India Vs South Africa
-
క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. వైజాగ్లో టీమిండియా మ్యాచ్
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ఈ ఏడాది ఆఖరిలో భారత పర్యటనకు రానుంది. ఈ టూర్లో భాగంగా సౌతాఫ్రికా ఆతిథ్య టీమిండియాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్లో తలపడనుంది. ఈ క్రమంలో ఈ సిరీస్లకు సంబంధించిన షెడ్యూల్ను ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఖారారు చేసినట్లు తెలుస్తోంది. బీసీసీ వర్గాల సమాచారం ప్రకారం.. టెస్టు సిరీస్తో ప్రోటీస్ జట్టు భారత పర్యటన ప్రారంభం కానుంది. ఢిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియం వేదికగా తొలి టెస్టు జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు సంబంధించిన తేదీలను ఇంకా వెల్లడించలేదు. ఇక రెండో టెస్టు మాత్రం గౌహతిలోని బర్సాపర క్రికెట్ స్టేడియం వేదికగా నవంబర్ 22 నుండి నవంబర్ 26 వరకు జరగనుంది. గౌహతి టెస్ట్ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. అనంతరం నవంబర్ 30న రాంఛీ వేదికగా జరగనున్న తొలి వన్డేతో వైట్బాల్ సిరీస్ ప్రారంభం కానుంది. రెండో వన్డే డిసెంబర్ 3న రాయ్పూర్, మూడో వన్డే డిసెంబర్ 6న వైజాగ్ వేదికలగా జరగనుంది.మరో టీ20 వరల్డ్కప్పై కన్ను..ఐపీఎల్-2025 ముగిసిన తర్వాత టీమిండియా టీ20 వరల్డ్కప్-2026కు సన్నద్దం కానుంది. వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న పొట్టి ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఎక్కువగా టీ20 సిరీస్లను షెడ్యూల్ చేసింది. ఈ మెగా టోర్నీకి ముందు భారత జట్టు ఏకంగా 23 టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఇందులో భాగంగానే స్వదేశంలో సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది. డిసెంబర్ 9న కటక్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టెస్టు సిరీస్తొలి టెస్టు: - : ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంరెండో టెస్టు: నవంబర్ 22 నుండి నవంబర్ 26-గౌహతిభారత్ వర్సెస్ సౌతాఫ్రికా వన్డే సిరీస్:నవంబర్ 30: రాంచీడిసెంబర్ 3: రాయ్పూర్డిసెంబర్ 6: వైజాగ్భారత్ vs సౌతాఫ్రికా T20I సిరీస్:1st T20I: డిసెంబర్ 9: కటక్2nd T20I: డిసెంబర్ 11: నాగ్పూర్3rd T20I: డిసెంబర్ 14: ధర్మశాల4th T20I: డిసెంబర్ 17: లక్నో5th T20I: డిసెంబర్ 19: అహ్మదాబాద్చదవండి: ఐపీఎల్-2025 తొలి మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ: తుదిజట్లు ఇవే!? -
‘జట్టు నుంచి తప్పించారు.. అతడు మాట్లాడేందుకు సిద్ధంగా లేడు.. అందుకే’
తాను అవకాశాల కోసం అడిగే వ్యక్తిని కాదని టీమిండియా వెటరన్ క్రికెటర్ అజింక్య రహానే(Ajinkya Rahane) అన్నాడు. తనను జట్టు నుంచి ఎందుకు తప్పించారో తెలియదని.. ఈ విషయం గురించి మేనేజ్మెంట్ నుంచి తనకు ఎలాంటి సమాచారం రాలేదని పేర్కొన్నాడు. సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా తనకు పిలుపునిస్తారని ఆశగా ఎదురుచూశానని.. అయితే, సెలక్టర్లు మరోసారి మొండిచేయే చూపారని ఆవేదన వ్యక్తం చేశాడు.జట్టులో అవకాశాలు కరువుకాగా ఒకప్పుడు టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్(Vice Captain)గా వెలుగొందిన అజింక్య రహానే.. తాత్కాలిక సారథిగా ఆస్ట్రేలియా గడ్డపై భారత్కు విజయం అందించాడు. విదేశాల్లోనూ మెరుగైన రికార్డు కలిగి ఉన్న ఈ ముంబై బ్యాటర్కు గత కొన్నేళ్లుగా జట్టులో అవకాశాలు కరువయ్యాయి. అయితే, దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి.. ఐపీఎల్లోనూ తనను తాను నిరూపించుకున్న రహానే.. అనూహ్యంగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC)-2023 ఫైనల్(ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా)కు ఎంపికయ్యాడు.అనంతరం వెస్టిండీస్ పర్యటనలో టెస్టు వైస్ కెప్టెన్గా ప్రమోషన్ పొందాడు. కానీ ఆ టూర్లో వైఫల్యం తర్వాత రహానేకు మళ్లీ సెలక్టర్ల నుంచి పిలుపురాలేదు. ఈ క్రమంలో దేశీ క్రికెట్పై దృష్టి సారించిన అతడు.. ముంబై కెప్టెన్గా గతేడాది రంజీ ట్రోఫీ టైటిల్ అందుకున్నాడు. టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ సత్తా చాటాడు.ఇక ప్రస్తుతం రంజీ సెమీ ఫైనల్స్తో బిజీగా ఉన్న అజింక్య రహానే టీమిండియా పునరాగమనం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ.. ‘‘జట్టు నుంచి నన్ను ఎందుకు తప్పించారని ప్రశ్నించే రకం కాదు. అసలు మేనేజ్మెంట్తో నాకు కమ్యూనికేషన్ లేదు. చాలా మంది వెళ్లి మాట్లాడమని చెప్పారు.అతడికి మాట్లాడే ఉద్దేశం లేనప్పుడుఅందుకు నేను సిద్ధంగా ఉన్నా.. ఎదుటి వ్యక్తి కూడా అందుకు సుముఖంగా ఉండాలి కదా!.. ఒకవేళ అతడికి మాట్లాడే ఉద్దేశం లేనప్పుడు నేను పోరాడటంలో అర్థం ఉండదు. నేను నేరుగా అతడితోనే మాట్లాడాలనుకున్నా. అందుకే మెసేజ్లు చేయలేదు. ఎంత కష్టపడినా ఫలితం లేకుండా పోయింది’’ అంటూ టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తీరుపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశాడు.అదే విధంగా.. ‘‘డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత నన్ను జట్టు నుంచి తప్పించడం బాధ కలిగించింది. తదుపరి సిరీస్లలో నన్ను ఆడిస్తారని అనుకున్నా. కానీ నా చేతుల్లో ఏం లేదు కదా! ఇప్పుడు దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నాను. ఐపీఎల్లో కూడా ఆడితే మళ్లీ నన్ను పిలుస్తారేమో.రీఎంట్రీ ఇస్తాఅయితే, సౌతాఫ్రికాలో పరిస్థితులు కఠినంగా ఉంటాయి. అందుకే టెస్టు సిరీస్కు నన్ను పిలుస్తారని ఆశించా. కానీ ఆ జట్టులో నాకు స్థానం దక్కలేదు. చాలా బాధగా అనిపించింది. అయినా.. ఇప్పుడు ఏం అనుకుని ఏం లాభం. అయితే, ఏదో ఒకరోజు తప్పకుండా మళ్లీ జట్టులోకి తిరిగి వస్తాననే నమ్మకం ఉంది’’ అని అజింక్య రహానే ఉద్వేగానికి లోనయ్యాడు.కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ రహానేను కొనుగోలు చేసింది. రూ. కోటి యాభై లక్షలకు అతడిని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆస్ట్రేలియా చేతిలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్లో టీమిండియా 3-1తో ఓడిపోయింది. తదుపరి టెస్టు సిరీస్లో ఇంగ్లండ్తో తలపడనున్న రోహిత్ సేన ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ టోర్నీతో బిజీగా ఉంది.చదవండి: డబ్బులేదు.. మూడేళ్లపాటు మ్యాగీ మాత్రమే.. మరో ఆణిముత్యం.. అతడే ఓ చరిత్ర: నీతా అంబానీ -
INDW Vs SAW: ఫైనల్లో త్రిష మాయాజాలం.. 82 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్
మహిళల అండర్–19 టీ20 ప్రపంచకప్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా అమ్మాయిలు భారత బౌలర్ల దాటికి నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 82 పరుగులకే ఆలౌటయ్యారు. భారత స్టార్ ఆల్రౌండర్, తెలుగు అమ్మాయి గొండి త్రిష(Gongadi Trisha) తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను బోల్తా కొట్టించింది. త్రిష తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. ఆమెతోపాటు వైష్ణవి శర్మ, అయూష్ శుక్లా, పరునికా సిసోడియా తలా రెండు వికెట్లు సాధించారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో మైకే వాన్ వూర్ట్స్(23), జెమా బోథా(16), ఫే కోవిలింగ్(15) పరుగులతో పర్వాలేదన్పించగా..మిగితా బ్యాటర్లంతా దారుణంగా నిరాశపరిచారు.అదరగొట్టిన త్రిష.. కాగా ఈ టోర్నీ అసాంతం త్రిష తన ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. భారత్ వరుసగా రెండో సారి ఫైనల్ చేరడంలో ఆమెది కీలక పాత్ర. స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో త్రిష 59 బాల్స్లో ఏకంగా 110 పరుగులతో నాటౌట్గా నిలిచింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడిన త్రిష..66.25 సగటుతో 265 పరుగులు చేసి టాప్ స్కోరర్గా కొనసాగుతోంది. అటు బౌలింగ్లోనూ 7 వికెట్లతో త్రిష సత్తాచాటింది.తుది జట్లుదక్షిణాఫ్రికా మహిళల U19 జట్టు: జెమ్మా బోథా, సిమోన్ లౌరెన్స్, డయారా రామ్లాకన్, ఫే కౌలింగ్, కైలా రేనెకే(కెప్టెన్), కరాబో మెసో(వికెట్ కీపర్), మైకే వాన్ వూర్స్ట్, షెష్నీ నాయుడు, ఆష్లీ వాన్ వైక్, మోనాలిసా లెగోడి, న్తాబిసెంగ్ నినితుది జట్లుదక్షిణాఫ్రికా మహిళల U19 జట్టు: జెమ్మా బోథా, సిమోన్ లౌరెన్స్, డయారా రామ్లాకన్, ఫే కౌలింగ్, కైలా రేనెకే(కెప్టెన్), కరాబో మెసో(వికెట్ కీపర్), మైకే వాన్ వూర్స్ట్, షెష్నీ నాయుడు, ఆష్లీ వాన్ వైక్, మోనాలిసా లెగోడి, న్తాబిసెంగ్ నినిచదవండి: #Virat Kohli: 'వావ్ వాట్ ఎ బాల్'.. తనను ఔట్ చేసిన బౌలర్పై కోహ్లి ప్రశంసలు -
ఫైనల్లో తలపడుతున్న భారత్ - దక్షిణాఫ్రికా
-
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా ఫైనల్.. తుది జట్లు ఇవే
మహిళల అండర్–19 టీ20 ప్రపంచకప్ ఫైనల్కు రంగం సిద్దమైంది. కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న తుది పోరులో దక్షిణాఫ్రికా, భారత్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా కనిపిస్తోంది. అజేయంగా ఫైనల్లో అడుగుపెట్టిన భారత జట్టు.. దక్షిణాఫ్రికాపై అదే జోరును కొనసాగించాలని పట్టుదలతో ఉంది. భారత్ మాదిరిగానే ఓటమి లేకుండా ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా జట్టు తొలిసారి వరల్డ్కప్ను ముద్దాడాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న తెలుగు అమ్మాయి గొంగడి త్రిషపై భారత్ మరోసారి ఆధారపడనుంది. ఈ వరల్డ్కప్లో అత్యధిక పరుగుల బ్యాటర్గా త్రిష (265 పరుగులు)నే కొనసాగుతోంది.తుది జట్లుదక్షిణాఫ్రికా మహిళల U19 జట్టు: జెమ్మా బోథా, సిమోన్ లౌరెన్స్, డయారా రామ్లాకన్, ఫే కౌలింగ్, కైలా రేనెకే(కెప్టెన్), కరాబో మెసో(వికెట్ కీపర్), మైకే వాన్ వూర్స్ట్, షెష్నీ నాయుడు, ఆష్లీ వాన్ వైక్, మోనాలిసా లెగోడి, న్తాబిసెంగ్ నినిభారత మహిళల U19 జట్టు: కమలిని(వికెట్ కీపర్), గొంగడి త్రిష, సానికా చల్కే, నికి ప్రసాద్(కెప్టెన్), ఈశ్వరి అవ్సరే, మిథిలా వినోద్, ఆయుషి శుక్లా, జోషిత షబ్నం షకీల్, పరుణికా సిసోడియా, వైష్ణవి శర్మచదవండి: ENG vs IND: ఇంగ్లండ్తో ఐదో టీ20.. భారత జట్టులో కీలక మార్పులు! వారికి ఛాన్స్? -
ప్రపంచంలోనే తొలి బౌలర్గా.. వరుణ్ చక్రవర్తి ‘చెత్త రికార్డు’
గుమ్మడికాయంత ప్రతిభ ఉన్నా.. ఆవగింజంత అదృష్టం కూడా కలిసిరావాలంటారు. టీమిండియా ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) ప్రస్తుత పరిస్థితికి ఈ నానుడి చక్కగా సరిపోతుంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. గతేడాది బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ సందర్భంగా మరోసారి జాతీయ జట్టులోకి వచ్చాడు 33 ఏళ్ల ఈ రైటార్మ్ లెగ్బ్రేక్ స్పిన్ బౌలర్. సొంతగడ్డపై జరిగిన ఈ సిరీస్లో ఐదు వికెట్లు తీసిన వరుణ్.. అనంతరం సౌతాఫ్రికా పర్యటనలోనూ రాణించాడు.కెరీర్లోనే అత్యుత్తమంగాస్వభావసిద్ధంగా ఫాస్ట్బౌలర్లకు అనుకూలించే సౌతాఫ్రికా పిచ్లపై కూడా వరుణ్ చక్రవర్తి తన మార్కు చూపించగలిగాడు. ప్రొటిస్ జట్టుతో నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో మొత్తంగా 12 వికెట్లతో సత్తా చాటాడు. ఇందులో ఓ ఫైవ్ వికెట్ హాల్(ఒకే ఇన్నింగ్స్లో ఐదు లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం) కూడా ఉండటం విశేషం.ఇక తాజాగా స్వదేశంలో ఇంగ్లండ్తో టీ20 సిరీస్(India vs England T20 Series)లోనూ వరుణ్ చక్రవర్తి తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. కోల్కతాలో జరిగిన తొలి టీ20లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి.. 23 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం చెన్నై చెపాక్ స్టేడియంలో రెండు వికెట్లు తీయగలిగాడు.అయితే, రాజ్కోట్లో మంగళవారం జరిగిన మూడో టీ20లో మాత్రం వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లతో చెలరేగాడు. నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 24 పరుగులే ఇచ్చి మెరుగైన ఎకానమీ(6.00) నమోదు చేశాడు. ఇంగ్లండ్ కీలక బ్యాటర్, కెప్టెన్ జోస్ బట్లర్(24)తో పాటు జేమీ స్మిత్(6), జేమీ ఓవర్టన్(0), బ్రైడన్ కార్సే(3), జోఫ్రా ఆర్చర్(0)ల వికెట్లు తీశాడు.కానీ.. ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలైంది. ఇంగ్లండ్ చేతిలో 26 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ ఆధిక్యం 2-1కు తగ్గింది.దురదృష్టం వెంటాడిందిసౌతాఫ్రికాతో 2024 నాటి రెండో టీ20 సందర్భంగా వరుణ్ చక్రవర్తి తొలిసారి అంతర్జాతీయ టీ20లలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. తాజాగా ఇంగ్లండ్తో మూడో టీ20లో రెండో అత్యుత్తమ గణాంకాలు(5/24) సాధించాడు.కానీ దురదృష్టవశాత్తూ ఈ రెండు మ్యాచ్లలోనూ టీమిండియా ఓడిపోవడం గమనార్హం. ఇంటర్నేషనల్ పొట్టి ఫార్మాట్లో ఇలా ఓ బౌలర్ ఐదు వికెట్లు ప్రదర్శన నమోదు చేసిన రెండు సందర్భాల్లోనూ అతడి జట్టు ఓడిపోవడం క్రికెట్ ప్రపంచంలో ఇదే తొలిసారి.చెత్త ‘వరల్డ్’ రికార్డుతద్వారా.. వరుణ్ చక్రవర్తి పేరిట ఇలా ఓ చెత్త వరల్డ్ రికార్డు నమోదైంది. అయితే, ఇంగ్లండ్తో మూడో టీ20లో అద్భుత ప్రదర్శనకు గానూ వరుణ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.మెరుగ్గా ఆడేందుకుఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు అన్ని రకాల బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుందని.. ప్రస్తుతం తన ప్రదర్శన పట్ల సంతృప్తిగానే ఉన్నట్లు తెలిపాడు. అయితే, మున్ముందు ఇంతకంటే మెరుగ్గా ఆడేందుకు కష్టపడుతున్నట్లు తెలిపాడు.బ్యాటర్ల కారణంగానేకాగా ఇంగ్లండ్తో కోల్కతా టీ20లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సూర్యకుమార్ సేన.. చెన్నైలో రెండు వికెట్ల తేడాతో గట్టెక్కగలిగింది. అయితే, మూడో టీ20లో మాత్రం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. రాజ్కోట్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. ఇంగ్లండ్ను 171 పరుగులకు కట్టడి చేయగలిగింది. అయితే, లక్ష్య ఛేదనలో 145 పరుగులకే పరిమితమై ఓటమిని ఆహ్వానించింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం పుణెలో నాలుగో టీ20 జరుగుతుంది.చదవండి: భారత్ బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదు.. అతడిని లోయర్ ఆర్డర్లో ఆడిస్తారా??: కెవిన్ పీటర్సన్ -
సౌతాఫ్రికాతో సిరీస్.. భారత్-‘ఎ’ జట్టు వైస్ కెప్టెన్గా గొంగడి త్రిష
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో జరిగే అండర్–19 మహిళల ముక్కోణపు టీ20 సిరీస్లో పాల్గొనే భారత ‘ఎ’... ‘బి’ జట్లను ప్రకటించారు. హైదరాబాద్కు చెందిన గొంగడి త్రిష భారత ‘ఎ’ జట్టుకు వైస్ కెప్టెన్గా ఎంపికైంది.అదే విధంగా... హైదరాబాద్కే చెందిన గుగులోత్ కావ్యశ్రీకి భారత ‘ఎ’ జట్టులో... కేసరి ధృతికి భారత ‘బి’ జట్టులో చోటు లభించింది. ఆంధ్ర బౌలర్ షబ్నమ్ భారత ‘ఎ’ జట్టులో ఎంపికైంది. పుణె వేదికగాదక్షిణాఫ్రికాతోపాటు భారత ‘ఎ’, ‘బి’ జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలోమ్యాచ్లు జరుగనున్నాయి.ఇక ఈ టోర్నీ డిసెంబర్ 3 నుంచి 12వ తేదీ వరకు జరుగుతుంది. కాగా 18 ఏళ్ల త్రిష గత ఏడాది జరిగిన అండర్–19 ప్రపంచ టీ20 టోర్నీలో విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యురాలిగా ఉంది. భారత ‘ఎ’ జట్టు: సనిక చాల్కె (కెప్టెన్), గొంగడి త్రిష (వైస్ కెప్టెన్), గుగులోత్ కావ్యశ్రీ, భవిక అహిరె, జోషిత, హర్లీ గాలా, సస్తీ మండల్, సిద్ధి శర్మ, సోనమ్ యాదవ్, గాయత్రి సుర్వసె, చాందిని శర్మ, హ్యాపీ కుమారి, షబ్నమ్, బిదిషా డే, ప్రాప్తి రావల్. భారత ‘బి’ జట్టు: నికీ ప్రసాద్ (కెప్టెన్), కమలిని (వైస్ కెప్టెన్), మహంతి శ్రీ, ఇషావరి అవసారె, మిథిలా వినోద్, ఆయుశి శుక్లా, కేసరి ధృతి, పరుణిక సిసోడియా, వైష్ణవి శర్మ, పార్శవి చోప్రా, నందన, అనాది తాగ్డె, అనందిత, సుప్రియా అరెల, భారతి ఉపాధ్యాయ్. లీగ్ దశలోనే తెలంగాణ అవుట్ సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై జరుగుతున్న జాతీయ సబ్ జూనియర్ మహిళల హాకీ చాంపియన్షిప్లో ఆతిథ్య తెలంగాణ జట్టు కథ లీగ్ దశలోనే ముగిసింది. సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్లో బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్లో తెలంగాణ జట్టు 0–7 గోల్స్ తేడాతో ఛత్తీస్గఢ్ జట్టు చేతిలో ఓడిపోయింది. మూడు జట్లున్న గ్రూప్ ‘బి’లో తెలంగాణ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.మంగళవారం జరిగిన తొలి మ్యాచ్లో తెలంగాణ జట్టు 0–11 గోల్స్ తేడాతో జార్ఖండ్ జట్టు చేతిలో పరాజయం పాలైంది. తెలంగాణతో జరిగిన మ్యాచ్లో ఛత్తీస్గఢ్ తరఫున దామిని ఖుస్రో, మధు సిదార్, శ్యామ్లీ రే 2 గోల్స్ చొప్పున చేయగా... అంజలి ఎక్కా 1 గోల్ సాధించారు. ఇతర మ్యాచ్ల్లో మధ్యప్రదేశ్ 15–0తో బెంగాల్ జట్టుపై, ఉత్తర ప్రదేశ్ 5–0తో ఉత్తరాఖండ్పై, గుజరాత్ 1–0తో అస్సాంపై గెలుపొందాయి. -
ICC: వరల్డ్ నంబర్ వన్గా హార్దిక్ పాండ్యా.. దూసుకువచ్చిన తిలక్ వర్మ.. ఏకంగా..
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా సత్తా చాటాడు. టీ20 మెన్స్ ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో మరోసారి అగ్రస్థానం సంపాదించాడు. ఇటీవల సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో ఆల్రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్న హార్దిక్.. వరల్డ్ నంబర్వన్గా అవతరించాడు.ఈ మేరకు ఐసీసీ బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్లో రెండు స్థానాలు ఎగబాకి అగ్రపీఠం కైసవం చేసుకున్నాడు. ఈ క్రమంలో నేపాల్కు చెందిన దీపేంద్ర సింగ్ ఐరీ, ఇంగ్లండ్ విధ్వంసకర వీరుడు లియామ్ లివింగ్స్టోన్ను హార్దిక్ పాండ్యా అధిగమించాడు.తిలక్ వర్మ ఏకంగా 69 స్థానాలు ఎగబాకిమరోవైపు.. టీమిండియా యువ సంచలనం, సెంచరీల వీరుడు తిలక్ వర్మ ఏకంగా 69 స్థానాలు ఎగబాకి.. టీ20 మెన్స్ బ్యాటర్స్ ర్యాంకింగ్స్లో మూడో ర్యాంకు సాధించడం విశేషం. అదే విధంగా.. మరో శతకాల వీరుడు సంజూ శాంసన్ కూడా 17 స్థానాలు జంప్ చేసి.. 22వ ర్యాంకుకు చేరుకున్నాడు. కాగా ఇటీవల నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికాలో పర్యటించిన విషయం తెలిసిందే.సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో సఫారీ గడ్డపై 3-1తో ఈ సిరీస్ను భారత జట్టు సొంతం చేసుకుంది. ఇందులో 31 ఏళ్ల హార్దిక్ పాండ్యా ఇటు బంతితో.. అటు బ్యాట్తో రాణించి తన వంతు పాత్ర పోషించాడు.ముఖ్యంగా నిర్ణయాత్మక నాలుగో టీ20లో మూడు ఓవర్ల బౌలింగ్లో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి.. టీమిండియా గెలుపునకు బాట వేశాడు.సంజూ శాంసన్ సైతంఇక రెండో టీ20లోనూ 39 పరుగులతో అతడు అజేయంగా నిలిచాడు. కాగా టీ20 ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా ప్రథమ స్థానం సంపాదించడం ఇది రెండోసారి. ఇక తిలక్ వర్మ సఫారీలతో సిరీస్లో వరుస సెంచరీలతో చెలరేగాడు. మూడో టీ20లో 107 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ హైదరాబాదీ బ్యాటర్.. నాలుగో మ్యాచ్లో కేవలం 47 బంతుల్లోనే 120 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. మరోవైపు.. సంజూ శాంసన్ సౌతాఫ్రికాలో తొలి టీ20లో 107, నాలుగో టీ20లో 109(నాటౌట్) పరుగులు సాధించాడు.ఐసీసీ టీ20 మెన్స్ ఆల్రౌండర్ల ర్యాంకులు టాప్-51. హార్దిక్ పాండ్యా(ఇండియా)- 244 రేటింగ్ పాయింట్లు2. దీపేంద్ర సింగ్ ఐరీ(నేపాల్)- 231 రేటింగ్ పాయింట్లు3. లియామ్ లివింగ్స్టోన్(ఇంగ్లండ్)- 230 రేటింగ్ పాయింట్లు4. మార్కస్ స్టొయినిస్(ఆస్ట్రేలియా)- 209 రేటింగ్ పాయింట్లు5. వనిందు హసరంగ(శ్రీలంక)- 209 రేటింగ్ పాయింట్లుఐసీసీ టీ20 మెన్స్ బ్యాటర్ల జాబితా టాప్-51. ట్రవిస్ హెడ్(ఆస్ట్రేలియా)- 855 రేటింగ్ పాయింట్లు2. ఫిల్ సాల్ట్(ఇంగ్లండ్)- 828 రేటింగ్ పాయింట్లు3. తిలక్ వర్మ(ఇండియా)- 806 రేటింగ్ పాయింట్లు4. సూర్యకుమార్ యాదవ్(ఇండియా)- 788 రేటింగ్ పాయింట్లు5. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 742 రేటింగ్ పాయింట్లు.టాప్-10లో అర్ష్దీప్ సింగ్ఇదిలా ఉంటే.. టీ20 బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్కు చెందిన ఆదిల్ రషీద్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. వనిందు హసరంగ(శ్రీలంక), ఆడం జంపా(ఆస్ట్రేలియా), అకీల్ హొసేన్(వెస్టిండీస్), మహీశ్ తీక్షణ(శ్రీలంక) టాప్-4లో ఉన్నారు. ఇక టీమిండియా పేసర్ అర్ష్దీప్ సింగ్ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని తొమ్మిదో ర్యాంకు పొందాడు.చదవండి: కోహ్లి పాకిస్తాన్లో ఆడాలని అనుకుంటున్నాడు: పాక్ దిగ్గజ బౌలర్ షాకింగ్ కామెంట్స్ -
పాకిస్తాన్ రికార్డు బద్దలు.. భారీ మైలురాయిని అధిగమించిన టీమిండియా
నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో సౌతాఫ్రికాపై గ్రాండ్ విక్టరీ (3-1) అనంతరం టీమిండియా ఓ భారీ మైలురాయిని అధిగమించింది. పొట్టి ఫార్మాట్లో ఓ క్యాలెండర్ ఇయర్లో 90కు పైగా విజయాల శాతం నమోదు చేసిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు ఓ క్యాలెండర్ ఇయర్లో 90కు పైగా విజయాల శాతాన్ని నమోదు చేయలేదు.భారత్.. పాకిస్తాన్ పేరిట ఉన్న లాంగ్ స్టాండింగ్ రికార్డును బద్దలు కొట్టింది. షార్ట్ ఫార్మాట్లో ఈ ఏడాది భారత్ 92.31 విజయాల శాతం కలిగి ఉంది. 2018లో పాక్ 89.43 విజయాల శాతాన్ని నమోదు చేసింది. సౌతాఫ్రికా సిరీస్తో కలుపుకుని ఈ ఏడాది భారత్ మొత్తం 26 టీ20లు ఆడింది. ఇందులో 24 విజయాలు నమోదు చేసింది. భారత్ ఈ ఏడాది కేవలం రెండు టీ20ల్లో మాత్రమే ఓడింది.టీమిండియా ఈ ఏడాది టీ20 వరల్డ్ ఛాంపియన్గానూ అవతరించింది. యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన పొట్టి ప్రపంచకప్ 2024లో భారత్ జగజ్జేతగా నిలిచింది. టీ20 వరల్డ్కప్ అనంతరం భారత్.. జింబాబ్వే, బంగ్లాదేశ్, శ్రీలంక, సౌతాఫ్రికాపై వరుస సిరీస్ల్లో విజేతగా నిలిచింది. సౌతాఫ్రికా సిరీస్లో కేవలం మూడో టీ20లో మాత్రమే ఓడిన భారత్.. 1, 2, 4 టీ20ల్లో విజేతగా నిలిచింది.పొట్టి ఫార్మాట్లో ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక విజయాల శాతం నమోదు చేసిన జట్లు..భారత్- 92.31 (2024)పాకిస్తాన్- 89.43 (2018)ఉగాండ- 87.88 (2023)పపువా న్యూ గినియా- 87.5 (2019)టాంజానియా- 80.77 (2022)ఇదిలా ఉంటే, భారత టెస్ట్ జట్టు ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సన్నాహకాల్లో బిజీగా ఉంది. ఈ సిరీస్ కోసం భారత్ ఇదివరకే ఆస్ట్రేలియాకు చేరుకుంది. ఈ సిరీస్లో మొత్తం ఐదు మ్యాచ్లు జరుగనున్నాయి. తొలి టెస్ట్ పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ కోసం టీమిండియా కఠోర సాధన చేస్తుంది. ఈ మ్యాచ్కు భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండకపోవచ్చు. హిట్మ్యాన్ రెండోసారి తండ్రైనందున కుటుంబంతో గడిపేందుకు భారత్లోనే ఉన్నాడు. -
నాకు కాదు.. వాళ్లకు థాంక్యూ చెప్పు: తిలక్ వర్మతో సూర్య
టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ సఫారీ గడ్డపై అదరహో అనిపించాడు. అంతర్జాతీయ టీ20లలో రెండు వరుస సెంచరీలతో చెలరేగి సౌతాఫ్రికాపై సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో తిలక్ వర్మ సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం ఈ హైదరాబాదీ ఆట తీరును కొనియాడకుండా ఉండలేకపోయాడు. నాలుగో టీ20 ముగిసిన తర్వాత తిలక్తో సంభాషిస్తూ.. వరుసగా రెండు శతకాలు బాదడం ఎలాంటి అనుభూతినిచ్చిందని ప్రశ్నించాడు. ఇందుకు బదులిస్తూ.. ఇదంతా మీ వల్లే అంటూ తిలక్ వర్మ కెప్టెన్కు కృతజ్ఞతలు తెలిపాడు. అయితే, సూర్య మాత్రం.. ‘‘నువ్వు థాంక్స్ చెప్పాల్సింది నాకు.. కాదు సెలక్టర్లకు’’ అంటూ చమత్కరించాడు.ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. టీ20 సిరీస్లో సౌతాఫ్రికాపై 3-1తో విజయం తర్వాత తిలక్ వర్మ.. కెప్టెన్ సూర్యకుమార్తో సంతోషాన్ని పంచుకుంటూ.. ‘‘అసలేం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. నాలో ఎన్నెన్నో భావోద్వేగాలు చెలరేగుతున్నాయి.నాకు అవకాశం ఇచ్చినందుకు టీమ్కు ధన్యవాదాలు తెలుపుకొంటున్నా. ఇలా వరుసగా టీ20 సెంచరీలు.. అది కూడా సవాళ్లకు నెలవైన సౌతాఫ్రికా పిచ్లపై సఫారీ జట్టుపై చేస్తానని అస్సలు ఊహించలేదు. నిజంగా చాలా గొప్పగా అనిపిస్తోంది. మీకు కూడా థాంక్యూ’’ అని సూర్యపై అభిమానం చాటుకున్నాడు.ఇందుకు బదులుగా సూర్యకుమార్ స్పందిస్తూ.. ‘‘ఇతగాడు ఎంత హుందాగా కృతజ్ఞతలు చెబుతున్నాడో చూడండి. అయినా నాకు నువ్వు థాంక్యూ చెప్పాల్సిన అవసరం లేదు. సెలక్టర్ సర్ అక్కడ కూర్చుని ఉంటారు’’ అంటూ సెలక్టర్లను మర్చిపోవద్దన్న ఉద్దేశంలో తిలక్ వర్మను సరదాగా ట్రోల్ చేశాడు. ఆ సమయంలో తిలక్ వర్మతో పాటు అక్కడే ఉన్న మరో సెంచరీల హీరో సంజూ శాంసన్ కూడా నవ్వులు చిందించాడు. ఈ దృశ్యాలు టీమిండియా అభిమానులను ఆకర్షిస్తున్నాయి.కాగా.. నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా వెళ్లిన టీమిండియా 3-1తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో తొలి, ఆఖరి టీ20లలో సంజూ శతకాలు బాదగా.. మూడు, నాలుగో టీ20లో తిలక్ వర్మ సెంచరీలు కొట్టాడు. సంజూ, తిలక్ అద్భుత ప్రదర్శన కారణంగా టీమిండియా ఆయా మ్యాచ్లలో గెలిచి సఫారీ టూర్ విజయాన్ని పరిపూర్ణం చేసుకుంది. ఇదిలా ఉంటే.. సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును తిలక్ వర్మ సొంతం చేసుకోవడం విశేషం. Jersey number secret, hairdo and a special message for #TeamIndia Captain @ImRo45 🤗Skipper SKY interviews 'Humble' centurions @IamSanjuSamson & @TilakV9 💯WATCH 🎥 🔽 #SAvIND | @surya_14kumar— BCCI (@BCCI) November 16, 2024 -
తిలక్ వర్మ సరికొత్త చరిత్ర.. విరాట్ కోహ్లి ఆల్టైమ్ రికార్డు బ్రేక్
దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా యువ ఆటగాడు, హైదరాబాదీ తిలక్ వర్మ విధ్వంసం సృష్టించాడు. వరుస సెంచరీలతో తిలక్ సత్తాచాటాడు. ప్రోటీస్తో జరిగిన మూడో టీ20లో అద్బుత సెంచరీతో చెలరేగిన తిలక్.. ఇప్పుడు జోహన్స్బర్గ్ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో అదే ఇన్నింగ్స్ను రిపీట్ చేశాడు.ఈ మ్యాచ్లో కేవలం 47 బంతులు మాత్రమే ఎదుర్కొన్న తిలక్ వర్మ.. 9 ఫోర్లు, 10 సిక్స్లతో 120 పరుగులు చేశాడు. ఈ సిరీస్ అసాంతం తిలక్ అద్బుతమైన ప్రదర్శన కరబరిచాడు. మొత్తం నాలుగు మ్యాచ్ల సిరీస్లో 140 సగటు, 198 స్ట్రైక్రేటుతో తిలక్ 280 పరుగులు చేశాడు. ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డులు రెండు కూడా తిలక్ దక్కాయి.కోహ్లి రికార్డు బ్రేక్ఈ క్రమంలో తిలక్ వర్మ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా తిలక్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది.2020-21లో ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో కోహ్లి 147 స్ట్రైక్రేటుతో 231 పరుగులు సాధించాడు. తాజా సిరీస్తో కోహ్లి ఆల్టైమ్ రికార్డును ఈ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ బ్రేక్ చేశాడు. కాగా ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై 135 పరుగుల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. దీంతో నాలుగు మ్యాచ్ల సిరీస్ను 3-1 తేడాతో టీమిండియా ఎగరేసుకుపోయింది.చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు -
సంజూ భారీ సిక్సర్.. లేడీ ఫ్యాన్ చెంపకు తగిలిన బంతి! వీడియో
సౌతాఫ్రికాతో వరుసగా రెండు మ్యాచ్ల్లో డకౌటైన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఆఖరి టీ20లో మాత్రం దెబ్బతిన్న సింహంలా విజృంభించాడు. జోహన్స్బర్గ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో శాంసన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.సఫారీ బౌలర్లను ఊతికారేశాడు. కేవలం 56 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శాంసన్.. 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్లో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. శాంసన్ కొట్టని ఓ భారీ సిక్సర్ నేరుగా వెళ్లి స్టాండ్స్లో ఉన్న ఓ మహిళా అభిమాని ముఖానికి తగిలింది. ఇన్నింగ్స్ 10 ఓవర్ వేసిన స్టబ్స్ రెండో బంతిని మిడిల్ అండ్ లెగ్లో ఫుల్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని శాంసన్ డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. ఈ క్రమంలో ఆ బంతి మొదట సెక్యూరిటీ గార్డును తాకి, ఆపై స్టాండ్స్లో ఉన్న అమ్మాయి దవడకు తగిలింది.దీంతో ఆ లేడీ ఫ్యాన్ నొప్పిని భరించలేక ఏడ్చేసింది. ఆమెకు వెంటనే ఐస్ తెచ్చి దవడపై ట్రీట్ మెంట్ ఇచ్చారు. ఆమె గాయపడినట్లు తెలియగానే సంజూ క్షమాపణలు కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ మ్యాచ్లో ప్రోటీస్ను 135 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది.చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు Wishing a quick recovery for the injured fan! 🤕🤞Keep watching the 4th #SAvIND T20I LIVE on #JioCinema, #Sports18 & #ColorsCineplex 👈#JioCinemaSports pic.twitter.com/KMtBnOa1Hj— JioCinema (@JioCinema) November 15, 2024 -
టీమిండియా సరికొత్త చరిత్ర.. దెబ్బకు ఆసీస్ వరల్డ్ రికార్డు బ్రేక్
దక్షిణాఫ్రికా పర్యటనను టీమిండియా అద్బుత విజయంతో ముగించింది. జోహన్నెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో 135 పరుగులతో భారత్ గెలుపొందింది. తద్వారా నాలుగు మ్యాచ్ల సిరీస్ 3-1తో సూర్య సేన సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.సిక్సర్లు, ఫోర్ల వర్షంతో వాండరర్స్ మైదానం తడిసి ముద్దైంది. తిలక్ వర్మ, సంజూ శాంసన్ అద్బుత సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు. తిలక్ వర్మ 47 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్స్లతో 120, సంజూ శాంసన్ 56 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్లతో 109 పరుగులు చేసి ఆజేయంగా నిలిచారు. అదేవిధంగా ఈ యువ జోడీ రెండో వికెట్కు 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించారు.దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. అనంతరం 284 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక ప్రోటీస్ జట్టు కేవలం 148 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్లో ఘన విజయం సాధించిన టీమిండియా పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది.ఆసీస్ రికార్డు బద్దలు..👉సౌతాఫ్రికాపై టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా వరల్డ్ రికార్డు నెలకొల్పింది. దక్షిణాఫ్రికాపై భారత్ ఇప్పటివరకు 31 టీ20లు ఆడి 18 విజయాలు సాధించింది. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఆస్ట్రేలియా సౌతాఫ్రికాపై 25 మ్యాచ్ల్లో 17 విజయాలు నమోదు చేసింది.తాజా మ్యాచ్తో ఆసీస్ అల్టైమ్ రికార్డును భారత్ బ్రేక్ చేసింది. టీ20ల్లో సౌతాఫ్రికాపై అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో భారత్, ఆస్ట్రేలియా తర్వాత వెస్టిండీస్ (14), ఇంగ్లండ్ (12), పాకిస్తాన్ (12), శ్రీలంక (5), న్యూజిలాండ్ (4), ఐర్లాండ్ (1), నెదర్లాండ్స్ (1) జట్లు ఉన్నాయి.👉టీ20ల్లో భారత్కు ఇది రెండో అత్యధిక స్కోరు(284). గత నెలలో హైదరాబాద్లో బంగ్లాదేశ్పై భారత్ 297 పరుగులు చేసింది. 👉అంతర్జాతీయ టీ20ల్లో ఏ వికెట్కైనా అత్యధిక భాగస్వామ్యం(210) జోడించిన జోడీగా తిలక్-శాంసన్ నిలిచారు. దీంతో రోహిత్, రింకూ (190; అఫ్గానిస్తాన్పై 2024లో) రికార్డు కనుమరుగైంది.చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు -
అందులో సీక్రెట్ ఏమీ లేదు.. వారిద్దరూ మాత్రం అద్బుతం: సూర్య
జోహన్నెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో 135 పరుగులతో టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. తద్వారా నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-1 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. ఆఖరి టీ20లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు.తిలక్ వర్మ (47 బంతుల్లో 120 నాటౌట్; 9 ఫోర్లు, 10 సిక్స్లు), సంజూ శాంసన్ (56 బంతుల్లో 109 నాటౌట్; 6 ఫోర్లు, 9 సిక్స్లు) మెరుపు సెంచరీలతో చెలరేగారు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది.భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లతో సత్తాచాటగా.. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఈ విజయం తనకెంతో ప్రత్యేకమని సూర్య చెప్పుకొచ్చాడు.వారిద్దరూ అద్బుతం: సూర్య"పరిస్థితులకు అనుగుణంగా మారి ఆడటంలో ఎటువంటి రహస్యం లేదు. మేము డర్బన్లో అడుగుపెట్టిన వెంటనే మా ప్రణాళికలను సిద్దం చేసుకున్నాము. మేము గతంలో దక్షిణాఫ్రికాకు వచ్చినప్పుడు ఎలా ఆడామో ఈ సారి కూడా అదే బ్రాండ్ ఆఫ్ క్రికెట్ను కొనసాగించాలని నిర్ణయించుకున్నాము.ఫలితాలు గురించి మేము ఎప్పుడూ ఆలోచించలేదు. తిలక్ వర్మ, సంజూ శాంసన్ ఇద్దరూ అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. ఇద్దరిలో ఎవరిది గొప్ప నాక్ అని ఎంచుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది. వారిద్దరితో పాటు అభిషేక్ కూడా తన బ్యాటింగ్ స్కిల్స్ను ప్రదర్శించాడు.ఉష్ణోగ్రత తగ్గిన అనంతరం బౌలింగ్కు అనుకూలిస్తుందని భావించాం. చక్కని లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేస్తే ప్రత్యర్ధి బ్యాటర్లను కట్టడి చేయవచ్చని మా బౌలర్లకు చెప్పారు. అందుకు తగ్గట్టే వారు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మేము ఇక్కడే మా తదుపరి టీ20 వరల్డ్కప్ను ఆడనున్నాము.దక్షిణాఫ్రికా వంటి పరిస్థితుల్లో విజయాలు సాధించడం అంత ఈజీ కాదు. కాబట్టి ఇది ఎంతో ప్రత్యేకమైన విజయం. కోచింగ్ స్టాప్ కూడా మాకు ఎంతో సపోర్ట్గా ఉన్నారు. ఈ సిరీస్ మొదటి రోజే మాకు ఓ క్లారిటీ ఇచ్చేశారు. మీకు నచ్చిన విధంగా ఆడడండి, మేము కూర్చోని మీ ప్రదర్శనను ఎంజాయ్ చేస్తాము అని మాతో చెప్పారు" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో సూర్య పేర్కొన్నాడు.చదవండి: #Rohit Sharma: రెండోసారి తండ్రైన రోహిత్ శర్మ.. మగబిడ్డకు జన్మనిచ్చిన రితికా -
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ తిరిగి తన ఫామ్ను అందుకున్నాడు. జోహన్నెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో శాంసన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. వరుసగా రెండు టీ20ల్లో డకౌటై నిరాశపరిచిన సంజూ.. ఆఖరి మ్యాచ్లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనదైన స్టైల్లో ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు.తిలక్ వర్మతో స్కోర్ బోర్డును ఈ కేరళ స్టార్ బ్యాటర్ పరుగులు పెట్టించాడు. కేవలం 56 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శాంసన్.. 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేశాడు. ఇక అద్భుత సెంచరీతో చెలరేగిన శాంసన్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.చరిత్ర సృష్టించిన శాంసన్👉అంతర్జాతీయ టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా శాంసన్ ప్రపంచ రికార్డు సాధించాడు. ఈ ఏడాది టీ20ల్లో సంజూకు ఇది మూడో సెంచరీ. తద్వారా ఈ రేర్ ఫీట్ను సంజూ తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ప్రపంచక్రికెట్లో ఏ బ్యాటర్ కూడా ఒకే ఏడాదిలో మూడు టీ20 సెంచరీలు సాధించలేదు.👉అదేవిధంగా ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్లో రెండు సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా శాంసన్ నిలిచాడు. సంజూ కంటే ముందు ఇంగ్లండ్కు చెందిన ఫిల్ సాల్ట్ ఈ ఫీట్ నమోదు చేశాడు.భారత్ ఘన విజయంఇక ఈ మ్యాచ్లో 135 పరుగుల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. తద్వారా నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-1తో టీమిండియా సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది.భారత బ్యాటర్లలో శాంసన్తో పాటు తిలక్ వర్మ(47 బంతుల్లో 120 నాటౌట్) సూపర్ సెంచరీతో మెరిశాడు. అనంతరం లక్ష్య చేధనలో ప్రోటీస్ కేవలం 148 పరుగులకే కుప్పకూలింది.చదవండి: #Rohit Sharma: రెండోసారి తండ్రైన రోహిత్ శర్మ.. మగబిడ్డకు జన్మనిచ్చిన రితికా -
సఫారీలకు చుక్కలు చూపించిన టీమిండియా.. రికార్డులు బ్రేక్ (ఫొటోలు)
-
శివాలెత్తిన తిలక్, సంజూ.. విధ్వంసకర శతకాలు.. టీమిండియా అతి భారీ స్కోర్
జొహనెస్బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా అతి భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. సంజూ శాంసన్, తిలక్ వర్మ విధ్వంసకర శతకాలతో శివాలెత్తిపోయారు. సంజూ 55 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేయగా.. తిలక్ 41 బంతుల్లోనే 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో శతక్కొట్టాడు. తిలక్కు ఇది వరుసగా రెండో సెంచరీ కాగా.. సంజూకు ఈ సిరీస్లో ఇది రెండో సెంచరీ. తొలి టీ20లో సెంచరీ అనంతరం సంజూ వరుసగా రెండు మ్యాచ్ల్లో డకౌటయ్యాడు. ఈ మ్యాచ్లో మొత్తం 56 బంతులు ఎదుర్కొన్న సంజూ 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేసి అజేయంగా నిలువగా.. తిలక్ 47 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 120 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ సైతం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ 18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 36 పరుగులు చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో సిపామ్లాకు అభిషేక్ శర్మ వికెట్ దక్కింది. కాగా, నాలుగు మ్యాచ్ల ఈ సిరీస్లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.తుది జట్లు...భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(వికెట్కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తిదక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్కీపర్), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సైమ్లేన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, లూథో సిపమ్లా -
భారత్, సౌతాఫ్రికా నాలుగో టీ20.. తుది జట్లు ఇవే..!
జొహనెస్బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో ఇవాళ (నవంబర్ 15) జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. మూడో టీ20లో ఆడిన జట్లనే యధాతథంగా బరిలోకి దించుతున్నాయి. నాలుగు మ్యాచ్ల ఈ సిరీస్లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(వికెట్కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తిదక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్కీపర్), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సైమ్లేన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, లూథో సిపమ్లా -
సౌతాఫ్రికాతో నాలుగో టీ20.. టీమిండియా గెలిచిందా చరిత్రే..!
జొహనెస్బర్గ్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య ఇవాళ (నవంబర్ 15) నాలుగో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభంకానుంది. నాలుగు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. నేటి మ్యాచ్లో భారత్ గెలిస్తే సరికొత్త చరిత్ర సృష్టించినట్లవుతుంది.ఈ మ్యాచ్ గెలుపుతో భారత్ సిరీస్ను కైవసం చేసుకోవడంతో పాటు సౌతాఫ్రికాపై టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పుతుంది. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా జట్లు సౌతాఫ్రికాపై తలో 17 విజయాలు సాధించాయి. ఆస్ట్రేలియా సౌతాఫ్రికాపై 25 మ్యాచ్ల్లో 17 విజయాలు సాధిస్తే.. భారత్ 30 మ్యాచ్ల్లో 17 విజయాలు సాధించింది. టీ20ల్లో సౌతాఫ్రికాపై అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో ఆస్ట్రేలియా, భారత్ తర్వాత వెస్టిండీస్ (14), ఇంగ్లండ్ (12), పాకిస్తాన్ (12), శ్రీలంక (5), న్యూజిలాండ్ (4), ఐర్లాండ్ (1), నెదర్లాండ్స్ (1) జట్లు ఉన్నాయి.కాగా, సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ ఒకటి, మూడు మ్యాచ్ల్లో గెలుపొందగా.. సౌతాఫ్రికా రెండో మ్యాచ్లో విజయం సాధించింది. చివరిగా జరిగిన మూడో టీ20లో భారత్ సౌతాఫ్రికాపై 11 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తిలక్ వర్మ (107 నాటౌట్) శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ (50) ఆడాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా గెలుపు కోసం చివరి వరకు పోరాడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. సౌతాఫ్రికా లక్ష్యానికి 12 పరుగుల దూరంలో నిలిచిపోయింది. మార్కో జన్సెన్ (54), హెన్రిచ్ క్లాసెన్ (41) దక్షిణాఫ్రికాను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. అర్షదీప్ సింగ్ 3 కీలక వికెట్లు తీసి దక్షిణాఫ్రికా గెలుపుకు అడ్డుకట్ట వేశాడు. -
IND VS SA 4th T20: సంజూ మరోసారి డకౌటైతే..?
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. జొహనెస్బర్గ్ వేదికగా ఇరు జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 15) నాలుగో టీ20 జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి.ఇదిలా ఉంటే, ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో సెంచరీ చేసిన టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్.. ఆతర్వాత వరుసగా రెండు మ్యాచ్ల్లో డకౌటయ్యాడు. శాంసన్ తన 32 మ్యాచ్ల స్వల్ప కెరీర్లో మొత్తం ఆరు సార్లు డకౌటయ్యాడు. శాంసన్ ఇవాళ జరుగబోయే నాలుగో టీ20లో కూడా డకౌటైతే ఓ చెత్త రికార్డును టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లితో కలిసి షేర్ చేసుకుంటాడు.కోహ్లి తన 117 మ్యాచ్ల టీ20 కెరీర్లో ఏడు సార్లు డకౌటయ్యాడు. సంజూ నేటి మ్యాచ్లో డకౌటైతే విరాట్ సరసన నిలుస్తాడు. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక సార్లు డకౌటైన అప్రతిష్ట రోహిత్ శర్మకు దక్కుతుంది. హిట్మ్యాన్ తన 151 మ్యాచ్ టీ20 కెరీర్లో 12 సార్లు ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. హిట్మ్యాన్ తర్వాతి స్థానాల్లో విరాట్ (7), సంజూ శాంసన్ (6), కేఎల్ రాహుల్ (5), శ్రేయస్ అయ్యర్ (4) ఉన్నారు.కాగా, సంజూ తన కెరీర్లో వరుసగా రెండు మ్యాచ్ల్లో డకౌట్లు కావడం ఇది రెండో సారి. ఈ ఏడాది శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లోనూ సంజూ వరుసగా రెండు మ్యాచ్ల్లో డకౌటయ్యాడు. నేటి మ్యాచ్లో సంజూ ఎలాగైనా ఖాతా తెరిచి విరాట్ పేరిట ఉన్న అప్రతిష్టను సమం చేయకూడదని భావిస్తున్నాడు. సంజూ గత రెండు మ్యాచ్ల్లో డకౌటైన సందర్భాల్లో మార్కో జన్సెన్ బౌలింగ్లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సంజూ ఈసారి ఎలాగైనా జన్సెన్ ఫోబియా నుంచి బయటపడి భారీ స్కోర్ సాధించాలని ఆశిద్దాం. -
Ind vs SA: వాళ్లు ఓకే.. సూర్యకుమార్ యాదవ్ ఎందుకిలా?
సౌతాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్ గెలవడమే లక్ష్యంగా టీమిండియా ఆఖరి మ్యాచ్లో బరిలోకి దిగనుంది. ఇరుజట్ల మధ్య జొహన్నస్బర్గ్ వేదికగా.. శుక్రవారం నాటి టీ20లో గెలిచి.. 3-1తో పర్యటన ముగించాలని పట్టుదలగా ఉంది. ఇక ఈ టూర్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని యువ జట్టు ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో మెరుగ్గానే రాణించింది.వాళ్లు ఓకేముఖ్యంగా తొలి, మూడో టీ20లో బ్యాటర్లు దంచికొట్టిన తీరు అలరించింది. ఈ సిరీస్లో ఇప్పటి వరకు సంజూ శాంసన్(107- మొదటి టీ20), తిలక్ వర్మ(107 నాటౌట్- మూడో టీ20)లో అద్భుత శతకాలతో సత్తా చాటి విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఇంత వరకు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.సూర్యకుమార్ యాదవ్ ఎందుకిలా?సఫారీలతో మూడు టీ20లలో అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 21, 4, 1. ఈ నేపథ్యంలో కీలకమైన నాలుగో టీ20కి ముందు సూర్య ఫామ్పై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సూర్యను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.గత మూడేళ్ల కాలంలో ఇలా‘‘సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ టీ20ల ఫామ్పై ఆందోళన అవసరమే అంటారా?.. చాలా మంది ఈ విషయం గురించి ఆలోచిస్తున్నారు. అందుకే అతడి గణాంకాలను ఓసారి పరిశీలిద్దాం. 2021లో సగటున 34 పరుగులతో 155కు పైగా స్ట్రైక్రేటు నమోదు చేశాడు. కేవలం 11 ఇన్నింగ్స్లోనే ఇది జరిగింది.ఇక 2022లో సూర్య యావరేజ్గా 46 రన్స్తో 187కు పైగా స్ట్రైక్రేటుతో 1164 పరుగులు సాధించాడు. అద్భుతంగా ఆడాడు అనడానికి ఇదే నిదర్శనం. ఇక 2023లో 155కు పైగా స్ట్రైక్రేటుతో 733 రన్స్ సాధించాడు. సగటు 49. పర్లేదు బాగానే ఆడాడు.కానీ..2024లో ఇప్పటి వరకు 17 ఇన్నింగ్స్లో కేవలం 429 పరుగులే చేయగలిగాడు. స్ట్రైక్రేటు 150 ఉన్నా.. సగటు మాత్రం కేవలం 26.8. ఇందులో కేవలం నాలుగు అర్ధ శతకాలే ఉన్నాయి. వీటన్నింటిని బట్టి చూస్తే సూర్య మునుపటి సూర్యలా లేడు. సగటున అతడు రాబడుతున్న పరుగులే ఇందుకు సాక్ష్యం’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.సూర్య కనీసం హాఫ్ సెంచరీ సాధిస్తే..గత మూడేళ్ల కాలంలో ఈ ఏడాది సూర్యకుమార్ బ్యాటింగ్ మరీ అంతగొప్పగా ఏమీలేదని.. కాబట్టి సూర్య ఫామ్ ఆందోళన కలిగించడంలో ఆశ్చర్యం ఏమీ లేదని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. జొహన్నస్బర్గ్ మ్యాచ్లో సూర్య కనీసం హాఫ్ సెంచరీ అయినా సాధిస్తే.. జట్టుతో పాటు అతడికీ ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా డర్బన్లో తొలి టీ20లో గెలిచిన టీమిండియా.. గెబెహాలో ఓడిపోయింది. అయితే, సెంచూరియన్లో మూడో మ్యాచ్లో గెలిచి ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉంది.చదవండి: పాకిస్తాన్తో తొలి టీ20: మాక్స్వెల్ ఊచకోత, స్టొయినిస్ విధ్వంసం -
IND VS SA 3rd T20: చరిత్ర సృష్టించిన టీమిండియా
సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 11 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. తద్వారా నాలుగు మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో వెళ్లింది. మూడో టీ20లో గెలుపు అనంతరం టీమిండియా ఓ అరుదైన రికార్డు తమ ఖాతాలో వేసుకుంది. పాక్ తర్వాత విదేశాల్లో 100 విజయాలు సాధించిన రెండో జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఓవరాల్గా భారత్ ఇప్పటివరకు 241 టీ20 మ్యాచ్లు ఆడి 164 మ్యాచ్లో విజయాలు సాధించింది. విదేశాల్లో 152 టీ20లు ఆడిన భారత్ 100 మ్యాచ్ల్లో విజయాలు సాధించగా.. విదేశాల్లో 203 టీ20లు ఆడిన పాక్ 116 మ్యాచ్ల్లో గెలుపొందింది.200 సిక్సర్లు బాదిన తొలి జట్టుగా..!సౌతాఫ్రికాతో మూడో టీ20లోనే టీమిండియా మరో రికార్డు తమ ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్లో మొత్తం 13 సిక్సర్లు బాదిన భారత్.. టీ20ల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో 200 సిక్సర్లు బాదిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.శతక్కొట్టిన తిలక్ వర్మ.. విధ్వంసం సృష్టించిన అభిషేక్ శర్మసౌతాఫ్రికాతో మూడో టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తిలక్ వర్మ (56 బంతుల్లో 107 నాటౌట్; 8 ఫోర్లు, 7 సిక్సర్లు), అభిషేక్ శర్మ (25 బంతుల్లో 50; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. టీ20ల్లో 200 పరుగుల మార్కు దాటడం భారత్కు ఈ ఏడాది ఇది ఎనిమిదోసారి. టీ20 చరిత్రలో ఏ జట్టు ఓ క్యాలెండర్ ఇయర్లో ఇన్ని సార్లు 200 పరుగుల మార్కును దాటలేదు.పోరాడి ఓడిన సౌతాఫ్రికా..220 పరుగుల భారీ లక్ష్యాన్నిఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా చివరి నిమిషం వరకు అద్భుతంగా పోరాడి ఓటమిపాలైంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి లక్ష్యానికి 12 పరుగుల దూరంలో నిలిచిపోయింది. హెన్రిచ్ క్లాసెన్ (41), మార్కో జన్సెన్ (54) సఫారీలను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. భారత బౌలర్లలో అర్షదీప్సింగ్ 3, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు పడగొట్టారు. -
సౌతాఫ్రికాతో నాలుగో టీ20.. హార్దిక్ పాండ్యాపై వేటు..?
జొహనెస్బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో రేపు (నవంబర్ 15) జరుగబోయే నాలుగో టీ20లో టీమిండియా ఓ కీలక మార్పు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్ ఫలితంతో సిరీస్ డిసైడ్ కానున్న నేపథ్యంలో భారత్ ఈ మ్యాచ్ను చాలా కీలకంగా తీసుకోనుంది. ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను పక్కకు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. నాలుగు మ్యాచ్ల ఈ సిరీస్లో హార్దిక్ బ్యాట్తో చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ చేయకపోగా.. బౌలింగ్లో పూర్తిగా నిరాశపరిచాడు. తొలి టీ20లో ఆరు బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులు మాత్రమే చేసిన హార్దిక్.. బౌలింగ్లో మూడు ఓవర్లు వేసి వికెట్ లేకుండా 27 పరుగులు సమర్పించుకున్నాడు.ఆతర్వాత రెండో టీ20 బ్యాట్తో కాస్త పర్వాలేదనిపించిన హార్దిక్.. బంతితో (3 ఓవర్లలో వికెట్ లేకుండా 22 పరుగులు) ఆకట్టుకోలేకపోయాడు. ఈ మ్యాచ్లో హార్దిక్ బ్యాట్తో రాణించాడని మాట వరుసకే చెప్పుకోవాలి. ఈ మ్యాచ్లో అతను స్ట్రయిక్ రొటేట్ చేయకుండా ఇన్నింగ్స్ ఆఖర్లో అనవసరంగా బంతులు వేస్ట్ చేశాడు. ఈ మ్యాచ్లో 45 బంతులు ఎదుర్కొన్న హార్దిక్.. 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 39 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బౌలింగ్లో హార్దిక్ కీలక సమయంలో వైడ్లు వేసి అభిమానులకు కంపరం పుట్టించాడు.మూడో టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో హార్దిక్ బ్యాట్తోనూ, బంతితోనూ పూర్తిగా విఫలమయ్యాడు. తొలుత బ్యాటింగ్లో 16 బంతులు ఎదుర్కొని 3 ఫోర్ల సాయంతో 18 పరుగులు చేసిన హార్దిక్.. ఆతర్వాత బౌలింగ్లో దారుణమైన ప్రదర్శన చేశాడు. మొత్తం నాలుగు ఓవర్లు వేసిన హార్దిక్ ఏకంగా 50 పరుగులిచ్చి ఓ వికెట్ తీసుకున్నాడు. మూడు టీ20ల్లో పేలవ ప్రదర్శనల నేపథ్యంలో కీలకమైన నాలుగో టీ20 నుంచి హార్దిక్ను తప్పించాలని అభిమానులను నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. హార్దిక్ స్థానంలో స్పెషలిస్ట్ పేసర్కు తుది జట్టులో చేర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. హార్దిక్ బంతితో ఎలాగూ తేలిపోతున్నాడు కాబట్టి ఆవేశ్ ఖాన్ లేదా యశ్ దయాల్కు నాలుగో టీ20లో అవకాశం ఇవ్వడం మంచిదని అంటున్నారు.మరోవైపు ఈ సిరీస్లో రింకూ సింగ్ సైతం వరుసగా మూడు మ్యాచ్ల్లో దారుణంగా విఫలమయ్యాడు. నాలుగో టీ20లో రింకూను కూడా తప్పించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. రింకూ స్థానంలో జితేశ్ శర్మకు అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఈ సిరీస్లో తొలి మూడు టీ20ల్లో రింకూ స్కోర్లు ఇలా ఉన్నాయి. తొలి టీ20లో 11 పరుగులు చేసిన రింకూ.. రెండో టీ20లో 9, మూడో టీ20 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. నాలుగో మ్యాచ్ గెలిస్తేనే సిరీస్ టీమిండియా వశమవుతుంది కాబట్టి మేనేజ్మెంట్ ఈ రెండు మార్పులపై దృష్టి సారించాలని అభిమానులు కోరుకుంటున్నారు. -
తలకు గాయం.. అప్డేట్ ఇచ్చిన తిలక్ వర్మ! ఆ విషయంలో క్రెడిట్ వాళ్లకే
సౌతాఫ్రికాతో మూడో టీ20లో గెలుపు కోసం టీమిండియా ఆఖరి వరకు పోరాడాల్సి వచ్చింది. భారీ స్కోరు సాధించినా.. చివరి ఓవర్ వరకు ఆతిథ్య జట్టు గట్టిపోటీనిచ్చింది. దీంతో భారత బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో టీమిండియా సెంచరీ హీరో తిలక్ వర్మ గాయపడ్డాడు.ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో భారత పేసర్ అర్ష్దీప్ సింగ్ ఆఖరి ఓవర్ వేశాడు. అప్పటికే జోరు మీదున్న ప్రొటిస్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ మార్కో జాన్సెన్.. అర్ష్దీప్ బౌలింగ్లో రెండో బంతికి కవర్స్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. అయితే, ఆ బంతిని అందుకునే క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న తిలక్ వర్మ.. క్యాచ్ అందుకునే క్రమంలో కిందపడ్డాడు.తిలక్ తల నేలకు బలంగా తాకినట్లుఫలితంగా క్యాచ్ మిస్ కావడమే గాక.. తిలక్ తల నేలకు బలంగా తాకినట్లు రీప్లేలో కనిపించింది. దీంతో భారత శిబిరంలో కలకలం రేగింది. వెంటనే ఫిజియో వచ్చి తిలక్ను పరిస్థితిని పర్యవేక్షించాడు. మరోవైపు... ఈ సిక్సర్తో జాన్సెన్ యాభై పరుగుల మార్కును పూర్తి చేసుకుని.. టీమిండియాపై ఫాస్టెస్ట్ ఫిఫ్టీ(16 బంతుల్లో) నమోదు చేసిన తొలి సౌతాఫ్రికా ప్లేయర్గా నిలిచాడు.ఇదిలా ఉంటే.. తిలక్ వర్మ గాయంపై అభిమానుల్లోనూ ఆందోళన నెలకొంది. అతడు తదుపరి మ్యాచ్కు అందుబాటులో ఉంటాడో లేదోనన్న సందేహాల నడుమ.. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో తిలక్ వర్మ తన గాయంపై అప్డేట్ అందించాడు.నేను బాగానే ఉన్నాను‘‘నేను బాగానే ఉన్నాను. క్యాచ్ అందుకునేటపుడు వెలుతురు కళ్లలో పడి.. బంతిని పట్టుకోవడం సాధ్యం కాలేదు. ఏదేమైనా మేము గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని తిలక్ వర్మ పేర్కొన్నాడు. అదే విధంగా.. తాను విధ్వంసకర శతకం బాదడంలో క్రెడిట్ మొత్తం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటు కోచ్ వీవీఎస్ లక్ష్మణ్కు ఇవ్వాలని తిలక్ అన్నాడు.107 పరుగులుఈ మ్యాచ్లో మూడో నంబర్లో బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చినందుకు సూర్యకు ధన్యవాదాలు తెలిపాడు. కాగా సెంచూరియన్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్లో తిలక్ వర్మ 56 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో ఏకంగా 107 పరుగులు సాధించాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి భారత్ 219 పరుగులు స్కోరు చేయడంలో కీలకంగా వ్యవహరించాడు. ఇక లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 208 పరుగుల వద్ద నిలిచి.. పదకొండు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో తిలక్.. అర్ష్దీప్ బౌలింగ్లో హెన్రిచ్ క్లాసెన్(41)క్యాచ్ అందుకుని మ్యాచ్ను మలుపు తిప్పడంలో దోహదపడ్డాడు.చదవండి: Mohammed Shami: రీ ఎంట్రీలో చెలరేగిన మహ్మద్ షమీ.. -
టీమిండియా తదుపరి హెడ్కోచ్ అతడే: పాక్ మాజీ క్రికెటర్
టీమిండియా మాజీ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గౌతం గంభీర్ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్గా లక్ష్మణ్ ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో భారత జట్టు అద్భుత ప్రదర్శనే అతడి శిక్షణా నైపుణ్యాలకు నిదర్శనమని కొనియాడాడు.శుభారంభమే అయినాటీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్గా అవతరించిన తర్వాత రాహుల్ ద్రవిడ్ హెడ్కోచ్ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2007, 2011 వరల్డ్కప్ హీరో గౌతం గంభీర్ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేశాడు. శ్రీలంక పర్యటనతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి టీ20 సిరీస్లో క్లీన్స్వీప్ విజయం అందుకున్నాడు.అయితే, లంకతో వన్డే సిరీస్లో చారిత్రక ఓటమి తర్వాత.. మళ్లీ సొంతగడ్డపై గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా మరో వైట్వాష్ విజయం అందుకుంది. బంగ్లాదేశ్ను టెస్టుల్లో 2-0తో ఓడించింది. అయితే, ఆ తర్వాత మరో ఘోర ఓటమిని చవిచూసింది. స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో 3-0తో క్లీన్స్వీప్నకు గురై.. చెత్త రికార్డులు మూటగట్టుకుంది.ఆస్ట్రేలియా పర్యటన రూపంలో గంభీర్కు అసలైన సవాలుఇక ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటన రూపంలో గంభీర్కు అసలైన సవాలు ఎదురుకానుంది. అక్కడ బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియా పాసైతేనే గంభీర్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. లేదంటే.. విమర్శలతో పాటు కోచ్ పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లూ వచ్చినా ఆశ్చర్యం లేదు.వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ మాత్రంమరోవైపు.. ప్రధాన కోచ్ల గైర్హాజరీలో టీమిండియా హెడ్కోచ్గా వ్యవహరిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్ మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. టీ20 వరల్డ్కప్ తర్వాత జింబాబ్వే టూర్లో లక్ష్మణ్ సారథ్యంలో యువ జట్టు 4-1తో టీ20 సిరీస్ గెలిచింది. తాజాగా సౌతాఫ్రికా గడ్డపై పటిష్ట ప్రొటిస్ జట్టుపై కూడా సూర్యకుమార్ సేన సత్తా చాటుతోంది.సెంచూరియన్లో జరిగిన మూడో టీ20లో భారీ స్కోరు సాధించడమే గాక.. లక్ష్యాన్ని కాపాడుకుని గెలుపు జెండా ఎగురవేసింది. ఈ క్రమంలో నాలుగు మ్యాచ్ల సిరీస్లో 2-1తో ముందంజలో నిలిచింది.ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ లక్ష్మణ్పై ప్రశంసలు కురిపించాడు.టీమిండియా హెడ్కోచ్గా అతడే హాట్, హాట్, హాట్ కేకు‘‘ఈరోజు వీవీఎస్ వ్యూహాలను చూసిన తర్వాత.. టీమిండియా హెడ్కోచ్గా అతడే హాట్, హాట్, హాట్ కేకు అనిపించింది. సూర్యకుమార్ యాదవ్ను మూడో నంబర్లో బ్యాటింగ్కు పంపకుండా కొత్త ప్రణాళికను అమలు చేశాడు.ఒకవేళ ఆస్ట్రేలియా పర్యటనలో గంభీర్ గనుక విఫలమైతే.. వీవీఎస్ తదుపరి కోచ్గా.. రేసులో ముందుకు దూసుకువస్తాడు. మూడో టీ20లో సూర్యను మూడో నంబర్లో పంపకుండా.. ఉండటం వల్లే సౌతాఫ్రికాతో మ్యాచ్లో టీమిండియాకు అనుకూల ఫలితం వచ్చింది’’ అని బసిత్ అలీ పేర్కొన్నాడు.11 పరుగుల తేడాతో టీమిండియా విజయంకాగా సెంచూరియన్లో బుధవారం జరిగిన మూడో టీ20లో కెప్టెన్ సూర్యకుమార్కు బదులు తిలక్ వర్మ మూడో నంబర్లో బ్యాటింగ్ చేశాడు. కేవలం 56 బంతుల్లోనే 107 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ హైదరాబాదీ.. జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో 219 పరుగులు చేసిన టీమిండియా.. 11 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై విజయం సాధించింది.చదవండి: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా ఘనత -
భువనేశ్వర్ ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన అర్ష్దీప్ సింగ్.. ఒకే ఒక్కడు!
అంతర్జాతీయ టీ20లలో టీమిండియా తరఫున 2022లో అరంగేట్రం చేశాడు అర్ష్దీప్ సింగ్. రెండేళ్లకాలంలోనే పొట్టి ఫార్మాట్లో అత్యంత విజయవంతమైన బౌలర్గా అవతరించాడు. తాజాగా సౌతాఫ్రికా పర్యటనలోనూ సత్తా చాటుతున్నాడు ఈ యువ పేసర్.నాలుగు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి రెండు టీ20లలో స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్పై కూడా అర్ష్దీప్ ఫర్వాలేదనిపించాడు. ఆ రెండు మ్యాచ్లలో ఒక్కో వికెట్ తీసిన ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్.. మూడో టీ20లో మాత్రం తన సత్తా చూపించాడు. కీలక సమయంలో మూడు కీలక వికెట్లు కూల్చి టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చడంలో తన వంతు పాత్ర పోషించాడు.కీలక సమయంలో కీలక వికెట్లు తీసిపవర్ ప్లేలో సౌతాఫ్రికా ఓపెనర్ రియాన్ రెకెల్టన్(15 బంతుల్లో 20)ను పెవిలియన్కు పంపిన అర్ష్దీప్.. విధ్వంసకర బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్(22 బంతుల్లో 41)ను అవుట్ చేసి తన ఖాతాలో రెండో వికెట్ జమచేసుకున్నాడు. ఇక ప్రొటిస్ జట్టు లక్ష్యానికి చేరువగా వస్తుందనుకున్న సమయంలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ వీరుడు మార్కో జాన్సెన్(17 బంతుల్లో 54)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని గట్టిషాకిచ్చాడు.అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్బౌలర్గామొత్తంగా మూడో టీ20లో నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన అర్ష్దీప్ 37 పరుగులు ఇచ్చి.. మూడు వికెట్లు కూల్చాడు. తద్వారా అంతర్జాతీయ టీ20లలో 92 వికెట్ల మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్కుమార్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్బౌలర్గా అవతరించాడు.అంతేకాదు.. టీమిండియా తరఫున టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గానూ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో భారత వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ 96 వికెట్లతో మొదటిస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, తొంభై వికెట్ల క్లబ్లో చేరేందుకు చహల్కు 80 మ్యాచ్లు అవసరమైతే.. 25 ఏళ్ల అర్ష్దీప్ సింగ్ కేవలం 59 మ్యాచ్లలోనే ఈ ఘనత సాధించడం విశేషం.అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లు1. యజువేంద్ర చహల్- 80 మ్యాచ్లలో 96 వికెట్లు2. అర్ష్దీప్ సింగ్- 59 మ్యాచ్లలో 92 వికెట్లు3. భువనేశ్వర్ కుమార్- 87 మ్యాచ్లలో 90 వికెట్లు4. జస్ప్రీత్ బుమ్రా- 70 మ్యాచ్లలో 89 వికెట్లు.తిలక్, అభిషేక్ ధనాధన్ఇదిలా ఉంటే.. సెంచూరియన్ వేదికగా బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. తిలక్ వర్మ(107 నాటౌట్), అభిషేక్ శర్మ(50) అద్భుత ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఏకంగా 219 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనలో ఆఖరి వరకు సౌతాఫ్రికా పోరాడినా.. భారత బౌలర్ల విజృంభణతో వారికి ఓటమి తప్పలేదు. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 208 పరుగుల వద్ద నిలిచిన ప్రొటిస్ జట్టు.. టీమిండియా చేతిలో పదకొండు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ క్రమంలో సూర్యకుమార్ సేన ఈ సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక నాలుగో టీ20 జొహన్నస్బర్గ్లో ఆదివారం జరుగనుంది.చదవండి: అతడి కోసం నా ప్లేస్ను త్యాగం చేశా.. చెప్పి మరీ సెంచరీ బాదాడు: సూర్య -
టీమిండియాపై ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. వేలంలో అతడికి రూ. 10 కోట్ల ధర!
టీమిండియాతో మూడో టీ20లో సౌతాఫ్రికా అంత తేలికగా తలవంచలేదు. సూర్యకుమార్ సేన విధించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆఖరి వరకు పోరాడగలిగింది. ఇందుకు ప్రధాన కారణం ప్రొటిస్ బౌలింగ్ ఆల్రౌండర్ మార్కో జాన్సెన్.కేవలం 16 బంతుల్లోనేస్పెషలిస్టు బ్యాటర్లంతా దాదాపుగా చేతులెత్తేసిన వేళ.. జాన్సెన్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ పరుగుల వరద పారించాడు. ఒకానొక దశలో టీమిండియా నుంచి మ్యాచ్ను లాగేసుకుంటాడా అనేంతలా అద్భుత బ్యాటింగ్తో అలరించాడు. కేవలం 16 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.తొలి సౌతాఫ్రికా ప్లేయర్గాఈ క్రమంలో సౌతాఫ్రికా తరఫున అత్యంత వేగంగా అంతర్జాతీయ హాఫ్ సెంచరీ సాధించిన రెండో బ్యాటర్గా మార్కో జాన్సెన్ రికార్డు సాధించాడు. అంతేకాదు.. టీమిండియాపై టీ20లలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన తొలి సౌతాఫ్రికా ప్లేయర్గానూ చరిత్ర సృష్టించాడు.ఇక ఈ మ్యాచ్లో మొత్తంగా 17 బంతులు ఎదుర్కొన్న జాన్సెన్ నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 317కు పైగా స్ట్రైక్రేటుతో 54 పరుగులు సాధించాడు. భారత పేసర్ అర్ష్దీప్ సింగ్ గనుక జాన్సెన్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోకుంటే పెద్ద ప్రమాదమే జరిగేది. ఎట్టకేలకు జాన్సెన్ అవుట్ కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగుల వద్ద నిలిచిన సౌతాఫ్రికా టీమిండియా చేతిలో ఓటమిపాలైంది.ఇదిలా ఉంటే.. మూడో టీ20లో జాన్సెన్ ఒక వికెట్ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ రూపంలో కీలక వికెట్ తీసి సత్తా చాటాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ(107) సెంచరీతో చెలరేగగా.. మార్కో జాన్సెన్ సైతం తన ప్రతిభను చాటుకున్నాడు.రూ. 10 కోట్ల ప్లేయర్ కాదంటారా?ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ మార్కో జాన్సెన్ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘‘మార్కో జాన్సెన్.. రూ. 10 కోట్ల ప్లేయర్ కాదంటారా? నేనైతే అవుననే అంటాను’’ అని స్టెయిన్ పేర్కొన్నాడు. ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో జాన్సెన్ గురించి ఫ్రాంఛైజీలకు గుర్తు చేస్తూ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.కాగా ఐపీఎల్-2024లో మార్కో జాన్సెన్ సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, ఈ సీజన్లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. మూడు మ్యాచ్లు ఆడి కేవలం ఒకే ఒక్క వికెట్ తీశాడు. ఈ నేపథ్యంలో వేలానికి ముందు సన్రైజర్స్ అతడిని విడిచిపెట్టింది.సౌతాఫ్రికా వర్సెస్ టీమిండియా స్కోర్లువేదిక: సూపర్స్పోర్ట్ పార్క్, సెంచూరియన్టాస్: సౌతాఫ్రికా.. తొలుత బౌలింగ్టీమిండియా స్కోరు- 219/6 (20)సౌతాఫ్రికా స్కోరు- 208/7 (20)ఫలితం: పదకొండు పరుగుల తేడాతో టీమిండియా విజయం.. 2-1తో భారత్ పైచేయిప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: తిలక్ వర్మ(56 బంతుల్లోనే 107 నాటౌట్).చదవండి: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా ఘనత -
చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా..
టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికాతో మూడో టీ20లో సహచర ఆటగాళ్లు విఫలమైన వేళ విధ్వంసకర శతకంతో విరుచుకుపడి జట్టుకు గెలుపు అందించాడు. ఈ క్రమంలో తన పేరిట ఓ అరుదైన రికార్డునూ లిఖించుకున్నాడు. ప్రొటిస్ జట్టుపై.. ప్రపంచంలో ఇంతవరకు ఏ ఆటగాడికి సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు.మళ్లీ గెలుపు బాటకాగా నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికాకు వెళ్లింది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్లో ఘన విజయంతో సిరీస్ మొదలుపెట్టిన సూర్యసేన.. రెండో టీ20లో మాత్రం ఓడిపోయింది. ఈ క్రమంలో సెంచూరియన్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్లో తిరిగి పుంజుకుని.. మళ్లీ గెలుపు బాటపట్టింది.అభిషేక్ శర్మ ధనాధన్ హాఫ్ సెంచరీఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆతిథ్య సౌతాఫ్రికా.. భారత్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఓపెనర్లలో సంజూ శాంసన్(0) మరోసారి డకౌట్ కాగా.. అభిషేక్ శర్మ(25 బంతుల్లో 50) ధనాధన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఇక వన్డౌన్లో వచ్చిన హైదారాబాదీ ఠాకూర్ తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఆఖరి వరకు అజేయంగా తిలక్వరుసగా వికెట్లు పడుతున్నా.. అభిషేక్తో కలిసి స్కోరు బోర్డును పరిగెత్తించాడు. కేవలం 56 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాదిన ఈ లెఫ్టాండర్.. 107 పరుగులు సాధించాడు. ప్రొటిస్ బౌలింగ్ను చీల్చిచెండాడుతూ ఆఖరి వరకు అజేయంగా నిలిచి.. జట్టుకు భారీ స్కోరు(219-6)అందించాడు.ఈ క్రమంలో కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆఖరి వరకు పోరాడింది. అయితే, నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన ఆతిథ్య జట్టు.. 208 పరుగుల వద్దే నిలిచిపోయింది. దీంతో పదకొండు పరుగుల తేడాతో టీమిండియా గెలుపొంది.. సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.ప్రపంచంలోనే తొలి క్రికెటర్గాఇదిలా ఉంటే.. గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన తర్వాత తిలక్ వర్మ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ ఇది. కెరీర్లో తొలి అంతర్జాతీయ శతకాన్ని ఏకంగా సఫారీ గడ్డపై బాదడం విశేషం. ఈ క్రమంలో 22 ఏళ్ల తిలక్ వర్మ ఓ అరుదైన రికార్డు సాధించాడు. సౌతాఫ్రికా జట్టుపై అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అదే విధంగా.. చిన్న వయసులోనే టీమిండియా తరఫున టీ20 శతకం బాదిన రెండో క్రికెటర్గా నిలిచాడు.సౌతాఫ్రికాపై పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాళ్లుతిలక్ వర్మ(ఇండియా)- 22 ఏళ్ల, 5 రోజుల వయసులో 2024- సెంచూరియన్ వేదికగా..సురేశ్ రైనా(ఇండియా)- 23 ఏళ్ల, 156 రోజుల వయసులో 2010- గ్రాస్ ఐస్లెట్ వేదికగామార్టిన్ గఫ్టిల్(న్యూజిలాండ్)- 26 ఏళ్ల, 84 రోజుల వయసులో- 2012- ఈస్ట్ లండన్బాబర్ ఆజం(పాకిస్తాన్)- 26 ఏళ్ల, 181 రోజుల వయసులో- 2021- సెంచూరియన్క్రిస్ గేల్(వెస్టిండీస్)- 27 ఏళ్ల 355 రోజుల వయసులో- 2007- జొహన్నస్బర్గ్.టీమిండియా తరఫున చిన్న వయసులో టీ20 సెంచరీ సాధించిన ఆటగాళ్లుయశస్వి జైస్వాల్- 2023లో నేపాల్ మీద- 21 ఏళ్ల 279 రోజుల వయసులోతిలక్ వర్మ- 2024లొ సౌతాఫ్రికా మీద- 22 ఏళ్ల 5 రోజుల వయసులోశుబ్మన్ గిల్(126*)- 2023లో న్యూజిలాండ్ మీద- 23 ఏళ్ల 146 రోజుల వయసులోసురేశ్ రైనా(101)- 2010లో సౌతాఫ్రికా మీద- 23 ఏళ్ల 156 రోజుల వయసులో ఈ ఘనత సాధించారు.చదవండి: Asia Cup 2024: భారత జట్టు ప్రకటన.. 13 ఏళ్ల కుర్రాడికి చోటు Thunderstruck ❌Tilak-struck 💯A superb maiden century for the stylish #TeamIndia southpaw! 🙌Catch LIVE action from the 3rd #SAvIND T20I on #JioCinema, #Sports18, and #ColorsCineplex! 👈#JioCinemaSports #TilakVarma pic.twitter.com/L7MEfEPyY8— JioCinema (@JioCinema) November 13, 2024 -
అతడి కోసం నా ప్లేస్ను త్యాగం చేశా.. చెప్పి మరీ సెంచరీ బాదాడు: సూర్య
దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో ఓటమి చవిచూసిన టీమిండియా తిరిగి పుంజుకుంది. బుధవారం సెంచూరియన్ వేదికగా సఫారీలతో జరిగిన మూడో టీ20లో 11 పరుగుల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది.దీంతో నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి భారత జట్టు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమిండియా అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన మెన్ ఇన్ బ్లూ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ(107 నాటౌట్) ఆజేయ సెంచరీతో చెలరేగగా.. అభిషేక్(50) హాఫ్ సెంచరీతో మెరిశాడు.అనంతరం లక్ష్య చేధనలో ఆతిథ్య సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేయగల్గింది. అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లతో సత్తాచాటగా.. వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు సాధించాడు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు."మళ్లీ విజయాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్ కంటే ముందు టీమ్ మీటింగ్లో మేము చాలా విషయాలు చర్చించుకున్నాము. మా బ్రాండ్ క్రికెట్ను కొనసాగించాలనుకున్నాము. సెంచూరియన్లో అదే చేసి చూపించాము.జట్టులో ప్రతీ ఒక్కరికి వారి రోల్పై ఓ క్లారిటీ ఉంది. మా కుర్రాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాము. నెట్స్లో కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారు దూకుడుగా ఆడి నా పనిని సులువు చేస్తున్నారు. అన్నీ సానుకూలంగా జరుగుతుండటం చాలా అనందంగా ఉంది. మైదానంలోనూ ఆరేడు నిమిషాలు ముందే ఉన్నాం.మేము సరైన దిశలో వెళ్తున్నామని భావిస్తున్నాను. ఇక తిలక్ వర్మ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రెండో టీ20 అనంతరం తిలక్ నా గదికి వచ్చి మూడో స్ధానంలో బ్యాటింగ్ చేసే అవకాశమివ్వండి అని అడిగాడు.అందుకు నేను సరే అని పూర్తి స్వేచ్ఛగా ఆడమని చెప్పాను. తను చెప్పినట్లే తిలక్ అదరగొట్టాడు. తొలి సెంచరీ సాధించడంతో అతడి కుటంబ సభ్యులు ఆనందపడి ఉంటారు" అని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో సూర్య పేర్కొన్నాడు.చదవండి: ఆ నలుగురు మావాడి కెరీర్ను నాశనం చేశారు: శాంసన్ తండ్రి -
IND Vs SA: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. అశ్విన్ ఆల్టైమ్ రికార్డు బ్రేక్
సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరోసారి అదరగొట్టాడు. బుధవారం సెంచూరియన్ వేదికగా సఫారీలతో జరిగిన మూడో టీ20లో రెండు వికెట్లతో సత్తాచాటాడు. గత రెండు మ్యాచ్లతో పోలిస్తే పరుగులు కాస్త ఎక్కువగా ఇచ్చినప్పటికీ రెండు కీలక వికెట్లు పడగొట్టి భారత్కు మరో విజయాన్ని అందించాడు.ఓపెనర్ రీజా హెండ్రిక్స్, కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్లను సరైన సమయంలో పెవిలియన్కు పంపి మ్యాచ్ను భారత్ వైపు మలుపు తిరిగేలా చేశాడు. ఈ క్రమంలో వరుణ్ చక్రవర్తి ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.అశ్విన్ రికార్డు బద్దలు...ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్లో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా వరుణ్ చరిత్ర సృష్టించాడు. ఈ సిరీస్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన ఈ తమిళనాడు స్టార్ స్పిన్నర్ 10 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఈ రేర్ ఫీట్ను తన పేరిట వరుణ్ లిఖించుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉండేది. 2016లో శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్లో అశ్విన్ 9 వికెట్లు తీశాడు. తాజా మ్యాచ్తో అశ్విన్ ఆల్టైమ్ రికార్డును చక్రవర్తి బద్దలు కొట్టాడు. కాగా ఈ మ్యాచ్లో 11 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. తద్వారా నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది.చదవండి: IND vs AUS: ప్రాక్టీస్ మొదలైంది -
SA Vs IND: తిలక్ వర్మ అజేయ సెంచరీ.. మూడో టీ20లో భారత్ గెలుపు (ఫొటోలు)
-
సౌతాఫ్రికాతో మూడో టీ20.. శతక్కొట్టిన తిలక్ వర్మ.. టీమిండియా భారీ స్కోర్
సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. తిలక్ వర్మ మెరుపు సెంచరీ (56 బంతుల్లో 107 నాటౌట్; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) చేసి టీమిండియా భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. అభిషేక్ శర్మ తనవంతుగా మెరుపు అర్ద శతకం (25 బంతుల్లో 50; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) బాదాడు. తిలక్ కేవలం 51 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత ఇన్నింగ్స్లో సంజూ శాంసన్ డకౌట్ కాగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 1, హార్దిక్ పాండ్యా 18, రింకూ సింగ్ 8, రమణ్దీప్ సింగ్ 15 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖరి ఓవర్ను మార్కో జన్సెన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ ఓవర్లో అతను కేవలం నాలుగు పరుగులలు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, సైమ్లేన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జన్సెన్కు ఓ వికెట్ దక్కింది. కాగా, నాలుగు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే. -
IND VS SA 3rd T20: సంజూ మరోసారి..!
టీమిండియా స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ ఎప్పుడు ఎలా ఆడతాడో ఎవరికి అంతుచిక్కడం లేదు. ఈ వికెట్కీపర్ కమ్ బ్యాటర్ ఓ మ్యాచ్లో సెంచరీ చేస్తే.. మరుసటి మ్యాచ్లో డకౌటవుతున్నాడు. సౌతాఫ్రికా టూర్కు ముందు బంగ్లాదేశ్తో జరిగిన టీ20 మ్యాచ్లో సెంచరీ చేసిన సంజూ.. ఆతర్వాత సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో మరో సెంచరీతో మెరిశాడు. ఈ రెండు సెంచరీల అనంతరం సంజూ వరుసగా రెండు మ్యాచ్ల్లో డకౌటయ్యాడు.తాజాగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో సంజూ రెండు బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. దీనికి ముందు మ్యాచ్లో కూడా సంజూ డకౌటయ్యాడు. వరుస సెంచరీలు చేసి మాంచి జోష్ మీద కనిపించిన సంజూ.. ఆతర్వాత వరుసగా రెండు డకౌట్లై ఓ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సార్లు డకౌటైన భారత ప్లేయర్గా తన చెత్త రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు.సంజూ ఈ ఏడాది టీ20ల్లో ఐదోసారి డకౌటయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో డకౌటైన సంజూ.. ఆతర్వాత శ్రీలంకపై వరుసగా రెండు మ్యాచ్ల్లో ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. తాజాగా సౌతాఫ్రికాపై వరుసగా రెండు మ్యాచ్ల్లో డకౌటయ్యాడు. సంజూకు ముందు ఓ క్యాలెండర్ ఇయర్లో (టీ20ల్లో) అత్యధిక సార్లు డకౌటైన చెత్త రికార్డు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, యూసఫ్ పఠాన్ పేరిట ఉండేది. ఈ ముగ్గురు ఓ క్యాలెండర్ ఇయర్లో మూడు సార్లు డకౌటయ్యారు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా ఖాతా తెరవకుండానే సంజూ శాంసన్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ మరో ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. వీరిద్దరి ధాటికి భారత్ స్కోర్ 7 ఓవర్లలో 83/1గా ఉంది. అభిషేక్ 19 బంతుల్లో 42.. తిలక్ 22 బంతుల్లో 34 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. సంజూ వికెట్ మార్కో జన్సెన్కు దక్కింది. సంజూ రెండో టీ20లోనూ జన్సెన్ బౌలింగ్లోనే ఔటయ్యాడు. -
సౌతాఫ్రికాతో మూడో టీ20.. రమణ్దీప్ సింగ్ అరంగేట్రం, అభిషేక్కు మరో అవకాశం
సెంచూరియన్ వేదికగా టీమిండియాతో ఇవాళ (నవంబర్ 13) జరుగుతున్న మూడో టీ20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. భారత్ తరఫున ఆవేశ్ ఖాన్ స్థానంలో రమణ్దీప్ సింగ్ ఎంట్రీ ఇచ్చాడు. రమణ్దీప్కు ఇది డెబ్యూ మ్యాచ్. సౌతాఫ్రికా తరఫున న్కాబయోమ్జి పీటర్ స్థానంలో లూథో సిపమ్లా తుది జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్లో వరుసగా రెండు మ్యాచ్ల్లో విఫలమైన అభిషేక్ శర్మకు మరో అవకాశం ఇచ్చింది టీమిండియా మేనేజ్మెంట్. కాగా, నాలుగు మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో భారత్.. రెండో మ్యాచ్లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే.తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(వికెట్కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తిదక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్కీపర్), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సైమ్లేన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, లూథో సిపమ్లా -
అశ్విన్ ఆల్టైమ్ రికార్డుపై కన్నేసిన మిస్టరీ స్పిన్నర్
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సహచర స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉన్న ఓ ఆల్టైమ్ రికార్డుపై కన్నేశాడు. సౌతాఫ్రికాతో ఇవాళ (నవంబర్ 13) జరుగబోయే మూడో టీ20లో వరుణ్ మరో రెండు వికెట్లు తీస్తే.. టీమిండియా తరఫున ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్గా రికార్డు సృష్టిస్తాడు.2016లో శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్లో అశ్విన్ 9 వికెట్లు తీశాడు. నాటి నుంచి ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్లో ఏ భారత స్పిన్నర్ ఇన్ని వికెట్లు తీయలేదు. ఇప్పుడు అశ్విన్ ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం వరుణ్కు వచ్చింది. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో వరుణ్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో 5.25 సగటున 8 వికెట్లు తీశాడు.డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20లో మూడు వికెట్లు తీసిన వరుణ్.. గెబెర్హా వేదికగా జరిగిన రెండో టీ20లో ఐదు వికెట్లు పడగొట్టాడు. సెంచూరియన్ వేదికగా ఇవాళ మూడో టీ20 జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. తొలి టీ20లో భారత్ గెలువగా.. రెండో టీ20లో సౌతాఫ్రికా గెలిచిన విషయం తెలిసిందే.రెండో టీ20లో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి 124 పరుగులకే పరిమితమైనా.. వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేసి విజయావకాశాలు సృష్టించాడు. అయితే ఆఖర్లో కొయెట్జీ, స్టబ్స్ కొన్ని అద్భుతమైన షాట్లు ఆడి టీమిండియాకు గెలుపును దూరం చేశారు. ఈ మ్యాచ్లో వరుణ్ డేంజరెస్ బ్యాటర్లైన రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ వికెట్లు పడగొట్టాడు. -
టీమిండియాతో సిరీస్.. సౌతాఫ్రికాదే గెలుపు: సిక్సర్ల వీరుడి కామెంట్స్ వైరల్
టీ20 సిరీస్లో చెరో విజయంతో సమంగా ఉన్న టీమిండియా- సౌతాఫ్రికా మరో కీలక పోరుకు సిద్ధమయ్యాయి. ఇరుజట్ల మధ్య బుధవారం సెంచూరియన్ వేదికగా మూడో టీ20 జరుగనుంది. ఇందులో గెలిచి ఆధిక్యం పెంచుకోవాలని ఇటు సూర్య సేన.. అటు ప్రొటిస్ జట్టు తహతహలాడుతున్నాయి.మొదటి రెండు టీ20లలో అలాఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ హర్షల్ గిబ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మొదటి రెండు టీ20లలో పిచ్లు భారత జట్టుకే అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నాడు. టీ20 మ్యాచ్లలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని.. అయితే, టీమిండియాపై తమ జట్టు పైచేయి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.టీమిండియాతో సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంటుందని హర్షల్ గిబ్స్ విశ్వాసం కనబరిచాడు. ఇందుకు గల కారణాన్ని విశ్లేషిస్తూ.. ‘‘ఈ ఫార్మాట్లో ఏదైనా జరగవచ్చు. నాకు తెలిసి ఇప్పటి వరకు వికెట్ టీమిండియాకే అనుకూలించింది. అయితే, సెంచూరియన్, జొహన్నస్బర్గ్ మ్యాచ్లలో మాత్రం భారీస్కోర్లు నమోదవుతాయని భావిస్తున్నా.3-1తో ప్రొటిస్ జట్టుదే సిరీస్ఆ రెండు మ్యాచ్లలో ఏదైనా జరగొచ్చు. తొలి రెండు టీ20లలో ప్రొటిస్ పూర్తిస్థాయి, పటిష్ట జట్టుతోనే బరిలోకి దిగింది. అయితే, టీమిండియా మాత్రం అనుభవలేమి ఆటగాళ్లతో ఇక్కడికి వచ్చింది. నా అంచనా ప్రకారం ఈ సిరీస్ను 3-1తో ప్రొటిస్ జట్టు సొంతం చేసుకుంటుంది’’ అని హర్షల్ గిబ్స్ పేర్కొన్నాడు. ఈ మేరకు స్పోర్ట్స్బూమ్తో వ్యాఖ్యలు చేశాడు.మిగిలిన రెండు టీ20లలోకాగా నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికాకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డర్బన్ వేదికగా తొలి మ్యాచ్లో సూర్యకుమార్ సేన 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, గెబెహాలో జరిగిన రెండో టీ20లో భారత బౌలర్లు ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. ఆతిథ్య జట్టు చేతిలో టీమిండియా మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య తదుపరి సెంచూరియన్లోని సూపర్స్పోర్ట్ పార్క్లో బుధవారం మూడో టీ20... అదే విధంగా.. శుక్రవారం జొహన్నస్బర్గ్లోని ది వాండరర్స్ స్టేడియంలో ఆఖరి టీ20 జరుగునున్నాయి. ఈ రెండు మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8.30 నిమిషాలకు మొదలయ్యేలా షెడ్యూల్ ఖరారైంది.ప్రపంచ రికార్డు ఖాతాలో వేసుకునిఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా హర్షల్ గిబ్స్ చరిత్ర పుటల్లో తన పేరు లిఖించుకున్నాడు. 2007లో నెదర్లాండ్స్తో మ్యాచ్లో డాన్ వాన్ బంగ్ బౌలింగ్లో వరుసగా సిక్స్లతో విరుచుకుపడ్డాడు.ఇక గిబ్స్ తర్వాత వన్డేల్లో జస్కరన్ మల్హోత్రా (అమెరికా) పాపువా న్యూగినియాతో 2021 నాటి మ్యాచ్లో మళ్లీ ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20లలో టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్; 2007లో) బౌలింగ్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు. తర్వాత వెస్టిండీస్ వీరుడు కీరన్ పొలార్డ్ శ్రీలంక బౌలర్ అఖిల ధనంజయ(2021లో) బౌలింగ్లో ఈ ఘనత సాధించాడు.సౌతాఫ్రికాతో టీ20లకు భారత జట్టుసంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అవేశ్ ఖాన్, జితేశ్ శర్మ, విజయ్కుమార్ వైశాఖ్, రమణ్దీప్ సింగ్, యశ్ దయాళ్.సౌతాఫ్రికా జట్టురియాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, ఆండిలే సిమెలేన్, గెరాల్డ్ కొయెట్జీ, కేశవ్ మహారాజ్, నకబయోమ్జీ పీటర్, పాట్రిక్ క్రూగర్, మిహ్లాలీ ఎంపోంగ్వానా, డోనోవన్ ఫెరీరా, ఒట్నీల్ బార్ట్మన్, లుథో సిపామ్లా.చదవండి: BGT: బీసీసీఐ కీలక నిర్ణయం!.. అభిమానులకు బ్యాడ్న్యూస్! -
సౌతాఫ్రికాతో మూడో టీ20.. రెండు మార్పులు చేయనున్న టీమిండియా..?
భారత్, దక్షిణాఫ్రికా మధ్య నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో టీమిండియా గెలువగా.. రెండో టీ20లో దక్షిణాఫ్రికా జయభేరి మోగించింది. మూడో టీ20 సెంచూరియన్ వేదికగా రేపు (నవంబర్ 13) జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది.రెండో టీ20లో టీమిండియా స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో చివరి నిమిషం వరకు అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. అయితే ట్రిస్టన్ స్టబ్స్, గెరాల్డ్ కొయెట్జీ చివర్లో సూపర్గా బ్యాటింగ్ చేసి భారత్ చేతుల నుంచి విజయాన్ని లాగేసుకున్నారు. ఈ మ్యాచ్లో భారత యూనిట్లో పలు లోపాలు స్పష్టంగా కనిపించాయి.మూడో మ్యాచ్లో ఈ లోపాలను సరిదిద్దుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇందులో భాగంగా భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగాలని యోచిస్తుంది. బ్యాటింగ్ విభాగంలో ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతున్నాడు. ఈ సిరీస్లో ఇప్పటివరకు జరిగిన రెండు టీ20ల్లో అతను దారుణంగా నిరాశపరిచాడు.వరుస వైఫల్యాల నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ అభిషేక్ను పక్కకు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అభిషేక్ స్థానంలో తిలక్ వర్మ, రమన్దీప్ సింగ్లలో ఎవరో ఒకరితో ఓపెనింగ్ చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం. తిలక్ వర్మతో పోలిస్తే రమన్దీప్కు ఓపెనర్గా బరిలోకి దిగే ఛాన్స్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.రమన్దీప్కు హార్డ్ హిట్టింగ్తో పాటు బౌలింగ్ చేయగల సామర్థ్యం కూడా ఉంది. తిలక్ వర్మ మిడిలార్డర్లో ఎలాగూ సెట్ అయ్యాడు కాబట్టి టీమిండియా యాజమాన్యం అతన్ని కదిపే సాహసం చేయకపోవచ్చు. మూడో టీ20లో అభిషేక్తో పాటు అర్షదీప్ సింగ్పై కూడా వేటు పడే అవకాశం ఉంది. అర్షదీప్ గత రెండు టీ20ల్లో చెప్పుకోదగ్గ ప్రదదర్శనలు చేయకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ కారణంగా అతన్ని పక్కకు పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అర్షదీప్ను తుది జట్టు నుంచి తప్పిస్తే, అతని స్థానంలో యశ్ దయాల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. మూడో టీ20లో రమన్దీప్, యశ్ దయాల్ ఇద్దరూ బరిలోకి దిగితే వారిద్దరికి అది అరంగేట్రం మ్యాచ్ అవుతుంది.భారత జట్టు (అంచనా): రమణ్దీప్ సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, యష్ దయాల్, ఆవేశ్ ఖాన్. -
సౌతాఫ్రికాతో మూడో టీ20.. కీలక మార్పు సూచించిన భారత మాజీ స్టార్
సౌతాఫ్రికాతో మొదటి టీ20లో గెలిచి శుభారంభం చేసిన టీమిండియా.. రెండో మ్యాచ్లో అదే జోరును కొనసాగించలేకపోయింది. కీలక బ్యాటర్లంతా విఫలం కావడంతో మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో సిరీస్ గెలవాలంటే.. మిగిలిన రెండు టీ20లలో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.సంజూ శాంసన్ ధనాధన్ సెంచరీ వల్లనిజానికి డర్బన్లో జరిగిన తొలి టీ20లోనూ ఓపెనర్ సంజూ శాంసన్(50 బంతుల్లో 107), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(21), తిలక్ వర్మ(33) రాణించడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. మిగతా వాళ్లంతా విఫలమైనా 202 రన్స్ రాబట్టగలిగింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య ప్రొటిస్ను భారత బౌలర్లు కట్టడి చేయడంతో 61 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.రెండో టీ20లో మాత్రంఅయితే, గెబెహా వేదికగా రెండో టీ20లో మాత్రం టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. ఓపెనర్లలో సంజూ శాంసన్(0) అనూహ్య రీతిలో డకౌట్ కాగా.. అభిషేక్ శర్మ(4) మరోసారి విఫలమయ్యాడు. కెప్టెన్ సూర్య సైతం నాలుగు పరుగులకే వెనుదిరగగా.. మిడిలార్డర్లో తిలక్ వర్మ(20), అక్షర్ పటేల్(27), హార్దిక్ పాండ్యా(39 నాటౌట్) కాసేపు క్రీజులో నిలబడ్డారు.ఇక లోయర్ ఆర్డర్లో రింకూ సింగ్(9) నిరాశపరచగా.. టెయిలెండర్ అర్ష్దీప్ సింగ్(7 నాటౌట్) కూడా సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి టీమిండియా కేవలం 124 పరుగులే చేసింది. అయితే, సౌతాఫ్రికాను కట్టడి చేసేందుకు భారత బౌలర్లు మాత్రం ఆఖరి వరకు గట్టి పోరాటం చేశాడు.అయినప్పటికీ 19 ఓవర్లలోనే ప్రొటిస్ జట్టు లక్ష్యాన్ని ఛేదించి జయభేరి మోగించింది. టీమిండియా ఆధిక్యాన్ని తగ్గిస్తూ 1-1తో సమం చేసింది. ఇలా తొలి రెండు మ్యాచ్లలోనూ బౌలర్లు వందశాతం పాసైనా.. బ్యాటర్లలోనే నిలకడ లోపించింది. ఆల్రౌండర్ అవసరం ఉందిఈ నేపథ్యంలో సౌతాఫ్రికా- టీమిండియా మధ్య సెంచూరియన్ వేదికగా మూడో టీ20పై క్రికెట్ వర్గాల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే సూర్య సేన ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయగలదు. ఈ క్రమంలో భారత తుదిజట్టు కూర్పుపై మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప కీలక వ్యాఖ్యలు చేశాడు.సౌతాఫ్రికాతో మూడో టీ20లో ఆల్రౌండర్ రమణ్దీప్ సింగ్ను అరంగ్రేటం చేయించాలని టీమిండియా మేనేజ్మెంట్కు సూచించాడు. ఈ మేరకు.. ‘‘ఎనిమిదో స్థానంలో మనకు ఓ ఆల్రౌండర్ అవసరం ఉంది. అతడు పూర్తి స్థాయిలో బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్ చేయగలగాలి.అతడిని ఆడిస్తేనే మంచిదిఅతడు స్పిన్నరా? లేదంటే ఫాస్ట్ బౌలరా అన్న అంశంతో మనకు పనిలేదు. హార్దిక్ పాండ్యా కాకుండా.. అతడిలా ఆడగలిగే మరో క్రికెటర్ కావాలి. ఇప్పుడు జట్టులో ఉన్న ప్రధాన లోటు అదే. ప్రస్తుతం రమణ్దీప్ సింగ్ సరైన ఆప్షన్లా కనిపిస్తున్నాడు. అందుకే అతడిని తుదిజట్టులో ఆడిస్తే మంచిది’’ అని రాబిన్ ఊతప్ప జియో సినిమా షోలో పేర్కొన్నాడు.కాగా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ జట్టుతో ఉన్నాడు. అయితే, రమణ్దీప్ సింగ్కు లైన్ క్లియర్ కావాలంటే.. మిగిలిన ఆటగాళ్లలో ఎవరో ఒకరిపై వేటు తప్పదు. అలాంటి పరిస్థితిలో తొలి రెండు టీ20లలో ఘోరంగా విఫలమైన ఏకక ఆటగాడు అభిషేక్ శర్మ(7, 4)నే తప్పించే అవకాశమే ఎక్కువగా ఉంది. అదే జరిగితే ఓపెనింగ్ జోడీలోనూ మార్పు వస్తుంది. కాగా నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు సూర్యకుమార్ సేన సౌతాఫ్రికాకు వెళ్లిన విషయం తెలిసిందే.చదవండి: టీమిండియాకు గుడ్న్యూస్ -
సౌతాఫ్రికాతో మూడో టీ20.. టీమిండియా స్టార్ ప్లేయర్పై వేటు!
సెంచూరియన్ వేదికగా బుధవారం జరగనున్న మూడో టీ20లో భారత్-దక్షిణాఫ్రికా జట్లు తలపడతున్నాయి. రెండో టీ20లో అనూహ్య ఓటమి చవిచూసిన టీమిండియా ఈ మ్యాచ్లో ఎలాగైనా పుంజుకుని తిరిగి కమ్బ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది.పోర్ట్ ఎలిజిబెత్లో చేసిన బ్యాటింగ్ తప్పిదాలను పునరావృతం చేయకూడదని సూర్య సేన యోచిస్తోంది. అందుకు తగ్గట్టే భారత జట్టు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. ఈ మ్యాచ్లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.అభిషేక్ శర్మపై వేటు..గత రెండు మ్యాచ్ల్లో విఫలమైన యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై భారత జట్టు మేనెజ్మెంట్ వేటు వేయాలని నిర్ణయించుకుంటున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో ఆల్రౌండర్ రమణ్దీప్ సింగ్కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అభిషేక్ను పక్కన పెట్టి సంజూ శాంసన్ జోడీగా తిలక్ వర్మను ప్రమోట్ చేయనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. మరోవైపు పేసర్ అవేష్ ఖాన్ను కూడా బెంచ్కే పరిమితం చేసే సూచనలు కన్పిస్తున్నాయి. అవేష్ స్ధానంలో కర్ణాటక పేసర్ విజయ్కుమార్ వైశ్యాఖ్ అరంగేట్రం చేసే అవకాశముంది.భారత తుది జట్టు(అంచనా)సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రమణ్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, విజయ్ కుమార్ వైశ్యాఖ్చదవండి: BGT: పంత్ కాదు!.. అతడే కొత్త రాజు అంటున్న ఆస్ట్రేలియా మీడియా! -
గత మూడేళ్లు కష్టకాలం..! రీ ఎంట్రీలో అదుర్స్
పోర్ట్ ఎలిజబెత్: మూడేళ్ల క్రితం వరుణ్ చక్రవర్తి ‘మిస్టరీ స్పిన్నర్’గా గుర్తింపు తెచ్చుకొని భారత జట్టులోకి ఎంపికయ్యాడు. శ్రీలంకతో టి20 సిరీస్లో మూడు మ్యాచ్లలో పొదుపైన బౌలింగ్ ప్రదర్శన కనబర్చడంతో కొద్ది రోజులకే యూఏఈలో జరిగిన టి20 వరల్డ్ కప్లో ఆడే అవకాశం కూడా దక్కింది. అయితే 3 మ్యాచ్లలో కలిపి 11 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు! దాంతో అతను తీవ్ర విమర్శలపాలై సెలక్టర్ల నమ్మకం కోల్పోయాడు. జట్టులో స్థానం చేజార్చుకున్న అతను ఐపీఎల్లో మాత్రం ఆకట్టుకున్నాడు. 2024 ఐపీఎల్లో మళ్లీ సత్తా చాటి కోల్కతా నైట్రైడర్స్ టైటిల్ విజయంలో కీలకపాత్ర పోషించడంతో ఎట్టకేలకు మళ్లీ టీమిండియా చాన్స్ లభించింది.పునరాగమంలో ఆడిన 5 టి20ల్లో కలిపి 13 వికెట్లతో వరుణ్ సత్తా చాటాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో రెండో టి20 మ్యాచ్లో 5 వికెట్ల ప్రదర్శనతో చెలరేగిన అతను తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ‘వైఫల్యాలు వచ్చిన తర్వాత నేను మళ్లీ నా ఆటలో మూలాలకు వెళ్లిపోయాను. నా వీడియోలు చూసి లోపాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేశా. నా సైడ్ స్పిన్ బౌలింగ్ అంతర్జాతీయ స్థాయిలో పనికి రాదని అర్థమైంది. అందుకే నా బౌలింగ్లో సమూల మార్పులు చేసుకున్నాను. దానికి రెండేళ్లు పట్టింది. ఐపీఎల్తో పాటు స్థానిక లీగ్లలో అది మంచి ఫలితాలు ఇవ్వడంతో దానినే ఇక్కడా కొనసాగించాను. ఆదివారం మ్యాచ్లో నా శైలికి పిచ్ కూడా సహకరించింది. ఇకపై కూడా ఇలాగే రాణించాలని కోరుకుంటున్నా’ అని వరుణ్ స్పందించాడు. మూడేళ్ల క్రితం భారత జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత తన పరిస్థితి బాగా ఇబ్బందికరంగా మారిందని అతను గుర్తు చేసుకున్నాడు. దానిని కష్టకాలంగా అతను పేర్కొన్నాడు. ‘గత మూడేళ్లు చాలా కఠినంగా సాగాయి. ఆపై మరింత ఎక్కువ క్రికెట్ ఆడటమే నేను చేయగలిగిందని అర్థమైంది.అందుకే టీఎన్పీఎల్ వంటి దేశవాళీ లీగ్లలో పాల్గొన్నా. అది నా ఆటను మరింత అర్థం చేసుకునేందుకు, ఆపై మెరుగు పర్చుకునేందుకు ఉపకరించింది’ అని వరుణ్ చెప్పాడు. ఇటీవల బంగ్లాదేశ్తో సిరీస్ ఆడిన సమయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన బాధ్యతలపై స్పష్టత ఇవ్వడం మేలు చేసిందని అతను అన్నాడు. ‘నువ్వు 30–40 పరుగులు ఇచ్చినా సరే ఆందోళన చెందవద్దు. వికెట్ల తీయడమే నీ పని అంటూ నా బాధ్యత ఏమిటో గంభీర్ స్పష్టంగా చెప్పారు. అది మంచి చేసింది’ అని ఈ స్పిన్నర్ వ్యాఖ్యానించాడు. చదవండి: ICC CT 2025: టీమిండియా లేకుంటే చాంపియన్స్ ట్రోఫీ లేనట్లే! -
సూర్య చేసిన తప్పు అదే.. అతడిని ఎందుకు ఆడిస్తున్నట్లు?
సౌతాఫ్రికా పర్యటనను ఘనంగా ఆరంభించిన టీమిండియా జోరుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ఆతిథ్య ప్రొటిస్ జట్టు బదులు తీర్చుకుంది. రెండో మ్యాచ్లో మూడు వికెట్ల తేడాతో భారత్పై గెలిచి.. సిరీస్ను 1-1తో సమం చేసింది. కాగా నాలుగు టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు సూర్య సేన సౌతాఫ్రికాకు వెళ్లిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో డర్బన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 61 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే, గెబెహాలో ఆదివారం జరిగిన రెండో టీ20లో మాత్రం ఓటమిపాలైంది. కీలక బ్యాటర్లంతా విఫలమైనా.. స్వల్ప లక్ష్యాన్ని కాపాడటం కోసం బౌలర్లు ఆఖరి వరకు పోరాడారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.ఒకే ఒక్క ఓవర్ ఇస్తారా?ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా విమర్శలు చేశాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో సూర్య విఫలమయ్యాడని పేర్కొన్నాడు. రెండో టీ20లో అక్షర్కు కేవలం ఒకే ఒక్క ఓవర్ ఇవ్వడం భారత కెప్టెన్ చేసిన అతిపెద్ద తప్పని విమర్శించాడు.ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘అక్షర్ పటేల్ సేవలను పూర్తిగా వినియోగించుకుంటున్నారా? అసలు అతడిని ఎందుకు ఆడిస్తున్నారు? డర్బన్లో అక్షర్కు కేవలం ఒకే ఒక్క ఓవర్ ఇచ్చారు. గెబెహాలోనూ అదే పరిస్థితి.సూర్య చేసిన అతిపెద్ద తప్పు ఇదిస్పిన్నర్లు మాత్రమే ఆరు నుంచి ఏడు వికెట్లు తీస్తున్న పిచ్పై అక్షర్తో ఇలా ఒకే ఒక్క ఓవర్ వేయించడం ఏమిటి? అక్షర్ సేవలను వినియోగించుకోవడంలో మేనేజ్మెంట్ విఫలమవుతోంది. తుదిజట్టులో ముగ్గురు స్పిన్నర్లను ఆడిస్తున్నారు. కానీ వారిని సరైన విధంగా ఉపయోగించుకోలేకపోతున్నారు.భారత జట్టు బ్యాటింగ్ వైఫల్యం గురించి నేను ప్రస్తుతానికి మాట్లాడదలచుకోలేదు. కానీ బౌలర్గా అక్షర్ పటేల్ను ఉపయోగించుకోవడంలో విఫలమయ్యారు. ఈ మ్యాచ్లో సూర్య చేసిన అతిపెద్ద తప్పు ఇది అని కచ్చితంగా చెప్పగలను’’ అని పేర్కొన్నాడు. కేవలం 124 పరుగులుఇక ఈ మ్యాచ్లో బ్యాట్ ఝులిపించే ప్రయత్నం చేసిన అక్షర్ పటేల్ రనౌట్ కావడం నిజంగా అతడి దురదృష్టమని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా సౌతాఫ్రికాతో రెండో టీ20లో టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కేవలం 124 పరుగులు చేసింది. తిలక్ వర్మ(20), స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్(27), హార్దిక్ పాండ్యా(39 నాటౌట్) రాణించడంతో ఈ మాత్రం స్కోరు సాధ్యమైంది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాను భారత బౌలర్లు ఆది నుంచే ఇబ్బంది పెట్టారు. వరుణ్ ఐదు వికెట్లు తీసినా..ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కేవలం 17 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. మరో స్పిన్నర్ రవి బిష్ణోయి సైతం ఒక వికెట్ తీయగా.. పేసర్ అర్ష్దీప్ సింగ్ కూడా ఒక వికెట్ దక్కించుకున్నాడు.అయితే, స్పిన్కు అనుకూలిస్తున్న పిచ్పై అక్షర్ పటేల్కు మాత్రం ఒకే ఒక్క ఓవర్ ఇవ్వగా.. అతడు కేవలం రెండు పరుగులే ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. భారత బౌలర్లు అటాక్ చేస్తున్నా సౌతాఫ్రికా హిట్టర్ ట్రిస్టన్ స్టబ్స్ 41 బంతుల్లో 47 పరగులుతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఇరుజట్ల మధ్య బుధవారం సెంచూరియన్ వేదికగా మూడో టీ20 జరుగనుంది.చదవండి: హార్దిక్ సెల్ఫిష్ ఇన్నింగ్స్..! ఇదంతా ఐపీఎల్ కోసమేనా: పాక్ మాజీ క్రికెటర్ -
హార్దిక్ సెల్ఫిష్ ఇన్నింగ్స్..! ఇదంతా ఐపీఎల్ కోసమేనా: పాక్ మాజీ క్రికెటర్
సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. బౌలర్లు అద్భతంగా పోరాడినప్పటికి బ్యాటింగ్ వైఫల్యం కారణంగా భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ప్రోటీస్తో జరిగిన తొలి టీ20లో విధ్వంసం సృష్టించిన భారత బ్యాటర్లు రెండో మ్యాచ్లో మాత్రం పూర్తిగా తేలిపోయారు. మొదటి మ్యాచ్లో సెంచరీ చేసిన సంజూ శాంసన్ తొలి ఓవర్లోనే డకౌట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత అభిషేక్ శ్మ (4), సూర్యకుమార్ యాదవ్ (4) వరుస ఓవర్లలో పెవిలియన్కు చేరారు. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా (39 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడితో పాటు తిలక్ వర్మ(20), అక్షర్ పటేల్ (21 బంతుల్లో 27) పర్వాలేదన్పించారు.పాండ్యా సెల్పిష్ ఇన్నింగ్స్.. !ఇక భారత ఇన్నింగ్స్ 8 ఓవర్లోనే బ్యాటింగ్కు వచ్చిన హార్దిక్ ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టు స్కోర్ 120 పరుగుల మార్క్ దాటేలా చేశాడు. ఓ వైపు వికెట్లు క్రమం తప్పకుండా పడతుండడంతో హార్దిక్ సింగిల్స్ తీస్తూ భారత స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు.ఆఖరి మూడు ఓవర్లలో హిట్టింగ్కు హార్దిక్ ప్రయత్నించాడు. కానీ ఆఖరిలో కూడా పాండ్యా ప్రభావం చూపలేకపోయాడు. ఆఖరి ఓవర్లో స్ట్రైక్ తన వద్దే అంటిపెట్టుకున్న పాండ్యా కేవలం బౌండరీ మాత్రమే బాదాడు. ఓవరాల్గా 45 బంతులు ఎదుర్కొన్న హార్దిక్.. స్ట్రైక్ రేట్ 86.67తో 39 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, ఓ సిక్స్ మాత్రమే ఉన్నాయి. అయితే స్లో స్ట్రైక్ రేట్తో ఆడిన పాండ్యాపై పలువురు మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ చేరాడు. పాండ్యాను ఉద్దేశించి అతడు ఘాటు వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ జట్టు అవసరాల కంటే వ్యక్తిగత మైలురాళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నాడని అలీ ఆరోపించాడు."పాండ్యా సార్ ఆజేయంగా నిలిచి 45 బంతుల్లో 39 పరుగులు చేశాడు. అతడు ఈ ఇన్నింగ్స్ జట్టు కోసం కాదు తన కోసం ఆడాడు. హార్దిక్ ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడని నేను అనుకుంటున్నాను. అందుకే ఈ సెల్ఫిష్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడు ఆడిన తీరు క్షమించరానిది. అర్ష్దీప్ సింగ్ సిక్సర్ కొట్టినప్పటికి అతడు హార్దిక్ స్ట్రైక్ కూడా ఇవ్వలేదు. భారత్ చేతిలో ఇంకా 4 వికెట్లు ఉన్నప్పటికి పాండ్యా సింగిల్స్ను తిరష్కరించాడు. స్ట్రైక్ తనవద్దే అంటిపెట్టుకుని ఏమి సాధించాడు. అతడి కంటే అక్షర్ పటేల్ ఎంతో బెటర్. పాండ్యా కంటే మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. 21 బంతుల్లో 27 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు" అని అలీ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: Ind vs SA: సూర్య చేసిన అతిపెద్ద తప్పు అదే.. అతడిని ఎందుకు ఆడిస్తున్నట్లు మరి? -
సంజూ శాంసన్ అత్యంత చెత్త రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో విధ్వంసకర సెంచరీతో చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్.. 48 గంటల తిరగకముందే ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వరుస మ్యాచ్ల్లో సెంచరీలు చేసి మంచి జోష్ మీదన్న శాంసన్ ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లోను అదే జోరును కొనసాగిస్తాడని అంతా భావించారు. కానీ ఈ మ్యాచ్లో సంజూ తీవ్ర నిరాశపరిచాడు. మూడు బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సార్లు డకౌటైన భారత ప్లేయర్గా శాంసన్ చెత్త రికార్డు నెలకొల్పాడు.నాలుగో 'సారీ'..ఈ ఏడాది టీ20ల్లో శాంసన్ డకౌట్ కావడం ఇది నాలుగో సారి. ఈ ఏడాది ఆరంభంలో అఫ్గానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో డకౌటైన సంజూ.. ఆ తర్వాత జూలైలో శ్రీలంకపై వరుసగా రెండు మ్యాచ్ల్లో ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. గతంలో రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతో పాటు యూసఫ్ పఠాన్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో ప్రోటీస్ చేతిలో టీమిండియా ఓటమి పాలైంది.చదవండి: చాలా గర్వంగా ఉంది.. ఈ రోజు కోసమే అతడు ఎంతో కష్టపడ్డాడు: సూర్య -
ఇదేం చెత్త ఆట బ్రో.. ఐపీఎల్లోనే ఆడుతావా! ఫ్యాన్స్ ఫైర్
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచిన అభిషేక్.. ఇప్పుడు పోర్ట్ ఎలిజిబెత్లో జరిగిన రెండో టీ20లో కూడా అదే తీరును కనబరిచాడు. ఈ మ్యాచ్లో 5 బంతులు ఆడిన అభిషేక్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. సఫారీ పేసర్ కోయిట్జీ బౌలింగ్లో చెత్త ఆడి ఈ పంజాబీ స్టార్ బ్యాటర్ ఔటయ్యాడు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా అభిషేక్ శర్మపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.ఇదేమి ఆట భయ్యా..కేవలం ఐపీఎల్లోనే ఆడుతావా? అంటే ఓ యూజర్ ఎక్స్లో పోస్ట్ చేశాడు. మరి కొంతమంది అతడి స్ధానంలో రుతురాజ్ గైక్వాడ్ అవకాశం ఇవ్వండి అంటూ భారత జట్టు మేనెజ్మెంట్ను సూచిస్తున్నారు.ఒక్క సెంచరీ మినహా.. కాగా జింబాబ్వే సిరీస్తో టీ20తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ ఇప్పుడు భారత్ తరపున 9 మ్యాచ్లు ఆడాడు. అయితే జింబాబ్వే సిరీస్లో సెంచరీ మినహా ఇప్పటివరకు అభిషేక్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. జైశ్వాల్కు బ్యాకప్గా జట్టులోకి వచ్చిన ఈ యువ ఆటగాడు తన మార్క్ను చూపించడంలో విఫలమయ్యాడు. 24 ఏళ్ల అభిషేక్ శర్మ తన తొమ్మిది టీ20 ఇన్నింగ్స్లలో ఎనిమిదింటిలో కనీసం 20 పరుగుల మార్కును కూడా దాటలేకపోయాడు. దీంతో జట్టులో అతడి స్ధానం ప్రశ్నార్థకంగా మారింది. మిగిలిన రెండు మ్యాచ్ల్లో రాణిస్తానే అభిషేక్ జట్టులో కొనసాగే అవకాశముంది.ఐపీఎల్లో అదుర్స్ఐపీఎల్-2024లో మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ తరపున అభిషేక్ శర్మ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన అభిషేక్ 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో 484 పరుగులు చేశాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం ఆ దూకుడును అభిషేక్ ప్రదర్శించలేకపోతున్నాడు.Abhishek Sharma's last 9 T20i innings:0(4), 100(47), 10(9), 14(11), 16(7), 15(11), 4(4), 7(8), 4(5)He is clearly missing IPL tracks and his partner Travis Head.#INDVSSA pic.twitter.com/rZLiTGUmxe— JassPreet (@JassPreet96) November 10, 2024చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. తొలి భారత బౌలర్గా -
చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. తొలి భారత బౌలర్గా
పోర్ట్ ఎలిజబెత్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో 3 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో టీమిండియా పరాజయం పాలైనప్పటకి ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన అద్బుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు.ఈ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి బంతితో మాయ చేశాడు. 125 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో ప్రోటీస్ బ్యాటర్లను చక్రవర్తి ముప్పుతిప్పలు పెట్టాడు. మార్క్రమ్, క్లాసెన్, హెండ్రిక్స్, మిల్లర్, జాన్సెన్ వంటి కీలక వికెట్లు పడొట్టి ఆతిథ్య జట్టును ఓటమి కోరల్లో చిక్కుకునేలా చేశాడు. కానీ ప్రోటీస్ బ్యాటర్ స్టబ్స్ అద్బుత పోరాటంతో తన జట్టును ఓటమి నుంచి తప్పించాడు. ఈ మ్యచ్లో వరుణ్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఓ అరుదైన ఈ తమిళనాడు స్పిన్నర్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.తొలి భారత బౌలర్గా..👉అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా తరపున ఐదు వికెట్ల హాల్ సాధించిన అతి పెద్ద వయుష్కుడిగా వరుణ్ రికార్డులకెక్కాడు. చక్రవర్తి 33 సంవత్సరాల 73 రోజుల వయస్సులో ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్(32 సంవత్సరాల, 215 రోజులు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో భువీ ఆల్టైమ్ రికార్డును వరుణ్ బ్రేక్ చేశాడు.👉అదేవిధంగా ఓ టీ20 మ్యాచ్లో 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మూడో భారత స్పిన్నర్గా చక్రవర్తి నిలిచాడు. ఈ జాబితాలో స్టార్ స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు.👉ఓవరాల్గా టీ20ల్లో 5 వికెట్ల ఘనత సాధించిన ఐదో భారత బౌలర్గా వరుణ్ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో యజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్ (రెండుసార్లు), భువనేశ్వర్ కుమార్ (రెండుసార్లు) ఉన్నారు.చదవండి: చాలా గర్వంగా ఉంది.. ఈ రోజు కోసమే అతడు ఎంతో కష్టపడ్డాడు: సూర్య pic.twitter.com/T5ZdA4gCWt— viratgoback (@viratgoback) November 10, 2024 -
చాలా గర్వంగా ఉంది.. ఈ రోజు కోసమే అతడు ఎంతో కష్టపడ్డాడు: సూర్య
పోర్ట్ ఎలిజబెత్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో 3 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. 125 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఆతిథ్య ప్రోటీస్ చేధించింది. ఓ దశలో ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (4–0–17–5) మాయాజాలంతో భారత్ గెలిచేలా కన్పించినప్పటకి.. సఫారీ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ (47 నాటౌట్) విరోచిత పోరాటంతో తన జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. దీంతో నాలుగు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సౌతాఫ్రికా సమం చేసింది. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి కేవలం 124 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(39 నాటౌట్) ఫైటింగ్ నాక్ ఆడాడు. అతడితో పాటు అక్షర్ పటేల్(27), తిలక్ వర్మ(20) పరుగులతో పర్వాలేదన్పించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్సెన్, కోయిట్జీ, పీటర్, సీమీలేన్ తలా వికెట్ సాధించారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఓటమి పాలైనప్పటకి వరుణ్ చక్రవర్తి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడని సూర్య కోనియాడు.చాలా గర్వంగా ఉంది: సూర్యకుమార్"ఎప్పుడైనా సరే ఎంత లక్ష్యం నమోదు చేసినా కానీ డిఫెండ్ చేసుకునేందుకు ప్రయత్నించాలి. సెకెండ్ ఇన్నింగ్స్ ఆరంభానికి ముందు మా కుర్రాళ్లకు ఇదే విషయం చెప్పాను. ఫలితాలు కోసం ఆలోచించకండి, ఆఖరి వరకు పోరాడాదం అని చెప్పాను. వాస్తవానికి టీ20 గేమ్లో 125 లేదా 140 పరుగుల టార్గెట్ను కాపాడుకోవడం అంత సులభం కాదు. కానీ మా బౌలర్లు అద్బుతమైన పోరాట పటిమ కనబరిచారు. వారి పోరాట పటిమ చూసి గర్వపడుతున్నా. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి బంతితో మ్యాజిక్ చేశాడు. 125 పరుగుల లోస్కోరింగ్ మ్యాచ్లో టార్గెట్ను డిఫెండ్ క్రమంలో ఒక్క బౌలర్ 5 వికెట్లు సాధించడం చాలా గొప్ప విషయం. అతడు ఈ రోజు కోసమే ఎప్పటినుంచో ఎదురుచేస్తున్నాడు. అందుకోసం చాలా కష్టపడ్డాడు. ఈ రోజు అతడి కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. చాలా సంతోషంగా ఉంది. ఇక ఈ సిరీస్లో ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. జోహాన్స్బర్గ్లో జరగనున్న మూడో టీ20లో ఈ ఓటమికి బదులు తీర్చుకుంటామని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో సూర్య పేర్కొన్నాడు.చదవండి: IND vs SA: విజయాన్ని వదిలేశారు -
ఐదేసి మాయ చేసిన వరుణ్ చక్రవర్తి.. అయినా ఓటమిపాలైన టీమిండియా
నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సఫారీ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. సఫారీ బౌలర్లలో మార్కో జన్సెన్, గెరాల్డ్ కొయెట్జీ, అండైల్ సైమ్లేన్, ఎయిడెన్ మార్క్రమ్, ఎన్ పీటర్ పొదుపుగా బౌలింగ్ చేసి తలో వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్లో హార్దిక్ పాండ్యా (39 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలువగా.. తిలక్ వర్మ (20), అక్షర్ పటేల్ (27) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. సంజూ శాంసన్ 0, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ తలో 4, రింకూ సింగ్ 9 పరుగులు చేసి ఔటయ్యారు. అర్షదీప్ సింగ్ 7 పరుగులతో అజేయంగా నిలిచాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో భారత్ ఆదిలో విజయవంతమైంది. వరుణ్ చక్రవర్తి (4-0-17-5) దెబ్బకు సౌతాఫ్రికా ఓ దశలో మరో ఓటమి మూటగట్టుకునేలా కనిపించింది. అయితే ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ (47 నాటౌట్), గెరాల్డ్ కొయెట్జీ (19 నాటౌట్) పట్టుదలగా ఆడి సౌతాఫ్రికాను విజయతీరాలకు చేర్చారు. 19 ఓవర్లలో సౌతాఫ్రికా 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో స్టబ్స్, కొయెట్జీతో పాటు ర్యాన్ రికెల్టన్ (13), రీజా హెండ్రిక్స్ (24) రెండంకెల స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవరి ఐదు, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు. నాలుగు మ్యాచ్ల ఈ టీ20 సిరీస్లో టీమిండియా తొలి మ్యాచ్లో గెలుపొందిన విషయం తెలిసిందే. -
రాణించిన సఫారీ బౌలర్లు.. స్వల్ప స్కోర్కే పరిమితమైన టీమిండియా
గెబెర్హాలో వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేసి భారత బ్యాటర్లను కట్టడి చేశారు. సఫారీ బౌలర్లలో మార్కో జన్సెన్, గెరాల్డ్ కొయెట్జీ, అండైల్ సైమ్లేన్, ఎయిడెన్ మార్క్రమ్, ఎన్ పీటర్ పొదుపుగా బౌలింగ్ చేసి తలో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్లో టీమిండియా ఐదు పరుగులకే ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ వికెట్లు కోల్పోయింది. గత రెండు టీ20ల్లో సెంచరీలు చేసిన సంజూ మూడు బంతులు ఆడి డకౌట్ కాగా.. అభిషేక్ శర్మ (5 బంతుల్లో 4) తన వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. ఆతర్వాత బ్యాటింగ్కు దిగిన సూర్యకుమార్ యాదవ్ కూడా పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. స్కై 9 బంతుల్లో కేవలం 4 పరుగులు చేసి ఔటయ్యాడు.ఆతర్వాత బ్యాటింగ్కు వచ్చిన తిలక్ వర్మ (20), అక్షర్ పటేల్ (27) క్రీజ్లో ఉన్నంత సేపు ధాటిగా ఆడారు. తిలక్ వర్మను డేవిడ్ మిల్లర్ అద్బుతమైన క్యాచ్తో పెవిలియన్కు పంపగా.. అక్షర్ పటేల్.. హార్దిక్ ఆడిన రిటర్న్ షాట్ కారణంగా రనౌటయ్యాడు. ఆతర్వాత బ్యాటింగ్కు వచ్చిన హార్దిక్ చాలా నిదానంగా ఆడి 45 బంతుల్లో 4 బౌండీరలు, సిక్సర్ సాయంతో 39 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రింకూ సింగ్ తొమ్మిది పరుగులు చేసి ఔట్ కాగా.. అర్షదీప్ సింగ్ 7 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్లో హార్దిక్ కాస్త వేగంగా ఆడి ఉంటే భారత్ మరింత మెరుగైన స్కోర్ చేసేది. ఇన్నింగ్స్ ఆఖర్లో హార్దిక్ స్ట్రయిక్ రొటేట్ చేసేందుకు ఇష్టపడలేదు. అతను సొంతంగా స్కోర్ చేయకపోగా.. బంతులను అనవసరంగా వృధా చేశాడు. -
SA VS IND 2nd T20: కష్టాల్లో టీమిండియా
గెబెర్హాలోని సెయింట్ జార్జ్స్ పార్క్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ ఐదు పరుగులకే ఓపెనర్లు వికెట్లు కోల్పోయింది. వరుసగా రెండు టీ20ల్లో సెంచరీలు చేసిన సంజూ శాంసన్ మూడు బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరగా.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 5 బంతుల్లో బౌండరీ సాయంతో నాలుగు పరుగులు చేసి ఔటయ్యాడు. సంజూ శాంసన్కు మార్కో జన్సెన్ క్లీన్ బౌల్డ్ చేయగా.. గెరాల్డ్ కొయెట్జీ బౌలింగ్లో మార్కో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ ఔటయ్యాడు.నిరాశపరిచిన స్కై..తొలి టీ20లో ఓ మోస్తరు స్కోర్ చేసిన సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో దారుణంగా నిరుత్సాహపరిచాడు. స్కై తొమ్మిది బంతులు ఎదర్కొని కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. స్కై.. సైమ్లేన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 70/5గా ఉంది. సంజూ శాంసన్ (0), అభిషేక్ శర్మ (4, సూర్యకుమార్యాదవ్ (4), తిలక్ వర్మ (20), అక్షర్ పటేల్ (27) ఔట్ కాగా.. హార్దిక్ పాండ్యా (7), రింకూ సింగ్ (0) క్రీజ్లో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో జన్సెన్, కొయెట్జీ, సైమ్లేన్, మార్క్రమ్ తలో వికెట్ పడగొట్టారు. తీరు మార్చుకోని అభిషేక్..టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అందివస్తున్న వరుస అవకాశాలను ఒడిసి పట్టుకోలేకపోతున్నాడు. నిర్లక్ష్యంగా షాట్లు ఆడుతూ వికెట్ పారేసుకుంటున్నాడు. తొమ్మిది ఇన్నింగ్స్ల కెరీర్లో రెండో ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన అభిషేక్ ఆతర్వాత వరుసగా వైఫల్యాల బాట పట్టాడు. ఈ సిరీస్లో రాణించకపోతే అవకాశాలు రావని తెలిసినా అభిషేక్ బ్యాటింగ్ తీరులో ఏమాత్రం మార్పు లేదు. తొలి టీ20లో ఏడు పరుగులు చేసిన అభిషేక్ ఈ మ్యాచ్లో నాలుగు పరుగులకు ఔటయ్యాడు.టీ20 కెరీర్లో అభిషేక్ శర్మ స్కోర్లు ఇలా ఉన్నాయి..!0, 100, 10, 14, 16, 15, 4, 7, 4తుది జట్లు.. భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(వికెట్కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చకరవర్తి, అవేష్ ఖాన్దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ఎయిడెన్ మార్క్రమ్(కెప్టెన్), ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్కీపర్), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సిమెలన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, న్కాబయోమ్జి పీటర్ -
SA VS IND 2nd T20: మార్పులు లేని టీమిండియా
గెబెర్హాలోని సెయింట్ జార్జ్స్ పార్క్ వేదికగా ఇవాళ (నవంబర్ 10) భారత్, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లోని రెండో మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం సౌతాఫ్రికా ఓ మార్పు చేసింది. క్రూగర్ స్థానంలో రీజా హెండ్రిక్స్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు భారత్ మాత్రం గత మ్యాచ్లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. డర్బన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 61 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.తుది జట్లు.. భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(వికెట్కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చకరవర్తి, అవేష్ ఖాన్దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ఎయిడెన్ మార్క్రమ్(కెప్టెన్), ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్కీపర్), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సిమెలన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, న్కాబయోమ్జి పీటర్ -
అర్షదీప్ సింగ్ మరో 3 వికెట్లు తీస్తే..!
భారత్-సౌతాఫ్రికా మధ్య ఇవాళ (నవంబర్ 10) రెండో టీ20 జరుగనుంది. సెయింట్ జార్జ్స్ పార్క్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. నాలుగు మ్యాచ్ల ఈ సిరీస్లో టీమిండియా తొలి మ్యాచ్లో గెలుపొందిన విషయం తెలిసిందే.అర్షదీప్ సింగ్ మరో 3 వికెట్లు తీస్తే..!ఇవాళ జరుగనున్న రెండో టీ20లో అర్షదీప్ సింగ్ మరో మూడు వికెట్లు తీస్తే భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం భువనేశ్వర్ కుమార్ పేరిట ఉన్న ఈ రికార్డును అర్షదీప్ సింగ్ బద్దలు కొడతాడు. భువీ 87 మ్యాచ్ల్లో 90 వికెట్లు పడగొట్టగా.. అర్షదీప్ సింగ్ కేవలం 57 మ్యాచ్ల్లోనే 88 వికెట్లు తీశాడు. అర్షదీప్ సింగ్ మరో రెండు వికెట్లు తీస్తే టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాను కూడా అధిగమిస్తాడు. బుమ్రా 70 మ్యాచ్ల్లో 89 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్గా టీ20ల్లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఘనత యుజ్వేంద్ర చహల్కు దక్కుతుంది. చహల్ 80 మ్యాచ్ల్లో 96 వికెట్లు పడగొట్టాడు.భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితా..చహల్- 96భువనేశ్వర్ కుమార్- 90జస్ప్రీత్ బుమ్రా- 89అర్షదీప్ సింగ్- 88హార్దిక్ పాండ్యా- 87కాగా, నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో భారత్ 61 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సంజూ శాంసన్ శతక్కొట్టడంతో (50 బంతుల్లో 107; 7 ఫోర్లు, 10 సిక్సర్లు) నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ చేసింది.అనంతరం 203 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. భారత బౌలర్ల ధాటికి 17.5 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి తలో మూడు వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికా పతనాన్ని శాశించారు. ఆవేశ్ ఖాన్ రెండు, అర్షదీప్ సింగ్ ఓ వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో హెన్రిచ్ క్లాసెన్ (25) టాప్ స్కోరర్గా నిలువగా.. గెరాల్డ్ కొయెట్జీ (23), ర్యాన్ రికెల్టన్ (21), డేవిడ్ మిల్లర్ (18), ట్రిస్టన్ స్టబ్స్ (11), మార్కో జన్సెన్ (12) రెండంకెల స్కోర్లు చేశారు. -
IND vs SA 2nd T20: టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్..
ఆదివారం గెబేహా వేదికగా జరగనున్న రెండో టీ20లో భారత్-దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. తొలి టీ20లో సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా ఇప్పుడు రెండో టీ20లో కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు మొదటి టీ20లో ఓటమి చవిచూసిన సఫారీ జట్టు.. ఈ మ్యాచ్లో ఎలాగైనా టీమిండియాను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని యోచిస్తోంది.అయితే ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశముంది. ఆక్యూవెదర్ రిపోర్ట్ ప్రకారం.. మ్యాచ్ ప్రారంభ సమయానికి గెబేహాలో 50 శాతం వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వర్షం కారణంగా టాస్ కూడా ఆలస్యమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. కాగా ఈ మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. అంటే భారత కాలమానం ప్రకారం మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలు కానుంది. అదే విధంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో కూడా వరుణుడు ఇబ్బంది కలిగించే అస్కారం ఉన్నట్లు స్ధానిక వాతవారణ శాఖ కూడా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఒకవేళ పూర్తి స్థాయిలో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే.. కనీసం 5 ఓవర్ల గేమ్నైనా ఆడిస్తారు. అలా కూడా కుదరకపోతే మ్యాచ్ను అంపైర్లు రద్దు చేస్తారు.తుది జట్లు(అంచనా)దక్షిణాఫ్రికా: ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, పాట్రిక్ క్రూగర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, ఒట్నీల్ బార్ట్మన్, గెరాల్డ్ కోయెట్జీభారత్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, అవేష్ ఖాన్చదవండి: CK Nayudu Trophy: ఊచకోత.. ఒకే ఇన్నింగ్స్లో 426 పరుగులు! 46 ఫోర్లు, 8 సిక్స్లతో -
ఊచకోత..; ఒక్కసారి అతడు హిట్టింగ్ మొదలుపెడితే ఆపలేం: మార్క్రమ్
యాభై బంతుల్లో ఏడు ఫోర్లు, పది సిక్సర్లు.. మొత్తంగా 107 పరుగులు.. టీమిండియా స్టార్, ఓపెనర్ సంజూ శాంసన్ డర్బన్ వేదికగా సౌతాఫ్రికా బౌలింగ్ను ఒక రకంగా ఊచకోత కోశాడు. ప్రొటిస్ బౌలర్లపై అటాక్ చేస్తూ పరుగుల విధ్వంసంతో 214కు పైగా స్ట్రైక్ రేటు నమోదు చేశాడు. ఆద్యంతం అద్భుతమైన షాట్లతో క్రికెట్ ప్రేమికులను అలరిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఎంత మంది బౌలర్లను మార్చినా ప్రయోజనం లేదుసంజూ జోరుకు కళ్లెం వేయడానికి సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ ఎంత మంది బౌలర్లను మార్చినా ప్రయోజనం లేకపోయింది. అతడే స్వయంగా ఈ విషయాన్ని అంగీకరించాడు. తొలి టీ20లో టీమిండియా చేతిలో ఓడిన తర్వాత మార్క్రమ్ మాట్లాడుతూ... సంజూ శాంసన్పై ప్రశంసలు కురిపించాడు.అసాధారణ ఇన్నింగ్స్.. అతడిని ఆపలేకపోయాం‘‘ఈ మ్యాచ్లో సంజూ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. మా బౌలర్లను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. అతడిని అవుట్ చేయడానికి మేము చాలానే ప్లాన్స్ వేశాం. ఎప్పటికప్పుడు మెరుగైన ప్రణాళికతో ముందుకు వెళ్లాం. ఒక్కసారి అతడు అలా క్రీజులో కుదురుకుని హిట్టింగ్ మొదలు పెట్టాక.. అతడిని ఆపడం కుదిరేపని కాదు.అదొక్కటే మాకు సానుకూలాంశంఅతడి ముందు ఒక రకంగా తలొగ్గడం తప్ప ఏమీ చేయలేకపోయాం. అయితే, డెత్ ఓవర్లలో మా వాళ్లు బాగా బౌలింగ్ చేశారు. గెరాల్డ్ కోయెట్జీ, మార్కో జాన్సెన్ ఆట తీరు మాకు ఈ మ్యాచ్లో సానుకూలాంశం’’ అని మార్క్రమ్ పేర్కొన్నాడు. తదుపరి మ్యాచ్లో పొరపాట్లను సరి చేసుకుని మెరుగైన ఆట తీరుతో ముందుకు వస్తామని తెలిపాడు.Sanju Chetta is on fire! 🔥💥Watch the 1st #SAvIND T20I LIVE on #JioCinema, #Sports18, and #ColorsCineplex! 👈#TeamIndia #JioCinemaSports #SanjuSamson pic.twitter.com/kTeX4Wf6AQ— JioCinema (@JioCinema) November 8, 2024 కాగా నాలుగు టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో సూర్య సేన శుక్రవారం మార్క్రమ్ బృందంతో తొలి మ్యాచ్లో తలపడింది. తిలక్ సైతండర్బన్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా సంజూ అద్భుత శతకం, తిలక్ వర్మ(18 బంతుల్లో 33) ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోరు సాధించింది.భారత బౌలర్ల విజృంభణలక్ష్య ఛేదనలో భారత బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా 141 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 61 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది. ఇక టీమిండియా స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి(3/25), రవి బిష్ణోయి(3/28) చెరో మూడు వికెట్లతో చెలరేగగా.. పేసర్లు అర్ష్దీప్ సింగ్ ఒకటి, అవేశ్ ఖాన్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఈ మ్యాచ్లో మార్క్రమ్ ఎనిమిది పరుగులకే నిష్క్రమించాడు. ఇక ఇరుజట్ల మధ్య ఆదివారం రెండో మ్యాచ్ జరుగనుంది.చదవండి: BGT: వరుసగా 4 సెంచరీలు.. ఆస్ట్రేలియాలో ఫెయిల్.. అయినా టీమిండియా ఓపెనర్గా అతడే! -
'చాలా సంతోషంగా ఉంది.. ఈ క్షణం కోసమే పదేళ్లుగా ఎదురుచూస్తున్నా'
డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ విధ్వంసకర సెంచరీతో కదం తొక్కాడు. ప్రధాన ఆటగాళ్లు దూరం కావడంతో తనకు వచ్చిన అవకాశాలను శాంసన్ రెండు రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు.గత నెలలో హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్పై శివతాండవం చేసిన సంజూ.. ఇప్పుడు సఫారీ గడ్డపై బీబత్సం సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో వరుస ఇన్నింగ్స్లలో సెంచరీలు సాధించిన తొలి భారత బ్యాటర్గా శాంసన్ రికార్డులకెక్కాడు. కేవలం 50 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్లతో 107 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ ఈ కేరళ స్టార్ నిలిచాడు. ఇక తన అద్బుత ఇన్నింగ్స్పై సంజూ శాంసన్ స్పందించాడు. ఇన్నింగ్స్ బ్రేక్లో బ్రాడ్కాస్టర్తో మాట్లాడుతూ ఆధికారిక బ్రాడ్కాస్టర్తో సంజూ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు."నేను ఇప్పుడు ఎక్కువగా ఆలోచిస్తే కచ్చితంగా ఎమోషనల్ అవుతాను. ఎందుకంటే ఈ క్షణం కోసమే గత 10 ఏళ్ల నుంచి వేచి ఉన్నాను. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. చాలా మంది నాకు సపోర్ట్గా నిలిచారు.నా కష్టానికి తగ్గ ఫలితం ఇన్నాళ్లకు దక్కింది. కానీ నేను గాల్లో తేలిపోవాలనుకోవటం లేదు. రాబోయే మ్యాచ్ల్లో కూడా ఇదే తరహా ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తానని" అని భారత్ ఇన్నింగ్స్ అనంతరం సంజూ పేర్కొన్నాడు."ఈ మ్యాచ్లో నా బ్యాటింగ్ను నేను అస్వాదించాను. నా ఫామ్ను పూర్తిగా వినిగియోగించుకున్నాను. మేము దూకుడుగా ఆడాలని ముందే నిర్ణయించుకున్నాము. మూడు నాలుగు బంతులు ఆడిన తర్వాత కచ్చితంగా బౌండరీ కోసం ప్రయత్నించాల్సిందే. ఓవరాల్గా ఈ మ్యాచ్లో నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను" అని పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో శాంసన్ చెప్పుకొచ్చాడు.చదవండి: IND-A vs AUS-A: తీరు మారని టీమిండియా.. ఆసీస్ చేతిలో మరో ఓటమి -
సంజూతో గొడవ పడ్డ సౌతాఫ్రికా ప్లేయర్.. ఇచ్చిపడేసిన సూర్య! వీడియో
దక్షిణాఫ్రికాతో నాలుగు టీ20ల సిరీస్ను టీమిండియా విజయంతో ఆరంభించింది. శుక్రవారం డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20లో 61 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో భారత్ అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్లో దుమ్ములేపిన టీమిండియా.. అనంతరం బౌలింగ్లో సఫారీలను చిత్తు చేసింది. దీంతో నాలుగు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన ప్రశాంతతను కోల్పోయాడు. దక్షిణాఫ్రికా స్టార్ ఆల్రౌండర్ మార్కో జాన్సెన్, సూర్యకుమార్ మధ్య చిన్నపాటి మాటల యుద్దం చోటు చేసుకుంది.అసలేం జరిగిందంటే?దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 15 ఓవర్ వేసిన రవి బిష్ణోయ్ బౌలింగ్లో రెండో బంతిని గెరాల్డ్ కోట్జీ లాంగ్-ఆఫ్ దిశగా షాట్ ఆడాడు. బంతి బౌన్స్ అయి నేరుగా లాంగా ఆఫ్ ఫీల్డర్ చేతికి వెళ్లింది. వెంటనే సదరు ఫీల్డర్ బంతిని వికెట్ కీపర్ సంజూ శాంసన్కు త్రో చేశాడు.ఈ క్రమంలో ఆ బంతిని సంజూ పిచ్పై కుడివైపు నుండి అందుకున్నాడు. అయితే సంజూ పిచ్ మధ్యలోకి వచ్చి బంతి అందుకోవడం జాన్సెన్కు నచ్చలేదు. దీంతో అతడు శాంసన్తో వాగ్వాదానికి దిగాడు. శాంసన్ కూడా అతడికి బదులిచ్చాడు. ఈ క్రమంలో మిడాన్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ సంజూ శాంసన్కు సపోర్ట్గా నిలిచాడు. జాన్సెన్ వద్దకు వెళ్లి సీరియస్గా ఏదో అన్నాడు. ఆ తర్వాత నాన్స్ట్రైక్లో ఉన్న గెరాల్డ్ కోయెట్జీ కూడా ఈ గొడవలో భాగమయ్యాడు. అయితే ఫీల్డ్ అంపైర్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కాగా ఈ మ్యాచ్లో సంజూ శాంసన్(107) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.pic.twitter.com/s1ufl4WqNB— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) November 8, 2024 pic.twitter.com/x8Jf2rR4wN— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) November 8, 2024 -
రికార్డుల కోసం ఆడడు.. అతడు నిజంగా చాలా గ్రేట్: సూర్యకుమార్
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆతిథ్య జట్టును 61 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. భారత బౌలర్ల దాటికి 141 పరుగులకే కుప్పకూలింది.టీమిండియా స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ తలా మూడు వికెట్లతో ప్రోటీస్ పతనాన్ని శాసించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ సాధించింది.భారత బ్యాటర్లలో సంజూ శాంసన్(107) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. తిలక్ వర్మ(33), సూర్యకుమార్ యాదవ్(21) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయిట్జీ మూడు వికెట్లు పడగొట్టగా.. మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, పీటర్, క్రుగర్ తలో వికెట్ సాధించారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు."డర్బన్లో మాకు మంచి రికార్డు ఉందన్న విషయం నాకు తెలియదు. ఆ సంగతి నాకు ఇప్పుడే తెలిసింది. గత మూడు నాలుగు సిరీస్ల నుంచి మేం మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్ను కొనసాగిస్తున్నాం. తొలి మ్యాచ్లోనే విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఇక సంజూ శాంసన్ ఒక అద్బుతం. గత కొన్నేళ్లుగా సంజూ శాంసన్ పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. ఈ మ్యాచ్లో తన స్కోర్ 90లలో ఉన్నప్పుడు కూడా అతడు బౌండరీలు కొట్టేందుకు ప్రయత్నించాడు. సంజూ ఎప్పుడు వ్యక్తిగత రికార్డుల కోసం కాకుండా, జట్టు ప్రయోజానాల కోసం ఎప్పుడూ ఆలోచిస్తాడు.మ్యాచ్ కీలక దశలో స్పిన్నర్లను ఎటాక్లోకి తీసుకురావాలని ముందే ప్లాన్ చేశాము. క్లాసెన్, మిల్లర్ క్లాసెన్, మిల్లర్ వికెట్లను స్పిన్నర్లతో తీయాలనుకున్నాం. మా స్పిన్నర్లు మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేశారు అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో సూర్యకుమార్ పేర్కొన్నాడు.కెప్టెన్సీని ఎంజాయ్ చేస్తున్నారా?అవును నా కెప్టెన్సీని నేను ఆస్వాదిస్తున్నాను. మా కుర్రాళ్లు అద్బుతంగా ఆడి నా పనిని మరింత సులువు చేస్తున్నారు. ఇదే విషయాన్ని టాస్, ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్లో చెప్పాను. ప్రస్తుతం నాపై ఎటువంటి ఒత్తడి లేదు. మా బాయ్స్ అంతా ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాను. వికెట్లు కోల్పోయినప్పటకీ భయపడకుండా ఆడుతున్నాము. మా బ్రాండ్ క్రికెట్ను కొనసాగిస్తున్నాము అని సూర్య చెప్పుకొచ్చాడు. -
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. తొలి భారత క్రికెటర్గా
డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన శాంసన్ ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. స్టేడియం నలుమూలలా బౌండరీల వర్షం కురిపిస్తూ అభిమానులను అలరించాడు.ఈ క్రమంలో కేవలం 47 బంతుల్లోనే తన రెండో అంతర్జాతీయ టీ20 సెంచరీని సంజూ అందుకున్నాడు. ఓవరాల్గా 50 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సంజూ 7 ఫోర్లు, 10 సిక్స్లతో 107 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో సెంచరీతో మెరిసిన శాంసన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.శాంసన్ సాధించిన రికార్డులు ఇవే..👉అంతర్జాతీయ టీ20ల్లో వరుస ఇన్నింగ్స్లలో సెంచరీలు బాదిన తొలి భారత బ్యాటర్గా శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ కంటే ముందు హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మూడో టీ20లో శాంసన్ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు.ఇప్పుడు అదే ఇన్నింగ్స్ను సఫారీ గడ్డపై రిపీట్ చేశాడు. తద్వారా ఈ అరుదైన ఫీట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్గా ప్రపంచక్రికెట్లో ఈ ఘనత సాధించిన నాలుగో ప్లేయర్గా సంజూ రికార్డులకెక్కాడు. గతంలో గుస్తావ్ మెక్కియాన్ (ఫ్రాన్స్), ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్), రిలీ రూసో (దక్షిణాఫ్రికా) ఈ ఘనత సాధించారు.👉అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు బాదిన భారత ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డును శాంసన్ సమం చేశాడు. ఈ మ్యాచ్లో సంజూ 10 సిక్స్లు నమోదు చేశాడు. గతంలో శ్రీలంకతో జరిగిన టీ20లో హిట్మ్యాన్ కూడా 10 సిక్స్లు బాదాడు.👉టీ20ల్లో దక్షిణాఫ్రికా గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత ఆటగాడిగా సంజూ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉండేది. గతేడాది డిసెంబర్లో జోహన్నెస్బర్గ్లోని వాండరర్స్ స్టేడియంలో సూర్యకుమార్ 100 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో సూర్య రికార్డును ఈ కేరళ బ్యాటర్ బ్రేక్ చేశాడు.👉ప్రొఫెషనల్ టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 7000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆరో భారత బ్యాటర్గా శాంసన్ నిలిచాడు. కేవలం 269 ఇన్నింగ్స్లలో ఈ ఫీట్ను శాంసన్ సాధించాడు. ఈ క్రమంలో మహేంద్ర సింగ్ ధోనీని(365) అధిగమించాడు. ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాలో కేఎల్ రాహుల్(197) అగ్రస్ధానంలో ఉండగా.. విరాట్ కోహ్లి(212), శిఖర్ ధావన్(246), సూర్యకుమార్ యాదవ్(249), సురేశ్ రైనా(251) తర్వాతి స్ధానాల్లో ఉన్నారు.భారత్ ఘన విజయం..ఇక ఈ మ్యాచ్లో 61 పరుగుల తేడాతో దక్షిణాఫ్రిను భారత్ చిత్తు చేసింది. దీంతో నాలుగు టీ20ల సిరీస్లో1-0 ఆధిక్యంలోకి టీమిండియా దూసుకెళ్లింది. 202 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో దక్షిణాఫ్రికా చతికలపడింది. భారత బౌలర్ల దాటికి సౌతాఫ్రికా కేవలం 141 పరుగులకే ఆలౌటైంది.చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన కేఎల్ రాహుల్ -
IND Vs SA: శాంసన్ సూపర్ సెంచరీ.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్
దాదాపు నెల రోజుల క్రితం హైదరాబాద్ టి20 మ్యాచ్లో అద్భుత సెంచరీతో అలరించిన సంజు సామ్సన్ అదే ఫామ్ను కేప్టౌన్ వరకు తీసుకెళ్లాడు. వేదిక మారినా, ప్రత్యర్థి మారినా అదే దూకుడుతో సిక్సర్ల వర్షం కురిపించిన అతను వరుసగా రెండో శతకంతో మెరిసి ఈ ఘనత సాధించిన అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. సామ్సన్ మెరుపు బ్యాటింగ్ కారణంగా భారీ స్కోరుతో ప్రత్యర్థికి భారత్ సవాల్ విసిరింది. ఆపై చక్కటి బౌలింగ్తో ప్రత్యర్థిని కుప్పకూల్చి సిరీస్లో శుభారంభం చేసింది. సొంతగడ్డపై కూడా అన్ని రంగాల్లో సమష్టిగా విఫలమైన సఫారీ టీమ్ ఏమాత్రం ప్రభావం చూపలేక పరాజయాన్ని మూటగట్టుకుంది.కేప్టౌన్: టి20 క్రికెట్ ప్రపంచ చాంపియన్ భారత్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో మరోసారి దక్షిణాఫ్రికాపై పైచేయి సాధించింది. శుక్రవారం కింగ్స్మీడ్ మైదానంలో జరిగిన తొలి టి20 మ్యాచ్లో భారత్ 61 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సంజు సామ్సన్ (50 బంతుల్లో 107; 7 ఫోర్లు, 10 సిక్స్లు) సెంచరీతో చెలరేగగా... హైదరాబాద్ బ్యాటర్ ఠాకూర్ తిలక్వర్మ (18 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా రాణించాడు. అనంతరం దక్షిణాఫ్రికా 17.5 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. క్లాసెన్ (25)దే అత్యధిక స్కోరు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ చెరో 3 వికెట్లు తీశారు. సిరీస్లో భారత్ 1-0తో ముందంజ వేయగా, రెండో టి20 మ్యాచ్ జిఖెబెర్హాలో ఆదివారం జరుగుతుంది.మెరుపు భాగస్వామ్యాలు... జాన్సెన్ వేసిన తొలి ఓవర్లో 2 పరుగులే వచ్చినా... ఆ తర్వాతి రెండు ఓవర్లలో భారత్ 22 పరుగులు రాబట్టింది. అభిషేక్ శర్మ (7) విఫలం కాగా, సామ్సన్ తన దూకుడుతో వేగంగా పరుగులు రాబట్టాడు. అతనికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (17 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) జత కలవడంతో స్కోరు దూసుకుపోయింది.పవర్ప్లేలో జట్టు 56 పరుగులు సాధించింది. జాన్సెన్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన సామ్సన్... పీటర్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో 27 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. సామ్సన్, సూర్య రెండో వికెట్కు 37 బంతుల్లో 66 పరుగులు జోడించారు. ఆ తర్వాత సామ్సన్, తిలక్ కలిసి ధాటిని కొనసాగిస్తూ సఫారీ బౌలర్లపై చెలరేగారు. క్రూగర్ ఓవర్లో తిలక్ వరుసగా ఫోర్, సిక్స్ బాదాడు. మరోవైపు మహరాజ్ బౌలింగ్లో లాంగాఫ్ దిశగా సింగిల్ తీయడంతో సామ్సన్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. మూడో వికెట్కు 77 పరుగులు (34 బంతుల్లో) జత చేసిన అనంతరం తిలక్ వెనుదిరిగాడు. ఆ తర్వాత ఒక్కసారిగా భారత బ్యాటింగ్ నెమ్మదించింది. 16 పరుగుల వ్యవధిలో సామ్సన్, హార్దిక్ పాండ్యా (2), రింకూ సింగ్ (11) అవుట్ కావడం జట్టు స్కోరు వేగానికి బ్రేక్ వేసింది. చివరి 5 ఓవర్లలో భారత్ 35 పరుగులే చేసింది.టపటపా... భారీ ఛేదనలో దక్షిణాఫ్రికా ఏ దశలోనూ కనీసస్థాయి ఆటను ప్రదర్శించలేదు. టీమ్లో ఒక్క బ్యాటర్ కూడా పట్టుదలగా నిలబడలేకపోయాడు. భారత బౌలర్ల జోరుతో పవర్ప్లే ముగిసేలోపే సఫారీ స్కోరు 44/3 వద్ద నిలిచింది. ఈ స్థితిలో క్లాసెన్, మిల్లర్ (18) జోడీ ఆదుకుంటుందని జట్టు ఆశలు పెట్టుకుంది. అయితే వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్లో వీరిద్దరిని అవుట్ చేయడంతో సఫారీ గెలుపు దారులు దాదాపుగా మూసుకుపోయాయి. ఆ తర్వాత ఇతర బ్యాటర్లు కొద్దిసేపు పోరాడటం మినహా విజయానికి ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది.స్కోరు వివరాలుభారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) స్టబ్స్ (బి) పీటర్ 107; అభిషేక్ (సి) మార్క్రమ్ (బి) కొయెట్జీ 7; సూర్యకుమార్ (సి) సిమ్లేన్ (బి) క్రూగర్ 21; తిలక్ వర్మ (సి) జాన్సెన్ (బి) మహరాజ్ 33; పాండ్యా (సి) జాన్సెన్ (బి) కొయెట్జీ 2; రింకూ సింగ్ (సి) క్లాసెన్ (బి) కొయెట్జీ 11; అక్షర్ పటేల్ (సి) స్టబ్స్ (బి) జాన్సెన్ 7; అర్ష్దీప్ (నాటౌట్) 5; బిష్ణోయ్ (రనౌట్) 1; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 202. వికెట్ల పతనం: 1-24, 2-90, 3-167, 4-175, 5-181, 6-194, 7-199, 8-202. బౌలింగ్: జాన్సెన్ 4-0-24-1, మార్క్రమ్ 1-0-10-0, కేశవ్ మహరాజ్ 4-0-34-1, కొయెట్జీ 4-0-37-3, పీటర్ 3-0-35-1, క్రూగర్ 2-0-35-1, సిమ్లేన్ 2-0-27-0.దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) తిలక్ (బి) వరుణ్ 21; మార్క్రమ్ (సి) సామ్సన్ (బి) అర్ష్దీప్ 8; స్టబ్స్ (సి) సూర్యకుమార్ (బి) అవేశ్ 11; క్లాసెన్ (సి) అక్షర్ (బి) వరుణ్ 25; మిల్లర్ (సి) అవేశ్ (బి) వరుణ్ 18; క్రూగర్ (సి) పాండ్యా (బి) బిష్ణోయ్ 1; జాన్సెన్ (సి) పాండ్యా (బి) బిష్ణోయ్ 12; సిమ్లేన్ (ఎల్బీ) (బి) బిష్ణోయ్ 6; కొయెట్జీ (రనౌట్) 23; మహరాజ్ (బి) అవేశ్ 5; పీటర్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 6; మొత్తం (17.5 ఓవర్లలో ఆలౌట్) 141. వికెట్ల పతనం: 1-8, 2-30, 3-44, 4-86, 5-87, 6-87, 7-93, 8-114, 9-135, 10-141. బౌలింగ్: అర్ష్దీప్ 3-0-25-1, అవేశ్ ఖాన్ 2.5-0-28-2, పాండ్యా 3-0-27-0, వరుణ్ చక్రవర్తి 4-0-25-3, రవి బిష్ణోయ్ 4-0-28-3, అక్షర్ 1-0-8-0.4 అంతర్జాతీయ టి20ల్లో వరుసగా రెండు మ్యాచ్లలో సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా సామ్సన్ నిలిచాడు. గతంలో గుస్తావ్ మెక్కియాన్ (ఫ్రాన్స్), ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్), రిలీ రోలో (దక్షిణాఫ్రికా) ఈ ఘనత సాధించారు. -
IND VS SA 1st T20: సౌతాఫ్రికాతో తొలి టీ-20.. చెత్త షాట్ ఆడి
Update: డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20లో 61 పరుగుల తేడాతో దక్షిణాఫ్రిను భారత్ చిత్తు చేసింది. దీంతో నాలుగు టీ20ల సిరీస్లో1-0 ఆధిక్యంలోకి టీమిండియా దూసుకెళ్లింది.సౌతాఫ్రికాతో తొలి టీ-20లో శాంసన్ సెంచరీ47 బంతుల్లో సెంచరీ చేసిన శాంసన్7 ఫోర్లు, 9 సిక్స్లతో చెలరేగిన శాంసన్10 ఓవర్ల అనంతరం టీమిండియా స్కోర్ 99/2.. సంజూ శాంసన్ (59 బ్యాటింగ్), తిలక్ వర్మ (7 బ్యాటింగ్)టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. అభిషేక్ తన టీ20 కెరీర్లో ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక సెంచరీ చేశాడు. మిగతా అన్ని మ్యాచ్ల్లో దారుణంగా విఫలమయ్యాడు. తాజాగా అభిషేక్ మరోసారి చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో అభిషేక్ 8 బంతుల్లో బౌండరీ సాయంతో 7 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ తొలి బంతి నుంచి చాలా ఇబ్బంది పడ్డాడు. బంతిని కనెక్ట్ చేసుకోలేక సతమతమయ్యాడు. గెరాల్డ్ కొయెట్జీ బౌలింగ్ భారీ షాట్కు ప్రయత్నించి మార్క్రమ్ చేతికి చిక్కాడు. అభిషేక్ వరుసగా అవకాశాలు ఇస్తున్నా విఫలమవుతుండటంతో భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిషేక్కు గేమ్ పట్ల సీరియస్నెస్ లేదని కామెంట్స్ చేస్తున్నారు. దక్షిణాఫ్రికాతో సిరీస్లో అభిషేక్ మరో మ్యాచ్లో ఫెయిల్ అయితే టీమిండియా తలుపులు తట్టలేడని అంటున్నారు.కాగా, నాలుగు మ్యాచ్ల సిరీస్లో భాగంగా డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన భారత్ చెలరేగి ఆడుతుంది. అభిషేక్ నిరాశపరిచినప్పటికీ.. సంజూ శాంసన్ దుమ్ములేపుతున్నాడు. సంజూ 20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. మరో ఎండ్లో సూర్యకుమార్ యాదవ్ కూడా ధాటిగానే ఆడుతున్నాడు. స్కై 8 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 14 పరుగులు చేశాడు. 6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 56/1గా ఉంది. దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, పాట్రిక్ క్రుగర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సిమెలన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, న్కాబయోమ్జి పీటర్భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్ -
IND VS SA 1st T20: తుది జట్లు ఇవే..!
నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా డర్బన్ వేదికగా టీమిండియాతో ఇవాళ (నవంబర్ 8) జరుగుతున్న తొలి టీ20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగుతుంది. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా రానున్నారు.భారత్, సౌతాఫ్రికా మధ్య ఇప్పటివరకు 27 టీ20 మ్యాచ్లు జరగగా.. భారత్ 15, సౌతాఫ్రికా 11 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు. ఇరు జట్లు చివరిసారి తలపడిన మ్యాచ్లో టీమిండియానే పైచేయి సాధించింది. టీ20 వరల్డ్కప్ 2024 ఫైనల్లో భారత్, సౌతాఫ్రికా తలపడగా.. ఆ మ్యాచ్లో టీమిండియా జయభేరి మోగించి రెండో సారి వరల్డ్కప్ ఛాంపియన్గా నిలిచింది. దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(వికెట్కీపర్), ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, పాట్రిక్ క్రుగర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సిమెలన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, న్కాబయోమ్జి పీటర్భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్ -
ఇండియా, సౌతాఫ్రికా తొలి టీ20కి వర్షం ముప్పు..?
నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా భారత్, సౌతాఫ్రికా జట్లు ఇవాళ (నవంబర్ 8) తొలి మ్యాచ్లో తలపడనున్నాయి. డర్బన్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉందని యాక్యూవెదర్ పేర్కొంది. మ్యాచ్ జరిగే సమయంలో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని సమాచారం. మ్యాచ్ ప్రారంభ సమయానికి 46 శాతం వర్షం పడే సూచనలు ఉన్నట్లు యాక్యూవెదర్ తెలిపింది. మ్యాచ్ జరిగే సమయంలో ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్గా ఉండనున్నట్లు తెలుస్తుంది. రాత్రి 9:30 గంటల ప్రాంతంలో వర్షం పడే అవకాశాలు 51 శాతానికి పెరుగుతాయని సమాచారం. ఇవాళ ఉదయం నుంచి డర్బన్లో ఆకాశం మేఘావృతమై ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే నేటి మ్యాచ్కు వర్షం అంతరాయాలు తప్పేలా లేవు.కాగా, భారత్-సౌతాఫ్రికా చివరి సారి టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తలపడిన విషయం తెలిసిందే. నాటి ఫైనల్లో భారత్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి ఛాంపియన్గా అవతరించింది. పొట్టి ప్రపంచ కప్ అనంతరం భారత్ టీ20ల్లో తిరుగులేని జట్టుగా ఉంది. సూర్యకుమార్ నేతృత్వంలో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. శ్రీలంకను వారి సొంతగడ్డపై మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో క్లీన్స్వీప్ చేసిన భారత్.. తాజాగా బంగ్లాదేశ్ను సైతం మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో క్లీన్ స్వీప్ చేసింది. దక్షిణాఫ్రికా విషయానికొస్తే.. ప్రొటీస్ జట్టు పసికూన ఐర్లాండ్తో జరిగిన రెండు మ్యాచ్ టీ20 సిరీస్ను 1-1తో సమం చేసుకుంది. జట్ల బలాబలాల ప్రకారం చూస్తే.. ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. ఇరు జట్లలో స్టార్ హిట్లర్లు ఉన్నారు. దక్షిణాఫ్రికా జట్టులో క్లాసెన్, మిల్లర్, మార్క్రమ్ ఉండగా.. టీమిండియాలో సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా లాంటి భారీ హిట్టర్లు ఉన్నారు. ఐపీఎల్ మెగా వేలం నేపథ్యంలో ఈ సిరీస్కు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సిరీస్లో రాణించిన ఆటగాళ్లపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు కన్నేసే అవకాశం ఉంది. కాబట్టి ఇరు జట్ల ఆటగాళ్లు పోటీపడి సత్తా చాటాలని భావిస్తారు. -
అతడికి ఎందుకు ఛాన్స్ ఇవ్వడం లేదు?.. కుండబద్దలు కొట్టిన సూర్య
యువ ఆటగాళ్లతో కూడిన భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య శుక్రవారం డర్బన్ వేదికగా మొదటి మ్యాచ్ జరుగనుంది. ఇందుకోసం భారత్- ప్రొటిస్ జట్లు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాయి. జైత్రయాత్రను కొనసాగించాలని టీమిండియా.. పరాభవాల నుంచి కోలుకోవాలని సౌతాఫ్రికా పట్టుదలగా ఉన్నాయి.ఈ నేపథ్యంలో తొలి టీ20కి ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా రుతురాజ్ గైక్వాడ్ గురించి ప్రశ్న ఎదురైంది. అతడిని సౌతాఫ్రికా సిరీస్కు ఎందుకు ఎంపిక చేయలేదని విలేఖరులు అడుగగా.. ‘‘రుతు అద్భుతమైన ఆటగాడు. మూడు ఫార్మాట్లలోనూ అతడు నిలకడగా రాణిస్తున్నాడు.అతడి కంటే ముందు చాలా మందే ఉన్నారుఇక అతడి కంటే ముందు చాలా మంది ఆటగాళ్లు కూడా ఇలాగే అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు. కాబట్టి ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఆడించాలో మేనేజ్మెంట్కు బాగా తెలుసు. యాజమాన్యం నిర్ణయాలను ప్రతి ఒక్కరు పాటించాల్సిందే. రుతు ఇంకా యువకుడే. అతడికీ ఏదో ఒక రోజు టైమ్ వస్తుంది’’ అని సూర్య కుండబద్దలు కొట్టినట్లుగా సమాధానమిచ్చాడు.కొత్త జోడీకాగా రుతురాజ్ గైక్వాడ్ వన్డే, టీ20 ఫార్మాట్లలో రాణిస్తున్నప్పటికీ అనుకున్న స్థాయిలో టీమిండియాలో అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు. అతడి బ్యాటింగ్ స్థానమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ముఖ్యంగా టీ20లలో యశస్వి జైస్వాల్- శుబ్మన్ గిల్ జోడీ ఓపెనర్లుగా పాతుకుపోగా.. వారి గైర్హాజరీలో కొత్తగా సంజూ శాంసన్- అభిషేక్ శర్మ జోడీని బీసీసీఐ పరిశీలిస్తోంది.కెప్టెన్గా అవకాశాలుఅయితే, సౌతాఫ్రికాతో సిరీస్ కంటే ముందే భారత్-‘ఎ’ జట్టు కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. ఈ క్రమంలోనే అతడు ప్రొటిస్తో టీ20 సిరీస్కు దూరమయ్యాడు. ఇక ఓపెనింగ్ బ్యాటర్ రుతు చివరగా జింబాబ్వే పర్యటనలో టీమిండియా తరఫున టీ20 సిరీస్ ఆడాడు. ఆ టూర్లో 158కి పైగా స్ట్రైక్రేటుతో 133 పరుగులు సాధించాడు.ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్కు సారథిగా వ్యవహరిస్తున్న రుతురాజ్ గైక్వాడ్.. ఇటీవల దేశీ రెడ్బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-సి జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. ఆసీస్ గడ్డపై విఫలంఅంతేకాదు.. ఇరానీ కప్లో రెస్టాఫ్ ఇండియా జట్టుకు సారథ్యం వహించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరుగుతున్న అనధికారిక టెస్టు సిరీస్తో బిజీగా ఉన్న రుతు.. అక్కడ కెప్టెన్గా, బ్యాటర్గా విఫలమవుతున్నాడు. తొలి టెస్టులో 0, 5 పరుగులు చేసిన రుతు.. రెండో టెస్టులో 4, 11 రన్స్ చేశాడు. ఇక తొలి టెస్టులో ఏడు వికెట్ల తేడాతో ఓడిన భారత్-ఎ.. రెండో టెస్టులోనూ ఓటమి దిశగా పయనిస్తోంది. చదవండి: IND vs SA: 'అతడికి ఇది డూ ఆర్ డై సిరీస్.. లేదంటే ఇక మర్చిపోవాల్సిందే' -
'అతడికి ఇది డూ ఆర్ డై సిరీస్.. లేదంటే ఇక మర్చిపోవాల్సిందే'
దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టీ20 ఇరు జట్ల మధ్య శుక్రవారం డర్బన్ వేదికగా జరగనుంది. ఈ సిరీస్లో సఫారీలను సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని యువ భారత జట్టు ఢీకొట్టనుంది.ప్రోటీస్ సిరీస్కు యశస్వీ జైశ్వాల్, గిల్, రిషబ్ పంత్, బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు దూరమయ్యారు. దీంతో సౌతాఫ్రికా పర్యటనకు రమణ్దీప్ సింగ్, విజయ్కుమార్ వైశ్యాఖ్, యశ్ దయాల్ వంటి కొత్త ముఖాలకు భారత జట్టులో సెలక్టర్లు చోటు కల్పించారు.ఈ నేపథ్యంలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మకు ఈ సిరీస్ డూ ఆర్ డై వంటిది అని చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా జింబాబ్వే సిరీస్తో టీ20ల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అభిషేక్.. జైశ్వాల్ బ్యాకప్ ఓపెనర్గా కొనసాగుతున్నాడు.జైశ్వాల్ గైర్హాజరీ సిరీస్లలో అభిషేక్కు సెలక్టర్లు చోటిస్తున్నారు. అయితే జింబాబ్వే సిరీస్లో సెంచరీ మినహా ఇప్పటివరకు అభిషేక్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఇప్పటివరకు 8 ఇన్నింగ్స్లు ఆడిన అభిషేక్.. 22.71 సగటుతో కేవలం 159 పరుగులు మాత్రమే చేశాడు."అభిషేక్ శర్మ ఈ సిరీస్లో చావోరెవో తెల్చుకోవాల్సిందే. ఎందుకంటే ఈ సిరీస్లో అభిషేక్ రాణించికపోతే వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు అతడిని కచ్చితంగా పక్కనపెట్టేస్తారు. అభిషేక్ శర్మ అద్భుతమైన ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.అతడి బ్యాటింగ్ స్టైల్ అంటే నాకు ఎంతో ఇష్టం. జింబాబ్వే పర్యటనలో సెంచరీ కూడా సాధించాడు. కానీ ఆ తర్వాత ఇప్పటివరకు అభిషేక్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదని" చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: IND-A vs AUS-A: నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. 223 పరుగులకు ఆసీస్ ఆలౌట్ -
Ind vs SA: అతడు పట్టిందల్లా బంగారమే!.. ఒక్కో మ్యాచ్కు రూ. 73 కోట్లు!
టీ20 ప్రపంచకప్-2024లో చాంపియన్గా అవతరించిన టీమిండియా ఆ తర్వాత ద్వైపాక్షిక సిరీస్లలోనూ దుమ్ములేపింది. రోహిత్ శర్మ స్థానంలో పూర్తి స్థాయిలో భారత టీ20 జట్టు పగ్గాలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్ పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ముందుకు సాగుతున్నాడు. తొలుత శ్రీలంక పర్యటనలో సూర్య సేన టీ20 సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేయగా.. తర్వాత సొంతగడ్డపై పూర్తిగా యువ ఆటగాళ్లతో కూడిన జట్టుతో బంగ్లాదేశ్ను 3-0తో వైట్వాష్ చేసింది.అదొక్కటి సానుకూలాంశంఅయితే, సౌతాఫ్రికా గడ్డపై రాణించడం టీమిండియాకు అంత తేలికేమీ కాదు. కానీ.. ప్రపంచకప్-2024 ఫైనల్లో భారత్ చేతిలో ఓటమి తర్వాత ప్రొటిస్ జట్టు ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం మనకు సానుకూలాంశం. మెగా టోర్నీ తర్వాత వెస్టిండీస్ చేతిలో 0–3తో వైట్వాష్కు గురైన సౌతాఫ్రికా.. తర్వాత పసికూన ఐర్లాండ్తో సిరీస్ను 1–1తో ‘డ్రా’గా ముగించింది.ఈ నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో సూర్య సేన వస్తుంటే.. గత పరాభవాల నుంచి కోలుకుని స్వదేశంలో సత్తా చాటాలని సౌతాఫ్రికా పట్టుదలగా ఉంది. హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ రీఎంట్రీతో తమ రాత మారుతుందని ధీమాగా ఉంది. ఈ నేపథ్యంలో సఫారీలతో టీమిండియా సమరం ఈసారి మరింత రసవత్తరంగా మారనుంది.ఒక్కో మ్యాచ్తో రూ. 73 కోట్లు! నిజానికి.. భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్తో సిరీస్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియా పర్యటన కోసం వెళ్లాల్సి ఉంది. తొలుత టీమిండియా షెడ్యూల్లో ఈ సిరీస్ లేనే లేదు. కానీ ఆదాయం కోసమే హడావిడిగా దీనిని ఏర్పాటు చేశారు. దక్షిణాఫ్రికా బోర్డును ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు టీ20 స్పెషలిస్ట్లతో భారత టీమ్ను ఎంపిక చేశారు.టీమిండియాతో టీ20 సిరీస్లో ఒక్కో మ్యాచ్ ద్వారా దక్షిణాఫ్రికాకు 150 మిలియన్ ర్యాండ్ల (సుమారు రూ.73 కోట్లు) ఆదాయం రానుందని అంచనా. ఐపీఎల్ తరహాలో దక్షిణాఫ్రికా బోర్డు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఎస్ఏ20(SAT20) టోర్నీ ద్వారా వచ్చిన మొత్తం లాభం 54 మిలియన్ ర్యాండ్లతో (రూ. 26 కోట్లు) పోలిస్తే దీని విలువ ఏమిటో అర్థమవుతుంది! ఇక ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు తమ సత్తాను నిరూపించుకునేందుకు కూడా సౌతాఫ్రికా ఆటగాళ్లకు ఈ సిరీస్ గొప్ప వేదిక కానుంది.సౌతాఫ్రికా వర్సెస్ టీమిండియా టీ20 సిరీస్ 2024👉మొదటి టీ20- నవంబరు 8(శుక్రవారం)- డర్బన్- రాత్రి గం.8:30లకు👉రెండో టీ20- నవంబరు 10(ఆదివారం)- గ్వెబెర్హ- రాత్రి 7.30 నిమిషాలకు👉మూడో టీ20- నవంబరు 13(బుధవారం)- సెంచూరియన్- రాత్రి గం.8:30లకు👉నాలుగో టీ20- నవంబరు 15(శుక్రవారం)- జొహన్నస్బర్గ్- రాత్రి గం.8:30లకుజట్లుసౌతాఫ్రికారీజా హెండ్రిక్స్, రియాన్ రికెల్టన్(వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, గెరాల్డ్ కోయెట్జీ, నకబయోమ్జీ పీటర్, ఒట్నీల్ బార్ట్మన్, డోనోవన్ ఫెరీరా, మిహ్లాలీ ఎంపోంగ్వానా, ప్యాట్రిక్ క్రుగర్.భారత్అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, విజయ్ కుమార్ వైశాక్, అవేష్ ఖాన్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, యశ్ దయాళ్, రవి బిష్ణోయ్, రమణ్దీప్ సింగ్, జితేశ్ శర్మ.ముఖాముఖి రికార్డులుఇప్పటి వరకు టీమిండియా- సౌతాఫ్రికా 27 టీ20 మ్యాచ్లలో తలపడగా.. భారత్ 15 మ్యాచ్లలో గెలుపొందగా.. సౌతాఫ్రికా పదకొండింట విజయం సాధించింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల ఫలితం తేలకుండా ముగిసిపోయింది. -
South Africa vs India: సఫారీ గడ్డపై సమరానికి సై
దాదాపు ఐదు నెలల క్రితం... టి20 వరల్డ్కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ చాంపియన్గా నిలిచింది. ఇప్పుడు ఆ మ్యాచ్ తర్వాత ఇరు జట్లు మరోసారి ఇదే ఫార్మాట్లో పోరుకు సిద్ధమయ్యాయి. వరల్డ్కప్ ఫైనల్ ఓటమికి ఒక ద్వైపాక్షిక సిరీస్లో మ్యాచ్ను ప్రతీకార సమరంగా చూడలేం. పైగా నాటి మ్యాచ్ ఆడిన టీమ్ నుంచి ఇరు జట్లలో పలు మార్పులు జరిగాయి. అయితే తర్వాతి టి20 వరల్డ్కప్ కోసం కొత్త జట్లను తయారు చేసే ప్రణాళికల్లో భాగంగా ఇరు జట్లూ సన్నద్ధమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ టి20 సమరానికి రంగం సిద్ధమైంది. డర్బన్: స్వదేశంలో ఐదు రోజుల క్రితమే టెస్టు సిరీస్లో చిత్తయిన భారత్ ఇప్పుడు విదేశీ గడ్డపై టి20 ఫార్మాట్లో సత్తా చాటేందుకు ‘సై’ అంటోంది. అయితే టెస్టు సిరీస్ ఆడిన వారిలో ఒక్క ఆటగాడు కూడా లేకుండా బరిలోకి దిగుతుండటంతో టీమిండియాపై ఈ ఓటమి భారం లేదు. నాలుగు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు దక్షిణాఫ్రికాను తొలి టి20 మ్యాచ్లో భారత్ ఎదుర్కోనుంది. సఫారీ జట్టు పరిస్థితి చూస్తే వరల్డ్కప్ ఓటమి నుంచి ఇంకా కోలుకున్నట్లుగా లేదు. ఆ తర్వాత టి20ల్లోనే విండీస్ చేతిలో 0–3తో ఓడిన జట్టు ఐర్లాండ్తో 1–1తో ‘డ్రా’ చేసుకుంది. ఇప్పుడు స్వదేశంలోనైనా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇచ్చి సిరీస్ గెలుచుకోవాలని జట్టు ఆశిస్తోంది. సుస్థిర స్థానం కోసం... సొంతగడ్డపై బంగ్లాదేశ్ను టి20 సిరీస్లో 3–0తో ఓడించిన భారత యువ జట్టు ఉత్సాహంతో ఉంది. సూర్యకుమార్ నాయకత్వంలో ఈ టీమ్ అన్ని విధాలా బలంగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్పై హైదరాబాద్లో జరిగిన చివరి టి20 మ్యాచ్లో మెరుపు సెంచరీతో చెలరేగిన సంజూ సామ్సన్ అదే జోరును ఇక్కడా కొనసాగించాలని పట్టుదలతో ఉన్నాడు. యశస్వి, గిల్వంటి రెగ్యులర్ ఓపెనర్లు మళ్లీ వచ్చినా ఓపెనర్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని అతను భావిస్తున్నాడు. రెండో ఓపెనర్గా అభిషేక్ శర్మ కూడా అదే ప్రయత్నంలో ఉన్నాడు. జింబాబ్వేపై 36 బంతుల్లోనే శతకం బాదినా... మిగిలిన ఆరు ఇన్నింగ్స్లలో అతను ఒక్కసారి కూడా 20 పరుగులు దాటలేదు. ఇటీవల ఎమర్జింగ్ కప్లో భారత టాప్స్కోరర్గా నిలిచిన అభిషేక్ ఇక్కడ రాణించడం అవసరం. సూర్య, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్లతో మన బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. అయితే హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ కూడా తనను తాను మళ్లీ నిరూపించుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు. అంతర్జాతీయ కెరీర్ ఆరంభంలో మంచి ప్రదర్శనలే వచ్చినా... ఆ తర్వాత చోటు కోల్పోయి ఇటీవలే మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఎమర్జింగ్ కప్లో కెప్టెన్ హోదాలో ఆడిన తిలక్ 4 ఇన్నింగ్స్లలో 117 పరుగులే చేయగలిగాడు. మిడిలార్డర్లో పోటీ పెరిగిన నేపథ్యంలో రెగ్యులర్గా మారాలంటే తిలక్ మంచి స్కోర్లు సాధించాల్సి ఉంది. దూకుడైన బ్యాటింగ్తో పాటు అద్భుతమైన ఫీల్డర్ అయిన రమణ్దీప్ సింగ్ ఈ మ్యాచ్తో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. మెరుపు ప్రదర్శనతో ముస్తాక్ అలీ టోర్నీలో పంజాబ్, ఐపీఎల్లో కేకేఆర్ జట్ల విజయాల్లో కీలకపాత్ర పోషించిన అతను ఎమర్జింగ్ టోర్నీలోనూ రాణించాడు. వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ సభ్యుడైన అర్ష్దీప్ సింగ్ బౌలింగ్ను నడిపిస్తుండగా...అవేశ్కు రెండో పేసర్గా అవకాశం దక్కవచ్చు. హిట్టర్లు వచ్చేశారు... వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ మళ్లీ ఇప్పుడే మైదానంలోకి దిగుతున్నారు. వీరిద్దరి రాకతో పాటు మరో దూకుడైన ప్లేయర్ స్టబ్స్తో దక్షిణాఫ్రికా మిడిలార్డర్ పటిష్టంగా మారింది. ప్రపంచకప్ ఆడిన డికాక్, రబడ, నోర్జే ఈ సిరీస్కు అందుబాటులో లేకపోయినా... గాయాల నుంచి కోలుకున్న జాన్సెన్, కొయెట్జీ పునరాగమనం చేయడంతో టీమ్ మెరుగ్గా కనిపిస్తోంది. ఓపెనర్లుగా అనుభవజ్ఞుడైన హెన్డ్రిక్స్తో పాటు రికెల్టన్ శుభారంభం ఇవ్వాలని టీమ్ ఆశిస్తోంది. ఇద్దరు కొత్త ఆటగాళ్లు సిమ్లేన్, ఎన్ఖబయోమ్జి అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టనున్నారు. అయితే కెప్టెన్ మార్క్రమ్ ఫామ్ టీమ్ను కలవరపరుస్తోంది. ఈ ఏడాది ఆడిన 14 ఇన్నింగ్స్లలో మార్క్రమ్ ఒకే ఒక్కసారి 25 పరుగుల స్కోరు దాటగలిగాడు. ఈ సిరీస్ ద్వారా ఫామ్లోకి వస్తానని అతను చెబుతున్నాడు. ఐపీఎల్ వేలానికి ముందు భారత జట్టుపై రాణించడం ద్వారా తమ సత్తాను ప్రపంచానికి చూపించేందుకు సఫారీ ఆటగాళ్లకు ఇది చక్కటి అవకాశం. ఒక్క క్లాసెన్ మినహా మిగతా వారందరూ వేలంలోకి రానున్నారు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), సామ్సన్, అభిషేక్, తిలక్, పాండ్యా, రింకూ, రమణ్దీప్, అక్షర్, అవేశ్, అర్‡్షదీప్, వరుణ్ చక్రవర్తి. దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెపె్టన్), హెన్డ్రిక్స్, రికెల్టన్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, జాన్సెన్, సిమ్లేన్, ఎన్ఖబయోమ్జి, కేశవ్, బార్ట్మన్.పిచ్, వాతావరణం కింగ్స్మీడ్ మైదానం భారీ స్కోర్లకు వేదిక. మరోసారి అదే జరిగే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ రోజు వర్షసూచన ఉంది.6: దక్షిణాఫ్రికా గడ్డపై ఇరు జట్ల మధ్య 9 టి20 మ్యాచ్లు జరిగాయి. ఇందులో భారత్ 6 మ్యాచ్ల్లో నెగ్గి, 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. -
సౌతాఫ్రికాతో తొలి టీ20.. ఓపెనర్గా సంజూ, ఆర్సీబీ ఆటగాడికి కూడా ఛాన్స్..!
సౌతాఫ్రికాతో నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ డర్బన్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో భారత తుది జట్టులో ఎవరెవరుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓపెనర్గా సంజూ శాంసన్ బరిలోకి దిగడం ఖాయమని తేలిపోయింది. సంజూతో కలిసి అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ను ప్రారంభిస్తాడు. ఇటీవలి కాలంలో పెద్దగా ఆకట్టుకోని అభిషేక్ శర్మకు ఈ సిరీస్ చాలా కీలకం. అభిషేక్ ఒకవేళ ఈ సిరీస్లో కూడా విఫలమైతే మరోసారి టీమిండియా తలుపులు తట్టడం దాదాపుగా అసాధ్యం. ఈ సిరీస్లో టీమిండియా సంజూపై కూడా భారీ అంచనాలు పెట్టుకుంది. అతని నుంచి భారత అభిమానులు మెరుపు ఇన్నింగ్స్లు ఆశిస్తున్నారు.వన్డౌన్ కెప్టెన్ సూర్యకుమార్ బరిలోకి దిగనున్నాడు. అతని తర్వాత తిలక్ వర్మ ఎంట్రీ ఇస్తాడు. తిలక్ వర్మ చాలా రోజుల తర్వాత తుది జట్టులో ఆడే ఛాన్స్ దక్కించుకోనున్నాడు. తిలక్ వర్మ తర్వాత హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ బరిలోకి దిగుతారు. వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి ఆసీస్ టూర్కు ఎంపిక కావడంతో ఆల్రౌండర్ కోటాలో అక్షర్ పటేల్ బరిలో ఉంటాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా రవి బిష్ణోయ్తో పోలిస్తే వరుణ్ చక్రవర్తికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇటీవలికాలంలో వరుణ్ తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. తొలి టీ20లో భారత్ ముగ్గురు పేస్లరలో బరిలోకి దిగే అవకాశం ఉంది. అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్లతో పాటు ఆర్సీబీ పేసర్ యశ్ దయాల్ తుది జట్టులో ఉండే ఛాన్స్ ఉంది. ఆఖరి నిమిషంలో ఎవరైనా గాయపడితే తప్ప ఈ జట్టు యధాతథంగా కొనసాగవచ్చు.దక్షిణాఫ్రికాతో సిరీస్కు భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, విజయ్కుమార్ వైషాక్, అవేష్ ఖాన్, యశ్ దయాల్దక్షిణాఫ్రికాతో తొలి టీ20కి భారత తుది జట్టు (అంచనా): అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్, యశ్ దయాల్ -
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్.. భారీ రికార్డులపై కన్నేసిన సూర్యకుమార్
భారత్, సౌతాఫ్రికా మధ్య నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ నవంబర్ 8న డర్బన్ వేదికగా జరుగనుంది. రెండో టీ20 గ్వ్కెబెర్హా వేదికగా నవంబర్ 10న జరుగుతుంది. మూడో మ్యాచ్ సెంచూరియన్ వేదికగా నవంబర్ 13న.. నాలుగో టీ20 జొహనెస్బర్గ్ వేదికగా నవంబర్ 15న జరుగనున్నాయి. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్లో పలు భారీ రికార్డులపై కన్నేశాడు.మరో 107 పరుగులు చేస్తే..ఈ సిరీస్లో స్కై మరో 107 పరుగులు చేస్తే, భారత్-సౌతాఫ్రికా మధ్య టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు డేవిడ్ మిల్లర్ మిల్లర్ పేరిట ఉంది. మిల్లర్ 21 మ్యాచ్ల్లో 156.94 స్ట్రయిక్రేట్తో 452 పరుగులు చేశాడు. స్కై సౌతాఫ్రికాతో ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీల సాయంతో 175.63 స్ట్రయిక్రేట్ చొప్పున 346 పరుగులు చేశాడు.మరో ఆరు సిక్సర్లు..ఈ సిరీస్లో సూర్యకుమార్ యాదవ్ మరో ఆరు సిక్సర్లు కొడితే టీ20ల్లో అత్యంత వేగంగా 150 సిక్సర్ల మార్కును తాకిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం స్కై 71 ఇన్నింగ్స్ల్లో 144 సిక్సర్లు బాది, అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో నికోలస్ పూరన్తో (144) కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (205) టాప్లో ఉండగా.. మార్టిన్ గప్తిల్ (173) రెండో స్థానంలో ఉన్నాడు.మరో రెండు శతకాలు..అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు నాలుగు శతకాలు బాదిన సూర్యకుమార్, దక్షిణాఫ్రికాతో రేపటి నుంచి ప్రారంభం కాబోయే సిరీస్లో మరో రెండు శతకాలు బాదితే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు. టీ20ల్లో అత్యధిక శతకాల జాబితాలో సూర్యకుమార్ కంటే ముందు రోహిత్ శర్మ, గ్లెన్ మ్యాక్స్వెల్ ఉన్నారు. ఈ ఇద్దరు పొట్టి ఫార్మాట్లో చెరి ఐదు శతకాలు సాధించారు. దక్షిణాఫ్రికాతో సిరీస్కు భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, విజయ్కుమార్ వైషాక్, అవేష్ ఖాన్, యశ్ దయాల్ -
సౌతాఫ్రికాతో టీ20లు.. తిలక్ రీ ఎంట్రీ.. ఆర్సీబీ స్టార్ అరంగేట్రం!
టీమిండియా టీ20 పూర్తిస్థాయి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ అద్బుతమైన విజయాలు సాధించాడు. యువ ఆటగాళ్లతో కూడిన జట్లతోనే శ్రీలంక పర్యటనలో పొట్టి సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన ఈ ముంబై బ్యాటర్.. సొంతగడ్డపై బంగ్లాదేశ్పై 3-0తో వైట్వాష్ చేసి సత్తా చాటాడు.సఫారీ పిచ్లపై అంత ఈజీ కాదుఅయితే, సౌతాఫ్రికా టూర్ రూపంలో సూర్యకు అసలు సిసలు సవాలు ఎదురుకానుంది. శ్రీలంక, బంగ్లాదేశ్లను క్లీన్స్వీప్ చేసినంత సులువుగా సౌతాఫ్రికాను పడగొట్టడం సాధ్యం కాదు. సొంత పిచ్లపై చెలరేగే సఫారీ బౌలర్లను ఎదుర్కోవడం కత్తిమీద సాములాంటిదే.పైగా టీ20 ప్రపంచకప్-2024లో స్వల్ప తేడాతో టీమిండియా చేతిలో ఓడి తొలి టైటిల్ గెలిచే అవకాశాన్ని తృటిలో కోల్పోయింది సౌతాఫ్రికా. అందుకు ఈ సిరీస్లో ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. అలాంటపుడు యువ జట్టుతో ప్రొటిస్ టీమ్ను ఎదుర్కోవడం సూర్యకు బిగ్ చాలెంజ్ అనడంలో సందేహం లేదు.తిలక్ వర్మ పునరాగమనం ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో ఆడిన ఆటగాళ్లలో నితీశ్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ యాదవ్ సౌతాఫ్రికా టూర్కు వెళ్లే జట్టులో లేరు. వీరిలో నితీశ్, సుందర్ ఆస్ట్రేలియా పర్యటనతో బిజీ కానున్నారు. ఈ క్రమంలో 11 నెలల తర్వాత హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ పునరాగమనం ఖాయం కాగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బౌలర్ యశ్ దయాల్ అరంగేట్రం కూడా ఫిక్సయినట్లు తెలుస్తోంది.ఈసారి ఛాన్స్ పక్కా ఈ ఇద్దరితో పాటు.. సీనియర్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ సైతం సౌతాఫ్రికాతో తొలి టీ20లో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. కాగా టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన అక్షర్ ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్తో టెస్టులు ఆడిన జట్లలో సభ్యుడే. అయితే, తుదిజట్టులో మాత్రం అతడికి చోటు దక్కలేదు. అయితే, సౌతాఫ్రికా సిరీస్లో అక్షర్ను ఆడించనున్నట్లు తెలుస్తోంది.ఇక ప్రొటిస్తో తొలి టీ20లో టీమిండియా ముగ్గురు పేసర్లను తుదిజట్టులో ఆడించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే యశ్ దయాళ్ ఎంట్రీ ఖాయమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇటీవలి రిటెన్షన్స్లో భాగంగా ఆర్సీబీ యశ్ను రూ. 5 కోట్లకు అట్టిపెట్టుకున్న విషయం తెలిసిందే.సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు భారత జట్టుసూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణ్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, విజయ్ కుమార్ వైశాక్, ఆవేశ్ ఖాన్, యశ్ దయాళ్.సౌతాఫ్రికాతో తొలి టీ20- భారత తుదిజట్టు(అంచనా)సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, యశ్ దయాళ్, ఆవేశ్ ఖాన్.చదవండి: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా టీ20 సిరీస్.. పూర్తి వివరాలు -
ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా టీ20 సిరీస్.. పూర్తి వివరాలు
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ నవంబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా గడ్డపై జరుగనున్న ఈ సిరీస్లో పాల్గొనేందుకు టీమిండియా ఇప్పటికే అక్కడికి చేరుకుంది. ఈ సిరీస్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం. ఈ సిరీస్ కోసం ఇరు జట్లను ఇప్పటికే ప్రకటించారు. టీమిండియాను సూర్యకుమార్ యాదవ్ ముందుండి నడిపించనుండగా.. దక్షిణాఫ్రికాకు ఎయిడెన్ మార్క్రమ్ సారథ్యం వహించనున్నాడు.దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం ఎంపికైన భారత్ జట్టు..సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణ్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, విజయ్కుమార్ విశాక్, అవేశ్ ఖాన్, యశ్ దయాల్భారత్తో టీ20లో సిరీస్లో తలపడే దక్షిణాఫ్రికా జట్టు..ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్మన్, గెరాల్డ్ కొయెట్జీ, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, పాట్రిక్ క్రూగర్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, మిహ్లాలీ ఎంపోంగ్వానా, నకాబా పీటర్, ర్యాన్ రికెల్టన్, ఆండిల్ సిమెమెలన్, ట్రిస్టన్ స్టబ్స్, లుథే సిపామ్లాషెడ్యూల్..నవంబర్ 8- తొలి టీ20 (డర్బన్)నవంబర్ 10- రెండో టీ20 (గ్వెబెర్హా)నవంబర్ 13- మూడో టీ20 (సెంచూరియన్)నవంబర్ 15- నాలుగో టీ20 (జొహనెస్బర్గ్)మ్యాచ్ టైమింగ్స్..ఈ సిరీస్లోని నాలుగు మ్యాచ్లు భారతకాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు ప్రారంభమవుతాయి.లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?ఈ సిరీస్ను టీవీల్లో స్పోర్ట్స్ 18 ఛానళ్లలో వీక్షించవచ్చు. ఆన్లైన్లో చూడాలనుకుంటే జియో సినిమాలో ఉచితంగా చూడవచ్చు. -
IND vs SA: దక్షిణాఫ్రికాకు చేరుకున్న టీమిండియా.. వీడియో వైరల్
న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ను కోల్పోయిన టీమిండియా ఇప్పుడు మరో కఠిన సవాల్కు సిద్దమైంది. నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు సోమవారం సఫారీ గడ్డపై అడుగుపెట్టింది. డర్బన్కు చేరుకున్న భారత జట్టుకు సౌతాఫ్రికా క్రికెట్ ఆధికారులు ఘన స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్లో షేర్ చేసింది. కాగా ఈ సిరీస్లో భారత జట్టు ప్రధాన కోచ్గా నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ లక్ష్మణ్ వ్యహరించనున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం సిద్దమవుతుండడంతో రెగ్యూలర్ హెడ్కోచ్ గౌతం గంభీర్కు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. నవంబర్ 8న డర్బన్ వేదికగా జరగనున్న తొలి టీ20 ఈ సిరీస్ ప్రారంభం కానుంది.అద్భుత ఫామ్లో టీమిండియా..ఇక ఈ ఏడాదిలో టీ20ల్లో భారత్ క్రికెట్ జట్టు అదరగొడుతోంది. 2024 ఏడాదిలో 22 టీ20లు ఆడిన టీమిండియా కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే ఓటమి చవిచూసింది. కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో భారత జట్టు దూసుకుపోతుంది. ఇప్పుడు దక్షిణాఫ్రికాపై కూడా అదే జోరును కనబరచాలని యంగ్ ఇండియా ఉవ్విళ్లూరుతోంది.భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్. వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, విజయ్కుమార్ వ్యాషాక్, అవేష్ ఖాన్, యశ్ దయాల్దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్మన్, గెరాల్డ్ కోయెట్జీ, డోనోవన్ ఫెర్రీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, పాట్రిక్ క్రూగర్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, మిహ్లాలీ మ్పోంగ్వానా, న్కాబా పీటర్, ర్యాన్ సిమిప్లాన్, ర్యాన్ సిమిప్లామ్టన్, ట్రిస్టన్ స్టబ్స్చదవండి: IPL 2025: రిషబ్ పంత్కు రూ. 50 కోట్లు!? Touchdown Durban 🛬🇿🇦How good is #TeamIndia's knowledge of their next destination 🤔#SAvIND pic.twitter.com/m4YjikAw6Y— BCCI (@BCCI) November 4, 2024 -
టీమిండియాతో టీ20 సిరీస్.. దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. స్టార్ పేసర్లు రీ ఎంట్రీ
త్వరలో టీమిండియాతో జరుగబోయే నాలుగు మ్యాచ్ల టీ20 కోసం దక్షిణాఫ్రికా జట్టును ఇవాళ (అక్టోబర్ 31) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా ఎయిడెన్ మార్క్రమ్ ఎంపికయ్యాడు. గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్న మార్కో జన్సెన్, గెరాల్డ్ కొయెట్జీ ఈ సిరీస్తో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ సిరీస్ కోసం లుంగి ఎంగిడిని పరిగణలోకి తీసుకోలేదు. ఎంగిడిని త్వరలో శ్రీలంకతో జరుగబోయే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం రిజర్వ్గా ఉంచారు. సౌతాఫ్రికా యూఏఈలో ఆడిన వైట్బాల్ సిరీస్లకు దూరంగా ఉన్న హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, కేశవ్ మహారాజ్ 16 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు ఎంపికయ్యారు. ఈ సిరీస్లో కగిసో రబాడ ఆడటం లేదు. సెలెక్టర్లు అతనికి విశ్రాంతినిచ్చారు. ఆల్రౌండర్ మిహ్లాలీ మ్పోంగ్వానా తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక కాగా.. అన్క్యాప్డ్ ఆల్రౌండర్ అండీల్ సైమ్లేన్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్లో నకాబా పీటర్ మరో స్పిన్ ఆప్షన్గా ఉన్నాడు. జాతీయ కాంట్రాక్ట్ దక్కని తబ్రేజ్ షంషిని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ఎయిడెన్ మార్క్రమ్, కేశవ్ మహారాజ్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్ నవంబర్ 4న మిగతా జట్టు సభ్యులతో కలుస్తారు.టీమిండియాతో టీ20 సిరీస్కు దక్షిణాఫ్రికా జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్మన్, గెరాల్డ్ కోయెట్జీ, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, పాట్రిక్ క్రూగర్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, మిహ్లాలీ మ్పోంగ్వానా, నకాబా పీటర్, ర్యాన్ రికెల్టన్, అండీల్ సైమ్లేన్, లూథో సిపామ్లా, రిస్టన్ స్టబ్స్భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, రమన్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్, సంజూ శాంసన్, జితేశ్ శర్మ, రవి బిష్ణోయ్, విజయ్కుమార్ వైశాఖ్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, యశ్ దయాల్, ఆవేశ్ ఖాన్షెడ్యూల్..తొలి టీ20- నవంబర్ 8- డర్బన్రెండో టీ20- నవంబర్ 10- గ్వెబెర్హామూడో టీ20- నవంబర్ 13- సెంచూరియన్నాలుగో టీ20- నవంబర్ 15- జొహనెస్బర్గ్చదవండి: IND vs NZ 3rd Test: బుమ్రాకు విశ్రాంతి..? -
టీమిండియా హెడ్ కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్
సౌతాఫ్రికాతో జరుగబోయే నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం టీమిండియా హెడ్ కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్ ఎంపికయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. రెగ్యులర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లనుండగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సౌతాఫ్రికా సిరీస్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్లు క్లాష్ కానున్న నేపథ్యంలో టీమిండియాకు ఇద్దరు హెడ్ కోచ్లు అవసరమయ్యారు. తొలుత టీమిండియా షెడ్యూల్లో సౌతాఫ్రికా టీ20 సిరీస్ లేదు. ఈ మధ్యలో క్రికెట్ సౌతాఫ్రికా విన్నపం మేరకు బీసీసీఐ ఈ సిరీస్కు ఒప్పుకుంది. సౌతాఫ్రికా టీ20 సిరీస్ నవంబర్ 8, 10, 13, 15 తేదీల్లో జరుగనుండగా.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టు నవంబర్ 10 లేదా 11 తేదీల్లో ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. సౌతాఫ్రికా టీ20 సిరీస్లో లక్ష్మణ్ సపోర్టింగ్ స్టాఫ్గా ఎన్సీఏ సభ్యులు సాయిరాజ్ బహుతులే, హృషికేశ్ కనిత్కర్, సుబదీప్ ఘోష్ ఉండే అవకాశం ఉంది. ఈ ముగ్గురు ఆసియా కప్ ఎమర్జింగ్ టోర్నీలో టీమిండియా కోచింగ్ సభ్యులుగా వ్యవహరించారు.కాగా, సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యుల భారత బృందాన్ని అక్టోబర్ 25న ప్రకటించారు. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు. భారత టెస్ట్ జట్టులోకి సభ్యులెవరికీ ఈ జట్టులో చోటు దక్కలేదు. సౌతాఫ్రికా పర్యటన కోసం భారత జట్టు నవంబర్ 4న బయల్దేరి వెళ్లనుంది.సౌతాఫ్రికా టీ20 సిరీస్ కోసం భారత జట్టు..సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్కీపర్), రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, విజయ్కుమార్ వైషాక్, అవేష్ ఖాన్ , యష్ దయాళ్ -
IND VS SA T20 Series: శివమ్ దూబే, రియాన్ పరాగ్కు ఏమైంది..?
సౌతాఫ్రికాతో నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును నిన్న (అక్టోబర్ 25) ఎంపిక చేశారు. అందరి అంచనాలకు తగ్గట్టుగానే ఈ జట్టు ఎంపిక జరిగినప్పటికీ.. ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లకు చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన సిరీస్లలో జట్టుతో పాటు ఉన్న శివమ్ దూబే, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్ దక్షిణాఫ్రికాతో సిరీస్కు ఎంపిక కాలేదు. వీరిని ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది.మయాంక్ యాదవ్, శివమ్ దూబే గాయాల బారిన పడటంతో వారిని పరిగణలోకి తీసుకోలేదని చెప్పిన బీసీసీఐ.. రియాన్ పరాగ్ భుజం సమస్య కారణంగా సెలెక్షన్కు అందుబాటులో లేడని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం రియాన్ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రిపోర్ట్ చేసినట్లు తెలిపింది. ఫామ్లో ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేయని అంశాన్ని పక్కన పెడితే.. జట్టులో రెండు అనూహ్య ఎంపికలు జరిగాయి.బౌలింగ్ ఆల్రౌండర్ రమన్దీప్ సింగ్, పేస్ బౌలర్ విజయ్కుమార్ వైశాఖ్ ఊహించని విధంగా జట్టులోకి వచ్చారు. వీరిద్దరికి చోటు దక్కుతుందని ఎవరు ఊహించలేదు. ఇవి మినహా మిగతా జట్టు ఎంపిక అంతా ఊహించిన విధంగానే జరిగింది. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగనుండగా.. వికెట్కీపర్లుగా సంజూ శాంసన్, జితేశ్ శర్మ ఎంపికయ్యారు. కాగా, దక్షిణాఫ్రికా సిరీస్తో పాటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం కూడా భారత జట్టును నిన్ననే ప్రకటించారు.దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు భారత జట్టు: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణ్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్ దీప్, విజయ్ కుమార్ వైశాఖ్, అవేశ్ ఖాన్, యశ్ దయాళ్సౌతాఫ్రికాతో టీ20 సిరీస్..తొలి మ్యాచ్- నవంబర్ 8 (డర్బన్)రెండో మ్యాచ్- నవంబర్10 (గ్వెకెర్బా)మూడో మ్యాచ్- నవంబర్ 13 (సెంచూరియన్)నాలుగో మ్యాచ్- నవంబర్ 15 (జోహనెస్బర్గ్)చదవండి: ఆ్రస్టేలియా పర్యటనకు నితీశ్ కుమార్ రెడ్డి -
Ranji Trophy: కేరళ కెప్టెన్ సంజూ కాదు!.. కారణం ఇదే!
టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ రంజీ బరిలో దిగనున్నాడు. సొంత రాష్ట్రం కేరళ తరఫున రెడ్బాల్ టోర్నీలో పాల్గొననున్నాడు. అయితే, ఈసారి కెప్టెన్గా గాకుండా కేవలం వికెట్ కీపర్ బ్యాటర్గానే ఆడనున్నాడు. ఇందుకు కారణం ఏమిటంటే..?టెస్టుల్లో అరంగేట్రం చేయాలని ఉందని సంజూ శాంసన్ ఇటీవల తన మనసులోని మాట వెల్లడించిన విషయం తెలిసిందే. మేనేజ్మెంట్ సైతం ఇందుకు సుముఖంగా ఉందని పరోక్షంగా తెలిపాడు. యాజమాన్యం సూచనల మేరకే తాను దులిప్ ట్రోఫీ-2024 బరిలో దిగానన్నాడు సంజూ.ఇక ఆ టోర్నీలో విధ్వంసకర శతకంతో ఆకట్టుకున్న సంజూ శాంసన్.. తదుపరి బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ సందర్భంగా టీమిండియాతో చేరాడు. సొంతగడ్డపై జరిగిన ఈ సిరీస్ మూడో మ్యాచ్లో సెంచరీతో దుమ్ములేపాడు. ఓపెనర్గా బరిలోకి దిగి టీమిండియా 3-0తో బంగ్లాను క్లీన్స్వీప్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు.కారణం ఇదేఈ నేపథ్యంలో ఇటీవల ఓ స్పోర్ట్స్ వెబ్సైట్తో మాట్లాడుతూ.. తాను త్వరలోనే టెస్టుల్లో అరంగేట్రం చేస్తాననే సంకేతాలు ఇచ్చాడు. ఇందుకు రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో అతడు రాణించాల్సి ఉంది. అయితే, గత ఎడిషన్లో కేరళ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన సంజూ ఈసారి.. సారథ్య బాధ్యతలకు దూరమయ్యాడు. టీమిండియా నవంబరులో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుండటమే ఇందుకు కారణం.రంజీ తాజా ఎడిషన్లో సచిన్ బేబీ సారథ్యంలో కేరళ తొలుత పంజాబ్తో మ్యాచ్ ఆడి.. 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తదుపరి శుక్రవారం నుంచి కర్ణాటకతో తలపడేందుకు సిద్ధం కాగా.. అవుట్ఫీల్డ్ తడిగా ఉన్న కారణంగా టాస్ ఆలస్యమైంది. ఇదిలా ఉంటే.. టీమిండియా టీ20 సిరీస్ షెడ్యూల్ కారణంగా సంజూ కొన్ని రంజీ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది.ముఖ్యంగా ఉత్తరప్రదేశ్(నవంబరు 6-9), హర్యానా(నవంబరు 13- 16)తో కేరళ ఆడే మ్యాచ్లకు సంజూ అందుబాటులో ఉండకపోవచ్చు. ఆ సమయంలో (నవంబరు 8 నుంచి) టీమిండియా టీ20 సిరీస్ కోసం సౌతాఫ్రికాకు వెళ్లనుంది. అందుకే సంజూ కేరళ జట్టు కెప్టెన్సీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: IND Vs NZ 1st Test: పాపం రోహిత్ శర్మ!.. ఆనందం ఆవిరి.. అన్లక్కీ భయ్యా! -
వరల్డ్కప్ ఫైనల్లో పంత్ మాస్టర్ ప్లాన్.. అలా మేము గెలిచాం: రోహిత్
టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో రిషభ్ పంత్ వేసిన మాస్టర్ ప్లాన్ను కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా వెల్లడించాడు. మోకాలి గాయం పేరిట పంత్ ఆలస్యం చేయడం వల్ల సౌతాఫ్రికాను దెబ్బకొట్టగలిగామని పేర్కొన్నాడు. అయితే, తాము చాంపియన్లుగా నిలవడానికి ఇదొక్కటే కారణం కాదని.. సమిష్టి ప్రదర్శనతో ట్రోఫీ గెలిచామని తెలిపాడు.ఏడు పరుగుల స్వల్ప తేడాతో ఓడించికాగా ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్కప్ సందర్భంగా భారత క్రికెట్ జట్టు పదకొండేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన విషయం తెలిసిందే. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన ఈ ఐసీసీ టోర్నీలో జయభేరి మోగించింది. తుదిపోరులో సౌతాఫ్రికాను ఏడు పరుగుల స్వల్ప తేడాతో ఓడించి టైటిల్ గెలిచింది.అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం టీమిండియా వన్డే, టెస్టు జట్ల కెప్టెన్గా కొనసాగుతున్న రోహిత్.. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ను 2-0తో గెలిచాడు. తదుపరి న్యూజిలాండ్తో టెస్టులతో బిజీ కానున్నాడు.తన తెలివితేటల్ని చక్కగా అమలు చేశాడుఈ క్రమంలో రోహిత్ శర్మ కపిల్ శర్మ షోకు హాజరైన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా వరల్డ్కప్ ఫైనల్ నాటి ఆసక్తికర విశేషాలను పంచుకున్నాడు. ‘‘అప్పటికి సౌతాఫ్రికా విజయానికి 30 బంతుల్లో 30 పరుగులు మాత్రమే చేయాల్సిన పటిష్ట స్థితిలో ఉంది. అంతకంటే కాస్త ముందు మాకు చిన్న విరామం దొరికింది.అప్పుడే పంత్ తన తెలివితేటల్ని చక్కగా అమలు చేశాడు. అతడి మోకాలికి గాయమైనట్లుగా కనిపించాడు. ఫిజియోథెరపిస్టులు వచ్చి అతడి మోకాలికి కట్టుకట్టారు. నిజానికి అప్పుడు సౌతాఫ్రికా మంచి రిథమ్లో ఉంది. త్వరత్వరగా బ్యాటింగ్ ముగించేయాలని చూసింది.అయితే, పంత్ చేసిన పనివల్ల సౌతాఫ్రికా మొమెంటమ్ కాస్త నెమ్మదించేలా చేయగలిగాం. వారి ఊపును కాస్త నిలువరించగలిగాం. ఆ సమయంలో బంతిని దబాదబా బాదేయాలని కాచుకుని ఉన్నారు బ్యాటర్లు. అయితే, పంత్ వల్ల వారి రిథమ్ను మేము బ్రేక్ చేయగలిగాం.పంత్ అకస్మాత్తుగా కింద పడిపోయాడునేను ఫీల్డింగ్ సెట్.. చేస్తూ బౌలర్లతో మాట్లాడుతున్న సమయంలో పంత్ అకస్మాత్తుగా కింద పడిపోవడం గమనించాను. ఫిజియోథెరపిస్ట్ వచ్చి చికిత్స చేశారు. మ్యాచ్ త్వరగా మొదలుపెట్టాలని క్లాసెన్ చూస్తున్న సమయంలో ఇలాంటి ఘటన వారిని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు.అయినా, మేము గెలవడానికి ఇదొక్కటే ప్రధాన కారణం అని చెప్పను. అయితే, విజయానికి దారితీసిన పరిస్థితుల్లో ఇదొకటి. పంత్ సాబ్ మైదానంలో ఇలా తన స్మార్ట్నెస్ చూపిస్తూ.. మాకు మేలు చేస్తూ ఉంటాడు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. పంత్ వల్ల జరిగిన ఆలస్యానికి జరిమానా ఎదుర్కోవడానికి కూడా తాము రిస్క్ చేసినట్లు తెలిపాడు.పాండ్యా చేసిన అద్భుతంకాగా సౌతాఫ్రికా విజయానికి 30 పరుగుల దూరంలో ఉన్నపుడు విధ్వంసకర వీరులు హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ క్రీజులో ఉన్నారు. అయితే, హార్దిక్ పాండ్యా పదిహేడో ఓవర్లో తొలి బంతికి క్లాసెన్(52)ను వెనక్కి పంపడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఇక ఆఖరి ఓవర్లోనూ హార్దిక్ అద్భుతం చేశాడు. మిల్లర్(21)తో పాటు టెయిలెండర్లు కగిసో రబడ(3), అన్రిచ్ నోర్జే(1)లను అవుట్ చేసి భారత్ను గెలుపుతీరాలకు చేర్చాడు. ఇక ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ తొమ్మిది పరుగులకే పరిమితం కాగా.. పంత్ డకౌట్ అయ్యాడు. కోహ్లి 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.చదవండి: ఐపీఎల్లో ఆ జట్టుకు కెప్టెన్గా సూర్య?.. స్పందించిన ‘స్కై’Captain Rohit Sharma revealed the untold story of Rishabh Pant when India needed to defend 30 runs in 30 balls. Two Brothers ! 🥺❤️pic.twitter.com/EmqIrrCFb3— 𝐇𝐲𝐝𝐫𝐨𝐠𝐞𝐧 (@IamHydro45_) October 5, 2024 -
చరిత్ర మరువని అద్భుత గణాంకాలు
భారత వన్డే క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు మన హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ పేరిట నమోదై ఉన్నాయి. 2023, నవంబర్ 15న ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో సిరాజ్ 9.5 ఓవర్లు వేసి 57 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు.ఈ ప్రదర్శన తర్వాత 12 మంది భారత బౌలర్లు ఆరు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసినప్పటికీ ఒక్కరు కూడా ఏడు వికెట్ల మార్కును తాకలేకపోయారు. 2014లో స్టువర్ట్ బిన్నీ బంగ్లాదేశ్పై నమోదు చేసిన 6/4 ప్రదర్శన భారత వన్డే క్రికెట్ చరిత్రలో రెండో అత్యుత్తమం. భారత వన్డే క్రికెట్లో టాప్-5 అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల్లో ఒక్కరు కూడా తమ కోటా 10 ఓవర్లు పూర్తిగా వేయకపోవడం గమనించదగ్గ విశేషం.అసలు విషయానికొస్తే.. వన్డేల్లో భారత్ తరఫున అత్యుత్తమ గణాంకాలు సిరాజ్ పేరిట నమోదై ఉన్నప్పటికీ.. 1999లో సౌతాఫ్రికాపై సునీల్ జోషీ నమోదు చేసిన గణాంకాలను (10-6-6-5) మాత్రం వన్డే క్రికెట్ ఎన్నటికీ మరువదు. కెన్యాలోని నైరోబీ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో సునీల్ జోషి మెలికలు తిరిగే బంతులతో సౌతాఫ్రికా ఆటగాళ్లను ముప్పుతిప్పలు పెట్టాడు. బంతి వికెట్ల ఆవల నేలపై పడిందంటే వదిలేయడం తప్ప సౌతాఫ్రికా ఆటగాళ్లకు వేరే గత్యంతరం లేకుండా ఉండింది.వన్డే క్రికెట్ చరిత్రలో ఓ స్పిన్నర్ ఇంతలా బ్యాటర్లను భయపెట్టడం బహుశా ఇదే మొదటిసారి అయ్యుండవచ్చు. ఈ మ్యాచ్లో జోషి ఓవర్కు 0.60 సగటున పరుగులు సమర్పించుకున్నాడు. వన్డేల్లో కోటా ఓవర్లు పూర్తి చేసి ఇంత తక్కువ ఎకానమీతో బౌల్ చేయడం చాలా అరుదు. నేటి ఆధునికి క్రికెట్లో 10 ఓవర్లలో ఒకటి, రెండు మెయిడిన్లు వేస్తేనే గగనమైతే.. అప్పట్లో జోషి ఏకంగా ఆరు మెయిడిన్ ఓవర్లు సంధించాడు. ఆ మ్యాచ్లో జోషి స్పిన్ మాయాజాలం ధాటికి సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 48 ఓవర్లు ఎదుర్కొని 117 పరుగులకే కుప్పకూలింది.అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ కేవలం 22.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. సదగోపన్ రమేశ్ 26, సౌరవ్ గంగూలీ 38 పరుగులు చేసి ఔట్ కాగా.. విజయ్ భరద్వాజ్ (18), రాహుల్ ద్రవిడ్ (6) భారత్ను విజయతీరాలకు చేర్చారు. భారత వన్డే క్రికెట్ చరిత్రలో సునీల్ జోషి నమోదు చేసిన గణంకాలు 14వ అత్యుత్తమమైనప్పటికీ.. వన్డే క్రికెట్లో ఈ ప్రదర్శన చిరకాలం గుర్తుండిపోతుంది. -
భారత్-సౌతాఫ్రికా సిరీస్.. లైవ్ ఎందులో అంటే..?
ఈ ఏడాది నవంబర్లో టీమిండియా నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. నవంబర్ 8, 10, 13, 15 తేదీల్లో నాలుగు టీ20లు వివిధ వేదికలపై జరుగనున్నాయి. ఈ సిరీస్ ప్రత్యక్ష ప్రసార హక్కులను స్పోర్ట్స్ 18 దక్కించుకుంది. ఈ సిరీస్లోని మ్యాచ్లన్నీ జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్ కానున్నాయి.తొలి టీ20: డర్బన్రెండో టీ20: సెయింట్ జార్జ్స్ పార్క్మూడో టీ20: సెంచూరియన్నాలుగో టీ20: జోహన్సెస్బర్గ్కాగా, ఈ సిరీస్కు ముందు భారత్ స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్తో టెస్ట్, టీ20 సిరీస్లు ఆడనుంది. సెప్టెంబర్ 19 నుంచి రెండు టెస్ట్లు, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ల కోసం బంగ్లాదేశ్ భారత్లో పర్యటించనుంది. అనంతరం అక్టోబర్ 16 నుంచి మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ భారత్లో పర్యటించనుంది. ఈ ఏడాది చివర్లో భారత్ ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది.ఈ ఏడాది టీమిండియా షెడ్యూల్..సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్ పర్యటన మొదలు..సెప్టెంబర్ 19-23: తొలి టెస్ట్ (చెన్నై)సెప్టెంబర్ 27-అక్టోబర్ 1: రెండో టెస్ట్ (కాన్పూర్)అక్టోబర్ 6-తొలి టీ20అక్టోబర్ 9- రెండో టీ20అక్టోబర్ 12- మూడో టీ20అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్ పర్యటన మొదలు..అక్టోబర్ 16-20: తొలి టెస్ట్ (బెంగళూరు)అక్టోబర్ 24-28: రెండో టెస్ట్ (పూణే)నవంబర్ 1-5: మూడో టెస్ట్ (ముంబై)నవంబర్ 22 నుంచి భారత్.. ఆస్ట్రేలియా పర్యటన మొదలు..నవంబర్ 22-26: తొలి టెస్ట్ (పెర్త్)డిసెంబర్ 6-10: రెండో టెస్ట్ (అడిలైడ్)డిసెంబర్ 14-18: మూడో టెస్ట్ (బ్రిస్బేన్)డిసెంబర్ 26-30: నాలుగో టెస్ట్ (మెల్బోర్న్)జనవరి 3-7: ఐదో టెస్ట్ (సిడ్నీ) -
నా కోచింగ్ కెరీర్లో చేదు అనుభవం అదే: ద్రవిడ్
టీమిండియా విజయవంతమైన కోచ్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్. టీ20 ప్రపంచకప్-2021 తర్వాత రవిశాస్త్రి స్థానంలో హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టిన ఈ కర్ణాటక లెజెండ్ మార్గదర్శనంలో.. టీమిండియా అన్ని ఫార్మాట్లలో నంబర్ వన్గా ఎదిగింది. ద్వైపాక్షిక సిరీస్లలో వరుస విజయాలతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.ఘనంగా వీడ్కోలుఅయితే, టీ20 ప్రపంచకప్-2022(సెమీస్), ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్- 2021-23, వన్డే వరల్డ్కప్-2023(ఫైనల్) టోర్నీలో మాత్రం టైటిల్ గెలవలేకపోయింది. ఈ క్రమంలో ఒక సందర్భంలో ద్రవిడ్ను వెంటనే కోచ్గా తొలగించాలనే డిమాండ్లూ వచ్చాయి. అయితే, బీసీసీఐ మాత్రం అతడిపై నమ్మకం ఉంచింది. వరల్డ్కప్-2023 తర్వాత అతడి పదవీకాలం ముగిసినా.. టీ20 ప్రపంచకప్-2024 వరకు కోచ్గా కొనసాగాలని కోరింది.ఇందుకు అంగీకరించిన ద్రవిడ్కు ఘనమైన వీడ్కోలు లభించింది. ప్రపంచకప్-2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు చాంపియన్గా అవతరించింది. తద్వారా దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత మరోసారి భారత్కు ఐసీసీ టైటిల్ దక్కింది. అయితే, సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్ ఓడిపోవడం మాత్రం ద్రవిడ్ కెరీర్లోని చేదు అనుభవం అని చెప్పవచ్చు.ఆ ఓటమే బాధించిందిఅయితే, రాహుల్ ద్రవిడ్ మాత్రం అన్నింటికంటే సౌతాఫ్రికా గడ్డ మీద ఓటమే.. తన కోచింగ్ కెరీర్లో ఎదురైన ఘోర పరాభవం అంటున్నాడు. ప్రొటిస్ జట్టును తమ సొంతదేశంలో ఓడించే అవకాశం చేజారడం ఎన్నటికీ మర్చిపోలేనన్నాడు. చిరస్మరణీయ విజయం సాధించే క్రమంలో జరిగిన పొరపాట్ల వల్ల భారీ మూల్యమే చెల్లించామని పేర్కొన్నాడు.ఈ మేరకు.. ‘‘నా క్రికెట్ కోచింగ్ కోరీర్లో అన్నింటికంటే ఘోర పరాభవం.. సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలవలేకపోవడం. సెంచూరియన్లో జరిగిన తొలి మ్యాచ్లో మేము విజయం సాధించాం. అదే జోరులో రెండో టెస్టును ఘనంగా ఆరంభించాం. కానీ సౌతాఫ్రికా అనూహ్య రీతిలో తిరిగి పుంజుకుని గెలుపును లాగేసుకుంది.మూడో టెస్టులోనూ అదే ఫలితం పునరావృతం చేసింది. మా జట్టులోని కొందరు సీనియర్లు అప్పుడు అందుబాటులో లేరు. రోహిత్ శర్మ కూడా గాయపడ్డాడు. అయినా.. రెండు, మూడో టెస్టుల్లో విజయానికి చేరువగా వచ్చాం. కానీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం. అయితే, ఈ సిరీస్ ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. కోచ్గా ఎలా నన్ను నేను సంభాళించుకోవాలో తెలుసుకున్నా.ఓటమీ మంచికేఅన్ని మ్యాచ్లు మనమే గెలవలేం. ఒక్కోసారి ఓటమే మనకు ఎంతో నేర్పిస్తుంది’’ అని రాహుల్ ద్రవిడ్ 2021-22 సిరీస్ నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా ద్రవిడ్ స్థానంలో టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇక గౌతీ హయాంలో తొలిసారిగా శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమిండియా టీ20 సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. అయితే, వన్డే సిరీస్లో మాత్రం 0-2తో ఆతిథ్య లంక జట్టు చేతిలో ఓటమిని చవిచూసింది. 27 ఏళ్ల తర్వాత తొలిసారి శ్రీలంకకు వన్డే సిరీస్ను సమర్పించుకుంది.చదవండి: IPL 2025: ఈ ముగ్గురు కెప్టెన్లను రిలీజ్ చేయనున్న ఫ్రాంఛైజీలు! -
ధోనికి కోపం వచ్చింది.. అతడి వల్లే: అశ్విన్
టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్కు ‘మిస్టర్ కూల్’గానూ పేరుంది. పరిస్థితి చేయిదాటి పోతే తప్ప తలా.. మైదానంలో కోపం, అసహనం ప్రదర్శించడు. అయితే, శ్రీశాంత్ చేసిన పని వల్ల తొలిసారి ధోనికి ఆగ్రహానికి గురికావడం చూశానంటున్నాడు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.తొలిసారి ధోని కోప్పడటం చూశా2010 నాటి సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుందని తన పుస్తకం ‘ఐ హావ్ ది స్ట్రీట్స్- ఏ కుట్టీ క్రికెట్ స్టోరీ’(I Have The Streets- A Kutty Cricket Story)లో అశూ వెల్లడించాడు. నాటి మ్యాచ్ సంగతులను ప్రస్తావిస్తూ..‘‘ఆరోజు నేను డ్రింక్స్ అందించే పని చేస్తున్నా. అప్పుడు ధోని హెల్మెట్ తీసుకురమ్మని చెప్పాడు. నాకెందుకో మహీ కోపంగా ఉన్నట్లు కనిపించింది.అతడు సహనం కోల్పోవడం నేను అంతకు ముందెన్నడూ చూడలేదు. ‘శ్రీ(శ్రీశాంత్) ఎక్కడ ఉన్నాడు? అతడు అసలేం చేస్తున్నాడు?’ అని ఎంఎస్ అడిగాడు.శ్రీశాంత్కు ఈ సందేశం చేరవేరుస్తానని నేను చెప్పాను. ఆ తర్వాత ఎంఎస్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే, మరుసటి ఓవర్లో నన్ను మళ్లీ పిలిచి మహీ హెల్మెట్ రిటర్న్ చేశాడు.శ్రీకి ఇక్కడ ఉండటం ఇష్టం లేదేమో!అప్పుడు కామ్గానే ఉన్నట్లు అనిపించింది. నాకు హెల్మెట్ ఇచ్చే సమయంలో.. ‘ఒక పనిచెయ్.. రంజీబ్ సర్(టీమ్ మేనేజర్) దగ్గరికి వెళ్లు.శ్రీకి ఇక్కడ ఉండటం ఇష్టం లేదని చెప్పు. వెంటనే అతడికి టికెట్ బుక్ చేయమని చెప్పు. అతడు ఎంచక్కా ఇండియాకు తిరిగి వెళ్లిపోతాడు. సరేనా’ అని నాతో అన్నాడు.ధోని అలా అనడం ఊహించని నాకు షాక్ తగిలినట్లయింది. అసలు నేను ఈ మాటలు విన్నది ధోని నుంచేనా అని కాసేపు అయోమయానికి గురయ్యాను’’ అని అశ్విన్ తన పుస్తకంలో రాశాడు.ఆ మరుసటి ఓవర్లో తనతో పాటు శ్రీశాంత్ కూడా భారత ఆటగాళ్లకు మైదానంలో డ్రింక్స్ అందించాడని అశూ తెలిపాడు. అయినప్పటికీ ధోని శాంతించలేదని.. అతడి నుంచి డ్రింక్స్ తీసుకోవడానికి ఇష్టపడలేదని పేర్కొన్నాడు.మళ్లీ తననే పిలిచి.. శ్రీశాంత్ టికెట్ గురించి మేనేజర్తో చెప్పావా?లేదా అని తనను గట్టిగా ప్రశ్నించాడని అశూ తెలిపాడు. కాసేపయ్యాక అంతా మామూలుగా మారిపోయిందని.. సమస్య సమసిపోయిందని అశ్విన్ వెల్లడించాడు.ధోని కోపానికి కారణం ఇదేకాగా రిజర్వ్ ఆటగాళ్లతో పాటు డగౌట్లో కూర్చోకుండా పేసర్ శ్రీశాంత్ డ్రెస్సింగ్రూంలోనే ఉండిపోవడమే ధోని ఆగ్రహానికి కారణం. ఆ తర్వాత అశ్విన్తో మెసేజ్ పంపగా.. శ్రీశాంత్ జెర్సీ వేసుకుని డగౌట్కు రావడంతో పాటు.. ధోని దెబ్బకు డ్రింక్స్ కూడా సర్వ్ చేశాడట. అదీ సంగతి!చదవండి: బ్లడ్ క్యాన్సర్.. బాధగా ఉంది: బీసీసీఐకి కపిల్ దేవ్ విజ్ఞప్తి -
యువరాజ్ మళ్లీ ఫెయిల్.. సెమీఫైనల్లో టీమిండియా
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ వరుసగా మూడో ఓటమి చవిచూసింది. బుధవారం నార్తాంప్టన్ వేదికగా దక్షిణాఫ్రికా ఛాంపియన్స్తో జరిగిన మ్యాచ్లో 54 పరుగుల తేడాతో ఇండియా ఓటమి పాలైంది. 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితమైంది. భారత బ్యాటర్లలో యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ ఆఖరిలో మెరుపులు మెరిపించినప్పటకి జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. యూసఫ్ పఠాన్(44 బంతుల్లో54, 4 ఫోర్లు, 2 సిక్స్లు), ఇర్ఫాన్(21 బంతుల్లో 35, 4 ఫోర్లు, ఒక సిక్స్) పోరాడనప్పటకి అప్పటికే మ్యాచ్ భారత్ చేదాటిపోయింది. కెప్టెన్ యువరాజ్ సింగ్(5) మరోసారి ఫెయిల్ అయ్యాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫిలిండర్ రెండు వికెట్లు పడగొట్టగా.. చార్ల్ లాంగెవెల్డ్ట్, తహీర్,స్నైమెన్ తలా వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సఫారీ బ్యాటర్లలో స్నైమెన్(73) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. లివీ(25 బంతుల్లో 60, 5 ఫోర్లు, 5 సిక్స్లు) మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో హర్భజన్ సింగ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కులకర్ణి, వినయ్కుమార్, యూసఫ్ తలా వికెట్ సాధించారు.సెమీస్లో భారత్..ఇక ఈ మ్యాచ్లో ఓటమి పాలైనప్పటికి సెమీఫైనల్లో భారత్ అడుగుపెట్టింది. పాయింట్ల పట్టకలో నాలుగో స్ధానంలో భారత్ నిలిచి సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకుంది. ఈ టోర్నీలో చెరో రెండు విజయాలు సాధించిన భారత్, దక్షిణాఫ్రికా జట్లు పాయింట్ల పరంగా సమంగా నిలిచాయి. అయితే దక్షిణాఫ్రికా(-1.340) రన్రేట్ కంటే భారత్(-1.267)రన్రేట్ మెరుగ్గా ఉండడంతో సెమీస్కు యువీ సేన ఆర్హత సాధించింది. జూలై 12న నార్తాంప్టన్ వేదికగా ఆస్ట్రేలియా ఛాంపియన్స్ భారత్ తలపడనుంది. -
T20I: టీమిండియా ఘన విజయం.. ఇలా ఇది మూడోసారి
India Women vs South Africa Women, 3rd T20I: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత మహిళల క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ను 1–1తో సమంగా ముగించింది. చెన్నై వేదికగా మంగళవారం జరిగిన చివరిదైన మూడో టీ20 మ్యాచ్లో.. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా.. 10 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించింది.తొలి టీ20లో దక్షిణాఫ్రికా నెగ్గగా... రెండో టీ20 వర్షం కారణంగా రద్దయింది. ఇక 2006 నుంచి ఇప్పటి వరకు 187 టీ20 మ్యాచ్లు ఆడిన భారత జట్టుకిది 100వ విజయం కావడం విశేషం. ప్రత్యర్థి జట్టుపై టీమిండియా 10 వికెట్లతో నెగ్గడం ఇది మూడోసారి.ఈ మ్యాచ్ కంటే ముందు భారత జట్టు 2016లో ఆస్ట్రేలియాపై, 2019లో వెస్టిండీస్పై 10 వికెట్ల తేడాతో గెలిచింది. సిరీస్ను సమం చేయాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో టాస్ నెగ్గిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 17.1 ఓవర్లలో 84 పరుగులకే కుప్పకూలింది.పూజ వస్త్రకర్కు 4 వికెట్లుభారత పేస్ బౌలర్ పూజా వస్త్రకర్ 13 పరుగులిచ్చి 4 వికెట్లు, స్పిన్నర్ రాధా యాదవ్ 6 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను దెబ్బ తీశారు. అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ ఒక్కో వికెట్ తీశారు.అనంతరం 85 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ఆడుతూపాడుతూ ఛేదించింది. 10.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 88 పరుగులు చేసి టీమిండియా గెలిచింది. Series Levelled ✅#TeamIndia and @ProteasWomenCSA share the honours in the T20I series. 🤝 🏆#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/RS3yCOjH2Q— BCCI Women (@BCCIWomen) July 9, 2024 స్మృతి మంధాన (40 బంతుల్లో 54 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ అర్ధ సెంచరీ సాధించగా... షఫాలీ వర్మ (25 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు) కూడా రాణించింది. పూజా వస్త్రకర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. A clinical 🔟-wicket win in the 3rd T20I 🥳The @IDFCFIRSTBank #INDvSA series is drawn 1⃣-1⃣Scorecard ▶️ https://t.co/NpEloo6GAm#TeamIndia pic.twitter.com/f1wcGPWWKo— BCCI Women (@BCCIWomen) July 9, 2024 -
నాన్సెన్స్.. నేనెందుకు రంజీల్లో ఆడాలి: ఇషాన్ కిషన్
చేతులారా తన కెరీర్ను తానే నాశనం చేసుకుంటున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్. భారత జట్టు ఓపెనర్గా తనదైన శైలిలో రాణిస్తూ ప్రతిభ నిరూపించుకున్న ఈ జార్ఖండ్ వికెట్ కీపర్.. కొంత కాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు.గతేడాది నవంబరులో సౌతాఫ్రికా పర్యటన మధ్యలోనే వ్యక్తిగత కారణాలు చెప్పి స్వదేశానికి తిరిగి వచ్చిన ఇషాన్ కిషన్ పట్ల బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. మానసిక ఒత్తిడితో బాధపడుతున్నానని జట్టు నుంచి నిష్క్రమించిన ఈ యంగ్ ఓపెనర్.. కుటుంబంతో కలిసి సరదాగా గడిపిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.ఈ నేపథ్యంలో.. తుదిజట్టులో ఆడే అవకాశం రానందు వల్లే ఇషాన్ ఇంటిబాట పట్టాడని.. ఈ క్రమంలో బోర్డుతో విభేదాలు తారస్థాయికి చేరాయనే వార్తలు వినిపించాయి. అందుకు తగ్గట్లుగానే.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం.. ఇషాన్ దేశవాళీ క్రికెట్(రంజీ)లో ఆడితేనే మళ్లీ జాతీయ జట్టులో అడుగుపెట్టగలడని స్పష్టం చేశాడు.అయితే, ఇషాన్ కిషన్ మాత్రం ఈ ఆదేశాలను బేఖాతరు చేశాడు. జార్ఖండ్ తరఫున అతడు రంజీ బరిలో దిగుతాడని స్థానిక బోర్డు ఆశించినా.. అతడి నుంచి స్పందన కరువైంది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలు తీసుకున్న బీసీసీఐ.. ఇషాన్ కిషన్ను సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించింది.ఈ విషయంపై తాజాగా ఇషాన్ కిషన్ స్పందించాడు. తాను రంజీలు ఆడకపోవడానికి గల కారణం వెల్లడించాడు. ‘‘ఒక ఆటగాడు చాలా కాలం తర్వాత పునరాగమనం చేయాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలనే నిబంధన ఉంది.అయితే, నన్ను కూడా ఇలా ఆడమనడంలో అర్థం లేదనిపించించింది. ఎందుకంటే నేను కాస్త విరామం తీసుకున్నా. అది సాధారణ సెలవు మాత్రమే.అలాంటపుడు నేనెందుకు రంజీలు ఆడాలి. ఆడే ఓపిక లేదనే కదా అంతర్జాతీయ క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకున్నా. అయినా.. జాతీయ జట్టుకు ఆడకుండా విరామం తీసుకుంటే.. రంజీలు ఆడమంటూ ఆదేశించడం ఏమిటో అర్థం కాలేదు.నేను బాగుంటే గనుక ఇంటర్నేషనల్ క్రికెట్ కంటిన్యూ చేసేవాడిని కదా. అప్పుడు నేను డిప్రెషన్లో ఉన్నాను. ఈ రోజు కూడా అంతా బాగుందని చెప్పే పరిస్థితిలో లేను.క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నా. అయినా నా విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతోందనే ప్రశ్న పదే పదే నా మదిని తొలుస్తోంది.నేను బాగా ఆడుతున్నా.. కేవలం బ్రేక్ తీసుకున్నాననే కారణంగా ఇలా ఎందుకు చేశారో అర్థం కావడం లేదు’’ అని ఇషాన్ కిషన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ ఈ మేరకు తన మనసులోని భావాలు పంచుకున్నాడు.కాగా రంజీలు ఆడకుండా ఎగ్గొట్టిన ఇషాన్ కిషన్.. ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగడం గమనార్హం. ఈ సీజన్లో అతడు 14 ఇన్నింగ్స్లో కలిపి కేవలం 320 పరుగులు చేయగలిగాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024 జట్టు ఎంపిక సమయంలో బీసీసీఐ అతడిని పరిగణనలోకి కూడా తీసుకోలేదు.ఇక వికెట్ కీపర్ల కోటాలో రిషభ్ పంత్, సంజూ శాంసన్ చోటు దక్కించుకున్నారు. ఇక ఈ మెగా టోర్నీ ఆద్యంతం అదరగొట్టిన టీమిండియా చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. -
న్యాయం చేయలేకపోతున్నా.. కోహ్లి ఆవేదన! ద్రవిడ్ రిప్లై ఇదే..
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి. లీగ్ దశలో పూర్తిగా విఫలమైన ఈ ‘రన్మెషీన్’.. సెమీస్ వరకు అదే పేలవ ప్రదర్శన కనబరిచాడు.అయితే, అసలైన మ్యాచ్లో మాత్రం దుమ్ములేపాడీ కుడిచేతి వాటం బ్యాటర్. సౌతాఫ్రికాతో ఫైనల్లో అద్భుత అర్ధ శతకంతో రాణించి భారత్ ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.తద్వారా ‘ఫామ్ తాత్కాలికం.. క్లాస్ మాత్రమే శాశ్వతం’ అని నిరూపించి.. తన విలువ చాటుకున్నాడు. అయితే, ఫైనల్ మ్యాచ్కు ముందు తనను ఆత్మవిశ్వాసంతో లేనని.. డీలా పడిపోయానని కోహ్లి పేర్కొన్నాడు.భారంగా తయారయ్యానని కుమిలిపోయాజట్టుకు ఏమాత్రం ఉపయోగపడకుండా భారంగా తయారయ్యానని కుమిలిపోయానని తెలిపాడు. అలాంటి సమయంలో హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ మద్దతుగా నిలిచి.. తాను కోలుకునేలా ఉత్సాహాన్ని నింపారని కోహ్లి వెల్లడించాడు.వెస్టిండీస్ నుంచి ట్రోఫీతో తిరిగి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన సమయంలో కోహ్లి సంభాషిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ‘‘నాకు నేను, నా జట్టుకు ఏమాత్రం న్యాయం చేయలేకపోతున్నానని రాహుల్ భాయ్కు చెప్పాను.అందుకు బదులుగా.. ‘కీలక సమయంలో నువ్వు తప్పకుండా ఫామ్లోకి వస్తావు’ అని భాయ్ చెప్పాడు. ఆ తర్వాత మ్యాచ్ ఆడే సమయంలో రోహిత్తో కూడా ఇదే మాట చెప్పాను. నేను కాన్ఫిడెంట్గా లేనని చెప్పాను.పట్టుదలగా నిలబడ్డానుఒక్క పరుగు కూడా చేయకపోతే పరిస్థితి ఏమిటని సతమతమయ్యాను. అయితే, ఫైనల్లో మేము వికెట్లు కోల్పోతున్న క్రమంలో పరిస్థితి తగ్గట్లుగా నన్ను నేను మలచుకోవాలని నిర్ణయించుకున్నాను.జట్టు కోసం నా వంతు ప్రయత్నం చేయాలని పట్టుదలగా నిలబడ్డాను. అందుకు తగ్గట్లుగానే ఫలితం కూడా వచ్చింది’’ అని విరాట్ కోహ్లి సంతోషం వ్యక్తం చేశాడు. కాగా వరల్డ్కప్-2024లో ఫైనల్కు ముందు కోహ్లి చేసిన పరుగులు 75 మాత్రమే.. సౌతాఫ్రికాతో ఫైనల్లో 59 బంతుల్లోనే 76 రన్స్ సాధించాడు. కాగా సమష్టిగా రాణించి టీమిండియా టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే.చదవండి: Ind vs Zim: వికెట్ కీపర్గా అతడే.. భారత తుది జట్టు ఇదే! -
చాలా బాధగా ఉంది.. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నా: మిల్లర్
టీ20 వరల్డ్కప్-2024 టోర్నీ ఆధ్యంతం అదరగొట్టిన దక్షిణాఫ్రికా ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఫైనల్లో ఎలాగైనా గెలిచి తమ 30 ఏళ్ల వరల్డ్కప్ నిరీక్షణకు తెరదించాలని భావించిన సఫారీలకు మరోసారి నిరాశే ఎదురైంది. బార్బోడస్ వేదికగా భారత్తో జరిగిన టైటిల్ పోరులో 7 పరుగుల తేడాతో సౌతాఫ్రికా పరాజయం పాలైంది. గెలుపు అంచుల దాక వెళ్లిన దక్షిణాఫ్రికా.. ఆఖరిలో భారత బౌలర్ల దాటికి చేతులేత్తేసింది. ఈ మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు సెలబ్రేషన్స్లో మునిగి తేలితే.. మరోవైపు ప్రోటీస్ ఆటగాళ్లు న్నీటి పర్యంతం అయ్యారు. ముఖ్యంగా ప్రోటీస్ స్టార్ డేవిడ్ మిల్లర్ను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.తన చివరి ఓవర్ వరకు క్రీజులో ఉన్నప్పటికి జట్టును గెలిపించలేకపోయానన్న బాధతో మిల్లర్ కుంగిపోయాడు. కాగా ఆఖరి ఓవర్లో ప్రోటీస్ విజయానికి 16 పరుగులు అవసరమవ్వగా..తొలి బంతికే సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్తో పెవిలియన్కు పంపాడు. దీంతో ప్రోటీస్ ఓటమి లాంఛనమైంది. కాగా వరల్డ్కప్లో ఓటమిపై డేవిడ్ మిల్లర్ తొలిసారి స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ నోట్ను షేర్ చేశాడు."నేను చాలా నిరాశకు గురయ్యా. రెండు రోజులు గడిచినప్పటికి ఇంకా మా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాను. నా బాధను మాటల్లో వర్ణించలేను. అయితే ఒక్క విషయాన్ని మాత్రం గొప్పగా చెప్పగలను. మా జట్టు పోరాటం, ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. ఈ నెలలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశాము. కానీ ఈ ప్రయాణం మాత్రం ఎంతో అద్భుతం. మేము మా బాధను ఇంకా భరిస్తున్నాము. కానీ ఒక జట్టుగా మేము మరింత బలంగా తిరిగి వస్తామన్న నమ్మకం నాకు ఉందంటూ" ఇన్స్టాలో మిల్లర్ రాసుకొచ్చాడు. -
అందుకే పిచ్లోని మట్టిని తిన్నా.. అసలు కారణమిదే: రోహిత్ శర్మ
టీ20 వరల్డ్కప్-2024ను భారత్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి 17 ఏళ్ల తర్వాత పొట్టి ప్రపంచకప్ను భారత్ కైవసం చేసుకుంది. అప్పుడు ఎప్పుడో 2011లో వరల్డ్కప్ను సొంతం చేసుకున్న టీమిండియా.. ఎట్టకేలకు మళ్లీ 13 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. గతేడాది వన్డే వరల్డ్కప్లో ఆఖరి మెట్టుపై బోల్తా పడిన భారత్.. ఈ పొట్టి ప్రపంచకప్లో మాత్రం ఎటువంటి పొరపాటు చేయలేదు. ఎనిమిది నెలల తిరిగక ముందే కప్ కొట్టి రోహిత్ సేన 140 కోట్ల మంది భారతీయలను సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. ఈ విజయం తర్వాత టీమిండియా ఆటగాళ్లంతా ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ గెలుపొందిన వెంటనే నెలను ముద్దాడాడు. అంతేకాకుండా పిచ్లోని మట్టిని తిని అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. అయితే తాను ఎందుకు అలా చేశాడో తాజాగా హిట్మ్యాన్ వివరణ ఇచ్చాడు. బార్బడోస్ మైదానం ఎప్పటికి తనకు గుర్తుండిపోవాలన్న ఉద్దేశంతోనే మట్టిని తిన్నానని రోహిత్ చెప్పుకొచ్చాడు."బార్బడోస్ మైదానం నాకెంతో ప్రత్యేకం. ఈ స్టేడియంలోని పిచ్ మాకు వరల్డ్కప్ను ఇచ్చింది. మా కలలన్నీ నెరవేరిన చోటు అది. ఆ మైదానాన్ని, ఆ పిచ్ను నా జీవితంలో ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. పిచ్లోని కొంత భాగాన్ని నాలో భాగం చేసుకోవాలనకున్నాను. అందుకే పిచ్లోని మట్టిని తిన్నాను. నిజంగా ఆ క్షణాలు మరలేనివి. ఈ విజయం కోసమే ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తున్నామని" బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ పేర్కొన్నాడు. -
భీకర హరికేన్ ధాటికి అతలాకుతలమైన కరేబియన్ కంట్రీ బార్బడోస్ (ఫొటోలు)
-
సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. 10 వికెట్ల తేడాతో ఘన విజయం
చెపాక్ వేదికగా దక్షిణాఫ్రికా మహిళలతో జరిగిన ఏకైక టెస్టులో 10 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికా విధించిన 37 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత మహిళల జట్టు వికెట్ నష్టపోకుండా ఛేదించింది. షెఫాలీ వర్మ(24), సతీష్(13) పరుగులతో నాటౌట్గా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తమ మొదటి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 603 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ(205) డబుల్ సెంచరీతో చెలరేగగా.. స్మృతి మంధాన(146), రిచా ఘోష్(86) అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. అనంతరం దక్షిణాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 266 పరుగులకు ఆలౌట్ కావడంతో ఫాలోన్ గండం దాటలేకపోయింది. తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికాను భారత స్పిన్నర్ స్నేహ్ రాణా 8 వికెట్లతో దెబ్బతీసింది.ఈ క్రమంలో ఫాలో ఆన్ ఆడిన సఫారీలు సెకెండ్ ఇన్నింగ్స్లో 373 పరుగులకు ఆలౌటయ్యారు. దీంతో భారత్ ముందు దక్షిణాఫ్రికా కేవలం 37 పరుగులు మాత్రమే లక్ష్యంగా ఉంచింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఊదిపడిసేన భారత్.. ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇక సెకెండ్ ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా బ్యాటర్లలో సునే లూస్(109), వోల్వార్డ్ట్(109) సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో దీప్తీ శర్మ, గైక్వాడ్, రాణా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. షఫాలీ వర్మ, హర్మాన్ ప్రీత్ కౌర్ తలా వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్లో 10 వికెట్లతో సత్తాచాటిన స్నేహ్ రాణాకు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది. -
చరిత్ర సృష్టించిన భారత క్రికెటర్.. ఒకే మ్యాచ్లో 10 వికెట్లు
చెపాక్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళ స్పిన్నర్ స్నేహ రాణా అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది.. తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికాకు చుక్కలు చూపించిన రానా.. రెండో ఇన్నింగ్స్లో కూడా రెండు కీలక వికెట్లతో సత్తాచాటింది.ఈ మ్యాచ్లో ఓవరాల్గా రానా 10 వికెట్లు పడగొట్టి సఫారీలను కట్టడి చేసింది. ఈ క్రమంలో స్నేహ రాణా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. మహిళల టెస్టు క్రికెట్లో 10 వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్గా స్నేహ రాణా రికార్డులకెక్కింది. ఈ జాబితాలో స్నేహ రాణా కంటే ముందు భారత మహిళ క్రికెట్ దిగ్గజం జులాన్ గోస్వామి ఉంది. 2006లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో జులాన్ 10 వికెట్లు సాధించింది. అయితే ఈ ఫీట్ సాధించిన తొలి భారత మహిళా స్పిన్నర్ స్నేహనే కావడం విశేషం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 266 పరుగులకు ఆలౌట్ కావడంతో ఫాలోన్ గండం దాటలేకపోయింది.ఈ క్రమంలోనే ఫాలో ఆన్ ఆడిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు సెకెండ్ ఇన్నింగ్స్లో 373 పరుగులకు ఆలౌలైంది. దీంతో భారత్ ముందు కేవలం 37 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే దక్షిణాఫ్రికా ఉంచింది. అంతకముందు భారత్ తమ మొదటి ఇన్నింగ్స్లో 603 పరుగుల భారీ స్కోర్ చేసింది. Edged and taken!Shubha Satheesh takes a sharp low catch at first-slip 👌👌South Africa lose their 8th wicket.Follow the match ▶️ https://t.co/4EU1Kp6YTG#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/LDYR5uCeme— BCCI Women (@BCCIWomen) July 1, 2024 -
ఎనిమిది వికెట్లతో చెలరేగిన టీమిండియా బౌలర్
మహిళల క్రికెట్లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో టీమిండియా బౌలర్ స్నేహ్ రాణా అదరగొట్టింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో రాణా ఏకంగా 8 వికెట్లు (25.3-4-77-8) పడగొట్టింది. మహిళల క్రికెట్లో ఓ ఇన్నింగ్స్లో ఇవి మూడో అత్యుత్తమ గణాంకాలు. రాణాకు ముందు మహిళల టెస్ట్ క్రికెట్లో ఆష్లే గార్డ్నర్ (8/66), నీతూ డేవిడ్ (8/53) ఎనిమిది వికెట్ల ఘనత సాధించారు.మ్యాచ్ విషయానికొస్తే.. చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్లో సౌతాఫ్రికాపై టీమిండియా ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 603 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. షఫాలీ వర్మ డబుల్ సెంచరీతో (205), స్మృతి మంధన (149) సెంచరీతొ చెలరేగారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా.. స్నేహ్ రాణా ధాటికి తొలి ఇన్నింగ్స్లో 266 పరుగులకు ఆలౌటై ఫాలో ఆన్ ఆడుతుంది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో మారిజన్ కాప్ (74), సూన్ లుస్ (65) మాత్రమే రాణించారు. ఫాలో ఆన్ ఆడుతూ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. సూన్ లుస్ (109) సెంచరీతో చెలరేగగా.. లారా వొల్వార్డ్ట్ 93 పరుగులతో అజేయంగా నిలిచింది. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్కు సౌతాఫ్రికా ఇంకా 105 పరుగులు వెనుకపడి ఉంది. -
జట్టులో చోటు ఎందుకన్నారు.. కట్ చేస్తే అతడే వరల్డ్కప్ హీరో
ఐపీఎల్-2024లో పేలవ ప్రదర్శన కనబరిచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఇప్పుడు హీరోగా మారిపోయాడు. అతడిని విమర్శించిన నోళ్లే ఇప్పుడు శెభాష్ అని పొగుడుతున్నాయి. టీ20 వరల్డ్కప్-2024 ఎంపిక చేసిన భారత జట్టులో హార్దిక్ పాండ్యాకు చోటు దక్కడం పై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఫామ్లో లేని ఆటగాడికి ఛాన్స్ ఎందుకు ఇచ్చారని సెలక్టర్లపై కూడా చాలా మంది మాజీలు ప్రశ్నల వర్షం కురిపించాడు. అయితే తనపై వచ్చిన విమర్శలన్నింటకి హార్దిక్ తన ఆటతోనే సమాధానమిచ్చాడు. టీ20 వరల్డ్కప్లో పాండ్యా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆల్రౌండ్ షోతో హార్దిక్ అదరగొట్టాడు.కీలకమైన ఫైనల్లో సైతం పాండ్యా సత్తాచాటాడు. బ్యాటింగ్లో తన మార్క్ చూపించే అవకాశం పెద్దగా రాకపోయినప్పటికి బౌలింగ్లో మాత్రం దుమ్ములేపాడు. ఓటమి తప్పదనుకున్న పాండ్యా మ్యాజిక్ చేశాడు. 17 ఓవర్ వేసిన పాండ్యా.. చేలరేగి ఆడుతున్న క్లాసెన్ను అద్బుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. క్లాసెన్ వికెట్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. అనంతరం ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 16 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ వేసే బాధ్యతను కూడా రోహిత్.. హార్దిక్ పాండ్యాకే అప్పగించాడు. కెప్టెన్ నమ్మకాన్ని పాండ్యా నిలబెట్టకున్నాడు. కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి భారత్కు అద్బుతమైన విజయాన్ని అందించాడు. భారత్ విజయం సాధించగానే పాండ్యా భావోద్వేగానికి లోనయ్యాడు. భారత జెండా పట్టుకుని స్టేడియం మొత్తం పాండ్యా తిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఫైనల్ మ్యాచ్లో 3 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్గా ఈ టోర్నీలో 8 మ్యాచ్లు ఆడి 144 పరుగులతో పాటు 11 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో పాండ్యాపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. -
చాలా గర్వంగా ఉంది.. మాటలు రావడం లేదు! వాళ్లందరికి సెల్యూట్: రోహిత్
ఎన్నాళ్లకు.. ఎన్నాళ్లకు! భారత కల నేరవేరింది. గత 13 ఏళ్లగా ఊరిస్తున్న వరల్డ్కప్ ట్రోఫీ ఎట్టకేలకు భారత్ వసమైంది. టీ20 వరల్డ్కప్-2024 ఛాంపియన్స్గా టీమిండియా నిలిచింది. బార్బోడస్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 7 వికెట్ల తేడాతో ఓడించిన భారత్..రెండో సారి విశ్వవిజేతగా నిలిచింది. 2007లో తొలిసారి ఎంఎస్ ధోని సారథ్యంలో పొట్టి ప్రపంచకప్ను భారత్ సొంతం చేసుకోగా.. మళ్లీ 17 ఏళ్ల తర్వాత సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రోటీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేయగల్గింది. భారత విజయంలో బుమ్రా, హార్దిక్ పాండ్యా, అర్ష్దీప్ కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఛాంపియన్స్గా నిలిచినందుకు చాలా గర్వంగా ఉందని రోహిత్ తెలిపాడు."మా కల నేరివేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ క్షణం కోసమే ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాము. గత నాలుగేళ్లలో మా జట్టు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంది. కొన్ని కీలక మ్యాచ్ల్లో ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయి. కానీ మేము ఏ రోజు కుంగిపోలేదు. మేము ఒక యూనిట్గా తీవ్రంగా శ్రమించాము. ఈ రోజు మేము విజయం సాధించడం వెనక చాలా కష్టం దాగి ఉంది.మా కష్టానికి తగ్గ ఫలితం ఈ రోజు దక్కింది. ఏమి మాట్లాడాలో కూడా నాకు ఆర్ధం కావడం లేదు. జట్టులో ప్రతీ ఒక్కరూ అద్బుతం. ఒకానొక సమయంలో మ్యాచ్ దక్షిణాఫ్రికా వైపు మలుపు తిరిగినప్పుడు కూడా మేము ఒక యూనిట్గా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాము. ఎలాగైనా గెలవాలనుకున్నాం. ఒక జట్టుగా ఆఖరికి విజయం సాధించాము.ఒక టోర్నమెంట్ను గెలవాలంటే జట్టులోని ప్రతీ ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలి. ఈ టోర్నీలో మా బాయ్స్ అదే చేసి చూపించారు. జట్టు మెనెజ్మెంట్ కూడా ప్రతీ ఒక్క ఆటగాడికి పూర్తి స్వేఛ్చను ఇచ్చింది. ఈ విజయం వెనక సపోర్ట్ స్టాఫ్ కష్టం కూడా దాగి ఉంది. ఇక విరాట్ ఒక వరల్డ్క్లాస్ ప్లేయర్. కోహ్లీ ఫామ్పై నాతో పాటు జట్టులోని ఏ ఒక్కరికి సందేహం లేదు. అతడి సత్తా ఏంటో మాకు తెలుసు. గత 15 ఏళ్లగా వరల్డ్ క్రికెట్లో టాప్ క్రికెటర్గా కొనసాగుతున్నాడు. ఇలాంటి పెద్ద మ్యాచ్ల్లో పెద్ద ప్లేయర్లు జట్టు కోసం కచ్చితంగా నిలబడతారు. విరాట్ కూడా అదే చేసి చూపించాడు.ఇక అక్షర్ పటేల్ నిజంగా ఒక అద్బుతం. అతడి చేసిన 47 పరుగులు మా విజయంలో కీలక పాత్ర పోషించింది. అదేవిధంగా బౌలింగ్లో బుమ్రా కోసం ఎంత చెప్పుకున్న తక్కువే. అతడు ప్రతీ మ్యాచ్లోనూ తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. హార్దిక్, అర్ష్దీప్ కూడా అద్బుతంగా బౌలింగ్ చేశాడు. ఈ విజయంలో ప్రతీ ఒక్కరి పాత్ర ఉంది. ఇక ఈ మెగా టోర్నీలో మాకు పెద్ద ఎత్తు ఎత్తున అభిమానుల నుంచి సపోర్ట్ లభించింది. వాళ్లందరికి సెల్యూట్ చేయాలనకుంటున్నాను. 140 కోట్ల మంది భారతీయులకు ఈ విజయం సంతోషాన్నిచ్చిందని భావిస్తున్నా"అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో రోహిత్ పేర్కొన్నాడు. -
T20ప్రపంచ కప్ సొంతం.. ఆనంద క్షణాల్లో ఆటగాళ్ల భావోద్వేగం (ఫొటోలు)
-
India's T20 World Cup 2024 Victory: టీమిండియా ఘన విజయంతో దేశవ్యాప్తంగా అంబరానంటిన అభిమానుల సంబురాలు (ఫొటోలు)
-
భారత్దే టి20 ప్రపంచకప్ .. విశ్వవిజేతగా రోహిత్ సేన (ఫోటోలు)
-
అంత తొందరెందుకు రోహిత్.. ఇది ఫైనల్ కదా! వీడియో వైరల్
టీ20 వరల్డ్కప్-2024 టోర్నీ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఫైనల్లో మాత్రం విఫలమయ్యాడు. బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్లో రోహిత్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు తొలి ఓవర్లో మంచి ఆరంభం లభించింది. జానెసన్ మొదటి ఓవర్లో ఏకంగా 15 పరుగులచ్చాయి. వెంటనే దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎవరూ ఊహించని విధంగా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ను ఎటాక్లో తీసుకువచ్చాడు. మహారాజ్ వేసిన రెండో ఓవర్లో తొలి రెండు బంతులను స్విప్ ఆడి బౌండరీలగా మలిచిన రోహిత్.. మూడో బంతిని డిఫెన్స్ ఆడాడు. అయితే నాలుగో బంతిని మళ్లీ రివర్స్ స్వీప్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ ఈసారి మాత్రం బంతి నేరుగా బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్లో ఉన్న క్లాసెన్ చేతికి వెళ్లిపోయింది.దీంతో రోహిత్ నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అంత తొందరెందుకు రోహిత్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక ఈ మ్యాచ్లో రోహిత్, పంత్, సూర్యకుమార్ యాదవ్ విఫలమైనప్పటకి భారత్ మాత్రం భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి భారత్ 176 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు.59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 76 పరుగులు చేసి ఔటయ్యాడు. విరాట్తో పాటు అక్షర్ పటేల్(47) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, నోర్జే తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జానెసన్, రబాడ ఒక్క వికెట్ సాధించారు. View this post on Instagram A post shared by ICC (@icc) -
టీ20 వరల్డ్కప్-2024 ఛాంపియన్స్గా భారత్..
IND vs SA T20 WC Final Live Updates:టీ20 వరల్డ్కప్-2024 ఛాంపియన్స్గా భారత్.. టీ20 వరల్డ్కప్-2024 ఛాంపియన్స్గా టీమిండియా నిలిచింది. బార్బోడస్ వేదికగా జరగనున్న ఫైనల్లో 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్.. రెండో సారి టీ20 వరల్డ్కప్ టైటిల్ను ముద్దాడింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేయగల్గింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. హార్దిక్ పాండ్యా మూడు వికెట్లతో సత్తాచాటగా.. బుమ్రా, అర్ష్దీప్ సింగ్ తలా రెండు వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.ఐదో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా..దక్షిణాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన హెన్రిచ్ క్లాసెన్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఔటయ్యాడు. సౌతాఫ్రికా విజయానికి 23 బంతుల్లో 26 పరుగులు కావాలి.విజయం దిశగా దక్షిణాఫ్రికా..15 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ 49 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అతడితో పాటు మిల్లర్(14) పరుగులతో క్రీజులో ఉన్నాడు. దక్షిణాఫ్రికా విజయానికి 30 బంతుల్లో 30 పరుగులు కావాలి. సౌతాఫ్రికా మూడో వికెట్ డౌన్.. స్టబ్స్ ఔట్70 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన స్టబ్స్.. అక్షర్ పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి క్లాసెన్ వచ్చాడు. 10 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది.6 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్: 42/26 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. క్రీజులో డికాక్(20), స్టబ్స్(12) పరుగులతో ఉన్నారు.సౌతాఫ్రికా రెండో వికెట్ డౌన్.. మార్క్రమ్ ఔట్దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన మార్క్రమ్.. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులో స్టబ్స్ వచ్చాడు.సౌతాఫ్రికా తొలి వికెట్ డౌన్.. హెండ్రిక్స్ ఔట్177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. 4 పరుగులు చేసిన రీజా హెండ్రిక్స్.. బుమ్రా బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.2 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది. క్రీజులో డికాక్, మార్క్రమ్(4) పరుగులతో ఉన్నారు.ఫైనల్లో చెలరేగిన విరాట్ కోహ్లి.. దక్షిణాఫ్రికాతో ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా అదరగొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి భారత్ 176 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 76 పరుగులు చేసి ఔటయ్యాడు. విరాట్తో పాటు అక్షర్ పటేల్(47) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, నోర్జే తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జానెసన్, రబాడ ఒక్క వికెట్ సాధించారు.విరాట్ కోహ్లి ఫిప్టీ.. కీలకమైన ఫైనల్లో విరాట్ కోహ్లి ఫామ్లోకి వచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో కోహ్లి హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 64 పరుగులతో కోహ్లి బ్యాటింగ్ చేస్తున్నాడు. 18 ఓవర్లకు భారత్ స్కోర్: 150/4భారత్ నాలుగో వికెట్ డౌన్.. అక్షర్ పటేల్ ఔట్టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 47 పరుగులతో అద్బుత ఇన్నింగ్స్ ఆడిన అక్షర్ పటేల్ రనౌట్ రూపంలో ఔటయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(46), దూబే(9) పరుగులతో ఉన్నారు.12 ఓవర్లకు భారత్ స్కోర్: 93/3విరాట్ కోహ్లి, అక్షర్ పటేల్ నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 50 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. 12 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(41), అక్షర్ పటేల్(38) పరుగులతో ఉన్నారు.నిలకడగా ఆడుతున్న విరాట్, అక్షర్..వరుసగా మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత టీమిండియా బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ లభించిన అక్షర్ పటేల్ అద్బుతంగా ఆడుతున్నాడు. 9 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(31), అక్షర్ పటేల్(25) పరుగులతో ఉన్నారు.టీమిండియా మూడో వికెట్ డౌన్..34 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. రబాడ బౌలింగ్లో ఔటయ్యాడు. 5 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(22), అక్షర్ పటేల్(5) పరుగులతో ఉన్నారు.భారత్కు బిగ్ షాక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లుటాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓకే ఓవర్లో భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. కేశవ్ మహారాజ్ వేసిన రెండో ఓవర్లో తొలుత రోహిత్ శర్మ ఔట్ కాగా.. అనంతరం రిషబ్ పంత్ పెవిలియన్కు చేరాడు. 3 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(14), సూర్యకుమార్ యాదవ్(0) పరుగులతో ఉన్నారు.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్బార్బోడస్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా ఫైనల్ మ్యాచ్కు విజిల్ మ్రోగింది. ఈ టైటిల్ పోరులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్లో ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి.తుది జట్లుదక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీభారత్ : రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాస్టేడియంకు చేరుకున్న ఇరు జట్లుఇక ఫైనల్ మ్యాచ్ కోసం భారత్-దక్షిణాఫ్రికా జట్లు బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానానికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఇరు జట్లు వామాప్ చేస్తున్నాయి. మరో 30 నిమిషాల్లో టాస్ పడనుంది.అభిమానులకు గుడ్ న్యూస్.. భారత్-దక్షిణాఫ్రికా ఫైనల్ మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. ఫైనల్ జరిగే బార్బోడస్లో ప్రస్తుతం ఎటువంటి వర్షం పడడం లేదు. ప్రస్తుతం ఎండకాస్తోంది. దీంతో మ్యాచ్ సజావుగా జరిగే సూచనలు కన్పిస్తున్నాయి.టైటిల్ పోరులో భారత్-దక్షిణాఫ్రికాటీ20 వరల్డ్కప్-2024లో తుది సమరానికి సమయం అసన్నమైంది. బార్బోడస్ వేదికగా టైటిల్పోరులో భారత్-దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మెగా టోర్నీలో ఆజేయంగా నిలిచిన ఇరు జట్లు.. ఆఖరి పోరులో తాడోపేడో తెల్చుకోనున్నాయి. భారత్ తమ రెండో టీ20 వరల్డ్కప్ ట్రోఫీపై కన్నేయగా.. సౌతాఫ్రికా తొలి సారి వరల్డ్కప్ను ముద్దాడాలని ఉవ్విళ్లూరుతోంది. ఇరు జట్లు సమవుజ్జీగా ఉన్నాయి. ఈ టైటిల్ పోరులో ఎవరిది పై చేయో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. -
T20 World Cup 2024 Final: టీ20 వరల్డ్కప్ చరిత్రలో తొలిసారి ఇలా..!
టీ20 వరల్డ్కప్ 2024 ఫైనల్లో ఇవాళ (జూన్ 29) భారత్, సౌతాఫ్రికా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. బార్బడోస్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి టైటిల్ సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఇందు కోసం ఇప్పటికే వ్యూహప్రతివ్యూహాలు సిద్దం చేసుకున్నాయి. వరల్డ్కప్ గెలవడం ఓ జట్టుకు (టీమిండియా) 13 ఏళ్ల నిరీక్షణ అయితే.. మరో జట్టుకు (సౌతాఫ్రికా) చిరకాల కోరిక.ప్రపంచ కప్లో తొలిసారి ఇలా..ప్రస్తుత ప్రపంచకప్లో భారత్, సౌతాఫ్రికా అజేయ జట్లుగా ఫైనల్కు చేరాయి. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇలా (ఫైనల్కు చేరిన జట్లు అజేయ జట్లుగా నిలవడం) జరగడం ఇదే తొలిసారి.ఈ మెగా సమరానికి ముందు పొట్టి ఫార్మాట్లో ఇరు జట్లు ఎన్ని సార్లు ఎదురెదురుపడ్డాయో ఓ లుక్కేద్దాం. ఈ ఫార్మాట్లో భారత్-సౌతాఫ్రికా పోరాటం 18 ఏళ్ల కిందట మొదలైంది. జోహనెస్బర్గ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా ప్రొటీస్ను ఖంగుతినిపించింది. ఆ మ్యాచ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆడిన ఏకైక అంతర్జాతీయ టీ20 మ్యాచ్.టీమిండియాదే ఆధిక్యంఅప్పటి నుంచి పొట్టి క్రికెట్లో భారత్-సౌతాఫ్రికా జట్లు 26 మ్యాచ్ల్లో ఎదురెదురుపడగా.. టీమిండియా 14, సౌతాఫ్రికా 11 మ్యాచ్ల్లో గెలిచాయి. ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు.టీ20 ప్రపంచకప్లో ఇరు జట్ల హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. సౌతాఫ్రికాపై భారత్కు స్పష్టమైన ఆధిక్యత ఉంది. ఇరు జట్లు ఆరు సందర్భాల్లో ఎదురెదురుపడగా.. భారత్ 4, సౌతాఫ్రికా 2 మ్యాచ్ల్లో గెలుపొందాయి. ఇరు జట్ల మధ్య చివరిసారి జరిగిన వరల్డ్కప్ (2022 ఎడిషన్) మ్యాచ్లో భారత్పై సౌతాఫ్రికా విజయం సాధించింది. -
కమాన్ టీమిండియా.. భారత జట్టు ప్రపంచకప్ గెలవాలని దేశవ్యాప్తంగా పూజలు
టీ20 వరల్డ్కప్ 2024 ఫైనల్ ఇవాళ (జూన్ 29) జరుగనుంది. బార్బడోస్ వేదికగా భారత్, సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కోసం యావత్ భారత దేశం కళ్లకు వొత్తులు పెట్టుకుని ఎదురుచూస్తుంది. ఈ సారి టీమిండియా ఎలాగైనా వరల్డ్కప్ గెలవాలని అభిమానులు తమ ఇష్ట దైవాలకు ప్రార్దనలు చేస్తున్నారు. Prayers for team India at Siddhivinayak Temple. 🥹🇮🇳 pic.twitter.com/dgwBJ5XiPi— Mufaddal Vohra (@mufaddal_vohra) June 29, 2024దేశవ్యాప్తంగా అభిమానులు తమ ఫేవరెట్ ప్లేయర్ల పేరిట ప్రత్యేక పూజలు చేయిస్తున్నారు. టీమిండియా ఫ్యాన్స్ పూజలతో దేశవ్యాప్తంగా ప్రార్ధనాలయాలు కిక్కిరిసిపోయాయి. ప్రజలు అనునిత్యం టచ్లో ఉండే సోషల్మీడియా టీమిండియా నామస్మరణతో మార్మోగుతుంది. ఏ ప్లాట్ఫాంలో చూసినా టీమిండియాను ఉత్తేజపరిచే పోస్ట్లే దర్శనమిస్తున్నాయి. 140 కోట్లకుపైగా భారతీయులు ఈసారి వరల్డ్కప్ మనదే అని ధీమాగా ఉన్నారు. Fans from Prayagraj offering prayers for team India's victory. 🇮🇳pic.twitter.com/4AGCwdAr0b— Mufaddal Vohra (@mufaddal_vohra) June 29, 2024భారత ఆటగాళ్లు సైతం గతంలో కాకుండా ఈసారి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. గ్రూప్ దశలో, సూపర్-8, సెమీస్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఈ టోర్నీలో భారత్ అజేయ జట్టుగా ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ అరివీర భయంకర ఫామ్లో ఉన్నాడు. సూర్యకుమార్, రిషబ్ పంత్ సత్తా చాటుతున్నారు. హార్దిక్ ఆల్రౌండర్ పాత్రకు న్యాయం చేస్తున్నారు. బౌలర్లంతా అద్భుతంగా రాణిస్తున్నారు. Indian fans doing Havan and prayers in Varanasi for Team India to win this T20 World Cup 2024 Trophy. 🇮🇳🙏pic.twitter.com/ETAuGiMfGP— Tanuj Singh (@ImTanujSingh) June 29, 2024పేసు గుర్రం బుమ్రా అయితే పట్టపగ్గాల్లేకుండా దూసుకుపోతున్నాడు. విరాట్, శివమ్ దూబే ఫామ్ మినహాయించి టీమిండియా అన్ని విషయాల్లో భేషుగ్గా ఉంది. వీరిద్దరు ఫైనల్లో టచ్లోకి వస్తే టీమిండియాకు తిరుగుండదు. మరోవైపు సౌతాఫ్రికా సైతం గెలుపుపై ధీమాగా ఉంది. ఆ జట్టు కూడా ఈ టోర్నీలో అజేయంగా ఉంది. సౌతాఫ్రికా సైతం అన్ని విభాగాల్లో టీమిండియాతో సరిసమానంగా ఉంది. మన దగ్గర సూర్యకుమార్ ఉంటే.. వాళ్ల దగ్గర క్లాసెన్ ఉన్నాడు. మన దగ్గర రోహిత్ ఉంటే.. వారి దగ్గర మార్క్రమ్ ఉన్నారు. మన దగ్గర కోహ్లి ఉంటే.. వారి వద్ద మిల్లర్ ఉన్నారు. మన దగ్గర పంత్ ఉంటే.. వారి దగ్గర డికాక్ ఉన్నాడు. THE DAY HAS ARRIVED - IT'S T20 WORLD CUP 2024 FINAL...!!!!! 🏆- Team India will take on South Africa in Final of this T20 World Cup. This is the dream of Billion Indians, Every Indian wants to see India lift the World Cup.- ALL THE BEST, TEAM INDIA, LET'S CREATE HISTORY. 🇮🇳 pic.twitter.com/4P1PbUC4CW— Tanuj Singh (@ImTanujSingh) June 28, 2024మన దగ్గర హార్దిక్ ఉంటే.. వారి దగ్గర జన్సెన్ ఉన్నాడు. బౌలింగ్ విషయానికొస్తే.. ఇరు జట్లలో మేటి పేసర్లు ఉన్నారు. మన దగ్గర బుమ్రా, అర్ష్దీప్ ఉంటే వారి దగ్గర రబాడ, నోర్జే ఉన్నారు. భారత్, సౌతాఫ్రికా మధ్య తేడా వచ్చేది స్పిన్ విభాగంలోనే. మన దగ్గర ప్రపంచ స్థాయి స్పిన్నర్లు కుల్దీప్, అక్షర్, జడేజా ఉండగా.. వారి దగ్గర షంషి, కేశవ్ మహారాజ్ మాత్రమే ఉన్నారు. భారత్ ఈ ఒక్క విషయంలో సఫారీలపై ఆధిక్యం కలిగి ఉంది. ఈ ఆధిక్యమే ఫైనల్లో టీమిండియాను గెలిపించే అవకాశం ఉంది. సో.. ఆల్ ద బెస్ట్ టీమిండియా. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. టెస్ట్ క్రికెట్లో అత్యధిక స్కోర్ నమోదు
భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృస్టించింది. టెస్ట్ క్రికెట్లో ఓ ఇన్నింగ్స్లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. స్వదేశంలో సౌతాఫ్రికా మహిళల జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా ఈ రికార్డును సాధించింది. ఈ మ్యాచ్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 603 పరుగులు చేసింది. ఈ మ్యాచ్కు ముందు ఓ టెస్ట్ ఇన్నింగ్స్లో అత్యధిక స్కోర్ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇదే సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 575 పరుగులు చేసింది. ఓవరాల్గా మహిళల టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా 600 స్కోర్ దాటిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లో టీమిండియా మరో ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పింది. టెస్టు క్రికెట్లో తొలి రోజుతో పాటు ఒకే రోజు అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. 1935లో న్యూజిలాండ్పై ఇంగ్లండ్ చేసిన 431 పరుగులు టెస్ట్ల్లో తొలి రోజుతో పాటు ఒకే రోజు చేసిన అత్యధిక స్కోర్గా ఉండింది.టెస్ట్ క్రికెట్ చరిత్రలో టాప్-5 టీమ్ స్కోర్లు..భారత్- 603/6ఆస్ట్రేలియా- 575/9ఆస్ట్రేలియా- 569/6ఆస్ట్రేలియా- 525న్యూజిలాండ్- 517/8కాగా, సౌతాఫ్రికాతో మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు శతకాల మోత మోగించి పరుగుల వరద పారించారు. ఓపెనర్ షపాలీ వర్మ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ (194 బంతుల్లో 205) నమోదు చేయగా... మరో ఓపెనర్ స్మృతి మంధన (149) టెస్ట్ల్లో తన రెండో సెంచరీ సాధించింది. మంధన, షఫాలీతో పాటు జెమీమా రోడ్రిగెజ్ (55), హర్మన్ప్రీత్ (69), రిచా ఘోష్ అర్ద సెంచరీలతో రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ను 603 పరుగుల వద్ద (6 వికెట్ల నష్టానికి) డిక్లేర్ చేసింది.భారత ఇన్నింగ్స్లో మరిన్ని హైలైట్స్..2 మిథాలీ రాజ్ (214; 2002లో ఇంగ్లండ్పై) తర్వాత టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారతీయ మహిళా క్రికెటర్గా షఫాలీ నిలిచింది.292 తొలి వికెట్కు షఫాలీ, స్మృతి జోడించిన పరుగులు. ఇది కొత్త ప్రపంచ రికార్డు. 2004లో పాక్ ఓపెనర్లు సాజీదా, కిరణ్ బలూచ్లు విండీస్పై తొలి వికెట్కు 241 పరుగులు జతచేశారు. -
T20 World Cup 2024 Final: రోహిత్ శర్మ మరో 34 పరుగులు చేస్తే..!
టీ20 వరల్డ్కప్ 2024 తుది అంకానికి చేరింది. బార్బడోస్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య ఇవాళ (జూన్ 29) ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుంది. అయితే ఈ మ్యాచ్కు వర్షం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మ్యాచ్ జరిగే సమయానికి వర్షం పడే సూచనలున్నట్లు తెలిపింది. ఒకవేళ ఇవాళ మ్యాచ్ రద్దైనా రిజర్వ్ డే ఉంది. రిజర్వ్ డేలో కూడా మ్యాచ్ రద్దైతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.హిట్మ్యాన్ మరో 34 పరుగులు చేస్తే..వరల్డ్కప్ ఆధ్యాంతం సూపర్ ఫామ్లో ఉన్న రోహిత్ శర్మ.. ఫైనల్ మ్యాచ్లో మరో 34 పరుగులు చేస్తే టోర్నీ లీడింగ్ రన్ స్కోరర్గా నిలుస్తాడు. రోహిత్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 41.33 సగటున 155.97 స్ట్రయిక్రేట్తో 3 అర్ద సెంచరీల సాయంతో 248 పరుగులు చేశాడు. ఇందులో 22 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం వరల్డ్కప్ లీడింగ్ రన్ స్కోరర్గా రహ్మానుల్లా గుర్బాజ్ ఉన్నాడు. గుర్బాజ్ 8 మ్యాచ్ల్లో 124.34 స్ట్రయిక్రేట్తో 281 పరుగులు చేశాడు.అర్ష్దీప్ సింగ్ మరో 3 వికెట్లు తీస్తే..ఈ టోర్నీలో మంచి ఫామ్లో ఉన్న టీమిండియా పేసర్ అర్ష్దీప్ సింగ్ మరో 3 వికెట్లు తీస్తే టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్గా నిలుస్తాడు. అర్ష్దీప్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 15 వికెట్లు తీసి సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్గా ఉన్నాడు. టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్గా ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఫజల్ హక్ ఫారూఖీ (8 మ్యాచ్ల్లో 17 వికెట్లు) ఉన్నాడు. -
T20 World Cup 2024 Final: శివమ్ దూబేనా..సంజూ శాంసనా..?
మరికొద్ది గంటల్లో టీ20 వరల్డ్కప్ 2024 ఫైనల్ ప్రారంభం కానుంది. బార్బడోస్ వేదికగా భారత్-సౌతాఫ్రికా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచి టైటిల్ సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఈ టైటిల్ ఓ జట్టుకేమో (టీమిండియా) 13 ఏళ్ల నిరీక్షణ.. మరో జట్టుకు (సౌతాఫ్రికా) చిరకాల కోరిక. ఈ తుది సమరం కోసం కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్కు వరుణుడు అడ్డుతగిలేలా ఉన్నాడు. ఒకవేళ ఇవాళ మ్యాచ్ రద్దైనా రిజర్వ్ డే ఉంది. ఒకవేళ రిజర్వ్ డేలో కూడా మ్యాచ్ సాధ్యపడకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. సంయుక్త విజేతలుగా నిలవడం ఇరు జట్ల ఆటగాళ్లుకు, అభిమానులు ఇష్టం ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ జరగాలనే దేవుళ్లను ప్రార్ధిస్తున్నారు.ఇదిలా ఉంటే, ఫైనల్ మ్యాచ్ కోసం భారత తుది జట్టు కూర్పులో ఓ తలనొప్పి ఉంది. వరుసగా విఫలమవుతున్న శివమ్ దూబేను ఫైనల్లో ఆడించాలా వద్దా అని మేనేజ్మెంట్ తలలు పట్టుకు కూర్చుంది. ఫామ్లోని లేని దూబేని ఫైనల్లో కూడా కొనసాగిస్తే.. టీమిండియా విజయావకాశాలను దెబ్బతినే ప్రమాదముందని అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ దూబేని తప్పిస్తే జట్టు లయ దెబ్బతీనే ప్రమాదం కూడా లేకపోలేదు.ప్రస్తుతం భారత జట్టు బ్యాటర్లు, ఆల్రౌండర్లు, బౌలర్లతో సమతూకంగా ఉంది. ఒకవేళ దూబే స్థానంలో సంజూ శాంసన్ లేదా యశస్వి జైస్వాల్ను తుది జట్టులోకి తీసుకుంటే భారత్కు ఓ ఆల్రౌండర్ తక్కువ అవుతాడు. ఈ టోర్నీలో దూబేతో బౌలింగ్ చేయించనప్పటికీ అతన్ని ఆల్రౌండర్గానే పరిగణించాలి. బౌలర్గా అతనికి ఓ మోస్తరు ట్రాక్ రికార్డు ఉంది. బార్బడోస్ పిచ్ బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో జట్టు మేనేజ్మెంట్ దూబేని తప్పించే సాహసం చేయకపోవచ్చు. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ ద్రవిడ్కు కూడా దూబేని మార్చడం ఇష్టం ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్లో భారత తుది జట్టుపై మీ అంచాలనేమో కామెంట్ చేయండి. శివమ్ దూబేని ఆడిస్తే బాగుంటుందా లేక సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్లలో ఒకరికి అవకాశమిస్తే బాగుంటుందా..? -
T20 World Cup 2024 Final: ద్రవిడ్కు చివరి మ్యాచ్.. టైటిల్తో వీడ్కోలు పలకండి..!
టీ20 వరల్డ్కప్ 2024 చివరి అంకానికి చేరింది. బార్బడోస్ వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య ఇవాళ (జూన్ 29) జరుగబోయే ఫైనల్తో మెగా టోర్నీ ముగస్తుంది. ఈ మ్యాచ్ టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్కు చివరిది. భారత హెడ్ కోచ్గా ద్రవిడ్ పదవీకాలం ఈ మ్యాచ్తో ముగస్తుంది. టైటిల్ గెలిచి ద్రవిడ్కు ఘనంగా వీడ్కోలు పలకాలని టీమిండియా ఆటగాళ్లు భావిస్తున్నారు. భారత క్రికెట్ అభిమానులు సైతం ఇదే కోరుకుంటున్నారు. కోచ్గా ద్రవిడ్ టీమిండియాకు ఎనలేని సేవలనందించాడు. ద్రవిడ్ ఆథ్వర్యంలో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, వన్డే ప్రపంచకప్ ఫైనల్ లాంటి ప్రతిష్టాత్మకమైన మ్యాచ్లు ఆడింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆడనుంది. తన హయాంలో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ద్రవిడ్కు ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేదన్న లోటు మిగిలిపోయింది. ఈ ప్రపంచకప్తో ఆ లోటు తీర్చుకోవాలని ద్రవిడ్ పట్టుదలగా ఉన్నాడు. RAHUL DRAVID - ONE FINAL DAY AS HEAD COACH. 🌟- Indian cricket will miss you. pic.twitter.com/Xd7hMZiPBP— Johns. (@CricCrazyJohns) June 28, 2024ఇందుకోసం అతను బాయ్స్ను (టీమిండియా క్రికెటర్లను) సమాయత్తం చేస్తున్నాడు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైనా (రిజర్వ్ డేలో కూడా) భారత్ సంయుక్త విజేతగా నిలుస్తుంది కానీ.. అది ద్రవిడ్కు అంత సంతృప్తిని ఇవ్వకపోవచ్చు. భారత ఆటగాళ్లకు, అభిమానులకు కూడా సంయుక్త విజేతలుగా నిలవడం ఇష్టం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ జరిగి. అందులో టీమిండియా విజేతగా నిలవాలని యావత్ భారత దేశం కోరుకుంటుంది. భారత్ చివరిసారి ప్రపంచకప్ టైటిల్ను (వన్డే) 2011లో సాధించింది. టీ20 వరల్డ్కప్ను 2007 అరంగేట్రం ఎడిషన్లో గెలిచింది. ఈ సారి టీమిండియా టైటిల్ సాధిస్తే.. ప్రపంచకప్ కోసం 13 ఏళ్ల నిరీక్షణకు తెరపడినట్లవుతుంది.మరోవైపు ఈ వరల్డ్కప్లో మరో ఫైనలిస్ట్ అయిన సౌతాఫ్రికా కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది. రాకరాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ జట్టు ఆటగాళ్లు, అభిమానులు కోరుకుంటున్నారు. సౌతాఫ్రికా ఇప్పటివరకు ఒక్క వరల్డ్కప్ టైటిల్ కూడా గెలవలేదు. ఫైనల్స్కు చేరడం కూడా ఆ జట్టుకు ఇదే మొదటిసారి. కాబట్టి సౌతాఫ్రికా కూడా టైటిల్ సాధించే విషయంలో కృత నిశ్చయంతో ఉంది. మరి ఎవరు టైటిల్ గెలుస్తారో వేచి చూడాలి. -
T20 World Cup 2024 Final: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఇదో చేదు వార్త. భారత్, సౌతాఫ్రికా మధ్య ఇవాళ (జూన్ 29) జరగాల్సిన టీ20 వరల్డ్కప్ 2024 ఫైనల్ మ్యాచ్కు వరుణుడు అడ్డుతగలనున్నాడు. మ్యాచ్కు వేదిక అయినా బార్బడోస్లో మ్యాచ్ జరిగే సమయానికి (భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు) వర్షం పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. HEAVY RAIN IN BARBADOS. 🌧️- We've a Reserve Day for the Final. (Revsportz).pic.twitter.com/dmCnirETxv— Mufaddal Vohra (@mufaddal_vohra) June 28, 2024మ్యాచ్కు ముందు రోజు బార్బడోస్లో భారీ వర్షం పడింది. ఈ వర్షంతో బార్బడోస్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం చిత్తడిగా మారింది. మ్యాచ్ ముందు రోజు వర్షం పడుతున్న దృశ్యాలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ మ్యాచ్ షెడ్యూలైన రోజు రద్దైతే రిజ్వర్ డే రోజున కొనసాగిస్తారు. ఒకవేళ ఆ రోజు కూడా రద్దైతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ఇరు జట్ల ఆటగాళ్లు, అభిమానులు కప్ గెలవాలని కృత నిశ్చయంతో ఉన్నారు కాబట్టి మ్యాచ్ జరగాలనే కోరుకుంటున్నారు. ఈ కప్ గెలిస్తే సౌతాఫ్రికాకు చిరకాల కోరిక నెరవేరనుండగా.. భారత్కు 13 ఏళ్ల కరువు తీరనుంది. సౌతాఫ్రికా ఇంత వరకు ఒక్క వరల్డ్కప్ టైటిల్కు కూడా గెలవకపోగా.. భారత్ చివరిసారిగా 2011 వన్డే ప్రపంచకప్ గెలిచింది. కాగా భారత్, సౌతాఫ్రికా జట్లు సెమీఫైనల్లో ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లపై ఘన విజయాలు సాధించి ఫైనల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ఇరు జట్లు అజేయ జట్లు అజేయ జట్లుగా ఫైనల్స్కు చేరాయి. -
కోహ్లి ఫామ్ పెద్ద సమస్య కాదు.. అతడు రాజులకే రాజు: భారత మాజీ క్రికెటర్
టీ20 వరల్డ్కప్-2024లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. తన పేలవ ఫామ్ను విరాట్ కొనసాగిస్తున్నాడు. గ్రూపు స్టేజి, సూపర్ 8లో నిరాశపరిచిన విరాట్.. సెమీఫైనల్లో కూడా అదే ఆటతీరును కనబరిచాడు.గురువారం ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో కింగ్ కోహ్లి కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఓవరాల్ గా ఈ టోర్నీలో ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన కోహ్లి.. 10.71 సగటుతో 100 స్ట్రైక్ రేట్తో కేవలం 75 పరుగులు మాత్రమే చేశాడు. అయితే సెమీస్లో విరాట్ విఫలమైనప్పటికి భారత్ మాత్రం ఫైనల్లో అడుగుపెట్టింది. జూన్ 29(శనివారం)న బార్బోడస్ వేదికగా జరగనున్న ఫైనల్లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది.ఈ క్రమంలో కనీసం ఫైనల్లో నైనా కోహ్లి సత్తాచాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. భారత జట్టు మెనెజ్మెంట్ కూడా విరాట్కు సపోర్ట్గా ఉంది. ఈ నేపథ్యంలో కోహ్లిని ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్కు ముందు విరాట్ కోహ్లి ఫామ్ భారత జట్టును ఎటువంటి ఆందోళన కలిగించదని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. "కోహ్లి భారీ స్కోర్ చేయకపోయినా ఇబ్బంది లేదు. అతడు రాజులకే రాజు. నా స్నేహితుడు కూడా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. కాగా భారత్- దక్షిణాఫ్రికా ఫైనల్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశముంది. -
ఫైనల్లో సౌతాఫ్రికాకు చుక్కలు చూపిస్తారు.. భారత్దే కప్: షోయబ్ అక్తర్
క్రికెట్ అభిమానులను ఉర్రుతలూగిస్తున్న టీ20 వరల్డ్కప్-2024 తుది అంకానికి చేరుకుంది. జూన్ 29 (శనివారం) జరగనున్న ఫైనల్ మ్యాచ్తో ఈ మెగా టోర్నీకి ఎండ్ కార్డ్ పడనుంది. ఈ టైటిల్ పోరులో భారత్-దక్షిణాఫ్రికా జట్లు అమీతుమీ తెల్చుకోనునన్నాయి.ఈ ఫైనల్ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి రెండో వరల్డ్కప్ టైటిల్ను ఖాతాలో వేసుకోవాలని భారత జట్టు భావిస్తే.. దక్షిణాఫ్రికా మాత్రం తొలి సారి ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా జట్టుకు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కీలక సూచనలు చేశాడు. భారత జట్టు నుంచి ముప్పు పొంచి ఉందని సఫారీలను అక్తర్ హెచ్చరించాడు."సెమీస్లో భారత్ అద్బుతమైన విజయం సాధించింది. వారు ఈ విజయానికి నిజంగా అర్హులు. ఫైనల్కు చేరినందుకు టీమిండియాకు నా అభినందనలు. గత రెండు వరల్డ్కప్(టీ20, వన్డే)ల్లో టీమిండియా ఛాంపియన్స్గా నిలుస్తుందని భావించాను. కానీ ఆఖరి మెట్టుపై భారత్ బోల్తా పడింది. ఈ సారి కూడా భారత్ ఛాంపియన్స్గా నిలవాలని ఆశిస్తున్నాను. ఈ ఫైనల్ మ్యాచ్లో భారత్ నుంచి దక్షిణాఫ్రికాకు తీవ్రమైన పోటీ ఎదురుకానుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ ఎంచుకోవాలి. అప్పుడే ప్రోటీస్ ఎడ్జ్లో గెలిచే ఛాన్స్ ఉంటుంది. అయితే దక్షిణాఫ్రికాకు మాత్రం గెలుపు అవకాశాలు తక్కువ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వారు తొలిసారి ఫైనల్లో తలపడతున్నారు. కచ్చితంగా వారిపై ఒత్తిడి ఉంటుంది.అంతేకాకుండా భారత జట్టులో వరల్డ్క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. వారిని ఎదుర్కొని ప్రోటీస్ బ్యాటర్లు ఎలా పరుగులు సాధిస్తారో ఆర్ధం కావడం లేదు. చివరిగా ఈ ఫైనల్ పోరులో భారత్ గెలవాలని నేను కోరుకుంటున్నానని" తన యూట్యూబ్ ఛానల్లో అక్తర్ పేర్కొన్నాడు. -
ప్రపంచకప్ ఫైనల్.. ఒక జట్టుకేమో 13 ఏళ్ల కరువు.. ఇంకో జట్టుకు చిరకాల కోరిక
టీ20 వరల్డ్కప్ 2024 తుది అంకానికి చేరింది. భారత్, సౌతాఫ్రికా జట్లు ఫైనల్స్ చేరాయి. రేపు (జూన్ 29) జరుగబోయే ఫైనల్లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకుంటాయి. బార్బడోస్ వేదికగా రేపు రాత్రి 8 గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది.టీమిండియాకు 13 ఏళ్ల కరువుటీమిండియా ప్రపంచకప్ గెలిచి 13 ఏళ్లు అవుతుంది. 2011లో భారత్ చివరిసారి (వన్డే వరల్డ్కప్) ప్రపంచకప్ సాధించింది. గతేడాది వన్డే ప్రపంచకప్లో ఫైనల్స్కు చేరినా ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై రన్నరప్గా నిలిచింది.టీ20 వరల్డ్కప్ విషయానికొస్తే.. పొట్టి ప్రపంచకప్ను టీమిండియా 2007 అరంగేట్రం ఎడిషన్లో సాధించింది. ఆతర్వాత 2014లో ఫైనల్కు చేరినా శ్రీలంక చేతిలో ఓటమిపాలై రన్నరప్తో సరిపెట్టుకుంది.మళ్లీ ఇన్నాళ్లకు భారత్కు పొట్టి ప్రపంచకప్ గెలిచే అవకాశం వచ్చింది. రేపు జరుగబోయే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాను చిత్తు చేసి 13 ఏళ్ల కరువు తీర్చుకోవాలని భావిస్తుంది.సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఈ జట్టు వరల్డ్కప్ ఫైనల్కు చేరడం ఇదే మొదటిసారి. 1992లో తొలి వరల్డ్కప్ (వన్డే) ఆడిన సఫారీలు.. ఆతర్వాత 8 వన్డే ప్రపంచకప్లు, 9 టీ20 ప్రపంచకప్లు ఆడితే తొలిసారి (2024) ఫైనల్కు అర్హత సాధించారు. 33 ఏళ్ల తమ పరిమిత ఓవర్ల క్రికెట్ చరిత్రలో లభించిన తొలి అవకాశాన్ని సఫారీలు అందిపుచ్చుకోవాలని తహతహలాడుతున్నారు. వరల్డ్కప్ గెలవడం సౌతాఫ్రికన్ల చిరకాల కోరికగా మిగిలిపోయింది.ఇదిలా ఉంటే, ఎయిడెన్ మార్క్రమ్ నేతృత్వంలోని సౌతాఫ్రికా తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్పై ఘన విజయం సాధించి ఫైనల్కు చేరింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో వరుస విజయాలు సాధించిన సౌతాఫ్రికా ఆజేయ జట్టుగా కొనసాగతుంది. మరోవైపు భారత్.. రెండో సెమీస్లో ఇంగ్లండ్ను 68 పరుగుల తేడాతో చిత్తు చేసి ఫైనల్కు చేరింది. భారత్ సైతం ఈ టోర్నీలో అజేయ జట్టుగా కొనసాగుతుంది. అయితే సూపర్-8లో భారత్ ఆడాల్సిన ఓ మ్యాచ్ (కెనడా) వర్షం కారణంగా రద్దైంది. -
హ్యాట్రిక్ సెంచరీలు మిస్ అయిన టీమిండియా వైస్ కెప్టెన్.. అయినా రికార్డే..!
స్వదేశంలో దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టుతో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. బెంగళూరు వేదికగా ఇవాళ (జూన్ 23) జరిగిన మూడో వన్డేలో భారత మహిళా జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేయగా.. భారత్ 40.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. Smriti Mandhana smashed 3rd consecutive fifty plus score. 💯pic.twitter.com/mjYpYckhy6— Mufaddal Vohra (@mufaddal_vohra) June 23, 2024హ్యాట్రిక్ సెంచరీలు మిస్ఈ మ్యాచ్లో 90 పరుగుల వద్ద ఔటైన భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధన హ్యాట్రిక్ సెంచరీలు చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. ఈ సిరీస్ మొత్తంలో (3 మ్యాచ్ల్లో) 343 పరుగులు (117. 136, 90) చేసిన స్మృతి.. మహిళల మూడు మ్యాచ్ల ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రికార్డు సృష్టించింది. స్మృతి ఈ మ్యాచ్లో కూడా సెంచరీ చేసుంటే, హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన తొలి ఆసియా మహిళా క్రికెటర్గా రికార్డుల్లోకెక్కేది.మ్యాచ్ విషయానికొస్తే.. కెప్టెన్ లారా వొల్వార్డ్ట్ (61) అర్దసెంచరీతో రాణించడంతో దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేస్తూ ఓ మోస్తరు స్కోర్ చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో తంజిమ్ బ్రిట్స్ (38), డి క్లెర్క్ (26), డి రిడ్డర్ (26 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. దీప్తి శర్మ (10-0-27-2) దక్షిణాఫ్రికాను కట్టడి చేయగా.. అరుంధతి రెడ్డి 2, శ్రేయాంక పాటిల్, పూజా వస్త్రాకర్ తలో వికెట్ పడగొట్టారు.నామమాత్రపు లక్ష్య ఛేదనలో భారత్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. భారత ఇన్నింగ్స్లో మంధనతో పాటు కెప్టెన్ హర్మన్ప్రీత్ (42) రాణించగా.. షఫాలీ వర్మ (25), ప్రియా పూనియా (28) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఖాకా, తుమి సెకుఖునే, మ్లాబా తలో వికెట్ పడగొట్టారు. -
సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్ ఇదే
భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన ఖారారైంది. ఈ ఏడాది నవంబర్లో సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. ఈ మెరకు భారత క్రికెట్ బోర్డు(BCCI), దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు(CSA)లు సంయుక్తంగా శుక్రవారం షెడ్యూల్ విడుదల చేశాయి. ఈ టూర్లో భాగంగా సఫారీ గడ్డపై భారత్ నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇరు జట్ల మధ్య నవంబర్ 8న డర్బన్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సౌతాఫ్రికా క్రికెట్ ఛైర్పర్సన్ లాసన్ నైడూ మాట్లాడుతూ.. "దక్షిణాఫ్రికా క్రికెట్కు ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తున్న బీసీసీఐకు దన్యవాదాలు. భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఈ సిరీస్ జరిగిన అది అభిమానులకు ఎంతో అనుభూతిని కలిగిస్తోంది. ఈ రెండు క్రికెట్ బోర్డుల మధ్య స్నేహ బంధం ఎల్లప్పుడూ ఇలానే కొనసాగాలని ఆశిస్తున్నాను. దక్షిణాఫ్రికా-భారత్ మధ్య టీ20 సిరీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని" పేర్కొన్నారు. మరోవైపు భారత్-దక్షిణాఫ్రికా మధ్య సిరీస్పై బీసీసీఐ క్యార్యదర్శి జైషా సైతం భారత్- దక్షిణాఫ్రికా మధ్య సిరీస్పై సంతోషం వ్యక్తం చేశారు. సంతోషం వ్యక్తం చేశారు. ఇరు జట్ల మద్య పోటీ ఇప్పుడు ఉత్కంఠభరితంగా ఉంటుందని జైషా తెలిపారు. కాగా 2024-2025 హోం సీజన్కు సంబంధించి టీమిండియా ఆడబోయే మ్యాచ్ల షెడ్యూల్ను బీసీసీఐ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ సెప్టెంబర్లో బంగ్లాదేశ్తో జరిగే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్తో మొదలై వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్తో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్తో ముగియనుంది.టీమిండియా దక్షిణాఫ్రికా టూర్ షెడ్యూల్ ఇదే..తొలి టీ20(డర్బన్)-నవంబర్ 8రెండో టీ20(సెయింట్ జార్జ్ పార్క్)- నవంబర్ 10మూడో టీ20(సెంచూరియన్)- నవంబర్ 13నాలుగో టీ20(జోహన్స్బర్గ్)- నవంబర్ 15 CSA AND BCCI ANNOUNCE UPCOMING SERIESCricket South Africa (CSA) and the Board of Control for Cricket in India (BCCI) are delighted to confirm the scheduling of yet another thrilling KFC T20 International (T20I) series, which will see India traveling to South Africa in November… pic.twitter.com/6xn8AkpK51— Proteas Men (@ProteasMenCSA) June 21, 2024 -
చరిత్రపుటల్లోకెక్కిన ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్
మహిళల క్రికెట్లో భాగంగా నిన్న (జూన్ 19) జరిగిన భారత్-సౌతాఫ్రికా వన్డే మ్యాచ్ చరిత్రపుటల్లోకెక్కింది. ఈ మ్యాచ్లో ఏకంగా నలుగురు బ్యాటర్లు సెంచరీల మోత మోగించారు. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్లో తొలుత భారత బ్యాటర్లు స్మృతి మంధన (136), హర్మన్ప్రీత్ కౌర్ (103 నాటౌట్) శతక్కొట్టగా.. ఆ తర్వాత సౌతాఫ్రికా ప్లేయర్లు లారా వాల్వార్డ్ట్ (135 నాటౌట్), మారిజన్ కాప్ (114) సెంచరీలతో విరుచుకుపడ్డారు.మ్యాచ్ విషయానికొస్తే.. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా చివరి బంతి వరకు పోరాడి ఓటమిపాలైంది. లారా వోల్వార్డ్ట్, మారిజన్ కాప్ సౌతాఫ్రికాను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. సౌతాఫ్రికా గెలుపుకు చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా.. పూజా వస్త్రాకర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 2 కీలక వికెట్లు తీసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చింది. ఫలితంగా భారత్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో గెలుపుతో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 325 పరుగుల స్కోర్ చేయగా.. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 321 పరుగులకు పరిమితమైంది. ఈ సిరీస్లో నామమాత్రపు మూడో వన్డే జూన్ 23న జరుగనుంది. -
ఉత్కంఠ సమరంలో టీమిండియా గెలుపు.. పోరాడి ఓడిన సౌతాఫ్రికా
స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్ వన్డే సిరీస్ను భారత మహిళా క్రికెట్ జట్టు మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. బెంగళూరు వేదికగా ఇవాళ (జూన్ 19) జరిగిన రెండో మ్యాచ్లో టీమిండియా 4 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా చివరి బంతి వరకు పోరాడి ఓడింది. లారా వోల్వార్డ్ట్, మారిజన్ కాప్ సెంచరీలతో సత్తా చాటినప్పటికీ సౌతాఫ్రికాను గెలిపించుకోలేకపోయారు.పూజా వస్త్రాకర్ ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసి సఫారీల విజయాన్ని అడ్డుకుంది. ఆఖరి ఓవర్లో సౌతాఫ్రికా గెలుపుకు 11 పరుగులు అవసరం కాగా.. వస్త్రాకర్ 2 కీలక వికెట్లు తీసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చింది.అంతకుముందు భారత్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 325 పరుగుల స్కోర్ చేసింది. కెప్టెన్ హార్మన్ప్రీత్ కౌర్ (103 నాటౌట్), వైస్ కెప్టెన్ స్మృతి మంధన (136) సెంచరీలతో కదంతొక్కారు.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి సౌతాఫ్రికా.. లారా వోల్వార్డ్ట్ (135 నాటౌట్), మారిజన్ కాప్ (114) శతక్కొట్టినప్పటికీ లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ మ్యాచ్లో మెరుపు సెంచరీతో మెరిసిన మంధన ఓ వికెట్ కూడా పడగొట్టింది.భారత బౌలర్లలో దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ తలో 2 వికెట్లు, అరుంధతి రెడ్డి, మంధన చెరో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్లో నామమాత్రపు మూడో వన్డే జూన్ 23న జరుగనుంది. -
టీమిండియాలోకి అరంగేట్రం చేసిన తెలుగు క్రికెటర్
హైదరాబాద్కు చెందిన మహిళా క్రికెటర్, తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డి టీమిండియాలోకి అరంగేట్రం చేసింది. మహిళల ఐసీసీ వన్డే ఛాంపియన్షిప్లో భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (జూన్ 19) జరుగుతున్న మ్యాచ్తో అరుంధతి వన్డే ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చింది. టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధన అరుంధతికి క్యాప్ అందించి టీమ్లోకి ఆహ్వానించింది. 2018లోనే టీ20 ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చిన 26 ఏళ్ల అరుంధతి.. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత తిరిగి జాతీయ జట్టులో స్థానం దక్కించుకుంది. రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్, రైట్ హాండ్ బ్యాటర్ అయిన అరుంధతి.. తన చివరి టీ20 మ్యాచ్ను 2021లో ఆడింది. టీ20ల్లో 26 మ్యాచ్ల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన అరుంధతి 18 వికెట్లు తీసి, 73 పరుగులు చేసింది. 𝒀𝒐𝒖 𝒂𝒍𝒘𝒂𝒚𝒔 𝒉𝒂𝒗𝒆 𝒂 𝒍𝒐𝒕 𝒎𝒐𝒓𝒆 𝒕𝒊𝒎𝒆 𝒕𝒉𝒂𝒏 𝒚𝒐𝒖 𝒕𝒉𝒊𝒏𝒌. Arundhati Reddy last played an international game in 2021. Now she is back 'stronger and calmer' for a 2.0 to gleam like first frost, an ODI debut for 🇮🇳. pic.twitter.com/7IWhw3GpfQ— The Bridge (@the_bridge_in) June 19, 2024కాగా, మూడు వన్డేలు, ఒక టెస్ట్, మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ల కోసం సౌతాఫ్రికా మహిళల క్రికెట్ జట్టు భారత్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లలో తొలుత వన్డే సిరీస్ ప్రారంభమైంది. వన్డే సిరీస్లో భాగంగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 143 పరుగుల భారీ తేడాతో గెలిచింది.బెంగళూరు వేదికగా ఇవాళ జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికా జట్టు టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా 17 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. 20 పరుగులు చేసి షఫాలీ వర్మ ఔట్ కాగా.. స్మృతి మంధన (19), దయాలన్ హేమలత (7) క్రీజ్లో ఉన్నారు. షఫాలీ వర్మ వికెట్ మ్లాబాకు దక్కింది.తుది జట్లు..భారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, హేమలత, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ, పూజ వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రాధ యాదవ్, అశా శోభనదక్షిణాఫ్రికా: లారా వోల్వార్డ్ (కెప్టెన్), తజ్మిన్, అన్నెకే, సునే లూస్, మరిజన్నే, నాడిన్ డిక్లెర్క్, షాంగసె, మెయికే డిరిడ్డర్, మసాబట క్లాస్, మ్లాబా, అయబొంగ. -
చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన, ఆశా శోభన
భారత క్రికెటర్ స్మతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్లో ఏడు వేల పరుగుల మైలురాయిని చేరుకుంది. తద్వారా మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు సాధించిన భారత రెండో మహిళా క్రికెటర్గా స్మృతి మంధాన నిలిచింది.దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో స్మృతి ఈ ఘనత సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆకాశమే హద్దుగా చెలరేగిన మంధాన.. శతకంతో మెరిసింది. 127 బంతులు ఎదుర్కొని 117 పరుగులు సాధించింది. వన్డేల్లో ఆమెకిది ఆరో సెంచరీ.ఈ క్రమంలో ఏడు వేల పరుగుల మైలురాయిని చేరుకున్న మంధాన.. మిథాలీ రాజ్(10868 రన్స్) తర్వాత ఈ ఘనత సాధించిన మహిళా క్రికెటర్గా నిలిచింది. మంధాన తర్వాత ఈ లిస్టులో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(6870 రన్స్) ఉంది.దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయంకాగా సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో భారత మహిళల క్రికెట్ జట్టు శుభారంభం చేసిన విషయం తెలిసిందే. ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో భారత్ 143 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. ఓపెనర్, వైస్ కెపె్టన్ స్మృతి మంధాన (127 బంతుల్లో 117; 12 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు సెంచరీతో చెలరేగింది.వన్డేల్లో స్మృతికి ఇదో ఆరో శతకం కాగా... భారత గడ్డపై మొదటిది కావడం విశేషం. ఒకదశలో భారత్ 99/5తో కష్టాల్లో నిలిచింది. అయితే లోయర్ ఆర్డర్లో దీప్తి శర్మ (48 బంతుల్లో 37; 3 ఫోర్లు), పూజ వస్త్రకర్ (42 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు) స్మృతికి సహకరించారు.5 వికెట్లు చేజార్చుకున్న తర్వాత కూడా భారత మహిళల బృందం 166 పరుగులు జోడించగలగడం తమ వన్డే చరిత్రలోనే అత్యధిక కావడం ప్రస్తావనాంశం. అనంతరం దక్షిణాఫ్రికా 37.4 ఓవర్లలో 122 పరుగులకే కుప్పకూలింది. సూన్ లూస్ (58 బంతుల్లో 33; 4 ఫోర్లు), సినాలో జఫ్తా (27 నాటౌట్), మరిజాన్ కాప్ (24) కొద్ది సేపు ప్రతిఘటించగలిగారు. కెరీర్లో తొలి వన్డే ఆడిన కేరళకు చెందిన లెగ్ స్పిన్నర్ ఆశా శోభన (4/21) ప్రత్యర్థిని పడగొట్టగా... దీప్తి శర్మకు 2 వికెట్లు దక్కాయి. ఆశా శోభన రికార్డుఅతి పెద్ద వయసులో (33 ఏళ్ల 92 రోజులు) భారత్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన ప్లేయర్గా ఆశా శోభన నిలిచింది. రెండో వన్డే బుధవారం ఇదే వేదికపై జరుగుతుంది. -
యువ భారత్ సంచలన విజయం.. వరల్డ్కప్ ఫైనల్లోకి ప్రవేశం
సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్-19 వరల్డ్కప్లో యువ భారత్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. సౌతాఫ్రికాతో ఇవాళ (ఫిబ్రవరి 6) జరిగిన తొలి సెమీఫైనల్లో ఉదయ్ సహారన్ సేన సంచలన విజయం సాధించి, ఆతిథ్య జట్టుకు గుండెకోతను మిగిల్చింది. 245 పరుగుల లక్ష్య ఛేదనలో 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన భారత్ను సచిన్ దాస్ (95), కెప్టెన్ ఉదయ్ సహారన్ (81) చిరస్మరణీయ ఇన్నింగ్స్లు ఆడి గెలిపించారు. వీరు ఐదో వికెట్కు 171 పరుగులు జోడించి సౌతాఫ్రికా చేతల నుంచి మ్యాచ్ను లాగేసుకున్నారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. లుహాన్ డ్రి ప్రిటోరియస్ (76), రిచర్డ్ సెలెట్స్వేన్ (64) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. ఆఖర్లో ట్రిస్టన్ లూస్ (23 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడగా.. కెప్టెన్ జుయాన్ జేమ్స్ (24) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలరల్లో రాజ్ లింబాని 3, ముషీర్ ఖాన్ 2, నమన్ తివారి, సౌమీ పాండే తలో వికెట్ పడగొట్టారు. 245 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్కు తొలి బంతికే షాక్ తగిలింది. సౌతాఫ్రికా సంచలన పేసర్ మపాకా ఆదర్శ్ సింగ్ను తొలి బంతికే ఔట్ చేశాడు. ఆతర్వాత నాలుగో ఓవర్లో టీమిండియాకు అతి భారీ షాక్ తగిలింది. భీకర ఫామ్లో ఉన్న ముషీర్ ఖాన్ను (4) ట్రిస్టన్ లూస్ పెవిలియన్కు పంపాడు. ఆతర్వాత భారత్ 10, 12 ఓవర్లలో అర్షిన్ కులకర్ణి (12), ప్రియాన్షు మోలియా (5) వికెట్లు కోల్పోయింది. ట్రిస్టన్ లూసే వీరిద్దరి వికెట్లు పడగొట్టాడు. ఈ దశలో జతకట్టిన ఉదయ్ సహారన్, సచిన్ దాస్ జోడీ సౌతాఫ్రికా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని వారి నుంచి మ్యాచ్ లాగేసుకుంది. చివర్లో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయి కాస్త ఒత్తిడికి లోనైనప్పటికీ.. రాజ్ లింబానీ (13 నాటౌట్) బౌండరీ బాది టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 48.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన భారత్ 2 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఫైనల్లోకి ప్రవేశించింది. ఫిబ్రవరి 8న జరిగే రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. -
దక్షిణాఫ్రికాతో భారత్ సెమీస్ పోరు..
అండర్–19 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆతిథ్య దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్ పోరుకు సిద్ధమైంది. 1988లో మొదలైన అండర్–19 ప్రపంచకప్ల చరిత్రలో అత్యధికంగా 8 సార్లు ఫైనల్ చేరిన భారత్... 2000, 2008, 2012, 2018, 2022లలో ఐదుసార్లు విజేతగా నిలిచింది. ఉదయ్ సహరన్ నేతృత్వంలోని యువ జట్టు ఆల్రౌండ్ నైపుణ్యంతో ఉంది. ఈ టోర్నీలో వరుసగా ఐదు విజయాలు సాధించింది. ఈ మెగా ఈవెంట్కు ముందు సన్నాహకంగా ఆడిన ముక్కోణపు సిరీస్లో సఫారీ జట్టును భారత్ రెండు వన్డేల్లో ఓడించింది. కీలకమైన సెమీస్కు ముందు యువ భారత్ ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశమిది. ఇదే సమరోత్సాహంతో ఆతిథ్య దక్షిణాఫ్రికాను మట్టికరిపించాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్లో ముషీర్ ఖాన్, కెప్టెన్ ఉదయ్, సచిన్ దాస్ సూపర్ ఫామ్లో ఉన్నారు. బౌలింగ్లో సౌమీ కుమార్ పాండే, నమన్ తివారి, రాజ్ లింబానిలు కూడా నిలకడగా రాణిస్తుండటం జట్టును పటిష్టంగా నిలిపింది. మధ్యాహ్నం 1.30 గంటలకు మొదలయ్యే ఈ సెమీస్ పోరును స్టార్స్పోర్ట్స్ ప్రసారం చేస్తుంది. -
బీసీసీఐతో ఇషాన్కు విభేదాలా? అందుకే సెలక్ట్ చేయలేదా?!
యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి వ్యవహరిస్తున్న తీరుపై అతడి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విరాట్ కోహ్లి వంటి సీనియర్లకు, కిషన్ లాంటి యువ ఆటగాళ్లకు వేర్వేరు నిబంధనలు ఉంటాయా అని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు కారణం ఏమిటంటే?!.. జట్టుతోనే ఉన్నా నో ఛాన్స్ గతేడాది కాలంగా జట్టులో పాటే ప్రయాణిస్తున్నా ఇషాన్ కిషన్కు తుదిజట్టులో చోటు కరువైంది. మూడు ఫార్మాట్లలో ఓపెనింగ్ బ్యాటర్ స్థానంలో శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ నుంచి.. వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ నుంచి ఈ జార్ఖండ్ ప్లేయర్ తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో అడపాదడపా మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. సౌతాఫ్రికా పర్యటన మధ్యలోనే స్వదేశానికి ఇషాన్ ఈ క్రమంలో సౌతాఫ్రికా పర్యటన నుంచి ఇషాన్ అకస్మాత్తుగా తిరిగి రావడం ప్రాధాన్యం సంతరించింది. మానసికంగా అలసిపోయానని.. అందుకే కొంతకాలం బ్రేక్ తీసుకోవాలని అతడు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. నిజానికి.. జట్టుతో పాటు ప్రయాణిస్తున్నా తగినంత ప్రాధాన్యం దక్కడం లేదనే ఆవేదనతో ఇషాన్ ఆటకు విరామం ఇవ్వాలని భావించినట్లు సమాచారం. అప్పటి నుంచే బీసీసీఐతో విభేదాలు? స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ నుంచే తనకు సెలవులు కావాలని ఇషాన్ అడిగినా.. మేనేజ్మెంట్ సానుకూలంగా స్పందించలేదని జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఎట్టకేలకు అతడి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని రిలీవ్ చేస్తే.. విశ్రాంతి తీసుకోకుండా దుబాయ్లో ట్రిప్ ఎంజాయ్ చేయడం ఏమిటని కొందరు బీసీసీఐ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వదంతులు వచ్చాయి. అందుకే సెలక్ట్ చేయలేదా? ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్ ఫ్యాన్స్- నెటిజన్లకు మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. వరల్డ్కప్-2024కు ముందు కీలకమైన అఫ్గనిస్తాన్తో సిరీస్కు ఇషాన్ కావాలనే అందుబాటులో ఉండకపోవడం అతడి పొగరుబోతుతనానికి సూచిక అని కొంతమంది తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి ఆటిట్యూడ్ ఉన్న ఆటగాడిని ప్రపంచకప్ టోర్నీలో ఆడించాలనే ఆలోచన ఉంటే మానుకోవాలని సూచిస్తున్నారు. ఇచ్చిన సెలవు ఎలా వాడుకుంటే వాళ్లకెందుకు?! అయితే, ఇషాన్ కిషన్ అభిమానులు ఇందుకు ఘాటుగానే బదులిస్తున్నారు. ‘‘విరాట్ కోహ్లి తాను మానసికంగా అలసిపోయానని సుదీర్ఘకాలం విశ్రాంతి తీసుకుంటూ.. విదేశాలకు వెళితే తప్పు లేదు.. కానీ ఇషాన్ లాంటి వాళ్లు సెలవు అడిగి ట్రిప్నకు వెళ్తే నేరమా? కావాలనే అఫ్గనిస్తాన్ సిరీస్ నుంచి తప్పించి.. పైగా అతడిపైనే నిందలు మోపడం సరికాదు. ఇచ్చిన సెలవును ఎలా వాడుకుంటే వాళ్లకెందుకు?’’ అని కౌంటర్ వేస్తున్నారు. దీంతో ఇషాన్ కిషన్ పేరు ఎక్స్ వేదికగా ట్రెండింగ్లోకి వచ్చింది. అందుకే దుబాయ్కి వెళ్లిన ఇషాన్ కాగా తన సోదరుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు ఇషాన్ దుబాయ్కు వెళ్లడం గమనార్హం. ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్తో జనవరి 11 నుంచి టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఈ సిరీస్తో రీఎంట్రీ ఇస్తున్నారు. చదవండి: Ind Vs Afg: అఫ్గన్తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
రెండు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్.. కేప్టౌన్ పిచ్పై ఐసీసీ సీరియస్
కేప్టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయం కన్న ఈ మ్యాచ్కు ఉపయెగించిన పిచ్ ఎక్కువ వార్తల్లో నిలిచింది. ఈ మ్యాచ్ కేవలం ఒకటిన్నర రోజుల్లోనే ముగిసింది. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్గా కేప్టౌన్ టెస్టు రికార్డులకెక్కింది. ఈ పిచ్పై పేసర్లు పండగ చేసుకున్నారు. ఈ మ్యాచ్ తొలి రోజు ఏకంగా 23 వికెట్లు నేలకూలాయి. దీంతో ఈ మ్యాచ్లో ఉపయోగించిన పిచ్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ పిచ్పై ఇరు జట్ల కెప్టెన్లు డీన్ ఎల్గర్, రోహిత్ శర్మ సైతం ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ఐసీసీ సీరియస్.. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కేప్టౌన్లోని న్యూలాండ్స్ పిచ్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండో టెస్టుకు ఉపయోగించిన పిచ్ నాసిరకంగా ఉందని ఐసీసీ పేర్కొంది. నిబంధనల ప్రకారం దక్షిణాఫ్రికా క్రికెట్ను మందలిస్తూ న్యూలాండ్స్ పిచ్కు ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. ఈ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన క్రిస్ బ్రాడ్ నివేదిక ప్రకారం ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. "న్యూలాండ్స్లోని పిచ్లో బ్యాటింగ్ చేయడం కష్టంగా మారింది. మ్యాచ్ జరుగుతున్న కొద్దీ బంతి భయంకరంగా బౌన్స్ అయింది. షాట్లు ఆడేందుకు చాలా కష్టమైంది. బౌన్స్ కారణంగానే వికెట్లు కూడా ఎక్కువగా నేలకూలాయి" అని బ్రాడ్ పేర్కొన్నారు. చదవండి: ENG vs IND: టీమిండియాకు గుడ్ న్యూస్.. స్టార్ ఆటగాడు వచ్చేస్తున్నాడు!? -
రోహిత్ వ్యాఖ్యలపై ఐసీసీ సీరియస్.. చర్యలకు సిద్దం!?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. తాజాగా కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు అనంతరం క్రికెట్ పిచ్లపైన రోహిత్ చేసిన వ్యాఖ్యలను ఐసీసీ సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం. ఐసీసీ మ్యాచ్ రిఫరీలను ఉద్దేశించి రోహిత్ ఘూటు వాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో రోహిత్ కామెంట్స్ను సీరియస్గా తీసుకున్న ఐసీసీ.. హిట్మ్యాన్పై చర్యలకు సిద్దమైనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. రోహిత్ ఏమన్నాడంటే? కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. దీంతో టెస్టు సిరీస్ను 1-1తో టీమిండియా సమం చేసింది. ఈ క్రమంలో పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో రోహిత్ మాట్లాడుతూ.. "ఇది కూడా క్రికెట్ పిచే కదా. ఆడింది మ్యాచే కదా! మ్యాచ్ రిఫరీలకు, ఐసీసీకి ఏం జరిగిందొ కనబడిందనే అనుకుంటున్నా. మరి దీనికేం రేటింగ్ ఇస్తారు? భారత్లో ప్రపంచకప్ ఫైనల్ కోసం తయారు చేసిన పిచ్పై ఓ బ్యాటర్ సెంచరీ చేసినా దానికి ‘యావరేజ్’ రేటింగ్ ఇస్తారు. ఇవేం ద్వంద్వ ప్రమాణాలు మరి! ఐసీసీ గానీ, రిఫరీలు గానీ తటస్థంగా ఉండాలి. కేప్టౌన్లో ఏం జరిగిందో అందరూ చూశారు. పిచ్ ఎలా ఉందో అందరికీ తెలుసు. నిజాయితీగా చెబుతున్నా... ఇలాంటి పిచ్లపై ఆడేందుకు నాకైతే ఎలాంటి ఇబ్బందులు లేవు. అలాగే విదేశీ జట్లు కూడా భారత్కు వచ్చినప్పుడు మూడు రోజుల్లో ముగిస్తే, స్పిన్ తిరిగితే ఇవేం పిచ్లు, ఇదేం చెత్త అని నోరుపారేసుకోవడం ఆపితే మంచిది" అని రోహిత్ పేర్కొన్నాడు. అయితే ఐసీసీ మాత్రం ఈ విషయంపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక దక్షిణాఫ్రికా పర్యటనను ముగించుకుని స్వదేశానికి చేరుకున్న భారత జట్టు అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్కు సిద్దమవుతోంది. జనవరి 11న మొహాలీ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఇరు దేశాల క్రికెట్ సెలక్షన్ కమిటీలు తమ జట్లను ప్రకటించాయి. చదవండి: IND Vs AFG: టీమిండియాలో ఛాన్స్ కొట్టేశాడు.. కట్ చేస్తే! అక్కడ 6 వికెట్లతో అదుర్స్ -
టెస్టు క్రికెట్లో మేమే బెస్ట్.. ఆ మాటలకు నాకు నవ్వొచ్చింది! వాన్కు అశ్విన్ కౌంటర్
దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ను సొంతం చేసుకోవాలనుకున్న భారత జట్టుకు మరోసారి నిరాశ ఎదురైన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసిన టీమిండియా.. రెండో టెస్టులో తిరిగి పుంజుకుంది. కేప్టౌన్ వేదికగా ప్రోటీస్తో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో భారత్ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. దీంతో రెండు మ్యాచ్ల సిరీస్ను 1-1 సమం రోహిత్ సేన చేసింది. ఏదేమైనప్పటికీ సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ మరోసారి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. అయితే తొలి టెస్టులో ఓటమి అనంతరం టీమిండియాను ఉద్దేశించి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఘాటు విమర్శలు చేశాడు. గత పదేళ్లలో భారత జట్టు అసలేం సాధించలేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా అతడి వ్యాఖ్యలకు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గట్టి కౌంటరిచ్చాడు. వాన్ కామెంట్స్ తనకు నవ్వు వచ్చేలా చేశాయి అంటూ అశ్విన్ అన్నాడు. "భారత జట్టు గత పదేళ్లలో ఏమి సాధించలేదని తొలి టెస్టు ఓటమి తర్వాత వాన్ కామెంట్స్ చేశాడు. అవును నిజంగానే మేము గత కొన్ని ఏళ్ల నుంచి ఐసీసీ ట్రోఫీలను గెలవలేకపోయాం. కానీ వరల్డ్క్రికెట్లో మా జట్టు బలమైన జట్టు. టెస్టు క్రికెట్లో అత్యుత్తమ జట్లలో మా టీమ్ ఒకటి. గత కొంతకాలంగా రెడ్ బాల్ క్రికెట్లో అద్బుతమైన విజయాలను సాధించాము. అతడు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత కొంతమంది భారత క్రికెట్ నిపుణులు సైతం సొంత జట్టుపై ఈ తరహా విమర్శలు చేశారు. నిజం చెప్పాలంటే వారు కామెంట్స్ చేసినప్పుడు నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే వారికి వారే ఆలోచించుకోవాలి. కేప్టౌన్ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 55 పరుగులకే ఆలౌటైంది. అదే తొలి టెస్టులో ఒక వేళ దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసి ఉంటే 65 పరుగులకే ఆలౌట్ అయ్యే అవకాశం లేదా? టీమిండియా కూడా ఆరంభంలో ఇబ్బంది పడింది. 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది. విరాట్, శ్రేయస్ జట్టును అదుకున్నారు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ కీలక శతకంతో రాణించాడు. చివరికి మేం 245 పరుగులు చేశాం. కాబట్టి టెస్ట్ క్రికెట్కు మిగితా ఫార్మాట్లకు చాలా తేడా ఉంది. మంచి, చెడూ రెండు వుంటాయి. భారత్ వంటి దేశంలో క్రికెట్ను ఒక మతంగా పరిగణిస్తారు. అందుకేనేమో మేం ఎక్కువగా విమర్శలకు గురవుతుంటామని" అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. -
అఫ్గాన్తో సిరీస్కు జట్టు ఎంపిక నేడే.. ?ముంబైకు చేరుకున్న రోహిత్ శర్మ. . వీడియో వైరల్
దక్షిణాఫ్రికా పర్యటనను విజయంతో ముగించిన భారత జట్టు.. శనివారం ముంబైకు చేరుకుంది. టీమిండియాకు ముంబై ఎయిర్పోర్ట్లో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొంతమంది ఎయిర్పోర్ట్ సిబ్బందితో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా కేప్టౌన్ వేదికగా ప్రోటీస్తో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ మ్యాచ్ను కేవలం రెండు రోజుల్లోనే టీమిండియా ముగించింది. దీంతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 1-1తో భారత్ సమం చేసింది. అంతకుముందు ఇదే పర్యటనలో సఫారీలతో జరిగిన టీ20, వన్డే సిరీస్ను టీమిండియానే సొంతం చేసుకుంది. ఇక స్వదేశానికి చేరుకున్న భారత జట్టు అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్కు సిద్దం కానుంది. ఈ సిరీస్కు భారత జట్టును ఆదివారం అజిత్ అగర్కార్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. కాగా ఈ సిరీస్తో రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తిరిగి టీ20ల్లో పునరాగమనం చేయనున్నట్లు తెలుస్తోంది. జనవరి 11న మొహాలీ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్తో ఈ మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. చదవండి: BBL 2023-24: ఏంటి బ్రో ఇది.. నాటౌట్కు ఔట్ ఇచ్చేసిన థర్డ్ అంపైర్! వీడియో వైరల్ View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
హిందీలో మాట్లాడిన సిరాజ్.. ట్రాన్స్లేటర్గా మారిన బుమ్రా! వీడియో వైరల్
మహ్మద్ సిరాజ్.. కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 6 వికెట్లతో అదరగొట్టిన సిరాజ్.. రెండో ఇన్నింగ్స్ కీలకమైన మార్క్రమ్ వికెట్ పడగొట్టాడు. ఓవరాల్గా 7 వికెట్లు సాధించిన సిరాజ్కు మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు వరించింది. పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో సిరాజ్కు ట్రాన్స్లేటర్గా టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా మారాడు. సిరాజ్ హిందీలో మాట్లాడితే బుమ్రా ఆంగ్లంలోకి అనువాదించాడు. సిరాజ్ మాట్లడుతూ.. ఈ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా సలహాల వల్లే మెరుగైన ప్రదర్శన చేయగలిగానని చెప్పుకొచ్చాడు. 'బుమ్రా బౌలింగ్ మొదలు పెట్టిన తర్వాత పిచ్ ఎలా ఉందో నాకు తెలియజేశాడు. ఇటువంటి వికెట్పై ఏ లెంగ్త్తో బౌలింగ్ వేయాలన్నది నాకు సలహా ఇచ్చాడు. అందుకు తగ్గట్టు నా లెంగ్త్ను సెట్ చేసుకున్నాను. నేను మరి ఎక్కువగా ఆలోచించలేదు. ఒకే లెంగ్త్లో స్ధిరంగా బౌలింగ్ చేస్తే చాలు వికెట్లు పొందవచ్చు అని భావించాను. మరో ఎండ్లో బుమ్రా బౌలింగ్ చేస్తుంటే.. అతడితో కలిసి స్పెల్ను పంచుకోవడం చాలా బాగుంటుందని" సిరాజ్ పేర్కొన్నాడు. దీన్ని బుమ్రా ఇంగ్లీష్లోకి ట్రాన్సెలెట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: IND Vs SA: 'టైమ్ వేస్ట్'.. భారత్-సౌతాఫ్రికా టెస్టు సిరీస్పై రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు Siraj praised Bumrah during the presentation in his answer in Hindi and gave him credit. Bumrah of course edited that part out in the English translation. Of course. — Vishal Misra (@vishalmisra) January 4, 2024 -
'టైమ్ వేస్ట్'.. భారత్-సౌతాఫ్రికా టెస్టు సిరీస్పై రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు
దక్షిణాఫ్రికా పర్యటనను టీమిండియా విజయంతో ముగించింది. కేప్టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో భారత జట్టు విజయ భేరి ముగించింది. దీంతో సిరీస్ను భారత్ 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్ను కేవలం ఐదు సెషన్లలోనే టీమిండియా ముగించింది. టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా ముగిసిన టెస్టుగా ఈ మ్యాచ్ నిలిచింది. అయితే సిరీస్ డ్రాగా ముగియడంపై టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను నిర్వహించడం సమయం వృధా అని రవిశాస్త్రి తెలిపాడు. అదనంగా మరో టెస్టును ఆడించి వుంటే సిరీస్ ఫలితం తేలి ఉండేదని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాగా రవిశాస్త్రి వ్యాఖ్యలతో చాలా మంది మాజీ క్రికెటర్లు సైతం ఏకీభవిస్తున్నారు. కాగా అంతకుముందు దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ కూడా ఈ తరహా వ్యాఖ్యలే చేశాడు. భారత్-దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ కేవలం రెండు మ్యాచ్లకు మాత్రమే పరిమితం కావడం సిగ్గు చేటు అని ఏబీడీ విమర్శించాడు. గొప్ప చరిత్ర ఉన్న దక్షిణాఫ్రికా- భారత్ సిరీస్లో కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే పెట్టడం నిజంగా అవమానకరం అంటూ డివిలియర్స్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇక దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చిన భారత్ జట్టు టీ20, వన్డే సిరీస్లను సొంతం చేసుకోగా.. టెస్టు సిరీస్ను డ్రాగా ముగించింది. -
Ind vs SA: సచిన్కు కూడా సాధ్యం కాలేదు: భారత తొలి క్రికెటర్గా బుమ్రా రికార్డు
Ind Vs SA 2nd Test- Records List: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో సంచలన విజయంతో కొత్త ఏడాదిని ప్రారంభించింది టీమిండియా. అంతేకాదు కేప్టౌన్లో టెస్టు మ్యాచ్ గెలిచిన ఆసియా తొలి జట్టుగానూ చరిత్ర సృష్టించింది. సెంచూరియన్లో జరిగిన తొలి మ్యాచ్ను ఆతిథ్య జట్టు మూడు రోజుల్లో ముగిస్తే.. పర్యాటక భారత జట్టు రెండో టెస్టును ఒకటిన్నర రోజుల్లోనే పూర్తి చేసింది. సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న చిరకాల కోరిక నెరవేరకపోయినా.. 1-1తో డ్రాగా ముగించి సౌతాఫ్రికాతో ట్రోఫీని పంచుకుంది. తొలి భారతీయ క్రికెటర్గా బుమ్రా ఈ నేపథ్యంలో కేప్టౌన్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోగా.. సౌతాఫ్రికా స్టార్ డీన్ ఎల్గర్తో కలిసి జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. తద్వారా.. దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్లో ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు గెల్చుకున్న తొలి భారతీయ క్రికెటర్గా బుమ్రా గుర్తింపు పొందాడు. సఫారీ గడ్డపై మెరుగైన రికార్డు ఉన్న టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్కు కూడా ఈ ఘనత సాధ్యం కాలేదు. కాగా తొలి టెస్టులో బుమ్రా నాలుగు వికెట్లు తీశాడు. రెండో టెస్టులో మొత్తంగా ఎనిమిది వికెట్లు కూల్చాడు. సఫారీ గడ్డపై బుమ్రా- సిరాజ్ జోడీ చరిత్ర.. ఇక పేసర్ల అద్భుత బౌలింగ్ కారణంగానే టీమిండియా కేప్టౌన్లో విజయఢంకా మోగించిందన్న విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్లో మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో చెలరేగి 55 పరుగులకే సౌతాఫ్రికాను ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించగా.. రెండో ఇన్నింగ్స్లో జస్ప్రీత్ బుమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగి ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. ఈ నేపథ్యంలో సిరాజ్, బుమ్రా సౌతాఫ్రికాలో అరుదైన రికార్డు సృష్టించారు. సఫారీ గడ్డపై ఒక టెస్టు మ్యాచ్లో ఇద్దరు భారత పేస్ బౌలర్లు (సిరాజ్, బుమ్రా) రెండు ఇన్నింగ్స్లలో ఆరు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. అదే విధంగా.. టీమిండియా తరఫున టెస్టుల్లో ఓవరాల్గా రెండోసారి మాత్రమే. 2014లో ఇంగ్లండ్తో లార్డ్స్లో జరిగిన టెస్టులో భువనేశ్వర్ కుమార్ (తొలి ఇన్నింగ్స్లో 6/82), ఇషాంత్ శర్మ (రెండో ఇన్నింగ్స్లో 7/74) తొలిసారి ఈ ఘనత సాధించారు. సౌతాఫ్రికాపై టీమిండియా విజయం నేపథ్యంలో నమోదైన మరిన్ని రికార్డులు ఇవే ►642: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టులో ఫలితం రావడానికి వచ్చిన బంతులు (107 ఓవర్లు). తక్కువ బంతుల పరంగా, ఓవర్ల పరంగా టెస్టు క్రికెట్లో ఫలితం వచ్చిన టెస్టుగా ఈ మ్యాచ్ రికార్డు పుస్తకాల్లో ఎక్కింది. 1932లో ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య మెల్బోర్న్లో జరిగిన టెస్ట్లో 656 బంతుల్లో ఫలితం వచ్చింది. ఇది మూడోసారి మాత్రమే ►3: రెండు రోజుల్లోనే ముగిసిన టెస్టులో భారత జట్టు నెగ్గడం ఇది మూడోసారి. గతంలో భారత జట్టు అఫ్గానిస్తాన్పై (బెంగళూరులో–2018), ఇంగ్లండ్పై (అహ్మదాబాద్లో–2021) ఈ ఘనత సాధించింది. ఓవరాల్గా ఇప్పటి వరకు 25 టెస్టుల్లో రెండు రోజుల్లోనే ఫలితం వచ్చింది. ►1: కేప్టౌన్లో భారత జట్టు టెస్టులో నెగ్గడం ఇదే తొలిసారి. గతంలో ఈ వేదికపై భారత్ ఆరు టెస్టులు ఆడి రెండింటిని ‘డ్రా’ చేసుకొని, నాలుగింటిలో ఓడింది. దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు రెండోసారి బ్యాటింగ్ చేసి టెస్టులో గెలవడం ఇదే మొదటిసారి. గతంలో ఇక్కడ భారత్ నెగ్గిన నాలుగు టెస్టుల్లో తొలుత బ్యాటింగ్ ప్రారంభించింది. ►5: దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు గెలిచిన టెస్టుల సంఖ్య (జోహనెస్బర్గ్లో–2, డర్బన్లో–1, సెంచూరియన్లో–1, కేప్టౌన్లో–1). దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ మొత్తం 25 టెస్టుల ఆడగా ... ఐదు టెస్టుల్లో విజయం సాధించింది. 13 టెస్టుల్లో ఓడిపోయింది. ఏడింటిని ‘డ్రా’ చేసుకుంది. నాలుగో కెప్టెన్గా రోహిత్ శర్మ ►4: రాహుల్ ద్రవిడ్ (2006), ధోని (2010), కోహ్లి (2018, 2021) తర్వాత దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టుకు టెస్టులో విజయాన్ని అందించిన నాలుగో కెప్టెన్గా రోహిత్ శర్మ గుర్తింపు పొందాడు. ►2: దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ను ‘డ్రా’గా ముగించడం భారత జట్టుకిది రెండోసారి. ధోని సారథ్యంలో 2010–2011లో మూడు టెస్టుల సిరీస్ను భారత్ 1–1తో సమంగా ముగించింది. ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో రెండు టెస్టుల సిరీస్ను టీమిండియా 1–1తో ‘డ్రా’గా ముగించింది. ►4: కేప్టౌన్లో రెండు రోజుల్లోనే ఫలితం వచ్చిన టెస్టులు. 1889, 1896లో దక్షిణాఫ్రికా–ఇంగ్లండ్ జట్ల మధ్య రెండు టెస్టులు... 2005లో దక్షిణాఫ్రికా–జింబాబ్వే జట్ల మధ్య ఒక టెస్టు రెండు రోజుల్లోనే ముగిశాయి. చదవండి: కంగ్రాట్స్ టీమిండియా.. అతడు మాత్రం భయపెట్టాడు! బుమ్రా కూడా -
కంగ్రాట్స్ టీమిండియా.. అతడు మాత్రం భయపెట్టాడు! బుమ్రా కూడా: సచిన్
తొలి టెస్టులో ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంది. కేప్టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను టీమిండియా చిత్తు చేసింది. దీంతో రెండు మ్యాచ్ల సిరీస్ను 1-1తో భారత జట్టు సమం చేసింది. అంతేకాకుండా కేప్టౌన్లో తమ తొలి టెస్టు విజయాన్ని టీమండియా నమోదు చేసింది. ఇక భారత్ విజయంలో టీమిండియా పేసర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించారు. తొలి ఇన్నింగ్స్లో సిరాజ్ 6 వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించగా.. రెండో ఇన్నింగ్స్లో బుమ్రా సైతం 6 వికెట్లతో సఫారీలను చావు దెబ్బతీశాడు. ఓవరాల్గా ఈ టెస్టులో సిరాజ్ 7 వికెట్లు, బుమ్రా 8 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో ప్రోటీస్ జట్టుతో సిరీస్ను సమం చేసిన రోహిత్ సేనను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభినందించాడు. అదే విధంగా రెండో ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగిన ప్రోటీస్ ఓపెనర్ ఐడైన్ మార్క్రమ్పై లిటిల్మాస్టర్ ప్రశంసల వర్షం కురిపించాడు. 'సిరీస్ను సమం చేసిన టీమిండియాకు అభినందనలు. అదేవిధంగా మార్క్రామ్ ఆడిన విధానం అద్భుతం. అతడి గురించి ఎంత మాట్లాడుకున్న తక్కువే. ఇటువంటి పిచ్పై కొన్ని సార్లు బౌలర్లపై ఎటాక్ చేయడమే సరైన నిర్ణయం. మార్క్రామ్ అదే చేసి చూపించాడు. ఇక బుమ్రా కూడా అద్బుతంగా బౌలింగ్ చేశాడు. ఇటువంటి పిచ్పై ఎలా బౌలింగ్ చేయాలన్నది బుమ్రా చేసి చూపించాడని" సచిన్ ఎక్స్(ట్విటర్)లో రాసుకొచ్చాడు. Congratulations to #TeamIndia for levelling the series! Markram’s approach was fantastic because sometimes attack is the best form of defence on a pitch like this. Well bowled by Bumrah, who showed us exactly, how bowling in the channel consistently is all that’s required on such… pic.twitter.com/e1HDLq0IgR — Sachin Tendulkar (@sachin_rt) January 4, 2024 -
సంచలన విజయం.. డబ్ల్యూటీసీలో అగ్రస్థానానికి చేరిన టీమిండియా
కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ చారిత్రత్మక విజయంతో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 54.16 శాతం పాయింట్లతో భారత జట్టు.. ఐదో స్ధానం నుంచి టాప్ ప్లేస్కు ఎగబాకింది. అదే విధంగా ఈ మ్యాచ్లో ఘోర ఓటమి చవిచూసిన సౌతాఫ్రికా 50 శాతం పాయింట్లతో రెండో స్ధానానికి పడిపోయింది. ఇక సౌతాఫ్రికా తర్వాతి స్ధానాల్లో న్యూజిలాండ్(50.0), ఆస్ట్రేలియా(50.0),బంగ్లాదేశ్(50.0) పాకిస్తాన్(45.83) కొనసాగుతున్నాయి. కాగా ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మూడో టెస్టు అనంతరం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మళ్లీ మార్పులు చోటు చేసుకోన్నాయి. ఒకవేళ ఆసీస్ విజయం సాధిస్తే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరే ఛాన్స్ ఉంది. చదవండి: ఏం జరిగిందో చూశారు కదా.. నోరుపారేసుకోవడం ఆపితే మంచిది: రోహిత్ -
ఏం జరిగిందో చూశారు కదా.. నోరుపారేసుకోవడం ఆపితే మంచిది: రోహిత్
2024 ఏడాదిని విజయంతో టీమిండియా ఆరంభించింది. కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టు కేవలం ఒకటిన్నర రోజుల్లోనే ఈ మ్యాచ్ను ముగించింది. దీంతో రెండు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసింది. 79 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్కు వేదికైన కేప్టౌన్ పిచ్పై ప్రస్తుతం క్రికెట్ వర్గాలపై తెగ చర్చనడుస్తోంది. ఈ పిచ్పై పేసర్లు అద్బుతాలు సృష్టించారు. ఒకటిన్నర రోజుల్లోనే 33 వికెట్లు నేలకూలాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్గా కేప్టౌన్ టెస్టు రికార్డులకెక్కింది. మ్యాచ్ అనంతరం ఇదే విషయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. భారత్ పిచ్లపై విమర్శలు చేసే వారికి రోహిత్ గట్టి కౌంటరిచ్చాడు. "ఇది కూడా క్రికెట్ పిచే కదా. ఆడింది మ్యాచే కదా! మ్యాచ్ రిఫరీలకు, ఐసీసీకి ఏం జరిగిందొ కనబడిందనే అనుకుంటున్నా. మరి దీనికేం రేటింగ్ ఇస్తారు? భారత్లో ప్రపంచకప్ ఫైనల్ కోసం తయారు చేసిన పిచ్పై ఓ బ్యాటర్ సెంచరీ చేసినా దానికి ‘యావరేజ్’ రేటింగ్ ఇస్తారు. ఇవేం ద్వంద్వ ప్రమాణాలు మరి! ఐసీసీ గానీ, రిఫరీలు గానీ తటస్థంగా ఉండాలి. కేప్టౌన్లో ఏం జరిగిందో అందరూ చూశారు. పిచ్ ఎలా ఉందో అందరికీ తెలుసు. నిజాయితీగా చెబుతున్నా... ఇలాంటి పిచ్లపై ఆడేందుకు నాకైతే ఎలాంటి ఇబ్బందులు లేవు. అలాగే విదేశీ జట్లు కూడా భారత్కు వచ్చినప్పుడు మూడు రోజుల్లో ముగిస్తే, స్పిన్ తిరిగితే ఇవేం పిచ్లు, ఇదేం చెత్త అని నోరుపారేసుకోవడం ఆపితే మంచిది" అని పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో రోహిత్ పేర్కొన్నాడు. చదవండి: Ind vs SA: దెబ్బకు దెబ్బ: రెండు రోజుల్లోనే ముగించిన టీమిండియా.. సరికొత్త చరిత్ర -
చరిత్రకెక్కిన విజయంతో సఫారీ టూర్ ముగింపు
తగ్గేదేలే... సినిమా డైలాగ్లా ఉంది సఫారీలో భారత పర్యటన తీరు! తొలి టెస్టును ఆతిథ్య జట్టు మూడు రోజుల్లోనే ముగిస్తే... రెండో టెస్టును టీమిండియా రెండు రోజుల్లోనే ఖతం చేసింది. మొదటి మ్యాచ్ ముగియగానే అందరూ ‘భారత్ సొంతగడ్డపై పులి... విదేశాల్లో పిల్లి’ అని నిట్టూర్చారు. ఇప్పుడదే విమర్శకులు ‘ఔరా’ అని విస్తుపోయేలా మన పేస్ పేట్రేగిపోయింది. అచ్చిరాని కేప్టౌన్లో కేక పెట్టింది. క్రీజులోకి దిగిన బ్యాటర్ల గుండెల్లో గుబులు రేపింది. ఇన్నేళ్లుగా ఏ వేదికపై గెలవలేకపోయామో అక్కడే చరిత్రకెక్కే గెలుపుతో భారత్ మళ్లీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. కేప్టౌన్: క్రికెట్నే శ్వాసించే భారత అభిమానులకు ఈ కొత్త సంవత్సరం కిక్ ఇచ్చే గిఫ్ట్ను టీమిండియా ఇచ్చింది. ఆఖరి రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. మొత్తం సఫారీ పర్యటనలో మూడు ఫార్మాట్ల సిరీస్ను సాధికారంగా ముగించింది. గత డిసెంబర్లో టి20 సిరీస్తో ఈ పర్యటన మొదలైంది. టి20 సిరీస్ను 1–1తో సమం చేసుకున్న టీమిండియా... వన్డే సిరీస్ను 2–1తో కైవసం చేసుకుంది. తాజాగా టెస్టు సిరీస్ను 1–1తో సమంగా ముగించింది. తద్వారా ఏ ఒక్క సిరీస్లోనూ తగ్గలేదు సరికదా... పైపెచ్చు వన్డేలతో ఒకమెట్టుపైనే నిలిచింది. అలా మొదలై... ఇలా కుదేలైంది! తొలిరోజే 23 వికెట్లతో ఆసక్తికర పేస్ డ్రామాకు తెరలేపిన మ్యాచ్... రెండో రోజు అదే పేస్ పదునుకు తెరపడేలా చేసింది. ఓవర్నైట్ స్కోరు 62/3తో గురువారం రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన దక్షిణాఫ్రికా 36.5 ఓవర్లలో 176 పరుగులకే కుప్పకూలింది. ఇంత తక్కువ జట్టు స్కోరులోనూ మార్క్రమ్ (103 బంతుల్లో 106; 17 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీ హైలైట్ కాగా... తొలి ఇన్నింగ్స్ను సిరాజ్ కూల్చితే... రెండో ఇన్నింగ్స్లో ఆ పని బుమ్రా (6/61) చేశాడు. 98 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం వల్ల భారత్ లక్ష్యం 79 పరుగులతో మరింత చిన్నదైంది. దీన్ని టీమిండియా 12 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 80 పరుగులతో చకచకా ఛేదించింది. ఒకడి పోరాటం... మరొకడి పేస్ ప్రతాపం టెస్టుల్లో ఆటంటే ఐదు రోజులు. నాలుగు ఇన్నింగ్స్లు... 15 సెషన్లు... 450 ఓవర్లు... 40 వికెట్లు... అంటే అందదూ (బ్యాటింగ్) డబుల్ యాక్షన్ చేయాల్సిందే! అన్ని రోజులు శ్రమించినా... ప్రతి సెషన్లోనూ చెమటోడ్చినా చాలా టెస్టుల్లో (డ్రాలతో) ఫలితమే రాదు! కేప్టౌన్లో మాత్రం పేస్ పదునుకు, భారత్ పట్టుదలకు ఒక వంతు (ఐదు సెషన్లలోపే)లోనే, రెండు రోజులు పూర్తవకముందే భారత్ జయభేరి మోగించింది. తొలి సెషన్లో దక్షిణాఫ్రికా ఓవర్నైట్ బ్యాటర్ మార్క్రమ్ వన్డేను తలపించే ఆటతీరుతో చకచకా పరుగులు సాధించాడు. మరోవైపు బుమ్రా... బెడింగ్హమ్ (11), కైల్ వెరిన్ (9)లను పడగొట్టడంలో సఫలమయ్యాడు. దీని వల్ల జట్టు స్కోరు వంద పరుగుల్లోపే సగం (85/5) వికెట్లను కోల్పోగా, మార్క్రమ్ ఫిఫ్టీ కూడా పూర్తయ్యింది. పిచ్ సంగతి, బుమ్రా పేస్ నిప్పులు వెంటనే అర్థమైపోవడంతో మార్క్రమ్ ధనాధన్ బౌండరీలతో సెంచరీ సాధించాడు. కానీ ఈలోపే బుమ్రా కూడా జాన్సెన్ (11), కేశవ్ మహరాజ్ (3) వికెట్లను చేజిక్కించుకున్నాడు. మార్క్రమ్ పోరాటానికి సిరాజ్ బౌలింగ్లో చుక్కెదురవగా... మిగతా టెయిలెండర్లు లంచ్లోపే అవుటయ్యారు. ఇక రెండో సెషన్లో లక్ష్యఛేదనకు దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్లో క్రీజులోకి దిగిన వారంతా వేగంగా బ్యాటింగ్ చేశారు. యశస్వి జైస్వాల్ (23 బంతుల్లో 28; 6 ఫోర్లు), గిల్ (11 బంతుల్లో 10; 2 ఫోర్లు), కోహ్లి (11 బంతుల్లో 12; 2 ఫోర్లు) అవుట్కాగా, కెపె్టన్ రోహిత్ (16 నాటౌట్; 2 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (4 నాటౌట్; 1 ఫోర్) అజేయంగా ముగించారు. సిరాజ్కు ‘ప్లేయర్ ఆఫ్ మ్యాచ్’ అవార్డు లభించగా... ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ పురస్కారాన్ని ఎల్గర్, బుమ్రా సంయుక్తంగా గెల్చుకున్నారు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 55 ఆలౌట్; భారత్ తొలి ఇన్నింగ్స్: 153 ఆలౌట్; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) రోహిత్ శర్మ (బి) సిరాజ్ 106; ఎల్గర్ (సి) కోహ్లి (బి) ముకేశ్ 12; జోర్జి (సి) రాహుల్ (బి) ముకేశ్ 1; స్టబ్స్ (సి) రాహుల్ (బి) బుమ్రా 1; బెడింగమ్ (సి) రాహుల్ (బి) బుమ్రా 11; వెరిన్ (సి) సిరాజ్ (బి) బుమ్రా 9; జాన్సెన్ (సి అండ్ బి) బుమ్రా 11; కేశవ్ మహరాజ్ (సి) అయ్యర్ (బి) బుమ్రా 3; రబడ (సి) రోహిత్ శర్మ (బి) ప్రసిధ్ కృష్ణ 2; బర్గర్ (నాటౌట్) 6; ఎన్గిడి (సి) యశస్వి (బి) బుమ్రా 8; ఎక్స్ట్రాలు 6; మొత్తం (36.5 ఓవర్లలో ఆలౌట్) 176. వికెట్ల పతనం: 1–37, 2–41, 3–45, 4–66, 5–85, 6–103, 7–111, 8–162, 9–162, 10–176. బౌలింగ్: బుమ్రా 13.5–0–61–6, సిరాజ్ 9–3–31–1, ముకేశ్ కుమార్ 10–2–56–2, ప్రసిధ్ కృష్ణ 4–1–27–1. భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (సి) స్టబ్స్ (బి) బర్గర్ 28; రోహిత్ శర్మ (నాటౌట్) 16; శుబ్మన్ గిల్ (బి) రబడ 10; కోహ్లి (సి) వెరిన్ (బి) జాన్సెన్ 12; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 10; మొత్తం (12 ఓవర్లలో మూడు వికెట్లకు) 80. వికెట్ల పతనం: 1–44, 2–57, 3–75. బౌలింగ్: రబడ 6–0–33–1, బర్గర్ 4–0–29–1, జాన్సెన్ 2–0–15–1. -
IND VS SA 2nd Test: అలా జరగడం దురదృష్టకరం: రోహిత్ శర్మ
కేప్టౌన్లో జరిగిన రెండో టెస్ట్లో టీమిండియా.. సౌతాఫ్రికాను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి రెండు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. సిరాజ్ (6/15) విశ్వరూపం ప్రదర్శించడంతో 55 పరుగులకే (తొలి ఇన్నింగ్స్లో) కుప్పకూలింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. ఓ దశలో భారీ స్కోర్ చేసేలా కనిపించినప్పటికీ, సఫారీ పేసర్లు ఒక్కసారిగా విరుచుకుపడటంతో 153 పరుగులకే పరిమితమైంది. టీమిండియా తమ చివరి ఆరు వికెట్లు ఒకే స్కోర్ వద్ద కోల్పోయి భారీ స్కోర్ చేయలేకపోవడమే కాకుండా ఓ అనవసరమైన చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆ తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికాను మార్క్రమ్ (106) చిరస్మరణీయ శతకంతో ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఈసారి బుమ్రా (6/60) సఫారీలను దెబ్బకొట్టాడు. ఫలితంగా ఆ జట్టు 176 పరుగులకే పరిమితమై, టీమిండియా ముందు 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. ఈ లక్ష్యాన్ని భారత్ ఆడుతూపాడుతూ ఛేదించి, సిరీస్ కోల్పోయే ప్రమాదం నుంచి తప్పించుకుంది. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఇదో గొప్ప విజయం. తొలి టెస్ట్లో చేసిన తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకున్నాం. మా బౌలర్లు అద్బుతంగా రాణించారు. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం ఆడాం. ఫలితం సాధించాం. బ్యాటర్లు కూడా తమవంతు ప్రయత్నం చేశారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించడం మా విజయావకాశాలను మెరుగుపర్చింది. తొలి ఇన్నింగ్స్లో ఒకే స్కోర్ వద్ద చివరి ఆరు వికెట్లు కోల్పోవడం దురదృష్టకరం. సిరాజ్ గురించి మాట్లాడుతూ.. ఆ స్పెల్ చాలా ప్రత్యేకం. ఎప్పుడోకాని ఇలాంటివి చూడలేము. బుమ్రా కూడా అద్బుతంగా బౌలింగ్ చేశాడు. సాధారణంగా బౌలింగ్ చేయాలని అనుకున్నాం. మిగతా పని పిచ్ చూసుకుంటుందని ఊహించాం. అదే జరిగింది. క్రెడిట్ మొత్తం పేసర్లకే దక్కుతుంది. సౌతాఫ్రికాకు ఎప్పుడు వచ్చినా పరిస్థితులు ఛాలెంజింగ్గా ఉంటాయి. ఇక్కడ గత నాలుగైదు సంవత్సరాల్లో మేము అత్యుత్తమ విజిటింగ్ జట్టుగా మారాం. ఇక్కడే కాదు ఓవర్సీస్ మొత్తంలో గత కొద్దికాలంగా మేము చాలా మెరుగయ్యాం. సిరీస్ గెలుచుంటే బాగుండేది. సౌతాఫ్రికా అత్యుత్తమ జట్టు. వారు మాకెప్పుడూ ఛాలెంజే. అందుకే మేము ఇక్కడ సిరీస్ (టెస్ట్) గెలవలేకపోతున్నాం. ఎల్గర్ గురించి మాట్లాడుతూ.. క్రికెట్ సౌతాఫ్రికాకు చాలా ముఖ్యమైన ఆటగాడు. కెరీర్ ఆధ్యాంతం జట్టు ఉన్నతికి తోడ్పడ్డాడు. ఇలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఈ మ్యాచ్లో ఎల్గర్ను త్వరగా ఔట్ చేయడం గురించి ముందే మాట్లాడుకున్నాం. ఎల్గర్ ఇలాంటి కెరీర్ కలిగి ఉండటం అభినందనీయం. ప్రతిసారీ ఇలాంటి ఆటగాడిని చూడలేము. అద్భుతమైన కెరీర్. అతని భవిష్యత్తుకు శుభాకాంక్షలు అంటూ హిట్మ్యాన్ ముగించాడు. -
అదే మా కొంపముంచింది.. మార్క్రమ్ బ్యాటింగ్ తీరు అత్యద్భుతం: సౌతాఫ్రికా కెప్టెన్
కేప్టౌన్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టెస్ట్లో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో చిత్తైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఇరు జట్ల పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ.. అంతిమంగా భారత పేసర్లదే పైచేయిగా నిలిచింది. సిరాజ్ (6/15) విశ్వరూపం ప్రదర్శించడంతో తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా.. ఆతర్వాత భారత్ను 153 పరుగులకే పరిమితం చేసి తిరిగి మ్యాచ్లోకి వచ్చింది. అనంతరం మార్క్రమ్ కఠినమైన పిచ్పై నమ్మశక్యంకాని రీతిలో బ్యాటింగ్ విన్యాసాలు ప్రదర్శించి టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే మరపురాని ఇన్నింగ్స్ (106) ఆడాడు. మార్క్రమ్ రెచ్చిపోతుండటంతో ఓ సమయంలో సౌతాఫ్రికా మ్యాచ్పై పట్టు సాధించేలా కనిపించింది. అయితే బుమ్రా (6/60) మరో ఎండ్లో ఎవరినీ కుదురుకోనీయకపోవడంతో సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్కు 176 పరుగుల వద్ద తెర పడింది. ఫలితంగా దక్షిణాఫ్రికా టీమిండియా ముందు స్వల్ప లక్ష్యాన్ని (79) ఉంచింది. ఈ లక్ష్యాన్ని భారత్ ఆడుతూపాడుతూ ఛేదించి, రెండు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమంగా ముగించింది. కెరీర్లో చివరి టెస్ట్ ఆడుతున్న దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ డీన్ ఎల్గర్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఇలా అన్నాడు. తొలి ఇన్నింగ్స్లో చావుదెబ్బ (55 పరుగులకు ఆలౌట్) తినడం మా విజయావకాశాలను దెబ్బతీసింది. మార్క్రమ్ చిరస్మరణీయ శతకంతో తిరిగి మమ్మల్ని మ్యాచ్లోకి తెచ్చాడు. భారత పేసర్లు పరిస్థితులను సద్వినియోగం చేసుకుని అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ ఓటమిని జీర్జించుకోవడం కాస్త కఠినమే. 2-0 తేడాతో సిరీస్ను గెలిచుంటే బాగుండేది. అయినా పర్లేదు. గెలుపు కోసం మా వంతు పోరాటం చేశాం. మా కుర్రాళ్ల ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. సిరీస్ ఆధ్యాంతం పేసర్లు బౌలింగ్ చేసిన తీరు.. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో మార్క్రమ్ బ్యాటింగ్ చేసిన తీరు అత్యద్భుతం. ఈ పిచ్పై ఫలితం అందరి ఊహలకు విరుద్దంగా వచ్చింది. దురదృష్టవశాత్తూ మేమే బాధితులమయ్యాము. ఈ ఫలితం ఓ గుణపాఠం లాంటిది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడంపై స్పందిస్తూ.. రోహిత్ శర్మ సైతం అదే పని చేసేవాడు. అంతిమంగా చూస్తే తొలి రోజు తొలి సెషనే మా కొంపముంచిందని ఎల్గర్ అన్నాడు. -
భారత్-సౌతాఫ్రికా రెండో టెస్ట్ విశేషాలు, రికార్డులు..
కేప్టౌన్ వేదికగా భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ పలు రికార్డులకు వేదికైంది. ఈ మ్యాచ్లో భారత్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, రెండు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసుకుంది. దీనికి ముందు సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కేప్టౌన్ టెస్ట్ రికార్డులు.. 2024లో తొలి టెస్ట్ కేవలం ఒకటిన్నర రోజుల్లో ముగిసింది (నాలుగున్నర సెషన్లు) భారత్.. సౌతాఫ్రికాను కేప్టౌన్లో తొలిసారి ఓడించింది కేప్టౌన్లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఏషియన్ కెప్టెన్గా రోహిత్ శర్మ రికార్డు కేప్టౌన్లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఏషియన్ జట్టుగా భారత్ రికార్డు ధోని తర్వాత సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ను డ్రా చేసుకున్న రెండో కెప్టెన్గా హిట్మ్యాన్ రికార్డు అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ తర్వాత టెస్ట్ల్లో సౌతాఫ్రికా అత్యల్ప స్కోర్ (55, తొలి ఇన్నింగ్స్) టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ జట్టు (భారత్) పరుగులేమీ (153 పరుగుల వద్ద) చేయకుండా తమ చివరి ఆరు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. 2024లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా మార్క్రమ్ రికార్డు టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా (బంతుల పరంగా) ముగిసిన టెస్ట్ మ్యాచ్ (642 బంతుల్లో) టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలి రోజు అత్యధిక వికెట్లు (23) పడిన రెండో మ్యాచ్గా రికార్డు. మ్యాచ్ విశేషాలు.. సిరాజ్ చెలరేగడంతో (6/15) తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది ఒకే స్కోర్ వద్ద (153, తొలి ఇన్నింగ్స్) టీమిండియా చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. కెరీర్లో తొమ్మిదో ఐదు వికెట్ల ప్రదర్శనతో (6/61) సౌతాఫ్రికా నడ్డివిరిచిన బుమ్రా సౌతాఫ్రికా తరఫున టెస్ట్ల్లో అత్యంత వేగవంతమైన ఆరో సెంచరీ (99 బంతుల్లో) చేసిన మార్క్రమ్ సౌతాఫ్రికా తరఫున ఓ పూర్తయిన టెస్ట్ ఇన్నింగ్స్లో అత్యధిక శాతం (60.22) పరుగులు చేసిన ఆటగాడిగా మార్క్రమ్ రికార్డు సౌతాఫ్రికా తాత్కలిక కెప్టెన్ డీన్ ఎల్గర్ టెస్ట్ కెరీర్ ముగిసింది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్-సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్- డీన్ ఎల్గర్, బుమ్రా స్కోర్ వివరాలు.. సౌతాఫ్రికా- 55 (వెర్రిన్ 15, సిరాజ్ 6/15), 176 (మార్క్రమ్ 106, బుమ్రా 6/61) భారత్- 153 (కోహ్లి 46, ఎంగిడి 3/30), 80/3 (జైస్వాల్ 28, జన్సెన్ 1/15) 7 వికెట్ల తేడాతో భారత్ విజయం -
చరిత్ర తిరగరాసిన భారత్-సౌతాఫ్రికా రెండో టెస్ట్ మ్యాచ్
కేప్టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ పలు రికార్డులను కొల్లగొట్టింది. కేవలం ఒకటిన్నర రోజుల్లోనే (నాలుగున్నర సెషన్లు) ముగిసిన ఈ మ్యాచ్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్గా రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్ కేవలం 642 బంతుల్లోనే ముగియగా.. గత రికార్డు 656 బంతులుగా ఉండింది. 1932లో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య మెల్బోర్న్లో జరిగిన మ్యాచ్ ఈ మ్యాచ్కు ముందు వరకు టెస్ట్ల్లో బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్గా ఉండింది. ఈ జాబితాలో వెస్టిండీస్-ఇంగ్లండ్ మధ్య 1935లో జరిగిన మ్యాచ్ మూడో స్థానంలో (672 బంతుల్లో) ఉండగా.. ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య 1888లో జరిగిన మ్యాచ్ నాలుగో స్థానంలో (788), ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య 1888లో జరిగిన మ్యాచ్ (లార్డ్స్) ఐదో స్థానంలో (792) ఉన్నాయి. ఇదిలా ఉంటే, కేప్టౌన్ టెస్ట్లో పేసర్లు విజృంభించడంతో టీమిండియా చారిత్రక విజయం సాధించింది. 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 3 వికెట్లు కోల్పోయి ఛేదించి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. సిరాజ్ (9-3-15-6) విజృంభణ ధాటికి తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకు కుప్పకూలగా... భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 153 పరుగులకు పరిమితమైంది. అనంతరం బుమ్రా (6/61) చెలరేగడంతో సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్లో 176 పరుగులకు ఆలౌటై, భారత్ ముందు 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఈ టార్గెట్ను భారత్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. -
Ind vs SA: రెండ్రోజుల్లోనే ముగించిన టీమిండియా.. సరికొత్త చరిత్ర
South Africa vs India, 2nd Test- India won by 7 wkts: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టుపై విజయఢంకా మోగించింది. తద్వారా రెండు మ్యాచ్ల సిరీస్ను 1-1తో డ్రా చేసుకుంది. కాగా సఫారీ గడ్డపై అందని ద్రాక్షగా ఉన్న టెస్టు సిరీస్ గెలవాలనే సంకల్పంతో రోహిత్ సేన సౌతాఫ్రికాలో అడుగుపెట్టింది. బాక్సింగ్ డే టెస్టులో ఘోర పరాజయం ఈ క్రమంలో సెంచూరియన్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో అనూహ్య రీతిలో ఘోర ఓటమిని చవిచూసింది. ఇన్నింగ్స్ మీద 32 పరుగుల తేడాతో సౌతాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. దీంతో సిరీస్ గెలవాలన్న ఆశలు అడియాసలు కాగా.. కనీసం డ్రా చేసుకుంటే చాలనే స్థితికి వచ్చింది టీమిండియా. ఇలాంటి దశలో బుధవారం కేప్టౌన్లో రెండో టెస్టు ఆరంభించింది. ఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత జట్టు సరికొత్త రికార్డులు సృష్టిస్తూ 55 పరుగులకే ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది. సీమర్లకు స్వర్గధామంగా భావించే న్యూలాండ్స్ పిచ్ మీద తొలి రోజే సఫారీల ఆట కట్టించింది. టీమిండియా పేసర్లలో మహ్మద్ సిరాజ్ ఏకంగా ఆరు వికెట్లు కూల్చి సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. జస్ప్రీత్ బుమ్రా, ముకేశ్ కుమార్ చెరో రెండు వికెట్లు కూల్చారు. ⭐⭐⭐⭐⭐ A 5-star performance from #JaspritBumrah in the 2nd innings, as he picks up his 4th witcket of the morning! Will his 9th Test 5-fer lead to a historic win for #TeamIndia? Tune in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/hjDyvSAJc3 — Star Sports (@StarSportsIndia) January 4, 2024 తొలి రోజే ఆధిక్యంలోకి టీమిండియా ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(39), శుబ్మన్ గిల్(36), విరాట్ కోహ్లి(46) మెరుగైన ఇన్నింగ్స్ కారణంగా 153 పరుగులు చేయగలిగింది. తద్వారా 98 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఓ చెత్త రికార్డు కూడా.. బుమ్రా ‘ఆరే’యడంతో అయితే, 153 పరుగుల వద్దే వరుసగా ఆరు వికెట్లు కోల్పోయి ఓ చెత్త రికార్డు కూడా నమోదు చేసింది. ఈ క్రమంలో మళ్లీ బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో 63/3 ఓవర్నైట్ స్కోరుతో గురువారం ఆట మొదలుపెట్టిన సౌతాఫ్రికాను బుమ్రా కోలుకోలేని దెబ్బకొట్టాడు. వరుస విరామాల్లో ఐదు వికెట్లు కూల్చి ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలు చేశాడు. సెంచరీ హీరో మార్క్రమ్ రూపంలో సిరాజ్ కీలక వికెట్ దక్కించుకోగా.. ముకేశ్ కుమార్కు రెండు, ప్రసిద్ కృష్ణకు ఒక వికెట్ దక్కాయి. దీంతో 176 పరుగుల వద్ద సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ముగిసిపోయింది. తొలి ఆసియా జట్టుగా చరిత్ర ఈ నేపథ్యంలో 79 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 12 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి ఛేదించింది. తద్వారా ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్ సమం చేసుకోవడమే గాక.. కేప్టౌన్లో టెస్టు మ్యాచ్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా చరిత్ర సృష్టించింది. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 28, శుబ్మన్ గిల్ 10, విరాట్ కోహ్లి 12 పరుగులు చేయగా.. కెప్టెన్ రోహిత్ శర్మ 17, శ్రేయస్ అయ్యర్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. మహ్మద్ సిరాజ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. చదవండి: కేఎల్ రాహుల్ చేసిన తప్పు వల్ల.. మార్క్రమ్ సెంచరీ! తొలి సఫారీ బ్యాటర్గా.. -
కఠినమైన పిచ్పై అద్భుత శతకం.. మార్క్రమ్ ఖాతాలో అరుదైన రికార్డు
కేప్టౌన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్లో సౌతాఫ్రికా ఆటగాడు ఎయిడెన్ మార్క్రమ్ అద్బుత శతకంతో (103 బంతుల్లో 106; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) అలరించిన విషయం తెలిసిందే. మార్క్రమ్ ఈ సెంచరీని ఎంతో కఠినమైన పిచ్పై సాధించడం విశేషం. ప్రత్యర్ధి బ్యాటర్లతో పాటు సొంత బ్యాటర్లు సైతం ఒక్కో పరుగు చేసేందుకు ఇబ్బందిపడ్డ పిచ్పై మార్క్రమ్ చిరస్మరణీయ సెంచరీ సాధించి ఔరా అనిపించాడు. పేసర్లకు స్వర్గధామంగా ఉన్న పిచ్పై సెంచరీ చేయడమే అద్భుతమనుకుంటే మార్క్రమ్ ఈ సెంచరీని కాస్త సౌతాఫ్రికా తరఫున టెస్ట్ల్లో అత్యంత వేగవంతమైన ఆరో సెంచరీగా (99 బంతుల్లో) మలిచాడు. అలాగే మార్క్రమ్ కేప్టౌన్లో సెంచరీ చేసిన తొలి ప్రొటిస్ బ్యాటర్గానూ రికార్డుల్లోకెక్కాడు. ఈ రికార్డులతో పాటు మార్క్రమ్ మరో రికార్డును సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. సౌతాఫ్రికా తరఫున ఓ పూర్తయిన టెస్ట్ ఇన్నింగ్స్లో అత్యధిక శాతం (60.22) పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ ఇన్నింగ్స్లో (సెకెండ్) సౌతాఫ్రికా 176 పరుగులు చేయగా.. మార్క్రమ్ ఒక్కడే 103 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్గా ఓ పూర్తయిన టెస్ట్ ఇన్నింగ్స్లో అత్యధిక శాతం పరుగుల రికార్డు ఆస్ట్రేలియా ఆటగాడు చార్లెస్ బ్యానర్మ్యాన్ పేరిట ఉంది. 1877లో ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ ఇన్నింగ్స్లో అతను జట్టు స్కోర్లో 67.34 శాతం పరుగులు సాధించాడు. ఆ ఇన్నింగ్స్లో ఆసీస్ 245 పరుగులు చేయగా.. బ్యానర్మ్యాన్ ఒక్కడే 165 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ విభాగంలో ఆసీస్ ఆటగాడు మైఖేల్ స్లేటర్ (66.84), టీమిండియా సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ (63.98) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే, మార్క్రమ్ సెంచరీతో చెలరేగడంతో సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్ 176 పరుగుల వద్ద ముగిసింది. టీమిండియా పేసు గుర్రం బుమ్రా ఆరు వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాశించాడు. ముకేశ్ 2, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు. టీమిండియా టార్గెట్ 79 పరుగులుగా ఉంది. అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులు చేయగా.. భారత్ తొలి ఇన్నింగ్స్లో 153 పరుగులకు ఆలౌటైంది. -
సౌతాఫ్రికా వెన్ను విరిచిన బుమ్రా.. టెస్టుల్లో 4 అరుదైన రికార్డులు
Ind vs SA 2nd Test Day 2: Jasprit Bumrah Records: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేప్టౌన్ వేదికగా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో కేవలం రెండు వికెట్లకే పరిమితమైన ఈ స్పీడ్స్టర్.. రెండో ఇన్నింగ్స్లో ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. న్యూలాండ్స్ పిచ్ మీద 63/3 ఓవర్నైట్ స్కోరుతో గురువారం బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆతిథ్య ప్రొటిస్ జట్టుకు బుమ్రా ఆరంభం నుంచే చుక్కలు చూపించాడు. ముందు రోజు ట్రిస్టన్ స్టబ్స్ రూపంలో వికెట్ దక్కించుకున్న బుమ్రా.. రెండో రోజు ఆట మొదలైన తొలి ఓవర్లో(17.6వ ఓవర్)నే డేవిడ్ బెడింగ్హామ్ను అవుట్ చేసి శుభారంభం అందించాడు. ఆ తర్వాత మరో నాలుగు ఓవర్ల అనంతరం కైలీ వెరెనెను పెవిలియన్కు పంపాడు. అనంతరం మార్కో జాన్సెన్ను అద్భుత రీతిలో బౌల్డ్ చేసిన ఈ రైటార్మ్ పేసర్.. కేశవ్ మహరాజ్ వికెట్ను కూడా తన ఖాతాలో వేసుకుని ఐదు వికెట్ల హాల్ అందుకున్నాడు. ఈ క్రమంలో లుంగి ఎంగిడీని అవుట్ చేసిన సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ముగించిన బుమ్రా ఖాతాలో ఆరో వికెట్ జమైంది. ఈ నేపథ్యంలో.. సౌతాఫ్రికాతో రెండో టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా జస్ప్రీత్ బుమ్రా నాలుగు అరుదైన రికార్డులు సాధించాడు. అవేంటంటే.. 1. సౌతాఫ్రికాలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్ 2. SENA(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించిన నాలుగో భారత బౌలర్. 3. సౌతాఫ్రికాలో అత్యధికసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన రెండో భారత బౌలర్. 4. న్యూలాండ్స్ పిచ్ మీద టెస్టుల్లో అత్యధిక వికెట్లు కూల్చిన రెండో బౌలర్(ఏకైక భారత బౌలర్). బుమ్రా కంటే ముందు ఈ ఘనతలు సాధించిన బౌలర్లు 1. సౌతాఫ్రికాలో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్లు 45 - అనిల్ కుంబ్లే 43 - జవగళ్ శ్రీనాథ్ 38* - జస్ప్రీత్ బుమ్రా 35 - మహ్మద్ షమీ 30 - జహీర్ ఖాన్. ⭐⭐⭐⭐⭐ A 5-star performance from #JaspritBumrah in the 2nd innings, as he picks up his 4th witcket of the morning! Will his 9th Test 5-fer lead to a historic win for #TeamIndia? Tune in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/hjDyvSAJc3 — Star Sports (@StarSportsIndia) January 4, 2024 2. SENA దేశాల్లో టెస్టుల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన భారత బౌలర్లు 7 - కపిల్ దేవ్ 6 - భగవత్ చంద్రశేఖర్ 6 - జహీర్ ఖాన్ 6 - జస్ప్రీత్ బుమ్రా. 3. సౌతాఫ్రికాలో టెస్టుల్లో అత్యధికసార్లు ఫైవ్ వికెట్ హాల్స్ తీసిన భారత బౌలర్లు 3 - జవగళ్ శ్రీనాథ్ 3 - జస్ప్రీత్ బుమ్రా 2 - వెంకటేష్ ప్రసాద్ 2 - ఎస్ శ్రీశాంత్ 2 - మహ్మద్ షమీ. 4. న్యూలాండ్స్ పిచ్(కేప్టౌన్) మీద అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్లు 25 - కొలిన్ బ్లైత్ (ఇంగ్లండ్) 18 - జస్ప్రీత్ బుమ్రా (భారత్)(న్యూలాండ్స్ పిచ్ మీద ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్) 17 - షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) 16 - జేమ్స్ అండర్సన్ (ఇంగ్లండ్) 15 - జానీ బ్రిగ్స్ (ఇంగ్లండ్) బుమ్రా ధాటికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 176 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రాకు ఆరు వికెట్లు దక్కగా.. ముకేశ్ కుమార్ రెండు, ప్రసిద్ కృష్ణ, సిరాజ్ ఒక్కో వికెట్ తీశారు. -
రాహుల్ చేసిన తప్పు వల్ల.. మార్క్రమ్ సెంచరీ! తొలి సఫారీ బ్యాటర్గా..
Ind vs SA 2nd Test- Fastest Test hundreds for South Africa: సౌతాఫ్రికా- టీమిండియా మధ్య నిర్ణయాత్మక రెండో టెస్టు.. కేప్టౌన్లో తొలి రోజే ఏకంగా 23 వికెట్లు.. భారత పేసర్ల ధాటికి తొలుత 55 పరుగులకే ఆలౌట్ అయిన సౌతాఫ్రికా... ఆ తర్వాత టీమిండియా 153 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించి 36 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆతిథ్య సౌతాఫ్రికా బుధవారం నాటి మొదటి రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. అప్పటికి ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ 51 బంతులు ఎదుర్కొని 36 పరుగులు, ఐదో నంబర్ బ్యాటర్ డేవిడ్ బెడింగ్హామ్ ఆరు బంతులు ఆడి 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక తొలి రోజు ఆటలో టీమిండియా పేసర్లలో మహ్మద్ సిరాజ్ ఏకంగా ఆరు వికెట్లు దక్కించుకోగా.. జస్ప్రీత్ బుమ్రా, ముకేశ్ కుమార్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇక టీమిండియా ఇన్నింగ్స్ సందర్భంగా సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్లు రబడ, లుంగి ఎంగిడి, నండ్రే బర్గర్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం మళ్లీ బౌలింగ్కు దిగిన టీమిండియా పేసర్లలో ముకేశ్ కుమార్ రెండు, బుమ్రా ఒక వికెట్ తీశారు. తద్వారా పేసర్లకు న్యూలాండ్స్ పిచ్ స్వర్గధామం అన్న విషయం మరోసారి నిరూపితమైంది. తొలి రోజే బ్యాటర్లుకు చుక్కలు చూపిస్తూ ఏకంగా 23 వికెట్ల ప్రదర్శనకు వేదికైన ఇలాంటి అత్యంత కఠినమైన పిచ్పై సెంచరీని ఊహించగలమా!? అది కూడా అత్యంత వేగవంతమైన శతకం!! ⭐⭐⭐⭐⭐ A 5-star performance from #JaspritBumrah in the 2nd innings, as he picks up his 4th witcket of the morning! Will his 9th Test 5-fer lead to a historic win for #TeamIndia? Tune in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/hjDyvSAJc3 — Star Sports (@StarSportsIndia) January 4, 2024 రెండో రోజు ఆట సందర్భంగా ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు సౌతాఫ్రికా ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్. గురువారం 63/3 ఓవర్నైట్ స్కోరుతో మొదలుపెట్టిన ప్రొటిస్ జట్టు.. బుమ్రా ధాటికి వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయిన వేళ మార్క్రమ్ పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు. రాహుల్ జారవిడిచిన క్యాచ్ వల్ల సెంచరీ భారత పేసర్లకు కొరకరాని కొయ్యగా మారిన అతడు 73 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న సమయంలో.. బుమ్రా బౌలింగ్లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ క్యాచ్ మిస్ చేయడంతో లైఫ్ పొందాడు. ఈ క్రమంలో 99 బంతుల్లోనే సెంచరీ మార్కు అందుకుని మార్క్రమ్ చరిత్రకెక్కాడు. కేప్టౌన్ గడ్డపై తొలి సఫారీ బ్యాటర్గా మార్క్రమ్ రికార్డు సౌతాఫ్రికా తరఫున టెస్టుల్లో అత్యంత వేగంగా శతకం బాదిన ఆరో బ్యాటర్గా మార్క్రమ్ నిలిచాడు. అదే విధంగా కేప్టౌన్లో ఈ ఘనత సాధించిన తొలి ప్రొటిస్ బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. సౌతాఫ్రికా తరఫున అత్యంత వేగంగా సెంచరీలు చేసింది వీరే ►ఏబీ డివిలియర్స్(75 బంతుల్లో)- ఇండియా మీద- 2010 సెంచూరియన్ మ్యాచ్లో.. ►హషీం ఆమ్లా(87 బంతుల్లో)- ఆస్ట్రేలియా మీద- 2012 పెర్త్ మ్యాచ్లో.. ►డెనిస్ లిండ్సే(95 బంతుల్లో)- ఆస్ట్రేలియా మీద- 1966 జొహన్నస్బర్గ్ మ్యాచ్లో ►జాంటీ రోడ్స్(95 బంతుల్లో)- వెస్టిండీస్ మీద- 1999 సెంచూరియన్ మ్యాచ్లో ►షాన్ పొలాక్(95 బంతుల్లో)- శ్రీలంక మీద- 2001 సెంచూరియన్ మ్యాచ్లో ►ఐడెన్ మార్క్రమ్(99 బంతుల్లో)- ఇండియా మీద- 2024 కేప్టౌన్ మ్యాచ్లో.. ఇక మార్క్రమ్ 106 పరుగుల స్కోరు వద్ద ఉన్న సమయంలో సిరాజ్ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తరువాత కగిసో రబడ(2), లుంగి ఎంగిడి(8) అవుట్ కావడంతో సౌతాఫ్రికా 176 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ ముగించి 78 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే 79 పరుగులు చేయాలి. రెండో రోజు ఆటలో బుమ్రా ఆరు వికెట్లు దక్కించుకోవడం విశేషం. KL Rahul dropped a regulation catch of Aiden Markram (73) #KLRahul #INDvsSA #SAvsIND pic.twitter.com/V0ACuF5puD — Outofaukaat (@outofaukaat) January 4, 2024 -
చెలరేగిన పేసర్లు.. సౌతాఫ్రికాపై టీమిండియా చారిత్రక విజయం
South Africa Vs India 2nd Test 2024 Day 2 Updates- కేప్టౌన్: చెలరేగిన పేసర్లు.. సౌతాఫ్రికాపై టీమిండియా చారిత్రక విజయం కేప్టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పేసర్లు విజృంభించడంతో టీమిండియా చారిత్రక విజయం సాధించింది. 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 3 వికెట్లు కోల్పోయి ఛేదించి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. సిరాజ్ (9-3-15-6) విజృంభణ ధాటికి తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకు కుప్పకూలగా... భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 153 పరుగులకు పరిమితమైంది. అనంతరం బుమ్రా (6/61) చెలరేగడంతో సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్లో 176 పరుగులకు ఆలౌటై, భారత్ ముందు 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఈ టార్గెట్ను భారత్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. స్కోర్ వివరాలు.. సౌతాఫ్రికా- 55 (వెర్రిన్ 15, సిరాజ్ 6/15), 176 (మార్క్రమ్ 106, బుమ్రా 6/61) భారత్- 153 (కోహ్లి 46, ఎంగిడి 3/30), 80/3 (జైస్వాల్ 28, జన్సెన్ 1/15) 7 వికెట్ల తేడాతో భారత్ విజయం మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. కోహ్లి ఔట్ 75 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. జన్సెన్ బౌలింగ్లో కోహ్లి (12) ఔటయ్యాడు. భారత్ లక్ష్యానికి ఇంకా నాలుగు పరుగుల దూరంలో ఉంది. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. గిల్ ఔట్ 57 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్లో శుభ్మన్ గిల్ (10) ఔటయ్యాడు. భారత్ గెలుపుకు ఇంకా 22 పరుగుల దూరంలో ఉంది. తొలి వికెట్ కోల్పోయిన భారత్.. జైస్వాల్ ఔట్ 44 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. బర్గర్ బౌలింగ్లో జైస్వాల్ (28) ఔటయ్యాడు.భారత్.. దక్షిణాఫ్రికా గడ్డపై చారిత్రక గెలుపుకు ఇంకా 35 పరుగుల దూరంలో ఉంది. దూకుడుగా ఆడుతున్న జైస్వాల్.. లక్ష్యంగా దిశగా దూసుకుపోతున్న టీమిండియా 79 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా దూకుడుగా ఆడుతుంది. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ టీ20 తరహాలో విరుచుకుపడుతున్నాడు. అతను కేవలం 21 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 24 పరుగులు చేశాడు. రోహిత్ 6 పరుగులతో అతని జతగా క్రీజ్లో ఉన్నాడు. 5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 35/0గా ఉంది. 176 పరుగులకు ఆలౌటైన సౌతాఫ్రికా.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..? సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్ 176 పరుగుల వద్ద ముగిసింది. మార్క్రమ్ అద్భుతమైన సెంచరీ సాధించిన అనంతరం సౌతాఫ్రికా వెంటవెంటనే వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. ఆఖరి వికెట్ (ఎంగిడి (8)) కూడా బుమ్రాకే దక్కింది. దీంతో బుమ్రా ఖాతాలో ఆరు వికెట్లు చేరాయి. తొలి ఇన్నింగ్స్లో రెండు, ఈ ఇన్నింగ్స్లో ఆరు కలుపుకుని బుమ్రా ఖాతాలో మొత్తంగా ఎనిమిది వికెట్లు పడ్డాయి. బుమ్రాతో పాటు ముకేశ్ 2, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో వికెట్ దక్కించుకున్నారు. టీమిండియా టార్గెట్ 79 పరుగులుగా ఉంది. మ్యాచ్కు లంచ్ విరామం ప్రకటించారు. భారత పేసర్ల విజృంభణ.. తొమ్మిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 32.1: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో రోహిత్కు క్యాచ్ ఇచ్చి తొమ్మిదో వికెట్గా వెనుదిరిగిన రబడ(2) ఎనిమిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 31.4: సిరాజ్ బౌలింగ్లో సెంచరీ హీరో మార్క్రమ్ అవుట్ సెంచరీ పూర్తి చేసిన మార్క్రమ్.. 60 పరుగుల ఆధిక్యంలో సౌతాఫ్రికా ఓపెనర్గా బరిలోకి దిగిన మార్క్రమ్ అత్యంత కఠినమైన పిచ్పై అద్బుత సెంచరీతో (99 బంతుల్లో 102 నాటౌట్; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగాడు. టెస్ట్ల్లో సౌతాఫ్రికా తరఫున ఇది ఆరో వేగవంతమైన సెంచరీ కూడా కావడం విశేషం. ఐదేసిన బుమ్రా.. పట్టుబిగించిన టీమిండియా 3 వికెట్ల నష్టానికి 62 పరుగుల స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా.. బుమ్రా ధాటికి తొలి సెషన్లోనే మరో 4 వికెట్లు కోల్పోయింది. మొత్తంగా బుమ్రా ఈ ఇన్నింగ్స్లో ఐదు వికెట్లతో (5/59) చెలరేగడంతో సౌతాఫ్రికా 30 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 60 పరుగుల ఆధిక్యంలో ఉంది. మార్క్రమ్ (102 నాటౌట్) అద్భుత శతకంతో ఒంటరిపోరాటం చేస్తున్నాడు. అతనికి జతగా రబాడ (2) క్రీజ్లో ఉన్నాడు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికా వర్సెస్ ఇండియా రెండో టెస్టు తుదిజట్లు సౌతాఫ్రికా డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రమ్, టోనీ డి జోర్జీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెర్రెన్నె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, నండ్రే బర్గర్, లుంగి ఎంగిడి. టీమిండియా రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ముకేష్ కుమార్. -
Ind vs SA: నిన్న సిరాజ్.. నేడు బుమ్రా.. ఉతికి ‘ఆరే’శారు
సౌతాఫ్రికా- టీమిండియా మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆట మొదలైంది. కేప్టౌన్ వేదికగా 63/3(17) ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ప్రొటిస్ జట్టుకు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా చుక్కలు చూపిస్తున్నాడు. ఈ స్పీడ్స్టర్ దాటికి సౌతాఫ్రికా మొదటి సెషన్లోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. గురువారం నాటి ఆటలో భాగంగా తొలి ఓవర్లోనే డేవిడ్ బెడింగ్హామ్ను పెవిలియన్కు పంపాడు బుమ్రా. 17.6వ ఓవర్ వద్ద 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న సమయంలో బెడింగ్హామ్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ మరుసటి నాలుగో ఓవర్లో బుమ్రా మరోసారి తన బౌలింగ్ పదును రుచి చూపించాడు. 21.1 ఓవర్ వద్ద కైలీ వెరెనె(9) వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత మళ్లీ 23.5వ ఓవర్ వద్ద మార్కో జాన్సెన్ను అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు బుమ్రా. తద్వారా రెండో రోజు తొలి సెషన్లోనే మూడో వికెట్ కూడా దక్కించుకున్నాడు. ఆ తర్వాత కేశవ్ మహరాజ్ను పెవిలియన్కు పంపి నాలుగో వికెట్ తన ఖాతాలో జమ చేసుకున్నాడు. ఇక మొదటి రోజు ఆటలో భాగంగా బుమ్రా ట్రిస్టన్ స్టబ్స్ను అవుట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో బుమ్రా ఇప్పటికే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం. ఇదిలా ఉంటే.. బుమ్రా ధాటికి 117 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా.. 176 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. సెంచరీ హీరో ఐడెన్ మార్క్రమ్ వికెట్ను మహ్మద్ సిరాజ్ దక్కించుకోగా.. ప్రసిద్ కృష్ణ ఒక వికెట్ తీశాడు. ఆఖర్లో బుమ్రా తన ఆరో వికెట్గా లుంగి ఎంగిడిని పెవిలియన్కు పంపి సౌతాఫ్రికా ఇన్నింగ్స్కు ముగింపు పలికాడు. ఇక సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకే ఆలౌట్ చేయడంలో సిరాజ్ ఆరు వికెట్లతో కీలక పాత్ర పోషించగా.. రెండో ఇన్నింగ్స్లో బుమ్రా ఆరేయడం(ఆరు వికెట్లు తీయడం) విశేషం. Ugly shot, handy wicket!#JaspritBumrah adds to his tally of wickets, getting his 2️⃣nd scalp of the morning.#SouthAfrica 5️⃣ down and still trailing. Tune in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/xdVMC5Bit3 — Star Sports (@StarSportsIndia) January 4, 2024 -
ఇటువంటి పిచ్ను నా కెరీర్లో చూడలేదు: సౌతాఫ్రికా కెప్టెన్
కేప్టౌన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య ప్రారంభమైన రెండో టెస్టు మొదటి రోజు వికెట్ల వర్షం కురిసింది. ఇరు జట్ల పేసర్ల చెలరేగడంతో ఏకంగా మొదటి రోజు 23 వికెట్లు నేలకూలాయి. మొదటి ఇన్నింగ్స్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా కేవలం 55 పరుగులకే కుప్పకూలగా.. అనంతరం టీమిండియా కూడా 153 పరుగులకే చాపచుట్టేసింది. భారత బౌలర్లలో పేసర్ మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో విజృంభించాడు. సఫారీ బౌలర్లలో బర్గర్, రబాడ, ఎంగిడీ తలా మూడు వికెట్లు పడగొట్టారు. ఇక కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న డీన్ ఎల్గర్.. ఈ టెస్టు రెండు ఇన్నింగ్స్లలోనూ దారుణంగా విఫలమయ్యాడు. తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన ఎల్గర్ రెండో టెస్టులో మాత్రం 4 పరుగులు మాత్రమే చేశాడు. ఇక తొలి రోజు ఆట అనంతరం స్టార్స్పోర్ట్స్తో మాట్లాడిన ఎల్గర్ కేప్టౌన్ పిచ్ పరిస్థితి గురించి వివరించాడు. సెషన్ కొనసాగుతన్నకొద్దీ వికెట్ పరిస్థితి మారిపోయిందని ఎల్గర్ చెప్పుకొచ్చాడు. "సాధారణంగా న్యూలాండ్స్ పిచ్ కొంచెం స్లోగా ఉంటుంది. బ్యాటర్ కాస్త సమయం వెచ్చిస్తే క్రీజులో నిలదొక్కకోవచ్చు. అందుకే తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాను. కానీ ఈ మ్యాచ్లో సెషన్ కొనసాగుతున్న కొద్దీ బంతి గతిలో మార్పు కన్పించింది. అంతేకాకుండా బౌన్స్ కూడా చాలా ఎక్కవైంది. దీంతో బ్యాటర్లు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నాను. అయితే పిచ్ను దగ్గరనుంచి చూస్తే బాగానే ఉన్నట్లు అన్పిస్తోంది. గతంలో ఎప్పుడూ ఈ వేదికలో ఇలా జరగలేదు. డొమాస్టిక్ క్రికెట్లో కూడా ఇప్పటివరకు ఇంత చెత్త గణాంకాలు నమోదు కాలేదు. ఇటువంటి పిచ్ను ఇప్పటివరకు నా కెరీర్లో చూడలేదు" స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎల్గర్ పేర్కొన్నాడు. కాగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. చదవండి: Ind Vs SA: రెండో టెస్టులో విజయం భారత్దే.. ఎందుకంటే?: టీమిండియా దిగ్గజం -
చివరి మ్యాచ్ ఆడిన ఎల్గర్..
-
Ind Vs SA: ‘రెండో టెస్టులో టీమిండియాదే విజయం.. ఎందుకంటే?’
Ind Vs SA 2nd Test: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ధీమా వ్యక్తం చేశాడు. తొలి రోజే ప్రొటిస్ జట్టు కీలక వికెట్లు కోల్పోయింది కాబట్టి భారత్ గెలుపు సాధ్యమవుతుందని పేర్కొన్నాడు. టీమిండియా పేసర్లు మరోసారి విజృంభించి సౌతాఫ్రికాను తక్కువ స్కోరుకే కట్టడి చేసి శుభారంభం అందిస్తే.. బ్యాటర్లు విజయ లాంఛనం పూర్తి చేయగలరని గావస్కర్ అంచనా వేశాడు. కాగా సెంచూరియన్ వేదికగా బాక్సింగ్ డే టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసిన రోహిత్ సేన.. రెండో మ్యాచ్లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. సఫారీ గడ్డపై తొలిసారి సిరీస్ గెలిచే అవకాశాన్ని ఆదిలోనే చేజార్చుకున్న టీమిండియా.. కేప్టౌన్లో గెలిచి కనీసం డ్రా చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా బుధవారం మొదలైన టెస్టులో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. అనూహ్య రీతిలో సౌతాఫ్రికాను 55 పరుగులకే ఆలౌట్ చేసింది. 36 పరుగుల ఆధిక్యంలో టీమిండియా ఆ తర్వాత 153 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. అనంతరం మళ్లీ బౌలింగ్ చేసిన టీమిండియాకు మూడు వికెట్లు దక్కాయి. డీన్ ఎల్గర్ రూపంలో కీలక బ్యాటర్ను అవుట్ చేయగలిగింది. ఈ క్రమంలో తొలి రోజు ఆట ముగిసే సరికి సౌతాఫ్రికా 17 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేయగా.. టీమిండియాకు 36 పరుగుల ఆధిక్యం దక్కింది. రోహిత్ సేనదే విజయం.. ఎందుకంటే ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయింది. భారత్ ఇంకా ఆధిక్యంలోనే కొనసాగుతోంది. కాబట్టి మ్యాచ్ టీమిండియా చేజారిపోతుందని నేను అనుకోవడం లేదు. సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్లో మిగిలిన ఆటగాళ్లంతా కలిసి 150- 200 పరుగులు చేయడం మాత్రం కష్టమే. కాబట్టి భారత్కు విజయావకాశాలు ఎక్కువే. ఇన్నింగ్స్ తేడాతో విజయం దక్కకపోయినా.. మెరుగైన స్థితిలోనే ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. చదవండి: Ind vs SA: అస్సలు ఊహించలేదు.. వాళ్లిద్దరి సహకారం వల్లే సాధ్యమైంది: ‘సిక్సర్’ సిరాజ్ -
చివరి మ్యాచ్ ఆడిన ఎల్గర్.. అభిమానుల మనసు గెలుచుకున్న కోహ్లి!
కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు. తన చర్యతో అభిమానుల మనసును గెలుచుకున్నాడు. తన కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న దక్షిణాఫ్రికా స్టాండింగ్ కెప్టెన్ డీన్ ఎల్గర్కు కోహ్లి ఘనమైన విడ్కోలు పలికాడు. ఏం జరిగిందంటే..? ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించేందుకు చివరిసారిగా ఎల్గర్ మైదానంలో అడుగుపెట్టాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసిన ఎల్గర్.. రెండో ఇన్నింగ్స్లో కూడా కేవలం 12 పరుగులే చేశాడు. సెకెండ్ ఇన్నింగ్స్ 11 ఓవర్ వేసిన ముఖేష్ కుమార్ బౌలింగ్లో రెండో బంతిని ఎల్గర్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్తీసుకుని ఫస్ట్ స్లిప్ దిశగా వెళ్లింది. అక్కడ వున్న విరాట్ కోహ్లి ఈజీగా క్యాచ్ను అందుకున్నాడు. క్యాచ్ను పట్టిన వెంటనే కోహ్లి ఎటువంటి సెలబ్రేషన్స్ జరపుకోకుండా పరిగెత్తుకుంటూ ఎల్గర్ వద్దకు వెళ్లి అతడని అలింగనం చేసకున్నాడు. అంతేకాకుండా స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలని డ్రెస్సింగ్ రూమ్తో ప్రేక్షకులకు సూచించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కోహ్లి చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజే ఏకంగా 23 వికెట్లు నేలకూలాయి. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా 153 పరుగులకు ఆలౌటైంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. చదవండి: Ind vs SA: అస్సలు ఊహించలేదు.. వాళ్లిద్దరి సహకారం వల్లే సాధ్యమైంది: ‘సిక్సర్’ సిరాజ్ #MukeshKumar's nibbler gets #DeanElgar on his final test! Will #TeamIndia keep racking up wickets before the day's play? Tune in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/qftk1SpI8D — Star Sports (@StarSportsIndia) January 3, 2024 -
అస్సలు ఊహించలేదు.. వాళ్లిద్దరి సహకారం వల్లే ఇలా: సిరాజ్
Ind vs SA 2nd Test- Siraj Comments: కేప్టౌన్ టెస్టులో తొలి రోజే ‘సిక్సర్’తో సంచలనం సృష్టించాడు టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికాకు దిమ్మతిరిగే షాకిచ్చాడు. పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా, యువ పేసర్ ముకేశ్ కుమార్తో కలిసి ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించి.. టెస్టుల్లో తొలిసారి తన అత్యుత్తమ గణాంకాలు(6/15) నమోదు చేశాడు. కీలక వికెట్లు పడగొట్టిన సిరాజ్ మొత్తంగా తొమ్మిది ఓవర్ల బౌలింగ్లో కేవలం పదిహేను పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు. ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్(2), కెప్టెన్ డీన్ ఎల్గర్(4), టోనీ డీ జోర్జీ(2) రూపంలో బిగ్ వికెట్లు దక్కించుకున్న సిరాజ్ మియా.. డేవిడ్ బెడింగ్హాం(12), కైలీ వెరెనె(15), మార్కో జాన్సెన్(0)ల వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు.. బుమ్రా ట్రిస్టన్ స్టబ్స్(3), నండ్రీ బర్గర్(4)లను పెవిలియన్కు పంపగా.. ముకేశ్ కుమార్ కేశవ్ మహరాజ్(3), కగిసో రబడ(5) వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో టీమిండియా పేసర్ల దెబ్బకు 55 పరుగులకే ఆలౌట్ అయింది ఆతిథ్య సౌతాఫ్రికా. ఆధిక్యంలో రోహిత్ సేన ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన 153 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఈ క్రమంలో సౌతాఫ్రికా మళ్లీ బ్యాటింగ్కు దిగగా.. ఆట ముగిసే సరికి 17 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. టీమిండియా కంటే ఇంకా 36 పరుగులు వెనుకబడి ఉంది. అస్సలు ఊహించలేదు ఈ నేపథ్యంలో బుధవారం నాటి ఆట ముగిసిన అనంతరం విలేకరులతో మాట్లాడిన మహ్మద్ సిరాజ్కు.. ‘‘ఒకేరోజు రెండుసార్లు బౌలింగ్ చేయాల్సి వస్తుందని ఊహించారా?’’ అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ఇలా జరగుతుందని మీరైనా ఊహించారా? లేదు కదా.. మేము కూడా అంతే. క్రికెట్లో ఇవన్నీ సహజమే. ఒకేరోజు మంచి, చెత్త ఇన్నింగ్స్ చూశారు’’ అని సిరాజ్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తన అత్యుత్తమ ప్రదర్శనలో సీనియర్ బుమ్రా, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్కు కూడా భాగం ఉందని సిరాజ్ తెలిపాడు. వాళ్లిద్దరి సహకారం వల్లే సాధ్యమైంది ‘‘ఓవైపు సీనియర్ బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఉంటే.. మరోవైపు వికెట్ కీపర్ సరైన లెంగ్త్ గురించి సలహాలు ఇస్తూ ఉంటే.. బౌలర్ పని మరింత సులువు అవుతుంది. మా మధ్య చక్కటి సమన్వయం ఉంది. మన బౌలింగ్లో బ్యాటర్ 4-5 బౌండరీలు బాదినపుడు ఏ లెంగ్త్లో బౌలింగ్ చేయాలన్న విషయంపై సీనియర్ల సలహాలు కచ్చితంగా పనిచేస్తాయి’’ అని బుమ్రా, రాహుల్లపై 29 ఏళ్ల సిరాజ్ ప్రశంసలు కురిపించాడు. ఇక రెండో రోజు ఏం జరుగుతుందో ఊహించలేమన్న ఈ రైటార్మ్ పేసర్.. వీలైనంత తక్కువ స్కోరుకు సౌతాఫ్రికాను కట్టడి చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నాడు. ఇప్పటికీ టీమిండియా ఆధిక్యంలోనే ఉంది కాబట్టి రెండో రోజు సానుకూల ఫలితం రాబట్టగలమనే నమ్మకం ఉందని సిరాజ్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశాడు. ఏదేమైనా తొలిరోజే న్యూల్యాండ్స్ పిచ్ నుంచి ఇంత సహకారం లభిస్తుందని అనుకోలేదని, 55 పరుగులకే ప్రత్యర్థిని ఆలౌట్ చేసే అవకాశం వస్తుందని ఊహించలేదన్నాడు. చదవండి: IND vs SA: బాబు అక్కడ ఉన్నది కింగ్.. కోహ్లీతోనే ఆటలా! ఇచ్చిపడేశాడుగా W W W W W W 🙌🏻 Wreaking 🔥 ft. Mohammed Siuuuraajjj! Watch all his 6️⃣ scalps 👆🏻 Tune in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/t7bT3pCRLl — Star Sports (@StarSportsIndia) January 3, 2024 -
చరిత్ర సృష్టించిన కేప్ టౌన్ టెస్టు.. 134 ఏళ్ల రికార్డు బద్దలు
కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య ప్రారంభమైన రెండో టెస్టు.. తొలి రోజే ఎన్నో మలుపులు తిరిగింది. అభిమానులకు అసలుసిసలైన టెస్టు మజా అందించింది. పేస్కు అనుకూలంగా ఉన్న పిచ్పై ఇరు జట్ల ఫాస్ట్ బౌలర్లు పండగ చేసుకున్నారు. పేసర్ల దెబ్బకు తొలిరోజే ఏకంగా 23 వికెట్లు నేలకూలాయి. ఈ క్రమంలో కేప్టౌన్ టెస్టు పలు అరుదైన రికార్డులను బద్దులకొట్టింది. బ్రేక్ చేసిన రికార్డులు ఇవే.. ►టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలి రోజు అత్యధిక వికెట్ల పడిన రెండో మ్యాచ్గా ఇది నిలిచింది. అంతకుముందు 1890లో ది ఓవల్లో ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్లో మొదటి రోజులో 22 వికెట్లు నెలకూలాయి. అయితే తాజా మ్యాచ్తో 134 ఏళ్ల రికార్డు బద్దలైంది. కాగా ఈ జాబితాలో 1902లో మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ అగ్రస్ధానంలో ఉంది. ఈ మ్యాచ్ తొలి రోజు ఏకంగా 25 వికెట్లు పడ్డాయి. ►అదే విధంగా దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టుల్లో తొలి రోజు అత్యధిక వికెట్లు పడిన మ్యాచ్గా రికార్డులకెక్కింది. అంతకుముందు రికార్డు పోర్ట్ఎలిజిబెత్ వేదికగా 1896లో దక్షిణాఫ్రికా- ఇంగ్లండ్ మధ్య జరగిన మ్యాచ్ పేరిట ఉండేది. ఈ మ్యాచ్లో మొదటి రోజు 21 వికెట్లు పడ్డాయి. తాజా మ్యాచ్తో 122 ఏళ్ల ఆల్టైమ్ రికార్డు బద్దలు అయింది. ►ఓవరాల్గా టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే రోజు అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆరో మ్యాచ్గా కేప్టౌన్ టెస్టు నిలిచింది. ఈ జాబితాలో 188లో లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ అగ్రస్ధానంలో ఉంది. ఈ మ్యాచ్ రెండో రోజు ఏకంగా 27 వికెట్లు పడ్డాయి. -
బాబు అక్కడ ఉన్నది కింగ్.. కోహ్లీతోనే ఆటలా! ఇచ్చిపడేశాడుగా
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఫీల్డ్లో ఎంత దూకుడుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన హావభావాలతో ప్రత్యర్ధి ఆటగాళ్లను విరాట్ స్లెడ్జింగ్ చేయడం మనం చాలా సందర్బాల్లో చూశాం. అటువంటి కింగ్ ముందు దక్షిణాఫ్రికా యువ పేసర్ నండ్రీ బర్గర్ కుప్పిగంతులు వేశాడు. కోహ్లిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కానీ కోహ్లి తనదైన స్టైల్లో బర్గర్ కు దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చాడు. ఏమి జరిగిందంటే? 14.2 ఓవర్లో కెప్టెన్ రోహిత్ శర్మను బర్గర్ ఔట్ చేశాడు. రోహిత్ తర్వాత విరాట్ కోహ్లి బ్యాటింగ్కు దిగాడు. అదే ఓవర్లో విరాట్ ఎదుర్కొన్న తొలి బంతినే బర్గర్ గుడ్ లెంగ్త్ డెలివరీ సంధించాడు. కోహ్లి కూడా బంతి అద్బుతంగా ఆడి డిఫెండ్ చేశాడు. ఆ బంతిని నాన్స్టైక్లో ఎండ్లో బర్గర్ అందుకున్నాడు. అయితే కోహ్లి క్రీజులో ఉన్నప్పటికీ బర్గర్ అత్యుత్సహం ప్రదర్శించాడు. అతడు బంతిని కోహ్లిపై విసురుతా అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు. కోహ్లి మాత్రం నవ్వుతూ క్రీజులో నిలబడిపోయాడు. ఆ తర్వాత కోహ్లి తనదైన శైలిలో బర్గర్కు సమాధానం చెప్పాడు. అదే ఓవర్లో వరుసగా బౌండరీలు బాది అతడిని ఒత్తిడిలోకి నెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. బాబు అక్కడ ఉన్నది కింగ్.. కోహ్లీతోనే ఆటలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో కోహ్లి 46 పరుగులు చేశాడు. చదవండి: IND vs SA: ఒకే రోజు 23 వికెట్లు.. సచిన్ టెండూల్కర్ రియాక్షన్ ఇదే pic.twitter.com/Wn37PpFsFt — Cricket Videos (@cricketvid123) January 3, 2024 -
ఒకే రోజు 23 వికెట్లు.. సచిన్ టెండూల్కర్ రియాక్షన్ ఇదే
కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య రెండో టెస్టు రసవత్తరంగా ప్రారంభమైంది. తొలి రోజే ఆసక్తికర మలుపులు చోటు చేసుకున్నాయి. న్యూలాండ్స్ పిచ్పై ఇరు జట్ల పేసర్లు నిప్పులు చేరిగారు. ఫలితంగా మొదటి రోజే ఏకంగా 23 వికెట్లు నేలకూలాయి. తొలి ఇన్నింగ్స్లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. టీమిండియా పేసర్ సిరాజ్ దాటికి కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. సిరాజ్ 6 వికెట్లతో చెలరేగగా.. బుమ్రా, ముఖేస్ కుమార్ తలా రెండు వికెట్లతో తమ వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత తమ తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన టీమిండియాది కూడా అదే తీరు. ఒక దశలో స్కోరు 153/4 వద్ద పటిష్ట స్ధితిలో నిలిచింది. దీంతో తొలి రోజును భారీ అధిక్యంతో భారత్ ముగిస్తుందని అభిమానులంతా భావించారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ చేసుకుంది. చివరి 11 బంతుల్లో ఒక్క పరుగు కూడా తీయకుండా జట్టు 6 వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ ఇన్నింగ్స్ అదే స్కోరు వద్ద టీమిండియా ఆలౌటైంది. సచిన్ రియాక్షన్ ఇదే.. ఇక ఒకే రోజులో 23 వికెట్లు కోల్పోవడంపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. "ఒకే రోజు 23 వికెట్లతో ఈ ఏడాది క్రికెట్ ఆరంభమైంది. ఇది ఇప్పటికి నేను నమ్మలేకపోతున్నాను. సౌతాఫ్రికా ఆలౌటైనప్పుడు నేను ఫ్లైట్ ఎక్కాను. నేను ఇంటికి వచ్చి టీవీలో చూస్తే దక్షిణాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి బ్యాటింగ్ చేస్తోంది. నేను ఆశ్చర్యపోయాను. ఈ గ్యాప్లో నేను ఏమి మిస్సయ్యాను?" అని సచిన్ ఎక్స్( ట్వీట్) చేశాడు. Cricket in ‘24 begins with 23 wickets falling in a single day. Unreal! Boarded a flight when South Africa was all out, and now that I'm home, the TV shows South Africa has lost 3 wickets. What did I miss?#SAvIND — Sachin Tendulkar (@sachin_rt) January 3, 2024 -
Ind Vs SA 2nd Test: సిరాజ్ 6తో మొదలై 23తో ముగిసె...
ఒకే రోజు 23 వికెట్లు... ఎన్ని మలుపులు... ఎన్ని అనూహ్యాలు... భారత్ టాస్ ఓడగానే వెనుకబడిపోయినట్లు అనిపించింది...కానీ మొహమ్మద్ సిరాజ్ అద్భుత బౌలింగ్ ఆటను మార్చేసింది...అతని పదునైన అవుట్స్వింగర్లను తట్టుకోలేక దక్షిణాఫ్రికా కుప్పకూలింది... పునరాగమనం తర్వాత అతి తక్కువ స్కోరుకు ఆలౌటైంది...అనంతరం భారత్ వేగంగా పరుగులు సాధించి ముందంజ వేసింది...ఆధిక్యం దాదాపు వందకు చేరింది... కానీ ఇంతలో మరో అడ్డంకి ...ఒక్క పరుగు చేయకుండా చివరి 6 వికెట్లు చేజార్చుకొని టీమిండియా కాస్త డీలాపడింది. కానీ రెండో ఇన్నింగ్స్లో మళ్లీ మన బౌలింగ్ చెలరేగి ప్రత్యర్థిని ఆత్మరక్షణలోకి నెట్టింది. మొత్తంగా చూస్తే మొదటి రోజు మనదే పైచేయి కాగా...రెండో రోజు సఫారీలను కట్టడి చేస్తే టెస్టు భారత్ ఖాతాలో చేరినట్లే! కేప్టౌన్: భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు తొలి రోజు ఆట ఆసక్తికర మలుపులతో సాగి టెస్టు క్రికెట్ మజాను పంచింది. బుధవారం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో 23.2 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. మొహమ్మద్ సిరాజ్ (6/15) తన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. అనంతరం భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 34.5 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. కోహ్లి (46), రోహిత్ (39), శుబ్మన్ గిల్ (36) మినహా అంతా విఫలమయ్యారు. జట్టులో ఏడుగురు ఆటగాళ్లు ‘సున్నా’కే పరిమితమయ్యాడు. ఆ తర్వాత ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు ఇంకా 36 పరుగులు వెనుకబడి ఉంది. టపటపా... మ్యాచ్కు ముందు రోజు అంచనా వేసినట్లుగానే ఆరంభంలో పేస్ బౌలర్లకు పిచ్ అద్భుతంగా అనుకూలించడంతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. సిరాజ్ తన రెండో ఓవర్ రెండో బంతికి మార్క్రమ్ (0)ను అవుట్ చేయడంతో సఫారీల పతనం ప్రారంభమైంది. గత మ్యాచ్ స్టార్, కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న ఎల్గర్ (2) కూడా సిరాజ్ బంతికే బౌల్డ్ అయి నిరాశగా వెనుదిరిగాడు. స్టబ్స్ (3)ను వెనక్కి పంపి బుమ్రా కూడా జత కలిశాడు. జోర్జి (2)ని కూడా పెవిలియన్ పంపించిన సిరాజ్, ఆ తర్వాత ఒకే ఓవర్లో బెడింగామ్ (12), జాన్సెన్ (0)ల పని పట్టి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఆ తర్వాతి చివరి 4 వికెట్లు తీసేందుకు భారత్కు ఎక్కువ సమయం పట్టలేదు. అదే వరుస... యశస్వి జైస్వాల్ (0) ఆరంభంలోనే వెనుదిరిగినా రోహిత్, గిల్ కలిసి చకచకా పరుగులు రాబట్టారు. దాంతో పదో ఓవర్లోనే భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే వీరిద్దరిని తక్కువ వ్యవధిలోనే పెవిలియన్కు పంపించిన బర్గర్...శ్రేయస్ (0)ను కూడా అవుట్ చేశాడు. అయితే కోహ్లి చక్కటి షాట్లతో స్కోరును వేగంగా నడిపించాడు. మరో వైపు బాగా ఇబ్బంది పడిన రాహుల్ (8) తాను ఎదుర్కొన్న 22వ బంతికి గానీ తొలి పరుగు తీయలేకపోయాడు. ఒక దశలో స్కోరు 153/4 వద్ద నిలిచింది. అయితే తర్వాతి 11 బంతులు భారత్ను బాగా దెబ్బ తీశాయి. ఈ 11 బంతుల్లో ఒక్క పరుగు కూడా తీయకుండా జట్టు 6 వికెట్లు కోల్పోవడంతో అదే స్కోరు వద్ద టీమ్ ఆలౌట్ అయింది. స్కోరు వివరాలు: దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) యశస్వి (బి) సిరాజ్ 2; ఎల్గర్ (బి) సిరాజ్ 4; జోర్జి (సి) రాహుల్ (బి) సిరాజ్ 2; స్టబ్స్ (సి) రోహిత్ (బి) బుమ్రా 3; బెడింగామ్ (సి) యశస్వి (బి) సిరాజ్ 12; వెరీన్ (సి) గిల్ (బి) సిరాజ్ 15; జాన్సెన్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 0; మహరాజ్ (సి) బుమ్రా (బి) ముకేశ్ 3; రబాడ (సి) శ్రేయస్ (బి) ముకేశ్ 5; బర్గర్ (సి) యశస్వి (బి) బుమ్రా 4; ఎన్గిడి (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 5; మొత్తం (23.2 ఓవర్లలో ఆలౌట్) 55. వికెట్ల పతనం: 1–5, 2–8, 3–11, 4–15, 5–34, 6–34, 7–45, 8–46, 9–55, 10–55. బౌలింగ్: బుమ్రా 8–1–25–2, సిరాజ్ 9–3–15–6, ప్రసిధ్ 4–1–10–0, ముకేశ్ 2.2–2–0–2. భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (బి) రబడ 0; రోహిత్ (సి) జాన్సెన్ (బి) బర్గర్ 39; గిల్ (సి) జాన్సెన్ (బి) బర్గర్ 36; కోహ్లి (సి) మార్క్రమ్ (బి) రబడ 46; శ్రేయస్ (సి) వెరీన్ (బి) బర్గర్ 0; రాహుల్ (సి) వెరీన్ (బి) ఎన్గిడి 8; జడేజా (సి) జాన్సెన్ (బి) ఎన్గిడి 0; బుమ్రా (సి) జాన్సెన్ (బి) ఎన్గిడి 0; సిరాజ్ (రనౌట్) 0; ప్రసిధ్ (సి) మార్క్రమ్ (బి) రబడ 0; ముకేశ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 24; మొత్తం (34.5 ఓవర్లలో ఆలౌట్) 153. వికెట్ల పతనం: 1–17, 2–72, 3–105, 4–110, 5–153, 6–153, 7–153, 8–153, 9–153, 10–153. బౌలింగ్: రబడ 11.5–2–38–3, ఎన్గిడి 6–1–30–3, బర్గర్ 8–2–42–3, జాన్సెన్ 9–2–29–0. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్రమ్ (నాటౌట్) 36; ఎల్గర్ (సి) కోహ్లి (బి) ముకేశ్ 12; జోర్జి (సి) రాహుల్ (బి) ముకేశ్ 1; స్టబ్స్ (సి) రాహుల్ (బి) బుమ్రా 1; బెడింగ్హామ్ (నాటౌట్) 7; మొత్తం (17 ఓవర్లలో 3 వికెట్లకు) 62. వికెట్ల పతనం: 1–37, 2–41, 3–45. బౌలింగ్: బుమ్రా 6–0–25–1, సిరాజ్ 5–2–11–0, ముకేశ్ 6–2–25–2. -
IND VS SA 2nd Test Day 1: టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..!
కేప్టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా తమ చివరి ఆరు వికెట్లను ఒకే స్కోర్ వద్ద (153) కోల్పోయి అనవసరమైన చెత్త రికార్డును మూటగట్టుకుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ జట్టు పరుగులేమీ చేయకుండా ఇలా తమ చివరి ఆరు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. ఇన్నింగ్స్ 34వ ఓవర్ తర్వాత 153/4గా ఉన్న భారత్ స్కోర్ 11 బంతుల తర్వాత 153 ఆలౌట్గా మారింది. భారత ఇన్నింగ్స్లో ఏకంగా ఆరుగురు డకౌట్లు కాగా.. రోహిత్ శర్మ (39), శుభ్మన్ గిల్ (36), విరాట్ కోహ్లి (46) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్ కార్డు చూస్తే అన్నీ సున్నాలే దర్శనమిస్తాయి. బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం టీమిండియా ఆటగాళ్ల స్కోర్లు ఇలా (0, 39, 36, 46, 0, 8, 0, 0, 0, 0, 0 నాటౌట్) ఉన్నాయి. భారత ఇన్నింగ్స్ ఆఖర్లో తొలుత ఎంగిడి (6-1-30-3), ఆతర్వాత రబాడ (11.5-2-38-3) నిప్పులు చెరిగారు. వీరికి నండ్రే బర్గర్ తోడయ్యాడు. అంతకుముందు భారత పేసర్లు మొహమ్మద్ సిరాజ్ (9-3-15-6), ముకేశ్ కుమార్ (2.2-2-0-2), జస్ప్రీత్ బుమ్రా (8-1-25-2) నిప్పులు చెరగడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో కేవలం 55 పరుగులకే ఆలౌటైంది. భారత పేస్ త్రయం ధాటికి సఫారీల ఇన్నింగ్స్ లంచ్ విరామంలోపే (23.2 ఓవర్లలో) ముగిసింది. సఫారీల ఇన్నింగ్స్లో బెడింగ్హమ్ (12), వెర్రిన్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. భారత ఇన్నింగ్స్లా కాకుండా సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో కేవలం ఒక్కరు మాత్రమే డకౌటయ్యాడు. మిగతా బ్యాటర్లు కనీసం ఒక్క పరుగైనా చేయగలిగారు. తొలి రోజు ఆటలో ఇరు జట్ల తొలి ఇన్నింగ్స్లు 59.3 ఓవర్లలోనే ముగిసాయి. అంటే 60 ఓవర్లలోపే ఇరు జట్లు 20 వికెట్లు కోల్పోయాయి. భారత తొలి ఇన్నింగ్స్ అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసి జాగ్రత్తగా ఆడుతుంది. డీన్ ఎల్గర్ 7, మార్క్రమ్ 14 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. సౌతాఫ్రికా భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్ను ఇంకా 76 పరుగులు వెనకపడి ఉంది. తొలి రోజు ఆటలో ఇంకా 20 ఓవర్ల ఆట మిగిలి ఉంది. కాగా, రెండు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో సౌతాఫ్రికా తొలి టెస్ట్ గెలిచిన విషయం తెలిసిందే. -
55 పరుగులకే ఆలౌట్.. టెస్ట్ క్రికెట్ను అవమానించినందుకు తగిన శాస్తి జరిగింది..!
స్వదేశంలో జరిగే టీ20 లీగ్ కోసం న్యూజిలాండ్ పర్యటనకు ద్వితియ శ్రేణి జట్టును ఎంపిక చేసి టెస్ట్ క్రికెట్ను ఘోరంగా అవమానించిన క్రికెట్ సౌతాఫ్రికాకు రోజుల వ్యవధిలోనే తగిన శాస్తి జరిగింది. ఆ జట్టు స్వదేశంలో భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్లో తొలి రోజే 55 పరుగులకు ఆలౌటై, 135 ఏళ్ల కిందటి చెత్త రికార్డును తిరగరాసుకుంది. 1889 (ఇంగ్లండ్పై 84 పరుగులు) తర్వాత స్వదేశంలో టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ చేస్తూ సౌతాఫ్రికా చేసిన అత్యల్ప స్కోర్ ఇదే. ఈ మ్యాచ్లో భారత పేసర్లు మొహమ్మద్ సిరాజ్ (9-3-15-6), ముకేశ్ కుమార్ (2.2-2-0-2), జస్ప్రీత్ బుమ్రా (8-1-25-2) నిప్పులు చెరుగుతూ, టెస్ట్ క్రికెట్ను అవమానించినందుకు సఫారీలపై ప్రతీకారం తీర్చుకున్నారు. భారత పేస్ త్రయం ధాటికి సఫారీలు లంచ్ విరామంలోపే (23.2 ఓవర్లలో) కుప్పకూలారు. అప్పటివరకు పటిష్టంగా కనిపించిన సౌతాఫ్రికా టెస్ట్లను అవమానించిన తర్వాత ఇలా కుప్పకూలడంతో టెస్ట్ క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టెస్ట్లంటే గౌరవం లేని వారికి ఇలాంటి శాస్తి జరిగి తీరాల్సిందేనని శాపనార్థాలు పెడుతున్నారు. And this was the Test they actually cared about 😳 Karma strikes as days after disrespecting cricket, South Africa is bowled out before lunch for a 135-year worst >> https://t.co/WRU2aJihX8 pic.twitter.com/zYnjeVrh9W — Fox Cricket (@FoxCricket) January 3, 2024 కాగా, ఫిబ్రవరిలో న్యూజిలాండ్లో జరుగబోయే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా (CSA) సీనియర్లను కాదని ద్వితియ శ్రేణి జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. స్వదేశంలో జరిగే లీగ్లో (SA20) సీనియర్లను ఆడించేందుకు క్రికెట్ సౌతాఫ్రికా ఈ నిర్ణయం తీసుకుంది. న్యూజిలాండ్ పర్యటన కోసం CSA ఏడుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు, కొత్త కెప్టెన్తో కూడిన జట్టును ఎంపిక చేసింది. క్రికెట్ సౌతాఫ్రికా చేసిన ఈ పని టెస్ట్ క్రికెట్ను అవమానించడమేనని మాజీ క్రికెటర్లు గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయంపై క్రికెట్ సర్కిల్స్లో దుమారం రేగుతుండగానే సౌతాఫ్రికా ఇలా 55 పరుగులకు ఆలౌట్ కావడం చర్చనీయాశంగా మారింది. ఇదిలా ఉంటే, సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకే ఆలౌట్ చేసిన అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. తొలి రోజు టీ విరామం సమయానికి 4 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (20), కేఎల్ రాహుల్ (0) క్రీజ్లో ఉన్నారు. -
అప్పుడు సెంచరీ మిస్: టెస్టుల్లో కీలక మైలురాయి అందుకున్న గిల్
South Africa vs India, 2nd Test - Shubman Gill: టీమిండియా యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ తన కెరీర్లో మరో కీలక మైలురాయి చేరుకున్నాడు. అంతర్జాతీయ టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్ల జాబితాలో స్థానం సంపాదించాడు. సౌతాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గిల్ ఈ ఘనత సాధించాడు. సౌతాఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించిన భారత పేసర్లు కేప్టౌన్ వేదికగా బుధవారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, పేసర్లకు స్వర్గధామమైన న్యూల్యాండ్స్ పిచ్ మీద నిప్పులు చెరిగిన టీమిండియా బౌలర్లు సౌతాఫ్రికాను 55 పరుగులకే ఆలౌట్ చేశారు. మహ్మద్ సిరాజ్ టెస్టుల్లో తొలిసారిగా ఆరు వికెట్ల ప్రదర్శన నమోదు చేయగా.. జస్ప్రీత్ బుమ్రా, ముకేశ్ కుమార్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో తొలిరోజు ఆటలోనే ఆతిథ్య జట్టును ఆలౌట్ చేసిన టీమిండియా బ్యాటింగ్కు దిగింది. ఆదిలోనే జైస్వాల్ అవుట్ అయితే, ప్రొటిస్ పేసర్ కగిసో రబడ.. భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ను అద్భుత బంతితో బౌల్డ్ చేయడంతో ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. జైస్వాల్ డకౌట్గా వెనుదిరగగా.. అతడి స్థానంలో వచ్చిన శుబ్మన్ గిల్ మరో ఓపెనర్ రోహిత్ శర్మకు జతయ్యాడు. ఇక గత మ్యాచ్లో పేలవ ప్రదర్శన కనబరిచిన హిట్మ్యాన్ కేప్టౌన్లో మాత్రం బౌండరీలు బాదుతూ దూకుడుగా ఆడుతున్నాడు. పది ఓవర్లు ముగిసేసరికి 37 బంతుల్లో 38 పరుగులతో జోరుమీదున్నాడు. #RohitSharma is up & about! Three 4️⃣s to get going in this #TeamIndia innings. Tune in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/kuZAOIHJJH — Star Sports (@StarSportsIndia) January 3, 2024 1000 పరుగులు పూర్తి చేసుకున్న గిల్ మరోవైపు.. అతడి తోడుగా మరో ఎండ్లో సహకారం అందిస్తున్న వన్డౌన్ బ్యాటర్ గిల్.. భారత ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో నండ్రే బర్గర్ వేసిన నాలుగో బంతికి రెండు పరుగులు తీసి వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. కాగా తన టెస్టు కెరీర్లో 36వ ఇన్నింగ్స్లో ఘనత ఈ మైలురాయిని అందుకున్నాడు. మెల్బోర్న్లో 2020 నాటి ఆస్ట్రేలియా మ్యాచ్తో శుబ్మన్ గిల్ అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లలో వరుసగా 45, 35 (నాటౌట్) పరుగులు చేశాడు గిల్. అప్పుడు సెంచరీ మిస్ అదే విధంగా మరో మ్యాచ్లో గాబా స్టేడియంలో 91 పరుగులు సాధించి సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. గిల్ కెరీర్లో ఇప్పటి వరకు టెస్టుల్లో రెండు సెంచరీలు, నాలుగు అర్ధ శతకాలు సాధించాడు. అయితే, విదేశీ గడ్డపై ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వంద పరుగుల మార్కు అందుకోలేకపోయాడు. ఇక సౌతాఫ్రికాతో తొలి టెస్టులో శుబ్మన్ గిల్ విఫలమైన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్లో రెండు, రెండో ఇన్నింగ్స్లో 26 పరుగులు సాధించాడు. ఇక రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో పది ఓవర్లు ముగిసే సరికి ఆరు పరుగులతో క్రీజులో ఉన్నాడు. చదవండి: ఎట్టకేలకు మౌనం వీడిన సౌతాఫ్రికా బోర్డు: అందుకే అనామక జట్టును పంపుతున్నాం! -
IND VS SA 2nd Test: తొలి రోజే 23 వికెట్లు.. ఇంకా ఆధిక్యంలోనే టీమిండియా
South Africa Vs India 2nd Test 2024 Day 1 Updates- కేప్టౌన్: తొలి రోజే 23 వికెట్లు.. ఇంకా ఆధిక్యంలోనే టీమిండియా రెండో టెస్ట్లో తొలి రోజే 23 వికెట్లు నేలకూలాయి. ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్ల్లో ఆలౌటయ్యాక, సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 153 పరుగులకు ఆలౌటైంది. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. సౌతాఫ్రికా భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 36 పరుగులు వెనుకపడి ఉంది. మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 45 పరుగుల వద్ద సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్లో ట్రిస్టన్ స్టబ్స్ (1) ఔటయ్యాడు. ఇదే రోజు తొలి ఇన్నింగ్స్లో కూడా బుమ్రానే స్టబ్స్ను ఔట్ చేశాడు. 16 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 49/3గా ఉంది. సౌతాఫ్రికా భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 49 పరుగులు వెనుకపడి ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్లో సెకెండ్ వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా రెండో టెస్ట్ తొలి రోజు ఇరు జట్ల పేసర్లు అత్యద్భుతాలు చేస్తున్నారు. ఇరు జట్ల పేసర్ల ధాటికి ఇప్పటికే 22 వికెట్లు నేలకూలాయి. తాజాగా సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్లో సెకెండ్ వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్లో జార్జీ (1) ఔటయ్యాడు. 13 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 42/2గా ఉంది. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్కు సౌతాఫ్రికా ఇంకా 56 పరుగులు వెనుకపడి ఉంది. మార్క్రమ్ (25), ట్రిస్టన్ స్టబ్స్ (0) క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 37 పరుగుల వద్ద సౌతాఫ్రికా తమ సెకెండ్ ఇన్నింగ్స్లో తొలి వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్లో ఎల్గర్ (12) ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్కు విరుద్దంగా ఆడుతున్న సౌతాఫ్రికా 55 పరుగులకే తొలి ఇన్నింగ్స్లో కుప్పకూలిన సౌతాఫ్రికా.. ఆతర్వాత టీమిండియాను 153 పరుగులకు ఆలౌట్ చేసి తమ సెకెండ్ ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. అయితే సఫారీలు తమ సెకెండ్ను తొలి ఇన్నింగ్స్లో ఆడినట్లు ఆడట్లేదు. ఆ జట్టు ఓపెనర్లు చాలా జాగ్రత్తగా వికెట్లు పడకుండా ఆడుతున్నారు. 10 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 37/0గా ఉంది. సౌతాఫ్రికా భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్ను ఇంకా 61 పరుగులు వెనకపడి ఉంది. ఒకే స్కోర్ వద్ద ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియా 153 పరుగుల వద్ద టీమిండియా ఏకంగా ఆరు వికెట్లు కోల్పోయి, అదే స్కోర్ వద్ద ఆలౌటైంది. 34వ ఓవర్లో ఎంగిడి పరుగులేమీ ఇవ్వకుండా మూడు వికెట్లు పడగొట్టగా.. ఆ మరుసటి ఓవర్లోనే రబాడ.. కోహ్లి (46), ప్రసిద్ద్ (0)లను పెవిలియన్కు పంపాడు. అదే ఓవర్లో, అదే స్కోర్ వద్ద (153) సిరాజ్ (0) కూడా రనౌటయ్యాడు. ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసిన ఎంగిడి.. టీమిండియా 153/7 లుంగి ఎంగిడి ఒక్క ఓవర్లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. భారత ఇన్నింగ్స్ 34వ ఓవర్లో ఎంగిడి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. రాహుల్ (8), జడేజా (0), బుమ్రా (0) ఐదు బంతుల వ్యవధిలో ఔటయ్యారు. కోహ్లి (46), సిరాజ్ క్రీజ్లో ఉన్నారు. టీ విరామం.. టీమిండియా స్కోర్ 111/4 తొలి రోజు టీ విరామం సమయానికి టీమిండియా స్కోర్ 111/4గా ఉంది. విరాట్ కోహ్లి (20), కేఎల్ రాహుల్ (0) క్రీజ్లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్ 110 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. నండ్రే బర్గర్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్ (0) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా 105 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. నండ్రే బర్గర్ బౌలింగ్లో శుభ్మన్ గిల్ (36) ఔటయ్యాడు. విరాట్ కోహ్లి (16), శ్రేయస్ అయ్యర్ క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా 39 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత శర్మ ఔటయ్యాడు. నండ్రే బర్గర్ బౌలింగ్లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి హిట్మ్యాన్ పెవిలియన్కు చేరాడు. 16 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 90/2గా ఉంది. శుభ్మన్ గిల్ (24), విరాట్ కోహ్లి (1) క్రీజ్లో ఉన్నారు. ఆధిక్యంలోకి వచ్చిన టీమిండియా 10: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా ఆధిక్యంలోకి వచ్చింది. కేప్టౌన్ వేదికగా ఆతిథ్య జట్టును 55 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తొలి పది ఓవర్లలోనే లీడ్ సంపాదించింది. ఆరంభంలోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయినా.. మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో పది ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 58 పరుగులు సాధించిన టీమిండియా మూడు పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. రోహిత్ శర్మ 37 బంతుల్లో 38 పరుగులు సాధించి జోరు మీదున్నాడు. మరో ఎండ్లో శుబ్మన్ గిల్ ఆరు పరుగులతో ఆడుతున్నాడు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా సిరాజ్ (9-3-15-6), ముకేశ్ కుమార్ (2.2-2-0-2), బుమ్రా (8-1-25-2) నిప్పులు చెరగడంతో సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా.. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించి 17 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్ యశస్వి జైస్వాల్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 3 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 20/1గా ఉంది. ఎంగిడి వేసిన రెండో ఓవర్లో మూడు బౌండరీలు బాది రోహిత్ శర్మ జోరుమీదున్నాడు. సౌతాఫ్రికా వర్సెస్ ఇండియా రెండో టెస్టు తుదిజట్లు సౌతాఫ్రికా డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రమ్, టోనీ డి జోర్జీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెర్రెన్నె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, నండ్రే బర్గర్, లుంగి ఎంగిడి. టీమిండియా రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ముకేష్ కుమార్. -
నిప్పులు చెరిగిన టీమిండియా పేసర్లు.. సౌతాఫ్రికా చెత్త రికార్డులు
కేప్టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్లో భారత పేస్ బౌలింగ్ త్రయం (సిరాజ్, బుమ్రా, ముకేశ్ కుమార్) ఉగ్రరూపం దాల్చింది. వీరి ధాటికి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకే కుప్పకూలింది. ఆట తొలి రోజే భారత పేసర్లు సఫారీల భరతం పట్టారు. ముఖ్యంగా సిరాజ్ (9-3-15-6) నిప్పులు చెరిగే బంతులతో సౌతాఫ్రికా పతనాన్ని శాశించాడు. సిరాజ్కు జతగా ముకేశ్ కుమార్ (2.2-2-0-2), బుమ్రా (8-1-25-2) కూడా విజృంభించడంతో సౌతాఫ్రికా అత్యల్ప స్కోర్కు పరిమితం కావడంతో పలు చెత్త రికార్డులను మూటగట్టుకుంది. క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాక సౌతాఫ్రికాకు టెస్ట్ల్లో ఇదే అత్యల్ప స్కోర్ కాగా.. టెస్ట్ల్లో భారత్పై ఏ ప్రత్యర్ధికైనా ఇదే అత్యల్ప స్కోర్గా నిలిచింది. ఈ మ్యాచ్లో సిరాజ్ నమోదు చేసిన గణాంకాలు సైతం రికార్డుల్లోకెక్కాయి. అతి తక్కువ పరుగులు సమర్పించుకుని ఐదు వికెట్ల ఘనత సాధించిన భారత బౌలర్ల జాబితాలో సిరాజ్ నాలుగో స్థానాన్ని (6/15) సాధించాడు. ఈ జాబితాలో బుమ్రా (5/7) టాప్లో ఉండగా.. వెంకటపతి రాజు (6/12), హర్భజన్ సింగ్ (5/13) ఆతర్వాతి స్థానాల్లో నిలిచారు. అలాగే ఈ ప్రదర్శనతో సిరాజ్ మరో రికార్డుల జాబితాలోనూ చోటు దక్కించుకున్నాడు. సౌతాఫ్రికా గడ్డపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో శార్దూల్ ఠాకూర్ (7/61) టాప్లో ఉండగా.. హర్బజన్ సింగ్ (7/120) ఆతర్వాతి స్థానంలో నిలిచాడు. సౌతాఫ్రికా 55 పరుగులకే ఆలౌట్ కావడంతో కేప్టౌన్ సైతం రికార్డుల్లోకెక్కింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు 36 సందర్భాల్లో ఆయా జట్టు 55 అంతకంటే తక్కువ స్కోర్లకు ఆలౌట్ కాగా.. అత్యధిక సందర్బాల్లో (7) కేప్టౌన్లోనే ఈ చెత్త రికార్డులు నమోదయ్యాయి. కేప్టౌన్ తర్వాత అత్యధికంగా ఆరుసార్లు ఆయా జట్లు 55 అంతకంటే తక్కువ స్కోర్లను లార్డ్స్ మైదానంలో చేశాయి. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ విషయానికొస్తే.. బెడింగ్హమ్ (12), వెర్రిన్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మార్క్రమ్ 2, కెరీర్లో చివరి టెస్ట్ ఆడుతున్న సౌతాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ డీన్ ఎల్గర్ 4, టోనీ జార్జీ 2, ట్రిస్టన్ స్టబ్స్ 3, మార్కో జన్సెన్ 0, కేశవ్ మహారాజ్ 3, రబాడ 5, నండ్రే బర్గర్ 4 పరుగులు చేశారు. కాగా, రెండు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో ప్రోటీస్ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది.