అశోక్బాబుకు ఝలక్
సాక్షి, అమరావతి: ఏపీ ఎన్జీవోల సంఘం చైర్మన్ అశోక్బాబు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో తాము పాల్గొనడం లేదని ఏపీ పంచాయతీరాజ్ నాలుగో తరగతి ఉద్యోగులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.గోవిందరాజులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
పీఆర్సీ బకాయిలు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర సమస్యల పరిష్కారంలో అశోక్బాబు ఘోరంగా విఫలమైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని పంచాయతీరాజ్ నాలుగో తరగతి ఉద్యోగులెవ్వరూ జేఏసీ చేపట్టిన ధర్నాలో పాల్గొనవద్దని గోవిందరాజులు పిలుపునిచ్చారు.