-
ఇన్ఫీలో మరో దుమారం!
బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మరోసారి ‘అనైతిక విధానాల’ ఆరోపణల్లో చిక్కుకుంది. సీఈవో సలీల్ పరేఖ్, సీఎఫ్వో నీలాంజన్ రాయ్ స్వల్పకాలికంగా ఆదాయాలు, లాభాలను పెంచి చూపించేందుకు అనైతిక విధానాలు పాటిస్తున్నట్లు పేరు వెల్లడించని కొందరు ఉద్యోగులు ఇన్ఫీ బోర్డుకు ఫిర్యాదు చేశారు. ‘ఇటీవలి కొన్ని త్రైమాసికాలుగా సీఈవో పాటిస్తున్న అనైతిక విధానాలను మీ దృష్టికి తేగోరుచున్నాము. స్వల్పకాలికంగా ఆదాయాలు, లాభాలు పెంచి చూపేందుకు ప్రస్తుత త్రైమాసికంలో కూడా అలాంటి విధానాలే పాటిస్తున్నారు. బోర్డు తక్షణమే విచారణ జరిపి, చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం‘ అంటూ సెప్టెంబర్ 20న డైరెక్టర్స్ బోర్డుకు వారు లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన ఈ–మెయిల్స్, వాయిస్ రికార్డింగ్స్ కూడా తమ దగ్గర ఉన్నట్లు తెలిపారు. అందులో తమను తాము ’నైతికత గల ఉద్యోగులుగా’ ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. మరోవైపు, ప్రజావేగుల ఫిర్యాదును కంపెనీ పాలసీ ప్రకారం ఆడిట్ కమిటీ ముందు ఉంచినట్లు ఇన్ఫోసిస్ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికాలోనూ ఫిర్యాదు.. గడిచిన రెండు త్రైమా సికాలుగా ఇన్ఫీ ఖాతాలు, ఆర్థిక ఫలితాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ అమెరికాలోని ‘విజిల్బ్లోయర్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం’కు కూడా ప్రజావేగులు ఫిర్యాదు చేశారు. లాభాలను పెంచి చూపడం కోసం వీసా ఖర్చుల్లాంటి వ్యయాలను పూర్తిగా చూపించొద్దంటూ తమకు ఆదేశాలు వచ్చినట్లు పేర్కొన్నారు. ‘ఈ సంభాషణకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్స్ మా దగ్గర ఉన్నాయి. ఆడిటరు వ్యతిరేకించడంతో దీన్ని వాయిదా వేశారు‘ అని తెలిపారు. ఈ క్వార్టర్లోనూ లాభాలు తగ్గిపోయి, స్టాక్ ధరపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతో ఓ కాంట్రాక్టుకు సంబంధించి 50 మిలియన్ డాలర్ల చెల్లింపులను ఖాతాల్లో చూపొద్దంటూ చాలా ఒత్తిడి తెస్తున్నారని ఫిర్యాదుదారులు తెలిపారు. కీలకమైన సమాచారాన్ని ఆడిటర్లు, బోర్డుకు తెలియకుండా తొక్కిపెట్టి ఉంచడం జరుగుతోందని తెలిపారు. సీఈవోనే నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.. ‘భారీ డీల్స్ కుదుర్చుకోవడంలో బోలెడు అవకతవకలు జరుగుతున్నాయి. సీఈవో అన్ని నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. భారీ మార్జిన్లు వస్తున్నాయని తప్పుదోవ పట్టించేలా నివేదికలు తయారు చేయాలంటూ సేల్స్ టీమ్ను ఆదేశిస్తున్నారు. సీఎఫ్వో కూడా ఆయన చెప్పినట్లే చేస్తున్నారు. భారీ డీల్స్లో లొసుగులు బోర్డు సమావేశాల్లో ప్రస్తావనకు తేనివ్వకుండా మమ్మల్ని ఆపేస్తున్నారు. బోర్డు సభ్యులకివేవీ పట్టవని.. షేరు ధర బాగుంటే వాళ్లకు సరిపోతుందని సీఈవో మాతో చెప్పారు‘ అని ఫిర్యాదుదారులు తీవ్ర ఆరోపణలు చేశారు. గత కొన్ని త్రైమాసికాలుగా కుదుర్చుకున్న బిలియన్ల డాలర్ల డీల్స్లో పైసా మార్జిన్ లేదని పేర్కొన్నారు. చాలా మటుకు స మాచారాన్ని ఆడిటర్లకు చెప్పకుండా దాచిపెట్టేస్తు న్నారని, కేవలం లాభాలు, సానుకూల అంశాలే ఆర్థిక ఫలితాల్లో చూపాలని సీఈవో, సీఎఫ్వో ఒత్తిడి తెస్తున్నారని ఫిర్యాదుదారులు ఆరోపించా రు. దీన్ని వ్యతిరేకించే ఉద్యోగులను పక్కన పెడుతున్నారని, ఫలితంగా వారిలో చాలా మంది సం స్థ నుంచి నిష్క్రమించాల్సి వచ్చిందని తెలిపారు. గతంలో కూడా ఇన్ఫీ.. కార్పొరేట్ గవర్నెన్స్ లోపాల ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెలీ టెక్నాలజీ సంస్థ పనయా కొనుగోలులో అవకతవకలు జరిగాయంటూ ప్రజావేగుల ఆరోపణలు వచ్చిన దరిమిలా అప్పటి సీఈవో విశాల్ సిక్కా, ఎన్ఆర్ నారాయణ మూర్తి తదితర వ్యవస్థాపకుల మధ్య వివాదం తలెత్తింది. చివరికి 2017 ఆగస్టులో సిక్కా వైదొలిగారు. ఆయన స్థానంలో గతేడాది జనవరిలో పగ్గాలు చేపట్టిన సలిల్ పరేఖ్ కూడా తాజాగా గవర్నెన్స్ లోపాల ఆరోపణల్లో చిక్కుకోవడం గమనార్హం. ఇన్ఫీ ఏడీఆర్ క్రాష్... తాజా పరిణామాలతో అమెరికా నాస్డాక్లో లిస్టయిన ఇన్ఫోసిస్ ఏడీఆర్ (అమెరికన్ డిపాజిటరీ రిసీట్) సోమవారం కుప్పకూలింది. ఒక దశలో ఏకంగా 16 శాతం క్షీణించింది. -
ఇన్ఫీ మూర్తివి తప్పుడు ఆరోపణలు
కంపెనీ మాజీ చైర్మన్ శేషసాయి న్యూఢిల్లీ: ఇన్ఫీ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఆరోపణలపై మాజీ చైర్మన్ ఆర్ శేషసాయి ఎదురుదాడికి దిగారు. మూర్తి తనపై ‘వ్యక్తిగత దాడులకు’ దిగుతున్నారని, ‘తప్పుడు ఆరోపణలు చేస్తూ.. అభాండాలు వేస్తున్నారని‘ వ్యాఖ్యానించారు. అదే పనిగా కక్ష సాధింపు చర్యలను కొనసాగించడం వెనుక కారణాలేమిటో తనకు అర్థం కావడం లేదంటూ పేర్కొన్నారు. ‘నేను ఇన్ఫీ బోర్డు నుంచి వైదొలిగిన రోజు నుంచీ అనేక కవ్వింపు చర్యలు ఉంటున్నప్పటికీ.. బహిరంగంగా ఎలాంటి ప్రతికూల ప్రకటనలూ చేయలేదు. గత వివాదాలతో సతమతం కాకుండా కంపెనీ ముందుకెళ్లాలని నిజాయితీగా నేను ఆకాంక్షిస్తుండటమే ఇందుకు కారణం’ అని శేషసాయి చెప్పారు. ఇటీవలి ఇన్వెస్టర్ల సమావేశంలో మూర్తి తనపై వ్యక్తిగతంగా తప్పుడు అభియోగాలు మోపడం వల్లే తాను తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రకటన చేయాల్సి వచ్చిందని ఆయన వివరణ ఇచ్చారు. తాను మూర్తి ఆహ్వానం మేరకే ఇన్ఫీలో చేరానని, నైతికతకు నిలువెత్తు నిదర్శనం అంటూ కొద్ది నెలల క్రితమే కితాబిచ్చిన నారాయణ మూర్తి.. అంతలోనే తనపై కక్ష సాధింపు చర్యలకు దిగడం వెనుక కారణాలేంటో అర్థం కావడం లేదన్నారు. గవర్నెన్స్పై వాటాదారులతో చర్చలు: ఇన్ఫీ వ్యవస్థాపకులు, బోర్డు సభ్యుల మధ్య విభేదాలతో వివాదాల్లో చిక్కుకున్న ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్.. మళ్లీ కార్యకలాపాలను గాడిన పెట్టడంపై దృష్టి సారిస్తోంది. సంస్థలో పాలనాపరమైన ప్రమాణాలు అత్యుత్తమ స్థాయిలో పాటించే దిశగా తీసుకోతగిన చర్యలపై షేర్హోల్డర్లతో సంప్రతింపులు జరుపుతున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు ఇన్ఫోసిస్ తెలిపింది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
టీడీపీ బండారం బయటపెట్టిన వైఎస్సార్సీపీ మహిళలు
బొలెరో ఢీకొని వ్యక్తి దుర్మరణం
డీజిల్ కుంభకోణంపై రీజినల్ డైరెక్టర్ విచారణ
ప్రేమ పేరిట యువతి మోసం
ఈఏపీసెట్ ఫలితాల్లో ‘అల్ఫోర్స్’కు అత్యున్నత ర్యాంకులు
ఠాణాలో ఆత్మహత్యాయత్నం
ఉమ్మడి జిల్లా.. పర్యాటక ఖిల్లా
పట్టించుకుంటలేరు
స్ట్రాంగ్రూమ్లను నిరంతరం పర్యవేక్షించాలి
సీబీఎస్ఈ సిలబస్ అమలు చేయాలి
తప్పక చదవండి
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- అడవిలో పుట్టి... గుడి ముంగిట నిలిచి...
- నీటిలో ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చు
- దేశంలోనే పెద్ద స్టీల్ ఎయిర్ కాన్కోర్స్
- Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
- టైముకు తినండి.. ఆరోగ్యంగా ఉండండి!
- తెలంగాణ ఈఏపీసెట్లో ఏపీ ప్రభంజనం
- భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
Advertisement