GVK Mall
-
షాపింగ్ చేస్తున్న క్రికెటర్స్
-
కరెంట్ షాక్తో జీహెచ్ఎంసీ కార్మికురాలు మృతి
హైదరాబాద్: విధులు నిర్వర్తిస్తున్న జీహెచ్ఎంసీ కార్మికురాలు విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. ఈ సంఘటన నగరంలోని బంజారాహిల్స్ జీవీకే మాల్ వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్బీటీ నగర్కు చెందిన హైమావతి జీహెచ్ఎంసీలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో నేటి ఉదయం జీవీకే మాల్ సమీపంలో రోడ్లు శుభ్రం చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ రవికిరణ్ అక్కడికి చేరుకుని ఘటనకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. మృతురాలి కుటుంబానికి రూ. 5 లక్షల సాయం ప్రకటించారు. -
ఉద్యోగులపై జీవీకే మాల్ యాజమాన్యం దాష్టికం
-
జీవీకే మాల్పై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు
హైదరాబాద్: బంజారాహిల్స్లోని జీవీకే మాల్పై జీహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం దాడులు జరిపారు. నిబంధనలకు విరుద్ధంగా జీవీకే మాల్లోని దుకాణాలు ప్లాస్టిక్ సంచులు వినియోగిస్తున్నారన్న ఫిర్యాదు నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. పాస్టిక్ సంచులు వినియోగిస్తున్న ఇతర దుకాణాలకు 25వేల నుంచి లక్ష వరకూ అధికారులు జరిమానా విధించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జీవీకే మాల్పై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు
హైదరాబాద్: బంజారాహిల్స్లోని జీవీకే మాల్పై జీహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం దాడులు జరిపారు. నిబంధనలకు విరుద్ధంగా జీవీకే మాల్లోని దుకాణాలు ప్లాస్టిక్ సంచులు వినియోగిస్తున్నారన్న ఫిర్యాదు నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. పాస్టిక్ సంచులు వినియోగిస్తున్న ఇతర దుకాణాలకు 25వేల నుంచి లక్ష వరకూ అధికారులు జరిమానా విధించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.