Guntur District News
-
ఇంటర్ దూరవిద్య పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (దూరవిద్య) ఆధ్వర్యంలో మార్చి 3 నుంచి 15వ తేదీ వరకు ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర కో ఆర్డినేటర్ ఎన్.అక్బర్ అలీ, జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఇంటర్మీడియెట్ దూరవిద్య పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు శిక్షణ తరగతులను శుక్రవారం డీఈఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీఈఓ మాట్లాడుతూ, ఆయా తేదీలలో ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. అభ్యర్థులు అరగంట ముందుగా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా 9 కేంద్రాలలో 2,117 మంది పరీక్షకు హాజరుకానున్నట్టు తెలిపారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబోమని స్పష్టం చేశారు. -
వ్యాఘ్ర వాహనంపై మల్లేశ్వరుడు
మంగళగిరి టౌన్: మంగళగిరిలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం నాలుగో రోజు స్వామివారు వ్యాఘ్ర వాహనంపై భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామిని దర్శించేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. మహిళల కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉత్సవ కైంకర్యకర్తలుగా మంగళగిరి పట్టణానికి చెందిన సిందే నారాయణరావు వ్యవహరించారు. ఆలయంలో భక్తులకు దాతలు పొంగలి ప్రసాదం పంపిణీచేశారు. దేవస్థాన ఈవో జేవీ నారాయణ ఉత్సవ నిర్వహణను పర్యవేక్షించారు. -
‘విశిష్ట గుర్తింపు’
అన్నదాతకు● ఆధార్ తరహాలో రైతులకు భూ ఆధార్ ● 14 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ ● రిజిస్ట్రేషన్ అయితేనే ప్రభుత్వ పథకాలు కొరిటెపాడు(గుంటూరు): ఆధార్ తరహాలో రైతులకు భూ ఆధార్ కార్డులను అధికారులు జారీ చేస్తున్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ పేరిట చేపడుతున్న ఈ ప్రక్రియలో ప్రత్యేక యాప్లో సొంత భూమి కలిగిన ప్రతి రైతు వివరాలు నమోదు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు 14 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ అవుతుంది. ఇలా రిజిస్ట్రేషన్ అయితేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వ్యవసాయ పథకాలు, రాయితీలు, సాగు యంత్రాలు, వ్యవసాయ పరికరాలు అందిస్తారు. ఈ నేపథ్యంలో రైతుల నమోదు ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. అన్నదాతలు కూడా రిజిస్ట్రేషన్కు రైతు సేవా కేంద్రాలకు క్యూ కడుతున్నారు. గుంటూరు జిల్లాలో సుమారు 1.30 లక్షల మంది రైతులు ఉండగా, ఇప్పటి వరకు 70,478 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నమోదు ఇలా.. రైతులంతా భూ వివరాలు కలిగిన పట్టాదారు పాసుపుస్తకం, 1–బీ అడంగల్, ఆధార్ కార్డు జిరాక్స్లతో పాటు ఆధార్ కార్డుకు లింక్ చేసిన ఫోన్ నంబర్ను గ్రామంలోని సచివాలయానికి అనుబంధంగా ఉన్న రైతు సేవా కేంద్రానికి తీసుకుని వెళ్ళాలి. ఆర్ఎస్కేలోని గ్రామ వ్యవసాయ సహాయకులు(వీఏఏ) సంబంధిత పోర్టల్లో ఫార్మర్ రిజిస్ట్రీ చేస్తారు. ఈ క్రమంలో మన ఫోన్ నంబర్కు వచ్చే మూడు ఓటీపీలు చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ విజయవంతమైనట్లు ఫోన్కు సందేశం వస్తుంది. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఇలా నమోదు చేసుకుంటే ప్రభుత్వ పథకాలు పక్కాగా వర్తిస్తాయి. ఇక నుంచి తమకు ఈ పథకం రాలేదు.. ఆ పథకం రాలేదు.. పీఎం కిసాన్ డబ్బులు అందలేదన్న ఫిర్యాదులు రైతుల నుంచి ఉండవని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇలా భద్రపరచాలి.. నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత రైతులకు జారీ చేసిన విశిష్ట గుర్తింపు సంఖ్యను ఫోన్లో కానీ, పట్టాదారు పాసుపుస్తకంపై కానీ రాసుకుని భద్రపరుచుకోవాలి. వీలైతే ఈ సంఖ్యను గుర్తించుకుంటే చాలా వరకు మంచిది. ఒకవేళ గుర్తింపు సంఖ్య మర్చిపోయినా, పోయినా మళ్లీ రైతు సేవా కేంద్రానికి వెళ్లి, రైతు తమ భూ వివరాలు ఇచ్చి తెలుసుకోవచ్చు. రైతులకు ప్రయోజనకరం ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా రైతులకు జారీ చేస్తున్న విశిష్ట గుర్తింపు సంఖ్య ఎంతో ప్రయోజనకరం. ఆధార్ నంబర్ బట్టి మన వివరాలు ఏ విధంగా వస్తాయో అలాగే రైతుల 14 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య ద్వారా రైతు, ఆయన చేస్తున్న పంటల సాగు వివరాలు, ఆయన పొందుతున్న వ్యవసాయ పథకాలు అన్నీ తెలుస్తాయి. ఏ పథకానికి రైతు అర్హుడో కూడా తెలుస్తుంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్ఎస్కేల్లో నమోదు ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటి వరకు 70,478 మంది రైతులు నమోదు చేయించుకున్నారు. –నున్న వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి, గుంటూరు జిల్లా -
బుర్రకథా నాయకుడు నాజర్
● ప్రాచీన కళకు కొత్త హంగులద్దిన కళాకారుడు ● సంగీతంలోనూ ప్రజ్ఞాశాలి ● కళల తెనాలితో ప్రత్యేక అనుబంధం ● నేడు షేక్ నాజర్ వర్ధంతి తెనాలి: షేక్ నాజర్ వలి.. ప్రాచీన జానపద కళారూపం బుర్రకథకు కొత్త జీవం పోసిన ఘనులు. ప్రత్యేక హావభావాలు, ఆహార్యంతో ప్రదర్శనలిచ్చి అఖిలాంధ్రను షేక్ చేసిన కళాకారులు. ‘ఈ గండపెండేరాలూ, ఊరేగింపులూ, సన్మానాలూ, పద్మశ్రీలూ అన్నీ కలిపి, నాకు జనం వేసే ఒక్క ఈలతో సాటి కాదు’ అని సగర్వంగా ఎలుగెత్తి చాటిన గొప్ప ప్రతిభా ధీశాలి. సంగీతం, నటన, సాహిత్యం, గాన కళల్లోనూ తనదైన ముద్రవేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. పొన్నెకల్లులో జననం నాజర్ 1920 ఫిబ్రవరి 5న జిల్లాలోని పొన్నెకల్లు గ్రామంలోని ఓ పేద ముస్లిం కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి మస్తాన్ చెక్కభజనలో నేర్పరి. పెదతండ్రి నాజరు షహనాయి విద్వాంసుడు. ఆ వాతావరణంలో పుట్టి పెరిగిన నాజర్కు సంగీతంపై ఆసక్తి ఏర్పడింది. ఏడేళ్ల వయసులో పాఠశాల వార్షికోత్సవంలో ప్రదర్శించిన నాటకం నాజరు కళాజీవితానికి అంకురార్పణ చేసింది. పొన్నెకల్లులో ‘కనకతార’ నాటకంలో నాజర్ గానానికి ముగ్దులైన ప్రముఖ హార్మోనిస్టు ఖాదర్ ఆయనను ప్రోత్సహించారు. తన వెంట తెనాలికి తీసుకొచ్చి బాలల నాటక సమాజం ‘బాలరత్నసభ’లో చేర్పించారు. నాజర్ మంచి ప్రతిభ కనబరచడంతో నరసరావుపేట తీసుకెళ్లి అక్కడ ఓ సంగీత గురువు దగ్గర చేర్పించారు. ఆ తర్వాత నాజర్పై తండ్రి మరణంతో కుటుంబ భారం పడింది. వ్యవసాయ పనులకు వెళ్లారు. వారసత్వంగా ఉన్న గుడిలో సన్నాయి మేళం వాయించేవారు. కుట్టుమిషను నేర్చుకుని దుస్తులు కుట్టారు. ఏది చేసినా పాటను మాత్రం ఆపలేదు. ఒక రైతు కోరిక మేరకు అతడి పిల్లలకు సంగీతం చెప్పారు. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి ఆ విధంగా నాజర్ దగ్గర సంగీత పాఠాలు నేర్చుకున్నారు. సినీ రంగంలోనూ ప్రవేశం 1948లో కమ్యూనిస్టు పార్టీ నిషేధంతో నాజర్ నాటకాల్లో కొనసాగారు. సినిమాల్లోకి రాకముందు జమునకు శిక్షణనిచ్చి నాటకం వేయించారు. ఆ తర్వాత నాజర్ను సినీరంగం ఆహ్వానించింది. ‘పుట్టిల్లు’, ‘అగ్గిరాముడు’ సినిమాల్లో బుర్రకథలు చెప్పారు. ‘భలే బావ’, ‘నిలువుదోపిడీ’, ‘పెత్తందార్లు’ చిత్రాలకు పనిచేశారు. కొంతకాలం విప్లవ రచయితల సంఘం (విరసం)లో ఉన్నారు. 1986లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ విశిష్ట సభ్యత్వమిచ్చింది. ఇక గండపెండేరాలు, సువర్ణ ఘంటా కంకణాలు, ఎల్లలు లేని సన్మానాలూ, ఊరేగింపులూ తెలుగు నేలంతా కోకొల్లలుగా అందుకున్నారు. నాజర్ ఆత్మకథ ‘పింజారీ’ పేరుతో వెలువడింది. 1997 ఫిబ్రవరి 22న అంగలూరులో ఆయన కన్నుమూశారు. ప్రజానాట్యమండలి ద్వారా బుర్రకథా గానం నాజర్లోని కళా ప్రతిభను గుర్తించిన కమ్యూనిస్టు నాయకుడు వేములపల్లి శ్రీకృష్ణ గుంటూరులోని కమ్యూనిస్టు పార్టీ ఆఫీసుకు తీసుకెళ్లి బుర్రకథ నేర్పించారు. ప్రజల నుంచి ఆదరణ రావటంతో నాజర్ గుంటూరు జిల్లా ప్రజానాట్య మండలిని స్థాపించి విస్తృతంగా బుర్రకథలు చెప్పసాగారు. పాటలు, బుర్రకథలు స్వయంగా రాశారు. కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. బుర్రకథలో నాజర్ గుప్పించిన విషాదానికి రంగస్థల మహానటుడు బళ్లారి రాఘవ కన్నీరు పెట్టుకున్నారు. చైన్నెలో వీరి ప్రదర్శన చూసిన గోవిందరాజుల సుబ్బారావు, ‘ఇది గుంటూరు గోంగూర దెబ్బ’ అంటూ అభినందించారు. ప్రముఖ పాత్రికేయుడు కేఏ అబ్బాస్ ‘ఆంధ్ర అమరషేక్’గా నాజర్ను అభివర్ణించారు. నాజర్ ప్రతిభకు పుచ్చలపల్లి సుందరయ్య, ప్రముఖ సినీనటి భానుమతి కూడా ముగ్దులయ్యారు. -
తిరుపతమ్మకు బంగారు నెక్లెస్ బహూకరణ
పెనుగంచిప్రోలు: తిరుపతమ్మవారికి శుక్రవారం తెనాలికి చెందిన లంక శ్రీనివాసరావు, రత్నజ్యోతి దంపతులు 20 గ్రాముల బంగారు నెక్లెస్, 135 గ్రాముల వెండి గిన్నెను ఆలయ ఏఈవో తిరుమలేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతలను అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలతో సత్కరించారు. జీజీహెచ్లో ‘మీకోసం మేము’ గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్కు వచ్చే రోగుల సమస్యలను తెలుసుకుని తక్షణమే వారి సమస్యలు పరిష్కరించేందుకు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ ‘మీకోసం మేము’ నూతన కార్యక్రమాన్ని శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. డాక్టర్లు, రోగుల మధ్య సమన్వయం ఏర్పాటు చేసి త్వరితగతిన రోగులకు చికిత్స అందించేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు రోగుల బంధువులతో సూపరింటెండెంట్, సంబంధిత వైద్యులు మాట్లాడి రోగులు, వారి బంధువుల సమస్యలు తెలుసుకుని తగు చర్యలు తీసుకుంటారన్నారు. రోగులు ఆస్పత్రిలో పాటించవలసిన నియమ నిబంధనలు, వారి బంధువులు పాటించవలసిన నియమాలు వివరించారు. ఆస్పత్రిని శుభ్రంగా ఉంచేందుకు పాటించవలసిన పద్ధతులు తదితరవాటి గురించి వివరించారు. కార్యక్రమంలో ఎమర్జెన్సీ మెడిసిన్ వైద్యులు, రోగి బంధువులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలి రోజు రోగుల సమస్యలను సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ నేరుగా తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించారు. 1,14,723 బస్తాల మిర్చి విక్రయం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శుక్రవారం 1,01,695 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,14,723 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,600 నుంచి రూ.14,200 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 54,685 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. ఘనంగా శోభాయాత్ర మాచర్ల: పట్టణంలో శుక్రవారం గాయత్రి మహాయజ్ఞం కనులపండువగా నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 500 మంది శోభాయాత్రలో పాల్గొన్నారు. తొలుత కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు చేశాక కలశాలతో ముందుకు సాగారు. లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయానికి వెళ్లి గాయత్రీ మహా యజ్ఞంలో పాల్గొన్నారు. భారీగా దీప యజ్ఞం నిర్వహించారు. అఖిల విశ్వ గాయత్రీ పరివార్ శాంతికుంజ్ హరిద్వార్, మాచర్ల శాఖ వారి ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటైంది. సీఐ ప్రభాకర్రావు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసి ప్రశాంతంగా నిర్వహించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి మైక్రో అబ్జర్వర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పోలింగ్ సమర్థంగా నిర్వహించాలని ఆదేశించారు. మైక్రో అబ్జర్వర్ల విధులను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. శిక్షణలో భాగంగా బ్యాలెట్ బాక్సుల పరిశీలన గురించి వివరించారు. సమావేశంలో ఎన్నికల జనరల్ అబ్జర్వర్ వి.కరుణ, జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి తదితరులు పాల్గొన్నారు. ప్రిసైడింగ్ అధికారులకు సూచనలు అనంతరం కలెక్టర్ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి విధుల గురించి అవగాహన కల్పించారు. 26న మల్లయ్య గట్టుకు లాంచీలు విజయపురి సౌత్: మహా శివరాత్రిని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీన మాచర్ల మండలం అనుపు నుంచి ఏలేశ్వరస్వామి ఆలయానికి (మల్లయ్య గట్టుకు) ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ప్రత్యేక లాంచీలను నడపనున్నట్లు లాంచీ యూనిట్ మేనేజర్ వినయతుల్లా తెలిపారు. శుక్రవారం విజయపురి సౌత్లోని లాంచీ స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అనుపు నుంచి ఆ రోజు ఉదయం 7 – మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఈ సర్వీసులు నడపనున్నట్లు పేర్కొన్నారు. టికెట్ ధరను పెద్దలకు రూ.200, ఐదేళ్లు దాటిన పిల్లలకు రూ.150గా నిర్ణయించామన్నారు. -
గెలుపు కోసం కుతంత్రం
● ప్రభుత్వంపై ఉద్యోగులు, నిరుద్యోగుల్లో వ్యతిరేకత ● నీటిమూటగా మెగా డీఎస్సీ హామీ ● నిరుద్యోగులకు భృతి హామీ హుళక్కి ● ఉద్యోగులకిచ్చిన హామీలను తుంగలో తొక్కిన వైనం ● కూటమి పార్టీల్లో విభేదాలు ● ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓట్లడిగేందుకు జంకుతున్న ఎమ్మెల్యేలు ● మంత్రి గొట్టిపాటికి బాధ్యతల అప్పగింత సారక్షి ప్రతినిధి, బాపట్ల: ఈనెల 27న జరగనున్న ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పచ్చ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రారంభంలో ఎన్నిక ఏకపక్షమని ధీమాగా చెప్పినా, చివరకు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా కనపడుతోంది. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్కు పీడీఫ్ఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు గట్టిపోటీ ఇస్తూ చెమటలు పట్టిస్తున్నారు. ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగులలో ఉన్న వ్యతిరేకతకు తోడు కూటమి పార్టీల్లోని అసంతృప్తులతో పీడీఎఫ్ అభ్యర్థికి కలిసివచ్చే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని నిఘా విభాగం ప్రభుత్వానికి చేరవేసింది. దీంతో బెంబేలెత్తిన ముఖ్యమంత్రి చంద్రబాబు, చినబాబు అప్రమత్తమయ్యారు. రంగంలోకి రాబిన్సింగ్ గడచిన సార్వత్రిక ఎన్నికల్లో పని చేసిన రాబిన్సింగ్ టీంను రంగంలోకి దించారు. పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని, బెదింపులు, ప్రలోభాల పర్వానికి తెరతీయకపోతే సీటు గల్లంతేనని ఆయన నివేదించినట్లు తెలుస్తోంది. దీంతో చినబాబు లోకేష్ సీన్లోకి వచ్చారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పార్థసారథికి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. తేడా జరిగితే పరువు మొత్తం గంగలో కలుస్తుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఆలపాటి విజయానికి పనిచేయకపోతే ఎమ్మెల్యేల స్థానంలో అధిష్టానం ఇన్చార్జ్లను నియమిస్తుందని మంత్రి గొట్టిపాటి ఎమ్మెల్యేలను హెచ్చరించినట్లు ప్రచారం ఉంది. మంత్రి ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం చినబాబు ఉత్తర్వులు అందుకున్న మంత్రి గొట్టిపాటి, ఇన్చార్జ్ మంత్రి పార్థసారథి రేపల్లె, వేమూరు, బాపట్ల నేతలతోపాటు ఉమ్మడి గుంటూరు నేతలతోనూ సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి, చిన్న మంత్రి సందేశాన్ని ఎమ్మెల్యేల చెవిన వేశారు. అయితే ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగులతోపాటు సొంత పార్టీ కేడర్లోనూ వ్యతిరేకత ఉందని, వారిని పని చేయమంటే వినే పరిస్థితి లేదని పలువురు ఎమ్మెల్యేలు మంత్రుల దృష్టికి తెచ్చినట్లు సమాచారం. పదవులు ఇవ్వకపోవడంతోపాటు అధికారంలో సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆగ్రహంతో ఉన్న జనసేన, బీజేపీ నేతలు సైతం సహకరించే పరిస్థితి లేదని కొందరు నేతలు వివరించినట్లు తెలుస్తోంది. ఓటర్లకు ఎంత రేటు పెడితే వర్కవుట్ అవుతుందన్న దానిపైనా చర్చ జరిగింది. వెయ్యి రూపాయలు సరిపోతుందని కొందరు, కాదు రూ. 2 వేలు అంతకన్నా ఎక్కువ ఇవ్వాల్సిందేనని మరికొందరు ఎమ్మెల్యేలు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. కూటమికి పట్టభద్ర ఎమ్మెల్సీ గండం పచ్చ పార్టీలో ఇంటిపోరు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎందుకు? తొమ్మిది నెలల కూటమి పాలనపై అన్నివర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన వందకు పైగా హామీలను నెరవేర్చక సర్కార్ వంచించింది. చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చక ప్రజలను వంచించారు. పైగా విద్యుత్, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు, ఊరూరా బెల్టుషాపుల ఏర్పాటు, వలంటీర్లు, యానిమేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లతోపాటు కక్షగట్టి చిరుద్యోగులను తొలగించారు. సచివాలయ ఉద్యోగులను గాలిలో దీపంలా ఉంచారు. మెగా డీఎస్సీ పేరుచెప్పి హడావుడి చేసినా ఇంతవరకూ అతీగతీ లేదు. నిరుద్యోగులకు భృతి ఇస్తామన్న హామీ నీటి మూటే అయింది. దీంతో చదువుకున్న యువత కూటమి సర్కార్ తీరుపై మరింత ఆగ్రహంతో ఉంది. పట్టభద్రుల ఎన్నికల్లో ఇది పీడీఎఫ్ కు కలిసి రానుందని అంచనా. పచ్చపార్టీలో ఎమ్మెల్యేలు మొదలు కేడర్లో ఎమ్మెల్సీ ఎన్నికలపై వ్యతిరేకత కనపడుతోంది. అధికారం రాగానే ఎమ్మెల్యేలు అక్రమార్జనే ధ్యేయంగా వ్యాపారానికి తెరలేపారు. కనపడ్డ స్థలాన్ని కబ్జా చేస్తున్నారు. రేషన్ బియ్యాన్ని పేదల కడుపుకొట్టి నెలవారీ అమ్ముకుంటున్నారు. పార్టీ విజయం కోసం పనిచేసిన ముఖ్యనేతలు, క్రియాశీలక కార్యకర్తలకు పైసా రాబడిలేదు. నామినేటెడ్ పదవులు వస్తాయని ఆశించిన వారికి అవి దక్కలేదు. కష్టపడి తాము పనిచేస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు అధికారాన్ని అనుభవిస్తున్నారని పచ్చనేతల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. ఇది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశమున్నట్లు పరిశీలకుల అంచనా. -
ఐసీఏఐ గుంటూరు శాఖ కొత్త కార్యవర్గం
గుంటూరు ఎడ్యుకేషన్: ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) గుంటూరు శాఖకు (2025–26) సంవత్సరానికి చైర్మన్గా చింతా రఘునందన్, కార్యదర్శిగా వనిమిరెడ్డి వెంకట నరేష్ ఎన్నికయ్యారు. శుక్రవారం శ్రీనివాసరావుతోటలోని ఐసీఏఐ గుంటూరు శాఖ కార్యాలయంలో నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించింది. నూతన కమిటీ వైస్ చైర్మన్గా రుద్రవరపు భరద్వాజ్, కోశాధికారిగా మృత్యుంజయరావు, సికాస చైర్మన్గా రాజశేఖర్ నాగబీరు, సభ్యులుగా షేక్ బాజీ, దేసు సంపత్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా చింతా రఘునందన్ మాట్లాడుతూ ఐసీఏఐ గుంటూరుశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నూతన భవన నిర్మాణ పనులను పూర్తి చేసి, సీఏ సభ్యులకు, విద్యార్థులకు మెరుగైన వసతులను కల్పిస్తామని తెలిపారు. ఆదాయపుపన్ను, జీఎస్టీ అధికారులతో పాటు అన్ని వర్తక సంఘాలను కలుపుకుని అవగాహన సదస్సులు నిర్వహించి, దేశ ఆర్థిక పురోగతిలో తమ వంతు పాత్ర పోషిస్తామని అన్నారు. ఎస్ఐఆర్సీ కార్యదర్శి ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థులకు సీఏ విద్యపై అవగాహన పెంపొందించేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. -
24న కలెక్టరేట్ ఎదుట ధర్నా
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునఃప్రారంభిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల ముందు 24వ తేదీన ధర్నా నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పుప్పాల సత్యనారాయణ చెప్పారు. స్థానిక భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 24వ తేదీ నాడు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న ధర్నాల్లో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు, నగర అధ్యక్షులు రావుల అంజిబాబు, కార్పెంటర్ యూనియన్ నాయకులు కాయల రామారావు, బొట్టు శ్రీనివాసరావు, చల్లా మరియదాసు తదితరులు పాల్గొన్నారు. -
రూ.46.60 లక్షల విలువైన 234 మొబైల్స్ రికవరీ
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): పొగోట్టుకున్న మొబైల్ ఫోన్ల వివరాల ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి బాధితులకు అప్పగిస్తున్నట్లు జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి చెప్పారు. ఎస్పీ సతీష్కుమార్ ఆదేశాల మేరకు సుమారు రూ.46.60 లక్షల విలువైన 234 మొబైల్ ఫోన్లను జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో శుక్రవారం బాధితులకు అప్పగించారు. ఏఎస్పీ మాట్లాడుతూ బాధితులు పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేయడం ఆనందంగా ఉందన్నారు. సెల్ఫోన్లు పోతే పోలీస్ హెల్ప్లైన్ నంబర్ 8688831574 లేదా సీఈఐఆర్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేసి మాట్లాడితే ఆ నంబర్లను బ్లాక్ చేసి, దగ్గర్లోని పోలీస్స్టేషన్ లేదా జాతీయ సైబర్ భద్రత టోల్ ఫ్రీ నంబర్ 1930కు సమాచారం అందించాలని అన్నారు. కార్యక్రమంలో సీఐలు నిషార్బాష (ఐటీకోర్), నరేష్కుమార్ (పీసీఆర్), హెడ్ కానిస్టేబుళ్లు కిషోర్, రమేష్, కానిస్టేబుళ్లు శ్రీధర్, ఇమాంసాహెబ్, గౌస్భాషా, మానస, కరిముల్లాను ఏఎస్పీ అభినందించారు.బాధితులకు అప్పగించిన పోలీసులు -
మాతృభాషను మరవద్దు
చేబ్రోలు: మాతృభాషని ఎవరూ కూడా మరచిపోవద్దని విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య చెప్పారు. వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో మాతృభాషా దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. లావు రత్తయ్య మాట్లాడుతూ మాతృభాష విశిష్టతను వివరించారు. మాతృ భాష బాగా వస్తే ఇతర భాషల్లోనూ నైపుణ్యం పెంచుకోవడం సులువు అవుతుందని, బహుభాషా నైపుణ్యం ఉన్నవారికి గ్లోబల్ మార్కెట్లో మంచి అవకాశాలు ఉంటాయని వెల్లడించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పలు పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను, మెమెంటోలను అందజేశారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
మేడికొండూరు: ఆటోను వ్యాన్ ఢీకొన్న ఘటనలో నలుగురు మహిళలకు గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని పేరేచర్ల కాల్వ సమీపంలో జరిగింది. పేరేచర్ల నుంచి మేడికొండూరు వైపు వెళ్తున్న ఆటోను గుంటూరు నుంచి సత్తెనపల్లి వైపు వెళ్తున్న వ్యాన్ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మహిళలకు గాయాలయ్యాయి. వీరిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మోటార్ల చోరీ కేసులో ఇద్దరు అరెస్టు చీరాల: మోటార్ల చోరీ కేసులో ఇద్దరిని ఈపురుపాలెం పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్స్టేషన్లో శుక్రవారం ఎస్ఐ అంబటి చంద్రశేఖర్ వివరాలను వెల్లడించారు. చీరాల రూరల్ మండలం కావూరివారిపాలెంలోని పొలాల్లో నీళ్ల మోటార్లు చోరీకి గురికావడంతో గ్రామానికి చెందిన అక్కల సాంబయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన అక్కల గోపిరెడ్డి, కావూరి గోపిరెడ్డి నిందితులని తేలింది. ఇద్దరు మద్యం, వ్యసనాలకు అలవాటుపడ్డారు. సులువుగా డబ్బులు సంపాదించేందుకు పొలాల్లోని మోటార్లను చోరీ చేసి అమ్ముకుంటున్నారు. ఈనెల 15, 17తేదీల్లో ఫిర్యాది అక్కల సాంబయ్య, అతని పక్కనే ఉన్న గుండుబోయిన ఏసురాజు పొలంలో, అదే గ్రామానికి చెందిన అక్కల వెంకటరెడ్డి, కావూరి శ్రీనివాసరెడ్డి, కావూరి శివారెడ్డిలకు చెందిన పొలాల్లోని ఐదు మోటార్లను చోరీ చేశారు. దర్యాప్తు అనంతరం పోలీసులు నిందితులను శుక్రవారం సాయంత్రం కావూరివారిపాలెం వై.జంక్షన్ వద్ద అరెస్టు చేశారు. -
ఓటు హక్కు అవగాహన ర్యాలీ
తెనాలి: కృష్ణ–గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈనెల 27న జరగనున్న నేపథ్యంలో తెనాలిలో శుక్రవారం ఓటు హక్కు అవగాహన ర్యాలీని నిర్వహించారు. ‘స్వీప్’ కార్యక్రమంలో భాగంగా ఓటర్లను చైతన్య పరుస్తూ తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టారు. తెనాలి సబ్ కలెక్టర్ వి.సంజనా సింహ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఎమ్మెల్సీ ఎన్నికల నోడల్ అధికారులు దుర్గాభాయ్, కె.సంజీవరావు, సిబ్బందితో కలిసి ప్రదర్శనగా బయలుదేరారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నుంచి కొత్తపేట, బోసురోడ్డు మీదుగా గాంధీచౌక్ వరకూ చేరుకున్నారు. అక్కడ మానవహారం నిర్వహించి ఓటు హక్కు వినియోగం గురించి ప్రతిజ్ఞ చేశారు. సబ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెనాలి అర్బన్, రూరల్ కలిసి 26 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈనెల 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందని చెప్పారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడ పోలింగ్ శాతం తక్కువగా నమోదైందని, ఈ ఎన్నికల్లో వంద శాతం పోలింగ్ జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ నిర్వహణ గురించి అధికారులు తెలియజేశారు. వివిధ విభాగాల ఉద్యోగులు, సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు. -
సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి
దమ్మాలపాడు (ముప్పాళ్ళ): గ్రామాల్లో జరుగుతున్న ఎన్సీడీ–సీడీ సర్వేను వేగవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి బి.రవి చెప్పారు. దమ్మాలపాడు గ్రామంలో ఫ్రైడే– డ్రైడే కార్యక్రమాన్ని, ఎన్సీడీ– సీడీ సర్వేను శుక్రవారం ఆయన పరిశీలించారు. గ్రామాల్లో మురుగు నీరు నిల్వ లేకుండా పంచాయతీ సిబ్బందితో పని చేయించాలన్నారు. రోడ్ల వెంబడి చెత్త లేకుండా చూడాలని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్సీడీ–సీడీ సర్వేలో భాగంగా ప్రతి వ్యక్తి ఆరోగ్య వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. మార్చి 30వ తేదీ నాటికి సర్వే పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ఆరోగ్య ఉపకేంద్రాన్ని తనిఖీ చేశారు. జిల్లా మలేరియా అధికారి రవీంద్రరత్నాకర్, సీహెచ్ఓ హర్షవర్ధన్, ఆరోగ్య పర్యవేక్షకుడు ఎ.పీటర్ డేమియన్, ఎస్కే రహిమాన్, ఏఎన్ఎం మస్తాన్బీ, ఆశా కార్యకర్తలు సుభాన్బీ, సుబ్బమ్మ, కుమారి, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
అడ్వాన్స్ తిరిగివ్వాలని కోరితే బెదిరింపులు
వ్యక్తిపై కేసు నమోదు లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఇంటి కొనుగోలుకు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగివ్వాలని అడిగినందుకు బెదిరింపులకు దిగిన ఓ వ్యక్తిపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అరండల్పేట పోలీసుల కథనం ప్రకారం.. వేళంగిణి నగర్ ప్రాంతానికి చెందిన కర్రా విజయరాణి, ఆమె భర్త తెనాలి రాజశేఖర్ గుంటూరు ముత్యారెడ్డినగర్లోని ఒక ఇల్లు కొనుగోలుకు నిర్ణయించారు. దీనికోసం చైతన్యపురి కాలనీకి చెందిన కురాకుల శ్రీనివాసరావు, శోభారాణిలకు అడ్వాన్స్గా రూ.20 లక్షలు చెల్లించారు. తీరా ఇల్లు పూర్తిగా పరిశీలించగా నచ్చకపోవడంతో ఇల్లు బాగోలేదని, అడ్వాన్స్ తిరిగివ్వాలని కోరారు. అయితే నగదు తిరిగివ్వకుండా శ్రీనివాసరావు, శోభారాణి మూడు నెలలుగా కాలయాపన చేస్తూ వచ్చారు. గురువారం శ్రీనివాసరావు, శోభారాణి ఇంటి వద్దకు వెళ్ళి డబ్బులు ఇవ్వాలని కోరగా బాధితురాలు విజయరాణిపై దుర్భాషలాడి, హతమారుస్తామంటూ బెదరింపులకు దిగారు. దీంతో బాధితురాలు గురువారం రాత్రి అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వలస కూలీల మినీ లారీ బోల్తా ఆరుగురికి గాయాలు మేడికొండూరు: వలస కూలీలతో వెళుతున్న మినీ లారీ రోడ్డుపై బోల్తా కొట్టడంతో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని సత్తెనపల్లి రోడ్డులో గుళ్ళపాలెం సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రామానికి చెందిన వలస కూలీలు 25 మంది గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కోవెలమూడి గ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో మేడికొండూరు సమీపంలోని గుండ్లపాలెం పెట్రోల్ బంక్ వద్ద మినీలారీ అదుపు తప్పి రోడ్డుపై బోల్తా కొట్టింది. ఘటనలో లారీలో ఉన్న రాజ్ కుమార్, చంద్రమ్మలకు తీవ్ర గాయాలు అవ్వగా మరో నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. వీరిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి 108 సహాయంతో తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. -
వైభవంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
తెనాలి: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని శుక్రవారం స్థానిక కొత్తపేటలోని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు మాచిరాజు రామకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. పట్టణానికి చెందిన కవి, రచయిత పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి, స్వరలయ సంస్థ వ్యవస్థాపకుడు సాయి లక్కరాజు తమ ప్రసంగాల్లో మాతృభాషా దినోత్సవం ప్రారంభం, విశిష్టత, ఆవశ్యకతను తెలియజేశారు. గాలి సత్యనారాయణ, పావులూరి శ్రీనివాసరావు, వేములపల్లి సుజన, పినపాటి రవికుమార్, నండూరి నారాయణరావు, యడవల్లి శ్రీనివాసచౌదరి, జల్లి గంటయ్యలు మాతృభాషా దినోత్సవం వైశిష్ట్యాన్ని వివరించారు. విశిష్ట అతిథులు పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి, సాయి లక్కరాజులు మాతృభాష ప్రచారానికి చేస్తున్న కృషికి గుర్తింపుగా అసోసియేషన్ జిల్లా సహాయ కార్యదర్శి బేతాళ ప్రసాద్ చేతులమీదుగా సత్కరించారు. కోశాధికారి హృదయరాజు పర్యవేక్షించారు. లూథరన్ ప్రాథమికోన్నత పాఠశాలలో... అంతర్జాతీయ మాతభాష దినోత్సవాన్ని స్థానిక నాజర్పేటలోని లూథరన్ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మునిపల్లి వెంకట రఘునాథరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కవి, రచయిత, కళాకారుడు లక్కరాజు లక్ష్మణరావు మాట్లాడుతూ మాతృభాష మాధుర్యాన్ని, భాషావశ్యతకను వివరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయిని పి.ప్రియదర్శిని, ఉపాధ్యాయుడు ఎం.వెంకటరెడ్డి ప్రసంగించారు. పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వేమన శతక పద్యాల పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలను అందజేశారు. తొలుత తెలుగుతల్లి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. -
25న శివరాత్రి సమన్వయ కమిటీ సమావేశం
అమరావతి: పుణ్యక్షేత్రమైన అమరావతి శ్రీ మాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి వారి శివరాత్రి బ్రహ్మోత్సవాల సమన్వయ కమిటీ మూడో సమావేశం ఈ నెల 25వ తేదీన జరగనుంది. ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్ కుమార్ ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సత్తెనపల్లి ఆర్డీవో రమణకాంతరెడ్డి ఆధ్వర్యంలో ఆ రోజు మధా్య్హ్నం 2 గంటలకు ఆలయ ప్రాంగణంలో సమావేశం ఉంటుందని చెప్పారు. పండ్లతోటల పెంపకంపై రాయితీ నరసరావుపేట రూరల్: పండ్లతోటల పెంపకంపై ప్రభుత్వ రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డాట్ సెంటర్ శాస్త్రవేత్త నాగేష్ తెలిపారు. మండలంలోని పమిడిమర్రులో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రైతులకు అవగాహన కల్పించారు. శాస్త్రవేత్త నాగేష్, ఉద్యాన శాఖ అధికారి నవీన్కుమార్లు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రస్తుతం మిర్చి ధర తక్కువగా ఉన్నందున రైతులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వంద శాతం రాయితీలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్లో ఉద్యాన పంటలకు ఇచ్చే రాయితీని వచ్చే 2025–26 నుంచి పెంచినట్టు తెలిపారు. -
నిబంధనలు పాటించడం తప్పనిసరి
డీఎంహెచ్వో డాక్టర్ రవి నరసరావుపేట: జిల్లాలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులు వైద్య, ఆరోగ్యశాఖ నిబంధనలు కచ్చితంగా అమలుచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి ఆదేశించారు. జిల్లాలో అన్ని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించిన సీ–సెక్షన్ ఆపరేషన్ల ఆడిట్లో భాగంగా గురువారం ఆయన స్థానిక శ్రేయ ఐవీఎఫ్ సెంటర్ను తనిఖీ చేశారు. సీ–సెక్షన్ డెలివరీస్ రికార్డులను పరిశీలించారు. వీలైనంతవరకు సీజేరియన్ డెలివరీస్ తగ్గించాలని సూచించారు. అనంతరం స్కాన్ సెంటర్ను పరిశీలించారు. పీసీపీఎన్డీటీ యాక్ట్ నిబంధనలకు లోబడి అన్ని మార్పులు సరి చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం రిజిస్ట్రేషన్, రెన్యువల్స్ సకాలంలో చేసుకోవాలని తెలిపారు. లోపాలపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆయన వెంట స్టాటిస్టికల్ ఆఫీసర్ నీలకంఠేశ్వరరావు, సిబ్బంది ఉన్నారు. -
బాలిక అదృశ్యంపై కేసు
మంగళగిరి టౌన్: బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు మంగళగిరి పట్టణ పోలీసులు గురువారం తెలిపారు. మంగళగిరి పార్కు రోడ్డులో ఉంటున్న బాలిక గుంటూరు సమీపంలోని సిమ్స్ కాలేజీలో నర్సింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తండ్రి కొంత కాలం క్రితం మరణించడంతో బాలిక తల్లి తిరుపతమ్మ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో హౌస్ కీపింగ్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఫిబ్రవరి 14న కాలేజీకి వెళ్లిన కుమార్తె సాయంత్రానికి ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికింది. ఆచూకీ లభించకపోవడంతో బుధవారం రాత్రి పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పసుపు యార్డుకు 168 బస్తాలు దుగ్గిరాల: దుగ్గిరాల పసుపు యార్డులో గురువారం 168 బస్తాలు వచ్చాయి. పసుపు మొత్తం అమ్మకం చేసినట్లు వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యదర్శి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. సరుకు 139 బస్తాలకు కనిష్ట ధర రూ.8,400 గరిష్ట ధర రూ.10,750 మోడల్ ధర రూ.10,750, కాయలు 29 బస్తాలకు కనిష్ట ధర రూ.8,400, గరిష్ట ధర రూ.10,001, మోడల్ ధర రూ.10,001 పలికింది. మొత్తం 126 క్వింటాళ్ల అమ్మకాలు జరిగినట్లు వెల్లడించారు. బడ్జెట్లో చేనేత రంగానికి రూ.2వేల కోట్లు కేటాయించాలి మంగళగిరి టౌన్ : రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో చేనేత రంగానికి రూ. 2 వేల కోట్ల నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళగిరి నగర పరిధిలోని ఏపీ చేనేత కార్మిక సంఘ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ చేనేతలకు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని కోరారు. చేనేత సహకార సంఘాలకు బకాయి ఉన్న రూ.172 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, నేతన్న నేస్తం పథకాన్ని రూ.24 వేల నుంచి రూ.36 వేలకు పెంచాలని కోరారు. బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట కృష్ణారావు, ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
టోల్ ప్లాజాల వద్ద సౌకర్యాల కల్పనే లక్ష్యం
ఎన్హెచ్ఏఐ ఆర్వో ఆర్కే సింగ్ మంగళగిరి: టోల్ ప్లాజాల వద్ద ప్రయాణికుల కోసం వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని ఎన్హెచ్ఏఐ ఆర్వో ఆర్కే సింగ్ తెలిపారు. నగర పరిధిలోని కాజ టోల్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన కొత్త అంబులెన్స్లతోపాటు బేబీ కేర్ రూమ్లను గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ అంబులెన్సులు, బేబీకేర్ రూంలు ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో టోల్ ప్లాజా మేనేజర్ రవి, బేబీ కేర్ రూమ్ల దాతలు శ్రీ వేంకటేశ్వర ఫుడ్ బేవరేజస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులు పాలడగు కృష్ణ వంశీ, శ్రీనివాసరావు, కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
నేడు చికెన్, ఎగ్ఫుడ్ మేళా
గుంటూరు మెడికల్: చికెన్, కోడిగుడ్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు శుక్రవారం స్థానిక పట్టాభిపురం స్వామి థియేటర్ గ్రౌండ్లో చికెన్, ఎగ్ఫుడ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఒ.నరసింహారావు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో బర్డ్ఫ్లూపై అనేక వదంతులు వస్తున్న నేపథ్యంలో ప్రజలు కోడి మాసం, గుడ్లు తినేందుకు భయపడుతున్నారన్నారు. ప్రజలు ఫుడ్మేళాకు విచ్చేసి తమ సందేహాలు నివృత్తి చేసుకోవాలన్నారు. గుంటూరు జిల్లా ఫార్మర్స్, ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాయంత్రం 5 గంటలకు ఫుడ్మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. టీటీడీ సభ్యుడిపై చర్యలు తీసుకోండి ప్రభుత్వాన్ని కోరిన బొందిలి రాష్ట్ర నాయకులు నరసరావుపేట: శ్రీ వెంకటేశ్వరుడు నిలయమైన తిరుమల ఆలయంలో మహా ద్వారం వద్ద విధు లు నిర్వహిస్తున్న బాలాజీ సింగ్పై టీటీడీ పాలకవర్గ సభ్యుడు నరేష్కుమార్ అసభ్యకరమైన పదజాలంతో విరుచుకుపడటాన్ని ఏపీ రాష్ట్ర బొందిలి సంఘ నాయకులు తీవ్రంగా ఖండించారు. స్థానిక కార్యాలయంలో గురువారం సంఘ నాయకులు సమావేశమయ్యారు. సంఘ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొందిలి శ్రీనివాస సింగ్ మాట్లాడుతూ విధుల్లో ఉన్న ఉద్యోగిపై నరేష్కుమార్ ‘‘నిన్ను ఎవరు ఇక్కడ పెట్టించింది.. ఏమనుకుంటున్నావు.. నీ సంగతి చూస్తా.. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదా? నువు ముందు బయటికి పో’’ అంటూ దూషించడం దారుణమని తెలిపారు. వెంటనే నరేష్ కుమార్ క్షమాపణ చెప్పాలని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందించి పాలకవర్గ సభ్యుడుగా ఉన్న అతడిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ సంఘ నేతలు డి.ఖాసిం పీరా, ముంటి నాగమల్సింగ్, చావలి మురళి, చిందే నాగేశ్వరరావు పాల్గొన్నారు. 22,23 తేదీల్లో జిల్లాస్థాయి క్రీడా పోటీలు పెదకూరపాడు: పల్నాడు జిల్లా స్థాయిలో క్రీడా పోటీలను ఈ నెల 22, 23 తేదీల్లో నిర్వహిస్తున్నామని జన చైతన్య సమితి కో–ఆర్డినేటర్ వెలితోటి అనిల్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నెహ్రూ యువ కేంద్రం, జన చైతన్య సమితి ఆధ్వర్యంలో వాలీబాల్, కబడ్డీ, రన్నింగ్, లాంగ్ జంప్ క్రీడాంశాల్లో పెదకూరపాడులోని జీఆర్ సీఆర్కే శ్రీ చైతన్య స్పోర్ట్స్ అకాడమీ క్రీడా ప్రాంగణంలో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. విజేతలకు ప్రభుత్వ సర్టిఫికెట్లతో పాటు, షీల్డ్లను కూడా బహూకరించనున్నట్లు తెలియజేశారు. పురుషులకు, మహిళలకు వేర్వేరుగా ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు. వివరాలకు 8886777767, 9848977677, 8008094045 నంబర్లలో సంప్రదించాలని అనిల్ కుమార్ కోరారు. -
ప్రకృతి సేద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
కొరిటెపాడు(గుంటూరు): ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతో పాటు పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఏపీ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్(ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు వెలుగూరి రాధాకృష్ణమూర్తి కోరారు. ఈ మేరకు గురువారం ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో గుంటూరులోని రైతు సాధికార సంస్థ కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయం సీఈవో రామారావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో 15 వేల మంది ప్రకృతి వ్యవసాయంలో భాగస్వాములై అనేక క్యాడర్లలో తొమ్మిది ఏళ్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనం అమలు చేయాలన్నారు. రైతులకు సమాచారం చేరవేసే విషయంలో కష్టపడి పనిచేస్తున్న అనేక క్యాడర్ల ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. వారిని అర్ధాంతరంగా తొలగించే విధానాన్ని ఆపాలని సూచించారు. అంతేకాకుండా తొలగించిన వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వేతనాల పెంపు కోసం ప్రత్యేక నిధులు కేటాయించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. మహిళలకు భద్రత కల్పించాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో యూనియన్ రాష్ట్ర నాయకులు సునీల్ కుమార్, విజయలక్ష్మి,శ్రీనివాసరావు, శ్రీధర్, ఎం.రమేష్బాబు ఉన్నారు. -
హజరత్ మస్తాన్ వలి దర్గాను స్వాధీనం చేసుకోవాలి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుంటూరు నగరంలోని హజరత్ కాలే మస్తాన్ వలి దర్గాను రావి రామ్మోహనరావు, అతని కుమారుడు మస్తాన్ సాయి వ్యాపార కేంద్రంగా మార్చారని ముస్లిం సేన రాష్ట్ర అధ్యక్షుడు,వక్ఫ్ బోర్డ్ గుంటూరు జిల్లా మాజీ జాయింట్ సెక్రటరీ షేక్ సుభాని, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా ధ్వజమెత్తారు. స్థానిక నగరంపాలెంలోని ముస్లిం సేన రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రావి రామ్మోహనరావు కుటుంబానికి ఈ దర్గాకు సంబంధం లేదని కోర్టు స్పష్టం చేసినా, గత వక్ఫ్ బోర్డులో ఇతనిపై చర్యలు తీసుకోవాలని, షోకాజ్ నోటీస్ ఇచ్చి దర్గాను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించినా వక్ఫ్ బోర్డు సీఈఓ కనీస చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇప్పటికైనా సర్కారు, వక్ఫ్ బోర్డు అధికారులు దృష్టి సారించి దర్గాను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. మస్తాన్ సాయిపై డ్రగ్స్, మహిళలను మోసం చేసిన కేసులు నమోదయ్యాయని, ఇది దర్గా పవిత్రతకు భంగం కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్, మైనార్టీ నాయకుడు సైదా, సత్య, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో దొంగలు
చేబ్రోలు: చేబ్రోలు గ్రామ పంచాయతీకి చెందిన పెద్ద మంచినీటి చెరువులో అర్ధరాత్రి సమయంలో చేపలు పట్టుకున్న ఇద్దరు స్టువార్టుపురం దొంగలు పోలీసుల అదుపులో ఉన్నారు. చేబ్రోలు పరిధిలోని కొమ్మమూరు చానల్కు పక్కనే ఉన్న 22 ఎకరాల మంచినీటి చెరువులో కొంతకాలంగా రాత్రి సమయాల్లో పెద్ద పెద్ద చేపలను పట్టుకొని వెళ్తున్నారు. నీళ్ల మోటార్లు, కాపర్, యంత్ర పరికరాలు అపహరణకు గురవుతుండటంతో పంచాయతీ కార్యదర్శి కారసాని శ్రీనివాసరావు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఆటోలో వచ్చి నలుగురు దొంగలు మంచినీటి చెరువులోని పెద్ద పెద్ద చేపలను పట్టకుంటుండటంతో పంచాయతీ సిబ్బంది పథకం ప్రకారం వారిలో ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు పరారయ్యారు. వీరంతా స్టువార్టుపురానికి చెందిన వారిగా గుర్తించారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కౌలు రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వాలి లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): కౌలు రైతులకు ఎటువంటి ష్యూరిటీలు లేకుండా పంట రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వాలని కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వి.జగన్నాథం డిమాండ్ చేశారు. ఈ మేరకు జీటీ రోడ్డులోని లీడ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ను కలసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సచివాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో కౌలు రైతులకు పెద్ద ఎత్తున పంట రుణాలు ఇచ్చామని చెప్పడం విడ్డూరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కంజుల విఠల్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పచ్చల శివాజీ తదితరులు పాల్గొన్నారు. హోంగార్డుపై యువకుడు దాడి చెరుకుపల్లి: మద్యం మత్తులో ఓ యువకుడు హల్చల్ చేశాడు. ఏకంగా పోలీసులపైనే దాడికి దిగాడు. వివరాలు.. గుళ్ళపల్లి గ్రామానికి చెందిన వాగు దినేష్ గురువారం సాయంత్రం మద్యం తాగి జాతీయ రహదారిపై వాహనాల ముందుకు వెళ్లాడు. ట్రాఫిక్ విధుల్లో ఉన్న కారంకి శ్రీనివాసరావు అనే హోంగార్డు, మరో కానిస్టేబుల్ ఎంత వారించినా వినలేదు. వారిని దుర్భాషలాడుతూ హోంగార్డు శ్రీనివాసరావును కింద పడేసి దాడి చేశాడు. చొక్కా చించేశాడు. ఎస్సై అనీల్కుమార్ సిబ్బందితో వచ్చి ట్రాఫిక్ నియంత్రించారు. దినేష్కు ఎంత చెప్పినా వినకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. హోంగార్డు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై అనిల్కుమార్ తెలిపారు. -
విద్యార్థినులను రక్షించిన పోలీసులు
● ప్రముఖ విద్యా సంస్థ నుంచి ఐదుగురు అదృశ్యం ● సత్తెనపల్లి పోలీసులకు అభినందనలు తెలిపిన హోం మంత్రి అనిత సత్తెనపల్లి: అదృశ్యమైన ఐదుగురు మైనర్ విద్యార్థినులను పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీసులు గురువారం రక్షించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలోని ఓ ప్రముఖ విద్యాసంస్థలో చదువుతున్న ముస్తాబాద్కు చెందిన ఐదుగురు మైనర్ విద్యార్థినులు అదృశ్యం కావడంతో వారి బంధువులు గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన గన్నవరం పోలీసులు సాంకేతికతను వినియోగించి, విద్యార్థినులు సత్తెనపల్లి మీదుగా హైదరాబాద్ వెళుతున్నట్లు గుర్తించారు. వెంటనే సత్తెనపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సత్తెనపల్లి డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు ఆధ్వర్యంలో సీఐ బొప్పన బ్రహ్మయ్య, ఏఎస్ఐ రమణ, సిబ్బంది దరియావలి, సలీం, దశరథ్నాయక్లు ఉదయం 6:30–7:00 గంటల మధ్య విజయవాడ–నల్గొండ వెళుతున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో తనిఖీలు నిర్వహించారు. ఐదుగురు విద్యార్థినులను అదుపులోకి తీసుకొని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. గన్నవరం పోలీసుల సమాచారం మేరకు సత్వరమే స్పందించి విద్యార్థినులను రక్షించిన సత్తెనపల్లి పోలీసులను రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ట్విట్టర్ ద్వారా, ఫోన్లో అభినందించారు. -
ఆరుగురు గంజాయి విక్రేతల అరెస్టు
నిందితుల్లో ఒకరు మైనర్ తెనాలిరూరల్: గంజాయి విక్రయిస్తున్న మైనర్ సహా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో గురువారం సాయంత్రం డీఎస్పీ బి.జనార్దనరావు వన్టౌన్ సీఐ మల్లికార్జునరావుతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన ఆరుమళ్ల సాహిత్ రెడ్డి, రెడ్డిబత్తుల హర్షవర్ధరెడ్డి, పాముల రిషిబాబు, తెనాలి రామలింగేశ్వరపేటకు చెందిన యర్రమోతు పవన్ ప్రశాంత్, నాజరుపేటకు చెందిన పసుపులేటి వెంకటేశ్వరరావు, గంగానమ్మపేటకు చెందిన మరో మైనర్ కలిసి వైకుంఠపురం రైల్వే అండర్ పాస్ వద్ద గంజాయి విక్రయిస్తుండగా అందిన సమాచారంతో గురువారం అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువచ్చి తెనాలిలో అమ్ముతున్నట్టు గుర్తించామని వెల్లడించారు. వీరి వద్ద నాలుగు కిలోల 50 గ్రాముల గంజాయితోపాటు రూ.4,500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులను అరెస్ట్ చేసిన సీఐ మల్లికార్జునరావు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
జేఈఈ మెయిన్స్ విద్యార్థికి అభినందన
తెనాలి: జాతీయస్థాయి ఐఐటీ–జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో రికార్డు స్థాయిలో 99.37 పర్సెంటైల్ సాధించిన తెనాలి వివేక జూనియర్ కాలేజి విద్యార్థి తూనుగుంట్ల వెంకట పవన్కుమార్ను రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందించారు. తెనాలిలోని తన కార్యాలయంలో శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. పేద కుటుంబానికి చెందిన పవన్కుమార్కు ప్రభుత్వపరంగా, వ్యక్తిగతంగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పవన్కుమార్ వెంట ఉన్న వివేక విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కె.రామరాజు, సీఈవో ఉదయ్కిరణ్ను మంత్రి మనోహర్ ప్రశంసించారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి
తురకపాలెం(ముప్పాళ్ల): ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో పంట కాల్వలో వ్యక్తి బోర్లా పడి మృతి చెందిన సంఘటన గురువారం మండలంలోని గోళ్లపాడు గ్రామ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పంట కాల్వలో మృతదేహం ఉన్నట్లు గుర్తించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరిన వారు మృతదేహాన్ని కాల్వలోంచి బయటకు తీశారు. మండలంలోని తురకపాలేనికి చెందిన మక్కెన ఇన్నయ్య(45)గా గుర్తించారు. తలపైన తీవ్ర గాయంతో పాటుగా ముక్కుల వెంబడి రక్తం కారుతూ ఉండటంతో మొదట అనుమానాస్పద మృతిగా భావించారు. తర్వాత పోలీసులు విచారణ జరపగా తురకపాలెం గ్రామానికి చెందిన ఇన్నయ్య కొంకావారిపాలెం చేపల చెరువుకు కాపలా ఉండే చల్లంచర్ల ఏసురాజు అనే యువకుడితో కలిసి ద్విచక్ర వాహనంపై గోళ్లపాడు వైపు బయలుదేరారు. మార్గంమధ్యలో వాహనం అదుపు తప్పి ఇద్దరూ కిందపడి స్పృహ కోల్పోయారు. వాహనం వెనకాల కూర్చున ఇన్నయ్య కిందపడి తలకు గాయమై కాల్వలో జారిపోయాడు. చీకట్లో కనిపించకపోవడంతో ఏసురాజు తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. తెల్లవారిన తర్వాత ఇన్నయ్య కాల్వలో మృతి చెందాడని తెలియడంతో ఏసురాజు జరిగిన సంఘటన తీరును పోలీసులకు వివరించాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. భార్య ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వి.సోమేశ్వరరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. -
11 మంది రెవెన్యూ సిబ్బందికి షోకాజ్ నోటీసులు
మార్టూరు: జిల్లా వ్యాప్తంగా కొందరు రెవెన్యూ సిబ్బందికి గురువారం జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రెవెన్యూ సమస్యలపై దరఖాస్తు చేసుకున్న వ్యక్తులకు ఇటీవల ఎవరైనా మిమ్మల్ని లంచం అడిగారా? తీసుకున్నారా? అంటూ ప్రభుత్వం తరఫున ఫోన్ ద్వారా ఐవీఆర్ఎస్ సర్వే చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా జిల్లాలో 11 మంది రెవెన్యూ సిబ్బందిపై అవినీతి ఆరోపణలు రావడం గమనార్హం. వారిలో అత్యధికంగా మార్టూరు మండలం నుంచి ఐదుగురు వీఆర్వోలు ఉండటం విశేషం. మండలంలో షోకాజ్ నోటీసులు అందుకున్న వారిలో ద్రోణాదుల–2, కోలలపూడి, జొన్నతాళి, బొబ్బేపల్లి, మార్టూరు– 3 వీఆర్వోలు కే మోహన్ నాయక్, జి.వీరయ్య, ఎ. ఉమామహేశ్వరరావు, జి.రోశయ్య, కె.మోహనరావులు ఉన్నారు. మిగిలిన ఆరుగురిలో నగరం మండలం ధూళిపూడి గ్రామ సర్వేయర్ ఎం. గోపి నాగకృష్ణ, భట్టిప్రోలు వీఆర్ఓ ఎం.లక్ష్మి, అద్దంకి వీఆర్వో ఎం.శ్రీనివాసరావు, ఇంకొల్లు వీఆర్వో ఎం. సురేష్ ఉన్నారు. పర్చూరు మండలం ఉప్పుటూరు వీఆర్వో పి. నాగలక్ష్మి, జే. పంగులూరు మండలం రేణింగివరం వీఆర్వో వి. సుమతి షోకాజ్ నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. వీరిని మూడు రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశిస్తూ కలెక్టర్ గురువారం సాయంత్రం నోటీసులు జారీ చేశారు. ఐవీఆర్ఎస్ సర్వే లోపభూయిష్టం.. ఇదిలా ఉండగా ఈ విషయమై జిల్లాలోని కొందరు వీఆర్వోలు విలేకరులతో మాట్లాడుతూ ఐవీఆర్ఎస్ సర్వే లోపభూయిష్టంగా ఉందన్నారు. దరఖాస్తు చేయని వారికి ఫోన్ చేసి ఒకటి నొక్కమని ఒత్తిడి చేశారని చెబుతున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా కిందిస్థాయి ఉద్యోగులు, సిబ్బందే బలి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైళ్లు రద్దు లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ మీదుగా వెళ్లే చర్లపల్లి–దానాపూర్–చర్లపల్లి రైళ్లను కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దు చేసినట్లు డివిజన్ సీనియర్ డీసీఎం ప్రదీప్కుమార్ గురువారం తెలిపారు. చర్లపల్లి నుంచి దానాపూర్కు ఈనెల 21 నుంచి 28 వరకు నడపదలిచిన ప్రత్యేక రైలుతోపాటు దానాపూర్ నుంచి చర్లపల్లి వరకు ఈనెల 21 నుంచి 28వ తేదీ వరకు నడపదలిచిన ప్రత్యేక రైలును రద్దు చేసినట్టు వివరించారు. ఐవీఆర్ఎస్ సర్వేలో అవినీతి ఆరోపణలే కారణం -
గిరిజన భాషలకు సువర్ణమాల
● 19 భాషలకు లిపి రూపొందించిన ప్రొఫెసర్ ● ఏకేఎన్యూ వీసీ స్థాయికి ఎదిగిన వైనం ● ‘నారీశక్తి’ చాటిన మహిళామూర్తి సాతుపాటి ప్రసన్నశ్రీ తెనాలి: సాతుపాటి ప్రసన్నశ్రీ.. గిరిజన భాషల అక్షరశిల్పి ఆమె.. గిరిజన భాషలు అంతరించిపోకూడదనే మహోన్నత ఆశయంతో సొంత లిపి రూపొందించారు. ఇందుకోసం భారతదేశంలోని గిరిజన తండాలను సందర్శించారు. ఆ భాషలపై అధ్యయనం చేశారు. మొత్తం 19 గిరిజన భాషలకు లిపిని సిద్ధంచేశారు. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక నారీశక్తి పురస్కారాన్ని అందుకున్నారు. ఈ ఇంగ్లిష్ ప్రొఫెసర్ ఇప్పుడు రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి(ఏకేఎన్యూ) ఉపకులపతి అయ్యారు. పూర్వీకులది స్టువార్టుపురం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని స్టువార్టుపురం ప్రసన్నశ్రీ పూర్వీకుల ఊరు. ఒకప్పుడు పేరుమోసిన దొంగలకు నిలయమైన ఈ ఊరిలో సామాజికవేత్త హేమలతా లవణం వారిలో పరివర్తనకు కృషిచేశారు. ఫలితంగా అక్కడ నేరప్రవృత్తి కలిగిన పలువురు మారి చదువుకుని ఉద్యోగాలు చేపట్టారు. ఎందరో ఉన్నతస్థానాలకు చేరారు. హేమలతా లవణం వంటి ప్రముఖులతో కలిసి ప్రసన్నశ్రీ తాత ఆ కృషిలో భాగస్వామి అయ్యారు. ఆయన కుమారుడు ప్రసాదరావు చదువుకుని రైల్వే ఉద్యోగం చేపట్టారు. పలు ప్రాంతాల్లో పనిచేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి నుంచి వీసీ స్థాయికి.. గుంటూరు జిల్లాలోని సీతాగనరంలో ప్రసాదరావు స్థిరపడ్డారు. ఆయన కుమార్తె ప్రసన్నశ్రీ పలు ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేశారు. సర్దార్ పటేల్ మహావిద్యాలయంలో పీహెచ్డీ చేసిన ఆమె తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్ ప్రొఫెసర్గా రెండు దశాబ్దాలకుపైగా పనిచేశారు. ఇప్పుడు ఆదికవి నన్నయ వర్సిటీ(ఏకేఎన్యూ) వీసీ స్థాయికి ఎదిగారు. 19 భాషలపై పరిశోధనలు ఎస్టీ ఎరుకల సామాజికవర్గానికి చెందిన ప్రసన్నశ్రీ, లిపి లేని గిరిజన భాషలు అంతరించిపోతుండటంపై ఆవేదన చెందారు. గిరిజనుల వెనుకబాటుకు అక్షరాస్యతే లోపమని భావించారు. భిన్న సంస్కృతులు, జీవన విధానాలు కలిగిన గిరిజనుల జీవితాల్లో మార్పు రావాలంటే, అక్షరాలు ముఖ్యమని గ్రహించారు. ఆయా భాషలకో అక్షర లిపి కనుగొనాలని నిర్ణయించుకున్నారు. దేశవ్యాప్తంగా పర్యటించారు. గిరిజన తండాలకు వెళ్లారు. అక్కడ జరిగే సంతలు, పండగుల్లో గిరిజనుల జీవన స్థితిగతులు, భాషలపై పరిశోధనలు చేశారు. గోండు, కోయ, బగట వంటి 19 గిరిజన తెగలు మాట్లాడుకునే భాషలకు సొంతంగా లిపిని రూపొందించారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దులోని గిరిజనులకూ ఓ లిపిని సిద్ధంచేశారు. వరించిన పురస్కారాలు ప్రసన్నశ్రీ పరిశోధనలకు గుర్తింపు లభించింది. 2021లో అప్పటి భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి నారీశక్తి పురస్కారాన్ని ప్రసన్నశ్రీ అందుకున్నారు. 19 గిరిజన భాషలకు అక్షర మాలలు రాసిన ఘనతకు అమెరికాలో మరో ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని కూడా ఆమె స్వీకరించారు. 125 పరిశోధన వ్యాసాలు రాశారు. తన కృషికి ఇప్పటి వరకు 16 జాతీయ అవార్డులు, 15 అంతర్జాతీయ అవార్డులు అందుకున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఆమె నియమితులయ్యారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. -
స్ట్రాంగ్రూంల వద్ద కట్టుదిట్ట భద్రత
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ పెట్టెలను భద్రపరిచే స్ట్రాంగ్ రూంల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సతీష్కుమార్ చెప్పారు. ఈనెల 27న జరగనున్న ఉమ్మడి గుంటూరు–కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ పెట్టెలను భద్రపరిచేందుకు ఏసీ కళాశాలలో ఏర్పాటు చేసిన నాలుగు స్ట్రాంగ్ రూంలను గురువారం ఎస్పీ పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్ట్రాంగ్ రూంల వద్దకు వెళ్లే మార్గాల్లో నియమించాల్సిన పోలీస్ సిబ్బంది, బ్యాలెట్ పెట్టెల తరలింపుపై చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం రెవెన్యూ శాఖ నుంచి చేపట్టే ఏర్పాట్లపై ఆరాతీశారు. పోలీస్, రెవెన్యూ శాఖల సమన్వయంతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ చెప్పారు. స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచే బ్యాలెట్ పెట్టెల విషయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. ఏఎస్పీలు జీవీ రమణమూర్తి (పరిపాలన), హనుమంతు (ఏఆర్), ఏఆర్ డీఎస్పీ ఏడుకొండలరెడ్డి, తూర్పు, పశ్చిమ తహసీల్దార్లు గణేష్ (తూర్పు), వెంకటేశ్వర్లు (పశ్చిమ), కళాశాల ప్రిన్సిపల్ మోజెస్ పాల్గొన్నారు.ఎస్పీ సతీష్కుమార్ -
రోడ్డు ప్రమాదాలను నియంత్రించండి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేయాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్ జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రహదారులపై తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి 15 రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించారు. రోడ్ల మరమ్మతులు, ప్రమాదాల నియంత్రణకు చర్యలు తక్షణం ప్రారంభం కావాలని చెప్పారు. వాహనదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. గుంతల రహిత జిల్లా కోసం కృషి చేయాలని వివరించారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలన్నారు. ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే మార్చి 1 నుంచి రూ.1,000 జరిమానా విధిస్తామని చెప్పారు. సమావేశంలో ఆర్ అండ్ బీ ఎస్ఈ శ్రీనివాసమూర్తి, జిల్లా ఉప రవాణా కమిషనర్ సీతారామిరెడ్డి, జాతీయ రహదారుల పీడీ పార్వతీశం, పంచాయతీరాజ్ ఎస్ఈ బ్రహ్మయ్య, డీఎంహెచ్ఓ విజయ లక్ష్మి, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరిండెంట్ అరుణ కుమారి పాల్గొన్నారు. బ్లాక్ స్పాట్లను గుర్తించండి జిల్లా అధికారులకు కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశం -
ఎద్దుల బీడు ఫర్ సేల్
150 ఎకరాలకు పైగా భూమి అద్దంకి–నార్కెట్పల్లి జాతీయ రహదారిని అనుకుని పలు సర్వే నంబర్లలో 150 ఎకరాలకు పైగా (ప్రభుత్వ భూమి) ఎద్దుల బీడు విస్తరించి ఉంది. పొందుగల, రామాపురం, శ్రీనగర్, శ్రీనివాసపురం గ్రామాల్లో వేల సంఖ్యలో పశువులు ఉన్నాయి. చుట్టూ ఉన్న పంటల పొలాల్లోకి వెళ్లకుండా ఈ బీడుల్లో పశువులు మేత మేసేందుకు కేటాయించారు. అయితే, ఈ భూముల్లో విశ్రాంత ఆర్మీ ఉద్యోగులతో పాటుగా మరికొంతమందికి అధికారంగా కేటాయించారు. ఇది పోగా సుమారుగా మరో 80 ఎకరాలకు పైగా భూమి ఖాళీగా ఉంది. సాక్షి, నరసరావుపేట : పశువులకు పచ్చటి గడ్డి అందించడం కోసం వందల ఏళ్ల కిందట కేటాయించిన భూమిలో గద్దలు వాలడానికి సిద్ధమయ్యాయి. పల్నా డు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల సమీపంలోని ఎద్దుల బీడు భూములను ఓ గ్రామ తాజా మాజీ సర్పంచ్ బేరం పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అడ్వాన్స్ తీసుకున్నట్లుగా సమాచారం. ఆన్లైన్లో నమోదు మిగిలిన భూములను పలువురు అనధికారికంగా రెవెన్యూ అధికారులకు తాయిలాలు ముట్టజెప్పి ఆన్లైన్లో నమోదు చేయించుకుని, తాజాగా అమ్మకాలకు పెట్టారు. మాజీ సర్పంచ్ నాలుగు ఎకరాల భూములను విక్రయించేందుకు అడ్వాన్స్ తీసుకున్నట్లు పొందుగలతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రచారం జరుగుతోంది. ఎకరం రూ.12 లక్షల చొప్పున అమ్మేలా ఒప్పందాల జరిగినట్లు సమాచారం. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ పనులను చక్కదిద్దుకునే పనుల్లో ఆయన నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఒక కుటుంబంలోని వ్యక్తులకు ఒకే ఖాతా నంబర్లు వేసుకుని అమ్మకానికి పావులు కదుపుతున్నారు. పశువుల కోసం కేటాయించిన ఈ భూముల రక్షణకు రైతులు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భూములు విక్రయించేందుకు చర్యలు కాపాడాలంటున్న రైతులు, ప్రజలు తాజా మాజీ సర్పంచ్ బేరం పెట్టినట్లు సమాచారం -
వైఎస్సార్ సీపీ ‘అనుబంధ’ అధ్యక్షుల నియామకం
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాకు సంబంధించి పలువురిని పార్టీ అనుబంధ విభాగాల కమిటీ జిల్లా అధ్యక్షులుగా నియమిస్తూ గురువారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన శేషగిరి పవన్కుమార్, చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడిగా మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఉట్ల పాలశ్రీనివాసరావు, సాంస్కాృతిక విభాగం జిల్లా అధ్యక్షుడిగా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన చెరుకూరి సాంబశివరావు, ఇంటలెక్చువల్ ఫోరం జిల్లా అధ్యక్షుడిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఈమని రాఘవరెడ్డి, ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడిగా పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వీరిశెట్టి సుబ్బారావు, ఎస్టీ విభాగం జిల్లా అధ్యక్షుడిగా మంగళగిరికి చెందిన మేడా వెంకటేశ్వరరావు, వలంటీర్స్ విభాగం జిల్లా అధ్యక్షుడిగా ఉద్దగిరి మురళిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అమరేశ్వరుని సేవలో మంత్రి సుభాష్ అమరావతి: ప్రముఖ శైవ క్షేత్రం అమరావతిలోని శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వరుని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువారం దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు స్వాగతం పలికి దేవాలయంలోకి ఆహ్వానించారు. అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరి అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. ఆలయ అర్చకులు మంత్రికి ఆశీర్వచనం చేసి, స్వామివారి శేష వస్త్రంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో సునీల్కుమార్, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు. క్వారీ ప్రాంతాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్ వీరనాయకునిపాలెం(చేబ్రోలు): గ్రామంలో మైనింగ్ జరిగిన ప్రాంతాన్ని తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా గురువారం పరిశీలించారు. గ్రామానికి చెందిన కొందరు నిర్వహించిన అక్రమ క్వారీయింగ్పై గ్రీన్ ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేశారు. గ్రామ పరిధిలో జరిగిన మైనింగ్పై క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి పూర్తి స్థాయిలో నివేదిక అందజేయాలని రెవెన్యూ, మైనింగ్ శాఖాధికారులను కోర్టు ఆదేశించింది. గ్రామానికి చెందిన నిరుపేద దళితులకు 32 ఎకరాల భూమిని గతంలో ప్రభుత్వం అందజేసింది. దళితులకు అందజేసిన భూమిలో కొందరు నేతలు ఎటువంటి అనుమతులు లేకుండా క్వారీయింగ్ చేశారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎంతమేర మైనింగ్ జరిగిందనే దానిపై రెవెన్యూ, సర్వేయర్లతో నివేదికను తయారు చేస్తున్నారు. దీనిపై సిబ్బందికి సబ్ కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఫిర్యాదు చేసిన గ్రామానికి చెందిన పలువురు సబ్ కలెక్టర్కు తమ వద్ద ఉన్న సమాచారాన్ని అందజేశారు. తహసీల్దారు కె.శ్రీనివాసశర్మ, ఎస్ఐ డి.వెంకటకృష్ణ, మండల సర్వేయర్ సునీల్ పాల్గొన్నారు. 1,37,523 బస్తాల మిర్చి విక్రయం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు గురువారం 1,29,446 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,37,523 బస్తాల అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,000 నుంచి రూ.14,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,000 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 67,713 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. -
కుంభమేళాకు ప్రత్యేక బస్సు
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): భక్తుల కోరిక మేరకు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు కుంభామేళాకు ప్రత్యేక బస్సు సర్వీసు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఈ స్పెషల్ హైటెక్ బస్సు బయలుదేరనుంది. మొత్తం 8 రోజుల ప్రయాణంలో భాగంగా అయోధ్య, ప్రయాగ్రాజ్, వారణాసి ప్రాంతాలను సందర్శించేలా ఈ సర్వీసుకు రూపకల్పన చేశారు. ఉదయం 10గంటలకు బస్సు బయలుదేరనుంది. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోదలచిన వారు 91927 సర్వీస్ నంబర్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఒక్కో టికెట్ ధర రూ.8,300గా నిర్ణయించారు. భోజనాలు, వసతి ఖర్చుల బాధ్యత ప్రయాణికులదే. వివరాల కోసం 7382897459, 7382896403 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని అధికారులు తెలిపారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన
కలెక్టర్ నాగలక్ష్మి లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఉమ్మడి కృష్ణ–గుంటూరు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ గురువారం పరిశీలించారు. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనున్న దృష్ట్యా స్థానిక ఏసీ కళాశాలలో బ్యాలెట్ బాక్సులు భద్రపర్చే గదులు, రిసెప్షన్ సెంటర్లు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్, కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లను గురువారం సాయంత్రం కలెక్టర్తోపాటు జేసీ భార్గవతేజ పరిశీలించారు. అధికారులకు సూచనలు సలహాలు అందించారు. ఫిబ్రవరి 26న పోలింగ్ మెటీరియల్ పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఎన్నికల సిబ్బంది కోసం అన్ని వసతులూ కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, ల్యాండ్ అండ్ సర్వే శాఖ ఏడీ పవన్ కుమార్, గుంటూరు తూర్పు, పశ్చిమ మండల తహసీల్దార్లు నగేష్, వెంకటేశ్వర్లు, రెవెన్యూ, సర్వే అధికారులు పాల్గొన్నారు. గ్రూప్–2 మెయిన్స్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి గ్రూప్–2 మెయిన్స్ పరీక్షలు ఆదివారం సజావుగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జేసీ భార్గవ తేజతో కలిసి ఆమె పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. పలు సూచనలు చేశారు. జిల్లాలోని 11 కేంద్రాల్లో 9,277 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని వివరించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి, ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ వెంకటలక్ష్మి, లైజన్ అధికారులుగా నియమించిన జిల్లా అధికారులు, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. మాదకద్రవ్యాలను అరికట్టాలి జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఎస్పీ సతీష్ కుమార్తో కలసి ఆమె నార్కోటిక్ కో–ఆర్డినేషన్ కమిటీ (ఎన్సీఓఆర్డీ) జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ గంజాయి, ఎండీఎం, కోకైన్ వంటి మాదక ద్రవ్యాల కేసులు జిల్లాలో నమోదవుతున్నందున తక్షణం చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు అంతర్గతంగా ప్రత్యేకంగా కమిటీలను పదిహేను రోజుల్లో ఏర్పాటు చేసేలా విద్యా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మత్తు పదార్థాల దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. మత్తు పదార్థాల రవాణా సమాచారం చేరవేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 14405 టోల్ ఫ్రీ నంబరును విద్యా సంస్థల్లోనూ, జనసమ్మర్ధం అధికంగా ఉండే ప్రాంతాల్లోనూ ప్రదర్శించాలని చెప్పారు. నిరంతరం తనిఖీలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలపై గట్టి నిఘా పెట్టామని వివరించారు. విద్యార్థులూ మత్తుపదార్థాలు తీసుకుంటున్నారని, వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నట్టు వివరించారు. నేరస్తులపై కేసులు నమోదు చేస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఖాజా వలి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కన్జర్వేషన్ రిజర్వ్గా ఉప్పలపాడు పక్షుల కేంద్రం లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): పెదకాకాని మండలం ఉప్పలపాడు పక్షుల కేంద్రాన్ని వన్యప్రాణి చట్టం –1972 నిబంధనల ప్రకారం.. కన్జర్వేషన్ రిజర్వ్గా నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి చెప్పారు. గురువారం కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి వెట్ ల్యాండ్ మేనేజ్మెంట్ సమావేశంలో జేసీ భార్గవ తేజతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ హిమ శైలజ మాట్లాడుతూ ఉప్పలపాడు పక్షుల కేంద్రం 20ఏళ్లుగా అటవీశాఖ ఆధ్వర్యంలో నడుస్తోందని వివరించారు. దీనిని కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటించి ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. అరుదైన పక్షి జాతులను కాపాడుకోవాలని చెప్పారు. వెట్ ల్యాండ్ ఉపయోగాలను వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు అటవీశాఖ ద్వారా గుర్తించిన 300 వెట్ ల్యాండ్స్ను పంచాయతీ రాజ్, ఇరిగేషన్ , ఆర్ డబ్ల్యూఎస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు , రెవెన్యూ స్టేక్ హోల్డర్ శాఖల అధికారులు పరిశీలించి నివేదిక అందించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, పశు సంవర్ధక శాఖ జేడీ ఒ.నరసింహా రావు, ఇరిగేషన్ ఎస్ఈ వెంకట రత్నం, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కళ్యాణ చక్రవర్తి, డీఎల్పీఓ శ్రీనివాస్ రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ నజీనా బేగం, ఫారెస్ట్ రేంజ్ అధికారులు డి.పోతురాజు, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న నష్టాలు
కూటమి పాలనలో అన్నదాతలకు అష్టకష్టాలుసాక్షి ప్రతినిధి, బాపట్ల: చంద్రబాబు పాలన అన్నదాతలకు అష్టకష్టాలు మిగులుస్తోంది. బాబు అధికారంలోకి వచ్చినప్పుడు ఒక్కోసారి కరవు వచ్చి పంటలు పండవు, ఇంకోసారి వరదలతో పెను నష్టాలు తప్పవు.. అన్నీ దాటుకుని పంటలు పండినా గిట్టుబాటు ధరలుండవు. రైతులకు చేయూత మచ్చుకై నా కనిపించదు. ఇప్పుడూ కూటమి అధికారంలోకి వచ్చాక ఇదే కొనసాగుతోంది. తొలి ఏడాది ఖరీఫ్ నుంచే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. అంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రాజెక్టులు నీటితో నిండుకుండల్లా కళకళలాడాయి. పంటలు పుష్కలంగా పండాయి. అప్పటి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు అన్నివిధాలా ఆదుకుంది. కానీ బాబు పాలనలో జిల్లాలో అధికంగా సాగు చేసిన వరితోపాటు పొగాకు, మిర్చి, కంది తదితర పంటలకు మద్దతు ధర లేదు. కనీసం పెట్టుబడులు కూడా రాక అన్నదాతలు లబోదిబో అంటున్నారు. నిండా మునిగిన వరి రైతులు జిల్లాలోని రేపల్లె, వేమూరు, బాపట్ల, చీరాల, పర్చూరు ప్రాంతాల్లో ఈ ఏడాది రైతులు 2,16,434 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఎకరాకు 35 బస్తాలకు తగ్గకుండా దిగుబడి వచ్చింది. 5,62,729 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. ప్రభుత్వం మాత్రం పట్టుమని 60 వేల మెట్రిక్ టన్నులూ మద్దతు ధరకు కొనలేదు. మిల్లర్లకు అమ్ముదామంటే బస్తా రూ.1,300కు మించి కొనలేదు. 5 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని తక్కువ ధరకు విక్రయించడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వం కొన్న ధాన్యానికి మద్దతు ధర లభించగా.. బయట మార్కెట్లో బస్తా రూ. 2 వేలకుపైగా పలికింది. అన్నదాతలకు గిట్టుబాటు లభించింది. మిర్చి రైతు కంట్లో కారం జిల్లాలోని నగరం, సంతమాగులూరు, బల్లికురవ, మార్టూరు, యద్దనపూడి, పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, జె.పంగులూరు, అద్దంకి, కొరిశపాడు మండలాల పరిధిలో 9,330 ఎకరాల్లో మిర్చి సాగైంది. గత సంవత్సరం ఎకరానికి 20 క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చింది. క్వింటా రూ.22 వేలు పలికింది. ఈ ఏడాది ఎకరానికి 5 – 10 క్వింటాళ్ల లోపే దిగుబడి రాగా... ధర రూ. 8 వేల – రూ.10 వేలకు మించలేదు. కూలీల ఖర్చులు కూడా రావని రైతులు లబోదిబో అంటున్నారు. ప్రభుత్వం కూడా మద్దతు ధర, ఇతరత్రా సాయం చేయకుండా మిర్చి రైతు కంట్లో కారం కొడుతోంది. తేరుకోని పొగాకు రైతులు ఈ ఏడాది శనగకు బదులు పొగాకు సాగుకు మొగ్గు చూపారు. సంతమాగులూరు, బల్లికురవ, మార్టూరు, యద్దనపూడి, పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, జె.పంగులూరు, అద్దంకి, కొరిశపాడు మండలాల పరిధిలో 64,165 ఎకరాల్లో సాగు చేశారు. బర్లీ వైట్ రకాన్ని అధికంగా.. కొంతమంది బ్యార్నీ రకం వేశారు. ఈ ఏడాది ధరలు పూర్తిగా పడిపోయినట్లు రైతులు పేర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో బ్యార్నీ రకం క్వింటా రూ. 30 వేలు పలకగా.. ప్రస్తుతం సగంలోపే ఉంది. బర్లీ రకం రూ.10 వేలు– రూ. 13 వేలు ఉండగా.. ఇప్పుడు దారుణంగా రూ. 3,500 – 4 వేలలోపే పలుకుతోంది. కూలీల ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. జూట్ రైతులకూ తీవ్రం నష్టం జిల్లాలోని అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో దాదాపు వెయ్యి ఎకరాల్లో జూట్ సాగు చేస్తున్నారు. గత ఏడాది క్వింటా విత్తనాలు రూ. 15 వేల వరకు పలకగా.. ప్రస్తుతం రూ. 5 వేలకు మించడం లేదు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సగానికి సగం తగ్గిన కంది ధర జిల్లాలోని సంతమాగులూరు, బల్లికురవ, పర్చూరు, అద్దంకి, కొరిశపాడు మండలాల పరిధిలో సుమారు 300 ఎకరాల్లో కంది వేశారు. గత ఏడాది క్వింటా రూ. 10 వేలుండగా... ఇప్పుడు రూ. 6 వేలకు మించి లేదు. ఎకరంలో 3 నుంచి 5 క్వింటాళ్లలోపే దిగుబడి వస్తోందని, ఈ లెక్కన ఖర్చులు రావని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల జిల్లాలో 2.16 లక్షల ఎకరాల్లో వరి సాగు బస్తా ధాన్యం రూ.1,300 కూడా పలకని ధర 10 వేల ఎకరాల్లో మిర్చి పంట క్వింటా రూ.8 వేలకు మించి పలకని వైనం 64,165 ఎకరాల్లో పొగాకు సాగు సగానికిపైగా పడిపోయిన ధరలతో రైతులకు కన్నీరు 500 ఎకరాల్లో కంది పంట క్వింటా రూ.6,400కి మించి ఇవ్వని వ్యాపారులు మిర్చి సాగుతో కష్టాలు మాది చిమటవారి పాలెం. రెండు ఎకరాల్లో మిర్చి సాగు చేశా. వైరస్తోపాటు నల్లి, తామర పురుగు తెగుళ్లతో దిగుబడి సగం తగ్గింది. ఎకరానికి 5 క్వింటాళ్లు మించేలా లేదు. ధర రూ. 8 వేలకు మించి లేదు. గత ఏడాదితో పోలిస్తే కూలి ఖర్చులు రెండింతలు పెరిగాయి. అవీ ఇప్పుడు వచ్చేలా లేవు. తీవ్రంగా నష్టపోతున్నాం. – గనిపిశెట్టి వెంకటరావు, రైతు పొగాకు సాగుతో నష్టపోయా గత ఏడాది 4 ఎకరాల్లో పొగాకు సాగు చేశా. క్వింటా రూ. 15 వేలకుపైగా పలికింది. మంచి రాబడి వచ్చింది. ఈ సంవత్సరం 7 ఎకరాల్లో వేశా. ఎకరాకు రూ. 1.50 లక్షలు చొప్పున పెట్టుబడి పెట్టా. ఈ ఏడాది క్వింటా ధర రూ. 4 వేలకు మించలేదు. పైగా కూలి ఖర్చులు రెండింతలు పెరిగాయి. ఇవి కూడా వచ్చే పరిస్థితి లేదు. –గొట్టిపాటి వెంకట్రావు, రైతు దళారుల దెబ్బకు జూట్ ధరలు పతనం దళారుల జోక్యంతో జూట్ ధరలు బాగా పతనమయ్యాయి. వారు అడిగిందే ధరగా మారింది. నాలుగు ఎకరాల్లో జూట్ వేశా. కోసే ముందు రూ.7 వేల వరకు ధర పలికింది. కొట్టే సమయానికి రూ.6 వేలకు, తర్వాత రూ.ఐదున్నర వేలకు పడింది. గతంలో రూ.15 వేల వరకు ధర లభించింది. – ఎ. రాంబాబు, రైతు కందికి మద్దతు ధర కరవు మాది కొరిశపాడు. గతంలో కంది సాగు చేశా. అప్పట్లో రూ.15 వేల వరకు క్వింటా ఉండేది. నిన్న మొన్నటి వరకూ అదే ధర కొనసాగింది. పంట వచ్చే సమయానికి ఇప్పుడు రూ.ఆరున్నర వేలకు పడిపోయింది. – బ్రహ్మారెడ్డి, రైతు -
మెదడు క్యాన్సర్ నివారణకు కేఎల్యూ విద్యార్థిని సరికొత్త విధానం
తాడేపల్లిరూరల్: గ్లియో బ్లాస్టోమా మల్టీ ఫార్మ్(జీబీఎం)ను అదుపులో ఉంచడం ద్వారా మెడడు క్యాన్సర్ను నివారించే సరికొత్త విధానాన్ని కేఎల్యూ విద్యార్థిని కనిపెట్టినట్లు వర్సిటీ బయో టెక్నాలజీ ఆచార్యులు డాక్టర్ ఎం.జానకి రామయ్య బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని ఔషధాల కొత్త కలయిక ద్వారా ఈ విధానాన్ని విద్యార్ధి సాహితి ఆర్ చామ కొనుగొందని వివరించారు. ఈ విధానంలో ప్రారంభ ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో వర్శిటీ ఇన్చార్జి వైస్ చాన్సలర్ డాక్టర్ కె.రాజశేఖరరావు,ప్రో వీసీ డాక్టర్ ఎవిఎస్ ప్రసాద్, రిజిస్ట్రార్ డాక్టర్ కె. సుబ్బారావు, విద్యార్ధి సంక్షేమ విభాగం ఇన్చార్జి డీన్ డాక్టర్ కెఆర్ఎస్ ప్రసాద్, బయోటెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ వి.ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థిని అభినందించారు. -
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
తెనాలిరూరల్: తెనాలి చెంచుపేటలో ఈనెల 16 సాయంత్రం తీవ్ర సంచలనం రేకెత్తించిన పండ్ల వ్యాపారి షేక్ రబ్బాని హత్య కేసు నిందితుడిని త్రీ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సీఐ ఎస్ రమేష్బాబు కేసు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. చినరావూరుకు చెందిన షేక్ రబ్బాని చెంచుపేటలోని భాను టీ స్టాల్ సమీపంలో పండ్ల బండి పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. రబ్బాని మేనకోడలును పినపాడుకు చెందిన గౌస్బాషాకు ఇచ్చి గతంలో పెళ్లి చేశారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధల వల్ల ఆమె పుట్టింట్లో ఉంటోంది. గౌస్బాషా ఆదివారం భార్య ఇంటికి వెళ్లి ఆమెను కాపురానికి పంపించాలని కోరాడు. ఈ సమయంలో రబ్బానికి, గౌస్బాషాకి మధ్య వాగ్వాదం జరిగింది. తన భార్యను కాపురానికి పంపించే విషయంలో రబ్బాని అడ్డుపడుతున్నాడన్న కోపంతో ఆదివారం సాయంత్రం చెంచుపేటలో ఉన్న రబ్బానిపై గౌస్బాషా కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రబ్బానీని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందాడు. నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ రమేష్బాబు తెలిపారు. మీడియా సమావేశంలో ఎస్ఐ ప్రకాశరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రకృతి సేద్య ఉద్యోగుల సంఘ కార్యవర్గం
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రథమ మహాసభ బుధవారం స్దానిక కొత్తపేట సీపీఐ జిల్లా కార్యాలయంలో జరిగింది. ముందుగా ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వేలుగూరి రాధాకృష్ణమూర్తి ఏఐటీయూసీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కొత్త కమిటీ ఎన్నిక జరిగింది. రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా వెలుగురి రాధాకృష్ణమూర్తి, నూతన అధ్యక్షులుగా శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా ఎం.రమేష్ బాబు, ట్రెజరర్గా నాగేశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా వరప్రసాద్ (గుంటూరు) సునీల్ కుమార్ (కడప) రాహేల్ రావు (బాపట్ల) విజయలక్ష్మి (ఎన్టీఆర్) సుధారాణి (బాపట్ల), సహాయ కార్యదర్శులుగా శ్రీనివాసరావు (విజయనగరం) వీరరాఘవయ్య (తిరుపతి) శ్రీహరి (ప్రకాశం) రమాదేవి (నంద్యాల)తో పాటు 21 మంది కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎస్. వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. -
యార్డుకు 1,47,414 బస్తాల మిర్చి
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 1,47,414 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,42,943 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,000 నుంచి రూ.14,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.13,900 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,000 నుంచి రూ.7,000 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 75,790 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. యార్డుకు 119 పసుపు బస్తాలు దుగ్గిరాల: దుగ్గిరాల పసుపు యార్డులో బుధ వారం 119 బస్తాలు వచ్చాయి. పసుపు మొత్తం అమ్మకం చేసినట్లు వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యదర్శి శ్రీనివాసరరావు ఒక ప్రకటనలో తెలిపారు. సరకు 76 బస్తాలు కనిష్ఠ ధర రూ 9200 గరిష్టి ధర రూ 11000 మోడల్ ధర రూ 11000 కాయలు 43 బస్తాలు కనిష్ఠి ధర రూ 9200, గరిష్ఠ ధర రూ 11000, మోడల్ ధర రూ 11000, మొత్తం 89.250 క్వింటాళ్లు అమ్మకాలు జరిగినట్లు ఆయన తెలిపారు. -
కిడ్నాప్, హత్యాయత్నం కేసులో నలుగురు అరెస్ట్
పరారీలో మరో నిందితుడు తెనాలి రూరల్: కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన ఇద్దరు యువకులను కారులో కిడ్నాప్ చేసి తెనాలి తీసుకువచ్చి దాడి చేసి హత్యాయత్నం చేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఒకరు పరారీలో ఉన్నట్లు తెనాలి త్రీ టౌన్ సీఐ ఎస్. రమేష్బాబు తెలిపారు. స్థానిక త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. తెనాలి నందులపేటకి చెందిన మన్నే మణిదీప్కు కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన జానా సతీష్, మరికొందరితో ఆర్థిక లావాదేవీల వివాదం ఉంది. ఈ క్రమంలో సతీష్ తన స్నేహితుడు పండుతో కలిసి తనకు రావాల్సిన మొత్తాన్ని ఇవ్వాలని మణిదీప్ను అడుగుతున్నాడు. డబ్బులు ఇస్తాను రమ్మంటూ సతీష్ అతని స్నేహితుడు పండు ఈనెల 14న విజయవాడ వచ్చారు. మణిదీప్, అతని స్నేహితులు ఉప్పు రంగారావు, పెనమలూరి ఆదం, కోటా ప్రేమ్చంద్, బచ్చలకూర రమేష్బాబుతో కలిసి విజయవాడ వెళ్లి సతీష్, పండును కిడ్నాప్ చేశారు. కారులో తెనాలి తీసుకువచ్చి సుల్తానాబాద్ సమీపంలో ఒక గదిలో బంధించి తీవ్రంగా కొట్టడంతో పాటు వారికి కరెంట్ షాక్ కూడా ఇచ్చారు. వారి బారి నుంచి తప్పించుకున్న సతీష్, పండు త్రీ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసులో నలుగురుని అరెస్టు చేసినట్లు త్రీ టౌన్ సీఐ రమేష్ బాబు తెలిపారు. బచ్చలకూర రమేష్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్ఐ ప్రకాశరావు సిబ్బంది పాల్గొన్నారు. -
చికెన్పై అపోహలు తొలగాలి
కలెక్టర్ నాగలక్ష్మి లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): చికెన్ వినియోగంపై ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలగించేందుకు పశుసంవర్ధక శాఖ, పౌల్ట్రీ ఫార్మర్స్ సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో బర్డ్ఫ్లూ వైరస్.. చికెన్ వినియోగం అంశంపై పశు సంవర్ధక శాఖ అధికారులు, ఏపీ పౌల్ట్రీ ఫార్మర్స్ ఫెడరేషన్ సభ్యులతో ఆమె సమావేశమయ్యారు. జిల్లాలో బర్డ్ఫ్లూ ఆనవాళ్లు లేవని పశు సంవర్ధక శాఖ అధికారులు, పౌల్ట్రీ ఫార్మర్స్ కలెక్టర్కు వివరించారు. సోషల్ మీడియాలో చికెన్, కోడిగుడ్ల వినియోగంపై అసత్యప్రచారం జరుగుతోందని చెప్పారు.ఉడికించిన చికెన్, కోడిగుడ్లను తినడం వల్ల ఎలాంటి వైరస్లూ సోకవని వైద్యులు నిర్ధారించారని పేర్కొన్నారు. ప్రజల్లో అపోహల తొలగింపునకు పశుసంవర్ధక శాఖ, వైద్యారోగ్యశాఖతో కలిసి ఏపీ పౌల్ట్రీ ఫార్మర్స్ ఫెడరేషన్ ఫిబ్రవరి 21న చికెన్, ఎగ్ మేళాను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రజల్లో అపోహల తొలగింపునకు విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. చికెన్ , ఎగ్ మేళాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో పశుసంవర్దక శాఖ జిల్లా అధికారి డాక్టర్ ఒ. నరసింహరావు, ఏపీ పౌల్ట్రీ ఫార్మర్స్ ఫెడరేషన్ చైర్మన్ వై సురేష్, సభ్యులు నాగేశ్వరరావు, కె గిరిధర్, కిషోర్, వెంకయ్య, రాంబాబు, కిరణ్, జాకీర్ పాల్గొన్నారు. -
విజ్ఞాన్, బౌలింగ్ గ్రీన్ వర్సిటీల మధ్య ఒప్పందం
చేబ్రోలు: వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ – యూఎస్ఏ– ఓహియోలోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీల (బీజీఎస్యూ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని వైస్ చాన్స్లర్ పి.నాగభూషణ్ బుధవారం తెలిపారు. యూనివర్సిటీలోని ఆఫీస్ ఆఫ్ డీన్ ప్రమోషన్స్, కొలాబరేషన్స్ అండ్ ఫ్యాకల్టీ అఫైర్స్ ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూఎస్ఏ– ఓహియోలోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ అకడమిక్ అఫైర్స్ ఇంటిరిమ్ వైస్ ప్రోవోస్ట్ ప్రొఫెసర్ రామ్ వీరపనేని, ఆర్కిటెక్చర్ అండ్ అప్లైడ్ ఇంజినీరింగ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ డీన్ ప్రొఫెసర్ వేల్ మోక్తర్తో పత్రాలను మార్చుకున్నట్టు వివరించారు. ఒప్పందం వల్ల తమ వర్సిటీ విద్యార్థులకు బీజీఎస్యూతో కలిపి జాయింట్ డిగ్రీలను అందజేయవచ్చునని పేర్కొన్నారు. సంయుక్తంగా పరిశోధనలు, ప్రాజెక్టుల రూపకల్పనకు అవకాశం ఉంటుందని వివరించారు. యూఎస్ఏ– ఓహియోలోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ అకడమిక్ అఫైర్స్ ఇంటిరిమ్ వైస్ ప్రోవోస్ట్ ప్రొఫెసర్ రామ్ వీరపనేని మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులను సరికొత్త టెక్నాలజీల వైపు ప్రోత్సహించడంతోపాటు వారికి ఆయా రంగాలలో తర్ఫీదనివ్వడమే ఈ ఒప్పందం లక్ష్యమన్నారు. కార్యక్రమంలో బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ అండ్ అప్లైడ్ ఇంజినీరింగ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ డీన్ ప్రొఫెసర్ వేల్ మోక్తర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్ టెక్నాలజీ ప్రొఫెసర్ కొల్ల, కెన్ (జాన్), సీఈవో మేఘన కూరపాటి, రిజిస్ట్రార్ ఎంఎస్ రఘునాథన్ తదితరులు పాల్గొన్నారు. -
వీడియో కాల్లోనే ఆఖరి చూపు
పిట్టలవానిపాలెం (కర్లపాలెం): గన్ బుల్లెట్ బ్యాక్ ఫైర్ కావడంతో బాపట్ల జిల్లా పిట్లవానిపాలెం పంచాయతీ గౌడపాలెం గ్రామానికి చెందిన జవాన్ పరిశా మోహన్ వెంకటేష్ (27) మృతి చెందారు. ఈ మేరకు సైనిక అధికారుల నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... పరిశా శ్రీనివాసరావు, శివపార్వతి దంపతులకు కుమారులు మోహన్ వెంకటేష్, గోపీకృష్ణ ఉన్నారు. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ వారిని చదివించారు. ఇంటర్ వరకు చదివి 2019 డిసెంబర్లో ఆర్మీలో చేరారు. ప్రస్తుతం మోహన్ వెంకటేష్ 16వ లైట్ క్యావలరీ ఆర్మ్డ్ రేంజ్మెంట్లో రాజస్థాన్లో జవాన్గా విధులు నిర్వహిస్తున్నారు. రెండున్నర సంవత్సరాల క్రితం ఆయనకు గాయత్రితో వివాహం జరిగింది. వారికి కుమార్తె జ్యోత్స్న ఉంది. మంగళవారం ఉదయం 11 గంటలకు తల్లిదండ్రులతో మోహన్ వెంకటేష్ ఫోన్లో మాట్లాడారు. మధ్యాహ్నం 2 గంటలకు భార్యకు వీడియోకాల్ చేసి ముచ్చటించాక, పాపను కూడా చూశారు. మళ్లీ రాత్రికి ఫోన్ చేస్తానని చెప్పారు. ఇంతలోనే ప్రాణాలు కోల్పోయారు. జవాన్ భౌతికకాయం సూరజ్గడ్లోని మిలిటరీ హాస్పటల్ నుంచి విమానంలో గురువారం ఉదయం 5 గంటలకు ఢిల్లీ చేరనుంది. అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయానికి వస్తుందని, తరువాత రోడ్డు మార్గాన పిట్టలవానిపాలెంలోని ఆయన స్వగృహానికి తీసుకొస్తామని సైనికాధికారులు తెలిపారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని వివరించారు. ప్రస్తుతం మోహన్ వెంకటేష్ సోదరుడు గోపీకృష్ణ సెలవుపై వచ్చి స్వగ్రామంలో ఉన్నారు. అన్న మరణ వార్తతో తల్లడిల్లిపోతున్నారు. మాకిక దిక్కెవరంటూ మోహన్ వెంకటేష్ భార్య గాయత్రి విలపిస్తున్న తీరు చూపరులను సైతం కంటతడి పెట్టిస్తోంది. రాజస్థాన్లో బాపట్ల జిల్లాకు చెందిన సైనికుడు మృతి నేడు స్వస్థలానికి భౌతికకాయం బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు -
జిందాల్ ప్లాంట్ను సందర్శించిన ఐజీ రవికృష్ణ
యడ్లపాడు: కృష్ణా జిల్లాలో ఇటీవల పట్టుబడ్డ నాలుగు టన్నుల అక్రమ గంజాయిని ధ్వంసం చేయడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఐజీ ఆకే రవికృష్ణ ఆధ్వర్యంలో పోలీస్ ఉన్నతాధికారుల బృందం యడ్లపాడు మండలం కొత్తపాలెం పంచాయతీ పరిధిలోని జిందాల్ అర్బన్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను సందర్శించారు. ప్లాంట్ ఆపరేషన్ ఏపీ అధ్యక్షుడు ఎం.వి. చారితో సమావేశమయ్యారు. ప్లాంట్లో ఈనెల 22న గంజాయి దహనం కోసం అనుమతి తీసుకున్నారు. కార్యక్రమానికి డీజీపీ హరీష్కుమార్ గుప్తా సహా పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. అనంతరం అధికారుల బృందం ప్లాంట్లోని వివిధ విభాగాలను పరిశీలించింది. వ్యర్థాల సేకరణ, వాటిని దహనం చేసి విద్యుత్ ఉత్పత్తి చేసే విధానం గురించి తెలుసుకుంది. కార్యక్రమంలో కృష్ణాజిల్లా ఎస్పీ గంగాధర్, ఈగల్ విభాగం ఎస్పీ కె. నగేష్బాబు, గన్నవరం డీఎస్పీ సీహెచ్. శ్రీనివాసరావు, చిలకలూరిపేట గ్రామీణ సీఐ బి. సుబ్బరాయుడు, ఎస్ఐ వి.బాలకృష్ణ పాల్గొన్నారు. పట్టుబడిన నాలుగు టన్నులు గంజాయి దహనానికి ఏర్పాట్లు ప్లాంట్ అపరేషన్ అధ్యక్షుడు ఎం.వి. చారితో సమీక్ష ఉన్నతాధికారులతో కలిసి ప్లాంట్ విభాగాల పరిశీలన -
తక్కువ ధరకే టెండర్ ఖరారు చేసినా ఆరోపణలు
గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీ నుంచి మంజూరు చేస్తున్న ప్రతి పనిలో కమీషన్లు దండుకుంటూ తిరిగి అధికారులపై ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తూ పాలకులు రచ్చకెక్కడటం పరిపాటిగా మారింది. జెడ్పీ సీఈవో విధుల్లో నిత్యం జోక్యం చేసుకుంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటనలకు వెళ్లినా, అక్కడ అవినీతి జరుగుతోందని తప్పుడు ప్రచారాలు సాగిస్తున్నారు. జెడ్పీలో సీఈవోగా కొనసాగుతున్న ఉన్నతాధికారిపై పాలకవర్గంలో ఉన్న కీలక వ్యక్తులు సాగిస్తున్న తప్పుడు ప్రచారాన్ని జెడ్పీటీసీలు ఖండిస్తున్నారు. అవినీతి, అక్రమ సంపాదనతో జెడ్పీని భ్రష్టు పట్టిస్తున్న ఆమె సీఈవోలపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ జెడ్పీ పరువు తీస్తున్నారని మండిపడుతున్నారు. వచ్చిన మూడు నెలలకే ఫిర్యాదుల పరంపర ప్రస్తుతం సీఈవోగా పనిచేస్తున్న వి.జ్యోతిబసు గుంటూరు జిల్లాకు వచ్చి మూడు నెలలైంది. కృష్ణాజిల్లా సీఈవోగా పనిచేస్తూ సాధారణ బదిలీల్లో ఇక్కడికి వచ్చిన ఆయనపై అప్పుడే జెడ్పీ పాలకుల నుంచి పంచాయతీరాజ్ శాఖకు ఫిర్యాదులు వెళ్లాయి. గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న టెన్త్ విద్యార్థులకు వరుసగా రెండేళ్ల పాటు ‘‘జగనన్న విద్యాజ్యోతి’’ పేరుతో స్టడీ మెటీరియల్ ముద్రించి పంపిణీ చేశారు. జెడ్పీ పాలకులు పార్టీ మారిన తరువాత మూడోసారి మెటీరియల్ పంపిణీకి జెడ్పీ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ నుంచి మెటీరియల్ తెప్పించుకుని, టెండర్లు పిలిచి ప్రింటింగ్ చేయించే బాధ్యత సీఈవోకు అప్పగించారు. అయితే, ముద్రణలో ఉండగానే మరో వైపు స్టడీ మెటీరియల్ పంపిణీలో జాప్యం అంటూ ఆరోపణలు చేయించారు. అధికారులను లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు. స్టడీ మెటీరియల్పై సీఎం, విద్యాశాఖ మంత్రి ఫోటోలు ముద్రించలేదని, సీఈవోను లక్ష్యంగా చేసుకున్నారని జెడ్పీటీసీలు ఆరోపిస్తున్నారు. సీఈవో పోస్టు అంటే హడలెత్తిపోతున్న అధికారులు జెడ్పీని నడిపిస్తున్న అమ్మ అవినీతికి బలి తమ అవినీతిని దాచి అధికారుల చేతికి మసిపూస్తున్న వైనం నాలుగేళ్లలో మారిన నలుగురు సీఈవోలు ప్రస్తుత సీఈవో వచ్చిన మూడు నెలలకే ఫిర్యాదుల పరంపరఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న 34,747 మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ముద్రణకు సంబంధించి గతంలో కంటే తక్కువ ధరకే టెండర్ కట్టబెట్టినా సీఈవోపై అర్థం లేని అవినీతి ఆరోపణలు చేయించారు. ఒక పేజీ ముద్రణకు గతంలో 33 పైసలు చెల్లించగా, ప్రస్తుతం అది 30 పైసలకే ఖరారు చేశారు. ఈ విధంగా 564 పేజీలతో ముద్రణ పూర్తయిన పుస్తకాలకు గాను జెడ్పీకి రూ. లక్షల్లో ఆదా అయింది. టెండర్ కేటాయింపుల్లో అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున అధికారులపై ఆరోపణలు సాగిస్తుండగా, అసలు ఇప్పటి వరకు ముద్రణదారులకు చెల్లింపులు జరపలేదని అధికారులు చెబుతున్నారు. స్టడీ మెటీరియల్కు పైసా చెల్లించకుండా అవినీతికి ఆస్కారం ఎక్కడ ? అని పలువురు జెడ్పీటీసీలు ప్రశ్నిస్తున్నారు. జెడ్పీకి సీఈవోలుగా వచ్చిన వారిపై అవినీతి ఆరోపణలు చేస్తూ, వారితో బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తున్నప్పటికీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉన్నతాధికారులు దృష్టి సారించిన పరిస్థితులు లేవు. పరిస్థితులు ఇలాగే ఉంటే జెడ్పీ సీఈవోగా వచ్చేందుకు సైతం అధికారులు ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. -
డాక్టర్ శరత్ చంద్రకుమార్ ఔదార్యం
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాల 1998 బ్యాచ్ పూర్వ వైద్య విద్యార్థి, గుంటూరు చంద్ర కేర్ న్యూరో స్పెషాలిటీ అధినేత, ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ నలమోతు శరత్చంద్రకుమార్ తన తల్లి నలమోతు శైలజకుమారి జ్ఞాపకార్థంగా గుంటూరు వైద్య కళాశాలలో తారు రోడ్ల నిర్మాణానికి నిర్మించేందుకు రూ. 6 లక్షలు విరాళం అందజేశారు. ఈ విరాళంతో నిర్మించిన రోడ్లను బుధవారం గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సుందరాచారి శరత్చంద్రకుమార్ను అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ శ్రీధర్, పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నేడు, రేపు న్యాయవాదుల విధుల బహిష్కరణ గుంటూరు లీగల్ : న్యాయవాదుల అమెండ్మెంట్ బిల్లు 2025కు వ్యతిరేకంగా గుంటూరు బార్ ఫెడరేషన్ నిరసన తెలుపుతుందని ఫెడరేషన్ చైర్మన్ కాసు వెంకటరెడ్డి బుధవారం తెలిపారు. నిరసనలో భాగంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు గురు, శుక్రవారాల్లో విధులను బహిష్కరిస్తున్నట్టు వివరించారు. బ్లడ్ బ్యాంకు నుంచి డాక్టర్ సురేష్కుమార్ తొలగింపు గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ బ్లడ్బ్యాంక్ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న డాక్టర్ సురేష్కుమార్ను అక్కడి విధుల నుంచి తొలగించి ఇతర వార్డుకు మార్చినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ తెలిపారు. ఈమేరకు బుధవారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ‘సాక్షి’ పత్రికలో ‘జీజీహెచ్లో జలగలు’ శీర్షకన ఈనెల 18న బ్లడ్బ్యాంక్లో జరుగుతున్న అవినీతిపై కథనం ప్రచురితమవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తక్షణమే అతనిని బ్లడ్బ్యాంక్ నుంచి తొలగించి సూపరింటెండెంట్ కార్యాలయానికి రిఫర్ చేయాల్సిందిగా యశస్వి రమణ ఆదేశించారు. బ్లడ్బ్యాంక్ ఇన్చార్జిగా డాక్టర్ ప్రియదర్శిని, డాక్టర్ జి.శివరామకృష్ణలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ఎండీసీ ఎండీ శుక్లా సంతకంతో నకిలీ లెటర్ ఫిర్యాదు చేసిన కార్యాలయ సిబ్బంది తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ శుక్లా పేరుతో నకిలీ డిజిటల్ సంతకంతో అపాయింట్మెంట్ లెటర్ బయటపడినట్లు కార్యాలయం చీఫ్ జనరల్ మేనేజర్ జయరాం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై తాడేపల్లి సీఐ కల్యాణ్ రాజ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గత కొంత కాలంగా ఏపీ ఎండీసీ కార్యాలయానికి సంబంధించి డిజిటల్ సంతకంతో ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నట్లు ఫిర్యాదు చేశారని వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అదుపుతప్పి బస్సు బోల్తా ప్రయాణికులు సురక్షితం ఫిరంగిపురం: అదుపుతప్పి ఆర్టీసీ బస్సు బోల్తాపడిన ఘటన మండల కేంద్రంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం మణుగూరు డిపో బస్సు శ్రీశైలం నుంచి గుంటూరు వెళ్తోంది. మార్గమధ్యలో ఫిరంగిపురంలోని కొత్త పెట్రోలు బంకు సమీపంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డు మార్జిన్లో పడిపోయింది. బస్సులో 16 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో ప్రయాణికులను మరో బస్సులో పంపించివేశారు. వీరమ్మతల్లీ.. పాహిమాం.. ఉయ్యూరు: వీరమ్మతల్లి తిరునాళ్ల మహోత్సవం భక్తజన కోలాహలంగా మారింది. శిడి బండి మహోత్సవం పూర్తవటంతో అమ్మవారిని దర్శించుకుని శిడి మొక్కులు తీర్చుకునేందుకు బుధవారం వేకువజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. -
గుంటూరు
గురువారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టం బుధవారం 535.90 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 9,217 క్యూసెక్కులు విడుదలవుతోంది. ఆలయ నిర్మాణానికి విరాళం నరసరావుపేట రూరల్: ఇస్సప్పాలెం మహంకాళి గుడి నిర్మాణానికి పట్టణానికి చెందిన మక్కెన సుబ్బారావు దంపతులు రూ.1,01,116 చెక్ను బుధవారం అందించారు. వైభవంగా కోటి కుంకుమార్చన పిడుగురాళ్ల: పట్టణంలోని భవానీ నగర్లో గల శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో బుధవారం కోటి కుంకుమార్చన వైభవంగా నిర్వహించారు. పలువురు మహిళలు పాల్గొన్నారు. 7 -
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
తెనాలిరూరల్: తెనాలి చెంచుపేటలో ఈనెల 16 సాయంత్రం తీవ్ర సంచలనం రేకెత్తించిన పండ్ల వ్యాపారి షేక్ రబ్బాని హత్య కేసు నిందితుడిని త్రీ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సీఐ ఎస్ రమేష్బాబు కేసు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. చినరావూరుకు చెందిన షేక్ రబ్బాని చెంచుపేటలోని భాను టీ స్టాల్ సమీపంలో పండ్ల బండి పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. రబ్బాని మేనకోడలును పినపాడుకు చెందిన గౌస్బాషాకు ఇచ్చి గతంలో పెళ్లి చేశారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధల వల్ల ఆమె పుట్టింట్లో ఉంటోంది. గౌస్బాషా ఆదివారం భార్య ఇంటికి వెళ్లి ఆమెను కాపురానికి పంపించాలని కోరాడు. ఈ సమయంలో రబ్బానికి, గౌస్బాషాకి మధ్య వాగ్వాదం జరిగింది. తన భార్యను కాపురానికి పంపించే విషయంలో రబ్బాని అడ్డుపడుతున్నాడన్న కోపంతో ఆదివారం సాయంత్రం చెంచుపేటలో ఉన్న రబ్బానిపై గౌస్బాషా కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రబ్బానీని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందాడు. నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ రమేష్బాబు తెలిపారు. మీడియా సమావేశంలో ఎస్ఐ ప్రకాశరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
మెదడు క్యాన్సర్ నివారణకు కేఎల్యూ విద్యార్థిని సరికొత్త విధానం
తాడేపల్లిరూరల్: గ్లియో బ్లాస్టోమా మల్టీ ఫార్మ్(జీబీఎం)ను అదుపులో ఉంచడం ద్వారా మెడడు క్యాన్సర్ను నివారించే సరికొత్త విధానాన్ని కేఎల్యూ విద్యార్థిని కనిపెట్టినట్లు వర్సిటీ బయో టెక్నాలజీ ఆచార్యులు డాక్టర్ ఎం.జానకి రామయ్య బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని ఔషధాల కొత్త కలయిక ద్వారా ఈ విధానాన్ని విద్యార్ధి సాహితి ఆర్ చామ కొనుగొందని వివరించారు. ఈ విధానంలో ప్రారంభ ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో వర్శిటీ ఇన్చార్జి వైస్ చాన్సలర్ డాక్టర్ కె.రాజశేఖరరావు,ప్రో వీసీ డాక్టర్ ఎవిఎస్ ప్రసాద్, రిజిస్ట్రార్ డాక్టర్ కె. సుబ్బారావు, విద్యార్ధి సంక్షేమ విభాగం ఇన్చార్జి డీన్ డాక్టర్ కెఆర్ఎస్ ప్రసాద్, బయోటెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ వి.ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థిని అభినందించారు. -
ఛత్రపతి శివాజీ శోభాయాత్రలో ఉద్రిక్తత
దాచేపల్లి: ఛత్రపతి శివాజీ శోభాయాత్రలో బుధవారం రాత్రి దాచేపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శోభయాత్ర లైబ్రరీ సెంటర్లోకి రాగానే భారీఎత్తున నినాదాలు చేశారు. ఓ వ్యక్తి టిప్పు సుల్తాన్ జెండా చూపుతూ హల్చల్ చేయడంతో శోభాయాత్రలో ఉన్న యువకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న సీఐ భాస్కర్ ఆధ్వర్యంలో సిబ్బంది చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు శోభాయాత్రలో రాళ్లు విసిరారు. ఘటనా స్థలాన్ని గురజాల డీఎస్పీ జగదీష్ పరిశీలించి, సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దుకాణాలన్నింటిని మూసి వేయించారు. డ్రోన్ కెమెరాలతో పలు ప్రాంతాలను చిత్రీకరించారు. రెండు వర్గాల మధ్య రాళ్ల దాడి లాఠీచార్జీ చేసిన పోలీసులు -
మరణించినా.. నలుగురికి పునర్జన్మ
మహిళ అవయవదానం మంగళగిరి: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మరణించిన మహిళ అవయదానంతో మరో నలుగురికి పునర్జన్మనిచ్చింది. తాను మట్టిలో కలిసినా.. నలుగురి జీవితాలకు వెలుగిచ్చింది. విజయవాడ భవానీపురానికి చెందిన ఎం.సరస్వతి(54) ఈనెల 14న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఎయిమ్స్కు తరలించి చికిత్స అందిస్తుండగా మంగళవారం బ్రెయిన్ డెడ్ అయింది. కుటుంబ సభ్యులు అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. అభినందించిన వైద్యులు జీవన్ధాన్ ద్వారా సరస్వతి శరీరం నుంచి కిడ్నీలు, కళ్లు, గుండె, లివర్, లంగ్స్ను సేకరించారు. లివర్, కిడ్నీ, లంగ్స్ను వెంటనే మణిపాల్ ఆసుపత్రికి తరలించి అవసరమైన రోగులకు శస్త్రచికిత్సతో అమర్చారు. కళ్లను ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్కు తరలించారు. సరస్వతి అవయదానం చేసి మరికొందరి జీవితాలకు పునర్జన్మ అందించడం అభినందనీయమని వైద్యులు కొనియాడారు. ఆమె బాటలో ప్రతిఒక్కరూ అవయవదానానికి ముందుకు రావాలని కోరారు. అవయవదానం అభినందనీయం అవయదానం అభినందనీయమని తెనాలి సబ్ కలెక్టర్ వి.సంజనా సింహా, ఎయిమ్స్ డైరెక్టర్ అహెంతమ్ శాంత సింగ్ పేర్కొన్నారు. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా అవయవ దాత సరస్వతి గౌరవార్థం ప్రభుత్వం అందజేసిన నగదును కుటుంబ సభ్యులకు అందించారు. ఈ నగదును ఆమె కుటుంబ సభ్యులు లేనివారి కోసం ఖర్చుచేయాలని ఎయిమ్స్ డైరెక్టర్కు అందజేశారు. -
సూర్యప్రకాశరావు మృతి తీరని లోటు
కొరిటెపాడు: కోల్డ్ స్టోరేజెస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా, ఉమ్మడి రాష్ట్రంలో ఫెడరేషన్ ఆఫ్ కోల్డ్ స్టోరేజ్ వైస్ ప్రెసిడెంట్గా, గుంటూరు చాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్గా గత 30 ఏళ్లుగా సేవలందించిన తడికమళ్ల సూర్యప్రకాశరావు బుధవారం ఉదయం మృతిచెందారు. సూర్యప్రకాశరావు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఉన్న రైతు సోదరులకు పలు రకాల సేవలు అందించారని పలువురు ప్రముఖులు, మిత్రులు, బంధువులు కొనియాడారు. కోల్ట్ స్టోరేజ్ల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని వెల్లడించారు. రైతు సోదరుల కోసం ఆరు కోల్డ్స్టోరేజీలను సొంత ఖర్చులతో పలు ప్రాంతాల్లో నిర్మించి నడుపుతున్నారని గుర్తు చేశారు. ఆయన మృతి తీరని లోటన్నారు. సూర్యప్రకాశరావు ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్ధించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాయమాటలు చెప్పి బాలికపై లైంగిక దాడి యువకుడిపై పోక్సో కేసు మంగళగిరి టౌన్: ఓ బాలికపై లైంగిక దాడి చేసిన యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు బుధవారం మంగళగిరి పట్టణ పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మంగళగిరి నగరానికి చెందిన ఓ బాలిక 9వ తరగతి వరకు చదువుకుని ఇంట్లోనే ఉంటోంది. పార్కురోడ్డుకు చెందిన శ్యామ్బాబు ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శ్యామ్బాబు పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి బాలికపై పలుమార్లు లైంగికదాడి చేశాడు. ఈ నేపథ్యంలో ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని బాలిక అడగడంతో వివాహానికి నిరాకరించాడు. దీంతో బాలిక పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. రెండు ఆటోలు ఢీ : వృద్ధుడి మృతి దాచేపల్లి: రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో వృద్ధుడు మృతి చెందిన ఘటన దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామ సమీపంలో బుధవారం జరిగింది. ఈ ప్రమాదంలో సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం మహంకాళీగూడేనికి చెందిన పేరుపోగు ప్రేమదాసు (62) మృతి చెందాడు. ఎస్ఐ సౌందర్యరాజన్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో జరుగుతున్న ఓ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రేమదాసు ఆటోలో దామరచర్ల వైపు నుంచి వస్తున్నాడు. ఈ సమయంలో గామాలపాడు నుంచి శ్రీనగర్వైపు వెళుతున్న ఆటో దామరచర్ల వైపు వెళ్లుతున్న ఆటోని ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రేమదాసు తీవ్రంగా గాయపడ్డాడు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రేమదాసుని హస్పిటల్కి తీసుకెళ్తున్న క్రమంలో మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ సౌందర్యరాజన్ పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావుకు ఏపీటీఎఫ్ మద్దతు నరసరావుపేట: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కె.ఎస్. లక్ష్మణరావుకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బి.సంపత్బాబు చెప్పారు. ఆయన బుధవారం లక్ష్మణరావును కలిసి, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్మణరావు గెలుపునకు కృషి చేస్తామని చెప్పారు. సంఘం ప్రధాన కార్యదర్శి కొమ్ము కిశోర్, గౌరవ అధ్యక్షులు పమ్మి వెంకటరెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటు పడే పీడీఎఫ్ అభ్యర్థుల గెలుపు చారిత్రాత్మక అవసరమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను సైతం రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. పట్టభద్రులు కూడా చైతన్యవంతంగా ఆలోచించాలని, పీడీఎఫ్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. -
స్కూల్ బస్ను ఢీకొన్న కూలీల ఆటో
ఏడుగురికి స్వల్ప గాయాలు జరుబులవారిపాలెం (కారంచేడు): పక్కన ఆగి ఉన్న స్కూల్ బస్సును కూలీలతో వస్తున్న ఆటో ఢీకొట్టడంతో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని జరుబులవారిపాలెం గ్రామం నుంచి ఇంకొల్లు వెళ్లే రహదారిలో బుధవారం జరిగింది. ఎస్సై వి. వెంకట్రావు కథనం మేరకు.. ఇంకొల్లుకు చెందిన ఒక ప్రైవేటు స్కూల్ బస్సు విద్యార్థుల కోసం కేశవరప్పాడు నుంచి వచ్చి వెళ్తోంది. వ్యవసాయ కూలీలతో ఇంకొల్లు నుంచి కేశవరప్పాడుకు వస్తున్న ఆటో ఎదురుగా వెళ్లి ఢీకొట్టింది. దీంతో ఆటో పొలాల్లోకి పోగా, కూలీలలో కొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని చీరాల ఆసుపత్రికి తరలించారు. కొందరు స్కూల్ బస్సు వచ్చి ఆటోను ఢీకొందని చెబుతున్నారు. ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తామని ఎస్ఐ తెలిపారు. ఘటనా స్థలంలో ఆధారాలను ఏఎస్ఐ బి. శేషసాయి సేకరించారు. -
ఇద్దరు చైన్స్నాచర్లు అరెస్టు
బంగారం, నగదు స్వాధీనం నరసరావుపేట రూరల్: జిల్లాలోని పలుచోట్ల చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టుచేసి వారి వద్ద నుంచి రూ.5 లక్షలు విలువైన బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సీఐ పి.రామకృష్ణ వెల్లడించారు. మంగళవారం రూరల్ పోలీసుస్టేషన్ ఆవరణలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పట్టుకున్న నిందితులతో హాజరై వివరాలను వెల్లడించారు. యడ్లపాడు మండలం చెంఘీజ్ఖాన్పేటకు చెందిన పోతురాజు బాలకృష్ణ, యద్దల నరేంద్రసాయిలను అరెస్టు చేశామన్నారు. వీరు పగలు ద్విచక్ర వాహనంపై తిరుగుతూ బయట, ఇళ్లల్లో ఒంటరిగా ఉండే మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి మెడల్లోని బంగారు గొలుసులను లాక్కొని ఉడాయిస్తుంటారన్నారు. గతేడాది సెప్టెంబరు 15న నరసరావుపేట మండలం కాకాని గ్రామంలో సాయంత్రం సమయంలో ఊరిచివర గంగమ్మ దేవాలయం వద్ద సిమెంట్బల్లపై కూర్చోని ఉన్న దేవిశెట్టి లక్ష్మమ్మ మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని వాహనంపై వేగంగా పారిపోయారన్నారు. పెదకూరపాడు, ముప్పాళ్ల మండలం తొండపి, రొంపిచర్ల మండలం పరగటిచర్ల గ్రామాల్లో కూడా ఒంటరి మహిళలపై దాడులు చేసి బంగారు గొలుసులను లాక్కొని పరారయ్యారన్నారు. ఈ నేరాలపై దేవిశెట్టి లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఆర్కేటీ బైపాస్ వద్ద ఇరువురిని అరెస్టుచేసి బంగారం, నగదు స్వాధీనం చేసుకోవటం జరిగిందన్నారు. -
27న ఉద్యోగులు సాధారణ సెలవు వినియోగించుకోవచ్చు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈనెల 27న జరగనున్న నేపథ్యంలో ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ సెలవు వినియోగించుకోవచ్చని జిల్లా సహాయ రిటర్నింగ్ అధికారి, డీఆర్ఓ షేక్.ఖాజావలి మంగళవారం తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ప్రైవేటు ఉద్యోగులకు యాజమాన్యాలు అనుమతివ్వాలని సూచించారు. గురుకుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం చుండూరు(వేమూరు): డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో 2025–26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశానికి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలబాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. మార్చి 6వ తేదీ వరకు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పరీక్షలు ఏప్రిల్ 6వ తేదీన ఉంటాయని తెలిపారు. మార్కుల శాతం, రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయిస్తారని తెలిపారు. జోరుగా పొట్టేళ్ల పందేలు మేదరమెట్ల: కొరిశపాడు మండలంలోని పలు గ్రామాల్లో నిషేధిత కోడి పందేలు, పొట్టేళ్ల పోటీలు జోరుగా సాగుతున్నాయి. తమ్మవరంలో మంగళవారం పొట్టేళ్ల పందేలు నిర్వహించారు. నెల్లూరు, భీమవరం నుంచి తెప్పించిన పొట్టేళ్లతో స్థానిక నాయకులు బరులు ఏర్పాటు చేశారు. భారీ మొత్తంలో పందేలు వేశారు. పోలీసులు సైతం కన్నెత్తి కూడా చూడలేదు. యర్రబాలెం, అనమనమూరు తమ్మవరం గ్రామాల్లో నిత్యం కోడి పందేలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడంతో స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా వీటిని అరికట్టాలని కోరుతున్నారు. హైవేలో ప్రమాద స్థలాల పరిశీలన రొంపిచర్ల: పల్నాడు జిల్లాలోని శ్రీ కాసుబ్రహ్మానందరెడ్డి ఎక్స్ప్రెస్వేపై జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం మంగళవారం పర్యటించింది. దాచేపల్లి టోల్గేట్ వద్ద నుండి సంతమాగులూరు అడ్డరోడ్డు వరకు ఉన్న రాష్ట్ర రహదారిలోని ప్రమాద స్థలాలను బృందం పరిశీలించింది. ఎక్కువ ప్రమాదాలు జరిగిన ప్రత్యేక ప్రాంతాలను పరిశీలించి, ప్రమాదాలకు గల కారణాలను వారు పరిశీలించారు. అలాగే ఆ ప్రాంతంలో ఉన్న వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ బృందంలో రొంపిచర్ల ఎస్ఐ మణికృష్ణతో పాటు ఎంఐఈ అధికారులు, హైవే అధికారులు, జిల్లా ఎస్పీ నియమించిన ప్రత్యేక పోలీస్ బృందం అధికారులు ఉన్నారు. -
గుడారాల పండుగకు ఏర్పాట్లు
అమరావతి: హోసన్న మందిరం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహించే గుడారాల పండుగను ఈ ఏడాది గుంటూరు శివారులోని గోరంట్ల గ్రామంలో కాకుండా మండల పరిధిలోని లేమల్లె గ్రామంలో నిర్వహించాలని హోసన్న మందిరం పెద్దలు నిర్ణయించారని పాస్టర్ అనీల్ తెలిపారు. మంగళవారం ఆయన ఏర్పాట్ల గురించి వివరిస్తూ హోసన్న మందిరం వ్యవస్థాపకులు హోసన్న మొదటి చర్చి లేమల్లె గ్రామంలో నిర్మాణం చేసినందు వల్ల ఈ పవిత్ర ప్రదేశంలో 18వ గుడారాల పండుగ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. మార్చి 6వ తేదీ సాయంత్రం నుంచి 9వ తేదీ మధ్యాహ్నం వరకు గుడారాల పండుగ నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఇచ్చే లక్షలాది మంది హోసన్నా విశ్వాసులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సుమారు వెయ్యికి పైగా మరుగుదొడ్లు, వచ్చిన విశ్వాసులందరికీ భోజన వసతి, పార్కింగ్తో పాటుగా వైద్య సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సుమారుగా పదివేల మంది వలంటీర్లు పనిచేస్తారని అలాగే పోలీసు శాఖ వారి సహకారం తీసుకుంటామన్నారు. గుంటూరు, విజయవాడ, సత్తెనపల్లి నుంచి గుడారాల పండుగ వేదిక వద్దకు ప్రత్యేక బస్సులు అర్టీసీ వారు నడుపుతారన్నారు. అనకాపల్లి నుండి భీమవరం మీదగా ఆ గుడారాల పండుగకు ప్రత్యేక రైతులు విశ్వాసులు తరలివస్తారన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుండే కాక ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల నుండి భక్తులు లక్షలాది మంది ఈ పండుగకు తరలి వస్తాన్నారు. ప్రార్ధన వేదిక, ప్రార్ధన మందిరాలను పరిశుభ్రంగా ఉంచటానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. హోసన్నా మందిరంకు సుమారు 20ఎకరాల భూమి ఉండగా మిగిలినది రైతుల నుంచి సుమారు వంద ఎకరాలు లీజుకు తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గుడారాల పండుగకు వచ్చు వీఐపీలకు, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేశామన్నారు. -
శిడి బండి సంబరం
వైభవం.. ఉయ్యూరు: అశేష భక్తజన కోలాహలం.. సన్నాయి మేళాల జోరు, డప్పు వాయిద్యాల హోరు.. జై వీరమ్మ.. జైజై వీరమ్మ భక్తజన నినాదాల నడుమ.. శిడిబండి ఊరేగింపు కనుల పండువగా సాగింది. పెళ్లి కుమారుడు ఉయ్యూరు మౌర్యకిరణ్ శిడిబుట్టలో కూర్చున్న ఉత్సవాన్ని భక్తులు కనులారా వీక్షించి తరించారు. పారుపూడి, నెరుసు వంశస్తులు మూడు సార్లు శిడి ఆడించటంతో ఉత్సవం ముగిసింది. నయనానందకరంగా.. ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లలో 11వ రోజు నిర్వహించే ప్రధాన ఘట్టమైన శిడిబండి వేడుక మంగళవారం నయనానందకరంగా సాగింది. పాత వాటర్ ట్యాంకు రోడ్డులో ప్రత్యేకంగా తయారుచేసిన శిడిబండికి స్థానికులు పసుపునీళ్లు ఓరబోసి గుమ్మడికాయలు కట్టి, కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఊరేగింపుగా బయలుదేరిన శిడిబండికి దారిపొడవునా భక్తులు పువ్వులు విసురుతూ పసుపునీళ్లు ఓరబోస్తూ హారతులు పట్టారు. పూలదండలు, గుమ్మడికాయలను శిడిబండికి కట్టి భక్తిపారవశ్యం చెందారు. కాలేజ్ రోడ్డు, ప్రధాన రహదారి వెంబడి సాగిన ఊరేగింపులో అశేష భక్తజనం పాల్గొని తన్మయత్వం చెందారు. శిడిబుట్టలో కూర్చున్న పెళ్లి కుమారుడు.. సంప్రదాయం ప్రకారం ఉయ్యూరు దళితవాడ నుంచి పెళ్లి కుమారుడు ఉయ్యూరు మౌర్య కిరణ్ ఊరేగింపుగా ఆలయం వద్దకు తరలివచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు మౌర్య కిరణ్ను శిడి బుట్టలో కూర్చోబెట్టి ఆలయ ప్రదక్షిణ చేయించారు. అమ్మవారి ఆలయానికి ఎదురుగా శిడిబండిని నిలిపి మూడుసార్లు శిడి ఆడించటంతో ఉత్సవం ముగిసింది. శిడి ఆడే సమయంలో భక్తులు అరటికాయలు విసురుతూ భక్తిపారవశ్యం చెందారు. వేడుక అనంతరం పెళ్లి కుమారుడితో పాటు ఉయ్యూరు వంశస్తులు, బంధువులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. గన్నవరం డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో 300 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఉత్సవానికి పోటెత్తిన భక్తజనం -
ఇంజినీ‘రింగ్ రింగ’
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): ఇంజినీరింగ్ విద్యార్థులు రింగ రింగ అంటూ మత్తులో మునిగితేలుతున్నారు. నిషేధిత మత్తు పదార్థాలను సేవించడంతోపాటు వాటిని తక్కువ ధరకు కొని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. నాలుగేళ్లుగా గుంటూరులో సాగుతున్న ఈ మత్తు దందా గుట్టును ఎకై ్సజ్ శాఖ అధికారులు తాజాగా రట్టు చేశారు. ఎకై ్సజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాసులు మంగళవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. మంగళగిరి రూరల్ మండలం కాజకు చెందిన ఎం.సాయి కృష్ణ గుంటూరు సమీపంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇతని సోదరుడు బెంగళూరులో సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటాడు. సాయి కృష్ణ సోదరుడి దగ్గరకు వెళ్లిన సమయంలో అతని రూంలో ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్, తెనాలి చినరావూరుకు చెందిన ధరావత్ సతీష్కుమార్ పరిచయమయ్యాడు. సతీష్కుమార్ బెంగళూరుకు చెందిన నితిన్తో కలిసి ఎండీఎంఏ మత్తుమందును సేవించేవాడు. దీనిని సాయికృష్ణ కూడా అలవాటు చేసుకున్నాడు. ఈ మత్తు మందును గుంటూరులోనూ అమ్ముకోవచ్చని, లాభాలు పొందొచ్చని నితిన్ సతీష్కుమార్, సాయికృష్ణకు సూచించారు. దీంతో నితిన్ ద్వారా ఎండీఎంఏ మత్తు మందును నాలుగేళ్లుగా సాయి కృష్ణ, సతీష్ కుమార్ ఇద్దరూ గుంటూరు తీసుకొచ్చి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు అమ్ముతున్నారు. సాయి కృష్ణ ఇటీవల గుంటూరు సమీపంలోని గోరంట్ల ప్రాంతంలో కోదండ రామా నగర్లోని సాయి లక్ష్మీ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకొని అక్కడి నుంచే దందా సాగిస్తున్నాడు. గుట్టురట్టు ఇలా.. రెండు రోజుల క్రితం గుంటూరు ఎకై ్సజ్–2 టౌన్ సీఐ ఎం.యశోధర దేవి, ఆమె సిబ్బంది బృందావన్ గార్డెన్స్ సమీపంలోని వేంకటేశ్వర స్వామి గుడి రోడ్డులో తనిఖీ చేస్తుండగా ఇద్దరు ద్విచక్ర వాహనాన్ని ఆపి నిలబడి ఉన్నారు. అనుమానం వచ్చిన ఎకై ్సజ్ అధికారులు వారిని ప్రశ్నించారు. ఇద్దరూ తడబడుతుండడంతో వారిని తనిఖీ చేశారు. ఇద్దరి వద్ద 2.52 గ్రాముల మత్తు మందును స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎక్కడ కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించగా సాయి కృష్ణ వద్ద కొన్నామని తెలిపారు. సాయి కృష్ణ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్కి వెళ్లి విచారించగా అతని వద్ద 8.15 గ్రాముల మత్తు మందుతోపాటు, ఒక కేజీ గంజాయి, ద్విచక్ర వాహనం, రెండు సెల్ ఫోన్లు లభించాయి. అక్కడ ఏడుగురు విద్యార్థులు ఉన్నారు. ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులు ఉండగా 9 మందిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు ఎకై ్సజ్ శాఖ అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇంకా గంజాయి సరఫరా చేస్తున్న సాయికృష్ణ బంధువు వేంపాటి చైతన్యతోపాటు బెంగళూరుకు చెందిన నితిన్ను అరెస్ట్ చేయాల్సి ఉంది. వీరు పరారీలో ఉన్నట్టు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. మత్తు పదార్థాలు విక్రయిస్తూ పట్టుబడిన విద్యార్థులు 9 మంది అరెస్టు, పరారీలో ఇద్దరు బెంగళూరు నుంచి తక్కువ రేటుకు దిగుమతి గుంటూరులో అధిక ధరకు అమ్మకాలు వివరాలు వెల్లడించిన ఎకై ్సజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు బెంగళూరులో గ్రాము రూ.1400కు కొని.. ఎండీఎంఏ మత్తుమందును బెంగళూరులో గ్రాము రూ.1400కు కొని ఇక్కడికి తీసుకొచ్చి ఇంజినీరింగ్ విద్యార్థులకు రూ.4 వేల నుంచి రూ.ఐదు వేలకు అమ్ముతున్నట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. గుంటూరు సమీపంలోని ప్రధానంగా రెండు ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులకు ఈ మత్తు మందును సాయి కృష్ణ అలవాటు చేసినట్లు తెలుస్తోంది. గోరంట్లలోని తన ఫ్లాట్లోకి విద్యార్థులను పిలిపించి మత్తుమందు, గంజాయి అమ్ముతున్నట్టు సమాచా రం. నాలుగేళ్లుగా ఈ దందాను యథేచ్ఛగా సాగిస్తున్న సాయికృష్ణ తన గ్రామానికి చెందిన సమీప బంధువుతో ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి తెప్పించి విద్యార్థులకు విక్రయిస్తున్నట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ యశోధర దేవిని ఎకై ్సజ్ డెప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు ప్రత్యేకంగా అభినందించారు. సీఐతో పాటు ఎస్ఐలు సత్యనారాయణ, మాధవి, హెడ్ కానిస్టేబుల్స్ హనుమంతరావు, సీహెచ్ రాజు, మైలా శ్రీనివాసరావు, రవిబాబు, బీఎస్ఎన్రాజు, పి నాగేశ్వరరావు, ఎం సూర్యనారాయణ, వీవీ చారి, చిన్న బాబు తదితరులనూ అభినందించారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ రవి కుమార్ రెడ్డి, గుంటూరు ఎకై ్సజ్ శాఖ అధికారి వి.అరుణ కుమారి, ఏఈఎస్ ఈడే మారయ్య బాబు తదితరులు పాల్గొన్నారు. -
మిర్చి రైతుల బాధ పట్టని కూటమి సర్కారు
సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్కుమార్ లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): మిర్చి పంటకు గిట్టుబాటు ధర దక్కక రైతులు అల్లాడుతుంటే కూటమి సర్కారు పట్టించుకోవడం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్కుమార్ విమర్శించారు. స్థానిక కొత్తపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయం మల్లయ్య లింగం భవన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికై నా సర్కారు స్పందించాలని, లేకుంటే రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కేంద్ర బడ్జెట్లో పేద, కర్షక, కార్మిక వర్గాలను విస్మరించారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పచ్చల శివాజీ మాట్లాడుతూ మిర్చి ధర పతనం కావడంపై ఆందోళన వ్యక్తమవుతోందని వివరించారు. గత సంవత్సరం క్వింటాకు 23 వేల రూపాయలు పలికిన ధర ప్రస్తుతం రూ.10 వేలకు పరిమితమైందని, దీనికి కూటమి సర్కారు తీరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేడా హనుమంతరావు, ఆకిటి అరుణ్ కుమార్, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పి.జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. -
టెలి కమ్యూనికేషన్ యాక్ట్ కింద వ్యక్తి అరెస్ట్
మంగళగిరి టౌన్ : ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు చెందిన రాహుల్ కుమార్ సాహిని టెలి కమ్యూనికేషన్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పోలీసులు మంగళవారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం మంగళగిరి ఆటోనగర్లో ఓ డేటా సెంటర్లోని సర్వర్ సహాయంతో రాహుల్ సీబీపీఈ ఆప్టిమైజ్డ్ యాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. ఇతను అంతర్జాతీయ కాల్స్ చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్ ఢిల్లీకి గత ఆరు నెలల్లో 70 ఫిర్యాదులు అందాయి. దీంతో టెలి కమ్యూనికేషన్సంస్ధ విచారణ చేపట్టింది. విచారణలో మంగళగిరిలోని ఓ డేటా సెంటర్ సర్వర్ నుంచి ఈ కాల్స్ వస్తున్నట్లు నిర్ధారించారు. ఈ కంపెనీ నడుపుతున్న రాహుల్కుమార్ను సంప్రదించగా తన కంపెనీకి వంద సిప్లు గ్రూప్ కాల్స్ మాట్లాడడానికి అనుమతి తీసుకున్నట్లు తెలిపాడు. ఈ సిప్లు తీసుకోవడానికి నకిలీ జీఎస్టీ పత్రాలు, పాన్కార్డు అతను అందజేసినట్లు విచారణలో తేలింది. వీటిపై క్షేత్ర స్థాయిలో సక్రమంగా విచారించకుండానే జియో సంస్థ సిప్లు జారీ చేసినట్లు పోలీసు వర్గాల సమాచారం. జియో సంస్థ స్టేట్ మేనేజర్ రమణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్స్టేషన్లో గత ఏడాది నవంబర్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్కు చెందిన రాహుల్ కుమార్ను గోరక్పూర్లో అదుపులోకి తీసుకుని మంగళవారం కోర్టుకు హాజరు పరిచారు. కోర్టు రాహుల్కు రిమాండ్ విధించింది. రాహుల్ కుమార్ మాత్రం తనకు ఇవేమీ తెలియవని, తన కాల్ సెంటర్ ఉద్యోగులే చూసుకుంటారని, తమ కంపెనీ డేటాను ఎవరో దొంగిలించినట్లు అనుమానం వ్యక్తం చేశాడు. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనే యాప్ నుంచి ఏ కంపెనీ డేటా అయిన డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రాక్టికల్గా పోలీసులకు చూపించాడు. కంపెనీ రాహుల్ పేరు మీద ఉండడంతో బాధ్యుడిగా చేసి అతనిపై టెలి కమ్యూనికేషన్ యాక్ట్తోపాటు చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కంపెనీలో చేస్తున్న ముఠాను పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. -
ఏముంధరన్నో..!
సాక్షి ప్రతినిధి, గుంటూరు, కొరిటెపాడు: రాష్ట్రంలో ఈ ఏడాది ఉమ్మడి గుంటూరు (పల్నాడు, గుంటూరు) జిల్లాతోపాటు ప్రకాశం, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో సుమారు 1.96 లక్షల హెక్టార్లలో మిర్చి సాగైంది. 11.67 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు అంచనా వేశారు. అయితే ఈ ఏడాది దిగుబడులు దారుణంగా పడిపోయాయి. ఎకరాకు పది నుంచి 15 క్వింటాళ్లు మాత్రమే వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ మాత్రం కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి తామర, జెమినీ వైరస్ల ప్రభావంతోపాటు వాతావరణ మార్పులే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడి గతంతో పోలిస్తే ఈ ఏడాది మిర్చి సాగు పెట్టుబడులూ భారీగా పెరిగాయి. ఎరువులు, పురుగు మందుల ధరలు, కూలీలు, రవాణా ఖర్చులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ఫలితంగా ఎకరాకు రూ.1.50 లక్షల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. కౌలు రైతులైతే పెట్టుబడి మరింత పెరుగుతుంది. పెట్టుబడి పెరిగి దిగుబడి సరిగా రాక సతమతమవుతున్న రైతులపై ఇప్పుడు గోరుచుట్టుపై రోకటిపోటులా ధరలు మంట పుట్టిస్తున్నాయి. యార్డులో పలుకుతున్న ధరలను చూసి కర్షకులు కన్నీరు కారుస్తున్నారు. నాలుగైదు నెలలుగా ఇదే దుస్థితి ఉండంతో ఆవేదన చెందుతున్నారు. మిర్చి రకాలు 2020–24 ప్రస్తుతం (క్వింటాకు రూ.వేలల్లో) (క్వింటాకు రూ.వేలల్లో) తేజ 21–26 10–13 డీలక్స్ 20–25 10–12 సింజెంటా బ్యాడిగ 25– 36 10–13 341, 273 18–25 9–12 మిర్చి రైతుల గగ్గోలు దారుణంగా పతనమైన ధరలు రోజురోజుకూ నేల చూపులు చూస్తున్న వైనం దిగుబడులూ అంతంతమాత్రమే యార్డులో దోపిడీకి గురవుతున్న కర్షకులు పట్టించుకోని కూటమి సర్కారు కనీసం కూలీల ఖర్చూ మిగలని దుస్థితి వైఎస్సార్ సీపీ హయాంమిరప పంటకు స్వర్ణయుగం నేడు మిర్చి యార్డుకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్షకుల కష్టాలు అడిగి తెలుసుకోనున్న జననేత ధరలు ఎందుకు తగ్గాయంటే.. జగనన్న పాలనలో రికార్డు స్థాయిలో ధరలు.. వైఎస్సార్ సీపీ, కూటమి ప్రభుత్వాల హయాంలోమిర్చి ధరల వ్యత్యాసమిలా..ఘాటైన మిర్చి సాగుకు గుంటూరు ప్రసిద్ధి అయితే.. దీటైన ధర ఇవ్వడంలో మిర్చి యార్డు పెట్టిందిపేరు. ఇక్కడి పంటకు దేశవిదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. గత నాలుగేళ్లూ లాభాలు చూసిన రైతుల కన్నులు.. ఇప్పుడు కనీస ధర లేక చెమరుస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచీ ధరలు రోజురోజుకూ నేలచూపులు చూస్తుండడంతో కర్షకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పైగా యార్డులో రైతులు దోపిడీకి గురవుతున్నారు. అయినా కూటమి సర్కారు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం మిర్చి యార్డుకు రానున్నారు. కర్షకుల కష్టాలు అడిగి తెలుసుకుని అండగా నిలవనున్నారు. రైతుల తరఫున కూటమి సర్కారు అలక్ష్యంపై గళమెత్తనున్నారు. తెలుగు రాష్ట్రాల మిర్చిని కొనుగోలు చేసే థాయిలాండ్, వియత్నాం, చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్, బర్మా తదితర దేశాల్లోనూ కొంతమేర మిర్చి సాగు చేస్తుండడంతో గిరాకీ తగ్గింది. దీనికితోడు గత ఏడాది సాగు చేసిన 27 లక్షల బస్తాల మిర్చి శీతల గిడ్డంగులలో నిల్వ ఉండిపోవడం కూడా ధరలు తగ్గుదలకు ఒక కారణమని వ్యాపారులు చెబుతున్నారు. రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ పెట్టిన మిర్చికి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ సరుకును తక్కువ ధరకు అమ్ముకోవడానికి రైతులు సుముఖంగా లేరు. కొత్త సరుకుకు అనుకున్న మేర డిమాండ్ లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్న్రెడ్డి పాలనలో నాలుగేళ్లు మిర్చి రైతులకు స్వర్ణయుగమని చెప్పాలి. రికార్డు స్థాయిలో ధరలు లభించాయి. వైఎస్సార్ సీపీ హయాంలో దిగుబడులు బాగా వచ్చాయి. ఎకరాకు 20 క్వింటాళ్ల నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అప్పట్లో రైతులు సీజన్కు ఐదు నుంచి ఆరు కోతలు కోసేవారు. ఈ ఏడాది రెండు, మూడు కోతలతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి. 20 రోజుల్లో క్వింటాకు రూ.3 వేలు తగ్గుదల నేను 10 ఎకరాల్లో తేజ రకం సాగు చేశాను. ఎకరాకు కౌలుతో కలుపుకుని సుమారు రూ.2 లక్షల పెట్టుబడైంది. 20 రోజుల కిత్రం 70 క్వింటాళ్లు యార్డుకు తెచ్చా. క్వింటా రూ.15 వేలు ధర పలికింది. సోమవారం మరో 90 బస్తాలు తీసుకువచ్చా. కానీ రూ.10 వేలు నుంచి రూ.12 వేలు మాత్రమే అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కాని దుస్థితి. 20 రోజుల్లో క్వింటాకు రూ.3 వేలు ధర తగ్గింది. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర లభించేలా చూడాలి. –కె.దేవేంద్ర, రైతు, నల్లచెలిమిల, దేవనకొండ మండలం, కర్నూలు జిల్లా గత ఏడాది క్వింటా రూ.25 వేలు నేను రెండు ఎకరాల్లో తేజ రకం సాగు చేశా. గత ఏడాది ఎకరాకు 30 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. ఈ ఏడాది 15 క్వింటాళ్లకు మించి వచ్చే పరిస్థితులు లేవు. ఎకరాకు రూ.2.30 లక్షలు వరకు ఖర్చు చేశాను. ప్రస్తుతం 17 బస్తాలు ఎరుపు కాయలు తెచ్చా. క్వింటాకు రూ.13,400 ధర పలికింది. ఇవే కాయలు గతేడాది క్వింటా రూ.25 వేలు వరకు పలికాయి. ప్రభుత్వమే ఆదుకోవాలి. –వై.దేవదాసు, రైతు, నీలగంగవరం, వినుకొండ మండలం, పల్నాడు జిల్లా గిట్టుబాటు ధర కల్పించాలి.. నేను రెండెకరాల్లో తేజ రకం సాగు చేశా. రెండు ఎకరాలకు ఇప్పటి వరకు రూ.3.50 లక్షల వరకు పెట్టుబడైంది. గత ఏడాది ఎకరాకు 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ఈ ఏడాది 10 క్వింటాళ్లు మించి వచ్చే పరిస్థితి లేదు. గత ఏడాది క్వింటా రూ.25 వేలు పలికిన ధర ఇప్పుడు రూ.13 వేలు మించి పలకడం లేదు. పెట్టుబడులు భారీగా పెరిగాయి. యార్డుకు 10 క్వింటాళ్ల మిర్చిని తెచ్చా. క్వింటా రూ.13 వేలు వేశారు. క్వింటాకు రూ.20 వేల నుంచి రూ.22 వేలు వస్తే పెట్టుబడి వస్తుంది. లేదంటే భారీ నష్టం తప్పదు. –జి.సుబ్బయ్య, రైతు, మంగన్నపల్లే, పోరుమామిళ్ళ మండలం, కడప జిల్లా -
కేంద్ర పథకాల అమలు తీరుపై ఆరా
శావల్యాపురం: మండలంలోని శానంపూడి గ్రామంలో కేంద్ర టీం సభ్యులు పర్యటించి కేంద్ర ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలు పొందుతున్న లబ్థిదారులను మంగళవారం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామసచివాలయంలో ఏర్పాటు చేసిన సదస్సులో న్యూఢిల్లీ సంబోధ రీసెర్చ్ కమ్యూనికేషన్స్ ఫీల్డ్ మేనేజరు అండ్ కోఆర్డినేటరు వికాస్ మల్కర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రధానమంత్రి అవాస్ యోజన, స్వయ సహాయక సంఘూలు, పింఛన్లు పంపిణీ, గ్రామీణ సడక్ యోజన, గ్రామ స్వరాజ్య అభియాన్ తదితర పథకాల పురోగతిపై లబ్థిదారులను అడిగి తెలుసుకున్నారు. పథకాల నిర్వహణలో ఏమైనా ఇబ్బందులున్నాయా, అర్హులకు అందుతున్నాయా తదితరవన్నీ క్షేత్రస్థాయిలో లబ్థిదారులతో మాట్లా డారు. అనంతరం గ్రామంలో పర్యటించి ఆవాస్ యోజన పఽథకంలో నిర్మించిన నివాస గృహాలను పరిశీలించి లబ్థిదారులతో మాట్లాడి బిల్లులు గురించి ఆరా తీశారు. -
కేంద్రం రైల్వే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): రైల్వే శాఖ అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఉద్యోగుల సమస్యలను తక్షణమే కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శి ఎస్.మంజునాథ్, ఎం.వి ప్రసాద్ డిమాండ్ చేశారు. గుంటూరు రైల్వే స్టేషన్లో యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన నిరాహార దీక్ష శిబిరంలో వారు మాట్లాడుతూ రైల్వే ఉద్యోగుల సమస్యలను వివరించారు. అనంతరం రైల్వే ఉద్యోగులు నినాదాలతో హోరెత్తించారు. కేంద్రం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో మజ్దూర్ యూనియన్ డివిజన్ ట్రెజరర్ ఎస్.జి.కృష్ణయ్య, ఏడీఎస్ కె.కోటేశ్వరరావు, రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ట్రెజరర్ సాంబశివరావు, ఏడీఎస్లు కరుణశ్రీ, హక్, లావణ్య, సంఘ నాయకులు వెంకటేష్, సాయి కృష్ణ, కిరణ్, ప్రసాంత్, మూర్తి, టి.వి.రావు, సునీల్కుమార్, ఉద్యోగ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
నేడు గుంటూరుకు వైఎస్ జగన్
వై.ఎస్.జగన్ పర్యటన షెడ్యూల్ ఇలా.. పట్నంబజారు (గుంటూరుఈస్ట్) : వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం గుంటూరు మిర్చి యార్డుకు వస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు చెప్పారు. గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిర్చి రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కల్పించలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టడంతోపాటు, రైతులకు భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్ వస్తున్నారని వివరించారు. రైతులకు అండగా తానున్నాననే భరోసా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. మిర్చియార్డుకు వైఎస్ జగన్ ఉదయం 9.30 గంటలకు చేరుకుంటారని, మిర్చిని అమ్ముకునేందుకు వచ్చిన రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారని వివరించారు. కూటమి ప్రభుత్వం విఫలం కూటమి ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల కాలంలో సీఎం చంద్రబాబు రైతులకు ఒక్క మేలు అయినా చేశారా అని అంబటి ప్రశ్నించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో బాబు విఫలమయ్యారని విమర్శించారు. ధాన్యం బస్తా ధర రూ.1200 నుంచి 1300, మిర్చి క్వింటా ధర రూ. 13వేలు కంటే పలకడం లేదని ధ్వజమెత్తారు. కంది, మినుము, పత్తి పంటలకూ మద్దతు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రైతుల సమస్యలపై కలెక్టర్లకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందించినా సర్కారు పట్టించుకున్న పాపాన పోలేదని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో రైతులకు ఎంతో మేలు జరిగిందని గుర్తుచేశారు. పొగాకు పంట విషయంలో రూ.వందల కోట్లు ప్రభుత్వానికి నష్టం వచ్చినా రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో పంట కొనుగోలు చేసిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతోందన్నారు. వైఎస్ జగన్ రైతుల కష్టాలు తెలుసుకునేందుకు వస్తున్నారని, ఇది బహిరంగ సభ కాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. రైతుల సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం వైఎస్సార్ సీపీ గుంటూరు, నరసరావుపేట పార్లమెంట్ జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సమస్యలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. కూటమి నేతల కళ్ళు తెరిపించేందుకు, రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్ జగన్ గుంటూరుకు వస్తున్నట్లు వివరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్నాయుడు, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా, డెప్యూటీ మేయర్, పార్టీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు. పట్పంబజారు(గుంటూరు ఈస్ట్): వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం గుంటూరు రానున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి బయల్దేరి, రోడ్డు మార్గంలో గుంటూరు మిర్చి యార్డుకు చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు మిర్చి యార్డు వద్దకు వచ్చి 11 గంటల వరకు మిర్చి రైతుల సమస్యలు అడిగి తెలుసుకుని, వారితో మాట్లాడతారు. అనంతరం 11 గంటలకు గుంటూరు మిర్చి యార్డు నుంచి బయలుదేరి తిరిగి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. మిర్చియార్డులో రైతుల సమస్యల విననున్న జననేత వివరాలు వెల్లడించినవైఎస్సార్ సీపీ నేతలు -
చింతపల్లి మేజర్కు సాగునీరు విడుదల
అచ్చంపేట: మండలంలోని కొండూరు పంచాయతీ పరిధిలోని శ్రీనివాసతండా వద్ద నాగార్జున సాగర్ కాలువల ద్వారా చింతపల్లి మేజర్కు సాగునీటి అవసరాలకు కెనాన్స్ ఏఈ చిల్కా భాస్కర్ ఆదేశాలతో మంగళవారం సాగునీటిని వదిలారు. చింతపల్లి మేజర్ కాలువ కింద ప్రస్తుతం మిర్చి, మొక్కజొన్న, పొగాకు తదితర పంటలు వేశారు. ఈ కాలువకు నీళ్లు రాకపోవడంతో రైతులు గత కొద్దికాలంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక్కడ నుంచే కస్తల మేజర్కు సాగునీటిని వదిలిన అధికారులు చింతపల్లి మేజర్కు వదలకపోవడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన అధికారులు శ్రీనివాసతండా నుంచి ఐదు రోజులు కస్తల మేజర్కు, ఐదు రోజులు కస్తల మేజర్కు సాగునీటిని మార్చి మార్చి వదిలే విధంగా ఆదేశాలు జారీ చేశారు. -
గ్రీన్గ్రేస్పై తప్పుడు ఆరోపణలు
కొరిటెపాడు (గుంటూరు వెస్ట్): గ్రీన్గ్రేస్ ప్రాజెక్టుపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని వైఎస్సార్ సీపీ నేత అంబటి మురళీకృష్ణ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనపై పోటీ చేసి గెలిచిన పొన్నూరు ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల నరేంద్రకుమార్ రెండుమూడు నెలల నుంచి పలు రకాల ఆరోపణలు చేస్తున్నారన్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు ఈ ఆరోపణలపై పత్రికాముఖంగా స్పందించడంతో తాను వివరణ ఇస్తున్నట్లు వివరించారు. 2015లో భజరంగ్ జూట్మిల్లుకు రెసిడెన్షియల్ సైట్ 5.28 ఎకరాల్లో ఒక హైరైజ్ ప్రాజెక్టు నిర్మించాలని అప్పటి ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్ణయించిందని, మొదటగా ఐదు ఫ్లోర్లకు అనుమతి తీసుకోవాలని అనుకొని, మున్సిపల్ కార్పొరేషన్కు దరఖాస్తు చేశామని పేర్కొన్నారు. వారు ప్లాన్కు ముందు రైల్వే ట్రాక్ సైట్ 60 అడుగుల రోడ్డు మాస్టర్ ప్లాన్లో ఉంది కనుక 164 చదరపు గజాల స్థలం గిఫ్ట్గా ఇవ్వమని కార్పొరేషన్ వారు ఎండార్స్మెంట్ ఇవ్వడంతో తాము అంగీకరించి ఆ మేరకు స్థలం ఇచ్చామన్నారు. నల్లపాడు సబ్ రిజిస్ట్రారు కార్యాలయంలో 164 గజాలు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కు గిఫ్ట్ డీడ్గా రిజిస్టర్చేసి ఇవ్వడం జరిగిందన్నారు. దీంతో ఐదు అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతి ఇస్తూ 36వ పాయింట్గా కార్పొరేషన్ వారు రోడ్డు వేయడానికి తనను అడిగిన 164 గజాలు ఉచితంగా ఇచ్చాం గనుక రూ.19.30 లక్షలు సెట్బ్యాక్లో రిలాక్సేషన్ కింద ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించారు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సు కూడా తీసుకున్నాం తర్వాత హైరైజ్ భవనాలు నిర్మించాలని నిర్ణయించి 2015 మే 26న 111 మీటర్ల హైట్ వరకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్ఓసీ తీసుకున్నామని, 2015లోనే స్టేట్ ఎన్విరాన్మెంటల్ అథారిటీ నుంచి క్లియరెన్స్ తీసుకున్నామని అంబటి మురళీకృష్ణ వివరించారు. ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ 600 ప్లాట్లకు తీసుకున్నామని, ప్రస్తుతం తాను నిర్మిస్తుంది 510 ప్లాట్లని, దీనికి ఐదు సంవత్సరాలు వ్యాలిడిటీ ఉందని, తరువాత గజిట్ ద్వారా మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చని వివరించారు. తరువాత కోవిడ్లో ఒక సంవత్సరం సడలించడం వల్ల, 2026 వరకు అనుమతిలో ఉందని అంబటి పేర్కొన్నారు. ఆ తరువాత ఒక్కో టవర్కు ఒక్కోటి చొప్పున 2015లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏపీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్సర్వీసెస్ నుంచి ఫైర్ ఎన్ఓసీలు నాలుగు తీసుకున్నామని, ఒక్కో టవర్కు ఒకటి చొప్పున ఈ ఎన్ఓసీలు తీసుకున్న దరిమిలా 25 నవంబరు 2025లో రెండు సెల్లార్లు, ఒక గ్రౌండ్ ఫ్లోర్, 14 లివింగ్ ఫ్లోర్లకు అనుమతి తీసుకున్నట్టు వివరించారు. ఇది తీసుకున్న తరువాత 2020లో ప్రాజెక్టును ప్రారంభించామని, తర్వాత మూడు టవర్లకు వేర్వేరుగా రేరా అనుమతులు తీసుకున్నామని పేర్కొన్నారు. 2020లో 179 జీఓ ప్రకారం పోస్టు వెరిఫికేషన్ తొలగించి ఆటో వెరిఫై బై సూపర్వైజరీ చెక్ రూల్ ప్రకారం.. జీఎంసీ, డీటీసీపీ అధికారులు పరిశీలించి ఫైనల్ ప్లాన్గా ప్రకటించారన్నారు. 2020లో 96,000 స్క్వేర్ మీటర్లకు అనుమతి తీసుకుని అందులో ఐదు ఫ్లోర్లకు రూ.75 లక్షలు ఫీజు, తరువాత 2020లో 15 ఫ్లోర్కు రూ. 4.35 కోట్లు చెల్లించామన్నారు. హైరైజ్ బిల్డింగ్ కనుక పర్మినెంట్ ప్లాన్గా ఆమోదించామని పేర్కొన్నారు. ఆ తర్వాత 2024లో తాను ఒక టవర్లో కొన్ని మార్పులు చేయడం వల్ల మరో రివైజ్ ప్లాన్ తీసుకున్నట్టు వివరించారు. దీన్ని ఆన్లైన్లో తీసుకుని దీనికి రూ.1.27 కోట్లు ఫీజు చెల్లించామని, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కు ఒక్క రూపాయి కూడా బాకి లేదని పేర్కొన్నారు. అనుమతులు తీసుకున్నప్పుడు 15 శాతం బిల్డింగ్ ఏరియాను మున్సిపాలిటీకి మార్టిగేజ్ చేశానని, భవిష్యత్లో నిబంధనలు అతిక్రమిస్తే ఆ 15 శాతానికి సమానమైన ఫ్లాట్లు వాళ్లు తీసుకుని తనకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇస్తారని వివరించారు. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత కొత్త జీవో ప్రకారం కొన్ని షార్ట్ఫాల్స్ ఉన్నాయని, తనకు ఒక షార్ట్ఫాల్ నోటీసు ఆన్లైన్లో ఇచ్చారని, దీంట్లో రకరకాల సాయిల్ టెస్ట్ రిపోర్ట్, రివైజ్డ్ ఫైర్ ఎన్ఓసీ, తరువాత రైల్వే శాఖ నుంచి ఎన్ఓసీ కావాలని తొలిసారి నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. రాజకీయ ప్రేరేపిత విమర్శలు వచ్చిన దగ్గర నుంచి రైల్వే ఎన్వోసీ కావాలంటూ పట్టుపట్టారని పేర్కొన్నారు. రైల్వేశాఖ ఎన్ఓసీ ప్రాసెస్లో ఉండగా తనకు నోటీసు ఇచ్చారన్నారు. షార్ట్ఫాల్ సబ్బిట్ చేయని 1187 మందికి నోటీసులు ఇవ్వకుండా తనకు మాత్రమే ఇవ్వడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. కావాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, స్టాప్ నోటీసు ఇచ్చిన తర్వాత చట్టాన్ని గౌరవించి పనులు నిలిపివేశానని అంబటి స్పష్టం చేశారు. రైల్వే ఎన్ఓసీ విషయం కోర్టులో పెండింగ్లో ఉందని తీర్పు రావాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. అన్ని నిబంధనల మేరకే చేస్తున్నట్లు స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ నేత అంబటి మురళీకృష్ణ -
పెళ్లి కొడుకుగా మల్లేశ్వరుడు
మంగళగిరి టౌన్: మంగళగిరి గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈనెల 18 నుంచి 27 వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు మంగళవారం స్వామి పెళ్లి కుమారుడి ఉత్సవం శోభాయమానంగా నిర్వహించారు. స్వామికి గణపతి పూజ, పంచామృత అభిషేకం చేశారు. అనంతరం ఉత్సవమూర్తిని పెళ్లికుమారుడిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణానికి చెందిన చంద్రిక జ్యూయలర్స్ అధినేత జంజనం నాగేంద్రరావు, విజయలక్ష్మి దంపతులు ఈ ఉత్సవానికి కైంకర్యకర్తలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ట్రస్ట్బోర్డు మాజీ చైర్మన్లు బోగి కోటేశ్వరరావు, సీతారామ కోవెల ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ వాకా మంగారావు తదితరులు పాల్గొన్నారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి జె.వి.నారాయణ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. శతాధిక వృద్ధురాలి కన్నుమూత కొల్లిపర: కొల్లిపర గ్రామంలో 105 సంవత్సరాలు కలిగిన కొల్లి కాంతమ్మ సోమవారం అర్ధరాత్రి కన్నుమూశారు. కాంతమ్మ భర్త కొల్లి సుబ్బారెడ్డి స్వాత్రంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. జైలు శిక్ష అనుభవించారు. కాంతమ్మకు ఒక కొడుకు, ఇద్దరు కుమారైలతోపాటు మనమలు, మనవరాళ్లు, మునిమనమలు ఉన్నారు. ఈమె ఐదు తరాలను చూసింది. ఏఎన్యూ దూరవిద్య పరీక్ష ఫలితాలు విడుదలఏఎన్యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం గత ఏడాది నవంబరులో నిర్వహించిన ఎంఏ తెలుగు ప్రథమ, ద్వితీయ, తృతీయ నాలుగో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల చేశామని పీజీ పరీక్షల విభాగ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కోదండపాణి తెలిపారు. పరీక్ష ఫలితాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏఎన్యూసీడీఈఐఎన్ఎఫ్ఓ వెబ్సైట్ ద్వారా పొందవచ్చని వెల్లడించారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 28 ఆఖరు తేదీగా నిర్ణయించామని వివరించారు. ఎం ఫార్మసీ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదలఏఎన్యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో నిర్వహించునున్న ఎం.ఫార్మసీ వన్ బై టూ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ను సీఈఏ శివప్రసాదరావు మంగళవారం విడుదల చేశారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల 25 చివరి తేదీ. రూ.100 ఆలస్య రుసుముతో ఈ నెల 27 వర కు చెల్లించవచ్చునని, పరీక్షలు మార్చి 17 నుంచి ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. పరీక్ష ఫీజు తదితర వివరాలు యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచామని వివరించారు. రోడ్డు ప్రమాదంలో బ్యాంక్ మేనేజర్ మృతి తాడేపల్లిరూరల్: తాడేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని కనకదుర్గ వారధిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బ్యాంకు మేనేజర్ చనిపోయిన ఘటనపై మంగళవారం తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ శ్రీనివాసరావు కథనం ప్రకారం చీరాలకు చెందిన కొక్కిలిగడ్డ వీర వెంకటేశ్వరరావు (40) కృష్ణాజిల్లా పెడనలోని ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి బంధువుల ఇంటికి వెళ్లి ద్విచక్రవాహనంపై తిరిగి ఇంటికి వెళుతుండగా వెనుక నుంచి లారీ వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై భార్య అపర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. అమరేశ్వరుని సేవలో క్యాట్ న్యాయమూర్తి అమరావతి: ప్రముఖ శైవ క్షేత్రం అమరావతిలో వేంచేసియున్న శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరుని మంగళవారం సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(క్యాట్) న్యాయమూర్తి లతా భరద్వాజ్ దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, అర్చకులు న్యాయమూర్తికి స్వాగ తం పలికారు. అమరేశ్వరునికి, బాలచాముండేశ్వరీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం న్యాయమూర్తికి ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేసి స్వామివారి శేషవస్త్రంతో పాటు తీర్ధప్రసాదాలు అందజేశారు. ఆమె వెంట క్యాట్ మెంబర్ వరణ్సింధు కౌముది, అధికారులు ఉన్నారు. -
విద్యుత్ తీగలు తగిలి రైతుకు తీవ్రగాయాలు
ఈపూరు(శావల్యాపురం): మండలంలోని బొమ్మరాజుపల్లె గ్రామానికి చెందిన రైతు చీదా సుబ్బారావు తాను సాగు చేసిన కంది పంటకి కాపలాగా వెళ్ళి పంట పొలాల రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగలి అపస్మారక స్థితిలోకి వెళ్లిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం ఎస్సై ఎం.ఉమామహేశ్వర రావు కథనం ప్రకారం.. చీదా సుబ్బారావుకు చెందిన కంది పొలం భధ్రుపాలెం–ముప్పాళ్ళ గ్రామాల మధ్య ఉంది. అయితే అడవి జంతువుల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు విద్యుత్ తీగలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే గమనించని చీదా సుబ్బారావు బహిర్భూమికి వెళ్ళగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగలి సంఘటన స్థలంలో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కొంత సమయం గడిచిన తర్వాత స్పృహలోకి వచ్చి పడుతూ లేస్తూ వెళ్ళగా ఆ చుట్టుపక్కల పొలంలో ఉన్న రైతు ఆంజనేయులు గమనించి జరిగిన సంఘటన గురించి సెల్ఫోను ద్వారా సమాచారాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. సుబ్బారావుకు విద్యుత్తీగలు తగిలి తలకు, కాలికి శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. -
‘మచ్చు’కై నా దయలేదు!
అసలే సరైన ధర లేక అల్లాడుతున్న రైతులపై అధికారులు మచ్చుకైనా దయ చూపడం లేదు. మిర్చి యార్డులో మచ్చుకాయల దోపిడీని అరికట్టలేక చోద్యం చూస్తున్నారు. మరో వైపు వేమెన్స్ లేకుండానే దిగుమతి వ్యాపారుల గుమాస్తాలు కాటాలు వేస్తూ తూకంలో మోసం చేస్తున్నారు. ఆ తర్వాత వేమెన్లు వచ్చి బిల్లులు ఇస్తున్నారు. దిగుమతి వ్యాపారులు కమీషన్ పేరుతోనూ దండుకుంటున్నారు. వాస్తవానికి రెండుశాతం కమీషన్ తీసుకోవాల్సి ఉండగా, కొందరు నాలుగు నుంచి ఆరు శాతం వసూలు చేస్తున్నారు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలు మృతి
చేబ్రోలు: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామ శివారులో మహిళా కూలీలతో వెళుతున్న ఆటోను సోమవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. సుద్దపల్లి గ్రామానికి చెందిన 12 మంది మహిళా కూలీలు మినుము కోత కోసేందుకు నీరుకొండ ప్రాంతానికి ఆటోలో బయలుదేరారు.మార్గమధ్యంలోని నారాకోడూరు గ్రామ శివారులో దట్టమైన పొగుమంచు కారణంగా ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్ కూలీల ఆటోను వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో తోట సీతారావమ్మ (41), అల్లం శెట్టి అరుణ (39), కుర్రా నాంచారమ్మ (40) అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఆటో డ్రైవర్ ఇబ్రహీంకు, మరో ఎనిమిది మంది మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరు గుంటూరు ప్రభుత్వ వైద్యశాల్లో చికిత్స పొందుతున్నారు. -
అదనపు కమిషనర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు
గ్రీన్ గ్రేస్ అపార్టుమెంట్ నిర్మాణ పనుల నిలిపివేత ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ తదుపరి పనులు చేయడం, పట్టణ ప్రణాళిక అధికారుల పర్యవేక్షణ లోపం తదితర అంశాలపై అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ఏర్పాటు చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. సోమవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్దేశిత అనుమతులు లేకుండా కేవలం డీమ్డ్ ప్లాన్తో నిర్మాణ పనులు చేట్టిందని తెలిపారు. గత ఏడాది తాము కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్న డాక్యుమెంట్స్ను పరిశీలించిన తరువాత ప్రభుత్వానికి 19 మంది అధికారుల పాత్రపై సమగ్ర నివేదిక పంపామని చెప్పారు. సమావేశంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డెప్యూటీ కమిషనర్ సీహెచ్. శ్రీనివాసరావు, సిటీప్లానర్ రాంబాబు పాల్గొన్నారు. -
మూడు రోజులుగా కాల్వలో వృద్ధుడు
తెనాలి రూరల్: మూత్ర విసర్జనకు వెళ్లిన వృద్ధుడు ప్రమాదవశాత్తు కాల్వలో పడ్డాడు. మూడు రోజులుగా చెత్త కుప్పపై ఉంటూ సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. చివరకు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో బయటకు తీసి ఇంటికి పంపారు. వివరాలిలా ఉన్నాయి.. పట్టణ మారిస్పేటకు చెందిన సుభాని మార్కెట్లో తోపుడు బండిపై పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. మూడు రోజుల కిందట తెల్లవారుజామున మూత్ర విసర్జనకు వెళ్లి ప్రమాదవశాత్తు మార్కెట్ వంతెన వద్ద తూర్పు కాల్వలో పడ్డాడు. స్పృహ తప్పిన అతను కొద్ది గంటల అనంతరం తేరుకుని వంతెన కింద ఉన్న చెత్తకుప్ప మీదకు చేరుకున్నాడు. సాయం కోసం కేకలు వేసినా ఎవరికీ వినిపించకపోవడంతో మూడు రోజుల పాటు అక్కడే ఉండి పోయాడు. సోమవారం సాయంత్రం స్థానికులు అతన్ని గుర్తించి మార్కెట్ వంతెన కూడలిలోట్రాఫిక్ విధుల్లో ఉన్న హోంగార్డులకు సమాచారం తెలిపారు. హోంగార్డులు చెన్నబోయిన నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, పేరయ్యలు తాడు సాయంతో కాల్వలోకి దిగి కాల్వ నుంచి బయటకు తీసుకువచ్చారు. -
అద్భుతమైనది హనుమత్ వైభవం
తెనాలి: హనుమత్ వైభవం చాలా గొప్పదని, వాస్తవానికి భవిష్యత్ బ్రహ్మ ఆంజనేయస్వామిగా పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి(బాలస్వామి) అన్నారు. స్థానిక షరాఫ్బజారులోని శ్రీసువర్చలా సమేత శ్రీపంచముఖ ఆంజనేయస్వామి దేవాలయాన్ని బాలస్వామి సోమవారం దర్శించారు. స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. తన బాల్యంలో పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంతో అనుబంధాన్ని గుర్తుచేశారు. అనంతరం భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. హనుమంతుడి ధ్వజం ఎక్కడైతే ఉంటుందో అక్కడ జయాలు ఉంటాయని చెప్పారు. హనుమాన్ చాలీసా కూడా జయహనుమతోనే ప్రారంభమవుతుందని గుర్తుచేశారు. మాఘమాసంతో సహా ఏ మాసంలో ఏరోజు ఏమేం చేయాలో? ధర్మ ఆచరణ విధివిధానాలను పెద్దలు చెప్పారనీ, ప్రజలు శాస్త్రప్రకారం ధర్మాన్ని పాటిస్తూ, భగవంతుడిని ఆరాధిస్తూ తమ జీవనవిధానాన్ని ఆచరించాలని సూచించారు. బాలస్వామీజీకి ఆలయ ఈఓ అవుతు శ్రీనివాసరెడ్డి, హరిప్రసాద్, ప్రధాన అర్చకుడు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, ఆర్వీ కిరణ్కుమార్ స్వాగతం పలికారు. స్వామీజీతో సాలిగ్రామ మఠం కార్యదర్శి రావూరి సుబ్బారావు, సంయుక్త కార్యదర్శి ముద్దాభక్తుని రమణయ్య, కోశాధికారి గోపు రామకృష్ణ, సభ్యులు రాజేశ్వరరావు, ప్రభరాణి, వరలక్ష్మి, ప్రమీల పాల్గొన్నారు. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి -
రీసర్వే పైలెట్ ప్రాజెక్ట్ పనులు తనిఖీ
లక్ష్మీపురం: గుంటూరు తూర్పు మండలం, జొన్నలగడ్డ గ్రామంలో భూ రీసర్వే పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన పనులను జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ సోమవారం తనిఖీ చేశారు. రీ సర్వే బ్లాక్ బౌండరీ సరిహద్దులను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నీతి ఆయోగ్ బృందం తక్కెళ్లపాడు సందర్శన పెదకాకాని: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల సద్వినియోగంపై నీతి ఆయోగ్ ప్రతినిధుల బృందం తక్కెళ్లపాడు పంచాయతీ కార్యాలయాన్ని సోమవారం సందర్శించింది. బృందం సభ్యులు జిష్యుపాల్, స్వప్నలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, సడక్ యోజన, పింఛన్ పంపిణీ, డ్వాక్రా యానిమేటర్లతో మాట్లాడారు. డ్వాక్రా స్వయం సహాయ సంఘాలకు మంజూరు చేసిన నిధుల సద్వినియోగంపై డ్వాక్రా సంఘాల మహిళలతో చర్చించారు. ఈ పథకాలను సంబంధించిన పలు రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఆర్.శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
మృత్యువు
దూసుకొచ్చినకూలీల ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు చేబ్రోలు: మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన 12 మంది వ్యవసాయ కూలీలు సోమవారం వేకువజామునే నీరుకొండ ప్రాంతానికి మినుము కోత పనులకు ఆటోలో పయనమయ్యారు. దారంతా దట్టమైన పొగ మంచు కమ్మింది. నారాకోడూరు – బుడంపాడు గ్రామాల మధ్యకు వచ్చేసరికి గుంటూరు– 2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కూలీల ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అల్లంశెట్టి అరుణకుమారి (39), కుర్రా నాంచారమ్మ (40), తోట సీతారావమ్మ (41) అక్కడికక్కడే మరణించారు. వీరితోపాటు ఎం. శివమ్మ, ఎం. శివపార్వతి, జి. మల్లేశ్వరి, ఏ. వెంకట ప్రవీణ, ఆర్. రత్నకుమారిలతో పాటు ఆటో డ్రైవర్ ఇబ్రహీంతో పాటు మరో ముగ్గురుకు గాయాలయ్యాయి. వీరంతా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన ముగ్గురు మహిళల మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం పోలీసులు కుటుంబ సభ్యులకు అందజేశారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు ప్రమాదంలో మరణించిన ముగ్గురు కుటుంబాలది రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. సుద్దపల్లి గ్రామంలోని యూపీ స్కూల్ సమీపంలో నివసిస్తున్న వీరంతా ఊరిలో వ్యవసాయ పనులు లేకపోవడంతో సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీరుకొండ పరిసర ప్రాంతాలకు కొద్ది రోజులుగా వెళుతున్నారు. రోజు మాదిరిగానే సోమవారం తెల్లవారుజామున ఆటోలో 12 మంది మహిళలు పనులకు బయలుదేరారు. పనులకు వెళ్లొస్తామంటూ చిరునవ్వుతో ఇంట్లోంచి బయలుదేరి వెళ్లిన వీరంతా కొద్దిసేపటికి ప్రమాద ఘటనా స్థలంలో మిగతా జీవులుగా మారడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. భయానక వాతావరణం ప్రమాద సంఘటనలో ఆటో నుజ్జునుజ్జుగా మారి బోల్తా పడింది. ఆర్టీసీ బస్సు ముందు భాగం దెబ్బతింది. ప్రమాద స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. ప్రమాదంతో పొన్నూరు, గుంటూరు రోడ్డుకు ఇరువైపులా కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. చేబ్రోలు పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని క్రమబ ద్ధీకరించారు. పొన్నూరు రూరల్ సీఐ వై. కోటేశ్వరరావు, చేబ్రోలు ఎస్ఐ డి. వెంకటకృష్ణ సంఘటన ప్రాంతానికి చేరుకొని ప్రమాద వివరాలను నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నారాకోడూరు వద్ద ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి తొమ్మిది మందికి గాయాలు ప్రమాదానికి పొగ మంచే కారణం -
తెలుగులో తీర్పు చెప్పిన న్యాయమూర్తి
తెనాలి రూరల్: తెనాలి ప్రిన్సిపల్ సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) కోర్టులో ఓ కేసు(686/23)కు సంబంధించిన తీర్పును న్యాయమూర్తి తెలుగులో చెప్పారు.ప్రో నోటుకు సంబంధించిన కేసులో న్యాయమూర్తి తీర్పును తెలుగులో వెలువరించారని, రానున్న వారం రోజులు తెలుగులోనే చెప్పనున్నారని కోర్టు వర్గాలు తెలిపాయి. 21న కుంభమేళాకు ప్రత్యేక బస్సు పట్నంబజారు: భక్తుల కోరిక మేరకు కుంభమేళాకు మరో స్పెషల్ హైటెక్ బస్సును ఈనెల 21వ తేదీన ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం ఎం. రవికాంత్ తెలిపారు. మొత్తం ఎనిమిది రోజుల ప్రయాణం ఉంటుందని పేర్కొన్నారు. 21వ తేదీ ఉదయం 10 గంటలకు బస్సు బయలుదేరి ప్రయాగ్రాజ్ చేరుకున్న అనంతరం అక్కడ నుంచి అయోధ్య, వారణాసి వెళ్లి తిరిగి వస్తుందని పేర్కొన్నారు. ఆన్లైన్లో 91927 సర్వీస్ నంబర్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాలని సూచించారు. ఒక్కో టికెట్ ధర రూ. 8,300గా నిర్ణయించినట్లు తెలిపారు. భోజనాలు, వసతి ఖర్చుల బాధ్యత ప్రయాణికులేదనని చెప్పారు. వివరాల కోసం 7382897459, 7382896403 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. రేపు వాహనాల వేలం పాట రద్దు పట్నంబజారు: రవాణా శాఖకు పన్నులు చెల్లించకుండా నిర్బంధంలో ఉన్న వాహనాలకు ఈ నెల 19న నిర్వహించ తలపెట్టిన బహిరంగ వేలం పాటను రద్దు చేసినట్లు డీటీసీ కె. సీతారామిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు ఆర్టీఏ కార్యాలయంలో ఉన్న 31 వాహనాల వేలాన్ని పలు శాఖాపరమైన కారణాలతో నిలిపి వేసినట్లు పేర్కొన్నారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది వెల్లడిస్తామని ఆయన తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై సమీక్ష నరసరావుపేట టౌన్: మార్చి 8న జరగనున్న జాతీయ లోక్ అదాలత్కు సంబంధించి సోమవారం స్థానిక న్యాయస్థాన భవనాల ఆవరణలో పోలీసు అధికారులతో న్యాయమూర్తులు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు మార్చి 8న స్థానిక న్యాయస్థానం భవనాలు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు స్థానిక అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె.మధుస్వామి తెలిపారు. ఈ సందర్భంగా అదాలత్లో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీసు అధికారులకు రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవడానికి చట్టపరమైన అంశాలను వివరించారు. పోలీసులు కేసులు పరిష్కారానికి సంబంధించి లేవనెత్తిన పలు సందేహాలను నివృత్తి చేశారు. న్యాయమూర్తి ఆర్.ఆశీర్వాదం పాల్, వన్టౌన్ ఎస్ఐ అరుణ, టూటౌన్ ఎస్ఐ లేఖ ప్రియాంక, రొంపిచర్ల ఎస్ఐ మణి కృష్ణ, నకరికల్లు ఎస్ఐ సిహెచ్ సురేష్, సిబ్బంది పాల్గొన్నారు త్రికోటేశ్వరునికి బంగారు రుద్రాక్షలు బహూకరణ నరసరావుపేట రూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారికి నాదెండ్ల మండలం కమ్మవారిపాలెంకు చెందిన భక్తుడు చండ్ర శ్రీనివాసరావు రూ.16లక్షల విలువైన బంగారు రుద్రాక్షలను బహూకరించాడు. ఆలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా బంగారు రుద్రాక్షలను ఆలయ అర్చకులకు అందజేశారు. ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు. పనులు త్వరితగతిన పూర్తిచేయాలి నరసరావుపేట రూరల్: తిరునాళ్ల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారిని సోమవారం ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, డాక్టర్ చదలవాడ అరవిందబాబుతో కలిసి ఆయన దర్శించుకున్నారు. -
ఇస్సోపార్బ్ అధ్యక్షురాలిగా డాక్టర్ సులేఖా పాండే
మంగళగిరి: ఇండియన్ సొసైటీ ఆఫ్ పెరినాటాలజీ అండ్ రీ ప్రొడక్ట్ మెడిసన్(ఇస్సోపార్బ్) కొత్త అధ్యక్షురాలిగా డాక్టర్ సులేఖా పాండే బాధ్యతలు స్వీకరించారు. నగర పరిధిలోని చినకాకాని ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలలో మూడు రోజులు పాటు నిర్వహించిన ఇస్సోపార్బ్ 40వ జాతీయ సదస్సు సోమవారం ముగిసింది. మూడు రోజులు పాటు నిర్వహించిన సదస్సులో పెరినాటాలజీ, రీ ప్రొడక్ట్ మెడిషన్లోని కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. సదస్సును ఇస్సోపార్బ్ విజయవాడ చాప్టర్ నిర్వహించింది. ప్రారంభోత్సావానికి ఇస్సోపార్బ్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నారాయణ జానా, కార్యదర్శి డాక్టర్ మిశ్రా చౌదరి, ఎన్టీఆర్యూహెచ్ఎస్ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి హాజరై అనేక అంశాలను చర్చించారు. చాప్టర్ అధ్యక్షురాలు డాక్టర్ కె.గీతాదేవి, కార్యదర్శి కె.లత ప్రాతినిధ్యం వహించగా 450 మంది ప్రతినిధులు హాజరైన కార్యక్రమంలో పెరినాటాలజీ, రీ ప్రొడక్ట్ మెడిషన్లోని పలు అంశాలను చర్చించారు. కార్యక్రమంలో పోషకురాలు డాక్టర్ ఆర్ఎస్ రమాదేవి, ఏపీఎంసీ పరిశీలకులు డాక్టర్ కె.ప్రభాదేవి, ఓబీజీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ కె.గంగాధరరావు, సైంటిఫిక్ చైర్ డాక్టర్ వి.పద్మజ, విజయవాడ ఓబీజీ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ వి.శ్రీదేవి పాల్గొన్నారు. -
చిన్నారులకు సకాలంలో టీకాలు వేయించాలి
తాడికొండ: చిన్నారులకు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అందించే టీకాలు సకాలంలో వేయించేలా సిబ్బంది చొరవ తీసుకోవాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎ.శ్రావణ్ బాబు అన్నారు. సోమవారం తుళ్లూరు పీహెచ్సీని సందర్శించిన ఆయన వైద్య బృందంతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చిన్నారులకు బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఏఏ టీకాలు ఏ సమయంలో వేయించాలి అనే విషయంపై స్పష్టంగా అవగాహన కల్పించాలని కోరారు. టీకాలకు సంబంధించిన సమాచారాన్ని యు విన్ పోర్టల్లో అప్లోడ్ చేసే విధానాన్ని వివరించారు. గ్రామాల్లో సీడీఎన్సీ సర్వే చేసి ప్రతి గ్రామంలోని కుటుంబాలకు ఐడీ నంబర్లు ఇచ్చేలా చొరవ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారులు డి.శ్రీనివాస్, వసుంధర, శివపార్వతీ, సీహెచ్ఓ వెంకట రమణ, ఎంఎస్ రాణి, పర్యవేక్షకులు సుధాకర్, డీఎస్ రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ కరీమ్ పాల్గొన్నారు.