breaking news
free legal advice
-
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి కాల్వశ్రీరాంపూర్: పౌరులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సుల్తానాబాద్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి అన్నారు. మండలంలోని పెగడపల్లిలో న్యాయవిజ్ఞాన సదస్సును ఆదివారం నిర్వహించారు. సందర్భంగా చట్టాలపై అవగాహన కల్పించారు. న్యాయవిజ్ఞాన సదస్సుల ద్వారా చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు లోక్అదాలత్లతో సత్వర పరిష్కారం, న్యాయసేవాధికారి సంస్థ ద్వారా ఉచిత న్యాయసలహాలు అందిస్తున్నట్లు తెలిపారు. మండల కేంద్రాల్లో న్యాయసేవాధికార సంస్థ ద్వారా అవసరమైన సలహాలు అందించేందుకు ప్రతీ ఆదివారం న్యాయప్రతినిధులు అందుబాటులో ఉంటారన్నారు. గిప్టుడీడీ, వీలునామా, సేల్డీడీ, పార్ట్నర్షిప్ డీడీ, సివిల్, క్రిమినల్ కేసులపై వివరించారు. పట్టింపులకు పోకుండా రాజీ మార్గమే ఉత్తమని తద్వారా చాలా కేసులు సత్వర పరిష్కారం పొందుతాయని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సారయ్య గౌడ్, జెడ్పీటీసీ లంక సదయ్య, సర్పంచు గొడ్గు లక్ష్మి రాజకొమురయ్య, ఎస్సై ఉమాసాగర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ఎవ్వరికైనా ఉచిత న్యాయ సలహాలు
ఆస్తి వివాదాల్లాంటివాటి విషయంలో ఉచిత న్యాయ సలహాలు ఇచ్చేందుకు ఢిల్లీ విశ్వవిద్యాలయం ముందుకొచ్చింది. గతంలో కేవలం వర్సిటీకి చెందిన వారికి మాత్రమే ఈ సేవలు అందించిన విశ్వవిద్యాలయం తాజాగా ఆ సేవలు బయటవారికి కూడా విస్తరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ వర్సిటీలోని గాంధీ భవన్, క్యాంపస్ లా సెంటర్లో ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సాయంతో (డీఎస్ఎల్ఎస్ఏ) సాయంతో వర్సిటీకి చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు మాత్రమే న్యాయ సలహాల విషయంలో ఉచిత శిక్షణను ఇస్తుంది. తాజాగా ఎవరికైనా ప్రతి శుక్రవారం మూడు గంటల నుంచి ఐదు గంటల ప్రాంతంలో ఉచితంగా న్యాయ సలహాలు, శిక్షణను ఇస్తామని పేర్కొంది.