Guntur District News
-
ఉద్యోగాన్ని ఒత్తిడి లేకుండా నిర్వహించాలి
జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీంబాషా చేబ్రోలు: ఉద్యోగాన్ని ఒత్తిడి లేకుండా ఆహ్లాదకరంగా నిర్వర్తించాలని అప్పుడే ఆరోగ్యంగా ఉంటామని జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీం బాషా అన్నారు. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో మంగళవారం మండల విద్యాశాఖాధికారి రాయల సుబ్బారావు ఉద్యోగ విరమణ సందర్భంగా అభినందన సభ నిర్వహించారు. మండలంలోని ఉపాధ్యాయులు, హెచ్ఎంలు తదితరులు ఎంఈవో దంపతులను సన్మానించారు. డీఈఓ మాట్లాడుతూ 37సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో రాయల సుబ్బారావు సమర్ధవంతంగా పనిచేసి అందరి మన్ననలు పొందారని కొనియాడారు. భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణ, ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందన కార్యక్రమానికి హాజరయ్యారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు అభినందించారు. -
పీఆర్సీ, ఆర్థిక బకాయిల కోసం దశాలవారీ పోరాటం
ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ లింగారావు గుంటూరు ఎడ్యుకేషన్: 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ను నియమించి, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, లేనిపక్షంలో కలసి వచ్చే సంఘాలను కలుపుకుని దశలవారీ పోరాటం చేపడతామని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.బసవలింగారావు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కోర్టు వద్ద ఉన్న ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో మంగళవారం సంఘం జిల్లా అధ్యక్షుడు గుడిపాటి దాస్ అధ్యక్షతన సబ్ కమిటీ, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బసవలింగారావు మాట్లాడుతూ ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చని ఫలితంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని, ఆందోళనలు అసంతృప్తిగా మారి, పోరాటాలుగా మారతాయని అన్నారు. 2023 జులై నుంచి12వ పీఆర్సీ అమలు చేయాల్సి ఉండగా, మూడేళ్లు గడుస్తున్నప్పటికీ కమిషన్ అతీగతి లేదన్నారు. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్పై సముచిత నిర్ణయం తీసుకుంటామన్న నేతలు ఇచ్చిన మాట తప్పారని అన్నారు. 11వ పీఆర్సీతో పాటు, డీఏ, సరెండర్ లీవ్, తదితర అన్ని రకాల బకాయిలు రూ.30 వేల కోట్లు పేరుకపోయాయని అన్నారు. ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ ప్రధానకార్యదర్శి మొహ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ చెందిన ఉపాధ్యాయుల, ఉద్యోగుల గ్రాట్యుటీ 20 నెలల నుంచి చెల్లించడం లేదని, కేవలం పెన్షన్ తప్ప ఇతర ఆర్థిక ప్రయోజనాలు ఏ ఒక్కటీ రావడం లేదన్నారు. వచ్చే వేసవిలో బదిలీలు, ఉద్యోగోన్నతులను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వం స్పందించి నాయమైన ఆర్థిక సమస్యలు పరిష్కరించకుంటే, టెన్త్ స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాల్లో నిరసనలతో పాటు ఈనెల 16, 17 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో ధర్నాలు నిర్వహిస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించని పక్షంలో రాష్ట్ర స్థాయిలో నిరసనలు, మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ ఉపాధ్యక్షులు పి.నాగశివన్నారాయణ, పి.పార్వతి, జిల్లా కార్యదర్శలు కె.శ్రీనివాసరావు, పి.శివరామకృష్ణ, జిల్లా కౌన్సిలర్ వి.కిషోర్ షా పాల్గొన్నారు. -
బాజీ కుటుంబానికి అండగా ఉంటాం
వైఎస్సార్ సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా మేడికొండూరు : కారు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధానకార్యదర్శి బాజీ కుటుంబానికి అండగా ఉంటామని పార్టీ గుంటూరు నగర అధ్యక్షురాలు, గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా, గుంటూరు జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు పఠాన్ సైదా ఖాన్ అన్నారు. ఇస్లాంపేటలోని బాజీ కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కార్యక్రమం లో ఫిరంగిపురం మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు జనాబ్ షేక్ మస్తాన్ వలి (నుదురుపాడు మస్తాన్ వలి) జిల్లా మైనారిటీ అధ్యక్షులు షైదా ఖాన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ నందెటి రాజేష్, పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జి షర్ఫుద్దీన్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీపీఎస్సీ–2023 బ్యాచ్లో ఎంపీడీఓగా ఎంపికై కొల్లూరు మండలంలో పోస్టింగ్ పొందిన అమర్తలూరి స్పందనకు జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా మంగళవారం జెడ్పీ క్యాంపు కార్యాలయంలో నియామక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వి.జ్యోతి బసు, డెప్యూటీ సీఈఓ సీహెచ్ కృష్ణ, అకౌంట్స్ అధికారి శామ్యూల్ పాల్, ఏఓ జె.పూర్ణచంద్రారెడ్డి పాల్గొన్నారు. నెహ్రూనగర్: రైల్వే రిక్రూట్మెంట్ గ్రూప్ డీ పరీక్షలకు ఉచిత శిక్షణ నిమిత్తం అర్హులైన ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.మయూరి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రూప్ డీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వంద మంది అభ్యర్థులకు రెండు నెలల పాటు ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్, స్టడీ మెటీరియల్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఉచిత శిక్షణకు 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారాంగా ఎంపిక చేయబడుతుందన్నారు. శిక్షణకు దరఖాస్తు చేసుకునే వారు ఏప్రిల్ 8వ తేదీలోగా రాజాగారితోటలోని బీసీ స్టడీ సర్కిల్ గుంటూరు కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. వివరాలకు 0863–2358071 నంబర్ను సంప్రదించాలని కోరారు. గుంటూరు లీగల్: పెదకాకాని పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన హుండీలోని కానుకలు లెక్కింపు సమయంలో కొంత సొమ్ము చోరీకి గురైంది. మల్లేశ్వరస్వామి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామ రఘునందనరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఆరవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ గౌస్ నిందితురాలైన తాడికొండ మండలం గరికపాడు గ్రామానికి చెందిన ఎడ్ల శ్రీరావమ్మకు మూడు నెలలు సాధారణ జైలు శిక్ష విధించారు. ఈ కేసుకు సకాలంలో సాక్ష్యాధారాలను అందించిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వై.వినోద్కుమార్ కోర్ట్ కానిస్టేబుల్ కే.ప్రేమ్కుమార్కు సంబంధిత అధికారులు అభినందనలు తెలిపారు. కేసు లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి మురళీకష్ణ వాదనలు వినిపించారు. రెంటచింతల: మండలంలోని పాలువాయిగేటు గ్రామ సమీపంలో ఉన్న టోల్ప్లాజా వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడకక్కడే మృతిచెందాడు. పాతపాలువాయికి చెందిన ఇండ్లచెరువు పుల్లారావు(28) జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మాచర్ల నుంచి రెంటచింతల వైపు వెళ్తున్న వాహనం పుల్లారావును ఢీ కొట్టి ఉంటుందని ఆ ప్రాంతంలో వాహనానికి సంబంధించిన అద్దాలు ఉండటంవలన అనుమానిస్తున్నారు. పుల్లారావు భార్య కోటేశ్వరితో కొంతకాలంగా మనస్పర్థలు ఉన్న నేపథ్యంలో ఆమె కొత్తపల్లి గ్రామంలోని తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఘటన వివరాలు తెలుసుకున్న ఎస్ఐ సీహెచ్ నాగార్జున ప్రమాద స్థలానికి చేరుకుని విచారించారు. భార్య కోటేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
న్యాయస్థానాల్లో రాజకీయ జోక్యం పెరిగింది
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): బీజేపీ పాలనలో న్యాయస్థానాల్లో రాజకీయ జోక్యం ఎక్కువైందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకుడు చింతా మోహన్ పేర్కొన్నారు. గుంటూరులో ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు తొందరపాటుతో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించారని తెలిపారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు దళితుల్ని ముఖ్యమంత్రిని చేయాలని సీపీఎం అగ్రనాయకులు హరికిషన్ సింగ్ సూర్జిత్ కాంగ్రెస్ హై కమాండ్కు గట్టిగా సిఫార్సు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అంశం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం జరుగుతోందన్నారు. రాజ్యాంగ సవరణ చేసి, రిజర్వేషన్లు కల్పిస్తారన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ రాజకీయ ప్రేరేపిత జడ్జిమెంట్ అని పేర్కొన్నారు. దళితులను బలహీనం చేయాలనే కుట్ర స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అందులో భాగంగానే ఏబీసీడీ వర్గీకరణ తీర్పు అని పేర్కొన్నారు. ఇప్పుడు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు వంటి తీర్పులు వచ్చాయన్నారు. 2029లో ఎస్సీలు దేశ, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నారన్నారు. విలేకరులు సమావేశంలో ఎస్సీ నాయకుడు అన్నవరపు కిషోర్ పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ -
వర్క్ఫ్రమ్ హోమ్ పేరుతో ఆన్లైన్ మోసం
తాడేపల్లి రూరల్: వర్క్ ఫ్రం హోమ్ పేరిట మహిళను మోసం చేయడమే కాకుండా.. క్రైం బ్రాంచ్ పోలీసులమంటూ.. సీబీఐ అంటూ బెదిరించిన ఘటనపై కేసు నమోదయింది. వివరాల్లోకి వెళితే.. తాడేపల్లి పట్టణ పరిధిలోని కొండా అంకమ్మ గృహిణి. ఆమెతో పాటు అత్త, మామలు కూడా ఉంటున్నారు. ఈక్రమంలో మంగళవారం మధ్యాహ్నం 9846719089 నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది.. అవతలి వ్యక్తి మీకు నటరాజ్ పెన్సిల్ కంపెనీ నుంచి మంచి ఆఫర్ వచ్చిందని, ముందుగా మీరు సభ్యత్వం తీసుకోవాలని, అందుకు రూ.650 చెల్లిస్తే వివరాలు తెలుపుతామని చెప్పడంతో గృహిణి అయిన కొండా అంకమ్మ రూ. 650లు ఫోన్పే ద్వారా చెల్లించింది. వెంటనే మళ్లీ సదరు వ్యక్తి ఆ మహిళకు ఫోన్ చేసి మీరు నటరాజ్ పెన్సిల్ స్కీమ్లో సెలెక్ట్ అయ్యారని, రూ.1,999లు చెల్లించాలని చెప్పడంతో కొండా అంకమ్మ ఒక్క రూపాయి ఏముందంటూ రూ.2వేలు ఫోన్ పే ద్వారా చెల్లించింది. రెండు వేల రూపాయలు చెల్లిస్తే స్కీమ్కు అనర్హులని, రూ. 1999లు మాత్రమే చెల్లించాలని చెప్పడంతో మళ్లీ వారు చెప్పిన డబ్బులను ఫోన్పే ద్వారా చెల్లించింది. మీ ఇంటికి సాయంత్రం కల్లా ట్రక్తో పెన్సిల్ లోడ్ వస్తుందని, ఛార్జీల నిమిత్తం రూ. 3599లు చెల్లించమనడంతో ఆ నగదు సైతం చెల్లించింది. వెంటనే ఆ వ్యక్తి మీ ఫొటో పెట్టమని చెప్పడంతో సదరు మహిళ తన ఫొటోను పంపించింది. -
డీఏవీ పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన
దాచేపల్లి: మండలంలోని తంగెడ భవ్య సిమెంట్కు చెందిన దయానంద్ ఆంగ్లో వేదిక్(డీఏవీ) పాఠశాల వద్ద మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం యజమాన్యం ఏర్పాటు చేయటంతో 300 మందికిపైగా తల్లిదండ్రులు వచ్చారు. డీఏవీ పాఠశాలను ఇప్పటి నుంచి చెట్టినాడ్ విద్యా మందిర్గా మార్పు చేస్తున్నామని, ఇప్పటి వరకు విద్యార్థులకు చెప్పిన సీబీఎస్ఈ సిలబస్ బదులుగా స్టేట్ సిలబస్ చెబుతామని ఈ సమావేశంలో యజమాన్య ప్రతినిధులు ప్రకటించారు. దీంతో సమావేశంలో పాల్గొన్న తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. స్కూల్ ఏర్పాటు చేసిన నాటి నుంచే ఇక్కడ సీబీఎస్ఈ సిలబస్ని విద్యార్థులు చదువుకుంటున్నారని, ఇప్పుడు ఆ సిలబస్ తొలగించి స్టేట్ సిలబస్ చెబితే విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందని తల్లిదండ్రులు వాగ్వివాదానికి దిగారు. విద్యార్థుల భవిష్యత్ని దృష్టిలో పెట్టుకుని సీబీఎస్ఈ సిలబస్ బోధించాలని, యజమాన్యం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయవద్దని తల్లిదండ్రులు కోరారు. దీంతో తల్లిదండ్రులకు యజమాన్య ప్రతినిధులు సర్ది చెప్పే యత్నాలు చేశారు. -
5 నుంచి గుంటూరులో శ్రామిక మహిళల రాష్ట్ర సదస్సు
లక్ష్మీపురం: గుంటూరులో ఏప్రిల్ 5 నుంచి ఏడో తేదీ వరకు జరగనున్న మహిళా ఉద్యోగులు, శ్రామిక మహిళల 10వ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని మాజీ శాసనమండలి సభ్యుడు, ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక బ్రాడీపేటలోని సీఐటీయూ నగర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రామిక మహిళ రాష్ట్ర సదస్సు వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ సమాజంలో సగభాగంగా ఉన్న కార్మికవర్గంలో అధిక భాగంగా ఉన్న మహిళలు, శ్రామిక మహిళల సమస్యలు చర్చించేందుకు శ్రామిక మహిళ పదవ రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కనీస వేతనం, పని భద్రత, లేబర్ కోడ్లు అమలులోకి వస్తున్న నేపథ్యంలో పని ప్రదేశాలలో యాజమాన్యాలు పురుషులు, మహిళలు ఇద్దరి హక్కులను కాలరాయటం అవుతుందన్నారు. శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ జి.రమణ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, స్కీం వర్కర్లుగా ఉన్నవారికి కనీస వేతనం ఇవ్వాలని, పెరుగుతున్న ధరలకనుగుణంగా వేతనాలు పెంచాలన్నారు. పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధిక కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. 5న మహిళా కార్మికులకు, ఉద్యోగులకు, పిల్లలకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. 6వ తేదీ సాయంత్రం 5 గంటలకు యూటీఎఫ్ కార్యాలయంలో మహిళలు ఆరోగ్యం అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా కో కన్వీనర్ కే అనురాధ మాట్లాడుతూ 7వ తేదీన ఎంపిక చేయబడిన ప్రతినిధులతో రాష్ట్రవ్యాప్తంగా శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి కార్యాచరణ సిద్ధం చేస్తామని తెలిపారు. సమావేశంలో శ్రామిక మహిళా జిల్లా నాయకులు ఎస్ పద్మ, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి లక్ష్మణరావు, నగర కన్వీనర్ బి ముత్యాలరావు, కో కన్వీనర్ కే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
తహసీల్దార్ కృష్ణకాంత్
పెదకాకాని: గ్రామానికి చెందిన బెజవాడ సాంబయ్య, విజయలక్ష్మి దంపతులకు నలుగురు కొడుకులు ఉండగా చిన్న కుమారుడు బెజవాడ కృష్ణమూర్తి మాత్రమే సంతానం అని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇచ్చిన మాట వాస్తవమేనని తహసీల్దార్ పి.కృష్ణకాంత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘సాక్షి’ లో మంగళవారం రెవెన్యూ అధికారుల ఇష్టారాజ్యం పేరుతో కథనం ప్రచురితమైంది. ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్(ఎఫ్ఎంబీ) నా హయాంలో ఇవ్వలేదు, గతంలో ఇక్కడ పనిచేసిన పెల్లూరి రత్నం అనే తహసీల్దార్ విచారించి మంజూరు చేయడం జరిగిందన్నారు. ఆ ఎఫ్ఎంబీ ఆధారంగా బెజవాడ కృష్ణమూర్తి తన తల్లి పేరిట ఉన్న 38 సెంట్ల భూమికి 1బీ, అడంగల్, పాస్ పుస్తకానికి దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. ఆ దరఖాస్తును విచారించి బెజవాడ కృష్ణమూర్తి, మరో ఇద్దరు అని ఉదహరిస్తూ 38 సెంట్లకు హక్కు కల్పించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. గురజాల: వీఆర్ఏల డిమాండ్లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బదంగి సాహెబ్ డిమాండ్ చేశారు. స్థానిక రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద మంగళవారం వీఆర్ఏలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పే స్కేల్ జీతాలు అమలు చేయాలని, వన్టైమ్ సెటిల్మెంట్ ద్వారా వీఆర్వో, రికార్డు అసిస్టెంట్, అటెండర్, నైట్ వాచ్మెన్ పోస్టులకు భర్తీ చేయాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జీతాలు పెరుగుతాయని, ప్రమోషన్లు వస్తాయని ఆశించామని.. కానీ నేడు ఆ పరిస్థితులు కనిపించడం లేదన్నారు. ఈ ప్రభుత్వంలో వీఆర్ఏల సమస్యలు గురించి చర్చించిన దాఖలాలు కనిపించలేదన్నారు. రీ సర్వే పేరుతో మమ్ములను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. పలు డిమాండ్లను సత్వరమే కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం పరిపాలనాధికారిణికి వినతిపత్రం అందించారు. ఇమాం వలి, ఏడుకొండలు, దేవ సహాయం, రవి, మునాఫ్, పాపారావు, వెంకటేష్, మస్తాన్వలి, ముస్తఫా, రామకృష్ణ, అశోక్, రాజారావు, గురవయ్య, సైదా తదితరులున్నారు. వీఆర్ఏల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బదంగి సాహెబ్ -
వర్సిటీ బడ్జెట్కు ఆమోదముద్ర
ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 90వ అకడమిక్ సెనేట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వర్సిటీలోని డైక్మెన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఇన్చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావు అధ్యక్షత వహించారు. సమావేశంలో సోమవారం సాయంత్రం జరిగిన పాలకమండలి, ఫైనానన్స్ కమిటీ నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. నూతనంగా ఎంబీఏ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ కోర్సుకు, బీటెక్లో స్పేస్ టెక్నాలజీ కోర్సులను 2026–27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు సెనేట్ ఆమోదం తెలిపింది. ఏఎన్యూ 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ విజయోత్సవాలను నిర్వహించాలని పలువురు మాజీ వీసీలు సూచించారు. 50 ఏళ్లకు గుర్తుగా ఒక ప్రత్యేక నిర్మాణం చేపట్టాలని చర్చించారు. లైబ్రేరియన్ ఆచార్య వెంకట్రావ్ మాట్లాడుతూ అధ్యాపకులు తన పరిశోధన పత్రాలను వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్లో నమోదు చేసుకుంటే పబ్లిక్కు అయ్యే ఖర్చులను ఆ సంస్థ భరిస్తుందన్నారు. సమావేశానికి హాజరైన మాజీ వీసీ ఆచార్య హరగోపాల్రెడ్డి పెన్షనర్లకు బకాయిలు విడుదల చేయాలన్నారు. మాజీ వీసీ ఆచార్య వియన్నరావు మాట్లాడుతూ ఏఎన్యూ రీసెర్చ్ యూనివర్సిటీగా రూపాంతరం చెందేందుకు అవకాశాలు ఉన్నాయని ఆ దిశగా పాలకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. విశ్రాంత వీసీ బాలమోహన్దాస్ మాట్లాడుతూ ఏఎన్యూ 50 ఏళ్ల సందర్భంగా ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు కోరాలని సూచించగా మాజీ వీసీ ఆచార్య రాఘవులు ఐకానిక్ భవనం నిర్మాణం చేపట్టాలని కోరారు. మాజీ వీసీ ఆచార్య ఎల్.వేణుగోపాల్రెడ్డి మాజీ ప్రొఫెసర్ సేవలను వర్సిటీ వాడుకోవాలన్నారు. మాజీ వీసీ ఆచార్య రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ 50 ఏళ్ల వేడుకకు నోబెల్ విన్నర్లను తీసుకురావాలన్నారు. అనంతరం బడ్జెట్కు ఆమోదముద్ర వేశారు. ఇన్చార్జి వీసీ ఆచార్య కె గంగాధరరావు వర్సిటీ నివేదికను వివరించారు. సమావేశంలో రెక్టార్ ఆచార్య ఆర్.శివరాంప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం, పాలకమండలి సభ్యులు వెంకటేశ్వరరావు, షాహేదా అక్తర్, సుమంత్ కుమార్, జగదీష్ నాయక్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్పర్సన్ ఆచార్య రత్నషీలామణి, డీన్లు, ప్రిన్సిపాల్స్, డైరెక్టర్లు, సెనేట్ సభ్యులు పాల్గొన్నారు. తనిఖీ బృందం నివేదిక ఆధారంగా కఠిన చర్యలు.. ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన ఆరోపణలపై వర్సిటీ ఉన్నతాధికారులు నియమించిన ప్రత్యేక తనిఖీ బృందం కమిటీ నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని దూరవిద్య పరీక్షల విభాగం కో–ఆర్డినేటర్ ఆచార్య డి.రామచంద్రన్ మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ తనిఖీ బృందం (స్క్వాడ్) సమర్పించిన నివేదికలో పొందుపరిచిన అంశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కళాశాలలకు చెందిన విద్యార్థుల పరీక్ష ఫలితాలను తాత్కాలికంగా విత్హెల్డ్ లో ఉంచుతున్నామన్నారు. ఇంపర్సనేషన్ (ఇతరుల స్థానంలో పరీక్ష రాయడం), మాల్ప్రాక్టీస్ వంటి అక్రమాలకు పాల్పడిన విద్యార్థులపై వర్సిటీ నిబంధనలకు అనుగుణంగా క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తనిఖీ బృందం నివేదికలో సూచించిన తీవ్ర ఆరోపణలు ఉన్న పలు పరీక్ష కేంద్రాలను భవిష్యత్తులో పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వబోమని, అవసరమైతే వాటి అనుబంధాన్ని రద్దు చేసే దిశగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఇప్పటికే సమర్పించిన నివేదికలో కొన్ని అంశాలు అసంపూర్తిగా ఉన్నందున, సంబంధిత కమిటీ నుంచి పూర్తి వివరాలను మరోసారి సేకరించడం జరుగుతుందన్నారు. అనంతరం మరిన్ని కీలక నిర్ణయాలు ప్రకటించనున్నట్లు దూరవిద్యాకేంద్రం పరీక్షా విభాగం కో–ఆర్డినేటర్ ఆచార్య రామచంద్రన్ తెలిపారు. -
గుంటూరు
బుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ఇక గ్రామాల్లోనూ ప్రత్యేక పాలన ఇప్పటికే కొన్ని పంచాయతీల్లో రూ.లక్షల్లో బిల్లులు పెండింగ్ గత పది రోజుల నుంచి బిల్లులు క్లియర్ చేయొద్దని ఆదేశాలు ఎన్నికలు నిర్వహించకుండా చంద్రబాబు ప్రభుత్వం దాటవేత ధోరణి నరసరావుపేట రూరల్: ఇస్సపాలెంలోని మహంకాళి ఆలయ నిర్మాణానికి కొనకంచి లక్ష్మయ్య, కుమారి దంపతులు రూ.1.01,116 విరాళంగా అందజేశారు. -
వసూళ్ల ‘అనారోగ్యం’
నెహ్రూనగర్ : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 57 డివిజన్లు ఉన్నాయి. వీటికి 57 శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. నగరం మొత్తం మీద పర్మినెంట్, ఆప్కాస్, డైలీ వేజ్ కింద(రోజుకు రూ.500) పనిచేసే వారు 2 వేల మందికి పైగా ఉన్నారు. ప్రతి నెల కొన్ని శానిటరీ డివిజన్ల నుంచి రూ.10 వేలు వసూలు చేయాలని నిబంధన ఉండటంతో పర్మినెంట్ వర్కర్లు ఎవరైనా పనిచేయలేక మస్టర్ పలికి వెళ్లిపోతే వారి నుంచి నెలకు రూ.10వేలు, ఆప్కాస్ వర్కర్ ఎవరైనా చెప్పకుండా విధులకు గైర్హాజరైతే తిరిగి విధుల్లో తీసుకునేందుకు రూ.5 వేలకుపైగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇవ్వకపోతే కష్టాలే శానిటరీ ఇన్స్పెక్టర్లు అడిగినంత ఇవ్వకపోతే వర్కర్లకు ఇబ్బందులే. వారిని కష్టమైన పనులకు పురమాయించడంతోపాటు అన్ని పనులు వారే చేయాలన్నట్లు టార్గెట్ చేస్తారనే ఆరోపణలు లేకపోలేదు. ఇటీవల తూర్పు నియోజకవర్గంలో ఓ వర్కర్ డబ్బులు ఇవ్వలేదని తీవ్ర ఇబ్బందులు పెట్టడంతో అతడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన సందర్భం కూడా ఉంది. అదనపు బాదుడు ప్రతి నెల రూ.10 వేలతోపాటు అదనంగా స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు, పలు అవసరాలకు సంబంధించి నగదును కూడా శానిటరీ వర్కర్ల నుంచే బాదేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కార్మికుల నుంచి దోచుకుంటున్న వారిపై చర్యలు చేపట్టాలని యూనియన్ నాయకులు కోరుతున్నారు. ప్రజారోగ్యంలో వసూళ్ల పర్వంపై సీఎంహెచ్ఓ శాంతికళను వివరణ కోరేందుకు ఫోన్ చేయగా స్పందించలేదు. పారిశుద్ధ్య ఇన్స్పెక్టర్ నెలకు రూ.10 వేలు ఇవ్వాల్సిందే వారి నుంచి వసూలు చేస్తున్న సూపర్వైజర్లు తీసుకున్న డబ్బుల్లో ఉన్నతాధికారులకు వాటాలు ఇవ్వకపోతే సిబ్బందికి తప్పని వేధింపులు ప్రజారోగ్యంలో వసూల్ రాజాలు ఎక్కువైపోయారు. ఈ విభాగంలో ఓ ముఖ్య అధికారికి ప్రతి నెల పారిశుద్ధ్య ఇన్స్పెక్టర్ రూ.10 వేల చొప్పున ఇవ్వాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. దీంతో చేసేదేమీ లేక ఇన్స్పెక్టర్లు కూడా పారిశుద్ధ్య కార్మికుల నుంచి డబ్బులు వసూలు చేసి సూపర్వైజర్లకు (ఎస్ఎస్) ఇస్తే అందులో సగం ఎస్ఎస్లు, సగం ప్రజారోగ్య విభాగంలోని ఓ ముఖ్య అధికారి తీసుకుంటున్నారు. -
గుంటూరులో ఉద్యోగం సంతృప్తినిచ్చింది
గుంటూరు వెస్ట్: గుంటూరు జిల్లాలో ఉద్యోగ నిర్వహణ సంతృప్తినిచ్చిందని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అన్నారు. కలెక్టర్ బదిలీ సందర్భంగా మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్.ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, రెవిన్యూ సంఘం ఆధ్వర్యంలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్కు ఘన సత్కారం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ తనకు అందించిన సహకారానికి అధికారులకు, సిబ్బందికి, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి అందరూ సమన్వయంతో పనిచేసినందునే పలు కార్యక్రమాలు విజయవంతం అయ్యాయన్నారు. ప్రజలకు మంచి సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేసానన్నారు. ఏ అధికారికై నా నిబద్ధతతో పనిచేస్తే సంతృప్తి లభిస్తుందని చెప్పారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ జిల్లాలో మంచి సమన్వయంతో పాలన సాగించారన్నారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ నాయకత్వంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరిగాయని తెలిపారు. పరిపాలనలో పారదర్శకత, ప్రజల సమస్యల పరిష్కారంలో వేగం తీసుకువచ్చినట్లు కొనియాడారు. జిఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్ మాట్లాడుతూ పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు చక్కటి సూచనలు అందజేశారన్నారు. నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే వివిధ కార్యక్రమాలపై దృష్టి సారించారని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో షేఖ్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీకుమారి, జడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి, జిఎంసీ డిపిఓ బీవీ నాగసాయి కుమార్, సీపీఓ శేషశ్రీ, జిల్లా అధికారులు కలెక్టర్ సేవలను కొనియాడారు. జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా -
ఐజీని కలిసిన విశ్రాంత ఉద్యోగులు
నగరంపాలెం:గుంటూరు కలెక్టర్ బంగ్లా రోడ్లోని గుంటూరు రేంజ్ ఐజీ కార్యాలయంలో ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని మంగళవారం ఏపీ విశ్రాంత పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిశారు. సంఘం రాష్ట్ర కోశాధికారి డాక్టర్ కేవీ.నారాయణ (విశ్రాంత డీఎస్పీ), శ్రీపొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లా యూనిట్ కోశాధికారి ఎల్.ప్రభాకరరావు (విశ్రాంత డీఎస్పీ) సంబంధించి సమస్యలపై వినతిపత్రాలు అందించినట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాళహస్తి సత్యనారాయణ తెలిపారు. విశ్రాంత డీఎస్పీల సమస్యలపై గుంటూరు రేంజ్ ఐజీ సానుకూలంగా స్పందించారని అన్నారు. అనంతరం ఐజీని సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి డాక్టర్ కె.వి.నారాయణ, కార్యవర్గ సభ్యుడు బి.వి.సుబ్బారెడ్డి (విశ్రాంత డీఎస్పీ), సభ్యుడు వై.టి.నాయుడు (విశ్రాంత ఎస్పీ) పాల్గొన్నారు. నగరంపాలెం: గృహ ఎల్పీజీ సిలిండర్లను వినియోగించే వ్యాపార దుకాణాలు, హోటళ్లల్లో గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగపు అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. మంగళవారం బాపట్ల జిల్లా ఇంకొల్లు మండల పరిధిలోని గొల్లపాలెం రోడ్డులో ఉన్న బాలాజీ మెస్లో ఆరు సిలిండర్లు, మసీద్ సెంటర్లోని మస్తాన్ బాబా ముబారక్ హోటల్లో ఎనిమిది గృహ ఎల్పీజీ సిలిండర్లను గుర్తించారు. అక్రమంగా వినియోగిస్తున్న 14 సిలిండర్లను స్థానిక డిప్యూటీ తహసీల్దార్కు అప్పగించారు. ఆయా హోటళ్ల యాజమానులపై రెండు 6–ఎ కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో విజిలెన్న్స్, పౌరసరఫరాల శాఖ అధికార, సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నగరంపాలెం: నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని మోటార్ సెక్షన్, బెల్ఆఫ్ఆర్మీ సెక్షన్, డాగ్ కెన్నెల్స్, యూనిట్ హాస్పిటల్, పోలీస్ క్యాంటిన్, కమ్యూనికేషన్, టైలరింగ్ సెక్షన్ విభాగాలను మంగళవారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తనిఖీలు చేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి విభాగంలో శుభ్రత, నిర్వహణ ప్రమాణాలు మెరుగుపరచాలని అన్నారు. ఆయుధాల నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. భద్రతా ప్రమాణాలను అమలు చేయాలని ఆదేశించారు. ఎస్కార్ట్ డ్యూటీలు, గార్డ్ డ్యూటీలు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని అన్నారు. పోలీస్ డాగ్స్క్వాడ్ సామర్థ్యాన్ని పెంచాలని ఆదేశించారు. జిల్లా ఏఎస్పీలు రమణమూర్తి (పరిపాలన), హనుమంతు (ఏఆర్) డిఎస్పీ సంకురయ్య, ఆర్ఐలు శ్రీహరిరెడ్డి, సురేష్, శివరామకృష్ణ పాల్గొన్నారు. పెనుగంచిప్రోలు: పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీతిరుపతమ్మవారికి భక్తులు హుండీల ద్వారా రూ.76.38 లక్షల నగదును కానుకలు, మొక్కుబడిగా సమర్పించారు. కానుకలను సోమవారం అమ్మవారి మండపంలో లెక్కించారు. కానుకల లెక్కింపును ఆలయ ఈఓతో గ్రూపు ఆలయాల ఈఓలు సీహెచ్ జయప్రకాష్బాబు, బీవీ సుబ్బారావు, ఏఈఓ జంగం శ్రీనివాసరావు, దేవాదాయ శాఖ అధికారులు, ఉత్సవ కమిటీ మాజీ సభ్యులు పర్యవేక్షించారు. -
జీజీహెచ్లో జూనియర్ అసిస్టెంట్పై చర్యలు
గుంటూరు మెడికల్ : గుంటూరు జీజీహెచ్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఉదయభాస్కర్ను సీటు నుంచి తొలగిస్తూ ఆఫీస్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డి.ఉయభాస్కర్ కిడ్ని ప్లాంటేషన్ ఆపరేషన్లకు దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతులు మంజూరు చేసేందుకు రూ. లక్షకుపైగా అడిగినట్లు జిల్లా కలెక్టర్కు బాధితులు లిఖితపూర్వకంగా గత నెలలో ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహదేవ పట్నం గ్రామానికి చెందిన కె.సూర్యనారాయణ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ అనుమతి కోసం జీజీహెచ్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. సదరు సీటు బాధ్యతలు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ ఉదయభాస్కర్ త్వరితగతిన అనుమతులు మంజూరు చేయకుండా నాలుగు నెలలకుపైగా కాలయాపన చేశాడని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్కు బాధితులు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి అధికారులు నాలుగు రోజుల క్రితం రహస్య విచారణ చేసి ఉదయభాస్కర్పై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు, కనీసం సీటు మార్పు కూడా చేయలేదు. దీనిపై మార్చి 29న ‘సాక్షి’ దినపత్రికలో ‘లంచం ఇస్తేనే ఆపరేషన్’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. సాక్షి కథనంపై ఆసుపత్రి అధికారులు స్పందించి మంగళవారం జూనియర్ అసిస్టెంట్ను సీటు మార్పు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నూతక్కి శ్రీకాంత్ను కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ బోర్డు నిర్వహించాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. -
పల్లెల్లో ముగియనున్న ‘ప్రజా’ పాలన
యడ్లపాడు : రాష్ట్రంలోని స్థానిక సంస్థల ముఖచిత్రం వేగంగా మారిపోతోంది. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల బాటలోనే ఇప్పుడు గ్రామ పంచాయతీలు కూడా ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. ఏప్రిల్ రెండో తేదీతో ప్రస్తుత సర్పంచుల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం, యంత్రాంగం సిద్ధంగా లేకపోవడంతో పాలనా పగ్గాలను అధికారులకు అప్పగించే ప్రక్రియ దాదాపుగా వేగవంతమైంది. ఈ మేరకు ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. మేజర్ పంచాయతీలకు మండలస్థాయి అధికారులను, ఇతర గ్రామాలకు ఆ స్థాయికి తగ్గని అధికారులను ప్రత్యేక పాలకులుగా నియమించేందుకు కసరత్తు పూర్తయినట్లు సమాచారం. గత ఎన్నికల నేపథ్యం.. విభజన తర్వాత మారుతున్న సమీకరణాలు గత ఎన్నికల నిర్వహణ తీరును పరిశీలిస్తే.. 2021 ఫిబ్రవరిలో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని 973 గ్రామ పంచాయతీలకు నాలుగు దశల్లో ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఫలితాలు వెల్లడైన వెంటనే సర్పంచులు ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ, సాంకేతిక కారణాలతో వారి పదవీకాలం ఏప్రిల్ 2 నుంచి లెక్కించబడింది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 1 అర్ధరాత్రి వరకు మాత్రమే వారికి అధికారికంగా హోదా దక్కనుంది. అయితే ఉమ్మడి జిల్లాలోని 56 గ్రామాల్లో గతంలోనే ఎన్నికలు జరగలేదు. రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాలు మున్సిపల్ కార్పొరేషన్లలో విలీనం కావడం, మరికొన్ని గ్రామాలు నగర పంచాయతీలుగా మారడం, ఇంకొన్ని చోట్ల కోర్టు కేసులు అడ్డంకిగా మారడం వల్ల సుదీర్ఘ కాలంగా అక్కడ ప్రజాప్రతినిధుల పాలన కరువైంది. జిల్లాల పునర్విభజన తర్వాత ఈ గందరగోళం మరింత పెరిగిందని క్షేత్రస్థాయి పరిశీలనలో తేలుతోంది. అప్పుల ఊబిలో సర్పంచులు.. మరోవైపు గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవీకాలం ముగిసిపోతున్న తరుణంలో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గత కొన్నేళ్లుగా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు ఇప్పటికీ పెండింగ్లో ఉండటం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. అధికారిక హోదా ఉన్నప్పుడే నిధులు రాబట్టుకోలేకపోయిన తాము, పదవి నుంచి దిగిపోయాక కార్యాలయాల చుట్టూ తిరగడం వల్ల ప్రయోజనం ఉంటుందా అన్న సందేహం వారిలో వ్యక్తమవుతోంది. సొంత నిధులు వెచ్చించి పనులు చేసిన వారు ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయామని వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో అందుతున్న ప్రతికూల నివేదికల నేపథ్యంలో, ప్రజా ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందనే భయంతోనే ప్రభుత్వం నిధుల విడుదలపై కూడా స్పష్టత ఇవ్వడం లేదని తెలుస్తోంది. అధికారుల చేతుల్లోకి పల్లె అధికారం జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల విషయంలోనూ ఇదే తరహా అనిశ్చితి కొనసాగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు దృష్ట్యా పునర్విభజన ప్రక్రియ పూర్తి కావాలని, కుల గణన నిర్వహించాల్సి ఉందని ప్రభుత్వం చెబుతున్న కారణాలు ఎన్నికల వాయిదాకే సంకేతాలుగా కనిపిస్తున్నాయి. వివిధ సంక్షేమ పథకాల అమలులో తలెత్తుతున్న ఇబ్బందులు, సామాన్య ప్రజల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో, ప్రస్తుతానికి ఎన్నికల బరిలోకి దిగడం రాజకీయంగా నష్టదాయకమని టీడీపీ పెద్దలు అంచనా వేస్తున్నారు. మొత్తంమీద గ్రామీణ స్థాయిలో స్వపరిపాలనకు తాత్కాలికంగా విరామం లభించి, ప్రత్యేక అధికారుల చేతుల్లోకి అధికారం బదిలీ కావడం ఖాయంగా కనిపిస్తోంది. -
ఏఎన్యూ యూజీ కోర్సుల సీటీఏగా అశోక్ కుమార్ నియామకం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కారు డ్రైవర్ నిర్లక్ష్యం దుర్గగుడి అర్చకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరానికి చెందిన పాణిగ్రాహి జగన్మోహన శర్మ అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. గత గురువారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయలుదేరిన జగన్మోహనశర్మను తాడేపల్లి పీహెచ్సీ సెంటర్కు వచ్చే సరికి కారు బలంగా ఢీ కొట్టింది. దీంతో జగన్మోహనశర్మ రోడ్డుపై పడటంతో తలకు తీవ్ర గాయమైంది. ప్రమాదస్థలం నుంచి హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. మరి కొద్ది రోజుల్లో ఉద్యోగ విరమణ చేయాల్సిన జగన్మోహన శర్మ మరణం కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. ప్రమాదంపై జగన్మోహన శర్మ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ప్రమాదానికి కారణమైన కారు యజమానిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన శర్మ భౌతికకాయాన్ని దుర్గగుడి దేవస్థానానికి చెందిన పలువురు అధికారులు, అర్చకులు, సిబ్బంది సందర్శంచి నివాళులర్పించారు. పెనుగంచిప్రోలు: గ్రామంలో ఉన్న శ్రీతిరుపతమ్మ వారి ఆలయం వద్ద ఏడాది పాటు వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకునేందుకు సోమవారం ఆలయ ఆవరణలో నిర్వహించిన బహిరంగ వేలం, ఇ–ప్రొక్యూర్మెంట్ టెండర్ ద్వారా ఆలయానికి రూ.92.90 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ బి.మహేశ్వరరెడ్డి తెలిపారు. ఆలయం వద్ద కొబ్బరికాయలు విక్రయించుకునే లైసెన్స్ హక్కునకు రూ.50,05,000(పచ్చల శివప్రసాద్), మట్టికుండలు నిర్వహణ లైసెన్స్ హక్కునకు రూ.10,50,000(పచ్చల శివప్రసాద్), మునేరు అవతల 7 షెడ్లు, 4 ఏసీ గదులు, ఒక కల్యాణ మండపం నిర్వహణకు రూ.9,50,000(కొత్తపల్లి సతీష్కుమార్), ఆలయం వద్ద సంచారంగా ఐస్క్రీమ్ విక్రయించుకునే లైసెన్స్ హక్కునకు రూ.5,10,000(ముండ్లపాటి నాగరాజు), భక్తుల సామాన్లు, పాదరక్షలు భద్రపరచు లైసెన్ప్ హక్కునకు రూ.3,15,000 (గడిపూడి గోపి), సులభ కాంప్లెక్స్ నిర్వహణకు రూ.11,80,000(నూతలపాటి సురేష్), పువ్వులు, పాలు, బియ్యం పోగుచేసుకునే హక్కునకు రూ.2,80,000(దండా పుష్పలత), హెచ్చు పాటదారులుగా నిలిచి లైసెన్స్ హక్కును పొందారని తెలిపారు. -
ప్రారంభమైన మాస్టర్స్ అథ్లెటిక్ పోటీలు
ఏఎన్యూ(పెదకాకాని): ఆంద్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో శాప్ లీగ్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్(మాస్టర్స్) పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. గుంటూరు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి ఆఫ్రోజ్ ఖాన్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగే ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి 300 మంది మాస్టర్స్ అథ్లెటిక్స్ హాజరయ్యారు. 35 నుంచి 45 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళలు, పురుషులకు 100 మీటర్లు, 400, 800 మీటర్లు, 1500 మీటర్లు పరుగుపందెం, లాంగ్జంప్, డిస్కస్త్రో, షాట్పుట్, జావలిన్త్రో, రిలే పరుగపందెం నిర్వహించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎన్.సుబ్బారావు, డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ పాల్కుమార్, స్పోర్ట్స్ స్పెషలిస్ట్ డాక్టర్ యం.శివకుమార్, ఇంటర్నేషనల్ అథ్లెట్ కె. కృష్ణమోహన్, జిల్లా మాస్టర్ అసోసియేషన్ సెక్రటరీ సీహెచ్.కొండయ్య, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ జీవీఎస్.ప్రసాద్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎన్.సుబ్బారావు మాట్లాడుతూ వెటరన్ క్రీడా మహోత్సవం అనేది వయస్సు పైబడిన క్రీడాకారుల ఉత్సాహం, ఆరోగ్యం, క్రీడాస్ఫూర్తిని గౌరవించేందుకు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం అన్నారు. 40 సంవత్సరాలు పైబడిన అనేక మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొని, వయస్సుతో పనిలేకుండా ప్రతిభ కనబర్చారని అన్నారు. ఇది ఆరోగ్యం, పట్టుదల, జీవితాంతం క్రీడల పట్ల ఆసక్తిని ప్రోత్సహించే గొప్ప వేదిక అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కోచ్ లు, సిబ్బంది పాల్గొన్నారు. -
జగనన్న పట్టాలతో నూతన గృహ ప్రవేశాలు
గుంటూరు రూరల్: మండలంలోని వెంగళాయపాలెం గ్రామంలో నిర్మించిన టిడ్కో నివాసాల్లో సోమవారం స్థానిక ఎమ్మెల్యే గృహప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో పేదలకు గృహాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా లక్షలాది మందికి ఇళ్ల పట్టాలను అందజేశారు. అదే జగనన్న పట్టాలతో సోమవారం స్థానిక ఎమ్మెల్యే గృహ ప్రవేశాలను జరిపించి మమ అనిపించారు. అధికారులు సైతం పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయకపోవటంతో లబ్ధిదారులు గతంలో తమకు జగనన్న ఇచ్చిన పట్టాలను తీసుకుని కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో ఎమ్మెల్యే అధికారులపై చిర్రుబుర్రులాడారు. కొందరికి కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలతో, మరికొందరికి జగనన్న ఇచ్చిన పట్టాలతో గృహ ప్రవేశాలు జరిపించారు. పాత వారి స్థానంలో కొత్త వారి ఎంపిక గత ప్రభుత్వం ఇళ్ల పట్టాలను అందించిన లబ్ధి దారులను విస్మరించి చంద్రబాబు ప్రభుత్వం నూతనంగా అదే స్థానంలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన కార్యక్రమాన్ని కూడా సక్రమంగా నిర్వర్తించకుండా లబ్ధిదారులకు పట్టాలను సక్రమంగా పంపిణీ చేయలేకపోయారు. ఇదే క్రమంలో జగనన్న ప్రభుత్వంలో పట్టాలు పొందినవారికి ఇళ్లు లేవని బాహాటంగానే కూటమి నేతలు సమావేశంలో చెప్పటంతో ప్రజలు, లబ్ధిదారులు విచారం వ్యక్తం చేశారు. పట్టాలు ఒకరికి..ఇళ్లు మరొకరికి.. గత ప్రభుత్వంలో టిడ్కో సముదాయంలో పూర్తిస్థాయిలో నిర్మాణాలు జరగలేదు. దీంతో పట్టాలు పొందినప్పటికీ అనేక మంది గృహప్రవేశాలు చేయలేకపోయారు. ఈ క్రమంలో గతంలో లబ్ధిదారులుగా ఎంపికై న వారికి పంపిణీ చేసిన నివాసాలను సైతం టీడీపీ నేతలు వారికి అనుకూలంగా ఉన్నవారికి కేటాయించి గృహ ప్రవేశాలు చేస్తున్నారని లబ్ధిదారులు, ప్రజలు చర్చించుకున్నారు. -
బీసీ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన న్యాయమూర్తి
సత్తెనపల్లి: పట్టణంలోని రఘురామ్నగర్లో గల ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని సత్తెనపల్లి ప్రధాన సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్ )థౌషిద్ హుస్సేన్ సోమవారం సందర్శించారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు, సత్తెనపల్లి మండల న్యాయ సేవాధికార కమిటీ చైర్మన్, సత్తెనపల్లి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్ ) వి.విజయ్కుమార్రెడ్డి సూచనల మేరకు వసతి గృహం విద్యార్ధినిలకు పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ముందుగా న్యాయమూర్తి థౌషిద్ హుస్సేన్ వసతి గృహంలో పరిసరాలను పరిశీలించారు. విద్యార్ధినిలకు అందిస్తున్న ఆహారం, అవసరమైన సరకులు నాణ్యతను పరిశీలించారు. విద్యార్థినిలకు అందాల్సిన సౌకర్యాలు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో న్యాయవాదులు దివ్వెల శ్రీనివాసరావు, గంటా వెంకటశివ, బుర్రి సైదయ్య, పారా లీగల్ వాలంటీర్ షేక్ సుభాని, వసతి గృహ అధికారిణి ఎం.ఇందిరాగాంధీ, కోర్ట్ సిబ్బంది పాల్గొన్నారు. పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో నాయకులు తెనాలి రూరల్: పాస్టర్ల సంక్షేమానికి పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కృషి చేస్తుందని అసోసియేషన్ నాయకులు తెలిపారు. అసోసియేషన్ మార్చి నెల సమావేశాన్ని పట్టణంలోని కల్వరి కృప చర్చిలో సోమవారం నిర్వహించారు. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బిషప్ డాక్టర్ పినపాటి జాన్పాల్, గౌరవాధ్యక్షుడు డాక్టర్ కత్తెర సురేష్కుమార్ మాట్లాడుతూ పాస్టర్లు నిబద్దతతో సేవ చేయాలని, ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు. అసోసియేషన్ నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకునే పాస్టర్లకు అసోసియేషన్ అండగా ఉంటుందన్నారు. అసోసియేషన్ ద్వారా అందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నామని, అవసరతలో ఉన్న దైవ సేవకులకు ఆర్థిక చేయూత సైతం అందజేసే విధంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్న సూక్తి ప్రకారం అసోసియేషన్ లోని ప్రతి సభ్యుడికి సహాయ సహకారాలు అందించే విధంగా కృషి చేస్తామన్నారు. పాస్టర్లకు దేవుని సువార్త అందించటమే ప్రధాన లక్ష్యంగా ఉండాలన్న అభిప్రాయాన్ని తెలియజేశారు. దేవునిపై నమ్మకం ఉంచి దేవుని సేవ చేసే వారికి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయన్నారు. అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి రెవరెండ్ మల్లవరపు విజయ్ కుమార్, జె.ప్రభుదాస్, చిలక జాన్ వరప్రసాదరావు, అన్నం ఆదాం, విలియం కేరి, గడ్డం జాన్బాబు, ఎం.షడ్రక్, పొదిల ఏసోబు, శ్రీకాంత్, రజనీకాంత్, ఎం.షాలేమ్రాజు, తూమాటి రత్నరాజు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఎన్నారై ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో పదవ తరగతి పూర్తిచేసిన విద్యార్థులకు ఉచిత పాలిసెట్, ఏ.పి.ఆర్.జె.సి. శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు ఎన్నారై విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిడికిటి తిలక్ బాబు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా ఉచిత శిక్షణ తరగతులకు సంబంధించిన కరపత్రాలను విద్యానగర్లోని ఎన్నారై ఇంజనీరింగ్ కళాశాల సిటీ కార్యాలయంలో సోమవారం విడుదల చేశారు. ఉచిత శిక్షణ తరగతులను ఏప్రిల్ 3న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతిరోజూ 2 గంటల పాటు మాథమ్యాటిక్స్, గంట ఫిజిక్స్, గంట కెమిస్ట్రీ, కోచింగ్ పూర్తయ్యేలోపు మూడు పాలిసెట్, ఏ.పి.ఆర్.జె.సి గ్రాండ్ టెస్టుల నిర్వహణ జరుగుతుందని తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు తమవివరాలను 8885995458, 9502054168, 9398788336 నెంబర్లకు ఫోన్ చేసి వెంటనే రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు. వీటితోపాటు ఏ.పి.ఆర్.జె.సి. ఎంట్రన్స్ రాసుకునే ఆంగ్లంలో, బయాలజీలోనూ ప్రత్యేకశిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ముందుగా రిజిష్టర్ చేసుకున్న 200 మంది విద్యార్థులకు ఉచితంగా మెటీరియల్ అందజేయడం జరుగుతోందన్నారు. ఈ కోచింగ్ గుంటూరులోని మూడు ప్రధాన సెంటర్లు కొత్తపేట, విద్యానగర్లలో ఉన్న ఎన్నారైస్, ఇండియన్ స్ప్రింగ్స్ స్కూల్స్లో, విశదలలోని ఎన్నారై ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎన్నారైస్, ఇండియన్ స్ప్రింగ్స్ స్కూల్ ప్రిన్సిపల్స్ వట్టికూటి నవీన్ చౌదరి, కె.బాలకృష్ణ, ఏజీఎం బొర్రా భాను ప్రసాద్ పాల్గొన్నారు. -
టీచర్పై సస్పెన్షన్ ఎత్తివేత
‘సాక్షి’ కథనంతో దిగివచ్చిన విద్యాశాఖ అధికారులు గుంటూరు ఎడ్యుకేషన్: అకారణంగా ఉపాధ్యాయురాలిపై విధించిన సస్పెన్షన్ను గుంటూరు జిల్లా విద్యా శాఖ అధికారి షేక్ సలీంబాషా వెనక్కి తీసుకున్నారు. ఉపాధ్యాయురాలికి జరిగిన అన్యాయంపై ‘సాక్షి’లో వచ్చిన కథనం విద్యాశాఖలో కలకలం సృష్టించిన నేపథ్యంలో ఎట్టకేలకు క్షేత్ర స్థాయిలో విచారణ అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా సస్పెన్షన్ ఎత్తివేశారు. గుంటూరు బీఆర్ స్టేడియం ఎదుట ఉన్న మహాకవి తిక్కన – శ్రీ పులిపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ నెల 23న మధ్యాహ్న భోజనం తనిఖీ చేసేందుకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే ఎం.డి.నసీర్ అహ్మద్ పథకంలో తలెత్తిన లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సంఘటనతో సంబంధంలేని ఉపాధ్యాయురాలు సి.హెచ్.అరుణరాణిని మరుసటి రోజే డీఈఓ సస్పెండ్ చేశారు. విచారణ లేకుండా సస్పెండ్ చేసిన విషయమై ‘సాక్షి’లో కథనం ప్రచురించడంతో దిగి వచ్చిన అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఉపాధ్యాయురాలిపై సస్పెన్షన్ ఎత్తివేసి ఆమెను అదే పాఠశాలలో కొనసాగిస్తూ సోమవారం డీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. -
పెదకాకానిలో రెవెన్యూ అధికారుల ఇష్టారాజ్యం
పెదకాకాని: కూటమి ప్రభుత్వంలో రెవెన్యూ అధికారుల పనితీరు ఇష్టారాజ్యంగా మారింది. టీడీపీ నాయకులు సిఫార్స్లు చేస్తే చాలు రికార్డులు తారుమారు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉంటే ఒక్కరే ఉన్నట్లు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు మంజూరు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఆధారంగా భూముల రికార్డులు మార్చేస్తున్నారు. ఈక్రమంలో నెలల తరబడి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా న్యాయం జరగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రమైన పెదకాకాని గ్రామానికి చెందిన బెజవాడ సాంబయ్య, విజయలక్ష్మి(బుల్లెమ్మ) దంపతులకు బెజవాడ గణపతి, సుబ్రహ్మణ్యం, సీతారామాంజనేయులు నలుగురు సంతానం. వారిలో చిన్న కుమారుడు బెజవాడ కృష్ణమూర్తి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్(ఎఫ్ఎంబీ) కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆయనతో పాటు చుట్టు పక్కల వారిని విచారించిన రెవెన్యూ అధికారులు కృష్ణమూర్తి ఒక్కడే సంతానం అని ఎఫ్ఎంబీ మంజూరు చేశారు. ఆ తరువాత కొంతకాలానికి ఒక్కడి పేరిటే ఎఫ్ఎంబీ ఇచ్చారని తెలుసుకుని తహసీల్దార్ను ఆశ్రయించారు. బెజవాడ సాంబయ్యకు నలుగురు సంతానం ఉండగా ఒక్కరే ఉన్నట్లు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇచ్చారని మిగిలిన ముగ్గురు అన్నదమ్ముల పేర్లు కూడా చేర్చాలని, లేని పక్షంలో రద్దు చేయాలని ఫిర్యాదు చేశారు. ● 2025, జనవరి నెలలో తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తిరిగి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ద్వారా అదే నెలలో ఫిర్యాదు చేశారు. ఇప్పటి నుంచి ఇప్పటి వరకూ సమస్య పరిష్కారం కాకపోగా ఆ ఎఫ్ఎంబీ ఆధారంగా తల్లి పేరిట సర్వేనెంబరు 228 బి లో ఉన్న భూమి 38 సెంట్లకు చిన్న కుమారుడైన కృష్ణమూర్తి పేరిట 1బి, అడంగల్ నమోదు చేశారు. సమస్యను పరిష్కరించకపోగా ఫిర్యాదు చేసిన తరువాత 1బి, అడంగళ్ నమోదు చేయడంపై మార్చి 10వ తేదిన మళ్లీ తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకూ ఎటువంటి న్యాయం జరగలేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి నలుగురు పేర్లు నమోదు చేసి ఎఫ్ఎంబీ ఇవ్వాలని, దాని ఆధారంగా ఇచ్చిన 1బి అడంగళ్ను రద్దు చేయాలని బాధితులు కోరుతున్నారు. టీడీపీ నాయకులు ఫోన్ చేస్తే.. చేయాల్సి వచ్చింది టీడీపీ నాయకుల సిఫార్సుల ఆధారంగా 1బి అడంగళ్ చేయాల్సి వచ్చిందని రెవెన్యూ అధికారి చెప్పడం దారుణంగా ఉందని బాధితుడు సీతారామాంజనేయులు దంపతులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యం సహకరించని వయసులో భార్యభర్తలం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా న్యాయం చేయాలని కోరుతున్నారు. రికార్డులు తారుమారు చేస్తున్న వైనం నలుగురు అన్నదమ్ములు ఉంటే ఒక్కరే ఉన్నట్లు ఫ్యామిలీ మెంటర్ సర్టిఫికెట్ 15 నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న బాధితులు సమస్య పరిష్కరించకపోగా ఫిర్యాదు చేసిన తరువాత 1బి, అడంగళ్ మంజూరు చేసిన అధికారులు టీడీపీ నాయకుడు ఫోన్ చేస్తే ఇచ్చామన్న ఆర్ఐ -
పీఏసీఎస్లకు సహకారం అందిస్తాం
కొరిటెపాడు(గుంటూరు): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)కు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అన్ని విధాలుగా సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని ఆ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పేర్కొన్నారు. బ్రాడీపేటలోని బ్యాంక్ పరిపాలన కార్యాలయంలో సోమవారం జరిగిన ఆ బ్యాంక్ మహాజన సభ సమావేశంలో ఆయన మాట్లాడారు. సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. నిజమైన రైతులకు పంట రుణాలు అందించాలని సూచించారు. రైతులు తీసుకున్న పంట రుణాలు సకాలంలో చెల్లించేలా చూడాలన్నారు. అంతేకాకుండా రుణాల రికవరీని వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తేనే ఎక్కువ మంది రైతులకు రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. జీడీసీసీ బ్యాంక్ సీఈఓ ఫణికుమార్ మాట్లాడుతూ పీఏసీఎల్ల కంప్యూటరీకరణ వేగవంతం చేయాలని, అందుకు పీఏసీఎస్ల చైర్మన్లు చొరవ చూపాలని కోరారు. పలువురు పీఏసీఎస్ల అధ్యక్షులు మాట్లాడుతూ పలుచోట్ల చెరువు భూములను కూడా పంట భూములుగా మార్చి రుణాలు పొందారని, అలాంటి వారిని గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు. పీఏసీఎస్లకు రావాల్సిన డివిడెండ్ను ఇచ్చే ఏర్పాట్లు చేయాలని సూచించారు. సహకార బ్యాంక్ నుంచి పీఏసీఎస్లకు రావాల్సిన అలవెన్స్లు ఒక్క రూపాయి కూడా రావడం లేదని వాపోయారు. సమావేశంలో పీఏసీఎస్ల చైర్మన్లు, బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
సురక్షిత ప్రసవంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ
గుంటూరు మెడికల్: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సమావేశ మందిరంలో ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తల, సెర్ప్ స్వయం సహాయక సభ్యులు 150 మందికి మాతృత్వ సంరక్షణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ ముగింపు రోజు సోమవారం ముఖ్య అతిథిగా ఎంసీహెచ్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్కుమార్ మాట్లాడుతూ గర్భిణులు సురక్షిత ప్రసవం కావడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన ఎక్సర్ సైజ్లు గురించి శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్స్, మెలకువలు తెలుసుకొని, ఈ విషయాల మీద పట్టణ, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలో క్షేత స్థాయి సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని కోరారు. పరస్పర సహకారంతో తల్లి, బిడ్డల ఆరోగ్య సంరక్షణకు పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, రాష్ట్ర మాతృత్వ, నవజాత శిశు, కౌమార బాలికల కన్సల్టెంట్ డాక్టర్ గవ్వల నాగేంద్ర, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్ బాబు, డీపీఎంఓ డాక్టర్ కె.సుజాత, డీపీహెచ్ఎంఓ ఇన్చార్జి డాక్టర్ ప్రియాంక, పెర్నాండేజ్ ఫౌండేషన్ శిక్షకులు డాక్టర్ శ్రీధర్, ప్రోగ్రాం లీడర్ నీనా, ప్రాజెక్ట్ మేనేజర్ పాల్, పాల్గొన్నారు. నరసరావుపేట టౌన్: మూడు చోరీ కేసుల్లో నేరం రుజువు కావడంతో నిందితులకు ఒక్కొక్కరికి నెల రోజుల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ రెండవ అదనపు జూనియర్ సివిల్ కోర్టు ఇన్చార్జి న్యాయాధికారి ఏ. సలోమి సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నకరికల్లు, నర్సింగపాడు, చేజర్ల గ్రామాలలో ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్లను అపహరించుకు వెళ్లినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో నకరికల్లు పోలీసులు గత ఏడాది కేసు నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం నిందితులైన నరసరావుపేటలోని శివ సంజీవయ్య కాలనీకు చెందిన తిరువీధుల శ్రీకాంత్, పుల్లలచెరువు మండలం అక్కపాలెం తందాకు చెందిన మేఘావత్ శ్రీను నాయక్, వినుకొండ మండలం పార్వతీపురం గ్రామానికి చెందిన ధూపాటి చిన్న బాల లింగయ్య, నూజెండ్ల మండలం త్రిపురాపురం గ్రామానికి చెందిన పాడిపర్తి నాగిరెడ్డి లను అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు. -
రాజధానిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు
వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు నూరిఫాతిమా నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : అమరావతి శాశ్వత రాజధాని పేరుతో చంద్రబాబు ప్రభుత్వం కొత్త నాటకానికి తెరదీసిందని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా పేర్కొన్నారు. సోమవారం ఆమె విలేకరుతో మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తరువాత కేంద్ర నుంచి స్పెషల్ స్టేటస్ తీసుకువస్తామని, రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని చెప్పి 2014 అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఓటుకు నోటు కేసులో పట్టుబడి కేంద్ర నుంచి స్పెషల్ స్టేటస్ అనే మాట ఎత్తకుండా 2019 వరకు అమరావతి నిర్మిస్తున్నామని కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మీరేమి చేశారని ప్రశ్నించారు. రాజధానిలో ఇంత వరకు అభివృద్ధి జరగలేదని మొదట విడతలో భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చెందుతున్న క్రమంలో ఇప్పుడు రెండో విడత భూ సేకరణకు రైతులు ముందుకు రాకపోవడంతో కొత్త నాటకానికి తెర తీసి శాశ్వత రాజధాని అని అసెంబ్లీలో తీర్మానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మీరు అమరావతి రాజధాని పేరుతో మీ సొంత ప్రయోజనాలకోసం పాకులాడుతున్నారే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం, అమరావతి రాజధాని నిర్మాణం కోసం కాదన్నారు. వైఎస్ జగన్ అమరావతి రాజధానిగా ఉంటుందని..దానితో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్రలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మూడు రాజధానులు అంశాన్ని తీసుకువచ్చారన్నారు. అప్పగించారు. – తాడికొండ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు తాడికొండ: రాజధానికి చట్టబద్ధత పేరుతో ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం అంటూ ప్రభుత్వం హడావుడి చేయడం సిగ్గుచేటని తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్) అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ప్రత్యేక హోదాపై అన్ని పార్టీలు ఏకగ్రీవంగా అసెంబ్లీ, పార్లమెంటులో చట్టం చేసినా ఏం ప్రయోజనం జరిగిందో చెప్పాలని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. బాబును నమ్మి 28 వేల మంది రైతులు 33 వేల ఎకరాల భూములిస్తే ఇప్పుడు వాళ్ల ప్రయోజనాలను తాకట్టు పెట్టి, మళ్ళీ రెండో విడత పూలింగ్, అవసరమైతే మూడో విడత కూడా ఉంటుందని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. 2014–19 కాలంలో బాబు ప్రభుత్వంలో మొత్తం రూ.5 వేల కోట్లు ఖర్చుపెడితే అందులో సుమారు రూ.2 వేల కోట్లు వడ్డీ ఉందన్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చి రెండేళ్ల్లు అవుతుందని, 2028కి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని చెబుతున్నారని అది ఎలా సాధ్యమో రైతులకు వివరించాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా రాజధానికి వ్యతిరేకమని చెప్పిందేమో చెప్పాలని టీడీపీ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ వ్యతిరేకం కాదని, ఇక నుంచైనా మీరు పద్ధతులు మార్చుకొని ముందుకెళ్ళాలని సూచించారు.ఈ సమావేశంలో తాడికొండ, తుళ్ళూరు మండల అధ్యక్షులు వంగా పోలారెడ్డి, మైనేని నాగమల్లేశ్వరరావు, నాయకులు చుండు వెంకటరెడ్డి, షేక్ బాజీ, షేక్ అజీస్, కొప్పుల శేషగిరిరావు, వెంకటస్వామి, ఆరేపల్లి జోజి పాల్గొన్నారు. -
దళితులను దూషించిన వ్యక్తి అరెస్ట్
తెనాలి రూరల్: దళితుల్లోని మాల, మాదిగ సామాజిక వర్గ ప్రజలను రాయలేని పదాలతో అసభ్యకరంగా దూషించి, వీడియోలను సాషల్ మీడియాలో పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వీడియోలో అతని తల్లి కూడా దళితుల గురించి అసభ్యంగా మాట్లాడడంతో ఆమైపెనా కేసు నమోదు చేశారు. తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి. జనార్ధనరావు వివరాలు వెల్లడించారు. ● మండలంలోని ఖాజీపేటకు చెందిన చల్లా నాగరాజు చైన్నెలో కరెంటు పనులకు వెళుతుంటాడు. వచ్చిన డబ్బుతో మద్యం తాగి తిరుగుతుంటాడు. ఈ నెల 26న చైన్నె నుంచి వచ్చిన అతను 27న ఫూటుగా మద్యం తాగాడు. నందివెలుగు–గుంటూరు రోడ్డులో గుంటూరు నుంచి కొలకలూరుకు చెందిన బుల్లా వివేక్, అతని భార్య బైక్పై వస్తుండగా ఖాజీపేట వద్ద ఆవుల మంద అడ్డు వచ్చింది. అదే సమయంలో నాగరాజు వివేక్తో ఘర్షణ పడి దుర్భాషలాడి దాడి చేశాడు. అడ్డుకోబోయిన వివేక్ భార్యనూ నెట్టివేసి అసభ్యంగా దూషించాడు. ● దంపతులు వెళ్లిపోయిన అనంతరం నాగరాజు బైక్పై కొలకలూరు సెటరులోని అంబేడ్కర్, బాబు జగ్జీవన్రామ్ విగ్రహాల వద్దకు వెళ్లి ఫేస్ బుక్ లైవ్ వీడియో పెట్టి మాల, మాదిగ సామాజిక వర్గ ప్రజలను అసభ్యంగా దూషించాడు. తిరిగి ఇంటికి వెళ్లి తీవ్ర అసభ్యపదజాలంతో వీడియో చేసి పోస్ట్ చేశాడు. దీనిపై దళిత సంఘాలు ఆందోళన చేశాయి. – బాధితుడు వివేక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ జనార్ధనరావు తెలిపారు. ● నిందితుడు ఇంట్లో వీడియో రికార్డు చేస్తుండగా అతని తల్లి పద్మ అలియాస్ వెంకమ్మ దళితులను కించపరిచే విధంగా మాట్లాడడంతో ఆమె పైనా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. నాగరాజుకు 2019లో వివాహం కాగా మద్యంకు బానిసైన భర్తతో వేగలేక భార్య 2024లో విడిచిపెట్టిందని చెప్పారు. నిందితుడిపై రౌడీ షీట్ తెరవనున్నట్టు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ నాయబ్రసూల్, ఎస్ఐ కె. ఆనంద్, సిబ్బంది ఉన్నారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. -
తండ్రి మరణాన్ని దిగమింగుకుని
పదవ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థిని కుందురువారిపాలెం(ముప్పాళ్ల): తండ్రి మరణాన్ని సైతం బిగపట్టుకొని పదో తరగతి పరీక్షకు హాజరైంది కుందురువారిపాలెం గ్రామానికి చెందిన విద్యార్థిని మేడ భావనలక్ష్మి. గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన మల్లికార్జునరావు (38), పద్మలకు ఇద్దరు సంతానం. వీరిలో పెద్దదైన భావనలక్ష్మి చదువులో చురుగ్గా ఉండటంతో నరసరావుపేటలోని ఓ ప్రైవేటు స్కూల్లో పదవ తరగతి చదివించుకుంటున్నారు. సోమవారం జరిగే సోషల్ స్టడీస్ పరీక్షకు సిద్ధమవుతున్న తరుణంలో ఆదివారం రాత్రి భావనలక్ష్మి తండ్రి మల్లికార్జునరావు గుండెపోటుతో మృతి చెందాడు. కళ్లెదుటే తండ్రి మృతి తట్టుకోలేక, మరో వైపు పరీక్షకు సన్నద్ధమవ్వాల్సి ఉండటంతో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటూ ధైర్యం కోల్పోకుండా సోషల్ పరీక్షకు హాజరైంది. తన అన్న సాయంతో నరసరావుపేటలోని పరీక్ష కేంద్రానికి వెళ్లి పరీక్ష సజావుగా రాసింది. తండ్రి మరణంతో వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొని పరీక్షకు హాజరైన విద్యార్థిని అభినందించారు. -
పసుపు యార్డు సందర్శన
దుగ్గిరాల: దుగ్గిరాలలోని పసుపు మార్కెట్ యార్డును తెలంగాణ రాష్ట్రానికి చెందిన కమాలపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ సభ్యులు సోమవారం సందర్శించారు. దుగ్గిరాల పసుపు యార్డు చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, సెక్రెటరీ జె.వి.సుబ్బారావు యార్డు సిబ్బంది వారకి స్వాగతం పలికారు. జెవి సుబ్బారావు మాట్లాడుతూ యార్డులో జరిగే పసుపు వేలం ప్రక్రియ, మార్కెట్ నియంత్రణ పద్ధతులు, రైతులకు అందిస్తున్న సౌకర్యాలు, మౌలిక వసతులు సమగ్రంగా వివరించి తెలియజేశామన్నారు. అనంతరం కమాలపూర్ యార్డు చైర్మన్ ఝాన్సీ రాణి మాట్లాడుతూ దుగ్గిరాల లో తెలుసుకుని అద్యయనం చేసిన ఉత్తమ పద్దతులను తమ మార్కెట్ యార్డునుందు అమలు చేయడానకి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జె.యాకయ్య, పాలకవర్గ సబ్యులు పాల్గొన్నారు. -
నాట్యకళే ఆయన జీవితం
తెనాలి: 1995 సంవత్సరంలో ఒకరోజు... ఎన్వీఆర్ కల్యాణమండపం వేదికపై ‘అభిజ్ఞాన శాకుంతలము’ నృత్యరూపకం ప్రదర్శన. శకుంతల వృత్తాంతంతో కూడిన ఆ రూపకంలో పాత్రధారుల ఆహార్యం అద్భుతం. సన్నివేశాల కనుగుణమైన రంగాలంకరణ మరో ప్రత్యేకత! ఇక నటీనటుల ఆంగికం, అభినయం రక్తికట్టింది. మొత్తంమీద రంగస్థలంపై ఓ దృశ్యకావ్యం చూసిన అనుభూతితో ప్రేక్షకులు కరతాళధ్వనులు మిన్నంటాయి. ● ఎక్కడివారో తెలీదు...తెనాలిలో స్థిరపడిన ఓ నాట్యాచార్యుడు తీర్చిదిద్దిన నృత్యరూపకమది. అందులో శకుంతల పాత్రధారి జంధాల్య వేదవల్లి భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి శాఖ ఫెలోషిప్ను అందుకుని నృత్యగురువుగా దేశవిదేశాల్లో ఎందరికో శిక్షణనిస్తున్నారు. ఆమె ఒక్కరే కాదు... చిలకలూరిపేట కళానిలయం సంస్థ ‘నాట్యమయూరి’ అవార్డును తొలిగా గెలుచుకున్న తెనాలికి చెందిన భాస్కర్ల రంగనాయకి, మరో శిష్యురాలు చల్లా బాలత్రిపురసుందరి, ఆలపాటి ప్రజ్ఞ...వీరంతా ఆ నాట్యాచార్యుడి శిష్యులే. ప్రస్తుతం అందరూ నృత్యగురువులుగా ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. కళల తెనాలి గౌరవాన్ని ప్రకాశింపజేస్తున్నారు. ● నృత్యరంగానికి ఘనమైన వారసులను తీర్చిదిద్దిన ఆ నాట్యాచార్యుడు ఎం.దస్తగిరి...ఎండీ గిరిగా సుపరిచితులు. తెనాలిలో గల నృత్య శిక్షణ సంస్థ శ్రీగిరిజా ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపకులు. స్వస్థలం అనంతపురంలోని బోగాలకట్ట గ్రామంగా చెబుతారు. సంపన్న రైతుకుటుంబంలో జన్మించారు. నాయనమ్మ మరణంతో మనసు చెదిరి 1964లో ఏడో తరగతి చదువుతుండగానే ఇంటినుంచి వచ్చేశారు. 1969 నాటికి చీరాలకు చేరుకుని నాట్యాచార్యులు సీహెచ్ ఆంజనేయులు వద్ద కూచిపూడి నృత్యాన్ని అభ్యసించారు. స్నేహితుడి సలహాపై విజయవాడకు వెళ్లారు. జీవనోపాధి కోసం అక్కడ హోటల్ క్యాషియర్గా ఏడేళ్లు పనిచేశారు. నాట్యంపై ఆశ, ఆసక్తితో నాట్యాచార్యులు పరమానంద పిళ్లై, భాగవతుల యజ్ఞనారాయణశర్మ వద్ద శిక్షణ పొందారు. కొంతకాలం యజ్ఞనారాయణశర్మకు సహాయకునిగా ఉన్నారు. ● దేశీయ నృత్యరీతులను, వాటి వైశిష్ట్యాన్ని వ్యాప్తి చేయటానికి 1987లో శ్రీగిరిజా ఆర్ట్ అకాడమీని స్థాపించారు. ఆ మరుసటి సంవత్సరమే తొలి ప్రదర్శన ఇచ్చారు. దీనిని తిలకించిన పద్మశ్రీ నటరాజ రామకృష్ణ స్వయంగా గిరిని ఆహ్వానించి మెలకువలను నేర్పారు. నాట్యం అభ్యసిస్తూనే ‘మోహినీ భస్మాసుర’ నృత్యరూపకాన్ని ప్రదర్శించి, కళాభిమానుల ప్రశంసలను అందుకున్నారు. ఈ నృత్యరూపకాన్ని గిరితో సాటిగా ప్రదర్శింపగల మరో కళాకారుడు లేడని ఆ రోజుల్లోనే గురువు పరమానంద పిళ్లై రంగస్థల వేదికపై ప్రకటించారు. పుత్తడిబొమ్మ పూర్ణమ్మ, రతీమన్మథ, శిలువ ప్రభావం, ఇరవై సూత్రాల పథకం వంటి నృత్యరూపకాలను రచించి, ప్రదర్శనలతోపాటు శిక్షణనూ ఇవ్వసాగారు. నృత్యరూపకాలపై చేసిన కృషికి గుర్తింపుగా ‘దేవపారిజాతం’ అవార్డును వేదాంతం సత్యనారాయణశర్మ చేతులమీదుగా స్వీకరించారు. ‘నాట్యభూషణ’ గౌరవాన్నీ అందుకున్నారు. ● నటరాజ రామకృష్ణ శిక్షణలో ఉంటూనే ఆంధ్ర నాట్యం వ్యాప్తికి తగిన శిక్షణనివ్వాలని భావించిన గిరికి, అందుకు తెనాలి అనువైనదిగా ఎంచుకున్నారు. 1986లో తెనాలి చేరుకుని శ్రీగిరిజా ఆర్ట్ అకాడమీని ఇక్కడ ప్రారంభించారు. తెనాలి ప్రజల అభిరుచికి అనుగుణంగా గురువు అనుమతితో కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యంలో శిక్షణను ఆరంభించారు. పురాణాలు, ఇతిహాసాల్లోని ప్రధానాంశాలను నృత్యరూపకాలుగా మలచి కళాభిమానులను రంజింపజేయటం కత్తిమీద సాము. నటనలో పరిణతి, కళాకారుల సమష్టి కృషి అవసరం, వీటికితోడుగా రంగస్థల అలంకరణ నుంచి వాయిద్య సంగీత వరకు అవసరమైన వనరులుంటేనే నృత్యరూపకం రక్తి కడుతుంది. ఇన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని నాట్యకళ పవిత్రతకు భంగం వాటిల్లకుండా కళాకారులకు శిక్షణనిచ్చి, దృశ్యకావ్యం అనిపించుకునేలా తెనాలిలో ‘అభిజ్ఞాన శాకుంతలము’ నృత్యరూపకాన్ని ప్రదర్శింపజేశారు ఎండీ గిరి. ● ఆ విధంగా తెనాలిలో నాలుగు దశాబ్దాలపాటు ఎందరో నృత్యకళాకారులను తీర్చిదిద్దారు. వీరి శిష్యులు కొందరు ఆయన బాటలోనే నృత్యగురువులుగా ఎదిగారు. ఆవిధంగా ఎక్కడనుంచో వచ్చి, తెనాలిలో స్థిరపడి సొంత కుటుంబమంటూ లేకుండా తన శిష్యబృందమే లోకంగా, నాట్యకళే ఊపిరిగా కొనసాగిన నాట్యాచార్యుడు ఎండీ గిరి, కొద్దిరోజుల క్రితం అనారోగ్యానికి గురై ఆదివారం మృతిచెందారు. తన కళావారసత్వాన్ని శిష్యుల రూపంలో వదిలి వెళ్లారు. ఆయన భౌతికంగా లేకుండా నాట్యరీతుల్లో ఆయన అడుగులు మువ్వల సవ్వడుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ‘నాట్యమయూరి’, ‘సూపర్ డ్యాన్స్ ఆర్టిస్ట్’ వంటి పలు అవార్డులతో సహా భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి శాఖ ఫెలోషిప్ను పొందిన నన్ను నాట్యంలో తీర్చిదిద్దిన ఘనత గిరి మాస్టారుదే. మాస్టారుతో కలిసి రూపొందించిన నృత్యరూపకం ‘అభిజ్ఞాన శాకుంతలము’ అద్భుతం. పెళ్లయ్యాక కువైట్లో కొన్నేళ్లు ఉన్నాను. అక్కడ నృత్యశిక్షణాలయం నడిపాను. ఇప్పుడు హైదరాబాద్లో నటశిక్షణను కొనసాగిస్తున్నా. – జంధ్యాల వేదవల్లి, నృత్యగురువు తెనాలిలో కన్నుమూసిన ప్రముఖ నాట్యాచార్యుడు ఎండీ గిరికి నివాళిగా.... ‘దేవపారిజాతం’ అవార్డు గ్రహీత ఎండీ గిరి నృత్యరూపకాలతో తరగని ఖ్యాతి తెనాలిలో స్థిరపడి నృత్యశిక్షణ నృత్యగురువులుగా రాణిస్తున్న శిష్యబృందం -
ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన గుహ గురించి మీకు తెలుసా? (ఫొటోలు)
-
అధికార పార్టీ అండతో రెసిడెన్షియల్ ప్లాట్లలో బార్ అండ్ రెస్టారెంట్
రాజధానిలో నిబంధనలకు మంగళం తాడికొండ: రాజధాని ప్రాంతంలో ఇప్పట వరకు భూముల వ్యవహారాలు, వివాదాలే చూసిన స్థానికులకు ఇప్పుడు ఇది కాస్తా వ్యాపారాలకు కూడా పాకడంతో ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. పనుల్లేక సామాన్యులు చిన్నపాటి బడ్డీ కొట్టును జీవనం సాగించేందుకు కుటుంబాన్ని సాకుతుంటే ఆఘమేఘాలపై వచ్చి కూలదోసే అధికారులు ఏకంగా రెసిడెన్షియల్ కోసం కేటాయించిన ప్లాట్లలో కమర్షియల్ వ్యాపారానికి ఎంచక్కా అనుమతులివ్వడం విశేషం. అది ఎక్కడో మారుమూలన అనుకుంటే పొరబాటే రాజధాని నడిబొడ్డున ఏపీ సచివాలయం, అసెంబ్లీకి వెళ్లే వెలగపూడి, తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్ మలుపులో ఏకంగా బార్ అండ్ రెస్టారెంట్ను ఏర్పాటు చేసుకునేందుకు గేట్లు బార్లా తెరవడంతో గంటల వ్యవధిలో కంటెయినర్ను తెచ్చిపెట్టి విద్యుత్ సౌకర్యంతో సహా ఇచ్చి బార్ అండ్ రెస్టారెంట్ను ప్రారంభించారు. మంగళగిరి ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారికి చినబాబు ఆశీస్సులతో రాజధానిలో బార్ అండ్ రెస్టారెంట్ను కేటాయించారని, దీంతో ఆయన నిబంధనలకు విరుద్ధ్దంగా కమర్షియల్ ప్లాట్లలో దుకాణం ప్రారంభించడం ఎంతవరకు సమంజసం అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకొని నివాస ప్రాంతాల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన వ్యాపారాన్ని తొలగించి నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసుకోవాలని పలువురు రాజధాని వాసులు కోరుతున్నారు. మోడల్ స్కూల్స్ ఉద్యోగులకు వయోపరిమితి పెంపు వర్తింపజేయాలి కారెంపూడి: ఏపీ మోడల్ స్కూల్స్లో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగులకు సైతం వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘ అమరావతి జేఏసీ అధ్యక్షుడు వినుకొండ పేరయ్య తదితరులు ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అన్ని రంగాల ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న వారి వయోపరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచిందని, అయితే ఏపీ మోడల్ స్కూల్స్లో పని చేస్తున్న ఉద్యోగులను మాత్రం మరచిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీ మోడల్ స్కూల్స్లో పని చేస్తున్న వారికి కూడా వయోపరిమితి పెంపు వర్తింపచేయాలని కోరారు. -
ఆధునిక జీవనశైలి వల్లే సంతానలేమి సమస్యలు
కలెక్టర్ తమీమ్ అన్సారియా గుంటూరు మెడికల్ ఆధునిక జీవనశైలి వల్ల నేడు దంపతుల్లో సంతానలేమి (ఇన్ఫెర్టిలిటి) సమస్యలు పెరిగిపోతున్నాయని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఆదివారం గుంటూరు ఐటీసీ హోటల్లో కిమ్స్ ఫెర్టిలిటి ఐవీఎఫ్ సెంటర్ ఆధ్వర్యంలో గుంటూరు ఆబ్స్ట్రిక్ట్ అండ్ గైనకాలాజికల్ సొసైటీ సహకారంతో ఇన్ఫెర్టిలిటి గురించి వైద్యులకు ఫెమ్కాన్ పేరుతో నిరంతర వైద్య విద్య కార్యక్రమం(సీఎంఈ) నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంతాన చికిత్సలు అందించే కేంద్రాలు తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకోవాలన్నారు. ప్రభుత్వం సంతాన చికిత్సలకు ప్రత్యేకంగా ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. ఐవీఎఫ్ సెంటర్లో చట్టపరంగా చికిత్సలు అందించాలని చెప్పారు. పేదలకు సైతం ఆధునిక సంతాన చికిత్సలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. మాత మరణాలు నివారించడంలో సీ్త్ర వైద్య నిపుణులు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఆధునిక వైద్య సాంకేతికతలను సమర్థవంతంగా వినియోగించి సంతానోత్పత్తి సమస్యలకు పరిష్కారాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. మాత మరణాలను పూర్తిగా తగ్గించే దిశగా వైద్యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గర్భిణుల ఆరోగ్యంపై సమగ్ర పర్యవేక్షణతోపాటు, సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల వరకు ఆధునిక వైద్య సేవలు చేరేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి మాట్లాడుతూ సంతాన చికిత్సలు అందించే ఆస్పత్రుల వారు తప్పని సరిగా తమ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. పీజీ వైద్యులకు, నూతనంగా ప్రాక్టీస్లోకి వస్తున్న వైద్యులకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. సీఎంఈ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. కర్నాటకకు చెందిన డాక్టర్ ప్రత్యూష్కుమార్ నారాయణ్ సంతాన చికిత్సల్లో హార్మోన్స్ ఏవిధంగా స్పందిస్తాయనే విషయాలను, డాక్టర్ హితేష్బట్ సంతాన చికిత్సలు చేసే సమయంలో పాటించాల్సిన చట్టపరమైన అంశాలను, డాక్టర్ సచిన్ కులకర్ణి ఐవిఎఫ్ చికిత్సలు ఎవరికి చేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో చేయాలనే విషయాల గురించి వివరించారు. సదస్సులో వైద్యులు, నిపుణులు పాల్గొని ఫెర్టిలిటీ, ఎంబ్రియాలజీ రంగాల్లో వచ్చిన అధునాతన పోకడలను వివరించారు. కార్యక్రమంలో కిమ్స్ ఫెర్టిలిటి ఐవిఎఫ్ సెంటర్ డైరక్టర్ డాక్టర్ బి.శ్వేత, సీఓఓ సుధర్జాదవ్, డాక్టర్ ఐ.ప్రత్యూష, డాక్టర్ శిరీషా, ఎంబ్రాలజిస్ట్ డాక్టర్ ఉదయ్, యూనిట్హెడ్ డాక్టర్ ఎస్. వి.హరికుమార్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వినోద్, గుంటూరు ఆబ్స్ట్రిక్ట్స్ అండ్ గైనకాలాజికల్ సొసైటి ప్రెసిడెంట్ డాక్టర్ బి.వెంకటేశ్వరరావు, సెక్రటరీ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, జీజీహెచ్ గైనకాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ అరుణ, పలువురు గైనకాలజిస్ట్లు, ఐవీఎఫ్ స్పెషలిస్ట్లు తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మంగళగిరి టౌన్: పార్టీలోనే ప్రతి నాయకుడు, కార్యకర్త క్షేత్రస్థాయిలో గట్టిగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ పిలుపునిచ్చారు. మంగళగిరి పట్టణ పరిధిలోని గౌతమ బుద్ధా రోడ్లోని బీజేపీ కార్యాలయంలో పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభయాన్ 2026 శిక్షణ తరగతులు నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగిన శిక్షణ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. చివరిరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాధవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవాడికి చేరేలా కృషి చేయాలన్నారు. అంతోద్యయ ద్వారా సమాజంలోని చివరి వ్యక్తికి సేవలు చేరేలా సర్వ వ్యాప్తి, సర్వస్పర్శి లక్ష్యంతో పార్టీ విస్తరణ జరగాలని సూచించారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం పార్టీ సిద్ధాంతాలపై విశ్లేషాత్మకంగా వివరించారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శివన్నారాయణ, జిల్లా కార్యదర్శి పంచుమర్తి ప్రసాద్, మంగళగిరి పట్టణ అధ్యక్షులు మునగాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ్ణంరాజు రాజీనామా చేయాలి కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జొన్నకూటి నవీన్ ప్రకాష్ డిమాండ్ లక్ష్మీపురం: పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో దళితుల పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తూ, తన అనుచరులతో దళిత యువతను రెచ్చగొట్టి అల్లకల్లోలం సృష్టించిన ఉండి ఎమ్మెల్యే, డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు వైఖరిని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) గుంటూరు జిల్లా కార్యదర్శి జొన్నకూటి నవీన్ ప్రకాష్ ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. ప్రభుత్వ తీరు అత్యంత అభ్యంతరకరంగా ఉందని అన్నారు. పెద్దపేటలో అసలు ఏం జరిగిందో, దళిత యువతపై ఏరకంగా దాడులు జరిగాయో తెలుసుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు రఘురామకృష్ణంరాజు చర్యలను సమర్థిస్తూ ప్రకటనలు చేయడం అత్యంత అన్యాయమని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు ఒక వర్గానికి అన్యాయం జరుగుతుంటే కనీసం విచారణ చేయకుండా ఏకపక్షంగా మాట్లాడటం రాష్ట్రానికి హానికరం అని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ, దళితులపై దాడులను ప్రోత్సహిస్తున్న రఘురామకృష్ణంరాజును పదవి నుండి తొలగించని పక్షంలో దళిత ప్రజాసంఘాలను ఏకం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): లోక కల్యా ణార్థం, సకల ప్రాణ కోటికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని కోరుతూ ఆదివారం దుర్గమ్మ సన్నిధిలో సూర్యోపాసన సేవ నిర్వహించారు. అమ్మవారి ఆలయప్రాంగణంలోని లక్ష కుంకుమార్చన వేదిక వద్ద సూర్య భగవానుడి విగ్రహానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ నిర్వహించి సూర్యనారాయణుడికి కేసరిని నివేదనగా సమర్పించారు. అనంతరం అందరికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని ఆకాంక్షిస్తూ భక్తులకు ప్రసాద పంపిణీ జరిగింది. సేవలో పాల్గొన్న ఉభయదాతలను ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా అమ్మ వారి దర్శనానికి అనుమతించారు. -
నేడు ఏఎన్యూ పాలకమండలి సమావేశం
ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూలో పాలక మండలి సమావేశం సోమవారం నిర్వహించనున్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదింపజేయనున్నారు. ఈ వార్షిక బడ్జెట్లో యూనివర్సిటీకి వచ్చే ఆదాయం, ఖర్చులు ప్రభుత్వం విడుదల చేసే బ్లాక్ గ్రాండ్ నిధులు, ఉద్యోగుల వేతనాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు వంటి ప్రధాన అంశాలకు బడ్జెట్ కేటాయింపులు జరుగుతాయని అధికారులు చెప్పారు. సమావేశానికి ఇన్చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావు అధ్యక్షత వహించనున్నారు. రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్ సీపీ నాయకుడు బాజీ మృతి మేడికొండూరు: మంగళగిరి మండలం చినకాకాని వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి కారు అదుపుతప్పి బోల్తా కొట్టిన ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మేడికొండూరుకు చెందిన వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ బాజీ మృతి చెందారు. బాజీ కుటుంబ సభ్యులు చిన్నారి మొక్కు తీర్చుకోవడానికి అమలాపురం దర్గాకు వెళ్లి తిరుగు ప్రయాణం అయ్యారు. మంగళగిరి వద్ద జాతీయ రహదారిపై ఎదురుగా ఉన్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి కారు బోల్తా కొట్టింది ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రులను అంబులెనన్స్లో ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన షేక్ బాజీ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ మేడికొండూరు మండలం యూత్ ప్రెసిడెంట్గాను, మండల వర్కింగ్ ప్రెసిడెంట్గాను, రేషన్ షాప్ డీలర్ల ప్రెసిడెంట్గాను, ఫిరంగిపురం యార్డు చైర్మన్గాను పనిచేశారు. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొనసాగుతున్నాడు. బాజీ అకాల మరణంతో మండల వాసులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంతో మునిగిపోయారు. బాజీ మరణం పార్టీకి తీరని లోటు తాడికొండ: మేడికొండూరు మండలానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ బాజీ మరణం పార్టీకి తీరని లోటని వైఎస్సార్సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు(డైమండ్) తెలిపారు. ప్రమాదంలో గాయపడి రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. బాజీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు. నేడు సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో గ్రీవెన్స్ డే తాడికొండ: రాజధాని అమరావతి రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో సోమవారం ‘గ్రీవెన్స్ డే’ నిర్వహించనున్నట్లు సీఆర్డీయే అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్లో వివిధ విభాగాల అధికారులు అర్జీలు స్వీకరించనున్నారు. కావున రాజధాని ప్రాంతవాసులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. మిర్చి కమీషన్ దుకాణంలో నగదు చోరీ నగరంపాలెం: మిర్చి కమీషన్ దుకాణంలో నగదు చోరీపై బాధితుడు లాలాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్గా రోడ్డులో శివరామచౌదరి మిర్చి కమీషన్ దుకాణం నిర్వహించేవారు. శుక్రవారం రాత్రి దుకాణం షట్టర్కి తాళం వేసి వెళ్లాడు. శనివారం ఉదయం దుకాణం వద్దకు వచ్చేసరికి షట్టర్ తాళాలు పగిలిపోయి ఉండడాన్ని గుర్తించారు. వెంటనే లోనికెళ్లి బీరువా చూడగా, అందులో భద్రపరిచిన రూ.6 లక్షలు కనిపించలేదు. ఎవరైనా గుర్తుతెలియని అగంతకులు నగదు తస్కరించినట్లు గుర్తించి లాలాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దుకాణం, పరిసరాలను నిశితంగా పరిశీలించారు. అలాగే సీసీ టీవీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాల పుటేజీ సేకరించారు. అంతర్జాతీయ కోచింగ్ కోర్సుకు శ్రీనివాసరావు ఎంపిక యడ్లపాడు: మండలంలోని మైదవోలు గ్రామానికి చెందిన వాలీబాల్ క్రీడాకారుడు, కోచ్ నక్కా శ్రీనివాసరావు చైనాలో జరగనున్న ప్రతిష్టాత్మక ఎఫ్ఐవీబి లెవల్–3 అంతర్జాతీయ కోచింగ్ కోర్సుకు ఎంపికయ్యాడు. ఈ మేరకు వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తనపేరును అధికారికంగా సిఫార్సు చేసినట్లు ఆదివారం తెలిపారు. చైనా వేదికగా ఈ ఏడాది జూలై 17 నుండి 25 వరకు ఈ అత్యున్నత స్థాయి శిక్షణ తరగతులు జరగనున్నాయి. వాలీబాల్ కోచింగ్లో అత్యున్నత ప్రమాణంగా భావించే లెవల్–3 కోర్సుకు ఇంత చిన్న వయసులోనే ఎంపిక కావడం విశేషం. శ్రీనివాసరావు ఎంపిక పట్ల పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు. -
జిల్లా కలెక్టర్గా సాయికాంత్ వర్మ
గుంటూరు వెస్ట్: గుంటూరు జిల్లా కలెక్టర్గా సీఎం సాయికాంత్ వర్మను నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు కలెక్టర్గా విధులు నిర్వర్తించిన తమీమ్ అన్సారియాను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా నియమిస్తూ బదిలీ చేశారు. ప్రస్తుతం ఏపీ ఎకనామిక్ డెవల్మెంట్ బోర్డ్ (ఏపీఈడీబీ) సీఈఓగా పనిచేసిన సాయికాంత్ వర్మ 1989లో కర్నూలులో జన్మించారు. ఆయన మద్రాస్ ఐఐటీ నుంచి ఎంటెక్ కంప్యూటర్ సైన్స్లో ఉత్తీర్ణత సాధించారు. అమెజాన్, గూగుల్ వంటి సంస్థల్లో పనిచేసిన ఆయన 2015లో యూపీఎస్ిసీ పరీక్షల్లో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ క్యాడర్ 15వ ర్యాంకు సాధించారు. తొలి ప్రయత్నంలోనే అత్యుత్తమ ర్యాంకు సాధించి ఆయన ఐఏఎస్గా ఎంపిక కావడం గమనార్హం. కేవలం 26 సంవత్సరాల వయస్సులోనే దేశ అత్యుత్తమ సర్వీసుకు ఎంపిక కావడం విశేషం. తమీమ్ అన్సారియా బదిలీ -
ఆంధ్రప్రదేశ్ మ్యాథ్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడిగా షాహిద్ బాషా
ఆంధ్రప్రదేశ్ మ్యాథ్స్ ఫోరం పల్నాడు జిల్లా శాఖ అధ్యక్షుడిగా షేక్ షాహిద్ బాషా(చిలకలూరిపేట) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సత్తెనపల్లిలోని సుగాలి కాలనీ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ మ్యాథ్స్ ఫోరం (ఏపీఎంఎఫ్) జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ప్రధానకార్యదర్శిగా పి.వీరబ్రహ్మం(నాదెండ్ల), ట్రెజరర్గా పి.సత్యనారాయణరాజు(పాకాలపాడు), గౌరవఅధ్యక్షుడిగా రామిశెట్టి గోవిందరాజులు(నరసరావుపేట), ఉపాధ్యక్షులుగా కె.జగన్నాధరావు (ముప్పాళ్ళ), జూపల్లి గంగాధర్బాబు (మాచర్ల), ఎల్.రామాంజిరెడ్డి (వినుకొండ), ఎ.భాగేశ్వరీదేవి (మాదల), ఎం.ఫణికుమార్ (నరసరావుపేట), కార్యదర్శులుగా ఈ పున్నమ్మ (అచ్చంపేట), జాన్కెనడి (మాచర్ల), కె.శ్రీనివాసరావు(చిలకలూరిపేట), ఎస్.ఆదినారాయణ(యడ్లపాడు), ఎం.శ్రీనివాసరెడ్డి(రొంపిచర్ల), సిహెచ్.నాగేశ్వరరావు(వినుకొండ), ఎ.వెంకటశ్రీవత్స(కారంపూడి), జెవికె ప్రసాద్(రెంటచింతల), కె.శివనాయక్ (ఈపూరు), పి.రఘునాథబాబు (శావల్యపురం), బి.శివకోటేశ్వరరావు(దుర్గి), జి ప్రతాప్(బొల్లాపల్లి), కె.రాంబాబు (క్రోసూరు) ఎన్నికయ్యారు. జిల్లా అడ్వైజరీ కమిటీ బాధ్యులుగా కె.వి.రమణ (పెదమక్కెన), ఎ.శ్రీనివాసరెడ్డి (వెన్నాదేవి), పీవీ కోటేశ్వరరావు (సత్తెనపల్లి), బట్టు ఉదయ్భాస్కర్ (నరసరావుపేట), ీపి.విజయ్కుమారి (దుర్గి), పి.అంజనీకుమారి(నకరికల్లు), కె.వేణుగోపాలరావు(ముప్పాళ్ళ), ఎం.నరేంద్రకుమార్ (సత్తెనపల్లి) ఎన్నికయ్యారు. -
ప్రపంచ గమనాన్ని మార్చిన గణితం
సత్తెనపల్లి: ప్రపంచ గమనాన్ని గణితం మార్చిందని ఆంధ్రప్రదేశ్ మ్యాథ్స్ ఫోరం రాష్ట్ర కమిటీ సభ్యుడు పెద్దింటి వెంకట కోటేశ్వరరావు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని సుగాలి కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ గణిత వేదిక (ఏపీఎమ్ఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన పల్నాడు జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. గణితం లేనిదే ప్రపంచ ప్రగతి లేదన్నారు. ప్రతి విద్యార్థి గణితంపై ఆసక్తి పెంచుకునేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు. దైనందిన జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి గణితం పాత్ర ఎక్కువ అన్నారు. గణితం ఒక వేగం, గణితంతో స్నేహం ఒక అపూర్వ అనుభవమన్నారు. గణితం పై ఆసక్తిని పెంచుకునేందుకు మ్యాథ్స్ ఫోరం ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. ఏపీఎమ్ఎఫ్ ఆవిర్భావం నుంచి నేటి వరకు సాధించిన ప్రగతిని ఆయన వివరించారు. ముందుగా సమావేశ పరిచయకర్తగా సత్యనారాయణరాజు వ్యవహరించారు. కందిమళ్ల వేణుగోపాల్ ప్రశ్నపత్రాల తయారీ, మూల్యాంకన విధివిధానాలపై కీలక సూచనలు చేయగా, భాగేశ్వరి విద్యార్థుల పేపర్ ప్రజెంటేషన్ మెరుగుపరుచుకునే విధానాలను వివరించారు. తాత సాంబశివరావు గణిత బోధనా పరికరాల తయారీపై ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. ఏపీఎంఎఫ్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు కె.మల్లికార్జునరెడ్డి గణిత ఉపాధ్యాయుల నైపుణ్యాల పెంపకం, గణిత సబ్జెక్టు అభివృద్ధికి మ్యాథ్స్ ఫోరం చేస్తున్న కృషిని వివరించారు. మ్యాథ్స్ ఫోరం రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి పి దుర్గారావు పల్నాడు జిల్లా శాఖ కృషిని వివరించారు. సుగాలి కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ప్రశాంత బాలు గణిత శాస్త్రవేత్తలపై రూపొందించిన ఆడియో విజువల్ ప్రదర్శించి అభినందించారు. ప్రశాంతబాలుకు ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందించారు. జాతీయ స్థాయి యోగా విజేతగా నిలిచిన ఉపాధ్యాయుడు ఎం రమేష్ దంపతులను, గణిత సేవలో విశేష కృషి చేసిన వీరబ్రహ్మం, వేణుగోపాల్, భాగేశ్వరిలను సన్మానించారు. ఏపీఎమ్ఎఫ్ మ్యాథ్స్ ఫోరం పల్నాడు జిల్లా కార్యవర్గాన్ని, జిల్లా అడ్వైయిజరీ కమిటీలను ఎన్నుకున్నారు. -
నాట్యాచార్యుడు ఎండీ గిరి మృతి
విచారంలో నృత్యకళాకారులు తెనాలి: పట్టణానికి చెందిన ప్రముఖ నాట్యాచార్యుడు, నాట్యగురువు ‘దేవపారిజాతం’ అవార్డు గ్రహీత ఎండీ గిరి (80) మృతిచెందారు. వారం రోజుల కిందట అనారోగ్యానికి గురైన గిరి, స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందారు. కళాకారులు, నృత్యకళాకారుల సందర్శనార్ధం ఆయన భౌతికకాయాన్ని బీసీ కాలనీలోని పట్టణ రంగస్థల కళాకారుల భవనంలో ఉంచారు. ప్రముఖ నృత్యకళాకారులు/నృత్యగురువులు భాస్కర్ల రంగనాయకి, జంధ్యాల వేదవల్లి, జంధ్యాల రామచంద్రమూర్తి, ఆలపాటి ప్రజ్ఞ తదితరులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సాయంత్రం ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలను నిర్వహించారు. ఎండీ గిరి పూర్తిపేరు దస్తగిరి. అనంతపురం జిల్లా బోగాలకట్ట స్వగ్రామం. 1986లో తెనాలి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. తాను స్థాపించిన శ్రీగిరిజా ఆర్ట్ అకాడమీ ద్వారా ఎందరికో నృత్యశిక్షణనిచ్చారు. దేశీయ నృత్యరీతులు, వాటి వైశిష్ట్యాన్ని వ్యాప్తి చేసేందుకు గత నాలుగు దశాబ్దాలుగా విశేష కృషిచేశారు. ఎన్నో నృత్యరూపకాలను రూపొందించి ప్రదర్శింపజేశారు. -
గోవాడ ప్రాశస్త్యాన్ని కాపాడుకుందాం
తెనాలిటౌన్: వందలాది సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ బాలకోటేశ్వరస్వామి దేవస్థానం గోవాడ తిరునాళ్ల ప్రాశస్త్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని గోవాడ మహాశివరాత్రి పరిరక్షణ కమిటీ సభ్యులు ఆరోపించారు. స్థానిక కొత్తపేటలోని పెన్షనర్స్ హాల్లో ఆదివారం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కమిటీ కన్వీనర్ దర్శి శివకోటేశ్వరరావు మాట్లాడుతూ తెనాలి దగ్గరలోని గోవాడ శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు రెండు తెలుగురాష్ట్రాల నుంచి ఈ తిరునాళ్ళకు లక్షల సంఖ్యలో వస్తారని చెప్పారు. ఆలయ సమీపంలోని గోవాడ నుంచి కావూరు డొంకలో ఉత్సవం కోసం నిర్దేశించిన స్థలంలో ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కుకు స్థలం కేటాయిస్తూ ఏపీఐఐసీ వారికి స్థలం అప్పగించడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూవుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే కేటాయింపులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 1943 నుంచి అనేకసార్లు ఈ స్థలాన్ని వేరేవారికి కేటాయించగా బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఉత్సవ విశిష్టతను తెలుసుకుని కేటాయింపులు రద్దు చేసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే, తహసీల్దార్ ఈ స్థలం కేటాయింపునకు ప్రాధాన్యం కనబరుస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో తుమ్మల జగదీష్, మండవ మల్లీశ్వరి, కెవి సత్యనారాయణ, వేదాంతం ఫణీంద్ర, కె.వాసుదేవనాయుడు, కడియాల నంద కిషోర్, బసవపున్నయ్య, ఆర్.శివశంకరరావు, రాజేష్ పాల్గొన్నారు. -
అట్టహాసంగా ప్రారంభమైన ఎడ్ల బల ప్రదర్శన పోటీలు
తెనాలిరూరల్: తెనాలి, వేమూరు నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన, పశు పాల, వ్యవసాయ వైజ్ఞానిక ప్రదర్శన పోటీలు ఆదివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఒంగోలు జాతి ఎడ్లు జాతి సంపదని, వాటిని కాపాడుకోవాలన్నారు. రైతాంగానికి పెద్ద పీట వేసి రైతులు సంతోషంగా ఉండాలని కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని చెప్పారు. ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ ఒంగోలు జాతి ఎడ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఒంగోలు జాతిని ప్రేమిస్తూ కాపాడుతున్న రైతాంగానికి ధన్యవాదాలు తెలిపారు. తొలి రోజు రెండు పళ్ల లోపు విభాగం పోటీలు నిర్వహించారు. ఈ విభాగంలో మొత్తం 20 జతల ఎడ్లు వచ్చాయని, అవసరమైతే సోమవారం కొనసాగిస్తామని రిఫరీగా వ్యవహరిస్తున్న సూరపనేని రాధాకృష్ణ ప్రకటించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఇతర నాయకులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. -
మరో దోపిడికీ రంగం సిద్ధం చేస్తున్న చంద్రబాబు సర్కారు
సోమవారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2026సత్తెనపల్లి: ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయినా .. కనీస వేతనం లేకపోయినా అప్పులు చేసి అన్నం, కూరలు తయారు చేస్తున్నారు. విద్యార్థుల కడుపు నింపి ఆకలి తీర్చుతున్నారు. అలాంటి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పొట్ట కొట్టేందుకు స్మార్ట్ కిచెన్ల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మధ్యాహ్న భోజనం పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టారు. దీని ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందించాల్సింది పోయి తమ అనుయాయులకు మేలు జరిపేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమవుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయోగాత్మకంగా అమలు చేసిన వైఎస్సార్ కడప జిల్లాలో విజయవంతమైందంటూ 2025 డిసెంబర్లో హడావుడి చేశారు. మళ్లీ ఇప్పుడు తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 155 పాఠశాలల్లో స్మార్ట్ కిచెన్ ఏర్పాటుకు నివేదికలు పంపాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో తొలి విడతలో 13 పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా జిల్లా అధికారులు కూడా ఆగమేఘాల మీద సౌకర్యవంతంగా ఉన్న పాఠశాలలను గుర్తించి స్మార్ట్ కిచెన్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని మండల విద్యాశాఖాధికారులకు(ఎంఈఓ)ఆదేశాలు జారీ చేయగా వారు నివేదికలు పంపిస్తు న్నారు. పది లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు తప్ప విద్యార్థులు ఎక్కువ మంది ఉన్న పాఠశాలలకు స్మార్ట్ కిచెన్ల ద్వారా మధ్యాహ్న భోజనం సరఫరా చేయనున్నారు. ఒకచోట భోజనం తయారు చేసి 1 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలల విద్యార్థులకు అందించాలన్నది ప్రభుత్వ ఆలోచన. వంట కార్మికుల ఆందోళన... మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న ఏజెన్సీలను తొలగించి స్మార్ట్ కిచెన్ల పేరుతో మధ్యాహ్న భోజనం నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయన్న సమాచారంతో ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో వంటలు నిర్వహిస్తున్న మహిళలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులను ఆదుకుంటామంటూ ప్రకటనలు చేసిన చంద్రబాబు తమ పొట్ట గొట్టేందుకే ఈ పథకాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టే ప్రయ త్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఫలితంగా ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్న తమను రోడ్డును పడేస్తే ఎలా? అని ... ఇన్నేళ్లుగా కష్టపడి పనిచేసిన దానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రతిఫలం ఇదేనా ... అంటూ మధ్యాహ్న భోజన నిర్వాహకులు మండిపడుతున్నారు. అవకతవకలకు పాల్పడిన ఎక్కడో దూరంలో ఉన్న విద్యార్థులకు ఒకచోట భోజనం వండి వాహనాల్లో తీసుకెళ్లి ఇవ్వడం అన్నది వ్యయప్రయాసలతో కూడుకున్నది. దీనివల్ల విద్యార్థులకు వేడి పదార్థా లు తినే భాగ్యం లేనట్టేనని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటి వరకు పాఠశాల ఆవరణలోనే మధ్యాహ్న భోజనం వండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కాంట్రాక్టర్ల చేతుల్లోకి పోతుంది. ఎవరిని సంతృప్తి పరచడానికి స్మార్ట్ కిచెన్లు తీసుకొస్తున్నారని ప్రజాసంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి విద్యార్థు లకు వండి పెడుతున్న కార్మికుల కడుపులు కొట్టి సొంత పార్టీ నాయకుల బొజ్జలు నింపేందుకే స్మార్ట్ కిచెన్ల రూపకల్పన జరిగినట్టు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. స్మార్ట్ కిచెన్లకు స్వస్తిపలకాలని కోరుతున్నాయి. విద్యార్థుల కడుపు మాడ్చేసి .. మధ్యాహ్న భోజన కార్మికులను రోడ్డును పడేసి తమ అనుయాయుల జేబులు నింపేందుకు చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఏళ్ల తరబడి పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పొట్ట గొట్టేందుకు స్మార్ట్ కిచెన్ల పేరుతో ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది. ప్రభుత్వం సకాలంలో బిల్లులు ఇవ్వకపోయినా అప్పో సప్పో చేసి విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వండి పథకం కార్మికులు కడుపులు నింపుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే పాత వారిని తొలగించి పచ్చ పార్టీ సానుభూతిపరులను నియమించుకోవాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేశారు. అవి ఫలించక ఇక ఇప్పుడు స్మార్ట్ కిచెన్ల పేరుతో అసలుకే ఎసరు పెట్టాలని చూస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వేడి అన్నం స్థానంలో తమ పిల్లలు ఎప్పుడో తెల్లవారి వండిన భోజనాన్ని తినాల్సి వస్తుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
స్వచ్ఛతపై అవగాహన కలిగి ఉండాలి
జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా గుంటూరు రూరల్: స్వచ్ఛతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా తెలిపారు. శనివారం పెదపలకలూరు రోడ్డులోని విజ్ఞాన్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో నగర కమిషనర్ కె. మయూర్ అశోక్తో కలిసి పాల్గొన్నారు. కులం పేరుతో దూషణపై కేసు నమోదు తెనాలి రూరల్: కులం పేరుతో దూషణపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. దళితుల్లోని రెండు సామాజికవర్గాలను అసభ్యంగా దూషిస్తూ మండలంలోని ఖాజీపేట గ్రామానికి చెందిన చల్లా నాగరాజు శుక్రవారం ఫేస్బుక్లో లైవ్ వీడియో పెట్టాడు. తిరిగి రాత్రి క్షమాపణ కోరుతూ మరో లైవ్ వీడియో పోస్టు చేశాడు. దీనిపై రూరల్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఇప్పటికే నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. -
జాతీయ రహదారిపై కారు బోల్తా
● ఎనిమిది మందికి గాయాలు ● ఇద్దరి పరిస్థితి విషమం ● దర్గా నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం మంగళగిరి టౌన్: మంగళగిరి జాతీయ రహదారిపై చినకాకాని వద్ద శుక్రవారం అర్ధరాత్రి కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మేడికొండూరుకు చెందిన ఎనిమిది మంది కుటుంబ సభ్యులు వాహనంలో చిన్నారి మొక్కు తీర్చుకునేందుకు అమలాపురం దర్గాకు వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో మంగళగిరి జాతీయ రహదారిపై ఎదురుగా ఉన్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది. పల్టీలు కొట్టుకుంటూ జాతీయ రహదారిపై నుంచి సర్వీస్రోడ్లోకి దూసుకుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్లో సమీపంలో ఉన్న ఎన్ఆర్ఐ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనలో మొక్కు తీర్చుకున్న బాలుడికి ఎటువంటి ప్రమాదం జరగకుండా బయటపడడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, మిగిలిన వారు సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు పోలీసులు తెలిపారు. జరిగిన ఘటనపై మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగళగిరి రూరల్ పోలీసులు సకాలంలో స్పందించడంతో గాయపడిన వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఘటన జరిగిన నిమిషాల వ్యవధిలోనే మంగళగిరి రూరల్ సీఐ బ్రహ్మం, ఎస్ఐ వెంకట్లు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన క్షతగాత్రులను స్వయంగా వారే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు రావడం ఏ మాత్రం ఆలస్యమైనా పలువురి పరిస్థితి విషమంగా మారే అవకాశం ఉండేదని క్షతగ్రాతులు తెలియజేశారు. తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉన్న షేక్ బాజీ వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నట్లు సమాచారం. -
లంచం ఇస్తేనే ఆపరేషన్
గుంటూరు మెడికల్: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కిడ్ని మార్పిడి ఆపరేషన్ చేయించుకునేందుకు సిద్ధమైన ఓ రోగికి ఆపరేషన్ అనుమతి మంజూరుకు కార్యాలయ ఉద్యోగి రూ. లక్ష లంచం డిమాండ్ చేసినట్లు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు అందాయి. జిల్లా కలెక్టర్కు బాధితుడు లిఖిత పూర్వకంగా చేయడంతో రెండు రోజుల క్రితం ఆసుపత్రి అధికారులు రహస్యంగా విచారణ చేశారు తప్ప, సదరు జూనియర్ అసిస్టెంట్పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మిన్నకుండి పోయారు. వివరాల్లోకి వెళితే... ● పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం మహదేవపట్నం గ్రామానికి చెందిన కె.సూర్యనారాయణ కిడ్ని మార్పిడి ఆపరేషన్ అనుమతి కోసం డీఎంఈ కార్యాలయం ద్వారా జీజీహెచ్ అధికారులకు దరఖాస్తు చేశాడు. ● జీజీహెచ్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ ఉదయ భాస్కర్ డాక్యుమెంట్స్ పరిశీలించి కిడ్ని మార్పిడి ఆపరేషన్కు అనుమతులు వారం రోజుల్లో మంజూరు చేయాల్సి ఉంది. కాని నాలుగు నెలలకు పైగా కాలయాపన చేసి సూర్యనారాయణను ప్రాణాపాయ స్థితికి చేరుకునేలా చేయడంతోపాటు, కుటుంబ సభ్యులను తీవ్ర మనోవేదనకు, ఆర్థిక ఇబ్బందులకు గురిచేశాడని ఉదయభాస్కర్పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి సోదరుడు లక్ష్మీనారాయణ జిల్లా కలెక్టర్కు లిఖిత పూర్వకంగా గతనెలలో ఫిర్యాదు చేశాడు. ● తమలాగా మరెవరూ జీజీహెచ్లో ఇబ్బంది పడకూడదని, తక్షణమే విచారణ చేసి జూనియర్ అసిస్టెంట్ను ఉద్యోగం నుంచి తొలగించి ఎంతో మంది జీవించే హక్కు కాలరాస్తున్న అతనిని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో కోరారు. ● ఉదయభాస్కర్కు డబ్బులు చెల్లించినట్లుగా ఫోన్పే ఆధారాలు, ఆడియో, వీడియో సీడీలు సైతం ఆసుపత్రి అధికారులకు, కలెక్టర్కు బాధితులు అందజేశారు. అయితే ఆసుపత్రి అధికారులు రెండు రోజుల క్రితం రహస్యంగా విచారణ చేసి సదరు జూనియర్ అసిస్టెంట్పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోయారు. గతంలోనూ ఫిర్యాదులు ● గతంలో ఉదయభాస్కర్పై ఇదే తరహాలో ఫిర్యాదులు వచ్చాయి. ఓ పోలీసు అధికారి సైతం కిడ్ని మార్పిడి ఆపరేషన్ అనుమతులు జాప్యం చేయడం వల్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గతంలో ఆసుపత్రి అధికారులు సీటు మార్పు చేస్తున్నట్లు ప్రకటించారు. పలువురు బాధితులు సైతం లిఖిత పూర్వకంగా ఆధారాలతో జూనియర్ అసిస్టెంట్పై ఫిర్యాదు చేసినా ఆసుపత్రి అధికారులు అతడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుండిపోవడం విమర్శలకు తావిస్తుంది. ● కిడ్ని రోగులకు ఎంత త్వరగా కిడ్ని మార్పిడి ఆపరేషన్ చేస్తే అంత త్వరగా వారు నూతన జీవితాన్ని కొనసాగించే అవకాశం ఉంది. అలాంటి కీలకమైన సీటులో జూనియర్ అసిస్టెంట్ మామూళ్ల కోసం కిడ్ని రోగులను నెలల తరబడి అనుమతులు ఇవ్వకుండా వేధిస్తున సంఘటనలు, రూ.లక్షల్లో లంచాలు డిమాండ్ చేస్తున్న సంఘటనలు జరుగుతు న్నా ఆసుపత్రి పరువు మంట కలుస్తున్నా ఆసుపత్రి అధికారులు సదరు జూనియర్ అసిస్టెంట్ను ఎందుకు కాపాడుతున్నారో వారికే తెలియాలి. జీజీహెచ్ కార్యాలయ ఉద్యోగిపై బాధితుడి ఫిర్యాదు రహస్య విచారణ చేసిన ఆసుపత్రి అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్న అధికారులు -
సూపర్ పోలీస్ ఉమేష్చంద్ర
నేడు తెనాలిలో 60వ జయంతి తెనాలి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల కాల్పులకు బలైన ముగ్గురు పోలీసు అధికారుల్లో చదలవాడ ఉమేష్చంద్ర ఒకరు. సూపర్ పోలీస్గా పేరుతెచ్చుకున్న ఆ ఐపీఎస్ అధికారి నిండు నూరేళ్ల జీవితం 33 ఏళ్లకే మావోయిస్టుల తుపాకీ గుళ్లకు ముగిసిపోయింది. ఆయన 60వ జయంతిని తెనాలి, హైదరాబాద్లో ఆదివారం నిర్వహిస్తున్నారు. ఉదయం చెంచుపేటలోని ఆయన విగ్రహం వద్ద తెనాలి డీఎస్పీ బి.జనార్ధనరావు ఆధ్వర్యంలో పట్టణ, రూరల్ పోలీసులు పుష్పాంజలి ఘటిస్తారు. రాత్రి ఏడు గంటలకు హోటల్ గౌతమ్ కాన్ఫరెన్సు హాలులో జయంతి సభను నిర్వహిస్తారు. డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామ కృష్ణంరాజు, రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, ఏపీ ఐజీపీ ఆకే రవికృష్ణ, విశ్రాంత ఐపీఎస్ అధికారి జి.శ్రీనివాస్, ఉమేష్చంద్ర కుటుంబసభ్యులు పాల్గొంటారు. సాహసోపేత ఐపీఎస్ అధికారి ఉమేష్చంద్రను స్మరించుకుందాం. -
వేలానికి ప్రతిబంధకాలు
గుంటూరుఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026నెహ్రూనగర్: నగర పాలక సంస్థపై టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు పెత్తనం చెలాయిస్తున్నారు. నగరపాలక సంస్థకు చెందిన కమ్యూనిటీ హాళ్లు, కల్యాణ మండపాల వేలం నిర్వహణను టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారు. తమ అనుచరుల ఆదాయానికి గండి పడనీయకుండా జాగ్రత్త పడుతున్నారు. వేలం నిర్వహించేందుకు గతేడాది సెప్టెంబర్లో రెవెన్యూ అధికారులు ప్రకటన విడుదల చేశారు. గతేడాది సెప్టెంబర్ 16న బహిరంగ వేలం నిర్వహిస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కమ్యూనిటీ హాళ్లు, కల్యాణమండపాలు టీడీపీ నేతల చేతుల్లో ఉన్నాయి. వీటికి వేలం పాట పెడితే ఎక్కడ వారి ఆదాయానికి గండి పడుతుందోనని ఎమ్మెల్యేలు వాటికి వేలం నిర్వహించకుండా నిలిపివేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ కల్యాణ మండపం, మదర్థెరిస్సా కమ్యూనిటీ హాల్, కాపు కమ్యూనిటీ హాల్ (ఏసీ), లాల్జాన్ బాషా షాదీఖానాతో కలిపి మొత్తం నాలుగు ఉన్నాయి. ఇవి టీడీపీ నేతలు, కార్పొరేటర్ల చేతుల్లో ఉన్నాయి. వీటి ద్వారా భారీ స్థాయిలో వచ్చే ఆదాయాన్ని వారి జేబుల్లో వేసుకుని కార్పొరేషన్కు తూతూ మంత్రంగా అద్దె చెల్లిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దీంతో కార్పొరేషన్ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో కమ్యూనిటీ హాళ్లు, కల్యాణ మండపాలకు వేలం నిర్వహించాలని ఉద్దేశించి ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్ 20, 2025 నుంచి సెప్టెంబర్ 19, 2026 వరకు ఏడాది పాటు నిర్వహించేందుకుగాను చర్యలు చేపట్టారు. శ్రీకృష్ణ కల్యాణ మండపానికి రూ.3,53,510, మదర్థెరిస్సా కమ్యూనిటీ హాల్ రూ.3,51,450, కాపు కమ్యూనిటీ హాల్(ఏసీ)కి రూ.4,80,000, లాల్జాన్ బాషా షాదీఖానా రూ.1,50,000 చొప్పున సంవత్సరానికి అద్దె ఖరారు చేశారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకురావడంతో వేలం నిర్వహణకు బ్రేక్ పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్ 16న నగరపాలక సంస్థకు స్వచ్ఛ భారత్ బృంద సభ్యులు గుంటూరుకు వస్తున్నారనే కారణంగా వాయిదా వేస్తున్నామని, తిరిగి వేలం నిర్వహణ తేదీలను ప్రకటిస్తామంటూ అధికారులు ప్రకటించారు. నెలలు గడుస్తున్నప్పటికీ ఇంత వరకు వేలంపై ఎటువంటి స్పందన లేదు. కమ్యూనిటీ హాళ్లు, కల్యాణ మండపాలకు సంబంధించిన తాళాలు నగరపాలక సంస్థ సిబ్బంది వద్దే ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. కానీ తాళాలు మాత్రం ఒకటి కార్పొరేషన్ సిబ్బంది వద్ద, మరొకటి తమ్ముళ్ల వద్దే ఉంచుకుని వారికి అవసరమైనప్పుడు అద్దెలకు ఇచ్చుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రత్యేక అధికారి పాలనలోనైనా కమ్యూనిటీ హాళ్లు, కల్యాణ మండపాలకు కూడా వేలం పాట నిర్వహిస్తే కార్పొరేషన్ మరింత ఆదాయం సమకూరుతుందని నగర వాసులు అభిప్రాయపడుతున్నారు. I టీడీపీ నేతల చేతుల్లో కమ్యూనిటీ హాళ్లు, కల్యాణ మండపాలు వేలం నిర్వహణకు గతేడాది ప్రకటన ఎమ్మెల్యేల ప్రోద్బలంతో నిలిపివేత? నెలలు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు శ్రీకృష్ణ కల్యాణ మండపం టీడీపీ మాజీ కార్పొరేటర్ చేతుల్లో ఉండగా, కాపు కమ్యూనిటీ హాల్, మదర్థెరిస్సా కమ్యూనిటీ హాల్ టీడీపీ నాయకుల చేతుల్లో ఉన్నాయి. ఈ మూడింటికి నెలలకు లక్షల్లో ఆదాయం వస్తుంటే కార్పొరేషన్కు జమ అయ్యేది కేవలం వేలల్లోనే. ఈ మూడింటి తరపున ఎంతో కొంత నగదు జమ అవుతుంటే లాల్ జాన్బాషా షాదీఖానా ఎమ్మెల్యే సోదరుడు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని నుంచి నగరపాలక సంస్థకు తూతూ మంత్రంగా చిల్లర విదిలిస్తున్నట్లు నగరపాలక సంస్థ సిబ్బందే బహిరంగంగా చెబుతున్నారు. అధికారం మాదే కదా మేము ఎందుకు కట్టాలి అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5,000, గరిష్ట ధర రూ.9,000, మోడల్ ధర రూ.7,500 వరకు పలికింది. మాచర్ల:వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా శనివారం కలిశారు.విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 535.80 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి వచ్చే నీటిచేరిక పూర్తిగా నిలిచిపోయింది. -
తిరునాళ్ల స్థలం కేటాయింపుపై ఆందోళన
నేడు సన్నాహాక సమావేశం తెనాలి: ప్రసిద్ధ ఆలయానికి సంబంధించిన ఉత్సవం జరిగే డొంక ప్రదేశాన్ని ప్రభుత్వం చిన్న పరిశ్రమలకు కేటాయించటాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం జరిగే సమావేశానికి వేలాదిగా హాజరుకావాలని పరిరక్షణ కమిటీ నాయకులు కోరారు. బాపట్ల జిల్లా అమృతలూరు మండల గ్రామం గోవాడలో గల ప్రసిద్ధ శ్రీబాలకోటేశ్వరస్వామి దేవాలయంలో ఏటా మహాశివరాత్రి ఉత్సవాల్లో తిరునాళ్లకు లక్షలాది భక్తులు హాజరవుతుంటారు. ఆ తిరునాళ్ల జరిగే డొంక ప్రదేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చిన్న పరిశ్రమల ఏర్పాటుకు కేటాయిస్తున్నారు. అదే జరిగితే భవిష్యత్లో తిరునాళ్ల జరిపేందుకు తగిన స్థలం లేక, వేడుకలకు అవకాశం లేకుండాపోతుంది. దీనితో ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ గోవాడ మహాశివరాత్రి పరిరక్షణ కమిటీని తెనాలిలో ఏర్పాటుచేశారు. భవిష్యత్ కార్యాచరణపై 29వ తేదీ ఉదయం 10 గంటలకు పెన్షనర్స్ హాలులో ఈ సమావేశం జరుపుతున్నట్టు కమిటి కన్వీనర్ కె.నందకిశోర్ చెప్పారు. అందరూ చర్చించుకుని భవిష్యత్ కార్యక్రమం చేపడతామని, భక్తులు పెద్దసంఖ్యలో హాజరుకావాలని కోరారు. దరిశి శివకోటేశ్వరరావు, కొడాలి శ్రీధర్, టి.జగదీష్, టి.అమరనాధ్, కేవీ సత్యనారాయణ, రావూరి శివశంకరరావు పాల్గొన్నారు. -
జీడీసీఏ త్రీ మెన్ కమిటీ నియామకం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): జిల్లా క్రికెట్ అసోసియేషన్ తరఫున వ్యవహరించేందుకు త్రీమెన్ కమిటీని నియమిస్తూ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సానా సతీష్ శనివారం ఒక ప్రకటన విడుదల చేసారు. కోర్టు వ్యవహారాల నేపథ్యంలో గత ఏడాది కాలం నుంచి త్రీమెన్ కమిటీతోనే నెట్టుకొస్తున్నారు. ఇప్పటి వరకు సభ్యులుగా వ్యవహరించిన యు.మహతి శంకర్, వి.మనోజ్ సాయి, బి.సుధాకర్ల పదవీ కాలం ముగిసింది. వారి స్థానాల్లో జి.వి.శరత్ బాబు, నాగరాజు, టి.వెంకట శివ రామకృష్ణలను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. జీడీసీఏ తరఫున అన్ని వ్యవహారాలను ఇకపై నూతన కమిటీ సభ్యులే చూడనున్నారు. -
గ్రామంలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వండి
నల్లపాడు చెరువు కట్టవాసుల వేడుకోలు గుంటూరు రూరల్: నలభై ఏళ్ళుగా చెరువు కట్టపై నివాసాలు ఏర్పరచుకుని ఉంటున్న తమను ఖాళీ చేయించడం తగదని, జగనన్న ఇచ్చిన ఇళ్ల స్థలాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని, లేదంటే గ్రామంలో స్థలాలు ఇవ్వాలని నల్లపాడు చెరువుకట్టపై నివాసం ఉంటున్న ప్రజలు పేర్కొన్నారు. శనివారం వారితో ఆర్డీవో శ్రీనివాసరావు, ఇతర అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెరువు అభివృద్ధి కోసం ఖాళీ చేయాలని సూచించారు. కూలీనాలీ చేసుకుని బతికే తమకు స్థలాలు కొనుగోలు చేసుకుని ఇళ్లు నిర్మించుకునే శక్తిలేదని చెప్పారు. గతంలో జగనన్న కాలనీలలో కొంత మందికి స్థలాలు కేటాయించారని, అక్కడ సౌకర్యాలు కల్పిస్తే వెళతామని తెలిపారు. గుడిసెలు నిర్మించుకునేందుకు సాయం అందజేయాలని, లేదంటే గ్రామంలోనే ఎక్కడైనా స్థలాన్ని చూపించాలని కోరారు. స్థానిక టీడీపీ నేతలు జులుం ప్రదర్శించారు. యంత్రాలతో ఇళ్లను కూల్చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. అభివృద్ది పేరుతో చెరువులోని మట్టిని విక్రయించుకునేందుకు తయ బతులకును రోడ్డున పడేసస్తున్నారని స్థానికులు ఎదురు తిరిగారు. నోటీసులు త్వరలో ఇస్తామని, ఇదే విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని చెప్పారు. -
పైపులు దహనం కేసులో నిందితుడు అరెస్టు
● సెలవు ఇవ్వడం లేదని అక్కసుతో పైపులు తగులబెట్టిన వాచ్మన్ ● సాంకేతిక ఆధారాలతో ప్రత్యేక బృందాలతో కేసును ఛేదించిన పోలీసులు ● ఘటనను వైఎస్సార్సీపీపై మోపేందుకు యత్నించిన టీడీపీ నేతలు అబాసుపాలు తాడికొండ: రాజధాని ప్రాంతంలో అగ్నిప్రమాదం ఘటనలో నిందితుడిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. తుళ్లూరు పోలీసుస్టేషన్లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ విలేకరుల సమావేశంలో ఘటన వివరాలు వెల్లడించారు. రాజధాని ప్రాంత అభివృద్ధి పనులు, రోడ్లు, కాల్వల నిర్మాణం, తదితర పనులు చేపడుతున్న మెఘా ఇంజినీరింగ్ సంస్థ వారి పనులకు కావాల్సిన సామగ్రిని పలు ప్రాంతాల్లో నిల్వ చేసింది. సీఆర్డీఏ పరిధిలోని జోన్–6 బ్లాక్ –3లో ఈ–4, ఎన్–12 జంక్షన్ వద్ద ఆరు ఎకరాల ప్రాంతాల్లో భూగర్భ విద్యుత్ పనులకు కావాల్సిన పైపులు స్టాక్ యార్డులో ఉంచారు. వీటికి కాపాలాగా తుళ్లూరు ప్రాంతానికి చెందిన తిప్పగుడిసె రాముని ఉంచారు. ఈనెల 23న రాత్రి అవి తగలబడిన ఘటనపై నమోదైన కేసును పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నలుగురు సీఐలు, నలుగురు ఎస్సైలను ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేశారు. ఈ బృందాలు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో చేపట్టిన విచారణలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న దొండపాడు గ్రామానికి చెందిన తిప్పగుడిసె రాము అలియాస్ అర్లప్పను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తానే ఈ ఘటనకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. 23వ తేదీ ఉదయం సూపర్వైజర్ హనుమంతరావుకు ఫోన్ చేసి తనకు విరేచనాలు అవుతున్నాయని, సెలవు కావాలని అడగ్గా, షిఫ్ట్ మార్పు ఉన్నందున 24 గంటలు విధులు నిర్వహించాలని చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్తాపం చెందిన వాచ్మన్ రాము జనరేటర్లో డీజిల్ నింపడానికి ట్యాంకర్ వచ్చిన సమయంలో ఖాళీ బాటిల్తో పైపు ద్వారా డీజిల్ తీసి అక్కడ ఉన్న పైపుల మధ్య దాచి రాత్రి 8.45 గంటల సమయంలో డీజిల్ పోసి ఎండుగడ్డితో నిప్పింటించాడు. మంటలు వ్యాపించాక అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదని, చూపించే ప్రక్రియలో భాగంగా మంటలు లేని వైపు ఫొటోలు తీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేసి, తరువాత మంటలను వ్యాపించిన ఫొటోలు తీసి సమాచారం అందించాడు. పోలీసులు ఆ ఫొటోను నిశితంగా పరిశీలించగా, వెనుక మంటలు అంటుకున్నట్లు ఎర్రటి కాంతి కనబడడంతో నిందితుడిని గట్టిగా ప్రశ్నించారు. దీంతో నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. నిప్పు పెట్టి దానిని ఆర్పి వేసి, సిబ్బందిని పెంచాలని డిమాండ్ చేయవచ్చనే ఆలోచనతో ఈ నేరానికి పాల్పడ్డాడని నిందితుడు తెలిపాడని, అయితే ఈ కేసులో ఏదైనా కుట్ర కోణం ఉందా, ఎవరైనా ఇతరులు కూడా భాగస్వాములు అయ్యారనే దానిపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందన్నారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్, డీజిల్ తీయడానికి వాడిన పైపు, ఒక లైటర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ వ్యవహారాన్ని వైఎస్సార్సీపీ నేతలపై మోపేందుకు యత్నించిన టీడీపీ నేతలు అబాసుపాలయ్యారు. -
సీఆర్డీఏ కమిషనర్గా వి.విజయరామరాజు
తాడికొండ: ఏపీ సీఆర్డీఏ కమిషనర్గా వి.విజయరామరాజు శనివారం బాధ్యతలు చేపట్టారు. సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం ఐదవ ఫ్లోర్లోని కమిషనర్ చాంబర్లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆయన, సీఆర్డీఏ అదనపు కమిషనర్ ఎ.భార్గవతేజ, ఆఫీస్ మేనేజ్మెంట్ డైరెక్టర్ వల్లభనేని శ్రీనివాసరావు, ఇతర ముఖ్య అధికారుల సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. విజయ రామరాజుకు సీఆర్డీఏలోని అన్ని విభాగాల ముఖ్య అధికారులు బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతల స్వీకరణ అనంతరం సీఆర్డీఏలోని వివిధ విభాగాల ప్రధాన అధికారులతో కమిషనర్ సమావేశమయ్యారు. గుంటూరు వెస్ట్: గ్రూప్–2 ద్వారా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికై న పదిమంది అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా శనివారం నియామక పత్రాలు అందజేశారు. హరికృష్ణ, ఎం.మహేశ్వరరావు, ఎన్.హర్షవర్ధన్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, జి.ఉమాకాంత్, పి.రెడ్డి రాజా, టి.సుధాకర్, పి.వినయ్కుమార్, వై.అనిల్కుమార్, ఎస్.లక్ష్మీనారాయణ నియామక పత్రాలు అందుకున్న వారిలో ఉన్నారు. వీరంతా 12 రోజులపాటు శాఖాపరమైన శిక్షణకు హాజరు కావలసి ఉంటుందని జిల్లా కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో షేఖ్ ఖాజావలి పాల్గొన్నారు. నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : బాపట్ల జిల్లా చీరాలలో గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు శనివారం హోటళ్లు, దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. చీరాల పట్టణం కొత్తపేట బైపాస్లోని సాయి నందన కేఫ్లో తనిఖీలు చేయగా, మూడు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లు గుర్తించారు. అదే ప్రాంతంలోని డైమండ్ బేకరీలో తనిఖీ చేయగా, మరో రెండు గృహ వినియోగ సిలిండర్లు గుర్తించారు. ఐదు సిలిండర్లు స్థానిక సీఎస్డీటీ అధికారులకు అప్పగించారు. ఆయా దుకాణాల యజమానులపై 6ఏ కేసు నమోదు చేశారు. తనిఖీల్లో విజిలెన్స్, స్థానిక పౌరసరఫరాల శాఖ అధికారులు ఉన్నారు. నరసరావుపేట: జిల్లాలో ‘మనబడి–మన భవిష్యత్‘ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పాఠశాలల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో విద్యాశాఖ, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తక్కువ మరమ్మతులు అవసరం ఉండి, త్వరగా అందుబాటులోకి వచ్చే తరగతి గదులు, మరుగుదొడ్లుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ‘100 రోజులు–100 తరగతి గదులు’ గా నామకరణం చేస్తూ జూన్ 13న పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయిన పాఠశాలలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట, అత్యవసరంగా మరమ్మతులు అవసరమైన జిల్లా పరిషత్ హైస్కూళ్ల పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. -
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా కలెక్టర్ కృతికా శుక్లా బాధ్యతల స్వీకారం చిలకలూరిపేట: పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పురపాలక సంఘ కార్యాలయంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా తాగునీటి సరఫరా, వీధి దీపాలు, రోడ్లు, డ్రైన్ల నిర్వహణ, అమృత్ స్కీమ్ పనుల తీరు, పన్నుల వసూళ్లు, షాపుల అద్దెల వసూళ్లు, భవన నిర్మాణ అనుమతులు, బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్, ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్, టిడ్కో ఇళ్ల నిర్మాణం, గృహ నిర్మాణపథకాలు, జనన గణన, జనన మరణాల రికార్డుల పరిశీలనతో పాటు సంబంధిత అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు మున్సిపల్ సేవలు మరింత మెరుగ్గా అందించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు, మున్సిపల్ డీఈఈ షేక్ అబ్దుల్ రహీం, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణ క్రోసూరు: ఏపి ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు పాలిటెక్నిక్లలో ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్–2026 ప్రవేశపరీక్షకు క్రోసూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళశాలలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు కళశాల ప్రిన్స్పాల్ బి.వీ.రమాదేవి శనివారం తెలిపారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25న జరుగుతుందని, అందుకుగాను ఏప్రిల్ 4 వ తేదీ నుంచి 22 వ తేదీ వరకు ఎంట్రన్స్ రాసే విద్యార్థులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ కాలంలో విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందచేయబడుతుందన్నారు. పాలిసెట్ ఎంట్రన్స్కు దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 4 వ తేదీగా తెలిపారు. దరఖాస్తు చేసుకొనే వారు అధికారిక వెబ్సైట్ http://polycetap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. వివరాలకు 94903 43929, 96189 26798,72072 88540 లో సంప్రదించవచ్చునన్నారు. వరికోత మిషన్ తగిలి మహిళ మృతి మాచవరం: వరి కోత మిషన్ తగిలి మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని వేమవరం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పెరుగు నాగేంద్ర (60) తెల్లవారు జామున ఇంటి పనులు చేసుకునేందుకు ఇంటి ముందుకు రాగా, మాచవరం వైపు నుంచి తెలంగాణ వైపు వెళుతున్న వరి కోత మిషన్ ముందు భాగం నాగేంద్రం తలభాగానికి తగిలింది. ఘటనలో నాగేంద్ర తలకు తీవ్ర గాయం కాగా అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు . మృతురాలి కుమారుడు జానయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివాహిత ఆత్మహత్య యడ్లపాడు: చీరతో ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన యడ్లపాడులో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మృతురాలు షేక్ జిమ్మాబి(28)కి సుమారు ఎనిమిదేళ్ల కిందట ఫిరంగిపురానికి చెందిన షేక్ ఖాజావలితో వివాహం జరిగింది. వీరికి ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో నాలుగేళ్ల కిందట కుమారుడిని భర్త వద్ద వదిలివేసి పెదకాకానిలోని తన తల్లిదండ్రుల ఇంటికి చేరింది. ఈ నేపథ్యంలో ఆమె ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు గమనించిన తల్లిదండ్రులు ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించారు. మనస్తాపానికి గురైన జిమ్మాబి యడ్లపాడు వచ్చి ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటుంది. ఈ క్రమంలో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరెతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. నాగార్జునకొండను సందర్శించిన శ్రీలంక మంత్రి విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండను శనివారం శ్రీలంక దేశానికి బుద్ధ సేన రిలీజియస్, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి హిణిడుమ సునీల్ సేన్వి 21 దేశాలకు చెందిన బౌద్ధ భిక్షువులు విదేశీ ప్రతినిధులతో కలిసి సందర్శించారు. వీరు లాంచీలో నాగార్జునకొండకు చేరుకొని కొండలోని మ్యూజియంలో ఉన్న తొమ్మిది అడుగుల బుద్ధుని పాలరాతి విగ్రహం, బుద్ధుని పుట్టుకకు సంబంధించిన శిలా ఫలకాలు, రాతి పనిముట్లు, సింహళ విహార్, మహా స్థూపం, అశ్వమేధ యాగశాల, స్నానఘట్టం తిలకించి బౌద్ధ గురు దలైలామా నాటిన బోధి వృక్షం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. వీరికి నాగార్జునకొండ మ్యూజియం క్యూరేటర్ కమల్హాసన్ నాగార్జునకొండ చరిత్రను వివరించారు. -
ఇద్దరు బైకు దొంగలు అరెస్ట్
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): చెడు వ్యసనాలకు అలవాటు పడి వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న మైనర్ను, యువకుడిని నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 9 ద్విచక్ర వాహనాలు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నగరంపాలెం స్టేషన్లో శనివారం వెస్ట్ ఇన్చార్జి డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ... నగరంపాలెం స్టేషన్ పరిధిలో వాహనాల చోరీ ఫిర్యాదుల మేరకు సీఐ సత్యనారాయణ కేసు నమోదు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఆరా తీసి నిందితులను గుర్తించారు. గుంటూరు ఆటోనగర్కు చెందిన మైనర్ను నిందితుడిగా తేల్చారు. పల్నాడు జిల్లా పెదరెడ్డిపాలెంకు చెందిన గుర్రపుశాల మణికంట కుమార్ కూడా చోరీలను పాల్పడనట్లు గుర్తించారు. శనివారం ఉదయం గుంటూరులోని వీఐపీ రోడ్డులోని కె.వి.పి. కాలనీ నుంచి చుట్టుగుంట సెంటర్ వైపు వెళ్తున్న సమయంలో వారిని అరెస్టు చేశారు. -
శోభాయమానం
నగరంపాలెం: గుంటూరు నగర వీధుల్లో శ్రీరామనవమి శోభాయాత్ర శుక్రవారం కనులపండువగా నిర్వహించారు. శ్రీ రామనవమి పండుగ రోజున శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్న యాత్ర ఈ ఏడాది శుక్రవారం కూడా కొనసాగింది. జైశ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున భక్తులు నినదించారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానం వద్ద ప్రారంభమైన శోభాయాత్రను కనులారా తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. రథంలో వేంచేసిన శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి వార్లను దర్శించుకున్నారు. భక్తి గీతాలతో సందడి చేస్తూ వాహనాలపై ముందుకు కదిలారు. శ్రీరాముని భారీ ప్రతిమ యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారు యాత్రకు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా తాళ్ల్లాయ్యపాలెం శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు. శివస్వామి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా హిందూవులు ఏకం కావాలని అన్నారు. ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ తొమ్మిదేళ్లుగా శోభాయాత్రను నిర్వహించడం శుభపరిణామమని అన్నారు. శ్రీరామ ఉత్సవ సమితి గౌరవాధ్యక్షుడు కారంశెట్టి లోకేష్గుప్త యాత్ర విశేషాలను వివరించారు. శ్రీవెంకటేశ్వర దేవస్థానం వద్ద శోభాయాత్ర మొదలైంది. కుందల రోడ్డు మీదుగా పట్టాభిపురం, కంకరగుంట రైల్వే ఓవర్బ్రిడ్జి, నగరంపాలెం, హనుమాన్ సెంటర్, బస్టాండ్, పాతగుంటూరు, పట్నంబజార్లోని శ్రీకన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వైపుగా సంపత్నగర్ శ్రీరామనామ క్షేత్రం వద్ద ముగిసింది. ఈ యాత్రలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, భాష్యం హనుమంతురావు, వైద్యులు శనక్కాయల ఉమాశంకర్, బృందావన్గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, ఉత్సవ సమితి ముఖ్య కార్యకర్తలు వేణుగోపాల్, బ్రహ్మారెడ్డి, ఫణింద్ర, చరణ్, మధు, ప్రవీణ్ అంకారావు, జానకి, సుబ్బారావు, సంజీవ్, భక్తులు, హిందువులు, ప్రముఖ వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. శోభా యాత్రను ప్రారంభిస్తున్న శివస్వామి -
రాములోరి పురాతన నాణేలు
కారంచేడు: వివిధ దేశాలకు, ప్రాంతాలకు చెందిన నాణాలు, కరెన్సీ, స్టాంపులు వంటివి సేకరించడం అతని హాబీ. దీనిలో భాగంగా రాముని పరిపాలనా సమయంలో వినియోగించిన నాణేలను కూడా ఆయన సేకరించాడు. శుక్రవారం శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఆయన ఈ నాణేలను కారంచేడు కల్యాణ మండపం వద్ద ప్రదర్శనగా ఉంచాడు. వీటిని తిలకించేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వచ్చి వాటిని తిలకించి సీతారాములను పూజించుకుంటున్నారు. మండలంలోని ఆదిపూడి గ్రామానికి చెందిన కాలవ రఘురామయ్య 20 ఏళ్లుగా పురావస్తు వస్తువులు సేకరిస్తున్నట్లు తెలిపారు. 1762వ సంవత్సరంలో ‘యునైటెడ్ కింగ్ డమ్ లండన్ ఈస్ట్ ఇండియా’ సంస్థ తయారు చేసి వాడుకలోకి తీసుకొచ్చిన 250 గ్రాముల బరువుతో 2.50 పైసల నాణెంపై ఒకవైపు సీతారాములు, లక్ష్మణ, ఆంజనేయస్వామి వారి బొమ్మలు, మరో వైపు ఈస్ట్ ఇండియా సింబల్ను ముద్రించారు. 1818వ సంవత్సరంలో ముద్రించిన నాణెంపై ఒక వైపు సీతారాములు, లక్ష్మణ, ఆంజనేయ స్వామి వారి బొమ్మలు, మరో వైపు ఈస్ట్ ఇండియా సింబల్తో పద్మం ఉండే విధంగా తయారు చేశారు. దీని బరువు 150 గ్రాములు ఉంది. వీటిని సేవరించి తన ఖజానాలో భద్రపర్చడం జీవితంలో మర్చిపోలేని సంఘటని రఘరామయ్య తెలిపారు. -
బీసీ మహిళపై టీడీపీ కక్షసాధింపు చర్యలు
సత్తెనపల్లి: ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ చెందిన వారిపై టీడీపీ దాడులు పరాకాష్టకు చేరాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ వేముల శ్రీదేవి వైఎస్సార్ సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. ఈక్రమంలో తనపై కక్ష సాధింపు చర్యలగా కూటమికి చెందిన సత్తెనపల్లి నాయకులు తన పేరుతో ఫేస్ బుక్లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అసభ్యకర ఫొటోలు, వీడియోస్ క్రియేట్ చేశారని బాధితురాలు వాపోయింది. సత్తెనపల్లిలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. తనపై ఫేక్ అకౌంట్ క్రియేట్చేసిన వైనంపై గ్రీవెనన్స్లో నాలుగు సార్లు ఫిర్యాదు చేశానని.. అయితే నిందితులు నిజం ఒప్పుకున్నా పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా తనను దూషించి అవమానించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది ఇలా ఉంటే ఈనెల 25న రాత్రి సమయంలో తన ఇంటి మీదకి ఓ మహిళ, సుమారు 20 మంది పురుషులు వచ్చి ఒక్కసారిగా కళ్లలో కారం చల్లి, సభ్య సమాజం తలదించుకునే రీతిలో దుర్భాషలాడుతూ.. వైఎస్సార్ సీపీలోనే కండువా కప్పుకొని పార్టీలో తిరుగుతావా? వైఎస్సార్ సీపీకి అనుకూలంగా పోస్టులు పెడతావా? అంటూ మాట్లాడటానికి వీలు లేని పదజాలంతో దూషించి దాడి చేశారని ఆవేదన వెలిబుచ్చింది. తన భర్త శ్రీనివాసరావు సెంట్రింగ్ పనిచేస్తూ పని నుంచి వస్తుంటే అతనిపై కూడా దాడి చేశారని, ఎందుకు ఇలా దాడులు చేస్తున్నారో అర్థం కాక సత్తెనపల్లి రూరల్ పోలీస్స్టేషన్కి వెళ్లి తమపై టీడీపీకి చెందిన వారు దాడి చేసేందుకు వచ్చారని ఫిర్యాదు చేస్తే పోలీసులు తమ ఫిర్యాదును స్వీకరించకపోగా .. నువ్వేదో వాళ్లపై పోస్ట్ పెట్టావంట, వాళ్లను తిట్టావంట అంటూ తననే తిరిగి ప్రశ్నించారని, బెదిరించారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకేమాత్రం సంబంధ లేదంటూ మొత్తుకుంటున్నా.. వినకుండా.. తనపై దాడి చేసిన వారికి మాత్రం రాచమర్యాదలు చేసి కూర్చోబెట్టారని, ఇది ఎంతవరకు సమంజసమో అర్థం కావడం లేదని ఆమె ఆవేదన వెలిబుచ్చింది. దాడి చేసిన వారికే పోలీసులు కూడా సహకరిస్తున్నారని ఆవేదన వ్యక్త పరిచింది. ఇప్పటికై నా జరిగిన ఘటనలపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. -
అమరావతిలో వైభవంగా సీతారాముల కల్యాణం
అమరావతి: దక్షిణ కాశీ క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన అమరావతిలోని కోదండ రామ ఆలయంలో వేంచేసియున్న సీతాసమేత కోదండ రామ స్వామికి శుక్రవారం శ్రీరామ నవమి సందర్భంగా వైభవంగా కల్యాణం నిర్వహించారు. స్వామి వారిని తొలుత దేవాలయంలో ప్రత్యేకంగా అలంకరించిన మండపంపై ఉంచి కల్యాణం నిర్వహించారు. ఆలయ అర్చక స్వామి పరాశరం రామకృష్ణమా చార్యులు ఆధ్వర్యంలో వైఖానస ఆగమానుసారం వేడుక జరిపించారు. సత్తెనపల్లి: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియెట్ స్పాట్ వాల్యూయేషన్ సెంటర్లో కనీస సౌకర్యాలు లేవంటూ అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష పేపర్లు దిద్దేందుకు కనీసం కూర్చునేలా కూడా బల్లలు సరిపడా లేవని, భోజనాలు చేయటానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శుక్రవారం శ్రీరామ నవమి పర్వదినం కావడంతో కొందరు ముందస్తుగా బయటకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో బయట గేటుకు తాళాలు వేయడంతో అధ్యాపకులు గేట్ వద్దకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పరీక్ష కేంద్ర పర్యవేక్షకుడితో కొందరు అధ్యాపకులు వాగ్వివాదానికి దిగారు. గుంటూరు వెస్ట్: జిల్లా లోని 16 మండలాల్లో శనివారం వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించిందని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వడగాల్పులకు గురి కాకూడదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పనులు ఉంటే మినహా ఎవరూ బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. అత్యవసర పనులకు బయటకు వస్తే గొడుగు ఉపయోగించాలని, వదులు దుస్తులు ధరించాలని, తగినంత నీటిని తాగాలని సూచించారు. చిన్నారులు, వయసు మీరినవారు బయటకు వెళ్లకుండా కుటుంబ సభ్యులు చూడాలని చెప్పారు. డీ హైడ్రేషన్కు గురికాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధింత అధికారులు ప్రజలకు తగు సూచనలు, సలహాలు అందించాలని ఆదేశించారు. ప్రకృతి సాగును పరిశీలించిన నేపాల్ బృందం కొరిటెపాడు(గుంటూరు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, రైతు సాధికార సంస్థ (ఆర్వైఎస్ఎస్) సంయుక్తంగా వ్యవసాయ శాఖ ద్వారా నిర్వహిస్తున్న ‘ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం‘ (ఏపీసీఎన్ఎఫ్) పద్ధతులను నేపాల్ బృందం పరిశీలించింది. శుక్రవారం గుంటూరులోని రైతు సాధికార సంస్థ రాష్ట్ర కార్యాలయంలో ఆ సంస్థ సీఈఓ రామారావు సదరు బృందంతో సమావేశమయ్యారు. ఆర్వైఎస్ఎస్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయ్ కుమార్ వర్చువల్గా ప్రకృతి వ్యవసాయంలో అనుసరిస్తున్న విధానాలు, రైతులకు అందుతున్న ప్రోత్సాహం, పరస్పర సహకారం, భవిష్యత్తులో ఈ రంగంలో చేపట్టాల్సిన కార్యాచరణ వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఈ బృందం కొల్లిపర మండలం, అత్తట గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించింది. క్షేత్రస్థాయిలో సాగు పద్ధతులను ప్రత్యక్షంగా పరిశీలించింది. రైతు సాధికార సంస్థకు చెందిన కృష్ణారావు, ఎన్ఆర్ఓ యూనిట్ ఆధ్వర్యంలో పర్యటన కొనసాగుతోంది. -
మద్యం మత్తులో యువకులు హల్చల్
గోళ్ళపాడు(ముప్పాళ్ళ): మద్యం మత్తులో ముగ్గురు యువకులు ద్విచక్రవాహనం పై వస్తూ రహదారిపై ఆగిఉన్న లారీ డ్రైవర్ పై దాడిచేసి లారీ అద్దాలు పగలగొట్టిన సంఘటన నరసరావుపేట–సత్తెనపల్లి ప్రదాన రహదారిపై మండలంలోని గోళ్ళపాడు సమీపంలో గురువారం అర్ధరాత్రి జరిగింది. సంఘటనకు సంబంధించి పోలీసులు, లారీ డ్రైవర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామం నుంచి మొక్కజొన్న పొత్తుల లోడ్తో పోరుమామిళ్ళ బయలుదేరిన ఏపీ07టీజే1454 నెంబర్ లారీ గోళ్లపాడు గ్రామంలోని లోలెవల్ చప్టా దాటాక లారీలోని మొక్కజొన్న పొత్తుల బస్తాలు పక్కకి వరిగిపోవటంతో రహదారి పక్కన ఆపి సరిచేసుకుంటున్నారు. అదే సమయంలో ద్విచక్రవాహనం పై ముగ్గురు యువకులు నరసరావుపేట వైపు నుంచి వస్తూ ఆగి ఉన్న లారీ డ్రైవర్ ఎస్.నాగయ్య, క్లీనర్ నందిపాటి ప్రవీణ్కుమార్లను లారీ రోడ్డు పై ఆపావేంట్రా...అని గొడవపడి బూతులు తిడుతూ చేతులు, కాళ్లతో కొట్టడం ప్రారంభించారు. భయపడిన డ్రైవర్, క్లీనర్లు పరిగెత్తేందుకు యత్నిస్తుండగా అడ్డగించి మళ్లీ దాడికి దిగారు. అంతటితో ఆగకుండా రాళ్ళతో లారీ అద్దాలు, హెడ్లైట్ పగలకొట్టారు. భయపడిన లారీ డ్రైవర్, క్లీనర్లు పొలాల గుండా ముప్పాళ్ళ పోలీస్స్టేషన్ కు వెళ్లి పోలీసులకు సమాచారం అందించారు. జరిగిన సంఘటనపై లారీ డ్రైవర్ ఎస్.నాగయ్య అందించిన ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.అనిల్కుమార్ తెలిపారు. అర్ధరాత్రి ఆగి ఉన్న లారీ అద్దాలు ధ్వంసం -
విద్యార్థులు సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవాలి
చేబ్రోలు: విద్యార్థులు సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవాలని హైదరాబాద్లోని టీసీఎస్– ఇండస్ట్రీ సొల్యూషన్ యూనిట్ హెడ్ భీమశేఖర్ ఆత్మకూరు సూచించారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో చదువుతూ ఈ ఏడాది ప్రాంగణ ఎంపికల ద్వారా ఆయా సంస్థల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు శుక్రవారం సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతినెల ప్రచురించబోయే రీసెర్చ్ నెక్సస్ జర్నల్ను ఆవిష్కరించారు. యూనివర్సిటీలో ఈ ఏడాది మొత్తం 1100 మందికి పైగా విద్యార్థులు ప్రాంగణ ఎంపికల ద్వారా 100కు పైగా కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. 80 శాతం మంది విద్యార్థులు ఆయా సంస్థల్లో ఉద్యోగాలు పొందారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఉద్యోగాలు సాధించిన తల్లిదండ్రులను సన్మానించారు. టీసీఎస్– ఇండస్ట్రీ సొల్యూషన్ యూనిట్ హెడ్ భీమశేఖర్ మాట్లాడుతూ తల్లిదండ్రులను సత్కరించడం వెనుక ఉన్న భావం ఎంతో లోతైనదని, వారి త్యాగాన్ని గుర్తించే ప్రయత్నమని కొనియాడారు. శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రత్యేకతను సంతరించుకుందని, శ్రీరాముడు తన జీవితంలో ఎదురైన ప్రతి సవాలును అవకాశంగా మార్చుకుని విజయం సాధించినట్లే, విద్యార్థుల విజయాలు సాధించాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే ‘కోడ్ విటా’ పోటీలో విజ్ఞాన విద్యార్థి విజయం సాధించడం విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను పెంచిందన్నారు. విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య మాట్లాడుతూ విజ్ఞాన్ యూనివర్సిటీకి చెందిన 1100 మంది పిల్లలు ఇంత క్లిష్ట సమయంలో కూడా చాలా పెద్ద సంఖ్యలో మంచి ఉద్యోగాలు సాధించగలిగారని ఆనందం వ్యక్తం చేశారు. వీరు ఉద్యోగాలు సాధించడం వలన వాళ్ల కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయన్నారు. విజ్ఞాన్లో చేరే పిల్లల్లో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తున్నారనే ఉద్దేశంతో కేంబ్రిడ్జి యూనివర్సిటీ సహకారంతో ఆంగ్ల భాష నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేయడం, నాయకత్వ స్ఫూర్తి, సృజనాత్మకత, నైపుణ్యాలు పెంపొందించడం కోసం ప్రత్యేక శిక్షణలు కొనసాగించడం, విద్యార్థులతో అధ్యాపక బృందం నిరంతరం మద్దతుగా నిలబడటం లాంటి అంశాల వల్ల విద్యార్థులు విజయం సాధించగలిగారని వివరించారు. వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ఏఐ రాకతో మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు రావడం ఎంతో కష్టంగా ఉందని, కాబట్టి విద్యార్థులు ఎప్పటికప్పుడు స్కిల్స్ను పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఈఓ డాక్టర్ మేఘన కూరపాటి, ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీఎంవీ రావు పాల్గొన్నారు. టీసీఎస్– ఇండస్ట్రీ సొల్యూషన్ యూనిట్ హెడ్ భీమశేఖర్ ఘనంగా రీసెర్చ్ నెక్సస్ జర్నల్ ఆవిష్కరణ -
డివైడర్ను ఢీకొని బైకిస్టు మృతి
కృష్ణలంక(విజయవాడతూర్పు): అతివేగంగా వెళ్తు న్న ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ఒక యువకుడు దుర్మరణం చెందిన ఘటన కృష్ణలంక పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తాడేపల్లి మండలం గుండిమెడకు చెందిన మేడికొండ అన్వేష్(27), జెట్టి అజయ్(17), మేడికొండ అఖిల్బాబు (15), పల్నాడు జిల్లా దొడ్లేరు గ్రామానికి చెందిన ఈదులమూడి రాజ్కుమార్(24) స్నేహితులు. అజయ్, అఖిల్బాబు ఐటీఐ చదువుతుండగా అన్వేష్ పెయింటర్గా పనిచేస్తుంటాడు. రాజ్కుమార్ గుండిమెడలోని సోదరి ఇంటిలో ఉంటూ పెయింటింగ్ పనులకు వెళ్తుంటాడు. వీరు నలుగురు శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు సెల్ఫోన్ రిపేరు నిమిత్తం ఒకే ద్విచక్ర వాహనంపై గుండిమెడ నుంచి గవర్నర్పేటలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్కు బయలుదేరారు. ద్విచక్ర వాహనాన్ని రాజ్కుమార్ నడుపుతుండగా వెనుక అజయ్, తర్వాత అఖిల్, ఆ తర్వాత అన్వేష్ కూర్చున్నారు. మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో వారధి దాటి ట్రాఫిక్ సబ్ కంట్రోల్ సమీపానికి చేరుకోగానే అతివేగంగా వెళ్తున్న వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో నలుగురు కింద పడిపోయి రోడ్డుకు గుద్దుకున్నారు. అన్వేష్ తల పగిలి అక్కడికక్కడే మృతిచెందగా మిగిలిన ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ ముగ్గురిని అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం, అన్వేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఇదేం.. ప్రగతి?
చంద్రబాబు పాలనలో తెనాలి పట్టణంలో అభివృద్ధి జాడే కనిపించడం లేదు. నిధుల లేమి కారణంగా ఇప్పటికే ప్రతిపాదించిన పనులను కూడా రద్దు చేస్తున్నారు. గతంలో చేసిన పనులకు సంబంధించి బిల్లుల అప్లోడ్, బిల్లుల చెల్లింపులో పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రగతి మచ్చుకైనా లేదు. ఇదే కోవలో మున్సిపల్ కౌన్సిల్లో జనరల్ ఫండ్ కింద మంజూరు చేసిన పనులలో ప్రారంభం కాని వాటిని రద్దు చేసేందుకు అఽధికారులు సిద్ధమయ్యారు. కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించారు. సమస్యలను పరిష్కరించి ప్రగతిని పట్టాలెక్కించాల్సిందిపోయి పనులనే రద్దు చేస్తున్న సర్కారు తీరుపై తెనాలి వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెనాలి అర్బన్: తెనాలి పట్టణం 16.77 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీనిలో 55,917 నివాస గృహాలున్నాయి. 2.60 లక్షల జనాభాతో జిల్లాలోనే ఏకై క సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా పేరుగాంచింది. ప్రతి ఏడాది వివిధ పన్నులు, షాపుల అద్దెలు వంటి వాటి ద్వారా రూ.36 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఇవి కాకుండా 15వ ఆర్థిక సంఘం, ఇతర ప్రత్యేక గ్రాంట్ల ద్వారా సుమారు రూ.70 కోట్ల వరకు సమకూరుతుంటాయి. రద్దు కానున్న 214 పనులు అభివృద్ధి పనులు చేసేందుకు మున్సిపల్ సాధారణ నిధులతో పాటు వివిధ ఆర్థిక సంఘ నిధులు, ప్రత్యేక నిధులను ఉపయోగిస్తుంటారు. అయితే జనరల్ ఫండ్ కింద తెనాలి పట్టణంలో గత రెండు సంత్సరాలలో 500 పనులుకు టెండర్లు పిలిచారు. వాటిలో కొన్నింటిని పూర్తి చేయగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. అసలు ప్రారంభానికి నోచుకుని పనులు 107 ఉన్నాయి. వాటి విలువ రూ.11.69 కోట్లు, అలాగే అగ్రిమెంట్ దశలో ఉన్నవి 44 ఉన్నాయి. వాటి విలువ రూ.5.67 కోట్లు, టెండర్లలో కాంట్రాక్టర్లు పాల్గొనని పనులు 63 ఉన్నాయి. వీటి విలువ రూ.6.01 కోట్లు. వీటన్నింటిని రద్దు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల మున్సిపల్ అఽధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. అంతేకాకుండా సాధారణ నిధుల కొరత ఉన్నప్పుడు ఎందుకు టెండర్లు పిలుస్తున్నారని ప్రశ్నించారు. దీంతో అధికారులు పనులు ప్రారంభించని, టెండర్లు దక్కించుకుని అగ్రిమెంట్ చేసుకోని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అంతేకాకుండా డిపాజిట్ నగదును మున్సిపల్ బ్యాంకు ఖాతాలో జమ చేయాలనే భావనలో ఉన్నట్లు సమాచారం. దీనివల్ల తెనాలి పట్టణంలో సుమారు రూ.24 కోట్ల విలువ చేసే 214 అభివృద్ధి పనులు రద్దు కానున్నాయి. నిధుల లేమి.. బిల్లుల చెల్లింపులోజాప్యం జిల్లాలో ఏకై క సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న తెనాలిని నిధుల కొరత వేధిస్తోంది. వివిధ పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలకు, ఇతర అత్యవసర పనులకు ఉపయోగించటం వల్ల ప్రతి నెలా ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంది. కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేసిన వెంటనే కంప్యూటర్ ఆపరేటర్లు బిల్లులు తయారు చేసి నిధి యాప్లో పొందుపరచటం లేదు. కాంట్రాక్టర్లు వారి చుట్టూ ప్రదక్షిణలు చేయలేక టెండర్లను బహిష్కరిస్తూ వస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కూడా కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లింపులు జరపకపోవటంతో పనులు చేసేందుకు ముందుకు రావటం లేదు. టెండర్లు దక్కించుకున్నాక వాటిని ప్రారంభించకుండా వదిలేయటం తెనాలిలో పరిపాటిగా మారింది. తెనాలిలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతోంది. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి బిల్లుల తయారు చేయటంలో నెలకొన్న జాప్యాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. మున్సిపల్ సాధారణ నిధుల కింద గతంలో మంజూరై పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇస్తున్నాం. వారి వివరణ సంతృప్తికరంగా లేకపోతే డిపాజిట్లను మున్సిపాలిటీకి జమ చేస్తాం. అలాగే ఆ పనులన్నింటినీ రద్దు కూడా చేయనున్నాం. నిధుల కొరత కారణంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక నుంచి జనరల్ ఫండ్ కింద అభివృద్ధి పనులు కొంత కాలం నిలిపివేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. –జేఆర్ అప్పలనాయుడు, కమిషనర్, తెనాలి పురపాలక సంఘం -
ఘనంగా ప్రపంచ రంగస్థల దినోత్సవం
తెనాలిటౌన్: తల్లి జన్మనిస్తే తనకు రంగస్థలం జీవితాన్నిచ్చిందని మా–ఏపీ వ్యవస్తాపకులు, సినీదర్శకుడు దిలీప్ రాజా అన్నారు. స్థానిక చెంచుపేటలోని ఆలపాటినగర్లో గల మా–ఏపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ప్రపంచ రంగస్థల దినోత్సవం నిర్వహించారు. పెదరావూరు ఫిలిం స్టూడియోస్ మేనేజర్ పినపాటి సురేష్బాబు అధ్యక్షత వహించారు. మా–ఏపీ వ్యవస్థాపకులు, సినీదర్శకుడు దిలీప్రాజా మాట్లాడుతూ ప్రపంచ రంగస్థల దినోత్సవం నేపథ్యాన్ని వివరించారు. నాటి నటుడు శివాజి గణేశ్ నుంచి కోట శ్రీనివాసరావు వరకు రంగస్థలం నుంచి వెండితెరపై రాణించారని ఆయన వివరించారు. మేకప్ వేసుకునే ప్రతి నటీనటుడు మార్చి 27న ప్రపంచ రంగస్థల దినోత్సవం నిర్వహించాల్సిన నైతిక భాధ్యత ఉందన్నారు. రంగస్థల నటులు దేవిశెట్టి కృష్ణారావు, వసంత యామి ని, చందు సూర్యను ‘మా–ఎపీ’ సత్కరించింది. తమకు జరిగిన సత్కారానికి సన్మాన గ్రహీతలు ‘మా–ఏపీ’కి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో దర్శకుడు అచ్చన శ్రీనివాస్ యాదవ్, కాస్ట్యూమ్ డిజైనర్ పార్వతి పట్నాల, సూర్యనారాయణ, మంచాల కిషోర్బాబు తదితరులు పాల్గొన్నారు. -
అంధుల క్రికెట్ పోటీల్లో ఆంధ్ర జట్టు ఘన విజయం
ఫైనల్స్లో 5–0 తేడాతో మధ్యప్రదేశ్పై ఘన విజయం గుంటూరు వెస్ట్ (క్రీడలు): అంధుల క్రికెట్ టోర్నమెంట్లోమధ్యప్రదేశ్పై ఆంధ్ర జట్టు 5–0 తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు రోజులుగా స్థానిక అరండల్పేటలోని పిచ్చుకులగుంట క్రీడా మైదానంలో క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ (సీఏబీఏపీ), డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ అంధుల క్రికెట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అంధుల క్రికెట్ ఇన్క్లూజివ్ చాలెంజర్స్ ట్రోఫీ‘ టీ20 బైలాటరల్ సిరీస్ను ఆంధ్ర జట్టు ఏకపక్ష విజయాలతో కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్స్లో జట్టు సమిష్టిగా ఆడి విజయం నమోదు చేసింది. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ పోటీతత్వం ముందు అంధత్వం ఓటమి పాలైందని పేర్కొన్నారు. యువ క్రీడాకారులకు ఈ విజయం ఎంతో స్ఫూర్తినిస్తుందని చెప్పారు. దృష్టి లోపం ఉన్నా, గుండె నిండా ధైర్యంతో మైదానంలో ప్రదర్శించిన పోరాట పటిమ అద్భుతమన్నారు. విజేతలతోపాటు రన్నర్స్కు ట్రోఫీలతోపాటు నగదు బహుమతులు అంజేశారు. అంతర్జాతీయ అంధుల మాజీ క్రికెటర్ అజయ్కుమార్ రెడ్డి, ఎస్బీఐ డీజీఎం కృష్ణకుమార్, వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వెంకటరమణప్ప, ఏఐబీఓిసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జయకుమార్, వీసీవైఏ అధ్యక్షుడు ఎల్.రత్నరాజ్ పాల్గొన్నారు. -
గుంటూరు
శనివారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.5884 టీఎంసీలు. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 536.30 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 18,516 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7500, గరిష్ట ధర రూ.9200, మోడల్ ధర రూ.8400 వరకు పలికింది. 7 -
హ్యాండిల్ లాక్ విరగతీసి.. ఇంజిన్ వైర్లు కలిపి..
నరసరావుపేట టౌన్: పట్టపగలు జనసంచారం.. ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా.. ఇద్దరు అగంతకులు సినిమా స్టయిల్లో బైక్ చోరీకి పాల్పడ్డ ఘటన పట్టణంలో కలకలంరేపింది. నిమిషాల వ్యవధిలో హ్యాండిల్ లాక్ను విరగదీసి.. ఇంజిన్వైర్లు కలిపి బైక్ స్టార్ట్ చేసుకొని దర్జాగా అక్కడ నుంచి జారుకున్నారు. వివరాల్లోకెళ్లితే... వెంగళరెడ్డి కాలనీకు చెందిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి సయ్యద్ ఉస్మాన్ ప్రకాష్నగర్ ఓవర్ బ్రిడ్జి ఎంట్రన్స్ వద్దగల హోటల్ ఎదుట శుక్రవారం ద్విచక్రవాహనాన్ని నిలిపాడు. కొద్దిసేపటి తర్వాత వచ్చి చూడగా వాహనం కనిపించలేదు. ఈ మేరకు వన్టౌన్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని హోటల్ వద్ద ఉన్న సీసీ పుటేజ్ను పరిశీలించారు. అందులో ఇద్దరు ఆగంతకులు ద్విచక్రవాహనాన్ని చాకచక్యంగా దొంగలించుకొని వెళ్లినట్లు గుర్తించారు. మొదట ఓ యువకుడు బైక్ దగ్గర చుట్టూ చూసుకుంటూ నిలబడ్డాడు. అనుమానం రాకుండా ఫోన్లో మాట్లాడుతున్నట్లు నటించాడు. కొద్దిసేపటికి మరో యువకుడు అక్కడికి చేరుకున్నాడు. ఆ తర్వాత వాహన హ్యాండిల్ లాక్ను విరగతీశాడు. అనంతరం ఇంజన్కు సంబంధించిన వైర్లు కలిపి స్టార్ట్చేసి అపహరించుకొని దర్జాగా వెళ్లారు. ఈ దృశ్యం అంతా సీసీ పుటేజ్లో నిక్షిప్తమై ఉంది. వాటిని స్వాధీనం చేసుకొని నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టపగలు జనసంచారం ఉన్న ప్రాంతంలో యదేచ్ఛగా ద్విచక్రవాహనాలు చోరీకి పాల్పడటంతో వాహన యజమానులు ఆందోళన చెందుతున్నారు. -
ఉత్సాహంగా శ్రీరాముని శోభాయాత్ర
జనసందోహంగా మారిన నగర పుర వీధులు నగరంపాలెం: శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం పాతగుంటూరు మణిహోటల్ సెంటర్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానం వద్ద శోభాయాత్ర ప్రారంభించారు. ఏపీ ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్, తూర్పు ఎమ్మెల్యే నసీర్అహ్మద్లు హాజరై ప్రారంభించారు. మణిహోటల్ సెంటర్ వద్ద ప్రారంభమైన శోభాయాత్ర బాలాజీనగర్, శ్రీరాధాకృష్ణ మందిరం, పాత గుంటూరు, యాదవబజార్, పాతగుంటూరు ఆంజనేయస్వామి గుడి, బీఆర్.స్టేడియం, పాత బస్టాండ్ జిన్నాటవర్, నగరంపాలెం, జూట్మిల్, పట్టాభిపురం, బృందావన్గార్డెన్, లక్ష్మీపురం, లాడ్జిసెంటర్, అమరావతిరోడ్, నగరాలు, గోరంట్ల శ్రీపద్మావతి అండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం వరకు కొనసాగింది. శ్రీరామ ఉత్సవ సమితి అధ్యక్షులు అంకరాజు శశాంక్శర్మ ఆధ్వర్యంలో జరగ్గా, సభ్యులు భూపతి ఈశ్వరరావు, యడ్ల హిమగిరి పాల్గొన్నారు. శిల్పారామంలో స్టాళ్ల కోసం సంప్రదించండి గుంటూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఇన్నర్ రింగ్రోడ్డులోని శిల్పారామంలో సందర్శకులను ఆకర్షించే ఆటవస్తువులు, సాహస క్రీడలు, ఈవెంట్ల నిర్వహణ కోసం ఆసక్తిగల ఏజెన్సీలను ఆహ్వానిస్తున్నామని శిల్పారామం నిర్వాహకుడు ప్రసాదరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చేనేత స్టాళ్ల నిర్వహణకు, హస్తకళల విక్రయాలు, ప్రదర్శనల కోసం ఖాళీ స్థలాన్ని కేటాయించేందుకు సమర్థులైన అర్హత కలిగిన ఏజెన్సీలను ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ అవకాశం ఏప్రిల్ 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకూ మాత్రమే ఉన్నదని తెలిపారు. మరిన్ని వివరాలకు 8886652023, 8886652012 సెల్ నంబర్లను సంప్రదించాలన్నారు. వాగు ఒడ్డున పురాతన ఆంజనేయస్వామి విగ్రహం రొంపిచర్ల: స్థానిక చపా రపు సుబ్బారెడ్డి కాలనీ సమీపంలోని చప్టా వద్ద పురాతన కాలం నాటి ఆంజనేయస్వామి విగ్రహాన్ని శుక్రవారం స్థానికులకు కనుగొన్నారు. విగ్రహం ఆనవాళ్లతో పురాతనమైనదిగా భావిస్తున్నారు. మూ డు రోజుల కిందట రాత్రి సమయాల్లో జేసీబీ ఆ ప్రాంతంలో సంచరించటం స్థానికులు చూశారు. విగ్రహం ముఖ భాగం కనిపించకుండా ఉండటంతో స్థానికులు తొలుత దానిని రాయిగా భావించారు. శుక్రవారం గ్రామస్తులు కొందరు రాయిని దొర్లించగా విగ్రహం కనిపించింది. విగ్రహం ముక్కు, ఛాతీ, మొఖం, గధ ప్రాంతాల్లో దెబ్బతిన్నట్లు గుర్తించారు. జేసీబీ బక్కెట్లో విగ్రహాన్ని ఉంచి ఇక్కడకు తీసుకొచ్చి పడవేసినట్లు భావిస్తున్నారు. ఆ సమయంలోనే విగ్రహం ధ్వంసం అయినట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు ఆ విగ్రహాన్ని గుడిలోకి చేర్చి పూజలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి వినుకొండ: రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా ఇరువురికి గాయాలయ్యాయి. వినుకొండ – వెల్లటూరు మధ్యలో ఉన్న కురవ దగ్గరలోని పార్కు సమీపంలో గురువారం రాత్రి ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన చింతపల్లి వెంకటేశ్వర్లు (27) మృతిచెందగా మరో ఇద్దరు హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. మృతుడు చింతపల్లి వెంకటేశ్వర్లుకి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. వెంకటేశ్వర్లు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
జాతీయ ఆర్చరీ పోటీలు ప్రారంభం
పెదకాకాని: నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెరుకూరి లెనిన్ వోల్గా మెమోరియల్ నేషనల్ ఆర్చరీ చాంపియన్షిప్ పోటీలు శుక్రవారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. పోటీలు ఏప్రిల్ 7వ తేదీ వరకు విశ్వవిద్యాలయం క్యాంపస్లో జరగనున్నాయి. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 2,300 మంది ఆర్చరీ క్రీడాకారులు, కోచ్లు రానున్నారు. అండర్ 10, అండర్ 13, అండర్ 15 విభాగాలుగా నిర్వహించనున్న పోటీలలో తొలి రోజున 723 మంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ నందమూరి తేజస్విని, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ (శాప్) ఎండీ ఎస్.భరణి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్షీశా, వీవీఐటీయూ చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్లు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వర్సిటీ చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ ఆర్చరీ వంటి క్రీడలు విద్యార్థులలో ఏకాగ్రతను, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని చెప్పారు. అలాంటి పోటీలకు తమ విశ్వవిద్యాలయం వేదిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వై. మల్లికార్జునరెడ్డి, ఇండియన్ ఆర్చరీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సత్యనారాయణ, పీడీ ఎన్. అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రామాలయాన్ని నిర్మించిన ముస్లిం భక్తుడు
మాచర్ల రూరల్: భద్రాద్రి శ్రీ సీతారామ దేవస్థాన నిర్మాణంలో భక్త రామదాసు ఆలయాన్ని నిర్మించి తన స్వామి భక్తిని చాటుకుంటే.. మాచర్ల మండలం జమ్మలమడకలో ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి రామాలయాన్ని నిర్మించి రామభక్తిని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన షేక్ సైదా సాహెబ్ 1996 సంవత్సరంలో గ్రామ శివారులోని సుమారు ఎకరం స్థలంలో శ్రీసీతారామాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టి మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన తన భక్తిని చాటుకున్నాడు. ముస్లిం వ్యక్తివి.. హిందూ దేవుళ్లకు చెందిన రామాలయాన్ని నిర్మించటమేటంటూ పెద్దలు వారించినా వినకుండా శ్రీరామునిపై తనకున్న భక్తిని విడవకుండా ఆలయాన్ని నిర్మించాడు. సైదా సాహెబ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు సైతం ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావటం విశేషం. సుమారు 8సంవత్సరాల క్రితం అనారోగ్యంతో షేక్ సైదా సాహెబ్ ఆలయ ప్రాంగణంలోనే మృతిచెందాడు. సాహెబ్ భక్తి భావాన్ని ఆదర్శంగా తీసుకొని.. ఆయన్ను తలచుకుంటూ గ్రామస్తులంతా ప్రతి ఏడాది కులమతాలకు అతీతంగా పెద్ద ఎత్తున శ్రీరామనవమి వేడుకలను నిర్వహిస్తుంటారు.ఆలయాన్ని నిర్మించి మతసామరస్యం చాటిన సైదా సాహెబ్ -
విద్యాభివృద్ధిలో గ్రంథాలయాల పాత్ర కీలకం
మంగళగిరి టౌన్: విద్యార్థుల విద్యాభివృద్ధికి గ్రంథాలయాలు కీలకమని కేఎల్యూ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎన్.ప్రవీణ పేర్కొన్నారు. మంగళగిరి మండలం నూతక్కి గ్రామంలోని గ్రంథాలయానికి గురువారం ఎన్ఎస్ఎస్ వలంటీర్లు రంగులు వేసే కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రంథాలయ భవనంలో రంగులు వేయడంతో పాటు గోడలపై విద్యాపరమైన, స్ఫూర్తిదాయకమైన చిత్రాలను చిత్రీకరించారు. గ్రంథాలయాలు శుభ్రంగా, అందంగా తీర్చిదిద్దడం విద్యార్థులు, పాఠకులు, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమేనని ప్రవీణ అన్నారు. తద్వారా గ్రంథాలయానికి ప్రజలు ఆకర్షితులవుతారని.. పుస్తక పఠనంపై ఆసక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్టూడెంట్ అఫైర్స్ డీన్ డాక్టర్ కేఆర్ఎస్ ప్రసాద్, ఎన్ఎస్ఎస్ ప్రోగాం కో ఆర్డినేటర్ డాక్టర్ పి.శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు. సమన్వయకర్తగా ఫీల్డ్ కో ఆర్డినేటర్ పి. సురేష్ వ్యవహరించారు. మంగళగిరి టౌన్: బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని మంగళగిరి ఎంఈఓ–2 బాబు తల్లిదండ్రులకు సూచించారు. మంగళగిరి పట్టణ పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు అడ్మిషన్లను ఇచ్చారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. నూతన విద్యావిధానం, తల్లికి వందనం, మధ్యాహ్న భోజనం, పుస్తకాల పంపిణీ వంటి వాటిని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఎంటీఎంసీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో అర్హులైన ఉపాధ్యాయులతో పూర్తిస్థాయిలో 1 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బోధన జరుగుతోందని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ–1 ఉషాకుమారి, వివిధ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, ఉషాలక్ష్మి, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తాడికొండ: అమరావతిలో 11 లక్షల చదరపు అడుగుల్లో అసెంబ్లీ నిర్మాణం జరుగుతుందని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలో అసెంబ్లీ నిర్మాణంలో సెంట్రల్ హాలుకు పైలింగ్ పనులను ప్రత్యేక పూజలు చేసి మంత్రి నారాయణ గురువారం ప్రారంభించారు. నారాయణ మాట్లాడుతూ.. బీ+జీ+3 అంతస్తుల్లో అసెంబ్లీ నిర్మిస్తున్నామన్నారు. భవనం పైన 250 మీటర్ల ఎత్తులో టవర్ ఉంటుందని తెలిపారు. సందర్శకులు టవర్ పైకి వెళ్లి అమరావతి మొత్తం చూసేలా డిజైన్ చేశామని అన్నారు. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా భవనం డిజైన్ చేసినట్లు వెల్లడించారు. అసెంబ్లీ భవనాన్ని నాలుగు భాగాలుగా విభజించి నిర్మాణం చేస్తున్నారని చెప్పారు. మంత్రి వెంట అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాస్, అధికారులు ఉన్నారు. తాడికొండ: భాష, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని సందర్శించి ఆయన నివాళులర్పించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ.. తమిళనాడు ప్రభుత్వంపై ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజులు దీక్ష చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని గుర్తుచేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు విగ్రహ నిర్మాణానికి సహకరిస్తున్న ట్రస్ట్కు అభినందనలు తెలిపారు. ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దుండి రాకేష్ మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు జీవిత చరిత్రను తెలియజేయడం కోసమే ఈ విగ్రహం ఏర్పాటు చేసినట్లు వివరించారు. విజయపురిసౌత్: అంతరాష్ట్ర సరిహద్దు ప్రాంతం నాగార్జునసాగర్ వద్ద రవాణా శాఖ, పోలీస్, ఫైర్ అధికారుల ఆధ్వర్యంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులలో గురువారం తనిఖీలు నిర్వహించారు. మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. డ్రంకన్న్ డ్రైవ్, ఫిట్నెస్, ఇన్సురెన్స్, పర్మిట్ పత్రాలను పరిశీలించారు. నిబంధనలు పాటించని వాహనాలపై కఠినంగా వ్యవహరిస్తావని అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల రూరల్ సీఐ నఫీజ్ బాష, ఎంవీఐ శేషారెడ్డి, విజయపురి సౌత్ ఎస్సై అశోక్ పాల్గొన్నారు. -
జిల్లా ఎస్పీ కార్యాలయంలో నూతన భవనాలు
నగరంపాలెం: జిల్లా పోలీస్ శాఖకు పీజీఆర్ఎస్, మినీ హాల్ నూతన భవనాలను అప్పగించడం ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారని వీఐటీ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు, చాన్సలర్ డాక్టర్ జి.విశ్వనాథన్ అన్నారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో వీఐటీ–ఏపీ విద్యా సంస్థల సహకారంతో నిర్మించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్), మినీ హాల్ నూతన భవనాల శిలఫలకాలను వీఐటీ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు, చాన్సలర్ డాక్టర్ జి.విశ్వనాథన్, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్లు ఆవిష్కరించారు. వేద మంత్రాల నడుమ ఈ భవనాలను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. కార్యక్రమంలో వీసీ డాక్టర్ అరుల్మౌళివర్మన్, రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్చంద్ర, జిల్లా ఏఎస్పీలు జి.వి.రమణమూర్తి (పరిపాలన), హనుమంతు (ఏఆర్), డీఎస్పీలు శ్రీనివాసులు (ఎస్బీ), అలహరి శ్రీనివాస్, సంకురయ్య (ఏఆర్), ఏఆర్ ఆర్ఐలు సురేష్బాబు, రామకృష్ణారెడ్డి, శివరామకృష్ణ , శ్రీహరిరెడ్డి, రామకృష్ణారెడి, పలువురు సీఐలు, వీఐటీ–ఏపీ యాజమాన్య సభ్యులు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవానికి రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్గుప్తా హాజరు కాలేదు. మార్కాపురంలో జరిగిన బస్ ప్రమాదం దృష్ట్యా అత్యవసరంగా అక్కడకెళ్లారని కార్యాలయపు వర్గాలు పేర్కొన్నాయి. -
రాయగడ ఎక్స్ప్రెస్లో చోరీ కేసులో నిందితుల అరెస్టు
లక్ష్మీపురం: రాయగడ ఎక్స్ప్రెస్లో బ్యాగు చోరీ చేసిన తల్లి, కొడుకులను రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే జీఆర్పీ సీఐ వీరబాబు వెల్లడించారు. గురువారం గుంటూరు రైల్వే జీఆర్పీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఆర్పి సీఐ వీరబాబు వివరాలు వెల్లడించారు. ఈనెల 19న రాయగడ ఎక్స్ప్రెస్లో విశాఖ పట్నంకు చెందిన సిద్ధాంతి పద్మావతి, భర్త, బంధువులతో కలిసి రైలులో ప్రయాణిస్తున్నారు. 20వ తేదీ తెల్లవారు జామున సుమారు 3.50 గంటల సమయంలో మంగళగిరి వచ్చేసరికి సామగ్రిని పరిశీలించగా హ్యాండ్ బ్యాగ్ కనిపించలేదు. బ్యాగులో 26 గ్రామలు బంగారు చైన్తో పాటు రూ.7వేల నగదు ఉండగా.. భోగిలో వెతుకులాడారు. కనిపించకపోవడంతో ఈనెల 24వ తేదీన జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే ఏఎస్సీ శైలేష్ కుమార్, ఆదేశాల మేరకు గుంటూరు డీఎస్ఆర్పీ అక్కేశ్వరరావు పర్యవేక్షణలో జీఆర్పీ సీఐ వీరబాబు, ఆర్పీఎఫ్ పోలీసుల ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో పాత నేరస్తుల వివరాలు తీసుకొని యాక్టివ్గా ఉన్న పాత నేరస్తులను విచారించగా.. విజయవాడకు చెందిన చెన్నాడా వినోద్ కుమార్ దొంగతనం చేసినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో గురువారం ఉదయం 9.40 నిమిషాలకు గుంటూరు రైల్వే స్టేషన్ లోని ఈస్ట్ సైడు రైల్ కోచ్ రెస్టారెంట్ వద్ద ముద్దాయి చెన్నాడ వినోద్ కుమార్ దొంగతనం చేసిన బంగారు గొలుసును అమ్మడానికి తన తల్లి చెన్నాడ నాగరాణి అలియాస్ మైలా నాగరాణి, అలియాస్ గోపిశెట్టి నాగరాణితో కలిసి అక్కడ సంచరిస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బంగారు చైన్ను, రూ.2వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో ఆర్పీఎస్ఐ మహబూబ్ సుభాని, కానిస్టేబుళ్లు వలి, మస్తాన్, ఆర్పీఎఫ్ సీఐబీ ఇన్స్పెక్టర్ వీరబాబు, శంకర్, ఇతర సిబ్బంది కీలక పాత్ర పోషించారని డీఎస్పీ అక్కేశ్వరరావు తెలిపారు. వారిని ప్రత్యేకంగా అభినందించారు. దొంగిలించిన బంగారం అమ్ముతున్న తల్లీకొడుకులను అరెస్టు చేసిన రైల్వే పోలీసులు -
జిల్లా అదనపు ఎస్పీ సంతోష్
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగ్ యాప్లతో జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బెట్టింగ్లతో ఆర్థికంగా నష్టపోతారన్నారు. ఎటువంటి లాభం ఉండదని చెప్పారు. అంతేగాక అప్పుల ఊబిలోకి కూరుకుపోతారని పేర్కొన్నారు. బెట్టింగ్లతో సమయం వృధా చేసుకోవద్దని, యువత ఉన్నత స్థాయికి చేరేందుకు తమ సమయం ఉపయోగించాలని తెలిపారు. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే డయల్ 112 లేదా స్థానిక పోలీస్స్టేషన్లల్లో సమాచారం అందించాలని అన్నారు. ఈనెల 28 నుంచి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభం దృష్ట్యా ఆన్లైన్, ఆఫ్లైన్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రధానంగా యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. డబ్బులు పోగొట్టుకుని మానసిక ఒత్తిడికి గురై, నిరాశ, ఆత్మన్యూనత భావాలతో చివరికి ఆత్మహత్యా ప్రయత్నాలకు దారితీస్తాయని పేర్కొన్నారు. కొనసాగుతున్న విజిలెన్స్ తనిఖీలు నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : ఉమ్మడి జిల్లాలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వినియోగించే హోటళ్లు, దుకాణాలపై గుంటూరు ప్రాంతీయ విజిలెన్న్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగపు ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం గుంటూరు జిల్లాలోని నల్లపాడు, చేబ్రోలు, పొన్నూరు పట్టణంలో చేపట్టారు. గుంటూరు రూరల్ మండలం నల్లపాడు హోసన్న మందిరం ఎదురు బెంగళూరు అయ్యం గారి బేకరిలో మూడు గృహ ఎల్పీజీ సిలిండర్లు, చేబ్రోలు మండలం మంచాల గ్రామం శ్రేష్టా కేఫ్ ఫుడ్ కోర్ట్లో నాలుగు సిలిండర్లు, పొన్నూరు టౌన్ ఫ్రెండ్ టీ ప్యాలెస్లో ఐదు గృహ ఎల్పీజీ సిలెండర్లు, ఎస్ఎస్వీ టీ కేఫ్లో మూడు సిలిండర్లను గుర్తించారు. ఈ మేరకు స్థానిక సీఎస్డీటీలకు 15 సిలిండర్లు అప్పగించారు. ఈ మేరకు యజమానులపై నాలుగు 6–ఎ కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, స్థానిక పౌరసరఫరాల శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా విడుదల
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాలలో పలు ఉద్యోగాలను కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జనరల్ డ్యూటీ అటెండెంట్ ఉద్యోగాలు 85, ఆఫీస్ సబార్డినేట్స్ 26, ల్యాబ్ టెక్నీషియన్స్ 20, ల్యాబ్ అటెండెంట్ 10, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ 8, ఇలా 27 రకాల ఉద్యోగాలు జీజీహెచ్, వైద్య కళాశాలలో భర్తీ చేస్తున్నామన్నారు. ఉద్యోగాలకు ఆసక్తి, అర్హత ఉన్నవారు ఏప్రిల్ 2న సాయంత్రం 5 గంటల్లోపు తమ దరఖాస్తులను గుంటూరు మెడికల్ కళాశాలలో అందజేయాలన్నారు. డిస్ట్రిక్ట్ సెక్షన్ కమిటీ ద్వారా ఉద్యోగాల భర్తీ జరుగుతోందన్నారు. విద్యార్హతలు, వేతనాలు, ఇతర వివరాల కోసం http: guntur.ap.gov.in లేదా www. gunturmedicalcollege.edu.in గుంటూరు మెడికల్ కాలేజ్.ఈడీయూ.ఇన్ వెబ్సైట్లో చూడాలన్నారు. ఏప్రిల్ 13న ఉద్యోగాలకు ఎంపికై న వారి ప్రొవిజనల్ మెరిట్ లిస్టును ప్రదర్శిస్తామన్నారు. నరసరావుపేట టౌన్: చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ నేషనల్ రీసెర్చ్ కమిటీ సభ్యుడిగా నరసరావుపేట కు చెందిన ప్రముఖ ఆడిటర్ చేకూరి సాంబశివరావు ఎంపికయ్యారు. ఈ మేరకు నియామాక పత్రాన్ని గురువారం రీసెర్చ్ కమిటీ చైర్మన్ విశాల్ దోషి చేతుల మీదుగా అందుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 12న 449వ కౌన్సిల్ సమావేశం నిర్వహించటం జరిగిందన్నారు. కౌన్సిల్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం అధ్యక్షుడు రీసెర్చ్ కమిటీ 2026–27 పునఃవ్యవస్థీకరించారన్నారు. -
గుంటూరు
శుక్రవారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2026సౌర ప్యానళ్ల వితరణ అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2,400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.5884 టీఎంసీలు.తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7,000, గరిష్ట ధర రూ.9,000, మోడల్ ధర రూ.8,000 వరకు పలికింది.గుంటూరు వెస్ట్ (క్రీడలు): స్థానిక బీఆర్ స్టేడియం ప్రాంగణంలో రూ.14 కోట్లతో నిర్మించనున్న బహుళ ప్రయోజన ఇండోర్ స్టేడియానికి కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు అంతస్తులుగా నిర్మిస్తున్న ఈ స్టేడియంలో తొమ్మిది బ్యాడ్మింటన్ కోర్టులు, స్క్వాష్, టెన్నిస్ సహా ఆరు క్రీడా అంశాలలో వసతులు ఏర్పాటు కానున్నాయని పేర్కొన్నారు. స్టేడియంలోని క్రికెట్ మైదానాన్ని ఏడాదిన్నర కాలంలో అభివృద్ధి చేస్తామన్నారు. రూ.170 కోట్లతో మొత్తం స్టేడియం డీపీఆర్లు తయారు చేశారని వివరించారు. జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, తూర్పు శాసన సభ్యులు నసీర్ అహ్మద్లు మాట్లాడారు. కమిషనర్ మయూర్అశోక్, ఎమ్మెల్సీ ఆలపాటి, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, రాష్ట్ర క్రీడా సాధికార సంస్థ చైర్మన్ రవి నాయుడు, వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ భరణి, మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర, మాజీ డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, డీఎస్డీఓ అఫ్రోజ్ ఖాన్ పాల్గొన్నారు. సత్తెనపల్లి: రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సత్తెనపల్లి మండల న్యాయసేవాధికార కమిటీ చైర్మన్ వి.విజయ్కుమార్ రెడ్డి సూచనల మేరకు పట్టణంలోని నరసరావుపేట రోడ్డులో ఉన్న పరివర్తన మానసిక దివ్యాంగుల పాఠశాలను గురువారం సత్తెనపల్లి సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్,)జె. సుజన్కుమార్ సందర్శించారు. ముందుగా అక్కడ ఉన్న విద్యార్థుల వసతి గృహం, వంటశాలను పరిశీలించారు. ఆహార నాణ్యతను ప్రత్యేకంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు బి.ఎల్. కోటేశ్వరరావు, గంటా వెంకటశివ, పారా లీగల్ వలంటీర్ షేక్ సుభాని, పాఠశాల నిర్వాహకుడు కొరబండి కిషోర్బాబు ఉన్నారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 536.60 అడుగులకు చేరింది. ఇది 181.3178 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 8,023, ఎడమ కాలువకు 8,718, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 8,473, ఎస్ఎల్బీసీకి 2,000, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. తాడేపల్లి రూరల్ : రాజధాని ముఖద్వారమైన మంగళగిరి నియోజకవర్గంలో సీతానగరంలో ప్రభుత్వ భూములు కనిపిస్తే చాలు కొంతమంది నాయకులు కన్నేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. రూ. లక్షల సొమ్మును జేబుల్లో వేసుకుంటున్నారు. ఇదే తరహాలో తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం బోటు యార్డు సమీపంలో రైల్వే భూములను సైతం ప్లాట్లుగా మార్చి రెండు, మూడు సెంట్ల చొప్పున అమ్మేశారు. ఈ వ్యవహారంపై స్థానికులు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్ధలో ఫిర్యాదు చేశారు. అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు. అది ఆసరాగా చేసుకున్న సదరు నాయకులు రెచ్చిపోయి ఒక ప్లాట్ను రూ.5 లక్షల నుంచి రూ. 6 లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. సీతానగరం బోటు యార్డు రోడ్డు నుంచి జీయర్ ఆశ్రమం వరకు గతంలో తాడేపల్లి మున్సిపాలిటీగా ఉన్న సమయంలో రహదారి ఏర్పాటు చేశారు. ఆ రహదారికి కుడిభాగంలో కొంత రైల్వే స్థలం, మరికొంత ప్రభుత్వ స్థలం, దాని పక్కనే ప్రైవేటు స్థలం ఉన్నాయి. ఇక్కడి ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి అవుతున్నా అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడంతో సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పేదలను టార్గెట్ చేసి ఈ భూములను అమ్మేస్తున్నారు. వలస వచ్చినవారే టార్గెట్ ప్రకాశం, శ్రీకాకుళంలతో పాటు ఇతర జిల్లాల నుంచి వలస కూలీలుగా వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వారిని సదరు నాయకులు టార్గెట్ చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి ఎటువంటి ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నా రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటూ నమ్మబలికి సెంటు భూమి ప్రస్తుతం రూ.2 లక్షల నుంచి రూ. 2.50 లక్షల వరకు అమ్మేస్తున్నారు. డబ్బులు ఇచ్చిన తరువాత మూడవ విడత, నాల్గవ విడతలో మీకు ప్రభుత్వం పట్టాలు ఇస్తుందంటూ నమ్మిస్తున్నారు. కొనుగోలుదారులు ఇళ్లు నిర్మించుకుంటుంటే అక్కడికి వెళ్లిన సచివాలయ సిబ్బందిని నాయకులు సంప్రదిస్తున్నారు. మాట వినకపోతే బెదిరించి కొనుగోలు చేసిన వారి చేత ఇళ్లను నిర్మింపజేస్తున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ కోర్టు కేసులతో కునారిల్లుతుంది. వందల సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉన్నప్పటికీ వాటి పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కేసులకు సంబంధించి సకాలంలో కౌంటర్ వేయడంలో మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ బాధితులకు సరైన న్యాయం జరగకపోవడంతోపాటు కొన్ని సందర్భాల్లో కార్పొరేషను ఆదాయం, ఆస్తులు కూడా పోయే పరిస్థితులు తలెత్తుతున్నాయి. నెహ్రూనగర్ : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఈ సంవత్సరం మార్చి మొదటి వారం వరకు మొత్తం 297 కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో అత్యధికంగా టౌను ప్లానింగ్ విభాగంలో 145 కేసులు, ఇంజినీరింగ్ సెక్షనులో 62, రెవెన్యూ సెక్షనులో 42, పబ్లిక్ హెల్త్ సెక్షనులో 20, జనరల్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షనులో 17, ఎలక్షన్ను సెల్ 8, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్, ఉపా సెల్, ఎడ్యుకేషనను ఎస్టాబ్లిష్మెంట్ విభాగాలకు ఒక్కొక్కటి చొప్పున కేసులు పెండింగ్లో ఉన్నాయి. కౌంటర్ వేయని కేసులు 150 మొత్తం 295 పెండింగ్ కేసుల్లో 150 కేసుల్లో అసలు కౌంటర్ దాఖలు చేయలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. టౌను ప్లానింగ్ సెక్షనులో 145 కేసులకు 75, ఇంజినీరింగ్ విభాగంలో 62 కేసులకు 42, రెవెన్యూ సెక్షన్నులో 42 కేసుల్లో 10, పబ్లిక్ హెల్త్ విభాగంలో్ 20 కేసులకు 7, జనరల్ ఎస్టాబ్లిష్మెంట్ 17 కేసులకు 7 కేసుల్లో కౌంటర్ లేదు. ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ ఒక కేసు ఉంటే దీనికీ కౌంటర్ దాఖలు చేయలేదు. ఎలక్షనను విభాగంలో కూడా 8 కేసులు పెండింగ్లో ఉంటే ఒక్క దానికి కూడా కౌంటర్ వేయలేదు. అధికంగా ఈ అంశాలపైనే.. టౌను ప్లానింగ్ విభాగంలో ఎక్కుగా రోడ్డు విస్తరణకు సంబందించి ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఇందులో భవనాలు ఎఫెక్ట్ అయ్యే వారు కూడా ఎక్కువగా కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అదే విధంగా ఇంజనీరింగ్ సెక్షనులో బిల్లులు చెల్లింపు, టెండరింగ్ విషయంలో కేసులు నమోదు అయ్యాయి. రెవెన్యూ సెక్షననులో షాపింగ్ కాంప్లెక్స్లకు సంబంఽధించి ట్యాక్స్ విషయంలో, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో లీజు గడువు పూర్తయినప్పటికీ వాటిని ఖాళీ చేయకుండా కోర్టులను ఆశ్రయించారు. నగరపాలక సంస్థ కార్యాలయం1బోటు యార్డ్ రోడ్డు నుంచి జీయర్ ఆశ్రమం వరకు సుమారు 40 అడుగల వెడల్పుతో రహదారిని ఏర్పాటు చేశారు. ఆ రహదారిని సైతం ఆక్రమించడంతో అక్కడ పట్టా భూములు కొనుక్కొని నివాసముంటున్న వారు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపైకి మురుగునీరు పారడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఆక్రమణలపై ప్రభుత్వం విచారణ జరిపి ప్రభుత్వ భూములను విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.మంగళగిరి టౌన్: చినకాకానిలోని షైన్ ఆనంద శరణాలయానికి హైదరాబాద్ ఏఆర్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కళ్ళం సుబ్బారెడ్డి రూ. 5.5 లక్షల విలువైన సోలార్ విద్యుత్ ప్యానళ్లను గురువారం అందజేశారు. సుబ్బారెడ్డి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం శరణాలయంపై ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్యానళ్లను ఆయన ప్రారంభించారు. బాలలకు అన్నదానం నిర్వహించారు. వైఎస్సార్సీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి, వివిధ రంగాల ప్రముఖులు దొంతిరెడ్డి గాంధీ, శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి, రుక్మాంగరెడ్డి, వెంకటరామిరెడ్డి, లంకా శ్రీనివాస్, రామకృష్ణారెడ్డి, షైన్ ఫౌండేషన్ చైర్మన్ డీజీ నాయక్, నిర్వాహకురాలు సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. కోర్టు కేసుల్లో సకాలంలో కౌంటర్ వేయకపోవడం వలన కార్పొరేషను ఆదాయానికి భారీ స్థాయిలో గండి పడుతుందనే విమర్శలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అభివృద్ది పనులు నెలల తరబడి ఆగిపోవాల్సి వస్తోంది. ఉదాహరణకు కాకుమానువారి తోట (కార్మిక శాఖ స్థలం) రోడ్డు వేయకుండా నెలల తరబడి పెండింగ్లో ఉంది. రోడ్డు టెండర్ను కాంట్రాక్టర్ అడ్డదారిలో దక్కించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. వర్కును ఇంజినీరింగ్ అధికారులు రద్దు చేశారు. దీనిపై కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులు నెలల తరబడి తేలకపోవడంతో ఆ రోడ్డు అలాగే ఆగిపోయింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి సకాలంలో కోర్టు కేసులు పరిష్కారం అయ్యే విధంగా చూడాలని నగర వాసులు కోరుతున్నారు. -
ఆర్డీఓగా బాలకృష్ణ బాధ్యతల స్వీకరణ
నరసరావుపేట: జిల్లా కేంద్రమైన నరసరావుపేటకు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ)గా నియమితులైన బాలకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన బదిలీల్లో భాగంగా ఆయన నందిగామ నుంచి నరసరావుపేటకు వచ్చారు. ఇక్కడ ఆర్డీఓగా పనిచేసిన కె.మధులతను రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు బదిలీ చేశారు. పలువురు ఉద్యోగులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు. నరసరావుపేట డివిజన్ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందజేస్తానని నూతన ఆర్డీఓ వెల్లడించారు. నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : స్థానిక బృందావన్గార్డెన్న్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నయ్య కళావేదికపై పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మాగంటి మురళీమోహన్ ద్వితీయ నాటకోత్సవాలు, గుమ్మడి శ్రీమన్నారాయణ కళా సమితి, వైకే.నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ తొమ్మిదవ వార్షికోత్సవాలను నిర్వహించనున్నట్లు నిర్వాహాకులు కాట్రగడ్డ రామకృష్ణప్రసాద్, బొప్పన నరసింహారావు బుధవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈనెల 28, 29, 30 తేదిల్లో నాటకోత్సవాలు కొనసాగుతాయని అన్నారు. 28న ఏపీ సృజనాత్మకత సంస్కృతి సమితి చైర్మన్ తేజస్వినికి డాక్టర్ మురళీమోహన్ రంగస్థల పురస్కారం, మా ఇంట్లో మహాభారతం నాటిక ప్రదర్శిస్తారని తెలిపారు. 29న నువ్వో సగం, నేనో సగం నాటిక, 30న ఆర్యచాణక్య చారిత్రాత్మిక నాటకం ప్రదర్శించనున్నారని అన్నారు. -
బ్యాంకు ఉద్యోగుల ఆందోళన
కొరిటెపాడు (గుంటూరు): యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపుతో చేపట్టిన ఆందోళనలకు స్పందన లభించిందని ఏఐబీఓసీ రాష్ట్ర నాయకులు శేష సాయి, జయకుమార్, కోటిరెడ్డి, రాంబాబు, వేణులు తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం నగరంపాలెంలోని ఎస్బీఐ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీఎఫ్ఎస్ తీసుకున్న పీఎల్ఐ అమలు నిర్ణయం ప్రస్తుతం చీఫ్ లేబర్ కమిషనర్(సీఎల్సీ) వద్ద పరిష్కార దశలో ఉన్నప్పటికీ అమలు చేయడం ఏకపక్ష, తొందరపాటు చర్య అని విమర్శించారు. ఈ పథకం ఉద్యోగులు, యూనియన్లు కోరింది కాదని, కొద్ది మందికి మాత్రమే లాభం ఉందని అభిప్రాయపడ్డారు. ఉద్యోగులను ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేసి, సమస్య పరిష్కరించాలని వారు కోరారు. నేడు గుంటూరు నగరానికి డీజీపీ హరీష్కుమార్గుప్తా రాక నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్గుప్తా గురువారం గుంటూరు నగరంలో పర్యటించనున్నారు. నగరంపాలెంలోని గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో నూతన సమావేశ మందిరం, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) జిల్లా నూతన భవనాన్ని రాష్ట్ర డీజీపీ ప్రారంభించనున్నట్లు డీపీఓ కార్యాలయ వర్గాలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రారంభోత్సవంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఏపీ విట్ విశ్వ విద్యాలయం చాన్సలర్, వైస్చాన్సలర్, రిజిష్ట్రర్, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొంటారని పేర్కొన్నారు. -
పెన్షన్ వాలిడేషన్ యాక్ట్కు వ్యతిరేకం
గుంటూరు వెస్ట్: కేంద్ర ప్రభుత్వం గత ఏడాది మార్చిలో తీసుకొచ్చిన పెన్షన్ వాలిడేషన్ యాక్ట్కు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి పి.నాగరాజు తెలిపారు. ఈ రోజును తాము బ్లాక్ డే నిర్వహిస్తున్నామన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వెంటనే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. పెన్షనర్లందరికి సమాన హక్కులు ఉండాలన్నారు. జనవరి 1, 2026 ముందు రిటైరైన వారు, తర్వాత రిటైరైన వారిని విభజించి పెన్షనర్లను తీవ్ర మానసిక ఆందోళనకు గురి చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. పెన్షన్ కమ్యూటేషన్ పీరియడ్ను 12 సంవత్సరాలకు తగ్గించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. అనంతరం డీఆర్వో షేఖ్ ఖాజావలికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సీహెచ్.వెంకటేశ్వర్లు, ఎన్జీఓ నాయకులు మూర్తి, కోటేశ్వరరావుర, సాయిబాబు, నాగేశ్వరరావు, నాగేంద్రం, సుబ్బారావు పాల్గొన్నారు. -
రేపటి నుంచి నేపాల్ ప్రతినిధి బృందం పర్యటన
రేపల్లె,బాపట్ల: రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్(ఆర్డీఓ)గా బూసి శ్రీదేవి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కృష్ణా జిల్లా కేఆర్సీలో స్పెషల్ డెప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తూ సాధారణ బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా బాధ్యతలు తీసుకున్న ఆమె మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ సేవలు అందించటం జరుగుతుందని చెప్పారు. ప్రతి సోమవారం నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని డివిజనల్ పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రేపల్లె రెవెన్యూ డివిజన్ అధికారిగా బి.శ్రీదేవి బుధవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ని మర్యాద పూర్వకంగా కలిశారు. బుట్టాయగూడెం: ద్విచక్ర వాహనాలు ఢీకొని ఐదుగురు గాయపడిన ఘటన ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలోని శివాలయం సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం గణపవరానికి చెందిన తాళ్లభోగి సురేష్, కుమార్తెలు ప్రియాంక, శ్రావణి, మనవడితో పొగాకు పనుల నిమిత్తం వచ్చి కంసాలిపాలెంలో నివాసముంటున్నారు. మనవడు చిన్నా పానీపూరీ అడగడంతో సురేష్ కుమార్తెలు ప్రియాంక, శ్రావణి, చిన్నాతో కలిసి ద్విచక్రవాహనంపై బుట్టాయగూడెం వస్తున్నారు. అదే సమయంలో స్థానిక అరుంధతీ కాలనీకి చెందిన ఉండ్రాజవరపు కాంతారావు, మరో యువకుడు ద్విచక్ర వాహనంపై బుట్టాయగూడెం నుంచి శివాలయం వైపు వెళ్తున్నారు. ఆ సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను అంబులెన్స్లో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రియాంక, చిన్నా, శ్రావణిలకు స్వల్ప గాయాలు కావడంతో సామాజిక ఆరోగ్య కేంద్రంలోనే వైద్య సేవలు అందించారు. కాంతారావు, సురేష్ల పరిస్థితి తీవ్రంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్లో జంగారెడ్డిగూడెం తరలించారు. -
పైసా మే..పాస్
తరగతులకు హాజరు కాకుండానే కేవలం పరీక్ష రాస్తే చాలు బీఈడీ సర్టిఫికెట్ ఇస్తారంటూ దేశవ్యాప్తంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరువు పోయింది. పైసలిస్తే చాలు ప్రాక్టికల్ రాయకుండానే పాస్ అనే తీరులో మరోసారి అభాసుపాలైంది. బీఈడీ ప్రాక్టికల్స్ పేరిట ఏఎన్యూలో రూ.కోట్ల విద్యావ్యాపారం జరిగింది. బీఈడీ కళాశాలలు రూ.లక్షలు విరజిమ్మి... లక్ష్యం నీరుగార్చారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఏఎన్యూ పరిధిలో 2024– 26 బీఈడీ విద్యాసంవత్సర ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 10 నుంచి 25వ తేదీ వరకు మూడు విడతలలో నిర్వహించారు. దాదాపు 7 వేల మంది విద్యార్థులు హాజరు కావలసిన ఈ పరీక్షలలో 4500 నుంచి 5000 మంది ఇతర రాష్ట్రాలవారే. తెలంగాణ, ఒడిశా, అసోం, మిజోరాం, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షకో రేటు నిర్ణయించి వసూలు చేశారు. 50 మార్కుల పరీక్షకు 49గానీ, 50గానీ మార్కులు వేసి ఏఎన్యూని మరోసారి భ్రష్టుపట్టించారు. ఏఎన్యూలో దొడ్డిదారిన ఉద్యోగాలు పొంది, దోచుకోవడమే ధ్యేయంగా వ్యవహరిస్తున్న కొందరి తీరుతో పైసలిస్తే చాలు ప్రయోగాలు సజమావుగా సాగుతున్నాయి. ఏఎన్యూ పరిధిలోని 60కి పైగా కళాశాలల్లో అనేకమంది విద్యార్థుల నుంచి రూ.లక్షల్లో దోచుకున్నారు. ఒక్కో విద్యార్థికి రూ.10 వేల నుంచి రూ.12 వేల చొప్పున ఒక సిండికేట్ కళాశాలకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఇలా వసూలు చేసినట్లు సమాచారం. బీఈడీ ప్రాక్టికల్స్ పేరిట విద్యా వ్యాపారం రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు జరిగిందని పల్నాడులోని ఓ కళాశాల కరస్పాండెంట్ తెలిపారు. పల్నాడులోని ఒక ప్రిన్సిపాల్, నర్సరావుపేటలోని ఒక లెక్చరర్, కళాశాల నుంచి కలెక్షన్ చేసే ఏజెంట్లుగా వ్యవహరించారు. వీరు అనధికారికంగా యాజమాన్యాలను బెదిరించి మరో రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా వీరే దళారులుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో ఎగ్జామినర్కి రోజుకి రూ.2 వేల నుంచి రూ.2,500 చొప్పున కొన్ని కళాశాలలు చెల్లించాయి. గైర్హాజరైన ప్రతి విద్యార్థికి రూ. 500 అదనంగా కొందరు చెల్లించారు. ప్రాక్టికల్ ఫీజ్ పేరిట కొన్ని కళాశాలల్లో రూ.2,000 నుంచి రూ.5,000 వసూలు చేశారు. మెయింటెనెన్స్ ఫీజు అంటూ రూ.లక్ష నుంచి రూ. 2 లక్షలు దక్షిణగా సమర్పించారు. తొమ్మిది రోజుల పరీక్షల తంతులో రూ.ఐదు కోట్ల వరకు విద్యావ్యాపారం జరిగిందని తెనాలికి చెందిన ఒక ఇంగ్లిషు లెక్చరర్ తెలిపారు. ఫోర్జరీ సంతకాలతో బురిడీ కొట్టించారు. వినుకొండ, తెనాలి ప్రాంతంలోని మూడు చొప్పున కళాశాలల్లో క్లర్కులు, ప్రిన్సిపల్స్ ఇలా ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. విద్యార్థుల, పరిశీలకుల సంతకాలు పోల్చి విచారణ జరిపితే అనేక మందిపై చర్యలు ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. పరీక్షల పేరిట జరిగిన రూ.కోట్ల విద్యావ్యాపారంపై లోతుగా విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగుచూడటం తథ్యమని వాదనలు వినిపిస్తున్నాయి. అప్రూవల్ జాబితాలలోని ఎగ్జామినర్ల సంతకాలను, మార్కుల జాబితాలలోని వాటితో పోలిస్తే అవకతవకలు బహిర్గతం కానున్నాయి. మూడవ సెమిస్టర్ హాల్ టికెట్లలో విద్యార్థుల సంతకాలను ప్రాక్టికల్ పరీక్ష డైలీ రిపోర్టు సంతకాలతో పోలిస్తే నకిలీల గుట్టు రట్టవుతుందని తెలుస్తోంది. జిల్లా విద్యాశాఖాధికారి అనుమతితో ఎన్ని కళాశాలలు ప్రభుత్వ పాఠశాలలో పరీక్షలు నిర్వహించాయో పరిశీలిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. పల్నాడులోని ఇద్దరు అయ్యవార్ల ఫోన్ పేలు, కాల్ లిస్టులపై విచారణ జరిపితే రూ.కోట్ల కుంభకోణం వెలుగు చూడటం తథ్యమనే వాదనలు తెరపైకి వచ్చాయి. విద్యావ్యవస్థను కాసుల కోసం దిగజార్చిన వారి అక్రమాలకు కళ్లెం పడుతుంది. మార్చి 23వ తేదీ నుంచి జరిగే మూడవ విడత పరీక్షలలో అక్రమాలు వెలువెత్తాయి. నరసరావుపేట, రేపల్లెలోని కళాశాలల్లో మూడు రోజుల పరీక్షలను రెండు రోజులలోనే ముగించారు. నరసరావుపేట వ్యవహారం బహిరంగం కావడంతో మామూళ్ల కోసం పరుగులు తీశారు. పరీక్షలు పెట్టేటప్పుడు తమ దగ్గరకు ఎందుకు రాలేదంటూ పల్నాడుకు చెందిన ఒక దళారి డెల్టాలోని ఒక మహిళా యజమానిపై జులుం ప్రదర్శించారు. డెల్టా ప్రాంతంలోని ఫిజిక్స్ ఇంటర్నల్ లేకుండా పరీక్ష ఎలా పెట్టారని ఒక దళారి బెదిరించి వసూలు చేశారు. పల్నాడులోని ఒక కరస్పాండెట్ కొన్ని బీఈడీ కళాశాలలను బెదిరించి భారీగా వసూలు చేసినట్టు పచ్చ పార్టీకి చెందిన యాజమాన్యాలే వాపోతున్నాయి. -
గుంటూరు
నిమ్మకాయల ధరలు తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7600, గరిష్ట ధర రూ.9300, మోడల్ ధర రూ.8400 వరకు పలికింది. సాగర్ నీటిమట్టం విజయపురి సౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 536.70 అడుగులకు చేరింది. ఇది 181.5216 టీఎంసీలకు సమానం. ఒక్కరోజే రూ. 2.55 కోట్లు నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : ఆస్తి పన్నుపై వడ్డీ రాయితీని వినియోగించుకుని బుధవారం రూ. 2.55 కోట్లు పన్నులు ప్రజలు చెల్లించారని కమిషనర్ తెలిపారు.7 -
నీటి దోపిడీ ట్యాపులు
ఇన్నర్ రింగ్రోడ్డులో అపార్ట్మెంట్లకు అనధికారికంగా అమరిక నెహ్రూనగర్ దోపిడీకి కాదేదీ అనర్హం అన్నట్లు ఇంజినీరింగ్ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆ విభాగంలో కింది స్థాయి సిబ్బంది దొంగ టెండర్లు వేయించి రూ. కోట్ల కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టిన విషయం తెలిసిందే. టెండరింగ్లో లెస్సుల పేరుతో మాయాజాలం చేసి జీఎంసీ ఆదాయానికి కన్నం వేసిన విషయాలను కూడా సాక్షి పలుమార్లు ప్రచురించిన విషయం తెలిసిందే. తాజాగా అభివృద్ధి చెందుతున్న ఇన్నర్ రింగ్ రోడ్డులో అపార్ట్మెంట్లకు ఎటువంటి అనుమతులు లేకుండా అనధికారికంగా ట్యాపులు ఇచ్చేసి బిల్డర్ల వద్ద నుంచి రూ.లక్షలు దండుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇదిగో ఉదహరణ.. ఇన్నర్ రింగ్ రోడ్డులో గుంటూరు నగరానికి చెందిన ఓ వ్యక్తి అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేశారు. అయితే సదరు ఫ్లాట్కి ఇటీవల వాటర్ పైపులైన్ నుంచి నీళ్లు రావడం లేదని గమనించారు. రిపేరు చేయించేందుకు నగరపాలక సంస్థ కార్యాలయానికి వెళ్లి తన అసెస్మెంట్ నంబర్ (ఇంటి పన్ను) చెప్పి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నం చేశారు. సదరు అసెస్మెంట్ నంబర్ మీద కేవలం ఆస్తి పన్ను మాత్రమే చూపించింది. వాటర్ కనెక్షన్ లేదని నగరపాలక సంస్థ సిబ్బంది చెప్పారు. కంగుతిన్న యజమాని బిల్డర్కు ఫోన్ చేసి సమస్యను వివరించారు. వాటర్ ట్యాపును రిపేర్ చేయించే బాధ్యత తనదని బిల్డర్ చెప్పడంతో చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు. ఈ లెక్కన ఇన్నర్ రింగ్ రోడ్డులో ఏదో ఒక వీధిలో అపార్ట్మెంట్ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని పరిశీలిస్తే ఎన్ని దొంగ ట్యాపులు ఉన్నాయో తేలనుంది. ఆ పేర్లతో పైపులైన్లు ఇన్నర్ రింగ్ రోడ్డులో పలు ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు భారీగా వెలుస్తుంటాయి. అపార్ట్మెంట్లు సేల్ కావాలంటే తప్పనిసరిగా రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు తప్పనిసరిగా ఉంటేనే కొనుగోలు చేస్తారు. అయితే సదరు అపార్ట్మెంట్ల బిల్డర్లుతో ఇంజినీరింగ్ అధికారులు కుమ్మకై పైపులైన్ వేయాలంటే డోనేషన్/కాంట్రీబ్యూషన్ ఇస్తే చాలని వారి వద్ద నుంచి రూ.లక్షలు వసూలు చేయడం..ఆ తరువాత వాటికి టెండర్ పెట్టి బిల్లులు చేసుకోవడం పరిపాటిగా మారిందనే చెప్పుకోవచ్చు. ఇన్నర్ రింగ్రోడ్డు పరిసర ప్రాంతాల్లో అపార్టుమెంట్లు పరిశీలించి దొంగ ట్యాప్లో ఉంటే డిస్కనెక్ట్ చేయడంతోపాటు సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – జి.వెంకటేశ్వరరావు , నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజినీర్ -
నృసింహుని హుండీ ఆదాయం లెక్కింపు
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దిగువ, ఎగువ సన్నిధులతో పాటు శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడులకు సంబంధించి హుండీ ఆదాయాలను బుధవారం ఆలయ అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్కుమార్ మాట్లాడుతూ ఎగువ సన్నిధిలోని శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారికి రూ. 16,74,302, దిగువ సన్నిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి రూ. 25,06,239, శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి రూ. 79,682, అన్నదానంకు రూ. 30,297 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని వైకుంఠపురం శ్రీ లక్ష్మీపద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థాన సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి అనుపమ పర్యవేక్షించారు. గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియెట్ స్పాట్ వాల్యూయేషన్ను బోర్డు కార్యదర్శి పి.రంజిత్ బాషా బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్పాట్ వాల్యూయేషన్ జరుగుతున్న తీరు, తెన్నులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మూల్యాంకన విధుల్లో నిమగ్నమైన అధ్యాపకులకు ఇంటర్మీడియెట్బోర్డు నిర్దేశించిన వాల్యూయేషన్ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని, వాల్యూయేషన్ విధుల్లో నిర్లక్ష్యంగా ఉండరాదని ఆయన సూచించారు. బుధవారం రెండో స్పెల్లో భాగంగా కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కామర్స్, సివిక్స్ సబ్జెక్టులకు ప్రారంభమైన మూల్యాంకన ప్రక్రియపై అధ్యాపకులకు అవగాహన కల్పించారు. మూల్యాంకన విధానంలో తీసుకువచ్చిన సంస్కరణలు, ప్రశ్నల కోడ్స్, ప్రశ్నపత్రం సరళి, మార్కుల వెయిటేజీ తదితర అంశాలపై మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్ఐవో, స్పాట్ వాల్యూయేషన్ క్యాంపు అధికారి సునీత, సహాయ క్యాంపు అధికారులు, కోడింగ్ అధికారులు పాల్గొన్నారు. ముప్పాళ్ళ: మైనర్ బాలికపై ఓ యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన బుధవారం వెలుగు చూసింది. ఎనిమిదవ తరగతి చదువుతున్న మైనర్ బాలిక (13)ను యువకుడు(23) మాయమాటలు చెప్పి తరచూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లుగా గమనించి తల్లిదండ్రులు ఇటీవల మందలించారు. బుధవారం బాలిక తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లడాన్ని గమనించి మళ్లీ లైంగిక వేఽధింపులకు పాల్పడుతుండగా బాలిక సమీప బంధువులు యువకుడిని పట్టుకున్నారు. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతు సమస్యల పరిష్కారం ముఖ్యం నరసరావుపేట రూరల్: నూతన సాంకేతిక పద్ధతులు రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చి తోడ్పాటును అందించేలా ఏరువాక కేంద్రం పనిచేయాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.శివన్నారాయణ తెలిపారు. మండలంలోని రావిపాడు ఏరువాక కేంద్రంలో జిల్లా స్థాయి సమన్వయ సంఘ సమావేశం బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ జి.శివన్నారాయణ మాట్లాడుతూ వ్యవసాయ, అనుబంధ శాఖల సమన్వయం చేసుకుంటూ పంటలలో ఎదురయ్యే సమస్యలు, వాటి సమగ్ర నివారణ చర్యలు రూపొందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. డాక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఏరువాక కేంద్రం కార్యక్రమాలను రైతు స్థాయిలో సమస్యలకు అనుగుణంగా నిర్వహిస్తే మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు. -
నూనెలు సలసల
గుంటూరు ఎడ్యుకేషన్: వంట గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలను వంట నూనె ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వంటిట్లో గుబులు రేపుతోంది. రెండు వారాలకు ముందు వరకు సాధారణంగా ఉన్న వంట నూనెల ధరలు అమాంతం ఆకాశాన్నంటుతున్నాయి. లీటర్ నూనైపె ఒక్కసారిగా రూ.20 నుంచి రూ.50 వరకు పెరగడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. ఇదే కాకుండా వివిధ బ్రాండ్లకు చెందిన వంట నూనె ధరలు లీటర్కు ఏకంగా రూ.60 నుంచి రూ.80కు సైతం పెరిగాయి. హోల్సేల్ సూపర్బజార్లు, ఆన్లైన్ హోమ్ డెలివరీ ప్లాట్ఫామ్లలోనూ అధిక ధరలు కొనసాగుతున్నాయి. యుద్ధం పేరుతో ధరలకు రెక్కలు వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. గల్ఫ్, పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం వంటనూనెల సరఫరా వ్యవస్థపై ప్రభావం పడింది. ఫలితంగా దిగుమతులు తగ్గి మార్కెట్లో అనుకోని విధంగా ధరలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం నిత్యావసరాలపై ఇటీవల విధించిన 12 శాతం పన్నులు సైతం వట నూనెల ధరలు పెరగడానికి మరో కారణమైంది. ఉగాది పండుగ మొదలు మార్కెట్లో వంటనూనెలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. అంతర్జాతీయ కారణాలను సాకు చూపి స్థానిక వ్యాపారులు వినియోగదారులపై నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. మార్కెట్లో డిమాండ్ పెరగడంతో దాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు వ్యాపారులు గోదాముల్లో స్టాకును బ్లాక్ చేసి కృత్రిమ కొరత సృష్టించి, ధరలు పెరిగేందుకు కారకులవుతున్నారు. అదే విధంగా తక్కువ ధరకు కొనుగోలు చేసిన నూనె ప్యాకెట్లు, డబ్బాలను ప్రస్తుతం నెలకొన్న డిమాండ్తో ధరలు పెంచేసి సొమ్ము చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో రోజుకు రూ.50వేల లీటర్లకు పైగా నూనె వినియోగం తగ్గిపోయిన పరిమాణం... నూనె రకం గతంలో ధర ప్రస్తుత ధర (లీటర్) ( లీటర్) పామాయిలు 90–115 20–160 సన్ఫ్లవర్ ఆయిల్ 140–155 160–180 వేరుశనగ నూనె 130–150 170–190 -
గల్లంతయిన విద్యార్థి మృతదేహం లభ్యం
మేడికొండూరు: మండల పరిధిలోని పేరేచర్ల కై లాసగిరి సమీపంలో ఉన్న క్వారీ గుంతలో ఈతకు దిగి గల్లంతయిన విద్యార్థి మృతదేహం బుధవారం మేడికొండూరు పోలీసులు ఫైర్ సిబ్బందితో కలిసి బయటకు తీశారు. పలకలూరు గ్రామానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థి చంద్రశేఖర్(16) తన స్నేహితులతో కలిసి మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో క్వారీ గుంతలో ఈతకు దిగి కనిపించకుండా పోయాడు. సంఘటన జరిగిన సమయం నుంచి మేడికొండూరు సీఐ మధుసూదన్ రావు తన సిబ్బందితో కలిసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం తాడేపల్లి నుంచి గజ ఈతగాళ్ళను రప్పించి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో క్వారీ గుంతలలో రాళ్ళల్లో లోతుగా ఉన్న చంద్రశేఖర్ మృతదేహాన్ని బయటకు తీశారు. మతుని తండ్రి బండారు రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడికొండూరు సిఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి తరలించారు. మిన్నంటిన రోదనలు.. పేరేచర్ల కై లాసగిరి సమీపంలో ఉన్న క్వారీలో విద్యార్థి గల్లంతైన సంఘటన ప్రదేశానికి విద్యార్థి తల్లిదండ్రులు బంధువులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. తండ్రి రాంబాబు ఆటో డ్రైవర్ గా పని చేస్తూ ఇద్దరు కుమారులను ఉన్నత చదువులు చదివిస్తూ.. జీవనం సాగిస్తున్న ఈ తరుణంలో రెండవ కుమారుడు మృతి చెందటంతో ఆ కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. తను ఆటోడ్రైవర్గా పనిచేసిన కుమారులు మాత్రం ఆ విధంగా ఉండకూడదని ఉన్నతంగా స్థిరపడేందుకు చదువే ఆధారంగా భార్యాభర్తలు కుమారుల కోసం కష్టపడుతూ ఉంటారని బంధువులు తెలియజేశారు. -
టీబీ రహిత జిల్లాగా ఆవిర్భవించాలి
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ గుంటూరు మెడికల్: క్షయ వ్యాధి (టీబీ) రహిత జిల్లాగా ఆవిర్భవించేందుకు సమష్టిగా కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని జాయింట్ కలెక్టర్ మంగళవారం ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ క్షయ వ్యాధికి సరైన సమయంలో పరీక్షలు చేయించుకొని, వైద్యుల సూచనల మేరకు పూర్తి చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం అవుతుందన్నారు. ‘టీబీ నిర్మూలనకు సమష్టి కృషి అవసరం’ థీమ్తో ఈ సంవత్సరం టీబీ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అవగాహన ర్యాలీలు, ఆరోగ్య శిబిరాలు, ఉచిత పరీక్షలు, ఔషధాల పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజలు అందరూ టీబీ పట్ల శ్రద్ధ వహించి టీబీ రహిత భారత్ కు, టీబీ రహిత జిల్లాకు సహకరించాలని చెప్పారు. రెండు వారాలకు పైగా దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలన్నారు. టీబీ పరీక్షలు, మందులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా లభిస్తాయన్నారు. టీబీ రోగులతో బంధాన్ని కొనసాగించి, త్వరగా నయం కావడానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాస్థాయి సమన్వయ సంఘం సమావేశం
గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం నందున్న ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాస్థాయి సమన్వయ సంఘ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి సహా పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎన్.వి.వి.ఎస్ దుర్గాప్రసాద్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.శివనారాయణ మాట్లాడుతూ 2026–27లో చేపట్టబోతున్న కార్యక్రమాలకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకునేందుకు పంటలవారీగా సలహాలను, సూచనలు తెలిపారు. దత్తత గ్రామాల రైతుల ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసి, వారి ఆర్థిక స్థితిగతులను మెరుగు పరిచేందుకు అవసరమైన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఏరువాక కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎ.మనోజ్ మాట్లాడుతూ 2025–26 సంవత్సరంలో వివిధ పంటలలో చేపట్టిన చిరు సంచులు ఫలితాలను, క్షేత్ర పరిశీలనలను, జిల్లాలో వ్యవసాయ అనుబంధ శాఖలు ద్వారా నిర్వహించిన కార్యక్రమాలను వివరించారు. పలువురు శాస్త్రవేత్తలు, అధికారులు ఏరువాక కేంద్రం 2026–27 లో చేపట్టవలసి కార్యక్రమాలకు అవసరమైన సలహాలను అందజేశారు. విస్తరణ నిపుణురాలు డాక్టర్ శ్రీలతవాణి 2025–26లో చేపట్టిన కార్యక్రమాలు 2026–27లో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి వివరించారు. రైతులకొరకు షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక నిధులతో నువ్వులలో సమగ్ర యాజమాన్యంపై పుస్తక ఆవిష్కరణ జరిగింది. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, ఆత్మ పథక సంచాలకులు డి.వెంకటేశ్వర్లు, జిల్లా వనరుల కేంద్రం అధికారి సునీత, జిల్లా నీటిపారుదల శాఖ డీఈ, విత్తన ధ్రువీకరణ అధికారి సురేష్రెడ్డి, రిలయన్స్ ఫౌండేషన్ ఏరియా మేనేజర్ యాకోబు, పంటలవారీగా ప్రధాన శాస్త్రవేత్తలు, ఆర్ఈసి సభ్యులు, డి.ఎల్.సి.సి సభ్యులు, ఇన్నోవేటివ్ నెట్వర్క్ సభ్యులు, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా జోన్–3 పంచాయతీ కార్యదర్శుల ప్రమోషన్లు
పంచాయతీ అభివృద్ధి అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వైవీడీ ప్రసాద్ తెనాలిటౌన్: జోన్–3 పంచాయతీ కార్యదర్శుల ప్రమోషన్లు పారదర్శకంగా జరిగాయని పంచాయతీ అభివృద్ధి అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వైవీడీ ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024 సంవత్సరంలో గ్రేడ్–3 సంబంధించి ప్రమోషన్లు కల్పించగా కొందరు ఉద్యోగులు మే నెలలో కోర్టును ఆశ్రయించడంతో ప్రమోషన్లు నిలిచిపోయినట్లు చెప్పారు. ఇటీవల పదిరోజుల కిందట న్యాయస్థానం ఆ పిటిషన్ చెల్లదని కొట్టివేయడంతో పంచాయతీరాజ్శాఖ కమిషనర్ వెంటనే స్పందించి పంచాయతీరాజ్ శాఖలో చేస్తున్న సంస్కరణలకు అనుగుణంగా ప్రమోషన్లు కల్పించినట్లు తెలిపారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో 600మంది నష్టపోయినట్లు గుర్తుచేశారు. పంచాయతీరాజ్శాఖ కమిషనర్ తీసుకున్న నిర్ణయానికి అసోసియేషన్ పూర్తి మద్దతు తెలుపుతుందని వెల్లడించారు. కొందరు ఉద్యోగులు దుర్దేశపూర్వకంగా ప్రకాశం జిల్లాలో చేస్తున్న నిరసన దీక్షను ఖండించారు. సీనియారిటీ జాబితా ప్రకారం ప్రమోషన్లు కల్పించలేదన్న మాట అవాస్తవమని చెప్పారు. కోర్టు తీర్పు చూసికూడా వీరికి కనువిప్పు కలగలేదని ఆరోపించారు. పంచాయతీరాజ్ కమిషనర్పై నిందలు వేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు సయ్యద్ జాన్ పీరా మాట్లాడుతూ జీవోఎంఎస్ 91 ప్రకటించిన గ్రేడ్ల ప్రకారం పేస్కేల్ అమలు చేయాలని కోరారు. ఈ విధానం వలన 15వేల మంది లబ్ధి పొందుతారని చెప్పారు. గ్రేడ్–3 స్కేల్ అమలుపరచడం వలన 8,300 కుటుంబాలకు మేలు చేసిన వారవుతారని తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర పబ్లిసిటీ సెక్రటరీ పి.శ్రీనివాసరావు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరి పి.శివాజీ, శ్రీకాకుళం జిల్లా సహా అధ్యక్షుడు జ్యోతి శ్రీనివాస్, డేటా ఎంట్రీ ఆపరేటర్ల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
కూటమిలో లుకలుకలు
● టీడీపీ, జనసేన వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు ● బీజేపీలో అంతర్గత చిచ్చు ● ప్రజా ప్రయోజనాలపై దృష్టి శూన్యంనరసరావుపేట: అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ వర్గీయుల మధ్య ఆదిపత్య పోరు, పదవుల పోరాటం, అంతర్గత కుమ్ములాటలు నడుస్తున్నాయి. ఈ మూడు పార్టీల్లోని నాయకులు ప్రజా సమస్యల పరిష్కారం కంటే స్వప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ ఒకరిపై ఒకరు పోరాడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో మూడు పార్టీల ప్రతినిధిగా డాక్టర్ చదలవాడ అరవిందబాబు గెలుపొందారు. ఎన్నికల సమయంలోనే టీడీపీ ఎంపీగా పోటీచేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట ఎమ్మెల్యేగా డాక్టర్ అరవిందబాబుకు టికెట్ ఇచ్చేందుకు తన విముఖుత వ్యక్తం చేశారనే ఆరోపణలు వినిపించాయి. ఎన్నికల అనంతరం కూడా వారిద్దరి మధ్య పొరపొచ్చాలు కొనసాగుతున్నాయి. ప్రజా సమస్యలపై పట్టింపు ఏదీ?ప్రజా సమస్యల పరిష్కారంలో రెండు పార్టీలు విఫలమయ్యాయి. రెండేళ్ల నుంచి నియోజకవర్గం నుంచి కొనసాగే నకరికల్లు–చీరాల ఓడరేవు బైపాస్ రోడ్డు నిర్మాణం పనులు మొదలు పెట్టించలేకపోయారు. పట్టణంలో పారిశుధ్యం అధ్వానంగా మారింది. మున్సిపాల్టీతో పాటు ప్రభుత్వ కార్యాలయా ల్లో అవినీతి ఏరులై పారుతుంది. ఈ ప్రభుత్వంలో అధికారుల లంచాలు తీసుకోవడం తప్పితే తమకు కూటమి ప్రభుత్వంలో ఒరిగిందేమిలేదని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇక బీజేపీలో అంతర్గత కు మ్ములాట నడుస్తుంది. గత ఎన్నికల నాటి కి నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరించిన రంగిశెట్టి రామకృష్ణ, ప్రస్తుత అధ్యక్షుడు ఏలూరి శశికుమార్ వర్గీయుల మధ్య నిప్పులేకుండానే పొగ వస్తుంది. ఇటీవల రామకృష్ణ కాప సంఘ సమావేశంలో తన కులస్తులపైనే కొన్ని విమర్శలు చేయటం, ఆ విమర్శలతో పార్టీకి ఏం సంబంధం లేదని, అతని వ్యక్తిగతమంటూ బీజేపీ నాయకులు ప్రెస్మీట్ పెట్టి చెప్పటం గమనించాల్సిన అంశం. దీనిపై రామకృష్ణ వర్గీయులు జిల్లా అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకొని వాట్సాప్లలో వ్యతిరేక ప్రచారం నిర్వహిస్తున్నట్లు భోగట్టా. -
కారుతో విద్యార్థుల హల్చల్
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి రూరల్ పరిధిలోని ప్రాతూరు గుండిమెడ మధ్య వున్న చిన్నరహదారిలో కొంతమంది విద్యార్థులు మంగళవారం కారుతో హల్చల్ చేశారు. అతివేగంగా కారు నడిపి ఓ విద్యార్థి మృతికి కారణమవగా, మరో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. సేకరించిన వివరాల ప్రకారం... జాతీయ రహదారి వద్ద ప్రాతూరు అండ్పాస్ నుంచి ఒక కారు అతివేగంగా వస్తూ రోడ్డుపక్కనే ఉన్న వారిని భయభ్రాంతులకు గురిచేసి పలువుర్ని ఢీకొట్టేందుకు యత్నించగా వారు తప్పించుకున్నారు. ప్రాతూరు గ్రామం మలుపు నుంచి గుండిమెడ వస్తున్న సమయంలో ఆంధ్రరత్న పంపింగ్ స్కీం పంటకాలువ దాటిన తరువాత రోడ్డుపక్కనే అతివేగంగా వస్తున్న కారులో ఉన్న స్నేహితుల కారు ఆగి ఉంది. అదే వేగంతో ఆ కారును ఢీకొని ఆ పక్కనే ద్విచక్రవాహనంపై వెళుతున్న సంపత్రెడ్డి (17), అనే ఇంటర్ విద్యార్థిని, మరో విద్యార్థినిని ఢీకొనడంతో సంపత్రెడ్డి ఎగిరి రోడ్డుపై పడ్డాడు. ఏం జరిగిందో తెలియదు కానీ సంపత్రెడ్డి మొహం మొత్తం నలిగిపోయింది. వాహనం వెనుక ఉన్న విద్యార్థినికి కాలు, చెయ్యి విరగడంతో 108లో స్థానికులు ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆ విద్యార్థిని వివరాలు చెప్పేందుకు, కేసు పెట్టేందుకు ముందుకు రాలేదు. కారుతో ఢీకొట్టిన విద్యార్థిని స్థానికులు పట్టుకోగా, అదే కారులో వున్న విద్యార్ధి, విద్యార్థినులు మరో కారులో ప్రాతూరు వైపు పరారవుతుండగా రోడ్డు ప్రమాదాన్ని పరిశీలించిన యువకులు ఆపేందుకు ప్రయత్నించారు. వారిని సైతం కారుతో నెట్టుకుంటూ అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం కారులో ప్రయాణిస్తున్న ఒక విద్యార్థి తల్లిదండ్రులు వచ్చి ప్రమాదం జరిగిన విషయాన్ని కనుక్కోకుండా వారి కొడుకుని కాపాడుకునేందుకు యత్నించడంతో స్థానికులు ఆయన వచ్చిన కారు అద్దాలను పగలకొట్టారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి కారు నడిపిన విద్యార్థితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు మాత్రం వారందరూ మత్తులో ఉన్నారని, గంజాయి తాగారా, మద్యం సేవించారా అన్నది తెలియరావడం లేదని, జరిగిన సంఘటనపై సక్రమమైన విచారణ చేసి విద్యార్థి మృతికి కారణమైన వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
మేఘా క్యాంపును పరిశీలించిన ఏడీసీ సీఎండీ
తాడికొండ: రాజధాని పరిధిలో రాయపూడి – తుళ్లూరు గ్రామాలకు చేరువలో మెగా ఇంజినీరింగ్ సంస్థకు చెందిన స్టాక్ పాయింట్లో సోమవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీపార్థసారథి మంగళవారం పరిశీలించారు. ఎల్పీఎస్ జోన్ – 6 అభివృద్ధి కోసం తీసుకొచ్చిన మెటీరియల్ స్టాక్ను కాంట్రాక్టర్ ఇక్కడ ఉంచారని, ఈ ప్రమాదంలో ఎల్పీఎస్ నిర్మాణ పనులకు తీసుకువచ్చిన వివిధ రకాల యుటిలిటీ పైపులు అగ్నికి ఆహుతైనట్లు ఏడీసీ చీఫ్ ఇంజినీరు సీహెచ్ ధనుంజయ సీఎండీకి వివరించారు. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. అగ్ని ప్రమాదానికి కారణాలను లోతుగా పరిశోధించాలని ఆమె ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. స్టాక్ పాయింట్లలో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని మెగా ఇంజినీరింగ్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. పరిశీలించిన ఇంటిలిజెన్స్ ఎస్పీ, జిల్లా ఎస్పీలు తాడికొండ: రాజధాని ప్రాంతంలోని తుళ్ళూరు మండలం రాయపూడి సమపంలో మెగా ఇంజినీరింగ్ కంపెనీ స్టాక్ యార్డు వద్ద మంగళవారం పైపులు తగలబడిన ప్రాంతంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఘటనా స్థలానికి చేరుకొని అగ్ని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసకున్నారు. ఆర్ఎఫ్ఎస్ఎల్, ఎఫ్ఎస్ఎల్ బృందాలతో కలిసి పరిసరాలను పరిశీలించి 22 లాటులు పీఎల్బీ పైపులు కాలిపోయినట్లు గమనించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి ప్రమాదానికి కారణమైన వారిని తక్షణమే గుర్తించాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. సీసీ టీవీ పుటేజీలు పరిశీలించడంతో పాటు పాత నేరస్తులు, అనుమానితుల కదలికలను గమనించాలని సూచించారు. ఆయన వెంట లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ ఏటీవీ రవికుమార్, తుళ్ళూరు డీఎస్పీ మురళీ కృష్ణ, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ శ్రీనివాసరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
29న అండర్–19 యువకుల క్రికెట్ ఎంపిక
గుంటూరు వెస్ట్ (క్రీడలు): జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని త్రీమెన్ కమిటీ సారధ్యంలో ఈ నెల 29 ఉదయం 7:30 గంటలకు అరండల్ పేట 10/3 శ్రీ మాజేటి గురవయ్యా హైస్కూల్ గ్రౌండ్లో అండర్–19 యువకుల క్రికెట్ ఎంపిక నిర్వహిస్తామని కమిటీ సభ్యుడు యు.మహతి శంకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 1, 2007 తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు. ప్లేయర్స్ వైట్ డ్రెస్తోపాటు సొంత కిట్ బాగ్తో రిపోర్ట్ చేయాలన్నారు. డిజిటల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్, ఆధార కార్డ్ ఒరిజినల్, జిరాక్స్ కాపీ తో రిపోర్ట్ చేయాలన్నారు. పులిపాక హైస్కూల్ ఇన్చార్జి హెచ్ఎం సస్పెన్షన్ గుంటూరు ఎడ్యుకేషన్: మధ్యాహ్న భోజన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో పొత్తూరువారితోటలోని పులిపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్చార్జి హెచ్ఎంను సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం సంబంధిత పాఠశాలను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎండీ నసీర్ అహ్మద్ తనిఖీ చేసిన సమయంలో పాఠశాలలో హాజరైన విద్యార్థుల కంటే అధిక సంఖ్యలో మధ్యాహ్న భోజనం చేసినట్లుగా రికార్డుల్లో నమోదు చేసిన సంఘటనపై ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో విచారణ జరిపించినట్లు పేర్కొన్నారు. జరిగిన సంఘటనను జిల్లా విద్యాశాఖాధికారి దృష్టికి తీసుకురావడంలో నిర్లక్ష్యం వహించిన ఇన్చార్జ్ హెచ్ఎంను సస్పెండ్ చేసిన డీఈవో సలీమ్ బాషా రెగ్యులర్ హెచ్ఎంతో పాటు ఎంఈవో–2కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మందుబాబులకు మూడు రోజుల సేవాశిక్ష చీరాల రూరల్: మద్యం తాగి జన సంచారంలో ద్విచక్ర వాహనాలు నడుపుతున్న 9 మందికి మంగళవారం సెకండ్ క్లాస్ న్యాయస్థానం మేజిస్ట్రేట్ నరహరి శ్రీనివాసరావు మూడు రోజులు పాటు కోర్టు ప్రాంగణాన్ని పరిశుభ్రం చేయాలంటూ సేవా శిక్ష విధించినట్లు టూటౌన్ సీఐ అశోక్ కుమార్ తెలిపారు. చీరాల టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఐదుగురు, రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇద్దరు, ఒన్టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఒకరు, వేటపాలెం పోలీసు స్టేషన్ పరిధిలో ఒకరు ఉన్నట్లు సీఐ తెలిపారు. ద్విచక్ర వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడడమే కాకుండా వారి కుటుంబ సభ్యులను అనాథలుగా మార్చేందుకు దోహదం చేస్తోందని చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన కేసుల్లోని నిందితులకు న్యాయస్థానం రూ.10 వేల జరిమానా విధిస్తుందని చెప్పారు. అయితే వారిలో పరివర్తన తీసుకొచ్చేందుకు న్యాయమూర్తి వారిపై జాలి చూపించి సేవా శిక్ష విధించినట్లు తెలిపారు. -
ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టరు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన భక్తులు మంగళవారం రూ.లక్ష విరాళం సమర్పించారు. తెనాలి చెంచుపేటకు చెందిన మాదాల నాగరాజా కుమారి, భానుప్రసాద్లు అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,00,116 విరాళం అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. పిడుగురాళ్ల: పట్టణంలోని నాగుల గుడిలో షష్టి సందర్భంగా సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి మంగళవారం పంచామృతాలు, విశేష ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పల్లకి ఉత్సవం, కావడి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రేపల్లె: పట్టణంలోని ఓల్డ్ టౌన్లో వేంచేసియున్న గ్రామదేవత బూరగలమ్మ వారికి పుష్కర మహా కుంభాభిషేక మహోత్సవాలు మంగళవారంతో రెండవ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా అమ్మవారికి వేకువ జాము నుంచే ఆలయ అర్చకులు నందివెలుగు భానుసుధాకర్ గురుకులు, బాలాజీ గురుకులు ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పట్టు, రజత వస్త్రాలంకరణ చేశారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన యాగశాలలో నిత్య హోమాది పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావులు పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మ వారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులకు నిర్వాహకులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. -
క్వారీ గుంతలో విద్యార్థి గల్లంతు
మేడికొండూరు: మండల పరిధిలోని పేరేచర్ల కై లాసగిరి సమీపంలో ఉన్న క్వారీ గుంతలో ఈతకు దిగి విద్యార్థి గల్లంతైన సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. మేడికొండూరు సీఐ మధుసూదన్ రావు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు రూరల్ మండలం పెద్ద పలకలూరు గ్రామానికి చెందిన బండారు రాంబాబు కుమారుడు చంద్రశేఖర్, అతని స్నేహితుడు నేలకంఠ గీతా భగవాన్లు ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులు. చంద్రశేఖర్ తన ద్విచక్ర వాహనంపై గీతా భగవాన్తో కలసి పెద్ద పలకలూరు నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటల సమయంలో కై లాసగిరి పర్వతాల వెనుక వైపున ఉన్న పాత క్వారీ గుంత వద్దకు చేరుకున్నాడు. చంద్రశేఖర్ నీటిలోకి దిగి ఈత కొడుతూ మధ్య వరకు వెళ్లి అకస్మాత్తుగా మునిగాడు. గమనించిన అతని స్నేహితుడు గీతా భగవాన్ సమీపంలోని వారికి సమాచారం ఇచ్చి, వెంటనే డయల్ 100కు సమాచారం ఇచ్చాడు. మేడికొండూరు పోలీసులు, ఫైర్ సిబ్బంది వచ్చి చంద్రశేఖర్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 9.30 గంటల వరకు వెతికినా చంద్రశేఖర్ ఆచూకీ తెలియరాలేదు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. -
గుంటూరు
బుధవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2026రూపురేఖలుపునర్విభజనతో మారనున్న ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయ ముఖచిత్రం సాక్షి, నరసరావుపేట: దేశంలో లోక్సభతోపాటు శాసనసభ స్థానాల పునర్విభజనకు కేంద్రం సిద్ధమైందన్న వార్తల నేపథ్యంలో అందరి నోటా ఇదే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలోనే ఈ బిల్లును ఆమోదించేలా అన్ని రాజకీయ పార్టీలతో కేంద్రం చర్చలు జరుపుతున్న నేపథ్యంలో నేతలు ‘కొత్త’ లెక్కలేసుకుంటున్నారు. జిల్లాలో కొత్తగా ఎన్ని సీట్లు పెరగనున్నాయి, ఏ ఏ మండలాలతో ఏర్పడితే రాజకీయంగా తమకు అనుకూలమనే ఆలోచనలో వారు ఉన్నారు. సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేలు తమ సొంత మండలం కొత్తగా ఏర్పడే వేరే నియోజకవర్గంలోకి వెళితే ఏం చేయాలన్న ఆలోచనలు మొదలుపెట్టారు. మరోవైపు ఎవరూ ఊహించని విధంగా పునర్విభజన ద్వారా ఏకంగా 50 శాతం స్థానాల సంఖ్య పెరుగుతాయన్న వార్తలతో ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయ ముఖచిత్రమే మారనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చట్టసభలకు వెళ్లాలనుకునే వారిలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. నియోజకవర్గాల సంఖ్య పెరగడం, మహిళా రిజర్వేషన్ అమలులోకి రానుండటంతో కొత్తవారికి చట్టసభలకు వెళ్లే అవకాశాలు పెరగనున్నాయి. 2008లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో ఉమ్మడి జిల్లాలో కొంతమేర మార్పుచేర్పులు జరగగా... తాజా పునర్విభజనతో సమూల మార్పులు రానున్నాయని రెవెన్యూ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గతంలో కేవలం అసెంబ్లీ స్థానాలు మాత్రమే మార్పు జరగగా... ఈసారి లోక్సభ స్థానాలలో సైతం పునర్విభజన జరగనుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ప్రస్తుతం 17 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో ఏడు చొప్పున, బాపట్ల జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. తాజా పునర్విభజన తరువాత ఉమ్మడి జిల్లాలో కొత్తగా 8 నుంచి 9 స్థానాలు పెరిగే అవకాశముంది. దీంతో జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య 25గానీ, 26గానీ కానుంది. గతంలో అసెంబ్లీ స్థానాలుగా ఉండి రద్దైన ఫిరంగిపురం, పెదకాకాని, దుగ్గిరాలలతోపాటు గుంటూరు రూరల్, నగరం, రొంపిచర్ల, పిడుగురాళ్ల, కారంపూడి, అమరావతి వంటి కొత్త అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. అసెంబ్లీ స్థానాలు కొత్తగా మరో 9 పెరగనున్న నేపథ్యంలో ఆశావహుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. మరోవైపు ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో తాడికొండ, ప్రత్తిపాడు, వేమూరు నియోజకవర్గాలు ఎస్సీ సామాజికవర్గానికి రిజర్వు కాగా... ఈ సంఖ్య పునర్విభజన తరువాత పెరగనుంది. ప్రస్తుత గుంటూరు ఈస్ట్, వెస్ట్తోపాటు తెనాలి, నరసరావుపేట వంటి అర్బన్ స్థానాలు ఏర్పడే అవకాశముంది. నిజాంపట్నం: స్థానిక సచివాలయం–2ను డీఆర్డీఏ పీడీ బి.సింగయ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. 9 శాసనసభ, 2 లోక్సభ నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడే అవకాశం మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుతో అతివలకు అందలం ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలు మహిళలకు కేటాయింపు ఏ ప్రాంతం ఏ నియోజకవర్గంలో ఉంటుందో.. అభ్యర్థి ఎవరో.. అంటూ ప్రజల్లో చర్చ భవిష్యత్ ఎలా ఉంటుందోనని ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్న రాజకీయ నేతలు -
కట్టుకున్న భార్యే కడతేర్చింది
మృతదేహానికి రాయి కట్టి చెరువులో పడేసిన కేసులో వీడిన మిస్టరీనగరంపాలెం: ఈనెల 19వ తేదీన యనమదల / ఈదులపాలెం గ్రామాల పరిధిలోని ఎన్హెచ్ 16 సమీపానున్న చెరువులో నడుముకు రాయికట్టి గోనెసంచిలో ఉన్న గుర్తు తెలియని మృతదేహం తాలూకా మిస్టరీ వీడింది. మద్యం మత్తులో ఉన్న భర్తను తాడుతో కట్టేసి, కర్రలతో కొట్టి భార్యే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసులో మృతుడి భార్య, మరో ముగ్గుర్ని ప్రత్తిపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఈనెల 19న మృతుడి నడుంకు రాయిని తాడుతో కట్టి, గోనెసంచిలో పెట్టిఉంచారని అందిన సమాచారం మేరకు.. ప్రత్తిపాడు పీఎస్ సీఐ జి.శ్రీనివాసరావు, ఎస్ఐ నరహరి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అతన్ని ఎవరైనా హత్య చేసి ఉంటారని, ఆ దిశగా దక్షిణ సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ మధుసూదన్రావు పర్యవేక్షణలో దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా గుంటూరు దాసరిపాలెం గ్రామంలోని ఓ కుటుంబం ఇంటి సామగ్రి, పశువులతో పరారవుతున్నట్లు తెలిసి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం గుంటూరు రూరల్ మండలం దాసరిపాలెం ప్లాట్స్లో ఉంటున్న తెనాలి ఐతానగర్ బత్తులవారివీధికి చెందిన ఉప్పుతల్ల లక్ష్మి అలియాస్ తన్నీరు తిరుపతమ్మ, ప్రస్తుతం తెనాలి పెదరావూరులో ఉంటున్న చౌడవరం సీఆర్నగర్కు చెందిన భార్యభర్తలు సిద్ధి అంకమ్మ, సురేష్, పేరేచర్ల లక్ష్మీనరసింహకాలనీ ఐదో వీధికి చెందిన ఓ మైనర్గా గుర్తించారు. చెరువులో మృతదేహం తన్నీరు వెంకటేశ్వర్లు (30)గా గుర్తించి, మృతురాలి భార్య తిరుపతమ్మ, ఆమె సోదరి అంకమ్మ, భర్త సురేష్, సోదరుడు మైనర్ను అరెస్ట్ చేశారు. హత్యకు వాడిన కరల్రు, ఇనుప పలుగు, పారలు, మోటార్సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. హత్య చేశారిలా.. వెంకటేశ్వర్లు మద్యానికి బానిసై, భార్య తిరుపతమ్మను శారీరక, మానసికంగా వేధించేవాడు. పలుమార్లు రాజీ ప్రయత్నాలు చేసినా అతనిలో మార్పురాలేదు. ఈనెల 17న వెంకటేశ్వర్లు, తిరుపతమ్మకు మళ్లీ వివాదం నెలకొంది. దీంతో తిరుపతమ్మ ఆతన సోదరి, బావ, మైనర్లకు సమాచారం అందించింది. దీంతో భార్య, ఆ ముగ్గురు కల్సి వెంకటేశ్వర్లను తాడుతో కట్టేసి, కరల్రతో తీవ్రంగా కొట్టగా మృతిచెందాడు. తొలుత భర్త మృతదేహన్ని ఇంట్లో పూడ్చాలని అనుకున్నా, స్థానికులకు అనుమానం వస్తుందని భావించారు. దీంతో మిరపకాయల గోనె సంచిలో మృతదేహం వేసుకుని మోటార్సైకిళ్లపై తీసుకెళ్లి చెరువులో పడవేశారు. అయితే మృతదేహాం పైకి తేలకుండా నడుముకు రాయిని తాడుతో కట్టేసి చెరువులో వేశారని దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసుని చేధించిన సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ నరహరి, సిబ్బందిని జిల్లాఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలను అందించారు. సమావేశంలో దక్షిణ ఇన్ఛార్జ్ డీఎస్పీ మధుసూదన్రావు, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
టెన్త్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
గుంటూరు ఎడ్యుకేషన్: మార్కెట్ సెంటర్లోని హిందూ హైస్కూలులో పదో తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును పరిశీలించిన కలెక్టర్ పరీక్ష కేంద్రంలో తాగునీరు, వైద్య శిబిర ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షల సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతోపాటు విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులతోపాటు రవాణా సదుపాయం తదితర వివరాలపై ఆరా తీశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ను పక్కాగా అమలు చేయడంతోపాటు పరీక్షలు జరుగుతున్న రోజుల్లో పరీక్ష కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ దుకాణాలను మూసి వేయించాలని ఆదేశించారు. జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషా మాట్లాడుతూ 149 కేంద్రాల పరిధిలో నిరంతరం పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో చీఫ్ సూపరింటెండెంట్, శాఖాధికారులు పాల్గొన్నారు. -
పెట్టుబడుల పేరుతో మోసం
నగరంపాలెం: పెట్టుబడుల పేర్లతో మోసగించారని, రైతులకు తెలియకుండా మిర్చి బస్తాలు విక్రయించారని ఒకరూ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. బాధితుల నుంచి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఫిర్యాదులను స్వీకరించారు. వారి విన్నపాలను జిల్లా ఎస్పీ ఆలకించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ స్థానిక పోలీస్ సబ్ డివిజన్లు, పోలీస్ స్టేషన్లల్లోనూ ఫిర్యాదు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఆన్లైన్ ద్వారా meekos am.ap.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ఫిర్యాదుల స్థితిగతులను తెలుసుకునేందుకు 1100 టోల్–ఫ్రీ నంబర్కు కాల్ చేయవచ్చునని చెప్పారు. జిల్లా ఏఎస్పీ సుప్రజ (క్రైం), డీఎస్పీలు బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్), శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), మధుసూదన్రావు (సీసీఎస్) ఫిర్యాదులు స్వీకరించారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధుల మధ్యాహ్నా భోజనంపై వ్యాఖ్యలు చేసిన ఆధ్యాత్మిక ప్రవచనకర్తపై చర్యలు చేపట్టాలి. పిల్లలను శోభనం పెళ్లి కొడుకులుగా కించపరిచేలా మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాల్లో తొంభై శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విద్యార్థులు చదువుకుంటారు. విద్యార్ధుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. – మాల మహనాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్కుమార్, దార్ల అర్జున్కుమార్, నాయకులు సుమారు రెండేళ్ల క్రితం రైతులకు సంబంధించి 1,800 మిర్చి బస్తాలను చిలకలూరిపేట రోడ్డులోని ఓ కోల్డ్స్టోరేజీలో నిల్వ చేశాం. అయితే రైతులకు తెలియకుండా 1,500 బస్తాలను కోల్ట్స్టోరేజీ నిర్వాహకులు విక్రయించారు. సుమారు రెండు నెలలు క్రితం రైతులు వెళ్లి విచారించగా, సదరు నిర్వాహకులు విక్రయించినట్లు బయటపడింది. దాదాపు విక్రయించిన సరుకు సుమారు రూ.కోటి వరకు ఉంటుంది. న్యాయం చేయగలరు. – గరిగంటి వెంకటేశ్వర్లు, ఈశ్వరీ ట్రేడింగ్ కంపెనీ నిర్వాహకులు గుంటూరు అరండల్పేటలో సుమారు రెండేళ్లుగా ఓ ప్రైవేట్ కంపెనీ నిర్వహిస్తున్నారు. ఒక్కసారి రూ.లక్ష పెట్టుబడి చెల్లిస్తే నెలకు రూ.10 వేలు చొప్పున 20 నెలలు చెల్లిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ క్రమంలో దాదాపు తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల మందికి పైగా చెల్లించారు. మొదట్లో చెల్లింపులు పద్ధతిగా చేశారు. అయితే నెల నెలా చెల్లింపుల్లో ఆలస్యమవగా అనుమానం వచ్చి కార్యాలయం వద్దకు వెళ్లాం. అక్కడకు వెళ్తే నిర్వాహాకులు పారిపోయారని తెలిసింది. దాదాపు రూ.వంద కోట్ల మేరకు కుచ్చుటోపీ పెట్టి పరారయ్యారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనంలేదు. న్యాయం చేయగలరు. – బాధితులు నిజామ్, అనీల్, శ్రీనివాస్, షేక్ సైదా పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసిన బాధితులు -
20 లక్షల ఉద్యోగాలు ఏవి బాబూ?
పట్నంబజారు: కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇస్తామని చెప్పిన 20లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ ఉత్తేజ్రెడ్డి ప్రశ్నించారు. బృందావన్గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోగా, నాలుగు లక్షల ఉద్యోగాలు తీసేశారని, ఉగాది పండుగ రోజున జాబ్ క్యాలెండర్ను 10వేల ఉద్యోగాలతో విడుదల చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అది కూడా విడతల వారీగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పటం సిగ్గుచేటన్నారు. కూటమి ప్రభుత్వ తీరు పబ్లిసిటీ పీక్.. ఫెర్మాఫెన్స్ వీక్ అనే చందంగా ఉందని ఎద్దేవా చేశారు. కూటమి సర్కార్ ఏర్పడిన తరువాత మూడు బడ్జెట్లు ముగిశాయని, నిరుద్యోగ భృతి గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. చంద్రబాబు ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారని, అవి ఎక్కడెక్కడ ఇచ్చారో బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. యువతకు సంబంధించి ఇచ్చిన హమీలు అమలు చేయకుండా ఉంటే పోరాటం తప్పదని హెచ్చరించారు. -
మోదుగులను శోభాయాత్రకు ఆహ్వానించిన సమితి సభ్యులు
పట్నంబజారు: ఈనెల 27న శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న శోభాయాత్ర కార్యక్రమానికి హాజరు కావాలని శ్రీరామనవమి శోభాయాత్ర ఉత్సవ సమితి సభ్యులు మాజీ ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ ఎన్టీఆర్ జిల్లా పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డిని ఆహ్వానించారు. రెడ్డిపాలెంలోని ఆయన నివాసంలో కలిసిన సమితి సభ్యులు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. 27వ తేదీ సాయంత్రం 4 గంటలకు పాతగుంటూరులోని మణిహోటల్ సెంటర్ సమీపంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి ప్రారంభమై గోరంట్ల వరకు జరిగే శోభాయాత్రలో పాల్గొనాలని విన్నవించారు. మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ పవిత్ర శ్రీరామనవమి రోజున అద్భుతమైన శోభాయాత్రను నిర్వహించడం సంతోషదాయకమన్నారు. భక్తులంతా ఏకతాటిపై ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న సమితి సభ్యులను ప్రశంసించారు. కార్యక్రమంలో శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వాహక సమితి సభ్యులు రామరాజు త్రికోటేశ్వరరావు, సాయి, తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి
సబ్కలెక్టర్ కార్యాలయంలో సీపీఎం నేతల వినతి తెనాలి: ఎల్పీజీ గ్యాస్ సక్రమంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకుడు కొల్లిపర బాబుప్రసాద్ కోరారు. స్థానిక సబ్కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో సీపీఎం నాయకులు ఎల్పీజీ గ్యాస్ను అందుబాటులో ఉంచాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు కొల్లిపర బాబుప్రసాద్ మాట్లాడుతూ, తెనాలి పట్టణంలో వినియోగదారులు గ్యాస్ బుకింగ్ కోసం ఏజెన్సీలకు ఫోన్ చేస్తే స్పందించటం లేదని చెప్పారు. ఒకవేళ స్పందించి రిజిస్టరు చేసుకున్నా రెండు వారాలు గడిచినా డెలివరీ చేయటం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఎల్పీజీ గ్యాస్కు ఎటువంటి కొరత లేదని, గ్యాస్ సరఫరాకు కూడా ఎలాంటి అవరోధం ఉండడానికి వీలు లేదని హామీలు ఇచ్చారని గుర్తుచేస్తూ, వాస్తవ పరిస్థితి ఆ విధంగా లేదన్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు జోక్యం చేసుకుని సకాలంలో, సక్రమంగా సీరియల్ ప్రకారం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ిసీపీఎం నాయకులు షేక్ హుస్సేన్వలి, రాజ శేఖర్ పాల్గొన్నారు. -
అత్యుత్తమ సేవలే మెడ్స్టార్ లక్ష్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధప్రదేశ్లోనే అడ్వాన్స్డ్ మెడికల్ ఎకోసిస్టమ్తో రోగి కేంద్రిత వైద్య సేవలకు కొత్త ప్రమాణాలు సృష్టిస్తూ మెడ్స్టార్ ఆస్పత్రిని మంగళవారం లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.విజయ చైతన్య తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆశ్రమం రోడ్డులో ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ఆస్పత్రిలో ఫిలిప్స్ అజ్యూరియన్ 7ఎం 20 హైబ్రిడ్ క్యాథ్ల్యాబ్ను రాష్ట్రంలోనే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. దీని ద్వారా అత్యాధునిక 3డీ ఇమేజింగ్, తక్కువ రేడియేషన్ సాంకేతికతతో హైబ్రిడ్ ప్లాట్ఫారమ్ ద్వారా గుండె, రక్తనాళాలు, ఎండో వాస్క్యులర్ సంబంధిత క్లిష్టమైన శస్త్రచికిత్సలను అత్యంత కచ్చితత్వం, భద్రతతో నిర్వహించొచ్చని పేర్కొరు. ఫిలిప్స్ 3డీటీ (ట్రాన్స్ ఈసోఫేజియల్ ఎకోకార్డియోగ్రఫీ) సిస్టమ్ అందుబాటులో ఉందన్నారు. ఇది గుండె నిర్మాణాన్ని రియల్ టైమ్లో, హై–రిజల్యూషన్ 3 ఈ రూపంలో చూపిస్తూ క్లిష్టమైన హార్ట్ వాల్వ్, స్ట్రక్చరల్ హార్ట్ ప్రొసీజర్స్ సమయంలో కచ్చితమైన నిర్ధారణ మార్గదర్శకత్వాన్ని అందిస్తుందని వివరించారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ, పల్మనాలజీ విభాగాల్లో అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆస్పత్రిలో మొత్తం వైద్య వ్యవస్థను గార్డియన్ సాఫ్ట్వేర్ అనలిటిక్స్ ఆధారిత ఇంటెలిజెంట్ మానిటరింగ్ ఫ్రేమ్వర్క్ సమన్వయం చేస్తుందని, ఇది రోగుల ఆరోగ్య స్థితిని రియల్ టైమ్లో పర్యవేక్షిస్తూ, ప్రమాద సంకేతాలను ముందుగానే గుర్తించి, వైద్య బృందం స్పందన వేగాన్ని పెంచుతుందని తెలిపారు. దీని ద్వారా నిరంతర, డేటా ఆధారిత వైద్య సేవలు అందు తాయని పేర్కొన్నారు. ఈ ఆస్పత్రిని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మంగళవారం ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమంలో వైద్యశాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో ఆస్పత్రి డైరెక్టర్ పరుచూరి సాయికుమార్, సీటీ సర్జన్ డాక్టర్ పి.వి.నరేష్, నెఫ్రాలజిస్ట్ అండ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వై.రమేష్ పాల్గొన్నారు. -
కళల తెనాలిలో ‘స్వరలయ’ కళాసేవ అమోఘం
రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెనాలి: కళలకు జన్మభూమి వంటి తెనాలిలో నిత్యకళాసేవ చేస్తూ, క్రమం తప్పక చేసే కార్యక్రమాలలో స్వరలయ నిర్వహించే ఉగాది ఉత్సవాలు చిరస్మరణీయమని రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. పట్టణానికి చెందిన సంగీత, సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక ఆధ్వర్యంలో స్థానిక బోసురోడ్డులోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో ఆదివారం రాత్రి ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. సభకు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ విశ్రాంత సీఈవో దైవాల సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమలరావు, దుర్గాప్రసాద్, మల్లేశ్వరరావు, రవిమోహన్, గోపాలకృష్ణ, ఉమామహేశ్వరరావు, డాక్టర్ పురుషోత్తమరావు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
వైకుంఠపురం ఆలయంలో హుండీ కానుకలు లెక్కింపు
తెనాలిటౌన్: వైకుంఠపురం లోని శ్రీలక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీ కానుకలు సోమవారం లెక్కించారు. రూ.51 లక్షల నగదు, 61 గ్రాముల 400 మిల్లీగ్రాముల బంగారం, 745 గ్రాముల వెండి వచ్చింది. ఆలయ కార్యనిర్వహణాధికారి వి.అనుపమ మాట్లాడుతూ 93 రోజులకు హుండీ కానుకలు లెక్కించగా ఈ ఆదాయం వచ్చినట్లు చెప్పారు. 75 మంది వలంటీర్లు, బ్యాంకు సిబ్బంది దేవస్థాన సిబ్బందితో లెక్కింపు చేపట్టినట్లు వివరించారు. పర్యవేక్షణాధికారిగా దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ సైదామాబి వ్యవహరించినట్లు తెలిపారు. శావల్యాపురం: పల్నాడు జిల్లా శావల్యాపురంలో నూతనంగా నిర్మిస్తున్న ఆర్యూబీ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు గుంటూరు రైల్వే డివిజనల్ ఇంజనీరు (డీఈ) డి.శరత్ తెలిపారు. రైల్వే స్టేషను పరిధిలో జరుగుతున్న పనులను సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే ఉన్నతాధికారుల అదేశాలకనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పది రోజుల వ్యవధిలోని పనులు పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. పనుల్లో భాగంగా రెవెన్యూ అధికారుల సహకారంతో ఆక్రమణలు తొలగిస్తామన్నారు. ఆయనతో పాటు రైల్వే అధికారులు, మతుకుమల్లి గ్రామ మాజీ సర్పంచ్ ముండ్రు హనుమంతరావు ఉన్నారు. తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో ఫెమ్ప్లేర్ 2026 కార్యక్రమంలో భాగంగా సోమవారం కార్నివాల్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెమ్ప్లేర్–2026 చైర్ పర్సన్ డాక్టర్ కె. రూతురమ్య మాట్లాడుతూ అతిపెద్ద మహిళా వేడుక అని పేర్కొన్నారు. బాలికలే స్వయంగా అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ మహిళా సమ్మేళనాన్ని నిర్వహిస్తారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఆయా కళాశాలల నుంచి విద్యార్థినులు హాజరు కానున్నారని తెలిపారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువనుంచి నీరు రావడంలేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 34.6755 టీఎంసీలు. -
అర్జీలు రీ ఓపెన్ కాకుండా చూడాలి
జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియాగుంటూరు వెస్ట్: అర్జీలు రీ–ఓపెన్ కాకుండా శాఖాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా తెలిపారు. సోమవారం ఎస్ఆర్శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ మాట్లాడుతూ కొన్ని శాఖల్లో అర్జీలు రీ–ఓపెన్ జరుగుతుందన్నారు. అటువంటి వాటిపై శాఖాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సిబ్బంది అర్జీదారులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. లీగల్ కేసుల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి జవాబు ఇవ్వాలన్నారు. సరైన కారణాలు లేకుండా అర్జీదారులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని కలెక్టర్ హితవు పలికారు. అనంతరం వచ్చిన 688 అర్జీలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో షేఖ్ ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రత్తిపాడు మండలం కోయావారి పాలెం గ్రామ పరిధిలోని జగన్ కాలనీలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ 71 కుటుంబాలు కూలీనే జీవనోపాధిగా చేసుకుని జీవిస్తున్నాయి. రోడ్లు, కాలువలు లేవు. వర్షాలు వస్తే కాలనీ నీటిలో మునిగిపోతుంది. కనీస మౌలిక వసతులు కల్పించాలని మనవి. – కూరపాటి నిర్మల, తదితరులు, దళిత బహుజన రీసోర్స్ సెంటర్. ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని ఓబుల్నాయుడు పాలెం పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో కొందరు అక్రమంగా క్వారీ వ్యాపారం చేస్తున్నారు. దీనికి కొందరు ప్రభుత్వాధికారులు కూడా సహకరిస్తున్నారు. స్థానికంగా క్వారీ మాఫియాతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు చొరవచూపి విచారించి న్యాయం చేయాలని మనవి. – ఆర్.శివనాగరాజు, ఓబులనాయుడుపాలెం. -
టెక్స్టైల్ కంపెనీలో భారీ చోరీ
మంగళగిరి టౌన్ : మంగళగిరిలోని ఓ టెక్స్టైల్ కంపెనీలో భారీ చోరీకి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.45 లక్షల 20 వేల నగదుతో పాటు 41 ఎలక్ట్రికల్ మోటార్లు, దొంగతనానికి ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు మంగళగిరి నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీస్స్టేషన్లో సోమవారం నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ మంగళగిరి మండలం చినకాకానిలో ఉన్న మంగళగిరి టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో గత నెల 28న మిషనరీ అపహరించిన ఘటనపై ఫిర్యాదు అందిందని పేర్కొన్నారు. మంగళగిరి పట్టణానికి చెందిన డాక్టర్ గోలి నాగసైనరావుతో పాటు పలువురు స్నేహితులు కలసి 2006లో చినకాకాని గ్రామంలో టెక్స్టైల్స్ కంపెనీ నిర్మించారు. కొంతకాలం లాభాల బాటలో నడిచింది. ఆ తరువాత ప్రొడక్షన్ తక్కువగా ఉండడం వల్ల బ్యాంకుకు ఇ.ఎం.ఐలు చెల్లించలేదు. భాగస్వామి ఇమ్మనేని ఈశ్వరరావును రిజల్యూషన్ ప్రొఫెషనల్గా బ్యాంకు అధికారులు నియమించారు. అప్పటి నుంచి ఈశ్వరరావు ఓ ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసెస్ ద్వారా కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో గత నెల 28న మిషనరీ దొంగతనం జరిగిందని గమనించి ఈశ్వరరావు మంగళగిరి రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ● మైలవరానికి చెందిన గజ్జలకొండ గోపాల్, ఈశ్వరరావుకు తెలిసిన వ్యక్తి కావడంతో ఓ ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసెస్ ద్వారా పలువురిని నియమించారు. గోపాల్కు దుర్భుద్ది పుట్టి దొంగతనానికి పాల్పడ్డాడు. ఆ మిషనరీని అమ్ముకుని ఇతర దేశాలకు వెళ్లిపోవాలని గోపాల్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. కూలీల సహాయంతో కంపెనీలో ఉన్న మిషనరీని ముందుగా మాట్లాడుకున్న షాపులకు అమ్మేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు అయిన విషయం తెలుసుకున్న గోపాల్ విదేశాలకు పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన తొమ్మిది మందిని మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలోని కోకో కోలా కంపెనీ వెనుక ప్రాంతంలో ఉన్నారని తెలుసుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 45 లక్షల 20 వేల రూపాయల నగదు, మహేంద్ర బొలెరో, మహేంద్ర స్కార్పియో వాహనాలు, ట్రాక్టర్ ఇంజన్తో పాటు 41 ఎలక్ట్రికల్ మోటార్లను స్వాధీనం చేసుకొని స్టేషన్కు తరలించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన పోలీస్బృందాన్ని అభినందిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మంగళగిరి రూరల్ సీఐ అవ్వారు వెంకట బ్రహ్మం, ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్, సిబ్బంది పాల్గొన్నారు. -
కవిత్వమంటే గొప్ప సామాజిక అన్వేషణ
తాడికొండ: కవిత్వమంటే గొప్ప సామాజిక అన్వేషణ అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ అన్నారు. స్థానిక పెదపరిమి మొవ్వా చిన్న బాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్, కేంద్ర సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ‘గ్రామ్ లోక్–యువ కవుల కోసం కవిత్వ మెళకువల’పై ఒక రోజు వర్క్షాప్ను ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని యువకులు తమ చుట్టూ జరిగే సామాజిక అంశాలను అంతర్ముఖంగా దర్శిస్తూ ఆవేదన, సున్నితం, వ్యంగ్యం, చైతన్యం రగిల్చే విధంగా రాస్తూ యువకవులుగా తమను తాము తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ప్రముఖ కవి కొప్పర్తి వెంకట రమణమూర్తి మాట్లాడుతూ.. పెద్దగా చదువు లేని గుర్రం జాషువా, భరద్వాజలు తమ రచనల ద్వారా జాతీయ పురస్కారాలు పొందారని గుర్తు చేశారు. సభాధ్యక్షులు ఎంవీఆర్ఎం ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఎంవీ రామిరెడ్డి మాట్లాడుతూ దాతల సహకారంతో వృద్ధాలయాల నిర్వహణతో పాటు నిరుద్యోగ యువతకు ఉచిత భోజన వసతితో కూడిన పోటీ పరీక్షల శిక్షణ ఇస్తూ 700 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు చేయూతనందిస్తున్నామని అన్నారు. మధ్యాహ్నం నిర్వహించిన వర్క్షాప్నకు సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యులు వల్లూరు శివప్రసాద్ అధ్యక్షత వహించారు. అనంతరం ‘కవిత్వంలో గ్రామీణ జీవనం’ అంశంపై డాక్టర్ సుంకర గోపాల్, మందరపు హైమావతి, కోసూరి రవికుమార్లు విశ్లేషించారు. వర్క్షాప్నకు ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల నుంచి 50 మందికి పైగా గ్రామీణ యువకవులు, రచయితలు, రచయిత్రులు ఉత్సాహంగా హాజరయ్యారు. కార్యక్రమంలో సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, ట్రస్టు అధ్యక్షులు మొవ్వ సాంబిరెడ్డి, కార్యదర్శి మున్నంగి శ్రీనివాసరెడ్డి, నరసింహారెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, విశ్రాంత ప్రొఫెసర్ శారద తదితరులు పాల్గొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ శివశంకర్ -
31న మా ఏపీ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు
తెనాలిటౌన్: మా–ఏపీ ఆధ్వర్యంలో ఈనెల 31వ తేదీన వివిధ రంగాల్లోని ప్రముఖులు ఎనిమిది మందికి అష్టదిగ్గజాల పేరిట ఉగాది పురస్కారాలను ప్రదానం చేయనున్నట్టు మా–ఏపీ వ్యవస్థాపకుడు, సినీదర్శకుడు దిలీప్రాజా వెల్లడించారు. తెనాలిలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్, 24 విభాగాల యూనియనన్్ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్థానిక ఆలపాటి నగర్లోని రత్న ఫార్చూన్ కల్యాణ మండపంలో ఈ వేడుకలు జరుగుతాయని చెప్పారు. ఈ వేడుకలకు గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ముఖ్య అతిథిగా హాజరవుతారు. తమ సంస్థ అష్టదిగ్గజాలుగా ఎంపిక చేసిన ప్రముఖుల్లో రాష్ట్రంలో ప్రమాదాల నివారణలో 2025 సంవత్సరానికి ప్రథమ స్థానం పొందిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, కుష్టు, ఎయిడ్స్ పీడితులకు సాయం చేస్తున్న హార్వెస్ట్ ఆఫ్ ఇండియా అధినేత కత్తెర సురేష్ కుమార్ర్, అనాధ శవాల దహనసంస్కారి కుర్రా శ్రీను, ఉచిత వైద్య శిబిరాల శిఖరం డాక్టర్ డి.శారద, వృద్ధాశ్రమ నిర్వాహకుడు వజ్రాల రామలింగాచారి, కూచిపూడి కళాకారిణీ తేజస్వి ప్రఖ్య, షార్ట్ ఫిలిమ్స్ ఉత్తమ నటి సుజిత, యూట్యూబ్ ఉత్తమ కేరెక్టర్ నటి సాయిప్రకర్షలను ఎంపిక చేసినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో సినీ దర్శకుడు అచ్చన శ్రీనివాసయాదవ్, పెదరావూరు ఫిలిం స్టూడియోస్ మేనేజర్ పినపాటి సురేష్బాబు పాల్గొన్నారు. -
శనగ పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలి
లక్ష్మీపురం(గుంటూరువెస్ట్): శనగ పంటను ప్రభుత్వమే మార్కెఫెడ్ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ అన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాశం రామారావు అధ్యక్షతన ఆదివారం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా శనగల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి క్వింటా రూ.5,875లకు కొనుగోలు చేయాలన్నారు. ప్రభుత్వం తగిన విధంగా కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు 5 వేల కంటే తక్కువకు అమ్ముకోవాల్సి వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం శనగల దిగుమతిని రద్దు చేయాలని, దేశీయ శనగలను కొనుగోలు చేయాలని కోరారు. శనగలతోపాటు మొక్కజొన్న, జొన్న, పెసలు, మినుము వంటి పంటలకు మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై చేస్తున్న సామ్రాజ్యవాద దాడిని ఖండించాలని ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలని, ట్రంప్ యుద్దోన్మాద చర్యలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహ్మమారికి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా విస్తత ప్రచారం చేపట్టాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాశం రామారావు మాట్లాడుతూ జిల్లాలో 11 మండలాలు, 40 గ్రామాలలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం 6వేల ఎకరాల సారవంతమైన భూములను సేకరిస్తున్నారని, భూములు కోల్పోయే రైతులకు ప్రైవేటు మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని, జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, ఎన్నికలకు ముందు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు జరపాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈమని అప్పారావు, బూరుగు వెంకటేశ్వర్లు, కె.నళీనికాంత్, జిల్లా కమిటీ సభ్యులు ఎల్.అరుణ, ఎమ్.ఎ.చిష్టీ, డి.లక్ష్మీనారాయణ, బి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ -
విజయానికి షార్ట్కట్స్ లేవు
● కష్టపడితేనే జీవితంలో సక్సెస్ ● హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ గుంటూరు ఎడ్యుకేషన్: కష్టపడితేనే జీవితంలో విజయాన్ని సాధించగలమని, ఎంచుకున్న రంగంలో ఉన్నతస్థాయికి ఎదిగేందుకు షార్ట్కట్స్ లేవనే విషయాన్ని తెలుసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ అన్నారు. ఆదివారం బ్రాడీపేటలోని చాణక్య ఎడ్యుకేషనల్ హబ్లో ‘సందేహాలతో సతమతమవుతున్న దశ నుంచి ఆత్మవిశ్వాసం పెంపొందించుకునే స్థాయికి చేరుకోవడం ఎలా’ అనే అంశంపై విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస అభివృద్ధి వర్క్షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ కృష్ణమోహన్ మాట్లాడుతూ విద్యార్థి దశలో పట్టుదలతో చదవాలని, ప్రతి విద్యార్థికీ కచ్చితంగా ఒక లక్ష్యం అనేది ఉండాలని స్పష్టం చేశారు. క్రమశిక్షణతో కూడిన ప్రవర్తన, నైతిక, మానవతా విలువలను ఆచరించినప్పుడే జీవితంలో సన్మార్గంలో పయనించగలరని అన్నారు. చదువుల పేరుతో ఒత్తిడి, ఆందోళనతో విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదని, శ్రమను నమ్ముకుని, నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలరని, విద్యార్థులు శారీరక, మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అలవాటు చేసుకోవాలన్నారు. ప్రేరణాత్మక వక్త కె.శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థులు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని, వ్యాపార సంబంధమైన విషయాల్లో దృష్టి సారించాలని సూచించారు. చాణక్య ఎడ్యుకేషనల్ హబ్ సీఈఓ డాక్టర్ వెంకట్ ఇక్కుర్తి మాట్లాడుతూ జీవితంలో ఏ విధంగా ఎదగాలి, లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంతో పాటు దానిని చేరుకునేందుకు అనుసరించాల్సిన మార్గాలపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా జీవితంలో విజయాన్ని సాధించేందుకు అవసరమైన సూచనలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. -
అంబటికి కాటసాని పరామర్శ
పట్నంబజారు: వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబును పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. గత కొద్ది కాలం క్రితం టీడీపీ గూండాలు అంబటిపై దాడికి యత్నించి, నివాసం, కార్యాలయం పగులకొట్టిన విషయం విధితమే. ఈ క్రమంలో సిద్ధార్థ నగర్లోని ఆయన నివాసంలో అంబటిని కలిసిన కాటసాని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ నేతలు చేసిన దాడి వివరాలను పరస్పరం చర్చించుకున్నారు. వైఎస్సార్ సీపీ నేతలు కాటసానికి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. తెనాలిఅర్బన్: 2003 సంవత్సరంలో ఎంపికై 2004లో విధుల్లో చేరిన ఎయిడెడ్ ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎయిడెడ్ ఉపాధ్యాయులు కోరారు. బోసురోడ్డులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. మంత్రి లోకేష్తో మాట్లాడి న్యాయం జరిగే విధంగా చూస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు ఉపాధ్యాయులు చెప్పారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ తెనాలి కన్వీనర్ పుట్టా జనార్ధనరావు, ఎయిడెడ్ ఉపాధ్యాయులు అనిశెట్టి శ్రీనివాసులు, ఎం.నాగమ్మ, షేక్ జాకీర్, వెంకటేశ్వరరావు, మంజుల, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలకు అసభ్య వీడియోలు పంపుతున్న వ్యక్తి అరెస్ట్
● రెండు సెల్ఫోన్లు స్వాధీనం ● సీసీఎస్ డీఎస్పీ మధుసూదనరావు వివరాలు వెల్లడి గుంటూరు రూరల్: ట్రూకాలర్లో మహిళల పేర్లను చూసి ఆయా సెల్ నంబర్లకు వీడియో కాల్స్ చేసి అసభ్యకర వీడియోలు పంపుతున్న వ్యక్తిని నల్లపాడు పోలీస్ స్టేషన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అడవితక్కెళ్లపాడులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ డీఎస్పీ మధుసూదనరావు, సీఐ వంశీధర్ వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం, మాచవరం గ్రామానికి చెందిన రామనాథం నాగేశ్వరరావు గతంలో పెట్రోల్ బంకులో పనిచేసేవాడు. జల్సాలకు అలవాటు పడి ఆడవారిని బెదిరించి డబ్బులు గుంజాలని తన ఫోన్లో రియల్ నంబర్స్ అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకున్నాడు. ఆ నంబర్లను ట్రూ కాలర్లో చెక్ చేసి వాటిలో ఆడవారి పేర్లతో రిజిస్టర్ అయిన నెంబర్లకు వాట్సప్ ద్వారా మెసేజ్లు పెట్టడం, వారికి వీడియో కాల్స్ చేయడం అసభ్య కరమైన ఫొటోలను వీడియోలను పంపుతున్నాడు. తద్వారా డబ్బులు సంపాదించాలని చూస్తుండేవాడు. పలకలూరు రోడ్డులోని ఒక మహిళకు అదే విధంగా అసభ్య పదజాలంతో వాట్సప్ ద్వారా బూతులు తిట్టి అసభ్యకరమైన ఫొటోలు పంపించాడు. ఆ మహిళా ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆదివారం పలకలూరు రోడ్డు విజ్ఞాన్ కాలేజి దగ్గరలో నిందితుడిని పట్టుకొని అతడి వద్ద నుంచి వివో ఫోన్, ఆపిల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ వకుల్జిందాల్ ఆదేశాల మేరకు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు, మహిళా భద్రతా దష్ట్యా శక్తి టీములు నిరంతరం అందుబాటులో ఉంటున్నట్లు డీఎస్పీ మధుసూదనరావు తెలిపారు. ఆపదలో ఉన్న వారు 112కు ఫోన్ చేసి పోలీస్ వారి సహాయం పొందవచ్చని, ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియా మాధ్యమాలను దుర్వినియోగం చేయరాదని సూచించారు. కేసులో ప్రతిభ కనబరిచిన నల్లపాడు పోలీస్ స్టేషన్ సీఐ వంశీధర్, ఎస్ఐ మహేష్కుమార్, సిబ్బందికి రివార్డు అందజేసి అభినందించారు. – రూ.11.80 లక్షల సొత్తు స్వాధీనం తెనాలిరూరల్: తెనాలి పట్టణం బుర్రిపాలెం రోడ్డులోని ఎలక్ట్రానిక్ షోరూమ్ సోనోవిజన్లో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకుని రూ.11.80 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. నిందితుల్లో ఒకరు ఇప్పటికే జువైనెల్ హోమ్లో శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. మళ్లీ ఇప్పుడు మద్యం, గంజాయికి అలవాటుపడిన మరో బాలుడిని కలుపుకుని ఏకంగా ఎలక్ట్రానిక్ షోరూమ్లోనే చోరీ చేశాడు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి. జనార్ధనరావు వివరాలు వెల్లడించారు. బుర్రిపాలెం రోడ్డులోని ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూమ్ సోనోవిజన్లో ఈనెల 15వ తేదీ అర్ధరాత్రి అనంతరం జరిగిన చోరీ కేసులో ఇద్దరు బాలురను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.11.80 లక్షల విలువైన సెల్ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పట్టణ ముత్యంశెట్టిపాలేనికి చెందిన 17 ఏళ్ల బాలుడు, చినరావూరు ఆర్టీసీ ఓల్డ్ డిపోరోడ్డుకు చెందిన 16 ఏళ్ల బాలుడు ఈ కేసులో నిందితులని తెలిపారు. ఈనెల 15వ తేదీ అర్ధరాత్రి రెండో అంతస్తులో గల గ్లాస్ డోరు పగులగొట్టి లోపలకు ప్రవేశించి వివిధ కంపెనీల మొబైల్స్, వాచీలు, బడ్స్, చార్జర్, అడాప్టర్లను దొంగతనం చేశారు. దీనిపై షోరూమ్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలించారు. ఈ క్రమంలో ఆదివారం గాంధీచౌక్లో నిందితులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ బి.జనార్ధనరావు చెప్పారు. ముత్యంశెట్టిపాలెంకు చెందిన బాలుడు చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవటంతో అక్కల వద్ద నివాసం ఉంటున్నాడు. క్యాటరింగ్ పనులు చేసుకుంటూ చెడు వ్యసనాలకు బానిసైనట్టు తెలిపారు. ఆదాయం సరిపోక బైక్ దొంగతనాలు చేస్తున్నాడు. ఈ నేరాలకుగాను అతడిపైన స్థానిక వన్న్ టౌన్, త్రీటౌన్, రూరల్ పోలీస్స్టేషన్లలో కేసులున్నాయి. వీటిలో రెండు కేసుల్లో ఇప్పటికే శిక్ష పడగా, తొమ్మిది నెలలపాటు విజయవాడ హోమ్లో ఉండి నాలుగు నెలల కిందట విడుదలయ్యాడు. మళ్లీ ఇప్పుడు ఇంటర్ సెకండియర్ చదువుతూ మద్యం, గంజాయి వ్యసనాలకు అలవాటుపడిన చినరావూరు బాలుడిని కలుపుకుని సోనోవిజనన్ షోరూమ్లో చోరీ చేసినట్టు వివరించారు. షోరూమ్ ఉన్న కాంప్లెక్సులోనే ఉన్న హోటల్లో క్లీనర్గా చేసిన 17 ఏళ్ల బాలుడు, రెక్కీ నిర్వహించి 16 ఏళ్ల బాలుడితో కలిసి చోరీ పాల్పడినట్టు తెలియజేశారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన సీఐ రాములునాయక్, ఆయన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిఽధిలోని బకింగ్హామ్ కెనాల్ ఉండవల్లి సెంటర్ బ్రిడ్జి పైనుంచి ఆదివారం ఓ వృద్ధుడు నీటిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ సాయికుమార్ సంఘటనా స్థలానికి వచ్చి నీటిపై తేలియాడుతున్న మృతదేహాన్ని వెలికితీయించారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని అంజిరెడ్డి కొట్టు సెంటర్ ప్రాంతంలో నివాసముండే ధనేకుల అర్జునరావు(68)గా గుర్తించి బంధువులకు సమాచారం ఇచ్చారు. కొంతకాలంగా విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతున్న అర్జునరావు ఆ నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు పోలీసులకు తెలిపారు. జరిగిన ఘటనపై భార్య ధనలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ సాయికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రిడ్జిపై నుంచి నీటిలోకి దూకే సమయంలో ప్రాణం పోయి ఉంటుందని అందువల్లే మృతదేహం నీటిపై తేలియాడిందని ఎస్ఐ తెలిపారు. అమరావతి: పిడుగుపాటుకు గురై మండల పరిధిలోని ఎండ్రాయి గ్రామానికి చెందిన యువకుడు మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. ఎండ్రాయి గ్రామానికి చెందిన నల్లగోర్ల విజయకుమార్ గేదెలను తోలుకుని రోజులాగానే శనివారం కూడా పొలానికి వెళ్లాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో గాలివాన తోపాటు పిడుగు పడటంతో విజయ్కుమార్(25) అక్కడిక్కడే మృతిచెందాడు. గేదెలు ఇంటికి వచ్చినా విజయకుమార్ రాకపోవటంతో కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఎండ్రాయి పరిసర ప్రాంతాలలో గాలించారు. శనివారం రాత్రి పొలాల్లో విగతజీవిగా పడి ఉన్న విజయకుమార్ను గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని అమరావతి సీహెచ్సీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని కుటుంబసభ్యులకు ఆదివారం అప్పగించారు. మృతుడికి ఏడాది కిందటే వివాహమైంది. భార్య, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
ఎదను కదిపిన ఆలాపన
తెనాలి: ఆ గానం సంగీత మధురిమలను పంచింది...ఆధ్యాత్మిక కీర్తనలు శ్రోతలను అలౌకిక ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. సంగీతాభిమానులకు పారవశ్వాన్ని కలిగించాయి. దాదాపు గంటన్నరసేపు సాగిన ఆ గానాలాపనకు శ్రోతలు కరతాళధ్వనులతో తమ ఆనందాన్ని చాటారు. ఎన్నో ఏళ్లుగా తన సంగీత విద్యతో శ్రోతలను రంజింపజేస్తూ, మరెందరికో శిక్షణనిస్తున్న చింతలపాటి మంజుల గానాలాపన ప్రతి ఎదనూ కదిపింది. ప్రతి కీర్తనకూ శ్రోతలనుండి కర తాళధ్వనులు అందుకున్నారు. స్థానిక బోసురోడ్డులోని హనుమాన్చౌక్లో గల శ్రీసీతారామమందిరంలో 94వ వార్షిక వసంత నవరాత్ర మహోత్సవాలు ఇందుకు వేదికగా నిలిచాయి. సంగీతవ్యాప్తికి చేస్తున్న కృషిలో భాగంగా సొంతూరు తెనాలిలో వసంత నవరాత్ర ఉత్సవాల్లో సంగీత కచేరీ చేయటం అదృష్టంగా భావించానని డాక్టర్ మంజుల చెప్పారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెనాలి డబుల్హార్స్ మినపగుళ్లు అధినేత, కళాభిమాని మునగాల మోహన్శ్యాంప్రసాద్ డాక్టర్ మంజులను సత్కరించి అభినందించారు. సంగీతరంగంలో తెనాలికి గల ఘనవారసత్వాన్ని కొనసాగిస్తున్న విద్వన్మణిగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీసీతారామమందిరం పాలకవర్గ కమిటి కార్యదర్శి కల్లూరి వేంకట సూర్యనారాయణమూర్తి, సభ్యులు నేతి ఆంజనేయశాస్త్రి డాక్టర్ మంజులను ప్రశంసించారు. సంగీత విద్వన్మణి డాక్టర్ చింతలపాటి మంజులకు సత్కారం -
జిల్లాలో 5.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు అత్యధికంగా గుంటూరు పశ్చిమలో 20.2 మిల్లీ మీటర్లు వర్షం కురవగా, అత్యల్పంగా ప్రత్తిపాడు మండలంలో 2 మి.మీ. వర్షం కురిసింది. సగటున 5.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. తాడికొండ మండలంలో 17.4 మి.మీ, పెదకాకాని 13.6, గుంటూరు తూర్పు 11.2, తుళ్లూరు 8, మంగళగిరి 7.8, దుగ్గిరాల 3.4, మేడికొండూరు 3.4, తాడేపల్లి 3.2, చేబ్రోలు 3, వట్టిచెరుకూరు 3, తెనాలి 2.6, కొల్లిపర మండలంలో 2.5 మి.మీ. చొప్పున వర్షం కురిసింది. జిల్లాలో మార్చి 22వ తేదీ నాటికి సాధారణ వర్షపాతం 7 మి.మీ. కురవాల్సి ఉండగా, ఇప్పటి వరకు 17.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా గుడిపాటి దాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జిల్లా కోర్టు వద్ద ఉన్న ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సంఘ జిల్లా కార్యవర్గ సమావేశంలో పెదనందిపాడు మండలం గోగులమూడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గుడిపాటి దాస్ను ఎన్నుకున్నారు. 11 ఏళ్లుగా సంఘ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన కె.బసవ లింగారావు ఇటీవల రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడి స్థానాన్ని భర్తీ చేశారు. డాక్టర్ కొంగర శ్రీకాంత్ గుంటూరు మెడికల్: ఆధునిక జీవనశైలితో నేడు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారని డాక్టర్ కొంగర శ్రీకాంత్ అన్నారు. ఆధునిక చికిత్సలతో జీవనశైలిలో మార్పులతో ఊబకాయాన్ని కట్టడి చేయవచ్చని తెలిపారు. ఆదివారం స్థానిక అమరావతిరోడ్లోని బండ్లమూడిగార్డెన్స్లో ఎండోలైఫ్ ఒబేసిటీ అప్డేట్ ఆధ్వర్యంలో ఊబకాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ అధిక బరువుతో అనేక వ్యాధులు వస్తున్నాయని, బరువు తగ్గించుకోవటం కోసం చాలా మంది అవస్థలు పడుతున్నారన్నారు. ఊబకాయంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తాము ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. అతి తక్కువ ఖర్చుతో ఊబకాయం తగ్గించే వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. ఊబకాయాన్ని తగ్గించే మెడిసిన్ స్టాల్స్ను ప్రదర్శనలో ఉంచామని, అందరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు అనేక మంది ఈ కార్యకమంలో పాల్గొనటం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో వైద్యులు నర్మదా, నీరజ, స్వప్న్కి, ఋషి కృష్ణ, ఐఎంఏ సభ్యులు పాల్గొన్నారు. నగరం: అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడిపై కళ్లెదుటే లారీ ఎక్కడంతో తల పగిలి మెదడు బయటకు వచ్చిన దృశ్యాన్ని చూసి కన్నతల్లి తల్లడిల్లిపోయింది. ఈ విషాద ఘటన ఆదివారం మండలంలోని శివంగులపాలెం జాతీయ రహదారి వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్ఐ బండ్ల భార్గవ్ కథనం.. మండలంలోని మంత్రిపాలెం శివారు బొడ్డువారిపాలెం గ్రామానికి చెందిన చెరుకూరి రాజేశ్వరావు, సుజిని దంపతులు. వారు తమ కుమారుడు దినేష్(13), కుమార్తెతో కలసి ద్విచక్ర వాహనంపై భట్టిప్రోలు వెళుతున్నారు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంతో వస్తున్న లారీ వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో దినేష్ తలపై నుంచి లారీ టైరు వెళ్లడంతో తల ఛిద్రమై మెదడు బయటకు వచ్చి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో రాజేశ్వరావుకు తీవ్ర గాయాలయ్యాయి. కుమార్తె కూడా గాయాలపాలైంది. కుమారుడి మృతదేహం వద్ద తల్లి రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దినేష్ మృతదేహానికి పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయాలపాలైన వారిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భార్గవ్ తెలిపారు. వరస ప్రమాదాలతో భయాందోళన గత రెండు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో పీటా గోపాలం ద్విచక్రవాహనంపై వెళుతున్న సమయంలో అంబులెన్స్ ఢీకొనడంతో మృతి చెందాడు. ఆదివారం అదే ప్రాంతంలో లారీ ఢీకొని బాలుడు మృతి చెందడంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు .వరుస ప్రమాదాల నేపథ్యంలో ఈ ప్రాంతంలో హెచ్చరికల బోర్డులు పెట్టించాలని, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
పన్ను వసూలుకూ పాట్లు!
గుంటూరు నగరపాలక సంస్థకు బకాయిలు ఉన్న పన్నులు వసూలు చేయడంలో సంబంధిత రెవెన్యూ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. రోజువారీ వసూళ్లపై దృష్టి సారించిన అధికార యంత్రాంగం ప్రైవేట్ వారి నుంచి పన్ను వసూళ్ల విషయంలో కాస్త ఫర్వాలేదన్నట్లుగా ఉంది. ఖాళీ స్థలాలు, వాటర్, స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీలకు సంబంధించిన బకాయిలు వసూలు చేయడంలో అధికారులు వెనుకంజలో ఉన్నారు. నగరాభివృద్ధికి కీలకమైన ఆదాయం సమకూర్చడానికి ప్రత్యేక అధికారి అయిన జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్, ఖాళీ స్థలాలు, ప్రభుత్వ బిల్డింగ్లకు సంబంధించిన మొత్తం అసెస్మెంట్లు 2,17,929 ఉన్నాయి. వీటికి సంబంధించి డిమాండ్ రూ.350 కోట్లు ఉంది. ఈ నెల 21వ తేదీ నాటికి ఇందులో వసూలు అయింది రూ.127.86 కోట్లు మాత్రమే. ఇంకా రూ.222.93 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ప్రైవేట్ పాపర్టీకి సంబంధించి చూస్తే 2,07,415 ప్రాపర్టీలకు ఇంటి పన్నులు వసూలు చేయాలి. వీటికి రూ.186.43 కోట్ల డిమాండ్ ఉండగా... ఇందులో వసూలు అయింది రూ.110.12 కోట్లు మాత్రమే, ఇంకా రూ.76.31 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అసెస్మెంట్లు 309 ఉన్నాయి. వీటికి మొత్తం డిమాండ్ రూ.30.36 కోట్లు కాగా, వసూలు అయింది రూ.2.49 కోట్లు మాత్రమే. ఇంకా రూ.27.86 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి 142 అసెస్మెంట్లు ఉన్నాయి. వీటికి మొత్తం డిమాండ్ రూ.12.78 కోట్లు. వీటిల్లో వసూలు అయినవి రూ.35.41 లక్షలు మాత్రమే. ఇంకా రూ.12.43కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఖాళీ స్థలాలూ ఎక్కువే.. నగరంలో 9,997 ఖాళీ స్థలాలకు అసెస్మెంట్లు ఉన్నాయి. వీటిలో మొత్తం డిమాండ్ రూ.115.60 కోట్లు. కానీ 21వ తేదీ వరకు వసూలు అయింది రూ.13.78 కోట్లు మాత్రమే. ఇంకా రూ.101.82 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. నగరంలో గృహా అవసరాలకు వాడే నీటి పన్నులు 1,12,850 అసెస్మెంట్లు ఉన్నాయి. వీటికి సంబంధించి మొత్తం డిమాండ్ రూ.28.37 కోట్లు. ఇప్పటి వరకు వసూలు చేసింది రూ.7.12 కోట్లు మాత్రమే. ఇంకా రూ.21.25కోట్లు వసూలు కావాల్సి ఉంది. అదే విధంగా కమర్షియల్, అపార్ట్మెంట్స్కు వాడే వాటర్ చార్జీలు (మీటర్) మొత్తం 4478 అసెస్మెంట్లు ఉన్నాయి. వీటికి డిమాండ్ రూ.53.80 కోట్లు కాగా.. ఈ నెల 21వ తేదీ వరకు వసూలు అయింది రూ.6.10 కోట్లు మాత్రమే. ఇంకా రూ.47.70 కోట్లు వసూలు కావాల్సి ఉంది. బకాయిలు ఉన్నవారి ట్యాప్ కనెక్షన్లు కట్ చేయాల్సిన అధికారులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారనే చెప్పుకోవచ్చు. గుంటూరు నగరపాలక సంస్థలో దీర్ఘకాలికంగా రూ.కోట్లల్లో బకాయిలు ఉన్నవారు పదుల సంఖ్యలో ఉన్నారు. రూ.10 లక్షలకు పైగా బకాయిలు ఉన్నవారు వందల సంఖ్యల్లోనే ఉన్నారు. వీరి వద్ద నుంచి బకాయిలు వసూలు చేయడంలో అధికారులు విఫలం చెందారనే చెప్పుకోవచ్చు. రెడ్ నోటీసులు ఇచ్చి వారి ట్యాప్ కనెక్షన్, డ్రైయినేజీ కనెక్షన్ కట్ చేస్తామని చెప్పినప్పటికి బకాయిదారుల్లో కనీసం చలనం లేదనే చెప్పుకోవచ్చు. ప్రత్యేక అధికారి పాలనలో అయిన మొండి బకాయిదారులపై దృష్టి సారించాల్సి ఉంది. వారి నుంచి రూ.కోట్ల రూపాయిల బకాయిలు వస్తే ప్రజలకు మేలు చేకూర్చే అభివృద్ధి పనులకు ఉపయోగపడతాయి. అదే విధంగా కేంద్ర, ప్రభుత్వ కార్యాలయ నుంచి బకాయిలు వసూలు చేయగలిగితే కార్పొరేషన్ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. -
కార్తికేయుని ఆలయంలో భక్తుల కోలాహలం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం ఆదివారం భక్తజనంతో కోలాహలంగా మారింది. తెల్లవారుజాము నుంచే తెలుగు ఉభయ రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. నాగ పుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళ్లశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ సూపరిటెండెంట్ అచ్యుత మదుసూధనరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే వివిధ సేవా టికెట్ల ద్వారా స్వామి వారికి రూ. 8,35,885 ఆదాయం వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. -
నేటి నుంచి పుష్కర కుంభాభిషేక మహోత్సవాలు
రేపల్లె: రేపల్లె పట్టణ గ్రామదేవత బూరగలమ్మ వారి పుష్కర కుంభా భిషేక మహోత్సవం నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవం సోమవారం నుంచి ఈనెల 25వ తేదీ వరకు జరుగుతుందని ఆలయ అర్చకుడు నందివెలుగు భానుసుధాకర్ గురుకులు ఆదివారం తెలిపారు. 12 సంవత్సరాలకు ఒకమారు ఈ మహాకుంభాభిషేక మహోత్సవాలు జరుగుతాయని, దీనిలో భాగంగా విశేష పూజలతోపాటు ఆలయ ఆవరణలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. 25వ తేది ఉదయం 9.50 గంటలకు ఆలయ శిఖరానికి, అమ్మవారికి ఏకకాలంలో అభిషేకం జరుగుతాయని పేర్కొన్నారు. మధ్యాహ్నం 11.30 గంటలకు అన్న ప్రసాద వితరణ జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ మహోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు. చేబ్రోలు: మానవాళి రక్షణకు ఏసుక్రీస్తు శిలువ శ్రమలు పొంది, శిలువపై రక్తం చిందించి మరణించి సర్వ మానవాళికి రక్షణ అందించారని చేబ్రోలు చీలిపాలెంలోని పునీత అంతోనివారి దేవాలయం ఫాదర్ మల్లవరపు బాలశౌరి తెలిపారు. చేబ్రోలులో ఆదివారం ఘనంగా శిలువ యాత్ర కార్యక్రమం చేపట్టారు. పాతరెడ్డి పాలెం, గొడవర్రు, కోవెలమూడి, లేమల్లె పాడు, కొత్తరెడ్డిపాలెం నుంచి వందలాది మంది విశ్వాసులు పాల్గొన్నారు. ప్రభువు శిలువ శ్రమలను కళ్లకు కట్టే విధంగా నాటక రూపంలో చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. పొన్నూరు ఆశ్రమానికి చెందిన బ్రదర్ జాక్ (గోతాలస్వామి) సందేశాన్ని అందజేశారు. కార్యక్రమానికి వచ్చిన వేలాది మందికి అన్నదానం చేశారు. కమిటీ పెద్దలు, సంఘస్తులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రోత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో నాల్గో రోజైన ఆదివారం జగన్మాతకు మందార పుష్పాలు, ఎర్రకలువలు, చామంతులతో అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారి అర్చన నిమిత్తం సేకరించిన పుష్పాలతో అధికారులు, అర్చకులు ప్రధాన ఆలయంలోని మూల విరాట్ను దర్శించుకున్నారు. -
చిన్నారులకు విద్యుత్ షాక్
తాడేపల్లి రూరల్: ఆడుకుంటున్న సమయంలో చేతిలో ఉన్న బెల్టు ఇంటికి అతి సమీపంలో వున్న 11 కేవీ విద్యుత్ వైర్లపై పడింది. దానిని తీసేందుకు ప్రయత్నించిన ఇద్దరికి విద్యుత్ షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. సేకరించిన వివరాల ప్రకారం.. ఉండవల్లి సెంటర్లో జామాయిల్ తోటలో నివాసముండే పుప్పాల శ్రీనివాస్, దుర్గ దంపతులకు కుమార్తె, కుమారుడు. ఇతను ఆటోను నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శ్రీనివాస్ తమ్ముడు సురేష్ అలియాస్ బుజ్జి చిరు ఉద్యోగం చేస్తూ ఉండవల్లి సెంటర్లోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద మూడో అంతస్తులో అద్దెకు నివాసముంటున్నాడు. సురేష్కు కూడా ఇద్దరు పిల్లలు. శ్రీనివాస్ పిల్లలు ఆడుకునేందుకు సురేష్ ఇంటికి వచ్చారు. నలుగురు పిల్లలు కారిడార్లో ఆడుకుంటున్న సమయంలో సురేష్ కొడుకు త్రివిక్రమ్ చేతిలోని బెల్టును విసిరివేశాడు. అది 11 కేవీ వైర్లపై పడింది. పక్కనే ఉన్న శ్రీనివాస్ కుమార్తె విష్ణుప్రియ బెల్టును తీసేందుకు ఇంటికి మాపు వేసే ఐరన్ పైపు కలిగి ఉన్న కర్రతో ప్రయత్నించింది. దీంతో విష్ణుప్రియకు, త్రివిక్రమ్కు విద్యుత్ షాక్ తగిలింది. పెద్దగా కేకలు వినిపించడంతో ఇంట్లో నిద్రిస్తున్న సురేష్, స్రవంతిలు బయటకు వచ్చి చూడగా పిల్లలు ఇద్దరూ మంటల్లో కాలిపోతున్నారు. ఏం జరిగిందో అర్ధంకాక పెద్దగా కేకలు వేసి ఇంట్లో ఉన్న దుస్తులతో మంటలను అదుపుచేశారు. ట్రాన్స్ఫార్మర్ ట్రిప్ అయి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇద్దరు చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. వీరిద్దరిని తల్లిదండ్రులు, ఇతర స్నేహితులు వైద్య నిమిత్తం విజయవాడ ఆసుపత్రిలో చేర్పించారు. 11 కేవీ విద్యుత్ వైర్లు ఇంటి ముందు నుంచి వెళుతున్నా ఇంటి యజమాని విద్యుత్ సరఫరా కాకుండా పైపులైన్లు వేయించలేదు. ప్రమాదం అని తెలిసినా విద్యుత్ శాఖ అధికారులు ఆ బిల్డింగ్ యజమానికి సూచించలేదు. వారి నిర్లక్ష్యం కారణంగా చిన్నారులిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 8వ తరగతి చదువుతున్న విష్ణుప్రియకు జుట్టుతోపాటు రెండు చేతులు, ఛాతీ పూర్తిగా కాలిపోయింది. కుడిచేయి బొటన వ్రేలు, చూపుడు వేలు తీసివేయాలని వైద్యులు తెలియజేశారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. త్రివిక్రమ్కు రెండు చేతులు, కుడిచేయి ఛాతీ కింద భాగంలో పూర్తిగా విద్యుత్ ఘాతానికి గురై కాలిపోయాయి. -
సంక్షోభంలో పాఠశాల విద్యారంగం
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్రంలో పాఠశాల విద్యారంగం సంక్షోభంలో ఉందని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.బసవ లింగారావు అన్నారు. ఆదివారం జిల్లా కోర్టు వద్ద ఉన్న ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సంఘ జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలతో పాఠశాల విద్యారంగం సంక్షోభంలోకి నెట్టి వేయబడిందని అన్నారు. పాఠశాల విద్యలో అనేక ప్రయోగాలను చేస్తూ, పాఠశాలలను ప్రయోగ పరీక్ష కేంద్రాలుగా మార్చి వేశారని అన్నారు. కూటమి పాలనలో విద్యారంగంలో తెచ్చిన ఏ ఒక్క పథకం, కార్యక్రమం నాణ్యమైన విద్య అందించేదిగా లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా విద్యారంగంపై ప్రయోగాలు మానుకుని, విద్యార్థులకు ఉపయోగపడే శాసీ్త్రయమైన విద్యావిధానాన్ని మాతృభాషలో కొనసాగించాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిన ప్రాథమిక పాఠశాలల తరగతులు ఉపసంహరించుకోవాన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ను నియమించి, 30శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. వేసవి సెలవుల్లో ఉపాధ్యాయ బదిలీలు, ఉద్యోగోన్నతులను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, సంఘ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి పి.పాండురంగ వరప్రసాదరావు మాట్లాడుతూ విద్యాశాఖాధికారులు నిరంకుశంగా అమలు చేస్తున్న విద్యార్థి, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను పోరాటాల ద్వారానే ఎదుర్కోవాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకుడు షేక్ జిలానీ మాట్లాడుతూ 79 ఏళ్లుగా ఏపీటీఎఫ్ విద్యారంగ ప్రగతికి, ఉపాధ్యాయ సంక్షేమానికి నిరంతరం పనిచేస్తోందని, కార్యకర్తలు నిత్య చైతన్యంతో పనిచేయాలని సూచించారు. పేద ప్రజల బిడ్డలకు మంచి విద్యను అందించాలన్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న గుడిపాటి దాస్ మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకుల సమష్టి కృషితో సంఘ నిర్మాణానికి, ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. కార్యవర్గ సమావేశంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర జీఓ కమిటీ కన్వీనర్ సయ్యద్ చాంద్ బాషా, జిల్లా శాఖ అధ్యక్షుడు గుడిపాటి దాస్, ప్రధానకార్యదర్శి మహమ్మద్ ఖాలీద్, ఉపాధ్యక్షులు పి.నాగశివన్నారాయణ, పుట్టా జనార్ధనరావు, పి.పార్వతి, జిల్లా కార్యదర్శులు గడ్డిపాటి శివరామకృష్ణ, చక్కా వెంకటేశ్వరావు, కె.శ్రీనివాసరావు, పి.శివరామకృష్ణ, రాష్ట్ర కౌన్సిలర్లు బి.సాయి లక్ష్మీ, కె.రమేష్ వివిధ మండల శాఖల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.బసవ లింగారావు -
ఘరానా దొంగ అరెస్ట్
గుంటూరు రూరల్: జల్సాల కోసం డబ్బులు సులువుగా సంపాదించుకునేందుకు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లాల దొంగను నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం అడవితక్కెళ్ళపాడులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మధుసూదనరావు తెలిపిన వివరాల మేరకు... కృష్ణా జిల్లా, గన్నవరం గ్రామానికి చెందిన కత్తి రవికుమార్ గతంలో గుంటూరు, ప్రకాశం, ఏలూరు, కృష్ణా, కర్నూల్ జిల్లాలతోపాటు హైదరాబాద్లోనూ చోరీలు చేశాడు. పలు కేసుల్లో అరైస్టె 5 సార్లు జైలుకు కూడా వెళ్లొచ్చాడని తెలిపారు. గత సంవత్సరం డిసెంబరు నెలలో జైలు నుంచి వచ్చి మళ్లీ గుంటూరు అంకిరెడ్డిపాలెం గ్రామంలో ఒక ఇంటిలో రాత్రి పూట బంగారం చోరీ చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం పలకలూరు రోడ్డులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ. 5 లక్షల విలువ చేసే బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నగరంపాలెం స్టేషన్ పరిధిలో చోరీలకు సంబంధించి రూ1.50 లక్షల విలువ చేసే బంగారు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన నల్లపాడు సీఐ వంశీధర్, ఎస్ఐ మహేష్కుమార్, సిబ్బందిని రివార్డు అందజేసి అభినందించారు. -
చురుగ్గా ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్
గుంటూరు ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు ముగియడంతో విద్యార్థుల ఆన్సర్ షీట్లకు స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ వేగవంతమైంది. గుంటూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో సంస్కృత భాష ఆన్సర్ షీట్లకు వాల్యూయేషన్ జరుగుతోంది. జనరల్, ఒకేషనల్ కోర్సులవారీగా ఆరు సబ్జెక్టుల చొప్పున ఆదివారం వాల్యూయేషన్ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా వివిధ కళాశాలలకు చెందిన అధ్యాపకులు మూల్యాంకన విధులకు హాజరయ్యారు. ఇటీవల ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులకు సంబంధించి గుంటూరు జిల్లాకు ఆర్ట్స్, సైన్స్ కోర్సుల వారీగా 3.50 లక్షలు, ఒకేషనల్లో 75 వేల స్క్రిప్ట్స్ వచ్చాయి. స్పాట్ వాల్యూయేషన్ క్యాంపు అధికారి, ఆర్ఐవో జి.సునీత పర్యవేక్షణలో తెలుగు, హిందీ, సంస్కృతం, గణితం, సివిక్స్, ఇంగ్లిషు సబ్జెక్టులకు సంబంఽధించిన ఆన్సర్ షీట్లకు అధ్యాపకులు మూల్యాంకనం నిర్వహిస్తున్నారు. వాల్యూయేషన్తోపాటు ‘మార్క్స్ ట్యాబ్లేషన్’ ఆన్సర్ స్క్రిప్టులకు వాల్యూయేషన్ చేయడంతోపాటు మార్కుల కేటాయింపు ప్రక్రియ స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలోనే జరుగుతోంది. గతంలో స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకనం చేసిన ఆన్సర్ స్క్రిప్ట్లను చీఫ్ ఎగ్జామినర్లు పరిశీలించిన తరువాత వాటిని ఇంటర్మీడియెట్ బోర్డుకు పంపేవారు. ఆ విధంగా బోర్డుకు వెళ్లిన ఆన్సర్ స్క్రిప్ట్లను స్కాన్ చేసి విద్యార్థుల రోల్ నంబరు, ప్రశ్నపత్రంలో ఇచ్చిన సీరియల్ నంబరు, బార్కోడ్ ఆధారంగా మార్కులను కేటాయించేవారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల ఆన్సర్ స్క్రిప్ట్లను స్కానింగ్ చేసి మార్కులను కేటాయిడం ఇంటర్మీడియెట్ బోర్డు ప్రధాన కార్యాలయంలో కేంద్రీకృతమై ఉండటంతో అధికారులకు, ఉద్యోగులకు తలకు మించిన భారంగా ఉండేది. పగలు, రాత్రి విధుల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ మార్కుల వెల్లడిలో జాప్యం నెలకొంటున్న పరిస్థితుల్లో మూడేళ్ల క్రితం ఈ విధానంలో మార్పులు తెచ్చిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యార్థుల ఆన్సర్ స్క్రిప్ట్లను స్కానింగ్ చేసే ‘మార్క్స్ ట్యాబ్లేషన్’ విధానాన్ని వికేంద్రీకరణ చేసింది. జిల్లాల వారీగా స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాల్లోనే ఆ మేరకు ఏర్పాట్లు చేసింది. స్పాట్ వాల్యూయేషన్ విధులకు హాజరవుతున్న ఎగ్జామినర్లు వాల్యూయేషన్ చేస్తున్న స్క్రిప్ట్లను అదే రోజు స్కానింగ్ చేసి ఆన్లైన్ ద్వారా బోర్డుకు పంపుతున్నారు. తద్వారా ఇంటర్మీడియెట్ బోర్డుకు కొండంత పని భారం నుంచి విముక్తి లభించింది. ఆన్సర్ స్క్రిప్ట్లకు స్పాట్ వాల్యూయేషన్ ద్వారా మార్కుల కేటాయింపుతోపాటు అక్కడిక్కడే స్కానింగ్ చేసి ఆన్లైన్ ద్వారా బోర్డుకు పంపడంతో వీలైనంత త్వరగా ఫలితాలను ప్రకటించేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి. ఫలితాలను ఏప్రిల్ 11న ప్రకటించే అవకాశం ఉంది. స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో సబ్జెక్టులవారీగా మూల్యాంకనానికి ఏర్పాట్లు చేశారు. సబ్జెక్టు నిపుణులను బోర్డులుగా విభజించిన ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ఆన్సర్ షీట్లకు వాల్యూయేషన్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ప్రతి బోర్డులో ఒక చీఫ్ ఎగ్జామినర్తో పాటు ఐదుగురు అసిస్టెంట్ ఎగ్జామినర్లు ఉంటారు. వీరికి అదనంగా బోర్డుకు ఒకరు చొప్పున నియమించిన స్క్రూటినైజర్ మూల్యాంకనం చేసిన ఆన్సర్ స్క్రిప్ట్లను తనిఖీ చేసి, కేటాయించిన మార్కులను పరిశీలిస్తారు. ఈ విధంగా 500 మంది అధ్యాపకులను సంబంధిత విధుల్లో నియమించారు. స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో విధుల్లో పాల్గొంటున్న అధ్యాపకులకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసిన అధికారులు, తప్పిదాలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టారు. ఆర్ట్స్, సైన్స్ కోర్సులకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో స్పాట్ వాల్యూయేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు. -
విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి
ఆర్ఐవో జి.సునీతగుంటూరు ఎడ్యుకేషన్:స్పాట్ వాల్యూయేషన్ విధి నిర్వహణలో అధ్యాపకులు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలని ఇంటర్మీడియెట్ విద్య ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (ఆర్ఐవో) జి.సునీత పేర్కొన్నారు. ఆదివారం సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో ఇంటర్మీడియెట్ స్పాట్ వాల్యూయేషన్ విధులకు నియమించిన అధ్యాపకులకు ఇంటర్మీడియెట్ బోర్డు నిర్దేశించిన వాల్యూయేషన్ నిబంధనలు, మార్గదర్శకాలపై అవగాహన కల్పించారు. ఆర్ఐవో, స్పాట్ వాల్యూయేషన్ క్యాంపు అధికారి సునీత మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థుల ఆన్సర్ షీట్లకు మూల్యాంకనం నిర్వహించేందుకు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మొదటి స్పెల్లో భాగంగా జనరల్ కోర్సుల వారీగా తెలుగు, హిందీ, ఇంగ్లీషు, గణితం, చరిత్ర, ఎకనామిక్స్ సబ్జెక్టులతోపాటు ఒకేషనల్ విభాగంలో ఇంగ్లీషు, జీఎఫ్సీ, ఏ అండ్ టీ, సీఎస్ఈ, ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ సబ్జెక్టులకు మూల్యాంకన ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మూల్యాంకన విధులకు నియమితులైన అధ్యాపకులందకూ బోర్డు నిర్ధేశించిన స్కీమ్ ఆఫ్ వాల్యూయేషన్ నిబంధనలకు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే మూల్యాంకన విధుల్లో పాల్గొనే అధ్యాపకులకు మౌళిక వసతుల పరంగా ఏర్పాట్లు చేశామని చెప్పారు. స్పాట్ వాల్యూయేషన్ విధుల్లో నిమగ్నమైన అధ్యాపకులు మొబైల్ ఫోన్ వినియోగించరాదని పేర్కొన్నారు. సమావేశంలో సహాయ క్యాంపు అధికారులు బి. ఉమాదేవి, జయశీల, కోడింగ్ అధికారులు సుచరిత, బాలమోహన్ పాల్గొన్నారు. -
విశ్వశాంతి స్థాపనకు కవులు పునరంకితం కావాలి
ప్రపంచ కవితా దినోత్సవ సభలో రంగిశెట్టి రమేష్ తెనాలి: ప్రపంచ కవితా దినోత్సవం రోజైన శనివారం సాయంత్రం తెనాలి నాజరుపేటలోని కమలశ్రీ సాహితీ నిలయంలో శ్రీకృష్ణ దేవరాయ కళావేదిక, విశ్వ సాహితీ కళావేదిక సంయుక్త నిర్వహణలో ‘విశ్వశాంతి ఆవశ్యకత–కవుల పాత్ర’ అంశంపై కవిసమ్మేళనం నిర్వహించారు. తొలుత ప్రాచీన కవుల నుంచి నేటి ఆధునిక కవుల చిత్రపటాలకు పూలతో నివాళులర్పించారు. సభకు శ్రీకృష్ణదేవరాయ కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వ సాహితీ కళావేదిక జాతీయ గౌరవ అధ్యక్షులు రంగిశెట్టి రమేష్ అధ్యక్షత వహించారు. నేటి వర్తమాన పరిస్థితుల్లో ప్రపంచ దేశాల మధ్య విశ్వశాంతి స్థాపనకు కవులందరు మరొక్కసారి పునరంకితం కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. యుద్ధం అనర్థాలపై సమాజాన్ని చైతన్యపరచి యుద్ధ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎలుగెత్తి చాటాలన్నారు. -
పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించండి
బెల్లంకొండ: స్టేషన్ ఉన్న పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. శనివారం బెల్లంకొండ పోలీస్ స్టేషన్ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లో రికార్డులు, ఫిర్యాదుల నిర్వహణ, కేసుల వివరాలను పరిశీలించారు. మండలవ్యాప్తంగా సీసీ కెమెరాల నిర్వహణను పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వీలైనంత తొందరగా పెండింగ్ కేసులను పూర్తి చేసి, బాధితులకు న్యాయం చేయాలని ఎస్ఐకు సూచించారు. గ్రామాల్లో నాటుసారా తయారీ, విక్రయాలు, గంజాయి సరఫరా వంటి వాటిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటూ, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలపై దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని ఎస్పీ తెలిపారు. గ్రామాల్లో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు, పల్లెనిద్ర, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సత్తెనపల్లి డీఎస్పీ ఎం.హనుమంతరావు, పెదకూరపాడు రూరల్ సీఐ ప్రత్తిపాటి సురేష్, స్థానిక ఎస్ఐ పి.గోపి, పోలీస్ సిబ్బంది ఉన్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు -
రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : వాణిజ్య అవసరాలకు అక్రమంగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్న దుకాణాలు, హోటళ్లపై గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగపు అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. శనివారం విద్యానగర్లో వణుకూరి పవన్కుమార్ కార్ఖానాలో నాలుగు ఎల్పీజీ సిలిండర్లను గుర్తించారు. ఈ మేరకు సీజ్ చేసిన సిలిండర్లను స్థానిక వీఆర్ఓకి అప్పగించారు. ఈ మేరకు అతనిపై 6–ఎ కేసు నమోదు చేశారు. ఈ సోదాల్లో విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ అధికార, సిబ్బంది పాల్గొన్నారు. -
రైలు పట్టాలపై తలపెట్టి యువకుడు బలవన్మరణం
తాడేపల్లి రూరల్: భార్య ప్రవర్తనలో మార్పు రావడం, వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని అనుమానంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు తాడేపల్లి కృష్ణాకెనాల్ జంక్షన్ పరిధిలోని రైల్వే పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం చోటుచేసుకుంది. మృతి చెందిన యువకుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడేపల్లి కొత్తూరుకు చెందిన సాయికుమార్ (26) ఇదే ప్రాంతంలో నివాసముండే అఖిలాండేశ్వరిని 2019లో ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వీరిద్దరి అన్యోన్య దాంపత్యానికి ఇద్దరు పిల్లలు జన్మించారు. అనంతరం వేరే వారితో ఫోన్లో మాట్లాడడం, సన్నిహితంగా ఉండడం గమనించిన భార్యను పలుమార్లు సాయికుమార్ హెచ్చరించినా ఎటువంటి మార్పు లేకపోవడంతో ఉదయం సమయంలో కృష్ణాకెనాల్ జంక్షన్ పరిధిలోని బకింగ్హామ్ కెనాల్ వద్ద రైల్వేట్రాక్పై తలపెట్టాడు. అదే సమయంలో ట్రైన్ రావడంతో తలతెగిపోయి సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బంధువులు సంఘటనా స్థలానికి వెళ్లి తెనాలి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే సాయి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం రైల్వే ఆసుపత్రికి తరలించారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వేపోలీసులు తెలిపారు. భార్య ప్రవర్తనలో మార్పు రావడంతోనే అంటున్న మృతుడి బంధువులు -
కువైట్లో మేం క్షేమంగానే ఉన్నాం..
తెనాలి: యుద్ధ నేపథ్యంలో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్త్తుందో అర్థంకాని పరిస్థితి. ఆయా దేశాల్లోని తమ వారికోసం ఇక్కడి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. కువైట్లోని ఇంటర్నేషనల్ స్కూలులో ఆర్ట్ టీచర్గా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న పట్టణ గంగానమ్మపేటకు చెందిన ఎ.శివనాగేశ్వరరావును ‘సాక్షి’ ఫోనులో పలకరించింది. అక్కడి పరిస్థితి ఆయన మాటల్లోనే... ‘‘నేను రెండు దశాబ్దాలకు పైగా కువైట్లో సీబీఎస్ఈ బోర్డు పరిధిలోని ఇంటర్నేషనల్ స్కూలులో ఆర్ట్ టీచర్గా పనిచేస్తున్నా. యుద్ధం నేపథ్యంలో యూఏఈలో అమెరికా ఏర్పాటు చేసుకున్న సైనిక స్థావరాలపై ఇరాన్ గురిపెడుతోంది. ఆర్థిక వనరులైన ఆయిల్ఫీల్డ్స్, రిఫైనరీలపై దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. కువైట్లో చాలా రిఫైనరీలున్నాయి. ఇక్కడ సరిహద్దుల్లో అమెరికాకు చెందిన సైనిక స్థావరాలున్నాయి. కువైట్ ప్రభుత్వం, అగ్నిమాపక శాఖ చాలా యాక్టివ్గా ఉంటాయి. ప్రతి పేటకో ఫైర్ స్టేషన్ ఉంటుంది. నిమిషాల్లోనే ప్రమాదస్థలానికి సిబ్బంది చేరుకుంటారు. దాడికి గురైన రిఫైనరీలోని మంటలను గంటల వ్యవధిలోనే కంట్రోలు చేయగలుగుతున్నారు. ఇళ్లపై దాడులు లేవు.. జనావాసాలపై దాడులు జరగకపోవటంతో అందరం క్షేమంగానే ఉన్నాం. జనజీవితం సాధారణంగానే ఉంటోంది. కువైట్ ప్రభుత్వం తెలుగువారిని కూడా గుర్తించింది. భద్రతకు సంబంధించిన హెచ్చరిక సందేశాలను తెలుగు భాషలోనే పంపుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు 30 శాతం సిబ్బందితో రెండు షిఫ్టులుగా నడుస్తున్నాయి. ఇండియాలోని సీబీఎస్ఈ బోర్డు పరిధిలో నడుస్తున్న యూఏఈ, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీఅరేబియా దేశాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షల సమయం. 1 నుంచి 9 తరగతుల వరకు, 11వ తరగతి పరీక్షలు రద్దుచేశారు. ఆయా తరగతుల విద్యార్థులకు యూనిట్ టెస్టుల్లో వచ్చిన మార్కులను లెక్కించి ఆ ప్రకారం పై తరగతులకు ప్రమోషన్ ఇస్తారు. 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్లో క్లాసులు జరుగుతున్నాయి. వాస్తవానికి ఇక్కడ జూన్లో వేసవి సెలవులు ఇస్తారు. గతంలో కువైట్ పౌరులకు కూరగాయలు భారతదేశం నుండి వస్తుండేవి. అయిదారేళ్లుగా ఈ పరిస్థితి మారిపోయింది. సమీప ఎడారి దేశాల నుంచే కూరగాయలు ఇప్పుడు వస్తున్నాయి. కువైట్లోనూ కూరగాయలను పండిస్తున్నారు. క్యాబేజి, కాలీఫ్లవర్, తమ్మకాయలు, బంగాళాదుంపలు, టమాటా, మునగ, ఆకుకూరలను పండిస్తున్నారు. గతంలో ఎక్కువగా ఖర్జూర పండించేవారు. కొంతకాలంగా ప్రభుత్వం సబ్సిడీనిచ్చి మరీ కూరగాయల సాగును ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో మునగ తోటలను బాగా వేస్తున్నారు. టీలోనూ మునగ ఆకును వినియోగిస్తున్నారు. ఇప్పటివరకై తే అంతా బాగానే ఉన్నాం.’’ పాఠశాలలకు సెలవులిచ్చి ఆన్లైన్లో బోధన ప్రభుత్వ కార్యాలయాల్లో షిప్టులవారీగా విధులు సాధారణంగానే జనజీవనం తెలుగులోనే ప్రమాద హెచ్చరికల జారీ కువైట్ నుంచి చిత్రలేఖన ఉపాధ్యాయుడు శివనాగేశ్వరరావు -
పోలీసుల ఆకస్మిక తనిఖీలు
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): జిల్లాలోని లాడ్జిలు, హోటళ్లు, డార్మిటరీలలో శనివారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు తనిఖీలు కొనసాగాయి. రాత్రి వేళ బస చేసిన వ్యక్తుల వివరాలపై ఆరా తీశారు. అనుమానితుల వివరాలు సేకరించారు. అనంతరం ఫింగర్ ప్రింట్ పరికరాల ద్వారా ధృవీకరణ చేపట్టారు. ప్రతి ఒక్కరి నుంచి ఆధార్ లేదా గుర్తింపు పత్రం తీసుకోవాలని నిర్వాహాకులకు సూచించారు. రిజిస్టర్ పుస్తకం విధిగా పాటించాలని అన్నారు. సీసీ టీవీ కెమెరాలను ప్రవేశ ద్వారాలు, కారిడార్లు, పరిసరాల్లో బిగించాలని చెప్పారు. అనుమానాస్పద వ్యక్తులపై సమీప పోలీస్స్టేషన్ కు సమాచారం అందించాలని తెలిపారు. డార్మిటరిస్, హోటళ్లు, లాడ్జిలలో చట్టవ్యతిరేక లేదా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. దుగ్గిరాల: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి పశ్చిమ డెల్టాకు 816 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటి మట్టం స్థిరంగా ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ బ్యాంక్ కెనాల్కు 60 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 110, పశ్చిమ కాలువకు 70, కొమ్మూరు కాలువకు 200 క్యూసెక్కుల విడుదల చేశారు -
కాలువలో ఈతకు దిగి వ్యక్తి మృతి
తెనాలి రూరల్: రంజాన్ పండుగ రోజున పట్టణంలో విషాదం నెలకొంది. కాలువలో ఈతకు దిగి వ్యక్తి మరణించాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు... పట్టణంలోని సుల్తానాబాద్కు చెందిన మహబూబ్ వలి (38) తన మిత్రుడు బుజ్జితో కలసి రంజాన్ పండుగ సందర్భంగా మద్యం తాగాడు. అనంతరం సాయంత్రం మార్కెట్ సమీపంలో తూర్పు కాలువలో ఈతకు దిగాడు. వలి మునిగిపోగా స్థానికులు గమనించి ఒడ్డుకు లాగారు. కొన ఊపిరితో ఉన్న అతను కొద్దిసేపటికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మద్యం తాగి ఈతకు దిగామని, వలి నీటిలో మునిగి మృతి చెందాడని బుజ్జి తెలిపాడు. వలి మార్బుల్, ఇతర పనులకు వెళుతూ లాడ్జీల్లో ఉంటుంటాడని పోలీసులు తెలిపారు. -
తెనాలిలో ట్రాఫిక్ జామ్
తెనాలి రూరల్: తెనాలిలో శనివారం రాత్రి ట్రాఫిక్ స్తంభించిపోయింది. మార్కెట్ యార్డు నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో పాలకవర్గ సభ్యులు పట్టణంలో శనివారం రాత్రి భారీ ర్యాలీలు నిర్వహించారు. చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు వేర్వేరుగా ర్యాలీలు, డీజేలతో హోరెత్తించారు. దీంతో మార్కెట్ వంతెన నుంచి సుల్తానాబాద్ వరకు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. గంటన్నరకుపైగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పోలీసులు మార్కెట్ యార్డు వద్ద బందోబస్తులో బిజీగా ఉండడం, సరిపడినంత మంది సిబ్బంది లేకపోవడంతో ట్రాఫిక్ నియంత్రణ కష్టమైంది. పండుగ, సెలవు కావడంతో సాయంత్రం కుటుంబసభ్యులతో కలసి బయటకు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
పెదకాకాని శివాలయంలో హుండీల కానుకల లెక్కింపు
పెదకాకాని: పెదకాకానిలోని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం హుండీలు తెరచి కానుకలు లెక్కించారు. దేవదాయశాఖ ఆదేశాల మేరకు ఈ హుండీల కానుకలు లెక్కింపు కార్యక్రమానికి పర్యవేక్షణాధికారిగా తెనాలి వైకుంఠపురంలోని పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఏసీ వి.అనుపమ హాజరయ్యారు. ఆలయంలో ఉదయం 9 గంటలకు కల్యాణ మండపంలో లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. 84 రోజులకుగాను కానుకల హుండీల ద్వారా రూ.48,76,103 ఆదాయం లభించినట్లు డీసీ గోగినేని లీలాకుమార్ తెలిపారు. అన్నప్రసాద వితరణ హాల్లోని హుండీ ద్వారా రూ.2,81,368 సమకూరిందన్నారు. హుండీల ద్వారా బంగారం, వెండి కూడా వచ్చిందన్నారు. విదేశీ నగదు అమెరికన్ డాలర్లు 127 సమకూరినట్లు డీసీ గోగినేని లీలాకుమార్, చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు తెలిపారు. హుండీల లెక్కింపు కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, ఆలయ సిబ్బంది, పెదకాకాని ఎస్బీఐ మేనేజర్ శ్రీనివాసరావు, సిబ్బంది, సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. సత్తెనపల్లి: పరాభవ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలను పురస్కరించుకొని పట్టణంలో గల వడ్డవల్లి శ్రీ రామాలయం, శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం మత్స్య జయంతి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామిని మత్స్యావతారంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కోదండ రామస్వామి, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామిలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆలయ కమిటీ బాధ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. చేబ్రోలు: ిహందూ ఉపాధ్యాయ సమితి ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సరం చంద్రమాసం ఆధారంగా రూపొందించిన శుభతిథి క్యాలెండర్ను శనివారం ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండల శివారు బ్రాహ్మణ కోడూరులో రామినేని ఫౌండేషన్ చైర్మన్ రామినేని ధర్మ ప్రచారక్ ఆధ్వర్యంలో ఈ క్యాలెండర్ను ఆవిష్కరించారు. దర్మ ప్రచారక్ మాట్లాడుతూ ఈ క్యాలెండర్ నూతన ఒరవడితో ఆకట్టుకుందన్నారు. తెలుగు నెలలు, తెలుగు వారాలు, తిథులతో కూడిన క్యాలెండర్ను హిందూ ఉపాధ్యాయ సమితి చేయటం అభినందనీయం అన్నారు. హిందూ ఉపాధ్యాయ సమితి రాష్ట్ర కార్యదర్శి మట్టపూడి కిరణ్ కుమార్, ఎస్ఎస్ఎఫ్ పొన్నూరు ఖండ ఇంటూరి శివ రామకృష్ణ, రామినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నూజండ్ల: గుర్తు తెలియని వ్యక్తులు సుబాబుల్ తోటను నరికివేసిన సంఘటన నూజండ్ల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన సోమేపల్లి వెంకటరత్నంకు సుబాబుల్ తోట ఉంది. శనివారం ఉదయం తోటకు వెళ్లి చూడగా పెద్ద సంఖ్యలో చెట్లను విచ్చలవిడిగా నరికివేసినట్టు గుర్తించి ఐనవోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కారణమైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని బాధిత రైతు కోరారు. -
ముగిసిన బాజీబాబా ఉరుసు మహోత్సవం
పెదకాకాని: బాజీబాబా దర్గా రెండు రోజుల ఉరుసు మహోత్సవం శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలతో ముగిసింది. పెదకాకాని సయ్యద్ బాజీ షహీద్ అవులియా దర్గా 538వ ఉరుసు మహోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో వక్ఫ్బోర్డు అధికారులు మహ్మద్ హుస్సేన్, దర్గా ఈఓ షేక్ ఖాజావలిలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్గా ఉరుసు మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో భాగంగా పెదకాకాని పొలిమేర సెంటర్ నుంచి ప్రత్యేక చాందినీ అలంకరణలో గంధం బిందెలతో గురువారం రాత్రి ప్రారంభమైంది. బాజీబాబా వారి గుర్రం శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకూ వెనిగండ్ల, పెదకాకాని గ్రామ పురవీధులలో గ్రామోత్సవం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు బాజీబాబా వారి గుర్రానికి మిఠాయిలు, పండ్లు తినిపించారు. కొబ్బరికాయలు, పూలు, గంధం సమర్పించి భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. బాబావారి గుర్రం దర్గాలోకి చేరుకోగాలనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, భక్తులకు గంధం పంపిణీ చేశారు. గంధం పంపిణీ సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఒక్కసారిగా ఎగబడటంతో రద్దీ వాతావరణం నెలకొంది. భక్తులందరికీ గంధం పంపిణీ జరిగిందని వక్ఫ్బోర్డు ఈఓ షేక్ ఖాజావలి తెలిపారు. -
గుంటూరు
శనివారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2026పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2,400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.6755 టీఎంసీలు. ధనలక్ష్మీగా అమ్మవారు పిడుగురాళ్ల: నాగులగుడిలో దేవీ వసంత నవరాత్రులలో భాగంగా మహా సరస్వతి అమ్మవారు శుక్రవారం ధనలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నిమ్మకాయల ధరలు తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7,000, గరిష్ట ధర రూ.9,000, మోడల్ ధర రూ.8,000 వరకు పలికింది. 7 -
గ్యాస్ కొరతతో హోటళ్లు మూత
బ్లాక్లో సిలిండర్ ధర రూ.2,500 నుంచి రూ. 3 వేలు గుంటూరు రూరల్: గ్యాస్ కొరతతో టీ దుకాణాలు, హోటళ్లు, భోజనం మెస్లు మూతపడ్డాయి. ముందు ముందు గ్యాస్ దొరకదేమోనన్న అపోహలతో ప్రజలు గ్యాస్ కొనుగోలుకు తహతహలాడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రతి నిత్యం బారులు తీరుతున్నారు. గ్రామాల్లో ఐతే వీధులకు వీధులు ప్రజలు గ్యాస్ సరఫరా కేంద్రాలకు ట్రాక్టర్లతో వస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 2500 నుంచి రూ. 3000 వరకూ చెల్లించాల్సిందే. బ్లాక్ మార్కెట్ నిర్వాహకులు అత్యవసరంగా ఉండే వారిని, ఫంక్షన్లు తదితర కార్యక్రమాలు చేసుకునే వారినే లక్ష్యంగా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. -
జీఎంసీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ బాధ్యతలు స్వీకరణ
తెనాలి ప్రత్యేకాధికారిగా జేసీ తెనాలి అర్బన్: తెనాలి పురపాలక సంఘ ప్రత్యేకాధికారిగా గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరులోని ఆయన కార్యాలయానికి మున్సిపల్ అధికారులు వెళ్లి సంతకం చేయించారు. మంగళవారం తెనాలి వచ్చి రివ్యూ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేకాధికారిని కలిసిన వారిలో ఎంఈ పినప శ్రీకాంత్, ఇన్చార్జి అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ మొవ్వా ఏసుబాబు, ఏసీపీ వాణి, ఆర్వో రాంప్రసాద్, శ్యామలదేవి తదితరులు ఉన్నారు. -
ఇంజినీరింగ్ కోర్సుల దరఖాస్తు గడువు పొడిగింపు
ఈనెల 24 వరకు ఏపీ ఈఏపీ సెట్–2026 దరఖాస్తుల స్వీకరణ గుంటూరుఎడ్యుకేషన్:ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్–2026 ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు ఈనెల 24వ తేదీవరకు పొడిగించారు. ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన ఏపీఈఏపీసెట్–2026(గతంలో ఎంసెట్) నోటిఫికేషన్ ఆధారంగా సీనియర్ ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులతో తాజాగా పరీక్షలకు హాజరై న విద్యార్థులు ఏపీ ఈఏపీ సెట్– 2026 ఆధారిత ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికై దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో 36 ఇంజనీరింగ్ కళాశాలల్లో 30,240 సీట్లు ఏపీ ఈఏపీసెట్ సైట్లో పూర్తి సమాచారం ఏపీ ఈఏపీ సెట్కు దరఖాస్తు ఇలా -
కార్మెల్ కొండ వద్ద విద్యార్థుల ప్రార్థనలు
ఫిరంగిపురం: మండల కేంద్రంలోని కార్మెల్ కొండపై ఉన్న కార్మెల్ మాత వద్ద సెయింట్ ఆన్స్ సెంటినరీ ఇంగ్లిషు మీడియం పదవ తరగతి విద్యార్థులు ప్రార్థనలు నిర్వహించినట్లు పాఠశాల హెచ్ఎం సిస్టర్ కె.నిర్మల తెలిపారు. పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా దైవానుగ్రహం అందేలా ప్రార్థనలు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉపాథ్యాయులు కె.అనిల్, విద్యార్థులు పాల్గొన్నారు. పోలేరమ్మ తిరునాళ్ల వేడుకలు రొంపిచర్ల: మండలంలోని సంతగుడిపాడు గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయ 37వ వార్షికోత్సవ తిరునాళ్ల వేడుకలను శుక్రవారం నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు అమ్మవారికి పొంగళ్లు పొంగించి నైవేద్యం సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విజనరీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో తిరునాళ్లకు వచ్చిన భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. గ్రామస్తులు విద్యుత్ ప్రభను నిర్మించి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రొంపిచర్ల పోలీసులు తిరునాళ్లలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. సాగర్ నీటి మట్టం వివరాలు విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 535.70 అడుగులకు చేరింది. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 8,023, ఎడమ కాలువకు 8,541, ఎస్ఎల్బీసీకి 2,000, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 18,864 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 18,864 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
ఆరంభమైన వసంత నవరాత్ర మహోత్సవాల సందడి
తెనాలి: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా పట్టణంలో వసంత నవరాత్రి మహోత్సవాల సందడి ఆరంభమైంది. స్థానిక బోసురోడ్డులోని హనుమాన్ చౌక్లోని శ్రీ సీతారామ మందిరంలో 94వ వార్షిక వసంత నవరాత్ర మహోత్సవాలు గురువారం నుంచి ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా రెండోరోజైన శుక్రవారం రాత్రి మందిరం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. తొలిగా ప్రఖ్యాత గాయని వేంపాటి కృష్ణశ్రితచే శాసీ్త్రయ సంగీత కచేరీ సంగీతాభిమానులను పరవశింపజేసింది. పలు కీర్తనలను ఆమె శ్రావ్యంగా ఆలపించారు. వయొలిన్పై గౌరావఝుల ఆంజనేయశాస్త్రి, తబలపై పెరవలి వంశీకృష్ణ వాయిద్య సహకారం అందించారు. తదుపరి కళ్యాణి కూచిపూడి ఆర్ట్ అకాడమీ నృత్యగురువు డాక్టర్ చల్లా బాలత్రిపురసుందరి శిష్యబృందం కూచిపూడి నృత్యాంశాలను ప్రదర్శించారు. శ్రీసీతారామ మందిర నిర్వహణ సేవాసంఘం కార్యదర్శి కల్లూరి వేంకట సూర్యనారాయణమూర్తి, సభ్యులు నేతి ఆంజనేయశాస్త్రి పర్యవేక్షించారు. అగ్నిహోత్రం నరసింహాచార్యులు పూజాదికాలను జరిపించారు. -
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
లక్ష్మీపురం: మొక్కజొన్న, పెసర రైతులకు మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని సీపీఐ జాతీయ కమిటీ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పప్పుధాన్యాల సాగు కీలకమైనదని తెలిపారు. ప్రస్తుతం పప్పు ధాన్యాల రైతులు భారీగా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఈ పరిస్థితికి రెండు ప్రధాన కారణాలున్నాయని పేర్కొన్నారు. ఒకటి కేంద్ర ప్రభుత్వం విదేశీ దిగుమతులకు అనుమతులు ఇవ్వడంతో పెద్ద వ్యాపారులు విదేశాల నుంచి తక్కువ ధరలకు దిగుమతులు చేసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో మొక్కజొన్న ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిందని, డెల్టా ప్రాంతంలో కూడా మరో 20 రోజుల్లో రాబోతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో రూ.2400 మద్దతు ధర రావాల్సిన రైతులు రూ.1500, రూ.1550కే పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మినుము, పెసరకు సంబంధించి కూడా మార్కెట్లో ధరలు మద్దతు ధర కంటే తక్కువగా ఉన్నాయని తెలిపారు. మినుము మద్దతు ధర రూ.8760 ఉండగా, రైతులు సుమారు రూ.8000కే అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. తాజాగా కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు మరింత నష్టపోతున్న నేపథ్యంలో, పంటలను తక్కువ ధరలకు అమ్మకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు.సీపీఐ జాతీయ కమిటీ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు -
విశ్వాసం.. ప్రేమ.. ఈద్
ప్రత్యేక నమాజ్లు జరిగే ఈద్గాలు ఇవే.... లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్):నెలవంక దర్శనంతో ఈద్ సంబరాలు ఆరంభమయ్యాయి, శనివారం ఈద్–ఉల్–ఫిత్ర్ జరుపుకొనేందుకు ముస్లింలు సమాయత్తమవుతున్నారు. ఈద్గాలు ముస్తాబవుతున్నాయి. నెల రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లింలు శుక్రవారం మగ్రిబ్ నమాజ్ తర్వాత నెలవంకను దర్శించారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ ముబారక్ తెలుపుకొన్నారు. రంజాన్ మాసం చివరి రోజు కావడంతో జిల్లాలోని మసీదుల వద్ద సందడి నెలకొంది. జిల్లాలో గురువారం ఈద్ ఉల్ ఫిత్ర్ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈద్గా వద్ద ప్రార్థన ప్రతి ముస్లిం రంజాన్ పండుగ రోజున ఈద్గా వద్ద ప్రత్యేక సమాజ్ చేయాలన్నది మహ్మద్ ప్రవక్త ఆజ్ఞ. వృద్ధులు, దివ్యాంగులు, ఈద్గా (వసతులు) లేని వారు తప్ప మిగిలిన వారంతా ఈద్గా వద్ద రంజాన్ ప్రత్యేక నమాజ్ చేయాలని మత పెద్దలు పేర్కొంటున్నారు. ఈద్గాలో సామూహిక నమాజ్ చేస్తే ఎంతో పుణ్యం దక్కుతుందని నమ్మకం. అంతేగాక పేద, ధనిక అనే తారతమ్యం ఉండదని, తోటి వ్యక్తుల సాధకబాధలు తెలుసుకునే అవకాశం కలుగుతుందని ఇమామ్లు, మౌల్వీలు చెబుతున్నారు. ఈద్గా వద్దకు వెళ్లేటప్పుడు ఒక దారిలో తిరిగి వచ్చేటప్పుడు మరో దారిలో నుంచి రావాలని ప్రవక్త సందేశం. తక్బీర్ తప్పనిసరి ముస్లింలందరూ నూతన దుస్తులు ధరించి (వారి శక్తి కొలది) ఒకచోటకు చేరి అక్కడి నుంచి తక్బీర్ చదువుతూ ఈద్గా వద్దకు చేరుకోవాలి. ఈద్గాలో ఇమామ్ ఖురాన్ వాక్యాలు, దైవ సందేశాన్ని వినిపిస్తారు. అనంతరం రంజాన్ (ఈద్ ఉల్ ఫిత్ర్) ప్రత్యేక సమాజు చదివిస్తారు. ఆ తర్వాత దువాతో ప్రార్థనలు ముగుస్తాయి. ఈద్–ఉల్–ఫిత్ర్ సందేశమిదే.. సర్వ మానవాళికి కారుణ్య వర్షిణి అయిన రంజాన్ మాసంలో చివరి రోజు ఈద్ ఉల్ ఫిత్ర్ను ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారు. కఠోర దీక్ష ఆచరించిన ముస్లింలు తగిన ప్రతిఫలాన్ని అల్లాహ్ నుంచి పొందే రోజే ఈద్ ఉల్ ఫిత్ర్. రంజాన్ పండుగ స్ఫూర్తిని గుండెల నిండా నింపుకొని ఈ ఆనందంలో అందరినీ భాగస్వాములను చేసేందుకు ముస్లింలు ప్రయత్నించాలి. జకాత్, ఫిత్రా పేరుతో సమాజంలోని అభాగ్యులకు బాధ్యతగా దానం చేయాలి. కుల మతాలు, వర్గ విభేదాలకు అతీతంగా మంచి మనుషులుగా స్పందిస్తూ సమాజంలోని దారిద్య్రం, పేదరికం, అసమానతలను దూరం చేయాలి. శాంతిసామరస్యాలను, సంతోషాన్ని పెంపొందింప చేయాలనేదే ’ఈద్ ఉల్ ఫిత్ర్ సమాజానికి అందిస్తున్న సందేశం. నగరంపాలెంలోని పురానీ ఈద్గాలో ఉదయం 9.30 గంటలకు, పాత బస్టాండ్లోని ఉర్దూ పాఠశాల ఆవరణలోని ఈద్గాలో 9 గంటలకు, ఐపీడీ కాలనీ ఈద్గాలో 9.30 గంటలకు, ఆంధ్రా ముస్లిం కళాశాల ఆవరణలోని ఈద్గాలో 10 గంటలకు ఈద్ సమాజ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రత్యేక ప్రార్థనలకు అసౌకర్యం కలుగకుండా తాగునీరు, షామియానాలు ఏర్పాటు చేశారు. -
పండగ పూటా గుండైపె బండ
పండుగ పూట కూడా పస్తులుండాల్సిన పరిస్థితిని చంద్రబాబు ప్రభుత్వం కల్పించింది. ముస్లింలకు గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్ర సమస్యగా మారింది. ఏకంగా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సొంత జిల్లాలోనే గ్యాస్ సరఫరా అస్తవ్యస్తంగా తయారైంది. ఏజెన్సీలు, అధికారులు కుమ్మకై ్క సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. బుక్ చేసుకున్న వారికి ఫోన్లు చేసి ఓటీపీ కనుక్కుని మరీ ఈ దందా సాగిస్తున్నారు. అధికారులు సమీక్షలకే పరిమితం కావడం విమర్శలకు తావిస్తోంది. సాక్షి ప్రతినిధి, గుంటూరు: గ్యాస్ సిలిండర్ సమస్య జిల్లా వ్యాప్తంగా ప్రజలకు తప్పడం లేదు. చంద్రబాబు సర్కార్ ఇదేమీ పట్టినట్లు లేదు. శనివారం పవిత్ర రంజాన్ పండుగ. తూర్పు నియోజకవర్గ పరిధిలోని ముస్లిం సోదరులతోపాటు ఇతర వర్గాల ప్రజలకు గ్యాస్ బండలు గుదిబండలుగా మారుతున్నాయి. కొందరు ఇబ్బందులను తాళలేక గ్యాస్ గోడౌన్లకు సిలిండర్లతో వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది, గ్యాస్ ఏజన్సీలు కొంత నిర్లక్ష్యంతో వ్యవహరించడంతో ప్రజలు ఆగ్రహిస్తున్నారు. పవిత్ర పండుగ రోజున గ్యాస్ కొరతతో ఇబ్బందికి గురి చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తీరును నిరసిస్తున్నారు. అధికారులు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నామమాత్రంగానే మిగిలిపోయింది. జిల్లాలో మొత్తం 7.80 లక్షల మంది గృహ వినియోగదారులు ఉన్నారు. సుమారు 15 వేల మంది కమర్షియల్ సిలిండర్లు వినియోగిస్తున్నారు. మొత్తం 55 ఏజన్సీల ద్వారా బుక్ చేసుకుంటే రెండు రోజుల్లోనే సిలిండర్ ఇంటికి చేరేది. సాధారణ రోజుల్లో రోజూ జిల్లాలో సుమారు 10 వేల సిలిండర్లు బుక్ అయ్యేవి. ఇప్పుడు ఆ సంఖ్య అమాంతం రెట్టింపయ్యింది. కానీ 10 వేలు నుంచి 14 వేలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. స్పందించని ప్రజాప్రతినిధులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి బదిలీ చేయాలన్నా తమ అనుమతి ఉండాల్సిందే అని నిత్యం అధికారులకు హుకుం జారీ చేసే ప్రజాప్రతినిధులు గ్యాస్ ఇబ్బందులపై ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. మంత్రి సమీక్షలకే పరిమితం అయ్యారు. అఽధికారులు కూడా హెచ్చరికలతో సరిపెడుతున్నారు. విజిలెన్స్ అధికారులు నామమాత్రంగా దాడులు చేస్తున్నారు. గతంలో బుక్ చేసుకున్న వారికి రెండు రోజుల్లోనే సిలిండర్ ఓటీపీ ద్వారా ఇంటికి వచ్చేది. ఇప్పుడు వారం పడుతోంది. ముందస్తు జాగ్రత్తగా ప్రజలు ఖాళీ ఉంటే సిలిండర్లు నింపుకొనేందుకు అధిక సంఖ్యలో బుక్ చేసుకుంటున్నారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బ్లాక్ మార్కెట్లో ఎవరైనా గ్యాస్ విక్రయిస్తే కఠిన చర్యలకు వెనుకాడబోం. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. అవసరమైన వారు 83091 60972, 63095 20569 ఫోను నంబర్లకు కాల్ చేయొచ్చు. – కోమలి పద్మ, డీఎస్ఓ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ హెచ్పీ గ్యాస్ మార్చి 2వ తేదీన బుక్ చేశాం. ఆ తర్వాత కొన్ని రోజులకు గ్యాస్ డెలివరీ బాయ్ వచ్చి సిలిండర్ ఇవ్వకుండా అమ్మగారి నుంచి ఓటీపీ కనుక్కొని వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్నాక ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ సమస్య ఎప్పడటికి తీరుతుందో అర్ధం కావడం లేదు. – షేక్ మస్తాన్, పాత గుంటూరు యుద్ధం జరుగుతున్నందున గ్యాస్ కొరతగా ఉందంటున్నారు. మరి ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు. చాలా రోజుల నుంచి గ్యాస్ కోసం ఎదురుచూస్తున్నాం. అయినా సిలెండర్ దొరకడం లేదు. పండుగను ఎలా జరుపుకోవాలి. కొందామంటే కరెంటు పొయ్యలు కూడా దొరకడంలేదు. – షేక్ మెహరున్నీసా, గుంటూరు గ్యాస్ బుక్ చేసిన తర్వాత ప్రతి వినియోగదారుడికి ఒక ఓటీపీ వస్తుంది. అది చెబితేనే గ్యాస్ డెలివరీ చేస్తారు. కొన్ని ఏజన్సీలతోపాటు కొందరు సిబ్బంది మాయాజాలంతో ఓటీపీ వచ్చినా సిలిండర్ మాత్రం రావడం లేదని ప్రజలు వాపోతున్నారు. మరికొందరు బ్లాక్ మార్కెట్లో రూ.1,300–1,600 వరకు సిలిండర్ కొంటున్నట్లు చెబుతున్నారు. గ్యాస్ డెలివరీ చేసే బాయ్స్ చేతివాటం గురించి మొదటి నుంచి అనేక ఫిర్యాదులున్నా ఏజెన్సీలు పెద్దగా స్పందించకపోవడం కూడా సమస్యలకు కారణం అవుతోంది. పౌర సరఫరాల శాఖ అధికారుల పర్యవేక్షణ కూడా లేదని, ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. -
రైల్వే వైర్లు చోరీ చేసిన నిందితుల అరెస్ట్
60 కిలోల రాగి తీగలు స్వాధీనం తెనాలిరూరల్: ౖరెల్వేకు సంబంధించిన వైర్లను దొంగిలించి వాటిని కాల్చి రాగి తీగలను అమ్మిన నిందితులను ఆర్పీఎఫ్ అధికారులు అరెస్ట్ చేసి నిందితుల వద్ద నుంచి వైర్లు, రాగి తీగలను స్వాధీనపర్చుకున్నారు. తెనాలి ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ బి. హీరాసింగ్ వివరాలను శుక్రవారం వెల్లడించారు. తెనాలి రైల్వే స్టేషన్ టెలికాం స్టోరులో ఈ నెల 8వ తేదీన సుమారు రూ. 2.25 లక్షల విలువైన వైర్లు అపహరణకు గురయ్యాయి. నిందితులు స్టోర్ రూమ్ కిటికీ అద్దాలను ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన ఆర్పీఎఫ్ అధికారులు నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నించారు. నిందితులు కావలికి చెందిన దార్ల శ్రీను, దార్ల సింహాద్రి, దార్ల పుట్టయ్య, పర్తపు దుర్గయ్య, పర్తపు వల్లూరయ్య, నెల్లూరుకు చెందిన పర్తపు శ్రీనుగా గుర్తించారు. నిందితులు కొంత కాలంగా తెనాలి వీఎస్ఆర్ కళాశాల ఎదురు కఠెవరం కాల్వ కట్టకు వెళ్లే దారిలో ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట పాకలు వేసుకుని ఉంటున్నారు. అదను చూసి రైల్వే వైర్లను దొంగలించారు. అపహరించిన వైరులో సగ భాగం కాల్చి రాగి తీగలను నందివెలుగులోని ఓ వ్యక్తికి విక్రయించారు. నందివెలుగు అతను విజయవాడలోని మరో వ్యక్తికి విక్రయించాడు. విజయవాడ వ్యక్తి విజయవాడ ఆటోనగర్లోని ఇంకో వ్యక్తికి విక్రయించాడు. చోరీకి పాల్పడిన ఆరుగురు నిందితులతో పాటు చోరీ సొత్తును కొనుగోలు చేసిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో తెనాలి ఆర్పీఎఫ్ ఏఎస్ఐ శివరామకృష్ణయ్య, విజయవాడ ఆర్పీఎఫ్ క్రైమ్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మధుసూదనరావు, సిబ్బంది ఉన్నారు. -
బాణసంచా మంటల్లో చిక్కిన ఇద్దరు చిన్నారులు
పెదకాకాని: కూటమి ప్రభుత్వంలో నాయకుల పర్యవేక్షణలో జరిగిన బాజీబాబా దర్గా ఉరుసు మహోత్సవం నిర్వహణలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. మహోత్సవం పెదకాకాని పొలిమేర సెంటర్ జెండా చెట్టు నుంచి బయలుదేరి గురువారం రాత్రి 2 గంటలకు వెనిగండ్లలోని వేమారెడ్డి గుడి సమీపంలోకి చేరుకుంది. ఆ సమయంలో ఆటో పక్కనే నిలబడి బాణసంచా కాలుస్తున్న వ్యక్తి మద్యం మత్తులో ఆకాశంలోకి వదిలిన తారాజువ్వ నుంచి నిప్పురవ్వలు ఆటోలో నిల్వ ఉన్న బాణసంచాపై పడ్డాయి. ఆటోకు నిప్పు అంటుకుని మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బాణసంచాపై పడుకుని నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులు ఆ మంటల్లో చిక్కుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారి అనాస్ పరిస్థితి విషమంగా ఉండగా.. అజయ్ అనే చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరికీ తండ్రులు లేదు. తల్లులు దర్గా వద్ద పారిశుద్ధ్య పనులు చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటున్నారు. గుంటూరు ఆర్డీఓ కె. శ్రీనివాసరావు, మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, తహసీల్దార్ కృష్ణకాంత్, టీపీ నారాయణస్వామిలు పరామర్శించారు. నిద్ర వస్తుండటంతో బాణసంచాపై పడుకుని ఉన్నామని, పక్కకు వెళ్ళి కాల్చాలని ఆ వ్యక్తిని కోరామని బాధితులు తెలిపారు. అయినప్పటికీ అతడు వినిపించుకోలేదని వాపోయారు. -
పోలీస్ సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి
ఎస్పీ వకుల్ జిందాల్ నగరంపాలెం: జిల్లాలోని పోలీస్ సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ స్టాఫ్ గ్రీవెన్న్స్ నిర్వహించారు. పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించే పోలీస్ సిబ్బంది వినతులను జిల్లా ఎస్పీ స్వీకరించారు. జిల్లా ఎస్పీ మాట్లా డుతూ ఒకసారి దొర్లిన పొరపాట్లను మరలా జరగకుండా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించు కోవా లని అన్నారు. జిల్లాలోని ప్రజలకు ఉత్తమ పోలీస్ సేవలు అందించాలని చెప్పారు. పోలీస్ సిబ్బంది సమస్యలను విధిగా పరిష్కరిస్తామని అన్నారు. ఫిరంగిపురం: మండలంలోని పొనుగుపాడు గ్రామంలో నుదురుపాడు పశువైద్యశాల ఆధ్వర్యంలో పశువులకు వేస్తున్న గాలికుంటువ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా పశుసంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్ టి.శ్రీనివాసరావు పరిశీలించారు. గాలికుంటు టీకాలకు సంబంధించి పశువుల రక్తనమూనాల సేకరణ, క్షేత్రస్థాయిలో టీకాలు వేసిన పశువులను ఆయన పాడి రైతులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించి సిబ్బందికి శాఖపరమైన సూచనలు చేశారు. ఆయన వెంట పశువైద్యాధికారి షేక్.పీర్ అహ్మద్, జిల్లా ఏడీడీఎల్ ల్యాబ్ పశువైద్యాధికారి లావణ్య, లైవ్స్టాక్ అసిస్టెంట్ ఆర్.వినీల, సిబ్బంది ఉన్నారు. దుగ్గిరాల:ప్రకాశం బ్యారేజీ నుంచి పశ్చిమ డెల్టా కు శుక్రవారం 1,016 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపా రు. బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటిమట్టం స్థిరంగా ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ బ్యాంక్ కెనాల్కు 60 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 145, పశ్చి మ కాలువకు 110, కొమ్మూరు కాలువకు 200 క్యూసెక్కులు బ్యారేజీ నుంచి విడుదల చేశారు. -
తెలుగు నూతన సంవత్సరం దివ్యంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా గుంటూరు వెస్ట్: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది అందరికీ మంచి జరగాలని, జిల్లా మరింత అభివృద్ధి పథంలో సాగాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా ఆకాంక్షించారు. ఉగాది పండుగను పురస్కరించుకుని గురువారం స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో ఉత్సవాలు శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో కలెక్టర్తోపాటు జీఎంసీ కమిషనర్ మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ... నూతన సంవత్సరంలో ప్రతి ఇంట్లోనూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఉండేలా కృషి చేయాలన్నారు. గౌరీపెద్ది మురళి పంచాంగ పఠనం చేశారు. టీటీడీ వేద పండితులు లంకా నాగేశ్వర అవధాని, వైఖానస ఆగమ ముఖ్య ఆచార్య అళహరి రవికుమార్, ములుకుదురు చెన్న కేశవస్వామి దేవాలయం అర్చకులు నారాయణం కేశవ మూర్తి, దొండపాడు శ్రీ రాజ మల్లేశ్వరి దేవస్థానం అర్చకులు యనమదల హనుమంతరావులను పట్టు శాలువా, నూతన వస్త్రాలు, ప్రశంసాపత్రం, నగదుతో జిల్లా కలెక్టర్, కమిషనర్ మయూర్ అశోక్, జేసీలు ఘనంగా సత్కరించారు. సాహితీవేత్తలు, కవులు, కవయిత్రిలు పింగళి భాగ్యలక్ష్మి, చుండూరి శేషమాంబ, సంబరాజు రమణి, అస్మతున్నీస, లంకా మాధవి, బాసరాజు శంకర్రాజు, రాయల సుబ్బారావు, ఆవుల తిరుమలేష్, పి. శివ పార్వతి, కొమ్మడి శివశంకర ప్రసాద్, డాక్టర్ రావెళ్ళ శ్రీనివాసరావు, చెట్టి వెంకట రమణ, చెరుకూరి వెంకట సాయి రమేష్, ఎస్ఎంఎం ఖుద్దూస్లను పట్టు శాలువా, మెమోంటో, సర్టిఫికెట్, ఉగాది పురస్కారాలతో సత్కరించారు. తొలుత ఉగాది విశిష్టత, వైభవాన్ని తెలియజేసేలా సభలో చిన్నారులు, యువతులు సంప్రదాయ గీతాల ఆలాపన, నృత్యాల ప్రదర్శనతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. డీఆర్వో షేఖ్ఖాజా వలి, జెడ్పీ సీఈవో వి.జ్యోతి బసు, జీఎంసీ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గ్రంధి మాధవి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
శాస్త్రోక్తంగా పంచాంగ శ్రవణం
అమరావతి: ఉగాది పర్వదినాన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలోని అమరేశ్వరస్వామి వారికి గురువారం వేకువ జామున మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి సహస్ర కుంకుమార్చన నిర్వహించారు.దేవాలయ ఈవో సునీల్కుమార్ ఆధ్వర్యంలో వెంకటాద్రినాయుడు మండపంలో స్వామి వారిని ఉంచి శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగాలకు పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖర శర్మ పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం భక్తులందరికి ఉచితంగా పంచాంగ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయంలో గురువారం ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని శ్రీ బాల త్రిపుర సుందరిగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై పంచాంగ శ్రవణం నిర్వహించారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉగాది వేడుకలకు ప్రముఖ ప్రవచన కర్త ఎం.కృష్ణకిషోర్ ఉగాది పండుగ విశిష్టతను వివరించారు. ప్రముఖ పౌరాణికులు శ్రీహరి శర్మ పంచాంగ శ్రవణం గావించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పంచాంగ శ్రవణం విని ప్రసాదాలు స్వీకరించారు. నరసరావుపేట రూరల్: ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో గురువారం ఉగాది ఉత్సవాలను నిర్వహించారు. పరాభవ నామ ఉగాది సందర్భంగా ఆలయంలో వేదపండితులకు సన్మానం ఘనంగా నిర్వహించారు. దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో ఆలయ అర్చకులు కొండకావూరి సత్యనారాయణ, కొండకావూరి రామకృష్ణ, శ్రీరాముల రాజశేఖరశర్మలను సన్మానించి సంభావన అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో డి.చంద్రశేఖరరావు, సిబ్బంది పాల్గొన్నారు. కర్లపాలెం: బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో గురువారం సాయంత్రం కురిసిన వర్షాలకు పిడుగు పడి ఓ వరికుప్ప దగ్ధమైంది. స్థానిక వీఆర్వో సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల మేరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురియటంతో బుద్ధాం గ్రామంలో నర్రా నాగరాజుకు చెందిన వరికుప్పపై పిడుగు పడి మంటలు ఎగశాయి. స్థానిక రైతులు వెంటనే స్పందించి మంటలు ఆర్పి కుప్పను కల్లంలో ఆరబెట్టారు. రైతుకు సుమారు రూ.70వేల నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు. -
పిన్నెల్లికి జన నీరాజనం
నకరికల్లు: అక్రమ కేసులో 98 రోజులపాటు అక్రమ నిర్భంధం అనుభవించి బెయిల్పై వస్తున్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మండలంలో ఘన స్వాగతం పలికారు. సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జి గజ్జల సుధీర్భార్గవరెడ్డి ఆధ్వర్యంలో అభిమానులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో అడ్డరోడ్డుకు చేరుకున్నారు. సుమారు మూడున్నర గంటలపాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాకకోసం ఎదురుచూశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్డరోడ్డు చేరుకోగానే హర్షధ్వానాలతో అభిమానులు హోరెత్తించారు. పిన్నెల్లిని, సత్తెనపల్లి ఇన్చార్జి గజ్జల సుధీర్భార్గవరెడ్డిని భారీ గజమాలతో సన్మానించారు. జయజయ నినాదాలతో హోరెత్తించారు. అడ్డరోడ్డు వద్ద గల శ్రీ అభయాంజనేయ స్వామిని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడులో టీడీపీ రెండు వర్గాల పోరులో వాళ్లకు వాళ్లు హత్యలకు పాల్పడితే కావాలని తమను అనవసరంగా ఇరికించారని వాపోయారు. 98 రోజులపాటు అక్రమంగా జైలులో పెట్టారన్నారు. ఎస్పీ సైతం ఆధిపత్యపోరులో ఈ హత్యలు జరిగాయని చెప్పినా తమను అన్యాయంగా కేసులో ఇరికించారన్నారు. తమకంటూ ఒకరోజు వస్తుందని... తప్పుడు కేసులు పెట్టడానికి కారణమైన వారిని కచ్చితంగా చట్టం ముందు నిలబెడతామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయాలని చూడడమే కాక తప్పుడు కేసులతో నోరు నొక్కాలని చూస్తోందని మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటామని... అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రెట్టింపు బలంతో దుర్మార్గంపై పోరాడతామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి, డాక్టర్ మేడికొండ పరమేశ్వరరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు పడాల శివారెడ్డి, మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి, వైస్ ఎంపీపీ మేడం ప్రవీణ్కుమార్రెడ్డి, దూదేకుల బాషా పాల్గొన్నారు. దాచేపల్లిలో.. దాచేపల్లి : మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి దాచేపల్లిలో ఘన స్వాగతం లభించింది. నగర పంచాయతీ చైర్మన్ కొప్పుల సాంబయ్య కుటుంబ సభ్యులు గజమాలతో సన్మానించారు. చైర్మన్ సాంబయ్య నివాసంలో అల్పాహారాన్ని పీఆర్కే స్వీకరించారు. అనంతరం నారాయణపురం బంగ్లా సెంటర్లో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయంలో పీఆర్కే ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. నగర పంచాయతీ వైస్ చైర్మన్ షేక్ ఖాదర్ బాషా రంజాన్ పండుగ సందర్భంగా పీఆర్కేకు టోపీ, చౌకన్, కంకణం బహూకరించారు. నడికుడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి, పార్టీ మండల, పట్టణ కన్వీనర్లు కోటా కృష్ణ, షేక్ సుభాని, నగర పంచాయతీ మాజీ చైర్మన్ మునగా పున్నారావు, జెడ్పీటీసీ మూలగొండ్ల ప్రకాష్ రెడ్డి, ఎంపీపీ కందులు జాను, వైస్ చైర్మన్లు షేక్ ఖాదర్ బాషా, కొమరభత్తిన విజయకుమార్, అధికార ప్రతినిధి షేక్ జాకీర్ హుస్సేన్, మాజీ సర్పంచ్లు మందపాటి రమేష్ రెడ్డి, బుర్రా విజయ్ కుమార్ రెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు పరిమి బాబు తదితరులు ఉన్నారు. ప్రత్యేక పూజలు మాచర్ల: మాచర్ల పట్టణానికి చేరుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మద్దతుగా వేలాది మంది తరలి వచ్చి ఘన స్వాగతం పలికారు. రాయవరం జంక్షన్లో ఆంజనేయస్వామి దేవాలయంలో పీఆర్కే ప్రత్యేక పూజలు చేశారు. -
వాణిజ్య గ్యాస్ కొరత
తాడేపల్లి రూరల్: యుద్ధ ప్రభావం గ్యాస్ సిలిండర్ల సరఫరాపై పడుతోంది. ప్రధానంగా కమర్షియల్ గ్యాస్ బండలు దొరకడం లేదు. మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా చిన్న, మధ్యతరహా హోటళ్లు వెయ్యికిపైగా ఉన్నాయి. పెద్ద హోటళ్లు సుమారు 200 వరకు ఉన్నాయి. ప్రతి రోజు ఆరు వందల వరకు కమర్షియల్ గ్యాస్ బండలను వినియోగిస్తారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అధికారుల సూచనల మేరకు గృహావసరాలకు గ్యాస్ కూడా బుక్ చేసిన 25 నుంచి 30 రోజులలోపు వస్తోంది. కొంతమంది గ్యాస్ బుక్ చేస్తుంటే నో సర్వర్ అని ఫోన్లో చూపిస్తోంది. ఇప్పటికే గ్యాస్ కొరత వల్ల కొన్నిచోట్ల హోటళ్లు మూతబడ్డాయి. కొంతమంది కమర్షియల్ గ్యాస్ బండ ధర రూ. 1700 ఉండగా, రూ. 3,400కు కొనుగోలు చేస్తున్నారు. మరికొంతమంది రూ.6 వేల నుంచి రూ. 7 వేలకు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. యజమానులు ఇప్పటికే ప్రతి టిఫిన్పై రూ.5 నుంచి రూ. 10 వరకు పెంచారు. టీ దుకాణాల్లో గతంలో ఆఫ్ టీ రూ.7 ఉండగా ఇప్పుడు రూ.10–12 చేశారు. కాఫీ ధర రూ.25కు పెంచారు. మరో 20 రోజులు గ్యాస్ సరఫరా చేయకపోతే లాక్డౌన్ తరహా పరిస్థితి చూడాల్సిన వస్తుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాకు సమయం పడుతుందని చెబుతున్నారు. -
సీఆర్డీఏకు జాతీయస్థాయి గుర్తింపు
తాడికొండ: రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా అమలు చేస్తున్న డిజిటల్ ప్రణాళికా విధానానికి జాతీయ గుర్తింపు లభించిందని ఏపీ సీఆర్డీఏ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అమరావతి ఇంటిగ్రేటెడ్ డిజిటల్ అర్బన్ ప్లానింగ్ అండ్ గవర్నెన్స్ ప్లాట్ఫామ్కు ఎకనామిక్ టైమ్స్ గోవ్టెక్ అవార్డు– 2026 కార్యక్రమంలో గోల్డ్ అవార్డు లభించిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎకనామిక్ టైమ్స్ సంస్థ నుంచి ఏపీ సీఆర్డీఏ కమిషనర్ కె.కన్నబాబు ఢిల్లీలో గురువారం అవార్డు అందుకున్నారని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలో ఉత్తమ సాంకేతిక ప్రాజెక్టులకుగాను ఈ అవార్డును అందించారని తెలిపారు. -
విజయకీలాద్రిపై ఉగాది వసంత నవరాత్రోత్సవాలు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై గురువారం ఉగాది పర్వదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉగాది శ్రీ పరాభవ నామ సంవత్సర వసంత నవరాత్రోత్సవాలు ఈనెల 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నామన్నారు. తొలిరోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం 8 గంటలకు శ్రీ సీతా లక్ష్మణ హనుమత్సమేత శ్రీరామచంద్రస్వామి వారికి అభిషేక మహోత్సవం నిర్వహించామని, శ్రీ చిన్న జీయరుస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉదయం 11 గంటలకు ఉగాది పంచాగ శ్రవణం, సంపూర్ణ రామాయణ పారాయణ ప్రారంభం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం శ్రీరామనామ లేఖనం, శ్రీరామపూజ, నివేదన, మంగళా శాసనం, తీర్థప్రసాద గోష్ఠితో కార్యక్రమాలు వైభవంగా ముగిశాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. -
అకాల వర్షానికి నేలకొరిగిన పైర్లు
అకాలవర్షం, ఈదురు గాలులకు తెనాలి నియోజకవర్గంలో పలుచోట్ల పైర్లు నేలకొరిగాయి. తెనాలి ప్రాంతంలో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులు వీచి, అక్కడక్కడా వర్షం కురిసింది. మళ్లీ గురువారం కూడా భారీ వర్షం వచ్చింది. చిత్రంగా ఒక ఊళ్లో వర్షం కురుస్తున్న సమయంలో మరో ఊరిలో చిన్న జల్లు కూడా పడలేదు. అకాల వర్షాలకు రైతులు బెంబేలెత్తారు. ఈదురు గాలులకు కొన్నిచోట్ల అరటి చెట్లు విరిగిపడ్డాయి. ప్రస్తుతం జొన్న పైరు కోతలు జరుగుతున్నాయి. చేలల్లో ఉన్న కంకులు వర్షానికి తడిచాయి. మరో మూడు వారాల్లో కోతకు రానున్న మొక్కజొన్న పైరు పలుచోట్ల నేలవాలింది. మరోసారి భారీ వర్షం కురిస్తే జొన్న, మొక్కజొన్నకు నష్టం తప్పదని రైతులు ఆందోళన పడుతున్నారు. మెట్టలో సాగుచేసిన పసుపు పైరును ఇప్పుడు దున్నుతున్నారు. ముందుగా దున్నిన రైతులు పసుపును వండి ఆర బెట్టే పనిలో ఉన్నారు. ఈ సమయంలో వర్షం కురిస్తే పసుపు రైతులు నష్టపోక తప్పని పరిస్థితి. – తెనాలి/కొల్లిపర -
శుక్రవారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2026
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులకు మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి దంపతులు నూతన వస్త్రాలను బహూకరించగా, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దుశ్శాలువాతో వైఎస్ జగన్ను సన్మానించారు. పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ, వనమా బాల వజ్రబాబు, బలసాని కిరణ్కుమార్, షేక్ నూరి ఫాతిమా, గజ్జల సుధీర్ భార్గవరెడ్డి, వరికూటి అశోక్బాబు, పి. నాగమోహన కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


