కోహ్లికి రెండో ర్యాంక్
దుబాయ్: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్ లో రెండో స్థానంలో నిలిచాడు. భారత్ తరపున వన్డే కెప్టెన్ ధోని, శిఖర్ ధావన్, మాత్రమే టాప్ టెన్ లో ఉన్నారు. సిడ్నీ టెస్టులో భారత్ కు నాయకత్వం వహిస్తున్న కోహ్లి 862 పాయింట్లులో రెండో ర్యాంక్ లో నిలిచాడు.
దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డీవిలియర్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. శిఖర్ ధావన్ 5, ధోని 10వ స్థానంలో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా మాత్రమే టాప్ టెన్ లో చోటు సంపాదించారు. భువనేశ్వర్ 8, జడేజా 9వ ర్యాంక్ లో నిలిచారు.