gems and jewelry
-
ఆభరణాల ఎగుమతుల జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశం నుంచి రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 2023 ఫిబ్రవరిలో రూ.28,833 కోట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 24 శాతం వృద్ధి అని జెమ్, జువెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) తెలిపింది. చైనా, మధ్యప్రాచ్య మార్కెట్ల రికవరీ ఇందుకు కారణమని వెల్లడించింది. ‘ఈ ఏడాది ఫిబ్రవరిలో కట్, పాలిష్డ్ డైమండ్ ఎగుమతులు 32 శాతం ఎగసి రూ.19,582 కోట్లుగా ఉంది. బంగారు ఆభరణాలు 30 శాతం అధికమై రూ.5,829 కోట్లకు చేరుకున్నాయి. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం తరువాత యూఏఈకి బంగారు ఆభరణాల ఎగుమతులు 45 శాతం దూసుకెళ్లాయి. స్వల్ప క్షీణత తరువాత తిరిగి మధ్యప్య్రాచ్య మార్కెట్ పుంజుకుంటోందని అనడానికి ఇదే నిదర్శనం’ అని వివరించింది. కలిసి వస్తున్న చైనా మార్కెట్.. : ‘ప్రధానంగా యూఎస్కు ఎగుమతయ్యే రాళ్లు పొదిగిన బంగారు ఆభరణాల విక్రయాలు 2023 ఫిబ్రవరిలో 20 శాతం అధికం అయ్యాయి. కొన్ని నెలలుగా తిరోగమన వృద్ధి నమోదు చేసిన హాంగ్కాంగ్ ఇప్పుడు తిరిగి గాడిలో పడింది. చైనా మారెŠక్ట్ పుంజుకోవడం గొప్ప మెరుగుదలకు దారితీయవచ్చు. చైనాలో సగటు పొదుపు రేటు దాదాపు 40 శాతంగా ఉంది. పొదుపు విలువ లక్షల కోట్ల రూపాయలకు సమానం. సుదీర్ఘ లాక్డౌన్ వ్యవధి తర్వాత ఇతర ప్రపంచ మార్కెట్లలో చూసిన విధంగా ’ప్రతీకార కొనుగోలు’కు అవకాశం ఉంది. ఫలితంగా వజ్రాలు, వజ్రాభరణాల పరిశ్రమలో వచ్చే ఆరు నెలల్లో పెద్ద ఎత్తున వృద్ధి నమోదయ్యే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నాం’ అని కౌన్సిల్ అభిప్రాయపడింది. -
మీరు కోరినట్టే ఆభరణాల డిజైన్..
• టాప్-4లో తెలుగు రాష్ట్రాలు • బ్లూస్టోన్.కామ్ సీవోవో అరవింద్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్లో బంగారు, వజ్రాభరణాల కొనుగోళ్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టాప్-4లో ఉన్నట్టు బ్లూస్టోన్.కామ్ తెలిపింది. తొలి మూడు స్థానాల్లో ఢిల్లీ, కర్నాటక, మహారాష్ట్ర నిలిచారుు. తెలుగు రాష్ట్రాల కస్టమర్లు చెవి రింగులు, ఉంగరాలు, పెండెంట్లు ఎక్కువగా ఆన్లైన్లో బుక్ చేస్తున్నారని కంపెనీ సీవోవో అరవింద్ సింఘాల్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. పిల్లల నగల కొనుగోళ్లలో తెలుగు రాష్ట్రాలు 5వ స్థానంలో నిలిచాయన్నారు. తమ పోర్టల్ ద్వారా సగటు ఆభరణం ధర రూ.25-30 వేలు ఉందని చెప్పారు. రూ.17 లక్షల విలువైన డైమండ్ రింగ్, రూ.8 లక్షలు ఖరీదు చేసే నెక్లెస్ను సైతం తాము విక్రరుుంచామని వివరించారు. నెలకు 7,000 ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు. ఇందులో టాప్-6 నగరాల నుంచి 65 శాతం ఉంటాయన్నారు. ప్రతి నెల 200 డిజైన్లు.. బ్లూస్టోన్.కామ్ ప్రతి నెల 200 డిజైన్లను ప్రవేశపెడుతోంది. కస్టమర్లు తమకు నచ్చినట్టుగా ఆభరణాలను డిజైన్ చేసుకోవచ్చు. కస్టమర్ కోరితే డిజైన్లను ఇంటికి తీసుకొచ్చి చూపిస్తారు కూడా. ఆర్డరు తీసుకున్న తర్వాతే సొంత ప్లాంటులో తయారీ చేపడుతున్నట్టు అరవింద్ వెల్లడించారు. ఆభరణాలకు అన్ని ధ్రువీకరణలు ఉన్నాయని, డెలివరీ వారం రోజుల్లో చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా ఆన్లైన్ ఆభరణాల విపణి రూ.500 కోట్లుందని చెప్పారు. 51 శాతం వాటాతో బ్లూస్టోన్ టాప్లో ఉందన్నారు. 100 శాతం వృద్ధి సాధించామని, టర్నోవరు 2018 నాటికి రూ.1,000 కోట్లు దాటుతుందని అంచనాగా చెప్పారు.