breaking news
Guntur District Latest News
-
రేపు విజయవాడలో ఫ్యాప్టో ధర్నా
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఈనెల 7న విజయవాడ ధర్నా చౌక్లో తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘ (ఎస్టీయూ) గుంటూరు జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు పిలుపునిచ్చారు. కంకరగుంటలోని ఎస్టీయూ భవన్లో ఆదివారం జరిగిన సంఘ ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినప్పటికీ హామీల అమలుకు చర్యలు తీసుకోకపోవడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. మెరుగైన పీఆర్సీ, మధ్యంతర భృతి మంజూరు, సీపీఎస్ స్థానంలో పాత పెన్షన్ విధానం, పీఎఫ్, ఏపీజీఎల్ఐ, ఋణాల మంజూరు, ఆర్థిక బకాయిల చెల్లింపు తదితర ఎన్నికల్లో ఇచ్చి హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. వివిధ రూపాల్లో ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకువెళ్లినప్పటికీ తాత్సారం చేయడంతో ఉపాధ్యాయలోకం ఆగ్రహంతో ఉందని తెలిపారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఫ్యాప్టో నిర్ణయం మేరకు ఈనెల 7న తలపెట్టిన ‘చలో విజయవాడ’లో అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి డీకే సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను, నిర్ణయాలను విజయవంతంగా అమలు చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, సంక్షేమాన్ని ప్రభుత్వం మరచిపోయిందని తెలిపారు. ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుంచి తప్పించకుండా మరింత భారాన్ని మోపి మానసిక ఆందోళనకు గురి చేయడం సరికాదని పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాట్యుటీ, కమ్యూటేషన్, ఈఎల్ ఎన్క్యాష్మెంట్ తదితర బకాయిలను చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోందని విమర్శించారు. సమావేశంలో సీనియర్ నాయకులు పి.ప్రసాద్, పి.దిబ్బయ్య, పి.సుందర్రావు, మేడా శ్రీనివాస రావు, రాజశేఖర్ పాల్గొన్నారు. ధర్నాను విజయవంతం చేయాలి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఽఖ్య (ఫ్యాప్టో) పిలుపు మేరకు ఈనెల 7న విజయవాడలోని ధర్నా చౌక్లో తలపెట్టిన మహాధర్నాను ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని జిల్లా చైర్మన్ కె.నరసింహారావు ఆదివారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుంచి తప్పించడంతోపాటు, 12వ పీఆర్సీ, మధ్యంతర భృతి మంజూరు, పాత పెన్షన్ విధానం, ఆర్థిక బకాయిల చెల్లింపు, పెన్షనర్లకు కార్పొరేషన్ ఏర్పాటు వంటి హామీలను కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 16 నెలలు అయినా ఏ ఒక్క హామీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని తెలిపారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి గ్రాట్యుటీ, కమ్యూటేషన్, సెలవుల డబ్బులు, అంత్యక్రియల ఖర్చు తదితర సౌలభ్యాలను చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోందని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు ఏటా రూ. 180 కోట్లు హెల్త్ కార్డుల కోసం చెల్లిస్తున్నప్పటికీ ఏ హాస్పిటల్లోనూ వాటిని అంగీకరించడం లేదని తెలిపారు. ప్లస్ టు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని, ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విజయవంతం చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పెదబాబు పిలుపు -
దుండగులను కఠినంగా శిక్షించాలి
కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జొన్నకూటి నవీన్ ప్రకాష్ లక్ష్మీపురం: చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు అంటించిన దుండగులను వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) జిల్లా కార్యదర్శి జొన్నకూటి నవీన్ ప్రకాష్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం, పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం మరో విగ్రహాన్ని ప్రతిష్టించింది గానీ, ఘటన జరిగి మూడు రోజులైనా దోషులను అరెస్టు చేయకుండా ఏమి చేస్తుందని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు నిత్య కృత్యమయ్యాయని తెలిపారు. ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం పిఠాపురంలో దళితులపై దాడులు చేస్తే నిందితులపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ ఘటనలు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దళితుల పట్ల చిన్నచూపును తెలియజేస్తుందని తెలిపారు. నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేవీపీఎస్ నగర అధ్యక్షులు జి.లూథర్ పాల్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం మీద నిరంతరం దాడి జరుగుతోందని విమర్శించారు. దళితులను చదువుకు, మానవీయ విలువలకు దూరంగా ఉంచిన మనువాద సిద్ధాంతాన్ని తీసుకు రావడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. ఈ చర్యలను ప్రజాస్వామికవాదులు అందరూ తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ నగర కార్యదర్శి బి.ముత్యాలరావు, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎల్.అరుణ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ సమీర్, కేవీపీఎస్ నాయకులు యం.సుందరబాబు, జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి జాన్ బాబు, నాయకులు జి. వెంకట్రావు, ప్రసాద్ పాల్గొన్నారు. -
జాతీయ పోటీలకు రోషన్ ఎంపిక
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఒరిస్సాలోని భువనేశ్వర్లో ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు జరగనున్న 41 జాతీయ జూనియర్ అథ్లెటిక్ చాంపియన్షిప్ పోటీల్లో స్థానిక ఎన్టీఆర్ స్టేడియానికి చెందిన ఎస్కే రోషన్ రాష్ట్ర జట్టు తరఫున పాల్గొంటాడని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి జి.వి.ఎస్. ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా రోషన్ 110 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్లో బంగారు పతకాలు సాధించి ఉత్తమ క్రీడాకారుడు అవార్డును కూడా గెలుపొందాడని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రోషన్ను ఏపీ రేరా సభ్యులు దామచర్ల శ్రీనివాసరావు ఘనంగా సన్మానించారని తెలిపారు. రోషన్కి సహాయ, సహకారాలను అందిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు ప్రసాద్ తెలియజేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఉత్తమ సేవలు డీఆర్ఎం సుథేష్ట సేన్ లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్) : విక్షిత్ భారత్– 2047 భాగంగా సమష్టి భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ, భారత ప్రభుత్వ వివిధ ప్రధాన కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయాణికులు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నట్లు డీఆర్ఎం సుథేష్ట సేన్ తెలిపారు. గుంటూరు రైల్వే స్టేషన్లో ఆదివారం అమృత్ సంవాద్ కార్యక్రమంలో భాగంగా విక్షిత్ భారత్– 2047 కార్యక్రమంలో ప్రయాణికులకు, రైల్వే సిబ్బందికి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం సామాజిక, ఆర్థిక వృద్ధిని సాధించడంలో భారతీయ రైల్వేల పాత్ర గురించి తెలిపారు. పరిశుభ్రత, భద్రత, సమర్థ సేవలను అందించడంలో ప్రజల భాగస్వామ్యం, ప్రాముఖ్యత గురించి వివరించారు. ప్రయాణికులకు సంతృప్తిని అందించడంతో పాటు జాతీయ అభివృద్ధికి దోహదపడటం కోసం రైల్వే సిబ్బంది అంకితభావంతో పని చేయాలని ఆమె సూచించారు. అనంతరం ప్రయాణికులతో సంభాషించి వారి సూచనలు, సలహాలను తీసుకున్నారు. కార్యక్రమంలో సీనియర్ డీఓఎం జె.శ్రీనాథ్, సీనియర్ డీసీఎం ప్రదీప్కుమార్, డీసీఎం కమలాకర్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. మద్యానికి డబ్బులు లేవన్నందుకు దాడి వ్యక్తికి గాయాలు సత్తెనపల్లి: వుద్యానికి డబ్బులు లేవన్నందుకు బావ తలను బావమరిది పగలగొట్టిన సంఘటన పట్టణంలోని రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్ సమీపంలో గల వైన్ షాప్ వద్ద ఆదివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న పెదాల నరసింహారావు మద్యం తాగేందుకు రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్ సమీపంలో గల వైన్ షాపు వద్దకు వెళ్లాడు. అక్కడ మద్యం తాగుతుండగా.. కొద్దిసేపటికి వరుసకు బావమరిది అయ్యే చెరుకూరి మణి వచ్చి మద్యం ఇప్పించమని అడిగాడు. తన వద్ద క్వార్టర్కే డబ్బులు ఉన్నాయని, అయినా తాగే ఉన్నావుగా.. ఇంకెందుకంటూ దూషించి, మందలించాడు. మద్యం ఇప్పించకపోగా తననే దూషిస్తావా? అంటూ మణి మద్యం సీసా తీసుకొని నరసింహారావు తలపై కొట్టాడు. దీంతో తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో స్థానిక ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో ప్రాథమిక చికిత్స చేయించుకుని పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పట్టణ ఎస్ఐ జె.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముంచెత్తిన వాన
మంగళగిరి టౌన్ : ఆదివారం రాత్రి మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సుమారు రెండు గంటల పాటు పడిన భారీ వర్షానికి నగరంలోని కాలువలు, డ్రైనేజీలు పొంగి, రోడ్లపైకి నీరు ప్రవహించింది. మంగళగిరి పట్టణ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. నగరంలో పలుచోట్ల రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. లక్ష్మీ నరసింహ కాలనీ, ఎన్ఆర్ఐ వై జంక్షన్ దగ్గర అండర్పాస్ల వద్ద నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. గౌతమ బుద్ధ రోడ్డు, రత్నాల చెరువు, ఎస్టీ కాలనీ, ఆల్ఫా సెంటర్ వద్ద డ్రెయిన్లు పొంగి నీరు రోడ్ల పైకి చేరింది. భరించలేని దుర్వాసనలో స్థానికులు ముక్కుమూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. తెనాలిలో కుండపోత వర్షం తెనాలి అర్బన్: అల్పపీడనం ప్రభావంతో తెనాలిలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఉన్నప్పటికీ మధ్యాహ్నం మూడు గంటల తరువాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. సాయంత్రం ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన భారీ వర్షం ప్రారంభమైంది. రాత్రి పొద్దు పోయే వరకు కురుస్తూనే ఉంది. రోడ్డన్నీ జలమయం అయ్యాయి. ఉదయం నుంచి ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు కొంత సేదతీరారు. -
శివాలయంలో అన్నదానానికి విరాళం
పెదకాకాని: స్థానిక శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థాన అభివృద్ధికి గ్రామానికి చెందిన కానుగంటి రాధాకృష్ణమూర్తి, సామ్రాజ్యం దంపతుల పేరున వారి కుమారుడు హరిబాబు, నాగేశ్వరి దంపతులు ఆదివారం రూ. 1,00,116ను విరాళంగా అందజేశారు. ప్రతి సంవత్సరం మహాలయ అమావాస్య రోజున అన్నప్రసాద వితరణ చేయాలని దాతలు కోరారు. ఆలయ సిబ్బంది దాతలకు ప్రత్యేక దర్శనం, వేద ఆశీర్వచనం చేయించి స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించి, చిత్రపటాన్ని బహూకరించారు. సైడు కాలువలో పడి వ్యక్తి మృతి కాకుమాను: సైడు కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. బాపట్లకు చెందిన మాచవరపు వెంకటేశ్వరరావు (40) శనివారం ఉదయం గుంటూరు జిల్లా కాకుమానులోని అత్తగారింటికి వచ్చాడు. అదేరోజు రాత్రి పూటుగా మద్యం తాగి తిరిగి వెళుతున్న సమయంలో అదుపుతప్పి పక్కనే సైడు కాలువలోనికి పడి మృతి చెందాడు. ఆదివారం ఉదయం తెల్లవారుజామున అటుగా వెళుతున్న స్థానికులు కాలువలో మృతదేహం పడి ఉండటాన్ని గమనించి బయటకు తీశారు. సమాచారాన్ని మృతుని కుటుంబాలతో పాటు పోలీసులకు అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాపట్ల ప్రజావైద్యశాలకు తరలించారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఏక్నాథ్ తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. 8న సెపక్తక్రా జట్ల ఎంపికలు సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలబాలికల సెపక్ తక్రా జిల్లా జట్ల ఎంపికలు సత్తెనపల్లి మండలం నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 8వ తేదీన జరుగుతాయని అసోసియేషన్ పల్నాడు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ వడ్డెంపూడి పవన్ కుమార్, పి.శివరామకృష్ణలు ఆదివారం తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే వారు 2007 జనవరి 1 తర్వాత జన్మించిన వారై ఉండాలన్నారు. ఎంపికయిన క్రీడాకారులు ఈ నెల 11, 12 తేదీల్లో ప్రకాశం జిల్లా చీరాలలో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ చాంపియన్ షిప్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఇతర వివరాలకు 8712129398, 99851 86556 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. -
సూర్యలంక తీరంలో ఇద్దరు గల్లంతు
బాపట్ల టౌన్: సూర్యలంక సముద్ర తీరంలో స్నానాలు చేస్తూ ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా టేకుమిట్ల గ్రామానికి చెందిన బొద్దు శ్రీను, నల్గొండ జిల్లాకు చెందిన కత్తుల వినేష్లు కుటుంబ సభ్యులతో ఆదివారం మధ్యాహ్నం సూర్యలంక తీరానికి చేరుకున్నారు. సముద్రంలో స్నానాలు చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన అలల తాకిడికి ఇరువురు నీటిలో మునిగారు. గమనించిన కుటుంబసభ్యులు కేకలు వేయడంతో అప్రమత్తమైన కోస్టల్ సెక్యూరిటీ సిబ్బంది, గజ ఈతగాళ్లు సముద్రంలోకి వెళ్లారు. కొట్టుకుపోతున్న ఇద్దరు యువకులను సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు. కోస్టల్ సెక్యూరిటీ సిబ్బంది, గజ ఈతగాళ్లను ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ప్రత్యేకంగా అభినందించారు. తీరానికి వచ్చే పర్యాటకులు పోలీస్ సిబ్బంది ఆదేశాలను పాటించి, సముద్ర స్నానాలు చేయాలని ఆయన సూ చించారు. వెంటనే స్పందించి కాపాడిన కోస్టల్ సెక్యూరిటీ సిబ్బంది -
పెరుగుతున్న హిందీ భాష ప్రాముఖ్యత
తెనాలి: ఉపాధి అవకాశాలకు విదేశీ తలుపులు మూసుకుపోతున్న నేడు స్వదేశంలోనే ఉద్యోగాలను వెతుక్కోవాల్సి వస్తుందనీ, అప్పుడు హిందీ భాష నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్రాంత రిజి స్ట్రార్, ప్రముఖ రచయిత రావెల సాంబశివరావు అభిప్రాయపడ్డారు. స్థానిక హిందీ ప్రేమి మండలి మహా విద్యాలయంలో ఏటా జరిగే గాంధీ జయంతి, బోయపాటి నాగేశ్వరరావు–సుభద్రాదేవి గురు దంపతుల 23వ వార్షిక గురుపీఠ పురస్కారాల ప్రదానోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. మహా విద్యాలయం ప్రాంగణంలోని మోటూరి సత్యనారాయణ స్మారక సభా వేదికపై జరిగిన సభకు రావెల సాంబశివరావు అధ్యక్షత వహించారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం హిందీ విభాగం ఆచార్యులు, రచయిత ప్రొఫెసర్ నారాయణ, కాకినాడకు చెందిన విశ్రాంత హిందీ అధ్యాపకురాలు, రచయిత్రి షేక్ కాశింబీకి గురుపీఠ పురస్కారాలు, నగదును ప్రదానం చేసి సత్కరించారు. సభాధ్యక్షుడు సాంబశివరావు మాట్లాడుతూ స్వదేశంలోనే ఉద్యోగాలకు మాతృభాష తెలుగుతో పాటు హిందీని నేర్చుకుంటే మరింత ప్రయోజనం ఉంటుందని సూచించారు. విజయవాడకు చెందిన బహు గ్రంథకర్త డాక్టర్ వెన్నా వల్లభరావు మాట్లాడుతూ మహాత్మాగాంధీ అడుగిడిన ప్రేమి మండలి పునీతమైందని తెలిపారు. సత్కారగ్ర హీతలైన ప్రొఫెసర్ నారాయణ షేక్ కాశింబీ మాట్లాడుతూ మాతృభాష తెలుగుతో పాటు హిందీని నేర్చుకోవడం మంచిదని సూచించారు. డాక్టర్ మురుకుట్ల మంజుల స్వాగతం పలుకగా, నాగళ్ల దుర్గా రఘురాం వందన సమర్పణ చేశారు. కార్యక్రమాన్ని డాక్టర్ ఈలప్రోలు శ్రీనివాసరావు, కస్తూరి పర్య వేక్షించారు. -
విశ్రాంత అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: విశ్రాంత అధ్యాపకుల సమస్యలను ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించాలని రాష్ట్ర జూనియర్ కళాశాలల విశ్రాంత అధ్యాపక సంఘ అధ్యక్షుడు డి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని మాజేటి గురవయ్య కళాశాల సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన సంఘ రాష్ట్రస్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తే, సహచర పెన్షనర్ సంఘాలతో కలిసి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం రోజు తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేయడం బాధాకరమని తెలిపారు. 70 నుంచి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న పెన్షనర్లకు తగ్గించిన అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను పునరుద్ధరించాలని, పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు. 11వ పీఆర్సీ బకాయిలను చెల్లింపుతో పాటు 12వ పీఆర్సీ కమిషన్ను నియమించి, ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ వ్యవస్థ నుంచి వచ్చిన పెన్షనర్లకు మెడికల్ రీ–యింబర్స్మెంట్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పెన్షనర్లందరికీ అన్ని ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యాన్ని అందించాలని కోరారు. ఆదాయపు పన్నును రద్దు పర్చి, గతంలో ఉన్న రైలు ప్రయాణ టికెట్ రాయితీని పునరుద్ధరించాలని విన్నవించారు. మానిటరీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సభకు అధ్యక్షత వహించిన సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మడి నారాయణరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది ప్రభుత్వ, ఎయిడెడ్ ఇంటర్మీడియట్ అధ్యాపకుల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జి.భాస్కరరావు, జెడ్.ఎస్. రామచంద్రరావు, జి.సుబ్బారావు, 13 జిల్లాల కార్యవర్గ సభ్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు. సంఘ అధ్యక్షుడు డి.వెంకటేశ్వర్లు -
ఏపీపీపీ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ
గుంటూరు రూరల్: పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్ష కేంద్రంలో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం పరిశీలించారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని పలకలూరు రోడ్డులోగల విజ్ఞాన్ నిరులా ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పరీక్షలను జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్), నోడల్ అధికారి రమణమూర్తితో కలిసి ఎస్పీ పర్యవేక్షించారు. కార్యక్రమంలో సౌత్ డీఎస్పీ భానోదయ, నల్లపాడు సీఐ వంశీధర్, ఎస్ఐ వాసు పాల్గొన్నారు. తెనాలి అర్బన్: ఐతానగర్లోని శ్రీకృష్ణ మందిర వార్షికోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఉదయం విశేష పూజలు చేశారు. మధ్యాహ్నం అన్నసంతర్పణ చేశారు. సాయంత్రం స్వామివారి ఊరేగింపును జరిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, శ్రీకృష్ణ భక్త బృందం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బయ్యవరం(క్రోసూరు): మండలంలోని బయ్యవరం గ్రామంలో శనివారం ప్రారంభమైన రాష్ట్రస్థాయి ఎడ్ల పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఆదివారం ఆరు పళ్ల విభాగంలో ఎనిమిది జతలు, నాలుగు పళ్ల విభాగంలో ఎనిమిది జతలు పోటీలో నిలిచాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు ఘనంగా నిర్వహిస్తున్నారు. చుట్టపక్కల గ్రామాల రైతులు ఎడ్ల పోటీలు తిలకించేందుకు హాజరయ్యారు. మాదల(ముప్పాళ్ళ): ఆంధ్రప్రదేశ్ మరాఠా రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఛత్రపతి శివాజీ మహారాజ్ పల్లకీ సేవ వాహనయాత్రకు మండలంలోని మాదల గ్రామం వద్ద సంఘ సభ్యులు ఆదివారం ఘనంగా స్వాగతం పలికారు. మరాఠా సంఘం అధ్యక్షులు వెంకట సోమౌజీ ఆధ్వర్యంలో చేపట్టిన యాత్ర విజయవాడ శ్రీకనకదుర్గమ్మ ఆలయం నుంచి శ్రీశైలం శ్రీమల్లికార్జునస్వామి ఆలయం వరకు సాగనుంది. యాత్ర వాహనాలకు మాదల వద్ద సంఘ సభ్యులు పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ముప్పాళ్ల మీదుగా నరసరావుపేటకు యాత్ర వెళ్లింది. సంఘ సభ్యులు పులహరి పిరోజీ పాల్గొన్నారు. నరసరావుపేట ఈస్ట్: సత్తెనపల్లిరోడ్డు పులుపులవారి వీధిలోని శ్రీవీరాంజనేయస్వామి సహిత శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామి రాతి ఆలయ నిర్మాణానికి ఆదివారం పలువురు దాతలు విరాళాలను కమిటీ సభ్యులకు అందించారు. పట్టణానికి చెందిన మెడికల్ వ్యాపారి అర్వపల్లి రామకోటి సుబ్బారావు, నాగేశ్వరి దంపతులు ముఖమండపం 12వ రాతి స్తంభం నిర్మాణానికి రూ.3,01,116 అందించారు. వర్రా సావిత్రమ్మ రూ.51,116, అర్వపల్లి సాంబశివరావు, వెంకట విజయలక్ష్మి దంపతులు రూ.25,116 ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పులుపుల రాము, వనమా సాంబశివరావు, కోవూరు శివ శ్రీనుబాబు, వనమా కృష్ణ పాల్గొన్నారు. -
ఐఎంఏ గుంటూరు అధ్యక్షుడిగా డాక్టర్ సేవ కుమార్
గుంటూరు మెడికల్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) గుంటూరు శాఖ అధ్యక్షుడిగా డాక్టర్ తాతా సేవకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం గుంటూరు కలెక్టర్ బంగ్లా రోడ్డులోని జీఎంఏ హాల్లో నిర్వహించిన 2025–2026 కార్యవర్గం ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా డాక్టర్ ఎం.శివప్రసాద్, కార్యదర్శిగా డాక్టర్ బి.సాయికృష్ణ, సంయుక్త కార్యదర్శిగా చిలకా శ్రీనివాసరెడ్డి, కార్యవర్గ సభ్యులుగా మరో 25మంది ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా ఎన్నికై న డాక్టర్ తాతాసేవకుమార్ 2004లో ఐఎంఏ గుంటూరు శాఖలో సభ్యత్వం పొందారు. శాఖలో అంచలంచెలుగా పలు పదవులు నిర్వహించి ఇప్పుడు అధ్యక్ష పదవి అందుకున్నారు. ఐఎంఏ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా ఉన్న డాక్టర్ సేవకుమార్ గతంలోరాష్ట్ర వర్కింగ్ కమిటీలో, ఐఎంఏ వివిధ స్కీంలలో పని చేశారు. ప్రస్తుతం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా, జాతీయ కౌన్సిల్ మెంబర్గా వ్యవహరిస్తున్నారు. గుంటూరు వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్ పట్టా పొందిన డాక్టర్ సేవ కుమార్ 1996లో బ్రాడీపేటలో సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ (ఎస్హెచ్ఓ)ను స్థాపించారు. నాటి నుంచి ఉచిత వైద్య సలహాలు, అతి తక్కువ ఖర్చుకి అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందులు అందిస్తున్నారు. అధ్యక్షుడిగా ఎన్నికై న డాక్టర్ సేవకుమార్ను ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గార్లపాటి నందకిశోర్, పూర్వ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.కిశోర్, ఐఎంఏ సీజీపీ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ ఎం.ఫర్నికుమార్, ఎన్నికల నిర్వహణ అధికారి డాక్టర్ చేబ్రోలు విశ్వేశ్వరరావు, డాక్టర్ యార్లగడ్డ సుబ్బారాయుడు, డాక్టర్ డి. అమరలింగేశ్వరరావు తదితరులు అభినందించారు. -
19న బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ద్వితీయ మహాసభ
నెహ్రూనగర్: బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ద్వితీయ మహాసభ ఈనెల 19న గుంటూరులో నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు జి.శివ పూర్ణయ్య తెలిపారు. ఆదివారం గుంటూరు తాలుకా పెన్షనర్స్ హోంలో మహాసభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ ఎంప్లాయీస్ సమస్యలు, ఉద్యోగులకు రిజర్వేషన్లు, ప్రమోషన్స్లో మెరిట్ కమ్ రోస్టర్ విధానం అమలుచేయడానికి తీసుకోవాల్సిన చర్యలు మీద చర్చించినట్లు తెలిపారు. ద్వితీయ మహాసభలో ప్రవేశపెట్టే తీర్మానాలు, సమావేశం విజయవంతం చేయడానికి అన్ని జిల్లాలలోని బీసీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, తరలివచ్చి మహాసభను విజయవంతం చేయాలని కోరారు.సమావేశంలో ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం వి. ప్రసాద్, గౌరవాధ్యక్షులు పి.వి.రమణయ్య, గుంటూరు ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కె. శ్రీనివాసులు పాల్గొన్నారు. -
శ్రీ గురుభ్యో నమః !
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్న ఉత్తమ ఉపాధ్యాయులు వృత్తి నిబద్ధతతో తోటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్ పర్సన్ ప్రొఫెసర్ కె.రత్న షీలామణి పేర్కొన్నారు. కేవీఆర్ అండ్ జయలక్ష్మి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆదివారం మార్కెట్ సెంటర్లోని శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 54 మంది ఉపాధ్యాయులను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రత్నషీలామణి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తన తల్లిదండ్రుల పేరుతో స్థాపించిన ట్రస్టు ద్వారా ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, సావిత్రీబాయి పూలే పేరుతో ప్రతిభా పురస్కారాలు అందిస్తూ వారిని గౌరవించడం ఎంతో ముదాహమని తెలిపారు. కృత్రిమ మేధా సంపత్తి వంటి అభివృద్ధి సాధనాలు ఎన్ని వచ్చినా ఉపాధ్యాయులకు సాటి రావని అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయని తెలిపారు. తొలుత డాక్టర్ సర్వేపల్లి రాధాకష్ణన్, కేవీఆర్ అండ్ జయలక్ష్మి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ బి.గోపీమూర్తి మాట్లాడుతూ జాతి నిర్మాణ భవిష్యత్తు ఉపాధ్యాయులపైనే ఆధారపడి ఉందని తెలిపారు. కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యాభివద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులను ట్రస్ట్ ద్వారా గుర్తిస్తూ, వారిని గౌరవించడం బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వ సురేష్, మెడికల్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, వీజీఎస్ పబ్లిషర్స్ అధినేత ఎస్.రామారావు, కె.విజయ కుమారి పాల్గొన్నారు. -
జీఎస్టీ తగ్గింపులపై విస్తృత ప్రచారం
గుంటూరు వెస్ట్ : సూపర్ జీఎస్టీ– సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా సెలూన్, స్పా తదితర వాణిజ్య కార్యకలాపాల కేంద్రాల్లో సోమవారం పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరం నుంచి ఆదివారం సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 7,8 తేదీల్లో జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు తదితర అన్ని విద్యాసంస్థల్లో ప్రచారం చేయాలని విద్యాశాఖ అధికారులను ఆయన ఆదేశించారు. విద్యార్థులకు వ్యాస రచన, చిత్రలేఖనం, వక్తృత్వ తదితర పోటీలను నిర్వహించాలని సూచించారు. జీఎస్టీ తగ్గింపుతో మెరుగైన గ్రామీణ కనెక్టివిటీ, సురక్షితమైన రవాణా ఎంపికలు, విద్యా సామగ్రిపై పన్ను ఉపశమనం, స్టార్టప్లకు మద్దతు లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాల ఫొటోలు, వీడియోలను సంబంధిత పోర్టల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని జేసీ ఆదేశించారు. జీఎస్టీ జాయింట్ కమిషనర్ బి.గీతామాధురి, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ -
ఏపీకే ఫైల్.. బీ కేర్ఫుల్!
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): సాంకేతిక పెరుగుతున్న కొద్ది సైబర్ నేరగాళ్లు కొత్తా పంథాలో దోపిడీ మొదలెట్టారు. గుర్తు తెలియని వ్యక్తుల వాట్సాప్, ఇన్స్ట్రాగామ్ల ద్వారా ఏపీకే ఫైల్స్, లింకులు, డాక్యుమెంట్లు పంపి, నిమిషాల వ్యవధిలో దోచుకుంటున్నారు. ఏపీకే ద్వారా ప్రజల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ డేటా, ఫొటోలు, డాక్యుమెంట్లను దొంగలిస్తూ, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి కేసుల్లో కనీస పురోగతి కూడా లభించని దుస్థితి ఏర్పడింది. ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులు, ఆన్లైన్ షాపింగ్ చేసే వినియోదారులు, రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఏపీకే ఫైల్స్పై ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. జాగ్రత్తలు అవసరం సైబర్ నేరాలకు గురి కాకుండా జాగ్రత్తలు ఎంతో అవసరం. ఏదైనా యాప్ డౌన్లోడ్ చేయాలంటే కేవలం ప్లే స్టోర్ నుంచి మాత్రమే చేయాలి. గుర్తు తెలియని వ్యక్తులు పంపిన లింక్లు, డాక్యుమెంట్లు, ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయవద్దు. ఫోన్లోని ప్రతి యాప్కు ఇచ్చే అనుమతులను అప్రమత్తంగా పరిశీలించాలి. బ్యాంక్ అకౌంట్, యూపీఐ కార్డు వివరాలను ఎవరితోనూ పంచుకోరాదు. ఫోన్లో అనుమానాస్పద యాప్ ఇన్స్టాల్ చేశారని అనుమానం కలిగితే, వెంటనే అన్ ఇన్స్టాల్ చేయాలి. మొబైల్ రీసెట్ చేసి ట్రస్ట్ (నమ్మకం) చేసిన యాప్లను మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫోన్లో భద్రత కోసం యాంటీ వైరస్/యాంటీ మాల్వర్ యాప్లను వినియోగించాలి. మోసానికి గురైతే ఇలా చేయాలి ఆన్లైన్ మోసానికి గురైతే తక్షణమే 1930 (నేషనల్ సైబర్ హెల్ప్ లైన్) నంబర్కు కాల్ చేయాలి. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సైబర్ క్రైమ్. జీఓవీ.ఇన్ వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలి. దగ్గరలో గల పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. 1930కి ఫిర్యాదు చేయడం ద్వారా త్వరిగతిన ఏదైనా సాంకేతికత ద్వారా నిందితులను ఆచూకీ తెలిసే అవకాశం ఉంటుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. కొద్ది రోజుల కిందట నగరంలోని లాలాపేట ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఏపీకే మేసేజ్ వచ్చింది. దాన్ని అతడు ఓపెన్ చేయడంతో రూ 40వేల వరకు ఖాతాలో ఖాళీ అయ్యాయి. పాత గుంటూరు ఆనందపేటకు చెందిన మొహమ్మద్ ముజమ్మిల్కు ఈ నెల 13న వాట్సాప్లో ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ ఫైల్స్ (ఏపీకే) మేసేజ్ వచ్చింది. ఆయన దాన్ని ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా ఫోన్ హ్యాక్ అయింది. మొబైల్ ఆయన మాట వినడం మానేసింది. కేవలం నిమిషాల వ్యవధిలో రూ. 1,18,000 అమెజాన్ కార్డులో నుంచి డెబిట్ అయ్యాయి. -
కూటమి మోసాలపై పోరుబాట
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లాలోని దాదాపు 25 వేల మందికి ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్నికలకు ముందు పీఆర్సీ, మంచి ఐఆర్ ఇస్తామని, పెండింగ్ బకాయిలన్నీ విడుదల చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నర గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదు. ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే అనేక ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వినతి పత్రాలు సమర్పిస్తున్నా ఎలాంటి స్పందన లేదు. ●సత్తెనపల్లి: వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎలాంటి కష్టం లేకుండా సకాలంలో చెల్లింపులు చేశారు. అంతకుముందు ప్రభుత్వం బకాయి పెట్టిన 3 డీఏలూ చెల్లించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు డీఏలు బకాయి పెట్టింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు దాచుకున్న పీఎఫ్, ఏపీజీఎల్ఐ రుణాలు కూడా మంజూరు చేయడం లేదని ఉద్యోగులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. బిడ్డల చదువులకు, వివాహాల నిమిత్తం దాచుకున్న దానిలో రుణాల కింద విడుదల చేయాలని దరఖాస్తులు పెట్టుకున్నా పట్టించుకునే నాఽథుడే లేడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దసరా కానుకగా కనీసం రెండు డీఏల బకాయిలైనా విడుదల చేస్తారని ఎదురుచూసినా నిరాశే మిగిలింది. 25 వేల మందికి వెన్నుపోటు రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసానికి జిల్లా వ్యాప్తంగా సుమారు 25 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు బలయ్యారు. వీరిలో 7,415 మంది ఉపాధ్యాయులు ఉండగా.. మిగతావారు ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, గెజిటెడ్ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగులు ఉన్నారు. వీరికి ఒక్క డీఏ బకాయి వరకు చూసుకున్నా సుమారు రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్లపైనే బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. సరెండర్ లీవ్, పీఎఫ్, ఏపీజీఎల్ఐ రుణాల బకాయిలు మరో రూ.160 కోట్లు ఉంటుంది. జిల్లావ్యాప్తంగా సుమారు 10 వేల మంది పెన్షనర్లు కరువు భత్యం కోసం ఎదురుచూస్తున్నారు. పీఆర్సీ ఊసే ఎత్తడం లేదు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ ప్రకటిస్తే తమ జీతాలు పెరుగుతాయని ఆశగా ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల ప్రకటన విడుదల కావడం లేదు. 12వ పీఆర్సీ ప్రకటిస్తే కనీసం 30 శాతం ఫిట్మెంట్ లభించి, సుమారు రూ.50 వేల జీతం తీసుకునే ఉద్యోగికి మరో రూ.15 వేల వరకు అదనంగా వచ్చే అవకాశం ఉందని, సర్కారు కప్పదాటుగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పీఆర్సీ చైర్మన్ను నియమించగా, అధ్యయనం చేస్తుండగానే ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారడంతో కష్టాలు మొదటికొచ్చాయని వాపోతున్నారు. సర్కారు తీరుపై సంఘాల ఆగ్రహం బకాయిలను వెంటనే విడుదల చేయాలని పలు ఉపాధ్యాయ సంఘాలు విడివిడిగా కలెక్టర్ కార్యాలయాలు, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించాయి. ఫ్యాప్టో ఆధ్వర్యంలో కొన్ని ఉపాధ్యాయ సంఘాలు పోరాటాలకు దిగాయి. ఐక్యవేదికగా ఏర్పడి పోరుబాట పట్టాయి. ప్రభుత్వంలో కదలిక రాలేదు. ఏపీటీఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా నిరసన వారం చేపట్టగా .. యుటీఎఫ్ రణభేరి కార్యక్రమం నిర్వహించింది. ఈ నెల 7న ఫ్యాప్టో ఆధ్వర్యంలో పోరుబాట పేరుతో ఽవిజయవాడలో ధర్నాకు పిలుపునిచ్చారు. ఎన్జీవో నాయకులు సైతం వచ్చే రెండు నెలల్లో అన్ని సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. లేనిపక్షంలో ఉద్యమ కార్యాచరణ ప్రారంభిస్తామని హెచ్చరించారు.2023 జూలై ఒకటో తేదీ నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయాల్సి ఉంది. చైర్మన్ను నియమించాక కొత్త ప్రభుత్వం వచ్చి 16 నెలలు దాటుతున్నా ఆ మాటే ఎత్తక పోవడం దురదృష్టకరం. పాత పీఆర్సీ బకాయిలు ఇచ్చిన తరువాతే కొత్త పీఆర్సీ కమిషన్ను వేస్తామని చెబుతున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు అడిగితే ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారని మాట దాటవేస్తున్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చాలి. కనీసం ఒక్క డీఏను కుడా ఇవ్వలేదు. పాత పీఆర్సీ బకాయిలు ఇవ్వడం లేదు. విజయవాడలో 7న జరిగే పోరుబాట ధర్నాలో పీఆర్సీయే ప్రధానం. – ఎస్ఎం సుభాని, ఫ్యాప్టో రాష్ట్ర నాయకుడు -
రాష్ట్ర స్కూల్ గేమ్స్ టెన్నిస్ పోటీలకు ఎంపిక
గుంటూరు వెస్ట్ (క్రీడలు): శ్రీకాళహస్తిలో ఈనెల 7వ తేదీ నుంచి 9 వరకు జరగనున్న ఏపీ స్టేట్ స్కూల్ గేమ్స్ టెన్నిస్ చాంపియన్షిప్ పోటీల్లో ఎన్టీఆర్ స్టేడియంకు చెందిన ఆరుగురు క్రీడాకారులు జిల్లా జట్టుకు ఎంపికయ్యారని టెన్నిస్ కోచ్ జీవీఎస్ ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులను రేమండ్స్ షో రూమ్ అధినేత టి.అరుణ్ కుమార్, ఏపీ రెరా సభ్యులు దామచర్ల శ్రీనివాసరావు, సహస్ర ఆర్థో అండ్ న్యూరో క్లినిక్ అధినేత డాక్టర్ ఎం. శివకుమార్, రక్షిత్, నాంచారయ్యలు అభినందించారు. ఎంపికై న క్రీడాకారుల వివరాలు... అండర్–19 బాలుర విభాగంలో కె.విన్సెంట్, ఊరుబంది లలిత్ కుమార్, బాలికల విభాగంలో సాధుర్ల కావ్య హర్షిత, అండర్–17 బాలుర భాగంలో గంటా దిశాంత్, ఇ.జి. హర్షవర్ధన్, అండర్– 14 బాలుర విభాగంలో కుంభ సాయి నాగ కళ్యాణ్లు ఎంపికయ్యారు. -
మహనీయుల చరిత్రను తెలిపే ‘సదాస్మరామి’
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ నగరంపాలెం(గుంటూరు వెస్ట్): తెలుగు భాషకు, సంస్కృతికి, చరిత్రకు, కళలకు, వన్నెతెచ్చిన మహనీయుల చరిత్రలను సమగ్రంగా, సంగ్రహంగా గ్రంథస్థం చేసి వర్తమాన భవిష్యత్ తరాలకు దిశా నిర్దేశం చేసిన గ్రంథకర్త మండలి బుద్ధప్రసాద్ అభినందనీయులని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ అన్నారు. బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ రచించగా మోదుగుల రవికృష్ణ సంపాదకత్వంలో శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ వెలువరించిన సదాస్మరామి పుస్తకావిష్కరణ సభ నగరంపాలెం కలెక్టర్ బంగ్లా రోడ్లోని భారతీయ విద్యాభవన్లో శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన జస్టిస్ కృష్ణమోహన్ మాట్లాడుతూ మహనీయుల చరిత్రను తెలుసుకునే అవకాశం సదాస్మరామి పుస్తకం ఇస్తుందని పేర్కొన్నారు. పుస్తక రచయిత, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మహనీయుల గురించి రాయడం తన అదృష్టమన్నారు. దాన్ని వెలువరించిన బొమ్మిడాల కృష్ణమూర్తి ఫౌండేషన్కు కృతజ్ఞతలు తెలిపారు. సభలో ఎం.నాగేశ్వరరావు, న్యాయమూర్తి జగదీశ్వరి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు డాక్టర్ పాపినేని శివశంకర్, పెనుగొండ లక్ష్మీనారాయణ, భారతీయ విద్యాభవన్ కార్యదర్శి పి.రామచంద్రరాజు, బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పలువురు రచయితలు, సాహితీవేత్తలు పాల్గొన్నారు. -
బోధనా నైపుణ్యాలు పెంచుకోవాలి
పాఠశాల విద్య జేడీ శైలజ నరసరావుపేట ఈస్ట్: మెగా డీఎస్సీ–2025లో ఎంపికై న ఉపాధ్యాయులు బోధనా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పాఠశాల విద్య జేడీ పి.శైలజ తెలిపారు. డీఎస్సీ జోన్–3 పరిధిలో పీజీటీ, టీజీటీలుగా ఎంపికై న ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను శనివారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయుల నియామకం చేపట్టిందని తెలిపారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఆమె చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం కలిగేలా కృషి చేయాలని హితవు పలికారు. విద్యార్థుల్లో సామర్థ్యాలు పెరిగేలా బోధన ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో పల్నాడు విద్యాశాఖ ఏడీ బి.వి.రమణ, ఎంఈఓలు ఎండీ. ఖాసిం, పి.సుధారాణి, ప్రధానోపాధ్యాయులు ఆర్.గోవిందరాజులు, వి.వెంకట్రావు, ఏఎంఓ పూర్ణచంద్రరావు, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. -
వయోవృద్ధుల సంక్షేమానికి కృషి
గుంటూరు వెస్ట్: వయోవృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్దతతో కృషి చేస్తుందని రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సెక్రటరీ సూర్య కుమారి తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశం మందిరంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం – 2025 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర్యకుమారితోపాటు జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, శాసన సభ్యులు గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ నారాయణ స్వామి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ జి.కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్యకుమారి మాట్లాడుతూ వయో వృద్ధుల సమస్యలను సాధ్యమైనంతవరకు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వృద్ధుల అనుభవాలు చాలా గొప్పవి.. జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా మాట్లాడుతూ వయోవృద్ధుల అనుభవాలు నేటి సమాజానికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. వారి నుంచి స్పూర్తి పొందాలన్నారు. అనంతరం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన వయోవృద్ధులను ఘనంగా సన్మానించారు. రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ జి. ప్రకాష్ రెడ్డి, డీఆర్ఓ ఎన్ఎస్కే ఖాజావలి, ఏడీ దుర్గాబాయి పాల్గొన్నారు. వయోవృద్ధుల సంక్షేమ శాఖ సెక్రటరీ సూర్య కుమారి -
అన్నపూర్ణ కాంప్లెక్స్ ఖాళీ చేయాల్సిందే..!
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఉన్న నగరపాలక సంస్థకు చెందిన డాక్టర్ కొల్లి శారదా మార్కెట్లోని షాపుల లీజు గడువు పూర్తికావడంతో ఆగస్టు 18, 19, 20వ తేదీల్లో బహిరంగ వేలం నిర్వహించారు. ఒక్కో షాపును రూ.లక్షల్లో పాడుకుని దక్కించుకున్నారు. పాత లీజుదారులు పొన్నూరు రోడ్డు(బైపాస్) వద్ద ఉన్న అన్నపూర్ణ కాంప్లెక్స్లో షాపులు నిర్వహించుకుంటున్నారు. దీంతో మార్కెట్కు వచ్చే రైతులంతా అన్నపూర్ణ కాంప్లెక్స్కు వెళ్లడంతో మార్కెట్లో వ్యాపార లావాదేవీలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఈ నెల 10లోగా ఖాళీ చేయాలని ఆదేశాలు.. మార్కెట్లో ఉన్న 81 షాపులకు బహిరంగ వేలం పాట నిర్వహించగా కార్పొరేషన్కు రూ.ఆరు కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. 81 షాపుల్లో 41 షాపులకు సంబంధించి కొత్తగా పాడుకున్న లీజుదారులు కార్పొరేషన్కు నాన్ రిఫండబుల్ గుడ్విల్ చెల్లించారు. ఈ క్రమంలో పాత లీజుదారులు కార్పొరేషన్ అధికారులు తమను అన్యాయంగా ఖాళీ చేయిస్తున్నారని హైకోర్టుకు వెళ్లడంతో కొత్త లీజుదారులు దక్కించుకున్న రేటుతో షాపులను రెండు నెలల పాటు నిర్వహించుకోవాలని ఆదేశించింది. దాని ప్రకారం అధికారులు పాత లీజుదారులకు తెలియజేసినప్పటికీ వారు దానికి కూడా అంగీకరించకుండా అన్నపూర్ణ కాంప్లెక్స్ వద్దే వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. తమకు జరుగుతున్న అన్యాయంపై కొత్త లీజుదారులు ప్రైవేట్గా మార్కెట్ను నిర్వహించకూడదని, ఇతర తగిన ఆధారాలతో హైకోర్టును ఆశ్రయించగా కోర్టు పాత లీజుదారులకు షాక్ ఇస్తూ అన్నపూర్ణ కాంప్లెక్స్ను ఈ నెల 10వ తేదీలోగా ఖాళీ చేయాలని ఆదేశించింది. దీంతో పాత లీజుదారులు డైలామాలో పడ్డారు. హైకోర్టు ఉత్తర్వులు ఫాలో అవుతారో లేదో..! అన్నపూర్ణ కాంప్లెక్స్ ఖాళీ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నాయి. వీరిని ఖాళీ చేయించేందుకు అధికారులు మల్లాగుల్లాలు పడుతున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాత లీజుదారులకు ఎమ్మెల్యే సపోర్ట్, కొత్త లీజుదారులకు మంత్రి సపోర్ట్ ఉందని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం కావడంతో.. ఎవరికి సపోర్ట్గా వ్యవహరిస్తే రాజకీయంగా ఎటువంటి సమస్యలు వస్తాయో అని అధికారులు సందిగ్గంలో ఉన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు అన్నపూర్ణ కాంప్లెక్స్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నవారికి నోటీసులు జారీ చేస్తున్నాం. ఈ నెల 10వ తేదీలోగా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తాం. – డి.శ్రీనివాసరావు, డిప్యూటీ కమిషనర్–1 -
నేడు 650 మందికి ఉపకార వేతనాల పంపిణీ
తులసి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ తులసి యోగీష్ చంద్ర కొరిటెపాడు(గుంటూరు): కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్, ఏపీ కాట్వా సంయుక్త ఆధ్వర్యంలో చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 650 మంది పేద విద్యార్థులకు రూ.24.50 లక్షల ఉపకార వేతనాలను పంపిణీ చేయనున్నట్లు తులసి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ తులసి యోగీష్ చంద్ర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అమలాపురంలోని ముక్తేశ్వరం రోడ్లోని సత్యనారాయణ గార్డెన్స్లో ఆదివారం ఉదయం 9 గంటకు కార్యక్రమం ప్రారంభమవుతోందన్నారు. తులసి గ్రూప్స్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు ముఖ్య అతిథిగా హాజరై ఉపకార వేతనాలు వితరణ చేయనున్నట్టు వెల్లడించారు. ఇందులో 331 మంది విద్యార్థులకు రూ.11.84 లక్షలు తులసి సీడ్స్ ఆధ్వర్యంలో కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ ద్వారా పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. -
చేనేత పరిశ్రమను సర్వ నాశనం చేసిన ప్రభుత్వం
సత్తెనపల్లి: చేనేతపై జీఎస్టీ వేసి పరిశ్రమను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టా శివ దుర్గారావు విమర్శించారు. సంఘం 11వ రాష్ట్ర మహాసభలు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఈ నెల 6, 7 తేదీల్లో జరగనున్న నేపథ్యంలో సభా ప్రాంగణం, వసతి ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. మహాసభల ప్రాంగణం ఆర్చీ వద్ద కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివదుర్గారావు మాట్లాడుతూ మహాసభల్లో చేనేత రంగం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై చర్చిస్తామని తెలిపారు. చేనేత రంగాన్ని పరిరక్షించేందుకు తీసుకోవలసిన చర్యలు, కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు. మహాసభల ప్రారంభం రోజు 6వ తేదీన సత్తెనపల్లి పట్టణంలో చేనేత కార్మికుల భారీ ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర నలు మూలల నుంచి ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. వసతి ఏర్పాట్లు, మహాసభ జరిగే ప్రాంగణం, ఆర్చీ అన్ని ఇప్పటికే పూర్తయ్యాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి అనుముల వీరబ్రహ్మం, కమిటీ సభ్యులు పి. ప్రభాకర్, జి. సుసులోవ్, మల్లాల గురవయ్య, బిట్రా పానకాలు, జి. ఏసురత్నం, ఆవాజ్ సంఘం నాయకులు షేక్ మస్తాన్వలి పాల్గొన్నారు. -
బొక్కేస్తున్న పచ్చ బ్యాచ్!
ఆదివారం శ్రీ 5 శ్రీ అక్టోబర్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా నిరాటంకంగా కొనసాగుతోంది. మాముళ్లు అందుతుండడంతో కూటమి ఎమ్మెల్యేలు కొమ్ముకాస్తున్నారు. బాపట్ల జిల్లా నుంచి తరలిపోతున్న రేషన్ బియ్యం ఒక్క రోజులోనే పొన్నూరు, ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో వెయ్యి బస్తాలు పట్టుబడిందంటే ఈ దందా స్థాయి అర్థం చేసుకోవచ్చు. మాఫియాలోని వర్గాల సమాచారంతో ఇవి పట్టుబడ్డాయని, లేకుంటే కృష్ణపట్నం పోర్టుకు తరలిపోయేవని తెలుస్తోంది. వేమూరు నియోజకవర్గంలో వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు, అమర్తలూరు, చుండూరు మండలాల్లో ఎమ్మెల్యే అనుచరుల ఆధ్వర్యంలో దందా కొనసాగుతోంది. ప్రజల నుంచి రూ.10కే బియ్యం కొనుగోలు చేసి చుండూరు మండలం నడిగడ్డవారిపాలెం రైస్ మిల్లుకు తరలిస్తున్నారు. పాలీష్ చేసి నేరుగా కృష్ణపట్నం పోర్టుకు తీసుకెళుతున్నారు. భట్టిప్రోలు నుంచి తరలిస్తున్న బియ్యాన్ని గురువారం పొన్నూరులో 300 బస్తాలు పట్టుకున్నారు. ● రేపల్లె నియోజకవర్గంలో డీలర్లు కిలో రూ.10 చొప్పున కొని కూటమి నాయకులకు రూ. 11 నుంచి రూ.12 వరకు అమ్ముతున్నారు. తర్వాత ప్రకాశం జిల్లాకు తరలిస్తున్నారు. ఆపై రూ.16కు విక్రయిస్తున్నట్లు సమాచారం. నిజాంపట్నం మండలం కొలసానివారిపాలెంకు చెందిన కూటమి నేత కీలకంగా ఉన్నాడు. ప్రతి నెలా ఎమ్మెల్యేకు పెద్ద మొత్తం అందుతున్నట్లు తెలుస్తోంది. ● బాపట్ల నియోజకవర్గంలో టీడీపీ నాయకులు ఈనగంటి గాంధీ, వక్కలగడ్డ సుధీర్ రేషన్ ఈ వ్యాపారం చేస్తున్నారు. బాపట్ల నుంచి తరలిస్తున్న 700 బస్తాల బియ్యం శుక్రవారం నాగులుప్పలపాడులో పట్టుబడిన సంగతి తెలిసిందే. గుంటూరులోని శ్రీనగర్కు చెందిన జనసేన నేత అనిల్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు ఒకరు డీలర్లతో మాట్లాడి ప్రతినెల బియ్యం కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. అధికారుల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆర్టీసీ కాలనీకి చెందిన నాగేశ్వరరావు మిల్లర్ ద్వారా బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. మోహన్, సుబ్బారావులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ● పొన్నూరులో పచ్చ నేతలు ముగ్గురు హవా చాటుతున్నారు. పచ్చ జెండా మోసి అలసిపోయిన ఓ మువ్వగోపాలుడు మండలాన్ని చేజిక్కించుకున్నట్లు సమాచారం. రెండు నెలల క్రితం ఓ ఇంట్లో 70 బస్తాల రేషన్ బియ్యం నిల్వ చేసి పోలీసు రికార్డులకు ఎక్కిన టీడీపీ సానుభూతిపరుడు రబ్బాని ప్రస్తుతం కీలకంగా మారారని సమాచారం. పెదకాకాని మండలంలోని వెనిగండ్ల కేంద్రంగా అక్రమ రవాణా సాగుతోంది. ● తాడికొండ నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యే ఫిరంగిపురం మండలంలోని టీడీపీ యువ నాయకుడికి దందా అప్పగించారు. మండలాల్లో నేతలకు మామూళ్లు ఇచ్చి నడిపిస్తున్నారు. తాడికొండలో ఇద్దరు రేషన్ డీలర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రత్తిపాడులో కొని రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. ఎమ్మెల్యే అల్లుడు, అనుచరులు దందా నడిపిస్తున్నారు. ● మంత్రి లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో బియ్యం నేరుగా మిల్లుల వద్దకు చేరుస్తున్నారు. పాలీష్ చేసి కిలో రూ. 50 నుంచి రూ.70కి విక్రయిస్తున్నారు. కూటమి నేతల అండతో ఓ టీవీ చానల్ రిపోర్టర్ సోదరుడు రేషన్ దుకాణాలపై పెత్తనం చేస్తున్నట్లు సమాచారం రేషన్ బియ్యం అక్రమ రవాణా పూర్తిగా అధికార పార్టీ నేతల అండదండలతో సాగుతుండటంతో రెవెన్యూ, పోలీసు, విజిలెన్స్ శాఖల అధికారులు లంచాలు తీసుకుని చోద్యం చూస్తున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన లారీలు, ఆటోలు మాత్రమే పట్టుబడటమే ఇందుకు నిదర్శనం. పొన్నూరులో అధికారులకు చిక్కిన రేషన్ బియ్యం బస్తాలు టీడీపీ నాయకుల కనుసన్నల్లో రేషన్ మాఫియా అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న డీలర్లు అర్ధరాత్రి యథేచ్ఛగా అక్రమ రవాణా షాడో ఎమ్మెల్యేల కనుసన్నల్లో కార్యకలాపాలు బియ్యం పట్టుకుంటే ఎమ్మెల్యే అనుచరుల నుంచి ఫోన్లు పేదల నోటి దగ్గర కూడూ లాక్కుంటున్న నేతలు ప్రేక్షక పాత్రకే పరిమితమైన అధికారులు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. పొన్నూరులో మామిళ్ళపల్లి కేంద్రంగా వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. టీడీపీ నాయకులు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. పాలకులు రేషన్ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో విఫలమవుతున్నారు. – చింతలపూడి మురళీకృష్ణ, వైఎస్సార్ సీపీ పొన్నూరు మండల అధ్యక్షుడు, గుంటూరు జిల్లా.పల్నాడు జిల్లాలో కూడా రేషన్ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. సత్తెనపల్లిలో షాడో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బియ్యం అక్రమంగా కొనుగోలు చేస్తున్నారు. రాత్రి వేళ బొలెరో వాహనాలలో నకరికల్లుకు తరలిస్తున్నారు. ఎమ్మెల్యే ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు. -
ఆటో డ్రైవర్లకు అండగా ప్రభుత్వం
గుంటూరు వెస్ట్: ఆటో డ్రైవర్లకు అండగా కూటమి సర్కార్ ఉంటుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శనివారం స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఆటోడ్రైవర్ల సేవలో పథకం కింద సాయం పంపిణీని పెమ్మసాని, గుంటూరు జిల్లా ఇన్చార్జి మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, నసీర్ అహ్మద్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్రబాబుతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. జిల్లాలో 13,194 మంది ఖాతాల్లో దాదాపు రూ.20 కోట్లు జమ చేస్తున్నామన్నారు. డిప్యూటీ మేయర్ షేక్ సజీల, జిల్లా రవాణా అధికారి సీతారామ్ రెడ్డి, ఏపీ ఇండస్ట్రీస్ చైర్మన్ డేగల ప్రభాకర్, ఏపీ టెక్నాలజీస్ చైర్మన్ మోహన కృష్ణ, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వరరావు, జనసేన జిల్లా ఇన్చార్జి గాదె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ -
రైతుకు వి‘పత్తి’
● వర్షాల ధాటికి పంటను ఆశించిన ఎర్ర తెగులు, గులాబీరంగు పురుగు ● పంట ఎదుగుదల లేకపోవడంతో ఐదెకరాల్లో పంట పీకేసిన పత్తి రైతు ప్రత్తిపాడు: ఆ రైతు.. ఆరుగాలం శ్రమించాడు. ఎండనక వాననక ఆశల సాగు చేశాడు. పుడమినే నమ్ముకుని చేను కౌలుకు తీసుకున్నాడు. అరువు చేసి అరక కట్టాడు. కాలం విసురుతున్న విపత్కర పరిస్థితులను దాటుకుంటూ కౌలు భూమిలో పత్తి విత్తనాలను విత్తాడు. కానీ ప్రకృతి మాత్రం వాన రూపంలో వదలకుండా వెంటాడింది. చివరకు పంట తెగుళ్లబారిన పడి, ఎదుగుదల లేకపోవడంతో కన్నీటి పర్యంతమవుతూ సాగు చేసిన పంటను తన చేతులతోనే పీకేసుకోవలసిన వి‘పత్తి’ని ఆ వృద్ధ రైతు ఎదుర్కొన్నాడు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగానికి చెందిన నూనె గణపతికి ఎకరం భూమి ఉంది. మూడు నెలల కిందట మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. మొత్తం ఐదెకరాల్లో పత్తి సాగు చేశాడు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలు పంట పెరుగుదలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. పై ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరు కూడా పొలంలో రోజుల తరబడి నిలబడటంతో ఉరకెత్తి ఎర్ర తెగులు సోకింది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా గులాబీ రంగు పురుగు కూడా పంటను తీవ్రంగా ఆశించింది. దీంతో మొక్క ఎదుగుదల లోపించింది. మూడు నెలలైనా రెండడుగులు కూడా పెరగలేదు. కౌలుకు రూ. లక్ష, వ్యవసాయం చేసేందుకు సుమారు మరో రూ.లక్ష వరకు పెట్టుబడులు అయ్యాయి. గుండె తరుక్కుపోయిన గణపతి పొలంపై ఆశలు వదులుకున్నాడు. బుధవారం ఉదయం కన్నబిడ్డలా సాగు చేసిన పైరును తన చేతులతోనే పీకేశాడు. -
మహనీయుల సేవలు చిరస్మరణీయం
గుంటూరు వెస్ట్: దేశాభివృద్ధి కోసం మహనీయులు చేసిన సేవలను ఎప్పటికీ మరులేమని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా తెలిపారు. గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, నగర పాలక కమిషనర్ పులి శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, జిల్లా అధికారులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలో ఇంతటి స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవిస్తున్నామంటే మహానుభావుల త్యాగ ఫలమేనన్నారు. ప్రతిఫలం ఆశించకుండా వారు చేసిన సేవలు నేటి యువత తెలుసుకుని, వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు. సాగును లాభసాటిగా మార్చాలి వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో పెట్టుబడులు తగ్గి రైతులకు లాభాలు పెరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాథమిక రంగాల శాఖలు నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు వేస్తూ లాభదాయకత పెరిగేలా చూడాలని ఆదేశించారు. భవిష్యత్తు అవసరాలను ముందుగా గుర్తించాలని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ అయితా నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతు సేవ కేంద్రాల స్థాయిలో లక్ష్యాలను నిర్దేశించామని తెలిపారు. పంటల వారీగా సమస్యలను గుర్తించామని చెప్పారు. రైతులు మొక్కజొన్న, మినప పంటలకు మారుతున్నారని తెలిపారు. పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి. సత్యనారాయణ సీపీఓ శేషశ్రీ, జిల్లా మత్స్య శాఖ అధికారి పి.ఎన్.కిరణ్ కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛ అవార్డులు రావడం అభినందనీయం గుంటూరు జిల్లాకు స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు 5 రాష్ట్ర స్థాయి, 48 జిల్లా స్థాయి అవార్డులు వచ్చాయని తెలిపారు. వివరాలను స్వర్ణ ఆంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర పోర్టల్లో పొందుపరిచామన్నారు. అధికారులు, సిబ్బంది కృషిని అభినందించారు. వాయు నాణ్యతాప్రమాణాలు పెంచండి గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వాయు నాణ్యతాప్రమాణాలను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం ద్వారా జీఎంసీ పరిధిలో చేపడుతున్న పనుల పురోగతిపై జిల్లా స్థాయి అమలు కమిటీతో కలెక్టర్ సమీక్షించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెడికల్ క్లబ్ రోడ్డు, పొన్నూరు రోడ్డు బీటీ పనులకు, మియావాకీ ప్లాంటేషన్కు రూ.3.56 కోట్లతో వచ్చిన ప్రతిపాదనలకు ప్రాథమికంగా ఆమోదం తెలిపారు. అనుమతులు ఇవ్వండి పరిశ్రమలు, సేవా రంగాల్లో అనుమతులు సత్వరం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సెకండరీ, సేవా రంగాలలో జిల్లాలో ఉత్తమ ప్రగతి రావాలన్నారు. అభివృద్ధిలో యంగ్ ప్రొఫెషనల్స్ కీలకం నియోజకవర్గ స్థాయిలో ‘యంగ్ ప్రొఫెషనల్స్’ ఆ ప్రాంత అభివృద్ధిలో కీలక భూమిక పోషించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, యంగ్ ప్రొఫెషనల్స్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. యువత విజ్ఞానం వృథా కాకుండా సమాజ అభివృద్ధికి ఉపయోగపడేలా కృషి చేయాలన్నారు. జెడ్పీ సీఈఓ జ్యోతి బసు, వ్యవసాయ శాఖ జేడీ అయితా నాగేశ్వర రావు, గుంటూరు నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. -
50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ గుంటూరు వెస్ట్: ఖరీఫ్ సీజన్లో 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణను లక్ష్యంగా నిర్ణయించామని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా ధాన్య సేకరణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జిల్లాలో 3,89,849 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా ఉందన్నారు. ఇందులో ఈ ఏడాది డిసెంబర్ నుంచి 50 వేల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 177 రైతు సేవ కేంద్రాలు, 45 రైతు సేవ క్లస్టర్ల ద్వారా ధాన్యం సేకరిస్తామని పేర్కొన్నారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాకు రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 చొప్పున ఇచ్చి కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ అధికారులు ఇ–పంట, ఇ – కేవైసీ వంద శాతం పూర్తి చేయాలన్నారు. పంట రకాన్ని గుర్తించాలని, తేమ శాతం అధికంగా లేకుండా చూడాలని చెప్పారు. ధాన్యం సేకరణ నిబంధనలను రైతులకు తెలియజేయాలన్నారు. రైతుల ఎంపిక మేరకు పంటను సంబంధిత మిల్లులకు తరలించేలా సివిల్ సప్లయిస్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం తరలించే వాహనాలకు జీపీఎస్ ఉండేలా రవాణా శాఖాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తేమ శాతం అధికంగా ఉంటే డ్రయర్లను ఉపయోగించుకోవాలన్నారు. రైతులకు అవసరమైన టార్పాలిన్లు సరఫరా చేసేందుకు మార్కెటింగ్ శాఖాధికారులు, ధాన్యం తూకానికి సంబంధించి లీగల్ మెట్రాలజీ అధికారులు ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. ధాన్యం లోడింగ్, అన్ లోడింగ్కు సరిపడా హమాలీలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. మిల్లర్లు మాట్లాడుతూ.. టార్పాలిన్లను సబ్సిడీపై అందించాలని కోరారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని విన్నవించారు. ఈ విషయాలను ప్రభుత్వానికి తెలియజేసి తదుపరి చర్యలు తీసుకుంటామని జేసీ తెలిపారు. సమావేశంలో సివిల్ సప్లయిస్ జీఎం పి.జయంతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
అలరించిన ‘ఆదికవి నన్నయ భట్టు’
●కొనసాగిన వీణా అవార్డ్స్ – 2025 ●ముగిసిన పద్య నాటికల అంకం తెనాలి: కళల కాణాచి, తెనాలి, ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో ఇక్కడ జరుగుతున్న ‘వీణా అవార్డ్స్–2025’ జాతీయస్థాయి పంచమ పద్యనాటక, సాంఘిక నాటక, నాటికల పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఐదోరోజైన బుధవారం ఉదయం శ్రీశ్యామలాంబ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్, విజయనగరం వారు ప్రదర్శించిన ‘ఆదికవి నన్నయ్య భట్టు’తో పద్యనాటకాలు ముగిశాయి. సాంఘిక నాటక/నాటికలు కొనసాగుతున్నాయి. ఆదికవి నన్నయ భట్టు ఇతివృత్తం తెలిసిందే. రాజరాజ నరేంద్రుడికి ఇచ్చిన మాట కోసం ఆస్థాన కులగురువు నన్నయ భట్టు మహాభారతాన్ని తెలుగులో రచించటానికి పూనుకుంటాడు. సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులోకి అనువదింటానికి పండితలోకం అనుమతించదు. అందుకు తగిన వ్యాకరణం కూడా లేదని నిరసిస్తుంది. దీంతో ‘ఆంధ్ర శబ్ద చింతామణి’ అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించి, మహాభారత అనువాదానికి పూనుకుంటాడు నన్నయ. భార్య వియోగం, రాజు మరణం సహా అనేక అవాంతరాలు ఎదురవుతాయి. చివరకు ఆది, సభాపర్వాలు మాత్రమే రచించి, అనూహ్యంగా పరలోకం చేరుకుంటాడు. శారదా ప్రసన్న రచనకు ఈపు విజయకుమార్ దర్శకత్వం వహించారు. నన్నయ భట్టుగా కె.సూర్యనారాయణ, నారాయణభట్టుగా ఎం.సుబ్రహ్మణ్యం, సోమిదమ్మగా కేవీ పద్మావతి, రాజరాజ నరేంద్రుడుగా వై.సత్యం పాత్రోచితంగా నటించారు. మధ్యాహ్నం జయకళానికేతన్, విశాఖపట్నం వారి ‘సిరికేళి’ సాంఘిక నాటకాన్ని ప్రదర్శించారు. వేగి పార్వతి సూర్యనారాయణ రచనకు కె.వెంకటేశ్వరరావు దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రల్లో కృష్ణారావు, హేమ, రాజేశ్వరి, కె.వెంకటేశ్వరరావు, త్రినాథ్ నటించారు. సాయంత్రం శ్రీసద్గురు కళానిలయం, గుంటూరు వారి ‘నాన్న’ నాటికను ప్రదర్శించారు. మాడభూషి దివాకర్బాబు రచనకు బసవరాజు జయశంకర్ దర్శకత్వం వహించారు. పరమాత్ముని క్రియేషన్స్, భాగ్యనగరం, హైదరాబాద్ వారి ‘ఎక్కడో...ఏదో’ నాటిక, చివరగా కళానికేతన్, వీరన్నపాలెం వారి ‘దీపం కింద చీకటి’ నాటికను ప్రదర్శించారు. నూతలపాటికి వేదగంగోత్రి వరప్రసాద్ పురస్కారం తెనాలి: స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రమ్లో జరుగుతున్న వీణా అవార్డ్స్–2025 పోటీల్లో అయిదోరోజైన బుధవారం రాత్రి వేదగంగోత్రి వరప్రసాద్ జాతీయ రంగస్థల నిర్వాహక పురస్కారాన్ని సత్తెనపల్లికి చెందిన ప్రగతి కళామండలి రథసారథి, ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు నూతలపాటి సాంబయ్యకు ప్రదానం చేశారు. పొన్నూరు కళాపరిషత్ నిర్వాహకుడు ఎస్.ఆంజనేయులు నాయుడు అధ్యక్షత వహించారు. కళల కాణాచి వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీమాటల రచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా. మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారిచే అవార్డును అందజేశారు. కార్యక్రమంలో వేదగంగోత్రి ఫౌండేషన్, విజయవాడ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.రవితేజ, ప్రముఖ నాటకరంగ విశ్లేషకుడు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ నాటక పరిషత్ల సమాఖ్య అధ్యక్షుడు బుద్దాల వెంకట రామారావు, కళల కాణాచి గౌరవ సలహాదారుడు వేమూరి విజయభాస్కర్, సహాయ కార్యదర్శి అయినాల మల్లేశ్వరరావు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా జాతీయస్థాయి నాటక పోటీలు నిర్వహిస్తున్న కళల కాణాచికి ప్రభుత్వం తరఫున నిధి ఏర్పాటుకు తాను సిఫార్సు చేయనున్నట్టు రాజకుమారి ప్రకటించారు. -
టిప్పర్ను ఢీకొన్న లారీ
డ్రైవర్కు తీవ్ర గాయాలు చీరాల అర్బన్: మండల కేంద్రం చీరాల 216 జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి. చైన్నె నుంచి నిజాంపట్నం వెళుతున్న లారీ ఎంవీఐ కార్యాలయం సమీపంలో ముందు వెళుతున్న టిప్పర్ను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ పఠాన్ సిరాజ్కు తీవ్ర గాయాలయ్యాయి. లారీ ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్ను అతికష్టం మీద బయటకు తీసి చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. -
రక్తదానం ఎంతో గొప్పది
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రాణాలను కాపాడే రక్తదానం ఎంతో గొప్ప సేవా కార్యక్రమం అని, ప్రతిఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ కె.విజయలక్ష్మి పిలుపునిచ్చారు. బుధవారం జాతీయ రక్తదాతల దినోత్సవం సందర్భంగా జెడ్పీ ప్రాంగణంలోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో రోటరీ క్లబ్ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ గత 15 రోజులుగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అనేక కళాశాలల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి యువతను రక్తదానం వైపు మళ్లే రెడ్ క్రాస్ కృషి చేసిందని, రెడ్ క్రాస్ చేస్తున్న సేవలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్వీ సుందరాచారి మాట్లాడుతూ జాతీయ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో యువత ముందుకు వచ్చి రక్తదానం చేయటం అభినందనీయమని అన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాలు నిర్వహించిన మాస్టర్ మైండ్స్, టీజేపీస్, మలినేని ఇంజనీరింగ్ కాలేజ్, సెయింట్ ఆన్స్ డిగ్రీ కాలేజ్ ప్రతినిధులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. రెడ్ క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ పి.రామచంద్ర రాజు, రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు అధ్యక్షుడు నంబూరు కృష్ణమూర్తి, తెనాలి రెడ్ క్రాస్ చైర్మన్ ముమ్మనేని భానుమతి, డాక్టర్ శ్రవణ్ కుమార్, రోటరీ క్లబ్ సభ్యులు, రెడ్ క్రాస్ వలంటీర్లు పాల్గొన్నారు. -
వైభవంగా చండీకల్యాణం
అమరావతి: ప్రముఖ శైవక్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న శ్రీబాల చాముండిక సమేత అమరేశ్వరస్వామి దేవాలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి చండీకల్యాణం వైభవంగా నిర్వహించారు. తొలుత అమ్మవారికి, స్వామివారికి ఎదుర్కోల మహోత్సవం జరిగింది. ఆలయంలోని వెంకటాద్రినాయుని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారిని ఉంచి ఆలయ అర్చకులు కౌశిక చంద్రశేఖరశర్మ యాజ్ఞీక పర్యవేక్షణలో అర్చకులు విఘ్నేశ్వర పూజ, రక్షాబంధనం,పుణ్యహవాచనం, కన్యాదానం, శాస్త్రోక్తంగా కల్యాణ క్రతువు నిర్వహించారు. ఏటా రెండుసార్లు అనగా మహాశివరాత్రి, దసరాకు కల్యాణం నిర్వహించటం సంప్రదాయమని అర్చకులు పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యతాలోపాలు నాదెండ్ల: సీసీ రోడ్డు నిర్మాణంలో నాణ్యతాలోపాలు నిజమని తేలటంతో సంబంధిత అధికారులపై ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. 2017–18లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు రూ.40 లక్షల పంచాయతీరాజ్ నిధులతో సిమెంటు రోడ్డు నిర్మించారు. పనులు నాసిరకంగా ఉన్నాయంటూ 2020లో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశాడు. విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ప్రమాణాలు పాటించలేదని నిర్ధారించారు. అప్పటి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా వ్యవహరించిన కేశవరావుకు చార్జ్మెమో జారీ చేశారు. కాంట్రాక్టర్కు చెల్లించిన బిల్లులో కోత విధించారు. 2024లో కేశవరావు ఉద్యోగ విరమణ చేసినందున ఆయన పింఛను నుంచి మూడేళ్లపాటు 15 శాతం చొప్పున జరిమానాగా కోత విధించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
గంజాయి తాగుతున్న నలుగురు అరెస్టు
పట్నంబజారు: గంజాయి తాగుతూ, విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. పాతగుంటూరు పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈస్ట్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, పాతగుంటూరు పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ కె.వెంకటప్రసాద్ వివరాలు బుధవారం వెల్లడించారు. పొన్నూరు రోడ్డులోని ఆంధ్రా ముస్లిం కళాశాల సమీపంలో ఉన్న రేకుల షెడ్డులో కొంత మంది గంజాయి సేవిస్తూ, విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడిచేశారు. ఆనందపేటకు చెందిన షేక్ అబూలకర్ సిద్ధీక్ అలియాస్ అబ్బు, లాలాపేటకు చెందిన పోపూరి దేవరాజు, షేక్ హుస్సేన్, పాతగుంటూరుకు చెందిన షేక్ ఇర్ఫాన్లు గంజాయి సేవిస్తూ పట్టుపడ్డారు. వారిని స్టేషన్కు తీసుకొచ్చి విచారించగా, గత కొద్దిరోజుల క్రితం గోవా వెళ్లి పలు మత్తు పదార్ధాలకు సంబంధించి బిళ్లలు తీసుకొచ్చి నీటిలో కలిపి ఇంజక్షన్ల ద్వారా నరాలకు ఎక్కించుకుంటున్నట్లు గుర్తించారు. దీంతోపాటు, 1200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పలు రకాలకు చెందిన మత్తు బిళ్లలు, ఇంజక్షన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్ఐలు షేక్ అబ్దుల్ రెహమాన్, ఎన్.సి.ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నగరంపాలెం: తెనాలి, దక్షిణ సబ్ డివిజన్ల పరిధిలో నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో బుధవారం తెనాలి, దక్షిణ పోలీస్ సబ్ డివిజన్ల పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లపై క్షేత్రస్థాయిలో నిఘా ఉండాలని అన్నారు. కొత్తగా నేరాల జోలికి వెళ్లకుండా సరైన రీతిలో కౌన్సెలింగ్ చేయాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఆయా సబ్ డివిజన్ల పరిధిలోని పోలీస్స్టేషన్లు, శాంతి భద్రతలు వంటి అంశాలపై జిల్లా ఎస్పీకి డీఎస్పీలు జనార్దన్ (తెనాలి), భానోదయ (దక్షిణ)లు వివరించారు. -
సాగర్బాబు ఘటనపై తగిన న్యాయం చేస్తాం
నరసరావుపేట రూరల్: విద్యుత్ షాక్కు గురై వికలాంగుడిగా మారిన సాగర్బాబు ఘటనలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ ఎస్ఈ విజయ్కుమార్ హామీ ఇచ్చారు. జొన్నలగడ్డలోని విద్యుత్శాఖ ఎస్ఈ కార్యాలయం వద్ద సాగర్బాబు కుటుంబం గత రెండురోజులుగా నిరాహార దీక్షలు చేపట్టారు. మంగళవారం చేపట్టిన దీక్షా శిబిరాన్ని ఎస్ఈ సందర్శించి, సాగర్బాబు భార్య కెజియాతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు ఎస్ఈని కలిసి చర్చించారు. సాగర్బాబు కుటుంబం గత 17 రోజులుగా రిలే నిరాహారదీక్షలు, రెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నట్టు తెలిపారు. వారి ఆరోగ్యం క్షీణిస్తుందని వెంటనే సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ ఘటనలో విద్యుత్ అధికారులకు ఎలాంటి సంబంధం లేదని గ్రామ పెద్దలు రాతపూర్వకంగా ఇచ్చారని ఎస్ఈ తెలపగా.. రెండున్నర సంవత్సరాల క్రితం ఘటన జరిగితే ఇప్పుడు నకిలీ లెటరు తీసుకువచ్చి చూపడం సరికాదని, ప్రజాసంఘాల నాయకులు తెలిపారు. సాగర్బాబుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై శాఖాపరంగా విచారణ జరిపి న్యాయం చేస్తామని ఎస్ఈ హామీ ఇచ్చారు. దీంతో సాగర్బాబు కుటుంబసభ్యులు రిలే నిరాహార దీక్షలను విరమించారు. కార్యక్రమంలో పీడీఎం నాయకులు వై.వెంకటేశ్వర్లు, నల్లపాటి రామారావు, జిల్లా అద్యక్షుడు షేక్ మస్తాన్వలి, కార్యదర్శి జి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్కంఠగా కొనసాగుతున్న చెస్ పోటీలు
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో 62వ నేషనల్ చెస్ చాంపియన్షిప్ పోటీలు ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. ఆలిండియా చెస్ ఫెడరేషన్ విభాగంలోని ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో ఈ పోటీలు జరుగుతున్నాయి పదో రోజైన మంగళవారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కై కలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు. ఆట ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ చదరంగాన్ని బ్రెయిన్ గేమ్ అని కూడా అంటారన్నారు. నిజమైన విజయమంటే ప్రత్యర్థిని ఓడించడం మాత్రమే కాదని, మనలోని ఆలోచనా శక్తిని పెంచుకోవడమనిన అభిప్రాయపడ్డారు. ఏపీ నుంచి మొట్టమొదటి ఇంటర్నేషనల్ మాస్టర్ లంకా రవి మాట్లాడుతూ చదరంగం అనేది ఒక మేధో క్రీడ మాత్రమే కాకుండా, అనేక నైపుణ్యాలను నేర్పే వేదికన్నారు. 9వ రౌండ్ ఫలితాలు తొమ్మిదో రౌండ్లో సంచలనాలు చోటుచేసుకున్నాయి. ముగ్గురు గ్రాండ్మాస్టర్లు, మాజీ జాతీయ చాంపియన్లు కూడా ఇంటర్నేషనల్ మాస్టర్ల చేతిలో ఓటమిపాలయ్యారు. పీఎస్పీబీకి చెందిన జీఎం సశికిరణ్ కృష్ణన్ గెలుపు అవకాశాన్ని కోల్పోయినా 7.5 పాయింట్లతో టాప్లో కొనసాగుతున్నాడు. తమిళనాడుకు చెందిన జీఎం ఇనియన్ పి.ఎ., కేరళకు చెందిన ఐఎం గౌతమ్ కృష్ణ. హెచ్ కూడా అతనితో సమంగా లీడ్లో చేరారు. ఇంకా రెండు రౌండ్లు మిగిలి ఉండటంతో టైటిల్ పోరు ఉత్కంఠభరితంగా మారింది. పీఎస్పీబీకి చెందిన టాప్ జీఎంలు సూర్యశేఖర్ గంగూలీ, అభిజిత్ గుప్తా, ఎస్పీ సేతురామన్ వరుసగా గోవా ఐఎం రిట్విజ్ పరాబ్, కేరళ ఐఎం గౌతమ్ కృష్ణ, తమిళనాడు ఐఎం మనిష్ ఆంటో క్రిస్టియానో చేతిలో ఓడిపోయారు. -
దివ్యం.. దుర్గమ్మ దర్శనం
● వైభవంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ● వేదపఠనంతో మారుమోగిన ఇంద్రకీలాద్రి ● అమ్మ దర్శనానికి తరలివస్తున్న భవానీలు ● నేడు మహిషాసురమర్దినిగా అలంకారం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దేవీశరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ మంగళవారం శ్రీదుర్గాదేవి అలంకారంలో భక్తులను కరుణించారు. లోకకంటకుడైన దుర్గమాసురుడనే రాక్షకుడిని వధించి ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవిగా కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము మూడు గంటలకు అమ్మవారికి విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత క్యూలైన్లోకి చేరిన భక్తులకు తెల్లవారుజామునే దర్శనం పూర్తయింది. మధ్యాహ్నం నుంచి వర్షం పడటంతో క్యూలైన్లో ఉన్న భక్తులు, అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణమైన వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వీఐపీలు, సిఫార్సులతో దర్శనానికి వచ్చే వారి సంఖ్య అంతంత మాత్రంగానే కనిపించింది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వీఐపీల తాకిడి పెరగడంతో ఆలయ ప్రాంగణంలో కాస్త గందరగోళ పరిస్థితులు కనిపించాయి. కనకదుర్గమ్మ బుధవారం శ్రీమహిషాసురమర్దినీదేవిగా దర్శనమిస్తారు. ముగింపు దశకు ఉత్సవాలు గత నెల 22వ తేదీన ప్రారంభమైన దసరా ఉత్సవాలు గురువారంతో ముగియనున్నాయి. గురువారం శ్రీరాజరాజేశ్వరి అలంకారం, ఉదయం పది గంటలకు యాగశాలలో మహా పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడంతో అమ్మవారి దీక్ష స్వీకరించిన భవానీల రాక ప్రారంభమైంది. దీంతో పోలీసులు, ఇటు రెవెన్యూ అధికారులు అప్రమత్తమై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భవానీమాలధారుల రాకతో ఆలయ పరిసరాలు అరుణ వర్ణాన్ని సంతరించుకున్నాయి. దుర్గమ్మ సేవలో దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్లాల్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈఓ శీనానాయక్ సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు. పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. సినీ నటి హేమ అమ్మవారిని దర్శించుకున్నారు. -
అవయవ దానంతో పలువురికి నూతన జీవితం
గుంటూరు మెడికల్: బ్రెయిన్ డెడ్ అయి లోకాన్ని విడిచిపోతున్న వారి అవయవాల దానంతో పలువురికి నూతన జీవితాన్ని ప్రసాదించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని జీవన్ దాన్ సంస్థ మంగళవారం బ్రెయిన్డెడ్ అయిన ఇద్దరి అవయవాలను అవసరమైన వారికి పంపింది. మంగళగిరిలోని ఎయిమ్స్లో ఇండ్లమూరి నాగేంద్రకుమార్ (21) బ్రెయిన్ డెడ్ అయ్యారు. నాగేంద్రకుమార్ లివర్ను గుంటూరులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్కు మంగళవారం ప్రత్యేక గ్రీన్ చానల్ ద్వారా పోలీసుల సహకారంతో వైద్యులు తరలించారు. అలాగే, గన్నవరం పిన్నమనేని సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన మువ్వా ప్రదీప్కుమార్ (46)కు చెందిన రెండు కిడ్నీలను కూడా ఇదే హాస్పిటల్స్కు పంపారు. ఈ సందర్భంగా హాస్పిటల్స్కు చెందిన డాక్టర్ కార్తీక్ చౌదరి మాట్లాడుతూ.. పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా బ్రెయిన్ డెడ్ అయిన తమ వారి అవయవాలను కుటుంబసభ్యులు దానం చేయడం ఎంతో అభినందనీయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేల మంది వివిధ అనారోగ్యాలతో బాధపడుతూ అవయవాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. డాక్టర్ అనుష మాట్లాడుతూ ఒకరికి అవయవదానం చేసి జీవితాన్ని ప్రసాదించడం వల్ల వారి కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటుందన్నారు. ప్రదీప్కుమార్ నాగేంద్రకుమార్ -
చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఏల్చూరి
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) అధ్యక్షునిగా ఏల్చూరి వెంకటేశ్వర్లు గెలుపొందారు. గుంటూరు జిన్నాటవర్ కూడలిలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష పదవికి ఏల్చూరి వెంకటేశ్వర్లు, రంగా బాలకృష్ణలు పోటీపడ్డారు. సోమవార ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. అర్ధరాత్రి దాటేవరకు లెక్కింపు చేపట్టారు. అధ్యక్షుడిగా ఏల్చూరి వెంకటేశ్వర్లు 721 ఓట్లతో రెండోసారి గెలిచారు. రంగా బాలకృష్ణకు 65 ఓట్లు వచ్చాయి. ఏల్చూరి ప్యానెల్లో ముగ్గురు కార్యదర్శులు, ఉపాధ్యక్షులుగా టీఎల్వీ వీరాంజనేయులు, వి.వెంకటనాగి రెడ్డితోపాటు మరో నలుగురు గెలిచినట్లు చాంబర్ శాశ్వత గౌరవాధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు మంగళవారం తెలిపారు. సుమారు 3,200 మంది వ్యాపారులకు చాంబర్లో సభ్యత్వం ఉండగా, ఓటేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. కేవలం 797 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. -
వల విసరక.. పూట గడవక..
తాడేపల్లి రూరల్ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానదిలో చేపలు వేటాడే మత్స్యకారుల బతుకు దయనీయంగా ఉంది. గత రెండు నెలల నుంచి కృష్ణానదికి తరచూ వరద రావడంతో వల విసరలేని పరిస్థితి నెలకొంది. పొట్ట నింపుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యారేజ్ ఎగువ, దిగువ ప్రాంతాల్లో సుమారు 450 కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. వీరే కాకుండా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి నుంచి వలస వచ్చిన మరో 50 కుటుంబాలు కృష్ణానదిని నమ్ముకునే ఇలా బతుకుతున్నాయి. నదికి కొన్ని నెలలుగా వరద పోటెత్తుతూ ఇప్పుడు 6 లక్షల క్యూసెక్కుల వరకు చేరింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లాలంటే కృష్ణానది గేట్లు తప్పని సరిగా మూసి ఉండాలి. లేని పక్షంలో పడవ నిలిచి వల వేడయానికి కుదరదు. నాలుగైదు నావల వారు కలిసి రాత్రి సమయంలో కృష్ణానదిలో అక్కడక్కడ రంగ వలలతో బుట్టలను ఏర్పాటు చేస్తారు. వరద రావడంతో అవి కొట్టుకుపోతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. గత మూడు నెలలుగా అందిన చోట అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద సొసైటీలు ఉన్నాయని, వాటి ద్వారా మత్స్యశాఖ అధికారులు ఆర్థిక సహాయాన్ని అందించాలని విన్నవించారు. రేషన్ సరకులు అందజేస్తే కడుపు నింపుకొంటామన్నారు. ప్రస్తుతం తమ కుటుంబాలు అర్ధాకలితో జీవించాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. దోచుకుంటున్న వ్యాపారులు.... కృష్ణానదిలో చేపల వేట లేకపోవడంతో ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతంలోని సీతానగరానికి వెళ్లే మార్గంలో చేపల వ్యాపారుల తమకు ఇష్టం వచ్చిన ధరలతో విక్రయిస్తున్నారు. కేజీ చెరువు చేపలను రూ.300 – రూ.500 వరకు అమ్ముతున్నారు. అవి కూడా కృష్ణానది చేపలు అంటూ అంటగడుతున్నారు. దిగువ ప్రాంతంలో చేపల వ్యాపారులు ఏర్పాటు చేసిన కాటాల్లో సైతం భారీ వ్యత్యాసం కనబడుతోంది. కేజీ చేప తీసుకుంటే 750 గ్రాములే ఉంటోందని పలువురు వాపోతున్నారు. తూనికలు, కొలతల అధికారులకు ఫిర్యాదు అందడంతో తనిఖీ చేయగా మోసం వెలుగుచూసింది. 15 కాటాలు సీజ్ చేసి, కేసులు నమోదు చేశారు. అయినా వ్యాపారులు తమ తీరు మార్చుకోవడం లేదని పలువురు కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం
వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట పీహెచ్సీ వైద్యుల నిరసన నరసరావుపేట టౌన్: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు మంగళవారం పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సమస్యలు పరిష్కారం కోరుతూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా పీహెచ్సీ వైద్యులు ఓపీ సేవలు బహిష్కరించి నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు డాక్టర్ మమత ప్రియ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ సేవలు నిలిపివేశామని, అత్యవసర చికిత్సలకు సేవలందిస్తున్నామన్నారు. సుమారు 25 సంవత్సరాల నుంచి పదోన్నతులు లేక ఒకే హోదాలో సేవలందిస్తున్న వైద్యాధికారులకు న్యాయం చేయాలన్నారు. ఇన్ సర్వీస్ పీజీ కోటాను పునరుద్ధరించాలని, నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్న వైద్యులకు 50 శాతం మూలవేతనం గిరిజన భత్యంగా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమానికి రూ.5 వేలు భత్యం ఇవ్వాలన్నారు. బుధవారం పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపడతామన్నారు. గురువారం విజయవాడ వైద్య శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టటం జరుగుతుందన్నారు. అప్పటికీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైద్యులు రమ్య, జగన్ నరసింహారెడ్డి, రాధా కృష్ణణ్, ప్రదీప్, బాల అంకమ్మ పాల్గొన్నారు. -
7న చలో విజయవాడకు ఫ్యాప్టో పిలుపు
గుంటూరు ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఽఖ్య(ఫ్యాప్టో) పిలుపు మేరకు ఈ నెల 7న విజయవాడలోని ధర్నా చౌక్లో తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకులు నక్కా వెంకటేశ్వర్లు, గుత్తా శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా ఫ్యాప్టో చైర్మన్ కె.నరసింహారావు పిలుపునిచ్చారు. రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు ధర్నా సన్నాహక సమావేశాన్ని మంగళవారం నగరంపాలెంలోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. -
అలరించిన ‘మోహినీ భస్మాసుర’
తెనాలి: పురాణగాథ ‘మోహినీ భస్మాసుర’ పద్యనాటకంగా పండిత పామరులను అలరిస్తూనే ఉంది. తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో జరుగుతున్న వీణా అవార్డ్స్–2025 జాతీయ పంచమ పద్యనాటక, సాంఘిక నాటక/నాటికల పోటీల్లో నాలుగోరోజైన మంగళవారం తొలి ప్రదర్శనగా ఈ నాటకం అలరించింది. విజయనగరానికి చెందిన అక్కినేని సాంస్కృతిక సమాజం ప్రదర్శించగా, వీక్షకుల కరతాళధ్వనులను అందుకుంది. వృకాసురుడనే రాక్షసుడు అయిదేళ్లపాటు భీకర తపస్సు చేయటంతో శివుడు ప్రత్యక్షమై, అడిగినదే తడవుగా ఎవరి తలపైనయినా చేయి పెట్టిన వెంటనే అతడు భస్మమయేలా, ఎవరివల్ల కూడా వృకాసురుడికి మరణం లేకుండా వరాలిస్తాడు. ఈ వరాలతో జరిగే కీడు తెలిసిన నారదుడు రెచ్చగొట్టటంతో వరాన్ని పరీక్షించుకునేందున వృకాసరుడు నేరుగా శివుడు దగ్గరకు వెళతాడు. శివుడు తప్పించుకుని శ్రీవిష్ణువును శరణు వేడతాడు. విష్ణువు నారదుడిని సంప్రదించి, మోహినీరూపం దాల్చి వృకాసురుని అంతమొదించటం ఇతివృత్తం. మద్దెల పంచనాదం రచనకు గవర సత్తిబాబు దర్శకత్వం వహించారు. వృకాసురుడుగా దాసరి తిరుపతినాయుడు, మోహినిగా కేవీ పద్మావతి, లక్ష్మీదేవిగా పి.నీలవేణి, నారుదుడిగా గవర సత్తిబాబు పాత్రోచితంగా నటించారు. ఆకట్టుకున్న ఇతివృత్తాలు అనంతరం టీజీవీ కళాక్షేత్రం, కర్నూలు వారి ‘జగదేక సుందరి సామా’ పద్యనాటకాన్ని ప్రదర్శించారు. సామా అనే వేశ్య ఎందరినో బానిసలను చేసుకుంటుంది. వేలంలో కొనుగోలు చేసిన బానిస మాఘపై మనసు పడుతుంది. ఆమె దగ్గర బానిసలను విడిపించటానికి మాఘ ఆమెను ప్రేమిస్తున్నట్టు నటిస్తాడు. అతడి మాటలను నమ్మి బానిసలు విడుదల చేస్తుంది. ఆ వెంటనే సామా ఎదుటనే మాఘ విషం తీసుకుని మరణిస్తాడు. విరక్తి చెందిన సామా ఆత్మహత్యకు పూనుకోగా, పుణ్యకుడు అనే బౌద్ధగురువు హితబోధతో బౌద్ధసన్యాసినిగా మారుతుంది. సామాగా ప్రముఖ రంగస్థల, సినీనటి సురభి ప్రభావతి అద్భుతంగా నటించారు. ఇతర పాత్రల్లో జీవీ శ్రీనివాసరెడ్డి, కె.బాలవెంకటేశ్వర్లు, పి.రాజారత్నం నటించారు. పల్లేటి కులశేఖర్ రచనకు పద్యాలు/దర్శకత్వం పత్తి ఓబులయ్య. అనంతరం మానవత, యడ్లపాడు వారి ‘అంతా మంచివారే...కానీ’ సాంఘిక నాటకాన్ని ప్రదర్శించారు. రచన, దర్శకత్వం జరుగుల రామారావు. చివరగా అభ్యుదయ ఆర్ట్స్, విజయవాడ వారు ‘క్రతువు’ సాంఘిక నాటికను ప్రదర్శించారు. కేవీవీ సత్యనారాయణ రచనకు వేంపాటి రమేష్ దర్శకత్వం వహించారు. నాటకపోటీలను కళల కాణాచి, తెనాలి, ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో కొనసాగిస్తున్నారు. -
మద్యం మత్తులో కారుతో హల్చల్
పిడుగురాళ్ల: మద్యం మత్తులో బొలెరో వాహనాన్ని నడుపుతూ వాహనాలు, పాదచారులపైకి దూసుకుపోయిన ఘటన పిడుగురాళ్ల పట్టణ సమీపంలోని అయ్యప్ప నగర్ వద్ద మంగళవారం రాత్రి జరిగింది. సేకరించిన వివరాలు ప్రకారం.. సైదా వలి అనే యువకుడు పూటుగా మద్యం తాగి బొలెరో వాహనం నడుపుతూ దాచేపల్లి వస్తున్నాడు.. ఈక్రమంలో పిడుగురాళ్ల అయ్యప్పనగర్ వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాల తో పాటు పాదచారులపైకి దూసుకుపోయాడు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన యువకుడు హైవేపై కొద్ది నిమిషాల పాటు హల్చల్ చేశాడు. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. రోడ్డు పక్కన ద్విచక్ర వాహనం నిలిపి పక్కన మాట్లాడుతున్న వ్యక్తిని బొలెరోతో ఢీకొనడమే కాకుండా ఆ ద్విచక్ర వాహనాన్ని రోడ్డుపై ఈడ్చుకుంటూ అర కిలోమీటర్ దూరం వరకు వెళ్లాడు. వేగంగా వాహనం దూసుకుని పోవడంతో రోడ్డుపై నిప్పు రవ్వలు చెలరేగాయి. ఈ ఘటన చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గాయపడిన వారిలో నరసరావుపేటకు చెందిన ఓ వ్యక్తికి కాలు పూర్తిగా దెబ్బతింది. అతన్ని వెంటనే నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ తరలించినట్లు తెలిసింది. మిగిలిన వారిని పిడుగురాళ్ల పట్టణంలో ప్రైవేట్ హాస్పటల్లో చేర్పించారు. ఈక్రమంలో ఆ వాహనాన్ని అడ్డుకునేందుకు స్థానికులు విశ్వప్రయత్నం చేశారు. ఎట్టకేలకు పలువురు యువకుల సాయంతో బొలెరో వాహనాన్ని ఆపారు. అనంతరం మద్యం మత్తులో ఉన్న సైదావలికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గాయపడ్డ వారిని 108 ద్వారా పిడుగురాళ్ల ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనతో అద్దంకి –నార్కెట్పల్లి హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు సమాచారం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ను క్లియర్ చేశారు. వాహనం నడిపిన సైదావలిని అదుపులో తీసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివ నాగరాజు తెలిపారు. -
అథ్లెట్స్ రోషన్, రమేష్లకు ఉత్తమ క్రీడాకారుల అవార్డులు
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఇటీవల ఏలూరు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో జరిగిన ఏపీ స్టేట్ జూనియర్ అథ్లెటిక్ చాంపియన్ షిప్ పోటీల్లో గుంటూరుకి చెందిన ఎస్కే రోషన్, బి. గణ రమేష్లకు ఉత్తమ క్రీడాకారుల అవార్డులను ప్రదానం చేశారని అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్.కె రోషన్ అండర్ –20 యువకుల విభాగంలో 110 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్ను 13.8 సెకండ్లలో పూర్తి చేసి బంగారు పతకాన్ని సాధించినట్లు తెలిపారు. అండర్ 14 బాలుర ట్రయాథ్లిన్ విభాగంలో బి.గణ రమేష్ బంగారు పతకాలు సాధించి ఉత్తమ క్రీడాకారుల ట్రోఫీలను అందుకున్నట్లు తెలియజేశారు. వీరిద్దరూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అంతర్జాతీయ క్రీడాకారుడు, శిక్షకుడు కృష్ణమోహన్, కె.రవి వద్ద శిక్షణ పొందినట్లు ఆయన పేర్కొన్నారు. -
ప్రతి అర్జీని పరిశీలించాల్సిందే !
గుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన ప్రతి అర్జీని పరిశీలించాల్సిందేనని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్న తీరు, పరిష్కార విధానం, కౌంటర్లను ఆమె పరిశీలించారు. అనంతరం కొన్ని చేర్పులు, మార్పులకు శ్రీకారం చుట్టారు. రెవెన్యూ, జీఎస్డబ్ల్యూఎస్, రిజిస్ట్రేషన్, విద్యా, పోలీస్, విద్యుత్ తదితర శాఖలకు సంబంధించిన వినతులు ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించి, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడారు. ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించాలని చెప్పారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి అర్జీని నిర్దేశిత సమయంలో పరిష్కరించాల్సిందేనని ఆదేశించారు. వివరాలు ముందుగా అవగాహన చేసుకోవాలని, ప్రభుత్వ విధానాలకు సంబంధించిందా లేదా ఇతర అంశాలకు సంబంధించిందా అనేది చూడాలని ఆదేశించారు. అర్జీలకు సంబంధించి స్పష్టమైన, వాస్తవ వివరాలు మాత్రమే ఇవ్వాలని చెప్పారు. సోమవారం అందిన అర్జీలు శుక్రవారం నాటికి పూర్తి చేసి డేటాను అప్ లోడ్ చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం వచ్చిన 222 అర్జీలను కలెక్టర్తోపాటు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి గంగరాజు, డెప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె. విజయలక్ష్మి, జిల్లా అధికారులు పరిశీలించారు. -
గుంటూరు
మంగళవారం శ్రీ 30 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025ముంపు పొలాలు పరిశీలన కొల్లిపర: మండలంలోని పలు గ్రామాల్లో ముంపునకు గురైన ఉద్యాన పంటలను జిల్లా ఉద్యానవన అధికారి బి.రవీంద్రబాబు సోమవారం పరిశీలించారు. ఎస్పీని కలసిన పీఎస్ఐలు నగరంపాలెం: జిల్లాలోని పలు పోలీస్స్టేషన్లలో శిక్షణ పొందుతున్న పీఎస్ఐలు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ను మర్యాద పూర్వకంగా కలిశారు. చండీ హోమం నగరంపాలెం: బృందావన్గార్డెన్స్లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం చండీహోమం నిర్వహించారు.మంగళగిరిలోని జీఆర్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన మందిరంలో చిన్నారులు, మహిళల పూజలు గుంటూరు నగరంలోని కొరిటెపాడు సెంటర్లో సరస్వతీదేవి అలంకారం పెదకాకాని శివాలయంలో సరస్వతీ దేవిగా భ్రమరాంబ అమ్మవారు మంగళగిరి నృసింహస్వామి ఆలయంలో శ్రీ సరస్వతీదేవి అలంకారం జిల్లావ్యాప్తంగా దేవీ శరన్నవ రాత్రి ఉత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. చదువుల తల్లిగా..జ్ఞాన ప్రదాయినిగా పలు ఆలయాల్లో అమ్మవారు సోమవారం సరస్వతీ దేవిగా దర్శనమిచ్చారు. మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా పలు పాఠశాలల్లో సరస్వతి పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విద్యార్థులు సరస్వతీ నమస్తుభ్యం.. వరదే కామ రూపిణీ ! అంటూ ప్రార్థించారు. చక్కని జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ఇవ్వాలని కోరారు. ప్రసిద్ధ పెదకాకాని శివాలయంలో భ్రమరాంబ అమ్మవారు వీణాధరిగా పూజలందుకున్నారు. విద్యార్థులు, మహిళలు దర్శించుకుని సకల జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరారు. మంగళగిరిలోని నృసింహ ఆలయంలో అమ్మవారు సరస్వతి మాతగా శోభాయమానంగా దర్శనమిచ్చారు. –మంగళగిరి / నగరంపాలెం/ పెదకాకాని సరస్వతీ నమస్తుభ్యం ! 7 -
8వ రౌండ్కు చేరిన జాతీయ చెస్ పోటీలు
చేబ్రోలు: ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ విజ్ఞాన్ యూనివర్సిటీ వేదికగా నిర్వహిస్తున్న 62వ జాతీయ చెస్ చాంపియన్షిప్ పోటీలు సోమవారం ఆసక్తికరంగా జరిగాయి. ఎనిమిదో రౌండ్ ముగిసే సరికి, పీఎస్పీబీకి చెందిన నాలుగు సార్లు జాతీయ విజేత జీఎం కృష్ణన్ శశికిరణ్ తన జట్టు సహచరుడు జీఎం దీప్సెం గుప్తాపై గెలిచాడు. అదే జట్టుకు చెందిన మరో గ్రాండ్మాస్టర్ అభిజీత్ గుప్తా యూపీకి చెందిన ఐఎం ఎలెక్ట్ అజయ్ సంతోష్ పర్వతరెడ్డిపై విజయం సాధించారు. దీంతో శశికిరణ్, అభిజీత్లు చెరో ఏడు పాయింట్లతో టాప్లో నిలిచారు. వీరికి సగం పాయింట్ వెనుక ఆరుగురు ఆటగాళ్లు (తమిళనాడు జీఎం ఇనియన్, రైల్వేస్ జీఎం దీపన్ చక్రవర్తి, నలుగురు ఐఎంలు) ఉన్నారు. తెనాలి: శ్రీదేవీ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం రోజైన సోమవారం సాయంత్రం తెనాలిలో 108 వీణల ఘన సప్తస్వర సమ్మేళనం (వీణా సింఫనీ) నిర్వహించారు. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీప్రజ్ఞానంద సరస్వతి (బాల స్వామీజీ) ఆధ్వర్యంలో 108 మంది వైణికుల వాద్య స్వర తరంగాలు ఒకే సమయాన ఆడిటోరియంలో ఆవహించాయి. దివ్యానంద సుడిగాలిలా భక్తులను చుట్టుముట్టాయి. స్థానిక చెంచుపేటలోని పద్మావతి కల్యాణ మండపంలో ఈ ఆధ్యాత్మిక సంగీత యజ్ఞాన్ని వేడుకగా చేశారు. బాలస్వామీజీ స్వయంగా వీణావాదన చేశారు. సరస్వతీ దేవికి ప్రీతిపాత్రం వీణ అని తెలిసిందే. వీణ ధ్వనిని వేదమంత్రాల నాదంతో సమానంగా పరిగణిస్తారు. ఇక 108 సంఖ్య హిందూ సంప్రదాయంలో పవిత్రమైనది. జపమాలలో ఉండే గింజల సంఖ్య 108. అంతమంది వైణికులు ఒకేసారి వీణ వాయించటమంటే జపమాల గింజల్లా ప్రతి స్వరం ఒక మంత్రధ్వనిగా మారటం అన్నమాట! శ్రోతలలో భక్తి, శాంతి, ఆనందం, ఆత్మశుద్ధిని కలిగించే ఆధ్యాత్మిక యజ్ఞంలా జరిగింది. పట్టణానికి చెందిన శ్రీ విద్యా పీఠం, సాలిగ్రామ మఠం, జయలక్ష్మి మాతృమండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయా సంస్థల బాధ్యులు నంబూరి వెంకటకృష్ణమూర్తి, పెనుగొండ వెంకటేశ్వరరావు, రావూరి సుబ్బారావు, ముద్దాభక్తుని రమణయ్య, పల్లపోతు మురళీ మనోహర్, కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రమణ్యం, గోపు రామకృష్ణ, రాజేశ్వరరావు, కమిటీ సభ్యులు, జయలక్ష్మి మాతృమండలి సభ్యులు పాల్గొన్నారు. గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయం డెప్యూటీ డైరెక్టర్గా (డీడీ) బండి పాల్ సుధాకర్ను నియమిస్తూ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన గుంటూరు మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. పదోన్నతి ద్వారా డీడీగా విధుల్లో చేరనున్నారు. కడపకు చెందిన పాల్ సుధాకర్ హాకీ క్రీడలో ప్రతిభ చాటారు. పలుమార్లు జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనడంతో స్పోర్ట్స్ కోటాలో 1993లో సీనియర్ అసిస్టెంట్గా ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికై , డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో విధుల్లో చేరారు. ఆఫీస్ సూపరింటెండెంట్గా, పరిపాలనా అధికారిగా పదోన్నతులు పొంది 2014 వరకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో పని చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రమోషన్ పొంది గుంటూరు జీజీహెచ్కు 2015లో బదిలీ అయ్యారు. అక్కడి నుంచి గుంటూరు వైద్య కళాశాలకు 2019లో బదిలీ అయ్యారు. నేడు పదోన్నతి పొంది గుంటూరు ఆర్డీ కార్యాలయం డీడీగా విధుల్లో చేరనున్నారు. యర్రబాలెం(మంగళగిరి): ప్రేమ పేరుతో మైనర్ బాలికను మోసం చేసిన ఘటన యర్రబాలెం బీసీ కాలనీలో జరిగింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగర పరిధిలోని యర్రబాలెం బీసీ కాలనీకి చెందిన మైనర్ బాలిక అదే ప్రాంతానికి చెందిన సందీప్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యలో బాలికను వివాహం చేసుకోవాలని కుటుంబసభ్యులు కోరగా నిరాకరించాడు. దీంతో బాలిక కుటుంబసభ్యులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు. -
ముగిసిన రాజ్ భాషా వేడుకలు
లక్ష్మీపురం: గుంటూరు డివిజన్ పరిధిలో ఈనెల 14 నుంచి 29 వరకు నిర్వహించిన రాజ్ భాషా పక్షం–2025 వేడుకలు సోమవారంతో ముగిశాయి. గుంటూరు పట్టాభిపురంలోని డివిజన్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో డీఆర్ఎం సుధేష్ట సేన్ మాట్లాడారు. వేడుకల్లో భాగంగా హిందీ వర్క్షాప్లు, హిందీలో సాంకేతిక సెమినార్లు, డిపార్ట్మెంటల్ సమావేశాలు, హిందీ కీబోర్డ్ శిక్షణ, హిందీ పోటీలు, వ్యాసం, వక్తృత్వం, టైపింగ్, క్విజ్, జ్ఞాపకశక్తి, హిందీ పదజాలం తదితర కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. హిందీని అధికారిక భాషగా ప్రచారం చేయడం మన బాధ్యతని చెప్పారు. డీజీఎం శ్యామ సుందర్ సాహు మాట్లాడుతూ రాజ్ భాష అమలు కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం వివిధ పోటీల్లో బహుమతులు గెలుచుకున్న ఉద్యోగులకు అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం ఎస్. రమేష్ కుమార్, బ్రాంచ్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
నూతన ఉపాధ్యాయులకు అభినందన
గుంటూరు వెస్ట్: జిల్లాలో ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా కోచింగ్ తీసుకుని ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను సోమవారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఆఫ్ లైన్లో 117 మందికి, ఆన్లైన్లో 217 మందికి డీఎస్సీ కోచింగ్ అందించారు. వీరిలో సెకండరీ గ్రేడ్ టీచర్స్ 14 మంది, స్కూల్ అసిస్టెంట్గా నలుగురు ఉద్యోగాలు పొందారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన చేయటంతోపాటు బాధ్యతగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వారికి సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి, బీసీ సంక్షేమశాఖ అధికారి మయూరి పాల్గొన్నారు. శ్రీరాముడిని తాకిన సూర్యకిరణాలు బల్లికురవ: దసరా శరన్నవరాత్రులు, మూలా నక్షత్రం సందర్భంగా సోమవారం మండలంలోని కొత్తపాలెం రామాలయాన్ని సూర్యకిరణాలు తాకాయి. దక్షిణాయన పుణ్యకాలంలో పర్వదినాన సూర్యకిరణాలు శ్రీరామ చంద్రస్వామిపై పడటం ఎంతో శుభపరిణామని ఆలయ అర్చకులు ఐనవోలు సుబ్బాచార్యులు శివసాయి అన్నారు. పంచామృతాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, హరిద్రా చూర్ణ లేపనం అష్టోత్తర శతనామ పూజ, ప్రత్యేక అలంకరణ, దివ్యమంగళ హారతి చేపట్టారు. ఆ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. సచివాలయ ఉద్యోగుల నిరసన బాపట్ల: సచివాలయం ఉద్యోగస్తులు ఆత్మగౌరవ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద, మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సచివాలయంలో వలంటీర్లను తొలగించి వారు చేసే ప్రతి పనిని ఉద్యోగులతో చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బందిపై సర్వేల భారం పెట్టి మరీ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పని ఒత్తిడితో తీవ్ర ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించకపోతే దశలవారీగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ డివిజన్ పీఆర్ఓ నుస్రత్ మండ్రూ ప్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ●సికింద్రాబాద్ – అనకాపల్లి (07059) ప్రత్యేక రైలు అక్టోబర్ 6, 13, 20, 27 తేదీల్లో ప్రతి సోమవారం రాత్రి ఏడు గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు అనకాపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07060) 7, 14, 21, 28 తేదీల్లో ప్రతి మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు అనకాపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.40 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. రెండు మార్గాల్లో ఈ రైలు చర్లపల్లి, పగిడిపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, కృష్ణా కెనాల్, విజయవాడ, గుడివాడ, కై కలూరు, అకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, యలమంచిలి స్టేషన్లలో ఆగుతుంది. -
ప్రజలకు అండగా వైఎస్సార్ సీపీ
పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పొన్నూరు: కూటమి పాలనలో నమోదయ్యే అక్రమ కేసులతో వెనకాడేది లేదని, నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ తెలిపారు. ఆయన సోమవారం పొన్నూరు మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన ఓ కేసులో రూరల్ పోలీస్స్టేషన్లో విచారణకు ఆయన హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కూటమి పాలనలో బాధితుల పక్షాన నిలిచిన వారిపై అక్రమ కేసులు బనాయించడం సర్వసాధారణంగా మారిందని విమర్శించారు. జరిగిన అన్యాయంపై ఆవేదనకు గురైన ఓ బాధిత మహిళ పక్షాన నిలిచి, ఆమెకు న్యాయం చేయాలని కోరుతూ మీడియాతో మాట్లాడినా కూడా కేసు నమోదు చేయడం కూటమి ప్రభుత్వానికే చెల్లిందని తెలిపారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్. జగన్ మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్లో ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు ఇప్పటికే వందలాదిగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. -
ప్రజలకు తగ్గనున్న వైద్య ఖర్చులు
గుంటూరు మెడికల్: అత్యవసర మందులు, వైద్య పరికరాలపై ప్రభుత్వం జీఎస్టీని 12 నుంచి ఐదు శాతానికి తగ్గించడం వల్ల ప్రజలకు ఖర్చులు తగ్గుతాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జీఎస్టీ 2.0 సంస్కరణల్లో భాగంగా శిశువులకు ఉపయోగించే న్యాప్కిన్లు, ఫీడింగ్ బాటిల్స్, వ్యక్తిగత ఆరోగ్య బీమా అంశాలపై జీఎస్టీ పూర్తిగా మినహాయింపును ఇచ్చారని పేర్కొన్నారు. క్యాన్సర్ కారకమైన పొగాకు ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీ 28 నుంచి 40 శాతానికి పెంచడం వల్ల వినియోగం తగ్గుతుందన్నారు. తద్వారా క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని తెలిపారు. వైద్యశాఖ అధికారులు, వైద్యులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు జీఎస్టీ ప్రయోజనాలు ప్రజలకు తెలియజేసి అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు, క్యాలెండరు యాక్టివిటీస్లో భాగంగా అక్టోబర్ 1న అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా న్యాయ విజ్ఞాన సంస్థలో సదస్సు నిర్వహించారు. ఇన్చార్జి కార్యదర్శి ఎం.కుముదిని సదస్సును ప్రారంభించారు. వృద్ధులకు న్యాయపరంగా ఉన్న సెక్షన్లు, హక్కులు, పిల్లల ద్వారా మోసపోయిన వారికి తిరిగి ఆస్తిని పొందే చట్టాల గురించి ఆమె వివరించారు. వృద్ధులు ఎదుర్కొనే పలు సమస్యలు, వాటి పరిష్కారాల గురించి స్టేట్ సీనియర్ సిటిజన్స్ అసోసి యేషన్ సెక్రటరీ ఉమామహేశ్వరరావు తెలియజేశారు. కార్యక్రమంలో సీహెచ్.పరమేశ్వరరావు, పారా లీగల్ వలంటీర్స్, వృద్ధులు పాల్గొన్నారు. లక్ష్మీపురం: కౌలు రైతుల సమస్యలపై అక్టోబర్ 13, 14 తేదీల్లో మండల కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు చెప్పారు. గుంటూరు బ్రాడీపేటలోని సంఘం జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌలు రైతులందరికీ భూ యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా గుర్తింపు కార్డులిచ్చి పంట రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు వర్తింప చేయాలని కోరారు. ఈ క్రాప్ నమోదు చేసి ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలు, ఎరువులు, పురుగు మందులు, ఇతర నష్ట పరిహారాలు వర్తింప చేయాలన్నారు. కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ జిల్లాలో సుమారు లక్ష మంది కౌలు రైతులున్నారని, 70 శాతం వారే సాగు చేస్తున్నారన్నారు. రైతు సేవా కేంద్రాల్లో అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, యూరియా అందుబాటులో ఉంచాలని కోరారు. సమావేశంలో కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి.రామకృష్ణ, నాగమల్లేశ్వరరావు, సాంబిరెడ్డి, కృష్ణ, అమ్మిరెడ్డి, నీలాంబరం పాల్గొన్నారు. -
పోటెత్తిన కృష్ణమ్మ
కొల్లిపర: ఎగువ కురిసిన భారీ వర్షాలతో కృష్ణమ్మ పోటెత్తింది. కృష్ణా బ్యారేజీ నుంచి 6.80లక్షల క్యూసెక్కులను సోమవారం అధికారులు దిగువకు విడుదల చేయడంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు ఒక్కసారిగా పోటెత్తడంతో కృష్ణా కరకట్ట వెంబడి ఉన్న గ్రామాల ప్రజలు, రైతులు భయాందోళన చెందుతున్నారు. మండల పరిధిలోని వల్లభాపురం, మున్నంగి, పిడపర్రు గ్రామాల్లో నదికి దిగువున ఉన్న పంట పొలాలు, పాత బొమ్మువానిపాలెం, అన్నవరపులంక, కొత్తూరులంక గ్రామాల్లో పలు వాణిజ్య పంటలు నీటిలో మునిగి పోయాయి. కరకట్ట దిగువున లంక గ్రామాల్లోని నాలుగు వేల ఎకరాల్లో అరటి, కంద, పసుపు, మొక్కజొన్న, మినుము, కూరగాయలు, నిమ్మ పంటలను సాగు చేపట్టారు. ఇందులో వెయ్యి ఎకరాల దాకా నీట మునిగాయి. వరద నీటితో అరటి, కంద, పసుపులకు దుంప కుళ్లి పోతుందని వాపోతున్నారు. వరద నీరు బయటకు పోయిన తరువాత నిదానంగా చనిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకు పంటలను కన్న బిడ్డలా కాపాడుకుంటూ వచ్చామని, తెగుళ్లు లేకుండా ఏపుగా పెరుగుతున్న సమయంలో వరద నీరు తమకు అప్పులు తెచ్చిపెడుతుందని పలువురు రైతులు వాపోతున్నారు. -
ప్రభుత్వ కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించాలి
గుంటూరు వెస్ట్: ప్రభుత్వ కార్యక్రమాలు సక్రమంగా అమలు జరిగేలా జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి సోమవారం సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలసి నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాలు, ధరలు తగ్గుదలపై గ్రామీణ, పట్టణ ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రతి జిల్లా కార్యాలయంలో జీఎస్టీ 2.0పై అవగాహన కోసం హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా సురక్షితమైన తాగునీరు సరఫరా చేయాలన్నారు. పారిశుద్ధ్యంపై ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. ప్రతిరోజు నీటి శాంపిల్స్ తీయాలని, క్లోరినేషన్ తరువాత మాత్రమే నీటిని సరఫరా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణ ప్రాంతాల్లో దోమలు నియంత్రణకు డ్రెయిన్లలో ఆయిల్ బాల్స్, ఫాగింగ్కు కార్యాచరణ చేపట్టాలని తెలిపారు. తల్లికి వందనం నగదు జమ ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఆటో మిత్రలో ఆమోదం పొందిన దరఖాస్తుల ఈకేవైసీ నూరుశాతం తక్షణమే పూర్తి చేయాలని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నిర్వహిస్తున్న వివిధ సర్వేలు నిర్దేశిత లక్ష్యాలను అధిగమించేలా ఎంపీడీవో, కమిషనర్లు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే ఖాజావలి, జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి నాగేశ్వరరావు, డీఎంహెచ్ఓ విజయలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి సాయికుమార్, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి పాల్గొన్నారు. కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా -
సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి
నగరంపాలెం: పొలంలో కొంతమేర అక్రమించారని అధ్యాపకుడు, అద్దెల్లు చెల్లించకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నారని మరొకరూ వాపోయారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదులు– పరిష్కారాల వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో పలువురు బాధితులు ఫిర్యాదులు చేశారు. అర్జీలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వీకరించారు. బాధితుల మొరను అలకించారు. చట్ట పరిధిలో సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. జిల్లాలోని పోలీస్స్టేషన్ల పరిధిలో ఫిర్యాదులకు పరిష్కరించేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఎప్పటికప్పుడు అర్జీలు పరిష్కరించేలా దిశా నిర్దేశం చేస్తామని చెప్పారు. జిల్లా ఏఎస్పీలు రమణమూర్తి (పరిపాలన), కె.సుప్రజ (క్రైం), డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), అరవింద్ (గుంటూరు పశ్చిమ) కూడా అర్జీలు స్వీకరించారు. -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
● తాళ్లాయపాలెం లంకలో పర్యటించిన కలెక్టర్ తమీమ్ అన్సారియా ● కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు(0863–2234014) తాడేపల్లి రూరల్: కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో ప్రకాశం బ్యారేజ్ వద్దకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. అధికార యంత్రాంగం అప్రమత్తమై ప్రజలకు సూచనలు, సలహాలు అందజేసే పనిలో పడ్డారు. ఆదివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, తాడేపల్లి తహసీల్దార్ సీతారామయ్య వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రకాశం బ్యారేజ్ ఎగువ ప్రాంతంలోని ఉండవల్లి, పెనుమాక ప్రాంతాల్లో కరకట్ట లోపల నివాసముండే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం ప్రకాశం బ్యారేజ్పై సందర్శకులు వచ్చిన సమయంలో పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. సీతానగరం పుష్కర ఘాట్ వద్ద సందర్శకులు నీటిలో దిగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీస్ అధికారులను ఆదేశించారు. సీతానగరం, మహానాడు ప్రాంతాల్లో కృష్ణానది తీరంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ప్రభుత్వం ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుందని ఆమె సూచించారు. వరద తగ్గుముఖం పట్టే వరకు కృష్ణాతీరంలో రెవెన్యూ సిబ్బంది అంచనా వేస్తే ప్రజలను అప్రమత్తం చేయాలని ఆమె సూచించారు. -
లంక గ్రామాల్లో మంత్రి పర్యటన
కొల్లిపర: కృష్ణా నదికి వరద పెరిగినందున నది పరివాహక ప్రాంతాల్లో ఎటువంటి విపత్తు సంఘటనలు జరగకుండా అధికారులు తగుజాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మండలంలోని బొమ్మువానిపాలెం గ్రామంలో ఆదివారం మంత్రి పర్యటించి వరద ఉధృతిని పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ ఉహించిన విధంగా నదిలో వరద ఉధృతి పెరిగితే లంక గ్రామాల ప్రజలను, పాడి పశువులను పునరావాస కేంద్రాలకు తీసుకువచ్చే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరద ఉధృతి తగ్గేవరకు లంక గ్రామంలో వైద్య అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, పారిశుద్ధ్యంపై పంచాయతీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎటువంటి అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి తహసీల్దార్ గోపాలకృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ రాజేష్, ఈవోపీఆర్డీ భార్గవ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
విశ్వ నరుడు గుర్రం జాషువా
పట్నంబజారు: సమాజ శ్రేయస్సు కోసం రచనలు చేసి.. మూఢ నమ్మకాలు, దురాచారాలపై పోరాడిన విశ్వ నరుడు, మహాకవి, కవి కోకిల గుర్రం జాషువా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ పరిశీలకులు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డి పేర్కొన్నారు. బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం గుర్రం జాషువా 130వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోదుగుల వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ ఆధునిక తెలుగు కవుల్లో ఉన్నత స్థానం పొందిన గొప్ప వ్యక్తి జాషువా అని చెప్పారు. ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లా వాసి కావటం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. తన రచనలతో సమాజ శ్రేయస్సు కోసం పాటుపడ్డారన్నారు. తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు మాట్లాడుతూ జాషువా రచనలు సమాజ శ్రేయస్సుకు ఎంతో దోహదపడ్డాయన్నారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలని కోరారు. వైఎస్సార్ సీపీ నేతల నిమ్మకాయల రాజానారాయణ, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బైరెడ్డి రవీంద్రారెడ్డి, బందా రవీంద్రనాథ్, కొరిటిపాటి ప్రేమ్కుమార్, దానం వినోద్, బత్తుల దేవా, అనిల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చతికిల పడిన మార్కెట్ కమిటీలు
● గుంటూరు మార్కెట్ కమిటీ లక్ష్యం రూ.115 కోట్లు కాగా, ఆగస్టు నాటికి 29.58 శాతంతో రూ.34.02 కోట్లు సాధించారు. ● తెనాలి మార్కెట్ కమిటీ లక్ష్యం రూ.7.65 కోట్లు కాగా 35.06 శాతంతో రూ.2.68 కోట్లు వసూలు చేసింది. ● పొన్నూరు మార్కెట్ కమిటీ రూ.8.38 కోట్లు కాగా, 32.66 శాతంతో రూ.2.74 కోట్లు. ● దుగ్గిరాల మార్కెట్ కమిటీ రూ.3.75 కోట్లకు 34.67 శాతంతో రూ.1.30 కోట్లు. ● తాడికొండ మార్కెట్ కమిటీ రూ.2.17 కోట్లకు కేవలం 3.27 శాతంతో రూ.7 లక్షలు. ● మంగళగిరి మార్కెట్ కమిటీ రూ.3.03 కోట్లకు 24.72 శాతంతో రూ.75 లక్షలు. ● ఫిరంగిపురం మార్కెట్ కమిటీ రూ.1.88 కోట్లకు 15.73 శాతంతో రూ.30 లక్షలు. ● ప్రత్తిపాడు మార్కెట్ కమిటీ రూ.4.45 కోట్లకు 28.41 శాతంతో రూ.1.26 కోట్లు వసూలు చేశాయి. ఫీజు వసూళ్లలో మందగమనం జిల్లాలోని ఎనిమిది మార్కెట్ కమిటీల్లో రాబడి అంతంత మాత్రం ఈ ఏడాది లక్ష్యం రూ.146.31 కోట్లు.. ఆగస్టు చివరి నాటికి వసూలైంది రూ.43.12 కోట్లు -
సావిత్రి నటనను ఎవరూ భర్తీ చేయలేరు
రెంటచింతల: పల్నాడు ప్రాంతంలో త్రిశక్తి పీఠం (లక్ష్మీదేవి, దుర్గాదేవి, సరస్వతీదేవి)గా విరాజిల్లుతున్న పాలువాయి జంక్షన్లోని కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం జిల్లా జడ్జి సత్యశ్రీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథోత్సవంలో పాల్గొని అన్నదాన కార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని అందచేశారు. తొలుత జిల్లా జడ్జికి ఆలయ ప్రధాన ధర్మకర్త ఏచూరి సాంబశివరావు, ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ చుండు సాంబశివశాస్త్రి ఘనంగా స్వాగతం పలికారు. రెంటచింతల వెంకటేశ్వరస్వామి దేవస్థానం అధ్యక్షులు నాళం పెదబాబు తదితరులు పాల్గొన్నారు. విజయపురిసౌత్: దసరా సెలవులు కావటంతో ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్కు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. నాగార్జున సాగర్ డ్యాం 26 క్రస్ట్గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో ఆంధ్ర–తెలంగాణ రాష్ట్రాల నుంచి పర్యాటకులు సాగర్కు చేరుకొని డ్యాం గేట్లు తిలకించిన అనంతరం పచ్చని కొండల మధ్య ఉన్న అనుపు, యాంపీ స్టేడియం, శ్రీరంగనాథస్వామి దేవాలయాలను సందర్శిస్తున్నారు. నూతన బ్రిడ్జి, పాత వంతెన, లాంచీస్టేషన్, కృష్ణవేణి పుష్కర్ఘాట్ ప్రాంతాలు సందర్శకులతో కిటకిటలాడాయి. మాచర్ల మండలంలోని ఎత్తిపోతల జలపాతాన్నీ వీక్షించారు. లాంచీస్టేషన్ ఆదాయం రూ.1,30,100 పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండకు ఆదివారం పర్యాటకులు తరలివచ్చారు. దీంతో లాంచీస్టేషన్కు రూ.1,30,100 ఆదాయం సమకూరినట్లు లాంచీ యూనిట్ అధికారులు తెలిపారు. కొండను సందర్శించిన పర్యాటకులు బుద్దుని జీవిత చరిత్రకు సంబంధించిన శిలాఫలకాలను తిలకించారు. అనంతరం మాచర్ల మండలంలోని అనుపు, ఎత్తిపోతల జలపాతాన్ని వీక్షించారు. పిడుగురాళ్ల: సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కావడి ఊరేగింపు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఆదివారం నిర్వహించారు. పట్టణంలోని పిల్లుట్ల రోడ్డులో గల నాగుల గుడి దేవస్థానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆశ్వయూజ శుద్ధ పష్టి సందర్భంగా కావడి ఊరేగింపు నిర్వహించారు. ముందుగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నాగుల గుడి దేవాలయం నుంచి గంగమ్మ గుడి వరకు కావడి ఊరేగింపు నిర్వహించారు. భక్తులకు ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందజేశారు. -
విజయ సిద్ధిని కాంక్షిస్తూ చండీదేవికి పూజలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దేవీ శరన్నవ రాత్రి మహోత్సవాలలో భాగంగా ఆదివారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ శ్రీచండీదేవి గా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారికి విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలకు చెందిన భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. దసరా ఉత్సవాలలో ఎంతో విశేషమైన చండీదేవి అలంకారం కావడంతో అమ్మవారికి నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఆదివారం నుంచి అన్ని దర్శన టికెట్ల విక్రయాలను నిలిపివేసినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. రూ. 300, రూ.100 టికెట్ క్యూలైన్లోకి సైతం భక్తులను ఉచితంగా అనుమతించారు. దీంతో ఐదు క్యూలైన్లలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. ఉత్సవాల నేపథ్యంలో ప్రత్యేక ఖడ్గమాలార్చన, ప్రత్యేక కుంకుమార్చన, ప్రత్యేక శ్రీచక్రనవార్చన, ప్రత్యేక చండీయాగానికి ఉభయదాతల నుంచి డిమాండ్ ఎక్కువగా కనిపించింది. తెల్లవారుజాము నుంచే రద్దీ.. తెల్లవారుజాము దర్శనం ప్రారంభమైన కొద్దిసేపటికే ఘాట్రోడ్డులోని ఓం టర్నింగ్ వరకు భక్తులు బారులు తీరి ఉండగా, తెల్లవారుజామున ఆరు గంటలకే వినాయకుడి గుడి వరకు క్యూలైన్లు రద్దీ పెరిగిపోయింది. ఉదయం 8 గంటలకు సీతమ్మ వారి పాదాలు, 9 గంటలకు వీఎంసీ కార్యాలయం సమీపంలోని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. గంట గంటకూ భక్తుల రద్దీ పెరుగుతూ ఉండటంతో అటు పోలీస్ కమిషనర్, కలెక్టర్, దుర్గగుడి ఈవోలు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాల ద్వారా భక్తుల రద్దీని అంచనా వేస్తూ వారికి త్వరత్వరగా దర్శనం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. వినాయకుడి గుడి నుంచి కొండపైన ఆలయానికి చేరుకునేందుకు మూడు గంటల సమయం పట్టిందని భక్తులు పేర్కొన్నారు. వీఐపీ టైం స్లాట్ మినహా మిగిలిన సమయంలో ఘాట్రోడ్డు మీదగా కొండపైకి భక్తులెవరినీ దర్శనానికి అనుమతించలేదు. అయితే సేవా బృంద సభ్యులు, పలు ప్రభుత్వ శాఖల అధికారుల సిఫార్సులతో కొండపైకి చేరుకుంటున్న భక్తులు లక్ష్మీగణపతి ప్రాంగణం, గాలిగోపురం వద్ద గుంపులు గుంపులుగా చేరి దర్శనానికి పంపాలనడంతో భక్తులు, పోలీసుల మధ్య వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. కానుకగా రూ. 10లక్షల బంగారు ఆభరణాలు.. మహారాష్ట్రకు కోల్హాపూర్ ఎంపీ శ్రీకాంత్ షిండే రూ. 3.5లక్షల విలువైన బంగారు హారం, హైదరాబాద్కు చెందిన సీఎం రాజేష్, ప్రకృతి దంపతులు రూ. 6.5లక్షల విలువైన బంగారపు పట్టీలను ఈవో శీనానాయక్కు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. గొల్లపూడికి చెందిన శ్రీమంజూష అమ్మవారి ఉచిత ప్రసాద వితరణకు రూ. లక్ష విరాళాన్ని అందించారు. దుర్గమ్మ సేవలో సీఎస్ విజయానంద్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ చండీదేవి అలంకారంలో దుర్గమ్మను దర్శించుకున్నారు. విజయానంద్కు దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఈవో శీనానాయక్ సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. -
నేడు చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు
మళ్లీ ఆ ఇద్దరే అధ్యక్ష పదవికి పోటీ నగరంపాలెం(గుంటూరువెస్ట్): ఇండియన్ చాంబర్ ఆఫ్ కామ ర్స్ (ఐసీసీ) ఎన్నికల పోటీ రసవత్తరంగా మారింది. ఎన్నడూ లేని విధంగా గతేడాది నుంచే ఐసీసీలో ఎన్నికల ప్రక్రియకు కూటమి ప్రభుత్వం తెరలేపింది. దీంతో అధ్యక్ష పదవి కోసం ఇరువర్గాల ప్యానెళ్లు బరిలోకి దిగాయి. నువ్వా–నేనా అనే రీతిలో పోటీ పడుతున్నాయి. గతంలో అధ్యక్షునిగా ఆతుకూరి ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చారు. దాదాపు 34 ఏళ్లపాటు ఆయన చాంబర్ ఆధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. చాలాసార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో ఉన్న రికార్డులను చెరిపేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోటీ చిచ్చు రేపింది. దీంతో గతేడాది అధ్యక్ష పదవికి టీడీపీ నేతలు ఏల్చూరి వెంకటేశ్వర్లు, రంగా బాలకృష్ణలు పోటీపడ్డారు. చివరకు కూటమి నేతలంతా ఒక్కటై, ఏల్చూరి వెంకటేశ్వర్లకు మద్దతుగా శిబిరాలు నిర్వహించి, అధ్యక్ష బరిలో ఉన్న టీడీపీ నేత బాలకృష్ణను ఓడించారు. ఆది నుంచి చాంబర్లో చురుగ్గా ఉంటున్న రంగా బాలకృష్ణను విస్మరించి, ఏల్చూరి వైపు కూటమి నాయకులు మొగ్గుచూపడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లోనూ ఆ ఇద్దరి మధ్యనే మళ్లీ పోటీ నెలకొనడం రసకందాయంగా మారింది. ఈసారైనా గెలుపొందాలని బాలకృష్ణ ప్యానెల్ పావులు కదుపుతోంది. రెండోసారి కూడా అధ్యక్ష పదవిని కైవసం చేసుకోవాలని ఏల్చూరి ప్యానెల్ ప్రయత్నాలు చేస్తోంది. 3,200 మందికి సభ్యత్వం గుంటూరు నగరంలోని జిన్నాటవర్ కూడలిలో ఉన్న ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం ఎన్నికలు జరుగుతాయి. సుమారు 3,200 మంది వ్యాపారులకు సభ్యత్వం ఉన్నట్లు కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. ఉదయం పది గంటలకు మొదలయ్యే ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది. అదే రోజు రాత్రి ఓట్ల లెక్కింపు నిర్వహించి గెలుపొందిన అభ్యర్థిని ప్రకటిస్తారు. -
ఆరుగురికి ఏఎస్ఐలుగా ఉద్యోగోన్నతి
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): ఉద్యోగోన్నతి పొందడమనేది ప్రతి ఉద్యోగికి ఒక గౌరవమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ఏఎస్ఐలుగా ఉద్యోగోన్నతి పొందిన ఎం.వరకుమార్, సీహెచ్ పుల్లారావు, ఎ.సాంబశివరావు, ఆర్.రవి, ఎం.సత్యనారాయణ, షేక్ షంషుద్దీన్లు ఆదివారం నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ను మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో సమర్ధవంతంగా విధులు నిర్వహించి, జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని అన్నారు. -
‘క్లెసా’ పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా లక్ష్మీకాంత్
నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులు నరసరావుపేట: కాన్ఫిడరేషన్ ఆఫ్ లైసెన్స్డు ఇంజినీర్స్, సర్వేయర్స్, అండ్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఏపీ (క్లెసా–ఏపీ) పల్నాడు జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఆదివారం స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) భవనంలో క్లెసా ఏపీ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్నాడు చాప్టర్ నూతన కమిటీ ఆవిష్కరణకు గౌరవ చైర్మన్ వేల్పుల రాము, చైర్మన్ ముని శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ కొమ్మసాని కమలాకరరెడ్డి, జనరల్ సెక్రటరీ ఎన్.ఎన్.వి.ఎస్.ఎస్.మూర్తి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రేజేటి సతీష్కుమార్ ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. వీరి సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా గౌరవ చైర్మన్గా కె.కమలాకరరెడ్డి, చైర్మన్గా ఎం.మురళీకృష్ణ, ప్రెసిడెంట్గా ఎస్.లక్ష్మీకాంత్, కోశాధికారిగా డి.రాజశేఖర్రెడ్డి, ఉపాధ్యక్షులుగా మీసా శ్రీనివాసరావు, బి.నరేంద్ర, ప్రధాన కార్యదర్శిగా డేవిడ్ కృపానందం, సంయుక్త కార్యదర్శులుగా మారెళ్ల రామాంజనేయులు, తోట సాంబశివరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బి.వెంకటనారాయణరావు, ఈసీ సభ్యులుగా పి.నిర్మల్కుమార్, డీవీ కృష్ణారావు, పి.శ్యాంప్రసాద్, వి.శ్రీనివాసరావు, నుసి నాగఫణింద్రారెడ్డి, పి.కోటిరెడ్డి, అమర్లను ఎన్నుకున్నారు. ఈసందర్భంగా నూతన అధ్యక్షుడు సిరివేరి లక్ష్మీకాంత్ మాట్లాడుతూ సంఘం సంక్షేమం, టెక్నికల్ సెమినార్లు, సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తామని హామీ ఇచ్చారు. చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల, దాచేపల్లి ప్రాంతాల ఇంజినీర్లు పెద్దఎత్తున పాల్గొన్నారు. తొలుత కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో శ్రీకారం చుట్టారు. మ్యాక్స్ విజన్ కంటి హాస్పిటల్ డాక్టర్ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహించారు. అలాగే ఇంజినీర్స్ వృత్తిలో ఎదురవుతున్న పలు సమస్యలపై చర్చించారు. -
నిరంతర అభ్యాసంతో విజయాలు సొంతం
చేబ్రోలు: చెస్ ఆటలో మనం గడిపే ప్రతి క్షణం విలువైనదేనని చెస్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి అన్నారు. ఆలిండియా చెస్ ఫెడరేషన్ విభాగంలోని ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘62వ నేషనల్ చెస్ చాంపియన్షిప్ పోటీలు’ ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. ఎనిమిదో రోజు ఆదివారం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఇండియన్ చెస్ గ్రాండ్మాస్టర్, కోనేరు హంపితో విజ్ఞాన్ వర్సిటీ వైస్ చాన్స్లర్ పి.నాగభూషణ్ ముందుగా ఒక ఎత్తు వేసి ఆటను ప్రారంభించారు. ఈ సందర్భంగా కోనేరు హంపి మాట్లాడుతూ చెస్ క్రీడాకారులందరికీ ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఒక గొప్ప వేదికన్నారు. నిరంతర అభ్యాసం, పట్టుదలతో ముందుకు సాగినప్పుడే విజయాలు సొంతమవుతాయన్నారు. ప్రతి ఒక్కరూ ఎప్పుడూ నేర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ఆటలోని ప్రతి అనుభవాన్ని పాఠంగా తీసుకొని ముందుకు సాగితేనే నిజమైన క్రీడాకారుడిగా ఎదగవచ్చునని అభిప్రాయపడ్డారు. ఆలిండియా చెస్ ఫెడరేషన్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఏకే వర్మ మాట్లాడుతూ చెస్ అనేది ఆలోచన, ఓర్పు, దృష్టి, మేధస్సుల కలయికన్నారు. వైస్ చాన్సలర్ పి.నాగభూషన్ తదితరులు పాల్గొన్నారు. ఏడవ రౌండ్ ఫలితాలు.. జాతీయ చెస్ చాంపియన్షిప్లో ఏడో రౌండ్ ముగిసే సరికి, తొలి ఆరు బోర్డులలో నిర్ణయాత్మక ఫలితాలు రాకపోవడంతో ఆధిక్యంలో మార్పు లేకుండా నిలిచింది. ఇప్పటివరకు 6 పాయింట్లు సాధించిన పీఎస్పీబీకి చెందిన గ్రాండ్మాస్టర్స్ శశికిరణ్, అభిజిత్ గుప్తా, రైల్వేస్ ఐఎం అరోన్యక్ ఘోష్, ఐఎం ఎలెక్ట్ అజయ్ సంతోష్ పర్వతరెడ్డిలు లీడ్ను కొనసాగించారు. వీరితో పాటు విజయాలు సాధించిన పీఎస్పీబీకి చెందిన జీఎం దీప్ సేంగుప్తా, రైల్వేస్ ఐఎం ఆయుష్ శర్మ, తమిళనాడుకు చెందిన ఐఎం హర్ష సురేష్ కూడా 6 పాయింట్ల క్లబ్లో చేరారు. -
రంగస్థలంపై మరో ‘చింతామణి’
ఆకట్టుకున్న ‘వీణా అవార్డ్స్’ ప్రదర్శనలు తెనాలి: సుదీర్ఘరాగం.. హోరెత్తే సంగీతం.. అర్థం కాని పద్యం... తెలుగువారికే సొంతమైన పద్యనాటకంపై సాధారణ ప్రేక్షకుడి అభిప్రాయం. ఒకప్పుడు పామరులను సైతం ఉర్రూతలూగించిన పద్యనాటకం, రానురాను ఆదరణ కోల్పోతుండటానికి ఇదే కారణం. భాష, భావం అర్థంకాని పద్యగానంపై మక్కువ తగ్గిపోయింది. ఇలాంటి తరుణంలో తెనాలిలో జరుగుతున్న వీణా అవార్డ్స్ నాటకోత్సవాల్లో రెండోరోజైన ఆదివారం ప్రదర్శించిన ‘కస్తూరి తిలకం’ పద్యనాటకం ఆద్యంతం ప్రేక్షకులను కూర్చోబెట్టింది. కల్పిత కథో, చారిత్రక ఆధారాలున్నాయో తెలీదుగాని, బిల్వమంగళుడు, చింతామణి పేర్లతో ప్రధాన పాత్రల చుట్టూ శారదా ప్రసన్న అల్లిన నాటకాన్ని చందాల కేశవదాసు కళారిషత్, మధిర వారు ప్రదర్శించారు. రంగస్థల కళలో ఆరితేరిన డాక్టర్ నిభానుపూడి సుబ్బరాజు దర్శకత్వం వహించారు. పాత్రల మధ్య సంభాషణలు సందర్భోచితంగా వచ్చే పద్యాలు స్పష్టంగా వినిపిస్తూ, హృద్యమైన గానాలాపనతో నాటకం నడిచింది. చాలాకాలానికి ప్రేక్షకులు చక్కటి పద్యనాటకాన్ని ఆస్వాదించారు. ప్రధాన పాత్రల్లో చిలువేరు శాంతయ్య, బి.విజయరాణి నటించారు. ఇతర పాత్రల్లో సరిత, జి.శివకుమారి, ఎన్.సాంబశివారెడ్డి, నిభానుపూడి సుబ్బరాజు నటించారు. సంగీతం సీహెచ్ నాగేశ్వరరావు. ●తదుపరి మిర్యాలగూడ సాంస్కృతిక సమాఖ్య, మిర్యాలగూడవారి ‘బ్రహ్మరథం’ పద్య నాటకాన్ని ప్రదర్శించారు. బ్రహ్మహత్యాపాతకానికి భయపడి ఇంద్రుడు అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఇంద్రపీఠం ఎక్కిన నహుషుడుకు పదవీ వ్యామోహంతో చేసిన అరాచకాలకు శాపానికి గురై, పశ్చాత్తాపానికి లోనైన ఇతివృత్తమిది. సూలూరి శివసుబ్రహ్మణ్యం రచనకు తడికమళ్ల రామచంద్రరావు దర్శకత్వం వహించారు. తదుపరి కళాంజలి, హైదరాబాద్ వారి ‘యాగం’ సాంఘిక నాటకాన్ని ప్రదర్శించారు. శ్రీశైలమూర్తి రచనకు కొల్లా రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. చివరగా హర్ష క్రియేషన్స్, విజయవాడ వారి ‘భువి కోరని భ్రమణం’ సాంఘిక నాటికను ప్రదర్శించారు. ఆచళ్ల ఉమామహేష్ మూలకథకు తాళాబత్తుల వెంకటేశ్వరరావు నాటకీకరించగా, కత్తి శ్యాంప్రసాద్ దర్శకత్వంలో ప్రదర్శించారు. కళల కాణాచి, తెనాలి, ఆర్ఎస్ఆర్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. -
ఆగిఉన్న లారీని ఢీకొన్న ఆటో : వృద్ధుడు మృతి
ఒకరికి తీవ్ర, నలుగురికి స్వల్పగాయాలు ఫిరంగిపురం: ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టిన సంఘటనలో వ్యక్తి మృతిచెందగా.. మరో ఐదుగురికి గాయాలైన ఘటన శనివారం అర్థరాత్రి ఫిరంగిపురం శివారులో గుంటూరు – కర్నూలు రాష్ట్ర రహదారిపై చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేరికపూడి గ్రామానికి చెందిన ఆరుగురు భక్తులు ఆమీనాబాద్ గ్రామంలోని మూలాంకురేశ్వరి అమ్మవారి దేవాలయంలో భజన కార్యక్రమానికి వెళ్లి.. ఆటోలో తిరిగి గ్రామానికి వస్తున్న క్రమంలో ఫిరంగిపురం శివారులోని ఓ హోటల్ ముందు ఆగిఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. దీంతో దానిలో ప్రయాణిస్తున్న ఆర్.రామకృష్ణనాయక్(68) అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కె.నాగేశ్వరమ్మకు తీవ్రగాయాలు కాగా డి.ధనలక్ష్మి, జి.అంజమ్మ, జి.లక్ష్మి, కె.వెంకట సుబ్బారెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను నరసరావుపేట గవర్నమెంటు వైద్యశాలకు చికిత్స కోసం తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
సత్తెనపల్లి: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య అన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 19న చలో ప్రభుత్వ మెడికల్ కళాశాల పేరుతో పిడుగురాళ్ల మండలం కామేపల్లిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాన్ని సందర్శించేందుకు వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో గుంటూరు నుంచి పెద్ద ఎత్తున బయలుదేరి వెళుతుండగా సత్తెనపల్లిలో పోలీసులు అడ్డుకుని, విద్యార్థులతో వ్యవహరించిన తీరు చాలా దుర్మార్గమన్నారు. దీనిలో భాగంగా తమపై నమోదు చేసిన అక్రమ కేసులో విచారణ నిమిత్తం శనివారం సత్తెనపల్లి టౌన్ పీఎస్కు హాజరయ్యామన్నారు. పార్టీ గుంటూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజ్రెడ్డి, గుంటూరు నగర అధ్యక్షుడు యేటి కోటేశ్వరరావు యాదవ్, యువజన విభాగం జోనల్ అధ్యక్షుడు కళ్లం హరికృష్ణారెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.నవీన్, గుంటూరు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు సీహెచ్ వినోద్, యువజన విభాగం గుంటూరు ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గ అధ్యక్షులు షేక్ సుభాని, శశిధర్, విద్యార్థి విభాగం మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షుడు పి.సందీప్, విద్యార్థి విభాగం నాయకుడు రవీంద్ర ఉన్నారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య -
ఆట్యాపాట్యా రాష్ట్ర క్రీడల్లో జిల్లాకు తృతీయ స్థానం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఆట్యాపాట్యా క్రీడా పోటీల్లో గుంటూరు జిల్లా బాలబాలికల జట్లు తృతీయ స్థానాలు దక్కించుకున్నాయని గుంటూరు జిల్లా ఆట్యా–పాట్యా అసోసియేషన్ కార్యదర్శి దావులూరి సుబ్బారావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పల్నాడు జిల్లా ఆట్యా–పాట్యా అసోసియేషన్ ఆధ్వర్యంలో నకరికల్లులోని వంగా వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈనెల 25, 26 తేదీల్లో నిర్వహించిన 12వ రాష్ట్ర స్థాయి సీనియర్ ఆట్యా–పాట్యా చాంపియన్ షిప్–2025 పోటీల్లో జిల్లా క్రీడాకారులు ఈ విజయాలు నమోదు చేసారన్నారు. క్రీడాకారులను ఏపీ ఆట్యా–పాట్యా సీఈవో రంభ ప్రసాద్, కార్యదర్శి శ్రీ చరణ్, గుంటూరు జిల్లా అధ్యక్షులు కాళ్ల విజయ్కుమార్ తదితరులు అభినందించారన్నారు. -
భక్తి రసానందం పద్యనాటకాలు
తెనాలి: కళల కాణాచి, తెనాలి, ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో జాతీయస్థాయ పంచమ పద్యనాటక, సాంఘిక నాటక, నాటికల పోటీలు ‘వీణా అవార్డ్స్–2025’ శనివారం ఇక్కడ ప్రారంభమయ్యాయి. తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ప్రముఖ నటీమణి, పట్టణ కళాకారుల సంఘం అధ్యక్షురాలు, బుర్రా జయలక్ష్మి జ్యోతిప్రజ్వలనతో పోటీలను ఆరంభించారు. తొలిగా టీజీవీ కల్చరల్ అకాడమీ, కర్నూలు వారి ‘శ్రీవెంకటేశ్వర మహాత్మ్యం’ పద్యనాటకాన్ని ప్రదర్శించారు. శ్రీవెంకటేశ్వరుడిపై అమిత భక్తిభావం కలిగిన అనంతాచార్యుడు స్వామివారి కై ంకర్యాలు కోసం నియమితుడవటం, అందుకోసం ఆయన పడే కష్టాలు, చివరకు శ్రీవేంకటేశ్వరుడే మారురూపంలో వచ్చి సాయం చేయటం కథాంశం. శ్రీవెంకటేశ్వరుడుగా టి.రాజశేఖరరావు, అనంతాచార్యులుగా జె.మోహన్ నాయర్, మహాలక్ష్మిగా సురభి హారికకార్తీక్, అలిమేలు మంగమ్మగా సురభి వెంగమాంబ నటించారు. సంగీతం పీజీ వెంకటేశ్వర్లు, శారదా ప్రసన్న రచనకు వీవీ రమణారెడ్డి దర్శకత్వం వహించారు. రెండో ప్రదర్శనగా పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు అండ్ లలిత కళాపరిషత్, అనంతపురం వారి ‘కాలభైరవ సంహారం’ పద్యనాటకాన్ని ప్రదర్శించారు. కీ.శే పోతులయ్య రచనకు రామగోంద్సాగర్ దర్శకత్వం వహించారు. శ్రీకృష్ణుడుగా గంటా శివశంకర్, కాలభైరవుడుగా దాసరి దయానంద్, దుర్యోధనుడుగా సోమర లక్ష్మీనారాయణ, నారదుడుగా సి.శ్రీరాములు, ద్రౌపదిగా ఎస్.విజయశారద నటించారు. రాత్రి చివరి ప్రదర్శనగా వెలగలేరు థియేటర్ ఆర్ట్స్, వెలగలేరు వారి ‘నల్లత్రాచు నీడలో’ సాంఘిక నాటకాన్ని ప్రదర్శించారు. రచన, దర్శకత్వం శ్రీనివాసరావు పోలుదాసు, ప్రధాన పాత్రల్లో దర్శకుడు శ్రీనివాసరావు, సురభి లలిత, పవన్కళ్యాణ్, షణ్ముఖి నాగుమంత్ర, గోవర్ధనరెడ్డి, చైతన్య నటించారు. -
కూటమిపై న్యాయ పోరాటం
పట్నంబజారు: ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయడం దుర్మార్గమైన చర్యగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ విభాగం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు పోలూరు వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ లీగల్ విభాగం ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం లాడ్జి సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ, పేద విద్యార్థులకు వైద్య విద్య, పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందకుండా కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండి పడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో నిరుపేదలకు జరుగుతున్న అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. పేద విద్యార్థులు కూడా వైద్యులు కావాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నూతనంగా 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తొలి విడతలో ఐదు మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసి ప్రారంభించారని వివరించారు. మిగిలిన కళాశాలల నిర్మాణాలు పలు దశల్లో ఉన్న వాస్తవం అందరికీ తెలిసిందేనన్నారు. తన సుదీర్ఘ పాలనలో రాష్ట్రానికి ఒక్క వైద్య కళాశాల కూడా తేలేని చంద్రబాబు, జగన్ తెచ్చిన వాటిని ప్రైవేటుపరం చేయడం తగదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు వైద్య విద్య, పేద ప్రజలకు వైద్య సేవలను దూరం చేసే దుశ్చర్యలకు తక్షణమే స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో న్యాయవాదులు వజ్రాల రాజశేఖర్ రెడ్డి, కళ్ళం వెంకటరమణారెడ్డి, పోకల వెంకటేశ్వర్లు, వాసం సూరిబాబు, కొమ్మారెడ్డి రామకృష్ణారెడ్డి, క్రాంతి, వేముల ప్రసాద్, బాబురావు, శ్యామల, మంజుల, వెంకటరమణ, వరదాయిని, శ్రీనివాసరావు, సయ్యద్ బాబు, సుబ్బారావు, సుబ్బారెడ్డి, ఖాజావలి, లలిత, మొండితోక శ్రీనివాసరావు, చంద్రశేఖర్ రెడ్డి, గోపిరెడ్డి పద్మాకర్, పాపిరెడ్డి, కోటిలింగారెడ్డి, నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ శ్రేణులకు భరోసా.. డిజిటల్ బుక్
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం డిజిటల్ బుక్ స్కానర్ల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ, ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి, జిల్లా పరిశీలకులు పోతిన మహేష్, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డితోపాటు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ జిల్లా, నగర కమిటీ నేతలు హాజరయ్యారు. తగిన సమాధానం చెబుతాం ఈ సందర్భంగా మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ.. పార్టీకి ప్రజలు, కార్యకర్తలు రెండు కళ్లులాంటి వారని, అందర్ని కాపాడుకునేందుకు డిజిటల్ బుక్ను మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారన్నారు. పార్టీ కార్యకర్తకు జరిగిన అన్యాయానికి న్యాయబద్ధమైన సమాధానం రాబోయే జగన్ 2.0 లో ఇవ్వనున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను త్రీవంగా ఖండించారు. గతంలో చిరంజీవి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వద్దకు వచ్చి ఎంతో హుందాగా వ్యవహరించారని, దానిపై బాలకృష్ణ వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబు నవ్వడం సిగ్గు చేటన్నారు. ముందు డిజిటల్ బుక్లో బాలకృష్ణ పేరు నమోదు చేయాలన్నారు. శ్రేణులకు అండగా పార్టీ పార్టీ జిల్లా పరిశీలకుడు పోతిన మహేష్ మాట్లాడుతూ పార్టీ నేతలు, కార్యకర్తలకు అండగా నిలబడేందుకు డిజిటల్ బుక్ ప్రారంభించారన్నారు. కూటమి ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామన్నారు. అక్రమ కేసులతో వేధింపులు పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి అనేక అక్రమ కేసులు నమోదు చేశారని చెప్పారు. వ్యాపారాలను దెబ్బతీశారని ఆరోపించారు. తనపై తొమ్మిది కేసులు నమోదు చేశారని తెలిపారు. కచ్చితంగా వారం రోజులపాటు డిజిటల్ బుక్లో, పూర్తి స్థాయిలో అక్రమ కేసుల గురించి స్పష్టంగా వివరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు నిమ్మకాయల రాజానారాయణ, షేక్ మస్తాన్వలి, షేక్ గులాం రసూల్, నందేటి రాజేష్, తాడిబోయిన వేణుగోపాల్, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వేలూరి అనిల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమాధానం ఖాయం వైఎస్సార్సీపీ నేతల పునరుద్ఘాటన -
బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా గుంటూరు వెస్ట్ : అనారోగ్య బారిన పడిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్యపడ వద్దని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. శనివారం స్థానిక పాత గుంటూరు యాదవ బజార్ లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె. విజయలక్ష్మితో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని వైద్యులను సూచించారు. వర్షాకాలంలో వ్యాధుల ప్రబలే అవకాశాలు ఉన్నాయని, ప్రజలందరూ వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు. ఏపీ సీపీడీసీఎల్ పర్యవేక్షక ఇంజినీర్ రమేష్ కొరిటెపాడు(గుంటూరు): నెలాఖరు నేపథ్యంలో గుంటూరు సర్కిల్ పరిధిలోని విద్యుత్ బిల్లులు చెల్లించేలా ఆదివారం సెలవు రోజు అయినా కౌంటర్లు పనిచేస్తాయని ఏపీ సీపీడీసీఎల్ గుంటూరు సర్కిల్ ప్యవేక్షక ఇంజినీర్ చల్లా రమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు సర్కిల్ పరిధిలోని అన్ని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలు అందుబాటులో ఉంటాయన్నారు. అంతేకాకుండా ఇంటి నుంచే నేరుగా విద్యుత్ బిల్లులు చెల్లించేలా మొబైల్లో ఏపీ సీపీడీసీఎల్ కస్టమర్ యాప్, ఫోన్ పే, గూగుల్ పే నుంచి కూడా బిల్లులు చెల్లించవచ్చని ఆయన తెలియజేశారు.గుంటూరు రూరల్: ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం సంస్థలో భాగమైన గుంటూరు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె. రాజకుమారికి ప్రకృతి వ్యవసాయ రాష్ట్రాస్థాయి విస్తరణ అధికారిగా అవార్డు లభించింది. ఏరువాక ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కిసాన్ మహోత్సవం–2025లో ఎంఎల్సీ సోమువీర్రాజు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాస్రెడ్డి, జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ హరిబాబుల చేతుల మీదుగా ప్రకృతి వ్యవసాయ రాష్ట స్థాయి విస్తరణ అధికారిగా అవార్డును ఆమె వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో అందుకున్నారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామీణ స్థాయిలో విస్తరించడానికి, రైతులలో అవగాహన పెంచడానికి, ఎన్నో అవగాహన కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడానికి చేసిన కృషిని గుర్తిస్తూ ఆమెకు ఈ అవార్డు ప్రదానం చేశారు. -
మహాలక్ష్మీ నమస్తుతే !
దేవీ శరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు శుక్రవారం అమ్మవారు పలు ఆలయాల్లో ధనలక్ష్మిగా దర్శనమిచ్చింది. చేబ్రోలు ముట్లూరు రోడ్డులోని మార్కెట్టు సెంటర్లో రూ.25లక్షల కరెన్సీ నోట్లతో అమ్మవారిని భక్త బృందం ప్రత్యేకంగా అలంకరించింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహాలక్ష్మీ దేవిగా భక్తులను అనుగ్రహించారు. గుంటూరు రూరల్ మండలంలోని నల్లపాడు, చల్లావారిపాలెం గ్రామాల ప్రజల ఇలవేల్పు అయిన ఘంటాలమ్మ తల్లి, పుట్టలమ్మ తల్లి ఆలయంలో అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు. పెదనందిపాడులోని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కనకదుర్గమ్మ అమ్మవారు ‘ధన కనకదుర’్గగా భక్తులకు దర్శనమిచ్చింది. ప్రత్యేక మండపంలో కొలువుదీరిన అమ్మవారిని రూ. 99,99,999తో మహాలక్ష్మిగా అలంకరించారు. – పెదకాకాని/చేబ్రోలు/ గుంటూరు రూరల్/ ప్రత్తిపాడు పెదనందిపాడులో ‘ధన’ కనకదుర్గగా.. -
సిరివర్షిణీ.. శిరసా నమామి
ఇంద్రకీలాద్రికి భక్తులు వెల్లువలా తరలివస్తూనే ఉన్నారు. ఎండా వానను లెక్కచేయక, కాలినడకన కొండెక్కి అమ్మ దర్శనం చేసుకుని తరిస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు సైతం ఆత్మస్థైర్యంతో అడుగులు వేస్తూ సునాయాసంగా నడిచేసి భక్తిప్రపత్తులు చాటుకుంటున్నారు. శుక్రవారం అష్టలక్ష్మీ సమష్టి రూపమైన శ్రీమహాలక్ష్మీదేవిగా కనకదుర్గమ్మ కొలువయ్యారు. భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులు సిరుల తల్లిని కనులారా వీక్షించారు. మా కల్పవల్లివి నీవే తల్లి అంటూ అంటూ ఐశ్వర్యసిద్ధి కోసం ప్రార్థించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ శుక్రవారం శ్రీమహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం పైగా శ్రీమహాలక్ష్మీదేవి అలంకారం కావడంతో తెల్లవారుజామున నుంచే భక్తుల రద్దీ కనిపించింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశాల నుంచి భక్తుల రాక ప్రారంభమైంది. దీంతో క్యూలైన్లో రద్దీ ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగుతూనే ఉంది. ఉదయం 6 గంటలకే సర్వ దర్శనం, రూ.100, రూ.300 టికెట్ల క్యూలైన్లు దేవస్థాన ఘాట్రోడ్డులోని టోల్గేట్ వరకు చేరాయి. మారిన టైం స్లాట్ మేరకు శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 7 గంటలకు వీఐపీలు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక మిగిలిన సమయంలో అంతరాలయ గేట్లకు ఆలయ అధికారులు తాళాలు వేశారు. వీఐపీ టైం స్లాట్ మినహా మిగిలిన సమయంలో వచ్చిన వారికి బంగారు వాకిలి దర్శనం కల్పించారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ ప్రాంగణానికి వీఐపీలు రాకుండా పోలీసులు, రెవెన్యూ అధికారులు కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీయాగంలో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. సర్వ దర్శనం క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి రెండున్నర గంటల సమయం పట్టినట్లు భక్తులు పేర్కొంటున్నారు. రూ. 100, రూ. 300 టికెట్లు క్యూలైన్లో సైతం గంటన్నరకు పైగా సమయం పడుతుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాణిపాకం దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు దుర్గమ్మకు కాణిపాకం దేవస్థానం నుంచి పట్టువస్త్రాలను సమర్పించారు. ఈవో పెంచల కిశోర్, స్థానాచార్యులు ఫణీంద్రస్వామిలతో పాటు ఎమ్మెల్యే కె. మురళీమోహన్ పట్టువస్త్రాలతో దుర్గగుడికి విచ్చేశారు. అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ఈవో శీనానాయక్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. 90 వేల మంది దర్శనం.. మహాలక్ష్మీదేవి అలంకారంలో దుర్గమ్మను శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు సుమారు 90 వేల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు పేర్కొన్నారు. 5వ రోజు దేవస్థానానికి రూ. 28.21లక్షల మేర ఆదాయం సమకూరిందని చెప్పారు. లడ్డూల ప్రసాదం విక్రయం ద్వారా రూ. 2.86లక్షలు, ఆరు లడ్డూ బాక్స్ ప్యాక్ విక్రయం ద్వారా రూ. 23.58లక్షలు, ఆర్జిత సేవా టికెట్లు, తలనీలాల టికెట్ల విక్రయం ద్వారా 1.75 లక్షలకు పైగా ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. ఇక అమ్మవారి అన్న ప్రసాదాన్ని 23,656 మందికి పంపిణీ చేసినట్లు వివరించారు. ఉత్సాహం.. ఆనందం..సాయం సంధ్య వేళ ఆహ్లాదకర వాతావరణంలో ఆది దంపతులైన శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన నగరోత్సవం కనుల పండువగా సాగింది. మల్లేశ్వర స్వామి వారి ఆలయం వద్ద యాగశాలలో ఆదిదంపతులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించి ఊరేగింపును ప్రారంభించారు. మహామండపం నుంచి మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల కోలాట నృత్యాలు, డప్పు కళాకారులు విన్యాసాలతో నగరోత్సవం ముందుకు సాగింది. అమ్మవారిని దర్శించుకుని కొండ దిగువకు చేరుకున్న భక్తులు ఆదిదంపతుల నగరోత్సవంలో పాల్గొని తరించారు. మహాలక్ష్మీ సేవలో గవర్నర్లుమహాలక్ష్మీదేవి అలంకారంలో దుర్గమ్మను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి విడివిడిగా దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆలయానికి చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్కు దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి హరిజవహర్లాల్, కమిషనర్ రామచంద్రమోహన్ సాదరంగా స్వాగతం పలకగా, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి పట్టుచీర, పూలు, పండ్లు, పూజా సామగ్రిని సమర్పించారు. వేద ఆశీర్వచనం, అమ్మవారి ప్రసాదాలు, పట్టువస్త్రాలు, చిత్రపటాన్ని గవర్నర్కు అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, పోలీస్కమిషనర్ రాజశేఖరబాబు, జేసీ ఎస్.ఇలక్కియ పాల్గొన్నారు. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి దంపతులకు ఈవో స్వాగతం పలుకగా.. అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనాచౌదరి ఆయనతో పాటు ఉన్నారు. ఇంద్రకీలాద్రిపై నేడు ● తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి అమ్మవారి దర్శనం ● ఉదయం ఆరు గంటలకు ప్రత్యేక ఖడ్గమాలార్చన(ఆరో అంతస్తు) ● ఉదయం 7 గంటలకు ప్రత్యేక కుంకుమార్చన(ఆరో అంతస్తు) ● ఉదయం 9 గంటలకు ప్రత్యేక చండీయాగం(యాగశాల) ● ఉదయం 9 గంటలకు ప్రత్యేక శ్రీచక్రనవార్చన(లక్ష కుంకుమార్చన వేదిక) ● సాయంత్రం 5 గంటలకు శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి నగరోత్సవ సేవ ● సాయంత్రం 5 గంటలకు మహా మండపం ఆరో అంతస్తులో అర్చక సత్కార సభ ● సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి మహా నివేదన, పంచహారతుల సేవ, వేద స్వస్తి ● రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం అమ్మవారి దర్శనం అనంతరం కిందికి వస్తున్న భక్తులు, (ఇన్సెట్లో) మహాలక్ష్మి అలంకరణలో దుర్గమ్మ -
పవన్ కల్యాణ్ మౌనంతో కాపుల్లో ఆవేదన
పొన్నూరు: ప్రముఖ సినీ నటుడు, తన అన్న చిరంజీవిని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అవమానించేలా దారుణంగా మాట్లాడినా ఆయన సోదరుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించక పోవడం చిరంజీవి అభిమానులు, కాపు నాయకులను ఆవేదనకు గురి చేస్తోందని వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అన్నారు. అంతటి అవమానం జరిగినా తన స్వార్థ రాజకీయం కారణంగానే పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గుంటూరులోని తన కార్యాలయంలో అంబటి మురళీ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని ఎమ్మెల్యే బాలకృష్ణ సైకో అనడం, అదేవిధంగా సినీ పరిశ్రమలోనే దిగ్గజ నటుడు చిరంజీవిని అవమానించే విధంగా మాట్లాడటం ఎంతో బాధను కలిగించిందన్నారు. వై.ఎస్.జగన్, చిరంజీవిలను అభిమానించే వ్యక్తిగా ఈ వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నానన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలపైన పవన్ కళ్యాణ్, నాగబాబుల నుంచి ఎందుకు స్పందన లేదని సూటిగా ప్రశ్నించారు. నాగబాబు, పవన్ కళ్యాణ్లు ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన వ్యక్తి చిరంజీవి అనే విషయాన్ని సోదరులు ఇద్దరూ గుర్తించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చిరంజీవికి ఉన్న తమ్ముళ్లలందరూ మాట్లాడుతుంటే, వారెందుకు నోరు మెదపరని ప్రశ్నించారు. చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కూటమి విధానాలా.. చంద్రబాబు విధానాల అనే అంశాన్ని పవన్ కళ్యాణ్, నాగబాబులు ప్రశ్నించాలన్నారు. దీనిని ప్రజలకు సైతం తెలియజెప్పాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన చిరంజీవిని అవమానించడం ద్వారా ఆ సామాజిక వర్గాన్నే అవమానించిన భావన ప్రతి ఒక్కరిలో కలుగుతోందన్నారు. దీనిపై రక్తం పంచుకుపుట్టిన తమ్ముళ్లుగా నిలదీస్తారో.. లేక పదవుల కాంక్షతో కప్పిపుచ్చుతారో అది నాగబాబు, పవన్ కళ్యాణ్ల విజ్ఞతకే వదిలి పెడుతున్నానన్నారు. బాలకృష్ణ దురుసు వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి , నాగబాబులు ఎందుకు స్పందించరు ? వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ -
నేటి నుంచి నాటక, నాటిక పోటీలు
తెనాలి: కళల కాణాచి– తెనాలి, ఆర్ఎస్ఎఆర్ గ్రీన్వే ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో జాతీయస్థాయి పంచమ పద్యనాటక, సాంఘిక నాటక, నాటికల పోటీలు శనివారం ఆరంభం కానున్నాయి. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఉదయం 10.30 గంటలకు పద్యనాటకం, మధ్యాహ్నం 2.30 గంటలకు పద్యనాటకం, సాయంత్రం 5.15 గంటలకు ప్రారంభసభ, రాత్రి 7.15 గంటలకు సాంఘిక నాటక ప్రదర్శనలు ఉంటాయి. తర్వాతి రోజు నుంచి ఉదయం నుంచి రాత్రివరకు ప్రదర్శనలు కొనసాగుతాయి. పోటీల ఆహ్వానపత్రికను కళల కాణాచి వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీరచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా శుక్రవారం ఆవిష్కరించారు. వీణాఅవార్డ్స్ నాటకపోటీలకు అనేక సంస్థల నుంచి స్పందన వచ్చిందన్నారు. పద్యనాటకాలు–9, సాంఘిక నాటకాలు–5, సాంఘిక నాటికలు–7 కలిపి మొత్తం 21 ప్రదర్శనలు ఉంటాయన్నారు. సినీనటుడు వేమూరి విజయభాస్కర్ మాట్లాడుతూ భారీస్థాయిలో జరుగుతున్న పోటీల నిర్వహణ వ్యయప్రయాసలతో కూడుకున్నదని చెప్పారు. -
బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి
పట్నంబజారు: అసెంబ్లీ సాక్షిగా నటుడు చిరంజీవి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్. జగన్మోహన్రెడ్డిలపై ఎమ్మెల్యే బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజ్రెడ్డి ధ్వజమెత్తారు. బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో యువజన విభాగం నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కనీస విజ్ఞత లేకుండా సభా మర్యాద తెలియని బాలకృష్ణ తాను బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న మద్యాన్ని తాగి వ్యాఖ్యలు చేసినట్లు అనిపిస్తోందని విమర్శించారు. మాజీ సీఎం వై.ఎస్.జగన్ ద్వారా ఎంతో లబ్ధి పొందిన విషయాన్ని గుర్తించాలన్నారు. బసవతారకం హాస్పిటల్కు సంబంధించి పెండింగ్ బిల్లులను టీడీపీ హయాంలో ఇవ్వకపోతే, స్వయంగా వై.ఎస్.జగన్ వాటిని విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగితే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి వెంటనే రాజకీయం చేయకుండా బాలకృష్ణ జీవితాన్ని కాపాడిన విషయాన్ని గుర్తుచేశారు. తండ్రిపై చెప్పులు వేయించిన వ్యక్తితో పయనిస్తున్న బాలకృష్ణకు, తండ్రి ఆశయాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వై.ఎస్.జగన్ను విమర్శించే స్థాయి లేదన్నారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. పార్టీ యువజన విభాగం నగర అధ్యక్షుడు యేటి కోటేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ సినిమా వాళ్లను అవమానించారంటూ పిచ్చిబట్టిన వ్యాఖ్యలు చేస్తూ వై.ఎస్.జగన్పై కూటమి నేతలు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారన్నారు. ప్రజా సమస్యలు చర్చించిన పాపాన పోలేదని మండిపడ్డారు. సినిమా డైలాగులు చెప్పడం తప్ప, కనీసం మాట్లాడలేని బాలకృష్ణ ఒక సైకో అని మండి పడ్డారు సమావేశంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం నేతలు వేలూరి అనిల్రెడ్డి, కానూరి శశిధర్, వెంకటేష్రెడ్డి, దానం వినోద్ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజ్రెడ్డి -
97 రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు
తాడికొండ: అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన పెనుమాక (జరీబు, మెట్ట), మల్కాపురం(ప్రత్యామ్నాయ ప్లాట్లు) గ్రామాల రైతులకు శుక్రవారం విజయవాడలోని ఏపీ సీఆర్డీఏ కార్యాలయంలో ఈ– లాటరీ విధానంలో 97 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించారు. వీటిలో 41 నివాస ప్లాట్లు కాగా, 36 వాణిజ్య ప్లాట్లు, 20 ప్రత్యామ్నాయ ప్లాట్లు ఉన్నాయి. మొత్తంగా 56 మంది రైతులు, భూయజమానులకు ప్లాట్లను కేటాయించారు. అధికారులు ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేశారు. డైరెక్టర్(ల్యాండ్స్)/స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్– క్యాపిటల్ సిటీ) ఎన్వీఎస్బీ వసంతరాయుడు మాట్లాడుతూ రైతులకు భౌగోళికంగా ప్లాట్లు ఎక్కడ కేటాయించబడ్డాయో వివరించడానికి ప్రత్యేకంగా జి.ఐ.ఎస్. సిబ్బంది, గ్రామ సర్వేయర్లను నియమించామన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కోరారు. రుసుము వసూలు చేయబడదని రైతులు గమనించాలని కోరారు. కార్యక్రమంలో సీఆర్డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎ.జి.చిన్ని కృష్ణ, బి.సాయి శ్రీనివాస నాయక్ పాల్గొన్నారు. -
బ్యాంకు ఉద్యోగుల ‘స్వచ్ఛతా హీ సేవ’
కొరిటెపాడు: స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఈ నెల 17 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు పలు శుభ్రతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బ్యాంకు చైర్మన్ కె.ప్రమోద్కుమార్ రెడ్డి తెలిపారు. గుంటూరు శ్యామలానగర్ పార్కులో శుక్రవారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం, ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. వారికి విధుల్లో ఉపయోగపడేలా ప్రత్యేకమైన కిట్లను అందజేశారు. చైర్మన్ మాట్లాడుతూ వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు, సమాజ అభివృద్ధికి పరిశుభ్రత అత్యంత అవసరమని పేర్కొన్నారు. పరిశుభ్రతకు కార్మికులు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి కృషి ప్రశంసనీయమని అభినందించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్లు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. -
గౌడ్గా కులధ్రువీకరణ పత్రం అందించాలి
పెదకాకాని: ప్రభుత్వం గౌడ కులస్తులందరికీ గౌడ్గా కుల ధ్రువీకరణ పత్రం మంజూరు చేయడంతోపాటు సంక్షేమ పథకాలకూ పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యామా మురళీగౌడ్ అన్నారు. గుంటూరు ఇన్నర్రింగ్ రోడ్డులో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశానికి బీజేపీ ఓబీసీ విభాగ అధ్యక్షుడు అనుమోలు ఏడుకొండలు గౌడ్ అధ్యక్షత వహించారు. మురళీగౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గౌడ సామాజిక వర్గానికి పలు పేర్లతో కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తోందన్నారు. భవిష్యత్లో ఇబ్బందులు పడకుండా అందరికీ గౌడ్ (బీసీ–బీ) పత్రాలు మంజూరు చేయాలన్నారు. సంఘం నాయకులు యడవల్లి కొండలు, కుక్కల రాంప్రసాద్, బెజవాడ మల్లికార్జున్, యోకరాల రాము, ఎరుకల వెంకట్రావు, యడవల్లి సైదారావు, తుళ్ళూరు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని ఇప్పటం – వడ్డేశ్వరం మధ్య బకింగ్హామ్ కెనాల్ ఒడ్డున డ్రైనేజీ కాలువలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటనపై తాడేపల్లి పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడిని తాడేపల్లి పట్టణ పరిధిలోని సలాం హోటల్ సెంటర్కు చెందిన కొర్రపాటి సాల్మన్ రాజు(66)గా గుర్తించారు. సాల్మన్ రాజు భార్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఖాజావలి శుక్రవారం అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ఆరుగురితో కలసి చేపల వేటకని ఇప్పటం – వడ్డేశ్వరం మధ్య బకింగ్హామ్ కెనాల్కు సాల్మన్ రాజు వెళ్లాడు. మార్గమధ్యలో ఏడుగురూ భోజనం చేశారు. తర్వాత ఆరుగురు చేపల వేటకు వెళ్లారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సాల్మన్ రాజు తమ వెంట రాలేదని మిగిలిన వారు తెలిపారు. డ్రైనేజీలో పడితేనే తన భర్త ఎలా చనిపోతాడని భార్య అనుమానం వ్యక్తం చేశారు. అక్టోబర్ 27న జిల్లా పెన్షనర్ల సంఘం సర్వసభ్య సమావేశం నరసరావుపేట ఈస్ట్: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం పల్నాడు జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం అక్టోబర్ 27వ తేదీన నిర్వహిస్తున్నట్టు సంఘం జిల్లా అధ్యక్షుడు మానం సుబ్బారావు, కార్యదర్శి సి.సి.ఆదెయ్య శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమావేశానికి సంఘంలో సభ్యత్వం గల ప్రతి ఒక్క పెన్షనర్ హాజరై విజయవంతం చేయాలని కోరారు. వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిన సంఘ సభ్యులు సమావేశానికి హాజరై నూతన కార్యవర్గం ఎన్నికలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. -
డీఎస్సీ ఉపాధ్యాయులకు తప్పిన ప్రమాదం
ప్రత్తిపాడు: హైవేపై పెను ప్రమాదం తప్పింది. మార్జిన్లో నిలిపి ఉంచిన ఫర్నీచర్ లోడ్ ఆటోను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 40 మంది డీఎస్సీ ఉపాధ్యాయులకు ప్రమాదం తప్పిపోవడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా అచంట మండలం కొండమంచిలి గ్రామానికి చెందిన మానూరి త్రినాథ్ గత కొంతకాలంగా విజయవాడలో నివాసం ఉంటూ డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 25వ తేదీ రాత్రి త్రినాథ్ తన మేనల్లుడు పొదిలి మోషేకుతో కలసి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నుంచి ట్రాలీ ఆటోలో కుర్చీల లోడుతో తిరుపతికి బయల్దేరాడు. మార్గమధ్యలో అర్ధరాత్రి సమయంలో ఆటో నడుపుతున్న మహేష్ కాలకృత్యాల కోసం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం సమీపంలో పదహారో నంబరు జాతీయ రహదారిపై మార్జిన్లో ఆటో నిలిపాడు. తర్వాత కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లాడు. ఆ సమయంలో ఇటీవల డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన సుమారు 40 మంది ఉపాధ్యాయులతో గుంటూరు వైపు నుంచి చిలకలూరిపేట వైపు వెళుతున్న కనిగిరి డిపో ఆర్టీసీ బస్సు వేగంగా ఆ ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది. ఆటోలో ఉన్న త్రినాథ్తోపాటు ఆటో కూడా సైడు కాలువలోనికి దూసుకుపోయింది. ప్రమాదంలో ఆటో పూర్తిగా దెబ్బతినగా, త్రినాథ్కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న 40 మంది డీఎస్సీ ఉపాధ్యాయులకు ఎలాంటి నష్టం జరగలేదు. వీరంతా గురువారం రాజధానిలో జరిగిన సీఎం సభకు హాజరై రాత్రికి తిరుగు పయనమయ్యారు. త్రినాథ్ను చిలకలూరిపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇచ్చిన పిర్యాదు మేరకు ప్రత్తిపాడు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సీహెచ్ రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎన్. నరహరి తెలిపారు. -
విజ్ఞాన్ కళాశాలలో దసరా సంబరాలు
గుంటూరు రూరల్: శక్తి స్వరూపిణి దుర్గాదేవి అని విజ్ఞాన్ విద్యా సంస్థల అధ్యక్షుడు డాక్టర్ లావు రత్తయ్య తెలిపారు. ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి కళాశాలలో పూజిస్తున్నట్లు గుర్తుచేశారు. ఈ సంవత్సరం 11 రోజులపాటు పెదపలకలూరు రోడ్డులోని విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలలో పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేవీ నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారిని బాలాత్రిపుర సుందరిగా పూజించగా, అయిదో రోజున మహాలక్ష్మి దేవిగా గురువారం అలంకరించారని పేర్కొన్నారు. ప్రత్యేక పూజలనంతరం విద్యార్థులకు దర్శనం కల్పించారు. ఎనిమిదో రోజు సరస్వతి దేవిగా అలంకరణ ఉంటుందని తెలిపారు. ఈ సందర్బంగా విజ్ఞాన్ నిరుల మహిళా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులకు బతుకమ్మ, దసరా వేషధారణ, దాండియా, సంప్రదాయ వస్త్రధారణ తదితర కార్యక్రమాలు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రాధిక తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
గుంటూరులో 21 వాటర్ ప్లాంట్లు సీజ్
నెహ్రూనగర్: నగరంలో కలుషిత తాగు నీటిని సరఫరా చేస్తూ ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్న 21 మినరల్ వాటర్ ప్లాంట్లను ప్రజారోగ్యం దృష్ట్యా వైద్యారోగ్య శాఖ సూచనల మేరకు సీజ్ చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలియజేశారు. నగరంలో కొన్ని ప్రాంతాలలో కలుషిత తాగు నీటి వలన డయేరియా కేసులు నమోదవుతున్న నేపధ్యంలో జిల్లా కలెక్టర్, నగర కమిషనర్ ఆదేశాల మేరకు నగరంలో ఉన్న 120 మినరల్ వాటర్ ప్లాంట్లు సరఫరా చేసే తాగు నీటి శాంపిల్స్ను మంగళగిరిలోని ఐపీఎం పీహెచ్ ల్యాబ్, గుంటూరు మెడికల్ కాలేజీ ఆవరణలోని రీజినల్ పీహెట్ ల్యాబరేటరీలో పరీక్షించగా అందులో 21 ప్లాంట్ల నుంచి విక్రయించే నీటిలో హానికారక బ్యాక్టీరియాను గుర్తించడం జరిగిందన్నారు. సదరు ల్యాబ్ రిపోర్టులను నివేదిక రూపంలో ప్రభుత్వానికి పంపామని, ప్రభుత్వం తక్షణమే ప్రజారోగ్యానికి భంగం కలిగించే హానికారిక బ్యాక్టీరియాలను కలిగియున్న నీటిని విక్రయిస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్లను వెంటనే సీజ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించిందన్నారు. సీజ్ చేసిన ప్లాంట్లు ఇవే.. నగరంలోని ఐపీడీ కాలనీలోని పెరల్స్ ఎంటర్ ప్రైజేస్, నల్లచెరువులోని నీల్ డ్రాప్, శ్రీనివాసరావుతోట 60 అడుగుల రోడ్డులోని మై ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్, చరణ్ వాటర్ ప్లాంట్, రెడ్ల బజార్లోని కేపీ రావు ప్లాంట్, అంబేడ్కర్ నగర్లోని జేఎస్ వాటర్ ప్లాంట్, పాత గుంటూరు బాలాజీనగర్లోని ఏకా వారి వీధి వాటర్ ప్లాంట్, మల్లిఖార్జున పేటలోని గురుశ్రీ మినరల్ వాటర్ ప్లాంట్, ఏటీ అగ్రహారంలోని బాషా కూల్డ్రింక్, శివనగారాజు కాలనీలోని వాసవి వాటర్ ప్లాంట్, నెహ్రూనగర్లోని ఆర్కే వాటర్ ప్లాంట్, నగరాలలోని స్వాతి ఫుడ్ అండ్ వాటర్ ప్లాంట్, స్థంభాలగరువులోని ఎలైన్ ఫ్రెష్ వాటర్, మద్దిరాల కాలనీలోని పరమేష్ హోల్ సేల్, సంపత్ నగర్లోని నరేష్ షాప్, కోబాల్ట్ పేటలోని ఉమర్ బాషా ఫ్లేవర్డ్ వాటర్, పలకలూరులోని ఎన్టీఆర్ సుజల ప్లాంట్, హిమని నగర్లోని సరస్వతి కృష్ణ స్టోర్, బుడంపాడులోని స్టెయిన్ లెస్ స్టీల్ స్టోరేజ్ ట్యాంక్, ఏటుకూరులోని మేఘన షాప్, లాలుపురం రోడ్డులోని 76వ సచివాలయం దగ్గరలోని ప్లాంట్లను నగర పాలక సంస్థ ప్రజారోగ్య అధికారులు సీజ్ చేశారు. -
‘డీఈఓ పూల్’ ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతి కల్పించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: డీఎస్సీ–2025 నియామకాల కంటే ముందుగానే డీఈఓ పూల్లో ఉన్న ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు కల్పించాలని ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షుడు కె.బసవలింగారావు పేర్కొన్నారు. గురువారం జిల్లాకోర్టు ఎదుట ఉన్న ఏపీటీఎఫ్ జిల్లా శాఖ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో బసవ లింగారావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 1236 మంది డీఈఓ పూల్లో ఉన్నారని, 2016లో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నిలకడగా ఏ ఒక్క పాఠశాలలో పనిచేయలేక పోయారన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 50 మందికి పైగా ఉన్నారని తెలిపారు. వీరికి ఉద్యోగోన్నతి కల్పించకుండా డీఎస్సీ నియామకాలు ద్వారా కేడర్లో జూనియర్లుగా మిగిలిపోతారన్నారు. న్యాయపరమైన అంశాలతో వీరికి ఉద్యోగోన్నతులు అడ్డుకోవడం సరికాదన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ అర్హత గల సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు పీఈటీ ఉద్యోగోన్నతుల్లో అన్యాయం జరిగిందని తెలిపారు. డీఎస్సీ మాదిరిగానే జూనియర్ కాలేజీ, డైట్లలో నియామకాలు చేపట్టాలని కోరారు. ప్లస్ 2 పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులు సబ్జెక్ట్ టీచర్స్ కొరతో ఇబ్బంది పడుతున్నారని, ఖాళీలను అర్హత గల స్కూల్ అసిస్టెంట్స్ తో భర్తీ చేసి విద్యా ప్రమాణాలు కాపాడలన్నారు. సంఘ నాయకులు మాట్లాడుతూ దసరా పండుగకు పెండింగ్ నాలుగు డీఏ లలో ఒక్క డీఏ ఐనా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు గత 15 నెలల నుంచి ఒక్క బకాయి విడుదల కాలేదన్నారు. సమావేశంలో జిల్లా శాఖ నాయకులు పి.లక్ష్మినారాయణ, జి.దాస్, ముని నాయక్, టి.రామారావు, పి.వేణుగోపాలరావు, కిరణ్, శివరామకృష్ణ,మూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
గతాన్ని మరిచిన బాలకృష్ణ
తాడికొండ: మెంటల్ సర్టిఫికెట్తో హత్యకేసు నుంచి బయటపడిన బాలకృష్ణ గతాన్ని మరిచి మాట్లాడటం దుర్మార్గమని, ఆయన నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని మాజీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. బెల్లంకొండ సురేష్పై బాలకృష్ణ ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందో ఓ సారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. నాడు దిగంవత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి లేకపోతే నీ గతి ఏమై ఉండేదో ఆలోచించుకోవాలని, అప్పుడే నువ్వు జైలు పాలు అయ్యేవాడివనే గతాన్ని గుర్తుంచుకొని మాట్లాడితే మంచిదన్నారు. అప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కాళ్లు పట్టుకొనే నువ్వు కేసు నుంచి తప్పించుకున్నావని గుర్తుంచుకొని మాట్లాడితే మంచిదని, కక్షపూరిత రాజకీయాలు, అబద్ధపు హామీలు, మాటలు వైఎస్సార్ కుటుంబానికి లేవు, రావనే నిజం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని బాలకృష్ణ తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. గతాన్ని మర్చిపోయి బాలకృష్ణ ప్రవర్తించిన తీరుపై సినీనటుడు చిరంజీవి సైతం హుందాగా స్పందించారని, ప్రజా ప్రతినిధిగా ఉన్న బాలకృష్ణ తన వ్యాఖ్యలను ఉప సంహరించుకొని క్షమాపణ చెపితే మంచిదని లేదంటే నీకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. మెంటల్ సర్టిఫికెట్ ఉన్న వ్యక్తులు అసెంబ్లీకి అనర్హులని, బాలకృష్ణ ముందు ఆ సంగతి తేల్చుకొని చట్టసభల్లో మాట్లాడాలని హెచ్చరించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ -
ప్రభుత్వానికి ప్రజల బాధలు పట్టవా ?
గుంటూరు మెడికల్: నగర ప్రజలు పది రోజులుగా డయేరియాతో అల్లాడిపోతున్నా కూటమి ప్రభుత్వానికి వారి బాధలు పట్టవని వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి విడదల రజిని విమర్శించారు. డయేరియా బారిన పడి గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను గురువారం ఆమె పరామర్శించారు. వార్డులో వసతులు లేకపోవడాన్ని గమనించి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పది రోజులుగా డయేరియా తగ్గుముఖం పట్టలేదంటే ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని, ఇది కూటమి ప్రభుత్వం విఫలమేనని పేర్కొన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో డయేరియా వస్తే కేవలం మూడు రోజుల్లోనే కట్టడి చేశామని గుర్తు చేశారు. యంత్రాంగం అంతా గుంటూరుపై దృష్టి సారించి ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడామని తెలిపారు. చికిత్స పొందుతున్న వార్డుల్లో వసతులు సైతం అరకొరగా ఉన్నాయని చెప్పారు. గుంటూరు నగరపాలక సంస్థకు ప్రత్యేకంగా రూ. 1400 కోట్ల బడ్జెట్ ఉందని, అధికారులు తలుచుకుంటే తాగునీరు అందించవచ్చని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ నిద్రపోతోందని, అందుకు నిదర్శనం పదిరోజులైనా డయేరియా గుంటూరు నగరంలో అదుపులో లేకపోవడమేనని పేర్కొన్నారు. కలరా కేసులు చాలా అరుదుగా వింటామని, గుంటూరులో 11కు పైగా కేసులు నమోదైనా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు డయేరియా, కలరాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, పెద్ద విషయంలా కనిపించడం లేదని విమర్శించారు. తురకపాలెంలో 40 మందికిపైగా చనిపోయారని, దానికి ఇప్పటి వరకు కారణాలు ప్రభుత్వం తెలియజేయలేదన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటైజేషన్పై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై లేదని తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు వారికి అమ్మేసి, సొమ్ము చేసుకోవడంలో బిజీగా కూటమి ప్రభుత్వం ఉన్నట్లు ఆరోపించారు. మెడికల్ కాలేజీలపై చర్చకు తాము సిద్ధమేనని సవాల్ విసిరారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా, రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు పాల్గొన్నారు. -
● భక్తుల పాలిట కల్పవల్లి కాత్యాయని దేవి
జిల్లావ్యాప్తంగా దేవీ శరన్నవరాత్య్రుత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. గురువారం పలు ఆలయాల్లో కాత్యాయని దేవిగా అమ్మవారు దర్శనమించారు. భక్తులు పెద్దఎత్తున దర్శించుకుని పూజలు నిర్వహించారు. కాత్యాయని దేవిని పూజిస్తే చదుర్విద పురుషార్థాలు సిద్ధిస్తాయని, రోగాల భయాలు నశిస్తాయని, ఆయురారోగ్యాలు, సుఖఃసంతోషాలు వర్ధిల్లుతాయని భక్తుల నమ్మకం. అమరావతిలోని అమరేశ్వర ఆలయంలో అన్నపూర్ణగా అమ్మవారు పూజలందుకున్నారు. – సాక్షి, నెట్వర్క్ గుంటూరు కొరిటెపాడు సెంటర్లో... అమరావతిలోని అమరేశ్వర ఆలయంలో అన్నపూర్ణగా......పెదకాకాని శివాలయంలో కాత్యాయని దేవిగా అమ్మవారు గుంటూరులోని గౌతమీ నగర్లో కాత్యాయని అలంకరణలో అమ్మవారు -
అలరించిన గాత్ర కచేరి
నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై గురువారం గాత్ర కచేరి నిర్వహించారు. నాగార్జున సాంస్కృతిక కేంద్రం, నాగార్జున సంగీత నృత్య పాఠశాల, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంయుక్తంగా నిర్వహించగా, జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. నాగార్జున స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ కల్చరల్ సెంటర్ చైర్మన్ డాక్టర్ వీజే.వినయకుమార్ అధ్యక్షత వహించారు. టీటీడీ ఆస్థాన గాయకుడు ఎం.రవిచంద్ర పలు గీతాలను అలపించారు. కీబోర్డుపై ఎస్.మురళీ, తబలాపై జీఎం. బాబురావు, రిథమ్స్పై ఎం.రెడ్డప్ప, శృతి వాయిద్యాన్ని అందించారు. కార్యక్రమంలో కళాశాల ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.సూర్యనారాయణ, కార్యదర్శి డాక్టర్ ఎం.ఎస్.శ్రీధర్ పాల్గొన్నారు.స్వచ్ఛత.. సామాజిక బాధ్యత నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): స్వచ్ఛతను సామాజిక ఉద్యమంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించినప్పుడే గుంటూరు జిల్లా, నగరం క్లీన్ అండ్ గ్రీన్గా మారుతాయని కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా తెలిపారు. స్వచ్ఛత హీ సేవ– 2025లో భాగంగా గురువారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని రెడ్ ట్యాంక్ కాంప్లెక్స్లో ‘ఏక్ దిన్, ఏక్ గంట, ఏక్ సాత్‘ కార్యక్రమంలో భాగంగా ఒక గంట శ్రమదానం చేసి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛతను పాటిస్తూ, తాగునీరు, పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధ్యానత ఇవ్వాలని తెలిపారు. నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించినప్పుడే క్లీన్ గ్రీన్ గుంటూరు సాకారమవుతుందని పేర్కొన్నారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ స్వచ్ఛత హీ సేవలో భాగంగా మాస్ క్లీనింగ్, పచ్చదనం పెంపునకు మొక్కలను విరివిగా నాటుతున్నామని తెలిపారు. ప్రజారోగ్య కార్మికుల సంక్షేమం కోసం ఈ నెల 28న మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, డెప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, టి.వెంకట కృష్ణయ్య, సిటీ ప్లానర్ రాంబాబు, ఇన్చార్జ్ ఎస్ఈ సుందర్రామిరెడ్డి, ఇన్చార్జ్ ఎంహెచ్ఓ రామారావు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, ప్రజారోగ్య కార్మికులు పాల్గొన్నారు. -
గాయత్రీ దేవిగా బాలచాముండేశ్వరి
అమరావతి: ప్రముఖ శైవక్షేత్రం అమరావతి బాలచాముండిక సమేత అమరేశ్వరాలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్య్రుత్సవాలలో భాగంగా బుధవారం బాలచాముండేశ్వరి అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించారు. దసరా వేడుకలలో మూడో రోజు సహస్ర కుంకుమార్చన, దేవీ ఖడ్గమాల, త్రిశల, లలితా సహస్రనామార్చన, శ్రీ చక్రార్చనతోపాటుగా గాయత్రీదేవికి సంధ్యా సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని జ్వాలాముఖి, మహిషాసురమర్దిని అమ్మవార్లకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించి ప్రత్యేక కుంకుమార్చనలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయాల్లో జరిగిన పూజల్లో పాల్గొన్నారు. -
ఇకపై రోబోటిక్ తుంటిమార్పిడి సర్జరీలు
స్ట్రైకర్ సంస్థతో సాయిభాస్కర్ ఆస్పత్రి ఒప్పందం గుంటూరు మెడికల్: ఇప్పటివరకు మోకీలు మార్పిడి సర్జరీలకు మాత్రమే రోబోటిక్ వ్యవస్థను వినియోగిస్తుండగా, ఇకపై తుంటి మార్పిడిలకు కూడా రోబోటిక్ సర్జరీలు చేయనున్నట్లు సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత, సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి చెప్పారు. అందుకోసం వరల్డ్ క్లాస్ రోబోటిక్ సంస్థ స్ట్రైకర్తో ఒప్పందం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. విజయవాడలోని తమ ఆస్పత్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కోవిడ్ తర్వాత తుంటి కీలు అరుగుదలపై తీవ్ర ప్రభావం చూపి, చిన్న వయస్సులోనే తుంటి మార్పిడి శస్త్ర చికిత్సలు చేయాల్సి వస్తుందన్నారు. రోబోటిక్ వ్యవస్థతో రోగికి మరింత మెరుగైన వైద్యసేవలు అందిస్తామని స్పష్టం చేశారు. ఏపీలోనే మొదటిసారిగా తుంటి మార్పిడి ఆపరేషన్లలో మాకొ హిప్ అండ్ నీ రోబోటిక్ను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. అక్టోబర్ నుంచి తమ ఆస్పత్రిలో రోబోటిక్ తుండి మార్పిడి ఆపరేషన్లు అందుబాటులోకి వస్తాయన్నారు. -
ముగిసిన చేతిరాత శిక్షణ శిబిరం
గుంటూరు రూరల్: అందమైన చేతిరాత అదృష్టమని, అది ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు మున్నంగి సంజీవరెడ్డి తెలిపారు. శ్రీమతి చేబ్రోలు మహాలక్ష్మి పుల్లయ్య నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి చేతిరాత శిక్షణ శిబిరం బుధవారంతో ముగసింది. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంజీవరెడ్డి మాట్లాడుతూ అందమైన చేతిరాత వలన విద్యార్థులు పరీక్షల్లో అదనంగా మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు. జాతీయ అవార్డు గ్రహీత వి.రామమోహనరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 వేల మంది విద్యార్థులు, 15 వేల మంది ఉపాధ్యాయులు చేతిరాతలో శిక్షణ పొందారన్నారు. వీర గంగాధరరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. చైల్డ్ లైన్ వెల్ఫేర్ బోర్డు రిటైర్డ్ అధికారి ప్రసాదలింగం మాట్లాడుతూ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా శిక్షణ పొందటం అమూల్యమైనదని ప్రశంసించారు. రిటైర్డ్ ఉపాధ్యాయురాలు మల్లీశ్వరి మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజానికి, విద్యార్థులకు అందిస్తున్న సేవలు గొప్పవని కొనియాడారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న వారిని సత్కరించిన అనంతరం చేతిరాతలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాలు అందజేశారు. -
క్విజ్ పోటీల్లో ఆప్తమాలజీ పీజీ వైద్యుల ప్రతిభ
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్ కంటి వైద్య విభాగం పీజీ వైద్య విద్యార్థులు తమ ప్రతిభా, పాటవాలు చాటి రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించారు. ఆంధ్రప్రదేశ్ ఆప్తాల్మిక్ సొసైటీ గుంటూరు ఆధ్వర్యంలో ఈనెల 19 నుంచి 21 వరకు రాష్ట్రస్థాయి కంటి వైద్యుల సమావేశాలు జరిగాయి. సమావేశాల్లో నిర్వహించిన క్విజ్ పోటీల్లో గుంటూరు వైద్య కళాశాల ఆప్తమాలజీ పీజీ వైద్యులు ప్రథమ స్థానాన్ని సాధించారు. ఈనేపథ్యంలో బుధవారం గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారీ రాష్ట్ర స్థాయిలో సత్తా చాటి ప్రథమ బహుమతి సాధించిన కంటి వైద్య విభాగం పీజీ విద్యార్థులను అభినందించారు. వారికి ఉత్తమ బోధన అందిస్తున్న కంటి వైద్య విభాగాధిపతి డాక్టర్ రవిబాబు, ప్రొఫెసర్లు, అసోసియేట్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవిబాబుతోపాటు, కంటి వైద్యులు సాధన, ఉషాలత, వాణి, శ్రీదేవి, హారిక, పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.ఉత్కంఠభరితంగా ‘జాతీయ చెస్ చాంపియన్షిప్’చేబ్రోలు: ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ నిర్వహిస్తున్న 62వ జాతీయ చెస్ చాంపియన్షిప్ – 2025 పోటీల్లో బుధవారం మూడో రౌండ్లో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. రైల్వేల జీఎం సయంతన్ దాస్ను కేవలం 12 ఏళ్ల ఆంధ్ర ప్రతిభావంతుడు అందమాల హేమల్ వర్షన్ ఓడించి సంచలనం సృష్టించాడు. మూడో రౌండ్ ముగిసే సరికి 27మంది ఆటగాళ్లు తలా మూడు పాయింట్లతో అగ్రగాములుగా ఉన్నారు. కేవలం 12 ఏళ్ల హేమల్ వర్షన్ సిసిలియన్ డిఫెన్స్లో జీఎం సయంతన్ దాస్పై ఘనవిజయం సాధించాడు. రూక్, మైనర్ పీస్ ఎండ్గేమ్లో రెండు అదనపు పాన్ల ఆధిక్యం సాధించిన హేమల్, నైట్ త్యాగం చేసి పాన్ను ఎనిమిదవ వరుసకు ప్రమోట్ చేయడంతో దాస్ రాజీనామా చేశారు. ఆంధ్ర ప్రముఖ ఆటగాడు జీఎం లలిత్ బాబు, ట్రాంపోవ్స్కీ ఆరంభంలో వేదాంత్ గార్గ్ (ఛత్తీస్గఢ్) పై 45 మూవ్లలో గెలిచాడు.ఎన్నారై కళాశాల వద్ద విద్యార్థుల ఆందోళనమేడికొండూరు: ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉండటం వల్ల మేడికొండూరులోని ఎన్నారై కళాశాల యాజమాన్యం విద్యార్థులను వేధిస్తోందని ఆరోపిస్తూ, బుధవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కళాశాల వద్ద భారీ ధర్నా జరిగింది. ఫీజులు చెల్లించకపోతే పరీక్ష ఫీజులు కట్టించుకోమని, అలాగే ప్రాక్టికల్ మార్కులు తగ్గిస్తామని బెదిరిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.పవన్ కుమార్, ఎస్.కె. సమీర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే ఈ పరిస్థితికి కారణమని మండిపడ్డారు. ఎమ్మెల్సీగా ఉన్న ఆలపాటి రాజా కళాశాల యాజమాన్యంలో విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం సమస్యపై స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమస్యపై ఆలపాటి రాజా, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వెంటనే స్పందించి విద్యార్థులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి ఎ. యశ్వంత్, జిల్లా గౌడ్స్ కన్వీనర్ సౌమ్య, జిల్లా కమిటీ సభ్యులు అభి తదితరులు పాల్గొన్నారు. -
ట్యాంకులు ఇలా.. ఆరోగ్యం ఎలా?
నెహ్రూనగర్: గుంటూరు నగరానికి తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ నుంచి నగరంలోని పలు వాటర్ ట్యాంకులకు నీటి సరఫరా అయి అక్కడ నుంచి పైపులు ద్వారా ఇంటింటికి తాగునీటి సరఫరా జరుగుతుంది. అయితే నగరంలో ఉన్న పలు వాటర్ ట్యాంకులు శిథిలావస్థకు చేరడంతో పాటు పై కప్పులు ఊడిపోవడంతో అధ్వానంగా మారాయి. వీటి ద్వారానే తాగునీటి సరఫరా జరుగుతుండటంతో నగర వాసులు అనారోగ్యం బారిన పడుతున్నారు. శిథిలావస్థలో ఏడు ట్యాంకులు.. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 62 వాటర్ ట్యాంకులు ఉన్నాయి (వీటిల్లో 42 ట్యాంకులు నగర పరిధిలో, మిగిలిన విలీన గ్రామాలకు చెందినవి). అయితే ఈ 42 వాటర్ ట్యాంకుల్లో 7 ప్రాంతాల్లోని 9 వాటర్ ట్యాంకులకు పై కప్పులు ఊడిపోయి అధ్వానంగా మారాయి. బీఆర్ స్టేడియం, నల్లచెరువు, ఏటీ అగ్రహారం, స్థంభాలగరువు, శారదాకాలనీ, వసంతరాయపురం, నెహ్రూనగర్ రిజార్వయర్లలో ఉన్న వాటర్ ట్యాంకులకు ఉన్న పై కప్పులు సక్రమంగా లేకపోవడంతో వాటిలో పక్షుల వ్యర్థాలు పడుతున్నాయి. ఈ నీటినే అధికారులు నగరంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. 2018లో బీఆర్ స్టేడియం పరిధిలోని ఆనంద్పేటలో 30కి మందికిపైగా డయేరియా బారిన పడి మృతిచెందిన విషయం తెలిసిందే. అప్పుడు హడావుడిగా పాడైపోయిన వాటర్ ట్యాంకులను కవర్ చేస్తూ మరమ్మతులు చేపట్టారు. కాలక్రమేనా అవి కూడా పాడైపోవడంతో వాటిని పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. తీరా ఇప్పుడు అదే ప్రాంతంలో డయేరియా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్గా 80 కేసులు.. గుంటూరు నగర పరిధిలో ఇప్పటివరకు 160 మంది జీజీహెచ్లో డయేరియాతో బారిన చికిత్స పొందుతున్నారు. వీరిలో 80 మంది డిశార్జి అవ్వగా..ఇంకా 80 మంది చికిత్స పొందుతున్నారు. అదే విధంగా ఈకోలి బ్యాక్టరీయా కారణంగా కలరా వ్యాప్తి చెంది 3 కేసులు నమోదవగా.. వారు చికిత్స తీసుకుని డిచార్జ్ అయ్యారు. ప్రభావిత ప్రాంతాల్లో జిల్లాస్థాయి అధికారులను ఒక్కో వార్డుకు ఒక్కో అధికారిని నియమించి, వారికి డయేరియాపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. గుంటూరు నగరంలో ఉన్న 42 వాటర్ ట్యాంకులను నెలకొక సారి శుభ్రం చేయాల్సి ఉంది. కాఠీ ఇందులో చాలా ట్యాంకులను సకాలంలో శుభ్రం చేయడం లేదని గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికి ఇంకా ఈ నెలలో 10 ట్యాంకులను శుభ్రం చేయలేదని వారు చెబుతున్నారు. తాగునీటి సరఫరాపై అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యజఆరించడంపై నగర వాసులు పాలకులు, అధికారుల తీరుపై మండిపడుతున్నారు. గుంటూరు నగరంలో 7 ప్రాంతాల్లో ఉన్న వాటర్ ట్యాంకులు శిథిలావస్థలో పై కప్పులు ఊడిపోయి ఉన్నా యి. 42 వాటర్ ట్యాంకులు నగర పరిధిలో ఉంటే వీటిల్లో 10 ట్యాంకులను ఇంకా శుభ్రం చేయలేదు. డయేరియా ప్రభావిత ప్రాంతాలకు ఆయా పాడైన వాటర్ ట్యాంకుల నుంచే వాటర్ సప్లయి చేస్తే ప్రయోజనం ఏం ఉండదు. తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ నుంచితాగునీరు సరఫరా చేయాలి. – నారాయణరెడ్డి, గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
విజయకీలాద్రిపై వీరలక్ష్మి అలంకారం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారం రెండవ రోజుకు చేరాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి మంగళా శాసనాలతో రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా అమ్మవారు వీరలక్ష్మిగా దర్శనమిచ్చారని తెలిపారు. ఉదయం 9 గంటలకు తిరుమంజనం అలంకరణ, భక్తులతో సామూహిక కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించామని పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటలకు వీరలక్ష్మి అమ్మవారికి పల్లకీ సేవ, అర్చన, స్వామి వారి మంగళా శాసనాలతో కార్యక్రమాలు ఘనంగా ముగిశాయని వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో వీరలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని తీర్థ, ప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలియజేశారు. -
పెదకాకాని శివాలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు
అన్నపూర్ణాదేవిగా భ్రమరాంబ దర్శనం పెదకాకాని: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన స్థానిక శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో భ్రమరాంబ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులను అనుగ్రహించారు. శరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు బుధవారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామున సుప్రభాతసేవతో పూజలు ప్రారంభమయ్యాయి. ఆలయ యాగశాలలో నిర్వహించిన చండీ హోమం , రుద్ర పూజల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అన్న ప్రసాదిని..అభయ ప్రదాయిని ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూడో రోజైన బుధవారం దుర్గమ్మ శ్రీఅన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని శ్రీఅన్నపూర్ణాదేవిగా దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారికి విశేష అలంకరణ, పూజా కార్యక్రమాలు, బాలభోగం నివేదన అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. సర్వ దర్శనం మూడు క్యూలైన్లలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రద్దీ కొనసాగుతూనే ఉంది. సాయంత్రం అమ్మవారి మహా నివేదన, పంచహారతుల తర్వాత భక్తుల రద్దీ మరింత పెరిగింది. కెనాల్రోడ్డులోని వినాయకుడి గుడితో పాటు కుమ్మరిపాలెం వైపు క్యూలైన్లు రద్దీగా కనిపించాయి. సర్వ దర్శనం క్యూలైన్లలో రద్దీ బుధవారం తెల్లవారుజాము నుంచి సర్వ దర్శనం క్యూలైన్లలో భక్తుల రద్దీ కొనసాగింది. సాధారణ భక్తులతో పాటు భవానీ దీక్షలు స్వీకరించిన భక్తులు క్యూలైన్లో ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే ఉపవాసంతో ఉండే భవానీలకు ప్రత్యేక ఏర్పాటు చేయకపోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటకలకు చెందిన భక్తులు దీక్షలను స్వీకరించి దర్శనానికి వచ్చారు. తెల్లవారుజాము నుంచి రాత్రి 11 గంటల వరకు సర్వ దర్శనం క్యూలైన్లో రద్దీ ఏకధాటిగా కొనసాగుతూనే ఉంది. వీఐపీ క్యూలైన్లో అనుమతి.. సేవా బృంద సభ్యులు, పోలీసు సిబ్బంది ఎవరైనా వీఐపీ క్యూలైన్ ద్వారానే అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఈవో శీనానాయక్, ఏడీసీపీ జి.రామకృష్ణ సూచించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని స్కానింగ్ పాయింట్, మీడియా పాయింట్ల వద్ద పలు మార్లు తనిఖీలు నిర్వహించారు. సిఫార్సులతో దర్శనం కోసం నేరుగా వస్తున్న వారిని ఆపి కార్డులు తనిఖీలు చేశారు. దీంతో చిన్న గాలిగోపురం పరిసరాల్లో, సీఎం గేటు వద్ద రద్దీ అదుపులోకి వచ్చింది. అన్నదాన భవనంలో తనిఖీలు.. అమ్మవారి అన్నప్రసాదం కోసం తరలివచ్చిన భక్తులతో మహా మండపం ఎదుట నూతనంగా నిర్మించిన అన్నదాన భవనం కిటకిటలాడింది. మరో వైపున అన్న ప్రసాద నాణ్యతలలో ఎటువంటి లోటు పాట్లు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్కలెక్టర్ ఎస్. ఇలక్కియ వేరు వేరుగా తనిఖీలు నిర్వహించారు. మూడో రోజు ఆదాయం రూ.31.08లక్షలు దసరా ఉత్సవాలలో మూడో రోజైన బుధవారం దేవస్థానానికి రూ. 31.08 లక్షల మేర ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. రూ. 300 టికెట్ల విక్రయం ద్వారా రూ.10.56లక్షలు, రూ.100 టికెట్ల విక్రయం ద్వారా రూ.3.46లక్షలు, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ. 2.98లక్షలు, ఆరు లడ్డూ బాక్స్ల విక్రయం ద్వారా రూ.11.89లక్షలు, ఆర్జిత సేవా టికెట్ల విక్రయం, సేవల ద్వారా రూ.2.10 లక్షల మేర ఆదాయం లభించిందని పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటల వరకు 58 వేల మంది అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా దర్శించుకున్నారని, అన్నప్రసాదం 22,506 మందికి పంపిణీ చేశామని పేర్కొన్నారు. -
కృష్ణమ్మ ఉగ్రరూపం
కొల్లూరు: కృష్ణమ్మ ఉగ్రరూపంతో నదీ పరీవాహక లంక గ్రామాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. వరద తీవ్రత అంతకంతకూ పెరుగుతుండటంతో పంట పొలాల్లోకి నీరు వచ్చి చేరుతోంది. వాణిజ్య పంటలు ముంపు బారిన పడుతున్నాయి. బుధవారం ప్రకాశం బ్యారేజ్ నుంచి 4.44 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేయడంతో నదిలో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల్ని వరద నీరు ముంచెత్తింది. మండలంలోని పెసర్లంక, ఆవులవారిపాలెం, గాజుల్లంక గ్రామాల చుట్టూ ఇటుకరాయి తయారీకి అవసరమైన మట్టి కోసం తవ్విన భారీ గుంతల్లోకి నీరు చేరింది. చింతర్లంక, గాజుల్లంక, పోతార్లంక, దోనేపూడి కరకట్ట దిగువు ప్రాంతాల్లో వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లింది. పంట భూములలోకి వరద నీరు ప్రవేశించింది. అరటి, కంద, కూరగాయలు, పసుపు, మినుము పంటలు ముంపు బారిన పడ్డాయి. ప్రకాశం బ్యారేజ్ నుంచి వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇంచుమించు 6.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి వదిలే అవకాశాలున్నట్లు అధికారులు ముందస్తు హెచ్చరికలు చేస్తూ ప్రజలను ఆప్రమత్తం చేశారు. వరద తీవ్రత పెరిగిన పక్షంలో ప్రజలను తరలించడానికి అవసరమైన ఏర్పాట్లతో పాటు మండలంలో 13 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
అతివృష్టితో అపర నష్టం!
తాడికొండ: అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు అన్నదాతలు కుదేలవుతున్నారు. మబ్బుకు చిల్లుపడిందా అన్న చందంగా ప్రతి రోజు వాన కురుస్తుండటంతో రైతన్నలు పంట పొలాల్లో అడుగు పెట్టేందుకు కూడా వీలులేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే అరకొరగా సాగుచేసిన అపరాల పంటలు వర్షార్పణం కాగా పత్తి పంట ఎదుగుదల లేక ఎర్రబారుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక జ్యూట్ పంట పరిస్థితి కూడా ఇదేవిధంగా మారడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా పొలంలోకి అడుగు పెట్టి అంతర కృషి చేసే పరిస్థితి కూడా లేని కారణంగా పై పాటుగా మందుల పిచికారీ కలుపు ఏరివేత కూడా చేయలేని పరిస్థితితో పొలాలు పిచ్చి కంపల్లా మారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుండె ‘చెరువు’ అయింది! ఈ ఏడాది నెలకొన్న అతివృషి పరిస్థితుల కారణంగా ఇప్పటి వరకు పెట్టుబడుల రూపంలో పెట్టిన సొమ్ము అయినా తిరిగొస్తుందా లేదా అనే బెంగ అన్నదాతల్లో పట్టుకుంది. కొండవీటి వాగు ఉధృతికి తాడికొండ, తుళ్ళూరు మండలాల్లో వేలాది ఎకరాల్లో పంటలు గత రెండు నెలలుగా నానుతున్నాయి. పంటనష్టం పరిహారం అంచనాలు రూపొందించి అన్నదాతకు అండగా నిలవాల్సిన వ్యవసాయాధికారులు, ప్రజాప్రతినిధులు ఆ దిశగా యత్నించిన దాఖలాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు యూరియా సరఫరా లేక ప్రభుత్వం చేతులెత్తేయగా.. అధిక ధరలు వెచ్చించి కాంప్లెక్స్ ఎరువులు కొనుగోలు చేసి పెట్టుబడులు పెట్టామని, తీరా ఇప్పుడు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని రైతులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి కొండవీటి వాగు ముంపునకు గురైన రైతులకు న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
అంతంకాని డయేరియా భూతం
గుంటూరు మెడికల్: డయేరియా భూతం గుంటూరు నగరాన్ని పట్టి పీడిస్తోంది. అధికారుల నిర్లక్ష్యంతో బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పది రోజులుగా నగరంలో వాంతులు, విరేచనాల కేసులు నమోదవుతూనే ఉన్నాయి. నిత్యం పెద్ద సంఖ్యలో బాధితులు చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్కి వస్తున్నారు. వ్యాధిని కట్టడి చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైందనే విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.కలరా భయంతో వణుకుఓ పక్క డయేరియాతో వణికిపోతున్న నగర ప్రజానీకానికి మరోపక్క కలరా భయం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అధికారుల గణాంకాల ప్రకారం గుంటూరు నగరానికి చెందిన ముగ్గురు కలరాతో జీజీహెచ్లో చికిత్స పొంది, డిశ్చార్జి అయ్యారు. అయితే, పూర్తి స్థాయిలో నివేదికలు బయటకు రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవ పరిస్థితులను కూడా అధికారులు దాస్తున్నారు. డయేరియా, కలరా బాధితుల గణాంకాలను వివరించేందుకు ముందుకు రావడం లేదు.ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందనే కారణాలతో సాధ్యమైనంత మేరకు గణాంకాలను దాచి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వివరాలు చెబితే వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయనే భయంతో అన్ని శాఖల వారు మౌనంగా ఉంటున్నారు.వ్యాధి కట్టడి కీలకంసాధారణంగా డయేరియా, కలరా లాంటి వ్యాధులు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ముందస్తుగా అధికారులు అప్రమత్తం చేయాలి. వ్యక్తిగతంతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా ఈ వ్యాధుల కట్టడిలో కీలకం. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేదు. మురుగు కాలువల్లో తాగునీటి పైప్లైన్లు ఇంకా మునిగే ఉన్నాయి. గతంలో జరిగిన ప్రాణ నష్టం నుంచి అధికారులు గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. విధుల నిర్వహణలో నిర్లిప్తతను ప్రదర్శిస్తున్నారు.ఏ మాత్రం తగ్గని డయేరియాఈనెల 15న గుంటూరు జీజీహెచ్లో మొట్టమొదటిసారిగా డయేరియా బాధితులు అడ్మిట్ అయ్యారు. నాటి నుంచి ప్రతిరోజూ చికిత్స కోసం వస్తూనే ఉన్నారు. ఇటీవల కలరా కలకలం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఒకవైపు డయేరియా, మరోవైపు కలరాతో ఈ నగరానికి ఏమైందంటూ మేధావులు సైతం పెదవి విరుస్తున్నారు. గుంటూరు జీజీహెచ్లో ఇప్పటి వరకు 165 మందికి పైగా డయేరియాతో చికిత్స పొందారు. వీరిలో ఆరోగ్యం కుదుటపడిన సుమారు 80 మందిని డిశ్చార్జి చేశారు. వాంతులు, విరేచనాలు ఎక్కువగా అవడంతో కిడ్నీల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్న ముగ్గురిని ఐసీయూలో అడ్మిషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తొలుత డయేరియా బాధితుల కోసం ఇన్పేషెంట్ విభాగంలోని జనరల్ సర్జరీ విభాగం 333 నంబరును కేటాయించారు. బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటం, ప్రతిరోజూ అడ్మిషన్లు రావడంతో ఆర్థోపెడిక్ విభాగంలోని పేరాప్లీజియా, ఇతర సర్జరీ వార్డులను కేటాయించారు.రాత్రి అయితే కంటి మీద కునుకు కరువుముఖ్యంగా రాత్రి సమయాల్లో బాధితులు చికిత్స కోసం ఆసుపత్రులకు వెళుతున్నారు. పగలంతా ఇళ్ల వద్దే ఉన్నా వాంతులు, విరేచనాలు కట్టడి కాకపోవడంతో రాత్రి సమయాల్లో జీజీహెచ్కి వెళుతున్నట్లు బాధితులు, వారి కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. ప్రతిరోజూ రాత్రి పది గంటల వరకు కేసులు అడ్మిట్ అవుతున్నాయి. చికిత్స కోసం బాధితులను తీసుకెళ్లే కుటుంబ సభ్యులకు, ఆసుపత్రిలో ఉన్న వైద్యులు, సిబ్బందికి సైతం రాత్రి అయితే కంటి మీద కునుకు లేకుండా పోతోంది.ముందస్తు జాగ్రత్త చర్యలు.. కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియాగుంటూరు వెస్ట్: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా సంబంధిత శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా తెలిపారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో బుధవారం నగరపాల సంస్థ కమిషనర్ పులి శ్రీనివాస్తో కలిసి నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. నగరపాలక సంస్థ పరిధిలో సీజనల్ వ్యాధులు నియంత్రణకు వైద్య, ఆరోగ్య, మున్సిపల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు కృషి చేయాలని ఆమె చెప్పారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో నియమించిన జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేయాలని ఆమె తెలిపారు. పాత గుంటూరులో డయేరియా కేసులు నమోదవుతున్న తొమ్మిది సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టితో ముందస్తు నివారణ చర్యలను అమలు చేయాలని ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకోవాలని తెలిపారు. అనారోగ్య లక్షణాలు ఉన్నవారిని వెంటనే వైద్య శిబిరాలకు తరలించి చికిత్స అందించాలని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గురువారం ఉదయం నాటికి పూర్తిస్థాయిలో ఇంటింటి సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది, సచివాలయ ఉద్యోగులతో అవసరం మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. నిర్దేశిత నాణ్యత ప్రమాణాలు లేని దుకాణాలను వెంటనే మూయించాలని చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే ఖాజావలి, జిల్లా వైద్య శాఖ అధికారి విజయలక్ష్మి, జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యసశ్వీ, జిల్లా పంచాయతీ అధికారి సాయి కుమార్, ఆర్డబ్ల్యూ ఎస్ ఎస్ఈ కల్యాణ్ చక్రవర్తి, నగరపాలక సంస్థ సీఎంహెచ్ఓ శోభారాణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఆర్ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి
గుంటూరు మెడికల్: జిల్లాలో ప్రస్తుతం ప్రబలిన డయేరియా పరిస్థితి రీత్యా డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి జిల్లాలోని ఆర్ఎంపీ, పీఎంపీల సంఘనేతలతో బుధవారం తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్ఎంపీ, పీఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలన్నారు. ఓఆర్ఎస్ ద్రావణం పంపిణీ తప్ప తమ పరిధికి మించి చికిత్స చేయకూడదన్నారు. సైలెన్లు ఎక్కించడం, మందులు ఇవ్వడం వంటివి చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రోగ్రాం ఆఫీసర్లు, డాక్టర్ అమర్తలూరి శ్రావణ్బాబు, డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ రోహిణి రత్నశ్రీ, ఆరోగ్య విస్తరణ అధికారి నూనె రామకృష్ణ, సూపర్వైజర్ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.3,202 గృహాలు సర్వే ..అతిసార ప్రభావిత ప్రాంతాల్లో 50 బృందాలు 3202 గృహాలను సర్వే చేసిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి బుధవారం తెలిపారు. అతిసార నివారణకు తీసుకున్న చర్యలు వివరించారు. నోడల్ అధికారులుగా నియమితులైన జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించి తీసుకోవలసిన చర్యలు పై ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. జీజీహెచ్లో సెప్టెంబర్ 17 నుంచి ఇప్పటి వరకూ 185 కేసులు రిపోర్ట్ కాగా, 104 మంది బెడ్ మీద ఉన్నారని, 81 మంది డిశ్చార్జ్ అయ్యారని, కొత్తగా చేరిన వారిలో 8 కేసులు డిశ్చార్జ్ అయ్యారని, 23, 24 తేదీల్లో 17 కేసులు వచ్చాయని తెలిపారు. 168 నమూనాలు సేకరించగా 13 పాజిటివ్ వచ్చాయని, వాటిలో విబ్రియో 3, సిగేల్లి 1, ఇ – కోలి 9 కేసులు ఉన్నాయన్నారు.ఆరు మండలాల్లో వర్షం కొరిటెపాడు(గుంటూరు): జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ఆరు మండలాల్లో తేలికపాటి వర్షం పడింది. అత్యధికంగా ప్రత్తిపాడు మండలంలో 15.4 మిల్లీ మీటర్లు పడగా, అత్యల్పంగా పొన్నూరు మండలంలో 1.6 మి.మీ. పడింది. -
ఏఎన్యూలో ఒకే సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యం
పెదకాకాని (ఏఎన్యూ): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏర్పడినప్పటి నుంచి పాలన, కార్యనిర్వహణ పదవుల్లో అన్ని సామాజిక వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించేవారు. జనాభా ప్రాతిపదికన ఆయా వర్గాలకు పెద్దపీట వేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమ సామాజిక వర్గానికే అన్ని పదవులు కట్టబెడుతున్నారు. ఇన్ఛార్జ్ వీసీ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సెల్ కోఆర్డినేటర్, రీసెర్చ్ సెల్ కోఆర్డినేటర్, పీజీ పరీక్షల కోఆర్డినేటర్, పరీక్షల సీటీఏ వంటి ఏడు కీలక పదవులు చంద్రబాబు సామాజిక వర్గానికి కట్టబెట్టారు. ఓట్లు, జనాభా పరంగా అతి తక్కువ ప్రాతినిధ్యం ఉన్న ఆ సామాజిక వర్గానికి పదిహేను పదవుల్లో ఏడు కీలక పదవులు ఇవ్వడంపై విమర్శలు వెల్లవెత్తాయి. గత ఏడాదిన్నర కాలంగా తీవ్ర ఆరోపణలు వస్తున్నా తాజాగా ఖాళీ అయిన రెక్టార్ పోస్టులోనూ అదే సామాజిక వర్గానికి చెందిన ఓ అధ్యాపకుడిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అందరూ విస్తుపోయారు. వర్సిటీ ఏర్పాటైనప్పటి నుంచి ఇలా కీలకమైన రెండు పదవులూ ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టడం ఎప్పుడూ జరగలేదని విద్యావేత్తలు చెబుతున్నారు. కూటమిలో గెలుపులో తాము చాలా కీలకం అని చెప్పే కాపులు, ఎస్సీల్లోని ఓ వర్గం, గుంటూరు జిల్లా ఓట్ల పరంగా పెద్ద ప్రభావం చూపే బీసీల్లో ప్రాధాన్యత కలిగిన సామాజిక వర్గాలకు ఏఎన్యూ పదవుల్లో తీవ్ర అన్యాయం జరిగింది. చినబాబు నియోజకవర్గంలో ఉన్న వర్సిటీలో ఆయా వర్గాలపై చిన్నచూపు చూస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు చెందిన కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేని పరీక్షల కోఆర్డినేటర్ పదవి ఒకటి ఇచ్చి పక్కన పెట్టారు. టీడీపీకి వెన్నుదున్నుగా నిలిచామని చెప్పుకుంటున్న ఎస్సీల్లోని ఒక సామాజిక వర్గానికి అస్సలు పదవే దక్కలేదు. టీడీపీకి మద్దతుగా నిలిచే యాదవ, గౌడ వంటి ప్రధాన బీసీ వర్గాలకు పూర్తిగా మొండిచేయి చూపారు. ఎస్టీలతోపాటు పలు ఇతర వర్గాలకు పదవుల ఊసేలేదు. సగానికిపైగా కీలక పదవుల్లో ఒక సామాజిక వర్గం వారే చినబాబు ఇలాకాలో ఇతర వర్గాలకు మొండిచేయి కాపులు, ఎస్సీల్లోని ఓ వర్గం, బీసీల్లోని కీలక వర్గాలకు దక్కని ప్రాతినిధ్యం వైఎస్సార్సీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట ఎన్ని విమర్శలు వచ్చినా తీరు మారని చంద్రబాబు సర్కారు తాజాగా రెక్టార్ నియామకంలోనూ అదే పక్షపాతం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర అణగారిన వర్గాలకు పెద్దపీట వేశారు. వీసీ, రెక్టార్, దూరవిద్యాకేంద్రం డైరెక్టర్, ఐఎస్సీ డైరెక్టర్తోపాటు పలు కీలక పదవులను ఈ వార్గల వారికి ఇచ్చారు. నేటి కూటమి ప్రభుత్వంలో దానికి భిన్నంగా వర్సిటీలో ఉన్న పదవుల్లో సగానికిపైగా, కార్యనిర్వహణలో కీలక స్థానాలన్నింటిలో ఒక సామాజిక వర్గం వారికే కట్టబెట్టడం చంద్రబాబు ప్రభుత్వ అంతరంగాన్ని తెలియజేస్తోందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పదవులు, పెత్తనం అన్నింటిలో ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నారు. సీఎం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు వర్సిటీలోని పాలన, కార్యనిర్వహణ పదవుల్లో కీలమైన వాటిని ఎక్కువగా తమ వర్గానికే యథేచ్ఛగా కట్టబెడుతుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అయినప్పటికీ వారి ప్రయోజనాలే ముఖ్యమన్నట్లుగా కూటమి పాలకులు వ్యవహరిస్తున్నారు. -
వేదమాతా నమోనమః
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వేదమాత గాయత్రీదేవిగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కొలువైన ఇంద్రకీలాద్రిపై దేవీశరన్నవ రాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజైన మంగళవారం దుర్గమ్మను శ్రీగాయత్రీదేవిగా అలంకరించారు. తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. వేకువజాము నుంచి ఉదయం ఆరు గంటల వరకు భక్తులతో అన్ని క్యూలైన్లు కిక్కిరిశాయి. అమ్మవారికి నిర్వహించే పలు ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు, ఉభయదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు కొండపైకి చేరుకోవడం ఇబ్బందికరంగా ఉందని పలువురు ఉభయదాతలు నేరుగా కలెక్టర్ లక్ష్మీశకు ఫిర్యాదు చేశారు. ఉదయం ఆరు గంటల తర్వాత సర్వ దర్శనం క్యూలైన్లలో భక్తుల రద్దీ కొనసాగింది. అయితే రూ.100, రూ.300 టికెట్ల క్యూలైన్లు ఖాళీగానే దర్శనమిచ్చాయి. రద్దీని కట్టడి చేసేందుకు పోలీసు, రెవెన్యూ అధికారులు భక్తులను రూ.100 క్యూలోకి అనుమతించారు. ఇక అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, చండీయాగం, కుంకుమార్చనలో ఉభయదాతలు పాల్గొన్నారు. ప్రత్యేక కుంకుమార్చనను మొదటి షిఫ్టునకే పరిమితం చేశారు. వీఐపీ దర్శనాలకు బ్రేక్ తొలి రోజున ఆలయ ప్రాంగణంలో ఇష్టానుసారంగా వీఐపీల పేరిట జరిగిన దర్శనాలకు మంగళవారం బ్రేక్ పడింది. ప్రొటోకాల్ ఉన్న వారికి మాత్రమే సీఎం గేటు, వీఐపీల పేరుతో వచ్చే వారిని గాలిగోపురం వద్ద ఉన్న క్యూలైన్ ద్వారానే ఆలయంలో అనుమతించారు. కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం ఉదయం లడ్డూ తయారీ పోటులను తనిఖీ చేశారు. ప్రసాదాల తయారీకి వినియోగిస్తున్న పిండి పర్థారాలు, పంచదార, నూనె, నెయ్యి, జీడిపప్పు నాణ్యతను పరిశీలించారు. రోజుకు ఎన్ని లడ్డూలు తయారు చేస్తున్నారు? మొదటి రోజు ఎన్ని విక్రయించారు? ఇంకా ఎన్ని నిల్వ ఉన్నాయన్న వివరాలను ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. నిత్యం 2.50 లక్షల లడ్డూలను తయారీ చేసేలా దేవస్థానం మూడు లడ్డూ పోటులను సిద్ధం చేసిందని, ఉత్సవాల్లో 36 లక్షల లడ్డూలు అవసరమయవుతాయని అంచనా వేశామని తెలిపారు. లడ్డూ విక్రయ కేంద్రాలను మంగళవారం నుంచి మరి కొన్నింటిని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ప్రస్తుతం కనకదుర్గనగర్లో పది కౌంటర్లు ఉండగా, అక్కడ మరో రెండు కౌంటర్లు, బస్టాండ్, రైల్వేస్టేషన్తో పాటు రథం సెంటర్లో వృద్ధులు, దివ్యాంగుల కోసం కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు.ట్రాఫిక్ ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వించిపేట(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల సన్నిధిలో జరుగుతున్న దసరా మహోత్సవాల్లో రెండో రోజు మంగళవారం శ్రీగాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గమ్మను రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, ఎస్.సవిత, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, బండారు శ్రావణి, గల్లా మాధవి, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ దర్శించుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు వేద పండితులు వేదాశీర్వచనం, ఆలయ ఈఓ శీనా నాయక్ అమ్మవారి చిత్రపటాలు అందజేశారు. రెండో రోజు ఆదాయం రూ.25.48లక్షలు దసరా ఉత్సవాల్లో రెండో రోజున దేవస్థానానికి రూ.25.48 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. రూ.300 టికెట్ల విక్రయం ద్వారా రూ.8.99 లక్షలు, రూ.100 టికెట్ల ద్వారా రూ.3.16 లక్షలు, లడ్డూ ప్రసాదం ద్వారా రూ.1.86 లక్షలు, ఆరు లడ్డూల ప్రత్యేక ప్యాక్ల ద్వారా రూ.9.66 లక్షలు, ప్రత్యేక కుంకుమార్చన టికెట్ల ద్వారా రూ.69 వేలు, ఇతర సేవా టికెట్ల విక్రయం ద్వారా ఈ ఆదాయం లభించిందని వివరించారు. రెండో రోజు సాయంత్రం ఐదు గంటలకు సుమారు 60 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని, 19,629 మందికి అన్న ప్రసాదం అందజేశామని తెలిపారు. గాయత్రీదేవిగా దుర్గమ్మ దర్శనం -
అమెరికా వైద్యులు
●కృష్ణా జిల్లాకు చెందిన డాక్టర్ కడియాల సమత విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చదివి నేడు అమెరికాలో వైద్యురాలిగా స్థిరపడ్డారు. ఆమె వద్దకు చికిత్స కోసం వచ్చే వారిలో ఎక్కువ మంది గర్భాశయ క్యాన్సర్ బాధితులు ఉండటం గమనించారు. అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశంలో పరిస్థితి చూసి ఆశ్చర్యపోయి ఇక భారతదేశంలో ఎంతో మంది అమాయక మహిళలు క్యాన్సర్కు బలవుతుంటారని ఆలోచించారు. ఇండియాలో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేసి క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించి ప్రాణాలు పోకుండా కాపాడాలని నిర్ణయించుకున్నారు. ఆమె మహా సంకల్పానికి పింక్ అనే ఎన్ఓజీ సంస్థ సహకారం అందించింది. అమెరికాలో తనతోపాటుగా పనిచేస్తున్న డాక్టర్ జీన్టాల్బర్ట్, డాక్టర్ కారోల్ హాబాక్లు ఇండియాకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. తాను ఎంబీబీఎస్ చదివే రోజుల్లో స్నేహితుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్( ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గార్లపాటి నందకిషోర్ సూచనలతో డాక్టర్ సుమత కడియాల సోమవారం గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్లో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గురువారం వరకు ఉచిత క్యాన్సర్ వైద్యశిబిరం జరగనుంది. ముందస్తుగా నమోదు చేయించుకోవాలి... ఈనెల 25 వరకు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మహిళలకు ఉచితంగా గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారని నాట్కో క్యాన్సర్ సెంటర్ సమన్వయకర్త యడ్లపాటి అశోక్కుమార్ తెలిపారు. అంతర్జాతీయ వైద్య నిపుణులు ఉచితంగా గుంటూరు వచ్చి పరీక్షలు చేస్తున్న దృష్ట్యా 21 నుంచి 60 ఏళ్లు మహిళలు ప్రతి ఒక్కరు ఈ ఉచిత వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముందస్తుగా పేర్లు నమోదు చేయించుకో వాలని పేర్లు నమోదు కోసం స్టాఫ్ నర్సు అంజమ్మను 9640102066 నెంబరులో సంప్రదించాలన్నారు. క్యాన్సర్ నిర్ధారణతో పాటుగా చికిత్స సైతం .. అత్యాధునిక వైద్య పరికరాలతో క్యాన్సర్ నిర్ధారణ గురువారం వరకు కొనసాగనున్న స్క్రీనింగ్ క్యాంపు 21 నుంచి 60 ఏళ్లలోపు మహిళలు పరీక్షలు చేయించుకోవాలని సూచన ఆ మహిళలు అమెరికాలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న వైద్యులు. రెండు చేతులా సంపాదన ఉన్నా మనసులో ఏదో తెలియని అసంతృప్తి. ఎంతో మంది క్యాన్సర్ బారిన పడి చికిత్స కోసం రావటం వారి మనసును కలిచి వేసింది. ముఖ్యంగా మహిళలు చిన్న వయస్సులోనే క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోవటం చూసి చలించిపోయారు. తమ వంతుగా క్యాన్సర్ నివారణకు ఏమైనా చేయాలని కంకణం కట్టుకున్నారు. వీరికి ఒక ఎన్జీఓ సహకారం అందించింది. దీంతో క్యాన్సర్పై సమరం చేసేందుకు సిద్ధమయ్యారు. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల కంటే భారత దేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువ మంది పేదలు ఉంటారని, చికిత్సలు చేయించుకోకుండా, కనీసం వ్యాధి నిర్ధారణ కూడా చేయించుకోక ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు తెలుసుకుని ఇండియాలో క్యాన్సర్ చికిత్సలు ఉచితంగా చేసేందుకు కదలి వచ్చారు. – గుంటూరు మెడికల్ గర్భాశయ క్యాన్సర్ను చాలా త్వరగా గుర్తించి(ప్రాథమిక దశలో) చికిత్స కూడా వెంటనే అందించే అత్యాధునిక వైద్య పరికరాలను సైతం డాక్టర్ కడియాల సమత గుంటూరు జీజీహెచ్కు తీసుకొచ్చారు. ఒక పక్క పేద రోగులకు అత్యాధునిక క్యాన్సర్ వైద్య పరీక్షలు చేస్తూనే మరో పక్క యువ వైద్యులకు సైతం అత్యాధునిక క్యాన్సర్ వైద్య పరికరాలు ఏ విధంగా ఉపయోగించాలనే విషయాలపై సైతం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఏపీలో ఎక్కడా లేని విధంగా అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో క్యాన్సర్కు అత్యాధునిక వైద్య పరికరాలు, వైద్య సౌకర్యాలు నాట్కో ట్రస్ట్ గుంటూరు జీజీహెచ్లో ఏర్పాటు చేసింది. దీంతో క్యాన్సర్ చికిత్సలు కూడా తక్షణమే చేసేలా అమెరికా నుంచి వచ్చిన వైద్యులకు వెసులుబాటు కలిగింది. -
కృష్ణానదికి వరద ఉద్ధృతి
కొల్లూరు/ భట్టిప్రోలు: కృష్ణానదిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. క్రమక్రమంగా నదిలో నీటి మట్టం ఎక్కువ అవుతోంది. మంగళవారం ప్రకాశం బ్యారేజ్ నుంచి 3,97,250 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేసిన నేపథ్యంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ ఎగువనున్న ప్రాజెక్టులతోపాటు తెలంగాణ ప్రాంతంలోని మున్నేరు, ఇతర వాగులు నుంచి వరద నీరు అధికంగా వస్తోంది. దీంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నదిలో గణనీయంగా వరద నీరు పెరుగుతుండటంతో పెసర్లంక నక్కపాయ గండి, పోతార్లంక – గాజుల్లంక ప్రాంతాలలోని చిన్నరేవు, నది ఒడ్డుకు ఏర్పడిన కోతల ద్వారా వరద నీరు భారీగా లోతట్టు ప్రాంతాలలోకి ప్రవేశించి గ్రామాలను చుట్టుముట్టింది. వరద తీవ్రత అధికమవుతుండటంతో చింతర్లంక, పోతార్లంక, గాజుల్లంక, దోనేపూడి కరకట్ట దిగువున ఉన్న పంట పొలాలలో సాగులో ఉన్న అరటి, కంద, పసుపు, కూరగాయల పంటలు ముంపు బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. కొల్లూరు, గాజుల్లంక, పెసర్లంక ప్రాంతాలలోని పల్లపు భూములలోకి వరద నీరు చేరడంతో ఇటుక బట్టీలు ముంపునకు గురయ్యాయి. దోనేపూడి చినరేవు చప్టా పై నుంచి వరద నీటి ప్రవాహం అధికమవడంతో మండలంలోని 10 గ్రామాలకు చెందిన ప్రజలు గాజుల్లంక, భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామాల మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. వరద తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో అధికారులు నది తీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నదిలోకి పశువుల కాపరులు దిగరాదని, పిల్లలను నది వద్ద వెళ్లనీయకూడదని, ఈతకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణానది పరివాహక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేసినట్లు తహసీల్దార్ బి. వెంకటేశ్వర్లు తెలిపారు. కొల్లూరు మండలంలోని వరద ప్రభావిత 21 గ్రామాలలో ఉన్న ప్రజల కోసం 13 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. కొల్లూరులో 8, అనంతవరం, చిలుమూరు, ఈపూరు, దోనేపూడి, భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామాలలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలో వీటిని సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. కలెక్టర్కూ తప్పని ‘కరకట్ట’ కష్టం కరకట్ట ప్రయాణ కష్టాలు జిల్లా కలెక్టర్కు సైతం తప్పలేదు. కొల్లూరు వద్ద సుమారు రెండు కిలోమీటర్ల మేర కరకట్ట మార్గం పూర్తిగా దెబ్బతింది. నిరంతరం ప్రమాదాలకు నిలయంగా మారిన ఈ మార్గంలో వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఇరువైపులా సుమారు 15 అడుగుల లోతట్టు ప్రాంతం, పశ్చిమ బ్యాంక్ కెనాల్తో ఉన్న మార్గంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలు గాలిలో కలసిపోయే ప్రమాదం వెన్నాడుతోంది. రహదారి అధ్వానంగా మారడంతో ఎదురుగా ఏదైనా వాహనం వస్తే పక్కకు తప్పుకొనే అవకాశం సైతం లేదు. మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ కొల్లూరు కరకట్ట ప్రాంతానికి రావడంతో వాహనం ముందుకు సాగడానికి తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. నదిలో క్రమక్రమంగా పెరుగుతున్న నీటి ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు లోతట్టు ప్రాంతాలలోకి భారీగా చేరిన వరద నీరు ముంపు ప్రాంత ప్రజల కోసం పునరావాస కేంద్రాలు సిద్ధం క్షేత్రస్థాయిలో పర్యటించిన బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ సహాయక చర్యలపై అధికారులు, సర్పంచ్లతో సమావేశం -
క్రీడలకు సాంకేతికత జోడింపుతో ఉత్తమ ఫలితాలు
పెదకాకాని(ఏఎన్యు): రాష్ట్రంలో క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి ఎం.రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో 36వ దక్షిణ మండల జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు, ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి రాంప్రసాద్రెడ్డి మాట్లాడుతూ క్రీడల విధానంలో నూతన అధ్యాయం ప్రారంభమైందన్నారు. ఆధునిక సాంకేతికతను క్రీడల రంగానికి జోడించడం ద్వారా అద్భుత ఫలితాలు సాధించవచ్చన్నారు. ప్రభుత్వానికి సమాంతరంగా పలు అథ్లెటిక్ అసోసియేషన్లు, మల్టీ నేషనల్ కంపెనీలు క్రీడలను ప్రోత్సహించడం సంతోషకరమన్నారు. తొలుత అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పతాకాన్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఏపీ అథ్లెటిక్స్ అసోసియేషన్ పతాకాన్ని శాప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణి ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, లక్షద్వీప్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. -
క్రీడలతోనూ ఉత్తమ భవిష్యత్తు
కలెక్టరేట్ ఎదుట ఏఐవైఎఫ్ నాయకుల నిరసన లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ సమస్యలపై చర్చించాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ విడదల చేయాలని, నిరుద్యోగ భృతి మంజూరు చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలి డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా షేక్ వలి మాట్లాడుతూ నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా ఏటా జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి విడుదల చేస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరారు. అదేవిధంగా అధికారం వచ్చిన 100 రోజుల్లో 107–108 జీఓలు రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మోసం చేశారని మండిపడ్డారు, పైగా మెడికల్ కాలేజీ లను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణకు ఇవ్వడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అన్ని శాఖల్లో పోస్టుల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇవ్వాలని తీర్మానం చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలు నెలకొల్ప నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. జిల్లా అధ్యక్షుడు జంగాల చైతన్య, నగర అధ్యక్ష కార్యదర్శులు శ్రీను, మరియదాసు గుంటూరు జిల్లా కార్యదర్శి యస్వంత్ నగర కార్యదర్శి బన్నీ సాయి, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు గోపి, నవీన్, రెహ్మాన్, ఖాదర్వలి తదితరులు పాల్గొన్నారు. కొరిటెపాడు(గుంటూరు): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల గుంటూరు జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 14 మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడింది. అత్యధికంగా తుళ్ళూరు మండలంలో 36.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా ఫిరంగిపురం మండలంలో మి.మీ. కురిసింది. సగటు 10.1 మి.మీ.గా నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రత్తిపాడు మండలంలో 35.4 మి.మీ., తాడేపల్లి 25.8, దుగ్గిరాల 18.6, కొల్లిపర 15.4, పెదకాకాని 11.2, కాకుమాను 9, గుంటూరు పశ్చిమ 7.6, గుంటూరు తూర్పు 6.4, మంగళగిరి 6, తాడికొండ 5.2, పొన్నూరు 2.2, మేడికొండూరు మండలంలో 1.2 మి.మీ. చొప్పున వర్షపాతం పడింది. సెప్టెంబర్ మాసం 23వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 122.2 మి.మీ. పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు 245 మి.మీ. వర్షపాతం నమోదైంది. చిలకలూరిపేటటౌన్: ఫోన్లో మెసేజ్లు పెడుతూ వివాహితను వేధింపులకు గురి చేస్తున్న పురపాలక సంఘం కాంట్రాక్ట్ ఉద్యోగిపై పట్టణ పోలీస్స్టేషన్లో మంగళవారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరా లప్రకారం...పట్టణంలోని భావనరుషినగర్లో నివాసం ఉంటున్న అవ్వారు రమేష్ తన ఇంటి పక్కనే ఉంటున్న వివాహితకు కొంతకాలంగా ఇబ్బందికరమైన మెసేజ్లను పెడుతున్నాడు. ఆమె పోలీసులకు ఫిర్యా దు చేసింది. మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇద్దరి నివాసాలు పక్కపక్కనే ఉండటం వల్ల పరిచయం ఏర్పడిందని, దానిని అడ్డుపెట్టుకొని రమేష్ ఈ వేధింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు వెల్లడించింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పెదకాకాని(ఏఎన్యు): విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఆచార్య కె.గంగాధరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మంగళవారం అంతర కళాశాలల పురుషుల కబడ్డీ క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీల ప్రారంభోత్సవంలో వీసీ ఆచార్య కె.గంగాధరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మనిషికి చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా మనిషి ఎదుగుదల, వికాసం, శరీరక దృఢత్వానికి దోహదపడతాయన్నారు. ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు క్రీడలను అశ్రద్ధ చేయడం వలన పిల్లలు క్రీడలకు దూరం అవుతున్నారన్నారు. క్రీడా నైపుణ్యాలు, క్రీడాకారులు సామర్ధ్యం, క్రీడల విశిష్టతను కొనియాడారు. వర్సిటీ ఆర్ట్స్, లా ప్రిన్సిపాల్, టోర్నమెంట్ ప్రెసిడెంట్ ఆచార్య ఎం.సురేష్కుమార్, రెక్టార్ ఆచార్య ఆర్ శివరాంప్రసాద్, రిజిష్టార్ జి.సింహాచలం, డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య పీపీఎస్ పౌల్కుమార్ పాల్గొన్నారు. కమిటీ మెంబర్లుగా డాక్టర్ పి.శ్రీనివాసరావు, పి.గణేష్, కె.ప్రసన్నకుమార్లు వ్యవహరించారు. ఏఎన్యూ పరిధిలోని 21 కళాశాలల జట్లు ఈ పోటీలో పాల్గొన్నాయి. హత్య కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు మంగళగిరి: ఆరు సంవత్సరాల క్రితం నగర పరిధి లోని కొత్తపేటలో జరిగిన హత్య కేసు ఘటనలో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ 5వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. మంగళగిరి పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... 2019, ఆగస్టు 2న మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని యర్రబాలెం గ్రామానికి చెందిన బొద్దులూరి వెంకటరమణ(43) కొత్తపేటకు చెందిన మోటు కూరి భాస్కరరావు మద్యం మత్తులో ఘర్షణకు పాల్పడ్డారు. అనంతరం చుట్టూ వున్నవారు వారించడంతో ఎవరి ఇళ్లకు వారు వెళ్లారు. అయితే వెంకటరమణ కొత్తపేటలోని భాస్కరరావు నివాసానికి వెళ్లి తనపై ఎందుకు ఘర్షణకు దిగావని వాగ్వివాదానికి దిగాడు. దీంతో ఆగ్రహం చెందిన భాస్కరరావు తన ఇంటిలోని కుట్టుమిషన్పై వున్న కత్తెరతో వెంకట రమణను పొట్టలో పొడవగా గాయాలపాలైన వెంకట రమణ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై అప్పటి ఎస్ఐ సీహెచ్ రవిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుడు భాస్కరరావును కోర్టులో హాజరుపరచి చార్జిషీటు దాఖలు చేశారు. గుంటూరు జిల్లా మూడో ఏడీజే కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముబీన బేగం వాదనలు వినిపించగా సదరు కేసును విచారణ జరిపిన జిల్లా మూడవ ఏడీజే కోర్టు జడ్జి సి.వెంకట నాగ శ్రీనివాసరావు ముద్దాయి భాస్కరరావుకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు పోలీసులు తెలిపారు. ఏఎన్యూ వీసీ ఆచార్య కె.గంగాధరరావు వర్సిటీలో అంతర కళాశాలల పురుషుల కబడ్డీ పోటీలు ప్రారంభం -
రసవత్తరంగా విజ్ఞాన్ జాతీయ చెస్ చాంపియన్షిప్
చేబ్రోలు: ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ నిర్వహిస్తున్న 62వ జాతీయ చెస్ చాంపియన్షిప్ పోటీల్లో మంగళవారం రెండో రౌండ్ ముగిసేసరికి 68 మంది క్రీడాకారులు తలో రెండు పాయింట్లతో అగ్రస్థానాన్ని పంచుకున్నారు. ఎక్కువమంది అగ్ర క్రీడాకారులు మూడో రౌండ్కి సులభంగా అడుగుపెట్టారు. మాజీ జాతీయ చాంపియన్ గ్రాండ్ మాస్టర్ సూర్యశేఖర్ గంగూలీ (పీఎస్పీబీ) టాప్ బోర్డులపై తొలి విజయాన్ని నమోదు చేశారు. గియూకో పియానో ఆరంభంలో, 19వ మూవ్లో యషద్ బంబేశ్వర్ (ఛత్తీస్గఢ్) చేసిన తప్పిదాన్ని గంగూలీ సద్వినియోగం చేసుకున్నారు. వరుసగా బిషప్, నైట్ త్యాగాలు చేసి పూర్తిగా ఆధిపత్యం సాధించిన గంగూలీ, 30వ మూవ్లో ప్రత్యర్థిని రాజీనామా చేయించారు. ● టాప్ సీడ్ జీఎం ఇనియన్.పి (తమిళనాడు), అధిరాజ్ మిత్రా(ఝార్ఖండ్)పై గెలుపొందాడు. వెటరన్ జీఎం కృష్ణన్ శశికిరణ్, హృషికేశ్ బానిక్ (పశ్చిమ బెంగాల్)పై గెలుపొందాడు. కొత్తగా గ్రాండ్మాస్టర్ బిరుదు పొందిన ఎస్.రోహిత్ కృష్ణ (తమిళనాడు), దేవర్ష భోర్కటేరియా (గుజరాత్)పై గెలుపొందాడు. జీఎం.ఎం.ఆర్.లలిత్ బాబు (ఆంధ్రప్రదేశ్), అయుష్ రవికుమార్ (తమిళనాడు)పై ఆసక్తికర పోరులో గెలిచారు. కర్ణాటక ఐఎం వియాని ఆంటోనియో డి కున్హాను ఆంధ్ర యువకుడు అందమాల హేమల్ వర్షన్ డ్రాలో కట్టేశారు. మూడో రౌండ్లో టాప్ బోర్డులపై మరింత రసవత్తర పోటీలు జరగనున్నాయి. -
బాలాత్రిపుర సుందరీదేవిగా బాల చాముండేశ్వరి దేవి దర్శనం
అమరావతి: ప్రముఖ శైవ క్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న శ్రీబాల చాముండిక సమేత అమరేశ్వరాలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మంగళవారం బాలాత్రిపురసుందరీదేవి అలంకారంలో బాల చాముండేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పూజా కార్యక్రమాలలో భాగంగా చండీ, రుద్రహోమాలు, శ్రీచక్రార్చన నిర్వహించారు. ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖర శర్మ బాల త్రిపురసుందరి దేవి అలంకార విశిష్టతను వివరించారు. ఆలయంలోని జ్వాలాముఖి, మహిషాసుర మర్ధని అమ్మవార్లకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో రెండో రోజు అమ్మవారికి వారాహిదేవి అలంకారం చేసి, ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలలో పాల్గొన్నారు. తాడికొండ: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 25వ తేదీన వెలగపూడిలో రాష్ట్ర సచివాలయం సమీపంలో డీఎస్సీ అభ్యర్థులకు ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను మంగళవారం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ , విద్యాశాఖ కమిషనర్ విజయ రామరాజు, జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్లు పరిశీలించారు. ఐఎస్డబ్ల్యూ ఎస్పీ ఆరిఫ్ ఆఫీజ్, సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవలు వారి వెంట ఉన్నారు. జిల్లాల నుంచి వచ్చే అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా తగు సూచన బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తాగునీరు, మరుగుదొడ్లు తదితర వసతుల కల్పనకు సంబంధించి అధికారులకు సూచనలు ఇచ్చారు. -
పూర్ణఫలం.. బాలానందం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం దేవీశరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున ప్రధాన ఆలయంలో అమ్మవారి మూలవిరాట్కు స్నపనాభిషేకం, అలంకరణ, నిత్య పూజల అనంతరం దర్శనాలకు అనుమతించారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోం మంత్రి అనిత, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనాచౌదరి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు, దుర్గగుడి ఈవో శీనానాయక్లతో పాటు పలువురు జిల్లా అధికారులు తొలి దర్శనం చేసుకున్నారు. ఉదయం 8 గంటలకు అన్ని క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ప్రధాన ఆలయంలోని అమ్మవారి ఉత్సవ మూర్తిని మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా మహా మండపం ఆరో అంతస్తుకు తీసుకువెళ్లి ప్రతిష్టించారు. అక్కడ అమ్మవారి ఉత్సవ మూర్తికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించగా, మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం సమీపంలోని యాగశాలలో కలశస్థాపన, పూజలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. జన హృది బాలా.. నిత్యకల్యాణశీలా.. మహా మండపం ఆరో అంతస్తులో ప్రత్యేక కుంకుమార్చనలో 104 మంది ఉభయదాతలు ఆలయ ప్రాంగణంలో శ్రీచక్రనవార్చనలో 13 మంది, చండీయాగంలో 29 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. పూజల్లో పాల్గొన్న వారికి రూ. 300 క్యూలైన్లో బంగారు వాకిలి దర్శనం కల్పించారు. ఇక పరోక్ష చండీ హోమానికి 57 మంది, కుంకుమార్చనకు 18 మంది రుసుం చెల్లించి ఆన్లైన్లో పూజను వీక్షించారు. మహా మండపం ఆరో అంతస్తులో సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గగుడిపై నేడు శ్రీగాయత్రీదేవి అలంకారంనయనానందకరం.. నగరోత్సవం.. ఆది దంపతుల నగరోత్సవ సేవ సోమవారం సాయంత్రం కనుల పండువగా సాగింది. శ్రీగంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై ఊరేగింపు నిర్వహించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలతో పాటు కేరళ వాయిద్యాలు, కోలాట నృత్యాలు, కావడి నృత్యాలతో పలువురు కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. మహా మండపం నుంచి ప్రారంభమైన నగరోత్సవం కనకదుర్గనగర్, రథం సెంటర్, దుర్గాఘాట్, దుర్గగుడి ఘాట్రోడ్డు మీదగా అమ్మవారి ఆలయానికి చేరుకుంది. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి అమ్మవారి దర్శనం ఉదయం ఆరు గంటలకు ప్రత్యేక ఖడ్గమాలార్చన(ఆరో అంతస్తు) ఉదయం 7 గంటలకు, 10 గంటలకు ప్రత్యేక కుంకుమార్చన(ఆరో అంతస్తు) ఉదయం 9 గంటలకు ప్రత్యేక చండీయాగం(యాగశాల) ఉదయం 9 గంటలకు ప్రత్యేక శ్రీచక్రనవార్చన(లక్ష కుంకుమార్చన వేదిక) సాయంత్రం 4 గంటలకు శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్ల నగరోత్సవ సేవ సాయంత్రం 6 గంటలకు మహా నివేదన, పంచహారతుల సేవ, వేద స్వస్తి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం -
ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయం
గుంటూరు వెస్ట్: జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్యం పర్యవేక్షణతో పాటు అనారోగ్యకరమైన ఆహారం అమ్మకాలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సోమవారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ఆయన జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి గుంటూరు నగరంలో డయేరియా కేసులు కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై వివిద శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. డయేరియా, కలరా వంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందటానికి గల కారణాలు తెలుసుకోవడానికి, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కమ్యూనిటీ డిసీజ్ నిపుణులతో పాటు పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు, గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా పరిషత్ లేదా పంచాయతీ అధికారులు.. మెడికల్ కళాశాల, ప్రభుత్వ సమగ్ర వైద్యశాల అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. బృందం సభ్యులు కేసులు నమోదవుతున్న సమయం, ప్రాంతం, వ్యాధి బారిన పడుతున్న వ్యక్తుల వయస్సు, క్లినికల్ అంశాలతో పాటు క్షేత్రస్థాయిలో పరిస్థితులపై పూర్తిస్థాయిలో విశ్లేషణ చేయాలని ఆదేశించారు. దీనివల్ల నివారణ చర్యలు మరింత పటిష్టంగా చేపట్టడానికి అవకాశం ఉంటుందని సూచించారు. ప్రజలకు పూర్తిస్థాయిలో సురక్షితమైన మంచినీరు సరఫరా చేయాలని ఆదేశించారు. వ్యాధులు నమోదవుతున్న ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. నిర్దేశిత ప్రమాణాలు లేని వాటర్ ప్లాంట్లను మూసి వేయించాలని ఆదేశించారు. అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు విక్రయించకుండా నిరంతరం తనిఖీ నిర్వహించాలని చెన్నారు. ఆరోగ్య భద్రత నిబంధనలను ఉల్లంఘించే వారిపై రెవెన్యూ , పోలీస్ అధికారుల ద్వారా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా మాట్లాడుతూ జీఎంసీ పరిధిలో సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ఇప్పటివరకు 146 మంది డయేరియా వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరారని పేర్కొన్నారు, ప్రస్తుతం 84 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, మిగతావారు డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. డయేరియా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో తాగునీటికి పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించడంతోపాటు పారిశుద్ధ్య కార్యక్రమాలు మరింత మెరుగుపరిచేలా నగరపాల సంస్థ అధికారులతో కలిసి చర్యలు తీసుకున్నామని వివరించారు. ట్యాంకుల ద్వారా పూర్తిస్థాయిలో రక్షిత మంచినీటిని ప్రజలకు సరఫరా చేస్తున్నామని తెలిపారు. అనంతరం ఆహార భద్రత కమిషనర్ వ్యక్తిగత శుభ్రతపై జారీ చేసిన ప్రచార పోస్టర్ను వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్, కమిషనర్, అధికారులు ఆవిష్కరించారు. సమావేశంలో ఈఎన్సీ ప్రభాకర్రావు, జీఎంసీ అదనపు కమిషనర్ ఓబులేసు, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణా యశస్వి, ఫుడ్ సేఫ్టీ అధికారి పూర్ణచంద్రరావు, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రసూన, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ -
సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు !
గుంటూరు వెస్ట్ : ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులకు సూచించారు. సోమవారం కలక్టరేట్లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత సమయంలో పరిష్కరించాలని తెలిపారు. అనంతరం వచ్చిన 291 అర్జీలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో ఎన్ఎస్కే ఖాజావలి, డెప్యూటీ కలెక్టర్లు లక్ష్మీ కుమారి , గంగరాజు , గుంటూరు ఆర్డీఓ కె. శ్రీనివాసరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా గుంటూరు రూరల్ మండలంలోని తురపాలెంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 30 మంది మరణించారు. ఇప్పటి వరకు ఎటువంటి నష్టనివారణతో పాటు కనీసం తమ బాధల్ని కూడా పంచుకోలేని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించి అమాయకులు చావులకు కారణమైన అధికారులపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలి. ఇవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే. బాధిత కుటుంబాలకు తక్షణం నష్టపరిహారం చెల్లించాలి. కూటమి ప్రభుత్వ పెద్దలు తురకపాలెంలోని ఉండి సమస్యలు పరిష్కరించాలి. – కుల, దళిత ప్రజా సంఘాల నాయకులు గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్ధులకు ఆంగ్ల బోధన చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పాఠశాలల్లో తొలగించారు. పేద పిల్లలు అంతర్జాతీయ పోటీలను తట్టుకోవాలంటే ఆంగ్ల మీడియం తప్పనిసరి. తప్పకుండా ఆంగ్ల విద్యాబోధన పునఃప్రారంభించాలి. –డి. ఏడుకొండలు షెఫర్డ్, కె.మహమ్మద్ నూర్, ఇంగ్లిష్ విద్యా పరిరక్షణ వేదిక సభ్యులు, గుంటూరు -
అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు
లక్ష్మీపురం: చెడు వ్యసనాలకు అలవాటుపడి గంజాయి విక్రయిస్తూ, ద్విచక్ర వాహనాలు చోరీ చేసే ఎనిమిది మంది అంతర్రాష్ట్ర దొంగలను అరండల్పేట పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం బ్రాడీపేటలో కొంత మంది గుంపుగా చేరి గంజాయి విక్రయిస్తున్నట్లు అరండల్పేట సీఐ ఆరోగ్య రాజుకు సమాచారం వచ్చింది. హుటాహుటిన ఆయన ఎస్ఐ కృష్ణబాజీ, సిబ్బందితో ఆకస్మిక దాడులు నిర్వహించగా కొంత మంది పరారయ్యారు. మిగిలిన వారిలో శ్రీనగర్కు చెందిన ఇంజాపల్లి మేరిబాబు, వెంగళరావునగర్కు చెందిన యద్దనపూడి దీనభాస్కర్, శారదా కాలనీకి చెందిన బడుగు ప్రభుకుమార్, ఒక మైనర్ బాలుడు, గోరంట్లకు చెందిన పణిదరపు అమరజ్యోతి, వెంగళరావు నగర్కు చెందిన ఏలూరి ఎలిజిబెత్రాజు, శివనాగ రాజు కాలనీకి చెందిన తూతిక అలియాస్ పాతూరి సైని, అలియాస్ హనీ, ఒరిస్సా రాష్ట్రంలోని పారిమ గ్రామానికి చెందిన పారిమ జోయామాజిలను అదుపులో తీసుకుని, కేసు నమోదు చేశారు. వీరి వద్ద గల 3.5 కేజీల గంజాయితో పాటు చోరీ చేసిన ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. వీరితో పాటు గంజాయి తాగుతున్న ఏసుబాబు, హర్ష సరిఫుద్దీన్, దుర్గాప్రసాద్, లక్ష్మణ్, అమరజ్యోతి, ఈశ్వర్, మురళి, వీరాస్వామిలు పరారీలో ఉన్నారు. వీరిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. సీఐ ఆరోగ్య రాజు, ఎస్ఐలు కృష్ణబాజి, ఎం.సుబ్బారావు, హెడ్ కానిస్టేబుల్ చిరంజీవులు, కానిస్టేబుల్ డేవిడ్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. 3.5 కేజీల గంజాయి స్వాధీనం ఎనిమిది బైక్లను సీజ్ చేసిన అరండల్పేట పోలీసులు -
ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
పెదకాకాని: ఏఎన్యూ పరిధిలో 2025–26 విద్యా సంవత్సరానికి రెండేళ్ల ఎంబీఏ, ఎంసీఏ దూర విద్యా కోర్సులకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను వర్సిటీ ఉపకులపతి ఆచార్య కె. గంగాధరరావు, వర్సిటీ ఇన్చార్జి రెక్టార్ ఆచార్య శివరాం ప్రసాద్ సోమవారం విడుదల చేశారు. దూరవిద్య కేంద్రం పరీక్షల కో–ఆర్డినేటర్ ఆచార్య దిట్టకవి రామచంద్రన్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గత ఆదివారం 10 పరీక్ష కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఎంబీఏకు 600 మంది దరఖాస్తు చేసుకోగా 444 మంది పరీక్షకు హాజరు కాగా, 435 మంది అర్హత సాధించారని పేర్కొన్నారు. ఎంసీఏకు 128 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 82 మంది పరీక్షకు హాజరు కాగా, 80 మంది అర్హత సాధించారని వివరించారు. -
ఈవీఎంల భద్రతపై రాజీ వద్దు
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ గుంటూరు వెస్ట్ : ఈవీఎంల భద్రతలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఆయన సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయ ఆవరణలోని ఈవీఎంల గోడౌన్ను కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా, సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. త్రైమాసిక తనిఖీలో భాగంగా భద్రత ఏర్పాట్లు, సీసీటీవీ పనితీరు, అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. భద్రతా చర్యలు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో ఎన్.షేక్ ఖాజావలి, గుంటూరు ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, అడిషనల్ ఫైర్ ఆఫీసర్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. దుగ్గిరాల : స్థానిక శుభం కోల్డ్ స్టోరేజ్లో ఆరుబయట ఉంచిన పసుపు బస్తాలను లోపల వేసి సీజ్ చేయాలని సిబ్బందిని తహసీల్దార్ ఐ. సునీత ఆదేశించారు. కోల్డ్ స్టోరేజ్లో గతంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అందులో మిగిలిన 1,169 బస్తాలను అప్పట్లో సీజ్ చేశారు. పురుగులు పడుతున్నాయని, వాటిని బయటకు తీసి యాజమాన్యం గ్రేడింగ్ చేస్తుండగా స్థానిక రైతులు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. ఆమెతో పాటు పసుపు యార్డు సెక్రటరీ జె.వి. సుబ్బారావు హుటాహుటిన కోల్డ్ స్టోరేజ్కు చేరుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సీజ్ చేసిన పసుపు బస్తాలను బయటకు ఎందుకు తీశారని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. అనంతరం బస్తాలన్నింటిని లోపల వేసి, సీజ్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఇద్దరు వీఆర్వోలు, యార్డ్ సిబ్బంది బస్తాలను లెక్కించినట్లు తహసీల్దార్ తెలిపారు. ఆన్లైన్లో అగ్రిసెట్ ఫలితాలు గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆగస్ట్ 18వ తేదీన ఆన్లైన్లో నిర్వహించిన అగ్రిసెట్– 2025 పరీక్ష ఫలితాలను సోమవారం వీసీ ఆర్. శారదజయలక్ష్మీదేవి విడుదల చేశారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, విత్తన సాంకేతికత పరిజ్ఞానం కోర్సుల్లో డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు నాలుగు సంవత్సరాల వ్యవసాయ డిగ్రీ కోర్సు చదువుకునేందుకు అర్హులవుతారని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షకు 844 మంది విద్యార్థులు ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోగా 813 మంది హాజరయ్యారని తెలిపారు. వారిలో 753 మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. ఫలితాలు మంగళవారం నుంచి విశ్వవిద్యాలయం వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని, ర్యాంక్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చని రిజిస్ట్రార్ ఎం.వి. రమణ తెలిపారు. అగ్రిసెట్ కౌన్సెలింగ్ తదితర వివరాల కోసం విశ్వవిద్యాలయం వెబ్సైట్ను సందర్శించాలని ఆయన సూచించారు. జ్వాలాముఖి అమ్మవారికి మంగళసూత్రాల సమర్పణ అమరావతి: స్థానిక అమరేశ్వరాలయంలోని జ్వాలాముఖి దేవి అమ్మవారికి అర్చక కుటుంబానికి చెందిన శంకరమంచి రామమోహనరావు కుమారుడు గణేష్కుమార్ బంగారు మంగళ సూత్రాలను సమర్పించారు. 12 గ్రాముల బరువుతో రూ.1.50లక్షల విలువైన రెండు బంగారు మంగళసూత్రాలను సోమ వారం ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించి ఈఓ రేఖకు అప్పగించారు. -
ఐర్లాండ్లో అడ్మిషన్ పేరిట మోసం
కుమార్తెను ఐర్లాండ్లో ఎంబీఏ చదివించేందుకు అడ్మిషన్ కోసం గుంటూరు లక్ష్మీపురంలోని వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ కన్సల్టెన్సీ నిర్వాహకులకు 2024 జూన్లో రూ.12.21 లక్షలు చెల్లించాం. సంస్థ ప్రతినిధి ఎన్.రవికుమార్ మా నుంచి చెక్కుల రూపంలో నగదు తీసుకున్నాడు. పేరు రాయకుండా తీసుకున్న చెక్కులను బి.నీహారిక పేరుతో డ్రా చేసుకున్నాడు. డబ్బు కట్టించుకున్న తరువాత అమ్మాయికి అడ్మిషన్ ఖరారు కాకపోవడంతో పలుమార్లు కన్సల్టెన్సీకి వెళ్లి విచారించగా, రవికుమార్ కార్యాలయంలో ఉండకుండా ఫోన్లోనే సమాధానమిస్తున్నాడు. డబ్బు వసూలు చేసి అడ్మిషన్ కల్పించకపోగా, రెండేళ్లుగా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటుడంతో తమ బిడ్డ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. వ్యవసాయం చేసుకునే రైతునైనా అమ్మాయికి మంచి భవిష్యత్తు కావాలని ఆర్థికంగా భారమైనప్పటికీ పెద్ద మొత్తంలో చెల్లించాం. కన్సల్టెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకుని, చెల్లించిన డబ్బు తిరిగి ఇప్పించాలి. –అవిసెన కోటిరెడ్డి, వాలపల్లి, బల్లికురవ మండలం, బాపట్ల జిల్లా కందుల బ్రోకరేజీ వ్యాపారం చేస్తూ, అవసరమైన వ్యాపారులకు మధ్యవర్తిగా ఉండి సరఫరా చేయిస్తుంటాను. గత తొమ్మిదేళ్లుగా ఆదిలాబాద్కు చెందిన సత్యనారాయణ దాల్ ఇండస్ట్రీస్ నిర్వాహకులు అర్జున కేడియా, లలిత్ కేడియాతో వ్యాపారం చేస్తున్నాను. 2024 జూలైలో రెండు దఫాలుగా 3,250 క్వింటాళ్ల కందులను సేకరించి ఆదిలాబాద్కు పంపాను. ఇందుకు గానూ వారు రూ.3.54 కోట్లు చెల్లించాలి. ఇంత వరకు పైసా ఇవ్వలేదు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాను. డబ్బు అడిగితే చంపుతామని అర్జున్ కేడియా, లలిత్ కేడియా బెదిరించారు. డబ్బులు ఇప్పించడంతో పాటు తనను బెదిరించిన మిల్లు నిర్వాహకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. – సకలా వెంకటేశ్వరరావు, గుంటూరు నేను వృద్ధుడిని.. వికలాంగుడిని. వృద్ధులమనే కనికరం లేకుండా కన్న కొడుకు దశరథరాము వేధింపులకు గురి చేస్తున్నాడు. తాగుడుకు బానిసగా మారి, అర్ధరాత్రి వేళ ఇంటికి వచ్చి చంపేందుకు ప్రయత్నించాడు. భయంతో పొరుగువాళ్ల ఇంట్లో ఆశ్రయం పొందాం. ఇంటిని ఆక్రమించుకుని, భయభ్రాంతులకు గురి చేస్తున్న కొడుకుపై చర్యలు తీసుకుని, మాకు రక్షణ కల్పించాలి. –కూరాకుల వెంకట్రావు, నాగ మల్లేశ్వరి, గుంటూరు నేను వ్యవసాయం చేస్తున్నాను. గుంటూరుకు యార్డుకు గత పదేళ్లుగా మిర్చి అమ్మకాలు జరుపుతున్నాను. 2024 ఏప్రిల్లో మాఊరు అబ్బిరాజుపాలేనికి వచ్చిన పులిపాటి ఆనంద్ మిర్చి పంటను కొనుగోలు చేస్తానని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మి 50 బస్తాలను రూ.2.14 లక్షలకు విక్రయించాను. డబ్బు చెల్లించకుండా బెదిరింపు ధోరణలో మాట్లాడుతున్నాడు. తనకు పెద్దల అండ ఉందని, దిక్కున్న చోట చెప్పుకోవాలని బెదిరిస్తున్నాడు. ఆనంద్పై చర్యలు తీసుకుని, డబ్బు ఇప్పించాలి. –చిరుమామిళ్ల వెంకట్రావు, పెదకూరపాడు ● -
పాఠశాలల్లో స్కౌట్స్, గైడ్స్ యూనిట్స్ ఏర్పాటు చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థుల్లో సేవాభావం, క్రమశిక్షణ, సమానత్వ భావాలతో పాటు దేశభక్తిని పెంపొందిస్తున్న భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ను ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర కార్యదర్శి ఆర్. నరసింహారావు తెలిపారు. సోమవారం పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్ష భవన్లో గుంటూరు జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వార్షిక సమావేశాన్ని జిల్లా కార్యదర్శి ఎం. ఏడుకొండలు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నరసింహారావు గుంటూరు జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ రిజిస్ట్రేషన్, బిగినర్స్ కోర్స్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. 955 పీఎంశ్రీ పాఠశాలలకు రూ. 50 వేలు చొప్పున విడుదల చేసిన నిధులతో విద్యార్థులకు యూనిఫామ్తో పాటు స్కౌట్స్ అండ్ గైడ్స్ను అభివృద్ధి చేయాలని సూచించారు. ఉన్నతమైన సంస్థగా గుర్తింపు పొందిన స్కౌట్స్, గైడ్స్ ఆశయాలకు అనుగుణంగా సేవా భావంతో పనిచేయాలని సూచించారు. విద్యార్థులకు ఉన్నత చదువులు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నారని తెలిపారు. జిల్లాలోని 111 పాఠశాల నుంచి 136 యూనిట్స్ రిజిస్ట్రేషన్ చేశారని వివరించారు. సమావేశంలో ఎస్ఓసీ పి. శ్రీనివాసరావు, చేబ్రోలు ఎంఈవో రాయ సుబ్బారావు, పెదకాకాని ఎంఈఓ బీవీ రమణయ్య, డీటీసీ టి. నరేష్, డీఓసీ ఎం.శ్రీ హరి, ఘంటా కిరణ్, కామాక్షి, అనిల్, నాగేశ్వరరావు, రమేష్ పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఆర్. నరసింహారావు -
కృషి, పట్టుదలతోనే ప్రభుత్వ ఉద్యోగాల సాధన
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థులు కృషి, పట్టుదలతో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలను సాధించాలని కౌండిన్య ఐఏఎస్ అకాడమీకి చెందిన అధ్యాపకుడు ఎస్. నవీన్ పేర్కొన్నారు. పట్టాభిపురంలోని టీజేపీఎస్ పీజీ కళాశాలలో సోమవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధతపై వెనిగండ్లలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఎంబీఏ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ అధ్యాపకుడు కోటేశ్వరరావు ప్రభుత్వ పోటీ పరీక్షలైన సివిల్స్, ఎస్సెస్సీతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎల్ఐసీ, బీపీసీఎల్ వంటి సంస్థల్లో ఉద్యోగావకాశాలను గురించి వివరించారు. కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వ శాఖల్లో విస్కృతంగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కృషీ, పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా పోటీ పరీక్షలకు సిద్ధమైతే తప్పక విజయం సిద్ధిస్తుందని చెప్పారు. ఎంబీఏ విద్యార్థులు కమ్యూనికేషన్, పరిపాలనా నైపుణ్యాలతో ప్రైవేటు రంగంలోనే కాకుండా, ప్రభుత్వ రంగ సంస్థల్లో సైతం రాణించగలరని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అనితాదేవి, మేనేజ్మెంట్ స్టడీస్ విభాగాధిపతి యు. రవి కుమార్, వాణిజ్య విభాగాధిపతి ఎస్. శ్రీనివాసరావు, అధ్యాపకుడు నాంచారయ్య, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు. -
మాతృ మరణాలను అరికట్టాలి
డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి గుంటూరు మెడికల్: గుంటూరులోని కార్యాలయంలో సోమవారం డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అధ్యక్షతన సబ్ డిస్టిక్ లెవెల్ మాతృ మరణాల సమీక్ష సమావేశం జరిగింది. చేబ్రోలు, నిడమర్రు, మందపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జులై, ఆగస్టుల్లో జరిగిన మూడు మాతృ మరణాలపై సభ్యులు సమీక్షించారు. మరణానికి గల కారణాలను అధ్యయనం చేశారు. అందులో ఒకటి నివారించగలిగినది గాను, రెండు నివారించలేనివి గాను నిర్ధారించారు. సమావేశానికి హాజరైన ఆశా కార్యకర్తలు,ఆరోగ్య కార్యకర్తలు, సూపర్వైజర్లు, వైద్యాధికారులతో డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడారు. గర్భం దాల్చినప్పటి నుంచి తరచుగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, పౌష్టికాహారం పై అవగాహన కల్పించాలని చెప్పారు. తొలుత ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ప్రమాదకర పరిస్థితులు సంభవించినప్పుడు ఉన్నత స్థాయి ఆసుపత్రులకు తరలించి, మాతృ మరణాలు జరగకుండా చూడాలని ఆదేశించారు. జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్బాబు, డీసీహెచ్ఎస్ డాక్టర్ రంగారావు , ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ రోహిణి రత్నశ్రీ , జీజీహెచ్ గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ అరుణ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కొల్లిపర: మండల పరిధిలోని చివలూరు శివారు జగనన్న కాలనీ సమీపంలో సోమవారం రాత్రి 10గంటలు సమయంలో ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. ఇద్దరు గాయపడ్డారు. కొల్లిపరకు చెందిన కంచర్ల విశ్వాస్, సుధీర్లు చివలూరుకు వెళుతున్నారు. ఈ సమయంలో తెనాలి నుంచి గుదిబండి వారిపాలేనికి వస్తున్న ఆటో జగనన్న కాలనీ సమీపంలో బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విశ్వాస్ అక్కడికక్కడే మృతి చెందగా సుధీర్ గాయపడ్డాడు. ఆటోలో ఉన్న శేషం కృపారావుకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 ద్వారా పోలీసులు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మోసపోయాం.. న్యాయం చేయండి!
గుంటూరు ఎడ్యుకేషన్: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదులు–పరిష్కారాల వ్యవస్థ (పీజీఆర్ఎస్)కు ఫిర్యాదుదారులు వెల్లువెత్తారు. ఆర్థిక సంబంధమైన అంశాలతో పాటు వివిధ రకాల ఫిర్యాదులతో వచ్చిన బాధితులు న్యాయం చేయాలని పోలీసు అధికారులకు మొరపెట్టుకున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా అడ్మిన్ ఎస్పీ రమణమూర్తి, డీఎస్పీలు భానోదయ, కె.అరవింద్ వాటిని సంబంధిత పోలీసు స్టేషన్లకు బదిలీ చేశారు. ఎస్పీ గ్రీవెన్స్కు వెల్లువెత్తిన ఫిర్యాదులు -
ఉత్కంఠభరితంగా జాతీయ చెస్ పోటీలు
చేబ్రోలు: ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజ్ఞాన్లో నిర్వహిస్తున్న 62వ జాతీయ చెస్ చాంపియన్షిప్–2025 పోటీలు సోమవారం రెండో రోజు ఉత్కంఠభరితంగా సాగాయి. వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. 2027 ప్రపంచ చెస్ చాంపియన్షిప్కి అర్హత సాధించే టోర్నమెంట్ కావడంతో ఈ పోటీకి విశేష ప్రాధాన్యత ఏర్పడింది. 14 మంది గ్రాండ్మాస్టర్లు, 30 మంది ఇంటర్నేషనల్ మాస్టర్లు సహా మొత్తం 394 మంది పోటీ బరిలో నిలిచారు. తొలి రౌండ్లో ఎక్కువ మంది గ్రాండ్ మాస్టర్లు, ఇంటర్నేషనల్ మాస్టర్లు సునాయాస విజయాలతో రెండో రౌండ్కి చేరుకున్నారు. ● రెండో సీడ్ సూర్యశేఖర్ గాంగూలి మొదటి రోజు సుదీర్ఘమైన గేమ్ను ఆడి, చివరికి తనదైన స్టైల్లో విజయం సాధించారు. ● రైల్వే జట్టుకు చెందిన గ్రాండ్మాస్టర్ దీపన్ చక్రవర్తి, ఐఎం సిద్ధాంత్ మోహాపాత్రా ప్రత్యర్థులతో పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది. ● పీఎస్పీబీకి చెందిన ఐఎం నిషా మొహోటా, తెలంగాణ ఆటగాడు మోక్షిత్ పసుపులేటి చేతిలో ఓటమి పాలయ్యారు. ● ఆంధ్రప్రదేశ్ అభిమాన ఆటగాడు, 2017 జాతీయ చాంపియన్ లలిత్ బాబు, ఛత్తీస్గఢ్కు చెందిన గగన్ సహూను చాకచక్యంగా ఓడించారు. -
న్యాయం చేస్తారా లేదా మాకు అప్పగిస్తారా ?
ప్రత్తిపాడు:‘‘ పసి పిల్లలపై నీచంగా, అసభ్యకరంగా ప్రవర్తించిన వృద్ధుడిని కఠినంగా శిక్షించి మాకు న్యాయం చేస్తారా.. లేక నిందితుడిని అప్పగిస్తారా ?’’ అంటూ మహిళలు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ప్రత్తిపాడు మండలం రావిపాటివారిపాలెం ప్రాథమిక పాఠశాలలో స్కావెంజర్ భర్త 72 ఏళ్ల వృద్ధుడు సామియేలు విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. అతడి అరెస్టు విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారంటూ ఆదివారం రాత్రి రావిపాటివారిపాలెం గ్రామస్తులు పెద్ద ఎత్తున స్థానిక పోలీస్ స్టేషను వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. పాఠశాలకు సంబంధం లేని వ్యక్తిని నెలల తరబడి పాఠశాలలోకి హెచ్ఎం, ఉపాధ్యాయులు ఎలా అనుమతిస్తున్నారని మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ, తప్పు చేసిన వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఎంఈవోతో పాటు హెచ్ఎం, ఉపాధ్యాయులపైనా వెంటనే కేసు నమోదు చేయాలని కోరారు. ఎస్ఐ నరహరి మాట్లాడుతూ నిందితుడిని ఆదివారం అదుపులో కి తీసుకుని అరెస్టు చేశామని, చట్టప్రకారం అతడిని కోర్టుకు హాజరు పరచనున్నట్లు చెప్పారు. మరలా రెండు నెలల్లో బయటకు వచ్చి తిరుగుతాడని, ఒక్కసారి తమకు అప్పగించాలని పట్టుబట్టారు. దీంతో ఎస్ఐ చట్టాన్ని చేతుల్లోనికి తీసుకోవడం సరికాదని తెలిపారు. బాధిత పిల్లల తల్లిదండ్రులు స్టేషనుకు వచ్చిన వెంటనే కేసు నమోదు చేశామని, ఎలాంటి తాత్సారం చేయలేదని ఎస్ఐ స్పష్టం చేశారు. చట్ట ప్రకారం చర్యలు గుంటూరు ఎడ్యుకేషన్: నాగమ్మ భర్త విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనపై పోలీసు కేసు నమోదు చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. -
జనాభాను తగ్గించి చూపడం దారుణం
గుంటూరు రూరల్: నగర శివారు గోరంట్లలోని ఉడ్లాండ్ హోటల్లో నూర్ బాషా, దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు కె. పీర్ మహమ్మద్ అధ్యక్షతన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షలుగా ఉన్న జనాభాను ఒకటి రెండు లక్షలుగా చూపిస్తూ దూదేకులను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం గౌరవ అధ్యక్షుడు, దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్మీరా మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి తన వంతు సేవలందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో సంఘం లైజనింగ్ కమిటీ, కోర్ కమిటీతోపాటు రాష్ట్ర అధికార ప్రతినిధిగా డాక్టర్ ఉమర్ ముక్తార్ను నియమించారు. ముక్తర్ మాట్లాడుతూ తన తండ్రి చమన్ ఏర్పాటు చేసిన సంఘంలో పని చేయడం గర్వకారణమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా యువతను ఏకం చేసి సంఘం అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. సంఘం సలహాదారుడు డాక్టర్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం, రాష్ట్ర కోశాధికారి డాక్టర్ పర్ల దస్తగిరి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ డి. మస్తానమ్మ చేతుల మీదుగా లైజనింగ్ కమిటీ, కోర్ కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అన్ని జిల్లాల అధ్యక్షులతో పాటు రాష్ట్ర నాయకులు సాయిబాబా, డీఎస్పీ మహబూబ్ బాషా, రిటైర్డ్ ఎమ్మార్వో షేక్ షావలి, లాల్ వజీర్, నాగూర్, ఆదాం షఫీ, దిల్షాద్, రజియా, ఖాజావలి, షేక్ మస్తాన్, షరీఫ్, ఇబ్రహీం, ఖాసిం, ఆరిఫ్, మహబూబ్ బాషా, ఇమాములు, బాషా పాల్గొన్నారు. నూర్బాషా, దూదేకుల ముస్లిం సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పీర్ మహమ్మద్ -
ట్రెక్కింగ్తో మానసిక వికాసం, శారీరక ఆరోగ్యం
గుంటూరు ఎడ్యుకేషన్ :ఆరోగ్యవంతులైన యువతీ, యువకులతోపాటు శరీరం సహకరించే ప్రతి ఒక్కరూ ట్రెక్కింగ్ను ఒక అలవాటు, హాబీగా మలచుకోవాలని యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (వైహెచ్ఏఐ) గుంటూరు యూనిట్ చైర్మన్ డాక్టర్ కె.కొండయ్య పేర్కొన్నారు. ఆదివారం పట్టాభిపురంలోని టీజేపీఎస్ కళాశాలలో వైహెచ్ఏఐ గుంటూరు యూనిట్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. గుంటూరు యూనిట్ అధ్యక్షుడు చంద్రశేఖర్ అధ్యక్షత జరిగిన సమావేశంలో డాక్టర్ కొండయ్య మాట్లాడుతూ ట్రెక్కింగ్ ద్వారా అద్భుతమైన శారీరక, మానసిక ఆరోగ్యంతోపాటు విశ్వజనీన మానవునిగా సంబంధాలు కలిగి ఉండవచ్చునని అన్నారు. కలుషిత వాతావరణంలో కృత్రిమంగా జీవించేందుకు అలవాటు పడిన వారు ట్రెక్కింగ్ ద్వారా మరో అద్భుతమైన ప్రపంచాన్ని, సుందర స్వప్నాన్ని సాకారం చేసుకోవచ్చని చెప్పారు. స్వచ్ఛమైన గాలి, నీరు, పచ్చటి ప్రకృతి సంపద, తమ శబ్దాలతో పలకరించే పక్షులు, జంతువులు చెప్పలేనంత మానసిక ఆనందాన్ని కలుగజేస్తాయని వివరించారు. కార్యక్రమంలో గుంటూరు యూనిట్ ఉపాధ్యక్షుడు జానకి, కేశవరావు, కార్యనిర్వాహక కార్యదర్శులు గుణరంజన్, భాను, సంయుక్త కార్యదర్శి శ్రీలత, సభ్యత్వ నమోదు ఇన్చార్జ్ మల్లికార్జునరావు, కోశాధికారి సుధాకర్, పీఆర్వో మేడూరి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
నేటి నుంచి సచివాలయ ఉద్యోగుల సమ్మె ?
గుంటూరు వెస్ట్: ఉద్యోగమంటే అధికారాన్ని చెలాయించడం కాదు.. అది ప్రజలకు సక్రమమైన సేవలందించేందుకే ఉపయోగించాలి.. అతి సాధారణ వ్యక్తికి సైతం తన సమీపంలోనే నాణ్యమైన ప్రభుత్వ సేవలు లభించాలనే లక్ష్యంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను అక్టోబర్ 2, 2019లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. సుమారు 1,26,000 ప్రభుత్వ ఉద్యోగాలను ఒక్క రూపాయి లంచం లేకుండా, ఏ అధికారి, ప్రజాప్రతినిధి సిఫార్సు లేకుండా భర్తీ చేశారు. అయితే, 2024లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సచివాలయాల పరిస్థితి దారుణంగా తయారైంది. జిల్లాలో ఉన్న సుమారు 10 వేల మంది వలంటీర్లను తొలగించారు. అప్పట్లో ఒక్కొక్క సచివాలయంలో 11 మంది ఉద్యోగులుండేవారు. ఇప్పుడు కొన్ని సచివాలయాల్లో ముగ్గురు కూడా ఉండడం లేదు. సిబ్బందిపై అనేక సర్వేల పేరుతో కూటమి ప్రభుత్వం పని ఒత్తిడిని పెంచుతోంది. ఏడాదిగా ఉద్యోగులు మొరపెట్టుకుంటున్నా ప్రభుత్వం కనీసం పరిశీలన కూడా చేయకపోవడంతో తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ఈ నెల 22 నుంచి సమ్మె చేస్తామని ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. పని భారంతో సతమతం గుంటూరు జిల్లాలో మొత్తం 568 సచివాలయాలున్నాయి. అందులో 336 గ్రామ, 232 వార్డు సచివాలయాలున్నాయి. వీటిలో 4,747 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. సుమారు 500 పైగా ప్రభుత్వ సేవలందిస్తున్నారు. గతంలో ఒక వలంటీర్కు ఒక క్లస్టర్ అప్పగించారు. ఇప్పుడు ఒక ఉద్యోగికి నాలుగు క్లస్టర్స్ అప్పగించి మితిమీరిన పని భారాన్ని మోపుతున్నారు. ప్రతి జిల్లాలో మూడు విభాగాలుగా సచివాలయ వ్యవస్థను విభజించారు. 2,500 అంతకంటే తక్కువ జనాభా కలిగిన ప్రాంతాన్ని ఏ విభాగంగా గుర్తించి అందులో ఆరుగురిని నియమించారు. 2,500–3,500 మధ్యలో జనాభా ఉన్న ప్రాంతాన్ని గుర్తించి ఏడుగురిని, 3,500 అంతకు మించి ఉన్న జనాభా ప్రాంతాలను గుర్తించి ఎనిమిది మందిని నియమించారు. అయితే, ఉద్యోగ సంఘ నాయకులు వాదన మరో లాగా ఉంది. కొన్ని సచివాలయాల్లో కనీసం ముగ్గురుకూడా లేరంటున్నారు. డెప్యుటేషన్పై ఇతర పనులకు వాడుకుంటున్నారంటున్నారు. ఎనిమిది మంది ఉద్యోగులు, వలంటీర్లు చేయాల్సిన పనిని ముగ్గురు చేయాల్సి వస్తుందని, దీంతో విపరీతమైన ఒత్తిడి పెరుగుతోందని వాపోతున్నారు. ప్రజలు కూడా నాణ్యమైన సేవలు పొందలేకపోతున్నారని పేర్కొంటున్నారు. మరో పక్క ప్రతి జిల్లా స్థాయి అధికారి సచివాలయ ఉద్యోగులపై అజమాయిషీ చెలాయిస్తుండటం ఇబ్బందిగా మారింది. అందరూ ఉన్నత చదువులతో ఈ ఉద్యోగాలు పొందాం. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎన్ని సేవలు చేయగలడో ఆలోచించడం లేదు. మేము చెబుతుంటే కనీసం వినే నాథుడే లేడు. చాలా బాధగా ఉంది. మా సమస్యలు ప్రభుత్వం కాక ఇంకెవరు తీరుస్తారు ? తప్పని పరిస్థితుల్లోనే సమ్మె బాటకు పిలుపునిచ్చాం. ప్రభుత్వం భేషజాలకు పోకుండా ముందుకు వచ్చి సమస్య పరిష్కరించాలి. – పి.మధు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ఏపీ సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక గత కొన్ని నెలల నుంచి రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విధులు రోడ్లకే పరిమితమయ్యాయి.క్షేత్రస్థాయిలో అవమానకర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి 15 రోజుల గడువుతో ఉద్యమ కార్యాచరణ నోటీసు ఇచ్చాం.. అయినప్పటికీ చలనం లేదు.. మరో వారం రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. మా సమస్యలను పరిష్కరించే వరకు ప్రభుత్వంతో ప్రత్యక్షంగా పోరాడుతాం. –షేక్ అబ్దుల్ రజాక్, రాష్ట్ర కన్వీనర్ , ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక -
కిడ్నాప్, హత్య కేసులో నలుగురు అరెస్ట్
లక్ష్మీపురం: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి విద్యుత్ తీగతో గొంతు నులిమి హతమార్చి మృతదేహాన్ని గుండ్లకమ్మ కాలువలో పడేసిన కేసులో నలుగురు నిందితులను నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని నగరంపాలెం పోలీస్స్టేషన్లో ఆదివారం రాత్రి వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్ వివరాలు వెల్లడించారు. ఈనెల 7వ తేదీన సీతమ్మ కాలనీకి చెందిన వేముల రామాంజనేయులు కనిపించడం లేదని ఆయన భార్య శివపార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరంపాలెం ఎస్సై రమాదేవి, మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచనల మేరకు వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్, స్టేషన్ ఇన్చార్జి సీఐ ఆరోగ్యరాజు, ఎస్సై రాంబాబు, ప్రసన్నకుమార్, రమాదేవి, పట్టాభిపురం ఎస్సై నాగేంద్రలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ముమ్మరం చేశారు. అదే ప్రాంతానికి చెందిన బండారు కొండయ్యపై అనుమానం వ్యక్తం చేసి స్టేషన్కు తరలించి విచారించారు. కొండయ్య భార్య శ్రీలక్ష్మికి, వేముల రామాంజనేయులు మధ్య గతంలో వివాహేతర సంబంధం ఉండేది. దీనిని ఆసరాగా తీసుకుని శ్రీలక్ష్మిని రామాంజనేయులు తరచూ డబ్బులు అడుగుతూ ఇబ్బందులకు గురి చేయడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని ఆమె భర్త కొండయ్యకు తెలియజేసింది. రామాంజనేయులు వేధింపులు భరించలేకపోతున్నానని, ఎలాగైనా హతమార్చమని చెప్పింది. ఈనెల 6వ తేదీన మధ్యాహ్నం 4 గంటల సమయంలో కొండయ్య తన స్నేహితులైన ఏసుభక్తనగర్ ప్రాంతానికి చెందిన కోలా దిలీప్, వికలాంగుల కాలనీ, కేవీపీ కాలనీకి చెందిన నాగుల్ మీరాలతో కలసి హత్యకు పథకం రచించారు. నాగుల్ మీరా ద్వారా రామాంజనేయులుకు ఫోన్ చేసి హౌసింగ్ బోర్డు కాలనీ సెంటర్ వద్ద ఉన్న పెట్రోల్ బంక్ వెనుక నుంచి అంకిరెడ్డిపాలెం వెళ్లే దారిలో ఉన్న డంపింగ్ యార్డ్ వద్దకు పిలిపించారు. కొండయ్య, దిలీప్, నాగుల్మీరాలు ముగ్గురు కలిసి రామాంజనేయులును కారులో బలవంతంగా ఎక్కించారు. అంకిరెడ్డిపాలెం నుండి హైవే వైపు తీసుకెళ్లి, పొత్తూరు ఈనాడు ఆఫీస్ సమీపంలో హైవే సర్వీస్ రోడ్లో కారు ఆపారు. కొండయ్య, రామాంజనేయులుతో గొడవ పడ్డాడు. కారు ముందు సీటులో కూర్చుని ఉన్న రామాంజనేయులు మెడకు వెనుక కూర్చున్న కోలా దిలీప్, నాగుల్ మీరాల సహాయంతో కరెంటు వైర్తో బిగించి హతమార్చారు. ముగ్గురూ కలిసి కారులో ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం, వెల్లంపల్లి గ్రామ పరిధిలోని గుండ్లకమ్మ వాగు బ్రిడ్జిపై నుంచి నీటిలో రామాంజనేయులు మృతదేహాన్ని పడేశారు. బయటకు కనబడకుండా దానిపై ఇసుక మూటలు వేశారు. కొండయ్య తెలిపిన విధంగా ఈనెల 15న పోలీసులు గుండ్లకమ్మ వాగు వద్దకు వెళ్లి పరిశీలించి, 16వ తేదిన మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్కు తరలించి కేసు నమోదు చేశారు. ఈ కేసులో మిగిలిన కోలా దిలీప్, నాగుల్మీరాలతోపాటు కొండయ్య భార్య శ్రీ లక్ష్మిని ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేసిన సీఐ ఆరోగ్యరాజు, ఎస్సైలు రాంబాబు, ప్రసన్నకుమార్, రమాదేవి, నాగేంద్రలతో పాటు సిబ్బంది శ్రీనివాస్, ఉదయ్చంద్, గంగరాజ్, నాగరాజులను డీఎస్పీ అభినందించారు. వివరాలు వెల్లడించిన వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్ -
స్క్రీనింగ్ పరీక్షలతో చెక్
స్క్రీనింగ్ పరీక్షల ద్వారా క్యాన్సర్కు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా మహిళలు 45 సంవత్సరాలు దాటాక ప్రతి ఏడాది మ్యామో గ్రామ్ పరీక్ష చేయించుకోవాలి. 55 సంవత్సరాలు దాటిన వారు సీ టీ స్కాన్, కొలనోస్కోపి చేయించుకోవాలి. తొమ్మిదేళ్ల నుంచి 11 ఏళ్లలోపు బాలికలకు, 45 సంవత్సరాల్లోపు మహిళలకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించడం ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. హెపటైటీస్ బీని కూడా వ్యాక్సిన్ వేయించుకుని రాకుండా నిరోధించవచ్చు. – డాక్టర్ బైరపనేని స్రవంతి, మెడికల్ అంకాలజిస్ట్ -
నేటి నుంచి శివాలయంలో దసరా ఉత్సవాలు
పెదకాకాని: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో 22 నుంచి అక్టోబరు 2 వరకూ దేవీ శరన్నవరాత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు డీసీ గోగినేని లీలాకుమార్ ఆదివారం తెలిపారు. ఉత్సవాల్లో ప్రతినిత్యం సుప్రభాత సేవ, పంచ హారతులు, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనాలు, పంచగవ్య ప్రాశనలు శాస్త్రోక్తంగా జరుగుతాయని తెలిపారు. శరన్నవరాత్రోత్సవాలు పురస్కరించుకుని భ్రమరాంబ అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవి, గాయత్రీ దేవి, అన్నపూర్ణాదేవి, లలితా త్రిపురసుందరీదేవి, కదంబ వనవాసినీదేవి, సరస్వతీదేవి, దుర్గాదేవి, మహిషాసురమర్దనీ దేవి, రాజరాజేశ్వరీదేవి అలంకరణలో భక్తులను అనుగ్రహిస్తారని వివరించారు. అక్టోబరు 2 విజయదశమి రోజున ఉదయం మహాపూర్ణాహుతి, సాయంకాలం శమీపూజ భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు ఏవో తెలిపారు. అనంతరం శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని తెలియజేశారు. ప్రతిరోజూ విశేష పూజలతో పాటు రాత్రివేళల్లో భక్తులకు కాలక్షేపంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు. నేడు బాలా త్రిపురసుందరీ దేవిగా భ్రమరాంబ తొలిరోజు భ్రమరాంబ అమ్మవారు బాలా త్రిపురసుందరీ దేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. సోమవారం తెల్లవారుజామున సుప్రభాతసేవ, హారతులతో పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 5 గంటలకు అమ్మవారికి కుంకుమార్చనలు, పంచహారతులు, ఆలయ ప్రదక్షిణ, తీర్థ ప్రసాదాల పంపిణీ ఉంటాయి. రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా భజన, కూచిపూడి నృత్యం, పౌరాణిక నాటకాల్లోని సన్నివేశాలు ఉంటాయి. -
మద్యం మత్తులో వర్షపు నీటిలో పడి వ్యక్తి మృతి
లక్ష్మీపురం: మద్యం మత్తులో వర్షపు నీటిలో పడి వంట మాస్టర్ మృతి చెందిన ఘటనపై అరండల్పేట పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. గుంటూరులోని ముత్యాలరెడ్డి నగర్ 1వ లైన్ ప్రాంతానికి చెందిన చింతాబత్తిన కుమార్ బాబు (35) అరండల్పేట 10వ లైన్లోని మెస్లో వంట మాస్టర్గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. భార్య దుర్గాదేవి బొంగరాల బీడు యూపీహెచ్సీలో ల్యాబ్ టెక్నీషియన్గా పని చేస్తోంది. కుమార్ బాబు శనివారం అర్ధరాత్రి పూటుగా మద్యం తాగి డొంక రోడ్డు మూడు వంతెనల సెంటర్ వద్ద వర్షపు నీటిలో పడి మృతి చెందాడు. స్థానికులు భార్య దుర్గాదేవికి సమాచారం తెలియజేయడంతో హుటాహుటిన చేరుకుని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దుర్గాదేవి ఫిర్యాదు మేరకు అరండల్పేట పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని ప్రభుత్వ సమగ్రాసుపత్రికి పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. -
క్యాన్సర్కూ ఉంది ఆన్సర్
కెనడా దేశానికి చెందిన 12 ఏళ్ల మెలిండా రోజ్ అనే బాలిక 1994లో క్యాన్సర్ వ్యాధికి గురైంది. అది కూడా చాలా అరుదైన బ్లడ్ క్యాన్సర్. కొన్ని వారాల్లోనే చనిపోతుందని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. కాని రోజ్ భయపడకుండా ఆస్పత్రిలో ఉన్న రోగులకు రోజూ పువ్వులు అందించేది. వారికి కవితలు వినిపించి రోగుల్లో మనో ఉల్లాసాన్ని కలిగించేది. ఇలా ఆరునెలల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రోగులను చిరునవ్వుతో పలుకరిస్తూ ఉండేది. ఉత్తరాలు రాస్తూ వారిలో ఆనందం, ఉత్సాహాన్ని నింపుతూ సెప్టెంబరు 22న మరణించింది. ఆ బాలిక జ్ఞాపకార్థం ప్రతి ఏడాది రోజ్ డేను నిర్వహిస్తున్నారు. గుంటూరు మెడికల్: క్యాన్సర్ .. ఈ వ్యాధి పేరు చెబితేనే చాలా మందికి ఒంట్లో వణుకు పుడుతుంది. వస్తే చనిపోవటమే అనే అపోహల్లో ప్రజలు ఉన్నారు. పూర్వ రాచపుండుగా పిలువబడే క్యాన్సర్ వ్యాధికి చికిత్స ఉండేది కాదు. వ్యాధిగ్రస్తులు మరణానికి రోజులు లెక్క బెట్టుకుంటూ గడిపేవారు. ప్రస్తుతం ఈ పరిస్థితి మారింది. ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. బాధితుల్లో భయాన్ని పోగొట్టి వారిలో మానసిక ధైర్యాన్ని నింపేందుకు ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబరు 22న రోజ్ డే వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. క్యాన్సర్కు కారణాలు క్యాన్సర్ రావటానికి ప్రధాన కారణం పొగాకు ఉత్పుత్తుల వినియోగమే. సిగిరెట్, బీడీ, చుట్ట , పాన్పరాగ్, ఖైనీ, గుట్కా.. ఇలా ఏ రూపంలో పొగాకును తీసుకున్నా వస్తుంది. మద్యపానం, వ్యాయామం చేయకపోవడం, ఆకు కూరలు తినకపోవడం, ఊరగాయ పచ్చళ్లు, కొవ్వు ఎక్కువగా ఉన్న మాంసాహారం తినడం, అధిక బరువు ఉండటం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. జీజీహెచ్లో అత్యాధునిక వైద్య సేవలు గుంటూరు జీజీహెచ్లో 2020 జులైలో అత్యాధునిక క్యాన్సర్ వైద్య సేవలు అందించేందుకు నాట్కో క్యాన్సర్ సెంటర్ను మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. కోట్ల రూపాయలతో పెట్ స్కాన్ను ఏర్పాటు చేశారు. 100 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. జీజీహెచ్లో చికిత్స పొందిన వారి వివరాలు క్యాన్సర్కు నేడు ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇమ్యూనోథెరపీ, టార్గెట్థెరపీ ద్వారా త్వరగా కోలుకుంటున్నారు. నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సింగ్ టెస్ట్ ద్వారా చాలా త్వరగా గుర్తించవచ్చు. ఏ జీన్లో తేడా వల్ల సోకుతుందనే విషయం తేటతెల్లమవుతుంది. కుటుంబంలో ఒకరికి క్యాన్సర్ ఉంటే ఇతరులకు వచ్చే అవకాశం ఉందా లేదా నిర్ధారించే బీఆర్సీఏ–1, 2 పరీక్షలు ఉన్నాయి. లాప్రోస్కోపిక్, రొబోటిక్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. –డాక్టర్ ఎం.జి.నాగకిశోర్, సీనియర్ సర్జికల్ అంకాలజిస్ట్, గుంటూరు రోగుల సంఖ్య ఆపరేషన్లు సంవత్సరం2020 2067 – 2021 5,865 114 2022 13,107 395 2023 14,647 753 2024 ఆగస్టు వరకు 9,376 542 -
25న విజయవాడలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాఽధితుల రక్షణపై ధర్నా
లక్ష్మీపురం: దళితులపై దాడులు, అత్యాచారాలు ఆగాలంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, లేకుంటే బాధితులకు న్యాయం జరగదని కుల వివక్ష వ్యతిరేక సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి అన్నారు. దళితులు, బహుజనులపై జరుగుతున్న అత్యాచారాలు, అట్రాసిటీ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ గుంటూరు బ్రాడీపేటలోని పీఎల్ రావు భవన్లోని కేవీపీఎస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మాల్యాద్రి మాట్లాడుతూ దళితులపై అణచివేత కొనసాగుతున్న పరిస్థితుల్లో బహుజన సమాజం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. బాధితులు ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసులు వెంటనే కేసులు నమోదు చేయకపోవడం, ఆలస్యం చేయ డం, లేదా ఎఫ్ఐఆర్లు బలహీనంగా నమోదు చేయడం వల్ల న్యాయం జరగడం లేదని అన్నారు. డీహెచ్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కరవది సుబ్బారావు మాట్లాడుతూ బాధితుల పక్షాన నిలబడే మానవ హక్కుల సంఘాలు, ప్రజాసంఘాలను ప్రభుత్వం అడ్డుకోవడం మానుకోవాలన్నారు. న్యాయవాది శిఖా సురేష్ మాట్లాడుతూ కేసులను తేలికగా తీసుకుంటే న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకం దెబ్బతింటుందన్నారు. నేరస్తులను కఠినంగా శిక్షించడమే సమాజంలో మార్పు తీసుకొస్తుందన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి. లక్ష్మణరావు మాట్లాడుతూ దళితులు గిరిజనుల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా అన్ని దళిత గిరిజన సంఘాలతో పాటు వర్గ సంఘాలు కూడా తోడై ఐక్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సెప్టెంబర్ 25న విజయవాడలో జరగబోయే ధర్నాలో పాల్గొని ప్రభుత్వాన్ని కదిలించేలా పోరాటం చేస్తామని తీర్మానం చేశారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఎంబీఏ, ఎంసీఏ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు స్పందన
పెదకాకాని(ఏఎన్యూ): ఆచార్య నాగార్జున విద్యాలయం దూరవిద్యా కేంద్రం ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికిగాను నిర్వహించిన రెండేళ్ల ఎంబీఎ, ఎంసీఎ ప్రవేశ పరీక్షకు అనూహ్య స్పందన లభించిందని కో–ఆర్డినేటర్ ఆచార్య దిట్టకవి రామచంద్రన్ తెలిపారు. దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లుతో కలసి ఆదివారం ఆయన ఏఎన్యూలో పరీక్ష నిర్వహణను పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 10 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష సజావుగా జరిగినట్లు పేర్కొన్నారు. మొత్తం 720 మంది దరఖాస్తు చేసుకోగా 522 మంది హాజరయ్యారన్నారు. ఇందులో ఎంబీఏకు 449 మంది, ఎంసీఏకు 73 మంది పరీక్ష రాశారని తెలిపారు. ఎంబీఏలో ఇప్పటికే ఉన్న స్పెషలైజేషన్తో పాటు నూతనంగా ఎంబీఏ ఫైనాన్స్, ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వంటి కోర్సులను ప్రవేశపెట్టాలని పలువురు విద్యార్థులు కోరినట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షల ప్రత్యేక పరిశీలకులుగా కె. శశిధర్, ఎన్. బాబు వ్యవహరించారు. ఫలితాలు సోమవారం సాయంత్రం విడుదల అవుతాయని పరీక్షల కో–ఆర్డినేటర్ దిట్టకవి రామచంద్రన్ తెలిపారు. గుంటూరు ఎడ్యుకేషన్: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా సెలవులను పాటించాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సెలవుల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తే సంబంధిత పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయమై ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి 6,834 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగులు నీటిమట్టం ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్కి 140 క్యూసెక్కులు, బ్యాంక్ కెనాల్ 1,685, తూర్పు కాలువకు 607, పశ్చివ కాలువకు 247, నిజాపట్నం కాలువకు 436, కొమ్మూరు కాలువకు 2,980 క్యూసెక్కులు, బ్యారేజీ నుంచి సముద్రంలోకి 2,17,350 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు నెహ్రూనగర్: నగరంలో ఈనెల 24వ తేదీ నుంచి రోడ్లు, డ్రెయిన్స్ మీదకు వచ్చిన ర్యాంపులు, మెట్ల తొలగింపు ప్రక్రియ చేపడతామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు నగరంలో వర్షం పడిన ప్రతిసారి పలు ప్రాంతాలు మునిగిపోవడంతో ఆదివారం సాక్షి దినపత్రికలో ‘గుంటూరు నెత్తిన నీటి కత్తి’ అనే కథనం ప్రచురితమైంది. దీనికి కమిషనర్ పై విధంగా స్పందించారు. నగరంలో గత ఐదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల పలు ప్రాంతాలు జలమయమయ్యాయని తెలిపారు. రోడ్లమీద పడిన వర్షం డ్రెయిన్లలోకి వెళ్లడానికి వీల్లేకుండా ర్యాంపులు, మెట్లు ఏర్పాటు చేయడం వల్లనే ఈ సమస్య ఏర్పడిందని పేర్కొన్నారు. ఇప్పటికే పలు దఫాలుగా స్వచ్ఛందంగా తొలగించుకోమని చెప్పినప్పటికీ కొందరు నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. దీనివల్ల చిన్నపాటి వర్షాలకు కూడా నీరు నిలిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. డ్రెయిన్లను మూసేస్తూ ఏర్పాటు చేసిన ర్యాంపులు, మెట్లను మంగళవారం సాయంత్రం లోపు తొలగించుకోవాలని, లేనిపక్షంలో బుధవారం ఉదయం నుంచి నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక సిబ్బంది వార్డుల వారీగా జేసీబీలతో తొలగింపు ప్రక్రియ చేస్తారని తెలిపారు. జరిగిన నష్టానికి సంబంధిత నిర్మాణదారులే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. -
రేవేంద్రపాడులో వెయిట్ లిఫ్టింగ్ జట్టు ఎంపికలు
దుగ్గిరాల: విద్యార్థులు చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యమని అని హెచ్.ఎం బి.వి.కృష్ణారావు చెప్పారు. మండలంలోని రేవేంద్రపాడు జెడ్పీ హైస్కూలులో ఆదివారం జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్ జట్టు ఎంపికలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గేమ్స్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో 17 నుంచి 19 సంవత్సరాల బాలబాలికల విభాగంలో ఎంపికలు జరిగినట్లు తెలిపారు. విద్యార్థులు చురుగ్గా ఉండటానికి ఆటలు ఆడాలని, దేహ దారుఢ్యం కూడా పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు నాగ శిరీష, రాంబాబు, వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. గుంటూరు రూరల్: తమలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకుని డబ్బులు ఇవ్వకుండా పరారయ్యారని జిల్లా ఎస్పీకి కళాకారులు ఆదివారం ఫిర్యాదు చేశారు. బాధితుడు, శ్లోక ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గంట స్వామి ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. రెడ్డిపాలెం ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీ చైతన్య కళాశాల గ్రౌండ్ 99 అడుగుల మట్టి మహాగణపతిని ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసింది. నగరంలో ఉన్న వివిధ సాంస్కృతిక సంస్థలతో కలసి శ్లోకా ఫౌండేషన్ ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 20 వరకు నిత్యం శాసీ్త్రయ నృత్యాలతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించింది. ఉత్సవాల అనంతరం కళాకారులకు సొమ్మును ఇవ్వకుండా కమిటీ ప్రెసిడెంట్ నరేంద్రరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రాజానాయుడు, సెక్రటరీ లక్ష్మీరెడ్డిలు అందుబాటులో లేరని ఫిర్యాదు చేశారు. ఫోన్ ద్వారా కూడా సమాధానం చెప్పకుండా తప్పించుకొని వెళ్లి పోయారని ఆరోపించారు. కళాకారులు, చిన్నారులు, మహిళలు, మేకప్ మేన్కు రూ 1,75,000 ఇవ్వాలని తెలిపారు. వెంటనే నగదు ఇప్పించాలని స్వామి ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. -
అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రభుత్వం
ప్రజా ప్రయోజనాలతో వార్తలు ప్రచురించినప్పుడు అవి అధికార పార్టీకి అనుకూలంగా లేకపోతే సంబంధిత విలేకరులపై కేసులు పెట్టడం అధికార దుర్వినియోగం అవుతుంది. ప్రజల స్వేచ్ఛని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విలేకరులపై, పత్రికలపై అక్రమ కేసులు పెట్టి వేధించడం ప్రభుత్వానికి తగదు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య పత్రికలు వారధి వంటివి. ప్రజా ప్రయోజనాలతో ఎలాంటి వార్తలనైనా ప్రచురించే హక్కు పత్రికలకు ఉంటుంది. అలాంటి స్వేచ్ఛను ఒక వర్గం అణచివేయడం దారుణమైన విషయం. ప్రజాహితం కోరే పత్రికా స్వేచ్ఛ ఈ సమాజంలో నిలబడాలి. విలేకరులపై తప్పుడు కేసులు పెట్టే సంస్కృతిని ఎవరైనా ఖండించాల్సిదే ! – మెరుగుపాల రాజారత్నం, సీనియర్ జర్నలిస్ట్ -
ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయుల్లో తీవ్ర వ్యతిరేకత
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వం అమలు చేస్తున్న అకడమిక్ విధానాలపై ఉపాధ్యాయులు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ కేఎస్. లక్ష్మణరావు తెలిపారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 25న తలపెట్టిన రణభేరి సభ పోస్టర్లను ఆదివారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు. కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఈనెల 25న శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలు, విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి బహిరంగసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలైనా డీఏ, ఐఆర్ ఇవ్వకపోవడంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు. వెంకటేశ్వర్లు, ఎం.కళాధర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన రణభేరి జాతాకు అన్ని జిల్లాల్లో ఉపాధ్యాయులు పెద్దఎత్తున సంఘీభావం తెలిపారని వివరించారు. ఈనెల 25న తలపెట్టిన రణభేరి ముగింపు సభలో కూడా అన్ని జిల్లాల నుంచి ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సంఘ జిల్లా సహాధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శులు ఎం.గోవిందు, జి.వెంకటేశ్వరరావు, ఎండీ షకీలా బేగం, కె.రంగారావు, ఆడిట్ కమిటీ సభ్యులు ఎం.కోటిరెడ్డి, గఫార్, ఉదయ్ భాస్కర్, బురాన్, గోపయ్య పాల్గొన్నారు. -
నీటి కత్తి
గుంటూరు నెత్తిన చిన్న వర్షాలకే నీట మునుగుతున్న నగరం నెహ్రూనగర్: రోజు రోజుకీ అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరం వర్షం పడితే చాలు మునిగిపోతోంది. రాజధాని ప్రాంతంలో ప్రముఖమైన నగరంలోని పలు ప్రాంతాల్లోని వీధులన్నీ జలమయంగా మారుతున్నాయి. నగరపాలక సంస్థ కార్యాలయం కూడా మునుగుతుందంటే దీనికి కారణం పాలకుల అసమర్థతే అని చెప్పుకోవాలి. వర్షం పడితే చాలు ప్రధాన రోడ్లన్నీ మోకాళ్ల లోతు దాకా వర్షపు నీటితో నిండిపోతున్నాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్లు, ద్విచక్ర వాహనాలు నీళ్లలో నాని మొరాయిస్తున్నాయి. మరమ్మతులు చేయించుకోవడానికి తడిసి మోపెడవుతోంది. మరో పక్క ఇళ్లలోకి నీరు చేరుతోంది. గృహోపకరణాలు పాడైపోతుండటంతో సామాన్యులు ఆర్థికంగా నష్టపోతున్నారు. తూతూమంత్రంగా డ్రెయిన్లలో పూడికతీత పనులు గుంటూరు నగరంలో 210 కిలోమీటర్ల మేర డ్రెయిన్లు విస్తరించి ఉన్నాయి. వీటిలో మేజర్ 125.28 కిలోమీటర్లు, మీడియం 67.41 కిలోమీటర్లు, మైనర్ 16.25 కిలోమీటర్లుగా ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభానికి ముందే మాన్సూన్ యాక్షన్ ప్లాన్ కింద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డ్రెయిన్లలో పూడికతీత పనులు చేపడుతుంటారు. ఈ ఏడాది ఇంజినీరింగ్ అధికారులు రూ.4.78కోట్లతో పనులు ప్రారంభించారు. అయితే, కాంట్రాక్టర్లు ౖపైపెన పూడిక తీయడం, బిల్లు పెట్టుకోవడం పరిపాటిగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమన్వయం కరువు మొండిగేటు అవుట్ ఫాల్ డ్రెయిన్ విస్తరణకు రైల్వేశాఖకు నగరపాలక సంస్థ నుంచి ఖర్చును చెల్లించినప్పటికీ ఫలితం లేదు. రైల్వే అధికారులను సమన్వయం చేసుకుని డ్రెయిన్ విస్తరణ చేయడంలో నగరపాలక సంస్థ అధికారులు విఫలం అవుతున్నారు. ఆక్రమణల తొలగింపుకు అడ్డుపడుతున్న ఎమ్మెల్యేలు? ఎమ్మెల్యే అండ చూసుకుని నగరంలో ఎటూ చూసిన డ్రెయిన్లను ఆక్రమించుకుని నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటిని అడ్డుకోవాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో డ్రెయిన్లు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఇటీవల కమిషనర్ తన రోజువారీ పర్యటనలో ఆక్రమణలు తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఫలితం లేదు. స్థానిక ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. -
వర్షం పడితే బయటకు రాలేని పరిస్థితి
వర్షం పడిన ప్రతి సారి రోడ్లన్నీ జలమయంగా మారుతున్నాయి. మోకాళ్ల లోతు దాకా నీరు రావడంతో ద్విచక్రవాహనం మీద బయటకు వెళ్లాలంటే భయంగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు బండి తడిసిపోయి స్టార్ట్ కావడం లేదు. – జగదీష్కుమార్, నెహ్రూనగర్ ఉదయం పూట ఎండగా ఉంటోంది. రాత్రి అయితే చాలు వర్షం విపరీతంగా కురుస్తోంది. ఇటువంటి వాతావరణ పరిస్థితులు ఎప్పుడు చూడలేదు. ఈ వర్షాల దెబ్బకు డ్రెయిన్లు పొంగిపోయి ఇళ్లు మునిగి పోతున్నాయి. – లక్ష్మి, స్తంభాల గరువు● -
క్షేత్రస్థాయిలో పటిష్టంగా పనిచేయాలి
గుంటూరు వెస్ట్ : క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది పటిష్టంగా పని చేయాలని, అతిసార లక్షణాలు కనిపించిన ప్రాంతాల్లో ఆరోగ్య సర్వే రెండు రోజుల్లో పూర్తి కావాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై శనివారం కార్యాలయంలో ఆమె సమీక్షించారు. అనంతరం పోషకాహారంపై పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని మందులు, ఓఆర్ఎస్ పాకెట్స్ అందుబాటులో ఉంచాలని, అవసరమైతే తక్షణ వైద్య సేవలు అందించాలని సూచించారు. ఎక్కడైనా ప్రజల్లో అనారోగ్య లక్షణాలు కన్పిస్తే కలెక్టర్ కార్యాలయంలో గల కంట్రోల్ రూమ్ 08963– 2234014 కు తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో జేసీ అశుతోష్ శ్రీవాస్తవ, ఆర్డీఓ ఎన్.ఎస్.కె.ఖాజావలి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె. విజయలక్ష్మి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్.ఎస్.వి.రమణ, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కల్యాణ చక్రవర్తి, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి. ప్రసూన, జిల్లా విద్యా శాఖ అధికారి రేణుక పాల్గొన్నారు. జీజీహెచ్లో రోగులకు పరామర్శ గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్, లాంచస్టర్ రోడ్డులోని యూపీహెచ్సీని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను సందర్శించి అతిసార, వైద్య చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. యూపీహెచ్సీ నిర్వహించిన స్వస్థ నారి– స్వశక్తి పరివార్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. గర్భిణులకు సీమంతం చేశారు.అనంతరం 19వ వార్డు సంగడిగుంటలో ఇంటింటి ఆరోగ్య సర్వే కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా -
టాప్ 2% సైంటిస్ట్లలో విజ్ఞాన్ అధ్యాపకులకు చోటు
చేబ్రోలు: మండలంలోని వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీకి చెందిన ఆరుగురు అధ్యాపకులు వరల్డ్ టాప్ 2% సైంటిస్ట్లలో చోటు సాధించారని వైస్ చాన్స్లర్ పి. నాగభూషణ్ శనివారం తెలిపారు. అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సర్వే నిర్వహించింది. ఇందులో విజ్ఞాన్స్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి చెందిన ప్రొఫెసర్ అంబటి రంగారావు, డాక్టర్ కె.చంద్రశేఖర్, ఫార్మసీ డిపార్ట్మెంట్కు చెందిన డాక్టర్ రుద్రపాల్ మిథున్, అడ్వాన్డ్స్ సీఎస్ఈ విభాగానికి చెందిన డాక్టర్ జోత్న్సాదేవి బోడపాటి, కెమికల్ విభానికి చెందిన ప్రొఫెసర్ టి.సుబ్బయ్య, హైదరాబాద్లోని ఆఫ్ క్యాంపస్ మెకానికల్ విభాగానికి చెందిన డాక్టర్ ఎండీ రహమాన్లు వరల్డ్ టాప్ 2% సైంటిస్ట్లలో నిలిచారని తెలిపారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఆగస్టు 2025 వరకు ఉన్న ఉత్తమ సైంటిస్ట్ల డేటాను తీసుకోవడంతో పాటు స్టాండర్డ్ సైన్స్ మేట్రిక్స్ క్లాసిఫికేషన్లో గల 44 సైంటిఫిక్ ఫీల్డ్స్, 174 సబ్ ఫీల్డ్స్ను పరిగణలోనికి తీసుకుని ఈ ఫలితాలను వెల్లడించిందని వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆరుగురు ప్రొఫెసర్లను చైర్మన్ లావు రత్తయ్య, డీన్లు అభినందించారు. -
మధ్యలో నిలిచిన డ్రెయిన్ల నిర్మాణం
నగరంలో వర్షం నీరు ఎప్పటికప్పుడు బెయిల్ అవుట్ అయ్యే విధంగా బృందావనం అపార్ట్మెంట్(ఏటుకూరు వెళ్లే రోడ్డు) నుంచి పొన్నూరు రోడ్డులోని డ్రెయిన్కు అనుసంధానంగా 14వ వార్డులో 800 మీటర్ల పొడవుతో రూ.3.50కోట్లతో డ్రెయిన్ నిర్మాణ పనులు పార్ట్ పార్ట్లుగా చేపట్టారు. అయితే, ఇది మధ్యలోనే నిలిచిపోవడంతో వర్షపు నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో నగరంలో వీధులన్నీ జలమయంగా మారుతున్నాయి. మూడు వంతెనలు వద్ద రైల్వే ట్రాక్ కింద నుంచి మరొక డ్రెయిన్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ వాటి అమలుకు పాలకులు తగిన చర్యలు తీసుకోవడం లేదు. రూ.5.50కోట్లుతో మూడు వంతెనలు ఆధునీకరించినప్పటికీ చిన్న వర్షం పడితే చాలు మోకాళ్లలోతు దాకా నీళ్లు వస్తున్నాయి. దీనికి ప్రత్నామ్నాయంగా రైల్వే ట్రాక్ కింద డ్రెయిన్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు కంకరగుంట అండర్ పాస్ వద్ద వర్షం పడిన ప్రతిసారి మునిగిపోతోంది. దీనికి కూడా పాలకులు శాశ్వత పరిష్కారం చూపాలని నగర వాసులు కోరుతున్నారు. -
శలపాడులో దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన
చేబ్రోలు: భారీ వర్షాలు, వరదలకు మండలంలోని శలపాడు, వీరనాయకునిపాలెం గ్రామాల్లో నీట మునిగి దెబ్బతిన్న వరి పొలాలను శనివారం వ్యవసాయశాఖాధికారులు పరిశీలించారు. సాక్షి దినపత్రికలో శనివారం ప్రచురితమైన ‘‘రెక్కల కష్టం... వర్షార్పణం’’ కథనానికి అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా స్థానిక ఏవో పి. ప్రియదర్శిని మాట్లాడుతూ శేకూరు, శలపాడు రెవెన్యూ గ్రామాల పరిధిలో రైతులు నాలుగు వేల ఎకరాల్లో వరి సాగు చేశారని తెలిపారు. పంట కూడా 30రోజులు పైబడిన దశలో ఉందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు నిల్వ ఉన్న పొలాలను పరిశీలించామని, ప్రాథమిక నివేదికను జిల్లా వ్యవసాయశాఖాధికారికి సమర్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యయసాయశాఖ సిబ్బంది, మైలా రామరాజు, స్థానిక రైతులు పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్: బీఆర్ స్టేడియంలో శనివారం అండర్– 14, అండర్– 17, అండర్– 19 జిమ్నాస్టిక్స్ బాలబాలికల జిల్లా టీం సెలక్షన్లు నిర్వహించారు. అండర్– 14, 17 ఎంపికలు ఎస్జీఎఫ్ సెక్రటరీ గోపి, అండర్ –19 ఎంపికలు నరసింహారావు, కోచ్ ఆఫ్రోజ్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగాయి. తాడికొండ: బాలికను వేధిస్తున్న యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు తాడికొండ సీఐ సీహెచ్.వాసు శనివారం తెలిపారు. తాడికొండకు చెందిన యువతి గుంటూరులోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. గత పది నెలలుగా తాడికొండ గ్రామానికి చెందిన షేక్ అస్లామ్ యువతి కళాశాలకు వెళుతున్న సమయంలో వెంటబడుతున్నాడు. తనను ప్రేమించాలంటూ బలవంతం చేస్తూ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. యువతి విషయాన్ని కుటుంబ సభ్యలకు తెలిపింది. ఆమె తాతయ్య నిందితుడిని హెచ్చరించాడు. రెచ్చిపోయిన యువకుడు ఫోన్ చేసి తన ప్రేమను అంగీకరించకపోతే యువతితో పాటు ఆయన్ను చంపుతానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ వాసు తెలిపారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నగరంపాలెం: జిల్లాను గంజాయి రహితంగా చేయడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గంజాయి క్రయ, విక్రయాలు, సరఫరాపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. గడచిన రెండు రోజుల్లో 3.5 కిలోల గంజాయి సీజ్ చేసి, 22 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు, అవగాహన కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. గంజాయి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై ప్రత్యేక నిఘాతో పాటు పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని, ఆస్తుల జప్తునకు కూడా చర్యలు చేపడతామని వివరించారు. పోలీస్స్టేషన్ స్థాయిలోని ప్రత్యేక పోలీస్ బృందాలు, ఈగల్ బృందాల సమన్వయంతో గంజాయి నిర్మూలిస్తామ డ్రోన్ కెమెరాల సాయంతోనూ గుర్తిస్తామని తెలిపారు. జిల్లాలో చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు. పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): గుంటూరు నగర ట్రాఫిక్ డీఎస్పీగా బెల్లం శ్రీనివాసరావు శనివారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. 1992 బ్యాచ్కు చెందిన ఆయన గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎస్ఐ, సీఐగా పని చేశారు. తెనాలి, గుంటూరు సీసీఎస్, ఎస్బీలో కూడా ఆయన సీఐగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది ఆయనకు డీఎస్పీగా పదోన్నతి లభించింది. ఈ క్రమంలోనే గుంటూరు ట్రాఫిక్ డీఎస్పీగా నియమించారు. బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావుకు ఈస్ట్, వెస్ట్ ట్రాఫిక్ సీఐలు అశోక్, సింగయ్యలు అభినందనలు తెలియజేశారు. ఇలాగైతే కష్టం ‘మర్రి’? ●మర్రి రాజశేఖర్పై చేరికపై తెలుగు తమ్ముళ్ల గుర్రు ●పార్టీ సభ్యత్వాలకు పలువురు నాయకుల రాజీనామా -
దేవీశరన్నవరాత్రుల గోడ ప్రతుల ఆవిష్కరణ
నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : ఈ నెల 22 నుంచి చుట్టుగుంట శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో 22వ దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి తెలిపారు. దేవస్థానంలో శనివారం మహోత్సవాల గోడప్రతులను కమిటీ సభ్యులతో కలసి ఆమె ఆవిష్కరించారు. వచ్చేనెల రెండో తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు అచ్చాల వెంకటరెడ్డి, అడకా పద్మావతి, తుమ్మల నాగేశ్వరరావు, కుమ్మర క్రాంతి కుమార్, అంగడి శ్రీనివాసరావు, అడకా శ్రీనివాసరావు, పెద్ద బుజ్జి పాల్గొన్నారు. నెహ్రూనగర్: గుంటూరు నగరంలో శనివారం రాత్రి ఉరుములతో భారీ వర్షం కురిసింది. నగర ప్రజలు పలు ఇబ్బందులకు గురయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. అరండల్పేటలో పైపులైను కోసం తవ్విన గుంతల పక్కన మట్టి రోడ్డుపైనే ఉండటంతో వర్షం నీటితో చిత్తడిగా మారింది. పలువురు పాదచారులు, వాహన చోదకులు జారిపడి గాయపడ్డారు. డొంకరోడ్డులో మూడు వంతెనల వద్ద వర్షపునీటితో రాపోకపోలకు అంతరాయం ఏర్పడింది. కంకరగుంట ఫ్లైఓవర్ వద్ద అండర్పాస్ పూర్తిగా నీటి మయం కావడంతో అక్కడ భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వన్టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గమ్మ సన్నిధిలో జరిగే దసరా ఉత్సవాలను అపహాస్యం చేయటానికి, అమ్మవారి ప్రతిష్టను, ఖ్యాతిని తగ్గించడానికి కూటమి నేతలు విజయవాడ ఉత్సవ్ పేరుతో అడ్డగోలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన మహేష్ విమర్శించారు. తన కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘దసరా ఉత్సవాల పేరుతో కూటమి నేతలు చేస్తున్న కార్యక్రమాల్లో అమ్మవారిని గుర్తు పెట్టుకుంటారా? మీ సినిమా పాటలు గుర్తు పెట్టుకుంటారా?’ అని ప్రశ్నించారు. విజయవాడ ఉత్సవ్ పేరుతో రూ.100 కోట్లు దోచుకోవడానికి ఎంపీ కేశినేని చిన్ని తదితర నేతలు పథకం పన్నారని దుయ్యబట్టారు. శ్రేయస్ మీడియాతో కుదుర్చుకున్న ఒప్పందం ఎంతో విజయవాడ ఎంపీ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. విజయవాడలో వందేళ్లగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని గుర్తుచేశారు. సంక్రాంతి రోజు విజయవాడ ఉత్సవ్ నిర్వహించొచ్చు కదా? అని ప్రశ్నించారు. హిందూ భక్తులను దోచుకోవడానికి సీఎం చంద్రబాబు అధికారిక ఉత్తర్వులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు వ్యామోహంతో విష సంస్కృతిని వ్యాప్తి చేస్తున్నారని దుయ్యబట్టారు. విజయవాడ ఉత్సవ్కు పర్యటన శాఖ సహకారం, నిధులు ఇస్తోందని కూటమి నేతలు చెప్పటం సిగ్గుచేటన్నారు. బందరు గొడుగుపేట వెంకటేరస్వామికి గొల్లపూడిలో ఉన్న భూముల్లో విజయవాడ ఉత్సవ్ ఎందుకు పెడుతున్నారని నిలదీశారు. అమ్మవారి దసరా ఉత్సవాలను రాష్ట్ర ఉత్సవంగా ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. కూటమి ప్రజాప్రతినిధులు విజయవాడ ఉత్సవ్ ఆహ్వాన పత్రికలు ఇస్తున్నారు తప్ప, అమ్మవారి దసరా ఉత్సవ్ పత్రికలు ఇచ్చారా అని ప్రశ్నించారు. -
హెల్త్ ఆన్ వీల్స్ రైలులో రెండవ విడత వైద్య పరీక్షలు
లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణను దృష్టిలో పెట్టుకుని రెండవ విడత హెల్త్ ఆన్ వీల్స్లో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పీఆర్వో డి.వినయ్కాంత్ తెలిపారు. శనివారం గుంటూరు–దొనకొండ రైల్వే స్టేషన్ల మార్గంలో ఉద్యోగులకు రెండవ విడత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్కాంత్ మాట్లాడుతూ ఈనెల 13న కార్యక్రమాన్ని డీఆర్ఎం సుధేష్ఠ సేన్ ప్రారంభించినట్లు తెలిపారు. మొదటి రోజు గుంటూరు– రేపల్లె మార్గంలో నిర్వహించినట్లు పేర్కొన్నారు. మొబైల్ మెడికల్ యూనిట్లో గుంటూరు చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సీహెచ్. శ్రీనివాసు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి.సింధు, లలిత, ఒమేగా హాస్పిటల్స్తో పాటు శంకర్ కంటి ఆసుపత్రి వైద్యులు కలిసి పరీక్షలు నిర్వహించారని తెలిపారు. రైల్వే ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించారని తెలియజేశారు. కార్యక్రమంలో డీఎంఓ గుంటూరు డాక్టర్ ప్రియాంక, డీఎంఓ దొనకొండ డాక్టర్ ప్రకాశ్ పాల్గొన్నారు. -
తెలుగు భాష పరిరక్షణ అందరి బాధ్యత
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు – 2026 సన్నాహాల్లో భాగంగా శనివారం కలెక్టర్ బంగ్లా రోడ్ భారతీయ విద్యాభవన్లో ‘తెలుగు భాషా వికాసం‘పై అంతర్జాతీయ లఘు చలన చిత్రోత్సవంలో భాగంగా 44 చిత్రాల ప్రదర్శన నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలని అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాడారని, ఆయన జీవితం తరతరాలకు స్ఫూర్తి కావాలని తెలిపారు. రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ జాతి అస్తిత్వానికి మాతృభాష కొలమానమని అన్నారు. ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ద్వారా తెలుగు భాషా వికాసానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని చెప్పారు. రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షురాలు పొడపాటి తేజస్విని మాట్లాడుతూ లలిత కళలు, మన సంస్కృతి గొప్పతనంపై విస్తృత ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన ఆంధ్ర సారస్వత పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో జరిగే మూడో ప్రపంచ తెలుగు మహాసభలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. సభలో వీవీఐటీ విశ్వవిద్యాలయం కులపతి వాసిరెడ్డి విద్యాసాగర్, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్, నంబర్ వన్ టీవీ చైర్మన్ సుధాకర్నాయుడు, చలనచిత్ర ప్రముఖులు దశరథ్, కోన వెంకట్, డి.వై.చౌదరి, బి.వి.ఎస్. రవి, సిరాశ్రీ, సమన్వయకర్త పి.రామచంద్రరాజు, సినీ, టీవీ, రంగాల రచయితలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు. అనంతరం గిడుగు రామ్మూర్తి పంతులుపై కొత్తపల్లి సీతారాం దర్శకత్వంలో కృత్రిమ మేధస్సుతో రూపొందించిన తెలుగు వెలుగు గొడుగు గిడుగు లఘు చిత్రం ఆకట్టుకుంది. తెలుగు భాష ప్రాధాన్యతపై నలభైకి పైగా లఘు చిత్రాలను ప్రదర్శించారు. నలభైకి పైగా లఘు చిత్రాల ప్రదర్శన -
వైఎస్సార్ సీపీలో పలువురికి పదవులు
పట్నంబజారు: ౖవెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాకు చెందిన పలువురిని పదవుల్లో నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు శనివారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాడికొండ నియోజకవర్గానికి చెందిన ఆవుల రమణారెడ్డిని పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, బి.వెంకటస్వామిని బీసీ విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, వంగా సీతారామిరెడ్డిని రాష్ట్ర వలంటీర్ల విభాగం జోనల్ అధ్యక్షుడిగా, సకిల కమలారెడ్డిని రాష్ట్ర పబ్లిసిటీ విభాగం కార్యదర్శిగా, కొరివి రవికిశోర్ను రాష్ట్ర వైఎస్సార్ టీయూసీ సహాయ కార్యదర్శిగా, మంగళగిరి నియోజకవర్గానికి చెందిన మున్నంగి వివేకానందరెడ్డిని రాష్ట్ర మున్సిపల్ విభాగం ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. -
పరిష్కార మార్గాలపై దృష్టి పెట్టని పాలకులు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వర్షం పడితే ఆ ప్రాంతం అంతా వర్షపు నీటితో నిండిపోయి ఆ ప్రభావం తూర్పు నియోజకవర్గంపై పడుతోంది. పశ్చిమ నుంచి వచ్చే మురుగు, వర్షపు నీరు 3వ వార్డులోని మొండిగేటు నుంచి బయటకు వెళుతుంటుంది. మొండిగేటు అవుట్ ఫాల్ డ్రెయిన్ వద్దకు 100శాతం మురుగునీరు వస్తే అందులో 10శాతం మాత్రమే బయటకు వెళుతోంది. ఆ ప్రభావం మొత్తం 3, 4, 8 వార్డులపై పడి పలు కాలనీలు నీట మునుగుతున్నాయి. దీని విస్తరణ కోసం పాలకులు, అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదు. -
రైల్వే ప్రాంగణాల పరిశుభ్రత సమష్టి బాధ్యత
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్) : స్వచ్ఛ భారత్ దార్శనికతకు అనుగుణంగా రైల్వే ప్రాంగణాలను, పరిసరాలను శుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచడంలో సమష్టి బాధ్యత వహించాలని గుంటూరు రైల్వే డివిజనల్ డీఆర్ఎం సుథేష్ఠ సేన్ పిలుపు నిచ్చారు. పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలం నుంచి గుంటూరు రైల్వే స్టేషన్ వరకు స్వచ్ఛతా హి సేవ –2025 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. డివిజన్ అధికారులు, సిబ్బంది, స్కౌట్స్ అండ్ గైడ్స్, వలంటీర్లతో కలిసి డీఆర్ఎం ప్రారంభించారు. ర్యాలీలో సిబ్బంది, అధికారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ప్రతి రైల్వే స్టేషన్, కార్యాలయాల ప్రాంగణంలో ఆకు పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో విధులు నిర్వహించడం వల్ల మానసిక సంతృప్తి దక్కుతుందని తెలిపారు. పచ్చని చెట్లు చుట్టు ఉన్న ప్రాంగణాల్లోకి కలుషితమైన గాలి రాదని తెలిపారు. అనంతరం ర్యాలీని విజయవంతంగా రైల్వే స్టేషన్ వరకు నిర్వహించారు. కార్యక్రమంలో డీఆర్ఎం కార్యాలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.డీఆర్ఎం సుథేష్ఠ సేన్ -
అక్రమ అరెస్ట్లతో అడ్డుకోలేరు !
పట్నంబజారు: అక్రమ అరెస్ట్లు, గృహ నిర్బంధాలతో ప్రజల పక్షాన చేసే పోరాటాలను కూటమి ప్రభుత్వం అడ్డుకోలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు స్పష్టం చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పిడుగురాళ్లలో జరిగిన ‘చలో మెడికల్ కాలేజ్’ కార్యక్రమానికి పార్టీ యువజన, విద్యార్థి విభాగం నేతలు తరలి వెళ్లారు. బృందావన్ గార్డెన్స్లోని జిల్లా కార్యాలయం వద్ద ర్యాలీని పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు నూరిఫాతిమా జెండా ఊపి ప్రారంభించారు. అంబటి నివాసం వద్ద భారీగా పోలీసులు ముందుగా అంబటి నివాసం వద్ద పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. ర్యాలీలకు అనుమతి లేదని, ఇందుకు సంబంధించి నోటీసులు తీసుకోవాలని పోలీసులు అడ్డుకున్నారు. అయితే, తాము ఎటువంటి ర్యాలీలు, నిరసన కార్యక్రమాలకు వెళ్లడం లేదని, తమ జిల్లా పార్టీ కార్యాలయం వద్దకు వెళ్తున్నామని రాంబాబు పోలీసులకు వివరించారు. జిల్లా పార్టీ కార్యాలయం వద్దకు వచ్చి నోటీసులు ఇస్తే తీసుకుంటామని చెప్పడంతో పోలీసులు అక్కడకు వచ్చి జారీ చేశారు. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వైద్య విద్య ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ హయాంలో నిర్మాణం చేసిన మెడికల్ కళాశాలలను కూటమి సర్కార్, చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు అందాల్సిన వైద్యాన్ని, విద్యను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టే కుట్రలకు తెరదీశారని ధ్వజమెత్తారు. మెడికల్ కళాశాలల నిర్మాణాలకు రూ. 5వేల కోట్లు లేవని చెబుతున్నారని, రూ. 52వేల కోట్లు అప్పు ఎక్కడ నుంచి తెచ్చారన్నారు. అమరావతికి అయితే ఎంతైనా నిధులు వస్తాయా ? అని ప్రశ్నించారు. చంద్రబాబు జ్ఞానం తెచ్చుకుని ఇప్పటికై నా ప్రైవేట్ పరం చేయాలన్న ఆలోచనను విరమించుకోవాలని హితవు పలికారు. పెట్టుబడి పెట్టిన వాడు వ్యాపారం చేస్తాడు తప్పా.. ఉచిత సేవ చేయడన్న విషయం తెలియదా ? అని ప్రశ్నించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పేదలకు వైద్యం దక్కుతుందో లేదో అందరికీ తెలుసన్నారు. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని కూటమి పాలన వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ పోలీసులను అడ్డుపెట్టుకుని ఎన్నాళ్లు పాలన చేస్తారని మండిపడ్డారు. నానాటీకీ ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటూనే ఉన్నారని, ప్రజల పక్షాన ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్ట్లతో భయపెట్టాలని చూడటం సిగ్గుచేటని ఖండించారు. కేసులెన్ని పెట్టినా, బెదిరింపులకు గురి చేసినా వైఎస్సార్ సీపీ అడుగు కూడా వెనక్కి వేయదని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం నేత కళ్లం హరికృష్ణారెడ్డి, నగర యువజన విభాగం అధ్యక్షుడు యేటి కోటేశ్వరరావు యాదవ్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షుడు శశిధర్, తూర్పు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు సుభాని, అనిల్రెడ్డి, విద్యార్థి విభాగం నేతలు భానుప్రకాష్, యువజన, విద్యార్థి విభాగం నేతలు పాల్గొన్నారు. అంబటి ఇంటి వద్ద పోలీస్ బలగాలు నగరంపాలెం: పోలీసులతో ప్రజా ఉద్యమాలను అణిచివేయాలని ప్రయత్నం చేసే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. గుంటూరు సిద్ధార్థనగర్లోని ఆయన నివాసం వద్దకు శుక్రవారం మధ్యాహ్నం పట్టాభిపురం పోలీసులు, బలగాలు భారీగా చేరుకున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్దకు వెళ్లేందుకు బయలుదేరిన అంబటి రాంబాబు, పార్టీ శ్రేణులను అడ్డుకున్నారు. ముగ్గురు ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది ఇంటి వద్దనే సాయంత్రం వరకు పహారా నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు మీడియాతో మాట్లాడుతూ సత్తెనపల్లి పోలీసులు అనేక మందిని నిర్బంధించారని, 12 మందిని అరెస్ట్ చేశారని తెలిపారు. వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా ఈ ఉద్యమాన్ని చేయాలని భావించామని చెప్పారు. అయితే, గుంటూరులో తనను, చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజనీని, పల్నాడు జిల్లాలో యువజన విభాగం నేత శ్రీకాంత్ను అడ్డుకున్నారని వివరించారు. పోలీసుల ద్వారా ఉద్యమాలను అణిచివేయాలని చూడడం దురదృష్టకరమని ఖండించారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటుకు అప్పగించి డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, నాయకులు పఠాన్ సైదాఖాన్, కొరిటిపాటి ప్రేమ్కుమార్, నందేటి రాజేష్, న్యాయవాదులు రామకృష్ణారెడ్డి, క్రాంతికుమార్ పాల్గొన్నారు. -
లబ్ధిదారులకు దీపం నగదు బదిలీ చేయాలి
గుంటూరు వెస్ట్: దీపం పథకం – 2 ద్వారా జిల్లాలో 1,257 మందికి సబ్సిడీ నగదు ఖాతాల్లో నమోదు కావడం లేదని వచ్చిన ఫిర్యాదులపై శుక్రవారం కలెక్టరేట్లోని డీఆర్సీ హాలులో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ గ్యాస్ ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూటర్లు, సివిల్ సప్లయ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. గుంటూరు తూర్పు, పశ్చిమ, తెనాలి, మేడికొండూరు మండలాల్లో ఎక్కువగా నగదు జమ కాలేదని ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. 1257 మంది జాబితాను గ్యాస్ ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూటర్లకు పంపాలని జిల్లా సప్లయ్ అధికారికి సూచించారు. వినియోగదారులకు ఫోన్ చేసి ఎందుకు సబ్సిడీ నగదు పడలేదో వివరించాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను వచ్చే బుధవారం నాటికి పూర్తి చేయాలని చెప్పారు. ఎల్డీఏం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ వినియోగదారులు లేటెస్ట్ ఆధార్ కార్డు , పాసు పుస్తకం బ్యాంక్కు తీసుకువెళ్లి అక్కౌంట్ డీ లింక్ చేయించుకుని, మళ్లీ లింక్ చేయించాలని సూచించారు. కొంత మందికి ఆధార్ ఇన్ ఆక్టివ్ అని వస్తున్నదని, వారికి పొరపాటున రెండు ఆధార్లు ఉంటే ఒక కార్డును ఇవ్వాలని తెలిపారు. కొందరికి ఆధార్ బ్యాంక్ ఖాతాకు లింక్ కానందున, ఈకేవైసీ చేయించుకోకపోవడం వల్ల సబ్సిడీ జమ కావడం లేదని వివరించారు. ఆధార్ అప్ డేట్ వివరాలు లేనివారు 1,031 మంది ఉన్నారని , వారు వివరాలు అందజేయాలని సూచించారు. సమావేశంలో డీఎస్ఓ కె. శ్రీనివాసరావు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ -
రెక్కల కష్టం.. వర్షార్పణం
చేబ్రోలు: గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో అన్నదాతలు ఆటుపోటులను ఎదుర్కొన్నారు. అతివృష్టితో అవస్థలు పడ్డారు. వర్షం నీటితో పొలాలన్నీ మునిగిపోయాయి. రైతుల కష్టం వర్షార్పణం మైంది. చేబ్రోలు మండలంలోని శలపాడు, వీరనాయకునిపాలెం గ్రామాల పరిధిలో రైతుల అవస్థలు చూస్తే గుండె తరుక్కుపోతుంది. వందలాది ఎకరాల వరిపొలాలు వరద ముంపు బారిన పడ్డాయి. శుక్రవారం నాటికి కూడా ముంపు నుంచి బయటపడకపోవటంతో రైతులు తీవ్రంగా నష్టపోవలసి రావటంతో ఆందోళన చెందుతున్నారు. కన్నెత్తి చూడని నేతలు, అధికారులు కష్టంలో ఆదుకోవాల్సిన అధికారులు, నాయకులు కన్నెత్తి కూడా చూడకపోవటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన రెండు నెలల్లో ఇప్పటి వరకు మూడు సార్లు వరి పొలాలు ముంపు బారిన పడ్డాయి. వరద తాకిడికి వరి పొలాలు కుళ్లిపోయాయి. శాపంగా మారిన తుంగభద్ర డ్రెయిన్ చేబ్రోలు మండల పరిధిలోని శలపాడు, వీరనాయకునిపాలెం గ్రామాల మధ్యలో ఉన్న తుంగభద్ర డ్రైయిన్ రైతులకు శాపంగా మారింది. మంగళగిరి, గుంటూరు తదితర ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద తాకిడికి పొంగి సమీప పొలాలను ముంచెత్తుతోంది. రెండు గ్రామాల పరిధిలో నాలుగు వందల ఎకరాలు నేటికీ ముంపు బారిలోనే ఉన్నాయి. కొద్దిపాటి వర్షానికి సైతం ఎగువ ప్రాంతాల నుంచి డ్రెయిన్కు బారీగా వర్షపు నీరు చేరుతోంది. గత నెలలో కురిసిన భారీ వర్షానికి పదిహేను రోజులు పొలాలు నీట మునిగిపోవటంతో ఏపుగా ఉన్న పంటలు దెబ్బతిన్నాయి. శ్రమకోర్చి కుళ్లిపోయిన వరి పొలాలను దమ్ము చేసి, అధిక రేటుకు నారు కొనుగోలు చేసి మళ్లీ నాట్లు వేశారు. మరికొంతమంది రెండో సారి వెద పద్ధతిలో గింజలు నాటారు. కొద్ది రోజుల్లో భారీ వర్షం కురిసింది. దీంతో నాలుగు రోజులుగా వరి పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. ఏపుగా ఉన్న పొలాలు కుళ్లి పోయి పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతాంగం కోరుతున్నారు. కన్నెత్తి చూడని వ్యవసాయశాఖాధికారులు శలపాడు, వీరనాయకునిపాలెం తదితర గ్రామాల్లో వరి పొలాలు ముంపు బారిన పడి రైతులు ఆందోళన చెందుతుంటే, అండగా ఉండాల్సిన వ్యవసాయశాఖాధికారులు కన్నెత్తి కూడా చూడలేదు. మునిగిన పొలాల రక్షణకు సూచనలు, సలహాలు కూడా లేవు. నేటి వరకు తమ పొలాలను పరిశీలించ లేదని రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపరిహారం అందించాలి వందలాది ఎకరాలు రెండు నెలల కాలంలో మూడు సార్లు దెబ్బతినటంతో ఎకరానికి రూ.30వేల వరకు రైతులు నష్టపోయారు. ఉన్నతాధికారులు స్పందించి వాస్తవ పరిస్థితులను అంచనా వేసి, ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం ఇప్పించాలని లేనిపక్షంలో అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పరిశుభ్రత, వ్యక్తిగత క్రమశిక్షణతో అభివృద్ధి
కొరిటెపాడు(గుంటూరు): భారత ప్రభుత్వం, డీఎఫ్ఎస్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్(ఏపీజీబీ) అన్ని శాఖల్లో ‘స్వచ్ఛత హి సేవ’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చైర్మన్ కె.ప్రమోద్కుమార్రెడ్డి తెలిపారు. అందులో భాగంగా శుక్రవారం పట్టాభిపురంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల, రవీంద్రనగర్లలో మొక్కలు నాటి విద్యారులతో మాట్లాడారు. పరిశుభ్రత, వ్యక్తిగత క్రమశిక్షణ మనిషి అభివృద్ధికి దోహదం చేస్తాయని తెలిప్పారు. దీంతో కుటుంబం, గ్రామం, రాష్ట్రం బలపడతాయని, చివరికి దేశాభివృద్ధికి దారి తీస్తుందని వివరించారు. పరిశుభ్రతను పాటించే వారు దేశానికి మరింత ఉత్పాదకతను అందించడంలో దోహదపడతారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల్లో చదువుకున్న వారు అత్యున్నత స్థానాలకు ఎదగాలని, తాను కూడా అందులోనే చదివానని విద్యార్థులకు ప్రేరణనిచ్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వై.వీరబాబు మాట్లాడుతూ తమ పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో విజిలెన్స్ ఇన్చార్జి హరీష్ బేధా, ఏపీజీబీ జనరల్ మేనేజర్లు, మేనేజర్లు, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు. ఏపీజీబీ చైర్మన్ ప్రమోద్కుమార్రెడ్డి