breaking news
Guntur District Latest News
-
బహిరంగ మద్యపానంపై కఠిన చర్యలు
నెహ్రూనగర్: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎకై ్సజ్ శాఖ గుంటూరు డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె.శ్రీనివాసులు హెచ్చరించారు. శనివారం అరండల్పేటలోని ఎకై ్సజ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2025 జనవరి 1 నుంచి 2026 జూన్ 19 వరకు గుంటూరు, పల్నాడు జిల్లాల్లో బహిరంగ మద్యపానంపై మొత్తం 1,136 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గుంటూరు జిల్లాలో 599 కేసులు, 604 మంది నిందితులుగా గుర్తించామన్నారు. పల్నాడు జిల్లాలో 537 కేసులకు గాను 561 మంది నిందితులుగా ఉన్నారన్నారు. జూన్ 19 ఒక్కరోజే రెండు జిల్లాల్లో కలిపి 45 కేసులు నమోదు చేసి 46 మందిపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. బహిరంగంగా మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని, ఇకపై కూడా ఇలాంటి వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఇ. మారయ్యబాబు, గుంటూరు–1 స్టేషన్ హౌస్ ఆఫీసర్ బి.లత తదితరులు పాల్గొన్నారు. ఎకై ్సజ్ శాఖ గుంటూరు డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాసులు -
రైతు సంఘం జిల్లా 17వ మహాసభల్లో రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య
లక్ష్మీపురం: అమెరికాతో మోదీ ప్రభుత్వం కుదుర్చుకున్న వ్యవసాయ వాణిజ్య ఒప్పందాలు దేశ వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.కృష్ణయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా 17వ మహాసభ శనివారం స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో నిర్వహించారు. జొన్నా శివశంకర్, వి.భారతి, ఎం.శివసాంబిరెడ్డి అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. తొలుత రైతు సంఘం పతాకాన్ని సీనియర్ నాయకులు ఆళ్ల సాంబరెడ్డి ఆవిష్కరించారు. కృష్ణయ్య మాట్లాడుతూ అమెరికాకు మనం చేసే ఎగుమతులపై 18 శాతంపైగా పన్నులు విధిస్తూ, అమెరికా నుంచి మన దేశం దిగుమతి చేసుకునే వస్తువులపై మాత్రం పన్నులు పూర్తిగా ఎత్తివేయటం వలన మన రైతుల ఉత్పత్తుల విక్రయాలు నిలిచిపోతాయని, రైతులు దివాళా తీస్తారన్నారు. కంపెనీలకు అనుకూలంగా చట్టాలు సవరించారని తెలిపారు. రాష్ట్రంలోనూ వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం దివాళా తీయిస్తుందన్నారు. కార్యక్రమంలో సీనియర్ సైంటిస్ట్ ప్రొఫెసర్ తాళ్లూరి వెంకటరత్నం, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్కుమార్, సీనియర్ సైంటిస్ట్ ప్రొఫెసర్ ఎన్.వేణుగోపాలరావు, రిటైర్డ్ డీఎస్పీ బీరం నాగేశ్వరరావు, రైతు సంఘం జిల్లా నాయకులు పాశం రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.రామకృష్ణ, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎంఎ.చిష్టీ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ, రైతు సంఘం జిల్లా నాయకులు కాజా వెంకటేశ్వరరావు, కొత్త వెంకటశివరావు, ఎం.వెంగళరెడ్డి, ఎం.శ్రీనివాసరెడ్డి, బిక్కి శ్రీనివాసరావు, చింత భాస్కరరావు, ఈశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థులకు గాయాలు యడ్లపాడు: జాతీయ రహదారి సర్వీసు రోడ్డుపై యడ్లపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వైద్య విద్యార్థులు గాయపడ్డారు. బాధితుల కథనం మేరకు... కోండ్రుపాడులోని కాటూరి మెడికల్ కళాశాల విద్యార్థులు వైద్యపరమైన సేవలు ప్రజలకు అందించటానికి శనివారం రెండు బస్సులో యడ్లపాడు వచ్చారు. విధులు ముగించుకున్న అనంతరం వారు తిరిగి వెళ్లే క్రమంలో గ్రామంలోని జాతీయ రహదారి సర్వీసు రోడ్డులో నిలిపి ఉన్న బస్సుల్లోకి ఎక్కుతున్నారు. ఇంతలో గుంటూరు వైపు నుంచి వచ్చిన నాలుగు చక్రాల ఆటో బస్సు పక్కనే ఉన్న ఐస్క్రీం బండిని, బస్సు ఎక్కుతున్న విద్యార్థులు ఢీకొట్టింది. ప్రమాదంలో విద్యార్థులు హరీష్, ఎం బాలాజీ, సాల్మాన్, సిద్ధ్దార్థ గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. -
పవర్ లిఫ్టింగ్ పోటీల్లో కేఎల్యూ విద్యార్థిని ప్రతిభ
ఏపీజీఈఎస్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాంద్ బాషా మంగళగిరి టౌన్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు తక్షణమే వేతనాలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ (ఏపీజీఈఎస్ఎ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాంద్ బాషా శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. వేలాదిమంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు గత నాలుగు నెలలుగా వేతనాలు అందలేదని అన్నారు. దీంతో వారి కుటుంబ పోషణ, పిల్లల చదువులకు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను దృష్టిలో ఉంచుకుని సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను క్రమబద్దీకరిస్తామని ఇచ్చిన హామీపై ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవల క్రమబద్దీకరణ అంశాన్ని తదుపరి కేబినెట్ సమావేశంలో చర్చించి సత్వర నిర్ణయం తీసుకోవాలని కోరారు. క్రమబద్దీకరణ పూర్తయ్యే వరకు ఉద్యోగులకు గ్రాస్ శాలరీ వర్తింపజేస్తే వారి కుటుంబాలకు కొంత ఊరట లభిస్తుందని అన్నారు. ప్రముఖ సినీనటుడు తనికెళ్ల భరణి తెనాలి: పట్టణ రామలింగేశ్వరపేటలోని తోటవారి వీధిలో ప్రత్యేక యాగశాలలో శ్రీలక్ష్మీనారాయణ సహిత మహాసుదర్శన యాగంలో శనివారం సాయంత్రం ప్రముఖ సినీనటుడు, రచయిత తనికెళ్ల భరణి పాల్గొన్నారు. పండితులు ఆశీర్వచనం తీసుకున్నారు. సినీనటుడు వేమూరి విజయభాస్కర్ ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీన మహాసుదర్శనయాగం ఆరంభించిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం సుప్రభాతంతో మొదలై సుదర్శన యాగం, నవగ్రహారాధన, శ్రీవేంకటేశ్వర హోమం, శ్రీలక్ష్మీనారాయణ హోమం, మంగళహారతితో రాత్రి ఏడు గంటలకు ముగిసింది. లోకకళ్యాణార్ధం విజయభాస్కర్ చేపడుతున్న మహాసుదర్శనయాగం మంచి ఫలితాలను ఇస్తుందన్నని తనికెళ్ల భరణి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
బ్లాస్టింగ్కు నిరసనగా పేరేచర్లలో ధర్నా
మేడికొండూరు: మండల పరిధిలోని పేరేచర్లలో శనివారం సాయంత్రం పేరచర్ల గ్రామవాసులు బ్లాస్టింగ్ పూర్తిగా నిలుపుదల చేయాలని కోరుతూ గుంటూరు– హైదరాబాదు ప్రధాన రహదారిపై మహిళలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. క్వారీ యజమానులు నిబంధనలు పాటించకుండా బ్లాస్టింగ్ ఎక్కువ మోతాదులో నిర్వహించడం వలన తమ ఇల్లు పూర్తిగా దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఇల్లు నిర్మించుకున్న తమకు బ్లాస్టింగ్ వలన ఇళ్లకు పగుళ్లు ఏర్పడి రాళ్లు మీద పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన ఫలితం లేకుండా పోయిందని ఆరోపించారు. రేకుల ఇల్లు నిర్మించుకున్న వారి పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని, క్వారీలో బ్లాస్టింగ్ దాటికి రాళ్లు ఎగిరిపడి రేకులపై పడి ఇల్లు పూర్తిగా దెబ్బతినటమే కాకుండా టీవీలు, ఇంటి సామగ్రి సైతం పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేరేచర్ల ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మేడికొండూరు పోలీసులు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కాలనీవాసులు శాంతించారు. -
అక్రమ కేసులు పెట్టినా ప్రజా సమస్యలపై పోరాటం
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రజా సమస్యలపై గళం వినిపిస్తున్న వైఎస్సార్ సీపీ యువజన విభాగ నాయకులపై టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు, అరెస్టులతో భయపెట్టాలని చూస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు ఉత్తేజ్ రెడ్డి అన్నారు. శనివారం బృందావన్గార్డెన్స్లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఉత్తేజ్రెడ్డి మాట్లాడుతూ రెండేళ్లు పూర్తి చేసుకున్న కూటమి పాలనలో ఇచ్చిన హామీలు అమలు కాని పరిస్థితులపై వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాల ద్వారా ప్రజలకు వాస్తవాలను వివరించామని చెప్పారు. నిరసన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినందుకు కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులతో భయపెడుతోందని, తాము అక్రమ కేసులు, అరెస్టులకు భయపడబోమని స్పష్టం చేశారు. ఎంత నిర్బంధించాలని చూసినా, ఎదురిస్తామని, టీడీపీ అక్రమాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని అన్నారు. పోలీసులు వైఎస్సార్ సీపీకి ఒక రూల్, కూటమి నేతలకు ఒక రూల్ అమలు చేస్తున్నారని అన్నారు. వైఎస్సార్ సీపీ తరపున ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తుంటే అక్రమ కేసులు మోపుతున్న పోలీసులు టీడీపీ నేతలు ఎంత పెద్ద తప్పు చేసినా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపుతున్నారని ఆరోపించారు. యువజన విభాగ నగర అధ్యక్షుడు యేటి కోటేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగ కార్యనిర్వహక అధ్యక్షుడు కారుమూరి సునీల్ యాదవ్ను అక్రమ కేసులో అరెస్టు చేయించారని ఆరోపించారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీడీపీ బీసీలను అణగదొక్కుతోందన్నారు. పార్టీ వెస్ట్ యువజన విభాగ అధ్యక్షుడు కానూరి శశిధర్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీలో యువ నాయకుడిగా ఎదుగుతున్న కారుమూరి సునీల్ యాదవ్ను చంద్రబాబు అక్రమ అరెస్టు చేయించారని ఆరోపించారు. యువతను అణగదొక్కేందుకు, వైఎస్సార్ సీపీ కోసం పనిచేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేయడం, తప్పుడు కేసులో అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. సునీల్ కుమార్కు అండగా ఉంటామని, వైఎస్ జగన్ వచ్చాక అందరికీ శిక్షలు పడతాయని అన్నారు. నగర ఉపాధ్యక్షుడు వై.వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో లిక్కర్ స్కామ్ వెలుగు చూసిందని, పర్మిట్ రూమ్స్కు అనుమతులు ఎవరిచ్చారని అన్నారు. అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుపుతున్నారని అన్నారు. సమావేశంలోతూర్పు విభాగ అధ్యక్షుడు షేక్ సుభానీ కొండా కోటిరెడ్డి(ప్రత్తిపాడు), వెంకటరెడ్డి (తాడికొండ) పాల్గొన్నారు. -
ప్రైవేటు పాఠశాలల్లో డీఈఓ తనిఖీలు
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలు విధిగా పాటించాలని జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా పేర్కొన్నారు. గుంటూరు నగరం కేవీపీ కాలనీలోని సిద్దార్థ స్కూల్, శ్రీనివాసరావుపేటలోని సుజాత స్కూల్ను డీఈఓ శనివారం తనిఖీ చేశారు. పాఠశాల గుర్తింపు ధ్రువపత్రం, రికార్డులను పరిశీలించారు. నిబంధనలు పాటించడంతోపాటు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను వసూలు చేయాలని ఆయా పాఠశాలల యాజామాన్యాలకు సూచించారు. క్యాంపస్లలో పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు విక్రయించరాదని స్పష్టం చేశారు. నగరంపాలెం: జిల్లాలో ఆదివారం జరగనున్న నీట్ (యూజీ)–2026 పునఃపరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని 26 పరీక్ష కేంద్రాలలో 7,312 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్న దృష్ట్యా ప్రతి కేంద్రం వద్ద పోలీస్ అధికార, సిబ్బందిని నియమించామని అన్నారు. పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసేయాలని దుకాణదారులకు సూచించారు. మొబైల్ఫోన్లు, స్మార్ట్వాచ్లు, బ్లూటూత్ పరికరాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిలేదని అన్నారు. పరీక్ష నిబంధనలు ఉల్లంఘించినా, అనుమానాస్పదంగా ప్రవర్తించిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరిగితే డయల్–112 లేదా స్థానిక పోలీస్స్టేషన్లల్లో సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ సూచించారు. -
భూ సమస్యలకు రీసర్వేతో శాశ్వత పరిష్కారం
రోణంకి కూర్మనాథ్ కొరిటెపాడు(గుంటూరు): వినియోదారుల సమస్యల సత్వర పరిష్కారానికి విద్యుత్ అదాలత్ ఎంతగానో ఉపయోపడుతోందని కన్జ్యూమర్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ ఫోరం(సీజీఆర్ఎఫ్) చైర్మన్ ఎన్.విక్టర్ ఇమ్మానుయేలు అన్నారు. గుంటూరు పొన్నూరు రోడ్లోని విద్యుత్ భవనం ఆవరణలోని సమావేశ మందిరంలో శనివారం విద్యుత్ వినియోగదారుల అదాలత్, అవగాహన సదస్సు నిర్వహించారు. వినియోగదారుల నుంచి వినతులు స్వీకరించారు. విద్యుత్ బిల్లుల్లో తప్పులు, స్తంభాల మార్పు, మీటర్ రీడింగ్లో లోపాలు, కొత్త కనెక్షన్ల జాప్యం, లో–ఓల్టేజీ, సోలిర్ పేమెంట్ క్రెడిట్ కాకపోవడం తదితర సమస్యలపై 12 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సీజీఆర్ఎఫ్ చైర్మన్ ఇమ్మానియేలు మాట్లాడుతూ వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి వివరాలతో స్పాట్లోనే పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అదాలత్కు వచ్చిన 12 ఫిర్యాదుల్లో 10 పరిష్కరించినట్లు తెలిపారు. వినియోగదారుల హక్కులు, విద్యుత్ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీజీఆర్ఎఫ్ సాంకేతిక సభ్యులు డి.కృష్ణనాయక్, ఆర్థిక సభ్యులు కె.కృష్ణ, స్వతంత్ర సభ్యులు ఏ.సునీత, ఎస్ఈ చల్లా రమేష్, అకౌంటెంట్ రామిరెడ్డి, డీఈఈలు, ఏఈలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట: అమృత భారత్ స్టేషన్ స్కీము(ఏబీఎస్ఎస్) కింద కోట్ల వ్యయంతో చేస్తున్న రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులను గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ సుధేష్ణసేన్ శనివారం పరిశీలించారు. స్టేషన్లో నూతనంగా ఏర్పాటుచేసిన రెండో ప్లాట్ఫామ్ పైకప్పు, ప్లోర్ పనులు, మొదటి ప్లాట్ఫామ్ పొడిగింపు, హైలెవల్ బ్రిడ్జి, స్టేషన్ ముందు పనులను పరిశీలించారు. ఈనెలాఖరుకు ప్లాట్ఫామ్ పనులను పూర్తిచేస్తామని ఇంజినీర్లు చెప్పారు. లింగంగుంట్ల వైపు స్టేషన్సమీపంలో నివాసం ఉంటున్న గృహాలను పరిశీలించారు. నూతన రైల్వేట్రాక్, స్టేషన్ కొలతలను కొలిపించి పరిశీలించారు. అసిస్టెంట్ డీఆర్ఎం రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సాదాసీదాగా సాగిన సీఎం పర్యటన
● టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం కూడా కరువు ● దూరం పాటించిన జనసైనికులు ● నియోజకవర్గానికి లభించని హామీలు చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన ఎలాంటి ప్రత్యేకతలు లేకుండా సాదాసీదాగా సాగింది. టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపలేకపోయింది. కూటమిలో భాగస్వాములులైన కొద్దిమంది బీజేపీ నాయకులు నామమాత్రంగా హెలిప్యాడ్ వద్దకు సీఎంను కలిసి వెళ్లారు. మరోవైపు జనసైనికులు పూర్తి దూరంగా ఉండిపోయారు. మొత్తంగా శనివారం అన్నదాత సుఖీభవ, స్వచ్ఛాంఽధ్ర– స్వర్ణాంధ్ర కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి పర్యటనకు స్పందన అంతంతే కనిపించింది. మధ్యాహ్నం 12.20 ప్రాంతంలో ముఖ్యమంత్రి గ్రామంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకున్నారు. అక్కడి నుంచి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. నెట్ జీరో విధానంలో భాగంగా రాష్ట్రంలోని 44,346 అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం ఇండక్షన్ స్టౌలు, పాత్రలను అందజేసే కార్యక్రమంలో భాగంగా ఇక్కడి కేంద్రానికి అందించారు. రాగి జావ కాచే కార్యక్రమంలో పాల్గొని చిన్నారులతో ముచ్చటించారు. ప్రకృతి వ్యవసాయక్షేత్ర పరిశీలన... అనంతరం రైతు గుడిపల్లి నాగభూషణం సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయక్షేత్రాన్ని పరిశీలించారు. ప్రకృతి సాగుతో పెట్టుబడి తగ్గి భూసారం పెరిగి దిగుబడులు అధికంగా వచ్చాయని సీఎంకు రైతు వివరించారు. ఎద్దు గానుగ ద్వారా నూనె తీయడం పరిశీలించి, నూనె కొనుగోలు చేశారు. అక్కడి నుంచి చిలకలూరిపేట పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్లో ఏర్పాటు చేసిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం తిరిగి లింగంగుంట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన సభాస్థలికి సాయంత్రం 4.15 గంటలకు చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వ్యవసాయశాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు ప్రసంగించారు. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పీఎం కిసాన్ యోజన ప్రసంగాన్ని ఎల్ఈడీపై వీక్షించే కార్యక్రమం నిర్వహించారు. తెలుగు తమ్ముళ్ల అత్యుత్సాహం సాయంత్రం 5 గంటల సమయంలో ప్రధాని మోదీ ప్రసంగం ప్రారంభమయ్యాక ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా వీక్షించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. పావుగంట గడిచాక ప్రధాని ప్రసంగం హిందీలో కొనసాగుతుండటంతో తెలుగు తమ్ముళ్ల నుంచి అసహనం వ్యక్తం అయింది. ప్రసంగం నిలిపివేయాలని అరుపులు, కేకల ద్వారా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వారికి నచ్చచెప్పాల్సి వచ్చింది. ప్రధాని ప్రసంగం 5.30 వరకు కొనసాగిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రసంగం మొత్తం పరనింద, ఆత్మస్తుతికే పరిమితమైంది. పేరుకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ అయినప్పటికీ ఎక్కువగా టెక్నాలజీ గురించి ముఖ్యమంత్రి మాట్లాడటం విశేషం. వివిధ రకాల టెక్నాలజీలను తన పరిపాలన కాలంలో తెచ్చానని, ఇంకా తెస్తున్నానని వల్లెవేశారు. కూటమిలో భాగస్వాములైన బీజేపీ నాయకులు కొద్ది మంది మాత్రమే హెలిప్యాడ్ వద్దకు వచ్చి ముఖ్యమంత్రిని కలసి వెళ్లారు. మరో భాగస్వామి అయిన జనసేన నాయకులు మాత్రం నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎవరూ ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ముఖ్యంగా పురపాలక సంఘం, వ్యవసాయ మార్కెట్ కమిటీ వంటి వాటిలో జనసేనకు చెందిన వారికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించకపోవడం, నామినేటెడ్ పదవులు కట్టబెట్టకపోవడమే వారి అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. మరోవైపు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి నిర్వహించిన ముఖ్యమంత్రి సభకు కేవలం ఇండోర్లో ఏర్పాటు చేసిన సీట్లకు మాత్రమే ప్రజలు పరిమితమయ్యారు. అంతకు మించి ఎక్కడా క్యాడర్లో ఉత్సాహం కనిపించిన దాఖలాలు కానరాలేదు. తీరా నియోజవర్గ అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి నోట ఎటువంటి హామీలు లభించకపోవడం మరింత నిరాశ కలిగించింది. -
సాగునీటి సమస్య పరిష్కారానికి ఉద్యమం
లక్ష్మీపురం: సాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ ఈనెల 30వ తేదీన చలో విజయవాడ నిర్వహించనున్నట్లు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. కొత్తపేటలోని జిల్లా సీపీఐ కార్యాలయంలోని మల్లయ్య లింగంభవన్లో శనివారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘాల సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి అధ్యక్షత వహించారు. ముప్పాళ్ల మాట్లాడుతూ గుంటూరు హై లెవెల్ చానల్ లో పూడికను తీయాలని, దాంతో పాటు ముళ్ళుకంపను తొలగించి చానల్ కట్టలను బలోపేతానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జల్లవాగులో పూడిక తీయకపోవటం వలన ప్రతి ఏడాది వేలాది ఎకరాల్లో పంటలు ముంపుగురై రైతాంగం నష్టపోతున్నారని ఈ వాగును ప్రక్షాళన చేసి మరమ్మతులు చేపట్టాలని కోరారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అమలు చేయాలి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల కాలవల నిర్మాణం తక్షణమే చేపట్టాలని, పంట కాలవలలో ఉన్న పూడిక, గురపు డెక్క, తూడికాడ తొలగించి సాగునీటి వ్యవస్థను మేరుగు మర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా కౌలురైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయకపోవడం చాలా దారుణమన్నారు. సొంత భూమి కలిగిన రైతులతో పాటు కౌలు రైతుల కూడా అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సంఘం నాయకులు కోటా మాల్యాద్రి, చిన్ని తిరుపతయ్య, పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యార్లగడ్డ వెంకటేశ్వరరావు, రైతు సంఘం నాయకులు పచ్చల సాంబశివరావు, ముప్పాల సాంబశివ, సూర్యనారాయణ, కూసం నాగిరెడ్డి, కొల్లి శంకర్ రెడ్డి పాల్గొన్నారు. -
4న దళిత క్రైస్తవుల భారీ నిరసన
బాపట్లటౌన్: దళిత క్రై స్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ జూలై 4న బాపట్లలో దళిత క్రై స్తవుల భారీ నిరసన ప్రదర్శనకి జిల్లా నలుమూలల నుంచి దళిత క్రైస్తవులు తరలి రావాలని దళిత క్రైస్తవ ఐక్య వేదిక కన్వీనర్ దేవతోటి సుందరయ్య పిలుపునిచ్చారు. పట్టణంలోని అంబేడ్కర్ భవన్లో శనివారం సాయంత్రం నిరసన కార్యక్రమం వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. సుందరయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 ప్రకారం తమకు నచ్చిన మతం స్వీకరించి, ఆచరించి, ప్రచారం చేసుకునే హక్కుని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కల్పించారని, క్రైస్తవ మతం స్వీకరించిన దళితులకు ఎస్సీ హోదా నిరాకరిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడం, దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం శోచనీయమన్నారు. సుప్రీంకోర్టు తీర్పును పునర్విచారణ చేయాలని, రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తింప చేయాలన్నారు. కార్యక్రమంలో సమాజ సేవకులు మోపర్తి జాన్, అంబేడ్కర్ సేవా సమాజం గౌరవాధ్యక్షుడు మందపాటి పరమానందకుమార్, మండే విజయకుమార్, గుదే రాజారావు, కురగంటి శ్యామ్ రాజు, పాస్టర్లు మేజర్ చల్లాపల్లి ఏలియ రాజు, మేజర్ దాసరి మైఖేల్ పాల్గొన్నారు. కారంచేడు: మండలంలోని పోతినవారిపాలెం గ్రామానికి చెందిన పోతిన వెంకట్రావుకు డాక్టరేట్ విత్ ఇంటర్నేషనల్ ఛేంజ్ మేకర్ అవార్డు వరించింది. ఆయన 1990 నుంచి గ్రామంలో తన వ్యవసాయ భూమిలో అనేక రకాల వంగడాలను సాగు చేసి ఉత్తమ రైతుగా అవార్డులు తీసుకున్నారు. అంతర పంటలతో పాటు, శనగ, పత్తి, పొగాకు, మొక్కజొన్న, పెసర, మినుము వంటి పంటలను సాగు చేసి అధిక దిగుబడులు సాధించారు. తాజాగా శనివారం ఢిల్లీలో సోక్రేట్స్ సోషల్ రీసెర్చ్ యూనివర్సిటీ ట్రస్ట్ వారు వెంక్రట్రావుకు డాక్టరేట్తో పాటు ఇంటర్నేషనల్ ఛేంజ్ మేకర్ అవార్డును అందించారు. 2009లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఉత్తమ ఆదర్శ రైతు అవార్డు, 2010లో ప్రకాశం జిల్లా ఉత్తమ రైతు, 2011లో పర్చూరు డివిజన్ ఉత్తమ రైతు, 2018లో గుంటూరు లాంఫాం కాలేజీ నుంచి ఉత్తమ రైతు అవార్డు, 2021లో జాతీయ ఆదర్శరైతు, 2024లో సేవానంది జాతీయ పురస్కారాలు అందుకున్నారు. వెంకట్రావును రైతులు, గ్రామస్తులు అభినందించారు. -
జాతీయ క్విజ్ పోటీల్లో గుంటూరు వైద్య విద్యార్థి సత్తా
గుంటూరు మెడికల్: జాతీయస్థాయిలో నిర్వహించిన క్విజ్ పోటీల్లో గుంటూరు వైద్య కళాశాల డెర్మటాలజీ పీజీ వైద్య విద్యార్థి సత్తా చాటారు. వారం క్రితం ఆన్లైన్లో నిర్వహించిన జాతీయ క్విజ్ పోటీల్లో డెర్మటాలజీ ఫైనల్ ఇయర్ వైద్య విద్యార్థి డాక్టర్ బండారు రాకేష్ ప్రతిభ చాటి మూడో బహుమతి సాధించారు. మొదటి బహుమతిని గుజరాత్, రెండవ బహుమతిని ఒడిశాకు చెందిన పీజీ వైద్య విద్యార్థులు గెలుపొందారు. దేశ వ్యాప్తంగా పీజీ వైద్యులకు స్కిన్ బ్యారియర్స్ అనే అంశంపై ఆన్లైన్లో నిర్వహించిన జాతీయ స్థాయి క్విజ్ పోటీల్లో తృతీయ స్థానంలో నిలిచిన డాక్టర్ రాకేష్ను శనివారం గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరచారి , గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ గిరిజవోలు దుర్గాప్రసాద్లు అభినందించారు. కార్యక్రమంలో డెర్మటాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ డీఎస్ఎస్ శ్రీనివాసప్రసాద్, ఇతర బోధన సిబ్బంది పాల్గొన్నారు. -
ఆంధ్ర ప్రిమియర్ లీగ్ క్రికెట్ టోర్నీకి సిద్ధం
మంగళగిరి రూరల్: ఆంద్ర ప్రిమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్లు ఫైనల్, సెమీ ఫైనల్ మ్యాచ్లు జూలై నెల 31 నిర్వహించనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కేశినేని శివనాథ్ తెలిపారు. శనివారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. తొలుత మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని లాంఛనంగా ప్రారంభించారు. శివనాథ్ మాట్లాడుతూ బీసీసీఐ నిబంధనల ప్రకారం 175 రోజులు అంతర్జాతీయ షెడ్యూల్కు సరిపోయేలా మౌలిక వసతులు, సదుపాయాలు మెరుగుపరచినట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఏపీఎల్ మ్యాచ్లకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. మ్యాచ్ వీక్షించడానికి టికెట్ అవసరం లేదని పూర్తిగా ఉచితం అన్నారు. రాబోయే రోజుల్లో అంర్జాతీయ స్థాయి మ్యాచ్లు ఆతిథ్యం ఇవ్వడానికి స్టేడియ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. కార్యక్రమంలో ఎంఎస్ కుమార్, ఏపీఏ ట్రెజరర్ దండమూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
లైంగికదాడి కేసులో నిందితుడు అరెస్ట్
పర్చూరు(చినగంజాం): మహిళపై లైంగికదాడి కేసులో నిందితుడిని అరెస్టు చేశారు. శనివారం పర్చూరు పోలీస్ స్టేషన్ ఆవరణలోని మార్టూరు రూరల్ సీఐ నాగభూషణం విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన సుమారు 36 ఏళ్ల మహిళ తన భర్తతో కలిసి పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో నివశిస్తోంది. ఆమె ప్రతి రోజూ చిలకలూరిపేట పట్టణం చుట్టు పక్కల ప్రాంతాల్లో కూలి పనులకోసం వెళ్తుండేది. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీ ఉదయం 8 గంటల ప్రాంతంలో ఎప్పటి లాగానే కూలి పనుల కోసం చిలకలూరిపేట గాంధీ పార్కు వద్ద ఎదురు చూస్తోండగా.. ఆ సమయంలో గుర్తు తెలియని యువకుడు ఆమె దగ్గరకు వచ్చి మార్టూరులో ఒక అపార్ట్మెంట్లో శుభ్రం చేయడానికి పనిమనిషి కావాలని చెప్పి తన మోటారు సైకిల్పై ఎక్కించుకున్నాడు. ఒంగోలు వైపు వెళుతూ మార్గమధ్యంలో తాతపూడి ఫ్లైఓవర్ జంక్షన్ వద్ద నుంచి సూరావారిపల్లె వెళ్లే రోడ్డులోకి తీసుకు వెళ్లాడు. ఆమెను గట్టిగా పట్టుకొని, కొట్టి కింద పడేసి ఆమైపె లైంగిక దాడి చేశాడు. అనంతరం ఆమె సెల్ఫోన్ లాక్కొని అక్కడి నుంచి మోటార్ సైకిల్పై పరారయ్యాడు. ఆ మహిళ ఈవిషయాన్ని తనకు తెలిసిన వ్యక్తికి చెప్పి అదే రోజు రాత్రి యద్దనపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. బైక్ చోరీ చేసి వస్తూ దొరికిన నిందితుడు ఈమేరకు సీఐ నాగభూషణం 20వ తేదీ శనివారం ఉదయం తన సిబ్బందితో పర్చూరు వై జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితుడు గతంలో ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద దొంగతనం చేసిన మోటార్ సైకిల్ పై ఒంగోలు వైపు నుంచి గుంటూరు వైపు వెళ్తూ పోలీసులను చూసి వాహనాన్ని వెనక్కి తిప్పి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా అతనిని పట్టుకొని విచారించారు. సదరు యువకుడు బాపట్ల జిల్లా చుండూరు మండలం మోదుకూరు గ్రామానికి చెందిన కుంభా వెంకట్(19)గా గుర్తించారు. అతడు ప్రస్తుతం గుంటూరు జిల్లా తుళ్లూరు మండల పెద్ద పరిమి గ్రామంలో ఉంటున్నాడన్నారు. పోలీస్ల విచారణలో నేరం చేసినట్లు అంగీకరించడంతో శనివారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి బాధితురాలి సెల్ఫోన్, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై పలు క్రిమినల్ కేసులున్నట్లు వారు గుర్తించారు. విలేకరుల సమావేశంలో సీఐ బి.నాగభూషణం, యద్దనపూడి ఎస్ఐ డి.వెంకటరత్నం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అభినందించిన ఎస్పీ ఉమామహేశ్వర్.. మహిళపై లైంగికదాడి కేసును అతి తక్కువ సమయంలో ఛేదించి, నిందితుడిని అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరచిన బాపట్ల డీఎస్పీ చంద్రమౌళి, మార్టూరు సీఐ బి.నాగభూషణం, యద్దనపూడి ఎస్ఐ డి.వెంకటరత్నం, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, పీసీలు కుమార్, నాగూరు, హోం గార్డు అనిల్ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వివరాలు వెల్లడించిన సీఐ నాగభూషణం -
హారన్ మోగింది.... రెండు గ్రామాల మధ్య ఘర్షణ
మేడికొండూరు: కారు హారన్ ఆపకుండా మోగించిన డ్రైవర్కు భీమినేనివారిపాలెం గ్రామ యువకుడు హారన్ కొట్టొద్దు అని చెప్పడం తప్పుగా అనిపించింది. ఫలితంగా కారు డ్రైవర్ తన సొంత గ్రామమైన పెదకూరపాడు నుంచి సుమారు 20 మంది పైగా యువకులను పిలిపించుకొని భీమినేనివారిపాలెం గ్రామంలో యువకునిపై దాడికి దిగిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. మేడికొండూరు పోలీసులు తెలిపిన వివరాలు.. గుంటూరు నుంచి సిరిపురం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సు భీమినేనివారిపాలెం క్రాస్ రోడ్డు వద్ద మలుపు తిప్పి బస్సులో నుంచి దిగే ప్యాసింజర్లను ఎక్కించుకునే క్రమంలో బస్సు ఆపారు. పెదకూరపాడు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కారు రోడ్డుపై ఉన్న ఆర్టీసీ బస్సుకు హారన్ ఆపకుండా మోగిస్తున్నారు. దీంతో భీమినేనివారిపాలెం యువకుడు బస్సు నుంచి ప్యాసింజర్లు దిగుతున్నారని ఒక్క నిమిషంలో బస్సు వెళ/్లపోతుందని కనుక మీరు హారం మోగించవద్దంటూ కోరాడు. హారన్ కొట్టడం వల్ల నీకు ఇబ్బంది ఏంటని కారు డ్రైవర్ యువకుని ప్రశ్నిస్తుండగా కోపంతో ఊగిపోతున్న కారులోని మహిళ భీమినేనివారిపాలెం గ్రామ యువకుడిపై చేయి చేసుకుంది. గొడవ పెద్దదవుతుండటంతో గ్రామస్తులు సర్ది చెప్పి ఇరువురిని పంపించారు. అయితే పెదకూరపాడు గ్రామం నుంచి సుమారు 25 మంది పైగా బైకులపై కరల్రతో భీమినేనివారిపాలెం గ్రామం వచ్చారు. ఇది గమనించిన గ్రామస్తులు ఆ యువకుడిని క్రాస్ రోడ్ సమీపంలో ఉన్న షాపులో ఉంచి తలుపులు వేశారు. పెదకూరపాడు గ్రామస్తులు షాపు ధ్వంసం చేసి తలుపులు నెట్టుకొని లోపల ఉన్న యువకుడిని బయటకు లాగి తీవ్రంగా కొట్టారు. తమకు అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉన్నాయని తమను ఎవరు ఏమి చేయలేరని దుర్భాషలాడుతూ గ్రామంలో వీరంగం వేశారు. విషయం తెలుసుకున్న మేడికొండూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదర కొట్టారు. భీమినేనివారిపాలెం గ్రామ యువకుడి ఫిర్యాదుతో మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తప్పించుకు తిరుగుతున్న నిందితుడి అరెస్ట్
కర్లపాలెం: హత్య కేసులో బెయిల్పై బయటకు వచ్చి కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిని శుక్రవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కర్లపాలెం ఎస్ఐ రవీంద్ర తెలిపిన వివరాలు.. కర్లపాలెం మండల పరిధిలోని పెదపులుగువారిపాలెం గ్రామానికి చెందిన పులుగు రామకృష్ణారెడ్డిపై ఇద్దరు మహిళల హత్య కేసులు ఉన్నాయి. కోర్టు వాయిదాలకు హాజరు కావాలసిన రామకృష్ణారెడ్డి 36 నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయటంతో గాలించి శుక్రవారం కర్లపాలెం రూరల్ ఏరియాలో అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరు పరిచారు. -
మత్తులో యువకుల వీరంగం
మంగళగిరి టౌన్: పట్టణంలోని టిడ్కో గృహసముదాయంలో శుక్రవారం రాత్రి మత్తులో ఇద్దరు యువకులు బీభత్సం సృష్టించారు. ఒక ద్విచక్ర వాహనం ధ్వంసం చేయడంతో పాటు చిరువ్యాపారుల టిఫిన్ బండ్లను నాశనం చేశారు. టిడ్కో గృహసముదాయానికి చెందిన ఇద్దరు యువకులు మత్తుపదార్థాలు తీసుకుని ఈ ఘటనలకు పాల్పడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బందితో రక్షక్ వాహనం ఘటనా స్థలానికి చేరింది. పోలీస్సిబ్బంది ఆ ఇద్దరు యువకుల్ని అదుపు చేయలేకపోవడంతో ఎస్ఐకు సమాచారం అందించారు. పట్టణ ఎస్ఐ అక్కడకు చేరుకుని ఇద్దరు యువకులను ఎట్టకేలకు అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. గంజాయి, సొల్యూషన్ గానీ తాగి ఉండవచ్చని, ఇద్దరిలో ఒకరిని గతంలోనే ఇక్కడ ఉండవద్దంటూ పోలీసులు హెచ్చరించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇద్దరు యువకులు మైనర్లు అని, వీరు గతంలో కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లు సమాచారం. -
సదరం సర్టిఫికెట్పై తప్పుడు ఆరోపణలు
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో ఆటిజంతో బాధపడుతున్న చిన్నారికి సదరం సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాధారమైన ఆరోపణలు చేసిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి వెల్లడించారు. శుక్రవారం జీజీహెచ్ సూపరింటెండెంట్ చాంబర్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆటిజం సమస్యకు 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే శాశ్వత సర్టిఫికెట్ ఇవ్వడం కుదురుతుందని వివరించారు. గుంటూరుకు చెందిన గోపి తన ఐదేళ్ల కుమారుడికి ఆటిజం సర్టిఫికెట్ ఇచ్చేందుకు వైద్యులపై ఒత్తిడి చేశాడని, రూ.50 వేలు లంచం అడిగినట్లు తప్పుడు ఆరోపణలు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లవాడికి సదరం సర్టిఫికెట్ ఇవ్వాలని, పీజీ వైద్యులకు సెల్ఫోన్లో మెసేజ్లు పంపినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. నిబంధనల ప్రకారం సర్టిఫికెట్ ఇవ్వనందువల్లే గోపి జీజీహెచ్ వైద్యులపై బురద జల్లేందుకు లంచం ఆరోపణలు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. జీజీహెచ్ వైద్యుల మనోధైర్యం దెబ్బతినేలా, ఆస్పత్రి పరిస్థితిని భంగం కలిగించేలా తప్పుడు ఆరోపణలు చేసిన గోపిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నామని పేర్కొన్నారు. మానసిక వైద్య విభాగాధిపతి డాక్టర్ నీలి ఉమాజ్యోతి మాట్లాడుతూ రాత్రిబవళ్లు కష్టపడి రోగులకు సేవలందిస్తున్న వైద్యులపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. మీడియా ప్రతినిధులు ఎవరైనా ఆరోపణలు వచ్చినప్పుడు వారి వద్ద వివరాలు సేకరించిన తరువాత వార్తలు ప్రచురించాలని కోరారు. వైద్యుల మనోధైర్యాన్ని దెబ్బతిసేలా వార్తలు ప్రచురించవద్దని విజ్ఞప్తి చేశారు. -
పోక్సో కేసులో నిందితుడికి జైలు
తెనాలిరూరల్: పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలానికి చెందిన 14 ఏళ్ల బాలిక 2023 నవంబర్ 7వ తేదీ రాత్రి స్నానం చేస్తుండగా వారి గ్రామానికే చెందిన బడుగు మెతుషెల్ దడిలో నుంచి చూస్తున్నాడు. గమనించిన బాలిక తల్లి కేకలు వేసి తన భర్తతో కలసి పట్టుకునేందుకు ప్రయత్నించగా మెతుషెల్ పరారయ్యాడు. ఇదే విషయాన్ని గ్రామ పెద్దలకు చెప్పి చందోలు పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్ఐ ఎస్.రాజశేఖర్ కేసు నమోదు చేశారు. కేసు తెనాలి పోక్సో కోర్టులో శుక్రవారం విచారణకు రాగా, సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.ఐదు వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో నెల జైలు శిక్ష అనుభవించాలన్నారు. ప్రాసిక్యూషన్ తరఫున పోక్సో కోర్టు స్పెషల్ ప్రాసిక్యూటర్ వెలినేని రాఘవయ్య వాదించారు. -
జూలై 30, 31న కలెక్టరేట్ వద్ద ధర్నా
లక్ష్మీపురం: పారిశ్రామిక కార్మికులకు, స్కీం వర్కర్లకు వేతనాలు పెంచాలని కోరుతూ జూలై 30, 31 తేదీలలో గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కే ఉమామహేశ్వరరావు తెలిపారు. సంఘం జిల్లా కార్యాలయంలో విస్త్తృతస్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 73 రకాల షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు వెంటనే వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా పెద్దలకు రాయితీలు ఇస్తూ, పనిచేసే కార్మికులకు మాత్రం వాతలు పెడుతున్నారని ఆరోపించారు. అంగన్వాడీలకు ఇచ్చే రూ.11,500, హెల్పర్లకు రూ.7 వేలు జీతం ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగి అని పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను ఆపివేయడం దుర్మార్గం అని అన్నారు. తక్షణమే అంగన్వాడీలకు ఇతర స్కీమ్ వర్కర్లకు ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేయాలని, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశానికి సంఘం జిల్లా అధ్యక్షులు బి.లక్ష్మణరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ, వర్కింగ్ ఉమెన్ జిల్లా కన్వీనర్ జీ రమణ, జిల్లా కార్యదర్శి బి.ముత్యాలరావు, ఏబీఎన్ కుమారి, జిల్లా ఉపాధ్యక్షులు హుస్సేన్ వలి, వై.నేతాజీ, ఎన్.శివాజీ పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు -
సమస్యలపై కలెక్టర్కు ఉద్యోగుల ఏకరువు
గుంటూరు ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయా సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్ ఎదుట ఏకరువు పెట్టారు. దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని సమస్యల పరిష్కారం కోసం విన్నవించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్, ఎన్జీవోలకు చెందిన 14 సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. హెల్త్కార్డులపై వైద్యం అందని తీరును వివరించారు. నగదు రహిత వైద్యం అందించేందుకు ఆస్పత్రుల యాజమాన్యాలతో మాట్లాడాలని కోరారు. కారుణ్య నియామకాలపై తగు నిర్ణయం తీసుకోవాలన్నారు. అదనపు క్వాంటమ్ పెన్షన్ అమలు పర్చాలని పెన్షనర్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. గుంటూరు అర్బన్, రూరల్ మండల విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని విభజించి, తూర్పు నియోజకవర్గంలో కొత్తగా ఎంఈవో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. నలుగురు ఎంఈవోలు ఒకే కార్యాలయంలో విధులు నిర్వర్తించడం వలన ఘర్షణ వాతావరణం నెలకొంటోందని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. మున్సిపల్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయలను విద్యాశాఖలో విలీనం చేయడంతో జిల్లాలోని వివిధ మున్సిపాలిటీల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల నుంచి వసూలు చేసిన పీఎఫ్ సొమ్మును చెల్లించారని, నగరపాలక సంస్థ పరిధిలోని పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు పీఎఫ్ డబ్బులు చెల్లించలేదని తెలిపారు. సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలను కలెక్టర్కు వివరించారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్తో పాటు యూటీఎఫ్, పీఆర్టీయూ, ఎస్టీయూ, ఏపీటీఎఫ్, పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మేకల సుబ్బారావు, కె.నరసింహారావు కలెక్టర్కు సమస్యలపై వినత్రి పత్రం అందజేశారు. -
అవినీతి క్యాన్సర్ను నయం చేస్తారా?
క్యాన్సర్ కణం కంటికి కనిపించకుండా శరీరంలో దాగి ఉండి ట్యూమర్స్లాగా మారి కొన్నిసార్లు మనిషి మరణానికి దారితీస్తుంది. ఈ మహమ్మారిపై గత 25 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఎంతో మంది రోగులకు చికిత్సలు అందించి నయం చేశారు ప్రముఖ క్యాన్సర్ డాక్టర్ గిరిజవోలు దుర్గాప్రసాద్. ఆయన శుక్రవారం గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించారు. పేదల పెద్దాసుపత్రిగా పేరుగడించిన జీజీహెచ్లో పాతుకుపోయిన అవినీతి క్యాన్సర్పైనా ఆయన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గుంటూరు మెడికల్: వ్యాధి నిర్ధారణకు అవసరమైన సర్టిఫికెట్లు మెడికల్ బోర్డు, కిడ్నీ బోర్డు, సదరం బోర్డుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది ఇస్తున్నారు. ఇలా ఇచ్చేందుకు అధిక మొత్తంలో లంచాలు అడిగినట్లు బాధితులు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. జిల్లా అధికారులకు సైతం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయటంతో ఆస్పత్రి పరువు బజారున పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు ఏడు జిల్లాలకు చెందిన లక్షల మంది పేద, మధ్య తరగతి రోగులకు ఉచిత వైద్యసేవలు జీజీహెచ్లో అందించాలి. ఎంతో క్లిష్టమైన ఆపరేషన్లు చేస్తుంటారు. పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది ఇలా జీజీహెచ్కు పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నారు. కొంతమంది అవినీతి, అక్రమార్జన వల్ల ఆస్పత్రికి చెడ్డపేరు వస్తోంది. అత్యవసర సేవల విభాగంలో రోగి సహాయకులతో చికిత్సకు వినియోగించే సర్జికల్ ట్రే క్లీనింగ్ చేయించిన విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారి జిల్లా అధికారులు వారిపై చర్యలకు ఆదేశించారు. కిందిస్థాయిలో కొంత మంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అత్యవసర సేవల నిమిత్తం చేరే వారికి కనీసం వీల్చైర్స్ ఉంచకుండా, రోడ్డు ప్రమాద బాధితులను, తీవ్ర అనారోగ్యంతో చికిత్సకు ఎమర్జన్సీ వార్డుకు వచ్చే రోగులను చికిత్సకు తీసుకెళ్లకుండా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గర్భిణికి వీల్చైర్ ఇవ్వకపోవడం, స్కానింగ్ కేంద్రానికి తీసుకెళ్లపోవడంపై సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విధులకు సీనియర్లు డుమ్మా సీనియర్ వైద్యులు కొంత మంది సమయపాలన పాటించడం లేదు. నిబంధనల ప్రకారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రొఫెసర్లు, అసోసియేట్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు జీజీహెచ్లో అందుబాటులో ఉండాలి. పలువురు మధ్యాహ్నం కల్లా సొంత క్లీనిక్లు, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిపోతున్నారు. కొంత మంది వైద్యులు ఉదయం ఓపీలకు డుమ్మా కొట్టి వార్డుల్లో రౌండ్స్ వేసి సరిపుచ్చుతున్నారు. జూనియర్ వైద్యులే రోగులకు ఓపీ చూస్తున్నారు. మధ్యాహ్నం నుంచి బెడ్సైట్ టీచింగ్ చేయాల్సిన వైద్యులు దాన్ని మరిచిపోయారు. ఓపీ రోగులను చూడకుండా టీచింగ్ చెప్పి మధ్యాహ్నం నుంచి సొంత పనులపై వెళ్లి పోతున్నారు. వైద్య విద్యార్థులకు నాణ్యమైన బోధన లభించడం లేదు. మామూలు ఇస్తేనే... జీజీహెచ్ కాన్పుల విభాగంలో పురుడుపోసుకున్న వారు తమ బిడ్డను కళ్లారా చూడాలంటే వైద్య సిబ్బందికి మగబిడ్డకు ఒకరేటు, ఆడబిడ్డకు మరో రేటు చొప్పున మామూలు ఇవ్వాల్సిందే. చికిత్స పొందుతూ ఎవరైనా చనిపోతే పోస్టుమార్టం చేసేందుకు మార్చురీలో ముక్కుపిండి వసూలు చేస్తారు. మృతదేహాలను ఉచితంగా తరలించేందుకు ఏర్పాటు చేసిన మహాప్రస్థానం వాహనాలు రాత్రి వేళల్లో అందుబాటులో ఉండటం లేదు. పరిపాలనా కార్యాలయంలో ఏ ఫైల్ ముందుకు కదలాలన్నా లంచం తప్పనిసరి అని బాధితులు వాపోతున్నారు. పదోన్నతులు ఇవ్వాలన్నా అదే దుస్థితి నెలకొంది. ఫీజు రీయింబర్స్మెంట్, ఆసుపత్రుల తనిఖీలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఉద్యోగ నియామకాలు, సర్వీసు క్రమబద్ధీకరణ, బిల్లుల చెల్లింఽపులు ఇలా ప్రతి విషయానికి ఎంతోకొంత ఇస్తేనే ఫైల్స్ కదులుతున్నాయని పలువురు యూనియన్ నాయకులు సైతం వాపోతున్నారు. నర్సింగ్ కార్యాలయంలో మామూళ్ల మోతతో బెంబేలెత్తిపోతున్నారు. క్యాన్సర్ చికిత్సతో పేరు... పొన్నూరు మండలం కొండబాలివారిపాలెంకు చెందిన డాక్టర్ దుర్గాప్రసాద్ గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ అనంతరం హైదరాబాద్ వెళ్లి ఉస్మానియాలో పీజీ చేశారు. రేడియేషన్ ఆంకాలజీ వైద్య విభాగాన్ని అభివృద్ధి చేసి మన్ననలు అందుకున్నారు. గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్కు 2020లో వచ్చారు. క్యాన్సర్ చికిత్సల్లో విజయం సాధించిన ఆయన పరిపాలనాపరమైన పోస్ట్లోకి డెప్యూటీ సూపరింటెండెంట్గా ప్రవేశించి, నేడు నేరుగా సూపరింటెండెంట్ అయ్యారు. -
కాపు నేతపై తమ్ముళ్ల కక్ష
సుగాలి ప్రీతి తల్లి ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్పై విమర్శలు చేసినప్పుడు ఆ పార్టీ తరఫున స్పందించిన నాయకుడు ఆయన. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనసేన కోసం నిలబడింది కూడా ఆయనే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అవినీతిని, జనసేన పార్టీకి చెందిన కాపులపై జిల్లాలో జరుగుతున్న దాడులపై ప్రశ్నించడమే ఆయనకు శాపంగా మారింది. జనసేన జిల్లా అధ్యక్షునిగా ఉన్న గాదె వెంకటేశ్వరరావుకు ఉద్వాసన పలికి ఆయన స్థానంలో మంగళగిరికి చెందిన చిల్లపల్లి శ్రీనివాసరావు, గంజి చిరంజీవిలలో ఒకరిని జిల్లా అధ్యక్షునిగా చేయాలని నిర్ణయించారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: గాదె వెంకటేశ్వరరావు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసే ఆయన జనసేన పెట్టినప్పటి నుంచి ఆ పార్టీ జెండాను భుజాన మోస్తూ వచ్చారు. పార్టీ కోసం ఇప్పటి వరకూ జిల్లాలో నిలబడిన చరిత్ర ఉంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు మిర్చి యార్డు చైర్మన్ పదవి వస్తుందనుకున్నారు. కానీ రాలేదు. దాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన కుర్రా అప్పారావుకు ఇచ్చారు. నామినెటేడ్ పదవుల్లో కూడా చోటు దక్కలేదు. అయినా అసంతృప్తి చెందకుండా పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు. అయితే ఇటీవల జనసేన పార్టీకి చెందిన వారిని పక్కన పెట్టడంతో అసంతృప్తి మొదలైంది. గుంటూరు తూర్పు, ప్రత్తిపాడులో కొంతమేర జనసేనకు సమాచారం ఇచ్చి చేసినా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పునర్విభజన ప్రక్రియలో కనీస సమాచారం కూడా లేకపోవడం, ఎమ్మెల్యేను అడిగినా పట్టించుకోకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీనిపై గట్టిగా నిలదీశారు. గుంటూరు నగరంలో జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లలో 28 రోడ్లు వేయాలని ప్రతిపాదనలు ఇవ్వగా, ఒక్కటీ ఆమోదించకపోవడంపై కూడా ఎమ్మెల్యేని నిలదీశారు. అంబటి రాంబాబుపై అక్రమలు కేసులు మోపి జైలులో పెట్టిన వ్యవహారంలో కూడా రాంబాబును జైలులో ఉంచడానికి జనసేన తరఫున తాను 2022లో ఇచ్చిన ఫిర్యాదును బయటకు తీసుకొచ్చారు. తమను ఇబ్బంది పెట్టారన్న భావన కూడా గాదె వెంకటేశ్వరరావులో ఉంది. కాపు నేతలే లక్ష్యంగా... ఓబులనాయుడుపాలెంలో చిన్నారి క్వారీ గుంతలో పడి మృతి చెందడంపై గాదె వెంకటేశ్వరరావు తీవ్రంగా ఆరోపణలు చేశారు. ఇక్కడ ఉన్న అటవీ శాఖ భూముల్లో కూడా అక్రమ మైనింగ్ చేస్తుంటే అవినీతికి అలవాటు పడిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇలా గాదె వెంకటేశ్వరరావు ప్రతి విషయాన్ని నిలదీస్తుండటాన్ని తెలుగుదేశం ఎమ్మెల్యేలు వెళ్లి కేంద్ర మంత్రి పెమ్మసాని దృష్టికి తీసుకువెళ్లారని సమాచారం. దీంతో ఆయన జనసేన అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో గాదెను మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల పట్ల జనసేనలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. -
జీజీహెచ్ సూపరింటెండెంట్గా బాధ్యతల స్వీకరణ
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్గా డాక్టర్ గిరిజవోలు దుర్గాప్రసాద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్, డాక్టర్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి నుంచి డాక్టర్ దుర్గాప్రసాద్ బాధ్యతలు తీసుకున్నారు. మే 31న డాక్టర్ యశస్వి రమణ పదవీ విరమణ చేయడంతో ఫుల్ అడిషనల్ చార్జ్ (ఎఫ్ఏసీ) సూపరింటెండెంట్గా డాక్టర్ ఎన్.వి.సుందరాచారిని డీఎంఏ నియమించారు. రెండు వారాలు గడవకముందే డాక్టర్ గిరిజవోలు దుర్గాప్రసాద్కు ఎఫ్ఏసీ సూపరింటెండెంట్గా డీఎంఈ ఉత్తర్వులు ఇవ్వడంతో శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ నర్సింగ్ సిబ్బంది, కింది స్థాయి ఉద్యోగుల కొరత అధిగమిస్తామని పేర్కొన్నారు. ఓపీ సేవలకు ప్రత్యేక యాప్ తెస్తామన్నారు. ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామన్నారు. దుర్గాప్రసాద్ను అడ్మినిస్ట్రేటర్ చిన్నం సుధారాణి, అసిస్టెంట్ డైర్టెర్ పూసల శ్రీనివాసరావు, పరిపాలనా అధికారి గోపవరపు స్టాన్లీరాజ్కుమార్, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ బి.వి.రావు అభినందించారు. జిల్లా కలెక్టర్తో భేటీ గుంటూరు వెస్ట్: డాక్టర్ జి.దుర్గాప్రసాద్ శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసుపత్రి అభివృద్ధిపై చర్చించారు. -
నేడు లింగంగుంట్లకు సీఎం చంద్రబాబు రాక
చిలకలూరిపేట: అన్నదాత సుఖీభవ– పీఎం కిసాన్ పథకం ప్రభుత్వం విడుదల కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు లింగంగుంట్ల గ్రామానికి శనివారం రానున్నారని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్, అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె జిల్లా ఎస్పీ బి.కృష్ణారావుతో కలసి శుక్రవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం 12.15 గంటలకు లింగంగుంట్ల గ్రామానికి ముఖ్యమంత్రి చేరుకుంటారని తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలిస్తారన్నారు. అనంతరం 12.50 నుంచి 1.20 వరకు రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారని తెలిపారు. 2.15 నుంచి 3.45 గంటల వరకు పార్టీ కార్యకర్తలతో సమావేశం ఉంటుందని, సాయంత్రం 3.50 గంటలకు ప్రజావేదిక సభలో ప్రసంగిస్తారన్నారు. సాయంత్రం 6 గంటలకు లింగంగుంట్ల గ్రామం నుంచి బయలు దేరి వెళతారని వివరించారు. యడ్లపాడు: ప్రకృతి వ్యవసాయ విధానాలను రైతులు ఆచరించటం ద్వారా గ్రామీణ కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ కె.అమలకుమారి చెప్పారు. యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామంలో శుక్రవారం బంగ్లాదేశ్ రూరల్ అడ్వాన్స్మెంట్ సెంటర్ ప్రతినిధులు ఉషారాణి, శ్వేతబెనర్జీ, అభిషేక్ సింగ్ వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. రైతు మానం శ్రీకాంత్, మహిళా రైతు గల్లా మల్లేశ్వరి సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. వారు మాట్లాడుతూ మునగ పంటలో దొండ, గోంగూర, తోటకూర, క్యారెట్ వంటి అంతర పంటలు సాగు చేయటం ద్వారా ప్రధాన పంటల ఖర్చు తగ్గటమే కాక చీడపీడల నుంచి విముక్తి కలుగుతుందన్నారు. ప్రతి కుటుంబం ఈ విధానాన్ని అనుసరిస్తే వలసలు అవసరం లేకుండా జీవనోపాధి భద్రత లభిస్తుందన్నారు. అనంతరం గ్రామ సంఘ సమాఖ్య సమావేశంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి రైతు ఆచరించాలని, అవసరమైన వనరులను గ్రామ సంఘాల ద్వారా సమకూర్చుకోవాలని, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను సంఘసభ్యులు వినియోగించుకుని మిగిలిన ఉత్పత్తులు సమష్టిగా మార్కెటింగ్ చేసుకోవాలని అమలకుమారి పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ప్రాజెక్ట్ మేనేజర్ ప్రేమ్రాజ్, జిల్లా సిబ్బంది అప్పలరాజు, మేరి తదితరులు పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 516.20 అడుగులకు చేరింది. ఇది 142.4378 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి నీటి చేరిక నిలిచిపోయింది. రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దక్షిణ రైల్వే జోన్ అరక్కోణం జంక్షన్లో జరుగుతున్న నాన్–ఇంటర్లాకింగ్, స్టేషన్ ఆధునికీకరణ పనుల కారణంగా విజయవాడ మీదుగా నడుస్తున్న పలు రైళ్లను తాత్కాలికంగా దారి మళ్లించి నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23న విల్లుపురం –ఖరగ్పూర్ (22604), 24న తిరునెల్వేలి –పురూలియా (22606), 25న టాటానగర్ –యర్నాకులం (18189) రైళ్లు మెల్పక్కం, తిరుత్తాని, రేణిగుంట, గూడూరు మీదుగా దారి మళ్లించి నడపనున్నారు. -
గుంటూరు
శుక్రవారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2026పసుపు వైపు.. రైతు చూపు లంక గ్రామాల్లో ఆరంభం దాడి చేసిన నేత కారుకు మంత్రి ప్రారంభోత్సవం ● విత్తన పసుపునకు గిరాకీ ● కొనుగోళ్లతో తూములూరు కళకళ ● కొత్త రకాలపైనా రైతుల ఆసక్తి 7తెనాలి/కొల్లిపర: తొలకరి చినుకుల సవ్వడితో మెట్ట రైతులు పసుపు సాగుకు సమాయత్తం అవుతున్నారు. అడపాదడపా వర్షాలతో నేల పదునుతో లంక ప్రాంతాల్లో పసుపు విత్తటానికి శ్రీకారం చుడుతున్నారు. మిగిలిన చోట్ల నేలను సిద్ధం చేసుకోవటం, విత్తన సేకరణ సన్నాహాల్లో ఉన్నారు. ఎండు పసుపునకు మార్కెట్ ధర ఆశాజనకంగా ఉండటంతో ఈసారి కొంత విస్తీర్ణం పెరిగేలా ఉంది. దీంతోపాటు కొందరు రైతులు తమ చేలల్లో 5–10 సెంట్ల విస్తీర్ణంలో సొంత అవసరాలకు మిరప, టామాటా, వంగ నారుమళ్లు చేస్తున్నారు. ఏటా పసుపు సాగుకు ముందు కడప జిల్లా నుంచి రైతులు, మధ్యవర్తులు పచ్చి పసుపును తీసుకొచ్చి కొల్లిపర మండల గ్రామం తూములూరులో నిల్వచేయటం తెలిసిందే. తొలకరి వర్షం రాగానే జిల్లాతోపాటు పరిసర జిల్లాల్లోని రైతులు ఇక్కడి నుంచి విత్తనం పసుపు కొనుగోలు చేస్తుంటారు. ఈసారి పసుపు విత్తనం పుట్టి (225 కిలోలు) ధర రూ.7,500 నుంచి రూ.8,500 వరకు అమ్మకాలు చేస్తున్నారు. ఎండు పసుపు ధర రెండేళ్లుగా మార్కెట్లో క్వింటా రూ.7 వేల వరకు ఉంది. ఈ సంవత్సరం మార్కెట్లో పసుపు ధర క్వింటా రూ.10– రూ.14 వేల వరకు కొనుగోళ్లు జరిగాయి. గత ఆరు నెలల నుంచి ధర కాస్త అటూఇటుగా నిలకడగా ఉంది. రానున్న సీజనులో ధర బాగుంటుందని రైతులు అంచనా వేస్తున్నారు. దీంతో పచ్చి పసుపు ధర పుట్టి రూ.8 వేల వరకు ఉన్నప్పటికీ కొనుగోలు చేసి సాగుకు సమాయత్తం అవుతున్నారు. గతేడాదితో పోల్చుకుంటే 2026–27 సీజనులో పసుపు విస్తీర్ణం పెరుగుతుందన్న అంచనా ఉంది. అధిక దిగుబడులతోపాటు నాణ్యమైన పంట సాగు కోసం రైతులు నూతన రకాలపై ఆసక్తి చూపుతున్నారు. తెగుళ్లను, తేమను తట్టుకొనే పసుపు రకాలైన నిజామాబాద్, మైదుకూరు, సేలం, టేకూరుపేట వంటి రకాలను సేకరించే ప్రయత్నాల్లో ఉన్నారు. వీటితోపాటు కుర్కుమిన్ శాతం అధికంగా ఉండే పసుపు విత్తన సేకరణకూ సన్నాహాలు చేస్తున్నారు. కొల్లిపర మండలం లంక గ్రామాల్లో ఇప్పటికే కొందరు రైతులు పసుపు విత్తటం పూర్తి చేశారు. టీఢీపీలో అసంతృప్తి సెగ గుంటూరు జిల్లాలో పసుపు సాగు సాధారణ విస్తీర్ణం 4,500 ఎకరాలు ఉంది. 2024లో 3,616 ఎకరాల విస్తీర్ణంలో రైతులు పసుపు సాగు చేశారు. 2025లోనూ కొంచెం విస్తీర్ణం తగ్గింది. జిల్లాలో అత్యధికంగా పసుపు సాగు తెనాలి వ్యవసాయ సబ్ డివిజనులోనే చేస్తుంటారు. ఇందులోనూ కొల్లిపర మండలంలోనే ఎక్కువ విస్తీర్ణం ఉంటుంది. గతేడాది కొల్లిపర మండలంలో 1,950 ఎకరాలు, దుగ్గిరాలలో 234, తెనాలిలో 133 , మంగళగిరిలో 405, మేడికొండూరులో 222, తాడేపల్లిలో 365 ఎకరాలలో సాగు చేశారు. మిగిలిన మండలాల్లో అక్కడక్కడ 20 ఎకరాలలోపు సాగు చేశారు. దీంతో మొత్తం సుమారు 3,343 ఎకరాల్లో పంట సాగయింది. 2024లో మార్కెట్లో ఎండు పసుపు సరైన ధర లేకపోవటంతో కొందరు రైతులు ఇతర పంటలకు మళ్లారు. ఫలితంగా 2025లో కొంత మేర సాగు విస్తీర్ణంం తగ్గింది. ఈ సారి మార్కెట్లో పసుపు రేటు బాగానే ఉంది. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 516.30 అడుగులకు చేరింది. ఎస్ఎల్బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 33.05 టీఎంసీలు. ఎగువ నుంచి 4130 క్యూసెక్కులు వస్తోంది. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1200, గరిష్ట ధర రూ.2300, మోడల్ ధర రూ.1800 వరకు పలికింది. -
కాపు వర్గం దూరం?
● మంత్రి సత్యప్రసాద్, ఆయన సోదరుడు శివప్రసాద్ తీరుతో నేతల రాజీనామా ● జనసేన నాయకులను దూరం పెడుతున్న టీడీపీ నేతలు ● సొంత సామాజిక వర్గం నుంచే మంత్రికి వ్యతిరేక పవనాలు ● పచ్చ పార్టీకి దూరమవుతున్న కాపు వర్గానికి చెందిన నేతలు రేపల్లె: నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో అంతర్గత యుద్ధ వాతావరణం నెలకొంది. బయటకు కూటమి, అభివృద్ధి అంటూ గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ లోపల మాత్రం విభేదాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మంత్రి సత్యప్రసాద్, ఆయన సోదరుడు శివప్రసాద్ వ్యవహార శైలి పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందని స్వయంగా టీడీపీ వర్గాలే అంటున్నాయి. వీరిద్దరి వ్యవహార శైలిపై తీవ్ర అసహనం వ్యక్తమవుతున్న నేపథ్యంలో పార్టీ కోసం పనిచేసిన పలువురు నాయకులు రాజీనామా దిశగా అడుగులు వేస్తున్నారు. ఒక్క కుటుంబం చేతుల్లోనే పార్టీ అనే విమర్శలు రోజురోజుకు బలపడుతున్నాయి. స్థానిక నాయకులను పట్టించుకోకుండా, నిర్ణయాలన్నీ ఏకపక్షంగా తీసుకోవడం, తమ అనుచరులకే ప్రాధాన్యం ఇవ్వడం, విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసే వారిని పక్కనబెట్టడంపై నేతలు మండిపడుతున్నారు. ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్బై చెప్పే దిశగా కదులుతున్నారు. నాయకుల రాజీనామాలు ఇప్పటికే పట్టణ టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు, 17వ వార్డు ఇన్చార్జి మల్లికార్జునరావు రాజీనామా చేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అదే విధంగా నగరం మండలం సిరిపూడమ్మ ఆలయ కమిటీ చైర్మన్ వీరంకి వీరరాఘవయ్య సహా పలువురు స్థానిక నేతలు కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఇది కేవలం ప్రారంభమేనని, రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జోరందుకుంది. జనసేనతో దూరం పెరుగుతోందా? మరోవైపు మిత్రపక్షమైన జనసేన పార్టీతో సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయనే ప్రచారం రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. జనసేన నాయకులను పట్టించుకోకపోవడం, కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడం, వారిని ఉద్దేశపూర్వకంగా పక్కనబెట్టడం వంటి చర్యలు కూటమికి బీటలు వారేలా చేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలు కొనసాగితే కూటమి బలహీనపడటం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సొంత వర్గం నుంచే వ్యతిరేకత ఇదిలా ఉంటే మంత్రి సత్యప్రసాద్కు ఆయన సొంత సామాజిక వర్గం నుంచే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే ప్రచారం ఊపందుకుంది. స్థానిక సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, నిర్ణయాలలో ఏకపక్ష ధోరణి కారణంగా ఈ అసంతృప్తి పెరిగిందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇక కాపు నేతలతోపాటు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కొందరు నాయకులు కూడా ఇదే బాటలో నడుస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు రాబోయే ఎన్నికల్లో టీడీపీ రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ అంతర్గత విభేదాలు అదుపులోకి రాకపోతే పార్టీ మరింత బలహీనపడొచ్చని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో రేపల్లె నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయ చైతన్యం, అవగాహన, పోరాట స్ఫూర్తి పరంగా ఈ ప్రాంతం ముందంజలో ఉంటుంది. ప్రధాన పార్టీల నుంచి బలమైన నాయకత్వాన్ని అసెంబ్లీకి పంపిన గొప్ప చరిత్ర రేపల్లె సొంతం. రాజకీయంగా ముదిరిన చర్చలు, సిద్ధాంతపరమైన పోటీలు, ప్రజా సమస్యలపై గట్టి పోరాటాలు ఈ నేల ప్రత్యేకతగా నిలిచాయి. అలాంటి ఘన చరిత్ర కలిగిన రేపల్లె మూడుసార్లు వరుసగా టీడీపీని గెలిపిస్తూ బలమైన కేడర్ను నిర్మించుకుంది. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పార్టీ బలంగా పాతుకుపోయిందన్న భావన ఏర్పడింది. అదే సమయంలో పార్టీ ఇప్పుడు విభేదాలకు వేదికగా మారుతోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సత్యప్రసాద్, ఆయన సోదరుడు శివప్రసాద్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు పార్టీలో చిచ్చు రాజేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
సాయికృష్ణ కుటుంబానికి పరామర్శ
పొన్నూరు: విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం కావడం, పోలీసులే చంపి, బూడిద కూడా లేకుండా చేశారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో సాయికృష్ణ కుటుంబాన్ని గురువారం వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పరామర్శించారు. ఈ సందర్భంగా అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ ఘటనపై నిజాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, బాధితులకు అన్ని విధాలా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఘటనపై ప్రభుత్వం పారదర్శక విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. -
పెదకాకానిలో చోరీ
పెదకాకాని: గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి బంగారం, వెండి, నగదు మాయం చేసిన ఘటన పెదకాకానిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదకాకాని శివాలయం రోడ్డులోని న్యూఇండియన్ పబ్లిక్ స్కూల్ వెనుక బజారులో బత్తుల సుబ్బయ్య కుటుంబం నివశిస్తుంది. వారు రోజూ మాదిరిగానే ఇంటికి తలుపులు వేసి వరండాలో నిద్రించారు. ఆ ఇంటికి వెనుక వైపు ఉన్న కిటికీ గుండా గురువారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులులోనికి ప్రవేశించి, బీరువా తెరచి అందులో ఉన్న 7 గ్రాముల బంగారు వస్తువులు, పిల్లలు దాచుకున్న మట్టి ముంత(కిడ్డీ బ్యాంక్)లో ఉన్న నగదు, సుమారు 200 గ్రాముల వెండి వస్తువులు దొంగిలించారు. ఈ చోరీలో వరండాలో పడుకున్న వారు ఇంటిలోపలికి రాకుండా ఇంట్లో ఉన్న తలుపునకు లోపల గడియపెట్టి మరీ చోరీకి పాల్పడ్డారు. ఉదయం నిద్ర లేచి తలుపు తీస్తుండగా ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చి చూస్తే వెనుక ఉన్న కిటికీ తొలగించి ఉంది. బీరువా తెరచి వస్తువులు చిందర వందరగా పడి ఉంటడం, కిడ్డీ బ్యాంక్ పగులగొడ్డడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వేలిముద్రలను సేకరించేందుకు క్లూస్ టీంను రప్పించారు. నిందితులు బంగారు వస్తువులతో కలసి ఉన్న రోల్డ్గోల్డ్ వస్తువులను అక్కడే వదిలి వెళ్లడం గమనార్హం. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ టీపీ నారాయణస్వామి తెలిపారు. కిటికీ నుంచి ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లిన దుండగులు -
సుస్థిర సాగు విధానాలతో ముందుకెళ్లాలి
గుంటూరు వెస్ట్: రైతుల ఆదాయం పెంచడమే వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల అంతిమ లక్ష్యం కావాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, అధికారులతో కలసి నిర్వహించిన సమావేశంలో పెమ్మసాని మాట్లాడారు. రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సమర్థంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగంలో విస్తృతంగా వినియోగిస్తూ, ఉత్పాదకత పెంచేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. సమావేశంలో ఆచార్య వర్సిటీ వీసీ డాక్టర్ పీవీ సత్యనారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
గజాల్లోనే భూములను గుర్తించాలి
సత్తెనపల్లి: గుంటూరు–బీబీనగర్ మధ్య రైల్వే డబ్లింగ్ లైను నిర్మాణానికి గానూ సత్తెనపల్లి మండల పరిధిలో వివిధ గ్రామాల నుంచి సేకరించే భూమిని గజాల ప్రకారం గుర్తించాలని రైతులు కోరారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో గుంటూరు –బీబీనగర్ మధ్య రైల్వే డబ్లింగ్ లైను నిర్మాణానికి గానూ భూసేకరణలో భాగముగా సత్తెనపల్లి మండల పరిధిలోని రైతులతో అవార్డు ఎంక్వయిరీ సమావేశం కంపిటెంట్ అథారిటీ(భూసేకరణ) – రెవెన్యూ డివిజనల్ అధికారి కె.గోపాలకృష్ణ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. భూసేకరణలో భాగమైన అబ్బూరు, గుడిపూడి, భీమవరం, కంకణాలపల్లి, సత్తెనపల్లి, ధూళిపాళ్ల గ్రామాల పరిధిలోని నోటిఫైడ్ రైతులు హజరై తమ భూమికి సంబంధించిన హక్కు పత్రములను అందించారు. రైతులు మాట్లాడుతూ సబ్రిజిస్టార్ కార్యాలయంలో భూమి గజాలలో ఉన్నందున గజాలలోనే లెక్కించి పరిహరం అందించాలన్నారు. అలా కాకుండా సెంట్లలో లెక్కిస్తే పరిహరం తక్కువ వస్తుందన్నారు. అంతేగాక చిన్న రైతులు 5 సెంట్లు ఉంటే కేవంల 3 సెంట్లు మాత్రమే తీసుకోవడం వల్లన మిగిలిన రెండు సెంట్లలో ఏ పనులు చేసుకోవటానికి అనువుగా ఉండదని, ఆ భూమికి దారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. భూసేకరణ అధికారులు ఈ అవార్డ్ ఎంక్వయిరీకి హాజరైన రైతులం దరికీ పరిహారమునకు గురించిన పూర్తి సమాచారంను వివరించారు. సత్తెనపల్లి మండ ల పరిధిలోని గుంటూరు –బీబీనగర్ మధ్య రైల్వే డబ్లింగ్ లైను నిర్మాణానికి గానూ భూసేకరణలో భాగమైన వివిధ గ్రామాలలోని భూ విస్తీర్ణం వివరములు ఇలా ఉన్నాయి...అబ్బూరు ఎ.0.375 సెంట్లు, గుడిపూడి ఎ.0.610 సెంట్లు, భీమవరం ఎ 0.871 సెంట్లు, కంకణాలపల్లి ఎ.5.595 సెంట్లు, సత్తెనపల్లి ఎ.7.310 సెంట్లు, ధూళిపాళ్ల ఎ.11.960 సెంట్లుగా తేల్చారు. ఆయా గ్రామాలకు చెందిన మొత్తం 193 మంది రైతులు సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో ఆర్డీఓ కార్యాలయ ఏవీపీ చంద్రారెడ్డి, తహసీల్దార్ కార్యాలయ డిప్యూటీ తహసీల్దార్ నేలటూరి రవికుమార్, ఆర్ఐ భోస్బాబు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గోన్నారు. భూ సేకరణ సమావేశంలో రైతుల డిమాండ్ -
జ్యుయలరీ షాపులో చోరీ
తెనాలిరూరల్: తెనాలి గంగానమ్మపేట శివాలయం వెనుక గేటు రోడ్డులోని శ్రీ విజయలక్ష్మి జ్యుయలర్స్లో చోరీ జరిగింది. అర్ధరాత్రి దాటాక జోరున కురుస్తున్న వర్షంలో బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు రాడ్లతో తాళాలను ధ్వంసం చేశారు. లోనికి వెళ్లిన వారికి, బంగారు ఆభరణాలున్న మరో గది తాళం తీయడం చేతకాలేదు. ముందు గదిలో ఉన్న 50 గ్రాముల వెండి వస్తువులతో ఉడాయించారు. షాపు తాళాలు ధ్వంసం చేసి ఉండటాన్ని యజమానులు గురువారం ఉదయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. టూ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. క్లూస్ టీమ్కు సమాచారం ఇచ్చారు. నిందితుల కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నేడు ఎస్సీ నిరుద్యోగ యువతకు జాబ్ మేళా నెహ్రూనగర్: జిల్లా పెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంఘం, గుంటూరు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, గుంటూరు జిల్లా వారి సహకారంతో ఎస్సీ నిరుద్యోగ యువతకు అవగాహన సదస్సు, జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ ఈడీ దుర్గాబాయి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి అనుసుచిత్ జాతి అభ్యుదయ యోజన పథకం కింద ఈ కార్యక్రమం శుక్రవారం 9.30 గంటలకు, ఫిరంగిపురం మండలం, మెయిన్ రోడ్, వేలంకని మాత చర్చి ఎదురు, గ్లోబల్ ఫౌండేషన్న్లో అవగాహన కార్యక్రమంతోపాటు జాబ్ మేళా జరుగుతుందన్నారు. ఈ జాబ్ మేళాకు 10 కంపెనీలు పాల్గొని 315 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన 18 నుంచి 35 సంవత్సరాల వయసు గల ఎస్సీ నిరుద్యోగ యువతీ యువకులు అర్హులని చెప్పారు. మరిన్ని వివరాలకు 89195 08017 నెంబర్ను సంప్రదించాలని కోరారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి పెదకాకాని: విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందిన సంఘటన గుంటూరు ఆటోనగర్లో చో టు చేసుకుంది. అగతవరప్పాడు ఏవీఎన్ కాలనీకి చెందిన షేక్ మీరావలి(26) కొంతకాలంగా గుంటూరు ఆటోనగర్లో లారీలకు బాడీ అమర్చే పనులకు వెళుతున్నాడు. రోజూ మాదిరిగానే గురువారం ఆటోనగర్లోని వర్క్షాప్కు వెళ్లి లారీకి బాడీ అమర్చే పనులు చేస్తుండగా కరెంట్ తీగ తగిలి షాక్కు గురయ్యాడు. క్షతగాత్రుడిని స్థానికులు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మీరావలి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుని సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెదకాకాని సీఐ తెలిపారు. -
డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
మంగళగిరి టౌన్: నేడు మంగళగిరిలో జరిగే ఉప ముఖ్యమంత్రి కార్యక్రమ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం కార్యక్రమం జరిగే ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శుక్రవారం మంగళగిరి ఎయిమ్స్ సమీపంలో నిర్వహించనున్న ‘అరణ్యరామం’ శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పాల్గొననున్నట్లు తెలిపారు. ఆయనతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొంటున్న నేపధ్యంలో కార్యక్రమానికి సంబంధించి అధికారులకు పలు సూచనలను చేశారు. కార్యక్రమంలో పాల్గొనే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టచర్యలు చేపట్టాలన్నారు. వాహనాల పార్కింగ్, తాగునీరు తదితర ఏర్పాట్లు చేయాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, డీఎఫ్ఓ హిమశైలజ తదితర అధికారులు పాల్గొన్నారు. నేడు డిప్యూటీ సీఎం పర్యటన.. తాడేపల్లి రూరల్: రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ శుక్రవారం తాడేపల్లిలో పర్యటించనున్నట్లు జనసేన పార్టీ తాడేపల్లి పట్టణ కన్వీనర్ తిరుపతిరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాడేపల్లిలోని బ్రహ్మానందపురం వద్ద రాష్ట్ర అటవీశాఖ నూతన కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారని, అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన ఆ ప్రకటనలో తెలియజేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లను అధికారులు పరిశీలించినట్లు సమాచారం. -
ప్రభుత్వ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలి
నరసరావుపేట: ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు రూ.2500 నుంచి రూ.3వేలకు పెంచి వారి సమస్యలు పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. గురువారం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపి ఆర్డీఓ కె.బాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మెనూ బాగా పెంచామని హంగులు ఆర్భాటాలు చేస్తున్నారన్నారు. వాస్తవానికి పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు ఏ మాత్రం కూడా పెంచలేదని అన్నారు. ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులకు నెలకు రూ.1200, ఇంటర్మీడియట్కు నెలకు రూ.1600లు బడ్జెట్ కేటాయిస్తే 30 రోజుల్లో ఉదయం నుంచి రాత్రి వరకు పెట్టడానికి ఏమాత్రం సరిపోవడం లేదని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు కాస్మోటిక్ చార్జీలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, అటెండర్, కామాటి, ట్యూటర్ పోస్టులు భర్తీ చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షులు మేకపోతుల నాగేశ్వరావు, హేమంత్, యశ్వంత్, మధు ,హర్ష, చరణ్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఫిరంగిపురం: ప్రమాదవశాత్తు స్కూటీని, బైక్ ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలకేంద్రంలోని చెక్పోస్టు సమీపంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గరుడాచల పాలెంకు చెందిన శ్రీకాంత్(40) పెయింటర్గా పనిచేస్తుంటాడు. శాంతిపేటలో బంధువుల ఇంటికి వచ్చి తరువాత వేములూరిపాడు గ్రామానికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. ముందు వెలుతున్న స్కూటీ నడుపుతున్న వ్యక్తి ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా పక్కకు మరలడంతో దానిని శ్రీకాంత్ ఢీకొన్నాడు. దీంతో తీవ్రగాయాలు కావడంతో స్థానికుల సమాచారంతో 108 వాహనం వచ్చి చికిత్సకోసం తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే శ్రీకాంత్ మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి భార్య కిరణ్మయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడుకి భార్య,కుమారుడు, కుమార్తె ఉన్నారు. మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో సత్తా చినగంజాం: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ గ్రాండ్ మాస్టర్లతో పోటీ పడి మూడో స్థానం సాధించాడు. మండలంలోని సోపిరాల గ్రామానికి చెందిన పర్వతరెడ్డి అజయ్ సంతోష్. ముంబైలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జూన్ 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరిగిన 360 వన్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో గ్రాండ్ మాస్టర్లతో పోటీలో పాల్గొన్న అజయ్ సంతోష్ 9కి 6 పాయింట్లు సాధించి ప్రపంచ వ్యాప్తంగా 3వ స్థానంలో నిలిచాడు. అజయ్ సంతోష్ ఈ పాటికే 2500 ఫిడే రేటింగ్ను దాటి తన మొదటి జీఎం నార్మ్ను సాధించాడు. గ్రాండ్ మాస్టర్ టైటిల్ను సాధించడానికి అతడు ఇంకా కేవలం 2 నార్మ్లు మాత్రమే సాధించాల్సి ఉంది. అజయ్ వచ్చే వారం మరో జీఎం టోర్నమెంట్ కోసం చైన్నె వెళ్ళనున్నాడు. అటు తరువాత మరిన్ని నార్మ్స్ సాధించేందుకు యూరప్లోని చెక్ రిపబ్లిక్, పారిస్.. ఫ్రాన్స్ దేశాలకు ప్రయాణం కానున్నట్లు అజయ్ తాతయ్య పర్వతరెడ్డి కాంతారావు తెలిపారు. అజయ్ ప్రపంచ వ్యాప్తంగా 3వ స్థానం సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలియజేశారు. -
తీరంలో మద్యం విక్రయిస్తే ఉద్యమాలకు సిద్ధం
బాపట్లటౌన్: బీచ్ షాక్ పేరుతో తీరంలో మద్యం విక్రయిస్తే ఉద్యమాలు తప్పవని సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్.గంగయ్య తెలిపారు. పట్టణంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. గంగయ్య మాట్లాడుతూ బాపట్లకి దగ్గరలో ఉన్నటువంటి సూర్యలంక బీచ్లో టూరిజాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయని, దీని కోసం కేంద్ర ప్రభుత్వం రూ.97 కోట్ల నిధులు మంజూరు చేసిందని, దానికి అనుగుణంగా పనులు జరుగుతున్నాయని, దీనిని స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే గోవా తరహాలో సూర్యలంక బీచ్ని అభివృద్ధి చేయాలని బీచ్ షాక్ పేరుతో సూర్యలంకలో రెండు వైన్ షాపులను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎక్కడో దూర ప్రాంతాల నుండి అహ్లాదకరంగా, ప్రశాంతమైన వాతావరణంలో గడపడానికి కుటుంబ సభ్యులతో వేల సంఖ్యలో పర్యాటకులు సూర్యలంక బీచ్కు వస్తున్నారని, ఇక్కడ బార్ షాపులు ఓపెన్ చేస్తే ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణ దెబ్బతింటుందని పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం ఆలోచనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఐద్వా కార్యదర్శి సుభాషిణి, పార్టీ బాపట్ల నాయకులు కె.శరత్ పాల్గొన్నారు. -
పిడుగుపాటుకు ఇద్దరు మృత్యువాత
వినుకొండ: వినుకొండ మండలంలోని వెంకుపాలెం గ్రామంలో గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగులు పడ్డాయి. ఈ ఘటనలో గ్రామానికి చెందిన గుడిపాటి కోటేశ్వరరావు అలియాస్ చిన్న బుజ్జి (29) అక్కడికక్కడే మృతి చెందగా, గుడిపాటి బాలకోటయ్య, యలగాల శ్రీను, చెన్నుబోయిన కోటయ్యలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మరో వ్యక్తి పరిస్థితి విషమించడంతో గుంటూరు తరలించారు. వ్యవసాయ పొలంలో ఉండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో ఘటన జరిగినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. మరో ఘటనలో... శావల్యాపురం: మండలంలోని కారుమంచి గ్రామంలో సాయంత్రం ఊరుములు, మెరుపులతో కురిసిన వర్షంలో పిడుగుపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాలు మేరకు గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీకి చెందిన మల్లపరపు చిన కోటేశ్వరరావు (55) గేదెలు మేత కోసం పొలానికి వెళ్లాడు. పొలంలో గేదెలు మేత మేస్తుండగా అకస్మాతుగా పిడుగుపాటుకు గురై సంఘటన స్థలం మృతి చెందాడు. గేదెలు మాత్రం యథావిధిగా ఇంటికి వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతుకుతుండగా పొలంలో మృతదేహం గుర్తించారు. మృతుడుకి భార్య ముగ్గురు సంతానం కలరు. కాలనీలో విషాదచాయలు అలముకున్నాయి. పది గొర్రెలు కూడా... వినుకొండ: పట్టణంలో ఉరుములు, మెరుపులు, ఈ దురుగాలులతో కూడిన భారీ వర్షంతోపాటు పట్టణంలోని తిమ్మాయపాలెం రోడ్డులో నాగమయ్య పుట్ట వద్ద చెట్టుపై పిడుగుపడటంతో చెట్టు కింద ఉన్న మేకల నరేంద్ర, మేకల శ్రీనుకు చెందిన 10 గొర్రెలు మృతి చెందాయి. మృతిచెందిన గొర్రెల విలువ సుమారు రూ.లక్షకుపైగా ఉంటుందని బాధితులు తెలిపారు. గుడిపాటి కోటేశ్వరరావు, మల్లవరపు చిన కోటేశ్వరరావు మృతదేహాలు మరో ముగ్గురికి తీవ్రగాయాలు -
చలో విజయవాడకు తరలిరండి
అఖిల భారత కిసాన్ సభ నాయకులు లక్ష్మీపురం: రైతులు, కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహించే ‘ఛలో విజయవాడ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) నాయకులు పిలుపునిచ్చారు. గురువారం గుంటూరు కొత్తపేటలోని ఏఐకేఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.వి.జగన్నాథం మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని వారు విమర్శించారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కవులు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కంజుల విఠల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు వైద్యులకు అవగాహన సదస్సు
గుంటూరు మెడికల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్యాల సహకారంతో జిల్లాలోని ప్రైవేట్ వైద్యులకు గురువారం అంటువ్యాధుల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ బంగ్లా రోడ్డులోని ఐఎంఏ హాల్లో సాయంత్రం 7 నుంచి 10 గంటల సదస్సు ఉంటుందని చెప్పారు. ప్రైవేట్ వైద్యులందరూ హాజరు కావాలని కోరారు. నరసరావుపేట: ఎస్సీ నిరుద్యోగులకు శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎస్సీ కార్పోరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు దుర్గాబాయి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పిడుగురాళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ప్రధానమంత్రి అనుచిత్ జాతి అభ్యుదయ యోజన కింద మేళాతో అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెనాలి: శ్రీలక్ష్మీనారాయణసహిత శ్రీసుదర్శనయాగ మహోత్సవం బుధవారం వైభవంగా ఆరంభమైంది. సామాజిక సేవకుడు వేమూరి విజయభాస్కర్ చేపట్టిన భారీ యాగశాలలో వేదాంతం నాగమారుతి పర్యవేక్షణలో 20 మంది రుత్వికులు ఉదయం ఏడు గంటలకు సూర్యనమస్కారాలు, దీక్షతో ఆరంభించారు. వేమూరి విజయభాస్కర్, సీత దంపతులు పాల్గొన్నారు. తొమ్మిది రోజులపాటు నిర్వహించనున్నారు. తొలిరోజున సినీ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా, తాడిబోయిన హరిప్రసాద్ యాగాన్ని సందర్శించారు. ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన బీఈడీ రెగ్యులర్ మొదటి సెమిస్టర్ ఫలితాలను వర్సిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావు బుధవారం విడుదల చేశారు. ఏఎన్యూలో బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు 2026 ఫిబ్రవరి 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 6,985 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 5,870 మంది ఉత్తీర్ణులయ్యారు. రీవాల్యూషన్కు ఈనెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు ఫారాల 24వ తేదీలోగా పీజీ కోఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలని పరీక్షల నియంత్రణ అధికారి ఎ.వెంకటేశ్వర్లు తెలిపారు. పూర్తి వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్సైట్ను చూడవచ్చని చెప్పారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): జూనియర్, సబ్ జూనియర్ బాల బాలికల ఫుట్బాల్ జట్ల ఎంపిక ఈనెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కుమ్మరి క్రాంతి కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పేరేచర్ల ఫుట్బాల్ మైదానంలో జూనియర్ బాయ్స్, సబ్ జూనియర్ బాయ్స్ విభాగాలకు సంబంధించి ఆదివారం ఉదయం సెలక్షన్ జరుగుతాయని తెలిపారు. జూనియర్ గర్ల్స్, సబ్ జూనియర్ గర్ట్స్ సంబంధించి 22వ తేదీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 7337585790 సంప్రదించాలని కోరారు. పెడన: రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి చేనేత కార్మికుల న్యాయమైన డిమాండ్లు సాధించుకోవడానికి తమ ఆధ్వర్యంలో ఈ నెల 22న రాష్ట్రస్థాయిలో కలె క్టరేట్ల ముట్టడి కార్యక్రమం జరుగుతుందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పెడన పట్టణంలోని సర్వోదయ సొసైటీలో బుధవారం జరిగిన కృష్ణా జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ అమలుపై చర్చించారు. -
కీలక పోస్టులూ ఖాళీ
నగరంపాలెం: జిల్లా పోలీస్ శాఖలో డీఎస్పీల కొరత ఏర్పడింది. నెలలు గడిచినా ఇదే పరిస్థితి. దీంతో ఇన్చార్జ్లతో పోలీస్ సబ్ డివిజన్లను నెట్టుకొస్తున్నారు. రాజధాని ప్రాంతమని ప్రగల్భాలు పలికే కూటమి ప్రభుత్వంలో గుంటూరులో డీఎస్పీలను నియమించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆమడ దూరంలో రాష్ట్ర డీజీపీ ప్రధాన కార్యాలయం ఉన్నప్పటికీ జిల్లాలో ఈ పరిస్థితి నెలకొంది. డీఎస్పీల నియామకాలు చేపట్టకపోవడంతో ఆయా పోలీస్ సబ్ డివిజన్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మూడు కీలక పోస్టులూ ఖాళీ.. జిల్లాలో గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు, గుంటూరు దక్షిణ, నార్త్, తెనాలి, తుళ్ళూరు సబ్ డివిజన్లు ఉన్నాయి. ఇందులో తెనాలి, నార్త్, తుళ్లూరు సబ్ డివిజన్ల మినహా గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు, గుంటూరు దక్షిణ సబ్ డివిజన్ల డీఎస్పీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతేడాది జనవరిలో గుంటూరు పశ్చిమ సబ్ డివిజన్ డీఎస్పీగా కె.అరవింద్, గుంటూరు దక్షిణ డీఎస్పీగా భానోదయ బాధ్యతలు స్వీకరించారు. సుమారు 13 నెలలు విధులు నిర్వర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25న కె.అరవింద్, భానోదయను రాష్ట్ర డీజీపీ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అయితే 2018 గ్రూప్–1లో సెలక్ట్డ్ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. దీంతో ఇద్దరు డీఎస్పీలు డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. ఇక అప్పటి నుంచి ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రోజుల వ్యవధిలో గుంటూరు పశ్చిమ డీఎస్పీ ఇన్చార్జ్గా ట్రాఫిక్ డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు, గుంటూరు దక్షిణ డీఎస్పీ ఇన్చార్జ్గా గుంటూరు సీసీఎస్ డీఎస్పీ మధుసూదనరావుకి అదనపు బాధ్యతలు అప్పగించారు. డీఎస్పీలు నియమించక సుమారు నాలుగు నెలలైంది. వారం క్రితం గుంటూరు తూర్పు డీఎస్పీ పోస్ట్ సైతం ఖాళీ ఏర్పడింది. డీఎస్పీ అబ్దుల్ అజీజ్ బాపట్ల జిల్లా రేపల్లె డీఎస్పీగా బదిలీ అయ్యారు. దీంతో గుంటూరు నగరానికి కీలకమైన మూడు సబ్ డివిజన్లకు డీఎస్పీలు నియమించకపోవడం కూటమి ప్రభుత్వం పనితీరుకి అద్దం పడుతోంది. ఎందుకీ జాప్యమో... గతేడాది సెప్టెంబర్లో డీఎస్పీలుగా బెల్లం శ్రీనివాసరావుతోపాటు మరో ముగ్గురు పదోన్నతి పొందారు. వీరిలో బెల్లం శ్రీనివాసరావును వెంటనే గుంటూరు ట్రాఫిక్ డీఎస్పీగా నియమించారు. ఇటీవల గుంటూరు ఎస్బీ –1 సీఐ అలహరి శ్రీనివాస్ డీఎస్పీగా ఉద్యోగోన్నతి పొందగా, జిల్లా ఎస్బీ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే డీఎస్పీలుగా ఉద్యోగోన్నతి పొందిన కొందరికి ఇప్పటికీ ఏ జిల్లాలోనూ నియమించలేదు. ఆఖరికి ఇటీవల డీఎస్పీలుగా ఉద్యోగోన్నతి పొందిన అనేక మంది పోస్టింగ్లు కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు రాష్ట్ర డీజీపీ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. గుంటూరు తూర్పు డీఎస్పీ అబ్దుల్ అజీజ్ బాపట్ల జిల్లా రేపల్లె డీఎస్పీగా బదిలీ అయ్యారు. ఇటీవల ఓ డీఎస్పీకి మంత్రి నుంచి పిలుపు రావడం.. బదిలీ అయి బాధ్యతలు స్వీకరించడం వెంటనే జరిగాయి. పలుకుబడి, పరపతి ఉన్న డీఎస్పీలకే కీలకమైన పోస్టులకు బదిలీ చేస్తున్నారనే వాదన లేకపోలేదు. డీఎస్పీల నియామకాలు జరగకపోవడంతో సబ్ డివిజన్లలో ప్రధాన సమస్యగా మారింది. ఒక్కొక్క సబ్ డివిజనల్ పరిధిలో మూడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. డీఎస్పీలను నియమించకపోవడంతో పోలీస్స్టేషన్ల సీఐలు, ఎస్ఐలే శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ఏదైనా భారీ మోసం, నేరం జరిగితే దిశా నిర్దేశం చేసే డీఎస్పీలు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. డీఎస్పీలు ఉంటే సీనియారిటీ ఆధారంగా నేరస్థులను పట్టుకునేందుకు, ఏవైనా కొట్లాటలు ఇతరత్రా నేరాల నియంత్రణకు ఆదేశాలు జారీ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇక ఇన్చార్జ్ డీఎస్పీలు నియామకంతో వారి సబ్ డివిజన్లను పర్యవేక్షించడమే సరిపోతుంది. శంకర్విలాస్ రైల్వే ఓవర్బ్రిడ్జి పునర్నిర్మాణ పనుల దృష్ట్యా గుంటూరు నగరంలో ట్రాఫిక్ ఎక్కువైంది, రాజధాని ప్రాంతంలోనూ అదే పరిస్థితి. ఇక వాహనాల క్రమబద్ధీకరణ, ముఖ్య అధికారులు, పాలకుల రాకపోకల వేళల్లో మరింత అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది. ఇక జిల్లాలో నేరాలు కట్టడి చేసేందుకు, చోరులను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టాల్సి ఉంది. అటువంటి పరిస్థితుల్లో సబ్ డివిజన్లకు ఇన్చార్జ్లను నెలల తరబడిగా నియమించడంతో విధుల భారం ఎక్కువైంది. గుంటూరు నగరంలో కీలకమైన మూడు డీఎస్పీల పోస్టులు ఖాళీ ఏర్పడటంపై పలువురు డీఎస్పీలు వారి ప్రయత్నాలలో వారు నిమగ్నమయ్యారు. కూటమి నాయకులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. -
మాజీ సైనికోద్యోగుల నిరసన
నెహ్రూనగర్: దేశ సరిహద్దుల్లో సేవలందించిన మాజీ సైనికుడు కృపారావుపై ఎకై ్సజ్ సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడిన ఘటనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు బుధవారం ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ముందు సంఘ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ చట్టబద్ధంగా కొన్న మద్యం బిల్లులు, గుర్తింపు కార్డులు ఉన్నా కృపారావును స్టేషనుకు తీసుకెళ్లి వేధించారని ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, ఆయన విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్లకు తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు ప్రసాద్, సలాం, నాగేశ్వరరావు, నాగభూషణం, చిన్న వీరయ్య, సత్తయ్య, మాణిక్యాలరావు, అప్పారావు, వేణుగోపాలరావు, రాకేష్, వెంకటరెడ్డి, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్లపై వినతుల స్వీకరణ
గుంటూరు వెస్ట్: స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి అధ్యయనం నిర్వహిస్తున్న డెడికేషన్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా బుధవారం గుంటూరులోని ఎస్.ఆర్. శంకరన్ హాల్లో సమావేశం నిర్వహించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, బీసీ సంఘాల నుంచి వినతులు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ల కల్పన, బీసీ వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత, స్థానిక పాలనలో వారి ప్రాతినిధ్యం పెంపు తదితర అంశాలపై అభిప్రాయాలను సేకరించారు. సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో షేఖ్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాస రావు, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి మయూరి, జెడ్పీ సీఈవో జ్యోతిబసు, ఇతర శాఖల జిల్లా అధికారులు, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచాలి వినతి పత్రం అందజేసిన అనంతరం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు మాట్లాడుతూ బీసీ కులాల జనగణనను శాసీ్త్రయంగా నిర్వహించి, సుప్రీంకోర్టు 50 శాతం పరిమితిని ఎత్తివేయాలన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లను జనాభా దామాషా మేరకు పెంచేలా ప్రభుత్వానికి సిఫారసు చేయాలన్నారు. -
అవయవదానంతో ఐదుగురికి పునర్జన్మ
గుంటూరు మెడికల్: విధి నిర్వహణలో బ్రెయిన్ స్ట్రోక్కు గురైన వ్యక్తి ఐదుగురికి నూతన జీవితాలను ప్రసాదించారు. ఆయన అవయవదానంతో ఐదు కుటుంబాల జీవితాల్లో వెలుగు నిండింది. ఎకై ్సజ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న పామర్తి నాగ వెంకట దుర్గ శ్రీనివాస్ (48) విధి నిర్వహణలో ఉన్న సమయంలో ఈ నెల 10న బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యారు. వెంటనే సహచర సిబ్బంది ఆయన్ను గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్కు తరలించారు. వైద్యులు ఆరు రోజులపాటు వైద్య చికిత్స అందించినా బ్రెయిన్ స్ట్రోక్తో ఆరోగ్య పరిస్థితి విషమించి ఈ నెల 16న బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. ఆయన భార్య వెంకట నాగలక్ష్మి, తల్లి పి.వి.జయలక్ష్మి తదితర కుటుంబసభ్యులు దుఃఖంలో ఉండి కూడా అవయవదానానికి అంగీకరించారు. జీవన్దాన్ కో ఆర్డినేటర్లు అవగాహన కల్పించడంతో వారు ముందుకొచ్చారు. బుధవారం రెండు నేత్రాలను ఎల్.వి.ప్రసాద్ ఇనిస్టిట్యూట్కు, ఒక కిడ్నీఎన్నారై హాస్పిటల్కు తరలించారు. మరో కిడ్నీ, లివర్ను ఆస్టర్ రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి అమర్చి నూతన జీవితాలు ప్రసాదించారు. ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్బాబు మాట్లాడుతూ అవయవదానం చేసిన కుటుంబ సభ్యులను అభినందించారు. -
రైతుల న్యాయ పోరాటానికి మద్దతు
అండగా ఉంటామన్న వైఎస్సార్సీపీ లీగల్సెల్ అధ్యక్షుడు మనోహర్రెడ్డి తాడేపల్లి రూరల్: దేశానికి వెన్నెముక రైతు అని, ప్రభుత్వాల స్వలాభాల కోసం, కార్పొరేట్ సంస్థల కోసం భూములు లాక్కుంటే రైతులు న్యాయపోరాటం చేసే అవకాశం ఉందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి అన్నారు. వారికి ఎప్పుడూ తాము అండగా ఉంటామని తెలిపారు. బుధవారం రాజధాని గ్రామమైన మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో రైతులకు న్యాయ సలహాలు అందించేందుకు న్యాయవాదులతో కలసి ఆయన పర్యటించారు. భూములను పరిశీలించాక గ్రామంలోని రైతులతో సమావేశం నిర్వహించారు. రైతుల నుంచి వారి అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ ఏ గ్రామంలో అయినా ఇన్ని పంటలు పండే భూములను ప్రభుత్వం తీసుకోవడం సాధ్యపడదని, అధికారులు అందరూ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఒక రైతు మాట్లాడుతూ తనకు 40 సెంట్ల భూమి ఉంటే రికార్డుల్లో 25 సెంట్లు చూపిస్తున్నారని తెలిపారని వివరించారు. ఇలాంటి సమస్యలపై న్యాయ పోరాటం చేయొచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుదర్శన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, నరసింహారెడ్డి, శేఖర్ రెడ్డి, శ్రీహరి, జి.ఎల్. నాగేశ్వరరావు, ఎల్లారెడ్డి, జి. శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ నష్టాలను తగ్గించండి
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో విద్యుత్ లైన్ లాసెస్ తగ్గింపుతో పాటు రెవెన్యూ వసూళ్ల లక్ష్యాలను సాధించాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం విజయవాడ కార్పొరేట్ కార్యాలయంలో గుంటూరు జిల్లా విద్యుత్ అధికారులతో బుధవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో గుంటూరు జిల్లా ఎస్ఈ చల్లా రమేష్, ఈఈలు, ఆపరేషన్స్ అధికారులు పాల్గొన్నారు. సబ్స్టేషన్ పనుల పురోగతి, ఫీడర్ లెవెల్ సోలరైజేషన్, పీఎం సూర్య ఘర్, యూఎల్ఏ, పీఎం–కుసుమ్, ఆర్డీఎస్ఎస్, జీఐఎస్ మాపింగ్, ఎల్టీ నెట్వర్క్ అభివృద్ధి తదితర అంశాలపై సీఎండీ సమీక్షించారు. విద్యుత్ సరఫరాలో నాణ్యతను మరింత మెరుగుపరచాలని, వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. లైన్ లాసెస్ తగ్గింపు, రెవెన్యూ వసూళ్లలో సర్కిల్ లక్ష్యాలను తప్పనిసరిగా అందుకోవాలని, ఆ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో డైరెక్టర్ టెక్నికల్ ఎ.మురళీకృష్ణ యాదవ్, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ టీవీఎస్ఎన్ మూర్తి, ఫైనాన్స్ డైరెక్టర్ వై. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో బాలుడు దుర్మరణం
పెదకాకాని: విద్యుత్ షాక్కు గురైన బాలుడు మరణించిన సంఘటన పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్లో చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. మంగళగిరి రత్నాల చెరువు చెందిన క్రోసూరి రవికిరణ్(17) గత కొంతకాలంగా గుంటూరు ఆటోనగర్లోని షెడ్లో లారీలకు బాడీలు అమర్చే పనులు చేస్తున్నాడు. ప్రతిరోజు మంగళగిరి నుంచి గుంటూరు ఆటోనగర్ వచ్చి పనులు చేసుకొని తిరిగి ఇంటికి వెళుతూ ఉంటాడు. ఎప్పటి మాదిరిగానే మంగళవారం లారీకి బాడీ అమర్చే పనులు చేస్తుండగా కరెంట్ షాక్ గురై అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే స్థానికులు అతన్ని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రవికిరణ్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కరెంట్ షాక్ గురై యువకుడు మృతి చెందడంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కృష్ణలంక(విజయవాడతూర్పు): విజయవాడ నుంచి మంగళగిరికి కనకదుర్గ వారధి మీదుగా వెళ్తున్న ఓ కారులో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఆ మంటల్లో చిక్కుకుని కారు బుగ్గిపాలైంది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన టి.వందనంరాజు కారులో నగరానికి వచ్చి మంగళవారం రాత్రి తిరిగి వెళ్తుండగా వారధిపై ఏడో నంబర్ పిల్లర్ వద్దకు రాగానే ఒక్కసారిగా కారులో నుంచి దట్టమైన పొగరావడం గమనించాడు. వెంటనే అతను అప్రమత్తమై కారును ఆపి బయటకు దిగిపోయాడు. చూస్తుండగానే ఒక్కసారిగా కారంతా మంటలు వ్యాపించాయి. ప్రయాణ సమయంలో కారులో ఒక్కరే ఉండడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపుచేశారు. ఈ ఘటనతో వారధిపై ట్రాఫిక్జామైంది. -
‘గోల్ రీచ్ కాలేకపోతున్నాను.. క్షమించండి’
తండ్రి సెల్ఫోన్కు మెసెజ్ పెట్టి విద్యార్థిని అదృశ్యం లక్ష్మీపురం: గుంటూరు ఓ కళాశాలలో ఇంటర్ సీఎంఏ చదువుతూ పరీక్షల్లో ఫెయిల్ అయి.. మనస్థాపంతో తండ్రికి మెసెజ్ పెట్టి ఓ కుమార్తె అదృశ్యమైన ఘటనపై అరండల్పేట పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా చీరాల మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన చిల్లర అనురాధ అనే విద్యార్థిని గత మూడు సంవత్సరాలుగా గుంటూరు బ్రాడీపేటలోని హాస్టల్లో ఉంటూ మాస్టర్ మైండ్స్ కాలేజీలో ఇంటర్ సీఎంఏ చదువుతోంది. అయితే ఇటీవల జరిగిన పరీక్షల్లో ఫెయిల్ అయింది. ఈక్రమంలో పది రోజుల క్రితం ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. ఇంటి నుంచి వెళ్ళిన రోజు తన తండ్రికి ‘నన్ను క్షమించండి.. నేను గోల్ రీచ్ అవ్వలేకపోతున్నాను.. నేను జాబ్ కోసం వెళ్ళిపోతున్నాను ఏదో ఒకటి సాధించి వస్తాను’ అని సెల్ఫోన్కు మెసేజ్ చేసింది. దీంతో అప్పటి నుంచి చుట్టు పక్కన బంధుమిత్రుల వద్ద విచారించినా ఎంతకు ఆచూకీ తెలియక పోవడంతో దిక్కుతోచక అరండల్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు అనురాధ తల్లి శ్రీలక్ష్మి ఫిర్యాదు చేసింది. అరండల్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ ఢీకొని దంపతులు మృతి
ఫిరంగిపురం: ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొని భార్యాభర్తలు మృతిచెందిన సంఘటన మండలంలోని వేములూరిపాడు గ్రామ శివారులో మల్కాచెరువు వద్ద బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం దేచవరం గ్రామానికి చెందిన ఉమ్మడిదల కోటేశ్వరరావు(65), పద్మావతి(60)లు విజయవాడలోని పెనుమలూరులో కుమారుడివద్ద ఉంటున్నారు. కాగా గుంటూరులోని కుమార్తెను చూసి తిరిగి ద్విచక్రవాహనంపై స్వగ్రామం దేచవరం వెళుతుండగా మండలంలోని మల్కాచెరువు వద్ద గుంటూరు నుంచి వస్తున్న లారీ వారి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. దీంతో దంపతులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సురేష్ సిబ్బందితో సంఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తాడికొండ: రాజధాని అమరావతిలో లింగాయపాలెం – ఉద్ధండరాయునిపాలెం గ్రామాల మధ్య ఎన్ – 10 సీడ్యాక్సెస్రోడ్డు (ఈ–03) కూడలిలో అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) సెంట్రల్ నర్సరీని అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టింది. రాజధాని నగరంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న 34 ప్రధాన రహదార్లకు ఇరువైపులా సుమారు 700 కి.మి. మేర చెట్లు పెంచి మంచి గాలి, నీడ అందించాలనేది ప్రధాన లక్ష్యం. ఈ సెంట్రల్ నర్సరీలో 45 వేల మొక్కలను పెంచాలని ఏడీసీ లక్ష్యంగా పెట్టుకుందని సంస్థ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీపార్థసారథి వెల్లడించారు. బుధవారం ఆమె సెంట్రల్ నర్సరీలో మొక్కలు నాటి నర్సరీలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. 18 ఎకరాలలో ఈ నర్సరీని అభివృద్ధి చేస్తారు. ఫేజ్ – 1లో తొలుత 10 ఎకరాలలో అభివృద్ధి పనులను చేపట్టారు. దఫాల వారీగా తక్కిన విస్తీర్ణంలో కూడా నర్సరీని తీర్చిదిద్దుతారు. ఏడీసీ ఉద్యనవన, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్లపై 50శాతం సీలింగ్ ఎత్తివేయాలి
గుంటూరు వెస్ట్: రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ ఎత్తివేయాలని హైకోర్టు న్యాయవాది, సామాజిక న్యాయ కేంద్రం తరఫున వై.కోటేశ్వరరావు (వైకె) ఏపీ బీసీ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వానికి సమర్పించే నివేదికలో రాజ్యాంగ సవరణ ద్వారా 50శాతం సీలింగుని రద్దు చేయించవలసిందిగా తమ నివేదిక ద్వారా సిఫారు చేయవలసిందిగా కమిషన్ని కోరారు. అలాగే, రాజ్యాంగ సవరణ చట్టాన్ని పరిరక్షించే విధంగా, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఆ చట్టాన్ని చేర్చాలని కూడా సూచించారు. బీసీ రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న విధంగా జనాభా దామాషా ప్రకారం కల్పించాలన్నారు. స్థానిక సంస్థల్లో కల్పించే బీసీ రిజర్వేషన్లను అన్ని కులాలకు అందే విధంగా, ఏబీసీడీఈలుగా వర్గీకరించాలని కోరారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నందున కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, 50 శాతం సీలింగుని ఎత్తివేయించే విధంగా ఒత్తిడి తేవాలన్నారు. వినతి పత్రం సమర్పించిన వారిలో బీసీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పి.వి. రమణయ్య, బీసీ మహాజనసభ రాష్ట్ర అధ్యక్షుడు ఉగ్గం సాంబశివరావు, వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు ఓర్సు ప్రేమ రాజు, శాలివాహన సంఘం రాష్ట్ర నాయకురాలు నాగేశ్వరి, హైకోర్టు న్యాయవాది రాచర్ల కాంత్ తదితరులు ఉన్నారు. -
ఈశాన్య ప్రాంత ప్రజలకు న్యాయసేవలు
గుంటూరు లీగల్: ఈశాన్య ప్రాంతాల నుంచి వలస వచ్చిన ప్రజల కోసం ఇన్చార్జి చైర్మన్ ఒకటో అదనపు జిల్లా జడ్జి వీఏఎల్.సత్యవతి చేతులమీదుగా లీగల్ ఎయిడ్ క్లినిక్ను జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు బుధవారం గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఈ క్లినిక్ ద్వారా న్యాయ సేవలు మరింత విస్తృతం చేయవచ్చని పేర్కొన్నారు. న్యాయవాదులను, పారా లీగల్ వలంటీర్లను నియమించనున్నట్లు వివరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ ఈ ప్రత్యేక క్లినిక్ ఉద్దేశం ప్రతి ఒక్కరికి న్యాయం అందుబాటులో ఉంచడమేనన్నారు. ప్యానెల్ అడ్వొకేట్స్, పారా లీగల్ వలంటీర్లు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. -
లింకురోడ్డు రద్దుతో తెనాలికి అన్యాయం
తెనాలి: రాష్ట్ర ప్రభుత్వం అమరావతి చుట్టూ ఏర్పాటుచేయనున్న ఔటర్ రింగ్రోడ్డుకు తెనాలి ప్రాంతాన్ని అనుసంధానించే లింకు రోడ్డును రద్దు చేసేందుకు కేంద్రప్రభుత్వం నిర్ణయించటం బాధాకరమని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ తెనాలి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. లోక్సభ స్థానాన్ని కోల్పోయి జిల్లా హోదాకు నోచుకోని తెనాలి, ఇప్పుడు ఓఆర్ఆర్కు లింకురోడ్డును కోల్పోతే వెనుకబాటుకు గురవుతుందని, ఈ ప్రాంతవాసులకు తీరని అన్యాయం జరిగినట్టు కాగలదని హెచ్చరించారు. స్థానిక గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో బుధవారం పార్టీ నాయకులతో కలిసి శివకుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెనాలి ప్రాంతానికి మేలు చేకూర్చేందుకే గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు తెనాలి–విజయవాడ రోడ్డును నాలుగులైన్ల రహదారిగా మార్చాలని ప్రతిపాదించినట్టు గుర్తుచేశారు. అయితే పశ్చిమ బైపాస్ రోడ్డుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాల్లో ఉన్నందున, తన ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదని చెప్పారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం, కొన్ని మార్పులతో ఈస్ట్ బైపాస్ ప్రతిపాదనను ఓఆర్ఆర్ డీపీఆర్లో చేర్చిందని చెప్పారు. సీఐ అక్రమ సంబంధాలపై విచారించాలి... నెలవారీ మామూళ్లు కాకుండా అప్పుల పేరుతోనూ కలెక్షన్లు చేస్తున్న తెనాలి టూటౌన్ సీఐ రాములనాయక్ను వీఆర్కు పంపుతూ తక్షణం నిర్ణయం తీసుకున్న జిల్లా ఎస్పీ వకుళ్జిందాల్కు మాజీ ఎమ్మెల్యే శివకుమార్ అభినందించారు. ఇది కేవలం ఒక వ్యాపారి సమస్య మాత్రమే కాదనీ, పట్టణంలోని పలువురు వ్యాపారులకు ఇదే సమస్యగా ఉందన్నారు. వీఆర్కు పంపిన సీఐపై మహిళలను లొంగదీసుకుని, అక్రమ సంబంధాలు నడుపుతున్న ఆరోపణలు ఉన్నాయన్నారు. వాటిపైనా విచారించాలని ఎస్పీని కోరారు. చంద్రబాబు ప్రభుత్వంలో తెనాలిలో పోలీసుల కారణంగా అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని చెప్పారు. మారీసుపేటలోని ఇల్లు అద్దెకు తీసుకుని ఖాళీచేయటం లేదని ఓ వృద్ధమహిళ మీవరకు వచ్చి మొరపెట్టుకున్నా న్యాయం జరగలేదని ఎస్పీ నుద్దేశించి అన్నారు. పైగా ఆమైపెనే దౌర్జన్యం చేశారని తెలిపారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు దేసు శ్రీనివాసరావు, పార్టీ నాయకులు తాడిబోయిన రమేష్, కఠారి హరీష్, కాలిశెట్టి ఫణికుమార్, కాకి దేవసహాయం, రావి శ్రీనివాసరావు, షేక్ దుబాయ్బాబు, కొర్ర యశోద, మైలా విజయ్నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక దృష్టి
నకరికల్లు: హైరిస్క్ గర్భిణుల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి.రవి అన్నారు. మండలంలోని కుంకలగుంట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పీహెచ్సిలోని మందుల నిల్వలు, సిబ్బంది హాజరు రిజిస్టర్లు, రికార్డులు తనిఖీలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంజీవని కార్యక్రమం, ఎలక్ట్రానిక్ హెల్త్కార్డుల నిర్వహణపై వాకబు చేశారు. పీహెచ్సీ పరిధిలోని గర్భిణుల వివరాలు నూటికి నూరుశాతం నమోదు చేయాలన్నారు. పీహెచ్సీలో చేస్తున్న రక్తపరీక్షలు గురించి తెలుసుకొని ఖచ్చితమైన నిర్ధారణ ఉండాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి ఎం.పూజశ్రీ, ఆరోగ్య విస్తరణ అధికారి కొంపల వెంకటేశ్వర్లు, సూపర్వైజర్ రాధాకృష్ణమూర్తి, స్టాఫ్ నర్స్ శివకుమారి, ఫార్మాసిస్ట్ కల్పన, ల్యాబ్ టెక్నీషియన్ లాలూనాయక్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి.రవి -
‘పది’కి రోజువారి పరీక్షలు ఉపసంహరించుకోవాలి
డీఈఓకు వినతి గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాలలు పునః ప్రారంభమైన తరుణంలోనే పదో తరగతి విద్యార్థులకు రోజువారి పరీక్షలను నిర్వహించాలనే విద్యా శాఖ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.బసవలింగారావు, జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుడిపాటిదాస్, మొహమ్మద్ ఖాలిద్ డిమాండ్ చేశారు. మంగళవారం డీఈఓ కార్యాలయంలో జిల్లా విద్యా శాఖ అధికారి షేక్ సలీమ్బాషాను కలిసి వినతి పత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభంలో పాఠ్యాంశాలను చాప్టర్ వైజ్గా బోధించాల్సిన సమయంలో రోజువారి పరీక్షలు నిర్వహించడం వలన ప్రశ్న, సమాధానాలుగా తరగతులు మారిపోతాయని అన్నారు. రోజువారి పరీక్షలను ఉపసంహరించుకుని వారంతపు పరీక్షలు నిర్వహించే విధంగా ఉపాధ్యాయులకు స్వేచ్ఛనివ్వాలన్నారు. డీఈఓను కలిసిన వారిలో ఏపీ టీఎఫ్ ఫిరంగిపురం, పొన్నూరు మండల శాఖల అధ్యక్షులు జహంగీర్, వి.కిషోర్షా, పేరేచర్ల హైస్కూల్ హెచ్ఎం పి.రంగరాజు ఉన్నారు. -
విత్తన ఎంపిక కీలకం
కొరిటెపాడు(గుంటూరు): విత్తనం మంచిదైతే పంట బాగా పెరుగుతుంది. దిగుబడులు మెరుగ్గా ఉంటాయి. కొంతమంది రైతులు విత్తనం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోరు. దొరికింది కదాఅని ఏదో ఒకటి కొని విత్తుకుని నష్టపోతుంటారు. వ్యవసాయంలో రాణించడానికి, అధిక దిగుబడులు పొందడానికి నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవడం ఎంతో ముఖ్యం. రైతులు సరైన విత్తనం ఎంపిక చేసుకోకుండా ఎన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టినా ఉపయోగం ఉండదు. విత్తన ఎంపిక, కొనుగోలులో కొన్ని మెళకువలను తప్పనిసరిగా పాటంచాలి. మరో వారం, పది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. రైతులు తమ పొలాలను సీజన్కు సిద్ధం చేసుకుని పత్తి విత్తనాలు వేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో విత్తనాల కొనుగోలు, ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారి(డీఏఓ) ఎం.పద్మావతి సూచిస్తున్నారు. మంచి దిగుబడి విత్తనం ఎంపికపై ఆధారపడి ఉంటుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో విత్తనాల ఎంపిక, కొనుగోలులో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవేంటో చుద్దాం. -
రాంజీ చట్టంతో ఉపాధి కార్మికులకు తీవ్ర నష్టం
లక్ష్మీపురం: జూలై 1 నుంచి అమలులోకి రానున్న వీబీపీ రాంజీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉపాధి హామీ కార్మికులతో నిరసన కార్యక్రమాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు కోరారు. మంగళవారం గుంటూరులోని సంఘం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జెట్టి బాలరాజు అధ్యక్షతన జిల్లా విస్తృత సమావేశం నిర్వహించారు. అప్పారావు మాట్లాడుతూ ఈ చట్టం వల్ల ఉపాధి కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లతోందన్నారు. గ్రామాల్లో ఫేస్ యాప్ వలన ఉపాధి కార్మికులు పలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పనికి మస్టర్ వేసే దాంట్లో భాగంగా ఫొటో మ్యాచ్ అయితేనే పని చూపుతున్నారని, ఇది కూడా పని ప్రారంభంలో ఒకసారి పని పూర్తయిన తర్వాత రెండవసారి ఫొటో తీస్తున్నారన్నారు. గ్రామాల్లో సర్వర్ పనిచేయక ఫొటో మ్యాచ్ కాక ఉపాధి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఉపాధి కార్మికులకు పని చేసిన 15 రోజుల్లోపు వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో వేతనం ఇచ్చేటప్పుడు పే ిస్లిప్పులు ఇచ్చే వారిని, దానిలో ఎంత పని చేసింది ఎంత డబ్బులు పడుతుంది వివరంగా అర్థమయ్యేదన్నారు. ప్రస్తుతం ఎక్కడా ప్లే స్లిప్పులు ఇవ్వటం లేదన్నారు. ప్రతి కుటుంబానికి ఉపాధి హామీ చట్టం ప్రకారం వంద రోజులు పనిని కల్పించాలని కోరారు. జూలై ఒకటిన గ్రామ సచివాలయం వద్ద జరిగే నిరసన కార్యక్రమాల్లో ఉపాధి హామీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు బి.కోటేశ్వరి, సహాయ కార్యదర్శి జి.అజయ్, ఎస్.కె ఖాదర్ బాబా, మేరీ, పాలేటి అప్పారావు, భద్రయ్య, కాటమరాజు పాల్గొన్నారు. -
రేపు దుగ్గిరాల బంద్
తెనాలి: దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్నిబాధిత పసుపు రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలులో వైఫల్యానికి నిరసనగా ఈ నెల 18వ తేదీన దుగ్గిరాల బంద్ నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ములకా శివసాంబిరెడ్డి తెలిపారు. చెంచుపేటలోని ప్రజాసంఘాల కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రూ.100 కోట్ల పసుపు కాలి బూడిదైనా గాని ప్రభుత్వం పట్టించుకోవకపోవడం దుర్మార్గం అని పేర్కొన్నారు. సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంనాయుడు, అధికారులు చేసిన ఒప్పందానికి విలువ లేకపోతే రైతులకి ఏం న్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే కనీసం 179 సార్లు మంత్రులు, అధికారులు చుట్టూ అగ్ని బాధిత పసుపు రైతులు ప్రదక్షిణలు చేసినా కరుణించలేదన్నారు. నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయని కూడా గుర్తుచేశారు. ఈ నెల 8న తెనాలిలో రౌండ్ టేబుల్ సమావేశం, జూన్ 10న దుగ్గిరాల పసుపు వ్యవసాయ మార్కెట్ యార్డు ముట్టడి చేసినట్టు తెలిపారు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ నెల 18వ తేదీన దుగ్గిరాల బంద్కు అగ్ని బాధిత పసుపు రైతులు కమిటీ పిలుపునిచ్చిందని తెలిపారు. దుగ్గిరాల ప్రజలు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు, రైతు శ్రేయోభిలాషులు కార్మికులు, విద్యా వాణిజ్య సంస్థలు అందరూ బంద్కు సహకరించాలని కోరారు. వీరితో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు కూడా ఉన్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలి వాహనాలు దగ్ధం పట్నంబజారు: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలి ద్విచక్రవాహనాలు దగ్ధమైన ఘటన కొత్తపేటలో చోటు చేసుకుంది. తెలిసిన సమాచారం.. కొత్తపేట పోలీసు స్టేషన్ పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ సోమవారం రాత్రి ఈదురుగాలులకు పేలింది. నిప్పులు చెలరేగడంతో అక్కడ ఉన్న మూడు ద్విచక్రవాహనాలు తగలబడినట్లు సమాచారం. అయితే పలు కేసుల్లో పట్టుబడిన వాహనాలు సైతం పోలీసులు రోడ్డుపైనే పార్కింగ్ చేసిన పరిస్థితుల్లో, వాటితోపాటు ఇతరుల వాహనాలు కూడా తలగబడినట్లు తెలుస్తుంది. గంజాయి కేసులో నిందితులు అరెస్టు పట్నంబజారు: చెడు వ్యసనాలకు బానిసలుగా మారి గంజాయి సేవించడంతోపాటు, విక్రయాలు చేస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కొత్తపేట పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ సబ్ డివిజన్ ఇన్చార్జి డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డి, కొత్తపేట సీఐ వీరయ్య వివరాలు మీడియాకు మంగళవారం వెల్లడించారు. నెహ్రూనగర్కు చెందిన గుర్రం శివకుమార్, బత్తుల శశాంక్, శ్రీనగర్కు చెందిన చెన్నంశెట్టి రుద్రబాలసుబ్రహ్మణ్యం, రామిరెడ్డితోటకు చెందిన దాసరి గురవయ్యలు నెహ్రూనగర్లో నూతనంగా నిర్మిస్తున్న రైల్వే క్వార్టర్స్ వద్ద గంజాయి కలిగి ఉన్నట్లు పక్కా సమాచారంతో దాడిచేశారు. నిందితుల నుంచి ఐదు కిలోల 360 గ్రాముల గంజాయి స్వాధీనం చసుకున్నారు. ఈమేరకు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంతో ప్రతిభ కనబర్చిన సిబ్బందిని అభినందించారు. రైతులు నష్టపోకుండా చూస్తాం రాజుపాలెం: రైల్వే ట్రాక్ నిర్మాణంలో భూములు కోల్పోయే రైతులను అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని, సకాలంలో నష్ట పరిహారం అందేవిధంగా చర్యలు తీసుకుంటామని సత్తెనపల్లి ఆర్డీఓ గోపాలకృష్ణ రైతులకు భరోసా ఇచ్చారు. మండలకేంద్రంలోని తహసీల్దారు కార్యాలయంలో రైల్వే ట్రాక్ వలన భూములు కోల్పోయే రైతులకు అవార్డు ప్రకటించే ముందుగా మంగళవారం రైతుల అభిప్రాయాలను సేకరించారు. మండలంలో అనుపాలెం, చౌటపాపాయపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం గ్రామాలకు సంభందించిన 249 మంది రైతులకు సంబంధించిన సుమారు 20 ఎకరాల సాగు భూములను రైల్వే అధికారులు సేకరించారు. దీనికి సంబంధించి అవార్డు ప్రకటించే ముందుగా రైతుల అభిప్రాయాలను తీసుకున్నారు. కొంతమంది రైతులు ఆర్డీఓతో మాట్లాడుతూ ఇప్పుడు బయట మార్కెట్ రేటు ఎకరం రూ.2కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ధర పలుకుతుందని ప్రభుత్వం చాలా తక్కువ నష్ట పరిహారం ఇస్తుందని వాపోయారు. దీంతో తాము నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీఓ గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ రేటుతో కలిపి రెండున్నర రెట్లు ఇస్తున్నట్లు తెలిపారు. మీ పొలాల్లో ఉన్న బోర్లకు, బావులకు పెద్ద చెట్లకు అదనంగా నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు. ఇది సమంజసం కాదనిపిస్తే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. తహసీల్దార్ దుర్గేశ్వరరావు, ఆర్ఐ గోపి, వీఆర్వోలు పుల్లయ్య, దుర్గాభాయి, శాంతి, తదితరులు పాల్గొన్నారు. -
కాపర్ కేబుల్స్ దొంగిలించిన వ్యక్తి అరెస్ట్
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ మండలం వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో కాపర్ కేబుల్స్ అపహరించిన వ్యక్తిని తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు మంగళవారం అరెస్ట్ చేశారు. మీడియా సమావేశంలో సీఐ మాట్లాడుతూ యూనివర్సిటీలో లక్షల రూపాయల విలువ చేసే కాపర్ కేబుల్స్ దొంగతనానికి పాల్పడిన మానిగల మంగయ్యను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అతని వద్ద నుంచి సుమారు 30 కేజీల కాపర్కేబుల్స్, రూ.2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో మంగయ్య పెద్ద ఎత్తున దొంగతనాలకు పాల్పడ్డాడని వెల్లడించారు. ఈ సమావేశంలో తాడేపల్లి ఎస్ఐ ఖాజావలి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. యువతిపై లైంగిక దాడికి యత్నం పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు తెనాలిరూరల్: యువతిపై వ్యక్తి లైంగికదాడికి యత్నించిన ఘటనలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. విశ్వసనీయ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చినరావూరుకు చెందిన యువతి ఇక్కడి వహాబ్ చౌక్లోని సోలార్ సిస్టమ్ షాపులో సేల్స్ గర్ల్గా పనిచేస్తోంది. ఇదే షాపులో మేనేజర్గా పనిచేసే రాజేష్ నెల రోజులుగా యువతిని వేధింపులకు గురిచేస్తున్నాడు. గాంధీచౌక్లోని షాపు గోడౌన్కు సోమవారం మధ్యాహ్నం పిలిచాడు. యువతి రాగానే తలుపు వేసి లైంగిక దాడికి యత్నించాడు. యువతి తప్పించుకుని వెళ్లింది. విషయం యువతి బంధువులకు తెలియడంతో సుమారు 20 మంది, రాజేష్కు దేహశుద్ధి చేసేందుకు మంగళవారం ఉదయం సోలార్ షాపు వద్దకు వెళ్లారు. సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారిస్తున్నారు. ఐదు ఇసుక టిప్పర్లు సీజ్ కొల్లిపర: ఎటువంటి వే బిల్లు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు టిప్పర్లను స్వాధీనం చేసుకుని మంగళవారం కేసు నమోదు చేసినట్లు కొల్లిపర ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. చిలుమూరు లంక నుంచి గుంటూరు ఎటువంటి వే బిల్లు లేకుండా అక్రమంగా టిప్పర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో మండల పరిధిలోని తూములూరు అడ్డ రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఐదు టిప్పర్లను ఆపి పరిశీలించగా వారి వద్ద ఎటువంటి అనుమతి పత్రాలు, వే బిల్లు లేకపోవడంతో సీజ్ చేశారు. తహసీల్దార్ జి సిద్ధార్థకు నివేదిక సమర్పించారు. ఒక్కొక్క టిప్పర్కి రూ.10,000 చొప్పున మొత్తం రూ.50,000 జరిమానా విధించారు. ఎస్ఐ మాట్లాడుతూ ఎటువంటి బిల్లులు, మైనింగ్ అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
బకాయిల చెల్లింపుల్లో జాప్యంపై నిరసన
మేడికొండూరు: గ్రామ పునర్నిర్మాణ సంఘం (వీఆర్ఓ)లో గతంలో పనిచేసిన మాజీ ఉద్యోగులు తమకు రావలసిన పీఎఫ్, గ్రాట్యుటీ, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు ఇతర చట్టబద్ధ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమ సమస్యలను ఎన్నో సంవత్సరాలుగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ న్యాయం జరగకపోవడంతో మరోసారి ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఉద్యోగుల ప్రతినిధులు మాట్లాడుతూ 2018 సంవత్సరం నుంచి తమకు రావలసిన బకాయిల కోసం నిరంతర పోరాటం చేస్తున్నామని తెలిపారు. పీఎఫ్ కమిషనర్ సహకారంతో పలుమార్లు సంఘ యాజమాన్యానికి వినతిపత్రాలు సమర్పించడం, ధర్నాలు, నిరసనలు, సమావేశాలు, చర్చలు నిర్వహించడం వంటి పలు కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. అయినప్పటికీ సంఘ యాజమాన్యం తమ సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందించకుండా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గుంటూరు ప్రాంత ప్రతినిధి టి.మురళి, కమిటీ సభ్యులు రమేష్బాబు, మోహన్, ఏసోబు, విజయలక్ష్మి, సునీల్ తదితరులు పాల్గొని మాజీ ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. -
‘బకాయిలకు’ చికిత్స చేసేదెవరు?
● జీజీహెచ్లో అడ్డగోలుగా పలువురు వ్యాపారుల తీరు ● అద్దెలు చెల్లించక, కరెంటు బిల్లులు కట్టక ఖజానాకు గండి ● ప్రజాప్రతినిధుల అండకు తోడు అధికారుల మద్దతు గుంటూరు జీజీహెచ్లో కొందరు అడ్డగోలుగా వ్యాపారం చేసుకుంటున్నారు. ఆస్పత్రి ఆవరణలో దుకాణానికి నెలవారీ అద్దె చెల్లించాల్సిన పనిలేకుండా.. కరెంటు బిల్లులు కూడా కట్టనవసరం లేకుండా ఈ వ్యవహారం సాగుతోంది. ప్రజాప్రతినిధుల మద్దతు, ఆస్పత్రి పరిపాలన అధికారులను ప్రసన్నం చేసుకుని ఇలా పలువురు ఆర్జిస్తున్నారు. గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో పాలు, పాల ఉత్పత్తుల షాపులు , ఫొటో స్టాట్ షాపు, టీ స్టాళ్లు, జనరిక్ మందుల షాపులు ఉన్నాయి. వీరు జిల్లా కలెక్టర్ అనుమతితో వ్యాపారాలు చేస్తున్నారు. కొంత మందికి అనుమతులు లేవని ఇటీవల జిల్లా కలెక్టర్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందింది. నామినల్గా జిల్లాలో ఎక్కడా లేని విధంగా అతి తక్కువ అద్దెతో జీజీహెచ్లో వ్యాపారాలు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రతి నెల అద్దె ఇవ్వడం లేదు. కరెంటు బిల్లులు సైతం చెల్లించడం లేదు. ఆసుపత్రి అధికారులు కూడా ఏళ్ల తరబడి ఇలా చేస్తున్న వ్యాపారులపై కనీస చర్యలు తీసుకోకపోవడం లేదు. హెచ్డీఎస్ ఆదాయానికి గండి ఆస్పత్రికి ఆదాయం వచ్చేలా పనిచేయాల్సిన పరిపాలన అధికారులు వ్యాపారులకు వత్తాసు పలుకుతున్నారు. సొంతంగా లబ్ధి పొంతుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రి అభివృద్ధి సంఘం (హెచ్డీఎస్) చైర్మన్గా జిల్లా కలెక్టర్, పలువురు ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు ఉన్నారు. ప్రతినెలా, లేదా మూడు నెలలకొకసారి హెచ్డీఎస్ సమావేశాలు నిర్వహించి. ఆసుపత్రి అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. కనీసం అలాంటి సమావేశాల్లోనైనా ఈ మొండి బకాయిల గురించి అజెండాలో పెట్టకుండా, చర్చించకుండా వ్యాపారస్తులకు వత్తాసు పలుకుతున్నారు. ఆసుపత్రిలో నిధుల కొరతతో హెచ్డీఎస్ అకౌంట్ ఎన్నడూ లేని విధంగా అల్లాడుతోంది. ఆసుపత్రిలో వ్యాపారాలు చేసేవారి వద్ద నుంచి సకాలంలో నిధులు సేకరించడం ద్వారా హెచ్డీఎస్ అకౌంట్కు నిధులు సమకూరుతాయి. జిల్లా కలెక్టర్ దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
గుంటూరు
బుధవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 2026ఓట్లకు ఎసర్ పెడుతున్నారా? ● గుంటూరు నగరంలో ప్రక్రియ తీరుపై అనుమానాలు ● బీఎల్ఓతోపాటు తిరుగుతున్న టీడీపీ నాయకులు ● వైఎస్సార్ సీపీ వారి ఓట్లను తొలగించేందుకు ఒత్తిడి? అధికారం అండగా ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓట్లకు టీడీపీ నాయకులు ఎసరు పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్’ ప్రక్రియ ముఖ్యంగా గుంటూరు నగరంలో అడ్డదిడ్డంగా సాగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. బీఎల్ఓను వెంటపెట్టుకుని అధికార పార్టీ నేతలు ఓటర్ల వద్దకు వెళ్లి సర్ దరఖాస్తులు అందిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల బీఎల్ఏలకు కనీస సమాచారం ఇవ్వకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీపురం: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన సర్ ప్రక్రియ కొనసాగుతున్న తీరు గుంటూరు నగరంలో అనుమానాలకు తావిస్తోంది. సోమవారం ప్రారంభం అయిన ప్రక్రియను సంబంధిత సచివాలయాలవారీగా బీఎల్ఓను నియమించారు. 2025 ఎన్నికల ఓటరు జాబితాల ఆధారంగా గుంటూరు నగరంలోని 57 డివిజన్లలో ఉన్న పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 291 బూత్లు, గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో 256 బూత్లకుగాను మొత్తం 547 మందిని బీఎల్ఓలుగా నియమించారు. బీఎల్ఓలతోపాటు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన బీఎల్ఏలను కూడా ఆయా పార్టీ నాయకులు నియమించారు. నగరంలోని పలు డివిజన్లలో బీఎల్ఓలతోపాటు వారి వద్ద ఉన్న ఓటరు జాబితాలతో తెలుగుదేఽశం పార్టీకి చెందిన డివిజన్ అధ్యక్షులు, స్థానిక తృతీయ శ్రేణి నాయకులు పాల్గొంటున్నారు. అధికారపార్టీకి చెందిన వారికి మాత్రమే సర్ ప్రక్రియలో భాగంగా సంబంధిత దరఖాస్తులను బీఎల్ఓలు అందజేస్తున్నారనే ఆందోళన వ్యక్తం అవుతోంది. బీఎల్ఓలతోపాటు తెలుగుదేశం పార్టీ డివిజన్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, తృతీయ శ్రేణి నాయకులు కలసి సర్ ప్రక్రియకు సంబంధించిన దరఖాస్తులను అందజేసి ఫొటోలు దిగుతున్నారు. నిబంధనల మేరకు నిర్వహించాల్సిన సర్ ప్రక్రియ అధికార పార్టీల నేతలకు అనుకూలంగా మారిందని, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన బీఎల్ఏలను రానివ్వకుండా నగర వీధుల్లో బీఎల్ఓలను తిప్పుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 34వ డివిజన్లో బీఎల్ఓతో సర్ ప్రక్రియ నిర్వహిస్తున్న సమయంలో టీడీపీ డివిజన్ అధ్యక్షుడు, మైనార్టీ నాయకుడు అక్కడే ఉన్నారు. 34వ డివిజన్లో కోబాల్డ్పేట 2వ లైనులోని మున్సిపల్ స్కూల్లో బీఎల్ఓ నుంచి సర్ దరఖాస్తు స్థానిక మహిళకు టీడీపీ డివిజన్ అధ్యక్షుడు అందజేయడంపై విమర్శలు వస్తున్నాయి. సంబంధిత నగరపాలక సంస్థ అధికారులు ఈ బీఎల్ఓలపై నియమించిన సూపర్వైజర్లు కూడా ఆయా ప్రాంతాలలో తిరుగుతూ పార్టీలకు అతీతంగా ఈ సర్ ప్రక్రియను నిర్వహించాల్సిందిగా నగర వాసులు కోరుతున్నారు. ఇదే తరహాలో బీఎల్ఓలు తెలుగుదేశం పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులతో కలసి సర్ ప్రక్రియలో భాగంగా దరఖాస్తులు అందజేయడంపై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికై న జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టి సర్ ప్రక్రియలో పార్టీలకు అతీతంగా నిర్వహించాలని కోరుతున్నారు. స్థానికంగా ఉండే బీఎల్ఏలతో కలసి ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి ఓటరుకు దరఖాస్తులు అందజేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా విన్నవిస్తున్నారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 33.0520 టీఎంసీలు. ఎగువ నుంచి 4,130 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. ప్రధానంగా గుంటూరు పశ్చిమ నియోజక వర్గ పరిధిలో నియమించిన బీఎల్ఓలు కొన్ని డివిజన్లలో పాత డోర్ నంబర్లకు బదులు కొత్త డోర్ నంబర్లలో ఉన్న వారికి సంబంధించి సర్ ప్రక్రియను నిర్వహించడం లేదని తెలుస్తోంది. కొంతమంది ఓటరు జాబితాలోని వరుస సంఖ్య ప్రకారం తిరుగుతూ సర్ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ప్రస్తుత కొత్త డోర్ నంబర్ ప్రకారం నిర్వహించాల్సిన సర్ ప్రక్రియను సమర్థంగా చేపట్టడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత నగరపాలక సంస్థ అధికారులతో తాము మాట్లాడతామని బీఎల్ఓలను కొన్ని డివిజన్లలో అధికార పార్టికి చెందిన నాయకులు బెదిరిస్తున్నారని సమాచారం. దిక్కుతోచక బీఎల్ఓలు సర్ ప్రక్రియను అధికార పార్టీకి చెందిన నాయకులు చెప్పినట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
సిగరెట్ దుకాణాలే లక్ష్యంగా చోరీలు
కొల్లూరు: చోరులు కొత్త తరహా దొంగతనాలకు తెరతీశారు. దుకాణాల్లోని సిగరెట్ ప్యాకెట్లు, నగదుతో ఉడాయిస్తున్నారు. దొంగల పంథాను నిశితంగా పరిశీలిస్తే ముందస్తుగా రెక్కీ చేసి, ఎంపిక చేసుకున్న దుకాణాలలో రూ. వేల విలువైన సిగరెట్ ప్యాకెట్లు చోరీ చేస్తున్నారు. కొల్లూరులో వారం క్రితం ఓ దుకాణంలో సిగరెట్ ప్యాకెట్లు దొంగతనం చేశారు. అదే తరహాలో మండలంలోని దోనేపూడిలో దుకాణం తాళాలను నిమిషం వ్యవధిలోనే తొలగించి షట్టరు కింద నుంచి షాప్లోకి చొరబడి సిగరెట్ ప్యాకెట్లను మూటగట్టుకుని ఉడాయించాడు. దోనేపూడికి చెందిన వెనిగళ్ల సుధాకర్ అనే వ్యక్తి పంచాయతీ కార్యాలయం వెనుక ప్రాంతంలో రేపల్లె–తెనాలి ప్రధాన రహదారి వెంబడి కొన్నేళ్లుగా దుకాణం నిర్వహిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున రూ.30 వేలు విలువ చేసే సిగరెట్ ప్యాకెట్లు, రూ. 3 వేల వరకు నగదును చోరుడు దొంగిలించాడు. మరో వ్యక్తి ద్విచక్ర వాహనంపై అక్కడే వేచి ఉన్నాడు. తర్వాత ఇద్దరూ దోనేపూడి కరకట్ట వైపు వెళ్లినట్లు సీసీ ఫుటేజీల ద్వారా వెల్లడైంది. పక్కా ప్రణాళికతో దుండగులు చోరీలు చేస్తున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి. కొండలరావు తెలిపారు. కొల్లూరు ప్రాంతంలో రేయింబవళ్లు దుకాణాలు తీసి ఉండటంతో రాత్రి సమయంలో కొత్త వ్యక్తుల సంచారం అధికంగా ఉంటోంది. రాత్రి వేళ పోలీసుల గస్తీ సన్నగిల్లడం సైతం దొంగతనాలు చోటుచేసుకోవడానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇకనైనా పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పాన్షాప్లో సరుకులు చోరీ తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలో పాన్షాపులో మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. సేకరించిన వివరాల ప్రకారం.. వినుకొండ నియోజకవర్గం, నూదెండ్ల మండలం, ముప్పరాజు గ్రామానికి చెందిన గోరంట్ల సునీల్ కుటుంబ పోషణ నిమిత్తం వలస వచ్చి తాడేపల్లి పట్టణ పరిధిలోని భరతమాత సెంటర్లో పాన్షాపు అద్దెకు తీసుకుని జీవిస్తున్నారు. సోమవారం రాత్రి మూసి ఇంటికి వెళ్లారు. తెల్లవారుజామున 5 గంటలకు షాపు తీద్దామని వచ్చి చూడగా అప్పటికే తాళాలు పగలకొట్టి ఉండడాన్ని గమనించారు. దొంగలు చోరీ చేశారని గుర్తించి తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి సుమారు రూ.50 వేల సరుకులతోపాటు, సెంటు బాటిళ్లు, ఇతర వస్తువులను చోరీ జరిగాయని తేల్చారు. ప్రముఖులు తిరిగే ప్రాంతంలో సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ చోరీ జరగడంపై ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇక శివారు ప్రాంతాల్లో పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వరుస దొంగతనాలతో వ్యాపారుల బెంబేలు -
డైయేరియాతో బహుపరాక్
అతిసార ప్రాణాంతకం గుంటూరు మెడికల్: డయేరియా సోకినప్పుడు పెద్దవారు చేసే కొద్దిపాటి నిర్లక్ష్యంతో పిల్లల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అతిసార వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స అందించని పక్షంలో ప్రాణాలు పోతాయి. దేశంలో చంటి బిడ్డల్లో అతిసారం ప్రధాన సమస్యగా మారింది. ప్రతి ఏడాది 4.3శాతం చిన్నారులు అతిసార వ్యాధితో చనిపోతున్నారు. జిల్లాలో 2024లో 93 మంది ఐదేళ్లలోపు చిన్నారులు , 2025లో 105 మంది, 2026 జనవరి నుండి మే నెల వరకు 66 మంది అతిసార వ్యాధి బారిన పడ్డారు. పిల్లల్లో డయేరియా మరణాలను నివారించడమే లక్ష్యంగా ఈనెల 16 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా డయేరియా (అతిసారవ్యాధి) నియంత్రణ కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సాధారణ విరేచనం కంటే ఎక్కువ నీరు లేదా, పూర్తిగా నీళ్ల విరోచనం అవుతూ ఉంటే పిల్లలకు అతిసార వ్యాధి సోకినట్లు గుర్తించాలి. ఐదేళ్లలోపు పిల్లలకు రోజులో మూడు సార్లుకంటే ఎక్కువ సార్లు మోషన్స్ అవడం, విరేచనంలో నీటి శాతం ఎక్కువగా ఉంటే దానిని అతిసారగా గుర్తించి తక్షణమే వైద్యులను సంప్రదించాలి. అతిసార వైరస్ద్వారా సోకుతోంది. ఈ వ్యాధి సోకిన వారిలో నీటి శాతం బాగా తగ్గిపోతుంది. బిడ్డకు చంచలత్వం, చిరాకు, మైకం, అపస్మారక స్థితి, కళ్లు లోపలికి వెళ్లినట్లు ఉండటం, చర్మం స్థితిస్థాపకత లేకపోవడం, సున్నితంగా నొక్కడం వల్ల చర్మం చాలా నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకోవడం, బిడ్డ చాలా దాహంతో ఉండటం, నీరు తాగులేకపోవడం, లక్షణాలు కనిపిస్తే తక్షణమే డయేరియాగా నిర్ధారించుకుని వైద్యులను సంప్రదించాలి. జిల్లాలో డయేరియా వ్యాధి నియంత్రణ, డయేరియా మరణాల నివారణే లక్ష్యంగా 15 రోజులపాటు స్టాప్– డయేరియా పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు ప్రతి ఇంటికి తిరిగి ఐదేళ్లలోపు వయస్సు ఉన్న చిన్నారులను గుర్తించి వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ మాత్రలు అందిస్తున్నారు. హ్యాండ్ వాష్పై ఆసుపత్రుల్లో, ఇళ్ల వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పిల్లలు వ్యాధి బారిన పడకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నాం. పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఓఆర్ఎస్ – జింక్ కార్నర్స్ ఏర్పాటు చేస్తున్నాం. – డాక్టర్ అమర్తలూరి శ్రావణ్బాబు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి, గుంటూరు డయేరియాను ఓఆర్ఎస్తో పూర్తిగా కట్టడి చేయవచ్చు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందిస్తున్నారు. శుభ్రమైన పాత్రలో ఒక లీటరు తాగునీటిని పోసి నీటిని కాచి చల్లార్చి అందులో ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ను పోయాలి. పరిశుభ్రమైన స్పూన్తో ఓఆర్ఎస్ పొడిని కాచిచల్లార్చిన నీటినిలో కలిసిపోయేలా తిప్పాలి. పిల్లవాడి వయస్సు, శరీర బరువును బట్టి ఓఆర్ఎస్ ద్రావణం ఇవ్వాలి. రెండు నెలలకంటే తక్కువ వయస్సు ఉన్న శిశువుకు ప్రతి విరేచనం తరువాత ఐదు స్పూన్ల ద్రావణం పట్టించాలి. రెండు నెలల నుంచి రెండు సంవత్సరాల పిల్లలకు ప్రతి విరేచనం తరువాత అరకప్పు, రెండు నుంచి ఐదు సంవత్సరాల పిల్లలకు ప్రతి విరేచనం తరువాత ఒక కప్పు ఓఆర్ఎస్ ద్రావణం తాగించాలి. అతిసార వ్యాధి మొదలైన నాటి నుంచి విరేచనాలు తగ్గే వరకు పిల్లలకు ఓఆర్ఎస్ ఇవ్వాలి. తల్లులు పాలు తాగుతున్న పిల్లలకు తప్పనిసరిగా మోషన్స్ అవుతున్నా కూడా బ్రెస్ట్మిల్క్ ఆపకూడదు. దాంతోపాటుగా, గంజి, కొబ్బరి నీరు, పలుచని పప్పుచారు ఇవ్వడం మంచిది. ఓఆర్ఎస్తోపాటుగా జింక్ మాత్రలను కూడా పిల్లలకు ఇవ్వాలి. అతిసార వ్యాధి తీవ్రతను జింక్ మాత్ర తగ్గిస్తోంది. డయేరియా సోకిన చిన్నారులకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య సేవలందిస్తున్నాం. డయేరియా వ్యాధిపై అవగాహన, చికిత్స ఏవిధంగా అందించాలనే విషయాలపై అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ – జింక్ కార్నర్లు ఏర్పాటు చేశాం. డయేరియా సోకిన చిన్నారులకు ఏవిధంగా వైద్యం అందించాలనే విషయాలపై వైద్యులు, వైద్య సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాం. జిల్లా వ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులు 1,45,000 మంది ఉన్నారు. వీరికి 2,14,630 ఓఆర్ఎస్ ప్యాకెట్లు, 1,07,450 జింక్ మాత్రలు గ్రామస్థాయిలో వైద్య సిబ్బంది వద్ద అందుబాటులో ఉంచాం. అదనంగా రిజర్లు స్టాక్ను ఆయా ఆరోగ్య కేంద్రాల్లో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మెడికల్ స్టోర్స్ విభాగంలో సిద్ధంగా ఉంచాం. – డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ, గుంటూరు -
కుడికాలువకు నీరు నిలుపుదల
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ కుడికాలువకు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అధికారులు నీటిని నిలుపుదల చేశారు. గత నెల 25న తాగునీటి అవసరాల నిమిత్తం కృష్ణానది యాజమాన్య బోర్డు 10 టీఎంసీల నీటిని కేటాయించింది. నీటి విడుదల పూర్తి అవ్వటంతో కుడికాలువకు పూర్తిగా నీటిని నిలుపుదల చేశారు. కార్యక్రమంలో డీఈఈ టి మురళీధర్, ఏఈఈ సుధ, డ్యాం సిబ్బంది రమణ తదితరులు పాల్గొన్నారు. పెదకాకాని: సినీ నటుడు వడ్డే నవీన్ హీరోగా స్వయంగా నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ట్రానన్స్ఫర్ త్రిమూర్తులు చిత్ర బృందం వీవీఐటీయూలో సందడి చేసింది. ఈ చిత్రం జూన్ 19న విడుదల కానున్న నేపథ్యంలో ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు చిత్ర బృందం ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం నంబూరు వీవీఐటీ విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. కార్యక్రమంలో హీరో వడ్డే నవీనన్తో పాటు హీరోయిన్ రాశి సింగ్ పాల్గొన్నారు. చిత్రబృందానికి వీవీఐటీయూ ప్రో–ఛాన్సలర్ వాసిరెడ్డి మహాదేవ్ స్వాగతం పలికారు. నవీన్ మాట్లాడుతూ ఈ చిత్రం బలమైన కథాంశంతో సహజత్వానికి దగ్గరగా ఉంటుందన్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం చిత్రబృందం విద్యార్థులతో కలసి నృత్యాలు, సెల్ఫీలతో సందడి చేసింది. బాపట్లటౌన్: బైండోవర్ బాండ్ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో నిందితుడిగా ఉన్న స్టువార్టుపురం గ్రామానికి చెందిన మాదిగాని రామచంద్రకుమార్ అలియాస్ పప్పును వెదుళ్లపల్లి పోలీసులకు సోమవారం కోర్టుకు అప్పగించారు. బాపట్ల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ 30 రోజుల రిమాండ్, రూ.2 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. కోర్టు అనుమతితో సోమవారం రామచంద్రకుమార్ను బాపట్ల సబ్జైల్కు తరలించారు. గుంటూరు లీగల్: వృద్ధులకు ఏమైనా న్యాయపరమైన సమస్యలుంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా సేవలు అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ తెలిపారు. న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదే శాల మేరకు సోమవారం ఎస్వీఎన్ కాలనీ సమీపంలోని దాక్షిణ్య మానసిక వికలాంగుల స్కూల్, ఓల్డ్ ఏజ్ హోంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ తొలుత దాక్షిణ్య స్కూల్ను సందర్శించి అక్కడ ఉన్న పిల్లలతో మాట్లాడారు. వారి సమస్యల గురించి అక్కడవున్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తదనంతరం కోయవారిపాలెం, గుంటూరులోని నవీన్ ఆదర్శ్ మహిళా మండలి ఓల్డ్ ఏజ్ హోంను సందర్శించి, వృద్ధుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సత్తెనపల్లి: సత్తెనపల్లి మండలం నలందా ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని హైవే రోడ్డుపై గుర్తు తెలియని పాప తిరుగుతుండటాన్ని సత్తెనపల్లి పోలీసులు గుర్తించి పోలీసు స్టేషన్కు తీసుకొచ్చారు. పాప తన పేరు షేక్ జాన్, తండ్రి గౌస్ అని, గుంటూరు క్లబ్ వద్ద చినపలకలూరు గ్రామంగా చెబుతుందని ఎస్ఐ అమిరుద్దీన్ తెలిపారు. పాప ఆచూకీ తెలిసిన వారు సత్తెనపల్లి రూరల్ సీఐ, ఎస్ఐ, పోలీసు స్టేషన్లో సంప్రదించాలన్నారు. -
నెలాఖరులోగా కాల్వల మరమ్మతులు పూర్తి
తెనాలి టౌన్: గుంటూరు–కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని ప్రధాన పంట కాలువలు వాటి పరిధిలోని బ్రాంచ్ కెనాళ్లను ఈ నెలాఖరులోగా శుభ్రం చేసి రైతులకు జూలై మొదటి వారంలో సాగునీరు అందివ్వనున్నట్టు గుంటూరు–కృష్ణా పశ్చిమ డెల్టా తెనాలి కార్యాలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎస్. సుధాకర్ తెలిపారు. ఈమేరకు సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడా రు. ఈ ఆయకట్టు పరిధిలో 5,72,000 ఎకరాల వ్యవసాయ భూమి సాగులో ఉన్నట్టు చెప్పారు. మొత్తం 10 ప్రధాన పంట కాలువలు, వాటి కింద 50 పైబడి బ్రాంచ్ కెనాల్స్ ఉన్నట్టు వివరించారు. వీటి మెయింట్ నెన్స్కు ప్రభుత్వం రూ. 13.64కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రధాన పంట కాల్వలో గురప్రు డెక్క తొలగిస్తున్నట్టు తెలిపారు. బ్రాంచ్ కెనాల్స్కు అవసరమైనచోట్ల నూతన షట్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. 20 సెక్షన్ల పరిధిలో 284 వర్కులు.. గుంటూరు–కృష్ణా పశ్చిమ డెల్టా కార్యాలయ పరిధిలో 20 సెక్షన్లు ఉండగా మొత్తం 284 వర్కులు చేపట్టారు. ఇవన్నీ సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో వర్కులు జరుగుతున్నట్టు చెప్పారు. ప్రకాశం జిల్లాలో ఐదు వర్కులు, బాపట్ల జిల్లాలో 162, గుంటూరు జిల్లాలో 117 వర్కులు జరుగుతున్నాయన్నారు. నెలాఖరులోగా పనులు పూర్తి చేసి పంటకాలువలను అందుబాటులోకి తేనున్నట్టు వివరించారు. అయితే గురప్రు డెక్కతో నిండిన ప్రధాన పంట కాలువల మరమ్మతులు నత్తనడకన సాగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. గుంటూరు–కృష్ణా పశ్చిమ డెల్టా కార్యాలయ ఈఈ ఎస్.సుధాకర్ -
అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ఫీజులపై సోమవారం ‘ప్రైవేటు బడి.. నిలువు దోపిడీ’ శీర్షికతో ‘సాక్షి’ లో ప్రచురితమైన కథనానికి జిల్లావిద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా స్పందించారు. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు విద్యాహక్కు చట్ట ప్రకారం విడుదల చేసిన జీఓ నెం.53లో నిర్దేశించిన విధంగా ఫీజులు వసూలు చేయాలని యాజమాన్యాలను ఆదేశించారు. అదేవిధంగా క్యాంపస్లో పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగులు వంటి సామగ్రి విక్రయించరాదని స్పష్టం చేశారు. అధిక ఫీజులు వసూలు, యూనిఫాం, పుస్తకాలు, బ్యాగులు విక్రయిస్తే యాజమాన్యంపై తగుచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
రెయిన్ట్రీ పార్క్ విల్లాలో భారీ చోరీ
సుమారు 475 గ్రాముల బంగారం చోరీ మంగళగిరి టౌన్: మంగళగిరి ప్రాంతంలోని ఓ విల్లాలో శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది. మంగళగిరి మండలం కాజ గ్రామం రెయిన్ట్రీపార్క్లోని ఓ విల్లాలో అడ్వకేట్ శైలేంద్ర నివాసముంటున్నాడు. ఆయన భార్య చినకాకానిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్. శైలేంద్ర నివాసముంటున్న విల్లా సెకండ్ ఫ్లోర్లో అతడి తల్లిదండ్రులుంటున్నారు. శైలేంద్ర భార్య శనివారం రాత్రి ఆస్పత్రిలో నైట్ డ్యూటీకి వెళ్లింది. స్నేహితులను కలిసేందుకు శైలేంద్ర శనివారం సాయంత్రం విజయవాడ వెళ్లాడు. తిరిగి ఆదివారం తెల్లవారుజామున తను విల్లాకు చేరుకున్నాడు. మొదటి అంతస్తులో ఉన్న గదికి వెళ్లగా.. అక్కడ వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో పాటు, ఆల్మరాలు తెరిచి ఉన్నాయి. మెయిన్ బెడ్రూమ్లో ఉండాల్సిన ఐరన్ సేఫ్ కనిపించలేదు. సెకండ్ ఫ్లోర్లో శైలేంద్ర తల్లిదండ్రులు ఆ సమయానికి నిద్రపోతున్నారు. వారి గది తప్ప విల్లాలోని అన్ని గదుల్లో ఉన్న ఆల్మరాలు తెరిచి ఉండటంతో ఇంట్లో దొంగలు పడ్డారని నిర్ధారించుకుని వెంటనే భార్యకు సమాచారం ఇచ్చాడు. మాస్టర్ బెడ్రూమ్ సేఫ్ లాకర్, డెస్క్లో ఉన్న బంగారు ఆభరణాలు సుమారు 475.5 గ్రాములు, రూ.3 లక్షల విలువైన పలు వస్తువులు, 350 యూఎస్ డాలర్లు చోరీకి గురైనట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం విల్లాను పరిశీలించారు. పోలీసు జాగిలాల బృందం సాయంతో నిందితుల ఆనవాళ్లను గుర్తించాలని, సీసీ టీవీ ఫుటేజ్లను, ఇతర సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితులను గుర్తించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. -
ప్రైవేటు బడి.. నిలువు దోపిడీ!
గుంటూరు ఎడ్యుకేషన్ :‘‘గుంటూరు నగరంలోని కొరిటెపాడుకు చెందిన శ్రీరామ్ ఓ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్గా ఉద్యోగం చేస్తున్నారు. తన ఇద్దరు పిల్లలను సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించారు. ఒకటో తరగతిలో చేర్పించిన బాబుకు రూ.22 వేల ఫీజుతోపాటు పుస్తకాలు, యూనిఫాం కోసం అదనంగా రూ.4,500 వేలు చెల్లించాలని స్కూల్లో చెప్పారు. అదే విధంగా రెండో తరగతిలో చేర్పించిన కుమార్తెకు ఫీజు రూపంలో రూ.24 వేలతోపాటు పుస్తకాలు, యూనిఫాం కోసం రూ.6 వేలు చెల్లించాలని చెప్పారు. ప్రభుత్వ పాఠ్య పుస్తకాల వెల ఒక్కో విద్యార్థికీ రూ.500 లోపే కదా అని అడిగితే ప్రభుత్వ పుస్తకాలను మార్కెట్లో కొనుక్కోవాలని, తాము సూచించిన పుస్తకాలను క్యాంపస్లోనే కొనుగోలు చేయాలని పాఠశాల యాజమాన్యం దబాయించింది. ఫలితంగా చిరుద్యోగం చేస్తూ నెలకు రూ.18 వేలు సంపాదిస్తున్న శ్రీరామ్ ఇద్దరు పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చదివించడం పెనుభారంగా మారింది. వచ్చే కొద్దిపాటి జీతంతో కుటుంబాన్ని పోషించడంతోపాటు పిల్లలను ఏ విధంగా చదివించాలని ఆవేదన చెందుతున్నారు.’’ చంద్రబాబు పాలనలో పట్టించుకునే దిక్కేది? టీడీపీ పాలనలో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలపై నియంత్రణ కరువైన ఫలితంగా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల దోపిడీతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు. గతేడాదితో పోల్చితే ఫీజులను 20 శాతం నుంచి 30 శాతం మేరకు అడ్డగోలుగా పెంచేశారు. ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతికి ఫీజు రూ.20 నుంచి రూ.22 వేల మధ్యలో ఉంది. కార్పొరేట్ స్కూల్లో అది రూ.30 వేలు చేశారు. కార్పొరేట్ పాఠశాలలో 6వ తరగతికి రూ.40 వేల నుంచి రూ.45 వేలు, పదో తరగతికి రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్న పాఠశాలలు ఉన్నాయి. అదే విధంగా 6వ తరగతి నుంచి ఐఐటీ, నీట్ ఫౌండేషన్ పేరుతో నిర్వహిస్తున్న వివిధ ప్రోగ్రామ్లకు ఒక్కో విద్యార్థి నుంచి రూ. 60 వేల మొదలు రూ.లక్ష వరకూ వసూలు చేస్తున్నారు. ఏసీ క్యాంపస్లతో కూడిన పాఠశాలల్లో ఒకటో తరగతికి రూ.60 వేలు, టెన్త్కు రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. నాణ్యమైన విద్య అందని పరిస్థితులు ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) రూపొందించిన పాఠ్యాంశాల బోధనకు బదులుగా ఆయా పాఠశాలల యాజమాన్యాలు అనధికార పాఠ్యపుస్తకాలతో తరగతులను నిర్వహిస్తున్నారు. గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎస్సీఈఆర్టీ ద్వారా రూపొందించి, ముద్రించిన పాఠ్య పుస్తకాలనే బోధించాలని ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు తమ వద్ద లేవని, వాటిని బహిరంగ మార్కెట్లో కొనుక్కోవాలని చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బోధన చేస్తున్న పాఠ్యాంశాలనే ప్రైవేటు విద్యార్థులకూ తప్పనిసరి చేస్తూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయానికి చంద్రబాబు సర్కార్ తూట్లు పొడించింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 637 ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయి. సొంత సిలబస్ బోధించి, పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పత్తా లేని యాజమాన్య కమిటీలు ప్రైవేటు పాఠశాలల్లో ఇష్టారాజ్యంగా ఫీజులను పెంచేందుకు నిబంధనలు అంగీకరించవు. పాఠశాల యాజమాన్య కమిటీ ఆయా విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించి, బడిలో కల్పిస్తున్న సదుపాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. గత విద్యాసంవత్సరంలో వసూలు చేసిన ఫీజులకు ఐదు శాతమే పెంచాల్సి ఉంది. కానీ ఇవేమీ అమలు కావడం లేదు.విద్యార్థుల నుంచి ఫీజులు మొదలు ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలను క్యాంపస్లలోనే దుకాణం తెరిచి విక్రయిస్తున్నారు. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను పక్కనపెట్టి, ప్రైవేటు పబ్లిషర్లతో డీల్ కుదర్చుకుని పాఠ్య పుస్తకాలు, నోటుబుక్లు విక్రయిస్తున్నారు. ఈ విధంగా ఒక్కో విద్యార్థికి విక్రయిస్తున్న పుస్తకాల ధరలో కనీసం 50 శాతం మేరకు లాభాలను ఆర్జిస్తున్నారు. వివిధ పాఠశాలలు పాఠ్య పుస్తకాలతో పాటు నోటు పుస్తకాలు యూనిఫాం, బెల్టు, టై సహా అన్ని రకాల సామగ్రిని క్యాంపస్లలోనే విక్రయిస్తున్నాయి. మరికొన్ని పాఠశాలలు మార్కెట్లోని వస్త్ర విక్రయ దుకాణదారులతో ఒప్పందం కుదుర్చుకుని దండుకుంటున్నాయి. తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
క్రమశిక్షణతో చదివి ఉన్నతంగా ఎదగాలి
ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెనాలి: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం, ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సూచించారు. పట్టణానికి చెందిన రజక వలంటరీ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో తొమ్మిదో వార్షికోత్సవాన్ని ఆదివారం స్థానిక తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. సొసైటీ అధ్యక్షుడు పోతార్లంక ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు చెందిన సంఘీయులైన వందమంది విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడారు. ప్రొఫెసర్ నిరంజన్, పులిగడ్డ నారాయణరావు, కొండేటి సురేష్, తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, విశ్రాంత మున్సిపల్ కమిషనర్ వల్లూరు మహాలక్ష్మీపతి, ఏపీ ట్రాన్స్కో డీఈఈ పాగోలు భవాని తదితరులు మా ట్లాడారు. విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.2 వేల ఉపకార వేతనం, నోట్ పుస్తకాలు, బ్యాగులు, డ్రెస్ మెటీరియల్ తదితరాలు పంపిణీ చేశారు. సొసైటీ ప్రధాన కార్యదర్శి పేటేటి శ్రీనివాస్, శివనాగేశ్వరరావు, పెదలంక వెంకటేశ్వరరావు, మోపిదేవి శ్రీనివాస్, నాంచారయ్య, పెసర్లంక రమణ తదితరులు పాల్గొన్నారు. ‘పంచాయతీరాజ్ మినిస్టీరియల్’ అసోసియేషన్ సమావేశం గుంటూరు రూరల్: నగరంలోని మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మినిస్టీరియల్ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. రాష్ట్ర కమిటీకి నిర్వహించాల్సిన ఎన్నికలను జూలై 31లోగా పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు. గత కొంతకాలంగా రాష్ట్ర కమిటీ ఎన్నికలు జరగకపోవడం వల్ల అసోసియేషన్ కార్యక్రమాలు సరైన రీతిలో జరగలేదని దానివల్ల పంచాయతీరాజ్శాఖలో జరిగిన పరిపాలన సంస్కరణలో పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్కు సరైన న్యాయం జరగలేదని పలువురు జిల్లా అధ్యక్షులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీవోల పదోన్నతులలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కు అన్యాయం జరిగిందని సమావేశంలో అభిప్రాయపడ్డారు. దశాబ్దాలు గా పదోన్నతులు లేక అన్యాయానికి గురైన రికార్డు ల్యాబ్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్లకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించాలని సమావేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 30 సంవత్సరాల పైన ఒకే క్యాడర్లో పనిచేస్తున్న రికార్డు అసిస్టెంట్లకు ఒక్క ప్రమోషన్ కూడా లభించకపోవడం చాలా బాధాకరమన్నారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న జిల్లా పరిషత్ నాన్ టెక్నికల్ సిబ్బందిని నిబంధనలకు విరుద్ధంగా సరెండర్ చేస్తున్నారని, ఈ ప్రక్రియను వెంటనే ని లుపుదల చేయకపోతే ప్రత్యక్ష కార్యచరణకు వెళ్లా లని కార్యవర్గంలో తీర్మానించారు. సంఘం రాష్ట్ర ట్రెజరర్ పి.దస్తగిరిబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.మోహన్రావు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రా ఘవులు, సంఘం వివిధ జిల్లాల అధ్యక్షులు ముర ళి, సత్తిబాబు, శ్రీధర్రాజు, ప్రసాద్, నిర్మలభారతి, పెంచలయ్య, మురళీధర్రెడ్డి, శశిధర్, గుంటూరు జిల్లా కార్యదర్శి శామ్యూల్ పాల్,ఉద్యోగులు పాల్గొన్నారు. పైపుల వ్యాపారి బలవన్మరణం గుంటూరు రూరల్: ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యలతో పైపుల వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్లపాడు పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ భాస్కర్ తెలిపిన వివరాలు.. ఏటుకూరుకు చెందిన ఎ.రాంబాబు(60) గ్రామంలోని బొంతపాడు రోడ్డులో పైపుల వ్యాపారం చేస్తూ జీవిస్తుంటాడు. ఇటీవల వ్యాపార లావాదేవీలు ఇబ్బందికరంగా ఉండటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో తన ఆఫీసులో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. -
టెట్పై ప్రభుత్వం స్పందించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ను రద్దు చేయించే దిశగా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆదివారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో సంఘ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యు. రాజశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం టెట్ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విద్యాహక్కు చట్టంలో మార్పులు చేయించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కళాధర్ మాట్లాడుతూ 50 ఏళ్లుపైబడి బీపీ, షుగర్ తదితర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, పాఠశాలలో అననుకూల పరిస్థితుల మధ్య ఒత్తిడిలో ఉన్న ఉపాధ్యాయులకు ఏ ఇతర ఏ ప్రభుత్వశాఖలోనూ లేని విధంగా ఇన్ సర్వీస్ పరీక్ష పెట్టడం తగదన్నారు. ఉపాధ్యాయులు టెట్లో అర్హత సాధించడంపై ధ్యాసపెడితే బోధనకు విఘాతం కలుగుతుందన్నారు. రాష్ట్ర సహాధ్యక్షురాలు ఏఎన్ కుసుమ కుమారి మాట్లాడుతూ టెట్ రద్దు కోసం యూటీఎఫ్ చేపట్టే కార్యాచరణలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన టెట్లో ఉన్న అసంబద్ధ నిర్ణయాలు ఇన్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు ఇబ్బందికరమన్నారు. సమావేశంలో సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు పీవీ శ్రీనివాసరావు, జిల్లా సహాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, ఎండీ షకీలా బేగం, జిల్లా కోశాధికారి ఎండీ గయాసుద్దౌలా, జిల్లా కార్యదర్శి ఆదినారాయణ, సాంబశివరావు, ఆంజనేయులు, అడవి శ్రీను, కె. కేదార్నాథ్, బి.ప్రసాదు, ఎం.కోటిరెడ్డి, కె.కామాక్షి పాల్గొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు -
వందేళ్ల బళ్లబాటకు పరిశ్రమ నిర్మాణంతో సమస్య
వందేళ్ల నుంచి రైతుల రాకపోకలకు ఉపయోగించే బళ్లబాటకు ప్రస్తుతం నిర్మించిన ప్లాస్టిక్ పరిశ్రమ వల్ల సమస్య వచ్చింది. నిర్మాణ సమయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా సహకరిస్తామని చెప్పి ఇప్పుడు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. – అడుసుమల్లి నరసింహారావు, రైతు, చేబ్రోలు పరిశ్రమ నిర్మాణంతో రాకపోకల కోసం ఉన్న బళ్లబాట మూసుకునిపోయి ఇబ్బందులు పడుతున్నామని రైతులు మా దృష్టికి తీసుకువచ్చారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. కంపెనీ ప్రతినిధులు, రైతులతో మాట్లాడి పొలాల్లో బళ్లబాటకు ఇబ్బందులు లేకుండా అందరితో మాట్లాడి పరిష్కరిస్తాం. – కె.శ్రీనివాసశర్మ, తహసీల్దార్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ పరిశ్రమ వల్ల బళ్లబాట సమస్య, సాగునీటి సమస్యలు ఏర్పడ్డాయి. నేను రైతును తోటి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తానని హమీ ఇచ్చిన కంపెనీ యజమాని నిర్మాణం పూర్తి దశలో మీకు చేతనైంది చేసుకోండి అంటూ అహకారంతో చిన్న చూపుతో మాట్లాడుతున్నాడు. కంపెనీ ముందు ఉన్న సాగునీటి కాలువ మీద సిమెంటు తూము వేసి పూడ్చివేయటంతో సాగునీటి సమస్య ఏర్పడింది. రైతుల వాహనాలు, పంట ఉత్పత్తులు రాకపోకలు సాగించే బళ్లబాటకు ఆటంకం కలిగించే విధంగా ప్రహరీ నిర్మిస్తుండటంతో సుమారు 600ఎకరాల్లోని రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. – శరణం మల్లికార్జునరావు, రైతు, చేబ్రోలు -
దర్జాగా బళ్లబాట కబ్జా
చేబ్రోలు: చేబ్రోలు గ్రామంలో వంద సంవత్సరాల చరిత్ర కలిగిన సాంప్రదాయ ‘బళ్ల బాట’ మూసివేతపై స్థానిక రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రమైన చేబ్రోలు గ్రామ పరిధిలోని కొమ్మమూరు బ్రిడ్జి సమీపంలో జీబీసీ రహదారి పక్కన సర్వే నెంబర్ 963–1బి లో 1.66 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన అధికార పార్టీ పొన్నూరు నియోజకవర్గ ముఖ్యనేత అనుచరుడు పరుచూరి సత్య కిషోర్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ పరిశ్రమను కొంతకాలం క్రితం నిర్మించాడు. వ్యవసాయ భూమిలో నిర్మాణాలు చేపట్టే సమయంలో బళ్లదారికి ఇరువైపులా ఉన్న రైతులందరితో సదరు యజమాని అనుకూలంగా మాట్లాడాడు. ప్రధాన రహదారి రోడ్డు నుంచి రైతులకు అనుకూలంగా ‘బళ్ల బాట’ (రైతుల రాకపోకలకు దారి) వదులుతానని నమ్మబలికాడు. అయితే కంపెనీ నిర్మాణం పూర్తయిన తర్వాత మాట మార్చడమే కాకుండా, ప్రస్తుతం రైతులకు ఉన్న ఏకై క దారిని సైతం మూసివేస్తూ అక్కడ శాశ్వత రక్షణ గోడను నిర్మించారు. దీనిపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేయగా, ‘నేను దారి ఇచ్చేది లేదు, మీకు చేతనైంది చేసుకోండి, నాకు అన్ని అనుమతులు ఉన్నాయి’ అంటూ సదరు అధికార పార్టీ ముఖ్యనేత అనుచరుడు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 600 ఎకరాలపై ప్రభావం.. రైతుల పంట పొలాలకు ట్రాక్టర్లు, పంట ఉత్పత్తులు తరలించటానికి రాకపోకలకు ఉపయోగించే బళ్ల బాట మూసుకుపోవడం వల్ల దాదాపు 600 వందల ఎకరాలకు పైగా ఉన్న పంట పొలాలకు వెళ్లే మార్గం పూర్తిగా మూసుకుపోయింది. పొలాల్లో పండిన పంటను ఇంటికి లేదా మార్కెట్కు తరలించడానికి, వ్యవసాయ సామగ్రిని పొలాల్లోకి తీసుకెళ్లడానికి ఈ దారి తప్ప రైతులకు ప్రత్యామ్నాయ మార్గం లేదు. కంపెనీ యాజమాన్యం నిర్మాణ పనులను వేగవంతం చేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. తూర్పు వైపు ప్రహారీ నిర్మాణం, ఉత్తరం వైపున ప్రహరీ నిర్మాణాలను కొంత భూమి బళ్లబాట కోసం రైతులకు ఉపయోగపడే విధంగా వదలకుండా పనులు పూర్తి చేస్తుండటంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో ముప్పు మాగాణి భూమిలో నిర్మాణం జరిగిన ప్లాస్టిక్ బకెట్లు, వస్తువుల తయారీ కంపెనీ వలన చుట్టుపక్కల భూములకు ముప్పు ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్లాస్టిక్ పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాల వల్ల భవిష్యత్తులో చుట్టుపక్కల భూములన్నీ బీడు భూములుగా మారే ప్రమాదం పొంచి ఉందని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బళ్లబాట సమస్యపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, అక్కడ న్యాయం జరగకుంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా కంపెనీ ముందు భాగంలో ఉన్న సాగునీటి కాలువ పూడ్చివేతపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సిమెంటు తూము వేసి పరిశ్రమలోకి రాకపోకలు చేస్తున్నారు. కాలువలోకి గ్రావెల్ జారిపోవటంతో కాలువ పూడిపోయింది. సిమెంటు తూమును తీసివేసి వంతెన కల్వర్టు నిర్మాణం చేసుకోవాలని రైతులు సూచిస్తున్నారు. -
గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్
పట్నంబజారు: లిక్విడ్ గంజాయిని తరలిస్తూ.. బీటెక్ విద్యార్థితో పాటు ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు. లాలాపేట పోలీసు స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ సబ్ డివిజన్ ఇన్చార్జి, మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డి, లాలాపేట పోలీసు స్టేషన్ సీఐ ఏవీ శివప్రసాద్ వివరాలను మీడియాకు వెల్లడించారు. గుంటూరు నగరంలోని పాతగుంటూరు, సంగడిగుంట ప్రాంతాలకు చెందిన రామిశెట్టి మహవీర్, అబ్బు సాయిమణికంఠతేజ, షేక్ రెహ్మాతుల్లాలు స్నేహితులు. వీరిలో ప్రధాన నిందితుడైన రామిశెట్టి మహావీర్ గంజాయికి అలవాటుపడి, డబ్బులు కోసం ఒడిశా ప్రాంతం నుంచి లిక్విడ్ గంజాయిని తీసుకుని వచ్చి గుంటూరులో విక్రయిస్తున్నాడు. శనివారం ఐపీడీ కాలనీలో సమీపంలోని సత్యసాయి బాబా ట్రస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ ఎస్యూవీ కారులో ముగ్గురు అనుమానాస్పదంగా ఉండటాన్ని గమనించారు. అదుపులోకి తీసుకుని విచారించటంతో పాటు వాహనాన్ని తనిఖీ చేయగా లిక్విడ్ గంజాయి దొరికింది. వీరిలో ప్రధాన నిందితుడిగా ఉన్న రామిశెట్టి మహావీర్ ఒక కళాశాలలో బీటెక్ అభ్యసిస్తున్నాడని పోలీసులు తెలిపారు. వీరికి సహకరిస్తున్న మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి 2కిలోల 110 గ్రాముల గంజాయి లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి, నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. -
వైఎస్ జగన్ను విమర్శించే స్థాయి లేదు
గుంటూరు ఎడ్యుకేషన్: కార్పొరేటర్గా సైతం గెలవని పిల్లి మాణిక్యరావుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి, అర్హత లేవని వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ విభాగ అధ్యక్షుడు గెడ్డేటి సురేంద్ర అన్నారు. ఆదివారం బృందావన్ గార్డెన్స్లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సురేంద్ర మాట్లాడుతూ... గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను కట్టబెట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ సామాజిక వర్గానికి అన్యాయం చేసిన చంద్రబాబుకు ఆ సామాజిక వర్గానికి రాజ్యాంగ పదవుల్లో సముచిత స్థానం కల్పించిన వైఎస్ జగన్తో పోలికా అని అన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క సంక్షేమ పథకం గుర్తుకు రాదని, ఆయన్ను ఎవ్వరూ నమ్మరని ఆరోపించారు. యూటర్న్కు, వెన్నుపోటుకు, క్రెడిట్ చోరీకి ఆయన చిరునామా అన్నారు. మహానేత వైఎస్సార్ వేసిన పునాదులతో పైకి వచ్చిన వైఎస్ జగన్ రెండుసార్లు ఎంపీగా గెలవడంతోపాటు 151 మందిని ఎమ్మెల్యేలుగా గెలిపించి, ముఖ్యమంత్రిగా సంక్షేమ పాలన అందించారని అన్నారు. స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకుని, రూ.కోట్ల అవినీతికి పాల్పడిన డీఎస్సీ వ్యవహారంపై పిల్లి మాణిక్యరావుకు దమ్ముంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో మాట్లాడించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం రెండేళ్లలో హామీలు అమలు చేయని ఫలితంగా రాష్ట్ర ప్రజలు రూ.లక్షన్నర కోట్లు నష్టపోయారని ఆరోపించారు. గొడ్డలి పార్టీ అని తప్పుడు విమర్శలు చేస్తున్న పిల్లి మాణిక్యరావు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సైతం అనేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే వైఎస్సార్ సీపీ తరఫున తాము చేసిన ఆరోపణలపై సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీలో ఎమ్మెల్యేలు, మంత్రులు లేక పిల్లి మాణిక్యరావుతో పదే పదే అబద్ధాలు, ఆరోపణలు చేయిస్తున్నారా అని మండిపడ్డారు. జిల్లాలో ఎస్సీ విభాగంలో టాపర్లుగా వచ్చిన అభ్యర్థులకు డీఎస్సీలో పోస్టులు ఇవ్వకుండా, డబ్బులు తీసుకుని అనర్హులకు పోస్టింగ్స్ ఇచ్చారని ఆరోపించారు. ఎస్సీ విభాగ నగర అధ్యక్షుడు పాటిబండ్ల కిరణ్కుమార్ మాట్లాడుతూ మాణిక్యరావు పదే పదే వైఎస్ జగన్ను విమర్శిస్తున్నారని, కార్పొరేటర్గా గెలుపొందని మాణిక్యరావుకు ఆ అర్హత లేదన్నారు. ప్రజా ప్రతినిధిగా గెలుపొందని మాణిక్యరావు లిడ్క్యాప్ చైర్మన్గా ఎస్సీల సంక్షేమం కోసం పని చేయడం మాని, టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నిత్యం వైఎస్ జగన్ను విమర్శిస్తున్నారని అన్నారు. తూర్పు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు అంకాలరాజు మాట్లాడుతూ డీఎస్సీపై చేసిన ఆరోపణలకు ప్రభుత్వంతో ఎటువంటి సంబంధం లేని మాణిక్యరావు తమపై ఎదురు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. టీడీపీ రెండేళ్ల పాలనలో రాష్ట్రంలోని 66 లక్షల పెన్షన్లలో ఆరు లక్షల పెన్షన్లు ఎత్తేశారని, పిల్లి మాణిక్యరావు దళితుల్లో ఏ ఒక్కరికై నా పెన్షన్ ఇప్పించారా అని ప్రశ్నించారు. డీఎస్సీపై లోకేష్తో ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. పశ్చిమ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు జి.ప్రభు మాట్లాడుతూ మాణిక్యరావు అదే పనిగా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ను, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. అధికారం ఉంది కదా అని విర్రవీగితే వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో మూతబడిన 400 చర్మకారుల కుటీరాలను తెరిపించడంలో లిడ్క్యాప్ చైర్మన్గా ఉన్న పిల్లి మాణిక్యరావు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. సమావేశంలో నాయకులు మనోజ్, వెంకట్రావు బత్తుల, కూచిపూడి కిరణ్, బాబు, సందీప్, దుర్గారావు, పాలపర్తి గోవర్ధన్ పాల్గొన్నారు. -
అతిసార నివారణకు ఓఆర్ఎస్ ద్రావణం
గుంటూరు మెడికల్: అతిసార నివారణకు ఓఆర్ఎస్ ద్రావణమే ప్రాణాధారమని జిల్లా వైద్య , ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో చంటి బిడ్డల్లో అతిసారం ప్రధాన ప్రజారోగ్య సమస్యగా పరిణమించిందన్నారు. ప్రతి సంవత్సరం అతిసారం వల్ల ఐదు సంవత్సరాల పిల్లల్లో 4.3% మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. డయేరియా నివారణకు ముందస్తు గుర్తింపు, ఓఆర్ఎస్ ద్రావణం, జింక్ మాత్రల వినియోగం ద్వారా ఈ మరణాలను నిరోధించవచ్చన్నారు. అతిసార వ్యాధి నివారణలో భాగంగా దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం స్టాప్ – డయేరియా క్యాంపెయిన్ చేపట్టిందన్నారు. డయేరియా నివారణకు పరిశుభ్రత ఓఆర్ఎస్ పాకెట్స్ వినియోగంపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఇందులో భాగంగా జూన్ 1 నుంచి 15 వ తేదీ వరకు సన్నద్ధత దశ అని పేర్కొన్నారు. జూన్ 16 నుంచి 31 వ తేదీ వరకు కార్యాచరణ దశ అన్నారు. జూన్ 16 వ తేదీ నుంచి జరిగే కార్యాచరణ దశలో భాగంగా చంటి బిడ్డలకు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించుట, రోటా వైరస్ వ్యాక్సిన్ అందజేయుట, చేతుల పరిశుభ్రత, రక్షిత తాగునీరు అందజేయుట, ఇంటింటికీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ టాబ్లెట్లు అందజేయాలన్నారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో తప్పనిసరిగా ఓఆర్ఎస్, జింకు కార్నర్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా 1,45,000 మంది ఐదేళ్లలోపు చంటిబిడ్డలకు అందజేయుటకు 2,14,630 ఓఆర్ఎస్ ప్యాకెట్లు, 1,07,450 జింక్ టాబ్లెట్లు గ్రామస్థాయిలో అందుబాటులో ఉంచామని వెల్లడించారు. -
ఇచ్చినట్లే ఇచ్చి.. వెనక్కి!
తెనాలిరూరల్: అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారుల లీలలు విచిత్రంగా ఉన్నాయి. అధునాతన వాహనాన్ని వెనక్కి తీసుకుని పాత వాహనాన్ని తెనాలికి పంపారు. ఏప్రిల్ 14వ తేదీన తెనాలి అగ్నిమాపక కార్యాలయానికి ప్రత్యేక అగ్నిమాపక శకటాన్ని కేటాయించి పంపారు. పంపిన రెండు రోజులకే వెనక్కి పిలిపించి రాష్ట్ర సచివాలయంలో ఉంచారు. పరిధి పెద్దదైన తెనాలి కార్యాలయం కింద తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల, చేబ్రోలు, బాపట్ల జిల్లా చుండూరు, వేమూరు, అమృతలూరు, కొల్లూరు మొత్తం ఎనిమిది మండలాలు ఉన్నాయి. ఇక్కడ దశాద్దాల క్రితమే రెండు వాహనాలు అవసరముందని భావించిన అధికారులు రెండు వాహనాలను కేటాయించారు. ఒక వాహనం దశాబ్దంన్నర క్రితం శిథిలావస్థకు చేరుకోగా అప్పటి నుంచి కేవలం ఒక్క వాహనంతోనే నెట్టుకువస్తున్నారు. ఇటీవల రెండో వాహనం కేటాయించి పంపడంతో అగ్నిప్రమాదాల్లో ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని అందరూ భావించారు. ఈ ఆనందం కేవలం రెండు రోజుల్లోనే ఆవిరైపోయింది. -
సర్చూసుకునేందుకు సిద్ధమా...
నెహ్రూనగర్: ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటరు జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)’పై అందరిలోనూ ఆందోళన నెలకొంది. సర్వేలో భాగంగా బీఎల్ఓలు ఇప్పుడు ఎన్యుమరేషన్ ఫారం–2ను ఓటరు నింపి మళ్లీ అందజేయాల్సి ఉంటుంది. ఇందులో వ్యక్తిగత వివరాలతో పాటు తన కుటుంబం 23 ఏళ్లగా భారతదేశంలోనే ఉన్నట్టు ధ్రువీకరించే వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలోనే పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులు ఓట్లను టార్గెట్ చేసి ‘23 ఏళ్ల నివాసం’ పేరుతో భారీగా ఓట్లు గల్లంతు చేస్తుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఆయా రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలతోపాటు ఓటర్లు అప్రమత్తంగా లేకపోతే పెద్ద మొత్తంలో ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉంది. అందుకే జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసిన ‘సర్’ హాట్ టాపిక్గా మారింది. ‘సర్’ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ ప్రజల్లో మాత్రం పలు అనుమానాలు నెలకొన్నాయి. 2002 తర్వాత మళ్లీ ఇప్పుడు... గుంటూరు జిల్లాలో తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు నియోజకవర్గాలతో కలిపి మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో పురుషులు 8,69,950 మంది, మహిళలు 9,31,668, ట్రాన్స్జెండర్స్ 165, మొత్తం 18,01783 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో 2002లో చివరిసారిగా ‘సర్’ ప్రక్రియ చేపట్టారు. సరిగ్గా 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు సర్వే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బీఎల్ఓలు 2002 ఓటరు జాబితా ప్రాతిపదికన ప్రస్తుత ఓటరు జాబితాను పరిశీలిస్తారు. ఈ నెల 15 (సోమవారం) నుంచి జూలై 14 వరకూ బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓ) ఇంటింటికీ వచ్చి సర్వే చేస్తారు. సర్వే వివరాల ఆధారంగానే ముసాయిదా ఓటరు జాబితా ప్రకటిస్తారు. వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి తుది జాబితా ప్రకటిస్తారు. ఫారం–2లో ఏం నింపాలి.. ‘సర్’ కార్యక్రమంలో ప్రతి ఓటరు ఎన్యుమరేషన్ ఫారం–2 నింపి, బీఎల్ఓకు అందజేయాల్సి ఉంటుంది. నిరక్షరాస్యులకు ఈ ప్రక్రియ అంత సులువు కాదు. 2002 నాటి ఓటరు జాబితాలో మీ పేరు ఉందా.. ఆ వివరాలు ఎన్యుమరేషన్ ఫారంలో నింపాలి. అప్పటి జాబితాలో మీ పేరు లేకపోతే.. మీ తల్లిదండ్రులు లేదా భార్య/భర్త లేదంటే ఇతర కుటుంబికుల పేరు ఉంటే వారి వివరాలు నమోదు చేయాలి. వీటితోపాటు పుట్టిన తేదీ, ఆధార్, మొబైల్ నంబర్, తండ్రి / సంరక్షకుడి పేరు, తల్లి పేరు, భార్య / భర్త పేరు, వారి ఎపిక్ నంబర్ (అందుబాటులో ఉంటే) తదితర వివరాలు నింపి, కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫొటో అతికించి బీఎల్ఓకు అందజేస్తే ఇందుకు రశీదు ఇస్తారు. దీన్ని తప్పనిసరిగా భద్రపరచుకోవాలి. ‘సర్’లో ముఖ్యమైన తేదీలు బూత్ లెవల్ ఏజెంట్లదే కీలక పాత్ర.. సర్ విషయంలో రాజకీయ పార్టీలు, వారి పార్టీల బీఎల్ఏలు (బూత్ లెవల్ ఏజెంట్లు) అప్రమత్తంగా ఉండాలి. తమ బూత్ పరిధిలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు. ఎంత మంది ఓట్లు మ్యాపింగ్ అయ్యాయి.. ఎంత మందివి మ్యాపింగ్ కాలేదు... అనే వివరాలు తెలుసుకుని ఉండాలి. మ్యాపింగ్ కాని ఓటర్ల వద్దకు వెళ్లి అవసరమైన డాక్యుమెంట్లతో సిద్ధంగా ఉండేలా చూడాలి. బీఎల్ఓ వచ్చినపుడు వివరాలను సమర్పించేలా చూసి మ్యాపింగ్ చేయించాలి. 2002 ఓటరు జాబితాలో ఓటరుగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం ఆ ఇంటిలో లేకపోతే.. ఇంటిలో ఉన్న ఓటరు తాలూకా బంధువుల నుంచి వివరాలు ఇప్పించి మ్యాపింగ్ చేయించాలి. ఈ విషయంలో తప్పులు దొర్లితే ఓట్లు గల్లంతు అయ్యే ప్రమాదం లేకపోలేదు. ఈ నెల 15 నుంచి బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికీ వచ్చి ఓటరు వివరాల సర్వే చేస్తారు. వారు అప్పుడు అడిగే ఎపిక్ కార్డు (ఓటరు గుర్తింపు కార్డు), రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, 2002 ఓటరు జాబితా వివరాలు, తల్లిదండ్రులు లేదా తాతల ఎపిక్ కార్డులు ప్రజలు సిద్ధంగా ఉంచుకోవాలి. ప్రతి ఓటరుకు రెండు ఎన్యుమరేషన్ ఫారాలు ఇస్తారు. ఒకటి నింపి వారికిచ్చి, మరొకటి రశీదుగా తీసుకోవాల్సి ఉంటుంది. పారదర్శక ఓటరు జాబితా కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలి. – కె.మయూర్ అశోక్, జీఎంసీ కమిషనర్ -
జాతీయ ఈత పోటీలకు టెక్నికల్ అధికారిగా సురేష్
నరసరావుపేట ఈస్ట్: శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల స్విమ్మింగ్ పూల్ కోచ్ జి.సురేష్ 79వ సీనియర్ జాతీయ ఆక్వాటిక్ చాంపియన్షిప్ పోటీలకు టెక్నికల్ అధికారిగా నియమితులయ్యారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు పోటీలు జరగనున్నాయి. స్విమ్మింగ్ కోచ్గా కొనసాగుతున్న సురేష్ గతంలోనూ పలు అంతర్జాతీయ, జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీలకు పర్యవేక్షకునిగా వ్యవహరించారు. ఆక్వాటిక్స్లో సురేష్కు ఉన్న నైపుణ్యానికి, నిబద్ధతకు ఈ ఎంపిక నిదర్శనమని పలువురు పేర్కొన్నారు. సురేష్కు కళాశాల యాజమాన్య ప్రతినిధులు, పల్నాడు జిల్లా సిమ్మింగ్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు. బాపట్ల: సూర్యలంక బీచ్ వద్ద సముద్రంలో నీటిలో గల్లంతైన బాలుడిని సాహసోపేతంగా పోలీసులు, మైరెన్ సిబ్బంది ఆదివారం కాపాడారు. మధ్యాహ్నం సమయంలో కర్లపాలెంకు చెందిన కంబం కమల్ దాస్ (17) తన నలుగురు స్నేహితులతో సూర్యలంక బీచ్లో సముద్ర స్నానానికి వెళ్లాడు. అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రవాహానికి లోతైన నీటిలోకి కొట్టుకుపోయాడు. విధుల్లో ఉన్న మైరెన్, బాపట్ల రూరల్ పోలీసులు బాలుడిని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చారు. మరో ఘటనలో.. చీరాల: చీరాల మండలం తోటవారిపాలేనికి చెందిన అఖిలేష్ (17) కుటుంబ సభ్యులు, స్నేహితులతో వాడరేవు సముద్రతీరానికి వచ్చాడు. అలల తాకిడికి కొట్టుకుపోతుండటంతో పోలీసులు రక్షించి ఒడ్డుకు చేర్చారు. మెరుగైన చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. తెనాలి: డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా బీసీ కులాల జనగణనను శాసీ్త్రయంగా పారదర్శకంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు జొన్నాదుల వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని బీసీ సంఘ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కోటాకు సంబంధించి వివిధ బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి అభిప్రాయాలు, వినతులను స్వీకరించేందుకు రాజీవ్ రంజన్ మిశ్రా ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తెనాలి రానున్న సందర్భంగా బీసీ సంఘాలు కమిషన్కు విజ్ఞాపన పత్రాన్ని అందజేయాలని కోరారు. సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ ఆర్డర్ సంతృప్తికరంగా అమలు జరిపేలా, బీసీ రిజర్వేషన్ వర్గీకరణ చేయాలని, రాష్ట్రంలో బీసీల కుల గణన ద్వారా సరైన డేటా సేకరించి రిజర్వేషన్ల పెంపునకు కమిషన్ సహకరించాలన్నారు. జనగణన వివరాలను బీసీ కులగణన సహా అన్ని స్థాయిల పాలనా కేంద్రాల నోటీసు బోర్డులలో ప్రదర్శించాలన్నారు. బీసీల ప్రధాన డిమాండ్లతో కూడిన విజ్ఞాపనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ముఖ్యంగా చట్టసభలలో రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు జనాభా దామాషాలో దక్కేలా తోడ్పడాలన్నారు. బీసీ నాయకులు పోలిశెట్టి వెంకటేశ్వరరావు, జొన్నాదుల వెంకటసాయి, జొన్నాదుల మణికంఠ, జె.నాగమోహన్, జె.మురళి, ములికి జయకృష్ణ, జె.రమేష్ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల: జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కరవేదిక(పీజీఆర్ఎస్) సోమవారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నడవలేని, మంచాలకు పరిమితం అయిన, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని తీసుకురావద్దని సూచించారు. ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు తప్పని సరిగా హెల్మెట్ పెట్టుకొని రావాలి కోరారు. ‘మీకోసం టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్ 1100’ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి సూచించారు. -
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
తెనాలిరూరల్: పట్టణ సుల్తానాబాద్లోని గాయత్రి వే బ్రిడ్జి సమీపంలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చోరీ జరిగింది. కూలి పనులకు వెళ్లే మరియమ్మ ఒంటరిగా నివసిస్తోంది. గురువారం ఆమె బంధువుల ఇంటికి వెళ్లి.. శనివారం సాయంత్రం తిరిగి వచ్చింది. ఆదివారం ఉదయం చూసుకోగా ఇంట్లోని బీరువాలో ఉన్న సుమారు రూ. 4 లక్షల నగదు, 25 గ్రాముల బంగారు ఆభరణాలు, 100 గ్రాముల వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయి. బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా త్రీ టౌన్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నించింది. బెంబేలెత్తిస్తున్న వరుస చోరీలు.. తెనాలి ప్రాంతంలో ఇటీవల చోరీలు పెరుగుతున్నాయి. మండలంలోని కఠెవరం గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఈ నెల 4వ తేదీన ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లారు. తిరిగి 7వ తేదీ అర్ధరాత్రి వచ్చారు. చోరీ జరిగిందని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. రూ. లక్ష నగదు, 150 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్టు ఫిర్యాదు చేశారు. -
44 సార్లు రక్తదానం చేశా
నేను కేఎల్ యూనివర్సిటీలో 2007లో బీటెక్ చదువుతున్న సమయంలో ఎవరైనా రోగులు, రోడ్డు ప్రమాద బాధితులు ఆపరేషన్ కోసం రక్తం కావాలని అడిగితే స్వచ్ఛందంగా ఇవ్వడం ప్రారంభించాను. గుంటూరు జీజీహెచ్లో ఎస్బీఐలో పనిచేస్తున్న సమయంలో ఆస్పత్రిలో రక్తం కొరత ఉందని, రక్తం సకాలంలో లభించక పలువురు చనిపోతున్న విషయం తెలుసుకున్నా. ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది రక్తం ప్రాధాన్యత గురించి వివరించారు. దాంతో ప్రతి ఏడాది క్రమం తప్పకుండా మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తున్నాను. ఒడిశాలో రెండు రైళ్లు ఢీకొన్నప్పుడు ఆ రాష్ట్రం వెళ్లా. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రక్తదానం చేశా. ఇప్పటి వరకు 44 సార్లు రక్తదానం చేశాను. రక్తదానం చేయడం వల్ల ఎంతో పుణ్యం దక్కడంతోపాటు మంచి ఆరోగ్యం కూడా సొంతం అవుతుందని నా నమ్మకం. -
ఇసుకాసురుల ఇష్టారాజ్యం
సహజ సంపదలను కొల్లగొడుతూ అక్రమార్జనకు అలవాటు పడ్డ పెదకూరపాడు ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోతోంది. నదిలో ఇసుక తవ్వకాలపై నిషేధం ఉన్నా స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతో ఏమాత్రం పట్టించుకోకుండా నదీగర్భాన్ని చీల్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుకాసురులు బరితెగించి దోచుకుంటున్నా అధికారులు స్పందించకపోవడంతో మరింత విర్రవీగిపోతున్నారు. సాక్షి కథనానికి స్పందించి ఇసుక రీచ్లోకి వాహనాలు వెళ్లకుండా దారికి గాడి కొట్టిన అఽధికారులు సాక్షి, నరసరావుపేట: కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం కృష్ణా తీరంలో ‘మాన్సూన్ హాలీడే’ జూన్ 1 నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు ఉండటంతో ఇసుక తవ్వకాలపై నిషేధం అమలులోకి వచ్చింది. వర్షాకాలంలో నదుల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం, వరదలు వచ్చే అవకాశం ఉండటంతో ఇసుక తవ్వకాలు జరపడం ప్రమాదకరం. నది జీవజాలం, పర్యావరణ పునరుజ్జీవనానికి ఈ విరామం ఎంతో అవసరం. అచ్చంపేట, అమరావతి మండలాల్లో జూన్ 1, 2వ తేదీలలో సైతం రాత్రీపగలు తేడా లేకుండా భారీ వాహనాలతో ఇసుకను తరలిస్తున్న ఫొటోలతో ‘సాక్షి’ పత్రికలో జూన్ 3వ తేదీన ‘చెలరేగిపోతున్న ఇసుకాసురులు’ పేరిట కథనం ప్రచురితమైంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు స్పందించి చర్యలకు ప్రారంభించారు. అచ్చంపేట మండలం చింతపల్లి, అమరావతి మండలం పొందుగల ఇసుక రీచ్లలోకి వాహనాలు వెళ్లకుండా దారికి అడ్డంగా గాడి కొట్టించారు. రీచ్లలో ఇసుక రవాణా జరిపేందుకు ఎలాంటి అనుమతులు లేవంటూ ప్రకటనలు జారీ చేసి చేతులు దులుపుకొన్నారు. గాడి పూడ్చి అక్రమ రవాణా... ఇసుక రీచ్లలోకి వాహనాలు వెళ్లకుండా అధికారులు కొట్టిన గాడిని మాఫియా పూడ్చివేసింది. గత రెండు రోజులుగా చింతపల్లి, పొందుగల–2 రీచ్లలోకి నిబంధనలకు విరుద్ధంగా జేసీబీలను పంపి తవ్వి లారీలు, ట్రాక్టర్ల ద్వారా ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. అధికారులు దారికి గాడి కొట్టిన తరువాత నది సమీపంలో భారీ యంత్రాలను అక్కడ నుంచి పంపేయాలి. వాటిని అక్కడే ఉంచడంతో రాత్రిపూట, సెలవు రోజుల్లో గాడిని పూడ్చి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఎన్జీటీ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నా మైనింగ్, ఇరిగేషన్, పోలీసు, విజిలెన్స్, రవాణా శాఖల అధికారులు పట్టించుకుంటున్న పాపానపోలేదు. ఇసుక రీచ్లలో భారీ యంత్రాలతో గాడిని పూడ్చి ఇసుక తరలిస్తున్నా అధికారులకు తెలియకుండా ఎలా ఉంటుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అడ్డుకుంటాం... పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలో ఇసుక రీచ్లలోకి వాహనాలు వెళ్లకుండా కొట్టిన గాడిని పూడ్చి ఇసుక రవాణా చేయడంపై పల్నాడు జిల్లా మైనింగ్ శాఖ ఏడీ నాగయ్యను వివరణ కోరగా... గాడిని పూడ్చి ఇసుక తరలిస్తున్న విషయం తనకు తెలియదని చెప్పారు. అచ్చంపేట, అమరావతి మండలాల తహసీల్దార్లను ఇసుక తరలింపును అడ్డుకోమని ఆదేశిస్తానని తెలిపారు. ఈ సమయంలో ఇసుక తవ్వకాలకు అనుమతి లేదన్నారు. టాస్క్ఫోర్స్ టీం ఏర్పాటు చేశామని, వారు అక్రమ రవాణాను అడ్డుకుంటారని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలను అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దించాలి. ఈ టాస్క్ఫోర్స్ టీంలో మైనింగ్, రెవెన్యూ, జలవనరుల శాఖ, పోలీస్, రవాణా శాఖల అధికారులు ఉంటూ కృష్ణానది తీరప్రాంతాల్లో నిఘా ఉంచాల్సి ఉంది. నిబంధనలు ఉల్లంఘించి ఇసుకను అక్రమంగా తరలిస్తే వాహనాలను సీజ్ చేయడంతోపాటు భారీ జరిమానాలు, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఇవేవీ పెదకూరపాడు నియోజకవర్గంలో జరగడం లేదు. అచ్చంపేట, అమరాతి మండలాల్లో నిషేధ సమయంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా టాస్క్ఫోర్స్ టీం స్పందించి అక్రమ రవాణాను అడ్డుకొని చర్యలు తీసుకోవడం లేదు. -
అక్రమంగా తరలిస్తున్న రేషన్బియ్యం స్వాధీనం
తెనాలిరూరల్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో పోలీసులు మండలంలోని అంగలకుదురు గ్రామం సమీపంలోని తెనాలి–గుంటూరు ప్రధాన రహదారిపై శనివారం తెల్లవారుజామున వాహన తనిఖీలు నిర్వహించారు. తెనాలి నుంచి గుంటూరు వైపు వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా, పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులను గమనించిన వాహనంలోని ఇద్దరు వ్యక్తులు పరారయ్యేందుకు ప్రయత్నించగా, తెనాలి మండలం జగ్గడిగుంటపాలెం గ్రామానికి చెందిన డ్రైవర్ కలవకొల్లు మధుబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి గొంది అశోక్ పరారయ్యాడు. మొత్తం 79 బస్తాలలో సుమారు 3,950 కిలోల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఐతానగర్ ప్రాంతంలోని ఎస్బీఐ బ్యాంకు వెనుక గల రేషన్ షాపు నుంచి లోడ్ చేసి, వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామంలోని హరీష్ రైస్ మిల్లుకు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. గొంది అశోక్, కలవకొల్లు మధుబాబు, ఐతానగర్ రేషన్ డీలర్ కుటుంబ సభ్యుడు, అనంతవరప్పాడు ప్రాంతానికి చెందిన రైస్ మిల్ నిర్వాహకుడు హరీష్లను నిందితులుగా గుర్తించినట్టు రూలర్ ఎస్ఐ కె.ఆనంద్ తెలిపారు. బియ్యం, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని, పరారీలో ఉన్న నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని రూరల్ సీఐ నాయబ్ రసూల్ తెలిపారు. -
యోగాతో ఆరోగ్యవంతమైన సమాజం
మంగళగిరి టౌన్: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం యోగాతోనే సాధ్యమని గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పేర్కొన్నారు. మంగళగిరి పట్టణం శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. మహర్షి పతంజలి చిత్రపటానికి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన విధానంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, యోగా సాధన పట్ల ఆసక్తిని కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆధునిక జీవన శైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళన, ఆరోగ్య సమస్యలను అధిగమించడంలో యోగా కీలకపాత్ర వహిస్తుందని అన్నారు. ప్రతిరోజూ కొంత సమయం యోగా సాధనకు కేటాయించాలని కోరారు. యువత, విద్యార్థులు, ఉద్యోగులు తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంటీఎంసీ కమిషనర్ అలీంబాషా, డీఎంహెచ్ఓ శాఖ అధికారులు, యోగా శిక్షకులు, సాధకులు, మహిళ, యువత తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ -
2004 ఎన్నికల ముందు కేసుల సంగతేంటి?
తెనాలి: ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన ర్యాలీ తెనాలిలో భారీగా విజయవంతం కావటంతో బెంబేలెత్తిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విలేకరుల సమావేశంలో తనను అహంకారిగా వ్యాఖ్యనించటాన్ని వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఖండించారు. స్థానిక గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో పార్టీ నేతలతో కలిసి శివకుమార్ మాట్లాడారు. హైదరాబాద్లో ఉంటున్న తెనాలికి చెందిన వ్యక్తి ఎన్నికలకు ముందుగానే ఇక్కడకు వచ్చి జనసేన/టీడీపీకి ప్రచారం చేశారని చెప్పారు. పోలింగ్ సమయంలో తనను అసభ్యంగా మాట్లాడటంతో ఇష్యూ జరిగిందని చెబుతూ ‘అదంతా నీవల్లే జరిగింది... ఆర్గనైజ్డ్గా చేయించావు’ అని మనోహర్ను ఉద్దేశించి అన్నారు. అయినా తాను కేసు పెట్టలేదని గుర్తుచేశారు. అదే తన అహంకారమైతే ఎన్నికల ముందు మనోహర్పై ఏడు కేసులు ఉన్నాయని, అవన్నీ 2004 ఎన్నికల అఫిడవిట్లో ఆయనే స్వయంగా ప్రకటించినట్టు ఆ పత్రాలను చూపారు. అందులో 420తో సహా సేవాట్రస్ట్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాల కోసం ఆడపిల్లల్ని నిర్బంధించటమనే 372–కే సెక్షన్ కూడా ఉందని ఆరోపించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ వాళ్లు కరపత్రాలను కూడా పంచారని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గంజాయి వీధివీధినా దొరికిందన్న మనోహర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ‘ఇప్పుడు నీ హయాంలో గంజాయితో పాటు డ్రగ్స్, న్యూడ్కాల్స్ సెంటర్ నడిచాయి’ అని చెప్పారు. హామీలు అమలు చేయలేని మంత్రి ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్కళ్యాణ్ ద్వారా తెనాలి ప్రజలకు ఇప్పించిన హామీలను మంత్రి హోదాలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఎందుకు అమలు చేయటం లేదని శివకుమార్ ప్రశ్నించారు. కొల్లిపర వద్ద కృష్ణానదిపై చెక్డ్యామ్ నిర్మిస్తామని, వంద పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని, తెనాలిలో పంటకాలువలను లాస్వెగాస్లా సుందరీకరిస్తామని హామీలనిచ్చినట్టు నాటి వీడియోను ప్రదర్శిస్తూ చెప్పారు. అలాగే నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఆరంభించి యువతకు శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తామని కూడా గుర్తు చేశారు. తెనాలి– విజయవాడ రోడ్డును నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి చేస్తామని మనోహర్ చెప్పారని వివరించారు. ఆ హామీల ప్రతిపాదనలున్నా చూపాలని డిమాండ్ చేశారు. తెనాలి వచ్చినప్పుడు పంటకాలువల వెంట తిరుగుతూ అధికారులు తన మాట వినటం లేదని మనోహర్ అనటాన్ని ఏమనాలని శివకుమార్ ప్రశ్నించారు. సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యమిచ్చిన వైఎస్సార్ సీపీ హయాంలో ఎమ్మెల్యేగా తాను రూ.1800 కోట్ల సంక్షేమంతో పాటు 26 వేల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసినట్లు చెప్పారు. 170 రోడ్లు నిర్మించానని గుర్తుచేశారు. మార్కెట్ ధర లేనపుడు జొన్న/మొక్కజొన్న పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసినట్టు చెప్పారు. ధాన్యం కొనుగోలు చేశామని చెప్పే మంత్రి మనోహర్, గత రబీలో జొన్న, మొక్కజొన్న ఎందుకు కొనలేదని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ న్యాయవాదులు చింకా సురేష్చంద్ర యాదవ్, మైలా విజయ్నాయుడు, కొల్లిపర మండల పార్టీ అధ్యక్షులు కల్లం వెంకటప్పారెడ్డి, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు కొడాలి క్రాంతి, పెదలంక వెంకటేశ్వర్లు, కాకి దేవసహాయం, కొర్ర యశోద, కొంగర రాగమంజరి, షేక్ జకీరా, ఎం.ఇందిరా ప్రియదర్శిని, సిద్దాబత్తుని శాంతి, నీలి అజయ్, మల్లెబోయిన రాము, యలవర్తి సాంబశివరావు, ఉన్నం అనీష్, పొట్లూరి అశోక్, పల్లె రోహిత్శామ్యూల్, పిల్లి వీరయ్య, యాతాటి అనిల్, కాళిదాసు సత్యం, చుక్కా ఆనంద్, అక్కిదాసు కిరణ్కుమార్ పాల్గొన్నారు. -
అగ్రిగోల్డ్ మోసానికి మరో బాధితురాలు మృతి
గుంటూరు రూరల్: అగ్రిగోల్డ్ మోసానికి మరో వృద్ధురాలు బలైంది. భర్తలేని తనకు వృద్ధాప్యంలో ఉపయోగపడుతుందని అగ్రిగోల్డ్లో ఫిక్సిడ్ డిపాజిట్గా దాచుకున్న రూ.25,000 కోసం ఎదురుచూసి చివరికి తుదిశ్వాస విడిచింది. వివరాలు.. వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన తన్నీరు పోలేరమ్మ(70) కూలి పనులు చేసుకుని జీవించేది. ఆమెకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరందరికి వివాహాలు జరిపించింది. పిల్లలంతా తమ కుటుంబ సభ్యులతో ఎవరి కుటుంబాలు వారు చూసుకుంటుండగా, భర్తలేని తనకు వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటుందని అప్పట్లో అగ్రిగోల్డ్ను నమ్మి రూ.25,000 కడితే చివరికి రూ.50,000 వస్తాయని ఆశతో ఫిక్సిడ్ డిపాజిట్ చేసుకుంది. 2012లో కడితే 2018లో తనకు డబ్బు వస్తుందని ఆశ పడింది. 2015లో అగ్రిగోల్డ్ కంపెనీ మూతపడిన దగ్గర నుంచి, అవసర పడతాయి అనుకున్నా డబ్బులు ఇక రావని దిగులుతో నిత్యం మదనపడుతూ ఉండేది. అప్పట్లో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాలు, దీక్షలు చూసి కొంత ధైర్యంగా ఉన్నా, వృద్ధాప్యంలో డబ్బులు లేక అనేక బాధలు పడుతూ ఉండేది. ఇప్పటికే 12 సంవత్సరాలు దాటి, ప్రభుత్వాలు మారుతున్న ఇచ్చిన హామీలు నెరవేర్చటంలో ప్రభుత్వాలు విఫలం కావడంతో గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్ డబ్బులు తిరిగి బాదితులకు అందించే దిశగా కృషిచేస్తామని కూటమి ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేసింది. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టి, అధికారంలోకి వచ్చి, రెండు సంవత్సరాలు అవుతున్న మాటలు చెబుతున్నారని, చేతల్లో డబ్బులు వస్తాయన్న నమ్మకం లేకపోయిందని, మానసికంగా ఆలోచించి, గుండెనొప్పితో శనివారం మృత్యువాతకు గురైంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం స్పెషల్ కోర్టు పెట్టడంతో పాటు కంపెనీ డేటా ప్రకారం వడ్డీతో సహా ప్రతి బాధితునికి త్వరలో డబ్బులు ఇచ్చి న్యాయం చేసి మరో ప్రాణహాని జరగకుండా చూడాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కుంచాల అంకమ్మరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
పాఠశాల హెచ్ఎంకు సంజాయిషీ నోటీసు
గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా గుంటూరు కొరిటెపాడులోని ఆర్సీఎం పాఠశాలలో విద్యార్థినులు చీపుర్లు పట్టుకుని పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేసిన సంఘటనపై ‘చిట్టి తల్లులకు చీపురు కష్టాలు’ శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురించిన వార్తకు జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా స్పందించారు. జరిగిన సంఘటనపై ఎంఈవోతో విచారణ జరిపించామని, పాఠశాలలో ఉపాధ్యాయుల ప్రమేయం లేకుండా విద్యార్థినులు పాఠశాలను పరిశుభ్రం చేశారని తెలిపారు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయునికి సంజాయిషీ నోటీసు జారీ చేశామని పేర్కొన్నారు. మరోసారి ఇటువంటి తప్పిదం జరగకుండా చూడాలని ఆదేశించామని చెప్పారు. జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థులతో ఎటువంటి పనులు చేయించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 4,040 సీట్లకు కౌన్సెలింగ్ నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ఐటీల్లో 2026–27 విద్యాసంవత్సరం అడ్మిషన్లలో భాగంగా ఎంపికై న అభ్యర్థుల జాబితాను ఆర్జీయూకేటీ వర్గాలు శనివారం విడుదల చేశాయి. ప్రత్యేక కేటగిరీ కోటా మినహా 4,040 సీట్లకు ఎంపికై న విద్యార్థుల జాబితాను తాజాగా విడుదల చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా నుంచి 366 మంది ఎంపికవ్వగా, అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి అత్యల్పంగా నలుగురు ఎంపికయ్యారు. పల్నాడు జిల్లా నుంచి 188 మంది ఎంపికవగా, బాపట్ల జిల్లా నుంచి 120, గుంటూరు జిల్లా నుంచి 79 మంది ఎంపికయ్యారు. బాపట్ల జిల్లా కొల్లూరు జెడ్పీ బాలికల హైస్కూల్ విద్యార్థిని భవిరెడ్డి దివ్యతేజశ్రీ టాప్ టెన్లో చోటు దక్కించుకుంది. టాప్ 10 జాబితాలో ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 517.30 అడుగులకు చేరింది. కుడికాలువకు 3,031, ఎస్ఎల్బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. -
చోరీ కేసులో నిందితుడు అరెస్ట్
రూ. ఐదు వేల నగదు, కారు స్వాధీనం తెనాలిరూరల్: పట్టపగలు ఇంట్లో చోరీకి పాల్పడిన పాత నేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం నిందితుడు కారులో పరారయ్యాడన్న ఆధారంతో సాంకేతికతను వినియోగించి అరెస్ట్ చేయడం గమనార్హం. స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంతో సీఐ నాయబ్ రసూల్ శనివారం వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని హాఫ్ఫేట గ్రామానికి చెందిన రెడ్డి వెంకట రవికిరణ్ తన తల్లి లక్ష్మీసామ్రాజ్యంను ఈ నెల 9వ తేదీ ఉదయం 10 గంటలకు బ్యాంకుకు తీసుకువెళ్లాడు. 11.50 గంటల సమయంలో అతని రెండో అక్క తోటకూర సామ్రాజ్యం ఫోన్ చేసి ఇంట్లో నుంచి గుర్తు తెలియని వ్యక్తి బయటకు వచ్చాడని, తనను చూసి వేగంగా వెళ్లి సమీపంలో ఉన్న తెల్ల కారులో పరారయ్యాడని చెప్పింది. రవికిరణ్ వెంటనే ఇంటికి వచ్చి చూడగా తాళం పగలగొట్టి ఉంది. లోపల బీరువా తాళాలూ పగలగొట్టి ఉన్నాయి. బీరువాలోని రూ. 25 వేలు అపహరించుకెళ్లాడు. ఇదే విషయాన్ని రవికిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ ఎస్ఐ కె. ఆనంద్ కేసు నమోదు చేశారు. నిందితుడు పరారైన సమయంలో ఆ మార్గంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్లు పరిశీలించి కారు నంబరును గుర్తించగలిగారు. సాంకేతికతను వినియోగించి కారు కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. కారు విజయవాడ నుంచి తెనాలి వైపు వస్తున్నట్టు గుర్తించి నందివెలుగు ప్రధాన జంక్షన్లో అరెస్ట్ చేశారు. నిందితుడిని ఖమ్మం జిల్లా మధిర మండలం మదుపల్లి గ్రామానికి చెందిన బండి గోపిగా గుర్తించారు. నిందితుడి నుండి రూ.ఐదు వేల నగదు, కారును స్వాధీన పర్చుకున్నారు. నిందితుడిపై తెలంగాణలో తొమ్మిది, ఆంధ్రప్రదేశ్లో రెండు కేసులు ఉన్నాయని, మరో 20 కేసులు కోర్టు కొట్టివేసిందని సీఐ తెలిపారు. సాంకేతికతను వినియోగించి నిందితుడిని అతి త్వరగా అరెస్ట్ చేసిన ఎస్ఐ ఆనంద్, సిబ్బందిని సీఐ అభినందించారు. -
ప్రాణదానంతో సమానం
ఒకరు చేసే రక్తదానంతో నలుగురి ప్రాణాలు కాపాడవచ్చు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చి ప్రాణదాతలుగా నిలిచిపోవాలి. జిల్లా జనాభాలో ఒక శాతం రక్తం సేకరణ చేయాల్సి ఉంది. జిల్లాలో 17 బ్లడ్ బ్యాంకుల్లో రోగులకు అవసరమైన రక్తాన్ని అందిస్తున్నారు. రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు వైద్య కళాశాల జింఖానా ఆడిటోరియంలో శుక్రవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. అత్యధిక సార్లు రక్తదానం చేసిన వ్యక్తులు, సంస్థలను ఘనంగా సన్మానిస్తున్నాం. – డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ, గుంటూరు. -
గుంటూరు
ఆదివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32.92 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నేటి కాలంలో రక్తసంబంధాలు కూడా భారంగా మారాయి. కానీ ఏ బంధం లేకపోయినా మానవత్వం రక్తదాతల రూపంలో ఇంకా ఇతరులకు సాయం చేస్తోంది. ఇలాంటి వారు ప్రాణదాతలుగా మారుతున్నారు. అర్ధరాత్రి... అపరాత్రి... అని తేడా చూసుకోకుండా ఫోన్ చేయగానే సొంత ఖర్చులతో ఆస్పత్రికి తక్షణమే వెళ్లి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడుతున్నారు. ఆ క్షణంలో వారు చేసే రక్తదానం నిండు ప్రాణాన్ని కాపాడుతోంది. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనమిదీ.. -
ఇంటర్ విద్యార్థులకు ఆన్లైన్లో ఉచిత ఉర్దూ శిక్షణ
పెదకాకాని: విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేయడంపై కేసు నమోదు చేసినట్లు పెదకాకాని పోలీసులు శనివారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన ఒక విద్యార్థిని గుంటూరు నగర శివారులోని ప్రైవేట్ కళాశాలలో డెంటల్ కోర్స్ చదువుతుంది. ఆ విద్యార్థిని విశాఖపట్నంలో ఉన్న సమయంలో సోషల్ మీడియా ద్వారా ఒక యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఆ యువకుడు ప్రేమిస్తున్నానని, తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని వేధింపులకు గురి చేస్తున్నాడు. తన నెంబర్ బ్లాక్ చేయగా తన స్నేహితుల ద్వారా ఫోన్ చేసి యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. బాధితురాలు పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ టిపి నారాయణస్వామి తెలిపారు. పురపాలక పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ తాడికొండ: అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, నిర్మాణ వ్యయాలపై కొందరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. శనివారం అమరావతిలో పర్యటించిన మంత్రి కొండవీటి వాగు, పాలవాగులపై నిర్మిస్తున్న బ్రిడ్జిల నిర్మాణ పనులను పరిశీలించారు. వర్షాకాలంలో ఆయా బ్రిడ్జిల వద్ద నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. -
విజ్ఞాన్లో ఘనంగా ఆన్లైన్ ‘వాక్స్–2026’
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయానికి చెందిన విజ్ఞాన్ ఆన్లైన్ – సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ (సీడీఓఈ) ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక వార్షిక విద్యార్థుల సమావేశం ‘వాక్స్–2026’ను విశ్వవిద్యాలయ ప్రాంగణంలో శనివారం ఘనంగా నిర్వహించారు. సుమారు 180 మంది ఆన్లైన్ విద్యార్థులు, అధ్యాపకులు, నిర్వాహకులు హాజరై విద్య, విజయాలు, పరస్పర అనుబంధాలను వేడుకగా జరుపుకున్నారు. వైస్ చాన్సలర్ కేవీ కృష్ణకిశోర్ మాట్లాడుతూ ఆన్లైన్ మాధ్యమంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ వార్షిక సమావేశం ముఖ్యోద్దేశమన్నారు. కార్యక్రమంలో అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో 2024 జనవరి, 2024 జూలై, 2025 జనవరి, 2025 జూలై బ్యాచ్ల టాపర్లను సత్కరించారు. ఆయా విభాగాల డీన్లు, డైరెక్టర్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో గుండె మార్పిడి ఆపరేషన్
గుంటూరు మెడికల్: గుండెజబ్బుతో మూడేళ్లుగా బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ యువకుడికి గుండె మార్పిడి ఆపరేషన్ చేసి వైద్యులు పునర్జన్మిచ్చారు. గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వైద్యులు అత్యంత అరుదైన గుండె మార్పిడి ఆపరేషన్ చేసి యువకుడికి నూతన జీవితం ప్రసాదించారు. వివరాలు.. గుంటూరు శారదాకాలనీ 25వలైనుకు చెందిన గుండిమెడ వేద ప్రకాష్, ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి మూడేళ్ల కిందట గుండె జబ్బు సోకింది. 2023 మార్చిలో తీవ్రమైన ఛాతీనొప్పి, స్పృహ కోల్పోవడం, సడన్ కార్డియాక్ట్కు అరెస్టు సంభవించింది. వైద్యులు తక్షణమే కార్డియో పల్మనరీ రీసెర్చ్స్టేషన్ (సీపీఆర్) చేసి ప్రాణాలు కాపాడారు. కార్డియాక్ట్ ఎమ్మారై పరీక్షలో గుండె ఎడమ జటరిక తీవ్రంగా బలహీన పడినట్లు, గుండె పంపింగ్ సామర్ధ్యం 30 నుంచి 35 మాత్రమే ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. రక్త ప్రవాహం మందగించినట్లు గుర్తించి 2024 మే నెలలో ఆటోమ్యాటెడ్ ఇంప్లాంట్బుల్ కార్డియో వర్కర్ ట్యూబ్లర్ (ఏఐసీడీ) పరికరాన్ని వేద ప్రకాష్కు అమర్చామన్నారు. ఎన్ని చికిత్సలు చేసినా గుండె పనితీరు మెరుగు పడలేదని, గుండె మార్పిడి మాత్రమే శాశ్వత పరిష్కారమని నిర్ధారించామని వివరించారు. విజయవాడ మాచవరానికి చెందిన 17 సంవత్సరాల యువకుడు రోడ్డు ప్రమాదంలో చనిపోతూ అవయవదానం చేయగా ఆ యువకుడి గుండెను వేద ప్రకాష్కు మే 26న అమర్చి విజయవంతంగా గుండె మార్పిడి ఆపరేషన్ చేశామన్నారు. వేద ప్రకాష్ మాట్లాడుతూ తనకు ఆసుపత్రి వైద్యులు పునర్జన్మిచ్చారని చెప్పారు. డాక్టర్ రాజా రమేష్ మాట్లాడుతూ హార్ట్ ఫెల్యూర్తో బాధపడేవారికి నేడు అత్యాధునిక వైద్య చికిత్సలు వచ్చాయన్నారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ రాయపాటి మమత, హాస్పిటల్ చైర్మన్ ఎంఎస్ రామోహన్రావు, మెడికల్ డైరెక్టర్ రవికాంత్, వైద్యులు నవీన్, కృష్ణ, రామారావు, మృత్యుంజయకుమార్, శ్రీకాంత్, అశోక్కుమార్, శివప్రసాద్, జయరామ్పాయ్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హత పరీక్ష లేకుండా ఉపాధ్యాయ నియామకాలు న్యాయమా!
నెహ్రూ నగర్: డీఎస్సీ రాత పరీక్ష లేకుండానే క్రీడల సర్టిఫికెట్ల ఆధారంగా 382 మంది ఉపాధ్యాయులను నియమించడం విద్యా వ్యవస్థకు తీవ్ర నష్టమని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, ప్రధాన కార్యదర్శి టి. ధనుంజయ రెడ్డి విమర్శించారు. శుక్రవారం స్థానిక జన చైతన్య వేదిక హాలులో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్ 19న విడుదల చేసిన జీఓ నంబరు 4, 47 ద్వారా రాత పరీక్ష లేకుండా కేవలం క్రీడల ప్రతిభ ఆధారంగా 421 ఉపాధ్యాయ పోస్టులకు ఎంపిక చేపట్టిందని తెలిపారు. అస్మదీయులకు దొడ్డిదారిన 382 మందికి క్రీడల్లో పాల్గొన్న సర్టిఫికెట్ల ఆధారంగా నియామకాలు ఇవ్వడం మంచిది కాదన్నారు. 2012లో విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వు 74 ప్రకారం క్రీడా రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగ నియామకాలు పొందాలంటే సంబంధిత రాత పరీక్షలు తప్పనిసరి అని, మెరిట్ ఆధారంగానే నియామకాలు జరిగేవని గుర్తుచేశారు. కానీ నేటి కూటమి ప్రభుత్వం రాత పరీక్ష లేకుండానే నియామకాలు చేపట్టడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి సర్టిఫికెట్లకు ఇచ్చిన వెయిటేజీపై అభ్యర్థుల్లో సందేహాలు ఉన్నాయని, నకిలీ లేదా వివాదస్పద సర్టిఫికెట్లపై పూర్తి పరిశీలన జరిగిందా అనే అనుమానాలు ఉన్నాయన్నారు. అన్ని క్రీడలకు సమాన అవకాశాలు లభించాయా అనేది ప్రశ్నార్థకమన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగానికి బోధనా నైపుణ్యం కూడా అవసరమని, కేవలం ఆటల్లో పాల్గొన్న సర్టిఫికెట్ల ఆధారంగా 270 మందికి నియామకాలు ఇవ్వడం వల్ల విద్యా వ్యవస్థకు నష్టం కలుగుతుందని తెలిపారు. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో పారదర్శకత కరువైందని, ఇది వ్యవస్థాకత కుంభకోణమని అభివర్ణించారు. రాత పరీక్ష లేకుండా 382 ఉపాధ్యాయ పోస్టుల నియామకం జరిగిందని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారని తెలిపారు. నియామకాలు పూర్తయిన వెంటనే భవిష్యత్లో రాత పరీక్షల ఆధారంగానే స్పోర్ట్స్ కోటా నియామకాలు జరపాలని ఉత్తర్వులు ఇవ్వడం తమ తప్పులను సరిదిద్దుకోవడానికేనా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పోర్ట్స్ కోటా నియామకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని, కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణ నిర్వహించి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు డిమాండ్ చేశారు. -
నిందితుడికి మూడేళ్ల జైలు
గుంటూరు లీగల్: నాగార్జునసాగర్ పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో మాచర్ల మండలం కొప్పునూరు గ్రామానికి చెందిన నిందితుడు యరసాని ఇమ్మానియేల్కు మూడు సంవత్సరాల సాధారణ కారాగార శిక్షతోపాటు రూ.5,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 30 రోజుల సాధారణ కారాగార శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ప్రభుత్వం తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి.దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు. కోర్టు తీర్పు అనంతరం నిందితుడికి అప్పీల్ చేసుకునే హక్కు, ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు ఉన్నట్లు కూడా న్యాయస్థానం తెలియజేసింది. ఏపీ సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ బాధ్యతల స్వీకారం తాడికొండ: తుళ్లూరు మండలం రాయపూడిలోని ఏపీ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం అభిషేక్ కుమార్ అడిషనల్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. సీఆర్డీయే ప్రధాన కార్యాలయం 2వ ఫ్లోర్లోని ఆయన చాంబర్ వద్ద శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అభిషేక్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. సీఆర్డీయే ప్రధాన కార్యాలయానికి విచ్చేసిన ఆయనకు తొలుత ఏపీ సీఆర్డీయే ఆఫీస్ మేనేజ్మెంట్ విభాగ డైరెక్టర్ వల్లభనేని శ్రీనివాస్, కమ్యూనికేషన్న్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ జి రామరాజు స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం అభిషేక్ కుమార్కి ఏపీ సీఆర్డీయేలోని పలు విభాగాల ముఖ్య అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. నేటి చిన్నారులే రేపటి భావిభారత పౌరులు గుంటూరు వెస్ట్: చిన్నారులతో వెట్టిచాకిరీ చేయిస్తే చట్టరీత్యా నేరమని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్సవ తెలిపారు. ప్రపంచ బాల కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అవగహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జేసీతో పాటు డీఆర్వో షేఖ్ ఖాజావలి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ చిన్నారులందరూ విధిగా పాఠశాలలకు వెళ్ళి విద్యనభ్యసించాలని తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు ఉప కార్మిక శాఖ కమీషనర్ ఎ.గాయత్రీ దేవి, సహాయ కమిషనర్ కట్టా శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
పరీక్ష నోటిఫికేషన్లతో విద్యార్థుల్లో అయోమయం
ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూ అధికారులు పరీక్షల నిర్వహణ తేదీల నోటిపికేషన్ విద్యార్థులను అయోమయానికి గురి చేస్తున్నాయి. మొదటి సెమిస్టర్ ఫలితాలు ఇవ్వకుండానే రెండవ సెమిస్టర్ పరీక్షల తేదిలను ప్రకటించడంతో విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2026 ఫిబ్రవరి 23 నుంచి 28 వరకూ ఆరు రోజులపాటు బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఆ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు ఇప్పటి వరకూ వెల్లడించలేదు. పరీక్షలు జరిగి దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నా పరీక్ష ఫలితాలు ప్రకటించని వర్సిటీ అధికారులు 2026 మే 20వ తేదీ నుండి 23 వరకూ బీఈడీ రెండవ సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పలువురు బీఈడీ కళాశాలల నిర్వాహకులు జోక్యంతో ఆ పరీక్షల తేదీలను తాత్కాలికంగా వాయిదా వేశారు. అదే రెండవ సెమిస్టర్ పరీక్షలను జూన్ 22వ తేది నుండి 26వ తేది వరకూ నిర్వహిస్తున్నట్లు మే 2వ తేదీన ప్రకటన చేశారు. వర్సిటీ నిబంధనల ప్రకారం సెమిస్టర్కి మరొక సెమిస్టర్కు మద్య కనీసం 90 రోజుల వ్యవధి ఉండాలి. వర్సిటీ అధికారులు ఇటీవల ప్రకటిస్తున్న పరీక్షల తేదీలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. దీంతో విద్యార్థులు ఆయా సబ్జెక్ట్ల సిలబస్ పూర్తికాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరీక్షలకు వర్సిటీ పరిధిలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల నుండి దాదాపు 6000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికై నా వర్సిటీ ఉన్నతాధికారులు విద్యార్థుల భవిష్యత్ను, ఇబ్బందులను దృష్టి పెట్టుకుని పరీక్ష తేదీలను ఖరారు చేయాలని, పరీక్ష నిర్వహణ గడుపు పొడిగించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఏఎన్యూ పరిధిలోని పలు కళాశాలల నిర్వాహకులు కోరుతున్నారు. నిష్పక్షపాతంగా ఓటర్ల జాబితా తయారు చేయాలి డీఆర్వో షేఖ్ ఖాజావలి గుంటూరు వెస్ట్: భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, ఓటర్ల జాబితాను సమూలంగా ప్రక్షాళన చేయడానికి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) చేపట్టినట్లు జిల్లా రెవెన్యు అధికారి షేఖ్ ఖాజావలి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)పై ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లు అత్యంత కీలకమైన క్షేత్రస్థాయి సిబ్బందిగా పనిచేస్తారన్నారు. బూత్ స్థాయి అధికారులు(బీఎల్వో ) లు ఒక పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్ల జాబితా నిర్వహణ బాధ్యత పూర్తిగా బీఎల్ ఓ లదే అన్నారు. ఓటర్ల ప్రత్యేక సవరణ సమయంలో బీల్వో ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల వివరాలను స్వయంగా సేకరించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.శ్రీనివాసరావు , తెనాలి ఆర్డీఓ రమణి, డెప్యూటీ కలెక్టర్ లక్ష్మీకుమారి పాల్గొన్నారు. ఏపీఎం సోమశేఖర్కు రిమాండ్ కాకుమాను: పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెందిన ఏపీఎం సోమేశేఖర్ను కాకుమాను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాలు.. ఏపీఎం సోమశేఖర్ గతంలో కాకుమానులో పనిచేశారు. ఈ క్రమంలో గరికపాడు గ్రామానికి చెందిన డ్వాక్రా గ్రూపు సభ్యుల డబ్బులను దుర్వినియోగం చేశారనే ఫిర్యాదుతో 2023లో ఆయనపై కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి పొన్నూరు అడిషనల్ జూనియర్ సివిల్జడ్జి కోర్టులో విచారణ జరుగుతుంది. అయితే వాయిదాలకు హాజరు కాకపోవడంతో ఏపీఎం సోమశేఖర్, అతడితోపాటు సీసీ సుబ్బారావుకు నాన్ బెయిల్ బుల్ అరెస్ట్ వారెంట్ను కోర్టు జారీ చేసింది. ఈక్రమంలో ఏపీఎం, సీసీలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. శుక్రవారం వారిని కోర్టులో హాజరుపరచగా కోర్టు 24వ తేదీ వరకు రిమాండ్ విధించారు. గుంటూరు సబ్ జైలుకు తరలించారు. -
రైతుల శ్రమను తగ్గించే పరిశోధనలు అవసరం
గుంటూరు రూరల్: రైతుల శ్రమను తగ్గించి ఆదాయం పెంచే విధంగా పరిశోధనలు చేయాలని నాబార్డు మాజీ చైర్మన్, ఐఐఎఫ్ఎల్ సంస్థ ఫైనాన్స్ బోర్డు చైర్మన్ చింతల గోవిందరాజులు సూచించారు. శుక్రవారం నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 63వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పీవి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. డాక్టర్ గోవిందరాజులు మాట్లాడుతూ భారత వ్యవసాయం ఇప్పటికీ వర్షాకాలంపై ఆధారపడి ఉందన్నారు. దీని వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా, సాంకేతికత ఆధారితంగా, పర్యావరణ హితంగా, తక్కువ వ్యయంతో సాగుచేసే విధంగా రైతుల శ్రమను తగ్గించేలా తీర్చిదిద్దడంపై ప్రముఖ విద్యాసంస్థలు దృష్టి సారించాలన్నారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ఏఐ ఆధారిత వ్యవసాయ సాంకేతికతలు ఉత్పత్తి ఖర్చులు తగ్గించే సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడంపై దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్వర్మ మాట్లాడుతూ జిల్లాలోని రైతుల ఆదాయం పెంచడంలో, ఆహారభద్రత కల్పించడంలో, పురుగుమందుల అవశేషాలు లేని ఆరోగ్యకరమైన ఆహారం తినాలని కోరారు. -
బాల్యం ఓ వరం
ఏఎన్యూ (పెదకాకాని): పరీక్ష ఫలితాలను ఏఎన్యూ దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఏ హిస్టరీ, సంస్కృతం, ఎంహెచ్ఆర్ఎం 1,2,3,4 సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ, డిప్లమా ఇన్ సైకాలజీ పరీక్ష ఫలితాలను విడుదల చేశామన్నారు. ఈ నెల 24వ తేదీలోగా రీవాల్యుషన్ దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ప్రతి పేపర్కు రూ.1400 చొప్పున చెల్లించాలని చెప్పారు. దరఖాస్తులను ఈ నెల 30వ తేదీలోగా పరీక్షల కోఆర్డినేటర్ కార్యాలయానికి అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్సైట్ నుంచి పొందవచ్చన్నారు. -
గుంటూరు
శనివారం శ్రీ 13 శ్రీ జూన్ శ్రీ 20267ర్యాలీలో పార్టీ గుంటూరు అధ్యక్షురాలు నూరి ఫాతిమా, పోతిన మహేష్, శ్యామలప్రత్తిపాడులో జరిగిన నిరసన ర్యాలీలో బలసాని, పార్టీ శ్రేణులు పొన్నూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో అంబటి మురళీకృష్ణ, నాయకులు రెండేళ్ల మోసాలపైచంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై వైఎస్సార్సీపీ నిరసన గళం ఉవ్వెత్తున ఎగసిపడింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తున్న తీరుపై ప్రజాగ్రహ జ్వాల రేగింది. పార్టీ సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలుపుతున్న జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం తదితరులువిజయపురి సౌత్: నాగార్జున సాగర్ నీటిమట్టం శుక్రవారం 517.50 అడుగులకు చేరింది. కుడికాలువకు 3,031, ఎస్ఎల్బీసీకి 450 క్యూసెక్కులు వదులుతున్నారు.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,7952 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3000, గరిష్ట ధర రూ.4000, మోడల్ ధర రూ.3500 వరకు పలికింది. మరోవైపు రాజధాని జిల్లాలో నిరసనలకు ప్రజలు రాలేదని చూపించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దింపింది. గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు, తాడికొండ, తెనాలి నియోజకవర్గాలలో ఎక్కడికక్కడ నిరసన ర్యాలీకి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారు. గతం వారంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిష్టిబొమ్మను తెలుగుదేశం నాయకులు దహనం చేస్తుంటే దగ్గరుండి కాపలా కాసిన పోలీసులే... ఈరోజు డీఎస్సీ దిష్టిబొమ్మను తగులబెట్టకుండా అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేశారు. ర్యాలీలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ప్రత్తిపాడులో ఎస్ఐ నరహరి ఓవరాక్షన్ చేసి తగలబడుతున్న దిష్టిబొమ్మను కార్యకర్తల మీదకు వేయడంతో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. -
నిరసనపై పోలీస్ జులుం
ప్రత్తిపాడు: ౖవెఎస్సార్ సీపీ కార్యకర్తలపై ఖాకీలు జులుం ప్రదర్శించారు. దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకునే పేరుతో మంటలు ఎగసి పడుతున్న దిష్టిబొమ్మను తీసుకుని పార్టీ నాయకులు, కార్యకర్తల వైపు ఎస్ఐ దూసుకురావడంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్ పాతమద్రాసు రోడ్డుపై బైఠాయించారు. వివరాలు.. ప్రత్తిపాడులో శుక్రవారం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం బస్టాండు సెంటరులోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట పార్టీ శ్రేణులు డీఎస్సీ దిష్టిబొమ్మను దహనం చేసి, చంద్రబాబు డౌన్ డౌన్.. అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇంతలో అక్కడకు వచ్చిన ప్రత్తిపాడు ఎస్ఐ ఎన్.నరహరి మంటల్లో దహనమవుతున్న దిష్టిబొమ్మను పక్కకు లాగేశారు. అంతటితో ఆగకుండా మంటలు ఎగసి పడుతున్న దిష్టిబొమ్మను తీసుకుని గుంపుగా ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల వైపు దూసుకొచ్చారు. ఎస్ఐ చేతిలో ఉన్న దిష్టిబొమ్మను లాక్కుని కింద పడేసేందుకు పార్టీ శ్రేణులు ప్రయత్నించారు. పార్టీ శ్రేణులకు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. వట్టిచెరుకూరు మండలానికి చెందిన పార్టీ నాయకుడు రాంబాబు చేయికి అంటుకుని బొబ్బలు రావడంతో పాటు చొక్కాకు నిప్పు అంటుకుంది. అదే విధంగా గుంటూరు రూరల్ మండలానికి చెందిన లక్ష్మి చీరకు కూడా మంటలు అంటుకోవడంతో చీర కాలిపోయింది. పార్టీ శ్రేణులు అప్రమత్తమై మంటలను అదుపుచేయడంతో పెనుప్రమాదం తప్పింది. అత్యంత దుర్మార్గంగా ఎస్ఐ తీరు.. ప్రత్తిపాడు ఎస్ఐ తీరును నిరసిస్తూ వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్తిపాడు మెయిన్ రోడ్డులో పాతమద్రాసు రోడ్డుపై వైఎస్సార్ కాంస్య విగ్రహం ఎదుట బైఠాయించారు. ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దోపిడి రాజ్యం.. దొంగల రాజ్యం.. పోలీసుల జులుం నశించాలి.. డౌన్ డౌన్ పోలీస్.. ఉయ్వాంట్ జస్టిస్.. అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పోలీసులు కిరణ్కుమార్ వద్దకు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసి ఆందోళన విరమించాలని కోరారు. ఈ సందర్భంగా కిరణ్కుమార్ మాట్లాడుతూ పోలీసులు ఇంత సెన్స్లెస్గా చేసిన పని వలన ఒక నాయకుడికి చేయి కాలిందని, మరో మహిళా నాయకురాలికి చీర కాలిందని, పొరబాటున ఏదైనా అనుకోని ఘటన జరిగి ఉంటే బాధ్యులు ఎవ్వరని ప్రశ్నించారు. ఎస్ఐ నరహరి అసభ్య పదజాలంతో పార్టీ నాయకులు, శ్రేణులను దూషించడం బాధాకరమన్నారు. అత్యంత దుర్మార్గమైన చర్యకు పాల్పడిన ఎస్ఐపై తక్షణమే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని బలసాని డిమాండ్ చేశారు. నియోజకవర్గ పరిశీలకుడు షేక్ గులాం రసూల్ మాట్లాడుతూ ఏమైనా తప్పు జరిగితే పోలీసులు కేసు రిజిస్టర్ చేయాలే గానీ, ఇలా హత్యా ప్రయత్నం చేయడం ఏమటని ఎస్ఐ నరహరిని ప్రశ్నించారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తారా అని మండిపడ్డారు. ఫ్లెక్సీలు తొలగించాలంటూ.. అంతకుముందు కూడా ప్రత్తిపాడు ఎస్ఐ గ్రామంలో రోడ్డుపై కట్టిన వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలు తొలగించాలంటూ హడావుడి చేశారు. ఇందిరాగాంధీ బొమ్మ సెంటరులో విద్యుత్ స్తంభాలకు చిన్న చిన్న కట్టడంతో అసలు ఎవరిని అడిగి కట్టారంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఫైర్ అయ్యారు. ఆ సమయంలోనూ వాగ్వాదం చోటుచేసుకుంది. -
రాజధాని భూసేకరణలో పురోగతి ఉండాలి
గుంటూరు వెస్ట్: రాజధాని భూముల భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని, ప్రతివారం ఖచ్చితమైన పురోగతి ఉండాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాల్లో సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్లు భార్గవ్ తేజ్ , కార్తీక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవలతో కలసి రాజధాని భూసేకరణ గురించి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ–3, ఈ–13, ఈ–15 పరిధిలోని సీడ్ యాక్సిస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జి తదితర నిర్మాణాలకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియలో పెండింగ్ అంశాల గురించి చర్చించారు. భూసేకరణ ప్రక్రియలోని ప్రతి అంశానికి నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయుటకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అసైన్న్డ్ భూములు, పట్టా భూములు విషయంలో నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలన్నారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు ఇతర శాఖల సమన్వయంతో క్షేత్రస్థాయిలో సంయుక్త తనిఖీలు నిర్వహించి ఎటువంటి పెండింగ్ లేకుండా పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. ఆర్ అండ్ ఆర్ సర్వే విషయంలో సంయుక్త తనిఖీలు త్వరగా నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, సీఆర్డీఏ అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సర్ అత్యంత కీలకం ఎటువంటి లోపాలు, దొంగ ఓట్లు లేని ఒక సమగ్రమైన, పారదర్శకమైన తుది ఓటర్ల జాబితాను రూపొందించడమే లక్ష్యంగా ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలకు పని చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. గురువారం రాత్రి కలక్టరేట్లోని వీసీ సమావేశ మందిరంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పై ఈఆర్ఓ లు, ఏఈఆర్ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ -
ప్రభుత్వ విద్య మిథ్యే
నేడు పునఃప్రారంభం కానున్న పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం జిల్లాలోని పాఠశాలలు శుక్రవారం పునఃప్రారంభం కానున్నాయి. సెలవుల్లో సేదదీరి తిరిగి వచ్చే విద్యార్థులకు టీడీపీ సర్కారు తీరుతో తీవ్ర నిరాశే మిగలనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థికీ ఉచితంగా పంపిణీ చేయాల్సిప విద్యార్థి మిత్ర స్టూడెంట్ కిట్ను సిద్ధం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం చతికిలపడింది. అంతులేని నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా పరిణమించింది. స్టూడెంట్ కిట్తోపాటు ఇవ్వాల్సిన సామగ్రిని సిద్ధం చేయడంలో విఫలమైన ప్రభుత్వం కేవలం పాఠ్య పుస్తకాల పంపిణీకే పరిమితం కానుంది. గుంటూరు ఎడ్యుకేషన్ విద్యార్థులకు స్టూడెంట్ కిట్లో భాగంగా పుస్తకాల బ్యాగు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, రెండు జతల యూనిఫాం, బూట్లు, సాక్సులు, టై, బెల్టు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, వర్క్బుక్స్ ఉచితంగా పంపిణీ చేయాలి. గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 89,157 మంది విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేయాలని విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కిట్లు పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు మరో నెల రోజులకుపైగానే పట్టే పరిస్థితులు నెలకొన్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థుల భవిష్యత్తుకు, వారి చదువులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు. నాణ్యమైన సామగ్రితో కూడిన విద్యాకానుక స్టూడెంట్ కిట్లను వ్యక్తిగత పర్యవేక్షణతో సిద్ధం చేయించారు. ప్రతి ఏటా పాఠశాలలు తెరిచిన మొదటి రోజున ఒక పండుగలా విద్యాకానుక పంపిణీ నిర్వహించారు. పాఠ్యపుస్తకాలకే పరిమితం గుంటూరు జిల్లాలోని 18 మండలాల పరిధిలో 89,157 మంది విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ పాఠ్యపుస్తకాలు మాత్రమే ఇవ్వనున్నారు. కిట్లో భాగంగా అందించే పుస్తకాల బ్యాగు, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, నోటు బుక్స్, వర్క్బుక్స్, బ్యాగులు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు, బూట్లు, సాక్సులు, టై, బెల్టు, పిక్టోరియల్ డిక్షనరీలు రావాల్సి ఉంది. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అప్పటి టీడీపీ ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులకు కేవలం పాఠ్య పుస్తకాలు, యూనిఫాం పంపిణీకే పరిమితమైంది. వైఎస్ జగన్ చొరవతో రూపుదిద్దుకున్న విద్యాకానుక స్టూడెంట్ కిట్లను పేద, మధ్య తరగతి విద్యార్థులకు 10 రకాల సామగ్రితో ఉచితంగా పంపిణీకి శ్రీకారం చుట్టిన గత వైసీపీ ప్రభుత్వం నిరాటంకంగా విద్యార్థులకు అందజేసింది. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల సంఖ్య 1,730 జిల్లాలో మొత్తం విద్యార్థుల సంఖ్య 3.49 లక్షలు ప్రభుత్వ బడుల సంఖ్య 1,074 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 89,157 ప్రైవేటు పాఠశాలల సంఖ్య 656 ప్రైవేటు బడులలోని విద్యార్థుల సంఖ్య 2,60,354 ప్రభుత్వ విద్యార్థులకు ఇవ్వనున్న పాఠ్యపుస్తకాలు: 15,26,181 -
వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడిగా నాగరాజు
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) గా డాక్టర్ కోనేటి నాగరాజును నియమిస్తూ గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరబ్గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డాక్టర్ నాగరాజు వైఎస్సార్ కడప జిల్లా డీఎంహెచ్ఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయనకు పదోన్నతి కల్పించి గుంటూరు ఆర్డీగా బదిలీ చేశారు. డాక్టర్ నాగరాజు తిరుపతిలో 1983లో ఎంబీబీఎస్ అభ్యసించారు. కడప జిల్లా కదిరిలో 1993లో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా విధుల్లో చేరి ప్రభుత్వ సర్వీసులోకి ప్రవేశించారు. డెప్యూటీ సివిల్ సర్జన్గా 2010లో, సివిల్ సర్జన్గా 2021లో పదోన్నతి పొందారు. రాజంపేట డెప్యూటీ డీఎంహెచ్ఓగా, వైఎస్సార్ కడప జిల్లా జిల్లా ఆసుపత్రిలో 13 సంవత్సరాల పాటు, వైఎస్సార్ కడప రిమ్స్లో ఐదు సంవత్సరాల పాటు విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఫుల్ అడిషనల్ చార్జి ఆర్డీగా డాక్టర్ జి.శోభారాణి విధులు నిర్వహిస్తున్నారు. ఈమె జులై 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. డీఈఓ షేక్ సలీమ్ బాషా గుంటూరు ఎడ్యుకేషన్ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన విక్రయ పాఠ్య పుస్తకాలను మార్కెట్లో అందుబాటులోకి తీసుకురావడంలో విఫలమైన ప్రభుత్వ తీరుపై మార్కెట్లోకి రాని పాఠ్య పుస్తకాలు శీర్షికతో గురువారం ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా స్పందించారు. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాల కొరత ఉన్న వాస్తవేమనని, త్వరలోనే అన్ని తరగతుల పాఠ్య పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. జిల్లాలో సగటు వర్షపాతం 30.4 మి.మీ. కొరిటెపాడు (గుంటూరు): గుంటూరు జిల్లాలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు అత్యధికంగా మంగళగిరి మండలంలో 81.8 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా మేడికొండూరు మండలంలో 6.4 మి.మీ వర్షం కురిసింది. సగటున 30.4 మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. తాడేపల్లి మండలంలో 77.6 మి.మీ., దుగ్గిరాల 70.8, తెనాలి 67.8, కొల్లిపర 47.4, చేబ్రోలు 45, తుళ్లూరు 28.8, పెదకాకాని 27.2, గుంటూరు పశ్చిమ 26.4, గుంటూరు తూర్పు 18.4, వట్టిచెరుకూరు 16.6, ఫిరంగిపురం 8.6, పొన్నూరు 8.6, తాడికొండ 8.2, ప్రత్తిపాడు మండలంలో 7.2 మి.మీ చొప్పున వర్షం కురిసింది. కొరిటెపాడు(గుంటూరు): సబ్ జూనియర్ బాలబాలికల అంతర్జాతీయ బాక్సింగ్ పోటీలకు గుంటూరు జిల్లాకు చెందిన నలుగురు బాక్సర్లు ఎంపికై నట్లు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు, వేద సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తులసి ధర్మ చరణ్ తెలిపారు. గురువారం స్థానికంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయనగరంలో శుక్రవారం నుంచి 14వ తేదీ వరకు సబ్ జూనియర్ బాలబాలికల విభాగంలో ఈ పోటీలు జరగనున్నాయన్నారు. బాలికల విభాగంలో 40 కిలోల కేటగిరిలో ప్రజ్ణ దియా జోష్లిన్ ఎంపికై ందన్నారు. బాలుర విభాగంలో 70 కిలోల కేటగిరిలో శ్రీ కార్తికేయ, 55 కిలోల విభాగంలో జ్ఞాన సాయి, 35 కిలోల విభాగంలో చంద్రహౌస్ ఎంపికై నట్లు వివరించారు. ఈ క్రీడాకారులతో పాటు బాక్సింగ్ కోచ్ ఇమ్మానియేల్ రాజు కూడా పోటీలకు హాజరుకానున్నారని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న గుంటూరు జిల్లా బాక్సర్లు విజయం సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ కోలా చిరంజీవి మాట్లాడుతూ పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు అసోసియేషన్ తరపున ఆర్తిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
నాలుక కోస్తాం..
పిల్లి కూతలు కూస్తే .. గుంటూరు ఎడ్యుకేషన్ వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు నోరు అదుపులో పెట్టుకోకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం నగర అధ్యక్షుడు పాటిబండ్ల కిరణ్కుమార్ హెచ్చరించారు. గురువారం బృందావన్గార్డెన్స్లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిరణ్కుమార్ మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఐదేళ్లపాటు సంక్షేమ పాలన అందించిన వైఎస్ జగన్పై నోటికొచ్చినట్లు మాట్లాడటం మాణిక్యరావుకు తగదని, వైఎస్ జగన్కు విమర్శించే స్థాయి అతనికి లేదన్నారు. టీడీపీలోని అగ్రవర్ణ నేతలు మాణిక్యరావును ముందు ఉంచి, విమర్శలు చేస్తున్నారని, టీడీపీలో మాణిక్యరావు బలిపశువేనని అన్నారు. హామీలు అమలు చేయడంలో విఫలమైన టీడీపీ నేతలు ప్రతిపక్షంపై చవకబారు మాటలు, ఎదురుదాడికి దిగడం సిగ్గు చేటన్నారు. ఎంఆర్పీఎస్లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన మాణిక్యరావు ఉద్యమాన్ని వదిలేసి, డబ్బు కోసం టీడీపీలో చేరాడని ధ్వజమెత్తారు. సొంత సామాజిక వర్గానికి నష్టం చేసి జగన్ పై విమర్శలు చేస్తున్నారని, పిల్లి కూతలు కూస్తే, నాలుక కోస్తామని హెచ్చరించారు. వైఎస్ జగన్ను తిడితేనే టీడీపీలో పదవి అని, చంద్రబాబు, లోకేష్ దిగువస్థాయి నాయకులతో పదే, పదే నోటికొచ్చిన విధంగా ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. డబ్బు కోసం, పదవుల కోసం దిగజారిన వ్యాఖ్యలు చేస్తున్న మాణిక్యరావు టీడీపీకి అధికారం మరో మూడేళ్లే ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఎస్సీ విభాగం అధ్యక్షుడు జి.ప్రభు మాట్లాడుతూ డీఎస్సీలో తమకు నష్టం జరిగిందని 200 మందు అభ్యర్థులు కోర్టుకు వెళ్లారనీ, మెరిట్జాబితాలను కలెక్టరేట్లలో ఎందుకు ప్రచురించలేదన్నారు. డీఎస్సీలో అవినీతి జరిగిందనే విషయం విద్యాశాఖ మంత్రి లోకేష్ మాట్లాడకపోవడంతోనే అర్ధమవుతోందన్నారు. తూర్పు నియోజకవర్గ ఎస్సీ విభాగం అధ్యక్షుడు డి.అంకాలరాజు మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు మనోజ్, వెంకట్రావు బత్తుల, కూచిపూడి కిరణ్, బాబు, సందీప్, దుర్గారావు, పాలపర్తి గోవర్ధన్ పాల్గొన్నారు. -
నాడు–నేడు పనులపై నిర్లక్ష్యం
2014–19 మధ్య టీడీపీ పాలనలో సమస్యలతో కునారిల్లిన ప్రభుత్వ పాఠశాలలకు ప్రాణం పోసిన వైఎస్సార్సీపీ సర్కారు నాడు–నేడు ద్వారా సకల వసతులతో పాఠశాలలను ఆధునికీకరించింది. ఈ విధంగా నాడు–నేడు మొదటి దశలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 1,183 పాఠశాలలను రూ.283 కోట్లతో కార్పొరేట్కు ధీటుగా తీర్చిదిద్దారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే 563 పాఠశాలలను రూ.202 కోట్లతో 10 కాంపొనెంట్ల వారీగా చేపట్టిన పనులు గత ప్రభుత్వం దిగిపోయే నాటికి దాదాపు 80 శాతానికిపైగా పూర్తయ్యాయి. వీటిలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా చేపట్టిన 600 తరగతి గదుల నిర్మాణాలు సైతం ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే నాడు–నేడు పనులను అటకెక్కించింది. ఒక్కో పాఠశాలకు కేవలం రూ.ఐదు లక్షలు ఖర్చు పెడితే పూర్తయ్యే అవకాశమున్నచోట సైతం పట్టించుకోలేదు. అదనపు తరగతి గదులకు సిమెంట్, ఇసుక సరఫరా చేయకపోవడంతో సివిల్ పనులు మధ్యలోనే అగిపోయాయి. నాడు–నేడు మొదటి దశలో విద్యార్థులకు సురక్షితమైన తాగునీటి సరఫరా కోసం పంపిణీ చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్లు నిర్వహణ లేక, వినియోగంచకుండా పక్కన పడేశారు. రెండో దశలో పాఠశాలలకు ఆర్వో వాటర్ ప్లాంట్లు ఇచ్చినా ఇన్స్టాలేషన్ చేయకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు ఉచిత విద్యకు ఇచ్చిన భరోసా రెండేళ్ల కూటమి పాలనలో కరువైంది. -
28న పల్స్ పోలియో చుక్కలు
గుంటూరు మెడికల్: జిల్లా వ్యాప్తంగా ఈనెల 28 నుంచి మూడు రోజులపాటు పల్స్ పోలియో చుక్కల పంపిణీ నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. సన్నాహాక కార్యక్రమంలో భాగంగా గురువారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లాలోని అన్ని పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు, పర్యవేక్షకులతో సమావేశం నిర్వహించారు. ఆమె.. మాట్లాడుతూ ఈ నెల 28 బూత్ స్థాయిలో, 29, 30 తేదీల్లో ఇంటింటికి వెళ్లి చుక్కలు వేస్తారని వెల్లడించారు. సుమారు 1,49,054 మంది 0 నుండి 5 ఏళ్ల పిల్లలు ఉన్నారన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం 12,899 పోలియో వ్యాక్సిన్ వైల్స్ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. జిల్లాలో 584 హైరిస్క్ ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక పర్యవేక్షక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లావ్యాధినిరోధక టీకాల అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్బాబు , డబ్ల్యుహెచ్ఓ కన్సల్టెంట్ డాక్టర్ జి.భవాని, డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ సుజాత, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ సురేష్, మునిసిపల్ హెల్త్ ఆఫీసర్, డాక్టర్ ప్రియాంక, డెమో శివ సాంబిరెడ్డి, డీపీవో సైమన్, సూపర్వైజర్ శాస్త్రి పాల్గొన్నారు. -
వెన్నుపోటు పాలనకు రెండేళ్లు
చంద్రబాబు సర్కారు వచ్చాక సంక్షేమం శూన్యం చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు నిండాయి. సూపర్ సిక్స్ అంటూ అలవికాని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా అమలు చేయకపోగా ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఎన్నికల సమయంలోఊదరగొట్టి తర్వాత హామీలు అమలు చేయకపోవడం ఆయన నైజమని మరోసారి తేలింది. సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తెనాలి, పొన్నూరు, గుంటూరు, తాడికొండ, ప్రత్తిపాడు సభలతోపాటు బీసీ ఘర్జనలో పాల్గొన్ని సూపర్ సిక్స్ గురించి ఊదరగొట్టారు. తాము వస్తే సంపద సృష్టించి సంక్షేమం అమలు చేస్తామని చెప్పారు. గుంటూరులో ఏకంగా ఐటీ టవర్లు కట్టి ఉపాధి కల్పిస్తామన్నారు. జిల్లాలో పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా సూపర్సిక్స్ పథకాల గురించి తమ అనుకూల పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. మంత్రి అనుమతితోనే కేసులు గుంటూరు జిల్లాలో పూర్తిగా మంత్రి లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగమే నడుస్తోంది. పోలీసులు ఏ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నా లోకేష్ అండ్ టీం అనుమతి ఉండాల్సిందే. లేకపోతే కేసు కూడా నమోదు కాని పరిస్థితి గుంటూరు జిల్లాలో నడుస్తోంది. ముఖ్యంగా సోషల్మీడియా ఫిర్యాదులైతే పూర్తిగా తెలుగుదేశం పార్టీ వారు ఇచ్చిన వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రతిపక్షాల నుంచి ఎవరు ఫిర్యాదు చేసినా అది బుట్టదాఖలే అవుతోంది. సోషల్ మీడియా కేసులు, వైఎస్సార్సీపీ నేతలపై పెడుతున్న కేసుల విషయంలో వారి వైఖరి ప్రశ్నార్థకంగా మారింది. కోర్టులు అక్షింతలు వేస్తున్నా పోలీసుల వైఖరి మారలేదు. చినబాబు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఇక దాడులు కూడా సర్వసాధారణంగా మారిపోయాయి. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై ఏడున్నర గంటలసేపు చేసిన దౌర్జన్యం, హింసాకాండ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. జిల్లాలో కూటమిలోని ఇతర పార్టీ నేతలతోపాటు ముఖ్యంగా కాపు సామాజికవర్గం వారిపై జరుగుతున్న దాడులతో వారు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. పేరుకే పథకాలు తల్లికి వందనం కింద సంవత్సరానికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ. 15 వేలు ఇచ్చే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తామన్నారు. ఇప్పటి వరకూ ఒక్క మహిళకు కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ల తాలూకు డబ్బులు జమ కాలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే వరకు నెలకు రూ. 3 వేల భృతి అందజేస్తామన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ.1500 నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని చెప్పారు. అన్నదాతకు అండగా ఏడాదికి రూ. 20 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్కు గ్యారెంటీ’ అంటూ ఇంటింటికీ కరపత్రాలు పంచారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల తర్వాత మాట మార్చారు. అసలు సూపర్ సిక్స్ హామీలను చూస్తుంటేనే భయం వేస్తుందంటున్నారు. సీ్త్ర శక్తి పథకం అమలు చేస్తున్నా ఇప్పటికీ సగానికి పైగా గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. ఉన్న చోట కూడా అరకొర మాత్రమే ఉన్నాయి. కొత్త బస్సులు లేవు. దీనివల్ల మహిళా ప్రయాణికులకు పెద్దగా ఉపయోగం లేకుండాపోయింది. యువతకు అన్యాయం ‘యువతకు ఉపాధి కల్పిస్తాం. సంపద సృష్టించి అభివృద్ధి చేస్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటికొకరికి ఉద్యోగం ఇస్తాం. లేదంటే రూ. 3 వేలు భృతి ఇస్తామంటూ’ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఊదరగొట్టారు. ఇప్పుడు కొత్త ఉద్యోగాల సంగతి పక్కన పెడితే భృతి కూడా లేకుండా పోయింది. ప్రస్తుత పాలన సంక్షేమం నుంచి సంక్షోభం వైపునకు వెళ్తోంది. ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో ప్రజలందరికీ కులమతాలకు అతీతంగా అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాలు అందేలా చూశారు. తర్వాత మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి పాలనలో ప్రజలను సంక్షోభంలోకి నెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛను మాత్రమే పెంచిన కూటమి ప్రభుత్వం... మిగిలిన పథకాలకు తిలోదకాలు ఇచ్చింది. గుంటూరులో భూగర్భ డ్రైనేజీని పూర్తి చేస్తామని కూటమి నాయకులు చెప్పారు. ఇప్పటివరకూ దీనిపై అడుగు ముందుకు పడలేదు. ‘ముస్లింలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తాం. ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరస్తాన్లకు స్థలాలు కేటాయిస్తాం. హజ్ యాత్రకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామంటూ’ గుంటూరు పర్యటనలో చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఈ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. పైగా ఉన్న వక్ఫ్ ఆస్తులు, అంజుమన్ ఆస్తులను ఏపీఐఐసీకి ధారాదత్తం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. గుంటూరులోనే ఐటీ టవర్లు కట్టి వర్క్ ఫ్రం హోం విధానం తీసుకొస్తామని చెప్పారు. అభివృద్ధి చేయకపోగా అవినీతికి గేట్లెత్తేశారు. నగరం నడిబొడ్డున ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జిని కూడా తక్కువ నిధులు వచ్చాయని ఫ్లైఓవర్ బదులుగా మళ్లీ బ్రిడ్జినే కడుతూ వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లే విధంగా వ్యవహరిస్తున్నారు. అన్నదాతలను రోడ్డున పడేశారు. ఈ రెండేళ్లలో తుపాన్లు, వర్షాలకు రైతన్నలు పూర్తిగా నష్టపోయారు. గుంటూరు చానల్, కొండవీటి వాగుల వల్ల పూర్తిగా మునిగారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. వరి, మిర్చి, పొగాకు, జొన్న, మొక్కజొన్న, కంది, పత్తి రైతులు పూర్తిగా దెబ్బతిన్నారు. రాజధాని అమరావతిలో అవినీతి రాజ్యమేలుతోంది. భూములు ఇవ్వని రైతులను వేధిస్తుండటంతో వారందరూ రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. మరోవైపు రెండోవిడత భూసమీకరణను రాజధాని రైతులు వ్యతిరేకిస్తున్నారు. -
ప్రజా ఫిర్యాదులపై దృష్టి సారించాలి
ఎస్పీ వకుల్జిందాల్ నగరంపాలెం: జిల్లాలోని పోలీసు స్టేషన్లకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ వకుల్జిందాల్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలోని హాలులో బుధవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో నమోదైన నేరాలు, దర్యాప్తు, పురోగతి, కేసు ఛేదించిన శాతం, నేరస్తుల అరెస్టులపై ఆరా తీశారు. ఎస్పీ మాట్లాడుతూ చట్టప్రకారం బాధితుల ఫిర్యాదులు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. కొందరు పోలీసు అధికారులు ప్రజా ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహిస్తున్నారని హెచ్చరించారు. ఫిర్యాదులు వచ్చే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు. రానున్న స్థానిక ఎన్నికల దృష్ట్యా గ్రామాలు, వార్డుల వారీగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను గుర్తించాలని కోరారు. అవసరమైన చోట బైండోవర్ కేసులు నమోదు చేయాల్నారు. అంతేకాక వారిపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీ జి.వి.రమణమూర్తి, ఏటీవీ రవికుమార్, డీఎస్పీలు అళహరిశ్రీనివాస్, సంతూరయ్య పాల్గొన్నారు. డీలర్ల సమావేశంలో జేడీఏ పద్మావతి కొరిటెపాడు: ఏపీ ఏఐఎంఎస్ ద్వారా ఎరువుల విక్రయాలు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.పద్మావతి కోరారు. జిల్లాలోని ఎరువుల డీలర్లకు ఫర్టిలైజర్స్ కళ్యాణమండపంలో బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రిటైల్ డీలర్లు ఇకపై ఏపీఏఐఎంఎస్ 2.ఓ పోర్టల్ ద్వారా మాత్రమే యూరియా, డీఏపీ ఎరువులను విక్రయించాలని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీడీ ఆత్మ వేంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో సమతుల్య ఎరువుల వాడకం ఆవశ్యకతను వివరించారు. రసాయన ఎరువుల అధిక వాడకం వల్ల భూమికి, పర్యావరణానికి కలిగే దుష్పరిణామాలను డీలర్లకు వివరించారు. కార్యక్రమంలో ఏడీఏలు ఎన్. మోహనరావు, వి.రమాకోటేశ్వరి, ఆర్.విజయబాబు, పి.సంధ్యారాణి పాల్గొన్నారు. పుల్లలచెరువు మండలం శతకోడులో ఘటన పుల్లలచెరువు: భూముల క్రయవిక్రయాలు సాగించేందుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పుల్లలచెరువు మండలం శతకోడు గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన రవికుమార్(42) అనే వ్యక్తి పొలాలు విక్రయిస్తూ, కొలుగోలు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా శతకోడు గ్రామానికి చెందిన వరికూటి పోలిరెడ్డితో కలిసి చుట్టపక్కల ప్రాంతాల్లో తిరిగాడు. బుధవారం సాయంత్రం గ్రామ శివారు ప్రాంతంలో శివాలయం వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉందని స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. సంఘటన స్థలాన్ని ఎస్సై సాంబశివరావు పరిశీలించారు. హత్యకు గురైన వ్యక్తిని రవికుమార్గా గుర్తించారు. గ్రామంలో ఇటీవల కాలంలో పోలిరెడ్డితో కలిసి రవికుమార్ తిరగడం చూశామని గ్రామస్తులు కొందరు చెప్పారు. హత్యకు పురిగొల్పిన కారణాలు తెలియాల్సి ఉంది. -
మార్కెట్లోకి రాని పాఠ్యపుస్తకాలు
ఎస్సీఈఆర్టీ నిర్లక్ష్యం వల్లే... గుంటూరు ఎడ్యుకేషన్: ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన విక్రయ పాఠ్య పుస్తకాలను సిద్ధం చేయడంలో టీడీపీ సర్కారు విఫలమైంది. 2026–27 నూతన విద్యాసంవత్సరం శుక్రవారం ప్రారంభం కానుండగా, అదే రోజు పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 637 ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న మూడు లక్షల మంది విద్యార్థులకు ఎస్సీఈఆర్టీ ద్వారా రూపొందించిన పాఠ్య పుస్తకాలను ప్రైవేటు కేంద్రాల్లో విక్రయించేందుకు ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం అరకొరగా పంపిణీ చేసింది. దీంతో శుక్రవారం పాఠశాలలు పునఃప్రారంభం కానుండటంతో పాఠ్య పుస్తకాలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన తల్లిదండ్రులకు పుస్తకాలు ఇంకా రాలేదని దుకాణదారులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠ్యాంశాల బోధన తప్పనిసరి ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వం ముద్రించిన పాఠ్య పుస్తకాలతో పూర్తిస్థాయిలో బోధన చేసేలా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పటిష్ట చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) రూపొందించిన పాఠ్య పుస్తకాలను విధిగా కొనుగోలు చేసేలా తీసుకున్న చర్యలతో వ్యవస్థను గాడిలో పెట్టారు. వైఎస్సార్ సీపీ పాలనకు ముందు టీడీపీ హయాంలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులతో యాజమాన్యాలు రూ.వేల ఖర్చుతో ప్రైవేటు పబ్లిషర్ల నుంచి పుస్తకాలను కొనుగోలు చేయిస్తున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలండర్కు విరుద్ధంగా సొంత సిలబస్ను బోధించి, పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన గత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంస్కరణలతో ప్రైవేటు పాఠశాలల్లోనూ ప్రభుత్వ పాఠ్య పుస్తకాలతో బోధన జరుగుతోంది. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన సేల్ టెక్ట్స్బుక్స్కు ఇండెంట్ తీసుకుంటున్న విద్యాశాఖ ప్రభుత్వ విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన పాఠ్య పుస్తకాలకు అదనంగా సేల్ టెక్ట్స్బుక్స్ను ముద్రించి, విక్రయాలు జరిపింది. ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలను బహిరంగ మార్కెట్లో సిద్ధం చేయడంలో ఎస్సీఈఆర్టీ విఫలమైందని ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. డబ్బులు పెట్టి కొనుగోలు చేసుకునేందుకు పాఠ్య పుస్తకాలను అందించలేని దుస్థితి నెలకొందని, పాఠశాలలు తెరిచిన తరువాత పాఠ్య పుస్తకాలు లేకుండా విద్యార్థులకు బోధన ఏ విధంగా చేయాలని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో పాఠశాలలవారీగా హెచ్ఎం లాగిన్ ద్వారా అవసరమైన పాఠ్య పుస్తకాలకు ఆన్లైన్లో ఇండెంట్ పెట్టి, నేరుగా ముద్రణదారుల నుంచి కొనుగోలు చేసే అవకాశం కల్పించారన్నారు. టీడీపీ పాలనలో పరిస్థితులు అధ్వానంగా మారాయని అంటున్నారు. పాఠశాలలు రీ ఓపెన్ చేసేందుకు వ్యవధి దగ్గర పడినప్పటికీ పాఠ్య పుస్తకాలు సైతం అందించలేని దుస్థితి గతంలో ఎప్పుడూ లేదన్నారు. ఇంత చెత్త ప్రభుత్వాన్ని తాము ఎన్నడూ చూడలేదని ఆరోపణలు చేస్తున్నారు. -
వసతి గృహాల ఆధునికీకరణకు చర్యలు
గుంటూరు వెస్ట్: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్స్ను ఆధునికీకరించి మౌలిక సదుపాయాలు కల్పించడానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ ఆదేశించారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో వెల్ఫేర్ హాస్టల్స్ సంక్షేమ అధికారులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, ఆర్ అండ్బీ శాఖ అధికారులు, వసతి గృహాల అభివృద్ధి అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 67 సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయని, వాటిలో 32 హాస్టల్స్ ప్రభుత్వ భవనాలు కలిగి ఉన్నాయన్నారు. వీటిలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వసతి గృహాల అభివృద్ధి, ఆధునికీకరణకు ‘మార్పు’ అని పేరు పెట్టినట్లు తెలిపారు. ఎలాంటి సదుపాయాలు ఉండాలనే విషయమై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అన్ని హాస్టల్స్ ఒకే విధానంలో ఉండేలా చూడాలన్నారు. ఈ నెల 28 నాటికి పనులకు సంబంధించి ఖచ్చితమైన అంచనాలు రూపొందించి సమర్పించాలన్నారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాబాయి, బీసీ కార్పొరేషన్ ఈడీ మంజుల, సోషల్ వెల్ఫేర్ డీడీ చెన్నయ్య, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి పార్థసారథి, పంచాయతీరాజ్ ఎస్ఈ జి.శ్రీనివాసులు, వసతి గృహాల అభివృద్ధి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ ల్యాడ్స్పై నివేదిక సమర్పించాలి ఎంపీ ల్యాడ్స్ ద్వారా జిల్లాలో జరుగుతున్న పనుల పురోగతిపై ప్రగతి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని వి.సి. హాల్లో ఎంపీ ల్యాడ్స్ పనుల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామ శివారు తురకపాలెం వద్ద స్లాబ్ కల్వర్టు నిర్మాణ పనులు, గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం గ్రామంలోని హిందూ శ్మశానవాటికలో కర్మశాల భవన నిర్మాణ పనులను విచారించారు. సమావేశంలో సీపీఓ శేషాశ్రీ, వివిధ కార్యనిర్వాహక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. యోగా కార్యక్రమానికి ఏర్పాట్లు అమరావతి రాజధానిలోని పెరేడ్ గ్రౌండ్స్లో ఈనెల 21న నిర్వహించనున్న రాష్ట్రస్థాయి యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, యోగా గురువు బాబా రాందేవ్ తదితరులు పాల్గొంటారన్నారు.జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ -
గుంతలోకి జారిపడిన ట్రాక్టర్.. డ్రైవర్ మృతి
మంగళగిరి టౌన్: ట్రాక్టర్ అదుపుతప్పి గుంతలోకి జారిపడడంతో తీవ్ర గాయాల పాలైన డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల మేరకు.. మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో నివాసముంటున్న శరత్బాబు (50) ట్రాక్టర్ డ్రైవర్గా మెగా కంపెనీలో పనిచేస్తున్నాడు. కురగల్లు గ్రామంలో మెగా కంపెనీ కింద గుంతల్లో నిల్వ ఉన్న నీటిని ట్రాక్టర్ ఇంజిన్తో డీవాటరింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో జూన్ 9వ తేదీ మధ్యాహ్నం నీళ్లు ఉన్న గుంత అంచున ట్రాక్టర్ పెట్టి నీటి పైపును వేసి డీ వాటరింగ్ చేస్తున్నాడు. ట్రాక్టర్ను వెనక్కు తీసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో గుంత అంచున ఉండడంతో ప్రమావశాత్తూ పక్కనే ఉన్న 20 అడుగుల లోతున్న గుంతలో జారిపడిపోయింది. డ్రైవర్ సీట్లో ఉన్న శరత్బాబు పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయిన శరత్బాబును మెగా కంపెనీ అంబులెన్స్లో చికిత్స నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్కు తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం శరత్బాబు మృతిచెందాడు. ఘటనపై మృతుడి కుమారుడు వంశీకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్కు కాపు నాడు వినతి నెహ్రూనగర్: కాపుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు అధ్యక్షులు సంకటి లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం మంగళగిరి వద్ద ఉన్న జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్కు వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ 2017 డిసెంబర్లో అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు 100 నియోజకవర్గాల్లో కాపు భవనాలు, హాస్టళ్లు, కల్యాణ మండపాలకు స్థలాలు ఇచ్చి కట్టిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వాటిని వెంటనే అమలు చేయాలని కోరారు. కాపు కార్పొరేషన్న్కు ఏటా రూ.1000 కోట్ల నుంచి రూ.2000 కోట్లు నిధులు విడుదల చేయాలని కోరారు. కాపు విదేశీ విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టడంతో పాటు కాపు మహిళా సాధికారత కింద 45 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.15,000, 5 సంవత్సరాలకు రూ.75,000 వరకు ఆర్థిక సాయం అందించాలని పేర్కొన్నారు. 2019లో కాపులను బీసీల్లో చేర్చి 9వ షెడ్యూల్లో పెడతామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై పూర్తిగా పరిశీలించి కాపులకు న్యాయం చేయాలని వినతిపత్రంలో కోరారు. కాపునాడు ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదని, వ్యతిరేకం కాదని, రిజర్వేషన్, రాజ్యాధికార సాధన లక్ష్యంగా పోరాడే సంస్థ అని స్పష్టం చేశారు. -
మంత్రి లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చాలి
1998 డీఎస్సీ క్వాలిఫైడ్ టీచర్స్ మిగిలిపోయిన అభ్యర్థులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి తాడేపల్లి రూరల్: మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ టీచర్స్ భైరవకోన సభ్యులు డిమాండ్ చేశారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని ప్రెస్క్లబ్లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కడుగు శ్రీనివాసరావు, చింతా శ్రీనివాసరావు, పొన్నగంటి లక్ష్మి, వి.ఎం.సుహాసిని మాట్లాడుతూ తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. గత కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నామని, ఇప్పటికే వయోభారంతో కొంతమంది అభ్యర్థులు చనిపోయారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయ్యిందని, ఇప్పటి వరకు నారా లోకేష్ ఎన్నికల హామీని నెరవేర్చలేదని విమర్శించారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో 4,072 మందికి ఉద్యోగాలు ఇచ్చారని, ప్రస్తుతం అందులో పనిచేస్తున్న ఎంటీఎస్ టీచర్లు 1500 మంది రిటైర్ అయ్యారని, ఈ పోస్టులను గత డీఎస్సీలో కలపలేదని, వారి స్థానంలో మిగిలిన వారికి ఇస్తే మిగిలిపోయిన 1,369 మందికి ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే తమకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో బిల్లా చంద్రయ్య, డి.ఆదినారాయణ, డి.నాగేశ్వరరావు, టి.ఏసుబాబు, సీహెచ్ఎల్వీ తులసి, ఆర్.రామారావు పాల్గొన్నారు. -
ప్రింటింగ్ రంగానికి పారిశ్రామిక హోదాపై పరిశీలన
తాడేపల్లి రూరల్: రాష్ట్రంలో ప్రింటింగ్ రంగానికి పారిశ్రామిక హోదా కల్పించే అంశం ప్రభుత్వం పరిశీలనలో ఉందని, దీనిపై సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి భరత్ స్పష్టం చేశారు. బుధవారం విజయవాడ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంట్యాల బసవయ్య అభినందన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రింటింగ్ అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలపై మంత్రికి వినతిపత్రం అందజేశారు. మంత్రి భరత్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తోందని గుర్తుచేశారు. ఇప్పటికే ప్రింటింగ్ రంగానికి విద్యుత్ ఛార్జీలకు సంబంధించి పారిశ్రామిక హోదాను వర్తింపజేశామని, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి టారిఫ్ సవరణ కూడా అమలులోకి వచ్చిందని తెలిపారు. ప్రపంచంలోని పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రింటింగ్ రంగాన్ని 4వ లేదా 5వ అతిపెద్ద పరిశ్రమగా గుర్తిస్తూ పారిశ్రామిక హోదా కల్పించారని మంత్రి పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఈ రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వాలనే డిమాండ్ వస్తోందని, దీనిపై తాము కూడా కసరత్తు చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 40 నుంచి 50 వేల మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, కాబట్టి వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో, సరికొత్త కాన్సెప్ట్లతో ముందుకు రావాలని, పరిశోధన మరియు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. మంచి ప్రభుత్వానికి, మంత్రి వర్యులకు ముద్రణా రంగ పారిశ్రామికవేత్తల తరఫున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రింటింగ్ రంగాన్ని ఇప్పటివరకు కేవలం ఒక వ్యాపారంగానే చూస్తున్నారని, దీనికి పూర్తిస్థాయిలో పరిశ్రమగా గుర్తింపు ఇవ్వాలని మంత్రి టీజీ భరత్ను కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి కోలా వెంకటరమణ, సలహాదారులు మిక్కిలినేని వెంకట శివప్రసాద్, కార్యదర్శి కట్రగడ్డ మోహన్, ఆల్ ఇండియా ఫెడరేషన్ మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ ప్రతినిధి రవీందర్ రెడ్డి, తెలంగాణ ప్రింటర్స్ అసోసియేషన్ కార్యదర్శి వెంకట్ రెడ్డి, సభ్యులు చక్కా శివప్రసాద్ హర్షారెడ్డి పాల్గొన్నారు. -
అటవీ శాఖ విజిలెన్స్ అధికారుల తనిఖీలు
బొల్లాపల్లి: అటవీ శాఖ విజిలెన్స్ విభాగం అధికారులు బుధవారం వినుకొండ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తనిఖీ నిర్వహించారు. రాష్ట్ర విజిలెన్స్ విభాగానికి చెందిన టీ శ్రీసాయి, ఎఫ్ఆర్ఓ శంకరయ్యలు తొలుత వినుకొండ పట్టణ సమీపంలో అటవీ శాఖ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన నగర వనాన్ని సందర్శించారు. ఈపూరు మండలం భద్రుపాలెం సమీపంలో ఆ శాఖ పరిధిలో నిర్వహిస్తున్న నర్సరీని సందర్శించారు. బొల్లాపల్లి మండలం జయంతి రామాపురం, మర్రిపాలెం గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్లాంటేషన్ పరిశీలించారు. రేమిడిచర్ల బీట్ పరిధిలో ఇటీవల వన్యప్రాణుల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన 5 సాసర్ ఫిట్స్ను తనిఖీ చేసి సంతప్తి వ్యక్తం చేశారు. అనంతరం అదే బీట్ పరిధిలో పలకల క్వారీని తనిఖీ చేశారు. విజిలెన్స్ విభాగం అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారని రేంజర్ సి.మాధవరావు తెలిపారు. అటవీశాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: మంగళగిరి ఎయిమ్స్ వైద్యశాలలో ఆయుష్ సేవలను బలోపేతం చేస్తామని, భవిష్యత్తులో యోగ, సిద్ధ వైద్య విధానాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నామని ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ ప్రొఫెసర్ డాక్టర్ అహంతం శాంతాసింగ్ పేర్కొన్నారు. మంగళగిరి ఎయిమ్స్లో బుధవారం ఆయుష్ విభాగాన్ని ఆయన ప్రారంభించారు. డాక్టర్ అహంతం శాంతాసింగ్ మాట్లాడుతూ త్వరలోనే ఆయుష్ విభాగంలో మరో ఇద్దరు వైద్యాధికారులు చేరనున్నట్లు తెలిపారు. నూతనంగా ప్రారంభించిన ఆయుష్ విభాగంతోపాటు ఎయిమ్స్లో 44 క్రియాశీలక విభాగాలు ఉన్నాయని వెల్లడించారు. క్రీడాకారుల ఆరోగ్య సంరక్షణ అవసరాలకు స్పోర్ట్స్ మెడిసిన్ విభాగాన్ని మంగళగిరి ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వృద్ధుల ఆరోగ్య సంరక్షణకు జెరియాట్రిక్ మెడిసిన్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎయిమ్స్ వైద్యులు పుష్పాంజలి, దేసు రామమోహన్, రాజశేఖర్ మోహన్, కల్నల్ శశికాంత్, సన్యాల్, ఆర్థిక సలహాదారులు డి.గోవిందరావు, అధికారులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్ (క్రీడలు): హైదరాబాద్ కొంపల్లిలో ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న సౌత్ జోన్ పికిల్ బాల్ చాంపియన్షిప్ పోటీలకు గుంటూరు నుంచి 14 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు జిల్లా పికిల్ బాల్ సంఘం కార్యదర్శి జీఎస్ ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సౌత్ జోన్లో పాల్గొనే క్రీడాకారులకు ఆపిల్ డెంటల్ కేర్ అధినేత డాక్టర్ తోట హను, తోట ప్రగతి, అలపర్తి అలేఖ్యలు క్రీడాకారులకు టీ–షర్ట్స్ అందజేశారు. సౌత్ జోన్ పోటీలలో కూడా మెడల్స్ సాధించి జిల్లా కీర్తి ప్రతిష్టలను దేశవ్యాప్తంగా ఇనుముడింప చేయాలని కోరారు. సౌత్ జోన్ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారుల వివరాలు పి.ఆనంద్కుమార్, కె.అరుణ్కుమార్, డి.అభిరామ్, నల్లబోతు త్రిలోక్య (సంజు), నిహాల్, ఆకాష్, చరణ్, జీవీఎస్ ప్రసాద్, టీ నేహా, టి.నిహిత, ఏ.ఆరాధ్య, ఎన్. హవిష్మ్, పి.అమృత, కే.కళ్యాణ్. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ముస్తాబాద్–గన్నవరం సెక్షన్లలో పనుల కారణంగా పలు రైళ్లను దారి మళ్ల్లించినట్లు రైల్వే విజయవాడ పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. యర్నాకులం –పాట్నా (22643) ఈ నెల 15, 16, 22, 23, 29, 30, జూలై 6, 7 తేదీల్లో వయా విజయవాడ, గుడివాడ, నిడదవోలు మీదుగా నడపనున్నారు. ఎస్ఎంవీటీ బెంగళూరు – గౌహతి (12509) 10, 17, 24, జూలై ఒకటో తేదీ, భవ్నగర్ టెర్నినస్ – కాకినాడ పోర్టు (12756) రైలు 13, 20, 27, జూలై 4 తేదీల్లో దారి మళ్లించారు. -
ఎట్టకేలకు చిక్కిన రిమాండ్ ఖైదీ
నగరంపాలెం: గుంటూరు జీజీహెచ్ నుంచి పరారైన రిమాండ్ ఖైదీ దాదాపు 70 రోజుల తర్వాత తమిళనాడు పోలీసులకు చిక్కాడు. వివరాలు.. ఏలూరు జిల్లా పెద్దయోగి మండలం కొప్పలవారిగూడెం గ్రామం నాగన్నగూడెంకు చెందిన భీముడు అజిత్కుమార్ (29) ఓ కేసులో ఒంగోలు జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. 2024లో గుంటూరు జిల్లా తెనాలి ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. ఈ కేసులో వారెంట్ ముద్దాయి అయిన అతన్ని తెనాలి ఒకటో పట్టణ పోలీసులు ఈ ఏడాది మార్చి 24న ఒంగోలు జైలు నుంచి పీటీ వారెంట్పై తీసుకొచ్చారు. రిమాండ్ నిమిత్తం రేపల్లె సబ్ జైలుకి తరలించారు. పరారయ్యేందుకు జైల్లోనే పథకం రూపొందించాడు. మార్చి 25న ఆస్తమా ఉందని, గతంలో ఎడమ కాలికి శస్త్రచికిత్స చేయగా నొప్పిగా ఉందని సబ్ జైలు అధికారి దృష్టికి తీసుకెళ్లడంతో ఎస్కార్ట్ సిబ్బంది గుంటూరు జీజీహెచ్కి తరలించారు. చికిత్స పొందే క్రమంలో 28న అజిత్కుమార్ మూత్రవిసర్జనకి వెళ్తున్నానని పరారైన విషయం విదితమే. రేపల్లె సబ్ జైలు అధికారికి ఆన్లైన్లో నగదు చెల్లించారనేది విచారణలో బహిర్గతమైంది. మొబైల్ ఫోన్ వాడకపోవడం, ఎప్పటికప్పుడు ప్రదేశాలు మారుస్తూ జాగ్రత్త పడటంతో నెలలు గడిచాయి. తమిళనాడులోని తిరుపూర్లో క్రైం విభాగం పోలీసులు సుమారు వారం క్రితం ఓ కేసులో అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం అతను రిమాండ్ ఖైదీగా ఉన్నట్లు సమాచారం. అతన్ని గుంటూరు తీసుకొచ్చేందుకు పోలీస్ బృందం వెళ్లినట్లు తెలిసింది. పరారీ ఘటపై ఇప్పటి వరకు తొమ్మిది మందిని సస్పెండ్ చేశారు. మరికొందరిపై ఇప్పటికి విచారణ చేస్తున్నారు. -
పొగాకు బాధితులకు చేదు వార్త
గుంటూరు మెడికల్: యవ్వనంలో సరదా కోసం స్మోకింగ్కు అలవాటు పడినవారు ఆ అలవాటు మానాలనుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాంటి వారికి గుంటూరు జీజీహెచ్ మానసిక వ్యాధుల విభాగంలో డీ అడిక్షిన్ సెంటర్, పొగాకు మాన్పించే కేంద్రం ఉన్నాయి. వీటిలో చికిత్స కోసం ప్రతి రోగి పది నుంచి 15 మంది పొగతాగే అలవాటు ఉన్నవారు, ఖైనీ, గుట్కా, పాన్పరాగ్లాంటి పొగాకు సంబంధిత ఉత్పత్తులు నమిలే అలవాటు ఉన్నవారు సైతం జీజీహెచ్కు వస్తున్నారు. వీరికి ఆ అలవాటును మాన్పించేందుకు శరీర భాగంలో ఛాతీకి లేదా భుజానికి లేదా తొడకు వెంట్రుకలు లేని ప్రాంతంలో నికోటిన్ ట్రాన్స్థర్మల్ ప్యాచ్ను అంటించి కౌన్సెలింగ్ చేస్తారు. ఇలా ప్రతినెలా బాధితులు పొగాకు ఉత్పత్తులు విడనాడుతున్నారు. మందులు మింగే పనిలేకుండా కేవలం ఒక స్టిక్కర్ మాదిరిగా నికోటిన్ ప్యాచ్ను అంటించుకోవడం ద్వారా పొగాకు వినియోగాన్ని సునాయాసనంగా విడిచి పెట్టడంతో రోజూ జీజీహెచ్కు బాధితులు క్యూ కడుతున్నారు. కానీ ప్యాచ్లు ఆరు నెలలుగా జీజీహెచ్లో స్టాక్ లేవు. వాస్తవానికి ఈ ప్యాచ్లను ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల పాటు వినియోగించాల్సి ఉంటుంది. బహిరంగ మార్కెట్లో వీటి ఖరీదు నెలకు రూ.3 వేలకుపైగా ఉంటుంది. పలువురు బాధితులు వాటిని కొనుగోలు చేసే స్థోమత లేక కౌన్సిలింగ్ చేయించుకున్నప్పటికీ ప్యాచ్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువగా రోజువారి కూలీలు, దిగువ మధ్యతరగతి వారు బాధితులుగా ఉన్నారు. ఆరు నెలలుగా స్టాకు లేక బయట కొనుగోలు చేసే స్థోమత లేక పొగరాయుళ్లు సతమతం అవుతున్నారు. గుంటూరు జీజీహెచ్కు కేవలం గుంటూరు జిల్లాకు చెందిన వారే కాకుండా పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లాలకు చెందిన వారు సైతం నికోటిన్ ప్యాచ్ల కోసం పొగ అలవాటును మానాలనే ఉద్దేశంతో వచ్చి ఇబ్బంది పడుతున్నారు. జీతాలకు కూడా దిక్కులేదు... డీ అడిక్షన్ సెంటర్, పొగాకు మాన్పించే కేంద్రంలో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి రెండు నెలలుగా వేతనాలు కూడా విడుదల కాలేదు. ఇరువురు కౌన్సిలర్లు, ఇరువురు నర్సింగ్ సిబ్బంది, ఇరువురు నాలుగో తరగతి ఉద్యోగులు, మెడికల్ ఆఫీసర్ ఈ కేంద్రంలో విధులు నిర్వహిస్తూ పొగరాయుళ్లుకు చెడు అలవాట్లు మాన్పించటంలో సహాయపడుతున్నారు. ఒక పక్క నికోటిన్ ప్యాచ్లు లేక, మరోపక్క పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు విడుదల కాక డీ అడిక్షన్ సెంటర్ పనితీరు దిగజారుతోంది. సంబంధిత అధికారులు ఇప్పటికై నా స్పందించి పొగాకు వినియోగంలాంటి చెడు అలవాట్లు విడనాడాలనుకునే వారికి నికోటిన్ ప్యాచ్లు అందుబాటులో ఉండేలా చూడాలని, కేంద్రంలో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి వేతనాలు విడుదల అయ్యేలా చూడాలని బాధితులు కోరుతున్నారు. -
చేనేతల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
మంగళగిరి టౌన్: చేనేత కార్మికుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చేనేత సంఘాల రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటీ ఆరోపించింది. మంగళగిరి పట్టణం మార్కండేయ కళ్యాణ మండపంలో బుధవారం కమిటీ సమావేశం నిర్వహించారు. పలువురు కమిటీ సభ్యులు మాట్లాడుతూ చేనేత కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారు. గత ఫిబ్రవరి 22న చేనేత కార్మికులతో మంగళగిరిలో నిర్వహించిన చేనేత గర్జన, ప్రదర్శన, బహిరంగ సభ అనంతరం కూడా ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 22న 48 గంటల నిరాహార దీక్ష చేపట్టినా పాలకుల వైఖరిలో మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మగ్గాలు ఉన్న చేనేత కార్మికులకే ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తూ, మగ్గాలు లేని షెడ్ల కార్మికులు, అనుబంధ వృత్తులపై ఆధారపడిన వారిని విస్మరించిందని ఆరోపించారు. నేతన్న భరోసా పథకం కింద ఏడాదికి అందించాల్సిన 25 వేల ఆర్థిక సహాయాన్ని విడుదల చేయకపోవడం వలన చేనేత కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సహకార చేనేత సంఘాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన 203 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో ఈనెల 22న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద భారీ ఆందోళనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. చేనేత రంగ పరిరక్షణ కోసం చేపట్టనున్న ఉద్యమాలకు ప్రజలు మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. మంగళగిరి హ్యాండ్లూమ్ కమిషనర్ కార్యాలయం వద్ద జూన్ 22వ తేదీన ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కమిటీ కో కన్వీనర్ పిల్లలమర్రి నాగేశ్వరరావు, సభ్యులు రామనాథం పూర్ణచంద్రరావు, పి.బాలకృష్ణ, రామారావు, కోటేశ్వరరావు, రవి పాల్గొన్నారు. -
భద్రతా నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు
లక్ష్మీపురం: భద్రతా నియమాలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీనియర్ డివిజనల్ సేఫ్టీ అధికారి బి.విజయకీర్త్తి హెచ్చరించారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ పిలుపు మేరకు గుంటూరు రైల్వే డీఆర్ఎం సుధేష్ఠ సేన్ పర్యవేక్షణలో ఈనెల మూడు నుంచి తొమ్మిదో తేదీ వరకు గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో నిర్వహించిన అంతర్జాతీయ లెవెల్ క్రాసింగ్ అవగాహన దినోత్సవాలు బుధవారంతో ముగిశాయి. రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద ప్రమాదాల నివారణ, రహదారి వినియోగదారుల్లో భద్రతా అవగాహన పెంపు లక్ష్యంగా అధికారులు, సూపర్వైజర్లు, భద్రతా సిబ్బంది రక్షేత్రస్థాయిలో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానంగా పట్టాభిపురం, ఇన్నర్ రింగ్ రోడ్, పెదకపలకలూరు, మంగళగిరి ప్రాంతాల్లోని రైల్వే గేట్ల వద్ద ప్రజలకు అవగాహన కల్పించారు. రైల్వే భద్రతా బృందాలు లెవెల్ క్రాసింగ్ల సమీప గ్రామాల్లో పర్యటించి ప్రజలకు భద్రతా సూచనలు తెలియజేడంతోపాటు పోస్టర్లు, కరపత్రాల ద్వారా పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో డివిజన్ అధికారులు, ఆర్పిఎఫ్ సిబ్బంది, పాల్గొన్నారు. సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ విజయకీర్త్తి -
గుంటూరు
గురువారం శ్రీ 11 శ్రీ జూన్ శ్రీ 2026గ్లాసులు గలగల.. అధికారంలోకి రాగానే సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమం అందిస్తాం.... ఇదీ చంద్రబాబు ఎన్నికల ప్రకటన. ఆ సంపద ఏమోగానీ, దానిని తమ నుంచే కొల్లగొడుతున్నారని తెలియని ప్రజలు విస్తుపోతున్నారు. రేయింబవళ్లు గ్లాసులు గలగల అనేలా సర్కారు ప్రోత్సాహం ఇస్తోంది. ఖజానా కళకళలాడితే చాలన్నట్లుగా వ్యవహరిస్తోంది. గత నెలలో భారీగా ఆదాయం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,7952 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. తెనాలి రూరల్: మండలంలోని సంగం జాగర్లమూడి పీహెచ్సీని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఎ.శ్రావణ్బాబు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 7 -
లారీ యాజమానులపై అదనపు భారం మోపవద్దు
నగరంపాలెం: లారీ యజమానులపై అదనపు భారం మోపవద్దని న్యూ ఆంధ్ర మోటార్ ట్రాన్స్పోర్టర్స్ అసోసియేషన్ (ఎన్ఏఎంటీఏ) జిల్లా ఇన్న్చార్జి సాంబశివరావు అన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గూడ్స్ క్యారేజ్ వాహనాలపై వెహికల్ లోకేషన్ ట్రాకింగ్ డివైస్(వీఎల్టీడీ)ను తప్పనిసరి చేయడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. తద్వారా లారీ యజమానులపై మరింత భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం జారీ చేసిన రూల్ 125 హెచ్, 2018 నాటి వీఎల్టీడీ మార్గదర్శకాల్లో ప్రధానంగా పబ్లిక్ సర్వీస్ వెహికల్స్ గురించే ప్రస్తావించారని అన్నారు. గూడ్స్ క్యారేజ్ వాహనాలకు వీఎల్టీడీ తప్పనిసరి అమలుపై చట్టపరమైన నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. గతనెల 13న సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలలో ప్రజా రవాణా వాహనాలలో వీఎల్టీడీ, పానిక్ బటన్ అమలుపై దృష్టి సారించిందని, గూడ్స్ వాహనాలపై తప్పనిసరి అమలుకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయా అనే విషయంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని కోరారు. డీజిల్ ధరల పెరుగుదల, టోల్ ఫీజులు, బీమా ప్రీమియంలు, టైర్లు, స్పేర్ పార్ట్స్ ధరలు, బ్యాంకు రుణాల వడ్డీలు పెరుగుతున్న దృష్ట్యా లారీ యజమానులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇటువంటి వేళ ఒక వాహనానికి వీఎల్టీడీ పరికరం కొనుగోలు, అమరిక, వార్షిక నిర్వహణ, సిమ్, సాఫ్ట్వేర్ ఛార్జీల రూపంలో వేలాది రూపాయల అదనపు వ్యయం మోపడంతో చిన్న, ముధ్య తరహా లారీ యజమానులకు భారంగా మారుతుందని వాపోయారు. గూడ్స్ వాహనాలపై వీఎల్టీడీ తప్పనిసరి అమలుకు ఉన్న చట్టపరమైన ఆధారాన్ని ప్రభుత్వం బహిరంగంగా వెల్లడించాలని అన్నారు. రూల్ 125 హెచ్, 2018 వీఎల్టీడీ మార్గదర్శకాలపై అధికారిక స్పష్టీకరణ జారీ చేయాలని కోరారు. రాష్ట్ర స్థాయి ట్రాన్స్పోర్ట్ సంఘాలతో అత్యవసర సమావేశం నిర్వహించాలని పేర్కొన్నారు. చట్టపరమైన స్పష్టత వచ్చే వరకు ఫిట్నెస్, పర్మిట్, బ్యాక్స్, ఇతర పరిపాలనా చర్యలలో వీఎల్టీడీ నిబంధనను అమలు చేయరాదని డిమాండ్ చేశారు. చిన్న, మధ్య తరహా లారీ యజమానులకు ఆర్థిక భారం తగ్గించే చర్యలు చేపట్టాలని అన్నారు. లారీ యజమానుల న్యాయమైన ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోకపోతే రాష్ట్రంలోని ట్రాన్న్స్పోర్ట్ సంఘాలతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. రవాణా రంగాన్ని ఇబ్బందులకు గురిచేసే విధానాల కంటే, ట్రాన్స్పోర్ట్ రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. -
సచివాలయాల ఉద్యోగుల నుంచి ఫోన్ కాల్స్
లక్ష్మీపురం: యోగాంధ్ర రిజిస్ట్రేషన్ పేరుతో సచివాలయాల నుంచి ఫోన్ కాల్స్ చేసి ఓటీపీలు అడుగుతుండటంతో నగర వాసులు సైబర్ నేరాలకు ఎక్కడ గురవుతామోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లా, నగరపాలక సంస్థ అధికారుల సూచన మేరకు గుంటూరు నగర వాసులకు సచివాలయాల ఉద్యోగులు ఓటీపీ చెప్పాలని ఫోన్ కాల్ చేస్తున్నారు. ఒక పక్క ఓటీపీలు చెబితే చాలు ఖాతాల్లోని రూ.లక్షల నగదు మాయం అవుతున్న రోజులివి. ఇప్పుడు యోగాంధ్రా కోసం సచివాలయాల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నామని, దానికి సంబంధించి మీ సెల్ ఫోన్ నంబర్కు ఓటీపీ వచ్చిందని సచివాలయ సిబ్బంది నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కొంత మంది చెప్పినప్పటికీ చాలామంది భయంతో వెనుకడుగు వేస్తున్నారు. అయినప్పటికీ పదే పదే కాల్స్ చేస్తుండటంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు. నగరంలోని సచివాలయాల నుంచి కాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి ఫోన్లు వస్తుండటంతో ఇదే నమోదు అనే అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. నమోదు చేస్తున్నట్లు చెప్పకుండా నేరుగా ఓటీపీ చెప్పమని అడుగుండటంతో ప్రజలు భయందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడి కారణంగానే సంబంధిత అధికారుల ఆదేశాలతో సచివాలయ సిబ్బంది ఇలా చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. -
పెను భారంగా మారిన ధరలు
లక్ష్మీపురం: ప్రధాని బాధ్యతారాహిత్యం వల్ల పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అసాధారణ రీతిలో పెరిగి సామాన్యులకు భారంగా మారాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ళ నాగేశ్వరరావు ఆరోపించారు. పెంచిన వీటి ధరలు తగ్గించాలని స్థానిక హిమనీ సెంటర్లో వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇచ్చి ప్రజలు వినియోగించే వంట గ్యాస్, ఇంధన ధరలను ప్రభుత్వం పెంచడం దుర్మార్గమన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకునే ఎన్డీఏ పాలనలో రూపాయి విలువ పూర్తిగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ జిల్లా, నగర కార్యదర్శులు కోట మాల్యాద్రి, ఆకిటి అరుణ్ కుమార్ మాట్లాడుతూ సంక్షోభం వచ్చిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచామని ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కేజీ బేసిన్లో రాష్ట్రానికి సగం ఉత్పత్తులు ఇవ్వాలని ప్రణాళిక సంఘం చెప్పినా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదని పేర్కొన్నారు. సీపీఎం నగర కార్యదర్శి నళినీకాంత్, సీపీఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి ఉల్లిగడ్డ నాగేశ్వరరావు, జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు, నగర కమిటీ సభ్యుడు నూతలపాటి చిన్న, రావుల అంజిబాబు, సురేష్ బాబు, గుండెబోయిన లక్ష్మి, బి.వెంకటేశ్వర రెడ్డి, చల్ల మరిదాసు, జంగాల చైతన్య, రత్నం, కోట్ల మరిదాసు, రాయల వెంకటేశ్వర్లు, ఆకిటి రామచంద్రుడు, పున్నయ్య, షేక్ వలి, మిరియాల కోటేశ్వరరావు, అప్పమ్మ, రాగం చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. -
పవర్ లిఫ్టింగ్లో షబీనాకు రజతం
తెనాలి: అఖిల భారత అంతర విశ్వవిద్యాలయాల పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ 2025–26లో తెనాలికి చెందిన పవర్ లిఫ్టర్ షేక్ షబీనా అద్భుత ప్రతిభతో రజత పతకం సాధించింది. చైన్నెలోని హిందుస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (హిట్స్) బే రేంజ్ క్యాంపస్లో ఈ నెల జూన్ 3 నుంచి 8 వ తేదీ వరకు ఈ పోటీలు జరిగాయి. కేఎల్ యూనివర్సిటీలో చదువుతున్న షబీనా ఈ పోటీల్లో 84 కిలోల కేటగిరీలో తలపడి స్క్వాట్ 210 కిలోలు, బెంచ్ ప్రెస్ 110 కిలోలు, డెడ్ లిఫ్ట్ 207.5 కిలోలతో మొత్తం 527.5 కిలోల బరువులను ఎత్తి రజత పతకం గెలుచుకుంది. ప్రముఖ కోచ్ ఎం.అశోక్ మార్గదర్శకత్వంలో శిక్షణ పొందిన షబీనా, క్రమశిక్షణతో కూడిన కఠిన సాధనతో పలు జాతీయ, అంతర్జాతీయ పతకాలను సాధిస్తుండటం విశేషం. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై హనుమాన్కు 3000 మామిడిపండ్లతో మంగళవారం అర్చన నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మంగళాశాసనములతో విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై శ్రీ విఘ్న విమోచక హనుమాన్కు 3వేల మామడి పండ్లతో అర్చన కార్యక్రమాన్ని శోభాయమానంగా నిర్వహించామని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారన్నారు. హనుమంతుడి అనుగ్రహాన్ని పొందారని ఆయన తెలిపారు. గుంటూరు వెస్ట్: ప్రభుత్వ ఉద్యోగమంటే ఉపాధి మార్గం మాత్రమే కాదని, సామాజిక బాధ్యతగా స్వీకరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఆరుగురు అభ్యర్థులకు కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. కార్మిక శాఖ, పోలీస్, ఎన్సీసీ తదితర శాఖలలో వీరికి నియామక ఉత్తర్వులను అందజేశారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి పాల్గొన్నారు. ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి పొన్నూరు: గణితం, ఆంగ్లం సబ్జెక్టులు విద్యార్థులు ఇష్టపడి చదివే విధంగా ఉపాధ్యాయులు బోధన చేయాలని గుంటూరు ప్రాంతీయ ఉప సంచాలకుడు బి.లింగేశ్వరరెడ్డి అన్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీ హైస్కూల్లో జి.ఎఫ్.ఎల్.ఎన్. శిక్షణ తరగతులు నిర్వహించారు. తరగతులు జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఒకటి, రెండు తరగతులు బాగా చదివితే పై తరగతుల్లో విద్యార్థులు రాణిస్తారన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు జీఎఫ్ఎల్ఎన్ అమలు కోసం కృషి చేయాలన్నారు. ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పనులను పరిశీలించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు డి. రాజు, కె.విజయ భాస్కర్, ప్రధానోపాధ్యాయురాలు వి.తులసిరాణి, డీఆర్పీలు శ్రీనివాసమూర్తి, కోటేశ్వరరావు, సద్గుణరావు, లక్ష్మీనారాయణ, పద్మజ, కళ్యాణి, రాంబాబు, దీక్ష కోఆర్డినేటర్లు బి.హనుమంత ప్రసాద్, పి.రవికుమార్ సీఆర్ఎంటీలు, పీటీఐలు తదితరులు పాల్గొన్నారు. -
మృతదేహంతో ఇంటి ముందు నిరసన
గుంటూరు రూరల్: పొలం తాకట్టు వివాదం నేపథ్యంలో మృతదేహంతో నిరసన తెలిపిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు.. వెంగళాయపాలేనికి చెందిన చీలి రామారావు(60)కు భార్య భాగ్యలక్ష్మి, కుమారులు ఉన్నారు. ఆయన 2006లో కొన్ని అవసరాల నిమిత్తం నల్లపాడు గ్రామానికి చెందిన చల్లా శ్రీనివాసరెడ్డి వద్ద అప్పు తీసుకున్నారు. ఆ సమయంలో వెంగళాయపాలెంలోని 40 సెట్ల భూమిని తాకట్టు పెట్టారు. పొలం డబ్బు విషయంలో పలుమార్లు పోలీసులు, పెద్దలు జరుగుతున్న వివాదాలకు పలు మార్లు సెటిల్ మెంట్లు చేశారు. రామారావు అనారోగ్యంతో మంగళవారం మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని రామారావు కుటుంబ సభ్యులు పొలం తీసుకున్న వ్యక్తి ఇంటిముందు ఉంచి నిరసన తెలిపారు. విషయం తెలిసిన గ్రామ పెద్దలు పలువురు ఇరువురికి సర్ది చెప్పి పొలాన్ని విక్రయించి చెరిసగం తీసుకోవాలని నచ్చజెప్పారు. ఇరువర్గాలు అంగీకరించడంతో వివాదం సర్దుమణిగింది. -
గళమెత్తిన న్యాయవాదులు
చీరాల రూరల్: చినగంజాం మండలంలోని అన్ని సివిల్, క్రిమినల్ కేసులను చీరాల కోర్టుల నుంచి పర్చూరు కోర్టుకు తరలించవద్దంటూ బార్ అసోసియేషన్, అడ్హక్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయవాదులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. చినగంజాం మండల సివిల్, క్రిమినల్ కేసులను పర్చూరు కోర్టుకు బదలాయించడాన్ని నిరసిస్తూ మంగళవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చీరాల–వాడరేవుపై ధర్నా నిర్వహించారు. న్యాయవాదులు చీరాల కోర్టుల్లోని చినగంజాం కేసులను పర్చూరు కోర్టుకు తరలించవద్దంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. సీనియర్ న్యాయవాదులు శ్రీకాంత్ ఠాకూర్, మిక్కిలి పుల్లయ్య, ఆకిశెట్టి పుల్లయ్య నాయుడు, పింజల ప్రసాద్, గౌరవ రమేష్బాబు మాట్లాడారు. చినగంజాం మండల కేసులను పర్చూరు కోర్టుకు మార్చినట్లయితే ఆయా మండలానికి చెందిన అనేక గ్రామాల కక్షిదారులు తీవ్రంగా ఇబ్బందులు పడతాయని చెప్పారు. చినగంజాం పరిసర గ్రామాలకు చెందిన కక్షిదారులు పర్చూరు కోర్టుకు వెళ్లాలంటే అనేక వ్యయ ప్రయాసలకోర్చి వెళ్లాలన్నారు. పర్చూరుకు నిరంతరాయంగా బస్సు సౌకర్యం కూడా లేదని, కక్షిదారులు సుమారుగా 60 కిలో మీటర్లు దూరం ప్రయాణించాల్సి ఉంటుందని తద్వారా వారికి సమయంతో పాటు డబ్బు అధికంగా ఖర్చు అవుతాయని తెలిపారు. చినగంజాం పరిసర గ్రామాల కక్షిదారులు చీరాల చేరుకోవాలంటే అనేక రవాణా సదుపాయాలున్నాయని ముఖ్యంగా రైలుబండ్లు, బస్సులు నిరంతరాయంగా ఉంటాయని దూరం కూడా 20 కిలో మీటర్లులోపే ఉంటుందని వారు తెలిపారు. ఉన్నత న్యాయ స్థానాలు న్యాయం మన ఇంటి ముంగిటకే వస్తుందని చెప్పే మాటలన్నీ నీటి మూటలని ఈ సంఘటనను బట్టి అర్థమవుతుందని వారు పేర్కొన్నారు. గతంలో ఇలా జరిగితే అప్పుడు కూడా ఉద్యమాలు చేపట్టి చీరాల కేసులు పర్చూరు కోర్టులకు వెళ్లకుండా ఆపగలిగామని చెప్పారు. పర్చూరు కోర్టులో కేసులు తక్కువగా ఉండడం కారణంగానే చినగంజాం మండల కేసులన్నింటిని తరలించే కార్యక్రమాన్ని చేపట్టారని వారు విమర్శించారు. -
న్యాయవాదులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
చేబ్రోలు: న్యాయవాద వృత్తిలో విజయాన్ని సాధించాలంటే కఠోర శ్రమ, నిరంతర అధ్యయనం, పరిశోధనతోపాటు ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడం అత్యవసరమని విజ్ఞాన్ విద్యాసంస్థల వైస్ చైర్మన్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఏఐఎల్యూ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ప్రొఫెషనల్ ట్రైనింగ్ క్లాసెస్ ఫర్ లాయర్స్’ మంగళవారం కూడా కొనసాగాయి. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ దేశంలో సమర్థంగా పనిచేస్తోందని, దానిలో భాగస్వాములైన యువ న్యాయవాదులు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. న్యాయ విద్యార్థులకు ప్రధానంగా రెండు అవకాశాలు ఉన్నాయన్నారు. ఒకటి న్యాయమూర్తులుగా ఎదగడం, మరొకటి కార్పొరేట్ రంగంలో న్యాయ నిపుణులుగా సేవలందించడం అని చెప్పారు. న్యాయమూర్తిగా ఎదగడం కష్టసాధ్యమైన మార్గమైనప్పటికీ, విజయవంతమైతే వందలాది మందికి న్యాయం చేసే అవకాశం లభిస్తుందని అన్నారు. ప్రస్తుతం కృత్రిమ మేధస్సు (ఏఐ) న్యాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోందన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు స్థాయిలో ఇప్పటికే కొద్దిమంది ప్రముఖ న్యాయవాదులు ఆధిపత్యం చెలాయిస్తున్నారని, ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న వారికి మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏఐఎల్యూ నాయకులు సుంకర రాజేంద్రప్రసాద్, నల్లూరి మాధవరావు, కె.కుమార్, నర్రా శ్రీనివాసరావు, విశ్రాంత జిల్లా జడ్జి జీవీ క్రిష్ణయ్య, జనవిజ్ఞాన వేదిక నాయకులు తుమ్మేటి రమేష్, తుమ్మల శ్రీకుమార్, న్యాయవాదులు సీవీఎల్ఎన్ మూర్తి, బైరపునేని నరేష్, వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. -
12, 14 తేదీల్లో డాక్టర్ వెలగా వెంకటప్పయ్య జయంతి
తెనాలి: పట్టణానికి చెందిన గ్రంథాలయ ఉద్యమ ప్రముఖుడు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య జయంతి వేడుకలను ఈనెల 12, 14 తేదీల్లో తెనాలి, గుంటూరులో నిర్వహించనున్నారు. ఆలపాటి కళావతి రవీంద్ర పీఠం ఆధ్వర్యంలో జరిగే వేడుకల ఆహ్వాన పత్రికను మంగళవారం స్థానిక శాఖా గ్రంథాలయంలో ఆవిష్కరించారు. రవీంద్రపీఠం అధ్యక్షులు అయినాల మల్లేశ్వరరావు వివరాలను తెలియజేశారు. 12వ తేదీ ఉదయం 9 గంటలకు తెనాలి బండ్పై గల డాక్టర్ వెలగా వెంకప్పయ్య కాంస్య విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటిస్తారు. అనంతరం 10 గంటలకు శాఖాగ్రంథాలయంలో జయంతి సభ జరుగుతుందని తెలిపారు. అదేరోజు సాయంత్రం గుంటూరులోని బృందావన్ గార్డెన్స్లో గల అన్నమయ్య వేదికపై వెలగా–అయ్యంకి సభలో అయినాల మల్లేశ్వరరావు, ఓంకార్ ప్రసాద్, పావులూరి శ్రీనివాసరావుకు పురస్కారాలను ప్రదానం చేస్తారు. 14వ తేదీ ఉదయం 9గంటలకు తెనాలి ఇండస్ట్రియల్ ఏస్టేట్లోని కుమార్పంప్స్ సత్సంగ్ హాలులో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్, మానవత సంస్థ, తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామ్చంద్కు డాక్టర్ వెలగా పేరిట జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేస్తారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేస్తారు. ఆహ్వానపత్రిక ఆవిష్కరణలో మొవ్వా సత్యనారాయణ, ఓంకార్ ప్రసాద్, వెంపటి సత్యనారాయణ, పాపోలు వెంకట్, ఈఎల్వీ అప్పారావు, వెలగా వీరయ్య, గ్రంథాలయం ప్రతినిధులు ఎస్.లావణ్యసుధ, కె.పద్మావతి పాల్గొన్నారు. 14న డాక్టర్ కె.రామ్చంద్కు జీవనసాఫల్య పురస్కారం -
సిరాజ్కు జాతీయ స్థాయి పురస్కారం
గుంటూరు ఎడ్యుకేషన్: దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంస్థలకు డిజిటల్ వ్యూహాలు రూపొందిస్తూ సోషల్ మీడియా రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన సిరాజ్ సేవలను గుర్తిస్తూ ప్రతిష్టాత్మక ‘ఇండియన్ ఐకాన్ ఆఫ్ పొలిటికల్ సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్– 2026‘ పురస్కారం ప్రకటించారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ఇండియన్ ఐకాన్ అవార్డ్స్–2026 కార్యక్రమంలో సినీ నటి హెబ్బా పటేల్ చేతుల మీదుగా సిరాజ్ పురస్కారాన్ని అందుకున్నారు. మాజీ ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ టి.ఎన్. సురేష్ కుమార్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులకు అవార్డులు ప్రదానం చేశారు. స్టీలు బ్రిడ్జి పనులు ప్రారంభం తాడేపల్లి రూరల్: రాజధాని ముఖద్వారమైన ప్రకాశం బ్యారేజ్ సమీపంలో బకింగ్హామ్ కెనాల్పై నిర్మిస్తున్న స్టీలు బ్రిడ్జి గతంలో స్వల్పంగా ఒరగడంతో ఆ బ్రిడ్జిలో కొంత భాగాన్ని సీఆర్డీఏ అధికారుల సూచనల మేరకు తొలగించారు. ఆ గడ్డర్లను సరిచేసి బకింగ్హామ్ కెనాల్పై అమర్చేందుకు కాంట్రాక్టర్లు మంగళవారం నుంచి పనులు ప్రారంభించారు. మొత్తం నాలుగు ఐరన్ గడ్డర్లు బిగించాల్సి ఉండగా సాయంత్రం సమయానికి మూడు గడ్డర్లు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. మరో గడ్డర్ను అమర్చి దానిపై కాంక్రీట్ వేసేందుకు ప్రత్యేకమైన రేకులు, స్టీలును అమర్చాల్సి ఉంది. 10–15 రోజుల్లో స్టీలు బ్రిడ్జిపై కాంక్రీట్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అక్కడి సిబ్బంది తెలిపారు. జాతీయస్థాయి పోటీలకు పలువురు ఎంపిక గుంటూరు వెస్ట్ (క్రీడలు): ప్రాచీన యుద్ధకళ కర్రసాము పోటీల్లో నగరానికి చెందిన కాశీనాథ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని చీఫ్ కోచ్ కాశీనాఽథ్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 7న స్థానిక బీఆర్ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి కర్ర సాము పోటీల్లో ఎనిమిది మంది విద్యార్థులు బంగారు పతకాలు సాధించి మరోసారి అకాడమీ పేరు నిలబెట్టారన్నారు. ఐదుగురు సిల్వర్, ఒకరు బ్రాంజ్ మెడల్స్ సాధించారన్నారు. ఆయా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈనెల 21న తమిళనాడు రాష్ట్రంలోని సేలంలో జరిగే జాతీయస్థాయి కరస్రాము పోటీలకు అర్హత సాధించారన్నారు. క్రీడాకారులను ఎస్ఐ విజయ్కుమార్, సక్సెస్ స్కూల్ డైరెక్టర్ బి.సాయి మల్లికార్జున్, అకాడమీ అధ్యక్షులు వెంకట రమణతోపాటు పలువురు అభినందించారన్నారు. -
చంద్రబాబు పాలనపై ప్రజా వ్యతిరేకత
గుంటూరు ఎడ్యుకేషన్: చంద్రబాబు పాలనపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యం కావాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ విభాగ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీనివాసరావుపేటలోని ఏ1 కన్వెన్షన్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గస్థాయిలో వెన్నుపోటుకు రెండేళ్లు టౌన్హాల్ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ నియోజకరవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు అధ్యక్షతన జరిగిన సదస్సులో ముఖ్య అతిఽథిగా పాల్గొన్న సుధాకర్బాబు మాట్లాడుతూ టీడీపీ రెండేళ్ల పాలనలో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోందని అన్నారు. అవినీతి, అక్రమాలు, రాజకీయ దాడులతో నిండిపోయిన టీడీపీ కబంద హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడే ఏకై క నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరేనని తెలిపారు. వైఎస్సార్ సీపీలో సమర్థుడైన నేతగా ఎదిగిన అంబటి రాంబాబు టీడీపీకి ప్రధాన ప్రత్యర్థిగా నిలిచి గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పారు. గుంటూరు జిల్లాలో వైఎస్సార్ సీపీని అన్ని నియోజకవర్గాల్లో గెలిపించి, వైఎస్ జగన్కు కానుకగా ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. గుంటూరు నగరంలో ఎంతో మంది ఉద్దండులైన నేతలు ఎంపీలుగా రాణించిన పరిస్థితుల్లో అమెరికా నుంచి వచ్చిన పెద్దమనిషి రాజకీయ దాడులతో గుంటూరులో రాజకీయాలను దిగజార్చారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కుతో అధికార మదం దింపుతారని అన్నారు. వైఎస్ జగన్ అంటేనే భయం ఉండటంతో వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్కు జానియర్ ఎన్టీఆర్ అంటే భయమన్నారు. చిరంజీవిని తిట్టిన చింతకాయల విజయ్కు చంద్రబాబు రాజ్యసభ పదవిని కట్టబెట్టారని, టీడీపీ బినామీ లింగమనేనికి పవన్ కల్యాణ్ జనసేన తరఫున రాజ్యసభ టిక్కెట్ ఇచ్చారని మండిపడ్డారు. వంగవీటి మోహన్ రంగాను చంపిన వాళ్లే, అంబటిని అంతం చేసేందుకు ఆయన ఇంటిపై మూకుమ్మడి దాడికి తెగబడ్డారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించిన టీడీపీ నాయకులు, పోలీసు అధికారుల పేర్లు గుర్తుంచుకోవాలని సూచించారు. అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేలుస్తామని స్పష్టం చేశారు. సమష్టి కృషి అవసరం ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ శ్రేణులు సమష్టిగా కృషి చేసి పార్టీ గెలుపు కోసం పని చేయాలని కోరారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో ఫీజు రీ యింబర్స్మెంట్, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి లేదని ఆరోపించారు. డీఎస్సీ అక్రమాలపై మంత్రి లోకేష్ నోరు తెరవకపోవడంతోనే ఆ అక్రమాలు నిజమని నిర్ధారణ అయిందన్నారు. టీడీపీ మూడు కోతుల పాలన వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ టీడీపీ పాలనలో ప్రభుత్వ వైఫల్యాలపై చంద్రబాబు మాట్లాడకుండా, పవన్ కల్యాణ్ వినకుండా, లోకేష్ కళ్లతో చూడకుండా మూడు కోతుల పాలన సాగిస్తున్నారని అన్నారు. చంద్రబాబు పాలన అంతా మోసాలతో నిండి పోయిందని, ఓట్లేసి గెలిపించిన ప్రజలు తమను తాము నిందించుకుంటున్నారని అన్నారు. 2029లో వైఎస్ జగనన్న పాలన కోసం రాష్ట్రంలోని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారని అన్నారు. టీడీపీ పాలనలో మహిళలపై దాడులు, నేరాలు పెరిగాపోయాయని అన్నారు. సదస్సులో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, పశ్చిమ నియోజకవర్గ పరిశీలకురాలు నల్లమోతు రూత్రాణి, జిల్లా ఎస్సీ విభాగ అధ్యక్షుడు గడ్డేటి సురేంద్ర, జిల్లా మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి రఘుమహంతి వరలక్ష్మీదేవి, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు వంగల వలివీరారెడ్డి, పోలే ముత్యం, కొల్లి శివరామిరెడ్డి, యర్రం హనిమిరెడ్డి, సింగు నరసింహారావు, మామిడిరాము, కె.విజయమాధవి, కె.చిన్నపరెడ్డి, పఠాన్ సైదాఖాన్, ఈమని రాఘవరెడ్డి, బాల వెంకట్రెడ్డి, షేక్ రాజియా బేగం, బాల మురళీకృష్ణ, చదలవాడ రవీంద్రనాథ్, వి.సుబ్బారెడ్డి, దేవరశెట్టి సత్యనారాయణ, సీహెచ్ ధన్వంతరీ భగవాన్, యేటి కోటేశ్వరరావు, పల్లపు మహేష్, వెంకాయమ్మ, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, విద్యార్థి, యువజన విభాగాల నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ తనకు 40 ఏళ్ల రాజకీయ అనుభం ఉందని చెప్పే చంద్రబాబు ఇచ్చిన హామీల అమల్లో విఫలమైన నేతగా ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అమరావతి అభివృద్ధి పేరుతో రూ.వేల కోట్లు దోచుకోవడం, అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి, జైలుకు పంపడం తప్ప చంద్రబాబుకు ప్రజల సంక్షేమం పట్టదన్నారు. రాంబాబుపై దాడితో రాష్ట్రంలో టీడీపీ పాలన ఎంత అధ్వానంగా ఉందో ప్రజలకు అర్థమైందన్నారు. ఈ నెల 12న తలపెట్టిన ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం తరువాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఓటమి ఎదురైందని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. తాను నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి, టీడీపీ ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం సాగిస్తానని స్పష్టం చేశారు. పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుని, వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత న్యాయం చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అనేకమైన వాగ్దానాలు చేసినా అవేవీ సాధ్యం కాదని వైఎస్ జగన్ నాడే చెప్పారని గుర్తుచేశారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో అదే విషయం ప్రజలకు అర్థమైందన్నారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ... చంద్రబాబు వాగ్దానాలు అమలు కావని తెలిసే ఎక్కడా వాటి గురించి మాట్లాడలేదన్నారు. చంద్రబాబు మాయ మాటలు నమ్మిన ప్రజలు ఓట్లేసి మోసపోయారని అన్నారు. టీడీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు వైఎస్సార్ సీపీ తరఫున ప్రజలను చైతన్యం చేసేందుకు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. గత రెండేళ్లలో టీడీపీ చేసిన రాజకీయ దాడులు, హత్యలతో అసలైన గొడ్డలి పార్టీగా అదే నిలిచిందని చంద్రబాబు తెలుసుకోవాలని చురకలు అంటించారు. జూలై 29న వినతి యాత్ర తన ఇంటిపై దాడికి తెగబడిన దుండగులపై ఇప్పటివరకు కేసులు లేవని అంబటి అన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గతంలో నిరసన దీక్ష చేశానని చెప్పారు. జూలై 29న గుంటూరు నుంచి మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి 29 కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్లి డీజీపీకి వినతి పత్రం సమర్పిస్తానని చెప్పారు. వైఎస్ జగన్ పిలుపు మేరకు వెన్నుపోటుకు రెండేళ్లలో భాగంగా ఈ నెల 12న పశ్చిమ నియోజకవర్గంలో భారీ ర్యాలీ ఉంటుందని చెప్పారు. -
పురుగు మందుల పరీక్షల్లో నాణ్యతకు పెద్దపీట
అమరావతి ప్రాంతీయ కోడింగ్ కార్యాలయం ఉప వ్యవసాయ సంచాలకులు రామ్మోహన్ కొరిటెపాడు(గుంటూరు): రైతులకు నాణ్యమైన పురుగు మందులు అందించేందుకు పరీక్ష విధానాలను మరింత పటిష్టం చేయాలని అమరావతి ప్రాంతీయ కోడింగ్ కార్యాలయం ఉప వ్యవసాయ సంచాలకులు శనగల రామ్మోహన్ సూచించారు. గుంటూరులోని పురుగు మందుల పరీక్ష కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, వివిధ యంత్రాలపై పరీక్ష ప్రక్రియను పరిశీలించారు. పురుగు మందుల పరీక్ష కేంద్రం ఏడీఏ సీహెచ్ తిరుమలాదేవి మాట్లాడుతూ పురుగు మందుల పరీక్షలకు అవసరమైన వివిధ రకాల మూల పదార్థాలను(టెక్నికల్స్) సరఫరా చేయాలని కోరారు. కొత్త జీఎల్సీ ఎక్విప్మెంట్ వచ్చిన వెంటనే ఎన్ఏబీఎల్ అక్రిడేషన్ ప్రాసెస్ పూర్తి చేస్తామని ఆమె తెలిపారు. రామ్మోహన్ మాట్లాడుతూ పురుగు మందుల పరీక్ష కేంద్రంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది ఆరోగ్యం పరీక్షించుకోవడంతోపాటు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలో నూతన అనాలసిస్ చేసే పరికరాలు అందించడం జరుగుతోందన్నారు. ఎన్ఏబీఎల్ అక్రిడేషన్ ప్రాసెస్ను త్వరితగతిన పొందాలని సూచించారు. కార్యక్రమంలో ప్రాంతీయ కోడింగ్ కార్యాలయం వ్యవసాయ అధికారి విశ్వేశ్వరప్ప, ఏఓలు బి.సురేంద్రబాబు, ఎ.శ్రీనివాసులు, ఎన్.ప్రసన్న, బి.భారతి, బి.సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
దూరవిద్య పీజీ పరీక్ష ఫలితాలు విడుదల
ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో జరిగిన పలు పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను మంగళవారం వర్సిటీ వీసీ ఆచార్య కె గంగాధరరావు, రెక్టార్ ఆచార్య ఆర్ శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య జి సింహాచలం మంగళవారం విడుదల చేశారు. దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎంఏ సోషియాలజీ, సోషల్ వర్క్, ఎకనామిక్స్, మాస్టర్ ఆఫ్ కామర్స్ ప్రథమ, ద్వితీయ, తృతీయ, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేశారన్నారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, సైకాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్న్స్, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్న్స్ మొదటి, రెండవ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు తెలిపారు. ఈనెల 21వ తేదీలోగా రీవాల్యుయేషన్కు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలను వర్సిటీ వైబ్సెట్ నుండి పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఐసీటీ డైరెక్టర్ ప్రభాకర్, పరీక్షల విభాగం డిప్యూటీ రిజిస్ట్రార్ జైనలుద్దీన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు కోదండపాణి, వై వెంకటప్పారెడ్డి, సూపరింటెండెంట్ జవ్వాజి శ్రీనివాస్, ఉద్యోగులు, వలి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయం పరిధిలో మార్చినెలలో ఉమ్మడి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల జీజీహెచ్లో 150 కాంట్రాక్టు స్టాఫ్నర్సు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశామని ఆర్డీ డాక్టర్ జి.శోభారాణి మంగళవారం తెలిపారు. అభ్యర్థుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ప్రొవిజనల్ మెరిట్ లిస్టు రివైజ్ చేసి, ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థుల జాబితా రూపొందించామన్నారు. కాంట్రాక్టు స్టాఫ్నర్సు ఉద్యోగాలకు ప్రొవిజనల్లీ సెలెక్ట్ అయిన వారు ఈనెల 10 తేదీ ఉదయం 9 గంటలకు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న మెడికల్ అండ్ హెల్త్ రీజనల్ డైరెక్టర్ కార్యాలయానికి ఒరిజినల్ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్ కోసం హాజరు కావాలన్నారు. ఎస్ఎస్సీ సర్టిఫికెట్, మార్కుల మెమో, ప్రొవిజనల్లీ సర్టిఫికెట్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఎగ్జామినేషన్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఆఫ్ ఏపీ ఎన్ఎంసీ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్స్, అపాయింట్మెంట్ఆర్డర్ కాపీ, సర్వీస్ సర్టిఫికెట్స్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్, లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, అంగవైకల్యం ఉన్న వారు సంబంధిత సర్టిఫికెట్లు, కరోనా సమయంలో పనిచేసినందుకు శాలరీ పొందిన బ్యాంకు స్టేట్మెంట్ తీసుకుని రావాలన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం ఉద్యోగాలకు ఎంపికై న వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామన్నారు. -
గొప్ప జీవన విధానం యోగా
జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తాడేపల్లి రూరల్: ప్రపంచానికి గొప్ప జీవన విధానమైన యోగాను అందించినది భారతదేశమని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ అన్నారు. మంగళవారం మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి గుహల వద్ద యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవలు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశంలో ఉద్భవించిన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధన యోగా అని అన్నారు. యోగా అంటే శ్వాస నియంత్రణ (ప్రాణాయామం), ధ్యానం, వివిధ భంగిమల (ఆసనాలు) ద్వారా శరీరాన్ని, మనస్సును ఏకం చేసే అద్భుతమైన ప్రక్రియ అని తెలిపారు. యోగా చేయడం ద్వారా ఒత్తిడిని, ఆందోళనను తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో పలు ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా ఈనెల 13వ తేదీన మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నిత్య జీవితంలో యోగాను భాగంగా చేసుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గి, ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆగస్టులో ప్రత్యేక అదాలత్
గుంటూరు లీగల్: సమాధన్ సమరో–2026లో భాగంగా సుప్రీంకోర్టులో ఆగష్టు 21, 22, 23 తేదీలలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి చైర్మన్ షేక్ సికిందర్ బాషా సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ లోక్ అదాలత్ సుప్రీంకోర్టులోనే నిర్వహిస్తారని, సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు లోక్ అదాలత్ లో సెటిల్ చేసుకోవాలని తెలిపారు. ప్రత్యేక లోక్ అదాలత్లో పరిశీలన కోసం, అంగీకార పత్రాలను సమర్పించడానికి గడువును 2026 జూలై 31వరకు పొడిగించారని తెలిపారు. లోక్ అదాలత్ ఫారాలు, హెచ్టీటీఎస్://డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్సీఐ.జీవోవి.ఇన్ సుప్రీంకోర్టు వెబ్ సైట్లోను, జిల్లా కోర్టు వెబ్సైట్లోను అందుబాటులో ఉంచామన్నారు. ఫిర్యాదుదారులు, కక్షిదారులు సుప్రీంకోర్టు అంగీకారంతో వారి న్యాయవాదులతో జిల్లాలోనే హాజరు కావచ్చునని పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిర్వహించే సెటిల్మెంట్ సమావేశాలకు ప్రత్యక్షంగా లేదా వర్చువల్గా హాజరు కావచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబరు 15100, 0863–2224886లలో సంప్రదించవచ్చునని తెలిపారు. ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఏపీ పీ సెట్–2026 పరీక్షలు సోమవారంతో ముగిశాయి. చివరి రోజు 499 మంది మహిళా అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 333 మంది హాజరయ్యారని ఏపీ పీ సెట్ కన్వీనర్ ఆచార్య పాల్కుమార్ తెలిపారు. ఆరు రోజులుగా జరుగుతున్న ఏపీ పీ సెట్ పరీక్షలకు 2858 మంది పురుష అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 2147 మంది హాజరయ్యారు. అలానే 1179 మంది మహిళా అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 813 మంది పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. పరీక్షల్లో అభ్యర్థులకు రన్నింగ్, లాంగ్జంప్, షాట్పుట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, సెటిల్ వంటి క్రీడల్లో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. పరీక్షలు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): విజయవాడలోని నైట్రో పికిల్ బాల్ కోర్టులో ఆదివారం జరిగిన మూడవ ఏపీ స్టేట్ పికిల్ బాల్ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు 17 మెడల్స్ సాధించినట్లు గుంటూరు జిల్లా పికిల్ బాల్ సంఘం కార్యదర్శి జీఎస్ ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెడల్స్ సాధించిన క్రీడాకారులను జిల్లా పికిల్ బాల్ సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ తోట హను, తోట ప్రగతి, అలపర్తి అలేఖ్య, కార్యదర్శి జీఎస్ ప్రసాదులు అభినందించారు. ఈనెల 13 నుంచి 15 వరకు హైదరాబాదులో జరిగే సౌత్ జోన్ పికిల్ బాల్ పోటీల్లో మెడల్ సాధించి జిల్లాకు కీర్తి ప్రతిష్టను సాధించాలని కోరారు. గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో సోమవారం రాత్రి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఎమర్జెన్సీ వార్డులో ఏవిధంగా వైద్య సేవలు అందిస్తున్నారనే విషయంపై ఆరా తీశారు. రోగు లు, ప్రమాద బాధితులకు ఎమర్జెన్సీ వార్డులో అందిస్తున్న వైద్య సేవల గురించి కేస్ షీట్లు పరిశీలించి, రోగులు, వారి సహాయకులను అడిగి తెలుసుకున్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో తనిఖీలు చేశారు. గర్భిణులు, చిన్నా రులకు వైద్యసేవలు అందుతున్న తీరును పరిశీలించారు. మార్చురీని సైతం తనిఖీ చేసి మార్చురీలో ఏసీలు ఏ విధంగా పనిచేస్తున్నాయనే విషయాలు పరిశీలించారు. తనిఖీల్లో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారీ, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ బి.సతీష్కుమార్ ఉన్నారు. -
గంజాయి, డ్రగ్స్ లభ్యమైతే కఠిన చర్యలు
నగరంపాలెం: జిల్లాలో ఎవరి దగ్గరైనా గంజాయి, డ్రగ్స్ లభ్యమైతే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. గుంటూరు తూర్పు సబ్ డివిజన్లోని కొత్తపేట పీఎస్, పాతగుంటూరు పీఎస్, లాలాపేట పీఎస్ పరిధిలోని రౌడీషీటర్లు, గంజాయి నేరస్తులకు సోమవారం బీఆర్ స్టేడియంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. రౌడీషీటర్లు, గంజాయి కేసుల్లోని నేరస్తులతో జిల్లా ఎస్పీ మాట్లాడారు. ప్రస్తుతం ఏయే పనులకు వెళ్తున్నారు, ఎక్కడెక్కడ నివసిస్తున్నారనే అంశాలపై ఆరాతీశారు. ఎవరైనా చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తూర్పు సబ్ డివిజన్లోని రౌడీషీటర్స్, పాత గంజాయి కేసులున్న 120 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్స్ (డిడికె)తో పరీక్షలు నిర్వహించగా అందులో 17 మందికి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో సీఐలు వీరయ్య (కొత్తపేట పీఎస్), వెంకటప్రసాద్ (పాత గుంటూరు పీఎస్), ఎస్ఐలు రెహమాన్ (పాతగుంటూరు పీఎస్), రవి (లాలాపేట పీఎస్) సునీల్ (ఈగల్ ఆర్ఎస్ఐ) పాల్గొన్నారు. -
చంద్రబాబూ... దేవుడితో రాజకీయాలా ?
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్ర వ్యాప్తంగా దళితుల కాలనీల్లో వేంకటేశ్వరస్వామివారి ఆలయాలను నిర్మించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన చర్యలకు కూటమి ప్రభుత్వం మోకాలడ్డుతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర బ్రాహ్మణ విభాగ అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్ అన్నారు. సోమవారం గుంటూరులోని బృందావన్గార్డెన్స్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హిందూ ధర్మంపై అమితమైన భక్తి, శ్రద్ధలతో సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 216 ఆలయాలను పునరుద్ధరించి, పూర్వ వైభవం కల్పించారని చెప్పారు. టీటీడీ శ్రీవాణి ట్రస్టు ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో 1,342 శ్రీవారి దేవాలయాలను నిర్మించేందుకు గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిలిపివేసిందన్నారు. వీటిలో తిరుపతి జిల్లాలోనే 135 ఆలయాలు ఉన్నాయని తెలిపారు. నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఆలయాలకు సంబంధించి యూసీలు లేవనే సాకుతో రూ.147 కోట్లు విడుదల చేయకుండా అడ్డుకుంటోందని, సంబంధిత యూటిలైజేషన్ సర్టిఫికెట్లను ఇచ్చేందుకు దేవదాయ శాఖ సిద్ధంగా ఉన్నా సీఎం చంద్రబాబు మోకాలడ్డుతున్నారని ఆరోపించారు. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామన్న పవన్ కల్యాణ్ మౌనంగా ఉండటం తగదన్నారు. దేవుడితో రాజకీయాలు చేస్తే పుట్టగతులుండవని, ఆలయాల జోలికి రావొ ద్దని హెచ్చరించారు. రాజధాని నిర్మాణానికి భూ ములిచ్చిన రైతులకు దేవదాయ శాఖ భూము లను చదునుచేసి ప్లాట్లుగా ఇచ్చేలా టీడీపీ సర్కారు దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. బ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నాగరాజు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రెండేళ్లు వరుసగా రూ.22 కోట్లు, రూ.23 కోట్లు కేటాయించారని తెలిపారు. మాజీ కార్పొరేటర్ ఈచంపాటి వెంకటకృష్ణమాచారి మాట్లాడుతూ ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (సర్)లో బ్రాహ్మణులందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. -
కూటమి ప్రభుత్వం పనైపోయింది
తెనాలి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పనైపోయిందని, రానున్నది జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇది గ్రహించినందునే చంద్రబాబు గొడ్డలి పార్టీ అంటూ దుష్రచారం చేస్తున్నారనీ, ఆయన తనయుడూ, విద్యాశాఖ మంత్రి ‘దగా డీఎస్సీ’పై నోరెత్తటం లేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ బహిరంగసభ సోమవారం స్థా నిక ఎం.కన్వెన్షను హాలులో నిర్వహించారు. పార్టీ తెనాలి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అధ్యక్షత వహించారు. జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ, గత ఎన్నికల హామీలను నెరవేర్చకుండానే చంద్రబాబునాయుడు అమలుచేశానని చెబుతూ ప్రజలను వెన్నుపోటు పోడిచాడని విమర్శించారు. వెన్నుపోటు పదం ఆయనతోనే వచ్చిందనీ, వెన్నుపోటుతోనే ఆయన అధికారంలోకి వచ్చా డని గుర్తుచేశారు. వైఎస్సార్ సీపీ స్వచ్ఛంగా ప్రజాక్షేత్రంలోంచి అధికారాన్ని చేపట్టిందని స్పష్టంచేశారు. పొత్తులేనిదే బాబు గెలవలేడు సభకు అధ్యక్షత వహించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ, చంద్రబాబు ఏ ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీచేయలేదని గుర్తుచేశారు. వైఎస్సార్ సీపీ మినహా అన్ని పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్నారని చెప్పారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, నాదెండ్ల భాస్కరరావు కుమారుడు మనోహర్ ఇద్దరూ కూటమిలో ఉన్నారని గుర్తుచేశారు. తాడేపల్లి నుంచి తెనాలికి వైఎస్ జగన్మోహన్రెడ్డి హెలికాప్టర్లో వచ్చారని మంత్రి మనోహర్ చేసిన విమర్శను ప్రస్తావిస్తూ కరకట్ట ప్యాలెస్ నుంచి సచివాలయానికి హెలికాప్టర్లో వచ్చిన చంద్రబాబు గురించి మాట్లాడరేమని ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్బాబు, నియోజకవర్గ పరిశీలకుడు కాకుమాను సదాశివరెడ్డి, తెనాలి, కొల్లిపర ఎంపీపీలు ధర్మరాజుల చెన్నకేశవులు, భీమవరపు పద్మావతి, పార్టీ బూత్కమిటీల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుదిబండి కృష్ణకిషోర్రెడ్డి, ప్రసాదం సురేష్, మర్రెడ్డి విష్ణువర్ధన్రెడ్డి, బూరెల నాంచారమ్మ, ఆళ్ల ఉత్తేజ్రెడ్డి,శ్రీనివాసరావు, కల్లం వెంకటప్పారెడ్డి, చెన్నుబోయిన శ్రీనివాసరావు, గోల్డ్ రహిమా, కొడాలి క్రాంతి, దేవరపల్లి భూషణం, టి.యల్లమంద, బొల్లిముంత పోతురాజు, మైలా విజయ్నాయుడు, అవుతు శేఖర్రెడ్డి, కోలా వాసు, షేక్ వాసు, బొంతు గోపిరెడ్డి, బొమ్ము శ్రీనివాసరెడ్డి, కొర్ర యశోద, షేక్ దుబాయ్బాబు, నిట్టా బాలు, పి.అశోక్, కిరణ్కుమార్రెడ్డి మాట్లాడారు. ఎన్నికలకు మూడేళ్ల ముందే కూటమి ప్రభు త్వం గ్రాఫ్ పడిపోయిందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఇది గ్రహించిన చంద్రబాబు, జగన్మోహన్రెడ్డిది గొడ్డలి పార్టీ అంటూ అన్పాపులర్ చేయాలని చూస్తున్నారని, అది ఆయ న వల్లకాదన్నారు. స్థానికసంస్థల ఎన్నికలు పెడితే సంగతేంటో తేలిపోతుందన్నారు. చంద్రబాబు జీవితమంతా మోసం చేసి అధికారంలోకి రావటం మినహా రుజుమార్గంలో ఏనాడూ రానేలేదని అంబటి రాంబాబు విమర్శించారు. మరోవైపు ఫేక్ న్యూస్ను ప్రచారం చేస్తున్నట్టు చెబుతూ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ ప్రభుత్వ సలహాదారు కేఎన్నార్పై అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నారని ఆరోపించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్ సీపీని అణచాలని ప్రయత్నిస్తున్నారని, అది సాధ్యం కాదన్నారు. క్రీడాకోటా శాతాన్ని ముందే పెంచుకుని దొంగ సర్టిఫికెట్లతో మెగా డీఎస్సీలో 421 పోస్టులు రిక్రూట్మెంట్ చేశారని ఆరోపించారు. ఈ మోసం విద్యార్థిలోకం ఉద్యమిస్తుంటే సంబంధిత శాఖామంత్రి నారా లోకేశ్ తేలుకుట్టిన దొంగలా మాట్లాడటం లేదన్నారు. లింగమనేని రమేష్ అక్రమ కట్టడంలో తండ్రీకొడుకులు ఉంటూ, ఆయన్ను జనసైనికుడుగా రాజ్యసభకు పంపుతున్నారని చెప్పారు. ఇందుకు ‘కలెక్షన్ కింగ్’ వంతపాడుతున్నారని అన్నారు. ఇల్లిస్తే, స్థలమిస్తే రాజ్యసభకు అర్హతగా తేల్చారని చెబుతూ జగన్మోహన్రెడ్డి పార్టీలో కష్టపడినవారినే రాజ్యసభకు పంపారని రాంబాబు గుర్తుచేశారు. -
రెవెన్యూ క్లినిక్స్పై సీఎస్ ఆరా
సిబ్బందికి సున్నితంగా హెచ్చరికలు గుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదికంలో భాగంగా స్థానిక కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన రెవెన్యూ క్లినిక్ను సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ సందర్శించారు. వచ్చే అర్జీలు, వాటి అప్లోడ్ విధానం, అధికారులు ఇచ్చే పరిష్కార మార్గాలు వంటి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దాదాపు మూడు గంటలపాటు అక్కడే ఉండి పూర్తి వివరాలు సేకరించారు. జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ తో కలిసి ఆయన కొంతమంది బాధితులతో మాట్లాడి. పరిష్కార మార్గాలను అధికారులకు సూచించారు. పాత రికార్డులు అడగవద్దు 1900 నాటి రికార్డుల కోసం అర్జీదారులను ఇబ్బంది పెట్టద్దని అధికారులకు సీఎస్ సూచించారు గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం గ్రామంలో సర్వే నెంబర్ 1239లో ఎకరం 69 సెంట్లు రిజిస్టర్ భూమిని తొమ్మిది మంది కలిసి కొనుగోలు చేశామని, ఆ తర్వాత వాగు పోరంబోకుగా తేల్చి 22/ఏ నిషేధిత జాబితాలో చేర్చారని ఆ ప్రాంతవాసులు పశ్చిమ మండల అధికారులకు అర్జీ అందజేశారు. అక్కడ ఏర్పాటు చేసుకున్న నివాసాలను కూల్చివేస్తున్నారని వారి దృష్టికి తీసుకువచ్చారు. భూమి డాక్యుమెంట్లు 1900 సంవత్సరం నుంచి కావాలని అధికారులు అడగగా అక్కడే ఉన్న సీఎస్ స్పందించారు 1900 రికార్డులు వారి దగ్గర ఎలా ఉంటాయని, ఒకవేళ అవి తెస్తే మొగలుల కాలంనాటి రికార్డులు అడుగుతారా అని సిబ్బందికి చురకలంటించారు. అధికారులు ఉక్కిరి బిక్కిరి సీఎస్ సాయి ప్రసాద్ రావడం, అక్కడే మూడు గంటలపాటు ఉండటంతో అధికారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ పరిస్థితిని గమనించిన సీఎస్ రెవెన్యూ క్లినిక్కు వచ్చే సమస్యలు వాటి అప్లోడ్ వంటి వివరాలను తెలుసుకునేందుకు వచ్చానని మీరు కంగారు పడకండి అని సిబ్బందికి ధైర్యం నింపారు. ముఖ్యంగా కొత్తగా తహసీల్దార్ బాధ్యతలు తీసుకునేవారు గతంలో ఉన్న భూ సమస్యల కేసులను స్టడీ చేయాలని సూచించారు. సర్వేలో ప్రైవేటు వ్యక్తుల జోక్యంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. సీఎస్ రావటం అదే సమయంలో యువతి ఆత్మహత్య, కరెంటు కోత వంటి ఘటనలతో అధికారులు ఇబ్బంది పడ్డారు. -
ఏపీఏఐఎంఎస్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ పెదకాకాని: రైతులు ఏపీ ఏఐఎంఎస్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ అన్నారు. పెదకాకాని మండలంలోని నంబూరు మన గ్రోమోర్, వెనిగండ్ల దనీత్ ఎంటర్ప్రైజెస్ ఎరువులు, పురుగుమందులు షాపుల్లో సోమవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ మాట్లాడుతూ రైతులకు సౌకర్యవంతంగా ఏపీ ఏఐఎంఎస్(వ్యవసాయ సమాచార నిర్వహణ విధానం) యాప్ను రూపొందించడం జరిగిందన్నారు. ఈ యాప్ ద్వారానే రైతులకు యూరియా, డీఏపీ విక్రయాలు జరుగుతాయని వెల్లడించారు. పంటలు సాగు చేసే రైతులు తమ పంట నమోదు చేసుకోవడం ద్వారా ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. వ్యవసాయానికి కాకుండా ఇతర అవసరాలకు యూరియాను దారి మళ్లించకుండా ఉండేందుకు ఈ యాప్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని వివరించారు. ఈ ఏడాది రైతుల అవసరాల మేరకు ఎరువుల లభ్యత ఉంటుందని చెప్పారు. రైతులు తమకు ఇష్టమైన ప్రాంతంలోని డీలర్ల ఎరువులు తీసుకునే వెసులుబాటు ఈ యాప్ ద్వారా ఉంటుందని తెలిపారు. వర్షం పడితే పొలాలకు ఎరువులు చేరడం ఇబ్బందిగా ఉంటుందని ముందుగానే ఎరువులు ఇవ్వాలని పలువురు రైతులు కమిషనర్ దృష్టికి తీసుకు రావడంతో సానుకూలంగా స్పందించారు. ఈ యాప్ ద్వారా ఆరుగురు రైతులకు 15 బస్తాలు యూరియా ఇచ్చారు. కార్యక్రమంలో కమిషనర్ కార్యాలయం ఎస్ఈఐటీ సెల్ బాల సుబ్రహ్మణ్యం, ఏడీఏ ఫర్టిలైజర్స్ రాజన్, డీడీ ఫర్టిలైజర్ ఎం.ఆనంద్రావు, వ్యాసర్ ల్యాబ్ హరి, మండల వ్యవసాయ అధికారి రమణకుమార్ పాల్గొన్నారు. అనంతరం ఆత్మ పీడీ ఎ.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కేత్ బాచావో అభియాన్ కార్యక్రమం పెదకాకాని సచివాలయంలో నిర్వహించారు. ఏడీఏ ఎన్ రామ్మోహన్రావు పాల్గొన్నారు. న్యూరాలజిస్ట్ డాక్టర్ పోలవరపు నరేన్ గుంటూరు మెడికల్: బ్రెయిన్ ట్యూమర్లు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఏ వయస్సు వారికై నా వచ్చే అవకాశం ఉందని లలితా పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ పోలవరపు నరేన్ అన్నారు. ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరులోని లలితా పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్మెడికల్ సెన్సెస్ హాస్పటల్లో బ్రెయిన్ ట్యూమర్స్పై అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. డాక్టర్ నరేన్ మాట్లాడుతూ కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉన్న వారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. మెదడులో ట్యూమర్ ఎంత వరకు వ్యాపించిందో తెలుసుకునేందుకు ఉపయోగపడే ఎమ్మారై ట్రాక్టోగ్రఫీ నేడు అందుబాటులో ఉందన్నారు. ట్యూమర్ స్వరూపాన్ని కచ్చితంగా నిర్ధారించే న్యూరో నావిగేషన్ గైడెడ్ బయాస్పి వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయన్నారు. హాస్పటల్ మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ పమిడిముక్కల విజయ మాట్లాడుతూ బ్రెయిన్ ట్యూమర్లు ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడవచ్చన్నారు. బ్రెయిన్ ట్యూమర్లు అని క్యాన్సర్కు దారి తీయవని, మెనిమ్జియోమా వంటి కొన్ని ట్యూమర్లను ఆపరేషన్ ద్వారా తొలగిస్తే జీవితాంతం మరలా రావని సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ నూతక్కి శ్రీనివాసరావు అన్నారు. న్యూరాలజిస్ట్ డాక్టర్ అనూష మాట్లాడుతూ తలనొప్పి బ్రెయిన్ ట్యూమర్ లక్షణం కాదని, తలనొప్పితోపాటు ఇతర నాడి సంబంధిత లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బైరపనేని స్రవంతి మాట్లాడుతూ ప్రారంభ దశలో ట్యూమర్లను గుర్తిస్తే కేవలం ఆపరేషన్ ద్వారానే 90 నుంచి 95 శాతం విజయవంతంగా నయం చేయవచ్చు అన్నారు. అవగాహన సదస్సులో 300 మందికి పైగా రోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నా రు. బ్రెయిన్ ట్యూమర్లకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకున్నారు. తెనాలి: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో స్థానిక తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో జరుగుతున్న 5వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు రెండోరోజైన సోమవారం కొనసాగాయి. తొలి ప్రదర్శనగా ఆరభి యూత్ అండ్ కల్చరల్ అసోసియేషన్, రాప్తాడు వారి ‘డొక్కా సీతమ్మ’ నాటికను ప్రదర్శించారు. ఆముదాల సుబ్రమణ్యం రచించిన ఈ నాటికకు ఆయనే దర్శకత్వం వహించారు. సామాజిక సేవకురాలు డొక్కా సీతమ్మగా భావిక, పెద్ద సీతమ్మగా యశోదమ్మ, ఇతర పాత్రల్లో బాషా, అరుణ్బాబు తదితర 30 మందికి పైగా నటీనటులు నటించారు. తదుపరి గర్తపురి థియేటర్ ఆర్ట్స్, గుంటూరు వారి ‘5జీ కపుల్స్’ నాటికను ప్రదర్శించారు. ఎస్కేడీ హస్సన్ రచించిన ఈ నాటికకు ఆయనే దర్శకత్వం వహించారు. చివరగా ఎన్ఎంఆర్ క్రియేషన్స్, అనకాపల్లి వారి ‘వేదాంతం’ నాటికను ప్రదర్శించారు. ప్రఖ్యాత సాహితీవేత్త గుడిపాటి వెంకటాచలం మూలకథకు మార్గశీర్ష నాటకీకరించగా, ముత్యాలరావు పొన్నాడ దర్శకత్వం వహించారు. తొలినాటిక ప్రఖ్యాత సామాజిక సేవకురాలు డొక్కా సీతమ్మ జీవితానికి సంబంధించినది కాగా, ఇతర నాటికలు సందేశాత్మక ఇతివృత్తంతో సాగాయి. -
బాధితులకు వడ్డీతో సహా నష్టపరిహారం చెల్లించాలి
దుగ్గిరాల: శుభం కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధిత పసుపు రైతులకు ప్రభుత్వం వాగ్దానం మేరకు క్వింటాకు రూ.7వేలు పరిహారం వడ్డీతో సహా చెల్లించాలని పసుపు రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్నా శివశంకర్ డిమాండ్ చేశారు. సోమవారం దుగ్గిరాలలోని పసుపు యార్డు ముట్టడి కార్యక్రమం సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ములకా శివసాంబిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని ర్యాలీగా యార్డుకు చేరుకున్నారు. భారీ సంఖ్యలో పసుపు రైతులు, వ్యాపారులు పాల్గొన్నారు. ముందుగా యార్డు బయటకు వెళ్లే మార్గంలో బైటాయించారు. రైతులను ఉద్దేశించి శివశంకర్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు పసుపు ఽక్వింటాకు రూ.13,400 ఉండగా, ప్రభుత్వం రైతులు, వ్యాపారులతో చేసిన ఒప్పందం ప్రకారం రూ.7 వేలు వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. రెండు సంవత్సరాల నాలుగు నెలలు గడిచినా పసుపు రైతులకు పూర్తి పరిహారం ఇప్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కోల్డ్ స్టోరేజ్ యజమానిని అరెస్టు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కొల్లిపర బాబు ప్రసాద్ మాట్లాడుతూ నిల్వ చేసుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోకుండా పసుపు దగ్ధం కావడానికి కారణమైన యజమానిని కఠినంగా శిక్షించాలని కోరారు. యార్డు ఇన్చార్జి కార్యదర్శి డి.చిన సుబ్బారావుకి వివతి పత్రం అందించారు. వెంటనే స్పందించిన ఆయన సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళతానిని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వల్లూరి భారతి, గద్దె శ్రీహరి, కాజా వెంకటేశ్వరరావు, జెట్టి బాలరాజు, పి.రవికిషోర్, బి.చిన్న వెంకటరెడ్డి, ఎన్.యోగేశ్వర రావు, ఎస్.ఆంజనేయులు పాల్గొన్నారు. -
గుంటూరు
మంగళవారం శ్రీ 9 శ్రీ జూన్ శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1294 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 518.60 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్కి 7,483 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3,000, గరిష్ట ధర రూ.5,200, మోడల్ ధర రూ.4,200 వరకు పలికింది. 7 -
లోతైన అధ్యయనం చేయాలి
చట్టంలోని నిబంధనలు చేబ్రోలు: కోర్టులో తుది తీర్పు వెలువడే వరకు పక్షాల హక్కులను రక్షించేందుకు ఇంటర్ లాక్యుటరీ అప్లికేషన్స్ కీలక సాధనాలు, న్యాయవాదులు వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకుని సమర్థవంతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ఏపీహెచ్ఆర్సీ మాజీ చైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఏఐఎల్యూ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ మరియు విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా సంయుక్త ఆధ్వర్యంలో న్యాయవాదుల కోసం నిర్వహిస్తున్న మూడు రోజుల ‘‘ప్రొఫెషనల్ ట్రైనింగ్ క్లాసెస్ ఫర్ లాయర్స్’’ సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణ తరగతులను ఆంధ్రప్రదేశ్ మాజీ హైకోర్టు న్యాయమూర్తి, మాజీ ఏపీహెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ ఎం. సీతారామమూర్తి, విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య కలిసి ప్రారంభించారు. జస్టిస్ సీతారామమూర్తి మాట్లాడుతూ ఇంటర్లాక్యుటరీ అప్లికేషన్స్ దాఖలు చేసే సమయంలో న్యాయవాదులు చట్టంలోని నిబంధనలను లోతుగా అధ్యయనం చేయాలని సూచించారు. ఏఐ యుగానికి న్యాయవాదులు సిద్ధం కావాలి విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య మాట్లాడుతూ నేటి ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రభావం న్యాయవృత్తిపైనా స్పష్టంగా కనిపిస్తోందని, అందుకు అనుగుణంగా న్యాయవాదులు సిద్ధం కావాలని అన్నారు. భవిష్యత్ న్యాయరంగం, సాంకేతిక పరిజ్ఞానం, సైబర్ నేరాలు, మానవ విలువల ప్రాధాన్యతపై విశదీకరించారు. కృత్రిమ మేధస్సు కేవలం ఐటీ రంగానికే పరిమితం కాకుండా వైద్యం, విద్య, పరిశ్రమలు, వ్యవసాయం, పరిపాలనతో పాటు న్యాయరంగంలోనూ వేగంగా ప్రవేశిస్తోందన్నారు. న్యాయపరమైన పరిశోధనలు, కేసుల విశ్లేషణ, చట్టాల అధ్యయనం, తీర్పుల అన్వేషణ, పత్రాల తయారీ వంటి అనేక అంశాల్లో ఇప్పటికే ఏఐ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా న్యాయవాదులు కూడా తమ పనితీరును ఆధునికీకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో సాంప్రదాయ నేరాల కంటే సైబర్ నేరాలే పెద్ద సవాలుగా మారనున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి జీ. ప్రతిభాదేవి, ఏఐఎల్యూ అఖిల భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్, ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్, బెజవాడ, గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి లక్ష్మీ నారాయణ, ఎం నాగేశ్వరరావు, ఏఐఎల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లూరి మాధవరావు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. -
రెడ్బుక్ రాజ్యాంగం మేరకే బొల్లా అక్రమ అరెస్టు
నరసరావుపేట: మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి అక్రమ అరెస్టును గమనిస్తే ఆంధ్రాలో మాదిరిగానే చంద్రబాబునాయుడు శిష్యుడైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేశారనిపిస్తుందని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. బాధితులపైనే కేసు పెట్టడమంటే కూటమి ప్రభుత్వం డైరెక్షన్లోనే రేవంత్రెడ్డి నడుస్తున్నాడన్నారు. కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయిన బొల్లాను అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేయటం అనైతికం అన్నారు. బొల్లా కుటుంబానికి పార్టీ, ఎస్సీ సెల్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో నియోజకవర్గ ప్రజలకు బొల్లా అండగా ఉంటారని పేర్కొన్నారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్కుమార్ మాట్లాడుతూ ఒక తప్పుడు ఫేక్ కేసుతో బొల్లాను అరెస్టు చేశారన్నారు. బొల్లాకు 70 ఏళ్ల వయస్సుతో పాటు గుండె ఆపరేషన్ జరిగిందని, భూమి కొనుగోలులో బాధితుడైన బొల్లాను అరెస్టు చేయటం హేయం అన్నారు. తమ పార్టీ సమస్యలు, బెదిరింపులకు భయపడే పార్టీ కాదన్నారు. ఎదురెళ్లి ధమ్ము, ధైర్యంతో పోరాటం చేస్తోందని, కడిగిన ముత్యంలా బొల్లా బయటకు రావటం ఖాయమన్నారు. పార్టీ ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు. -
మెగా కాదు దగా డీఎసీ
వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన గుంటూరు వెస్ట్: ప్రతిభగల అభ్యర్థులకు అన్యాయం చేసే విధంగా మెగా డీఎస్సీ–2025 నియామక ప్రక్రియ ఉందని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు జి.సురేంద్ర డిమాండ్ చేసారు. బాధితులతో కలిసి సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు వినతిపత్రం అందజేసారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో దళిత కుటుంబాలకు చెందిన కర్రా బేబి, మేడిద సుధారాణిలకు జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ ర్యాంకులు, రాష్ట్ర స్థాయిలో 140,143 ర్యాంకులు వచ్చాయన్నారు. వీరికి ఉద్యోగం ఇవ్వకుండా క్రీడా కోటా కింద ఇతరులకు ఉద్యోగాలివ్వడమేంటో అర్ధం కావడంలేదన్నారు. ఇద్దరు దళిత యువతులకు ఇక్కడే అన్యా యం జరిగిందన్నారు. ఇక రాష్ట్రస్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఎంత అన్యాయం చేసారో గమనించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్రీడా కోటాలో 400 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారన్నారు. ఆ వివరాలు అడిగితే సమాధానం చెప్పడంలేదన్నారు. ప్రశ్నిస్తే దుర్మార్గులుగా చిత్రీకరిస్తున్నారు డీఎస్సీ ఎంపిక ప్రక్రియ విషయంలో ప్రశ్నించే వారిని దుర్మార్గులుగా చిత్రీకరించే యత్నాలను ప్రభుత్వం మానుకోవాలన్నారు. ప్రశ్నా పత్రాల భద్రత, పరీక్షల నిర్వహణ, స్పోర్ట్స్ కోటా ఎంపిక తదితర అంశాల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. అనేక మంది అభ్యర్ధులు డీఎస్సీలో ఎంపికవుదామని అహర్నిశలు కష్టపడి చదువుకుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ప్రతి అంశంలో ముందుకు వచ్చే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డీఎస్సీ అక్రమాలపై ఎందుకు మాట్లాడడంలేదో చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేదిలేదన్నారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉన్న బాధితుల తరపున వైఎస్సార్ సీపీ రాజీలేని పోరాటం చేస్తుందని సురేంద్ర హెచ్చరించారు. అది దగా డీఎస్సీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నగర అధ్యక్షుడు పాటిబండ్ల కిరణ్ మాట్లాడుతూ మెగా డీఎస్సీ పెద్ద దగా డీఎస్సీగా వర్ణించారు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ పూర్తి వైఫల్యం చెందారన్నారు. దీనికి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని పేర్కొన్నారు. పేద విద్యార్థుల ప్రతిభకు ప్రభుత్వం నిలు వునా పాతరేసిందన్నారు. ఎందరో ప్రతిభగల విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే హక్కు వీరికి ఎవరి చ్చారని ప్రశ్నించారు. తమ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుద్యోగుల తరపున రాజీలేని పోరాటానికి సిద్ధపడ్డారని ఆయనకు అండగా రాష్ట్ర యువత నిలుస్తుందని చెప్పారు. పార్టీ ఎస్సీ విభాగం పశ్చిమ, తూర్పు నియోజకవర్గ అధ్యక్షులు జి.ప్రభు, అంకాల రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బత్తుల దేవానంద్, పార్టీ ఎస్సీ విభాగం నేతలు పున్నారావు, సిహెచ్ కిరణ్, టి.నాని, గేరా సంజీవ్, పి.కవిత, ఆర్.వరలక్ష్మి, పిల్లి మేరి, బత్తుల వెంకట్, జల్ది స్వామినాథన్ పాల్గొన్నారు. -
చిట్టీల పేరిట మోసగించారు
ఎస్పీకి నివేదించిన బాధితులునగరంపాలెం(గుంటూరు వెస్ట్) : చిట్టీల పేర్లతో మోసగించారంటూ పలువురు బాధితులు వాపోయారు. సోమవారం గుంటూరు నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. బాధితుల నుంచి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అర్జీలు స్వీకరించారు.ఆయా సమస్యలపై సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదిదారుల సమస్యలపై వెంటనే విచారణ చేపట్టాలని అన్నారు. తద్వారా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), బెల్లం శ్రీనివాస్ (ట్రాఫిక్), మధుసూదన్రావు (సీసీఎస్)లు అర్జీలు స్వీకరించారు. -
జిల్లాలో సగటున 11 మి.మీ వర్షపాతం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు అత్యధికంగా మేడికొండూరు మండలంలో 36.4 మిల్లీ మీటర్లు వర్షం కురవగా, అత్యల్పంగా కొల్లిపర మండలంలో 1.6 మి.మీ వర్షం కురిసింది. సగటున 11 మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. ఫిరంగిపురం మండలంలో 19.2 మి.మీ., పెదకాకాని 16.2, మంగళగిరి 14.8, గుంటూరు పశ్చిమ 14.6, వట్టిచెరుకూరు 12.4, తాడికొండ 11.6, గుంటూరు తూర్పు 11.4, చేబ్రోలు 10.2, తాడేపల్లి 9.2, కాకుమాను 8.2, దుగ్గిరాల 7.4, పెదనందిపాడు 6.2, తెనాలి 5.6, ప్రత్తిపాడు 4.6, పొన్నూరు 4.6, తుళ్లూరు మండలంలో 4 మి.మీ చొప్పున వర్షం కురిసింది. నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : అనారోగ్యంతో బాధపడుతున్న 72 ఏళ్ల వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం బంగారు దుకాణాల సముదాయం గంటాలమ్మ చెట్టు ఏరియాలో ఉంటున్న పశ్చిమ బెంగాల్ మిద్నాపూర్ జిల్లా దాస్పూర్ గ్రామ వాసి బవానందదాస్ (72) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తలనొప్పితో బాధపడుతున్న అతను కొత్తపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సోమవారం మధ్యాహ్నాం అతను ఇంటి పైభాగంలోని స్టోర్లో ఫ్యాన్కు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడి కుమార్తె రూపాలి దాసు ఫిర్యాదుతో లాలాపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తాడేపల్లి రూరల్: అత్యంత క్లిష్టమైన ఊపిరితిత్తుల సమస్యలు, ప్రాణాపాయ స్థితిలో ఉపయోగపడే ఎక్ట్స్రా కార్బొరియల్ మోంబ్రేన్ ఆక్సిజనేషన్ (ఏక్మో) సేవలు తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్లో అందుబాటులోకి వచ్చినట్లు కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ పల్మనాలజీ డాక్టర్ లోకేష్ గుప్తా తెలిపారు. సోమవారం మణిపాల్ హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. డాక్టర్ లోకేష్ గుప్తా మాట్లాడుతూ అమరావతి ప్రాంతం తుళ్లూరుకి చెందిన గుమ్మా వెంకటరావు అత్యంత విషమ పరిస్థితుల్లో మణిపాల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని తెలిపారు. రోగికి ఆక్సిజన్ స్థాయి 60 శాతానికి పడిపోయిందని, వివిధ రకాల పరీక్షల అనంతరం రోగికి హార్డ్స్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారని పేర్కొన్నారు. వెంటిలేటర్ సహాయం, ప్రోన్ పొజిషనింగ్, యాంటీ బయాటిక్స్, అన్ని రకాల అత్యవసర చికిత్సలు అందించినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోగా మరింత దిగజారిందని వివరించారు. రోగికి సాధారణ చికిత్సలు ఫలితం ఇవ్వకపోడంతో ‘ఏక్మో’ సపోర్ట్తో వైద్యం ప్రారంభించారని, తాత్కాలికంగా ఊపిరితిత్తులు పనిని నిర్వహిస్తూ అవి కోలుకొనే సమయాన్ని కల్పించినట్లు తెలిపారు. 27 రోజులు రోగికి ఐసీయూలో చికిత్స అందించామని, చికిత్స సమయంలో భారీగా రక్తస్రావం జరిగిందని, వెంటనే రిజిడ్ బ్రోంకోస్కోపి నిర్వహించామని పేర్కొన్నారు. శ్వాసనాళానికి అడ్డుగా ఉన్న పెద్ద రక్తపు గడ్డలను తొలగించామని, రెండు వారాల పాటు ఏక్మో సపోర్ట్, నిరంతర పర్యవేక్షణ, రెస్పిరేటరీ రిహాబిలిటేషన్, ఫిజియోథెరపి వివిధ విభాగాల వైద్యుల సమన్వయంతో సమగ్ర చికి త్స అందించామని వివరించారు. ప్రస్తుతం రోగి స్పృహలో ఉండి ఆరోగ్యంగా కోలుకుంటున్నారని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. డాక్టర్ ఉదయ్ కిరణ్, డాక్టర్ జె.రామాంజనేయరెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉండడం వలన ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో అయినా ప్రాణాలు కాపాడవచ్చని పేర్కొన్నారు. డాక్టర్ దినేష్కుమార్ గొంట్ల, టి.శ్రీనివాస్, దిలీప్ రట్టి, వరుణ్ పమ్మిడి తదితరులు పాల్గొన్నారు. -
మోటరోలా సొల్యూషన్స్ ఎండీ, కంట్రీ హెడ్గా అనుదీప్
తెనాలి: మోటరోలా సొల్యూషన్స్లో ఆర్నెల్ల క్రితం అతి పిన్నవయసులోనే సీనియర్ డైరెక్టర్గా ఎదిగి, భారత ప్రభుత్వంచే ‘యూత్ ఐకాన్–2025’ గౌరవాన్ని స్వీకరించిన ముత్తవరపు అనుదీప్ ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా, కంట్రీ హెడ్, ఇండియాగా పదోన్నతిని పొందారు. తన కార్యస్థానం అమెరికా నుంచి బెంగళూరుకు మారింది. దేశం అంతటా కంపెనీ ఉనికిని బలోపేతం చేసేందుకు కృషిచేస్తారు. అనుదీప్ ముత్తవరపు సొంతూరు తెనాలి సమీపంలోని వరహాపురం. గుంటూరు జిల్లాలోని కేఎల్ యూనివర్శిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఇంజినీరింగ్ చేశాడు. అమెరికాలోనే డల్లాస్లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్లో టెలీకమ్యూనికేషన్స్లో మరో మాస్టర్స్ డిగ్రీని పూర్తిచేశాడు. తదుపరి ప్రపంచంలోని 10 అగ్రశ్రేణి కాలేజిల్లో ఒకటిగా, అమెరికాలో సెకండ్ ర్యాంకులో ఉన్న నార్త్వెస్టర్న్ కెల్లోగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. ఒక చిన్న స్టార్టప్ కంపెనీలో చేరిన పదేళ్లలోనే ఫార్ూచ్యన్ 500 కంపెనీల్లో ఒకటైన మోటారోలాలో అతి పిన్నవయస్కుడైన సీనియర్ డైరెక్టర్గా ఎదిగిన అనుదీప్, ఇప్పుడు అదే కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా, కంట్రీ హెడ్, ఇండియాగా పదోన్నతిని పొందటం విశేషం. -
నేటి నుంచి మిర్చి యార్డులో క్రయవిక్రయాలు
నగరంపాలెం: వాహనాల వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గిస్తే వాయు కాలుష్యాన్ని నియంత్రించవచ్చని జిల్లా ఎస్బీ డీఎస్పీ అలహరి శ్రీనివాస్ అన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ఆరోగ్యకర జీవనశైలిపై జిల్లా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆదివారం ఉదయం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ర్యాలీని ఏఆర్ హెడ్కానిస్టేబుల్ బీవీ నారాయణ ప్రారంభించారు. నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్ మీదుగా ఎంటీబీ సెంటర్ వరకు సాగింది. అక్కడి నుంచి జిల్లా పోలీస్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. శ్రీనివాస్ మాట్లాడుతూ సైక్లింగ్ను ప్రోత్సహించాలని అన్నారు. తద్వారా పర్యావరణ పరిరక్షణతోపాటు వ్యక్తిగత ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు. జిల్లా ఏఆర్ డీఎస్పీ సంకురయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని అన్నారు. పర్యావరణహిత జీవన విధానాలను అలవర్చుకోవాలని తెలిపారు. ర్యాలీలో ఆర్ఐలు శ్రీహరిరెడ్డి, సురేష్, రామకృష్ణారెడ్డి, ఆర్ఎస్ఐలు, పోలీస్ అధికార, సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): రాష్ట్ర స్థాయి సిలంబం సబ్ జూనియర్, సీనియర్ చాంపియన్షిప్ విజేతగా గుంటూరు జిల్లా నిలిచింది. స్థానిక బీఆర్ స్టేడియంలో నిర్వహించిన పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అఫ్రోజ్ ఖాన్ ఆదివారం ప్రారంభించారు. సిలంబం స్టిక్ ఫెన్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డీఎస్ క్రిస్టఫర్ మాట్లాడుతూ పోటీల్లో సుమారు 100 మంది వరకు పాల్గొన్నారన్నారు. ప్రథమ స్థానంలో గుంటూరు జిల్లా, ద్వితీయ స్థానంలో బాపట్ల జిల్లా, తృతీయ స్థానంలో కర్నూలు జిల్లా నిలిచాయన్నారు. అనంతరం విజేతలకు అఫ్రోజ్ ఖాన్తోపాటు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇ. అశోక్బాబు, క్రిస్టఫర్లు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కోచ్లు కాశీనాథ్రెడ్డి, సీహెచ్ శ్రీరామ్, ఎం.శ్రీనివాసరావు, కె.కిరణ్, వెంకటసాయి, నాంచారయ్య, నవీన్ పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్: కృష్ణానదిపై ఉన్న కనకదుర్గ వారధిపై ప్రయాణిస్తున్న ఒక కారు ఇంజిన్లో ఆదివారం రాత్రి మంటలు చెలరేగాయి. గమనించిన యజమాని తన కుటుంబ సభ్యులు నలుగురిని కిందకు దించారు. క్షణాల్లో కారు తగలబడిపోయింది. సమాచారం అందుకున్న ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విజయవాడ నుంచి ఫైర్ ఇంజిన్ తెప్పించి మంటలు అదుపుచేశారు. అరగంటపాటు వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో ప్రాతూరు రోడ్డు వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. -
అర్చకులపైనా ఆగడాలు
నరసరావుపేట రూరల్: టీడీపీ నేతలు రెడ్బుక్ రాజ్యాంగాన్ని ఆలయ అర్చకులపై కూడా అమలు చేస్తున్నారు. ఇస్సపాలెం మహంకాళి అమ్మవారి ఆలయ అర్చకులపై ఆలయ కమిటీ చైర్మన్ వేధింపులకు పాల్పడుతున్నారు. తాము చెప్పినట్టు నడుచుకోవాలని, లేకుంటే గుడి నుంచి బయటకు వెళ్లాలని అర్చకులకు హుకుం జారీ చేస్తున్నారు. శాస్త్ర విరుద్ధంగా తాము పనిచేయలేమని చెప్పినందుకు కక్ష సాధిస్తున్నారు. వంశపారంపర్యంగా ఆలయ అర్చకులు నిర్వహిస్తున్న కంకణధారణను రద్దు చేయించారు. ఆలయంతో సంబంధం లేని పూజారులతో ఆదివారం కంకణధారణకు అధికారులు, కమిటీ సభ్యులు ప్రయత్నించారు. వారిని ఆలయ అర్చకులు అడ్డుకున్నారు. దీంతో ఆలయంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తున్న కంకణధారణలో రద్దీ ఎక్కువగా ఉండే ఆదివారాలతోపాటు ప్రత్యేక పర్వదినాల్లో అర్చక కుటుంబ సభ్యులు పాల్గొంటారు. దీనిపై కూటమి నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళలు పాల్గొనకూడదంటూ తేల్చిచెప్పారు. తమ తాతల నుంచి వస్తున్న ఆచారాన్ని ఎలా వదలుకుంటామంటూ అర్చకులు కంకణధారణను కొనసాగిస్తున్నారు. దీనిపై కమిటీ సభ్యులు ఫిర్యాదు చేయడంతో ఆలయంలో కంకణధాణను రద్దు చేస్తూ దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ వీవీఎస్కే ప్రసాద్ ఈనెల 2వ తేదీ ఆదేశాలు జారీ చేశారు. ఇరువర్గాల వాగ్వాదం ఆదివారం ఉదయం ఆలయ ఈవో నలబోతు మాధవీదేవి, తహసీల్దార్ వేణుగోపాల్, ఆలయ కమిటీ చైర్మన్ బండ్లమూడి చంద్రశేఖర్లు ప్రైవేటు అర్చకులతో కంకణధారణ నిర్వహించేందుకు ప్రయత్నించారు. కంకణాలను అమ్మవారి వద్ద ఉంచి పూజాదికాలు నిర్వహించాలని అర్చకులను కోరారు. దీనికి అర్చకస్వాములు అభ్యంతరం వ్యక్తం చేశారు. అమ్మవారికి నివేదనతో పూజాదికాలు నిర్వహించిన అనంతరమే కంకణాలను ఇస్తామని స్పష్టంచేశారు. భక్తుల నమ్మకాలతో వ్యాపారం చేయలేమని, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన కంకణాలనే భక్తులకు అందిస్తామని తేల్చిచెప్పారు. కంకణాలకు పూజలు జరిపేందుకు ప్రైవేటు అర్చకుడిని గర్భగుడిలోకి పంపేందుకు ఆలయ అధికారులు ప్రయత్నించారు. దీనిని ఆలయ అర్చకులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్వ వాగ్వాదం చోటుచేసుకుంది. ఆలయ అర్చకులకు మద్దతుగా కొంతమంది గ్రామస్తులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఇస్సపాలెం ఆలయ అర్చకులకు టీడీపీ నేతల వేధింపులు తాజాగా కంకణధారణ రద్దు చేయించిన నాయకులు ప్రైవేటు అర్చకులతో నిర్వహించేందుకు కుటిల ప్రయత్నాలు అడ్డుకున్న ఆలయ అర్చకులు... ఆలయంలో ఉద్రిక్తత -
మద్యం మత్తులో ఈతకు వెళ్లి వ్యక్తి మృతి
గుంటూరు రూరల్: మద్యం మత్తులో ఈతకు వెళ్లి వాచ్మెన్ మృతి చెందిన సంఘటన నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. నల్లపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ మధుపవన్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్యామలానగర్ సీతమ్మకాలనీ సమీపంలో అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్న బొబ్బుల ప్రసాద్ (35) అదే కాలనీలో పలు అపార్ట్మెంట్లలో వాచ్మెన్లుగా పనిచేస్తున్న తన స్నేహితులైన బొడ్డుపల్లి బ్రహ్మయ్య, మరో ఇద్దరుతో కలిసి ఆదివారం మద్యం సేవించేందుకు వెంగళాయపాలెం సమీపంలోని కాలువ వద్దకు చేరారు. మద్యం సేంచి సమీపంలోని కాలువలో ఈతకు వెళ్లారు. అనంతరం నలుగురు మరలా మద్యం సేవించేందుకు పక్కనే ఉన్న ఫ్లాట్లులోకి వెళ్ళారు. మిగిలిన ముగ్గురు మద్యం సేవిస్తుండగా ప్రసాద్ తాను మద్యం సేవించనని ఈతకొడుతూ ఉంటాను మీరు రండి అంటూ మరలా కాలువలో ఈతకు దిగాడు. మద్యం సేవించిన మిగిలిన ముగ్గురు కాలువ వద్దకు చేరి చూడగా ప్రసాద్ కనిపించలేదు. చుట్టు చూసి కాలువలో వెతకగా కొంతదూరంలో ప్రసాద్ మృతదేహం కాలువలో కనిపించింది. దీంతో ముగ్గురు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
గుంటూరు
సోమవారం శ్రీ 8 శ్రీ జూన్ శ్రీ 2026అంతా మమ.. శుభ్రత భ్రమ! ● స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల కోసం అధికారుల ప్రయత్నాలు ● ఆప్కాస్ కార్మికులపైనే మొత్తం పని ఒత్తిడి ● 293 మందికిపైగా పర్మినెంట్ వర్కర్లకు మస్టర్ వేసి ఇళ్లకు పంపుతున్న వైనం ● ఇందుకుగాను ప్రతినెలా కార్మికుల నుంచి డబ్బులు వసూలు ● మరికొంతమంది అధికారుల ఇళ్లల్లో పనులకు పరిమితం ● ఇంకొంతమందికి నగరపాలక సంస్థ కార్యాలయంలో డిప్యూటేషన్ ● అదనపు వర్కర్లు ఉన్నప్పటికీ సక్రమంగా పనులు చేయించలేని పరిస్థితి నెహ్రూనగర్ : గుంటూరు నగరపాలక సంస్థలో 57 డివిజన్లు ఉన్నాయి. ముగ్గురు రెగ్యులర్, ఇద్దరు ఇన్చార్జి పారిశుద్ధ్య సూపర్వైజర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. నగరంలో పర్మినెంట్ పారిశుద్ధ్య కార్మికులు 293 మంది ఉన్నారు. వీరితోపాటుగా ఆప్కాస్ వర్కర్లు 1897 మంది, అదనపు వర్కర్లు 420 మంది విధులు చేపడుతున్నారు. ఇందులో పనిచేసే పర్మినెంట్ వర్కర్లను వేళ్ల మీదే లెక్కపెట్టొచ్చు. వీరికి మస్టర్లు వేసి ఇంటికి పంపించాలని శానిటరీ సూపర్వైజర్లే సంబంధిత ఇన్స్పెక్టర్లకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. దీనికోసం కార్మికుల నుంచి నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నగర పరిధిలో 1,897 మంది ఆప్కాస్ వర్కర్లు ఉంటే వారిలో కూడా రెగ్యులర్గా విధులు నిర్వహించేది 1,500 మందే అని సమాచారం. మిగతా వారంతా డెప్యూటేషన్పై నగరపాలక సంస్థ కార్యాలయంలో, పాఠశాలల్లో, రిజర్వాయర్లలో, పలు ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. ముఖ్యంగా నగరపాలక సంస్థ కార్యాలయంలోనే పదుల సంఖ్యలో ఉన్నారు. ఒక్కో అధికారి వద్ద వీరు విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన వారు శానిటరీ ఇన్స్పెక్టర్ల ఇళ్లల్లో, ఇతర అధికారుల నివాసాల్లో పనులు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నగరంలో నిత్యం 3 లక్షలకుపైగా ఇళ్ల నుంచి ఉత్పత్తి అయ్యే 470 మెట్రిక్ టన్నుల చెత్తను కేవలం కొంత మంది ఆప్కాస్ వర్కర్లే తరలించాలంటే తలకు మించిన భారంలా మారుతోంది. అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రతి డివిజన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని వారు కోరుతున్నారు. అందరూ సక్రమంగా విధులు నిర్వర్తించేలా చూస్తేనే స్వచ్ఛ సర్వేక్షణ్లో ర్యాంకుతోపాటు నగరవాసులకు మేలు జరుగుతుందని పేర్కొంటున్నారు. పర్మినెంట్ పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యఅప్కాస్ వర్కర్లుఅదనపు కార్మికులురోజుకు ఉత్పత్తి అయ్యే చెత్తమొత్తం కార్మికుల సంఖ్యమాట్లాడుతున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎన్.రవీంద్రరెడ్డికి జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేస్తున్న దృశ్యం 7ఆలయ చైర్మన్ తమ ఆచార వ్యవహారాల్లో కలుగజేసుకుని ఇబ్బందులు పెడుతున్నారు. కంకణధారణ కార్యక్రమాల్లో మా నాన్నమ్మ, అమ్మ పాల్గొన్నారు. ఇప్పుడు మా అక్క పాల్గొంటుంటే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కంకణధారణలను ఇంటిలో తయారు చేసి ఆదివారం ముందు రోజు పూజలో ఉంచి అభిషేకాలు నిర్వహించి భక్తులకు కడతాం. ఇప్పుడు అలాంటి పూజాదికాలు లేకుండా కంకణాలను అమ్మవారి వద్ద ఉంచి భక్తులకు విక్రయించాలని ప్రయత్నిస్తున్నారు. ఇది వ్యాపారం అవుతుంది. మేం చేయలేమని చెప్పడంతో అధికారం ఉందని పేర్కొన్నారు. మమ్మల్ని బయటకు వెళ్లండని బెదిరిస్తున్నారు. – కె.కార్తికేయ, ఆలయ అర్చకుడు ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో ఈ సంస్కృతి మరింత పెచ్చుమీరుతోందనే చెప్పుకోవచ్చు. దీంతో నగరంలో చెత్త తరలించే భారం అంతా ఆప్కాస్ వర్కర్లపైనే పడుతోంది. అధికారులు చెప్పిన ప్రతి పనిని వారే చేయాల్సి వస్తోంది. అదనపు వర్కర్లు ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. ఏదైనా డివిజన్లో ఆప్కాస్ వర్కర్లు సెలవు పెడితే సదరు డివిజన్కు అదనపు వర్కర్లును పంపించాలంటే శానిటరీ ఇన్స్పెక్టర్లను సంబంధిత సూపర్వైజర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ఆదివారం నాటికి ప్రస్తుత నిల్వ 32,0877 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. నరసరావుపేట రూరల్: ఇస్సపాలం మహంకాళి ఆలయ నిర్మాణానికి సత్తెనపల్లికి చెందిన శాత్రసుపల్లి బాబురావు, పద్మావతి దంపతులు రూ 1,11,116 విరాళం ఇచ్చారు.విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 518.80 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 3,305 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల కోసం నగరపాలక సంస్థ పాట్లు పడుతుంటే మరో పక్క పారిశుద్ధ్య సూపర్వైజర్లు కొంత మంది తమ జేబులు నింపుకొనే పనిలో నిమగ్నమయ్యారు. పర్మినెంట్ వర్కర్లు ఉన్నప్పటికీ వారికి మస్టర్ వేసి ఇంటికి పంపుతున్నారు. ప్రతిఫలంగా వారి నుంచి ప్రతి నెల మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఉన్నతాఽధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నగరంలో శుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిందిపోయి జేబులు నింపుకొనేందుకు యత్నించడంపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
మంగళగిరి టౌన్: తాళం వేసిన ఇంట్లో దొంగలు చొరబడి భారీ సొత్తును అపహరించుకుపోయిన ఘటన మంగళగిరి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామ పరిధిలోని రామాలయం సమీపంలో సుబ్బారావు, వెంకటేశ్వరమ్మ దంపతులు తమ కుమారుడు, కోడలితో కలసి నివాసముంటున్నారు. సుబ్బారావు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కుమారుడు నవీన్ ఓ ప్రభుత్వరంగ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ నేపధ్యంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో సుబ్బారావు తన భార్య వెంకటేశ్వరమ్మతో కలసి పెనుగంచి ప్రోలులోని ఓ కార్యక్రమానికి వెళ్లాడు. కుమారుడు నవీన్ కూడా అదే గ్రామంలోని అత్తగారింటికి వెళ్లాడు. అదునుగా భావించిన గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. బీరువాలో ఉన్న సుమారు రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల విలువైన వెండి వస్తువులతో పాటు, రూ.లక్ష నగదు దోచుకు వెళ్లినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో కుమారుడు నవీన్ ఇంటికి వచ్చి, లోపల డోర్కు వేసిన తాళాలు పగలకొట్టి ఉండడంతో గదిలోకి వెళ్లి చూడగా బీరువా తాళాలు పగలకొట్టి ఉండడం గమనించాడు. మరో గదిలో గడ్డపలుగు ఉండడంతో గుర్తుతెలియని దుండగులు ఇంటి వెనుక గోడ దూకి వచ్చి గడ్డపలుగు సాయంతో తాళాలు పగలకొట్టి చోరీకి పాల్పడినట్లు భావించి, పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. మంగళగిరి రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్టీమ్ను పిలిపించి ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. రూ.7 లక్షల విలువైన ఆభరణాలు, రూ.లక్ష నగదు మాయం -
అమ్మబాబోయ్.. రాజధాని లారీలు
తాడికొండ: రాజధానికి మితిమీరిన వేగంతో దూసుకెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్న లారీలను తాడికొండలో గ్రామస్తులు అడ్డుకున్నారు. రాత్రిళ్లు అధిక వేగంతో వస్తున్న లారీ మలుపు వద్ద యువకుడిని ఢీకొట్టబోవడంతో అప్రమత్తమైన అతను త్రుటిలో తప్పుకున్నాడు. గతంలో సైతం గ్రామంలో అధిక వేగంతో వెళుతున్న లారీల కారణంగా ఇలాంటి ఘటనలు పలుమార్లు జరిగిన నేపధ్యంలో స్థానిక ట్యూబ్లైట్ సెంటర్లో బాబు జగ్జీవన్రామ్ విగ్రహం వద్ద యువకులు రోడ్డుపై లారీలను అడ్డుకొని నిరసన తెలియజేశారు. రాజధానికి వెళ్లే పలు లారీలు బారులు తీరి నిలిచిపోవడంతో హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువకులతో చర్చించగా గ్రామంలో లారీలు అధిక వేగంతో వెళుతున్న కారణంగా పడుతున్న ఇబ్బందులు తెలియజేశారు. పేరేచర్ల ప్రాంతం నుంచి రాజధాని నిర్మాణాలకు వెళ్ళే కంకర, ఫ్లైయాష్తో వెళ్లే లారీలతో పాటు ఇతర సామగ్రి రవాణా లారీలు, రాజధాని నుంచి అక్రమంగా తరలిస్తున్న నల్లమట్టి, ఇసుక లారీలు రోడ్లపై నిత్యం హోరెత్తిస్తున్నాయని, అధిక శబ్ధంతో కూడిన వాహనాలు అధిక వేగం కారణంగా రోడ్డుపై నడవాలంటే భయందోళనకు గురవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో పాటు పెరిగిన రద్దీ దృష్ట్యా లారీలు, ఇతర రాజధాని వాహనాల రవాణా కోసం గ్రామ శివారు నుంచి బైపాస్ రహదారి నిర్మించిలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం తాడికొండ పోలీస్ స్టేషన్లో మితిమీరిన వేగంతో వస్తున్న లారీలపై ఫిర్యాదు చేశారు. రాజధాని ప్రాంతానికి మట్టి, ఇసుక, ఇతర నిర్మాణ సామగ్రి తరలిస్తూ అధిక వేగంతో వెళ్తున్న లారీలు ప్రమాదాలబారిన ప్రజలు తాడికొండలో లారీలను ఆపి నిరసన వ్యక్తం చేసిన గ్రామస్తులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించిన పోలీసులు -
టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి
పిడుగురాళ్ల: ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చి టిప్పర్ ఢీకొని వ్యక్తి మతి చెందిన సంఘటన పిడుగురాళ్ల పట్టణంలో ఆదివారం జరిగింది. పట్టణ ఎస్ఐ డి శివనామరాజు తెలిపిన వివరాల మేరకు... మృతుడు ఇరగదిండ్ల బాలస్వామి (53) మారుతీనగర్ 5వ లైన్లో నివాసం ఉంటున్నాడు. జీవనోపాధి కోసం చికెన్ పకోడీ బండి నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం చికెన్ పకోడీ తయారీకి కావలసిన సామగ్రి కొనుగోలు చేసేందుకు తన ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయలుదేరాడు. ఐలాండ్ సెంటర్ మెయిన్ రోడ్ వైపు నుంచి బస్టాండ్ వైపు వెళుతున్న టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతివేగంగా వాహనం నడుపుతూ బాలస్వామి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనక నుండి ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలస్వామి రోడ్డుపై పడిపోయి తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే క్షతగాత్రుని పట్టడంలోనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలస్వామి మృతి చెందాడు. మృతుడి భార్య ఇరగదిండ్ల అలేఖ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై తెలిపారు. చీరాల: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి గుండె ఆగింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఆ వివరాల్లోకి వెళితే... ఆదివారం తెనాలి నుంచి చీరాల మీదుగా ఒంగోలు వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సులో సుమారు 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి బాపట్లలో బస్సు ఎక్కాడు. బాపట్ల నుంచి చీరాలకు టికెట్ తీసుకున్నాడు. బస్సు చీరాల ఆర్టీసీ బస్టాండ్కు వచ్చి తిరిగి ఒంగోలు వెళ్తోంది. టికెట్లు ఇచ్చే క్రమంలో కండక్టర్కు అనుమానం వచ్చి నిద్రపోతున్నాడనుకుని పలు మార్లు లేపినా ఎటువంటి స్పందన లేదు. దీంతో అనుమానం వచ్చి బస్సును చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. డాక్టర్ పరిశీలించి మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడికి సంబంధించిన వివరాలేమీ లభించలేదు. తెలుపు గళ్ల నలుపు చొక్కా, జీన్స్ నిక్కర్ ధరించి ఉన్నాడు. మెడలో నల్లని దారం కట్టుకుని ఉన్నాడు. చిల్లర డబ్బులు, ఈనో ప్యాకెట్ తప్ప మరే గుర్తింపు కార్డులు అతని వద్ద లభించలేదు. అలానే మృతుడి వద్ద రెండు టికెట్లు లభించాయి. గుంటూరు నుంచి చీరాలకు ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్లు ఒకటి, బాపట్ల నుంచి చీరాలకు తీసుకున్న టికెట్ ఒకటి లభించాయి. బాపట్ల నుంచి చీరాలకు టికెట్ తీసుకోవడంతో అతడు బాపట్లకు చెందిన వ్యక్తా, చీరాలకు చెందిన వ్యక్తా అనేది తెలియడంలేదు. ఔట్ పోస్టు పోలీసులు ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ వద్ద నుంచి వివరాలు నమోదు చేశారు. చీరాల వన్టౌన్ పోలీసుస్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బస్సులో ఉన్న ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించి పంపించి వేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడు కర్నూలు వాసి మృతి విషయం మీడియా మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో హల్చల్ కాగా ఆదివారం సాయంత్రం వివరాలు లభించాయి. ఈ మేరకు ఒన్టౌన్ పోలీసులు వివరాలు వెల్లడించారు. మృతుడి పేరు కుమ్మరి కిరణ్ (38) కర్నూలులోని ప్రకాష్నగర్ వాసిగా గుర్తించారు. కొద్ది రోజుల కిందట కూలి పనుల నిమిత్తం వేటపాలెం మండలానికి ఐదుగురు వచ్చారు. గతంలోనే ఆరోగ్య సమస్యలు ఉండడంతో శనివారం గుంటూరు హాస్పిటల్లో చికిత్స చేయించుకుని ఆదివారం తిరుగు ప్రయాణంలో చీరాల వస్తున్నట్లు తెలిపారు. గుంటూరు నుంచి వస్తూ బాపట్లలో దిగి మరో బస్సు ఎక్కినట్లు తెలుస్తోంది. బస్సులో ప్రయాణిస్తూ గుండెపోటుతో మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఏరియా వైద్యశాలకు వచ్చి పరిశీలించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.


