hamsa vahanam
-
Vijayawada: హంస వాహనంపై స్వామి వారు జల విహారం (ఫొటోలు)
-
హంసవాహనంపై ఖాద్రీ లక్ష్మీ నృసింహుడు
కదిరి : ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి గురువారం రాత్రి హంసవాహనంపై ఊరేగుతూ తన భక్తులకు దర్శనభాగ్యం కల్గించారు. భక్త జనుల గోవింద నామస్మరణల మధ్య శ్రీవారు విద్యల తల్లి సరస్వతీదేవి రూపంలో భక్తులను కటాక్షించారు. చేతిలో వీణ, విశేష దివ్యాభరణాలు, పట్టు పీతాంరాలు ధరించిన స్వామివారు తిరువీధుల్లో ఊరేగారు. పాలు, నీళ్లు వేరు చేసినట్లే గుణా వగుణ విచక్షణా ఙ్ఞానానికి సంకేతం హంస. ఇహలోక బంధ విముక్తుడైన జీవుని ఆత్మను హంసతో పోలుస్తారు. అలాంటి హంసపై పరమహంస అయిన లక్ష్మీనారసింహుడు ఊరేగడం నయనానందకరం. హంస అనే శబ్దానికి అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చే పరిశుద్ధమైన మనోమందిరమని కూడా అర్థం ఉందని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. పరమాత్మ వేదోపదేశాన్ని హంస రూపంలోనే చేసినందున తుచ్చమైన కోర్కెల అంధకారం వీడి శాశ్వతమైన పరబ్రహ్మ చెంతకు చేరే ముక్తిమార్గం వైపు నడవాలని ఈ హంసవాహనం ద్వారా స్వామివారు తన భక్తులకు చాటిచెప్పారని భక్తుల ప్రతీతి. ఆలయానికి కాలినడకన రాలేకపోతున్న భక్తుల కోసం స్వామివారే తన భక్తుల చెంతకు వచ్చారని ప్ర«ధాన అర్చకులు వివరించారు. తిరువీధుల గుండా స్వామివారిని చూసేందుకు భక్తులు కిక్కిరిసిపోయారు. ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పి పూజలు నిర్వహించారు. ఉభయ దారులుగా పట్టణానికి చెందిన తోటంశెట్టి రాజుగోపాల్శెట్టి కుటుంబీకులు వ్యవహరించారని ఆలయ కమిటీ చైర్మన్ నరేంద్రబాబు, ఆలయ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. -
నేడు హంసవాహనంపై ఊరేగనున్న లక్ష్మీనారసింహుడు
కదిరి : ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి హంసవాహనంపై ఊరేగుతూ తన భక్తులకు దర్శనభాగ్యం కల్గిస్తారు. భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య శ్రీవారు తిరువీధుల గుండా విహరిస్తారు. ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పి పూజలు నిర్వహించిన మీదట యాగశాల ప్రవేశం, నిత్యహోమంతో ప్రారంభమై శ్రీవారి తిరువీధుల మండప ఉత్సవాలు నిర్వహిస్తారు. కల్యాణోత్సవం అనంతరం శ్రీవారు తిరువీధుల్లో విహరించడానికి బ్రహ్మదేవుడు తన ప్రియ వాహనం హంసను పంపుతారని భక్తుల నమ్మకం. హంస ఏవిధంగా నీటిని, పాలను వేరుచేస్తుందో లక్ష్మీనారసింహుడు సైతం భక్తుల పాప, పుణ్యాలను వేరు చేసి మోక్షాన్ని ప్రసాదిస్తారని ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు, పార్థసారథి ఆచార్యులు చెబుతున్నారు. ఉత్సవానికి ఉభయ దారులుగా పట్టణానికి చెందిన తోటంశెట్టి రాజగోపాల్శెట్టి కుటుంబీకులు వ్యవహరిస్తారని ఆలయ కమిటీ చైర్మన్ పచ్చిపులుసు నరేంద్రబాబు, ఆలయ సహాయ కమిషనర్ దొడ్డా వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నారు. -
హంస వాహనంపై శ్రీవారి దర్శనం
-
హంస వాహనంపై పరమహంస