India A vs Sri Lanka A
-
SL vs AFG: ఫైనల్లో భారత్ ప్రత్యర్థి ఎవరంటే?
ముక్కోణపు సిరీస్లో అఫ్గానిస్తాన్- ‘ఎ’ ప్రయాణం ముగిసింది. శ్రీలంక- ‘ఎ’తో శుక్రవారం జరిగిన అనధికారిక వన్డేలో అఫ్గాన్ చిత్తుగా ఓడిపోయింది. శ్రీలంక వేదికగా భారత్, లంక, అఫ్గాన్ జట్ల మధ్య ట్రై సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా తొలి మ్యాచ్లో శ్రీలంకపై గెలిచిన భారత్.. తర్వాత అఫ్గాన్, శ్రీలంక చేతిలో ఓడిపోయింది. అయితే, లీగ్ దశలో చివరగా అఫ్గనిస్తాన్పై తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఏకంగా 101 పరుగులతో గెలిచి.. ఫైనల్కు దూసుకువెళ్లింది.ఈ క్రమంలో దంబుల్లా వేదికగా మరో ఫైనల్ బెర్తు కోసం శ్రీలంక- అఫ్గాన్ తలపడ్డాయి. టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా శ్రీలంక బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లలో నిరోషన్ డిక్విల్లా అర్ధ శతకం (66)తో ఆకట్టుకోగా.. అవిష్క ఫెర్నాండో సెంచరీ (110)తో దుమ్ములేపాడు. వన్డౌన్ బ్యాటర్ నువానిదు ఫెర్నాండో 45 పరుగులతో రాణించగా.. లోయర్ ఆర్డర్లో రవిందు ఫెర్నాండో 25 రన్స్ రాబట్టాడు.ఫలితంగా శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 322 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. అఫ్గాన్ బౌలర్లలో ఫరీదూన్ దావూద్జాయ్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. ఫర్మానుల్లా సఫీ మూడు, మహ్మద్ ఇబ్రహీం ఒక వికెట్ దక్కించుకున్నారు.భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ జట్టుకు ఆదిలోనే షాకులు తగిలాయి. ఓపెనర్, కెప్టెన్ ఇమ్రాన్ మిర్, వన్డౌన్ బ్యాటర్ నూర్ ఉల్ రహ్మాన్ను దులాజ్ సముదిత డకౌట్ చేశాడు. ఇలాంటి తరుణంలో మరో ఓపెనర్ హసన్ ఎసాఖిల్ ఒంటరి పోరాటం (74) చేయగా.. బహీర్ షా 35, ఫర్మానుల్లా సఫీ 43 పరుగులతో రాణించారు. అయితే, మిగతా వారి నుంచి వీరికి పెద్దగా సహకారం లభించలేదు. దీంతో 42.5 ఓవర్లలో కేవలం 219 పరుగుల చేసి అఫ్గాన్ ఆలౌట్ అయింది. శ్రీలంక బౌలర్లలో దులాజ్ సముదిత్ ఐదు వికెట్లతో చెలరేగి అఫ్గాన్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. కుగాతస్ మతూలన్ మూడు, రవిందు ఫెర్నాండో, విజయకాంత్ వియస్కాంత్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఈ క్రమంలో 103 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన శ్రీలంక- ‘ఎ’ జట్టు ఫైనల్కు దూసుకుపోయింది. భారత్- ‘ఎ’తో ఆదివారం నాటి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇరుజట్ల మధ్య ఫైనల్కు దంబుల్లా వేదిక. -
వైభవ్ వివాదం.. స్పందించిన బీసీసీఐ
గత కొన్నాళ్లుగా తన ఆట తీరుతో హాట్టాపిక్గా మారిన భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు తన ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. భారత్- ‘ఎ’ జట్టు తరఫున శ్రీలంక పర్యటనలో ఉన్న ఈ పిల్లాడు.. ముక్కోణపు వన్డే సిరీస్ ఆడుతున్నాడు.సూపర్ ఓవర్లో లంక విజయంఇందులో భాగంగా శ్రీలంక- ‘ఎ’ జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. దంబుల్లా వేదికగా ఈ మ్యాచ్లో శ్రీలంక భారత్- ‘ఎ’ జట్టుపై సూపర్ ఓవర్లో విజయం సాధించింది.నువ్వు ఇక ఇంటికి వెళ్లుఈ క్రమంలో లంక ప్లేయర్ విశేన్ హలంబగే.. భారత ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి.. ‘‘మ్యాచ్ అయిపోయింది. నువ్వు ఇక ఇంటికి వెళ్లు’’ అని రెచ్చగొట్టినట్లు తెలిసింది. దీంతో సహనం కోల్పోయిన వైభవ్.. అతడిపైకి దూసుకెళ్లాడు. విశేన్ను వెనక్కి నెట్టేయగా.. అతడూ వైభవ్ను తోసేశాడు.ఇంతలో లంక సీనియర్ ప్లేయర్ డిక్విల్లా ఇద్దరినీ విడదీసి.. వైభవ్ను అక్కడి నుంచి పంపించాడు. అయితే, వైభవ్ వెళ్తూ వెళ్తూ వేలు చూపించి బెదిరించినట్లు కనిపించింది. ఈ నేపథ్యంలో పదిహేనేళ్ల వైభవ్ వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి. అయితే, ఇది అనధికారిక మ్యాచ్ కాబట్టి ఐసీసీ పెద్దగా చర్యలు తీసుకునే అవకాశం లేనట్లు కనిపిస్తోంది.స్పందించిన బీసీసీఐఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా వైభవ్ సూర్యవంశీ వివాదం గురించి స్పందించింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఇండియా- ‘ఎ’ జట్టు కీలక టోర్నమెంట్ ఆడుతోంది. వర్దమాన క్రికెటర్లు టీమిండియాలోకి వచ్చేందుకు ఇదొక మంచి అవకాశం.ముక్కోణపు వన్డే సిరీస్ రూపంలో వారికి తమను తాము నిరూపించుకునే అవకాశం దొరికింది. కాబట్టి వాళ్లంతా కేవలం ఆటపై మాత్రమే దృష్టి పెట్టాలి. ఇతరత్రా విషయాలను పట్టించుకోకూడదు. అలా చేస్తే ఏకాగ్రత దెబ్బతింటుంది.ఆటపైనే దృష్టి పెట్టండిఅక్కడికి ఎందుకు వెళ్లారో ఆ విషయంపై మాత్రమే దృష్టి పెట్టండి. ప్రతి ఒక్కరు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా ఈ ట్రై సిరీస్లో ఇండియా విజేతగా నిలవగలదు. మా దృష్టి మొత్తం విజయం మీదే కేంద్రీకృతమై ఉంది. ఆటగాళ్లు అందుకు అనుగుణంగా నడుచుకోవాలి’’ అని దేవజిత్ సైకియా పరోక్షంగా భారత క్రికెటర్లను హెచ్చరించాడు.కాగా ఈ మ్యాచ్ సందర్భంగా సూపర్ ఓవర్ విషయంలో కెప్టెన్ తిలక్ వర్మ సైతం అంపైర్లతో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. లంక, భారత్తో పాటు అఫ్గనిస్తాన్ కూడా ఈ ట్రై సిరీస్లో భాగమైంది. భారత్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడి రెండు ఓడిపోయింది. తద్వారా ఫైనల్ చేరే అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. -
పల్లెటూరోడు!.. పెంపకం సరిగ్గా లేదు.. వైభవ్పై సంచలన వ్యాఖ్యలు
అతి పిన్న వయసులోనే క్రికెట్ ప్రపంచంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఫార్మాట్లకు అతీతంగా విధ్వంసకర బ్యాటింగ్తో అలరిస్తూ నీరాజనాలు అందుకుంటున్నాడు. ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా బరిలోకి దిగిన వైభవ్.. ఏకంగా 776 పరుగులు సాధించాడు.పదిహేనేళ్ల వయసులోనే ఆరెంజ్ క్యాప్తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి పదిహేనేళ్ల వయసులోనే ఆరెంజ్ క్యాప్ దక్కించుకుని చరిత్ర సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. ఈ నేపథ్యంలో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ టీమిండియాకు కూడా ఎంపికయ్యాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్లో పర్యటించే, ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత టీ20 జట్టులో అతడికి స్థానం దక్కింది.ముక్కోణపు వన్డే సిరీస్లోఇక ప్రస్తుతం భారత్- ‘ఎ’ తరఫున వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. భారత్, లంక, అఫ్గనిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్తో ఈ ఓపెనింగ్ బ్యాటర్ బిజీగా ఉన్నాడు. అయితే, సోమవారం శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ సహనం కోల్పోయాడు. సూపర్ ఓవర్లో విజయం సాధించిన తర్వాత శ్రీలంక ప్లేయర్ విశేన్ హలంబగే వైభవ్, సూర్యాంశ్ షెడ్గేలను ఉద్దేశించి ఏదో అన్నాడు.దీంతో వైభవ్, సూర్యాంశ్ లంక ప్లేయర్లతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పరస్పరం నెట్టేసుకున్నారు. లంక ఆటగాడి ఛాతీపై చేయి వేసి వైభవ్ వెనక్కి నెట్టాడు. అంతేకాదు వెళ్తూ వెళ్తూ వేలు చూపిస్తూ బెదిరించినట్లుగా ఉన్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.🚨 BIG TROUBLE FOR VAIBHAV & TILAK 😭Vaibhav Sooryavanshi and Tilak Varma could face a 1-2 match ban after their heated argument with the umpires 😳- Suryavanshi's physical altercation with Sri Lanka A players after the match might cost him dearly 😥 pic.twitter.com/Fc5zLXYL91— Jara (@JARA_Memer) June 15, 2026వైభవ్ ప్రవర్తనపై విమర్శలుఈ నేపథ్యంలో వైభవ్ ప్రవర్తనపై విమర్శలు వస్తున్నాయి. చిన్న వయసులో ఇంత దూకుడు పనికిరాదని.. కాస్త ఓర్పుతో ఉండాలని మాజీ క్రికెటర్లు సద్విమర్శలు చేస్తున్నారు. అయితే, శ్రీలంక క్రికెట్ బోర్డు మీడియా మాజీ మేనేజర్ బ్రేన్ థామస్ మాత్రం శ్రుతిమించాడు. సూర్యవంశీతో పాటు భారత ప్రజల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు.పల్లెటూరోడు!.. పెంపకం సరిగ్గా లేదంటూ ఓవరాక్షన్‘‘సూర్యవంశీ.. అతడి చెత్త కోపానికి సంబంధించిన ఫుటేజీని ఇప్పుడే చూశాను. క్రికెట్లో యెల్లో, రెడ్ కార్డులు లేకపోవడం విచారకరం. ఒకవేళ మ్యాచ్ రిఫరీ గనుక ఈ కౌబాయ్ను తదుపరి మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తే బాగుంటుంది.అప్పుడే ఎలా ప్రవర్తించాలో అతడికి తెలిసి వస్తుంది. అయినా.. ఇండియాలోని గ్రామానికి చెందిన పిల్లాడి నుంచి ఇంతకంటే ఎక్కువగా ఏం ఆశించగలము? శ్రీలంకలో మాదిరి అక్కడి పిల్లల పెంపకం అంత గొప్పగా ఏమీ ఉండదు.హేయ్ సూర్యవంశీ నువ్వు గనుక సంతోషంగా లేకుంటే.. ఇండియాలో నిన్ను పొగుడుతూ నెత్తికెక్కించుకునే వాళ్ల దగ్గరికి వెళ్లిపో. మీ ఇంటికి పో. ఇది జెంటిల్మెన్ గేమ్’’ అంటూ బ్రేన్ థామస్ పరుష పదజాలంతో వైభవ్ను కించపరిచాడు. దీంతో భారత నెటిజన్లు సైతం థామస్కు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. ‘స్పెల్లింగ్ సరిగా రాయడం రాని నువ్వు చదువు గురించి మాట్లాడుతున్నావా? 15 ఏళ్ల పిల్లాడిపై ఇంత విషం చిమ్ముతావా?’ అంటూ చురకలు అంటిస్తున్నారు. కాగా ఈ సిరీస్లో వైభవ్ ఇప్పటికి మూడు మ్యాచ్లలో వరుసగా.. 14, 44, 21 పరుగులు చేశాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీ.. నువ్విక ఇంటికి వెళ్లు!భారత జట్టుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అక్కసు -
వైభవ్ సూర్యవంశీ.. నువ్విక ఇంటికి వెళ్లవచ్చు!
ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్- ‘ఎ’ జట్టు చిక్కుల్లో పడింది. ఇప్పటికి మూడు మ్యాచ్లు ఆడిన తిలక్ వర్మ సేన.. రెండింట ఓడిపోయింది. తొలుత అఫ్గనిస్తాన్ -‘ఎ’ చేతిలో ఓడిన భారత జట్టు.. సోమవారం నాటి పోరులో లంక చేతిలో పరాజయం పాలైంది.దంబుల్లా వేదికగా ఈ మ్యాచ్లో ఇరుజట్లు 265 పరుగులు చేయగా.. మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించగా.. భారత్ అనూహ్య రీతిలో ఓడిపోయింది. అయితే, వెలుతురులేమి కారణంగా తొలుత సూపర్ ఓవర్ నిర్వహించడం సాధ్యం కాదని అంతా భావించారు.వెలుతురులేమి సమస్యభారత జట్టు కెప్టెన్ తిలక్ వర్మ సైతం ఇదే విషయంపై అంపైర్లతో వాదించినట్లు సమాచారం. కానీ వెలుతురు మరీ తగ్గిపోతే సూపర్ ఓవర్ మొదలైనప్పటికీ మ్యాచ్ నిలిపివేస్తామని అంపైర్లు భారత శిబిరానికి చెప్పినట్లు క్రిక్బజ్ తన కథనంలో పేర్కొంది. అయితే, తొలుత శ్రీలంక బ్యాటింగ్ చేయగా.. భారత్ లక్ష్య ఛేదనకు దిగిన సమయంలో మరింతగా చీకటి అలుముకుంది.కొట్టుకోవడం ఒక్కటే తక్కువఅయినప్పటికీ సూపర్ ఓవర్ నిర్వహించగా.. భారత జట్టు ఓటమిపాలైంది. ఆద్యంతం ఆసక్తిరేపిన ఈ మ్యాచ్లో సూపర్ ఓవర్ ముగిసిన తర్వాత భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీతో శ్రీలంక ఆటగాళ్లు వ్యవహరించిన తీరు.. అందుకు వైభవ్ బదులిచ్చిన విధానం విమర్శలకు దారితీసింది.వైభవ్ సూర్యవంశీ.. నువ్విక ఇంటికి వెళ్లవచ్చు!వైభవ్- శ్రీలంక ఆటగాళ్లు పరస్పరం మీదమీదకు వెళ్తూ కొట్టుకున్నంత పనిచేశారు. అయితే, వారి మధ్య గొడవకు కారణం ఏమిటన్న అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. క్రిక్బజ్ నివేదిక ప్రకారం.. శ్రీలంక ప్లేయర్ విశేన్ హలంబగే వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి.. ‘‘మ్యాచ్ అయిపోయింది.. ఇక నువ్వు ఇంటికి వెళ్లిపోవచ్చు’’ అన్నట్లు సమాచారం.దీంతో కోపోద్రిక్తుడైన వైభవ్.. ‘‘ఏమంటున్నావు’’ అంటూ మీదకు వెళ్లగా ఇద్దరూ పరస్పరం నెట్టేసుకున్నారు. ఆ తర్వాత లంక సీనియర్ ప్లేయర్ ఒకరు వచ్చి ఇద్దరినీ విడదీశారు. అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకున్నారు. అయితే, ఈ విషయం గురించి శ్రీలంక డ్రెసింగ్రూమ్లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.క్షమాపణ అడుగుదాం!చీకటి పడిన తర్వాత కూడా సూపర్ ఓవర్లో ఆడేందుకు సహకరించిన భారత జట్టుకు ధన్యవాదాలు చెప్పడంతో పాటు.. వైభవ్ విషయంలో జరిగినదానికి క్షమాపణలు కోరాలనే చర్చ నడిచినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజా ఓటమితో భారత్ ఫైనల్ చేరే అవకాశాలు సన్నగిల్లాయి.చదవండి: 29 బంతుల్లోనే సెంచరీ చేసిన చహల్🚨 BIG TROUBLE FOR VAIBHAV & TILAK 😭Vaibhav Sooryavanshi and Tilak Varma could face a 1-2 match ban after their heated argument with the umpires 😳- Suryavanshi's physical altercation with Sri Lanka A players after the match might cost him dearly 😥 pic.twitter.com/Fc5zLXYL91— Jara (@JARA_Memer) June 15, 2026 -
అంపైర్లతో తిలక్ వర్మ, వైభవ్ వాగ్వాదం.. తిలక్ను తోసేసి..
భారత్- ‘ఎ’ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ, యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అంపైర్లతో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా శ్రీలంక వేదికగా ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్- ‘ఎ’ జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది.దంబుల్లా వేదికగా గురువారం అఫ్గనిస్తాన్- ‘ఎ’ జట్టు చేతిలో ఓడిన భారత్.. సోమవారం శ్రీలంక చేతిలోనూ ఓటమి పాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో సరిగ్గా 265 పరుగులు చేయడంతో మ్యాచ్ ‘టై’ అయింది.అయితే, శ్రీలంక ఇన్నింగ్స్లో ఆఖరి బంతిని ఎదుర్కొన్న గుణశేఖర బాల్ను ఫ్లిక్ చేయకుండానే.. సింగిల్ తీసి రనౌట్ అయ్యాడు. దీంతో స్కోరు సమం కాగా.. భారత శిబిరం మాత్రం ఆ పరుగును ఎలా పరిగణిస్తారని అంపైర్లను ప్రశ్నించింది. మరోవైపు.. సూపర్ ఓవర్ నిర్వహించాల్సి ఉండగా అప్పటికే చీకటి పడిపోయింది.ఈ నేపథ్యంలో కెప్టెన్ తిలక్ వర్మ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. గుణశేఖర బంతిని బాదనపుడు తొలి పరుగును ఎలా లెక్కలోకి తీసుకుంటారని వాదించినట్లు కనిపించింది. ఆ సమయంలో వైభవ్ సూర్యవంశీ కూడా తిలక్కు మద్దతుగా వచ్చి నిలబడ్డాడు.Vaibhav Sooryavanshi sending off Captain Tilak Varma from arguing with Umpire.pic.twitter.com/067cYfhmo2— Maina Singh (@Maina_Singhx77) June 15, 2026అయితే, కాసేటికే తిలక్ను సముదాయించినట్లు వెనక్కి నెడుతూ అక్కడి నుంచి తీసుకెళ్లాడు. ఇక సూపర్ ఓవర్లో తిలక్ బంతిని అర్షద్ ఖాన్కు ఇవ్వగా.. లంక కెప్టెన్ సహన్ అరాచిగే తొలి బంతికే రెండు పరుగులు రాబట్టాడు. రెండో బంతి వైడ్కాగా.. తదుపరి మరో సింగిల్ వచ్చింది.మూడో బంతికి అవిష్క ఫెర్నాండో సింగిల్ తీయగా.. నాలుగో బంతికి అరాచిగే మూడు పరుగులు రాబట్టాడు. ఐదో బంతిని ఫెర్నాండో సిక్సర్గా మలచగా.. ఆరో బంతి నోబాల్ అయింది. దీంతో ఫ్రీ హిట్ రాగా.. మొత్తంగా లంక 16 పరుగులు చేసింది. అయితే, నోబాల్ విషయంలో కూడా తిలక్ వర్మ వాదనకు దిగాడు. అనంతరం భారత్ తరఫున వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ షెడ్గే బ్యాటింగ్కు దిగగా.. భారత్కు ఓటమే ఎదురైంది. A heated moment between Tilak Verma and Umpire. 🤯 pic.twitter.com/pe67HdkoHK— Qamar. (@Qamar5618) June 15, 2026చదవండి: శ్రీలంక ప్లేయర్ను నెట్టేసిన వైభవ్.. వీడియో వైరల్ -
శ్రీలంక ప్లేయర్ను నెట్టేసిన వైభవ్.. కోపంతో ఊగిపోతూ..
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా ఆతిథ్య శ్రీలంక- ‘ఎ’- భారత్ -‘ఎ’ జట్ల మధ్య మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. దంబుల్లాలో సోమవారం టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్కు దిగింది. లంక బౌలర్ల ధాటికి 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది.మ్యాచ్ ‘టై’ఆల్రౌండర్లు సూర్యాంశ్ షెడ్గే (72), విప్రాజ్ నిగమ్ (51) అర్ధ శతకాల వల్ల భారత్కు ఈ మాత్రం స్కోరు సాధ్యమైంది. అయితే, విప్రాజ్ నిగమ్ పిచ్ మధ్యభాగంలో రెండుసార్లు పరిగెత్తడం వల్ల భారత్కు పది పరుగుల పెనాల్టీ పడింది. దీంతో 10/0తో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి సరిగ్గా 265 పరుగులే చేసింది.ఫలితంగా మ్యాచ్ ‘టై’ కాగా.. సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19 పరుగులు చేసింది. అనంతరం భారత్ తరఫున బ్యాటింగ్కు దిగిన వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ షెడ్గే లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమయ్యారు. తొలి బంతికి సూర్యాంశ్ రెండు పరుగులు తీయగా.. తర్వాత పరుగేమీ రాలేదు.భారత్ ఓటమిఆ తర్వాత వైభవ్ రెండు పరుగులు తీయగా.. మరుసటి బంతికి ఫోర్ బాదాడు. ఆఖరి బంతికి ఎనిమిది పరుగులు అవసరం కాగా.. వైభవ్ పరుగులేమీ తీయలేకపోయాడు. దీంతో భారత్ ఓటమి ఖరారైంది. ఈ క్రమంలో వైల్డ్గా సెలబ్రేట్ చేసుకున్న శ్రీలంక ప్లేయర్లలో ఎవరో వైభవ్ను ఏదో అన్నట్లుగా కనిపించింది.శ్రీలంక ప్లేయర్ను నెట్టేసిన వైభవ్దీంతో కోపంతో శ్రీలంక ఆటగాళ్లపై దూసుకువెళ్లిన పదిహేనేళ్ల వైభవ్ వారిని నెట్టేశాడు. ఇంతలో అంపైర్, సూర్యాంశ్ వచ్చి అతడిని వారి నుంచి విడదీశారు. ఆ తర్వాత కూడా వైభవ్ చేయి చూపిస్తూ కోపంతో ఊగిపోతూ మైదానం వీడాడు. అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకున్నారు. వైభవ్ దూకుడుగా వ్యవహరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.చదవండి: నరాలు తెగే ఉత్కంఠ.. ట్విస్టులు.. హైడ్రామా🚨 BIG TROUBLE FOR VAIBHAV & TILAK 😭Vaibhav Sooryavanshi and Tilak Varma could face a 1-2 match ban after their heated argument with the umpires 😳- Suryavanshi's physical altercation with Sri Lanka A players after the match might cost him dearly 😥 pic.twitter.com/Fc5zLXYL91— Jara (@JARA_Memer) June 15, 2026 -
IND vs SL: నరాలు తెగే ఉత్కంఠ.. ట్విస్టులే ట్విస్టులు.. ఆఖరికి
ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్-‘ఎ’ జట్టుకు మరో పరాభవం ఎదురైంది. తొలుత అఫ్గనిస్తాన్ చేతిలో ఓడిన భారత జట్టు తాజాగా.. సోమవారం నాటి మ్యాచ్లో శ్రీలంక చేతిలోనూ పరాజయం పాలైంది.ముక్కోణపు వన్డే సిరీస్కాగా శ్రీలంక వేదికగా ఆతిథ్య లంక, భారత్, అఫ్గనిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య జూన్ 9న ముక్కోణపు వన్డే సిరీస్ మొదలైంది. తొలి మ్యాచ్లో శ్రీలంకపై భారత్ 8 పరుగుల తేడాతో గెలవగా.. రెండో మ్యాచ్లో అఫ్గనిస్తాన్ భారత్పై 4 పరుగుల తేడాతో గట్టెక్కింది.ఇక మూడో మ్యాచ్లో శ్రీలంక అఫ్గనిస్తాన్పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించగా.. నాలుగో మ్యాచ్లో భాగంగా సోమవారం భారత్- శ్రీలంక రెండోసారి తలపడ్డాయి. టాస్ గెలిచిన శ్రీలంక ఆహ్వానం మేరకు.. తిలక్ వర్మ సేన తొలుత బ్యాటింగ్కు దిగింది.265 పరుగులు చేసి ఆలౌట్గత మ్యాచ్లో ఆకట్టుకున్న భారత ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్ (11), వైభవ్ సూర్యవంశీ (21) ఈసారి నిరాశపరిచారు. ఫామ్లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ ఈసారి 37 పరుగులకే పరిమితం కాగా.. కెప్టెన్ తిలక్ వర్మ కేవలం 23 పరుగులే చేశాడు. ఆయుశ్ బదోని 15, నిశాంత్ సింధు 6, అనుకుల్ రాయ్ 8, అర్షద్ ఖాన్ 2 పరుగులు చేసి నిష్క్రమించారు.అయితే, ఆల్రౌండర్లు సూర్యాంశ్ షెడ్గే 66 బంతుల్లో 72, విప్రాజ్ నిగమ్ 49 బంతుల్లో 51 పరుగులు సాధించి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరి అర్ద శతకాల కారణంగా భారత్ 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది.పది పరుగుల పెనాల్టీశ్రీలంక బౌలర్లలో విజయకాంత్ వియస్కాంత్, మొహ్మద్ షిరాజ్ చెరో మూడు వికెట్లు తీసి సత్తా చాటగా.. కెప్టెన్ సహన్ అరాచిగే, వనుజా సహన్, కుగాతస్ మతూలన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. అయితే, విప్రాజ్ నిగమ్ పరుగులు తీసే క్రమంలో రెండుసార్లు పిచ్ మధ్యభాగంలోకి వచ్చాడు. దీంతో భారత జట్టుకు పది పరుగుల పెనాల్టీ పడింది.Not every day you see 5 runs off a helmet hit😅 Watch #SLvIND in the #TalentTVCup, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV 📺 #SonySportsNetwork #SonyLIV #TeamIndia pic.twitter.com/2db4eMFJpL— Sony Sports Network (@SonySportsNetwk) June 15, 2026ఫలితంగా శ్రీలంక 10/0తో తమ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అయితే, బౌలింగ్ సమయంలో బంతి వికెట్ కీపర్ హెల్మెట్కు తాకడంతో శ్రీలంకకు కూడా పెనాల్టీ పడింది.ఇదిలా ఉంటే.. లక్ష్య ఛేదనలో ఓపెనర్లు నిరోషన్ డిక్విల్లా (37), అవిష్క ఫెర్నాండో (22) మెరుగైన ఆరంభం అందించగా.. వన్డౌన్ బ్యాటర్ విశేన్ హలంబగే (17) విఫలమయ్యాడు. కెప్టెన్ సహన్ అరాచిగే 8 పరుగులకే నిష్క్రమించగా.. అహాన్ విక్రమసింఘే 6 పరుగులు చేసి అవుటయ్యాడు.ఇలాంటి తరుణంలో నాలుగో నంబర్ బ్యాటర్ సదీర సమరవిక్రమ ఒంటరి పోరాటం చేశాడు. అతడికి తోడుగా వనుజా సహన్ (25) రాణించగా.. విజయకాంత్ వియస్కాంత్ 39 బంతుల్లో 18 పరుగులు చేయగలిగాడు.నరాలు తెగే ఉత్కంఠఇక 47 ఓవర్లు పూర్తయ్యేసరికి శ్రీలంక ఏడు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేయగా.. విజయానికి 18 బంతుల్లో 18 పరుగులు అవసరమయ్యాయి. అప్పటికి సదీర సమరవిక్రమ 104 బంతుల్లో 88 పరుగుల వద్ద ఉన్నాడు.ఈ క్రమంలో 48వ ఓవర్లో ఆరు పరుగులు రాగా.. శ్రీలంక విజయానికి 12 బంతుల్లో 12 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో సదీర ఆచితూచి ఆడాడు. ఇలాంటి తరుణంలో యశ్ ఠాకూర్ నోబాల్తో 48వ ఓవర్ ఆఖరి బంతికి లంకకు ఫ్రీహిట్ రాగా.. గుణశేఖర ఫోర్ బాదాడు. దీంతో చివరి ఓవర్లో ఐదు పరుగులు అవసరం కాగా.. అర్షద్ ఖాన్ బంతితో రంగంలోకి దిగాడు.తొలి బంతికి పరుగులేమీ ఇవ్వని.. అర్షద్ రెండో బంతికి సదీర సమరవిక్రమను బౌల్డ్ చేశాడు. దీంతో 93 పరుగుల వద్ద సదీర నిష్క్రమించగా.. నాలుగు బంతుల్లో ఐదు పరుగులుగా లంక విజయ సమీకరణం మారింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన షిరాజ్ మూడో బంతికి సింగిల్ తీయగా.. ఆ తర్వాత గుణశేఖర సైతం సింగిల్ పూర్తి చేశాడు.దీంతో రెండు బంతుల్లో మూడు పరుగులు అవసరం కాగా.. అర్షద్పై ఒత్తిడి పెరిగింది. ఐదో బంతికి షిరాజ్ సింగ్ తీయడంతో సమీకరణం ఆఖరి బంతికి రెండు పరుగులుగా మారింది. అయితే, ఆఖరి బంతికి పరుగు తీసిన గుణశేఖర రెండో పరుగు కోసం రాగా.. రనౌట్ అయ్యాడు. దీంతో స్కోర్లు సమం అయ్యాయి.సూపర్ ఓవర్ ముగిసిందిలా..అయితే, గుణశేఖర షాట్ ఆడినట్లు కనిపించలేదని.. బంతి ఫ్లిక్ అయి కీపర్ వైపు వెళ్లింది కాబట్టి దీనిని రన్గా పరిగణించవద్దని భారత శిబిరం కోరగా.. ప్రతికూల నిర్ణయమే వచ్చింది. ఇక ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించాల్సి ఉండగా.. వెలుతురులేమి సమస్యగా మారింది. అయినప్పటికీ సూపర్ కోసం పట్టుపట్టగా.. ఫ్లడ్లైట్లు లేకుండానే శ్రీలంక తొలుత బ్యాటింగ్కు దిగింది.భారత కెప్టెన్ తిలక్ వర్మ అర్షద్ ఖాన్ చేతికి బంతినివ్వగా.. వైడ్, నోబాల్ రూపంలో భారత్ మూల్యం చెల్లించింది. శ్రీలంక 16 పరుగులు చేసింది. అయితే, నోబ్ విషయంలో తిలక్ వర్మ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. కానీ మ్యాచ్ కొనసాగింది. 17 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 9 పరుగులే చేయడంతో ఓటమి ఖరారైంది. -
IND vs SL: కొంపముంచేశాడు.. భారత్కు భారీ షాక్!
శ్రీలంక, అఫ్గనిస్తాన్లతో ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్- ‘ఎ’ ఇప్పటికి రెండు మ్యాచ్లు పూర్తి చేసుకుంది. తొలుత ఆతిథ్య లంక జట్టుతో తలపడ్డ తిలక్ వర్మ సేన.. ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది.అఫ్గన్ చేతిలో ఓటమిఅనంతరం అఫ్గన్-‘ఎ’ జట్టుతో మ్యాచ్లో 349 పరుగుల మేర భారీ స్కోరు సాధించినప్పటికీ.. భారత జట్టుకు పరాభవం తప్పలేదు. వర్షం పదేపదే అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో అఫ్గన్ జట్టు డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం.. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది.ఫలితంగా పాయింట్ల పట్టికలో అఫ్గనిస్తాన్ అగ్రస్థానానికి దూసుకుపోగా.. భారత్, శ్రీలంక రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. అయితే, తర్వాతి మ్యాచ్లో అఫ్గనిస్తాన్పై గెలిచి లంక టాప్కు దూసుకెళ్లగా.. భారత్ రెండు, అఫ్గన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.మరోసారి శ్రీలంకతోఈ ట్రై సిరీస్లో భాగంగా భారత్ సోమవారం నాటి మ్యాచ్లో మరోసారి శ్రీలంకతో తలపడుతోంది. దంబుల్లా వేదికగా టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్కు దిగిన భారత్ 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది.ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్ (11), వైభవ్ సూర్యవంశీ (21) విఫలం కాగా.. రుతురాజ్ గైక్వాడ్ 37, కెప్టెన్ తిలక్ వర్మ 23 పరుగులు చేశారు. మిగతా వారిలో ఆల్రౌండర్లు సూర్యాంశ్ షెడ్గే (72), విప్రాజ్ నిగమ్ (51) అర్ధ శతకాలతో రాణించడంతో భారత్కు గౌరవప్రదమైన స్కోరు దక్కింది.రెండుసార్లు అదే తప్పుఅయితే, విప్రాజ్ చేసిన పొరపాటు వల్ల భారత్ భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. భారత్-‘ఎ’ ఇన్నింగ్స్లో 35వ, 37వ ఓవర్లలో విప్రాజ్.. సింగిల్ తీసే క్రమంలో పిచ్ మధ్యలో పరిగెత్తాడు. ఎంసీసీ నిబంధన 41.14 ప్రకారం.. ఉద్వేశపూర్వకంగా గానీ, అనుకోకుండా గానీ పిచ్ మధ్యలో (ప్రొటెక్టెడ్ ఏరియా)కి వచ్చి డ్యామేజ్కు కారణమయ్యే పరిస్థితి తలెత్తితే తొలుత అంపైర్ సదరు స్ట్రైకర్ను హెచ్చరిస్తాడు.ఇదే తప్పు పునరావృతం చేస్తే బ్యాటింగ్ చేసే జట్టు స్కోరులో ఐదు పరుగుల మేర కోత విధిస్తారు. అయితే, ఇక్కడ తొలుత అనుకుల్ రాయ్ కూడా ఇలాంటి తప్పిదానికే పాల్పడగా.. అంపైర్ వార్నింగ్తో వదిలేశాడు. అయితే, విప్రాజ్ ఒకటి కాకుండా.. ఏకంగా రెండుసార్లు పిచ్ మధ్యలోకి రావడంతో మొత్తంగా భారత్కు పది పరుగుల మేర నష్టం కలిగింది.పది పరుగుల నష్టంఫలితంగా శ్రీలంక తమ ఇన్నింగ్స్ను 10/0తో మొదలుపెట్టింది. అంటే విప్రాజ్ తప్పిదం వల్ల ప్రత్యర్థికి అదనంగా పది పరుగుల మేర లాభం చేకూరింది. ఫైనల్ రేసులో ఉండాలంటే భారత్ తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఈ ఆల్రౌండర్ చేసిన తప్పిదం దేనికి దారితీస్తుందో చూడాలి మరి!!చదవండి: హోల్డర్ సిక్సర్ల వర్షం.. సిరీస్ విండీస్ కైవసం -
అఫ్గనిస్తాన్తో వన్డే.. వైభవ్ సూర్యవంశీ ఉంటాడు!
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ‘ఎ’ జట్టు తరఫున తొలి మ్యాచ్లోనే విఫలమయ్యాడు. ముక్కోణపు సిరీస్లో భాగంగా శ్రీలంక- ‘ఎ’ జట్టుతో మంగళవారం నాటి వన్డేలో ఓపెనర్గా బరిలోకి దిగాడు ఈ లెప్టాండర్ బ్యాటర్.వైభవ్ విఫలంఆరంభంలో బౌండరీలతో అలరించిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. కాసేపటికే అవుటై ఉసూరుమనిపించాడు. మొత్తంగా 12 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్ల సాయంతో కేవలం 14 పరుగులు చేసి మహ్మద్ షిరాజ్ బౌలింగ్లో నిష్క్రమించాడు. ఇక మరో ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (11 బంతుల్లో 2) విఫలమయ్యాడు.Bossing From Ball 1 😎Vaibhav Sooryavanshi - making a 𝙍𝙐𝙏𝙃𝙇𝙀𝙎𝙎 entry on the world stage. 💥 #SonySportsNetwork #SonyLIV #TalentTVCup #TeamIndia #SLvIND pic.twitter.com/tLBkRO2ySF— Sony Sports Network (@SonySportsNetwk) June 9, 2026రుతురాజ్ గైక్వాడ్ సెంచరీసాధారణంగా ఓపెనర్గా బరిలోకి దిగే ప్రియాన్ష్ ఆర్య లంకతో మ్యాచ్లో మూడో స్థానంలో వచ్చి (32 బంతుల్లో 32) ఫర్వాలేదనిపించాడు. టాపార్డర్ విఫలమైనా నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ(101)తో రాణించడంతో భారత్ గట్టెక్కింది. నిర్ణీత 50 ఓవర్లలో 277 పరుగులు చేయగలిగింది.అయితే, విజయం కోసం మాత్రం చివరి వరకు తీవ్రంగా పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. భారత్ విధించిన 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 47 ఓవర్లు ముగిసే సరికి లంక 261/6తో పటిష్టంగా ఉంది. ఆఖరి మూడు ఓవర్లలో 17 పరుగులే రావాల్సి ఉండగా.. విజయం లాంఛనమే అనుకున్నారు.బౌలర్ల విజృంభణతో..కానీ భారత బౌలర్లు ఆఖర్లో పది బంతుల్లోనే నాలుగు వికెట్లు కూల్చి ఆతిథ్య లంక జట్టు ఓటమిని శాసించారు. అర్షద్ ఖాన్, అనుకుల్ రాయ్, ఆయుశ్ బదోని, విప్రాజ్ నిగమ్ రెండేసి వికెట్లు తీయగా... అన్షుల్ కాంబోజ్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో తిలక్ వర్మ సేన ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించి.. సిరీస్లో ఆధిక్యంలో నిలిచింది.ఇక తమ రెండో మ్యాచ్లో భాగంగా భారత్- ‘ఎ’ జట్టు గురువారం అఫ్గనిస్తాన్-‘ఎ’ జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పుపై చర్చ మొదలైంది. ఓపెనర్లుగా వైభవ్, ప్రభ్సిమ్రన్ విఫలమైనా వారిద్దరిని కొనసాగించాలని నాయకత్వ బృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తద్వారా లంకపై గెలిచిన తుది జట్టుతోనే భారత్ అఫ్గన్తో వన్డే బరిలోనూ దిగనున్నట్లు తేలిపోయింది.అఫ్గనిస్తాన్-‘ఎ’తో వన్డేకు భారత తుదిజట్టు (అంచనా)వైభవ్ సూర్యవంశీ, ప్రభ్సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాన్ష్ ఆర్య, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ (కెప్టెన్), ఆయుశ్ బదోని, అనుకుల్ రాయ్, సూయాన్ష్ షెడ్గే, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్, విప్రాజ్ నిగమ్.చదవండి: వాళ్లకే దిక్కు లేదు.. అతడిని ఎలా ఎంపిక చేస్తారు? -
గైక్వాడ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో టీమిండియా గెలుపు
శ్రీలంకలో జరుగుతున్న ఏ-జట్ల ముక్కోణపు టోర్నీలో టీమిండియా బోణీ కొట్టింది. డంబుల్లా వేదికగా శ్రీలంక-ఏతో ఇవాళ (జూన్ 9) జరిగిన మ్యాచ్లో 8 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రుతురాజ్ గైక్వాడ్ (101) సూపర్ సెంచరీతో, కెప్టెన్ తిలక్ వర్మ (60) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆఖర్లో ఆయుశ్ బదోని (24), సూర్యాంశ్ షేడ్గే (26 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లతో అలరించారు. మిగతా ఆటగాళ్లలో ప్రియాంశ్ ఆర్మ 32, ప్రభ్సిమ్రన్ సింగ్ 2, అనుకూల్ రాయ్ 1 (నాటౌట్) పరుగు చేయగా.. ఐపీఎల్ 2026 తర్వాత భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ 14 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.లంక బౌలర్లలో మొహమ్మద్ షిరాజ్ 2 వికెట్లు తీయగా.. కరుణరత్నే, సంకేత్, వనుజ సహాన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక, సాహన్ అరచ్చిగే (74), నిరోషన్ డిక్వెల్లా (47), సమరవిక్రమ (46) రాణించడంతో ఓ దశలో (262/6) గెలుపు దిశగా దూసుకెళ్లింది. అయితే చివరి రెండు ఓవర్లలో (7 పరుగుల వ్యవధిలో) కేవలం 10 పరుగులు అవసరమైన సమయంలో శ్రీలంక వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయి 269 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది.అర్షద్ ఖాన్, ఆయుష్ బదోని, అనుకూల్ రాయ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా, అన్షుల్ కంబోజ్ ఓ వికెట్ పడగొట్టింది. జూన్ 11న జరిగే తదుపరి మ్యాచ్లో భారత్-ఏ, ఆఫ్ఘనిస్తాన్-ఏ తలపడనున్నాయి. -
టీమిండియాలో చోటివ్వరా? శతకంతో కదం తొక్కాడు!
టీమిండియా స్టార్ రుతురాజ్ గైక్వాడ్ శతక్కొట్టాడు. శ్రీలంక-‘ఎ’ జట్టుతో తొలి వన్డేలో సెంచరీతో మెరిసి జట్టును ఆదుకున్నాడు. ముక్కోణపు వన్డే సిరీస్ ఆడేందుకు భారత్- ‘ఎ’ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో పాటు అఫ్గనిస్తాన్తో భారత్ వన్డేలు ఆడనుంది. ఈ క్రమంలో తొలుత శ్రీలంకతో పోరుకు భారత్ సిద్ధమైంది. దంబుల్లా వేదికగా మంగళవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ తిలక్ వర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.వైభవ్ విఫలం..అయితే, ఆదిలోనే శ్రీలంక భారత్కు షాకిచ్చింది. ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్ (11 బంతుల్లో 2), వైభవ్ సూర్యవంశీ (12 బంతుల్లో 14)లను పెవిలియన్కు పంపి దెబ్బకొట్టింది. వన్డౌన్లో వచ్చిన ప్రియాంశ్ ఆర్య 32 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.శతకంతో కదంతొక్కాడుఇలాంటి తరుణంలో నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ శతకంతో కదంతొక్కాడు. మొత్తంగా 114 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 101 పరుగులు సాధించాడు. కెప్టెన్ తిలక్ వర్మ (97 బంతుల్లో 60)తో కలిసి 185 బంతుల్లో 150 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నాడు.మిగిలిన వారిలో ఆయుశ్ బదోని 24, సూర్యాంశ్ షెడ్గే 26 పరుగులతో రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన భారత్ 277 పరుగులు చేయగలిగింది. శ్రీలంక బౌలర్లలో మహ్మద్ షిరాజ్ రెండు వికెట్లు దక్కించుకోగా.. చమిక కరుణరత్నె, గరుక సంకేత్, వనుజా సాహన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.అఫ్గనిస్తాన్తో వన్డేలకు ఎంపిక చేయని సెలక్టర్లుచివరగా సౌతాఫ్రికాతో వన్డేలో టీమిండియా తరఫున రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయినప్పటికీ ఆ తర్వాత సెలక్టర్లు అతడిని పక్కనపెట్టారు. అఫ్గనిస్తాన్తో స్వదేశంలో జూన్ సిరీస్కు రుతురాజ్ను ఎంపిక చేయలేదు.స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయపడగా.. అతడి స్థానంలో యశస్వి జైస్వాల్కు ఆఖరి నిమిషంలో చోటిచ్చారు. ఇలాంటి తరుణంలో రుతురాజ్ భారత్-ఎ తరఫున శతక్కొట్టడం విశేషం. దీంతో తనను విస్మరించిన టీమిండియా సెలక్టర్లకు రుతు బ్యాట్తోనే గట్టి సమాధానం ఇచ్చాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: కొడితే సెంచరీ.. లేదంటే డకౌట్! -
వన్డే సిరీస్కు అఫ్గనిస్తాన్ జట్టు ప్రకటన
ముక్కోణపు వన్డే సిరీస్కు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) తమ జట్టును ప్రకటించింది. శ్రీలంక- ‘ఎ’, భారత్- ‘ఎ’ జట్లతో తలపడే అఫ్గన్- ‘ఎ’ జట్టు వివరాలను గురువారం వెల్లడించింది. ఈ జట్టుకు ఇమ్రాన్ మిర్ కెప్టెన్గా వ్యవహరిస్తాడని ఏసీబీ తెలిపింది. వికెట్ కీపర్ల కోటాలో నూర్ రహ్మాన్తో పాటు మొహమ్మద్ ఇషాక్లకు సెలక్టర్లు చోటిచ్చారు. బ్యాటింగ్ విభాగంలో హసన్ ఐసాఖిల్, ఖలీద్ తనీవాల్, ఐజాజ్ అహ్మద్జాయ్, బహీర్ షా మెహబూబ్, ఫైజల్ ఖాన్ షినోజదా స్థానం సంపాదించుకున్నారు.ఆల్రౌండర్ల జాబితాలో ఫర్మానుల్లా సూఫీ, షామ్స్ ఉర్ రహ్మాన్ ఎంపికయ్యారు. వీరు సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్లు కాగా.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ ఖలీల్ గుర్బాజ్కు కూడా సెలక్టర్లు ఈ జట్టులో చోటిచ్చారు.ఇక స్పిన్ దళంలో రిస్ట్ స్పిన్నర్ జహీర్ ఖాన్ పక్టీన్ ఒక్కడే ఉండగా.. పేస్ విభాగంలో మహ్మద్ ఇబ్రహీం, అబ్దుల్లా అహ్మద్జాయ్, ఫరీదూన్ దావూద్జాయ్ సేవలు అందించనున్నారు. కాగా జూన్ 9 నుంచి 21 వరకు శ్రీలంక వేదికగా ఈ ముక్కోణపు వన్డే సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్లో భారత్-‘ఎ’ జట్టుకు హైదరాబాదీ తిలక్ వర్మ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అదే విధంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. దంబుల్లా వేదికగా భారత్- శ్రీలంక- అఫ్గన్ ‘ఎ’ జట్ల మధ్య మ్యాచ్లు జరుగనున్నాయి.శ్రీలంక- భారత్లతో ముక్కోణపు వన్డే సిరీస్కు అఫ్గన్-‘ఎ’ జట్టు ఇదేఇమ్రాన్ మిర్ (కెప్టెన్), నూర్ రహ్మాన్, మొహమ్మద్ ఇషాక్, హసన్ ఐసాఖిల్, ఖలీద్ తనీవాల్, ఐజాజ్ అహ్మద్జాయ్, బహీర్ షా మెహబూబ్, ఫైజల్ ఖాన్ షినోజదా, ఫర్మానుల్లా సూఫీ, షామ్స్ ఉర్ రహ్మాన్, జహీర్ ఖాన్ పక్టీన్, ఫరీదూన్ దావూద్జాయ్, మహ్మద్ ఇబ్రహీం, అబ్దుల్లా అహ్మద్జాయ్.సిరీస్ షెడ్యూల్ ఇదేజూన్ 9: భారత్ వర్సెస్ శ్రీలంకజూన్ 11: భారత్ వర్సెస్ అఫ్గన్జూన్ 13: అఫ్గన్ వర్సెస్ శ్రీలంకజూన్ 15: భారత్ వర్సెస్ శ్రీలంకజూన్ 17: భారత్ వర్సెస్ అఫ్గన్జూన్ 19: అఫ్గన్ వర్సెస్ శ్రీలంకజూన్ 12: ఫైనల్. -
భారత జట్టులో మార్పు.. కేకేఆర్ స్టార్కు లక్కీ ఛాన్స్
కోల్కతా నైట్ రైడర్స్ ఆల్రౌండర్ అనుకుల్ రాయ్కు సువర్ణావకాశం వచ్చింది. భారత్-‘ఎ’ జట్టులో అతడు చోటు దక్కించుకున్నాడు. హర్ష్ దూబే స్థానంలో శ్రీలంక, అఫ్గనిస్తాన్ ‘ఎ’ జట్లతో జరిగే త్రైపాక్షిక సిరీస్కు అనుకుల్ రాయ్ ఎంపికయ్యాడు.హర్ష్ దూబే స్థానంలో..ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గురువారం వెల్లడించింది. కాగా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ హర్ష్ దూబే ఇటీవలే టీమిండియా నుంచి పిలుపు అందుకున్న సంగతి తెలిసిందే. స్వదేశంలో అఫ్గనిస్తాన్తో జరిగే ఏకైక టెస్టు, వన్డే సిరీస్కు సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు.కారణం ఇదేకాగా హర్ష్ దూబే జాతీయ జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి. అయితే, అఫ్గన్తో సిరీస్ కంటే ముందు ప్రకటించిన భారత జట్టులో హర్ష్ దూబేకు చోటిచ్చారు సెలక్టర్లు. తాజాగా అతడి స్థానంలో అనుకుల్ రాయ్ను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.జార్ఖండ్కు చెందిన 27 ఏళ్ల అనుకుల్ రాయ్ స్పిన్ ఆల్రౌండర్. ఎడమచేతి వాటం గల ఈ ఆటగాడు ఐపీఎల్-2026లో కోల్కతాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటికి 13 మ్యాచ్లు ఆడి 43 పరుగులు చేయడంతో పాటు.. ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.తిలక్ వర్మ సారథ్యంలోఇదిలా ఉంటే.. శ్రీలంకలో జరిగే వన్డే ముక్కోణపు సిరీస్లో ఆతిథ్య జట్టుతో పాటు భారత్-‘ఎ’, అఫ్గన్-‘ఎ’ జట్లు పాల్గొంటాయి. జూన్ 9- జూన్ 21 మధ్య ఈ సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు డంబుల్లా వేదిక. ఇక ఈ సిరీస్లో భారత జట్టుకు హైదరాబాదీ తిలక్ వర్మ కెప్టెన్గా ఎంపిక కాగా.. చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ తొలిసారిగా ‘ఎ’ జట్టులో చోటు దక్కించుకున్నాడు.ముక్కోణపు వన్డే సిరీస్కు భారత్-‘ఎ’ జట్టు (అప్డేటెడ్)తిలక్ వర్మ (కెప్టెన్), ప్రియాన్ష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), ఆయుశ్ బదోని, నిశాంత్ సంధు, సూయాన్ష్ షెడ్గే, ప్రభ్సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), కుమార్ కుశాగ్రా (వికెట్ కీపర్), విప్రాజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్, అనుకుల్ రాయ్. -
Asia Cup 2026: ఫైనల్కు దూసుకెళ్లిన భారత్
మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్- 2026 టోర్నీలో భారత్ ఫైనల్కు దూసుకువెళ్లింది. తొలి సెమీస్ మ్యాచ్లో శ్రీలంకను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ వేదికగా ఈ టీ20 టోర్నీ ఫిబ్రవరి 13న మొదలైంది.ఎనిమిది జట్లుగ్రూప్-ఎ నుంచి భారత్-ఎ, పాకిస్తాన్-ఎ.. యూఏఈ, నేపాల్ మహిళా జట్లు పాల్గొనగా.. గ్రూప్-బి నుంచి బంగ్లాదేశ-ఎ, శ్రీలంక-ఎ, థాయ్లాండ్, మలేషియా మహిళా జట్లు బరిలో నిలిచాయి. ఈ నేపథ్యంలో గ్రూప్-ఎ టాపర్లు భారత్, పాక్.. గ్రూప్-బి టాపర్లు బంగ్లాదేశ్, శ్రీలంక సెమీ ఫైనల్ చేరాయి.118 పరుగులకే ఆలౌట్ఈ క్రమంలో తొలి సెమీ ఫైనల్లో భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్లు శుక్రవారం తలపడ్డాయి. టెర్థాయ్ స్టేడియంలో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత బౌలర్ల ధాటికి తాళలేక 19.4 ఓవర్లలో కేవలం 118 పరుగులే చేసి లంక బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది.రాధా యాదవ్కు నాలుగుఓపెనర్లు సంజనా కావింది (31), హన్సిమ కరుణరత్నె (14)లతో పాటు సత్య సందీపణి (15), షాశిని గిమ్హాని (22) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో కెప్టెన్ రాధా యాదవ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. తనుజా కణ్వార్, ప్రేమా రావత్ చెరో రెండు వికెట్లు కూల్చారు. సైమా ఠాకూర్, మిన్ను మణి తలా ఒక వికెట్ పడగొట్టారు.బ్యాటింగ్లోనూ ఇరగదీసిన కెప్టెన్ ఇక లక్ష్య ఛేదనలోనూ భారత మహిళా జట్టు అదరగొట్టింది. ఓపెనర్లలో నందిని కశ్యప్ (13) నిరాశపరిచినా.. వ్రిందా దినేశ్ మెరుపు ఇన్నింగ్స్ (20 బంతుల్లో 42)తో ఆకట్టుకుంది. వన్డౌన్ బ్యాటర్ల అనుష్క శర్మ (18 బంతుల్లో 27) ఫర్వాలేదనిపించగా.. రాధా యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ (18 బంతుల్లో 31 నాటౌట్)తో మెరిసింది.𝐅𝐢𝐧𝐚𝐥𝐬, 𝐡𝐞𝐫𝐞 𝐰𝐞 𝐜𝐨𝐦𝐞 🇮🇳Radha Yadav seals it with a boundary as India book their place in the final 😍#SonySportsNetwork #GirlsRising | DP World Women’s Asia Cup Rising Stars 2026 pic.twitter.com/vuMvuCPhUH— Sony Sports Network (@SonySportsNetwk) February 20, 2026ఫైనల్లో భారత్మిగిలిన వాళ్లలో తేజల్ హసాబ్నిస్ (3), మిన్ను మణి (2) విఫలమయ్యారు. అయితే, వ్రిందా వేసిన పునాదిపై అనుష్క, రాధా ఇన్నింగ్స్ నిర్మించడంతో 13.3 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 119 పరుగుల టార్గెట్ను భారత్ పూర్తి చేసింది. తద్వారా శ్రీలంకను ఐదు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది.లంక బౌలర్లలో షాశిని రెండు వికెట్లు తీయగా.. యసాంతి నిమంతికకు ఒక వికెట్ దక్కింది. ఇక ఆల్రౌండ్ ప్రదర్శనతో దుమ్ములేపిన రాధా యాదవ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. బంగ్లాదేశ్- పాకిస్తాన్ మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్లో విజేతతో భారత్ ఆదివారం నాటి టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకుంటుంది. చదవండి: పాకిస్తాన్ క్రికెటర్లకు భారీ షాక్!


