gangadharam
-
జనసేన ఓడిపోవడానికి టీడీపీయే కారణం : గంగాధరం
-
8 ఏళ్ల చిన్నారిపై మారు తండ్రి లైంగిక దాడి
కాకుమాను(ప్రత్తిపాడు): ఎనిమిదేళ్ల చిన్నారిపై మారు తండ్రి లైంగిక దాడికి పాల్పడిన సంఘటన గుంటూరు జిల్లా కాకుమాను ఎస్టీ కాలనీలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. బాపట్ల డీఎస్పీ గంగాధరం తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త ఐదేళ్ల క్రితం మృతిచెందటంతో భార్య కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటోంది. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం మదవర్తి గ్రామానికి చెందిన కొమరనేని లక్ష్మయ్య (35) తన భార్యకు దూరంగా ఉంటూ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల క్రితం లక్ష్మయ్యకు, సదరు మహిళకు మధ్య పరిచయం ఏర్పడటంతో కొంతకాలం సహజీవనం సాగించి, రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఏడాది క్రితం లక్ష్మయ్య, భార్య, ఆమె ఇద్దరు కుమార్తెలతో పనుల నిమిత్తం ఒడిశాకు వెళ్లారు. ఇటీవలే తిరిగి వచ్చిన వీరు లక్ష్మయ్య తల్లి కాకుమానులో ఉండటంతో వారం క్రితం అక్కడికి వచ్చారు. మద్యానికి బానిసైన లక్ష్మయ్య తాగిన మత్తులో.. సోమవారం సాయంత్రం ఇంటి పక్కన స్నేహితులతో ఆడుకొంటున్న భార్య చిన్న కూతురు (8)ను పాడుబడ్డ పూరింట్లోకి తీసుకొళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి భయాందోళనలతో కేకలు వేయగా చుట్టుపక్కల వారు గమనించి లక్ష్మయ్యను పట్టుకుని దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం అందించి, వారికి అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, నిర్భయ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ గంగాధరం వెల్లడించారు. వైద్య పరీక్షల నిమిత్తం చిన్నారిని బాపట్ల వైద్యశాలకు పంపించినట్లు ఆయన తెలిపారు. కాగా, ఇదే చిన్నారిపై లక్ష్మయ్య గతంలోనూ ఒడిశాలో లైంగిక దాడికి పాల్పడినట్లు చిన్నారి తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తూ పోలీసుల ఎదుట తన గోడు వెళ్లబోసుకుంది. -
చిన్న వయసు.. పెద్ద మనసు
ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు భారం అనుకుంటున్న వారూ చాలా మంది ఉన్నారు... తమను పెంచి పోషించిన వారు మంచాన పడితే పట్టించుకోని వారినీ చూస్తుంటాం.. వారికి ఆలనాపాలన చూ సేందుకు వెనకాడుతుంటారు... అయితే ఓ అమ్మాయి తమ తాతయ్య కోసం అహర్నిశలు కష్టపడుతూ సేవలందిస్తోంది. రాయచోటి రూరల్ : రాయచోటి మండలం వరిగపాపిరెడ్డిగారిపల్లె గ్రామ పంచాయతీలోని చౌడచెరువువారిపల్లెకు చెందిన శంకారపు రెడ్డి ఈశ్వరి ఈ ఏడాది డిగ్రీ పూర్తి చేసింది. తమ కుటుంబం కోసం ఎంతో కష్టపడిన తాతయ్య శంకారపు గంగాధరానికి సేవలందిస్తోంది. శంకారపు గంగాధరం(90) ఉపాధ్యాయుడిగా, ఎంఈవోగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. అందరికీ వివాహాలు చేశారు. ఎంఈవోగా లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాల్లో పని చేస్తూ రాయచోటి పట్టణంలో నివాసం ఉండేవారు. పెద్ద కుమారుడు వెంకటరమణ బిడ్డలు రెడ్డికుమారి, రెడ్డి ఈశ్వరి, రెడ్డిప్రసాద్తోపాటు రెండో కుమారుడు శివప్రసాద్ బిడ్డలను కూడా తన వద్దనే ఉంచుకుని చదివించాడు. విద్య విలువ తెలియడంతో పిల్లలను బాగా చదివించాలనే ఉద్దేశంతో వారినే తన వద్దే ఉంచుకున్నారు. వారి చిన్ననాటి నుంచి ఆలనాపాలన చూసుకున్నారు. పక్షవాతం సోకడంతో.. గంగాధరానికి వయసు మీద పడింది. ప్రస్తుతం 90 ఏళ్లు. ఆయనకు పక్షవాతం సోకడంతో మొదట తిరుపతి, అనంతరం మహల్తోపాటు ఇతర ప్రాంతాల్లో వైద్యం చేయించారు. ఆ తర్వాత రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రెండు నెలలుగా చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఈశ్వరి రాత్రి, పగలు ఆయన దగ్గరే ఉంటూ సేవలందిస్తోంది. రోజుకు మూడు పూటలా వేడినీరు, తడిబట్టతో శరీరం శుభ్రం చేయడంతోపాటు అన్ని రకాల సపర్యలు చేస్తోంది. ఇది చూస్తున్న ఆసుపత్రి వర్గాలు, ఇతర రోగులు మెచ్చుకుంటున్నారు. ఇలాంటి బిడ్డ పుడితే సంతోషించని వారు ఎవరు ఉంటారని వారు అంటున్నారు. రుణం తీర్చుకుంటున్నా కుటుంబంలో అందరి మంచి కోరుకుంటూ.. మనవళ్లు, మనవరాళ్లను బాగా చదివించిన గొప్ప మనిషి మా తాతయ్య. ఇప్పుడు ఆయనకు జబ్బు చేసింది. సేవ చేసి, రుణం తీర్చుకోవాలని ఇక్కడే ఉండి అన్నీ చూసుకుంటున్నాను. అమ్మానాన్నలు, చినాన్న వాళ్లు, అవ్వ అందరూ తరచూ వచ్చి తాతయ్యను బాగా చూసుకుంటున్నారు. నాకు చిన్నప్పటి నుంచి తాతయ్య అంటే చాలా ఇష్టం. చివరి వరకు బాగా చూసుకోవాలనుకుంటున్నాను. – రెడ్డి ఈశ్వరి -
గంగాధరం ఇళ్లలో కొనసాగుతున్న సోదాలు
-
గంగాధరం ఇళ్లలో కొనసాగుతున్న సోదాలు
హైదరాబాద్: ఆర్అండ్బీ చీఫ్ ఇంజనీర్ గంగాధరం ఇళ్లలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. గంగాధరం బంధువుల ఇళ్లలో సైతం మంగళవారం సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు నిర్వహించిన తనిఖీల్లో రూ. 130 కోట్లకు పైగా ఆస్తులు, విలువైన డాక్యుమెంట్లను అధికారులు గుర్తించారు. సోమవారం గంగాధరంకు సంబంధించిన పలు బ్యాంకు లాకర్లను ఓపెన్ చేసిన అధికారులు విలువైన డాక్యుమెంట్లను గుర్తించిన విషయం తెలిసిందే. ఇవాళ మరో మూడు లాకర్లను ఏసీబీ అధికారులు ఓపెన్ చేయనున్నారు. గంగాధరాన్ని కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు నేడు పిటిషన్ దాఖలు చేయనున్నారు. కాగా.. బహిరంగ మార్కెట్లో గంగాధరం కూడగట్టిన ఆస్తుల విలువ వందల కోట్లు ఉంటుందని సమాచారం. -
గంగాధరం లాకర్లలో విలువైన డాక్యుమెంట్లు
హైదరాబాద్: ఆర్అండ్బీ చీఫ్ ఇంజనీర్ ఎం. గంగాధరం, ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 100 కోట్లకు పైగా ఆస్తులను దాడుల్లో ఏసీబీ గుర్తించింది. 8 బ్యాంకు లాకర్లను గుర్తించిన ఆధికారులు.. సోమవారం వాటిని ఓపెన్ చేశారు. లాకర్లలో విలువైన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంగాధరాన్ని కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. చదవండి: చేప కాదు తిమింగలం -
గంగాధరం లాకర్లలో విలువైన డాక్యుమెంట్లు