breaking news
Guntur District Latest News
-
వెంకటపాలెం వెస్ట్ బైపాస్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం
తుళ్ళూరు ఎస్సీ కాలనీకి చెందిన ఇద్దరు మృతి తాడికొండ: తుళ్ళూరు మండలం వెంకటపాలెం వద్ద పశ్చిమ బైపాస్ బ్రిడ్జిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తుళ్లూరు ఎస్సీ కాలనీకి చెందిన బుద్దా మార్క్ (50), పౌలు (65) లు మరణించారు. ద్విచక్ర వాహనంపై తుళ్లూరు మండలం వెంకటపాలెం పశ్చిమ బైపాస్ మీదుగా గొల్లపూడి వైపు వెళుతుండగా రాంగ్ రూట్లో వెళ్లి లారీని ఢీకొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మంగళగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మార్క్కు కుమార్తె, కుమారుడు ఉండగా, పౌలు విశ్రాంత ఉద్యోగి అని వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారని స్థానికులు తెలిపారు. -
అన్ని పథకాల్లో బాబు కోతలే
అబ్బాయ్: బాబాయ్ ఎలా ఉన్నావు. పిన్ని, పిల్లలు అంతా బాగున్నారా. బాబాయ్: మా సంగతి సరే.. నువ్వు ఎప్పుడు వచ్చావ్ సిటీ నుండి. అబ్బాయ్: నిన్న రాత్రి వచ్చాను బాబాయ్. ఊరికొచ్చి రెండేళ్లపైనే అయ్యింది కదా.. అలా చూసొద్దామని వెళుతున్న. ఏంటీ ఊర్లో విశేషాలు. ఊరంతా రచ్చబండ దగ్గర ఉన్నట్లుందిగా బాబాయ్. ప్రకాశం తాత, సుబ్బన్న బాబాయ్, సందెపూడి పెద్దయ్యన్న, శీను గాడు, నరసాలుగాడు.. అంతా ఈడే ఉన్నారే. ఎలా ఉన్నారంతా. అందరూ..: బానే ఉన్నాంలే అబ్బాయ్. అబ్బాయ్: అయినా నీకేంటి ప్రకాశం తాత. ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టకుండా ఒకటో తారీకే ఇంటొకొచ్చే పింఛను.. షుగర్, బీపీలకు నెలకు సరిపడా మాత్రలిచ్చే ఊరికొచ్చే 104 బండి, ఇంటి ముందుకొచ్చే రేషన్బండి, నీ పని బానే ఉంటాదిగా. ప్రకాశం: ఓరబ్బాయ్.. అయన్నీ పోయి రెండేళ్లయ్యిందిరా అయ్యా. పింఛను ఇంటికి వత్తారా.. మనమే వాళ్ల కాడికెళ్లాలా అన్నది ఆళ్ల దయ. మాత్రలంటావా.. నెలకు కాదు వారానికి పది రోజులకు చేతిలో పెట్టి పోతన్నారు లేవని. మిగిలిన ఇరవై రోజులకు నేనే కొనుక్కోవాలిరా అయ్యా. పింఛను వచ్చే నాలుగేలలో సగందాకా ఈ మందుబిళ్లలకే పోతాయి. ఇక రేషన్ బండ్లూ ఎత్తేసినారు. చౌకధరల దుకాణానికి పోయి సరుకులు తెచ్చుకోవాలా. కాళ్లు పట్టేయకుంటే సచ్చీ, చెడీ తెచ్చుకుంటున్నా. అయినా దూరంగా ఉండి చూత్తే కొండలు కూడా నున్నగా అగుపిత్తాయి. మా బతుకులు కూడా అంతేరా అబ్బాయ్. అబ్బాయ్: సుబ్బన్న బాబాయ్.. ఎలా ఉంది పొలం? ఈ ఏడు ఏమేం పంటలేశావేంటి? సుబ్బన్న: ఎందకడుగుతావులే రా అబ్బాయ్ ఎవసాయం గురించి. చావలేక, బతకలేక ఎవసాయం చేయడమే. నాకున్న ఐదెకరాలకు తోడు ఏదో పాముకుందామని ఓ పదిహేను ఎకరాలు భూమి కౌలుకు తీసుకుని ఎలగబెట్టాలే. సగం పత్తి, సగం మిరప ఏశాను. నల్లతామరతో మిరప ఊడ్సిపెట్టుకుపోయింది. గులాబీరంగు పురుగు పత్తిని ముంచేసింది. ఏదో పత్తి ఎకరాకు నాలుగైదు కింటాలొచ్చినా.. ఉపయోగం లేకుండా ఉంది. సీసీకి తీసకెళితే బాలేదని కొనలేదు. బయట బోకర్లకమ్మి వచ్చాను. తుపాను వచ్చింది. మిర్చి మునిగింది. కానీ రూపాయి కూడా ఇయ్యడం అవ్వదన్నారు. ఏం చేత్తం ఈ ఏడాది పదిలచ్చల దాకా ఎవసాయంలో నట్టాలొచ్చినట్టే. గత పెభుత్వంలో అయినా రైతు భరోసా అని, పంటల బీమా, రైతు భరోసా కేంద్రాల్లో ఎరువలని, మందులనీ వచ్చేటివి. ఇప్పుడు ఏదీ లేదు. అబ్బాయ్: సందెపూడి పెద్దయ్యన్న గారూ.. మీ మనవడిని ఎంబీబీఎస్ చదివించాలన్నారుగా . పెద్దయ్యన్న: ఏంది బాబూ చేర్పిచ్చేది. అప్పుడు అంటే అవన్నీ ప్రభుత్వానివి కదా.. ఎట్టాగూ మనవడికి మంచి మార్కులొస్తాయి. అందులో సీటు వచ్చిద్దని అనుకున్నా. ఇంతలో సర్కారు మారిందిగా. ప్రబుత్వ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారంట. ఇప్పుడు వాటిల్లో సీట్లు కొనాలంటే ఎకరాలమ్ముకోవాలి. నీకు తెలిసిందేగా మా పెద్దోడు వ్యాపారమంటే అప్పుట్లో మూడెకరాలమ్మాను. ఇంకా ఉన్న రెండు కూడా అమ్మి డాక్టరు చదివిస్తే రేపు పిల్లల పరిస్థితి ఏమిటని ఊరుకున్నాను బాబు. వాడిని కూడా ఏదో ఒకటి చేయాలి. అబ్బాయ్: ఏం శీనుగా.. ఏం చేస్తున్నావురా నువ్వు. నిన్న సాయంత్రం మీ ఇంటికొచ్చాను. ఏక్కడికెళ్లినావ్? శీను: చెల్లి చెప్పిందిరా వచ్చి ఎళ్లినావని. నిన్న ఉదయం మిర్చికి నీళ్లెట్టినాలే. ఇయ్యాల యూరియా సల్లాల. మొక్కలకు యూరియా కొందామని మండలానికి పోయి వచ్చినాను. అబ్బాయ్: అదేంటిరా మండలం దాకా ఎందుకు. మన ఊరిలో రైతు భరోసా కేంద్రం ఉంది కదా. శీను: ఆ ఆ ఉందిలే. అదిప్పుడు రైతు సేవ. కానీ ఆడ యూరియా దొరకదు. బుకింగ్ సేసేటి మిసన్లు దుమ్ముకొట్టుకోయి పడిన్నయి. అసలు ఎప్పుడు తీత్తారో, ఎప్పుడు ఉంటారో కూడా తెల్దు. బయటకెళ్లి బ్లాక్లో కొనాల్సిందే. అబ్బాయ్: పిన్నమ్మ బాగున్నావా.. ? పిన్ని: ఏముందిరా.. ఆరోగ్యమే ఏమీ బాగుండట్లేదు. నెలనెలా పట్నం పోయి ఆస్పత్రిలో చూయించుకుంటున్నా. ఉన్న నాలుగు రూపాయలూ ఈ రోగాలకే పోతాన్నాయిరా.. అబ్బాయ్: అదేంటి.. మన ఊర్లో అంత పెద్ద విలేజ్ క్లినిక్ కట్టారుగా! పిన్ని: ఆ.. కట్టారుగానీరా. అప్పట్లో ఆడికి పెద్ద పెద్ద డాటర్లు వచ్చేవాల్లు, మనం ఆడదాకా పోలేకపోతే వాళ్లే ఇంటికొచ్చి పరీచ్చలు చేసి మందులిచ్చి పోయేటోళ్లు. పెబుత్వం మారింది. ఇప్పుడేమో అక్కడున్న వాళ్లే ఎప్పుడుంటారో తెలియట్లా. ఇక డాటర్లు రాడమే మానేశారు. అందుకని పట్నం పోయి చూయించుకుంటున్నా. అబ్బాయ్: అవును పిన్నమ్మ... ఈ పక్కనిల్లు అప్పుడు రెండేళ్ల కింద నేనొచ్చినప్పుడే పడేత్తన్నారు కదా.. ఇంకా కట్టుకోలేదేంటీ.. పిన్ని: అదా.. అలా వదిలేసిండులే. పాత పెభుత్వం లచ్చాముప్పాతిక దాకా ఇచ్చేదంట. ఈ పెభుత్వం నాలుగు లచ్చలిత్తదని ఎలచ్చన్లప్పుడు చెప్పిండ్రంటా. ఇత్తే కట్టేసుకుంటారు. అబ్బాయ్: ఏమో పిన్నమ్మా.. ఇప్పుడు నువ్వు చెప్పే మాటలకు, ఇందాక అక్కడ రచ్చబండ దగ్గర బాబాయ్ వాళ్లు చెప్పే మాటలు చూస్తుంటే.. బాధగా ఉంది. రైతులు, మహిళలు, వృద్ధులు, చదువుకునే పిల్లలు.. ఇలా ఎవ్వరి పరిస్థితీ బాలేనట్లుగా ఉంది. ఏం చేస్తాం. ప్రభుత్వాలు సరిగా ఉంటేనే మనలాంటి ప్రజల పరిస్థితి బాగుంటుంది. – సాక్షి, గుంటూరు -
కనులారా మకరజ్యోతి దర్శనం
నగరంపాలెం: గుంటూరు సంపత్నగర్లోని క్రేన్ రిలీజియస్ ట్రస్ట్ వారి శ్రీహరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా మకరజ్యోతి దర్శనం ఘనంగా జరిగింది. ట్రస్ట్, క్రేన్ సంస్థల చైర్మన్ గ్రంధి వెంకట సత్యలక్ష్మీకాంతారావు, లక్ష్మీహైమావతి దంపతులు, కుటుంబ సభ్యులు కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం స్వామి వారి తిరువాభరణాలను సంపత్నగర్లోని ఫ్యాక్టరీ నుంచి దేవాలయానికి కాంతారావు దంపతులు, ఆయన అల్లుడు చక్కా వినోద్రామకృష్ణ, కుమార్తె విజయలక్ష్మి, కుటుంబ సభ్యులు దేవాలయానికి తీసుకొచ్చారు. అనంతరం స్వామి వారికి అలంకరించారు. రాత్రి భక్తుల స్వామి వారి శరణ ఘోష నడుము గ్రంధి కాంతారావు దంపతులు మకర జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం భక్తి గీతాల సంగీత విభావరి నిర్వహించారు. అయ్యప్ప భక్తులు, క్రేన్ గ్రూప్ సంస్థల సిబ్బంది, టంగుటూరి మణి, పుర ప్రముఖులు హాజరయ్యారు. -
అమరేశ్వరునికి భోగి సేవ
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వరుని సంక్రాంతి ఉత్సవాలలో భాగంగా బుధవారం భోగి పండుగ సందర్భంగా గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామి వారికి వారు పోసి హారతులు ఇచ్చి పూజలు చేశారు. అలాగే అమరావతి పాండురంగస్వామి దేవాలయంలో గోదాదేవి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. నకరికల్లు: భోగి పండుగ సందర్భంగా స్థానిక ఆదిలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి రథోత్సవం బుధవారం కనుల పండువగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయం నుంచి ప్రారంభమైన రథోత్సవం పురవీధుల్లో సాగింది. యువకులు, భక్తులు రథాన్ని లాగుతూ స్వామివారి నామస్మరణ చేస్తూ ముందుకు సాగారు. ముందుగా అర్చకులు కొడవటికంటి మధుసూదనాచార్యులు, పాండురంగాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. రేపల్లె: పట్టణంలోని ఉప్పూడి రహదారిలోని రాజ్యలక్ష్మి, గోదా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం గోదాదేవి కల్యాణం వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని, రంఘనాథస్వామి వారిని వధూవరులుగా తీర్చిదిద్ద వేదమంత్రాల నడుమ కళ్యాణం కనుల పండువగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. గుంటూరు రూరల్: నల్లపాడు, చల్లావారిపాలెం గ్రామాల ఇలవేల్పు దేవత శ్రీ పుట్టలమ్మతల్లి శ్రీ ఘంటాలమ్మ తల్లి సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. గత ఏడాది అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలందుకున్న 9 కిలోల లడ్డూను వేలంలో రూ.15 లక్షలకు పాడుకున్న భక్తుడు దుగ్గెంపూడి సుధాకర్రెడ్డి, శ్రీవాణి దంపతులు ఆలయానికి అందించిన నగదుతో ఆలయ కమిటీ చైర్మన్ ఇంటూరి అంజిరెడ్డి, కమిటీ సభ్యులు అమ్మవారికి కెంపు, పగడాలు పొదిగిన హారాన్ని తయారు చేయించారు. సుధాకర్రెడ్డి దంపతులు ఆలయ కమిటీ సమక్షంలో బుధవారం అమ్మవారికి బహూకరించారు. కార్యక్రమంలో దుగ్గెంపూడి యోగేశ్వర్రెడ్డి, గౌతమ్ కార్తికేయరెడ్డి, తరుణ్ కార్తికేయరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మాచర్ల : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వీరనారి చాకలి ఐలమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ దంతవైద్యులు సిద్దూ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా పలువురు పేద మహిళలకు చీరెలు పంపిణీ చేయటం ప్రశంసనీయమన్నారు. అనంతరం 100 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాదులు కేళం శ్రీనివాసరావు, ఆవుల ఉదయ్కుమార్, అబ్దుల్ కలాం సేవా సమితి అధ్యక్షులు పాషావలి, వ్యవస్థాపక అధ్యక్షులు మన్నెం పాండురంగారావు, మోరా భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భోగిమంటల్లో పీపీపీ జీఓ ప్రతుల దహనం
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): అఖిల భారత విద్యార్థి సమాఖ్య, యువజన సమాఖ్య గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలో ‘పిపిపి’ విధానాన్ని రద్దు చేయాలని, మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ, జీఓలను భోగిమంటల్లో వేసి దహనం చేశారు. గుంటూరు కొత్తపేట మల్లయ్య లింగం భవన్ సీపీఐ కార్యాలయం ఎదుట బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో భోగిమంటలలో జీఓ పత్రాలను దహనం చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తుందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే వంద రోజుల్లో 107, 108 జీఓలను రద్దు చేస్తామని హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తవుతున్నప్పటికీ జీవోలను రద్దు చేయకపోగా 100 శాతం వైద్య విద్యను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జంగాల చైతన్య, షేక్, వలి మాట్లాడుతూ.. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేసి, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కల్పించి, ప్రతి జనవరిలో విడుదల చేస్తామన్న జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థి నాయకులు యశ్వంత్ రఘువీర్, అమర్నాథ్, చల్లా మరియదాసు, అజయ్, సాయి గణేష్, జోస్ మాథ్యూస్, సులేమాన్, శశిధర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
తాడికొండలో ‘బరి’ తెగించారు..!
తాడికొండ: సంక్రాంతి పండుగ మాటున తాడికొండ మండలంలో పందేల బరులు కొనసాగాయి. తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నల్లో మండల పరిధిలోని నిడుముక్కల గ్రామంలో కత్తులు కట్టి కోడి పందేలు నిర్వహించడంతో పాటు పేకాట, గుండాట యథేచ్ఛగా కొనసాగింది. మోతడకలో జోరుగా కోడి పందేలు వేయడంతో పండుగ మాటున మూగజీవాలు హింసకు గురై మృత్యువాత పడ్డాయి. నియంత్రించాల్సిన పోలీసు అధికారులు అటువైపు తొంగిచూసిన దాఖలాలు లేకపోవడంతో నిర్వాహకులు పందేల మాటున జోరుగా జేబులు నింపుకొన్నారు. అధికార పార్టీ కావడంతో అదుపుచేసే పరిస్థితి లేకపోయిందని పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కోడి పందేల రాయుళ్లు భారీగా హజరు కావడంతో ఆ ప్రాంతం కోలాహాలంగా మారింది. -
కోడికత్తుల తయారీ ముఠా అరెస్ట్
గుంటూరు రూరల్: కోడి కత్తుల తయారీ ముఠాను నల్లపాడు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ వకుల్జిందాల్ ఆదేశాల మేరకు, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్బీ సీఐ అలహరి శ్రీనివాస్ పర్యవేక్షణలో స్పెషల్ బ్రాంచ్ పోలీస్ సిబ్బంది జిల్లావ్యాప్తంగా కోడి పందేలు జరగకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. కోడి పందేల నిర్వహకులు, కోడి కత్తులు తయారు చేసి సరఫరా చేసే వ్యక్తులు, కోడి పందేల కోసం బరులు ఏర్పాటు చేస్తున్న వారిని గుర్తిస్తూ చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో నల్లపాడు స్పెషల్ బ్రాంచ్ పోలీస్లకు అందిన సమాచారం మేరకు.. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని నాయుడుపేట, అంబేడ్కర్ కాలనీ (జిందాల్ ఫ్యాక్టరీ సమీపంలో)లో ఒక నివాసంలో కోడి కత్తులు తయారు చేస్తూ, వాటికి సాన పెట్టి అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దీంతో సీఐ ఆదేశాలమేరకు నల్లపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది సహకారంతో ఇంటిపై దాడి నిర్వహించారు. దాడిలో గుంటూరు శ్రీనివాసరావుపేటకు చెందిన బండి బాలచంద్ర కోడి కత్తులు తయారు చేస్తున్నట్లు గుర్తించి అతనిని అదుపులోకి తీసుకున్నారు. దాడిలో తయరు చేసిన 60 కోడి కత్తులు, మూడు కోడి కత్తులకు సాన పెట్టే మిషన్లను స్వాధీనం చేసుకుని విచారణ నిమిత్తం నిందితుడిని నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు నిర్వహిస్తూ జీవ హింసకు పాల్పడే వారిపట్ల ఎలాంటి సడలింపు ఉండదని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు హెచ్చరించారు. -
చెట్టును ఢీకొన్న కారు.. ఒకరి మృతి: ఇద్దరికి గాయాలు
ప్రత్తిపాడు: కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయాలపాలైన ఘటన మండలంలో చోటుచేసుకుంది. గుంటూరుకు చెందిన అంచా వెంకట సువర్ణ అనే వృద్ధురాలు తన ఇద్దరు కుమారులతో కలిసి బుధవారం ప్రత్తిపాడు మండలం గనికపూడిలో దేవర కార్యక్రమానికి వచ్చారు. కార్యక్రమం పూర్తయిన తరువాత మహేంద్ర ఎక్స్యూవీ వాహనంలో గుంటూరుకు తిరుగు పయనమయ్యారు. మార్గ మధ్యలో ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెం సమీపంలో వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వెంకట సువర్ణతో పాటు కారు నడుపుతున్న అంచా శ్రీనివాసరావులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ప్రత్తిపాడు పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్లో గుంటూరుకు తరలించారు. కాగా అందులో ప్రయాణిస్తున్న అంచా భాను ప్రసాద్ (60) తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిసింది. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదానికి నిద్రమత్తు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. క్షతగాత్రులది స్వగ్రామం గనికపూడి కాగా కొన్నేళ్లుగా గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో నివాసం ఉంటున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రత్తిపాడు ఎస్ఐ ఎన్.నరహరి తెలిపారు. -
అంతర్ జిల్లాల దొంగలు అరెస్ట్
తెనాలిరూరల్: వరుస చోరీలకు ప్పాడుతున్న అంతర్ జిల్లాల దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రూరల్ సీఐ నాయబ్ రసూల్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 11వ తేదీన తెనాలి ఆటోనగర్లోని స్టీలు కంపెనీతో పాటు త్రీ టౌన్ పరిధిలోని ఏపీ గ్రామీణ బ్యాంకు, వైన్ షాపులు, మరో రెండు దుకాణాల్లో చోరీలు జరిగిన సంగతి తెలిసిందే.. ఆటోనగర్ కేసును దర్యాప్తు చేస్తున్న రూరల్ పోలీసులు నిందితులను గుంటూరు శారదా కాలనీకి చెందిన మిక్కిలి సందీప్, పఠాన్ మస్తాన్వలిగా గుర్తించారు. నిందితుల కదలికలపై నిఘా ఉంచి వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తెనాలి రూరల్, త్రీ టౌన్ పోలీస్స్టేషన్ల పరిధితో పాటు అమరావతి పోలీస్స్టేషన్ పరిధిలోని మల్లాది గ్రామంలోని ఇంట్లో బంగారు ఆభరణాలు, వెండి పట్టీలు, అమరావతిలో ఓ దుకాణంలో నగదు అపహరించుకెళ్లినట్లు ఒప్పుకొన్నారు. చెడు అలవాట్లకు బానిసలై చోరులుగా మారిన వీరిద్దరూ డిసెంబరులోనే జైలు నుంచి బయటకు వచ్చి వెంటనే నేరాలకు పాల్పడడం ప్రారంభించినట్టు సీఐ తెలిపారు. సందీప్ 28 కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడని, మస్తాన్ వలి 12 కేసుల్లో జైలుకెళ్లాడని చెప్పారు. నిందితుల నుంచి 8.50 గ్రాముల బంగారు ఆభరణాలు, 250 గ్రాముల వెండి వస్తువులు, రూ. 17 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. పండుగ సందర్భంలో ఊరు వెళ్లే వారు ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, అలానే ప్రతి ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిదని సీఐ సూచించారు. సమావేశంలో రూరల్ ఎస్ఐ కె. ఆనంద్, సిబ్బంది ఉన్నారు. -
నిదానంపాటి అమ్మవారి హుండీ ఆదాయం రూ. 39 లక్షలు
దుర్గి: అడిగొప్పలలోని శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి హుండీ కానుకలు లెక్కించగా రూ. 39,46,887 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సైదమ్మ బాయి తెలిపారు. 95 రోజులపాటు భక్తులు అమ్మవారికి సమర్పించిన హుండీ లెక్కింపును మంగళవారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కారంపూడి గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో చేపట్టారు. కానుకల రూపంలో వచ్చిన ఆదాయాన్ని బ్యాంకు అధికారులకు అందజేసి సంబంధిత రసీదును తీసుకున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎన్ఎంఆర్ సిబ్బంది, అర్చక, పరిచారక, నాయీ బ్రాహ్మణులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అమరావతి: కృష్ణా నదిలో స్నానానికి దిగి ఓ యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులు అందించిన సమాచారం మేరకు.. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు గ్రామానికి చెందిన పల్లెగుంట సద్గుణ్ (22) తన ఇద్దరు స్నేహితులతో కలసి ద్విచక్రవాహనంపై మంగళవారం అమరావతి మండల పరిధిలోని దిడుగు ప్రాంతానికి చేరుకున్నారు. దిడుగు అవతల ఒడ్డున స్నానానికి కృష్ణా నదిలో దిగారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ సద్గుణ్ నీటిలో మునిగి గల్లంతయ్యాడు. ఏటూరు, దిడుగు గ్రామస్తులు నదిలో అతడు గల్లంతైన సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. యువకుని ఆచూకీ కోసం నదిలో గాలిస్తున్నారు. -
త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో పేదలకు ఇళ్ల నిర్మాణం
తెనాలిటౌన్: త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో పేదలకు ఇళ్ల నిర్మాణం చేయనున్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ పి.అరుణ్బాబు తెలిపారు. రూరల్ మండలం బుర్రిపాలెం గ్రామంలో మంగళవారం ఆయన అధికారులతో కలసి పర్యటించారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో సెంట్రల్ స్కీమ్ ద్వారా సొంత ఇంటి స్థలం కలిగిన 91 మంది పేదలకు త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఇంటి నిర్మాణం పూర్తిచేసి ఇవ్వనున్నట్లు చెప్పారు. పూర్తి ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని అన్నారు. గ్రామంలోని లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. అనంతరం జగ్గడిగుంటపాలెం గ్రామంలోని జగనన్న కాలనీ లే అవుట్ను పరిశీలించారు. ఇంటి నిర్మాణాలు పరిశీలించి కాంట్రాక్టర్లతో ముచ్చటించారు. నిర్మాణం ఏ దశలో ఉంది, లబ్ధిదారులకు మేలు కలిగేలా నిర్మాణాలు జరుగుతున్నది లేనిది వాకబు చేశారు. నాణ్యత ప్రమాణాలకు లోటు లేకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఆయన వెంట చీఫ్ ఇంజనీర్ జయరామాచారి, ఎస్ఈ వేణుగోపాల్, జిల్లా హౌసింగ్ పీడీ ప్రసాద్, తెనాలి హౌసింగ్ ఈఈ భాస్కర్, ఏఈ బాలాజీ, తదితరులు ఉన్నారు. -
తెనాలి దేవదాయశాఖ ఈఓపై మంత్రి ఫైర్
తెనాలి: విడవమంటే పాముకు కోపం...కరవమంటే కప్పకు కోపం అన్నట్టుగా తెనాలిలో అధికారుల పరిస్థితి తయారైంది. దేవదాయ శాఖ ఈవో తమ్మా శివారెడ్డిపై స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఫైర్ కావడం, సెలవుపై వెళ్లాలని ఆదేశించడం ఇందుకో నిదర్శనం. దేవదాయ పరిధిలోని శ్రీ సత్యనారాయణ టాకీస్ లీజు వ్యవహారమే ఇందుకు కారణం. డిపాజిట్ చెల్లించకపోయినా డిఫాల్టర్ అయినప్పటికీ బినామీకి థియేటర్ లీజు అప్పగించడమే ఈవో పొరపాటు. నాడు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ నుంచి అక్షింతలు వేయించుకోని మరీ మౌనంగా వుండిపోయినందుకు ఈవో శివారెడ్డికి ఇప్పుడు మంత్రి మనోహర్చే చివాట్లు పడాల్సి వచ్చింది. పైగా బదిలీపై వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గతేడాది సంక్రాంతి కోడిపందాలు వ్యవహారంలో అప్పట్లో ఒక సీఐ సెలవుపై వెళ్లిపోయారు. మళ్లీ ఇప్పుడు ఈవోకు ఆ పరిస్థితి తప్పటం లేదు. దేవాదాయ పరిధిలోని స్థానిక బోసురోడ్డులో గల శ్రీ కాకుమాను శంకరుని సత్రానికి చెందిన శ్రీ సత్యనారాయణ టాకీస్ లీజు పేరుతో టీడీపీ వర్గీయుల ఆదీనంలో కొనసాగుతోంది. కొన్నేళ్లుగా అందులో ఫంక్షన్ హాలు నడుపుతున్నారు. 2025 ఏప్రిల్ నాటికి టాకీస్ లీజు కాల పరిమితి ముగిసింది. లీజుదారుడు అప్పటికీ రూ.12 లక్షలు అద్దె బకాయిలు వున్నారు. బకాయిలు వసూలుకు కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. దేవదాయశాఖ హాలు వేలంకు ప్రకటన చేసింది. డిఫాల్టర్ అయిన శ్రీనివాస్కు వేలంలో పాల్గొనే అర్హతను కోల్పోవటంతో, అతడి బినామీ వీరయ్య చౌదరి వేలంలో పాడుకున్నారు. నెలకు రూ.1.28 లక్షల వేలంతో దక్కించుకున్నారు. వేలంలో పాల్గొన్న ఇతరులను అంతకుమంచి పాడనివ్వకుండా చేశారని అప్పట్లో ఆరోపణ లొచ్చాయి. ఏదైమైనా డిఫాల్టరయిన శ్రీనివాస్, వీరయ్య చౌదరి ద్వారా మళ్లీ లీజు దక్కించుకున్నారు. నిబంధనలు ప్రకారం రూ.5లక్షల డిపాజిట్ను చెల్లించకుండానే వేలంకు అనుమతించటం, అతడు పేరిట కొట్టేయడం జరిగిపోయింది. దీనికి కారణం ఫంక్షన్ హాల్ నిర్వాహకుడు పుట్టి శ్రీనివాస్కు టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ అండదండలు వుండటమేనని అందరికీ తెలుసు. గతంలోని అద్దెను స్వల్పంగా పెంచి శ్రీనివాస్కు ఇవ్వాల్సింది పోయి, వేలం ఎందుకు పెట్టావంటూ అప్పట్లో ఈవోపై ఆలపాటి ఆగ్రహించినట్లు కూడా చెబుతారు. ఆలపాటి ఆశీస్సులతో శ్రీ సత్యనారాయణ టాకీస్ను వీరయ్య చౌదరి పేరుతో లీజు దక్కించుకున్న పుట్టి శ్రీనివాస్ నెలనెలా చెల్లించాల్సిన అద్దె రూ.1.28 లక్షలు యధాప్రకారం బకాయిల జాబితాలో చేరాయి. 2025 ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు 9 నెలలకు రూ.10లక్షలకు పైగా చెల్లించాల్సి వుండగా, కేవలం రూ.2 లక్షలు మాత్రమే చెల్లించినట్లు సమాచారం. పాట సమయంలో చెల్లించాల్సిన రూ.5 లక్షలు డిపాజిట్ అతీగతీ లేదు. ఇదిలావుంటే మూడేళ్ల లీజుకు అనుమతిస్తూ దేవదాయశాఖ కమిషనర్ నుండి ఉత్తర్వులు కూడా వచ్చాయి. రాజకీయ సిఫార్సుల్లేకుండా నిబంధనలకూ విరుద్ధంగా అనుమతులు ఎలా వస్తాయనేది ప్రశ్న! శ్రీ సత్యనారాయణ టాకీస్కు ఫంక్షన్ హాలుగా నడుపుతున్న పుట్టి శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. థియేటర్ వేలం పాటలో డిఫాల్టర్ తరపున బినామీ లీజులో పాల్గొన్నారని, టీడీపీ మద్దతతో ‘మనోడు’ దక్కించుకున్నాడని ‘సాక్షి’లో అప్పట్లోనే కథనం ప్రచురితమైనంది. ఆ సమయంలో పట్టించుకోని మంత్రి మనోహర్ దాదాపు 10 నెలలకు శ్రీ సత్యనారాయణ టాకీస్ లీజు వ్యవహారంపై ఈవోను సెలవుపై వెళ్లాలంటూ ఆదేశించడం విశేషం. ఇటీవల ఫ్లెక్సీల వివాదం తరువాత ఈ ఘటన చోటుచేసుకోంది. ఇలా ఇద్దరి మధ్య నలుగుతున్న అధికారులు ఇంకెందరో? అన్న చర్చ పట్టణంలో నడుస్తోంది! సెలవుపై వెళ్లాలని ఆదేశం సత్యనారాయణ టాకీస్ వేలం వ్యవహారంలో మంత్రి మనోహర్ ఆగ్రహం వేలం నాడే ‘సాక్షి’ హెచ్చరించినా ఎవరికీ పట్టని వైనం ఎమ్మెల్సీ రాజా వర్సెస్ మంత్రి మనోహర్ మధ్య మరో అధికారి బలి? -
ప్రయాణం.. పెను భారం
సంక్రాంతి అంటే చాలు గ్రామాలకు వెళ్లే వారే ఎక్కువ. ఉద్యోగం, ఉపాధి, విద్య తదితర కారణాలతో నగరాలు, పట్టణాల్లో ఉంటున్న లక్షల మంది పండుగకు తమ స్వగ్రామాల బాట పట్టారు. ఈ సమయంలో ఏపీఎస్ఆర్టీసీపై ఒత్తిడి భారీగా పెరిగింది. ఈ ఏడాది సంక్రాంతి ప్రయాణాలు మరింత భారంగా మారాయి. బస్సులు సరిపోక, రద్దీ పెరిగి దూరప్రాంతాలకు సర్వీసులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సీ్త్రశక్తి, బస్సుల కొరత మధ్య నలిగిపోతున్న ప్రయాణికులు దూరప్రాంతాల ప్రజలకు అందుబాటులో లేని బస్సులు కనీసం సీటు దొరక్క పురుషులకు తప్పని అగచాట్లు ప్రైవేట్ ట్రావెల్స్ను ఆశ్రయిస్తే అడ్డగోలు చార్జీలతో జేబుకు చిల్లు -
భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య
గుంటూరు రూరల్: భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తనపై, తన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయిస్తూ, తనను జైలుకు పంపి, ఇబ్బందులకు గురిచేస్తుందనే మానసిక వేదనకు గురై వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. నల్లపాడు పోలీస్ స్టేషన్ సీఐ వంశీధర్ తెలిపిన, మృతుడు వీడియో ద్వారా సోషల్ మీడియాలో వైరల్ చేసిన సమాచారం మేరకు... ఏటీ అగ్రహారానికి చెందిన .వెంకటేశ్వర్లు కారు డ్రైవర్గా పనిచేస్తుంటాడు. మొదటి భార్య అకాల మృత్యువాతకు గురవ్వటంతో అడవితక్కెళ్ళపాడు టిడ్కో హౌస్లలో నివాసం ఉండే వెంకటరమణను రెండవ వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు కుమార్తె లాయర్ డిగ్రీ పూర్తి చేసుకుని వేముల బాలాజీ అనే వ్యక్తి వద్ద ప్రాక్టీస్కు చేరింది. కుమార్తె ప్రాక్టీస్కు వెళుతున్న సమయంలో ఆమెకు తోడుగా వెళ్లే వెంకటరమణ, బాలాజీ లాయర్తో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. ఈ విషయమై వెంకటేశ్వర్లు, వెంకటరమణల మధ్య ఘర్షణలు జరుగుతూ ఉండేవి. వివాదాల నేపథ్యంలో వెంకటరమణ, లాయర్ బాలాజీలు ఇరువురు తనపై గతంలో తొమ్మిదికి పైగా అక్రమ కేసులు బనాయించి, తనను జైలుకు కూడా పంపారని వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు ముందు చేసిన వీడియోద్వారా తెలిపాడు. తనపై కేసులు మోపటంతోపాటు తన అన్నదమ్ములు, మొదటి భార్య బిడ్డలపై కూడా అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నారని వాపోయాడు. ● లాయర్ బాలాజీ అండతో తనను తన భార్య చిత్రహింసలకు గురిచేస్తుందని, తాను కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బుతో పేరేచర్లలోని జగనన్న కాలనీలో ఇంటిని కొనుక్కున్నానని, అయితే అందులోకి కూడా తనను వెళ్లకుండా చేసి ఆ ఇంటిని లాయర్, తన భార్య గెస్ట్ హౌస్గా వాడుకుంటున్నారని వీడియో ద్వారా వాపోయాడు. గతంలో తనపై పెట్టిన కేసుల్లో జైలు నుంచి వచ్చాక రాజీ కోసం ప్రయత్నించి తన సొంత ఇంటిని అమ్మి డబ్బులు కూడా తన భార్య వెంకటరమణకు ఇవ్వడం జరిగిందని తెలిపాడు. అనంతరం మళ్లీ తనకు ఫోన్ చేసి రూ 20 లక్షలు ఇస్తే డైవోర్స్ ఇస్తాను, తనపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటానని ఆ లాయర్, తన భార్య వేధిస్తున్నారని, వారి వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని, తన చావుకు కారణం లాయర్ బాలాజీ, భార్య వెంకటరమణలే కారణమని పేపర్పై రాసి, వీడియోద్వారా తెలిపాడు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ● వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఘటనకు కారణమైన వెంకటరమణను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. లాయర్ బాలాజీ పరారీలో ఉన్నాడని అతడిని త్వరలో అదుపులోకి తీసుకుంటామని సీఐ తెలిపారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. న్యాయవాదితో వివాహేతర సంబంధం పెట్టుకుని తనపై తొమ్మిది కేసులు పెట్టి, జైలుకు పంపిందని వీడియోలో వాపోయిన మృతుడు విడాకులు కావాలంటే రూ.20లక్షలు ఇవ్వాలని వేధించడంతో సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య -
మాయప్పిరాన్ అలంకరణలో శ్రీవారు
మంగళగిరి టౌన్: లడక్లో ఈ నెల 20 నుంచి 27వ తే దీ వరకు జరిగే ఖేలో ఇండియా గేమ్స్– 2026కు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ గ్రహీత, అంతర్జాతీయ ఐస్ స్కేటర్ జెస్సీ రాజ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికై ంది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన జెస్సీరాజ్ ఆంధ్రప్రదేశ్ నుంచి బాలికల విభాగంలో ఎంపికై న ఏకై క స్కేటర్గా నిలవడం విశేషం. రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనున్న జెస్సీ వ్యక్తిగత ప్రతిభకు నిదర్శంగా నిలవడమే కాకుండా రాష్ట్రానికే గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరి షేక్ ఖాజా పేర్కొన్నారు. దీంతో పలువురు క్రీడాకారులు, నాయకులు ఈ ఆమెకు అభినందనలు తెలిపారు. చేబ్రోలు: చేబ్రోలు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారుల బృందాలు మంగళవారం విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. 3072 సర్వీసులను తనిఖీ చేసి 123 మందిపై కేసులు నమోదు చేసి రూ.5.63 లక్షల జరిమానా విధించినట్లు తెనాలి విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అక్కల సత్యనారాయణ తెలిపారు. మీటరు లేకుండా డైరెక్టుగా విద్యుత్ చౌర్యానికి పాల్పడిన ఐదు కేసులకు రూ.20 వేలు, అనుమతించిన లోడు కంటే అదనంగా విద్యుత్ వాడుతున్న 111 సర్వీసులకు రూ.4.43 లక్షలు, మాల్ ప్రాక్టీస్ సంబంధించి ఏడు కేసులకు రూ.లక్ష జరిమానా విధించినట్లు తెలిపారు. ఈఈ మాట్లాడుతూ విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో డీపీఈ (విజిలెన్సు) కే రాజశేఖర్, కే రవికుమార్, ఎ.సుందరంబాబు, మల్లికార్జున ప్రసాద్, శ్రీనివాసరావు, స్థానిక ఏఈ బి.శ్రీనివాసరావు, చేబ్రోలు, తెనాలి డివిజన్ వివిధ సెక్షన్ల డీఈఈలు, ఏఈఈలు, సిబ్బంది పాల్గొన్నారు. -
సత్తా చాటిన వేటపాలెం ఎడ్లు
యర్రగొండపాలెం: యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఆద్యంతంగా ఉత్సాహభరిత వాతావరణంలో సాగుతున్నాయి. మంగళవారం న్యూ కేటగిరీ ఎడ్ల బల ప్రదర్శనలో బాపట్ల జిల్లా వేటపాలేనికి చెందిన గిత్తలు 4,800 అడుగులు లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. ఆ ఎడ్ల యజమానులు ఆర్కే బుల్స్ అత్తోటి శిరీషా చౌదరి, శివకృష్ణ చౌదరి రూ.లక్ష నగదు బహుమతి అందుకున్నారు. ఎమ్మెల్యే తాటిపర్తి ఎడ్లు 466.2 అడుగులు లాగి ద్వితీయ స్థానంలో నిలిచి రూ.80 వేలు దక్కించుకున్నాయి. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాల, ముప్పాళ్లకు చెందిన ఎడ్లు 4,500 అడుగుల లాగి తృతీయ స్థానంలో నిలిచాయి. ఆ ఎడ్ల యజమాని పుచ్చకాయల శివపార్వతి, కల్యాణ్ మెమోరియల్స్కు చెందిన శేషాద్రి చౌదరి రూ.60 వేలు అందుకున్నారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం మునుగోడుకు చెందిన ఎడ్లు 4,500.6 అడుగులు లాగి చతుర్థ స్థానంలో నిలిచాయి. ఆ ఎడ్ల యజమాని కోపూరి శ్రీనివాసరావు రూ.50 వేలు, నంద్యాల జిల్లా బిళ్వలాపురానికి చెందిన ఎడ్లు 4,028.6 అడుగులు లాగి 5వ స్థానంలో నిలిచాయి. ఆ ఎడ్ల యజమాని రూ.40 వేలు, గుంటూరు జిల్లా కొల్లిపరకు చెందిన ఎడ్లు 3,911.4 అడుగులు లాగి 6వ స్థానంలో నిలిచాయి. ఆ ఎడ్ల యజమానులు గువిబండి మాధవరెడ్డి అండ్ సన్స్, శ్రీనివాసరెడ్డి రూ.30 వేలు, కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా మండలం తూడిచర్ల గ్రామానికి చెందిన ఎడ్లు 3,475.4 అడుగులు లాగి 7వ స్థానంలో నిలిచాయి. ఆ ఎడ్ల యజమానులు రూ 25 వేలు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని కోట కందుకూరుకు చెందిన ఎడ్లు 3,455 అడుగులు లాగి 8వ స్థానంలో నిలిచాయి. ఆ ఎడ్ల యజమాని గోన నరసింహారెడ్డి రూ.20 వేలు, పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాల గ్రామానికి చెందిన ఎడ్లు 3,388 అడుగులు లాగి 9వ స్థానంలో నిలిచాయి. ఆ ఎడ్ల యజమానులు పి.ఈశ్వర్ ప్రణయ్ యాదవ్, అశ్విక్ యాదవ్ రూ.18 వేలు ప్రకారం ఎమ్మెల్యే అందచేశారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు యేర్వ చలమారెడ్డి, చేదూరి విజయభాస్కర్, వాగ్యా నాయక్, గుమ్మా ఎల్లేష్ యాదవ్, ఏకుల ముసలారెడ్డి, గంటా వెంకట రమణారెడ్డి, దోమకాల వెంకటేశ్వర్లు, సింగారెడ్డి పోలిరెడ్డి, పాలిరెడ్డి కృష్ణారెడ్డి, కె.ఓబులరెడ్డి, వై.వెంకటేశ్వరరెడ్డి, సయ్యద్ జబీవుల్లా, షేక్.బుజ్జి, దొండేటి నాగేశ్వరరెడ్డి, ఆర్.అరుణాబాయి, ఎల్.రాములు, పి.రాములు నాయక్, పల్లె సరళ, గార్లపాటి శార, వాడాల పద్మ, మిడత నరసింహారావు, మందుల ఆదిశేషు, కందూరి కాశీవిశ్వనాథ్, పబ్బిశెట్టి శ్రీనివాసులు, దోగిపర్తి సంతోష్కుమార్, గోళ్ల కృష్ణారావు, సూరె శ్రీనివాసులు, షేక్.కాశింపీరా, షేక్ మహమ్మద్ కాశిం, షేక్ షెక్షావలి, తోకల ఆవులయ్య, గుండారెడ్డి వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. నేడు సీనియర్ విభాగంలో ఎడ్ల పోటీలు ఎడ్ల బలప్రదర్శనలో భాగంగా బుధవారం సీనియర్ విభాగంలో ఎడ్ల పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన ఎడ్ల యజమానులకు ప్రథమ బహుమతి రూ.1.50 లక్షలు, ద్వితీయ బహుమతి రూ.లక్ష, తృతీయ బహుమతి రూ.80 వేలు, చతుర్ధ బహుమతి రూ.70 వేలు, 5వ బహుమతి రూ.60 వేలు, 6వ బహుమతి రూ.50 వేలు, 7వ బహుమతి రూ.40 వేలు, 8వ బహుమతి రూ.30 వేలు, 9వ బహుమతి రూ.20 వేలు అందజేస్తారు. -
19 నుంచి ఉచిత పశువైద్య శిబిరాలు
గుంటూరు వెస్ట్: జిల్లాలో ఉచిత పశు వైద్య శిబిరాలను ఈనెల 19 నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. పశు వైద్య శిబిరాల పోస్టర్లను కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్.కె.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ అన్ని మండలాల్లో పశు వైద్యాధికారుల ఆధ్వర్యంలో రెండు బృందాలను ఏర్పాటుచేసి శిబిరాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉచిత పశు వైద్య శిబిరాలలో గొర్రెలు, మేకలు, పెద్ద పశువులు, లేగ దూడలకు ఉచితంగా నట్టల నిర్మూలన మందులు వేయడం జరుగుతుందని చెప్పారు. గొర్రెలకు బొబ్బ వ్యాధి నిరోధక టీకాలు, కోళ్లలో కొక్కెర తెగులు నివారణ టీకాలు, అనారోగ్య పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇస్తామని తెలిపారు. రైతులు ఉచిత పశువైద్య శిబిరాలలో అందించే పశు వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాజధాని ప్రాంత అభివృద్ధి పనులు వేగవంతం కావాలి రాజధాని ప్రాంత అభివృద్ధి పనులు వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాజధాని ప్రాంత అభివృద్ధి పనులకు అవసరమయ్యే గ్రావెల్, కంకర, రహదారి మెటీరియల్ తదితర అంశాలలో ఎటువంటి జాప్యం లేకుండా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. అనుమతుల మంజూరును నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనులు జాప్యం జరగరాదని చెప్పారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో షేఖ్ ఖాజావలి, కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ ఎం.డి. నజీనా బేగం, అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో జన గణన కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. మంగళవారం అమరావతి నుంచి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ జిల్లా కలెక్టర్లతో జనగణన కార్యక్రమాల అమలుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన జనాభా లెక్కల అధికారిగా కలెక్టర్ వ్యవహరించడం జరుగుతుందని, అదనపు ప్రధాన జనాభా లెక్కల అధికారిగా జేసీని నియమించామన్నారు. జిల్లా జనాభా లెక్కల అధికారిగా డి.ఆర్.ఓ, అదనపు జిల్లా జనాభా లెక్కల అధికారులుగా జిల్లా ప్లానింగ్ ఆఫీసర్, జిల్లా విద్యాశాఖాధికారి, జడ్పీ సీఈవో, సర్వే శాఖ ఏడీ, పంచాయతీరాజ్ అధికారి, జిల్లా ఫారెస్టు ఆఫీసర్ను నియమించడం జరిగిందని వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో షేఖ్ ఖాజావలి, జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, ఆర్డీఓ కె. శ్రీనివాసరావు, జిల్లా విద్యా శాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా, సీపీఓ శేషశ్రీ తదితరులు పాల్గొన్నారు. పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్ -
మహిళా వీఆర్ఓను దుర్భాషలాడిన వ్యక్తిపై కేసు
మేడికొండూరు: మేడికొండూరు మండలం కొరప్రాడు గ్రామంలో వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్న మహిళను అసభ్య పదజాలంతో దూషించిన కొరప్రాడు గ్రామానికి చెందిన మద్దూ రామకోటిపై సీఐ నాగూర్ మీరా సాహెబ్ మంగళవారం కేసు నమోదు చేశారు. సీఐ తెలిపిన వివరాలు.. రామకోటి నూతన పాస్ పుస్తకం కోసం వెళ్లి వీఆర్వోను కలువగా ఆమె మీ పొలం కోర్టు కేసులో ఉందని, అర్జీ పెట్టుకుంటే ఓకే చేస్తామని చెప్పింది. కోపోద్రికుడైన రామకోటి మహిళా వీఆర్వోను అసభ్యకరమైన పదజాలంతో దుర్భాషలాడాడు. రామకోటి ప్రవర్తనకు భయపడిన మహిళా వీఆర్వో మేడికొండూరు పోలీసులను ఆశ్రయించింది. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. మహిళా వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా, వారి విధులకు ఆటంకం కలిగించిన అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ నాగూర్ మీరా సాహెబ్ హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు వ్యవస్థను బలోపేతం చేశాం: మంత్రి నాదెండ్ల తెనాలి అర్బన్: ధాన్యం కొనుగోలు వ్యవస్థను పూర్తిగా బలోపేతం చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఖరీఫ్లో 50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం పెట్టిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 41.27లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు చెప్పారు. రూ.10 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రకటించారు. రైతులందరూ సంక్రాంతిని సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. పశ్చిమ బ్యాంక్ కెనాల్లోకి దూసుకెళ్లిన కారు భట్టిప్రోలు: పెనుమూడి–వెల్లటూరు రహదారి మార్గం0లో పెదపులివర్రు పక్కనే ఉన్న పశ్చిమ బ్యాంక్ కెనాల్లోకి కారు దూసుకుపోయింది. కారులో పెదపులివర్రుకు చెందిన తండ్రి, కుమార్తెలు ప్రయాణం చేస్తున్నారు. కారు ప్రమాదవశాత్తూ కెనాల్లోకి దూసుకెళ్లింది. ప్రయాణికులు సురక్షితంగా బయటకు వచ్చారు. సమాచారం మేరకు 108 వాహనం వారిని రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. చిన్న చిన్న గాయాలవడంతో ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేశారు. -
ఆడబిడ్డను హింసిస్తుంటే మాట్లాడవేం నరేంద్ర ?
పట్నంబజారు: ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర...నీ దగ్గర పని చేసే వ్యక్తి తన భార్యను వేధింపులకు గురిచేస్తూ.. విపరీతంగా హింసిస్తుంటే.. సర్దిచెప్పాల్సింది పోయి స్వయంగా నువ్వు.. నీ కుమార్తె మేమున్నామని ప్రోత్సహించడం వల్ల ఒక బాధితురాలికి తీవ్ర అన్యాయం జరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నరేంద్ర వద్ద పని చేసే పౌల్రాజ్ అనే వ్యక్తి తన భార్య వెంకటేశ్వరమ్మను చిత్రవధ చేస్తుంటే ప్రశ్నించినందుకు తనపై అక్రమ కేసు పెట్టించిన ఎమ్మెల్యే వారం రోజులుగా వెంకటేశ్వరమ్మ కనపడటంలేదని, ఆమె తల్లి నంబూరి లక్ష్మి పెడుతున్న కన్నీటికి సమాధానం చెపుతారా? అని ప్ర శ్నించారు. బృందావన్గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంళవారం విలేకరుల సమావేశంలో మురళీకృష్ణ బాధితురాలు తల్లి లక్ష్మితో కలసి మాట్లాడారు. ఆస్తి కోసం పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనుచరుడు పౌల్రాజ్ బరితెగించాడని ఆరోపించారు. వెంకటేశ్వరమ్మను ప్రేమ వివాహం చేసుకున్న పౌల్రాజ్ ఆస్తి కోసం తొలి నుంచి ఆమెను అనేక రకాల వేధింపులకు పాల్పడుతున్నాడని ఆమె కుటుంబ సభ్యుల ద్వారా తెలిసిందన్నారు. ఒక తోటలో చెట్టుకు కట్టేసి కొడుతూ.. పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఆమె తల్లి నంబూరి లక్ష్మికి ఫోన్ చేసి వినిపిస్తూ హింసించాడని పేర్కొన్నారు. బాధ్యత గత ఎమ్మెల్యేగా మహిళను కాపాడాల్సిపోయి పౌలరాజ్ అరాచకాలను ప్రోత్సహిస్తున్నాడని మండిపడ్డారు. నాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉందని, నన్ను ఎవరు ఏమి చేయలేరని, నీకు చేతనైంది చేసుకో అని పౌలరాజ్ బెదిరింపులకు దిగిన ఆడియోలు ఉన్నాయన్నారు. వెంకటేశ్వరమ్మను కిడ్నాప్ చేసి, మాచవరంలోని పౌల్రాజ్ సోదరుడు రాజేష్ నివాసంలో పెట్టారని చెబుతున్నారని, తక్షణమే ఆ యువతిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసులపై ఉందన్నారు. తక్షణమే బాధితురాలు ఎక్కడ ఉందో ఆచూకీ తెలపాలని, పౌలరాజ్ నుండి వెంకటేశ్వరమ్మను రక్షించాలని, లేకుంటే ఆమె తల్లి నిరాహారదీక్షకు కూడా కూర్చుంటుందని చెబుతోందన్నారు. ఆస్తికోసం భార్యను చిత్రహింసలకు గురి చేస్తున్న పౌలరాజ్ పై కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా కుమార్తెను చంపే ప్రయత్నం జరుగుతోంది.. కిడ్నాప్కు గురైన బాధితురాలు వెంకటేశ్వరమ్మ తల్లి నంబూరి లక్ష్మి మాట్లాడుతూ తన కుమార్తెను చంపే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఇప్పటికే బంగారం, డబ్బులు ఎన్నోసార్లు పౌల్రాజుకు ఇచ్చా మని అయినా తన కుమార్తైపె వేధింపులు ఆగటం లేదన్నారు. ఎకరం ఆస్తి కోసం ప్రేమ వివాహం చేసుకుని, చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అండతో అల్లుడు పౌల్రాజ్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని పేర్కొన్నారు. ఉన్న ఎకరం ఆస్తి కూడా ఇస్తానని, తన కూతురును ప్రాణాలతో అప్పజెప్పాలని వేడుకుంది. ఎమ్మెల్యే నరేంద్ర, పోలీసు అధికారులు స్పందించాలని తన కుమార్తెను క్షేమంగా తీసుకుని రావాలని విన్నవించారు. పౌల్రాజ్ బెదిరింపుల ఆడియోకాల్స్ రికార్డింగ్లు, ఎమ్మెల్యే ధూళిపాళ్ళతో ఉన్న ఫొటోలను ప్రదర్శించారు. అభివృద్ధికి వైఎస్సార్ సీపీ వ్యతిరేకంగా కాదు వైఎస్సార్ సీపీ ఏ రోజు అభివృద్ధికి వ్యతిరేకం కాద న్న విషయాన్ని గుర్తించాలని వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ స్ప ష్టం చేశారు. రైతులు నష్టపోకుండా అభివృద్ధి చేయాలనేదే తమ ఉద్దేశమన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో నుంచి వెళ్తున్న ఔటర్ రింగ్ రోడ్డుకు అంత భూమి అవసరం లేదని అభిప్రాయపడ్డారు. నారాకోడూరు వద్ద ఉన్న 80 ఎకరాలు సరిపోతుందని రైతులు చెప్తుంటే, అధికారులు 650 ఎకరాలకు మార్కింగ్ పెట్టారని, ఎలాంటి ముందస్తు నోటీసులు, గ్రామసభలు లేకుండా భూసేకరణ చేపట్టడం సరైన విధానం కాదన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్య క్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జగనన్న కాలనీలకు అవసరం మేరకు మాత్రమే తగిన నష్ట పరిహారం చె ల్లించి భూములు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. నారాకోడూరు రైతులు వైఎస్ జగన్ను కలవాలి అనుకుంటే.. వారిని కలిసేందుకు కావాల్సిన ప్రయత్నం చే స్తామని హామినిచ్చారు. వ్యాపార దక్పథంతో, ఎమ్మె ల్యే ధూళిపాళ్ల నరేంద్ర కోరిక మేరకు మాత్రమే భూ సేకరణ జరుగుతోందని ఆరోపించారు. రైతుల సంతృప్తి మేరకు భూసేకరణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల పాలిట శాపంగా ఎమ్మెల్యే ధూళిపాళ్ల మారారని మండిపడ్డారు. రైతులకు అన్యాయం జరిగితే పోరాటం తప్పదని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ -
దూరమైన సంప్రదాయాలు
హరిదాసులు.. గంగిరెద్దుల విన్యాసాలు.. బుడబక్కల వారు.. కొమ్మదాసరులు.. జంగమ దేవరులు.. హరిదాసు సంచారం (ఫైల్) బుడబక్కల వారు (ఫైల్) అలనాటి సంక్రాంతి పండుగ నిర్వహణ తీరే వేరు గ్రామాల్లో హరికీర్తనలు ఆలపించే హరిదాసుల సందడి సయ్యాటలతో సందడి చేసే డూడూ బసవన్నలు కళాకారులతో గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద పండుగ హుషారు నేడు అక్కడక్కడే కనిపిస్తున్న నాటి సంప్రదాయ గురుతులు -
తెనాలి సబ్కలెక్టర్ సంజనా సింహా బదిలీ
తెనాలిరూరల్: తెనాలి సబ్కలెక్టర్ వి.సంజనా సింహా బదిలీ అయ్యారు. ఆమెను పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్గా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2022 బ్యాచ్లో ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన సంజనా సింహా ఐఐటీ, ఖరగ్పూర్లో బీటెక్ చేశారు. సివిల్స్ పరీక్షల్లో మూడో పర్యాయం 201 ర్యాంకుతో ఐఆర్ఎస్కు ఎంపికయ్యారు. నాలుగో ప్రయత్నంలో 37వ ర్యాంకు సాధించి తాను కలలుగన్న ఐఏఎస్ను అందుకున్నారు. నెల్లూరు జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్గా శిక్షణ పూర్తిచేసుకున్నాక, ఆమె ను విద్యుత్ శాఖలో కార్యదర్శిగా నియ మించారు. 2024 ఆగస్ట్ 25న తెనాలి సబ్కలెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి సమర్థంగా పనిచేస్తూ వచ్చారు.తెనాలి శాలిపేట లో దశాబ్దాలుగా నిర్వహిస్తున్న వ్యభిచార గృహాన్ని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ హోదాలో ఐటీపీ సెక్షన్ 18 కింద సీజ్ చేయాలని ఆదేశాలు జారీచేశారు. తెనాలి ప్రాంతంలో వ్యభిచార గృహాన్ని ఏడాదిపాటు సీజ్ చేయించిన తొలి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. గుంటూరు నగర కమిషనర్గా మయూర్ అశోక్ నెహ్రూనగర్:గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్గా కె మయూర్ అశోక్ను నియమిస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐఏఎస్ల బదిలీల్లో భాగంగా గుంటూరు నగర కమిషనర్గా పనిచేస్తున్న పులి శ్రీనివాసులును మార్కాపురం జాయింట్ కలెక్టర్గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో విశాఖపట్నం జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్న కె మయూర్ అశోక్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సంక్రాంతి తరువాత నూతన కమిషనర్ విధుల్లో చేరనున్నట్లు సమాచారం. -
బరి తెగింపు
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం తూర్పుపాలెంలో కోడిపందాల కోసం వచ్చే వీఐపీలకు సిద్ధమవుతున్న వేదిక రేపల్లె నియోజకవర్గంలోని చెరుకుపల్లి మండలంలో 50 ఎకరాల విస్తీర్ణంలో కోడిపందేలు, పేకాట కోసం బరి సిద్ధం చేశారు. ఇందులో ఒకటి పెద్ద బరికాగా.. మిగిలిన పది బరులు చిన్నవి. పెద్ద బరిలో రూ.లక్ష నుంచి రెండు లక్షల పందేలు జరగనుండగా చిన్న బరుల్లో రూ.10 వేల నుంచి లక్ష వరకు జరగనున్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున పేకాట నిర్వహించనున్నారు. హైదరాబాద్కు చెందిన వారికి ఐదు రోజులపాటు పేకాట ఆడుకునేందుకు రూ. 60 లక్షలకు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు సమాచారం. బరులవద్ద పార్కింగ్, మద్యం దుకాణాల ఏర్పాటుకు నిర్వాహకులు పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, బాపట్ల: సంక్రాంతి నాడు సంప్రదాయ క్రీడగా ఆడుకొనే కోడి పందేలను జూద క్రీడగా మార్చి కోట్లు కొల్లగొట్టేందుకు కొందరు అధికారపార్టీ నేతలు సిద్ధమయ్యారు. ఇందుకోసం పండుగకు వారం ముందే బరులు సిద్ధం చేశారు. ఐదు రోజులపాటు పందాలు, పేకాట జోరుగా సాగనుంది. అంతకు మించి పై పందాలు ఉండనున్నాయి. వందల కోట్లలో వ్యాపారం ఉంటుందని అంచనా వేస్తున్నారు. బరుల వద్ద పలురకాల వ్యాపారాలను లాభసాటిగా మార్చేందుకు టీడీపీ, జనసేన నేతలు సిద్ధమయ్యారు. కూల్డ్రింక్ షాపులు మొదలు చిరుతిళ్ల దుకాణాలు నెలకొల్పతున్నారు. బరులవద్ద అనధికార మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. వేమూరు నియోజకవర్గంలో.. ఈ ప్రాంతంలో ఐదు బరులు ఏర్పాటు చేస్తున్నారు. వేమూరు మండలం కేంద్రం మార్కెట్ సమీపంలో టీడీపీ నేత పది ఎకరాల్లో ఒక బరి సిద్ధం చేయగా..ఇదే మండలంలోని చావలి– కోడిపర్రు మధ్యన జనసేన నేత పది ఎకరాల్లో మరో బరి నెలకొల్పారు. కొల్లూరు మండలం కేంద్రం సమీపంలో క్రాప వద్ద ఒక బరి, ఇదే మండలంలోని అనంతవరం వద్ద మరొక బరిని టీడీపీ నేతలు ఏర్పాటు చేశారు. చుండూరు మండలం వేటపాలెం వద్ద బరి సిద్ధం చేశారు. బాపట్ల నియోజకవర్గంలో... పిట్టలవానిపాలెం మండలం మంతెనవారిపాలెం వద్ద టీడీపీ నేతలు బారీ బరి ఏర్పాటు చేశారు. ఈ బరులన్నింటిలో రూ.25 వేలు మొదలు రెండు లక్షల వరకు పందాలు సాగనున్నాయి. పెద్ద ఎత్తున పేకాట కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా పర్చూరు నియోజకవర్గం చినగంజాం మండలం పెద గంజాంతోపాటు నియోజకవర్గం వ్యాప్తంగా గ్రామాల్లో కోడి పందేలు జరగనున్నాయి. చీరాల, బాపట్ల నియోజకవర్గాల్లోని గ్రామాల్లో కోడిపందాలు, పేకాట నిర్వహించనున్నారు. జిల్లాలో జరిగే కోడిపందాలు, పేకాటలకు జిల్లా నలుమూల నుంచే కాక అటు ప్రకాశం, నెల్లూరు, జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి రానున్నారు. అక్కడే మద్యం దుకాణాల ఏర్పాటు -
ఎమ్మెల్యే ధూళిపాళ్ల అండతో నా కుమార్తెకు చిత్రహింసలు
నగరంపాలెం: ‘‘నా కుమార్తె వారం రోజులుగా కనిపించడం లేదు..అసలు బతికే ఉందో..చనిపోయిందో తెలియడం లేదు...అల్లుడిని అడిగితే బెదిరిస్తున్నాడు..నా బిడ్డ ప్రాణాలతో కావాలంటూ’’ ఓ తల్లి సోమవారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసింది. కుమార్తెను చిత్రహింసలకు గురిచేస్తున్న ఆమె భర్త చెర నుంచి విడిపించాలని వేడుకుంది. నా బిడ్డ నాకు కావాలి, ప్రాణాలతో కావాలి అంటూ ఫ్లెక్సీ చేతపట్టుకుని జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేసింది. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జరిగిన పీజీఆర్ఎస్ గ్రీవెన్స్లో ఆమె ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడింది. వివరాలు ఇలా... బాపట్ల జిల్లా కూనపద్మావతినగర్ జగన్ కాలనీకి చెందిన నంబూరు లక్ష్మి కుమార్తె వెంకటేశ్వరమ్మ, పౌలురాజు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన దగ్గర్నుంచి భార్యను అనుమానంతో వేధింపులకు గురిచేసేవాడు. ఐదు సవర్ల బంగారు గొలుసు తీసుకుని బ్యాంక్లో తనఖా పెట్టాడు. ఇటీవల మరో ఎకరం పొలం రాసివ్వాలంటూ భార్యపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నాడు. వారం రోజులుగా భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. అప్పటి నుంచి ఆమె కనిపించడంలేదు. నా బిడ్డ బతికే ఉందో.. చనిపోయిందో తెలియడంలేదని లక్ష్మి వాపోయింది. కుమార్తె విషయమై అల్లుడ్ని అడిగితే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరిస్తున్నాడని తెలిపింది. భర్త చిత్రహింసలు భరించలేక గతంలో కుమార్తె పలుమార్లు జిల్లా పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేసింది. పౌలురాజుకు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మద్దతు ఉందని, ఆయన అండదండలతోనే తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆరోపించింది. జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ఫ్లెక్సీతో ఓ తల్లి ఆవేదన -
రామావతారం అలంకరణలో శ్రీవారు
సత్తెనపల్లి: ధనుర్మాసాన్ని పురస్కరించుకుని పట్టణంలోని రైల్వేస్టేషన్రోడ్లో గల అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో సోమవారం శ్రీవారికి రామావతారం అలంకరణ చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు చిత్రకవి శ్యాము ఆచార్యులు ప్రత్యేక పూజలు, గోత్రనామాలతో అభిషేకాలు నిర్వహించారు. మహిళలు పాశురాలను పఠించారు. ఆలయ ప్రాంగణంలో స్వామి వారి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు కోలాట ప్రదర్శన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా శ్రీవారి సేవా సమాజం ఏర్పాట్లను పర్య వేక్షించారు. భక్తులు సమర్పించిన వస్త్రాల వేలం మంగళగిరి టౌన్: మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని ఎగువ, దిగువ సన్నిధిల్లో శ్రీ స్వామివారికి, అమ్మవార్లకు భక్తులు సమర్పించిన వస్త్రాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 14, 15వ తేదీలలో ఉదయం 9 గంటల నుంచి దిగువ సన్నిధిలోని ఆలయంలో వేలం నిర్వహిస్తామని, ఆసక్తి గలవారు పాల్గొనాలని పేర్కొన్నారు. స్వదేశీ నినాదాన్ని చాటిన మహనీయుడు వివేకానంద మంగళగిరి టౌన్ : స్వదేశీ నినాదాన్ని ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీలోని స్వామి వివేకానంద స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సోమవారం వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. వర్శిటీ పరిపాలనా భవనంలో జరిగిన కార్యక్రమంలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నైతిక విలువలు, దేశభక్తిని నాటడంలో వివేకానంద చేసిన కృషి అపారమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెక్టర్ ఆచార్య శివరామ్ ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలం, వర్శిటీ ఆర్ట్స్, కామర్స్ లా కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సురేష్కుమార్, పలువురు ఆచార్యులు లింగరాజు, తేజామూర్తి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సాగర్ నీటిమట్టం వివరాలు విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 556.00 అడుగులకు చేరింది. ఇది 223.1910 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 9,800, ఎడమ కాలువకు 7,272, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 26,704, ఎస్ఎల్బీసీకి 1,650, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది.జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 45,726 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 33,098 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. భక్తిశ్రద్ధలతో మహా పూర్ణాహుతి నగరంపాలెం(గుంటూరువెస్ట్):గుంటూరుబృందావన్ గార్డెన్స్లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆల య ధార్మిక ప్రాంగణంలో భారతీ ధార్మిక విజ్ఞా న పరిషత్, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ పాలకమండలి సంయుక్త ఆధ్వర్యంలో విశ్వశాంతి, లోక కల్యాణాలను కాంక్షిస్తూ సోమవారం చండీహోమం మహా పూర్ణాహుతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అన్నప్రసాద వితరణ చేశారు. -
ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయండి
మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఈనెల 29, 30, 31, ఫిబ్రవరి 1న గుంటూరులోని టీటీడీ కల్యాణ మండపంలో జరిగే ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. గుంటూరు అరండల్ పేటలోని ఓ హోటల్ లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో లక్ష్మణరావు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకర్ రెడ్డి, సుందరయ్య కళా నిలయం అధ్యక్షుడు ముత్తవరపు సురేష్ బాబులు మాట్లాడారు. గుంటూరు టీటీడీ కళ్యాణ మండపంలో ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి, ఢిల్లీ రైతు ఉద్యమంతో సహా వివిధ రైతాంగ ఉద్యమాలలో పాల్గొన్న 300 మంది రైతునాయకులు వస్తున్నారన్నారు. అదేవిధంగా ఆయా రోజుల్లో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వ్యవసాయ ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రిటైర్డ్ ప్రొఫెసర్ టి.రత్నారావు, ప్రొఫెసర్ ఎన్.వేణుగోపాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.అజయ్ కుమార్, కౌలు రైతుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పాశం రామారావు తదితరులు పాల్గొన్నారు. -
వివేకానంద జీవితం యువతకు మార్గదర్శకం
జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా గుంటూరు వెస్ట్: స్వామి వివేకానంద జీవితం యువతకు మార్గదర్శకమని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వేడుకలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు వివేకానంద చిత్ర పటానికి పూలమాలలు నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద భారత ఆధ్యాత్మిక, తాత్విక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడన్నారు. యువతకు శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని అందించిన మహోన్నత ఆలోచనావేత్త అని పేర్కొన్నారు. ‘మేలుకో .. లక్ష్యాన్ని సాధించే వరకు ఆగవద్దు’’ అనే వివేకానందుని సూక్తి నేటి యువతకు మార్గదర్శకమని కొనియాడారు. స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవడం, ఆయన యువతపై చూపిన ప్రభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో షేఖ్ ఖాజావలి, జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్ఈ కె.కళ్యాణ చక్రవర్తి, జలవనరుల శాఖ ఎస్ఈ వెంకటరత్నం, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్రబాబు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అక్షర ఆంధ్రతో అక్షరాస్యత పెంచాలి ఆధునిక సమాజంలో విద్య ఎంతో కీలకమని దాని ప్రాముఖ్యతను వివరించి అక్షరాస్యతా శాతాన్ని పెంచే విధంగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ నిర్వహించిన వీడియో సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు నిర్వహిస్తున్న ఉల్లాస్ – అక్షర ఆంధ్ర కార్యక్రమం నిర్దేశిత లక్ష్యాలను అందుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ ఆంజనేయులు, డీఈఓ షేక్ సలీం బాషా, డీపీఓ నాగసాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీగా వెంకట రమణప్ప
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్జెండర్స్, వృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా వెంకట రమణప్ప గుంటూరులోని ఆ శాఖ కార్యాలయంలో సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ శాఖకు ఇప్పటి వరకు జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్న దుర్గాభాయి ఇన్చార్జి ఏడీగా పనిచేశారు. దుర్గాభాయిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆమైపె పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని విభిన్న ప్రతిభావంతుల స్టేట్ డైరెక్టర్ బి. రవిప్రకాష్రెడ్డి జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాను ఆదేశిస్తూ గత కొద్ది రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. సదరు విచారణ జరగుతున్న నేపథ్యంలో ఆమె స్థానంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న వెంకట రమణప్పను నియమించారు. క్రీడల్లో బాపట్ల జిల్లాకు ప్రాధాన్యం పెరగాలి బాపట్ల: రాష్ట్ర స్థాయిలో ఒలింపిక్ గేమ్స్లో సి.డబ్ల్యూ.ఎస్.ఎన్ ప్రత్యేక అవసరాల గల విద్యార్థులు రాణించడం సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో బాపట్ల జిల్లా, యద్దనపూడి మండలానికి చెందిన ఎ.భార్గవ్ శ్రీరామ్, ఎం.రత్న కుమార్ 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెం లో మొదటి, మూడవ స్థానంలో విజేతలుగా నిలిచారు. రేపల్లె మండలం, ప్రభుత్వ పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి ఎస్.కె.అహ్మద్ జోనల్ లెవెల్లో బాపట్ల జిల్లా నుంచి ఎంపికై న విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు క్రీడల్లో ప్రాధాన్యం పెరగాలని ఆకాంక్షించారు. -
కవయిత్రి విశ్వైక పావని దంపతులకు సన్మానం
సత్తెనపల్లి: సామాజిక కవయిత్రి విశ్వైక కలం నుంచి వెలువడిన ‘తొలి సంతకం‘ కవితా సంకలనం పుస్తక పరిచయం పట్టణంలోని పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఉషోదయ కళాపరిషత్ అధ్యక్షుడు పిన్నమనేని పాములయ్య అధ్యక్షత వహించి మాట్లాడుతూ కవిత్వం ఆత్మ భాషయని, భావోద్వేగాలను పదాలుగా నేయగలవాడు ‘కవి’ అన్నారు. ఈ ‘తొలి సంతకం’ కవితా మాలిక కవయిత్రి పావని కాగా ఆమె కలంపేరు ‘విశ్వైక.’ ఇటీవల హైదరాబాద్ నగరంలో ప్రారంభావిష్కరణ జరుపుకోగా సత్తెనపల్లిలో పుస్తక సమీక్ష ‘తొలి సంతకం’ కవితా మాలిక ప్రతిష్టను సంతరించుకొన్నదన్నారు. సభలో ప్రముఖ కవి కొరబండి ఆంథోనీ, యూటీఎఫ్ నాయకులు రిటైర్డ్ ఉపాధ్యాయులు కె.పోతులూరయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ కుమార్ సీపీఎం పట్టణ కార్యదర్శి డి విమల, అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) పట్టణ కార్యదర్శి జి ఉమాశ్రీలు మాట్లాడారు. అనంతరం ‘తొలి సంతకం’ కవితా సంపుటి పుస్తకాన్ని సభికులు ప్రారంభించి సభకు పరిచయం చేశారు. విశ్వైక కుమారులు కార్తీక్ దీపక్లు ఈ పుస్తకానికి సాంకేతిక వర్గంగా వ్యవహరించారు. అనంతరం కవయిత్రి విశ్వైక, ఆమెను ప్రోత్సహించిన భర్త విశ్వరూపాచారి, ఆమె తండ్రి రొంపిచర్ల పురుషోత్తంలను పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఉషోదయ కళాపరిషత్ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కవయిత్రి విశ్వైక, విశ్వరూపాచారి దంపతులు పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంకు రూ.50 వేలు విరాళంగా బ్యాంక్ చెక్కును అంద జేశారు. ఈ కార్యక్రమంలో కళాకారులు బత్తినేని లక్ష్మయ్య, ఈవీ ప్రసాద్, మాతంగి సాంబశివరావు, నాగేశ్వరరావు, రమాదేవి, జొన్నలగడ్డ రత్నరాజు, రవి, తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన భాష్యం ఒలంపస్ క్రీడా పోటీలు
గుంటూరు ఎడ్యుకేషన్: లక్ష్య సాధన కోసం దృఢ సంకల్పంతో ముందుకు సాగితే విజయం సాధించవచ్చని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ డీసీపీ కేజీవీ సరిత అన్నారు. భాష్యం విద్యాసంస్థల ఆధ్వర్యంలో గుంటూరు వికాస్నగర్లోని భాష్యం స్పోర్ట్స్ ఎరీనా గ్రౌండ్లో భాష్యం ఒలంపస్ పేరిట జరుగుతున్న భాష్యం సెంట్రల్ లెవల్ ఒలంపస్ క్రీడా పోటీల కార్యక్రమం సోమవారం ముగిసింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సరిత మాట్లాడుతూ 60 వేలకు మందికి పైగా విద్యార్థులు ఈ భాష్యం ఒలంపస్లో పాల్గొని ఉత్తమ ప్రదర్శన ఇవ్వడం నిజమైన క్రీడా స్ఫూర్తిని తెలియజేస్తుందన్నారు. ఎన్సీసీ క్యాడెట్స్ బృందం ఓపెన్ పరేడ్లో ప్రదర్శించిన క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పోలీస్ అధికారిగా గర్వపడేలా చేశాయన్నారు. పోటీల్లో గెలుపొందిన జట్లకు చైర్మన్ భాష్యం రామకృష్ణ, వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు ట్రోపీలను అందజేశారు. కార్యక్రమంలో భాష్యం విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రామ్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. గెలుపొందిన జట్ల వివరాలు.. -
పోలీసులపై చర్యలు తీసుకోవాలి
మైనర్లపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన నగరంపాలెం: మైనర్ విద్యార్థులపై దాడికి పాల్పడిన ఎస్ఐ, కానిస్టేబుల్ను సస్పెండ్ చేయాలంటూ కాకుమాను, అప్పాపురం గ్రామస్తులు, మాలమహానాడు, మాల మహాసభ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఐ, కానిస్టేబుల్ను సస్పెండ్ చేయాలని నినదించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొని, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం అర్జీదారుల ఫిర్యాదులను ఆలకించారు. సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్లు చేసి, ఆయా అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని సూచించారు. ప్రజా ఫిర్యాదులను వేగంగా, చట్టబద్ధంగా పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ రమణమూర్తి, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్), అబ్దుల్అజీజ్ (గుంటూరు తూర్పు) పాల్గొన్నారు. విద్యార్థులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు.. ఇటీవల కాకుమాను మండలం అప్పాపురం గ్రామం మాలపల్లిలో జరిగిన అమానుష ఘటనను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్కుమార్ అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్కు వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు వాలీబాల్ నెట్ కట్టే క్రమంలో టెలిఫోన్ స్తంభాన్ని తొలగించారని అన్నారు. దీనిపై ఓ మహిళా కాకుమాను పీఎస్లో ఫేక్ ఫిర్యాదు చేసిందని, దాన్ని ఆధారంగా చేసుకుని ఎస్ఐ ఏక్నాథ్, కానిస్టేబుల్ శ్రీకాంత్తో కలిసి నలుగురు విద్యార్థులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని వాపోయారు. విద్యార్థులను దుర్భాషలాడుతూ, తాము తలుచుకుంటే గ్రామాన్ని ఖాళీ చేయిస్తామని వ్యాఖ్యానించారన్నారు. వారిపై విచక్షణరహితంగా దాడి చేయడమేగాక రౌడీషీటర్ల వలే రోడ్డుపై నడిపించారని ఆరోపించారు. ఇప్పటివరకు ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం శోచనీయమన్నారు. ఎస్ఐ ఏక్నాథ్, పీసీ శ్రీకాంత్ను తక్షణమే సస్పెండ్ చేసి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు జాన్పాల్, ఎస్.వెంకటరమణ, మల్లెల వెంకట్రావు, బాధితులు, వారి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయింపు
నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్లు చేయిస్తున్నారని పార్టీ పీఏసీ సభ్యులు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. గుంటూరు జిల్లా జైల్లో ఉన్న జీడీసీసీ మాజీ డైరెక్టర్ గోవిందనాయక్ను సోమవారం ములాఖత్ ద్వారా బ్రహ్మనాయుడు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సొసైటీ ద్వారా రైతులకు రుణాలు మంజూరు చేసేది అధికారులని అన్నారు. రుణాలకు సంబంధించి డబ్బు చెల్లించాల్సింది రైతులని పేర్కొన్నారు. ఈ క్రమంలో సంతకం చేసిన గోవిందనాయక్పై అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు. ఒక ఎస్టీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేయడం వెనుక చంద్రబాబు ప్రభుత్వం కుట్ర దాగి ఉందని ఆరోపించారు. సొసైటీ ద్వారా వంద కోట్లు రుణాలు తీసుకుంటే రూ.80 కోట్లు చెల్లించారని, మిగతా రూ.20 కోట్లను చెల్లిస్తున్నారని చెప్పారు. ఒకవైపు రైతులు రుణాలు చెల్లిస్తున్నా, అధికారులు తప్పు చేసినా కూడా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలే చేశారని వారిని అరెస్ట్లు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన డైరక్టర్లు ఉన్నారని, గతంలో వారు సంతకాలు చేశారని అయినప్పటికీ వారిని అరెస్ట్ చేయలేదన్నారు. ఇప్పటికై నా రెడ్ బుక్ రాజ్యాంగం ఆపాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకు తీవ్ర వ్యతిరేకత వస్తోందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని చెప్పారు. బొల్లాపల్లి మండలం జెడ్పీటీసీ సభ్యుడు కృష్ణనాయక్, పార్టీ బొల్లాపల్లి మండల కన్వీనర్ నారాయణరెడ్డి, వినుకొండ టౌన్ కన్వీనర్ కొత్తమాసు శివ, వినుకొండ రూరల్ మండలం కన్వీనర్ దండు చెన్నయ్య, తుప్పిశెట్టి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఓబన్న పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం
మంగళగిరి టౌన్: వడ్డే ఓబన్న పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఎంతో ఆదర్శప్రాయమని ఆంధ్రపద్రేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకరరావు, సినీ నటుడు సుమన్ అన్నారు. మంగళగిరి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం వడ్డే ఓబన్న జయంతి నిర్వహించారు. సినీ నటుడు సుమన్, పలువురు బీసీ నాయకులతో కలసి ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేశన శంకరరావు, సుమన్లు మాట్లాడుతూ బీసీ వడ్డేర కులానికి చెందిన ఓబన్న భయం ఎరుగని వడ్డెరలు, బోయలు, చెంచులు, ఇతర వెనుకబడిన తరగతుల వారిని సైన్యంలో చేర్చి ఆనాడే బీసీల ఐక్యతను చాటారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మర క్రాంతి కుమార్, నాయకులు విజయకుమార్, మూర్తి, మేకా వెంకటేశ్వరరావు, కాగితాల స్వాతి, శారద, పద్మావతి, డోగిపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యమస్ఫూర్తి.. వడ్డే ఓబన్న పట్నంబజారు: స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న పేరు చెబితినే గుర్తుకు వచ్చేది ఉద్యమ స్ఫూర్తి అని.. అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగు నింపాలనే సంకల్పంతో ఆయన సాగించిన పోరాటాలు చరిత్రలో నిలిచిపోతాయని ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం కీర్తించారు. గుజ్జనగుండ్లలోని తన కార్యాలయంలో ఆదివారం వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఏసురత్నం మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన నిరంతర కృషి నేటి తరానికి మార్గదర్శకమన్నా రు. విద్య, ఉపాధి, ఆత్మగౌరవం అనే మూడు మూలస్తంభాలపై సమాజం నిలబడాలన్నది ఆయన ధృఢ నమ్మకమన్నారు. దమకాండకు ఎదురొడ్డి నిలబడే ధైర్యాన్ని ప్రజల్లో నాటిన నేతగా ఓబన్నను గుర్తించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వైఎస్సార్ సీపీ నేతలు పఠాన్ సైదాఖాన్, జి.ప్రభు, కొండా రవి, వేలాద్రి, తురాకా రమేష్, నాగరాజు, బొల్లెద్దుల వెంకటేష్, వెంకటే శ్వరరెడ్డి, సత్యన్నారాయణరెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు. -
నాటకం ద్వారా విజ్ఞానం, వికాసం
ముగిసిన గుంటూరు కళాపరిషత్ వార్షిక నాటకోత్సవాలు నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : మనిషికి విజ్ఞానం, వికాసం నాటకం ద్వారా వస్తుందని విద్యావేత్త పీవీ.శంకరరావు అన్నారు. గుంటూరు మార్కెట్ కూడలిలోని శ్రీవెంకటేశ్వర విజ్ఙాన మందిరంలో నిర్వహిస్తోన్న గుంటూరు కళా పరిషత్ 28వ వార్షిక నాటకోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. సభకు అధ్యక్షత వహించిన పరిషత్ గౌరవ సలహాదారులు ఆలోకం పెద్దబ్బాయి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కళాపరిషత్ను ఆదరిస్తున్నారని అన్నారు. ఏపీ ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు పి.చంద్రనాయక్ మాట్లాడుతూ ఎన్నో కళాపరిషత్లకు ఆదర్శంగా గుంటూరు కళాపరిషత్ ముందుకు వెళ్తుందని అన్నారు. టిక్కెట్ కొని నాటకం వీక్షించే ప్రేక్షకులు గుంటూరులోనే ఉన్నారని పరిషత్ ప్రధాన కార్యదర్శి బి.పూర్ణ పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రముఖ ఆడిటర్ ముప్పాళ్ళ సుబ్బారావు, సిటీ వాకర్స్ కార్యదర్శి నారదాసు కోటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు షేక్.సైదా పాల్గొన్నారు. ఒక రాక్షసుడి కథ... ఏపీ ప్రజానాట్యమండలి (విశాఖపట్నం) ఆధ్వర్యంలో ఒక రాక్షసుడి కథ నాటిక ప్రదర్శించారు. రచన, దర్శకత్వం కేకేఎల్.స్వామి చేయగా, సిటీ వాకర్స్ అసోసియేషన్ గుంటూరు వారు సమర్పించారు. మనిషి నాగరిక సమాజం ముసుగులో నేటికి అనాగరికంగా అజ్ఞానంగానే ఉన్నాడనే విమర్శనాస్త్రం ఈ నాటిక ద్వారా సంధించారు. ● ఎండమావుల్లాంటి బిడ్డల వల్ల ప్రయోజనం శూన్యం అంటూ పేరు రాసిన శాసనం అనే నాటికను ప్రదర్శించారు. గంగోత్రి పెదకాకాని ఆధ్వర్యంలో ప్రదర్శించగా, చింతకింది శ్రీనివాసరావు రచించగా, నాయుడు గోపీ దర్శకత్వం వహించగా, ఆకట్టుకుంది. -
వడ్డే ఓబన్న గొప్ప స్వాతంత్య్ర పోరాట యోధుడు
జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా గుంటూరు వెస్ట్: వడ్డే ఓబన్న గొప్ప స్వాతంత్య్ర పోరాట యోధుడని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా కొనియాడారు. ఆయన జయంతి కార్యక్రమం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో ఆదివారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వడ్డే ఓబన్న చిత్రపటానికి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, ఎమ్మెల్యే గళ్లా మాధవి, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ వడ్డే ఓబన్న జీవిత చరిత్ర గొప్ప స్ఫూర్తిదాయకమన్నారు. జీవిత చరిత్రను భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. వడ్డే ఓబన్న విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. పాఠ్యాంశంగా పెట్టాలనే సూచనను జిల్లా యంత్రాంగం తరపున ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ దేశం కోసం, బడుగు వర్గాల కోసం వడ్డే ఓబన్న పని చేశారన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి స్నేహితునిగా, ప్రాణ రక్షకునిగా నిలిచారని తెలిపారు. ఒక కులానికే ఆపాదించకుండా ఓబన్న ఆశయాలను అమలు చేయడంలో సమష్టిగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ శైలజ గౌడ్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కె.మయూరి, దేవుల మల్లికార్జున, వెనుకొండ శ్రీనివాస్, జె.నాగేశ్వరరావు, చల్లా లీలా భానుప్రసాద్, సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కారును తప్పించబోయి చెట్టును ఢీకొన్న కారు
తాడికొండ: ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి మరో కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన తాడికొండ మండలం లాం గ్రామం వద్ద ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తుళ్లూరు గ్రామానికి చెందిన యువకులు గుంటూరులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాడికొండ నియోజకవర్గ కార్యాలయానికి కారులో వెళ్లారు. తిరిగి వస్తుండగా లాం గ్రామ సమీపంలో వెటర్నరీ డాక్టర్స్ క్వార్టర్స్ వద్దకు వచ్చే సమయానికి ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి చింతచెట్టును బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు వెనుక సీటులో ఉన్న కంతేటి తరుణ్(17), బాకి అఖిల్(18)లకు తీవ్ర గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే మృతిచెందారు. మేరుగ కిరణ్, పేరం ఇంద్రలకు గాయాలు కాగా జీజీహెచ్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పేరం ఇంద్ర పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. హుటాహుటిన జీజీహెచ్కి బాల వజ్రబాబు ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి వనమా బాల వజ్రబాబు హుటాహుటిన జీజీహెచ్కి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని క్షతగాత్రులను పరామర్శించారు. సాయంత్రం వరకు అక్కడే ఉండి జీజీహెచ్ సూపరింటెండెంట్ ఇతర ఉన్నతాధికారులు, వైద్యులతో సంప్రదించి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి వారికి అంగా ఉంటానని హామీ ఇచ్చారు. బాకి అఖిల్ కంతేటి తరుణ్ -
కనుల పండువగా నగర సంకీర్తన
తెనాలిటౌన్: ఆధ్యాత్మిక భావనతోనే మానవ జన్మ చరితార్థమవుతుందని, ధనుర్మాసం దేవతలకు బ్రహ్మ ముహూర్త కాలమని సంగీత విద్వాంసురాలు నేరెళ్ల వరలక్ష్మి కళ్యాణి అన్నారు. ధనుర్మాసం సందర్భంగా తెనాలిలో ఆదివారం నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టారు. మహిళలు వీధులలో భజనలు, నృత్యం చేస్తూ భక్తిని, ఆధ్యాత్మిక భావనను పెంపొందించే దిశగా కృషి చేశారు. ధనుర్మాసం అనగా దేవతలకు బ్రహ్మ ముహూర్త కాలం వంటిదని, ఈ రోజుల్లో దేవతలు అత్యంత ప్రీతి చెందుతారని చెప్పారు. పూజా, గానం, యజ్ఞం, ఇత్యాది విషయాలు సంపూర్ణంగా స్వీకరిస్తారని వివరించారు. కార్యక్రమంలో చిన్నమయి సంగీత శిక్షకులు ఆంజనేయశాస్త్రి, నృత్య గురువు నిర్మల రమేష్, ఎన్సీసీ అధికారి బెల్లంకొండ వెంకట్, గాయని వఝుల సునీత, తదితరులు పాల్గొన్నారు. కొల్లూరు: గంధ మహోత్సవ వేడుకలు బాపట్ల జిల్లా కొల్లూరులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాజస్థాన్లోని అజ్మీర్ షరీఫ్లో వెలసిన హజరత్ ఖాజ్వా గరీబ్ నవాజ్ రహమతుల్లా అలైహి పేరిట ముస్లింలు భక్తి శ్రద్ధలతో గంధ మహోత్సవం జరిపారు. తొలుత స్థానిక జెండా చెట్టు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం, ప్రత్యేకంగా అలంకరించిన జెండాను కొల్లూరు వీధుల్లో ఊరేగింపుగా తర లించారు. గంధ మహోత్సవ వేడుకలలో హిందువులు పాల్గొని మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు. ప్రసాదాలు పంపిణీ చేశారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణం సీతానగరంలో ఉన్న విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ఆదివారం కూడారై మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్స్వామి మంగళ శాసనాలతో 108 గంగాళాలతో కూడారై ప్రసాదం (పాయసం) పాత్రలను గోద రంగనాథులకు సమర్పించామని, అనంతరం పాసుర విన్నపాన్ని గావించామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించి గోదా అమ్మవారి అనుగ్రహాన్ని పొందారని పేర్కొన్నారు. శ్రీవైష్ణవ సంప్రదాయంలో ధనుర్మాసం సందర్భంగా కూడారై మహోత్సవాన్ని ఎంతో విశేషంగా జరుపుకుంటారని తెలిపారు. తెనాలిటౌన్: శ్రీ శరణాగతి గోష్టి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ నరేంద్ర రామానుజ దాస స్వామి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సమీపంలోని వీఎస్సార్ కళాశాల రోడ్డులో జరుగుతున్న 12వ ధనుర్మాస వ్రత మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా 27వ రోజు ఆదివారం వేలాది మంది భక్తులు పాల్గొని 581 ఇత్తడి గంగాళాలతో స్వామివారికి పాయస నివేదన చేశారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి నిష్టగా భక్తి ప్రపత్తులతో పూజలు నిర్వహించారు. అనంతరం పాయస నివేదన చేశారు. సత్తెనపల్లి:ధనుర్మాసా న్ని పురస్కరించుకొని పట్టణంలోని వడ్డవల్లి రామాలయం, వేంక టేశ్వరస్వామి దేవాలయంలో ఆదివారం కూడారై ఉత్సవం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి, శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయస్వామిలకు ప్రత్యేక అలంకరణ చేశారు. -
మనిషినే సరుకుగా మార్చిన నేటి ఆర్థిక వ్యవస్థ
గుంటూరు ఎడ్యుకేషన్: ఆర్థిక అసమానతలతో సమాజంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, సరుకులకే విలువున్న నేటి సమాజంలో మనిషి సరుకుగా మారి విలువ కోల్పోయాడని ప్రముఖ ఆర్థిక రంగ విశ్లేషకులు డి.పాపారావు అన్నారు. ఉపాధ్యాయ ఉద్యమ సారథి నూతలపాటి పరమేశ్వరరావు వర్ధంతి సందర్భంగా ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం ఏసీ కళాశాలలో విద్యాసదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పాపారావు ‘విద్య ప్రైవేటీకరణ – ఆర్థిక అసమానతలు‘ అనే అంశంపై మాట్లాడుతూ పెట్టుబడి దారీ వ్యవస్థ లో యజమాని కార్మిక శ్రమ దోపిడీతో లాభాలు గడిస్తూ, కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించలేని స్థితిలో ఉన్నారని అన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తున్నప్పటికీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతున్నారన్నారు. – ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెన్నుపాటి మంజుల, కె.భానుమూర్తి మాట్లాడుతూ 12వ పీఆర్సీ, డీఏ విడుదల, పెండింగ్ బకాయిలు, సీపీఎస్ రద్దు తదితర అంశాలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలిసంఘం అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలతో ముందుకు వెళుతూ అన్ని వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నాయని ఆరోపించారు.కామ్రేడ్ నూతలపాటి పరమేశ్వరావు అమరుడై నాలుగేళ్ళు గడిచాయని ఆయన ఆలోచన అవగాహనతో పనిచేసినప్పుడే అతనికిచ్చే ఘన నివాళి అని వక్తలు కొనియాడారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ పాకాలపాటి రఘు వర్మ, ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకులు షేక్ జిలాని, పూర్వ ప్రధాన కార్యదర్శి పి.పాండురంగ వరప్రసాదరావు, ఓపీడీఆర్ రాష్ట్ర కార్యదర్శి వి.హనుమంతరావు, ఏపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు, ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షుడు కె.బసవలింగారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్, పెద్ద సంఖ్యలో ఉపాద్యాయులు పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ సదస్సులో ఆర్థిక రంగ విశ్లేషకులు డి.పాపారావు -
హరిలోరంగ హరి..
హరిదాసు అనగా పరమాత్మకు ప్రతిరూపం అని చెబుతుంటారు. హరిదాసుల రాక సంక్రాంతికి సంకేతం. ఆకర్షణీయమైన తెల్లని పంచె, ఒక చేతిలో చిడతలు, మరో చేతిలో తంబుర, దేహంపై హరినామాలు, తలపై అక్షయపాత్ర, మెడలో పూలదండ, కాళ్లకు గజ్జెలతో హరిదాసులు గ్రామాల్లో కనిపిస్తారు. ప్రజలు ఇచ్చే దాన ధర్మాలు అందుకుని వారికి ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలగాలని దీవించే వారే హరిదాసులు. ధనుర్మాసం ఆరంభమైన నాటి నుంచి సరిగ్గా నెల రోజుల పాటు వీధివీధినా హరి నామాన్ని గానం చేస్తూ పండుగ నాడు ధన, ధాన్య, స్వయంపాకాలను స్వీకరిస్తారు. ప్రత్తిపాడు: ధనుర్మాసం.. ప్రభాత వేళ.. ‘హరిలోరంగ హరి’ అంటూ పల్లె ముంగిట వినిపించే హరిదాసుని గానం సంక్రాంతికి ప్రతీక. రామరాజ్యం నుంచి వస్తున్న సంప్రదాయం, పాశ్చాత్య పోకడల ధాటికి కాస్తంత మసకబారుతున్నప్పటికీ సంక్రాంతికి హరిదాసు పాత్ర ప్రత్యేకం. వీధుల్లో వినిపించే హరిగానం సంక్రాంతి శోభను కళ్లకు కడుతుంది. ధనుర్మాసంలో గ్రామగ్రామాన కనిపించే హరిదాసులపై ప్రత్యేక కథనం.. సంక్రాంతి నెలలో మనకు కనిపించే గొప్ప సంప్రదాయాల్లో ఒకటి హరిదాసుని గానం. పూర్వం పల్లె, పట్టణం తేడా లేకుండా తెల్లవారుజామునే, ఇంటి ముంగిట ముగ్గులేసే సమయానికే పురవీధుల్లో హరినామ గానం చేస్తూ కీర్తనలతో అలరిస్తూ హరిదాసులు ప్రజలు ఇచ్చే ధన, ధాన్యాలను స్వీకరించేవారు. వీరి రాక సంక్రాంతి నెలకు శోభను తెస్తుంది. ధనుర్మాసాన్ని గుర్తుచేస్తుంది. రాముడి రాజ్యంలో శ్రీరాముడి రాజ్యంలో చింతలు లేవు. కరువు కాటకాలు రావు. దాన ధర్మాలు చేద్దామన్నా పుచ్చుకునే వారే కరువయ్యారని ప్రజలు ధర్మదేవతను ఆడిపోసుకునేవారట. అది విన్న వేగులు రాముడితో విషయాన్ని చెప్పగా వారి దాన ధర్మాలను పుచ్చుకునేందుకు హరినామాన్ని గానం చేసే గాయకులను రాజ్యంలో తిరిగేలా చేశారని, వారే నేడు కనిపించే హరిదాసులని పండితులు, పెద్దలు, పూర్వీకులు చెబుతుంటారు. పరమ పవిత్రం అక్షయపాత్ర.. అక్షయ అనగా ఎప్పుడూ నిండుగా ఉండేదని అర్థం. పంచలోహంతో తయారు చేసిన అక్షయపాత్రను శిరస్సుపై ధరిస్తారు. అక్షయపాత్రకు ఎంతో చరిత్ర ఉంది. ఈ పాత్ర శిరస్సుపై ఉన్నంత వరకు అకుంఠిత దీక్షతో నారాయణుడే గ్రామాల్లో సంచరిస్తున్నాడనేంత పవిత్రంగా ఉంటారు. అక్షయపాత్ర నిండిన సమయంలో బిక్షను సమీప ఇంటిలో భద్రపరుస్తారు. ఈ పాత్రలో బిక్షవేయడం స్వయంగా నారాయణుడికి నైవేద్యం సమర్పించినట్లేనని పెద్దలు చెబుతుంటారు. సంప్రదాయం ‘హరీ’ కల్చర్ మారుతోంది. పాశ్చాత్య పోకడలు శృతిమించిపోతున్నాయి. సంప్రదాయాలు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. అందులో భాగంగా హరిదాసుల రాకడ కూడా తగ్గిపోతుంది. ఒకప్పుడు ప్రతి గ్రామంలో ధనుర్మాసంలో దర్శనమిచ్చే హరిదాసులు.. ఇప్పుడు అక్కడక్కడా మాత్రమే కనిపిస్తున్నారు. కారణం వారికి గ్రామాల్లో ఆశించినంతగా ఆదరణ లేకపోవడం, నేటి తరం వీరి పట్ల పూర్వపు ఆదరణను చూపకపోతుండటమేనని తెలుస్తోంది. -
ప్రతిభావంతులు సమాజాభివృద్ధికి తోడ్పాటు అందించాలి
●సీసీఎల్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజేంద్రప్రసాద్ ●442 మంది విద్యార్థులకు రూ.61.82 లక్షలు ఉపకార వేతనాలు పంపిణీ గుంటూరు ఎడ్యుకేషన్: దాతల సహకారంతో ఉపకార వేతనాలు పొందిన విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకున్నాక సమాజాభివృద్ధికి తోడ్పాటు అందించాలని సీసీఎల్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సీహెచ్ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆదివారం జేకేసీ కళాశాలరోడ్డులోని డాక్టర్ కేఎల్పీ పబ్లిక్ స్కూల్లో శ్రీ కాకతీయ స్టూడెంట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 23వ ఉపకార వేతన పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాజేంద్రప్రసాద్, సొసైటీ ప్రతినిధులు రూ.442 మంది ఇంజినీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, నర్సింగ్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు రూ.61.82 లక్షల ఉపకార వేతన చెక్కులను పంపిణీ చేశారు. ముందుగా సొసైటీ వ్యవస్థాపకులు జాస్తి వెంకటేశ్వర్లు, పుట్టగుంట వేణుగోపాల్రావు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ● సొసైటీ ప్రెసిడెంట్ పాలడుగు లక్షణరావు మాట్లాడుతూ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించే లక్ష్యంతో సొసైటీ పని చేస్తోందన్నారు. సొసైటీ ప్రతినిధి నామినేని కోటేశ్వరరావు మాట్లాడుతూ శ్రీ కాకతీయ స్టూడెంట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గత 23ఏళ్లలో 6,923 మంది విద్యార్థులకు రూ.7.50 కోట్ల మేరకు ఉపకార వేతనాలు పంపిణీ చేశామని, దీనిని ప్రతి యేటా కొనసాగిస్తామని చెప్పారు. సొసైటి చైర్మన్ డాక్టర్ కె. బసవ పున్నయ్య మాట్లాడుతూ ఉపకార వేతనాలు అందుకున్న విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని సత్ప్రవర్తన, వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. ● సొసైటీ ముఖ్యదాత పుట్టగుంట వేణుగోపాలరావు కుమార్తె డాక్టర్ పుట్టగుంట లక్ష్మీ మాట్లాడుతూ తన తల్లిదండ్రులకు చదువు అన్నా, ప్రకతి అన్నా ప్రాణమని, తన తండ్రి సొసైటీకి రూ.కోటి విరాళం ఇవ్వడం వెనుక అంతరార్ధం అదేనని చెప్పారు. సొసైటీ కార్యదర్శి డాక్టర్ కె.కృష్ణప్రసాద్, కోశాధికారి వి.గోవర్ధనరావు,సొసైటీ యూఎస్ఏ ప్రతినిధి బొప్పన ద్వారకా ప్రసాద్లు మాట్లడారు. కార్యక్రమంలో నాట్కో ఫార్మా ప్రతినిధి ఎన్.సదాశివరావు, కొర్రపాటి రామారావు, కావూరి ప్రసాదరావు, కొల్లా శ్రీనివాసరావు, బుచ్చయ్యచౌదరి, చుక్కపల్లి రమేష్, కొత్తా ఛాయ, యడ్లపల్లి అశోక్ కుమార్, పంచుమర్తి నాగసుశీల, దండా బ్రహ్మానందం, నరేంద్రనాధ్ చౌదరి, హరేంద్రనాధ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్లల్లో చోరీలకు పాల్పడే పాత నేరస్తుడు అరెస్ట్
నగరంపాలెం: ఇళ్లల్లో చోరీలకు పాల్పడే పాత నేరస్తుడ్ని తాడేపల్లి పీఎస్ పోలీసులు అరెస్ట్ చేయగా, సుమారు రూ.9.11 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కేసు వివరాలను వెల్లడించారు. తాడేపల్లి నులకపేటలో ఉంటున్న గోలి శౌరీఆనంద్కుమార్ కుటుంబ సభ్యులు క్రిస్మస్ పండుగ సందర్భంగా గతనెల 24 రాత్రి చర్చికి వెళ్లారు. ప్రార్థనలు ముగించుకుని అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయంలో ఇంటికి చేరుకున్నారు. మొదటి అంతస్తులోని గది వెనుక తలుపు గడియ విరిగి ఉండడాన్ని బాధితుడు గమనించాడు. బీరువాలో దాచిన రూ.2.10 లక్షలు కనిపించకపోవడంతో తాడేపల్లి పీఎస్లో ఫిర్యాదు చేశాడు. సీఐ వీరేంద్రబాబు, ఎస్ఐ వెంకటసాయికుమార్ కేసు దర్యాప్తు చేపట్టారు. ఇదే తరహాలో వరుసగా చోరీలు జరగ్గా, ప్రత్యేక బృందాలతో దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో పలు చోరీ కేసుల్లో పాత నేరస్తుడు, రౌడీషీటర్ ప్రస్తుతం తాడేపల్లి నులకపేటలో ఉంటున్న కృష్ణలంక రణధీర్నగర్ వాసి షేక్ హుస్సేన్ అలియాస్ బెగ్గర్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం రుజువై, గతంలో తొమ్మిది చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. పది దొంగతనాల కేసుల్లో రూ.4.79 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, రూ.4.32 లక్షలు సీజ్ చేశారు. తాళాలు తీయడంలో దిట్ట.. 28 ఏళ్ల హుస్సేన్పై రౌడీషీట్ ఉందని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పగలు, రాత్రి వేళల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడేవాడని తెలిపారు. కేవలం చేతులతోనే తాళాలను తొలగించి లోనికెళ్లేవాడని తెలిపారు. ఇంట్లోకి చేరిన క్షణాల్లో అందిన వరకు దోచేసేవాడని విచారణలో వెల్లడైందన్నారు. వరుస చోరీల కేసులను ఛేదించిన ఉత్తర డీఎస్పీ మురళీకృష్ణ, తాడేపల్లి పీఎస్ సీఐ వీరేంద్రబాబు, ఎస్ఐలు ప్రదీప్, వెంకటసాయికుమార్, అపర్ణ, హెచ్సీలు రవి, కోటేశ్వరరావు, కానిస్టేబుళ్లు వి.ప్రసాదరావు, అనిల్, రవి, జోసెఫ్లను అభినందించి, ప్రశంసాపత్రాలను జిల్లా ఎస్పీ అందించారు. జిల్లాలో తరుచూ చోరీలకు పాల్పడే వారిపై పీడీ చట్టం ప్రయోగిస్తామని జిల్లా ఎస్పీ వకుల్జిందాల్ హెచ్చరించారు. -
కమ్యూనిటీ.. ఉగ్గబట్టుకోవాల్సిందేనా..!
ప్రత్తిపాడు: అధికారుల నిర్వాకంతో కమ్యూనిటీ టాయిలెట్లుకు తాళాలు పడ్డాయి. కమ్యూనిటీ టాయిలెట్లుకు తాళాలు ఏమిటి.. అని ఆశ్యర్యపోతున్నారా.. అవును మరి అధికారులా మజాకా.. నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడులోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో గ్రామ సచివాలయం–2 వద్ద మహిళలకు, పురుషులకు వేర్వేరుగా కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మించారు. అయితే వీటిని అందరూ ఎందుకు వినియోగించుకోవాలనుకున్నారో లేక మరేదైనా కారణమో తెలియదు గానీ తాళాలు వేసేస్తున్నారు. మండల పరిషత్ కార్యాలయం ఊరి చివర ఉండటం, అందులోనే వెలుగు, ఉపాధి, హౌసింగ్, వ్యవసాయశాఖ కార్యాలయాలు కూడా ఉండటంతో మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఇక్కడకు నిత్యం మహిళలు వస్తుంటారు. వీరు అత్యవసరంగా మల, మూత్ర విసర్జనలకు వెళ్లాలంటే కమ్యూనిటీ టాయిలెట్లుకు తాళాలు వేసి ఉండటంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తిరిగి వారి గ్రామాలకు వెళ్లే వరకు ఉగ్గబట్టుకుని ఉండాల్సిన దుర్గతి చోటుచేసుకుంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి కమ్యూనిటీ టాయిలెట్లుకు వేసిన తాళాలు తీయించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రత్తిపాడులో టాయిలెట్లుకు తాళాలు -
ఆండళక్కుం మెయ్యన్ అలంకరణలో శ్రీవారు
సత్తెనపల్లి: పట్టణంలోని రైల్వేస్టేషన్రోడ్లో గల అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని శనివారం శ్రీవారిని ఆండళక్కుం మెయ్యన్గా అలంకరించి ప్రత్యేక పూజలు, గోత్రనామాలతో అభిషేకాలు ఆలయ ప్రధాన అర్చకుడు చిత్రకవి శ్యాము ఆచార్యులు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆండళక్కుం మెయ్యన్ అంటే ‘ఆండాళ్ (గోదాదేవి)కి మెయ్యన్’ అని అర్ధమన్నారు. నిజమైన (ప్రియమైన) వాడని అర్థమని, ఇది విష్ణువును సూచిస్తుందన్నారు. ఇది తమిళనాడులోని తిరువాదనూర్లో ఉన్న ఒక ముఖ్యమైన వైష్ణవ దేవాలయం అని, ఈ ఆలయంలోని ప్రధాన దైవమే ఆండళక్కుం మెయ్యన్ అన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా శ్రీవారి సేవకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అమరావతి: అమరేశ్వరాలయంలోని దేవుడి సొమ్ముపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ అమరావతి మండల అధ్యక్షుడు మేకల వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం అయన మాట్లాడుతూ ఇటీవల పత్రికల్లో వస్తున్న అవినీతి వార్తలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. పాలకమండలి సభ్యులే అవినీతి జరిగిందని ఆరోపించినా కనీసం విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించకపోవటంపై పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. దేవదాయశాఖ ఉన్నతాధికారులు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలు వెలికి తీసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వీహెచ్పీ డిమాండ్ చేస్తుందన్నారు. అవినీతిపై దేవదాయశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోతే విశ్వహిందూ పరిషత్ లీగల్సెల్ తరఫున న్యాయపోరాటం చేస్తామని వీహెచ్పీ మండల లీగల్సెల్ అధ్యక్షులు బి.సుబ్బారావు అన్నారు. సత్తెనపల్లి: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని పట్టణంలోని వడ్డవల్లి శ్రీ రామాలయం, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామికి, శనివారం పండ్లతో ప్రత్యేక అలంకరణ, శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామిలకు నిజరూపదర్శన అలంకరణ చేసి ప్రత్యేక పూజలు, గోత్రనామాలతో అభిషేకాలు నిర్వహించారు. శ్రీవారి పాదాలను ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు. గుంటూరురూరల్: రెడ్డి కళాశాల సమీపంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సరస్(అఖిలభారత డ్వాక్రా బజార్) మేళాలో స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారవేత్తలుగా మారటానికి అవసరమైన నైపుణ్యాలపై యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్ఎస్ఈటీఐ) ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆర్ఎస్ఈటీఐ ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఉచిత వసతి భోజన సౌకర్యాలతో అందించే వివిధ రకాల స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలను తెలియజేశారు. -
తెనాలిలో ఏసీ మెకానిక్ దారుణ హత్య
తెనాలి రూరల్: తెనాలిలో ఏసీ మెకానిక్ ఒకరు దారుణ హత్యకు గురయ్యాడు. నందులపేటకు చెందిన ఏసీ మెకానిక్ షేక్ ఫయాజ్ అహ్మద్(52)ని గుర్తుతెలియని దుండగులు బండరాళ్లు, కర్రలతో కొట్టి హతమార్చారు. తెనాలి నందులపేటకు చెందిన ఫయాజ్ టెలిఫోన్ ఎక్చ్సేంజి సమీపంలో ఏసీ మెకానిక్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి తెనాలి టీచర్స్ కాలనీ శివారు ప్రాంతంలో ఉంటున్న మహిళను కలిసేందుకు స్కూటీపై వచ్చాడు. కొద్ది సేపటికి తీవ్ర గాయాలతో ఇంటి సమీపంలోనే పడి ఉన్న ఫయాజ్ను సదరు మహిళ తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. హత్య జరిగిన ప్రదేశాన్ని డీఎస్పీ బి.జనార్ధనరావు, త్రీ టౌన్ సీఐ ఎస్. సాంబశివరావు శనివారం ఉదయం పరిశీలించారు. గుంటూరు నుంచి వచ్చిన డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నించింది. డీఎస్పీ మాట్లాడుతూ ఫయాజ్ తన ఇంటికి వచ్చి వెళుతుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి చేశారని హిమబిందు తెలిపిందని, ఆమె గాయపడ్డ ఫయాజ్ని వైద్యశాలకు తరలించిందని చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని చెబుతోందని, ఘటనా స్థలంలో కర్ర, బండరాయితో మోది చంపిన ఆనవాళ్లు కనపడుతున్నాయని తెలిపారు. త్రీ టౌన్ సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కేసీ స్కూల్స్ తపాలా పోస్టల్ కవర్ ఆవిష్కరణ
చేబ్రోలు: చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలోని కొండవీటి కమిటీ స్కూల్స్ (కేసీ స్కూల్స్) స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ప్రత్యేక తపాలా పోస్టల్ కవర్ను ఆవిష్కరించారు. కొత్తరెడ్డిపాలెం గ్రామంలో శ్రీ విద్యాభివర్థనీ సంఘంను 1925 డిసెంబరు 25న 1925న స్థాపించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో కొండవీటి కమిటీ ప్రాథమిక పాఠశాల ప్రారంభమైంది. ఈ సంస్థ శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జనవరి 11వ తేదీన ఆదివారం శత వసంతాల పండుగ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా పోస్టల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేక తపాలా కవర్ను రిలీజ్ చేశారు. కార్యక్రమంలో పోస్టల్ సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు కేసీ స్కూల్స్ కరస్పాండెంట్ గాదె సుబ్బారెడ్డి, వెంకటరెడ్డి, మాదిరెడ్డి హనుమారెడ్డి, కాశింరెడ్డి పాల్గొన్నారు. పోస్టల్ అధికారులు, సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
కళ కళలాడుతున్న పసుపు
తెనాలి: తెనాలి ప్రాంతంలో పసుపు పైరు ఏపుగా పెరిగి పచ్చని పసిమితో కళకళలాడుతోంది. రైతులకు మాత్రం భూమిలో పసుపు దుంప చక్కగా ఊరుతుందన్న భరోసా చిక్కటం లేదు. పంట దున్నేనాటికి ఆశించిన దిగుబడి ఉండేదేమోనన్న గుబులు తొలి చేస్తోంది. ఖరీఫ్ సీజనులో అధిక వర్షాలు, మోంథా తుఫాన్ వరిని దెబ్బతీసిన విషయం తెలిసిందే. వర్షాల కారణంగా పసుపుకు దుంపకుళ్లు అక్కడక్కడా కనిపించింది. దిగుబడిపై మనసులో ఆందోళన ఉన్నా, ప్రస్తుతం మార్కెట్లో పసుపుకు మంచి ధర ఉండటం ఊరటనిస్తోంది. రెండు వేల ఎకరాల్లో సాగు... ఖరీఫ్ సీజనులో నాటిన పసుపు జనవరి/ ఫిబ్రవరి నెలల్లో చేతికొస్తుంది. 2023లో మార్కెట్ ధర పతనం కావటంతో ఆ ఏడాది కొందరు రైతులు సాగుకు విముఖత చూపారు. 2023–24 సీజనులో అనూహ్యంగా ధర పెరిగింది. క్వింటాలు రూ.5,000లకు కాస్త అటూ ఇటుగా ఉంటూ ధర పెరుగుతూ రూ.14,800 వరకు కొనుగోళ్లు జరిగాయి. దీంతో 2024–25 ఖరీఫ్ సీజనులో పసుపు సాగు విస్తీర్ణం కొంత పెరిగింది. ఆ ఏడాది ధర కొంత తగ్గింది. క్వింటాలు రూ.12 వేలకు అమ్ముకోగలిగారు. ప్రస్తుతం తెనాలి వ్యవసాయ సబ్డివిజనులో దాదాపు రెండు వేల ఎకరాల్లోనే పసుపు సాగు చేశారు. ఇందులో అధికశాతం 1500 ఎకరాల విస్తీర్ణం కొల్లిపర మండలంలోనే ఉంది. పెట్టుబడి అధికమే.. ఇతర పంటలతో పోల్చితే పసుపు సాగుకు పెట్టుబడి ఖర్చులు అధికమని తెలిసిందే. 2024 మార్చిలో పెరిగిన మార్కెట్ ధరలతో విత్తనం ధర కూడా భారీగానే పెరిగింది. ఎకరాకు ఆరు పుట్ల చొప్పున నాటతారు. మార్కెట్ ధరల ప్రకారం విత్తన ధర ఆధారపడి ఉంటుంది. 2024లో ఒక్కో పుట్టి రూ.10 వేలకు కొనుగోలు చేశారు. 2025లో మార్కెట్ ధర తగ్గటంతో ధర దిగొచ్చింది. పుట్టి రూ.6–9 వేల వంతున అమ్మకాలు జరిగాయి. విత్తనం నాటటం నుంచి ఎండు పసుపు చేతికొచ్చేసరికి ఒక్కో ఎకరాకు కనీసం రూ.1.50 లక్షల పెట్టుబడి వ్యయం చేయాల్సి వస్తోంది. పసుపు సాగుకు కౌలు రూ.50 వేలు పైమాటగానే ఉంది. దుంపకుళ్లు, తాటాకు తెగులు... ఇంత పెట్టుబడితో సాగుచేస్తున్న పసుపు పైరును ఖరీఫ్ సీజనులో ఆది నుంచీ ప్రతికూల వాతావరణమే వెంటాడింది. భారీవర్షాలతో పల్లపు చేలల్లో నీరు నిలిచింది. కృష్ణానదికి వచ్చిన వరదతో లంక చేలల్లో వేసిన పైరు మునిగింది. ఈ చేలల్లో పంట చేతికొచ్చేది ఏమీ లేదని, అక్కడక్కడా దుంపకుళ్లు, తాటాకు తెగులు సోకాయి. భూమిలో దుంప ఊరే సమయంలో అల్పపీడనం కారణంగా ముసురు వాతావరణం నెలకొనటం తెలిసిందే. సూర్యరశ్మి పెద్దగా లేకపోవటం ప్రతికూలమని చెబుతున్నారు. ఈ కారణాలతో దిగుబడి ఈసారి తగ్గే అవకాశముందని భావిస్తున్నారు. దిగుబడి కొంత తగ్గినప్పటికీ మార్కెట్ ధర బాగుంటే రైతులు ఒడ్డున పడతారు. ప్రస్తుతం మార్కెట్లో ధర ఆశాజనకంగానే ఉంది. దుగ్గిరాల యార్డులో క్వింటా రూ.13–14 వేల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. పంట చేతికొచ్చేసరికి ధర పెరిగితే మేలు కలుగుతుంది. లేదా కనీసం క్వింటాలు రూ.14 వేలు ఉండాలని రైతులు కోరుకుంటున్నారు. నేను ఎకరం విస్తీర్ణంలో పసుపు సాగు చేశాను. సీజనులో రెండు నెలలపాటు కృష్ణానదికి వరదలు, అధిక వర్షాల కారణంగా భూమి ఆరలేదు. ప్రతికూల వాతావరణంలో పసుపు సరిగ్గా ఊరదు. పైగా దుంపకుళ్లు ఆశించింది. గత ఏడాది ఎకరంలో 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈసారి 20 క్వింటాళ్లకు మించదని అనుకుంటున్నా.. మార్కెట్ ధర కనీసం రూ.15–16 వేలు ఉండాలని కోరుకుంటున్నా. – వంగా అంజిరెడ్డి, పసుపు రైతు, మున్నంగి -
చంద్రబాబు స్వలాభం కోసమే అంజుమన్ భూముల కబ్జా
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): చంద్రబాబునాయుడు తన స్వలాభం కోసం ముస్లిం మైనార్టీలకు చెందిన అంజుమన్ భూములను కబ్జా చేసేందుకు కుట్ర పన్నుతున్నారని వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్బాషా మండిపడ్డారు. శనివారం గుంటూరు బస్టాండ్ వద్ద గల పార్టీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో 71.57 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు నోటిఫికేషన్ ఇవ్వడం బాధాకరమన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు వక్ఫ్బోర్డు భూములను కాపాడతానని చెప్పి.. ఇప్పుడు ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు కుట్ర పన్నడం దుర్మార్గమైన చర్య అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాగానే ఆ భూములు ఎంతటి బడా బాబుల వద్ద ఉన్నప్పటికీ స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. మైనార్టీ ఆస్తులను కాపాడేందుకు ఉద్యమం : అంబటి మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్కి భూదాహం పెరిగిపోతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. మైనార్టీ భూములను కాజేసే కుట్రకు వైఎస్సార్ సీపీ వ్యతిరేకమన్నారు. నారా లోకేష్ ప్రోద్బలంతోనే భూములను కాజేసీ ఇండస్ట్రీలకు అప్పగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 23న ముస్లీం మైనార్టీలంతా ఏకమై అంజుమన్ భూముల స్వాధీనానికి వ్యతిరేకంగా ఉద్యమించి, కలెక్టర్కు విన్నవించేందుకు తరలి రావాలని పిలుపు నిచ్చారు. మైనార్టీల ద్రోహి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ : నూరి ఫాతిమా ముస్లిం, మైనార్టీల ద్రోహి తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి నూరి ఫాతిమా పేర్కొన్నారు. ముస్లిం ఎమ్మెల్యే అయి ఉండి అంజుమన్ భూముల కాపాడే అంశంపై ఎంతో హేళనగా సమాధానం చెప్పడం చూస్తుంటే నసీర్ అహ్మద్ చేతకానితనం స్పష్టంగా అర్థమవుతుందన్నారు. అంజుమన్ భూముల్లో ఎమ్మెల్యే నసీర్కు స్వలాభం ఉంది కాబట్టే ఆ భూములను లాగేసుకుంటున్నప్పటికీ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ నెల 23న కలెక్టరేట్ రోడ్డులోని అంజుమన్ ఈద్గా వద్ద నుంచి భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. అంతే కాకుండా భూములను కాపాడేందుకు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు వివరించారు. వక్ఫ్ భూములను కాపాడతానన్న చంద్రబాబు ఇప్పుడు వాటిని కై ంకర్యం చేయాలని చూస్తున్నారు వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్బాషా -
గుంటూరు
ఆదివారం శ్రీ 11 శ్రీ జనవరి శ్రీ 2026పార్టీ నేతలతో విస్త్రృత స్థాయి సమావేశంతెనాలి: తెనాలి మార్కెట్యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1500, గరిష్ట ధర రూ.3200, మోడల్ ధర రూ.2400 వరకు పలికింది.విజయపురిసౌత్: నాగార్జునకొండకు శనివారం పర్యాటకులు పోటెత్తారు. లాంచీస్టేషన్కు రూ.2,73,950 ఆదాయం సమకూరినట్లు యూనిట్ మేనేజర్ కె.మస్తాన్బాబు తెలిపారు.లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లకు, నేరచరిత్ర కలిగిన వారికి శనివారం పోలీస్ మార్క్ కౌన్సెలింగ్ నిర్వహించారు. సాధారణ కౌన్సెలింగ్గా భ్రమించి– హాజరైన రౌడీషీటర్లు, నేరచరిత్ర కలిగిన వారికి పోలీస్ మార్క్ కౌన్సెలింగ్ రుచి చూపించినట్లు అదనపు ఎస్పీ రమణమూర్తి తెలిపారు. కౌన్సెలింగ్ అనంతరం, గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో లక్ష్మీపురంలోని ఎన్టీఆర్ స్టేడియం నుంచి మదర్ థెరిసా విగ్రహం వరకు పరేడ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజాశాంతికి భంగం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, ఎవరినీ ఉపేక్షించబోమని, చట్టానికి లోబడి నడుచుకోవాలని హెచ్చరించారు. అవసరమైతే పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాలు అమలు చేస్తామని హెచ్చరించారు. జిల్లాను ప్రశాంత జిల్లాగా ఉంచడమే లక్ష్యంగా, శాంతిభద్రతల పరిరక్షణ కోసం గుంటూరు జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగరంలోని పలువురు సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జుసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 557.20 అడుగులకు చేరింది. ఇది 225.9508 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 9,800, ఎడమకాలువకు 7,272, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 30,150, ఎస్ఎల్బీసీకి 2,200, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 49,722 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 49,722 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. పట్నంబజారు(గుంటూరుఈస్ట్): రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పాలన సాగుతోందని, ప్రజలు కూటమి పాలనపై పూర్తిస్థాయిలో విసిగిపోయారని వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యుడు టీజేఆర్ సుధాకర్బాబు పేర్కొన్నారు. గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, గుంటూరు పార్లమెంట్ జిల్లా పరిశీలకులు పోతిన మహేష్, పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా, తెనాలి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మంగళగిరి సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తాడికొండ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, ప్రత్తిపాడు సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజనారాయణ, షేక్ గులాం రసూల్లతో కలిసి విలేకరుల సమావేశంలో సుధాకర్బాబు మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి వైఎస్సార్ సీపీని బలోపేతం చేసే దిశగా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి మహాయజ్ఞం ప్రారంభించారని తెలిపారు. జనవరి ఐదు నుంచి ఫిబ్రవరి 18వ తేదీలోగా గ్రామ స్థాయి నుంచి డివిజన్, వార్డుల స్థాయి కమిటీల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా స్థానిక నేతలు, కార్యకర్తల నిర్ణయం మేరకు కమిటీలను, అధ్యక్షులను నియమిస్తామని తెలిపారు. రాష్ట్రంలో బాధ్యత కలిగిన ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్ సీపీ పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ పాలనలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని, పదవుల్లో సైతం వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవ్వటం తథ్యమన్నారు. సోషల్ మీడియాను బలోపేతం చేసి కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరుగని పోరాటం చేస్తున్నామన్నారు. సంస్థాగత నిర్మాణంపై దృష్టి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ సంస్థాగత నిర్మాణం చేయాలని వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. రానున్న 45 రోజుల్లో సంస్థాగత నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. వీటిపై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతామని వివరించారు. ఈనెల 17, 18, 19, తేదీల్లో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి, సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిస్తామన్నారు. ఇప్పటీకే అనేక నియోజకవర్గాల్లో కమిటీ నియామకం పూర్తయ్యిందని, త్వరితగతిన మిగతావి కూడా పూర్తి చేస్తామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సుధాకర్బాబుకు సంస్థాగత నిర్మాణ బాధ్యతలు అప్పజెప్పారని తెలిపారు. వైఎస్ జగన్ ఎక్కడకు వెళ్లినా ప్రజలు లక్షలాది మందిగా తరలివచ్చి బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. పూర్తిస్ధాయిలో పార్టీ బలోపేతం దిశగా కృషి చేస్తామమని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నేతలు మెట్టు వెంకటప్పారెడ్డి, ఈమని రాఘవరెడ్డి, నందేటి రాజేష్, పఠాన్ సైదాఖాన్, సీడీ భగవాన్, మామిడి రాము, పానుగంటి చైతన్య, శేషగిరి పవన్కుమార్, కేసరి సుబ్బులు, పల్లపు మహేష్, ఉడుముల పిచ్చిరెడ్డి, వినోద్, విఠల్, యార్లగడ్డ మదన్మోహన్, ఓర్సు శ్రీనివాసరావు, రమణి, ప్రభు తదితరులు పాల్గొన్నారు. Iవైఎస్సార్ సీపీ జిల్లా ముఖ్య నేతలు, జిల్లా కమిటీ నేతలతో శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో విస్తృత స్థాయి అంతర్గత సమావేశం నిర్వహించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యుడిగా నియమితులైన టీజేఆర్ సుధాకర్బాబు మాట్లాడుతూ సమష్టి కృషితోనే సంస్థాగత నిర్మాణం సాధ్యపడుతుందన్నారు. ఉగాదిలోగా పార్టీ క్యాడర్కు ఐడీ కార్డులు ఇవ్వాలన్నదే వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమన్నారు. -
చదువుతో పాటు క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రతి ఒక్క విద్యార్థి చదువుతో పాటు క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకుని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వైజాగ్ జిల్లా చోడవరం సబ్ రిజిస్ట్రార్ బలగ గీతాలక్ష్మి అన్నారు. శనివారం భాష్యం విద్యాసంస్థల ఆధ్వర్యంలో వికాస్నగర్లోని భాష్యం స్పోర్ట్స్ ఎరీనా మైదానంలో భాష్యం ఒలంపస్ పేరుతో భాష్యం సెంట్రల్ లెవల్ ఒలంపస్ క్రీడా పోటీలను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సబ్ రిజిస్ట్రార్ గీతాలక్ష్మి మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ జీవితాన్ని సమతుల్యం చేసుకోవాలన్నారు. క్రీడలతో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని ఎంచుకున్న రంగంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ భాష్యం ఒలంపస్ పేరుతో మూడు రోజులపాటు క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్, ఫైనల్స్ జరుగుతాయన్నారు. వీటిలో త్రోబాల్, కబడ్డీ, ఖోఖో, క్యారమ్స్, చెస్, రిలే రేస్ పోటీలు జరుగుతాయని, వీటితో పాటు భాష్యం క్రికెట్ లీగ్ పోటీల్లో 8 జోనల్ జట్లు పాల్గొంటాయన్నారు. తొలుత భాష్యం ఒలంపస్, భాష్యం జెండాలను ఎగురవేసి క్రీడాజ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఈసందర్భంగా క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పోటీల్లో గెలుపొందిన జట్లకు చైర్మన్ భాష్యం రామకృష్ణ ట్రోఫీలను అందజేశారు. భాష్యం విద్యాసంస్థల వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రామ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సింక్రోని గ్లోబల్ ఐటీ సొల్యుషన్స్తో వీవీఐటీయూ అవగాహన పెదకాకాని: విద్యార్థులకు జనరేటివ్ ఏఐపై శిక్షణ ఇంటర్న్ షిప్ అవకాశాల కొరకు ప్రముఖ బహుళ జాతీయ ఐటీ సంస్థ సింక్రోని గ్లోబల్ ఐటీ సొల్యుషన్స్ తో వీవీఐటీ విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు వీవీఐటీయూ ప్రొ–చాన్స్లర్ వాసిరెడ్డి మహదేవ్ తెలిపారు. మండల పరిధిలోని నంబూరులోగల యూనివర్సిటీలో శనివారం ప్రొ చాన్స్లర్ వాసిరెడ్డి మహదేవ్ మా ట్లాడుతూ ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులు, అధ్యాపకులకు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఇంజినీరింగ్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ డేటా ఇంజినీరింగ్ సాంకేతికపై శిక్షణ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు పరిశ్రమ అనుభవాన్ని అందించడానికి ఇంటర్న్షిప్ అందించేందుకు తోడ్పాటు ఇవ్వనున్నట్లు తెలిపారు. సింక్రోని సంస్థ సీఈఓ భాను కొంగల, వీవీఐటీయూ రిజిస్ట్రార్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వీవీఐటీయూ రిజిస్ట్రార్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి, అకడమిక్ డీన్ డాక్టర్ కె.గిరిబాబు, ప్లేస్మెంట్ డైరెక్టర్ ఎ.వెంకటేష్, ప్లేస్మెంట్ బృందం పాల్గొన్నారు. నగరంపాలెం(గుంటూరు వెస్ట్): రెండు వేర్వేరు గంజాయి కేసుల్లో 11 మందిని నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో కేసుల వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ముందస్తు సమాచారంతో శుక్రవారం అంకమ్మనగర్ ఇరిగేషన్ విభాగం కార్యాలయం వెనుక ఖాళీస్థలంలో నగరంపాలెం పోలీసులు తనిఖీలు చేపట్టారన్నారు. అదే రోజు రాత్రి లాల్పురం డొంకరోడ్డులోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం సమీపంలోని ఖాళీ స్థలంలోనూ తనిఖీలు కొనసాగాయన్నారు. ఈ క్రమంలో వారి వద్ద గంజాయి గుర్తించారన్నారు. దీంతో మొదటి కేసులో కొరిటెపాడు నాయుడుపేట మూడో వీధిలో ఉంటున్న మేడూరి హేమసాయిచంద్ అలియాస్ చందు, గౌతమీనగర్ మూడో వీధికి చెందిన ముత్తుకూరి సాయిరామ్, తన్నీరు నాగసాయి, హనుమయ్యనగర్ రెండు, మూడు వీధుల్లో ఉంటున్న మేళం ఏసుమూర్తి, షేక్.జానీబాషా, జొన్నలగడ్డ యువరాజుని రెండో కేసులో శ్రీనివాసరావుపేట అరవై అడుగుల రోడ్డులో ఉంటున్న పాలేటి సాల్మన్రాజు, నగరంపాలెం ఒకటో వీధికి చెందిన గుంజి హేమంత్రాజు, శ్రీనివాసరావుపేట 12వ వీధికి చెందిన సుంకర వంశీకృష్ణ, పట్టాభిపురం రెండో వీధిలో ఉంటున్న పాముల రఘురామ్, అడపాబజార్కు చెందిన షేక్ నాగుల్మీరాలను అరెస్ట్ చేశామన్నారు. ఆయా కేసుల్లో 4.4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఈ కేసులు చేధించిన నగరంపాలెం పీఎస్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐలు పి.రాంబాబు, రామచంద్రరెడ్డి, హెచ్సీ ఎం.దాసు, కానిస్టేబుళ్లు ఎస్కే.జాన్సైదా, శ్రీనివాసరావు, సిహెచ్.ఉదయచంద్, పి.గంగరాజు, ఎస్కె.షకీల్అహ్మద్, టాస్క్ఫోర్స్ బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలు అందించారు. మీడియా సమావేశంలో గుంటూరు పశ్చిమ డీఎస్పీ అరవింద్ పాల్గొన్నారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ మేడికొండూరు: మేడికొండూరులో పట్టాదారు పాసు పుస్తకాలను జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా పంపిణీ చేశారు. కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను మేడికొండూరు మండలం విశదల, వెలువర్తి, డోకిపర్రు గ్రామాల్లో శనివారం జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకంపై గల క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే భూమి వివరాలు తెలుస్తాయని చెప్పారు. ఈకేవైసీ పూర్తి అయ్యాకే పాసు పుస్తకం ముద్రించి జారీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 35,690 పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. డో శ్రీనివాసరావు, మండల ప్రత్యేక అధికారి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, తహసీల్దార్ గాలం రాఘవరావు పాల్గొన్నారు. 4.4 కిలోల గంజాయి స్వాధీనం పట్టుబడిన వారందరూ 30 ఏళ్ల లోపు వారే.. అందులో ఏడుగురు పాత నేరస్తులు.. వెల్లడించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ -
శతాబ్ది వేడుకలకు ముస్తాబు
చేబ్రోలు: ఇక్కడ విద్యాబుద్ధులను నేర్చుకొన్న ఎందరో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. మరికొందరు విదేశాల్లో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అదే చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ విద్యాభివర్థని సంఘం, కేసీ స్కూల్స్ ప్రత్యేకత. ఈ నెల 11వ తేదీన శతాబ్ది ఉత్సవాలకు ముస్తాబవుతున్నది. శత వసంత ఉత్సవాలకు సిద్ధమవుతున్న కొండవీటి కమిటీ పాఠశాలకు ఘన చరిత్ర ఉంది. అవతరణ ఇలా... శ్రీ విద్యాభివర్థని సంఘాన్ని మొదట తొమ్మిది మంది గ్రామపెద్దలతో గాదె హనుమారెడ్డి ప్రదానోపాధ్యాయులుగా 1925 డిసెంబర్17వ తేదీన ఏర్పాటు చేశారు. అలెగ్జాండ్రియా హిందూ హయ్యర్ ఎలిమెంటరీ స్కూల్గా 1925 డిసెంబర్ 25వ తేదీన ప్రాథమిక పాఠశాల స్థాపించారు. 1930లో మల్లాది గౌరీనాథశాస్త్రి హెచ్ఎంగా వ్యవహరించారు. అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలో మంత్రి బెజవాడ గోపాలరెడ్డి పాఠశాల నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ శిలాఫలకం నేటికీ ఉంది. 1941లో 26 మంది సభ్యులతో ఈ సంఘం రిజిస్టర్బాడీగా ఏర్పాటైంది. 1954 సెప్టెంబర్ 19వ తేదీ నుంచి కొండవీటి కమిటీ ప్రాథమిక పాఠశాలగా మార్చారు. సమరయోధుడు కొత్తరెడ్డిపాలెంకు చెందిన గాదె చిన్నప్పరెడ్డి ౖసైసెరా చిన్నప్పరెడ్డిగా పేరుగాంచారు. వీరి వంశస్థులు ఇప్పటికీ కరస్పాండెంట్లుగా కొనసాగుతున్నారు. తర్వాత రెండు పాఠశాలలను నిర్వహించటం ప్రారంభించారు. జాతీయస్థాయిలో గుర్తింపు చల్లా రామకృష్ణారెడ్డి కరస్పాండెంట్గా ఉన్న కాలంలో సుమారు 14 ఎకరాలను ఆటస్థలానికి సమకూర్చారు. 1960– 78 మధ్య ఆయన హెచ్ఎంగా ఉన్న కాలంలో పాఠశాలకు మంచి గుర్తింపు వచ్చింది. 1975లో ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు విద్యార్థులు ఎంపిక అయ్యారు. తరగతి గదులను మర్రి చెన్నారెడ్డి ప్రారంభించారు. విద్యార్థులు పలువురు వాలీబాల్ పోటీలలో రాష్ట్ర స్థాయిలో బంగారు పతకాలు సాధించారు. పాఠశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన డిజిటల్ రూం, అందులో అమర్చబడిన డిజిటల్ పరికరాలను ముఖ్య అతిథులు ప్రారంభించనున్నారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, ప్రభుత్వ పరీక్షల కార్యాలయం రిటైర్డు డైరక్టర్ ఆర్ సురేందర్రెడ్డిలు సావనీర్ ఆవిష్కరించున్నారు. -
ప్రారంభమైన నాటకోత్సవాలు
నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : కొత్త ప్రయోగాలకు వేదికగా గుంటూరు కళాపరిషత్ 28 ఏళ్లుగా సాగుతుందని కళాపరిషత్ అధ్యక్షుడు పీవీ మలికార్జునరావు అన్నారు. గుంటూరు మార్కెట్ కూడలిలోని శ్రీవెంకటేశ్వర విజ్ఙాన మందిరంలో మూడు రోజులపాటు జరగనున్న గుంటూరు కళాపరిషత్ 28వ వార్షిక నాటకోత్సవాలను శుక్రవారం అతిథులు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. సభకు అధ్యక్షత వహించిన పీవీ.మల్లికార్జునరావు మాట్లాడుతూ కళాపరిషత్ సమయపాలనతో ముందుకెళ్తుందని అన్నారు. ఎన్టీఆర్ కళాపరిషత్ అధ్యక్షుడు గుదే పాండురంగారావు, కార్యదర్శి అమ్మిశెట్టి శివలు మాట్లాడారు. సభను కార్యవర్గ సభ్యులు మురళీకృష్ణారావు, పరిషత్ ఉపాధ్యక్షులు ధనియాల గాంధీ, కార్యదర్శి అమ్మిశెట్టి శివ, కార్యవర్గ సభ్యులు రావుల అంజిబాబు, పరిషత్ ప్రధాన కార్యదర్శి బి.పూర్ణ, ఉపాధ్యక్షులు నాయుడు గోపి, కార్యదర్శి గుమ్మడి నాగేశ్వరరావు పర్యవేక్షించారు. మాయాజాలం నాటిక శర్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవా సంఘం(బొరివంక) ఆధ్వర్యంలో ప్రదర్శించగా, ఈ నాటికకు సలీం మూలకథ సమర్పించగా, కేకేఎల్ స్వామి దర్శకత్వం వహించారు. విజయవాడ సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో మమ్మల్నీ బతకనీయ్యండి నాటికను ప్రదర్శించగా, సుఖమంచి కోటేశ్వరరావు రచించి దర్శకత్వం వహించారు. -
ఏఎన్యూలో ఇండోనేషియా శాస్త్రవేత్తల బృందం
ఏఎన్యూ(పెదకాకాని): ఇండోనేషియాకు చెందిన నేషనల్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఏజెన్సీ(బీఆర్ఐఎన్) లోని రీసెర్చ్ సెంటర్ ఫర్ బయోమాస్–బయోప్రొడక్ట్స్కు చెందిన ప్రొఫెసర్ విద్యా ఫాత్రియాసారి, ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం, అమరావతి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్ అసోసియేట్ డీన్ డాక్టర్ ఎస్.రంగభాసియం శుక్రవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె. గంగాధరరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ భేటీలో వ్యర్థాల నిర్వహణ (వేస్ట్ మేనేజ్ మెంట్) విధానాలు, బయోవ్యర్థ పదార్థాల సమర్థ వినియోగం, వాటి ద్వారా విలువైన ఉత్పత్తుల తయారీ వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. బయోవ్యర్థాలను సుస్థిరంగా వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆర్థిక విలువను ఎలా సృష్టించవచ్చో ఈ చర్చలో ప్రధానంగా ప్రస్తావించారు. అనంతరం అతిథి బృందం ఎంఎస్సీ ఫారెస్ట్రీ విభాగం సందర్శించారు. ఈ కార్యక్రమాన్ని ఎం.ఎస్సీ ఫారెస్ట్రీ విభాగాధిపతి ప్రొఫెసర్ కె. మల్లికార్జున సమన్వయంతో నిర్వహించారు. -
మాదకద్రవ్యాల నివారణపై న్యాయ విజ్ఞాన సదస్సు
గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు జాతీయ యువజన దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఎకై ్సజ్ పోలీసులకు శుక్రవారం గుంటూరులో న్యాయ విజ్ఞాన సదస్సును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా వికసిత భారత్ వైపు అడుగులు వేయించే దిశగా అవగాహనా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రస్తుత సమాజంలో 10 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న విద్యార్థులు స్కూల్, కాలేజీల్లో మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారన్నారు. ప్రజలకు, విద్యార్థులకు మరింతగా అవగాహన కలిగించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అరుణకుమారి మాట్లాడుతూ మన సమాజంలో మాదక ద్రవ్యాలు చాప కింద నీరులా ప్రమాదకరంగా మారుతున్నాయని, మాదక ద్రవ్యాల నివారణకు ఇలాంటి అవగాహనా సదస్సులు మరింతగా ఉపయోగపడతాయని తెలిపారు. ప్యానెల్ అడ్వకేట్ కట్ట కాళిదాసు, ఎల్ఏడీసీ చీఫ్ సురేష్ బాబు, డెప్యూటీ ఎస్బీఏ ఝాన్సీలు యువతలో మాదక ద్రవ్యాల నివారణకు అవగాహన కలిగించారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నుంచి ప్రారంభించిన ర్యాలీ మెడికల్ కాలేజీ రోడ్ మీదుగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి జిల్లా కోర్టు వరకు కొనసాగింది. -
జిల్లా కోర్టు ఆవరణలో యువజనోత్సవాలు
గుంటూరు లీగల్: స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని జిల్లా కోర్టు ఆవరణలో గుంటూరు బార్ అసోసియేషన్ న్యాయవాదుల ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ యువజన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, గుంటూరు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి, అతిథులుగా జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. వీరికి బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవిత ఆశయాలను వివరించారు. జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాది చిగురుపాటి రవీంద్రబాబు రచించిన సంక్రాంతి పాట సీడీని విడుదల చేశారు. ఈ సభకు గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంగలశెట్టి శివ సూర్య నారాయణ అధ్యక్షత వహించారు. -
వైద్య కళాశాలలో ఫిజియాలజీ ఆధునికీకరణ
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాల ఫిజియాలజీ వైద్య విభాగం ఆధునికీకరణకు గుంటూరు వైద్య కళాశాల పూర్వ వైద్య విద్యార్థి, బ్రిందా హాస్పిటల్ అధినేత, బాహుబలి సర్జన్ డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి కుటుంబం రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. వారి విరాళంతో ఆధునికీకరించిన ఫిజియాలజీ వైద్య విభాగాన్ని శుక్రవారం డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి, డాక్టర్ అనిత దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. శాస్త్రవేత్త ఆర్ధర్ గైటన్ విగ్రహాన్ని డాక్టర్ శ్రీనివాసరెడ్డి దంపతులు ఆవిష్కరించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారీ, దాత డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ అకడమిక్ డాక్టర్ మాధవి, అడ్మిన్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, ఫిజియాలజీ విభాగాధిపతి డాక్టర్ మారుతి పాల్గొన్నారు. డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి కుటుంబం రూ.10లక్షల విరాళం -
జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు వడ్డేశ్వరం బాలిక ఎంపిక
తాడేపల్లి రూరల్ ః జాతీయస్థాయిలో జరగనున్న వాలీబాల్ పోటీలకు తాడేపల్లి రూరల్ వడ్డేశ్వరం జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన బాలిక ఎంపికయ్యింది. ఈ సందర్భంగా శుక్రవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాకుమాను జోజప్ప మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో గత డిసెంబర్నెలలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్ 14 వాలీబాల్ పోటీలలో గుంటూరు జిల్లా బాలికల జట్టు ప్రథమ స్ధానం సాధించిందని, ఈ జట్టులో తమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని సిహెచ్. నవీన జాతీయ జట్టుకు ఎంపికయ్యిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టీమ్ కెప్టెన్గా నవీన ఎంపిక కావడం అభినందనీయమని పేర్కొన్నారు. -
ప్రభుత్వ నర్సుల సంఘం కేలండర్ ఆవిష్కరించిన కలెక్టర్
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నర్సుల సంఘం జిల్లా క్యాలెండర్ను శుక్రవారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వెల్లంపల్లి పద్మ, జిల్లా కోశాధికారి పారాబత్తిన హేమలత, ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఎం.ఆషాలత, పుల్లగూర సునీత, జి.అరుణ, ఎ.భూలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిరూరల్ : గంజాయి అమ్ముతూ పట్టుబడిన మహిళకు న్యాయస్థనం మూడు సంవత్సరాలు జైలుశిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించింది. శుక్రవారం తాడేపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నులకపేటకు చెందిన చావల జ్యోతి గత ఏడాది మే 26వ తేదీన గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం అందగా అప్పటి ఎస్ఐ ప్రతాప్ తన సిబ్బందితో మహిళను అదుపులోకి తీసుకుని మూడు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. చార్జిషీటు దాఖలు చేసి శుక్రవారం కోర్టులో హాజరు పరిచారు. గుంటూరు న్యాయస్థానం పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం మహిళకు వెయ్యి రూపాయలు జరిమానా, మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు తెలిపారు. -
108లో.. సమ్మె సైరన్..
ఈ నెల 12 వరకు ప్రభుత్వానికి డెడ్ లైన్ ప్రత్తిపాడు:ప్రభుత్వం మారడం..కాంట్రాక్టు సంస్థను మార్చడం.. రూ.4 వేలు జీతం పెంచామంటూ జీవో.. అందులో రూ. 2 వేలు కోత విధించడం.. అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వకపోవడం, ఉద్యోగులను ఉన్నపళంగా తొలగించడం ఇలా.. చెప్పుకుంటూ పోతే సమస్యల చిట్టా చాంతాడంత. సమస్యలు సానుకూలంగా పరిష్కరించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం, కాంట్రాక్టు సంస్థ ఉద్యోగుల విషయంలో నిర్దయగా వ్యవహరిస్తుండటంతో గత్యంతరం లేక 108 ఉద్యోగులు డిమాండ్ల సాధనకు ఆందోళనబాట పట్టారు. 108 సిబ్బంది సమ్మె సైరన్ మోగించారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే సమ్మెబాట పడతామని స్పష్టం చేశారు. ఈ నెల 12 వరకు ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. అప్పటికి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే జిల్లా వ్యాప్తంగా అత్యవసర సేవలు నిలిపివేసి సమ్మె లోకి వెళ్లనున్నామని 108 ఉద్యోగులు అల్టిమేటం జారీచేశారు. ఈ మేరకు ఇప్పటికే సంబంధిత శాఖల జిల్లా ఉన్నతాధికారులతో పాటు కాంట్రాక్టు సంస్థకు కూడా సమ్మె నోటీసులను పలు దఫాలుగా అందజేశారు. చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుంచి 108 ఉద్యోగులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సంస్థను మార్చడం మొదలు పెంచామన్న జీతం జీవోకే పరిమితమవ్వడం, వైట్ యాప్రాన్ బదులు డ్రెస్ కోడ్ మార్చడం, ఆరునెలలుగా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నా పట్టించుకోకపోవడంతో వారికి సమ్మె అనివార్యంగా మారింది. ఇటీవల ఒకసారి చర్చలు జరిగినప్పటికీ, అందులో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో పరిష్కరించకుండా కాలయాపన చేస్తుండటంతో వారు మరోసారి సమ్మె బాట పట్టాలని నిర్ణయించారు. 108 వాహనాలు 22పైలెట్లు 45 108 సిబ్బందికి రూ. 4 వేలు పెంచుతూ చంద్రబాబు ప్రభుత్వం జీవో 49ను పునరుద్ధరించింది. అయితే కాంట్రాక్టు సంస్థ ఉద్యోగులకు నాలుగు వేలు చెల్లించకుండా సగం కోత విధిస్తుంది. ఉద్యోగులకు రూ. 2 వేలు మాత్రమే చెల్లిస్తూ మిగిలిన రెండు వేలు సీటీసీ కింద మినహాయిస్తుందని ఉద్యోగులు వాపోతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే వేటు వేస్తామని నిర్వహణ సంస్థ హెచ్చరిస్తుండటంతో సిబ్బందికి ఆందోళనే మార్గమైంది. -
అంకిత భావానికి అందలం
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): కష్టపడి పనిచేసి.. పార్టీ పట్ల నిబంద్ధతతో నిస్వార్థంగా ముందుకు సాగే ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం లభిస్తుందని శాసనమండలి సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. అంకితభావంతో ముందుకు సాగే వారిని అందలమెక్కించడంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుటారని, అందుకు పార్టీ లీగల్ విభాగం రాష్ట్ర జోనల్ వర్కింగ్ అధ్యక్షుడిగా పోలూరి వెంకటరెడ్డి నియామకమే నిదర్శమన్నారు. పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన పోలూరి వెంకటరెడ్డి అభినందన సభ శుక్రవారం గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని ఎమ్మెల్సీ కార్యాలయంలో లీగల్ విభాగం జిల్లా అధ్యక్షుడు సీడీ భగవాన్ అధ్యక్షతన నిర్వహించారు. పోలూరిని ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ఏర్పాటు కాక ముందే.. గుంటూరులో వైఎస్సార్ లీగల్ సెల్ ఏర్పాటు చేసిన ఘనత పోలూరి సొంతమన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత, వైఎస్ జగన్ను ఒంటరి చేసి వేధిస్తున్న సమయం నుంచే ఆయన వెన్నంటి నడిచిన అతి కొద్ది మందిలో పోలూరి ఒకరని తెలిపారు. ఆ తర్వాత పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి పూర్తి అంకితభావంతో పార్టీ అభ్యున్నతికి కృషి చేశారన్నారు. పదవులతో పని లేకుండా పార్టీ కోసమే నిస్వార్థంగా పనిచేయడం ఆయన నైజమని ప్రశంసించారు. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత నేతలు, కార్యకర్తలపై ప్రస్తుత ప్రభుత్వం అక్రమ కేసులు, అరెస్టులతో వేధిస్తుంటే... ఇతర న్యాయవాదులతో కలిసి వారికి పోలూరి అండగా నిలుస్తున్న తీరు అభినందనీయమన్నారు. లీగల్ విభాగం రాష్ట్ర జోనల్ వర్కింగ్ అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ తనకు లభించింది అలంకారప్రాయమైన పదవి కాదని.. ఇదొక బాధ్యతన్నారు. అధికారంలో ఉన్నామన్న అహంతో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో వేధించాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. వారి తరుపున రాజీలేని న్యాయ పోరాటానికి లీగల్ సెల్ ముందుంటుందన్నారు. తన నియామకానికి కృషి చేసిన వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, మనోహర్రెడ్డి, అంబటి రాంబాబు, అన్నాబత్తుని శివకుమార్, బలసాని కిరణ్కుమార్, నూరి ఫాతిమా, అంబటి మురళీకృష్ణ, వనమా బాల వజ్రబాబు, దొంతిరెడ్డి వేమారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సీఈసీ సభ్యులు మంద పాటి శేషగిరిరావు, గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్, ఉమ్మడి గుంటూ రు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బత్తుల దేవానంద్, న్యాయవాదులు పోకల వెంకటేశ్వర్లు, వేముల ప్రసాద్, మంజుల, శ్యామల, వెంకటరమణ, చల్లా క్రాంతి, వినయ్, బాబూరావు, కాసు వెంకటరెడ్డి, సుదర్శన క్రాంతి, కల్లం రమణారెడ్డి, వాసం సూరిబాబు, సయ్యద్ బాబు, విన్ని, సీహెచ్ సౌజన్య, చందు చంద్రశేఖర్రెడ్డి, బాలాజీ చక్రవర్తి, కార్పొరేటర్లు ఈచంపాటి వెంకటకృష్ణ, షేక్ రోషన్, యక్కలూరి కోటిలింగారెడ్డి, పడాల సుబ్బారెడ్డి, బోడపాటి కిషోర్, అచ్చాల వెంకటరెడ్డి, ఓర్సు శ్రీనివాసరావు, సురసాని వెంకటరెడ్డి, షేక్ రబ్బానీ, యేరువ నర్సిరెడ్డి పాల్గొన్నారు. -
నృసింహుని ఆలయంలో సంక్రాంతి సంబరాలు
మంగళగిరి టౌన్ : మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్కుమార్ పేర్కొన్నారు. దేవస్థానంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్వామివారి కల్యాణ మైదానంలో 11వ తేదీన సంక్రాంతి సంబరాలు జరుగుతాయని తెలిపారు. ఇందులో భాగంగా ముగ్గుల పోటీలు, చిన్నారులకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, గాలిపటాలు ఎగురవేత నిర్వహిస్తారని చెప్పారు. 12వ తేదీన రంగవల్లుల పోటీలు జరుగుతాయని, పాల్గొనదలచిన వారు మధ్యాహ్నం 1 గంటలోపు పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. దేవస్థాన ఆవరణలో ఆ పోటీలు జరుగుతాయని తెలిపారు. ఆ రోజు నమోదు చేసుకోని వారు 13వ తేదీన శివాలయంలో జరిగే రంగవల్లుల పోటీలకు పేర్లు నమోదు చేసుకుని పాల్గొనవచ్చని అన్నారు. 14వ తేదీన దేవస్థానం ఎదుట భోగిమంటల కార్యక్రమం జరుగుతుందని, అలాగే మొట్టమొదటి సారిగా దేవస్థానంలో నైరుతిలో ఉన్న కొట్టాయి మండపంలో సామూహిక గోదా కల్యాణం నిర్వహించనున్నామని, ఇప్పటికి 50 మంది దంపతులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, మరో 20 మంది దంపతులను అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. 15వ తేదీన గంగిరెద్దులు, పిట్టలదొర, హరిదాసు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, 16వ తేదీన సామూహిక గోపూజ, శ్రీ స్వామివారు, అమ్మవార్ల పారువేట ఉత్సవంతో సంక్రాంతి సంబరాలు ముగుస్తాయని ఆయన తెలిపారు. రంగవల్లుల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామని తెలిపారు. -
రాయి గరుడుడు అలంకరణలో శ్రీవారు
సత్తెనపల్లి: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని సత్తెనపల్లి పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్లోగల అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో శుక్రవారం శ్రీవారిని రాయిగరుడుడుగా అలంకరించి ప్రత్యేక పూజలు, గోత్రనామాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు చిత్రకవి శ్యాము ఆచార్యులు మాట్లాడుతూ రాయిగరుడు విశిష్టతను వివరించారు. రేపు ఉపకార వేతనాలు పంపిణీ గుంటూరు ఎడ్యుకేషన్: కాకతీయ స్టూడెంట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈనెల 11న ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.61 లక్షల ఉపకార వేతనాలు పంపిణీ చేస్తున్నట్లు సొసైటీ చైర్మన్ డాక్టర్ కొండబోలు బసవపున్నయ్య తెలిపారు. శుక్రవారం గుంటూరులోని డాక్టర్ కేఎల్పీ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు సహాయ, సహకారాలను అందించే ఆశయంతో 2003లో సొసైటీని ప్రారంభించినట్లు చెప్పారు. ఈనెల 11న కేఎల్పీ పబ్లిక్ స్కూల్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న 23వ ఉపకార వేతన పంపిణీ కార్యక్రమంలో భాగంగా డిగ్రీ, పీజీ చదువుతున్న 440 మంది విద్యార్థులకు రూ.61 లక్షలు చెక్కుల రూపంలో పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి సీసీఎల్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చల్లా రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా రానున్నారని చెప్పారు. సొసైటీకి రూ.కోటి విరాళాన్ని అందజేసిన కెనడాకు చెందిన ముఖ్యదాత డాక్టర్ పుట్టగుంట వేణుగోపాలరావు కుమార్తె డాక్టర్ పుట్టగుంట లక్ష్మి హాజరవుతున్నట్లు చెప్పారు. సమావేశంలో సొసైటీ కార్యదర్శి డాక్టర్ కె.కృష్ణప్రసాద్, బొప్పన ద్వారకాప్రసాద్, వడ్లమూడి గోవర్ధనరావు, నామినేని కోటేశ్వరరావు, రామారావు పాల్గొన్నారు. బీఆర్ స్టేడియం అభివృద్ధికి రూ. 14 కోట్లు మంజూరు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని గుంటూరు వెస్ట్ (క్రీడలు): గుంటూరు నగరంలోని ప్రఖ్యాత బ్రహ్మానందరెడ్డి స్టేడియం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.14 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్టేడియం అభివృద్ధి కోసం గతంలో రూ.170 కోట్ల క్రీడా మౌలిక వసతుల ప్రతిపాదనలు పంపామని పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఖేలో ఇండియా పథకం కింద మల్టీ–స్పోట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఈ నిధులు మంజూరు చేసిందన్నారు. దీంతోపాటు దశల వారీగా నిధులను సేకరిస్తామని తెలిపారు. ఈ నిధులతో విశాలమైన స్టేడియం అభివృద్ధి చెంది ఔత్సాహిక క్రీడాకారులు అందుబాటులోకి వస్తారన్నారు. పశ్చిమ డెల్టాకు నీటి విడుదల దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి పశ్చిమ డెల్టాకు 2,519 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 11.5 అడుగుల నీటిమట్టం స్థిరంగా ఉంది. బ్యాంక్ కెనాల్ 150 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 267, పశ్చిమ కాలువకు 60, నిజాంపట్నం కాలువకు 31, కొమ్మూరు కాలువకు 1,360 క్యూసెక్కులు విడుదల చేశారు. -
రెక్కలు రాని ప్రేమలు
తెనాలి: పదవ తరగతి విద్యార్థి ప్రేమపాఠాలు...ఆ పేరుతో డబ్బు వసూలు...నూతన సంవత్సరం వేడుకలకు చేయి కోసుకుంటాననీ, టీసీ తీసుకు వెళ్లిపోతానని బెదిరింపులు...ఆ ఒత్తిడి తట్టుకోలేక, డబ్బులు ఇవ్వలేక మానసిక క్షోభకు గురైన తొమ్మిదవ తరగతి విద్యార్థిని ఎలుకల మందు తిని ఆసుపత్రి పాలైంది. ఏడు రోజులపాటు నరకం చూసి చివరకు మృతి చెందింది. కన్న తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చింది. మైనారిటీ తీరకుండానే ప్రేమపురాణాలు .. తెనాలి నియోజకవర్గంలో గత పది నెలల్లో దాదాపు 22 మంది బాలికలు అదృశ్యమైనట్టు కేసులు నమోదయ్యాయి. ఇద్దరు పెళ్లి చేసుకుని తిరిగొచ్చారు. మిగిలిన వాటిలో ఒకటి మినహా అన్నీ తెలిశాయి. వీటిలో ఎక్కువశాతం ప్రేమ నేపథ్యమే. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. బంగారు భవిష్యత్ కోసం ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని చేరుకునేలా కష్టపడాలి. ప్రేమ అంటూ చిన్న వయసులో భవిష్యత్తును నాశనం చేసుకోకూడదు. ప్రేమ పేరిట మైనర్ను వేధించినా, ఇద్దరికీ ఇష్టమేనని ప్రేమ పేరుతో మైనర్ల వెంట పడినా పోక్సో కేసు నమోదు చేస్తాం. మైనర్ను పెళ్లి చేసుకున్నా నేరమే. పోక్సో యాక్టు కింద శిక్ష తప్పదు. – బి.జనార్ధనరావు, తెనాలి డీఎస్పీ -
ప్రతి దస్త్రం ఈ–ఆఫీస్ ద్వారానే జరగాలి
గుంటూరు వెస్ట్: ప్రతి దస్త్రం ఈ–ఆఫీస్ ద్వారానే నడవాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశమందిరంలో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖపై ప్రజల సానుకూల దృక్పథం పెరగాలన్నారు. పీజీఆర్ఎస్ను పక్కాగా అమలు చేయాలని వెల్లడించారు. తప్పుడు ఎండార్స్మెంట్లు ఇవ్వకూడదన్నారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నివేదికలు సమర్పించాలన్నారు. ఒకే అంశం పట్ల పలుమార్లు దస్త్రాలు తిప్పరాదని చెప్పారు. ప్రభుత్వం కొన్ని అధికారాలను తహసీల్దార్లకు బదలాయించిందని, వాటిని వినియోగించడంలో ప్రజలకు మేలు కలిగే విధంగా ఉండాలన్నారు. గృహ నిర్మాణాల వారీగా లే అవుట్ వివరాలు, ప్రస్తుతం ఉన్న లబ్ధిదారుల వివరాలపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కారుణ్య నియామకాలు, పింఛన్ల పరిష్కారంలో ఎటువంటి జాప్యం లేకుండా చూడాలన్నారు. రెవెన్యూ అంశాలను పూర్తి నిర్ధారణతో పరిశీలించి పనిచేయాలని సూచించారు. ఓటరు జాబితా పునశ్చరణపై దృష్టి సారించాలన్నారు. ఆదివారం నాటికి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రెవెన్యూ క్లినిక్ల ద్వారా రెవెన్యూ భూ సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ రికార్డులు డిజిటలైజేషన్ కావాలన్నారు. ముందుగా రికార్డుల జాబితా తయారు చేయాలని పేర్కొన్నారు. పత్రాన్ని పక్కాగా స్కాన్ చేయడంతోపాటు పేజీల సంఖ్య తప్పిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో షేఖ్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, డెప్యూటీ కలెక్టర్లు లక్ష్మీకుమారి, శ్రీనివాస్, పార్థసారథి పాల్గొన్నారు. కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు కోడి పందేలు చట్ట రీత్యా నేరమని, వాటిలో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా హెచ్చరించారు. జిల్లా సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కోడి పందేలు, ఎడ్ల పందేలు నిర్వహించే వారిపై జంతు హింస నిరోధక చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని అన్నారు. శనివారం అన్ని గ్రామాల్లో దండోరా వేయించాలని పేర్కొన్నారు. అన్ని గ్రామాల్లో పోస్టర్లు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని చెప్పారు. పందేలు నిర్వహించే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. జంతు సంక్షేమ సంఘాల సలహాలు సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఈనెల 14 నుంచి 31వ తేదీ వరకు జంతు సంక్షేమ పక్షోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పక్షోత్సవాల పోస్టర్ను కలెక్టర్ విడుదల చేశారు.విద్యతో పేదరికాన్ని సులభంగా జయించవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా విద్యార్థులకు తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాల నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రేరణ కల్పించే ‘విజయం మనదే‘ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటించారు. ప్రతి ఒక్కరూ స్టేట్ టాపర్ కావాలన్నారు. విజయం మనదే స్టడీ మెటీరియల్ను, విద్యా జ్యోతి గైడ్ను విద్యార్థులకు జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. -
గుంటూరు
శనివారం శ్రీ 10 శ్రీ జనవరి శ్రీ 2026అమ్మవారికి సారె సమర్పణ నరసరావుపేట ఈస్ట్: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం పాతూరులోని శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అమ్మవార్లకు భక్తులు సారె సమర్పించారు. నిమ్మకాయల ధరలు తెనాలి:తెనాలి మార్కెట్యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1300, గరిష్ట ధర రూ.2900, మోడల్ ధర రూ.2000 వరకు పలికింది. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 557.60 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 49,902 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. I -
స్కౌట్ శిక్షణతో సేవాభావం పెంపు
తాడికొండ: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో, పీఎంసీ పాఠశాలల్లో మహిళ ఉపాధ్యాయులకు గైడ్ కెప్టెన్, ఏడు రోజుల బేసిక్, అడ్వాన్స్ కోర్స్ శిక్షణ కార్యక్రమం గురువారం నిర్వహించినట్లు జిల్లా సెక్రటరీ ఎం.ఏడుకొండలు తెలిపారు. శిక్షణ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణకు హాజరైన వందమంది మహిళ ఉపాధ్యాయులను ఉద్దేశించి విద్యాశాఖ అధికారి డాక్టర్ సలీం బాషా మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల్లో స్కౌట్ ద్వారా సేవా భావాన్ని దేశభక్తిని క్రమశిక్షణ పెంపొందించాలన్నారు. విద్యార్థుల్లో తగ్గుతున్న నైతిక విలువలను పెంపొందించడానికి స్కౌట్ ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. సంక్రాంతి సెలవుల అనంతరం జనవరి 20 నుంచి పీఎం శ్రీ పాఠశాల స్కౌట్స్ అండ్ గైడ్స్ బాల బాలికలకు ఐదు రోజుల ద్వితీయ సోపానం శిక్షణ కార్యక్రమం డివిజన్లవారీగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రధానోపాధ్యాయులు, స్కౌట్ ఉపాధ్యాయులు విద్యార్థులను సంసిద్ధం చేసి పంపించాలని సూచించారు. కార్యక్రమంలో 66మంది బేసిక్ 34 మంది అడ్వాన్స్ కోర్సుకు హాజరయ్యారని కోర్సు లీడర్ ఎస్ఓటీ ఉమాదేవి తెలియజేశారు. కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ కామాక్షి, రిసోర్స్ పర్సన్స్ మహాదేవమ్మ, శకుంతల, గిరిజాకుమారి, వర కమలాదేవి, ఎస్ఓసీ శ్రీనివాసరావు, స్కౌట్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఉద్యాన, పట్టు పరిశ్రమలతో రైతులకు సుస్థిర ఆదాయం
●ఏపీ వ్యవసాయ కమిషనరేట్, ఉద్యాన, పట్టు పరిశ్రమ డైరెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు ●విజ్ఞాన్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు చేబ్రోలు: సంప్రదాయ పంటలతోపాటు ఉద్యాన పట్టు పరిశ్రమల సాగును చేపట్టడం ద్వారానే రైతులకు ఏడాది పొడవునా సుస్థిర ఆదాయం లభిస్తుందని ఏపీ వ్యవసాయ కమిషనరేట్, ఉద్యాన, పట్టు పరిశ్రమ డైరెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు (ఐఏఎస్) అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ విభాగం, రైతు నేస్తం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రైతుశ్రేయస్సే కేంద్రంగా సంక్రాంతి సంబరాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఏపీ వ్యవసాయ కమిషనరేట్, ఉద్యాన, పట్టు పరిశ్రమ డైరెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు తక్కువ నీటితో ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే మామిడి, జామ, అరటి వంటి పండ్ల తోటల సాగుపై దృష్టి సారించాలని కోరారు. రైతు ఆదాయం రెండింతలు చేయడం లక్ష్యంగా స్కిల్ డెవలప్మెంట్, రైతు క్లబ్బులు, రైతు సమాఖ్యల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిరంతరంగా నిర్వహిస్తున్నామన్నారు. ఏపీ అటవీ శాఖ ప్రభుత్వ సలహాదారు ఎం.మల్లికార్జునరావు మాట్లాడుతూ సామాజిక అడవుల పెంపకంతో రైతులకు అదనపు ఆదాయం చేకూరుతుందన్నారు. విజ్ఞాన్ యూనివర్సిటీ వైస్ చైర్మన్ లావు శ్రీకష్ణదేవరాయలు మాట్లాడుతూ విద్యార్థులే ఈ దేశ భవిష్యత్ ఆస్తి, జ్ఞానం, నైపుణ్యం, నైతిక విలువలతో ముందుకు వచ్చిన యువత భారత్ను మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. విజ్ఞాన్ యూనివర్సిటీ చాన్స్లర్ డాక్టర్ పావులూరి సుబ్బారావు మాట్లాడుతూ భారతీయ ఆర్థిక వ్యవస్థకు మూలాధారమైన వ్యవసాయ రంగం, ఆధునిక సాంకేతికతతో జోడించబడినప్పుడే రైతు ఇంట నిజమైన సంక్రాంతి వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సంప్రదాయ హరిదాసు, కొలాటాలు, గంగిరెద్దుల ఆటలు, సాంస్కతిక నత్యాలతో సంక్రాంతి పండుగ సందడిని విద్యార్థులు, పాల్గొన్న అతిథులు ఆనందంగా ఆస్వాదించారు. రైతులకు ప్రత్యేక సన్మానాలు నిర్వహించి, పంటల ప్రదర్శనలు, వరి, సిరిధాన్యాలు, అపరాలు, నూనెగింజలు, పత్తి, వాణిజ్య పంటలు, మిరప, ఆయిల్ ఫామ్, కూరగాయలు, పండ్లు, అగ్రో ఫారెస్ట్రీ, పశుపోషణ కోళ్ల పెంపకం, మత్య్సోత్పత్తి వంటి 12 పంటలపైన వ్యవసాయ సాంకేతిక అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. సుమారు 250 మంది రైతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చానన్స్లర్ డాక్టర్ కె.ధనుంజయరావు, ఐసీఏఆర్ డైరెక్టర్, ఉపకులపతి డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు, వైస్ చాన్స్లర్ పి. నాగభూషణ్, వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంవీ రావు, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వర రావు, ఐసీఏఆర్–ఐఐఎమ్ఆర్ డైరెక్టర్ డా.తార సత్యవతి, ఐసీఏఆర్–ఎన్ఐఆర్సీఏ(రాజమండ్రి) డైరెక్టర్ డాక్టర్ ఎం. శేషు మాధవ్ ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, రైతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
దేశ విజ్ఞాన సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటిన నాగార్జునుడు
ఏఎన్యూ(పెదకాకాని): ప్రాచీన భారత విజ్ఞాన చరిత్రలో ఆచార్య నాగార్జునుడికి విశిష్ట స్థానం ఉందని వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కంచర్ల గంగాధరరావు అన్నారు. వర్సిటీ రసాయనశాస్త్ర విభాగం, సెంటర్ ఫర్ ఆంధ్ర ప్రదేశ్ స్టడీస్ సంయుక్త ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జునుడి ఆల్కెమికల్ వారసత్వం–సంప్రదాయిక, ఆధునిక దృక్పథాలు అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు గురువారం ముగిసింది. ముగింపు సభకు జాతీయ సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ దిట్టకవి రామచంద్రన్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వర్సిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య కంచర్ల గంగాధర్రావు మాట్లాడుతూ మెటలర్జీ, కెమికల్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాలలో ఆయన ఆలోచనలు ప్రేరణగా మారాయన్నారు. ఆయుర్వేదం, సిద్ధ వైద్యం వంటి రంగాలపై ఆయన ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ రామచంద్రన్ మాట్లాడుతూ తమిళనాడు, కేరళ, తెలంగాణ, న్యూఢిల్లీ, కర్ణాటక వంటి పలు రాష్ట్రాల నుంచి సుమారు 300 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొని, పరిశోధన పత్రం సమర్పించారని తెలిపారు. జబల్పూర్, మంగళాయతన్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు మాట్లాడుతూ ప్రయోగాత్మక దృక్పథం, పరిశీలన పద్ధతులు, శాసీ్త్రయ తత్వం నాగార్జునుడి రచనలలో స్పష్టంగా కనిపిస్తాయన్నారు. చాణిక్య ఎడ్యుకేషన్ హబ్ ప్రతినిధి డాక్టర్ ఇంకుర్తి వెంకట్ మాట్లాడుతూ శాసీ్త్రయ పరిశోధనలో కృత్రిమ మేధస్సు దోహదపడుతుందన్నారు. అనంతరం పరిశోధన పత్రాలు సమర్పించిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.సింహాచలం, వర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి రోశయ్య, ఓఎస్డి ఆచార్య ఆర్విఎస్ఎస్ఎన్ రవికుమార్, పాలకమండలి సభ్యులు సీహెచ్ ఏపీ రామేశ్వరరావు, నూట అధ్యక్షులు ప్రొఫెసర్ బ్రహ్మాజీ, ప్రొఫెసర్ సుబ్బారావు, ప్రొఫెసర్ రమేష్ రాజు, జాతీయ సదస్సు కో కన్వీనర్ ప్రొఫెసర్ పి.సుధాకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బిహెచ్.మల్లికార్జునరావు, జనరల్ సెక్రెటరీ బి.సత్యనారాయణ, ట్రెజరర్ డాక్టర్ పి.భరత్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్య కార్డుల్లో డిజిడల్!
గుంటూరు జీజీహెచ్లో కేంద్ర ప్రభుత్వ పథకం అమలుపై నిర్లక్ష్యం గుంటూరు మెడికల్: ఆధార్ కార్డు నంబర్ మాదిరిగానే అబా నెంబర్ను ఆన్లైన్లో ఎంటర్ చేయగానే రోగి చికిత్సకు సంబంధించిన పూర్తి సమాచారం వస్తుంది. తద్వారా దేశంలో ఏ ఆస్పత్రికి వెళ్లినా హెల్త్ ఫైల్ అంతా ఈ కార్డు నెంబర్తో వైద్యులకు తెలిపి, తగిన చికిత్స పొందవచ్చు. రోగికి పూర్తి సమాచారం అబా హెల్త్ కార్డు ద్వారా చికిత్స అందించే ఇతర వైద్యులకు సైతం తెలుస్తుంది. వైద్యులు కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా, పలుమార్లు పరీక్షలు చేయకుండా రోగికి సత్వర చికిత్స అందించి ప్రాణాలు కాపాడవచ్చు. ఒకసారి అనారోగ్యం వచ్చి చికిత్స చేయించుకున్న తరువాత తగ్గిన తర్వాత మళ్లీ సమస్య వస్తే అబా హెల్త్ కార్డు నెంబర్తో తక్షణమే వైద్య సేవలు ప్రారంభించవచ్చు. ఇలా రోగి చికిత్సలో ఎంతో కీలక పాత్ర పోషించే ఈ కార్డులను గుంటూరు జీజీహెచ్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. కేవలం ఓపీలో పేరు నమోదు కోసం అబా హెల్త్ కార్డు ఓపెన్ చేసి ఇక ఎలాంటి సమాచారం అందులో నమోదు చేయడం లేదు. ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశించినా.. ఈ మిషన్ పనితీరుపై గత ఏడాది నవంబర్ 30న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్గౌర్ గుంటూరు జీజీహెచ్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కోసం రోగులు పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా చూశారు. కేవలం ఓపీ చీటీ తీసుకోవటం కోసమే అరగంటకు పైగా ఒక్కో రోగి సమయం వెచ్చిస్తున్నారు. ఈ విషయాన్ని పరిశీలించి ఓపీ చీటీ తీసుకునే సమయం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేటికీ రోగులను అవే బాధలు వెంటాడుతున్నాయి. స్వయంగా ఓపీ చీటీని సాధారణ రోగిలా తీసుకుని వార్డులో వైద్యుల వద్దకు సౌరభ్గౌర్ వెళ్లి వైద్యులు సదరు వివరాలు ఆన్లైన్ హెల్త్ కార్డులో నమోదు చేయటం లేదని గుర్తించారు. కేవలం ఓపీ చీటీ మాత్రమే ఎన్రోల్ చేయటాన్ని తప్పుబట్టారు. ఆన్లైన్ హెల్త్ కార్డులో వివరాలన్నీ నమోదు చేయాలని గుంటూరు జీజీహెచ్ అధికారులకు ఆదేశించినా బేఖాతర్ చేస్తున్నారు. నిధులు ఏమయ్యాయి? డిజిటల్ హెల్త్ ఐడీ కార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తుంది. గుంటూరు జీజీహెచ్కు 2023లో రూ.84 లక్షలు మంజూరు చేసింది. కార్డులు ఎక్కువ సంఖ్యలో చేసినందుకు ఈ నిధులు ఇచ్చింది. దేశ వ్యాప్తంగా అబా హెల్త్ ఐడీ కార్డులు ఎక్కువ చేసిన యూపీలోని ప్రయాగ్రాజ్ స్వరూప్రాణి జవహర్లాల్నెహ్రూ హాస్పటల్కు ప్రథమ స్థానం రాగా, గుంటూరు జీజీహెచ్కు దేశంలో రెండో స్థానం లభించింది. ఆధార్ను అనుసంధానం చేస్తూ అబా హెల్త్ కార్డులు ఇస్తున్నారు. నాడు విడుదల చేసిన నిధులతో కొన్ని కంప్యూటర్లు కొనుగోలు చేశామని ఆస్పత్రి అధికారులు లెక్కల్లో చూపించారు. ఆ కంప్యూటర్లు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. నేటి వరకు లెక్క లేదు. హెల్త్ సెక్రటరీ ఆదేశాలతో డిజిటల్ హెల్త్ ఐడీలు చేసేందుకు కంప్యూటర్లు లేవని కుంటిసాకులు చెబుతూ ఆస్పత్రి అధికారులు కాలం నెట్టుకొస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాన్ని, రోగులకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమాన్ని నీరు గారుస్తున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికై నా స్పందించి జీజీహెచ్లో హెల్త్ ఐడీ కార్డులు పూర్తి స్థాయి వివరాలతో నమోదు అయ్యేలా, ఓపీ చీటీల వద్ద జాప్యం లేకుండా త్వరగా చూడాలని పలువురు కోరుతున్నారు. వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం వచ్చిన రోగిని ఏ డాక్టర్ పరీక్షించారు, ఏ పరీక్షలు చేశారు, ఏ మందులు ఇచ్చారు, వార్డులో చేరితే ఎలాంటి సేవలు అందాయి. భోజనం ఎంత బాగా పెట్టారు... ఇలా ప్రతి విషయం ఆన్లైన్లో నమోదు చేయాలని కేంద్రం పథకాన్ని ప్రవేశపెట్టింది. దాని పేరే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఇందులో భాగంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (అబా) ప్రక్రియ గుంటూరు జీజీహెచ్లో పేరుకు కూడా అమలు చేయడం లేదు. రోగుల వివరాలు ఆన్లైన్ కావడం లేదు. -
మొక్కజొన్నకు కత్తెర పోటు
ప్రత్తిపాడు: మొక్కజొన్న రైతులను కత్తెర పురుగు కలవరపెడుతుంది. పంటను కత్తెర పురుగు విస్తృతంగా ఆశించడంతో రైతులు అల్లాడిపోతున్నారు. పత్తిలో గులాబిరంగు పురుగు, మిర్చిలో నల్ల తామర పురుగు దెబ్బకు భయపడి.. ఈ ఏడాది రబీలో రైతులు మొక్కజొన్న వైపు ఆసక్తి చూపారు. అయితే ఊహించని విధంగా పంటపై కత్తెర పురుగు దాడి చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పురుగు ఆకులను కొరకడంతో పాటు మొవ్వను కూడా నాశనం చేస్తుంది. రైతులు అలసత్వం వహిస్తే 50 నుంచి 75 శాతానికి దిగుబడులపై పురుగు ప్రభావం పడే అవకాశాలున్నాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఈ రబీలో ఇప్పటికి గుంటూరు డివిజన్లో 2,838 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు. యాజమాన్య పద్ధతులతో.. రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా కొంత మేర పురుగు ఉధృతిని నివారించుకోవచ్చు. లోతు దుక్కులు దున్నుకుంటే పురుగు కోథస్థ దశలు నాశనం అవుతాయి. పైరు చుట్టూ నాలుగు వరుసలు నేపియర్ గడ్డిని ఎర పంటగా వేసుకోవాలి. ఎకరానికి 4–5 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. గుడ్ల సముదాయాలను గుర్తించి ఏరివేసి నాశనం చేయాలి. ఇప్పటి వరకు విత్తుకోని రైతులు విత్తనశుద్ధి చేసుకుని సయాంత్రలోలిపోల్, థయోమిథాక్సోమ్ను కిలో విత్తనాలకు ఐదు మి.లీ కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. రసాయన పద్ధతులు.. విషపు ఎరల ద్వారానూ.. పురుగు ఉధృతిని విషపు ఎరల ద్వారా కూడా నియంత్రించవచ్చు. 10 కిలోల తవుడును రెండు కిలోల బెల్లంతో రెండు లీటర్ల నీరు కలిపి రాత్రంతా పులియబెట్టి, రెండవ రోజు పులియబెట్టిన మిశ్రమంలో 100 గ్రాముల థయోడికార్బ్ మందును జోడించి సాయంత్రం వేళల్లో మొవ్వలో పడేట్లు పిచికారీ చేయాలి. మొక్కజొన్న పంటను సాగు చేసే రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి. కత్తెర పురుగు ఉధృతి అధికంగా ఉంది. యాజమాన్య పద్ధతులతో పురుగును నివారించకుంటే దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుంది. రైతులు అప్రమత్తంగా ఉండాలి. సాగు చేసిన పదిహేను రోజుల నుంచే గమనిస్తూ ఉండాలి. – ఎన్.మోహన్రావు, ఏడీఏ, గుంటూరు. -
కేఎల్యూలో ఐకాన్ ప్యాక్–2026 ప్రారంభం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ వడ్డేశ్వరం కేఎల్ యూనివర్శిటీ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ శుద్ధ, అనువర్తిత రసాయన శాస్త్ర సదస్సు (ఐకాన్ ప్యాన్ 2026) గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐఐటీ మద్రాస్కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ జి.రంగారావు, ప్రముఖ పదార్థ శాస్త్రవేత్త డాక్టర్ శ్వేత అగర్వాల్లు విచ్చేశారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థులు శుభ్రమైన శక్తి సాంకేతికతలు, క్వాటలిసిస్, శక్తి నిల్వ వ్యవస్థలు, పర్యావరణ పునరుద్ధణలో పదార్ధ రసాయన శాస్త్రం కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ అనువర్తనాలకు సంబంధించిన ఆధునిక కార్యాచరణ పదార్థాలలో జరిగిన తాజా ఆవిష్కరణలను వివరించారు. సదస్సు కన్వీనర్ నిరంజన్ పాత్ర ఐకాన్ ప్యాక్ 2026 యొక్క దృష్టి, లక్ష్యాలను వివరించారు. ఈ సదస్సు ద్వారా పరిశోధకులు, అధ్యాపకులు, పరిశ్రమ నిపుణులు ఒకే వేదికపై కలిసి అభిప్రాయాలను పంచుకుని, ఆధునిక పరిశోధనలను ప్రదర్శించి, సహకారాన్ని పెంపొందించుకునే అంతర్జాతీయ వేదికగా నిలుస్తుందని తెలిపారు. కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సదస్సులో కీ నోట్ ప్రసంగాలు, ఆహ్వానిత ఉపన్యాసాలు, మౌఖిక, పోస్టర్ ప్రదర్శనలు నిర్వహించబడుతాయని పేర్కొన్నారు.వర్శిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ జి.పార్ధసారధి వర్మ, ప్రో వీసీలు ఏవీఎస్ ప్రసాద్, ఎన్.వెంకట్రామ్, కె.రాజశేఖరరావు, రిజిస్ట్రార్ కె.సుబ్బారావు, విద్యార్థి సంక్షేమ విభాగం ఇన్చార్జి డీన్ కేఆర్ఎస్ ప్రసాద్, డీన్ ఎంహెచ్ఎస్ ఎం.కిషోర్బాబు, వివిధ సంస్థలకు చెందిన ప్రముఖ అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘సరస్’లో ఆకలి కేకలు
గుంటూరు: నగరంలో గత రెండు రోజులుగా జరుగుతున్న సరస్ అఖిల భారత డ్వాక్రాబజార్లో భోజనాలకు ఇబ్బందులు పడుతున్నామని స్టాల్స్లోని సిబ్బంది, ప్రాంగణంలో పనులు చేస్తున్న వారు వాపోతున్నారు. సిబ్బందికి సరిపడా భోజనాలను వండాలని కోరుతున్నారు. ప్రాంగణంలో సుమారు 300కు పైగా స్టాల్స్, వాటిలో ప్రతి షాప్కు కనీసం ఒకరిద్దరు, అదేవిధంగా పర్యవేక్షణకుగానూ మరో 300 మంది అధికారులు, సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారు. ప్రాంగణం పరిశుభ్రత నిర్వహణకు మరో 300 మంది ఉన్నారు. నగర మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిలో కూడా 400 మందిని అధికారులు కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో పూటకు కనీసం 700 నుంచి వెయ్యి మందికి భోజన వనతి కల్పించాల్సి ఉంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో వసతులు ఎలా ఉన్నా, మధ్యాహ్నం సమయంలో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని అధికారులు, సిబ్బంది వాపోతున్నారు. రూ.కోట్ల ప్రజా ధనాన్ని వెచ్చించి నిర్వహిస్తున్న కార్యక్రమంలో వసతులు కల్పించటంలో యంత్రాంగం విఫలమైందని సిబ్బంది చర్చించుకుంటున్నారు. మధ్యాహ్నం సమయంలో యంత్రాంగం ఒకటి రెండు స్టాళ్లను ఏర్పాటు చేస్తుండటం, టోకెన్లను సక్రమంగా పంపకపోవటం, ఒకొక్కసారి భోజనం అయిపోయి గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని అంటున్నారు. కూర ఉంటే భోజనం లేక, భోజనం ఉంటే కూర సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. దాదాపు మరో పది రోజులపాటు నిర్వహించాల్సిన ఈ కార్యక్రమంలో భోజనాలు సక్రమంగా ఏర్పాటు చేయకపోవటంతో మున్ముందు ఇబ్బందేనని పేర్కొన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ప్రారంభించిన కార్యక్రమంలోనే ఏర్పాట్లు ఇలా ఉంటే ఎలా అని సిబ్బంది పెదవివిరుస్తున్నారు. గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని పలువురు ఆవేదన -
● ఫిబ్రవరి 7, 8 తేదీల్లో నిర్వహణ ● అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన
యడ్లపాడు: చారిత్రక వారసత్వానికి నెలవైన కొండవీడు కోటపై ఫిబ్రవరి 7, 8 తేదీల్లో నిర్వహించనున్న ‘కొండవీడు ఫెస్ట్–2026’ ఏర్పాట్లపై కసరత్తు ప్రారంభమైంది. గురువారం వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు కొండవీడుకోటను సందర్శించి, ఉత్సవాల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలపై ప్రాథమిక పరిశీలన జరిపారు. ఉత్సవాలకు వచ్చే వారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపేలా చేపట్టాల్సిన ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ తీరుపై చర్చించారు. రవాణా సౌకర్యాలు, వేదికల ఏర్పాటు, పర్యాటకుల భద్రత వంటి అంశాలపై అధికారులు చర్చించారు. గత ఉత్సవాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి మెరుగైన వసతులు కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. సేకరించిన వివరాలను జిల్లా కలెక్టర్కు నివేదించనున్నట్లు అధికారులు వివరించారు. త్వరలోనే జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే సమక్షంలో అన్ని శాఖల అధికారులతో కలిసి తుది పరిశీలన ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్శనలో ఆర్డీవో మధులత, డీఎంహెచ్వో డాక్టర్ రవి, జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీధర్, ఆర్టీసీ ఆర్ఎం అజిత కుమారి, టూరిజం మేనేజర్ గంగిరెడ్డి నాయుడమ్మ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమణమ్మ, తహసీల్దార్ విజయశ్రీ, ఎంపీడీవో హేమలతాదేవి, తదితరులు పాల్గొన్నారు. -
తల్లడిల్లుతున్న ఉల్లి రైతు
తాడేపల్లి రూరల్: చంద్రబాబు సర్కారు హయాంలో ఉల్లి రైతులు నష్టాలతో తల్లడిల్లుతున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి గిట్టుబాటు ధరలు లేక అన్ని పంటల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఉల్లి రైతులు పెట్టిన పెట్టుబడులు రాక కన్నీరు పెడుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో వాణిజ్య పంటలు పండే పొలాల్లో కౌలు మొత్తం ఆకాశాన్ని అంటుతోంది. రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు కౌలు మొత్తం తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు ఆర్థికంగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. నియోజకవర్గంలో పెనుమాక, ఉండవల్లి, యర్రబాలెం, నవులూరు ప్రాంతాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. ఈ సంవత్సరంలో అధిక వర్షాల వల్ల, కొండవీటి వాగు వరదల వల్ల పంట దెబ్బతింది. రైతులు నారు వేసే సమయంలో కిలో ధర రూ. 50 నుంచి రూ. 60 ఉండగా, ప్రస్తుతం మార్కెట్లో రూ. 30 ఉంది. ఈ ప్రాంతంలో ఉల్లి దిగుబడి రాగానే దళారులు ఆ ధరను తగ్గించి కేజీ రూ.15కి కొంటున్నారు. టన్ను రూ. 15 వేలు మాత్రమే. దిగుబడి తగ్గడంతో రైతులకు పెట్టుబడి కూడా రాక రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు ఎకరాకు నష్టపోతున్నారు. కౌలు అదనంగా చెల్లించాల్సిందే. పెనుమాక, ఉండవల్లిలో ఎకరానికి రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు కౌలు తీసుకుంటున్నారు. ఉల్లి సాగు ప్రారంభించిన దగ్గర నుంచి రూ. 1.20 లక్షలు అవుతుందని రైతులు చెబుతున్నారు. పెనుమాకలో శ్రీనివాసరావు అనే రైతు ఉల్లి పీకి కోత కోయగా 4.5 టన్నులు అయ్యింది. టన్ను రూ. 15 వేలకు అమ్మగా.. సుమారు రూ.75 వేలు వచ్చాయి. రూ.50 వేల వరకు నష్టం వచ్చిందని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. భారీగా ఖర్చులు ఉల్లి రైతులు కనీసం రూ.50 వేలు కౌలుకు చెల్లిస్తున్నారు. దుక్కి దున్నడానికి, బోదులు వేయడానికి రూ.10 వేలు, ఉల్లినారు కొనుగోలుకు రూ.40 వేలు, నాట్లు వేయడానికి రూ.18 వేలు, ఎరువులకు రూ.18 వేలు, పురుగు మందులకు రూ.10 వేలు, కలుపునకు రూ.12 వేలు, ఉల్లి పీకడానికి, మోయడానికి రూ.16 వేలు ఖర్చు పెడుతున్నట్లు రైతులు తెలిపారు. బయట మార్కెట్లో రూ.30కి కిలో విక్రయిస్తుండగా , రైతుల వద్ద రూ. 15కు కొనుగోలు చేస్తున్నారు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అమరావతిని ప్రజల రాజధాని అంటే బాగుండేది
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతా మోహన్ లక్ష్మీపురం: చంద్రబాబు తెలుగు మహాసభల్లో అమరావతి దేవతల రాజధాని అని అనడం విడ్డూరంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకుడు చింతా మోహన్ అన్నారు. గుంటూరులో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తున్న నాకు మనుషులు, వాళ్ల కష్టాలు కనబడుతున్నాయే తప్ప, ఎక్కడ దేవతలు కనబడడం లేదన్నారు. ఎక్కడైనా రాజధాని నిర్మాణానికి వెయ్యి ఎకరాలు చాలని, అమరావతి రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాలు అవసరం లేదన్నారు. రాష్ట్రంలో 80 శాతం మంది ప్రజలు అమరావతి రాజధానిని కోరుకోవడం లేదన్నారు. రాజధాని ప్రాంతంలో రైతులు సంతోషంగా లేరన్నారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం దుర్మార్గమని విమర్శించారు. దివంగత సీపీఎం నేత హరికిషన్ సింగ్ సూర్జిత్ హృదయంలో నుంచి ఉపాధి హామీ చట్టం పుట్టిందని, దేశ స్వాతంత్య్రం కోసం, అంటరానితనానికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దేశంలో జ్యుడీషియల్ వ్యవస్థ బలహీన పడుతోందని చెప్పారు. కోర్టులలో ఆర్థికపరమైన అంశాలు, టెండర్లు, కాంట్రాక్టులు వంటి తగాదాలపై మాత్రమే కేసులు జరుగుతున్నాయని తెలిపారు. సామాజిక న్యాయంపై ఏమాత్రం విచారణ జరగడం లేదని చెప్పారు. సమావేశంలో దళిత నాయకుడు అన్నవరపు కిషోర్ పాల్గొన్నారు. గుంటూరు మెడికల్: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జటోతు హుస్సేన్ నాయక్ గురువారం గుంటూరు మెడికల్ కళాశాలను సందర్శించారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యునికి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. కళాశాల సిబ్బందిని పరిచయం చేశారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణతో మాట్లాడి ఆసుపత్రిలో ఏఏ సౌకర్యాలు వున్నాయి, ఇంకా ఏమైనా సౌకర్యాలు అవసరం అని అడిగి తెలుసుకున్నారు. జీజీహెచ్లో ట్రాన్స్ప్లాంట్ థియేటర్, స్టాఫ్ని నియమించాలని సూపరింటెండెంట్ కమిషన్ సభ్యుని దృష్టికి తీసుకువచ్చారు. మెడికల్ కాలేజీ, పీహెచ్సీలు, స్కూళ్లు, హాస్టల్ సందర్శించి అవసరమైన సౌకర్యాలను తెలుసుకుని ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని కమిషన్ సభ్యులు తెలిపారు. అనంతరం మెడికల్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఎస్టీ కమిషన్ – సమస్యలు, రోస్టర్ పాయింట్ సమస్యలు, స్కూల్స్, కాలేజీలలో ఏమైనా సమస్యలు వుంటే ఎస్టీ కమిషన్కు తెలియజేయాలన్నారు. షెడ్యుల్ జాతులకు న్యాయం జరుగకపోతే ఇరు పార్టీలను పిలిచి సమస్యను పరిష్కరిస్తామన్నారు. కోర్టులలో సత్వర న్యాయం జరగడం లేదని, కమిషన్ను ఆశ్రయిస్తున్నారన్నారు. సమాజం కోసం కమిషన్ పని చేస్తుందని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులు, ఎస్టీ సంఘ నాయకుల నుంచి వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ మాధవి, డాక్టర్ శ్రీధర్, కళాశాల ఉద్యోగులు, విద్యార్థులు, ఎస్టీ సంఘ నాయకులు పాల్గొన్నారు. -
వైభవంగా ఉరుసు మహోత్సవాలు
నగరంపాలెం: స్థానిక జీటీరోడ్డులో శ్రీహాజరత్ కాలే మస్తాన్ షా ఆవులియా 134వ ఉరుసు మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం బాబా సమాధి ప్రత్యేకంగా అలకరించారు. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. రాత్రికి గ్యార్మీ షరీఫ్ (ఖురాన్ పఠనం) చేపట్టారు. కార్యక్రమాలను ధర్మకర్త రావి రామ్మోహరావు పర్యవేక్షించారు. నగరంపాలెం: స్థానిక లక్ష్మీపురం శ్రీ త్యాగరాజ కళావేదికపై నిర్వహిస్తోన్న శ్రీత్యాగరాజస్వామి 179వ ఆరాధన సంగీత మహోత్సవాలు గురువారం ముగిశాయి. శ్రీత్యాగరాజ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో జరగ్గా, తొలుత శ్రీ త్యాగరాజస్వామికి శ్రీకాంత్ బృందంచే నాదస్వరం, ఉంఛవత్తి, పంచామృతాభిషే కార్చన, విశేష అలంకరణతో ప్రారంభించారు. శ్రీత్యాగరాజ స్వామిని పల్లకీలో కళాకారులు, సంగీతజ్ఞులు, ఔత్సాహికులు శ్రీత్యాగరాజ పంచరత్న కీర్తనల గానంతో తిరు వీధులలో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం స్థానిక, స్థానికేతర కళాకారులతో పంచరత్న సేవ విశేష హారతి, అన్న ప్రసాద వితరణ చేశారు. సాయంత్రం నాట్యాచార్య డాక్టర్ కాజా వెంకటసుబ్రహ్మణ్యం శిష్య బృందం చే ప్రహ్లాద భక్తి విజయం నృత్య రూపకం ప్రదర్శించారు. దేవదాయశాఖ గౌరవ సలహాదారులు బ్రహ్మశ్రీ చుండూరి సీతారామాంజనేయప్రసాద్, ఆధ్యాత్మికవేత్త శ్రీమాన్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి హాజరై, త్యాగరాజ స్వామి విశిష్టతను వివరించారు. చిన్నారులను ప్రశంసించారు. సంఘం కార్యదర్శి వల్లూరి కృష్ణకిషోర్, ఉపాధ్యక్షులు ఎస్.గిరిజాశంకర్, కోశాధికారి రవీంద్రనాధ్, సలహాదారు నేతి విశ్వేశ్వరరావు పాల్గొనగా, అతిధులను, కళాకారులను సత్కరించారు. శిశువుల అక్రమ విక్రయాల్లో 30కి చేరిన అరెస్ట్లు లబ్బీపేట(విజయవాడతూర్పు): శిశువుల అక్రమ విక్రయాల కేసుల్లో ఇప్పటి వరకూ 30 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు నగర డిప్యూటీ కమిషనర్ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో శిశువుల కిడ్నాప్ అమ్మకం కేసులకు సంబంధించి పోక్సో యాక్ట్ , మానవ అక్రమ రవాణా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అహ్మదాబాద్, గుజరాత్, ఢిల్లీ, ముంబయి వంటి ప్రాంతాల్లో టీములు ఈ రాకెట్మూలాలను దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అక్కడ ఫెర్టిలిటి సెంటర్స్ ప్రమేయం ఎంతవరకు ఉంది.. నిజంగా పిల్లల కిడ్నాప్ చేశారా లేదంటే తల్లిదండ్రులు స్వచ్ఛందంగా పిల్లలను ఈ రకమైన అమ్మకానికి పెడుతున్నారా అనే అంశాలను విచారణ చేస్తున్నట్లు తెలిపారు. పెదకాకాని: నో ప్లాస్టిక్ జోన్గా ఉప్పలపాడు పక్షుల కేంద్రాన్ని తీర్చిదిద్దేందుకు సహకరించాలని కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీర్ ఎం.డి.నజీనా బేగం అన్నారు. ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా (నో ప్లాస్టిక్ జోన్)గా మార్చే ఉద్దేశంతో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో గురువారం ఉప్పలపాడు పక్షుల కేంద్రంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పక్షి సంరక్షణ కేంద్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వినియోగాన్ని నిషేధించి, పూర్తిగా ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా ప్రకటించేందుకు డీఎఫ్ఓకు సూచనలు జారీ చేశారు. పక్షి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించే వారికి ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను లోపలికి తీసుకురావద్దని అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే హానికర ప్రభావాలను వివరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి కె శ్రీనివాసరావు, పర్యాటకులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. -
అవుట్ సోర్సింగ్ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం
నెహ్రూనగర్: రాయలసీమ థర్మల్ ప్లాంట్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను పరిష్కారించాలని మాలమాహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్కుమార్ కోరారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ థర్మల్ ప్లాంట్లో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అవుట్ సోర్సింగ్ నియామకాల్లో అన్యాయం జరగుతుందని వివరించారు. థర్మల్ ప్లాంట్లో పనిచేసే ఓ ముఖ్య అధికారి బీసీ వ్యక్తులను ఎస్సీ, ఎస్టీలుగా చిత్రీకరించి వారి పేర్లు జాబితాలో చేర్చారన్నారు. దీనిపై స్పందించి ఆ అధికారి పెట్టిన ఫైల్ను రిజెక్ట్ చేసి నిజమైన ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయాలని కోరారు. తాడికొండ: తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామంలో కోడిపందేల స్థావారాలపై టాస్క్ఫోర్స్ బృందం మెరుపు దాడులు నిర్వహించింది. మధ్యాహ్నం సుమారు 2.30 గంటల సమయంలో పెదపరిమి శివారులోని పత్తి పొలాల్లో ఆర్గనైజింగ్ కోడిపందేలు జరుగుతున్నాయని టాస్క్ఫోర్స్ సిబ్బందికి వచ్చిన సమాచారం మేరకు ఎస్బీ సీఐ –1కు ఆదేశాల మేరకు తుళ్లూరు పోలీసుస్టేషన్ ఎస్సై కలగయ్య, సిబ్బందితో కలిసి టాస్క్ఫోర్స్ పోలీసులు కోడిపందేల స్థావారాలపై దాడులు నిర్వహించారు. ఏడుగురు పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి ఒక కోడి, రూ.1,22,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది సెల్ఫోన్లు, ఆరు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. తాడికొండ: రాజధాని అమరావతిలో సీడ్ యాక్సిస్ రహదారి నిర్మాణానికిగాను 12.5758 ఎకరాల భూమి సేకరించేందుకు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉండవల్లిలో 10.5018 ఎకరాలు, పెనుమాకలో 0.6500 ఎకరాలు, మందడం–1లో 0.7000 ఎకరాలు, రాయపూడి–1లో 0.4710 ఎకరాలు, రాయపూడి–2 – 0.2530 ఎకరాల సేకరించనున్నారు. సంబంధిత రైతులు, భూ యజమానులు అమరావతి సీడ్ యాక్సిస్ రహదారి నిర్మాణం నిమిత్తం ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చేందుకు సిద్ధమైతే తమ గ్రామంలోని కాంపిటెంట్ అథారిటీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. -
రోడ్డెక్కిన కూటమి రచ్చ
గుంటూరుగురువారం శ్రీ 8 శ్రీ జనవరి శ్రీ 2026● తెనాలి నేతల మధ్య ముదిరిన గొడవ ● ఆధిపత్యం పోకూడదని ఎమ్మెల్సీ రాజా ఆరాటం ● ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్న మంత్రి మనోహర్ ● ఫ్లెక్సీ పేరుతో రోడ్డెక్కిన ఆలపాటి వర్గం ● టీడీపీ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు మంత్రి సిద్ధం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 3900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 39.8368 టీఎంసీలు. తెనాలి వేదికగా కూటమిలో విభేదాలు రోడ్డున పడ్డాయి. తెనాలిలో గెలిచి మంత్రిగా కొనసాగుతున్న నాదెండ్ల మనోహర్ ఆధిపత్యానికి గండి కొట్టి తన పట్టు నిలుపుకోవడం కోసం ఎమ్మెల్సీ ఆలపాటి రాజా చేస్తున్న ప్రయత్నాలు కూటమిలో చిచ్చు పెడుతున్నాయి. మంగళవారం ఫ్లెక్సీల తొలగింపునకు పూనుకున్న మున్సిపల్ అధికారులను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. -
రక్షకులా.. రాక్షసులా!
గుంటూరు జిల్లా: ‘బూటు కాళ్లతో మా పిల్లలను తొక్కుతారా? పన్నెండు మంది కలిసి పోల్ పీక్కెళితే అందులో నలుగురు దళిత బిడ్డలను మాత్రమే స్టేషన్కు పిలిపించి లాఠీలు విరిగేలా అరికాళ్లపై కొట్టడమేంటి?’ అంటూ అప్పాపురం దళితవాడ ప్రజలు పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులను పిలిచి చెప్పే కనీస జ్ఞానం కూడా లేదా? లాఠీలతో కొట్టి అక్కడే నడిపిస్తారా’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం అప్పాపురానికి చెందిన పన్నెండు మంది విద్యార్థులు వాలీబాల్ నెట్ కట్టుకునేందుకు సోమవారం ఓ వీధిలో ఉన్న టెలిఫోన్ స్తంభాన్ని(పోల్) తొలగించి, తీసుకెళ్లారు. ఆ సమయంలో స్తంభానికి చుట్టి ఉన్న విద్యుత్వైర్లు కదిలి ఇళ్లలో ఉన్న విద్యుత్ పరికరాలు దెబ్బతిన్నాయంటూ ఓ మహిళ కాకుమాను పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం వారిలో నలుగురు యువకులను పోలీసులు స్టేషన్కు పిలిపించి కొట్టారని ఆరోపిస్తూ అదే రోజు రాత్రి తల్లిదండ్రులు స్టేషను వద్దకు వెళ్లి పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నాలుగు గంటల పాటు రాస్తారోకో ‘మా పిల్లలను బూటు కాళ్లతో తొక్కి, లాఠీలు విరిగేలా అరికాళ్లపై కొట్టిన ఎస్ఐ ఏక్నాథ్ను సస్పెండ్ చేయాలి. కులం పేరుతో దూషించిన ఏఎస్ఐ, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేస్తూ బుధవారం ఉదయం అప్పాపురం దళితవాడ వాసులు బాధిత విద్యార్థులు, యువకులతో కలిసి మెయిన్ రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా చేశారు. పన్నెండు మందిలో అగ్రవర్ణాల పిల్లలు కూడా ఉన్నారని, కానీ వాళ్లను వదిలేసి దళిత బిడ్డలనే స్టేషన్కు పిలిపించి దాడి చేయడం ఏంటని ప్రశి్నంచారు. చదువుకునే పిల్లలను ఇలా విచక్షణారహితంగా కొట్టడం ఏమిటంటూ తల్లిదండ్రులు నిప్పులు చెరిగారు. బాధిత యువకులు, విద్యార్థులు స్టేషన్లో సీసీ కెమెరాల్లేని గదిలోకి తీసుకువెళ్లి పోలీసులు అమానుషంగా దాడి చేశారని వాపోయారు. స్టీల్ రాడ్లతో సైతం కొట్టారని ఆరోపించారు. ఈ క్రమంలో వందల మంది మహిళలు, స్థానికులు రాస్తారోకోలో పాల్గొనడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. దళితసంఘ నాయకుడు చార్వాక దళితులకు మద్దతు పలికి, రాస్తారోకోలో పాల్గొన్నారు. దళిత బిడ్డలపై అబద్ధాలతో ఫిర్యాదు చేసిన మహిళతో పాటు కులం పేరుతో తమను, తమ పిల్లలను దూషించిన ఎస్ఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ చార్వాక దళితవాడ ప్రజలతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి విచారణ చేపట్టి న్యాయం చేస్తామని సీఐ హామీ ఇవ్వడంతో చివరికి వారు శాంతించారు. కాగా, పోలీసుల దాషీ్టకానికి బలైన దళిత విద్యార్థులకు వైఎస్సార్సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్ అండగా నిలిచారు. బుధవారం మధ్యాహ్నం అప్పాపురం దళితవాడలో పర్యటించిన ఆయన బాధిత విద్యార్థులతో మాట్లాడారు. ఈ ఘటనను ఇంతటితో వదిలేది లేదని, బాధ్యులైన ఏ ఒక్కరినీ వదలబోమని హెచ్చరించారు. -
సంక్రాంతి బాదుడు..!
● ప్రైవేటు ట్రావెల్స్లో ఆర్టీసీ టికెట్కు మూడింతల ధర ● పండగ రద్దీ అదనుగా సామాన్యుడి జేబుకు చిల్లు ● చంద్రబాబు పాలనలో కనీసం నోరు మెదపని యంత్రాంగం ఇష్టారాజ్యం ప్రత్యేక బస్సుల సంగతేంటో? అడిగే దిక్కు లేదు... -
ఆపస్ నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ ఉపాధ్యాయ సంఘ (ఆపస్) నూతన సంవత్సర కేలండర్, డైరీని పాఠశాల విద్య ఆర్జేడీ బి. లింగేశ్వరరెడ్డి బుధవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద ఉన్న ఆర్జేడీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆపస్ రాష్ట్ర మహిళా కన్వీనర్ పి.పద్మ, ఉపాధ్యక్షుడు డి. శ్రీనివాస్, గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఎ.బాలచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, కోశాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీలో గురువారం జరగాల్సిన స్థాయీ సంఘ సమావేశాలతో పాటు సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. సీఎం చంద్రబాబు గుంటూరు నగరానికి వస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్తో పాటు ప్రభుత్వ శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు ఓ ప్రకటనలో తెలిపారు. ఏఎన్యూ(పెదకాకాని): అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్సిక్ మహా సంఘం (ఏబీఆర్ఎస్ఎం) ఆంధ్రప్రదేశ్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను బుధవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.మధుమూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో దాదాపు ఐదు వేల అధ్యాపకుల పోస్టుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఏబీఆర్ఎస్ఎం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ వై.వి.రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ డి.ఎస్.వి.ఎస్ బాలసుబ్రహ్మణ్యం కోరారు. అనంతరం ప్రొఫెసర్ మధుమూర్తి మాట్లాడుతూ కొన్ని న్యాయపరమైన అడ్డంకులు ఉన్నందువల్ల అధ్యాపక పోస్టుల భర్తీ ఆలస్యం అవుతుందని, వీలైనంత తొందరలో భర్తీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీఆర్ఎస్ఎం జాతీయ సహ సంఘటన కార్యదర్శి గుంతా లక్ష్మణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రొఫెసర్ రామచంద్రన్, డాక్టర్ వాణి, డాక్టర్ గంగరాజు, డాక్టర్ బాల మురళి, తదితరులు పాల్గొన్నారు. గుంటూరు రూరల్: గుంటూరులోని నల్లపాడు రోడ్డు రెడ్డికళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన సరస్ మేళా ఏర్పాట్లను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ మహిళలు తయారుచేసిన ఉత్పత్తులను ప్రదర్శించడానికి, విక్రయించడానికి ఇది ఒక వేదికని తెలిపారు. ఇది మహిళల ఆర్థిక సాధికారతకు తోడ్పడుతుందన్నారు. ఈ అఖిల భారత డ్వాక్రాబజార్ సరస్ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు గురువారం ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమంలో గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారుచేసిన ఉత్పత్తులను ప్రదర్శన విక్రయాలు జరుగుతాయన్నారు. గుంటూరులో ఈ మేళా 12 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఎత్తున ఏర్పాటు చేయబడిందన్నారు.300 షాపులు ఉంటాయని, వాటిలో 65 షాపులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఉత్పత్తులను ప్రదర్శన విక్రయాలు చేస్తారన్నారు. -
22 నుంచి విజ్ఞాన్లో ఏపీ స్పేస్ టెక్ సమ్మిట్–2026
చేబ్రోలు: గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ, అమరావతిలోని ఏపీ స్పేస్టెక్ అకాడమీ, హైదరాబాద్లోని అనంత్ టెక్నాలజీస్ సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 22 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ సమ్మిట్–2026 ను నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వైస్ చాన్స్లర్ పి. నాగభూషణ్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా సమ్మిట్కు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. అమరావతిలోని సైన్స్ సిటీ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో మొట్టమొదటి సారిగా ‘సౌత్ ఇండియా రాకెట్రీ చాలెంజ్–2026’ ను కూడా మూడు రోజుల పాటు ఇదే సమ్మిట్లో భాగంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో కాలేజీ స్థాయి విద్యార్థులకు కెమికల్ రాకెట్రీ, స్కూల్ స్థాయి విద్యార్థులకు హైడ్రో రాకెట్రీ పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఏపీ స్పేస్ టెక్ సమ్మిట్ను ‘లివరేజింగ్ స్పేస్ టెక్నాలజీ ఫర్ వికసిత్ భారత్–2047’ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ‘సౌత్ ఇండియా రాకెట్రీ చాలెంజ్–2026’ లో దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్, డిగ్రీ, స్కూల్, పాలిటెక్నిక్ విద్యార్థి బృందాలు పాల్గొననున్నాయని తెలిపారు. విజేతలకు ప్రత్యేక ట్రోఫీలు, సర్టిఫికెట్లు, నగదు బహుమతులు, ఇంటర్న్షిప్ అవకాశాలు అందజేయనున్నట్లు చెప్పారు. ఆసక్తిగల విద్యార్థులు యూనివర్సిటీ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రత్యేక ఆకర్షణగా సౌత్ ఇండియా రాకెట్రీ చాలెంజ్ -
వీవీఐటీ విశ్వవిద్యాలయానికి ప్రతిష్టాత్మక సిమెన్స్ ఈడీఏ సెంటర్
పెదకాకాని: విద్యాలయాలలో అత్యాధునిక రీసెర్చ్, ఆవిష్కరణల రూపకల్పనతోపాటు పరిశ్రమలతో అనుసంధానం చేయడానికి సిమెన్స్ సంస్థ ఏర్పాటు చేసిన సిమెన్స్ ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమిషన్ సెంటర్ (సిమెన్స్ ఈడీఏ సెంటర్) ఏర్పాటుకు వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్శిటీ ఎంపికై నట్లు వీవీఐటీయూ ప్రొ–చాన్స్లర్ వాసిరెడ్డి మహదేవ్ తెలిపారు. గుంటూరు జిల్లా నంబూరు వీవీఐటీయూలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ విభాగం సిమెన్స్ అకడమిక్ పార్టనర్ గ్రాంట్కు సమర్పించిన విద్యార్థుల ప్రాజెక్ట్ సమూనాలు, అధ్యాపకుల పరిశోధనల ఆధారంగా ఈ కేంద్రం ఎంపిక కాబడిందని బుధవారం ప్రొ ఛాన్సలర్ తెలిపారు. ఈ సెంటర్ ఏర్పాటుకు మూడు సంవత్సలకు కోటిన్నర విలువచేసే ఐసీ డిజైన్ అండ్ వెరిఫికేషన్, ఎంబడెడ్ సిస్టమ్స్, పీసీబీ డిజైన్స్ అనుబంధ ఈడీఏ సాధనాలను సిమెన్స్ సంస్థ అందించినట్లు వివరించారు. అనంతరం ఈిసీఈ విభాగాధిపతి, ఈడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఎం.వై. భానుమూర్తి, సైట్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ ఎస్.కె ఇనావుల్హక్ లను వీవీఐటీయూ చాన్స్లర్ వాసిరెడ్డి విద్యాసాగర్, వీసీ ప్రొఫెసర్ కొడాలి రాంబాబు, రిజిస్ట్రార్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి. అకడమిక్ డీన్ డాక్టర్ కె. గిరిబాబు అభినందించారు. -
పోలవరంపై బాబు అబద్ధాలు
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): పోలవరం ప్రాజెక్ట్పై చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరు సిద్ధార్థనగర్లోని ఆయన తన నివాసంలో బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు చెప్పిన అబద్ధాన్ని మళ్లీ చెబుతుంటారని ధ్వజమెత్తారు. ఆయనకు మీడియా బలం ఉందని, ఆ మీడియాలో మొదటి పేజీలో అబద్ధాన్ని అచ్చువేసి, మళ్లీ రాష్ట్ర ప్రజలకు చెబుతారని మండిపడ్డారు. డయాఫ్రం వాల్ వేయడంలో ప్రొటోకాల్ను విస్మరించింది చంద్రబాబు ప్రభుత్వమని ఆరోపించారు. డయాఫ్రం వాల్ వేయాలంటే ముందు కాఫర్ డ్యాం కట్టాలనే జ్ఙానం లేని వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. కాఫర్ డ్యాం వేయకుండా డయాఫ్రం వాల్ ఎలా వేశారని చంద్రబాబును సూటిగా అడుగుతున్నానని అన్నారు. ప్రాజెక్ట్ అలస్యమయ్యేందుకు చంద్రబాబే కారణమని స్పష్టం చేశారు. నది డైవర్షన్ చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్దే అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అనవసరమని గతంలో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీని కాపాడుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టు పెట్టవద్దని హితవు పలికారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి బాగు కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు ఒక్క సమస్య అయినా పరిష్కారించారా అని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్ట్పై ఆరోగ్యకరమైన చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. ఈ ప్రాజెక్ట్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కలల పంటని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబుకి ఏటీఎం కార్డు వంటిదని గతంలో జరిగిన ఎన్నికల వేళల్లో ప్రధాని మోదీ చెప్పారని ఆయన గుర్తుచేశారు. పొలవరం ప్రాజెక్ట్ 45.7 లెవల్కు నీరు నింపామని, అయితే చంద్రబాబు 41.1కు కుదించారని మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరమని వాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో ప్రాజెక్ట్లపై కనీసం ఎవరూ దృష్టి సారించలేదని తెలిపారు. నది డైవర్షన్ చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్దే తెలంగాణలో టీడీపీని కాపాడుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెడుతున్న సీఎం మాజీ మంత్రి, వై ఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ధ్వజం -
నడిరోడ్డుపై నడిపించి కోర్టుకు..
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): హత్యాయత్నం కేసులో నిందితులుగా ఉన్న రౌడీషీటర్తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు నడిరోడ్డుపై నడిపించి కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసుకు సంబంధించి గుంటూరు లాలాపేట పోలీసులు తెలిపిన వివరాలు.. లాలాపేట పోలీస్స్టేషన్లో రౌడీషీట్ ఉన్న గణపతి రాజేష్, అతని స్నేహితులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఉమర్బుడేసాహెబ్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనం ఢీ కొనడడంతో వివాదం జరిగింది. దీనిపై కక్ష పెంచుకున్న గణపతిరాజేష్ అతని స్నేహితులతో కలిసి గతేడాది డిసెంబర్ 21న బుడేసాహెబ్ ఇంటికి వెళ్లి రాడ్లు, కర్రలతో దాడి చేశారు. తీవ్ర గాయాలైన బుడేసాహెబ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఇందిరాకాలనీకి చెందిన గణపతి రాజేష్ అలియాస్ శ్రీను, గణపతి ఆనంద్, బత్తుల హరీష్తో పాటు మరో మైనర్ను అదుపులోకి తీసుకుని బుధవారం కోర్టులో హాజరుపరిచారు. కాగా రౌడీషీటర్ గణపతి రాజేష్ 10 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. -
కోల్డ్ స్టోరేజీ యాజమాన్యాల సమస్యలు పరిష్కరించాలి
జిల్లా కోల్డ్స్టోరేజీల ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేంద్రబాబు కొరిటెపాడు(గుంటూరు వెస్ట్): గుంటూరు జిల్లాలో శీతల గిడ్డంగుల యాజమాన్యాల సమస్యలను పరిష్కరించాలని కోల్డ్ స్టోరేజ్ల ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.సురేంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ది గుంటూరు జిల్లా కోల్డ్ స్టోరేజ్ల ఓనర్స్ వేల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం చుట్టుగుంటలోని మార్కెటింగ్శాఖ రాష్ట్ర కార్యాలయం ఆవరణలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు సమస్యలతో కూడిన వినతిప్రతం అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో అసోసియేషన్ కార్యదర్శి కేఎస్ రాఘవయ్య, కోశాధికారి ఆర్.రమణ, సభ్యుడు జుగిరాజ్ భండారి తదితరులు ఉన్నారు. -
రేపటి నుంచి వార్షిక నాటకోత్సవాలు
నగరంపాలెం: గుంటూరు కళాపరిషత్ వార్షిక నాటకోత్సవాలను ఈ నెల 9వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు పీవీ మల్లికార్జునరావు, ఉపాధ్యక్షుడు నాయుడు గోపి తెలిపారు. గుంటూరు మార్కెట్ కూడలిలో శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బుధవారం మీడియా సమావేశంలో నాటకోత్సవాల బ్రోచర్లను నిర్వాహకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 9, 10, 11 తేదీల్లో 28వ వార్షిక నాటకోత్సవాలు జరగనున్నాయని తెలిపారు. కార్యక్రమాలు ఇలా... 9న సాయంత్రం జ్యోతిప్రజ్వలన చేసి, అనంతరం శర్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవా సంఘం (శ్రీకాకుళం జిల్లా) ఆధ్వర్యంలో మాయాజాలం (సాంఘిక నాటిక), తదుపరి ప్రారంభ సభ ఉంటుందని అన్నారు. రాత్రి స్వర్ణ సూర్య డ్రామా లవర్స్ (హైదరాబాద్) సీ్త్రమాత్రేనమః (సాంఘిక నాటిక)తోపాటు విజయవాడ సాంస్కృతిక సమితి ‘మమ్మల్నీ బ్రతకనీయండి’ (సాంఘిక నాటిక) ప్రదర్శన ఉంటాయని చెప్పారు. 10న రాత్రి కళానికేతన్ (వీరన్నపాలెం) వారి ‘దీపం కింద చీకటి’ (సాంఘిక నాటిక), బీవీకే క్రియేషన్స్ (కాకినాడ) వారి ‘కన్నీటికి విలువెంత’ (సాంఘిక నాటిక), ‘అన్నదాత’ సాంఘిక నాటికలు ప్రదర్శిస్తారని వివరించారు. 11న రాత్రి ఏపీ ప్రజానాట్య మండలి (విశాఖపట్నం) వారి ‘ఒక రాక్షసుడి కథ’ (సాంఘిక నాటిక), మైత్రీ కళానిలయం (విజయవాడ) వారి ‘వాస్తవం’ (సాంఘిక నాటిక), ‘గంగోత్రి’ (పెదకాకాని) వారి ‘పేగు రాసిన శాసనం’ (సాంఘిక నాటిక) ప్రదర్శిస్తారని తెలిపారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి బండ్ల పూర్ణచంద్రరావు, గౌరవ సలహాదారు ఆలోకం పెద్దబ్బాయి, కార్యవర్గ సభ్యులు పోపూరి శివరామకృష్ణ, షేక్ సైదా, రావుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. -
సాయుధ బలగాల సంక్షేమ నిధికి విరాళం
నరసరావుపేట: సాయుధ బలగాల సంక్షేమ నిధికి దాతలు ఇచ్చిన చెక్కులను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి గుణశీలకు అందజేశారు. నరసరావుపేట ఇంజినీరింగ్ కాలేజీ(ఎన్ఈసీ) చెందిన ఎన్సీసీ క్యాడెట్లు రూ.30 వేలు, వాసవీ క్లబ్ సభ్యులు రూ.25 వేలు విరాళంగా ఇచ్చారు. దేశ రక్షణలో భాగస్వాములయ్యే సైనికుల సంక్షేమం కోసం ముందుకు వచ్చిన క్యాడెట్లు, వాసవి క్లబ్ సభ్యులను కలెక్టర్ అభినందించారు. నరసరావుపేట రూరల్: యూరియా అధిక ధరలకు విక్రయిస్తే డీలర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు హెచ్చరించారు. సబ్ డివిజన్ పరిధిలోని ఎరువుల డీలర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. జగ్గారావు మాట్లాడుతూ చట్టప్రకారం ఎప్పటికప్పుడు స్టాక్ రిజిస్టర్, బిల్లు బుక్ అప్టేట్ చేసుకోవాలని తెలిపారు. ఐఎఫ్ఎంఎస్ స్టాక్ గోడౌన్ స్టాక్ సరిపోవాలని పేర్కొన్నారు. ఎరువుల గోడౌన్ల వద్ద స్టాక్ బోర్డు ఏర్పాటు చేయాలని, స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని తెలిపారు. సమావేశంలో సహాయ వ్యవసాయ సంచాలకులు కేవీ శ్రీనివాసరావు, వి.హనుమంతరావు, జిల్లా ఎరువుల డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు నాగిరెడ్డి, పట్టణ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఏవోలు, సిబ్బంది పాల్గొన్నారు. సత్తెనపల్లి: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని సత్తెనపల్లి పట్టణం వడ్డవల్లిలోని శ్రీ రామాలయం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామికి మంగళవారం తులసితో అలంకారం చేశారు. కోదండ రామచంద్ర ప్రభువైన శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయస్వామిలను విశేష అలంకరణ చేసి కనుల పండువగా పూజలు, గోత్ర నామాలతో అభిషేకాలు చేశారు. మహిళలు పాశురాలను పఠించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. గుంటూరు రూరల్: అఖిల భారత డ్వాక్రా బజార్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్న సందర్భంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్అన్సారియా, జిల్లా ఎస్పీ వకుల్జిందాల్లు మంగళవారం పరిశీలించారు. స్థానిక రెడ్డి కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన సరస్ అఖిల భారత డ్వాక్రా బజారును ఈ నెల 8వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి సందర్శించి పలు స్టాళ్లను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా, బందోబస్తు ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. మంగళవారం నుంచి 18వ తేదీ వరకు అఖిల భారత డ్వాక్రా బజార్ ప్రదర్శన నిర్వహించనున్నట్టు తెలిపారు. సరస్లో ప్రతి రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 8వ తేదీన ప్రారంభిస్తారని చెప్పారు. -
తెనాలిలో టీడీపీని అంతం చేసే కుట్ర
తెనాలి టౌన్: మున్సిపల్ అధికారులు పోలీసుల సాయంతో పట్టణ వహాబ్చౌక్లో ఫ్లెక్సీల తొలగింపులో హైడ్రామా నెలకొంది. తొలగించిన ఫ్లెక్సీని టీడీపీ నాయకులు తిరిగి నిలబెట్టటమే కాకుండా మరో ఫ్లెక్సీని తీయకుండా అడ్డుకుని, అధికారులపై మండిపడ్డారు. నల్లబ్యాడ్జిలతో ఫ్లెక్సీ ఎదుట కూర్చొని నిరసన తెలియజేశారు. కూటమి ధర్మం వీడి మంత్రి మనోహర్ తమ పార్టీని టార్గెట్ చేశారంటూ టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెనాలిలో టీడీపీని చంపే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. చేసేదిలేక అధికారులు, పోలీసులు వెనుదిరిగారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తెనాలి వహాబ్చౌక్లోని డివైడర్కు రెండు వైపులా టీడీపీ నాయకులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల తొలగింపునకు మున్సిపల్ టౌన్ప్లానింగ్ అసిస్టెంట్ సిటీప్లానర్ వాణి, తన సిబ్బందితో ఉదయం 11 గంటలకు అక్కడకు చేరుకున్నారు. వహాబ్ చౌక్లో డివైడర్కు పడమరవైపున్న ఫ్లెక్సీని పొక్లెయిన్తో తొలగించారు. డివైడర్కు మరోవైపు మున్సిపల్ కౌన్సిలర్, టీడీపీ ఫ్లోర్లీడర్ పసుపులేటి త్రిమూర్తి కార్యాలయం ఎదుటగల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఫ్లెక్సీని తొలగించే ప్రయత్నంలో ఉండగా, కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుద్దూస్ టౌన్ ప్లానింగ్ అధికారులను అడ్డుకున్నారు. నల్లరిబ్బన్లు ధరించి ఫ్లెక్సీ ఎదుట కూర్చుని నిరసన తెలిపారు. టీడీపీ శ్రేణులకు అధికారుల మధ్య తోపులాట జనం రద్దీగా ఉండే సమయంలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసులతో వచ్చి ఫ్లెక్సీల తొలగింపుకు పూనుకోవటం ఏమిటని ప్రశించారు. ఎవరి ప్రోద్బలం లేకుండానే అధికార పార్టీ నేత ఆలపాటి రాజా ఫ్లెక్సీని తొలగించేందుకు అధికారులు అత్యుత్సాహం చూపించడం ఏంటని మండిపడ్డారు. తెనాలిలో టీడీపీని చంపేయడమే లక్ష్యంగా మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ వ్యవహరిస్తున్నారని టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుద్దూస్ ఆరోపించారు. డివైడర్ కు ఒకవైపు ఇదంతా జరుగుతుండగా మరోవైపు తొలగించిన ఫ్లెక్సీని కొందరు యువకులు తిరిగి ఏర్పాటుకు ప్రయత్నించారు. దీనిని నిరోధించటానికి పోలీసులు పూనుకోవటంతో తోపులాట జరిగింది. అయినప్పటికీ తొలగించిన ఫ్లెక్సీని టీడీపీ నాయకులు తిరిగి ఏర్పాటుచేశారు. రెండోవైపు తొలగించటానికి సాధ్యంకాక పోలీసులు, మున్సిపల్ సిబ్బంది మౌనంగా ఉండిపోయారు. ఈ సమయంలోనే టీడీపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్పై ఆరోపణలను గుప్పించారు. తెనాలిలో టీడీపీ ఉనికిని ప్రశ్నార్థకం చేయడమే లక్ష్యంగా మంత్రి మనోహర్ వ్యవహరిస్తున్నారని మహమ్మద్ ఖుద్దూస్ ఆరోపించారు. కూటమి పార్టీ నిబంధనలకు విరుద్ధంగా తెనాలిలో పరిపాలన జరుగుతుందని అన్నారు. ఎన్నికలవేళ జనసేన, టీడీపీ నాయకులను రెండు కళ్లుగా చూస్తానని చెప్పి గెలిచిన తర్వాత టీడీపీ నేతల ముఖం చూడడానికి కూడా మంత్రి మనోహర్ ఇష్టపడడం లేదని వారు దుయ్యబట్టారు. టీడీపీని అభాసుపాలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క టీడీపీ కౌన్సిలర్ కూడా ఉండకూడదని మంత్రి నిర్దేశించుకున్నాడని, అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని కౌన్సిలర్ త్రిమూర్తి ఆరోపించారు. ఇటువంటి చర్యలు పునరావృతం అయితే సహించేది లేదని టీడీపీ నాయకులు హెచ్చరించారు. -
అడ్డగోలుగా అక్రమ మట్టి తవ్వకాలు
తాడేపల్లి రూరల్: రాజధాని గ్రామాల్లో మట్టి అక్రమంగా తరలించే లారీలు అర్ధరాత్రి సమయంలో పెద్దగా శబ్దాలు చేస్తూ రాకపోకలు సాగిస్తుండడంతో స్థానికులు ఆగ్రహించారు. రాజధాని రైతులు సోమవారం అర్ధరాత్రి పెనుమాక గ్రామంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలను నిలిపివేశారు. ఆ సమయంలో డ్రైవర్లు పెద్దగా హారన్లు కొట్టడం, వాహనాలకు ఉన్న లైట్లను తీయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.కోట్ల విలువ చేసే పంటపొలాలను రాజధాని నిర్మాణానికి ఇస్తే కొంతమంది అక్రమంగా మట్టి తవ్వుతున్నారని వారు వాపోయారు. కనీసం పోలీసులుగానీ, ప్రభుత్వంగానీ, సీఆర్డీఏ అధికారులుగానీ అడ్డుకోవడంలొ విఫలమయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటకుపైగా లారీలను ఆపి తాడేపల్లి పోలీస్స్టేషన్కు సమాచారం ఇచ్చినా ఎవరూ స్పందించలేదని తెలిపారు. రాజధానికి భూములు ఇచ్చి త్యాగం చేసిన రైతులకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒక్క రాత్రికే రూ.లక్షలు భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం సంవత్సరానికి కౌలు కింద రూ. 30వేలు ఇస్తున్నారు. రాజధానిలోని తమ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వేవారు ఒక్క రాత్రికి రూ.లక్షలు సంపాదిస్తున్నారని వారు తెలిపారు. ఇంత దోపిడీ జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, రేపు మాకు ప్లాట్లు కేటాయిస్తే ఆ ప్లాట్లలో మట్టి తవ్వకాల వల్ల గుంతలు ఏర్పడి మళ్లీ రూ. లక్షలతో మట్టి తోలించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారు చెప్పారు. రాజధానిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఏ లారీలు ఎటు వెళుతున్నాయో అర్థం కావడం లేదని నాయకులు అంటున్నారు. ప్రతిచోట పనిచేసే వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేసి ఆ పని వద్ద భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేస్తే అక్రమ తవ్వకాలు నివారించే అవకాశం ఉంది. ఇంత చిన్న విషయాన్ని కూడా అధికారులు విస్మరిస్తున్నారంటే మట్టి మాఫియాతో వారికి సంబంధం ఉందని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రాణ భయం... రాత్రి సమయంలో అమరావతి, కృష్ణాయపాలెం, యర్రబాలెం రోడ్లలో భారీ శబ్దాలు చేసుకుంటూ లారీలు తిరుగుతుంటే చిన్నపిల్లలు, వృద్ధులు ఉలిక్కిపడి నిద్ర లేస్తున్నారు. ఈ లారీల వల్ల తమకు ప్రాణ భయం ఉంది. కనీసం గ్రామాల్లో వేగ నియంత్రణ లేకపోవడం వల్ల డ్రైవర్లు కొంతమంది మద్యం మత్తులో ఇష్టారాజ్యంగా తోలుతున్నారని చెప్పారు. మలుపు వచ్చినా, గొయ్యి ఉన్నా, స్పీడ్ బ్రేకర్ కనబడినా ఆపకుండా హారన్పై చేయి వేసి నడపడంతో ఆ శబ్దాలకు గుండెలు అదురుతున్నాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
బీపీ‘ఎస్’.. అంతంతే!
తెనాలి అర్బన్: బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్)కు అనేక అవరోధాలు ఏర్పడుతున్నాయి. అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో బిల్డర్లు, భవన యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. తెనాలి పట్టణంలో ఇటీవల 200కుపైగా అనధికార, ప్లాన్కు విరుద్దంగా నిర్మించిన భవనాలు ఉన్నాయి. తెనాలి పట్టణం నానాటికీ విస్తరిస్తోంది. రాజధాని అమరావతికి అతి దగ్గరగా గుంటూరు, విజయవాడకు మధ్యలో ఉండటంతో గ్రామీణ ప్రాంతాల వారు కూడా తెనాలిలో ఉండాలని భావిస్తున్నారు. పట్టణంలో మూడు కాల్వలు ఉండటం వల్ల నీటి కొరత ఉండదు. ప్రశాంతతకు మారు పేరుగా ఉండటంతో పలువురికి ఆసక్తి పెరుగుతోంది. పట్టణ పరిఽధి విస్తరిస్తోంది. ప్రస్తుతం 40 వేల గృహాల్లో 1.70 లక్షల మంది జనాభా ఉన్నారు. అన్ని కట్టడాలు పరిగణనలోకి వచ్చేనా? టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు తెనాలి పట్టణంలో అక్టోబర్ 21న 47 బృందాలు నిర్మాణంలో ఉన్న భవనాల వివరాలను సేకరించాయి. సర్వేలో సుమారు 200కుపైగా అనధికార, ప్లాన్కు విరుద్ధంగా నిర్మించిన భవనాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వీటిన్నింటిపై చర్యలు తీసుకోనున్నట్లు ఆ సమయంలో మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు ప్రకటించారు. కానీ చర్యలు కన్పించలేదు. ఇంతలో బీపీఎస్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వీటిలో కొన్ని ఆగస్టు 31వ తేదీ తర్వాత నిర్మించారు. వీటిని పరిగణలోకి తీసుకుంటారా లేదా అనే మీమాంస యజమానుల్లో నెలకొంది. తమనూ పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు. కొనసాగుతున్న అనఽధికార కట్టడాలు మరోవైపు పట్టణంలో అనధికార కట్టడాల నిర్మాణం కొనసాగుతోంది. సుమారు ఏడాది నుంచి ప్రారంభమైన నిర్మాణాలకు నేటికీ తెరపడలేదు. పట్టణంలోని ముత్తింశెట్టిపాలెం, గంగానమ్మపేట, కొత్తపేట, రైల్వేస్టేషన్ రోడ్డు వంటి ప్రాంతాలలో యజమానులు అర్ధరాత్రి, తెల్లవారుజాము సమయంలోనూ నిర్మాణ పనులు చేయిస్తున్నారు. అధికారులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీపీఎస్కు కరువైన స్పందన పట్టణంలో 1985 నుంచి ఈ ఏడాది వరకు అనధికార, ప్లానుకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలు 900 వరకు ఉండవచ్చనే అంచనాకు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చారు. పథకాన్ని నవంబర్ 12న ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అక్రమ భవనాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం బీపీఎస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 1985 జనవరి 1 నుంచి 2025 అగస్ట్ 31వ తేదీలోపు అనధికారికంగా, ప్లాన్కు విరుద్ధంగా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు కల్పించింది. 2026 మార్చి 11వ తేదీలోపు యజమానులు క్రమబద్ధీకరించుకోవాలనే నిబంధన విధించింది. మొదట ఆన్లైన్లో రూ.10 వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. టౌన్ ప్లానింగ్ అధికారుల తనిఖీల తర్వాత స్థలం విలువ, విస్తీర్ణం అధారంగా అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం బీపీఎస్ పథకాన్ని నవంబర్ నెలలో ప్రవేశపెట్టింది. పట్టణంలో సుమారు 900 భవనాలు బీపీఎస్ పరిధిలోకి రానున్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చాం. యజమానులకు అవగాహన కల్పించేందుకు ప్రధాన కూడలిల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాం. మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాం. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – వాణి, అసిస్టెంట్ సిటీ ప్లానర్, తెనాలి పురపాలక సంఘం -
ఎమ్మెల్యే నసీర్ వ్యాఖ్యలపై ముస్లింల అభ్యంతరం
లక్ష్మీపురం(గుంటూరు ఈస్ట్): అంజుమన్, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణపై గుంటూరు నగరంలోని తూర్పు నియోజక వర్గంలోని మజ్లిస్ ఉల్ ఉలెమా ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముస్లిం సంఘాల వారు, మత పెద్దలు, నాయకులు, అంజుమన్ సుదీర్ఘ కాల కమిటీ సభ్యులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే మస్తాన్వలి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గులాం రసూల్, తెలుగుదేశం పార్టీ నుంచి ప్రస్తుత తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహమ్మద్, జమియతుల ఉలెమా పెద్దలు ముఫ్తి బాసీత్, మాజీ డిప్యూటీ మేయర్ గౌస్, తెలుగుదేశం పార్టీ నాయకుడు షౌకత్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహమ్మద్ మాట్లాడుతూ ముస్లిం మత పెద్దలు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి జన సమీకరణ లేకపోవడం చాలా బాధగా ఉందనన్నారు. ముస్లిం మత పెద్దల కమిటీ సభ్యులు కూడా సమావేశంలో లేకపోవడం, నగరంలో ఉన్న మసీదుల్లో ఉన్న మౌలానాలు, మౌజన్లను పిలిచినా జనం భారీ సంఖ్యలో వచ్చే వారని తెలిపారు. పార్టీ సమావేశాలకు రెండు వందల మంది తగ్గకుండా వస్తున్నారని, ఇప్పుడు పట్టుమని 50 మంది కూడా లేకపోవడం బాధగా ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అంజుమన్–ఏ–ఇస్లామియా సంస్థకు సంబంధించిన చినకాకానిలోని 71.57 ఎకరాల భూమిపై ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ ఇచ్చిన నోటిఫికేషన్ గురించి ప్రస్తావించలేదు. పైగా ఎమ్మెల్యే అయిన తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. ముస్లిం సంఘాలు, పెద్దలు, ఆయా పార్టీల నాయకులు తమవంతుగా కార్యాచరణకు దిగాలన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నందున ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతానని చెప్పారు. ఖండించిన మత పెద్దలు ఎమ్మెల్యే నసీర్ అహమ్మద్ సంభాషణ పూర్తి అయిన తరువాత ముస్లిం మత పెద్దలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సంఘం గురించి కించపరిచేలా మాట్లాడటం సబబు కాదని, ఈ సమావేశం ఏర్పాటు చేయడం ప్రధాన ఉద్దేశం జన సమీకరణ కాదన్నారు. జన సమీకరణ ఎలా ఉంటుందో తమ సంఘం అనేక మార్లు చూపించడం జరిగిందని ఎమ్మెల్యే నసీర్ను నిలదీశారు. కించపరిచేలా మాట్లాడటం తన ఉద్దేశం కాదని, జన సమీకరణ ఉంటే బాగుంటుందని చెప్పడం మాత్రమే తన ఉద్దేశం అని సమర్థించుకునే యత్నం చేశారు. -
గుంటూరు
బుధవారం శ్రీ 7 శ్రీ జనవరి శ్రీ 20267బెల్లంకొండ: పులిచింతల ముంపు గ్రామం కేతవరంలోని శ్రీ వజ్రలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మంగళవారం ధనుర్మాస పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నక్షత్ర హారతితో పూజలు చేశారు.చేబ్రోలు: నారాకోడూరులోని గాయత్రీ శక్తిపీఠం ఆధ్వర్యంలో నిర్మించిన డీ–అడిక్షన్ సెంటర్ను హరియాణ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ మంగళవారం ప్రారంభించారు.నల్లపాడు రోడ్లో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రం ఎదుట వేచి ఉన్న పత్తి వాహనాలుజిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా గుంటూరు వెస్ట్: జిల్లాలో ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలతోపాటు గురుకులాల్లోనూ మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పీ4 కార్యక్రమంలో భాగంగా ‘స్వీకారం‘ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రతి వసతి గృహం సంపూర్ణ ప్రగతికి చిహ్నంగా, చిన్నారుల మానసిక వికాసానికి ప్రేరణగా ఉండాలనే తలంపుతో దీనిని చేపట్టినట్లు పేర్కొన్నారు. హాస్టళ్లను ఆధునికీకరించేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, బ్యాంకులు సహకరించాలన్నారు. ఏడో తరగతి విద్యార్థినికి అభినందన తెనాలి: స్థానిక మారీసుపేటలోని ఎన్సీఆర్ మున్సిపల్ హైస్కూలులో ఏడో తరగతి చదువుతున్న షేక్ జాస్మిన్కు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి స్పీడ్పోస్ట్ వచ్చింది. జిల్లా కలెక్టర్ నుంచి శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చిన పోస్ట్ అది. అందులో ‘డియర్ జాస్మిన్... ఎక్స్లెంట్ పెయింటింగ్, క్రియేటివిటీ, ఇమాజినేషన్, హార్డ్వర్క్’ అన్న ప్రశంసలతో గ్రీటింగ్ కార్డు, చిన్న లెటర్, డైరీ మిల్క్ చాక్లెట్ ఉన్నాయి. స్పీడ్పోస్ట్ అందుకున్న ప్రధానోపాధ్యాయుడు పఠాన్ కరిముల్లా సదరు విద్యార్థిని జాస్మిన్కు అందజేసి అభినందించారు. విషయమేమంటే, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని హైస్కూలు విద్యార్థులు, చిత్రలేఖన ఉపాధ్యాయుడు బెల్లంకొండ వెంకట్ పర్యవేక్షణలో చిన్న కార్డులపై బొమ్మలను స్వయంగా చిత్రించి గ్రీటింగ్ కార్డులుగా తయారుచేశారు. వాటిని అధికారులు, ఉపాధ్యాయులు, బంధువులకు పోస్ట్ చేశారు. జిల్లా కలెక్టర్ స్పీడ్పోస్టు పంపటంతో ఆమె సంతోషంతో పొంగిపోయింది. పత్తి రైతుకు పాలకులు కన్నీరే మిగుల్చుతున్నారు. తేమ పేరుతో అడ్డగోలుగా ధర తగ్గించడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. సీసీఐకి తీసుకెళితే సాకులు చెబుతున్నారని వాపోతున్నారు. దిక్కు లేక దళారులకు తక్కువ ధరకే విక్రయిస్తున్నామని . మళ్లీ దళారులు అదే పత్తి తీసుకెళితే మద్దతు ధరకు సీసీఐ కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. చంద్రబాబు సర్కారు నిర్వాకంతో అధికారులు, సిబ్బంది, దళారులు కలిసి రైతులను పట్టపగలే దోచుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: మద్దతు ధరతో పత్తి కొనుగోలు చేయడంలో సీసీఐ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గుంటూరు జిల్లాలో 66,130 ఎకరాల్లో పత్తి సాగయింది. గుంటూరు, ఫిరంగిపురం, తాడికొండ, ప్రత్తిపాడులలో 14 పత్తి జిన్నింగ్ మిల్లుల్లో మద్దతు ధరతో సీసీఐ పత్తి కొనుగోలు చేస్తోంది. జిల్లాలో సుమారు 6 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. దిగుబడులు భారీగా ఉన్నప్పటికీ సీసీఐ కొనుగోళ్లలో వేగం పెంచకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు 2,32,338.19 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసింది. రైతుల వద్ద ఇంకా సుమారు 3.50 లక్షల క్వింటాళ్ల పత్తి నిల్వలు పేరుకుపోయాయి. సీసీఐ మద్దతు ధర రూ.8,110 ఉండగా.. మార్కెట్లో రూ.6 వేల నుంచి రూ.6,500 మాత్రమే ఉంటోంది. ఖాతాలకు జమకాని నగదు.. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరతో పత్తి అమ్ముకున్న రైతులకు సకాలంలో నగదు జమ కావడం లేదు. వ్యవసాయ ఉత్పత్తులు చేతికి రావడంతో బ్యాంకర్లతోపాటు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల వ్యాపారులు రైతులపై రుణాల వసూలుకు ఒత్తిడి చేస్తున్నారు. పత్తి విక్రయించిన రైతులు మాత్రం సీసీఐ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దళారులకే లాభం పత్తి విక్రయాల్లో అక్రమాలు జరగకుండా ప్రభుత్వం సాంకేతికతను ఉపయోగిస్తున్నా.. దళారులు ఎత్తుకు పైఎత్తు వేస్తున్నారు. గ్రామాల్లో తక్కువ ధరతో కొనుగోలు చేసిన పత్తిని స్థానిక రైతుల పేరున సీసీఐకి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. సీసీఐ, మార్కెటింగ్ శాఖల అధికారుల అండదండలతో దళారుల దందా జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు ప్రైవేట్లో సుమారు 30 వేల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేస్తే, సీసీఐ సుమారు 2.32 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేసింది. జిల్లాలో ప్రైవేట్లో పత్తికి ధర లేదు. సీసీఐకి విక్రయించాలంటే తేమ పేరిట నిరాకరిస్తోంది. విధి లేని పరిస్థతుల్లో తక్కువ ధరైనా రైతులు మాత్రం వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారు. ఇదే పత్తిని దళారులు తీసుకొస్తే.. 8 శాతం తేమతో సీసీఐ కొనుగోలు చేస్తోంది. రైతుల నుంచి క్వింటాళ్లకు రూ.6 వేల నుంచి రూ.6,500 లోపు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్న దళారులు.. తమకు తెలిసిన రైతుల పేరున సీసీఐ కేంద్రాల్లో క్వింటా రూ.8,110 చొప్పున విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ లెక్కన క్వింటాలు పత్తికి సుమారు రూ.1,500 పైగా లాభం పొందితే అందులో పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ ఇచ్చిన రైతుతో పాటు సీసీఐ, మార్కెటింగ్ శాఖల సిబ్బందికి వాటాలు ఉంటాయనే ఆరోపణలు ఉన్నాయి. వివరాలపై అక్రమాలు బయటపడే వీల్లేదు. తేమ, రంగు విషయంలో కాస్త ఉదారంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా కూడా సీసీఐ అధికారులను ఆదేశించారు. కానీ సీసీఐ అధికారులు ఇవేమీ పట్టించుకోని పరిస్థితి నెలకొంది. 12 శాతం కంటే ఎక్కువ తేమ ఉంటే నిర్ధాక్షిణ్యంగా వెనక్కు పంపుతున్నట్లు గమనార్హం. తిరస్కరించిన పత్తిని దళారులు కొని అదే పత్తిని మద్దతు ధరతో అమ్ముతున్నారు. సీసీఐ అధికారులే ముడుపుల కోసం దళారులలను పోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పత్తి కొనుగోళ్లలో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఆన్లైన్లో్ వివరాలు ఉన్న రైతుల నుంచి మాత్రమే పత్తి కొనుగోలు చేస్తున్నారు. సీసీఐ కేంద్రాల్లో అక్రమాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాం. సీసీఐ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తాం. – పి.సత్యనారాయణ చౌదరి, సహాయ సంచాలకులు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ -
తండ్రీకొడుకుల అరాచకాలు ఎంతోకాలం సాగవు
వెంకటాచలం (పొదలకూరు): అధికారం తమదనే అహంకారంతో తండ్రీ కొడుకులు బరితెగించి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అరాచకాలు సాగిస్తున్నారని, ఇవి ఎంతో కాలం సాగవని మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ నేతలను ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో.. రేపటి రోజున వీరికి అదే గతి పడుతుందని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం 16 నెలల పాలనలో పిన్నెల్లి సోదరులపై 16 అక్రమ కేసులను నమోదు చేయించి జైలు పాలు చేసిందని ధ్వజమెత్తారు. నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలను మంగళవారం రోజా, తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణతో కలిసి ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు వెలుపల రోజా మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నాయకుల ఆధిపత్య పోరులో భాగంగా హత్యలు జరిగితే పిన్నెల్లి సోదరులపై హత్య కేసు నమోదు చేయడం దారుణమన్నారు. ఎన్నికల్లో టీడీపీ నాయకులు రిగ్గింగ్ చేస్తే అడ్డుకున్న పిన్నెల్లిపై కేసులు నమోదు చేసి జైలు పాలు చేశారని విమర్శించారు. జైల్లో సౌకర్యాలు కల్పించాలని కోర్టు ఆదేశించినా అమలు చేయించకుండా కక్ష సాధింపునకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజల మన్ననలు పొందిన కుటుంబం : అంబటి మురళీకృష్ణ మాచర్లలో ప్రజల మన్ననలు పొందిన కుటుంబం పిన్నెల్లి కుటుంబమని పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పేర్కొన్నారు. పిన్నెల్లి సుందర రామిరెడ్డి, లక్ష్మారెడ్డి, రామకృష్ణారెడ్డిలు వరుసగా మాచర్లలో పోటీ చేసి గెలుపొందారన్నారు. టీడీపీ అక్కడ బలహీనంగా ఉండడంతో ప్రతి ఎన్నికల్లో అభ్యర్థిని మార్చేవారన్నారు. మాచర్లలో ఎలాగైనా పట్టుసాధించాలని పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు బనాయించారన్నారు. ఈవీఎంల మాయాజాలం, పోలీసుల దమనకాండతో మాచర్లలో టీడీపీ విజయం సాధించినట్టు ఆరోపించారు. కోర్టు పిన్నెల్లి సోదరులకు ప్రత్యేక వసతులు కల్పించాలని ఆదేశించినా 27 రోజులుగా వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదన్నారు. -
గుంటూరు చేరుకున్న ‘జన చైతన్య యాత్ర ’
కొరిటెపాడు(గుంటూరు): ఏపీ – తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య (ఏపీఅండ్టీబీఈఎఫ్) ఆధ్వర్యంలో ప్రజా రంగ బ్యాంకుల పరిరక్షణ, సామాన్య ప్రజల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా చేపట్టిన ‘జన చైతన్య యాత్ర – సైకిల్ రైడ్’ విజయవంతంగా కొనసాగుతోంది. విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు సుమారు 850 కిలోమీటర్లు, జిల్లా నుంచి జిల్లా, ప్రజల మధ్యకు వెళ్లేలా రామరాజు నిర్వహిస్తున్న సైకిల్ రైడ్ యాత్ర గుంటూరు చేరుకుంది. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు గుంటూరు ఏటుకూరు రోడ్డు వద్ద ఆంజనేయస్వామి విగ్రహం వద్దకు యాత్ర చేరుకుంది. అక్కడ నుంచి గుంటూరులో అన్ని బ్యాంకుల ఉద్యోగులు ప్రధానవీధుల గుండా ర్యాలీ నిర్వహించి జీటీ రోడ్లోని యూనియన్ బ్యాంకు రీజినల్ ఆఫీసు వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా బ్యాంక్ ఎంప్లాయీస్ కో–ఆర్డినేషన్ కమిటీ నాయకులు రామకృష్ణ, వేణుబాబు, రవిచంద్రారెడ్డి, పృథ్వీ, మురళీ షరీఫ్, పావని క్రాంతి, అఖిల, పి.కిషోర్ కుమార్ తదితర నాయకులు మాట్లాడుతూ ప్రజారంగ బ్యాంకులను బలహీనపరచే విధానాలకు వ్యతిరేకంగా, బ్యాంకింగ్ సేవలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. ఈ యాత్రకు ప్రజలు, ఉద్యోగుల నుంచి లభిస్తున్న విశేష స్పందన ఉద్యమానికి మరింత బలం చేకూరుస్తోందని పేర్కొన్నారు. బ్యాంకులు ప్రభుత్వ రంగంలోనే ఉండాలని, ప్రజలను చైతన్యపరుస్తూ బ్యాంకులను కాపాడు కోవాలని తెలిపారు. ఈ సైకిల్ యాత్రను కొనసాగిస్తూ రామరాజు చిలకలూరిపేట మీదుగా ఒంగోలు వెళ్లారు. సచివాలయాల్లో ఈ–గవర్నెన్స్ అమలు జడ్పీ చైర్పర్సన్ హెనీక్రిస్టినా నగరంపాలెం (గుంటూరు వెస్ట్): గ్రామీణ ప్రాంతాల్లోని సచివాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఈ – గవర్నెన్స్ అప్లికేషన్స్ అమలు చేయాలని గుంటూరు జడ్పీ చైర్పర్సన్ హెనీక్రిస్టినా అన్నారు. జిల్లాపరిషత్ (జడ్పీ) ఆవరణలోని హాల్లో మంగళవారం పంచాయతీరాజ్ డిప్యూటీ ఎంపీడీఓలు, పరిపాలనాధి కారులు (ఏఓ), సీనియర్/ జూనియర్ సహాయకులు (ఎస్ఏ/జేఏ), పంచాయతీ అభివృద్ధి అధికారుల (పీడీఓ)కు ఈ–గవర్నెన్స్పై ఒక్కరోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఈ–ఆఫీస్, పీఆర్–ఒన్, ఈ–క్రాప్, వాట్సాప్ యాప్ గవర్నర్స్ తదితర అంశాలపై పూర్తిస్థాయిలో శిక్షణ పొందాలని అన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి జిల్లా స్థాయిలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఈనెల ఒకట్నుంచి ఈ–ఆఫీస్ ద్వారా ఫైల్స్ను నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో దీనిపై తర్ఫీదు పొందేందుకు శిక్షణ నిర్వహించినట్లు తెలిపారు. డీపీఆర్సీ ఏఓ ప్రతాప్కుమార్, జడ్పీపీ ఏఓ శామ్యూల్, డీటీఎం కె.నాగేశ్వరరావు, రిసోర్స్ పర్సన్స్ కె.శ్రీనివాసరావు, కె.అనురాధ, డి.రవీంద్రబాబు పాల్గొన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవాలి తాడేపల్లి రూరల్: క్రీడల ద్వారా యువత శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని ఐఎఫ్ఎస్ అధికారిణి భరణి వ్యాఖ్యానించారు. మంగళవారం తాడేపల్లి రూరల్, వడ్డేశ్వరంలో మూడు రోజులుగా జరుగుతున్న సౌత్జోన్ ఇంటర్ యూని వర్శిటీ టోర్నమెంట్–2026 ముగింపు వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా భరణి ప్రసంగిస్తూ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో కూడా సత్తా చాటాలని కోరారు. రానున్న కాలంలో కేఎల్యూ వేదికగా జాతీయ అంతర్జాతీయ క్రీడలు జరుగుతాయని తెలిపారు. కేఎల్యూ వైస్ చాన్స్లర్ డాక్టర్ జి.పార్ధసారధి వర్మ మాట్లాడుతూ కర్నాటకకు చెందిన జైన్ యూనివర్శిటీ ప్రథమ స్థానంలో, కేఎల్యూ ద్వితీయ స్థానం, చైన్నె ఎస్ఆర్ఎం యూనివర్శిటీ జట్టు తృతీయ, కేరళ కాలికట్ యూనివర్శిటీ నాల్గవ స్థానంలో నిలిచాయని పేర్కొన్నారు. అనంతరం పరిశ్రమల అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ శివజ్యోతి, ఐఎఫ్ఎస్ అధికారిణి భరణి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఆలిండియా యూనివర్సిటీల పరిశీలకులు మనోజ్కుమార్, వర్శిటీ ప్రో వీసీలు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్.వెంకట్రామ్, డాక్టర్ కె.రాజశేఖరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, క్రీడల డైరెక్టర్ డాక్టర్ కె.హరికిషోర్, విద్యార్థి సంక్షేమ విభాగం ఇన్చార్జి డీన్ డాక్టర్ కేఆర్ఎస్ ప్రసాద్, సలహాదారు డాక్టర్ హబీబుల్లా ఖాన్, వ్యాయామ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
విజ్ఞాన్లో ఆకట్టుకున్న శాసీ్త్రయ నృత్య ప్రదర్శన
చేబ్రోలుః చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో భారతీయ సంప్రదాయ కళలను విద్యార్థులకు చేరువచేసే లక్ష్యంతో శాసీ్త్రయ నృత్య కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు వైస్ చాన్స్లర్ పి. నాగభూషణ్ సోమవారం తెలిపారు. స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ విభాగం, డీన్–స్టూడెంట్ అఫైర్స్ సంయుక్త ఆధ్వర్యంలో శాసీ్త్రయ నృత్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గాంచిన ప్రముఖ భరతనాట్య నృత్య కళాకారిణి డాక్టర్ బాలాదేవి చంద్రశేఖర్ ప్రత్యేక శాసీ్త్రయ నృత్య ప్రదర్శన చేశారు. భారతీయ శాసీ్త్రయ నృత్యానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చిన కళాకారిణిగా డాక్టర్ బాలాదేవి చంద్రశేఖర్కు విశేషమైన పేరు ఉందని వైస్ చాన్స్లర్ తెలిపారు. డాక్టర్ బాలాదేవి చంద్రశేఖర్ భారతదేశంతో పాటు అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లోని అనేక ప్రతిష్ఠాత్మక వేదికలపై నృత్య ప్రదర్శనలు ఇచ్చి భారతీయ సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేశారని తెలిపారు. కార్యక్రమానికి విద్యార్థులు, అధ్యాపకులు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై శాసీ్త్రయ నృత్య వైభవాన్ని తిలకించారు. ప్రపంచ ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి డాక్టర్ బాలాదేవి చంద్రశేఖర్ ప్రత్యేక ప్రదర్శన -
జిల్లాల విభజనలో సాంకేతికత లేదు
బాపట్ల: రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో సాంకేతికత లేదని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో కోన రఘుపతి మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విభన చేపడితే కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసమే పునర్విభజన చేసిందన్నారు. పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయటం వలన నీతిఆయోగ్ నుంచి నిధుల విడుదల, వాటి సఫలీకృతం చేసేందుకు వీలు ఉంటుందనే మంచి ఆలోచనతో విభజన చేశారని గుర్తు చేశారు. మా మార్క్ కనిపించాలనే విధంగా కూటమి ప్రభుత్వం అశాసీ్త్రయంగా విభజన చేసిందన్నారు. రాయచోటి జిల్లాను మార్పుచేసి మదనపల్లికి ఎందుకు మార్పు చేయాల్సి వచ్చిందో అర్ధంకావటంలేదన్నారు. బాపట్లకు ప్రాధాన్యం తగ్గే విధంగా పునర్విభజన బాపట్ల జిల్లా నుంచి అద్దంకి నియోజకవర్గాన్ని తొలగించటం బాధాకరమన్నారు. 1982 సంవత్సరం నుంచి బాపట్ల జిల్లాను సాధించాలని తన తండ్రి కోన ప్రభాకర్ నుంచి తన వరకు ఏ సందర్భం వచ్చినా జిల్లా ప్రస్తావనతో ముందుకు నడిశామన్నారు. నీతి ఆయోగ్ ప్రాధాన్యతను చూసినప్పుడు సంతనూతలపాడు నియోజకవర్గం బాపట్ల జిల్లాలోకి రాలేదని కొద్దిపాటి ఆలోచన చేసినప్పటికి ఒంగోలుకు చుట్టుపక్కల ఉండటంతో అలా చేయాల్సి వచ్చిందని భావించామన్నారు. తాను మొదటి నుంచి పొన్నూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాలను బాపట్ల జిల్లాలో చేర్చాలని కోరుతూనే ఉన్నానని కోన చెప్పారు. అద్దంకి తొలగిపోవటంతో ఆర్థికంగా బాపట్ల జిల్లా వెనుకబడిపోతుందని కోన అభిప్రాయపడ్డారు. ఆర్థికంగా బాపట్ల జిల్లా ముందు ఉండాలంటే పొన్నూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాలను జిల్లాలో కలపాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్కు వినతిపత్రం అందిస్తామని కోన చెప్పారు. జిల్లాల పునర్విభజన సందర్భంగానైన ఆ రెండు నియోజకవర్గాలను బాపట్ల జిల్లాలో కలపాలని బలంగా తమ వాణి వినిపిస్తామని చెప్పారు. సమావేశంలో పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, ఉయ్యూరు లీలాశ్రీనివాసరెడ్డి, నాయకులు గవిని కృష్ణమూర్తి, మోర్ల సముద్రాలగౌడ్, లక్ష్మీరాఘవ, అహ్మద్ హుస్సేన్, ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, ఇనగలూరి మాల్యాద్రి, తన్నీరు అంకమ్మరావు తదితరులు ఉన్నారు. -
● ముగ్గురు రాజుల మహోత్సవానికి సిద్ధం ● దేశ, విదేశాల నుంచి రానున్న క్రైస్తవ సోదరులు
పాటిబండ్లకు ఆధ్యాత్మిక శోభ పెదకూరపాడు: పాటిబండ్ల గ్రామంలో ఆధ్యాత్మిక శోభ విరజల్లుతుంది. ముగ్గురు రాజుల దేవాలయం తిరునాళ్లకు సిద్ధమైంది. తిరునాళ్ల మహోత్సవాన్ని తిలకించేందుకు దేశ విదేశాలలో ఉన్న మత గురువులు, మతకన్యలు, క్రైస్తవ సోదరులతో రానున్నారు. ఆదర్శవంతమైన సంఘంగా, విశ్వాసానికి ప్రత్యేకంగా పాటిబండ్లలో నిర్మించిన ముగ్గురు రాజుల దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈనెల 1వ తేదీ నుంచి ప్రారంభమైన ఉత్సవాలు 5,6,7 తేదీలతో ముగుస్తాయి. జనవరి ఒకటో తేదీ నుంచి ప్రత్యేక దివ్య పూజ నిర్వహిస్తున్నారు. మంగళవారం నిర్వహించే మహోత్సవంలో గుంటూరు పీఠాధిపతులు చిన్నాబత్తిన భాగ్యయ్య ప్రత్యేక దివ్య పూజ నిర్వహించనున్నారు. మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు స్థానిక విచారణ గురువులు చిన్నాబత్తిన హృదయరాజు తెలిపారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా పెదకూరపాడు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
గంజాయి ముఠా అరెస్టు
పిడుగురాళ్ల: గంజాయి ముఠాను అరెస్టు చేసినట్లు గురజాల డీఎస్పీ బీఎల్ఎన్ జగదీష్ తెలిపారు. పట్టణ పోలీస్స్టేషన్లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. గురజాల డీఎస్పీ బీఎల్ఎన్ జగదీష్ మాట్లాడుతూ పిడుగురాళ్ల పోలీస్స్టేషన్ పరిధిలో గంజాయి కార్యకలాపాలలో పాల్గొంటున్న ఏడుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 6 కేజీల 400 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి విక్రయిస్తున్న ఏడుగురిని పట్టణ సీఐ ఎస్ వెంకట్రావు, ఎస్ఐ డి.శివనాగరాజుల బృందం చాకచక్యంగా పట్టుకున్నట్లు తెలిపారు. వారిలో పిడుగురాళ్ల పట్టణానికి చెందిన వెన్ను తిరుమలరావు, సాదుపాటి రాజేష్, నున్సావత్ శివకుమార్, సాదుపాటి గోపి, కొండమోడుకు చెందిన షేక్ బాబావలి, పిడుగురాళ్ల ఎస్టీ కాలనీకి చెందిన తాడిమళ్ల దివ్యబాల, డేగల శిరిష వీరికి అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణ శివారు కళ్లం టౌన్షిప్ పరిధిలో 60 అడుగుల రోడ్డు చివర పడమర వైపు కొంత మంది గంజాయి కలిగి ఉన్నారనే సమాచారంతో సీఐ వెంకట్రావు, ఎస్ఐ శివనాగరాజులు ఆదివారం సాయంత్రం దాడులు నిర్వహించారు. వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అమ్మకాలు వినియోగిస్తున్న స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. వీరితోపాటు దాచేపల్లి పట్టణానికి చెందిన సాకేటి తిరుపతినారం నాయుడు, పిడుగురాళ్ల ఎస్టీ కాలనీకి చెందిన మామిడిశెట్టి మణికంఠలు పరారీలో ఉన్నారు. వీరు విశాఖపట్నం, ఒడిస్సాలో ప్రాంతాల నుంచి కిలో గంజాయిని కిలో రూ. 5000 వేలకు కొనుగోలు చేసి దానిని అరెస్టు అయిన ఏడుగురికి కిలో రూ.10 వేల చొప్పున అమ్మేవారు. ఈ ఏడుగురు పది గ్రాముల చొప్పున చిన్న చిన్న ప్యాకెట్ కవర్లలో పెట్టి పది గ్రాముల గంజాయి ప్యాకెట్ రూ.300లకు విక్రయిస్తున్నారు. ఇప్పటికే వీరిపై గంజాయి కేసులు వంటి పలు కేసులు నమోదై ఉన్నాయని డీఎస్పీ పేర్కొన్నారు. గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం, యువత భవిష్యత్కు, సమాజానికి తీవ్ర ప్రమాదమని డీఎస్పీ జగదీష్ హెచ్చరించారు. నిషేధిత మాదకద్రవ్యాల కొనుగోలు, విక్రయం, రవాణా కలిగి ఉండటం చట్టపరంగా తీవ్రమైన నేరమని, ఇటువంటి వాటికి పాల్పడితే కఠిన శిక్ష తప్పదని తెలిపారు. ఇటువంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే తక్షణమే 112కు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ పేర్కొన్నారు. అనంతరం గంజాయిని పట్టుకున్న సీఐ, ఎస్ఐను అభినందించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ ఎస్.వెంకట్రావు, ఎస్ఐలు బి.శివనాగరాజు, ఎం.మోహన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రొటోకాల్కు అధికారుల మంగళం!
మేడికొండూరు: అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు వైఎస్సార్ సీపీకి చెందిన ప్రజాప్రతినిధులకు సముచిత గౌరవం ఇవ్వడం లేదు. కేవలం టీడీపీ నేతల అండతోనే వైఎస్సార్ సీపీకి చెందిన ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్ ప్రకారం గౌరవించకుండా అవమానాలకు గురిచేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మేడికొండూరు మండల పరిధిలోని డోకిపర్రు సచివాలయం వద్ద మండల రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సోమవారం గ్రామసభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వైఎస్సార్ సీపీకి చెందిన జడ్పీటీసీ సభ్యుడు కందుల సిద్ధయ్యకు అధికారులు ఆహ్వానం పలికారు. స్థానిక పంచాయతీ అధికారి ఆహ్వానం మేరకు గ్రామసభకు వచ్చిన జడ్పీటీసీ సిద్ధయ్యకు చేదు అనుభవం ఎదురైంది. ప్రభుత్వ కార్యక్రమమైన గ్రామ సభ వేదికపై టీడీపీ చోటా నాయకులు కొలువుదీరారు. జడ్పీటీసీ సిద్ధయ్య వేదిక వద్దకు వచ్చినా.. వేదికపైకి ఎవరూ ఆహ్వానించలేదు. తనకు ప్రొటోకాల్ పాటించకపోవడంపై సిద్ధయ్య ప్రశ్నించడంతో చివరకు స్థానిక పంచాయతీ అధికారి షేక్ జిలానీ స్టేజిపైకి పిలిచి, చివరన కూర్చోబెట్టారు. అధికారులు టీడీపీ నేతల ఒత్తిళ్లకు లొంగి ప్రజాప్రతినిధులకు సముచిత గౌరవం ఇవ్వకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
గుంటూరు
మంగళవారం శ్రీ 6 శ్రీ జనవరి శ్రీ 2026ముగిసిన తెలుగు మహాసభలుస్వామివారికి విశేషార్చన పెదపులివర్రు(భట్టిప్రోలు): పెదపులివర్రులోని శ్రీ భూనీళా సమేత శ్రీ వరదరాజస్వామి సోమవారం ప్రాతః కాలంలో విశేషార్చనలో దర్శనమిచ్చారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.తెనాలి: తెనాలి మార్కెట్యార్డుకు సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1500, గరిష్ట ధర రూ.3500, మోడల్ ధర రూ.2300 వరకు పలికింది. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 560.00 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 19,472 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. గుంటూరులోని శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక కేంద్రంలో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభలు సోమవారంతో ముగిశాయి. సభలకు తెలుగు భాషాభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సభల రెండో రోజైన ఆదివారం మారిషస్ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ దంపతులు హాజరయ్యారు. సభల ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గోవా గవర్నర్ పి.అశోక్గజపతిరాజు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. మహాసభల సందర్భంగా పోస్టల్ శాఖ రూపొందించిన ప్రత్యేక కవర్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ప్రపంచంలో తెలుగు భాషకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. చిన్న పిల్లలను తెలుగులోనే మాట్లాడించాలని తల్లిదండ్రులకు సూచించారు. 7 -
నేటి నుంచి 134వ ఉరుసు మహోత్సవం
నగరంపాలెం: నగరంపాలెంలో శ్రీహాజరత్ కాలే మస్తాన్ షా ఆవులియా 134వ ఉరుసు మహోత్సవాన్ని మంగళవారం నుంచి నిర్వహిస్తున్నట్లు ధర్మకర్త రావి రామ్మోహరావు తెలిపారు. సోమవారం సాయంత్రం నగరంపాలెంలో 134వ ఉరుసు మహోత్సవ బ్రోచర్ను ఆయన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ఆరో తేది నుంచి పదో తేదీ వరకు ఈ మహోత్సవాలు కొనసాగుతాయని చెప్పారు. మంగళవారం తెల్లవారుజామున బాబా సమాధిపై చాందిని అలంకరణ, గంధ మహోత్సవం, రాత్రి సందల్ (గంధం) ఊరేగింపు ఉంటుందని అన్నారు. ఏడో తేదీ సాయంత్రం గంధం పంపిణీ, దీపారాధన, ఎనిమిదో తేదీన పురాణ పఠనం, తొమ్మిదిన బాబా వస్త్రాలను పంచడం, బాబా కుర్చీ యథాస్థానంలో ఉంచడమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఈ మహోత్సవానికి వచ్చే బాబా భక్తులకు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా కనీస మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతిరోజు భక్తులకు అన్న సంతర్పణ ఉంటుందని చెప్పారు. బాబా గంధం, ఊరేగింపుల కార్యక్రమాల్లో భక్తులు పాల్గొనాలని అన్నారు. -
తుళ్లూరులో టవర్ ఎక్కి యువకుడు హల్చల్
తాడికొండ: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మల్కాపురం జంక్షన్లో సోమవారం రాంబాబు అనే యువకుడు ఓ విద్యుత్ టవర్పైకి ఎక్కి హల్చల్ చేశాడు. స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతని వివరాలు ఆరా తీశారు.. తాను బెట్టింగ్ యాప్ల వలన అప్పుల పాలయ్యానంటూ వాపోయాడు. ఆత్మహత్య చేసుకునేందుకే టవర్ ఎక్కానని చెప్పగా.. పోలీసులు అతనితో సానుకూలంగా మాట్లాడి టవర్ నుంచి కిందకు దింపారు. పోలీసు విచారణలో యువకుడిది నెల్లూరు జిల్లాగా గుర్తించారు. బెట్టింగ్ యాప్లో ఆట ఆడటం వలన రూ.80 లక్షలు నష్టపోయానని, ఇంకా రూ.60 లక్షలు అప్పు ఉందని యువకుడు పోలీసులకు తెలిపాడు. సినీహీరోలు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం వలననే తాను బెట్టింగ్లో డబ్బులు పెట్టానన్నారు. అప్పులు తీర్చడం కోసం తాను కిడ్నీ అమ్ముకోవడానికి హైదరాబాద్ వెళ్లానని, రూ.4 లక్షలు మాత్రమే ఇస్తానన్నారని, సంక్రాంతి పండుగ వస్తుందని, అప్పుల వాళ్లు తనను ఇబ్బంది పెడుతున్నారని, తనకు రూ.10 లక్షలు కావాలన్నాడు. కిడ్నీ అమ్ముకునేందుకు అనుమతి కోసం 5 రోజుల నుంచి హైకోర్టు చుట్టూ తిరుగుతుంటే తనను లోపలికి వెళ్లనివ్వలేదని, లాయర్లు ఐపీ పెట్టమని సలహా ఇస్తే తాను అలా చేయలేనన్నారు. రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మంగళగిరి టౌన్ : అమెరికాలో ఎంసీఏఏ ఆధ్వర్యాన జాతీయ స్థాయిలో జరిగే ఆ దేశ వాలీబాల్ పోటీల్లో పాల్గొనే టీమ్కు మంగళగిరి క్రీడాకారుడు ఎంపికయ్యాడు. స్ధానిక వివిధ పార్టీల నాయకులు క్రీడాకారుడు ఈశ్వర్ను సోమవారం శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురుమాట్లాడుతూ జనవరి నుంచి మే వరకు అమెరికాలో జరిగే ఆ దేశ వాలీబాల్ పోటీల్లో మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన పొండుగల ఈశ్వర్ ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈశ్వర్ అమెరికాలో పుట్టి పెరిగి అక్కడే విద్యను అభ్యసిస్తూ, ఆ దేశంలో జరిగే వాలీబాల్ పోటీలకు పెప్పర్ డైన్ విశ్వవిద్యాలయం నుంచి ఎంపికయ్యాడని తెలిపారు. ఫిబ్రవరి 12న జరిగే పోటీలలో ఈశ్వర్ టీమ్ తలపడనుందని, గ్రామానికే కాక రాష్ట్రానికి దేశానికి గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో ఈశ్వర్ క్రీడల్లో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. అభినందించిన వారిలో స్థానికులు వెంకటేశ్వరరావు, శివరామయ్య, నంద కిషోర్, బ్రహ్మం, అన్నె చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. -
పుస్తకాలకు సమాజాన్ని శాసించే శక్తి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): సమాజాన్ని శాసించే శక్తి పుస్తకాలకు ఉందని విశ్రాంత ఐఏఎస్ అధికారి కృష్ణయ్య అన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవంలో సోమవారం సాయంత్రం ఆచార్య గుజ్జు చెన్నారెడ్డి రచించిన ‘ధర్మపురి’ నవలను కృష్ణయ్య ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజంపై పుస్తకాల ప్రభావం ఉంటుందన్నారు. గుజ్జు చెన్నారెడ్డి నవలను తీసుకురావటం అభినందనీయమన్నారు. రచయిత చెన్నారెడ్డి మాట్లాడుతూ.. బుద్ధుని చరిత్రతో ప్రభావితమై, దానిని ఆధునిక పరిస్థితులకు అన్వయిస్తూ ఈ నవల రాసినట్లు తెలిపారు. ఈగల్ ఎస్పీ నగేష్బాబు మాట్లాడుతూ.. మత్తు మందుల్లాంటి ప్రమాదకర వ్యసనాల నుంచి భావితరాలను రక్షించే శక్తి మంచి పుస్తకాలకు ఉందన్నారు. ప్రభుత్వ సహాయ కార్యదర్శి కృష్ణయ్య, పుస్తక మహోత్సవ సంఘం అధ్యక్షుడు మనోహర్ నాయుడు పాల్గొన్నారు. మినీ కవితా ఉద్యమ సారథి కొల్లూరి ఎక్స్రే పత్రిక సంస్థాపకుడు కొల్లూరి మినీ కవితా ఉద్యమ సారథి అని పలువురు వక్తలు కొనియాడారు. ఎక్స్రే పత్రిక, నెలనెలా వెన్నెల కార్యక్రమం ద్వారా మినీ కవితా ఉద్యమానికి ఆయన కృషి చేశారని పేర్కొన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవంలో కవి, ఎక్స్రే పత్రిక సంస్థాపకుడు కొల్లూరి సంస్మరణ సభ జరిగింది. ఈ సభకు ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం కార్యదర్శి చలపాక ప్రకాష్ అధ్యక్షత వహించారు. సింగంపల్లి అశోక్ కుమార్, బి.ఆంజనేయరాజు, కందికొండ రవికిరణ్, ఉమామహేశ్వరి, శైలజ సామినేని ప్రసంగించారు. సమాజాన్ని ఆవిష్కరించే సాధనం కవిత్వం సమాజ వాస్తవ స్వరూపాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించే సాధనం కవిత్వమని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏఎండీ ఇంతియాజ్ అన్నారు. ‘పాతికేళ్ల కవిత’ అంశంపై చర్చాగోష్ఠిని బీవీ పట్టాభిరామ్ సాహిత్యవేదికపై నిర్వహించారు. రచయిత ఖాదర్ మొహియుద్దీన్, కడలి సత్యనారాయణ, కవి అనిల్ డ్యానీ ప్రసంగించారు. సాహితీ స్రవంతి సత్యాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వాధికారి మెరుపుల అజయ్కుమార్ పాల్గొన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి కృష్ణయ్య -
11న ఏపీటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సు
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ ఉద్యమ సారథి నూతలపాటి పరమేశ్వరరావు 4వ వర్ధంతి సందర్భంగా ఈనెల 11న ఏపీ టీఎఫ్ ఆధ్వర్యంలో ఏసీ కళాశాలలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి విద్యాసదస్సులో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.బసవలింగారావు, మహమ్మద్ ఖాలీద్లు పిలుపునిచ్చారు. కన్నావారితోటలోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో సోమవారం విద్యాసదస్సు పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కె.బసవలింగారావు మాట్లాడుతూ గత 80 ఏళ్లుగా ఆంధ్రనాట విద్యారంగ ప్రగతికి, ఉపాధ్యాయ సంక్షేమానికి ఏపీటీఎఫ్ కృషి చేస్తోందని అన్నారు. విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి జరిగే పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న ఏపీటీఎఫ్ సంఘంలో పరమేశ్వరరావు కీలక పాత్ర పోషించారన్నారు. కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు, జి.దాస్, జిల్లా కార్యదర్శులు పి.లక్ష్మీనారాయణ, పి.శివరామకృష్ణ, ఎస్.సత్యనారాయణ మూర్తి, కేసన రమేష్, ఆర్.బలరాజు, సిద్దిక్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. -
సెమీ ఫైనల్స్కు కేఎల్యూ జట్టు
తాడేపల్లి రూరల్: వడ్డేశ్వరంలో జరుగుతున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ పురుషుల టోర్నమెంట్–2026 పోటీలు సోమవారంతో మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సౌత్జోన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరి డాక్టర్ కె.హరికిషోర్ మాట్లాడుతూ.. ఎనిమిది జట్లు సెమీ ఫైనల్స్కు చేరుకున్నాయని తెలిపారు. సెమీ ఫైనల్స్ క్రీడలు రాత్రి కూడా జరగనున్నాయని.. సోమవారం సాయంత్రం 5వ రౌండ్ పూర్తయ్యే సమయానికి కేఎల్యూ జట్టు చైన్నెకు చెందిన భారతీయార్ యూనివర్సిటీ జట్టుపై విజయం సాధించి సెమీ ఫైనల్స్లో తలపడనుందని తెలిపారు. జేఎన్టీయూ కాకినాడ జట్టుపై కేరళకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కాలికట్ విజయం సాధించిందని పేర్కొన్నారు. వీటితో పాటు మరో ఆరు జట్లు సెమీ ఫైనల్స్లో తలపడుతున్నాయని.. సెమీ ఫైనల్స్ ముగిసిన అనంతరం మంగళవారం మధ్యాహ్నం ఫైనల్ మ్యాచ్ జరుగనున్నట్లు వివరించారు. -
‘ఉపాధి’ చట్టాన్ని యథాతఽథంగా అమలు చేయాలి
అమరావతి: 2005 నుంచి కొనసాగుతున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతధంగా అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం–2025 వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవిక మిషన్ గ్రామీణ చట్టానికి వ్యతిరేకంగా స్థానిక గ్రామ సచివాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో కీలకమైన నాలుగు అంశాలను రద్దుచేసి కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం 2025 డిసెంబర్లో నూతన చట్టాన్ని తెచ్చి పాత చట్టంలో ఉన్నటువంటి ఉపాధికి గ్యారెంటీ అంశాన్ని రద్దు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం భరిస్తున్న 90శాతం నిధులను 60 శాతానికి కుదించి రాష్ట్రాలు 40 శాతం భరించాలని సవరణ చేయటం దారుణమన్నారు. ఇప్పటికే రాష్ట్రాలు అప్పుల పాలై అధోగతిలో ఉంటే 40శాతం నిధులు భరించే స్థితి లేక ఉపాధి హామీ చట్టాన్ని నీరుగారుస్తాయన్నారు. పాత చట్టంలో 100 రోజులు ప్రతి కుటుంబం తమకు అవకాశం ఉన్న సందర్భంలో పనికి హాజరుకావచ్చని, కొత్త చట్టంలో ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రాంతాల్లో మాత్రమే వర్తింపచేయటం కూలీల కడుపుకొట్టటమేనన్నారు. కొత్త చట్టం వల్ల లక్షలాది గ్రామీణ వ్యవసాయ కుటుంబాలు పని లేక వలసలు పోవాల్సి వస్తుందన్నారు. అనంతరం స్థానిక గ్రామ సచివాలయం వద్ద జరుగుతున్ గ్రామసభలో పంచాయతీ కార్యదర్శి నాగరాజుకు వినతిపత్రం అంచేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి.సూరిబాబు, ఎస్కే రఫీ సయ్యద్ బహుదిన్ వలి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు నండూరి వెంకటేశ్వరరాజు, మండల కన్వీనర్ పి.సత్యనారాయణ, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. -
విశేష అలంకరణలో కల్యాణ వేంకటేశ్వరస్వామి
సత్తెనపల్లి: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని పట్టణంలోని పలు ఆలయాల్లో సోమవారం భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సత్తెనపల్లి పట్టణం వడ్డవల్లిలోని శ్రీ రామాలయం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామికి విశేష అలంకారం చేశారు. కోదండ రామచంద్ర ప్రభువైన శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయస్వామిలను విశేష అలంకరణ చేసి పూజలు, గోత్రనామాలతో అభిషేకాలు చేశారు. మహిళలు పాశురాలను పఠించారు. పట్టణంలోని రైల్వేస్టేషన్రోడ్లో ఉన్న శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారికి గంధంతో అలంకారం చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వ హించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ప్రధాన అర్చకులు చిత్రకవి శ్యాము ఆచార్యులు గోత్రనామాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కోలాట ప్రదర్శన చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఆయా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. వైభవంగా శ్రీరామయోగయ్య స్వామి తిరునాళ్ల వేడుకలు నూజెండ్ల: నూజెండ్ల గ్రామంలో వేంచేసి యున్న శ్రీరామయోగయ్య స్వామి తిరునాళ్ల వేడుకలు సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారిని వేకువజాము నుంచి పంచామృతాలతో ప్రత్యేకంగా అభిషేకించి విశేష పూజలు చేశారు. గ్రామంలోని నలుదిక్కులు ఏర్పాటు చేసిన పాదులకు మేళతాళాల నడుమ వైభవంగా 108 బిందెలతో గ్రామస్తులు జలాభిషేకం చేశారు. మహిళలు పొంగళ్లు పొంగించి తమ మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని వీధుల్లో మేళతాళాలతో ఘనంగా ఊరేగించారు. మూడు విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేశారు. కోర్టు ఆవరణలో సోషల్ సెక్యూరిటీ ఆడిట్ నరసరావుపేట టౌన్: నరసరావుపేట కోర్టు ఆవరణలో పల్నాడు జిల్లా ఏఆర్ ఏఎస్పీ సత్తిరాజు ఆధ్వర్యంలో సోమవారం సోషల్ సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కోర్టు ఆవరణలో భద్రతాపరమైన అంశాలను పరిశీలించి న్యాయస్థానం ఏవోకు పలు సూచనలు చేశారు . ప్రహరీ గోడపైన ఇనుప కంచె నిర్మించాలని సూచించారు. కోర్టు ఆవరణలోకి వచ్చే కక్షిదారులను తనిఖీ చేయడానికి తగు ఏర్పాట్లు చేయాలన్నారు. కోర్టు విధులు నిర్వహించే సమయంలో సాయుధ భద్రతనుఆవరణలో ఏర్పాటు చేయాలన్నారు. అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారు. జనరేటర్ పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు ఆవరణలో రాత్రి సమయంలో విద్యుత్ కాంతి ఉండేలా లైట్లు ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు. సత్తెనపల్లిలో 100 అడుగుల జాతీయజెండా ఆవిష్కరణ సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి తాలూకా సెంటర్లో రూ.18.40 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన 100 అడుగుల జాతీయ జెండాను రాష్ట్ర విద్యుత్ శాఖ, పల్నాడు జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చల్లం చర్ల లక్ష్మీతులసీ, కమిషనర్ నంబూరి ఆనంద్కుమార్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. -
మమ్మీ, డాడీ కల్చర్కు స్వస్తి పలకండి
ప్రత్తిపాడు: తెలుగు రాష్ట్రంలో పుట్టిన బిడ్డలెవ్వరూ అమ్మా, నాన్నలను మమ్మీ, డాడీ అని పిలవకూడదని, మమ్మీ, డాడీ కల్చర్కు స్వస్తి పలికి, ఇంట్లో తెలుగు మాట్లాడాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంటలోని మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ముందస్తు సంక్రాంతి వేడుకలకు ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు హాజరయ్యారు. తొలుత కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన మాజీ రాష్ట్రపతి ఏపీజె అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం హాస్టల్ ఆవరణలో నూతనంగా నిర్మించిన గాయత్రి సదన్ హాస్టల్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. విద్యార్థినుల సాంస్కృతిక నృత్య ప్రదర్శలు, కోలాటాలను ఆసక్తిగా వీక్షించారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ అమ్మా.. అనే మాట అంతరాల నుంచి వస్తుందని, మమ్మీ అంటే మూతి నుంచి వస్తుందన్నారు. ఇంగ్లీషు తప్పనిసరిగా చదువుకోవాలని, కానీ ఇంట్లో, వీధిలో, గుడిలో, బడిలో అమ్మఒడి నుంచి వచ్చిన భాషను మరిచిపోకూడదన్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
రొంపిచర్లలో విజిలెన్స్ దాడులు
50 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత నరసరావుపేట టౌన్: అక్రమంగా తరలిస్తున్న 50 బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. రొంపిచర్ల మండలం బుచ్చిబాపన్నపాలెం గ్రామం నుంచి రామిరెడ్డిపాలెం వైపు అక్రమంగా మినీ లారీలో ప్రజా పంపిణీ బియ్యం రవాణా చేస్తున్నారన్నా సమాచారం మేరకు విజిలెన్స్ సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. వాహనంలో అక్రమంగా రవాణా చేస్తున్న 50 బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని రొంపిచర్ల ఎస్ఐ లోకేశ్వరరావుకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మంగళగిరి టౌన్ : త్వరలో జరగనున్న సౌత్జోన్ ఆలిండియా పోలీస్ క్రికెట్ టోర్నమెంట్కు సెలక్షన్స్ నిర్వహిస్తున్నామని స్టోర్స్ ఐజీపీ ఏవీ మోహనరావు తెలిపారు. మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఏపీ పోలీస్ స్టేట్ టి–20 సెలక్షన్స్ కార్యక్రమాన్ని ఆయన సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహనరావు మాట్లాడుతూ ఈ సెలక్షన్లు జనవరి 5 నుంచి 11వ తేదీ వరకు మంగళగిరి స్టేడియం, మూలపాడు స్టేడియంలలో జరగనున్నట్లు పేర్కొన్నారు. ఈ సెలక్షన్స్కు 11 టీమ్లు వచ్చాయని ఏపీయస్పీ, ఆక్టోపస్, గ్రేహాండ్స్, ఇంటెలిజెన్స్, సీఐడీ, ఏసీబీల టీమ్లు ఆడనున్నట్లు తెలిపారు. వీటిలో బాగా ఆడి గెలుపొందిన టీమ్లను ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే సౌత్జోన్ ఆలిండియా పోలీస్క్రికెట్ పోటీలకు పంపనున్నట్లు వివరించారు. సోమవారం మొదటి మ్యాచ్ విశాఖ–కర్నూలు మధ్య జరిగిందని తెలియజేశారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మేనేజర్ చందు కిషోర్, సెలెక్టర్ ప్రదీప్లతో పాటు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
రోగాలూ ఎంతో ఫాస్ట్
● నాణ్యతలేని ఫాస్ట్ఫుడ్తో అనారోగ్యం ● చిన్న వయస్సులోనే గ్యాస్ట్రబుల్ సమస్యలు ● జంక్ ఫుడ్తో పెరుగుతున్న వ్యాధులు ● కనీసం పట్టించుకోని అధికారులు జిల్లాలో వెయ్యికిపైగా షాపులు... వ్యాధులకు కారణాలు నేడు ఎంతో మంది బయటి ఆహారం ఎక్కువగా తింటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, చిన్నారులు సైతం ఫాస్ట్ఫుడ్కు అలవాటు పడి రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. సకాలంలో వ్యాధులను గుర్తించి చికిత్స అందించని పక్షంలో తీవ్రంగా అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కన్నవారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. -
రెండో రోజుకు చేరిన పురుషుల బ్యాడ్మింటన్ పోటీలు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని వడ్డేశ్వరంలో జరుగుతున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ పురుషుల టోర్నమెంట్ 2026 పోటీలు ఆదివారం రెండవ రోజుకు చేరుకున్నాయి. సౌత్జోన్ బ్యాడ్మింటన్ అసోసియేషన ఆర్గనైజింగ్ సెక్రటరి డాక్టర్ కె.హరికిషోర్ మాట్లాడుతూ రెండవ రోజు పోటీలలో రెండు, మూడు రౌండ్లు పూర్తయ్యాయని, రెండవ రౌండ్లో మొత్తం 64 జట్లు పోటీ పడ్డాయని, వాటిలో 30 జట్లు గెలుపొందాయని పేర్కొన్నారు. రెండవ రౌండ్లో గెలుపొందిన 30 జట్లు ఆదివారం మధ్యాహ్నం మూడవ రౌండ్లో తలపడ్డాయని, 3వ రౌండ్లో ఆంధ్రాకు చెందిన జెఎన్టీయూ కాకినాడ జట్టు కర్ణాటకకు చెందిన గార్డెన్ సిటీ యూనివర్సిటీపై విజయం సాధించిందని వివరించారు. సోమవారం సెమీ ఫైనల్ అనంతరం మంగళవారం ఫైనల్ పోటీలు జరుగుతాయని హరికిషోర్ పేర్కొన్నారు. -
ఆ రోడ్డు.. రెండు జిల్లాలది..!
బల్లికురవ: సిమెంట్ రోడ్డు రెండు జిల్లాలకు హద్దుగా మారింది. ఈ రోడ్డు ఉత్తరం వైపు ప్రకాశం జిల్లా.. దక్షిణం వైపు బాపట్ల జిల్లాలోకి చేరడంతో అయోమయం నెలకొంది. బల్లికురవ నుంచి నక్క బొక్కలపాడు– కొణిదన– రాజుపాలెం మీదుగా ఎన్హెచ్ 16ను కలిపే లింకు రోడ్డు ఉంది. బల్లికురవ మండలంలోని కె.రాజుపాలెం రోడ్డు ఉత్తర భాగంలో.. మార్టూరు మండలంలో ఉన్న రాజుపాలెం దక్షిణ భాగంలోకి చేరింది. కె.రాజుపాలెంలో 920 మంది ఓటర్లు, రాజుపాలెంలో 2,400 మంది ఓటర్లున్నారు. మొన్నటి వరకు రెండు మండలాలు బాపట్ల జిల్లా పరిధిలోనే ఉన్నాయి. అంటే మార్టూరు మండలంలోని రాజుపాలెం పర్చూరు నియోజకవర్గంలో.. బల్లికురవ మండలంలోని కె.రాజుపాలెం అద్దంకి నియోజకవర్గంలో చేరి ఉన్నాయి. ఇటీవల జిల్లాల పెంపు సర్దుబాటులో భాగంగా బల్లికురవ మండలంలోని కె.రాజుపాలెం ప్రకాశం జిల్లాలోకి.. రెవెన్యూ డివిజన్ అద్దంకిలో చేరింది. మార్టూరు మండలంలోని రాజుపాలెం బాపట్ల జిల్లాలోకి.. రెవెన్యూ డివిజన్ చీరాల్లోకి వెళ్లింది. అయితే కె.రాజుపాలెం వాసులకు పొలాలన్నీ మార్టూరు మండల పరిధిలోకి చేరడంతో.. రెవెన్యూ పనులకు చీరాల వెళ్లక తప్పదని రైతులు చెబుతున్నారు. అధికారులు తికమక పడుతున్నారు. కాగా కె.రాజుపాలెంలో టీ దుకాణాలు కూడా లేకపోవడంతో రోడ్డు దాటి పక్క జిల్లా అయిన బాపట్లకు వెళ్లాల్సి రావడం కొసమెరుపు. -
షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్కు విశేష స్పందన
తెనాలిటౌన్: ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్కు రాష్ట్రం నలుమూలల నుంచి విశేషస్పందన లభించిందని మా–ఏపీ వ్యవస్థాపకులు, సినీదర్శకుడు దిలీప్రాజా చెప్పారు. ఈనెల 11న నిర్వహించనున్న ఈ పోటీల వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మా–ఏపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా–ఏపీ వ్యవస్థాపకులు, సినీదర్శకుడు దిలీప్రాజా వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించాలనే భావనతో నిర్వహిస్తున్న ఈ పోటీలకు మొత్తం 203 ఎంట్రీలు వచ్చాయని తెలిపారు. ఆయా షార్ట్ ఫిలింస్ జ్యూరీ పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. పోటీలకు ఎంట్రీలు పంపిన ఔత్సాహికులు అందరికీ జనవరి 11న తెనాలిలో జరిగే షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ సంబరాలకు ఆహ్వానం పలుకుతున్నట్లు కో– కన్వీనర్, సినీదర్శకుడు అచ్చన శ్రీనివాస్ యాదవ్ కోరారు. సమావేశంలో సహాయ దర్శకులు గాజులపల్లి రాముడు, నరేష్ దోనే, నటుడు మిలటరీ ప్రసాద్ పాల్గొన్నారు. -
ముదిరాజ్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
నెహ్రూనగర్: ఆంధ్రప్రదేశ్లో ముదిరాజ్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కోమటి విష్ణువర్ధన్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. సంపత్నగర్లో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాజధానిలో ముదిరాజ్ కమ్యూనిటీ భవన్ కోసం ఐదెకరాల స్థలం ఇవ్వాలని కోరారు. బీసీ డీలో ఉన్న ముదిరాజ్లను బీసీ ఏలోకి మార్చాలన్నారు. జనాభా దామాషా ప్రకారం నామినేట్ పదవుల్లో ముదిరాజ్లకు తగిన ప్రాధాన్యత కల్పించాలన్నారు. సమావేశంలో ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి బొమ్మన సుబ్బారాయుడు, గౌరవ అధ్యక్షుడు జయరాం, జిల్లా అధ్యక్షుడు గొడుగు శంకర్, రాజు, సాంబశివరావు, రాంబాబు, శేఖర్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఫిరంగిపురం: మండలకేంద్రంలోని బాల ఏసు కథెడ్రల్ దేవాలయంలో ఆదివారం శ్రీసభలో క్రీస్తు సాక్షాత్కార (ముగ్గురు రాజుల పండుగ)మహోత్సవం నిర్వహించారు. దివ్యపూజాబలి నిర్వహించారు. బాల ఏసు కథెడ్రల్ దేవాలయ విచారణ గురువులు మాలపాటి ఫాతిమా మర్రెడ్డి వాక్యోపదేశం చేశారు. దేవుని కుమారుడు మానవుడిగా జన్మించాడని చెప్పారు. ఆదినుంచి భగవంతుడు తన పవిత్రగంథం ద్వారా తన కుమారుడు భూమిపై లోక రక్షకుడిగా జన్మిస్తాడని తెలిపారన్నారు. పరలోక రాజ్యం యూదులకే కాదని ప్రతి ఒక్కరికి ఉందని.. అందుచేతనే దీనిని ముగ్గురు రాజుల పండుగగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భగవంతుడు భూమిపై ప్రతి ఒక్కరిని రక్షించేందుకు జన్మించాడన్నారు. సత్యం తెలియజేసేందుకు గాను మానవుడిగా క్రీస్తు జన్మించి దానిని ప్రతి ఒక్కరికీ తెలియజేసినట్లు చెప్పారు. అనంతరం దివ్యపూజాబలి నిర్వహించారు. సహాయ విచారణ గురువులు సాగర్, మఠకన్యా సీ్త్రలు, సోడాలిటీ సభ్యులు, ప్యారిష్ కౌన్సిల్, గుడిపెద్దలు, కథోలిక క్రైస్తవులు పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని 16వ నెంబర్ జాతీయ రహదారి, కుంచనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. జరిగిన సంఘటనపై తాడేపల్లి పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. సేకరించిన వివరాల ప్రకారం... దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామానికి చెందిన కామినేని భవానీశంకర్ (33) కుటుంబ జీవనోపాధి కోసం విజయవాడలోని ఓ వస్త్రదుకాణంలో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి స్టాక్ రావడంతో వాటిని చూసుకొని 12 గంటల తరువాత ఇంటికి వెళుతుండగా 16వ నెంబర్ జాతీయ రహదారిపై వెనుక నుంచి వస్తున్న కారు భవానీశంకర్ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో భవానీ శంకర్కు తీవ్ర గాయాలుకాగా, కారులో వైద్య నిమిత్తం దగ్గరలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్య నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో అతను మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఖాజావలి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ విజయవాడ మాచవరం పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. తాడేపల్లి పోలీసులు అక్కడి నుండి తీసుకువచ్చి విచారణ చేపట్టారు. -
సీఎం వస్తే మొక్కల ఖర్చే రూ.లక్షలు!
నెహ్రూ నగర్: గుంటూరు నగరానికి సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారంటే చాలు.. నగరపాలక సంస్థ రూ.లక్షలు ఖర్చు చేసి మొక్కలు తీసుకురావడం పరిపాటిగా మారింది. గత సంవత్సరం ఓ ప్రైవేట్ కార్యక్రమానికి గుంటూరు వచ్చిన సీఎంకు గుంటూరులో పచ్చదనం కనిపించేలా రోడ్లమీద, డివైడర్ల మీద ప్రత్యేకంగా రూ.లక్షలు ఖర్చు చేసి మొక్కలు పెట్టారు. వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో తెచ్చిన కొద్ది రోజులకే ఎండిపోయిన విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దుమారం రేగింది. దీనికి సంబంధించిన బిల్లు సుమారు రూ. 30 లక్షలు ప్రాసెస్ చేసినట్లు ఆరోపణలు లేకపోలేదు. ప్రస్తుతం గుంటూరు నగర పరిధిలో ఉన్న శ్రీ సత్యసాయి స్పిరిచ్యువల్ సిటీలో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం ఆ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. దీంతో మళ్లీ పలు రోడ్లు మెరిసిపోతున్నాయి. రోడ్డుకు రెండు పక్కల మొక్కలు కూడా పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. అరండల్పేటలోని పాత కమిషనర్ బంగ్లాలో లారీల్లో మొక్కలు దింపడంపై ప్రజలు విస్తుపోతున్నారు. మొక్కలు తీసుకురావడంపై ఉన్న శ్రద్ధ వాటిని పరిరక్షించడంపై కూడా చూపాలని నగరవాసులు కోరుతున్నారు. -
వృద్ధురాలిపై విచక్షణారహితంగా దాడి
తాడికొండ: రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలం వడ్డమానులో దారుణం చోటు చేసుకుంది. గ్రామ శివారులో వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన ఘటన శనివారం జరిగింది. గేదెలు కాసుకునేందుకు వెళ్లగా కర్రతో విచక్షణా రహితంగా దాడిచేసిన గుర్తు తెలియని వ్యక్తి పరారీ కాగా రక్తపు మడుగులో స్పృహ తప్పి పడిపోయిన వృద్ధురాలిని ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. వివరాల ప్రకారం.. వడ్డమాను గ్రామానికి చెందిన మేళం కోటేశ్వరమ్మ గేదెలు కాసుకునేందుకు వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తి కరత్రో విచక్షణరహితంగా దాడి చేయడంతో స్పృహ కోల్పోయింది. దీంతో దుండగుడు ఆమె మెడలో ఉన్న బంగారు మంగళ సూత్రం లాక్కెళ్లాడు. గేదెలు కాసేందుకు వెళ్లిన ఆమె సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో వెతికేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులు రక్తపు మడుగులో స్పృహ తప్పి పడిపోయిన వృద్ధురాలిని గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స అందించి ఇంటికి తీసుకొచ్చిన అనంతరం తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఘటనపై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధురాలికి తలకు 30 కుట్లు పడ్డాయని, ఘటన అనంతరం ఆమె మానసిక స్థితి సైతం సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. -
కౌండిన్య ఎడ్యుకేషన్ సేవలు ప్రశంసనీయం
పెదకాకాని: ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించడంతోపాటు పోటీ పరీక్షలకు తీర్చిదిద్దుతున్న కౌండిన్య అకాడమీ సేవలు ప్రశంసనీయమని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పెదకాకాని మండలం వెనిగండ్ల కౌండిన్యపురంలో ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యనభ్యసిస్తున్న 459 మంది విద్యార్థులకు 20వ ఉపకార వేతన(ఉత్తమ పురస్కారాలు) ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎడ్యుకేషనల్ ట్రస్టు ఫౌండర్, గౌడ జన సేవా సమితి చైర్మన్ డాక్టర్ ఈవీ నారాయణ అధ్యక్షత వహించారు. పెమ్మసాని మాట్లాడుతూ సమాజంలో ఆర్థిక అసమానతలు రూపుమాపడం విద్య ద్వారానే సాధ్యమని భావించి సేవా దృక్పథంతో పనిచేస్తున్న ట్రస్టు నిర్వాహకులను కొనియాడారు. మతాలకు, కులాలకు, ప్రాంతాలకతీతంగా పనిచేస్తున్న ట్రస్టుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ కార్పొరేట్ స్కూల్లో చదివిన విద్యార్థితో ప్రభుత్వ పాఠశాల విద్యార్థి పోటీ పడలేకపోతున్నాడన్నారు. చదువులో ప్రతిభ కనపరుస్తున్న పేద విద్యార్థులను ఎంపిక చేసి ఉపకార వేతనాలు ఇవ్వడం, అలానే నిరుద్యోగులను పోటీ పరీక్షలకు తీర్చిదిద్దుతున్న కౌండిన్య అకాడమీ సేవలను కొనియాడారు. ఎడ్యుకేషనల్ ట్రస్టు ఫౌండర్, గౌడ జన సేవా సమితి చైర్మన్ డాక్టర్ ఈవి నారాయణ ట్రస్టు స్థాపన, ఉపకార వేతనాల పంపిణీ, నిరుద్యోగులను పోటీ పరీక్షలకు తీర్చిదిద్దుతున్న తీరును వివరించారు. ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, ధూళిపాళ్ల నరేంద్రకుమార్లు ట్రస్టు సేవలను కొనియాడారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ సెక్రటరీ అద్దంకి శ్రీధర్బాబు, సిక్కిం విశ్రాంత డీజీపీ అత్తిలి సుధాకర్లు హాజరు కాగా ప్రత్యేక అతిథిగా కళారత్న అవార్డు గ్రహీత బొర్రా గోవర్ధన్లు హాజరయ్యారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 459 మంది విద్యార్థులకు రూ.19 లక్షలు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పామర్తి సాంబశివరావు, వాకా రాంగోపాల్గౌడ్, బొబ్బిళ్ల వెంకటేశ్వరరావు, కారంకి లక్ష్మీనారాయణ, బెల్లంకొండ సదాశివరావు, డాక్టర్ సేవాకుమార్, జల్లెడ శ్రీనివాసరావు, వీరంకి రంగారావు, వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, పీఠా సుబ్బరామయ్య, డాక్టర్ కృష్ణ, పలువురు విరాళ దాతలు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
అవినీతి మరక లేని వ్యక్తి అటల్జీ
● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ గుంటూరు మెడికల్: సమైక్య వాదంతో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి రాజకీయాలు చేశారని, ఆయన అవినీతి మరక లేని వ్యక్తి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. గుంటూరు లక్ష్మీపురం కూడలిలో ఏర్పాటు చేసిన వాజపేయి విగ్రహావిష్కరణ ఆదివారం జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరు తిరుపతిరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాధవ్ మాట్లాడుతూ సర్కిల్ను వాజ్పేయ్ సర్కిల్గా నామకరణం చేస్తున్నామని చెప్పారు. విభిన్న సిద్ధాంతాలున్న పార్టీలను ఏకతాటిపైకి తెచ్చారని వెల్లడించారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడుతూ అటల్ బిహారి వాజ్పేయి దేశం గర్వించే మహోన్నత నాయకుడని కొనియాడారు. నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం మంచి పరిణామన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ,అటల్ మోదీ సుపరిపాలన యాత్ర రాష్ట్ర కన్వీనర్ నాగోతు రమేష్ నాయుడు, పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
ఏపీఆర్ఎస్ఏ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
గుంటూరు వెస్ట్: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా పీఏ కిరణ్ కుమార్ మరోసారి ఎన్నికయ్యారు. కిరణ్ కుమార్ ప్యానెల్కు వ్యతిరేకంగా ఎవరూ పోటీ చేయకపోవడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం గెలుపొందిన ప్యానెల్ 2029 వరకు పని చేస్తుందని తెలిపారు. ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేట్ ప్రెసిడెంట్గా కోటంరాజు గోపాలకృష్ణ, ఉపాధ్యక్షులుగా ఎండీ గౌస్, వి.సర్వేశ్వర రెడ్డి, ఎస్.హీనాప్రియ, ప్రధాన కార్యదర్శిగా ఎం.వెంకట రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి.భాస్కర రావు (డిప్యూటీ తహసీల్దార్), స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీగా ఎస్కే దరియా వలి, జాయింట్ సెక్రటరీలుగా డి.దివ్య దుర్గాదేవి (డిప్యూటీ తహసీల్దార్), కె.రాజీవ్ కుమార్, జె.రవికుమార్, ట్రెజరర్గా కె.గోపి ఎన్నికయ్యారు. -
గంజాయి ముఠా అరెస్టు
● అరకు నుంచి తీసుకొచ్చి అమ్మకాలు ● 4.95 కిలోల గంజాయి స్వాధీనం ● 150 గ్రాముల ప్యాకెట్లతో విక్రయాలు ● క్రయ, విక్రయాలు చేసిన 14 మంది నిందితులు అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన ఎస్పీ వకుల్ జిందాల్ నగరంపాలెం: గంజాయి క్రయ విక్రయాలకు సంబంధించి 14 మందిని అరెస్ట్ చేసి, 4.95 కిలోల గంజాయిని పెదకాకాని పోలీసులు సీజ్ చేశారు. గుంటూరు నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో ఆదివారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ముందస్తు సమాచారంతో ఆదివారం పెదకాకాని గ్రామ పరిధిలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ సమీపంలోని పాత రేకుల షెడ్లో తనిఖీలు నిర్వహించారు. షెడ్లో ఉన్న నలుగురు ఉడాయించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నలుగురిని పోలీసులు చాకచాక్యంగా పట్టుకున్నారు. గంజాయి క్రయ విక్రయాలతోపాటు తాగుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ మేరకు మంగళగిరి పెదవడ్లపూడి రైల్వేస్టేషన్ రోడ్లో ఉంటున్న ముత్యాల రమణారావు అలియాస్ రాకీ, ప్రస్తుతం పెదకాకాని ఎన్టీఆర్ కాలనీలో నివసిస్తున్న ప్రకాశం జిల్లా పుల్లలచెరువు వాసి నూనె యోహాన్, పెదకాకాని తక్కెళ్లపాడు గ్రామ ఎస్టీకాలనీ వాసి పేరం ఓంకార్, నంబూరు గ్రామం విజయభాస్కర్నగర్ ఆర్సీఎం చర్చి సమీపంలో ఉంటున్న వేమూరి షారోన్ అలియాస్ రాకేష్తోపాటు మంగళగిరి రైల్వేస్టేషన్ రోడ్లో ఉండే షేక్ సిద్ధయ్య అలియాస్ సిద్ధు, నంబూరు అలీరఫత్ కాలనీ వాసి మొక్కాల సుధాకర్ అలియాస్ జాన్సన్, తక్కెళ్లపాడు ఎస్టీ కాలనీకి చెందిన కాట్రగుంట సువర్ణరాజు, పేరం గోపీ, పెదకాకాని పాతూరు వాసి షేక్ సమీర్, నంబూరు గ్రామం విజయభాస్కర్ నగర్ వాసి కొలకలూరి రాకేష్, కేసాని వెంకటేశ్వరరావు అలియాస్ వెంకి, నంబూరు నాగేశ్వరరావు అలియాస్ అబ్బు, కుంబ సాయికిరణ్, శృంగారపాటి విశాల్లను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. వారి నుంచి 4.95 కిలోల గంజాయి సీజ్ చేశారని చెప్పారు. 30 ఏళ్ల ముత్యాల రమణారావు అలియాస్ రాకీ పూల మార్కెట్లో కూలీ పనులకు వెళ్లేవాడని ఎస్పీ తెలిపారు. అతనే అరకు నుంచి గంజాయి తీసుకొచ్చి, పెదకాకానిలో ఉండే నూనె యోహాన్, పేరం ఓంకార్, వేమూరి షారోన్లకు సరఫరా చేసేవాడని అన్నారు. రాకీపై పెదకాకాని, తాడేపల్లి పీఎస్లో నాలుగు గంజాయి కేసులు, మంగళగిరి రూరల్ పీఎస్లో డెకాయిటీ కేసు, సూర్యారావుపేట పీఎస్లో చోరీ కేసు ఉందన్నారు. రాకీ వద్ద కొనుగోలు చేశాక యోహాన్ చిన్న ప్యాకెట్లలో గంజాయి పెట్టి విక్రయించేవాడని అన్నారు. అతనిపై అరండల్పేట పీఎస్లో కొట్లాట కేసు ఉందన్నారు. 23 ఏళ్ల ఓంకార్పై నగరంపాలెం పీఎస్లో గొలుసు చోరీ, కొట్లాట కేసులు ఉన్నాయన్నారు. ఆటో డ్రైవర్ వేమూరి షారోన్ అలియాస్ రాకేష్ గంజాయి విక్రయాల్లో సహకరించేవాడని, అతనిపై కూడా పెదకాకాని పీఎస్లో ఒక గంజాయి కేసు ఉందన్నారు. సుమారు 150 గ్రాముల గంజాయి ప్యాకెట్లను విక్రయించే వారని అన్నారు. ఈ కేసుని ఛేదించిన పెదకాకాని పీఎస్ సీఐ టీపీ.నారాయణస్వామి, ఎస్ఐలు షేక్ ఎండీ.మీరాజ్, డి.రామకృష్ణ, హెచ్సీలు ఎన్.శ్రీనివాసరావు, సీహెచ్ సుబ్బారావు, కానిస్టేబుళ్లు ఎండీ ఇర్ఫాన్, వి.సుధాకర్లను జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలను అందించారు. సమావేశంలో డీఎస్పీలు మురళీ కృష్ణ (ఉత్తర సబ్ డివిజన్), జి.శ్రీనివాసులు (ఎస్బీ), సీఐ అలహరి శ్రీనివాస్ (ఎస్బీ) తదితరులు పాల్గొన్నారు. -
రంగవల్లులు సాంస్కృతిక ప్రతీకలు
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన రంగవల్లుల పోటీలకు విశేష ఆదరణ లభించింది. ఆయా చోట్ల జరిగిన ముగ్గుల పోటీల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంబటి రాంబాబు ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ నెల 4వ తేదీ నుంచి 7వరకు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో నాలుగైదు డివిజన్లు ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి పోటీలు నిర్వహించనున్నారు. ఈక్రమంలో ఒక క్లస్టర్ పరిధిలోని 18, 19, 20, 22 డివిజన్లకు సంబంధించి వైఎస్సార్ సీపీ నేతలు గేదేల రమేష్, కలపాల సత్యం, పల్లపు మహేష్, వెంక టేష్, పల్లపు దుర్గామహేష్, ఖాజామొహీద్దీన్ ఆధ్వర్యంలో శ్రీనివాసరావుపేటలోని శ్రీ రామనామక్షేత్రంలో ఆదివారం జరిగిన ముగ్గుల పోటీల్లో అంబటి రాంబాబు ముఖ్యఅతిథిగా హాజరై, పోటీలను ప్రారంభించారు. పోటీల్లో 78 మంది మహిళలు పాల్గొని ముగ్గులు వేశారు. గ్రామీణ సంప్రదాయాలకు ఊపిరి ఆయా చోట్ల జరిగిన కార్యక్రమాల్లో అంబటి రాంబాబు మాట్లాడుతూ మన సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేయటంతో పాటు, ముగ్గుల పోటీల ద్వారా గ్రామీణ సంప్రదాయాలకు ఊపిరి పోయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు. పండుగ వాతావరణాన్ని తలపించే ఈ పోటీల్లో ప్రతి గీత వెనుక ఓ కథ, ప్రతి రంగు వెనుక ఓ విశ్వాసం దాగి ఉంటుందన్నారు. మహిళలు తమ సృజనాత్మకతను, సహనాన్ని, సంప్రదాయాలపై ఉన్న అభిమానాన్ని ఈ పోటీల్లో ప్రతిబింబిస్తారన్నారు. అమ్మమ్మల దగ్గర నేర్చుకున్న నమూనాలు, తల్లుల చేతిలో మెరుగుపడిన శైలులు, నేటి తరం ఆలోచనలతో కొత్త రూపు దాల్చి ముగ్గులుగా రూపుదిద్దుకుంటాయని పేర్కొన్నారు. సామాజిక ఐక్యతకు ప్రతీకలు ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ ఈ పోటీలు మహిళలకు తమ ప్రతిభను ప్రదర్శించుకునే వేదికగా మాత్రమే కాక, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయన్నారు. ఒకే ముంగిట్లో కలిసిన రంగులు, ఒకే ఆకాశం కింద పోటీపడే మనసులు మన సంస్కృతికి నిలువెత్తు నిదర్శనమన్నారు. ముగ్గుల పోటీలు అంటే రంగుల పండుగే కాదని, మన మూలాలను గుర్తు చేసే సాంస్కృతిక సంబరమేనని చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించటం ద్వారా తెలుగుదనం ఉట్టి పడుతుందని, భవిష్యత్తు తరాలకు మన సాంప్రదాయాలను చాటి చెప్పగలమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, నగర, జిల్లా కమిటీ నేతలు తదితరులు పాల్గొన్నారు. -
నేడు మంగళగిరికి మారిషస్ అధ్యక్షుడు
మంగళగిరి టౌన్: మారిషస్ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ సోమవారం మంగళగిరి రానున్నారు. ఆయన ఉదయం లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థాన ఎగువ, దిగువ సన్నిధిలోని స్వామివార్లను దర్శించుకోనున్నట్లు ఆ లయ కార్యనిర్వహణాధికారి కె.సునీల్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 7 గంటలకు ధరమ్ బీర్ గోకుల్ ఆలయానికి రానున్నారని, సంబంధిత ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి అమ్మవారు ఆదివారం అమృత వర్షిణి అలంకారంలో పూజలందుకున్నారు. అమ్మవారి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులు అధిక సంఖ్యలో రావటంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి పశ్చిమ డెల్టాకు 2,304 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యాంక్ కెనాల్కు 106 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 306, పశ్చిమ కాలువకు 126, నిజాంపట్నం కాలువకు 168, కొమ్మూరు కాలువకు 1,271 క్యూసెక్కులు విడుదల చేసినట్లు తెలిపారు. -
ఏపీ ఎన్జీజీఓ జిల్లా అధ్యక్షుడిగా ఘంటసాల
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం( ఏపీఎన్జీజీఓ) గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో మలేరియా సబ్ యూనియ్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఘంటసాల శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం గుంటూరులోని ఏపీఎన్జీజీఓ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులతో సహా మొత్తం 17 పోస్టులకు గాను కేవలం 17 నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయని ఎన్నికల అధికారి, ఎన్జీజీఓ సంఘ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కె.జగదీశ్వరరావు తెలిపారు. ఎన్నికలకు సహాయ అధికారిగా ఆనందనాథ్, పరిశీలకులుగా వి. సుబ్బారెడ్డిలు వ్యవహరించారు. మూడుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికై ఘంటసాల రికార్డు సృష్టించారు. ఘంటసాల శ్రీనివాసరావు, ఆరాధ్య శ్యామసుందర్ల నాయకత్వంలో నామినేషన్లు సమర్పించిన అనంతరం భారీ సంఖ్యలో ఉద్యోగులతో ర్యాలీ జరిగింది. ఎన్నికల ఫలితాలు ప్రకటించగానే ఎన్నికై న అభ్యర్థులతో ఎన్నికల అధికారి కె.జగదీశ్వర్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఘంటసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు అలపర్తి విద్యాసాగర్, డి.వి.రమణల నాయకత్వంలో ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణకు విశేషంగా కృషి చేస్తానని చెప్పారు. ఎన్నికలు విజయవంతంగా జరిపించిన ఎన్నికల అధికారులు కె.జగదీశ్వరరావు, ఆనందనాథ్, వి.సుబ్బారెడ్డిలను సంఘం తరఫున రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ షరీఫ్ ఘనంగా సన్మానించారు. సంఘం నేతలు సూరి, సిహెచ్ కళ్యాణ్ కుమార్, రమేష్, శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, సేవా నాయక్, పాపారావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నూతన కార్యవర్గం వివరాలు... జిల్లా అధ్యక్షుడిగా ఘంటసాల శ్రీనివాసరావు, సహాధ్యక్షుడిగా సిహెచ్ రాంబాబు, ఉపాధ్యక్షులుగా డి.డి నాయక్, కె.వి.వి కిషోర్, జి.సి.హెచ్ కోటేశ్వరరావు, డి.దుర్గారావు, సి.హెచ్ అనిల్ కుమార్, మహిళా ఉపాధ్యక్షురాలుగా వి.శ్రీవాణి, జిల్లా కార్యదర్శిగా ఎ.శ్యామసుందర్ శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శిగా కే.ఎన్.సుకుమార్, సంయుక్త కార్యదర్శిలుగా సయ్యద్ జానీబాషా, కె.విజయ బాబు, డి. శ్రీనివాస్, కె.నరసింహారావు, మహిళా సంయుక్త కార్యదర్శిగా ఎం.విజయలక్ష్మి, కోశాధికారిగా ఎల్.శ్రీధర్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నిక -
గుంటూరు
సోమవారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2026● వాటి మేళవింపుతోనే లోక కల్యాణం ● ఉత్తరాఖండ్ ఆది శంకరాచార్య పీఠం ఉత్తరాధికారి ● మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో అనుగ్రహ భాషణం గుంటూరు ఎడ్యుకేషన్: భాష, సంస్కృతుల మేళవింపుతో లోక కల్యాణానికి కృషి చేయాలని ఉత్తరాఖండ్లోని జగద్గురు ఆది శంకరాచార్య పీఠం ఉత్తరాధికారి స్వామి ప్రత్యక్ చైతన్య ముకుందానందగిరి శంకరాచార్య మహరాజ్ అన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో గుంటూరు శివారులోని శ్రీసత్యసాయి స్పిరిచ్యువల్ సిటీలో నిర్వహిస్తున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం సభలో ఆయన దివ్య అతిథిగా పాల్గొన్నారు. జగద్గురు ఆది శంకరాచార్య ధర్మ పరిరక్షణ కోసం దేశమంతా పర్యటించారని అన్నారు. సంస్కృతి, సంప్రదాయం, భాష ఎక్కడైతే మనుగడ సాగిస్తాయో అక్కడ జీవన విధానం వెల్లివిరుస్తుందన్నారు. వసుదైక కుటుంబ భావనతో ప్రజలు కలిసిమెలిసి ఉండాలని చెప్పారు. అప్పుడే లోక కల్యాణం సాధ్యపడుతుందన్నారు. దేశంలో ఎక్కడ పుట్టినా అంతా ఏకమనే భావన రావాలని చెప్పారు. కేరళలోని కాలడిగిలో జన్మించిన జగద్గురు ఆది శంకరాచార్య దేశం మొత్తం ఒక్కటనే భావన తెచ్చేందుకు నాలుగు దిశల్లో నాలుగు పీఠాలను స్థాపించారని అన్నారు. ధర్మ సంరక్షణ కోసం నడుం బిగించి, ముందుకు వెళ్లేవారికి దైవం అండగా ఉంటుందని చెప్పారు. భాషను రక్షించుకోవడం ద్వారా సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాలన్నారు. దేశం ఆధ్యాత్మికంగా విశ్వగురువుగా నిలిచిందని, గోవులను రక్షించుకోవడం మన జీవన విధానంలోనే ఉందన్నారు. తల్లిని దైవంగా భావించుకునే గొప్ప సంస్కృతి, ఋషుల ద్వారా వారసత్వంగా వచ్చిన సంప్రదాయం, గొప్ప పుణ్యనదులు దేశానికి తరగని సంపద అని అన్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మారిషస్లో తెలుగు ప్రజలు సంస్కృతి, సంప్రదాయాలను చాటుతున్నారని చెప్పారు. ఉగాది, శ్రీరామనవమి వంటి పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో తెలుగు మాధ్యమంలో బోధన కోసం పోరాటం చేస్తుండగా, మారిషస్లో కేజీ నుంచి పీజీ వరకు తెలుగు మాధ్యమంలో బోధన ఉందని చెప్పారు. మాతృభాష పరిరక్షణపై ప్రజలతోపాటు ప్రభుత్వాల్లో మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధరమ్ బీర్ గోకుల్కు భారత మిత్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.7శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ తెలుగు ప్రజలు ఆంగ్ల నూతన ఏడాది వేడుకలను జరుపుకొన్నంత ఆనందంగా ఉగాదిని జరుపుకోవడం లేదని అన్నారు. గ్రామాల్లో ఉగాది, శ్రీరామనవమి వంటి పండుగలను ఘనంగా నిర్వహించడంపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలుగులో విద్యాబోధన చేయించాలని సూచించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. జయసూర్య, ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్, ముఖ్య సమన్వయకర్త పి.రామచంద్రరాజు, తెనాలికి చెందిన శిల్పి రామలింగేశ్వరరావు, మెట్రో ఇండియా చైర్మన్ సీఎల్ రాజమ్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, వివిధ దేశాల నుంచి వచ్చిన తెలుగు ప్రముఖులు, భాషావేత్తలు, అభిమానులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 3,900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 40.3045 టీఎంసీలు. నరసరావుపేట రూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వర ఆలయ అన్న ప్రసాద వితరణకు ఒంగోలుకు చెందిన ప్రసాద్, లక్ష్మి, శివకృష్ణలు ఆదివారం రూ.లక్ష విరాళమిచ్చారు.విజయపురిసౌత్: నాగార్జుసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 560.50 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్కి 18,678 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
హోరాహోరీగా బ్యాడ్మింటన్ పోటీలు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో సౌత్జోన్ ఇంటర్ వర్సిటీ బ్యాడ్మింటన్ పురుషుల టోర్నమెంట్ శనివారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ప్రారంభించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన 128 విశ్వవిద్యాయాల జట్లు పాల్గొంటున్నట్లు చెప్పారు. సుమారు 896 మంది క్రీడాకారులు తలపడనున్నట్లు తెలిపారు. కేఎల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ జి.పార్థసారథి వర్మ మాట్లాడుతూ జనవరి 3 నుంచి 6వ తేదీ వరకు పోటీలు జరుగనున్నాయని తెలిపారు. యువత క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక శక్తిని పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. క్రీడల డైరెక్టర్ డాక్టర్ కె.హరి కిషోర్ మాట్లాడుతూ తమ వర్సిటీలో క్రీడాకారులకు ఫీజు రాయితీతోపాటు పలు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ జాయింట్ సెక్రటరీ పున్నయ్య చౌదరి, ఎన్టీఆర్ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె. కోటేశ్వరరావు, వర్సిటీ ప్రో వీసీలు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్. వెంకట్రామ్, డాక్టర్ కె. రాజశేఖరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. తొలి రౌండ్లో 60 జట్లు విజయం పోటీల వివరాలను వర్సిటీ సౌత్జోన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ హరికిషోర్ వెల్లడించారు. తొలిరోజు మొదటి రౌండ్లో మొత్తం 128 జట్లు పోటీ పడగా 60 జట్లు గెలుపొందగా, 4 పోటీల ఫలితాలు డ్రాగా ముగిసినట్లు తెలిపారు. ఏపీకి చెందిన శ్రీకృష్ణ దేవరాయలు యూనివర్శిటీపై తమిళనాడుకు చెందిన భారతీయార్ యూనివర్సిటీ జట్టు విజయం సాధించిందని, తమిళనాడుకు చెందిన తిరువళ్లువర్ యూనివర్సిటీపై హైదరాబాద్కు చెందిన జేఎన్టీయూ వర్సిటీ జట్టు గెలిచిందని పేర్కొన్నారు. ఆదివారం రెండో రౌండ్ పోటీలు ఉంటాయని వివరించారు. -
ఎన్టీఆర్ స్తుతి... పీవీకి దక్కని చోటు
గుంటూరుఆదివారం శ్రీ 4 శ్రీ జనవరి శ్రీ 20269న పీపీపీకి వ్యతిరేకంగా సామూహిక దీక్ష గుంటూరు నగరంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1200, గరిష్ట ధర రూ.2500, మోడల్ ధర రూ.1700 వరకు పలికింది.మాచర్ల: పాత ఊరులోని లక్ష్మీచెన్నకేశవ స్వామి నిత్య కల్యాణ మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. పలువురు దంపతులు పీటలపై కూర్చుని స్వామి కల్యాణం జరిపించారు.జ్యోతి ప్రజ్వలన చేస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి పమిడిఘంటం శ్రీనరసింహ, విశ్వయోగి విశ్వంజీ చిన్నారుల నృత్య ప్రదర్శనసాక్షిప్రతినిధి,గుంటూరు/నగరంపాలెం:మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో గుంటూరు శ్రీసత్యసాయి స్పిరిచ్యువల్ సిటీలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 శనివారం ప్రారంభమయ్యా యి. పరిషత్ అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ అధ్యక్షతన ఈ సభలు జరిగాయి. ప్రారంభ సభకు ముఖ్యఅతిథిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ విచ్చేసి భాష కేవలం భావ వ్యక్తీకరణకే కాదని, అది జీవన విధానమన్నారు. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, విశ్వయోగి విశ్వంజీ, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గోడా రఘురామ్, తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్, హైకోర్టు జడ్జి జస్టిస్ బి.కృష్ణమోహన్, తెలుగు మహాసభల ముఖ్య సమన్వయకర్త పి.రామచంద్రరాజు, కొప్పరపు కవుల సాహితీపీఠం ప్రతినిధి మా శర్మ, మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ, వివిధ దేశాల నుంచి వచ్చిన తెలుగు ప్రముఖులు, భాషావేత్తలు పాల్గొన్నారు. మాజీ ప్రధాని పీవీని మరిచారు. 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ను పొగడ్తలతో ముంచెత్తిన నిర్వాహకులు, అతిథులు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా సేవలందించిన అచ్చ తెలుగువాడు పీవీ నరసింహారావును మరిచారు. సంస్కరణలను ప్రవేశపెట్టి, దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన మేధావి, రాజ నీతిజ్ఞుడు పీవీ పేరును కనీసం తలచుకోకపోవడంతో సభకు వచ్చిన ఎంతో మంది ప్రముఖులు అసంతప్తి వ్యక్తం చేశారు. ఈనాడు రామోజీరావు పేరుతో ఏకంగా ఒక స్టాల్ పెట్టడమే కాకుండా ఆయన విగ్రహాన్ని కూడా సభా ప్రాంగణంలో ఏర్పాటుచేశారు. పత్రికాధిపతుల పేరుతో ప్రదర్శన శాలలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు బహుభాషాకోవిదుడు, తెలుగులో పలు రచనలు చేసి తెలుగు భాష అభ్యున్నతికి కృషి చేసిన పీవీ నరసింహారావు పేరును ఎక్కడా ప్రస్తావించకపోవడం విచారకరం. ప్రపంచ తెలుగు మహాసభలకు గుర్తుగా రూపొందించిన వీడియోలోనూ ఆయన ప్రస్తావన లేకపోవడం పట్ల పలువురు పెదవి విరిచారు. 7గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మాణంలో ఉన్న పది ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తున్నట్లు ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు చెప్పారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పీపీపీకి వ్యతిరేకంగా విజయవాడ లో ఈనెల 9న సామూహిక దీక్షను నిర్వహిస్తున్నామన్నారు. శనివారం గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో సామూహిక నిరసన దీక్ష పోస్టర్లు ఆవిష్కరించారు. సమావేశంలో లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రనాయక్, ఎస్ఆర్ శంకరన్ ప్రజా సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు బత్తుల కోటేశ్వరరావు, బీసీ మహాజన సభ రాష్ట్ర అధ్యక్షుడు దుగ్గం సాంబశివరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్.మానవేంద్రనాథ్రాయ్, పూర్వ న్యాయమూర్తి జస్టిస్ ఆకుల శేషసాయి, ఎంపీ కె.గోపీనాథ్ (తమిళనాడు)లు ప్రసంగించారు. -
ఐదుగురికి జైలు శిక్ష
గుంటూరు లీగల్: నగరంలో గత ఏడాది డిసెంబరు 31న ఈస్ట్, వెస్ట్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. డ్రైవ్లో 15 మంది మద్యం తాగినట్లు నిర్ధారించారు. వీరిలో పదిమందికి జరిమానా విధించి, మిగిలిన ఐదుగురికి జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. వీరిలో కారు డ్రైవర్లు నలుగురు, బైక్ నడుపుతున్న ఒకరు ఉన్నారు. వీరు అధికంగా మద్యం తాగినట్లు ఉండటంతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఆరో అదనవు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి మహమ్మద్ గౌస్ విచారణ తర్వాత ఐదుగురికి వారం రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. విద్యుత్ విజిలెన్స్ ఎస్ఈ మూర్తి కొరిటెపడు(గుంటూరు): సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (సీపీడీసీఎల్) పరిధిలో విద్యుత్ చౌర్యం అరికట్టేందుకు ప్రజలను చైతన్య పరిచాలని విద్యుత్ విజిలెన్స్ పర్యవేక్షక ఇంజినీర్ కేవీఎల్ఎన్ మూర్తి సూచించారు. స్థానిక సంగడిగుంట విద్యుత్ భవన్లో విజిలెన్స్ ఇంజినీరింగ్ అధికారులతో శనివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ విద్యుత్ చౌర్యం చట్టరీత్యా నేరమన్నారు. గత ఏడాది 9,064 కేసులు నమోదు చేసి రూ.21.45 కోట్లు అపరాధ రుసుము విధించామని చెప్పారు. విద్యుత్ చౌర్యం అరికట్టడానికి గుంటూరు జిల్లా ఈఈ కరీమ్–94408 12263, పల్నాడు జిల్లా ఈఈ సుందరబాబు – 94910 66757, బాపట్ల జిల్లా ఈఈ భాస్కరరావు – 77804 56319లను సంప్రదించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదాయానికి చౌర్యం వల్ల గండిపడకుండా చూడాలని కోరారు. -
గంటల వ్యవధిలో దంపతులు మృతి
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని పెనుమాక గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు అయిన భార్యభర్తలు గంటల వ్యవధిలో మృతి చెందిన సంఘటన ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, పెనుమాక పార్టీ అధ్యక్షుడు మేకా శివారెడ్డిలు నాయకులతో కలిసి వెళ్లి వారి భౌతికకాయాలకు నివాళులర్పించారు. వివరాలు.. పెనుమాకకు చెందిన షేక్ సిద్ధా సాహెబ్ (70), భార్య షేక్ సైదాబి (65) దంపతులు. గురువారం రాత్రి భార్య కాలు జారి కిందపడింది. ఆమెను ఇంట్లోకి తీసుకువచ్చి సపర్యలు చేసిన భర్త ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందారు. ఆరు గంటల వ్యవధిలో భార్య కూడా మృతి చెందింది. వాకి కుమారుడు మస్తాన్ వలి అంత్యక్రియలు నిర్వహించారు. దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి అంటే దంపతలుకు ఎంతో అభిమానమని గుర్తుచేసుకున్నారు. ప్రతి సంవత్సరం వైఎస్సార్కు నివాళులర్పిస్తారని, అలాంటి అభిమానులు మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పచ్చల విజయకుమార్, మేకా దామేష్రెడ్డి, భుజంగరావు, మేకా అంజిరెడ్డి, అల్లూ శ్రీనివాసరెడ్డి, ఎస్కే సుభాని, బషీర్, షేక్ జిలాని తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): 104 వాహనాల్లో పని చేస్తున్న సిబ్బంది సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని 104 ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గోరంట్ల సురేష్ కుమార్ అన్నారు. శనివారం వైద్యరంగ ప్రముఖులు, ప్రజా సంఘాల నాయకులు తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ పీహెచ్సీ సెంటర్ల వద్ద డిమాండ్స్తో కూడిన పోస్టర్లు అంటించి యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ అరకొర వేతనాలతో ఉద్యోగాలు చేస్తున్నారని, అరబిందో నుంచి రావాల్సిన బకాయిలు గ్రాడ్యూటీ, ఎర్న్ లీవ్ల డబ్బులు నేటికీ చెల్లించకపోవడం తీవ్ర అన్యాయం అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీహర్ష, కోశాధికారి ఐ.నాగులు, నాయకులు ఏడుకొండలు, సాయిరాం, బాలకృష్ణ, హరి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
ఫిబ్రవరి 7,8 తేదీల్లో కొండవీడు ఉత్సవాలు
నరసరావుపేట: ప్రముఖ పర్యాటక కేంద్రం కొండవీడు కోట ఖ్యాతి రాష్ట్రం నలుమూలలా వ్యాపించేలా ఫిబ్రవరి 7, 8 తేదీల్లో అట్టహాసంగా ఉత్సవాలు నిర్వహించనున్నామని పల్నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. కొండవీడు ఫెస్ట్ నిర్వహణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి, నోడల్ అధికారిగా జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణప్రియను నియమించారు. శనివారం క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉత్సాహపూరిత వాతావరణంలో ఫెస్ట్ నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆహ్లాదకరమైన సాంస్కృతిక కార్యక్రమాలు, పర్యాటకుల సంఖ్యకు తగినవిధంగా ఫుడ్కోర్టులు, స్టాల్స్, తాగునీరు, టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఫిరంగిపురం, నాదెండ్ల, వంకాయలపాడుల నుంచి కొండవీడు కోటకు వచ్చే రహదారులకు మరమ్మతులు చేపట్టాలన్నారు. గత ఉత్సవాలలో పర్యాటకులను ఆకర్షించిన హెలిరైడ్, బోటింగ్ వంటి వాటికి అదనంగా కార్యక్రమాలు రూపొందించాలని ఈవెంట్ మేనేజర్ను ఆదేశించారు. జిల్లా అటవీ అధికారి కృష్ణ్ణప్రియ, డీఆర్ఓ ఏకా మురళి, ఆర్డీవో మధులత, దీపీఓ నాగేశ్వర్నాయక్ పాల్గొన్నారు. సత్తెనపల్లి: ధనుర్మాసంను పురస్కరించుకొని సత్తెనపల్లిలోని అలివేలు మంగ పద్మావతి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం శ్రీవారిని ‘జగత్ రక్షకుడు’గా అలంకరించి పూజలు, గోత్రనామాలతో అభిషేకాలు నిర్వహించారు. శ్రీవారికి విశేష పౌర్ణమి పూజ, గరుడ పూజ చేసి శ్రీవారిని ‘ఉత్తర దిశగా’ ఊరేగించారు. గరుడ ప్రసాదంను ఆలయ ప్రధాన అర్చకులు చిత్రకవి శ్యాము ఆచార్యులు భక్తులకు అందించారు. ఆలయ ప్రాంగణంలో కోలాటం ఆడారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఆలయ కమిటీ బాధ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. నకరికల్లు: శివముక్కోటిని పురస్కరించుకొని పల్నాడు జిల్లా నర్శింగపాడు లోని శ్రీ మరకతలింగ చంద్రమౌళీశ్వరస్వామి వారి ఆలయంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు. అర్చకులు పమిడిమర్రు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వామివారికి విశేష ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం భక్తు లకు స్వామివారి ఉత్తరద్వార దర్శనం కల్పించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకొని మొక్కులు చెల్లించారు.అమరావతి: ప్రసిద్ధ శైవక్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న శ్రీబాల చాముండికా సమే త అమరేశ్వరునికి శనివారం ఆరుద్రోత్సవం నిర్వహించా రు. శనివారం వేకువజామున మహా న్యాస పూర్వక ఏకాదశ రుద్ర అన్నాభిషేకాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలు త పంచామృతాలతో అభిషేకం నిర్వహించిన అనంతరం దాతల సహకారంతో సుమారు నాలుగు క్వింటాళ్ల బియ్యాన్ని అన్నంగా వండి స్వామివారికి అభిషేకించారు. తొలుత అర్చకు లు, వేద పండితులు వెంకటాద్రినాయుని మండపంలో మహాన్యాసం నిర్వహించి అనంతరం 11 అమృతాలతో ఏకదశ రుద్రాభిషేకం వండిన నాలుగు క్వింటాళ్ల అన్నంతో అభిషేకం చేశారు. బాలచాముండేశ్వరి అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం అభిషేకించిన అన్నాన్ని అన్నప్రసాదంగా భక్తులకు పంపిణీ చేశారు. ప్రతి ఏడాదీ అన్నప్రసాద వితరణ సాయంత్రం మూడు గంటల వరకు జరిగేది ఈ ఏడాది రెండు గంటలలోపు అన్న ప్రసాద వితరణ ముగించటంతో పలువురు భక్తులు నిరాశతో వెనుదిరిగారు. -
భక్తిశ్రద్ధలతో శివముక్కోటి
పెదకాకానిలో మల్లేశ్వరస్వామికి మహా రుద్రాభిషేకం పెదకాకాని: స్థానిక శ్రీ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో శనివారం భక్తిశ్రద్ధలతో ఆరుద్రోత్సవం నిర్వహించారు. స్వామివారికి విశేష ద్రవ్యాలతో మహన్యాసపూర్వక మహా రుద్రాభిషేకం చేశారు. అర్చకస్వాములు 108 కిలోల అన్నంతో అన్నసూక్త పూర్వక అన్నాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశ్వరస్వామి వారికి విశేష అలంకరణ చేశారు. తొలుత శివముక్కోటి సందర్భంగా తెల్లవారుజామున ఉత్తరద్వారంలో భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వరస్వామి వార్లను భక్తులు దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేకంగా పూల అలంకణ చేసిన వాహనంపై భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి గ్రామోత్సవం నిర్వహించారు. -
ఇన్నర్ రింగ్రోడ్డు ఫేజ్–3 పనులకు శంకుస్థాపన
గుంటూరు రూరల్: మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డు మూడో దశ నిర్మాణ పనులకు శనివారం శిల్పారామం జంక్షన్ వద్ద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర పుర పాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణలు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని), స్థానిక ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, మహమ్మద్ నసీర్, గళ్లా మాధవి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, నగర కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలసి శంకుస్థాపన చేశారు. శిల్పారామం జంక్షన్ నుంచి పేరేచర్ల వరకు రూ.48 కోట్లతో మూడో దశ నిర్మాణం చేయనున్న విషయం విదితమే. అదే విధంగా నగర పాలక సంస్థ పరిధిలోని 41, 46, 47, 48 డివిజన్ల పరిధిలో రూ.69.59 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీల, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, నగరపాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు. -
శిల్పాలు, పత్రాలను పరిరక్షించుకోవాలి
ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆర్ఎంపీ, పీఎంపీల డివిజన్ అధ్యక్షుడు షేక్ బాజి నాదెండ్ల: గుంటూరులో ఈ నెల 10న నిర్వహించే ఆర్ఎంపీ, పీఎంపీల రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆర్ఎంపీ, పీఎంపీల నరసరావుపేట డివిజన్ అధ్యక్షుడు షేక్ బాజి శనివారం చెప్పారు. ఈ సందర్భంగా తూబాడులో ఆయన మాట్లాడుతూ మూడు ఫెడరేషన్లతో సంయుక్తంగా ఏర్పడిన జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభ జరుగుతుందన్నారు. ఏటుకూరు రోడ్డులోని ఆదిత్య హాస్పటల్ ప్రాంగణంలో జరిగే సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. ప్రాథమిక వైద్యానికి గుర్తింపు కోసం నలభై ఏళ్లు పైబడి చేస్తున్న పోరాటం సాఫల్యం అయ్యేరోజు ఆసన్నమైందన్నారు. మహాసభకు కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులను ఆహ్వానించినట్లు తెలిపారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే, జేఏసీ గౌరవ అధ్యక్షుడు డీటీ జనార్ధన్, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లోని మూడు వేల మందికి పైగా ఆర్ఎంపీ, పీఎంపీలు హాజరవుతారన్నారు. పెదకాకాని: ఒక జాతి గొప్పతనం ఆ జాతి చరిత్రపై ఆధారపడి ఉంటుందని అవనిగడ్డ శాసనసభ సభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. చరిత్ర సాక్ష్యాలైన శాసనాలు, శిల్పాలు, పత్రాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. గుంటూరు జిల్లా నంబూరులోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయంలో రెండురోజులపాటు జరగనున్న ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ 48వ వార్షిక సమావేశాలను శనివారం మండలి బుద్ధ ప్రసాద్ ముఖ్యఅతిథిగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర విభజన ద్వారా మన చరిత్ర చాలా నష్టపోయిందని చెప్పారు. ఆంధ్రపద్రేశ్ చరిత్రకు సంబంధించి తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న పురావస్తు వస్తువులు, శిల్పాలు, శాసనాలు, నాణేలు, తాళపత్ర గ్రంథాలు, రాత ప్రతులను మనం ఇప్పటికీ పూర్తి స్థాయిలో తెచ్చుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. గూడూరులో నిర్వహించిన 47వ వార్షిక సమావేశాలలో సమర్పించిన పరిశోధనా పత్రాల సంపుటిని హిస్టరీ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యులు ఆచార్య వకుళాభరణం రామకృష్ణ, అధ్యక్షులు బి.కేశవనారాయణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ మొవ్వా శ్రీనివాసరెడ్డిలతో కలిసి మండలి బుద్ధ ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సమావేశాలకు హాజరైన 150 మంది చరిత్ర పరిశోధకులు ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాల చరిత్ర విభాగాల కీలక ఉపన్యాసాలు, చారిత్రక రచనా విధానం స్థానిక చరిత్ర విభాగాలపై పరిశోధనా పత్రాలను ఆచార్య పి.సి. వెంకటసుబ్బయ్య, ఈఎస్ఎం ప్రసాద్, కె.గంగయ్య, బెల్లంకొండ రమేష్ చంద్రబాబు అధ్యక్షతన అందించారు. ● కేంద్ర విశ్వవిద్యాలయం హైదరాబాద్ హిస్టరీ అధ్యాపకురాలు ప్రొఫెసర్ అలోకా పరాశర్ శేస్ 6 నుంచి 14వ శతాబ్దంలో జరిగిన గ్రామీణ సామాజిక, ఆర్థిక పరిణామాల గురించి మామిడిపూడి వెంకట రంగయ్య 22వ స్మారక ఉపన్యాసంతో తొలిరోజు సమావేశాలు ముగించారు. ఈ సందర్భంగా ఈశ్వర వరప్రసాద్ పరిషత్తు సహకారంతో కోకా విజయలక్ష్మి నృత్య దర్శకత్వంలో ప్రదర్శించిన తెలుగు ప్రశస్తి నృత్య రూపకం విశేషంగా అలరించింది. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ వై. మల్లికార్జునరెడ్డి, హిస్టరీ కాంగ్రెస్ పూర్వ అధ్యక్షులు ఆచార్య ఏఆర్ రెడ్డి, వీవీఐటీయూ పబ్లికేషన్ డివిజన్ సంధానకర్త మోదుగుల రవికృష్ణ హాజరయ్యారు. ఘనంగా ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ సమావేశాలు ప్రారంభం -
డబ్బుల కోసం బాలుడి ఒత్తిడి
విద్యార్థిని ఆత్మహత్యాయత్నం తెనాలి రూరల్: కొత్త సంవత్సరం వేడుకలకు డబ్బులివ్వాలని బాలికపై బాలుడు ఒత్తిడి తీసుకురావడంతో ఎలుకల మందు తిని ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసుల కథనం మేరకు... గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలుడితో ఇన్స్ట్రాగామ్లో పరిచయమైంది. బాలుడి ఖర్చులకు అప్పుడప్పుడు విద్యార్థిని డబ్బులు ఇస్తుండేది. ఈ క్రమంలో గత నెల 31వ తేదీన తనకు రూ. రెండున్నర వేలు కావాలంటూ బాలుడు ఒత్తిడి తీసుకువచ్చాడు. తన వద్ద లేవని, రూ. వెయ్యి ఇవ్వగలనని బాలిక చెప్పింది. తాను చదువు మానేస్తానని, టీసీ తీసుకుని వెళ్లిపోతానంటూ బాలుడు ఒత్తిడి చేశాడు. దీంతో బాలిక ఎలుకల మందు తిని ఈ విషయాన్ని ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేసింది. గమనించిన కుటుంబసభ్యులు వైద్యశాలకు తరలించారు. వైద్యశాల నుంచి వచ్చిన సమాచారం మేరకు త్రీ టౌన్ పోలీసులు శనివారం పోక్సో కేసు నమోదు చేశారు. చిలకలూరిపేటటౌన్: భార్యపై అనుమానంతో రోకలి బండతో దాడి చేసి, ఆమె మరణానికి కారణమైన నిందితుడిని చిలకలూరిపేట రూరల్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈమేరకు చిలకలూరిపేట రూరల్ సీఐ కార్యాలయంలో మీడియా ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ బి.సుబ్బానాయుడు వివరాలు వెల్లడించారు.. వేలూరు గ్రామానికి చెందిన అల్లడి సల్మాన్రాజు తన భార్య పుష్పపై అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో గత నెల 29వ తేదీ అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న ఆమె తలపై రోకలి బండతో దాడి చేశాడు. తీవ్ర రక్తగాయాలతో ఆస్పత్రి పాలైన పుష్ప చికిత్స పొందుతూ డిసెంబర్ 30వ తేదీన మృతి చెందింది. మృతురాలి తల్లి మంచాల సారమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం అరెస్టు చేసి కోర్టు హాజరుపరచగా రిమాండ్ విధించారు. ప్రెస్మీట్లో రూరల్ ఎస్ఐ జి.అనిల్కుమార్, లేఖా ప్రియాంక సిబ్బంది పాల్గొన్నారు. -
ఆదాయం నిల్..
వనరులు పుష్కలం...లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): ‘‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అనే చందంగా వంద సంవత్సరాల చరిత్ర కలిగిన అంజుమన్–ఏ–ఇస్లామియా సంస్థ పరిస్థితి తయారైంది. ఆదాయ వనరులు పుష్కలంగా ఉన్నా చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి. అంజుమన్–ఏ–ఇస్లామియా సంస్థ ద్వారా వచ్చే ఆదాయాన్ని అంజుమన్ స్కూల్కు, ముస్లిం సమాజం అభ్యున్నతికి, విద్యార్థుల స్కాలర్షిప్లు వంటి వాటికి వినియోగించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం అంజుమన్ సంస్థకు వచ్చే ఆదాయం ఖాతాకు జమకాకపోవడంతో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం లేదని ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆదాయ వనరులు ఇలా... పట్టించుకోని కమిటీ అంజుమన్ సంస్థకు కమిటీతోపాటు మేనేజర్ పనిచేస్తున్నారు. మేనేజర్ ప్రతి నెలా అద్దెలు వసూలు చేయాల్సి ఉండగా ఆయన తన సొంత పనులు చేసుకుంటున్నారే తప్ప సంస్థ గురించి పట్టించుకోవడం లేదని ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. పలువురు వ్యాపారస్తుల నుంచి సుమారు రూ.40 లక్షలకు పైగా అద్దె బాకీలు ఉండటం గమనార్హం. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జిల్లా వక్ఫ్బోర్డ్ ఇన్స్పెక్టర్ స్థానికంగా ముస్లిం పెద్దలకు అందుబాటులో ఉండరని కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయరని ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి. నమాజ్కు వచ్చే వారికి ఇక్కట్లు లాలాపేట, పట్నంబజారు ప్రాంతంలో అత్యధికంగా ముస్లింలు నివసిస్తుంటారు. వీరు ఐదు పూటల నమాజ్ చేసుకునేందుకు అంజుమన్ మసీదుకు వస్తుంటారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నూతన కమిటీ అధ్యక్షుడుగా తూర్పు ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారు. కమిటీ ఏర్పడిన కొద్ది కాలానికే మసీదులో వజూ ఖానా (కాళ్లు, చేతులు కడిగే ప్రదేశం)ను తొలిగించారు. వక్ఫ్ బోర్డు అనుమంతి లేకుండానే ఆ ప్రదేశంలో కొత్త దుకాణాల నిర్మాణం చేపట్టారు. నమాజ్ చేసుకునేందుకు వచ్చే వారికి స్థలం సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ముస్లిం సంఘాలు ప్రశ్నించగా సంస్థకు ఆదాయం వచ్చేందుకు ఈ దుకాణాలు నిర్మిస్తున్నట్లు కమిటీ పేర్కొంది. అంజుమన –ఏ–ఇస్లామియా సంస్థకు వచ్చే ఆదాయాన్ని ఎవరికి వారు దోచుకుంటున్నారు. బాకీలను వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహించే వారితోపాటు సంస్థ ఆదాయాన్ని దోచుకునే వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దీనికి సంస్థ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్యే నసీర్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంది. అంజుమన్ సంస్థకు వచ్చే ఆదాయం ఎంత, బ్యాంక్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, ఏవిధంగా వినియోగిస్తున్నారు, సంస్థ కమిటీ సభ్యులు, వక్ఫ్ అధికారులు బహిరంగంగా తెలియజేయాలి. లేని పక్షంలో ఎంతటి ఉద్యమానికై నా వెనుకాడబోం. – షేక్.గులాం రసూల్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి -
రంగుల మహోత్సవంపై సమీక్ష
పెనుగంచిప్రోలు: భక్తులకు అసౌకర్యం కలిగిస్తే ఉపేక్షించబోమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి జరిగే అమ్మవారి రంగుల మహోత్సవ ఏర్పాట్లపై శుక్రవారం ఆలయ సత్రంలోని కల్యాణ మండపంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు బాధ్యతగా, సమన్వయంతో పని చేసి తిరుపతమ్మ రంగుల మహోత్సవం, ఫిబ్రవరిలో కల్యాణ మహోత్సవం విజయవంతం చేయాలన్నారు. ఐవీఆర్ఎస్ సర్వేలో ఆలయంలో పారిశుద్ధ్యం, ప్రసాదాలపై భక్తుల నుంచి అసంతృప్తులు వచ్చాయని, ఆలయ అధికారులు వాటిని అధిగమించడానికి చర్యలు చేపట్టాలన్నారు. ఆలయ ఈఓ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ అధికారులు సహకరించి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు చుంచు రమేష్బాబు, నందిగామ ఆర్డీఓ కె.బాలకృష్ణ, డీసీపీ బి.లక్ష్మీనారాయణ, నందిగామ ఏసీపీ తిలక్, తహసీల్దార్ ఎ.శాంతిలక్ష్మి, ఎంపీడీఓ జి.శ్రీను పాల్గొన్నారు. -
కుక్కపిల్లను కాపాడబోయి బాలుడు గల్లంతు
అమరావతి: మండల పరిధిలోని వైకుంఠపురం ఘాట్లో అదే గ్రామానికి చెందిన బాలుడు కృష్ణానదిలో గల్లంతైన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు ... వైకుంఠపురం ఎస్సీ కాలనీకి చెందిన నండూరు శివ (14) స్థానిక స్నానఘాట్ సమీపంలో దుస్తులు ఉతుకుతున్నాడు. ఇంతలో వెంట వచ్చిన పెంపుడు కుక్కపిల్ల నీటిలో మునిగిపోతుండటంతో రక్షించటానికి ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు అతడూ గల్లంతయ్యాడు. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. శివకు మాటలు రావు. కొడుకు ఇలా నదిలో గల్లంతైన విషయం తెలుసుకుని శివ తల్లితండ్రులు చాణక్యరావు, ఝాన్సీలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిలకలూరిపేట: అసిస్ట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జనరల్ డ్యూటీ అసిస్టెంట్ (నర్సింగ్) కోర్సు శిక్షణ ఉచితంగా ఇవ్వనున్నట్లు సంస్థ ప్రతినిధి కె. డేవిడ్ తెలిపారు. నర్సింగ్ కోర్సుతో పాటు 4 నెలల ఉచిత కంప్యూటర్ కోర్సు, స్పోకెన్ ఇంగ్లిషు కూడా నేర్పుతామన్నారు. 18 నుంచి 35 సంవత్సరాలలోపు యువతులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పదో తరగతి పాస్ సర్టిఫికెట్, రెండు పాస్పోర్టు సైజు ఫొటోలు, ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్లతో అడ్డరోడ్డు సెంటర్లో ఉన్న అసిస్ట్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. శిక్షణ పొందిన వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పారు. వివరాలకు ఫోన్ నంబర్లు 91826 34233, 89788 20317 లలో సంప్రదించాలన్నారు. డీఈఓ రామారావు నరసరావుపేట ఈస్ట్: పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయం, ఏపీ మోడల్ స్కూల్స్ హాస్టల్స్లో ఖాళీగా ఉన్న టైప్–3, టైప్–4 బోధనేతర సిబ్బందిని పొరుగు సేవలు (ఔట్ సోర్సింగ్) ప్రాతిపదికన భర్తీ చేసేందుకు జిల్లాలోని అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు శుక్రవారం తెలిపారు. జిల్లా పరిధిలోని కేజీబీవీలలో టైప్–3లో 62, టైప్–4లో 38 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వివరించారు. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, ఓకేషనల్ ఇన్స్ట్రక్టర్, అటెండర్, అకౌంటెంట్, కుక్, అసిస్టెంట్ కుక్, వాచ్ ఉమెన్, స్వీపర్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు. నియామకంలో రోస్టర్ పాయింట్స్ వర్తిస్తాయన్నారు. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు ఈ నెల 3 నుంచి 11వ తేదీలోగా తమ దరఖాస్తులను డీఈఓ కార్యాలయంలోని సమగ్ర శిక్ష విభాగంలో సమర్పించాలని తెలిపారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): ఈనెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మహారాష్ట్రలోని సోలాపూర్లో జరగనున్న జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు జిల్లా నుంచి వీవీ అఖిల్రెడ్డి, కె.లక్ష్మీసాయిప్రవల్లిక ఎంపికయ్యారని గుంటూరు షూటింగ్ బాల్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి అనిల్ తెలిపారు. గతనెల 25, 26 తేదీల్లో నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన వీరిద్దరూ జాతీయ పోటీలకు ఎంపికయ్యారన్నారు. అఖిల్రెడ్డి ప్రవల్లిక -
సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు పరిశీలించిన మంత్రి నారాయణ
తాడికొండ: రాజధానిలో వెంకటపాలెం నుంచి విజయవాడ వెళ్ళే సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ పరిశీలించారు. నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చిన 1.5 కి.మీ సీడ్ యాక్సిస్ రోడ్డు పనులను పరిశీలించిన ఆయన విజయవాడ నుంచి అమరావతికి వెళ్లేందుకు కరకట్టపై దూరం తగ్గిందన్నారు. గుంటూరు ఛానల్పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులను పరిశీలించి ఈ నెలాఖరుకు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థకు ఆదేశాలిచ్చారు. రోడ్డు నిర్మాణం పూర్తయినందున వాహన రాకపోకలు కొనసాగుతున్నాయని ఇకపై కరకట్టపై వెళ్లే అవసరం లేకుండా ప్రయాణాలు సాగించవచ్చన్నారు. త్వరలోనే బ్రిడ్జి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెనాలి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు మద్యం మత్తులో నడిరోడ్డుపై బైక్కు నిప్పు కారెంపూడి: మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు బైక్ను నడిరోడ్డుపై తగలబెట్టిన ఘటన కారెంపూడిలో శుక్రవారం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న యువకుడు చిన పీర్లసావిడి వద్ద బైక్ను ఆపి దానికి నిప్పు పెట్టాడు. సాయంత్రం పాఠశాలలు విడిచిపెట్టే సమయం కావడంతో కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పెద్ద ఎత్తున నడిరోడ్డుపై మంటలు చెలరేగడంతో వాహనాదారులు ఇబ్బందులుపడ్డారు. రేపు మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహావిష్కరణ గుంటూరు మెడికల్: బీజేపీ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా గుంటూరు లక్ష్మీపురం సెంటర్లో ఈనెల 4వ తేదీన ఆయన విగ్రహావిష్కరణ జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు తెలిపారు. శుక్రవారం గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉదయం 10 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ విచ్చేసి వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, కూటమి నేతలు పాల్గొంటారని వెల్లడించారు. ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకుడు జూపూడి రంగరాజు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిట్రా శివన్నారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ వెలగలేటి గంగాధర్, రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ తాడువాయి రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు బజరంగ్ రామకృష్ణ, తోట శ్రీనివాస్, దేసు సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మూగజీవాల అరణ్యరోదన
ప్రత్తిపాడు: పై రెండు ఘటనలు పశు వైద్యశాలల్లో మందు కొరతకు అద్దం పడుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం మూగ జీవాల ఆరోగ్యం పట్ల ఎంత అశ్రద్ధను చూపుతుందో కళ్లకు కడుతుంది. మూగజీవాల సంరక్షణను చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. పశు వైద్యశాలకు నిర్ణీత సమయంలో మందులను సరఫరా చేయకుండా చోద్యం చూస్తూ మూగజీవాల ఆరోగ్యంతో ఆటలాడుతుంది. అనారోగ్యం బారిన పడి పశువులు ‘అంబా’ అని అరిచి నా ఇసు‘మాత్ర’మైనా ఆలకించే దిక్కులేకుండా పోతుంది. ఫలితంగా మందుల కోసం పశు పోషకులు ప్రైవేటు మెడికల్ షాపులకు చీటీలు పట్టుకుని పరుగులు పెట్టాల్సిన దుస్థితి జిల్లాలో కనిపిస్తుంది. అనేక మందులు నిల్.. తొమ్మిది నెలలుగా సరఫరా చేయని మందులు అరకొరగానే బడ్జెట్ -
అంతర్ జిల్లా ద్విచక్ర వాహన దొంగ అరెస్ట్
వినుకొండ: జల్సాలకు అలవాటు పడి ద్విచక్రవాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను వినుకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 16 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. వినుకొండ పోలీసులు పట్టణంలోని వెల్లటూరు రోడ్డు జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో బొల్లాపల్లి వైపు నుంచి వస్తున్న వడితే సర్తార్నాయక్ అనే యువకుడిపై అనుమానం కలిగింది. బైకుపై వచ్చిన అతడిని ఆపి విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆటో డ్రైవర్ నుంచి దొంగగా.. నిందితుడు గతంలో ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. మద్యానికి, ఇతర చెడు వ్యసనాలకు బానిస కావడంతో ఆటో కిస్తీలు కట్టలేకపోయాడు. ఫైనాన్స్ వారు ఆటోను తీసుకెళ్లిపోయారు. పాత బైక్ తాళాలను సేకరించి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. వినుకొండ బస్టాండ్, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, మంగళగిరి, నాగార్జున సాగర్ వంటి ప్రాంతాల్లో ఇతను దొంగతనాలకు పాల్పడ్డాడు. దొంగిలించిన బైక్లను వెల్లటూరు గ్రామ సమీపంలోని రిజర్వ్ అటవీ ప్రాంతంలో దాచి ఉంచాడు. 10 వాహనాల వివరాలు లభ్యం కాగా, మిగిలిన వాటి సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. నిందితుడిని పట్టుకున్న వినుకొండ సీఐ బి.ప్రభాకర్, ఎస్సై ఎ.బాలకృష్ణ, కానిస్టేబుళ్లు చాన్ బాషా, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావులను డీఎస్పీ అభినందించారు. నగదు రివార్డులను అందజేశారు. -
స్మృతి వనంపై ‘నిర్లక్ష్యం’ నీడ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రానికే తలమానికంగా విజయవాడలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన అంబేడ్కర్ స్మృతి వనంపై చంద్ర బాబు సర్కార్ నిర్లక్ష్యపు నీడ పడుతోంది. దీని నిర్వహణను వదిలేసి.. పెండింగ్ పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గతంలో సందర్శకులతో కళకళలాడిన స్మృతి వనం ప్రస్తుతం వెలవెలబోతోంది. గతంలో నామమాత్రంగా ప్రభుత్వం రూ.5 టికెట్ ధరను నిర్ణయించింది. దీంతో నెలకు సుమారు రూ.మూడు లక్షలకు పైగా ఆదాయం వచ్చేది. ప్రస్తుతం నెలకు రూ.30 వేలు ఆదాయం కూడా రాని పరిస్థితి నెలకొంది. నిర్వహణ ఏదీ మొదట్లో అంబేడ్కర్ స్మృతి వనం నిర్వహణను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చూసేది. చంద్ర బాబు సర్కార్ అధికారంలోకి రాగానే నిర్వహణను చేపట్టలేమంటూ చేతులెత్తేసింది. పైగా ఓ ప్రైవేటు సంస్థ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసుకొనేందుకు అను మతి ఇచ్చింది. ఆ ప్రాంగణంలో గ్రీనరి పూర్తిగా దెబ్బతింది. అక్కడ కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నిర్వహణ భా రం అంటూ ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించేందు కు యత్నించింది. వైఎస్సార్ సీపీతో పాటు, ప్రజా సంఘాల సభ్యులు ఆందోళన చేపట్టా రు. దీంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం నిర్వహణ బాధ్యతను కల్చరల్ డిపార్ట్మెంట్కు అప్పజెప్పింది. కొంత మే ర ఉద్యోగులకు జీతాలు చెల్లించారు. నిర్వహణ బ కాయిలు రూ.1.5కోట్లకుపైగా ఉన్నట్లు సమాచారం. స్మృతివనం నిర్వహణతోపాటు, కొంతమేర పెండింగ్ పనులు చేయడానికి సాంస్కృతిక శాఖ చర్య లు తీసుకుంటున్నా నిధుల లేమి పట్టి పీడిస్తోంది. గత ప్రభుత్వంలో .. గత ప్రభుత్వ హయాంలో నగరానికే సెంటరాఫ్ అట్రాక్షన్గా నిలిచేలా అంబేడ్కర్ స్మృతి వనాన్ని తీర్చిదిద్దారు. మొదటి దశలో 18.18 ఎకరాల్లో దాదాపు రూ.404.35 కోట్లతో పనులు చేపట్టారు. ఆ ప్రాంగణా న్ని గ్రీనరీతో ముస్తాబు చేశారు. కారిడార్ మొత్తం గ్రానైట్ ఫుట్పాత్, ప్రాంగణంలో అందమైన మొక్కలతో ప్లాంటేషన్ చేశారు. ప్రత్యేక లైటింగ్ సిస్టం ఏర్పాటుతోపాటు అందంగా గార్డెన్ రూపొందించారు. గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షించి అద్భుతంగా ప్రాజెక్టును రూపొందిండానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నిత్యం అధికారులతో మాట్లాడుతూ పనులు పరుగులు పెట్టించారు. అరుదైన భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సామాజిక న్యాయ శిల్పం పనులు 2022 మార్చి 21న ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2024 జనవరి 19 తేదీన ఆవిష్కరించారు. నాటి ప్రభుత్వంలో జనకళతో సందడిగా కనిపించిన ఆ ప్రాంగణం చంద్రబాబు పాలనలో కళావిహీనంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అంబ్కేడర్ విగ్రహం ప్రాంగణంలో ఏసీలు పని చేయడం లేదు. పైన రెండవ గ్యాలరీ పనులు ప్రారంభం కాలేదు.అంబేడ్కర్ విగ్రహం వెనుక రాతిని అతికించే పనులను నిలిపివేశారు. ప్రాంగణంలో ఫౌంటెన్లు పని చేయడం లేదు. 70 మంది సామర్థ్యంతో నిర్మించిన మిని థియేటర్ వినియోగంలోకి తీసుకు రావడం లేదు. రెండో దశలో పెండింగ్ పనులు ఏ ఒక్కటి పూర్తి కాలేదు. ప్రస్తుతం కేవలం 6,340 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2,000 మంది సామర్థ్యంతో నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్ పనులు మాత్రమే జరుగుతున్నాయి. పుడ్కోర్టు 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాల్సింది. ఆడిటోరియం, మ్యూజియం, లిఫ్ట్లు బిల్డింగ్ చుట్టూ నీటి కొలను, చిల్డ్రన్ పార్కు, మినీఽథియేటర్లు వంటి పనులు ప్రారంభమే కాలేదు. -
పుస్తకాల వైపు యువత దృష్టి
వన్టౌన్(విజయవాడపశ్చిమ):యువత దృష్టి పుస్తకాలపై మరలుతోందని సీనియర్ సంపాదకులు కె.రామచంద్రమూర్తి అన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యాన స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసిన 36వ విజయవాడ పుస్తక మహోత్సవం శుక్రవారం ప్రారంభమైంది. ప్రారంభ సభకు అతిథిగా హాజరైన రామచంద్రమూర్తి ఇతర అతిథులతో కలిసి రచయిత బీవీ పట్టాభిరామ్కు నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ పట్టాభిరామ్ వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, రచయితగా తాను ప్రోత్సహించానన్నారు. ఆ తర్వాత ఆయన అనేక అద్భుత పుస్తకాలు తీసుకొచ్చారని వివరించారు. సాహితీవేత్త, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లా డుతూ ఆధునిక ఎలక్ట్రానిక్ మాధ్యమాలు పుస్తకాలకు ప్రత్యామ్నాయాలు కాలేవన్నారు. ఆత్మీయ అతిథి సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ మాట్లాడుతూ అమరావతిలో పుస్తక మహోత్సవానికి పది ఎకరాల స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏడాదిలో రెండు సార్లు పుస్తక మహోత్సవాన్ని నిర్వహించాలని ఆకాంక్షించారు. సీనియర్ పాత్రికేయులు అప్పర సు కృష్ణారావు మాట్లాడుతూ సమాజాన్ని ముందు కు నడిపిస్తున్న ఘనత పుస్తకాలదేనన్నా రు. పుస్తక మహోత్సవ సంఘ కార్యదర్శి కె.లక్ష్మ య్య స్వాగతోపన్యాసం చేయగా, ఎమెస్కో అధినే త డి.విజయకుమార్ సభను నిర్వహించారు. అధ్యక్షుడు టి. మనోహర్నాయుడు వందన సమర్పణ చేశారు. నా నోరు కట్టేశారు : రఘురామకృష్ణంరాజు సభకు అధ్యక్షత వహించిన ఏపీ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ తన నోరు కట్టేశారన్నారు. దానికి ముందు సీపీఐ నేత నారాయణ చేసిన ప్రసంగంపై ఆయన స్పందించారు. నారాయణ చెప్పినట్లు ఆయనకు తనకు నోరు కొంచెం జాస్తి అని కానీ తన నోరును కట్టేశారనడం నిజమేనన్నారు. బుక్ ఫెస్టివల్ సొసైటీకి అమరావతిలో స్థలాన్ని కేటాయించడానికి సహకారం అందిస్తానన్నారు. -
క్రికెట్ చాంపియన్గా ‘ఎంబీయూ’
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 19వ ఎడిషన్ విజ్ఞాన్ మహోత్సవ్–2కే26లో భాగంగా జరిగిన జాతీయ స్థాయి క్రికెట్ చాంపియన్షిప్లో తిరుపతికి చెందిన మోహన్బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) జట్టు విజేతగా నిలిచింది. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్కు ముఖ్య అతిథిగా వైస్ చాన్సలర్ పి.నాగభూషణ్ హాజరయ్యారు. ఆయన టాస్ వేసి ఫైనల్ మ్యాచ్ను అధికారికంగా ప్రారంభించారు. ఫైనల్లో విజయవాడకు చెందిన సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీతో తలపడిన మోహన్బాబు యూనివర్సిటీ జట్టు 6 పరుగుల తేడాతో విజయం సాధించి, చాంపియన్గా నిలిచింది. విజేతకు ఫిబ్రవరి 7వ తేదీన ముగింపు వేడుకల్లో ప్రశంసా పత్రాలు, మెడల్స్తోపాటు నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధ్యాపక సిబ్బంది, పీడీలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న బ్యాట్స్మెన్ టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన మోహన్బాబు యూనివర్సిటీ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. జట్టులో హర్ష 3 ఫోర్లు, 1 సిక్సర్తో 26 పరుగులు, పృథ్వీ యాదవ్ 2 ఫోర్లు, 1 సిక్సర్తో 20 పరుగులు, ఎ.గౌతమ్ 14 పరుగులు, కెప్టెన్ దినేష్ 12 పరుగులు చేశారు. సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ బౌలర్లలో డీకే, భవానీ ప్రసాద్ చెరో 2 వికెట్లు తీసి ఆకట్టుకున్నారు. లక్ష్యం ఛేదించలేక.. అనంతరం 97 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 90 పరుగులు మాత్రమే చేసింది. 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. బ్యాట్స్మెన్లలో సోహాన్ చౌదరి 5 ఫోర్లు, 1 సిక్సర్తో 39 పరుగులు, సాల్మన్ వెస్లీ 2 సిక్సర్లతో 25 పరుగులు చేసి పోరాడారు. మోహన్బాబు యూనివర్సిటీ బౌలర్లలో ప్రవీణ్ కుమార్, హర్ష, వివేక్ రెడ్డి తలో వికెట్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. -
రాజకీయ కక్షతోనే పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు
మాచర్ల రూరల్: రాజకీయంగా ఎదుర్కోలేక ఆధారాలు లేకుండా ప్రతీకార భావంతో అన్యాయంగా పిన్నెల్లి సోదరులను అరెస్టు చేయటం ప్రజాస్వామ్య వ్యవస్థను కాలరాయడమేనని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి పోతురెడ్డి కోటిరెడ్డి అన్నారు. మండలంలోని కొత్తపల్లి గ్రామంలో పిన్నెల్లి సోదరుల అక్రమ నిర్భందాన్ని నిరసిస్తూ శుక్రవారం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి కుటుంబం 30సంవత్సరాలకు పైగా ప్రజలతో సత్సంబంధాలు కలిగి వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసిన చరిత్ర వారిదన్నారు. వరుసగా నాలుగుసార్లు శాసనసభ్యునిగా గెలిచి ప్రజాభిమానాన్ని చూరగొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలను రాజకీయంగా ఎదుర్కోలేక గ్రూపు తగాదాలో జరిగిన హత్య కేసులో అక్రమంగా ఇరికించి అరెస్టు చేయటం అన్యాయమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి అక్రమ, అన్యాయాలకు పాల్పడుతూ ప్రతిపక్ష నేతలను అణచివేయాలనే దుర్మార్గపు ఆలోచన మంచిదికాదన్నారు. పిన్నెల్లి సోదరులపై పెట్టిన అక్రమ కేసులను తామంతా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. న్యాయస్థానంపై మాకు ఎంతో నమ్మకముందని, న్యాయపోరాటం చేసి నిర్ధోషిత్వాన్ని నిరూపించుకొని కడిగిన ముత్యంలా మా పిన్నెల్లి సోదరులు వస్తారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఓరుగంటి జయప్రకాశరెడ్డి, ఎంపీటీసీ తేళ్లూరి శ్రీనివాసరెడ్డి, నాయకులు గోగిరెడ్డి హనిమిరెడ్డి, పాదం లక్ష్మయ్య, దశబంధపు కొండలు, గాలి బాలిరెడ్డి, జయభారత్రెడ్డి, ఆరికట్ల పున్నారెడ్డి తదితరులున్నారు. నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ -
జీవాలపైకి దూసుకెళ్లిన టాటా ఏస్ వాహనం
చిలకలూరిపేటటౌన్: జీవాలపైకి టాటా ఏస్ వాహనం దూసుకు వెళ్లడంతో 12 గొర్రెలు మృతి చెందాయి. పలు గొర్రెలు తీవ్రగాయాలైన పాలైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ...కట్టుబడివారిపాలెం పరిధిలోని మోపూరివారిపాలెం గ్రామానికి చెందిన ఉయ్యాల ఏడుకొండలు తమ గొర్రెల మందను తోలుకుని వెళ్తున్న క్రమంలో కోటప్పకొండ సమీపంలోని ఈటీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మేతకు ముగించుకుని మంద తిరిగి ఇంటికి తరలి పోతున్న క్రమంలో డోర్నాల నుంచి చిలకలూరిపేట వైపు వస్తున్న టాటా ఏస్ మినిలారీ ఒక్కసారిగా మందపైకి దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో 11 గొర్రెలు, ఒక పొట్టేలు మృత్యువాత పడగా, మరో 21 గొర్రెలు గాయాల పాలయ్యాయి. వాహనం నిలుపుదల చేయకుండా పరారయ్యే క్రమంలో స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో మద్దిరాల గ్రామస్తులు అప్రమత్తమై నిలపుదల చేశారు. దీంతో బాధితుడు రూరల్ పోలీసులను ఆశ్రయించాడు. -
ప్రపంచ తెలుగు మహాసభలకు భారీ బందోబస్తు
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): గుంటూరు–ప్రత్తిపాడు ప్రధాన మార్గంలో హైవే పక్కన ఉన్న శ్రీసత్యసాయి స్పిరిచ్యువల్ సిటీలో ఈనెల 3, 4, 5 తేదీల్లో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి బందోబస్తు ఏర్పాట్లను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఇంటెలిజెన్స్ ఎస్పీ ఆరీఫ్హఫీజ్ పరిశీలించారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగే సభల్లో పాల్గొనేందుకు మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్బీర్ గోకుల్, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్న నేపథ్యంలో బందోబస్తును పరిశీలించారు. శనివారం సాయంత్రం గుంటూరులోని ఐటీసీ వెల్కమ్ హోటల్కు మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్బీర్ గోకుల్ రానున్నారు. తెలుగు మహాసభలకు హాజరై అనంతరం మంగళగిరిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో వీవీఐపీ ప్రొటోకాల్కు అనుగుణంగా బందోబస్తు, పోలీసు ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. భద్రత లోపాలకు తావులేకుండా జాగ్రత్తలు పాటిస్తున్నట్లు తెలిపారు. వీవీఐపీల రాక నేపథ్యంలో పర్యటనలో అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముగిసేలా కట్టుదిట్ట చర్యలు చేపట్టినట్లు అధికారులు వివరించారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. -
ప్రజల ఆకాంక్ష మేరకే ప్రభుత్వ పాలన
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని గుంటూరువెస్ట్: ప్రజల ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్న్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్ట్ కింద పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పెమ్మసాని మాట్లాడుతూ శనివారం నుంచి 9వ తేదీ వరకు గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించి 35,690 పట్టాదారు పుస్తకాల పంపిణీ చేస్తామన్నారు. భూ రికార్డుల వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలేనని తెలిపారు. సంస్కరణల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇన్సెంటివ్ ప్రోగ్రామ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్గా నిలిచి, ఇప్పటివరకు రూ.490 కోట్ల ఇన్సెంటివ్స్ పొందిందని చెప్పారు. పట్టణాల్లో పైలట్ ప్రోగ్రాంగా భూ సర్వేలు జరుగుతున్నాయని, గుంటూరు, మంగళగిరి నగరాలు ఇందులో భాగమని, జిల్లాలో ఇప్పటికే 30 గ్రామాల్లో ఈ కార్యక్రమం పూర్తయిందని, మిగిలిన గ్రామాల్లో కూడా మూడు నుంచి నాలుగు నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. రైతులకు మనశ్శాంతి, భూమిపై పూర్తి భరోసా కల్పించడమే ఈ సంస్కరణల ఉద్దేశమని పేర్కొన్నారు. అనంతరం పెమ్మసాని, ఎమ్మెల్యేతో కలసి రైతులకు పట్టాదారు పాస్పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు, సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రెవెన్యూ డైరెక్టర్ కూర్మనాధం, సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, నగర మేయర్ కోవెలమూడి రవీంద్రబాబు, కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా లతో కలసి పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఆర్వో షేఖ్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు. -
కిడ్నీలు పాడవకుండా ఉండాలంటే...
శరీరంలో స్వచ్ఛమైన రక్తం ఉండేలా చేసే కిడ్నీలు చాలా కీలక పాత్రనే పోషిస్తుంటాయి. కాళ్ల వాపులు, మూత్రం ఎక్కువ సార్లు రావటం, మూత్రంలో మంట, మూత్రంలో రక్తం కారటం, ఆకలి లేకపోవటం, వాంతులు కావటం తదితర లక్షణాలు కనిపి స్తే మూత్ర పిండాలకు సంబంధించిన వ్యాధి గా అర్థం చేసుకోవాలి. నొప్పుల మాత్రలు, నాటు మందులు వాడటం, బీపీ, ఘగర్లు అదుపులో లేకపోతే మూత్రపిండాలు పాడవుతాయి. బీపీ, ఘగర్ ఉన్నవారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. – డాక్టర్ చింతా రామకృష్ణ, సీనియర్ నెఫ్రాలజిస్ట్, గుంటూరు. -
రైతుల భూములపై కన్ను ?
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రైతుల భూమిపై కన్ను పడిందా? వాటిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు పావులు కదుపుతున్నారా? గుంటూరు కార్పొరేషన్లో 18 గ్రామాలను విలీనం చేయాలన్న ప్రక్రియపై ఆయా గ్రామాల ప్రజలు వ్యక్తం చేస్తున్న భయాందోళనలు ఇవి. ఇటీవల విజయవాడ, తిరుపతి గ్రేటర్ చేయాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వాయిదా వేశారు. కొత్తగా జనగణన ప్రారంభం కానున్న నేపథ్యంలో 2011 జనాభా లెక్కల ప్రకారం విలీనం సబబు కాదని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. అయినా గుంటూరులో మాత్రం సొంత పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు వ్యతిరేకిస్తున్నా కౌన్సిల్లో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించారు. మొదట 11 గ్రామాల విలీనం కోసం తీర్మానం పెట్టగా, దీని ద్వారా సుమారు 14 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ కార్పొరేషన్కు అందుబాటులోకి వస్తుందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు చెప్పుకొచ్చారు. ప్రభుత్వ భూమి లేని గ్రామాలు.. నగరానికి ఆనుకుని ఉన్న తక్కెళ్లపాడు, అగతవరప్పాడు, పెదకాకాని లేకుండా మిగిలిన దూరంలో ఉన్న గ్రామాలను కలపడం ఏంటని అభ్యంతరాలు సొంత పార్టీ సభ్యుల నుంచే రావడంతో మళ్లీ తాజాగా జరిగిన సమావేశంలో మరో ఏడు గ్రామాలను కలిపి మొత్తం 18 గ్రామాలను అజెండాలో పెట్టారు. దీనివల్ల 20 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ కార్పొరేషన్కు వస్తుందని బూర్ల రామాంజనేయులు చెబుతున్నారు. అసలు ప్రభుత్వ భూమి లేని ఈ గ్రామాలను కలపడం వల్ల ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంక్ ఎలా వస్తుంది? మా భూములు తీసేసుకుంటారా అన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతుందని బూర్ల తన ప్రతిపాదనలో పేర్కొనడం చూస్తుంటే ఈ గ్రామాలను కార్పొరేషన్లో కలిపి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు కనపడుతోంది. వ్యతిరేకిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు... 2012లో మున్సిపల్ కార్పొరేషన్లో కలిపిన గ్రామాలకే ఇప్పటి వరకు మంచినీటి సదుపాయాన్ని కల్పించడంలో కార్పొరేషన్ విఫలమైంది. అటువంటప్పుడు మరో 18 గ్రామాలను కలపడం ఉపయోగం లేదన్నది ప్రజా ప్రతినిధులు వాదన. ఈ ప్రతిపాదనను గుంటూరు తూర్పు, పశ్చిమ, పొన్నూరు ఎమ్మెల్యేలు మహ్మద్ నసీర్, గల్లా మాధవి, దూళిపాళ్ల నరేంద్ర వ్యతిరేకిస్తున్నారు. అలాగే గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేయడం ద్వారా పరిపాలనా పరమైన సమస్యలు వస్తాయని తూర్పు ఎమ్మెల్యే నసీర్ వ్యతిరేకించారు. విలీనం అయ్యే గ్రామాలివే.... లాల్పురం, చల్లావారిపాలెం, వెంగళాయపాలెం, మల్లవరం, చినపలకలూరు, దాసుపాలెం, తురకపాలెం, తోకవారి పాలెం, గొల్లవారిపాలెం, ఓబులు నాయుడుపాలెం, జొన్నలగడ్డ, ఆగతవరప్పాడు, వెనిగండ్ల, కొర్నెపాడు, పుల్లడిగుంట, తక్కెళ్లపాడు, లాం, పెదకాకాని గ్రామాల విలీనానికి ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని ప్రభుత్వ ఆమోదం కోసం తీసుకోనున్నారు. 18 గ్రామాలను విలీనం చేయాలనుకున్నప్పుడు అక్కడ గ్రామ సభలు నిర్వహించి ప్రజామోదంతో పాటు పంచాయతీ తీర్మానాలు చేయాల్సి ఉంది. అయితే కార్యదర్శులపై ఒత్తిడి తెచ్చి, సర్పంచ్లకు తెలియకుండానే తీర్మానాలను చేసి పంపించారు. దీన్ని ఆయా గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. -
బీపీ, ఘగర్లను అదుపులో పెట్టుకోవాలి...
అనేక శారీరక రుగ్మతలకు రక్తపోటు, మధుమేహం ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఇవి అదుపులో లేకపోతే మూత్రపిండాలు, గుండె ఫెయిల్ కావడం, దృష్టి లోపాలు రావటం, పక్షవాతం వస్తుంటాయి. బీపీ, షుగర్ ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించి అదుపులో పెట్టుకోవాలి. రోజూవారీ ఉప్పు వాడకం ఐదు గ్రాముల కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. బీపీని అదుపులో పెట్టేందుకు రోజు యోగా చేయాలి. పొటాషియం, క్యాల్షియం ఉండే పాలు, పండ్లు వంటి ఆహారాన్ని తీసుకోవాలి. – డాక్టర్ కోగంటి కళ్యాణ్చక్రవర్తి, ఇన్ఫెక్షన్స్ స్పెషలిస్ట్, గుంటూరు -
గుండె కోసం ఇవి పాటించాలి...
శరీరంలోని అన్ని అవయవాల్లో గుండె ప్రధానమైంది. గుండె కోసం తప్పని సరిగా ప్రతిరోజు వ్యాయామం చేయాలి. మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలి.న నూనె అధికంగా ఉండే పదార్థాలు, చికెన్, మాంసం వంటి కొవ్వు అధికంగా ఉండే పదార్థాలను తినకూడదు. ఆకుకూరలు, కాయగూరలు తీసుకోవాలి. బీపీ, ఘగర్లను నియంత్రణలో పెట్టుకోవాలి. 35 సంవత్సరాలు దాటిన వారు ఏడాదికోసారి రక్తంలో కొవ్వు శాతం పరీక్షలు చేయించుకోవాలి. ధూమపానం, మద్యపానం జోలికి వెళ్ళకూడదు. ఒత్తిడి లేకుండా ఉండాలి. – డాక్టర్ పోలవరపు అనురాగ్, ఇంట్రవెన్షనల్ కార్డియాలజిస్ట్, గుంటూరు. -
దుర్గమ్మ ఆర్జిత సేవలకు డిమాండ్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను గురువారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. అమ్మవారికి నిర్వహించే ఆర్జిత సేవలకు డిమాండ్ ఏర్పడింది. భక్తుల ఉదయం రద్దీ సాదారణంగా ఉండగా, 11 గంటల తర్వాత క్రమంగా పెరిగింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు భక్తులతో అన్ని క్యూలైన్లు కిటకిటలాడుతూ కనిపించాయి. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవలకు డిమాండ్ కనిపించింది. తెల్లవారుజామున అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, ఛండీహోమం, శాంతి కల్యాణం, నవగ్రహ హోమం, గణపతి హోమాల్లో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. సాయంత్రం అమ్మవారికి నిర్వహించిన పంచహారతుల సేవ, పల్లకీ సేవలో ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. ఆలయం వెలుపుల ఉన్న వేద ఆశీర్వచనాన్ని గురువారం నుంచి ఆలయం లోపల మండపంలోకి మార్పు చేస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 11 గంటల తర్వాత ఒక సారిగా భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. సర్వ దర్శనానికి రెండు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు రూ.100 టికెట్ క్యూలైన్లోకి ఉచితంగా మళ్లించి రద్దీని నియంత్రించారు. సర్వ దర్శనం క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. పలువురు పుర ప్రముఖులు, వీఐపీలు సైతం మహా నివేదన అనంతరం అమ్మవారి దర్శనానికి విచ్చేయడంతో సాధారణ భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. రద్దీ నేపథ్యంలో ఏఈఓలతో పాటు పలువురు సూపరింటెండెంట్లకు, ఇతర సిబ్బందికి ఆలయంలో ప్రత్యేక విధులు కేటాయించారు. మరోవైపు ఆలయానికి చేరుకునే క్యూలైన్లతో పాటు గాలిగోపురం, వీఐపీ మార్గం, సింహద్వారాల వద్దకు భక్తులు చేరుకుని తమను అలయంలోకి అనుమతించాలని డిమాండ్ చేశారు.


