breaking news
India A vs Australia A
-
జురెల్, పడిక్కల్ అద్భుత శతకాలు.. డ్రాగా ముగిసిన భారత్-ఆసీస్ తొలి టెస్ట్
భారత్ ఏ, ఆస్ట్రేలియా ఏ జట్ల మధ్య లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా జరిగిన తొలి అనధికారిక నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో నాలుగో రోజైన ఇవాళ (సెప్టెంబర్ 19) నిర్దేశిత సమయం కంటే ముందుగానే మ్యాచ్ను ముగించారు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 6 వికెట్ల నష్టానికి 532 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఓపెనర్ సామ్ కొన్స్టాస్ (109), వికెట్ కీపర్ జోష్ ఫిలిప్ (123 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కగా.. క్యాంప్బెల్ కెల్లావే (88), కూపర్ కన్నోల్లీ (70), లియమ్ స్కాట్ (81) సెంచరీలకు చేరువై ఔటయ్యారు. భారత బౌలర్లలో హర్ష్ దూబే 3, గుర్నూర్ బ్రార్ 2, ఖలీల్ అహ్మద్ ఓ వికెట్ తీశారు.అనంతరం బరిలోకి దిగిన భారత్ ఆసీస్కు ధీటుగా జవాబిచ్చింది. ఆధిక్యం సాధించే అవకాశం ఉన్నా.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఒక్క పరుగు ముందుగానే ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్లు కోల్పోయి 531 పరుగులు చేసింది.ధృవ్ జురెల్ (197 బంతుల్లో 140; 13 ఫోర్లు, 4 సిక్సర్లు), దేవ్దత్ పడిక్కల్ (281 బంతుల్లో 150; 14 ఫోర్లు, సిక్స్) అద్బుత శతకాలతో కదంతొక్కగా.. సాయి సుదర్శన్ (73), ఎన్ జగదీసన్ (64) అర్ద సెంచరీలతో రాణించారు. భారత ఇన్నింగ్స్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (8) ఒక్కడే విఫలమయ్యాడు.ఒక్క పరుగు లీడ్తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. సామ్ కొన్స్టాస్ 27, క్యాంప్బెల్ కెల్లావే 24 పరుగులతో అజేయంగా ఉన్నారు. ఈ దశలో మ్యాచ్ను డ్రాగా ప్రకటించారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ ఇదే వేదికగా సెప్టెంబర్ 23-26 మధ్య జరుగనుంది.కాగా, ఆస్ట్రేలియా-ఏ జట్టు రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్లు.. 3 అనధికారిక వన్డేల కోసం భారత్లో పర్యటిస్తుంది. వన్డేలు సెప్టెంబర్ 30, అక్టోబర్ 3, 5 తేదీల్లో కాన్పూర్ వేదికగా జరుగనున్నాయి. -
IND vs AUS: ఆసీస్కు ధీటుగా బదులిచ్చిన భారత్.. ఒకే ఒక్క పరుగుతో..
అనధికారిక తొలి టెస్టులో ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుకు భారత్-‘ఎ’ జట్టు ధీటుగా బదులిచ్చింది. ధ్రువ్ జురెల్ (Dhruv Jurel), దేవ్దత్ పడిక్కల్ (Devdutt Padikkal) భారీ శతకాలతో చెలరేగడంతో జట్టు పటిష్ట స్థితికి చేరుకుంది. అయితే, ఆసీస్ ఇన్నింగ్స్ కంటే ఒకే ఒక్క పరుగు వెనుకబడి ఉన్నవేళ భారత జట్టు తమ స్కోరును డిక్లేర్ చేయడం విశేషం.లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా మంగళవారం మొదలైన తొలి టెస్టులో టాస్ ఓడిన భారత్.. తొలుత బౌలింగ్ చేసింది. అయితే, భారత బౌలర్ల వైఫల్యం కారణంగా ఆసీస్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.ఆసీస్ @532ఓపెనర్ సామ్ కొన్స్టాస్ (109), వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఫిలిప్ (123 నాటౌట్) శతకాలతో చెలరేగగా.. మరో ఓపెనర్ కాంపెబెల్ కెల్లావే (88).. ఆల్రౌండర్లు కూపర్ కన్నోలి (70), లియామ్ స్కాట్ (81) అద్భుత అర్ధ శతకాలు సాధించారు. ఈ క్రమంలో ఆసీస్ 98 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 532 పరుగుల వద్ద తమ మొదటి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. భారత బౌలర్లలో హర్ష్ దూబే మూడు వికెట్లతో సత్తా చాటగా.. గుర్నూర్ బ్రార్ రెండు, ఖలీల్ అహ్మద్ ఒక వికెట్ దక్కించుకున్నారు.ఇక ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత్.. శుక్రవారం నాటి నాలుగో రోజు ఆట సందర్భంగా 141.1 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 531 పరుగుల వద్ద ఉన్న వేళ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.జురెల్, పడిక్కల్ భారీ శతకాలుభారత టాపార్డర్లో అభిమన్యు ఈశ్వరన్ (44) ఆకట్టుకోగా.. నారాయణ్ జగదీశన్ (64), సాయి సుదర్శన్ (73) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (149)తో పాటు నాలుగో నంబర్ ఆటగాడు దేవ్దత్ పడిక్కల్ (150) భారీ శతకం సాధించాడు.మిగతా వారిలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (8) పూర్తిగా విఫలం కాగా.. తనుశ్ కొటియాన్, హర్ష్ దూబే (నాటౌట్) చెరో 16 పరుగులు చేయగలిగారు. ఆసీస్ బౌలర్లలో కారీ రాచిసిల్లీ మూడు వికెట్లు తీయగా.. కూపర్ కన్నోలి, లియామ్ స్కాట్, ఫెర్గూస్ ఒ నీల్, జేవియర్ బార్ట్లెట్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నాడు.ఆసీస్కు స్వల్ప ఆధిక్యం.. డ్రా ఖాయమేఇక శుక్రవారం నాటి ఆఖరి రోజు ఆటలో తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టు 12 ఓవర్ల ఆట ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 38 పరుగులు చేసింది. సామ్ కొన్స్టాస్ 15, కాంపబెల్ కెల్లావే 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ కంటే ఆసీస్ 39 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంకా ఒక సెషన్ మాత్రమే మిగిలి ఉన్నందున ఈ మ్యాచ్ డ్రా కావడం ఖాయం. ఇరుజట్ల మధ్య ఏకనా స్టేడియంలోనే సెప్టెంబరు 23- 26 వరకు రెండో అనధికారిక టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: Asia Cup 2025 Super 4: సూపర్-4లో ఆడే జట్లు ఇవే.. షెడ్యూల్, టైమింగ్ వివరాలు -
IND vs AUS: భారీ శతకంతో కదం తొక్కిన పడిక్కల్.. ఆసీస్కు ధీటుగా..
ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో అనధికారిక తొలి టెస్టులో టీమిండియా స్టార్ దేవ్దత్ పడిక్కల్ (Devdutt Padikkal) భారీ శతకంతో మెరిశాడు. ఈ కర్ణాటక బ్యాటర్ 198 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా తన కెరీర్లో ఏడో ఫస్ట్క్లాస్ సెంచరీని నమోదు చేశాడు.కాగా భారత్-‘ఎ’ జట్టు స్వదేశంలో ఆసీస్-‘ఎ’ జట్టుతో రెండు అనధికారిక టెస్టులు ఆడుతోంది. లక్నోలోని ఏకనా స్టేడియం ఇందుకు వేదిక. ఇందులో భాగంగా మంగళవారం తొలి టెస్టు మొదలుకాగా టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ చేసింది.ఆసీస్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్డ్సామ్ కొన్స్టాస్ (109), జోష్ ఫిలిప్ (123 నాటౌట్) శతకాలతో చెలరేగగా.. కాంపెబెల్ కెల్లావే (88), కూపర్ కన్నోలి (70), లియామ్ స్కాట్ (81) అద్భుత అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. ఫలితంగా ఆసీస్ 98 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 532 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది.భారత బౌలర్లలో హర్ష్ దూబే (Harsh Dube) మూడు వికెట్లు తీయగా.. గుర్నూర్ బ్రార్ రెండు, ఖలీల్ అహ్మద్ ఒక వికెట్ దక్కించుకున్నారు. టాపార్డర్ హిట్.. ధీటుగా భారత్ సమాధానంఇక ఆసీస్ భారీ స్కోరు చేయగా.. అందుకు భారత్ కూడా ధీటుగా బదులిస్తోంది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (44), నారాయణ్ జగదీశన్ (64) శుభారంభం అందించగా.. వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ అర్ధ శతకం (73)తో మెరిశాడు.అయితే, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (8) మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ భారీ శతకం (140)తో ఇన్నింగ్స్ను మళ్లీ గాడిలో పెట్టగా.. శుక్రవారం నాటి ఆట సందర్భంగా పడిక్కల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.పడిక్కల్ భారీ శతకంనాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన పడిక్కల్.. మొత్తంగా 281 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 150 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో శుక్రవారం భోజన విరామ సమయానికి భారత జట్టు 138 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 520 పరుగులు సాధించింది. ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ కారీ రాచిసిల్లీ.. శ్రేయస్ అయ్యర్, దేవ్దత్ పడిక్కల్, తనూశ్ కొటియాన్ రూపంలో మూడు వికెట్లు తీశాడు. ఇతరులలో కూపర్ కన్నోలి, లియామ్ స్కాట్, ఫెర్గూస్ ఒ నీల్, జేవియర్ బార్ట్లెట్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నాడు.ఇక తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ కంటే భారత్ ఇంకా 12 పరుగులు వెనుకబడి ఉంది. ఇదిలా ఉంటే.. నాలుగు రోజుల అనధికారిక టెస్టులో ఇదే ఆఖరి రోజు. దీంతో ఫలితం తేలకుండానే ఈ మ్యాచ్ ముగిసిపోయే అవకాశం ఉంది.ఒకే ఒక్క పరుగుఅప్డేట్: ఇక లంచ్ తర్వాత మళ్లీ మొదలైన ఆట.. వర్షం కారణంగా నిలిచిపోయింది. హర్ష్ దూబే 16, ప్రసిద్ కృష్ణ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ స్కోరు: 531/7 (141.1). ఆసీస్ తొలి ఇన్నింగ్స్ కంటే భారత్ ఒకే ఒక్క పరుగు వెనుకంజలో ఉంది. చదవండి: Asia Cup 2025 Super 4: సూపర్-4లో ఆడే జట్లు ఇవే.. షెడ్యూల్, టైమింగ్ వివరాలు -
IND VS AUS: శతక్కొట్టిన ధృవ్ జురెల్.. టీమిండియా భారీ స్కోర్
లక్నోలోని ఎకానా స్టేడియంలో ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్లో భారత-ఏ జట్టు భారీ స్కోర్ చేసింది. వికెట్కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ మెరుపు శతకంతో చెలరేగాడు. 115 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసిన జురెల్.. 113 పరుగుల వద్ద (132 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు) ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు.మరో ఎండ్లో జురెల్కు జోడీగా ఉన్న దేవ్దత్ పడిక్కల్ కూడా సెంచరీకి చేరువయ్యాడు. పడిక్కల్ 178 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 86 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. అంతకుముందు సాయి సుదర్శన్ (73), ఎన్ జగదీసన్ (64) అర్ద సెంచరీలతో రాణించగా.. అభిమన్యు ఈశ్వరన్ (44) పర్వాలేదనిపించాడు. భారత-ఏ ఇన్నింగ్స్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (8) ఒక్కడే విఫలమయ్యాడు.మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత-ఏ స్కోర్ 103 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 403 పరుగులుగా ఉంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 129 పరుగులు వెనుకపడి ఉంది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా-ఏ 532 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. సామ్ కొన్స్టాస్ (109), వికెట్ కీపర్ జోష్ ఫిలిప్ (123 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కగా.. క్యాంప్బెల్ కెల్లావే (88), కూపర్ కన్నోల్లీ (70), లియమ్ స్కాట్ (81) సెంచరీలకు చేరువై ఔటయ్యారు.కాగా, రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్లు, మూడు అనధికారిక వన్డేల కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్లో పర్యటిస్తుంది. -
IND vs AUS: శతకాలతో చెలరేగిన కొన్స్టాస్, ఫిలిప్.. ఆసీస్ భారీ స్కోరు
భారత్-‘ఎ’ జట్టుతో అనధికారిక తొలి టెస్టులో ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టు భారీ స్కోరు సాధించింది. లక్నో వేదికగా ఇరుజట్ల మధ్య మంగళవారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ భారత పేసర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంది. సెంచరీతో కదంతొక్కిన కొన్స్టాస్టీమిండియాపై టెస్టు అరంగేట్రం చేసిన సామ్ కొన్స్టాస్ (Sam Konstas) సెంచరీతో కదంతొక్కగా... క్యాంప్బెల్ కెల్లావే (Campbell Kellaway- 97 బంతుల్లో 88; 10 ఫోర్లు, 2 సిక్స్లు), కూపర్ కనొల్లీ (84 బంతుల్లో 70; 12 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు.తొలి వికెట్కు 198 పరుగులు జోడించిన అనంతరం క్యాంపెబల్ అవుట్ కాగా.. ఈ దశలో భారత బౌలర్లు కాస్త పోరాటం కనబర్చారు. కెప్టెన్ నాథన్ మెక్స్వీనీ (1), ఒలీవర్ పీక్ (2)ను వెంట వెంటనే ఔట్ చేశారు. దీంతో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు 198/0 నుంచి 224/4కు చేరింది. ఇక పట్టు చేజిక్కించుకోవడమే తరువాయి అనుకుంటుంటే... కూపర్ కనొల్లీ, లియామ్ స్కాట్ (79 బంతుల్లో 47 బ్యాటింగ్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) పట్టుదల కనబర్చారు.దూబే... ఒక్కడే ఈ జంట ఐదో వికెట్కు 109 పరుగులు జోడించింది. ప్రసిధ్ కృష్ణ (0/47), ఖలీల్ అహ్మద్ (1/46) పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో... ఆసీస్ ప్లేయర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. భారత బౌలర్లలో హర్ష్ దూబే 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా రికార్డుల్లోకెక్కిన దూబే... ఒక్కడే ఆసీస్ ప్లేయర్లను ఇబ్బంది పెట్టగలిగాడు. గుర్నూర్ బ్రార్ ఒక వికెట్ తీశాడు.జోష్ ఫిలిప్ అజేయ సెంచరీఈ క్రమంలో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు తొలి ఇన్నింగ్స్లో 73 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. లియామ్ స్కాట్తో పాటు జోష్ ఫిలిప్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. వర్షం కారణంగా తొలి రోజు 73 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.ఈ క్రమంలో బుధవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా లియామ్ స్కాట్ (81) అదరగొట్టగా.. వికెట్ కీపర్ జోష్ ఫిలిప్ అజేయ సెంచరీ (123)తో దుమ్ములేపాడు. మరోవైపు.. టెయిలెండర్ జేవియర్ బార్ట్లెట్ 39 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఈ క్రమంలో ఆరు వికెట్ల నష్టానికి 532 పరుగుల భారీ స్కోరు వద్ద ఆసీస్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. భారత బౌలర్లలో హర్ష్ దూబే మూడు వికెట్లతో సత్తా చాటగా.. గుర్నూర్ బ్రార్ రెండు, ఖలీల్ అహ్మద్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక బుధవారం భోజన విరామ సమయానికి భారత్-‘ఎ’ జట్టు మూడు ఓవర్లలో మూడు పరుగులు చేసింది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ 2, నారాయణ్ జగదీశన్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో..ఒకవైపు సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు యూఏఈ వేదికగా ఆసియా కప్ టీ20 టోర్నమెంట్లో పాల్గొంటుండగా... మరోవైపు యువ ఆటగాళ్లు ఆస్ట్రేలియా- ‘ఎ’తో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ ఆడుతున్నారు. ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా... సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, ప్రసిద్ కృష్ణ, ఖలీల్ అహ్మద్ వంటి వాళ్లు బరిలో ఉన్నారు. చదవండి: IND Vs WI: టీమిండియాతో టెస్టులకు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. వికెట్ల వీరుడికి చోటు