IPL 2027
-
ఈ ఐదుగురు తమ చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడేశారు?!
ఐపీఎల్ పందొమ్మిదో సీజన్ ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టైటిల్ నిలబెట్టుకుంది. అహ్మదాబాద్లో ఆదివారం జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించి వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది.ఇదిలా ఉంటే.. ఈ సీజన్తో కొంతమంది ఆటగాళ్లు ఐపీఎల్ కెరీర్ చరమాంకానికి చేరినట్లు తెలుస్తోంది. అంచనాలు అందుకోలేక చతికిలపడిన కొందరు ప్లేయర్లను వదిలించుకునేందుకు ఫ్రాంఛైజీలు సిద్ధమైనట్లు సమాచారం. ఈ జాబితాలో టాప్-5లో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు ఇవే!కరుణ్ నాయర్కరుణ్ నాయర్ను ఢిల్లీ క్యాపిటల్స్ గతేడాది రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. మిడిలార్డర్లో రాణిస్తాడనే ఉద్దేశంతో 34 ఏళ్ల ఈ వెటరన్ బ్యాటర్కు అవకాశం ఇచ్చింది. ఇక, ఐపీఎల్-2025లో కరుణ్ నాయర్ కాస్త ఫర్వాలేదనిపించాడు.ఎనిమిది ఇన్నింగ్స్లో కలిపి 198 పరుగులు చేయగలిగాడు. దీంతో ఈ ఏడాది కూడా ఫ్రాంఛైజీ అతడిని కొనసాగించింది. అయితే, ఐపీఎల్-2026లో రెండు ఇన్నింగ్స్ ఆడిన కరుణ్ కేవలం 18 పరుగులే చేశాడు. ఫీల్డింగ్లోనూ విఫలమయ్యాడు.వచ్చే సీజన్ నాటికి కరుణ్ 35వ వసంతంలోకి అడుగుపెడతాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టు పునర్నిర్మాణంలో భాగంగా యువ ఆటగాళ్లను ఎంచుకునే క్రమంలో కరుణ్ నాయర్కు స్వస్తి పలికే అవకాశం ఉంది. ఇక అతడికి కొత్త జట్టు దొరకడం కూడా కష్టమే!టి.నటరాజన్సన్రైజర్స్ హైదరాబాద్ నెట్ బౌలర్గా వచ్చి.. ఐపీఎల్లో ఇటీవలి కాలంలో ప్రభావం చూపిన లెఫ్టార్మ్ పేసర్లలో ఒకడిగా ఎదిగాడు టి.నటరాజన్. ఢిల్లీ క్యాపిటల్స్ గతేడాది అతడిని ఏకంగా రూ. 10.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.అందుకు తగ్గట్లుగానే ఆరంభంలో రాణించినప్పటికీ.. ఆ తర్వాత అదే జోరు కొనసాగించకలేకపోయాడు ఈ తమిళనాడు బౌలర్. పది ఇన్నింగ్స్లో కలిపి కేవలం ఐదు వికెట్లే తీశాడు. ఎకానమీ 11.18.వరుసగా ఆరు మ్యాచ్లలో నటరాజన్ ఒక్క వికెట్ కూడా తీయలేక చతికిలపడ్డాడు. కాబట్టి ఢిల్లీ అతడిని వదిలివేయడం ఖాయంగానే కనిపిస్తోంది.అన్రిచ్ నోర్జేసౌతాఫ్రికా స్పీడ్స్టర్ అన్నిచ్ నోర్జేను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. పదునైన పేస్ ఆయుధంతో రాణించగల నోర్జే.. అదే స్థాయిలో గాయాల బారిన పడటం ప్రతికూలంగా మారింది.తాజా ఎడిషన్లో అతడు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడగలిగాడు. గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు. గతంలో కేకేఆర్ తరఫున కూడా కేవలం రెండు మ్యాచ్లే ఆడి వెళ్లిపోయాడు. దీంతో గాయాల బెడదతో బాధపడుతున్న నోర్జేకు ఫ్రాంఛైజీలు మళ్లీ అవకాశం ఇవ్వడం దాదాపుగా అసాధ్యమే అనిపిస్తోంది.ట్రెంట్ బౌల్ట్న్యూజిలాండ్ సీనియర్ పేసర్ ఫాస్ట్బౌలర్ ట్రెంట్ బౌల్ట్కు ఐపీఎల్లోనూ ఘన చరిత్రే ఉంది. వివిధ ఫ్రాంఛైజీలకు ప్రాతినిథ్యం వహిస్తూ.. విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ కివీస్ బౌలర్.. ఇప్పటికి 124 మ్యాచ్లలో కలిపి 145 వికెట్లు పడగొట్టాడు.ఇక ఐపీఎల్-2026కు ముందు ముంబై ఇండియన్స్ రూ. 12.50 కోట్ల భారీ ధరకు బౌల్ట్ను కొనుగోలు చేసింది. అయితే, ఆశించిన రీతిలో అతడు రాణించలేకపోయాడు. ఐదు మ్యాచ్లు ఆడి కేవలం రెండే వికెట్లు తీశాడు. దీంతో అతడికి బౌలింగ్ కోటా పూర్తి చేసే అవకాశం కూడా రాలేదు. కాబట్టి 36 ఏళ్ల బౌల్ట్ను ముంబై వదిలేస్తే.. అతడికి మరో ఫ్రాంఛైజీ నుంచి అవకాశం రావడం కష్టమే అనిపిస్తోంది.హర్షల్ పటేల్ఐపీఎల్-2026కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్ హర్షల్ పటేల్ను రూ. 8 కోట్లకు రిటైన్ చేసుకుంది. గతేడాది 13 ఇన్నింగ్స్లో కలిపి అతడు 16 వికెట్లు తీశాడు అయితే, గతంలో మాదిరి ఈసారి హర్షల్ రాణించలేదు.ఐదు మ్యాచ్లు ఆడి 10కి పైగా ఎకానమీతో పరుగులు ఇచ్చి.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. వచ్చే సీజన్ నాటికి హర్షల్ 35వ వసంతంలోకి అడుగుపెడతాడు. ఈ పరిణామాల క్రమంలో సన్రైజర్స్ అతడిని వదిలివేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. హర్షల్ వేలంలోకి వచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఫ్రాంఛైజీ అతడి వైపు మొగ్గుచూపకపోవచ్చు.చదవండి: IPL 2026: వైభవ్ తగ్గేదేలే.. ఎవరికెంత ప్రైజ్మనీ? -
రోహిత్ శర్మ వద్దు.. ముంబై కెప్టెన్గా అతడే సరైనోడు
ఐపీఎల్-2026 సీజన్లో ఘోర ప్రదర్శన తర్వాత ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తీవ్రమైన మానసిక ఒత్తిడి, అంతర్గత విభేదాలు, శారీరక అలసటతో సతమతమవుతున్న ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ముంబై ఫ్రాంచైజీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ ఏడాది సీజన్ మధ్యలోనే పాండ్యా తన నిర్ణయాన్ని టీమ్ మేనెజ్మెంట్కు తెలియజేసినట్లు ఐపీఎల్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఐపీఎల్-2024 సీజన్లో ముంబై ఇండియన్స్ యాజమాన్యం రోహిత్ శర్మను తప్పించి మరి తమ జట్టు పగ్గాలను హార్దిక్కు అప్పగించింది.కానీ వారి నమ్మకాన్ని పాండ్యా నిలబెట్టుకోలేకపోయాడు. ఆ సీజన్లో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచింది. ఆ తర్వాత సీజన్లో క్వాలిఫయర్-2 వరకు ముంబైని పాండ్యా తీసుకొచ్చాడు. కానీ తాజా ఎడిషన్లో మాత్రం పాండ్యా కెప్టెన్గా, వ్యక్తిగత ప్రదర్శన పరంగా దారుణంగా విఫలమయ్యాడు. 14 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ కేవలం నాలుగింట గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానానికి పరిమితమైంది. దీంతో ముంబై ఇండియన్స్ యాజమాన్యం కూడా హార్దిక్ కెప్టెన్సీపై అసంతృప్తిలోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.అయితే ఐపీఎల్-2027కు ముందు పాండ్యా నేరుగా మెగా వేలంలోకి వస్తాడా? లేదా ట్రేడింగ్ పద్ధతి ద్వారా మరేదైనా జట్టుతో ఒప్పందం కుదుర్చుకుంటాడా అనేది ఇంకా స్పష్టత లేదు. దీంతో వచ్చే ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఐదు టైటిల్స్ను అందించిన రోహిత్ శర్మ మరోసారి ముంబై జట్టు పగ్గాలను చేపట్టేందుకు సిద్దంగా లేడని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ముంబై తదుపరి కెప్టెన్ ఎవరన్న విషయంపై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు."ముంబై ఇండియన్స్కు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ బెస్ట్ ఛాయిస్. మళ్లీ రోహిత్ శర్మను కెప్టెన్గా నియమించడం అనేది వెనక్కి అడుగు వేయడమే అవుతుంది. ఎందుకంటే రోహిత్ వయస్సును కూడా పరిగణలోకి తీసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో సూర్యనే బెటర్" అని జాఫర్ తన యూట్యూబ్ ఛానల్లలో పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: రాజస్తాన్ సరికొత్త చరిత్ర.. సన్రైజర్స్ ఆల్టైమ్ రికార్డు బ్రేక్ -
‘ముంబై తప్పు తెలుసుకుంది.. కెప్టెన్గా అతడే!’
మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్కు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. ఐపీఎల్-2026లో గ్రూప్ దశలో పద్నాలుగు మ్యాచ్లకు గానూ ముంబై.. కేవలం నాలుగు మ్యాచ్లే గెలిచింది. ఫలితంగా ఎనిమిది పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది.ఐదుసార్లు చాంపియన్కాగా రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీలో ముంబై గతంలో ఏకంగా ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ 2024లో అతడిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించింది యాజమాన్యం. అతడి స్థానంలో... గుజరాత్ టైటాన్స్ను విజేతగా (2022) నిలిపిన తమ మాజీ ఆటగాడు హార్దిక్ పాండ్యాను తిరిగి జట్టులోకి తీసుకుంది. అంతేకాదు కెప్టెన్గానూ బాధ్యతలు అప్పగించింది.ఘోర పరాభవంముంబై ఇండియన్స్ సారథిగా తొలి ప్రయత్నంలోనే హార్దిక్ ఘోర పరాభవం చవిచూశాడు. సొంత జట్టు అభిమానుల నుంచే తీవ్ర వివక్ష ఎదుర్కోవడంతో పాటు.. జట్టును మరీ దారుణంగా చిట్టచివరన పదో స్థానంలో నిలిపాడు. అయితే, ఆ తర్వాత టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించడంతో హార్దిక్పై నెగిటివిటీ కాస్త తగ్గింది.గతేడాది ప్లే ఆఫ్స్ చేరినా.. అదే జోరులో 2025లో ముంబైని ప్లే ఆఫ్స్ చేర్చాడు హార్దిక్ పాండ్యా. అయితే, తాజా ఎడిషన్లో మళ్లీ పాత కథే పునరావృతమైంది. ఈసారి కెప్టెన్గా.. ఆల్రౌండర్గా అతడు పూర్తిగా విఫలమయ్యాడు. వెన్నునొప్పి కారణంగా నాలుగు మ్యాచ్లకు దూరమైన హార్దిక్.. 10 మ్యాచ్లు ఆడి 206 పరుగులు చేయడంతో పాటు.. కేవలం నాలుగు వికెట్లు తీశాడు.ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాపై అంబానీల సారథ్యంలోని యాజమాన్యం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య అభిప్రాయ భేదాలు తారస్థాయికి చేరుకున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ముంబై ఇండియన్స్ సన్నిహిత వర్గాలు ఎన్డీటీవీకి కీలక విషయాలు వెల్లడించాయి.ముంబై తప్పు తెలుసుకుంది‘‘ముంబై ఇండియన్స్ యాజమాన్యం తమ తప్పును తెలుసుకుంది. అయితే, రోహిత్ శర్మ తిరిగి పగ్గాలు చేపట్టేందుకు ఏమాత్రం సిద్ధంగా లేడు. కానీ.. అతడి ఆశీర్వాదం ఉన్న వ్యక్తే ముంబై ఇండియన్స్ తదుపరి కెప్టెన్ అవుతాడనడంలో సందేహం లేదు. రోహిత్ సూచించిన ఆటగాడికే కెప్టెన్సీ దక్కే అవకాశం ఉంది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యా సైతం ముంబైని వీడే ప్రయత్నాల్లో ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నాడు. ఇటీవల తన ఫోన్ స్క్రీన్పై ‘07:07’ టైమ్ను షేర్ చేయడంతో.. అతడు చెన్నై సూపర్ కింగ్స్లో చేరబోతున్నాడని నెటిజన్లు భావించారు.మేనేజ్మెంట్తో సంబంధాలు దెబ్బతింటేఈ విషయం గురించి కూడా సదరు వర్గాలు స్పందించాయి. ‘‘హార్దిక్ కచ్చితంగా ట్రాన్స్ఫర్ కోరుకుంటాడు. కేవలం కెప్టెన్సీ విషయంలోనే కాదు.. వ్యక్తిగతంగానూ అతడు జట్టుకు దూరమవ్వాలని కోరుకుంటున్నాడు.ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నపుడు మేనేజ్మెంట్తో సంబంధాలు దెబ్బతింటే ఎవరైనా ఇలాగే చేస్తారు కదా!.. ఆటగాళ్లు కూడా ఇందుకు మినహాయింపు కాదు’’ అని ముంబై ఇండియన్స్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.చదవండి: GT vs RR: వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే? -
IPL 2027: సీఎస్కేలోకి ఊహించని ఆటగాడు!
ఐపీఎల్లో గత రెండేళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. ఈ మాజీ చాంపియన్ 2025లో అత్యంత దారుణ ప్రదర్శనతో కేవలం నాలుగు మ్యాచ్లు గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది.ఈ నేపథ్యంలో 2026 వేలానికి ముందు సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను రాజస్తాన్ రాయల్స్కు ట్రేడ్ చేసిన చెన్నై.. అతడికి బదులు రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ను తీసుకుంది. టీ20 ప్రపంచకప్-2026 ట్రోఫీని భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజూ.. చెన్నై తరఫున ఆరంభంలో విఫలమయ్యాడు.సంజూ ధనాధన్అయితే, అనూహ్య రీతిలో పుంజుకుని రెండు శతకాల సాయంతో 14 మ్యాచ్లలో కలిపి 477 పరుగులు సాధించాడు సంజూ. తద్వారా సీఎస్కే తరఫున టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. కానీ.. జట్టు మాత్రం పేలవ ప్రదర్శనతో పద్నాలుగింట ఆరు మాత్రమే గెలిచి ఎనిమిదో స్థానంతో ముగించింది.భారీ మార్పులకు ఆస్కారంఈ నేపథ్యంలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. ఆటగాడిగానూ అతడు విఫలం కావడంతో వేటు వేస్తారా అనే సందేహాలు నెలకొన్నాయి. అదే విధంగా జట్టులో భారీ మార్పులకు ఆస్కారం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇలాంటి తరుణంలో సీఎస్కే మాజీ ఆటగాడు, భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సీఎస్కేలోకి వస్తాడనే అర్థంలో పోస్టు పెట్టాడు.కాగా హార్దిక్ కెప్టెన్సీలో ముంబై ఈ ఏడాది చెత్త ప్రదర్శన కనబరిచింది. పద్నాలుగింట నాలుగే గెలిచి తొమ్మిదో స్థానంలో ముగించింది. ఇక నాలుగు మ్యాచ్లకు హార్దిక్ దూరం కాగా.. యాజమాన్యంతో విభేదాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాడనే వార్తలు వచ్చాయి.07:07 కథేంటి?ఈ నేపథ్యంలో ఇటీవల హార్దిక్ ఇన్స్టాలో ఓ స్టోరీ షేర్ చేశాడు. ఇందులో.. ‘07:07’ అని తన ఫోన్లో టైమ్ చూపిస్తున్న ఫొటో పంచుకున్నాడు. దీంతో చెన్నై లెజెండ్ ధోని (జెర్సీ నంబర్)ని ఉద్దేశించే ఈ పోస్టు పెట్టాడని నెట్టింట చర్చ జరిగింది.అశూ ఏమన్నాడు?ఈ క్రమంలో ఓ నెటిజన్.. వచ్చే సీజన్లో చెన్నై జట్టులో మార్పుల గురించి అశూని అడుగగా.. ‘‘పతిరణ, 07:07, స్టోక్స్, దూబే, 07:07 మిడిలార్డర్/ఫినిషింగ్, ఓవర్టన్, స్టోక్స్ బ్యాలెన్స్’’ అని సమాధానం ఇచ్చాడు. దీంతో హార్దిక్ గురించే అశూ చెప్పాడనే చర్చ నడుస్తోంది. కాగా పతిరణను గతేడాది సీఎస్కే రిలీజ్ చేయగా.. కోల్కతా కొనుక్కుంది. కానీ గాయం వల్ల అతడు ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. దీంతో కోల్కతా అతడిని రిలీజ్ చేయనుందనే వార్తలు రాగా.. పతిరణ తిరిగి మళ్లీ సీఎస్కేలోకే వస్తాడనే ప్రచారం ఊపందుకుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో చెరో ఐదుసార్లు ముంబై, చెన్నై చాంపియన్లుగా నిలిచాయి. ఈ రెండు జట్లను అభిమానులు చిరకాల ప్రత్యర్థులుగా పరిగణిస్తారు. అలాంటిది ఊహించని రీతిలో హార్దిక్ ముంబైని వీడి ఐపీఎల్-2027 సందర్భంగా చెన్నైలో చేరతాడనే ప్రచారం ఆసక్తికరంగా మారింది.Pathirana, 07:07 & Stokes !Opening✅Dube & 07:07 MiddleOrder/Finishing✅Overton & Stokes Balance✅ https://t.co/kSALlKQDCp— Ashwin 🇮🇳 (@ashwinravi99) May 26, 2026


