breaking news
Iftar dinners
-
ఇఫ్తార్ విందులో పాల్గొన్న జగన్
హైదరాబాద్: రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర కో-ఆర్డినేటర్ హెచ్.ఎ. రెహమాన్ ఆధ్వర్యంలో ఇచ్చిన ఇఫ్తార్ విందులో మతసామరస్యం వెల్లివిరిసింది. శుక్రవారం సాయంత్రం కింగ్కోఠిలోని ఈడెన్ గార్డెన్లో జరిగిన ఇఫ్తార్ విందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్మోహన్రెడ్డితోపాటు ముస్లిం మత పెద్దలు, హెచ్.ఎ. రెహమాన్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, విజయచందర్, నల్ల సూర్యప్రకాశ్, కొండా రాఘవరెడ్డి, ఉర్దూ అకాడమీ మాజీ అధ్యక్షుడు నూరుల్లా ఖాద్రీలు ఈ విందులో పాల్గొన్నారు. -
ఈద్ పసంద్
దీక్షలు, ఉపవాసాలు... నియమాలు, నిష్ఠలు... సహర్లు, ఇఫ్తార్లు.. కొన్ని గంటల్లో ఫలించబోతున్నాయి. నెలవంక కనిపించడమే ఆలస్యం... హ్యాపీ రంజాన్! ఉన్నంతలోనే ఇవ్వడానికి... తిన్నంత తినిపించడానికి... వరమై వచ్చిన తరుణమిది. పసందైన ‘ఈద్’ ఇది. ఇన్నాళ్లూ ప్రక్షాళన... ఇప్పుడు రుచుల మనోరంజన! గోష్ కా దాల్చా కావలసినవి: శనగపప్పు - 200 గ్రా.; నూనె - పావు కిలో షాజీరా - టేబుల్ స్పూను దాల్చినచెక్క - అర టీ స్పూను లవంగాలు - 10; ఏలకులు - 10 ఉల్లితరుగు - 100 గ్రా.; అల్లంవెల్లుల్లి పేస్ట్ - 50 గ్రా. కారం - 100 గ్రా.; కరివేపాకు - నాలుగు రెమ్మలు పసుపు - చిటికెడు; ఉప్పు - తగినంత పచ్చిమిర్చి - 10 (సన్నగా తరగాలి) మిరియాలపొడి - టీ స్పూను కొత్తిమీర - చిన్న కట్ట (సన్నగా కట్ చేయాలి) సొరకాయ ముక్కలు - 500 గ్రా. టొమాటో ముక్కలు - 400 గ్రా. చింతపండు - 100గ్రా. (నానబెట్టి గుజ్జు తీసుకోవాలి) ధనియాలపొడి - రెండు టీ స్పూన్లు జీలకర్రపొడి - రెండు టీ స్పూన్లు పుదీనా - చిన్న కట్ట మటన్ ముక్కలు - 500 గ్రా. తయారి: శనగపప్పును ఉడికించి మెత్తగా చేసుకోవాలి. మటన్ను బాగా కడిగి తగినంత నీరు జత చేసి సుమారు అరగంటసేపు ముక్కలు మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. బాణలిలో నూనె వేసి కాగాక, షాజీరా, దాల్చినచెక్క, లవంగాలు, ఏలకులు వేసి వేయించాలి. ఉల్లి తరుగు జతచేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి. అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. కారం, కరివేపాకు, పసుపు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి. ఉప్పు, మిరియాలపొడి, కొత్తిమీర తరుగు వేసి ఒక నిముషం వేయించాలి. సొరకాయ ముక్కలు, టొమాటో తరుగు, ఉడికించిన మటన్, మెత్తగా చేసిన శనగపప్పు వేసి, అన్నీ ఉడికేవరకు ఉంచాలి. చింతపండు గుజ్జు వేసి పది నిముషాలపాటు ఉడికించాలి. ధనియాలపొడి, జీలకర్రపొడి, పుదీనా ఆకులు వేసి రెండు నిముషాలు బాగా కలిపి దించేయాలి. షీర్ ఖుర్మా కావలసినవి: నెయ్యి - 100 గ్రా. పాలు - ఒకటిన్నర లీటర్లు పంచదార - 700 గ్రా.; సేమ్యా - 500 గ్రా. ఏలకులు - 15 గ్రా. (పొడి చేయాలి) ఎండు ఖర్జూరాలు - 25 గ్రా. బాదంపప్పులు - 25 గ్రా. జీడిపప్పు పలుకులు - 25 గ్రా. కిస్మిస్ - 25 గ్రా.; చిరోంజీ - 25 గ్రా. నెయ్యి - 150 గ్రా.; పిస్తా - 25 గ్రా. తయారి: బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి, కరిగాక సేమ్యాను వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి పక్కన ఉంచాలి. ఒక పెద్ద పాత్రలో పాలు పోసి అవి సగం అయ్యేవరకు మరిగించాలి. పంచదార, ఏలకుల పొడి జత చేసి ఐదు నిముషాలు ఉంచాలి. సేమ్యా, ఖర్జూరాలు వేసి ఉడికించాలి. బాణలిలో మిగిలిన నెయ్యి వేసి కరిగాక బాదంపప్పులు, జీడిపప్పులు, చిరోంజీ, కిస్మిస్, పిస్తాలను వేసి వేయించి, ఉడుకుతున్న సేమ్యాలో వేసి బాగా కలిపి దించేయాలి. చికెన్ డ్రమ్స్టిక్స్ కావలసినవి: సోయా సాస్ - టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూన్ పంచదార - చిటికెడు; చికెన్ డ్రమ్స్టిక్స్ - 6 మైదా - 2 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు ఉప్పు - తగినంత మిరియాలపొడి + కారం - పావు టీ స్పూను కోడిగుడ్లు - 2 (పాత్రలో వేసి బాగా గిలక్కొట్టాలి) నూనె - తగినంత; గార్నిషింగ్ కోసం: ఉల్లిచక్రాలు - 10; నిమ్మచెక్కలు - 4 తయారి: ఒక పాత్రలో సోయాసాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పంచదార వే సి కలపాలి. చికెన్ డ్రమ్స్టిక్స్కి ఈ మిశ్రమాన్ని బాగా పట్టించి సుమారు అరగంటసేపు పక్కన ఉంచాలి. ఒక చిన్న పాత్రలో మైదా, కార్న్ఫ్లోర్, ఉప్పు, మిరియాలపొడి, కారం, కోడిగుడ్డు సొన వేసి ఉండలు లేకుండా కలపాలి. బాణలిలో నూనె వేసి కాగనివ్వాలి. ఒక్కో ముక్కను పిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసి డీప్ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఉల్లితరుగు, నిమ్మచెక్కలతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి. కర్డ్ - మటన్ బిర్యానీ కావలసినవి: మటన్ - అర కేజీ ఉప్పు - తగినంత అల్లంవెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూను పసుపు - కొద్దిగా పెరుగు - లీటరు ధనియాలపొడి - టీ స్పూను ఏలకులపొడి - టీ స్పూను మిరియాలపొడి - అర టీ స్పూను దాల్చినచెక్కపొడి - కొద్దిగా నెయ్యి - వంద గ్రాములు లవంగాలు - 10 నీళ్లు - కప్పు బియ్యం - అర కేజీ తయారి: మటన్ను ముక్కలుగా కోసి బాగా కడగాలి. ఒక పాత్రలో మటన్ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. ఒక పాత్రలో అర లీటరు పెరుగు, ధనియాలపొడి, ఏలకులపొడి, మిరియాలపొడి, దాల్చినచెక్కపొడి, కప్పుడు నీళ్లు వేసి బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని మటన్లో వేసి (గంటసేపు) పక్కన ఉంచాలి. పెద్ద పాన్లో మటన్ మిశ్రమం వేసి సమానంగా సర్దాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి, లవంగాలు వేయించి, నెయ్యితో పాటే మటన్ మీద వెయ్యాలి. బియ్యం కడిగి, మిగిలిన పెరుగును బియ్యంలో కలిపి పాన్లో ఉన్న మటన్ మీద వేసి సర్ది మిగిలిన నెయ్యి కూడా వేసి మూత పెట్టి మంట మీద ఉడకనివ్వాలి. ఆవిరి వస్తున్నప్పుడు సిమ్లో పెట్టి పావుగంట ఉడకనిచ్చి దించాలి. వేడిగా ఉండగానే పెద్ద ప్లేట్లోకి తిరగదీసి, ఉల్లిచక్రాలతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి. (నీళ్లు లేకుండా పెరుగుతో మాత్రమే వండే బిర్యానీ రెడీ). ఖుబానీ కా మీఠా కావలసినవి: ఖుబానీ (ఆప్రికాట్లు) - కేజీ పంచదార - కేజీ రూహ్ అఫ్జా - 250 గ్రా. వెనిలా ఎసెన్స్ - ఆరు చుక్కలు రాస్ప్బెర్రీ ఎసెన్స్ - ఆరు చుక్కలు క్రీమ్ - 50 గ్రా. తయారి: ఆప్రికాట్లను సుమారు అరగంటసేపు నీటిలో నానబెట్టాలి. ఒక పెద్ద పాత్రలో నానిన ఆప్రికాట్లను వేసి, తగినంత నీరు జత చేసి ఆప్రికాట్లు మెత్తబడేవరకు ఉడికించాలి. నీటిని ఒంపేసి, ఆప్రికాట్లు చల్లారాక గింజలను తీసేయాలి. ఒక పెద్ద పాత్రలో పంచదార, ఉడికించిన ఆప్రికాట్లను వేసి రెండూ బాగా కలిసేవరకు ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత వెనిలా ఎసెన్స్, రాస్ప్బెర్రీ ఎసెన్స్, రూహ్ అఫ్జా జత చేసి రెండు నిముషాలు ఉంచాలి. క్రీమ్తో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేయాలి. -
మత సామరస్యాన్ని చాటే ఇఫ్తార్ విందులు
జహీరాబాద్, న్యూస్లైన్: ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జె.గీతారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాత్రి జహీరాబాద్లోని ఫ్రెండ్స్ గార్డెన్ ఫంక్షన్హాల్లో మంత్రి గీతారెడ్డి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హిందూ ముస్లింల మధ్య సోదర భావం పెంపొందించేందుకు ఇఫ్తార్ విందులు ఎంతగానో దోహద పడతాయన్నారు. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైందన్నారు. అల్లా దయవల్ల ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. జహీరాబాద్ ప్రాంతం మత సామరస్యతకు ప్రతీకగా నిలిచిందన్నారు. అనంతరం మంత్రి గీతారెడ్డి ముస్లింలతో కలిసి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ జైపాల్రెడ్డి, మంత్రి గీతారెడ్డి భర్త రాంచంద్రారెడ్డి, కుమార్తె మేఘనారెడ్డి, కాంగ్రెస్ నాయకులు మంకాల్ సుభాష్, షీలా రమేష్, తాహెరాబేగం, ఖాజా పాల్గొన్నారు. సోదర భావంతో మెలగాలి నర్సాపూర్, న్యూస్లైన్: హిందూ ముస్లింలు సోదర భావంతోకలిసి, మెలిసి ఉండాలని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖా మత్రి వి.సునీతారెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మణికొండ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొని ప్రార్థనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇఫ్తార్ విందులో పాల్గొనడం తాను అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇఫ్తార్ విందులో నర్సాపూర్ ముస్లిం మతపెద్ద ఖాజాసమియొద్దీన్, కాంగ్రెస్ నాయకులు స్థానిక సర్పంచ్ రమణారావు, ఆత్మ చైర్మన్ ఆంజనేయులుగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, స్థానిక ఉపసర్పంచ్ నయీం, ఇతర కాంగ్రెస్ నాయకులు సత్యంగౌడ్, గులాం మహమ్మద్, కృష్ణారావు, శ్రీనివాస్గుప్తా, నవీన్రావు, జ్ఞానేశ్వర్,చిన్నఅంజనేయులుగౌడ్, రషీ ద్, మహమ్మద్, పాల్గొన్నారు.