import price
-
బంగారం, వెండి దిగుమతి ధరలు పెంపు
ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా భారత ప్రభుత్వం బంగారం (gold), వెండి (silver) దిగుమతి మూల ధరలను పెంచింది. ఫిబ్రవరి 14న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. బంగారం మూల ధర 10 గ్రాములకు 41 డాలర్లు పెరిగి 938 డాలర్లకు చేరుకుంది. వెండి బేస్ రేటు కూడా కేజీకి 42 డాలర్లు పెరిగింది.ట్రెండ్స్కు అనుగుణంగా సర్దుబాటుఅమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు సహా ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ అంశాల కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. బేస్ దిగుమతి ధర పెరిగితే వాటి మీద విధించే దిగుమతి సుంకాలు కూడా పెరుగుతాయి. వీటిని బేస్ ధరలో ఒక శాతంగా లెక్కించి వసూలు చేస్తారు. దీని దిగుమతి ధరలో సర్దుబాటు కారణంగా వెండి ధరలు కూడా పెరిగాయి.భారత్లో బంగారం ధరలుప్రపంచ ట్రెండ్ను అనుసరించి సోమవారం (ఫిబ్రవరి 17 ) భారత్లో కూడా బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.8,662, 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.7,940 చొప్పున ఉన్నాయి. బేస్ ధరల సవరణతో, వ్యాపారులు దేశీయ బంగారం ధరలను తదనుగుణంగా సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ఇది రిటైల్ మార్కెట్లో మొత్తం ధరలను ప్రభావితం చేస్తుంది.వెండి ధర సర్దుబాటుబంగారం లాగే వెండి కూడా అంతర్జాతీయంగా ధరల పెరుగుదలను చూసింది. వెండి బేస్ దిగుమతి ధరను పెంచాలనే ప్రభుత్వం నిర్ణయం ఈ ప్రపంచ మార్పులను చూపిస్తుంది. దిగుమతి ధరలలో మార్పు మార్కెట్కు అనుగుణంగా బేస్ ధరపై సుంకాలు విధించడం ద్వారా పన్నుల వ్యవస్థలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి సహాయపడుతుంది. ప్రపంచ మార్కెట్ పరిస్థితుల్లో తదుపరి మార్పులను బట్టి తదుపరి సవరణ వరకు కొత్త బేస్ దిగుమతి ధరలు వర్తిస్తాయి. -
బంగారం వెండి, వంటనూనెల బేస్ దిగుమతి రేటు తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ: వంటనూనెలు, బంగారం, వెండి బేస్ దిగుమతి రేట్లపై సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వీటి బేస్ దిగుమతి ధరలను తగ్గిస్తూ బుధవారం ఆలస్యంగా నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త రేట్లు నేటి నుంచే (జూన్16) అమలులోకి వచ్చాయి. ఎడిబుల్ ఆయిల్స్, గోల్డ్, సిల్వర్ బేస్ దిగుమతి ధరలను ప్రతీ 15 రోజులకు ఒకసారి సవరిస్తూ ఉంటుంది. వీటి ఆధారంగా దిగుమతిదారులు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. క్రూడ్ పామ్ ఆయిల్, సోయా ఆయిల్, గోల్డ్, సిల్వర్ పై దిగుమతి సుంకాన్ని కోత పెట్టింది. మరోవైపు ఇతర వాటి బేస్ దిగుమతి ధరలు మాత్రం పెరిగాయి ముఖ్యంగా క్రూడ్ పామోలిన్, ఆర్బీడీ పామోలిన్, ఇతర పామోలిన్, బ్రాస్ స్క్రాప్ ధరలు మాత్రం పెరిగాయి. క్రూడ్ పామ్ ఆయిల్ బేస్ దిగుమతి ధర 1625 డాలర్ల నుంచి 1620 డాలర్లకు తగ్గింది. క్రూడ్ సోయా బీన్ ఆయిల్ రేటు 1866 డాలర్ల నుంచి 1831 డాలర్లకు తగ్గింది. గోల్డ్ బేస్ దిగుమతి ధర 597 డాలర్ల నుంచి 585 డాలర్లకు దిగి వచ్చింది. సిల్వర్ బేస్ దిగుమతి ధర 721 డాలర్ల నుంచి 695 డాలర్లకు తగ్గింది. మరోవైపు ఆర్బీడీ పామ్ ఆయిల్ రేటు 1733 డాలర్ల నుంచి 1757 డాలర్లకు పెరిగింది. ఇతర పామ్ ఆయిల్ బేస్ దిగుమతి రేటు 1679 డాలర్ల నుంచి 1689 డాలర్లకు ఎగసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతిదారు ఇండియా గత నెలలో 2 మిలియన్ టన్నుల సోయాయిల్ను సుంకం రహిత దిగుమతులకు అనుమతించింది. 2 మిలియన్ టన్నుల సోయా ఆయిల్ దిగుమతికి ఇది వర్తిస్తుంది. వెండి, బంగారం మినహా బేస్ ధరలు ప్రతి కమోడిటీకి టన్నుకు డాలర్ చొప్పున ఉంటుంది. గోల్డ్ టారిఫ్ 10 గ్రాములకు ఒక డాలర్, అలాగే వెండికి కేజీకి డాలర్గా ఉంటుంది. కాగా దేశంలో గురువారం బంగారం ధరలు క్షీణించాయి. పది గ్రాముల పసిడి రూ. 270 పడిపోగా, కిలో వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. -
ఉక్కు ఉత్పత్తులకు కనీస దిగుమతి ధర
న్యూఢిల్లీ: కొన్ని రకాల ఉక్కు ఉత్పత్తులకు కేంద్రం శుక్రవారం కనీస దిగుమతి ధర (ఎంఐపీ)ను నిర్ణయించింది. ఈ విలువ వివిధ ఉత్పత్తులకు సంబంధించి టన్నుకు 341 డాలర్ల నుంచి 752 డాలర్ల వరకూ ఉంది. చౌక దిగుమతుల నుంచి దేశీయ పరిశ్రమను రక్షించడంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 173 హెచ్ఎస్ కోడ్స్(ప్రొడక్ట్స్)పై ఎంఐపీని విధిస్తున్నట్లు డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఒక నోటిఫికేషన్లో పేర్కొంది.ఈ ఎంఐపీ నిబంధనలు ఆరు నెలలు అమల్లో ఉంటాయి. ఎంఐపీ కంటే తక్కువ ధరకు దిగుమతులను అనుమతించడం జరగదు.