breaking news
India vs New Zealand
-
కివీస్తో మ్యాచ్ వరల్డ్ ఫైనల్ లాంటిది: మహ్మద్ సిరాజ్
న్యూజిలాండ్తో ఆదివారం ఇండోర్ వేదికగా సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో తాడో పేడో తెల్చుకోవడానికి భారత్ సిద్దమైంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తుంటే.. మరోవైపు కివీస్ కూడా భారత గడ్డపై మరోసారి చరిత్ర సృష్టించాలని పట్టుదలతో ఉంది.ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ను వరల్డ్కప్ ఫైనల్లా భావిస్తున్నామని సిరాజ్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ సిరీస్లో రెండు జట్లు సమవుజ్జీలగా ఉన్నాయి. గత పర్యటన మాదిరిగానే భారత జట్టుకు కివీస్ గట్టీ పోటీ ఇస్తుంది. అందుకే సిరాజ్ ఆఖరి వన్డేను ప్రపంచకప్ ఫైనల్తో పోల్చాడు.భారత్లో మాకు ఇటువంటి పరిస్థితులు చాలా అరుదుగా ఎదురవుతుంటాయి. మొన్న సౌతాఫ్రికా, నేడు న్యూజిలాండ్. చివరి మ్యాచ్లో గెలిచి సిరీస్ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తాము. ఈ మ్యాచ్ మాకు దాదాపు ప్రపంచ కప్ ఫైనల్ లాంటిది. జట్టులోని సీనియర్లు యువ ఆటగాళ్లకు చాలా మద్దతుగా ఉన్నారు. వారు నుంచి మాకు సలహాలు, సూచనలు అందుతున్నాయి.దీంతో డ్రెసింగ్ రూమ్ వాతావరణం చాలా బాగుంది. మేము మొదటి మ్యాచ్ గెలిచాం. దురదృష్టవశాత్తూ రెండో వన్డేలో ఓడిపోయాం. కాబట్టి ఇప్పుడు మాపై కాస్త ఒత్తిడి ఉంది. రాజ్కోట్ వన్డేలో డారిల్ మిచెల్ అవుట్ చేసేందుకు అన్ని విధాలంగా ప్రయాత్నించాము. కానీ ఒక క్యాచ్ డ్రాప్ కావడం వల్ల మ్యాచ్ పరిస్థితి మారిపోయింది.అతడు స్పిన్ను ఎదుర్కొనే తీరు, సింగిల్స్ తీస్తూ బౌలర్లపై ఒత్తిడి పెంచే విధానం నిజంగా అద్భుతం. మా బౌలింగ్ గురుంచి ఎలాంటి ఆందోళన లేదు. జట్టులో ప్రతీ ఒక్కరు పాజిటివ్ మైండ్తో ఉన్నారు. సిరీస్ డిసైడర్లో తప్పక గెలుస్తాము" అని సిరాజ్ ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు. కాగా రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.చదవండి: IND vs NZ: న్యూజిలాండ్తో మూడో వన్డే.. భారత జట్టులో కీలక మార్పులు! -
న్యూజిలాండ్తో మూడో వన్డే.. భారత జట్టులో కీలక మార్పులు!
భారత్-న్యూజిలాండ్ మధ్య సిరీస్ డిసైడర్ మూడో వన్డే ఆదివారం ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. అయితే ఈ నిర్ణయాత్మక మ్యాచ్ భారత తుది జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.తొలి రెండు మ్యాచ్లకు బెంచ్కే పరిమితమైన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ను మూడో వన్డేలో ఆడించాలని టీమ్మేనెజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ సిరీస్లో ఇప్పటివరకు అర్ష్దీప్కు అవకాశమివ్వకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన మనసు మార్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పేసర్ ప్రసిద్ద్ కృష్ణ స్ధానంలో అర్ష్దీప్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది.బదోని అరంగేట్రంఇక వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా అనుహ్యంగా జట్టులోకి వచ్చిన యువ ఆటగాడు అయూశ్ బదోని.. ఇండోర్లో అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. గత మ్యాచ్లో తుది జట్టులోకి వచ్చిన ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.దీంతో అతడిపై వేటు వేసి బదోనికి ఛాన్స్ ఇవ్వాలని గంభీర్ అండ్ కో ఫిక్స్ అయినట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అయితే తొలి రెండు వన్డేల్లో విఫలమైన సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు మరో అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. జడ్డూ వన్డేల్లో గత కొంతకాలంగా దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. దీంతో అతడిని పక్కన పెట్టాలని పలువరు మాజీలు టీమ్మెనెజ్మెంట్ను సూచిస్తున్నారు.పిచ్ రిపోర్ట్:ఇండోర్లోని హోల్కర్ స్టేడియం బ్యాటింగ్కు స్వర్గధామం. ఇక్కడ బౌండరీ లైన్స్ చాలా చిన్నవిగా ఉండటం వల్ల పరుగుల వరద పారే అవకాశం ఉంది. ఈ మైదానంలో టీమిండియాకు అద్భుతమైన రికార్డు ఉంది. ఇండోర్లో టీమిండియా ఇప్పటివరకు 7 వన్డేలు ఆడగా, అన్నింటిలోనూ విజయం సాధించింది. 2011లో వెస్టిండీస్పై భారత్ ఏకంగా 418 పరుగులు చేసింది. ఆ మ్యాచ్లో భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ (219 పరుగులు) డబుల్ సెంచరీతో మెరిశాడు.మూడో వన్డేకు భారత తుది జట్టు(అంచనా)శుభ్మన్ గిల్(కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అయూష్ బదోని, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్ -
టీమిండియా స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్..?
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో రేపు (జనవరి 18) జరుగబోయే నిర్ణయాత్మక మూడో వన్డే తర్వాత టీమిండియాకు అతి భారీ షాక్ తగలనుందని తెలుస్తుంది. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఈ మ్యాచ్ తర్వాత వన్డే ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని సమాచారం. ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన జడేజా వన్డే కెరీర్ భవితవ్యంపై గత కొద్ది రోజులుగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటన్నిటికి మరి కొద్ది గంటల్లో అధికారికంగా తెరపడే అవకాశం ఉంది.వరుసగా రెండు మ్యాచ్ల్లో విఫలంప్రస్తుత న్యూజిలాండ్ సిరీస్లో జడేజా తొలి రెండు మ్యాచ్ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. తొలి మ్యాచ్లో 9 ఓవర్లు వేసి వికెట్ లేకుండా 56 పరుగులు సమర్పించుకొని, ఆతర్వాత బ్యాటింగ్లో పూర్తిగా తేలిపోయాడు (4 పరుగులు). రెండో వన్డేలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి కొనసాగింది. బ్యాటింగ్లో (44 బంతుల్లో 27) కాస్త పర్వాలేదనిపించినా, బౌలింగ్లో (8-0-44-0) సీన్ రిపీటయ్యింది. అంతకుముందు సౌతాఫ్రికా సిరీస్లోనూ జడ్డూ గడ్డు పరిస్థితులనే ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా బంతితో బాగా ఇబ్బంది పడ్డాడు.ఈ నేపథ్యంలో జడేజాకు వన్డే రిటైర్మెంట్పై ఒత్తిడి పెరిగి ఉంటుంది. అతను టెస్ట్ల్లో సత్తా చాటుతున్నా వన్డేల్లో సామర్థ్యం మేరకు రాణించలేకపోతున్నాడు. వాస్తవానికి న్యూజిలాండ్తో రెండో వన్డేనే జడ్డూకు చివరిదని టాక్ నడిచింది. ఎందుకంటే ఆ మ్యాచ్కు వేదిక అయిన రాజ్కోట్ జడేజాకు హోం గ్రౌండ్. కానీ, ఆ మ్యాచ్ తర్వాత జడేజా ఎలాంటి ప్రకటన చేయలేదు. మూడో వన్డేకు ముందు మరోసారి అతని వన్డే రిటైర్మెంట్పై ఊహాగానాలు ఊపందుకున్నాయి.జడేజా ఫిట్గా ఉన్నాడు, ఆటను ఆస్వాదిస్తున్నంతకాలం భారత జట్టుకు ఉపయోగపడతాడని టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ తాజాగా కామెంట్ చేసినప్పటికీ.. జడేజా వన్డే రిటైర్మెంట్పై ఆల్రెడీ డిసైడైపోయాడని ప్రచారం జరుగుతుంది. 37 ఏళ్ల జడేజా ఇప్పటిరకు 209 వన్డేలు ఆడి 2893 పరుగులు చేసి, 232 వికెట్లు తీశాడు. వన్డేల్లో జడేజా స్థానంపై అక్షర్ పటేల్ ఇదివరకే కర్చీఫ్ వేసి ఉంచాడు. జడ్డూ రిటైర్మెంట్ తర్వాత అతను వన్డేల్లో రెగ్యులర్ సభ్యుడిగా మారిపోయే అవకాశం ఉంది. -
శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్కు ఊహించని అవకాశం
భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఐపీఎల్కు మాత్రమే పరిమితమైన రవి బిష్ణోయ్కు ఊహించని ఆఫర్ వచ్చింది. న్యూజిలాండ్ టీ20 సిరీస్కు ఎంపికైన తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ గాయాల బారిన పడటంతో వారి స్థానాలు భర్తీ చేసే సువర్ణావకాశం వీరికి దక్కింది. శ్రేయస్, బిష్ణోయ్ను న్యూజిలాండ్ సిరీస్కు ఎంపిక చేసినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.జనవరి 21, 23, 25 తేదీల్లో జరగబోయే తొలి మూడు మ్యాచ్ల్లో శ్రేయస్ తిలక్ వర్మ స్థానంలో ఆడనున్నారు. తిలక్ ఐదు మ్యాచ్ల న్యూజిలాండ్ సిరీస్లో మొదటి మూడు మ్యాచ్లకు మాత్రమే దూరమైన విషయం తెలిసిందే. బిష్ణోయ్ మాత్రం సిరీస్ మొత్తానికి సుందర్కు రీప్లేస్మెంట్గా ఉంటాడు. వన్డే సిరీస్ సందర్భంగా గాయపడిన సుందర్ న్యూజిలాండ్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. సుందర్ ప్రపంచకప్లో పాల్గొనేది కూడా అనుమానమేనని తెలుస్తుంది.సుందర్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో చికిత్స పొందుతున్నాడు. సుందర్కు స్కాన్స్లో సైడ్ స్ట్రెయిన్ ఇంజ్యూరీ అని తేలింది. దీంతో అతనికి దాదాపు మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఒకవేళ అతను త్వరగా కోలుకుంటే ప్రపంచకప్కు ఎంపికయ్యే అవకాశం ఉంది.శ్రేయస్ భారత్ తరఫున తన చివరి టీ20ని 2023 డిసెంబర్లో ఆస్ట్రేలియాతో ఆడారు. ఆతర్వాత అతను క్రమంగా టీమిండియా టీ20 సర్కిల్స్ నుంచి మాయమయ్యాడు. అయితే 2025 ఐపీఎల్లో అత్యుత్తమంగా రాణించడంతో శ్రేయస్కు భారత టీ20 జట్టులో స్థానం కల్పించాలని సర్వత్రా డిమాండ్లు వినిపించాయి. ఇప్పుడు తిలక్ గాయపడటంతో అతనికి ఊహించని విధంగా భారత టీ20 బెర్త్ దక్కింది. ఒకవేళ శ్రేయస్ న్యూజిలాండ్తో మొదటి మూడు టీ20ల్లో రాణిస్తే, ఆ సిరీస్ మొత్తానికి కొనసాగించడంతో పాటు ప్రపంచకప్కు కూడా ఎంపికయ్యే అవకాశం ఉంది. శ్రేయస్ గత ఐపీఎల్లో 175.07 స్ట్రయిక్రేట్తో 604 పరుగులతో సత్తా చాటడంతో, తన జట్టు పంజాబ్ కింగ్స్కు కెప్టెన్గా ఫైనల్స్కు కూడా చేర్చాడు.రవి బిష్ణోయ్ విషయానికి వస్తే.. ఈ కుడి చేతి వాటం లెగ్ స్పిన్ బౌలర్ చివరిగా 2025 జనవరిలో ఇంగ్లండ్తో జరిగిన టీ20లో భారత్కు ప్రాతినిథ్యం వహించాడు. ఆతర్వాత వరుణ్ చక్రవర్తి కారణంగా అతనికి అవకాశాలు రాలేదు. వరుణ్ దాదాపు ప్రతి మ్యాచ్లో రాణిస్తూ భారత స్పెషలిస్ట్ స్పిన్నర్ స్థానాన్ని కబ్జా చేశాడు. దీంతో బిష్ణోయ్కు అవకాశాలు రాలేదు. తాజాగా వాషింగ్టన్ సుందర్ గాయపడటంతో బిష్ణోయ్కు ఊహించని అవకాశం దక్కింది. తొలుత సుందర్ స్థానాన్ని మరో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్తో భర్తీ చేస్తారని అంతా అనుకున్నారు. రియాన్ పరాగ్ పేరు పరిశీలనలో కూడా ఉండింది. అయితే ఊహించని విధంగా భారత సెలెక్టర్లు స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన బిష్ణోయ్కు అవకాశం కల్పించారు. బిష్ణోయ్ ఇప్పటివరకు భారత్ తరఫున 42 టీ20ల్లో 61 వికెట్లు తీశాడు.న్యూజిలాండ్ టీ20 సిరీస్కు టీమిండియా (అప్డేటెడ్): సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్ (మొదటి మూడు మ్యాచ్లు), రవి బిష్ణోయ్ -
అతడి కారణంగానే రాజ్కోట్లో ఓడిపోయాం: ఇర్ఫాన్ పఠాన్
రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. 285 పరుగుల లక్ష్యాన్ని భారత బౌలర్లు కాపాడుకోలేకపోయారు. ఫాస్ట్ బౌలర్లతో పాటు స్పిన్నర్లు కూడా దారుణంగా విఫలమయ్యారు.భారత బౌలర్లు కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టారు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాట్తో పాటు బంతితో విఫలమైన ఆల్రౌండర్ రవీంద్ర జడేజాపై పఠాన్ విమర్శలు గుప్పించాడు. జడేజా నెమ్మదిగా ఆడడమే వల్లే భారత్ 300 పరుగులు దాటలేకపోయిందని పఠాన్ అభిప్రాయపడ్డాడు.రాజ్కోట్ వన్డేలో భారత్ స్కోర్ సునాయసంగా 300 పరుగుల మార్క్ దాటి ఉండేది. ఎల్ రాహుల్ అద్భుతంగా ఆడి 90 స్ట్రైక్ రేట్తో సెంచరీ చేస్తే.. జడేజా మాత్రం తన సొంత మైదానంలో 60 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. కనీసం 80 స్ట్రైక్ రేట్తో ఆడి ఉంటే భారత్ అదనంగా మరో 20-30 పరుగులు వచ్చేవి. జడేజా అద్భుతమైన ఆల్రౌండర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.టెస్ట్ క్రికెట్లో కపిల్ దేవ్ తర్వాత అంత పేరు తెచ్చుకున్న ఆల్రౌండర్గా జడ్డూ నిలిచాడు. కానీ వన్డేల్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోతున్నాడు. కనీసం స్ట్రైక్ రొటేట్ చేయడానికి కూడా అతడు కష్టపడుతున్నాడు.2020 తర్వాత జడేజా వన్డేల్లో ఇప్పటివరకు కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. గత ఐదు మ్యాచ్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఒక సీనియర్ ఆటగాడి నుంచి ఇలాంటి ప్రదర్శనలు జట్టుకు అస్సలు మంచిది కాదు. జడేజా స్థానంలో అక్షర్ పటేల్ను ఆడించడం బెటర్ అని తన యూట్యూబ్ ఛానల్లో పఠాన్ పేర్కొన్నాడు.చదవండి: అతడొక అద్భుతం.. కనీసం మూడో మ్యాచ్లోనైనా ఆడించండి: అశ్విన్ -
కనీసం మూడో మ్యాచ్లోనైనా ఆడించండి: అశ్విన్
రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియాకు ఘోర పరభావం ఎదురైన సంగతి తెలిసిందే. భారత్ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన కివీస్.. మూడు వన్డేల సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య సిరీస్ డిసైడర్ ఆదివారం(జనవరి 18) ఇండోర్ స్టేడియం వేదికగా జరగనుంది.అయితే తొలి రెండు వన్డేల్లో భారత స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ను బెంచ్కే పరిమితం చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. అర్ష్దీప్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నప్పటికి అతడికి తుది జట్టులో మాత్రం చోటు దక్కడం లేదు. హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణల వైపు టీమ్ మెనెజ్మెంట్ మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో అర్ష్దీప్ను కనీసం మూడో వన్డేలోనైనా తుది జట్టులోకి తీసుకోవాలని హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ను భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు."బౌలర్ల మధ్య తీవ్ర పోటీ ఉంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లకు అయితే హిట్-ది-డెక్ బౌలర్ అవసరం. కానీ న్యూజిలాండ్తో అటువంటి బౌలర్లు అవసరం లేదు. హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ వంటి బౌలర్లకు మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఈ విషయాన్ని నేను ఆర్ధం చేసుకోగలను. కానీ అర్ష్దీప్ గురుంచి ఎవరూ ఆలోచించడం లేదు.అతడు ఎంతో కష్టపడి ఈ స్ధాయికి చేరుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనలతో జట్టు విజయాల్లో భాగమయ్యాడు. అయినా ఇప్పటికీ అతడు జట్టులో స్థానం కోసం పోరాడుతున్నాడు. బ్యాటర్ల విషయంలో ఇలా ఎప్పుడూ జరగదు. ప్రతీసారి బౌలర్లే బలి అవుతున్నారు.అత్యుత్తమంగా రాణించినా బౌలర్లు కూడా తమ చోటును కాపాడుకోవడానికి నిరంతరం పోరాడాల్సి వస్తోంది. ఎక్కువ కాలం మ్యాచ్లు ఆడకుండా బెంచ్పై కూర్చోబెడితే, ఎంతటి గొప్ప బౌలర్ అయినా తన రిథమ్ను కోల్పోవాల్సి వస్తుంది. కనీసం మూడో వన్డేలోనైనా అతడికి ఛాన్స్ ఇవ్వండి" అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: T20 WC 2026: అతడి కోసం బీసీసీఐ 'ప్లాన్ బి'.. రేసులో స్టార్ ప్లేయర్లు -
జడేజా కథ ముగిసినట్లేనా? అతడే సరైన ప్రత్యామ్నాయం
టీమిండియా వెటరన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వన్డేలకు వీడ్కోలు చెప్పాల్సిన సమయం అసన్నమైందా? అంటే అవునానే సమాధనం ఎక్కువగా వినిపిస్తోంది. జడేజా టెస్టు క్రికెట్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నప్పటికి.. వన్డేల్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోతున్నాడు.ప్రస్తుతం న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లోనూ అతడి ఆట తీరు ఏ మాత్రం మారలేదు. తొలి వన్డేలో కూడా ఘోరంగా విఫలమైన జడేజా బుధవారం జరిగిన రెండో వన్డేలోనూ అదే తీరును కనబరిచాడు. ఈ మ్యాచ్లో జడేజా 8 ఓవర్లు వేసి వికెట్లేమీ తీయకుండా 44 పరుగులు సమర్పించుకున్నాడు.బ్యాటింగ్లోనూ కేవలం 27 పరుగులు చేశాడు. వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా సిరీస్ మధ్యలోనే వైదొలిగడంతో జడేజా ఒక్కడే సీనియర్ స్పిన్ ఆల్రౌండర్గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అక్షర్ పటేల్ను ఎందుకు వన్డే జట్టులోకి తీసుకోవడం లేదని సెలెక్టర్లను శ్రీకాంత్ ప్రశ్నించాడు. జడేజా పేలవ ఫామ్ గురుంచి కూడా అతడు మాట్లాడాడు."నాకు ఇష్టమైన ఆటగాళ్లలో జడేజా ఒకరు. కానీ అతడు ప్రస్తుతం పేలవ ఫామ్తో సతమతమవుతున్నాడు. బంతితో పాటు బ్యాట్తో కూడా రాణించలేకపోతున్నాడు. బంతిని అటాకింగ్గా వేయాలా లేక ఫ్లైట్ ఇచ్చి బ్యాటర్ను ట్రాప్ చేయాలా అనే విషయంలో అతడు కాస్త గందరగోళంగా ఉన్నాడు.ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో ఎందుకు ఆడకూడదు? ఆల్రౌండర్ అంటే మీడియం పేసరే ఉండాలనే రూల్ ఏమైనా ఉందా? రాజ్కోట్ వన్డేలో భారత్కు అదనపు స్పిన్నర్ లేని లోటు స్పష్టంగా కన్పించింది. అక్షర్ పటేల్ ఉండి ఉంటే బాగుండేది. అక్షర్ను ఎందుకు జట్టులోకి తీసుకోవడం లేదు? అతడొక అద్భుతమైన ఆల్రౌండర్. చాలా మ్యాచ్లలో జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. హార్దిక్ పాండ్యాకు సాటి వచ్చే ఆటగాడు దొరకడం కష్టం. కాబట్టి అత్యుత్తమ ఫామ్లో ఉన్న అక్షర్ పటేల్ను జట్టులోకి తీసుకోవడం బెటర్" అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. కాగా వాషీ స్దానంలో తుది జట్టులోకి పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.దీంతో మరోసారి భారత జట్టులో ఆల్రౌండర్ల కొరత కన్పిస్తోంది. ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికిన జడేజా.. ఇదే ఫామ్ కొనసాగితే వన్డేల నుంచి కూడా తప్పుకొనే అవకాశముంది. ఈ క్రమంలో జడేజాకు ప్రత్యామ్నాయంగా అక్షర్ పటేల్ పేరును చాలా మంది మాజీలు సూచిస్తున్నారు.చదవండి: ఇరగదీసిన అరంగేట్రం ఆటగాడు.. ప్లే ఆఫ్స్కు సన్రైజర్స్జడేజా తరహాలోనే ఎడమచేతి వాటం స్పిన్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం అక్షర్కు ఉంది. 2027 వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకుని, సెలక్టర్లు అక్షర్ పటేల్కే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. అక్షర్ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లోనూ సత్తాచాటాడు. అంతేకాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టులోనూ అతడు భాగంగా ఉన్నాడు. -
న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు కీలక ప్లేయర్ దూరం
త్వరలో న్యూజిలాండ్తో జరుగబోయే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. న్యూజిలాండ్తో తొలి వన్డే సందర్భంగా గాయపడిన కీలక ఆటగాడు వాషింగ్టన్ సుందర్.. టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. సుందర్ ప్రపంచకప్లో పాల్గొనేది కూడా అనుమానంగా మారింది. న్యూజిలాండ్ టీ20 సిరీస్కు వరల్డ్కప్కు ఒకే జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే.సుందర్కు ఏమైంది..?జనవరి 11న వడోదరలో జరిగిన తొలి వన్డేలో బౌలింగ్ చేస్తుండగా సుందర్ ఎడమ వైపు పక్కటెముకల ప్రాంతంలో తీవ్రమైన నొప్పి వచ్చింది. దీంతో అతను ఉన్నపళంగా మైదానం వదిలి వెళ్లాడు. అయితే, ఛేదనలో అతని బ్యాటింగ్ సేవలు జట్టుకు అవసరం కావడంతో రిస్క్ చేసి బరిలోకి దిగాడు. ఈ ప్రయత్నమే సుందర్ గాయాన్ని మరింత పెంచిందని వైద్యులు భావిస్తున్నారు. ఆ మ్యాచ్లో సుందర్ తనవంతుగా 7 పరుగులు చేసి జట్టు విజయంలో భాగమయ్యాడు. అనివార్యం కావడంతో బ్యాటింగ్ చేసిన సుందర్, ఆతర్వాత వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతని స్థానాన్ని ఆయుశ్ బదోనితో భర్తీ చేశాడు. సుందర్ గాయం తీవ్రత అధికంగా ఉండటంతో తాజాగా అతన్ని టీ20 సిరీస్ నుంచి కూడా తప్పించారు. టీ20లకు సుందర్ ప్రత్యామ్నాయాన్ని ఇంకా ప్రకటించలేదు. పరిస్థితలు చూస్తుంటే సుందర్ టీ20 వరల్డ్కప్కు కూడా అనుమానమేనని తెలుస్తుంది. పొట్టి ఫార్మాట్లో సుందర్ లాంటి కీలకమైన మిడిలార్డర్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ లేకపోవడం టీమిండియా విజయావాకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది. సుందర్ ఇటీవలికాలంలో పొట్టి ఫార్మాట్లో నమ్మదగిన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఏ సమయంలో అయినా బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉండటంతో పాటు 6,7 స్థానాల్లో సైతం సమర్దవంతంగా బ్యాటింగ్ చేయగలడు.రియాన్ పరాగ్ వస్తాడా..?న్యూజిలాండ్ టీ20 సిరీస్కు సుందర్కు ప్రత్యామ్నాయంగా రియాన్ పరాగ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. పరాగ్ ఐపీఎల్ 2025లో ఓ మోస్తరుకు మించి రాణించాడు. 32.75 సగటున 393 పరుగులు చేశాడు. ఒకవేళ పరాగ్కు న్యూజిలాండ్ సిరీస్లో అవకాశం వచ్చి రాణిస్తే.. ప్రపంచకప్కు కూడా ఎంపికయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఉపఖండంలో పిచ్లపై స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు చాలా కీలకం. మరోవైపు వన్డేల్లో సుందర్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఆయుశ్ బదోనీనే టీ20 సిరీస్కు కూడా కొనసాగించే అవకాశాలు కూడా లేకపోలేదు. -
మరో అరుదైన మైలురాయిని తాకిన రోహిత్ శర్మ
భారత దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ తన కెరీర్లో మరో అరుదైన మైలురాయిని తాకాడు. ఆసియా ఖండంలో 7000 వన్డే పరుగులు పూర్తి చేసుకున్న ఏడో బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో నిన్న (జనవరి 14) జరిగిన రెండో వన్డేలో ఈ ఫీట్ను సాధించాడు. రోహిత్కు ముందు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, కుమార సంగక్కర, సనత్ జయసూర్య, మహేళ జయవర్దనే ఆసియాలో 7000 వన్డే పరుగుల మైలురాయిని తాకారు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలి వన్డేలో అద్బుత విజయం సాధించిన టీమిండియాకు రెండో మ్యాచ్లో చుక్కెదురైంది. పర్యాటక న్యూజిలాండ్ చేతిలో 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా.. కేఎల్ రాహుల్ (112 నాటౌట్) సూపర్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ (56) అర్ద సెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లలో రోహిత్ శర్మ 24, విరాట్ కోహ్లి 23, శ్రేయస్ అయ్యర్ 8, రవీంద్ర జడేజా 27, నితీశ్ కుమార్ రెడ్డి 20, హర్షిత్ రాణా 2 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్ 3, జేమీసన్, ఫౌల్క్స్, లెన్నాక్స్, బ్రేస్వెల్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. డారిల్ మిచెల్ (131 నాటౌట్) అద్భుతమైన సెంచరీతో కదంతొక్కడంతో 47.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మిచెల్కు విల్ యంగ్ (87) సహకరించాడు. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ క్యామియో (మెరుపు ఇన్నింగ్స్) ఆడాడు. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు ఎంత శ్రమించినా మిచెల్, యంగ్ను నిలువరించలేకపోయారు. కుల్దీప్ యాదవ్ అయితే ఒక్క వికెట్ తీసి, ఏకంగా 82 పరుగులు సమర్పించుకున్నాడు. మిగతా బౌలర్లది కూడా అదే పరిస్థితి. హర్షిత్, ప్రసిద్ద్ తలో వికెట్ తీసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కాగా, ఈ సిరీస్లో నిర్ణయాత్మక మూడో వన్డే ఇండోర్ వేదికగా జనవరి 18న జరుగనుంది. -
అందుకు మూల్యం చెల్లించుకున్నాం.. రెండో వన్డేలో ఓటమిపై గిల్ కామెంట్స్
రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో నిన్న (జనవరి 14) జరిగిన రెండో వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా.. మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (112 నాటౌట్) సూపర్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ (56) అర్ద సెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లలో రోహిత్ శర్మ 24, విరాట్ కోహ్లి 23, శ్రేయస్ అయ్యర్ 8, రవీంద్ర జడేజా 27, నితీశ్ కుమార్ రెడ్డి 20, హర్షిత్ రాణా 2 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్ 3, జేమీసన్, ఫౌల్క్స్, లెన్నాక్స్, బ్రేస్వెల్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. డారిల్ మిచెల్ (131 నాటౌట్) అద్భుతమైన సెంచరీతో కదంతొక్కడంతో 47.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మిచెల్కు విల్ యంగ్ (87) సహకరించాడు. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ క్యామియో (మెరుపు ఇన్నింగ్స్) ఆడాడు. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు ఎంత శ్రమించినా మిచెల్, యంగ్ను నిలువరించలేకపోయారు. కుల్దీప్ యాదవ్ అయితే ఒక్క వికెట్ తీసి, ఏకంగా 82 పరుగులు సమర్పించుకున్నాడు. మిగతా బౌలర్లది కూడా అదే పరిస్థితి. హర్షిత్, ప్రసిద్ద్ తలో వికెట్ తీసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ సైతం తమ బౌలింగ్ ప్రదర్శనపై పెదవి విరిచాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోవడం వల్ల మూల్యం చెల్లించుకున్నామని అన్నాడు. అదనంగా 15-20 పరుగులు చేసినా ఫలితం ఇలాగే ఉండేదని అభిప్రాయపడ్డాడు. బోర్డుపై మంచి స్కోర్ ఉంచినా, మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోవడమే మ్యాచ్ను తమ చేతి నుంచి లాగేసుకుందని తెలిపాడు.మరిన్ని విషయాలు గిల్ మాటల్లో.. 10–15 ఓవర్లలో బంతి కాస్త కదిలి బౌలర్లకు సహకరించింది. కానీ 20–25 ఓవర్ల తర్వాత పిచ్ స్థిరపడింది. మధ్య ఓవర్లలో మేము మరింత ధైర్యంగా బౌలింగ్ చేసి, రిస్క్ తీసుకొని ఉండాల్సింది. అలా చేసుంటే ఫలితం వేరుగా ఉండేది.ఫీల్డింగ్ లోపాలు కూడా జట్టును ఇబ్బందుల్లోకి నెట్టాయి. గత మ్యాచ్లో కూడా కొన్ని అవకాశాలు వదిలేశాం. ఫీల్డింగ్లో మెరుగుపడటానికి ప్రయత్నిస్తాం. అవకాశాలు వదిలేస్తే మాత్రం ఈ ఫార్మాట్లో ఓటమి తప్పదని గిల్ అభిప్రాయపడ్డాడు. మొత్తంగా గిల్ బౌలింగ్పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి మ్యాచ్ గెలవగా.. తాజాగా న్యూజిలాండ్ రెండో వన్డే గెలిచింది. ఈ సిరీస్లో నిర్ణయాత్మక మూడో వన్డే ఇండోర్ వేదికగా జనవరి 18న జరుగనుంది. -
న్యూజిలాండ్దే పైచేయి...
భారత్ వరుసగా గత ఎనిమిది వన్డేల్లో న్యూజిలాండ్ను ఓడిస్తూ వచ్చి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఎట్టకేలకు ఈ జోరును కివీస్ ముగించగలిగింది. ముందుగా సమష్టి బౌలింగ్తో భారత్కు 300 పరుగులు కూడా దాటనీయకుండా నిలువరించిన జట్టు... ఆ తర్వాత మిచెల్, విల్ యంగ్ పదునైన బ్యాటింగ్తో విజయాన్ని సొంతం చేసుకుంది. మన బౌలర్లంతా విఫలం కాగా, అంతకుముందు కేఎల్ రాహుల్ చేసిన అజేయ సెంచరీ వృథా అయింది. రాజ్కోట్: భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ 1–1తో సమమైంది. బుధవారం జరిగిన రెండో మ్యాచ్లో కివీస్ 7 వికెట్ల తేడాతో భారత్పై గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (92 బంతుల్లో 112 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకం సాధించాడు. కెపె్టన్ శుబ్మన్ గిల్ (53 బంతుల్లో 56; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ నమోదు చేశాడు. అనంతరం న్యూజిలాండ్ 47.3 ఓవర్లలో 3 వికెట్లకు 286 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డరైల్ మిచెల్ (117 బంతుల్లో 131 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్లు), విల్ యంగ్ (98 బంతుల్లో 87; 7 ఫోర్లు) మూడో వికెట్కు 25.2 ఓవర్లలో 162 పరుగులు జోడించి జట్టు గెలుపును సులువు చేశారు. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డే ఆదివారం ఇండోర్లో జరుగుతుంది. కీలక భాగస్వామ్యాలు... భారత్ ఇన్నింగ్స్ను రోహిత్ శర్మ (38 బంతుల్లో 24; 4 ఫోర్లు), గిల్ నెమ్మదిగా ప్రారంభించారు. ఫలితంగా తొలి 5 ఓవర్లలో 10 పరుగులే వచ్చాయి. అయితే తాను ఆడిన తర్వాతి 10 బంతుల్లో రోహిత్ 4 ఫోర్లు కొట్టగా, ఫోక్స్ ఓవర్లో గిల్ వరుసగా 4, 6 కొట్టడంతో 3 ఓవర్లలో భారత్ 33 పరుగులు రాబట్టింది. 10 ఓవర్లలో జట్టు స్కోరు 57 పరుగులకు చేరింది. 70 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం తర్వాత రోహిత్ వెనుదిరగ్గా, 47 బంతుల్లో గిల్ అర్ధసెంచరీ పూర్తయింది. ఈసారి విరాట్ కోహ్లి (29 బంతుల్లో 23; 2 ఫోర్లు) ఎక్కువ ప్రభావం చూపలేకపోయాడు. గత ఐదు ఇన్నింగ్స్లలో వరుసగా 74, 135, 102, 65, 93 చేసిన అతను ఈ మ్యాచ్లో అర్ధసెంచరీ అందుకోలేకపోయాడు. కివీస్ మెరుగైన బౌలింగ్ ప్రదర్శనతో 19 పరుగుల వ్యవధిలో భారత్ గిల్, శ్రేయస్ అయ్యర్ (8), కోహ్లి వికెట్లు కోల్పోయింది. మధ్య ఓవర్లలో న్యూజిలాండ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఒక దశలో 62 బంతుల పాటు ఒక్క ఫోర్ కూడా రాలేదు! ఇలాంటి స్థితిలో రాహుల్ రెండు కీలక భాగస్వామ్యాలతో జట్టును ఆదుకున్నాడు. ముందుగా జడేజా (44 బంతుల్లో 27; 1 ఫోర్)తో ఐదో వికెట్కు 73 పరుగులు జోడించిన రాహుల్... ఆ తర్వాత ఆరో వికెట్కు నితీశ్ కుమార్ రెడ్డి (21 బంతుల్లో 20; 1 సిక్స్)తో 57 పరుగులు జత చేశాడు. హర్షిత్ రాణా (2) విఫలం కాగా 48 ఓవర్లు ముగిసేసరికి రాహుల్ 88 పరుగులతో ఉన్నాడు. జేమీసన్ వేసిన 49వ ఓవర్లో తొలి 5 బంతుల్లో 8 పరుగులు రాబట్టిన అతను... ఆఖరి బంతిని లాంగాన్ మీదుగా భారీ సిక్సర్గా మలచి 87 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బౌలర్లు విఫలం... లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ కూడా ఆరంభంలో తడబడింది. పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో భారత్ పేస్ బౌలింగ్నే ఎక్కువసేపు కొనసాగించింది. పేసర్లే వేసిన తొలి 15 ఓవర్లలో కివీస్ 64 పరుగులు మాత్రమే చేసి కాన్వే (16), నికోల్స్ (10) వికెట్లు కోల్పోయింది. అయితే మిచెల్, యంగ్ పట్టుదలగా క్రీజ్లో నిలబడి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముందుగా నిలదొక్కుకోవడంపై దృష్టి పెట్టిన వీరిద్దరు ఆ తర్వాత స్వేచ్ఛగా ఆడుతూ పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో ముందుగా మిచెల్ 52 బంతుల్లో, ఆ తర్వాత యంగ్ 68 బంతుల్లో హాఫ్ సెంచరీలను అందుకున్నారు. ఈ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. కుల్దీప్ బౌలింగ్లో 80 పరుగుల వద్ద మిచెల్ ఇచ్చిన క్యాచ్ను బౌండరీ వద్ద ప్రసిధ్ వదిలేయడం కూడా జట్టుకు కలిసొచి్చంది. ఎట్టకేలకు కుల్దీప్ తర్వాతి ఓవర్లో యంగ్ వెనుదిరగడం భారత్కు కాస్త ఊరటనిచి్చంది. అయితే మిచెల్ మాత్రం తగ్గలేదు. 96 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న అతను... గ్లెన్ ఫిలిప్స్ (25 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు 1 సిక్స్)తో కలిసి మరో 15 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ను ముగించాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) యంగ్ (బి) క్లార్క్ 24; గిల్ (సి) మిచెల్ (బి) జేమీసన్ 56; కోహ్లి (బి) క్లార్క్ 23; అయ్యర్ (సి) బ్రేస్వెల్ (బి) క్లార్క్ 8; రాహుల్ (నాటౌట్) 112; జడేజా (సి అండ్ బి) బ్రేస్వెల్ 27; నితీశ్ రెడ్డి (సి) ఫిలిప్స్ (బి) ఫోక్స్ 20; హర్షిత్ (సి) బ్రేస్వెల్ (బి) లెనాక్స్ 2; సిరాజ్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 10; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 284. వికెట్ల పతనం: 1–70, 2–99, 3–115, 4–118, 5–191, 6–248, 7–256. బౌలింగ్: జేమీసన్ 10–2–70–1, ఫోక్స్ 9–0–67–1, క్లార్క్ 8–0–56–3, లెనాక్స్ 10–0–42–1, బ్రేస్వెల్ 10–1–34–1, ఫిలిప్స్ 3–0–13–0. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (బి) హర్షిత్ 16; నికోల్స్ (బి) ప్రసిధ్ 10; యంగ్ (సి) నితీశ్ (బి) కుల్దీప్ 87; మిచెల్ (నాటౌట్) 131; ఫిలిప్స్ (నాటౌట్) 32; ఎక్స్ట్రాలు 10; మొత్తం (47.3 ఓవర్లలో 3 వికెట్లకు) 286. వికెట్ల పతనం: 1–22, 2–46, 3–208. బౌలింగ్: సిరాజ్ 9–0–41–0, హర్షిత్ 9.3–1–52–1, ప్రసిధ్ 9–0–49–1, నితీశ్ రెడ్డి 2–0–13–0, జడేజా 8–0–44–0, కుల్దీప్ 10–0–82–1. -
రాహుల్ సెంచరీ వృథా.. రాజ్కోట్ వన్డేలో టీమిండియా ఓటమి
రాజ్కోట్ వేదికగా భారత్తో జరిగిన రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను 1-1తో బ్లాక్ క్యాప్స్ జట్టు సమం చేసింది. 285 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ఆడుతూ పడుతూ 47.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. మిడిలార్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మిచెల్ అజేయ శతకంతో చెలరేగాడు.117 బంతులు ఎదుర్కొన్న మిచెల్.. 11 ఫోర్లు, 2 సిక్స్లతో 131 పరుగులు చేశాడు. అతడితో విల్ యంగ్ కూడా కీలక నాక్ ఆడాడు. యంగ్ 98 బంతుల్లో 87 పరుగులు చేసి ఔటయ్యాడు. చివరిలో గ్లెన్ ఫిలిప్స్ (25 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్తో 32) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. కుల్దీప్ యాదవ్, ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ రాణా తలా వికెట్ సాధించారు.రాహుల్ సెంచరీ వృథా..అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(12) విరోచిత శతకంతో చెలరేగగా.. కెప్టెన్ శుభ్మన్ గిల్(56) హాఫ్ సెంచరీతో రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టేన్ క్లార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. జేమీసన్, పౌల్క్స్, బ్రెస్వెల్ తలా వికెట్ సాధించారు. ఇక సిరీస్ డిసైడర్ మూడో వన్డే ఇండోర్ వేదికగా జనవరి 18న జరగనుంది. -
వారెవ్వా హర్షిత్.. దెబ్బకు ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది! వీడియో
టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా మరోసారి బంతితో అద్భుతం చేశాడు. న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వేను సంచలన బంతితో రాణా క్లీన్ బౌల్డ్ చేశాడు. 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్కు ఓపెనర్లు కాన్వే, హెన్రీ నికోల్స్ ఘనమైన ఆరంభాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించారు.కానీ భారత పేసర్లు రాణా, సిరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ఓపెనర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఈ క్రమంలో కివీస్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో రాణా వేసిన అద్భుతమైన డెలివరీకి కాన్వే దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఈ ఢిల్లీ పేసర్ కాన్వేకు గుడ్ లెంగ్త్ బాల్గా సంధించాడు.బంతి ఆఫ్ స్టంప్ దగ్గర పిచ్ అయ్యి లోపలికి దూసుకొచ్చింది. కాన్వే ఆ బంతిని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో బంతి నేరుగా వెళ్లి ఆఫ్ స్టంప్ను గిరాటేసింది. వెంటనే హర్షిత్ రాణా తనదైన శైలిలో దూకుడుగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు.కెప్టెన్ శుభ్మన్ గిల్ వైపు వేలు చూపిస్తూ చెప్పా కాదా అంటూ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అంతకుముందు తొలి వన్డేలో రాణా రెండు వికెట్లతో పాటు 29 పరుగులు చేశాడు. తనపై విమర్శలు చేస్తున్నవారికి తన ప్రదర్శనలతో రాణా సమాధనమిస్తున్నాడు. కాగా ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్(112) అజేయ సెంచరీతో మెరిశాడు.చదవండి: క్రికెట్కు వీడ్కోలు పలికిన మిస్టరీ స్పిన్నర్Off stump out of the ground 🔥🔥Harshit Rana gets the opening wicket in fine fashion! ⚡️Updates ▶️ https://t.co/x1fEenI0xl#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/mYvTSD273W— BCCI (@BCCI) January 14, 2026 -
'గంభీర్ సపోర్ట్తో అతడిని సెలెక్ట్ చేశారు'.. క్లారిటీ ఇచ్చిన బ్యాటింగ్ కోచ్
న్యూజిలాండ్తో ఆఖరి రెండు వన్డేలకు భారత జట్టులో ఢిల్లీ బ్యాటర్ అయూశ్ బదోనికి చోటు దక్కిన సంగతి తెలిసిందే. స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా సిరీస్ మధ్యలోనే వైదొలగడంతో బదోనికి సెలక్టర్లు పిలుపునిచ్చారు.అయితే సెలెక్టర్ల నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫామ్లో ఉన్న రియాన్ పరాగ్, రింకూ సింగ్ వంటి ఆటగాళ్లని కాదని బదోనిని తీసుకోవడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. గంభీర్ సపోర్ట్ వల్లే అతడిని అనుహ్యంగా జట్టులోకి తీసుకున్నారని మరికొంతమంది విమర్శిస్తున్నారు.కాగా బదోని ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడతున్నాడు. గతంలో లక్నో మెంటార్గా గౌతీ పనిచేశాడు. అతడి గైడెన్స్లో బదోని మరింత రాటుదేలాడు. అంతేకాకుండా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో బదోని ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.గంభీర్ కూడా ఢిల్లీ నుంచే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన విషయం విధితమే. ఈ కారణాలతో అయూశ్ వైపు మొగ్గు చూపాడని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. ఇక తాజాగా ఇదే విషయంపై భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కేవలం అతడిని టాలెంట్ ఆధారంగానే జట్టులోకి తీసుకున్నామని తెలిపాడు."అయూశ్ దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నాడు. భారత్-ఎ జట్టు తరపున కూడా అతడు వన్డే మ్యాచ్లు ఆడాడు. బదోని బ్యాటింగ్తో పాటు ఆఫ్ బ్రేక్ బౌలింగ్ కూడా చేయగలడు. కేవలం ఐదుగురు బౌలర్లతో మాత్రమే ఆడడం సరైన నిర్ణయం కాదు.ఒకవేళ ప్రధాన బౌలర్లలో ఎవరైనా మ్యాచ్ మధ్యలో గాయపడితే, ఆ ఓవర్లను భర్తీ చేయడానికి ఆరో బౌలింగ్ ఆప్షన్ ఖచ్చితంగా ఉండాలి. బదోని అవసరమైతే 3 నుండి 5 ఓవర్ల వరకు బౌలింగ్ చేయగలడు. అందుకే అతడిని జట్టులోకి తీసుకున్నాము" అని రెండో వన్డేకు ముందు విలేకరుల సమావేశంలో కోటక్ పేర్కొన్నాడు.చదవండి: BBL: పాక్ ప్లేయర్కు ఘోర అవమానం.. బ్యాటింగ్ మధ్యలోనే పిలిచేశారు -
కేఎల్ రాహుల్ సెంచరీ.. భారత్ స్కోరెంతంటే?
రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో జరగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 120 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును రాహుల్ తన సెంచరీతో ఆదుకున్నాడు.టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్కు వీరిద్దరూ 70 పరుగుల భాగస్వామమ్యం నెలకొల్పారు. రోహిత్(24) ఔటయ్యాక గిల్(56), శ్రేయస్ అయ్యర్(8), విరాట్ కోహ్లి(23) వెంటవెంటనే పెవిలియన్కు చేరారు.ఈ క్రమంలో రాహుల్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(27)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. జడేజా ఔటైనప్పటికి రాహుల్ మాత్రం తన ఏకాగ్రతను కోల్పోలేదు. ఆచితూచి ఆడుతూ 87 బంతుల్లో తన ఎనిమిదివ వన్డే సెంచరీ మార్క్ను కేఎల్ అందుకున్నాడు.ఫలితంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. మొత్తంగా రాహుల్ 92 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, ఒక సిక్సర్తో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టేన్ క్లార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. జేమీసన్, పౌల్క్స్చ, బ్రెస్వెల్ తలా వికెట్ సాధించారు.చదవండి: BBL: పాక్ ప్లేయర్కు ఘోర అవమానం.. బ్యాటింగ్ మధ్యలోనే పిలిచేశారు -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ ఆల్టైమ్ రికార్డు బ్రేక్
రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తన మార్క్ చూపించలేకపోయాడు. తొలి వన్డేలో 93 పరుగులతో సత్తాచాటిన కోహ్లి.. రెండో వన్డేలో మాత్రం నామమాత్రపు స్కోర్కే పరిమితమయ్యాడు.29 బంతుల్లో 23 పరుగులు చేసి క్లార్క్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. అయితే ఈ మ్యాచ్లో విరాట్ భారీ ఇన్నింగ్స్ ఆడనప్పటికి ఓ అరుదైన రికార్డు మాత్రం తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా కింగ్ కోహ్లి చరిత్ర సృష్టించాడు.4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతడు ఈ ఫీట్ సాధించాడు. కోహ్లి ఇప్పటివరకు కివీస్పై వన్డేల్లో 1770 పరుగులుచ చేశాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(1750)ను కోహ్లి అధిగమించాడు. ఓవరాల్గా ఈ ఫీట్ సాధించిన జాబితాలో కోహ్లి రెండో స్ధానంలో నిలిచాడు.అగ్రస్ధానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(1,971) కొనసాగుతున్నాడు. తొలి వన్డేలో కోహ్లి కూడా పలు అరుదైన రికార్డులు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంతవేగంగా 28,000 పరుగులు మైలు రాయిని అందుకున్న ప్లేయర్గా సచిన్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు.అదేవిధంగా ఇంటర్ననేషనల్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లి రెండో స్ధానానికి ఎగబాకాడు. కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. వన్డే వరల్డ్కప్-2027 లక్ష్యంగా దూసుకుపోతున్నాడు.చదవండి: రోహిత్ శర్మను కిందికి దించి అగ్రపీఠాన్ని అధిరోహించిన విరాట్ కోహ్లి -
రోహిత్ శర్మను కిందికి దించి అగ్రపీఠాన్ని అధిరోహించిన విరాట్ కోహ్లి
ఐసీసీ ఇవాళ (జనవరి 14) విడుదల చేసిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా ఫ్యాన్స్కు మిశ్రమ అనుభవాలు ఎదురయ్యాయి. దిగ్గజ బ్యాటర్లలో ఒకరు టాప్ ర్యాంక్కు చేరుకొని సొంత అభిమానుల్లో ఆనందం నింపగా.. అప్పటికే టాప్ ప్లేస్లో ఉన్న మరో ఆటగాడు రెండు స్థానాలు కోల్పోయి, పర్సనల్ ఫ్యాన్స్ను నిరాశకు గురి చేశాడు. ఇంతకీ ఆ దిగ్గజ బ్యాటర్లు ఎవరంటే..?విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ. విరాట్ తాజాగా న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో 93 పరుగులు చేయడంతో ర్యాంకింగ్స్లో ఓ స్థానం మెరుగుపర్చుకొని టాప్ ర్యాంక్కు చేరాడు. అప్పటికే టాప్ ప్లేస్లో ఉండిన రోహిత్ శర్మ న్యూజిలాండ్పై కేవలం 26 పరుగులకే పరిమితం కావడంతో రెండు స్థానాలు కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. అదే మ్యాచ్లో 84 పరుగులతో సత్తా చాటిన న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ ఓ స్థానం మెరుగపర్చుకొని రెండో స్థానానికి ఎగబాకాడు. అదే మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ (29 నాటౌట్) ఆడిన కేఎల్ రాహుల్ ఓ స్థానం మెరుగుపర్చుకొని, 11వ స్థానానికి చేరాడు. టాప్-10లో భారత్ తరఫున మరో ఇద్దరు ఆటగాళ్లు కూడా ఉన్నారు. శుభ్మన్ గిల్ 5, శ్రేయస్ అయ్యర్ 10 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇవి మినహా ఈ వారం ర్యాంకింగ్స్లో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు.బౌలర్ల విషయానికొస్తే.. టాప్-10లో ఒక్క మార్పు కూడా లేదు. రషీద్ ఖాన్, జోఫ్రా ఆర్చర్, కుల్దీప్ యాదవ్ టాప్-3గా కొనసాగుతున్నారు. భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఈ వారం ర్యాంకింగ్స్లో గణనీయంగా లబ్ది పొందాడు. న్యూజిలాండ్పై తొలి వన్డేలో 2 వికెట్లు తీయడంతో ఐదు స్థానాలు మెరుగుపర్చుకొని 16వ స్థానానికి చేరాడు. అదే మ్యాచ్లో ఘోరంగా విఫలమైన మరో టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా ఐదు స్థానాలు కోల్పోయి 21వ ప్లేస్కు పడిపోయాడు.ఆల్రౌండర్ల విషయానికొస్తే.. ఒమర్జాయ్, సికందర్, మొహమ్మద్ నబీ టాప్-3లో కొనసాగుతుండగా.. భారత్ తరఫున అక్షర్ పటేల్ పదో స్థానంలో నిలిచాడు. -
న్యూజిలాండ్తో రెండో వన్డే.. టీమిండియా బ్యాటింగ్
రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (జనవరి 14) జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాస్ ఓడింది. ప్రత్యర్థి ఆహ్వానం మేరకు భారత్ తొలుత బ్యాటింగ్కు దిగనుంది. ఈ మ్యాచ్లో భారత్ ఓ మార్పుతో బరిలోకి దిగుతుంది. తొలి వన్డే సందర్భంగా గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు న్యూజిలాండ్ కూడా ఓ మార్పు చేసింది. ఆ జట్టు తరఫున జేడన్ లెన్నాక్స్ (ఆదిత్య అశోక్ స్థానంలో) అరంగేట్రం చేయనున్నాడు. కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి వన్డే గెలిచి 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్వెల్(c), జకారీ ఫౌల్క్స్, జేడెన్ లెన్నాక్స్, కైల్ జామిసన్, క్రిస్టియన్ క్లార్క్భారత్: రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ -
భారత జట్టులోకి అనూహ్య ఎంట్రీ.. బదోని ఎంపికకు గల కారణాలివే?
ఢిల్లీ స్టార్ బ్యాటర్ అయూశ్ బదోని తన చిరకాల స్వప్నాన్ని నేరవేర్చుకునేందుకు అడుగు దూరంలో నిలిచాడు. 26 ఏళ్ల బదోని భారత తరపున అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమైంది. న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్ నుంచి స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా వైదొలగడంతో అనుహ్యంగా బదోనికి సెలెక్టర్లు పిలుపునిచ్చారు.అయితే బుధవారం రాజ్కోట్ వేదికగా జరగనున్న రెండో వన్డేలో బదోని డెబ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. వాషీ స్ధానంలో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్గా అతడిని తుది జట్టులోకి తీసుకోనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. నితీశ్ కుమార్ రెడ్డి మరో ఆల్రౌండర్గా ఉన్నప్పటికి.. బదోని వైపే టీమ్ మెనెజ్మెంట్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఎందుకంటే ఫాస్ట్ బౌలర్లగా సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ ఎలాగో తుది జట్టులో ఉంటారు. స్పిన్నర్లగా కుల్దీప్ యాదవ్, జడేజా ఇద్దరు మాత్రమే ఉన్నారు. బ్యాకప్గా మరొక స్పిన్ అప్షన్(బదోని) ఉంటే బెటర్ అని గంభీర్ అండ్ కో భావిస్తుందంట.బదోని సెలక్షన్ వెనుక కారణాలు ఇవే..అయితే అనుహ్యంగా బదోనిని జట్టులోకి తీసుకోవడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. కానీ టీమ్ మేనెజ్మెంట్, సెలక్టర్లు అతడిపై నమ్మకం ఉంచడానికి బలమైన కారణాలు ఉన్నాయి. బదోనికి దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన రికార్డు ఉంది. ముఖ్యంగా మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసే సత్తా అతడికి ఉంది.ఢిల్లీ తరపున నాలుగు లేదా ఐదో స్ధానంలో బ్యాటింగ్కు వస్తుంటాడు. శ్రేయస్ అయ్యర్ తర్వాత జట్టుకు సరైన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అవసరమని భావించిన గంభీర్.. బదోనిని రికమెండ్ చేశాడు. అంతేకాకుండా సుందర్ లాగే బదోని కూడా ఆఫ్-బ్రేక్ బౌలింగ్ చేయగలడు. డొమాస్టిక్ క్రికెట్ టోర్నీలో అతడు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తున్నాడు. ఆల్రౌండర్గా అతడికి మంచి స్కిల్స్ ఉన్నాయి.క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని తట్టుకుని ఆడటంలో బదోని దిట్ట. పరిస్థితులకు తగ్గట్టు అతడు బ్యాటింగ్ చేయగలడు. లిస్ట్-ఎ క్రికెట్లో బదోని ఇప్పటివరకు 27 మ్యాచ్లు ఆడి 693 పరుగులతో పాటు పది వికెట్లు పడగొట్టాడు. అతడిని ఫినిషర్గా కూడా ఉపయోగించుకోవచ్చు.ఐపీఎల్లో కూడా అతడు లక్నో తరపున ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలోనూ ఆల్రౌండర్గా బదోని సత్తాచాటాడు. అయితే క్వార్టర్ ఫైనల్కు అతడు దూరం కావడంతో విదర్భ చేతిలో ఢిల్లీ ఓటమి పాలైంది.పంత్ స్దానంలో జురెల్..అదేవిధగా కివీస్తో వన్డే సిరీస్ నుంచి స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కూడా గాయం కారణంగా తప్పుకొన్నాడు. అతడి స్ధానంలో ధ్రువ్ జురెల్ను జట్టులోకి తీసుకున్నారు. ఇషాన్ కిషన్ను ఎంపిక చేస్తారని ప్రచారం జరిగినప్పటికి జురెల్ వైపే సెలక్టర్లు మొగ్గు చూపారు. విజయ్ హజారే ట్రోఫీలో జురెల్ సెంచరీల మోత మ్రోగించాడు.చదవండి: IND vs NZ: చరిత్రకు అడుగు దూరంలో శ్రేయస్ అయ్యర్ -
డబ్బులిచ్చైనా న్యూజిలాండ్ క్యాంప్లో చేరుతా: అశ్విన్
వడోదర వేదికగా టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ పోరాడి ఓడిన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆతిథ్య జట్టుకు కివీస్ గట్టి పోటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టుపై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.సీనియర్లు లేనప్పటికి పర్యాటక జట్టు పోరాట పటిమను అశ్విన్ కొనియాడాడు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకురేందుకు కివీస్ బౌలర్లు ఆఖరి వరకు శ్రమించారు. కానీ దురదృష్టవశాత్తు 4 వికెట్ల తేడాతో బ్లాక్క్యాప్స్ జట్టు ఓటమి పాలైంది."చాలా అగ్రశ్రేణి జట్లు డేటా లేదా అనలిటిక్స్ మీద ఆధారపడవు. కానీ న్యూజిలాండ్ మాత్రం అందుకు భిన్నం. ప్రత్యర్ధి జట్టుకు సంబంధించి ప్రతీ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. వ్యూహాలు రచించడం, వాటిని విజయవంతంగా అమలు చేయడంలో కివీస్ దిట్ట. బ్లాక్ క్యాప్స్ తమ ప్రణాళికలను ఎలా అమలు చేస్తారో తెలుసుకోవడానికి, వారి టీమ్ మీటింగ్లలో పాల్గోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను.అవసరమైతే దానికోసం డబ్బులు చెల్లించడానికైనా నాకు అభ్యంతరం లేదు" అని అశ్విన్ పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్కు కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్, రచిన్ రవీంద్ర, మాట్ హెన్రీ, శాంట్నర్ వంటి కివీ స్టార్ ప్లేయర్లు దూరమయ్యారు. దీంతో బ్లాక్ క్యాప్స్ జట్టు కెప్టెన్గా మైఖల్ బ్రెస్వేల్ వ్యవహరిస్తున్నాడు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే బుధవారం రాజ్కోట్ వేదికగా జరగనుంది.చదవండి: IND vs NZ: చరిత్రకు అడుగు దూరంలో శ్రేయస్ అయ్యర్ -
చరిత్రకు అడుగు దూరంలో శ్రేయస్ అయ్యర్
టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన రీఎంట్రీలో సత్తాచాటిన సంగతి తెలిసిందే. వడోదర వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతుల్లో 49 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఇప్పుడు రాజ్కోట్ వేదికగా జరగనున్న రెండో వన్డేలోనూ అదే జోరును కొనసాగించాలని ఈ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ఉవ్విళ్లురుతున్నాడు. అయితే ఈ మ్యాచ్కు ముందు అయ్యర్కు ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. శ్రేయస్ తన వన్డే కెరీర్లో 3000 పరుగుల మార్కును చేరుకోవడానికి కేవలం 34 పరుగుల దూరంలో ఉన్నాడు.రాజ్కోట్ వన్డేలో శ్రేయస్ మరో 34 పరుగులు చేస్తే.. అత్యంతవేగంగా(ఇన్నింగ్స్లు పరంగా) ఈ ఫీట్ అందుకున్న భారత ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఈ ముంబైకర్ ఇప్పటివరకు 68 వన్డే ఇన్నింగ్స్లలో 2966 పరుగులు చేశాడు.ప్రస్తుతం ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్(72 ఇన్నింగ్స్లు) తొలి స్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్ధానాల్లో విరాట్ కోహ్లి(75), కేఎల్ రాహుల్(78) ఉన్నారు. ఇప్పుడు వీరిందరిని అధిగమించేందుకు సర్పంచ్ సాబ్ సిద్దమయ్యాడు.శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం భారత వన్డే జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా నాలుగో స్ధానంలో అయ్యర్ను మించిన ఆటగాడు కన్పించడం లేదు. 2017 నుండి 2021 మధ్య కాలంలో టీమిండియా మెనెజ్మెంట్ దాదాపు నాలుగవ స్దానం కోసం దాదాపు 13 మంది ఆటగాళ్లను మార్చింది. ఒక్కరు కూడా 500 పరుగుల మార్కును కూడా దాటలేదు. కానీ అయ్యర్ మాత్రం ఆ లోటును భర్తీ చేశాడు. ఈ స్ధానంలో అయ్యర్ 54.77 సగటుతో 1479 పరుగులు సాధించాడు.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఆసీస్ క్రికెట్ దిగ్గజం -
అచ్చం నాలాగే..: రోహిత్తో కోహ్లి ఏం చెప్పాడంటే..
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లికి ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెద్దోళ్లే కాదు చిన్న పిల్లలూ అతడి ఫ్యాన్స్ జాబితాలో ఉంటారు. ఇటీవల న్యూజిలాండ్తో తొలి వన్డేకు ముందు ఓ ‘బుల్లి’ అభిమాని కోహ్లిని కలిశాడు.ఇందులో ప్రత్యేకత ఏముంది అంటారా?.. ఆ చోటా ఫ్యాన్ కోహ్లి బాల్యంలో ఎలా ఉండేవాడో అచ్చం అలాగే ఉండటం ఇక్కడ విశేషం. ఈ విషయాన్ని కోహ్లి (Virat Kohli)నే స్వయంగా అంగీకరించాడు. అంతేకాదు రోహిత్ శర్మ (Rohit Sharma)తోనూ ఇదే విషయం చెప్పాడు. స్వదేశంలో కివీస్తో వన్డే సిరీస్తో టీమిండియా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా వడోదరలో ఇరుజట్ల మధ్య ఆదివారం తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్కు ముందు కోహ్లిని ఓ పిల్లాడు కలిశాడు. ఈ క్రమంలో కోహ్లి తనను చూసి ఎలా స్పందించాడో తాజాగా చెప్పుకొచ్చాడు. ‘‘కోహ్లి అని పిలిచి.. హాయ్ చెప్పాను.నా డూప్లికేట్ అక్కడ కూర్చున్నాడుఒక్క నిమిషంలో వస్తాను అని కోహ్లి నాతో అన్నాడు. అంతలోనే రోహిత్ శర్మవైపు తిరిగి.. ‘నా డూప్లికేట్ (Young Virat Kohli Doppelganger) అక్కడ కూర్చున్నాడు చూడు’ అని చెప్పాడు. అక్కడున్న వాళ్లంతా నన్ను చోటా చీకూ అని పిలిచారు’’ అంటూ ఆ బుడ్డోడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.93 పరుగులుకాగా కోహ్లి ముద్దుపేరు చీకూ అన్న విషయం తెలిసిందే. తనలాగే ఉన్న ఆ పిల్లాడిని కలిసి.. అతడికి ఫొటోగ్రాఫ్ కూడా ఇచ్చి ఖుషీ చేశాడు కోహ్లి. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి వన్డేలో భారత్ న్యూజిలాండ్పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది.కివీస్ విధించిన 301 పరుగుల లక్ష్యాన్ని 49 ఓవర్లలోనే భారత్ ఛేదించింది. కోహ్లి సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ 93 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా 45వ సారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మరోవైపు.. రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో 26 పరుగులు చేయగలిగాడు. ఇక భారత్- కివీస్ మధ్య బుధవారం నాటి రెండో వన్డేకు రాజ్కోట్ వేదిక.చదవండి: T20 WC 2026: నెదర్లాండ్స్ జట్టు ప్రకటన.. ‘మనోళ్ల’పై వేటు! Virat Kohli said to Rohit Sharma, "Wha dekh Mera duplicate betha hai (Look, my duplicate is sitting there)".- Virat Kohli called him a Chota Cheeku 😭❤️ pic.twitter.com/b4r1DopMUa— Virat Kohli Fan Club (@Trend_VKohli) January 12, 2026 -
IND vs NZ: రిపోర్టర్పై మండిపడ్డ టీమిండియా స్టార్
స్వదేశంలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో టీమిండియా శుభారంభం అందుకుంది. వడోదర వేదికగా ఆదివారం కివీస్పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి 1-0తో ముందంజ వేసింది. విరాట్ కోహ్లి (Virat Kohli- 93) అద్భుత ఇన్నింగ్స్తో మరోసారి సత్తా చాటి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.ఇక ఈ మ్యాచ్లో టీమిండియా యువ క్రికెటర్ హర్షిత్ రాణా (Harshit Rana) సైతం మెరుగ్గా రాణించాడు. అర్ధ శతకాలతో అదరగొట్టిన న్యూజిలాండ్ ఓపెనర్లు డెవాన్ కాన్వే (Devon Conway- 56), హెన్రీ నికోల్స్ (62) రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చాడు ఈ రైటార్మ్ పేసర్.ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిఅదే విధంగా.. న్యూజిలాండ్ విధించిన 301 పరుగుల లక్ష్య ఛేదనలో ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన హర్షిత్ రాణా.. 23 బంతులు ఎదుర్కొని 29 పరుగులు సాధించాడు. జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.బుమ్రా గైర్హాజరీలోఈ క్రమంలో కివీస్పై టీమిండియా గెలుపు అనంతరం హర్షిత్ రాణా మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్.. ‘‘జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాము. భారత బౌలింగ్లో తడబాటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.కొత్త బంతితో మనవాళ్లు అంత తేలికగా వికెట్లు తీయలేకపోతున్నారు. ఇందుకు గల కారణం ఏమిటి?’’ అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తీవ్ర అసహనానికి లోనైన హర్షిత్ రాణా.. ‘‘మీరు అసలు ఎలాంటి క్రికెట్ చూశారో నాకైతే అర్థం కావడం లేదు.మండిపడ్డ టీమిండియా హర్షిత్ రాణాఈరోజు సిరాజ్ వికెట్లు తీయలేకపోయినా మెరుగ్గా బౌలింగ్ చేశాడు. కొత్త బంతితో మేము మరీ ఎక్కువగా పరుగులు కూడా ఇచ్చుకోలేదు. అయినా కొత్త బంతితో వికెట్లు తీయడం కుదరలేదంటే.. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేమని కాదు కదా!.. మేము మధ్య ఓవర్లలో వికెట్లు తీశాము’’ అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు న్యూజిలాండ్తో వన్డేల నుంచి విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త బంతితో వికెట్లు తీయడంలో టీమిండియా తడబడిన మాట వాస్తవమే. కాన్వే, నికోల్స్ కలిసి తొలి వికెట్కు ఏకంగా 117 పరుగులు జోడించడం ఇందుకు నిదర్శనం.ఆల్రౌండర్గా ఇక టీమిండియా మేనేజ్మెంట్ తనను ఆల్రౌండర్గా చూడాలని భావిస్తోందని హర్షిత్ రాణా ఈ సందర్భంగా వెల్లడించాడు. ఇందుకు తగినట్లుగానే తాను నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపాడు. కాగా భారత్- న్యూజిలాండ్ మధ్య బుధవారం నాటి రెండో వన్డేకు రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియం వేదిక. చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్.. జట్టులోకి ఊహించని ఆటగాడు -
IND vs NZ: టీమిండియాకు భారీ షాక్!.. ప్రకటన విడుదల
న్యూజిలాండ్తో వన్డే సిరీస్ నేపథ్యంలో టీమిండియాకు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే రిషభ్ పంత్ గాయం కారణంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా మరో ఆటగాడు సైతం గాయపడ్డాడు.వడోదర వేదికగా తొలి వన్డే సందర్భంగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar)కు గాయమైంది. పక్కటెముకల్లో నొప్పితో అతడు విలవిల్లాడాడు. ఈ క్రమంలో అతడిని స్కానింగ్కు పంపించారు. ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్న వాషీ.. తదుపరి రిపోర్టు వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది.ఊహించని ఆటగాడుఈ నేపథ్యంలో వాషింగ్టన్ సుందర్ మిగిలిన రెండు వన్డేలకు దూరమయ్యాడు. మెన్స్ సెలక్షన్ కమిటీ వాషీ స్థానంలో యువ ఆటగాడు ఆయుశ్ బదోని (Ayush Badoni)ని జట్టుకు ఎంపిక చేసింది. రాజ్కోట్లో రెండో వన్డే కోసం బదోని టీమిండియాతో చేరతాడు. ఈ మేరకు బీసీసీఐ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా బదోని జాతీయ జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి. ఢిల్లీకి చెందిన ఆయుశ్ బదోని బ్యాటింగ్ ఆల్రౌండర్. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన బదోని.. రైటార్మ్ ఆఫ్బ్రేక్ స్పిన్నర్ కూడా!.. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న 26 ఏళ్ల బదోని.. ఇప్పటికి 56 మ్యాచ్లలో కలిపి 963 పరుగులు చేశాడు.ఫామ్లో లేడుఇక లిస్ట్-ఎ క్రికెట్లో 27 మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఆయుశ్ బదోని ఖాతాలో 693 పరుగులు ఉన్నాయి. ఇందులో ఓ శతకం, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే, ఇటీవల దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో మాత్రం గత మూడు మ్యాచ్ల (1, 12, 3 నాటౌట్)లో బదోని తీవ్రంగా నిరాశపరిచాడు. అయినప్పటికీ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషీ దూరం కావడంతో అతడి స్థానంలో తొలిసారి టీమిండియాలోకి వచ్చాడు. కాగా న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇరుజట్ల మధ్య బుధవారం నాటి రెండో వన్డేకు రాజ్కోట్ వేదిక. ఇదిలా ఉంటే పంత్ స్థానంలోధ్రువ్ జురెల్ జట్టులో చేరిన విషయం తెలిసిందే.న్యూజిలాండ్తో రెండు, మూడో వన్డేకు భారత జట్టు (అప్డేటెడ్)శుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), ఆయుశ్ బదోని.చదవండి: ఈ అవార్డులన్నీ ఆమెకే.. అమ్మకు ఇష్టం: విరాట్ కోహ్లి -
ఈ అవార్డులన్నీ ఆమెకే.. అమ్మకు ఇష్టం: విరాట్ కోహ్లి
వన్డే క్రికెట్లో తాను ఛేజింగ్ ‘కింగ్’నని టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి మరోసారి నిరూపించుకున్నాడు. సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ న్యూజిలాండ్తో తొలి వన్డేలోనూ అదరగొట్టాడు. తృటిలో సెంచరీ చేజార్చుకున్నా జట్టును గెలిపించి.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’(POTM)గా నిలిచాడు. కాగా కోహ్లి కెరీర్లో ఈ అవార్డు అందుకోవడం ఇది 45వ సారి కావడం విశేషం.మా అమ్మకు పంపిస్తానుఈ నేపథ్యంలో కోహ్లి (Virat Kohli) మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘‘నిజం చెప్పాలంటే నా కెరీర్లో ఈ అవార్డు అందుకోవడం ఎన్నోసారో ఐడియా కూడా లేదు. నాకు దక్కిన ట్రోఫీలన్నీ మా అమ్మకు పంపిస్తాను.గుర్గావ్లోని మా ఇంట్లో ఈ ట్రోఫీలను ఉంచి.. వాటిని చూస్తూ మురిసిపోవడం అమ్మకు అత్యంత ఇష్టమైన పని. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. నా ప్రయాణం ఇంత గొప్పగా సాగడం నిజంగా ఓ కలలా ఉంది.దేవుడు నాకు అన్నీ ఇచ్చాడునా శక్తిసామర్థ్యాలపై నాకు నమ్మకం ఉంది. అయితే, కఠినంగా శ్రమించినిదే ఏదీ లభించదని నాకు తెలుసు. ఆ దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. నిజం చెప్పాలంటే.. మైలురాళ్ల గురించి నేను ఆలోచించడం లేదు. తొలుత బ్యాటింగ్ చేస్తే నాకు కాస్త కష్టంగానే అనిపిస్తుంది.ఛేదనలో లక్ష్యం ఎంతో తెలుసు కాబట్టి సులువుగా ముందుకు సాగిపోతూ ఉంటాను’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్- కివీస్ వడోదర వేదికగా ఆదివారం తొలి మ్యాచ్ ఆడాయి. 93 పరుగులుటాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కెప్టెన్ శుబ్మన్ గిల్ అర్ధ శతకం (56)తో రాణించగా.. కోహ్లి నిలకడగా ఆడుతూ 91 బంతుల్లో 93 పరుగులు సాధించాడు. తృటిలో వన్డేల్లో 54వ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.మిగిలిన వారిలో శ్రేయస్ అయ్యర్ (49) మెరుగ్గా ఆడగా.. 49 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి టీమిండియా.. నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అతి తక్కువ (624) ఇన్నింగ్స్లోనే 28 వేల పరుగుల మైలురాయిని తాకిన క్రికెటర్గా కోహ్లి ప్రపంచ రికార్డు సాధించాడు.చదవండి: క్రికెట్ చరిత్రలో అద్భుతం🗣️ If I look back at my whole journey, it's nothing short of a dream come true. ✨🎥 Virat Kohli reflects on his incredible career after becoming the 2⃣nd highest run-getter in men's international cricket🙌👏#TeamIndia | #INDvNZ | @imVkohli | @idfcfirstbank pic.twitter.com/87BgcZlx4b— BCCI (@BCCI) January 11, 2026 -
భారత్-న్యూజిలాండ్ తొలి వన్డేలో ఆసక్తికర పరిణామం
భారత్–న్యూజిలాండ్ మధ్య వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్కు థర్డ్ అంపైర్గా బంగ్లాదేశ్కు చెందిన షరఫుద్దౌలా సైకత్ వ్యవహరించారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సైకత్ టీమిండియా మ్యాచ్కు అంపైర్గా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. టీ20 ప్రపంచకప్లో భాగంగా భారత్లో జరుగబోయే మ్యాచ్లకు తమ అంపైర్లను పంపబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఇలా జరగడం ఆసక్తికర పరిణామం.భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంబంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో బంగ్లా స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ను ఐపీఎల్ నుంచి తొలగించారు. 2026 వేలంలో ముస్తాఫిజుర్ను కేకేఆర్ రూ. 9.20 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుంది.ముస్తాఫిజుర్ను ఐపీఎల్ నుంచి తొలిగించడాన్ని అవమానంగా భావించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం స్వదేశంలో ఐపీఎల్ను బ్యాన్ చేసింది. భారత్లో తాము ఆడాల్సిన టీ20 ప్రపంచకప్-2026 గ్రూప్ స్టేజీ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది.ఐసీసీ నుంచి సరైన స్పందన లేకపోవడంతో తమ దేశానికి చెందిన అంపైర్లను ప్రపంచకప్ విధుల నిమిత్తం భారత్కు పంపించబోమని నిర్ణయించింది. ప్రపంచకప్లో బంగ్లాదేశ్ భవితవ్యంపై మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ముందస్తు షెడ్యూల్ ప్రకారం ప్రపంచకప్లో బంగ్లాదేశ్ గ్రూప్ స్టేజీ మ్యాచ్లు కోల్కతా, ముంబై నగరాల్లో జరగాల్సి ఉంది. అయితే బీసీబీ విన్నపాన్ని పరిశీలిస్తున్న ఐసీసీ వేదికలను చెన్నై, తిరువనంతపురంకు మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.బోణీ కొట్టిన టీమిండియాతొలి వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. డెవాన్ కాన్వే (56), హెన్రీ నికోల్స్ (62), డారిల్ మిచెల్ (84) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. భారత బౌలర్లలో సిరాజ్, హర్షిత్, ప్రసిద్ద్ కృష్ణ తలో 2 వికెట్లు, కుల్దీప్ ఓ వికెట్ తీశారు.అనంతరం భారత్ విరాట్ కోహ్లి (91 బంతుల్లో 93; 8 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ శుభ్మన్ గిల్ (56), వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (49), ఆఖర్లో ఎల్ రాహుల్ (29 నాటౌట్) హర్షిత్ రాణా (29) రాణించడంతో 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్ 4, ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్ తలో వికెట్ తీశారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే రాజ్కోట్ వేదికగా జనవరి 14న జరుగనుంది. -
విరాట్ కోహ్లి కోసం రంగంలోకి దిగిన వికాస్ కోహ్లి
లిస్ట్-ఏ ఫార్మాట్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అరివీర భయంకరమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. గత 7 మ్యాచ్ల్లో 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలతో తిరుగులేని ప్రదర్శనలు చేస్తున్నాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో నిన్న (జనవరి 11) జరిగిన తొలి వన్డేలో తృటిలో సెంచరీ (93) అవకాశాన్ని కోల్పోయాడు. విరాట్ సత్తా చాటడంతో న్యూజిలాండ్పై భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ ప్రదర్శనగానూ విరాట్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. ఈ ఇన్నింగ్స్తో విరాట్ పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం విరాట్కు ముందు సచిన్ మాత్రమే ఉన్నాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా 28000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగానూ విరాట్ రికార్డుల్లోకెక్కాడు.ఇదిలా ఉంటే, తొలి వన్డే అనంతరం విరాట్ సోదరుడు వికాస్ కోహ్లి సోషల్మీడియాలో షేర్ చేసిన ఓ సందేశం వైరలవుతుంది. విరాట్పై ఇటీవల చులకన వ్యాఖ్యలు చేసిన భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్కు వికాస్ పరోక్షంగా చురకలించాడు.విరాట్ టెస్ట్ల నుంచి తప్పుకొని, కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగడంపై మంజ్రేకర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వన్డేలు టాపార్డర్ బ్యాటర్లకు సులభమైన ఫార్మాట్ అని వ్యాఖ్యానించాడు. జో రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్లను ఉదాహరణగా చూపిస్తూ, వారు టెస్ట్ల్లో గొప్ప వారసత్వాన్ని నిర్మిస్తున్నారంటూ విరాట్ను నేరుగా టార్గెట్ చేశాడు.ఈ వ్యాఖ్యలకు కౌంటర్గానే వికాస్ సోదరుడు విరాట్ తరఫున రంగంలోకి దిగాడు. మంజ్రేకర్ పేరు ప్రస్తావించకుండానే “ఇది ఎంత సులభమైన ఫార్మాట్ కదా... కొద్ది రోజుల క్రితం ఎవరో తమ జ్ఞానాన్ని పంచుకున్నారు.. చెప్పడం సులభం, చేయడం కష్టం” అంటూ ఓ మెసేజ్ షేర్ చేశాడు.ఈ సందేశాన్ని అభిమానులు మాజీ క్రికెటర్–కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా భావిస్తున్నారు. కాగా, విరాట్పై ఈగ కూడా వాలనివ్వని వికాస్ గతంలో కూడా చాలా సందర్భాల్లో విరాట్పై వ్యతిరేక కామెంట్లు చేసే వారికి ఇలాగే చురకలంటించాడు. విరాట్ జనవరి 14న న్యూజిలాండ్తో జరిగే రెండో వన్డేలో తిరిగి బరిలోకి దిగుతాడు. ఈ మ్యాచ్ రాజ్ కోట్ వేదికగా జరుగనుంది. -
ప్రపంచ నంబర్ 1 జట్టును ఒత్తిడిలోకి నెట్టాం: న్యూజిలాండ్ కెప్టెన్
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా వడోదర వేదికగా టీమిండియాతో నిన్న (జనవరి 11) జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ సిరీస్కు న్యూజిలాండ్ ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగినా, తొలి మ్యాచ్లోనే అద్భుతం చేసింది. ఫీల్డింగ్ మినహా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియాను భయపెట్టింది. తొలుత బ్యాటింగ్లో ఆకట్టుకునే ప్రదర్శన చేసి, ఆతర్వాత బౌలింగ్లో అద్వితియమైన పోరాటపటిమ కనబర్చింది. సునాయాసంగా గెలుపు దిశగా సాగుతున్న భారత జట్టుకు ఓ దశలో గెలుపు భయం చూపించింది. బౌలింగ్ విభాగంలో ఏకైక అనుభవజ్ఞుడు కైల్ జేమీసన్తో భారత బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చింది.మ్యాచ్ అనంతరం కెప్టెన్ మైఖేల్ బ్రేస్వెల్ తన జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. 4 వికెట్లు తీసి టీమిండియాను ఇబ్బంది పెట్టిన జేమీసన్పై ప్రశంసల వర్షం కురిపించాడు. అద్భుతమైన బ్యాటింగ్తో ఇన్నింగ్స్కు జీవం పోసిన డారిల్ మిచెల్ను కొనియాడాడు. తమ జట్టు పోరాటపటిమను ఆకాశానికెత్తాడు.బ్రేస్వెల్ మాటల్లో.. ఓడినా, గర్వంగా ఉంది. ప్రపంచ నంబర్ 1 జట్టును ఒత్తిడిలోకి నెట్టాం. మరో 20-30 పరుగులు చేసుంటే ఫలితం వేరేలా ఉండేది. గాయం నుంచి తిరిగొచ్చిన జేమీసన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బ్యాటర్లు.. ముఖ్యంగా డారిల్ మిచెల్ తన అనుభవాన్నంతా రంగరించి మంచి స్కోర్ చేసేందుకు దోహదపడ్డాడు. అయినా మరో 20-30 పరుగులు చేసుండాల్సింది. మ్యాచ్ గతి మార్చే క్షణాలను సృష్టించుకోవడం గురించి మేమెప్పుడూ మాట్లాడుకుంటాం. ఈ రోజు కొన్ని విషయాల్లో బాగా పని చేశాం. కొన్ని కీలక అవకాశాలు కోల్పోయాం. భారత్లో లైట్ల వెలుతురులో ఆడటం సులభం కాదని మరోసారి నిరూపితమైంది. ఓడినా మా జట్టు ఎల్లప్పుడూ ఉన్నత ప్రమాణాలను పాటించేందుకు కృషి చేస్తుంది. బ్రేస్వెల్ చేసిన ఈ వ్యాఖ్యలు వారి జట్టు పోరాట స్పూర్తిని సూచిస్తున్నాయి.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. డెవాన్ కాన్వే (56), హెన్రీ నికోల్స్ (62), డారిల్ మిచెల్ (84) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. భారత బౌలర్లలో సిరాజ్, హర్షిత్, ప్రసిద్ద్ కృష్ణ తలో 2 వికెట్లు, కుల్దీప్ ఓ వికెట్ తీశారు.అనంతరం విరాట్ కోహ్లి (91 బంతుల్లో 93; 8 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ శుభ్మన్ గిల్ (56), వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (49), ఆఖర్లో ఎల్ రాహుల్ (29 నాటౌట్) హర్షిత్ రాణా (29) రాణించడంతో భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్ 4, ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్ తలో వికెట్ తీశారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే రాజ్కోట్ వేదికగా జనవరి 14న జరుగనుంది. -
మరో మైలురాయిని తాకిన రోహిత్ శర్మ
టీమిండియా వెటరన్ స్టార్ రోహిత్ శర్మ మరో మైలురాయిని తాకాడు. వడోదరలో న్యూజిలాండ్తో నిన్న (జనవరి 11) జరిగిన వన్డే మ్యాచ్లో 2 సిక్సర్లు బాదడంతో అంతర్జాతీయ క్రికెట్లో 650 సిక్సర్ల మైలురాయిని (539 ఇన్నింగ్స్ల్లో) చేరుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో రోహిత్ ఇప్పటికే అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చలామణి అవుతున్నాడు. తాజాగా మరో మైలురాయిని తాకి, తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. ఈ విభాగంలో రోహిత్ తర్వాతి స్థానంలో విండీస్ విధ్వంసకర యోధుడు క్రిస్ గేల్ (551 ఇన్నింగ్స్ల్లో 553 సిక్సర్లు) ఉన్నాడు.ROHIT SHARMA - 650 SIXES IN INTERNATIONAL CRICKET. ONE & ONLY HITMAN 🥶pic.twitter.com/ENstT40dz6— Johns. (@CricCrazyJohns) January 11, 2026మ్యాచ్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. డెవాన్ కాన్వే (56), హెన్రీ నికోల్స్ (62), డారిల్ మిచెల్ (84) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. భారత బౌలర్లలో సిరాజ్, హర్షిత్, ప్రసిద్ద్ కృష్ణ తలో 2 వికెట్లు, కుల్దీప్ ఓ వికెట్ తీశారు.అనంతరం 301 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ ఆదిలో సునాయాస విజయం దిశగా సాగినప్పటికీ.. విరాట్ కోహ్లి ఔటయ్యాక తడబాటుకు లోనైంది. అయితే కేఎల్ రాహుల్ (29 నాటౌట్) హర్షిత్ రాణా (29) సహకారంతో భారత్ను విజయతీరాలకు చేర్చాడు. అంతకుముందు కోహ్లి (91 బంతుల్లో 93; 8 ఫోర్లు, సిక్స్) మరో సెంచరీని తృటిలో చేజార్చుకున్నాడు. భారత ఇన్నింగ్స్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ (56), వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (49) కూడా రాణించారు. రోహిత్ శర్మ (29 బంతుల్లో 26; 3 ఫోరు, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించాడు. మొత్తంగా అందరూ తలో చేయి వేయడంతో భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్ 4, ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్ తలో వికెట్ తీశారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే రాజ్కోట్ వేదికగా జనవరి 14న జరుగనుంది.కాగా, ఈ సిరీస్కు న్యూజిలాండ్ ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగింది. అయినా తొలి వన్డేలో అద్భుతంగా రాణించి, ప్రపంచ నంబర్ వన్ జట్టు టీమిండియాకు ఊహించని పోటీనిచ్చింది. ఫీల్డింగ్లో కాస్త తడబడినా.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తా చాటి ఆకట్టుకుంది. -
కోహ్లి పరుగుల బాటతో...
అనుభవం లేని ఆటగాళ్లతో వచ్చిన న్యూజిలాండ్ అదరగొట్టింది. గెలిచేందుకు అవసరమైన లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. కానీ ఛేదనలో మొనగాడు, ‘కింగ్ కోహ్లి’ కుదురుకొని ఆడటంతో పెద్ద లక్ష్యం కూడా దిగివచ్చింది. ఒకదశలో జేమీసన్ వణికించినా... 8 పరుగుల వ్యవధిలోనే కోహ్లి, జడేజా, అయ్యర్ల వికెట్లు కోల్పోయినా... కేఎల్ రాహుల్ చేసిన విలువైన పరుగులతో టీమిండియా తొలి వన్డేలో గెలిచింది. మూడు మ్యాచ్ల సిరీస్లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. వడోదర: భారత బ్యాటింగ్ ‘కింగ్’ కోహ్లి మరోసారి ఛేజింగ్లో తన విలువ ఏంటో నిరూపించుకున్నాడు. కోహ్లి సాధికారిక ఆటతీరు కారణంగా... తొలి వన్డేలో న్యూజిలాండ్ 300 పరుగులు చేసినా ఓటమిని తప్పించుకోలేకపోయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో శుబ్మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ఫై గెలిచింది. టాస్ నెగ్గిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా, ముందుగా బ్యాటింగ్ చేపట్టిన కివీస్ నిరీ్ణత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగుల భారీస్కోరు చేసింది. డారిల్ మిచెల్ (71 బంతుల్లో 84; 5 ఫోర్లు, 3 సిక్స్లు), డెవాన్ కాన్వే (67 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్స్), హెన్రీ నికోల్స్ (69 బంతుల్లో 62; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. ‘హైదరాబాద్ ఎక్స్ప్రెస్’ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కోహ్లి (91 బంతుల్లో 93; 8 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీని చేజార్చుకోగా... గిల్ (71 బంతుల్లో 56; 3 ఫోర్లు, 2 సిక్స్లు), శ్రేయస్ అయ్యర్ (47 బంతుల్లో 49; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. జేమీసన్కు 4 వికెట్లు దక్కాయి. రెండో వన్డే 14న రాజ్కోట్లో జరుగుతుంది. అదిరే ఆరంభం ఓపెనర్లు కాన్వే, నికోల్స్ చూడచక్కని అర్ధసెంచరీలతో కివీస్కు శుభారంభమిచ్చారు. 21 ఓవర్ల వరకు భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. ఈ క్రమంలో తొలి వికెట్కు 117 పరుగులు జోడించారు. హర్షిత్ రెండో స్పెల్ 2–0–13–2తో విలువైన వికెట్లు పడగొట్టడంతో న్యూజిలాండ్ తడబడింది. 117/0 స్కోరుతో పటిష్టంగా ఉన్న న్యూజిలాండ్ 38వ ఓవర్ వచ్చేసరికి 198/5తో కష్టాల్లో పడింది. ఇలాంటి దశలో మిచెల్ మెరుపులతో కివీస్ ఇన్నింగ్స్ను మళ్లీ నిలబెట్టాడు. æ కోహ్లి నడిపించడంతో... భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ధాటిగా ఆడే క్రమంలో రోహిత్ శర్మ (26; 3 ఫోర్లు, 2 సిక్స్లు) అవుటయ్యాడు. కెప్టెన్ గిల్కు జతయిన కోహ్లి చకచకా పరుగులు రాబట్టారు. రెండో వికెట్కు 118 పరుగులు జోడించాక గిల్ అవుటయ్యాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్తో కలిసి విరాట్ జట్టు స్కోరును 200 దాటించాడు. సెంచరీకి చేరువవుతున్న దశలో కోహ్లిని జేమీసన్ అవుట్ చేశాడు. అప్పుడు భారత్ స్కోరు 234/3. ఇక చేయాల్సింది 67 పరుగులే కాగా చేతిలో 7 వికెట్లున్నాయి. కానీ జేమీసన్ ధాటికి అయ్యర్, జడేజా (4) పెవిలియన్ చేరారు. అయితే హర్షిత్ రాణా (23 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ (21 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఒక ఓవర్ మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (బి) రాణా 56; నికోల్స్ (సి) రాహుల్ (బి) రాణా 62; యంగ్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 12; మిచెల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ప్రసిధ్ 84; ఫిలిప్స్ (సి) అయ్యర్ (బి) కుల్దీప్ 12; మిచెల్ హే (బి) ప్రసిధ్ 18; బ్రేస్వెల్ రనౌట్ 16; ఫోక్స్ (బి) సిరాజ్ 1; క్లార్క్ (నాటౌట్) 24; జేమీసన్ (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 7; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 300. వికెట్ల పతనం: 1–117, 2–126, 3–146, 4–170, 5–198, 6–237, 7–239, 8–281. బౌలింగ్: సిరాజ్ 8–0–40–2, హర్షిత్ రాణా 10–0–65–2, సుందర్ 5–0–27–0, ప్రసిధ్ కృష్ణ 9–0–60–2, కుల్దీప్ 9–0–52–1, జడేజా 9–0–56–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) బ్రేస్వెల్ (బి) జేమీసన్ 26; గిల్ (సి) ఫిలిప్స్ (బి) అశోక్ 56; కోహ్లి (సి) బ్రేస్వెల్ (బి) జేమీసన్ 93; శ్రేయస్ (బి) జేమీసన్ 49; జడేజా (సి) క్లార్క్ (బి) జేమీసన్ 4; రాహుల్ (నాటౌట్) 29; హర్షిత్ (సి) హే (బి) క్లార్క్ 29; సుందర్ (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 13; మొత్తం (49 ఓవర్లలో 6 వికెట్లకు) 306. వికెట్ల పతనం: 1–39, 2–157, 3–234, 4–239, 5–242, 6–279. బౌలింగ్: జేమీసన్ 10–1–41–4, ఫోక్స్ 10–0–49–0, ఆదిత్య అశోక్ 6–0–55–1, క్లార్క్ 10–0–73–1, బ్రేస్వెల్ 8–0–56–0, ఫిలిప్స్ 4–0–21–0, మిచెల్ 1–0–7–0.2: మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) కలిపి అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లి రెండో స్థానానికి ఎగబాకాడు. 557 మ్యాచ్లు ఆడిన కోహ్లి 28,068 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (664 మ్యాచ్ల్లో 34,357 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు. శ్రీలంక ప్లేయర్ కుమార సంగక్కర (594 మ్యాచ్ల్లో 28,016 పరుగులు) మూడో స్థానానికి పడిపోయాడు.1: అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా 28 వేల పరుగులు పూర్తి చేసిన క్రికెటర్గా కోహ్లి ఘనత వహించాడు. సచిన్ టెండూల్కర్ (644 ఇన్నింగ్స్) పేరిట ఉన్న రికార్డును కోహ్లి (624 ఇన్నింగ్స్) బద్దలు కొట్టాడు.45: వన్డేల్లో కోహ్లికి లభించిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు. ఈ జాబితాలో సచిన్ (62), సనత్ జయసూర్య (48) ముందున్నారు. -
విరాట్ విశ్వరూపం.. తొలి వన్డేలో భారత్ ఘన విజయం
భారత పురుషల క్రికెట్ జట్టు కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించింది. ఆదివారం వడోదర వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 301 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 6 వికెట్లు కోల్పోయి 49 ఓవర్లలో చేధించింది.దీంతో మూడు వన్డే సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డార్లీ మిచెల్(71 బంతుల్లో 84), డెవాన్ కాన్వే(56), హెన్రీ నికోల్స్(62) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ రానా తలా రెండు వికెట్లు సాధించారు. కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టాడు.విరాట్ విధ్వంసం..అనంతరం భారీ లక్ష్య చేధనలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ తన విశ్వరూపాన్ని చూపించాడు. తనదైన శైలిలో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓ దశలో సునాయసంగా సెంచరీ మార్క్ను అందుకునేలా కన్పించిన కోహ్లి.. ఓ భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు.కేవలం 7 పరుగుల దూరంలో సెంచరీ చేసే అవకాశాన్ని కింగ్ కోల్పోయాడు. కోహ్లి మొత్తంగా 91 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 8 ఫోర్లు, ఒక సిక్సర్తో 93 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ శుభ్మన్ గిల్(56), వైస్ కెప్టెన శ్రేయస్ అయ్యర్(49) కీలక ఇన్నింగ్స్లు ఆడారు.అయితే కోహ్లి ఔటయ్యాక భారత్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. దీంతో భారత డగౌట్లో కాస్త టెన్షన్ నెలకొంది. కానీ కేఎల్ రాహుల్(21 బంతుల్లో 29) ప్రశాంతంగా ఆడుతూ మ్యాచ్ను ఫినిష్ చేశాడు. హర్షిత్ రాణా(23 బంతుల్లో 29) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాడ్ బౌలర్లలో కైల్ జేమీసన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఆశోక్, క్లార్క్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య మూడో వన్డే బుధవారం రాజ్కోట్ వేదికగా జరగనుంది.చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్ -
టీమిండియాకు భారీ షాక్..
టీ20 వరల్డ్కప్-2026కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. వడోదర వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. కివీస్ ఇన్నింగ్స్ సందర్భంగా 20 ఓవర్ వేస్తున్న సమయంలో సుందర్కు వెన్నునొప్పి తలెత్తింది. దీంతో అతడు వెంటనే మైదానాన్ని వీడియాడు.వాషీ స్ధానంలో నితీష్ కుమార్ రెడ్డి సబ్స్ట్యూట్ ఫీల్డర్గా మైదానంలో వచ్చాడు. సుందర్ తిరిగి ఫీల్డింగ్కు కూడా రాలేదు. అతడి గాయంపై ఈ మ్యాచ్లో కామెంటేటర్గా వ్యవహరిస్తున్న హర్షా భోగ్లే అప్డేట్ ఇచ్చాడు. సుందర్ వెన్నునొప్పితో బాధపడుతున్నాడని, మెడికల్ టీమ్ అతడిని పర్యవేక్షిస్తోందని భోగ్లే తెలిపాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సుందర్ బ్యాటింగ్కు కూడా వచ్చే సూచనలు కన్పించడం లేదు.అయితే తొలుత సుందర్ పక్కటెముకుల నొప్పితో బాధపడుతున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అది కేవలం వెన్ను నొప్పి అనే తెలియడంతో టీమ్ మెనెజ్మెంట్ ఊపిరి పీల్చుకుంది. ఎందుకంటే సైడ్ స్ట్రెయిన్ అయితే కోలుకోవడానికి కనీసం 3 నుండి 4 నెలల సమయం పడుతుంది.అటువంటి సందర్భంలో వచ్చే నెలలో జరగాల్సిన దూరంగా ఉండక తప్పుదు. అతడి గాయంపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మ్యాచ్లో 5 ఓవర్లు బౌలింగ్ చేసిన సుందర్ 27 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు.టీ20 ప్రపంచకప్నకు భారత జట్టుఅభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజుశాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్ ( వైస్ కెప్టెన్), రింకు సింగ్, బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్ -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో దుమ్ములేపిన విరాట్.. ఇప్పుడు కివీస్తో వన్డేల్లో కూడా అదే తీరును కనబరుస్తున్నాడు. వడోదర వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మొదటి వన్డేలో కోహ్లి దూకుడుగా ఆడుతున్నాడు.క్రీజులోకి వచ్చినప్పటి నుంచే భారీ షాట్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఈ క్రమంలో కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో 28,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. తద్వారా అత్యంతవేగంగా ఈ ఫీట్ సాధించిన ప్లేయర్గా విరాట్ వరల్డ్ రికార్డు సృష్టించాడు.కింగ్ కోహ్లి కేవలం 624 ఇన్నింగ్స్లలోనే అందుకున్నాడు. ఇంతకుముందు ఈ ఫీట్ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(644) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో సచిన్ ఆల్టైమ్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో ముగ్గురే ముగ్గురు 28,000 పరుగులు సాధించారు. కోహ్లి కంటే ముందు కుమార సంగక్కర(28,016), సచిన్ టెండూల్కర్(34,357) ఈ ఘనత సాధించారు.సంగక్కర రికార్డు బ్రేక్..అదేవిధంగా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో కోహ్లి రెండో స్ధానానికి చేరాడు. ఈ మ్యాచ్లోనే 42 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతడు ఈ ఫీట్ సాధించాడు. ఇంతకుముందు ఈ స్ధానంలో సంగక్కర ఉండేవాడు. తాజా మ్యాచ్తో అతడిని కోహ్లి అధిగమించాడు. కోహ్లి కంటే ముందు సచిన్ ఒక్కడే ఉన్నాడు. అయితే కోహ్లి కేవలం ఒక్క ఫార్మాట్లో మాత్రమే ఆడుతుండడంతో సచిన్ రికార్డు బ్రేక్ చేయడం కష్టమనే చెప్పాలి.చదవండి: IND vs NZ: 'అతడికి మరోసారి అన్యాయం.. కావాలనే ఎదగనివ్వడం లేదు' -
విరాట్ కోహ్లి నాగిన్ డ్యాన్స్.. వీడియో వైరల్
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి మైదానంలో ఎంత యాక్టివ్గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కింగ్ కోహ్లి కేవలం బ్యాటింగ్తోనే కాకుండా తన చేష్టలతో కూడా అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా మరోసారి కోహ్లి తనలోని ఫన్నీ యాంగిల్ను బయటపెట్టాడు.వడోదర వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో కోహ్లి నగిన్ డ్యాన్స్ చేశాడు. కివీస్ ఇన్నింగ్స్ 34వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో డేంజరస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్.. శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఇండియన్ టీమ్ మొత్తం సంబరాల్లో మునిగితేలిపోయింది. కోహ్లి మాత్రం ఫ్లూట్ వూదుతున్నట్లుగా చేతులతో సైగ చేస్తూ స్పెషల్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డార్లీ మిచెల్(71 బంతుల్లో 84), డెవాన్ కాన్వే(56), హెన్రీ నికోల్స్(62) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ రానా తలా రెండు వికెట్లు సాధించారు. కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టాడు.చదవండి: IND vs NZ: 'అతడికి మరోసారి అన్యాయం.. కావాలనే ఎదగనివ్వడం లేదు'pic.twitter.com/LZrkrdDVtq— crictalk (@crictalk7) January 11, 2026 -
రాణించిన కివీస్ బ్యాటర్లు.. భారత్ ముందు భారీ టార్గెట్
రాజ్కోట్ వేదికగా వడోదర వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగుల భారీ స్కోర్ సాధించింది. బ్లాక్ క్యాప్స్ జట్టుకు ఓపెనర్లు హెన్రీ నికోల్స్ (62), డెవాన్ కాన్వే (56) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ మొదటి వికెట్కు 117 పరుగులు జోడించి భారత బౌలర్లపై ఒత్తిడి పెంచారు. నికోలస్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విల్ యంగ్(12) ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. డెవాన్ కాన్వే కూడా వెంటనే పెవిలియన్కు చేరాడు. అయితే మిడిలార్డర్లో సీనియర్ బ్యాటర్ డారిల్ మిచెల్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.మిచెల్ 71 బంతుల్లో 5 ఫోర్లు, 33 సిక్స్లతో 84 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆఖరిలో అరంగేట్ర ఆటగాడు క్లార్క్(24) రాణించాడు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ రానా తలా రెండు వికెట్లు సాధించారు. కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టాడు.తుది జట్లుభారత్: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్(కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణన్యూజిలాండ్: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్వెల్(కెప్టెన్), జకారీ ఫౌల్క్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఆదిత్య అశోక్ -
Ind vs NZ 1st ODI: 27 ఏళ్ల రికార్డు బద్దలు
వడోదర వేదికగా భారత్తో ఇవాళ (జనవరి 11) జరుగుతున్న వన్డే మ్యాచ్లో న్యూజిలాండ్ ఓపెనర్లు హెన్రీ నికోల్స్ (62), డెవాన్ కాన్వే (56) చెలరేగిపోయారు. తొలి వికెట్కు 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి 27 ఏళ్ల కిందటి రికార్డు బద్దలు కొట్టారు. భారత్లో న్యూజిలాండ్ ఓపెనర్ల అత్యధిక భాగస్వామ్యం విభాగంలో నికోల్స్-కాన్వే తాజా భాగస్వామ్యం రెండో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్కు ముందు వరకు ఈ రికార్డు నాథన్ ఆస్టల్-క్రెయిగ్ స్పియర్మన్ పేరిట ఉండేది. 1999లో రాజ్కోట్లో ఈ న్యూజిలాండ్ ఓపెనింగ్ జోడీ భారత్పై 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ విభాగంలో టాప్ ప్లేస్లో ఆండ్రూ జోన్స్-జాన్ రైట్ జోడీ ఉంది. 1988లో ఈ కివీ ఓపెనింగ్ పెయిర్ ఇదే వడోదరలో తొలి వికెట్కు 140 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ 43.3 ఓవర్ల అనంతరం 7 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసి శుభారంభం అందించినా, ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో కివీస్ స్వల్ప స్కోర్కే పరిమితమయ్యేలా ఉంది. డారిల్ మిచెల్ (56 నాటౌట్) గౌరవప్రదమైన స్కోర్ను అందించే ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి జతగా క్రిస్టియన్ క్లార్క్ (1) క్రీజ్లో ఉన్నాడు. భారత బౌలర్లలో సిరాజ్, హర్షిత్ తలో 2.. ప్రసిద్ద్, కుల్దీప్ చెరో వికెట్ తీసి న్యూజిలాండ్ను ఇబ్బందుల్లోకి నెట్టారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో విల్ యంగ్ (12), గ్లెన్ ఫిలిప్ (12), మిచెల్ హే (18), కెప్టెన్ మైఖేల్ బ్రేస్వెల్ (16) మంచి ఆరంభాలు లభించినా, పెద్ద స్కోర్లుగా మలచలేకపోయారు. జకరీ ఫౌల్క్స్ 1 పరుగుకే ఔటయ్యాడు.కాగా, న్యూజిలాండ్ జట్టు 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ల కోసం భారత్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ తొలి వన్డే జరుగుతుంది.తుది జట్లు..న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్వెల్(c), జకారీ ఫౌల్క్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఆదిత్య అశోక్భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ -
'అతడికి మరోసారి అన్యాయం.. కావాలనే ఎదగనివ్వడం లేదు'
నితీశ్ కుమార్ రెడ్డి.. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా గతేడాది భారత్ తరపున మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే అతడిని సరిగ్గా ఉపయోగించుకోవడంలో టీమ్ మెనెజ్మెంట్ విఫలమైందనే చెప్పుకోవాలి. ఒక సిరీస్కు ఎంపిక చేస్తే మరొక సిరీస్కు పక్కన పెట్టడం, ఒకవేళ ఎంపికైనా తుది జట్టులో చోటు ఇవ్వకపోవడం వంటివి అతడి కెరీర్ను వెనుక్కి నెట్టిస్తున్నాయి. అంతేకాకుండా అతడిని ఆల్రౌండర్గా ప్లేయింగ్ ఎలెవన్లోకి తీసుకుని కేవలం బ్యాటింగ్కు పరిమితం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆల్రౌండర్గా గుర్తింపు పొందిన నితీశ్.. ఇప్పటివరకు 20 ఇన్నింగ్స్ల్లో కేవలం 100.1 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఇప్పుడు మరోసారి ఈ ఆంధ్ర ఆల్రౌండర్ పట్ల టీమ్ మెనెజ్మెంట్ కఠినంగా వ్యవహరించింది.న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వడంతో నితీశ్ కుమార్ రెడ్డిని జట్టులోకి తీసుకున్నారు. కానీ వడోదర వేదికగా జరుగుతున్న తొలి వన్డే తుది జట్టులో మాత్రం నితీశ్కు చోటు దక్కలేదు.అతడిని కాదని స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు అవకాశమిచ్చారు. ఈ నేపథ్యంలో టీమ్ మెనెజ్మెంట్పై భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు గుప్పించాడు. అతడికి అవకాశమివ్వనప్పుడు ఎందుకు ఎంపిక చేస్తున్నారని పఠాన్ మండిపడ్డాడు."నితీశ్కు ప్లేయింగ్ ఎలెవన్లో ఛాన్స్ ఇవ్వనప్పుడు, అతడిని ప్రధాన జట్టుకు ఎందుకు ఎంపిక చేస్తున్నారు? టీమ్తో పాటు ఉంటాడు.. కానీ తుది జట్టులో కన్పించడు. అతడిని పక్కన పెట్టడానికి ఏదో సరైన కారణముంది. ఒకవేళ తుది జట్టులో చోటు ఇచ్చినా.. ఒకట్రెండు ఓవర్లు బౌలింగ్, 8 స్ధానంలో బ్యాటింగ్కు పంపుతారు. ఇది సరైన విధానం కాదు. రెగ్యూలర్గా అవకాశమివ్వకపోతే ఎప్పటికీ అతడిని ఒక మంచి ఆల్రౌండర్గా తీర్చిదిద్దలేరు. హార్దిక్ పాండ్యాకు సరైన ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే నితీశ్కు వరుస అవకాశాలు ఇవ్వాలి. హార్దిక్ కూడా కెరీర్ ఆరంభంలో వరుస అవకాశాలు పొందడం వల్లే స్టార్గా ఎదిగాడన్న విషయం మర్చిపోవద్దు" అని స్టార్ స్పోర్ట్స్ షోలో పఠాన్ పేర్కొన్నాడు.చదవండి: IND vs NZ: కోహ్లి అరుదైన ఘనత.. సౌరవ్ గంగూలీ రికార్డు బ్రేక్ -
కోహ్లి అరుదైన ఘనత.. సౌరవ్ గంగూలీ రికార్డు బ్రేక్
టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరపున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానానికి కోహ్లి చేరుకున్నాడు. వడోదర వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో కోహ్లి ఈ ఫీట్ నమోదు చేశాడు.కోహ్లికి ఇది 309వ వన్డే మ్యాచ్. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరిట ఉండేది. గంగూలీ తన కెరీర్లో 308 మ్యాచ్లు ఆడి 11221 పరుగులు చేశాడు. ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(463) అగ్రస్ధానంలో ఉన్నారు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలోనూ సచిన్(18426) టాప్లో కొనసాగుతున్నారు.భారత్ తరపున అత్యధిక వన్డేలు ఆడిన ప్లేయర్లు వీరే..సచిన్ టెండూల్కర్-463ఎంఎస్ ధోని-347రాహుల్ ద్రవిడ్-340అజారుద్దీన్-334విరాట్ కోహ్లి-309సౌరవ్ గంగూలీ-308వన్డే కింగ్..ఇక ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లి కూడా తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా కోహ్లి కొనసాగుతున్నాడు. కోహ్లి ఇప్పటివరకు 53 సెంచరీలు నమోదు చేశాడు. అదేవిధంగా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లి(14557) రెండో స్ధానంలో ఉన్నాడు. కోహ్లి దారిదాపుల్లో ఎవరూ లేరు. -
భారీ రికార్డులపై కన్నేసిన రోహిత్, కోహ్లి
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా వడోదర వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (జనవరి 11) జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి భారీ రికార్డులపై కన్నేశారు. కోహ్లి 42 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించనుండగా.. రోహిత్ 67 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్గా 16000 పరుగుల అత్యంత అరుదైన మైలురాయిని తాకుతాడు.రో-కో ప్రస్తుతమున్న ఫామ్ను బట్టి చూస్తే ఇదే మ్యాచ్లో ఈ రెండు రికార్డులు బద్దలవడం ఖాయంగా తెలుస్తుంది. రోహిత్ గత ఆరు వన్డే ఇన్నింగ్స్ల్లో సెంచరీ, మూడు అర్ద సెంచరీలు చేసి సూపర్ ఫామ్లో ఉన్నాడు. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో సిక్కింపై భారీ శతకంతో (155) అదే ఫామ్ను కొనసాగిస్తున్నాడు.కోహ్లి విషయానికొస్తే.. రోహిత్తో పోలిస్తే ఇంకా మెరుగైన ఫామ్లో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో గత 4 ఇన్నింగ్స్ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు చేసి మరో భారీ ఇన్నింగ్స్ కోసం గర్జిస్తున్నాడు. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలోనూ ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన రో-కో ప్రస్తుతం వన్డేలపైనే పూర్తి ఫోకస్ పెట్టారు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి భారత ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ ఆచితూచి ఆడుతుంది. 16 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 79 పరుగులు చేసింది. ఓపెనర్లు హెన్రీ నికోల్స్ (42), డెవాన్ కాన్వే (35) భారత బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొంటున్నారు. నికోల్స్కు 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లైఫ్ లభించింది. కుల్దీప్ యాదవ్ సునాయాసమైన క్యాచ్ను జారవిడిచాడు. ఈ మ్యాచ్లో భారత్ ఆరుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగింది.తుది జట్లు..న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్వెల్(c), జకారీ ఫౌల్క్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఆదిత్య అశోక్భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ -
టీమిండియాతో తొలి వన్డే.. న్యూజిలాండ్ జట్టులో భారత మూలాలున్న ఆటగాడు
స్వదేశంలో ఇవాల్టి నుంచి (జనవరి 11) భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. వడోదర వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా భారీ ప్రయోగం చేస్తుంది. రొటీన్కు భిన్నంగా ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగుతుంది. స్పిన్నర్లుగా సుందర్, జడేజా, కుల్దీప్.. పేసర్లుగా సిరాజ్, ప్రసిద్ద్, హర్షిత్ బరిలో దిగుతున్నారు.న్యూజిలాండ్ తరఫున క్రిస్టియన్ క్లార్క్ ఈ మ్యాచ్తో అరంగేట్రం చేస్తున్నాడు. భారత మూలాలున్న ఆదిత్య అశోక్ ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ప్రధాన బౌలర్గా బరిలో దిగనున్నాడు. అశోక్ రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలర్. గూగ్లీలు వేయడంలో దిట్ట.ఎవరీ ఆదిత్య అశోక్..?ఆదిత్య అశోక్ తమిళనాడులోని వేలూర్లో 2002 సెప్టెంబర్ 5న జన్మించాడు. అతనికి నాలుగేళ్ల వయసు ఉండగా అతని న్యూజిలాండ్కు వలస వెళ్లి ఆక్లాండ్లో స్థిరపడింది. అశోక్ ఆక్లాండ్లోని మౌంట్ ఆల్బర్ట్ గ్రామర్ స్కూల్లో చదువుకున్నాడు.అశోక్ 2020 అండర్-19 వరల్డ్ కప్తో న్యూజిలాండ్ తరఫున జూనియర్ విభాగంలో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత దేశీయ క్రికెట్లో ఆక్లాండ్ తరఫున మెరిసాడు. - 2021 డిసెంబర్లో Super Smash టోర్నీతో టీ20 అరంగేట్రం చేశాడు. - 2022 జనవరిలో Ford Trophyతో లిస్ట్ A అరంగేట్రం చేశాడు. - 2022–23 Plunket Shieldతో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్లోనే 5 వికెట్లతో సత్తా చాటాడు. అశోక్కు న్యూజిలాండ్ సీనియర్ జట్టు నుంచి 2023 మార్చిలో తొలిసారి పిలుపు వచ్చింది. తొలుత అతను ఏ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2023 ఆగస్టులో UAEపై అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశాడు. 2023 డిసెంబర్లో బంగ్లాదేశ్పై వన్డే అరంగేట్రం చేశాడు. అశోక్ న్యూజిలాండ్ తరఫున ఇప్పటివరకు 2 వన్డేలు, ఓ టీ20 మాత్రమే ఆడాడు. అతన్ని న్యూజిలాండ్ స్పిన్ భవిష్యత్తుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇప్పటివరకు భారత మూలాలున్న చాలామంది క్రికెటర్లు న్యూజిలాండ్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. వీరిలో టామ్ పునా ప్రథముడు కాగా.. దీపక్ పటేల్, జీత్ రావల్, ఐష్ సోధి, ఎజాజ్ పటేల్, రచిన్ రవీంద్ర వంటి వారు బాగా పాపులయ్యారు. తాజాగా ఆదిత్య అశోక్ కూడా వీరి బాటలోనే పయనించేందుకు కృషి చేస్తున్నాడు. -
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
స్వదేశంలో ఇవాల్టి నుంచి (జనవరి 11) భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది. వడోదర వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా భారీ ప్రయోగం చేస్తుంది. రొటీన్కు భిన్నంగా ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగుతుంది. స్పిన్నర్లుగా సుందర్, జడేజా, కుల్దీప్.. పేసర్లుగా సిరాజ్, ప్రసిద్ద్, హర్షిత్ బరిలో దిగుతున్నారు. న్యూజిలాండ్ తరఫున క్రిస్టియన్ క్లార్క్ ఈ మ్యాచ్తో అరంగేట్రం చేస్తున్నాడు. భారత మూలాలున్న ఆదిత్య అశోక్ ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ప్రధాన స్పిన్నర్గా బరిలో దిగనున్నాడు. అశోక్ కుటుంబం అతని చిన్నప్పుడే తమిళనాడులోని వేలూర్ నుంచి వెళ్లి న్యూజిలాండ్లో స్థిరపడింది. తుది జట్లు..న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్వెల్(c), జకారీ ఫౌల్క్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఆదిత్య అశోక్భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ -
ఇవాల్టి నుంచి భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్
స్వదేశంలో ఇవాల్టి నుంచి (జనవరి 11) భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. వడోదర వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది. సిరీస్ ప్రారంభ నేపథ్యంలో ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరీస్లపై ఓ లుక్కేద్దాం. భారత్-న్యూజిలాండ్ ఇప్పటివరకు 17 ద్వైపాక్షిక సిరీస్ల్లో ఎదురెదురుపడగా.. న్యూజిలాండ్ 6, భారత్ 9 సిరీస్ల్లో విజయాలు సాధించాయి. 2 సిరీస్లు డ్రా అయ్యాయి.వీటిలో భారత్లో జరిగిన సిరీస్లను ప్రత్యేకంగా తీసుకుంటే.. భారత్ ఇప్పటివరకు స్వదేశంలో న్యూజిలాండ్తో ఏడు వన్డే సిరీస్లు అడగా ఒక్కదాంట్లో కూడా ఓడిపోలేదు. ఏడు సిరీస్ల్లోనూ జయకేతనం ఎగురవేసి, స్వదేశంలో తిరుగులేని రికార్డు కలిగి ఉంది. చివరి సారిగా (2022-23) స్వదేశంలో జరిగిన సిరీస్లో టీమిండియా 3-0తో కివీస్ను క్లీన్ స్వీప్ చేసింది.భారత్-న్యూజిలాండ్ మధ్య ఇప్పటివరకు జరిగిన ద్వైపాక్షిక సిరీస్లు..న్యూజిలాండ్లో జరిగినవి.. 1975/76- 2-0 (న్యూజిలాండ్)1980-81- 2-0 (న్యూజిలాండ్)1993-94- 2-2 (డ్రా)1998-99- 2-2 (డ్రా)2002-03- 5-2 (న్యూజిలాండ్)2008-09- 3-1 (5) (భారత్)2013-14- 4-0 (5) (న్యూజిలాండ్)2018-19- 4-1 (భారత్)2019-20- 3-0 (న్యూజిలాండ్)2022-23- 1-0 (3) (న్యూజిలాండ్)భారత్లో జరిగిన సిరీస్లు..1988/89- 4-01995-96- 3-21999-00- 3-22010-11- 5-02016-17- 3-22017-18- 2-12022-23- 3-0* అన్నింటిలో భారత్దే విజయంహెడ్ టు హెడ్ రికార్డులుభారత్-న్యూజిలాండ్ ఇప్పటివరకు 120 వన్డేల్లో ఎదురెదురుపడ్డాయి. ఇందులో భారత్ 62, న్యూజిలాండ్ 50 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. 7 మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు. ఓ మ్యాచ్ టై అయ్యింది. వీటిలో భారత్ స్వదేశంలో గెలిచిన మ్యాచ్లు 31 కాగా.. న్యూజిలాండ్ వారి స్వదేశంలో గెలిచిన మ్యాచ్లు 26.చివరిగా తలపడిన మ్యాచ్లోనూ పరాభవమేభారత్-న్యూజిలాండ్ చివరిగా వన్డే ఫార్మాట్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.స్వదేశంలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు భారత జట్టు..శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్) భారత్తో వన్డే సిరీస్కు న్యూజిలాండ్ జట్టు..డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్వెల్ (కెప్టెన్), విల్ యంగ్, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, జాకరీ ఫౌల్క్స్, నిక్ కెల్లీ, జోష్ క్లార్క్సన్, మైఖేల్ రే, కైల్ జేమీసన్, మిచెల్ హే, ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్, జేడెన్ లెనాక్స్ -
న్యూజిలాండ్ వన్డే సిరీస్ నుంచి పంత్ ఔట్
అనుకున్నదే జరిగింది. న్యూజిలాండ్ వన్డే సిరీస్ నుంచి టీమిండియా వికెట్కీపింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ వైదొలిగాడు. శనివారం (జనవరి 10) మధ్యాహ్నం వడోదరలోని BCA స్టేడియంలో నెట్స్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పంత్కు కుడి పక్క భాగంలో తీవ్రమైన నొప్పి వచ్చింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించి ఎంఆర్ఐ స్కాన్ తీయించగా.. Oblique Muscle Tear అని తేలింది. దీంతో రంగంలోకి దిగిన BCCI మెడికల్ టీమ్, డాక్టర్లతో చర్చించి పంత్ను న్యూజిలాండ్ వన్డే సిరీస్ నుంచి తప్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 🚨 PRESS RELEASE FROM BCCI ON RISHABH PANT 🚨 pic.twitter.com/z3l3jPKFCi— Johns. (@CricCrazyJohns) January 11, 2026ఈ మేరకు బోర్డు మీడియా అడ్వైజరీ కమిటీ ఓ లేఖను విడుదల చేసింది. పంత్ స్థానాన్ని ధృవ్ జురెల్తో భర్తీ చేస్తున్నట్లు అదే లేఖలో పేర్కొంది. జురెల్ ఇప్పటికే జట్టుతో కలిశాడు. కాగా, న్యూజిలాండ్ సిరీస్కు రిషబ్ పంత్ కేఎల్ రాహుల్కు బ్యాకప్గా ఎంపికయ్యాడు. ఇటీవలికాలంలో పంత్ టెస్ట్లకు మాత్రమే పరిమితమయ్యాడు. వన్డేల్లో అడపాదడపా అవకాశాలు మాత్రమే వస్తున్నాయి. వన్డేల్లో కేఎల్ రాహుల్ టీమిండియాకు ఫస్ట్ ఛాయిస్ వికెట్కీపర్గా ఉన్నాడు. తాజాగా పంత్ గాయపడిన తర్వాత ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఇషాన్ కిషన్ను ఎంపిక చేశారని ప్రచారం జరిగింది. అయితే ఎవరూ ఊహించని విధంగా జురెల్ ఎంపికయ్యాడు. న్యూజిలాండ్తో తొలి వన్డే వడోదర వేదికగా ఇవాళ (జనవరి 11) మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది.అప్ డేటెడ్ భారత జట్టు.. శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్) -
టీమిండియాకు ఊహించని షాక్
భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే ఆదివారం (జనవరి 11) జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ప్రాక్టీస్ సెషన్లో గాయపడ్డాడు. మొదటి వన్డే కోసం భారత జట్టు వడోదరలోని బీసీఏ (BCA) స్టేడియంలో శనివారం తమ చివరి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోంది.అయితే త్రోడౌన్ స్పెషలిస్టుల ఎదుర్కొంటున్న సమయంలో ఓ బంతి పంత్ నడుము పైభాగంలో బలంగా తగిలింది. దీంతో అతడు నొప్పితో విలవిలాడాడు. వెంటనే జట్టు ఫిజియో పరిగెత్తుకుంటూ వచ్చి అతడికి చికిత్స అందించాడు. అయినప్పటికీ నొప్పి తగ్గకపోవడంతో రిషబ్ ప్రాక్టీస్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు.ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పంత్ గాయపడిన సమయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా అక్కడే ఉన్నాడు. కాగా విజయ్ హజారే ట్రోఫీలో బిజీబీజీగా గడిపిన పంత్ శుక్రవారం భారత జట్టుతో చేరాడు. అంతలోనే పంత్ గాయపడడం టీమ్ మెనెజ్మెంట్ను కలవరపెడుతోంది.అయితే పంత్ గాయంపై బీసీసీఐ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. పంత్ ప్రస్తుతం జట్టులో కేఎల్ రాహుల్కు బ్యాకప్గా ఉన్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ మొత్తానికి అతడు బెంచ్కే పరిమితమయ్యాడు. కివీస్తో వన్డే సిరీస్కు పంత్ను పక్కన పెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. అతడి స్ధానంలో ఇషాన్ కిషన్ను జట్టులోకి తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ సెలెక్టర్లు మాత్రం పంత్ వైపే మొగ్గు చూపారు.కివీస్తో వన్డేలకు భారత జట్టుశుభ్మన్ గిల్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్ (వైస్-కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, నితీష్ కుమార్ రెడ్డి, రిషబ్ పంత్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, వాషింగ్టన్ సుందర్.చదవండి: WPL 2026: అరంగేట్రంలోనే అదరగొట్టిన అనుష్క శర్మ -
IND vs NZ: 'ఈసారి కూడా వైట్ వాష్ చేస్తాము'
భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ఆదివారం(జనవరి 11) నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో మొదటి వన్డేకు వడోదరలోని బీసీఎ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. అయితే ఏడాదిన్నర కిందట స్వదేశంలో భారత్ను టెస్టుల్లో వైట్వాష్ చేసిన కివీస్.. ఇప్పుడు అదే ఫలితాన్ని వన్డేల్లో కూడా పునరావృతం చేయాలని పట్టుదలతో ఉంది.ఇదే విషయాన్ని తొలి వన్డేకు ముందు మీడియా సమావేశంలో మాట్లాడిన న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ విల్ యంగ్ స్పష్టం చేశాడు. కివీస్ జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని, భారత్ను ఓడించగలమని యంగ్ థీమా వ్యక్తం చేశాడు. కాగా 2024 ఆఖరిలో భారత్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ సంచలనం సృష్టించింది.మూడు టెస్టుల సిరీస్ను కివీస్ వైట్ వాష్ చేసింది. బ్లాక్ క్యాప్స్ జట్టు 1955 తర్వాత భారత గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గడం ఇదే తొలిసారి. ఈ చారిత్రాత్మక సిరీస్ విజయంలో యంగ్ది కీలక పాత్ర. యంగ్ ప్లేయర్ ఆఫ్ది సిరీస్గా నిలిచాడు. ఇప్పుడు వన్డేల్లో కూడా సత్తాచాటాలని అతడు ఉవ్విళ్లూరుతున్నాడు."ఈసారి భిన్నమైన ఫార్మాట్లో క్రికెట్ ఆడేందుకు భారత్ పర్యటనకు వచ్చాము. మా జట్టు ప్రస్తుతం వన్డేల్లో అద్భుతంగా రాణిస్తోంది. సీనియర్ ప్లేయర్లు దూరంగా ఉన్నప్పటికి మేము మెరుగైన ప్రదర్శన చేస్తామన్న నమ్మకం నాకు ఉంది. ఈ సిరీస్కు ముందు మేము స్వదేశంలో ఇంగ్లండ్, వెస్టిండీస్తో వన్డేల్లో విజయం సాధించాము.గత భారత పర్యటనలో మేము సాధించిన విజయం మాకు ఎంతో నమ్మకాన్ని ఇచ్చింది. ఈసారి కూడా గెలిచేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాము. భారత్లో మరొక సిరీస్ గెలవడమే మా లక్ష్యం. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో చివరి మెట్టుపై బోల్తా పడ్డాము. కానీ ఆ ఓటమిని మేము ఎప్పుడో మర్చిపోయాము.ఇప్పుడు మా దృష్టి కేవలం ఈ ద్వైపాక్షిక సిరీస్ పైనే ఉంది" అని పేర్కొన్నాడు. కాగా గతేడాది మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ చేతిలో కివీస్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక ఈ సిరీస్ భారత పర్యటకు కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్,రచిన్ రవీంద్ర వంటి స్టార్ ప్లేయర్లు దూరమయ్యారు. వన్డే సిరీస్కు కివీస్ కెప్టెన్గా మైఖల్ బ్రెస్వెల్ వ్యవహరించనున్నాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 9 ఫోర్లు, 7 సిక్స్లతో -
T20 WC: వేటు వేసిన సెలక్టర్లు.. తొలిసారి స్పందించిన గిల్
టీ20 ప్రపంచకప్-2026లో పాల్గొనే భారత జట్టు నుంచి తనను తప్పించడంపై.. టీమిండియా వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్ స్పందించాడు. తనపై వేటు వేస్తూ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తానని పేర్కొన్నాడు. కాగా ఆసియా టీ20 కప్-2025 ద్వారా గిల్ అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో అభిషేక్ శర్మకు విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా ఉన్న సంజూ శాంసన్ (Sanju Samson)ను తప్పించి.. అతడి స్థానంలో గిల్ను ఓపెనర్గా పంపారు. అయితే, వరుస మ్యాచ్లలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ విఫలమయ్యాడు. గత ఇరవై ఇన్నింగ్స్లో అతడి ఖాతాలో ఒక్క టీ20 హాఫ్ సెంచరీ కూడా లేకపోవడం ఇందుకు నిదర్శనం.అయినప్పటికీ సౌతాఫ్రికాతో ఇటీవల స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్లోనూ గిల్ (Shubman Gill).. తొలి మూడు మ్యాచ్లలో కొనసాగించారు. ఇక్కడా అతడు విఫలమయ్యాడు. అనంతరం పాదం నొప్పి కారణంగా సఫారీ జట్టుతో నాలుగు (వర్షం వల్ల రద్దు), ఐదో టీ20కి గిల్ దూరమయ్యాడు. ఈ క్రమంలో ప్రొటిస్తో ఐదో టీ20లో ఓపెనర్గా తిరిగి వచ్చి సంజూ మరోసారి సత్తా చాటాడు.అనూహ్య రీతిలో వేటుఫలితంగా.. గిల్కు పెద్ద పీట వేస్తూ.. సంజూకు అన్యాయం చేశారన్న విమర్శలు మరోసారి తెరమీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. టెస్టు, వన్డే జట్ల కెప్టెన్.. టీ20 జట్టు వైస్ కెప్టెన్ అయిన గిల్ను ప్రపంచకప్ జట్టు నుంచి తప్పించింది. ఊహించని రీతిలో భవిష్య కెప్టెన్పై వేటు వేసి.. అక్షర్ పటేల్ను సూర్యకుమార్ యాదవ్ డిప్యూటీగా నియమించింది.ఇక భారత జట్టు ప్రస్తుతం సొంతగడ్డపై న్యూజిలాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్తో బిజీ కానుంది. జనవరి 11 నుంచి ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్ మొదలుకానుండగా.. టీమిండియా వన్డే కెప్టెన్ గిల్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా టీ20 జట్టులో చోటు కోల్పోవడంపై ప్రశ్న ఎదురైంది.అలా అయితే నన్నెవరూ ఆపలేరు కదా!ఇందుకు స్పందిస్తూ.. ‘‘సెలక్టర్ల నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టుకు ఆల్ ది బెస్ట్. నా తలరాతలో రాసి ఉన్నదాన్ని బట్టే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను.నాకు దక్కాల్సిన వాటి గురించి నుదిటిరాతలో రాసి ఉంటే.. నా నుంచి దానిని ఎవరూ దూరం చేయలేరు. నన్నెవరూ ఆపలేరు. ప్రతి ఒక్క ఆటగాడు ఎల్లప్పుడూ దేశం కోసం ఆడుతూ.. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే కోరుకుంటాడు. నేను కూడా అంతే. అయితే, సెలక్టర్లే అంతిమ నిర్ణయం తీసుకుంటారు’’ అని శుబ్మన్ గిల్ పేర్కొన్నాడు.చదవండి: T20 WC 2026: ‘ఈసారి ఫైనల్లో టీమిండియాపై గెలుస్తాం’ -
సంజూ శాంసన్ కోసం రంగంలోకి యువీ!
టీమిండియా దిగ్గజ ఆల్రౌండర్గా యువరాజ్ సింగ్కు పేరుంది. టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్కప్-2011 టోర్నీల్లో భారత్ చాంపియన్గా నిలవడంలో అతడిది కీలక పాత్ర. పదిహేడేళ్లకుపైగా అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగిన యువీ.. తన కెరీర్లో 40 టెస్టులు, 58 టీ20 మ్యాచ్లు.. అత్యధికంగా 304 వన్డేలు ఆడాడు.టెస్టుల్లో 1900, టీ20లలో 1177 పరుగులు చేసిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. వన్డేల్లో 14 శతకాల సాయంతో 8701 పరుగులు సాధించాడు. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఖాతాలో 9 టెస్టు, 111 వన్డే, 28 టీ20 వికెట్లు ఉన్నాయి. ఐపీఎల్లోనూ 132 మ్యాచ్లు ఆడిన యువీ.. 2750 పరుగులు చేయడంతో పాటు.. 36 వికెట్లు కూడా తీశాడు.ఇంతటి అనుభవం గల యువీ దగ్గర పంజాబీ బ్యాటర్లు, టీమిండియా స్టార్లు శుబ్మన్ గిల్, అభిషేక్ శర్మ శిక్షణ తీసుకున్నారు. అతడి మార్గదర్శనంలో వీరిద్దరు రాటుదేలారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ టీమిండియా విధ్వంసకర ఓపెనర్గా, ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్గా ఎదగడంలో యువీది కీలక పాత్ర.మరోవైపు.. గిల్ ఏకంగా టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. ఇక యువీ శిష్యుల జాబితాలోకి తాజాగా సంజూ శాంసన్ కూడా చేరిపోయినట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్తో స్వదేశంలో టీ20 సిరీస్కు ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సన్నద్ధమవుతున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి సన్నాహకంగా సాగే ఈ సిరీస్లో సత్తా చాటి.. మెగా ఈవెంట్లోనూ మెరవాలని సంజూ పట్టుదలగా ఉన్నాడు.ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ మార్గదర్శనంలో నెట్స్లో సంజూ శ్రమిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇందులో యువీ.. సంజూకు బ్యాటింగ్ పొజిషన్, టెక్నిక్స్ గురించి సలహాలు ఇస్తుండగా.. అతడు శ్రద్ధగా వింటున్నట్లు కనిపించిది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘క్రేజీ కాంబినేషన్.. సూపర్ భయ్యా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సంజూ శాంసన్ ఫ్యాన్స్ పేజీ నుంచి వచ్చిన ఈ వీడియోపై మరికొందరు మాత్రం.. ‘‘AI’’ కాదు కదా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.కాగా న్యూజిలాండ్తో తొలుత మూడు వన్డేలు ఆడిన తర్వాత.. టీమిండియా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. జనవరి 11- 31 వరకు ఈ సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఆ తర్వాత ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్-2026తో భారత జట్టు బిజీ అవుతుంది. Sanju Samson training session with Yuvraj Singh ❤️🔥@YUVSTRONG12 @IamSanjuSamson pic.twitter.com/gBc04dbKXs— Sanju Samson Fans Page (@SanjuSamsonFP) January 10, 2026 -
ప్రాక్టీస్లో టీమిండియా
వడోదర: న్యూజిలాండ్తో వన్డే సిరీస్ కోసం టీమిండియా సమాయత్తమవుతోంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం తొలి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ప్రాక్టీస్లో నిమగ్నమయ్యారు. శుక్రవారం జరిగిన సెషన్లో కోహ్లి, రోహిత్ మంచి టచ్లో కనిపించారు. నెట్స్లో వీరిద్దరూ గంటన్నర పాటు పేసర్లు, స్పిన్నర్లను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత త్రోడౌన్ స్పెషలిస్ట్ బంతులను ప్రాక్టీస్ చేశారు. టి20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరూ... ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో రెండు సెంచరీలు బాదిన కోహ్లి న్యూజిలాండ్పై కూడా అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో వీరిద్దరూ చెరో రెండు మ్యాచ్లు ఆడి ఫామ్ చాటుకున్నారు. కెపె్టన్ శుబ్మన్ గిల్ కూడా నెట్స్లో చమటోడ్చాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో చివరి రెండు టి20లకు దూరమైన అతడు... ఇప్పుడు పూర్తిగా కోలుకొని ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. గురువారం తమ రాష్ట్ర జట్ల తరఫున విజయ్ హజారే మ్యాచ్లు ఆడిన శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్ శుక్రవారం ప్రాక్టీస్లో పాల్గొనలేదు. వన్డే సిరీస్ అనంతరం భారత జట్టు న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ కూడా ఆడనుంది. ఆ వెంటనే ఐసీసీ టి20 ప్రపంచకప్ జరగనుంది. -
న్యూజిలాండ్తో తొలి వన్డే.. భారత తుది జట్టు ఇదే! ఆంధ్ర ప్లేయర్కు ఛాన్స్?
భారత పురుషల క్రికెట్ జట్టు కొత్త ఏడాదిలో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమవుతోంది. జనవరి 11 నుంచి భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్లో భాగంగా తొలి వన్డే వడోదర వేదికగా ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు తమ ప్రాక్టీస్ను ఆరంభించింది.కెప్టెన్ శుభ్మన్ గిల్ తిరిగి రావడంతో జట్టును నడిపించనున్నాడు. అదేవిధంగా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఇటీవల జరిగిన అన్ని ఫిట్నెస్ పరీక్షలో అతడు ఉత్తర్ణీత సాధించాడు. దీంతో అతడు కూడా కివీస్తో సిరీస్లో ఆడనున్నాడు. బ్రేస్వెల్ సారథ్యంలో కివీస్ జట్టు కూడా భారత్ గడ్డపై అడుగుపెట్టింది. సిరీస్ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. అయితే పర్యాటక జట్టుతో పోలిస్తే టీమిండియా పటిష్టంగా ఉంది. ఈ సిరీస్ కివీ స్టార్ ప్లేయర్లు మిచెల్ సాంట్నర్, టామ్ లాథమ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ దూరమయ్యారు. భారత్ మాత్రం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి సీనియర్ ప్లేయర్లతో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో భారత తుది జట్టు కూర్పుపై ఓ లుక్కేద్దాం.యశస్వికి నో ఛాన్స్..?సౌతాఫ్రికా సిరీస్కు శుభ్మన్ గిల్ దూరంగా ఉండడంతో భారత ఇన్నింగ్స్ను రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైశ్వాల్ ఆరంభించాడు. గిల్ తిరిగి రావడంతో ఓపెనర్ జైశ్వాల్ బెంచ్కే పరిమితం కానున్నాడు. మూడు, నాలుగు స్ధానల్లో విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్కు రానున్నారు.అయితే తుది జట్టులో ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కే అవకాశముంది. కాగా హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వడంతో నితీశ్కు ప్రధాన జట్టులో చోటు దక్కింది. అదేవిధంగా రిషబ్ పంత్ మరోసారి తుది జట్టులో చోటు దక్కే సూచనలు కన్పించనున్నాయి. కేఎల్ రాహుల్ వికెట్ కీపర్గా కొనసాగనున్నాడు.సౌతాఫ్రికా సిరీస్లోనూ పంత్ బెంచ్కే పరిమతం కావాల్సి వచ్చింది. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్గా రవీంద్ర జడేజా చోటు దక్కించుకోనున్నాడు. ఫాస్ట్ బౌలర్ల కోటాలో హర్షిత్ రాణాపై జట్టు మెనెజ్మెంట్ నమ్మకం ఉంచనున్నట్లు తెలుస్తోంది. అతడితో పాటు అర్ష్దీప్, మహ్మద్ సిరాజ్ బంతిని పంచుకోనున్నారు. స్పెషలిస్టు స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఉండనున్నాడు.కివీస్తో తొలి వన్డేకు భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, నితీశ్ కుమార్ రెడ్డి, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సిరాజ్చదవండి: WPL 2026: గుజరాత్ జెయింట్స్కు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ అవుట్ -
IND vs NZ: తిలక్ వర్మ స్థానంలో జట్టులోకి అతడు!
టీమిండియా స్టార్, హైదరాబాద్ క్రికెటర్ ఠాకూర్ తిలక్ వర్మ అనూహ్య రీతిలో జట్టుకు దూరమయ్యాడు. పొత్తి కడుపునకు సంబంధించిన సమస్య కారణంగా ఇటీవల అతడు తీవ్ర నొప్పితో బాధపడగా.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో అత్యవసరంగా తిలక్కు శస్త్ర చికిత్స నిర్వహించారు.వేగంగా కోలుకుంటున్నాడుదేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో హైదరాబాద్ జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తున్న తిలక్ వర్మ (Tilak Varma) .. రాజ్కోట్ వేదికగా మంగళవారం బెంగాల్తో జరిగిన మ్యాచ్లో ఆడాడు. అయితే ఆ తర్వాతే.. మైదానం బయట సమస్య మొదలైంది. ‘పొత్తి కడుపు సమస్యతో తిలక్కు ఇబ్బంది ఎదురైంది. దాంతో రాజ్కోట్లో బుధవారం తిలక్వర్మకు శస్త్రచికిత్స జరిగింది.గురువారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తిలక్ శుక్రవారం హైదరాబాద్కు తిరిగి వెళతాడు, ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది. వేగంగా కోలుకుంటున్నాడు’ అని బీసీసీఐ అధికారిక ప్రకటన జారీ చేసింది.సమస్య పూర్తిగా తగ్గిన తర్వాతేతాజా పరిణామం కారణంగా న్యూజిలాండ్ (IND vs NZ)తో జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తిలక్ తొలి మూడు మ్యాచ్లకు దూరమయ్యాడు. అయితే చివరి రెండు మ్యాచ్ల విషయంపై కూడా బోర్డు ఇంకా స్పష్టతనివ్వలేదు.‘తిలక్ ప్రస్తుతం సమస్య నుంచి కోలుకొని సమస్య పూర్తిగా తగ్గిన తర్వాతే ట్రైనింగ్ మొదలు పెడతాడు. ఆపైనే అతని ప్రాక్టీస్ ఉంటుంది. అతని ఆరోగ్యం, కోలుకునే విషయంలో పురోగతిని బట్టి చివరి రెండు మ్యాచ్లలో ఆడే విషయంపై నిర్ణయం తీసుకుంటాం’ అని బోర్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కివీస్తో టీ20లు ఆడే భారత జట్టులో తిలక్ వర్మ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరన్న చర్చ మొదలైంది.‘సర్పంచ్’ సాబ్ రావాల్సిందేఈ విషయంపై భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయం పంచుకున్నాడు. ఎక్స్ వేదికగా.. ‘‘తిలక్ వర్మ గాయపడ్డాడు. అతడు టీ20 ప్రపంచకప్ టోర్నీకి కూడా దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.మరి టీమిండియాలో అతడి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?... నా అభిప్రాయం ప్రకారం.. ఆ ఆటగాడు మరెవరో కాదు.. శ్రేయస్ అయ్యర్. అవును.. ‘సర్పంచ్’ సాబ్ ఆటోమేటిక్గా జట్టులోకి రావాల్సిందే.అప్పుడు అతడికి అన్యాయందేశీ టీ20 టోర్నీలోనే కాదు.. వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ పొట్టి క్రికెట్ తరహాలో అతడు అదరగొడుతున్నాడు. నిజానికి తన ఫామ్ దృష్ట్యా అతడు ఆసియా టీ20 కప్ టోర్నీ-2025 కూడా ఆడాల్సింది. కానీ సెలక్టర్లు అతడికి అన్యాయం చేశారనిపించింది. ఆ టోర్నీకి అతడిని ఎందుకు ఎంపిక చేయలేదో ఇప్పటికీ అర్థం కాలేదు.అయితే, ఇప్పుడు మిడిలార్డర్లో ఆడేందుకు శ్రేయస్కు ఓ అవకాశం దొరికింది. అతడొక అనుభవజ్ఞుడైన ఆటగాడు. ఐపీఎల్లో అతడి క్రేజే వేరు. తన అద్భుత ఆట తీరుతో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం అతడు పూర్తి ఫిట్గా కూడా ఉన్నాడు. కాబట్టి తిలక్ స్థానంలో నేనైతే శ్రేయస్ అయ్యర్కే ఓటు వేస్తా’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.ఊహించని పేరు కూడాఇక శ్రేయస్ అయ్యర్తో పాటు.. తన సెకండరీ ఆప్షన్గా ఆకాశ్ చోప్రా.. అసోం ఆల్రౌండర్ రియాన్ పరాగ్ను ఎంచుకున్నాడు. ఈ ఇద్దరితో పాటు జితేశ్ శర్మ కూడా పోటీలోకి రావచ్చొన్న ఈ మాజీ ఓపెనర్.. ఏదేమైనా శ్రేయస్ అయ్యర్కే చోటు దక్కుతుందని అంచనా వేశాడు. ఇక ఓపెనర్లతో ఇప్పుడు టీమిండియాకు పనిలేదు కాబట్టి.. శుబ్మన్ గిల్ టీ20 జట్టులోకి వచ్చే ఛాన్స్ లేదన్నాడు.చదవండి: అతడో గ్యాంబ్లర్.. కొంచెం కూడా భయం లేదు: ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం ఫైర్ -
టీమిండియాకు భారీ షాక్..
న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు ముందు భారత్కు భారీ షాక్ తగిలింది. ఈ సిరీస్లోని తొలి మూడు మ్యాచ్లకు స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్ వేదికగా ధ్రువీకరించింది."తిలక్ వర్మ శస్త్రచికిత్స విజయవంతమైంది. అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది. తిలక్ గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. శుక్రవారం తిరిగి హైదరాబాద్కు చేరుకోనున్నాడు. నొప్పి తగ్గిన తర్వాత అతడు తన ప్రాక్టీస్ను మొదలు పెట్టనున్నాడు. ఈ క్రమంలోన్యూజిలాండ్తో తొలి మూడు టీ20లకు దూరంగా ఉండనున్నాడు" అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.ఏమి జరిగిందంటే? తిలక్ ప్రస్తుతం విజయ్ హజారే-2025లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో రాజ్కోట్ వేదికగా జరిగిన ఓ మ్యాచ్లో తిలక్కు పొట్ట కింది భాగంలో తీవ్రమైన నొప్పి వచ్చింది. వెంటనే అతడిని రాజ్కోట్లో గోకుల్కు ఆస్పత్రికి తరలించి స్కాన్లు నిర్వహించారు.అతడికి టెస్టిక్యులర్ టార్షన్ సమస్య ఉన్నట్లు తేలింది. దీంతో అతడికి అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించారు. తిలక్ ఈ సిరీస్కు దూరమైనా టీ20 ప్రపంచకప్-2026 నాటికి పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశముంది. జనవరి 21 నుంచి భారత్-న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ ఆరంభం కానుంది. -
తిలక్కు గాయం.. గిల్కు కలిసొస్తుందా..?
న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మకు గాయమైందని తెలుస్తుంది. విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ కోసం (జమ్మూ అండ్ కశ్మీర్తో) రాజ్కోట్లో ఉన్న తిలక్కు ఉన్నట్టుండి వృషణాల్లో తీవ్రమైన నొప్పి వచ్చింది. సమీపంలోని గోకుల్ ఆసుపత్రికి తరలించి స్కాన్స్ తీయించగా.. "టెస్టిక్యులర్ టోర్షన్" అని నిర్ధారణ అయ్యింది.దీంతో హుటాహుటిన శస్త్రచికిత్ర చేశారు. చికిత్స విజయవంతమైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తిలక్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ.. అతని తదుపరి క్రికెట్ షెడ్యూల్ సందిగ్దంలో పడింది. త్వరలో ప్రారంభం కానున్న న్యూజిలాండ్ టీ20 సిరీస్తో పాటు టీ20 వరల్డ్కప్లో అతను పాల్గొనడం అనుమానంగా మారింది.ఈ నేపథ్యంలో తిలక్ ప్రత్యామ్నాయం ఎవరనే దానిపై చర్చ మొదలైంది. లిస్ట్లో నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ది. ఫామ్లో లేని కారణంగా గిల్కు న్యూజిలాండ్ సిరీస్తో పాటు ప్రపంచకప్ జట్టులోనూ చోటు దక్కలేదు.తిలక్ గాయం పుణ్యమా అని అతడికి సువర్ణావకాశం లభించినా లభించవచ్చు. టీ20 బెర్త్పై ఆశలు వదులుకున్న గిల్కు తిలక్ రూపంలో అదృష్టం వరించేలా ఉందన్న చర్చ ఇప్పటికే మొదలైంది. బీసీసీఐలో గిల్కు ఉన్న పలుకుబడికి న్యూజిలాండ్ సిరీస్తో పాటు ప్రపంచకప్ బెర్త్ కూడా దక్కవచ్చు.అయితే అవకాశాలు గిల్కు మాత్రమే పరిమితం కాలేదు. రేసులో శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్ లాంటి వారు కూడా ఉన్నారు. ఎందుకంటే.. తిలక్ వన్డౌన్లో లేదా నాలుగో స్థానంలో బరిలోకి దిగే బ్యాటర్. గిల్ను ఈ స్థానాల్లో బ్యాటింగ్కు పంపడమంటే ప్రయోగమవుతంది. కాబట్టి సెలెక్టర్లు వన్డౌన్లో లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న రుతురాజ్, పడిక్కల్, శ్రేయస్ పేర్లను పరిశీలించవచ్చు.పైగా వీరంతా సూపర్ ఫామ్లో ఉన్నారు. ముఖ్యంగా పడిక్కల్, రుతురాజ్ విజయ్ హజారే ట్రోఫీలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. పడిక్కల్ 6 మ్యాచ్ల్లో నాలుగు సెంచరీలు చేసి పీక్స్లో ఉండగా.. రుతురాజ్ తాజాగా ఓ సెంచరీ చేయడంతో పాటు గత నాలుగు మ్యాచ్ల్లో మరో సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ చేశాడు.వీరితో పాటు శ్రేయస్కు కూడా అవకాశాలు లేకపోలేదు. మిడిలార్డర్లో తిలక్ స్థానానికి అతడు సరైన న్యాయం చేయగల సమర్థుడు. మొత్తంగా తిలక్ న్యూజిలాండ్ సిరీస్తో పాటు టీ20 ప్రపంచకప్కు దూరమైతే, ఆ బెర్త్ భర్తీ చేసేందుకు నలుగురు పోటీలో ఉంటారు. తిలక్ గాయంపై బీసీసీఐ అధికారిక అప్డేట్ తర్వాత ఈ విషయంపై క్లారిటీ వస్తుంది. -
హార్దిక్ పాండ్యా మహోగ్రరూపం
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. ఈ టోర్నీలో తానాడిన తొలి మ్యాచ్లోనే (విదర్భపై 92 బంతుల్లో 8 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 133 పరుగులు) విధ్వంసకర శతకం బాదిన అతను.. ఇవాళ (జనవరి 8) తన రెండో మ్యాచ్లో ఛత్తీస్ఘడ్పై మెరుపు అర్ద సెంచరీతో మెరిశాడు. 31 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 75 పరుగులు చేశాడు.మొత్తంగా ప్రస్తుత విజయ్ హజారే ట్రోఫీలో 125 బంతులు ఎదుర్కొన్న హార్దిక్.. 21 సిక్సర్లు, 10 ఫోర్ల సాయంతో 208 పరుగులు చేసి మహోగ్రరూపంలో ఉన్నాడు. త్వరలో ప్రారంభం కానున్న న్యూజిలాండ్ సిరీస్లో హార్దిక్ ఇదే జోరును కొనసాగిస్తే పర్యాటక జట్టుకు తిప్పలు తప్పవు. జనవరి 21 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో హార్దిక్ కీలక సభ్యుడు. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టే ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్లోనూ కొనసాగుతుంది. హార్దిక్ ఇదే ఫామ్లో ఉంటే ప్రపంచకప్లో టీమిండియాకు తిరుగుండదు. గత వరల్డ్కప్లోనూ హార్దిక్ టీమిండియాను ఛాంపియన్గా నిలబెట్టడంలో కీలకపాత్ర పోషించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఛత్తీస్ఘడ్తో జరుగుతున్న కీలక మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న బరోడా 36.5 ఓవర్ల అనంతరం 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఓపెనర్లు నితిన్ పాండ్యా (2), అమిత్ పాసి (5) నిరాశపర్చినా.. ప్రయాన్షు మోలియా (79 నాటౌట్), విష్ణు సోలంకి (54), హార్దిక్ పాండ్యా (75), జితేశ్ శర్మ (64 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. మోలియా, జితేశ్ ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు. ఈ సీజన్లో మంచి ఫామ్లో ఉన్న హార్దిక్ అన్న కృనాల్ పాండ్యా (20) ఈ మ్యాచ్లో తక్కువ స్కోర్కే ఔటయ్యాడు. -
కోహ్లి కంటే సన్నగా!.. కింగ్ను ఉక్కిరిబిక్కిరి చేసిన ఫ్యాన్స్!
టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లతో బిజీ కానుంది. కివీస్తో తొలుత మూడు వన్డేలు.. అనంతరం ఐదు టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ తమ జట్లను ప్రకటించాయి.ఇక జనవరి 11, 14, 18 తేదీల్లో భారత్-కివీస్ మధ్య జరిగే వన్డే సిరీస్కు హిట్మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సన్నద్ధమవుతున్నాడు. నెట్స్లో తీవ్రంగా చెమటోడుస్తూ శ్రమిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.కోహ్లి కంటే కూడా సన్నబడ్డాడే!కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియాను విజేతగా నిలిపిన తర్వాత.. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్.. ఫిట్నెస్పై శ్రద్ధ పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏకంగా పది కిలోలకు పైగా బరువు తగ్గి ఆశ్చర్యపరిచాడు. తాజా వీడియోలో రోహిత్ మరింత బక్కచిక్కినట్లు కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో అభిమానులు.. ‘‘బ్రో.. కోహ్లి కంటే కూడా సన్నబడ్డాడే! అస్సలు గుర్తుపట్టలేకపోతున్నాం. సూపర్ భాయ్’’ అంటూ రోహిత్ శర్మను ఉద్దేశించి సరదాగా కామెంట్లు చేస్తున్నారు. Rohit Sharma in the nets. pic.twitter.com/OsFnlwkg40— Mufaddal Vohra (@mufaddal_vohra) January 6, 2026 కింగ్ను ఉక్కిరిబిక్కిరి చేసిన ఫ్యాన్స్!మరోవైపు.. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) కివీస్తో తొలి వన్డే కోసం వడోదరలో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో కోహ్లికి చేదు అనుభవం ఎదురైంది. కింగ్ను చూసేందుకు ఎగబడ్డ జనం.. అతడికి తీవ్ర అసౌకర్యం కలిగించారు. అతికష్టమ్మీద అతడు ఎయిర్పోర్టు నుంచి బయటకు వెళ్లాడు.#WATCH | Gujarat: Former Indian Captain and Star Cricketer Virat Kohli arrives at Vadodara for Team India's ODI match against New Zealand on 11th January. pic.twitter.com/cQbhCghMZy— ANI (@ANI) January 7, 2026ఇద్దరూ సూపర్ ఫామ్లోఇటీవల సౌతాఫ్రికాతో సొంతగడ్డపై వన్డే సిరీస్లో బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అదరగొట్టారు. కోహ్లి అయితే వరుస సెంచరీలతో వింటేజ్ కింగ్ను గుర్తు చేశాడు.ఆ తర్వాత రో-కో దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో సొంత జట్ల తరఫున బరిలోకి దిగారు. ముంబై తరఫున రోహిత్, ఢిల్లీ తరఫున కోహ్లి శతక్కొట్టారు. ఇలా స్టార్లు ఇద్దరూ సూపర్ ఫామ్లో ఉండటం కివీస్తో వన్డేలకు ముందు టీమిండియాకు సానుకూలాంశంగా పరిణమించింది.చదవండి: IND vs NZ: టీమిండియాకు శుభవార్త -
IND vs NZ: టీమిండియాకు శుభవార్త
న్యూజిలాండ్తో వన్డేలకు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అంతర్జాతీయ క్రికెట్ పునరాగమనానికి మార్గం సుగమమైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) నుంచి శ్రేయస్ అయ్యర్కు క్లియరెన్స్ సర్టిఫికెట్ లభించింది.అంతా సజావుగా సాగితే.. శ్రేయస్ (Shreyas Iyer) న్యూజిలాండ్తో మూడు వన్డేలకు అందుబాటులో ఉంటాడు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఈ ముంబై బ్యాటర్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబరు 25న సిడ్నీలో ఆసీస్ (Ind vs Aus)తో మూడో వన్డే సందర్భంగా క్యాచ్ పట్టబోయి అదుపు తప్పి కిందపడిపోయిన శ్రేయస్ పక్కటెములకు తీవ్ర గాయమైంది.అంతర్గత రక్తస్రావందీంతో హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం.. అంతర్గతంగా రక్తస్రావం కావడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలో చాన్నాళ్ల పాటు ఆస్పత్రిలోనే ఉన్న శ్రేయస్.. క్రమంగా కోలుకున్నాడు. అయితే, ఆటకు మాత్రం దాదాపు రెండు నెలలు దూరంగా ఉన్నాడు.రీఎంట్రీ ధనాధన్ఈ క్రమంలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు శ్రేయస్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే, ఫిట్నెస్ ఆధారంగానే అతడు అందుబాటులో ఉండే విషయం తేలుతుందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా మంగళవారం నాటి మ్యాచ్తో ముంబై కెప్టెన్గా శ్రేయస్.. కాంపిటేటివ్ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు.వచ్చీరాగానే ధనాధన్ దంచికొట్టి 36 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. హిమాచల్ ప్రదేశ్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్లో మొత్తంగా 53 బంతుల్లో 82 పరుగులు సాధించాడు. అంతేకాదు కెప్టెన్గానూ రాణించి.. ముంబై క్వార్టర్ ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే బీసీసీఐ సీఓఈ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ పొంది స్వదేశంలో కివీస్తో వన్డే (జనవరి 11, 14, 18)లకు సిద్ధమయ్యాడు.చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. వరల్డ్ రికార్డు -
రీఎంట్రీలో రఫ్ఫాడించిన శ్రేయస్ అయ్యర్
భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్, ముంబై స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పోటీ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన తొలి మ్యాచ్లోనే రఫ్ఫాడించాడు. తీవ్ర గాయం కారణంగా రెండు నెలలు ఆటకు పూర్తిగా దూరమైన శ్రేయస్.. ఇవాళ (జనవరి 6) హిమాచల్ ప్రదేశ్తో జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ 2025-26 మ్యాచ్లో పునరాగమనం చేశాడు. వచ్చీ రాగానే మెరుపు అర్ద శతకంతో అదరగొట్టాడు. 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, మొత్తంగా 53 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసి ఔటయ్యాడు.శ్రేయస్తో పాటు ముషీర్ ఖాన్ (73) కూడా రాణించడంతో హిమాచల్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై 29 ఓవర్ల అనంతరం 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. వాతావరణం అనుకూలించని కారణంగా ఈ మ్యాచ్ను 33 ఓవర్లకే కుదించారు. ముంబై ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 15, సర్ఫరాజ్ ఖాన్ 21, సూర్యకుమార్ యాదవ్ 24 పరుగులు చేయగా.. శివమ్ దూబే 20, హార్దిక్ తామోర్ 13 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.కాగా, గతేడాది అక్టోబర్ 25న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సందర్భంగా అలెక్స్ క్యారీ క్యాచ్ పట్టే ప్రయత్నంలో శ్రేయస్ ప్రమాదకరంగా కిందపడ్డాడు. క్యాచ్ అయితే పట్టగలిగాడు కాని, ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు. కిందపడ్డాక నొప్పితో విలవిలలాడిపోయిన శ్రేయస్ను హుటాహుటిన సిడ్నీలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు ఐసీయూలో పెట్టి చికిత్సనందించారు. తొలుత గాయం చిన్నదే అని అంతా అనుకున్నారు.అయితే డాక్టర్లు నెమ్మదిగా విషయాన్ని చెప్పారు. శ్రేయస్ స్ప్లీన్లో (ప్లీహం) చీలక వచ్చి, అంతర్గత రక్తస్రావమైందని తెలిపారు. ఒకటి, రెండు రోజుల వరకు ఏమీ చెప్పలేమని కూడా అన్నారు. అయితే దైవానుగ్రహం, డాక్టర్లు కృషి వల్ల శ్రేయస్ ప్రాణాపాయం నుంచి తప్పించుకుని సాధారణ స్థితికి చేరాడు.అనంరతం నెల రోజుల పాటు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో వైద్యుల పర్యవేక్షణలో ఉండి, తాజాగా పోటీ క్రికెట్లో పాల్గొనేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందాడు. శ్రేయస్ త్వరలో ప్రారంభం కాబోయే న్యూజిలాండ్ వన్డే సిరీస్లో టీమిండియా వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్కు సన్నాహకంగా శ్రేయస్ విజయ్ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్లు ఆడనున్నాడు.ఇవాళ హిమాచల్ ప్రదేశ్తో మ్యాచ్ తర్వాత జనవరి 8న పంజాబ్తో జరిగే మ్యాచ్లో పాల్గొంటాడు. ఈ రెండు మ్యాచ్ల్లో శ్రేయసే ముంబై జట్టును ముందుండి నడిపిస్తాడు. ముంబై రెగ్యులర్ కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ పిక్క గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం కావడంతో ఆ బాధ్యతలను ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)శ్రేయస్కు అప్పగించింది. -
విరాట్ కోహ్లి అనూహ్య నిర్ణయం!
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి అభిమానులకు చేదు వార్త. న్యూజిలాండ్తో వన్డేలకు ముందు ఈ రన్మెషీన్ మరోసారి బరిలోకి దిగుతాడనుకుంటే.. ఊహించని రీతిలో తన నిర్ణయం మార్చుకున్నాడు. ఢిల్లీ తరఫున విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో మూడో మ్యాచ్ ఆడేందుకు కోహ్లి నిరాకరించినట్లు తెలుస్తోంది.బీసీసీఐ ఆదేశాల మేరకుఅంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి (Virat Kohli).. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. వన్డే వరల్డ్కప్-2027 ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ ఢిల్లీ లెజెండ్.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాల మేరకు దాదాపు పదిహేనేళ్ల విరామం తర్వాత దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే బరిలో దిగాడు.రెండు మ్యాచ్లు కంప్లీట్కనీసం రెండు మ్యాచ్లు అయినా ఆడాలన్న నిబంధనల మేరకు.. తాజా ఎడిషన్లో ఢిల్లీ తరఫున రెండు మ్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. ఇటీవల సౌతాఫ్రికాతో స్వదేశంలో వరుస శతకాలతో జోరు మీదున్న కోహ్లి.. దేశీ క్రికెట్లోనూ ఫామ్ను కొనసాగించాడు. ఆంధ్రపై 131, గుజరాత్పై 77 పరుగులు సాధించాడు.మూడోదీ ఆడతానని చెప్పి..ఇక న్యూజిలాండ్తో సొంతగడ్డపై జనవరి 11 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో.. విజయ్ హజారే టోర్నీలో మూడో మ్యాచ్కు కూడా కోహ్లి అందుబాటులో ఉంటానని చెప్పాడు. ఈ విషయాన్ని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రోహన్ జైట్లీ ఇటీవలే ధ్రువీకరించాడు.అందుబాటులో లేడుఅయితే, తాజాగా ఢిల్లీ కోచ్ సరణ్దీప్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘లేదు. కోహ్లి అందుబాటులో ఉండటం లేదు’’ అని స్పష్టం చేశాడు. కాగా ఢిల్లీ తదుపరి మంగళవారం (జనవరి 6) నాటి మ్యాచ్లో రైల్వేస్ జట్టుతో ఆడనుంది. కర్ణాటకలోని ఆలూర్లో గల కేఎస్సీఏ క్రికెట్ గ్రౌండ్-2 ఇందుకు వేదిక. రిషభ్ పంత్ సారథ్యంలోని ఈ జట్టులో కోహ్లి లేడు.చదవండి: కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ -
అతడు సెలక్ట్ అవ్వాలంటే అదొక్కటే మార్గం: మాజీ చీఫ్ సెలక్టర్
న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎంపిక చేసిన జట్టుపై విమర్శలు కొనసాగుతున్నాయి. గత వన్డే సిరీస్ (సౌతాఫ్రికా)తో పోలిస్తే.. ఈసారి ముగ్గురు క్రికెటర్లు తమ స్థానాలు కోల్పోయారు. రిషభ్ పంత్ ఆట, వన్డేల్లో అతడి సగటు, వైఫల్యాలపై చర్చ జరుగుతున్నా... రెండో వికెట్ కీపర్గా అతడికే పట్టం కట్టారు సెలక్టర్లు.అయితే.. మరో వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ (Dhruv Jurel)పై మాత్రం వేటు పడింది. ఇక హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Varma) కూడా జట్టులో స్థానం కోల్పోయాడు. తిలక్ను విశాఖపట్నంలో మూడో వన్డేకు తుది జట్టులోకి తీసుకున్నా...బ్యాటింగ్ రాకపోగా, జురేల్కు వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశమే రాలేదు.శ్రేయస్ అయ్యర్ పునరాగమనంతోమరోవైపు.. సౌతాఫ్రికాతో రెండో వన్డేలో సెంచరీ సాధించినా రుతురాజ్ గైక్వాడ్పై కూడా వేటు పడింది. దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లోనూ దుమ్ములేపుతున్నా అతడికి నిరాశే మిగిలింది. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ పునరాగమనంతో రుతురాజ్ స్థానం కోల్పోక తప్పలేదు.అయితే, రుతు విషయంలో సెలక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని భారత మాజీ కెప్టెన్, టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ విమర్శించాడు. ‘‘జట్టులో స్థానం కోసం రుతురాజ్ తనలోని మరో నైపుణ్యం గురించి సెలక్టర్లకు చెప్పాలేమో!.. ‘నేను ధోనితో కలిసి ఆడాను.. వికెట్ కీపింగ్ కూడా చేయగలను’ అని చెప్పాలి.అదొక్కటే మార్గంజట్టులోకి తిరిగి వచ్చేందుకు అతడికి అదొక్కటే మార్గం. శ్రేయస్ అయ్యర్ కచ్చితంగా జట్టులో ఉండాలి. అదే సమయంలో పదిహేను మంది సభ్యులలో రుతురాజ్ కూడా ఉండాలి. నితీశ్ కుమార్ రెడ్డికి బదులు అతడిని జట్టులోకి తీసుకోవాల్సింది.నువ్వు సెంచరీ చేశావని తెలిసినా రుతు వంటి ఆటగాళ్లకు చోటు ఇవ్వమని చెప్పడం సరికాదు. దేశీ క్రికెట్లో మళ్లీ సత్తా చాటి అతడు తనను తాను నిరూపించుకోవాల్సిందే’’ అని చిక్కా అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఈ నెల 11, 14, 18 తేదీల్లో వరుసగా వడోదర, రాజ్కోట్, ఇండోర్లలో వన్డేలు జరుగుతాయి. న్యూజిలాండ్తో వన్డేలకు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్. చదవండి: BCCI: శుబ్మన్ గిల్ డిమాండ్ ఇదే! -
BCCI: శుబ్మన్ గిల్ డిమాండ్ ఇదే!
భారత టెస్టు జట్టు సారథిగా అరంగేట్రంలోనే ఇంగ్లండ్ పర్యటన రూపంలో కఠిన సవాలు ఎదుర్కొన్నాడు శుబ్మన్ గిల్. అయితే, ఇంగ్లండ్ గడ్డపై బ్యాటర్గా, కెప్టెన్గా రాణించి ఐదు మ్యాచ్ల సిరీస్ను 2-2తో సమం చేసి.. పాస్ మార్కులు వేయించుకున్నాడు. అనంతరం వెస్టిండీస్తో స్వదేశంలో 2-0తో వైట్వాష్ చేసి సత్తా చాటాడు.అయితే, ఇటీవల సౌతాఫ్రికాతో టెస్టు (IND vs SA) సిరీస్లో మాత్రం గిల్ సేన ఘోర పరాభవం చవిచూసింది. సఫారీల చేతిలో 2-0తో వైట్వాష్కు గురైంది. తద్వారా పాతికేళ్ల తర్వాత తొలిసారి ప్రొటిస్ జట్టు క్లీన్స్వీప్ విజయంతో సత్తా చాటగా.. టీమిండియాకు చేదు అనుభవం మిగిలింది.గిల్ డిమాండ్ ఇదేఈ పరిణామాల నేపథ్యంలో కెప్టెన్ గిల్ (Shubman Gill).. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పెద్దల ముందుకు ఓ విజ్ఞప్తి తీసుకువచ్చినట్లు సమాచారం. టెస్టు సిరీస్ ఆరంభానికి పదిహేను రోజుల ముందు నుంచే సన్నాహకాలు మొదలుపెట్టేలా ప్రణాళికలు రచించాలని యాజమాన్యాన్ని గిల్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘టెస్టు సిరీస్ ఆడేందుకు ముందు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావడం అత్యంత ముఖ్యమని గిల్ భావిస్తున్నాడు. మ్యాచ్లు ఆడటానికి కనీసం పదిహేను రోజుల ముందు నుంచే ప్రాక్టీస్ మొదలుపెడితే బాగుంటుందని అతడి ఆలోచన.దీని గురించి గిల్ ఇప్పటికే బోర్డు ముందు ప్రతిపాదన తెచ్చాడు. జట్టును ఎలా ముందుకు నడిపించాలన్న అంశంపై అతడికి పూర్తి అవగాహన ఉంది. సెలక్టర్లు, బీసీసీఐ పెద్దలతో తన డిమాండ్ల గురించి చెప్పాడు. టెస్టులతో పాటు వన్డేల్లోనూ రోహిత్ శర్మ తర్వాత గొప్ప సారథిగా ఎదిగేందుకు అన్ని అర్హతలు గిల్కు ఉన్నాయి. తన ఆలోచనలను నిక్కచ్చిగా పంచుకుంటూ జట్టును మరింత గొప్పగా అభివృద్ధి చేయాలని యోచిస్తున్నాడు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.విరామం లేని షెడ్యూల్కాగా దుబాయ్లో ఆసియా కప్-2025 గెలిచిన టీమిండియా.. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే వెస్టిండీస్తో టెస్టు బరిలో దిగింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటన ముగించుకున్న ఆరు రోజుల తర్వాత సొంతగడ్డపై ప్రొటిస్తో టెస్టుల్లో తలపడి.. పూర్తిస్థాయి ప్రాక్టీస్ లేకుండా వైట్వాష్ రూపంలో భారీ మూల్యమే చెల్లించింది.ఇక గిల్ ఈ మేరకు ఆలోచన చేసిన నేపథ్యంలో బీసీసీఐ ఇందుకు సంబంధించి కీలక ముందడుగు వేయనున్నట్లు తెలుస్తోంది. ‘‘హెడ్కోచ్ గౌతం గంభీర్ వన్డే, టీ20 సిరీస్లతో బిజీగా ఉంటాడు కాబట్టి.. టెస్టు సిరీస్లకు సన్నద్ధమయ్యే క్రమంలో బోర్డు వీవీఎస్ లక్ష్మణ్ సేవలను వాడుకోవాలని భావిస్తోంది. అతడి ఆధ్వర్యంలో రెడ్బాల్ క్యాంపులను నిర్వహించే అవకాశం ఉంది’’ అని బోర్డు సన్నిహిత వర్గాలు తెలిపాయి.ఇదిలా ఉంటే.. స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు వన్డేలు, ఐదు టీ20 సిరీస్లతో టీమిండియా బిజీ కానుంది. అనంతరం టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో పాల్గొంటుంది. ఈ మెగా ఈవెంట్ ఆడే జట్టులో గిల్కు చోటు దక్కలేదు.చదవండి: జో రూట్ 41వ శతకం -
2026లో విరాట్ కోహ్లి ఛేదించబోయే భారీ రికార్డులు ఇవే..!
రికార్డుల రారాజు విరాట్ కోహ్లి 2026వ సంవత్సరంలోనూ రికార్డు వేటను కొనసాగించనున్నాడు. టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించి, వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్.. గతేడాది చివరి వరకు రికార్డుల వేటను కొనసాగించాడు. లిస్ట్-ఏ ఫార్మాట్లో భీకర ఫామ్లో ఉన్న విరాట్.. త్వరలో న్యూజిలాండ్తో జరుగబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో బరిలోకి దిగుతాడు. ఈ సిరీస్ నుంచే విరాట్ రికార్డుల వేట మొదలవుతుంది. జనవరి 11 నుంచి న్యూజిలాండ్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విరాట్ ఈ ఏడాది ఛేదించే అవకాశం ఉన్న రికార్డులపై ఓ లుక్కేద్దాం.28000 అంతర్జాతీయ పరుగులుఅంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 623 ఇన్నింగ్స్లు ఆడిన విరాట్ 27975 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ సిరీస్లో విరాట్ మరో 25 పరుగులు చేస్తే అత్యంత వేగంగా 28000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ (644 ఇన్నింగ్స్) పేరిట ఉంది.15000 వన్డే పరుగులు308 ఇన్నింగ్స్ల్లో 14557 పరుగులు చేసి, వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కొనసాగుతున్న విరాట్.. మరో 443 పరుగులు చేస్తే 15000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఈ ఏడాది న్యూజిలాండ్, ఇంగ్లండ్ సిరీస్ల్లో విరాట్ ఈ రికార్డును ఛేదించే అవకాశం ఉంది. వన్డేల్లో ఇప్పటివరకు సచిన్ మాత్రమే 15000 పరుగుల మార్కును తాకాడు.అంతర్జాతీయ క్రికెట్లో రెండో అత్యధిక పరుగులువిరాట్ మరో 42 పరుగులు చేస్తే సచిన్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరిస్తాడు. ఈ క్రమంలో సంగక్కరను (28,016) వెనక్కు నెట్టేస్తాడు.అత్యధిక వన్డే పరుగులున్యూజిలాండ్ సిరీస్లో విరాట్ మరో 94 పరుగులు చేస్తే, ఆ దేశంపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ (42 మ్యాచ్ల్లో 1750 పరుగులు) ఖాతాలో ఉంది. విరాట్ న్యూజిలాండ్తో ఇప్పటివరకు 33 వన్డేలు ఆడి 1657 పరుగులు చేశాడు.ఐపీఎల్లో 9000 పరుగులుఈ ఏడాది అంతర్జాతీయ వన్డేలతో పాటు ఐపీఎల్ కూడా ఆడనున్న విరాట్.. మరో 339 పరుగులు చేస్తే ఐపీఎల్ చరిత్రలో 9000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా చరిత్రలో నిలిచిపోతాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 8,661 పరుగులు (267 మ్యాచ్లు) ఉన్నాయి. -
సెంచరీలు ఎందుకు, వికెట్లు తీసుడు ఎందుకు..?
సాధారణంగా ఏ దేశ క్రికెట్లో అయినా దేశవాలీ ప్రదర్శనల ఆధారంగా ఆటగాళ్లకు జాతీయ జట్టు అవకాశాలు వస్తుంటాయి. అయితే ప్రస్తుతం భారత్లో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. దేశవాలీ టోర్నీల్లో శతక్కొట్టుడు కొట్టి, పరుగుల వరద పారించినా జాతీయ జట్టు అవకాశాలు రావు. బ్యాటింగ్ ఆధిపత్యం నడుస్తున్న జమానాలో చచ్చీ చెడి వికెట్లు తీసినా పట్టించుకునే నాథుడే లేడు.తాజాగా న్యూజిలాండ్తో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టును చూస్తే ఈ విషయం సుస్పష్టమవుతుంది. ప్రస్తుతం దేశంలో దేశవాలీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ జరుగుతుంది. ఈ టోర్నీలో కర్ణాటక ఆటగాడు దేవదత్ పడిక్కల్ 5 మ్యాచ్ల్లో ఏకంగా నాలుగు సెంచరీలు చేశాడు. అయినా అతనికి టీమిండియాలో చోటు దక్కలేదు.మరో యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. లిస్ట్-ఏ ఫార్మాట్లో ఇతగాడు ఇరగదీస్తాడు. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలోనూ ఓ సెంచరీ చేశాడు. అయినా ఇతనికి కూడా టీమిండియాలో చోటు దక్కలేదు. రుతురాజ్ విషయంలో మరింత విడ్డూరమైన విషయం ఏంటంటే.. ఇటీవల జరిగిన సౌతాఫ్రికా వన్డే సిరీస్లో అద్భుతమైన సెంచరీ చేసినా మొండిచెయ్యే ఎదురైంది.అద్భుత ప్రదర్శనలు చేస్తున్న మరో ఆటగాడు ధృవ్ జురెల్. ఇతగాడు కూడా విజయ్ హజారే ట్రోఫీలో చెలరేగిపోతున్నాడు. మరో యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ పరిస్థితి కూడా ఇదే. తాజాగా జరిగిన ఓ మ్యాచ్లో సుడిగాలి శతకం బాదాడు. వీహెచ్టీలో సత్తా చాటుతున్న దేశీయ టాలెంట్ గురించి అయితే చెప్పక్కర్లేదు. అనామక బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తూ సెంచరీల మీద సెంచరీలు చేస్తున్నారు. కాస్తోకూస్తో అనుభవం ఉండి, గుర్తింపు ఉన్న ఆటగాళ్లకే అవకాశాలు లేనప్పుడు వీరు టీమిండియా బెర్త్లు ఆశించడం అత్యాశే అవుతుంది.బౌలింగ్ విషయానికొస్తే.. బ్యాటర్లు రాజ్యమేలే జమానాలో చచ్చీ చెడీ వికెట్లు తీస్తున్న టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి సెలెక్టర్లు మరోసారి మొండిచెయ్యి చూపారు. షమీ పూర్తి ఫిట్నెస్తో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నా, సెలెక్టర్లు అతన్ని కరుణించడం లేదు. షమీ విషయంలో ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరుగుతుందన్నది జగమెరిగిన సత్యం.దేశవాలీ టోర్నీల్లో అద్భుతమంగా రాణిస్తూ టీమిండియా బెర్త్లు దక్కించుకోలేకపోతున్న షమీ లాంటి బౌలర్లు చాలామంది ఉన్నారు. ఉత్తర్ప్రదేశ్ స్పిన్నర్ జీషన్ అన్సారీ, మహారాష్ట్ర పేసర్ రామకృష్ణ ఘోష్, ఆంధ్రప్రదేశ్ మీడియం పేసర్ సత్యనారాయణ రాజు లాంటి వారు ప్రస్తుతం జరుగుతున్న వీహెచ్టీలో చెలరేగి బౌలింగ్ చేస్తున్నా, టీమిండియా బెర్త్ దక్కలేదు.ఇక్కడ ఓ ప్రశ్న ఉత్పన్నమవ్వవచ్చు. ఉన్నది 11 బెర్త్లు, ఎంతమందికి అవకాశాలు ఇస్తారని చాలామంది అడగవచ్చు. ఈ ప్రశ్నకు ఎవరి వద్ద సమాధానం ఉండదు. అయితే ఇలా జరుగుతూపోతే మాత్రం దేశీయ క్రికెట్లో సత్తా చాటాలన్న తపన ఆటగాళ్లలో చచ్చిపోయే ప్రమాదం ఉంది. ఏదైనా ప్రత్యామ్నాయం చూపకపోతే దేశీయ క్రికెట్కు విలువే లేదు. ఇప్పటికే దేశీయ క్రికెట్ నామమాత్రంగా మారిందని విశ్లేషకులు అనుకుంటున్నారు. ఎవరి దృష్టిలోనో పడి, ఐపీఎల్ అవకాశాలు వస్తే.. వచ్చి అక్కడ కూడా రాణిస్తేనే టీమిండియా అవకాశాలు వస్తాయన్నది జగమెరిగిన సత్యం.ఇలా ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగా టీమిండియా బెర్త్ దక్కించుకోవడమన్నది అందరికీ సాధ్యపడదు. ఏదో హర్షిత్ రాణా లాంటి వారిని మాత్రమే ఇలాంటి అదృష్టాలు వరిస్తాయి. హర్షిత్ రాణా ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ విషయాన్ని చర్చించక తప్పదు. ప్రస్తుతం వీహెచ్టీలో రాణిస్తున్న పేస్ బౌలర్లు హర్షిత్కు ఏ విషయంలో తీసిపోతారు. వారికంటే హర్షిత్కు ఉన్న అదనపు అర్హతలు ఏంటి..? దీనికి సమాధానం భారత సెలెక్టర్ల వద్ద కానీ, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వద్ద కానీ ఉండదు. మొత్తంగా దేశీయ క్రికెట్కు విలువే లేకుండా పోయిందన్నది సగటు భారత క్రికెట్ అభిమాని అభిప్రాయం. -
మహ్మద్ షమీ కెరీర్ ముగిసినట్లేనా..?
మహ్మద్ షమీ.. వన్డే క్రికెట్లో తిరుగులేని ఫాస్ట్ బౌలర్. అమ్రోహా అనే చిన్న గ్రామం నుంచి వచ్చి తన పేస్ బౌలింగ్తో వరల్డ్ క్రికెట్ను శాసించిన ధీరుడు అతడు. వన్డే వరల్డ్ కప్లలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా నిలవడం నుంచి ఒక వన్డే మ్యాచ్లో 7 వికెట్ల తీయడం వరకు ఎన్నో అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ బెంగాల్ స్పీడ్ స్టార్ కేవలం 108 వన్డేల్లో 200 వికెట్ల మైలు రాయిని అందుకుని భారత క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన భారత బౌలర్గా షమీ కొనసాగుతున్నాడు. వన్డే ప్రపంచకప్-2023లో భారత్ తుది మెట్టుపై బోల్తా పడినప్పటికి.. షమీ బౌలింగ్ ప్రదర్శనను మాత్రం సదరు క్రికెట్ అభిమాని ఎప్పటికీ మర్చిపోడు. కేవలం 7 మ్యాచ్ల్లోనే 24 వికెట్లు తీసి, ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయంలోనూ షమీ తన వంతు పాత్ర పోషించాడు. అటువంటి షమీ ఇప్పుడు జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాడు.కెరీర్ ముగిసినట్లేనా?మహ్మద్ షమీ గతేడాది మార్చి నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. అయితే దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నప్పటికి అతడిని సెలక్టర్లు మాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. దీంతో సెలక్టర్లపై తీవ్ర స్ధాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్కు షమీని ఎంపిక చేయనున్నారని జోరుగా ప్రచారం జరిగింది.కానీ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాత్రం అతడికి మరోసారి మొండి చేయి చూపించింది. కివీస్ సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసేటప్పుడు సెలక్షన్ కమిటీ షమీ పేరును కనీసం పరిశీలించలేదంట. షమీ దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నప్పటికి.. అంతర్జాతీయ క్రికెట్కు కావాల్సిన అత్యున్నత స్థాయి ఫిట్నెస్ను అతడు ఇంకా అందుకోలేదని మేనేజ్మెంట్ భావిస్తోంది. ముఖ్యంగా గాయం తర్వాత అతడి బౌలింగ్లో పేస్ తగ్గిందని, కేవలం కేవలం సీమ్ పొజిషన్పైనే ఆధారపడుతున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా వన్డే వరల్డ్కప్-2027 సమయానికి అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ వంటి యువ పేసర్లను పూర్తి స్ధాయిలో సిద్దం చేసేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోంది. 34 ఏళ్ల షమీని జట్టులోకి తీసుకోకపోవడానికి ఇదొక కారణమని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.అగార్కర్పై విమర్శలు..సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ వైద్య బృందం తనకు క్లియరెన్స్ ఇచ్చినా జట్టులోకి తీసుకోకపోవడంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ను షమీ బహిరంగంగానే విమర్శించాడు. డొమాస్టిక్ క్రికెట్ ఆడుతున్నవాడిని అంతర్జాతీయ స్దాయిలో ఆడలేనా అని ప్రశ్నించాడు. అందుకు అగార్కర్ కూడా సమాధానమిచ్చాడు. షమీ నా ముందు ఉండి ఉంటే సమాధానం చెప్పేవాడిని, కేవలం ఫిట్నెస్ సమస్యల కారణంగా అతడిని తీసుకోవడం లేదని షమీ చెప్పుకొచ్చాడు.దేశవాళీ క్రికెట్లో అదుర్స్..షమీ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో సీజన్లో దుమ్ములేపుతున్నాడు. రంజీ ట్రోఫీ 2025-26లో బెంగాల్ తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా కొనసాగుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీలోన అతడు అదరగొట్టాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు దాదాపు 45 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు.కివీస్తో వన్డేలకు భారత జట్టుశుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (ఫిట్నెస్కు లోబడి)*, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, జైశ్వాల్, అర్ష్దీప్ సింగ్చదవండి: IPL 2026: వారు తొలిగిస్తే నేనేం చేయగలను? -
రిషబ్ పంత్ విధ్వంసం.. 4 ఫోర్లు, 6 సిక్స్లతో
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఒడిశా చేతిలో అనుహ్యంగా ఓటమి చవిచూసిన ఢిల్లీ జట్టు తిరిగి విజయ బాటలో పడింది. ఈ టోర్నీలో భాగంగా శనివారం సర్వీసెస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయాన్ని అందుకుంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్వీసెస్ 42.5 ఓవర్లలో 178 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ స్పీడ్ స్టార్ హర్షిత్ రాణా 4 వికెట్లు పడగొట్టి సర్వీసెస్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు ప్రిన్స్ యాదవ్ మూడు, ఇషాంత్, సైనీ తలా వికెట్ సాధించారు. సర్వీసెస్ బ్యాటర్లలో వికాస్ హత్వాలా(26) టాప్ స్కోరర్గా నిలవగా.. పుల్కత్ నరాంగ్ 22 పరుగులు చేశాడు.రాణా, పంత్ మెరుపులు..అనంతరం 179 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం రెండు వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో ఊదిపడేసింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(45 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 72 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ రిషబ్ పంత్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. టీ20 తరహాలో బ్యాటింగ్ బ్యాటింగ్ చేశాడు. కేవలం 37 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పంత్.. 4 ఫోర్లు, 6 సిక్స్లతో 67 పరుగులు చేశాడు.ఈ ఏడాది సీజన్లో పంత్కు ఇది రెండో ఫిప్టీ. అంతకుముందు గుజరాత్తో జరిగిన మ్యాచ్లో పంత్ 70 పరుగులు చేశాడు. మిగితా మ్యాచ్లలో మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు. 5 మ్యాచ్లలో ఇప్పటివరకు 188 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని భారత వన్డే జట్టు నుంచి తప్పించాలని చాలా మంది డిమాండ్ చేశారు. కానీ అతడిపై సెలెక్టర్లు మరోసారి నమ్మకం ఉంచారు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు పంత్ను సెలెక్టర్లు ఎంపిక చేశారు.Rishabh Pant when people start doubting him. pic.twitter.com/mnXCLPxp5p— Vaibhav (@spideynation_) January 3, 2026 -
'షమీకి అన్యాయం.. ఇది నిజంగా సిగ్గు చేటు'
టీమిండియా స్టార్ మహ్మద్ షమీకి జాతీయ సెలెక్టర్లు మరోసారి మొండిచేయి చూపించారు. న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టులో షమీకి చోటు దక్కలేదు. కివీస్తో వన్డే సిరీస్కు షమీని ఎంపిక చేయనున్నారని జోరుగా ప్రచారం జరిగింది.కానీ అజిత్ అగార్కర్ అండ్ కో మాత్రం షమీని పరిగణలోకి తీసుకోలేదు. జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడంతో మహ్మద్ సిరాజ్కు తిరిగి పిలుపునిచ్చారు. అదేవిధంగా పేస్ బౌలింగ్ విభాగంలో ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్లకు చోటు దక్కింది. అయితే అద్భుతమైన ఫామ్లో ఉన్న షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై చాలా మంది మాజీలు తప్పుబడుతున్నారు. భారత జట్టుకు తిరిగి ఆడాలంటే అతడు ఇంకా ఏమి చేయాలని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్ జట్టు హెడ్ కోచ్ లక్ష్మీ రతన్ శుక్లా సెలెక్టర్లపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డాడు.దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నప్పటికి, షమీని జాతీయ జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదని అతడు ఫైరయ్యాడు. షమీ చివరగా భారత్ తరపున గతేడాది మార్చిలో ఆడాడు. అప్పటి నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. కానీ దేశవాళీ క్రికెట్లో మాత్రం క్రమం తప్పకుండా ఆడుతున్నాడు.షమీకి అన్యాయం..సెలక్షన్ కమిటీ మరోసారి మహమ్మద్ షమీకి అన్యాయం చేసింది. ఇటీవలి కాలంలో ఏ అంతర్జాతీయ ఆటగాడు కూడా షమీ అంత పట్టుదలతో దేశవాళీ క్రికెట్ ఆడలేదు. డొమెస్టిక్ క్రికెట్లో అతడు అద్భుతంగా రాణిస్తున్నప్పటికి సెలెక్టర్లు ఎంపిక చేయకపోవడం నిజంగా సిగ్గు చేటు అని రేవ్స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శుక్లా పేర్కొన్నాడు. షమీ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో సీజన్లో దుమ్ములేపుతున్నాడు. రంజీ ట్రోఫీ 2025-26లో బెంగాల్ తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా కొనసాగుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీలోన అతడు అదరగొట్టాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు దాదాపు 45 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. అయితే షమీ ఫామ్ లేదా ఫిట్నెస్ విషయంలో ఎలాంటి సమస్యలు లేవు. 2027 వన్డే ప్రపంచకప్ సమయానికి హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్ లాంటి బౌలర్లను సిద్దం చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ క్రమంలోనే షమీకి అవకాశమివ్వడం లేదని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడతున్నారు.న్యూజిలాండ్ వన్డేలకు భారత జట్టు : శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కె.ఎల్. రాహుల్ (కీపర్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసీద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్. -
న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు భారత జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ వచ్చేశాడు
న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్కు దూరమైన కెప్టెన్ శుభ్మన్ గిల్.. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడ్డ వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా జట్టులోకి తిరిగొచ్చారు. అయితే అయ్యర్ ఇంకా బీసీసీఐ వైద్యబృందం నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ పొందాల్సింది. జనవరి 6 న విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరపున శ్రేయస్ ఆడనున్నాడు. దీంతో అతడు ఫిట్నెస్ లెవల్స్ వైద్యులు అంచనా వేయనున్నారు. అతడు ఎటువంటి సమస్య లేకుండా ఆడితే కివీస్తో వన్డే సిరీస్లో కూడా భాగం కానున్నాడు. ఒకవేళ ఈ ముంబై బ్యాటర్కు ఏదైనా సమస్య తలెత్తితే తిరిగి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్కు వెళ్లనున్నాడు.రుతురాజ్పై వేటు..ఇక అయ్యర్ రీ ఎంట్రీతో మహారాష్ట్ర కెప్టెన్, స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్పై వేటు పడింది. సౌతాఫ్రికాతో సిరీస్లో గైక్వాడ్ అద్భుతమైన సెంచరీతో సత్తాచాటినప్పటికి.. జట్టు కూర్పు దృష్ట్యా అతడిని సెలక్టర్లు పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇక టీ20 ప్రపంచకప్-2026ను దృష్టిలో ఉంచుకుని జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు ఈ సిరీస్ నుండి విశ్రాంతి ఇచ్చారు. దీంతో మహ్మద్ సిరాజ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ రాణాలతో కూడిన పేస్ దళాన్ని సిరాజ్ లీడ్ చేయనున్నాడు.షమీకి నో ఛాన్స్..ఇక దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపుతున్న వెటరన్ పేసర్ మహ్మద్ షమీకి సెలక్టర్లు మరోసారి మొండి చేయి చూపించారు. అతడిని కివీస్తో సిరీస్కు ఎంపిక చేయనున్నారని వార్తలు వచ్చినప్పటికి.. సెలక్టర్లు మాత్రం మొగ్గు చూపలేదు. షమీ గతేడాది మార్చి నుంచి భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు.పంత్కే ఓటు..అదేవిధంగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ను వన్డే జట్టు నుంచి తప్పించనున్నారని వార్తలకు సెలక్టర్లు చెక్ పెట్టారు. కివీస్తో వన్డే సిరీస్కు పంత్ను ఎంపిక చేశారు. అతడిని తప్పించి ఇషాన్ కిషన్కు చోటు ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ అజిత్ అగార్కర్ అండ్ కో మాత్రం పంత్కే ఓటేశారు. కేఎల్ రాహుల్ బ్యాకప్గా పంత్ ఉండనున్నాడు. హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది. ఇక కివీస్-భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది.కివీస్తో వన్డేలకు భారత జట్టుశుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (ఫిట్నెస్కు లోబడి)*, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, జైశ్వాల్, అర్ష్దీప్ -
5 మ్యాచ్ల్లో 4 సెంచరీలు.. సెలెక్టర్లకు తలనొప్పిగా మారిన ఆర్సీబీ స్టార్
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో కర్ణాటక స్టార్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. తన అద్భుత ప్రదర్శనలతో ప్రత్యర్ధి జట్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ల్లో ఏకంగా నాలుగు సెంచరీలు బాది ఔరా అనిపించాడు. ఈ టోర్నీ ఆరంభంలో తమిళనాడు, కేరళపై సెంచరీల(147, 124)తో సత్తాచాటిన పడిక్కల్.. తర్వాత తమిళనాడు మ్యాచ్లో విఫలమైనప్పటికీ పుదుచ్చేరిపై సూపర్ సెంచరీతో మెరిశాడు. మళ్లీ ఇప్పుడు త్రిపురతో జరుగుతున్న మ్యాచ్లోనూ పడిక్కల్ శతక్కొట్టాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కర్ణాటకు త్రిపుర బౌలర్లు గట్టి షాకిచ్చారు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్(5), కరుణ్ నాయర్(0) ఆరంభంలోనే పెవిలియన్కు చేరారు. ఈ క్రమంలో పడిక్కల్ నిలకడగా ఆడి తన 13వ లిస్ట్-ఎ సెంచరీ మార్క్ను అందుకున్నాడు.సెలక్టర్లకు హెడ్ ఎక్..అయితే పడిక్కల్ ఫామ్ జాతీయ జట్టు సెలక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు పడిక్కల్ను ఎంపిక చేయాలని చాలా మంది మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. దేశవాళీ క్రికెట్లో పడిక్కల్కు ఓపెనర్గా మంచి రికార్డు ఉంది. అయితే భారత జట్టులో ప్రస్తుతం ఓపెనింగ్ స్లాట్స్ ఖాళీగా లేవు. రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్ భారత జట్టు ఓపెనర్లగా ఉన్నారు. బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్ ఇప్పటికే రేసులో ముందున్నాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్లో గిల్ స్ధానంలో జట్టులోకి వచ్చిన యశస్వి సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయినప్పటికి గిల్ తిరిగి రావడంతో యశస్వి బెంచ్కే పరిమితం కానున్నాడు. అలా అని మిడిలార్డర్లో చూసుకున్నా ప్రతీ ఒక్కరూ సూపర్ ఫామ్లో ఉన్నారు. ఒకవేళ వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తిరిగి వస్తే రుతురాజ్, తిలక్ వర్మలపై కూడా వేటు పడే అవకాశముంది. సౌతాఫ్రికాతో జరిగిన రెండో రుతురాజ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు కూడా తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. దీంతో ఎవరిని తప్పించి పడిక్కల్కు అవకాశం ఇవ్వాలనేది సెలెక్టర్లకు పెద్ద ప్రశ్నగా మారింది.లిస్ట్-ఎ క్రికెట్లో అదుర్స్..లిస్ట్-ఏ క్రికెట్లో పడిక్కల్ గణాంకాలు చూస్తే మతిపోవాల్సిందే. కేవలం 38 మ్యాచ్ల్లోనే 80కి పైగా సగటుతో 2585 పైగా పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు ఉండటం విశేషం. పడిల్క్ భారత తరపున ఇప్పటివరకు టెస్టులు, టీ20లు ఆడినప్పటికి.. వన్డేల్లో మాత్రం ఇంకా అరంగేట్రం చేయలేదు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో పడిక్కల్ 514 పరుగులతో లీడింగ్ రన్స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఇకఇక కివీస్తో వన్డేలకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించనుంది. అయితే భారత జట్టులో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ వేటు వేయాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నట్లు సమాచారం.చదవండి: IND vs SA: కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ ఫెయిల్ -
IND vs NZ: సెలక్షన్ రోజే విఫలమైన ఇషాన్ కిషన్!
స్వదేశంలో సౌతాఫ్రికాతో ఆల్ ఫార్మాట్ సిరీస్లు ముగించుకున్న టీమిండియా.. తదుపరి సొంతగడ్డపై న్యూజిలాండ్తో వన్డే, టీ20లు ఆడనుంది. జనవరి 11 - జనవరి 31 మధ్య భారత్- కివీస్ జట్ల మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు జరుగుతాయి. అయితే, ప్రపంచకప్-2026కు ఎంపిక చేసిన జట్టునే కివీస్తో టీ20 సిరీస్కూ ఫైనల్ చేసింది బీసీసీఐ.వన్డేల్లోనూ పునరాగమనం!అయితే, వన్డేలకు మాత్రం శనివారం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ ముహూర్తం ఖరారు చేసింది. అనూహ్య రీతిలో టీ20 ప్రపంచకప్తో టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చిన జార్ఖండ్ డైనమైట్.. వన్డేల్లోనూ పునరాగమనం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వికెట్ కీపర్ కోటాలోని రిషభ్ పంత్ వరుస వైఫల్యాల(VHT) నేపథ్యంలో.. కేఎల్ రాహుల్కు బ్యాకప్గా ఇషాన్ రేసులోకి వచ్చాడు.ఈ నేపథ్యంలో దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో.. శనివారం నాటి మ్యాచ్లో జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ప్రదర్శన ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. కర్ణాటకతో మ్యాచ్లో 33 బంతుల్లోనే శతక్కొట్టిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. తాజాగా కేరళతో మ్యాచ్లో మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు.సెలక్షన్ రోజు విఫలంకివీస్తో వన్డేలకు భారత జట్టు సెలక్షన్ రోజు ఇషాన్ (Ishan Kishan).. ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 21 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. జార్ఖండ్ తరఫున కెప్టెన్ ఇషాన్ విఫలం కాగా.. కుమార్ కుశాగ్రా అజేయ, భారీ శతకం (143)తో అదరగొట్టగా.. అనుకూల్ రాయ్ (72) కూడా ఆకట్టుకున్నాడు.వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా జార్ఖండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేయగలిగింది. కాగా ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఫెయిలైనా కివీస్తో వన్డేలకు అతడు ఎంపికయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాగా దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో ఇషాన్ కిషన్ ఇరగదీసిన విషయం తెలిసిందే.ఏకంగా ప్రపంచకప్ జట్టులోకిజార్ఖండ్ సారథిగా.. బ్యాటర్గా సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇషాన్ కిషన్.. జట్టుకు తొలి దేశీ టీ20 టైటిల్ అందించాడు. 500కు పైగా పరుగులతో టాప్ రన్ స్కోరర్గానూ నిలిచాడు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి రిషభ్ పంత్ను కాకుండా ఇషాన్ కిషన్ను ఎంపిక చేశారు సెలక్టర్లు. సంజూ శాంసన్కు బ్యాకప్ కీపర్, ఓపెనర్గా అతడు ఉపయోగపడతాడన్న ఆలోచనతో రీఎంట్రీ ఇచ్చే అవకాశం కల్పించారు. కాగా క్రమశిక్షణా రాహిత్యం కారణంగా రెండేళ్లకు పైగా ఇషాన్ టీమిండియాకు దూరమైన విషయం తెలిసిందే. అయితే, తన అద్భుత ఆట తీరు, నైపుణ్యాలతో తిరిగి జట్టులో స్థానం సంపాదించాడు. చదవండి: శతక్కొట్టిన హార్దిక్ పాండ్యా.. కెరీర్లో ‘తొలి’ సెంచరీ! -
అదరగొట్టిన తిలక్ వర్మ.. సెంచరీతో సెలెక్టర్లకు వార్నింగ్
విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో హైదరాబాద్ కెప్టెన్, టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ తను ఆడిన తొలి మ్యాచ్లోనే శతక్కొట్టాడు. రాజ్కోట్ వేదికగా చండీగఢ్తో జరుగుతున్న మ్యాచ్లో తిలక్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్కు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది.ఓపెనర్లు అమన్ రావ్(13), తన్మయ్ అగర్వాల్(16) వెంటవెంటనే పెవిలియన్కు చేరారు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ తన అద్భుతమైన ప్రదర్శనతో జట్టును ఆదుకున్నాడు.తొలుత ఆచి తూచి ఆడిన వర్మ.. క్రీజులో కుదుర్కొన్నాక ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అభిరత్ రెడ్డి (71) తో కలిసి 114 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మొత్తంగా 118 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ.. 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 109 పరుగులు చేశాడు. ఫలితంగా హైదరాబాద్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 286 పరుగులు చేసింది. చండీగఢ్ బౌలర్లలో జగజీత్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. రోహిత్ దండా,హర్తేజస్వి కపూర్, విశూ కశ్యప్ తలా రెండు వికెట్లు సాధించారు.కివీస్తో వన్డేలకు తిలక్కు చోటిస్తారా?కాగా న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు భారత జట్టును శనివారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది. అయితే ఈ జట్టులో తిలక్ వర్మకు చోటు దక్కుతుందా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో తిలక్ భారత జట్టులో భాగమైనప్పటికి.. ఇప్పుడు కెప్టెన్ శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తిరిగి రానుండడంతో అతడిపై వేటు పడే అవకాశముంది.మరోవైపు కర్ణాటక ఆటగాడు దేవ్దత్త్ పడిక్కల్ కూడా సెంచరీలో మోత మోగిస్తున్నాడు. అతడు కూడా సెలక్టర్లు దృష్టిలో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా వికెట్ కీపర్ రిషబ్ పంత్పై కూడా వేటు వేయనున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో ఇషాన్ కిషన్ను జట్టులోకి తీసుకోనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.చదవండి: శతక్కొట్టిన హార్దిక్ పాండ్యా.. కెరీర్లో ‘తొలి’ సెంచరీ! -
IND vs NZ: పంత్పై వేటు!.. దేశీ ‘హీరో’ ఎంట్రీ?
న్యూఢిల్లీ: స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం శనివారం భారత జట్టు ఎంపిక జరగనుంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యుల టీమ్ను ప్రకటిస్తుంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్లో భారత్ 2–1తో గెలుచుకుంది. ఈ నేపథ్యంలో మార్పులు లేకుండా అదే జట్టును కొనసాగిస్తారా లేక ఏవైనా మార్పులు చేస్తారా అనేది చర్చనీయాంశం. వికెట్ కీపర్ స్థానం కోసం రిషభ్ పంత్ పేరును పరిశీలిస్తారా అనేది ఆసక్తికరం. చాలా కాలంగా వన్డేల్లో కేఎల్ రాహుల్ ప్రధాన కీపర్గా కొనసాగుతున్నాడు. గత సిరీస్లో పంత్, జురేల్ జట్టులో ఉన్నా వీరికి మ్యాచ్లు ఆడే అవకాశం రాలేదు. దేశీ క్రికెట్లో హీరోగా ఇషాన్ కిషన్ఇప్పటికే వన్డే తుది జట్టులో పంత్కు చోటు కష్టంగా మారగా...ఇప్పుడు బయటి నుంచి ఇషాన్ కిషన్ రూపంలో పోటీ ఎదురవుతోంది. దేశవాళీ క్రికెట్లో జార్ఖండ్ తరఫున ఇషాన్ కిషన్ సత్తా చాటగా...యూపీ తరఫున జురేల్ కూడా రాణిస్తున్నాడు. మరో వైపు పంత్ వరుసగా విఫలమయ్యాడు. నిజానికి గంభీర్ కోచ్గా వచ్చాక చూస్తే జులై 2024 నుంచి ఇప్పటి వరకు పంత్ ఒకే ఒక్క వన్డే ఆడాడు! ఏడేళ్ల కెరీర్లో అతను ఆడినవి 31 వన్డేలే కాగా...బ్యాటింగ్లో 34 సగటు చెప్పుకోదగ్గది కాదు. ఇలాంటి స్థితిలో పంత్కు మరిన్ని అవకాశాలు ఇస్తారా లేక పక్కన పెడతారా చూడాలి. సిరాజ్ను ఎంపిక చేస్తారా?మరో వైపు పేస్ బౌలర్ ఎంపికపై కూడా చర్చ నెలకొంది. హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ను తగిన కారణం లేకుండా సెలక్టర్లు వన్డేల నుంచి పక్కన పెడుతూ వస్తున్నారు. చాంపియన్స్ ట్రోఫీలో అవకాశం దక్కని అతను ఆ తర్వాత ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడాడు. అయితే స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్కు సిరాజ్ను మళ్లీ ఎంపిక చేయలేదు. విజయ్హజారే ట్రోఫీలో హైదరాబాద్ ఆడిన తొలి నాలుగు మ్యాచ్లలో సిరాజ్ బరిలోకి దిగలేదు. టీ20 ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకొని హార్దిక్ పాండ్యా, బుమ్రాలకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. మరో ఇద్దరు పేసర్లు హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్లను కూడా పక్కన పెట్టి సిరాజ్ను ఎంపిక చేస్తారా అనేది ఆసక్తికరం. షమీ విషయంలో యూటర్న్?సీనియర్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ పరిస్థితి కూడా ఇబ్బందికరంగానే ఉంది. దేశవాళీలో అతను అన్ని ఫార్మాట్లలో ఆడుతూ నిలకడగా రాణిస్తున్నా... షమీ అంతర్జాతీయ స్థాయిలో తన అత్యుత్తమ దశను దాటేశాడనేది సెలక్టర్ల అభిప్రాయంలా కనిపిస్తోంది. బ్యాటింగ్లో చూస్తే మిడిలార్డర్లో సర్ఫరాజ్ ఖాన్ తన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే దక్షిణాఫ్రికాతో సెంచరీతో రుతురాజ్ తన స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకున్నట్లే. ఓపెనర్గా గిల్, రోహిత్, జైస్వాల్ల స్థానాలకు ఢోకా లేదు కాబట్టి విజయ్హజారేలో సత్తా చాటుతున్న పడిక్కల్కు కూడా చోటు కష్టమే. చదవండి: IPL 2026: రాజస్తాన్ రాయల్స్ ‘ఫ్యాన్స్’కి భారీ షాక్! -
కివీస్తో వన్డేలకు భారత జట్టు ఇదే!.. అతడికి నో ఛాన్స్!
న్యూజిలాండ్తో వన్డే సిరీస్తో కొత్త సంవత్సరాన్ని మొదలుపెట్టనుంది టీమిండియా. ఇరుజట్ల మధ్య జనవరి 11, 14, 18 తేదీల్లో మూడు మ్యాచ్ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అనంతరం భారత్- కివీస్ (IND vs NZ) జట్లు ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడతాయి.ఇందుకు సంబంధించి న్యూజిలాండ్ ఇప్పటికే తమ వన్డే, టీ20 జట్లు ప్రకటించగా.. భారత్ కేవలం టీ20 జట్టు వివరాలను మాత్రమే వెల్లడించింది. దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 ప్రదర్శన ఆధారంగా.. శనివారం వన్డే జట్టును కూడా ప్రకటించే అవకాశం ఉంది.జైస్వాల్కు చోటు దక్కినా..ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా న్యూజిలాండ్తో వన్డేలకు తన జట్టును ఎంచుకున్నాడు. టాపార్డర్లో కెప్టెన్ శుబ్మన్ గిల్, రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లిలను కొనసాగించాడు ఈ మాజీ ఓపెనర్.ముంబై తరఫున ఇటీవల సెంచరీతో రాణించిన టెస్టు జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)కు.. తుదిజట్టులో ఇప్పుడే చోటు దక్కదని.. ఇంకొన్నాళ్లు వేచిచూడక తప్పదని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇక మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా.. అతడి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్నే సెలక్టర్లు కొనసాగిస్తారని పేర్కొన్నాడు.పంత్కు చోటెలా?అదే విధంగా వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్కు చోటిచ్చిన ఆకాశ్ చోప్రా.. వైస్ కెప్టెన్గా అతడే ఉంటాడని అభిప్రాయపడ్డాడు. ఇక బ్యాకప్ వికెట్ కీపర్గా సంజూ శాంసన్ను కాదని.. వన్డేల్లో మెరుగైన రికార్డు లేని, విజయ్ హజారే మ్యాచ్లలో విఫలమవుతున్న రిషభ్ పంత్ను ఎంపిక చేసుకున్నాడు.ఇక స్పిన్ ఆల్రౌండర్ల విభాగంలో వాషింగ్టన్ సుందర్కు ఓటు వేసిన ఆకాశ్ చోప్రా.. లెఫ్టార్మ్ బౌలర్లలో అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలలో ఒకరినే సెలక్టర్లు ఎంపిక చేస్తారని అభిప్రాయపడ్డాడు. అక్షర్ ఐదు టీ20లతో పాటు వరల్డ్కప్ ఆడాల్సి ఉన్నందున వన్డేల నుంచి అతడికి విశ్రాంతినివ్వవచ్చని పేర్కొన్నాడు. అందుకే కివీస్తో వన్డేల్లో జడ్డూనే ఆడతాడని అంచనా వేశాడు.సంజూతో పాటు షమీకీ మొండిచేయితన జట్టులో తిలక్ వర్మకు కూడా చోటుందన్న ఆకాశ్ చోప్రా.. పేసర్ల విభాగంలో మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్ తుదిజట్టుకు కూడా ఎంపిక అవుతారని పేర్కొన్నాడు. వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీని మాత్రం అతడు పరిగణనలోకి తీసుకోలేదు. ఇక స్పెషలిస్టు స్పిన్నర్గా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్కు ఆకాశ్ చోప్రా ఓటువేశాడు. కాగా కివీస్తో టీ20 మ్యాచ్లు, ప్రపంచకప్-2026 దృష్ట్యా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు వన్డేల నుంచి మేనేజ్మెంట్ విశ్రాంతినివ్వనున్నట్లు సమాచారం.న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత జట్టుశుబ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్/రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ, రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్.చదవండి: పాకిస్తాన్ నుంచి వచ్చిన వాడిని.. ఇక్కడ ఇలా: ఉస్మాన్ ఖవాజా -
8 నిమిషాల్లో అమ్ముడుపోయిన భారత్-న్యూజిలాండ్ తొలి వన్డే టికెట్లు
భారత్, న్యూజిలాండ్ మధ్య జనవరి 11న వడోదరలోని కొటంబి స్టేడయంలో జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆన్లైన్లో అమ్మకం ప్రారంభించిన 8 నిమిషాల్లోనే టికెట్లన్నీ సోల్డ్ ఔటయ్యాయి. మ్యాచ్ను ప్రత్యక్షంగా చూడాలనుకున్న వారిని ఈ విషయం బాధిస్తున్నప్పటికీ.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అభిమానులకు మాత్రం సంతృప్తినిస్తుంది.తమ ఆరాధ్య ఆటగాళ్లకు ఉన్న క్రేజ్ వల్లే, ఇలా తక్కువ సమయంలో టికెట్లు అమ్ముడుపోయాయని వారు సంబరపడిపోతున్నారు. ఇది కదా రో-కో క్రేజ్ అంటే అంటూ సోషల్మీడియాలో బజ్ క్రియేట్ చేస్తున్నారు. రాజ్కోట్, ఇండోర్లో జరిగే మిగతా రెండు వన్డేల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంటుందంటూ హడావుడి చేస్తున్నారు. కాగా, రోహిత్-విరాట్ టెస్ట్, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్లో రో-కో ఆకాశమే హద్దుగా చెలరేగడంతో న్యూజిలాండ్ సిరీస్ తొలి వన్డేకు హైప్ మరింత పెరిగింది. కోహ్లి ఆటను ప్రత్యక్షంగా చూడటమే లక్ష్యంగా అభిమానులు టికెట్ల కోసం ఎగబాడ్డారు. సౌతాఫ్రికా సిరీస్లో విరాట్ వరుసగా రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ చేసి ఫ్యాన్స్కు పిచ్చెక్కించాడు. ఇదే ఫామ్ను విరాట్ వడోదర వన్డేలోనూ కొనసాగిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉంటే, 3 మ్యాచ్ల వన్డే సిరీస్, 5 మ్యాచ్ల టీ20 సిరీస్ల కోసం న్యూజిలాండ్ జట్టు భారత్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లలో తొలుత వన్డేలు జరుగనున్నాయి. జనవరి 11, 14, 18 తేదీల్లో వడోదర, రాజ్కోట్, ఇండోర్ వేదికలుగా మూడు వన్డేలు జరుగుతాయి. అనంతరం 21, 23, 25, 28, 31 తేదీల్లో నాగ్పూర్, రాయ్పూర్, గౌహతి, విశాఖపట్నం, తిరువనంతపురం వేదికలుగా టీ20లు జరుగనున్నాయి. టీ20 సిరీస్ కోసం భారత జట్టును ఇదివరకే ప్రకటించగా.. వన్డే జట్టును ప్రకటించాల్సి ఉంది. -
రిషభ్ పంత్ ఫెయిల్.. ఇలా అయితే కష్టమే!
టీమిండియా స్టార్ రిషభ్ పంత్ మరోసారి పేలవ ఆట తీరుతో నిరాశపరిచాడు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు జట్టును ప్రకటించనున్న నేపథ్యంలో... మెరుగైన ప్రదర్శన చేసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తాడనుకున్న ఈ వికెట్ కీపర్.. అంచనాలు అందుకోలేకపోతున్నాడు.దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ జట్టుకు సారథ్యం వహిస్తున్న పంత్ (Rishabh Pant)... కీలక పోరులో బ్యాటింగ్లో ఆకట్టుకోలేకపోయాడు. ఫలితంగా ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు 79 పరుగుల తేడాతో ఒడిశా (Delhi Vs Odisha) చేతిలో ఓడింది. సమంత్రాయ్ హాఫ్ సెంచరీమొదట బ్యాటింగ్ చేసిన ఒడిశా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కెప్టెన్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బిప్లబ్ సమంత్రాయ్ (72; 3 ఫోర్లు, 4 సిక్స్లు), హాఫ్ సెంచరీ సాధించగా... తక్కినవాళ్లంతా తలాకొన్ని పరుగులు చేశారు. పంత్ సహా వారంతా విఫలంఢిల్లీ బౌలర్లలో హృతిక్ షోకీన్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ తడబడింది. 42.3 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. పంత్ (28 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ రాణా (2), ప్రియాన్ష్ ఆర్య (5), సార్థక్ రంజన్ (1) విఫలమవడంతో ఢిల్లీకి పరాజయం తప్పలేదు.ఒడిశా బౌలర్లలో దేబబ్రత ప్రధాన్, సంబిత బరల్ చెరో 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడింట గెలిచి ఒక దాంట్లో ఓడిన ఢిల్లీ 12 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇదే గ్రూప్లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్ల్లో రైల్వేస్ 4 వికెట్ల తేడాతో గుజరాత్పై... హర్యానా 7 వికెట్ల తేడాతో సర్వీసెస్పై గెలుపొందాయి.చదవండి: IND vs NZ: టీమిండియా వికెట్ కీపర్ రేసులో ఆ ముగ్గురు.. బెస్ట్ ఆప్షన్ ఎవరంటే? -
IND vs NZ: షమీకి గోల్డెన్ ఛాన్స్!
టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీకి మంచి రోజులు వచ్చాయా? త్వరలోనే అతడు భారత జట్టులో పునరాగమనం చేయనున్నాడా? అంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సన్నిహిత వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది.వాగ్యుద్ధంఆస్ట్రేలియా పర్యటనకు ముందు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar).. షమీ ఫిట్నెస్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడు పూర్తి ఫిట్గా లేడని.. అందుకే ఈ టూర్కు ఎంపిక చేయలేదని తెలిపాడు. ఇందుకు షమీ గట్టిగానే బదులిచ్చాడు. తనకు ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు లేవని.. రంజీల్లో ఆడుతున్న వాడిని వన్డేల్లో ఆడలేనా? అంటూ కౌంటర్ ఇచ్చాడు.ఇందుకు ప్రతిగా అగార్కర్.. మరోసారి తన మాటకు కట్టుబడే ఉన్నానంటూ.. షమీ పూర్తి ఫిట్గా లేడని పునరుద్ఘాటించాడు. అయితే, షమీ (Mohammed Shami) కూడా తగ్గేదేలే అన్నట్లు మాటలతో పాటు.. ఆటతోనూ సమాధానం ఇచ్చాడు. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియాలో అతడి రీఎంట్రీ కష్టమనే సంకేతాలు వచ్చాయి.అయితే, తాజాగా బీసీసీఐ (BCCI) వర్గాలు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. షమీ గురించి సానుకూలంగా స్పందించాయి. వన్డే వరల్డ్కప్-2027 టోర్నమెంట్కు ఎక్కువ సమయం లేదు కాబట్టి.. షమీని తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నాయి.ఇంకా పోటీలోనే ఉన్నాడుఈ మేరకు.. ‘‘సెలక్షన్ సమయంలో మొహమ్మద్ షమీ గురించి తరచూ చర్చ నడుస్తుంది. అతడు ఇంకా పోటీలోనే ఉన్నాడు. అయితే, అతడి ఫిట్నెస్ గురించే బోర్డుకు ఆందోళనగా ఉంది. వికెట్లు తీయగల సత్తా ఉన్న బౌలర్ అతడు.కివీస్తో సిరీస్కు.. వరల్డ్కప్కూ ఎంపిక కావొచ్చు!అలాంటి ఆటగాడు సెలక్షన్ రాడార్లో లేకపోవడం అనే మాటే ఉండదు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ముందు అతడి ఆట మెరుగ్గా సాగుతోంది. ఒకవేళ ఈ సిరీస్కు అతడిని ఎంపిక చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.షమీ అనుభవజ్ఞుడైన బౌలర్. కీలక సమయాల్లో ఒత్తిడిని అధిగమించి వికెట్లు తీయగలడు. 2027 వరల్డ్కప్ జట్టుకూ అతడు ఎంపికయ్యే అవకాశం లేకపోలేదు’’ అని బీసీసీఐ వర్గాలు ఎన్డీటీవీతో పేర్కొన్నాయి. కాగా వన్డే వరల్డ్కప్-2023లో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన షమీ.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ సత్తా చాటాడు.మెరుగైన ప్రదర్శనఈ మెగా టోర్నీలో భారత్ విజేతగా నిలవడంలో షమీది కీలక పాత్ర. ఈ ఈవెంట్లో తొమ్మిది వికెట్లు తీసిన ఈ రైటార్మ్ పేసర్.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తితో కలిసి సంయుక్తంగా టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఆ తర్వాత బెంగాల్ తరఫున దేశీ క్రికెట్లో రంజీల్లో కేవలం నాలుగు మ్యాచ్లలోనే 20 వికెట్లు తీసి సత్తా చాటాడు.ప్రస్తుతం దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో బెంగాల్కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. మెరుగ్గా రాణిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. జనవరి 11 నుంచి టీమిండియా- న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ మొదలుకానుంది. జనవరి 11, 14, 18 తేదీల్లో ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు జరుగుతాయి.చదవండి: సెలక్టర్లు వద్దన్నా!... హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం -
న్యూ ఇయర్కి ముందు టీమిండియాకు ఊహించని షాక్..!
మరి కొద్ది గంటల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుండగా.. భారత క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. స్టార్ మిడిలార్డర్ బ్యాటర్, వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ రీఎంట్రీ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది. అక్టోబర్లో ఆస్ట్రేలియా సిరీస్ సందర్భంగా తీవ్రంగా గాయపడిన శ్రేయస్.. న్యూజిలాండ్ వన్డే సిరీస్తో రీఎంట్రీ ఇస్తాడని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే శ్రేయస్ కూడా ఫిట్నెస్ సాధించి, ప్రాక్టీస్ ముమ్మరం చేశాడు.ముందుగా జరిగిన ప్రచారం ప్రకారం ఇవాళ (డిసెంబర్ 30) శ్రేయస్కు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) నుంచి ఫిట్నెస్ క్లియెరెన్స్ లభించాల్సి ఉండింది. అయితే శ్రేయస్ అనూహ్యంగా 6 కిలోలు బరువు తగ్గినట్లు CoE వైద్య బృందం గుర్తించింది. దీని వల్ల శ్రేయస్కు బ్యాటింగ్ చేయడంలో ఎలాంటి సమస్య లేకపోయినా, మసిల్ మాస్ బాగా క్షీణించి, శక్తి స్థాయిలు తగ్గాయని వైద్యులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో శ్రేయస్కు రిటర్న్ టు ప్లే (RTP) సర్టిఫికేట్ ఇవ్వలేమని పరోక్షంగా చెప్పారు. దీంతో శ్రేయస్ రీఎంట్రీ మరో వారం వాయిదా పడనుంది.ఒకవేళ శ్రేయస్కు ఇవాళ RTP సర్టిఫికేట్ లభించి ఉంటే జనవరి 3, 6 తేదీల్లో ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లు ఆడేవాడు. తాజా పరిస్థితి ప్రకారం.. శ్రేయస్ న్యూజిలాండ్ సిరీస్కు కూడా దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈ సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. జట్టును 2 లేదా 3 తేదీల్లోగా ప్రకటించే అవకాశం ఉంది.ఆ సమయానికి శ్రేయస్కు ఫిట్నెస్ క్లియరెన్స్ లభించడం అసాధ్యంగా కనిపిస్తుంది. వన్డే జట్టులో కీలకమైన శ్రేయస్ విషయంలో CoE అధికారులు ఎలాంటి రిస్క్ తీసుకునే సాహసం చేయలేరు. ఒకవేళ శ్రేయస్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ను మిస్ అయితే, విజయ్ హజారే ట్రోఫీలో నాకౌట్ మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది. -
హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం
టీమిండియా సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం తీసుకున్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశాల మేరకు మరోసారి దేశీ క్రికెట్ బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. ఆసియా టీ20 కప్-2025 సందర్భంగా గాయపడిన హార్దిక్ పాండ్యా.. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో కాంపిటేటివ్ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు.సొంతజట్టు బరోడా తరఫున దేశీ టీ20లు ఆడాడు హార్దిక్ పాండ్యా (Hardik Pandya). తాజాగా దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో అతడు భాగం కానున్నాడు. జనవరి 3, 8వ తేదీల్లో బరోడా.. విదర్భ, చండీగఢ్ జట్లతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్లలో హార్దిక్ పాండ్యా ఆడేందుకు నిర్ణయించుకున్నట్లు అతడి సన్నిహిత వర్గాలు IANSకు తెలిపాయి.అయితే, ఈ రెండు మ్యాచ్లకు మధ్య బరోడా.. జమ్మూ కశ్మీర్తో జనవరి 6న తలపడనుంది. ఈ మ్యాచ్కు మాత్రం హార్దిక్ పాండ్యా దూరంగా ఉండనున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల దృష్ట్యా ఈ మేరకు విశ్రాంతి తీసుకుంటూ.. తదుపరి మ్యాచ్లలో ఆడనున్నాడు.విశ్రాంతి తీసుకోమన్నా వినడే!టీమిండియా తదుపరి న్యూజిలాండ్తో స్వదేశంలో వన్డే సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. అయితే, మేనేజ్మెంట్ మాత్రం ఈ సిరీస్ నుంచి హార్దిక్కు విశ్రాంతినివ్వాలని భావిస్తోంది. కివీస్తో ఐదు టీ20లు సహా వరల్డ్కప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, పాండ్యా మ్యాచ్ ఫిట్నెస్ కోసం బరోడా తరఫున బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా హార్దిక్ పాండ్యా ఈ ఏడాది మార్చిలో చివరగా వన్డే మ్యాచ్ ఆడాడు.రో-కో ఆడేశారుకాగా బీసీసీఐ ఆదేశాల మేరకు ఇప్పటికే భారత బ్యాటింగ్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి.. తమ సొంత జట్లు ముంబై, ఢిల్లీ తరఫున రెండేసి విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లు ఆడారు. టీమిండియా యంగ్ స్టార్లు రిషభ్ పంత్ ఢిల్లీ కెప్టెన్, నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్ర సారథిగా ఈ టోర్నీలో భాగం కాగా.. అభిషేక్ శర్మ కూడా పంజాబ్ తరఫున బరిలోకి దిగాడు. ఇక శుబ్మన్ గిల్, అర్ష్దీప్ సింగ్ తదుపరి మ్యాచ్లలో పంజాబ్కు ఆడతారు. సంజూ శాంసన్ కేరళ తరఫున, రవీంద్ర జడేజా సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగనున్నారు.చదవండి: టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే? -
Virat Kohli: చరిత్రకు పాతిక పరుగుల దూరంలో..
భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇటీవల సొంతగడ్డపై సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో వరుస శతకాలు బాది.. యాభై ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక సెంచరీల వీరుడి (53)గా తన రికార్డును తానే సవరించుకున్నాడు.ఈ సిరీస్ తర్వాత దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 బరిలో దిగాడు కోహ్లి. సొంతజట్టు ఢిల్లీ తరఫున వన్డౌన్ బ్యాటర్గా వచ్చి ఆంధ్రతో మ్యాచ్లో శతక్కొట్టాడు. కేవలం 101 బంతుల్లోనే 131 పరుగులతో అలరించాడు.29 బంతుల్లోనే హాఫ్ సెంచరీఆ తర్వాత గుజరాత్తో మ్యాచ్లోనూ కోహ్లి అదరగొట్టాడు. కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మొత్తంగా 61 బంతుల్లో 77 పరుగులు చేసి అవుటయ్యాడు. బీసీసీఐ ఆదేశాల మేరకు ఢిల్లీ తరఫున దేశీ క్రికెట్లో రెండు మ్యాచ్లు పూర్తి చేసుకున్న కోహ్లి.. మరో మ్యాచ్ ఆడేందుకు కూడా సుముఖంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.స్వదేశంలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు సన్నాహకంగా జనవరి 6న రైల్వేస్తో జరిగే మ్యాచ్లో కోహ్లి ఆడే అవకాశం ఉంది. కాగా జనవరి 11 నుంచి భారత్- కివీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. కొటాంబి, ఖంధేరి, ఇండోర్ వేదికగా ఇరుజట్లు మూడు మ్యాచ్లు ఆడతాయి.సచిన్ ఆల్టైమ్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన కోహ్లిఈ సిరీస్ నేపథ్యంలో కోహ్లి.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న ఆల్టైమ్ ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. టీమిండియా తరఫున కోహ్లి ఇప్పటికి 123 టెస్టుల్లో 9230, 308 వన్డేల్లో 14557 పరుగులు, 125 టీ20లలో 4188 పరుగులు సాధించాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో 632 ఇన్నింగ్స్లో.. 27,975 పరుగులు పూర్తి చేసుకున్నాడు.ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి.. కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కివీస్తో తొలి వన్డే సందర్భంగా కోహ్లి గనుక పాతిక పరుగులు చేస్తే.. 28 వేల పరుగుల క్లబ్లో చేరతాడు.సచిన్ టెండుల్కర్ 644 ఇన్నింగ్స్లో ఈ మైలురాయిని తాకగా.. శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర 666 ఇన్నింగ్స్లో ఈ ఫీట్ను అందుకున్నాడు. కోహ్లి ఒకవేళ కివీస్తో తొలి వన్డేలోనే ఈ మైలురాయిని చేరుకుంటే.. అత్యంత వేగంగా అంతర్జాతీయ క్రికెట్లో 28 వేల పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్గా.. సచిన్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డు బద్దలుకొడతాడు. తొలి వన్డేలో మిస్ అయినా.. మిగిలిన రెండు వన్డేల్లో రాణించినా సరే.. కోహ్లి ఈ రికార్డును కొల్లగొట్టడం ఖాయం. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా కోహ్లి తొలి వన్డేలోనే ఈ ఘనత సాధించే అవకాశం ఉంది. చదవండి: టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే? -
పంత్ కాదు!.. వన్డే వరల్డ్కప్ జట్టులోనూ అతడే!
వన్డేల్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్గా కేఎల్ రాహుల్ కొనసాగుతున్నాడు. తాత్కాలిక సారథిగానూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇటీవల స్వదేశంలో భారత జట్టు కెప్టెన్ హోదాలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ను 2-1తో కేఎల్ రాహుల్ గెలిచాడు.పంత్ స్థానానికి ఎసరు!ఈ సిరీస్లో రాహుల్కు బ్యాకప్ వికెట్ కీపర్గా రిషభ్ పంత్ (Rishabh Pant)ను ఎంపిక చేసిన యాజమాన్యం.. అతడిని ఒక్క మ్యాచ్లోనూ ఆడించలేదు. ఈ నేపథ్యంలో.. గత కొన్నిరోజులుగా భారత దేశీ క్రికెట్లోని అద్భుత ప్రదర్శనల కారణంగా బ్యాకప్గానూ వన్డేల్లో పంత్ స్థానం గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడింది.ప్రపంచకప్-2026 టోర్నీ ఆడే జట్టులో చోటుదేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో సత్తా చాటిన జార్ఖండ్ డైనమైట్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) రేసులోకి దూసుకువచ్చాడు. ఈ సీజన్లో 500కు పైగా పరుగులతో సత్తా చాటి.. కెప్టెన్గా జార్ఖండ్కు తొలి టైటిల్ అందించి టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. విధ్వంసకర ఆట తీరుతో ఇటు ఓపెనర్గా, అటు వికెట్ కీపర్గా రాణించగల ఇషాన్ను ఏకంగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి సెలక్టర్లు ఎంపిక చేశారు.సంజూ శాంసన్ (Sanju Samson)కు బ్యాకప్గా ఇషాన్కు వరల్డ్కప్ జట్టులో చోటిచ్చారు. ఇదిలా ఉంటే.. దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ ఇషాన్ కిషన్ సత్తా చాటుతున్నాడు. కర్ణాటకతో మ్యాచ్లో 39 బంతుల్లోనే 125 పరుగులు చేసిన ఈ ఎడమచేతివాటం బ్యాటర్.. ఆరో స్థానంలో వచ్చి ఈ మేరకు చెలరేగడం విశేషం.వన్డే వరల్డ్కప్ జట్టులోనూ అతడే ఉండే ఛాన్స్!ఇప్పటికి టీమిండియా తరఫున 27 వన్డేలు ఆడిన ఇషాన్ కిషన్.. 42.40 సగటుతో ఏకంగా 933 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో ఓ వన్డే డబుల్ సెంచరీ కూడా ఉంది. చివరగా 2023 వరల్డ్కప్ టోర్నీలో భాగంగా ఈ జార్ఖండ్ ప్లేయర్ వన్డేల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డ కారణంగా 2023లో ఆఖరిగా టీమిండియాకు ఆడిన ఇషాన్ కిషన్.. దాదాపు రెండేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు. టీ20లలో ఆడే అవకాశం వచ్చి తనను తాను నిరూపించుకోవడం సహా.. వన్డేల్లోనూ ఫామ్ను కొనసాగిస్తే ప్రపంచకప్-2027 జట్టులోనూ అతడికి స్థానం దక్కే అవకాశం ఉంది.ఎడమచేతి వాటం బ్యాటర్ కావడం వల్ల లెఫ్ట్-రైట్ కాంబినేషన్ ఓపెనింగ్ జోడీ కోసం బ్యాకప్గా ఇషాన్ ఉపయోగపడతాడు. అంతేకాదు మిడిలార్డర్లోనూ రాణించగల సత్తా అతడికి ఉంది. ఇక వికెట్ కీపర్గానూ సేవలు అందించగలడు. కాబట్టి ప్రస్తుత ఫామ్ దృష్ట్యా టీమిండియా వన్డే బ్యాకప్ వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్ సరైన ఆప్షన్ అని చెప్పవచ్చు.రేసులోకి ధ్రువ్ జురెల్మరోవైపు.. ధ్రువ్ జురెల్ సైతం రేసులోకి వచ్చాడు. దేశీ క్రికెట్లో అతడు రెడ్హాట్ ఫామ్లో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీ తాజా సీజన్లో ఈ ఉత్తరప్రదేశ్ స్టార్ ఇప్పటికి మూడు మ్యాచ్లలో కలిపి ఏకంగా 307 పరుగులు సాధించాడు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ వచ్చి చితక్కొట్టగలనని నిరూపించాడు.ఇప్పటికే భారత టెస్టు జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకుంటున్న ధ్రువ్ జురెల్.. లిస్ట్-ఎ క్రికెట్లోనూ సత్తా చాటుతున్నాడు. తద్వారా వన్డే జట్టులోకి వచ్చేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నాడు. భారత్- ఎ టూర్లలో వన్డే బ్యాకప్ వికెట్ కీపర్గా అతడిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ తర్వాత ధ్రువ్ జురెల్ అత్యుత్తమ ఆప్షన్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు.పంత్ ఇలాగే ఉంటే కష్టమే!వీరిద్దరు ఇలా సత్తా చాటుతుండగా.. మరోవైపు రిషభ్ పంత్ మాత్రం స్థాయికి తగ్గట్లు ఆకట్టుకోలేకపోతున్నాడు. వన్డేల్లో అతడి రికార్డు కూడా అంతంత మాత్రమే. ఇప్పటికి 31 మ్యాచ్లలో కలిపి సగటు 33తో 871 పరుగులు చేశాడు. అయితే, గత కొంతకాలంగా వన్డే తుదిజట్టులో అతడికి చోటే కష్టమైంది.ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో గుజరాత్పై 70 పరుగులు సాధించడం మినహా.. మిగతా రెండు మ్యాచ్లలో అతడు విఫలమయ్యాడు. మేనేజ్మెంట్ నుంచి మద్దతు ఉంది కాబట్టి.. కేఎల్ రాహుల్ స్థానాన్ని పంత్ భర్తీ చేయవచ్చు. అయితే, వన్డేల్లో అతడి గణాంకాలు మాత్రం ఇందుకు దోహదం చేస్తాయని చెప్పలేము. ఈ రేసులో పంత్, జురెల్లను దాటి ఇషాన్ కిషన్ ముందుకు దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా తదుపరి న్యూజిలాండ్తో వన్డే సిరీస్తో టీమిండియా బిజీ కానుంది. చదవండి: ‘టీ20లలో బెస్ట్.. అతడిని వన్డేల్లోనూ ఆడించాలి’ -
న్యూజిలాండ్తో వన్డే సిరీస్.. ఈ ఐదుగురు ఔట్..?
వచ్చే ఏడాదిని భారత క్రికెట్ జట్టు స్వదేశంలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్తో మొదలు పెడుతుంది. ఈ సిరీస్ కోసం టీమిండియాను జనవరి 3 లేదా 4 తేదీల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎవరెవరు ఈ జట్టుకు ఎంపికవుతారు.. ఎవరిపై వేటు పడే అవకాశం ఉందనే దానిపై ఓ లుక్కేద్దాం. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ సిరీస్ కోసం వేర్వేరు కారణాల వల్ల ఐదుగురు ఆటగాళ్లకు అవకాశం దక్కకపోవచ్చని తెలుస్తుంది. ఆ ఐదుగురు ఎవరంటే..హార్దిక్ పాండ్యాక్వాడ్రిసెప్స్ గాయం కారణంగా తాజాగా ముగిసిన సౌతాఫ్రికా సిరీస్కు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా న్యూజిలాండ్ సిరీస్కు కూడా ఎంపికయ్యే అవకాశం లేదని తెలుస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే టీ20 వరల్డ్కప్ దృష్ట్యా మేనేజ్మెంట్ ఇతనికి విశ్రాంతినివ్వవచ్చు. హార్దిక్ స్థానంలో ఈ సిరీస్కు నితీష్ కుమార్ రెడ్డి ఎంపికయ్యే అవకాశం ఉంది.జస్ప్రీత్ బుమ్రాఇటీవలే బ్యాక్ ఇంజ్యూరీ నుంచి కోలుకున్న బుమ్రాను కూడా టీ20 వరల్డ్కప్ దృష్ట్యా న్యూజిలాండ్ వన్డే సిరీస్కు ఎంపిక చేయకపోవచ్చని తెలుస్తుంది. వరల్డ్కప్ నేపథ్యంలో బుమ్రాపై వర్క్ లోడ్ పడటం మేనేజ్మెంట్కు అస్సలు ఇష్టం లేదని సమాచారం. దీంతో బుమ్రాకు విశ్రాంతి అనివార్యం కావచ్చు. అతని స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాను ఎంపిక చేయవచ్చు.వాషింగ్టన్ సుందర్సౌతాఫ్రికా సిరీస్లో 2 మ్యాచ్ల్లో 14 పరుగులు మాత్రమే చేసి, ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన సుందర్పై వేటు పడే అవకాశం ఉంది. అతడి స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి రావచ్చు.తిలక్ వర్మతిలక్ సౌతాఫ్రికా సిరీస్లో జట్టులో ఉన్నా, ఫస్ట్ ఛాయిస్ XIలో చోటు దక్కలేదు. ఇదే సిరీస్లో రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో కదంతొక్కి తిలక్ స్థానాన్ని ప్రశ్నార్థకంగా మార్చాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ కూడా గాయం నుంచి పూర్తిగా కోలుకోని రీఎంట్రీకి సిద్దంగా ఉండటంతో తిలక్ వన్డే జట్టులో చోటుపై ఆశలు వదులుకున్నాడు.రిషబ్ పంత్గత కొంతకాలంగా ఒక్క వన్డే కూడా ఆడని రిషబ్ పంత్ను న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు కూడా పరిగణలోకి తీసుకోకపోవచ్చు. కేఎల్ రాహుల్ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్గా అద్భుతంగా రాణిస్తుండటంతో పంత్ కూడా వన్డే బెర్త్పై ఆశలు వదులుకున్నాడు. ఒకవేళ ఏదైనా అవకాశం ఉన్నా, ఇషాన్ కిషన్ రూపంలో పంత్కు మరో ప్రమాదం పొంచి ఉంది.న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు అవకాశాలు లేని ఆటగాళ్లు వీళ్లైతే.. శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రుతురాజ్, రవీంద్ర జడేజా, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ ఎంపిక దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది.జనవరి 11న వడోదర వేదికగా తొలి వన్డే జరుగనుంది. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో రెండో వన్డే జనవరి 14న రాజ్కోట్లో.. మూడో వన్డే జనవరి 18న ఇండోర్లో జరుగనుంది. అనంతరం ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ కోసం జట్టును ఇదివరకే ప్రకటించారు. టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టే ఈ సిరీస్లో యధాతథంగా కొనసాగుతుంది.కివీస్తో వన్డేలకు భారత జట్టు (అంచనా)..శుభ్మన్ గిల్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ , రుతురాజ్ గైక్వాడ్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా -
న్యూజిలాండ్ సిరీస్కు ముందే 'మరోసారి' రంగంలోకి దిగనున్న విరాట్
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) న్యూజిలాండ్ సిరీస్కు ముందే మరోసారి రంగంలోకి దిగనున్నాడు. ఇటీవలే విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరఫున రెండు మ్యాచ్లు ఆడిన విరాట్, ఇదే టోర్నీలో మరో మ్యాచ్ ఆడేందుకు సిద్దంగా ఉన్నాడు. జనవరి 6న ఆలుర్లో రైల్వేస్తో జరుగబోయే మ్యాచ్లో విరాట్ బరిలో ఉంటాడని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అత్యున్నత అధికారి ఒకరు క్రిక్బజ్కు లీక్ ఇచ్చారు. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే విరాట్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం జనవరి 7న భారత జట్టుతో పాటు బరోడాలో కలుస్తాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును అతి త్వరలో ప్రకటిస్తారు. ఈ జట్టులో విరాట్ ఉండటం లాంఛనమే. టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ ఫార్మాట్లో విరాట్ ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడు. గత ఆరు ఇన్నింగ్స్ల్లో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు చేసి పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్లు ఆడిన విరాట్.. ఓ సెంచరీ (ఆంధ్రపై 131), ఓ హాఫ్ సెంచరీ (గుజరాత్పై 77) చేశాడు. విరాట్ రైల్వేస్తో జరుగబోయే మ్యాచ్లోనూ సత్తా చాటితే న్యూజిలాండ్ సిరీస్కు ముందు టీమిండియాకు అదనపు ధైర్యం వస్తుంది.విరాట్ తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో వరుసగా రెండు సెంచరీలు (135, 102), ఓ హాఫ్ సెంచరీ (65 నాటౌట్) చేశాడు. అంతకుముందు ఆస్ట్రేలియా పర్యటనలో తొలి రెండు మ్యాచ్ల్లో డకౌటైన విరాట్.. చివరి మ్యాచ్లో హాఫ్ సెంచరీ (74 నాటౌట్) చేసి ఫామ్లోకి వచ్చాడు. విరాట్ ఢిల్లీ జట్టులో ఉండటం వల్ల విజయ్ హజారే ట్రోఫీలో ఆ జట్టుకు కూడా అదనపు బలం చేకూరుతుంది.చదవండి: మహ్మద్ షమీకి బీసీసీఐ భారీ షాక్..! -
న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు టీమిండియా స్టార్లు దూరం!
న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ముందు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్కు భారత స్టార్ ప్లేయర్లు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. టీ20 వరల్డ్ కప్ 2026 దృష్ట్యా సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.వన్డేలకు దూరంగా ఉండనున్న హార్దిక్-బుమ్రా.. తిరిగి జనవరి 21 నుండి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో మాత్రం ఆడనున్నాడు. ఈ టీ20 సిరీస్ ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జరగనుంది. మొత్తం ఐదు మ్యాచ్లలోనూ వారిద్దరూ ఆడనున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్కు కూడా వర్క్ లోడ్ మెనెజ్మెంట్లో భాగంగా వీరిద్దరి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. సఫారీలతో టీ20 సిరీస్లో మాత్రం ఆడారు. ఇప్పుడు అదే జరగనుంది. హార్దిక్ పాండ్యా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత ఇప్పటివరకు ఒక్క వన్డే కూడా ఆడలేదు. అదే విధంగా జస్ప్రీత్ బుమ్రా 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత వన్డే ఫార్మాట్కు దూరంగా ఉండనున్నాడు.బుమ్రా టెస్టుల్లో దుమ్ములేపుతుంటే.. పాండ్యా టీ20ల్లో అదరగొడుతున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన టీ 20 సిరీస్లో పాండ్యా ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు. ఒకవేళ కివీస్తో జరిగే వన్డే సిరీస్కు పాండ్యా దూరమైతే ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి జట్టులో దక్కనుంది. ఈ వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. కెప్టెన్ శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సైతం తిరిగి జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది.కివీస్తో వన్డేలకు భారత జట్టు (అంచనా)శుభ్మన్ గిల్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ /ఇషాన్ కిషన్ , రుతురాజ్ గైక్వాడ్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్చదవండి: మహ్మద్ షమీకి బీసీసీఐ భారీ షాక్..! -
టీమిండియాకు గుడ్ న్యూస్.. స్టార్ ప్లేయర్ వచ్చేస్తున్నాడు..!
స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగబోయే వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. స్టార్ ప్లేయర్, వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి పూర్తిగా కోలుకొని రీఎంట్రీకి సిద్దంగా ఉన్నాడు. గత కొద్ది రోజులుగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో గడిపిన శ్రేయస్.. తాజాగా ఫిట్నెస్ టెస్ట్లన్నీ పూర్తి చేసుకొని, రీఎంట్రీకి అనుమతి పొందాడు. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ కీలక అధికారి మీడియాకు వెల్లడించారు.CoE నుంచి తుది క్లియరెన్స్ ఆధారంగా శ్రేయస్ షెడ్యూల్ నిర్ణయించబడుతుందని సదరు అధికారి తెలిపారు. ప్రస్తుతం శ్రేయస్ నెట్స్లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడని.. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని అన్నారు.సదరు అధికారి చెప్పిన విషయాల మేరకు.. శ్రేయస్ న్యూజిలాండ్తో వన్డే సిరీస్తో టీమిండియా తరఫున రీఎంట్రీ ఇస్తాడు. అంతకంటే ముందే ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్లు ఆడతాడు. జనవరి 3న మహారాష్ట్రతో, 6న హిమాచల్ప్రదేశ్తో జరిగే మ్యాచ్ల్లో శ్రేయస్ బరిలోకి దిగుతాడు. ఆతర్వాత భారత వన్డే జట్టుతో కలుస్తాడు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ కోసం జనవరి 3 లేదా 4 తేదీల్లో భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జనవరి 11 (వడోదర), 14 (రాజ్కోట్), 18 (ఇండోర్) తేదీల్లో జరుగనుంది.కాగా, అక్టోబర్ 25న సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్లో శ్రేయస్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో క్యాచ్ అందుకునే ప్రయత్నంలో శ్రేయస్ పొత్తికడుపు భాగంలో తీవ్ర గాయమైంది. దీంతో అతడి స్ప్లీన్ (ప్లీహం) చీలికకు గురై, అంతర్గత రక్తస్రావం జరిగింది. వెంటనే అతడిని సిడ్నీలోని ఆసుపత్రికి తీసుకువెళ్లి ఐసీయూలో చికిత్స అందించారు.మూడు రోజుల తర్వాత శ్రేయస్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అనంతరం ముంబైకు తిరిగొచ్చిన అయ్యర్.. డాక్టర్ దిన్షా పార్దివాలా పర్యవేక్షణలో చికిత్స పొందాడు. -
రిషబ్ పంత్కు భారీ షాక్.. జట్టులోకి డబుల్ సెంచరీ వీరుడు
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కేవలం టెస్టులకే పరిమితం కానున్నాడా? వన్డే జట్టులో కూడా చోటు కోల్పోనున్నాడా? అంటే అవునానే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. న్యూజిలాండ్తో 2026 జనవరిలో జరగనున్న వన్డే సిరీస్ కోసం భారత జట్టులో పలు మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా రిషబ్ పంత్పై సెలక్టర్లు వేటు వేసేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఢిల్లీ బాయ్ టెస్టుల్లో అద్భుతమైన రికార్డు కలిగి ఉన్నప్పటికి.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం ఆశించిన స్ధాయిలో రాణించలేకపోయాడు.టెస్టుల్లో హిట్.. వన్డేల్లో ఫట్ఇప్పటివరకు భారత తరపున 31 వన్డేలు ఆడిన రిషబ్.. 33.5 సగటుతో కేవలం 871 పరుగులు మాత్రమే చేశాడు. టీ20ల్లో కూడా 76 మ్యాచ్లు ఆడి 23.25 సగటుతో 1209 పరుగులు చేశాడు. దీంతో అతడిని ఇప్పటికే టీ20 జట్టు నుంచి తప్పించిన సెలక్టర్లు.. ఇప్పుడు వన్డే జట్టు నుంచి కూడా పక్కన పెట్టేందుకు సిద్దమయ్యారంట.పంత్ టీమిండియా తరపున చివరగా వన్డేల్లో గతేడాది ఆగస్టులో శ్రీలంకపై ఆడాడు. అప్పటి నుంచి అతడు ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. ఇటీవల జరిగిన సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు ఎంపికైనప్పటికి.. తుది జట్టులో మాత్రం అతడికి చోటు దక్కలేదు. మొత్తం మూడు మ్యాచ్లకు బెంచ్కే పరిమితమయ్యాడు. 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో ఉన్నప్పటికి పంత్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కె.ఎల్ రాహుల్కు బ్యాకప్గా మాత్రమే పంత్ ఉన్నాడు. కాగా పంత్ టెస్టు క్రికెట్లో మాత్రం 49 మ్యాచ్లు ఆడి 42.91 సగటుతో 3476 పరుగులు చేశాడు.జట్టులోకి కిషన్..ఇక దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపుతున్న జార్ఖండ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తిరిగి వన్డేల్లో కూడా రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీ20 వరల్డ్కప్ జట్టుకు ఎంపికైన కిషన్ను వన్డే జట్టులోకి కూడా తీసుకోవాలని అజిత్ అగార్కర్ అండ్ కో భావిస్తున్నట్లు సమాచారం.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన ఇషాన్.. అదే ఫామ్ను విజయ్ హజారే ట్రోఫీలోనూ కొనసాగిస్తున్నాడు. కర్ణాటకతో జరిగిన తొలి మ్యాచ్లో కిషన్ కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాదాడు. తద్వారా లిస్ట్-ఎ క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన రెండో భారత క్రికెటర్గా కిషన్ నిలిచాడు.ఈ క్రమంలోనే అతడికి తిరిగి పిలుపునిచ్చేందుకు సెలక్టర్లు సిద్దమయ్యారు. కిషన్ చివరిసారిగా 2023 వన్డే ప్రపంచకప్లో భారత్ తరఫున ఆడాడు. కిషన్కు వన్డేల్లో అద్బుతమైన డబుల్ సెంచరీ కూడా ఉంది. ఇక కివీస్తో వన్డేలకు భారత జట్టును బీసీసీఐ జనవరి మొదటి వారంలో ప్రకటించనుంది. గాయం కారణంగా సౌతాఫ్రికాతో వన్డేలకు దూరంగా ఉన్న కెప్టెన్ శుభ్మన్ గిల్ తిరిగి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయమైంది. జనవరి 11 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.చదవండి: SA20: సౌరవ్ గంగూలీకు భారీ షాక్.. తొలి మ్యాచ్లోనే? -
టీమిండియాలోకి ఉహించని ప్లేయర్.. ఎవరంటే?
భారత పురుషల క్రికెట్ జట్టు.. కొత్త ఏడాదిని సొంతగడ్డపై న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్తో ప్రారంభించనుంది. జనవరి 11 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అనంతరం ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో కివీస్-భారత జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే టీ20 సిరీస్కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. మరో నాలుగైదు రోజుల్లో వన్డే జట్టును కూడా ఖరారు చేయనుంది. టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ తిరిగి జట్టులోకి రానున్నాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికా వన్డే సిరీస్కు దూరమైన గిల్.. తిరిగి టీ20 సిరీస్కు అందుబాటులోకి వచ్చాడు. ఆ తర్వాత మళ్లీ గాయపడడంతో సిరీస్ మధ్యలోనే వైదొలిగాడు. అయితే గిల్ ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దీంతో కివీస్తో వన్డే సిరీస్లో జట్టును గిల్ నడిపించనున్నాడు.శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీ?ఇక ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడ్డ భారత మిడిలార్డర్ శ్రేయస్ అయ్యర్ కూడి తిరిగి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయ్యర్ ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో ఉన్నాడు.అతడు తన ప్రాక్టీస్ను కూడా మొదలు పెట్టాడు. అతడికి రెండు మూడు రోజుల్లో ఫిట్నెస్ పరీక్షను నిర్వహించనున్నారు. అందులో అతడు ఉత్తీర్ణ సాధిస్తే కివీస్తో సిరీస్కు ఎంపిక కానున్నాడు.పడిక్కల్కు చోటు..!ఒకవేళ అయ్యర్ ఫిట్నెస్ సాధించకపోతే అతడి స్ధానంలో కర్ణాటక ఆటగాడు దేవ్దత్త్ పడిక్కల్ను సెలక్టర్లు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. పడిక్కల్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీ-2025లో పడిక్కల్ దుమ్ములేపుతున్నాడు. వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ పడిక్కల్ శతక్కొట్టాడు. లిస్ట్-ఎ క్రికెట్లో పడిక్కల్ సగటు దాదాపు 83. 64గా ఉంది. దీంతో అతడిని వన్డే జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. మరోవైపు 2026 టీ20 వరల్డ్ కప్ దృష్ట్యా కివీస్తో వన్డేలకు స్టార్ ప్లేయర్లు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది.న్యూజిలాండ్తో వన్డేలకు భారత జట్టు(అంచనా)శుభ్మన్ గిల్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్)/ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ , రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్ -
IND vs NZ: ‘మనోడి’తో పాటు మరో ముగ్గురు.. గోల్డెన్ ఛాన్స్!
టీమిండియాతో వన్డే, టీ20 సిరీస్లకు న్యూజిలాండ్ క్రికెట్ ఇప్పటికే తమ జట్లను ప్రకటించింది. వన్డే సిరీస్కు రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ దూరంగా ఉండగా.. అతడి స్థానంలో మైకేల్ బ్రేస్వెల్ సారథ్యం వహించనున్నాడు.అయితే, టీ20 సిరీస్ సందర్భంగా సాంట్నర్ తిరిగి జట్టుతో చేరనున్నాడు. ఇక జనవరి 11- 31 వరకు కివీస్ జట్టు భారత పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడుతుంది. ఈ నేపథ్యంలో టీ20 జట్టు స్టార్లతో నిండి ఉండగా.. వన్డే జట్టులో కొత్త ముఖాలే ఎక్కువగా ఉన్నాయి. ఆది అశోక్, క్రిస్టియన్ క్లార్క్, జోష్ కార్ల్సన్, జేడన్ లెనాక్స్ ఈసారి ఇండియా టూర్కు రానున్నారు.ఆది అశోక్భారత సంతికి చెందిన కివీస్ క్రికెటర్ ఆదిత్య అశోక్. తమిళనాడులో 2002, సెప్టెంబరు 5న జన్మించాడు. అశోక్ లెగ్ స్పిన్నర్. వైవిధ్య భరితమైన బంతులు వేయడంలో దిట్ట.భారత సంతతికే చెందిన ఇష్ సోధి కెరీర్ చరమాంకానికి చేరుకుంటున్నాడు. వైట్బాల్ క్రికెట్లో అతడి వారసుడిగా కివీస్ బోర్డు అశోక్ను తీర్చిదిద్దుతోంది. ఇప్పటికి న్యూజిలాండ్ తరఫున అశోక్ రెండు వన్డేలు, ఒక టీ20 ఆడి.. మొత్తంగా రెండు వికెట్లు తీశాడు.క్రిస్టియన్ క్లార్క్దేశీ క్రికెట్లో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రిస్టియన్ క్లార్క్ రైటార్మ్ ఫాస్ట్బౌలర్. ఇప్పటి వరకు అతడు కివీస్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే, టీమిండియాతో వన్డే సిరీస్ సందర్భంగా అతడు అరంగేట్రం చేసే అవకాశం ఉంది.లిస్ట్-ఎ క్రికెట్లో 34 మ్యాచ్లు ఆడిన క్లార్క్ 52 వికెట్లు తీశాడు. అయితే, అతడి ఖాతాలో ఓ శతకం కూడా ఉండటం విశేషం. 23 ఇన్నింగ్స్లో కలిపి అతడు 373 పరుగులు సాధించాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటర్గానూ రాణించగల సత్తా ఉన్న క్లార్క్ వైపు కివీస్ మొగ్గుచూపవచ్చు.జోష్ క్లార్క్సన్ఆరడుగుల మూడు అంగుళాల ఎత్తు ఉండే సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ జోష్ క్లార్క్సన్. లోయర్ ఆర్డర్లో ఫినిషర్గా రాణించగల సత్తా కూడా ఉంది. ఇప్పటికి 11 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన క్లార్క్సన్.. 92 పరుగులు చేశాడు. లిస్ట్-ఎ క్రికెట్లో 98 మ్యాచ్లలో అతడి పేరిట 2214 పరుగులు ఉన్నాయి.జేడన్ లెనాక్స్భారత పర్యటనలో భాగంగా ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. 31 ఏళ్ల లెనాక్స్.. లిస్ట్-ఎ క్రికెట్లో 54 మ్యాచ్లలో కలిపి 69 వికెట్లు కూల్చాడు. ఎకానమీ 4.86. అతడి బౌలింగ్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదే నిదర్శనం. సాంట్నర్కు వన్డే సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు కాబట్టి.. లెనాక్స్ స్పిన్ విభాగంలో కీలకమయ్యే ఛాన్స్ ఉంది.చదవండి: IND vs NZ: కివీస్ జట్ల ప్రకటన.. గాయాల వల్ల కీలక ప్లేయర్లు దూరం -
శుభ్మన్ గిల్ కీలక నిర్ణయం..!
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో ఆఖరి రెండు మ్యాచ్లకు గాయం కారణంగా దూరమైన టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్.. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దీంతో న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో భారత జట్టును ముందుండి నడిపించేందుకు గిల్ సిద్దంగా ఉన్నాడు. అంతకంటే ముందు విజయ్ హజారే ట్రోఫీ-2025లో గిల్ ఆడనున్నాడు.టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మాదిరిగానే కేవలం రెండు మ్యాచ్లకు మాత్రమే గిల్ అందుబాటులో ఉండనున్నాడు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన 18 మంది సభ్యుల జట్టులో గిల్ ముందే చోటు దక్కించుకున్నాడు. అయితే ఈ టోర్నీలో పంజాబ్ ఆడిన తొలి రెండు మ్యాచ్లకు గిల్ దూరంగా ఉన్నాడు.దీంతో అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని, నేరుగా కివీస్ సిరీస్లోనే ఆడనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ గిల్ మాత్రం ఈ దేశవాళీ వన్డేలో టోర్నీలో ఆడేందుకు సిద్దమయ్యాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. జనవరి 3న సిక్కిం, జనవరి 6న గోవాతో పంజాబ్ ఆడనున్న మ్యాచ్లలో గిల్ బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుతం మొహాలీలో ఉన్న శుభ్మన్.. జనవరి 1న జైపూర్లో పంజాబ్ జట్టుతో కలవనున్నట్లు సమాచారం. అదేవిధంగా ముంబైతో జరిగే ఫైనల్ గ్రూపు లీగ్ మ్యాచ్ ఆడేందుకు కూడా గిల్ ఆసక్తిచూపుతున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. జనవరి 8న పంజాబ్ తమ చివరి లీగ్ మ్యాచ్లో ముంబైతో తలపడనుంది.అయితే అక్కడికి రెండు రోజుల తర్వాత భారత్-న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ క్యాంపును ఏర్పాటు చేసే అవకాశముంది. ఒకవేళ అదే జరిగితే ముంబైతో మ్యాచ్కు గిల్ దూరం కానున్నాడు. కాగా గిల్ ప్రస్తుతం పేలవ ఫామ్తో సతమతవుతున్నాడు. దీంతో అతడికి టీ20 వరల్డ్కప్-2026 జట్టులో చోటు దక్కలేదు. అతడి స్ధానంలో ఇషాన్ కిషన్ను జట్టులోకి తీసుకున్నారు.చదవండి: రికెల్టన్ సుడిగాలి శతకం వృథా.. మార్క్రమ్ మెరుపులతో బోణీ -
న్యూజిలాండ్తో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్ ఎవరంటే?
స్వదేశంలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు భారత జట్టును జనవరి మొదటి వారంలో బీసీసీఐ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ జనవరి 3 లేదా 4న వర్చువల్గా సమావేశం కానుంది. ఈ మీటింగ్లో కివీస్తో వన్డేల కోసం కోసం భారత జట్టును ఖరారు చేయనుంది. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు దూరమైన కెప్టెన్ శుభ్మన్ గిల్ తిరిగి రీ ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమైంది. కివీస్తో వన్డే సిరీస్లో జట్టును నడిపించేందుకు గిల్ సిద్దమైనట్లు తెలుస్తోంది. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ మధ్యలో మెడ గాయం కారణంగా వైదొలిగిన గిల్.. వన్డేలకు దూరమయ్యాడు. దీంతో అతడి స్ధానంలో కేఎల్ రాహుల్ జట్టు పగ్గాలను చేపట్టాడు. అనంతరం గిల్ తిరిగి తిరిగి టీ20 సిరీస్కు అందుబాటులోకి వచ్చాడు. అయితే నాలుగో టీ20కు ముందు గిల్ కాలి మడమ గాయం బారిన పడ్డాడు.దీంతో ఆఖరి రెండు టీ20లకు కూడా అతడు దూరమయ్యాడు. అనంతరం టీ20 వరల్డ్కప్-2026 జట్టులో గిల్ చోటు దక్కించుకోలేకపోయాడు. కానీ గిల్ మాత్రం ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ సాధించాడు. విజయ్ హజారే ట్రోఫీ కోసం మొహాలీలోని పీసీఏ స్టేడియంలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే వన్డే జట్టు పగ్గాలను చేపట్టాక గిల్ పెద్దగా రాణించలేకపోయాడు. ఆసీస్తో వన్డే సిరీస్లో గిల్ విఫలమయ్యాడు. దీంతో తన రీఎంట్రీలో న్యూజిలాండ్పై సత్తాచాటాలని శుభ్మన్ ఉవ్విళ్లూరుతున్నాడు. మరోవైపు ఆసీస్ పర్యటనలో గాయపడ్డ శ్రేయస్ అయ్యర్ కూడా పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. అతడు ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో (CoE) తన ప్రాక్టీస్ను మొదలు పెట్టాడు. త్వరలోనే అతడికి వైద్య బృందం ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో ఉత్తీర్ణత సాధిస్తే అతడు కివీస్తో వన్డేలకు అందుబాటులోకి రానున్నాడు. జనవరి 11 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.కివీస్తో వన్డేలకు భారత జట్టు(అంచనా)శుభమన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, తిలక్ వర్మచదవండి: నవతరం క్రికెట్లో.. మూడు ఫార్మాట్లు ఆడగల టాప్-5 ప్లేయర్లు వీరే! -
టీమిండియాకు గుడ్ న్యూస్..
న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు ఓ గుడ్ న్యూస్ అందింది. ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా గాయపడి గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్ బ్యాటర్, వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్.. తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమవుతున్నాడు.దాదాపు రెండు నెలల విరామం తర్వాత అయ్యర్ బుధవారం(డిసెంబర్ 24) తన మొదటి బ్యాటింగ్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గోన్నట్లు సమాచారం. సుమారు గంటసేపు నెట్స్లో గడిపిన శ్రేయస్.. ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.అతడు ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. శ్రేయస్ ఒకట్రెండు రోజుల్లో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఈ ముంబై ఆటగాడు 4 నుంచి 6 రోజుల పాటు ప్రత్యేక శిక్షణలో పాల్గోనున్నాడు.అనంతరం అతడికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వైద్య బృంది ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించింది. ఒకవేళ ఈ పరీక్షలో అయ్యర్ పాసైతే న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు అందుబాటులో ఉండే అవకాశముంది. కివీస్తో వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్కు భారత జట్టును ఇంకా బీసీసీఐ ప్రకటించలేదు.అయ్యర్కు ఏమైందంటే?అక్టోబర్ 25న సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో క్యాచ్ అందుకునే ప్రయత్నంలో అయ్యర్ పొత్తికడుపు భాగంలో తీవ్ర గాయమైంది. దీంతో అతడి స్ప్లీన్ (ప్లీహం) చీలికకు గురై, అంతర్గత రక్తస్రావం జరిగింది. వెంటనే అతడిని సిడ్నీలోని ఆసుపత్రికి తీసుకువెళ్లి ఐసీయూలో చికిత్స అందించారు. మూడు రోజుల తర్వాత అయ్యర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అనంతరం ముంబైకు తిరిగొచ్చిన అయ్యర్.. డాక్టర్ దిన్షా పార్దివాలా పర్యవేక్షణలో చికిత్స పొందాడు. అతడికి దాదాపు నాలుగు ఐదు వారాల పాటు విశ్రాంతి అవసరమని పార్దివాలా సూచించారు.ఇప్పుడు అతడు పూర్తిగా కోలుకోవడంతో తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఒకవేళ అయ్యర్ తన ఫిట్నెస్ను నిరూపించుకుంటే.. విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టు తరపున బరిలోకి దిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు.చదవండి: ఐపీఎల్ వద్దు పొమ్మంది.. కట్చేస్తే.. డబుల్ సెంచరీతో దుమ్ములేపాడు! -
IND vs NZ: కివీస్ జట్ల ప్రకటన.. ఇద్దరు కెప్టెన్లు
టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్లకు న్యూజిలాండ్ క్రికెట్ తమ జట్లను ప్రకటించింది. గాయం నుంచి కోలుకున్న రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ భారత పర్యటనలో భాగంగా పునరాగమనం చేయనున్నాడు. అయితే, ఫిట్నెస్ దృష్ట్యా వన్డే సిరీస్కు సెలక్టర్లు అతడికి విశ్రాంతినిచ్చారు.రెండు జట్లకు ఇద్దరు కెప్టెన్లుఫలితంగా వన్డేల్లో సాంట్నర్కు బదులు మైకేల్ బ్రేస్వెల్ సారథ్యం వహించనున్నాడు. ఇక టీ20 సిరీస్కు మాత్రం సాంట్నర్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. మరోవైపు.. పేసర్ కైలీ జెమీషన్ గాయం నుంచి పూర్తిగా కోలుకుని భారత్తో వన్డే, టీ20 సిరీస్లలో భాగం కానున్నాడు.గాయాల బెడద.. వీరంతా దూరంఇక ముందుగా ఊహించినట్లుగానే మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. సౌతాఫ్రికా టీ20లో భాగమైన నేపథ్యంలో.. భారత్తో వన్డే సిరీస్కు దూరంగా ఉండనున్నాడు. మిగిలిన వారిలో నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, మార్క్ చాప్మన్, మ్యాట్ హెన్రీ గాయాల వల్ల ఆటకు దూరమయ్యారు. ఇదిలా ఉంటే.. టామ్ లాథమ్ తన మొదటి సంతానానికి ఆహ్వానం పలికే క్రమంలో ఈ టూర్ మిస్సయ్యాడు.అదే విధంగా.. జేకబ్ డఫీ, రచిన్ రవీంద్రలకు వన్డేల నుంచి విశ్రాంతినిచ్చారు. మరోవైపు.. లెఫ్టార్మ్ స్పిన్నర్ జేడెన్ లెనాక్స్ను తొలిసారి జాతీయ జట్టుకు సెలక్టర్లు ఎంపిక చేశారు. క్రిటిసాన్ క్లార్క్, ఆది అశోక్, జోష్ క్లార్క్సన్, నిక్ కెల్లీ, మేకేల్ రేలకు కూడా మేనేజ్మెంట్ ఈ జట్లలో చోటు కల్పించింది.భారత్తో వన్డేలకు న్యూజిలాండ్ జట్టుమైకేల్ బ్రేస్వెల్ (కెప్టెన్), ఆది అశోక్, క్రిస్టియన్ క్లార్క్, జోష్ క్లార్క్సన్, డెవాన్ కాన్వే, జాక్ ఫౌల్క్స్, మిచ్ హే, కైలీ జెమీషన్, నిక్ కెల్లీ, జేడెన్ లెనాక్స్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మైకేల్ రే, విల్ యంగ్.భారత్తో టీ20లకు న్యూజిలాండ్ జట్టుమిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైకేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జేకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, కైలీ జెమీషన్, బెవాన్ జాకబ్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ రాబిన్సన్, ఇష్ సోధి.భారత్ వర్సెస్ న్యూజిలాండ్ షెడ్యూల్జనవరి 11, 14, 18 తేదీల్లో మూడు వన్డేల సిరీస్జనవరి 21, 23, 25, 28, 31 తేదీల్లో ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్.చదవండి: రవీంద్ర జడేజా కీలక నిర్ణయం -
భారత్తో వన్డే సిరీస్.. విలియమ్సన్ సంచలన నిర్ణయం!
న్యూజిలాండ్ పురుషల క్రికెట్ జట్టు వచ్చే ఏడాది జనవరిలో భారత పర్యటనకు రానుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్లో కివీస్ తలపడనుంది. తొలుత వన్డే సిరీస్ జరగనుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీమిండియాతో వన్డే సిరీస్కు విలియమ్సన్ను దూరంగా ఉండనున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఆడేందుకు కేన్ ఇప్పటికే డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ లీగ్ డిసెంబర్ 26 నుండి జనవరి 26 వరకు జరగనుంది. ఈ లీగ్ కారణంగానే అతడు భారత్తో జరిగే వన్డేలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ జనవరి 11న ప్రారంభమై.. జనవరి 18న ముగియనుంది.ఇప్పటికే అంతర్జాతీయ టీ20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విలియమ్సన్.. ప్రస్తుతం వన్డే, టెస్టు ఫార్మాట్లలోనే కొనసాగుతున్నాడు. సెంట్రల్ కాంట్రాక్ట్ను కూడా వదులుకున్నాడు. ఎక్కవగా కుటంబంతో సమయం గడిపేందుకే కేన్ మామ ప్రాధాన్యత ఇస్తున్నాడు. గత నెలలలో వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్కు కూడా అతడు దూరమయ్యాడు. కానీ ఈ కివీ మాజీ కెప్టెన్ విండీస్తో టెస్టు సిరీస్లో మాత్రం మాడాడు. మౌంట్మంగనూయ్ వేదికగా విండీస్-న్యూజిలాండ్ మూడో టెస్టు ముగిసిన అనంతరం విలియమ్సన్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు."ఒక్కో సిరీస్కు కాస్త విరామం తీసుకుని మళ్లీ జాతీయ జట్టుకు ఆడుతాను. నా కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను. ముఖ్యంగా పిల్లలతో గడపడం నాకు చాలా ముఖ్యం. అయితే క్రికెట్ పట్ల నాకున్న మక్కువ ఇసుమంత కూడా తగ్గలేదు. కానీ నా వ్యక్తిగత జీవితాన్ని, నా ప్రొపిషనల్ లైఫ్ను బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నా" అని విలియమ్సన్ పేర్కొన్నాడు. ఐపీఎల్-2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు వ్యూహాత్మక సలహాదారుగా కేన్ వ్యవహరించనున్నాడు. -
చరిత్ర సృష్టించిన స్మృతి మంధన
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా ఆసీస్ దిగ్గజం మెగ్ లాన్నింగ్తో (Meg Lanning) వరల్డ్ రికార్డును షేర్ చేసుకుంది. ఈ ఇద్దరూ తలో 17 సెంచరీలు చేశారు. లాన్నింగ్ వన్డేల్లో 15, టీ20ల్లో 2 సెంచరీలు చేయగా.. మంధన వన్డేల్లో 14, టెస్ట్ల్లో 2, టీ20ల్లో ఓ సెంచరీ చేసింది.మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా నిన్న (అక్టోబర్ 23) న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో సూపర్ సెంచరీ చేసిన మంధన లాన్నింగ్ పేరిట ఉండిన ప్రపంచ రికార్డును సమం చేసింది. ఇకపై మంధన ఏ ఫార్మాట్లో అయినా సెంచరీ చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక శతకాల రికార్డు ఆమె పేరిటే సోలోగా ఉంటుంది.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన టాప్-5 బ్యాటర్లు..స్మృతి మంధన-17 (వన్డేల్లో 14, టెస్ట్ల్లో 2, టీ20ల్లో 1)మెగ్ లాన్నింగ్-17 (వన్డేల్లో 15, టీ20ల్లో 2)సూజీ బేట్స్-13 (వన్డేల్లో 13)ట్యామీ బేమౌంట్-12 (వన్డేల్లో 12)నాట్ సీవర్ బ్రంట్-10 (వన్డేల్లో 10)పై జాబితాలో మంధన మినహా మిగతా నలుగురు ఏదైన ఒకటి లేదా రెండు ఫార్మాట్లలో మాత్రమే సెంచరీలు చేశారు. మంధన మాత్రమే మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసి ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అనిపించుకుంది.న్యూజిలాండ్పై తాజా సెంచరీతో మంధన మరో రికార్డు కూడా సమం చేసింది. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ప్లేయర్గా తజ్మిన్ బ్రిట్స్తో (సౌతాఫ్రికా) పాటు ప్రపంచ రికార్డును పంచుకుంది. తజ్మిన్, మంధన ఇద్దరు ఈ ఏడాది తలో 5 సెంచరీలు చేశారు.ఈ సెంచరీతో మంధన వన్డేల్లో అత్యధిక సెంచరీలు (14) చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ క్రమంలో సూజీ బేట్స్ను (13) దాటి, అగ్రస్థానంలో ఉన్న మెగ్ లాన్నింగ్కు (15) మరింత చేరువయ్యింది.న్యూజిలాండ్తో నిన్న జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టీమిండియా 53 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్) గెలుపొంది సెమీస్కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్లు ప్రతిక (122), స్మృతి మంధన (109) సెంచరీలతో చెలరేగడంతో 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. వన్డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగెజ్ (76 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది.అనంతరం భారీ లక్ష ఛేదనలో న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు మాత్రమే చేయగలిగింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో బ్రూక్ హాలీడే (81), ఇసబెల్లా (65 నాటౌట్) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో భారత్కు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీస్ బెర్త్ దక్కించుకున్న విషయం తెలిసిందే. -
టీమిండియా ప్లేయర్ ప్రపంచ రికార్డు
భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ ప్రతిక రావల్ (Pratika Rawal) ఖాతాలో ఓ ప్రపంచ రికార్డు చేరింది. వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) భాగంగా నిన్న న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో సూపర్ సెంచరీ చేసిన ఆమె.. వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ప్లేయర్గా ఆస్ట్రేలియాకు చెందిన లిండ్సే రీలర్తో ప్రపంచ రికార్డును షేర్ చేసుకుంది. లిండ్సే, ప్రతిక ఇద్దరూ 23 ఇన్నింగ్స్ల్లోనే 1000 పరుగులు పూర్తి చేశారు. సాధారణంగా ఆస్ట్రేలియా ప్లేయర్లతో నిండుకుపోయే ఇలాంటి రికార్డులలో ప్రతిక చేరడం గమనార్హం. వన్డేల్లో తొలి 1000 పరుగులను అత్యంత వేగంగా పూర్తి చేసిన టాప్-5 ప్లేయర్ల జాబితాలో ప్రతిక, లిండ్సే తర్వాత ముగ్గురూ ఆస్ట్రేలియన్లే ఉన్నారు. నికోల్ బోల్టన్, మెగ్ లాన్నింగ్ తలో 25 ఇన్నింగ్స్ల్లో ఈ మైలురాయిని తాకగా.. బెలిండా క్లార్క్ 27 ఇన్నింగ్స్ల్లో చేరుకుంది.25 ఏళ్ల ప్రతిక గతేడాది (2024) డిసెంబర్లో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. స్వల్ప కెరీర్లో తాజా ఇన్నింగ్స్ (న్యూజిలాండ్పై) సహా ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్లు ఆడింది. ఢిల్లీకి చెందిన ప్రతిక పదేళ్ల నుంచే క్రికెట్ ఆడటం ప్రారంభించింది. పలు దశలను దాటుకుంటూ ప్రస్తుతం టీమిండియాలో కీలక సభ్యురాలిగా కొనసాగుతుంది.ప్రస్తుత ప్రపంచకప్లోనూ ప్రతిక అద్భుతమైన టచ్లో ఉంది. 6 మ్యాచ్ల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 51.33 సగటున 308 పరుగులు చేసి టోర్నీలో సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతుంది. ఓవరాల్ కెరీర్లో 23 వన్డేలు ఆడిన ప్రతిక 2 సెంచరీలు, 7 అర్ద సెంచరీల సాయంతో 50.45 సగటున 1110 పరుగులు చేసింది.నిన్న న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టీమిండియా 53 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్) గెలుపొంది సెమీస్కు అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్లు ప్రతిక (122), స్మృతి మంధన (109) సెంచరీలతో చెలరేగడంతో 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. వన్డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగెజ్ (76 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది.అనంతరం భారీ లక్ష ఛేదనలో న్యూజిలాండ్ అనూహ్య పోరాటం ప్రదర్శించింది. 44 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేయగలిగింది. బ్రూక్ హాలీడే (81), ఇసబెల్లా (65 నాటౌట్) న్యూజిలాండ్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో భారత్కు ముందు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీస్ బెర్త్ దక్కించుకున్న విషయం తెలిసిందే.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఆసీస్ వరల్డ్ రికార్డు బ్రేక్ -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఆసీస్ వరల్డ్ రికార్డు బ్రేక్
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో భారత జట్టు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా.. తమ సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్లో హర్మన్ సేన ఆల్రౌండ్షోతో అదరగొట్టింది.వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 49 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన మన అమ్మాయిల జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లకు 340 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన(109), ప్రతికా రావల్(122) అద్భుతమైన సెంచరీలతో సత్తాచాటగా.. జెమీమా రోడ్రిగ్స్ (76 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది.అనంతరం మళ్లీ వర్షం అంతరాయం కలిగించడంతో కివీస్ లక్ష్యాన్ని 44 ఓవర్లలో 325గా నిర్ణయించారు. కానీ న్యూజిలాండ్ లక్ష్య చేధనలో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 271 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఈ ఓటమితో కివీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ మ్యాచ్లో అదరగొట్టిన భారత మహిళల జట్టు ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఆసీస్ రికార్డు బ్రేక్..మహిళల వన్డే వరల్డ్కప్లో న్యూజిలాండ్పై అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ పేరిట ఉండేది. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్లోనే ఇండోర్ వేదికగా కివీస్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 326 పరుగులు చేసింది. తాజా మ్యాచ్లో 340 రన్స్ చేసిన టీమిండియా.. ఆసీస్ రికార్డును బ్రేక్ చేసింది.చదవండి: రోహిత్ నీకు ఇది ఫేర్వెల్ మ్యాచా? ఒక్క ఫోటో అయినా పెట్టు: గంభీర్ -
‘నాకు కాదు!.. తనకే ఇవ్వాల్సింది.. సెమీస్ చేరడం బిగ్ రిలీఫ్’
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 (ICC ODI WC 2025) టోర్నమెంట్లో భారత్ సెమీ ఫైనల్ చేరింది. న్యూజిలాండ్తో గురువారం నాటి మ్యాచ్లో 53 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత ఈ మేరకు అద్భుత గెలుపుతో టైటిల్ దిశగా ప్రయాణం మొదలుపెట్టింది.శతకాలతో చెలరేగిన ఓపెనర్లుకాగా కివీస్ జట్టు (IND W vs NZ W)పై భారత్ విజయంలో భారత ఓపెనర్లు ప్రతికా రావల్ (134 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్లు- 122), స్మృతి మంధాన (95 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్లు- 109)లది కీలక పాత్ర. ఇద్దరూ శతకాలతో చెలరేగి జట్టుకు భారీ స్కోరు అందించారు. వీరికి తోడుగా వన్డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (55 బంతుల్లో 76 నాటౌట్) కూడా అద్భుత రీతిలో రాణించింది.ఇక ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించిన కారణంగా.. ఇన్నింగ్స్ను 49 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో భారత్ మూడు వికెట్ల నష్టానికి 340 పరుగులు స్కోరు చేయగా.. డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం కివీస్ లక్ష్యాన్ని 44 ఓవర్లలో 325 పరుగులుగా నిర్దేశించారు.271 పరుగులే చేసి.. కివీస్ అవుట్అయితే, భారత బౌలర్ల ధాటికి తాళలేక నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయిన న్యూజిలాండ్ 271 పరుగుల వద్దే నిలిచిపోయింది. ఫలితంగా నవీ ముంబైలో హర్మన్సేన జయభేరి మోగించి సెమీస్లో అడుగుపెట్టింది.సెమీస్ చేరడం బిగ్ రిలీఫ్ఇక ఈ మ్యాచ్లో భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana)ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో విజయానంతరం స్మృతి స్పందిస్తూ.. ‘‘నాకౌట్స్కు అర్హత సాధించడం ఉపశమనం కలిగించింది. గత మూడు మ్యాచ్లలో మేము ఓడిపోయాం. అది గడ్డు దశ. మంచిగానే ఆడినా.. ఆ మ్యాచ్లలో మేము పరాజయం పాలయ్యాము.‘నాకు కాదు!.. తనకే ఇవ్వాల్సిందిఅయితే, ఈరోజు మాత్రం అనుకూలా ఫలితాన్ని రాబట్టగలిగాము. అయితే, ఈ అవార్డు నాకు ఇచ్చే కంటే ప్రతికాకు ఇస్తే బాగుండేది. నాతో పాటు ప్రతికా ఇందుకు అర్హురాలు. నిజంగా నేనైతే ఈ విషయంలో ఆశ్చర్యపోయాను. ఆమెకే అవార్డు ఇస్తారనుకున్నా’’ అని తెలిపింది.కాగా స్మృతి- ప్రతికా జోడీ ఈ ఏడాదిలో ఇప్పటికే 1557 పరుగులు సాధించింది. భారత పురుషుల క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండుల్కర్- సునిల్ గావస్కర్ జంట 1998లో 1635 పరుగులు చేయగా.. వారి రికార్డుకు స్మృతి- ప్రతికా ఇప్పుడు చేరువయ్యారు.ఇక భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న వన్డే వరల్డ్కప్ టోర్నీలో నాలుగు సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ టాప్-4లో అడుగుపెట్టగా.. న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఎలిమినేట్ అయ్యాయి. చదవండి: IND vs AUS: భారత్తో టీ20 సిరీస్.. ఆసీస్ జట్టు ప్రకటన! విధ్వంసకర వీరుడు వచ్చేశాడుSemi-Final Bound! 😍🤩Deepti Sharma wraps it up as #TeamIndia storm into their 5th Women’s Cricket World Cup semi-final! 👍🏻Watch them next #CWC25 👉 #INDvBAN | SUN, 26th OCT, 2 PM pic.twitter.com/F9sKcNx8Lt— Star Sports (@StarSportsIndia) October 23, 2025 -
ICC WC 2025: సత్తా చాటి సెమీఫైనల్కు భారత్
వరల్డ్ కప్లో వరుసగా మూడు పరాజయాలతో వెనుకబడి విమర్శలు ఎదుర్కొన్న భారత మహిళల జట్టు అసలు పోరులో చెలరేగింది. తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సత్తా చాటి దర్జాగా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. స్మృతి మంధాన, ప్రతీక రావల్ సెంచరీలతో పాటు జెమీమా మెరుపులు తోడవడంతో భారీ స్కోరుతో న్యూజిలాండ్ మహిళలకు సవాల్ విసిరిన టీమిండియా...ఆపై పదునైన బౌలింగ్తో ప్రత్యర్థిని కుప్పకూల్చి ఘన విజయాన్ని అందుకుంది. తాజా ఓటమితో మాజీ చాంపియన్ కివీస్ సెమీస్ అవకాశం కోల్పోయింది. ముంబై: స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్లో భారత మహిళల జట్టు సెమీఫైనల్కు చేరింది. ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ తర్వాత సెమీస్ చేరిన చివరి జట్టుగా హర్మన్ సేన నిలిచింది. గురువారం డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో భారత్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 53 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై విజయం సాధించింది. భారత బ్యాటింగ్ చివర్లో వాన కారణంగా ఇన్నింగ్స్ను 49 ఓవర్లకు కుదించగా, టీమిండియా 3 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రతీక రావల్ (134 బంతుల్లో 122; 13 ఫోర్లు, 2 సిక్స్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతి మంధాన (95 బంతుల్లో 109; 10 ఫోర్లు, 4 సిక్స్లు) శతకాలతో చెలరేగారు. వీరిద్దరు తొలి వికెట్కు 33.2 ఓవర్లలో 212 పరుగులు జోడించడం విశేషం. జెమీమా రోడ్రిగ్స్ (55 బంతుల్లో 76 నాటౌట్; 11 ఫోర్లు) కూడా మెరుపు బ్యాటింగ్తో జట్టు భారీ స్కోరులో కీలక పాత్ర పోషించింది. అనంతరం వర్షం మళ్లీ అంతరాయం కలిగించడంతో న్యూజిలాండ్ లక్ష్యాన్ని డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 44 ఓవర్లలో 325 పరుగులుగా నిర్ణయించారు. కివీస్ 44 ఓవర్లలో 8 వికెట్లకు 271 పరుగులు చేసింది. బ్రూక్ హ్యాలిడే (84 బంతుల్లో 81; 9 ఫోర్లు, 1 సిక్స్), ఇసబెల్లా గేజ్ (51 బంతుల్లో 65 నాటౌట్; 10 ఫోర్లు) రాణించారు. ఆదివారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో భారత్ తలపడుతుంది. నేడు కొలంబోలో జరిగే నామమాత్రమైన మ్యాచ్లో పాకిస్తాన్తో శ్రీలంక తలపడుతుంది. రికార్డు భాగస్వామ్యం... ప్రతీక, స్మృతి జాగ్రత్తగా ఇన్నింగ్స్ను మొదలుపెట్టడంతో తొలి 2 ఓవర్లు మెయిడిన్గా ముగియగా, 10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 40/0కు చేరింది. ఆ తర్వాత బ్యాటర్లు నిలదొక్కుకొని పరుగులు రాబట్టడంతో తర్వాతి 46 బంతుల్లో 60 పరుగులు రాబట్టిన భారత్ 100 పరుగుల మార్క్ను అందుకుంది. ఇదే క్రమంలో ముందుగా స్మృతి 49 బంతుల్లో, ప్రతీక 75 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. సగం ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ 147/0 వద్ద నిలిచింది. 77 పరుగుల వద్ద స్మృతికి అదృష్టం కలిసొచ్చింది. అమేలియా బౌలింగ్లో షాట్కు ప్రయత్నించగా బంతి ప్యాడ్కు తగలడంతో బౌలర్ అప్పీల్ చేసింది. వెంటనే అంపైర్ అవుట్గా ప్రకటించడంతో స్మృతి రివ్యూ కోరింది. రీప్లేలో ముందుగా బంతి గమనాన్ని చూపించారు. అందులో బంతి స్టంప్స్ను తాకుతున్నట్లు అర్థం కావడంతో స్మృతి పెవిలియన్ వైపు సాగిపోయింది. అయితే ఆ తర్వాత అల్ట్రా ఎడ్జ్లో బంతి బ్యాట్కు తగిలినట్లు రేఖ కనిపించడంతో ఆమె వెనక్కి వచ్చింది. కొద్ది సేపటికి 88 బంతుల్లో స్మృతి శతకం పూర్తి చేసుకుంది. ఎట్టకేలకు 34వ ఓవర్లో తొలి వికెట్ (స్మృతి) తీయడంలో కివీస్ సఫలమైంది. 122 బంతుల్లో ప్రతీక సెంచరీ పూర్తి కాగా, మూడో స్థానంలో వచ్చిన జెమీమా ఆరంభంనుంచే దూకుడును ప్రదర్శించింది. కార్స్ ఓవర్లో మూడు ఫోర్లు బాది 38 బంతుల్లోనే హాఫ్సెంచరీ చేసింది. బ్యాటింగ్ వైఫల్యం... భారీ లక్ష్య ఛేదనలో కివీస్ ఆరంభం నుంచే తడబడింది. ఓపెనర్ సుజీ బేట్స్ (1) తన వైఫల్యం కొనసాగించగా...ప్లిమ్మర్ (30; 5 ఫోర్లు, 1 సిక్స్), అమేలియా కెర్ (45; 4 ఫోర్లు) కొద్దిగా ప్రతిఘటించారు. టోర్నీలో జట్టు బెస్ట్ బ్యాటర్, కెప్టెన్ సోఫీ డివైన్ (6)ను రేణుక చక్కటి బంతితో బౌల్డ్ చేయడంతోనే భారత్కు పట్టు చిక్కింది.59 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకొని ఒకవైపు నుంచి హ్యాలిడే పోరాడుతున్నా...మరో వైపు వరుసగా వికెట్లు తీసి భారత్ ఒత్తిడి పెంచింది. చివర్లో ఇసబెల్లా కూడా ప్రయత్నించినా, చేయాల్సిన రన్రేట్ పెరిగిపోవడంతో కివీస్ ఓటమి దిశగా పయనించింది. 340 వన్డే వరల్డ్కప్లో భారత్ అత్యధిక స్కోరు. ఇదే టోర్నీలో ఆసీస్పై సాధించిన 330 పరుగుల స్కోరును జట్టు అధిగమించింది. 212 స్మృతి, ప్రతీక జోడించిన పరుగులు. వరల్డ్ కప్లో ఏ వికెట్కైనా భారత్కు ఇదే అత్యధిక భాగస్వామ్యం.14 స్మృతి వన్డే కెరీర్లో ఇది 14వ సెంచరీ. అత్యధిక సెంచరీల జాబితాలో మెగ్ లానింగ్ (15) తర్వాత రెండో స్థానంలో నిలిచింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ప్రతీక (సి) (సబ్) రోవ్ (బి) అమేలియా 122; స్మృతి (సి) (సబ్) రోవ్ (బి) బేట్స్ 109; జెమీమా (నాటౌట్) 76; హర్మన్ప్రీత్ (సి) కార్సన్ (బి) రోజ్మేరీ 10; రిచా (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 19; మొత్తం (49 ఓవర్లలో 3 వికెట్లకు) 340. వికెట్ల పతనం: 1–212, 2–288, 3–336. బౌలింగ్: రోజ్మేరీ 8–1–52–1, జెస్ కెర్ 8–1–51–0, డివైన్ 6–0–34–0, కార్సన్ 6–0–46–0, తహుహు 4–0–37–0, అమేలియా కెర్ 10–0–69–1, బేట్స్ 7–0–40–1. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: బేట్స్ (సి) ప్రతీక (బి) క్రాంతి 1; ప్లిమ్మర్ (బి) రేణుక 30; అమేలియా కెర్ (సి) స్మృతి (బి) స్నేహ్ 45; డివైన్ (బి) రేణుక 6; హ్యాలిడే (సి) స్నేహ్ (బి) చరణి 81; గ్రీన్ (సి) క్రాంతి (బి) ప్రతీక 18; ఇసబెల్లా (నాటౌట్) 65; జెస్ కెర్ (సి) స్మృతి (బి) క్రాంతి 18; రోజ్మేరీ (సి) స్మృతి (బి) దీప్తి 1; ఎక్స్ట్రాలు 6; మొత్తం (44 ఓవర్లలో 8 వికెట్లకు) 271. వికెట్ల పతనం: 1–1, 2–51, 3–59, 4–115, 5–154, 6–226, 7–266, 8–271. బౌలింగ్: రేణుక 6–0–25–2, క్రాంతి గౌడ్ 9–0–48–2, స్నేహ్ రాణా 8–0–60–1, శ్రీచరణి 9–0–58–1, దీప్తి శర్మ 8–0–57–1, ప్రతీక 4–0–19–1. -
ఓపెనర్ల శతకాలు.. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్
మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) సెమీస్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా (Team India) భారీ స్కోర్ చేసింది. నవీ ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్లు స్మృతి మంధన (Smriti Mandhana) (95 బంతుల్లో 109; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), ప్రతిక రావల్ (Pratika Rawal) (134 బంతుల్లో 122; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర శతకాలతో చెలరేగిపోయారు.వన్డౌన్లో వచ్చిన జెమీమా రోడ్రిగెజ్ (55 బంతుల్లో 76 నాటౌట్; 11 ఫోర్లు) కూడా సునామీ ఇన్నింగ్స్ ఆడింది. ఫలితంగా వర్షం కారణంగా 49 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో భారత్ 3 వికెట్ల నష్టానికి 340 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్లో హర్మన్ప్రీత్ కౌర్ 10, రిచా ఘోష్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో రోస్మేరీ మైర్, అమేలియా కెర్, సూజీ బేట్స్కు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలవాలంటే డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 44 ఓవర్లలో 325 పరుగులు చేయాలి.కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో మొదటి మూడు సెమీస్ బెర్త్లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. నాలుగో సెమీస్ బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి. మరోపక్క బంగ్లాదేశ్, పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.చదవండి: గర్జించిన బంగ్లాదేశ్ పులులు.. బిత్తరపోయిన మాజీ ఛాంపియన్లు -
తప్పక గెలవాల్సిన మ్యాచ్లో స్మృతి మంధన సూపర్ సెంచరీ
మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) సెమీస్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) సూపర్ సెంచరీతో కదంతొక్కింది. నవీ ముంబై వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (అక్టోబర్ 23) జరుగుతున్న మ్యాచ్లో 88 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసింది. మంధనకు ఈ ఏడాది ఇది ఐదో శతకం. ఓవరాల్గా వన్డేల్లో 14వ శతకం. ప్రస్తుత ప్రపంచకప్లో తొలి మ్యాచ్ల్లో నిరాశపరిచిన మంధన.. గత రెండు మ్యాచ్లుగా సత్తా చాటుతూ వస్తుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్తో జరిగిన చివరి రెండు మ్యాచ్ల్లో బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలతో మెరిసింది. వాస్తవానికి ఆ రెండు అర్ద సెంచరీలు కూడా సెంచరీల్లోకి మారాల్సింది. అయితే అవి తృటిలో చేజారాయి.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన టీమిండియా.. ఆది నుంచి నిలకడగా ఆడింది. ఓపెనర్లు మంధన, ప్రతీక రావల్ (77) సంయమనంతో బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్ను నిర్మించారు. అర్ద సెంచరీ తర్వాత మంధన గేర్ మార్చగా.. ప్రతీక రావల్ అదే టెంపోలో బ్యాటింగ్ చేస్తుంది. 31 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ వికెట్ నష్టపోకుండా 192 పరుగులుగా ఉంది. మంధన 100, ప్రతీక రావల్ 77 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో మొదటి మూడు సెమీస్ బెర్త్లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. నాలుగో సెమీస్ బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సెమీస్కు అర్హత సాధిస్తుంది. మరోపక్క బంగ్లాదేశ్, పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. చదవండి: IND vs AUS: టీమిండియాపై ఆసీస్ గెలుపు.. సిరీస్ కైవసం -
అది నేను ఎప్పటికీ మర్చిపోలేను: గంభీర్
గౌతమ్ గంభీర్.. టీమిండియా హెడ్కోచ్గా వైట్ బాల్ క్రికెట్లో విజయవంతమైనప్పటికి.. సంప్రాదాయ ఫార్మాట్లో ఇంకా తన మార్క్ చూపించలేదు. టీ20 వరల్డ్కప్-2024 విజయం రాహుల్ ద్రవిడ్ వారుసుడిగా బాధ్యతలు చేపట్టిన గంభీర్కు ఆరంభంలోనే ఘోర పరాభావం ఎదురైంది.సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో భారత్ వైట్ వాష్కు గురైంది. 1933లో టీమిండియా స్వదేశంలో తమ తొలి టెస్టు మ్యాచ్ ఆడినప్పటి నుంచి మూడు లేదా అంతకంటే ఎక్కువ టెస్టులు ఉన్న సిరీస్లో వైట్ వాష్ అవ్వడం ఇదే తొలిసారి.ఈ ఘోర ఆ ప్రతిష్టను భారత జట్టు గంభీర్ కోచింగ్లో మూటకట్టుకోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ట్రోఫీలోనూ టీమిండియా దారుణ ప్రదర్శన కనబరిచింది. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 3-1 తేడాతో భారత్ కోల్పోయింది.దీంతో గంభీర్ను కోచ్ పదవి నుంచి తప్పించాలని చాలా మంది మాజీలు సూచించారు. అయితే ఆ తర్వాత భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సమం చేయడంతో గంభీర్ను విమర్శించే వాళ్ల సంఖ్య కాస్త తగ్గింది. ఇటీవలే ఆసియాకప్ను కూడా భారత్ సొంతం చేసుకుంది.ప్రస్తుతం టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్తో తలపడుతోంది. ఇప్పటికే తొలి టెస్టులో విజయం సాధించిన గిల్ సేన.. ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ విజయం దిశగా సాగుతోంది. అయితే రెండో రోజు ఆట సందర్భంగా గౌతమ్ గంభీర్ అధికారిక బ్రాడ్క్రాస్టర్ స్టార్ స్పోర్ట్స్కు గౌతీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా కివీస్ సిరీస్ వైట్వాష్ కావడంపై అతడు స్పందించాడు."న్యూజిలాండ్తో సిరీస్ను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ ఓటమిని మా బాయ్స్కు ఇప్పటికి గుర్తు చేస్తూనే ఉంటాను. ఎందుకంటే కొన్నిసార్లు గతాన్ని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఏ జట్టును కూడా తేలికగా తీసుకూడదని నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను. న్యూజిలాండ్ను ఈజీగా ఓడించగలమని అందరూ అనుకున్నారు.కానీ ఊహించని ఫలితం మాకు ఎదురైంది. నేను కోచ్గా ఉన్న లేకపోయినా న్యూజిలాండ్పై ఓటమిని డ్రెస్సింగ్ రూమ్ ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది. ఆ అనుభవం భవిష్యత్తులో జట్టుకు ఎంగతగానో ఉపయోగపడుతోంది" అని గంభీర్ పేర్కొన్నాడు. -
న్యూజిలాండ్కు షాకిచ్చిన టీమిండియా
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్ 2025 వార్మప్ మ్యాచ్లు (ICC Women's World Cup 2025 Warm up Matches) ఇవాల్టి నుంచి (సెప్టెంబర్ 25) ప్రారంభమయ్యాయి. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మరియు కొలొంబోలోని వేర్వేరు మైదానాల్లో ఈ మ్యాచ్లు జరుగుతున్నాయి.తొలి మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్-ఏ (India A vs New zealand) 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. ఇసబెల్లా గేజ్ (101) అజేయ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది.అనంతరం భారత్ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా వర్షం ప్రారంభమైంది. దీంతో డక్వర్త్ లూయిస్ పద్దతిన టార్గెట్ను 40 ఓవర్లలో 224 పరుగులుగా నిర్దేశించారు. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికే భారత్ టార్గెట్ను రీచ్ అయ్యింది (39.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది). దీంతో భారత్ను విజేతగా ప్రకటించారు.121 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన టీమిండియాను కెప్టెన్ మిన్నూ మణి (39 నాటౌట్), మమత మడివాలా (56 నాటౌట్) ఆదుకున్నారు. అంతకుముందు షఫాలీ వర్మ (49 బంతుల్లో 70) విధ్వంసకర అర్ద శతకంతో ఆకట్టుకుంది.బెంగళూరులోనే జరుగుతున్న మరో మ్యాచ్లో భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా 36 ఓవర్ల అనంతరం 3 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (89), ఎమ్మా లాంబ్ (45) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో రేణుకా ఠాకూర్, అరుంధతి రెడ్డి తలో వికెట్ తీశారు.కొలొంబోలో జరుగుతున్న మరో రెండు మ్యాచ్ల్లో సౌతాఫ్రికా-బంగ్లాదేశ్, శ్రీలంక-పాకిస్తాన్ తలపడుతున్నాయి. ఈ రెండు మ్యాచ్లు వర్షం కారణంగా ఆగిపోయాయి. చదవండి: IND VS AUS: కేఎల్ రాహుల్కు గాయం.. సెంచరీ దిశగా సాగుతుండగా..! -
భారత పర్యటనకు న్యూజిలాండ్ క్రికెట్ జట్టు.. ఎప్పుడంటే?
న్యూజిలాండ్ పురుషుల క్రికెట్ జట్టు వచ్చే ఏడాది జనవరిలో భారత పర్యటనకు రానునున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్-2026 సన్నహాకాల్లో భాగంగా ఈ టూర్ను కివీస్ క్రికెట్ బోర్డు ప్లాన్ చేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. టైమ్స్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. ఈ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ జట్టు ఆతిథ్య టీమిండియాతో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనున్నట్లు సమాచారం.ఈ ఏడాది ఆఖరిలో కివీస్ తమ స్వదేశంలో విండీస్తో ఆల్ఫార్మాట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే బ్లాక్ క్యాప్స్ జట్టు భారత్కు వచ్చే అవకాశముంది. కాగా టీ20 ప్రపంచకప్-2026కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ టోర్నీ సన్నాహాల్లో భాగంగా సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు సైతం ఈ ఏడాది ఆఖరిలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లు ఆడనుంది. న్యూజిలాండ్ చివరగా వైట్బాల్ సిరీస్లు ఆడేందుకు 2023లో భారత్ పర్యటనకు వచ్చింది. ఆ సమయంలో బ్లాక్ క్యాప్స్ టీమ్ మూడు వన్డేల సిరీస్లో వైట్ వాష్ కాగా.. టీ20 సిరీస్ను 2-1 తేడాతో భారత్కు కోల్పోయింది.ఆ తర్వాత ఏడాది మాత్రం టీమిండియా జరిగిన రెడ్బాల్ సిరీస్లో మాత్రం న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంది. మూడు టెస్టుల సిరీస్లో 3-0 తేడాతో టీమిండియాను కివీస్ చిత్తు చేసింది. అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో మాత్రం న్యూజిలాండ్ను భారత్ మట్టికరిపించింది.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో తొలి టెస్టు.. భారత తుది జట్టు ఇదే! జడేజాకు నో ఛాన్స్? -
CT 2025: టీమిండియాకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ
టీమిండియాపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కాసుల వర్షం కురిపించింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో విజేతగా నిలిచినందుకు భారీ క్యాష్ రివార్డు ప్రకటించింది. ఈ మెగా వన్డే టోర్నీలో ఐదింటికి ఐదు మ్యాచ్లు గెలిచి అజేయంగా చాంపియన్గా నిలిచిన రోహిత్ సేనకు రూ. 58 కోట్ల నజరానా ఇచ్చింది. రోహిత్ సేన జైత్రయాత్రను ప్రస్తావిస్తూఈ మొత్తాన్ని ఆటగాళ్లు, కోచ్లు, సహాయక సిబ్బంది.. అదే విధంగా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సభ్యులకు బీసీసీఐ పంచనుంది. ఇందుకు సంబంధించి బోర్డు గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు.. ‘‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమిండియాకు రూ. 58 కోట్ల క్యాష్ రివార్డు ప్రకటిస్తున్నాం.మెన్స్ సెలక్షన్ కమిటీ సభ్యులతో పాటు ఆటగాళ్లు, కోచ్లు, సహాయక సిబ్బంది పనితీరును గుర్తిస్తూ వారిని ఇలా సత్కరిస్తున్నాం’’ అని పేర్కొంది. అదే విధంగా.. ‘‘కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా టోర్నీ ఆసాంతం ఆధిపత్యం కనబరిచింది. ఓటమన్నదే ఎరుగక నాలుగు విజయాలతో ఫైనల్ చేరింది.తొలుత బంగ్లాదేశ్పై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా.. ఆ తర్వాత పాకిస్తాన్పై కూడా ఆరు వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. అదే జోరును కొనసాగిస్తూ న్యూజిలాండ్పై 44 పరుగుల తేడాతో గెలిచి గ్రూప్ టాపర్ అయ్యింది. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ చేరుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించింది’’ అని బీసీసీఐ తమ ప్రకటనలో రోహిత్ సేన జైత్రయాత్రను ప్రస్తావించింది.అందుకే ఈ నగదు బహుమతిఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ మాట్లాడుతూ.. ‘‘వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు సాధించడం ఎంతో ప్రత్యేకమైనది. భారత జట్టు అంకిత భావం, ప్రపంచ వేదికపై దేశానికి వారు తెచ్చి పెట్టిన కీర్తి ప్రతిష్టలకు గుర్తింపుగా నగదు బహుమతి అందజేస్తున్నాం.ఈ గెలుపునకు కారణమైన ప్రతి ఒక్కరి సేవలను మేము గుర్తించాం. భారత్కు ఈ ఏడాది ఇది రెండో ఐసీసీ ట్రోఫీ. అండర్-19 వుమెన్స్ వరల్డ్కప్లో మనం చాంపియన్లుగా నిలిచాం. ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని కూడా సొంతం చేసుకున్నాం.దేశంలో క్రికెటింగ్ ఎకోసిస్టమ్ ఎంత పటిష్టంగా ఉందో చెప్పేందుకు ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు’’ అని హర్షం వ్యక్తం చేశాడు. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్-2024 సాధించిన రోహిత్ సేన.. ఆ టోర్నీలోనూ అన్ని మ్యాచ్లలో అజేయంగా నిలిచింది. నాడు బీసీసీఐ రోహిత్ సేనకు ఏకంగా రూ. 125 కోట్ల నజరానా ప్రకటించింది.ఎనిమిది జట్ల మధ్య పోటీతాజాగా చాంపియన్స్ ట్రోఫీలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయగా.. ఈసారి రూ. 58 కోట్ల బహుమతి ఇచ్చింది. ఇది ఐసీసీ ఇచ్చిన ప్రైజ్ మనీ (భారత కరెన్సీలో దాదాపు రూ. రూ.19.5 కోట్లు) కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఇక ఈ మెగా ఈవెంట్కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వగా.. భారత జట్టు మాత్రం తటస్థ వేదికైన దుబాయ్లోనే తమ మ్యాచ్లన్నీ ఆడింది. ఈ టోర్నీలో భారత్తో పాటు గ్రూప్-ఎ నుంచి పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీపడ్డాయి.తొలి సెమీస్లో భారత్ ఆస్ట్రేలియాను ఓడించగా.. రెండో సెమీస్లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్ చిత్తు చేసింది. ఈ క్రమంలో టీమిండియా- న్యూజిలాండ్ మధ్య మార్చి 9న జరిగిన టైటిల్ పోరులో రోహిత్ సేన నాలుగు వికెట్ల తేడాతో కివీస్ను ఓడించింది. ఈ మ్యాచ్లో అద్భుత అర్ధ శతకం(76) బాదిన కెప్టెన్ రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.చదవండి: ‘రేపు మీ బౌలింగ్ను చితక్కొడతాను చూడు!.. అన్నంత పని చేశాడు’ -
ఎవరూ ఊహించని నిర్ణయం.. రోహిత్ వ్యూహం భేష్: పాక్ దిగ్గజం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)పై పాకిస్తాన్ మాజీ సారథి వకార్ యూనిస్ ప్రశంసలు కురిపించాడు. న్యూజిలాండ్తో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో హిట్మ్యాన్ అనుసరించిన వ్యూహాలు అమోఘమని కొనియాడాడు. కీలక మ్యాచ్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని జట్టును విజేతగా నిలిపాడని ప్రశంసించాడు. కాగా ఫిబ్రవరి 19న మొదలైన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) మార్చి 9న ముగిసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చిన ఈ వన్డే టోర్నమెంట్లో.. టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్లో తమ మ్యాచ్లు ఆడింది. అజేయ చాంపియన్గాగ్రూప్ దశలో మూడింటికి మూడు (బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్) గెలిచిన రోహిత్ సేన.. సెమీస్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఇక ఫైనల్లో కివీస్ (India vs New Zealand)ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని ముద్దాడింది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ మాట్లాడుతూ.. కుల్దీప్ యాదవ్ను ముందుగా బౌలింగ్కు పంపడమే మ్యాచ్కు టర్నింగ్ అని అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మను తప్పక అభినందించాలన్నాడు. ఈ మేరకు ఓ యూట్యూబ్ చానెల్తో మాట్లాడుతూ.. ‘‘కుల్దీప్ను ముందుగా పంపడమే ఈ మ్యాచ్లో కీలకంగా మారింది.ఎవరూ ఊహించని నిర్ణయంరోహిత్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ప్రత్యర్థి జట్టు అస్సలు ఊహించి ఉండదు. సాధారణంగా కుల్దీప్ యాదవ్ 20- 25 ఓవర్ల తర్వాతే బౌలింగ్కి వస్తాడు. కాబట్టి న్యూజిలాండ్కు ఇది కచ్చితంగా ఆశ్చర్యం కలిగించే విషయమే.కుల్దీప్ ఇంత ముందుగా వస్తాడని కివీస్ ఓపెనర్లు అస్సలు ఊహించి ఉండరు. అక్షర్ లేదా జడేజా వస్తారని వాళ్లు అనుకుని ఉంటారు. అయితే, ఇక్కడే రోహిత్ శర్మ తన మార్కు చూపించాడు. అద్భుతమైన వ్యూహంతో అనుకున్న ఫలితాన్ని రాబట్టాడు’’ అని వకార్ యూనిస్ కొనియాడాడు.అతడి రాకతో కివీస్ కుదేలుకాగా కివీస్తో ఫైనల్లో రోహిత్ శర్మ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను పదకొండో ఓవర్లోనే బరిలోకి దించాడు. తన తొలి ఓవర్లోనే ప్రమాదకర ఓపెనర్ రచిన్ రవీంద్ర(37)ను బౌల్డ్ చేసిన కుల్దీప్.. పదమూడో ఓవర్లో కేన్ విలియమ్సన్(11) రూపంలో మరో కీలక వికెట్ పడగొట్టాడు. దీంతో భారత్కు శుభారంభం లభించింది. ఈ మ్యాచ్లో ఉత్తమంగా (10-0-40-2) రాణించిన కుల్దీప్ యాదవ్ జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. కాగా దుబాయ్ వేదికగా న్యూజిలాండ్తో టైటిల్ పోరులో టాస్ ఓడిన ఇండియా తొలుత బౌలింగ్ చేసింది. డారిల్ మిచెల్(63), మైఖేల్ బ్రాస్వెల్(53 నాటౌట్) అర్ధ శతకాల కారణంగా.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకున్నాడు. పేసర్ మహ్మద్ షమీ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక లక్ష్య ఛేదనలో కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ(76) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. శ్రేయస్ అయ్యర్(48), కేఎల్ రాహుల్(34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9) రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు. చదవండి: CT 2025: ఒకే వేదికపై ఆడటం అదనపు ప్రయోజనమే.. విమర్శలతో ఏకీభవిస్తా: స్టార్క్ -
టీమిండియాకు అదనపు ప్రయోజనం.. ఆ విమర్శలతో ఏకీభవిస్తా: స్టార్క్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో టీమిండియా ఒకే వేదికపై ఆడటంపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు మైకేల్ వాన్, మైకేల్ ఆథర్టన్ తదితరులు భారత జట్టుకు అదనపు ప్రయోజనాలు చేకూరాయని వ్యాఖ్యానించారు. ‘హోం అడ్వాంటేజ్’మరోవైపు.. రెండో సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో సౌతాఫ్రికా ఓటమి తర్వాత ప్రొటిస్ స్టార్ డేవిడ్ మిల్లర్ (David Miller) కూడా ఇదే మాట అన్నాడు. ఈ సందర్భంగా తాను ఫైనల్లో న్యూజిలాండ్కే మద్దతు ఇస్తానని కూడా మిల్లర్ పేర్కొన్నాడు. తాజాగా.. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా ‘హోం అడ్వాంటేజ్’పై స్పందించాడు. మిగతా జట్లతో పోలిస్తే రోహిత్ సేనకు కొంతమేర లాభం చేకూరిందని.. ఒకే వేదికపై ఆడటం వల్ల టీమిండియాకు మేలు జరిగిందన్న వాదనలతో తాను ఏకీభవిస్తానని తెలిపాడు. న్యాయంగానే గెలిచారుఅదే సమయంలో.. భారత జట్టు ఈ టోర్నీలో ఎలాంటి మోసానికీ పాల్పడలేదని.. న్యాయంగానే వాళ్లు గెలిచారని స్టార్క్ వ్యాఖ్యానించడం విశేషం. ‘‘ఒకే స్టేడియంలో తమ మ్యాచ్లన్నీ ఆడటం వల్ల కలిగే లాభాల గురించి రోజూ చర్చ జరుగుతూ ఉంది. అయితే, ఇండియా మాత్రం దుబాయ్ తమకు తటస్థ వేదిక అని వాదించేందుకు అన్ని మార్గాలను ఉపయోగించుకుంటోంది.ఏదేమైనా టీమిండియా నిజాయితీగా ఈ టోర్నీలో గెలిచింది. ఎందుకంటే.. మూడు ఫార్మాట్లలోనూ సుదీర్ఘకాలంగా వాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. అయితే, ఈ టోర్నీ విషయంలో వాళ్లపై వస్తున విమర్శలు సబబే అనిపిస్తోంది. సెమీ ఫైనల్ ఆడేందుకు న్యూజిలాండ్ పాకిస్తాన్కు వెళ్లింది.ఆ తర్వాత వెంటనే ఫైనల్ కోసం దుబాయ్కు వచ్చింది. పాకిస్తాన్ ఆతిథ్య దేశమే అయినప్పటికీ వాళ్లూ టీమిండియాతో ఆడేందుకు దుబాయ్కు రావాల్సి వచ్చింది. డేవిడ్ మిల్లర్ కూడా ఈ విషయంపై మాట్లాడాడు. అప్పటికప్పుడు విమాన ప్రయాణం చేయడం సులువు కాదని.. తమకు కలిగిన అసౌకర్యం గురించి చెప్పాడు.ఆ విమర్శలతో ఏకీభవిస్తాఏదేమైనా ఒక జట్టు ఎలాంటి ప్రయాణాలు లేకుండా.. ఒకే చోట ఉండి ఆడటం వల్ల కచ్చితంగా లాభపడుతుంది. కాబట్టి.. నేను ఈ విషయంలో టీమిండియాపై వ్యక్తమవుతున్న అభిప్రాయాలతో కచ్చితంగా ఏకీభవిస్తా’’ అని స్టార్క్ ఫెంటాస్టిక్స్టీవీతో పేర్కొన్నాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025కి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వగా.. బీసీసీఐ మాత్రం భారత జట్టును అక్కడకు పంపేందుకు నిరాకరించింది.భద్రతా కారణాల వల్ల తమకు తటస్థ వేదికపై ఆడే అవకాశం ఇవ్వాలని ఐసీసీని కోరగా.. ఇందుకు సమ్మతి లభించింది. ఈ నేపథ్యంలో దుబాయ్లోనే రోహిత్ సేన తమ మ్యాచ్లన్నీ ఆడింది. అయితే, టీమిండియాతో మ్యాచ్ల కోసం ఇతర జట్లు దుబాయ్- పాకిస్తాన్ మధ్య ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. ఇక ఈ వన్డే టోర్నమెంట్లో భారత్ గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్లను చిత్తు చేసింది.సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించిన టీమిండియా.. ఫైనల్లో న్యూజిలాండ్పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. చాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా అవతరించింది. ఇక ఈ టోర్నీలో భారత్ ఆడిన ఐదు మ్యాచ్లలోనూ విజయం సాధించడం విశేషం.ఆ సత్తా భారత్కు మాత్రమే ఉందిఈ నేపథ్యంలో స్టార్క్ టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు. భారత్లో ప్రతిభావంతులైన క్రికెటర్లు చాలా మంది ఉన్నారని, రిజర్వ్ పూల్ సత్తా అసాధారణమని ప్రశంసించాడు. ఒకేరోజు టీ20, వన్డే, టెస్టు మ్యాచ్లను ఆడే సత్తా భారత్కే ఉందని చెప్పాడు. ‘మూడు వేర్వేరు ఫార్మాట్లలో మూడు జట్లను ఒకేరోజు మైదానంలో దింపగలిగే సామర్థ్యం ప్రపంచ క్రికెట్లో ఒక్క భారత దేశానికి మాత్రమే ఉంది.ఆసీస్తో టెస్టు, ఇంగ్లండ్తో వన్డే, దక్షిణాఫ్రికాతో టీ20 ఆడగలదు. ఇదేదో ఆషామాషీగా కాదు! అంతర్జాతీయ క్రికెట్ పోటీకి ఏమాత్రం తగ్గకుండా మూడు టీమిండియా జట్లు ఆడగలవు. ఈ సామర్థ్యం, సత్తా మరే దేశానికి లేదు’ అని స్టార్క్ పేర్కొన్నాడు. ప్రపంచ లీగ్ క్రికెట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అగ్రగామిగా వెలుగొందడం వల్లే ఇంతటి అనుకూలతలు వచ్చాయా అన్న ప్రశ్నకు స్టార్క్ ఆసక్తికర సమాధానమిచ్చాడు.కేవలం ఐపీఎల్ వల్ల కాదు..ఇండియన్ ప్రీమియర్ ‘ఒక్క ఐపీఎల్ వల్లే ఈ సానుకూలతలని నేననుకోను. మేమంతా (క్రికెటర్లందరూ) కూడా ప్రపంచ వ్యాప్తంగా ఫ్రాంచైజీ లీగ్లు ఆడుతున్నాం. కానీ భారత క్రికెటర్లు మాత్రం ఒక్క ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న సంగతి మరవొద్దు. ఇక్కడ చూడాల్సింది అనుకూలతలు కావు. రిజర్వ్ బెంచ్ సత్తా. భారత క్రికెట్లో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ ఆడే బలగం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది.రోజు రోజుకీ పోటీ క్రికెటర్లు దీటుగా తయారవుతున్నారు. ఐపీఎల్ ఒక పెద్ద టోర్నీ. కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు. కానీ అంతకుమించిన ప్రతిభ కూడా ఉంది. అదే భారత క్రికెట్ బలగం అవుతోంది’ అని చెప్పాడు. మిగతా క్రికెటర్లు ఏడాదికి ఐదారు లీగ్లు ఆడుతున్నారని, మరి వారి దేశాల్లోనూ, ఆయా దేశాల్లోనూ లీగ్లు జరుగుతున్నప్పటికీ ఒక్క ఐపీఎల్కు పరిమితమైన దేశంలోనే పెద్ద సంఖ్యలో క్రికెటర్లు వెలుగులోకి రావడం గొప్ప విశేషమని స్టార్క్ వివరించాడు.చదవండి: BGT: ‘నేను జట్టులో ఉంటే కచ్చితంగా గెలిచేవాళ్లం.. ఇంగ్లండ్తో సిరీస్కు రెడీ’ -
CT 2025: రికార్డులు బద్దలు.. సరికొత్త చరిత్ర! ఏకంగా 11 వేల కోట్లకు పైగా..
భారత్లో క్రికెట్ ఓ ‘మతం’ లాంటిది.. వేదిక ఏదైనా టీమిండియా ఆడుతోందంటే అందరూ టీవీలకు అతుక్కుపోవాల్సిందే. ఆ వెసలుబాటు లేని వాళ్లకు డిజిటల్ మీడియా రూపంలో ప్రత్యామ్నాయం ఉండనే ఉంది. ఇక ఇటీవల జరిగిన మెగా ఐసీసీ ఈవెంట్ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) జియోహాట్స్టార్(JioHotstar)లో ప్రత్యక్ష ప్రసారం అయిన విషయం తెలిసిందే.11 వేల కోట్ల నిమిషాలకు పైగాఈ నేపథ్యంలో తాజాగా ఈ టోర్నమెంట్ వ్యూయర్షిప్నకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఈ వన్డే టోర్నీకి 540.3 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక వాచ్ టైమ్ ఏకంగా 11 వేల కోట్ల నిమిషాలకు పైగా నమోదు కావడం విశేషం. అంతేకాదు.. ఓవరాల్గా 6.2 కోట్ల మంది వ్యూయర్స్ ఈ మెగా ఈవెంట్ను వీక్షించినట్లు బ్రాడ్కాస్టర్ వెల్లడించింది.కాగా 2017లో చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించారు. నాటి ఫైనల్లో టీమిండియాపై గెలిచి పాకిస్తాన్ టైటిల్ సొంతం చేసుకుంది. అయితే, అప్పటి నుంచి సుదీర్ఘకాలం పాటు ఈ టోర్నీని వాయిదా వేశారు. ఈ క్రమంలో 2025లో తిరిగి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించేందుకు సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్(Pakistan) ఆతిథ్య హక్కులు దక్కించుకోగా.. టీమిండియా మాత్రం భద్రతా కారణాల వల్ల దుబాయ్లో తమ మ్యాచ్లు ఆడింది.కాగా పాకిస్తాన్లో 1996 తర్వాత ఓ ఐసీసీ టోర్నీ జరగడం ఇదే తొలిసారి. ఇక ఫిబ్రవరి 19న పాకిస్తాన్లో మొదలైన ఈ వన్డే ఈవెంట్ మార్చి 9న భారత్- న్యూజిలాండ్ మధ్య దుబాయ్ వేదికగా ఫైనల్తో ముగిసింది. హిట్మ్యాన్ ఖాతాలో రెండో ఐసీసీ టైటిల్ఇక ఈ టోర్నమెంట్లో రోహిత్ సేన ఆది నుంచి ఆఖరి వరకు అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్... సెమీస్లో ఆస్ట్రేలియాను, ఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తు చేసింది.తద్వారా హిట్మ్యాన్ ఖాతాలో రెండో ఐసీసీ టైటిల్ చేరింది. మరోవైపు.. ఈ వన్డే టోర్నీలో తొలిసారి అడుగుపెట్టిన అఫ్గనిస్తాన్ ఇంగ్లండ్ వంటి పటిష్ట జట్టును చిత్తు చేసి గెలుపు నమోదు చేయడం విశేషం. ఇక వన్డే వరల్డ్కప్-2023 విజేత ఆసీస్పై రన్నరప్ టీమిండియా ప్రతీకారం తీర్చుకోవడం కూడా హైలైట్గా నిలిచింది.ఇన్ని ప్రత్యేకతలు ఉన్న చాంపియన్స్ ట్రోఫీ-2025ని కోట్లాది మంది వీక్షించడంలో ఆశ్చర్యమేమీ లేకపోయినా.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 540 కోట్లకు పైగా వ్యూస్ రావడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్' 18 నెట్వర్క్లో టీవీలో ప్రసారాలు జరుగగా.. జియోహాట్స్టార్లోనూ ప్రత్యక్ష ప్రసారం చేశారు. అత్యధిక వ్యూస్ ఆ మ్యాచ్కేకాగా మిగతా మ్యాచ్లతో పోలిస్తే టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఫైనల్కు అత్యధిక వ్యూస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ పోరుకు ఏకంగా 124.2 కోట్ల వీక్షణలు వచ్చాయి.కాగా మొత్తంగా చాంపియన్స్ ట్రోఫీకి వచ్చిన వ్యూయర్షిప్లో ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, గోవా, పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి 38 శాతం మేర వ్యూస్ వచ్చినట్లు సమాచారం. ఇక వైఫై సాయంతో మ్యాచ్ వీక్షించిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందు ఉంది. కాగా 16 మాధ్యమాల్లో చాంపియన్స్ ట్రోఫీని ప్రసారం చేశారు. తొమ్మిది భాషల్లో కామెంట్రీ ఇచ్చారు.ఇక ఈ మెగా టోర్నీలో గెలవడం ద్వారా భారత్ ఖాతాలో ఏడో ఐసీసీ టైటిల్ చేరింది. 1983 వన్డే వరల్డ్కప్, 2002లో శ్రీలంకతో కలిసి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ, 2024 టీ20 ప్రపంచకప్, 2025 చాంపియన్స్ ట్రోఫీలను భారత్ గెలుచుకుంది. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పాల్గొన్నాయి. దుబాయ్తో పాటు కరాచీ, లాహోర్, రావల్పిండి ఇందుకు వేదికలు.చదవండి: IPL 2025: అతడి గురించి ఎవరూ మాట్లాడమే లేదు.. మూడో స్థానంలో ఆడిస్తారా? -
అతడు అద్భుతం.. కానీ ఆ విషయంలో అసంతృప్తి: భారత మాజీ బ్యాటర్
టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)పై భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కార్ ప్రశంసలు కురిపించాడు. ఈ ముంబైకర్ ఇప్పటికైనా తనలోని నైపుణ్యాలను గుర్తించాడని.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్లో అతడు బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతమని కొనియాడాడు.అయితే, న్యూజిలాండ్(India vs New Zealand)తో ఫైనల్లో శ్రేయస్ అయ్యర్ అవుటైన తీరు మాత్రం తనకు నచ్చలేదంటూ దిలీప్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అదే విధంగా.. కేఎల్ రాహుల్(KL Rahul) ఆట తీరును సైతం ఈ మాజీ బ్యాటర్ ప్రశంసించాడు. అంతేకాదు.. ఐదుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలన్న సెలక్టర్ల నిర్ణయం సరైందని నిరూపితమైందంటూ మేనేజ్మెంట్ వ్యూహాలను మెచ్చుకున్నాడు.కాగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ మార్చి 9న ముగిసిన విషయం తెలిసిందే. ఈ మెగా వన్డే టోర్నమెంట్కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వగా.. టీమిండియా మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా తమ మ్యాచ్లన్నీ దుబాయ్లోనే ఆడింది. న్యూజిలాండ్పై గెలుపొంది ట్రోఫీని ముద్దాడిఈ నేపథ్యంలో గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్లను చిత్తు చేసిన రోహిత్ సేన.. ఆఖరిగా న్యూజిలాండ్పై జయకేతనం ఎగురువేసింది. ఈ క్రమంలో గ్రూప్-ఎ టాపర్గా సెమీస్ చేరి.. అక్కడ ఆస్ట్రేలియాను ఓడించింది.ఈ క్రమంలో ఫైనల్లోనూ అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్పై గెలుపొంది ట్రోఫీని ముద్దాడింది. ఈ టోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్లలోనూ అజేయంగా నిలిచి చాంపియన్గా అవతరించింది. ఈ విజయాల్లో మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన శ్రేయస్ అయ్యర్ది కీలక పాత్ర. ఐదు ఇన్నింగ్స్లో కలిపి అతడు 243 పరుగులు చేసి.. భారత్ తరఫున టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.మరోవైపు.. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. తనకు అచ్చొచ్చిన ఐదో స్థానంలో కాకుండా ఆరో స్థానంలో ఆడాల్సి వచ్చింది. అక్షర్ పటేల్ కోసం తన నంబర్ను త్యాగం చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ అద్భుతంగా రాణించాడు. మొత్తంగా 140 పరుగులు చేసిన ఈ కర్ణాటక ఆటగాడు.. ముఖ్యంగా ఆసీస్తో సెమీస్లో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.అయ్యర్ అద్భుతంఈ నేపథ్యంలో దిలీప్ వెంగ్సర్కార్ మాట్లాడుతూ.. ‘‘అయ్యర్ అద్భుతంగా ఆడాడు. కానీ ఫైనల్లో అతడు అవుటైన విధానం నాకు అసంతృప్తిని మిగిల్చింది. తను ఆఖరి వరకు అజేయంగా నిలిచి విజయంతో ముగించి ఉంటే బాగుండేది. ఏదేమైనా ఇప్పటికైనా అతడు తన నైపుణ్యాలను గుర్తించి.. అందుకు న్యాయం చేసినందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నాడు.ఇక కేఎల్ రాహుల్ గురించి కూడా ప్రస్తావిస్తూ.. ‘‘ఆరో నంబర్లో వచ్చి కూడా కొన్ని ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయినా.. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ల కోసమని అక్షర్ పటేల్ను రాహుల్ స్థానమైన ఐదో నంబర్లో పంపడం నాకేమీ నచ్చలేదు’’ అని దిలీప్ వెంగ్సర్కార్ తెలిపాడు.సెలక్టర్లకు క్రెడిట్ ఇవ్వాలిఅదే విధంగా.. ‘‘టీమిండియా విజయంలో సెలక్టర్లకు తప్పకుండా క్రెడిట్ ఇవ్వాలి. ఆస్ట్రేలియా సిరీస్లో రోహిత్ శర్మ వైఫల్యం తర్వాత కూడా అతడిని కెప్టెన్గా కొనసాగించారు. అంతేకాదు.. చాంపియన్స్ ట్రోఫీలో ఐదుగురు స్పిన్నర్లను ఆడించాలన్న వారి నిర్ణయం కూడా సరైందని నిరూపితమైంది’’ అని దిలీప్ వెంగ్సర్కార్ బీసీసీఐ సెలక్షన్ కమిటీని ప్రశంసించాడు.కాగా చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత స్పిన్ దళంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలతో పాటు ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. వీరిలో సుందర్ ఒక్కడే పూర్తిస్థాయిలో బెంచ్కే పరిమితమయ్యాడు. ఇదిలా ఉంటే.. కివీస్తో ఫైనల్లో మిచెల్ సాంట్నర్ బౌలింగ్లో లాంగాన్ మీదుగా షాట్కు యత్నించి రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.చదవండి: అదే జరిగితే బుమ్రా కెరీర్ ముగిసినట్లే: కివీస్ మాజీ పేసర్ స్ట్రాంగ్ వార్నింగ్ -
ఛీ.. ‘డి’ జట్లను కూడా ఓడించలేకపోతున్నాం: పాక్ మాజీ క్రికెటర్ ఫైర్
పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్(Kamran Akmal) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. కనీసం ‘డి’ స్థాయి జట్లపై కూడా తమ ప్రధాన జట్టు గెలవలేకపోతోందని.. ఇంతకంటే అవమానం మరొకటి ఉండదని మండిపడ్డాడు. టీమిండియా, న్యూజిలాండ్ లాంటి జట్లను చూసి రిజ్వాన్ బృందం నేర్చుకోవాల్సింది చాలా ఉందని అభిప్రాయపడ్డాడు. ఒక్క విజయం లేకుండానేఇతర దేశాల్లో ప్రతిభ ఆధారంగా జట్లను ఎంపిక చేస్తే.. పాక్ క్రికెట్ బోర్డు మాత్రం ఇందుకు విరుద్ధమని కమ్రాన్ అక్మల్ విమర్శించాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో పాక్ జట్టు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ మెగా వన్డే టోర్నీకి ఆతిథ్యమిస్తూ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన పాకిస్తాన్.. కనీసం ఒక్క విజయం లేకుండానే వెనుదిరిగింది.గ్రూప్ దశలో న్యూజిలాండ్, టీమిండియా(Team India) చేతుల్లో ఓడిన రిజ్వాన్ బృందం.. ఆఖరిగా బంగ్లాదేశ్పై అయినా గెలవాలని ఉవ్విళ్లూరింది. అయితే, వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దు కావడంతో పాకిస్తాన్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. దీంతో గెలుపున్నదే లేకుండా నిష్క్రమించాల్సి వచ్చింది. దీంతో పాక్ మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.ఛీ.. ‘డి’ జట్లను కూడా ఓడించలేకపోతున్నాంఈ క్రమంలో మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ మాట్లాడుతూ... ‘‘మా దేశానికి వచ్చిన ‘డి’ స్థాయి(చిన్న జట్లను అన్న ఉద్దేశంలో) జట్లను కూడా పాకిస్తాన్ తమ పూర్తి స్థాయి జట్టుతో ఓడించలేకపోయింది. మన జట్టు బాగా ఆడి గెలిస్తేనే గౌరవం, మర్యాద ఉంటాయి’’ అని రిజ్వాన్ బృందం ఆట తీరుపై అసహనం వ్యక్తం చేశాడు.అదే విధంగా.. ‘‘టీమిండియా వరుసగా ఐసీసీ ఈవెంట్లు గెలుస్తోంది. న్యూజిలాండ్ కూడా అద్భుతంగా ఆడుతోంది. ఒక్క సిరీస్ ఓడిపోగానే ఆ జట్ల బోర్డులు మార్పులు చేసుకుంటూ వెళ్లవు. మరింత ఉత్సాహంతో తిరిగి పుంజుకునేలా స్ఫూర్తి నింపుతాయి. వాళ్లు మళ్లీ గెలుపుబాట పట్టేలా చేస్తాయి.కానీ మన పరిస్థితి వేరు. ఒక్కటి ఓడితే.. వరుసగా ఇక పరాజయాలే. చాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ విధానంలో నిర్వహించడం వల్ల మనకు ఎంత డబ్బు వచ్చిందనేదే మనకు ప్రధానం. కానీ ఆటలో గెలవాలి. గౌరవప్రదంగా ముందుకు వెళ్లాలని మాత్రం ఉండదు’’ అంటూ కమ్రాన్ అక్మల్ పాక్ బోర్డు తీరును కూడా తప్పుబట్టాడు.పాక్ క్రికెట్ ‘ఐసీయూ’లో ఉందిఇదిలా ఉంటే.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇటీవలి ప్రదర్శనపై ఆ జట్టు మాజీ ప్లేయర్ షాహిద్ అఫ్రిది కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తప్పుడు నిర్ణయాల వల్ల ప్రస్తుతం జట్టు పరిస్థితి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉందని అతను ఘాటుగా వ్యాఖ్యానించాడు. శస్త్రచికిత్స చేసి కోలుకునే పరిస్థితి నుంచి కూడా ఇప్పుడు చేయిదాటిపోయిందని అతను అన్నాడు. ముఖ్యంగా జట్టులో షాదాబ్ ఖాన్ ఎంపికను అతను తీవ్రంగా విమర్శించాడు.గత టీ20 వరల్డ్ కప్ తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన షాదాబ్ను న్యూజిలాండ్తో సిరీస్కు ఎంపిక చేయడంతో పాటు వైస్ కెప్టెన్గా కూడా నియమించారు. ‘ఏ ప్రాతిపదికన షాదాబ్ను మళ్లీ జట్టులోకి తీసుకున్నారు. దేశవాళీలో అతను ఏమాత్రం ప్రదర్శన ఇచ్చాడని ఎంపిక చేశారు.టోర్నీకి ముందు అంతా సన్నాహకాల గురించి మాట్లాడతారు. చిత్తుగా ఓడిపోగానే శస్త్రచికిత్స అవసరమంటారు. ఇప్పుడు అది కూడా సాధ్యం కాదు. పాక్ క్రికెట్ ఐసీయూలోకి చేరింది. బోర్డు విధానాలు, నిర్ణయాల్లో నిలకడ లేదు. కెప్టెన్లు, కోచ్లను మార్చడం తప్ప బోర్డు అధికారులకు జవాబుదారీతనం లేదు. వాళ్ల ఉద్యోగాలు కాపాడుకోవడానికి అంతా ఆటగాళ్లను బలి పశువులను చేస్తారు’ అని అఫ్రిది అభిప్రాయ పడ్డాడు. చదవండి: అదే జరిగితే బుమ్రా కెరీర్ ముగిసినట్లే: కివీస్ మాజీ పేసర్ స్ట్రాంగ్ వార్నింగ్ -
రిషబ్ పంత్ ఇంట్లో పెళ్లి భజాలు.. సందడి చేయనున్న భారత క్రికెటర్లు
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇంట్లో పెళ్లి భజాలు మోగనున్నాయి. అతడి సోదరి సాక్షి పంత్ పెళ్లి పీటలు ఎక్కనుంది. సాక్షి పంత్.. వ్యాపారవేత్త అంకిత్ చౌదరిని వివాహం చేసుకోబోతోంది. ఈ వివాహ వేడుకలు మంగళవారం, బుధవారం ముస్సోరీలో జరగనున్నట్లు తెలిసింది.ఈ వివాహానికి భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హాజరు కానున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా 9 ఏళ్లపాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట.. గతేడాది నిశ్చితార్థం చేసుకున్నారు. లండన్లో జరిగిన వారి నిశ్చితార్థానికి ఎంఎస్ ధోని హాజరయ్యాడు.లక్నో కెప్టెన్గా..ఇక ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గెలుచుకున్న భారత జట్టులో పంత్ సభ్యునిగా ఉన్నాడు. కానీ ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం పంత్కు రాలేదు. కేఎల్ రాహుల్ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్గా ఉండడంతో పంత్కు తుది జట్టులో చోటుదక్కలేదు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఐపీఎల్పైనే పడింది. ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.ఒకట్రెండు రోజులు విశ్రాంతి తీసుకుని ఆటగాళ్లంతా తమ తమ జట్లలో చేరనున్నారు. ఇప్పటికే రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా వంటి స్టార్ ప్లేయర్లు తమ ప్రాతినిథ్యం వహిస్తున్న ఫ్రాంచైజీలతో కలిశారు. ఈ ఏడాది సీజన్ ఐపీఎల్లో రిషబ్ పంత్ లక్నో సూపర్జెయింట్స్ తరపున ఆడనున్నాడు. గత డిసెంబర్లో జరిగిన మెగా వేలంలో పంత్ను రూ.27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా పంత్ రికార్డులెక్కాడు. ఈ సీజన్లో లక్నో కెప్టెన్గా పంత్ వ్యవహరించనున్నాడు.చదవండి: అక్షర్, రాహుల్ కాదు..? ఢిల్లీ కెప్టెన్గా ఎవరూ ఊహించని ప్లేయర్!? -
అద్భుతంగా రాణించాను.. టెస్టు రీఎంట్రీకి సిద్ధం
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) టెస్టుల్లో పునరాగమనంపై దృష్టి సారించాడు. దేశవాళీ టోర్నమెంట్లలో తాను అద్భుతంగా రాణించానని.. అందుకే తాను తిరిగి జాతీయ జట్టుకు ఆడతాననే ధీమా వ్యక్తం చేశాడు. కాగా వన్డే ప్రపంచకప్-2023 తర్వాత క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడ్డాడనే కారణంతో బీసీసీఐ(BCCI) శ్రేయస్ అయ్యర్పై వేటు వేసిన విషయం తెలిసిందే. దేశవాళీ క్రికెట్ ఆడాలన్న నిబంధనలను గాయం సాకు చూపి తప్పించుకున్నాడని భావించిన బోర్డు.. అయ్యర్ వార్షిక కాంట్రాక్టును రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ముంబై తరఫున దేశీ బరిలో దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. గతేడాది శ్రీలంకతో వన్డే సిరీస్ సందర్భంగా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు.ఇక తాజాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో సత్తా చాటిన శ్రేయస్ అయ్యర్.. ఈ వన్డే టోర్నీలో భారత్ తరఫున టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి ఐదు ఇన్నింగ్స్లో కలిపి 243 పరుగులు సాధించాడు. తద్వారా ఈ మెగా ఈవెంట్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో న్యూజిలాండ్ స్టార్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రచిన్ రవీంద్ర(263) తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.ఇదిలా ఉంటే.. వన్డేల్లో తానేంటో మరోసారి నిరూపించుకున్న శ్రేయస్ అయ్యర్.. టీమిండియా టెస్టు రీఎంట్రీకి తాను సిద్ధమనే సంకేతాలు ఇచ్చాడు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడుతూ.. ‘‘టెస్టుల్లో పునరాగమనం చేయాలని ఉంది. వీలైనంత ఎక్కువగా క్రికెట్ ఆడాలని భావిస్తున్నా.నేను ఉత్తమంగా రాణించానుదేశవాళీ టోర్నమెంట్లో నేను ఉత్తమంగా రాణించాను. అయితే, నా చేతుల్లో ఏమీ లేదు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. కానీ ఈ విషయం గురించి పదే పదే ఆలోచించను. దాని వల్ల అనసవరంగా నా మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది.అనుకున్నది జరుగకపోతే మానసికంగానూ కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ క్షణాన్ని ఆస్వాదిస్తా. విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటా. సమయం వచ్చినపుడు అవకాశం అదే తలుపుతడుతుంది. ముందుగా చెప్పినట్లు నేను భవిష్యత్తు, గతం గురించి ఎక్కువగా ఆలోచించే మనిషిని కాను. ప్రస్తుతం నేను ఇలా ఉండటానికి కారణం అదే’’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. కాగా చివరిసారిగా అయ్యర్ గతేడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్తో టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇక ఇప్పటి వరకు మొత్తంగా టీమిండియా తరఫున 14 టెస్టులు ఆడిన ఈ ముంబైకర్ 811 పరుగులు చేశాడు. ఇంగ్లండ్తో సిరీస్ నాటికి!?ఇందులో ఓ శతకం కూడా ఉంది. ఇక తాజా రంజీ ట్రోఫీ సీజన్లో శ్రేయస్ అయ్యర్.. ఆడిన ఐదు మ్యాచ్లలోనే ఏకంగా 480 పరుగులు సాధించాడు. ఇక టీమిండియా జూన్లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇందులో భాగంగా స్టోక్స్ బృందంతో టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్ నాటికి అయ్యర్ పునరాగమనం చేసే అవకాశాలు లేకపోలేదు.చదవండి: CT: ఇండియా-‘బి’ టీమ్ కూడా ఫైనల్ చేరేది: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ -
CT: ఇండియా-‘బి’ టీమ్ కూడా ఫైనల్ చేరేది: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
భారత జట్టు ‘బలం’ ముందు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్(Michael Vaughan) తలవంచాడు. టీమిండియా విజయాలను తక్కువ చేసి మాట్లాడిన అతడే.. పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రపంచంలోనే గొప్ప జట్టు అని భారత్ను కొనియాడాడు. ‘హోం అడ్వాంటేజ్’ అంటూ విమర్శలుచాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో రోహిత్ సేనకు ‘హోం అడ్వాంటేజ్’ ఉంటుందని విమర్శించిన వాన్.. ఇప్పుడు ద్వితీయ శ్రేణి జట్టుతోనే టీమిండియా టైటిల్ గెలవగలదని కితాబు ఇచ్చాడు.కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మొదలు కాగా.. టీమిండియా భద్రతా కారణాల దృష్ట్యా అక్కడికి వెళ్లలేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆమోదంతో తటస్థ వేదికైన దుబాయ్లోనే తమ మ్యాచ్లన్నీ ఆడింది. అయితే, ఒకే మైదానంలో ఆడటం వల్ల ఇతర జట్లతో పోలిస్తే భారత్కు అదనపు ప్రయోజనాలు చేకూరుతున్నాయని.. అలవాటైన స్టేడియంలో ఆడటం వారికి సానుకూలాంశమని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు విమర్శించారు.అంతేగాక.. టీమిండియాతో మ్యాచ్ల కోసం ఇతర జట్లు పాకిస్తాన్- దుబాయ్(Dubai) మధ్య ప్రయాణాలు చేయడం కూడా ఇబ్బందికరమేనని పేర్కొన్నారు. వేదిక ఏదైనా టీమిండియాకు తిరుగు లేదంటూ సునిల్ గావస్కర్ వంటి భారత క్రికెట్ దిగ్గజాలు ఈ విమర్శలను తిప్పికొట్టారు.ఏదేమైనా గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్లను ఓడించి టాపర్గా సెమీస్ చేరిన రోహిత్ సేన.. ఆస్ట్రేలియాపై గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం నాటి మ్యాచ్లో న్యూజిలాండ్ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి విజేతగా అవతరించింది.టీమిండియా-‘బి’ టీమ్ కూడా ఫైనల్ చేరేదిఈ నేపథ్యంలో మైకేల్ వాన్ భారత జట్టు ఆట తీరును కొనియాడాడు. అదే విధంగా.. భారత్ ‘బెంచ్ స్ట్రెంత్’ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘‘నిజాయితీగా చెప్పాలంటే.. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇండియా అత్యుత్తమ జట్టుగా కొనసాగుతోంది. ఈ విజయానికి వారు అర్హులు. టీ20 ప్రపంచకప్ గెలిచిన వెంటనే.. ఇండియా చాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచింది.జైస్వాల్, వర్మ, శర్మ, స్కై, పంత్, రెడ్డి, సుందర్, చహల్, అర్ష్దీప్, బుమ్రా, బిష్ణోయిలతో కూడిన జట్టు కూడా ఫైనల్కు చేరేది. టైటిల్ కూడా గెలిచేది. వైట్బాల్ క్రికెట్లో వారి బెంచ్ బలానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం మరొకటి ఉండదు’’ అని మైకేల్ వాన్ ‘ఎక్స్’ పోస్టులో రాసుకొచ్చాడు.అతడు దూరం.. వారు బెంచ్కే పరిమితంకాగా భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా చాంపియన్స్ ట్రోఫీ మొత్తానికి దూరం కాగా.. యశస్వి జైస్వాల్ను ఆఖరి నిమిషంలో తప్పించి వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకుంది మేనేజ్మెంట్. ఇక ఈ జట్టులో రిషభ్ పంత్కు స్థానం దక్కినా.. వికెట్ కీపర్ కోటాలో కేఎల్ రాహుల్ను తుదిజట్టులో ఆడించారు. దీంతో పంత్ బెంచ్కే పరిమితమయ్యాడు. వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్లదీ ఇదే పరిస్థితి.ఇక వీరితో పాటు తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, యజువేంద్ర చహల్, రవి బిష్ణోయిలతో కూడిన జట్టు కూడా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు చేరేదంటూ మైకేల్ వాన్ పేర్కొనడం విశేషం.చదవండి: Team of the Tourney 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్కు దక్కని చోటు -
ఏకైక ‘శత్రువు’ను అతడు జయించేశాడు: భారత మాజీ క్రికెటర్
టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్(KL Rahul)పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrekar) ప్రశంసలు కురిపించాడు. ఒత్తిడిలోనూ అద్భుతంగా ఆడాడని.. భారత్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) గెలవడంలో అతడి పాత్ర మరువలేనిదని కొనియాడాడు. తన ‘శత్రువు’ని జయించి రాహుల్ తన విలువేమిటో మరోసారి చాటుకున్నాడని ప్రశంసించాడు.వికెట్ కీపర్ బ్యాటర్గా సేవలు అందిస్తున్న కేఎల్ రాహుల్ ఓపెనర్గా, మిడిలార్డర్లో నాలుగు, ఐదు, ఆరో స్థానాల్లో బ్యాటింగ్ చేశాడు. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా యాజమాన్యం చెప్పినట్లుగా నడుచుకునే క్రమంలో ఎప్పుడు ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వస్తుందో అతడికే తెలియని పరిస్థితి.కూల్గా, పక్కా ప్రణాళికతోముఖ్యంగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా అతడి సేవలను వాడుకున్న తీరు దారుణమని నవజ్యోత్ సింగ్ సిద్ధు లాంటి వాళ్లు బీసీసీఐని విమర్శించడం గమనార్హం. అయితే, కేఎల్ రాహుల్ మాత్రం తాను ఏ స్థానంలో ఆడినా కూల్గా, పక్కా ప్రణాళికతో ముందుకు సాగాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్లో భారత్ విజయం సాధించడానికి.. విరాట్ కోహ్లితో పాటు ఈ కర్ణాటక బ్యాటర్ ధనాధన్ ఇన్నింగ్స్ కూడా ప్రధాన కారణం. సెమీస్ మ్యాచ్లో కేఎల్ రాహుల్ ఆరో స్థానంలో వచ్చి 34 బంతుల్లో 42 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక న్యూజిలాండ్తో ఫైనల్లోనూ అతడు అదరగొట్టాడు. 33 బంతుల్లో 34 పరుగులు సాధించి.. మరో ఓవర్ మిగిలి ఉండగానే భారత్ గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు. నిజానికి వన్డే వరల్డ్కప్-2023 టోర్నీలో రాహుల్ రాణించాడు.అయితే, సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో నాటి ఫైనల్లోనూ అర్ధ శతకం సాధించాడు. అయితే, 107 బంతుల్లో కేవలం 66 పరుగులే చేయడంతో.. భారత్ ఓటమికి అతడి స్లో ఇన్నింగ్స్ కూడా ఓ కారణమని కొంతమంది విమర్శించారు. అయితే, చాంపియన్స్ ట్రోఫీలో అతడు తన శైలిని మార్చుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లపై దూకుడు ప్రదర్శిస్తూ సరైన షాట్ల ఎంపికతో పరుగులు రాబట్టి.. టీమిండియా గెలుపుల్లో భాగమయ్యాడు.ఏకైక ‘శత్రువు’ను అతడు జయించేశాడుఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ కేఎల్ రాహుల్ గురించి మాట్లాడాడు.‘‘వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ నుంచి రాహుల్ ‘స్లో ఇన్నింగ్స్’ భారం మోస్తున్నాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి అతడు మాట్లాడుతూ.. ఆ ఇన్నింగ్స్ తాలూకు చేదు అనుభవం తనను వేటాడుతూ.. పదే పదే పాత గాయాన్ని గుర్తు చేస్తుందని చెప్పాడు.ఇక ఇప్పుడు సెమీస్, ఫైనల్లో అతడి ప్రదర్శన వల్ల కచ్చితంగా సంతృప్తి పడి ఉంటాడు. నిజానికి కేఎల్ రాహుల్కు బౌలర్లు ‘శత్రువులు’ కారు. అతడికి ఉన్న ఏకైక ‘శత్రువు’ అతడి మెదడే. తన ఆలోచనా విధానం వల్లే అతడు ఒత్తిడిలో కూరుకుపోయి ఉంటాడు.అయితే, ఇప్పుడు ఆ భారాన్ని జయించి.. సంయమనం పాటిస్తూ చక్కటి షాట్లతో అలరించాడు. అతడి ప్రయాణం గొప్పగా సాగుతోంది’’ అని సంజయ్ మంజ్రేకర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో వ్యాఖ్యానించాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో కేఎల్ రాహుల్ ఐదు మ్యాచ్లలో నాలుగు ఇన్నింగ్స్ ఆడి 140 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేటు 97.90. ఐసీసీ ప్రకటించిన టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ప్లేయింగ్ ఎలెవన్లోనూ ఈ వికెట్ కీపర్ బ్యాటర్ స్థానం సంపాదించాడు.చదవండి: Team of the Tourney 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్కు దక్కని చోటు View this post on Instagram A post shared by ICC (@icc) -
రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ వార్తలు.. జడ్డు రియాక్షన్ ఇదే!
దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) టోర్నమెంట్ జరుగగా.. టీమిండియా విజేతగా అవతరించింది. డిఫెండింగ్ చాంపియన్ పాకిస్తాన్ ఒక్క గెలుపు కూడా లేకుండా నిష్క్రమించగా.. భారత్ ఆఖరి వరకు అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. దుబాయ్ వేదికగా ఆదివారం నాటి ఫైనల్లో న్యూజిలాండ్(India vs New Zealand)ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి చాంపియన్గా నిలిచింది.ఆ నలుగురు.. అప్పుడూ.. ఇప్పుడూఇక 2017 చాంపియన్స్ ట్రోఫీ నాటి భారత జట్టులో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా(Ravindra Jadeja), హార్దిక్ పాండ్యా.. తాజా ఎడిషన్లోనూ ఆడారు. ప్రస్తుతం ఈ వన్డే టోర్నమెంట్ గెలిచిన జట్టుకు రోహిత్ కెప్టెన్గా ఉండగా.. మిగతా ముగ్గురు అతడితో కలిసి టీమిండియాను విజేతగా నిలపడంలో తమ వంతు పాత్ర పోషించారు.ముఖ్యంగా స్పిన్కు అనుకూలించిన దుబాయ్ పిచ్పై ఆల్రౌండర్ జడ్డూ ప్రభావం చూపాడు. మొత్తంగా ఐదు మ్యాచ్లలో పొదుపుగా బౌలింగ్ చేసిన జడ్డూ మొత్తంగా ఐదు వికెట్లు తీశాడు. ప్రత్యర్థి జట్ల బ్యాటర్లపై ఒత్తిడి పెంచుతూ కీలక వికెట్లు కూల్చి టీమిండియాను విజయపథంలో నిలపడంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ టోర్నీలో ఐదు మ్యాచ్లలో కలిపి 42 ఓవర్లు బౌలింగ్ చేసిన జడేజా.. 4.35 ఎకానమీ రేటుతో 183 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. బంతితోనే కాకుండా.. అవసరమైన వేళ బ్యాట్తోనూ జడ్డూ రాణించాడు. ముఖ్యంగా కివీస్తో ఫైనల్లో ఫోర్ బాది టీమిండియా విజయాన్ని ఖరారు చేసి.. ఈ టోర్నీని చిరస్మరణీయంగా మార్చుకున్నాడు. జడేజా రిటైర్మెంట్ గురించి ఊహాగానాలుఅయితే, ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో జడేజా తన బౌలింగ్ ఓవర్ల కోటా పూర్తి చేయగానే విరాట్ కోహ్లి వచ్చి జడ్డూను ఆత్మీయంగా హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట విస్తృతంగా వైరల్ అయ్యాయి.ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆస్ట్రేలియాకు కెప్టెన్గా వ్యవహరించిన స్టీవ్ స్మిత్కు కోహ్లి హగ్ ఇచ్చిన ఫొటోలను షేర్ చేస్తూ.. జడేజా రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు వచ్చాయి. జడ్డూ వన్డేల్లో తన చివరి స్పెల్ వేసేశాడని.. ఇక రిటైర్మెంట్ ప్రకటనే తరువాయి అన్నట్టుగా ప్రచారం సాగింది.జడ్డు రియాక్షన్ ఇదే!టీమిండియా విజయానంతరం ఈ విషయంపై స్పందించిన జడేజా.. ‘‘అనవసరంగా వదంతులు ప్రచారం చేయద్దు.. ధన్యవాదాలు’’ అంటూ చేతులెత్తి నమస్కరిస్తున్నట్లుగా ఉన్న ఎమోజీతో పాటు సెల్యూట్ చేస్తున్నట్లుగా ఉన్న ఎమోజీని జత చేశాడు. కాగా ఫైనల్లో జడ్డూ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి ఆరు బంతుల్లో ఒక ఫోర్ సాయంతో తొమ్మిది పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఇదిలా ఉంటే.. సెమీ ఫైనల్లో టీమిండియా చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయిన తర్వాత స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకంటే ముందు కోహ్లి అతడిని ఆలింగనం చేసుకోగా.. అధికారిక ప్రకటన కంటే ముందే స్మిత్ కోహ్లికి ఈ విషయం చెప్పాడని వార్తలు వచ్చాయి. జడ్డూ విషయంలో కూడా ఇలాగే జరుగుతుందని భావించిన వాళ్లకు తాజాగా అతడి పోస్టుతో స్పష్టతవచ్చింది.చదవండి: తప్పులు సరిదిద్దుకుని.. ‘టాప్’ రన్ స్కోరర్గా.. మాటలకు అందని అనుభూతి!Ravindra Jadeja with his family!#INDvsNZ #ChampionsTrophy2025 pic.twitter.com/16MpYrm7V6— Chandra 🇮🇳 (@cbatrody) March 9, 2025 -
తప్పులు సరిదిద్దుకుని.. ‘టాప్’ రన్ స్కోరర్గా.. మాటలకు అందని అనుభూతి!
తొలిసారి ఐసీసీ ట్రోఫీని ముద్దాడిన అనుభూతిని మాటల్లో వర్ణించలేనంటున్నాడు టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer). ప్రస్తుతం తన కాళ్లు నేలమీద నిలవడం లేదని.. ఇంతకంటే గొప్ప భావన మరొకటి ఉండదంటూ ఆనందంలో మునిగితేలుతున్నాడు. డ్రెస్సింగ్ రూమ్లో సహచర ఆటగాళ్ల సంతోషం చూసి తన మనసు గాల్లో తేలిందని ఉద్వేగానికి లోనయ్యాడు.అనూహ్య పరిస్థితుల్లో జట్టుకు దూరంకాగా వన్డే ప్రపంచకప్-2023లో అద్భుతంగా రాణించిన శ్రేయస్ అయ్యర్.. ఆ తర్వాత అనూహ్య పరిస్థితుల్లో జట్టుకు దూరమయ్యాడు. దేశవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించాడన్న ఆరోపణలతో సెంట్రల్ కాంట్రాక్టు(BCCI Cetral Contract) కూడా కోల్పోయాడు. అయితే, ఈ ముంబైకర్ తనకు ఎదురైన చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని తనను తాను సరిదిద్దుకున్నాడు.తప్పులు సరిదిద్దుకుని..బోర్డు ఆదేశాలను పాటిస్తూ ముంబై తరఫున దేశీ క్రికెట్ బరిలో దిగిన శ్రేయస్.. కఠినశ్రమ, అంకితభావంతో తనను నిరూపించుకున్నాడు. వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడ్డ ఈ ముంబై ఆటగాడు... దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కెప్టెన్గా వ్యవహరించి టైటిల్ గెలిచాడు. రంజీల్లో సత్తా చాటి తన విలువను చాటుకున్నాడు.అంతేకాదు.. ఐపీఎల్-2024(IPL 2024)లో కోల్కతా నైట్ రైడర్స్ సారథిగా వ్యవహరించి.. జట్టును చాంపియన్గా నిలిపాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టులో పునరాగమనం చేసిన శ్రేయస్ అయ్యర్.. స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో సూపర్ ఫామ్తో పరుగులు రాబట్టాడు. తొలి వన్డేకు మోకాలి నొప్పి కారణంగా విరాట్ కోహ్లి దూరం కాగా.. అతడి స్థానంలో తుదిజట్టులో చోటు దక్కించుకుని జట్టుకు విజయాలు అందించాడు.జట్టుకు వెన్నెముకలా నిలిచిఈ క్రమంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంపికైన జట్టులో స్థానం సంపాదించిన శ్రేయస్ అయ్యర్ ఇక్కడా అద్బుతంగా రాణించాడు. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో రాణిస్తూ జట్టుకు వెన్నెముకలా నిలిచాడు. ఈ వన్డే టోర్నమెంట్లో మొత్తంగా టీమిండియా ఆడిన ఐదు మ్యాచ్లలో కలిపి శ్రేయస్ 48.60 సగటుతో 243 పరుగులు రాబట్టాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.20 పరుగుల తేడాతో..తద్వారా ఈ టోర్నీలో టీమిండియా తరఫున టాప్ రన్ స్కోరర్గా నిలిచిన శ్రేయస్ అయ్యర్.. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన రచిన్ రవీంద్రకు 20 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. రచిన్ రెండు శతకాల సాయంతో 263 పరుగులు సాధించి ఓవరాల్గా అత్యధిక పరుగుల వీరుడిగా నిలవగా.. శ్రేయస్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.ఇక ఆదివారం నాటి ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్ను ఓడించడంలోనూ శ్రేయస్ అయ్యర్ది కీలక పాత్ర. కివీస్ విధించిన 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ శుబ్మన్ గిల్(31), విరాట్ కోహ్లి(1) రూపంలో కీలక వికెట్లు కోల్పోయిన వేళ.. రోహిత్ శర్మ(76)తో కలిసి శ్రేయస్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. మొత్తంగా 62 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 48 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్(33 బంతుల్లో 34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9 నాటౌట్) రాణించారు. తద్వారా మరో ఓవర్ మిగిలి ఉండగానే రోహిత్ సేన టార్గెట్ పూర్తి చేసి నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.మాటలకు అందని అనుభూతిఅనంతరం చాంపియన్గా నిలిచిన భారత్కు ట్రోఫీతో పాటు విన్నింగ్స్ మెడల్స్ అందించారు. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘‘ఈ అనుభూతిని మాటల్లో ఎలా వర్ణించాలో తెలియడం లేదు. నేను గెలిచిన మొదటి ఐసీసీ ట్రోఫీ ఇదే. ఈ టోర్నమెంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి ఫైనల్ వరకు మా జట్టు జైత్రయాత్ర అమోఘం.నిజం చెప్పాలంటే.. నేను ఒత్తిడిలోనే మరింత గొప్పగా రాణించగలను. సవాళ్లను ఎదుర్కోవడం నాకు భలే మజాను ఇస్తుంది. ఈ టోర్నమెంట్లో నాకు అద్భుత ఆరంభం లభించింది. దానిని అలాగే కొనసాగించాను. అయితే, భారీ స్కోర్లు సాధించలేకపోయాను. అయినప్పటికీ జట్టు విజయాలకు నా ప్రదర్శన దోహదం చేసింది కాబట్టి ఆనందంగానే ఉన్నాను. ఇంతకంటే సంతృప్తి, సంతోషం మరొకటి ఉండదు’’ అని హర్షం వ్యక్తం చేశాడు.చదవండి: అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్ -
CT 2025 Final: ముగింపు వేడుకలో ఒక్క పాకిస్తాన్ ప్రతినిధి కూడా లేడు.. కారణం ఏంటి..?
20 రోజుల పాటు సాగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన నిన్నటితో (మార్చి 9) ఫైనల్తో ముగిసింది. ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్ను 4 వికెట్ల తేడాతో ఓడించి, మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.కాగా, నిన్నటి ఫైనల్ అనంతరం ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా పోడియంపై ఒక్క పాకిస్తాన్ ప్రతినిథి కూడా కనపడకపోవడం చర్చనీయాంశంగా మారింది. టోర్నీకి ఆతిథ్యమిచ్చిన పాకిస్తాన్ నుంచి పోడియంపై ఒక్క ప్రతినిధి కూడా లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ అంశాన్ని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సోషల్మీడియా వేదికగా లేవనెత్తాడు. టోర్నీకి ఆతిథ్యమిచ్చిన పాకిస్తాన్ నుంచి ఒక్క ప్రతినిధి కూడా లేకపోవడమేంటని ప్రశ్నించాడు. ఇలా జరగడం దురదృష్టకరమని అన్నాడు.వాస్తవానికి భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్కు టోర్నీ ఆతిథ్య దేశ హోదాలో పాకిస్తాన్ నుంచి ఒక్కరైనా హాజరు కావాల్సి ఉండింది. అయితే అలా జరగలేదు. ముగింపు వేడుకకు పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ రావాల్సి ఉన్నా రాలేదు. బదులుగా, పాకిస్తాన్ లెగ్ మ్యాచ్లు నిర్వహించిన టోర్నీ డైరెక్టర్ సుమైర్ అహ్మద్ను పంపారు. ప్రోటోకాల్ ప్రకారం ముగింపు వేడుకల్లో పోడియంపైకి బోర్డు ద్వారా ఎన్నికైన సభ్యులు లేదా డైరెక్టర్లను మాత్రమే అనుమతిస్తారు. సుమైర్ అహ్మద్ పీసీబీ ఉద్యోగి మాత్రమే కావడంతో అతన్ని పోడియంపైకి అనుమతించలేదు. దుబాయ్ లెగ్కు బాధ్యత వహించిన మరో టోర్నమెంట్ డైరెక్టర్ ఆండ్రీ రస్సెల్ను కూడా పోడియంపైకి పిలువ లేదు. మొత్తంగా పాకిస్తాన్ ప్రతినిథి లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ ముగింపు వేడుక ముగిసింది.ముగింపు వేడుకలో ఐసీసీ తరఫున చైర్మన్ జై షా, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, న్యూజిలాండ్ క్రికెట్ డైరెక్టర్ రోజర్ ట్వోస్ పాల్గొన్నారు.ఇదిలా ఉంటే, ఉత్కంఠగా సాగిన నిన్నటి ఫైనల్లో భారత్ న్యూజిలాండ్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేయగా.. భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్లో భారత స్పిన్నర్లు చెలరేగడంతో న్యూజిలాండ్ ఓ మోస్తరు స్కోర్కే పరిమితమైంది. న్యూజిలాండ్ తరఫున డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్వెల్ (53 నాటౌట్) రాణించారు. రచిన్ రవీంద్ర (37), ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విల్ యంగ్ (15), కేన్ విలియమ్సన్ (11), టామ్ లాథమ్ (14),మిచెల్ సాంట్నర్ (8) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో 2.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.ఛేదనలో రోహిత్ (76) భారత్కు శుభారంభాన్ని అందించారు. శుభ్మన్ గిల్తో (31) కలిసి తొలి వికెట్కు 105 పరుగులు జోడించాడు. అయితే భారత్ 17 పరుగుల వ్యవధిలో గిల్, కోహ్లి (1), రోహిత్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ (48), అక్షర్ పటేల్ (29) మంచి భాగస్వామ్యం నెలకొల్పి భారత్ను తిరిగి గేమ్లోకి తెచ్చారు. అయితే శ్రేయస్, అక్షర్ కూడా స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో టీమిండియా మరోసారి కష్టాల్లో పడింది. అయితే కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజాతో (18 నాటౌట్) కలిసి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్ను విజయతీరాలకు చేర్చాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్, బ్రేస్వెల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జేమీసన్, రచిన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
ఎక్కడైనా టీమిండియాదే గెలుపు!.. ఇచ్చిపడేసిన పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్
టీమిండియాపై పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రం(Wasim Akram) ప్రశంసలు కురిపించాడు. వేదిక ఏదైనా రోహిత్ సేనకు తిరుగులేదని.. అద్భుత ప్రదర్శనతో విజయాలు సాధిస్తున్న తీరు అమోఘమని కొనియాడాడు. ఎల్లవేళలా తమ కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్కోచ్ గౌతం గంభీర్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించి భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) అనుకున్న ఫలితాన్ని రాబట్టగలిగిందని ప్రశంసించాడు.కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఈ మెగా టోర్నీ నిర్వహణ హక్కులు దక్కించుకోగా.. టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్లో తమ మ్యాచ్లు ఆడింది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్లను ఓడించిన రోహిత్ సేన.. సెమీస్లో ఆస్ట్రేలియాను, ఫైనల్లో న్యూజిలాండ్లపై గెలిచి టైటిల్ సాధించింది.బీసీసీఐ అనుసరించిన విధానాల వలనే..అయితే, ఒకే వేదికపై ఆడటం భారత్కు సానుకూలంగా మారిందనే విమర్శల నేపథ్యంలో పాక్ దిగ్గజ ఫాస్ట్బౌలర్ వసీం అక్రం తనదైన శైలిలో స్పందించాడు. బీసీసీఐ అనుసరించిన విధానాలే టీమిండియా జైత్రయాత్రకు కారణమని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘ప్రస్తుత భారత జట్టు ప్రపంచంలోని ఏ వేదికపై ఆడినా కచ్చితంగా గెలుస్తుంది.ఒక్క ఓటమి కూడా లేకుండాదుబాయ్లో ఆడినందుకు టీమిండియా లాభపడిందని చాలా మంది అంటున్నారు. కానీ పాకిస్తాన్లో ఆడినా రోహిత్ సేన టైటిల్ గెలిచేది. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో భారత జట్టు కూడా అన్ని టీమ్స్ మాదిరే వివిధ వేదికలకు ప్రయాణాలు చేసింది. మరి అజేయంగానే చాంపియన్గా నిలిచింది కదా! ఒక్క ఓటమి కూడా లేకుండా ట్రోఫీని ముద్దాడింది.ఐసీసీ ఈవెంట్లలో భారత జట్టుకు నిలకడకు ఇది నిదర్శనం. రోహిత్ శర్మ నాయకత్వ పటిమకు ఇదో కొలమానం. న్యూజిలాండ్తో స్వదేశంలో టీమిండియా టెస్టు సిరీస్లో కనీవినీ ఎరుగని రీతిలో 3-0తో వైట్వాష్ అయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో.. పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది.అంతకు ముందు శ్రీలంకకు వన్డే సిరీస్ను కూడా కోల్పోయింది. ఇలాంటి సమయాల్లో బోర్డుపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. కెప్టెన్, కోచ్లను తొలగించాలనే డిమాండ్లు వస్తాయి. అయితే, బీసీసీఐ మాత్రం తమ సారథికి, శిక్షకుడికి అన్ని వేళలా పూర్తి మద్దతుగా నిలిచింది. అందుకు తగ్గ ఫలితాన్ని చాంపియన్స్ ట్రోఫీలో చాంపియన్గా నిలవడం ద్వారా పొందింది’’ అని వసీం అక్రం పేర్కొన్నాడు.మూడోసారి ఈ ఐసీసీ టైటిల్ను కైవసంకాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో టీమిండియా కివీస్ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా మూడోసారి(2002, 2013, 2025) ఈ ఐసీసీ టైటిల్ను కైవసం చేసుకుంది. దుబాయ్లో ఆదివారం రాత్రి ముగిసిన ఈ మ్యాచ్లో టాస్ ఓడిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(63), మైకేల్ బ్రాస్వెల్(40 బంతుల్లో 53 నాటౌట్) రాణించడం ద్వారా నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ చెరో రెండు, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధ శతకం(83 బంతుల్లో 76)తో రాణించగా.. శ్రేయస్ అయ్యర్(48), కేఎల్ రాహుల్(33 బంతుల్లో 34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9 నాటౌట్) జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. రోహిత్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ టోర్నీలో పాకిస్తాన్ ఒక్క విజయం కూడా లేకుండా నిష్క్రమించడం గమనార్హం.చదవండి: అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్ TEAM INDIA ARE CHAMPIONS AGAIN! 🏆🇮🇳#ChampionsTrophyOnJioStar #INDvNZ #ChampionsTrophy2025 pic.twitter.com/Uh6EZWFfSL— Star Sports (@StarSportsIndia) March 9, 2025 -
ఆ మ్యాచ్లన్నీ దుబాయ్లో ఆడలేదు: భారత మాజీ క్రికెటర్ వ్యంగ్యాస్త్రాలు
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)ని టీమిండియా అజేయంగా ముగించింది. గ్రూప్ దశలో మూడింటికి మూడూ గెలిచిన రోహిత్ సేన.. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో న్యూజిలాండ్(India vs New Zealand)తో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో గెలిచి పరిపూర్ణ విజయంతో చాంపియన్గా నిలిచింది.ఈ నేపథ్యంలో భారత జట్టుపై ప్రశంసలు వెల్లువెత్తుతుండగా.. ఒకే వేదికపై ఆడిన తీరుపై విమర్శలు కూడా వస్తున్నాయి. కాగా ఫిబ్రవరి 19న మొదలైన ఈ వన్డే టోర్నమెంట్కు పాకిస్తాన్ ఆతిథ్యమివ్వగా.. టీమిండియా మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా తటస్థ వేదికపైన తమ మ్యాచ్లు ఆడింది. దుబాయ్(Dubai)లోనే ఈ ఐదు మ్యాచ్లలో ప్రత్యర్థులతో తలపడింది.అదనపు ప్రయోజనం అంటూ విమర్శలుమరోవైపు.. రోహిత్ సేనతో మ్యాచ్లు ఆడేందుకు ఆయా జట్లు పాకిస్తాన్- దుబాయ్ మధ్య ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఒకే మైదానంలో ఆడటం భారత్కు అదనపు ప్రయోజనాలను చేకూర్చిందని ఇంగ్లండ్, సౌతాఫ్రికా తదితర దేశాల మాజీ క్రికెటర్లు టీమిండియా విజయాలను విమర్శించారు. ఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా భారత్ అవతరించిన అనంతరం.. టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఐసీసీ టోర్నమెంట్లలో భారత జట్టు విజయాలను ఉటంకిస్తూ.. ‘‘కేవలం ఐసీసీ టైటిళ్ల విషయంలోనే కాదు.. టీమిండియా ఎన్ని ఐసీసీ మ్యాచ్లు గెలిచిందో కూడా చూడాలి. చెంపపెట్టు లాంటి సమాధానంగత ఆరేళ్లుగా ఐసీసీ ఈవెంట్లలో భారత్కు అద్బుత రికార్డు ఉంది. మరొక్క మాట.. ఈ మ్యాచ్లన్నీ దుబాయ్లో మాత్రం ఆడినవి కాదండోయ్!’’ అంటూ విమర్శకులను ఉద్దేశించి మంజ్రేకర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. టీమిండియా విజయాలను తక్కువ చేసి మాట్లాడుతున్న వారికి చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చారు అంటూ అభిమానులు మంజ్రేకర్ ట్వీట్ వైరల్ చేస్తున్నారు.కాగా ఐసీసీ వన్డే వరల్డ్కప్-2023లో ఫైనల్ వరకు అజేయంగా ఉన్న టీమిండియా.. టీ20 ప్రపంచకప్-2024లో అన్ని మ్యాచ్లు గెలిచి చాంపియన్గా నిలిచింది. ఇక చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్లోనూ ఓటమన్నదే లేకుండా ముందుకు సాగి ట్రోఫీని ముద్దాడింది. అరుదైన రికార్డులుఈ మూడు ఈవెంట్లలో రోహిత్ సేన మొత్తంగా 24 మ్యాచ్లు ఆడగా.. ఏకంగా 23 గెలిచింది. ఒక మ్యాచ్ మాత్రం ఓడిపోయింది. సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్-2023లో ఆస్ట్రేలియాతో చేతిలో పరాజయం పాలై ట్రోఫీని చేజార్చుకుంది.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీలో ఇంత వరకు ఏ జట్టుకు సాధ్యం కాని ఘనతను కూడా భారత్ సాధించింది. ఈ వన్డే టోర్నమెంట్లో ఇప్పటి వరకు మొత్తంగా 34 మ్యాచ్లు ఆడిన టీమిండియా ఇరవై మూడింట గెలిచి.. ఎనిమిది ఓడింది. మూడింట ఫలితాలు రాలేదు. ఇక ప్రపంచంలోని ఏ క్రికెట్ జట్టూ కూడా ఈ టోర్నీలో పదిహేను కంటే ఎక్కువ విజయాలు సాధించకపోవడం గమనార్హం.అంతేకాదు.. ఒక వేదికపై అత్యధిక వన్డే విజయాలు సాధించిన జట్టుగానూ భారత్.. న్యూజిలాండ్ రికార్డును సమం చేసింది. దుబాయ్లో ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్లు ఆడి పదింట గెలిచింది. న్యూజిలాండ్ గతంలో డునెడిన్లో పదింటికి పది మ్యాచ్లలో విజయం సాధించింది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ 👉కివీస్ స్కోరు: 251/7 (50)👉టీమిండియా స్కోరు: 254/6 (49)👉ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై గెలిచి చాంపియన్గా భారత్👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రోహిత్ శర్మ(83 బంతుల్లో 76)చదవండి: అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్TEAM INDIA ARE CHAMPIONS AGAIN! 🏆🇮🇳#ChampionsTrophyOnJioStar #INDvNZ #ChampionsTrophy2025 pic.twitter.com/Uh6EZWFfSL— Star Sports (@StarSportsIndia) March 9, 2025 -
ఛాంపియన్స్గా భారత్.. చిన్నపిల్లాడిలా గంతులేసిన గవాస్కర్! వీడియో
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 12 ఏళ్ల తర్వాత టీమిండియా వశమైంది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను 4 వికెట్ల తేడాతో ఓడించిన భారత జట్టు.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ను ముద్దాడింది. రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్ కొట్టగానే స్టేడియంలో ఉన్న భారత అభిమానలతో పాటు దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి.ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) ఆనందానికి అవధలు లేకుండా పోయాయి. ఫైనల్ పోరులో కామెంటేటర్గా వ్యవహరించిన గవాస్కర్.. టీమిండియా గెలిచిన వెంటనే మైదానంలో వచ్చి సందడి చేశాడు. 75 ఏళ్ల వయసులోనూ ఆయన చిన్నపిల్లాడిలా డ్యాన్స్ చేస్తూ టీమిండియా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.సహచర కామెంటేటర్లు వారి సెల్ఫోన్లలో అద్బుత క్షణాలను బంధించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టీమిండియా ప్లేయర్లు కూడా ట్రోఫీని అందుకున్నాక తమదైన శైలిలో డ్యాన్స్ చేస్తూ అలరించారు.కాగా భారత్కు ఇది మూడో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కావడం విశేషం. 2002లో శ్రీలంకతో ట్రోఫీని సంయుక్తంగా పంచుకున్న భారత జట్టు.. ఆ తర్వాత 2013, 2025లో ఛాంపియన్స్గా నిలిచింది. అదేవిధంగా తొమ్మిది నెలల వ్యవధిలో భారత్కు ఇది రెండో ఐసీసీ టైటిల్ కావడం గమనార్హం.ఇక ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(101 బంతుల్లో 3 ఫోర్లతో 63), మైఖేల్ బ్రేస్వెల్(40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం 252 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఆరు వికెట్లు కోల్పోయి చేధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రోహిత్ శర్మ 74 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. Sunil Gavaskar after India won champions trophy 😂😂😂I think now we can understand his harsh criticism of players pic.twitter.com/rWNsT8k47b— Chintan Patel (@Patel_Chintan_) March 9, 2025 -
అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్
మరోసారి చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) గెలవాలన్న న్యూజిలాండ్ ఆశలపై టీమిండియా నీళ్లు చల్లింది. పాతికేళ్ల క్రితం ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుని 2025 ఫైనల్లో కివీస్ను ఓడించి విజేతగా నిలిచింది. అయితే, ఈ మ్యాచ్లో తమ జట్టు ఆఖరి వరకు పోరాడిన తీరు అద్భుతమని కెప్టెన్ మిచెల్ సాంట్నర్ సహచర ఆటగాళ్లను అభినందించాడు. ఈ టోర్నమెంట్ తమకు చేదు-తీపిల కలయికగా మిశ్రమ అనుభూతిని మిగిల్చిందని పేర్కొన్నాడు.కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన ఈ మెగా వన్డే టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. గ్రూప్-ఎ నుంచి భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ బరిలో నిలిచాయి. ఈ క్రమంలో లీగ్ దశలో మూడింటికి మూడూ గెలిచి సెమీస్కు చేరిన రోహిత్ సేన.. సెమీస్లో ఆసీస్పై గెలుపొందింది. మరోవైపు.. గ్రూప్ దశలో కేవలం టీమిండియా చేతిలో ఓడిన కివీస్.. సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి ఫైనల్లో భారత్ను ఢీకొట్టింది.దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన టైటిల్ పోరులో భారత్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడి రిక్తహస్తాలతో వెనుదిరిగింది. అయితే, 49వ ఓవర్ వరకు ఫలితం తేలకుండా న్యూజిలాండ్ బౌలర్లు అడ్డుపడటం... ఆఖరి వరకు పట్టుదలగా పోరాడిన తీరును ప్రస్తావిస్తూ సాంట్నర్(Mitchell Santner) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆఖర్లో మాకు మిశ్రమ అనుభూతి లభించింది. అయితే, ఫైనల్లో పటిష్ట జట్టు చేతిలో ఓడిపోయినందువల్ల పెద్దగా బాధపడాల్సిన పనిలేదు.మ్యాచ్ ఆసాంతం మేము టీమిండియాను సవాల్ చేయగలిగాం. అది మాకు సంతృప్తినిచ్చింది. ఒకటీ రెండు చిన్నతప్పుల వల్ల మ్యాచ్ మా చేజారింది. ఏదేమైనా ఈ జట్టును చూసి నేను గర్విస్తున్నాను. టోర్నీ ఆసాంతం మా వాళ్లు అద్భుతంగా ఆడారు. అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్లతో మా జట్టు సమతూకంగా ఉంది. ఇలాంటి జట్టుకు కెప్టెన్గా ఉండటం అంత తేలికేమీ కాదు. నాకైతే ఈ టోర్నీ అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చింది.ముందుగా చెప్పినట్లు మేము బలమైన జట్టు చేతిలో ఓడిపోయాం. ఇంకో 20 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో!.. అయితే, రోహిత్ శర్మ(Rohit Sharma) తన అద్భుత బ్యాటింగ్తో మ్యాచ్ను మా నుంచి లాగేసుకున్నాడు. ఫైనల్ వరకు మా ఆటతీరు అద్బుతంగా సాగింది. టైటిల్ పోరులోనూ మేము ఆఖరి వరకు పోరాడటం గర్వకారణం’’ అని 33 ఏళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ సాంట్నర్ తమ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.కాగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన సాంట్నర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రచిన్ రవీంద్ర(37),గ్లెన్ ఫిలిప్స్(34) ఫర్వాలేదనిపించగా.. డారిల్ మిచెల్(63), మైకేల్ బ్రాస్వెల్(53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత యాభై ఓవర్లలో కివీస్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు స్కోరు చేసింది.భారత బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ పొదుపుగా బౌలింగ్ చేసి రెండేసి వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకోగా.. పేసర్లలో షమీ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనను దూకుడగా ఆరంభించిన భారత్ 49 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది.ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(83 బంతుల్లో 76, 7 ఫోర్లు, మూడు సిక్సర్లు) అద్భుత అర్ధ శతకం సాధించగా.. శ్రేయస్ అయ్యర్(48), కేఎల్ రాహుల్(33 బంతుల్లో 34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9 నాటౌట్) రాణించారు. కివీస్ బౌలర్లలో మైకేల్బ్రాస్వెల్, మిచెల్ సాంట్నర్రెండేసి వికెట్లు కూల్చగా.. రచిన్ రవీంద్ర, కైలీ జెమీసన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోగా.. సిరీస్ ఆసాంతం రాణించిన రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.చదవండి: మా స్పిన్నర్లు అద్భుతం: రోహిత్ శర్మ -
రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు.. ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాలేదు!
రోహిత్ శర్మ.. ఈ పేరు భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. కేవలం తొమ్మిది నెలల వ్యవదిలోనే భారత జట్టుకు రెండు ఐసీసీ టైటిల్స్ను అందించిన లీడర్ అతడు. రోహిత్ సారథ్యంలో టీ20 ప్రపంచకప్-2024 విజేతగా నిలిచిన టీమిండియా.. ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ను ముద్దాడింది.న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. మూడో సారి ఛాంపియన్స్గా నిలిచింది. ఈ విజయంతో పాతికేళ్ల కిందట కివీస్ చేతిలో పరాభావానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. దీంతో యావత్తు దేశం మొత్తం సంబరాల్లో మునిగితేలుతోంది. ప్రధాని నుంచి సామన్య మానవుడి వరకు టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.భారత కెప్టెన్ రోహిత్ శర్మది కీలకపాత్ర. రోహిత్ కెప్టెన్గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా అదరగొట్టాడు. ఫైనల్ మ్యాచ్లో 76 పరుగుల తేడాతో కీలక ఇన్నింగ్స్ ఆడిన హిట్మ్యాన్.. ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు..👉ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఫైనల్ పోరులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న తొలి కెప్టెన్గా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఏ జట్టు కెప్టెన్ కూడా ఈ ఫీట్ సాధించలేదు.👉అదేవిధంగా భారత్కు అత్యధిక ఐసీసీ టైటిల్స్ను అందించిన రెండో కెప్టెన్గా రోహిత్ నిలిచాడు. ఈ జాబితాలో దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోని ఉన్నాడు. ధోని సారథ్యంలో టీ20 ప్రపంచకప్-2007, వన్డే ప్రపంచకప్-2011, ఛాంపియన్స్ ట్రోఫీ-2013లను భారత్ కైవసం చేసుకుంది. ధోని మొత్తంగా భారత్కు మూడు టైటిల్స్ను అందించగా.. రోహిత్ రెండు టైటిల్స్ను సాధించాడు.👉పరిమిత ఓవర్ల ఐసీసీ ఈవెంట్లలో అత్యధిక విన్నింగ్ శాతం కెప్టెన్గా రోహిత్ నిలిచాడు. రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు వరుసగా మూడు వైట్బాల్ ఐసీసీ టోర్నీ ఫైనల్స్కు చేరింది. చివరి మూడు టోర్నమెంట్లలో భారత్ కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఓడిపోయింది.అది కూడా 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్. ఆ తర్వాత రెండు టోర్నీలను టీమిండియా ఆజేయంగా ముగించింది. దీంతో ఐసీసీ ఈవెంట్లలో రోహిత్ శర్మ విన్నింగ్ పర్సంటేజి 90 శాతంగా ఉంది. రోహిత్ తర్వాతి స్ధానాల్లొ పాంటింగ్(88 శాతం), గంగూలీ(80శాతం) ఉన్నారు.చదవండి: కోహ్లి, గిల్ కాదు.. అతడే సైలెంట్ హీరో: రోహిత్ శర్మ -
ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్.. ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?
గత కొన్ని రోజులుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు శుభం కార్డ్ పడింది. ఈ మెగా టోర్నీ విజేతగా భారత్(Teamindia) నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను 4 వికెట్ల తేడాతో ఓడించిన భారత జట్టు.. రికార్డుస్థాయిలో మూడోసారి చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.టోర్నీ ఆసాంతం ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటిన రోహిత్ సేన.. ఫైనల్లోనూ అదే జోరును కనబరిచి పుష్కరకాలం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని తిరిగి భారత్కు తీసుకొచ్చింది. భారత్ చివరగా 2013లో ధోని సారథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకోగా.. మళ్లీ రోహిత్ శర్మ నాయకత్వంలో తిరిగి సాధ్యమైంది. ఇక ఛాంపియన్స్గా నిలిచిన భారత్ ఎంత ప్రైజ్మనీని గెల్చుకుంది, రన్నరప్గా న్యూజిలాండ్ ఎంత మొత్తం దక్కించుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.విజేతకు ఎంతంటే?ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్గా నిలిచిన టీమిండియాకు 2.4 మిలియన్ డాలర్లు ( భారత కరెన్సీలో దాదాపు రూ. రూ.19.5 కోట్లు) అందుకుంది. అదే విధంగా రన్నరప్గా నిలిచిన కివీస్కు 1.12 మిలియన్ డాలర్ల (రూ.9.72కోట్లు) ప్రైజ్మనీ దక్కింది. సెమీఫైనల్లో ఓటిమిపాలైన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లకు 560,000 డాలర్లు (రూ.4.86కోట్లు) లభించాయి. ఐదో, ఆరో స్ధానాల్లో నిలిచిన జట్లు 350,000 డాలర్లు(రూ. 3 కోట్లు పైగా).. ఏడవ, ఎనిమిదవ స్థానంలో ఉన్న జట్లు 140,000 డాలర్లు(రూ. సుమారు 1.2 కోట్లు) దక్కించుకున్నాయి. గ్రూపు స్టేజిలో విజయం సాధించిన జట్టుకు 34,000 డాలర్లు (సుమారు రూ. 33 లక్షలు) అందనుంది. ఈ మెగా టోర్నీలో పాల్గోన్నందకు ప్రతీ జట్టుకు 125,000 డాలర్లు(రూ.కోటి) ఐసీసీ అందజేయనుంది. అంటే ఈ మెత్తాన భారత్కు రూ. 21 కోట్లపైనే అందింది.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా భారత జట్టు అవతరించింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను 4 వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను తిరిగి ముద్దాడింది. ఈ విజయంతో 25 ఏళ్ల కిందట కివీస్ చేతిలో ఎదురైన పరాభావానికి భారత జట్టు బదులు తీర్చుకుంది. ఈ మెగా టోర్నీలో అద్వితీయమైన ప్రదర్శన కనబరిచిన రోహిత్ సేన.. మరోసారి 140 కోట్లమంది భారతీయులను సగర్వంగా తలెత్తుకునేలా చేసింది.ఈ విజయంలో జట్టులోని ప్రతీ ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించారు. తొలుత బౌలర్లు అదరగొట్టగా.. అనంతరం బ్యాటర్లు తమ పని తాము చేసుకుపోయారు. కివీస్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది.రోహిత్ మాస్.. రాహుల్ క్లాస్లక్ష్య చేధనలో కెప్టెన్ రోహిత్ శర్మ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఓవర్ నుంచే కివీస్ బౌలర్లను హిట్మ్యాన్ టార్గెట్ చేశాడు. పవర్ ప్లేలో బౌండరీల వర్షం కురిపించాడు. 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. అయితే సెంచరీ చేరువలో ఓ భారీ షాట్కు ప్రయత్నించి స్టంపౌట్ రూపంలో పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మరోసారి వెన్నముకగా నిలిచారు. శ్రేయస్ అయ్యర్ (62 బంతుల్లో 48, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (33 బంతుల్లో 34 నాటౌట్, 1 ఫోర్, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(101 బంతుల్లో 3 ఫోర్లతో 63), మైఖేల్ బ్రేస్వెల్(40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు సాధించగా.. మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు.టీమిండియా వరల్డ్ రికార్డు..కాగాభారత్కు ఇది మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్. ఈ క్రమంలో టీమిండియా ఓ ప్రపంచరికార్డును తమ పేరిట లిఖించుకుంది. మూడు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను గెలుచుకున్న మొదటి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. 2002లో శ్రీలంకతో కలిసి సంయుక్తంగా ట్రోఫీని గెలుచుకున్న టీమిండియా.. ఆ తర్వాత 2013, 2025లో ఈ మెగా టోర్నీ టైటిల్ను తమ ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా, భారత్ పేరిట సంయుక్తంగా ఉండేది. కానీ ఈ విజయంతో ఆసీస్ను మెన్ బ్లూ అధిగమించింది. అదేవిధంగా వరుసగా రెండు ఐసీసీ టోర్నీల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఛాంపియన్స్గా నిలిచిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. టీ20 ప్రపంచకప్-2024లో ఆజేయంగా విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు.. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఒక్క మ్యాచ్లో కూడా టీమిండియా ఓడిపోలేదు.చదవండి: #Rohit Sharma: రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక ప్రకటన.. -
రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక ప్రకటన..
విశ్వవేదికపై మరోసారి భారత జెండా రెపరెపలాడింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా భారత క్రికెట్ జట్టు నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను 4 వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను ముద్దాడింది.ఈ విజయంతో ఏడాది తిరగకముందే మరో ఐసీసీ టైటిల్ భారత్ ఖాతాలో వేసుకుంది. కెప్టెన్గా రోహిత్ శర్మ వరుసగా రెండో ఐసీసీ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. ఈ క్రమంలో తన వన్డే రిటైర్మెంట్ వస్తున్న వార్తలకు రోహిత్ శర్మ చెక్ పెట్టాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన హిట్మ్యాన్.. ఇప్పటిలో రిటైర్ అయ్యే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశాడు.ఇప్పుడే కాదు.."చాలా సంతోషంగా ఉంది. చక్కటి క్రికెట్ ఆడిన మాకు దక్కిన ఫలితమిది. మొదటి నుంచి మా స్పిన్నర్లు ప్రభావం చూపించారు. ఎన్నో అంచనాలు ఉన్న సమయంలో వారు నిరాశపర్చలేదు. ఈ సానుకూలతను మేం సమర్థంగా వాడుకున్నాం. రాహుల్ మానసికంగా దృఢంగా ఉంటాడు.సరైన షాట్లను ఎంచుకుంటూ ఒత్తిడి లేకుండా అతను ఈ మ్యాచ్ను ముగించగలిగాడు. అతని వల్లే అవతలి వైపు పాండ్యా స్వేచ్ఛగా ఆడగలిగాడు. మా బ్యాటర్లంతా ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చారు. వరుణ్ బౌలింగ్లో ఎంతో ప్రత్యేకత ఉంది. అతను కీలక సమయాల్లో వికెట్లు తీశాడు. ఇలాంటి పిచ్పై అలాంటి బౌలర్ కావాలని అంతా కోరుకుంటారు. మాకు ఇది సొంత మైదానం కాకపోయినా పెద్ద సంఖ్యలో వచ్చి మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. దూకుడుగా బ్యాటింగ్ చేసేందుకు నన్ను కోచ్ ప్రోత్సహించారు. మరో విషయం నేను స్పష్టం చేయదల్చుకున్నాను. నేను ఈ ఫార్మాట్నుంచి రిటైర్ కావడం లేదు.ఎలాంటి వదంతులు రాకూడదని ఇది చెబుతున్నాను. సుదీర్ఘమైన క్రికెట్ ఆడినవారికి ఇంకా ఆడాలని ఉంటుంది. అయితే ఇది యువ ఆటగాళ్లపై ప్రభావం చూపుతోంది అని 38 ఏళ్ల రోహిత్ పోస్ట్మ్యాచ్ ప్రెస్కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు. కాగా రోహిత్, కోహ్లి ఇద్దరూ 2027 వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగే అవకాశముంది.భారత్ ఆల్రౌండ్ షో..ఈ ఫైనల్ పోరులో టీమిండియా ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(101 బంతుల్లో 3 ఫోర్లతో 63), మైఖేల్ బ్రేస్వెల్(40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు సాధించగా.. మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 252 పరుగుల లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ (83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 76) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా.. శ్రేయస్ అయ్యర్(62 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 48), కేఎల్ రాహుల్(33 బంతుల్లో ఫోర్, సిక్స్తో 34 నాటౌట్) కీలక నాక్స్ ఆడారు. కివీస్ బౌలర్లలో సాంట్నర్, బ్రేస్వెల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర, జెమీసన్ చెరో వికెట్ సాధించింది.చదవండి:మా స్పిన్నర్లు అద్భుతం.. ఆ ఇద్దరు సూపర్.. అతడు నాణ్యమైన బౌలర్: రోహిత్ -
భారత్ ఘన విజయం.. అభిమానంతో దద్దరిల్లిన ట్యాంక్ బండ్ (ఫొటోలు)
-
IND Vs NZ: చాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్ (ఫొటోలు)
-
Virat Kohli: అద్భుత విజయం.. అంతులేని సంతోషం!.. ఆసీస్ టూర్ తర్వాత..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) ఫైనల్లో టీమిండియా విజయం పట్ల స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) హర్షం వ్యక్తం చేశాడు. టోర్నమెంట్ ఆసాంతం జట్టులోని ప్రతి ఒక్క సభ్యుడు టైటిల్ గెలిచేందుకు తమ వంతు సహకారం అందించాడని తెలిపాడు. భారత జట్టులో ప్రస్తుతం ప్రతిభకు కొదువలేదని.. యువ ఆటగాళ్లు సీనియర్ల సలహాలు తీసుకుంటూనే తమదైన శైలిలో ముందుకు సాగుతున్న తీరును కొనియాడాడు.కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్.. ఆదివారం దుబాయ్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య ఫైనల్తో ముగిసింది. ఈ వన్డే టోర్నీలో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్ ఇంగ్లండ్ పోటీపడ్డాయి. అయితే, ఆసీస్ను ఓడించి టీమిండియా.. సౌతాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్ తుదిపోరుకు అర్హత సాధించాయి.ఈ క్రమంలో మార్చి 9 నాటి మ్యాచ్లో రోహిత్ సేన ఆఖరి వరకు పోరాడి కివీస్పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది.. టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో విజయానంతరం కోహ్లి తన మనసులోని భావాలు పంచుకున్నాడు. ‘‘ఇది అద్భుత విజయం. ఆస్ట్రేలియా పర్యటనలో చేదు అనుభవం తర్వాత పెద్ద టోర్నమెంట్ గెలవాలని మేము కోరుకున్నాం.సరైన దిశలోఇలాంటి తరుణంలో చాంపియన్స్ ట్రోఫీ గెలవడం అద్భుతంగా అనిపిస్తోంది. యువ ఆటగాళ్లతో కలిసి ఆడటం సంతోషంగా ఉంది. సీనియర్లుగా మేము మా అనుభవాలను వారితో పంచుకుంటున్నాం. వారు కూడా మా సలహాలు, సూచనలు తీసుకుంటూనే తమదైన శైలిలో రాణిస్తున్నారు.జట్టు ప్రస్తుతం సరైన దిశలో వెళ్తోంది. ఈ టోర్నీ మొత్తాన్ని మేము ఆస్వాదించాం. కొంతమంది బ్యాట్తో రాణిస్తే.. మరికొందరు బంతితో ప్రభావం చూపారు. అంతా కలిసి జట్టు విజయంలో భాగమయ్యారు. ఐదు మ్యాచ్లలో ప్రతి ఒక్కరు సరైన సమయంలో సరైన విధంగా రాణించి జట్టు గెలుపునకు బాటలు వేశారు. నిజంగా మాకు ఇది చాలా చాలా అద్భుతమైన టోర్నమెంట్’’ అంటూ కోహ్లి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.కాగా ఈ టోర్నీలో దాయాది పాకిస్తాన్తో మ్యాచ్లో శతకం(100 నాటౌట్)తో మెరిసిన కోహ్లి.. ఆసీస్తో సెమీ ఫైనల్లోనూ అద్భుత అర్ధ శతకం(84)తో రాణించాడు. అయితే టైటిల్ పోరులో మాత్రం దురదృష్టవశాత్తూ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉంటే.. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్లను చిత్తు చేసిన రోహిత్ సేన.. సెమీస్లో ఆసీస్ను, ఫైనల్లో కివీస్ను ఓడించి అజేయంగా టైటిల్ విజేతగా నిలిచింది. ఇక కెప్టెన్గా రోహిత్ శర్మకు ఇది రెండో ఐసీసీ టైటిల్. గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన హిట్మ్యాన్.. తాజాగా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను కూడా సాధించాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ స్కోర్లు👉వేదిక: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, దుబాయ్👉టాస్: న్యూజిలాండ్... తొలుత బ్యాటింగ్👉న్యూజిలాండ్ స్కోరు: 251/7 (50)👉కివీస్ టాప్ రన్ స్కోరర్: డారిల్ మిచెల్(101 బంతులలో 63)👉టీమిండియా స్కోరు: 254/6 (49)👉ఫలితం: న్యూజిలాండ్పై నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రోహిత్ శర్మ(83 బంతుల్లో 7 ఫోర్లు,3 సిక్స్ లు 76 పరుగులు).చదవండి: మా స్పిన్నర్లు అద్భుతం: రోహిత్ -
మా స్పిన్నర్లు అద్భుతం.. అతడు ఒత్తిడిని చిత్తు చేశాడు: రోహిత్
పుష్కరకాలం తర్వాత టీమిండియా మరోసారి చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025)ని ముద్దాడింది. పాతికేళ్ల క్రితం న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని 2025 విజేతగా ఆవిర్భవించింది. దుబాయ్ వేదికగా ఆదివారం నాటి ఫైనల్లో కివీస్ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో సాంట్నర్ బృందంపై పైచేయి సాధించి అభిమానులకు కనులవిందు చేసింది.మా స్పిన్నర్లు అద్భుతంఈ నేపథ్యంలో విజయానంతరం భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మాట్లాడుతూ సమిష్టి కృషి వల్లే గెలుపు సాధ్యమైందని సహచరులపై ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా స్పిన్నర్లు చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆసాంతం అదరగొట్టారని కితాబులిచ్చాడు. అదే విధంగా తమకు మద్దతుగా నిలిచిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు.‘‘ఇది మా సొంత మైదానం కాదు. అయినప్పటికీ మాకు మద్దతుగా అభిమానులు ఇక్కడికి తరలివచ్చారు. మా హోం గ్రౌండ్ ఇదే అన్నంతలా మాలో జోష్ నింపారు. గెలుపుతో మేము వారి మనసులను సంతృప్తిపరిచాం.ఫైనల్లో మాత్రమే కాదు.. టోర్నీ ఆరంభం నుంచీ మా స్పిన్నర్లు గొప్పగా రాణించారు. దుబాయ్ పిచ్ స్వభావరీత్యా వారిపై భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ ఒత్తిడికి లోనుకాకుండా పనిపూర్తి చేశారు. వారి నైపుణ్యాలపై నమ్మకంతో మేము తీసుకున్న నిర్ణయాలు సరైనవే అని నిరూపించారు. వారి బలాలను మాకు అనుకూలంగా మలచుకోవడంలో మేము సఫలమయ్యాం.అతడు ఒత్తిడిని చిత్తు చేశాడుఇక.. కేఎల్ రాహుల్(KL Rahul) గురించి చెప్పాలంటే.. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒత్తిడిని దరిచేరనీయడు. అందుకే మేము అతడి సేవలను మిడిల్లో ఎక్కువగా ఉపయోగించుకున్నాం. ఈరోజు తను బ్యాటింగ్ చేస్తున్నపుడు పరిస్థితులు మాకు అంత అనుకూలంగా లేవు. అయినప్పటికీ అతడు ఏమాత్రం తడబడకుండా షాట్ల ఎంపికలో సంయమనం పాటించాడు.తనతో పాటు బ్యాటింగ్ చేస్తున్న ఆటగాడు స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించేలా చక్కటి సహకారం అందిస్తాడు. తను సరికొత్తగా కనిపిస్తున్నాడు. నాణ్యమైన బౌలర్ఇక వరుణ్ టోర్నీ ఆరంభంలో ఆడలేదు. అయితే, న్యూజిలాండ్తో లీగ్ మ్యాచ్లో ఐదు వికెట్లతో మెరిసిన తర్వాత అతడి సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని మేము నిర్ణయించుకున్నాం. అతడొక నాణ్యమైన బౌలర్. ట్రోఫీ గెలవడంలో ప్రతి ఒక్క సభ్యుడు తమ వంతు పాత్ర పోషించారు’’ అని జట్టు ప్రదర్శన పట్ల రోహిత్ శర్మ సంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. డారిల్ మిచెల్(63), మైకేల్ బ్రాస్వెల్(53 నాటౌట్) అర్ధ శతకాలతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. షమీ, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ తీశారు.ఇక లక్ష్య ఛేదనలో భారత్కు ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్(31) శుభారంభం అందించారు. విరాట్ కోహ్లి(1) విఫలం కాగా.. శ్రేయస్ అయ్యర్(48)తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. 76 పరుగుల వద్ద రోహిత్ స్టంపౌట్ కాగా.. అక్షర్ పటేల్(29), కేఎల్ రాహుల్(33 బంతుల్లో 34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9) వేగంగా ఆడి మరో ఓవర్ మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు. రోహిత్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేత భారత్.. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో న్యూజిలాండ్పై విజయం
పాకిస్తాన్, దుబాయ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్లో టీమిండియా విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చి 9) జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత స్పిన్నర్లు చెలరేగిన వేల డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్వెల్ (53 నాటౌట్) అద్భుతమైన అర్ద సెంచరీలు సాధించి న్యూజిలాండ్కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. ఆదిలో రచిన్ రవీంద్ర (37), ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (34) మంచి ఇన్నింగ్స్లు ఆడారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో విల్ యంగ్ (15), కేన్ విలియమ్సన్ (11), టామ్ లాథమ్ (14),మిచెల్ సాంట్నర్ (8) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో 2.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. కుల్దీప్, వరుణ్, జడ్డూ, అక్షర్ పొదుపుగా బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్లో భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్ బ్యాటర్లు భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశారు.అనంతరం స్పిన్కు అనుకూలించే పిచ్పై 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఛేదనలో రోహిత్ (76) భారత్కు శుభారంభాన్ని అందించారు. శుభ్మన్ గిల్తో (31) కలిసి తొలి వికెట్కు 105 పరుగులు జోడించాడు. అయితే భారత్ 17 పరుగుల వ్యవధిలో గిల్, కోహ్లి (1), రోహిత్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ (48), అక్షర్ పటేల్ (29) మంచి భాగస్వామ్యం నెలకొల్పి భారత్ను తిరిగి గేమ్లోకి తెచ్చారు. అయితే శ్రేయస్, అక్షర్ కూడా స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో టీమిండియా మరోసారి ఒత్తిడిలో పడింది. ఇన్నింగ్స్ మధ్యలో పరుగులు చేసేందుకు భారత బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. న్యూజిలాండ్ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా బ్యాటర్లపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు.ఈ దశలో కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజాతో (18 నాటౌట్) కలిసి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్ను విజయతీరాలకు చేర్చాడు. జడేజా బౌండరీ బాది భారత్ను గెలిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్, బ్రేస్వెల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జేమీసన్, రచిన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం భారత్కు ఇది మూడోసారి (2002, 2013, 2025). ఫైనల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. టోర్నీ ఆధ్యాంతం రాణించిన రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు లభించింది. -
CT 2025 Final: గ్లెన్ ఫిలిప్స్ కళ్లు చెదిరే క్యాచ్.. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమం
క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమమైన క్యాచ్ నమోదైంది. న్యూజిలాండ్తో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో గ్లెన్ ఫిలిప్స్ ఈ క్యాచ్ను అందుకున్నాడు. మిచెల్ సాంట్నర్ బౌలింగ్లో శుభ్మన్ గిల్ ఆడిన షాట్ను (కవర్స్ దిశగా) ఫిలిప్స్ అమాంతం గాల్లోకి ఎగిరి పట్టేసుకున్నాడు. ఈ క్యాచ్ను ఫిలిప్స్ సైతం నమ్మలేకపోయాడు. క్యాచ్ పట్టిన తర్వాత కింద కూర్చుని క్యాచ్ పట్టానా అన్నట్లు ఎక్స్ప్రెషన్ పెట్టాడు. What a magnificent catch by GLENN PHILLIPS 🤯👏👏👏#INDvsNZ #ChampionsTrophyFinal pic.twitter.com/1CxjG3QYiw— INNOCENT EVIL ⁶𓅓 (@raju_innocentev) March 9, 2025ఈ క్యాచ్ను చూసి గిల్ నోరెళ్లపెట్టాడు. ఈ క్యాచ్ తర్వాత దుబాయ్ స్టేడియంలో నిశ్శబ్దం ఆవహించింది. అప్పటిదాకా భారత్కు సపోర్ట్ చేసిన ప్రేక్షకులు ఫిలిప్స్ క్యాచ్ చూసి షాక్లో ఉండిపోయారు. అస్సలు సాధ్యంకాని క్యాచ్ను పట్టడంతో అభిమానులు ఫిలిప్స్కు జేజేలు పలుకుతున్నారు. ఈ క్యాచ్ను సంబంధించిన వీడియో సోషల్మీడియాను షేక్ చేస్తుంది. ఫిలిప్స్ మనిషా లేక పక్షా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఫిలిప్స్ ఇదే టోర్నీలో విరాట్ కోహ్లి క్యాచ్ను (గ్రూప్ దశ మ్యాచ్లో) కూడా ఇలాగే నమ్మశక్యంకాని రీతిలో పట్టుకున్నాడు. ఆ క్యాచ్ను ఇది తలదన్నేలా ఉంది. క్యాచెస్ విన్ మ్యాచెస్ అన్న నానుడుని ఫిలిప్స్ నిజం చేస్తాడేమో చూడాలి.ఫిలిప్స్ పట్టుకున్న క్యాచ్ ఆషామాషీ వ్యక్తిది కాదు. గిల్ మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేసే సత్తా ఉన్న ఆటగాడు. అదీ కాక భారత్ అప్పటిదాకా బాగా స్కోర్ చేసి విజయం దిశగా దూసుకుపోతుండుంది. ఫిలిప్స్ క్యాచ్తో భారత్ డిఫెన్స్లో పడింది. పుండుపై కారం చల్లినట్లు గిల్ (31) ఔటైన పరుగు వ్యవధిలోనే భారత్ అత్యంత కీలకమైన విరాట్ కోహ్లి (1) వికెట్ కూడా కోల్పోయింది. మరో 17 పరుగుల తర్వాత క్రీజ్లో కుదురుకుపోయిన రోహిత్ శర్మ (76) కూడా ఔటయ్యాడు. దీంతో భారత్ ఒక్కసారిగా కష్టాల్లో కూరుకుపోయినట్లైంది. శ్రేయస్ అయ్యర్ (35), అక్షర్ పటేల్ (13) భారత ఇన్నింగ్స్ను చక్కద్దిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 35 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 161/3గా ఉంది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే 90 బంతుల్లో 91 పరుగులు చేయాలి. చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. స్పిన్కు అనుకూలిస్తున్న పిచ్పై డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్వెల్ (53 నాటౌట్) అద్భుతమైన అర్ద సెంచరీలు చేసి న్యూజిలాండ్కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో విల్ యంగ్ 15, రచిన్ రవీంద్ర 37, కేన్ విలియమ్సన్ 11, టామ్ లాథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ 34, మిచెల్ సాంట్నర్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్లో భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినా న్యూజిలాండ్ మంచి స్కోర్ చేసింది. -
CT 2025 Final: తొలి హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్స్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి భారత్ ముందు ఫైటింగ్ టార్గెట్ను (252) ఉంచింది. స్పిన్కు అనుకూలిస్తున్న పిచ్పై డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్వెల్ (53 నాటౌట్) అద్భుతమైన అర్ద సెంచరీలతో రాణించారు. ఫలితంగా న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో విల్ యంగ్ 15, రచిన్ రవీంద్ర 37, కేన్ విలియమ్సన్ 11, టామ్ లాథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ 34, మిచెల్ సాంట్నర్ 8 పరుగులు చేశారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్లో భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినా న్యూజిలాండ్ మంచి స్కోర్ చేయగలిగింది.అనంతరం 252 పరుగుల లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్ రోహిత్ శర్మ ధాటిగా ఇన్నింగ్స్ను ప్రారంభించాడు. రోహిత్ కేవలం 41 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐసీసీ టోర్నీల ఫైనల్స్లో రోహిత్ శర్మకు ఇది తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఈ టోర్నీ ప్రస్తుత ఎడిషన్లోనూ రోహిత్కు ఇదే తొలి హాఫ్ సెంచరీ.18 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 103/0గా ఉంది. రోహిత్తో (62 బంతుల్లో 69; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) పాటు శుభ్మన్ గిల్ (46 బంతుల్లో 29; సిక్స్) క్రీజ్లో ఉన్నాడు. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే మరో 32 ఓవర్లలో 149 పరుగులు చేయాలి.ఐసీసీ టోర్నీల ఫైనల్స్లో రోహిత్ శర్మ స్కోర్లు.. 69*(62), 2025 CT 9(5), 2024 T20 WC47(31), 2023 ODI WC43(60), 2023 WTC15(26), 2023 WTC30(81), 2021 WTC34(68), 2021 WTC0(3), 2017 CT29(26), 2014 T20 WC9(14), 2013 CT30*(16), 2007 T20 WC -
CT 2025 Final: రవీంద్ర జడేజా రిటైర్మెంట్..?
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ తర్వాత టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని సోషల్మీడియా కోడై కూస్తుంది. ఫైనల్ మ్యాచ్లో జడ్డూ తన కోటా 10 ఓవర్లు పూర్తి చేసిన తర్వాత విరాట్ కోహ్లి అతన్ని భావోద్వేగంతో హగ్ చేసుకోవడంతో ఈ ప్రచారం మొదలైంది. విరాట్.. ఆసీస్తో జరిగిన సెమీఫైనల్ తర్వాత స్టీవ్ స్మిత్ను కూడా ఇలాగే హగ్ చేసుకున్నాడు. ఆ మ్యాచ్ అనంతరం స్టీవ్ స్మిత్ వన్డేలకు గుడ్ బై చెప్పాడు. దీంతో ఫైనల్ మ్యాచ్ తర్వాత జడేజా కూడా రిటైర్ అవుతాడని సోషల్మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తుంది.Kohli hugged Smith - Retirement Kohli hugged jadeja - Retirement??#Indvsnz #Indvsnzfinal pic.twitter.com/DtKFESNFii— भाई साहब (@Bhai_saheb) March 9, 2025కాగా, న్యూజిలాండ్తో జరుగుతున్న ఫైనల్లో జడేజా ఎక్కువ వికెట్లు తీయకపోయినా చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్లో జడ్డూ కీలకమైన టామ్ లాథమ్ వికెట్ తీసి తన కోటా 10 ఓవర్లలో కేవలం 30 పరుగులు మాత్రమే ఇచ్చాడు. జడేజా మిడిల్ ఓవర్లలో చాలా పొదుపుగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ టోర్నీలో జడేజా మొదటి మ్యాచ్ నుంచి ఇలాంటి ప్రదర్శనలతోనే ఆకట్టుకున్నాడు. ఈ టోర్నీలో జడేజా 5 మ్యాచ్ల్లో 4.36 ఎకానమీతో 5 వికెట్లు తీశాడు. జడేజా గతేడాది టీ20 వరల్డ్కప్ తర్వాత టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ టోర్నీలో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 2024 టీ20 వరల్డ్కప్ తర్వాత జడేజాతో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కూడా పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఒకవేళ జడేజా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత నిజంగానే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించినా టెస్ట్ల్లో కొనసాగే అవకాశం ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. న్యూజిలాండ్తో జరుగుతున్న ఫైనల్లో భారత స్పిన్నర్లు చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో జడేజా సహా భారత స్పిన్నర్లంతా చెలరేగినా న్యూజిలాండ్ బ్యాటర్లు మంచి స్కోర్నే చేశారు. స్పిన్కు అనుకూలిస్తున్న పిచ్పై డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్వెల్ (53 నాటౌట్) అద్భుతమైన అర్ద సెంచరీలు చేసి న్యూజిలాండ్కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో విల్ యంగ్ 15, రచిన్ రవీంద్ర 37, కేన్ విలియమ్సన్ 11, టామ్ లాథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ 34, మిచెల్ సాంట్నర్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.252 పరుగుల ఛేదనలో భారత్కు రోహిత్ శర్మ మెరుపు ఆరంభాన్ని అందించాడు. రోహిత్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. మరో ఎండ్లో శుభ్మన్ గిల్ 13 బంతుల్లో 7 పరుగులు చేసి రోహిత్కు ఎక్కువగా స్ట్రయిక్ ఇస్తున్నాడు. 8 ఓవర్ల తర్వాత ఇండియా స్కోర్ 59/0గా ఉంది. -
CT 2025 Final: సత్తా చాటిన టీమిండియా స్పిన్నర్లు.. అయినా టఫ్ టార్గెట్ను సెట్ చేసిన న్యూజిలాండ్
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్వెల్ (53 నాటౌట్) అర్ద సెంచరీలు చేసి న్యూజిలాండ్కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో విల్ యంగ్ 15, రచిన్ రవీంద్ర 37, కేన్ విలియమ్సన్ 11, టామ్ లాథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ 34, మిచెల్ సాంట్నర్ 8 పరుగులు చేశారు.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.ఈ మ్యాచ్లో భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినా న్యూజిలాండ్ మంచి స్కోర్ చేయగలిగింది. డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్వెల్ అత్యంత కీలకమైన ఇన్నింగ్స్లు ఆడి భారత్కు టఫ్ టార్గెట్ నిర్దేశించారు. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తమ కోటా 10 ఓవర్లు పూర్తి చేసి పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలకమైన వికెట్లు తీశారు. అయితే ఇన్నింగ్స్ చివర్లో అక్షర్ పటేల్ కోటా ఓవర్లు ఇంకా మిగిలి ఉన్నా (2 ఓవర్లు) కెప్టెన్ రోహిత్ ఎందుకో అతనితో బౌలింగ్ చేయించలేదు. చివరి 3 ఓవర్లలో షమీ 2, హార్దిక్ ఓ ఓవర్ వేశారు. ఈ 3 ఓవర్లలో న్యూజిలాండ్ 35 పరుగులు పిండుకుంది. న్యూజిలాండ్ 235 పరుగులు చేస్తే కష్టమనుకున్న తరుణంలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. చివరి ఓవర్లలో షమీ, హార్దిక్ ఇచ్చిన పరుగులు టీమిండియా ఫేట్ను మార్చే ప్రమాదముంది.ఈ పిచ్పై 252 పరుగులు ఛేదించడం అంత ఆషామాషీ విషయం కాదు. పిచ్పై మంచి టర్న్ లభిస్తుంది. న్యూజిలాండ్ వద్ద సాంట్నర్, బ్రేస్వెల్ లాంటి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ తమ స్పిన్ బౌలింగ్తో మాయాజాలం చేయగలరు. మొత్తంగా భారత బ్యాటర్లు న్యూజిలాండ్ బౌలర్ల నుంచి కఠినమైన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఛేదనలో ఓపెనర్ రోహిత్ కనీసం 20 ఓవర్ల పాటు క్రీజ్లో ఉండటం చాలా కీలకం. రోహిత్ తన సహజ శైలిలో వేగంగా పరుగులు సాధించే క్రమంలో వికెట్ కోల్పోతే టీమిండియా మూల్యం చెల్లించుకోక తప్పదు. భారత్కు ఓపెనింగ్ భాగస్వామ్యం చాలా కీలకం. భారత్ పవర్ ప్లేలో ఎట్టి పరిస్థితుల్లో వికెట్లు కోల్పోకూడదు. ఒకవేళ టీమిండియా పవర్ ప్లేలో వికెట్లు కోల్పోతే మిడిలార్డర్పై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. స్పిన్కు అనుకూలించే పిచ్పై సాంట్నర్, బ్రేస్వెల్ లాంటి బౌలర్లను తట్టుకుని నిలబడటం ఆషామాషీ విషయం కాదు. -
CT 2025 Final: నాలుగు క్యాచ్లు జారవిడిచిన టీమిండియా ఫీల్డర్లు.. మూల్యం తప్పదా..?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో ఇవాళ (మార్చి 9) భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తుండటంతో న్యూజిలాండ్ 196 పరుగులకు (44 ఓవర్లలో) సగం వికెట్లు కోల్పోయింది. డారిల్ మిచెల్ (51), మైఖేల్ బ్రేస్వెల్ (21) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా ఓ వికెట్ దక్కించుకున్నాడు. వరుణ్, కుల్దీప్ న్యూజిలాండ్ ఆటగాళ్లు భాగస్వామ్యాలు నెలకొల్పుతున్న సమయంలో వికెట్లు తీసి భారత్ను తిరిగి ఆటలోకి తెచ్చారు. భారత్కు తొలి ఫలితం వరుణ్ చక్రవర్తి అందించాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ చివరి బంతికి వరుణ్ విల్ యంగ్ను (15) ఎల్బీడబ్ల్యూ చేశాడు. అనంతరం కుల్దీప్ తన మొదటి బంతికే ఇన్ ఫామ్ బ్యాటర్ రచిన్ రవీంద్రను (37) క్లీన్ బౌల్డ్ చేశాడు. కొద్ది సేపటికే కుల్దీప్ మరో అద్భుత బంతితో స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ను (11) క్యాచ్ అండ్ బౌల్డ్ చేశాడు. మిచెల్, లాథమ్ క్రీజ్లో కుదురుకుంటుండగా.. జడేజా లాథమ్ను (14) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మిచెల్తో కలిసి 50 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పి ప్రమాదకరంగా కనిపిస్తున్న ఫిలిప్స్ను (34) వరుణ్ చక్రవర్తి మరో అద్బుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు.ఇంతవరకు బాగానే ఉన్నా, ఈ మ్యాచ్లో భారత ఫీల్డర్ల ప్రదర్శన చాలా దారుణంగా ఉండింది. 40 ఓవర్లలోపే భారత ఫీల్డర్లు నాలుగు క్యాచ్లు డ్రాప్ చేశారు. తొలుత రచిన్ రవీంద్ర అందించిన రెండు క్యాచ్లను శ్రేయస్ అయ్యర్, మహ్మద్ షమీ నేలపాలు చేశారు. అయితే అదృష్టవశాత్తు రచిన్ ఔట్ కావడంతో భారత ఆటగాళ్లు ఊపిరిపీల్చుకున్నారు. తర్వాత భారత ఫీల్డర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మరో రెండు క్యాచ్లు జారవిడిచారు. డారిల్ మిచెల్ క్యాచ్ను రోహిత్.. ఫిలిప్స్ క్యాచ్ను గిల్ వదిలేశారు. ప్రమాదకరంగా కనిపిస్తున్న ఫిలిప్స్ ఔటయ్యాడు కానీ మరో డేంజర్ బ్యాటర్ డారిల్ మిచెల్ ఇంకా క్రీజ్లోనే ఉన్నాడు. మిచెల్ డ్రాప్ క్యాచ్కు టీమిండియా మూల్యం చెల్లించకుంటుందేమో వేచి చూడాలి. -
వారెవ్వా కుల్దీప్.. దెబ్బకు రవీంద్ర ఫ్యూజ్లు ఔట్! వీడియో వైరల్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో దుబాయ్ వేదికగా న్యూజిలాండ్తో జరగుతున్న ఫైనల్లో కుల్దీప్ యాదవ్ తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శిస్తున్నాడు. కుల్దీప్ బౌలింగ్ ఎటాక్లోకి వచ్చిన తొలి బంతికే భారత్కు వికెట్ అందించాడు. అప్పటివరకు దూకుడుగా ఆడుతున్న కివీ స్టార్ ఓపెనర్ రచిన్ రవీంద్రను కుల్దీప్ అద్బుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. కుల్దీప్ వేసిన బంతికి రచిన్ వద్ద సమాధానమే లేకుండా పోయింది.న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన కుల్దీప్ తొలి బంతిని రవీంద్రకు గూగ్లీగా సంధించాడు. ఆ డెలివరీని రచిన్ బ్యాక్ఫుట్పై నుంచి ఆఫ్సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి మాత్రం బ్యాట్కు మిస్స్ అయ్యి ప్యాడ్కు తాకుతూ స్టంప్స్ను గిరాటేసింది. దీంతో రవీంద్ర ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఈ వికెట్తో టీమిండియా సంబరాల్లో మునిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. రవీంద్ర 29 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్తో 37 పరుగులు చేశాడు. కాగా కుల్దీప్ తన తరవాతి ఓవర్లో కేన్ విలియమ్సన్ను కూడా బోల్తా కొట్టించాడు. విలియమ్సన్.. కుల్దీప్కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లు ముగిసే సరికి కివీస్.. 3 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది.ఫైనల్ మ్యాచ్కు తుది జట్లున్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కైల్ జామిసన్, విలియం ఓరూర్కే, నాథన్ స్మిత్భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిచదవండి: Champions Trophy Final: రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనేDC Blood Kuldeep Yadav got 2 wickets.KL Rahul and Kuldeep Yadav duo will gonna cook all thye ipl teams pic.twitter.com/EzuPwtBuVN— KL'sGIRL (@Silverglohss_1) March 9, 2025 -
రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే?
అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిన కెప్టెన్గా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా రికార్డును సమం చేశాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భారత్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా రోహిత్ ఈ ఫీట్ను తన ఖాతాలో వేసుకున్నాడు.రోహిత్ ఇప్పటివరకు వన్డేల్లో వరుసగా 12 సార్లు టాస్ ఓడిపోయాడు. బ్రియాన్ లారా కూడా వరుసగా 12 సార్లు టాస్ ఓడిపోయాడు. ఇక ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్కు కివీస్ స్టార్ పేసర్ మాట్ హెన్రీ గాయం కారణంగా దూరమయ్యాడు.ఆజేయంగా భారత్..ఇక ఈ టోర్నీలో టీమిండియా ఆజేయంగా ఫైనల్కు చేరింది. లీగ్ స్టేజిలో మూడుకు మూడు మ్యాచ్లు గెలిచిన భారత్.. సెమీస్లో ఆస్ట్రేలియాపై అద్బుతమైన విజయం సాధించింది. ఫైనల్లో కూడా కివీస్ను ఓడించి మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను తమ ఖాతాలో వేసుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే ఐసీసీ టోర్నీల్లో ఇప్పటివరకు ఫైనల్లో ఒక్కసారి కివీస్పై భారత్ గెలవలేదు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2000, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి చవిచూసింది.వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన కెప్టెన్లు👉బ్రియన్ లారా- వెస్టిండీస్ మాజీ సారథి- అక్టోబరు 1998- మే 1999 వరకు- 12 సార్లు 👉రోహిత్ శర్మ- ఇండియా కెప్టెన్- నవంబరు 2023- మార్చి 2025*-12 సార్లు 👉పీటర్ బారెన్- నెదర్లాండ్స్ మాజీ కెప్టెన్- మార్చి 2011 నుంచి ఆగష్టు 2013-11 సార్లుఫైనల్ మ్యాచ్కు తుది జట్లున్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కైల్ జామిసన్, విలియం ఓరూర్కే, నాథన్ స్మిత్భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిచదవండి: Champions Trophy: ఫైనల్కు ముందు న్యూజిలాండ్కు భారీ షాక్.. -
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేత భారత్.. ఫైనల్లో న్యూజిలాండ్పై విజయం
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేత భారత్.. ఫైనల్లో న్యూజిలాండ్పై విజయం2025 ఎడిషన్ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా అవతరించింది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (మార్చి 9) జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం ఇది మూడోసారి.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేయగా.. భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్వెల్ (53 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించగా.. విల్ యంగ్ 15, రచిన్ రవీంద్ర 37, కేన్ విలియమ్సన్ 11, టామ్ లాథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ 34, మిచెల్ సాంట్నర్ 8 పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో 2.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.ఛేదనలో భారత్కు రోహిత్ శర్మ (76) శుభారంభం అందించారు. రోహిత్.. శుభ్మన్ గిల్తో (31) కలిసి తొలి వికెట్కు 105 పరుగులు జోడించారు. అయితే భారత్ 17 పరుగుల వ్యవధిలో గిల్, కోహ్లి (1), రోహిత్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ (48), అక్షర్ పటేల్ (29) మంచి భాగస్వామ్యం నెలకొల్పి భారత్ను తిరిగి గేమ్లోకి తెచ్చారు. చివర్లో కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజాతో (18 నాటౌట్) కలిసి భారత్ను విజయతీరాలకు చేర్చారు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్, బ్రేస్వెల్ తలో 2.. జేమీసన్, రచిన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. అక్షర్ ఔట్203 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. బ్రేస్వెల్ బౌలింగ్లో రూర్కీకి క్యాచ్ ఇచ్చి అక్షర్ పటేల్ (29) ఔటయ్యాడు. 44 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 212/5గా ఉంది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే 36 బంతుల్లో 40 పరుగులు చేయాలి. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. శ్రేయస్ ఔట్183 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. వేగంగా పరుగులు రాబట్టే క్రయంలో శ్రేయస్ అయ్యర్ (48) ఔటయ్యాడు. సాంట్నర్ బౌలింగ్లో రచిన్ క్యాచ్ పట్టడంతో శ్రేయస్ పెవిలియన్ బాటపట్టాడు. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే 68 బంతుల్లో 69 పరుగులు చేయాలి. 38.4 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 183/4గా ఉంది.జాగ్రత్తగా ఆడుతున్న శ్రేయస్, అక్షర్252 పరుగుల ఛేదనలో స్వల్ప వ్యవధిలో గిల్, విరాట్, రోహిత్ శర్మ వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన భారత్ను శ్రేయస్ అయ్యర్ (47), అక్షర్ పటేల్ (17) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరు జాగ్రత్తగా ఆడుతూ భారత్ను విజయతీరాలవైపు తీసుకెళ్తున్నారు. 37 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 176/3గా ఉంది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే 78 బంతుల్లో 76 పరుగులు చేయాలి. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. రోహిత్ శర్మ ఔట్252 పరుగుల ఛేదనలో టీమిండియాకు మంచి ఆరంభం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. తొలి వికెట్కు 105 పరుగుల భాగస్వామ్యం అనంతరం భారత్ 17 పరుగుల వ్యవధిలో మూడు కీలకమైన వికెట్లు కోల్పోయింది. 105 పరుగుల వద్ద పరుగు వ్యవధిలో గిల్, కోహ్లి వికెట్లు కోల్పోయిన భారత్.. 122 పరుగుల వద్ద రోహిత్ శర్మ (76) వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పటిదాకా చాలా జాగ్రత్తగా ఆడిన రోహిత్.. పరుగులు అస్సలు రాకపోవడంతో ఒత్తిడికి లోనై భారీ షాట్కు ప్రయత్నించాడు. రచిన్ రవీంద్ర బౌలింగ్లో క్రీజ్ దాటి చాలా ముందుకు వచ్చిన రోహిత్ బంతి కనెక్ట్ కాకపోవడంతో స్టంపౌటయ్యాడు. పరుగు వ్యవధిలో గిల్, కోహ్లి వికెట్లు కోల్పోయిన టీమిండియాపరుగు వ్యవధిలో టీమిండియా రెండు కీలకమైన వికెట్లు కోల్పోయింది. 105 పరుగుల వద్ద గిల్, 106 పరుగుల వద్ద కోహ్లి ఔటయ్యారు. అప్పటిదాకా గెలుపుపై ధీమా ఉన్న టీమిండియా ఒక్కసారిగా ఇద్దరు స్టార్ల వికెట్లు కోల్పోవడంతో డిఫెన్స్లో పడింది. గిల్ను సాంట్నర్.. కోహ్లిని బ్రేస్వెల్ ఔట్ చేశారు. గ్లెన్ ఫిలిప్స్ నమ్మశక్యంకాని రీతిలో క్యాచ్ పట్టడంతో గిల్ పెవిలియన్ బాట పట్టగా.. కోహ్లిని బ్రేస్వెల్ వికెట్ల ముందు దొరికించుకున్నాడు. 17 ఓవర్లలో 100 పరుగులు పూర్తి చేసిన టీమిండియా252 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 17 ఓవర్లలో 100 పరుగులు పూర్తి చేసుకుంది. భారత్ వికెట్ నష్టపోకుండా ఈ మార్కును తాకింది. రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని 68 పరుగులతో, గిల్ 27 పరుగులతో అజేయంగా ఉన్నారు. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే మరో 152 పరుగులు చేయాలి. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ 252 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ ధాటిగా ఇన్నింగ్స్ను ప్రారంభించాడు. 41 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 11 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 65/0గా ఉంది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే మరో 187 పరుగులు చేయాలి.టార్గెట్ 252.. ధాటిగా ఆడుతున్న రోహిత్ శర్మ252 పరుగుల ఛేదనలో భారత్కు రోహిత్ శర్మ మెరుపు ఆరంభాన్ని అందించాడు. రోహిత్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. మరో ఎండ్లో శుభ్మన్ గిల్ 13 బంతుల్లో 7 పరుగులు చేసి రోహిత్కు ఎక్కువగా స్ట్రయిక్ ఇస్తున్నాడు. 8 ఓవర్ల తర్వాత ఇండియా స్కోర్ 59/0గా ఉంది. మిచెల్, బ్రేస్వెల్ హాఫ్ సెంచరీలు.. టీమిండియా టార్గెట్ 252ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి టీమిండియా ముందు 252 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కివీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్వెల్ (53 నాటౌట్) అర్ద సెంచరీలు చేసి టీమిండియాకు ఫైటింగ్ టార్గెట్ను నిర్దేశించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. విరాట్ కోహ్లి సూపర్ త్రో.. సాంట్నర్ రనౌట్విరాట్ కోహ్లి సూపర్ త్రోతో మిచెల్ సాంట్నర్ను (8) రనౌట్ చేశాడు. 239 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఏడో వికెట్ కోల్పోయింది.ఆరో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్45.4వ ఓవర్: 211 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్లో రోహిత్ శర్మ క్యాచ్ పట్టడంతో డారిల్ మిచెల్ (63) ఔటయ్యాడు. ఔట్ కాకముందు మిచెల్ షమీ బౌలింగ్లో రెండు బౌండరీలు కొట్టాడు.డేంజరెస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ ఔట్37.5వ ఓవర్: డేంజరెస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ ఔటయ్యాడు. వరుణ్ చక్రవర్తి ఫిలిప్స్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 38 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 165/5గా ఉంది. డారిల్ మిచెల్కు (44) జతగా బ్రేస్వెల్ క్రీజ్లోకి వచ్చాడు. నిలకడగా ఆడుతున్న మిచెల్, ఫిలిప్స్లాథమ్ వికెట్ పడ్డ తర్వాత న్యూజిలాండ్ మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతుంది. డారిల్ మిచెల్ (41), గ్లెన్ ఫిలిప్స్ (28) నిలకడగా ఆడుతున్నారు. 36 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 156/4గా ఉంది. కివీస్ నాలుగో వికెట్ డౌన్..టామ్ లాథమ్ రూపంలో న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన లాథమ్ జడేజా బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి గ్లెన్ ఫిలిప్స్ వచ్చాడు. 26 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్: 116/4నిలకడగా ఆడుతున్న మిచెల్, లాథమ్..22 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 3 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. మిచెల్(18), టామ్ లాథమ్(14) ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.విలియమ్సన్ ఔట్..కేన్ విలియమ్సన్ రూపంలో న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన విలియమ్సన్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో విలియమ్సన్ రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి టామ్ లాథమ్ వచ్చాడు. 15 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్: 82-3కివీస్ స్పిన్ మ్యాజిక్.. రవీంద్ర క్లీన్ బౌల్డ్రచిన్ రవీంద్ర రూపంలో న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన రవీంద్ర.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి డార్లీ మిచెల్ వచ్చాడు. 11 ఓవర్లకు భారత్ స్కోర్: 73/3వరుణ్ మ్యాజిక్.. కివీస్ తొలి వికెట్ డౌన్న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన విల్ యంగ్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి కేన్ విలియమ్సన్ వచ్చాడు. 8 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది. రవీంద్ర 34 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు.దూకుడుగా ఆడుతున్న రచిన్..టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ దూకుడుగా ఆడుతోంది. 4 ఓవర్లు ముగిసే సరికి కివీస్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. క్రీజులో రచిన్ రవీంద్ర(16), విల్ యంగ్(8) ఉన్నారు.ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్కు తెరలేచింది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరగుతున్న ఈ టైటిల్ పోరులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు కివీస్ స్టార్ పేసర్ మాట్ హెన్రీ దూరమయ్యాడు. అతడి స్ధానంలో నాథన్ స్మిత్ తుది జట్టులోకి వచ్చాడు. భారత్ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది.తుది జట్లున్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కైల్ జామిసన్, విలియం ఓరూర్కే, నాథన్ స్మిత్భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిమరి కాసేపటిలో టాస్..ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్కు సర్వం సిద్దమైంది. మరికాసేపట్లో టాస్ పడనుంది. ఇరు జట్లకు టాస్ కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్లో గెలిచేందుకు ఇరు జట్లు తమ ఆస్తశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. 25 ఏళ్ల తర్వాత ఐసీసీ వన్డే టోర్నీ ఫైనల్లో ఇరు జట్లు తలపడుతున్నాయి.హెడ్ టు హెడ్ రికార్డ్..ఇప్పటివరకు భారత్-న్యూజిలాండ్ జట్లు ముఖాముఖి 119 వన్డేల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 61 మ్యాచ్ల్లో విజయం సాధించగా.. న్యూజిలాండ్ 50 మ్యాచ్ల్లో గెలుపొందింది. మరో 7 మ్యాచ్ల్లో ఫలితం తేలకపోగా.. ఓ మ్యాచ్ టై అయింది. -
ఫైనల్కు ముందు న్యూజిలాండ్కు భారీ షాక్..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో దుబాయ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడేందుకు సిద్దమైంది. ఈ ఫైనల్ పోరుకు ముందు కివీస్కు గట్టి ఎదురు దెబ్బ తగిలే సూచనలు కన్పిస్తున్నాయి. ఆ జట్టు స్టార్ పేసర్ మాట్ హెన్రీ గాయం కారణంగా ఫైనల్ మ్యాచ్కు దూరమయ్యే అవకాశముంది.హెన్రీ ప్రస్తుతం భుజం గాయంతో బాధపడుతున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన సెమీస్లో గాయపడ్డ ఈ కివీ స్పీడ్ స్టార్ ఇంకా కోలుకోపోయినట్లు తెలుస్తోంది. అతడు భుజం నొప్పి కారణంగా అతడు ఎక్కువగా ప్రాక్టీస్లో కూడా పాల్గోకపోయినట్లు సమాచారం.నెట్ ప్రాక్టీస్లో హెన్రీ కేవలం ఏడు బంతులు మాత్రమే సంధించినట్లు రేవ్స్పోర్ట్స్ జర్నలిస్ట్ రోహిత్ జుగ్లాన్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. హెన్రీ అందుబాటుపై ఇప్పటివరకు న్యూజిలాండ్ జట్టు మెనెజ్మెంట్ ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుత పరిస్థితుల బట్టి అతడు మ్యాచ్లో ఆడే సూచనలు కన్పించడం లేదు.ఒకవేళ హెన్రీ ఫైనల్కు దూరమైతే కివీస్కు గట్టి ఎదురుదెబ్బే అనే చెప్పాలి. అతడు ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. భారత్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో హెన్రీ 5 వికెట్లతో సత్తాచాటాడు. ముఖ్యంగా భారత్పై మంచి రికార్డు అతడికి ఉంది. భారత్పై 11 మ్యాచ్లు ఆడిన ఈ కివీ స్పీడ్ స్టార్.. 4.48 ఎకానమీతో 21 వికెట్లు పడగొట్టాడు. హెన్రీ మ్యాచ్కు దూరమైతే అతడి స్ధానంలో జాకబ్ డఫీ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), శుబ్మన్ గిల్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, కుల్దీప్, వరుణ్. న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్), యంగ్, రచిన్, విలియమ్సన్, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, బ్రేస్వెల్, జేమీసన్, రూర్కే, హెన్రీ/ డఫీ.చదవండి: IML 2025: యువరాజ్, రాయుడు విధ్వంసం..సెమీస్కు చేరిన టీమిండియా -
న్యూజిలాండ్తో ఫైనల్.. రోహిత్ మరో కప్ను అందిస్తాడా?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్కు సర్వం సిద్దమైంది. దుబాయ్ వేదికగా మరికొన్ని గంటల్లో భారత్- న్యూజిలాండ్ మధ్య తుది పోరుకు తెరలేవనుంది. 25 ఏళ్ల తర్వాత.. ఐసీసీ వన్డే టోర్నీ టైటిల్ ఫైట్లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఆఖరిగా తలపడిన ఛాంపియన్స్ ట్రోఫీ-2000 ఫైనల్లో భారత్ను 4 వికెట్ల తేడాతో కివీస్ ఓడించింది. దీంతో నేడు జరగనున్న ఫైనల్లో న్యూజిలాండ్ను ఎలాగైనా ఓడించి తమ 25 ఏళ్ల పగకు ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ కసితో ఉంది. మరోవైపు కివీస్ జట్టు సైతం గతంలో తరహాలోనే మరోసారి ట్రోఫీని ఎగరేసుకుపోవాలనే పట్టుదలతో ఉంది. ఇరు జట్లు సమవుజ్జీలగా ఉండడంతో ఈ టైటిల్ పోరు అభిమానులను ఆఖరివరకు మునివేళ్లపై నిలబెట్టడం ఖాయం.రోహిత్ మరో కప్ను అందిస్తాడా?కాగా భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ జట్టును నాలుగు ఐసీసీ ఈవెంట్లలోనూ ఫైనల్ చేర్చాడు. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్-2023, వన్డే వరల్డ్ కప్-2023, టీ20 వరల్డ్ కప్, ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆఖరి పోరుకు అర్హత సాధించింది. డబ్ల్యూటీసీ, వన్డే ప్రపంచకప్లో ఆఖరి మెట్టుపై బోల్తా పడిన భారత జట్టు.. మరుసటి ఏడాది జరిగిన పొట్టి ప్రపంచకప్లో మాత్రం టీమిండియా అద్బుతం చేసింది.టీ20 వరల్డ్కప్-2024 విశ్వవిజేతగా టీమిండియా నిలిచింది. ఇప్పుడు ధోని తర్వాత రెండు ఐసీసీ టైటిల్స్ సాధించిన భారత సారథిగా నిలిచేందుకు అతను అడుగు దూరంలో ఉన్నాడు. దీనిని అతను అందుకుంటాడా అనేది నేడు జరిగే ఫైనల్ పోరులో తేలుతుంది. 2013లో చాంపియన్స్ ట్రోఫీలో ఓపెనర్గా బరిలోకి దిగిన రోహిత్ తన బ్యాటింగ్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడా?కాగా ఛాంపియన్స్ ట్రోఫీ విజయం సాధిస్తే వన్డేల నుంచి రోహిత్ శర్మ తప్పకోనున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే బీసీసీఐతో హిట్మ్యాన్ మాట్లాడాడని, ఫైనల్ మ్యాచ్ తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించనున్నాడని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ కీలక మ్యాచ్కు ముందు జరిగిన విలేకరుల సమావేశానికి కూడా రోహిత్ గైర్హజారీ అయ్యాడు. రిటైర్మెంట్కు సంబంధించిన ప్రశ్నలను నివారించేందుకే ప్రెస్ కాన్ఫరెన్స్కు హిట్మ్యాన్ హాజరు కాలేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే గిల్ మాత్రం డ్రెసింగ్ రూమ్లో ఏ ఆటగాడి రిటైర్మెంట్ గురించి చర్చ జరగడం స్పష్టం చేశాడు. రోహిత్ వన్డేల్లో కొనసాగుతాడా లేదా రిటైర్మెంట్ ప్రకటిస్తాడో? ఆదివారం తేలిపోనుంది.చదవండి: Champions Trophy final: 'వరుణ్ కాదు.. అతడితోనే న్యూజిలాండ్కు ముప్పు' -
'అతడు 20 ఓవర్లు ఆడితే ఛాంపియన్స్ ట్రోఫీ భారత్దే'
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో రసవత్తర పోరుకు సమయం అసన్నమైంది. దుబాయ్ వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్లో భారత్-న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తెల్చుకునేందుకు సిద్దమయ్యాయి. 12 ఏళ్ల విరామం తర్వాత తిరిగి ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకోవాలని టీమిండియా ఊవ్విళ్లరూతోంది.ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆజేయంగా నిలిచిన భారత జట్టు.. అదే జోరును ఫైనల్లో కూడా కొనసాగించాలని తహతహలాడుతోంది. మరోవైపు కివీస్ మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ-2000 ఫైనల్ ఫలితాన్ని పునరావృతం చేయాలని వ్యూహాలు రచించింది. సరిగ్గా 25 ఏళ్ల క్రితం జరిగిన ఈ మెగా టోర్నీ ఫైనల్లో భారత్ను న్యూజిలాండ్ ఓడించింది.ఆ తర్వాత వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్-2021 ఫైనల్లో కూడా టీమిండియా పరాజయం పాలైంది. ఈ రెండు ఓటములకు బదులు తీర్చుకోవడానికి భారత్కు ఇదే సరైన అవకాశం. ఇక టైటిల్ పోరు నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలను వెల్లడించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 20 ఓవర్లు పాటు బ్యాటింగ్ చేస్తే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంటుందని చోప్రా జోస్యం చెప్పాడు. అదేవిధంగా హిట్మ్యాన్ కెప్టెన్సీపై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు."రోహిత్ శర్మ అద్బుతమైన కెప్టెన్. మైదానంలో వ్యూహాలు రచించడంలో రోహిత్ దిట్ట. గత మూడు ఐసీసీ వైట్బాల్ టోర్నీల్లో అతడి కెప్టెన్సీలో భారత్ కేవలం ఒకే ఒక మ్యాచ్లో ఓడిపోయింది. ఈ ఫైనల్ పోరులో భారత్ విజయం సాధిస్తే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల ఖాతాలో నాలుగు ఐసీసీ ట్రోఫీలు చేరుతాయి.ఈ ఫీట్ సాధించిన తొలి భారత క్రికెటర్లగా వారిద్దరూ నిలుస్తారు. రోహిత్ శర్మ ఎల్లప్పుడూ దూకుడుగానే ఆడుతాడు. పవర్ప్లేలో పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఈ మ్యాచ్లో కాస్త ఎక్కువ సేపు అతడు ఆడితే బాగుంటుంది. రోహిత్ 20 ఓవర్లు ఆడితే భారత్దే ఛాంపియన్స్ ట్రోఫీ అని"చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.కాగా రోహిత్ శర్మ ఈ మెగా టోర్నీలో పర్వాలేదన్పిస్తున్నాడు. క్రీజులో ఉన్నంత సేపు పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే తన లభించిన ఆరంభాలను భారీ ఇన్నింగ్స్లగా రోహిత్ మలచలేకపోతున్నాడు.తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), శుబ్మన్ గిల్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, కుల్దీప్, వరుణ్. న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్), యంగ్, రచిన్, విలియమ్సన్, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, బ్రేస్వెల్, జేమీసన్, రూర్కే, హెన్రీ/ డఫీ.చదవండి: Champions Trophy final: 'వరుణ్ కాదు.. అతడితోనే న్యూజిలాండ్కు ముప్పు' -
'వరుణ్ కాదు.. అతడితోనే న్యూజిలాండ్కు ముప్పు'
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ పోరుకు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్లో భారత్-న్యూజిలాండ్ జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి 25 ఏళ్ల పగకు ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తుంటే.. న్యూజిలాండ్ మాత్రం మరోసారి టీమిండియాను మట్టికర్పించాలని పట్టుదలతో ఉంది.ఇప్పటివరకు భారత్-కివీస్ రెండు సార్లు ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో తలపడ్డాయి. ఛాంపియన్స్ ట్రోఫీ-2000, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్-2021 ఫైనల్లో కివీస్ చేతిలో టీమిండియా ఓటమి చవిచూసింది. ఇక ఈ టైటిల్ పోరు కోసం ఇరు జట్లు తమ ఆస్త్రశాస్రాలను సిద్దం చేసుకున్నాయి.మరోసారి స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశముంది. ఈ క్రమంలో ఇరు జట్ల ఆటగాళ్లు కూడా స్పిన్నర్లను నెట్స్లో ఎక్కువగా ఎదుర్కొన్నారు. న్యూజిలాండ్ అయితే ప్రత్యేకంగా శశ్వత్ తివారీ అనే ఓ స్పిన్నర్ను నెట్బౌలర్గా ఎంపిక చేసి మరి ప్రాక్టీస్ చేసింది.వరుణ్ కాదు.. అతడితోనే ముప్పు?అయితే న్యూజిలాండ్ టీమ్ ఆందోళన చెందుతుంది మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కోసం కాదంట. రవీంద్ర జడేజా వంటి ఎడమచేతి వాటం స్పిన్నర్ను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి వారు సిద్దమవుతున్నారంట. ఈ విషయాన్ని స్వయంగా కివీస్ నెట్బౌలర్గా ఉన్న శశ్వత్ తివారీ వెల్లడించాడు."ఈ రోజు న్యూజిలాండ్ జట్టుకు నెట్స్లో చాలా సమయం పాటు బౌలింగ్ చేశాను. వారు రవీంద్ర జడేజాను ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్దమవుతున్నారు. జడేజా బౌలింగ్లో వేరియేషన్స్ ఉంటాయి. అతడు చాలా వేగంతో బంతిని స్పిన్ చేస్తాడు. ఆ స్పీడ్ను అలవాటు చేసుకునేందుకు నన్ను 18 యార్డ్స్ నుంచి బౌలింగ్ చేయమన్నారు.నేను వారి చెప్పినట్లగానే ఆ పాయింట్ నుంచి బౌలింగ్ చేశారు. కొద్దిసేపు వారు ప్రాక్టీస్ చేశారు. కానీ బంతి చాలా త్వరగా డెలివరీ అవుతుండడంతో 22 గజాల నుంచే తిరిగి బౌలింగ్ చేయమని చెప్పారు. వారు ముఖ్యంగా ఎడమచేతి వాటం బౌలర్లపై ఎక్కువగా దృష్టిపెట్టారు. ప్రాక్టీస్లో స్పిన్ను ఎదుర్కొవడంలో వారు ఎక్కడా ఇబ్బంది పడలేదు.కానీ భారత జట్టులో టాప్-క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. కాబట్టి భారత స్పిన్నర్ల నుంచి మరోసారి వారికి కఠిన సవాలు ఎదురు కానుంది" అని శశ్వత్ తివారీ ఓ స్పోర్ట్స్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా కివీస్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో చక్రవర్తి 5 వికెట్లతో సత్తాచాటాడు. దీంతో అతడి నుంచి మరోసారి కివీస్కు ముప్పు పొంచి ఉందని అంతా భావిస్తున్నారు.చదవండి: చాంపియన్ నువ్వా.. నేనా -
Champions Trophy 2025 Prize Money: ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు ప్రైజ్మనీ ఎంతో తెలుసా..?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తుది అంకానికి చేరింది. దుబాయ్ వేదికగా రేపు (మార్చి 9) జరుగబోయే ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు.విజేతకు భారీ ప్రైజ్మనీఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచే జట్టు భారీ మొత్తంలో ప్రైజ్మనీ లభించనుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన వివరాల ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టుకు దాదాపు రూ. 19.48 కోట్లు ($2.24 మిలియన్) లభిస్తాయి. ఫైనల్లో ఓడిపోయిన జట్టు రూ. 9.74 కోట్లు ($1.12 మిలియన్) పొందుతుంది.సెమీఫైనలిస్టులకు కూడా భారీ ప్రైజ్మనీ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనలిస్ట్లకు కూడా భారీ ప్రైజ్మనీ లభించనుంది. సెమీస్లో ఓడిన జట్లు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా రూ. 4.87 కోట్లు ($5,60,000) చొప్పున పొందుతాయి. ఈసారి గ్రూప్ దశ నుంచి నిష్క్రమించిన జట్లకు కూడా ప్రైజ్మనీ లభిస్తుంది.ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్కు రూ. 3.04 కోట్లు ($3,50,000) లభిస్తాయి. ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచే పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్లకు సుమారు రూ. 1.22 కోట్లు ($1,40,000) లభిస్తాయి. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఐసీసీ సుమారు రూ. 60 కోట్లు ($6.9 మిలియన్లు) కేటాయించింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీతో పోలిస్తే ఇది 53 శాతం అధికం.అజేయ భారత్ఈ టోర్నీలో టీమిండియా అజేయ జట్టుగా ఫైనల్కు చేరింది. భారత్.. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్నూ సూపర్ విక్టరీలు సాధించి సెమీస్కు చేరింది. సెమీస్లో ఆసీస్ను మట్టికరిపించి ఫైనల్కు చేరింది. మరోవైపు న్యూజిలాండ్ గ్రూప్ దశలో పాకిస్తాన్, బంగ్లాదేశ్పై విజయాలు సాధించి, భారత్ చేతిలో ఓడింది. అయినా గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచి సెమీస్కు చేరింది. సెమీస్లో కివీస్ సౌతాఫ్రికాను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది.రెండోసారిఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్ను ఎదుర్కోవడం ఇది రెండోసారి. 2000 ఎడిషన్ ఫైనల్లో కివీస్ భారత్ను ఢీకొట్టి విజేతగా నిలిచింది. న్యూజిలాండ్కు అది తొలి ఐసీసీ టైటిల్. ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్ సాధించిన రెండో టైటిల్ కూడా భారత్పైనే (ఫైనల్స్) కావడం గమనార్హం. 2019-2021 డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్ను ఓడించి తమ రెండో ఐసీసీ టైటిల్ను కైవసం చేసుకుంది. ఐసీసీ ఫైనల్స్లో న్యూజిలాండ్పై భారత్కు మంచి ట్రాక్ రికార్డు లేకపోవడంతో భారత అభిమానులు ఆందోళన పడుతున్నారు. -
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు ముందు విరాట్కు గాయం..?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ మ్యాచ్కు ముందు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి గాయమైనట్లు తెలుస్తుంది. ఇవాళ (మార్చి 8) ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా విరాట్ గాయపడినట్లు జియో న్యూస్ తెలిపింది. నెట్స్లో ఓ పేసర్ను ఎదుర్కొనే క్రమంలో విరాట్ మోకాలికి గాయమైనట్లు సమాచారం. గాయపడిన అనంతరం విరాట్ ప్రాక్టీస్ను ఆపేసినట్లు తెలుస్తుంది. విరాట్ గాయానికి ఫిజియో చికిత్స చేశాడని సమాచారం. చికిత్స తర్వాత విరాట్ డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లకుండా మైదానంలోనే సహచరులతో గడిపినట్లు తెలుస్తుంది. విరాట్ గాయంపై కోచింగ్ స్టాఫ్ను ఆరా తీయగా తీవ్రమైంది కాదని పేర్కొన్నట్లు తెలుస్తుంది. ప్రాక్టీస్ సెషన్లో విరాట్ మోకాలికి కట్టు కట్టుకుని తిరిగినట్లు జియో న్యూస్ పేర్కొంది. విరాట్ గాయం గురించి తెలిసి అభిమానులు తొలుత ఆందోళన చెందారు. విరాట్ గాయంపై టీమిండియా మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఫైనల్లో విరాట్ ఎంత కీలకమైన ఆటగాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఒకవేళ స్వల్ప గాయమైనా ముందు జాగ్రత్త చర్చగా విరాట్ను ప్రాక్టీస్ చేయనిచ్చి ఉండరు. ఈ టోర్నీలో విరాట్ అత్యంత కీలకమైన ఇన్నింగ్స్లు ఆడి టీమిండియా ఫైనల్కు చేరడంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఈ టోర్నీలో విరాట్ దాయాది పాకిస్తాన్పై సూపర్ సెంచరీ చేసి భారత్ను గెలిపించాడు. ఆసీస్తో జరిగిన సెమీఫైనల్లోనూ విరాట్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో కూడా విరాట్ సెంచరీ చేసుండాల్సింది. అయితే తృటిలో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. విరాట్ సూపర్ ఫామ్ను ఫైనల్లోనూ కొనసాగించి భారత్కు మరో ఐసీసీ టైటిల్ అందించాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. ఫైనల్లో విరాట్ మంచి ఇన్నింగ్స్ ఆడితే భారత విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు. దుబాయ్ పిచ్లకు విరాట్ అలవాటు పడ్డాడు కాబట్టి ఫైనల్లో తప్పక రాణిస్తాడని అంతా అనుకుంటున్నారు.కాగా, దుబాయ్ వేదికగా రేపు (మార్చి 9) జరుగబోయే ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకోనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో టీమిండియా అజేయ జట్టుగా ఫైనల్కు చేరింది. భారత్.. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్నూ సూపర్ విక్టరీలు సాధించి సెమీస్కు చేరింది. సెమీస్లో ఆసీస్ను మట్టికరిపించి ఫైనల్కు చేరింది. మరోవైపు న్యూజిలాండ్ గ్రూప్ దశలో పాకిస్తాన్, బంగ్లాదేశ్పై విజయాలు సాధించి, భారత్ చేతిలో ఓడింది. అయినా గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచి సెమీస్కు చేరింది. సెమీస్లో కివీస్ సౌతాఫ్రికాను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది.ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్ను ఎదుర్కోవడం ఇది రెండోసారి. 2000 ఎడిషన్ ఫైనల్లో కివీస్ భారత్ను ఢీకొట్టి విజేతగా నిలిచింది. న్యూజిలాండ్కు అది తొలి ఐసీసీ టైటిల్. ఐసీసీ టోర్నీల్లో టీమిండియాను న్యూజిలాండ్పై అంత మంచి ట్రాక్ రికార్డు లేదు. ఈ టోర్నీలో భారత్ న్యూజిలాండ్ను గ్రూప్ దశలో ఓడించినప్పటికీ.. ఫైనల్లో ఓడించడం మాత్రం అంత ఈజీ కాదు. ఐసీసీ ఈవెంట్లలో (అన్ని ఫార్మాట్లలో) న్యూజిలాండ్ భారత్తో ఆడిన 16 మ్యాచ్ల్లో పదింట గెలిచింది. ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో భారత్పై న్యూజిలాండ్కు మరింత ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఐసీసీ నాకౌట్స్లో భారత్, న్యూజిలాండ్ నాలుగు సార్లు ఎదురెదురుపడగా.. 3 మ్యాచ్ల్లో కివీస్, ఒక మ్యాచ్లో భారత్ గెలుపొందాయి. న్యూజిలాండ్ తమ చరిత్రలో గెలిచిన రెండు ఐసీసీ టైటిళ్లు భారత్పైనే (ఫైనల్స్లో) సాధించినవే కావడం గమనార్హం. 2000 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత న్యూజిలాండ్ తమ రెండో ఐసీసీ టైటిల్ను 2021లో సాధించింది. 2019-2021 డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్ను ఓడించి తమ రెండో ఐసీసీ టైటిల్ను ఎగరేసుకుపోయింది. -
CT 2025 Final: వరుణ్ మిస్టరీ కోడ్ను కివీస్ బ్యాటర్లు ఛేదించగలరా..?
భారత్, న్యూజిలాండ్ మధ్య దుబాయ్లో జరుగనున్న 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ను రెండు సమవుజ్జీలైన జట్ల మధ్య జరిగే టైటిల్ పోరుగా అభివర్ణించవచ్చు. బ్యాటింగ్ పరంగా చూస్తే భారత్, న్యూజిలాండ్ రెండు జట్ల బ్యాట్స్మన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. భారత్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో మినహా న్యూజిలాండ్ బ్యాట్స్మన్ ఎక్కడా తడబడినట్టు కానీ, తక్కువ స్థాయిలో ఆడుతున్నట్టు కానీ కనిపించలేదు. న్యూజిలాండ్ ను ఈ మ్యాచ్ లో నిలువరించి ఘనత భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి దక్కుతుంది.తొలి పోరులో వరుణ్ దే పైచేయిగత ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి కివీస్ బ్యాట్స్మన్ని తన వైవిధ్యమైన బౌలింగ్ తో ముప్పతిప్పలు పెట్టాడు. అంటే న్యూ జిలాండ్ బ్యాట్స్మన్ కి స్పిన్నర్లను ఆడటం తెలియక కాదు. వారి జట్టులోనూ అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు. స్పిన్నర్లపై ఆధిపత్యం సాధించే అద్భుతమైన బ్యాట్స్మన్ కూడా ఉన్నారు. కానీ వరుణ్ మాత్రం విభిన్నమైన స్పిన్నర్. అతని బౌలింగ్ యాక్షన్ బట్టి అతని ఎలాంటి బంతి వేస్తాడో అంచనా వేయడం కష్టం.అదే ప్రత్యర్థి బ్యాట్స్మన్ కి పెద్ద అవరోధంగా కనిపిస్తోంది. అందుకే ఆ మ్యాచ్ లో వరుణ్ మిస్టరీ కోడ్ను అర్థం చేసుకోవడానికి కివీస్ బ్యాటర్లు నానా తిప్పలు పడ్డారు. ఈ మ్యాచ్ లో వరుణ్ 52 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్ మరియు మిచెల్ సాంట్నర్ వంటి కీలక వికెట్లు కూడా ఉన్నాయి. ఆ తర్వాత సెమీ-ఫైనల్లో ఆస్ట్రేలియాపై కూడా వరుణ్ మంచి వైవిధ్యం తో బౌలింగ్ చేసాడు. ఎప్పడూ భారత్ జట్టుకి ప్రధాన అడ్డంకి గా నిలిచే ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ను తన తొలి బంతితోనే బోల్తా కొట్టించాడు. వరుణ్ ఫామ్ ఫైనల్కి ముందు భారత్కు అదనపు బలాన్నిస్తునడంలో సందేహం లేదు.వరుణ్ గురించి హెచ్చరించిన కివీస్ కోచ్ అందుకే మ్యాచ్ కి ముందే న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టీడ్ తమ బ్యాట్సమన్లని వరుణ్ నుంచి ఎదురయ్యే సవాలుకి సిద్ధంగా ఉండాలని హెచ్చరించాడు. గత మ్యాచ్ లో మా జట్టు పై 5/42 గణాంకాలతో పైచేయి సాధించిన వరుణ్ ఫైనల్లో ఆడతాడని కచ్చితంగా చెప్పగలను. వరుణ్ ఒక క్లాస్ బౌలర్. గత మ్యాచ్ లో మాకు తన నైపుణ్యం మేమిటో రుచి చూపించాడు. ఫైనల్లో వరుణ్ మాకు పెద్ద ముప్పుగా భావిస్తున్నాం. ఈ విషయం (వరుణ్ మా ప్రధాన అడ్డంకి అని ) ముందే తెలిసింది కాబట్టి అతన్ని ఎలా ఎదుర్కోగలం. ఎలా పరుగులు సాధించగలము అనే దాని పై అంచనాలు వేస్తున్నామని స్టీడ్ అన్నాడు.హెన్రీ ఆడతాడా?న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్ సందర్భంగా కివీస్ స్టార్ పేసర్ మాట్ హెన్రీ గాయపడ్డాడు. ప్రమాదకరమైన బ్యాట్స్మన్ హెన్రిచ్ క్లాసెన్ను అవుట్ చేసే ప్రయత్నంలో డైవింగ్ క్యాచ్ తీసుకుంటుండగా, హెన్రీ కుడి భుజంపై గాయమైంది. వెంటనే ఫిజియోలు అతనిని పరిశీలించినప్పటికీ అతను తీవ్ర అసౌకర్యంతో ఉన్నట్టు కనిపించాడు. చివరికి హెన్రీ మైదానం నుండి బయటకు వెళ్లవలసి వచ్చింది. ఈ మ్యాచ్ లో మాట్ హెన్రీ తన 10 ఓవర్లను పూర్తి చేయలేకపోయాడు. అతను కేవలం 7 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసి 42 పరుగులు ఇచ్చాడు.ఈ మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ.. మాట్ హెన్రీ భుజం కొంచెం నొప్పిగా ఉందని.. అతను భారత్తో ఫైనల్ ఆడగలడో లేదో వేచి చూడాలన్నాడు. ఈ మ్యాచ్ లో భారత్ బ్యాట్స్మన్ ని నిలువరించడంలో హెన్రీ కీలక పాత్ర వహించాడు. ఈ మ్యాచ్ లో హెన్రీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో తన అత్యుత్తమ గణాంకాలు (5/42) నమోదు చేసుకున్నాడు. ఫైనల్లో హెన్రీ ఆడకపోతే న్యూజిలాండ్కు పెద్ద దెబ్బ అవుతుంది. -
CT 2025: ఒకే వేదికపై ఆడటం వల్ల టీమిండియా లబ్ది పొందింది.. విమర్శకులకు ఇచ్చిపడేసిన అశ్విన్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ తమ మ్యాచ్లను దుబాయ్లో ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీకి పాక్ ఆతిథ్యమిస్తున్నప్పటికీ.. భద్రతా కారణాల రిత్యా టీమిండియా తమ మ్యాచ్లను దుబాయ్లో ఆడుతుంది. అయితే టీమిండియా తమ మ్యాచ్లను ఒకే వేదికపై ఆడటాన్ని కొందరు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. ఒకే వేదికపై మ్యాచ్లు ఆడటం వల్ల టీమిండియా లబ్ది పొందుతుందని ఆరోపిస్తున్నారు.ఈ ఆరోపణలపై భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ఒకే వేదికపై ఆడటం వల్ల టీమిండియా లబ్ది పొందుతుందనడం సరికాదన్నాడు. గతంలో (2009 ఛాంపియన్స్ ట్రోఫీ) సౌతాఫ్రికా ఒకే వేదికపై అన్ని మ్యాచ్లు ఆడినా ఫైనల్కు చేరలేదన్న విషయాన్ని గుర్తు చేశాడు. బాగా ఆడితేనే టోర్నమెంట్లు గెలుస్తారని, సాకుల వల్ల కాదని చురకలంటించాడు. దుబాయ్లో ఆడటం వల్ల టీమిండియా లబ్ది పొందుతుందని తమ కెప్టెన్, కోచ్లను ప్రశ్నించినప్పుడు నవ్వుకున్నానని అన్నాడు. టీమిండియా చివరిగా కోవిడ్కు ముందు 2018లో (ఆసియా కప్) దుబాయ్లో ఆడిందన్న విషయాన్ని గుర్తు చేశాడు. టీమిండియా తర్వాత న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా దుబాయ్లో ఆడాయని అన్నాడు. ప్రయాణించడం వల్ల ఆటగాళ్లు అలసిపోతారన్న విషయంతో ఏకీభవించిన అశ్విన్.. షెడ్యూల్ ఫిక్స్ చేయడంలో టీమిండియా ప్రమేయం ఉండదన్న విషయాన్ని గుర్తు చేశాడు. సౌతాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ఈ విషయాన్ని ప్రస్తావించాడు.ఎంతమంది ఎన్ని రకాలుగా టీమిండియాపై ఆరోపణలు (ఒకే వేదిక అంశం) చేసినా న్యూజిలాండ్ ఆటగాళ్లు మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయరని కితాబునిచ్చాడు. ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయకుండా కేవలం ఆటపై దృష్టి పెడుతుంది కాబట్టే న్యూజిలాండ్కు భారీ సంఖ్యలో అభిమానులున్నారని అన్నాడు. ఫైనల్లో గెలిచినా ఓడినా న్యూజిలాండ్ ఆటగాళ్లు హుందాగా ప్రవర్తిస్తారని తెలిపాడు.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ అదరగొడుతున్న విషయం తెలిసిందే. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాక్, న్యూజిలాండ్పై విజయాలు సాధించిన భారత్.. సెమీస్లో ఆసీస్ను మట్టికరిపించి అజేయ జట్టుగా ఫైనల్కు చేరింది. మరోవైపు న్యూజిలాండ్ గ్రూప్ దశలో పాకిస్తాన్, బంగ్లాదేశ్పై విజయాలు సాధించి, భారత్ చేతిలో ఓడింది. అయినా గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచి సెమీస్కు చేరింది. సెమీస్లో కివీస్ సౌతాఫ్రికాను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. దుబాయ్ వేదికగా రేపు (మార్చి 9) జరుగబోయే తుది సమరంలో న్యూజిలాండ్ రోహిత్ సేనతో అమీతుమీ తేల్చుకోనుంది.ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్ను ఎదుర్కోవడం ఇది రెండోసారి. 2000 ఎడిషన్ ఫైనల్లో కివీస్ భారత్ను ఢీకొట్టి విజేతగా నిలిచింది. న్యూజిలాండ్కు అది తొలి ఐసీసీ టైటిల్. -
'రోహిత్, కోహ్లి కాదు.. ఫైనల్లో అతడే గేమ్ ఛేంజర్'
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ను ముద్దాడేందుకు టీమిండియా అడుగుదూరంలో నిలిచింది. దుబాయ్ వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్తో భారత్ తాడోపేడో తెల్చుకోనుంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో తుది మెట్టుపై బోల్తా పడిన భారత జట్టు.. ఈసారి మాత్రం ఎలాగైనా విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్టు ఫైనల్ మ్యాచ్ కోసం రోహిత్ సేన ప్రత్యేక వ్యూహాలను రచిస్తోంది. హెడ్కోచ్ గౌతం గంభీర్ నేతృత్వంలో భారత జట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ సైతం ఛాంపియన్స్ ట్రోఫీ-2000 ఫైనల్ ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది.2000లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కివీస్ చేతిలో మెన్ ఇన్ బ్లూ ఓటమి చవిచూసింది. అయితే అప్పటికంటే ఇప్పుడు భారత జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా కన్పిస్తోంది. టీమిండియాను ఓడించడం అంత సులువు కాదు. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ సబా కరీం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు."ఛాంపియన్స్ ట్రోఫీ-2025ను గెలుచుకునేందుకు భారత్కు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. ప్రస్తుత భారత జట్టులో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన తర్వాత మరోసారి 2017లో భారత్కు టైటిల్ను సొంతం చేసుకునే అవకాశం లభించింది. కానీ ఆ ఎడిషన్లో భారత్ తుది మెట్టుపై బోల్తా పడింది.కానీ ఈసారి మాత్రం టీమిండియా వద్ద అద్బుతమైన స్పిన్నర్లు ఉన్నారు. ఈ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టుకు శ్రేయస్ అయ్యర్ కీలకంగా మారనున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఎక్స్ ఫ్యాక్టర్లగా మారుతారని నేను అనుకోవడం లేదు. వారిద్దరూ అనుభవజ్ఞులైన ఆటగాళ్లు అయినప్పటికి.. న్యూజిలాండ్ బౌలర్ల ముందు కాస్త బలహీనంగా కన్పించే ఛాన్స్ ఉంది. అయితే ఈ సీనియర్ ద్వయం నుంచి ఫైటింగ్ నాక్స్ ఆశించవచ్చు.ప్రస్తుత జట్టుపై మాత్రం నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇంగ్లండ్ను 3-0 తేడాతో ఓడించి ఈ మెగా టోర్నీలో అడుగుపెట్టారు. ఇక్కడ కూడా గ్రూపు మ్యాచ్లన్నీ గెలిచి.. ఆ తర్వాత సెమీస్లో ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఫైనల్కు చేరుకున్నారు. రోహిత్ శర్మ అండ్ కో మంచి రిథమ్లో కన్పిస్తున్నారు.అయితే బ్లాక్ క్యాప్స్ను ఓడించడం అంత సలువు కాదు. గతంలో చాలా టోర్నమెంట్లలో చివరవరకు వచ్చి ఓటములను ఎదుర్కొన్నారు. అయితే ఐసీసీ టోర్నీల్లో మాత్రం భారత్పై వారికి మంచి రికార్డు ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయమని" స్టార్స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరీం పేర్కొన్నాడు.చదవండి: పాతికేళ్ల పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా? -
రోహిత్తో నాకు మంచి అనుబంధం ఉంది.. అతడు చాలా గ్రేట్: గంభీర్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ పోరులో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడేందుకు సిద్దమయ్యాయి. ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు భారత కెప్టెన్ రోహిత్ శర్మపై హెడ్కోచ్ గౌతం గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు.రోహిత్ శర్మతో తనకు మంచి అనుబంధం ఉందని గంభీర్ తెలిపాడు. కాగా రోహిత్ సారథ్యంలోని భారత జట్టు ప్రస్తుతం అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో వరుస విజయాలతో టీమిండియా ఫైనల్కు దూసుకెళ్లింది. అయితే ఫైనల్కు చేరడంలో కోచ్ గంభీర్ పాత్ర కూడా ఉంది. అక్షర్ పటేల్ను బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ చేయడం, వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకురావడం వంటివి గంభీర్ తీసుకున్న నిర్ణయాలే. అయితే వైట్బాల్ క్రికెట్లో కెప్టెన్గా, కోచ్గా అదరగొడుతున్న రోహిత్-గంభీర్ జోడీ.. రెడ్ బాల్ క్రికెట్లో ఇంకా తమ మార్క్ చూపించలేకపోయారు.న్యూజిలాండ్తో టెస్టు సిరీస్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఘోర పరాభావం తర్వాత వీరద్దరూ తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచి విమర్శించిన వారితోనే శెభాష్ అన్పించుకోవాలని వీరు భావిస్తున్నారు."రోహిత్ శర్మ తనొక కెప్టెన్ అని, అన్ని అధికారాలు ఉన్నాయని ఎన్నడూ భావించలేదు. అద్భుతమైన వ్యక్తిత్వం కలవాడు. అతడితో నాకు బలమైన అనుబంధం ఉంది. మంచి మనసు ఉన్న వారు మంచి నాయకుడిగా కూడా మారుతారు. అందుకే ఐపీఎల్లో అతడు కెప్టెన్గా అన్ని టైటిల్స్ సాధించగలిగాడు.భారత్కు టీ20 ప్రపంచకప్ను అందించాడు. అయితే చరిత్ర ఎప్పుడు గతంగానే ఉంటుంది. ఇప్పుడు మా ముందు కొత్త సవాలు ఉంది. ఫైనల్ మ్యాచ్లో కూడా అతడు బ్యాటర్ గానే కాకుండా సారథిగా కూడా అత్యుత్తమ ప్రదర్శన చేయగలడని ఆశిస్తున్నాను" అని ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతీ పేర్కొన్నాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత హిట్మ్యాన్ భారత వన్డే కెప్టెన్సీ నుంచి వైదొలిగే సూచనలు కన్పిస్తున్నాయి.చదవండి: పాతికేళ్ల పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా? -
పాతికేళ్ల పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా?
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరులో తలపడేందుకు భారత్, న్యూజిలాండ్ సంసిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు జట్లు ఈ టోర్నమెంట్ ఫైనల్లో తలపడటం ఇది రెండోసారి. ఈ ఫైనల్ కి ముందు రెండు జట్లూ సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. ఈ టోర్నమెంట్ గ్రూప్ దశ మ్యాచ్లోభారత్ ఇప్పటికే కివీస్ను 44 పరుగుల తేడాతో ఓడించి కొద్దిగా పైచేయి తో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ 79 పరుగులు సాధించగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ ని అద్భుతంగా నిలువరించడం తో భారత్ విజయం సాధించింది.పాతికేళ్ల క్రితం... భారత్ ని దెబ్బతీసిన న్యూజిలాండ్అయితే భారత్, న్యూజిలాండ్ జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తలపడటం ఇది రెండోసారి. గతంలో అక్టోబర్ 15, 2000న కెన్యా రాజధాని నైరోబిలోని జింఖానా క్లబ్ గ్రౌండ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కివీస్ జట్టు భారత్ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీ ని ఎగరేసుకుపోయింది. కెప్టెన్ సౌరవ్ గంగూలీ అద్భుతమైన సెంచరీ చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఆరు వికెట్లకు 264 పరుగులు చేసింది. గంగూలీ మరియు సచిన్ టెండూల్కర్ 26.3 ఓవర్లలో తొలి వికెట్కు 141 పరుగుల భాగస్వామ్యంతో పునాది వేశారు. టెండూల్కర్ 69 పరుగుల వద్ద రనౌట్ కావడంతో ఈ భాగస్వామ్యం తెగిపోయింది. అయితే, గంగూలీ తన ఇన్నింగ్స్ను కొనసాగించాడు, 130 బంతుల్లో 117 పరుగులు చేసి భారత్ కి ఆశలు రేకెత్తించాడు. అయితే అల్ రౌండర్ క్రిస్ కైర్న్స్ విజృంభించి 113 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచి కివీస్ కి విజయాన్ని చేకూర్చాడు.రోహిత్ కి కలిసిరాని టాస్భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ కి మాత్రం ప్రస్తుతం టాస్ కలిసి రావట్లేదు. రోహిత్ వరుసగా గత 14 వన్డే మ్యాచ్ లలో టాస్ గెలవలేక పోయాడు. 2023 నవంబర్ 19న అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్తో ప్రారంభమైన ఈ టాస్ పరాజయాల పరంపర ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే భారత్ మాత్రం ఈ 14 మ్యాచ్లలో తొమ్మిది విజయాలు సాధించింది, నాలుగింటిలో ఓటమి పాలయింది ఒక మ్యాచ్ (శ్రీలంకతో)తో టై గా ముగిసింది.ప్రస్తుత దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదిక గా ఆడుతున్న భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లోని ఇంతవరకూ జరిగిన నాలుగు మ్యాచ్ ల లో టాస్ ఓడిపోయింది, అయినప్పటికీ అన్ని మ్యాచ్ లలో విజయం సాధించింది. అందువల్ల టాస్ భారత్ విజయావకాశాల పై ప్రభావం చూపించలేదన్నది వాస్తవం. అయితే ఇక్కడి వాతావరణ పరిస్థితులు రెండవ స్థానంలో బ్యాటింగ్ చేసే జట్టుకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని తొలుత భావించారు. కానీ అలాంటిదేమీ ఈసారి కనిపించలేదు. భారత్ మొదట బ్యాటింగ్ చేసినప్పుడు ఒకసారి ఛేజింగ్ చేస్తూ మూడు మ్యాచ్లు గెలిచింది. ఇక్కడి వాతావరణం లో మంచు ఎక్కువగా లేకపోవడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. రాత్రులు వాతావరణం చల్లగా ఉండటంతో, టోర్నమెంట్లో మంచు పెద్ద పాత్ర పోషిస్తుందని భావించారు. అదృష్టవశాత్తూ అది జరగలేదు.వరుణ్ చక్రవర్తి కీలకం"ఈ సమయంలో ఈ మైదానంలో కొంచెం ఎక్కువ మంచు ఉంటుందని నేను అనుకున్నాను. అదృష్టవశాత్తూ అలా జరగలేదు. కాబట్టి టాస్ నిజానికి పెద్ద అంశం కాదని నేను భావిస్తున్నాను" అని న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెస్సన్ అన్నాడు. "ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు వెళుతున్నప్పుడు ఎవరు టాస్ గెలుస్తారనే దాని గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక భారత్ అభిమానులైతే రోహిత్ శర్మ వరుసగా 14 మ్యాచ్ల లో టాస్ ఓడిపోయాడని నిద్ర మానుకోవాల్సి పని లేదు." అని హెస్సన్ వ్యాఖ్యానించాడు. ఫైనల్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా?సరిగ్గా పాతికేళ్ల క్రితం క్రితం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పరాజయం చవిచూసిన భారత్ ఇప్పుడు న్యూజిలాండ్ పై ప్రతీకారం తీర్చుకుంటుందా? 25 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘోర పరాజయాన్నిభారత్ అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేదు. ఇన్నేళ్లకు ఈ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి రోహిత్ శర్మ బృందానికి అవకాశం కలిగింది. భారత్ జట్టు ప్రస్తుతం మంచి ఫామ్లో ఉంది మరియు టోర్నమెంట్లోని అన్ని మ్యాచ్లలో విజయం సాధించింది. రోహిత్ బృందం ఈ విజయ్ బాటను కొనసాగించాలన్న దృఢ సంకల్పంతో ఉంది. మరి ఈ ఫైనల్లో ఏమి జరుగుతుందో చూద్దాం.!చదవండి: భారత తుదిజట్టులో ఓ మార్పు.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వారికే: రవిశాస్త్రి -
భారత తుదిజట్టులో ఓ మార్పు.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ వారికే!
భారత్- న్యూజిలాండ్ మధ్య చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) కీలక వ్యాఖ్యలు చేశాడు. కివీస్తో మ్యాచ్లో భారత తుదిజట్టులో ఓ మార్పు చోటు చేసుకోవచ్చని అంచనా వేశాడు. పిచ్ పరిస్థితికి తగ్గట్లుగా టీమిండియా మేనేజ్మెంట్ ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని అంచనా వేశాడు.అయితే, ఎవరిపై వేటు వేస్తారు? ఎవరిని తీసుకువస్తారన్న విషయంపై మాత్రం రవిశాస్త్రి స్పష్టతనివ్వలేకపోయాడు. కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ మార్చి 9న దుబాయ్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య ఫైనల్తో ముగుస్తుంది. ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ సహా భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ ఈ వన్డే టోర్నమెంట్లో పాల్గొన్నాయి. ఈ క్రమంలో తొలి సెమీ ఫైనల్లో ఆసీస్ను ఓడించి రోహిత్ సేన.. సౌతాఫ్రికాను చిత్తు చేసి సాంట్నర్ బృందం టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. ఇక టీమిండియా తమ మ్యాచ్లన్నీ దుబాయ్లోనే ఆడగా.. కివీస్కు కూడా ఇక్కడ ఓ మ్యాచ్ ఆడిన అనుభవం ఉంది కాబట్టి తమకూ పిచ్ పరిస్థితులపై అవగాహన ఉందని కోచ్ గ్యారీ స్టెడ్ అన్నాడు.భారత తుదిజట్టులో ఓ మార్పుఇదిలా ఉంటే.. గ్రూప్ దశలో భాగంగా భారత్- పాకిస్తాన్ మ్యాచ్కు వాడిన పిచ్నే భారత్- కివీస్ ఫైనల్కు తిరిగి ఉపయోగించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కామెంటేటర్ రవిశాస్త్రి ఐసీసీ రివ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఫైనల్ మ్యాచ్లో భారత తుదిజట్టులో ఓ మార్పు చోటుచేసుకున్నా ఆశ్చర్యం లేదు. పిచ్ పరిస్థితికి అనుగుణంగా నిర్ణయం ఉంటుంది.టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగిన పిచ్ ఈ టోర్నమెంట్లోనే అత్యుత్తమైనది. మళ్లీ అలాంటి హోరాహోరీ చూడాలని ఉంది. ఇక ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత గ్రౌండ్స్మెన్కి దాదాపు ఐదు రోజుల విరామం లభించింది. 280- 300 పరుగుల మేర రాబట్టగలిగే పిచ్ తయారు చేసి ఉండవచ్చు’’ అని అభిప్రాయపడ్డాడు.ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వారికేఇక ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఆల్రౌండర్ ఉండబోతున్నాడని రవిశాస్త్రి ఈ సందర్భంగా అంచనా వేశాడు. ‘‘అక్షర్ పటేల్ లేదంటే రవీంద్ర జడేజా టీమిండియా తరఫున ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవబోతున్నారు. ఒకవేళ న్యూజిలాండ్కు అవకాశం ఉంటే మాత్రం నేను గ్లెన్ ఫిలిప్స్ వైపు మొగ్గుచూపుతాను. అతడు అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తాడు. మెరుపు ఇన్నింగ్స్తో 4- 50 పరుగులు రాబట్టగలడు. ఒకటీ లేదా రెండు వికెట్లు తీసి ఆశ్చర్యపరచనూగలడు’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఆసీస్తో సెమీస్ ఆడిన భారత తుదిజట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.సౌతాఫ్రికాతో సెమీ ఫైనల్ ఆడిన న్యూజిలాండ్ ప్లేయింగ్ ఎలెవన్విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, కైలీ జెమీసన్, విలియం ఓ రూర్కీ.చదవండి: CT 2025: వరుణ్తోనే పెను ముప్పు: కివీస్ కోచ్ -
IND vs NZ: ‘అండర్డాగ్స్ అని మర్చిపోండి.. అతడి దూకుడుకు కళ్లెం వేస్తే..’
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఫైనల్లో టీమిండియా ఫేవరెట్గా బరిలో దిగనుంది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లను చిత్తు చేసి టాపర్గా సెమీస్ చేరిన రోహిత్ సేన.. కీలక పోరులోనూ తన సత్తా చాటింది. వన్డే ప్రపంచకప్-2023 విజేత ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.ఐసీసీ టోర్నమెంట్ల ఫైనల్లో భారత జట్టుపై కివీస్(India vs New Zealand)దే పైచేయి అయినా.. దుబాయ్లో ప్రేక్షకుల మద్దతు మాత్రం రోహిత్ సేనకే లభించనుంది. అయితే, టీమిండియా ఎంత పటిష్టంగా ఉన్నప్పటికీ.. తమదైన రోజున న్యూజిలాండ్ను ఆపడం ఎవరితరం కాదు. ఈ విషయాన్ని కివీస్ జట్టు గుర్తించాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్(Shoaib Akhtar) అంటున్నాడు.అండర్డాగ్స్ అని మర్చిపోండిభారత్- న్యూజిలాండ్ ఫైనల్లో తలపడనున్న తరుణంలో కివీస్కు అక్తర్ కీలక సూచనలు చేశాడు. ‘‘మీరు టీమిండియాతో ఆడుతున్నామన్న విషయాన్ని మర్చిపోండి. మీరు అండర్డాగ్స్గా పరిగణింపబడతారనే అంశాన్నీ విస్మరించాలి. మీ జట్టు బాగా లేదని భావించవద్దు.సాంట్నర్కు గెలుస్తామనే నమ్మకం ఉంది. కెప్టెన్గా అతడు టైటిల్ గెలవాలని బలంగా కోరుకుంటున్నాడు. కాబట్టి కివీస్ ఏ దశలోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఇక భారత్తో మ్యాచ్ విషయంలో మీకు అతిపెద్ద సవాలు రోహిత్ శర్మ.అతడి దూకుడుకు కళ్లెం వేస్తేపవర్ ప్లేలో గనుక అతడికి అవకాశం ఇస్తే పరిస్థితి చేజారినట్టే. ఏమాత్రం దయ చూపకుండా అతడు దూకుడుగా ముందుకుపోతాడు. ముఖ్యంగా స్పిన్నర్లను ఒత్తిడిలోకి నెట్టగలడు. సాంట్నర్ను అటాక్ చేస్తాడు. కెప్టెన్గా తన జట్టులో ఆత్మవిశ్వాసం నింపాలంటే బ్యాటర్గానూ రాణించాలని అతడికి తెలుసు.70 శాతం టీమిండియాకే అవకాశంఓపెనర్గా తనదైన ముద్ర వేసి నిష్క్రమించాలనే కోరుకుంటాడు. కాబట్టి అతడి విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు. ఇక ఫైనల్ విజేతపై అంచనా గురించి చెప్పాలంటే 70 శాతం టీమిండియాకే అవకాశం ఉంది. వాళ్ల బ్యాటర్లు పరిణతితో ఆడుతున్నారు. స్పిన్నర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, న్యూజిలాండ్ తమ శాయశక్తులు ఉపయోగిస్తే మాత్రం మరోసారి టైటిల్ గెలిచే అవకాశం లేకపోలేదు’’ అని రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ గేమ్ ఆన్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. స్మిత్ను ఆదర్శంగా తీసుకోండిఇదే షోలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మాట్లాడుతూ.. న్యూజిలాండ్ బ్యాటర్లు ఆస్ట్రేలియా సారథి స్టీవ్ స్మిత్ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించాడు. ‘‘స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ చక్కటి సమన్వయంతో ముందుకు సాగటమే భారత బ్యాటర్ల గొప్ప లక్షణం. మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పగలిగితే బౌలర్లపై ఒత్తిడి ఉండదు.ఇక సెమీస్లో స్మిత్ భారత స్పిన్నర్ల బౌలింగ్లో ఆడిన విధానం కివీస్ బ్యాటర్లకు స్ఫూర్తిదాయకం. గ్యాప్స్లో షాట్లు బాదుతూ హాఫ్ సెంచరీ(73)తో రాణించాడు. ఫైనల్లో న్యూజిలాండ్ బ్యాటర్లూ అదే చేయాలి’’ అని షోయబ్ మాలిక్ సూచనలు చేశాడు. కాగా 2000 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్పై గెలుపొంది టైటిల్ గెలిచిన న్యూజిలాండ్... వరల్డ్ టెస్టు చాంపియన్షిప్(2023)లోనూ టీమిండియా ను ఓడించి ట్రోఫీని ముద్దాడింది. చదవండి: కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్బై? ఆటగాడిగా కొనసాగింపు? బీసీసీఐ నిర్ణయం? -
శుబ్మన్ గిల్కు ప్రమోషన్.. ఏకంగా రూ. 7 కోట్ల జీతం!?
భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) 2025-26 ఏడాదికి గాను ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించేందుకు సిద్దమైంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ముగిసిన తర్వాత ఈ లిస్ట్ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. గతేడాది సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోయిన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు ప్రమోషన్ దక్కనున్నట్లు సమాచారం.అతని సెంట్రల్ కాంట్రాక్ట్ను పునరుద్దరించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దేశీవాళీ క్రికెట్లో ఆడాలన్న తమ ఆదేశాలను ధిక్కరించడంతో బీసీసీఐ అయ్యర్పై వేటు వేసింది. ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుని రంజీల్లో ఆడిన శ్రేయస్ తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు.జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన అయ్యర్.. తన అద్బుతప్రదర్శనతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలోనూ శ్రేయస్ దుమ్ములేపుతున్నాడు. ఈ క్రమంలోనే అతడికి తిరిగి మళ్లీ కాంట్రాక్ట్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించుకుంది.గిల్కు ప్రమోషన్.. కోహ్లి, రోహిత్కు డిమోషన్మరోవైపు అద్బుతమైన ఫామ్లో ఉన్న టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్(Shubman Gill)కు సైతం ప్రమోషన్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గిల్ ప్రస్తుతం బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ల్లో ఏ కేటగిరిలో ఉన్నాడు. ఇప్పుడు అతడిని టాప్ గ్రేడ్(ఏ ప్లస్)కు ప్రమోట్ చేయాలని బీసీసీఐ పెద్దలు నిర్ణయించుకున్నారంట. కాగా ప్రస్తుతం ఏ ప్లస్ కేటగిరిలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలు మాత్రమే ఉన్నారు. అయితే అంతర్జాతీయ టీ20లకు విడ్కోలు పలికిన కోహ్లి, రోహిత్ శర్మ, జడేజా కాంట్రాక్లు మారనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ సీనియర్ త్రయాన్ని ఏ ప్లస్ నుంచి ఏ గ్రేడ్కు డిమోట్ చేసే అవకాశముంది. వీరిస్ధానాల్లో గిల్తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఏ ప్లస్ కేటగిరిలో చోటు దక్కే సూచనలు కన్పిస్తున్నాయి.కేటగిరి వారీగా ఆటగాళ్లకు దక్కే మొత్తం ఎంతంటే?ఏ ప్లస్ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక వేతనం కింద యేటా రూ. 7 కోట్లు దక్కనున్నాయి. ‘ఏ’ కేటగిరీలోని క్రికెటర్లకు రూ. 5 కోట్లు..‘బి’ కేటగిరిలో ఉన్న వారికి రూ. 3 కోట్లు.. ‘సి’ కేటగిరిలో ఉన్న క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం లభించనుంది.కివీస్తో ఫైనల్ పోరు..ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు కివీస్ కూడా భారత్ను ఓడించి రెండోసారి ఈ మెగా టోర్నీ టైటిల్ను ముద్దాడాలని పట్టుదలతో ఉంది.చదవండి: CT 2025: భారత్-న్యూజిలాండ్ ఫైనల్ పోరు.. బ్యాటర్లకు చుక్కలే! ఎందుకంటే? -
నాణ్యమైన క్రికెటర్.. ఏ స్థానంలోనైనా అతడు ఆడతాడు: టీమిండియా కోచ్
భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్(KL Rahul) విషయంలో యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈ కర్ణాటక ఆటగాడి బ్యాటింగ్ స్థానాన్ని పదే పదే మార్చడం.. అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం గురించి భారత మాజీ ఓపెనర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు మాట్లాడుతూ.. స్పేర్ టైర్ కంటే కూడా దారుణంగా మేనేజ్మెంట్ అతడి సేవలను వాడుకుంటోందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధంఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్(Sitanshu Kotak) స్పందించాడు. జట్టులో తన పాత్ర పట్ల కేఎల్ రాహుల్ సంతృప్తిగా ఉన్నాడని తెలిపాడు. జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నాడు. కాగా 2014లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన కేఎల్ రాహుల్.. ఆరంభంలో ఓపెనర్గా బరిలోకి దిగాడు.అనంతరం ఈ వికెట్ కీపర్ బ్యాటర్ను మిడిలార్డర్కు డిమోట్ చేశారు. అయితే, ఇటీవల ఆస్ట్రేలియా(India vs Australia)తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ సందర్భంగా మళ్లీ ఓపెనర్గా పంపారు. ఇక ఇంగ్లండ్తో స్వదేశంలో ఇటీవలి వన్డే సిరీస్లో ఒక్కోసారి ఆరో స్థానంలో ఆడించారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ ఇదే కొనసాగిస్తున్నారు. వీలునుబట్టి ఐదో స్థానంలో కూడా ఆడిస్తున్నారు.అయితే, ఇలా పదే పదే తన బ్యాటింగ్ ఆర్డర్ మారుతున్నా కేఎల్ రాహుల్ సంతోషంగానే ఉన్నాడని కోచ్ సితాన్షు కొటక్ చెప్పడం విశేషం. ‘‘అతడు ఓపెనింగ్ చేయగలడు. నాలుగు లేదంటే ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. డిమాండ్ను బట్టి ఆరో స్థానంలోనూ ఆడతాడు.జట్టుకు ఏది అవసరమో అది చేస్తాడుపరిస్థితులకు తగ్గట్లుగా తనను తాను మార్చుకోవడం అతడికి ఇష్టం. జట్టులో తన పాత్ర పట్ల అతడు సంతృప్తిగా, సంతోషంగా ఉన్నాడు. రాహుల్ వంటి నాణ్యమైన బ్యాటర్ ఆరో స్థానంలో అందుబాటులో ఉండటం జట్టుకు అదనపు ప్రయోజనం.బ్యాటింగ్ ఆర్డర్ మార్పుల గురించి నేను తనతో మాట్లాడినపుడు తనకేమీ ఇబ్బంది లేదని చెప్పాడు. జట్టుకు ఏది అవసరమో అది చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని నాతో అన్నాడు’’ అని సితాన్షు కొటక్ వెల్లడించాడు. టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఆదివారం చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా వన్డేల్లో ఐదో స్థానంలో వచ్చి ఇప్పటి వరకు 31 ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్.. 1299 పరుగులు సాధించాడు. సగటు 56.47. ఇందులో రెండు శతకాలతో పాటు నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక ఆరో స్థానంలో రాహుల్ ఏడుసార్లు బ్యాటింగ్ చేసి 160 పరుగులు మాత్రమే చేయగలిగాడు.ఇదిలా ఉంటే.. కివీస్తో టైటిల్ పోరు గురించి సితాన్షు కొటక్ మాట్లాడుతూ.. ‘‘సీనియర్లు, యువ ఆటగాళ్లతో జట్టు సమతూకంగా ఉంది. వాళ్లంతా కలిసికట్టుగా ఉంటూ.. ఆట గురించి చర్చిస్తూ ఉంటారు. ఏ జట్టుకైనా ఇంతకంటే విలువైన, గొప్ప విషయం మరొకటి ఉండదు.రోహిత్, విరాట్, హార్దిక్, షమీ, జడేజా.. జట్టులో ఉండటం సానుకూలాంశం. వాళ్లలో చాలా మందికి 15- 20 ఏళ్ల అనుభవం ఉంది. యువ ఆటగాళ్లు సీనియర్ల నుంచి ఎంతో నేర్చుకుంటున్నారు. ఫైనల్ విషయంలో మా జట్టుపై ఎలాంటి ఒత్తిడి లేదు’’ అని పేర్కొన్నాడు.చదవండి: CT 2025: వరుణ్తోనే పెను ముప్పు: కివీస్ కోచ్ -
IND Vs NZ: భారత్-న్యూజిలాండ్ ఫైనల్ పోరు.. బ్యాటర్లకు చుక్కలే! ఎందుకంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy)లో ఫైనల్ పోరుకు సమయం అసన్నమైంది. ఆదివారం(మార్చి 9) దుబాయ్ వేదికగా జరగనున్న ఫైనల్ మ్యాచ్లో భారత్-న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ టైటిల్ పోరు కోసం ఇరు జట్లు తమ ఆస్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి.ఈ మ్యాచ్లో గెలిచి ముచ్చటగా మూడో సారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను ముద్దాడాలని భారత జట్టు భావిస్తుంటే.. మరోసారి ఐసీసీ టోర్నీ ఫైనల్లో టీమిండియాను ఓడించాలని కివీస్ పట్టుదలతో ఉంది. ఇక ఈ మెగా ఫైనల్ మ్యాచ్కు పిచ్ ఏర్పాటు పూర్తి అయింది. గ్రూపు స్టేజిలో పాకిస్తాన్-భారత్ మ్యాచ్ కోసం ఉపయోగించిన పిచ్నే తుది పోరుకు కూడా క్యూరేటర్ సిద్దం చేసినట్లు తెలుస్తోంది.ఈ మెగా టోర్నీలో భారత్ ఆడిన తమ నాలుగు మ్యాచ్లు వేర్వేరు పిచ్లపైనే ఆడింది. ఎందుకంటే ఒక్కసారి ఉపయోగించిన పిచ్ను మళ్లీ ఉపయోగించాలంటే కనీసం రెండు వారాల గ్యాప్ ఉండేలా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) ప్లాన్ చేసింది. ఇప్పుడు పాకిస్తాన్తో లీగ్ మ్యాచ్ ఆడి రెండు వారాలు పూర్తి కావడంతో ఆ పిచ్పై మళ్లీ ఆడేందుకు భారత్ సిద్దమైంది. కాగా ఆ మ్యాచ్లో పాకిస్తాన్ 244 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని భారత్ సునాయసంగా ఛేదించింది.కివీస్కు మరోసారి..కాగా ఈ వికెట్ మరోసారి స్పిన్నర్లకు అనుకూలించే అవకాశముంది. పాక్తో జరిగిన మ్యాచ్లో కుల్దీప్ యాదవ్, జడేజా, అక్షర్ పటేల్ వంటి మణికట్టు స్పిన్నర్లు బంతితో మ్యాజిక్ చేశారు. ఆ మ్యాచ్లో ఇంకా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి లేడు. అతడు ప్లేయింగ్ ఎలెవన్లోకి వచ్చాక భారత స్పిన్ విభాగం మరింత పటిష్టంగా మారింది. న్యూజిలాండ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో వరుణ్ ఏకంగా 5 వికెట్లతో సత్తాచాటాడు. అతడి స్పిన్ దాటికి కివీలు విల్లవిల్లాడారు. ఈ క్రమంలో మరోసారి న్యూజిలాండ్కు వరుణ్ నుంచి ముప్పు పొంచి ఉంది. అయితే ప్రత్యర్ధి జట్టులో కూడా మెరుగైన స్పిన్నర్లు ఉన్నారు.కెప్టెన్ మిచెల్ శాంట్నర్, బ్రెస్వెల్ వంటివారు బంతితో అద్భుతాలు చేయగలరు. వీరికి తోడు రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ వంటి పార్ట్ టైమ్ స్పిన్నర్లకు కూడా మ్యాచ్ను మలుపు తిప్పే సత్తాఉంది. దీంతో మరోసారి బ్యాటర్లకు స్పిన్నర్ల నుంచి కఠిన సవాలు ఎదురుకానుంది.కివీస్దే పైచేయి..కాగా ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో న్యూజిలాండ్-భారత జట్లు రెండు సార్లు తలపడ్డాయి. ఈ రెండు మ్యాచ్ల్లో కూడా కివీసే విజయం సాధించింది. 2000 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో, 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియాను బ్లాక్ క్యాప్స్ చిత్తు చేసింది.చదవండి: రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడితే... -
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు ముందు కోహ్లిని ఊరిస్తున్న మూడు భారీ రికార్డులు
భారత్, న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ మార్చి 9న దుబాయ్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మూడు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ మ్యాచ్లో కోహ్లి మరో 95 పరుగులు చేస్తే వన్డేల్లో న్యూజిలాండ్పై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా అవతరిస్తాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమిస్తాడు. సచిన్ వన్డేల్లో న్యూజిలాండ్పై 1750 పరుగులు చేయగా.. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 1656 పరుగులు ఉన్నాయి.ఈ మ్యాచ్లో (ఫైనల్లో) విరాట్ సెంచరీ సాధిస్తే.. వన్డేల్లో న్యూజిలాండ్పై అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్గా సరికొత్త రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు విరాట్, వీరేంద్ర సెహ్వాగ్ పేరిట సంయుక్తంగా ఉంది. వీరిద్దరూ వన్డేల్లో న్యూజిలాండ్పై చెరో 6 సెంచరీలు బాదారు.ఈ మ్యాచ్లో విరాట్ మరో 128 పరుగులు చేస్తే.. ఐసీసీ వన్డే నాకౌట్స్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా అవతరిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఐసీసీ వన్డే నాకౌట్స్లో మాస్టర్ బ్లాస్టర్ 657 పరుగులు చేశాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 530 పరుగులు ఉన్నాయి.ఈ మ్యాచ్లో విరాట్ హాఫ్ సెంచరీ చేస్తే ఐసీసీ వన్డే నాకౌట్స్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ సరసన నిలుస్తాడు. సచిన్ ఐసీసీ నాకౌట్స్లో ఆరు అర్ద సెంచరీలు చేయగా.. ప్రస్తుతం విరాట్ ఖాతాలో ఐదు అర్ద శతకాలు ఉన్నాయి.ప్రస్తుతం విరాట్ ఉన్న ఫామ్ ప్రకారం చూస్తే పైన ఉన్న మూడు రికార్డులు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో విరాట్ ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడి 72.33 సగటున, 83.14 స్ట్రయిక్రేట్తో 217 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఫైనల్లో విరాట్ సెంచరీ చేస్తే వన్డేల్లో 52వ శతకం.. ఓవరాల్గా 83వ శతకం అవుతుంది.విరాట్ ఫైనల్లో న్యూజిలాండ్పై సెంచరీ సాధించాలని ప్రతి భారత క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు. అలాగే ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ కూడా ఫామ్లోకి రావాలని టీమిండియా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. టీమిండియాకు కృష్ణార్జులు లాంటి రోహిత్, కోహ్లి భారత్కు మరో ఐసీసీ టైటిల్ అందించాలని యావత్ భారతం ఆశిస్తుంది.టీమిండియాకు చెడు సూచకంఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు ముందు టీమిండియాకు చెడు సూచిస్తుంది. ఐసీసీ టోర్నీల ఫైనల్స్లో న్యూజిలాండ్ను ఎదుర్కొన్న ప్రతిసారి భారత్కు అపజయమే ఎదురైంది. ఐసీసీ టోర్నీల ఫైనల్స్లో భారత్, న్యూజిలాండ్ ఇప్పటివరకు రెండు సార్లు ఎదురెదురుపడ్డాయి. తొలిసారి ఈ ఇరు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ-2000 ఎడిషన్ ఫైనల్లో తలపడ్డాయి. నాడు న్యూజిలాండ్ భారత్ను ఓడించి తమ తొలి ఐసీసీ టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ ఇరు జట్లు ఇనాగురల్ డబ్ల్యూటీసీ ఫైనల్లో (2019-2021) రెండో సారి పోటీపడ్డాయి. ఈసారి కూడా న్యూజిలాండ్ భారత్ను ఓడించి తమ రెండో ఐసీసీ టైటిల్ను ఎగరేసుకుపోయింది. న్యూజిలాండ్, తమ రెండు ఐసీసీ టైటిళ్లను భారత్పైనే గెలవడం విశేషం.


