Hyderabad Latest News
-
మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు చేయండి
ఉస్మానియా యూనివర్సిటీ: యూనివర్సిటీలలో నూతన పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని, విద్యార్థులు, పరిశోధకులు మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. బుధవారం ఓయూ క్యాంపస్ సైన్స్ కాలేజీ ఫిజిక్స్ విభాగంలో మల్టీ ఫంక్షనల్ మెటీరియల్స్ ఫర్ సొసైటల్ అప్లికేషన్స్ అనే అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. కార్యక్రమానికి వీసీ ప్రొ.కుమార్ అధ్యక్షత వహించగా ఓయూ ఛాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. సమాజ అవసరాలు తీర్చేలా పరిశోధనలు జరగాలని అన్నారు. పరిశోధన ఫలాలు ప్రధానంగా గిరిజనులకు చేరాలన్నారు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో విభిన్న విభాగాలు కలసి పనిచేయాలని, తద్వారా నాణ్యతమైన ఉత్పత్తులు చౌకగా లభిస్తాయన్నారు. పరిశోధనలలో ఓయూ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతోందని వీసీ ప్రొ.కుమార్ అన్నారు. అంతరం సదస్సు సావనీర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సదస్సు చైర్మన్, హెడ్ ప్రొ.శ్రీనివాస్, ఏఆర్సీఐ డైరెక్టర్ డా.విజయ్, ఎఎండీ డైరెక్టర్ ధీరజ్ పాండే, ప్రొ.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. – గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ -
ఎంసీఈఎంఈని సందర్శించిన ఆర్మీ చీఫ్
కంటోన్మెంట్: టెక్నాలజీ పరంగా భవిష్యత్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆర్మీ సంసిద్ధంగా ఉండాలని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీఓఏఎస్) జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. బుధవారం ఆయన సికింద్రాబాద్లోని మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ (ఎంసీఈఎంఈ)ని సందర్శించారు. ‘ఆత్మ నిర్భర్’లో భాగంగా ఎంసీఈఎంఈ పరిధిలోని ల్యాబరేటరీల్లో రూపొందించిన అధునాత పరికరాలు, చేపట్టిన ప్రాజెక్టులను పరిశీలించారు. డ్రోన్లు, అటానమస్ రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఈఎంఈ టెక్నీషియన్స్ సామర్థ్యాన్ని పరిశీలించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈఎంఈలో చోటు చేసుకుంటున్న మార్పుల పట్ల సీఓఏఎస్ సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. -
ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
లింగోజిగూడ: శివారు ప్రాంతాల ఏటీఎంలే లక్ష్యంగా చేసుకోని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.4 లక్షల నగదు, కారు, వివిధ రకాల పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఎల్బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ కమిషనర్ సుధీర్బాబు వివరాలు వెల్లడించారు. రాజస్తాన్లోని డీగ్ జిల్లా సందీక గ్రామానికి చెందిన రాహుల్ అలియాజ్ రాహుల్ ఖాన్, మధ్యప్రదేశ్లో జేసీబీ మెకానిక్గా పని చేస్తున్న సందీక గ్రామానికి చెందిన జాహుల్ భాదన్ ఖాన్, జల్పల్లి షాజహాన్ కాలనీకి చెందిన ఎండీ సర్ఫారాజ్లు ఓ ముఠాగా ఏర్పడి ఏటీఎంలలో చోరీలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గత ఫిబ్రవరి 22 నుంచి 26 రావిర్యాల, పహడీషరీఫ్, బాలాపూర్, జల్పల్లి, బీబీనగర్, భువనగిరి, మైలార్దేవ్పల్లి ప్రాంతాల్లోని ఏటీఎంల వద్ద రెక్కీ నిర్వహించారు. చివరకు రావిర్యాల, మైలార్దేవ్పల్లి ఏటీఎంలలో చోరీ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈమేరకు ఫిబ్రవరి 26న మరికొందరు స్నేహితుల సాయంతో రావిర్యాల ఎస్బీఐ ఏటీంలో రూ.29 లక్షల 69 వేల 900 ఎత్తుకెళ్లారు. అక్కడి నుంచి మైలార్దేవ్ పల్లి, మధుబాన్ కాలనీలో మరో ఎస్బీఐ ఏటీఎంలో చోరికి ప్రయత్నించగా మిషన్లో మంటలు రావడంతో అక్కడి నుంచి నాందేడ్ మహారాష్ట్ర మీదుగా పారిపోయారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాహుల్ఖాన్, ముస్తాఖీన్ ఖాన్, వహీద్ఖాన్, షకీల్ ఖాన్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.4 లక్షల నగదు, కారు, చోరీకి ఉపయోగించిన వస్తువులు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. -
రోజు రోజుకూ పెరిగిపోతున్న పెండెన్సీ
సాక్షి, సిటీబ్యూరో: జలమండలి ట్యాంకర్ల పెండెన్సీ నానాటికీ పెరిగిపోతోంది. ముదురుతున్న ఎండలు.. అడుగంటుతున్న భూగర్భ జలాలతో తిప్పలు తప్పడంలేదు. తాగునీటితో పాటు నిత్యావసరాలకు సైతం ట్యాంకర్ల తాకిడి పెరిగింది. బుకింగ్ నుంచి డెలివరీ సమయం తగ్గించేందుకు సంబంధిత అధికారులు ఒక వైపు తీవ్ర కసరత్తు చేస్తున్నా... మరోవైపు బుకింగ్ పెండెన్సీ తారస్థాయికి చేరుతోంది. జలమండలి పరిధిలో మొత్తం 75 ఫిల్లింగ్ స్టేషన్లు ఉండగా.. 20 స్టేషన్లు మినహా మిగతా వాటిలో 24 నుంచి 48 గంటలు దాటితే కాని ట్యాంకర్లు డెలివరీ కానీ పరిస్థితి నెలకొంది. డోయెన్స్ ఫిల్లింగ్ స్టేషన్లో ఐదు రోజులు, ఎల్లారెడ్డిగూడెంలో నాలుగు రోజులు, షాపూర్నగర్, గచ్చిబౌలి–2, గాజుల రామారాం, మణికొండ, ఫతేనగర్లలో మూడు రోజులు, మిగతా ఫిల్లింగ్ స్టేషన్లలో ట్యాంకర్ల డెలివరీకి 48 గంటల సమయం పడుతున్నట్లు జలమండలి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ట్యాంకర్ యజమానుల చేతివాటం డిమాండ్ పెరగడంతో ట్యాంకర్ యజమానులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వినియోగదారులకు తెలియకుండానే వారి క్యాన్ నెంబర్ పేరిట ట్యాంకర్ను బుక్ చేసి వాణిజ్య అవసరాలకు తరలిస్తున్నారు. మరోవైపు కొందరు వినియోగదారుల సహకారంతో ట్యాంకర్లను బుక్ చేసి బ్లాక్లో డెలివరీ చేయడం పరిపాటిగా మారింది. వాస్తవంగా మాదాపూర్, బంజారాహిల్స్, మూసాపేట, మణికొండ, జూబ్లీహిల్ తదితర ప్రాంతాల నుంచి ట్యాంకర్ల డిమాండ్ పెరుగుతోంది. రోజువారీగా సెక్షన్ల పరిధిలో అత్యధికంగా ఐదు వందలపైగా ట్యాంకర్లు బుకింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అవసరానికి మించిన వినియోగంతో.. గత ఏడాదితో పోల్చితే ట్యాంకర్ల డిమాండ్ మార్చి నెలలో రెట్టింపు స్థాయిలో పెరిగింది. సాధారణంగా నగర పరిధిలో జనవరి నుంచి జూన్ రెండో వారం వరకు ట్యాంకర్లకు తాకిడి అధికంగానే ఉంటుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రతి యేటా ట్యాంకర్ల డిమాండ్ కనీసం 20 నుంచి 100 శాతం పెరుగుతూ వస్తోంది. వచ్చే నెలలో ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. వాస్తవంగా నగరంలో తాగునీటికి ఇంత డిమాండ్ ఏర్పడడానికి కారణం.. అవసరానికి మించి నీటిని వినియోగించడమేనని జలమండలి అధికారులు పేర్కొంటున్నారు. మొత్తమ్మీద 13 లక్షల నల్లా కనెక్షన్లలో కేవలం 42 వేల గృహాలు ట్యాంకర్లు బుకింగ్ చేస్తున్నట్లు జలమండలి అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో 500 మంది.. 75 రోజుల్లో 31 వేల ట్యాంకర్లు, 22 వేల మంది 90 శాతం ట్యాంకర్లను అంటే.. 2.84 లక్షల ట్యాంకర్లను బుక్ చేసినట్లు తెలుస్తోంది. సంఖ్య పెరిగినా.. వాటర్ ట్యాంకర్ల సంఖ్య పెరిగినా.. పెండెన్సీ మాత్రం తగ్గడం లేదు. వాస్తవంగా గతేడాది 69 ఫిల్లింగ్ స్టేషన్లు ఉండగా ఈ ఏడాది మరో ఆరు స్టేషన్లను పెంచారు. ఫిల్లింగ్ పాయింట్ల సంఖ్య 93 నుంచి 123కు పెరిగింది. ట్యాంకర్ల సంఖ్య 577 నుంచి 977కు చేరింది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
రాంగోపాల్పేట్: మితిమీరిన వేగంతో వచ్చిన ఓ కారు ఇద్దరు యువకులను బలి తీసుకుంది. బుధవారం ఉదయం మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ పరశురాం కథనం ప్రకారం.. బన్సీలాల్పేట్ చాచా నెహ్రూ నగర్కు చెందిన ఏడుకొండలు కుమారుడు గంటాడి దేవీ ప్రణయ్ (18), బన్సీలాల్పేట్ బీజేఆర్ నగర్కు చెందిన ఎర్రా హర్షిత్ (21) స్నేహితులు. వీరిద్దరూ మారేడుపల్లిలోని పెస్టోమెన్ అనే పెస్ట్ కంట్రోల్ సంస్థలో పని చేస్తున్నారు. రాత్రి విధులు ముగించుకున్న వీరు.. తమ యజమాని చెందిన ద్విచక్ర వాహనంపై ప్యారడైజ్ హోటల్కు వచ్చి టీ తాగారు. అనంతరం ఉదయం 4.40 గంటలకు జిమ్కు వెళ్లేందుకు ఎస్డీ రోడ్డు మీదుగా ప్యాట్నీ వైపు బైక్పై వస్తున్నారు. అదే సమయంలో కాప్రాకు చెందిన కొమురయ్య తాజ్హోటల్ వైపు వేగంగా కారు నడుపుతూ వచ్చి వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో బైక్ నడుపుతున్న దేవీ ప్రణయ్ తలకు, ఇతర భాగాలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనుక కూర్చున్న హర్షిత్కు తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందాడు. కారు డ్రైవర్ కొమురయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మూడంచెల్లో..
చెత్త సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ తిప్పలు సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ విభాగాలకు సంబంధించిన సమస్యలకు ఎంతో కొంత పరిష్కారం చూపగలుగుతున్నప్పటికీ, చెత్త సమస్యలు మాత్రం తీరడం లేదు. ఏళ్ల తరబడిగా ఉన్న ఈ సమస్య పరిష్కారానికి వివిధ చర్యలు చేపడుతున్నట్లు చెబుతున్నప్పటికీ, తగిన ఫలితాలంటూ కనిపించడం లేదు. ఇంటింటి నుంచి చెత్త సేకరణ సవ్యంగా జరగకపోవడంతో రోడ్ల వెంబడి బహిరంగ ప్రదేశాల్లో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. వీటిపై నిత్యం ఫిర్యాదులందుతున్నాయి. సోషల్ మీడియా వేదికగానూ ఫొటోలతో సహా ప్రజలు వీటిపై ఫిర్యాదు చేస్తుండటంతో ఆన్లైన్ మానిటరింగ్ విధాన్ని ప్రవేశపెట్టారు. అయినప్పటికీ ఫలితం కనిపించకపోవడంతో ఇప్పుడిక మూడు పర్యాయాలు చెత్త తరలింపును పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే రూ.1000 జరిమానాలు విధిస్తున్నా, ఇక్కడ చెత్త వేయొద్దని మైకుల్లో హెచ్చరిస్తున్నా సమస్య పరిష్కారం కాలేదు. చెత్త వేసేవారికి ఈ– పెనాల్టీల విధానాన్ని సైతం అందుబాటులోకి తెచ్చారు. వీటి వల్ల జీహెచ్ఎంసీకి పెనాల్టీల రూపేణా ఆదాయం వస్తున్నప్పటికీ, ఎక్కడ పడితే అక్కడ ఉన్న చెత్త సమస్య సమసిపోలేదు. మూడు పర్యాయాలు.. ఈ నేపథ్యంలో రోడ్ల వెంబడి చెత్త కనిపించకుండా ఉండేందుకు మూడుసార్లు పర్యవేక్షణతో, ఎక్కడ చెత్త తరలించలేదో గుర్తించి సంబంధిత సిబ్బంది, అధికారులను అప్రమత్తం చేయడం ద్వారా పరిష్కరించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ప్రవేశపెట్టిన ఈ విధానంలో మూడు అంశాల్ని పరిశీలిస్తున్నారు. 1. ఇంటింటి నుంచి చెత్త తరలించే స్వచ్ఛ ఆటోలు ఎన్ని గైర్హాజరవుతున్నాయో గుర్తించడం. 2. చెత్తను సర్కిళ్లలోని సమీప ట్రాన్స్ఫర్ స్టేషన్లకు తరలించాల్సిన ఆటోల్లో ఎన్ని పని చేయడం లేదో గుర్తించడం. 3. బహిరంగ ప్రదేశాల్లో చెత్తకుప్పలు గుట్టలుగా పోగయ్యే ప్రాంతాలను గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్గా గుర్తిస్తున్నారు. వాటిలో ఎన్నింటిని క్లీన్ చేసిందీ, ఎన్ని చేయనిదీ గుర్తిస్తున్నారు. ఈ పనుల్ని కేవలం రోజుకు ఒక్కసారి మాత్రమే కాకుండా మూడు పర్యాయాలు పర్యవేక్షిస్తున్నట్లు శానిటేషన్ విభాగం అడిషనల్ కమిషనర్ సీఎన్ రఘుప్రసాద్ తెలిపారు. ఆమేరకు.. ఉదయం 8గంటలలోగా ఎన్ని స్వచ్ఛ ఆటోలు, ట్రాన్స్ఫర్ స్టేషన్ల ఆటోలు తమ పని పూర్తిచేసింది గుర్తిస్తారు. పని చేయని ఆటోల సిబ్బందిని అలర్ట్ చేస్తారు. అలాగే జీవీపీల్లో ఎన్నింటిని శుభ్రం చేయలేదో గుర్తించి సంబంధిత సిబ్బందిని అప్రమత్తం చేస్తారు. తిరిగి మధ్యాహ్నం 1.30 గంటలకు మరోసారి పరిశీలిస్తారు. ఆ తర్వాత 2.30 గంటలకు మరోమారు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారు. ఉన్నతాధికారులు కార్యాలయాల నుంచే పరిశీలించేందుకు రియల్టైమ్లో ఆయా ప్రాంతాలు కనిపించేలా వెబ్పోర్టల్ నిర్వహిస్తున్నారు. తొలిదశలో ఉదయం 8 గంటలలోగా 30 శాతం కంటే తక్కువ పనిచేసిన వారిపై తగిన చర్యలు తీసుకోనున్నారు. తద్వారా ఒకేసారి కాకున్నా క్రమేపీ చెత్త సమస్యలు పరిష్కారమవుతాయని అధికారులు భావిస్తున్నారు. రోజుకు మూడుసార్లు పరిశీలించే యోచన -
ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
లింగోజిగూడ: శివారు ప్రాంతాల ఏటీఎంలే లక్ష్యంగా చేసుకోని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.4 లక్షల నగదు, కారు, వివిధ రకాల పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఎల్బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ కమిషనర్ సుధీర్బాబు వివరాలు వెల్లడించారు. రాజస్తాన్లోని డీగ్ జిల్లా సందీక గ్రామానికి చెందిన రాహుల్ అలియాజ్ రాహుల్ ఖాన్, మధ్యప్రదేశ్లో జేసీబీ మెకానిక్గా పని చేస్తున్న సందీక గ్రామానికి చెందిన జాహుల్ భాదన్ ఖాన్, జల్పల్లి షాజహాన్ కాలనీకి చెందిన ఎండీ సర్ఫారాజ్లు ఓ ముఠాగా ఏర్పడి ఏటీఎంలలో చోరీలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గత ఫిబ్రవరి 22 నుంచి 26 రావిర్యాల, పహడీషరీఫ్, బాలాపూర్, జల్పల్లి, బీబీనగర్, భువనగిరి, మైలార్దేవ్పల్లి ప్రాంతాల్లోని ఏటీఎంల వద్ద రెక్కీ నిర్వహించారు. చివరకు రావిర్యాల, మైలార్దేవ్పల్లి ఏటీఎంలలో చోరీ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈమేరకు ఫిబ్రవరి 26న మరికొందరు స్నేహితుల సాయంతో రావిర్యాల ఎస్బీఐ ఏటీంలో రూ.29 లక్షల 69 వేల 900 ఎత్తుకెళ్లారు. అక్కడి నుంచి మైలార్దేవ్ పల్లి, మధుబాన్ కాలనీలో మరో ఎస్బీఐ ఏటీఎంలో చోరికి ప్రయత్నించగా మిషన్లో మంటలు రావడంతో అక్కడి నుంచి నాందేడ్ మహారాష్ట్ర మీదుగా పారిపోయారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాహుల్ఖాన్, ముస్తాఖీన్ ఖాన్, వహీద్ఖాన్, షకీల్ ఖాన్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.4 లక్షల నగదు, కారు, చోరీకి ఉపయోగించిన వస్తువులు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. -
పత్తర్గట్టీ భవనం పెచ్చులూడి..ఇరువురికి గాయాలు
దూద్ బౌలి: పాతబస్తీలోని చారిత్రక కట్టడం పత్తర్గట్టీ భవనం పెచ్చులూడి ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి. బుధవారం రాత్రి వందలాది మంది రంజాన్ షాపింగ్లో మునిగి ఉండగా..అకస్మాత్తుగా పత్తర్గట్టీ భవనంలోని ఓ షాపు కిటికీ పైనుంచి గచ్చు పెచ్చులు ఊడిపడగా షాపు ముందున్న ఓ చిరువ్యాపారి, మరో యువకుడు గాయపడ్డారు. సమాచారం అందుకున్న చార్మినార్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పురావస్తు శాఖ అధికారులు చారిత్రాత్మక కట్టడం అయినా పత్తర్గట్టి భవనాన్ని పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
పూజారికి జీవిత ఖైదు
ప్రియురాలి హత్య కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు శంషాబాద్ రూరల్/రంగారెడ్డి జిల్లా కోర్టులు: తనకు వివాహం జరిగిందనే విషయాన్ని దాచి.. ఆలయానికి వచ్చే మరో మహిళతో ప్రేమాయణం సాగించాడు. ప్రియురాలు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో.. ఆమెను వదిలించుకునేందుకు హత్య చేసిన పూజారికి కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. రెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఈ కేసు తీర్పు బుధవారం వెలువడింది. ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సరూర్నగర్లో వెంకటేశ్వర కాలనీలో నివసించే పూజారి వెంకట సూర్యసాయి కృష్ణ (36)కు గతంలోనే పెళ్లి జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన కారుగంటి అప్సర (30) తరచూ ఇతను పూజారిగా ఉన్న ఆలయానికి వస్తుండేది. ఆమెతో చనువు పెంచుకున్న సాయి కృష్ణ ప్రేమాయణం సాగించాడు. తనకు వివాహం అయిందనే విషయం దాచిపెట్టి ఆమెతో వివాహేతర సంబంధాన్ని ఏర్పర్చుకున్నాడు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని సాయి కృష్ణపై అప్సర ఒత్తిడి చేయగా.. ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. కారులో తీసుకొచ్చి.. కోయంబత్తూరు తీసుకెళ్లాలని అప్సర సాయికృష్ణను కోరగా.. ఇదే అదనుగా భావించి ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్సరను 2023 జూన్ 3న సరూర్నగర్ నుంచి రాత్రి తన కారులో శంషాబాద్ తీసుకొచ్చి.. అక్కడే ఓ రెస్టారెంట్లో భోజనం చేశారు. ఆ తర్వాత నర్కూడలోని నవరంగ్ వెంచరులోకి తీసుకెళ్లగా.. అప్సర కారులోనే నిద్రలోకి జారుకుంది. ఈ సమయంలో ఆమె ముఖంౖపై కవర్ కప్పి ఊపిరి ఆడకుండా చేశాడు. స్పృహ కోల్పోయిన అప్సర తలపై రాయితో బాది హత్య చేశాడు. ఈ క్రమంలో అప్సర మిస్సింగ్ కేసు దర్యాప్తులో ఈ దురాఘతం వెలుగు చూసింది. అప్పటి ఇన్స్పెక్టర్ ఎ.శ్రీధర్కుమార్ చార్జ్షీట్ ఫైల్ చేయగా.. బాధితురాలి తరఫున ఈ కేసును పీపీ రవికుమార్ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో సాయి కృష్ణను ముద్దాయిగా నిర్ధారించిన రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయమూర్తి వై.జయప్రసాద్ బుధవారం అతడికి జీవిత ఖైదు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన కోర్టు డ్యూటీ ఆఫీసర్ ఏఎస్ఐ రామిరెడ్డి, కానిస్టేబుల్ ఎండీ.ఖాజాపాషాను ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి అభినందించారు. ఈ తీర్పుతో తన కూతురు ఆత్మకు శాంతి కలిగిందని, చివరకు న్యాయమే గెలిచిందని అప్సర తండ్రి శ్రీధర్ శర్మ ఆనందం వ్యక్తంచేశారు. -
మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు చేయండి
ఉస్మానియా యూనివర్సిటీ: యూనివర్సిటీలలో నూతన పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని, విద్యార్థులు, పరిశోధకులు మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. బుధవారం ఓయూ క్యాంపస్ సైన్స్ కాలేజీ ఫిజిక్స్ విభాగంలో మల్టీ ఫంక్షనల్ మెటీరియల్స్ ఫర్ సొసైటల్ అప్లికేషన్స్ అనే అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. కార్యక్రమానికి వీసీ ప్రొ.కుమార్ అధ్యక్షత వహించగా ఓయూ ఛాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. సమాజ అవసరాలు తీర్చేలా పరిశోధనలు జరగాలని అన్నారు. పరిశోధన ఫలాలు ప్రధానంగా గిరిజనులకు చేరాలన్నారు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో విభిన్న విభాగాలు కలసి పనిచేయాలని, తద్వారా నాణ్యతమైన ఉత్పత్తులు చౌకగా లభిస్తాయన్నారు. పరిశోధనలలో ఓయూ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతోందని వీసీ ప్రొ.కుమార్ అన్నారు. అంతరం సదస్సు సావనీర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సదస్సు చైర్మన్, హెడ్ ప్రొ.శ్రీనివాస్, ఏఆర్సీఐ డైరెక్టర్ డా.విజయ్, ఎఎండీ డైరెక్టర్ ధీరజ్ పాండే, ప్రొ.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. – గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ -
ఆర్డర్ల పేరుతో అందినంత స్వాహా
సాక్షి, సిటీబ్యూరో: నగర వ్యాపారిని ఫోన్ ద్వారా సంప్రదించి, భారీ ఆర్డర్ల పేరుతో ఎర వేసి, మోసం చేసిన కేసులో ఇద్దరు సైబర్ నేరగాళ్లను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో పట్టుబడిన వీరిపై దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 17 కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించామని డీసీపీ దార కవిత బుధవారం వెల్లడించారు. ఇంటర్నెట్ ద్వారా నగర వ్యాపారి ఫోన్ నెంబర్ సంగ్రహించిన సైబర్ నేరగాళ్లు సంప్రదించారు. ఆయన ఉత్పత్తులకు ఉత్తరాదిలో మార్కెటింగ్ చేస్తామని, భారీ ఆర్డర్లు తెస్తామంటూ నమ్మబలికారు. దీనికోసం తమ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. వీరి మాట నమ్మిన వ్యాపారి రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించారు. ఆపై వ్యాపారి ఉత్పత్తులకు దేశ, విదేశాల్లో భారీ డిమాండ్ ఉన్నట్లు, వారి నుంచి ఆర్డర్లు వస్తున్నట్లు సైబర్ నేరగాళ్లు నకిలీ ఈ–మెయిల్స్ సృష్టించారు. ఇవన్నీ నిజమేనని సదరు వ్యాపారి నమ్మారు. ఆ సరుకు సరఫరాకు ముందు తమకు రూ.9.5 లక్షల చెల్లించాలని చెప్పిన సైబర్ నేరగాళ్లు ఆ మొత్తం తన ఖాతాలో పడిన తర్వాత స్పందించడం మానేశారు. దీంతో మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ కె.ప్రసాద్రావు నేతృత్వంలో కానిస్టేబుళ్లు జి.క్రాంతి కుమార్ రెడ్డి, ఎ.సతీష్, ఎస్.శ్రీనివాస్రెడ్డి, జె.వెంకటేష్, జి.రాకేష్లతో కూడిన బృందం దీన్ని దర్యాప్తు చేసింది. బ్యాంకు ఖాతాలతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్లిన అధికారులు ఢిల్లీలో ఓ డమ్మీ కంపెనీకి సీఈఓగా ఉన్న అమర్నాథ్ సింగ్, మార్కెటింగ్ హెడ్గా పని చేస్తున్న రణ్వీర్ సింగ్ బాధ్యులని తేల్చారు. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం వీరిని అరెస్టు చేసింది. వీరిపై మహారాష్ట్ర, పంజాబ్ల్లో రెండేసి, రాజస్థాన్లో 5, హర్యానా, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, మధ్యప్రదేశ్ల్లో ఒక్కోటి చొప్పున కేసులు ఉన్నట్లు గుర్తించారు. నగరవాసికి టోకరా వేసినసైబర్ నేరగాళ్లు ఢిల్లీలో ఇద్దరిని అరెస్టు చేసినసిటీ సైబర్ కాప్స్ -
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం
గచ్చిబౌలి: రాష్ట్రంలో కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. బుధవారం గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో సీ్త్రనిధి 12వ సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మొదలైన సీ్త్రనిధి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు. అవకాశాలు ఇస్తే మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారని, కోటిమంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. కోవిడ్లో తల్లిదండ్రులను కోల్పోయిన యువతులను సీ్త్రనిధి సభ్యులుగా చేర్చి ఆదుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అమ్మాయిలు గౌరవంగా ఉండే విధంగా మహిళాఆర్మీ కృషి చేస్తుందని, అందుకు త్వరలోనే మార్యదర్శకాలు రూపొందిస్తామని చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా సీ్త్ర నిధికి భవనం కేటాయిస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. సీ్త్రనిధి బ్యాంక్పై సెర్ప్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రవిందర్రావు రూపొందించిన పాటను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. అనంతరం డివిడెండ్ ఫండ్ చెక్ను మహిళా సమాఖ్య సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈఆర్పీ సీఈఓ దివ్య, సీ్త్రనిధి అధ్యక్షురాలు ఇందిర, ఎండీ విద్యాసాగర్రెడ్డి, కోశాధికారి సరస్వతి, కొమురంభీం అడిషనల్ కలెక్టర్ దీపక్తివారి, వరంగల్ అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, కోఆపరేటివ్ సొసైటీస్ రిజిస్ట్రార్ సురేంద్రమోహన్, మెప్మా మిషన్ డైరెక్టర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
‘ఎస్టేట్స్’ దూకుడు!
సాక్షి, సిటీబ్యూరో: ఆర్థిక సంవత్సరం ముగియవస్తుండటంతో ఆదాయ లక్ష్యాలను చేరుకునేందుకు జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాలు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. ప్రభుత్వం ఆస్తిపన్ను బకాయిల వడ్డీలపై 90 శాతం రాయితీ కూడా ఇవ్వడంతో ట్యాక్స్ సెక్షన్ సెలవుల్లేకుండా పని చేస్తోంది. దాంతోపాటు ట్రేడ్ లైసెన్సుల విభాగం, ఎస్టేట్స్ విభాగాలు సైతం టార్గెట్లు చేరుకునేందుకు ముమ్మరంగా పర్యటిస్తూ దూకుడు పెంచాయి. ముఖ్యంగా, ఇటీవలి కాలం వరకు తన ఆస్తులేమిటో, ఎంతమొత్తం రావాలో కూడా పెద్దగా పట్టించుకోని ఎస్టేట్స్ విభాగం దూకుడు పెంచింది. ఆ విభాగానికి నగరంలోని పలు ప్రాంతాల్లో షాపింగ్ కాంప్లెక్స్లు, మార్కెట్లు ఉండటం తెలిసిందే. వాటిలో వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు ఎంతో ఆదాయాన్ని పొందుతున్నప్పటికీ, జీహెచ్ఎంసీకి చెల్లించాల్సిన నామమాత్రపు అద్దెలు మాత్రం చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో అద్దెల్ని కచ్చితంగా వసూలు చేయాలని భావించిన ఎస్టేట్స్ అధికారులు నిబంధనల మేరకు నోటీసులు, హియరింగ్లు వంటివి నిర్వహించారు. అంతిమంగా దుకాణాలను సీజ్ చేసే చర్యలు చేపట్టారు. ఈ నెల 8వ తేదీన తొలుత ఈ చర్యలు ప్రారంభించాక, కొద్దిమేర ఫలితం కనిపించింది. తిరిగి మళ్లీ పరిస్థితి షరామామూలుగా మారడంతో మంగళ, బుధ వారాల్లో సంబంధిత అధికారులు, సిబ్బంది దూకుడు పెంచారు. ప్రముఖ వాణిజ్య ప్రాంతాల్లో , భారీ వ్యాపాలు జరిగే ప్రాంతాల్లో ఉన్న కాంప్లెక్స్లలో భారీ బకాయిల అద్దెలున్న దుకాణాలను సీజ్ చేశారు. ● వీటితోపాటు సికింద్రాబాద్ ఓల్డ్ జైల్ కాంప్లెక్స్, పుత్లిబౌలి తదితర ప్రాంతాల్లోనూ కొన్ని షాపుల్ని సీజ్ చేశారు. వెరసి మొత్తం 223కు పైగా దుకాణాల్ని సీజ్ చేశారు. ● దీంతో దిగివచ్చిన వ్యాపారులు చెల్లించాల్సిన అద్దెల బకాయిల్లో కొంత చెల్లించి, మిగతా త్వరలో చెల్లిస్తామని వేడుకున్నారు. పుత్లిబౌలిలోని రెండు దుకాణాల నుంచే రూ.2.36 లక్షలు వసూలైంది. అలా రెండు రోజుల్లో రూ. 46 లక్షల అద్దెలు వసూలయ్యాయి. సీజ్ చేసిన మిగతా దుకాణాల నుంచీ అద్దెలు రాగలవని అధికారులు ఆశిస్తున్నారు. అలా ప్రస్తుతం సీజ్ చేసిన దుకాణాల నుంచి రూ. కోటికి పైగా వచ్చే అవకాశముందని చెబుతున్నారు. అద్దెలు చెల్లించని దుకాణాల సీజ్ ● చర్యలతో దిగివస్తున్న నిర్వాహకులు ● రెండు రోజుల్లో 223 దుకాణాలకు పైగా సీజ్ ● రూ. కోటికి పైగా ఆదాయం సీజ్ చేసిన దుకాణాలు ఇలా.. ఎక్కడ ఎన్ని కోఠి సబ్వే 67 సుల్తాన్బజార్ కాంప్లెక్స్ 53 పటాన్చెరు 56 మంగళ్హాట్ మార్కెట్ 24 కుషాయిగూడ 23 -
పది వేల మందితో మళ్లీ వస్తాం
ఇబ్రహీంపట్నం/యాచారం: పది వేల మంది నిరుపేదలతో మరోసారి రామోజీ ఫిలిం సిటీకి వస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ హెచ్చరించారు. యాజమాన్యం ఆక్రమించిన పేదల ఇళ్ల స్థలాలను వదిలేసే వరకూ పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. ఫిలింసిటీ వద్ద ఆందోళన నిర్వహించిన సీపీఎం నేతలను అరెస్టు చేసిన పోలీసులు వీరిని ఇబ్రహీంపట్నం, యాచారం పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదలకు మంజూరు చేసిన ఇళ్ల స్థలాల వద్దకు వెళ్తున్న లబ్ధిదారులను పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని..ఆ భూములతో పోలీసులకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. 2007లో అప్పటి ప్రభుత్వం సుమారు 600 మందికి 20 ఎకరాల్లో 60 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించి సర్టిఫికెట్లు ఇచ్చిందని.. అప్పటి నుంచి ఈ భూములు రామోజీ కబ్జాలోనే ఉన్నాయని ఆరోపించారు. ఈ సమస్యను పరిష్కరించాలని పలుమార్లు రెవెన్యూ అధికారులకు మొర పెట్టుకున్నా ఫలితంలేకపోవడంతో వారి స్థలాల్లోకి లబ్ధిదారులు వెళ్లారన్నారు. పోలీసులు రామోజీ యాజమాన్యానికి తొత్తులుగా మారి పేదలను అడ్డుకుంటున్నారని..రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకోవాల్సిన విషయంలో పోలీసులు తలదూర్చడం తగదన్నారు. రామోజీ కబంధ హస్తాల్లో ఉన్న మరో 300 ఎకరాల ప్రభుత్వ భూమిని సైతం బయటకు తీస్తామని అన్నారు. పేదల భూములు కబ్జా పెట్టిన రామోజీ యాజమాన్యంపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. పేదల పక్షాన పోరాడుతున్న తమపై కేసులు బనాయించడం సరికాదన్నారు. నేడు, రేపు ఆందోళనలు: సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య పోలీసుల అక్రమ అరెస్ట్లను నిరసిస్తూ గురు, శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పోలీసుల తోపులాటలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు పి.జగన్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. బుగ్గరాములు, సామేల్, జగదీశ్, జగన్, జంగయ్య, కిషన్, వెంకటేశ్, నర్సిరెడ్డి, ఎల్లేశ్, తులసిగారి నర్సింహ, అరుణ, స్వప్న, ప్రకాశ్కారత్, చరణ్, ఆనంద్, శ్రీకాంత్, శివ యాదగిరి, నర్సింహ తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. పోలీసుల కస్టడీలో ఉన్న వారిని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పి.అంజయ్యపరామర్శించారు. అరెస్టులతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరన్నారు. పేదల భూముల్లో గుడిసెలు వేస్తాం రెవెన్యూ సంబంధిత విషయంలో పోలీసుల జోక్యం తగదు రామోజీ యాజమాన్యంపై కేసులు పెట్టాలి త్వరలో పది వేల మందితోగుడిసెలు వేస్తాం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
సమాజ పరివర్తనే సంఘ్ ప్రధాన లక్ష్యం
కాచిగూడ: సమాజ పరివర్తనే ప్రధాన లక్ష్యంగా సంఘ్ పనిచేస్తోందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తెలంగాణ ప్రాంత కార్యదర్శి కాచం రమేష్ అన్నారు. బుధవారం బర్కత్పుర కేశవ నిలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ప్రాంత సంఘ్ చాలక్ బర్ల సురేందర్ రెడ్డితో కలిసి ఆయాన మాట్లాడుతూ బెంగళూర్లో ఇటీవల జరిగిన ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రతినిధుల సభలో చేసిన తీర్మానాలు, సంఘ్ శతాబ్ది సంవత్సరం సందర్భంగా తెలంగాణ, దేశ వ్యాప్తంగా చేపట్టనున్న ప్రత్యేక కార్యక్రమాలను వివరించారు. నూరేళ్ళ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సంఘ్ ఆలోచనలు, భావాలను సమాజం వద్దకు తీసుకెళ్లేలా వచ్చే నవంబర్–డిసెంబర్–జనవరి నెలల్లో దేశంలో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి వెళ్లడానికి జన సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. సమాజ పరివర్తనకు సంబంధించిన అంశాలను ప్రజలకు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రతి లక్ష మంది ఒక యూనిట్గా హిందూ సమాజ ఉత్సవాలు చేస్తామని, ఇందులో స్థానిక నేతలు, హిందూ సంస్థలకు భాగస్వామ్యం కల్పించి హిందుత్వాన్ని, ధర్మాన్ని సమాజంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు. -
ఫ్లాగ్ డే ఫండ్కు ఎస్బీఐ భారీ విరాళం
సాక్షి, సిటీబ్యూరో: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని హైదరాబాద్ సర్కిల్ ఉద్యోగులు తెలంగాణ సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి రూ. 37.16 లక్షలు విరాళంగా అందించి తమ దాతృత్వాన్ని, సామాజిక బాధ్యత పట్ల నిబద్ధతను ప్రదర్శించారు. ఇందులో భాగంగా ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి చైర్పర్సన్, తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు రూ. 37,16,500 విలువైన చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో సైనిక్ వెల్ఫేర్ (తెలంగాణ) డైరెక్టర్ కల్నల్ రమేష్ కుమార్, జితేంద్ర కుమార్ శర్మ డీజీఎం, సీఎస్ఓ కెప్టెన్ సంజయ్ అపగే పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఎస్బీఐ సిబ్బంది సామాజిక చొరవను అభినందించారు. నగరానికి నిధుల కేటాయింపు అంతంతే.. – అసెంబ్లీలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరం నుంచి రాష్ట్ర ఖాజానాకు సింహభాగం ఆదాయం వచ్చి చేరుతున్నా..బడ్జెట్లో నిధుల కేటాయింపు మాత్రం మొక్కుబడిగా ఉందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్లో జీహెచ్ఎంసీ, జలమండలికి, ఇతర సంస్థలకు నామమాత్రంగా నిధులు కేటాయించారని గుర్తు చేశారు. వాటర్బోర్డుకు కేవలం రూ. 3,383 కోట్ల కేటాయించారని, అందులో 3,083 కోట్ల అప్పుల చెల్లింపు, ఉచిత నీటి రియింబర్స్మెంట్ కింద రూ.300 కోట్ల కేటాయించారని గుర్తు చేశారు. అభివృద్ధి పనులుకు ఏ మాత్రం కేటాయించలేదని పేర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగు కోసం తక్షణమే రూ. 1500 కోట్ల కేటాయించాలన్నారు. జీహెచ్ఎంసీకి నిధులు కేటాయిపు పెంచాలన్నారు. నగర అభివృద్ధికి పెద్దపీట వేయాలన్నారు. విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కారించాలని, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు మంజూరు చేయాలని రాజశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు. -
నిందితుడి రిమాండ్
న్యాయవాది హత్య కేసులోసంతోష్నగర్: న్యాయవాదిని హత్య చేసిన కేసులో నిందితుడిని ఐఎస్ సదన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. చంపాపేట్ ఈస్ట్ మారుతీనగర్కు చెందిన ఎర్రబాపు ఇజ్రాయిల్ (56)కు సంతోష్నగర్లోని శ్రీనివాస అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్ ఉంది. ఇజ్రాయిల్ శ్రీనివాస అపార్ట్మెంట్లో ఎలాంటి ఎలక్ట్రికల్ పని ఉన్నా తూర్పు మారుతీనగర్ శ్మశాన వాటిక గదిలో ఉండే గులాం దస్తగిరీ (49)ని పిలిపించి చేయించేవాడు. కాగా.. శ్రీనివాస అపార్ట్మెంట్లో ఓ వ్యక్తి, ఆయన భార్య వాచ్మెన్లుగా పని చేస్తున్నారు. దీంతో దస్తగిరీ అపార్ట్మెంట్కు రాకపోకలు సాగిస్తున్న సమయంలో సదరు మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న న్యాయవాది ఇజ్రాయిల్ వాచ్మెన్ దంపతులను వారి స్వగ్రామానికి పంపించాడు. అనంతరం దస్తగిరీ తరచూ న్యాయవాది ఇజ్రాయిల్ వద్దకు వచ్చి వాచ్మెన్ను హత్య చేస్తే తనకు బెయిల్ ఇప్పించాలని కోరేవాడు. దంపతులను తిరిగి పిలిపించి తమను కలపాలని దస్తగిరీ సూచించగా.. దానికి న్యాయవాది ఇజ్రాయిల్ నిరాకరించారు. దీంతో ఇజ్రాయిల్పై కక్ష పెంచుకున్న దస్తగిరీ ఆయన కదలికలను కొన్ని రోజులుగా గమనించడం ప్రారంభించాడు. ఇందులో భాగంగా ఈ నెల 24 ఉదయం 8.50 గంటల సమయంలో న్యాయవాది ఇజ్రాయిల్ మార్నింగ్ వాకింగ్కు వెళ్లి తిరిగి తన యాక్టివాపై తిరిగి ఇంటి వస్తున్నాడు. న్యూ మారుతీనగర్ కాలనీలో కాపు కాసి వేచి ఉన్న దస్తగిరీ.. ఇజ్రాయిల్పై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో తీవ్ర గాయాలకు గురైన ఇజ్రాయిల్ను స్థానికులు, కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారుడ. దీనిపై న్యాయవాది ఇజ్రాయిల్ కూతురు ద్రాక్షవల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం నిందితుడు గులాం దస్తగిరీని అరెస్ట్ చేసి, అతని నుంచి కత్తి, సెల్ఫోన్, హోండా యాక్టివా ద్విచక్ర వాహనం, హెల్మెట్, కంటి అద్దాలు, చెప్పులను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. -
దక్షిణాది రాష్ట్రాలకు నిధుల కేటాయింపులు పెరగాలి
బంజారాహిల్స్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఆర్థిక శాస్త్ర విభాగం, తెలంగాణ రాష్ట్ర ఉన్నత మండలి, ఐసీఎస్ఎస్ఆర్–దక్షిణ భారతదేశ ప్రాంతీయ కేంద్రం ఆధ్వర్యంలో ‘భారతదేశంలో ఆర్ధిక సమాఖ్యవాదం: వికేంద్రీకరణ, అభివృద్ధి, ఆర్ధిక గతిశీలత’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు మంగళవారం ప్రారంభమైంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (న్యూఢిల్లీ) విశిష్ట అధ్యాపకులు పినాకి చక్రవర్తి ముఖ్యఅతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16వ ఆర్థిక సంఘం కోవిడ్ తర్వాత వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఆర్థిక అభివృద్ధి, నిర్వహణపై దృష్టి సారించిందన్నారు. రాష్ట్రాలు ఆర్థిక స్వయం ప్రతిపత్తి పొందడానికి పన్ను వికేంద్రీకరణను 42 శాతానికి ఆర్థిక కమిషన్ పెంచిందని వెల్లడించారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, అంబేడ్కర్ వర్సిటీ ఉపకులపతి ఘంటా చక్రపాణి మాట్లాడుతూ సామాజిక ధర్మంలో భాగంగా సమాజంలోని అన్ని వర్గాలకు అంబేడ్కర్ విశ్వవిద్యాలయం సేవలు అందిస్తుందన్నారు. గత దశాబ్ద కాలంగా కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు జరగాల్సిన స్థాయిలో చేయకున్నా దక్షిణ భారతదేశం అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. ఉత్తర–దక్షిణ ప్రాంతాలకు నిధుల కేటాయింపులపై సమగ్ర చర్చ జరగాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సభ్యులు అరవింద్ వారియర్, విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ పుష్పా చక్రపాణి, సామాజిక శాస్త్రాల విభాగ డీన్ వడ్డాణం శ్రీనివాస్, కృస్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాతీయ సదస్సులో నిపుణులు -
రూ.1.30 కోట్ల నగదు పట్టివేత
చాంద్రాయణగుట్ట: ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.1.30 కోట్ల నగదును చాంద్రాయణగుట్ట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ గురునాథ్ తెలిపిన వివరాల ప్రకారం..చాంద్రాయణగుట్ట పూల్బాగ్ జంక్షన్ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో అటుగా వచ్చిన కియా కారును నిలిపి తనిఖీ చేయగా మహ్మద్ యూసుఫుద్దీన్, సయ్యద్ అబ్దుల్ హదీల వద్ద రూ.1.30 కోట్ల నగదు లభ్యమయ్యింది. డబ్బుకు సంబంధించిన వివరాలు కోరగా, రియల్ ఎస్టేట్ వ్యాపారులమని, ల్యాండ్ కొన్నామని, అందుకు చెల్లించాల్సి ఉందని వారు పేర్కొన్నారు. సరైన పత్రాలు చూపని కారణంగా ఐటీ అధికారులకు అప్పగించారు. ట్రేడింగ్ ఫ్రాడ్లో అకౌంట్ సప్లయర్ అరెస్టు సాక్షి, సిటీబ్యూరో: ట్రేడింగ్ ఫ్రాడ్ చేసే సైబర్ నేరగాళ్లకు అవసరమైన బ్యాంకు ఖాతాలు అందిస్తున్న గుర్గావ్ వాసిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిపై దేశంలో 43 కేసులు, రాష్ట్రంలో ఆరు కేసులు ఉన్నట్లు డీసీపీ దార కవిత మంగళవారం తెలిపారు. రాజస్థాన్కు చెందిన హిమాన్షు స్వామి ప్రస్తుతం గుర్గావ్లో నివసిస్తున్నాడు. ఇతడు పవన్ జైన్తో కలిసి బ్యాంకు ఖాతాలు సమీకరిస్తూ సైబర్ నేరగాళ్లకు అందిస్తున్నాడు. నగరానికి చెందిన ఓ వ్యక్తికి సోషల్మీడియా ద్వారా ఎర వేసిన సైబర్ నేరగాళ్లు ట్రేడింగ్ పేరుతో రూ.20 లక్షలు స్వాహా చేశారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు హిమాన్షు, పవన్ పాత్రను గుర్తించారు. గుర్గావ్ వెళ్లిన ప్రత్యేక బృందం హిమాన్షును అరెస్టు చేసింది. పరారీలో ఉన్న పవన్ కోసం గాలిస్తోంది. బస్సు కింద పడి మహిళ మృతి బొల్లారం: ఉద్యోగానికి బయలుదేరిన మహిళ యాక్సిడెంట్కు గురై మృతిచెందిన ఘటన తిరుమలగిరి పోలీసు స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. తిరుమలగిరి పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని త్రివేణి కుమారి(43) అల్వాల్ ఎంఈఎస్ కాలనీలో నివాసం ఉంటోంది. మంగళవారం ఉదయం ఆఫీసుకు వెళ్లేందుకు లాల్బజార్ బస్టాప్కు బయలుదేరింది. ఈ క్రమంలో ఆమెను ఓ కారు ఢీకొట్టడడంతో రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో ఈసీఐఎల్ నుంచి సికింద్రాబాద్కు వస్తున్న కంటోన్మెంట్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు ఆమె పైనుంచి వెళ్లింది. దీంతో త్రివేణి కుమారి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కారు, బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే తన భార్య మృతి చెందిందని త్రివేణి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ డ్రైవర్ నరేశ్, కారు డ్రైవర్ రమేశ్లపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కోయంబత్తూర్లో ఘరానా మోసగాడి అరెస్ట్ గచ్చిబౌలి: బంగారం కొనుగోలు పేరిట ఘరానా మోసానికి పాల్పడిన కేటుగాడిని తమిళనాడు పోలీసులు కోయంబత్తూర్లో అరెస్ట్ చేశారు. కమిషన్ ఇస్తానని చెప్పి గత శుక్రవారం రఫీ నుంచి 18 వేల డాలర్లు, చంద్రశేఖర్ నుంచి 500 గ్రాముల బంగారం తీసుకొని ఉడాయించాడు. బాధితుల ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ప్రత్యేక బృందాలు తమిళనాడుకు వెళ్లాయి. ఈ మేరకు నిందితుడు పగులు హసన్ను సోమవారం కోయంబత్తూర్లో అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి అక్కడి పోలీసులు బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పీటీ వారెంట్పై హసన్ను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు గచ్చిబౌలి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. తాను ధనవంతుడినని, పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయని ఫైవ్స్టార్ హోటల్కు వచ్చేవారిని నమ్మిస్తాడు. బంగారం కొనుగోలు, డాలర్ల ఎక్స్చేంజ్ పేరిట మోసాలకు పాల్పడడం అతని నైజం. తెలంగాణ, తమిళనాడు, కర్నాటకలో మోసాలకు పాల్పడినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. బాలికపై లైంగిక దాడి: పోక్సో కేసు నమోదు హిమాయత్నగర్: ఇంటర్ చదువుతున్న ఓ బాలికకు మాయ మాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడిన నారాయణగూడ, దత్తానగర్కు చెందిన చతుర్వాల రోహిత్ సింగ్(21)ను మంగళవారం నారాయణగూడ పోలీసులు ఆరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే ఓ మైనర్ బాలిక స్థానికంగా ఉన్న కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఇదే క్రమంలో ప్రైవేట్ ఉద్యోగం చేసున్న రోహిత్ సింగ్తో కొన్ని నెలల క్రితం ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ నెల 23న బాలికను ఇంట్లో నుంచి బయటకు పిలిపించిన రోహిత్ సింగ్ ముషీరాబాద్లోని ఓ గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాగా నేరాన్ని ఒప్పుకున్నాడు. పోక్సో చట్టం కింద అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. -
వేడి నీటి బకెట్లో పడి నాలుగేళ్ల బాలుడి మృతి
జవహర్నగర్: వేడి నీటి బకెట్లో పడిన బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిన ఘటన జవహర్నగర్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్నగర్ కార్పొరేషన్ మార్కెట్ లైన్లో కాటి నర్సింహ, సుమలత దంపతులు ఇద్దరు కుమారులతో ఉంటున్నారు. నర్సింహ కూలిపనులు చేస్తుంటాడు. ఇద్దరు పిల్లలను చూసుకునేందుకు సుమలత తల్లి పుల్లమ్మ నర్సింహ ఇంటికి వచ్చింది. ఈ నెల 23న పుల్లమ్మ సమీపంలోని బంధువుల ఇంటికి నర్సింహ, సుమలతల చిన్న కుమారుడు బన్నీ(4)ని తీసుకుని వెళ్లింది. అప్పటికే ఆ ఇంట్లో హీటర్తో వేడి చేసిన నీటిని పెట్టి అక్కడే ఉంచారు. ఆ సమయంలో అక్కడే ఆడుకుంటున్న బన్నీ వేడి నీటి బకెట్లో పడిపోవడంతో ఛాతీ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం బాలుడు మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి బన్నీ మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
ఆయిల్ వ్యాపారులే టార్గెట్
సాక్షి, సిటీబ్యూరో: హోల్సేల్ ఆయిల్ వ్యాపారులను టార్గెట్గా చేసుకుని వరుస మోసాలకు పాల్పడి, ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరు మోసగాళ్లను సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఒకరిపై 9 వారెంట్లు, మరొకరిపై నాలుగు వారెంట్లు పెండింగ్లో ఉన్నట్లు అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు మంగళవారం వెల్లడించారు. ఓల్డ్ మలక్పేట హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన టి.సాయినందకిషోర్ 2006 నుంచి నేరబాట పట్టాడు. తానో రిటైల్ ఆయిల్ వ్యాపారినంటూ హోల్సేల్ వ్యాపారుల దగ్గరకు వెళ్తాడు. తొలుత చిన్నచిన్న మొత్తంలో ఖరీదు చేసి పక్కాగా చెల్లింపులు చేస్తాడు. ఆపై ట్యాంకర్లు బుక్ చేసుకుని, వాటిని మార్కెట్లో విక్రయించి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 2017లో ఆజంపురకు చెందిన మహ్మద్ అబ్దుల్ రహీం ఇతడితో జట్టుకట్టాడు. వీళ్లిద్దరూ కలిసి ఇదే పంథాలో మోసాలు చేశారు. 25 నేరాలను నందకిషోర్ ఒక్కడే చేయగా.. మరో పది నేరాలు రహీంతో కలిసి చేశాడు. వీరిపై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, నల్లగొండల్లో కేసులు నమోదై ఉన్నాయి. 2006 నాటి కేసుల్లోనూ నందకిషోర్ కోర్టు వాయిదాలకు హాజరుకాకపోవడంతో 9 వారెంట్లు జారీ అయ్యాయి. రహీంపై మరో నాలుగు వారెంట్లు ఉన్నాయి. పోలీసుల నిఘా తప్పించుకోవడానికి ఏడు మారుపేర్లతో చెలామణి అయిన నంద కిషోర్ ప్రస్తుతం ఘట్కేసర్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో క్యాంటీన్ నిర్వహిస్తున్నాడు. రహీం ర్యాపిడో డ్రైవర్ అవతారం ఎత్తాడు. వీరి కదలికలపై సౌత్–ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్కు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ ఎస్.సైదాబాబు నేతృత్వంలో ఎస్సైకు పి.సాయిరాం, షేక్ కవియుద్దీన్, ఎం.మధు వలపన్ని ఇరువురినీ అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం బంజారాహిల్స్, రామ్గోపాల్పేట ఠాణాలకు అప్పగించారు. ట్యాంకర్లు బుక్ చేసుకుని భారీ మోసాలు ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ద్వయం చాకచక్యంగా పట్టుకున్న టాస్క్ఫోర్స్ టీమ్ -
పటిష్టంగా మాన్సూన్ యాక్షన్ ప్లాన్
● వేసవిలో అగ్ని ప్రమాదాలు తలెత్తకుండా చర్యలు ● సమన్వయ సమావేశంలో జీహెచ్ఎంసీ, హైడ్రా కమిషనర్లు సాక్షి, సిటీబ్యూరో: రానున్న వర్షాకాలంలో నగరంలో ప్రజల కష్టాలను తొలగించే విధంగా మాన్సూన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఫైర్ సేఫ్టీ, మాన్సూన్ యాక్షన్ ప్లాన్, నాలాల్లో పూడికతీత, నాలాల వద్ద భద్రత ఏర్పాట్లు, చెరువుల పునరుద్ధరణ అంశాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో ఎదురయ్యే పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నగరంలో గుర్తించిన 141 నీటి నిల్వ ప్రాంతాల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. భవిష్యత్తులో నీటి నిల్వ ప్రాంతాలు లేకుండా శాశ్వత పరిష్కారం చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో సమస్యలకు ఆస్కారం లేకుండా పూడికతీత పనులు వర్షాకాలం లోపు పూర్తి చేయాలని సూచించారు. ప్రజల భద్రతకు, ట్రాఫిక్ అంతరాయం లేకుండా సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో సమష్టిగా పని చేయాలని పేర్కొన్నారు. చెరువులపై దృష్టి సారించాలి.. నగరంలోని చెరువుల సంరక్షణ, పునరుద్ధరణలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వర్షాలప్పుడు నీరు పొంగిపొర్లకుండా నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలని లేక్స్ అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల వారిని ఎప్పడికప్పుడు అప్రమత్తం చేయాలని, నాలాల్లో ప్రమాదాలు సంభవించకుండా నాలా ఆడిట్ చర్యలు తీసుకోవాలని, ఆ పనులకు సర్కిల్కు ఒక ప్రత్యేక అధికారిని బాధ్యులను చేయాలని ఇలంబర్తి సూచించారు. అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించాలి వేసవిలో అగ్ని ప్రమాదాలు నివారించేందుకు నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని రంగనాథ్ సూచించారు. నివాస, వాణిజ్య భవన యజమానులు, నిర్వాహకులకు అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలతో అవగాహన కల్పించాలని చెప్పారు. -
చిట్టీల పుల్లయ్య చిక్కాడు!
సాక్షి, సిటీబ్యూరో: ఆంధ్రప్రదేశ్ నుంచి నగరానికి వలసవచ్చి, కూలీగా జీవితం ప్రారంభించి, చిట్టీల వ్యాపారంలోకి దిగి, అధిక వడ్డీ ఆశ చూపి దాదాపు రూ.100 కోట్ల మేర కాజేసిన పుల్లయ్యను సిటీ సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. గత నెల 21 నుంచి పరారీలో ఉన్న ఇతగాడిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్న అధికారులు పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని చందన లక్ష్మింపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య తన స్వగ్రామంలోనూ చిట్టీల వ్యాపారం చేసి పలువురిని మోసం చేశాడు. దాదాపు 18 ఏళ్ల క్రితం నగరానికి వలసవచ్చిన ఇతగాడు బీకే గూడ దాసారం బస్తీలో చిన్న గుడిసె వేసుకుని జీవించాడు. కుమారుడు రామాంజనేయులు తాపీ మేసీ్త్రగా, పుల్లయ్య తాపీ పనిలో కూలీగా పని చేసే వాడు. ఇలా స్థానికులతో పాటు దాసారం బస్తీలో ఉండే రిక్షా కార్మికులతో పరిచయాలు పెంచుకున్నాడు. 15 ఏళ్ల క్రితం చిట్టీల వ్యాపారం ప్రారంభించిన ఇతగాడు బిల్డర్లకు ఫైనాన్స్ కూడా చేశాడు. పశ్చిమ మండలంలోని ఎస్సార్నగర్, బల్కంపేట, బీకేగూడ, సనత్నగర్ తదితర ప్రాంతాలకు చెందిన దాదాపు 500 మంది ఇతడికి ఖాతాదారులుగా మారారు. రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకు విలువైన చిట్టీలు వేశాడు. ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తూ నమ్మకం సంపాదించుకున్న పుల్లయ్య ఆపై ఆ మొత్తాలు తమ వద్దే ఉంచి, వడ్డీలు తీసుకునేలా చేశాడు. ఇలా దాదాపు రూ.100 కోట్ల వరకు కాజేసిన ఇతగాడు గత నెల 21న కుటుంబంతో సహా పారిపోయాడు. బాధితులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎస్సార్నగర్లో నమోదైన కేసునూ ఈ విభాగానికే బదిలీ చేశారు. ముమ్మరంగా గాలించిన అధికారులు పుల్లయ్యను బెంగళూరులో పట్టుకున్నారు. ఈ కేసులో అతడి భార్య, కుమారుడు సైతం నిందితులుగా ఉండటంతో వారి కోసం గాలిస్తున్నారు. కాజేసిన సొమ్మును పుల్లయ్య ఎక్కడకు మళ్లించాడు? తదితర వివరాలు ఆరా తీస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి మృతి కొత్తూరు: రోడ్డు ప్రమాదంలో ఓ పంచాయతీ కార్యదర్శి మృతి చెందిన సంఘటన మున్సిపల్ పరిధిలోని తిమ్మాపూర్లో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని రామంతాపూర్కు చెందిన సక్కుబాయి (38), పాండు దంపతులు. సక్కుబాయి మహేశ్వరం మండలం ఎన్డీతండా పంచాయతీ కార్యదర్శిగా, పాండు అంబర్పేట్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం ఇద్దరూ కలిసి సక్కుబాయి అమ్మగారి గ్రామమైన కొందుర్గుకు స్కూటీపై వచ్చారు. గ్రామంలో గతంలో వారు కొనుగోలు చేసిన వ్యవసాయ క్షేత్రంలో చేపడుతున్న పండ్లతోట పనులు చూసి తిరుగుపయనమయ్యారు. మార్గమధ్యలో తిమ్మాపూర్ వద్దకు రాగానే హెచ్పీ పెట్రోల్బంకు వద్ద ముందు వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. అదే సమయంలో లారీ అదుపుతప్పి పక్కనుంచి వెళ్తున్న వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీచక్రాలు బైకుపై నుంచి వెళ్లడంతో సక్కుబాయి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాలైన పాండును చికిత్స నిమిత్తం శంషాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రమాదం కారణంగా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. స్కూల్ బస్లో మంటలు తుర్కయంజాల్: షార్ట్ సర్క్యూట్తో స్కూల్ బస్లో మంటలు చెలరేగిన ఘటన సాగర్ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. నాదరగ్గుల్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు చెందిన బస్సు (టీజీ08 యూ1796) ఇంజాపూర్లో విద్యార్థులను దింపేసి, తిరిగి వెళ్తుండగా గుర్రంగూడ వద్ద డ్రైవర్ సీటు కిందినుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సు దిగి, తోటి వాహనదారుల సహాయంతో మంటలను ఆర్పేసే ప్రయత్నం చేయడంతో పాటు ఫైరిజింన్కు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో సాగర్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బెంగళూరులో పట్టుకున్న సీసీఎస్ పోలీసులు పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలింపు భర్తకు తీవ్ర గాయాలు విద్యార్థులను దింపేసి వస్తుండగా ఘటన సాగర్ రహదారిపై ట్రాఫిక్ జామ్ -
‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికలో ఎంఐఎందే గెలుపు?
సాక్షి, సిటీబ్యూరో: త్వరలో జరగనున్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవల ముగిసిన ఎమ్మెల్సీల ఎన్నికల్లో తమకు సహకరిస్తే హైదరాబాద్ స్ధానాన్ని ఇవ్వనున్నట్లు అధికార కాంగ్రెస్ ఎంఐఎంకు హామీ ఇచ్చినట్లు రాజకీయ ప్రచారం జరిగింది. ఆ లెక్కన కాంగ్రెస్ తమ అభ్యర్థిని పోటీకి దింపదు. ఒకవేళ అలా కాకుండా కాంగ్రెస్ తమ అభ్యర్థిని బరిలో దింపినా ఆ పార్టీకి తగినంత బలం లేదు. ఆ మాటకొస్తే.. ఒక్క ఎంఐఎంకు తప్ప మిగతా పార్టీలు వేటికి కూడా ఈ ఎన్నికల్లో గెలిచేంత బలం లేదు. ఈ ఎన్నికలో ప్రజలు ఎన్నుకున్న హైదరాబాద్ జిల్లా పరిధిలోని కార్పొరేటర్లు, లోక్సభ సభ్యులతో పాటు ఇక్కడ ఓటర్ల జాబితాలో పేరుండి జిల్లాను ఆప్షన్గా ఎంచుకున్న రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు ఓట్లు వేసేందుకు అర్హత కలిగి ఉంటారని సంబంధిత అధికారులు తెలిపారు. ప్రస్తుతం ముసాయిదా ఓటర్ల జాబితా మేరకు 110 మంది ఓటర్లున్నారు. వారిలో 81 మంది కార్పొరేటర్లు, 15 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు లోక్సభ సభ్యులు, నలుగురు రాజ్యసభ సభ్యులు, ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఉన్నట్లు సమాచారం. తుది జాబితా వెలువడేందుకు వచ్చే నెల 10వ తేదీ వరకు గడువున్నట్లు బల్దియా వర్గాల సమాచారం. ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారు జాబితాలో చేరనున్నారు. ఓటర్లు పెరిగే అవకాశముంది. ఎంఐఎంకే మెజార్టీ.. ఏ లెక్కన చూసుకున్నా అత్యధిక ఓటర్ల బలం ఎంఐఎంకే ఉంటుంది. దాదాపు యాభై మంది ఓటర్ల బలం ఆ ఒక్క పార్టీకి మాత్రమే ఉంది. మిగతా ఏ ఒక్క పార్టీకి కూడా అంత బలం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో మిగతా ఏ రెండు పార్టీలూ పొత్తులతో పోటీ చేసే అవకాశాలే లేవని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నిక అనేది పేరుకు మాత్రమేననే అభిప్రాయాలున్నాయి. అసలు పోలింగ్ జరిగేంతదాకా ఈ ప్రక్రియ సాగే అవకాశాలు కూడా లేవు. త్వరలో పదవీకాలం పూర్తికానున్న ఎంఎస్ ప్రభాకర్రావు ఎన్నిక సైతం పోటీ లేకుండానే ఏకగ్రీవం కావడం తెలిసిందే. అప్పట్లో బీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతునిచ్చింది. ఇప్పుడు ఎంఐఎంకు కాంగ్రెస్ మద్దతునిస్తూ తమ అభ్యర్థిని పోటీకి నిలపదనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రభాకర్రావు ప్రస్తుతం కాంగ్రెస్లో ఉండటం తెలిసిందే. కాంగ్రెస్ మద్దతు ఇచ్చినా.. ఇవ్వకున్నా.. పార్టీల వారీగా ఓట్ల బలాల ప్రకారం.. -
సారీ
అమ్మా.. నాన్నా.. బెట్టింగులకు దూరంగా ఉండలేకపోతున్నా ● క్రికెట్లో డబ్బులు పోవడంతో మనస్తాపం ● రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య మేడ్చల్ రూరల్: నేను సూసైడ్ చేసు కోవాలని డిసైడయ్యా.. దయచేసి నన్ను డిస్ట్రబ్ చేయకండి.. నేను డబ్బు ల విషయంలో ఆత్మహత్యకు పాల్పడడం లేదు. నా మైండ్ సెట్ కంట్రోల్ కావడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. అమ్మా.. నాన్నా.. అండ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్.. సారీ.. అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టి సోమేష్కుమార్ అనే యువకుడు గౌడవెల్లి గ్రామ పరిధిలో రైలు కిందపడి తనువు చాలించిన ఘటన చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. ఏపీలోని అనకాపల్లి జిల్లా చోడవరం మండలం భోగాపురం గ్రామానికి చెందిన రమణ, కనకమ్మ దంపతులు బతుకుదెరువు కోసం 25 ఏళ్ల క్రితం నగరానికి వలసవచ్చి గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు సోమేశ్కుమా ర్ (29) కొంపల్లి సమీపంలో ఉన్న ఓ కంపెనీ వేర్హౌస్లో అసిస్టెంట్ మేనేజర్గా పని చేస్తున్నాడు. క్రికెట్ బెట్టింగులకు బానిసైన సోమేశ్ రూ.లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నాడు. గతంలో కుటుంబీకులు సోదరి వివా హం కోసం దాచిన డబ్బులు సైతం బెట్టింగ్స్లో కోల్పోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు కుమారుడిని మందలించారు. బెట్టింగ్ కారణంగా రూ.3.5 లక్షల వరకు అప్పులు చేయడంతో వాటిని తల్లిదండ్రులే చెల్లించారు. దీంతో మళ్లీ బెట్టింగులకు పాల్పడనంటూ చెప్పిన సోమేశ్కుమార్ ఇటీవల ఐపీఎల్ క్రికెట్ మొదలవ్వడంతో మళ్లీ బెట్టింగుల వైపు మళ్లాడు. గత సోమవారం రాత్రి జరిగిన లక్నో– ఢిల్లీ మ్యాచ్ సందర్భంగా రూ.లక్ష క్రికెట్ బెట్టింగ్ యాప్లో బెట్టింగ్ వేశాడు. దురదృష్టవశాత్తు ఢిల్లీ మ్యాచ్ గెలవడంతో ఒక్క రోజే రాత్రికిరాత్రి రూ.లక్ష పోగొట్టుకున్నాడు. ఆ మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నీటి బకెట్లో పడి 13 రోజుల పసికందు మృతి
అనుమానాస్పద రీతిలో ఘటన మైలార్దేవ్పల్లి: పదమూడు రోజుల పసికందు నీటి బకెట్లో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన విజ్జి, ముదలి మణి దంపతులు ఐదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం బండ్లగూడ ప్రాంతానికి వచ్చారు. అలీనగర్ కాలనీలోని జయ అండ్ కో బిస్కెట్ కంపెనీలో పని చేస్తూ వర్కర్స్ క్వార్టర్స్లో ఉంటున్నారు. ముదలి మణి 13 రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మంగళవారం ఉదయం భర్త పనికి వెళ్లాడు. ముదలి మణి బిడ్డను మంచంపై పడుకోబెట్టి బాత్రూంలోకి వెళ్లింది. కొద్ది సేపటి తర్వాత వచ్చి చూసేసరికి పాప కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురై చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికింది. అనంతరం నీటి బకెట్లో పాప పడి ఉన్నట్లు గమనించింది. వెంటనే స్థానికుల సహాయంతో పసికందును ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. 13 రోజుల పసికందు బకెట్లో పడే అవకాశం లేదంటూ ఈ ఘటనపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
ప్లాట్ఫాంపైనే ప్రసవం
అండగా నిలిచిన ఆర్పీఎఫ్ మహిళా పోలీసులు సికింద్రాబాద్: ప్లాట్ఫాంపై ప్రసవ వేదనకు గురవుతున్న ఓ మహిళకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు అండగా నిలిచారు. అంబులెన్స్ను రప్పించారు. అప్పటికే సమయం మించిపోవడంతో మహిళా కానిస్టేబుళ్ల సహాయంతో అవసరమైన ఏర్పాట్లు చేయించి సదరు మహిళ సుఖ ప్రసవం వరకు అండగా నిలిచి తమ ఉదారత్వాన్ని చాటుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. దుండిగల్లో నివాసం ఉంటున్న ఒడిశాకు చెందిన ఇటుక బట్టీ కార్మికురాలు తబ్బా మహ్జీ (21) నిండు గర్భిణి. భర్తతో కలిసి జనరల్ టికెట్తో విశాఖపట్నం వెళ్లేందుకు మంగళవారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చింది. ఆరో నంబర్ ప్లాట్ఫాంపై ఆగి ఉన్న విశాఖపట్నం రైలు ఎక్కేందుకు సమాయత్తమవుతున్న సమయంలో మహ్జీకి పురిటి నొప్పులు వచ్చాయి. ప్రసవ వేదనకు గురవుతున్న సదరు మహిళ పరిస్థితిని అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ ఎస్ఐ మహేక్ గుర్తించారు. సమీపంలో బందోబస్తు విధుల్లో ఉన్న ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లను రప్పించి మహ్జీకి అండగా ఉంచి అంబులెన్స్ను రప్పించారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో రైల్వేస్టేషన్కు చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది మహ్జీకి ప్రసవం చేశారు. తబ్బా మహ్జీ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. మెరుగైన వైద్యం కోసం తల్లీబిడ్డలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
15 రోజులు.. 4 చోరీలు
లాలాపేట: బీఫార్మసీ పూర్తి చేసినా..జల్సాల కోసం చోరీలకు తెగబడుతున్న కరడుగట్టిన దొంగ శంకర్నాయక్ను మరోసారి పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఓయూ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అతన్ని మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. అనంతరం ఈస్ట్జోన్ డీసీపీ బాలస్వామి తదితరులు మాట్లాడుతూ శంకర్ నాయక్ దొంగతనాల చిట్టా విప్పారు. ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీలపై అందిన పలువురి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా విశ్వసనీయ సమాచారంతో శంకర్ నాయక్తో పాటు మరో దొంగను ఎల్బీనగర్లో అరెస్ట్ చేసి రూ.9 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే వందకు పైగా దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి..ఈ మధ్యనే బెయిల్పై బయటకు వచ్చిన శంకర్నాయక్..15 రోజుల వ్యవధిలోనే 4 చోరీలకు పాల్పడిన్నట్లు పోలీసులు వివరించారు. ఓయూ పీఎస్తో పాటు పటాన్చెరు, మియాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇళ్ల తాళాలు పగులకొట్టి చోరీలు చేసినట్లు విచారణలో తేలిందన్నారు. శంకర్నాయక్ నుంచి 11 తులాల బంగారు ఆభరణాలతో పాటు బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. దొంగిలించిన వస్తువుల వివరాలను పేపర్పై రాసి గోడకు అతికించడంతో పాటు..ఏ ఇంట్లో ఎలా..ఏమేం చోరీ చేశాడో కూడా శంకర్ నాయక్ తన డైరీలో రాసుకుంటాడని పోలీసులు వివరించారు. కరడుగట్టిన దొంగ శంకర్నాయక్ అరెస్టు ఇప్పటికే వందకుపైగా దొంగతనాలు.. పలుమార్లు జైలుకు సైతం.. -
మంచినీటి ట్యాంకర్లకు మహా డిమాండ్!
సాక్షి, సిటీబ్యూరో: నలు దిశలా విస్తరిస్తున్న హైదరాబాద్ మహనగర పరిధిలో వాటర్ ట్యాంకర్లకు యేటా డిమాండ్ పెరుగుతోంది. గత ఐదేళ్లలో ట్యాంకర్ల బుకింగ్ తీరును పరిశీలిస్తే సుమారు 50 శాతం పైగా పెరిగినట్లు జలమండలి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కొత్తగా ఏర్పాటవుతున్న బహుళ అంతస్తుల భవనాలతో విచ్చలవిడిగా..అత్యంత లోతుగా బోర్ల తవ్వకాలు జరిగి భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. వేసవి వచ్చిందంటే నీటి వినియోగం మరింత పెరిగి ట్యాంకర్లకు డిమాండ్ రెట్టింపు అవుతోంది. మొత్తం మీద సుమారు 42 వేల బహుళ అంతస్తుల భవన సముదాయాల నుంచి అత్యధికంగా వాటర్ ట్యాంకర్ల బుకింగ్ జరుగుతున్నట్లు ఇటీవల జలమండలి గుర్తించింది. హఫీజ్పేట, శేరిలింగంపల్లి, ఎస్ఆర్నగర్, కూకట్పల్లి, మణికొండ, నిజాంపేట్ డివిజన్ పరిధిలోని పలు సెక్షన్ల పరిధిలో సుమారు 500 నుంచి 10 వేలవరకు ట్యాంకర్ల బుకింగ్ జరుగుతున్నట్లు సమాచారం. గత ఐదేళ్లలో ఇలా.. మహానగర పరిధిలో వాటర్ ట్యాంకర్ల డిమాండ్ పరిశీలిస్తే..జనవరి నుంచి జూన్న రెండో వారం వరకు ట్యాంకర్లకు తాకిడి అధికంగానే ఉంటుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రతి యేటా ట్యాంకర్ల డిమాండ్ కనీసం 10 నుంచి 15 శాతం పెరుగుతూ వస్తోంది. గత ఐదేళ్లలో డిమాండ్ పరిశీలిస్తే ఈ ఏడాది జనవరి నుంచే తాకిడి పెరిగింది. గతేడాదితో పోల్చితే అదనంగా సుమారు 46 శాతం ఎగబాకింది. అదేవిదంగా ఫిబ్రవరి నెలలో సైతం అదే విధంగా నమోదైంది. సాధారణంగా మార్చి నెలలో ట్యాంకర్లకు డిమాండ్ కనీసం 30 నుంచి 50 శాతం వరకు అదనంగా ఉంటుంది. అయితే ఈ సారి మార్చి నుంచి మూడు నెలల పాటు ఉష్ణోగ్రత అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ట్యాంకర్లకు డిమాండ్ కూడా ఈసారి అదనంగా 60 నుంచి70 శాతం ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా ట్యాంకర్లు, ఫిల్లింగ్స్టేషన్లు, ఫిల్లింగ్ పాయింట్లను పెంచి నీటిని సరఫరా చేసేవిధంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టారు. ● మాదాపూర్ ఫిల్లింగ్ స్టేషనన్లో ఆరు ఫిల్లింగ్ పాయింట్స్, 80 ట్యాంకర్లు ఉన్నాయి. రోజుకి 600 ట్రిప్పులు డెలివరీ జరుగుతోంది. 80 శాతం బుకింగ్స్ను 6 నుంచి 12 గంటల్లో డెలివరీ చేస్తుండగా..మిగిలిన 20 శాతం 24 గంటల్లో డెలివరీ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో 1200 బుకింగ్స్ వచ్చినా డెలివరీ చేసే సామర్థ్యం ఉందని జలమండలి అధికారులు పేర్కొంటున్నారు. ● బంజారాహిల్స్ ఫిల్లింగ్ స్టేషన్లో 8 ఫిల్లింగ్ పాయింట్స్, 44 ట్యాంకర్లు ఉండగా.. రోజుకి 300 ట్రిప్పులు డెలివరీ చేస్తున్నారు. ఎర్రగడ్డ ఫిల్లింగ్ స్టేషన్న్లో 4 ఫిల్లింగ్ పాయింట్స్, 29 ట్యాంకర్లు ఉండగా రోజుకి 150 ట్రిప్పులు డెలివరీ చేస్తున్నారు. -
దైవ ఉద్యమానికి సహకరించండి
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును కోరిన రంగరాజన్ మొయినాబాద్: దైవానికి రాజ్యాంగ బద్ధమైన అధికారాల కోసం చిలుకూరు బాలాజీ ఆలయం నుంచి జరుగుతున్న ఉద్యమానికి సహకరించాలని అర్చకుడు రంగరాజన్.. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును కోరారు. ఈ మేరకు బుధవారం నగరంలోని వెంకయ్యనాయుడు నివాసంలో ఆయనను కలిసి విన్నవించారు. అనంతరం స్వామివారి శేషవస్త్రం అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు. దేశంలో రామరాజ్య పునఃస్థాపన రాజ్యాంగబద్ధంగా జరగాలని.. సుప్రీం కోర్టుకు తన పరిధి గురించి తెలిపేవిధంగా పిటిషన్స్ కమిటీ రఘురామకృష్ణకు సమర్పించిన లేఖ గురించి వెంకయ్యనాయుడుకు వివరించారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారని రంగరాజన్ తెలిపారు. -
బైకులు దొంగిలిస్తున్న మైనర్ అరెస్ట్
చార్మినార్: గుట్టు చప్పుడు కాకుండా ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న మైనర్ నిందితున్ని అరెస్టు చేసి జువైనల్ హోంకు తరలించినట్లు చార్మినార్ ఏసీపీ చంద్రశేఖర్, హుస్సేనీ ఆలం ఇన్స్పెక్టర్ సురేందర్ తెలిపారు. నిందితుని వద్ద నుంచి ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారీలో ఉన్న మరో మైనర్ నిందితుని కోసం వెతుకుతున్నామన్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచమహల్లాలో నివాసముంటున్న మహమ్మద్ ఎజాజ్ ఈ నెల 5వ తేదీన రంజాన్ ప్రార్థనలు ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చి తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి ముందు పార్క్ చేశాడు. అర్ధరాత్రి ఒంటి గంటకు పరిశీలించగా పార్క్ చేసిన ద్విచక్ర వాహనం కనిపించలేదు. వెంటనే పరిసర వీధుల్లో వెతికినా.. ప్రయోజనం కనిపించకపోవడంతో.. ఈ నెల 6న హుస్సేనీ ఆలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఈ నెల 11న దొంగిలించిన వాహనంపై అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ మైనర్ హుస్సేనీ ఆలం పోలీసులకు చిక్కాడు. వెంటనే విచారణ కొనసాగించిన పోలీసులకు ద్విచక్ర వాహనాల దొంగతనాలు వెలుగు చూశాయి. తన స్నేహితుడైన మైనర్ నిందితునితో కలిసి వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఐదు ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. దీంతో హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి, చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, మీర్పేట పరిధిలో ఒకటి, మొగల్పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి.. చొప్పున 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని మైనర్ను జ్యువైనల్ హోంకు తరలించారు. వీటి విలువ దాదాపు రూ.2.30 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం -
7 సబ్జెక్టుల్లో హెచ్సీయూ అదుర్స్
రాయదుర్గం: ప్రపంచంలోనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) అత్యుత్తమ వర్సిటీగా గుర్తింపు దక్కించుకుంది. లండన్కు చెందిన క్వాక్వరెల్లి సైమండ్స్ (క్యూఎస్) సంస్థ బుధవారం వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్– 2025ను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 100 ప్రాంతాల్లో కొనసాగుతున్న 1,700 కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాలలో పని తీరు ఆధారంగా సర్వే చేసి ర్యాంకింగ్స్ను ప్రకటించింది. 2025 సంవత్సరానికి గాను మన హెచ్సీయూ ఏడు సబ్జెక్టుల్లో మంచి ర్యాంకింగ్ సాధించినట్లు అందులో పేర్కొంది. సబ్జెక్టుల వారీగా.. ఇంగ్లిష్ లాంగ్వేజ్– లిటరేచర్లో 251– 300 ర్యాంకింగ్, లింగ్విస్టిక్స్లో 301–350, సోషియోలజీలో 310–375, కెమిస్ట్రీలో 451–500, ఎకనామిక్స్ అండ్ ఎకనామెట్రిక్స్లో 501–550, ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీలో 601–675, బయాలాజికల్ సైన్సెస్లో 651–700 ర్యాంకింగ్లను హెచ్సీయూ సాధించింది. ఈ సందర్భంగా మరింతగా శ్రమించి హెచ్సీయూ ఉనికిని విస్తరిస్తామని వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ బీజేరావు స్పష్టం చేశారు. భవిష్యత్తులో అన్ని సబ్జెక్టులలో మెరుగైన ప్రతిభ చాటేందుకు కృషి చేస్తామన్నారు. -
‘ఈఎన్టీ’లో సిబ్బంది కొరతను పరిష్కరించాలి
సుల్తాన్బజార్: కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్ల కొరత ఉందని, ఈ సమస్యను పరిష్కరించేవిధంగా కృషి చేయాలని టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేనికి ఈఎన్టీ టీఎన్జీఓస్ యూనియన్ అధ్యక్షుడు తూంకుంట రాజు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈఎన్టీ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్ల ఉద్యోగుల కొరత ఉన్నందున రోజు 1,500 నుంచి రెండు వేలమంది రోగులకు మందులు అందించడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని పేర్కొన్నారు. తద్వారా మెడికల్ స్టోర్స్, సబ్స్టోర్స్ నిర్వహించడంలో సిబ్బందికి పనిభారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలకు కావాల్సిన మిషనరీలను నిర్వహించేందుకు సైతం ఇబ్బందులకు గురికావాల్సి వస్తోందన్నారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని మారం జగదీశ్వర్, ముజీబ్ హుస్సేనిలు హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి భాస్కర్, కోశాధికారి రవి, సునీల్, సురేందర్ రెడ్డి, అర్షద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఓయూలో ఉమెన్స్ డే వేడుకలు
పాల్గొన్న మంత్రి సీతక్క ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ ఆర్ట్స్ కాలేజీలో బుధవారం జరిగిన మహిళా దినోత్సవంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కాలేజీలో ప్రమోటింగ్ ఉమెన్ రైట్స్, జెండర్ ఈక్వాలిటీ, ఫాస్టరింగ్ ఎంపవర్మెంట్ అనే అంశంపై సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి ప్రిన్సిపాల్ ప్రొ.కాశీం అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క మాట్లాడారు. అనంతరం సావనీర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్య మండలి సెక్రటరీ ప్రొ.శ్రీరామ్ వెంకటేష్, వీసీ ప్రొ.కుమార్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని, ఐసీఎస్ఎస్ఆర్ డైరెక్టర్ ప్రొ.సుధాకర్ రెడ్డి, యూజీసీ డీన్ ప్రొ.లావణ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు. కాగా.. ఓయూ ఆర్ట్స్ కాలేజీ కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్కకు జార్జిరెడ్డి పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ, ఇతర విద్యార్థి సంఘాల నాయకులు వర్సిటీ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలు సమర్పించారు. -
వడివడిగా అడుగులు.. కొంగర కుర్దులో ఏఐ సిటీ
సాక్షి, హైదరాబాద్: ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఫ్యూచర్సిటీ అభివృద్ధి సంస్థ (ఎఫ్సీడీఏ)ను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ ప్రాంతంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు భూ సేకరణ ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా 625 ఎకరాలను సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. వేర్వేరు చోట్ల గుర్తించిన భూముల్లో ఒకచోట ఏఐ సిటీని ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. మరోచోట ఇతర ఐటీ కంపెనీల హబ్గా తీర్చేదిద్దేలా ప్రతిపాదనలు తయారు చేసింది. ఫ్యూచర్ సిటీ కోసం ప్రత్యేక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్న పట్టణాభివృద్ధి సంస్థ.. ఫార్మా, ఐటీ, లైఫ్ సైన్సెస్, స్పోర్ట్స్ హబ్లకు స్థలాలను నిర్దేశించింది. ఇటీవల నాగిరెడ్డిపల్లిలో భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం తాజాగా మహేశ్వరం, కందుకూరు మండలాల్లోనూ మరికొంత భూమిని సమీకరిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే గ్రీన్ఫీల్డ్ రహదారికి శరవేగంగా భూ సేకరణ జరుపుతున్న సర్కారు.. ప్రస్తుతం నయా నగరిలో ప్రాజెక్టుల స్థాపనకు అవసరమైన భూ సేకరణ చేపడుతోంది. ఫ్యూచర్ సిటీలో భూ లభ్యతపై క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తున్న రెవెన్యూ యంత్రాంగం.. అసైన్డ్ భూముల వివరాలను సేకరిస్తోంది.ఐటీ, పారిశ్రామిక పార్కుల కోసం..మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామ పరిధిలోని కొంగరకుర్దు సర్వే నంబర్ 289లోని 94 మంది రైతుల నుంచి 275.12 ఎకరాలు సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భూముల్లో ఐటీ, ఇండస్ట్రీయల్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు అందులో పేర్కొంది. అయితే.. ప్రతిపాదిత భూములను ఏఐ సిటీకి కేటాయించనున్నట్లు తెలిసింది. 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ సిటీని అభివృద్ధి చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతిపాదిత రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రహదారికి సమీపంలో ఉన్న అసైన్డ్ భూములను సేకరించి.. ఏఐ సిటీ కోసం కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అలాగే.. కందుకూరు మండలం తిమ్మాయిపల్లి సర్వే నంబర్ 9లోని 439 మంది రైతుల నుంచి 350.22 ఎకరాల భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. భూములు కోల్పోయిన రైతులకు తగిన పరిహారం కూడా చెల్లించనున్నట్లు పేర్కొంది.రోడ్డుకు ఇరువైపులా హద్దురాళ్లు..మీర్ఖాన్పేట వద్ద యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీకి శంకుస్థాపన చేసిన ప్రభుత్వం.. భవన నిర్మాణ పనులను మేఘా సంస్థకు అప్పగించింది. పనులు కూడా చకచకా సాగుతున్నాయి. మరో వైపు ఓఆర్ఆర్ ఎగ్టిట్ 13 నుంచి మీర్ఖాన్ పేట మీదుగా ఆర్ఆర్ఆర్ వరకు 300 ఫీట్ల గ్రీన్ఫిల్డ్ రోడ్డు నిర్మాణానికి భూ సేకరణ చేపట్టింది. దారి పొడవునా.. రోడ్డుకు ఇరువైపులా హద్దురాళ్లను కూడా పాతే పనిలో నిమగ్నమైంది. మొదటి దశలో రావిరాల నుంచి మీర్ఖాన్పేట వరకు 19.2 కిలోమీటర్లకు రూ.1,665 కోట్లు మంజూరు చేసింది. అదేవిధంగా మీర్ఖాన్ే టు నుంచి ఆర్ఆర్ఆర్ వరకు 22.30 కిలోమీటర్లకు రూ.2365 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. ఆ మేరకు టెక్నికల్ బిడ్లను ఆహ్వానించింది. -
నకిలీ కస్టమర్ కేర్ నంబర్తో మోసం
సాక్షి, సిటీబ్యూరో: గూగుల్లో కనిపించిన నకిలీ కస్టమర్ కేర్ నంబర్ను నమ్మి నష్టపోయిన ఉదంతం ఇది. సంస్థ ప్రతినిధులుగా మాట్లాడిన అవతలి వాళ్లు ఏపీకే ఫైల్ పంపి రూ.1.9 లక్షలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నగరానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి.. ఎండల తీవ్రత పెరగటంతో తన ఏసీకి మరమ్మతులు చేయించాలని భావించారు. దీంతో ఓ కంపెనీ కస్టమర్ కేర్ నంబర్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేశారు. అందులో లభించిన ఓ నకిలీ నంబర్ను అసలైనదిగా భావించి ఫోన్ చేశారు. దీంతో ఆ కాల్ నంబర్ పొందుపరిచిన సైబర్ నేరగాళ్లకు చేరింది. ఆయనతో సంప్రదింపులు జరిపిన కేటుగాళ్లు.. మరమ్మతు కోసం ఎగ్జిక్యూటివ్ను పంపుతామని అంగీకరించారు. దానికోసం కొన్ని వివరాలు పొందుపరచాలంటూ లింకు పంపారు. ఆ లింకులో సైబర్ నేరగాడు ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ (ఏపీకే) ఫైల్ నిక్షిప్తం చేశారు. బాధితుడు పొరపాటున లింక్ క్లిక్ చేశాడు. అందులో వ్యక్తిగత వివరాలు పొందుపరిచి, రూ.10 చెల్లించాలని ఉండటంతో అనుమానం వచ్చి ఆ పని చేయలేదు. అయితే.. ఏపీకే ఫైల్స్లో నిక్షిప్తం చేసిన మాల్వేర్ అప్పటికే ఆయన ఫోన్లో నిక్షిప్తమైంది. అది ఇన్స్టల్ కావడంతోనే ఆ ఫోన్ మొత్తం నేరగాళ్ల అధీనంలోకి వెళ్లింది. ఇలా ఫోన్ ద్వారా జరిగే లావాదేవీలతో పాటు వచ్చే ఎస్సెమ్మెస్లు సైతం యాక్సెస్ చేయగలిగిన సైబర్ నేరగాళ్లు బాధితుడి నెట్ బ్యాంకింగ్ నుంచి ఆర్థిక లావాదేవీలు చేస్తూ, ఓటీపీలను వినియోగించి రూ.1.9 లక్షలు కాజేశారు. మరుసటి రోజు తన సెంట్రల్ బ్యాంక్ ఖాతాను పరిశీలించిన బాధితుడికి ఈ విషయం తెలిసింది. దీంతో సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఏపీకే ఫైల్స్ను సైబర్ నేరగాళ్లు లింకులు, సందేశాలు సహా వివిధ రూపాల్లో పంపిస్తారని, వీటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. ఏదైనా సందేశం, లింకు వచ్చినప్పుడు క్షుణ్ణంగా పరిశీలించాలని దాని చివరలో.. ఏపీకే అనే అక్షరాలతో ఉన్న ఫైల్ కనిపిస్తే ఇన్స్టల్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వెంటనే డిలీట్ చేయాలని సూచిస్తున్నారు. కస్టమర్ కేర్ నంబర్ల కోసం ఆయా కంపెనీల అధికారిక వెబ్సైట్ల పైనే ఆధారపడాలని, గూగుల్లో కనిపించే అన్ని నంబర్లను గుడ్డిగా నమ్మవద్దని సూచిస్తున్నారు. ఏపీకే ఫైల్ పంపి రూ.1.9 లక్షలు స్వాహా -
కీసరగుట్ట ఆలయ హుండీ లెక్కింపు
కీసర: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో కీసరగుట్ట రామలింగేశ్వరస్వామి దేవస్థానానికి రూ.92,49,961 ఆదాయం సమకూరింది. ప్రసాదాలు, వివిధ ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాల టికెట్ల విక్రయం ద్వారా రూ.63,51,060 ఆదాయం రాగా, హుండీ ఆదాయం రూ.28,98,901 వచ్చిందని, ఆలయ చైర్మన్ తటాకం నారాయణ, ఈవో సుధాకర్రెడ్డి ప్రకటించారు. మంగళవారం దేవాలయం మహామండపంలో హుండీని లెక్కించారు. ఈ ఆదాయాన్ని స్వామిపేరిట కీసర ఎస్బీఐ బ్యాంకులో డిపాజిట్ చేయనున్నట్లు వారు తెలిపారు. గతేడాది బ్రహ్మోత్సవాల కంటే ఈసారి సుమారు రూ.14,70,436ల మేర ఆదాయం పెరిగిందన్నారు. ఫౌండర్ ఫ్యామిలీ సభ్యులు, ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నేపాల్లో ఆ ఇద్దరు నేరగాళ్లు!
సాక్షి, సిటీబ్యూరో: కర్నాటకలోని బీదర్, నగరంలోని అఫ్జల్గంజ్లో తుపాకులతో విరుచుకుపడిన ఇద్దరు దుండగులు అమన్ కుమార్, అలోక్ కుమార్ దేశ సరిహద్దులు దాటి నేపాల్ పారిపోయినట్లు నగర పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది జనవరి 16 ఈ రెండు నేరాలకు పాల్పడిన బీహారీ ద్వయం పశ్చిమ బెంగాల్ మీదుగా నేపాల్ వెళ్లినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. నేరచరితులైన వీళ్లు గతంలోనూ ఇలా దేశం దాటి, పోలీసుల హడావుడి తగ్గిన తర్వాత మళ్లీ తిరిగి వచ్చారని అధికారులు చెప్తున్నారు. మీర్జాపూర్ నుంచి మారణకాండ... బిహార్లోని వైశాలి జిల్లా ఫతేపూర్ పుల్వారియాకు చెందిన అమన్ కుమార్, అలోక్ కుమార్, చందన్ కుమార్, రాజీవ్ సాహ్నిలతో ఈ ముఠా ఏర్పడింది. వాహనాలపై తిరుగుతూ, పట్టణ శివార్లలో రెక్కీ చేసి, ఏటీఎం మిషన్లలో నగదు నింపే వాహనాలనే టార్గెట్గా చేసుకోవడం వీరి నైజం. అలోక్ కుమార్ నేతృత్వంలో సాగే ఈ ముఠా 2023 సెప్టెంబర్ 12న ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్లో పంజా విసిరింది. సెక్యూరిటీ గార్డు జై సింగ్ను హత్య చేసి రూ.40 లక్షలు దోచుకుపోయింది. యూపీ పోలీసులు దాదాపు ఏడాది పాటు గాలించి గత ఏడాది సెప్టెంబర్లో చందన్ కుమార్ను ముంబైలో, రాజీవ్ సాహ్నిని వైశాలిలో పట్టుకున్నారు. అప్పట్లో అమన్, అలోక్లు వైశాలి జిల్లాలోని మహిసౌర్ జనధన్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. వీరి కోసం వెళ్లగా..పోలీసుల కళ్లు గప్పి నేపాల్ పారిపోయారు. బిహార్లోనూ అనేక నేరాలు చేసి... యూపీ పోలీసుల హడావుడి తగ్గిన తర్వాత ఈ ద్వయం నేపాల్ నుంచి బీహార్ చేరుకుంది. అప్పటికే తమ వద్ద ఉన్న డబ్బు అయిపోవడంతో మళ్లీ నేరాలు మొదలెట్టింది. ఈ ఏడాది జనవరిలో నగరానికి వచ్చి, షెల్డర్ తీసుకుంది. అదే నెల 16న బీదర్లో పంజా విసిరింది. ఎస్బీఐ ఏటీఎం మిషన్లలో నగదు నింపే సీఎంఎస్ సంస్థ ఉద్యోగిని గిరి వెంకటేష్ను చంపి, శివకుమార్ను గాయపరిచి రూ.83 లక్షలతో ఉడాయించింది. నగరంలో షెల్టర్ తీసుకున్న అమన్, అలోక్ నగదుతో తిరిగి ఇక్కడికే వచ్చి నేరానికి వాడిన ద్విచక్ర వాహనాన్ని ఎంజీబీఎస్ పార్కింగ్లో ఉంచారు. అఫ్జల్గంజ్లోని రోషన్ ట్రావెల్స్ నుంచి ప్రైవేట్ బస్సులో రాయ్పూర్ వెళ్లేందుకు అమిత్కుమార్ పేరుతో టిక్కెట్ బుక్ చేసుకుంది. అక్కడ జరిగిన పరిణామాలతో మేనేజర్ జహంగీర్ను కాల్చడం, పారిపోవడం జరిగిపోయాయి. ఆధారాలు దొరక్కుండా ప్రయాణాలు... అఫ్జల్గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లిన వీళ్లు... అక్కడ నుంచి గజ్వేల్ వెళ్లడానికి మరో ఆటో మాట్లాడుకున్నారు. అనివార్య కారణాలతో తిరుమలగిరిలో దిగేసి... ఇంకో ఆటోలో మియాపూర్ వెళ్లారు. ఆపై తిరుపతి వెళ్లే ఏపీఎస్ఆర్టీసీ ఎక్కి కడపలో దిగిపోయారు. మరో బస్సులో నెల్లూరు, అట్నుంచి చైన్నె వెళ్లారు. చైన్నె నుంచి రైలులో కోల్కతా చేరుకున్న ఈ ద్వయం పశ్చిమ బెంగాల్లోని సిలిగురి ప్రాంతం నుంచి నేపాల్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వీరిపై ఇప్పటికే యూపీ పోలీసులు రూ.2 లక్షలు, కర్నాటక పోలీసులు రూ.5 లక్షలు రివార్డు ప్రకటించారు. త్వరలో హైదరాబాద్ అధికారులూ రివార్డు ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అమన్ కుమార్ జనవరిలో బీదర్, అఫ్జల్గంజ్ల్లో కాల్పులు చైన్నె మీదుగా పశ్చిమ బెంగాల్కు బిహారీలు అక్కడి నుంచి దేశ సరిహద్దులు దాటిన వైనం గతంలోనూ ఇలా చేసిన అమన్, అలోక్ ద్వయం -
‘మల్టీలెవెల్ పార్కింగ్’ పనులు చకచకా
బంజారాహిల్స్: బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు సమీపంలో పార్కింగ్ సమస్యను నివారించేందుకు మల్టీ లెవెల్ పార్కింగ్ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పార్కు పక్కనే ఉన్న జీహెచ్ఎంసి స్థలంలో ఈ నిర్మాణం గత రెండు వారాల నుంచి ముమ్మరంగా జరుగుతున్నది. ఆరు అంతస్తులలో నిర్మాణం జరుగుతున్న ఈ మల్టీ లెవెల్ పార్కింగ్లో ఒక్కో ఫ్లోర్లో 12 కార్లు పార్కింగ్ చేయవచ్చు. ఇలా మొత్తం ఆరు ఫ్లోర్లలో 72 కార్లు పార్కు చేసుకునే అవకాశం ఉంటుంది. హైదరాబాద్కు చెందిన నవనిర్మాణ ఏజెన్సీ ఈ పనులు చేస్తున్నది. రూ.రెండున్నర కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పార్కింగ్ నిర్మాణంలో హైడ్రాలిక్ పద్ధతిలో లిఫ్ట్ సౌకర్యం ఉంటుంది. పార్కింగ్ కోసం కారు రాగానే ఈ హైడ్రాలిక్ లిఫ్ట్లో ఏ ఫ్లోర్లో ఖాళీగా ఉంటే ఆ ఫ్లోర్ లోకి కారు తీసుకెళ్లి పార్కింగ్ చేస్తారు. కారు పార్కింగ్ చేసిన తర్వాత ఒక చిప్ను కారు యజమానికి ఇస్తారు. వాకర్లు, ఇతర పనుల కోసం వచ్చిన వారు తమ కార్లు పార్క్ చేసిన తర్వాత..పని పూర్తికాగానే వెళ్తే డ్రైవర్ కారును కిందికి తెప్పిస్తాడు. ప్రస్తుతం ఇలాంటి మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థ బెంగళూరు, చైన్నెలో మాత్రమే ఉంది. హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా కేబీఆర్ పార్కు పక్కన నిర్మిస్తున్నారు. దీని చుట్టూ కేఫెలు, ఇతర దుకాణాలు కూడా ఏర్పాటు చేస్తారు. పార్కింగ్ ప్రాంతం అంతా సుందరంగా తీర్చిదిద్దుతారు. ఇప్పటికే ఫుట్పాత్పై ఉన్న బస్సు షెల్టర్లను నోటీసులు అందజేసి తొలగించారు. ఇక్కడ కొనసాగుతున్న కడక్ చాయ్తో పాటు 1980 మిలిటరీ హోటల్ కూడా తొలగించనున్నారు. ఈ రెండు దుకాణాలకు నోటీసులు జారీ చేశారు. ఇక్కడ మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థ నిర్మాణం పూర్తయిన తర్వాత పరిసరాలన్నీ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారు. కేబీఆర్ పార్క్ వద్ద ఆరు అంతస్తుల్లో నిర్మాణం 72 కార్లు పార్కింగ్ చేసుకునే అవకాశం -
అపార్ ఐడీతో విద్యార్థులకు మేలు
బంజారాహిల్స్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 75 శాతం విద్యార్థులకు అపార్ ఐడీ క్రియేట్ చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం తెలంగాణలోని ఇతర యూనివర్సిటీలకు మార్గదర్శిగా నిలవడం గర్వంగా ఉందని ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీరాం వెంకటేష్ కొనియాడారు. అంబేద్కర్ వర్సిటీలో ‘అపార్ అమలు’ అనే అంశంపై రెండు రోజుల పాటు జరిగిన సదస్సు మంగళవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీరాం వెంకటేష్ మాట్లాడుతూ డీజీ లాకర్, అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్, అపార్ ఐడీ వంటివి విద్యార్థి తాను చదువుకున్న విద్యా సంబంధిత విషయాలకు సంబంధించి కీలకమైన అంశాలుగా పేర్కొన్నారు. విద్యార్థి తన విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాక ఉద్యోగం కోసం ఏ సంస్థ దగ్గరకు వెళ్లినా సర్టిఫికెట్ల పరిశీలన సులభం అవుతుందన్నారు. ఆ సర్టిఫికెట్ ఒరిజినలా, లేక ఫేక్ సర్టిఫికెటా అనేది కూడా తేలిపోతుందన్నారు. రానున్న రోజుల్లో కూడా తెలంగాణలోని అన్ని విశ్వ విద్యాలయాల్లో అపార్ ఐడీలను రూపొందించి విద్యార్థులకు సహాయకారిగా నిలవడానికి, అవసరమైన శిక్షణ కోసం ఆర్థికపరమైన సహాయాన్ని అందించడానికి తెలంగాణ ఉన్నత విద్యామండలి సిద్ధంగా ఉందని వెల్లడించారు. త్వరలోనే తెలంగాణలోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థలకు కూడా ఆయా విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలలకు అపార్ ఐడీ నమోదుపై అవగాహన పెంపొందిస్తూ శిక్షణను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. యూనివర్సిటీ ఉపకులపతి ఘంటా చక్రపాణి మాట్లాడుతూ అపార్ ఐడీ నమోదు, అవగాహన పెంపొందించడానికి, శిక్షణ ఇవ్వడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి అంబేడ్కర్ వర్సిటీ సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ సంస్థలకు నామమాత్రపు రుసుముతో , ప్రైవేటు విద్యా సంస్థలకు ఉన్నత విద్యా మండలి నిర్దేశించిన ప్రకారం రుసుముతో శిక్షణ కార్యక్రమాలు సీఎస్టీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సెంటర్ ఫర్ స్టాఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ (సీఎస్టీడీ) డైరెక్టర్ పరాంకుశం వెంకటరమణ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అధ్యాపకులు రాజశేఖర్, అంబేడ్కర్ వర్సిటీ కంప్యూటర్ సెంటర్ ఇన్ఛార్జి వసంత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ సెమినార్లో తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాల విద్యాశాఖ, ఇంటర్మీడియెట్ బోర్డు, టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగాల నుంచి 60 మంది ప్రతినిధులు తమ అనుభవాలు, సమస్యల పరిష్కారానికి అవసరమైన మెలకువలను నేర్చుకున్నట్లు వివరించారు. ఈ సెమినార్లో పాల్గొన్నవారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీరాం వెంకటేష్ -
మున్సిపాలిటీలకు నిధుల పంట!
సాక్షి, సిటీబ్యూరో: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని పురపాలక సంఘాల్లో జీవో 51, అమృత్ పథకాల్లో మంజూరైన పనులపై తెలంగాణ పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ చల్లా నర్సింహారెడ్డి సమీక్షించారు. మంగళవారం తన కార్యాలయంలో ఇంజినీరింగ్ సిబ్బందితో పనుల ప్రగతిపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన ఇప్పటికే జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను ఇంజినీరింగ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై సూచనలు ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఫీల్డ్ విజిట్ నిర్వహించి పురపాలక సంఘాలు, స్థానిక ఎమ్మెల్యేలతో సమీక్షించనున్నట్లు తెలిపారు. పురపాలక సంఘాలకు కొత్తగా మంజూరైన పనులు, వాటికి సంబంధించిన నిధులను వివరించారు. అమృత్ 2.0 ప్యాకేజీ–3 కింద సంగారెడ్డి, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్నగర్ డివిజన్లకు రూ.130 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్లు విశ్వనాధ్ రాజు, చిన్నారావు, వెంకటేశ్వర్లు, జ్యోతిర్మయి, ఈఈలు విజయభాస్కర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ సందీప్, రమణ మూర్తి పాల్గొన్నారు. జీఓ 51, అమృత్ పథకాల కింద భారీగా మంజూరు జీవో 51 పథకం కింద మంజూరైన నిధులిలా.. పురపాలక సంఘం మంజూరైన నిధులు (రూ.ల్లో) పెద్ద అంబర్పేట రూ.15 కోట్లు షాద్ నగర్ రూ.61 కోట్లు ఇబ్రహీంపట్నం రూ.15 కోట్లు శంకర్ పల్లి రూ.36 కోట్లు కొత్తూరు రూ.37 కోట్లు ఆమనగల్ రూ.25 కోట్లు జల్పల్లి రూ.10 కోట్లు శంషాబాద్ రూ.20 కోట్లు ఆదిభట్ల రూ.10 కోట్లు తుర్కయంజాల్ రూ.25 కోట్లు బడంగ్పేట్ రూ.15 కోట్లు జిల్లెలగూడ రూ.15 కోట్లు తుక్కుగూడ రూ.15 కోట్లు తాండూర్ రూ.49 కోట్లు వికారాబాద్ రూ.8 కోట్లు పరిగి రూ.4 కోట్లు కొడంగల్ రూ.9 కోట్లు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్కు రూ.25 కోట్లు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్కు రూ.15 కోట్లు అమృత్ పథకంలో మంజూరైన నిధులిలా.. పురపాలక సంఘం మంజూరైన నిధులు కొడంగల్ రూ.3 కోట్లు పరిగి రూ.11 కోట్లు వికారాబాద్ రూ.8 కోట్లు తాండూరు రూ.20 కోట్లు శంకర్ పల్లి రూ.25 కోట్లు ఆమనగల్ రూ.23 కోట్లు కొత్తూరు రూ.13 కోట్లు షాద్నగర్ రూ.20 కోట్లు మేడ్చల్ సర్కిల్కు రూ.27 కోట్లు -
గూగుల్ను వాడి.. గుడులలో దోపిడీ!
అబ్దుల్లాపూర్మెట్: చోరీలు పాల్పడేందుకు సాంకేతికతను ఎంచుకున్నారీ దుండగులు. గ్రామ శివారుల్లో ఉండే దేవాలయాలనే లక్ష్యంగా చేసుకున్నారు. గూగుల్మ్యాప్లో అప్లోడ్ చేసే దేవతామూర్తులకు అలంకరించిన బంగారు, వెండి ఆభరణాలను అపహరించేందుకు పక్కా ప్రణాళికతో తెగబడ్డారు. నగర శివారులోని ఘట్కేసర్, దుండిగల్, బీబీనగర్, ఇబ్రహీంపట్నం, జవహర్నగర్ పోలీస్స్టేషన్ల పరిధుల్లోని దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు దుండగులు ఎట్టకేలకు వాహన తనిఖీ చేపడుతున్న అబ్దుల్లాపూర్మెట్ పోలీసులకు చిక్కారు. సీఐ అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున వాహన తనిఖీ చేపడుతున్న పోలీసులకు ఓ ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తుల తీరు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని బ్యాగును తనిఖీ చేయగా అందులో బిస్కెట్ల రూపంలో ఉన్న 20 కిలోల వెండి కనిపించింది. దుండగులిద్దరినీ స్టేషన్కు తీసుకుని విచారించగా మేడ్చల్లోని పోలీస్ క్వార్టర్స్ వెనకాల నివసించే మహ్మద్ ఇంతియాజ్ షరీఫ్, మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నవాబ్పేట గ్రామానికి చెందిన రంగా వేణులుగా గుర్తించారు. ఇద్దరు వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడి ఎలాగైనా అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దేవాలయల్లో దొంగతనాలకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు. అందుకు గూగుల్మ్యాప్ను వినియోగించుకున్నారు.విజయవాడలో విక్రయించినివాస గృహాలకు దూరంగా, గ్రామ శివారుల్లో ఉండే ఆలయాలను టార్గెట్గా చేసుకుని చోరీలకు పాల్పడుతూ బంగారు, వెండి ఆభరణాలను అపహరించుకు పోయారు. వాటిని కరిగించి బిస్కెట్ల రూపంలో విజయవాడలో విక్రయించి సొమ్ము చేసుకుంటూ జల్సాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల మండలంలోని పిగ్లీపూర్ గ్రామంలోని అభయాంజనేయస్వామి దేవాలయంలో దొంగతనం చేసిన వెండి ఆభరణాలను కరిగించి బిస్కెట్లుగా మార్చి విజయవాడలో విక్రయించేందుకు వెళ్తుండగా పోలీసులకు చిక్కారు. పిగ్లీపూర్తో పాటు ఘట్కేసర్, దుండిగల్, బీబీనగర్, ఇబ్రహీంపట్నం, జవహర్నగర్ పోలీస్స్టేషన్ల పరిధుల్లోని దేవాలయాల్లో పలు దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు దుండగుల నుంచి 20 కిలోల వెండి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. -
హాల్టికెట్ కోసం విద్యార్థి ఆందోళన
● పూర్తి ఫీజు చెల్లించకపోవడంతో యాజమాన్యం నిరాకరణ ● విషయం వైరల్ కావడంతో ఇచ్చేసిన వైనంమీర్పేట: ఇంటర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం అవుతుండగా పరీక్షకు సిద్ధం కావాల్సిన ఓ విద్యార్థి హాల్టికెట్ ఇవ్వాలని కళాశాల ఎదుట బైఠాయించాడు. ఈ సంఘటన మీర్పేట పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ.. మీర్పేట జిల్లెలగూడకు చెందిన వెంకట పవన్ బాలాపూర్ చౌరస్తాలోని శ్రీ వాగ్ధేవి జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పూర్తి ఫీజు చెల్లించలేకపోయాడు. దీంతో కళాశాల యాజమాన్యం హాల్టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో వెంకట పవన్ మంగళవారం రూ.5వేలు చెల్లించాడు. పూర్తి ఫీజు చెల్లిస్తే గానీ హాల్టికెట్ ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది. దీంతో పవన్ కళాశాల ఎదుటే కూర్చొని హాల్టికెట్ ఇవ్వాలని వేడుకున్నాడు. విషయం కాస్తా స్థానికంగా వైరల్ కావడంతో యాజమాన్యం రూ.5వేలు తిరిగిచ్చేయడంతో పాటు హాల్టికెట్ అందజేసింది. -
పేలిన సిలిండర్
గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా మూసాపేట: అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా సిలిండర్ పేలడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా పరిసర ప్రాంతవాసులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కూకట్పల్లి బాగ్అమీర్ కాలనీలో హరి శంకర్ త్యాగి అనే వ్యక్తి ఎలక్ట్రికల్ అండ్ గ్యాస్ సర్వీస్ షాపును నిర్వహిస్తున్నాడు. మంగళవారం షాపులో పెద్ద సిలిండర్ నుంచి చిన్న సిలిండర్లోకి గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. షట్టర్ పైభాగం రేకులు, షట్టర్లు ఎగిరి రోడ్డుపై పడ్డాయి. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. షాపు పూర్తిగా ధ్వంసమైంది. రీఫిల్లింగ్ చేస్తున్న హరి శంకర్కు కాళ్లు, చేతులు కాలిపోయాయి. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. జనావాసాల మధ్య అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నందుకు అతనిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఒకరికి తీవ్ర గాయాలు -
పోర్టికో కూలిన ఘటనపై విచారణకు ఆదేశం
8 మందితో కూడిన కమిటీ నియామకం రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని నూతన పరిపాలన భవనం పోర్టికో కుప్పకూలిన ఘటనపై విచారణకు వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ బీజే రావు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఒక నోటిఫికేషన్ను హెచ్సీయూ రిజిష్ట్రార్ డాక్టర్ దేవేష్ నిగమ్ విడుదల చేశారు. 8 మందితో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో చైర్మన్గా స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ప్రొఫెసర్ వై. సురేష్, సభ్యులుగా ప్రొఫెసర్ మల్లయ్య, ఎస్.సూర్యప్రకాశ్, బాషా, శివాజీ, రామ్శేషు, పి.శ్రీనివాసరావు, జీవీ రెడ్డి నియమితులయ్యారు. పోర్టికో కూలిన అంశంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి సమగ్ర నివేదికను నెల రోజుల్లోగా అందించాలని వైస్ చాన్స్లర్ ఆదేశించారు. గత నెల 27న పోర్టికో కుప్పకూలిన ప్రమాదంలో 11 మంది కార్మికులకు గాయాలైన విషయం విదితమే. -
ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం
డీసీఎం వాహనాన్ని ఢీకొట్టిన కారు ● భర్త మృతి.. భార్య, కుమారుడికి తీవ్ర గాయాలు దుండిగల్: ఔటర్ రింగ్ రోడ్డుపై డీసీఎం వాహనాన్ని కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సతీష్ కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన కార్తీక్ (38) నగరంలోని నిజాంపేటలో నివాసముంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు భార్య సింధు, కుమారుడు కివి (3) ఉన్నారు. స్వగ్రామం వెళ్లిన కార్తీక్ భార్య, కుమారుడితో కలిసి తన కారులో తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో మల్లంపేట ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 5 వద్ద మంగళవారం ఉదయం 7.30 గంటల సమయంలో ముందు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని అతివేగంతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు కావడంతో అందులో ఇరుక్కున్న కార్తీక్ అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య సింధు, కుమారుడు కివిలకు తీవ్ర గాయాలు కావడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దుండిగల్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. మల్లంపేట ఎగ్జిట్ వద్ద దిగి కొన్ని నిమిషాల్లోనే ఇంటికి చేరుకోవాల్సి ఉండగా.. ఖమ్మం జిల్లా నుంచి రాత్రి సమయంలో ప్రయాణం చేయడం నిద్రమత్తులో ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
స్టూడెంట్స్.. ఆల్ ది బెస్ట్!
నారాయణగూడలోని ఓ పరీక్ష కేంద్రంలో హాల్ టికెట్ నంబర్లు వేస్తున్న సిబ్బందినేటినుంచి ఇంటర్ పరీక్షలుఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రథమ సంవత్సరం కోసం హైదరాబాద్ జిల్లాలో 244 పరీక్ష కేంద్రాల్లో 85,753 మంది, రంగారెడ్డిలో 185 కేంద్రాల్లో 80,409, మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా పరిధిలోని 150 కేంద్రాల్లో 64,107 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇంటర్మీడియట్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. విద్యార్థులూ.. పరీక్షలు బాగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించడమే మీ ముందున్న లక్ష్యం. ఆల్ ది బెస్ట్! – సాక్షి, సిటీబ్యూరో -
అధిక వడ్డీ ఆశ చూపి.. కస్టమర్లకు కుచ్చుటోపీ
● రూ.14 కోట్లు మోసం చేసిన కేటుగాడు ● అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: అధిక వడ్డీ ఆశ చూపించి మోసం చేసిన కేటుగాణ్ని సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం (ఈఓడబ్ల్యూ) పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కందుల శ్రీనివాస రావు నగరంలోని కేపీహెచ్బీ కాలనీలో వెల్ విజన్ గ్రూప్ పేరుతో పలు కంపెనీలను ఏర్పాటు చేశాడు. తన కంపెనీలో డిపాజిట్లు, పెట్టుబడులు పెడితే 200 శాతం అధిక వడ్డీ అందిస్తానని రకరకాల స్కీమ్లతో ప్రచారం చేశాడు. రూ.లక్ష డిపాజిట్ చేస్తే.. రోజుకు రూ.2 వేల చొప్పున వంద రోజుల పాటు రూ.2 లక్షలు, అలాగే.. రూ.6.50 లక్షలు డిపాజిట్ చేస్తే.. 121 గజాల స్థలంతో పాటు నెలకు రూ.32,500 చొప్పున 20 నెలల్లో రూ.6.50 లక్షలు రీఫండ్ చేస్తామని ప్రకటించాడు. టీవీ, వాషింగ్ మిషన్, ఏసీ వంటి వెల్ విజన్ గ్రూప్ గృహోపకరణాలను ఖరీదు చేసిన వారికి ఉత్పత్తి ఖరీదు మొత్తాన్ని వాయిదాల రూపంలో తిరిగి చెల్లిస్తామని ఆశ పెట్టాడు. ఉదాహరణకు రూ.30 వేలు పెట్టి టీవీ కొనుగోలు చేసే కస్టమర్కు టీవీతో పాటు నెలకు రూ.1,500 చొప్పున 20 నెలల్లో రూ.30 వేలు కస్టమర్కు రీఫండ్ చేస్తామని ప్రచారం చేశాడు. అత్యాశకు పోయిన సుమారు 200 మంది అమాయకులు రూ.14 కోట్లు డిపాజిట్లు చేశారు. కొన్ని నెలల పాటు వడ్డీ చెల్లించిన శ్రీనివాస రావు.. ఆ తర్వాత బిచాణా ఎత్తేశాడు. బాధితుల ఫిర్యాదుతో సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు శ్రీనివాస రావును అరెస్టు చేశారు. -
గాంధీ ఆస్పత్రిలో ఇదేం దుస్థితి?
గాంధీఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని, పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన గాంధీ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేశారు. అవుట్ పేషెంట్ విభాగాలన్నింటా కలియతిరిగారు. రోగులు, రోగి సహాయకులతో మాట్లాడారు. వైద్య సేవలు, సమస్యలు, సౌకర్యాలపై ఆరా తీశారు. డాక్టర్ల అటెండెన్స్ రిజిస్టర్ తెప్పించుకుని పరిశీలించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా పలువురు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు చేపట్టాలని, షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరాలని అక్కడే ఉన్న డీఎంఈ, గాంధీ సూపరింటెండెంట్లకు ఆదేశించారు.అసలేం జరుగుతోంది?నర్సింగ్ సిబ్బంది అటెండెన్స్ రిజస్టర్ అందుబాటులో లేకపోవడంతో విస్మయం వ్యక్తం చేశారు. గాంధీ ఆస్పత్రిలో ఏం జరుగుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేడియాలజీ విభాగంలోని ఎక్స్రే, ఎమ్మారై, సీటీస్కాన్ తదితర వార్డులు, రెండో అంతస్తులోని జనరల్ మెడిసిన్ ఇన్పేషెంట్ వార్డును పరిశీలించారు. అనంతరం మాతాశిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్)లోని సంతాన సాఫల్య కేంద్రాన్ని (ఐవీఎఫ్ ) సందర్శించారు. ఇప్పటి వరకు ఎంతమందికి సేవలు అందించారు, సక్సెస్ రేట్ ఎంత, ప్రస్తుతం ఎంత మంది ఉన్నారు, విధి నిర్వహణలో ఉన్న వైద్యులు, సిబ్బంది సంఖ్య ఎంత అంటూ ఆరా తీయగా.. ఒక్కదానికి సరైన సమాధానం ఇవ్వకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఐవీఎఫ్ సెంటర్కు సంబంధించిన వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీఎంఈని ఆదేశించారు.సీరియస్గా రివ్యూ చేయాలి..గాంధీ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలపై సీరియస్గా రివ్యూ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి రాజనర్సింహ అభిప్రాయపడ్డారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గాంధీలో కొనసాగుతున్న అభివృద్ధి, నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మెడికల్, నాన్ మెడికల్ ఉద్యోగులు చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. గాంధీలో సమస్యలు, లోపాలపై వారం రోజుల్లో రివ్యూ సమావేశం నిర్వహిస్తానని వివరించారు.చీటీపై రాసిస్తే చిటికెలో పరిష్కారం!గాంధీభవన్కు వచ్చి నీ సమస్యను చీటీపై రాసిస్తే చిటికెలో పరిష్కారం దొరుకుతుందని ఓ దివ్యాంగురాలికి మంత్రి దామోదర్ రాజనర్సింహ భరోసా ఇచ్చారు. మంగళవారం గాంధీఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేసి తిరిగి వెళ్తున్న క్రమంలో దివ్యాంగ వృద్ధురాలు రాజనర్సింహను కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. సదరం సర్టిఫికెట్ కోసం ఏళ్ల తరబడిగా తెలంగాణ భవన్ చుట్టూ తిరిగినా ఫలి తం లేకుండాపోయిందని, ప్రస్తుతం తనకు సదరం ధ్రువీకరణ పత్రం ఇప్పించాలని వేడుకుంది. తెలంగాణ భవన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని.. ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని, గాంధీ భవన్కు వచ్చి చీటీపై రాసిస్తే సమస్యకు చిటికెలో పరిష్కా రం దొరకుతుందని మంత్రి ఆమెకు వివరించారు. ఓపీ చీటీపై తన ఫోన్ నంబరు రాసి ఇచ్చారు. ఫోన్ చేసి తన క్యాంపు కార్యాలయానికి వస్తే సమస్యను పరిష్కరిస్తానన్నారు. ఆమె వివరాలు అడిగి తెలుసుకుని కొంత నగదు ఆర్థిక సాయంగా అందించి ఔదార్యాన్ని చాటుకున్నారు మంత్రి రాజనర్సింహ. -
నడుస్తున్న కారులో అగ్ని కీలలు
రాజేంద్రనగర్: నడుస్తున్న కారు ఇంజిన్లోంచి పొగలు రావడంతో అప్రమత్తమైన యజమాని.. వాహనాన్ని పక్కకు నిలిపి పరిశీలిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వే పై మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నగరానికి చెందిన ఉదయ్ కుమార్ తన మారుతీ సుజుకీ కారులో ఆరాంఘర్లోని పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పైనుంచి మెహిదీపట్నం వైపు వెళ్తున్నాడు. ఫ్లై ఓవర్ 211వ పిల్లర్ వద్దకు రాగానే వాహనం ముందు భాగంలోని ఇంజిన్లోంచి పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఉదయ్ కుమార్.. పక్కకు ఆపి పరిశీలిస్తుండగా మంటలు చెలరేగి వాహనం మొత్తం అలుముకున్నాయి. నిమిషాల వ్యవధిలో కారు మంటల్లో చిక్కుకుంది. విషయం తెలుసుకున్న అత్తాపూర్ ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. ఫ్లై ఓవర్పై ఈ ఘటన చోటు చేసుకోవడంతో వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపారు. -
దుర్వినియోగాన్ని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు
ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న ట్రాఫిక్ విభాగం అధికారులు గడిచిన కొన్ని రోజులుగా అంబులెన్స్లపై అధ్యయనం చేశారు. ఫలితంగా సిటీలో సంచరిస్తున్న అన్ని అంబులెన్స్ల్లోనూ అత్యవసర వైద్యం అందించాల్సిన పేషెంట్లు ఉండట్లేదని తేలింది. ఉదాహరణకు గుండెపోటు వచ్చిన వ్యక్తికి ఇచ్చే ప్రాధాన్యం చేయి విరిగిన వ్యక్తికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే అంబులెన్స్లపై సమగ్ర విధానం రూపకల్పనకు నిర్ణయించారు. ట్రాఫిక్ కంట్రోల్ రూమ్లో ప్రత్యేకంగా ఓ సెల్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అత్యవసర పేషెంట్లను తరలిస్తున్న లేదా వారి కోసం వెళ్తున్న అంబులెన్స్ల వివరాలను ఆస్పత్రులు లేదా నిర్వాహకులు ఈ సెల్కు అందించేలా చేయనున్నారు. వాటి పూర్వాపరాలు పరిశీలించే ఇక్కడి అధికారులు అది ప్రయాణించే రూట్లోని జంక్షన్లను అప్రమత్తం చేస్తూ రిజిస్ట్రేషన్ నెంబర్ తదితరాలు అందిస్తారని, ఈ విధానంతో అటు అత్యవసర రోగులకు, ఇటు ప్రజలకు ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సంచరిస్తున్న అంబులెన్స్ల కారణంగా సాధారణ వాహన చోదకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అత్యవసరమైన పేషెంట్లను తరలిస్తున్న వాటికి మాత్రమే ‘గ్రీన్ లైట్’ విధానం అమలు చేస్తున్నారు. అవసరం లేకపోయినా, ఖాళీగా సంచరిస్తున్న సందర్భాల్లో సైరన్ వినియోగిస్తే ఆయా అంబులెన్స్ యజమానులపై కేసులు నమోదు చేస్తున్నారు. నగర ట్రాఫిక్ చీఫ్ జోయల్ డెవిస్ ఆదేశాల మేరకు సోమవారం నుంచి నగర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ ప్రారంభమైంది. అంబులెన్స్ల వ్యవహారంపై ట్రాఫిక్ బృందాలు ప్రత్యేక దృష్టి సారించాయి. మంగళవారం కొన్ని కేసులు నమోదయ్యాయి. ఇదే రోజు పెంపుడు కుక్కకు సంతాన నిరోధక ఆపరేషన్ కోసం.. రోగులను తీసుకువెళ్లాల్సిన అంబులెన్స్లో సైరన్ మోగించుకుంటూ వెళ్లిన డ్రైవర్ను పంజగుట్ట ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. అంబులెన్స్ను సీజ్ చేయడం గమనార్హం. ఆస్పత్రులున్న ప్రాంతాల్లో మరీ ఇబ్బంది.. సిటీలోని ఆసుపత్రులను నగర నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి రోగులు వస్తుంటారు. వీరిలో కొందరిని అంబులెన్స్ల్లో తరలిస్తుంటారు. ఈ కారణంగానే నగరంలోని ఏ చౌరస్తాను తీసుకున్నా సరాసరిన ప్రతి గంటకు కనిష్టంగా ఐదు అంబులెన్స్ను క్రాస్ చేస్తుంటాయి. ఆస్పత్రులు ఎక్కువగా ఉన్న బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిధుల్లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఏ ప్రాంతం నుంచి వచ్చే అంబులెన్స్ అయినా ఇక్కడికే చేరుకుంటుండటమే దీనికి కారణం. ప్రస్తుతం అన్ని అంబులెన్స్ల్నీ ఒకే తరహాలో పరిగణిస్తున్న ట్రాఫిక్ పోలీసులు సైరన్ వినిపిస్తే చాలు అప్రమత్తమవుతున్నారు. సదరు జంక్షన్లో మిగిలిన దిశల నుంచి వచ్చే ట్రాఫిక్ను ఆపి.. అంబులెన్స్ ఉన్న దిశలో వాటినే ముందుకు పంపిస్తున్నారు. ఇలా ఒకసారి ఆపిన చౌరస్తా మళ్లీ గాడిన పడటానికి కొన్ని నిమిషాల సమయం పడుతోంది. ఫలితంగా ఇతర వాహనచోదకులకు సమయం, ఇంధనం వృథా అవుతోంది. ఆ ప్రతిపాదనలకు ఆచరణ సాధ్యం కాక... సాధారణంగా అంబులెన్స్ అనగానే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని తరలిస్తోందనే భావన కలుగుతుంది. ఈ నేపథ్యంలో వీటికి నగర రోడ్లపై ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని గతంలో భావించారు. రహదారులపై కుడి వైపుగా అంబులెన్స్ల కోసం ప్రత్యేకంగా లైన్ ఏర్పాటు చేయాలని భావించారు. ఆపై వీటికి రేడియో ఫ్రీక్వెన్సీ (ఆర్ఎఫ్) ట్యాగ్స్ జారీ చేయడంతో పాటు సిగ్నల్స్కు రీడర్లను ఏర్పాటు చేయాలనుకున్నారు. ఫలితంగా ఓ చౌరస్తా వద్దకు అంబులెన్స్ వచ్చిన వెంటనే ఆర్ఎఫ్ ట్యాగ్ ద్వారా సిగ్నల్ గుర్తించి ఆ మార్గంలో గ్రీన్ లైట్ ఉంచేలా చేయాలని భావించారు. అయితే.. నగర రోడ్లపై ఈ రెండూ ఆచరణ సాధ్యం కాదని తేలడంతో ప్రస్తుతం ప్రతి అంబులెన్స్ను క్షేత్రస్థాయిలో ఉండే సిబ్బంది మాన్యువల్గా క్లియరెన్స్ ఇస్తున్నారు. ఇటీవల కాలంలో అంబులెన్స్ల సంచారం పెరగడంతో అనేక జంక్షన్లలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మంగళవారం తార్నాకలో అంబులెన్స్ను తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులుఅన్నీ తీవ్రమైన కేసులే ఉండట్లేదు.. సిటీలో సోమవారం నుంచి ప్రారంభమైన తనిఖీలు ఫలితంగా అనేక అంశాలు వెలుగులోకి.. అనవసరంగా సైరన్ మోగించిన వారిపై కేసులు -
బస్ షెల్టర్ బాలేదా?
ఇక్కడ కనిపిస్తున్న బస్ షెల్టర్ల దృశ్యాలు ఇప్పటివి కావు. పరిస్థితులు మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటున్నాయి. పేరుకు మాత్రం ప్రజల కోసమని బస్ షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నప్పటికీ.. అవి ప్రజలకు ఉపయోగపడటం కంటే ప్రకటనలు ఏర్పాటు చేస్తున్న యాడ్ ఏజెన్సీలకే బాగా పనికొస్తున్నాయి. రాత్రుళ్లలో ప్రజలకు చీకట్లే ఉంటున్నా, వాటి ఆదాయం మాత్రం జిగేల్మంటోంది. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో బస్సులను నడిపేది ఆర్టీసీ అయినా, బస్షెల్టర్లను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తుంది. ప్రజల సదుపాయార్థమని వీటిని ఏర్పాటు చేస్తున్నప్పటికీ, అవి ప్రజలకు ఉపయోగపడటం లేదు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతున్నారే తప్ప ప్రయాణికుల వాటితో సదుపాయం ఒనగూరడంలేదు. ఇదే తరుణంలో ప్రముఖ వాణిజ్యప్రాంతాల్లో, ప్రధాన రహదారులపై ఉన్న షెల్టర్లు వాటిని ఏర్పాటు చేసిన ఏజెన్సీలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. బస్షెల్టర్లు ఏర్పాటు చేసేటప్పుడే ఆసక్తి ఉన్న ఏజెన్సీలన్నీ పాల్గొనేందుకు వీల్లేకుండా నచ్చిన వారికి దక్కేలా టెండరు నిబంధనలు రూపొందిస్తున్నారు. కనీసం నిబంధనల మేరకై నా నిర్వహణ ఉంటోందా అంటే అదీ లేదు. ● ఈ నేపథ్యంలో బస్షెల్టర్లను ప్రజలకు సదుపాయంగా ఉంచాలని భావిస్తున్న జీహెచ్ఎంసీ.. బస్షెల్టర్లలో తమకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని అక్కడి నుంచే ఫిర్యాదు చేసేందుకు వీలుగా అక్కడే క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేయనుంది. వాటిని స్కాన్ చేసి ఇబ్బందుల్ని ఫిర్యాదు చేస్తే, నిర్ణీత వ్యవధిలోగా (రెండు మూడు రోజుల్లోగా) వాటిని పరిష్కరించాలని భావిస్తోంది. లేని పక్షంలో సంబంధిత ఏజెన్సీకి పెనాల్టీలు విధించడంతో పాటు వాటిని వసూలు చేసేందుకూ తగిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. సంబంధిత క్యూఆర్ కోడ్లు సిద్ధమయ్యాయని, త్వరలోనే ప్రజల వినియోగానికి అందుబాటులో ఉంచనున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. అమలుకు నోచుకోని నిబంధనలు జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 1300కు పైగా బస్షెల్టర్లున్నాయి. నిబంధనల మేరకు వాటిని ఏర్పాటు చేసిన ఏజెన్సీలు గ్రేడ్లను బట్టి డస్ట్బిన్ల నుంచి మొదలు పెడితే బస్సులు సదరు షెల్టర్కు చేరుకోనున్న సమయాన్ని తెలిపేలా రియల్టైమ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. కానీ ఏవీ ఏర్పాటు చేయకుండానే అవి ఆదాయం పొందుతున్నాయి. తాజాగా అందుబాటులోకి రానున్న క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి ఈ సమస్యల్ని ఫిర్యాదు చేయొచ్చు. ● కూర్చునేందుకు బెంచీలు, కుర్చీలు లేకుంటే.. ● ఉన్నా కూర్చునేందుకు వీల్లేకుండా విరిగిపోయి ఉంటే.. ● ఏరోజుకారోజు శుభ్రం చేయకుండా ఉంటే.. ● పైకప్పు లేకుంటే. ఉన్నా వానొస్తే తడవకుండా సరిగా లేకపోతే.. ● రాత్రుళ్లు లైట్లు వెలగని పక్షంలో.. ● బస్సుల నెంబర్లు, రూట్మ్యాప్లు లేకపోతే.. ● బస్షెల్టర్ గ్రేడ్ను బట్టి మొబైల్ చార్జింగ్ పాయింట్ లేనిపక్షంలో.. ● కాగితాలు వంటివి వేసేందుకు డస్ట్బిన్ లేకుంటే. ● పబ్లిక్ టాయ్లెట్ లేకపోతే.. ఫిర్యాదులు ఇకనైనా పరిష్కరిస్తారా ? ప్రయాణికుల నుంచే ఇబ్బందులు తెలుసుకునేందుకని ప్రస్తుతం క్యూఆర్ కోడ్ల ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. వీటి ఏర్పాటుతోనైనా సమస్యలు తీరుతాయా? లేదా? అనేది మున్ముందు తెలుస్తుంది. మెహిదీపట్నంలోని బస్ షెల్టర్అక్కడే స్కాన్ చేసి ఫిర్యాదు చేయండి కొత్త విధానాన్ని అమల్లోకి తేనున్న బల్దియా రెండేళ్ల క్రితమే.. దాదాపు రెండేళ్ల క్రితం సెంట్రల్ అడ్వర్టయిజ్మెంట్ మానిటరింగ్ ప్లాట్ఫార్మ్ (క్యాంప్)పేరిట ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించేందుకు సంబంధిత అధికారులు ఆర్ఎఫ్పీ టెండర్లు పిలిచారు. రియల్టైమ్లో అధికారులే ఆన్లైన్ ద్వారా పర్యవేక్షిస్తూ బాగులేని వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. ట్విట్టర్ (ఎక్స్) వంటి వాటిద్వారా ప్రజలు ఫిర్యాదు చేసినా పరిష్కరిస్తామన్నారు. కానీ.. ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. బస్సుల రాకపోకలు తెలిసేలా సదుపాయం కల్పించేందుకని ఇటీవల మరో ఆర్ఎఫ్పీ ఆహ్వానించారు. ఇది ఏ మేరకు అమలు చేస్తారో తెలియదు. -
డెడ్లైన్ సండే!
ఆలోపు అక్రమ హోర్డింగ్స్ తొలగించండి ● నిర్వాహకులకు స్పష్టం చేసిన హైడ్రా కమిషనర్ ● ఏజెన్సీల ప్రతినిధులతో ప్రధాన కార్యాలయంలో భేటీ సాక్షి, సిటీబ్యూరో: నగర వ్యాప్తంగా అనుమతులు లేకుండా, అనుమతి గడువు ముగిసినా కొనసాగుతున్న అక్రమ హోర్డింగ్స్ను ఆదివారం లోపు తొలగించాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. అలా కాకుంటే తాము వాటిపై చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. సోమవారం తన కార్యాలయంలో యాడ్ ఏజెన్సీల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. దాదాపు మూడు నెలల క్రితమే తొలగింపు ప్రక్రియ చేపట్టామని, అయితే యాడ్ ఏజెన్సీల విజ్ఞప్తి మేరకు కొంత సమయం ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. రెండు నెలలుగా పలుమార్లు మున్సిపల్ కమిషనర్లు, యాడ్ ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు ఆయన గుర్తు చేశారు. ఈ హోర్డింగ్స్పై ప్రభుత్వం విధివిధానాలు రూపొందించాల్సి ఉండటంతో రెన్యూవల్స్ ఆగిపోయాయని పలువురు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కారణంగానే 2022–23 ఆర్థిక సంవత్సరానికి చెల్లించాల్సిన రుసుములు కూడా కట్టలేకపోయామని రంగనాథ్కు తెలిపారు. 2023 మార్చి 31 వరకూ చెల్లింపులు చేసిన హోర్డింగుల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకూ తొలగించమని హామీ ఇచ్చిన రంగనాథ్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వారికి చెప్పారు. ఈ హోర్డింగ్స్ ద్వారా ప్రభుత్వానికి రూ.వందల కోట్ల ఆదాయం రావాల్సి ఉన్నా ప్రస్తుతం కేవలం రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లు వరకే వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అక్రమ హోర్డింగుల తొలగింపు విషయంలో హైడ్రా ఎవరికీ, ఎలాంటి మినహాయింపులకు ఇవ్వదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదాయం పెంపు లక్ష్యంగా తాము పని చేస్తున్నామని రంగనాథ్ పునరుద్ఘాటించారు. హోర్డింగుల ఏర్పాటుతో పాటు ప్రకటనల రుసుం చెల్లింపు విషయంలో ప్రభుత్వం కొత్త విధానం తీసుకువస్తే ఆ ప్రకారం నడచుకోడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని యాడ్ ఏజెన్సీ ప్రతినిధులు హైడ్రా కమిషనర్కు తెలిపారు. బాలాపూర్లో అనుమతి లేని హోర్డింగ్స్ను తొలగిస్తున్నప్పుడు హైడ్రాపై ఆరోపణలు చేసిన అఖిల యాడ్ ఏజెన్సీ యజమాని తమను కూడా తప్పుదోవ పట్టించారని పలువురు రంగనాథ్కు తెలిపారు. అఖిల యాడ్ ఏజెన్సీ పేరిట మీర్పేటలో ఉన్న అనుమతులను చూపించిన యజమాని బాలాపూర్ చౌరస్తాలో అక్రమంగా హోర్డింగులను ఏర్పాటు చేసినట్టు హైడ్రా ఆధారాలను ఏజెన్సీల ప్రతినిధులకు చూపించింది. -
గ్రేటర్ జిల్లాల్లో సోమవారం పగటి ఉష్ణోగ్రతలు ఇలా.. (సెల్సియస్ డిగ్రీలు)
జిల్లా 2024 2025 మార్చి 3 మార్చి 3 హైదరాబాద్ 38.06 35.07 రంగారెడ్డి 37.01 36.02 మేడ్చల్ 38.03 35.09 వికారాబాద్ 38.02 36.04 గత వారం గ్రేటర్లో విద్యుత్ డిమాండ్ ఇలా... తేదీ సమయం మెగావాట్లు ఫిబ్రవరి 26 09.23 3306 27 18.55 3272 28 18.56 3398 మార్చి 01 19.02 3254 02 19.14 3017 03 18.00 3369 -
పుట్టిన వెంటనే వినికిడి పరీక్షలు చేయించాలి
సాక్షి, సిటీబ్యూరో: అప్పుడే పుట్టిన బిడ్డకు తప్పనిసరిగా వినికిడి పరీక్ష నిర్వహించాలని పర్యావరణ, దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ప్రపంచ హియరింగ్ డే సందర్భంగా జూబ్లీహిల్స్ మా ఈఎన్టీ ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. మనిషికి అందం, ఐశ్వర్యం ఉన్నా వినికిడి జ్ఞానం లేనపుడు ఆ జీవితం అంధకారంలో ఉన్నట్లు అనిపిస్తుందన్నారు.‘పిల్లలు మనం మాట్లాడినపుడు విని మాటలు నేర్చుకుంటారు. వినలేకపోతే మూగవారిగా మారిపోయే ప్రమాదం ఉంది. ఎదుటి వ్యక్తి చెప్పినపుడు మనకు ఆ మాట వినిపించకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చికిత్సలు చేయించుకోవడానికి కొంత మందికి ఆర్థిక స్థోమత సహకరించకపోవచ్చు.అందుకే మూగ, చెవుడు చికిత్సలకు వైఎస్సార్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో రూ.7 లక్షల వరకు అందించింది. తరువాత వచ్చిన ప్రభు త్వం దీన్ని నిలిపివేసింది. మా ప్రభుత్వంలో పునరుద్ధరించడానికి ప్రతిపాదిస్తాం. ఆయన వైద్యుడు కాబట్టే మనిషి ఆరోగ్యం విలువ తెలిసిన వ్యక్తిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చి, అందరికి నాణ్యమైన వైద్యం అందించారు. వైఎస్సార్కు రూపాయి డాక్టర్ అనే పేరుండేది’ అని మంత్రి గుర్తుచేశారు.ఆసుపత్రులు డబ్బులే కాకుండా పేదలకు కొంత సేవా దృక్పథంతో ఉచితంగా చికిత్సలు అందించా లని కోరారు. మా ఇంట్లోనూ వినికిడి సమస్య వంశపారంపర్యంగా(జెనిటిక్) వస్తుందని తెలిపారు. మా ఈఎన్టీ ఆసుపత్రి వైద్యుడు మేఘనాథ్ మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సేవ్ ద ఫ్యూచర్ అనే నినాదంతో ఈ ఏడాది హియరింగ్ డే జరుపుకుంటోందన్నారు. కార్యక్రమంలో మా ఈఎన్టీ ఆసుపత్రి ఎండీ సునీత జీ కుమార్, వైద్యులు పాల్గొన్నారు. -
ఎండలు అలా.. కరెంటు ఇలా..!
గ్రేటర్లో పెరిగిన ఎండలు విద్యుత్ డిమాండ్ ౖపైపెకి..సోమవారం మధ్యాహ్నం ఎండతో నిర్మానుష్యంగా మారిన బషీర్బాగ్ చౌరస్తాసాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎండలు భగ్గున మండుతున్నాయి. సోమవారం హైదరాబాద్ జిల్లా షేక్పేటలో గరిష్టంగా 36.2 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఇండస్ట్రియల్ ఏరియాలో అత్యధికంగా 38.2 సెల్సియస్ డిగ్రీలు నమోదైంది. అదేవిధంగా మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో 38 డిగ్రీలు నమోదు కాగా, వికారాబాద్ జిల్లా మొమిన్పేటలో 38.1 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంగా మధ్యాహ్నం 12 తర్వాత రికార్డయ్యే ఎండలు..ప్రస్తుతం ఉదయం 10 గంటలకే నమోదవుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలకు ఉక్కపోత తోడవడంతో ఇంట్లోని ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్ల వినియోగం భారీగా పెరిగింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం గృహ విద్యుత్ వినియోగం 25 శాతం అధికంగా నమోదవుతున్నట్లు డిస్కం ఇప్పటికే స్పష్టం చే సింది. సోమవారం అత్యధికంగా 70 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యధికం. నేటి నుంచి మరో నాలుగు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ కూడా అదేస్థాయిలో నమోదయ్యే అవకాశం లేకపోలేదు. మార్చి చివరి నాటికి వంద ఎంయూలకు దాటే అవకాశం ఉన్నట్లు డిస్కం ఇంజనీర్లు అంచనా వేశారు. ఆ మేరకు ముందస్తు ఏర్పాట్లు కూడా చేశారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త డాక్టర్ వెంకటి, డీఎంహెచ్ఓ, హైదరాబాద్ ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి తెలిపారు. ‘సాధారణంగా మనిషి శరీరం 37 డిగ్రీల ఉష్ణోగ్రతలను మాత్రమే తట్టుకుంటుంది. ఆపై నమోదయ్యే ఉష్ణోగ్రతలను తట్టుకోలేదు. ఎండకు చర్మం నల్లగా కమిలిపోవడంతో పాటు డిహైడ్రేషన్కు లోనవుతుంటారు. మూత్రంలో మంట, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతుంటాయి. కాబట్టి ఎండల నుంచి కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో వండిన ఆహారమే తీసుకోవాలి. నీళ్లు బాగా తాగాలి’ అని ఆయన పేర్కొన్నారు. గత వారం గ్రేటర్లో విద్యుత్ డిమాండ్ ఇలా... తేదీ సమయం మెగావాట్లు ఫిబ్రవరి 26 09.23 3306 27 18.55 3272 28 18.56 3398 మార్చి 01 19.02 3254 02 19.14 3017 03 18.00 3369 షేక్పేటలో గరిష్టంగా 36.2 డిగ్రీలు.. మహేశ్వరంలో 38.2 డిగ్రీలు నమోదు రికార్డు స్థాయిలో (70 ఎంయూలు) విద్యుత్ డిమాండ్ ఇష్టానుసారం ఎల్సీలు తీసుకుంటే..ఇక వేటే ఇష్టానుసారం ఎల్సీలు ఇక కుదరదు ముషారఫ్ ఫారూఖీ, సీఎండీ, ఎస్పీడీసీఎల్ గతంతో పోలిస్తే గృహ విద్యుత్ వినియోగం ప్రస్తుతం రెట్టింపైంది. ప్రతి ఇంట్లోనూ ఏసీ, కూలర్, రిఫ్రిజిరేటర్లు సర్వసాధారణమయ్యాయి. ఉదయం, మధ్యాహ్నంతో పోలిస్తే..సాయంత్రం వేళ విద్యుత్ డిమాండ్ అనుహ్యంగా పెరుగుతోంది. ఇలాంటి సమయంలో అనివార్యమైతే తప్ప...ఎల్సీ(లోడ్ రిలీఫ్)లు తీసుకోవద్దని సీఎండీ ముషారఫ్ ఫారూఖీ ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుంచి 25 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా చూడాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఇంజనీర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. -
10 రోజుల్లో ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్
హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ సాక్షి, సిటీబ్యూరో: అన్ని విధాలుగా అర్హత కలిగి ఉండి..సకాలంలో ఫీజులు చెల్లించిన వారికి 10 రోజుల్లో ఎల్ఆర్ఎస్ అనుమతి పత్రాలను (ప్రొసీడింగ్స్)ను అందజేయనున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ (హెచ్ఎండీఏ) కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. అక్రమ స్థలాల క్రమబద్ధీకరణ కోసం ప్రవేశపెట్టిన ఈ ఎల్ఆర్ఎస్ పథకం అమలులో సందేహాల నివృత్తి కోసం కాల్సెంటర్ను కూడా ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. స్థలాల క్రమబద్ధీకరణను పారదర్శకంగా చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ నెల 31వ తేదీ లోపు ఎల్ఆర్ఎస్ ఫీజుల్లో 25 శాతం రాయితీ లభిస్తుందన్నారు. ఎల్ఆర్ఎస్ ఫీజుతో పాటు ప్లాట్లలో ఓపెన్ స్పేస్ చార్జీలను (ప్రొ–రాటా) కూడా చెల్లించిన వాళ్లకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుందన్నారు. ఎల్ఆర్ఎస్–2020 పథకంలో భాగంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వాళ్లకు మాత్రమే ప్రస్తుతం స్థలాలను క్రమబద్ధీకరించుకొనే సదుపాయం ఉంది. తిరస్కరణకు గురయ్యే దరఖాస్తులపైన చెల్లించిన ఫీజులో 90 శాతం రీఫండ్ చేస్తారు. మిగతా 10 శాతం ప్రాసెసింగ్ చార్జీల కోసం కేటాయిస్తారు. చెరువులు, కుంటలు, తదితర నీటివనరులకు 200 మీటర్ల పరిధిలో ఉన్న ప్లాట్లకు మాత్రం రెవెన్యూ, నీటిపారుదల శాఖల అనుమతితోనే ఎల్ఆర్ఎస్లు లభిస్తాయి. నిషేధిత భూములు, సరస్సులు, నీటి వనరుల పరిధిలో లేకుండా, అన్ని విధాలుగా అర్హత కలిగిన ప్లాట్లకు ఆటోమేటిక్గా ఫీజు నోటీసులు అందుతాయి. సకాలంలో ఫీజులు చెల్లించిన వారికి 10 రోజుల్లో ఎల్ఆర్ఎస్ జారీ ప్రక్రియను పూర్తి చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వనున్నట్లు కమిషనర్ వివరించారు. సందేహాల నివృత్తి ఇలా.. ● ఎల్ఆర్ఎస్ల దరఖాస్తులు ఏ దశలో ఉన్నా, ప్రొసీడింగ్ వివరాలు, ఫీజ్ వివరాలు, షార్ట్ఫాల్స్ తదితర వివరాల కోసం ఎల్ఆర్ఎస్ వెబ్సైట్ను సందర్శించవచ్చు. ● అలాగే హెచ్ఎండీఏ కాల్సెంటర్: 18005998838 నంబర్కు సంప్రదించవచ్చు. -
ఇంటర్ పరీక్షలకు
రేపటి నుంచి ప్రారంభం●● గ్రేటర్లో 579 పరీక్ష కేంద్రాలు ● హాజరవనున్న 4,64,445 మంది విద్యార్థులు ● సీసీ కెమెరా నిఘాలో ప్రశ్నపత్రాల ఓపెన్, జవాబు పత్రాల సీల్ ● క్యూఆర్ కోడ్ ద్వారా కేంద్రాల లొకేషన్ వెసులుబాటు ● సందేహాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 040–29700934 సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. బుధవారం నుంచి ప్రథమ సంవత్సరం, గురువారం నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఆరంభం కానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల పరిధిలో దాదాపు 4,46,445 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందుకోసం సుమారు 579 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ● ఎండలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో కేంద్రాల వద్ద ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. – తాగునీటి సదుపాయంతోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. – విద్యార్థులు అస్వస్థతకు గురైతే సత్వర సేవలందించేందుకు వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లను నియమించారు. ● విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు 144 సెక్షన్ అమలు చేయనున్నారు. 25 మంది చొప్పున సీటింగ్ ఇంటర్ పరీక్ష కేంద్రంలో ఒక్కో గదిలో 25 మంది చొప్పున కూర్చునే విధంగా సీటింగ్ ఏర్పాటు చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఇన్విజిలేటర్లను నియమించారు. మాస్ కాపీయింగ్ అరికట్టేందుకు తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారులు, సిట్టింగ్, ఫ్లయింగ్, స్క్వాడ్ బృందాలను నియమించారు. ఇందులో భాగంగా హైదరాబాద్లో సిట్టింగ్ స్క్వాడ్ 10, ఫ్లయింగ్ స్క్వాడ్ 4 బృందాలు, రంగారెడ్డి జిల్లాలో సిట్టింగ్ స్క్వాడ్ 5, ఫ్లయింగ్ స్క్వాడ్ 4, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 5 సిట్టింగ్, 6 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను రంగంలో దింపనున్నారు. వీరితో పాటు జిల్లాకు డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ (డీఈసీ)లో ఐదుగురు సభ్యులు, ఇద్దరు హైపవర్ కమిటీ సభ్యుల చొప్పున నియమించారు. పరీక్ష కేంద్రానికి పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చే ప్రశ్నపత్రాల సీల్ తీయడం మొదలుకుని, విద్యార్థులు రాసిన సమాధాన పత్రాలను సీల్ వరకు సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణలోనే ప్రక్రియను పూర్తి చేయనున్నారు. చీఫ్ సూపరింటెండెంట్ తప్ప మిగతా వారికి మొబైల్ ఫోన్ అనుమతి ఉండదు. పరీక్ష కేంద్రాల్లోకి సంబంధిత అధికారి జారీ చేసిన ఐడీ కార్డులు ఉంటేనే తప్ప ఇతరులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. సందేహాల కోసం టోల్ఫ్రీ నెంబర్ 040– 29700934 సంప్రదించవచ్చు. పరీక్ష కేంద్రం చిరునామా కోసం విద్యార్థులు పరీక్ష కేంద్రం చిరునామా ఈజీగా తెలుసుకునే విధంగా ఎగ్జామ్ సెంటర్ లోకేటర్ యాప్ను అందుబాటులో తెచ్చారు. ఆండ్రాయిడ్ ఫోన్లో ప్లే స్టోర్కు వెళ్లి ఐపీఈ ఎగ్జామ్ సెంటర్ లొకేటర్ యాప్ను డౌన్లౌడ్ చేసుకుని నో యువర్ ఎగ్జామ్ సెంటర్ అప్షన్లో కాలేజీ కోడ్/విద్యార్థి పేరు టైప్ చేస్తే సెంటర్ అడ్రస్ సులువుగా తెలుస్తుందని అదికారులు వెల్లడించారు. అదేవిధంగా హాల్ టికెట్పై గల క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే అడ్రస్ వెంటనే వస్తుందన్నారు. పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవాలి విద్యార్థులు హడావుడిగా కాకుండా..సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ప్రయత్నించాలి. పరీక్ష కేంద్రాల అడ్రస్ తెలుసుకుని ఒకరోజు ముందే సందర్శిస్తే బాగుంటుంది. పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశాం. తాగునీరు, వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాం. – ఒడ్డెన్న, జిల్లా ఇంటర్ బోర్డు అధికారి, హైదరాబాద్ -
మహిళ అనుమానాస్పద మృతి
భర్తే కొట్టి చంపాడని మృతురాలి బంధువుల ఆరోపణచాదర్ఘాట్: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన చాదర్ఘాట్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్ఐ రవిరాజ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అక్బర్బాగ్ డివిజన్ జమున టవర్స్లో 106 సింగం వినయ్, శిరీష(32) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమార్తె. శిరీష ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పని చేస్తుండగా, ఆమె భర్త వినయ్ ప్రైవేట్ ఉద్యోగి. ఆదివారం శిరీషకు గుండెపోటు వచ్చిందని ఆమె మేనమామ మధుకర్కు శిరీష స్నేహితురాలు సమాచారం అందించింది. దీంతో మధుకర్ ఆమె ఇంటికి వెళ్లేలోగా వినయ్ ఆమెను హాస్పిటల్కు తీసుకెళ్లాడు. శిరీషను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించాడు. దీంతో వినయ్ శిరీష మృతదేహాన్ని తీసుకుని అంబులెన్స్లో తన స్వగ్రామమైన దోమలపెంటకు బయలుదేరి వెళ్లాడు. దీనిపై అనుమానం వచ్చిన మధుకర్ చాదర్ఘాట్ పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన పోలీసులు అంబులెన్స్ డ్రైవర్కు ఫోన్ చేసి మృతదేహాన్ని వెనక్కి రప్పించారు. కాగా శిరీష శరీరంపై గాయాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. శిరీషను ఆమె భర్త వినయ్ కొట్టి చంపాడని మేనమామ మధుకర్ ఆరోపిస్తున్నారు. శిరీషపై అనుమానం పెంచుకున్న వినయ్ తరచూ ఆమెను వేధించేవాడని తెలిపాడు. 2017లో వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న చాదర్ఘాట్ పోలీసులు ఆమె భర్త వినయ్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు పేర్కొన్నారు. -
ఆర్చిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ సీజ్
గోల్కొండ: ఎలాంటి అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవనంలో కొనసాగుతున్న ఓ పాఠశాలను సోమవారం విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. డిప్యూటీ ఈవో సి.హెచ్.వెంకటరమణ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీసుల సమక్షంలో విద్యార్థులందరినీ ఇంటికి పంపి పాఠశాల గేట్లకు తాళం వేశారు. గత సంవత్సరం ప్రారంభమైన ఈ పాఠశాలకు ఎలాంటి అనుమతులు లేవని డిప్యూటీ ఈవో తెలిపారు. విద్యా శాఖ ఆర్జేడీ కార్యాలయం నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు స్కూల్ను సీజ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఐదంతస్తుల భవనంలో కొనసాగుతున్న ఈ పాఠశాలకు అగ్నిమాపక విభాగం అధికారుల అనుమతులు లేవని తెలిపారు. ట్రాఫిక్ అధికారులు, బల్దియా విభాగం నుంచి ఎలాంటి అనుమతులు లేవని, పాఠశాలకు గుర్తింపు సైతం లేదన్నారు. పలుమార్లు పాఠశాలకు వచ్చి ప్రిన్సిపాల్ను అనుమతుల విషయమై హెచ్చరించామని, అయినా యాజమాన్యం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో గత నెల 2న పాఠశాల ప్రిన్సిపాల్, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి, అనుమతులు లేనందున సదరు పాఠశాలలో పిల్లలను చేర్పించవద్దని ఇక్కడ ఉన్న పిల్లలను వేరే పాఠశాలలోకి మార్చుకోవాలని స్పష్టం చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల సూచనమేరకు పాఠశాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ వెంకట్రెడ్డి, డిప్యూటీ ఐఓఎస్ మహ్మద్ బషీర్తో పాటు విద్యాశాఖకు చెందిన సయ్యద్ జాఖేర్, మహ్మద్ నసీర్ తదితరులున్నారు. విద్య పేరుతో దోపిడీ... ఆర్చీడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం పిల్లల భద్రతను గాలికి వదిలేసి ఫీజుల పేరిట దోపిడీ చేస్తుందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలను సీజ్ చేసినట్లు తెలియడంతో నానల్నగర్ పరిసర ప్రాంతాల్లోని తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. గేట్లకు తాళం వేసి ఉండడం చూసి స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే వేలల్లో ఫీజులు చెల్లించామని విద్యా సంవత్సరం చివరలో తమ విద్యార్థుల భవిష్యత్తు ఏమిటని విద్యాశాఖ అధికారులను నిలదీశారు. వచ్చే నెలలో పరీక్షలు ఉన్నాయని దాని కోసం పిల్లలు కష్టపడి చదువుతున్నారని ఇప్పుడు పాఠశాలకు తాళం వేస్తే వారి పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవన్న విషయం తమకు తెలియదని ప్రభుత్వ గుర్తింపు ఉందని ఇప్పటి వరకు పాఠశాల యాజమాన్యం చెబుతూ వచ్చిందని వారు ఆరోపించారు. అనుమతులు లేకుండా నిర్వహణ పలు మార్లు విద్యాశాఖ అధికారుల హెచ్చరికలు పట్టించుకోని స్కూల్ యాజమాన్యం -
174 మంది జూనియర్ అసిస్టెంట్లకు పోస్టింగులు
సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో 174 మంది జూనియర్ అసిస్టెంట్లకు సోమవారం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పోస్టింగ్ ఆర్డర్లను అందజేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 ఉద్యోగాల రిక్రూట్మెంట్లో భాగంగా జీహెచ్ఎంసీకి కేటాయించిన వారిలో రిపోర్టు చేసిన 174 మందికి పోస్టింగ్ ఆర్డర్స్ అందజేశారు. వారిని ప్రధాన కార్యాలయంతోపాటు జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని రిలాక్స్ కావద్దని, ప్రతి ఉద్యోగి బాధ్యతగా, అంకితభావంతో పనిచేసి కార్పొరేషన్కు మంచి పేరు తీసుకురావాలని కోరారు. క్రమశిక్షణతో పనిచేసి ప్రజలకు మంచి సేవలు అందించినప్పుడే ఉద్యోగికి గుర్తింపుతో పాటు మరింత ఉన్నతంగా రాణిస్తారన్నారు. నగరంలో హెల్త్, శానిటేషన్ నిర్వహణ బాగుండాలని, ఆ విషయంలో ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పరిపాలన విభాగం అడిషనల్ కమిషనర్ వేణుగోపాల్, జాయింట్ కమిషనర్ శ్రీనివాస్,ఏఎంసీ జీవన్ కుమార్,తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రత్యేక అభివృద్ధి’ పనులు పూర్తి చేయాలి
పురోగతిపై జిల్లా కలెక్టర్ అనుదీప్ సమీక్ష సాక్షి, సిటీబ్యూరో: ప్రత్యేక అభివృద్ధి నిధులతో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఇంజనీరింగ్ శాఖల ఆధ్వర్యంలో ఎస్డీఎఫ్ నిధులతో చేపట్టిన పనుల పురోగతి, పెండింగ్ పనులను సమీక్షించారు. సీడీఎఫ్ పథకం కింద 268 పనులకుగాను 79 పనులు పూర్తి కాగా, మరో 73 పనులు పురోగతిలో ఉన్నాయని, 10 పనులు టెండర్ దశలో ఉన్నాయని పేర్కొన్నారు. మిగిలిన 48 పనులకు స్థల పరిశీలన చేసి ప్రతిపాదనలు సిద్ధంగా ఉంచాలన్నారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, ఎక్కడైనా ఏజెన్సీలు ఇబ్బంది పెడితే తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పనులు పూర్తయిన వాటికి సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు అందచేయాలని సూచించారు. ఎక్కడైనా స్థలం సమస్య, టెండర్ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఉంటే నివేదిక రూపంలో అందజేయాలనీ కలెక్టర్ అధికారులకు సూచించారు. సమీక్షా సమావేశంలో సీపీవో డాక్టర్ సురేందర్, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
చెత్త వేస్తే .. ఇక ఈ–చలాన్
యూపీఐ ద్వారానే పెనాల్టీల చెల్లింపులు ● యాప్ రూపొందించిన జీహెచ్ఎంసీ ● త్వరలో అందుబాటులోకి .. సాక్షి,సిటీబ్యూరో: ఒక్కో విభాగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్న జీహెచ్ఎంసీ.. డంపర్బిన్లలో చెత్త దాదాపు 75 శాతం నిండగానే అలర్ట్ చేసేలా ఆధునిక డంపర్బిన్లను అందుబాటులోకి తెస్తోంది. చెత్త తరలింపునకే కాకుండా ఎక్కడ పడితే అక్కడ చెత్త, నిర్మాణ.. కూల్చివేతల వ్యర్థాలు, ఇతరత్రా వ్యర్థాలు వేసే వారికి విధించే పెనాల్టీలకు ఇకపై ఈ–చలాన్లను జారీ చేయనుంది. అంతేకాదు, చెల్లింపులు సైతం మాన్యువల్గా కాకుండా యూపీఐ చెల్లింపులే స్వీకరించనుంది. ఇందుకు గాను జీహెచ్ఎంసీ త్వరలో ప్రత్యేక యాప్ను వినియోగంలోకి తేనుంది. ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ ద్వారా ఈ యాప్ను రూపొందించారు. నిధులు పక్కదారి పట్టకుండా.. స్వచ్ఛ కార్యక్రమాల అమల్లో భాగంగా జీహెచ్ఎంసీ బహిరంగ ప్రదేశాల్లో చెత్తాచెదారం వేసేవారితో పాటు నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలు వేసే వారికి పెనాల్టీలు విధిస్తోంది. పెనాల్టీలను చలాన్ బుక్ల ద్వారా క్షేత్రస్థాయిలోని అధికారులు జారీ చేస్తున్నారు. అధికారులు తమ ఇష్టానుసారం పెనాల్టీలు విధించడం, ఎక్కువ పెనాల్టీ వసూలు చేసి జీహెచ్ఎంసీ పుస్తకాల్లో మాత్రం తక్కువ మొత్తాలు రాస్తూ తమ జేబులు నింపుకునే పనులకు పాల్పడుతున్నారు. దీంతో ప్రజలు చెల్లిస్తున్న పెనాల్టీల సొమ్ము మొత్తం జీహెచ్ఎంసీ ఖజానాకు చేరడం లేదు. చలాన్ బుక్ల ద్వారా జారీ చేసిన వాటిలో ఎన్నింటికి పెనాల్టీలు వసూలయ్యాయో వంటి సమాచారం సైతం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో వాహన నిబంధనలు ఉల్లంఘించే వారికి ట్రాఫిక్ పోలీసుల ఈ–చలాన్ ల మాదిరిగా వ్యర్థాలు వేసేవారికి క్షేత్రస్థాయిలోని ఏఎంఓహెచ్లు, డీఈఈలు, ఏసీపీలు, తదితర అధికారులు ఈ–చలాన్లు జారీ చేయనున్నారు. రెండు మూడు రోజుల్లో యాప్పై సంబంధిత అధికారులకు శిక్షణ ఇచ్చిన తర్వాత యాప్ను వినియోగంలోకి తెస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ సీఎన్ రఘుప్రసాద్(పారిశుధ్యం) తెలిపారు. ఏ ఉల్లంఘనకు ఎంత పెనాల్టీ విధించాలో యాప్ ద్వారా ఆటోమేటిక్గానే జనరేట్ అవుతుందన్నారు. పెనాల్టీలను యూపీఐ ద్వారానే చెల్లించాల్సి ఉంటుందన్నారు. తద్వారా క్షేత్రస్థాయిలోని అధికారులు ఇకపై ఇష్టారాజ్యంగా వ్యవహరించే వీలుండదు. చార్మినార్ జోన్కు అధికంగా.. గతంలో స్వచ్ఛ ర్యాంకింగ్స్ కోసం డంపర్బిన్లను తొలగించిన జీహెచ్ఎంసీ అధికారులు అవి లేనిదే చెత్త సమస్యలు తీరవని గ్రహించి తిరిగి వాటిని ఏర్పాటు చేస్తున్నారు.ఆటోమేటిక్గా చెత్త పూర్తిగా నిండకముందే అలర్ట్ చేసే సాంకేతికతతో కూడిన డంపర్బిన్లను దాదాపు వెయ్యి చెత్త వల్నరబుల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 260 డంపర్బిన్లు సమకూర్చుకోగా రంజాన్ మాసాన్ని దృష్టిలో ఉంచుకుని చార్మినార్ జోన్కు అధికంగా 134 డంపర్బిన్లు తరలించారు. వాటిల్లో 121 బిన్లను వల్నరబుల్ ప్రాంతాల్లో ఉంచారు. ఖైరతాబాద్జోన్కు 20 బిన్లు తరలించగా, వాటిల్లో ఆరింటిని వల్నరబుల్ప్రాంతాల్లో అమర్చారు. మిగతా వాటిని ఏర్పాటు చేసే పనుల్లో ఉన్నారు. శానిటరీ జవాన్లా మజాకా ? జీహెచ్ఎంసీలో ఉన్న 269 మంది శానిటరీ జవాన్లలో 139 మందిని ఇటీవల బదిలీ చేయడం తెలిసిందే. వారు బదిలీ అయిన స్థానాల్లోకి వెళ్లక ముందే స్థానిక కార్పొరేటర్ల నుంచి మొదలు పెడితే.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దాకా తమ పరిధిలోని శానిటరీ జవాన్ల బదిలీ నిలిపివేయాలంటూ సంబంధిత ఉన్నతాధికారుల వద్దకు క్యూలు కడుతున్నారు. స్వచ్ఛ ర్యాంకింగ్ కోసం కేంద్ర బృందం నగరంలో పర్యటిస్తున్న తరుణంలో పారిశుధ్యం బాగుండాలనే తలంపుతో కమిషనర్ శానిటరీ జవాన్లను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. వారిలో చాలామందికి రాజకీయ అండదండలుండటంతో చేయాల్సిన పనులు చేయడం లేరు. రెగ్యులర్ ఉద్యోగులైన శానిటరీ జవాన్లు తమ పనుల్ని ఔట్సోర్సింగ్పై నియమితులైన శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లకు అప్పగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఒకే చోట పనిచేస్తున్న శానిటరీ జవాన్లలో గత 35 ఏళ్లుగా ఒకేచోట పని చేస్తున్నవారు కూడా ఉండటం విశేషం.సీఅండ్ డీ వ్యర్థాల ద్వారా దాదాపు నాలుగునెలల నుంచి నిర్మాణ, కూల్చివేతల(సీఅండ్డీ) వ్యర్థాలను క్షేత్రస్థాయిలో గుర్తించి పెనాల్టీలు విధిస్తున్న టౌన్ప్లానింగ్ ఏసీపీలు ఇప్పటి వరకు రూ. 54,15,792 పెనాల్టీలు విధించారు. ఒక్క కాప్రా సర్కిల్లోనే రూ.7,27,500 పెనాల్టీలు విధించారు. చెత్త వేసిన వారికి.. రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసిన వారికి జనవరి ఒకటో తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు రూ.2,33,600 పెనాల్టీలు విధించారు. ఈ–చలాన్ యాప్ అందుబాటులోకి వస్తే పెనాల్టీల మొత్తం ఇంకా పెరిగే అవకాశంతోపాటు, ఉల్లంఘనులు చెల్లించే సొమ్ము నేరుగా జీహెచ్ఎంసీ ఖజానాలోనే జమ అవుతుంది. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
గచ్చిబౌలి: ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా, తోర్మామిడికి చెందిన కమలాపురం దేవిక(25) మాదాపూర్లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తోంది. మంచిర్యాల మార్కెట్ రోడ్డుకు చెందిన సద్గుర్తి శరత్ చంద్రతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీయడంతో పెద్దల అంగీకారంతో వారిరువురు గత ఆగస్టు 23న గోవాలో పెళ్లి చేసుకున్నారు. రాయదుర్గంలోని ప్రశాంత్హిల్స్లో నివాసం ఉంటున్నారు. కొద్ది రోజులుగా భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా వారి మధ్య గొడవ జరగడంతో దేవిక గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. బయటికి వెళ్లి తిరిగి వచ్చిన శరత్చంద్ర తలుపు తట్టినా దేవిక స్పందించకపోవడంతో నిద్రపోయి ఉంటుందని భావించాడు. సోమవారం ఉదయం 10 గంటలైనా దేవిక బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన శరత్ చంద్ర తలుపు విరగ్గొట్టి చూడగా ఆమె ఉరి వేసుకుని కనిపించింది. ఇరుగు పొరుగు సహాయంతో కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందింది. వర కట్నం కోసం శరత్చంద్ర తన కుమార్తెను వేధిస్తున్నాడని, ఈ కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని మృతురాలి తల్లి రామలక్ష్మి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రతి మెట్రో స్టేషన్ వద్ద సురక్షితంగా రోడ్డు దాటేలా పైవంతెనలు
స్కైవాక్స్ను ప్రోత్సహిస్తాం: మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆసక్తి చూపే సంస్థలకు అవకాశం ఇస్తామని వెల్లడిసాక్షి, సిటీబ్యూరో: మెట్రో స్టేషన్ల నుంచి నేరుగా వాణిజ్య భవనాల్లోకి రాకపోకలు సాగించేవిధంగా స్కైవాక్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు హైదరాబాద్ మెట్రో రైలు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రాయదుర్గం మెట్రోస్టేషన్ నుంచి రహేజా మైండ్స్పేస్కు వెళ్లేందుకు అనుకూలంగా ఏర్పాటు చేసిన స్కైవాక్ తరహాలోనే అవసరమైన అన్ని మెట్రోస్టేషన్ల వద్ద అలాంటి స్కైవాక్లను అందుబాటులోకి తేనున్నారు. అలాగే ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, వాహన కాలుష్య నియంత్రణకు కూడా ఈ స్కైవాక్లు దోహదం చేయనున్నాయి. ఈ మేరకు మెట్రో స్టేషన్ల నుంచి సమీపంలో వాణిజ్య, నివాస భవనాల సముదాయాలకు పైవంతెనల (స్కైవాక్స్) నిర్మాణాన్ని ప్రోత్సహించాలని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్లు నిర్ణయించారు. ఈ మేరకు ఇటీవల హెచ్ఎండీఏ కార్యాలయంలో జరిగిన కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ) సమావేశంలో ఈ అంశంపైన చర్చించారు. ప్రస్తుతం పంజగుట్ట, హైటెక్ సిటీ, ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ల నుంచి నేరుగా మాల్స్లోకి వెళ్లేందుకు స్కైవాక్లు ఉన్నాయి. ఎల్అండ్టీ స్వయంగా వీటిని ఏర్పాటు చేసింది. అదే విధంగా జేబీఎస్, పెరేడ్ గ్రౌండ్ స్టేషన్లకు స్కైవాక్లు ఉన్నాయి. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి రహేజా మైండ్ స్పేస్ కాంప్లెక్స్ లోని 11 టవర్లకు స్కైవాక్ ద్వారా రాకపోకలు సాగించవచ్చు. పలు అంతర్జాతీయ సంస్థల్లో పనిచేస్తున్న వందలాది మందికి ఇది ఎంతో సౌకర్యంగా ఉంది. స్కైవాక్ల నిర్మాణానికి స్వాగతం... ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి రింగ్రోడ్డుకు అన్ని వైపులా రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా హెచ్ఎండీఏ నిర్మించిన వలయాకారపు రోటరీ స్కైవాక్ మెట్రో ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుందని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ఇలా నగరంలోని వివిధ మెట్రోస్టేషన్ల వద్ద ఉన్న స్కైవాక్స్ను దృష్టిలో ఉంచుకొని మెట్రో స్టేషన్ల నుంచి స్కైవాక్ల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలు, ఐటీ కంపెనీలు, నివాస భవనాలు, వాణిజ్య సముదాయాల నుంచి ఇప్పటికే అనూహ్యమైన స్పందన లభిస్తోందన్నారు. ఈ క్రమంలో బాలానగర్ మెట్రో స్టేషన్ నుంచి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫీనిక్స్, ల్యాండ్ మార్క్ మాల్ కొత్తగా స్కైవాక్ నిర్మాణం కొనసాగుందన్నారు. అలాగే ఎల్బీనగర్ స్టేషన్ నుంచి సమీపంలో నిర్మాణంలో ఉన్న వాసవీ ఆనంద నిలయం నివాస భవనాల సముదాయానికి రాకపోకలు సాగించేందుకు వాసవి గ్రూప్ స్కైవాక్ నిర్మిస్తుందన్నారు. వాసవి ఆనందనిలయం కాంప్లెక్స్ మొత్తం 25 ఎకరాలలో ఒక్కో టవర్లో 33 అంతస్తులతో మొత్తం 12 టవర్లు నిర్మిస్తోందని చెప్పారు. మరోవైపు నగరంలో 69 కిలోమీటర్ల మేర విస్తరించిన మెట్రో కారిడార్లలోని 57 స్టేషన్లలో ప్రతి స్టేషన్కు రెండు వైపులా రోడ్డుకు ఒక వైపు నుంచి మరో వైపునకు చేరుకునేందుకు మెట్రో వంతెనలు ఉన్నాయని, పాదచారులు వాటిని వినియోగించుకొని సురక్షితంగా రోడ్డు దాటాలని ఎన్వీఎస్ కోరారు. ఇలా సంప్రదించండి.. మరికొన్ని సంస్థలు నాగోల్, ఉప్పల్ స్టేడియం, దుర్గం చెరువు, కూకట్పల్లి తదితర మెట్రో స్టేషన్ల నుంచి స్కైవాక్లు నిర్మించేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. ప్రైవేట్ సంస్థలు మెట్రో స్టేషన్ల నుంచి స్కైవాక్లు నిర్మించదలిస్తే ఎల్అండ్టీ ప్రతినిధి కేవీ నాగేంద్ర ప్రసాద్ను (ఫోన్ నెంబర్ 9900093820) సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. -
ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు బీభత్సం
లక్డీకాపూల్ : నెక్లెస్ రోడ్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు డివైడర్ను ఢీ కొని ఫుట్పాత్పైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. సోమవారం ఖైరతాబాద్ జంక్షన్ నుంచి సెక్రటేరియేట్ వైపు వెళుతున్న ఓ కారు అతివేగం కారణంగా ఎన్టీఆర్ ఘాట్ మలుపు వద్ద అదుపు తప్పింది. కారు డివైడర్పైకి దూసుకెళ్లి కరెంట్ పోల్ను ఢీకొనడంతో పోల్ రోడ్డపై అడ్డంగా విరిగిపడింది. ఈ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో విద్యుత్ స్తంభంతో పాటు రెండు చెట్లు ధ్వంస మయ్యాయి. కాగా కారు నడిపిన వ్యక్తి కూడా సురక్షితంగా బయటపడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడా అనే కోణంలో విచారణ చేపట్టారు. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయినట్లు సమాచారం. రోడ్డు డివైడర్ను ఢీకొనిఫుట్పాత్ పైకి ఎక్కిన కారు.. -
పాత లేఔట్లలోనే కబ్జాల జోరు
సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పాత లేఔట్లలోనే కబ్జాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తమ ప్లాట్లతో పాటు ప్రజావసరాలకు ఉద్దేశించిన పార్కులు, రహదారులను కబ్జా చేసేస్తున్నారంటూ ఆయా లేఔట్లకు చెందిన పలువురు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి (హైడ్రా) ఫిర్యాదు చేస్తున్నారు. కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 49 ఫిర్యాదులు రాగా... అత్యధికం వీటికి సంబంధించినవే ఉన్నాయి. 1980–90 దశకాల్లో వేసిన లేఔట్లను మాయం చేసి, ఆ స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్న కబ్జారాయుళ్లు మళ్లీ విక్రయాలకు యత్నిస్తున్నారంటూ బాధితులు రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. భూములకు ధరలు అమాంతం పెరగడంతో గతంలో తమకు అమ్మిన వాళ్లే కబ్జాలకు పాల్పడుతున్నారని వాపోయారు. పంచాయతీ లేఔట్లను వ్యవసాయ భూములుగా మార్చేసి సాగు చేసుకుంటున్నారనీ హైడ్రాకు కొన్ని ఫిర్యాదులు అందాయి. వీటిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందిస్తూ ఫిర్యాదుదారుల సమక్షంలోనే గూగుల్ మ్యాప్లు, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లను పరిశీలించారు. వాటిలో లభించిన సమాచారం ఆధారంగా సమగ్ర విచారణకు అధికారులను ఆదేశించారు. ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడుతామని కమిషనర్ హామీ ఇవ్వడంతో పలువురు సంతోషం వ్యక్తం చేశారు. ● రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ గ్రామంలో 1980 దశకంలో 2684 ప్లాట్లతో చాణక్యపురి లేఔట్ వేశారు. గత ఏడాది అందులోని 30 ఎకరాలు కబ్జాకు గురైనట్లు పలువురు ఫిర్యాదు చేశారు. అందులోని పార్కులు, రహదారులు కూడా కనుమరుగయ్యాయని ఆరోపించారు. ● రంగారెడ్డి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నం.58, 59లో ఉన్న ఎన్ఎంఆర్–దివ్యానగర్ లేఔట్లో తాము ప్లాట్లు కొన్నామని, ఇప్పుడవి కనిపించట్లేదని యజమానులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఇలా 66 ప్లాట్లు గల్లంతయ్యాయని, ఇప్పుడు అక్కడ వ్యవసాయం చేస్తున్నారని వాపోయారు. ● గచ్చిబౌలిలోని గోపన్నపల్లిలోని టీఎన్జీవో కాలనీలో ఉద్యోగులకు కేటాయించిన భూములు ఉన్నాయి. వీటిలో ఎనిమిది ఎకరాలను కొందరు కబ్జా చేసి ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేశారు. దీనిపై టీఎన్జీవో కాలనీ సంక్షేమ సంఘం (గచ్చిబౌలి) ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ● మేడ్చల్ జిల్లా చెంగిచర్ల గ్రామంలోని సర్వే నం.7, 10లో వేసిన శ్రీపురం కాలనీలో పార్కులు, రహదారులు కబ్జాకు గురయ్యాయని కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. హైడ్రా ప్రజావాణిలో 49 ఫిర్యాదులు -
కార్మికుల హక్కుల సాధనకు రాజీలేని పోరాటం
సాక్షి, సిటీబ్యూరో: కార్మికుల హక్కుల సాధనకు రాజీలేని పోరాటం చేయాలని వాటర్ వర్క్స్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు రాజీరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సంజీవరెడ్డి నగర్లోని యూనియన్ ఆఫీస్లో ప్రధాన కార్యదర్శి శేఖర్ ఆధ్వర్యంలో రాజిరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐక్యతతోనే సమస్యలు పరిష్కారమవుతాయని, అందుకు కలిసి కట్టుగా మందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు సతీష్ కుమార్,జనరల్ సెక్రెటరీ రాఘవేంద్ర రాజు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో డీఈఈ
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ క్వాలిటీకంట్రోల్ విభాగంలో డిప్యూటీ ఈఈగా పనిచేస్తున్న ఎ.దశరథ్ ముదిరాజ్ ఫైల్స్ క్లియర్ చేయడానికి, వాటిని ఈఈకి పంపించేందుకు ఒక వ్యక్తిని రూ.20వేలు డిమాండ్ చేసి, తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకొని నాంపల్లి ఏసీబీ కేసుల కోర్టులో హాజరు పరిచారు. అడ్వాన్స్గా అంతకు ముందే రూ. 10వేలు తీసుకున్నట్లు ఏసీబీ పేర్కొంది. కంటోన్మెంట్లో సీబీఐ దాడులు! కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్లో సీబీఐ దాడులు కలకలం సృష్టించాయి. సికింద్రాబాద్ డిఫెన్స్ ఎస్టేట్స్ ఆఫీస్లో గత నెలలో సీబీఐ సోదాలు జరగడంతో ఇటు డీఈఓ కార్యాలయంతో పాటు కంటోన్మెంట్ ఉద్యోగుల్లోనూ వణుకు మొదలైంది. విశ్వసనీయ సమాచారం మేరకు రక్షణ భూముల్లో అక్రమ నిర్మాణాల అంశంతో పాటు డీఈఓ కార్యాలయ సిబ్బంది, రక్షణ భూముల కబ్జాదారుల నుంచి అక్రమ వసూళ్లపై ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ప్రాథమిక ఆధారాలతో ఫిర్యాదులు అందడంతోనే సీబీఐ అధికారులు దాడులు నిర్వహించినట్లు సమాచారం. దీంతో సదరు ఉద్యోగి కాల్ డేటా, బ్యాంకు లావాదేవీలు, కార్యాలయ సిబ్బంది సహకారంపై కూడా ఆరాతీసినట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి నర్సాపూర్ : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ లింగం కథనం ప్రకారం.. హైదరాబాద్కు చెందిన సాయి నిఖిల్(21), అతడి మిత్రుడు మనీశ్ ఆదివారం మెదక్లో జరిగిన వారి మిత్రుడి వివాహానికి హాజరయ్యారు. రాత్రి ఇంటికి తిరిగి బయలుదేరారు. నర్సాపూర్ మీదుగా హైదరాబాద్ వెళ్తుండగా నర్సాపూర్ శివారులోని అయ్యప్ప దేవాలయం సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న రెయిలింగ్కు బైక్ ఢీకొట్టంది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న నిఖిల్ అక్కడికక్కడే మృతి చెందగా వెనుక కూర్చున్న మనీశ్కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అనంతరం మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డికి తరలించారు. బైక్ను అతి వేగంగా అజాగ్రత్తగా నడిపినందునే అదుపుతప్పి ప్రమాదం జరిగిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఫ్రెష్.. ఫిష్
పహాడీషరీఫ్: జల్పల్లి పెద్ద చెరువు చేపలకు గిరాకీ పెరిగింది. నెల రోజులుగా బర్డ్ ఫ్లూ వార్తల నేపథ్యంలో జనం చికెన్, గుడ్లు తినడాన్ని కొంత తగ్గించారు. ఈ నేపథ్యంలో మటన్, చేపల వైపు మొగ్గు చూపుతున్నారు. చికెన్ విక్రయాలు పడిపోవడంతో మటన్ వ్యాపారులు కిలోకు వెయ్యి రూపాయల చొప్పున వరకు విక్రయిస్తున్నారు. ఇంత డబ్బు వెచ్చిచలేని పేద, మధ్య తరగతి ప్రజలు ప్రత్యామ్నాయంగా చేపలు తినేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే స్వచ్ఛమైన నీటితో కూడిన జల్పల్లి చెరువులో కళ్ల ముందే పట్టుకొచ్చిన చేపలను విక్రయిస్తుండటంతో శని, ఆదివారాల్లో నగర శివారు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి కొనుగోలు చేస్తున్నారు.రుచికరమైన చేపలకు పెట్టింది పేరు...పుష్కలమైన నీటితో నిండుకుండలా తొణికిసలాడుతున్న జల్పల్లి చెరువులో ప్రతీ శని, ఆదివారాల్లో తాజా చేపలను విక్రయిస్తుంటారు. 150 ఎకరాల మేర విస్తరించిన ఉన్న ఈ చెరువులోని చేపలు ఎంతో రుచికరంగా ఉంటాయి. దీంతో ఇక్కడ పెద్ద ఎత్తున చేపల విక్రయాలు కొనసాగుతుంటాయి. ప్రస్తుతం వీరి సంఖ్య రెట్టింపైంది. పాతబస్తీ, కాటేదాన్, శంషాబాద్ తదితర ప్రాంతాల ప్రజలు ఎక్కువగా వస్తుంటారు. పాంప్లెట్స్ రకం కిలో రూ.120 ఉండగా.. సాధారణ చేపలు కిలో రూ.150 చొప్పున విక్రయిస్తున్నారు. రవ్వ, బొచ్చ, కట్ల, గ్యాస్కిట్, కొర్రమీను తదితర రకాల చేపలు ఈ చెరువులో లభ్యమవుతున్నాయి.రెండు సంఘాల ఆధ్వర్యంలో.జల్పల్లి శ్రీరామ ఫిష్ సొసైటీ, పాతబస్తీ కందికల్ గేట్ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో రెండు గ్రూపుల పెంపకందారులు ఈ చెరువులో చేపలను పెంచి విక్రయిస్తుంటారు. ఈసారి తెలంగాణ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో 55 వేల చేప పిల్లలను ఉచితంగా అందజేశారు. వీటికి అదనంగా రెండు సంఘాల వారు ఆంధ్రప్రదేశ్లోని కూచిపూడి నుంచి 11 లక్షల చేప పిల్లలను తీసుకొచ్చి వదిలారు. నీరు సమృద్ధిగా ఉండడంతో చేపల తూకం కూడా గణనీయంగా పెరిగింది. ఒక్కో చేప ఒక కిలో నుంచి నాలుగు కిలోల వరకు తూగుతోంది. దీంతో పెంపకందారులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.ఎంతో రుచికరంచికెన్, గుడ్లు తినడం తగ్గించాం. బయట మార్కెట్లలో లభించే చేపలతో పోలిస్తే జల్పల్లి చెరువు చేపలు రుచికరంగా ఉంటాయి. కళ్ల ముందే చేపలను పట్టుకొచ్చి తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. కటింగ్ చేసేవారు కూడా ఇక్కడే అందుబాటులో ఉన్నారు. స్వచ్ఛమైన నీటిలో పెరిగిన చేపలు తినడమే ఆరోగ్యానికి మంచిదని ఈ చేపలకు ప్రాధాన్యమిస్తున్నాం. – రాజు, శ్రీరాంకాలనీగిరాకీ పెరిగిందిఇటీవల చేపల కోసం జల్పల్లి చెరువుకు వచ్చే వారి సంఖ్య బాగా పెరిగింది. డిమాండ్ ఉన్నప్పటికీ సాధారణ ధరకే విక్రయిస్తున్నాం. చెరువు నీరు కలుషితం కాకుండా కలిసికట్టుగా చూసుకుంటున్నాం. కులమతాలకతీతంగా ఫిష్ సొసైటీ ఏర్పాటు చేసుకున్నాం. చేప పిల్లలను వదిలినప్పటి నుంచి అవి పెరిగేంత వరకు అసోసియేషన్ సభ్యులందరు పర్యవేక్షిస్తుంటారు. – నర్సింహ, ఫిష్ సొసైటీ సభ్యుడు -
ప్రతి ఇంట్లో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోండి
శంకర్పల్లి: పిల్లల తల్లిదండ్రులందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నా.. ప్రతి ఇంట్లో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోండని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఐపీఎస్ మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మండలంలోని దొంతాన్పల్లిలో ఆదివారం సక్సెస్ షోటోకాన్ కరాటే ఆధ్వర్యంలో నిర్వహించిన 9వ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరాటే నేర్చుకోవడం ఎంత ముఖ్యమో, దానిని నిత్యం సాధన చేయడం అంత కన్నా ముఖ్యమని తెలిపారు. ఫోన్లలో సోషల్ మీడియా, టీవీలు చూడడం తగ్గించి పుస్తక పఠనంపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో సక్సెస్ షోటోకాన్ కరాటే ప్రతినిధులు రవీందర్ కుమార్, అనిల్, రాజు, శ్రీనివాస్, నాయకులు శ్రీనివాస్, లక్ష్మణ్నాయక్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
నెలరోజుల క్రితం ఆత్మహత్య?
గచ్చిబౌలి: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఆలస్యంగా లభ్యమైన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ ఆదివారం తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాయదుర్గంలోని మహాప్రస్థానం ఎదురుగా ఉండే గుట్టవైపు వేపచెట్టుకు 35–40 ఏళ్ళ వయసున్న ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. శనివారం సాయంత్రం స్థానికులు అటువైపు వెళ్లగా దుర్వాసన రావడంతో గమనించి మొబైల్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఉండగా..మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్నట్లుగా గుర్తించారు. కింద ఒక బ్యాగు అందులో షర్టులు, ప్యాంట్లు, ఒక కంటి అద్దాలు పెట్టుకొనే బాక్సు ఉన్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు సుమోటోగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా దాదాపు నెల క్రితం ఈ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం -
ఖతర్నాక్ కాంతి దత్ !
సాక్షి, సిటీబ్యూరో: తృతీయ ఫైన్ జ్యువెలరీ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా భాగస్వామి అని, టాలీవుడ్, కోలీవుడ్ నటులు సమంత, కీర్తి సురేష్ బ్రాండ్ అంబాసిడర్లు అంటూ నమ్మించి వర్ధమాన వ్యాపారవేత్తల్ని మోసం చేయడంలో దిట్ట తోనంగి కాంతిదత్పై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో (సీసీఎస్) కేసు నమోదైంది. గత నెల 22న ఇది రిజిస్టర్ కాగా...ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఇతడిపై జూబ్లీహిల్స్తో పాటు సీసీఎస్లో కేసులు ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్లో జూబ్లీహిల్స్ అధికారులు అరెస్టు కూడా చేశారు. తాజాగా శేరిలింగంపల్లికి చెందిన సౌజన్య జూపల్లిని రూ.4.5 కోట్ల మేర మోసం చేసిన ఆరోపణలపై సీసీఎస్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశాఖపట్నానికి చెందిన కాంతిదత్ ఫిల్మ్నగర్ పరిధిలోని షేక్పేటలో స్థిరపడ్డాడు. జూబ్లీహిల్స్ రోడ్ నం.36లో తృతీయ ఫైన్ జ్యువెలరీ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. ఇందులో భాగస్వామిగా ఉన్న వైజాగ్కు చెందిన శ్రీజరెడ్డి తిప్పల రూ.2.50 కోట్లు వెచ్చించారు. 2023 సెప్టెంబర్ 7న బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా చేతుల మీదుగా ఈ షోరూం ప్రారంభమైంది. దీని నిమిత్తం రూ.1.5 కోట్లు ఆమెకు ఇవ్వాలంటూ శ్రీజరెడ్డి దగ్గర తీసుకున్నాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఫోర్జరీ సంతకాలతో ఆమెను డైరెక్టర్ పదవి నుంచి తొలగించిన కాంతి దత్ తన తల్లిని నియమించాడు. శ్రీజ ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. ఇదిలా ఉండగా...కాంతి దత్ మొదట ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి నుంచి రూ.3.50 కోట్లు తీసుకుని తృతీయ జ్యువెలరీలో డైరెక్టర్గా చేర్చుకున్నాడు. ఈయనతో పాటు గౌతమ్ వ్యక్తిని కూడా నమ్మించి మోసగించడంతో వాళ్లు ఆయా ఠాణాల్లో ఫిర్యాదు చేశారు. గత ఏడాది డిసెంబర్లో జూబ్లీహిల్స్ పోలీసులు కాంతిదత్ను అరెస్టు చేశారు. ఆ సందర్భంలో ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డి కూడా ఓ వీడియో విడుదల చేస్తూ సస్టైన్ కార్ట్ వ్యాపారం పేరుతో తనను మోసం చేసినట్లు ఆరోపించారు. మొత్తమ్మీద పలువురి నుంచి దాదాపు రూ.40 కోట్లు తీసుకుని మోసం చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. కాంతి దత్ చేతిలో తాను కూడా రూ.4.5 కోట్లకు మోసపోయానంటూ సౌజన్య గత నెల 21న సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్లో తన కుమార్తెను ట్యూషన్కు తీసుకువెళ్లినప్పుడు తాను నయోమీ రెస్టారెంట్లో కూర్చుంటానని, అక్కడే తనకు కాంతి దత్ పరిచయం అయ్యాడని ఆమె పోలీసులకు తెలిపారు. అలా మాయమాటలు చెప్పిన అతగాడు శ్రీ స్మేర హాస్పిటాలిటీ పేరుతో లిమిటెడ్ లయబులిటీ పార్ట్నర్షిప్ కంపెనీలో వాటా అంటూ ఆమెను ఆకర్షించాడు. ఈ కంపెనీ పేరుతో బంజారాహిల్స్లో నయోమీ రెస్టారెంట్ బ్రాంచ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పాడు. ఆపై దక్షిణ్ కథ సౌత్ ఇండియన్ రెస్టారెంట్, తృతీయ ఫైన్ జ్యువెలర్స్ పేర్లు చెప్పి 2023–24ల్లో దాదాపు రూ.4.5 కోట్ల వరకు సౌజన్య నుంచి తీసుకుని మోసం చేశాడు. ఎట్టకేలకు తాను మోసపోయానని గుర్తించిన బాధితులరాలు సీసీఎస్ను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. సౌజన్య తన ఫిర్యాదుతో పాటు కాంతి దత్తో చేసిన లావాదేవీలకు సంబంధించిన పూర్తి ఆధారాలు అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మరోపక్క కాంతిదత్పై మాదాపూర్ ఠాణాలో గతంలో ఓ హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. బైక్ ట్యాక్సీ డ్రైవర్ రాజశేఖర్ మృతి చెందడంతో నమోదైన ఈ కేసులోనూ ఆయన అరెస్టు అయ్యారు. తృతీయ ఫైన్ జ్యువెలరీ పేరుతో సంస్థ ఏర్పాటు ప్రముఖ సినీ నటుల పేర్లు చెప్పి వరుస మోసాలు ఇప్పటికే ఇతడిపై జూబ్లీహిల్స్, సీసీఎస్లో కేసులు మరో బాధితురాలి ఫిర్యాదుతో తాజాగా ఇంకో కేసు.. -
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల అరెస్టు
అత్తాపూర్: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను అత్తాపూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చంద్రాయణగుట్టకు చెందిన మీర్ ముస్తఫా అలీ, ఎంఎం పహాడీకి చెందిన షేక్ ఖయ్యూమ్లు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేయడమే వత్తిగా మలుచుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు దాదాపు 80 కేసులు నమోదై ఉన్నాయి. వీరు తరచు దొంగతనాలు చేస్తూ పట్టుబడిన ప్రతిసారి బైయిల్పై బయటకు వస్తు తిరిగి అదే పంథాను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గత నెల 25వ తేదీన టీఎస్12ఈఏ 4398 నెంబర్ గల వారి యాక్టివా స్కూటీకి డూప్లికేట్ టీఎస్09ఈవై 0733 నంబర్ ప్లేట్ను అతికించారు. అనంతరం సర్వారెడ్డి కాలనీకి చేరుకున్నారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి బంగారు పుస్తెల తాడును తెంచుకుని పారిపోయి డూప్లికేట్ నెంబర్ప్లేట్, వారు ధరించిన బట్టలు, మాస్క్లను తొలగించి ఏమీ తెలియనట్లు ప్రయాణించారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా దొంగలించిన బంగారు గొలుసును జకియా సుల్తానా అనే మహిళకు ఇవ్వడంతో ఆమె విక్రయించిందన్నారు. ముగ్గు రు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 17.5 గ్రాముల బంగారం, యాక్టివా స్కూటీ, రూ.60 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రేమ పేరుతో వంచన..యువకుడిపై కేసు
బంజారాహిల్స్: ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతితో చెట్టాపట్టాలేసుకుని తిరిగి..ఆమెను గర్భవతిని చేసి..ఆపై ముఖం చాటేసిన యువకుడిపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన ఓ యువతి (25)కి అదే ప్రాంతానికి చెందిన ఎన్.శివాచారితో 2020 ఆగస్టులో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని శివాచారి నమ్మించడంతో ఆమె సన్నిహితంగా మెలిగింది. ఇటీవలే శివాచారి కేపీహెచ్బీకి మకాం మార్చగా యువతి కూడా బంజారాహిల్స్కు వచ్చి ఓ ఆస్పత్రిలో పనిచేస్తూ హాస్టల్లో ఉంటుంది. ఇక్కడ కూడా తరచూ కలుసుకునేవారు. ఆమె రెండుసార్లు గర్భం దాల్చగా, బలవంతంగా మాయమాటలు చెప్పి గర్భస్రావం చేయించాడు. గత నెల నుంచి శివాచారి ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు గమనించింది. లోతుగా ఆరా తీయగా శివాచారికి ఆరు నెలల క్రితమే మరో యువతితో నిశ్చితార్ధం జరిగినట్లుగా తెలిసింది. దీంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడింది. నాలుగు నెలల్లో పెళ్లి చేసుకుంటానని నమ్మించిన నిందితుడు పెళ్లి చేసుకోగా మరో యువతితో నిశ్చితార్ధం చేసుకోవడమే కాకుండా తమ ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదని, వాట్సప్ బ్లాక్ చేశాడని, తనను మోసం చేశాడని బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శివాచారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి మాచర్ల పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు. పరీక్షల వేళ భయాందోళన వద్దు మొయినాబాద్రూరల్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు భయాందోళనకు గురికావొద్దని తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియెట్ ప్రైవేట్ కళాశాలల అసోసియేషన్ చైర్మన్ గౌరీ సతీష్ అన్నారు. మండల పరిధిలోని హిమాయత్నగర్లో ఆదివారం ఆయన మాట్లాడారు. ఈనెల 5 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇంటర్బోర్డు నియమావళిని తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఉదయం 8.45 గంటలలోపు వచ్చిన వారినే పరీక్షలకు అనుమతించనున్నారని, ఆ తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరని చెప్పారు. సమయాన్ని పాటి స్తూ విద్యార్థులు 30 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాలకు వెళ్లాలని బోర్డు తొలిసారి నిబంధనలు అమలులోకి తెచ్చిందన్నారు. తల్లిదండ్రు లు విద్యార్థులను ప్రోత్సహిస్తూ.. పరీక్ష కేంద్రాలకు తగిన సమయానికి తీసుకెళ్లాలన్నారు. ఏవైనా సందేహాలుంటే 92402 05555 టో ల్ఫ్రీ నంబర్తో పాటు జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. క్రీడలను ప్రోత్సహించాలి హుడాకాంప్లెక్స్: బీసీసీఐ వద్ద ఉన్న నిధులను ఇతర క్రీడలకు మళ్లించి క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కిగౌడ్ అభిప్రాయపడ్డారు. హీరో సుమన్ 50 ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం ‘సుమన్ తల్వార్ లెజెండరీ కప్–2025’ పేరిట రాష్ట్ర స్థాయి ఓపెన్ కరాటే చాంపియన్షిప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మధుయాష్కి మాట్లాడుతూ.. యువత డ్రగ్స్, మద్యం ఇతర వ్యసనాల బారిన పడుతూ జీవితాలను పాడు చేసుకుంటున్నారని, క్రీడలను అలవాటు చేసుకోవడం ద్వారా వారి జీవితాలను క్రమశిక్షణగా తీర్చిదిద్దుకోవచ్చని సూచించారు. మద్యం తాగి వాంతులు చేసుకుని.. వలస కూలీ మృతిమొయినాబాద్: మద్యం తాగి వాంతులు చేసుకుని ఓ వలస కూలీ మృతి చెందాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధి అజీజ్నగర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన నీలాంచల్ బెహెర(33) బతుకు దెరువుకోసం 3 ఏళ్ల క్రితం అజీజ్నగర్కు వలస వచ్చాడు. సోడా కంపెనీలో కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో మద్యం తాగి పడుకున్నాడు. రాత్రి 8 గంటల సమయంలో అక్కడే పనిచేసే అతని బంధువు ఈశ్వర్ మహకుల్ భోజనం చేయడానికి నీలాంచల్ను నిద్ర లేపాడు. ఆ సమయంలో వాంతులు చేసుకుని మళ్లీ పడుకున్నాడు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో నిద్రలేపే ప్రయత్నం చేయగా.. అతను లేవలేదు. వెంటనే స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచిగాంధీకి తీసుకెళ్లగా.. బెహెర చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
తక్కువ ధరకు బంగారమంటూ టోకరా
సాక్షి, సిటీబ్యూరో: వాట్సాప్ ద్వారా కాల్స్ చేసి, తక్కువ ధరకు బంగారం విక్రయిస్తానంటూ వల వేసి, అందినకాడికి దండుకుని మోసం చేస్తున్న నేరగాడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సరూర్నగర్ ప్రాంతానికి చెందిన జాలె చంద్రశేఖర్రెడ్డి ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్లకు బానిసగా మారాడు. ఇతర వ్యసనాలకూ ఉన్న ఇతగాడు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. స్నేహితులు, పరిచయస్తుల ద్వారా నగరానికి చెందిన అనేక మంది ఫోన్ నెంబర్లు సేకరించిన ఇతగాడు వారికి వాట్సాప్ కాల్ చేసి తానో బంగారం వ్యాపారిగా పరిచయం చేసుకుంటాడు. ముంబైలో తక్కువ ధరలకు బంగారాన్ని ఖరీదు చేస్తుంటానని, దాన్ని మార్కెట్ రేటు కంటే తక్కువగా విక్రయిస్తానని నమ్మబలుకుతాడు. ఎదుటి వారిని పూర్తిగా నమ్మించడం కోసం వారికి తెలిసిన కొందరి పేర్లు చెప్తాడు. ఇలా కోఠిలో నివసిస్తున్న ఓ వృద్ధుడికి (75) గత ఏడాది డిసెంబర్లో కాల్ చేశాడు. ఆరు తులాల బంగారం రూ.5 లక్షలకు విక్రయిస్తానని నమ్మించాడు. ఆయన నుంచి అడ్వాన్స్గా ఆ మొత్తం తన బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకున్నాడు. ఆపై బాధితుడు తన బంగారం విషయంపై చంద్రశేఖర్కు ఫోన్ చేసి అడుగుతుండగా... క్రిస్మస్ పండుగతో పాటు ఇతర సాకులు చెప్పి తప్పించుకున్నాడు. తీవ్రంగా ఒత్తిడి చేయగా... ఈ ఏడాది జనవరి 15న నేరుగా వచ్చి బంగారం ఇస్తానని చెప్పాడు. అలా చేయకపోవడంతో బాధితుడు పదేపదే ఫోన్లు చేసినా స్పందించడం మానేశాడు. దీంతో తాను మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ కె.ప్రసాదరావు నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేసి ఆదివారం నిందితుడిని అరెస్టు చేసింది. నగరవాసి నుంచి రూ.5 లక్షలు స్వాహా నిందితుడిని అరెస్టు చేసిన సైబర్ కాప్స్ -
ముగిసిన విజ్ఞాన్ వైభవ్
చివరి రోజు విద్యార్థులతో కిటకిటలాడిన స్టాల్స్ ఆకట్టుకున్న డ్రోన్ షో చందానగర్: గచ్చిబౌలి స్టేడియంలో విజ్ఞాన్ వైభవ్ ఎగ్జిబిషన్ –2025 ఆదివారంతో ముగిసింది. మూడు రోజులపాటు నిర్వహించిన యుద్ధ పరికరాల ప్రదర్శన విద్యార్థులను, యువతను ఎంతో ఆకట్టుకుంది. రక్షణ రంగానికి చెందిన అనేక అరుదైన ఆయుధాలు, పరికరాలు వివిధ స్టాల్స్లలో ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. రక్షణరంగ ఉత్పత్తుల తయారీలో భారత్ మరో పదేళ్లలో ప్రపంచంలోనే నంబర్వన్గా నిలుస్తుందని డీఆర్డీఓ ప్రతినిధులు పేర్కొన్నారు. మూడు రోజులపాటు వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు రక్షణరంగ పరిశోధన కేంద్రాలు, ఉత్పత్తి సంస్థలు తయారు చేసిన ఆయుధాలను తిలకించారు. కార్యక్రమంలో డీఆర్డీవో డ్రోన్ షో అందరినీ ఆకట్టుకుంది. ఇండియన్ ఆర్మీ అధికారులతో విద్యార్థులు ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. అంతరిక్షం నమూనా వద్ద యువతి -
ఉత్సాహంగా డెసిబుల్ డాష్ రన్
గచ్చిబౌలి: వినికిడి సమస్యలపై అవగాహన పరుగును ఉత్సాహంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్, కేపీహెచ్బీలలోని మైక్రో కేర్ ఈఎన్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, మౌర్య ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం గచ్చిబౌలి స్టేడియం వద్ద 2కే, 5కే, 10కే రన్ను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, డాక్టర్ ప్రకాశ్ జెండా ఊపి ప్రారంభించారు. డెసిబుల్ డాష్ కేవలం పరుగు మాత్రమే కాదని, ఇది వినికిడి ఆరోగ్యం గురించి అవగాహన పెంచడానికి, వినికిడి సవాళ్లతో జీవిస్తున్న వారికి మద్దతునిచ్చే శక్తిమంతమైన ఉద్యమంగా నిర్వహిస్తున్నామన్నారు. రన్నర్లు, వైద్యులు, పారామెడికల్ నిపుణులు, ఐటీ ఉద్యోగులు, ఫార్మాస్యూటికల్ దిగ్గజాలు, క్రీడా ప్రముఖులు, సామాజికవేత్తలు, కళాకారులు, ప్రభావశీలురు, ప్రముఖ పౌరులు, రాజకీయ నాయకులు, ఆరోగ్య ఔత్సాహికులు పాల్గొంటున్నారని వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ అశ్విని అమరేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో జెండా ఊపి రన్ను ప్రారంభిస్తున్న నిర్వాహకులు -
ట్యాంకర్ల డెలివరీ టైమింగ్ తగ్గించాలి
సాక్షి, సిటీబ్యూరో: ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సేవలు అందించాలని ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం మాదాపూర్ ఫిల్లింగ్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. వేసవిలో నీటి డిమాండ్ను ఎదుర్కోవడానికి అధికారులంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. ట్యాంకర్ బుక్ చేసిన వెంటనే డెలివరీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం సూక్ష్మ స్థాయి ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. అవసరమైతే అదనపు ట్యాంకర్లు, సిబ్బందిని సమకూర్చుకోవాలని చెప్పారు. మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఏమైనా అవసరాలుంటే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వాటిని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ట్యాంకర్ల సరఫరాపై ఆరా ట్యాంకర్ డ్రైవర్లతో ఎండీ మాట్లాడారు. ట్యాంకర్ బుకింగ్, డెలివరీ లాగ్ బుక్ను పరిశీలించారు. ట్యాంకర్ బుకింగ్ స్టేటస్, రోజుకి ఎన్ని ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి? ఎన్ని డెలివరీ చేస్తున్నారు? తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాదాపూర్ ఫిల్లింగ్ స్టేషన్ లో 06 ఫిల్లింగ్ పాయింట్స్, 80 ట్యాంకర్లు ఉండగా.. రోజుకి 600 ట్రిప్పులు డెలివరీ చేస్తున్నారు. 80 శాతం బుకింగ్స్ ను 6 నుంచి 12 గంటల్లో డెలివరీ చేస్తుండగా.. మిగిలిన 20 శాతం 24 గంటల్లో డెలివరీ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ 600 ట్రిప్పులు డెలివరీ చేస్తుండగా.. రాబోయే రోజుల్లో 1200 బుకింగ్స్ వచ్చినా డెలివరి చేసే సామర్థ్యం ఉందని జీఎం.. ఎండీ కి వివరించారు.ఈ కార్యక్రమంలో జీఎం, డీజీఎం, మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. ఈడీ ఇన్స్పెక్షన్.. జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్ ఆదివారం పలు ఫిల్లింగ్ స్టేషన్లను తనిఖీ చేశారు. షాపూర్నగర్, మౌలాలి, ఎల్లారెడ్డి గూడ ఫిల్లింగ్ స్టేషన్లకు వెళ్లారు. ట్యాంకర్ బుకింగ్ స్టేటస్, రోజుకి ఎన్ని ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి? ఎన్ని డెలివరీ చేస్తున్నారు? తదితర వివరాలు తనిఖీ చేశారు. ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ ఇన్చార్జిలతో మాట్లాడి వివరాలు కనుక్కున్నారు. నీటి సరఫరాలో అంతరాయం మసీద్ బండ సెక్షన్లో విద్యుత్ శాఖ నిర్వహణ పనులు చేపడుతోంది. దీంతో ఆ సెక్షన్ పరిధిలో ఉన్న ఫిల్లింగ్ స్టేషన్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చెయ్యడం ఆగింది. ఒకే ఫిల్లింగ్ స్టేషన్ తో (గ్రావిటీ ద్వారా నడిచే) నీటి సరఫరా చేస్తున్నారు. మాదాపూర్ ఫిల్లింగ్ స్టేషన్లో జలమండలి ఎండీ తనిఖీ జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మాదాపూర్ ఫిల్లింగ్ స్టేషన్ తనిఖీ -
బాల్యానికి మూడు‘ముళ్లు’
సాక్షి, సిటీబ్యూరో: ఎగుమతుల ఖిల్లా.. రంగారెడ్డి జిల్లా బాల్య వివాహాలకు నిలయంగా మారుతోంది. ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో దూసుకుపోతూ అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఉమ్మడి జిల్లాలోని పలువురు బాలికలు మూడు ముళ్ల బంధంలో చిక్కుకుంటున్నారు. 18 ఏళ్ల వయసు నిండక ముందే పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తల్లిదండ్రులు తమకు ఇష్టం లేని పెళ్లిళ్లు చేస్తుండటంతో అధికారులను ఆశ్రయిస్తున్నారు. 2024 జనవరి నుంచి నవంబర్ చివరి వరకు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు వెయ్యి బాల్య వివాహాలను అడ్డుకోగా, వీటిలో కేవలం గ్రేటర్ జిల్లాల పరిధిలోనే 248 కేసులు ఉండటం గమనార్హం. అవగాహన కల్పిస్తున్నా.. బాల్య వివాహాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. పిల్లలకు త్వరగా పెళ్లి చేసి, బాధ్యతల భారాన్ని తగ్గించుకోవాలనే సామాజిక దురాచారం నుంచి తల్లిదండ్రులు ఇంకా బయటపడటం లేదు. ఉన్నత చదువులు చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించి సొంతకాళ్లపై నిలబడాలనే బాలికల ఆలోచనను మొగ్గలోనే తుంచేస్తున్నారు. బాల్య వివాహాల రద్దు కోసం ప్రభుత్వాలు బలమైన చట్టాలను తీసుకొచ్చినప్పటికీ.. తల్లిదండ్రుల్లో ఉన్న బలహీనత బాలికల పాలిట శాపంగా మారుతోంది. కొంత మంది తల్లిదండ్రుల ఒత్తిడికి తలొగ్గి తాళి కట్టించుకుంటుంటే.. మరికొంత మంది ఎదురు తిరుగుతున్నారు. పలువురికి విముక్తి బలవంతపు పెళ్లిని నిలిపివేయించాలని కోరుతూ పోలీసులను, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆశ్రయిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా 94 బాల్య వివాహాలను అడ్డుకోగా, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 54 చొప్పున అడ్డుకున్నారు. హైదరాబాద్లో 46 మంది బాలికలకు బాల్య వివాహాల నుంచి విముక్తి కల్పించారు. జిల్లా అడ్డుకున్న బాల్య వివాహాలు వికారాబాద్ 94 రంగారెడ్డి 54 మేడ్చల్ 54 హైదరాబాద్ 46 18 ఏళ్లు నిండక ముందే పెళ్లి పీటల పైకి.. గ్రేటర్ జిల్లాల పరిధిలో ఆగని బాల్య వివాహాలు తరచూ వెలుగు చూస్తున్న ఘటనలు -
పడమట పర్యాటక రాగం!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలను అనుసంధానం చేసే సరికొత్త ప్రాజెక్టు నిర్మాణానికి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) చర్యలు చేపట్టింది. దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులను ఆకట్టుకొనేలా ప్రత్యేక టూరిస్ట్ సర్క్యూట్లకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ట్యాంక్బండ్, నెకె్ల్స్ రోడ్డు, పీపుల్స్ ప్లాజా వలయంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా వలయ రహదారి ఉన్నట్లుగానే పడమట వైపున సుమారు 31 కిలోమీటర్ల పరిధిలో ఒక సర్క్యూట్ను ఏర్పాటు చేయనున్నారు.సుమారు 180 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసిన ఎకో పార్కు, గాంధీజీ భారీ విగ్రహంతో పాటు పర్యాటకులు సందర్శించేలా అభివృద్ధి చేయనున్న బాపూఘాట్తో పాటు వివిధ ప్రాంతాలను ఈ వలయంలో రూపొందించనున్నారు. ఇందుకోసం మౌలిక వసతులు, రహదారుల విస్తరణ, ప్రత్యేక రవాణా సదుపాయాలను విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు. ఎకో పార్కు నిర్మాణం ఇప్పటికే పూర్తయింది.త్వరలో దీన్ని ప్రారంభించనున్నారు. చారిత్రక తారామతి బారాదరితో పాటు, హిమాయత్సాగర్ ఫారెస్ట్ ట్రెక్ పార్కు తదితర ప్రాంతాలను ఈ వలయం అనుసంధానం చేయనుంది. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ)పద్ధతిలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. డిజైన్, నిర్మాణం, నిధుల కేటాయింపు, నిర్వహణ, బదిలీ (డీబీఎఫ్ఓటీ) మోడల్ గా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇందుకోసం త్వరలోనే ఆసక్తుల వ్యక్తీకరణకు ఆన్లైన్ బిడ్డింగ్ నోటిఫికేషన్ వెలువడనుందని పేర్కొన్నారు.సర్క్యూట్లోని ప్రధాన ప్రాంతాలు..● ఈ కొత్త టూరిజం సర్క్యూట్లో ఎకోపార్క్ (కొత్వాల్గూడ, హిమాయత్ సాగర్ సమీపంలో), బాపూ ఘాట్, తారామతి బారాదరి, ఫారెస్ట్ ట్రెక్ పార్క్ (చిలుకూరు రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్) వంటి నాలుగు ప్రధాన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. మొత్తం 31 కిలోమీటర్ల పొడవున ఈ సర్క్యూట్ విస్తరించనుంది.● తారామతి బారాదరి నుంచి బాపూఘాట్కు 3.8 కిలో మీటర్లు, బాపూఘాట్ నుంచి ఎకోపార్కు (హిమాయత్సాగర్) 13.50 కి.మీ, హిమాయత్సాగర్ నుంచి ఫారెస్ట్ ట్రెక్ పార్కు (నార్సింగి) వరకు 7.5 కి.మీ, అక్కడి నుంచి తిరిగి తారామతి బారాదరి వరకు 6 కి.మీ చొప్పున ఈ సర్క్యూట్ విస్తరించి ఉంటుంది.పర్యాటకులను ఆకట్టుకునేలా..● ఈ సర్క్యూట్ను ఆధునిక పర్యాటక హంగులతో అభివృద్ధి చేయనున్నారు. దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించేలా రవాణా సదుపాయాలను ఏర్పాటు చేస్తారు.● భాగ్య నగర చరిత్రను, సంస్కృతిని ప్రతిబింబించేలా సర్క్యూట్ను అందంగా తీర్చిదిద్దుతారు. రెస్టరెంట్లు, షాపింగ్ సెంటర్లు తదితర అన్ని సదుపాయాలూ ఉంటాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో పర్యాటకులు వివిధ ప్రాంతాలను సందర్శించేవిధంగా ఏర్పాట్లు చేస్తారు.● పర్యాటక రంగం అభివృద్ధిని ప్రభుత్వం ప్రత్యేకంగా భావిస్తోంది. ఇప్పటికే మూసీ ప్రక్షాళనతో పాటు బాపూఘాట్ను సువిశాలమైన చారిత్రక సందర్శన స్థలంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.● ఈ క్రమంలో నగరాన్ని అన్ని రంగాలతో పాటు పర్యాటక రంగంలోనూ అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు ఇలాంటి సర్క్యూట్లు దోహదం చేస్తాయని అధికారులు భావిస్తున్నారు.● ప్రత్యేకమైన పర్యాటక ప్యాకేజీలతో వెస్ట్ హైదరాబాద్ టూరిజం సర్క్యూట్ను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సందర్శించే విధంగా ప్రోత్సహిస్తారు.● ‘ఈ సర్క్యూట్ పూర్తయితే నగర పర్యాటక రంగం కొత్త శోభను సంతరించుకుంటుంది. అందుకే దేశీ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి చేయాలని భావిస్తున్నాం’ అని హెచ్ఎండీఏ అధికారి ఒకరు వివరించారు. -
సారూ.. జరచూడరూ!
చార్మినార్: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. దీంతో పాటు పాతబస్తీలో పార్కింగ్ సమస్య కూడా మొదలైంది. ఇక నెల రోజుల పాటూ పాతబస్తీలో రంజాన్ మార్కెట్ కొనసాగుతుంది. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన వివిధ రకాల వస్తువులు ఇక్కడి రంజాన్ మార్కెట్లో లభిస్తాయి. దీంతో పాతబస్తీ చార్మినార్ పరిసరాల్లో జోరుగా రంజాన్ మార్కెట్ ఉంటుంది. వివిధ ప్రాంతాలను చెందిన వినియోగదారులు తమకు నచ్చిన వస్తువులను ఖరీదు చేయడానికి పాతబస్తీకి భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. అయితే.. పాతబస్తీ రంజాన్ మార్కెట్కు వచ్చే వినియోగదారుల సౌకర్యార్థం పార్కింగ్ అందుబాటులో లేకుండాపోయింది. రంజాన్ ఉపవాస దీక్షల సందర్బంగా రోజుకు ఐదుసార్లు నమాజ్ చేసే ముస్లింలు సైతం మక్కా మసీదుకు పెద్ద ఎత్తున తరలి వస్తారు. వీరందరి వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి ఇప్పటి వరకు సరైన పార్కింగ్ లాట్లు అందుబాటులో లేవు. నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి దారుషిఫా, నయాపూల్, పురానా పూల్ ద్వారా పాతబస్తీలోకి అడుగుపెట్టే వాహనదారులకు పార్కింగ్ సమస్యలు రంజాన్ మాసంలో మరింత జటిలం కానున్నాయి. మల్టీ లెవల్ పార్కింగ్ సిస్టం ఏమాయే? చార్మినార్– మక్కా మసీదు సమీపంలోని పంచ్ మహల్లాలో జీహెచ్ఎంసీ మల్టీ లెవల్ పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయడానికి ఏడేళ్ల క్రితం ఇక్కడి ఆర్టీసీ బస్టాండ్ను కూల్చివేసి ఏడేళ్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు సైతం మంజూరు కావడంతో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గత సార్వత్రిక ఎన్నిలకు ముందు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు జరగలేదు. దీంతో పాటు మోతి గల్లీలోని నిజాం కాలం నాటి ట్రెజరీ భవనాన్ని తొలగించిన సంబంధిత అధికారులు ఇక్కడ కూడా మల్టీ లెవల్ పార్కింగ్ నిర్మాణాలు చేపడతామని హడావుడి చేశారు. ఏడేళ్లు గడిచిపోయినా ఏమీ జరగలేదు. ఇలా పాతబస్తీకి వచ్చే సందర్శకులు, వినియోగదారులు, వాహనదారులకు తమ వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలో తెలియని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. రంజాన్ మార్కెట్ ప్రారంభంతో మరిన్ని సమస్యలు.. ఇక సాధారణ రోజుల్లో తలెత్తే పార్కింగ్ సమస్యలతో పాటు.. ఈ నెల రోజుల పాటు కొనసాగే రంజాన్ మార్కెట్లో అధికంగా ఉంటాయి. అత్యధిక సంఖ్యలో వచ్చే వాహనాల పార్కింగ్కు తాత్కాలికంగానైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసంరం ఉంది. గత రంజాన్ మార్కెట్ సందర్భంగా పాతబస్తీలోని కొన్ని ఖాళీ స్థలాలను ఎంపిక చేసి తాత్కాలికంగా ఉచిత పార్కింగ్ అంటూ రంజాన్ ప్రారంభానికి ముందే ప్రకటించేవారు సంబంధిత లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు. అయితే.. ఆదివారం నంంచి రంజాన్ మాసం ప్రారంభమైనప్పటికీ.. పాతబస్తీలో అవసరమైన మేరకు పార్కింగ్ స్థలాలను అందుబాటులోకి తీసుకురాకపోవడంతో స్థానిక వ్యాపారులతో పాటు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాడ్బజార్లో సౌకర్యం లేకపోవడంతో.. లాడ్బజార్లోని గాజుల దుకాణాలను సందర్శించడానికి దూరపు ప్రాంతాల నుంచి షాపింగ్ కోసం వచ్చే వినియోగదారులకు సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో తమకు నిరాశ కలుగుతోందని స్థానిక వ్యాపారులు అంటున్నారు. తమ కోసం ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని గాజుల వ్యాపారులు కోరుతున్నారు. సరైన పార్కింగ్ లేకపోవడంతో తమ వాహనాలను ఎక్కడ పార్కు చేసుకోవాలో తెలియక వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు. పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయిస్తే ఈ రంజాన్ మాసంలో ఆశించిన స్థాయిలో వ్యాపారాభివృద్ది జరుగుతుందని కోరుతున్నారు. ప్రత్యేకంగా కారు పార్కింగ్ ఏర్పాటు చేయాని వారు సూచిస్తున్నారు. రంజాన్ మార్కెట్లో పార్కింగ్ తిప్పలు పాతబస్తీలో మొదలైన సందడి ఈ నెల రోజులూ ఇక ఇక్కట్లు ఊసే లేని మల్టీ లెవల్ పార్కింగ్ హామీ తాత్కాలిక సౌకర్యం కల్పించాలంటున్న వాహనదారులు -
పరీక్షల వేళ ‘ఫీ’జులుం!
ముషీరాబాద్కు చెందిన ప్రకాశ్ చిరుద్యోగి. అతని కుమారుడు కొత్తపేటలోని కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. సెకండియర్ ఫీజు మొత్తం రూ.1.60 లక్షలు కాగా.. దశలవారీగా రూ.1.20 లక్షలు చెల్లించారు. గత నెల ప్రాక్టికల్ పరీక్షల నేపథ్యంలో ఫీజు చెల్లించాలని ఒత్తిడి పెరగడంతో రూ. 20 వేలు చెల్లించారు. మరో రూ.20 వేలు పెండింగ్లో కట్టాల్సి ఉంది. ఈ నెల 5 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కొంత ఫీజు పెండింగ్లో ఉండటంతో హాల్ టికెట్ ఇచ్చేందుకు కాలేజీ వర్గాలు నిరాకరించాయి. పరీక్షల తర్వాత చెల్లిస్తామని వేడుకుంటున్నప్పటికీ ఇది యాజమాన్యం నిర్ణయం అని చెప్పారు. ఇది ఒక ప్రకాశ్ ఎదుర్కొంటున్న సమస్య కాదు.. పూర్తి స్థాయి ఫీజులు క్లియర్ చేయని విద్యార్థుల తలిదండ్రులందరిదీను.సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష వేళ విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి పెరిగింది. విద్యా సంవత్సరం పూర్తి స్థాయి ఫీజు చెల్లిస్తేనే హాల్ టికెట్ ఇస్తామని ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు తేల్చి చెబుతున్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల వార్షిక పరీక్షల హాల్ టికెట్ల జారీని కాలేజీల లాగిన్కు ఇవ్వడం వాటికి కలిసి వచ్చినట్లయింది. విద్యా సంవత్సరం ఫీజులు ఎలాంటి పెండింగ్ లేకుండా పూర్తిగా వసూలు చేసేందుకు హాల్ టికెట్లకు ఫీజుల క్లియరెన్స్ మెలిక పెడుతున్నారు. దీంతో విద్యార్ధులు మానసిక వేదనకు గురవుతున్నారు. ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థులతో పాటు ఫస్టియర్ విద్యార్థులు సైతం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పరీక్షల తర్వాత పెండింగ్ను క్లియర్ చేస్తామని చెబుతున్నా.. కాలేజీ యాజమాన్యాలు వినిపించుకోవడంలేద విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.కార్పొరేట్ల తీరు మరింత కఠినంవిద్యా సంవత్సరం ఫీజుల విషయంలో కార్పొరేట్ కాలేజీ తీరు మరింత కఠినంగా తయారైంది. మేనేజ్మెంట్ నిర్ణయమంటూ ఫీజులు చెల్లించనిదే హాల్ టికెట్లు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి వర్గాలకు ఇంటర్తో పాటు ఐఐటీ, మెడిసిన్ అంటూ వల విసిరి విద్యార్థులను చేర్చుకున్న కార్పొరేట్ కాలేజీలు ఫీజుల విషయంలో అసలు రూపం బయటపెడుతున్నారు. విద్యా సంవత్సరానికి కనీసం రూ.1.50 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. ఒకసారి ఫీజుల విషయంలో అంగీకరింపజేసి.. నెమ్మదిగా వసూళ్ల దిగుతున్నారు. కార్పొరేట్ వలలో చిక్కుకున్న పేద కుటుంబాలు ఫీజులు చెల్లించేందుకు అప్పులు చేయక తప్పడం లేదు. పరీక్షల సమయంలో ఒత్తిడి పెంచి పూర్తి స్థాయి ఫీజులు వసూళ్లకు పాల్పడుతుండటంతో పేద కుటుంబాలకు తలకు మించిన భారంగా తయారైంది. ఫీజుల ఒత్తిడితో విద్యార్థులు పరీక్షలపై సరిగా దృష్టి పెట్టలేకపోతున్నారని తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
కొత్త రూట్లలో ఏసీ బస్సులు
సాక్షి, సిటీబ్యూరో: కొత్తగా రెండు రూట్లలో గ్రీన్ మెట్రో లగ్జరీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ఈ నెల 3వ తేదీ నుంచి నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు లింగంపల్లి నుంచి మెహిదీపట్నం (216 డబ్ల్యూ) రూట్లో ప్రతిరోజూ 4 బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. లింగంపల్లి నుంచి మొదటి బస్సు ఉదయం 6.50 గంటలకు బయలుదేరుతుంది. చివరి బస్సు రాత్రి 10.10 గంటలకు బయలుదేరుతుంది. అలాగే.. మెహిదీపట్నం నుంచి మొదటి బస్సు ఉదయం 8 గంటలకు, చివరి బస్సు రాత్రి 11 గంటలకు మెహిదీపట్నం నుంచి లింగంపల్లికి బయలుదేరనుంది. ఈ రూట్లో నల్లగండ్ల, గోపన్పల్లి, విప్రో, ఖాజాగూడ, నానల్నగర్ మీదుగా రాకపోకలు సాగించనున్నాయి. అలాగే లింగంపల్లి– లక్ష్మీనగర్ జీఏఆర్ (216జీ) రూట్లో రెండు ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. లింగంపల్లిలో మొదటి బస్సు ఉదయం 6.15 గంటలకు చివరి బస్సు రాత్రి 9.05 గంటలకు బయలుదేరుతాయి. లక్ష్మీనగర్ జీఏఆర్ నుంచి మొదటి బస్సు ఉదయం 7.05 గంటలకు చివరి బస్సు రాత్రి 9.55 గంటలకు బయలుదేరుతాయి. -
9999 @ రూ.9.37 లక్షలు
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీఏ ప్రత్యేక నెంబర్లపై వాహనదారులు మరోసారి తమ క్రేజ్ను చాటుకున్నారు. శనివారం మణికొండలోని రంగారెడ్డి జిల్లా ఉప రవాణా కమిషన్ కార్యాలయంలో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్లో ‘టీజీ 07 పి 9999’ నెంబర్ను ఓ వాహనదారు రూ.9.37 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారు. అలాగే ‘టీజీ 07 పి 0009’ నెంబర్ కోసం మరో వాహనదారు రూ.7.50 లక్షలు చెల్లించారు. ‘టీజీ 07పి 999’ నెంబర్ కోసం మరొకరు రూ.3 లక్షలు చెల్లించినట్లు జేటీసీ చంద్రశేఖర్గౌడ్ తెలిపారు. ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య పంజగుట్ట: ఉద్యోగం రావడంలేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కర్నూలు జిల్లా శ్రీశైలం ప్రాంతానికి చెందిన నూకరాజు (29) బీటెక్ పూర్తి చేశాడు. నగరంలోని అమీర్పేటలో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవల ఓ సంస్థలో ఇంటర్వ్యూకు వెళ్లొచ్చిన నూకరాజు.. తనకు తప్పకుండా ఉద్యోగం వస్తుందన్న నమ్మకంతో రూమ్మేట్కు పార్టీ కూడా ఇచ్చాడు. కానీ.. ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం ఉదయం 8 గంటలకు రూమ్మేట్ మణికంఠ ఆఫీస్కు వెళ్లాడు. గదిలో నూకరాజు ఒక్కడే ఉన్నాడు. ఇదేరోజు రాత్రి 7.30 గంటలకు మణికంఠ వచ్చి చూడగా గది లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా.. మణికంఠ ఫ్యాన్కు వేలాడుతూ విగతజీవిగా కనిపించడంతో వెంటనే హాస్టల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాడు. వారు వచ్చి తలుపులు తెరిచి చూడగా ఫ్యాన్కు నూకరాజు ఉరి వేసుకుని ఉన్నాడు. పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని శనివారం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
గ్రీన్ సిగ్నల్
‘ట్రాఫిక్’ సమస్యల పరిష్కారమే బల్దియా ధ్యేయం సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో అసలే ట్రాఫిక్ సమస్యలెక్కువ. దానికి తోడు పలు జంక్షన్లలో ట్రాఫిక్ సిగ్నళ్లు లేవు. ఉన్న సిగ్నళ్లలోనూ పని చేయనివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో పని చేయని ట్రాఫిక్ సిగ్నళ్లకు అవసరమైన మరమ్మతులు చేసేందుకు, లేని ప్రాంతాల్లో కొత్తవి ఏర్పాటు చేసేందుకు, నిర్వహణ మెరుగ్గా ఉండేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. ఇందుకోసం కొత్తగా ఏర్పాటు చేసేవాటి కోసం సిగ్నళ్ల డిజైన్, సప్లయ్, ఇన్స్టలేషన్, పాత సిగ్నళ్లకు మరమ్మతులు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం తక్కువ ధరకు ఆయా పరికరాలు, ఉపకరణాలు సప్లయ్ చేసే ఏజెన్సీల నుంచి కొటేషన్లను ఆహ్వానించింది. జీహెచ్ఎంసీ లెక్కల ప్రకారం 404 జంక్షన్లలో ట్రాఫిక్ సిగ్నళ్లున్నాయి. దశాబ్దం క్రితం ఏర్పాటు చేసిన జంక్షన్లలో సరిగా పని చేయనివెన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవసరమైన జంక్షన్లను అప్గ్రేడ్ చేయాలని, సిగ్నలింగ్ విధానాన్ని ఆధునికీకరించాలని అధికారులు భావిస్తున్నారు. నిర్వహణ (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) మొత్తం సమగ్రంగా కొత్తగా కాంట్రాక్టుకు ఇవ్వాలని.. తద్వారా వాహనాల ప్రయాణం మెరుగవడం, వేగం పెరగడం, పాదచారులకు భద్రత కల్పించడంతో పాటు ఎమర్జెన్సీ వాహనాలకు ప్రాధాన్యమివ్వాలనుకుంటున్నారు. మూడేళ్ల వరకు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్తో పాటు టైమర్స్ తదితర అంశాల వారీగా అవసరమైన సామగ్రికి కొటేషన్లు ఆహ్వానించారు. వాటిని పరిశీలించాక, పరికరాల సరఫరా, నిర్వహణల కోసం టెండర్లు జారీ చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీలో ప్రస్తుతమున్న ట్రాఫిక్ సిగ్నల్ జంక్షన్లు.. పని చేస్తున్న సిస్టమ్స్ పోలీస్ కమిషనరేట్ల వారీగా.. హెచ్–ట్రిమ్స్ : హైదరాబాద్ ట్రాఫిక్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏటీఎస్సీ: అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్ సిస్టమ్ పీఎస్ఎస్: పెలికాన్ సిగ్నల్ సిస్టమ్ పని చేయని సిగ్నళ్లకు మరమ్మతులు కొత్తవాటి ఏర్పాటు దిశగా జీహెచ్ఎంసీ చర్యలు సిస్టమ్ హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ హెచ్–ట్రిమ్స్ 133 60 20 ఏటీఎస్సీ 62 38 13 పీఎస్ఎస్ 31 44 3 మొత్తం 226 142 36 -
ట్రాఫిక్ ఉల్లంఘనలపై స్పెషల్ డ్రైవ్
సాక్షి, సిటీబ్యూరో: రాంగ్ సైడ్ డ్రైవింగ్, అస్పష్ట నంబరు ప్లేట్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలపై సిటీ పోలీసులు స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా ఈ డ్రైవ్ను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రాంగ్ సైడ్ డ్రైవింగ్తో ఒకరు మృతి చెందారు.21 మంది గాయాల పాలయ్యారు. గత ఏడాది ఏకంగా ముగ్గురు మరణించగా.. 206 మంది క్షతగాత్రులయ్యారు. అస్పష్ట నంబరు ప్లేట్ వాహనదారులకు రూ.200 జరిమానాతో పాటు చార్జ్షీట్ దాఖలు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. -
శానిటరీ జవాన్లకు స్థాన చలనం
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో ఐదేళ్లకు పైగా ఒకేచోట పనిచేస్తున్న 139 మంది శానిటరీ జవాన్లను ఇతర సర్కిళ్లకు బదిలీ చేశారు. పలువురు శానిటరీ జవాన్ల నుంచి అందిన విజ్ఞప్తుల మేరకు అని బదిలీ ఉత్తర్వులో పేర్కొన్నప్పటికీ, ఒకేచోట సుదీర్ఘ కాలంగా పాతుకుపోయినవారు చేయాల్సిన పారిశుద్ధ్య కార్యక్రమాల పర్యవేక్షణ కంటే పైఆదాయానికే ప్రాధాన్యమిస్తున్నారనే ఆరోపణలు ఎంతో కాలంగా ఉన్నాయి. ఇంటింటి నుంచి చెత్త తరలించాల్సిన స్వచ్ఛ ఆటో కార్మికుల్లో చాలామంది ఇళ్లకంటే హోటళ్లు, ఫంక్షన్ హాళ్ల నుంచి వచ్చే అధిక ఆదాయం కోసం వాటి కోసమే పని చేస్తున్నారు.ఈ తతంగంలో పారిశుద్ధ్య కార్మికులపై అజమాయిషీ చెలాయించే ఔట్సోర్సింగ్పై పని చేస్తున్న ఎస్ఎఫ్ఏ (శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్)లు, రెగ్యులర్ సిబ్బంది అయిన శానిటరీ జవాన్లు పారిశుద్ధ్య కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని భావించి ఉన్నతాధికారులు ఇందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీలో మొత్తం 269 శానిటరీ జవాన్లు ఉండగా, వారిలో ఐదేళ్లకు పైబడి ఒకేచోట పనిచేస్తున్న 139 మందిని ఇతర సర్కిళ్లకు బదిలీ చేశారు. ఈమేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఉత్తర్వు జారీ చేశారు. ఉండాల్సిన శానిటరీ జవాన్ల కంటే కొన్ని సర్కిళ్లలో ఎక్కువగా ఉండగా, కొన్ని సర్కిళ్లలో తక్కువగా ఉండటాన్ని కూడా అధికారులు గుర్తించారు. బదిలీలతో దీన్ని సరిచేశారు.కాగా.. వారి విజ్ఞప్తుల మేరకు నివసిస్తున్న ప్రాంతాలకు ఎక్కువ దూరం కాకుండా వీలైనంత తక్కువ దూరంలోనే పోస్టింగ్స్ ఇవ్వాల్సిందిగా సంబంధిత జోనల్, డిప్యూటీ కమిషనర్లకు సూచించారు. అదే తరుణంలో నివసిస్తున్న ప్రాంతంలోనే నియమించరాదని కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలో శానిటరీ జవాన్లు ప్రస్తుతం పనిచేస్తున్న సర్కిళ్లకు ఇరుగుపొరుగు సర్కిళ్లకు బదిలీ చేశారు. జోనల్ కమిషనర్ల సహకారంతో డిప్యూటీ కమిషనర్లు పారిశుద్ధ్య జవాన్లను ఆయా వార్డుల్లో నియమించనున్నారు. రెండు పనిదినాల్లో ఈ పక్రియ పూర్తికావాలని కమిషనర్ ఆదేశించారు. -
ఎయిర్పోర్టు ఫిర్యాదులన్నీ ఇక ఆర్జీఐఏ పోలీస్ ఔట్పోస్టులోనే..
శంషాబాద్: ‘శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. వాణిజ్య, ఆర్థిక కార్యకలాపాలు కూడా పెరిగాయి. అభివృద్ధి జరిగిన చోట కొన్ని రకాల సమస్యలు కూడా పెరుగుతుంటాయి. వాటి పరిష్కారానికి అనుగుణంగా రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆర్జీఐఏలో పోలీస్స్టేషన్ ఔట్పోస్టును ప్రారంభించాం’ అని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. ఇకపై ఎయిర్పోర్టుకు సంబంధించిన ఫిర్యాదులన్నీ ఔట్పోస్టు పరిధిలో ఇవ్వాల్సి ఉంటుందన్నారు.బాధితులు ఫిర్యాదులు ఇచ్చేందుకు శంషాబాద్ పట్టణానికి రానవసరం లేదని సూచించారు. ఎయిర్పోర్టులో గతంలో కేవలం ఆరుగురు పోలీసు సిబ్బంది మాత్రమే ఉండేవారని, ప్రస్తుతం ఓ సీఐ, ఇద్దరు ఎస్సైలతో పాటు ఇరవైమంది సిబ్బందితో ఔట్పోస్టు కొనసాగనుందన్నారు. ఇమిగ్రేషన్, సీఐఎస్ఎఫ్ తదితర ఏజెన్సీలతో సమన్వంగా కలిసి పనిచేసి శాంతిభద్రతలు, నేరాల నియంత్రణకు పోలీసులు పని చేస్తారన్నారు.వేర్వేరుగా మారొచ్చు..శంషాబాద్ ఎయిర్పోర్టు కార్యకలాపాలతోపాటు శంషాబాద్ పట్టణ పరిధి కూడా పెరిగిన కారణంగా వీకేంద్రికరణ చేసినట్లు సీపీ తెలిపారు. భవిష్యత్లో ప్రస్తుత ఆర్జీఐఏ పోలీస్ ఔట్పోస్టు పూర్తి ఆర్జీఐఏ పోలీస్స్టేషన్గా పట్టణంలో ఉన్న ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ శంషాబాద్ టౌన్ పీఎస్గా మారేందుకు అవకాశాలున్నాయని చెప్పారు.ఔట్పోస్టు సీఐగా బాలరాజుకొత్తగా ఏర్పాటు చేసిన ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ పోస్టు సీఐగా జె.బాలరాజు నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఆయన సీపీ సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమంలో ఎయిర్పోర్టు సీఈఓ ప్రదీప్ ఫణీకర్, శంషాబాద్ డీసీపీ రాజేష్, ఏసీపీ శ్రీనివాస్రావు పాల్గొన్నారు. -
త్వరలోనే అమీన్పూర్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ నిర్ధారణ
సాక్షి, సిటీబ్యూరో: అమీన్పూర్ పెద్ద చెరువులో ఎఫ్టీఎల్ సరిహద్దుల నిర్ధారణ పేరిట జరుగుతున్న దందాలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ పేరుతో పలువురు దందాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులను కమిషనర్ తీవ్రంగా పరిగణించారు. జేఏసీ తరఫున కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నట్లు రసీదులు, వాట్సాప్ సందేశాలతో శనివారం రంగనాథ్ను కలిసి విన్నవించారు.చెరువు ఎఫ్టీఎల్ నిర్ధారణపై హైడ్రా చేస్తున్న కసరత్తును ఆసరాగా తీసుకుని ఎవరైనా దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దందాలకు పాల్పడిన వారిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు చేయాలని బాధితులకు సూచించారు. హైడ్రా నుంచి కూడా కేసులు పెట్టాలని అధికారులను ఆదేశించారు. దాదాపు 95 ఎకరాలుండే చెరువు 450 ఎకరాలకు ఎలా విస్తరించిందనే విషయమై హైడ్రా లోతైన విశ్లేషణ చేస్తోందని, ఈ విషయం ప్రభుత్వం దృష్టిలో కూడా ఉందన్నారు.గ్రామ రికార్డులు, సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇమేజీలతో సరిపోల్చడమే కాకుండా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించి ఎఫ్టీఎల్ నిర్ధారణ పూర్తి చేస్తామని కమిషనర్ చెప్పారు. జేఎన్టీయూ, ఐఐటీ కళాశాలల వారి భాగస్వామ్యంతో కమిటీ వేసి ఎఫ్టీఎల్ను నిర్ధారిస్తామన్నారు. రెండు, మూడు నెలల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. నీట మునిగిన లే ఔట్ల ప్లాట్లను కాపాడేందుకు ఖర్చు అవుతుందని దందాలు చేస్తున్న వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. -
‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
సాక్షి, సిటీబ్యూరో: పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో పదో తరగతి వార్షిక పరీక్షల ఏర్పాట్లపై విద్యా, రెవెన్యూ, పోలీస్, వైద్య, పోస్టల్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు నగరంలో 358 కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని, వీటి పరిధిలో 77,701 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒక్కో పరీక్ష కేంద్రానికి ఒక చొప్పున సిట్టింగ్ స్క్వాడ్, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులను నియమించినట్లు తెలిపారు.సీసీ కెమెరాల పర్యవేక్షణలో పేపర్ల తనిఖీ నిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ ఈ.వెంకటాచారి, డీఈఓ ఆర్ రోహిణి, డీఎంహెచ్ఓ వెంకటి, అదనపు డీసీపీ రవీందర్ రెడ్డి, విద్యుత్ శాఖ ఏడీఈ ప్రార్థన, డిప్యూటీ ఆర్ఎం భీంరెడ్డి, పర్యవేక్షకులు జహీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం రేవంత్రెడ్డి గైర్హాజరు
సిటీ కోర్టులు : సీఎం రేవంత్రెడ్డిపై బీజేపీ దాఖలు చేసిన పరువునష్టం కేసుపై గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు (స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్)లో విచారణ జరిగింది. కేసు విచారణకు సీఎం రేవంత్రెడ్డి గైర్హాజరు కావడంతో ఆయన తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణను మార్చ్ 5కు వాయిదా వేశారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా మే, 4న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రకాశం స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని అసత్యపు ఆరోపణలు చేశారని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సభలో రేవంత్రెడ్డి ప్రజలను రెచ్చగొట్టే ఆరోపణలు చేయడంతోపాటు వారికి తప్పుడు సంకేతాలు ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో సీఎం రేవంత్రెడ్డిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. విచారణను మార్చ్ 5కు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు -
హీరో నాగార్జున పరువునష్టం కేసు వాయిదా
సిటీ కోర్టులు : రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసుపై గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు (స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్) లో విచారణ జరిగింది. ఈ విచారణకు పిటిషనర్ నాగార్జునతో పాటు ప్రతివాది మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడంతో వారి తరుఫున న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మార్చి 6కు వాయిదా వేసింది. సినీ హీరో నాగార్జున కుమారుడైన హీరో నాగాచైతన్య–సమంత విడాకుల విషయంపై మంత్రి కొండా సురేఖ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారని, ఆమె వ్యాఖ్యలతో తన కుటుంబ పరువుకు భంగం వాటిల్లిందని ఆరోపిస్తూ నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అక్కినేని కుటుంబాన్ని కించపరిచేలా నాగచైతన్య వ్యక్తిగత జీవితంపై తన దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండానే మీడియా అసాధారణమైన వ్యాఖ్యలు చేసినందుకు తనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన పిటిషన్లో కోరారు. ఈ కేసులో మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేయగా గత విచారణలో ఆమె వ్యక్తిగతంగా హాజరయ్యారు. దీంతో కొండా సురేఖ వ్యక్తిగత బాండ్తోపాటు రూ.10 వేలు పూచీకత్తు కోర్టులో దాఖలు చేయాలని కోర్టు సూచించింది. అయితే ఈ విచారణలో కూడా ఆమె పూచీకత్తు పెట్టుకోకపోవడంతో మార్చి 6కు వాయిదా వేస్తున్నట్లు మంత్రి తరుఫు న్యాయవాదికి కోర్టు సూచించింది. విచారణకు మంత్రి కొండా సురేఖ నాగార్జున గైర్హాజరు మార్చి 6కు వాయిదా వేసిన నాంపల్లి స్పెషల్ కోర్టు -
ఆక్రమణల పర్వం!
రెచ్చిపోతున్న అక్రమార్కులు ● సర్కారు భూములకు రక్షణ కరువు ● దర్జాగా ఆక్రమిస్తున్న కబ్జారాయుళ్లు ● రూ.కోట్ల విలువ చేసే భూములు అన్యాక్రాంతం ● పట్టించుకోని సంబంధిత అధికారులు సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతోంది. ఖాళీ స్థలాలే కాదు చెరువులు, కుంటలు, శ్మశానవాటికలు, పార్కులు.. కావేవీ కబ్జాకు అనర్హం అన్నట్లు ఆక్రమణదారుల చెరలోకి వెళ్లిపోతున్నాయి. పట్టాదారులు పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను తమ ప్రైవేటు భూమిలో దర్జాగా కలిపేసుకుంటున్నారు. వాటికి గుట్టుగా రికార్డులు సృష్టించి, బహిరంగ మార్కెట్లో విక్రయిస్తూ రాత్రికి రాత్రే కోట్లకు పడగలెత్తుతున్నారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్లు (ఆర్ఐ), తహసీల్దారులు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యటించి, ఆయా ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాల్సి ఉండగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా రూ.కోట్ల విలువ చేసే భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ముఖ్యంగా శంషాబాద్, శేరిలింగంపల్లి, మొయినాబాద్, అబ్దుల్లాపూర్మెట్, హయత్నగర్, బాలాపూర్ మండలాల్లోని సర్కార్ భూములకు రక్షణ లేకుండా పోయింది. ఇప్పటికే మెజార్టీ భూములు ప్రైవేటు వ్యక్తుల పరం కాగా, మిగిలిన కొద్ది పాటి భూములకు సైతం రక్షణ కల్పించ లేకపోతుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికులెవరైనా స్వయంగా ఫిర్యాదు చేస్తే కానీ అధికారులు కూర్చున్న కుర్చీలో నుంచి కదలడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మచ్చుకు కొన్ని ఆక్రమణలు ● శంషాబాద్ మండలం పెద్దతూప్రలో 500 గజాల గ్రామకంఠం భూమి కబ్జా. ● తొండుపల్లిల సర్వే నంబర్ 108లో ఆరు ఎకరాలు, సర్వే నంబర్ 109లో 2.03 ఎకరాల ప్రభుత్వ భూమిని పక్కనే ఉన్న పట్టా భూమిలో కలిపే యత్నం. ● రాయన్నగూడ సర్వే నంబర్ 66లోని 6.31 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోంది. ● గొల్లపల్లి సర్వే నంబర్ 261లోని పది ఎకరాల మిగులు భూమిని ఆక్రమణకు యత్నిస్తున్నారు. ● ఔటర్ రింగ్రోడ్డు పక్కనే ఉన్న రాళ్లగూడ సర్వే నంబర్ 626లో రూ.వంద కోట్ల విలువ చేసే ఏడెకరాల ప్రభుత్వ భూమిపై కబ్జాదారుల కన్నుపడింది. ● కేశంపేట మండలం బైర్కాన్పల్లి గ్రామం సర్వే నంబర్ 53లోని డపింగ్యార్డ్ సహా నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని పక్కనే ఉన్న పట్టా భూమిలో కలిపే యత్నం. ● చేవెళ్ల మండలం కమ్మెట గ్రామం సర్వే నంబర్ 270లోని 2 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి, చుట్టూ ప్రీకాస్టింగ్ పలకలను అమర్చారు. శ్మశానవాటికలనూ వదలకుండా.. ● ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూరు–ఎంపీ పటేల్గూడ మధ్యలో ప్రవహిస్తున్న పులిందర్వాగు 500 మీటర్ల వరకు ఆక్రమణకు గురైంది. ● ఇబ్రహీంపట్నం బొంతపల్లికుంటపై స్థిరాస్తి వ్యాపారుల కన్నుపడింది. ఇప్పటికే మట్టి పోసి కుంటను ఆక్రమించే ప్రయత్నం చేశారు. ● కుంట్లూరు పెద్ద చెరువులో రెండు ఎకరాలు కబ్జా చేసి, జీఓ నంబర్ 59 కింద రెగ్యులరైజ్ చేసుకున్న భూమిని కాపాడాలంటూ హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. ● తుర్కయంజాల్ సర్వే నంబర్ 206,216/4, 212/1, 323లలోని రెండు ఎకరాల శ్మశానవాటికను సైతం కబ్జాదారులు వదల్లేదు. ● హయత్నగర్ మండలంలోని 582 ఎకరాల ఫారెస్ట్ భూమిపై కూడా అక్రమార్కుల కన్ను పడింది. ● అత్తాపూర్ సర్వే నంబర్ 72 నుంచి 78 వరకు ఉన్న దేవాదాయశాఖ భూమిలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు. -
ఇక భవన నిర్మాణాల అనుమతులు వేగవంతం
లక్డీకాపూల్: గ్రేటర్ పరిధిలో భవన నిర్మాణాల అనుమతులు వేగవంతమవుతాయని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి అన్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో గురువారం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతతో రూపొందించిన ‘బిల్డ్ నౌ’పై జోనల్, డిప్యూటీ కమిషనర్లకు ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. బిల్డ్ నౌ అప్లికేషన్ అప్లోడ్ చేసే విధానంపై పలువురికి శిక్షణ కల్పించామన్నారు. ఈ కార్యక్రమాన్ని మార్చి 9 వరకు నిర్వహించనున్నామన్నారు. మార్చి 10 నుంచి బిల్డ్ నౌ అప్లికేషన్ ప్రారంభించే అవకాశం ఉన్నందున జీహెచ్ఎంసీ జోనల్, డిప్యూటీ కమిషనర్లకు అవగాహన కల్పించేందుకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో సీసీపీ శ్రీనివాస్, జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంత్, హేమంత్ కేశవ్ పాటిల్, అపూర్వ్ చౌహాన్, రవి కిరణ్, వెంకన్న, అడిషనల్ సీసీపీలు గంగాధర్, ప్రదీప్ వీరన్న టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి జీహెచ్ఎంసీ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి జోనల్, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. జోనల్, డిప్యూటీ కమిషనర్ కార్యాలయాల్లో అధికారుందరూ అందుబాటులో ఉండాలని, అందుకు సంబంధిత జోనల్, డిప్యూటీ కమిషనర్లు బాధ్యత వహించాలని సూచించారు. ప్రధాన కార్యాలయంలో విభాగాధిపతులు కూడా అందుబాటులో ఉండేందుకు తాను సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వారి రాకపోకలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అధికారులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని, అందుకోసం ఏఐతో పనిచేసే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. విభాగాధిపతులంతా సందర్శకుల సమయమైన సాయంత్రం 4నుంచి 5 గంటల మధ్య అందుబాటులో ఉండాలని ఇదివరకే ఆదేశించడం తెలిసిందే. అధికారులు అందుబాటులో ఉండాలని పునరుద్ఘాటించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి -
జిహ్వ.. వహ్వా అనేలా..
సాక్షి, సిటీబ్యూరో: స్విగ్గీ మొదటి ఎడిషన్లో పలు విభాగాల్లో ముందంజలో ఉన్న నగరం ఈసారి మరిన్ని విభాగాల్లో పోటీ పడనుంది. ఉత్తమ రెస్టారెంట్, ఉత్తమ స్ట్రీట్ ఫుడ్ వంటి విభిన్న అంశాల్లో ఓటింగ్ ఏర్పాటు చేసింది. ‘క్రౌనింగ్ దోజ్ హూ ఈట్’ అనే థీమ్తో ఇచ్చే ఈ అవార్డులకు ఆహార ప్రియులు మార్చి 24 వరకూ స్విగ్గీ యాప్లో ఓటింగ్ చేయవచ్చని నిర్వాహకులు తెలిపారు. విజేతలను మార్చి 25న ప్రకటిస్తారని పేర్కొన్నారు. నాణ్యమైన, స్వచ్ఛమైన ఆహారాన్ని అందించే చెఫ్లు, రెస్టారెంట్స్ తదితర ఆహార రంగ వేదికలకు ఈ అవార్డులను అందించనున్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 130 నగరాలకు 90కి పైగా కేటగిరీల్లో 11 వేలకు పైగా బ్రాండ్లతో 16 వేలకు పైగా నామినేషన్లు వచ్చినట్లు అంచనా. ఫుడ్ డెలివరీకి ఇష్టమైన వాటి నుంచి డైనింగ్ అవుట్ జెమ్స్ వరకూ, ఫైన్ డైనింగ్ నుంచి స్ట్రీట్ ఫుడ్ హాట్స్పాట్లతో సహా విభిన్న వేదికలు భాగం కానున్నాయి. ప్రముఖ నగరాలతో పాటు.. ఈ అవార్డుల కోసం హైదరాబాద్ నగరంతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చైన్నె, పుణె, కోల్కతా, చండీగఢ్, భోపాల్, కోయంబత్తూర్, గోవా, ఇండోర్, జైపూర్, లక్నో, రాంచీ, వారణాసి, అమృత్సర్, భువనేశ్వర్, డెహ్రాడూన్, గౌహతి, జలంధర్, కాన్పూర్, కొచ్చి, కోజికోడ్, మంగళూరు, మైసూర్, నాగ్పూర్, పాట్నా, పాండిచ్చేరి, సూరత్, ఉదయపూర్, విజయవాడ, అగర్తలా, అహ్మదాబాద్ వంటి 130 పైగా నగరాలు భాగస్వామ్యం కానున్నాయి. విభిన్న విభాగాల్లో.. ఈ అవార్డులను ఉత్తమ బిర్యానీ, ఉత్తమ చైనీస్ వంటకాలు, అత్యుత్తమ కేకులు, డెజర్ట్స్ సహా, బెస్ట్ సౌత్ ఇండియన్ బెస్ట్ గ్లోబల్ ఫ్లేవర్ వంటి విభిన్న విభాగాలు ఇందులో ఉన్నాయి. 2025 స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ విజేతలను ప్రత్యేక ఫ్రేమ్డ్ ఫలకంతో సత్కరిస్తారు. నగరంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆహార ప్రియులు మార్చి 24 వరకూ ఈ ఓటింగ్లో పాల్గొని విజేతను ఎంపిక చేయాలని స్విగ్గీ యాజమాన్యం పేర్కొంది. రెండో ఎడిషన్ను ప్రకటించిన స్విగ్గీ సంస్థ టాప్ నగరాల్లో హైదరాబాద్కు గుర్తింపు -
జనారణ్యంలోకి జింకపిల్ల
విజయనగర్కాలనీ: అరణ్యంలో ఉండాల్సిన ఓ జింక పిల్ల నగరంలో ప్రత్యక్షమైంది. గురువారం ఆసిఫ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ జి.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మెహిదీపట్నం నుంచి గుడిమల్కాపూర్ వెళ్లే ప్రధాన రహదారిలో మహ్మదీయ మజీద్ వద్ద రోడ్డుపై ఉదయం 9 గంటలకు ఓ జింకపిల్లను కుక్కలు తరుముతుండగా స్థానికులు గమనించి డయల్ 100కు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న ఆసిఫ్నగర్ పోలీసులు సాయికుమార్, పవన్లు జింకపిల్లను స్థానికుల సహాయంతో పట్టుకున్నారు. అనంతరం సైఫాబాద్ ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఇంతియాజ్ అహ్మద్ తమ సిబ్బందితో వచ్చి జింకపిల్లను తీసుకువెళ్లారు. జింకపిల్ల నగరంలోకి ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక్కడి పరిసరాల్లో అటవీ ప్రాంతం లేదని, జింకపిల్లను ఎవరైనా పెంచుకుంటుంటే తప్పించుకొని రోడ్డుపైకి వచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. -
మహిళలు చదువుకుంటే కుటుంబమంతా విద్యావేత్తలే
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రసూల్పురా: మహిళలు చదువుకుంటే కుటుంబమంతా విద్యావేత్తలుగా మారుతారని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. గురువారం మారేడుపల్లి కస్తూర్బాగాంధీ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలను గవర్నర్ ప్రారంభించారు. మహిళా సాధికారతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుస్తోందన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని, ప్రపంచ వ్యాప్తంగా కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారని ప్రశంసించారు. కస్తూర్బా కళాశాల విద్యార్థులు విద్యతో పాటు ఇతర కార్యక్రమాల్లో గొప్ప మైలురాళ్లు అధిగమిస్తున్నారని కొనియాడారు. స్వామి వివేకానంద జీవితాన్ని ప్రతి విద్యార్ధీ ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన బాటలో నడవాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ కోర్సుల్లో అత్యధిక మార్కులు, క్రీడలు, సాంస్కృతిక ప్రదర్శనల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థినులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ సరోత్తమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అశోకా హోటల్కు బాంబు బెదిరింపు
మానసిక పరిస్థితి సరిగా లేని వ్యక్తి పనిగా గుర్తింపు రాంగోపాల్పేట్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న అశోకా హోటల్కు బాంబు బెదిరింపు రావడంతో కలకలం రేగింది. గురువారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి అశోకా హోటల్లో బాంబు పెట్టినట్లు బెదిరించారు. వెంటనే కంట్రోల్ రూమ్ అధికారులు గోపాలపురం పోలీసులను అప్రమత్తం చేశారు. గోపాలపురం ఏసీపీ సుబ్బయ్య, ఇన్స్పెక్టర్ నరేష్తో పాటు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించి బాంబు లేదని తేల్చారు. దీంతో పోలీసులు, స్థానిక ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. బాంబు ఉందని ఫోన్ చేసిన వ్యక్తిని కరీంనగర్కు పెద్దపల్లికి చెందిన మీర్ మోయిష్ అహ్మద్ (45)గా గోపాలపురం పోలీసులు గుర్తించారు. నిందితుడు 20 ఏళ్ల నుంచి కుటుంబానికి దూరంగా నగరంలోని అబిడ్స్ లోని ఓ డార్మిటరీలో ఉంటున్నట్లు తేల్చారు. ఆసిఫ్నగర్లోని ఓ అపార్ట్మెంట్లో ఉండే చుట్టాలపై కోపంతోనే బాంబు పెట్టినట్లు బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. -
తార్నాక జంక్షన్ రీ ఓపెన్
లాలాపేట: తార్నాక జంక్షన్ మరో వారం రోజుల్లో రీ ఓపెన్ కానుంది. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తి కావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తార్నాక జంక్షన్లో రోడ్డు, ఓయూ వైపు డివైడర్ల నిర్మాణం, లాలాపేట వైపు బస్ షెల్టర్ షిఫ్టింగ్ వంటి పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రస్తుతం జంక్షన్ ఫ్లై ఓవర్కు పెయింటింగ్ పనులు కొనసాగుతున్నాయి. తగ్గనున్న యూ టర్న్ల సమస్య.. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా 8 ఏళ్ల క్రితం తార్నాక ప్రధాన రహదారిలో రైల్వే డిగ్రీ కళాశాల వద్ద, ఇటు హబ్సిగూడ వైపు ఐఐసీటీ వద్ద యూ టర్న్లను ఏర్పాటు చేశారు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లాలాపేట వైపు వెళ్లేందుకు సుమారు 2 కిలోమీటర్ల ప్రయాణ దూరం పెరగడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యేవారు. దీంతో పాటు యూటర్న్ల వద్ద తరచూ ప్రమాదాలు జరిగేవి. ఈ జంక్షన్ను పునరుద్ధరిస్తే ప్రయాణ దూరం తగ్గడంతో పాటు ప్రమాదాలకు చెక్ పెట్టినట్లవుతుందని వాహనదారులు పేర్కొంటున్నారు. తార్నాక సిగ్నల్ ఓపెనింగ్కు సంబంధించిన పనులను వారంలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డెవిస్ అధికారులకు సూచించారు. ఈ మేరకు తార్నాక జంక్షన్ అభివృద్ధి పనులను బుధవారం సాయంత్రం ఆయన పరిశీలించి బల్దియా అధికారులతో మాట్లాడారు. పనుల్లో వేగం పెంచాలని సూచించారు. వారం రోజుల్లో.. -
అనుమానాస్పద స్థితిలో నిమ్స్ ప్రొఫెసర్ మృతి
సూరారం కట్టమైసమ్మ చెరువులో మృతదేహం ● అప్పుల బాధ తాళలేకనే ఆత్మహత్య? లక్డీకపూల్: నిమ్స్ బయో కెమిస్ట్రీ విభాగం సీనియర్ ప్రొఫెసర్ ఎం.విజయ్ భాస్కర్ (62) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ నెల 25న సూరారంలోని తన ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఆయన గురువారం ఉదయం 11 గంటలకు కట్టమైసమ్మ చెరువులో మృతదేహమై కనిపించారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని కుటుంబ సభ్యులను పిలిచి చూపించగా.. విజయ భాస్కర్దిగా గుర్తించారు. విజయభాస్కర్ అదృశ్యంపై అంతకుమునుపు సూరారం ఠాణాలో మిస్సింగ్ కేసు నమోదైంది. ఆయన ఐదేళ్ల క్రితం నిమ్స్ బయో కెమిస్ట్రీ విభాగంలో చేరారు. విజయభాస్కర్ మృతికి ఆర్థికపరమైన అంశాలే కారణమని తెలుస్తోంది. బంధువులు, స్నేహితులతో పాటు తోటి వైద్యులు, సిబ్బంది వద్ద పెద్ద మొత్తంలో ఆయన అప్పులు చేసినట్లు సమాచారం. అప్పుల బాధ తాళలేకే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని విజయభాస్కర్ భార్య పోలీసులకు వివరించినట్లు సమాచారం. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
హెచ్సీయూలో కుప్పకూలిన పోర్టికో
స్లాబ్ వేస్తుండగా ఘటన గచ్చిబౌలి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నూతన పరిపాలన భవనం పోర్టికో స్లాబ్ వేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. శిఽథిలాల కింద పడటంతో 9 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాధితులను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. రూ.50 కోట్ల వ్యయంతో హెచ్సీయూలో నాలుగంతస్తుల నూతన పరిపాలనా భవనం నిర్మాణం చేపడుతున్నారు. సీపీడబ్ల్యూ కాంట్రాక్టర్ 20 అడుగుల ఎత్తులో పోర్టికో కోసం గురువారం రాత్రి 8 గంటల సమయంలో స్లాబ్ వేస్తుండగా అది ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో స్లాబ్పైన ఉన్న కార్మికులు నేలనూ పడిపోయారు. ఈ ప్రమాదంలో జలంధర్, భగవాన్, సంజయ్, కరణ్, ఈశ్వర్, దీనా, యూనుస్, మాధవ్, మనోజ్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గచ్చిబౌలి పోలీసులు నల్లగండ్లలోని సిటిజన్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులెవరికీ ప్రాణాపాయం లేదని గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ తెలిపారు. నాణ్యతా లోపంతోనే.. పోర్టికో కూలిన విషయం తెలిసిన వెంటనే హెచ్సీయూ సెక్యూరిటీ విభాగం, అధికారులు, విద్యార్థులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అంబులెన్సులు, ఫైరింజిన్కు సమాచారం ఇచ్చారు. నాణ్యతా లోపంతోనే భవనం పోర్టికో కుప్పకూలిందని హెచ్సీయూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. క్యాంపస్లోకి ఎవరినీ అనుమతించకపోవడంతోనే ఇష్టానుసారంగా నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లోనికి అనుమతి నిరాకరణ.. హెచ్సీయూ క్యాంపస్లో పోర్టికో కుప్పకూలిన ఘటన చోటు చేసుకోవడంతో లోపలికి ఎవరినీ సెక్యూరిటీ వెళ్లకుండా అడ్డుకున్నారు. విద్యార్థులు, టీచింగ్, నాన్టీచింగ్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని తప్ప బయటివారిని కొన్నేళ్లుగా లోనికి అనుమతించడం లేదు. దీంతో అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది. 9 మందికి గాయాలు తప్పిన పెను ప్రమాదం -
స్మార్ట్ పార్కింగ్
సింగపూర్ తరహాలో.. నగరంలోని పలు ప్రాంతాల్లో.. సాక్షి, సిటీబ్యూరో: అన్ని రంగాల్లో ప్రపంచంతోనే పోటీ అంటున్న ప్రభుత్వ ఆలోచనలకనుగుణంగా వాహనాల పార్కింగ్ సైతం అత్యాధునిక సాంకేతికతతో.. సింగపూర్ తరహాలో ఉండాలని బల్దియా భావిస్తోంది. బిల్డ్, ఓన్, ఆపరేట్, షేర్, ట్రాన్స్ఫర్ (బూస్ట్) విధానంలో పీపీపీ పద్ధతిలో ప్రైవేటు ఏజెన్సీల ఆధ్వర్యంలో వాటిని ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. సింగపూర్లోని స్మార్ట్ పార్కింగ్ సదుపాయాలతో పాటు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్పీఆర్) సిస్టమ్ తదితరమైనవి వినియోగించుకోవాలనుకుంటోంది. పార్కింగ్ ప్రదేశంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా వాహనం లోనికి వెళ్లడం.. బయటకు రావడం, మొబైల్ యాప్ ద్వారా రియల్ టైమ్ పరిస్థితుల్ని తెలుసుకోవడం, డిజిటల్ చెల్లింపులు తదితర సదుపాయాలు కల్పించనున్నారు. ఇంటెలిజెంట్ డేటా అనాలిసిస్ వంటి వాటితో పార్కింగ్ ప్రదేశాన్ని ఎక్కువ ప్రయోజనకరంగా, సదుపాయవంతంగా వినియోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నగరంలోని పలు ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయాల్లేక అడ్డదిడ్డంగా వాహనాలు నిలపడం, తిరిగి వాటిని బయటకు తీయలేక నానా తిప్పలు పడుతుండటం తెలిసిందే. సింగపూర్ స్మార్ట్ పార్కింగ్ విధానం వల్ల ఈ ఇబ్బందులు తగ్గుతాయని భావిస్తున్నారు. తొలుత ఖైరతాబాద్ జోన్లో.. సంపన్న వర్గాల ప్రజలు ఎక్కువగా ప్రయాణించే ఖైరతాబాద్ జోన్ పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, టోలిచౌకి, ఖైరతాబాద్, పంజగుట్ట వంటి ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించనున్నారు. పరిస్థితుల్ని, సదుపాయాలకనుగుణంగా ఇండోర్ పార్కింగ్తో పాటు ఆన్–స్ట్రీట్, ఆఫ్–స్ట్రీట్ పార్కింగ్స్ ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ఆర్ఎఫ్పీ టెండర్లను ఆహ్వానించారు. ఎంపికయ్యే ఏజెన్సీ జీహెచ్ఎంసీతో పాటు ట్రాఫిక్ పోలీసుల సహకారంతో తొలుత తగిన స్థలాలను గుర్తించాలి. మొదట మోడల్గా ఒక స్మార్ట్పార్కింగ్ సెంటర్ను ఏర్పాటుచేసి.. దాని అనుభవంతో మిగతా ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. బాధ్యత ఏజెన్సీదే.. పార్కింగ్ ఏర్పాట్లకు తగిన డిజైన్, నిర్మించే బాధ్యత ఏజెన్సీదే. ఐదేళ్లపాటు నిర్వహణ కూడా దానిదే. అనంతరం పనితీరును బట్టి పొడిగిస్తారు. లేదంటే జీహెచ్ఎంసీకి తిరిగి అప్పగించాలి. నిర్వహణ కాలంలో నిర్ణీత పార్కింగ్ ఫీజులు వసూలు చేసుకోవడంతోపాటు వ్యాపార ప్రకటనలు, తినుబండారాల అమ్మకాలు, ఎలక్ట్రిక్ వాహనాలకు చా ర్జింగ్ వంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ పార్కింగ్ ప్రదేశాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలు పా ర్కింగ్ చేసుకోవచ్చు. ఆధునిక సాంకేతికతతో పనిచేసే స్మార్ట్ పార్కింగ్ సెన్సర్లు, కెమెరాలు, వైఫై, ఎల్పీ వ్యాన్ నెట్వర్క్ సదుపాయాలుండాలి. ఎంతకాలం పడుతుందో?వెబ్పోర్టల్ లేదా మొబైల్ ఫోన్నుంచి పార్కింగ్ ప్రదేశంలోని ఆక్యుపెన్సీని తెలుసుకొని స్లాట్ బుక్ చేసుకునే సదుపాయం ఉండాలి. ఏఐతో పని చేసే కెమెరాల ఏర్పాటు ద్వారా నంబర్ ప్లేట్లు, వాహనాల రాకపోకలు వంటివి మాత్రమే కాకుండా ఏవైనా ఇబ్బందులు తలెత్తినా వెంటనే తెలుసుకునే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. ఆలోచన బాగున్నప్పటికీ, అమల్లోకి రావడానికి ఎంతకాలం పడుతుందో వేచి చూడాల్సిందే. ప్రస్తుతం కేబీఆర్ పార్కు వద్ద ఒక మల్టీలెవెల్ పార్కింగ్ పనులు ప్రారంభం కాగా, పాతబస్తీలో మల్టీలెవెల్ పార్కింగ్ ఏళ్ల తరబడి పనులు జరగకపోవడం తెలిసిందే. తొలుత సంపన్న వర్గాలున్న ఖైరతాబాద్ జోన్కు ప్రాధాన్యం ‘బూస్ట్’ విధానంలో ఏర్పాటుకు సిద్ధమైన జీహెచ్ఎంసీ -
ఎండాకాలం.. ఏదీ సన్నద్ధత?
రోజుకు 5.05 లక్షల మందికి పైగా మెట్రో జర్నీ సాక్షి, సిటీబ్యూరో: మెట్రో ప్రయాణం రోజు రోజుకూ నరకప్రాయంగా మారుతోంది. లక్షలాది మంది కిక్కిరిసి ప్రయాణం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం వరకు నిల్చుని ప్రయాణం చేసే సదుపాయం ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి కూడా లేకుండాపోయింది. చోటులేనంతగా రైళ్లు భర్తీ అవుతున్నాయి. రాత్రింబవళ్లూ అన్ని కారిడార్లలో, అన్ని సమయాల్లోనూ ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది. పట్టాలపై నడిచే రైళ్లలో ఉండే ప్రయాణికులకు రెట్టింపుగా మెట్రోస్టేషన్లలో పడిగాపులు కాయాల్సివస్తోంది. రోజు రోజుకూ పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు కోచ్లను ఏర్పాటు చేసేందుకు రెండేళ్ల క్రితమే ప్రణాళికలను రూపొందించారు. కానీ.. ఇప్పటివరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రస్తుతం సుమారు 5.05 లక్షల నుంచి 5.10 లక్షల మంది మెట్రోల్లో ప్రయాణం చేస్తుండగా ఈ వేసవిలో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ నాటికి 5.5 లక్షలకు చేరవచ్చని అంచనా. ఇప్పటికే రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. పెరగనున్న రద్దీ రైళ్ల నిర్వహణలో భారంగా మారనుంది. వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకొని అదనపు కోచ్లు, అదనపు సర్వీసులను పెంచేందుకు అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఎన్నాళ్లీ పడిగాపులు? ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కొత్త కోచ్లను కొనుగోలు చేసేందుకు గత ప్రభుత్వ హయాంలోనే సన్నాహాలు చేపట్టారు. అద్దె ప్రాతిపదికన కోచ్లను తెప్పించాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. ప్రభుత్వం నిధులు కేటాయిస్తే ప్రయాణికుల డిమాండ్ మేరకు కొత్త కోచ్లను కొనుగోలు చేయాలనే ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది. కానీ.. ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రతిపాదన కార్యాచరణకు నోచుకోలేదు. ఈ ఏడాది కాలంలోనే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయినప్పటికీ 3 కోచ్లలోనే కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఇప్పుడు ఉన్న 3 కోచ్లను 6కు పెంచేందుకు నాగపూర్ మెట్రో రైల్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు అప్పట్లో పేర్కొన్నారు. కానీ.. ఆ మేరకు ఎలాంటి పురోగతీ లేదు. మరోవైపు ఈ ఏడాది కాలంగా అదనపు కోచ్లను ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు పదే పదే చెబుతూనే ఉన్నారు. ఎండలు ముదురుతున్నాయి.. ● రాయదుర్గం– నాగోల్, ఎల్బీనగర్– మియాపూర్ రూట్లలో నడిచే రైళ్లు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈ రెండు కారిడార్లలో ప్రధాన స్టేషన్లలో ప్రతి రోజూ 25 వేల నుంచి 30 వేల మంది ప్రయాణం చేస్తున్నారు. అమీర్పేట్, రాయదుర్గం, ఎల్బీనగర్ స్టేషన్లలో లక్ష మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు సైతం ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఆర్టీసీ వివిధ మార్గాల్లో సుమారు 240 ఏసీ బస్సులను నడుపుతున్నప్పటికీ ప్రతి 3 నిమిషాలకు ఒకటి చొప్పున అందుబాటులో ఉండే మెట్రో సర్వీసు ల వైపే ప్రయాణికులు మొగ్గు చూపుతున్నారు. ● ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు సకాలంలో చేరేందుకు అనుకూలంగా ఉండడంతో మెట్రో రైళ్ల ప్రాధాన్యం పెరిగింది. ప్రస్తుతం ప్రతి రోజూ సుమారు 1,065 ట్రిప్పులు నడుపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.కానీ ఇప్పుడు ఉన్న రద్దీ దృష్ట్యా 3 నిమిషాలకు ఒక రైలు నడిచినా రైల్లో నిలబడేందుకు చోటులేకపోవడంతో మరో ట్రైన్ కోసం ప్లాట్ఫామ్లపై పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఐటీ ఉద్యోగులు, పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేసే వారు ఇబ్బందులకు గురవుతున్నారు. కిక్కిరిసిపోతున్న మెట్రో సర్వీసులు ఈ వేసవిలో 5.50 లక్షలకు చేరే అవకాశం మెట్రో అదనపు సర్వీసులపై మీనమేషాలు రెండేళ్లుగా పెరిగిన కొత్త కోచ్ల డిమాండ్ -
శిశుమందిరాలతోనే సంస్కృతి పరిరక్షణ
బండ్లగూడ: సరస్వతీ శిశుమందిరాల్లోనే సంస్కృతి, సంప్రదాయాలతో కూడిన విద్య అందుతుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం శ్రీ శారదాధామంలో 41వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి సమాజానికి అవసరమైన భవిష్యత్ యువతరం శ్రీ సరస్వతీ శిశు మందిరాల ద్వారానే నిర్మాణం అవుతుందని పేర్కొన్నారు. చక్కటి వాతావరణం ఉన్నచోటనే దేశ భవిష్యత్ నిర్మాణం సాధ్యమవుతుంన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతీ వి ద్యాపీఠం తెలంగాణ అధ్యక్షుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ డాక్టర్ తక్కెళ్లపల్లి తిరుపతిరావు, భాగ్యనగనర్ విభాగ్ కార్యదర్శి విరివింటి రవీంద్ర శర్మ, ఆవాస విద్యాలయ కార్యదర్శి బొడ్డు శ్రీనివాస్, అధ్యక్షుడు అర్జున్గౌడ్, శ్రీ సరస్వతీ విద్యాపీఠం ప్రాంత సంఘటనా కార్యదర్శి పతకమూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
బ్రష్లు చేత పట్టి.. గోడలకు రంగులేసి..
ఉస్మానియా ఆసుపత్రిలో ఐటీ ఉద్యోగుల సామాజిక సేవ అఫ్జల్గంజ్: నిత్యం కంప్యూటర్ కీ బోర్డుపై బిజీగా ఉండే సాఫ్ట్వేర్ ఉద్యోగుల చేతులు బ్రష్లను పట్టి ఉస్మానియా ఆసుపత్రి గోడలకు రంగులు అద్దాయి. ప్రతిరోజు పని ఒత్తిడితో సతమతమవుతూ వారాంతంలో సినిమా, విందు, వినోద కార్యక్రమాలతో సేద తీరే ఐటీ ఉద్యోగులు సామాజిక సేవలో తాము సైతం అంటూ పాల్గొని ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. వివిధ ఐటీ కంపెనీలకు చెందిన దాదాపు 50 మంది ఉద్యోగులు, ఇప్పటికే ఉస్మానియా ఆసుపత్రిలో పేద రోగులకు సేవలందిస్తున్న హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ సహకారంతో ఆసుపత్రిలోని అవుట్ పేషంట్ బ్లాక్, కులీకుత్బ్ షా భవనంలోని పరిసరాలు, గోడలు, వార్డులను శ్రమదానంతో శుభ్రం చేశారు. బ్రష్లు చేతబట్టి సుమారు 100 లీటర్ల పెయింట్తో రంగులు వేశారు. పేద రోగులు వచ్చే ఉస్మానియా ఆసుపత్రికి తమ వంతుగా సేవ చేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని విప్రో కేర్ ఉద్యోగులు తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ సహాయ్, ఆర్ఎంఓలు డాక్టర్ జయకృష్ణ, డాక్టర్ మునావర్లు ఐటీ ఉ ద్యోగులను అభినందించారు. కార్యక్రమంలో వాజీ ద్, భారతి, నేహ, ప్రీతి, ఆరిఫ్, తేజ, దివ్య, స్వర్ణ, కౌసల్య, ఉష, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ఆనందం వ్యక్తం చేస్తున్న ఐటీ ఉద్యోగులు -
వినూత్నంగా ‘ది ఆర్టిసాన్స్ ఫ్లీ’..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని టి–వర్క్స్ వేదికగా నిర్వహించిన ‘ది ఆర్టిసాన్స్ ఫ్లీ’కార్యక్రమం విభిన్న కళలను, కళాకారులను ఒకే వేదిక మీదకు చేర్చింది. ఆదివారం జరిగిన ఈ కళాత్మక వేదికలో పలువురు ఆర్టిస్టులు వినూత్న కళలు, ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ప్రముఖ ఆర్ట్ బ్రాండ్ బ్రస్ట్రో సహకారంతో బియాండ్ హైదరాబాద్, ఆర్ట్ ఆర్టిస్ అఫీషియల్, ఎన్ఆర్బీ, అర్బన్ స్కెచర్స్ హైదరాబాద్ వంటి సంస్థ భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాకారుల హస్తకళా ప్రదర్శనలతోపాటు కళా ప్రముఖులతో ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించారు. మేకింగ్ కల్చర్ను ప్రోత్సహించడానికి ఇటీవల టి–వర్క్స్ ఆధ్వర్యంలో మేకర్స్ కలెక్టివ్ను ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఏర్పాటు చేసిన ఈ వేదికలో హ్యాండ్స్–ఆన్ వర్క్షాప్లు, నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాలను నిర్వహించింది. ఈ ఆర్టిసన్స్ ఫ్లీ 23వ ఎడిషన్లో 40 మంది వరకు కళాకారులు సృష్టించిన కళాకృతులను సామాజిక అనుసంధానాన్ని ప్రదర్శించాయి. ఈ వినూత్న కార్యక్రమంలోని ప్యానెల్ చర్చలో ప్రముఖ నటి గీతాభాస్కర్, స్క్రైబుల్ ఆర్టిస్టు హరీష్ భాగవతులు, అర్బన్ స్కెచర్స్ హైదరాబాద్ వ్యవస్థాపకుడు ఇషాక్ జియాయీ, చిత్రకారుడు–టెడెక్స్ స్పీకర్ ప్రియతం తదితరులు పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ ఆర్టిసాన్స్ ఫ్లీలో వెయ్యికి పైగా ఔత్సాహికులు, కళాకారులు పాల్గొన్నారు. టీ వర్క్స్ వేదికగా కళాత్మక సందడి ఆర్టిసాన్స్ ఫ్లీలో ఆకట్టుకున్న ఆర్టిస్టులు, కళాకృతులు ప్యానల్ చర్చలో పాల్గొన్న ప్రముఖులు -
‘ఛావా’ చిత్ర ప్రదర్శన
కుత్బుల్లాపూర్: మొగలులు భారతీయులపై సాగించిన దమకాండను ‘ఛావా’చిత్రం ప్రతిబింబిస్తోందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం కొంపల్లిలో బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు పెద్దబుద్దుల సతీష్సాగర్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన చావా చిత్రాన్ని ఎంపీ రాజేందర్ వీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 400 ఏళ్ల క్రితం మొగలుల దమనకాండ నుంచి హిందూ ధర్మాన్ని పరిరక్షించేందుకు శివాజీ మహరాజ్ నడుం బిగించారని, మన సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడేందుకు ఆయన వీరోచితంగా పోరాడారని తెలిపారు. ఆయన వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న శంభాజీ మహరాజ్ ఆనాడు మొగల్ చక్రవర్తులపై సాగించిన పోరాటాన్ని ఛావా చిత్రం ద్వారా తెరకెక్కించడం అభినందనీయమన్నారు. ఎంపీ ఈటల వెంట బీజేపీ నాయకుడు రాజిరెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ కో కన్వీనర్ శివాజీ రాజు, మాధురి, దుర్గా, అశోక్, మధు, మహేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, శంకర్ నాయక్, మహేందర్, తిరుపతి తదితరులు ఉన్నారు. ర్యాలీగా వెళ్లి... చిత్రం తిలకించి.. సుల్తాన్బజార్: శంభాజీ మహారాజ్ జీవిత కథగా తెరకెక్కిన ఛావా చిత్రానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఆదివారం కాచిగూడ క్రాస్ రోడ్డులోని ఐనాక్స్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. సనాతన ధర్మసేన వ్యవస్థాపకుడు డాక్టర్ కొప్పుల రాజశేఖర్తో కలిసి 150 మంది జాతీయవాద వైద్యులు కోఠి ఉస్మానియా మెడికల్ కళాశాల నుంచి ప్రత్యేకంగా అలంకరించిన గుర్రంతో ర్యాలీగా ఐనాక్స్ థియేటర్ వద్దకు చేరుకుని తిలకించారు. -
నీరా కేఫ్ ఎత్తేస్తే అడ్డుకుంటాం
ఖైరతాబాద్/సుందరయ్య విజ్ఞానకేంద్రం: హైదరాబాద్ నడిబొడ్డున రూ.20 కోట్లతో నిర్మించిన నీరా కేఫ్ను ఎత్తివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, గౌడజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎలికట్టె విజయ్కుమార్ గౌడ్ హెచ్చరించారు. విజయ్కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కల్లుగీత సంఘాల నాయకులు నీరా కేఫ్ భవన్ను పరిశీలించారు. అనంతరం బాగ్లింగంపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గౌడ కులస్తులు ఆత్మగౌరవంతోపాటు వృత్తిదారులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు నీరా కేఫ్ ఏర్పాటైందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 50 వేల వృత్తిదారులు ప్రకృతి సిద్ధమైన పానియాన్ని నీరా రూపంలో ప్రజలకు అందిస్తున్నారని అన్నారు. కొందరు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి ఈ కేఫ్ను ప్రైవేటు వ్యక్తుల పరం చేయడానికి పన్నాగం పన్నారని ఆరోపించారు. ప్రభుత్వ తక్షణమే ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని, లేదంటే గౌడ సంఘాలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గౌడ ఐక్యసాధన సమితి అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్, బబ్బూరి బిక్షపతి, భానుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ -
‘చరితార్థం’ పుస్తకావిష్కరణ
సాక్షి, సిటీబ్యూరో: ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఆంధ్ర మహిళాసభ కళాశాలలో ఆనందేశి నాగరాజు రాసిన ’చరితార్థం’ పుస్తకాన్ని ఆదివారం ఆవిష్కరించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నందివెలుగు ముక్తేశ్వర్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ రఘుకుమార్, సెంటర్ ఫర్ సోషియల్ డైలాగ్ కన్వీనర్ వేలూరి రామారావు మాట్లారు. భారత సమాజం, సంస్కృతి, ఆర్థిక అధ్యయనంతో ప్రాచీన భారతదేశ చరిత్రను ‘చరితార్థం’పుస్తకంలో రికార్డు చేశారని వక్తలు అన్నారు. నేటి భారత యువతకు మొదటి భారత ముస్లిం సంఘ సంస్కర్త, లౌకిక ప్రజాస్వామ్యవాది హమీద్ దల్వాయి భావాలు అనుసరణీయమని చెప్పారు. అనంతరం హమీద్ దల్వాయి రచించిన ’లౌకిక భారతదేశంలో ముస్లిం రాజకీయాలు’ అనే అనువాద పుస్తక పరిచయం కార్యక్రమం కూడా జరిగింది. -
పని ప్రదేశాల్లో లింగ సమానత్వం సాధించాలి
సాక్షి, సిటీబ్యూరో: పనిచేసే చోట లింగ సమానత్వం సాధించాల్సిన అవసరం ఉందని సీఐఐ తెలంగాణ చైర్మన్ సాయి డి ప్రసాద్ అన్నారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(టీడీఎఫ్), సీఐఐ తెలంగాణ ఎడ్యుకేషన్ అండ్ యూత్ ఎంపవర్మెంట్ సంయుక్తంగా ’ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి’ అనే అంశంపై ఆదివారం హైదరాబాద్లో సదస్సు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ పాలసీకి సిఫార్సులను రూపొందించడంలో ఇండియన్ ఉమెన్ నెట్ వర్క్ తెలంగాణ చేస్తున్న కృషిని కొనియాడారు. ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ మాట్లాడుతూ విద్యా నాణ్యతను మెరుగుపరిచేందుకు మద్దతు ఇవ్వడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మన విద్యార్థులు అసాధారణంగా రాణించేందుకు విద్యా వ్యవస్థలో భారీ మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సమాచారం సమకూర్చాలని కోరారు. విద్యలో నాణ్యత పెంపొందించడానికి విశ్వవిద్యాలయాల పరిపాలనను మెరుగుపరచడం, అవసరమైన నిధులను సమకూర్చడం, కొత్త బోధనా పద్ధతులను ప్రవేశపెట్టడం అవసరమని అన్నారు. కార్యక్రమంలో సీఐఐ సదరన్ రీజియన్ మాజీ చైర్మన్ అనిల్ కుమార్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ట్రస్టీ, మాజీ చైర్మన్ జి.గోపాల్ రెడ్డి, కావేరి విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ వి.ప్రవీణ్ రావు, మారుతి సుజుకి లిమిటెడ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు సి.వి.రామన్, సీఐఐ తెలంగాణ వైస్ చైర్మన్ ఆర్ఎస్ రెడ్డి, 200 మందికిపైగా పరిశ్రమ నిపుణులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. -
ఈజీగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్లు
సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లు మరింత సులభతరం కానున్నాయి. ఆన్లైన్లోనే పునరుద్ధరించుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. రవాణా శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సారథి’సాంకేతిక పరిజ్ఞానంసహాయంతో వాహన వినియోగదారులు ఎక్కడి నుంచైనా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ల(ఐడీపీ)ను రెన్యువల్ చేసుకొనే సదుపాయం ఉంటుంది. అమెరికా, దుబాయ్, యూరోప్ తదితర దేశాల్లోని నిబంధనల మేరకు రవాణా శాఖ అందజేసే డ్రైవింగ్ లైసెన్సులు, పర్మిట్ల ఆధారంగా ఏడాదిపాటు చెల్లుబాటు అయ్యేవిధంగా తాత్కాలికంగా లైసెన్సులను అందజేస్తారు. మరో ఏడాదిపాటు తీసుకోవాలంటే హైదరాబాద్ నుంచి మరోసారి ఐడీపీ పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యక్షంగా ఆర్టీఏ అధికారులను సంప్రదించాలి. కానీ, ‘సారథి’సేవలు వినియోగంలోకి వచ్చిన తరువాత ఆ ఇబ్బంది తొలగిపోనుందని ఆర్టీఏ అధికారి ఒకరు తెలిపారు. ఆర్టీఏ అందజేసే శాశ్వత డ్రైవింగ్ లైసెన్సులు, విదేశాల్లో ఉండేందుకు అనుమతించిన వీసాల ఆధారంగా ఆన్లైన్లోనే ఐడీపీలను పొందే అవకాశం లభిస్తుంది. సాధారణ లైసెన్సుల పునరుద్ధరణ, చిరునామా మార్పు, డూప్లికేట్ లైసెన్సులు వంటి ఆన్లైన్ సేవల్లో భాగంగా ఐడీపీ సదుపాయం ఉంటుంది. విదేశాల్లో ఉంటున్న వాళ్లకు దీనివల్ల భారీ ఊరట లభించనుంది. అనూహ్యమైన స్పందన... ఆర్టీఏ అందజేసే ఐడీపీలకు అనూహ్యమైన స్పందన లభిస్తోంది. విదేశాల్లో చదువుకొనేందుకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, బంధువుల ఇళ్లకు వెళ్లేవాళ్లు, తాత్కాలిక వీసాలపై వెళ్లే పర్యాటకులు ఐడీపీల కోసం ఆర్టీఏ కార్యాయాల వద్ద క్యూ కడుతున్నారు. ఒక్క ఖైరతాబాద్ కేంద్ర కార్యాలయం నుంచి ప్రతిరోజు సగటున 25 నుంచి 30 ఐడీపీలను అందజేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లోని వివిధ ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో సగటున 50 వరకు ఉండవచ్చని అంచనా. లైట్ మోటార్ వెహికల్(ఎల్ఎంవీ) డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండి వీసా ఉన్న నగరవాసులు ఈ అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లను తీసుకోవచ్చు. ఇందుకోసం ప్రస్తుతం ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకొని సుమారు రూ.1,500 ఫీజు చెల్లించి నిర్ణీత తేదీ, సమయం ప్రకారం సంబంధిత ఆర్టీఏ అధికారులను సంప్రదించాలి. డాక్యుమెంట్ల పరిశీలన అనంతరం అదేరోజు ఐడీపీని అందజేస్తారు. ఈ ఐడీపీని ఆమోదించిన దేశాల్లో వాహనాలు నడిపేందుకు అర్హత లభిస్తుంది. కానీ, ఉద్యోగులు వీటి పునరుద్ధరణలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సారథి పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే ఆ ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. మరోవైపు విదేశాల్లో వాహనాలు నడిపేందుకు పర్మిట్లు కోరుతున్న వాళ్లలో ఉద్యోగులతోపాటు మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. విదేశాల్లోనే స్థిరపడ్డవాళ్లు మాత్రం కొంతకాలం తాత్కాలికంగా ఐడీపీ ఆధారంగా వాహనాలు నడిపేందుకు అనుమతి పొందినా శాశ్వతంగా మాత్రం అక్కడి రవాణా శాఖ నుంచి డ్రైవింగ్ లైసెన్సులను పొందవలసి ఉంటుంది. తుదిదశలో ‘సారథి’పరిశీలన దేశ వ్యాప్తంగా వాహనాల నమోదు, డ్రైవింగ్ లైసెన్సుల సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వాహన్ సారథిని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ‘వాహన్’సేవలు అందుబాటులోకి వచ్చాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన వాహనాల గణాంకాలు, చిరునామాలు వంటి వివరాలన్నింటినీ ‘వాహన్’లో నిక్షిప్తం చేశారు. దీనివల్ల వాహనదారులు ఒక రాష్ట్రంనుంచి మరో రాష్ట్రానికి, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వాహనాలను బదిలీ చేసుకొన్నప్పుడు ప్రత్యేకంగా నిరభ్యంతర పత్రం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవిధంగా వాహనాన్ని ఏ రాష్ట్రంలో కొనుగోలు చేసినా వాహన వినియోగానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే విధమైన సేవలను పొందవచ్చు. వాహన్ ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. డ్రైవింగ్ లైసెన్సుల సేవలను సైతం ఏకీకృతం చేసేవిధంగా ‘సారథి’ని హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు. సికింద్రాబాద్ ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని ప్రయోగాత్మకంగా ఎంపిక చేశారు. సారథి సాంకేతిక వ్యవస్థ తుదిదశ పరిశీలనలో ఉంది. డ్రైవింగ్ లైసెన్సుల గణాంకాలను, వివరాలను సారథిలో నమోదు చేయడం వల్ల వాహనదారులు వాటి బదిలీలు, పునరుద్ధరణలో సారథి సేవలను వినియోగించుకోవచ్చు. అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లకు కూడా ఈ సదుపాయం లభించనుంది. ‘సారథి’సాంకేతిక దన్నుతో ఆన్లైన్లో పునరుద్ధరణ ఎక్కడి నుంచైనా సేవలను వినియోగించుకొనే అవకాశం తుదిదశలో సాంకేతిక అంశాల పరిశీలన... -
కాంక్రీట్ లారీ ఢీ.. కారు నుజ్జునుజ్జు
యువకుడి దుర్మరణం దుండిగల్: ఎదురుగా వస్తున్న కారును కాంక్రీట్ లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆదివారం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దూలపల్లి ప్రాంతానికి చెందిన దున్నాల నాగ వంశీ (22) ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. ఆదివారం ఉదయం కారులో మియాపూర్ నుంచి గండిమైసమ్మ చౌరస్తా వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో గండిమైసమ్మ నుంచి ప్రగతినగర్ వైపు వస్తున్న కాంక్రీట్ లారీ బౌరంపేట స్నేక్ పార్క్ చౌరస్తా వద్ద ఎదురుగా వస్తున్న నాగ వంశీ కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో నాగ వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు. అదే సమయంతో బైక్పై వస్తున్న బాచుపల్లికి చెందిన చిట్టూరి వెంకట సురేంద్ర, గోపాల్ కారును వెనుక నుంచి ఢీకొట్టారు. సురేంద్రకు కాలు విరిగిపోవడంతో సూరారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కారులో ఇరుక్కుపోయిన నాగవంశీ మృతదేహాన్ని జేసీబీ బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సుమారు గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. లారీ డ్రైవర్ రాములు పరారీలో ఉన్నాడని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
సూపర్ మచ్చీ!
నగరంలోని ముషీరాబాద్ చేపల మార్కెట్కు ఆదివారం కొనుగోలుదారులు పోటెత్తారు. నిన్నా మొన్నటి దాకా కొరమీను కిలో రూ.400 నుంచి రూ.450కి అమ్మగా.. ఆదివారం రూ.500 నుంచి రూ.600కు విక్రయించారు. బొచ్చ చేపలు మొన్నటి వరకు కిలో రూ.170– 180 ఉండగా రూ.200 ధర పలికాయి. రవ్వూ చేప కిలో రూ.130 నుంచి రూ.140కి విక్రయించగా రూ.150 నుంచి 160కి వినియోగదారులు కొనుగోలు చేశారు. రొయ్యలు కిలోకు రూ.450కి విక్రయించారు. బర్డ్ఫ్లూ భయంతోనే చేపలకు గిరాకీ ఏర్పడిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. – ముషీరాబాద్ -
ఊపిరి.. ఉక్కిరిబిక్కిరి
టర్ పరిధిలోని కోకాపేట్, నార్సింగి, తెల్లాపూర్, పుప్పాలగూడ, మణికొండ, గండిపేట్, జూబ్లీహిల్స్, మియాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో భవనాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. పనిచేసే ప్రదేశాల్లో ఇసుక, మట్టి తరలింపు, వ్యర్థాల తొలగింపు, నిర్వహణ వంటి విషయాల్లో నిర్మాణ సంస్థలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో వాటి పరిసర ప్రాంతాల్లో ఇసుక రేణువులు గాలిలో దట్టంగా అలముకుంటున్నాయి. గాలిలో పీఎం 10 ధూళికణాల సాంద్రత అధికంగా ఉండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై బస్సు, లారీ, కారు వంటి వాహనాలు వెళ్లేటప్పుడు దారి కనిపించనంత దట్టంగా దుమ్ము రేగుతోంది. పటాన్చెరు, బొల్లారం, పాశమైలారం, రామచంద్రాపురం తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో పరిశమ్రలు విడుదల చేస్తున్న వ్యర్థాలు గాలి పీల్చుకోలేనంత గాఢంగా మారుతున్నాయి. నగరంలో సుమారు 80 లక్షల వాహనాలు నిత్యం రహదారిపై తిరుగుతున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, అమీర్పేట్, కోఠి, కూకట్పల్లి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వాహనాల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. దీంతో రహదారిపై ఒకవైపు పొగ, మరోవైపు ధూళి రేణువులు కళ్లల్లో పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు జీహెచ్ఎంసీ రూ.వేల కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు దీర్ఘకాలంగా కొనసాగుతుండటంతో ఆ దారిలో దుమ్మురేగుతోంది. గాఢమైన వాసనలు పీల్చడం, దుమ్ము, ధూళి రేణువుల ప్రభావంతో శ్వాసకోశ జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. మియాపూర్లో ఆందోళనకరం మియాపూర్లోని నరేన్ గార్డెన్లో ఎయిర్ క్వాలిటీ 342గా నమోదైంది. ఇక్కడ ఉన్న కొన్ని నిర్మాణ సంస్థలే ఇందుకు ప్రధాన కారణమంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం గాలి నాణ్యత సోమాజిగూడ(154), కేపీహెచ్బీ ఫేజ్–3 (139), జూపార్క్ (124), కోటి (124), యూఎస్ కాన్సలేట్ (124) సైదాబాద్ (107) తదితర ప్రదేశాల్లో ప్రమాదకరంగా నమోదైంది. గాలి నాణ్యత 50 వరకు ఉంటే సాధారణం. 100 దాటితే ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు.బయటకు వెళ్తే దుమ్ము, ధూళి.. ఊపిరి పీల్చుకోలేక ఉక్కిరిబిక్కిరి.. పరిశ్రమలు, నిర్మాణ సంస్థలున్న ప్రాంతాల్లో దట్టమైన పొగలు.. ఇదీ నగరంలో పరిస్థితి. స్వచ్ఛమైన గాలి మచ్చుకై నా లేదు. వాహనాల రద్దీకి గాలి నాణ్యత తీవ్రంగా దెబ్బతింటోంది. కొన్ని ప్రాంతాల్లో ఘనపు మీటరు గాలిలో పీఎం10 ధూళికణాలు 60 మైక్రో గ్రాములు ఉండాల్సిన చోట 150 మైక్రో గ్రాములు దాటి నమోదు కావడం అందరినీ కలవరపెడుతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల ప్రకారం ఘనపు మీటరు గాలిలో పీఎం 10 సూక్ష్మ ధూళి కణాలు 60 మైక్రో గ్రాములు, డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల ప్రకారం 40 మైక్రో గ్రాములు ఉండాలి. –సాక్షి, సిటీబ్యూరోప్రాంతం పీఎం 10 స్థాయి (మైక్రో గ్రాములు) పాశమైలారం 158 పటాన్చెరు 155 జూ పార్క్ 157 బొల్లారం 146 హెచ్సీయూ 135 కోకాపేట్ 120 సోమాజిగూడ 104 -
కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు నేడే అంకురార్పణ
కీసర: ప్రఖ్యాత శైవ క్షేత్రం కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రాంరభం కానున్నాయి. మార్చి 1వ తేదీ వరకు ఆరు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. టీటీడీ వేద పాఠశాల ఆచార్యులు పుల్లేటికుర్తి గణపతి శర్మ ప్రధాన సంధానకర్తగా వైదిక కార్యక్రమాలు కొనసాగుతాయి. సోమవారం ఉదయం 11 గంటలకు ఆలయ చైర్మన్ తటాకం నారాయణ దంపతులచే విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, రుత్విక్వరణం, యాగశాల ప్రవేశం, అఖండ జ్యోతి ప్రతిష్ఠాపనం తదితర కార్యక్రమాలను వైదికులు నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు అగ్ని ప్రతిష్ఠాపన, బేరిపూజ, ధ్వజారోహణ, ద్వాత్రింశతి రాగాలాపన, హారతి, రాత్రి 7 గంటలకు మంత్ర పుష్పం, పరాకస్తవం, తీర్థ ప్రసాద వినియోగం, రాత్రి 8 గంటలకు శ్రీస్వామివారిని కీసరగుట్ట నుంచి కీసర గ్రామానికి ఊరేగింపుగా తీసుకువస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా సుమారు 5 లక్షల వరకు యాత్రికులు వస్తారని అంచనా. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. అలాగే కీసరగుట్ట బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని జిల్లా స్థాయి క్రీడోత్సవాలు సోమవారం ఉదయం ప్రారంభం కానున్నాయి. -
ఉద్యానం.. అభివృద్ధి స్వచ్ఛందం
రాజధానిలోని చెరువుల అభివృద్ధి కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నిధులు కేటాయిస్తుండగా... పార్కుల్ని తమకు అప్పగించాలంటూ పలు స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీఓ) హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని (హైడ్రా) కలుస్తున్నాయి. కబ్జా చెర నుంచి విడిపించిన వాటితో పాటు తమ ప్రాంతాల్లో ఉన్నవీ అప్పగిస్తే వాటిని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి స్థానికులకు అందుబాటులోకి తీసుకువస్తామని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించి, తదుపరి వచ్చే ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నిర్ణయించారు. –సాక్షి, సిటీబ్యూరోహైడ్రా అధికారులు ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న జలవనరులతో పాటు ప్రభుత్వ స్థలాలను పరిరక్షించే బాధ్యతల్ని నిర్వర్తిస్తోంది. ఏదైనా లేఔట్కు అనుమతి పొందే సమయంలో దాని యజమానులు పార్కుతో పాటు కామన్ ఏరియాలను విడిచిపెట్టడం అనివార్యం. తొలినాళ్లల్లో వీటిని ఓపెన్ ప్లేసులుగానే వదిలేస్తున్న యజమానులు కాలక్రమంలో ప్లాట్గా మార్చి అమ్మేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఆ ప్రాంతానికి అటు–ఇటు ఉన్న ప్లాట్ల యజమానులు కబ్జా చేస్తున్నారు. ఇలాంటి అనేక కారణాల నేపథ్యంలో కాలనీ నుంచి పార్కులు, ఓపెన్ స్పేస్లు, కామన్ ఏరియాలు మాయమవుతున్నాయి. లేఔట్ వేసే సమయంలో వదిలే ఈ ప్రాంతాలన్నీ ప్రభుత్వ స్థలాల పరిధిలోకే వస్తాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పరుసగా ఫిర్యాదులు.. కొన్నేళ్లుగా నగరంలో ఈ కబ్జా పర్వం నడుస్తోంది. అయితే.. ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఎలా ఫిర్యాదు చేయాలి? అనేది అంశాలు తెలియక కొందరు.. ప్రభుత్వ విభాగాల చుట్టూ ప్రదక్షిణలు చేయలేక మరికొందరు మిన్నకుండిపోతున్నారు. హైడ్రా ఏర్పడిన తర్వాత ఈ కబ్జాలపై ఫిర్యాదులు మొదలు కాగా... ఆ విభాగంలో ప్రజావాణి నిర్వహణ ప్రారంభించిన తర్వాత జోరందుకున్నాయి. తమకు వచ్చే ఫిర్యాదుల పూర్వాపరాలు, రికార్డులు, డాక్యుమెంట్లు పరిశీలిస్తున్న హైడ్రా అధికారులు పార్కుల్లో ఉన్న కబ్జాలను తొలగిస్తున్నారు. అక్కడ నిర్మించిన నిర్మాణాలను కూల్చివేస్తూ పరిరక్షించాల్సిందిగా ఆయా ప్రభుత్వ విభాగాలకు లేఖలు రాస్తున్నారు. కొన్ని కాలనీల్లో ఆయా సంక్షేమ సంఘాలే ఈ బాధ్యతల్ని చేపడుతున్నాయి. ఆసక్తి చూపిస్తున్న ఎన్జీఓలు.. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఎన్జీఓలు యాక్టివ్గా పని చేస్తున్నాయి. కొన్ని సంస్థలు నగర వ్యాప్తంగా తమ సేవల్ని విస్తరించాయి. ఇలాంటి కొన్ని ప్రతిష్టాత్మక సంస్థల నుంచి హైడ్రాకు విజ్ఞప్తులు వస్తున్నాయి. కొన్ని పార్కుల్ని తమకు అప్పగిస్తే వాటిని అభివృద్ధి చేయడంతో పాటు నిర్వహణ బాధ్యతలు చేపడతామని కోరుతున్నాయి. అయితే గత ప్రభుత్వం కొన్ని చెరువులన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించింది. అభివృద్ధి పనులంటూ వారు చేపట్టిన చర్యల వల్ల ఆయా జలవనరులకు లాభం కంటే నష్టమే జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న హైడ్రా అధికారులు పూర్తి సమాచారాన్ని, విధివిధానాలను ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించారు. ఆపై సర్కారు తీసుకునే నిర్ణయం, ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్లనున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ’సాక్షి’కి తెలిపారు. యథావిధిగా నేటి ప్రజావాణి... నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగ మార్గంలో శనివారం దుర్ఘటన చోటు చేసుకున్న విషయం విదితమే. ఆ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించడానికి వివిధ ప్రభుత్వ విభాగాలు రెస్క్యూ ఆపరేషన్లు చేస్తున్నారు. దీనికోసం నగరం నుంచి హైడ్రా బృందాలు కూడా తరలివెళ్లాయి. కమిషనర్ ఏవీ రంగనాథ్ సైతం ఈ బృందాలతో పాటు శనివారం రాత్రి అక్కడికి వెళ్లారు. రాణిగంజ్లోని బుద్ధ భవన్లో ఉన్న హైడ్రా ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణికి.. కమిషనర్ రంగనాథ్ అందుబాటులో లేనప్పటికీ ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుందని హైడ్రా ప్రకటించింది. హైడ్రా కమిషనర్ను కలుస్తున్న ఎన్జీఓల ప్రతినిధులు తమ ప్రాంతాల్లోని పార్కులు అప్పగించాలని వినతులు చెరువులూ అభివృద్ధి చేసేందుకు కొన్ని సంఘాల ఆసక్తి ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకోవాలని హైడ్రా నిర్ణయం -
సిటీ ట్రాఫిక్ చీఫ్గా జోయల్ డెవిస్
సాక్షి, సిటీబ్యూరో: నగర ట్రాఫిక్ విభాగం చీఫ్గా 2010 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి డి.జోయల్ డెవిస్ నియమితులయ్యారు. మొత్తం ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ శనివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లకు సంబంధించి నలుగురు అధికారులు ఉన్నారు. జోయల్ డెవిస్ గతంలో హైదరాబాద్ మధ్య మండల డీసీపీగా, సిద్దిపేట కమిషనర్గా పని చేశారు. గత ఏడాది ఫిబ్రవరి నుంచి సైబరాబాద్లో ట్రాఫిక్ విభాగం సంయుక్త పోలీసు కమిషనర్గా (జేసీపీ) వ్యవహరిస్తున్నారు. ఆ పరిధిలో ఉన్న అనేక రహదారుల్ని అధ్యయనం చేసిన ఆయన క్లిష్టమైన ప్రాంతాల్లోని ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కరించడంతో తన మార్కు చూపించారు. ఈ నేపథ్యంలో ఆయనను అత్యంత కీలకమైన సిటీ ట్రాఫిక్ చీఫ్గా ప్రభుత్వం నియమించింది. కొన్నాళ్లుగా రాజధానిలోని ట్రాఫిక్ సమస్యలపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో జోయల్ డెవిస్ నియామకం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అదనపు సీపీ హోదాలో సిటీ ట్రాఫిక్ చీఫ్గా పని చేస్తున్న 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి పి.విశ్వప్రసాద్ను ప్రభుత్వం నగర నేర విభాగానికి బదిలీ చేసింది. గత ఏడాది లోక్సభ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్తో అదనపు సీపీగా (నేరాలు) పని చేస్తున్న ఏవీ రంగనాథ్ బదిలీ అయ్యారు. అప్పటి నుంచి ఈ పోస్టును నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) డీసీపీనే ఇన్చార్జ్గా ఉన్నారు. జోయల్ డెవిస్ బదిలీతో ఖాళీ అయిన సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం జేసీపీ పోస్టులో 2008 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి డాక్టర్ గజరావ్ భూపాల్ నియమితులయ్యారు. గతంలో దక్షిణ మండల డీసీపీ, సీసీఎస్ డీసీపీగా పని చేసిన ఆయన 2023 నుంచి డీజీపీ కార్యాలయంలో కో–ఆర్డినేషన్ విభాగం డీఐజీగా పని చేస్తున్నారు. జోయల్ డెవిస్ బదిలీతో ఆయన్ను మరో కీలకమైన సైబరాబాద్ ట్రాఫిక్ చీఫ్ పోస్టులో ప్రభుత్వం నియమించింది. గతంలో నగర టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీగా పని చేసిన ఎస్.చైతన్యకుమార్కు 2020 బ్యాచ్ ఐపీఎస్ ఖరారైంది. ఈయన కొన్నాళ్లుగా నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) డీసీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరు సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన స్థానంలో సైబరాబాద్కు గజరావ్ భూపాల్ అదనపు కమిషనర్గా (నేరాలు) వెళ్లిన పి.విశ్వప్రసాద్ చైతన్యకుమార్ను ఎస్బీ డీసీపీగా నియమిస్తూ ఉత్తర్వులు -
మంటగలుస్తున్న మానవత్వం.. పెరుగుతున్న హింసా ప్రవృత్తి
తన ప్రేమ వివాహం చెడిపోవడానికి కారణమయ్యాడని కన్నతండ్రినే నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశాడు కన్న కొడుకు. బుద్ధి చెప్పాల్సిన తండ్రే వ్యసనాలకు బానిస కావడంతో అతనిపై కోపం పెంచుకున్నాడు కొడుకు సాయికుమార్. ఎలాగైనా తండ్రి మొగిలిని అంతమొందించాలని నిర్ణయించుకొని.. నడిరోడ్డుపై చుట్టూ జనం చూస్తుండగానే కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు.అకారణంగా భార్య వెంకట మాధవితో గొడవ పెట్టుకొని, ఆమె గొంతు నులిమి చంపేశాడు భర్త గురుమూర్తి. ఇల్లాలి కాళ్లు, చేతులు, శరీరం, తల నాలుగు భాగాలుగా నరికి, వాటర్ హీటర్తో నీళ్లు మరిగించి శరీర భాగాలను ఉడకబెట్టాడు. ఆ తర్వాత వాటిని స్టవ్పై కాల్చి, రోకలి బండతో దంచి పోడి చేశాడు. ఆ పొడిని బ్లాస్టిక్ బకెట్లో తీసుకెళ్లి జిల్లెలగూడ చెరువులో పారబోశాడు.తనను కాదని కంపెనీలో డైరెక్టర్గా మరొకర్ని నియమించారని, ఆస్తిలో వాటా ఇవ్వలేదని తాత మీద కక్ష పెంచుకున్నాడు మనవడు. చంద్రశేఖర జనార్దన్ రావు ఇంట్లోకి చొరబడిన కూతురు కొడుకు కార్తి తేజ.. వెంట తెచ్చుకున్న కత్తితో తాతను విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన తల్లి సరోజపైనా దాడికి తెగబడ్డాడు.భార్యను, పిల్లలను వేధిస్తున్న అన్నను అంతమొందించారు తమ్ముళ్లు. ఎప్పటిలాగే మద్యం మత్తులో ఉమేష్.. భార్య ప్రియాంక, తమ్ముడు రాకేష్, చిన్నాన్న కొడుకు లక్ష్మణ్లతో గొడవ పడ్డాడు. బీరు సీసాతో దాడి చేశాడు. వారు ప్రతిఘటించడంతో ఇంట్లో నుంచి వీధిలోకి పరుగెత్తుకుంటూ జాతీయ రహదారిపైకి చేరుకున్నాడు. అయినా రాకేష్, లక్ష్మణ్లు వదిలిపెట్టకుండా అన్న ఉమేష్ను వెంబడించి కత్తులతో 15 సార్లు పొడిచి చంపేశారు. ఇలా.. రక్త సంబంధాల్లో నెత్తుటి చారికలు పారుతున్నాయి. ఎలాంటి బంధాలనూ లెక్కచేయడం లేదు. చెడు వ్యసనాలు, డబ్బు మీద వ్యామోహం, వివాహేతర సంబంధాల కారణంగా బంధుత్వాలు మరిచి పాశవికంగా ప్రవర్తిస్తున్నారు. ఈ దారుణ ఉదంతాలు ఏ మారుమూల గ్రామాల్లోనో, గిరిజన ప్రాంతాల్లో జరిగినవి కాదు.. విశ్వనగరంగా ప్రపంచంతో పోటీపడుతున్న హైదరాబాద్లో ఇటీవల చోటుచేసుకున్నాయి. విద్యావంతులు, రిటైర్డ్ ఉద్యోగస్తులూ ఇలాంటి కిరాతకాలకు పాల్పడుతుండటం శోచనీయం.ఓటీటీలో బోలెడంత కంటెంట్..హత్యలు ఎలా చేయాలి, చేశాక పోలీసులకు ఆధారాలు దొరక్కుండా ఎలా తప్పించుకోవాలి? ఈజీగా మనీ సంపాదించే అక్రమ మార్గాలేంటి? అనే అంశాలు పూసగుచ్చినట్లు బోలెడంత కంటెంట్ ఓటీటీ, యూట్యూబ్లో అందుబాటులో ఉంది. ఓటీటీ కంటెంట్ కారణంగా సమాజంలో నేరాలు, లైంగిక హింస పెరుగుతున్నాయని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇండియన్ సైకాలజీ ఓ రిపోర్ట్ను విడుదల చేసింది. ఓటీటీకి అలవాటు పడ్డవారి ప్రవర్తనలో విపరీతమైన మార్పులు కలుగుతున్నట్లు, ముఖ్యంగా టీనేజర్లలో ఒంటరితనం, హింసా ప్రవృత్తి పెరుగుతున్నట్టు తేల్చింది. ఓటీటీకి కేటాయించే సమయాన్ని క్రమంగా తగ్గిస్తూ.. సాహిత్యం, సంగీత, ఇతర కళలు, అభిరుచుల వైపు దృష్టిసారిస్తేనే ఈ విపత్తు నుంచి బయటపడవచ్చనిసూచించింది.అసాంఘిక ఊబిలోకి..మద్యం, మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చాయి. నగదు అవసరాలు పెరిగాయి. వీటి కోసం పర తమ భేద భావాలను మర్చిపోతున్నారు. అయినోళ్లనే అత్యంత కిరాతకంగా హతమారుస్తున్నారు. తల్లీదండ్రులు, అన్నా చెళ్లెళ్లు, భార్యభర్తలు వావి వరసలు పట్టించుకోవడం లేదు. అవసరాల కోసం, క్షణిక సుఖాల కోసం నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. అందుబాటులోకి వచ్చిన అశ్లీలత, విశృంఖలత్వం, మనుషుల భావాలను తీవ్రంగా దిగజారుస్తున్నాయి. వారిని అసాంఘిక ఊబిలోకి లాగుతున్నాయి. సంస్కృతి, సంప్రదాయాల్ని పక్కనపెట్టేలా చేస్తున్నాయి. ఈ దుస్థితిని సమాజం నుంచి పారదోలేందుకు చిన్ననాటి పాఠ్యాంశాల నుంచి కూడా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని సామాజిక, మానసిక విశ్లేషకులు చెబుతున్నారు. నైతిక విలువలకు ప్రత్యేకంగా క్లాసులు తీసుకోవాలి. ఉన్నత, తరగతుల ఉపాధ్యాయులు సమకాలిన రాజకీయ, ఆర్థిక, చారిత్రక అంశాలకు, భారతీయ సంస్కృతి, విలువల్ని కూడా జోడించి విద్యార్థులకు బోధించాలి. చట్టాలు, న్యాయ వ్యవస్థ మానసిక శాస్త్ర ఆలోచల్ని అందుబాటులో ఉంచాలి.గతేడాది గ్రేటర్లో హత్యల గణాంకాలివీ:హైదరాబాద్77సైబరాబాద్ 121రాచకొండ 73విలువలు కునారిల్లడం వల్లే..చిన్నతనం నుంచే డ్రగ్సకు బానిసలవుతున్నారు. దీంతో సమాజం, కుటుంబం అంటే గౌరవం ఉండట్లే. ఆస్తులు, డబ్బే లక్ష్యంగా ఎంతటి దారుణాలకై నా ఒడిగడుతున్నారు. నేరాలు, హింస, హత్యలు, వివాహేతర సంబంధాల వంటి వాటికి ఇంతకాలం మగవారు ఎక్కువగా పాల్పడేవారు. ఇటీవల కాలంలో మహిళలు కూడా ఇందులో భాగస్వామ్యమవుతున్నారు.–డాక్టర్ పద్మా కమలాకర్, మానసిక వైద్యురాలు, ఫ్యామిలీ రిలేషిన్షిప్ కౌన్సిలర్తప్పు చేసి తప్పించుకోలేరుఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ రోజుల్లో నేరం చేసి తప్పించుకోలేరు. వ్యామోహంలో, క్షణికావేశంలో చేసిన తప్పు తెలుసుకునేసరికి పరిస్థితి ఘోరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు జైలుకు వచ్చి పలకరించే పరిస్థితి కూడా ఉండదు. కన్నబిడ్డలు అసలు దగ్గరకు కూడా రానివ్వరు. ఇలా అందరూ ఉన్న ఒంటరిగా నాలుగు గోడల మధ్య జైలు జీవితం గడపాల్సిందే.–సుధీర్ బాబు, రాచకొండ సీపీ -
అడుగంటిన పబ్లిక్ గార్డెన్ చెరువు
ప్రశ్నార్థకంగా జలచరాల మనుగడ నాంపల్లి: 150 ఏళ్ల పురాతన చరిత్ర కలిగిన నాంపల్లి పబ్లిక్ గార్డెన్ చెరువు అడుగంటింది. ఈ చెరువు ఎండిపోవడం పర్యావరణం సంక్షోభానికి సంకేతం. ఇన్నాళ్లూ జీవ వైవిధ్యానికి ఆధారంగా నిలిచిన పబ్లిక్గార్డెన్ చెరువు ఎండిపోవడానికి పట్టణీకరణ, భూగర్భ జలాలు అడుగంటడం, పేలవమైన పరిరక్షణ చర్యలే కారణాలని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ఈ చరిత్రాత్మకమైన ప్రదేశం వినాశనానికి గురికావడంతో అందులోని జలచరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మరో రెండురోజుల్లో పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది. తాబేళ్లు, చేపలు మృత్యువాత పడే అవకాశం ఉంది. నీటిమట్టం తగ్గడంతో చెరువులోని చేపలు కొంగలకు ఆహారంగా మారాయి. కాబట్టి సంబంధిత శాఖ అధికారులు ఈ చెరువుపై ప్రత్యేక దృష్టిని సారించి చెరువును, చెరువులోని జలచరాలను కాపాడాల్సిన అవసరం ఉంది. చెరువులోని పూడికను తొలగించి తక్షణం జల స్థిరతాన్ని తీసుకురావాలని స్థానికులు, సందర్శకులు కోరుతున్నారు. -
హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు దక్కేవేమో..
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి ఘట్కేసర్: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన ఘట్కేసర్ పీఎస్ పరిధిలో ఆదివారం జరిగింది. ఇన్స్పెక్టర్ పరుశురాం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి– భువనగిరి జిల్లా బీబీనగర మండలం జమిలాపేట్కు చెందిన మడిపడిగే యశ్వంత్ (18) ఇంటర్ చదివి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం ఇంటి నుంచి ఘట్కేసర్ వైపు స్కూటీపై వస్తుండగా అగస్త్య ఫామ్హౌజ్ సమీపంలో మితిమీరిన వేగంతో వచ్చిన లారీ యశ్వంత్ స్కూటీని ఢీకొట్టింది. దీంతో అతడి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యశ్వంత్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. యశ్వంత్ హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణం పోయేది కాదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. యశ్వంత్ మృతదేహం -
డీఆర్ఎఫ్ పాత్ర కీలకం
● హైడ్రా కమిషనర్ రంగనాథ్ ● ఔట్ సోర్సింగ్ అభ్యర్థులకు శిక్షణ సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) నిర్వహిస్తున్న విధుల్లో దీని అంతర్భాగంగా పని చేస్తున్న డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) పాత్ర అత్యంత కీలకమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ప్రభుత్వ లక్ష్యాలు నెరవేర్చడంతో పాటు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా హైడ్రా పని చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. డీఆర్ఎఫ్లోని ఔట్ సోర్సింగ్ విధానంలో కొత్తగా ఎంపిక చేసుకున్న 357 మందికి అంబర్పేటలోని పోలీసు ట్రైనింగ్ సెంటర్లో (పీటీసీ) వారం రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ కార్యక్రమాన్ని రంగనాథ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో, ప్రభుత్వ పరంగా హైడ్రా కీలక భూమిక పోషిస్తోందని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలు రక్షించడంతో పాటు ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో డీఆర్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇప్పుడు దీనికి హైడ్రా విధులు కూడా తోడయ్యాయని చెప్పారు. హైడ్రా మీద నమ్మకంతో ప్రభుత్వం పలు బాధ్యతలు అప్పగిస్తోందని, తాజాగా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునే పనినీ అప్పగించిందని తెలిపారు. ఈ బాధ్యతల్ని అందరూ అంకిత భావంతో నెరవేర్చాలని ఆయన సూచించారు. -
బీఆర్ఎస్ నుంచి ఒకరు విత్డ్రా
నేడు మరొకరు సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలోని 15 సభ్యత్వాల కోసం నామినేషన్లు దాఖలు చేసిన వారిలో బీఆర్ఎస్ కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మి తన నామినేషన్ను గురువారం విత్డ్రా చేసుకున్నారు. బీఆర్ఎస్కే చెందిన మరో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణరావు సైతం తన నామినేషన్ను శుక్రవారం ఉపసంహరించుకోనున్నట్లు సమాచారం. స్టాండింగ్ కమిటీ కోసం అధికార కాంగ్రెస్– ఎంఐఎం పరస్పర అవగాహనతో నామినేషన్లు వేసినందున, పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు బీఆర్ఎస్ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటున్నట్లు సమాచారం. ఉపసంహరణకు నేటి (శుక్రవారం) వరకు గడువు ఉంది. సత్యనారాయణరావు ఉపసంహరణ పూర్తయ్యాక, మిగతా 15 మందిని ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించే అవకాశం ఉంది. వీరిలో ఎనిమిది మంది ఎంఐఎం సభ్యులు, ఏడుగురు కాంగ్రెస్ సభ్యులుండటం తెలిసిందే. -
పరికి చెరువు ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలు
నిర్మాణంలో ఉన్న తన ఇంటిని తానే కూల్చుకున్న జేసీబీ డ్రైవర్ ఆల్విన్కాలనీ: కూకట్పల్లి మండల పరిధిలోని ఆల్విన్ కాలనీ డివిజన్ భూదేవి హిల్స్ పరికి చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు గురువారం కూల్చివేశారు. ఈ క్రమంలో హైడ్రాలో జేసీబీని నడిపే ఓ ఉద్యోగి నిర్మాణంలో ఉన్న తన ఇంటిని తానే కూల్చివేసుకోవడం గమనార్హం. తనకు చెందిన ఇంటి స్లాబ్ నిర్మాణాన్ని వదిలివేయాలని అతడు అధికారులను బతిమిలాడినా వారు ససేమిరా అన్నారు. చెరువులు, ప్రభుత్వ భూములు, నాలాల వెంట కొనుగోలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి కొనుగోలు చేసుకోవాలని, కష్టపడిన సొమ్మును వృథా చేసుకోరాదని అతడికి వారు సూచించారు. హైడ్రా సిబ్బంది అయినా, రాజకీయ నాయకులైనా, కబ్జాదారులైనా, ప్రభుత్వ భూములు, చెరువు స్ధలాలు, నాలా పరిసర ప్రాంత స్థలాలను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. కాగా.. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారనే విషయం తెలియడంతో స్థానికులు ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున వచ్చి అడ్డుకోవడానికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశామని, ఇళ్లు కట్టుకుంటున్న తరుణంలో కూల్చివేయటమేంటని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. జేసీబీ డ్రైవర్కు నచ్చచెబుతున్న పోలీస్ అధికారి -
‘చలో విద్యుత్ సౌధ’ భగ్నం
సాక్షి, సిటీబ్యూరో: విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఆర్టిజన్ కార్మికులను విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ గురువారం చేపట్టిన చలో విద్యుత్ సౌధ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ముందస్లు చర్యల్లో భాగంగా విద్యుత్ సౌధ సహా ఖైరతాబాద్, పంజాగుట్ట సర్కిళ్లలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఇతర జిల్లాల నుంచి నగరానికి చేరుకుంటున్న వాహనాలను ఎక్కడికక్కడే అడ్డుకుని కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కళ్లుగప్పి విద్యుత్ సౌధ ముందుకు చేరుకున్న జేఏసీ చైర్మన్ ఈశ్వర్రావును అరెస్ట్ చేయగా, కన్వీనర్ వజీర్ను ఎర్రగడ్డలో అదుపులోకి తీసుకున్నారు. జేఏసీ కో కన్వీనర్ గాంబో నాగరాజు సహా ఇతర ప్రతినిధులు సదానందం, నరేందర్, ఎల్లయ్యలను ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ భవన్ ముందు అదుపులోకి తీసుకున్నారు. -
‘స్కిల్ డెవలప్మెంట్’కు కమ్యూనిటీ హాల్
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటికే జీహెచ్ఎంసీకి చెందిన రెండు మోడల్ మార్కెట్లను నిరుద్యోగ యువత, మహిళల ఉపాధి కల్పన పేరిట స్కిల్ డెవలప్మెంట్ కోసం సీఎస్సార్ కింద లైట్హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్కు అప్పగించిన జీహెచ్ఎంసీ.. మరో కమ్యూనిటీ హాల్ను అదే సంస్థకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణకు ఇచ్చేందుకు పచ్చ జెండా ఊపింది. గతంలో మోడల్ మార్కెట్లు అంటే ఎవరూ ముందుకు రానందున ఖాళీగా ఉన్నాయని ఇచ్చారు. ఈసారి మాత్రం బోరబండలోని జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్ను ఇచ్చేందుకు గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. స్థానిక బస్తీల్లోని పేదలు, సామాన్య ప్రజలకు వివిధ కార్యక్రమాల కోసం ఉపయోగపడాల్సిన కమ్యూనిటీ హాల్ను సైతం స్కిల్ డెవలప్మెంట్కు ఇస్తుండటంతో మున్ముందు ఇంకెన్ని జీహెచ్ఎంసీ ఆస్తులు శిక్షణల పేరిట బదలాయిస్తారోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారీగా భూ సేకరణలు.. కేబీఆర్ పార్కు చుట్టూ నిర్మించనున్న ఫ్లై ఓవర్టు, అండర్పాస్లకు 105 ఆస్తులు, ఆల్విన్ క్రాస్రోడ్, ఖాజాగూడ, తదితర ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, రహదారుల అభివృద్ధి పనులు తదితరాల కోసం మరో 455 ఆస్తులు వెరసీ.. మొత్తం 560 ఆస్తుల సేకరణకు కమిటీ పచ్చజెండా ఊపింది. వీటితో పాటు మొత్తం 15 అజెండా అంశాలు, ఆరు టేబుల్ అంశాలకు ప్రస్తుత స్టాండింగ్ కమిటీ చివరి సమావేశం ఆమోదం తెలిపింది. ముఖ్యాంశాలు ఇలా.. ● మిధాని బస్టేషన్, బస్ డిపో నిర్మాణాలకు ఆర్టీసీకి కేటాయించిన 5.37 ఎకరాల ప్రభుత్వ భూమికి ఎన్ఓసీ. ● బీఆర్ఎస్ భవన్నుంచి బంజారా లేక్ వరకు ఎస్ఎన్డీపీ నిధుల నుంచి రూ.22.17 కోట్ల తో వరద కాల్వ నిర్మాణం, ఆధునికీకరణ. ● ఉప్పల్ సర్కిల్లోని చిలుకా నగర్ వివేకానంద విగ్రహం నుంచి కావేరీనగర్ కల్వర్టు వరకు రూ.6 కోట్ల అంచనా వ్యయంతో 100 మి.మీ. డయా పైపులైన్ నిర్మాణం. ● ప్రగతి నగర్ నుంచి మహదేవపురం వెటర్నరీ హాస్పిటల్ (వయా ఎల్లమ్మ బండ) వరకు ప్రతిపాదిత 30 మీటర్ల లింక్ రోడ్ అభివృద్ధికి అవసరమైన 8 ఆస్తుల సేకరణతో పాటు, రోడ్ను మాస్టర్ప్లాన్లో చేర్చేందుకు ప్రభుత్వానికి వినతి. ● దారుసలాం నుంచి చక్నావాడి కల్వర్టు వరకు రూ.7.40 కోట్లతో ఆర్సీసీ బాక్స్ డ్రెయిన్ నిర్మాణం. ● వీటన్నింటినీ పాలకమండలి ద్వారా ప్రభుత్వానికి నివేదించనున్నారు. జోన్కు రూ.25 కోట్లు జీహెచ్ఎంసీలో వివిధ అభివృద్ధి పనులకుగాను జోన్కు రూ.25 కోట్ల వంతున మొత్తం రూ.125 కోట్లు కేటాయించనున్నట్లు కమిషనర్ ఇలంబర్తి ఈ సందర్భంగా తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ సమన్వయంతో ప్రజల కోసం పని చేద్దామన్నారు. రహదారుల విస్తరణ, జంక్షన్లు, పార్కులు, క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీకి సంబంధించిన ఆస్తులు, వాటిపై వస్తున్న ఆదాయ వివరాలను అందించాలని అడిషనల్ కమిషనర్ (ఎస్టేట్స్) సమ్రాట్ అశోక్కు సూచించారు. జీహెచ్ఎంసీ ఆస్తులన్నింటినీ డిజిటలైజ్ చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో జీహెచ్ఎంసీ సెక్రటరీ కె.సత్యనారాయణ, స్టాండింగ్ కమిటీ సభ్యులు, అడిషనల్, జోనల్ కమిషనర్లు, విభాగాధిపతులు పాల్గొన్నారు. కమిషనర్, మేయర్తో స్టాండింగ్ కమిటీ సభ్యులు, అధికారులుసీఎస్సార్ కింద లైట్హౌస్ ఫౌండేషన్కు.. వివిధ ప్రాజెక్టుల కోసం 560 ఆస్తుల సేకరణ రూ.22 కోట్లతో బీఆర్ఎస్ భవన్ నుంచి బంజారా లేక్ వరకు వరద కాల్వ ఆధునికీకరణ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో ఆమోదం రూ.700 కోట్లిచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు: మేయర్ రాష్ట్రప్రభుత్వం గడచిన సంవత్సర కాలంలో జీహెచ్ఎంసీకి రూ. 700 కోట్ల నిధులు విడుదల చేసిందని చెబుతూ సమావేశానికి అధ్యక్షత వహించిన మేయర్ విజయలక్ష్మి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జీహెచ్ఎంసీకి ఎంతో ఆదాయాన్నిచ్చే క్రీడాప్రాంగణాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. -
వారం రోజుల్లో.. గోదావరి రెండు, మూడో దశలకు టెండర్లు..
సాక్షి, హైదరాబాద్: మహా నగర తాగునీటి అవసరాల కోసం మరో 20 టీఎంసీల గోదావరి జలాలను తీసుకొచ్చేందుకు కసరత్తు ప్రారంభమైంది. మరో వారం రోజుల్లో గోదావరి (Godavari) తాగునీటి సరఫరా పథకం రెండు, మూడో దశ పనులకు టెండర్లు ఆహ్వానించేందుకు జలమండలి ఏర్పాట్లు పూర్తి చేసింది. సుమారు రూ.7,360 కోట్ల అంచనా వ్యయంతో హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ (హ్యామ్) ప్రాజెక్టు పనులు చేపట్టనున్నారు. మొత్తం వ్యయంలో ప్రభుత్వ వాటా 40 శాతం, నిర్మాణ సంస్థ వాటా 60 శాతం భరించనున్నారు. ప్రభుత్వం తన వాటా నిధులను హడ్కో నుంచి రుణం తీసుకోనుంది. టెండర్ ప్రక్రియ పూర్తయిన నాటి నుంచి 24 నెలల్లో పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టనున్నారు.రెండు వరుసల భారీ పైపులైన్..కాళేశ్వరం (Kaleswaram) ఎత్తిపోతల్లో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి శామీర్పేట ఘన్పూర్ మీదుగా ఉస్మాన్సాగర్కు రెండు వరుసల భారీ పైపులైన్ నిర్మించనున్నారు. 3000 ఎంఎం డయాతో 50 కిలోమీటర్లు, 2,200 ఎంఎం డయాతో 58 కిలోమీటర్ల వరకు పైపులైన్ పనులు చేపట్టనున్నారు. ఘన్పూర్ వద్ద సుమారు 1170 ఎంఎల్డీల నీటిశుద్ధి ప్లాంట్ ఇతరత్రా నిర్మించనున్నారు. ఇందుకోసం సుమారు రూ.4,671 కోట్లు వినియోగించనున్నారు.● సుమారు రూ. 596.88 కోట్ల అంచనా వ్యయంతో ఘన్పూర్ నుంచి ముత్తంగి జంక్షన్ వరకు సుమారు 40 కిలోమీటర్లు 2400 ఎంఎం పైపులైన్, దాని వెంట 3000 ఎంఎం డయా రింగ్ మెయిన్ను కలుపుతూ పైపులైన్ నిర్మాణంతో పాటు ఇతర పనులు చేపట్టనున్నారు.● దాదాపు రూ. 300.09 కోట్ల అంచనాతో ఉస్మాన్ సాగర్లో 120 ఎంఎల్డీ, హిమాయత్సాగర్లో 70 ఎంఎల్డీ సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణ పనులు చేపట్టనున్నారు.30 టీఎంసీల కేటాయింపుగోదావరి జలాల్లో మహానగర తాగునీటి అవసరాలకు సుమారు 30 టీఎంసీల కేటాయింపు ఉంది. ఇప్పటికే గోదావరి మొదటి దశ కింద శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 10 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. రెండు, మూడు దశల కింద మిగిలిన 20 టీఎంసీలు తరలించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 20 టీఎంసీల్లో నగర తాగునీటి అవరాలకు 15 టీఎంసీలు, మిగిలిన 5 టీఎంసీలను ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల పునరుజ్జీవనానికి వినియోగించనున్నారు. గోదావరి మొదటి దశలో జలాలను ఇప్పటికే మూడు రింగ్ మెయిన్ పైప్లెన్ల ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాలకు అందిస్తున్నారు. రెండో దశ ప్రాజెక్టులో ఘన్పూర్ నుంచి నాలుగో రింగ్ మెయిన్ పైపులైన్ ముత్తంగి వరకూ నిర్మించనున్నారు. దీనిని ఇప్పటికే ఉన్న రింగ్ మెయిన్లకు అనుసంధానిస్తారు. మొత్తం మీద ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రెండోదశ నుంచి 150 ఎంజీడీలు, మూడోదశ నుంచి 150 ఎంజీడీల నీరు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని అన్ని ప్రాంతాలకూ సరఫరా జరిగే అవకాశం ఉంది. -
కులగణన రీ సర్వేకు సహకరించండి
హుడాకాంప్లెక్స్: కులగణన రీ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని బీసీ కమిషన్ సభ్యుడు రాపోలు జయప్రకాశ్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనలో పలు ఆరోపణలు వచ్చినందున తిరిగి సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం ఆయన సరూర్నగర్ డివిజన్కు చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వక్కలంక శ్రీనివాసరావు, పార్టీ సరూర్నగర్ డివిజన్ అధ్యక్షుడు శంకర్యాదవ్లతో సమావేశమై కులగణనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులగణనలో పాల్గొనని వారు ప్రస్తుతం రీ సర్వేలో తమ పేర్లను కులాల వారీగా నమోదు చేసుకోవాలన్నారు. కుల సంఘాల అభివృద్ధి, సంక్షేమానికి దోహదపడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు మహేందర్యాదవ్, శ్రీనివాస్, ధన్రాజ్గౌడ్, ఇమ్రాన్అలీ, శివకుమార్, షఫీ, యూనస్, జంగారెడ్డి, సుశీల, సంగీత తదితరులు పాల్గొన్నారు. -
అద్దెకు తీసుకుని అమ్మేశాడు..
జీడిమెట్ల: కార్లను లీజు ప్రాతిపదికన అద్దెకు తీసుకుని వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్న వ్యక్తిని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గురువారం బాలానగర్ డీసీపీ సురేష్కుమార్, ఏసీపీ హన్మంతరావు, జగద్గిరిగుట్ట సీఐ నర్సింహ, డీఐ అంజయ్యలతో కలిసి వివరాలు వెల్లడించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన అప్పరి విశ్వ పణీంద్ర గాజులరామారం దేవేందర్నగర్లో ఉంటూ చివకల రమణ, రెడ్డి వెంకటేశ్లతో కలిసి వీవీఅర్ ట్రావెల్స్ పేరిట సంస్థను ఏర్పాటు చేశాడు. అతను జగద్గిరిగుట్టకు చెందిన శశిధర్ వద్ద 2024 అక్టోబర్లో నెలకు రూ. 23 వేలు చెల్లించేలా లీజు ప్రాతిపదికన కారును అద్దెకు తీసుకున్నాడు. రెండు నెలలు సక్రమంగా అద్దె చెల్లించిన తర్వాత అద్దె చెల్లించకుండా కాలయాపన చేస్తున్నాడు. దీంతో అనుమానం వచ్చిన శశిధర్ అతడి కార్యాలయం వద్దకు వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. దీంతో పరిసర ప్రాంతాల్లో విచారించగా అతను ఇదే తరహాలో మరికొందరిని మోసం చేసినట్లు తెలిసింది. శశిధర్ జగద్గిరిగుట్ట పోలీసులకు పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు విశ్వపణీంద్రను అదుపులోకి తీసుకున్నారు. 32 కార్లు అమ్మేశాడు.. విశ్వపణీంద్ర ఇదే తరహాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 32 కార్లను అద్దెకు తీసుకుని విక్రయించినట్లు విచారణలో వెల్లడైంది. 28 కార్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడికి సహకరించిన రమణ, సత్యనారాయణ, వెంకటేష్ల కోసం గాలిస్తున్నారు. నిందితుడు విశ్వపణీంద్రను గురువారం రిమాండ్కు తరలించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన జగద్గిరిగుట్ట ఇన్స్పెక్టర్ నర్సింహ, డీఐ ఎం.అంజయ్య, ఎస్సై శంకర్, ఎఎస్సై రమణ, హెడ్కానిస్టేబుళ్లు అంజిబాబు, పురందాస్, కానిస్టేబుళ్లు నరేష్కుమార్, చిరంజీవి, నరేష్లను డీసీపీ అభినందించి రివార్డులను అందజేశారు. ఘరానా మోసగాడి అరెస్ట్ రూ.2.5 కోట్ల విలువైన 28 కార్లు స్వాధీనం -
గోల్డ్ లోన్ సొమ్ము నేరగాళ్ల పాలు!
సాక్షి, సిటీబ్యూరో: విద్య, వైద్య అవసరాల కోసం ఓ కార్మికుడు తీసుకున్న గోల్డ్ లోన్ సొమ్ము సైబర్ నేరగాళ్ల పరమైంది. ఈ మొత్తంతో పాటు అప్పటికే తన బ్యాంకు ఖాతాలో ఉన్న దాంతో కలిపి రూ.2.98 లక్షలు ఈ–కేటుగాళ్లు కాజేశారు. బాధితుడి ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నగరానికి చెందిన ఓ దిససరి కార్మికుడు (56) 20 రోజుల క్రితం గోల్డ్ లోన్ తీసుకున్నారు. అందులోంచి కొంత మొత్తం డ్రా చేసుకునేందుకు రెండు రోజులు క్రితం బ్యాంక్కు వెళ్లాడు. అయితే అధికారులు ఖాతాలో నగదు లేదని చెప్పడంతో కంగుతిన్న అతను పాస్బుక్ అప్డేట్ చేయించాడు. దీని ద్వారా కొన్ని అనధికార లావాదేవీలు జరిగాయని, బ్యాంకు ఖాతాలో ఉన్న మొత్తం గుర్తు తెలియని వ్యక్తులు కాజేశారని తెలిసింది. దీంతో ఆయన గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు అధికారులు ప్రాథమిక ఆధారాలను బట్టి నేరం జరిగిన తీరుపై ఓ అంచనాకు వచ్చారు. కొన్ని రోజుల క్రితం బాధితుడు సిటీ బస్సులో ప్రయాణిస్తూ తన సెల్ఫోన్ పొగొట్టుకున్నారు. దీనిపై ఫిర్యాదు చేయడం, సిమ్కార్డు బ్లాక్ చేయించడం తదితర చర్యలు తీసుకోలేదు. సదరు ఫోన్లో ఉన్న సిమ్కార్డు నెంబరే బ్యాంకు ఖాతాతో లింకై ఉండగా... ఫోన్ పే, గూగుల్ పే సహా ఎలాంటి యూపీఐ యాప్స్ అందులో లేవు. ఈ ఫోన్కు చేజిక్కించుకున్న వ్యక్తులు అందులో యూపీఐ యాప్స్ డౌన్లోడ్ చేశారు. ఖాతాతో లింకై న సిమ్కార్డు బ్లాక్ కాకపోవడంతో వాళ్ల పని తేలికై ంది. బ్యాంకు నుంచి వచ్చే ఓటీపీలు దానికే రావడంతో ఆ యాప్స్ను నేరగాడు యాక్టివేట్ చేసుకున్నారు. వీటి ద్వారా లావాదేవీలు చేస్తూ రూ.రూ.2.98 లక్షలు స్వాహా చేశారు. ఈ లావాదేవీలపై బ్యాంకు నుంచి ఎస్సెమ్మెస్లు వచ్చినప్పటికీ... ఫోన్ సైతం నేరగాళ్ల వద్దే ఉండటంతో బాధితుడికి విషయం తెలియలేదు. ఫోన్ అన్లాక్కు సంబంధించిన పాస్వర్డ్ సైతం పటిష్టంగా లేకపోవడం సైబర్ నేరగాళ్లకు కలిసి వచ్చింది. ఈ కేసు నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు కొన్ని కీలక హెచ్చరికలు చేస్తున్నారు. ఆండ్రాయిడ్, ఐఫోన్లలో కచ్చితంగా ఫౌండ్ మై డివైజ్ను యాక్టివేట్ చేసుకోవాలని కోరుతున్నారు. ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే సిమ్కార్డు బ్లాక్ చేయించుకోవాలని, పోలీసులతో పాటు బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. తన నెట్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలను నిలిపివేయాల్సిందిగా బ్యాంకును కోరాలని సూచిస్తున్నారు. సిటీ బస్సులో ఫోన్ పోగొట్టుకున్న కార్మికుడు దాన్ని చేజిక్కించుకుని యూపీఐ యాప్స్ ఇన్స్టాల్ వీటితో రూ.2.98 లక్షలు కాజేసిన ఈ–కేటుగాళ్లు -
యాప్రాల్లో దాడికి కుట్ర
మొయినాబాద్: చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్పై దాడి చేసి, కస్టడీలో ఉన్న వీర రాఘవరెడ్డి విచారణ ముగిసింది. దాడికి సంబంధించిన కీలక విషయాలను పోలీసులు ఆయననుంచి రాబట్టే ప్రయత్నం చేశారు. 14 రోజుల జుడీషియల్ రిమాండ్లో ఉన్న నిందితుడిని కోర్టు అనుమతితో పోలీసులు మూడు రోజుల కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. విచారణ చివరిరోజైన గురువారం ఉదయం మొయినాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి వీర రాఘవరెడ్డిని నగరంలోని యాప్రాల్కు తీసుకెళ్లారు. రంగరాజన్పై దాడికి ముందు రెండు రోజులపాటు రామరాజ్యం సైన్యంతో యాప్రాల్లోని ఓ ఇంట్లో వీర రాఘవరెడ్డి సమావేశం నిర్వహించాడు. అక్కడే దాడికి కుట్ర జరిగిందనే విషయాలను నిందితుడి నుంచి రాబట్టారు. రెండు రోజుల సమావేశంలో ఏయే అంశాలపై చర్చ జరిగింది? అనే విషయాన్ని పోలీసులు ఆరా తీశారు. రామరాజ్య స్థాపనలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకోసం పనిచేయాలని.. అందుకు సహకరించనివారి అడ్డు తొలగించుకోవాలని వీరరాఘవరెడ్డి సైన్యంతో ప్రతిజ్ఞ చేయించినట్లు సమాచారం. అక్కడి నుంచి నిందితుడిని మణికొండలోని తన నివాసానికి తీసుకెళ్లి పరిశీలించారు. ఇంట్లో పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. అనంతరం రాజేంద్రనగర్ డీసీపీ కార్యాలయానికి తలరించారు. డీసీపీ శ్రీనివాస్, వీర రాఘవరెడ్డిని పలు ప్రశ్నలు అడిగి కీలక విషయాలను రాబట్టారు. చిలుకూరు బాలాజీ దేవాలయానికి వచ్చి రంగరాజన్పై దాడి చేయడానికి ముందు ఏం జరిగిందనే విషయాలను తెలుసుకున్నారు. మూడు రోజుల విచారణలో రాబట్టిన కీలక విషయాలతో నివేదిక రూపొందించారు. గురువారం కస్టడీ ముగిసిన నేపథ్యంలో శుక్రవారం అతన్ని కోర్టులో హాజరుపర్చనున్నారు. ఇందుకు సంబంధించిన నివేదికను సైతం శుక్రవారం కోర్టులో సమర్పించనున్నారు. దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ కోసం పనిచేయాలని ప్రతిజ్ఞ రామరాజ్య స్థాపనకు సహకరించని వారిని అడ్డు తొలగించాలని దిశానిర్దేశం పోలీసుల విచారణలో వెల్లడించిన వీర రాఘవరెడ్డి? ముగిసిన మూడు రోజుల కస్టడీ నేడు కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు -
తుంగభద్ర నదిలో గల్లంతైన వైద్యురాలి మృతి
సుభాష్నగర్: విహార యాత్రకు వెళ్లి తుంగభద్ర నదిలో గల్లంతైన నగర వైద్యురాలు మైనంపల్లి అనన్యరావు(27) మృతి చెందింది. గురువారం అక్కడి యంత్రాంగం మృతదేహాన్ని వెలికి తీసింది. దూలపల్లిలోని అశోక ఎలా మైసన్–2కు చెందిన డాక్టర్ మోహన్రావు, రజిత దంపతుల కుమార్తె అనన్య రావు గుండ్లపోచంపల్లిలోని వీకేసీ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తోంది. తన స్నేహితులు సాత్విన్, హషితలతో కలిసి కర్నాటకలోని హంపీకి విహార యాత్రకు వెళ్లింది. ఈ నెల 19న సుమారు 25 అడుగుల ఎత్తుగల బండరాయి నుంచి తుంగభద్ర నదిలో ఈత కొట్టాలనుకుంది. నదికి మరోవైపు నుంచి స్నేహితులు సరదాగా వీడియో తీస్తున్నారు. అంతెత్తు నుంచి దూకిన అనన్య కొన్ని క్షణాల పాటు ఈత కొట్టి నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. వెంటనే స్నేహితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బుధవారం రాత్రి వరకు గాలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులతో కలిసి మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు అక్కడకి చేరుకున్నారు. మరునాడు గురువారం సాయంత్రం మృతదేహం లభ్యమైంది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అధికారులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం పోస్ట్మార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని నగరానికి తీసుకురానున్నారు. పోస్టుమార్టం అనంతరం నేడు నగరానికి మృతదేహం -
స్టూడెంట్ వీసాపై వచ్చి డ్రగ్స్ దందా
గచ్చిబౌలి: కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్గా మారిన ఓ యువతిని అదుపులోకి తీసుకున్న యాంటీ నార్కొటిక్ బ్యూరో(టీన్యాబ్), మియాపూర్ పోలీసులు ఆమె నుంచి 60 గ్రాముల సింథటిక్ ఎండీఎంఏ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు శతాబ్ధి మన్నా(24) అరెస్ట్ చేశామని, మరో అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ వారెన్ కొకరంగో పరారీలో ఉన్నాడు. గురువారం మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ డాక్టర్ వినీత్ వివరాలు వెల్లడించారు. డ్రగ్ పెడ్లర్ శతాబ్ధి మన్నా బుధవారం సాయంత్రం మియాపూర్ బస్స్టాప్లో ఉన్నట్లు సమాచారం అందడంతో దాడి చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని రూ.6 లక్షల విలువైన సింథటిక్ ఎండీఎంఏ డ్రగ్, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. జార్కండ్ రాష్ట్రం, జంషెడ్పూర్కు చెందిన మన్నా బెంగళూర్లో బీబీఏ పూర్తి చేసింది. అక్కడే ఆమెకు స్టూడెంట్ వీసాపై వచ్చిన ఆఫ్రికాకు చెందిన వారెన్ కొకరంగోతో పరిచయం ఏర్పడింది. బెంగళూరులోనే ఉంటూ వర్క్ ఫ్రం హోం విధులు నిర్వహిస్తున్న శతాబ్ధి మన్నా తన గదిలోనే డ్రగ్స్ నిల్వ ఉంచి డ్రగ్ పెడ్లర్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ క్రమంలో పక్కా సమాచారంతో డ్రగ్స్ అందజేసేందుకు వచ్చిన మన్నాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు., ఏదైనా పార్టీ లేదా పెడ్లర్లకు విక్రయించేందుకు ఆమె హైదరాబాద్కు వచ్చి ఉండవచ్చునన్నారు. మన్నా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసే సబ్ పెడ్లర్ను గుర్తించామని, మరి కొందరిని గుర్తించాల్సి ఉందన్నారు. వీరు గోవా, బెంగళూర్, రాజస్తాన్, ముంబై నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు సమాచారం ఉందని ఈ డ్రగ్ చైన్ను త్వరలోనే చేధిస్తామన్నారు. మరో నిందితుడు వారెన్ కొకరంగోకు అంతర్జాతీయ డ్రగ్ నెట్వర్క్లో ఉన్నాడని, పరారీలో ఉన్న అతడిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. డ్రగ్ పెడ్లర్లు జార్కండ్లో పేదరికంలో ఉన్న విద్యార్థులకు డబ్బు ఆశ చూపి ఈ దందాలోకి దించుతున్నట్లు తాము గుర్తించామన్నారు. టీ న్యాబ్ ఎస్పీ సాయి చైతన్య మాట్లాడుతూ డ్రగ్ ఫ్రీ తెలంగాణకు ప్రజలు సహకరించాలన్నారు. గత అక్టోబర్లో అబిడ్స్, అఫ్జల్గంజ్, చౌటుప్పల్ పీఎస్ల పరిధిలో రాజస్తాన్ గ్యాంగ్ నుంచి 350 గ్రాముల ఎండీఎంఏ, డిసెంబర్ 25న ఫిల్మ్నగర్ పీఎస్ పరిధిలో 17.38 గ్రాముల ఎండీఎంఏ, పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో ఫిబ్రవరి 11న ఇద్దరు రాజస్తాన్ పెడ్లర్ల నుంచి 40 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసున్నట్లు తెలిపారు. విద్యార్థులు, యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని సూచించారు. సమావేశంలో మాదాపూర్ ఏడీసీపీ జయరాం, టి న్యాబ్ డీఎస్పీ హరిచంద్రారెడ్డి, మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు విజయభాస్కర్ రెడ్డి, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. మియాపూర్లో 60 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం బెంగళూర్కు చెందిన కార్పొరేట్ ఉద్యోగిని శతాబ్ధి మన్నా అరెస్ట్ అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ వారెన్ కొకరంగో పరారీ -
పీఎం కిసాన్ పేరుతో ఏపీకే ఫైల్
సాక్షి, సిటీబ్యూరో: పీఎం కిసాన్ దరఖాస్తు పేరుతో సైబర్ నేరగాళ్లు పంపిన ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ (ఏపీకే) ఫైల్ను ఇన్స్టాల్ చేసుకున్న బాలానగర్ వాసి రూ.1.97 లక్షలు కోల్పోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలానగర్లోని గీతానగర్కు చెందిన మల్లికార్జున్ ప్రైవేట్ ఉద్యోగి. తన స్వగ్రామానికి చెందిన వారితో కూడిన వాట్సాప్ గ్రూపులో సభ్యుడిగా ఉన్నారు. ఇటీవల ఆ గ్రూపులో పీఎం కిసాన్ పథకం దరఖాస్తు పేరుతో ఓ లింక్ వచ్చింది. దానిని క్లిక్ చేయడంతో ఓ ఏపీకే ఫైల్ మల్లికార్జున్ ఫోన్లో ఇన్స్టాల్ అయింది. సైబర్ నేరగాళ్లు ఈ ఫైల్స్లో మాల్వేర్ను నిక్షిప్తం చేసి పంపిస్తారు. ఇది ఒకసారి ఇన్స్టాల్ అయిన తర్వాత ఫోన్ మొత్తం నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోతుంది. ఫోన్ ద్వారా జరిగే లావాదేవీలతో పాటు వచ్చే ఎస్సెమ్మెస్లు సైతం వారికి చేరిపోతుంటాయి. మల్లికార్జున్ ఫోన్ను తమ ఆధీనంలోకి తీసుకున్న సైబర్ నేరగాళ్లు దాని ద్వారా ఆర్థిక లావాదేవీలు చేస్తూ, ఓటీపీలను వినియోగించి రూ.1.97 లక్షలు కాజేశారు. ఎట్టకేలకు జరిగిన మోసాన్ని గుర్తించిన బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీన్ని అధికారులు సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నారు. గత ఏడాది రాష్ట్రంలో నాలుగు వేలకు పైగా ఏపీకే ఫ్రాడ్స్కు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. ఈ ఫైల్స్ను సైబర్ నేరగాళ్లు లింకులు, సందేశాలు సహా వివిధ రూపాల్లో పంపిస్తారని, వీటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. ● తెలియక డౌన్లోడ్ చేసుకున్న బాధితుడు ● రూ.1.97 లక్షలు స్వాహా చేసిన నేరగాళ్లు -
స్క్రాప్ మాటున గంజాయి అక్రమ రవాణా
నాగోలు: ఎవరికీ అనుమానం రాకుండా కంటైనర్లో స్క్రాప్ మెటీరియల్ మధ్య గంజాయి దాచి అరకు నుంచి మహారాష్ట్రకు అక్రమ రవాణా చేస్తున్న కంటైనర్ డ్రైవర్ను అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు, ఎస్ఓటీ మహేశ్వరం జోన్ పోలీసులు గురువారం అరెస్టు చేసిన అతడి నుంచి 300 కిలోల గంజాయి, కంటైనర్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గురువారం ఎల్బీనగర్లోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాచకొండ సీపీ సుధీర్బాబు వివరాలు వెల్లడించారు..మహారాష్ట్ర, పూణె, రూపినగర్కు చెందిన అహ్మద్ గులాబ్ షేక్ డీసీఎం డ్రైవర్గా పని చేసేవాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అతను సులువుగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి అదే ప్రాంతానికి చెందిన వైభవ్, దేవాతో పరిచయం ఏర్పడింది. మాదకద్రవ్యాల దందా నిర్వహించే వారు తమ వద్ద డ్రైవర్గా పని చేయాలని అహ్మద్ గులాబ్ షేక్కు సూచించారు. ఏపీలోని విశాఖపట్నం నుంచి పూణె, మహారాష్ట్ర, తదితర ప్రాంతాలకు గంజాయి తరలిస్తే ఒక్కో లోడ్కు రూ. 3 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకు అంగీకరించిన అతను గతంలో విశాఖపట్నం నుంచి పూణేకు రెండు లోడ్ల గంజాయిని విజయవంతంగా డెలివరీ చేసి వైభవ్కు అప్పగించాడు. దానిని వైభవ్, దేవా పూణెలోని తమ ఏజెంట్లకు సరఫరా చేశారు. వైభవ్, దేవా సూచన మేరకు నిందితు డు అమ్మద్ గులాబ్ షేక్ ఇటీవల విశాఖపట్నం వెళ్లి బుజ్జిబాబు అనే వ్యక్తి నుంచి 300 కిలోల గంజాయి (138) ప్యాకెట్లు) సేకరించాడు. తనిఖీల సమయంలో పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు కంటైనర్లో ప్లాస్టిక్ స్క్రాప్లోడ్ చేసి దాని కింద గంజాయి దాచి హైదరాబాద్ మీదుగా పూణెకు తరలిస్తున్నాడు. దీనిపై సమాచారం అందడంతో ఎస్ఓటీ మహేశ్వరం జోన్ పోలీసులు, అబ్దుల్లాపూర్మెంట్ పోలీసులు గురువారం మధ్యాహ్నం రామోజీ ఫీల్మ్ సిటీ సమీపంలో కంటైనర్ను ఆపి సోదా చేయగా గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతడి నుంచి గంజాయి, టాటా కంటైనర్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.1.05 కోట్లు ఉండవచ్చునని సీపీ పేర్కొన్నారు. ఈ కేసులో మిగిలిన నిందితులను పట్టుకునేందుకు ఎస్ఓటీ, అబ్దుల్లాపూర్మెట్ పోలీసులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఎల్బీనగర్, మహేశ్వరం అదనపు డీసీపీ ఎండీ షకీర్ హుస్సేన్, అబ్దుల్లాపూర్మెట్ సీఐ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అరకు నుంచి పూణెకు తరలింపు 300 కేజీల గంజాయి స్వాధీనం కంటైనర్ డ్రైవర్ అరెస్ట్ -
చుక్కలు చూపిస్తున్న మెట్రో రైళ్లు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో తరచూ స్తంభిస్తున్న మెట్రో రైళ్లు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకవైపు ప్రయాణికుల డిమాండ్ మేరకు కోచ్లు అందుబాటులో లేకపోవడంతో కిక్కిరిసిపోతున్నాయి. అదే సమయంలో ఉన్నపళంగా నిలిచిపోతున్న సర్వీసులతో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఐటీ ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన వారు గంటల తరబడి పడిగాపులు కాయాల్సివస్తోంది. కొద్దిరోజుల క్రితం నాగోల్– అమీర్పేట్ మార్గంలో సాంకేతిక కారణాలతో సర్వీసులు నిలిచిపోయాయి. ఉదయం 7.30 గంటల నుంచి సుమారు గంట పాటు రైళ్ల నిర్వహణకు ఆటంకాలు తలెత్తడంతో ప్రయాణికులంతా ఎక్కడిక్కడ మెట్రో స్టేషన్లలోనే పడిగాపులు కాశారు. ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. సామాజిక మాధ్యమాల్లో ఆందోళన వ్యక్తమైంది. గతేడాది నవంబర్ 4న సైతం మియాపూర్–ఎల్బీనగర్ రూట్లో అసెంబ్లీ సమీపంలో మెట్రో రైలు ఆగిపోయింది. దీంతో ఆ రూట్లో సర్వీసులను నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. ఇలా తరచూ మెట్రో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడటం పట్ల నగరంలోని వివిధ ప్రాంతాల ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ముందస్తు సమాచారం లేదు..సాధారణంగా సాంకేతికంగా తలెత్తే సమస్యలతో సిగ్నలింగ్ సేవలకు ఆటంకం కలుగుతుంది. అధికారులు ఆ సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు అరగంట నుంచి గంట వరకు సమయం పట్టవచ్చు. ఈ క్రమంలో మెట్రో రాకపోకల్లో తలెత్తిన అంతరాయంపై ప్రయాణికులకు ముందస్తుగా ఎలాంటి సమాచారం లభించడం లేదు. ఒకవైపు అప్పటికే టికెట్లు తీసుకున్న వాళ్లు మెట్రో కోసం ఎదురు చూస్తుంటారు. మరోవైపు యథావిధిగా టికెట్ విక్రయాలు కొనసాగుతూనే ఉంటాయి. దీంతో ఒక ట్రైన్కు సరిపడా ప్రయాణికులు ఎదురుచూస్తుండగా.. అంతకు రెట్టింపు సంఖ్యలో టికెట్లు ఇవ్వడం వల్ల రద్దీ అనూహ్యంగా పెరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని సర్వీసులకు అంతరాయం ఏర్పడినట్లు మెట్రోస్టేషన్లలో అనౌన్స్మెంట్ ఇవ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలకు అవకాశం లభిస్తుందని పేర్కొంటున్నారు. అధికారులు ఈ మేరకు ఎలాంటి అనౌన్స్మెంట్ చర్యలు చేపట్టకపోవడం వల్ల ప్రయాణికులకు పడిగాపులు తప్పడం లేదు.కోచ్ల కొరత.. తంటాలుసాంకేతిక సమస్యలతో పాటు కోచ్ల కొరత కూడా నగరంలో మెట్రో ప్రయాణానికి సవాల్గా మారింది. ప్రస్తుతం నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్ కారిడార్లలో ప్రతి రోజు సుమారు 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. రోజురోజుజూ మెట్రోల్లో రద్దీ పెరుగుతూనే ఉంది. ఒక ట్రైన్ బయలుదేరే సమయానికి మరో రెండు ట్రైన్లకు సరిపడా ప్రయాణికులు టికెట్లు తీసుకొని ఎదురుచూస్తున్నారు. దీంతో ఉదయం, సాయంత్రం మెట్రోలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ మేరకు రైళ్లు పెంచాలనే ప్రతిపాదన ఉంది. నాగ్పూర్ నుంచి కొత్త కోచ్లను కొనుగోలు చేయనున్నట్లు ఇటీవల ఎల్అండ్టీ అధికారులు పేర్కొన్నారు. కానీ ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. -
ఒత్తిడే శత్రువు!
మరికొద్ది రోజుల్లో టెన్త్, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల సమయం సమీపిస్తున్నకొద్దీ.. విద్యార్థుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. పరీక్షల్లో తప్పుతామోనని.. కొంత మంది, తల్లిదండ్రులు ఆశించిన దానికంటే తమకు తక్కువ మార్కులు వస్తాయోననే టెన్షన్తో మరికొంత మంది తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. బలహీన క్షణంలో ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారు. వార్షిక పరీక్షల వేళ.. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఏ ఒక్క రెసిడెన్షియల్ కాలేజీలోనూ కౌన్సిలర్ లేకపోవడం కూడా ఈ విపత్కర పరిణామాలకు మరో కారణం. అధ్యాపకులే కాదు తల్లిదండ్రులు కూడా విద్యార్థుల మానసిక స్థితిపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. బలవంతపు బోధన, అభ్యాసన కంటే.. ఇష్టంతో చదివేలా విద్యార్థులను మానసికంగా సంసిద్ధులను చేసినప్పుడు మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరోర్యాంకులు, గ్రేడ్లు రద్దు చేశాంవిద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వం ఇప్పటికే టెన్త్లో ర్యాంకులు, గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసింది. ప్రభుత్వ స్కూళ్లలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారిలో మానసిక స్థైర్యాన్ని నింపి, మానసికంగా పరీక్షలకు సంసిద్ధులను చేస్తున్నాం. అర్థం కాని పాఠ్యాంశాలను మళ్లీ వివరించే ప్రయత్నం చేస్తున్నాం. వార్షిక పరీక్షలపై వారిలో ఉన్న భయాన్ని పూర్తిగా పోగొట్టే ప్రయత్నం చేస్తున్నాం. మోడల్ పేపర్లను తయారు చేసి, పరీక్షలు రాయిస్తున్నాం.– సుశీందర్రావు, డీఈఓ, రంగారెడిప్రేమతో చెప్పాలిపిల్లల ఆత్మహత్యలకు కాలేజీ యాజమాన్యాలది ఎంత బాధ్యత ఉంటుందో? తల్లిదండ్రులది అంతే బాధ్యత ఉంటుంది. పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకోకుండా వారికి ఇష్టం లేని కోర్సులు, కాలేజీల్లో బలవంతంగా చేర్పిస్తుంటారు. ఈ సమయంలో కనీసం కౌన్సెలింగ్ కూడా ఇవ్వడం లేదు. ఒత్తిడికి గురై, ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్నకొద్దీ.. వారిలో ఆందోళన, భయం ఎక్కువై.. ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు వారితో ప్రేమగా వ్యవహరించాలి. మానసిక స్థైర్యం చెప్పాలే గాని.. వారిని తోటి పిల్లలు, బంధువుల ముందు తిట్టకూడదు.– డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, మానసిక నిపుణుడ్డు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరంఅత్యధిక మార్కులు సాధించాలనే ఉద్దేశంతో చాలా మంది పిల్లలు నిద్రాహారాలు మాని చదువుతుంటారు. అదేపనిగా చదవడం వల్ల తలనొప్పి, మానసిక సంఘర్షణ, కంటిచూపు సమస్య వస్తుంది. తీరా పరీక్షలు మొదలయ్యే నాటకి అనారోగ్యం పాల వుతుంటారు. ఈ సమయంలో పరీక్ష సరిగా రాయలేక..ఫెయిలవుతుంటారు. పిల్లల ఆరోగ్యపై తల్లిదండ్రులు శ్రద్ద చూపించాలి. వేళకు నిద్రపుచ్చడం, వేళకు నిద్రలేపి ఓ ప్రణాళిక ప్రకారం చదివించడం చేయాలి. తేలికగా జీర్ణం అయ్యే అప్పుడే వండివార్చిన తాజా ఆహారం అందించాలి.– డాక్టర్ వెంకటి, డీఎంహెచ్ఓ, హైదరాబాద్మచ్చుకు కొన్ని ఇటీవలి ఉదంతాలు..● ప్రిన్సిపాల్ తిట్టాడనే కారణంతో షాద్నగర్లోని శాస్త్ర పాఠశాల భవనంపై నుంచి దూకి 10వ తరగతి విద్యార్థి నీరజ్ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.● పరీక్షలో ఫెయిల్ అవుతాననే భయంతో మైసమ్మగూడ మల్లారెడ్డి మహిళా ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని కళాశాల నాలుగో అంతస్తు కిటికీ నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు యత్నించగా తోటి విద్యార్థులు గమనించి అడ్డుకున్నారు.● కుంట్లూరులోని తెలంగాణ గిరిజన రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న నాగర్కర్నూలుకు చెందిన సౌమ్య (17) ఇటీవల తరగతి గదిలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.● చదువు ఒత్తిడి తట్టుకోలేక హైదర్నగర్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న షాద్నగర్కు చెందిన విద్యార్థి కౌశిక్ రాఘవ (17) హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.● పరీక్ష సరిగా రాయలేదనే కారణంతో జీడిమెట్ల పీఎస్ పరిధిలో ఇటీవల పదో తరగతి విద్యార్థిని త్రిష ఆత్మహత్యకు పాల్పడింది. -
మురుగు శుద్ధి దిశగా జలమండలి అడుగులు
సాక్షి, సిటీబ్యూరో: వందశాతం మురుగు శుద్ధి దిశగా జలమండలి అడుగులేస్తోంది. మహా నగరంలో రోజువారీగా ఉత్పన్నమయ్యే మురుగు నీటిని పూర్తి స్థాయిలో శుద్ధి చేసేందుకు మూడేళ్ల క్రితం చేపట్టిన మురుగు శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) ప్రాజెక్టు పూర్తి కావస్తోంది. ఇప్పటికే సుమారు 663 ఎంఎల్డీల సామర్థ్యం గల 11 ఎస్టీపీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరో 443 ఎంఎల్డీ సామర్థ్యం గల తొమ్మిది ఎస్టీపీల నిర్మాణాలు తుది దశకు చేరుకుంటున్నాయి. మరోవైపు అమృత్ పథకంక కింద 972 ఎంఎల్డీ సామర్థ్యమున్న 39 ఎస్టీపీల నిర్మాణాలకు టెండర్లను ఆహ్వానించింది.1,650 ఎంఎల్డీల మురుగు ఉత్పన్నం..గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజువారీగా సుమారు 1,650 మురుగు నీరు ఉత్పన్నమవుతోందని అంచనా. అందులో సుమారు 772 ఎంఎల్డీల మురుగు నీటిని ఇప్పటికే 25 ఎస్టీపీల ద్వారా శుద్ధి చేస్తోంది. ఉత్పన్నమవుతున్న నీటిలో 46 శాతం శుద్ధి జరుగుతుండటంతో మిగిలిన 54 శాతం సైతం మురుగు నీటిని శుభ్రం చేయడానికి కొత్త ఎస్టీపీల నిర్మాణాలకు నడుం కట్టింది.31 నుంచి 20కి కుదింపుమూడేళ్ల క్రితం చేపట్టిన ఎస్టీపీల ప్రాజెక్టును మొత్తం మూడు ప్యాకేజీలుగా విభజించి రూ.3866.41 కోట్ల అంచనా వ్యయంతో 1259.50 ఎంఎల్డీల సామర్థ్యం గల 31 కొత్త మురుగు నీటి శుద్ధి కేంద్రాలకు ప్రణాళిక రూపొందించి కార్యాచరణకు దిగింది. స్థల సేకరణ వివాదాలు ఇతరత్రా అభ్యంతరాలతో ఎస్టీపీల సంఖ్యను 20కి కుదించి ఎంఎల్డీల సామర్థ్యాన్ని మాత్రం తగ్గకుండా చర్యలు చేపట్టింది. అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీ వినియోగిస్తూ ఎస్టీపీల నిర్మాణాలు చేపట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్యాకేజీ –1 కింద అల్వాల్, మల్కాజిగిరి, కాప్రా, ఉప్పల్, ప్యాకేజీ–2 కింద రాజేంద్రనగర్, ఎల్బీ నగర్ ప్యాకేజీ–3 కింద కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి సర్కిల్ ప్రాంతాల్లో ఎస్టీపీ నిర్మాణాలు చేపట్టగా.. ఇప్పటికే వీటిలో సగం అందుబాటులోకి వచ్చాయి. మిగతావి తుది దశలో ఉన్నట్లు జలమండలి వర్గాలు చెబుతున్నాయి.హ్యామ్ మోడ్లో అమృత్ ఎస్టీపీలుకేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద మంజూరైన 39 ఎస్టీపీలు హ్యామ్ మోడ్లో నిర్మించేందుకు జలమండలి ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం అవి టెండర్ దశలో ఉన్నాయి. అందులో ఒక ఎస్టీపీ పీపీపీ మోడ్లో.. మిగతా 38 ఎస్టీపీలను హైబ్రిడ్ అన్నూయిటీ మోడల్ (హ్యామ్) విధానంలో నిర్మించనున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే.. 972 ఎంఎల్డీల మురుగును శుద్ధి చేయవచ్చు. వాటి నిర్మాణ పనులు రెండు ప్యాకేజీల్లో పూర్తి చేయనుంది.. ప్యాకేజీ–1లో 16 ఎస్టీపీలను, ప్యాకేజీ–2లో 22 ఎస్టీఛపీలు నిర్మిస్తారు. నిర్మాణ సంస్థ ఎస్టీపీలను నిర్మించి 15 ఏళ్ల పాటు నిర్వహణ చేపట్టాల్సి ఉంది. మొత్తం ఎస్టీపీల నిర్మాణ వ్యయం రూ.2,569.81 కోట్లు కాగా.. 15 ఏళ్ల పాటు నిర్వహణకు రూ.1,279.29 కోట్ల అంచనా వ్యయం కానుంది. ఎస్టీపీల ప్రాజెక్టుల నిర్మాణ వ్యయంలో కేంద్రం 30, రాష్ట్రం 30 నిర్మాణ సంస్థ 40 శాతం చొప్పున నిధులు సమకూర్చనున్నాయి.తుది దశలో ఉన్న ఎస్టీపీలుఎస్టీపీ ఎంఎల్డీ.. సామర్థ్యంపాలపిట్ట 7శివాలయనగర్ 14ముల్లకత్వ చెరువు 25నలగండ్ల 7అత్తాపూర్–1 64అంబర్పేట 212.5రెయిన్బో విస్తా 43.5రామ చెరువు 30అత్తాపూర్–2 40 -
రాచకొండలో ఆపరేషన్ స్మైల్
సాక్షి, సిటీబ్యూరో: హోటళ్లు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేస్తున్న 1,051 మంది బాల కార్మికులకు రాచకొండ పోలీసులు విముక్తి కలిగించారు. ఆపరేషన్ స్మైల్–11లో భాగంగా కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మానవ అక్రమ రవాణా, షీ టీమ్, స్పెషల్ బ్రాంచ్ విభాగాలతో పాటు ఒక సబ్ ఇన్స్పెక్టర్, నలుగురు కానిస్టేబుళ్లు (ఒక మహిళా కానిస్టేబుల్ కలిపి)లతో 9 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్ కొనసాగింది. విముక్తి కలిగించిన చిన్నారుల్లో మన రాష్ట్రానికి చెందిన బాలురు 512 మంది, బాలికలు 28 మంది ఉండగా.. ఇతర రాష్ట్రాలకు చెందిన బాలురు 473 మంది, బాలికలు 38 మంది ఉన్నారు. చిన్నారులను పనిలో పెట్టుకున్న 464 మంది యాజమానులపై ఎఫ్ఐఆర్లు, 410 మందిపై జీడీ ఎంట్రీ కేసులు నమోదు చేశారు. 1,051 మంది చిన్నారులకు విముక్తి -
ఇంట్లోకి చొరబడి..కత్తులతో పొడిచి..
చిలకలగూడ: ఓ ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు తల్లి కొడుకుపై కత్తులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం చిలకలగూడ ఠాణా పరిధిలోని మెట్టుగూడలో చోటుచేసుకుంది. . తల్లి అపస్మారకస్థితిలో ఉండగా, కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఎవరు, ఎందుకు దాడికి పాల్పడ్డారో తెలియరాలేదు. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మెట్టుగూడ నల్లపోచమ్మ ఆలయ సమీపంలో రేణుక, శేఖర్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమారులు యశ్వంత్, యశ్పాల్, వినయ్ ఉన్నారు. ఏజీ కార్యాలయంలో పనిచేసే శేఖర్ మూడేళ్ల క్రితం మృతిచెందాడు. రేణుక, తన ముగ్గురు కుమారులు, మంచానికే పరిమితమైన అత్త (శేఖర్ తల్లి) అనసూయ (70) కలిసి ఉంటున్నారు. మౌలాలీలోని ఓ రైల్వే కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్న యశ్వత్ గత మూడు నెలలుగా పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. యశ్పాల్, వినయ్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. గురువారం ఉదయం యశ్పాల్, వినయ్ డ్యూటీకి వెళ్లగా యశ్వంత్, తల్లి రేణుక ఇంట్లోనే ఉన్నారు. ఉదయం 11.30 గంటల సమయంలో ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు రేణుక, యశ్వంత్లపై కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసిన అనంతరం బయట తలుపులకు గడియపెట్టి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన వారి కేకలు విన్న స్థానికులు తలుపులు తెరిచి చూడగా ఇద్దరూ రక్తపు మడుగులో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. రేణుక కడుపుపై రెండు, యశ్వంత్ కడుపుపై మూడు కత్తిపోట్లు ఉన్నాయి. రేణుక అపస్మారకస్థితిలో ఉండగా, యశ్వంత్ పరిస్థితి విషమంగా ఉందని, వారికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారు. పథకం ప్రకారమే దాడి.. తాము ఇంట్లో లేని సమయం చూసి పథకం ప్రకారమే దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డారని రేణుక మూడో కుమారుడు వినయ్ తెలిపాడు. తమకు ఎవరితోనూ శతృత్వం లేదన్నాడు. ఎవరు ఎందుకు దాడి చేశారో తెలియడం లేదని, ఆరుగురు వ్యక్తులు దాడిలో పాల్గొన్నారని, నలుగురు ఇంట్లోకి చొరబడి దాడి చేయగా, ఇద్దరు బయటే ఉన్నట్లు తెలిపాడు. సవాల్గా తీసుకున్న పోలీసులు... హత్యాయత్నంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈస్ట్జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య, చిలకలగూడ ఏసీపీ జైపాల్రెడ్డి, చిలకలగూడ ఇన్స్పెక్టర్ అనుదీప్, డీఐ రమేష్గౌడ్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్టీం, డాగ్స్వాడ్ ఆధారాలు సేకరించారు. రక్తపు మరకలతో ఉన్న పదునైన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనలో దుండగులను ప్రత్యక్షంగా చూసిన వారు లేకపోవడం గమనార్హం. బాధితులు నోరు విప్పితేనే... గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు కోలుకుని నోరువిప్పితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఈస్ట్జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య, చిలకలగూడ ఏసీపీ జైపాల్రెడ్డి తెలిపారు. దుండగులను కేవలం బాధితులు మాత్రమే చూశాన్నారు. అన్ని కోణాల్లోను దర్యాప్తు చేపట్టామని, త్వరలోనే మిస్టరీని చేధిస్తామన్నారు. తల్లీకుమారుడిపై హత్యాయత్నం తీవ్రగాయాలతో గాంధీలో చికిత్స కుమారుడు యశ్వంత్ పరిస్థితి విషమం అపస్మారకస్థితిలో తల్లి రేణుక ఎవరు, ఎందుకు దాడి చేశారో తెలియని వైనం బాధితులు కోలుకుని నోరు విప్పితేనే వాస్తవాలు వెలుగులోకి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆధారాల సేకరణ -
రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన
సాక్షి, సిటీబ్యూరో: జాతీయ రహదారి భద్రతా మాసం–2025 నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కమిషనరేట్ పరిసర ప్రాంతాల్లో గురువారం 1494 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. లా అండ్ ఆర్డర్ విభాగం 708, ట్రాఫిక్ విభాగం 378, ట్రాఫిక్ ట్రయినింగ్ ఇనిస్టిట్యూట్ (టీటీఐ) 408 అవగాహన సెషన్లు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు కమిషనర్ జీ సుధీర్ బాబు తెలిపారు. డ్రైవర్లు, పాదచారులు, విద్యార్థులు, ఆర్టీసీ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, ఆటోడ్రైవర్లను అవగాహన కార్యక్రమాల్లో భాగస్వాములను చేశారు. రోడ్డు భద్రతా నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వివిధ విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. -
అంతర్రాష్ట్ర గంజాయి పెడ్లర్ అరెస్ట్
సికింద్రాబాద్: ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న పెడ్లర్ను జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం జీఆర్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం, గజపతి జిల్లాకు చెందిన అబల్(23)వ్యవసాయ కూలీగా పని చేసేవాడు. సులువుగా డబ్బులు సంపాదించాలని భావించిన అతను కొద్ది రోజుల క్రితం అడవ పట్టణానికి వెళ్లి రైనో అనే వ్యక్తిని కలిశాడు. మహారాష్ట్రలో గంజాయికి చాలా డిమాండ్ ఉందని, తనకు 8 కిలోల గంజాయి కావాలని చెప్పిన రైనో పూణేకు గంజాయి తరలిస్తే ప్యాకెట్కు రూ. 1000 ఇస్తానని చెప్పడంతో అబల్ అందుకు అంగీకరించారు. దీంతో అతను మాసియా అనే వ్యక్తి నుంచి కిలో రూ. 800 చొప్పున గంజాయి కొనుగోలు చేసి అబల్కు అప్పగించాడు. ఈ నెల 4న అతను గంజాయి ప్యాకెట్లతో ఇచ్చాపురం నుంచి కోణార్క్ ఎక్స్ప్రెస్లో బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానస్పదంగా కనిపించిన అబల్ బ్యాగ్ను సోదా చేయగా రూ.1.96 లక్షల విలువైన 7.8 కిలోల గంజాయిని గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎస్ఐ మాజీద్, హెచ్సీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.7.84 కిలోల గంజాయి స్వాధీనం -
బండిలో బాటిల్స్
గచ్చిబౌలి: రోడ్డుపై వ్యాపారం చేస్తున్న ఓ మహిళకు చెందిన తోపుడు బండిలో 92 విస్కీ క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్న సంఘటన గురువారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జేవీజీహిల్స్లో ఫుట్పాత్పై ఉన్న డబ్బాలో మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు స్థానికులు శేరిలింగంపల్లి సర్కిల్ ఉప వైద్యాధికారి శ్రీకాంత్కు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి వెళ్లిన ఆయన తనిఖీలు చేయగా 10 క్వార్టర్ బాటిల్స్ లభించాయి. వాటిని ధ్వంసం చేసి డబ్బాను తొలగించారు. రాజరాజేశ్వరీ కాలనీలోనూ ఇదే తరహాలో ఉదయం నుంచి మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో అక్కడికి వెళ్లిన ఆయన సోదా చేయగా, తోపుడు బండిలో ఏకంగా వివిధ కంపెనీలకు చెందిన 92 క్వార్టర్ బాటిళ్లు గుర్తించి నివ్వెరపోయారు. అంతే కాకుండా పక్కనే ఉన్న గుడిసెలో పలువురు మద్యం సేవిస్తున్నట్లు గుర్తించి డయల్ 100, గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. మద్యం విక్రయిస్తున్న మహిళతో పాటు మద్యం బాటిళ్లను పోలీసులకు అప్పగించారు. బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న మహిళపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ తెలిపారు. గత కొన్ని నెలలుగా ఉదయం 6 గంటల నుంచే మద్యం అమ్మకాలు జరుగుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు పేర్కొన్నారు. తోపుడు బండిలో 92 విస్కీ క్వార్టర్ బాటిల్స్ ● కంగుతిన్న జీహెచ్సీ అధికారులు ● గచ్చిబౌలి పోలీసులకు అప్పగింత -
డ్రగ్స్ విక్రేతల అరెస్ట్
23 గ్రాముల కొకై న్, కారు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం మాదాపూర్: మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంఘటన మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఇజ్జత్నగర్లోని అలేఖ్యహోమ్స్లో ఉంటున్న చంద్రపు ప్రసన్నకుమార్ రెడ్డి ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. అతడికి బెంగళూరుకు చెందిన డ్రగ్స్ విక్రేత కెవిన్తో పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతను గురువారం ప్రసన్నకుమార్ రెడ్డికి డ్రగ్స్ అందజేసేందుకు మాదాపూర్లోని హైటెక్స్ మెటల్ చార్మినార్ వద్దకు వచ్చాడు. దీనిపై సమాచారం అందడంతో దాడి చేసిన మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 23 గ్రాముల కొకై న్ స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పాల్వంచకు చెందిన జూపల్లి విశ్వామిత్ర, మణికొండకు చెందిన శ్రీనివాస సాయిదీపక్, సికింద్రాబాద్కు చెందిన వరుణ్గౌడ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. కాగా కెవిన్ బెంగళూరులో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నాడని, ప్రస్తుతం హైదరాబాద్లో మొదలు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి మాదకద్రవ్యాలతో పాటు, కారు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న యువకుడి అరెస్ట్ మాదాపూర్: డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంఘటన మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మాదాపూర్లోని జేఎంజే కోలివింగ్ పీజీ హాస్టల్లో ఉంటున్న గుత్తాతేజ కృష్ణ ఆర్కిటెక్గా పనిచేస్తున్నారు. గురువారం అతను అయ్యప్ప సొసైటీ వద్ద బెంగళూరుకు చెందిన శాండీ అనే యువతి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు గుత్తా తేజకృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. డ్రగ్స్ విక్రేత శాండి పరారీలో ఉన్నట్లు తెలిపారు. పోలీసులు తేజ నుంచి 11.14 గ్రాముల ఎండీఎంతో పాటు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
ఇద్దరు సైబర్ నేరగాళ్లకు ఆరు నెలల జైలు
సాక్షి, సిటీబ్యూరో: ఓ మహిళ డీమ్యాట్ ఖాతాలోని షేర్లను తమ ఖాతాల్లోకి మార్చుకుని మోసం చేసిన ఇద్దరు సైబర్ నేరగాళ్లపై నేరం నిరూపణ అయింది. వీరికి న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష, రూ.10 వేల చొప్పున జరిమానా విఽధించినట్లు డీసీపీ దార కవిత గురువారం వెల్లడించారు. నగరానికి చెందిన ఓ మహిళకు డీ మ్యాట్ ఖాతాతో పాటు వివిధ కంపెనీల షేర్లు ఉన్నాయి. 2014లో ఆమెకు వారాసిగూడకు చెందని ఏఎల్ దీపక్ పరిచయం ఏర్పడింది. ఆమె తండ్రి పేరుతో ఉన్న షేర్లను ఆమె ఖాతాలోకి బదిలీ చేయిస్తానంటూ నమ్మబలికాడు. ఆమెతో ఆదిత్య బిర్లా మనీ లిమిటెడ్ సంస్థలో ట్రేడింగ్ ఖాతా తెరిపించారు. బాధితురాలికి తెలియకుండా ఆమె పేరుతో ఈ–మెయిల్ ఐడీ సృష్టించాడు. దీని ఆధారంగా ఆమె డీమ్యాట్ ఖాతాలో ఉన్న షేర్లను కాజేసి, విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. 2018లో ఈ విషయాన్ని గుర్తించిన బాధితురాలు నగర సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ దందాలో దీపక్కు తార్నాక వాసి ఆర్ శ్రవణ్కుమార్ సహకరించినట్లు తేలింది. దీంతో అధికారులు వారిని అరెస్టు చేసి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం ఇరువురు నిందితులను దోషులుగా తేల్చింది. ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. స్నేహితుడి భార్యను నిండా ముంచాడు... తన స్నేహితుడి భార్యను టార్గెట్గా చేసుకున్న ఓ కేటుగాడు మరో వ్యక్తితో కలిసి రూ.8.13 లక్షలు కాజేశాడు. దీనికోసం సోలార్ ప్రాజెక్ట్ కోసం 100 శాతం రణం ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. బాధితురాలి ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుజరాత్ రాష్ట్ర ఆర్థిక శాఖలోని ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాంలో (పీఎంఈజీపీ) పని చేసి, కన్నుమూసిన అధికారి భార్య నగరంలో స్థిరపడ్డారు. పదవీ విరమణ చేసిన ఆమె తన భర్త ఫోన్ నెంబర్నే వినియోగిస్తున్నారు. పీఎంఈజీపీలో అతడితో కలిసి పని చేసిన ఓ వ్యక్తి దీనిని ఆసరాగా చేసుకున్నాడు. కొన్నాళ్ల క్రితం ఆమెకు ఫోన్ చేసి మాట్లాడిన అతగాడు క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ (సీజీటీఎంఎస్ఈ) పథకం కింద సోలార్ ప్రాజెక్టులకు 100 శాతం రుణం ఇప్పిస్తానని చెప్పాడు. ఆమె ఆసక్తి చూపడంతో మరో వ్యక్తిని పరిచయం చేసిన అతగాడు దరఖాస్తు చేసుకునే విధానాన్ని వివరించడంతో పాటు సహకరిస్తాడని చెప్పాడు. ఆపై పత్రాల తయారీ, ఇతర ఖర్చుల పేరుతో కొంత, రిఫండబుల్ డిపాజిట్ అంటూ మరికొంత మొత్తం... ఇలా రూ.8.13 లక్షలు బదిలీ చేయించుకున్నారు. ఆపై రుణం మంజూరైందని, త్వరలోనే మీ ఖాతాలోకి వస్తుందని చెప్పారు. అయితే రోజులు గడుస్తున్నా తన ఖాతాలోకి నగదు రాకపోవడంతో తాను చెల్లించిన మొత్తం తిరిగి ఇవ్వాలని వారిని కోరింది. అయితే రుణం మంజూరుకు మరికొంత మొత్తం డిమాండ్ చేయడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.10 వేల చొప్పున జరిమానా -
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
సైదాబాద్: ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, కర్నేల్గంజ్కు చెందిన మహ్మద్ సాదాబ్, మహ్మద్ దిల్షాద్ (21) సోదరులు నగరానికి వలస వచ్చి సైదాబాద్ రెడ్డిబస్తీలో ఉంటూ టైలరింగ్ పని చేస్తున్నారు. దిల్షాద్ యూపీలోని తమ గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునే వారు. అయితే కొన్ని రోజులుగా వారు ఫోన్లో గొడవ పడుతున్నారు. మంగళవారం రాత్రి సాదాబ్ ఇంటికి తిరిగి వచ్చేసరికి దిల్షాద్ ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించాడు. అతడి సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దిల్షాద్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రేమ విఫలమై తన సోదరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని సాదాబ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి దారుణ హత్య చాంద్రాయణగుట్ట: క్షణికావేశంలో ముగ్గురు స్నేహితులు ఓ యువకుడిని కత్తులతో పొడిచి హత్య చేసిన సంఘటన గురువారం బండ్లగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బండ్లగూడ, ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన షేక్ షాబాజ్ (23) డీసీఎం డ్రైవర్, లేబర్గా పని చేసేవాడు. అదే ప్రాంతానికి చెందిన ఆజం, ఆయూబ్, అమీర్ అతడి స్నేహితులు. వీరు నలుగురు ఇందిరానగర్లోని శ్మశాన వాటికలో కూర్చుని మద్యం తాగేవారు. గురువారం మధ్యాహ్నం మద్యం సేవిస్తుండగా ఆజం, షాబాజ్ల మధ్య గొడవ జరిగింది. దీంతో షాజాబ్ ఆజమ్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని ఆజమ్ తన స్నేహితులు ఆయూబ్, అమీర్లకు చెప్పాడు. వీరు ముగ్గురు కలిసి మరోసారి మద్యం తాగి ఇందిరానగర్ శ్మశాన వాటిక నుంచి వెళుతుండగా చిన్న సందులో నుంచి షాబాజ్ వస్తూ కనిపించడంతో ఆజం తన వద్ద ఉన్న కత్తితో షాబాజ్పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన షాబాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కాంతిలాల్ పాటిల్, చాంద్రాయణగుట్ట ఏసీపీ కె.మనోజ్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బైకులు దగ్ధం మణికొండ: షాపు ఎదుట నిలిపిన ఎలక్ట్రిక్ బైక్లు దగ్ధమైన సంఘటన మణికొండ మున్సిపాలిటీ అలకాపూర్ టౌన్షిప్లో గురువారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అలకాపూర్ రోడ్డు నెంబర్ 23లో డామినోస్ పిజ్జా షాప్ కొనసాగుతుంది. అందులో నుంచి పిజ్జాలు సరఫరా చేసే స్కూటీలను బుధవారం రాత్రి ఎప్పటి లాగే షాప్ ఎదుట పార్క్ చేశారు. గురువారం తెల్లవారు జామున ఓ బైక్కు నిప్పంటుకోవడంతో పక్కనే ఉన్న మరో నాలుగు వాహనాలకు వ్యాపించాయి. దీనిని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే అవి కాలి బూడిదయ్యాయి. -
అక్కడికక్కడే వాహనాన్ని తిప్పేయడంతో...
సాధారణంగా సదరు ఎస్సైని తీసుకురావడానికి, దింపడానికి అధికారిక వాహనాన్ని డ్రైవర్ తీసుకువెళ్తుంటారు. ఆయన ఇంటి వద్దకు చేరుకున్న ప్రతిసారీ డ్రైవర్ కాస్తా ముందుకు వెళ్లి రోడ్డు డెడ్ ఎండ్ వద్ద రివర్స్ చేసుకుని మళ్లీ వచ్చిన దారిలోనే తిరిగి వెళ్లేవారు. అఫ్జల్గంజ్లో ఫైరింగ్ జరిగిన గత గురువారం రాత్రి కూడా ఇలానే చేసి ఉంటే... ట్రాలీల్లో ఉన్న డబ్బును బ్యాగుల్లోకి మారుస్తున్న దుండగులపై ఆ వాహనం లైట్లు పడేవి. దీంతో వారు అక్కడే చిక్కే అవకాశం ఉండేది. అయితే ఆ రోజు ఎస్సై కంగారులో ఉండటంతో తాను లోపలకు వెళ్లి ఆయుధం తెచ్చుకునే లోపే... వాహనం వెనక్కు తిప్పి ఉంచాల్సిందిగా డ్రైవర్ను ఆదేశించారు. దీంతో సదరు డ్రైవర్ అపార్ట్మెంట్ పక్కన ఉన్న చిన్న సందును ఆధారంగా చేసుకుని, అక్కడే రివర్స్ చేసి సిద్ధంగా ఉంచారు. ఈ కారణంగా ఆ సమీపంలోనే ఉన్న దుండగులపై వీరి దృష్టి పడలేదు. -
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్కు సర్వం సిద్ధం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ వేదికగా ఈ నెల 24 నుంచి 26 వరకు జరగనున్న ప్రతిష్టాత్మక ‘హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్’కు సర్వం సిద్ధమైంది. నగరంలోని టీ–హాబ్ (సత్వ నాలెడ్జ్ సిటీ)లో నిర్వహిస్తున్న ఈ సాహితీ పండుగకు భారత్తో పాటు విదేశాల నుంచి సాహితీ ప్రియులు, విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ ఫెస్టివల్లో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ప్లీనరీలు ఉంటాయని., మొదటి రోజు ప్లీనరీలో భాగంగా ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్తో ఆయన రాసిన 2024: ‘ది ఎలక్షన్ దట్ సర్ప్రైజ్ ఇండియా’ పుస్తకంపై సాహితీ ప్రముఖులు సునీతా రెడ్డి చర్చించనున్నారు. ఈ 15వ ఎడిషన్ ఫెస్టివల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణపై చర్చలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు, అంతరించిపోతున్న భారతీయ భాషలపై ప్రత్యేక సదస్సులు, కవిత్వానికి సంబంధించి ప్రత్యేకంగా కావ్యధార కార్యక్రమం ఉంటాయన్నారు. మీట్ మై బుక్ పేరుతో పుస్తక ఆవిష్కరణలు, మూవింగ్ ఇమేజెస్ టాకీస్ సినిమా ప్రదర్శనలు, సైన్స్ అండ్ సిటీ సెషన్స్, స్టేజ్ టాక్లు, స్టోరీ టెల్లింగ్, వర్క్షాప్స్, యంగిస్తాన్ యూత్ ఈవెంట్స్ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సారి ఫెస్టివల్ ఆతిథ్య దేశంగా లూథియానా, దృష్టి సారించిన భాషగా సింధీ భాషను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మూడు రోజుల కార్యక్రమాల్లో విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు షబానా అజ్మీ, అరుణా రాయ్, నందితా భవానీ,రీతా కొఠారీ,సునీతా కృష్ణన్, హుమా ఖురేషి, సినీనటుడు సిద్దార్థ్, దర్శకులు విద్యారావ్, సాహిత్య ప్రముఖులు రాజ్ మోహన్ గాంధీ, కల్పన కన్నబిరాన్ తదితరులు పాల్గొననున్నారు. -
వాహనాలు మారుస్తూ పరారీ...
నగదు సర్దుకోవడం పూర్తయిన తర్వాత ట్రాలీ బ్యాగుల్ని అక్కడే వదిలేసి కొంత దూరం వెళ్లిన దుండగులు చెట్ల చాటున తమ దుస్తులు సైతం మార్చుకున్నారు. అక్కడి నుంచి ప్రధాన రహదారి మీదుగా బోయిన్పల్లి వైపు వచ్చి... అక్కడ ఆటో మాట్లాడుకుని శామీర్పేట వెళ్లారు. అక్కడి నుంచి షేరింగ్ ఆటోలో గజ్వేల్కు, ఆపై లారీలో ఆదిలాబాద్కు చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ నుంచి రాష్ట్ర సరిహద్దులు దాటి మహారాష్ట్ర లేదా మధ్యప్రదేశ్ మీదుగా బీహార్కు వెళ్లినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. తమ ఆచూకీ కనిపెట్టడం కష్టసాధ్యం చేయడానికి దుండగులు వాహనాలు మారినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే నగరంతో పాటు బీదర్కు చెందిన పోలీసులు మహారాష్ట్ర, బీహార్లకు చేరుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. -
కటకట.. ఎక్కడెక్కడ?
తాగునీటి కొరతపై జలమండలి క్షేత్రస్థాయి సర్వే సాక్షి, సిటీబ్యూరో: వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడిని అధిగమించేందుకు జలమండలి సిద్ధమవుతోంది. గత వేసవి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పదిహేను రోజులుగా ముందస్తు ప్రణాళికల కోసం క్షేత్రస్థాయి సర్వే నిర్వహించింది. కోర్సిటీతో పాటు శివారులోని సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులు పర్యటించి పరిస్థితులను అంచనా వేశారు. ఎక్కడ.. ఏ మేరకు నీటి ఎద్దడి ఉంటుందో.. లోప్రెషర్తో పాటు ట్యాంకర్ల తాకిడి అధికంగా అవకాశాలుండే ప్రాంతాలను గుర్తించారు. సెక్షన్కు ఒక యూనిట్గా తీసుకొని సర్వే నివేదికల ఆధారంగా వేసవి కంటే ముందే ఫిబ్రవరి 15 వరకు సమస్య పరిష్కారం దిశగా చర్యలకు ఉపక్రమించేందుకు జలమండలి సిద్ధమవుతోంది. ఆరు డివిజన్ల నుంచి ట్యాంకర్లకు డిమాండ్ నగరంలోని సుమారు ఆరు డివిజన్లలోనే ట్యాంకర్ల డిమాండ్ అధికంగా ఉంటుందని క్షేత్ర స్థాయి సర్వేలో వెల్లడైంది. మొత్తమ్మీద ఇప్పటికే 20 నుంచి 30 సెక్షన్లలో పరిధిలో భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో వేసవిలో ట్యాంకర్ల తాకిడి అధికంగా ఉంటుందని జలమండలి గుర్తించింది. సాధారణంగా మాదాపూర్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, మణికొండ, హయత్నగర్, సరూర్నగర్, అత్తాపూర్ బంజారాహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కేపీహెచ్బీ, ప్రగతినగర్, నిజాంపేట తదితర ప్రాంతాల నుంచి ట్యాంకర్ల సరఫరాకు డిమాండ్ అధికంగా ఉండే అవకాశం ఉంటుందని సర్వేలో బహిర్గతమైంది. ఇప్పటికే ప్రగతి నగర్, వైశాలి నగర్, కొండాపూర్ తదితర ప్రాంతాలో ట్యాంకర్ల తాకిడి పెరిగింది. వేసవిలో భారీ స్థాయిలోనే.. ● సాధారణంగా వేసవిలో ట్యాంకర్ల డిమాండ్ భారీ స్థాయిలో ఉంటుంది. సగటున నెలవారీగా బుకింగ్ల సంఖ్య 1.50 లక్షల నుంచి 2.45 లక్షల వరకు చేరుతున్నాయి. ఈసారి కూడా అలాంటి సమస్య తలెత్తే ప్రమాదం ఉందని జలమండలి భావిస్తోంది. అవసరమైతే ఫిల్లింగ్ స్టేషన్లను పెంచడంతో పాటు ట్యాంకర్ల డెలివరీల్లో పెండెన్సీ లేకుండా సత్వర సరఫరా జరిగేలా తగిన ఏర్పాట్లకు చేయనుంది. ముఖ్యంగా వెయిటింగ్ పీరియడ్, పెండెన్సీ తగ్గించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. గతేడాది భూగర్భ జలాలు అడుగంటడంతో ఫిబ్రవరిలో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. ఏప్రిల్లో డిమాండ్ తారస్థాయికి చేరింది. దీంతో బుకింగ్.. సరఫరాకు మధ్య తీవ్ర కాలయాపన జరిగింది. ఈ సారి ఆ సమస్య తలెత్తకుండా.. తగిన ఏర్పాట్లు చేసేందుకు సంసిద్ధమవుతోంది. మరోవైపు గతంలో అధికంగా ట్యాంకర్లు బుక్ చేసిన వినియోగ దారులపై సర్వే నిర్వహించగా.. వారి ప్రాంగణాల్లో బోర్లు, భూగర్భ జలాలు ఎండిపోవడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైనట్లు గుర్తించింది. ● ఉదాహరణకు ప్రస్తుతం తట్టిఖానా సెక్షన్లో 20 ట్యాంకర్లతో దాదాపు 150 ట్రిప్పుల వరకు ట్యాంకర్ల డెలివరీ జరుగుతోంది. ఇదే డిమాండ్ కొనసాగితే ఏప్రిల్ నాటికి రోజూ 400 ట్రిప్పులు పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఫిల్లింగ్ స్టేషన్లోని ఫిల్లింగ్ పాయింట్స్ నిర్మాణ పద్ధతి వల్ల ఒక ట్యాంకర్ నింపడానికి 15 నిమిషాలు పడుతుంది. ఫిల్లింగ్ సమయాన్ని 5 నిమిషాలకు తగ్గించుకుంటే అనుకున్నదాని కంటే రెట్టింపు ట్రిప్పులు సరఫరా చేయవచ్చని జలమండలి భావిస్తోంది.. దీంతో వెయిటింగ్ పీరియడ్, పెండెన్సీ తగ్గడంతో పాటు నగరవాసులకు సకాలంలో నీరు సరఫరా చేయవచ్చనే భావన జలమండలిలో వ్యక్తమవుతోంది. ఎద్దడి ఉన్న బస్తీల గుర్తింపు లోప్రెషర్ సరఫరాపై స్పష్టత ట్యాంకర్ల తాకిడిపై దృష్టి ముందస్తు ప్రణాళికతో వేసవి నీటి ఎద్దడికి చెక్