haj piligrims
-
హజ్యాత్రికుల బృందాన్ని కలిసిన సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హజ్ యాత్రికుల బృందాన్ని కలిశారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో ఏర్పాటు చేసిన హజ్ క్యాంప్ నుంచి హజ్యాత్ర బృందం బయల్దేరనుంది. దీనిలో భాగంగా నంబూరుకు బయల్దేరి వెళ్లిన సీఎం జగన్.. యాత్రికులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తొలిసారిగా నంబూరు హజ్ క్యాంప్ నుంచి హజ్ యాత్రికలు బృందం బయల్దేరనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రం తరఫున హజ్ యాత్రికులకు శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం జగన్. రాష్ట్రం గురించి ప్రార్ధన చేయమని కోరుతున్నానని, రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటున్నాని సీఎం జగన్ తెలిపారు. హజ్ యాత్రలో మీకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందన్నారు. హజ్ యాత్రలో ఇబ్బంది తలెత్తకుండా కమిటీని పంపిస్తున్నామని, హజ్ యాత్రికులకు ఏ సమస్య వచ్చినా అంజద్ బాషా చూసుకుంటారన్నారు సీఎం జగన్. ఎమ్మెల్యే అంజద్ బాషాతో పాటు ఇతర అధికారులు మీకు అందుబాటులో ఉంటారని హజ్ యాత్రికులకు సీఎం జగన్ భరోసా ఇచ్చారు. మైనార్టీలకు సీఎం జగన్ అండగా నిలిచారు మైనార్టీల తరఫున సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలియజేశారు ఎమ్మెల్యే అంజద్ బాషా. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మైనార్టీలకు సీఎం జగన్ సంక్షేమ ఫథకాలు అందిచారన్నారు. మైనార్టీలకు సీఎం జగన్ ఎప్పుడూ అండగా నిలిచారన్నారు. ఆనాడు వైఎస్సార్, ఇప్పుడు సీఎం జగన్ మైనార్టీలకు అండగా ఉన్నారన్నారు. గతంలో పోలిస్తే మైనార్టీలకు సంక్షేమ పథకాలు మరింత ఎక్కువ అందాయని ఈ సందర్భంగా తెలియజేశారు. -
హజ్ యాత్ర–2022 షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: హజ్ యాత్ర–2022కు కేంద్ర హజ్ కమిటీ షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ ఏడాది 1,822 మందికి హజ్ యాత్రకు వెళ్లే అవకాశం దక్కిందని, టీకా రెండు డోసులు తీసుకున్న వారినే ఎంపిక చేసినట్లు రాష్ట్ర హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ అధికారి బి. షఫీవుల్లా తెలిపారు. కరోనా వల్ల ఈ ఏడాది యాత్రకు 65 ఏళ్లలోపు వారికే కేంద్ర హజ్ కమిటీ షరతులతో కూడిన అనుమతినిచ్చిందని పేర్కొన్నారు. జూన్ 17నుంచి జూలై 3వరకు యాత్ర ఉంటుందన్నారు. ఇప్పటికే ఎంపికైన యాత్రికుల నుంచి మొదటి వాయిదాగా రూ.2.1లక్షలు వసూలు చేశామని, కేంద్ర హజ్ కమిటీ ఆదేశాలతో రెండో వాయిదా వసూలు చేస్తామని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 3,500 మంది యాత్రికులుంటారని, ఈ ఏడాది రెండు రాష్ట్రాలవారూ హైదరాబాద్ ఎంబారికేషన్ పాయింట్ నుంచే వెళ్లనున్నారని చెప్పారు. హజ్ యాత్రికులను తీసుకెళ్లే అవకాశం ఈసారి సౌదీ ఎయిర్లైన్స్కు లభించిందని, ఎంపికైన యాత్రికులకు హజ్ శిక్షణ శిబిరాలు కొనసాగుతున్నాయని వివరించారు. -
హజ్ యాత్రికుల సబ్సిడీ ఎత్తివేత
-
'25 ఏళ్లుగా ఆగని మృత్యుఘోష'
గత పాతికేళ్లుగా ఇదే వరుస. హజ్ యాత్ర ప్రారంభం అవుతున్న ప్రతిసారి ప్రభుత్వ పెద్దల్లో ఆందోళన. ఏ క్షణం ఏం జరుగుతుందో ఎలా ప్రమాదం చోటు చేసుకుంటుందో ఊహించకుండానే జరగాల్సింది జరిగిపోతుంది. మృత్యుఘోష వినిపిస్తోంది. ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే హజ్ యాత్రలో గత 25 సంవత్సరాలలోనే ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. యాత్రా నిర్వాహకులు ఎంతో అప్రమత్తంగా ఉన్న ఏదో ఒక రూపంలో యాత్రికులను మృత్యువు కభళిస్తోంది. హజ్ యాత్ర కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాల నుంచి లక్షల్లో ముస్లింలు వస్తుంటారు. తన జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్ యాత్రను సందర్శించాలని ముస్లింలు కోరుకుంటారు. ఎంతో పవిత్రంగా ఆ కార్యక్రమం పూర్తి చేసేందుకు వారు పెద్ద ఎత్తున తరలి వెళుతుంటారు. అలా వెళ్లిన వారికి నిర్వహణా అధికారులకు మధ్య ఘర్షణ చోటుచేసుకోవడమో లేక ఏదో ఒక కారణంతో తొక్కిసలాట చోటుచేసుకోవడమో జరుగుతుండటం సర్వసాధరణంగా తయారైంది. ఫలితంగా అదే ప్రాణ నష్టం. వీటికి భిన్నంగా ఇదే నెల 12న మక్కాలోని ఓ భారీ క్రేన్ యాత్రికులపై కూలిపోయి దాదాపు 107 మంది చనిపోవడం, పదిహేను రోజులు తిరగకుండానే తొక్కిసలాట చోటుచేసుకుని 453మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అక్కడి అధికారులనే కాక, యాత్రికులను కూడా తీవ్రంగా కలవర పెడుతోంది. ఇప్పటి వరకు గత 25 ఏళ్లలో హజ్ యాత్రలో చోటుచేసుకున్న విషాదాలను పరిశీలిస్తే.. 1987 లో ఇరానియన్ యాత్రికులకు సౌదీ అధికారులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుని 402 మంది చనిపోగా.. 650మందికి పైగా గాయాలపాలయ్యారు. 1989లో రెండు బాంబులు పేలుళ్లు చోటుచేసుకొని ఓ యాత్రికుడు చనిపోగా 16మంది గాయాలపాలయ్యారు. 1990లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ టన్నెల్ను పాదయాత్రగా వెళుతున్న యాత్రికుల మధ్య తొక్కిసలాట చోటుచేసుకుని దాదాపు 1426మంది మృత్యువాత పడ్డారు. 1997 లో ఓ అగ్ని ప్రమాదం చోటు చేసుకుని 340మంది చనిపోగా.. 1500మంది గాయాలపాలయ్యారు. 1998లో ఓ ఇరుకైన మార్గం ద్వారా ఎక్కువమంది యాత్రికులను వెళ్లేందుకు అనుమతించడం వల్ల తొక్కిసలాట చోటు చేసుకుని 180మంది యాత్రికులు చనిపోగా పలువురు గాయాలపాలయ్యారు. 2001లో ఓ తొక్కిసలాట చోటుచేసుకుని 35మంది చనిపోయారు. 2004లో సైతాన్ స్టోన్పై రాళ్లు విసిరే సమయంలో తొక్కిసలాట చోటుచేసుకుని దాదాపు 250మంది ప్రాణాలు విడిచారు. 2006లో కూడా సైతాన్ స్టోన్పై రాళ్లు విసిరే క్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుని 350మంది చనిపోయారు. 2015 సెప్టెంబర్ 12న మక్కామసీదులో ఓ భారీ క్రేన్ కూలిపోయి దాదాపు 110మంది ప్రాణాలు విడిచారు. 2015 సెప్టెంబర్ 24న తొక్కిసలాట చోటుచేసుకుని 453 మంది చనిపోగా 750 మందికి పైగా గాయాలపాలయ్యారు.