breaking news
Kakinada District Latest News
-
బస్సులు పెంచకుండా ఉచిత ప్రయాణమా!
● సీ్త్రశక్తి పథకంతో తీవ్ర ఇబ్బందులు ● ఆర్టీసీ సిబ్బందికి పెరిగిన పనిభారం గోకవరం: బస్సులను పెంచకుండా సీ్త్రశక్తి పథకం అమలు చేయడంతో ప్రయాణికులకు, ఆర్టీసీ సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ నాయకులు అన్నారు. ఈ మేరకు శనివారం గోకవరం ఆర్టీసీ డిపో ఎదుట రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గేటు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏఎస్ నారాయణ, డిపో అధ్యక్షుడు జీఎస్ రావు, ప్రధాన కార్యదర్శి కేఎస్పీ రావు మాట్లాడుతూ ఉచిత బస్సు పథకంతో సిబ్బందిపై పని భారం పెరిగిపోయిందని, కండక్టర్లకు పొరపాట్లు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటి వల్ల వారి ఉద్యోగ భద్రత ముప్పు వాటిల్లుతుందన్నారు. బస్సుల్లో రెండు రకాల టిక్కెట్లు ఇచ్చే విధానాన్ని తీసి వేసి, డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే టిక్కెట్లు ఇచ్చేలా నిబంధన మార్చాలని డిమాండ్ చేశారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం బస్సులకు డోర్లు ఏర్పాటు చేసి బస్సుల్లో 70 మంది ప్రయాణికులకు మాత్రమే అనుమతించేలా చూడాలన్నారు. తక్షణమే బస్సుల సంఖ్యను పెంచాలని, బస్సులకు హైడ్రాలిక్ డోర్లు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఎంఎన్వీఎస్ నారాయణ, జిల్లా కార్యదర్శి ఎన్ఎన్ రావు, జీఎస్రావు, సెక్రటరీ రమణ, ఎంఎం కృష్ణ, సూర్యచంద్రరావు, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో కలపాలి
అమలాపురం రూరల్: రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని, ప్రజల సంకల్పాన్ని నీరుగార్చేలా కూటమి ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ, రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జేఏసీ, పీడీఎస్యూ, ఏఐకేఎంఎస్, ఐఎఫ్టీయూ ప్రజా సంఘాలు శనివారం అమలాపురం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించాయి. సీపీఐ న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు, రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జేఏసీ కన్వీనర్ మాగాపు అమ్మిరాజు, కోకన్వీనర్, పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్ధూ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏఐకేఎంఎస్ నాయకుడు వెంటపల్లి భీమశంకరం, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కిరణ్కుమార్, బీఎస్పీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అభివృద్ధి ముసుగులో జిల్లాల పునర్విభజన చేయడంతో ప్రజల మధ్య అనేక చీలికలు, అయోమయం, పరిపాలనా సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. భౌగోళికంగా, చారిత్రకంగా, పరిపాలనా పరంగా శతాబ్దాలుగా కాకినాడ జిల్లాతో అనుసంధానమైన రామచంద్రపురం నియోజకవర్గాన్ని, గోదావరి నదిని దాటి వెళ్లాల్సిన దూర ప్రాంతంతో అనుసంధానం చేయడం ప్రజలకు మేలు చేసే నిర్ణయం కాదని అన్నారు. ఈ నియోజకవర్గం నుంచి మంత్రి పదవి అందుకున్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నోరు మెదపకపోవడం దారుణమన్నారు. అఖిలపక్ష జేఏసీ గౌరవ అధ్యక్షుడు దొమ్మలపాటి సత్యనారాయణ, ఐఎఫ్టీయూ నాయకులు చింతా రాజారెడ్డి, నాయకులు నాగరాజు, అలీ, కె.నవీన్, బుల్లి రాజు, పట్టాభి, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి నెట్బాల్ పోటీలు ప్రారంభం
రావులపాలెం: క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తదితరులు అన్నారు. రావులపాలెం మండలం వెదిరేశ్వరం గ్రామంలో శనివారం మాజీ వైస్ ఎంపీపీ దండు సుబ్రహ్మణ్యేశ్వర వర్మ ఆధ్వర్యంలో దండు సాయిఆకాష్వర్మ మెమెరబుల్ టోర్నమెంట్ 10వ రాష్ట్ర స్థాయి నెట్బాల్ సీనియర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చాంపియన్షిప్ పోటీలను ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే రాష్ట్ర స్థాయి నెట్బాల్ ఆటలో అత్యున్నత ప్రతిభ కనబరిచి దురదృష్టవశాత్తూ మరణించిన దండు సాయిఆకాష్ వర్మ ఆసక్తి మేరకు అతని తండ్రి దండు సుబ్రహ్మణ్యేశ్వరవర్మ, సుజాత దంపతులు ఈ రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం జగ్గిరెడ్డి టాస్ వేసి తూర్పుగోదావరి– నెల్లూరు జట్ల మధ్య మ్యాచ్ను ప్రారంభించారు. అలాగే క్రీడాకారులకు టీషర్ట్లు పంపిణీ చేశారు. 13 జిల్లాల నుంచి మెన్, ఉమెన్ కేటగిరీల్లో మొత్తం 26 టీమ్లు పాల్గొనగా లీగ్ కమ్ నాకౌట్ విధానంలో తొలి రోజు పోటీలు జరిగాయి. పురుషుల విభాగంలో పది మ్యాచ్లు, మహిళల విభాగంలో నాలుగు మ్యాచ్లు హోరాహోరీగా సాగాయి. రెండో రోజు క్వార్టర్స్, సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయని నెట్బాల్ రాష్ట్ర సెక్రటరీ పల్లా శ్రీను తెలిపారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కొత్తపేట ఎంపీపీ మార్గన గంగాధరరావు, అముడా మాజీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్రాజు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు బొక్కా వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ గన్నవరపు వెంకట్రావు, సర్పంచులు బొక్కా కరుణాకరం, సబ్బితి మోహనరావు, కొత్తపేట వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ముత్యాల వీరభద్రరావు పాల్గొన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
ఉపాధికి వెళ్లి గుండెపోటుతో మృతి
అమలాపురం రూరల్: అమలాపురం మండలం వన్నెచింతలపూడికి చెందిన ఓ యువకుడు ఉపాధి నిమిత్తం దేశం కాని దేశం వెళ్లి గుండెపోటుతో మృతి చెందాడు. కేసీఎం అధికారుల చొరవతో అతని మృతదేహాన్ని శనివారం స్వగ్రామానికి తీసుకు వచ్చారు. అధికారుల వివరాల ప్రకారం.. వన్నెచింతలపూడి గ్రామానికి చెందిన ముంగండ రవితేజ (33) ఉపాధి నిమిత్తం ఈ ఏడాది సెప్టెంబర్ 11న ఖతార్ దేశానికి వెళ్లి హౌస్ కేరింగ్ వర్క్ చేస్తున్నాడు. అయితే ఈ నెల 16న రాత్రి అక్కడ గుండెపోటుతో మరణించాడు. దీనిపై మృతుని కుటుంబ సభ్యులు ఈ నెల 17న కలెక్టర్ మహేష్ కుమార్ను సంప్రదించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నోడల్ అధికారి కె.మాధవి, సమన్వయ అధికారి గోళ్ల రమేష్, సిబ్బంది ఎంఎం సఫియా, కడియాల సత్తిబాబు, బద్రి దుర్గా అమ్మాజీలు బాధిత కుటుంబాన్ని కలుసుకుని వివరాలు సేకరించారు. అనంతరం భారత రాయబార కార్యాలయంతో పాటు ఖతార్లోని ప్రతినిధులు శ్రీనివాస్, రాజ్కుమార్, విజయ్ చార్లీ, సోలామాన్, రమణ, శశిలతో నిరంతరం సమన్వయం జరిపారు. అనంతరం మృతదేహాన్ని వన్నెచింతలపూడికి శనివారం చేర్చారు. వ్యక్తి ఆత్మహత్య సామర్లకోట: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సామర్లకోట సీఐ ఎ.కృష్ణభగవాన్ కథనం ప్రకారం.. స్థానిక గాంధీనగర్కు చెందిన సిరికి రవికుమార్ (49) లారీ స్టాండ్ సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ఆర్థిక ఇబ్బందులు కారణమని పోలీసులు భావిస్తున్నారు. వీఆర్వో సమాచారం మేరకు సీఐ కృష్ణభగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డూడూ బసవన్నా.. ఆదరణ ఏదన్నా!
ఫ వైభవాన్ని కోల్పోతున్న గంగిరెద్దులాట ఫ ఇతర వృత్తులకు మళ్లుతున్న కళాకారులు రాయవరం: అయ్యవారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల కళాకారులు గ్రామాల్లో సందడి చేస్తుంటారు. తలకు పాగా ధరించి, వివిధ రకాల దుస్తులను ధరించి, బూర ఊదుతూ గంగిరెద్దులను తీసుకు వస్తారు. అందంగా అలంకరించిన గంగిరెద్దును తీసుకుని ఇంటింటికీ వెళ్లి వారి వంశ ప్రతిష్టను కీర్తించే గంగిరెద్దుల వారికి గ్రామాల్లో గంగిరెద్దులాటకు రానురానూ ఆదరణ తగ్గుతోంది. సాధారణ రోజుల్లో గంగిరెద్దులను ఆడిస్తూ గ్రామాల్లో తిరిగినా సంక్రాంతి సమయంలోనే కళాకారులకు ఓ ప్రత్యేకత ఉంటుంది. హరిదాసులతో పాటు డూడూ బసవన్నల రాకతోనే సంక్రాంతి పండగకు పరిపూర్ణత వస్తుందని చెప్పవచ్చు. ధనుర్మాసం ప్రారంభం నుంచి ఇళ్ల ముంగిట్లో ఎక్కడ చూసినా గంగిరెద్దులు దర్శనమిచ్చేవి. ఈ కళాకారులు ప్రతి ఇంటికి వచ్చి సన్నాయితో పాటలు పాడుతూ.. ఇంటి యజమానుల వంశాన్ని కీర్తిస్తూ.. బసవన్నను ఆడిస్తూ యజమానులు ఇచ్చే కానుకలను స్వీకరిస్తారు. నిర్వాహకులు సన్నాయితో పాడే పాటలకు అనుగుణంగా గంగిరెద్దుతో నాట్యం, విన్యాసాలు చేయిస్తారు. గ్రామాల్లో చిన్న పిల్లలు గంగిరెద్దుల వెంట తిరుగుతూ సెలవు దినాలను ఆనందోత్సాహాలతో గడిపేవారు. ఉమ్మడి జిల్లాలో 15 వేల మంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 15 వేల మంది గంగిరెద్దుల సామాజిక వర్గం వారు ఉన్నారు. వీరు 25 సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. అమలాపురం, కొత్తపేట, రాయవరం, పసలపూడి, రాజమహేంద్రవరం, వెదురుమూడి, ముక్కామల, భీమనపల్లి, మురమళ్ల, నీలపల్లి, కాకినాడ, అనపర్తి, ద్వారపూడి తదితర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో గంగిరెడ్ల సామాజిక వర్గం వారు జీవిస్తున్నారు. ఈ వృత్తిలో ఆదరణ తగ్గిపోవడంతో ఇతర వృత్తుల్లోకి మరలిపోతున్నారు. కొందరు ఇంకా పక్కా ఇళ్లకు కూడా నోచుకోలేక పోతున్నారు. ఇప్పటికీ మార్కెట్ షెడ్లలో నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికీ కొందరు గంగిరెద్దులను తీసుకుని సంక్రాంతికి జిల్లాలోని కందికుప్ప, అమలాపురం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు తరలివెళ్లారు. తగ్గుతున్న ఆదరణ గంగిరెద్దులకు కాలక్రమంలో ఆదరణ తగ్గుతుంది. ఇదే విషయాన్ని గంగిరెద్దుల కళాకారులు చెబుతున్నారు. ప్రజల్లో ఆదరణ తగ్గడానికి ఇంటింటికి ఉన్న టీవీలు కూడా ఒక కారణమని అంటున్నారు. టీవీలతోనే పిల్లలు, పెద్దలు కాలక్షేపం చేస్తూ గంగిరెద్దుల ఆటను తనివితీరా ఆస్వాదించ లేకపోతున్నారని, ఆట చూడడానికి కూడా తీరిక ఉండడం లేదని కళాకారులు అంటున్నారు. గతంలో గంగిరెద్దుల ఆటలు జనరంజకంగా ఉండేవి. గంగిరెద్దుల ఆటను చూసిన అనంతరం ఇంటి యజమానుల నుంచి కానుకలు స్వీకరించే ముందు వారిని ఆశీర్వదించేవారు. -
పదోన్నతుల్లో సీనియారిటీకే ప్రాధాన్యమివ్వాలి
● విద్యుత్ ఓసీ ఉద్యోగుల డిమాండ్ ● కాకినాడలో సంఘ వార్షికోత్సవం కాకినాడ రూరల్: పదోన్నతుల్లో సీనియారిటీకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్డలోని జి.కన్వెన్షన్ హాల్లో శనివారం రాష్ట్ర స్థాయిలో సంఘ 17వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు దూళిపాల వెంకట రంగారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో 2026 సంవత్సర కేలండర్, డైరీలను ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వరుపుల సత్యప్రభ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి హాజరయ్యారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓసీల ప్రయోజనాల కోసం పోరాటానికి విద్యుత్ సంస్థలో విద్యుత్ ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘాన్ని ప్రారంభించామన్నారు. ముఖ్యంగా ఓసీలకు ప్రతిభ ఉన్నా ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ల వలన అన్యాయం జరుగుతోందన్నారు. పదోన్నతుల్లో రిజర్వేషన్ల కంటే సీనియారిటీకే ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఉద్యోగుల పీఆర్సీ, న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా ఈక్వాలిటీ ఫారం నేషనల్ ప్రెసిడెంట్ ఎం.నాగరాజు, ఓసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్ రెడ్డి, సౌత్జోన్ ఏఐఈఎఫ్ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నజీర్ డల్, ఈపీడీసీఎల్ కంపెనీ ప్రెసిడెంట్ అప్పలరాజు, కంపెనీ సెక్రటరీ త్వరగా రామకృష్ణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ప్రాంతీయ అధ్యక్షుడు కేవీవీ రమణ, కాకినాడ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు డి.సురేష్బాబు, జ్యోతుల వీరబాబు, బొజ్జా వాసు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
ఎదురీతే..
కరప మండలం జెడ్.భావారంలో మోంఽథా తుపాన్కు నీట మునిగిన పంట (ఫైల్) పాత పెద్దాపురంలో నీటిలో కుళ్లిపోయిన పంటను చూపుతున్న రైతులు (ఫైల్)● ఈ ఏడాదంతా రైతులకు కష్టాలే ● కలసిరాని కాలం ● చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం ● పెరిగిన పెట్టుబడులు సాక్షి ప్రతినిధి, కాకినాడ: పట్టెడన్నం పెట్టే రైతన్న ఈ ఏడాది కష్టాల కడలిలో ఎదురీదాడు. ఆరుగాలం పడిన రెక్కల కష్టం ప్రకృతి కన్నెర్రకు తోడు చంద్రబాబు సర్కార్ నిర్వాకంతో నీటి పాలైంది. రబీ సీజన్ ఒక రకంగా నష్టపోతే ఖరీఫ్ సీజన్లో ముందుచూపులేని ప్రణాళిక సాగులో జాప్యానికి కారణమై రైతులు గుండెలు బాదుకుంటున్నారు. అకాల వర్షాలు రైతులను నిండా ముంచేశాయి. చేతికొచ్చిన ధాన్యాన్ని కనీస మద్ధతు ధర దక్కిందా అంటే అదీ లేదు. ధాన్యం సేకరణ లక్ష్యాన్ని ప్రభుత్వం కుదించడం దళారీ వ్యవస్థకు గేట్లు తెరిచినట్లైంది. తేమ శాతం అనే కుంటి సాకులతో రైతులకు మద్దతు లేకుండా పోయింది. పోనీ రబీ సీజన్లో అయినా సంతోషంగా సాగు జరుగుతుందా అంటే అదీ కొరవడింది. మొత్తంగా చూస్తే ఈ ఏడాది (2025) రైతులకు కలిసి రాలేదు. ఎరువుల బ్లాక్ 2025 ప్రారంభంలో రబీని గంపెడాశతో స్వాగతించిన రైతులకు ప్రారంభంలోనే చంద్రబాబు ప్రభుత్వంలో కొందరు పెద్దలు ఎరువులను బ్లాక్ చేసి చుక్కలు చూపించారు. దీంతో ప్రతి ఎకరాకు రూ.500 తక్కువ కాకుండా అదనపు భారం పడింది. పెట్టుబడి ఎక్కువై రైతు కుదేలయ్యాడు. జిల్లాలో 2.10 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. సవాలక్ష ప్రతి బంధకాల మధ్య సాగు చేసిన రైతుల నుంచి కనీస మద్ధతు ధరకు ప్రభుత్వం పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయలేదు. జిల్లాలో ఎంఎస్పీకి 3 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని, కేవలం 2.60 లక్షల మెట్రిక్ టన్నులకే సరి పెట్టేసి రైతుల నెత్తిన పిడుగు పడేసింది. మాసూళ్లు సమయంలో అకాల వర్షాలకు తోడు గోనె సంచుల కొరత కూడా వేధించింది. తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకుతో ప్రతి బస్తా ధాన్యం కొనుగోలుపై సుమారు రూ.400ను కమీషన్ ఏజెంట్లు, దళారులు కోత పెట్టడంతో రైతులు నష్టాలపాలయ్యారు. 80 వేల మంది రైతులు వద్ద ధాన్యం కొనుగోలు చేసి సక్రమంగా సకాలంలో వారి ఖాతాలో నగదు జమ చేసిన దాఖలాలు లేవు. మోంథా తుపానుతో భారీ నష్టం ఖరీఫ్లో సాగునీటి ఎద్దడి, ప్రకృతి విపత్తులకు తోడు ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాభావ పరిస్థితులతో సాగును ఆలస్యం కాగా, జిల్లాలో 2.10 లక్షల ఎకరాల్లో సాగుకు చేశారు. పంట పాలుపోసుకునే, గింజ గట్టిపడే దశల్లో మోంథా తుపాను తీవ్ర నష్టం కలిగింది. స్వర్ణ, సంపద స్వర్ణ సాగు చేసిన పొలాల్లో పంట నేలకొరిగి రైతులు కకావికలం అయ్యారు. ఎంటీయూ 1318, పీఎల్ఏ 1100 తదితర రకాల్లో తాలు గింజలు పెరిగి దిగుబడులు తగ్గిపోయాయి. నేలనంటిన వరి సామర్లకోట, పిఠాపురం, కొత్తపల్లి, కాకినాడ రూరల్ తదితర మండలాల్లో పంట పొలాలు నేలనంటాయి. మోంథా తుపానుతో జిల్లాలో సుమారు 70 వేల ఎకరాలలో వరి ముంపునకు గురైందని అధికారులు అంచనాలు రూపొందించారు. తీరా చివరకు నష్టం అంచనాలు కాస్తా బక్కచిక్కిపోయి 40 వేల ఎకరాలు మాత్రమే పంట నష్టం సంభవించినట్టు రికార్డులకెక్కాయి. దిగుబడి పరంగానూ రైతులకు ఖరీఫ్ కలిసి రాలేదు. ఎకరాకు సుమారు 35 బస్తాలు చొప్పున వస్తుందన్న అంచనాలు తల్లకిందులై కేవలం 25 బస్తాలు మాత్రమే వచ్చింది. తేమ శాతం ఎక్కువగా ఉందనే కుంటి సాకులతో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. దళారుల దందా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తివేసి.. రైతుల నెత్తిన ప్రీమియం భారం మోపింది. అలాగే జిల్లాలో 60 వేల మంది పైచిలుకు కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కూడా దూరం చేసింది. దాని కింద రైతులకు ఏటా రూ.20 వేలు ఇస్తామని చెప్పి, మొదటి ఏడాది ఎగనామం పెట్టారు. ధాన్యం కొనుగోలులో దళారులకు గేట్లు తెరిచారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉన్న ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం చేశారు. అయితే చంద్రబాబు సర్కారు మాత్రం ప్రచార యావతో ‘రైతన్నా.. మీకోసం’ అంటూ గ్రామాల్లో సభలు నిర్వహించి హడావుడి చేసింది. రైతులకు అండగా జగన్ ప్రభుత్వం జగన్ సర్కార్ సాగుకు ముందే పెట్టుబడి సాయం అందిస్తూ అన్నదాతలకు అండగా నిలిచింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఇచ్చే రూ.6 వేలకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.7500 కలిపి మొత్తం రూ.13,500 చొప్పున రైతు ఖాతాలో జమ చేస్తూ వచ్చింది. జిల్లాలో రెండు లక్షల మంది రైతులకు ఏటా రూ.200 కోట్లకు పైగా రైతు భరోసా ద్వారా అందించింది. దీనితో పాటు వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, ఇన్పుడ్ సబ్సిడీ ఇలా పలు పథకాల ద్వారా రైతులకు ఆర్థికంగా అండగా నిలిచింది. ఉచిత పంటల బీమాకు మంగళం రైతులపై ప్రీమియం భారం లేకుండా 2019 ఖరీఫ్ నుంచి వైఎస్సార్ ప్రభుత్వం ఉచిత పంటల బీమాను తీసుకువచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకాన్ని ఎత్తివేసి ప్రీమియం భారాన్ని రైతులపై మోపింది. జిల్లాలో 2,15,068 ఎకరాల్లో ఖరీఫ్ సాగు చేయగా రైతులు ఎకరాకు రూ.210 చొప్పున 72,766 ఎకరాలకు మాత్రమే ప్రీమియం చెల్లించారు. మిగిలిన 1,42,302 ఎకరాలు క్రాఫ్ ఇన్స్యూరెన్స్కు దూరంగా ఉండటం గమనార్హం. ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం విత్తు నుంచి పంట ఉత్పత్తుల విక్రయం వరకు సాగులో రైతుకు అన్ని విధాలా అండగా ఉండేందుకు అప్పటి జగన్ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం వాటి పేర్లను రైతు సేవా కేంద్రాలుగా మార్చిందే తప్ప.. అన్నదాతలకు ఒక్క ప్రయోజనం కల్పించలేదు. ప్రస్తుతం కొన్ని ఆర్బీకే భవనాలను ఇతర కార్యాలయాలకు వినియోగిస్తుండగా, మరికొన్ని తాళం వేసి కనిపిస్తున్నాయి. ఏడాది పొడవునా ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడుతూనే 2025ను అతి భారంగా వీడుతున్నారు. యూరియా ఇవ్వలేని దుస్థితి చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవసాయం కుంటుపడింది. రైతును ఆదుకోవడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారు. కనీసం యూరియా ఇవ్వలేని దయనీయ స్థితిలో ఈ ప్రభుత్వం నడుస్తోంది. రైతులందరికీ ఈ – క్రాప్ చేయలేదు. కౌలు రైతులకు కౌలు కార్డులు లేవు. పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. గత జగన్ ప్రభుత్వంలో విత్తనాలు, ఎరువులు, ఈ– క్రాప్ చక్కగా జరిగింది. ధాన్యం కొనుగోలులో హమాలీ, రవాణా చార్జీలను చెల్లించారు. గిట్టుబాటుఽ ధర కంటే రైతులకు ఎక్కువ లభించేలా చర్యలు తీసుకున్నారు. – లంక ప్రసాద్, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు -
హిందువులందరూ ఏకం కావాలి
కరప: భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు హిందువులందరకూ ఏకం కావాలని కాకినాడ గీతాశ్రమం స్వామీజీ దివ్యానంద సరస్వతి పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న హిందూ సమ్మేళనం కార్యక్రమాల్లో భాగంగా శనివారం నీలయ్య తోటలోని ఒకలే అవుట్లో మండల సహ కన్వీనర్ కొక్కెరమట్ల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్తంగా 2.50 లక్షల హిందూ సమ్మేళనాలు నిర్వహించాలన్న ఆశయంలో ఇంత వరకూ 1.50 లక్షల సమ్మేళనాలు జరిగాయన్నారు. హిందూ ధర్మాన్ని దశ దిశలా వ్యాపింపజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. యానాంఖండ పూర్వ కార్యనిర్వాహక్ రామారావు మాట్లాడుతూ హిందువులందరూ బంధువులేనన్న నినాదాన్ని ప్రజలకు తెలియజెప్పాలన్నారు. సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మ ప్రచారక్ పడాల రఘు, ఆధ్యాత్మికవేత్త చాగంటి సూరిబాబు, జిల్లా మహిళా సహ కన్వీనర్ వాసంశెట్టి సూర్యవతి, మండల మహిళా కన్వీనర్ పేకేటి లక్ష్మీకాంతం పాల్గొన్నారు. -
వృత్తిని వదులుకోవాల్సిన పరిస్థితి
గతంలో మాదిరిగా గంగిరెద్దుల ప్రదర్శనకు ఆదరణ అంతగా ఉండడం లేదు. కుల వృత్తిని వీడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం గంగిరెద్దుల సామాజిక వర్గాన్ని గుర్తించి ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే ఈ వృత్తిని కొనసాగించగలం. –బొడ్డు రాజు, పసలపూడి, రాయవరం మండలం పండగ సమయంలోనే.. ఒకప్పుడు అన్ని కాలాల్లో గంగిరెద్దుల ఆటను ప్రతి ఒక్కరూ ఆదరించేవారు. ఇప్పుడు కేవలం సంక్రాంతి సమయంలోనే ఆట ఉంటుంది. ఆదరణ తగ్గుతుండడంతో యువత ఈ వృత్తిని స్వీకరించడం లేదు. ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకునేందుకు, కూలి పనులకు వెళ్లిపోతున్నారు. –బొడ్డు ప్రకాష్, కందరాడ, పిఠాపురం మండలం ఆర్థికంగా ఆదుకోవాలి గంగిరెడ్ల సామాజిక వర్గం అనాది నుంచి సంచార జాతి ఉంటుంంది. ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకు వెళ్లి గంగిరెద్దులను ఆడించుకుని పోషణ పొందుతున్నాం. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోకుంటే మా జీవితాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి. –జానపాటి ఏసు, మాధవపట్నం, కాకినాడ రూరల్ ఎస్టీ జాబితాలో చేర్చాలి ఊరూరా తిరుగుతూ ఉండే సంచార జాతులమైన గంగిరెడ్ల సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలి. ఇప్పటికీ అధిక సంఖ్యలో ఉన్న గంగిరెడ్ల సామాజిక వర్గానికి కనీసం పక్కా ఇళ్లు లేవు. వృత్తి కూడు పెట్టకపోవడంతో చిన్న చిన్న సామాన్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాం. –బొమ్మన పరంజ్యోతి, అధ్యక్షుడు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గంగిరెడ్ల సంక్షేమ సంఘం -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థికి తీవ్ర గాయాలు
సామర్లకోట: గొంచాల–అచ్చంపేట రోడ్డులో జరిగిన ప్రమాదంలో పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. నక్కపల్లి యూనియన్ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్గా పని చేస్తున్న సందీప్రాజు కారు అతి వేగంగా రావడంతో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరర చదువుతున్న బెహరా రాజు తీవ్రంగా గాయపడ్డాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. తాను ఏమి చేయలేనని సందీప్రాజు చెప్పడంతో విద్యార్థులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. దాంతో సీఐ ఎ.కృష్ణభగవాన్ శనివారం రాత్రి ఇరువర్గాలను పిలిచి చర్చలు జరిపారు. బాధితుడి కాలు పూర్తిగా తీసి వేయడంతో ఇబ్బంది పడాల్సి వస్తోందని, నష్ట పరిహారం ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. దానికి కారు యజమానికి చెందిన బంధువులు అంగీకరించక పోవడంతో బ్యాంకు వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఇరువర్గాలకు సీఐ సూచించారు. అయితే రాత్రి వరకూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. -
ఏపీఎన్జీవో జిల్లా కార్యవర్గం ఎన్నిక
కాకినాడ క్రైం: ఏపీఎన్జీవో జిల్లా కార్యవర్గ ఎన్నిక శనివారం ఏకగ్రీవమైంది. కాకినాడలోని ఏపీఎన్జీవో హోంలో శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ జరిగింది. ఇందులో 17 స్థానాలకు గాను ఒక్కో నామినేషనే దాఖలు చేయడం వల్ల ఆయా స్థానాలన్నీ ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి, ఏలూరు జిల్లా ఏపీఎన్జీవో అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాసరావు, సహాయ ఎన్నికల అధికారి, సంఘ కార్యదర్శి ఎన్వీ రామారావు తెలిపారు. మూడేళ్ల పదవీ కాలానికి గాను కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా గుద్దటి రామ్మోహనరావు, కార్యదర్శిగా పాలపర్తి మూర్తిబాబు, కోశాఽధికారిగా యండమూరి పద్మ మీనాక్షి ఎన్నికయ్యారు. అసోసియేట్ ప్రెసిడెంట్గా ఎం.వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్లుగా చంద్రరావు, ప్రసాద్, పాండురంగారావు, సత్యనారాయణ, జయకృష్ణ, భారతి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రామకృష్ణ, జాయింట్ సెక్రటరీలుగా శ్రీనివాసరావు, వీరబాబు, చార్లెస్ పాల్, లోకమాన్య పరిమళ కుమార్, వెంకటరమణ, జయలక్ష్మి ఎన్నికై నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఎన్నికల పర్యవేక్షణాధికారిగా సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎ.రంజిత్ కుమార్ నాయుడు వ్యవహరించారు. నూతన కార్యవర్గాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్, సంఘ మాజీ అధ్యక్షులు ఆచంట రామానాయుడు, బూరిగ ఆశీర్వాదం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ కార్యదర్శి పేపకాయల వెంకటకృష్ణ అభినందించారు. శృంగార వల్లభస్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెద్దాపురం (సామర్లకోట): తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలోని శృంగార వల్లభ స్వామి ఆలయానికి శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జిల్లా నలుమూలల నుంచీ వచ్చిన సుమారు 12 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.1,20,860, అన్నదాన విరాళాలు రూ.61,519, కేశ ఖండన ద్వారా రూ.3 వేలు, తులాభారం ద్వారా రూ.300, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.19,035లతో కలిపి రూ.2,04,714 ఆదాయం వచ్చిందని చెప్పారు. సుమారు 3,200 మంది భక్తులు ఆలయంలో అన్న ప్రసాదం స్వీకరించారన్నారు. స్వామి వారికి ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మొయిలి కృష్ణమూర్తి, ట్రస్టు బోర్డు చైర్మన్ మొయిలి సంధ్య, దేవస్థానం సిబ్బంది, గ్రామ పెద్దలు భక్తులకు సేవలందించారు. బ్రిడ్జి నిర్మాణాలకు భూసేకరణ వేగవంతం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ), రోడ్డు అండర్ బ్రిడ్జి (ఆర్యూబీబీ) నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం జేసీ అపూర్వ భరత్తో కలిసి రెవెన్యూ, రోడ్డు భవనాలు, రైల్వే అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పీఎం గతిశక్తి పథకం కింద రైల్వే లైన్ల మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా జిల్లాలో పరిధిలో వివిధ ప్రదేశాల్లో రైల్వే లైనులకు అవసరమైన ఆర్ఓబీ, ఆర్యూబీ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రాథమిక దశలో వీటి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు. ఇందుకు రెవెన్యూ, సర్వే, రోడ్డు భవనాల శాఖల అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి, ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, కాకినాడ ఆర్డీవో ఎస్.మల్లిబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పార్థుని సంస్కారం ప్రశంసనీయం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): పార్థుని సంస్కారం ప్రశంసనీయమని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. ఆయన శనివారం హిందూ సమాజంలో 31వ రోజు విరాట పర్వ ప్రవచనం ముగించి, ఉద్యోగ పర్వంలోకి ప్రవేశించారు. పాండవులు తన వద్దనే అజ్ఞాతవాసం ముగించారని తెలుసుకున్న విరాటరాజు అనందభరితుడవుతాడు. తన కుమార్తె ఉత్తరను వివాహం చేసుకోవాలని అర్జునుడిని కోరతాడు. అర్జునుడు దానిని అంగీకరించక, ఉత్తరను కోడలిగా చేసుకుంటానని తన అభిప్రాయాన్ని వెల్లడిస్తాడు. ‘ఏడాది పాటు ఉత్తరకు నాట్యం నేర్పాను, ఆమె నన్ను ఆచార్యునిగా, తండ్రిగా భావించింది. ఇప్పుడు ఆమెను వివాహం చేసుకుంటే లోకం నా నడవడిని శంకిస్తుంది. ఆమెను కోడలిగా చేసుకుంటే నన్నుగానీ, నీ కుమార్తెను గానీ ఎవరూ శంకించరు. నేనులోకాపవాదుకు భయపడతాను’ అన్న అర్జునుని ఉత్తమ సంస్కారం మనకు ఆదర్శం కావాలని సామవేదం అన్నారు. ఉత్తరాభిమన్యుల వివాహంతో విరాట పర్వం ముగిసింది. సినిమాల్లో చూపినట్లు వివాహానికి ముందు ఉత్తరాభిమన్యులు యుగళగీతాలను పాడుకోలేదని ఆయన అన్నారు. నేడు సామవేదంకు బ్రహ్మజోస్యుల పురస్కారం ప్రముఖ స్వాతంత్య్ర పోరాట యోధుడు, గాంధేయవాది, సీతానగరం ఆశ్రమ వ్యవస్థాపకుడు డాక్టర్ బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం స్మారక పురస్కారాన్ని సామవేదం షణ్ముఖశర్మ అందుకోనున్నారు. ఆదివారం ఉదయం 10.45 గంటలకు సీతానగరం కస్తూర్బా ఆశ్రమంలో సామవేదం పురస్కారాన్ని అందుకుంటారని భగవత విరించి టీవీ నారాయణరావు వేదికపై వివరాలను వెల్లడించారు. -
పరుగు పందెంలో బంగారు పతకం
బాలాజీచెరువు: ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన 100 మీటర్ల పరుగు పందెంలో కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఏ ప్రథమ సంవత్సర విద్యార్థిని బి.నాగవిహారిక ప్రతిభ కనబరిచింది. ప్రో స్పోర్ట్స్ 100 ప్లస్ టీం, హైదరాబాద్ డిస్ట్రిక్ అథ్లెటిక్ అసోసియేషన్ నిర్వహించిన ఈ పోటీల్లో 12 సెకన్లలో పరుగు పూర్తి చేసి గోల్డ్ మెడల్తో పాటు రూ.30 వేల నగదు సాధించారు. అలాగే గత నెలలో నన్నయ వర్సిటీలో నిర్వహించిన అథ్లెటిక్స్ నన్నయవర్సిటీ చాంపియన్షిప్ పోటీల్లో పాస్టెస్ట్ ఉమెన్ టైటిల్ సాఽధించారు. కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో బీఏ విద్యార్థి వి.రేష్మయాదవ్ ప్రతిభ చూపి బంగారు పతకంతో పాటు నొయిడాలో జనవరి 3 నుంచి నిర్వహించే జాతీయ పోటీలకు అర్హత పొందారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ కందుల ఆంజనేయులు, ఇన్చార్జి ప్రిన్సిపాల్ సంజీవ్కుమార్, పీడీ రమణ, డాక్టర్ పసుపులేటి హరిరామప్రసాద్ అభినందించారు. -
రాతనాల్లా మార్చుకుందామా..
ఫ మంచి దస్తూరితో భవితకు బాట ఫ పదో తరగతిలో మంచి మార్కులకు దోహదం ఫ విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్న ఉపాధ్యాయులు రాయవరం/ ప్రత్తిపాడు: మా అబ్బాయి చాలా బాగా చదువుతాడు.. కానీ అందుకు తగ్గట్టుగా మార్కులు రావడం లేదు.. మా అమ్మాయి లెక్కలు బాగా చేస్తోంది. సూత్రాలు, ఫార్ములాలు మాత్రం ఎందుకో తప్పుగా కనిపిస్తుంటాయని ఉపాధ్యాయులు తరచూ చెప్పే మాటలివి.. ఇందుకు కారణం చేతిరాతే. ‘రాత బాగుంటే గీత బాగుంటుంది’ అన్న నానుడి పరీక్ష రాసే విద్యార్థికి ‘అక్షరాలా’ సరిపోతుంది. మంచి దస్తూరి ఉంటే మూల్యాంకనం సమయంలో సమాధాన పత్రాలు దిద్దే ఉపాధ్యాయుడికి మంచి భావన కలుగుతుంది. ఆ ప్రభావం మార్కులపై ఉంటుంది. అందుకే పరీక్షల్లో తెలివితో పాటు అక్షరాలు కూడా ఆయుధాలుగా పనిచేస్తాయని ఉపాధ్యాయులు చెబుతారు. ఇవి పాటిస్తే మంచిది ఫ పేజీ పైభాగంలో ఒక అంగుళం, ఎడమ వైపు అంగుళం మార్జిన్ విడిచి పెట్టాలి. ఫ సమాధాన పత్రంలో రాసే జవాబు సూటిగా ఉండటంతో పాటు అక్షరాలు పొందికగా రాయాలి. ఫ అక్షరాలు వంకర టింకరగా, గజిబిజిగా ఉంటే మార్కులు తగ్గినట్టే. ఫ పేజీకి 16 నుంచి 20 లైన్లకు మించకుండా రాయాలి. ఫ సమాధానాలు రాసే సమయంలో ప్యాడ్పైకి వాలిపోకుండా సాధ్యమైనంత వరకూ కూర్చుని రాయాలి. ఫ రెండు పదాల మధ్య ఒక అక్షరం లేదా ‘0’ పట్టేంత ఖాళీ స్థలం ఉండాలి. రెండు వరుసల మధ్య అర అంగుళం దూరం వదలాలి. ఫ కంటికి పేపరుకు 30–35 సెంటీమీటర్ల దూరం ఉండాలి. ఫ అక్షరాలన్నీ ఒకే సైజులో, ఒకే లైనులో ఉంటేనే రాత అందంగా వస్తుంది. ముందుగా ఫోర్ రూల్, తర్వాత డబుల్ రూల్, అనంతరం సింగిల్ రూల్పై ప్రాక్టీస్ చేయాలి. ఫ ఇంగ్లిష్లో కర్సివ్, లుసిడా రైటింగ్ను ప్రాక్టీస్ చేయాలి. వరుస క్రమంలో కనీసం పది రోజులు తర్ఫీదు తీసుకోవాలి. ఫ మొదటగా లెటరింగ్, తర్వాత వర్డింగ్, అనంతరం సెంటెన్సెస్ రాయడం నేర్చుకోవాలి. ఫ గొలుసుకట్టు రాత ఉండకూడదు. ప్రతి అక్షరం ఒకే పరిమాణంలో రాయాలి. ఫ పెన్నును మామూలుగా పట్టుకోవాలి. బిగుసుగా పట్టుకుంటే వేగంగా రాయలేం. అక్షరాల స్పష్టతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఫ ప్రాథమిక స్థాయి నుంచే మంచి రాత అలవాటు చేసుకోవాలి. తెల్ల కాగితంపై వరుస తప్పకుండా రాయగలగాలి. సాధనతోనే సాధ్యంప్రతి విద్యార్థికి తెలివి తేటలకు తోడు, సమయ పాలనకు, సహనానికి దస్తూరి ఓ సూచికగా చెప్పవచ్చు. అందుకే మంచి దస్తూరి ఉన్న విద్యార్థులే దాదాపు టాపర్లుగా నిలుస్తున్నారు. మార్చి 16వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు శ్రమిస్తున్నారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి దిద్దుబాట్లు, కొట్టివేతలు లేకుండా రెండున్నర గంటల్లో స్పష్టంగా పరీక్ష రాయాలి. అందుకే ఇప్పుడు అందరి దృష్టి చేతిరాతపై పడింది. ఇందుకు తగిన తర్ఫీదును ఉపాధ్యాయులు ఇస్తూ సాధన చేయిస్తున్నారు. పరీక్ష నెమ్మదిగా రాస్తే సమయం సరిపోదు. వేగంగా రాసేటప్పుడు తప్పులు దొర్లకుండా చూసుకోవాలి.ఇలా చేయాలంటే ముందుగా ప్రత్యేక తరగతులు, స్లిప్, గ్రాండ్ టెస్టులు సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. ముత్యాల్లాంటి అక్షరాలు మంచి మార్కులు తెచ్చిపెడతాయి.. విద్యార్థి భవితకు బాటలు వేస్తాయి.. సమయాన్ని వృథా చేయకుండా ప్రణాళిక ప్రకారం అన్ని సబ్జెక్టుల్లో పట్టు సాధించడంతో పాటు, మంచి దస్తూరితో అనేక ప్రయోజనాలు చేకూరుతాయి.. మనం ఏం రాశామన్నది పేపర్లు మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులకు అర్థం అయ్యేట్టు ఉంటేనే ఎక్కువ మార్కులు వస్తాయి.. దీనికోసం మంచి దస్తూరిపై ఇప్పటి నుంచే దృష్టి సారిస్తే పదో తరగతి పరీక్షల్లో ఇబ్బందులు ఉండవని నిపుణులు సూచిస్తున్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
రత్నగిరిపై రద్దీ
అన్నవరం: రత్నగిరికి శుక్రవారం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. దీంతో, ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ భక్తులతో నిండిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుడిని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని సుమారు 30 వేల మంది దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. సత్యదేవుని వ్రతాలు 2,100 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. -
ఇదేం యాపారం సామీ..!
● రత్నగిరిపై షాపులో రకరకాల వస్తువుల విక్రయాలు ● టాయిలెట్లకు వాడే ఫినాయిల్, కాళ్ల పగుళ్లకు తైలం కూడా అమ్మకం ● ‘దేవుని నిర్మాల్యాలతో తయారీ’ పేరిట ఎర ● భక్తుల నమ్మకంతో వ్యాపారం ● అలా చేయడం సరైనదో కాదో పరిశీలించకుండానే అనుమతులు అన్నవరం: గో ఆధారిత ఉత్పత్తులు.. సత్యదేవుని నిర్మాల్యంతో (పూజలు, వ్రతాల్లో ఉపయోగించిన పూలు, పత్రి) తయారు చేసిన ఉత్పత్తులు.. అంటూ భక్తుల నమ్మకంతో రత్నగిరిపై జరుగుతున్న వ్యాపారం చూస్తూంటే ఆశ్చర్యం కలగకమానదు. ప్రజల్లో నానాటికీ పెరుగుతున్న భక్తి.. గో ఆరాధన.. పూజలు, వ్రతాల్లో ఉపయోగించిన పూలు, పత్రికి ఉన్న పవిత్ర భావన.. కొత్త కొత్త ఆలోచనలకు, వ్యాపారాలకు ఊతమిస్తున్నాయి. దీనిని అవకాశంగా తీసుకుంటున్న కొంత మంది.. గోమయంతో తయారు చేసిన విభూది, దేవుని నిర్మాల్యంతో తయారు చేసిన అగరువత్తులు, ప్రమిదల వంటి అనేక వస్తువులను వివిధ దేవస్థానాల్లో ఇబ్బడిముబ్బడిగా విక్రయిస్తున్నారు. లాభమే పరమావధిగా భక్తులను దోపిడీ చేస్తున్నారు. రత్నగిరిపై బీజం పడిందిలా.. మూడు నెలల క్రితం ఓ వ్యాపారి అన్నవరం దేవస్థానం అధికారులను కలిసి గో ఆధారిత ఉత్పత్తులు, దేవుని నిర్మాల్యంతో తయారు చేసే వివిధ వస్తువుల విక్రయానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు. ఇతర దేవస్థానాల్లో కూడా తాను ఇదే విధంగా దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పాడు. ఇదే అదునుగా అన్నవరం దేవస్థానంలోని కొంత మంది ఉద్యోగులు ఆ వ్యాపారితో కుమ్మక్కయ్యారు. తమదైన శైలిలో చక్రం తిప్పి.. ఆ వ్యాపారి ప్రతిపాదనను దేవదాయ శాఖ కమిషనర్కు పంపించారు. దేవస్థానంలో పూజల్లో ఉపయోగించిన పూలు, పత్రి, బియ్యం, వక్కలను కేజీల లెక్కన కొనుగోలు చేస్తామని, వాటినే తిరిగి ఈ ఉత్పత్తుల తయారీకి వాడతామని ఆ వ్యాపారి చెప్పినట్లు ఆ ప్రతిపాదనలో పేర్కొన్నారు. దీంతో, ఈ ఉత్పత్తుల విక్రయాలకు వేలం నిర్వహించాలంటూ కమిషనర్ అనుమతి మంజూరు చేశారు. ఈ ఉత్పత్తుల విక్రయాల్లో ఏడాది అనుభవం ఉన్నవారే వేలంలో పాల్గొనాలంటూ టెండర్ షరతుల్లో పేర్కొన్నారు. ఫలితంగా స్థానిక వ్యాపారులెవరూ ఇందులో పాల్గొనలేదు. దీంతో, నెలకు కేవలం రూ.45 వేల అద్దెకే దేవస్థానంలోని తూర్పు, పశ్చిమ రాజగోపురాల వద్ద రెండు స్టాల్స్ ఏర్పాటుకు ఆ వ్యాపారి వేలం పాడుకున్నారు. చిన్న వ్యాపారానికీ రూ.లక్ష పైనే.. విచిత్రమేమిటంటే దేవస్థానంలో ప్రతి వ్యాపారానికి వేలం పాట ద్వారానే అనుమతి మంజూరు చేస్తారు. చిన్నపాటి వ్యాపారానికి కూడా అద్దె రూ.లక్షకు పైబడే ఉంటుంది. కొబ్బరి కాయలు అరటిపండ్లు తదితర పూజాద్రవ్యాలు, ఆవు నేతి దీపాల వంటి వ్యాపారాలకు ఏడాదికి సుమారు రూ.70 లక్షల నుంచి రూ.కోటి వరకూ వేలం పాట ఖరారవుతోంది. ఫ్యాన్సీ షాపులు, క్యాంటీన్ల వేలం ఏడాదికి రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ ఉంటోంది. చిన్నపాటి కాఫీ, టీ స్టాల్కు కూడా నెలకు రూ.50 వేలు పైనే ఉంటోంది. అటువంటిది స్వామివారి ఆలయానికి అతి తక్కువ దూరంలో ఈ రెండు స్టాల్స్ను కేవలం రూ.45 వేలకే ఏర్పాటు చేయడం వెనుక ఉన్న మతలబు ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అపచారమో కాదో చూడకుండానే.. ఈ స్టాల్స్లో సంప్రదాయ కాటుక, సహజ కుంకుమ, పంచగవ్య సబ్బు, బిల్వ పత్రాలతో చేసిన సబ్బు, బిల్వ పత్రాలతో చేసిన షాంపూ, తులసి పౌడర్, తులసి సోప్, పంచతులసి డ్రాప్, బిల్వదళ పౌడర్, తులసి వాటర్, తులసి టీ, బిల్వ సోప్, తులసి నాజిల్ డ్రాప్స్, దశపత్రి కషాయం. నిర్మాల్య పత్రితో ఫినాయిల్, నిర్మాల్య పత్రితో ఫేస్ ప్యాక్, నిర్మాల్య పత్రితో కాళ్ల పగుళ్ల క్రీమ్, నిర్మాల్య పత్రితో మాయిశ్చరైజింగ్ క్రీమ్, నిర్మాల్య పత్రితో నొప్పి నివారణ తైలం, కామధేను హారతి, గోక్షీరాది తైలం, సహజ సున్నిపిండి విక్రయించడానికి అనుమతులిచ్చారు. వీటిల్లో దేవుని నిర్మాల్యంతో తయారు చేసిన ఫినాయిల్, ‘కాళ్ల పగుళ్లకు రాసుకునే తైలం’ కూడా ఉన్నాయి. దేవుని నిర్మాల్యంతో ఇటువంటి వస్తువుల తయారీయే తప్పని అనుకుంటే.. వీటి విక్రయాలకు సైతం గత ఈఓ వీర్ల సుబ్బారావు అనుమతివ్వడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇటువంటి వస్తువులు విక్రయించడం సరైనదో కాదో పరిశీలించకుండానే అనుమతులిచ్చారా.. లేక ఎవరి ఒత్తిళ్లయినా ఉన్నాయా అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానం ఆవరణలో చెప్పులతోనే నడవకూడదని మైకులో రోజుకు వందసార్లు చెబుతారు. దేవుని పూజలో వాడిన పత్రి, పుష్పాలు, ప్రసాదాలు కింద పడితే వాటిని కాళ్లతో తొక్కడాన్ని అపచారంగానే భక్తులు భావిస్తారు. చెప్పులతో తొక్కడం మరింత అపచారం. అటువంటిది ఈ స్టాల్స్లో నిర్మాల్యంతో తయారు చేసిన ఫినాయిల్, కాళ్ల పగుళ్ల క్రీమ్ వంటి వాటి విక్రయాలకు అనుమతి ఇవ్వడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఈ జాబితాల్లో పేర్కొన్న మిగిలిన ఉత్పత్తులు ఎక్కడ తయారు చేస్తున్నారు.. తయారీకి సత్యదేవుని నిర్మాల్యమే ఉపయోగిస్తున్నారా వంటి అంశాలను అధికారులెవ్వరూ పరిశీలించిన దాఖలాల్లేవు. ఈఓ ఆరా ఈ స్టాల్స్ అనుమతులను దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు శుక్రవారం పరిశీలించారు. ఈ ఉత్పత్తుల విక్రయాలకు గత ఈఓ అనుమతిచ్చిన విషయం ఈ సందర్భంగా తేటతెల్లమైంది. భక్తుల మనోభావాలకు విరుద్ధంగా, దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉండే ఉత్పత్తులను ఇక్కడ విక్రయించరాదని ఈఓ ఆదేశించారు. దీనిపై కమిషనర్కు ఆయన నివేదిక సమర్పించనున్నట్లు సమాచారం. ఆ ఫినాయిల్ బాటిల్స్ మాయం ‘సత్యదేవుని నిర్మాల్య పత్రితో తయారైన ఫినాయిల్’ అంటూ రత్నగిరిపై షాపులో సాగిస్తున్న అమ్మకాలపై ‘సత్యదేవుని సన్నిధిలో మహాపచారం’ శీర్షికన ‘సాక్షి’ శుక్రవారం ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఆ షాపులో ‘సత్యదేవుని నిర్యాల్య పత్రితో ఫినాయిల్’ అని స్టిక్కర్ అతికించి అమ్ముతున్న బాటిల్స్ను తీసేశారు. మిగిలిన ఉత్పత్తులను మాత్రం యథాతథంగా విక్రయిస్తున్నారు. -
కల్తీ పెట్రోలు విక్రయంపై ఆందోళన
జగ్గంపేట: కాట్రావులపల్లి గ్రామంలోని శ్రీజయలక్ష్మి ఫిల్లింగ్ స్టేషన్లో కల్తీ పెట్రోల్ కొడుతున్నారంటూ వినియోగదారులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి ఆర్ఎస్ఎస్ సత్యనారాయణ రాజు పరిశీలించి తేడాలు గుర్తించి బంక్ను సీజ్ చేశారు. ఆ వివరాల ప్రకారం.. కాట్రావులపల్లిలో ఆ పెట్రోల్ బంక్ వద్ద పెట్రోలు కొట్టించుకున్న మోటార్ సైకిళ్లు కొద్దిరోజులుగా మరమ్మతులకు గురవుతున్నాయి. ఒక్కసారిగా చాలా మోటారు సైకిళ్లు పాడవడంతో మెకానిక్లు పెట్రోల్లో తేడా వల్లే ఇలా జరిగిందని వివరించడంతో సుమారు 28 మంది వాహనదారులు పెట్రోల్ బంక్ వద్ద సాయంత్రం ఆందోళనకు దిగారు. తమ వాహనాల మరమ్మతులకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనితో యాజమాన్యానికి, వినియోగదారుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో జగ్గంపేట ఎస్సై రఘునాధరావు ఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ నేపథ్యంలో జగ్గంపేట ఎంఎస్ఓ కృష్ణ సమాచారంతో జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి సత్యనారాయణ రాజు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రికార్డులు పరిశీలించడంతో పాటు, పెట్రోల్ సాంద్రత, నిల్వలను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సాంద్రతలో చాలా తేడాలు గుర్తించామని చెప్పారు. దీని ప్రకారం కల్తీ జరిగిందని నిర్ధారణకు వచ్చి బంక్ సీజ్ చేశామని, అలాగే యజమాని కనిగిరి వెంకట రమణమూర్తి, గుమస్తా వాకాడ రమేష్పై 6ఏ కేసు నమోదు చేశామని తెలిపారు. కాట్రావులపల్లి పెట్రోల్ బంక్ను తాత్కాలికంగా జగ్గంపేటలోని ఎస్ఆర్ బంక్ అప్పగించామని చెప్పారు. జగ్గంపేట ఎంఎస్ఓ కృష్ణ, వీఆర్వో కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఎగ్నామం పెట్టేందుకా?
బాలాజీచెరువు (కాకినాడ): మధ్యాహ్న భోజన పథకం అపహాస్యం అవుతోంది.. సంబంధిత ప్రైవేట్ ఏజెన్సీలు మధ్యాహ్న భోజనంలో మెనూలో భాగంగా ఉడకబెట్టిన గుడ్లను నిర్వాహకులకు పంపిస్తుండగా, ఇందులో రోజుకు 10 నుంచి 20 వరకూ పాడైపోతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. కాకినాడ పీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు పాడైన గుడ్లు వచ్చాయి. వాటిని వారు తినకుండా వదిలేశారు. ఇక్కడ మొత్తం 240 మంది మధ్యాహ్న భోజనం చేస్తారు. ఇందులో రోజూ సుమారు పది వరకూ గుడ్లు పాడవుతున్నాయని చెబుతున్నారు. ఈ విషయమై అధికారులకు చెబుతున్నా మార్పు ఉండటం లేదని పలువురు వాపోతున్నారు. స్నేహితుడిపై దాడి: వ్యక్తికి జైలు కాకినాడ లీగల్: స్నేహితుడిపై దాడి చేసిన వ్యక్తికి 9 నెలల జైలు, రూ.మూడు వేల జరిమానా విధిస్తూ కాకినాడ నాలుగో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ నిరూప భంజ్ డియో శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. తిమ్మాపురానికి చెందిన కొప్పిశెట్టి రాజేష్ అదే ప్రాంతానికి చెందిన జియ్యన శ్రీమన్నారాయణ స్నేహితులు. వారి మధ్య కక్షలు ఉండడంతో శ్రీమన్నారాయణపై రాజేష్ రాయితో దాడి చేశాడు. దీనిపై తిమ్మాపురం పోలీసులు 2022లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. కోర్టు విచారణలో రాజేష్పై నేరం రుజువు కావడంతో 9 నెలల జైలు, రూ.మూడు వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
100
శనివారం శ్రీ 27 శ్రీ డిసెంబర్ శ్రీ 2025రో జు లగందరగోళం● టెన్త్ ప్రత్యేక తరగతులపై ‘పరాయి’ పెత్తనం ● ఇతర శాఖలకు పర్యవేక్షణ బాధ్యతలు ● ఇది టీచర్లను అవమానించడమేనంటున్న ఉపాధ్యాయ సంఘాలు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): మరో మూడు నెలల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈసారి మెరుగైన ఫలితాలు సాధించాలని విద్యా శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం కొద్ది రోజులుగా వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తోంది. దీని ద్వారా డిసెంబర్ మొదటి వారానికే మొత్తం సిలబస్ పూర్తి చేసి, వంద రోజుల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించి, పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను ఉపాధ్యాయులు సన్నద్ధం చేయాల్సి ఉంది. ఆలోచన గొప్పగానే ఉన్నా.. అమలుకు వచ్చేసరికి ఈ ప్రణాళిక మొత్తం గందరగోళంగా మారింది. టీచర్లపై ‘బోధనేతర’ భారం జిల్లాలోని 476 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 29,637 మంది విద్యార్థులు ఈసారి పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. వీరిలో 251 ప్రభుత్వ పాఠశాలల నుంచి 18,097 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు గాను ప్రభుత్వం వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తోంది. దీనికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన ప్రణాళిక తీవ్ర గందరగోళానికి గురి చేస్తోంది. వాస్తవానికి విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ఉపాధ్యాయులకు ప్రభుత్వం అనేక బోధనేతర పనులు అప్పగించింది. దీంతో, వారు సిలబస్ సకాలంలో పూర్తి చేసేందుకు అనేక ఇబ్బందులు పడ్డారు. మరోవైపు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం ఒక ఎత్తయితే.. మూల్యాంకనం, మార్కుల అప్లోడ్ చేయడంతోనే వారికి సమయం అయిపోతోంది. మరోవైపు రకరకాల యాప్లు.. వాటిల్లో సమాచారం అప్లోడ్ వంటి వాటితో వారు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే పదో తరగతి విద్యార్థులకు డిసెంబర్ 6 నుంచి మార్చి 15వ తేదీ వరకూ వంద రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని విద్యా శాఖ ఆదేశించింది. దీని అమలు పర్యవేక్షణను ఆ శాఖతో ఎటువంటి సంబంధమూ లేని అధికారులకు అప్పగించింది. ఈ ఇన్చార్జి అధికారుల కనుసన్నల్లోనే ఈ ప్రణాళిక మొత్తం అమలవుతుందని చెప్పింది. దీనిపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు. తమ శాఖపై ఇతరులకు పెత్తనం అప్పగించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. వివిధ శాఖలు అధికారులు ఇలా.. వంద రోజుల ప్రణాళిక అమలుకు ఇన్చార్జ్లుగా రెవె న్యూ, పంచాయతీరాజ్, వైద్య – ఆరోగ్యం, ఎంపీడీఓ, ఆర్డబ్ల్యూఎస్, వ్యవసాయం, ఇరిగేషన్, మున్సిపల్ కమిషనర్, వెటర్నరీ తదితర అధికారులను ప్రభుత్వం నియమించింది. వీరందరూ కలిసి ఆయా మండలాల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు వెళ్లి, ఈ ప్రణాళిక అమలును పూర్తిగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. అంతేకాకుండా స్లిప్ టెస్టుల నిర్వహణ, మార్కుల నమోదు, ఉపాధ్యాయుల హాజరు, షైనింగ్, రైజింగ్ స్టార్లుగా టెన్త్ విద్యార్థులను విభజించి పాఠాలు బోధిస్తున్నారా లేదా తదితర అంశాలను ప్రతి రోజూ పరిశీలించాలి. శని ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో ఈ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారో లేదో చూడాల్సిన బాధ్యత కూడా వీరిపై ఉంటుంది. మావాళ్లుండగా వారితో పనేంటి? వాస్తవానికి ప్రతి మండలానికీ ఎంఈఓ–1, 2లతో పాటు జిల్లావ్యాప్తంగా డిప్యూటీ డీఈఓలు, ప్రతి పాఠశాలకు ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు ఉన్నారు. విద్యా శాఖలోనే ఇంత మంది ఉండగా.. వేరే శాఖల వారిని ఇన్చార్జులుగా నియమించడం దేనికనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వీరికి పాఠశాల విద్య అమలు తీరుపై ఏవిధంగా అవగాహన ఉంటుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం ఉపాధ్యాయులను అవమానించడమేనని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కరప మండలం వేళంగిలో వంద రోజుల ప్రణాళిక అమలును పరిశీలిస్తున్న డీఈఓ రమేష్ (ఫైల్) ఇతర శాఖల పెత్తనం తగదు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో విద్యా శాఖ నిర్ణయాలు విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయి. వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి ఆంక్షలు విధించడం అశాసీ్త్రయం. ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో, నిబద్ధతతో పని చేస్తూంటే ఇతర శాఖల అధికారులను తనిఖీల పేరుతో నియమించడం తగదు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. – చింతాడ ప్రదీప్ కుమార్,పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వ నిర్ణయం సరికాదు వంద రోజుల ప్రణాళిక ఏవిధంగా అమలవుతోందో పరిశీలించడానికి ఇతర శాఖల ఉద్యోగులను నియమించాలనే ప్రభుత్వ నిర్ణయం సరి కాదు. దీనివలన ఉపాధ్యాయుల ఆత్మాభిమానం దెబ్బ తింటోంది. ప్రణాళికను పక్కాగా అమలు చేసేందుకు జిల్లా విద్యా శాఖ అధికారి, ఉప విద్యా శాఖ అధికారులు, ఎంఈఓలు ఉన్నారు. – మోర్త శ్రీనివాస్, ఎస్టీయూ రాష్ట అదనపు ప్రధాన కార్యదర్శి విద్యార్థులు, ఉపాధ్యాయులపై ఒత్తిడి వంద రోజుల ప్రణాళికలో భాగంగా పండగ సెలవులు కూడా ఇవ్వకుండా విద్యార్థులు, ఉపాధ్యాయులపై ఒత్తిడి పెట్టడం సరైన విధానం కాదు. రోజూ పరీక్షలు నిర్వహించడం, మర్నాడు మార్కులు అప్ లోడ్ చేయాలని ఆదేశించడం, విద్యా శాఖపై అవగాహ న లేని వారిని పర్యవేక్షకులుగా నియమించడం సమంజసం కాదు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. – శేశెట్టి సత్యనారాయణ, అధ్యక్షుడు, ఎస్టీయూ, కాకినాడ -
కాకినాడ టు శబరిమల
ఇరుముడి ధరించి 1,470 కిలోమీటర్ల పాదయాత్ర నగరి: సాధారణంగా అయ్యప్ప భక్తులు పంబ నుంచి, లేకుంటే ఎరిమేలి నుంచి పెద్ద పాదలో గానీ పాదయాత్రగా శబరి కొండపైకి వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం పరిపాటి. అయితే కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఇద్దరు భక్తులు 1,470 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అయ్యప్ప దర్శనానికి వెళ్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా, తణుకు మండలం మండపాక గ్రామానికి చెందిన అర్జున్ (63), కాకినాడ రూరల్ రేపూరు గ్రామానికి చెందిన ముమ్మిడి భవానిశంకర్ (44) అయ్యప్ప స్వామి మాల ధరించారు. 18 ఏళ్ల క్రితం అర్జున్ స్వామి తన 18వ శబరియాత్రను చేపట్టగా, ముమ్మిడి భవాని శంకర్ కన్నెస్వామిగా మాల ధరించి ఆయన వెంట కాకినాడ నుంచి శబరికొండ వరకు పాదయాత్రగా వెళ్లి అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. ఆపై ఇరువురు సొంతంగా అయ్యప్ప ఆలయాలను నిర్మించి కలసి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఆపై ఇద్దరూ పాదయాత్ర చేసినా కలసి వెళ్లలేదు. మరో 18 ఏళ్లకు వారి ఆశయం నెరవేరింది. ఇద్దరూ వారి ప్రాంతాల్లో నూతన అయ్యప్ప ఆలయాల నిర్మాణం పూర్తి చేశారు. ఈ ఏడాది కలసి పాదయాత్ర ప్రారంభించారు. భవానీ శంకర్ 18వ సారి శబరి యాత్ర చేస్తుండగా, అర్జున్ స్వామి 36వ సారి తన యాత్రను కొనసాగిస్తున్నారు. వారు శుక్రవారం చిత్తూరు జిల్లా నగరికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ యాత్ర వివరాలను మీడియాకు తెలియజేశారు. ప్రజా సంక్షేమం కోరుతూ ఇరుముడి ధరించి 1,470 కిలోమీటర్ల పాదయాత్రను కొనసాగిస్తున్నామన్నారు. భవానీ శంకర్ నవంబరు 30న రేపూరు నుంచి యాత్రను ప్రారంభించగా, అర్జున్ స్వామి డిసెంబరు 4వ తేదీ తణుకు నుంచి యాత్రను ప్రారంభించారు. 22 రోజులుగా కలసి యాత్ర కొనసాగిస్తున్నామని మకర జ్యోతికి శబరిమలకు చేరుకుంటామని వారు తెలిపారు. వేల కిలోమీటర్ల యాత్రలో.. శబరి కొండకు వీరు చేసే యాత్రలు విని అందరూ నోరెళ్లబెడుతున్నారు. వీరిలో అర్జున్ స్వామి ఏడుసార్లు ఇలా తణుకు నుంచి శబరి కొండకు ఇరుముడితో పాదయాత్ర చేశారు. ఇందులో నాయుడుపేట మీదుగా మూడు సార్లు, సేలం, దిండిగల్ మీదుగా రెండు సార్లు, తిరుత్తణి, అరకోణం మీదుగా రెండు సార్లు పాదయాత్రగా వెళ్లగా, మోటారుసైకిల్ మీదుగా మూడుసార్లు, సైకిల్పై ఐదుసార్లు యాత్ర కొనసాగించారు. ప్రస్తుతం 62 సంవత్సరాల వయస్సులో ఇరుముడి ధరించి పాదయాత్ర చేస్తున్న ఈయన భక్తికి పరవశించి అందరూ ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు. గణపతి గురుస్వామి ద్వారా తాను ఈ భక్తిమార్గంలో నడుస్తున్నానని ఆయన తెలిపారు. ముమ్మిడి భవానీశంకర్ నాలుగు సార్లు పాదయాత్రగా వెళ్లగా, ఒకసారి బైక్యాత్ర చేశారు. ప్రస్తుతం ఐదవసారి యాత్ర చేస్తున్నారు. వేలు గురుస్వామి ద్వారా తాను ఈ భక్తిమార్గంలో నడుస్తున్నాని ఆయన తెలిపారు. పెట్రోలు బంకులు, ఆశ్రమాలు, గుళ్ల వద్ద తలదాచుకుంటూ మార్గంలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రాలు దర్శించుకుంటూ యాత్రను కొనసాగిస్తున్నారు. -
● మంచి మార్కులకు దోహదం
దస్తూరి అందంగా ఉంటేనే మంచి మార్కులు వస్తాయి. ప్రజెంటేషన్ బాగా చేయడానికి దస్తూరి ఒక కారణంగా చెప్పవచ్చు. ఏకాగ్రతతో 10 రోజులు సాధన చేస్తే కచ్చితంగా అద్భుతమైన చేతిరాతను సొంతం చేసుకోవచ్చు. వేల మందికి చేతిరాతను తీర్చిదిద్దడంలో తర్ఫీదునిచ్చాను. –కుంచే బాలకృష్ణ, కాలిగ్రాఫర్, స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ), జెడ్పీహెచ్ఎస్, తొండవరం ● మెళకువలు నేర్చుకోవాలి చేతిరాతను అందంగా తీర్చిదిద్దుకోవాలంటే కొన్ని మెళకువలు తప్పనిసరిగా పాటించాలి. పెన్ను పట్టుకునే విధానం కూడా చేతిరాతను మారుస్తుంది. ప్రతి రోజూ కొంత సమయాన్ని చేతిరాతను తీర్చిదిద్దుకునేందుకు కేటాయించాలి. చేతిరాత బాగుంటే తలరాత కూడా మారుతుంది. –టి.గణేశ్వరరావు, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవర్, స్కూల్ అసిస్టెంట్ (హిందీ), కాండ్రకోట, పెద్దాపురం మండలం ● తప్పుల్లేకుండా రాయాలి అందమైన అక్షరాలతో మంచి మార్కులను సంపాదించవచ్చు. చేతిరాత మెరుగుపర్చేందుకు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. సమాధానాలు దిద్దేవారికి సులభంగా అర్థమైనప్పుడే మంచి మార్కులకు అవకాశం ఉంటుంది. తక్కువ రాసినా తప్పుల్లేకుండా అందంగా రాయడం వల్ల మంచి మార్కులు సాధించవచ్చు. –సీహెచ్ జాన్ప్రసాద్, జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం, ప్రత్తిపాడు -
రూ.150 నాణెం సేకరణ
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వందేమాతర గీతం రూపుదిద్దుకొని 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముంబై టంకసాల ద్వారా రూ.150 ప్రత్యేక స్మారక నాణెం విడుదల చేసింది. దీనిని కాకినాడకు చెందిన ప్రముఖ నాణేల సేకర్త మార్ని జానకిరామ చౌదరి సేకరించారు. 32 గ్రాముల బరువైన ఈ నాణేన్ని రాగి, నికెల్, జింక్ మిశ్రమ లోహాలతో తయారు చేశారు. దీనికి ఒకవైపు రూ.150 ముఖవిలువను, మరోవైపు తుపాకీ ఎక్కుపెట్టి బ్రిటిష్ సైనికుల అరాచకాలను నిరసిస్తూ భారతీయులు ఏకతాటిపై నిలిచి ‘వందేమాతరం’ అంటూ నినదిస్తున్న చారిత్రక దృశ్యాన్ని ముద్రించారు. భారత స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో పాటు సాంస్కృతిక వారసత్వాన్ని, దేశభక్తిని చాటే ఇలాంటి అరుదైన నాణెం సేకరించటం గర్వంగా ఉందని జానకిరామ చౌదరి శుక్రవారం విలేకర్లకు తెలిపారు. చంద్రబాబుది ట్రబుల్ ఇంజిన్ సర్కార్ కాకినాడ రూరల్: చంద్రబాబుది డబుల్ ఇంజిన్ సర్కారు కాదని, ట్రబుల్ ఇంజిన్ సర్కార్ అని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి విమర్శించారు. శుక్రవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర సంపదను కొందరికి దోచి పెట్టడానికే చంద్రబాబు ప్రభుత్వం పని చేస్తోందని దుయ్యబట్టారు. గడచిన 8 నెలల్లో రాష్ట్ర ఆర్థిక లోటు 163 శాతానికి చేరిందంటూ కాగ్ నివేదిక ఇవ్వడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ శాతం కొంత మంది కాంట్రాక్టర్లకు దోచి పెట్టడమే ప్రభుత్వ విధానంలా మారిందని దుయ్యబట్టారు. చేస్తున్న అప్పులు ఎక్కడికి పోతున్నాయో కూడా చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసేందుకు కంకణం కట్టుకోవడం దారుణమన్నారు. ఆయుష్ ఆస్పత్రిలో కీలకమైన అధ్యాయం మొదలైందని చెబుతున్న ప్రభుత్వం.. మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ సూచనల మేరకు ముఖ్యమంత్రి, మంత్రులు అక్కడ చికిత్స చేయించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరుగుతోందంటూ కాగ్ పదేపదే చెబుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికై నా కుప్పలు తెప్పలుగా అప్పులు చేయడం మానుకుని, ఆదాయం పెంపుపై దృష్టి సారించాలని నాగమణి హితవు పలికారు. ‘కేవల మర్త్యుడె ధర్మసుతుడు?’ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్) ధర్మరాజును కేవలం మానవమాత్రుడేనని అనుకోరాదని ప్రవచన విరించి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో కొనసాగిస్తున్న వ్యాస భారత ప్రవచనంలో భాగంగా కీచక వధ వృత్తాంతాన్ని శుక్రవారం ఆయన వివరించారు. ‘‘నిండు సభలో కామరోగ పీడితుడైన కీచకుడు.. ద్రౌపదిని కాలితో తన్ని అవమానిస్తాడు. ఆ రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో భీముని వద్దకు వెళ్లి ద్రౌపది తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. ‘యుధిష్టిరుని భర్తగా పొందిన సీ్త్ర.. శోకం లేనిదెలా అవుతుంది? – అశోచ్యత్వం కుతస్తస్యాః యస్యా భర్తా యుధిష్ఠిరః’ అని తీవ్ర దుఃఖంతో అంటుంది. భీముడు సాంత్వనవచనాలతో ఆమెను ఓదార్చి, కీచకుడిని నర్తనశాలకు రాత్రి వేళ రావాల్సిందిగా ఆహ్వానించాలని, వాడిని అక్కడే గుట్టుగా మట్టు పెడతానని చెబుతాడు. ద్రౌపది తన తొందరపాటును నిందించుకుంటూ, ఆవేశంలో, దుఃఖాన్ని తట్టుకోలేక, ధర్మరాజు గురించి పరుషమైన పదాలు పలికానని, ఆ మహానుభావుని దివ్యత్వం తనకు తెలుసునని అంటుంది. ‘ఎవని చరిత్రము ఎల్ల లోకాలకు గురుస్థానంలో నిలచి పూజనీయమవుతుందో, ఎవని కడగంటి చూపు మానిత సంపదలు కలగచేస్తుందో, అట్టి మహానుభావుడు ధర్మరాజును కేవలం మానవమాత్రుడని అనుకోరాదు. కేవల మర్త్యుడె ధర్మసుతుడు?’ అని తన అంతరంగాన్ని వెల్లడిస్తుంది. చక్కగా అలంకరించుకుని నర్తనశాలకు వచ్చిన కీచకుడిని భీముడు గుట్టుగా మట్టు పెడతాడు. అతడి పార్థివ శరీరంతో పాటు ద్రౌపదిని దహనం చేయాలనుకున్న ఉపకీచకులు 105 మందిని భీముడు వధిస్తాడు. హస్తినలో వేగుల ద్వారా కీచకుని మరణ వార్త విన్న దుర్యోధనుడు ఈ పని చేసింది భీముడేనని, కీచకుడు మనసు పడ్డ సైరంధ్రి ద్రౌపది అనే నిర్ణయానికి వస్తాడు. ధర్మరాజు ఉన్న రాజ్యం సుఖశాంతులతో ఉంటుందని భీష్ముడు చెబుతాడు’’ అంటూ సామవేదం వివరించారు. అప్పటికే పాండవుల అజ్ఞాతవాస గడువు పూర్తయిందని అన్నారు. -
బాలా.. భళా
ఫ ఆంగ్లంలో 20వ ఎక్కం వరకూ చెబుతున్న ఒకటో తరగతి విద్యార్థి ఫ చిరుప్రాయంలోనే ప్రతిభ కొత్తపేట: ఒకటో తరగతి బాలుడు.. ఎక్కాలు ఆంగ్లంలో గణగణా చెప్పేస్తున్నాడు.. ఆ చిన్నారి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో చదువుకుంటున్నాడని అనుకుంటున్నారా? కాదు.. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలుడే.. అతని జ్ఞాపకశక్తి అమోఘమని అందరూ ఆశ్చర్యపోతున్నారు. భవిష్యత్ మేధావి అని ఆకాంక్షిస్తున్నారు.. ఈ బాలుడి పేరు అడపా మోహన్సాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం అవిడి ప్రభుత్వ మోడల్ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఆ పాఠశాల ఉపాధ్యాయుడు ఎ.దుర్గాప్రసాద్ ఎక్కాలు సులభ రీతిలో ఆంగ్లంలో చదవడంపై శిక్షణ ఇచ్చారు. దాని ఫలితంగా మోహన్సాయి అందరి కంటే మించి ఒకటో ఎక్కం నుంచి 20వ ఎక్కం వరకూ 20 స్టెప్పులు అనర్గళంగా చూడకుండా చెప్పేస్తున్నాడు. ఎంఈఓ మట్టపర్తి హరిప్రసాద్ ఆ పాఠశాల సందర్శన సందర్భంగా ఏ ఎక్కం గురించి అడిగినా భయం లేకుండా, తడుముకోకుండా అప్పచెప్పేశాడు. బాలుడి మేథస్సుకు ముచ్చటపడి ఆయన అభినందించారు. నేటి బాల మేథావి అని ఆకాంక్షించారు. ఇదిలాఉంటే అతని తల్లిదండ్రులు పెద్ద చదువులు చదివిన విద్యాధికులు కాదు.. తండ్రి శ్రీనివాసరావు సాధారణ రైతు కాగా, తల్లి గృహిణి. అతని అన్న రెండో తరగతి చదువుతున్నాడు. జ్ఞాపకశక్తి అమోఘం చిరుప్రాయంలోనే ఇంత మేథస్సు గల మోహన్సాయి గురించి ఉపాధ్యాయుడు దుర్గాప్రసాద్ను ‘సాక్షి’ అడగ్గా, ఆయన ఇలా తెలిపారు. ఒకటో తరగతి బాలలు రెండు పదులు, మూడు పదులు వరకూ చెప్తారు. కానీ సాయి 20వ ఎక్కం వరకూ 20 స్టెప్పులు ఆంగ్లంలో ధారాళంగా చూడకుండా చెబుతున్నాడు. ఇతని జ్ఞాపకశక్తి అద్భుతం, అమోఘమని అన్నారు. తన 40 ఏళ్ల సర్వీసులో ఒకటో తరగతి విద్యార్థి ఇలా చెప్పడం చూడలేదని చెప్పారు. గత ప్రభుత్వ కృషికి ఫలితంమోహన్సాయి అనర్గళంగా ఆంగ్లంలో 20 ఎక్కాలు చెప్పడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఇంగ్లిషు మీడియం ఓ కారణంగా చెప్పవచ్చు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన సంస్కరణలే పునాది అయ్యింది. ‘మనబడి నాడు – నేడు’ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంతో పాటు, అన్ని సౌకర్యాలు కల్పించిన విషయం తెలిసిందే. ఇంగ్లిషు మీడియం ఆప్షన్ అమలు చేయడంతో ఈ పాఠశాలల్లో చదువుకునే పేద, మధ్య తరగతి విద్యార్థులు ఈ మీడియం పట్ల మక్కువ చూపారు. మాతృభాష తెలుగుతో పాటు దేశ, విదేశాల్లో ఉన్నత చదువులకు దోహదపడే ఇంగ్లిషును కూడా మాట్లాడగలుగుతున్నారు. నాడు జగన్ ప్రభుత్వం విద్యా సంస్కరణలే నేటి ఈ మార్పులకు పునాది అని పలువురు విద్యాధికులు, మేధావులు పేర్కొంటున్నారు. -
ప్రజాస్వామిక శక్తులను బలోపేతం చేయాలి
● రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుకోవాలి ● సీపీఐ నేత మధు ● ఘనంగా ఆ పార్టీ శతజయంతి ఉత్సవాల ముగింపు సభ సామర్లకోట: రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుతూ, లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలను, శక్తులను బలోపేతం చేయాల్సిన అవసరముందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు అన్నారు. సీపీఐ శత జయంతి ఉత్సవాల జిల్లా స్థాయి ముగింపు సభ శుక్రవారం సామర్లకోటలో జరిగింది. ఈ సందర్భంగా స్థానిక మెహర్ కాంప్లెక్స్ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా లారీ స్టాండ్ వద్ద ఉన్న సీపీఐ కార్యాలయం వరకూ ప్రజా ప్రదర్శన నిర్వహించారు. అక్కడ సీపీఐ పతాకాన్ని పార్టీ సీనియర్ నాయకుడు చెరుకూరి సుబ్బారావు మాస్టారు ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయాన్ని మధు ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, ప్రస్తుతం దేశం సంక్షోభంలో ఉందని, క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాకర్టీ ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేస్తున్నారన్నారు. కేంద్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న మతతత్వ శక్తులు అంబేడ్కర్ వంటి మహనీయులు అందించిన రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు.. రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన లౌకిక, ప్రజాస్వామ్య, సంక్షేమ దేశాన్ని మత రాజ్యంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. దీనిలో భాగంగానే దేశాన్ని, దేశ చరిత్రను మార్చేందుకు రాజ్యాంగం నుంచి సెక్యులరిజం పదాన్ని తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. లౌకిక, ప్రజాస్వామ్య, ఫెడరల్ వ్యవస్థలు మతతత్వ శక్తుల దాడికి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయి ప్రజల జీవితాలు దుర్భరంగా మారిపోయాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత లౌకిక, ప్రజాస్వామ్య, వామపక్ష శక్తులపై ఉందని మధు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చిన తరువాత ప్రపంచంలో యుద్ధ వాతావరణం ఏర్పడిందన్నారు. కమ్యూనిస్టుల లక్ష్యమైన కుల, మత రహిత సోషలిస్టు సమాజ నిర్మాణానికి నిరంతరం పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు. సీపీఐ వందేళ్ల పోరాట వారసత్వాన్ని యువత ముందుకు తీసుకు వెళ్లాలని కోరారు. సీపీఐ పట్టణ కార్యదర్శి పెదిరెడ్ల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పప్పు ఆదినారాయణ, సీనియర్ నాయకులు చింతపల్లి సుబ్బారావు, కట్ట సత్యనారాయణ, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వై.బాబు, ఏఐఎస్ఎఫ్ నేత నాని స్టాలిన్, మున్సిపల్ యూనియన్ నాయకులు నందకిషోర, బొత్స శ్రీనివాసు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ కార్యకర్తలను సత్కరించారు. -
కాకినాడలో బిగ్బాస్ విజేత సందడి
బోట్క్లబ్ (కాకినాడ): స్థానిక శ్యామ్ ఇనిస్టిట్యూట్లో బిగ్బాస్ సీజన్– 9 విజేత, భారతదేశ సైనికుడు కళ్యాణ్ పడాల సందడి చేశారు. ఆ సంస్థతో జ్ఞాపకాలను నెమర వేసుకుంటూ, తన ఎదుగుదలలో శ్యామ్ ఇనిస్టిట్యూట్ పాత్రను ఆయన కొనియాడారు. బిగ్బాస్ ట్రోఫీతో విచ్చేసిన కళ్యాణ్ పడాలకు ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ శ్యామ్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కళ్యాణ్ మాట్లాడుతూ ఈ ఇనిస్టిట్యూట్ విద్యార్థిగా నేర్చుకున్న క్రమశిక్షణ, పట్టుదలే తనను ఈ స్థాయిలో నిలబెట్టాయన్నారు. బిగ్బాస్ హౌస్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ నేర్చుకున్న పాఠాలు ధైర్యాన్ని ఇచ్చాయని భావోద్వేగంతో వివరించారు. శ్యామ్ ఇనిస్టిట్యూట్ అధినేత గుంటూరు శ్యామ్ మాట్లాడుతూ ఇనిస్టిట్యూట్ విద్యార్థిగా కళ్యాణ్ ఎంతో అంకితభావంతో ఉండేవారన్నారు. అనంతరం కళ్యాణ్ను సత్కరించారు. పోటీ పరీక్షలకు కేరాఫ్ అడ్రస్గా.. పోటీ పరీక్షలకు శ్యామ్ ఇనిస్టిట్యూట్ కేరాఫ్ అడ్రస్గా నిలిచిందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. స్థానిక శ్యామ్ ఇనిస్టిట్యూట్ ఆవరణలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫిజికల్ ఈవెంట్ గ్రౌండ్ను ఎంపీతో పాటు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన అన్ని రకాల పోటీ పరీక్షల్లో శ్యామ్ ఇనిస్టిట్యూట్ అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు. అడిషనల్ ఎస్పీ ఎ.శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్న శ్యామ్ ఇనిస్టిట్యూట్ అధినేత శ్యామ్ను అభినందనీయులన్నారు. కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
చిన్నారి ప్రాణాలు కాపాడిన జీజీహెచ్ వైద్యులు
కాకినాడ క్రైం: స్థానిక జీజీహెచ్ వైద్యులు ఒక పసివాడి ప్రాణాలు కాపాడారు. ఆ వివరాల్లోకి వెళితే.. పండా విజయదుర్గ అనే మహిళ మూడు రోజుల నుంచి జీజీహెచ్లోని న్యూరో మెడిసిన్ విభాగంలో ఫిట్స్తో చికిత్స పొందుతుంది. ఆమెకు ఎనిమిది నెలల కుమారుడు. ఆస్పత్రిలో తల్లితో పాటు ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం ఆ చిన్నారి ఆడుకుంటూ అక్కడే ఉన్న మెంథోప్లస్ బామ్ డబ్బా ప్రమాదవశాత్తూ మింగేశాడు. డబ్బా బయటకు రాక ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ విషయం గుర్తించిన తల్లి విజయదుర్గ తోటి రోగుల సహాయంతో బాలుడిని కింద అంతస్తులోని అత్యవసర విభాగంలో చేర్చింది. అప్పటికే బాలుడి నోటి నుంచి రక్తం కారడం మొదలైంది. తక్షణమే స్పందించిన క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుష్మ, సహ వైద్యులు సత్యవాణి, మాణిక్యం, కాంతిమ సహకారంతో అరగంట పాటు శ్రమించి బాలుడి గొంతు నుంచి మెంథోప్లస్ బామ్ డబ్బాను బయటకు తీసి ప్రాణాలు నిలిపారు. వైద్యుల కృషిని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి అభినందించడంతో పాటు బాలుడి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. -
30న రత్నగిరిపై ఉత్తర ద్వార దర్శనం
అన్నవరం: ఈ నెల 30న ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిలో ఉత్తర ద్వార దర్శనం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు అన్నవరం దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు శుక్రవారం తెలిపారు. ఆ రోజు తెల్లవారుజామున 4 గంటలకు సత్యదేవుని ఆలయంలో ఉత్తర ద్వారం వద్ద శ్రీమహావిష్డువు, శ్రీమహాలక్ష్మి అలంకరణలో సత్యదేవుడు, అమ్మవార్లను కొలువుదీరుస్తారు. పండితులు వివిధ పూజలు నిర్వహిస్తారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి భక్తులను ఉత్తర ద్వార దర్శనానికి అనుమతిస్తారు. భక్తుల రద్దీని అనుసరించి సాయంత్రం 5 గంటల వరకూ ఈ దర్శనం కొనసాగుతుంది. ఆ రోజు ఉదయం 11 గంటలకు ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అమ్మవారిని వెండి రథంపై ఊరేగిస్తారు. రాత్రి 7 గంటల నుంచి కొండ దిగువన గరుడ వాహనంపై స్వామి, అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహిస్తామని ఈఓ తెలిపారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా దేవస్థానంలో చేస్తున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఉత్తర ద్వార దర్శనం కోసం ఏర్పాటు చేసే క్యూ లైన్లపై ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు. స్వామివారి ప్రసాద విభాగాన్ని పరిశీలించారు. ప్రసాదం తయారీలో ఉపయోగిస్తున్న నెయ్యి, పంచదార, ఇతర దినుసులను పరిశీలించారు. అక్కడి సిబ్బంది సమస్యలపై ఆరా తీశారు. భక్తులు మెచ్చే విధంగా ప్రసాదం తయారు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఈ వి.రామకృష్ణ, ఏఈఓలు భాస్కర్, ఎలక్ట్రికల్ డీఈ సత్యనారాయణ, ప్రసాదం విభాగం సూపరింటెండెంట్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తొలి తిరుపతిలో.. పెద్దాపురం (సామర్లకోట): పెద్దాపురం మండలంలో తొలి తిరుపతి గ్రామంలోని శృంగార వల్లభ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ నెల 30న ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. స్వామివారికి 29న ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తామన్నారు. మంగళవారం తెల్లవారుజామున 3.30 నుంచి 4.30 గంటల వరకూ మేలుకొలుపు హారతి, సుప్రభాత సేవ నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం 4.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకూ భక్తులకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తామని చెప్పారు. భక్తులకు ఉచిత దర్శనం ఏర్పాట్లు చేస్తున్నామని ఈఓ శ్రీనివాసరావు, చైర్పర్సన్ మొయిల సంధ్య తెలిపారు. భక్తులకు ప్రసాద వితరణ ఉంటుందన్నారు. పోస్టాఫీసుల పనివేళల పెంపు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడ డివిజన్లోని పోస్టాఫీసుల పని వేళలను పొడిగించినట్లు కాకినాడ పోస్టల్ సూపరింటెండెంట్ కె.కృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీఎస్పీ క్యాంపస్ ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ.. గాంధీ నగర్, జగన్నాయక్పూర్, పెద్దాపురం పోస్టాఫీసులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకూ.. జేఎన్టీయూకే తపాలా కార్యాలయం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకూ.. జగ్గంపేట పోస్టాఫీసు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకూ పని చేస్తాయని వివరించారు. -
బాధితుడికి ఆర్థిక సాయం
కాకినాడ క్రైం: ‘నీ చేయి పని చేయదు.. పెన్షన్ రాద్దాంలే’ శీర్షికన ‘సాక్షి’ ఈ నెల 16న ప్రచురించిన కథనానికి స్పందన వచ్చింది. పెదపూడి మండలం కైకవోలు గ్రామానికి చెందిన 42 ఏళ్ల పెరుగుల వెంకట రమణ ఈ ఏడాది మార్చి 18న ద్విచక్ర వాహనం స్టాండ్ వేస్తూ పడిపోయాడు. ఈ ఘటనలో అతడి కుడి చేతికి గాయమైంది. కాకినా డ జీజీహెచ్ వైద్యులు అతడికి తొలుత కట్టు కట్టి, డిశ్చార్జి చేశారు. ఏప్రిల్ 7న శస్త్రచికిత్స చేశారు. అప్పటి నుంచీ వెంకట రమణ కుడి చేయి మెల్లగా అచేతనంగా మారుతూ కదల్లేని స్థితికి చేరింది. సర్జరీ సమయంలో జీజీహెచ్ వైద్యులు మోచేతిలో బాల్ వంటి నిర్మాణం తీసేశారని ఓ ప్రైవేటు వైద్యుడు చెప్పడంతో తనకు జరిగిన అన్యాయంపై వెంకట రమణ ఈ నెల 8న జీజీహెచ్ సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేశారు. అనంతరం అక్కడి ఆర్థోపెడిక్ వైద్యుడు శివానందం కూడా సర్జరీలో తేడా జరిగిందని, చేయి రాదని, కావాలంటే పెన్షన్ పెడదామని అన్నారు. దీనిపై బాధితుడు కలెక్టరేట్ గ్రీవెన్స్లో నేరుగా కలెక్టర్కు తన సమస్యను నివేదించాడు. దీనిపై ఈ నెల 16న ‘సాక్షి’ దినపత్రిక కథనం ప్రచురించింది. దీని ద్వారా వెంకట రమణ కష్టం తెలుసుకుని విశ్రాంత డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ వి.శ్రీనివాసరావు చలించిపోయారు. అతడికి సామాజికవేత్త, కరప మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు సాయంతో రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు. కష్ట కాలంలో అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. హిందువులు మౌనం వీడాలి ● ఇస్కాన్ దక్షిణ భారత డివిజినల్ కౌన్సిల్ పూర్వ చైర్మన్ సత్యగోపీనాథ్ దాస్ ● భగవద్గీతను అర్థం చేసుకోవాలని పిలుపు ఆలమూరు: హిందువులందరూ మౌనం వీడి సంఘటితం కావాల్సిన సమయం వచ్చిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఇస్కాన్ దక్షిణ భారతదేశ డివిజినల్ కౌన్సిల్ పూర్వపు చైర్మన్ పరవస్తు సత్యగోపీనాథ్ దాస్ ప్రభూజీ అన్నారు. మండలంలోని చెముడులంక రామాలయం వద్ద గురువారం జరిగిన హిందూ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజకీయ నాయకుల నుంచి ప్రతి ఒక్కరికీ హిందువులంటే అలుసుగా మారిందన్నారు. అవమానాలు చేసినా నోరు తెరవరని ఇతరులకు ధీమా ఏర్పడినందువల్లే తరచూ హిందూమతంపై దాడి జరుగుతోందన్నారు. హిందూ ధర్మాన్ని అవమానించిన వారికి హిందువులు ఓట్లు వేయడం సిగ్గు చేటన్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారతదేశంలో అనేక ప్రాంతాల్లో హిందువులపై ఎన్ని దౌర్జన్యాలు జరుగుతున్నా ఒక్క హిందువు కూడా రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపిన దాఖలాలు లేవన్నారు. ఇప్పటికైనా అందరూ సంఘటితమై జై శ్రీరామ్ అంటూ రోడ్ల మీదకు రావాలన్నారు. ధర్మాన్ని ఆచరించడం, భావితరాలకు అందించడం ద్వారా మాత్రమే హిందూ ధర్మ రక్షణ సాధ్యమవుతుందన్నారు. శ్రీమద్రామాయణం బాటలో మనం నడిచినంత కాలం సంస్కృతీ సంప్రదాయాలు, కుటుంబ, మానవ సంబంధాలు ఉన్నతంగా వెలుగొందాయని చెప్పారు. పాశ్చాత్య సంస్కతిని అనుసరించడం మొదలుపెట్టాక సంఘంలోనే కాదు, కుటుంబాల్లో సైతం ఐక్యత దెబ్బ తిందన్నారు. గతంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో భగవద్గీత పోటీలు నిర్వహిస్తే నెల్లూరుకు చెందిన ముస్లిం యువకునికి మొదటి బహుమతి వచ్చిందన్నారు. తాను పోటీల కోసమే భగవద్గీత చదివానని అయితే భగవద్గీత మొత్తం చదివాక మొత్తం 700 శ్లోకాలలో ఎక్కడా మతం అన్న పదం లేదని, ఇది సర్వమానవాళికి ఉపయోగపడే సందేశంగా తెలుసుకున్నానని, మానవులు అందరూ భగవద్గీత చదవడం మొదలుపెడితే అశాంతి, కొట్లాటలు ఉండవని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హిందూ ధర్మం గొప్పతనం తెలుసుకోలేక కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా నేడు ప్రవర్తిస్తున్నామని సత్యగోపీనాథ్ దాస్ ప్రభూజీ అన్నారు. ఆర్ఎస్ఎస్ గోదావరి జిల్లా సహకార్యవాహ్ గెడ్డం రాంబాబు, వీహెచ్పీ తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి దూలం వెంకట గనిరాజు పాల్గొన్నారు. -
న్యాయం కావాలి
● మహిళా పోలీస్ స్టేషన్ ఎదుటే వివాహిత ధర్నా ● ఏడాదిన్నర బిడ్డతో నిరసన ● వదిలి వెళ్లిపోయిన భర్త నిర్వాకంపై ఫిర్యాదు కాకినాడ క్రైం: తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ ఏడాదిన్నర బిడ్డతో కలసి కాకినాడ మహిళా పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలపడం సంచలనం రేపింది. వివరాలివీ.. స్థానిక జగన్నాథపురానికి చెందిన మల్లాడి సునీత(24)కు కోటిపల్లికి చెందిన కార్పెంటర్ సూర్యప్రకాష్తో వివాహమైంది. వారికి ఏడాదిన్నర వయసున్న బాబు ఉన్నాడు. అయితే, అదనపు కట్నం రూ.3 లక్షలు తేవాలంటూ భర్త తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ సునీత ఏడాదిన్నర క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాటి నుంచి నేటి వరకూ ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎటువంటి చర్యలూ తీసుకోలేదని, తన భర్త నుంచి డబ్బులు తీసుకుని, రేపుమాపు, కౌన్సెలింగ్ అంటూ ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేస్తున్నారని సునీత ఆరోపించింది. తన భర్త తరఫున రాజకీయ నాయకులు వత్తాసు పలుకుతున్నారని, పోలీసులు కేసు నమోదు చేయకుండా వారు అడ్డు పడుతున్నారని వాపోయింది. తాను తల్లిదండ్రులు లేని అనాథనని, ఏ ఆధారమూ లేక, తినేందుకై నా గత్యంతరం లేని స్థితిలో చంటి బిడ్డతో బతుకుతున్నానని చెప్పింది. డబ్బు కోసం పోలీసులు తన జీవితంతో ఆడుకుంటున్నారని కన్నీటి పర్యంతమైంది. కేసు నమోదు చేసి, తనకు న్యాయం చేయాలనే డిమాండుతో సునీత నిరాహార దీక్షకు దిగి, గురువారం ఉదయం నుంచీ స్టేషన్ బయటనే బైఠాయించింది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది చెప్పారని, తాను వెళ్లకపోవడంతో వారు తనను బలవంతంగా స్టేషన్లోకి లాక్కెళ్లారని చెప్పింది. చంటిబిడ్డతో ఉన్న తనను తీవ్రంగా బెదిరించారని, తన ఫోన్ బలవంతంగా లాక్కున్నారని ఆరోపించింది. తనను లాక్కెళ్లే క్రమంలో బిడ్డకు దెబ్బలు తగులుతున్నా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారని, కనీసం తనను వాష్ రూముకు కూడా పంపకుండా చిత్రహింసలకు గురి చేశారని సునీత చెప్పింది. తాను, తన బిడ్డ ఉదయం నుంచీ ఆహారం ముట్టుకోలేదని, తన బిడ్డ నీరసించి తల వెనక్కి వాల్చేస్తే భయపడి గట్టిగా ఏడ్చానని, బాబు పరిస్థితి చూసిన పోలీసులు అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నామంటూ హడావుడి చేశారని తెలిపింది. తాను అక్కడి నుంచి బలవంతంగా బయటపడి తన బిడ్డను ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లానని సునీత చెప్పింది. కాగా, గురువారం రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేసే సమయానికి సునీత తన బిడ్డతో స్టేషన్ నుంచి వెళ్లిపోయిందని పోలీసులు చెప్పారు. -
నేత కార్మికులకిచ్చిన హామీలు అమలు చేయాలి
● రూ.170 కోట్ల బకాయిలు చెల్లించాలి ● ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ నేత డిమాండ్ పిఠాపురం: నేత కార్మికులకిచ్చిన ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు పప్పు దుర్గా రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫెడరేషన్, చేనేత సహకార సంఘాల జేఏసీ ఆధ్వర్యాన పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆప్కో ద్వారా గత ఆరేళ్ల నుంచి కొన్ని చేనేత సహకార సంఘాలకు, 12 సంవత్సరాల నుంచి మరికొన్నింటికి రావాల్సిన సుమారు రూ.170 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో నిలిచిపోయిన త్రిఫ్ట్ ఫండ్, నూలు సబ్సిడీ, 30 శాతం రిబేటు బకాయిలను కూడా చెల్లించాలని కోరారు. చేనేత సహకార సంఘాల నుంచి వస్త్రాల కొనుగోలును కొనసాగించాలని, పావలా వడ్డీ రుణ పథకం వెంటనే ప్రారంభించాలని, చేనేతలకు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.25 వేల నేతన్న భరోసా పథకాలను వెంటనే అమలు చేయాలని దుర్గా రమేష్ డిమాండ్ చేశారు. న్యాయపరమైన అడ్డంకులను తొలగించి, చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని వివిధ సంఘాల నాయకులు కోరారు. బోగస్ చేనేత సొసైటీలపై విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలన్నారు. సంక్రాంతిలోగా వంద శాతం బకాయిలను ఆప్కో చెల్లించకుంటే చేనేత సహకార సంఘాలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 18 చేనేత కుల సంఘాలతో కలిపి రిలే నిరాహార దీక్షలు చేపడతామని, అవసరమైతే ఆమరణ దీక్ష నిర్వహించేలా కార్యాచరణ రూపొందించామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చేనేతలకు, ప్రభుత్వానికి మధ్య అడ్డంకిగా మారిన హ్యాండ్లూమ్ కమిషనర్, ఆప్కో ఎండీ రేఖారాణిని వేరే శాఖకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు, విలేకర్ల సమావేశంలో సీనియర్ చేనేత నాయకుడు కోమాకుల సత్యనారాయణ, చేనేత సహకార సంఘాల సీనియర్ నాయకుడు పడాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
కోఢీ.. రెడీ!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సంక్రాంతి సంబరాలకు సమయం సమీపిస్తూండటంతో రూ.కోట్లు కొల్లగొట్టే కోడి పందేలకు నిర్వాహకులు ఇప్పటి నుంచే కాలు దువ్వుతున్నారు. బరుల కోసం ఇప్పటికే వెతుకులాట ప్రారంభించారు. ఎక్కడెక్కడ బరులు ఏర్పాటు చేయాలి, పందేల నిర్వహణకు సంబంధించి ఎవరెవరికి ఎంతెంత ముట్టచెప్పాలనే దానిపై అంచనాలు వేసుకోవడంలో తలమునకలవుతున్నారు. బేరసారాలకు తలుపులు బార్లా తెరిచారు. ప్రతి ఏడాది మాదిరిగానే కోడి పందేలు వేస్తే తోలు తీస్తామంటూ పోలీసులు భీకర హెచ్చరికలు చేస్తున్నా.. వాటిని నిర్వాహకులు షరా మామూలుగానే తేలికగా తీసుకుంటున్నారు. గత ఏడాది కంటే రెట్టింపు బరులు వేయాలనే పట్టుదలతో పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మూడు పుంజులు.. ఆరు పందేలు ఏటా సంక్రాంతి పండగ వస్తోందంటే చాలు.. జిల్లాలోని జగ్గంపేట, గోకవరం, గండేపల్లి, తుని రూరల్, తొండంగి, పిఠాపురం, గొల్లప్రోలు, కాకినాడ రూరల్, కరప మండలాల్లో కోడి పందేలు యమ జోరుగా సాగుతూంటాయి. కోడి పందేల ముసుగులో గుండాట, నంబర్ లాటరీలకు కూడా ఈ మండలాలు పెట్టింది పేరుగా నిలుస్తున్నాయి. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కాక కాకినాడ సిటీ, రూరల్ సహా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ గంజాయి, పేకాట, సింగిల్ నంబర్ లాటరీలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే సంక్రాంతి పండగ నాటికి కోడి పందేలు నిర్వహించి తీరుతామని ఇప్పటికే నిర్వాహకులు చాలెంజ్లు చేస్తున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో ‘మూడు పుంజులు.. ఆరు పందేలు’ అనే రీతిలో కోడిపందేలు నిర్వహించడం ఖాయమని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. పండగ పూట కోడికి కత్తి కట్టకుండా సరదాగా పందేలు వేసుకుంటే ఎటువంటి అభ్యంతరం ఉండదని, కత్తి కడితే మాత్రం పందేలను అడ్డుకుని తీరుతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఇప్పుడలానే అంటారని, పండగ దగ్గర చేసి ఈ మాటలేవీ చెల్లవని, ఏమైనా తేడా వస్తే తమ నాయకులే చూసుకుంటారని పందేల నిర్వాహకులు అంటున్నారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో పోలీసులతో సైతం బేరసారాల్లో మునిగితేలుతున్నారు. రోజుకు రూ.30 లక్షల మేర.. జిల్లాలో ఈసారి ప్రధానంగా కాకినాడ రూరల్, జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాలు కోడి పందేలకు కేరాఫ్గా నిలవనున్నాయి. ప్రతి బరిలో రోజుకు ఐదారు పెద్ద పందేలు, రెండు మూడు కొసరు పందేలు వేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో బరిలో రోజుకు తక్కువలో తక్కువ రూ.30 లక్షల విలువైన కోడి పందేలు నిర్వహించాలని భావిస్తున్నారు. దీనికి ఎంత ఖర్చవుతుంది, ఎంత మిగులుతుందనే లెక్కలేస్తున్నారు. కాకినాడ రూరల్, కరప మండలాల్లో ఈసారి జనసేన గ్రామ స్థాయి నేతలు గ్రామాల వారీగా బరులు వేసే ఏర్పాట్లలో ఉన్నారు. గత ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ మండలంలో విచ్చలవిడిగా జరిగిన పందేల్లో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. ఈసారి కూడా ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ లేకుండా పార్టీ నియోజకవర్గ ముఖ్య నేత మాట తీసుకుని మరీ నిర్వాహకులు ముందడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులతో ద్వితీయ శ్రేణి నేతలు ముందస్తు మంతనాలు సాగిస్తున్నారు. జరిగే పందేలను బట్టి బరులకు రేట్లు నిర్ధారించాలనే నిర్ణయానికి వచ్చారు. ముఖ్య నేతల కనుసన్నల్లో.. నిర్వాహకులు మారుతున్నారే తప్ప పందేలు మాత్రం ఎప్పటి మాదిరిగానే జరిపే ఏర్పాట్లలో ఉన్నారు. ఉదాహరణకు మండల కేంద్రమైన కరప, గురజనాపల్లి, గొర్రిపూడి, కొంగోడు, విజయరాయుడుపాలెం, వేళంగి, వేములవాడ గ్రామాల్లో గత ఏడాది వేసిన భారీ బరుల్లో రూ.లక్షలు చేతులు మారాయి. ఈసారి సంక్రాంతికి వేళంగి, గురజనాపల్లి మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ పందేలకు బరిలు సిద్ధమవుతున్నాయి. గత ఏడాది గురజనాపల్లిలో నష్టం వచ్చిందనే కారణంతో ఈసారి నిర్వహించేందుకు వెనకడుగు వేశారని అంటున్నారు. కరపలో మాత్రం ఈసారి రెండు బరులు వేసేందుకు సిద్ధపడుతున్నారు. ఒక్కో బరిలో గుండాట నిర్వాహకులు రూ.40 లక్షలకు తక్కువ కాకుండా ముట్టజెప్పేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారని చెబుతున్నారు. ఇక్కడ జనసేనలో రెండు వర్గాలు రెండు బరులకు ఏర్పాట్లు చేస్తున్నాయి. కరప – పెనుగుదురు మధ్య ఒక ప్రైవేట్ లే అవుట్లో బరి ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. కాకినాడ రూరల్ తిమ్మాపురం, సర్పవరం ప్రాంతాల్లో సైతం భారీ బరుల ఏర్పాటుకు బేరసారాలు కుదిరాయి. ఒక్కో బరికి రూ.30 లక్షల మేర ఒప్పందానికి వచ్చారని అంటున్నారు. అలాగే, తూరంగి, వాకలపూడి, వలసపాకలు, గొడారిగుంటల్లో ద్వితీయ శ్రేణి బరులు ఏర్పాటు చేసే పనిలో నిర్వాహకులున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ముఖ్య నేతల కనుసన్నల్లోనే బేరసారాలు సాగుతూండటం విశేషం. పందేలకు పుంజులను సిద్ధం చేస్తున్న నిర్వాహకులు (ఫైల్)బరిలో తలపడుతున్న పందెం పుంజులు (ఫైల్) కాలు దువ్వుతున్న పందెం కోడి పందెం బరులకు ముఖ్య నేతల కనుసన్నల్లో ఒప్పందాలు జోరుగా బేరసారాలు బరుల వేటలో పందెంరాయుళ్లు ఆ మూడు నియోజకవర్గాలే కీలకం -
ఐక్యత లేకనే హిందూ మతంపై దాడులు
● రాధామనోహర్ దాస్ ● వాకలపూడిలో హిందూ సమ్మేళనం కాకినాడ రూరల్: హిందువుల్లో ఐక్యత లేకనే హిందూ మతంపై దాడులు జరుగుతున్నాయని ఆధ్యాత్మికవేత్త రాధామనోహర్ దాస్ అన్నారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా వాకలపూడిలో గురువారం ఏర్పాటు చేసిన హిందూ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచంలోని అన్ని మతాల కన్నా హిందూ మతం చాలా గొప్పదని అన్నారు. దేశంలోని వారు మతం మారినంత మాత్రాన మానవత్వం మరచిపోరాదని కోరారు. భారతదేశానికి జన్మించిన పాకిస్థాన్, బంగ్లాదేశ్లు నేడు హిందూ మతానికి వ్యతిరేకంగా యుద్ధాలు చేస్తున్నాయని, వారి పీచం అణచివేయాలని పిలుపునిచ్చారు. హిందూ సంస్కృతీ సంప్రదాయాలను నాశనం చేయాలని చూస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వెయ్యి సంవత్సరాలుగా హిందూ మతంపై అనేక దాడులు జరిగాయని చెప్పారు. ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు దంగేటి సత్యనారాయణ, సాధుల శేషపాన్పు, బిందుశ్రీ తదితరులు కూడా ప్రసంగించారు. తొలుత సాంస్కృతిక కార్యక్రమాలు, వేద మంత్ర పఠనం నిర్వహించారు. కార్యక్రమంలో కాకినాడ హిందూ సమ్మేళన నిర్వహణ సమితి నాయకులు సుబ్రహ్మణ్యం, రామరాజు, అప్పాజీ తదితరులతో పాటు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. -
సత్యదేవుని సన్నిధిలో మహాపచారం
● పూజలో వాడిన పూలతో ఫినాయిల్ తయారీ! ● అన్నవరం దేవస్థానంలో విక్రయాలు ● ఆవేదన చెందుతున్న భక్తులుఅన్నవరం: ‘సంపద సృష్టి’ంచే నేటి పాలకుల హయాంలో ప్రతిదీ వ్యాపార మయమైపోతోంది. దాదాపు అన్ని వ్యవస్థలూ ప్రతి అంశాన్నీ డబ్బుతోనే లెక్కిస్తున్న దురవస్థలో కూరుకుపోతున్నాయి. ఈ క్రమంలో దేవుని సన్నిధిలో అపచారం చేస్తున్నామనే ఆలోచన కూడా వదిలేసినట్లు కనిపిస్తోంది. సాధారణంగా పూజ పూర్తి చేసిన అనంతరం.. ఏ దేవుడు/దేవతను అర్చిస్తున్నారో వారి పేరు స్మరించుకుని, ‘... ప్రసాదం శిరసా గృహ్ణామి’ అని చెప్పుకొంటూ.. ఆ స్వామి/అమ్మవారిని అర్చించిన పూలను భక్తులు భక్తితో కళ్లకు అద్దుకుని, శిరస్సున పెట్టుకుంటారు. ఆ తరువాతో.. ఆ మర్నాడో పూజ చేసి పూలు, పత్రిని (నిర్మాల్యం) ఎవ్వరూ కాలితో తొక్కని చోట వేస్తారు. లేదా నదులు, చెరువుల్లో కలుపుతారు. కానీ, అన్నవరం దేవస్థానంలో మాత్రం దీనికి భిన్నంగా చేస్తున్నారు. ‘నిర్మాల్య పత్రితో’ అని రాసి మరీ.. సత్యదేవుని వ్రతాలు, ఇతర పూజల్లో ఉపయోగించిన పూలు, పత్రి, ఇతర నిర్మాల్యంతో వివిధ రకాల పొడులు, నూనెలు, అగరుబత్తీలు తయారు చేస్తున్నారు. వీటిని భక్తులకు విక్రయించేందుకు దుకాణాలు ఏర్పాటు చేశారు. వీటికి ప్రతి నెలా రూ.50 వేల అద్దె వసూలు చేస్తున్నారు. వీటిల్లో గోమయంతో తయారు విభూతి కూడా విక్రయిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ, ఎవరి ఆలోచనో కానీ.. స్వామివారి నిర్మాల్యంతో ఏకంగా ఫినాయిల్ తయారు చేసేస్తున్నారు. పైగా ఆ బాటిల్పై భక్తవరదుడైన శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఫొటోతో కూడిన లేబుల్ సైతం అతికించేశారు. దానిపై ‘అన్నవరం సత్యనారాయణ స్వామి వారి నిర్మాల్య పత్రితో ఫినాయిల్’ అని స్పష్టంగా రాసి ఉంది. ఈ ఫినాయిల్ లీటర్ బాటిల్ను రూ.100కు విక్రయిస్తున్నారు. ఈ దుకాణాన్ని బుధవారం ప్రారంభించారు. అయితే, ఫినాయిల్ బాటిల్పై స్వామివారి ఫొటో ఉన్న లేబుల్ అతికించడంపై కొంతమంది భక్తులు అభ్యంతరం చెప్పారు. దీంతో, ఆ ఫొటోపై ‘ద్వారకా తిరుమల’ అనే స్టిక్కర్ అతికించి విక్రయిస్తున్నారు. సాధారణంగా ఫినాయిల్ను టాయిలెట్స్ కడగడానికి ఉపయోగిస్తారు. అటువంటి ఫినాయిల్ను దేవుని నిర్మాల్యంతో తయారు చేయడమేమిటో.. దానిని విక్రయించడానికి అనుమతించడమేమిటో.. ఇదేమి అపచారమోనని భక్తులు ఆవేదన చెందుతున్నారు. గతంలోనూ అపచారాలు అన్నవరం దేవస్థానంలో అధికారులు మారినా అపచారాలు మాత్రం జరిగిపోతూనే ఉన్నాయి. ఈఓలతో సంబంధం లేకుండా కింది స్థాయి అధికారులు చేపడుతున్న చర్యలు వివాదాస్పదమవుతున్నాయి. గత ఈఓ వీర్ల సుబ్బారావు హయాంలో రత్నగిరిపై రామాలయం పక్కన స్వామివారి వార్షిక కల్యాణ మండపం ఎదురుగా ఉన్న షెడ్డులో వివాహం కోసం పెద్ద కల్యాణ మండపం సెట్టింగ్ వేశారు. అదే రోజు వార్షిక కల్యాణ మండపంలో జరిగిన సూర్య నమస్కారాలను తిలకించడానికి ఈ సెట్టింగ్ అడ్డంగా ఉందంటూ అప్పట్లో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, గత మే నెలలో సత్యదేవుని వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాల సందర్భంగా వనదుర్గ అమ్మవారికి శుక్రవారం జరిగే చండీ హోమం, పౌర్ణమి నాడు జరిగే ప్రత్యంగిర హోమాలు చేయలేదు. అంతకు ముందెన్నడూ ఇలా జరగకపోవడంతో దీనిని అపచారమనే భక్తులు భావించారు. తాజాగా స్వామివారి నిర్మాల్యంతో తయారు చేసిన ఫినాయిల్ విక్రయించడం పెద్ద అపచారంగా చెప్పవచ్చు. అటువంటివి విక్రయించనీయం దేవస్థానంలోని పూజలు, వ్రతాల్లో వచ్చిన నిర్మాల్యం, పత్రితో తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి గతంలో ఈఓ అనుమతి ఇచ్చారు. ఆ షాపు బుధవారమే ప్రారంభించారు. అందులో ఏయే ఉత్పత్తులు విక్రయిస్తున్నారో ఇంకా పరిశీలించలేదు. భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా, దేవస్థానం పవిత్రతకు భంగం వాటిల్లేలా ఉండే వస్తువులను ఇక్కడ విక్రయించనీయం. ఆ షాపు అగ్రిమెంట్ను శుక్రవారం పరిశీలించి, తగు చర్యలు తీసుకుంటాం. – వి.త్రినాథరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం -
హైటెక్ దాసులు
ఉప్పలగుప్తం: ధనుర్మాసం వస్తూనే వేకువ జామునే శిరస్సున అక్షయ పాత్ర.. మెడలో చామంతుల మాల.. ఓ చేతిన చిడతలు.. మరో చేతిన తంబుర.. పాదాలకు మంజీరాలు.. నోట సుస్వర హరినామ సంకీర్తనలు.. పెద్దపెద్ద అంగలతో ఇంటింటికీ తిరిగి వారిచ్చిన స్వయంపాకాన్ని స్వీకరించి నమస్కరించినవారిని దీవించి వడివడిగా ముందుకు సాగే హరిదాసు ఓ నాటి దృశ్యకావ్యం. తెలుగువారి సంస్కృతిని తరతరాలుగా కొనసాగిస్తూ.. మారిన కాలంతో పోటీ పడి తానూ మారుతూ వాహనధారియై.. దాని హెడ్లైట్పై అక్షయ పాత్ర.. హ్యాండిల్కి మైక్.. దాని నుంచి హరినామ సంకీర్తనలు.. ఇదీ ఆధునిక హరిదాసు జీవన చిత్రం. మున్ముందు ఇంకెంత ఆధునీకత సంతరించుకుంటారో చూడాలి మరి. వీరికీ ఓ ఘన చరిత్ర.. కఠోర దీక్ష.. సంప్రదాయాన్ని ముందు తరాలకు తీసుకువెళ్లాలనే అంకితభావం ఉండడం చెప్పుకోదగ్గ విషయం. వైష్ణవులలో ఓ వర్గం నియమ నిబద్ధతలతో కూడిన మహావిష్ణు దీక్షను భక్తితో స్వీకరిస్తారు. కృష్ణ బలిజలు, శాతానాలు, వైష్ణవులు, దాసరులు పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారాన్ని కాపాడటానికి అవలంబించే 41 రోజుల కఠోర దీక్ష ఇది. ఈ దీక్షలను కార్తికం, ధనుర్మాసం, మాఘమాసాల్లో సంబంధిత గురువుల వద్ద స్వీకరిస్తారు. ఈ హరిదాసు దీక్షలకు సంబంధించి భద్రాచలంలో ప్రత్యేక శిక్షణ క్షేత్రం ఉంది. దీక్ష ఆరంభం నుంచి విరామం వరకూ వారి తమ పూర్వీకులు తిరిగిన గ్రామాల్లో పీఠం పెట్టుకుని భక్తిశ్రద్ధలతో కుటుంబాలకు దూరంగా ఉంటూ ఇల్లిల్లూ హరి నామ కీర్తన చేసుకుంటూ భిక్షాటన చేస్తారు. కటిక నేలపై పడుకుని నిత్యం ఉదయం, సాయంత్రం తల స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసుకుని అక్షయపాత్రకు అభిషేకం చేస్తారు. గ్రామాల్లో తిరుగుతూ సాయంత్రానికి పీఠం వద్దకు చేరుకుంటారు. ఉదయం వేళ అల్పాహారం తీసుకుంటూ సాయంత్రం ఒంటిపూట భోజనం చేస్తుంటారు. నెత్తిన అక్షయపాత్ర పెట్టుకుంటే అది దింపే వరకూ దైవ సంకీర్తన తప్ప వేరే మాట నోటి నుంచి రాకూడదన్నది నియమం. దీక్షాకాలం అనంతరం విష్ణు, శివాలయాల్లో దీక్షను విరమిస్తారు. దీక్షలో స్వీకరించిన భిక్షను తమ అవసరాలకు కొంత మిగుల్చుకుని భధ్రాచలం రాముల వారి కల్యాణంలో జరిగే అన్నదానానికి పంపిస్తారు. సాధారణ సమయంలో ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి వృత్తులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటారు. ఇంత కఠిన దీక్షను నేటి తరం ఆచరించే శారీరక సామర్థ్యం లేక ఆధునిక వసతులను వినియోగించుకుంటూ సంస్కృతిని ముందు తరాలకు అందజేస్తున్నారు. ఈ పయనంలో భాగంగా మోటారు సైకిళ్లను వారి ఆహార్యానికి అనుగుణంగా మార్పులు చేసుకుని చకచకా సాగిపోతున్నారు. వీరు సుమారు 4, 5 గ్రామాలను ఎంపిక చేసుకుంటారు. ఈ గ్రామాల్లో సంచరిస్తే వచ్చేది రోజకు కేవలం నాలుగైదు కుంచాల బియ్యం మాత్రమే. ప్రస్తుతం మోటారు సైకిల్పై తిరగటంతో దాని ఇంధనంతో పాటు ఇతర ఖర్చులకు 3 నుంచి 4 వందలు ఖర్చవుతుంది. ఇంతటి పురాతన సంస్కృతిని ముందు తరాలకు అందిస్తున్న ఈ వృత్తి కళాకారులకు ప్రభుత్వాల పరంగా ఎటువంటి గుర్తింపూ లేకపోవడం గమనార్హం. కొంతమంది దృష్టిలో వీరు భక్తులా, లేక ఒక వృత్తినే నమ్ముకున్న వారా అనే సందేహాలు కొంతమంది వ్యక్తం చేస్తుంటారు. కృష్ణ బలిజలు, శాతానాలు, వైష్ణవులు, దాసరి సామాజిక వర్గాలకు చెందిన వీరు బిసీ–డీ కేటగిరీగా పరిగణించబడుతున్నారు. వీరు ఎక్కువగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో, కృష్ణ, అనకాపల్లి జిల్లాలో నివసిస్తుంటారు. వీరికి రిజర్వేషన్ కోటాలో తక్కువగా ప్రాధాన్యత ఉండి వారి పిల్లలు విద్యారంగంలో అవకాశాలు కోల్పోతున్నప్పటికీ బీసీ–ఏ గా మార్చాలని ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తూ వారి గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన మాజీ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో వారిని బీసీ–ఏగా మార్చడానికి సన్నాహాలు చేసినప్పటికీ కొందరి అభ్యంతరాలతో పిటిషన్లు పెట్టి అడ్డుకున్నారని ఆ సామాజిక వర్గాల వారు ఆవేదన చేస్తున్నారు. మారుతున్న కాలంతో మున్ముందుకు సంస్కృతిని, వారసత్వాన్ని కొనసాగిస్తున్న వైనం ఆదాయాన్ని వదులుకుని ఆచారానికి పెద్దపీట ఎంతటి వారైనా గజ్జెకట్టి అక్షయ పాత్ర పట్టాల్సిందే భక్తి శ్రద్ధలతో.. హరినామ సంకీర్తనతో కఠోర దీక్ష -
నాన్న ఆదేశాలతో దీక్ష స్వీకరించా
నాపేరు అన్యం రాంబాబు. మాది కోనసీమ జిల్లా కె.గంగవరం మండలంలోని అముజూరు గ్రామం. నేను డిగ్రీ వరకూ చదువుకున్నాను. ప్రస్తుతం బట్టల వ్యాపారం చేస్తున్నాను. మా ముత్తాత, మాతాత, మానాన్న ఈ దీక్ష స్వీకరించి కొన్ని గ్రామాల్లో సంచరించారు. మా నాన్నకు మోకాళ్ల గుజ్జు అరిగిపోయి ఆరోగ్యం క్షీణించింది. అందుకే వారసత్వం, సాంప్రదాయం కాపాడటానికి ఆయన ఆదేశాలతో ఈ దీక్షను స్వీకరించి నేను మోటారు సైకిల్పై కొనసాగిస్తున్నాను. మా ఈ ఆచారంలో చాలా ఉన్నతమైన ఉద్యోగం చేసుకునే వారు సైతం వారి అవకాశాన్ని బట్టి కనీసం రెండు రోజులైనా ఈ దీక్షను స్వీకరిస్తారు. రేపటి తరంలో నా కుమారుడు సైతం ఏ హోదాలో ఉన్న మా పూర్వీకులు తిరిగిన ప్రాంతాల్లో ఈ దీక్షను ఆచరించాలి. నేను కార్తికమాసంలో దీక్షను తీసుకున్నాను. సుబ్రహ్మణ్య షష్టికి దీక్షను విరమిస్తాను. -
పాటల పల్లకిలో లెక్కల పాఠాలు
● వినూత్న బోధనతో ఆకట్టుకుంటున్న మా‘స్టార్’ ● రాగాలాపనతో చిక్కుముడులకు విడుపులు ● వి.సావరంలో నాగేశ్వరరావు ప్రతిభ రాయవరం: విద్యార్థికి అర్థమయ్యేలా బోధించడమే గురువు పరమ కర్తవ్యం. అందుకు ఒక్కొక్కరిది ఒక్కో శైలి. రాయవరం మండలం వి.సావరం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు పి.నాగేశ్వరరావు శైలి విభిన్నం. పాటతో గణితంలో పీటముడులు విప్పించడం ఆయన ప్రత్యేకత. రాష్ట్ర ఉన్నతాధికారులను సైతం ఆకట్టుకున్న ఆయన శైలిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం గణితం గజిబిజి కాదంటూ గణితంలో కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలపై విద్యార్థులు గజిబిజి అవుతుంటారు. వారు అలా అవస్థ పడకుండా ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు ప్రతి పాఠాన్ని పేరడీ పాటలతో బోధిస్తూ లెక్కను సులువు చేస్తున్నారాయన. రోజా చిత్రంలోని పరువం వానగా.. అన్న పాటను రియల్ నంబర్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ రేషనల్ ఇర్రేషనల్ నంబర్గా పాడారు. అలాగే చిన్నారి తల్లి.. చిన్నారి తల్లి అనే పాటను సైన్ ఏ ఫ్లస్ బి ఈజ్ అంటూ పేరడీగా పాడారు. ఇలా ప్రతి గణిత పాఠానికి పేరడీ పాటలు సృష్టించి పిల్లల నోళ్లలో నానుతున్నారు. సోషల్ మీడియాలోనూ సోషల్ మీడియా ద్వారా కూడా నాగేశ్వరరావు తనదైన శైలిలో బోధిస్తున్నారు. ప్రత్యేకంగా ‘పాలెపు నాగేశ్వరరావు’ పేరుతో యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసి, దాని ద్వారా గణితం బోధిస్తున్నారు. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్ట్రాగామ్ల ద్వారా తన గణిత పాఠాలను అప్లోడ్ చేసి బోధిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు కోట్ల మంది వీక్షకులు చూసినట్లు నాగేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటి వరకు 72 వేల మంది ఇన్స్ర్ట్రాగామ్లో సభ్యులుగా ఉన్నారన్నారు. అలాగే తెలుగు సబ్జెక్టులో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న పద్య రత్నాల్లో 50 పద్యాలను తనదైన శైలిలో గానం చేసి ఆకట్టుకున్నారు. ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు సంబంధించి ఇంటర్ పాఠ్యాంశాలపై చేసిన పేరడీలకు ఇన్స్టాలో 50 లక్షల వీక్షణలు రావడం గమనార్హం. ఉన్నతాధికారుల నుంచి పిలుపు సోషల్ మీడియా ద్వారా గణితాన్ని సులువుగా బోధిస్తున్న తీరును గుర్తించిన సమగ్ర శిక్షా రాష్ట్ర ఉన్నతాధికారులు నాగేశ్వరరావును ప్రత్యేకంగా విజయవాడకు ఆహ్వానించారు. రాష్ట్ర వ్యాప్తంగా విన్నూత్నంగా బోధిస్తున్న 41 మందిని బెస్ట్ ప్రాక్టీసెస్ వర్క్షాప్కు ఆహ్వానించగా, జిల్లాలోని మండపేట మండలం నుంచి అమలదాసు కావేరి, ఆలమూరు మండలం చింతలూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నుంచి వి.వెంకటేశ్వరరావు, రాయవరం మండలం వెదురుపాక నుంచి పి.నాగేశ్వరరావు ఉన్నారు. వర్క్షాప్లో నాగేశ్వరరావు కృషిని అభినందించి, ప్రశంసాపత్రాన్ని, వీడియోలు షూట్ చేయడానికి అవసరమైన పరికరాలను సమగ్ర శిక్షా రాష్ట్ర ఎస్పీడీ శ్రీనివాసరావు అందజేశారు. -
కాకినాడలో నటి మీనాక్షి సందడి
లక్కీ సిగ్నేచర్ మాల్ ప్రారంభం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో విక్టరీ వెంకటేష్ సరసన నటించిన నటి మీనాక్షి చౌదరి నగరంలో సందడి చేశారు. కాకినాడ మెయిన్రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన లక్కీ సిగ్నేచర్ ఫ్యామిలీ షోరూంను ఆమె గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రేక్షకులను తన అభివాదాలు ముద్దు ముద్దు మాటలతో ముంచెత్తారు. పూర్తిగా మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ షోరూమ్కు అందరి శుభాశీస్సులు అందించాలని మీనాక్షి కోరారు. మహిళల కోసం చీరలు, గాగ్రాలు, లెహంగాలు, ఎన్నో రకాలను అందుబాటు ధరలో అందిస్తోందన్నారు. ఆమెను చూసేందుకు హాజరైన ప్రజలు ఎగబడ్డారు. దీంతో పోలీసులు ట్రాఫిక్ మళ్లించారు. షోరూమ్ అంతా తిరిగి రకరకాల చీరలను ఆమె తిలకించగా వాటి వివరాలను సిబ్బంది ఆమెకు వివరించారు. షోరూం అధినేతలు రత్తయ్య, శ్రీను, స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో ఫ్యామిలీ కనెక్షన్ల్లో తిరుగులేని ఆదరణ పొందుతున్న లక్కీషాపింగ్ మాల్ను కాకినాడలో ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి కొండబాబు పాల్గొన్నారు. -
మెట్ల పైనుంచి పడి కళాకారిణి మృతి
ముసలమ్మతల్లి ఉత్సవ ప్రారంభంలో అపశృతి రాజోలు: పొట్టకూటి కోసం ఉత్సవాల్లో వేషధారణలు వేసి భక్తులను ఆనందింపజేసే కళాకారిణి ప్రమాదవశాత్తు భవనం మెట్లపై నుంచి జారిపడి మృతి చెందింది. ఈ ప్రమాదంలో రాజమహేంద్రవరానికి చెందిన పాలపర్తి భవ్యశ్రీ (17) ప్రాణాలు కోల్పోయింది. రాజోలు మండలం శివకోటి ములసమ్మతల్లి ఉత్సవాల ప్రారంభంలో ఈ అపశృతి చోటుచేసుకుంది. గురువారం శివకోటి ముసలమ్మతల్లి అమ్మవారి ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం నుంచి పలువురు కళాకారులు శివకోటి చేరుకున్నారు. వీరంతా వేషధారణల కోసం ఆలయానికి ఎదురుగా ఉన్న మూడు అంతస్తుల కల్యాణ మండప భవనంలోనికి వెళ్లారు. ఈ క్రమంలో తెల్లవారుజామున భవ్యశ్రీ ప్రమాదవశాత్తు కల్యాణ మండపం మెట్లపై నుంచి జారిపడి తలకు బలమైన గాయమైంది. ఆమెను హుటాహుటీన రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సహ కళాకారిణి మృతిపై సహచరులు, మృతురాలి తల్లి చినపాప ఆస్పత్రి వద్ద రోదించిన తీరు కంటతడి పెట్టించింది. యువతి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజేష్కుమార్ తెలిపారు. యువతి మృతదేహానికి రాజోలు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించారు. అసంపూర్తి భవనంలో బసపై అగ్రహం అసంపూర్తిగా నిర్మించిన కల్యాణమండపంలో కళాకారులకు బస ఏర్పాటు చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనం మెట్లకు రెయిలింగ్ లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఉత్సవ కమిటీ నిర్లక్ష్యం వల్లే కళాకారిణి మృతి చెందిందని వారు వాపోయారు. సగరుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వావి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఉన్న సగర కులస్తులకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించడంతో పాటు, ఒక ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సగర సంఘం అధ్యక్షుడు గుర్రం మహాలక్ష్మి డిమాండ్ చేశారు. స్థానిక సూర్యకళా మందిరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సగర సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం గురువారం ఘనంగా జరిగింది. సంఘం గౌరవ అధ్యక్షుడిగా ములికి సత్యనారాయణ, అధ్యక్షుడిగా కుర్ర మహాలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్గా నక్క కిశోర్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా తన్నాటి అప్పలస్వామి డిప్యూటీ ప్రధాన కార్యదర్శులుగా నక్క వీర వెంకట్రావు, శ్రీను, కోశాధికారి తంగెళ్ల అప్పారావుతో పాటు 151 మంది ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యవర్గాన్ని సభ్యులు సత్కరించారు. కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ సగరులు కలిసికట్టుగా ఉంటే అనుకున్నది సాధించవచ్చునన్నారు. త్వరలోనే కత్తిపూడి నుంచి కాకినాడ వరకూ భారీ ర్యాలీ నిర్వహించి, సగరుల సత్తా ఏమిటో తెలియజేయాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించాలన్నారు. తొలుత భగీరథుడు చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన సగర కుల నాయకులు పాల్గొన్నారు. -
అనుమానాస్పద మృతిపై విచారణ
కాకినాడ క్రైం: కాకినాడలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. మల్లయ్య అగ్రహారానికి చెందిన కుడుపూడి సత్యనారాయణ(29) ఈ నెల 22న అర్థరాత్రి ఇంట్లో దుప్పటితో ఫ్యాన్కు ఉరి వేసుకుని వేళాడుతూ ఉండడాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. చేతులు వెనక్కి కట్టేసి ఉండడంతో పాటు మరి కొన్ని కారణాల నేపథ్యంలో అనుమానాస్పద మృతిగా కుటుంబసభ్యులు భావించారు. ఈ అంశాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకినాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేయగా, మృతిపై విచారణ కొనసాగుతోందని సీఐ మజ్జి అప్పలనాయుడు తెలిపారు. సత్యనారాయణకు తల్లిదండ్రులు లేరు. బాబాయి, పిన్నే కన్నబిడ్డలా చూసుకుంటున్నారు. పెయింటింగ్ పనిచేసే సత్యనారాయణ కుటుంబసభ్యులతో ఎంతో అన్యోన్యంగా ఉండేవాడు. ఈ నేపథ్యంలో అతడి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
కోకపై పాశుర భాసురాలు!
చీరపై బొమ్మలు వేస్తున్న లీలా పూర్ణిమ అమ్మవారికి సమర్పించిన చీరను ప్రదర్శిస్తున్న లీలా పూర్ణిమ ● బొమ్మలతో కళాత్మకంగా అల్లిక ● ఉపాధ్యాయిని లీలా పూర్ణిమ ప్రతిభ మామిడికుదురు: కళోపాసన ఆ భగవంతుని ప్రసాదం. చేతిలో కళ ఉండాలే కానీ దానిని వ్యక్తపరిచే ప్రతి చర్యలోనూ ఆధ్యాత్మికత నిండి ఉంటుంది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని సందర్భోచితంగా తనలోని కుట్టు కళను అత్యంత సుందరంగా ఆవిష్కరించారు శ్రీఘాకోళపు లీలా పూర్ణిమ. మండలంలోని అప్పనపల్లికి చెందిన ఆమె ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేస్తూ తీరిక సమయంలో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తుంటారు. ధనుర్మాసం సందర్భంగా ఆమె గోదాదేవి తిరుప్పావై పాశురాలను చీరపై అత్యంత సుందరంగా అల్లి ఔరా అనిపించారు. పాశురాలతో పాటు చీరపై గోదాదేవి అమ్మవారి చిత్రం, నెమలి పింఛాలు, వెంకటేశుని నామాలు, వేణువు, కలువ పూలు, శంఖు, చక్రాలను రమణీయంగా కుట్టి తన ప్రతిభను చాటుకున్నారు. పది రోజుల పాటు 30 తిరుప్పావై పాశురాలు, 10 తిరుపుళ్లియ్యెచ్చి (శ్రీరంగనాథుని మేల్కొలుపు శ్లోకం) పాశురాలు, ప్రార్థనా శ్లోకాన్ని చీరపై అల్లారు. 1,493 పదాలను 320 వాక్యాల్లో అల్లినట్టు లీలా పూర్ణిమ తెలిపారు. ఎటువంటి తప్పులు దొర్లకుండా అక్షరాల మధ్య సమతౌల్యం పాటిస్తూ చీరకు ప్రాణం పోసినట్లు అక్షరాలను, బొమ్మలను తీర్చిదిద్దారు. పవిత్రతను చాటాలన్న లక్ష్యంతో.. సంక్రాంతి పండుగలో వచ్చే ధనుర్మాసానికి ఎంతో విశిష్టత ఉంది. దాని పవిత్రతను ప్రతి ఒక్కరికి చాటాలన్న లక్ష్యంతోనే పాశురాలు (శ్లోకాలు) రాశానని లీలా పూర్ణిమ తెలిపారు. నేటి తరం మరిచిపోతున్న లిపి కళను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నదే తన ఆలోచన అని ఆమె చెప్పారు. భక్తి, సంప్రదాయం, సహనం, సృజనాత్మకతకు ప్రతి రూపంగా ఆమె అల్లిన శ్లోకాలు, బొమ్మలతో కూడిన చీరను అప్పనపల్లి బాల బాలాజీ స్వామి వారికి సమర్పించారు. ఆ చీరను అర్చకులు అమ్మవారికి అలంకరించి నిత్యం ‘తిరుప్పావై’ సేవ నిర్వహిస్తున్నారు. -
విరి విలాపం
పెరవలి: మార్కెట్లో పూల ధరలు పతనం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఏడాది మూఢం ముందే రావడంతో శుభ ముహూర్తాలు లేక వినియోగం తగ్గడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీని వల్ల రైతులకు నష్టం వస్తుంటే పూలతోటలపై ఆధారపడిన కూలీలకు పనులు లేక ఉపాధి కరువై విలవిలలాడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు తలమానికంగా ఉన్న కడియం, కాకరపర్రు పూల మార్కెట్లు నేడు కొనుగోలుదారులు లేక కళావిహీనంగా కనిపిస్తున్నాయి. వ్యాపారులకు విక్రయాలు లేక.. దిగుబడి బాగున్నా గిట్టుబాటు ధర లేక.. కూలీలకు ఉపాధి దొరకక.. రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం శుభ ముహూర్తాలు, పండుగలు లేకపోవటం వలన పూల వినియోగం తక్కువగా ఉందని వ్యాపారులు చెప్తున్నారు. 20 రోజుల క్రితం చామంతి కిలో రూ.300, కాగడాలు కిలో రూ.900, కనకాంబరాలు రూ.1200 పలికితే నేడు పూల రకాలు, నాణ్యతను బట్టి కిలో రూ.20 నుంచి రూ.150కి కొనుగోలు చేస్తున్నారని రైతులు చెప్తున్నారు. రైతులు మార్కెట్కు పట్టుకువచ్చిన పూలు రెండు మూడు రోజుల వరకు విక్రయాలు జరగకపోవడంతో వ్యాపారుల దగ్గరే రెండు నుంచి మూడు రోజులు నిల్వ ఉండిపోతున్నాయి. నాలుగు రోజులు దాటితో పూలు వసి వాడిపోయి రోడ్డు పక్కన పాడేయాల్సిన పరిస్థితి నెలకొందని వ్యాపారులు వాపోతున్నారు. వాతావరణం అనుకూలించడంతో పూల దిగుబడి చాలా బాగుందని, మార్కెట్లో పూల ధరలు లేకపోవటం వల్ల వారానికి రెండు కోతలు కోయాల్సిన పూలు నేడు ఒక్కకోతే కోస్తున్నామని రైతులు చెప్తున్నారు. తీరా కోసిన తరువాత కనీసం కూలీల ఖర్చులు కూడ రావడం లేదని, దీంతో కోయకుండానే నష్టపోతున్నామని రైతులు చెప్తున్నారు. పూల రైతులు గ్రామాల బాట బట్టి కిలో పూలు సమయాన్ని బట్టి రూ.30 నుంచి రూ.50కి విక్రయిస్తున్నారు. మార్కెట్లకు పూలను తీసుకువెళ్తుంటే వ్యాపారులు కొనుగోలు చేయడం లేదని.. దీంతో మళ్లీ తామే తమ గ్రామాలకు తీసుకువెళ్లి వచ్చినకాడికి విక్రయిస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పూలసాగు ఇలా.. జిల్లాలో 4897 ఎకరాల్లో పూల సాగు చేస్తుంటే దీనిపై ప్రత్యక్షంగాను, పరోక్షంగాను 15 వేల మంది ఉపాధి పొందుతున్నారు. పూలకు మార్కెట్లో ధరలు పలకకపోవడం వల్ల సగానికి సగం మందికి ఉపాధి కరువైయ్యిందని రైతులు అంటున్నారు. చిరు వ్యాపారులు సైతం కూలి ఖర్చులు రావడం లేదంటున్నారు. పనులు లేక ఇబ్బంది పూల కోతలు, పూల తోటలకు ఎరువులు, పురుగు మందులు కొట్టే కూలీలకు, దండలు కట్టే కూలీలకు, చిరు వ్యాపారాలు చేసే సైకిల్ వ్యాపారులకు పని అంతంతమాత్రంగా లభించడంలో వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. నిత్యం పూలు కోసే కూలీలకు వారానికి ఒక్కరోజు మాత్రమే పనులు లభిస్తుంటే, పూల దండలు కట్టే మహిళలు పనులు లేక అల్లాడిపోతున్నారు. మార్కెట్లో ధరలు ఇలా.. పూల మార్కెట్లో 20 రోజుల వ్యవధిలో ధరలు పరిశీలిస్తే సగానికి సగం పడిపోయాయి. పూల రకం 20 రోజుల ప్రస్తుత క్రితం (రూ.) ధర (రూ.) బంతి పూలు 80 20 చామంతి 300 30-50 గులాబీలు 250 140 లిల్లీ పూలు 300 80 కాగడాలు 900 400 కనకాంబరాలు 1200 600 తోటలోనే మగ్గిపోతున్న పూలు పూలధరలు తగ్గడంతో వాటిని కోయకుండా రైతుల చేలల్లోనే వదలేస్తున్నారు. ఎందుకంటే కోయిస్తే కనీసం కూలీ ఖర్చులు కూడా రావటం లేదని, దీనితో పూల కోసేకంటే వదిలేయడమే మేలని చెప్తున్నారు. నిత్యం పదిమందితో పూలు కోయించే రైతులు నేడు వారానికి ఒక్కసారి మాత్రమే కోయిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు బంతి పూలు ఒక్కకోతకు 10 కూలీలు అవసరం వస్తే వీరికి రోజుకు రూ.350 కూలి ఇవ్వాలి. మార్కెట్లో కిలో పూలు రూ.20 పలుకుతున్నాయి. ఒక్క కోతకు సుమారు 100 కిలోలు కోయిస్తే కూలీలకు రూ.3500, కాఫీ, టిఫిన్లు, సంచులు, రవాణా కలిపి రూ.వెయ్యి ఖర్చు అవుతుంది. దీనితో పూలకు మార్కెట్లో వంద కిలోలకు రూ.రెండు వేలు వస్తే ఖర్చు రూ.4500 అవుతోందని రైతులు చెప్తున్నారు. అందుకే పూలను కోయకుండా వదలివేస్తున్నామని వాపోతున్నారు. అన్ని రకాల పూల సాగు పరిస్థితీ ఇలానే ఉందని రైతులు అంటున్నారు. విరివిగా పూసినా సిరులు అంతంతే ధరలు లేక మందగించిన వ్యాపారాలు గగ్గోలు పెడుతున్న రైతులు పనులు లేక కూలీలు.. ఉపాధి దొరక్క పనివారు విలవిల ‘తూర్పు’న 4897 ఎకరాల్లో పూల సాగు ప్రత్యక్షంగా,‘ పరోక్షంగా 15వేల మందిపై ప్రభావం -
గురువారం శ్రీ 25 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
కరుణామయునికి వందనాలు.. సర్వ మానవాళికి శాంతి.. ప్రేమ.. దయ బోధించిన క్రీస్తు కరుణామయుడు.. చిరస్మరణీయుడు. శాంతిదూత జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా చర్చిలు ముస్తాబయ్యాయి. క్రిస్మస్ను జిల్లా ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. కాకినాడ లాల్బహదూర్నగర్లో విద్యుల్లతల నడుమ దేదీప్యమానంగా సిద్ధమైన షియోను ప్రార్థనా మందిరం -
మూడో పంటకు మంగళం!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఈ సారి రైతులు మూడో పంటకు మంగళం పాడక తప్పని పరిస్థితి. ఖరీఫ్ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చూపించిన ఉదాసీనత రైతులకు శాపమైంది. దెబ్బమీద దెబ్బగా ప్రకృతి కన్నెర్రజేయడంతో తడిసిన ధాన్యాన్ని రబీ రైతులు కళ్లాల్లో ఆరబెట్టుకుని అమ్ముకున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సవాలక్ష సాకులు వెతకడంతో కనీస మద్దతు ధర అందక రైతులు లబోదిబోమంటున్నారు. ఈ పరిణామంతో ఖరీఫ్లో ధాన్యం విక్రయించడానికి రైతులు నానా కష్టాలు పడ్డారు. ఖరీఫ్ చివరిలో వర్షాలు పడడం, పండిన ధాన్యం ఆలస్యంగా కొనుగోలు చేయడంతో రైతులు రబీ పనులు చేసుకునేందుకు అన్నదాత సతమతమవుతున్నాడు. తేమ శాతం వల్ల రైతులు తాము కోసిన వరి పంటను కళ్లాల్లోనే సుమారు 10 నుంచి 15 రోజులు ఉంచేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీని ప్రభావం రబీ సాగు జాప్యానికి కారణమైంది. ఫలితంగా ఈ ఏడాది మూడో పంట అపరాలు వేసే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో రబీ సీజన్లో 1.80 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలనేది జిల్లా వ్యవసాయశాఖ నిర్దేశించిన లక్ష్యం. ముందస్తు ప్రణాళిక ప్రకారం రబీలో నాట్లు డిసెంబరు నెలాఖరుకు పూర్తి చేయాల్సి ఉంటుంది. లక్ష్యాలు నిర్దేశించడంలో చూపుతోన్న శ్రద్ధ వాటిని అధిగమించడంపై పెట్టడం లేదనే పలువురు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. రబీ సీజన్ మొదలై నెల దాటిపోతున్నా ఇంత వరకు కనీసం 20 శాతం వరి నాట్లు కూడా పూర్తి కాలేదు. వాస్తవానికి ఈ నెలాఖరు నాటికే నాట్లు పూర్తి కావాల్సి ఉంది. సాగు నీటి సలహా మండలి సమావేశంలో ఈ ఏడాది రబీ సాగు లక్ష్యాలను నిర్దేశించారు. 2026 మార్చి 31 కల్లా రబీ పంట కాలం పూర్తయ్యేలా నాటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా జిల్లాలో 1.8 లక్షల ఎకరాల్లో వరి సాగుచేయాలనేది లక్ష్యం. కానీ అధికారిక లెక్కల ప్రకారం ఇంతవరకు జిల్లాలో కేవలం 23 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. మిగిలిన 1.6 లక్షల ఎకరాల్లో నెలాఖరు నాటికి పూర్తి కావడం సాధ్యం కాదంటున్నారు. వచ్చే జనవరి మూడో వారానికి కూడా పూర్తికాావడం గగనమే అంటున్నారు. ఎప్పటిలాగే ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశామని వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం గొప్పగా సెలవిస్తున్నారు. ఈ సారి రబీ సన్నాహాలు బాగా ఆలస్యమైపోయాయి. నాట్లు వేసిన దగ్గర నుంచి సుమారు వంద రోజులకు గానీ వరిపంట చేతికి రాదు. రబీ త్వరగా పూర్తయితే మూడో పంటగా రైతులు మినుములు, పెసలు వంటి అపరాలు సాగు చేస్తారు. అపరాలు సాగు అంటేనే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుంది. ఒక ఎకరాలో రైతు పెసలు, మినుములు కానీ సాగుచేస్తే మూడు నుంచి నాలుగు బస్తాలు దిగుబడి వస్తుంది. ఎకరాకు కనీసం రెండు, మూడు బస్తాలు పండినా రైతులకు సుమారు రూ.15 వేలు లాభం వచ్చేది. ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రస్తుత రబీలో అపరాల సాగు దాదాపు లేనట్టే అంటున్నారు. ఖరీఫ్ సీజన్లో చంద్రబాబు ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో కుంటిసాకులతో ఈ ఏడాది రబీ మరింత ఆలస్యమవడమే ఇందుకు కారణం. సుమారు నెల రోజుల పైనే రబీ ఆలస్యం కావడంతో జనవరి నెలాఖరుకు కానీ వరినాట్లు పూర్తి చేసే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం జిల్లాలో కాకినాడ రూరల్, కరప, సామర్లకోట, పెద్దాపురం, గండేపల్లి, జగ్గంపేట తదితర మండలాల్లో ఇప్పుడిప్పుడే దమ్ములు చేస్తున్నారు. రబీ సాగు ఆలస్యం కావడంతో పంట చివర్లో ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీకి నీరు వదిలే సమయంలో గుర్రపు డెక్క తొలగింపు, కాలువల్లో పూడిక తీత పనులంటూ సాగునీరు వదలకుండా నీటిసంఘాల నాయకులు తాత్సారం చేశారు. డిసెంబర్ మూడో వారం నాటికే 70 శాతం రబీనాట్లు పూర్తయ్యేవి. ఈ ఏడాది ప్రభుత్వ నిర్వాకానికి సాగునీరందక రబీ ఆలస్యమవుతోందని రైతులు పేర్కొంటున్నారు. రబీ చివర్లో వరి పంట ఈనిక, పాలు పోసుకునే దశలో నీరందక తప్పతాలు గింజలు మారి, దిగుబడులు తగ్గిపోతాయంటున్నారు. మే నెలలో కూడా రబీ కోతలు పూర్తి కావంటున్నారు. మూడో పంటగా వేసే అపరాలసాగుపై ఆశలు వదులు కోవాల్సిందేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మూడో పంటను పక్కన పెడితే రబీకై నా పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుందో లేదోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్చి నెలాఖరు నాటికి ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. సరిగ్గా అదే సమయంలో మార్చి నెలాఖరున గోదావరి కాలువలు మూసివేస్తారు. ఆయకట్టు శివారున ఉన్న పంట పొలాలకు సాగునీటి ఇబ్బందులు తప్పవన్నది రైతుల వాదన. డిసెంబర్ నెలాఖరు లోగా రబీ వరినాట్లు వేసుకుంటే ఫిబ్రవరి నెలాఖరులోగా పంట చేతికి వచ్చేది. ఇలా క్రమ పద్ధతిలో సాగు జరిగి ఉంటే అపరాలు సాగు చేసుకునే అవకాశం దక్కేదని రైతులు చెబుతున్నారు. సాగు జాప్యంతో మూడో పంటగా అపరాల మాట ఎలా ఉన్నా రబీకి కూడా నీరు అందడం కష్టమవుతుందని రైతులు ఇప్పటి నుంచే దిగులు చెందుతున్నారు. ఏలేరు రైతు కన్నీరు జిల్లాలోని ఏలేరు సాగునీటి వ్యవస్థపై ఆధారపడ్డ 60 వేల ఎకరాల ఆయకట్టు రైతుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. సాగునీటి వ్యవస్థలో లోపాలతో ఏలేరు పరిధిలో పిఠాపురం, గొల్లప్రోలు, ఉప్పాడ కొత్తపల్లి మండలాల్లో అనుకున్న ప్రకారం రబీ సాగు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. డిసెంబర్ 1 నుంచే రబీ సాగుకు నీరు వదిలినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ ఎక్కడా సాగు నీరందిన ఆనవాళ్లు కనిపించడం లేదు. కేవలం కాలువల్లో ఊట నీటిని మోటార్ల ద్వారా తోడుకుని అక్కడక్కడా నారుమళ్లు వేశారు తప్ప కాలువ ద్వారా సాగునీరు అందిన దాఖలాలు ఏలేరు పరీవాహక ప్రాంత ఆయకట్టులో ఎక్కడా కనిపించడం లేదు. ప్రభుత్వ తీరుతో కాలువల ఆధునీకరణ పనులు సక్రమంగా ముందుకు సాగక రబీ సాగుకు ప్రతిబంధకంగా పరిణమించింది. ఏలేరు వంటి ప్రధాన ప్రాజెక్టుకు ఆధునీకరణ పనులు చేపట్టకపోవడంతో రైతులు ఏటా నష్టపోతూనే ఉన్నా సర్కార్ పట్టించుకోవడం లేదు. గడచిన రెండు సీజన్లుగా ఇదే పునరావృతమవుతోంది. అందుకే వెదజల్లు విధానంలో రబీలో ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. తుపాన్తో ఆలస్యం ఖరీఫ్ సాగు నుంచి వర్షాలు కురియడంతో వరి నాట్లు మునిగిపోయి రెండు పర్యాయాలు నాట్లు వేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. పంట చేతికి వచ్చే సమయంతో మోంథా తుపాను పంటను ముంచేసింది. అదే సమయంలో గ్రామం లోని ఏలేరు కాలువలో ఉన్న కాజ్వే కొట్టుకుపోవడంతో పంట రవాణాకు అవకాశం లేని పరిస్థితిలో ప్రభుత్వం నుంచి కాజ్వే నిర్మాణానికి సహకారం లభించలేదు. దాంతో దాత సహకారంతో కాజ్వేను పూర్తి చేసి కోతలు చేసుకున్నాం. దీని వల్ల రబీకి ఆలస్యం అవుతోంది. జనవరిలో పండగ వెళ్లిన తరువాత వరినాట్లు వేస్తాం. గ్రామంలో 30 శాతం మంది నాట్లు వేస్తున్నారు. – ఇంటి వెంకట్రావు, రైతు, వీకే రాయపురం ఆలస్యంగా రబీ సాగు ఈ నెలాఖరు తుది గడువైనా మూడో వారానికీ 20 శాతమే పూర్తి 1.8 లక్షల ఎకరాల సాగు లక్ష్యం 23 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు -
నేతి చమురు వదిలిపోయేలా..
అన్నవరం: సత్యదేవునికి ‘నేతి’ చమురు భారీగానే వదిలిపోనుంది. స్వామివారి ప్రసాదం తయారీకి అవసరమైన ఆవు నేతిని ఇప్పటి వరకూ కొటేషన్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే నెల నుంచి టెండర్ ద్వారా నెయ్యి కొనుగోలు చేయనున్నారు. ఈ మేరకు ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా నెయ్యి కొనుగోలుకు గత నెల 30న దేవస్థానం అధికారులు టెండర్లు పిలిచారు. ఇందులో సంగం డెయిరీ (గుంటూరు), విజయా డెయిరీ (విజయవాడ) టెండర్లో పాల్గొని టెక్నికల్ బిడ్కు అర్హత సాధించాయి. ప్రైస్ బిడ్ మంగళవారం తెరవగా.. సంగం డెయిరీ కిలో రూ.639.90కి, విజయా డెయిరీ కేజీ రూ.660కి కోట్ చేశాయి. దీంతో, అతి తక్కువ ధర కోట్ చేసిన సంగం డెయిరీ ఈ టెండర్ను దక్కించుకుంది. ఈ డెయిరీ జనవరి 1 తేదీ నుంచి జూన్ 30 వరకూ ఆరు నెలల పాటు అన్నవరం దేవస్థానానికి ఆవు నెయ్యి సరఫరా చేయాల్సి ఉంటుంది. కిలోకు రూ.50 అధికం గత ప్రభుత్వ హయాంలో టెండర్ పిలిచి నెయ్యి కొనుగోలు చేసేవారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి వరకూ ఉన్న టెండర్లను రద్దు చేసి సహకార డెయిరీల నుంచి కొటేషన్లు పిలిచి నెయ్యి కొనుగోలు చేయాలని ఆదేశించింది. ఆ మేరకు సంగం, విజయా డైరీల నుంచి కిలో సుమారు రూ.590కి కొంటున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి టెండర్లు పిలిచి ఆవు నెయ్యి కొనుగోలు చేయాలని గత ఆగస్టులో కమిషనర్ ఆదేశించారు. అయినప్పటికీ నవంబర్ వరకూ కొటేషన్ ద్వారానే కొనుగోలు చేశారు. దీనిపై దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లు అప్పటి ఈఓ వీర్ల సుబ్బారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే టెండర్ పిలిచి కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు టెండర్ పిలవగా దీనిని సంగం డెయిరీ దక్కించుకుంది. సత్యదేవుని ప్రసాదం తయారీకి ప్రతి నెలా 18 వేల నుంచి 20 వేల కిలోల వరకూ నెయ్యి ఉపయోగిస్తారు. ఇప్పుడు టెండర్ దక్కించుకున్న సంగం డెయిరీ జనవరి 1 నుంచి జూన్ 30 వరకూ సుమారు 1.10 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయాలి. కిలో రూ.639.90 చొప్పున నేతి కొనుగోలుకు సుమారు రూ.7.04 కోట్ల మేర దేవస్థానం సంగం డెయిరీకి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కొటేషన్పై కొనుగోలు చేస్తున్న దానికన్నా సంగం డెయిరీ రూ.50 ఎక్కువకు కోట్ చేయడం గమనార్హం. దీని ప్రకారం 1.10 లక్షల కిలోల నేతికి దేవస్థానం అదనంగా రూ.55 లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ ‘సంగం’కే ఆవునేతి టెండర్ ఫ కిలో రూ.639.90కి కోట్ చేసిన డెయిరీ ఫ ఇప్పటి వరకూ కొటేషన్ ద్వారా కిలో రూ.590కే కొనుగోలు ఫ ప్రస్తుతం 6 నెలలకు రూ.7.04 కోట్ల వ్యయం ఫ తాజా ధరతో 6 నెలలకు రూ.55 లక్షల భారం -
ఈ కుర్చీకో దండం
అన్నవరం: ఒకప్పుడు అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి(ఈఓ)గా పని చేయడానికి దేవదాయ శాఖ అధికారులు పోటీ పడేవారు. ఈ కుర్చీ కోసం ప్రజాప్రతినిధులతో పెద్ద ఎత్తున సిఫారసులు చేయించుకునేవారు. కానీ, నేడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఈఓ కుర్చీ అంటే.. వద్దు బాబోయ్.. దీనికో దండమని అంటున్నారు. ఏడాది కాలంగా దేవస్థానంలో నెలకొన్న పరిస్థితులు, పరిపాలనలో మితిమీరిన రాజకీయ జోక్యంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఇన్చార్జి ఈఓగా బాధ్యతలు చేపట్టిన వి.త్రినాథరావు సైతం తనను ఈ బాధ్యతల నుంచి తప్పించాలంటూ సంబంధిత శాఖ మంత్రిని వేడుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అదే కనుక నిజమైతే రత్నగిరిపై పరిస్థితి ఎంతలా దిగజారిపోయిందో చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరం లేదు. ప్రస్తుతం రాజకీయ జోక్యం చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత దేవస్థానం ఈఓగా దేవదాయ శాఖ అధికారుల స్థానంలో గ్రూప్–1 అధికారి, డిప్యూటీ కలెక్టర్ వీర్ల సుబ్బారావును గత ఏడాది డిసెంబర్లో నియమించారు. దేవస్థానంపై ఆయనకు పెద్దగా అవగాహన లేకపోవడానికి తోడు దేవస్థానం పరిపాలన అంతా ప్రజాప్రతినిధుల చేతుల్లో పెట్టడం, పని చిన్నదైనా, పెద్దదైనా వారు చెప్తే చేయడమే పరిపాలననే విధంగా పరిస్థితులు దిగజారిపోయాయి. అలాగే, ఆయన కుటుంబ సభ్యుల జోక్యం బాగా పెరిగిపోవడం దేవస్థానం సిబ్బందిలో అసంతృప్తికి కారణమైంది. సుబ్బారావు నియామకంపై ఈ ఏడాది మార్చి నాటికే దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఓ నిర్ణయానికి వచ్చినప్పటికీ, రాజకీయ జోక్యంతో కొనసాగించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కాలంలో ఉన్నతాధికారులు తరచూ జోక్యం చేసుకుని, పరిపాలనను చక్కదిద్దాల్సి వచ్చింది. రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాల్లో అన్నవరం ఐదు, ఆరు, ఏడు ర్యాంకులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈఓ మారినా.. శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి దేవస్థానాలకు ఈఓలుగా నియమించిన డిప్యూటీ కలెక్టర్ల పదవీ కాలాన్ని ఇటీవల మరో ఏడాది పొడిగించారు. అన్నవరం దేవస్థానం ఈఓ సుబ్బారావును మాత్రం రెవెన్యూ విభాగానికి సరెండర్ చేశారు. ఆయన స్థానంలో దేవదాయ శాఖ రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్జేసీ) త్రినాథరావును ఇన్చార్జిగా నియమించారు. గతంలో మూడుసార్లు ఈఓగా పని చేసిన అనుభవం ఉండటంతో ఆయన పరిస్థితులను చక్కదిద్దుతారని ఉన్నతాధికారులు భావించారు. కానీ, ఎవ్వరూ చక్కదిద్దలేనంతగా ఇక్కడి పరిస్థితులు దిగజారిపోయాయనే విషయం ఇప్పుడిప్పుడే తేటతెల్లమవుతోంది. ఇక్కడ ఏ పని చేయాలన్నా ప్రజాప్రతినిధుల జోక్యం చేసుకుంటున్నారు. ప్రతి పనీ తమకు చెప్పిన తర్వాతే చేయాలనే విధంగా పరిస్థితులు మారిపోయాయి. దీంతో, ఇక్కడ స్వేచ్ఛగా ఏ పనీ చేయలేమనే నిర్ణయానికి అధికారులు వచ్చేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఈ సీటు ఆశించిన వారందరూ ఇప్పుడు మిన్నకున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఈఓ త్రినాథరావు కూడా తనను ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించాలని సంబంధిత మంత్రిని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అన్నవరం దేవస్థానం అభివృద్ధి పథంలో పయనించింది. 2021–22 మధ్య కూడా త్రినాథరావు ఇక్కడ ఈఓగా ఉన్నారు. ఆ సమయంలో రత్నగిరి రామాలయం ముందు భక్తుల కోసం దాతల సహకారంతో సుమారు రూ.కోటితో విశ్రాంతి షెడ్డు నిర్మించారు. స్వామివారి వార్షిక కల్యాణ మండపం, ప్రసాద తయారీ భవనం నిర్మించి, ప్రారంభించారు. అలాగే, 2022–23లో కూడా దాతల సహకారంతో వనదుర్గ ఆలయం వద్ద డార్మెట్రీ నిర్మించారు. చంద్రశేఖర్ ఆజాద్ ఈఓగా ఉన్న సమయంలో కేవలం 8 నెలల్లోనే సత్యగిరి రోడ్డు నుంచి నేరుగా మూడో ఘాట్ రోడ్డు మలుపులోకి చేరేలా ఆదిశంకర మార్గ్ రోడ్డు, కొండ దిగువన టూరిస్టు బస్సులలో వచ్చే భక్తుల కోసం 5 విశ్రాంతి షెడ్లు నిర్మించారు. జాతీయ రహదారి వద్ద ఆక్రమణలో ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకుని, అందులో సత్యదేవుని నూతన నమూనా ఆలయం, రత్నగిరిపై పార్కింగ్ స్థలాల అభివృద్ధి, సహజ, ప్రకాష్ సదన్ సత్రాల మధ్య నుంచి పశ్చిమ రాజగోపురం సమీపానికి వాహనాలు చేరుకునేలా రోడ్ల నిర్మాణం వంటి పనులు చేపట్టి పూర్తి చేశారు. శివసదన్ సత్రం కూడా 135 గదులతో త్వరితగతిన నిర్మించి, భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. దూర ప్రాంతాల భక్తులకు కనిపించేలా విద్యుద్దీపాలతో శంఖచక్ర నామాలు ఏర్పాటు చేశారు. పశ్చిమ రాజగోపురం ముందు విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి లారెస్ ఫార్మా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని, సత్యదేవ అతిథి గృహాన్ని కూల్చేశారు. వివిధ కారణాలతో ఆ షెడ్డు నిర్మాణం ఆలస్యమైనప్పటికీ ఇటీవల పూర్తి చేశారు. సుమారు 45 వ్రత పురోహిత పోస్టులు భర్తీ చేశారు. వ్రత పురోహితుల పారితోషికాన్ని 30 నుంచి 40 శాతానికి పెంచారు. ఆ ఐదేళ్లూ ఎటువంటి వివాదాలూ లేకుండా దేవస్థానం పరిపాలన సాఫీగా సాగిపోయింది. ఫ రత్నగిరిపై మితిమీరిన రాజకీయ జోక్యం ఫ ఏ పనైనా తమకు చెప్పి చేయాల్సిందే నంటున్న ప్రజాప్రతినిధులు ఫ బెంబేలెత్తిపోతున్న అధికారులు ఫ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించాలని కోరిన ఈఓ ఫ మళ్లీ డిప్యూటీ కలెక్టర్నే నియమిస్తారంటూ ప్రచారం బలమైన అధికారి ఉండాల్సిందే.. పాలకొల్లులో ఆదివారం జరిగిన సామూహిక సత్యదేవుని వ్రతాల నిర్వహణకు వెళ్లిన పురోహిత బృందం అక్కడి భక్తుల నుంచి బలవంతంగా కానుకలు డిమాండ్ చేశారనే ఫిర్యాదు అందింది. దీంతో, ఆరుగురు పురోహితులను ఈఓ త్రినాథరావు సస్పెండ్ చేశారు. ఈ ఆరుగురిలో కీలకమైన ఓ పురోహితుడు తాను ప్రజాప్రతినిధులకు అత్యంత సన్నిహితుడనని, తననెవరూ ఏమీ చేయలేరంటూ చెప్పుకునేవాడని సాటి పురోహితులే చెబుతున్నారు. దీనికి తోడు ఇటీవల ఒక ప్రజాప్రతినిధిని మర్యాద పూర్వకంగా కలవడానికి ఈఓ వెళ్లినపుడు.. అక్కడ ఆ పురోహితుడు కూడా ప్రత్యక్షమయ్యారు. దీంతో, దేవస్థానంలో మారిన పరిస్థితి తేటతెల్లమైందని అంటున్నారు. ఏదేమైనా దేవస్థానంలో పరిస్థితులను చక్కదిద్దడానికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే బలమైన అధికారిని నియమించాలని పలువురు అంటున్నారు. మెతకగా ఉండే అధికారిని నియమిస్తే పరిస్థితి మరింత దిగజారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవేళ త్రినాథరావు విన్నపాన్ని మన్నిస్తే.. తిరిగి డిప్యూటీ కలెక్టర్నే ఈఓగా నియమిస్తారనే ప్రచారం దేవస్థానంలో జరుగుతోంది. -
నీతి, నిజాయితీలకు మారుపేరు ముద్రగడ
కిర్లంపూడి: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం ఉమ్మడి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో నీతి, నిజాయితీలకు మారుపేరని ఆ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, చోడవరం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ముద్రగడను కిర్లంపూడిలోని ఆయన నివాసంలో మంగళవారం మర్యాద పూర్వకంగా కలుసుకుని, ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ముద్రగడ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు, అమర్నాథ్ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ విలేకర్లతో మాట్లాడుతూ, ఇటీవల అనారోగ్యానికి గురైన ముద్రగడ ఇప్పుడు పూర్తిగా కోలుకుని ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని అన్నారు. లక్షలాది మంది అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రజల ఆశీస్సులు ఆయనకు నిండుగా ఉన్నాయన్నారు. పద్మనాభం రాజకీయ అనుభవాలు, సలహాలు తీసుకుని ముందుకు వెళ్తామన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ఆయన సేవలు పార్టీకి ఎంతో అవసరమని చెప్పారు. ముద్రగడ ఒక ప్రాంతానికి పరిమితమైన నాయకుడు కాదని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది అభిమానులు ఆయనకున్నారని అన్నారు. ఆయనను ఒక కులానికే నాయకుడిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని, కానీ, అన్ని కులాలనూ ఆదరిస్తూ, అందరికీ అండగా నిలుస్తున్న నాయకుడు ముద్రగడ అని వివరించారు. అలాంటి మహానాయకుడి ఆశీస్సులు అందుకోవడానికే తాను వచ్చానని చెప్పారు. అమర్నాథ్ వెంట మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట రామయ్య, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు చిక్కాల రామారావు, ఏడువాక సత్యారావు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దొండ రాంబాబుతో పాటు చోడవరం, అనకాపల్లి నియోజకవర్గాల పార్టీ శ్రేణులు ఉన్నాయి. ఫ ఆయన కుటుంబంతో నాలుగున్నర దశాబ్దాల అనుబంధం ఫ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ -
భంగపాటు చేయాలనిభంగపడిన దుష్టచతుష్టయం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): వనవాసం చేస్తున్న పాండు సుతులకు ఘోష యాత్ర మిషతో భంగపాటు కలిగించాలని వచ్చిన ధార్తరాష్ట్రులు భంగపాటుకు గురయ్యారని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. వ్యాస భారతంపై ప్రవచనాన్ని స్థానిక హిందూ సమాజంలో మంగళవారం ఆయన కొనసాగించారు. ‘‘గంధర్వుని చేతిలో దుర్యోధనుడు బందీ అయినప్పుడు.. కావలసిన కార్యాన్ని గంధర్వులే సరి చేశారని భీముడు ఆనందిస్తాడు. అతడిని ధర్మరాజు వారిస్తాడు. ‘ఇతరులతో విభేదాలు వస్తే మనం 105 మంది సోదరులం. ఇతర సందర్భాల్లో వారు వంద మంది, మనం ఐదుగురం. వెంటనే దుర్యోధనుడిని విడిపించు’ అని అర్జునుడిని ఆదేశిస్తాడు. తిరిగి వచ్చిన దుర్యోధనుడిని భీష్ముడు మందలిస్తాడు. ‘నీవు నమ్ముకున్న కర్ణుడు గంధర్వులతో జరిగిన పోరులో పలాయనవాదం చిత్తగించాడు. పాండవుల పరాక్రమంలో కర్ణుడు పావు భాగానికి సరిపోడు’ అని అంటాడ’’ని వివరించారు. భీష్ముడు దుష్టచతుష్టయాన్ని మందలించలేదని వచ్చే విమర్శల్లో సత్యం లేదని సామవేదం చెప్పారు. ‘‘తమ వద్దకు వచ్చిన దూర్వాస మహర్షిని దుర్యోధనుడుఅన్ని విధాలా సహనంతో సేవించాడు. ఆయన అర్థరాత్రీ, అపరాత్రీ వచ్చి భోజనం కావాలని ఆదేశించినా, చక్కని అన్నపానీయాలను అందించేవాడు. సంతృప్తి చెందిన దూర్వాసుడు వరం కోరుకోవాలని దుర్యోధనుడిని అడుగుతాడు. ‘మీరు పాండవుల వద్దకు వెళ్లి, సేవలు అందుకుని వారిని కూడా తరింపజేయాలి. ద్రౌపది కూడా భుజించిన తరువాత భోజనం పెట్టాల్సిందిగా వారిని ఆదేశించాలి’ అని దుర్యోధనుడు కోరుతాడు. వేలాది శిష్యులతో దూర్వాసుడు పాండుసుతుల వద్దకు వెళ్తాడు. ద్రౌపది భుజించిన తరువాత వెళ్లి, తనకూ, తనతో వచ్చిన వేలాది మంది శిష్యులకు భోజనం సిద్ధం చేయాలని కోరుతాడు. స్నానానికి వెళ్లిన దూర్వాసుడు, ఆయన శిష్యగణాలకు కృష్ణుని అనుగ్రహంతో మృష్టాన్న భోజనం చేసిన తృప్తి కలిగి, ధర్మరాజుకు చెప్పకుండా వెళ్లిపోతారు’’ అని కథా భాగాన్ని వివరించారు. హరి భక్తులకు ఇబ్బందులు కలిగిస్తే వచ్చే ప్రమాదాలు దూర్వాసునికి అంబరీషుని ద్వారా గతంలోనే అవగాహనకు వచ్చిందని చెప్పారు. అనంతరం, పాండవులకు మార్కండేయ మహర్షి రామకథ వివరిస్తాడని, పురాణాలు రామకథతో పవిత్రమవుతాయని, భాగవతంలో కూడా రామకథ కనిపిస్తుందని సామవేదం చెప్పారు. నలదమయంతుల కథ, సీతారాముల కథ, సావిత్రీసత్యవంతుల కథలతో కూడిన భారత కథా శ్రవణం ద్వారా యజ్ఞఫలం లభిస్తుందని అన్నారు. -
● రక్షణ లేదిక్కడ!
రెండు మార్గాలను కలిపేవే వంతెనలు.. అలాంటి వారధుల నిర్వహణను అధికారులు గాలికొదిలేయడంతో ప్రమాదకరంగా మారుతున్నాయి. కూలేందుకు సిద్ధంగా తయారవుతున్నాయి. యు.కొత్తపల్లి మండలం కాశివారిపాకలు – కొండెవరం రోడ్డులో గోదావరి కాలువపై దశాబ్దాల కిందట నిర్మించిన ఈ వంతెన ప్రస్తుతం ప్రమాదకరంగా మారింది. దీని రక్షణ గోడ ఓవైపు పూర్తిగా, మరోవైపు సగం కులిపోయింది. మిగిలింది శిథిలావస్థలో ఉంది. అప్రోచ్ సరిగ్గా లేదు. దీంతో, ఇటుగా ప్రయాణించాలంటే ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. ఇదే వంతెనపై నుంచి కొండెవరంలోని జిల్లా పరిషత్ పాఠశాలకు విద్యార్థులు వెళ్తుంటారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వారి తల్లిదండ్రులు నిత్యం ఆందోళన చెందుతున్నారు. రక్షణ గోడలు లేకపోవడంతో ఏమాత్రం అదుపు తప్పినా కాలువలోకి జారి పడే పరిస్థితి. ఈ వంతెన రక్షణకు సంబంధిత అధికారులు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. – కొత్తపల్లిగోదావరి కాలువపై రక్షణ గోడలు కూలి ప్రమాదకరంగా మారిన వంతెన -
శాసీ్త్రయ దృక్పథంతో సమస్యలకు పరిష్కారం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): శాసీ్త్రయ దృక్పథంతో ఆలోచిస్తేనే సమాజంలోని సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుందని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బి.గోపీమూర్తి అన్నారు. జన విజ్ఞాన వేదిక (జేవీవీ) ఆధ్వర్యాన జేఎన్టీయూకేలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న చెకుముకి రాష్ట్ర స్థాయి సైన్స్ సంబరాలు మంగళవారం ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధించిన ప్రగతి ఫలాలు సామాన్య ప్రజలందరికీ అందుబాటులోకి రావాలని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ, మూఢ విశ్వాసాల నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, అందరికీ విద్య, నాణ్యమైన వైద్యం కోసం 38 సంవత్సరాలుగా జేవీవీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. భావితరాలకు ఉన్నత, అభివృద్ధికర సమాజాన్ని అందించేందుకు, శాసీ్త్రయ దృక్పథం పెంపొందించేందుకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించేందుకు, సైన్స్, ప్రయోగాల పట్ల ఆసక్తి రేకెత్తించేందుకు, సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఏటా పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది పాఠశాల స్థాయి సైన్స్ సంబరాల్లో 4.60 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు. వచ్చే నెలలో సైన్స్ ప్రయోగాల పోటీలు నిర్వహిస్తామన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి పి.రమేష్ మాట్లాడుతూ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యావంతులు హేతుబద్ధమైన ఆలోచన కలిగి ఉంటేనే భావితరాలకు మంచి సమాజాన్ని అందించగలుగుతామని అన్నారు. కార్యక్రమంలో సంబరాల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, కాకినాడ సీ పోర్ట్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి ఎం.మురళీధర్, కోరమండల్ ఇంటర్నేషనల్ అధికారి వంశీకృష్ణ, సత్యా స్కాన్ డైరెక్టర్ డాక్టర్ కాదా వెంకట రమణ, చెకుముకి రాష్ట్ర కన్వీనర్ కేఎంఎంఆర్ ప్రసాద్, యూటీఎఫ్ నాయకుడు ప్రభాకరవర్మ, జేవీవీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి విజేతలు వీరే.. జిల్లా స్థాయి పోటీల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విభాగాల్లో మొదటి స్థానం సాధించిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి సైన్స్ సంబరాలకు హాజరయ్యారని జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్ తెలిపారు. వారికి ప్రయోగాలు, క్విజ్, విజువల్ రౌండ్, రాత పరీక్ష నిర్వహించి, విజేతలను ఎంపిక చేశామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ స్కూల్ (కర్నూలు జిల్లా) ప్రథమ, శ్రీ నరసింహ గవర్నమెంట్ హైస్కూల్ (గుంటూరు) ద్వితీయ, జెడ్పీ గర్ల్స్ హైస్కూల్ (బుదిరెడ్డిపల్లి, శ్రీ సత్యసాయి జిల్లా) తృతీయ స్థానాల్లో నిలిచాయని వివరించారు. ప్రైవేటు పాఠశాలల విభాగంలో ది ఎతేనా స్కూల్ (కర్నూలు) ప్రథమ, శ్రీ సాయి విజ్ఞాన్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ (వైఎస్సార్ కడప) ద్వితీయ, ఆదిత్య ఇంగ్లిష్ మీడియం స్కూల్ (గంగరాజు నగర్, కాకినాడ) తృతీయ స్థానాలు సాధించాయని తెలిపారు. పోటీలో పాల్గొన్న విద్యార్థులకు, పాఠశాలలకు సర్టిఫికెట్, జ్ఞాపికలను ఎమ్మెల్సీ గోపిమూర్తి, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, డీఓ రమేశ్ తదితరుల చేతుల మీదుగా అందజేశారు. ఫ ఎమ్మెల్సీ గోపీమూర్తి ఫ ముగిసిన చెకుముకి రాష్ట్ర స్థాయి సైన్స్ సంబరాలు -
శాసీ్త్రయ ప్రతిభను వెలికి తీసేందుకే కౌశల్ పరీక్షలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ѧéÅÆý‡$¦ÌZÏ §éW E¯]l² {糆¿ýæ¯]l$ ÐðlÍMìS ¡Ä¶æ$-yýl…ÌZ MúÔèæÌŒæ ç³È-„ýSË$ MîSÌSMýS ´ë{™èl ´ùíÙ-çÜ$¢-¯é²Ä¶æ$° hÌêÏ Ñ§éÅ-Ô>Rê-«¨M>Ç (yîlDK) í³.Æý‡Ðól$‹Ù A¯é²Æý‡$. Ý린MýS çÜÐ]l${VýS Õ„ýS çÜÐ]l*-ÐólÔèæ Ð]l$…¨Æý‡…ÌZ Ð]l$…VýS-âýæÐéÆý‡… °Æý‡Ó-íßæ…-_¯]l hÌêÏ Ýë¦Æ‡$$ MúÔèæÌŒæ ç³È„ýSÌS ºçßæ$Ð]l$† {ç³§é-¯ø-™èlÞ-Ð]l…ÌZ BĶæ$¯]l Ð]l¬QÅ A†¤V> ´ëÌŸY-¯é²Æý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> ѧéÅ-Æý‡$¦-ÌS-¯]l$§ólªÕ…_ Ð]l*sêÏ-yýl$™èl*, ´ùsîæ ç³È-„ýS-ÌSMýS$ çܯ]l²§ýl®… ^ólĶæ$-yé°MìS MúÔèæÌŒæ ç³È„ýSË$ G…™ø §øçßæ§ýlç³-yýl-™éĶæ$° A¯é²Æý‡$. ¿êÆý‡-¡Ä¶æ$ Ñgêq¯]l Ð]l$…yýl-Í, Æ>çÙ‰ Ô>ç܈, Ýë…MóS-†MýS Ð]l$…yýl-Í, OòܯŒSÞ íÜsîæ B‹œ B…{«§ýl{ç³§ólÔŒæ ç܅Ķæ¬MýS¢ B«§ýlÓÆý‡Å…ÌZ °Æý‡Ó-íßæ…_¯]l D ç³È„ýSÌZÏ hÌêÏ-ÐéÅ-ç³¢…V> 3,084 Ð]l$…¨ ѧéÅ-Æý‡$¦Ë$ ´ëÌŸY-¯é²Æý‡° ™ðlÍ-´ëÆý‡$. D ç³È-„ýSÌZÏ E™èl¢Ð]l$ {糆¿ýæ ^èl*í³¯]l ѧéÅ-Æý‡$¦ÌSMýS$ ¯]lVýS§ýl$ ºçßæ$-Ð]l$™èl$Ë$, {ç³Ôèæ…-Ýëç³-{™éË$, gêqí³-MýSË$ A…§ýl-gôæ-Ô>Æý‡$. {ç³£ýlÐ]l$ Ý릯]l… ´÷…¨¯]l ѧéÅ-Æý‡$¦-ÌSMýS$ Æý‡*.1,500, ¨Ó-¡Ä¶æ$ Ý릯]l… Ý뫨…-_¯]l ÐéÇMìS Æý‡*.1,000 ^ö糚¯]l ¯]lVýS§ýl$ ºçßæ$Ð]l$™èl$Ë$ A…¨…-^éÆý‡$. M>Æý‡Å-{MýSÐ]l$…ÌZ Eç³ Ñ§éÅÔ>Rꫨ-M>Æý‡$Ë$ MóSÒÒ çÜ™èlůé-Æ>-Ķæ$׿, {糿ê-MýS-Æý‡-ÔèæÆý‡Ã, yîlïÜ-D½ M>Æý‡Å-§ýlÇØ MðS.Ððl…-MýS-r-Æ> Ð]l#, MúÔèæÌŒæ gêÆ‡$$…sŒæ Mø BÇŠేyýl²-rÆŠ‡ ¼.çÜ*Æý‡Å-Ððl*-çßæ-¯ŒSÆð‡yìlz, hÌêÏ çÜÐ]l$-¯]lÓ-Ķæ$-MýSÆý‡¢ MóSçÜÇ }°-Ðé-çÜ-Æ>Ð]l#, G…DKË$, E´ë«§éÅ-Ķæ¬Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. జిల్లా స్థాయి విజేతలు వీరే.. ● క్విజ్లో ఎస్డీ ఆఫియా తబస్సుం (8వ తరగతి, పీఆర్జీ బాలికల ఉన్నత పాఠశాల, కాకినాడ), జి.విజయలక్ష్మి (9వ తరగతి), వి.కుసుమ (10వ తరగతి, జెడ్పీ హైస్కూల్, పెద్దనాపల్లి) ప్రథమ స్థానం సాధించారు. కె.శివగణేష్ (8వ తరగతి, జెడ్పీ హైస్కూల్, ఇంజరం), డీఎల్వీఎన్ఎస్ఎం లహరి (9వ తరగతి, ఏపీ మోడల్ స్కూల్, శంఖవరం), కె.కిశోర్ (10వ తరగతి, జెడ్పీ హైస్కూల్, తేటగుంట) ద్వితీయ స్థానంలో నిలిచారు. ● పోస్టర్ పోటీలో జి.మేఘన (8వ తరగతి, మున్సిపల్ ఉన్నత పాఠశాల, సీతారామపురం, తుని), పీజీవీ ఆశ (9వ తరగతి, ఏపీ మోడల్ స్కూల్, శంఖవరం) ప్రథమ స్థానం సాధించారు. కె.గణేష్ (8వ తరగతి, జెడ్పీ హైస్కూల్, సర్పవరం), సీహెచ్. లోహిత సుధ (9వ తరగతి, జెడ్పీ హైస్కూల్,ఎ.కొత్తపల్లి)ద్వితీయస్థానం పొందారు. ● రీల్స్ పోటీలో ఎం.లక్ష్మీ పూర్ణిమ (10వ తరగతి, జెడ్పీ హైస్కూల్, నాయకంపల్లి) ప్రథమ, ఎన్.తేజస్విని (10వ తరగతి, జెడ్పీ హైస్కూల్, పవర) ద్వితీయ స్థానం సాధించారు. ● వీరు ఈ నెల 27న తిరుపతిలోని నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని కేసరి శ్రీనివాసరావు తెలిపారు. -
సెంటినరీ ఆంధ్రా బాప్టిస్ట్ చర్చి
జగన్నాథపురం చర్చి స్క్వేర్ సెంటర్లో సెంటినరీ ఆంధ్రా బాపిస్ట్ చర్చిని 1870లో సువిశాల ప్రాంగణంలో నిర్మించారు. దీని నిర్మాణం పూర్తయిన తరువాత మిషనరీ రెవరెండ్ జాన్ మెక్ లారిన్ ఇక్కడ దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు పని చేశారు. ఈ చర్చిలో బ్రిటిష్ నిర్మాణ శైలి స్పష్టంగా కనపడుతుంది. పూర్తి రాతి కట్టడం కావడంతో ఇప్పటికీ ఇసుమంత కూడా చెక్కు చెదరకుండా నిలిచింది. ఈ చర్చి ఆధ్వర్యాన క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. క్రెగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న క్రెగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చికి కూడా వందేళ్లకు పైబడిన చరిత్ర ఉంది. ఇక్కడ క్రిస్మస్ వేడుకలు ఎంతో కోలాహలంగా జరుగుతాయి. వేలాదిగా భక్తులు తరలివస్తారు. -
గణిత మేధావి రామానుజన్
కె.పెదపూడిలో 1729 ఆకృతిలో కూర్చున్న విద్యార్థులు అంబాజీపేట: దేశానికి గణిత మేధావిగా శ్రీనివాస రామానుజన్ ఎంతో కీర్తి ప్రతిష్టలు సాధించారని హైస్కూలు హెచ్.ఎం, సీహెచ్.వేణుగోపాలకృష్ణ అన్నారు. కె.పెదపూడి జెడ్పీ హైస్కూల్లో గణిత దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్కు ఎంతో ఇష్టమైన సంఖ్య 1729 అని దీనిని రెండు ఘనముల మొత్తంగా రాయగల చిన్న సంఖ్య కావటంతో దీనిని ‘రామానుజన్ సంఖ్య‘ అంటారని వివరించారు. విద్యార్థులు రామానుజన్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన 1729 ఆకృతి పలువురిని అలరించింది. -
ఉప్పాడలో ఫుడ్ పాయిజన్
● ఎనిమిది మంది మత్స్యకారులకు అస్వస్థత ● పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న బాధితులు పిఠాపురం: చేపల ప్యాకింగ్ పనికి వెళ్లిన కొత్తపల్లి మండలం ఉప్పాడకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు ఫుడ్ పాయిజన్ అయిన బిర్యాని తినడంతో సోమవారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని పిఠాపురం ప్రభుత్వాసునత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైదద్యులు తెలిపారు. బాధితుల కథనం ప్రకారం కొత్తపల్లి మండలం ఉప్పాడకు చెందిన మత్స్యకారులు వంక కాలేబు, ఓసిపల్లి సంతోష్, పల్లెటి స్టాలిన్, ఉమ్మిడి జాన్, గోశల పీటర్ పాల్, రాచపల్లి ప్రసాద్, గోశల ప్రసాద్, కోడా నాగేంద్ర ఆదివారం తాళ్లరేవు మండలం భైరవపాలెం తీర ప్రాంతానికి చేపల ప్యాకింగ్ పనికి వెళ్లారు. తాళ్లరేవులో ఒక బిర్యానీ హోటల్ వద్ద ఎనిమిది మంది బిర్యానీ కొనుక్కుని ప్యాకింగ్ పూర్తయ్యాక దానిని తిన్నారు. తిరిగి రాత్రికి ఇంటికి చేరుకున్నాక బిర్యానీ తిన్న ఎనిమిది మందికి వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి రావడంతో వారందరిని కొత్తపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఇద్దరికి మినహా మిగిలిన వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితులను పరామర్శించిన మాజీ ఎంపీ గీత ఫుడ్ పాయిజన్ అవ్వడంతో అస్వస్థతకు గురైన బాధితులను మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి, పీఏసీ సభ్యురాలు వంగా గీతావిశ్వనాఽథ్ పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించారు. వైఎస్సార్సీపీ నాయకులు అంతా అండగా ఉంటామని ఆమె బాధితులకు ఽభరోసా కల్పించారు. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయాలని అవసరమైన సహకారం అందించాలని పిఠాపురం, కొత్తపల్లి మండల పార్టీ అధ్యక్షులు రావుల మాధవరావు, ఆనాల సుదర్శన్లకు ఆమె సూచించారు. ఆమె వెంట మత్స్యకార నాయకుడు ఉప్పాడ ఎంపీటీసీ మేరుగు ఎల్లాజీ కొత్తెం దత్తుడు తదితరులు ఉన్నారు. -
రెండు తాటాకిళ్లు దగ్ధం
రూ.5 లక్షల ఆస్తినష్టం పి.గన్నవరం: మండలంలోని పోతవరం శివారు మాతావారిపేటలో ఆదివారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు తాటాకిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరొక డాబా ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. మొత్తం ఐదు కుటుంబాల వారు నిరాశ్రయులు కాగా, రూ.5 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లినట్టు స్థానికులు చెబుతున్నారు. మాతా చంద్రరావు ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్కూట్ వల్ల మంటలు చెలరేగడంతో ఆ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఆ మంటలు పక్కనే ఉన్న మాతా శ్రీరాములు ఇంటికి వ్యాపించి, అతడి ఇల్లు కూడా అగ్నికి ఆహూతైంది. పక్కనే ఉన్న మాతా వెంకట్రావుకు చెందిన డాబా ఇల్లు దెబ్బతింది. అర్ధరాత్రి ఇళ్లల్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో బాధితులంతా కట్టుబట్టలతో ప్రాణాలు అరచేత పట్టుకుని ప్రమాదం నుంచి బయట పడ్డారు. చంద్రరావు ఇంట్లో నివసిస్తున్న అతడి కుమారులు శ్రీనుబాబు, రాంబాబు కుటుంబాలవారు కూడా నిరాశ్రయులయ్యారు. ఇళ్లలోని సామాన్లు, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు, విద్యార్థుల సర్టిఫికెట్లు సర్వం కాలిపోవడంతో బాధితులు ఆవేదన చెందుతున్నారు. చంద్రరావు కోడలు పద్మ ఇటీవల కువైట్ నుంచి వచ్చింది. ఆమె ఇల్లు కట్టుకుందామని తెచ్చుకున్న రూ.90 వేలు, బంగారు వస్తువులు కాలిపోవడంతో బోరున విలపించింది. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలామని బాధితులు విలపించారు. అమలాపురం అగ్నిమాపక కేంద్ర సిబ్బంది, స్థానికులు మంటలను అదుపు చేశారు. బాధిత కుటుంబాలకు రెవెన్యూ అధికారులు బియ్యం పంపిణీ చేశారు. సర్పంచ్ వడలి కొండయ్య, వీఆర్వో పద్మావతి సహాయక చర్యలు చేపట్టారు. తహసీల్దార్ పి.శ్రీపల్లవి, ఆర్ఐ వెన్నపు డాంగే, గిడ్డి ఆనంద్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. -
సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): సమస్యలు పరిష్కరించేంత వరకూ పోరాటం సాగిస్తామని రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు తోట వెంకట రామయ్య అన్నారు. కాకినాడ డీసీసీబీ వద్ద సోమవారం నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. సహకార ఉద్యోగులకు చట్ట ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని, ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని, రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా కల్పించాలని, సర్వీసులో ఉండగా ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబానికి రూ.20 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ చేయించి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర కోశాధికారి పెంకె సత్యనారాయణ మాట్లాడుతూ, 2019 తర్వాత సహకార సంఘాల్లో చేరిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, రైతులకు సహకార సంఘాల ద్వారా రుణాలిచ్చేలా చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం సహకార సంఘాల్లో పని చేస్తున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ క్లర్క్, కంప్యూటర్ ఆపరేటర్లను సీనియారిటీ ప్రాతిపదికన జిల్లాలో ఖాళీగా ఉన్న సంఘాల సీఈఓలుగా నియమించాలని కోరారు. అనంతరం డీసీసీబీ ఇన్చార్జ్ సీఈఓ ప్రవీణ్ కుమార్కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సంఘం కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల అధ్యక్షులు వై.రామచంద్రరావు, ఎ.ఆదినారాయణ, కేవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
చెడు అలవాట్లతో బీబీఏ విద్యార్థి ఆత్మహత్య
అమలాపురం టౌన్: అమలాపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి ఎదురుగా గల మెట్ల కాలనీకి చెందిన బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి కొప్పన దీపక్ రాజన్ (18) ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లో ఫ్యాన్ హుక్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అమలాపురం రూరల్ మండలం భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో బీబీఏ చదువుతున్న దీపక్ రాజన్ చెడు అలవాట్లకు బానిసై ఈ అఘాయిత్యం చేసుకున్నాడని పట్టణ ఎస్సై టి.శ్రీనివాస్ తెలిపారు. తండ్రి మరణించడంతో అతని తల్లి అతి గారాబంగా పెంచింది. తరచూ డబ్బు కోసం తల్లిని బెదిరించడం, ఇచ్చిన డబ్బుతో మద్యం తాగడం అతనికి అలవాటుగా మారింది. కాకినాడకు చెందిన తన మామయ్య ఇటీవల చనిపోవడంతో అతని తల్లి అక్కడికి వెళ్లింది. ఆదివారం అర్ధరాత్రి మద్యం సేవించి ఇంటికి చేరుకున్న దీపక్ రాజన్ తన తండ్రి గతంలో చనిపోయాడు, ఇప్పుడు మామయ్య చనిపోయాడు. నేనూ చనిపోతానని ఇంట్లో ఉన్న తన తాతాయ్యకు చెప్పి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. గంట సమయం దాటాక అనుమానం వచ్చి తాతాయ్య చూసేసరికి గదిలో దీపక్ రాజన్ ఉరి వేసుకుని వేలాడుతుండడాన్ని గమనించాడు. పోస్టుమార్టం కోసం విద్యార్థి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పతికి తరలించారు. పట్టణ సీఐ పి.వీరబాబు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. -
ఆరుగురు వ్రత పురోహితుల సస్పెన్షన్
అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం వ్రతవిభాగంలో పనిచేస్తున్న ఆరుగురు వ్రత పురోహితులను సస్పెండ్ చేస్తూ దేవస్థానం ఈఓ వీ త్రినాధరావు సోమవారం ఆదేశాలు ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆదివారం అన్నవరం దేవస్థానం సామూహిక సత్యదేవుని వ్రతాలు నిర్వహించింది. ఇందుకు ఆరుగురు రెగ్యులర్ వ్రత పురోహితులు, ముగ్గురు అదనపు పురోహితులు, వ్రత సామగ్రి, సత్యదేవుని ప్రచార రథంతో బయల్దేరి వెళ్లారు. ఈ వ్రతాలలో 300 జంటలు పాల్గొనగా మరో వేయి మంది భక్తులు తిలకించినట్టు అధికారులు తెలిపారు. ఉదయం తొమ్మిది నుంచి 11 గంటల వరకు వ్రతాలు నిర్వహించిన అనంతరం వ్రతకథ చెప్పిన మొదటి శ్రేణి వ్రతపురోహితుడు మల్లాది గురుమూర్తి వ్రత దక్షిణగా భక్తులు వస్త్రదానం కింద రూ.501, అన్నదానం కింద రూ.251 ఇవ్వాలని మైకు ద్వారా డిమాండ్ చేసినట్టు దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్లాల్, కమిషనర్ కే రామచంద్రమోహన్లకు సంబంధిత వీడియోలను సాక్ష్యాలుగా చూపుతూ కొందరు ఫిర్యాదు చేశారు. వాటిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఈఓ త్రినాథ్రావును ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ ఆదేశించారు. దీనిపై ఈఓ ఆ వ్రతాల నిర్వహణకు వెళ్లిన గుమస్తా బీఎస్ఎన్ రాజును విచారించగా వ్రతాలనంతరం భక్తుల నుంచి దానాలు రూపంలో కానుకలు డిమాండ్ చేసిన మాట వాస్తవమేనని, తాను వారించినా వినలేదని స్టేట్మెంట్ ఇచ్చారు. దీని ఆధారంగా వ్రతాల నిర్వహణకు వెళ్లిన స్పెషల్ గ్రేడ్ వ్రత పురోహితులు మంధా శ్రీరామ్మూర్తి, ప్రయాగ ఆంజనేయులు, తొయ్యేటి వేంకట నరసింహ హరిహర సుబ్రహ్మణ్యం, మొదటి శ్రేణి పురోహితులు మల్లాది గురుమూర్తి, పాలంకి సోమేశ్వరరావు, మూడో గ్రేడ్ పురోహితుడు మొక్కరాల సతీష్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. గుమస్తా బీఎస్ఎన్ రాజు కు మెమో ఇచ్చారు. సోమవారం సస్పెండ్ అయిన వ్రత పురోహితులు కొందరు గతంలో ఇదే విధమైన ఆరోపణలతో సస్పెండ్ అయి మళ్లీ విధుల్లో జాయిన్ అయ్యారు. దేవస్థానంలో పరిస్థితులు చక్కదిద్దడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కాకినాడలో సినీ నటి నిధి అగర్వాల్ సందడి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కాకినాడ సినీనటి నిధి అగర్వాల్ సందడి చేశారు. కాకినాడ మసీద్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఎస్ బ్రదర్స్ వస్త్ర దుకాణాన్ని ఆమె సోమవారం ప్రారంభించారు. షాపింగ్ మాల్లో ఉన్న మూడు అంతస్తులను సందర్శించి అక్కడ ఉన్న వివిధ రకాల దుస్తులను పరిశీలించారు. తరువాత షోరూం బయట ఏర్పాటు చేసిన వేదికపై తెలుగులోనే ప్రసంగించారు. తాను ప్రభాస్ సరసన రాజా సాబ్ సినిమాలో నటిస్తున్నానని చెప్పారు. అనంతరం షోరూం చైర్మన్ పొట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తాము ఏర్పాటు చేస్తున్న ప్రతీ షోరూమ్లో పండగలు, వివాహాది కార్యక్రమాలకు అన్ని రకాల ప్రజలకు అందుబాటులో ఉండే నాణ్యమెన వస్త్రాలను అందిస్తున్నామన్నారు. కంపెనీ డైరెక్టర్ తిరువీధుల ప్రసాదరావు మాట్లాడుతూ ధరలోను, నాణ్యత లోను, అభిరుచులలో ఆర్ఎస్ బ్రదర్స్ ముందుంటుందని తెలిపారు. షోరూమ్ మేనేజింగ్ డైరెక్టర్ సిర్ణ రాజమౌళి మాట్లాడుతూ ఇక్కడ అన్ని రకాలైన వస్త్రాలు పిల్లలకు, పెద్దలకు లభిస్తాయన్నారు.ఆర్ఎస్ బ్రదర్స్ షోరూం ప్రారంభం -
గాంధీజీ ఆనవాళ్లను తుడిచేస్తున్నారు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కులమతాలకు అతీతంగా చివరి ఊపిరి వరకూ ప్రజల కోసమే పని చేసిన జాతిపిత మహాత్మా గాంధీ ఆనవాళ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుడిచేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని నిరసిస్తూ.. స్థానిక గాంధీనగర్ పార్కులో బాపూజీ విగ్రహం వద్ద సీపీఐ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన సోమవారం మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. తొలుత రామారావుపేట సెంటర్ నుంచి గాంధీనగర్ పార్కు వరకూ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి, నిధులకు ఎగనామం పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. గాంధీజీ ఏం తప్పు చేశారని పేరు మారుస్తున్నారని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ కూలీలకు ఉపాధి దొరుకుతోందని సంతృప్తి పడేలోపే వారు పస్తులుండే పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోందని ఆరోపించారు. ఇప్పటికై నా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును యథాతథంగా కొనసాగించాలని, దీనికి కేంద్రమే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, కార్యవర్గ సభ్యులు పెద్దిరెడ్ల సత్యనారాయణ, బొబ్బిలి శ్రీనివాసరావు, సాకా రామకృష్ణ పాల్గొన్నారు. -
ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రభుత్వ స్థలాల్లో 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి, పక్కా ఇల్లు నిర్మించాలని, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద సోమవారం ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, ఏఐఎఫ్టీయూ, ప్రగతిశీల మహిళా సంఘం ( సీ్త్ర విముక్తి), ప్రజా సంఘాల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, అనంతరం జాయింట్ కలెక్టర్ అపూర్వభరత్కు వినతి పత్రం సమర్పించారు. ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ పెద్దాపురం ఒకటో వార్డు పరిధిలో గల ప్రభుత్వ స్థలంలో 30 ఏళ్ల క్రితం ఇల్లు లేని నిరుపేదలు పూరిగుడిసెలు వేసుకుని నివాసముంటున్నారన్నారు. ఆ కాలనీలో మౌలిక వసతులు లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వరదలు వచ్చిన, ఏలూరు కాలువ నీరు వదిలిన ఆ కాలనీ ముంపుకు గురవుతుందన్నారు. సర్వే నంబర్ 579లో గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాదారులకు ఇంటి రుణాలు మంజూరు చేయాలని, వారికి రోడ్లు డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.300 మంది శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు శ్మశాన వాటిక లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి శ్మశాన వాటికకు స్థలం కొనుగోలు చేసి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి అధ్యక్షుడు వల్లూరి రాజబాబు, సహాయ కార్యదర్శి కడితి సతీష్, జిల్లా నాయకులు కే రామలింగేశ్వర రావు, ఎల్లే సత్తిబాబు ఏఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి కుంచ అంజిబాబు, అధ్యక్షుడు మడికి సత్యం, ప్రగతిశీల మహిళా సంఘం ( సీ్త్ర విముక్తి) నాయకులు రెడ్డి దుర్గాదేవి, యమునా, శిరీష, దమ్మ సీత పాల్గొన్నారు. -
శతాబ్దాల ఘన చర్చితం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శుభదినం రెండు రోజుల్లో రానే వస్తోంది. ప్రేమ, శాంతి, కరుణ, క్షమ, నీతి వంటి సద్గుణాలను ఈ లోకానికి బోధించిన దైవ కుమారుడు.. ఏసు క్రీస్తు ఈ భూమిపై అడుగిడిన క్రిస్మస్ పర్వదినాన్ని ఆనందంగా నిర్వహించుకునేందుకు క్రైస్తవులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చర్చిలను ముస్తాబు చేశారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. క్రైస్తవులు సామూహికంగా ప్రార్థనలు నిర్వహించుకునేందుకు శతాబ్దం కిందటే కాకినాడ నగరంలో అనేక చర్చిల నిర్మాణం జరిగింది. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ పాలకుల హయాంలో క్రైస్తవ మిషనరీల నిర్వాహకులు వీటిని నిర్మించారు. ఇప్పటికీ చెక్కు చెదరకుండా అవి నిలుస్తున్నాయంటే.. వాటిని ఎంత పటిష్టంగా, నాణ్యంగా నిర్మించారో అర్థం చేసుకోవచ్చు. బ్రిటిష్, ఇటాలియన్ వంటి నిర్మాణ రీతులు ఈ చర్చిల్లో కనిపిస్తూ.. వీక్షకులను ఆకట్టుకుంటాయి. చర్చి స్క్వేర్ సెంటర్ కాకినాడ నగరం అనగానే క్రైస్తవులకు గుర్తుకు వచ్చేది జగన్నాథపురంలోని చర్చి స్క్వేర్ సెంటర్. వందేళ్ల చరిత్ర కలిగిన నాలుగు చర్చిలు ఉండటంతో ఆ ప్రాంతాన్ని చర్చి స్క్వేర్ సెంటర్గా పిలుస్తారు. ఇక్కడ ఇటలీకి చెందిన రోమన్ కేథలిక్ మిషన్తో పాటు బ్రిటిష్ పాలకుల హయాంలో నిర్మించిన పురాతన చర్చిలు ఉన్నాయి. ఈ నెల 25 క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 24 నుంచి 31 వరకూ క్రీస్తు జనన వేడుకను ఈ ప్రాంతంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కాకినాడ పరిసర ప్రాంతాల నుంచి క్రైస్తవ భక్తులు వేల సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొంటారు. కోకనాడ సెయింట్ ఆన్స్ చర్చి కోకనాడ సెయింట్ ఆన్స్ చర్చిని 1854లో జగన్నాథపురం చర్చి స్క్వేర్ సెంటర్లో నిర్మించారు. దీని నిర్మాణానికి బాప్టిస్టు జేఎన్ టిస్సోట్, ఫెడ్రిక్ డికంపియోక్స్ ఆద్యులు. ఈ చర్చి నిర్మాణంలో ఇటలీ ఆర్కిటెక్చర్ స్పష్టంగా కనపడుతుంది. చర్చి బయట కొవ్వొత్తి వెలిగించి, మేరీ మాతను పూజించడానికి రాళ్లతో కట్టిన నిర్మాణం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ చర్చిలో ఏసుక్రీస్తు విగ్రహంతో ఆల్టర్(పరిశుద్ధ స్థలం)ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఫ కాకినాడలో ఎన్నో పురాతన చర్చిలు ఫ వందేళ్లకు పైగా చరిత్ర వీటి సొంతం ఫ నేటికీ చెక్కుచెదరని నిర్మాణాలు -
కంద పంటకు ఇదే అనువైన కాలం
పెరవలి: రాష్ట్రంలో కంద పంటను పశ్చిమ, తూర్పుగోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో 10వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పెరవలి, నిడదవోలు, కొవ్వూరు, నల్లజర్ల, ఉండ్రాజవరం, చాగల్లు మండలాల్లో సుమారు 400 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. కంద పంట వేసే రైతులకు ఇదే సరైన సమయం కావడంతో రైతులు కందను నాటే విధానం, సాగు, సస్యరక్షణ చర్యలు, ఎరువుల యాజమాన్యం, ఆశించే తెగుళ్లు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొవ్వూరు ఉద్యావన శాఖ అధికారి డి.సుధీర్ కుమార్ వివరించారు. కంద నాటే సమయం ఆసన్నమవ్వడంతో రైతులు ఈ విధంగా సాగు చేపట్టాలని సూచించారు. నేల తయారీ నీటి వసతి కలిగి నీరు బయటకుపోయే సదుపాయం గల సారవంతమైన నేలలను ఎన్నుకోవాలి. ఈ పంట వేయడానికి దుక్కు లోతుగా దున్నాలి. ఆఖరి దుక్కులో 10 టన్నుల చివికిన పశువుల ఎరువును, 24కిలోల భాస్వరం ఎరువులను వేసి దుక్కి దున్నాలి. నాటే సమయం ఏడాదిలో రెండుసార్లు ఈ పంటను వేయవచ్చు. మే, జూన్ నెలల్లోను నవంబర్, డిసెంబర్ నెలల్లో విత్తనాన్ని నాటవచ్చు. విత్తనం నీడలో రెండుమూడు నెలలు ఆరబెట్టిన దుంపలనే విత్తనంగా ఉపయోగించాలి. విత్తన దుంపలు 500 నుండి 750గ్రాములు బరువు కలిగినవి వినియోగిస్తే వీటిని ముక్కలుగా కోసి వాడవచ్చు. ముక్కలుగా కోసేటప్పుడు దుంపకన్ను(మొలక భాగం) ప్రతీ ముక్కలోకి వచ్చే విధంగా కోయాలి. విత్తన దుంపలను కోసిన తరువాత వెంటనే నాటాలి. ఎకరానికి 6టన్నుల విత్తనం వాడాలి. నాటడం విత్తనదుంపలను 60 సెంటీమీటర్ల దూరంలో నాటాలి. దుంపలను భూమికి లోతుగా నాటి వెంటనే తడిపెట్టాలి. ఎరువుల యాజమాన్యం విత్తనం నాటిన 40, 80, 120 రోజులకు ఎరువులను వేయాలి. నత్రజని, పొటాష్, యూరియాను 217 కిలోలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 179 కిలోలను 3 సమాన భాగాలుగా చేసి పైన తెలిపిన రోజుల్లో అందించాలి. ఇనుప ధాతువు లోపం కంద పంటకు నీటితడులు సక్రమంగా ఇవ్వని చేలల్లో ఇనుపధాతువు లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ధాతువు లోపం ఉన్న మొక్కల ఆకులు పత్రహరితం కోల్పోయి తెలుపుగా మారతాయి. దీని నివారణకు లీటరు నీటికి 5 గ్రాముల అన్నబేధి, 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. జింక్ ధాతువు లోపం జింక్ ధాతువు లోపం ఉంటే కందమొక్కల ఆకుల ఈనెల మధ్య పసుపువర్ణంగా మారి ఆకు ముగ్గిపోయి ఎండిపోతుంది. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల జింక్సల్ఫేట్ కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు ఆకులపై చిన్నచిన్న మచ్చలు ఏర్పడి అవి పెరిగి ఆకంతా వ్యాపించి ఆకులు ఎండిపోతాయి. ఈ తెగులు సోకడం వలన పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రాములు కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును పిచికారీ చేయాలి. కాండం లేక మొదలు కుళ్లు తెగులు ఈ తెగులు మొక్క మొదలు వద్ద కాండాన్ని ఆశించడంతో కాండం కుళ్లిపోయి చనిపోతుంది. ఈ తెగులు ఆశించినప్పుడు మొదలుకు నీరు వెళ్ళకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీని నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల కాప్టాన్ లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును కలిపి కాండం మొత్తం తడిసేలా పిచికారీ చేయాలి. మొజాయిక్ తెగులు ఇది వైరస్ తెగులు. ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకులు పత్రహరితం కోల్పోయి ఆకులపై తెలుపు, పసుపురంగు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు చిన్నవిగాను, ముడుచుకుపోయినట్లుగా ఉంటాయి. ఈ తెగులు విత్తన దుంపల ద్వారాను, పేనుబంక పురుగు ద్వారాను వ్యాపిస్తుంది. దీని నివారణకు డైమిథోయేట్ లేదా మిథైల్డెమటాన్ మందును 2 మిల్లీలీటర్లు 1 లీటరు నీటిలో కలిపి ఆకులు పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి.అన్నవరప్పాడులో చేలో పరచిన విత్తనం కందఅన్నవరప్పాడులో విత్తనం కందను నాటుతున్న కూలీలు -
గ్రావెల్ అక్రమ తవ్వకాలపై అధికారుల దాడులు
రెండు పొక్లెయిన్లు, లారీ సీజ్ గోకవరం: మండలంలోని రంపయర్రంపాలెం, గంగంపాలెం గ్రామాల్లో జరుగుతున్న గ్రావెల్ అక్రమ తవ్వకాలపై జిల్లా మైన్స్శాఖ అధికారి డి.ఫణిభూషణ్రెడ్డి సోమవారం దాడులు నిర్వహించారు. రంపయర్రంపాలెంలో సర్వే నంబర్ 471లో బి.అర్జునుడికి చెందిన భూమిలో, గంగంపాలెంలో సర్వేనంబర్ 96/2లో కనిశెట్టి అచ్చియ్యమ్మకు చెందిన భూమిలో గ్రావెల్ అక్రమంగా తవ్వుతున్నట్టు ఆయన గుర్తించారు. ఆయా భూముల్లో గ్రావెల్ తవ్వకాలు నిర్వహిస్తున్న రెండు జేసీబీలను, లారీని సీజ్ చేశారు. రంపయర్రంపాలెంలో 1,104 క్యూబిక్ మీటర్లు, గంగంపాలెంలో 5,769 క్యూబిక్ మీటర్లు మేర గ్రావెల్ అక్రమంగా తవ్వినట్టు నిర్ధారించామన్నారు. ఆయన వెంట మైన్స్శాఖ సర్వేయర్ పి.శ్రీనివాస్, ఆయా గ్రామాల రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి తొండంగి: మండలంలోని ఏ.వి.నగరంలో బాలిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై అనుమానాస్పద స్థితిలో మృతి కేసు నమోదు చేసినట్టు తొండంగి ఎస్సై జగన్మోహన్రావు సోమవారం తెలిపారు. ఏ.వి.నగరం గ్రామానికి చెందిన నరాల పాపారావుకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె కత్తిపూడిలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆదివారం ఏ.వి.నగరం గ్రామంలోని తన ఇంటి నుంచి అదే గ్రామంలో అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఇంటి దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని అదే గ్రామానికి చెందిన తాటిపర్తి వసంతు పాపారావు సమాచారం అందించాడు. ఘటనా స్ధలానికి వెళ్లి చూడగా కుమార్తె ఉరివేసుకుని వేలాడుతూ మృతిచెంది ఉంది. కుమార్తె మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ పాపారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు. బైక్ దొంగలకు 12 నెలల జైలు గండేపల్లి: బైక్ దొంగలకు కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించినట్టు సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. రాజమహేంద్రవరానికి చెందిన తోట వినయ్ (లోఫర్), ఐసెట్టి దివాకర్ (బన్నీ) కలిసి మండలంలోని సూరంపాలెంకు చెందిన వెలుగుల బాలాజీ జూలై 11న తన కూతురిని స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు కాలేజీలో దింపేందుకు వెళ్లి మోటార్ సైకిల్ను పార్క్చేసి కాలేజీలోకి వెళ్లి వచ్చే సరికి బైక్ మాయమైందన్నారు. ఎసై యూవి శివ నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి బైక్ చోరీకి పాల్పడిన ఇద్దరిని అరెస్ట్చేసి కోర్టుకు తరలించగా పెద్దాపురం జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎల్ దేవి రత్నకుమారి ఒక్కొక్కరికి 12 నెలలు చొప్పున జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించినట్టు తెలిపారు. -
కొత్త కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం
కాకినాడ రూరల్: కొత్తగా కానిస్టేబుళ్లుగా ఎంపికై న 282 మందికి తొమ్మిది నెలల శిక్షణను జిల్లా ఎస్పీ బిందుమాధవ్ రమణయ్యపేటలోని ఏపీఎస్పీ మూడో బెటాలియన్ క్యాంపులో సోమవారం ప్రారంభించారు. శిక్షణకు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్తగా రూపొందించిన క్రిమినల్ చట్టాలను ఎంతో శ్రద్ధాసక్తులతో నేర్చుకోవాలని, శిక్షణను సీరియస్గా తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి కమాండెంట్ దేవానందరావు, అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ కేవీ సత్యనారాయణ, అసిస్టెంట్ కమాండెంట్ గంగరాజు తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్కు 556 అర్జీలు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 556 అర్జీలు సమర్పించారు. వారి నుంచి జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్తో పాటు వివిధ శాఖల అధికారులు అర్జీలు స్వీకరించారు. బియ్యం కార్డుల మంజూరు, ఇళ్ల స్థలాలు, ఆన్లైన్లో భూమి వివరాల నమోదు, పూడికల తొలగింపు, పారిశుధ్యం, సంక్షేమ పథకాల లబ్ధి వంటి సమస్యలు పరిష్కరించాలని ప్రజలు అర్జీలు సమర్పించారు. వీటిని గడువులోగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను జేసీ ఆదేశించారు. ఆలిండియా సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్స్లో రజతం నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): పాట్నాలో ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకూ జరిగిన ఆలిండియా సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల క్రీడా పోటీల్లో యు.కొత్తపల్లి మండలం మూలపేట జెడ్పీ హైస్కూల్ వ్యాయామోపాధ్యాయిని సునీత రజత పతకం సాధించారు. అథ్లెటిక్స్ 35–45 సంవత్సరాల కేటగిరీ లాంగ్జంప్లో ఆమె ఈ ఘనత సాధించారు. అలాగే, 100 మీటర్ల పరుగు పందెంలో ఆరో స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా సోమవారం తనను మర్యాదపూర్వకంగా కలిసిన సునీతను జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్ అభినందించారు. కార్యక్రమంలో డీఈఓ కార్యాలయ ఏడీ షరీఫ్, వ్యాయామోపాధ్యాయ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎల్.జార్జి పాల్గొన్నారు. సర్పవరం ఏఎస్సైకి డీజీపీ మెడల్ కాకినాడ రూరల్: సర్పవరం ఏఎస్సై ఎం.నాగేశ్వరరావు డీజీపీ మెడల్కు ఎంపికయ్యారు. పోలీసు శాఖలో ఉత్తమ సేవలందిస్తున్న అధికారులు, సిబ్బందికి డీజీపీ అవార్డులను సోమవారం ప్రకటించారు. దీనికి జిల్లా నుంచి ఇద్దరు ఎంపికవగా వీరిలో ఏఎస్సై నాగేశ్వరరావుతో పాటు ట్రాఫిక్ ఏఎస్సై హోదాలో జిల్లా స్పెషల్ బ్రాంచ్లో అటాచ్మెంట్ ద్వారా విధులు నిర్వర్తిస్తున్న రేగడమిల్లి వెంకట సత్య భాస్కర్ కూడా ఉన్నారు. వీరు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే కార్యక్రమంలో డీజీపీ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోనున్నారు. వీరితో పాటు ఏపీఎస్పీ 3వ బెటాలియన్ నుంచి పలువురు డీజీపీ మెడల్కు ఎంపికయ్యారు. అద్దేపల్లి ప్రభుకు సాహితీ వేదిక పురస్కారం సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అనేక సంవత్సరాలు గా సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ‘రాజమండ్రి సాహితీ వేదిక’ కాకినాడకు చెందిన రచయిత అద్దేపల్లి ప్రభుకు 2025 సంవత్సరానికి ‘సాహితీ వేదిక పురస్కారం’ ప్రకటించింది. ఈ నెల 25న స్థానిక గౌతమీ గ్రంథాలయంలో జరిగే సంస్థ వార్షిక సమావేశంలో ప్రభు కు పురస్కారంతో పాటు రూ.20 వేల నగదు అందజేస్తున్నట్లు నిర్వాహకురాలు కుప్పిలి పద్మ తెలిపారు. క్లిష్టమైన వర్తమానాన్ని తన కథల్లో, కవితల్లో ఆవిష్కరిస్తూ, తెలుగు సాహిత్యానికి చేర్పునిస్తున్నందుకు గాను ఆయనకు ఈ పురస్కారం ఇస్తున్నట్లు వివరించారు. ప్రభు ఇప్పటికే ఆవాహన, పారిపోలేం, పిట్ట లేని లోకం, పర్యావరణ ప్రయాణాలు, దుఃఖపు ఎరుక కవితా సంపుటాలను, ‘సీమేన్’ కథా సంపుటిని ప్రచురించారు. -
మరచిన సొమ్ము ఇదిగో..
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): చాలా మందికి వివిధ బ్యాంకుల్లో ఖాతాలుంటాయి. బదిలీ జరిగో, బతుకు తెరువు కోసమో ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లినప్పుడు పాత బ్యాంకు ఖాతాలను పలువురు వినియోగించరు. అందులో ఉన్న సొమ్ము గురించి మరచిపోతూంటారు. అలాగే, కుటుంబ సభ్యులెవరైనా మరణిస్తే వారి ఖాతాలోని సొమ్ము గురించి వారసులకు ఏమాత్రం తెలిసే అవకాశం ఉండదు. ఇన్నాళ్లూ ఇటువంటి సొమ్మును కనీసం క్లెయిమ్ చేసే అవకాశం కూడా ఉండటం లేదు. దీంతో, బ్యాంకు వినియోగదార్లు నష్టపోతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గుర్తించింది. వారికి మేలు చేసే లక్ష్యంతో అన్ క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ (ఉద్గమ్) పోర్టల్ను ప్రారంభించింది. దీని ద్వారా క్లెయిమ్ చేయని ఖాతాలను ఖాతాదారులు స్వయంగా తనిఖీ చేసుకోవచ్చు. అటువంటి ఖాతాదారులు, వారి వారసులు సంబంధిత బ్యాంకులను సంప్రదించి, తగు ఆధారాలు సమర్పిస్తే అన్క్లెయిమ్డ్ సొమ్మును తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పదేళ్లు అంతకు మించి లావాదేవీలు జరగని ఖాతాల్లోని సొమ్మును ఆయా బ్యాంకులు తిరిగి చెల్లిస్తున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్, సేవింగ్స్, కరెంట్ ఖాతాలకు ఈ అవకాశం వర్తిస్తుంది. జిల్లాలో 39 బ్యాంకులుండగా వాటి పరిధిలో 351 బ్రాంచిలున్నాయి. అన్క్లెయిమ్డ్ సొమ్ము రూ.101.22 కోట్లు ఏళ్ల తరబడి ఎటువంటి లావాదేవీలు జరగని వాటిని డిపాజిట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (డీఈఏ) ఫండ్ ఖాతాలుగా బ్యాంకర్లు పేర్కొంటున్నారు. ఈవిధంగా జిల్లావ్యాప్తంగా 5,72,938 వ్యక్తిగత ఖాతాల్లో రూ.83.36 కోట్లు, 10,048 సంస్థల ఖాతాల్లో రూ.12.60 కోట్లు, 5,535 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల ఖాతాల్లో రూ.5.26 కోట్లు కలిపి మొత్తం 5,88,521 ఖాతాల్లో రూ.101.22 కోట్లు ఉన్నాయి. అత్యధికంగా స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలోని 1.50 లక్షల ఖాతాల్లో దాదాపు రూ.45 కోట్లు ఈవిధంగా మూల్గుతున్నాయి. ఆ తరువాతి స్థానంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. ఖాతాదారు నేరుగా సంబంధిత బ్యాంకుకు వెళ్లి కెయిమ్ ఫామ్ నింపి, నో యువర్ కస్టమర్(కేవైసీ)కు సంబంధించిన ఆధారాలు సమర్పిస్తే ఆయా ఖాతాల్లోని సొమ్ము తిరిగి చెల్లిస్తారు. ఒకవేళ ఖాతాదారు మృతి చెందితే వారి వారసులు సంబంధిత వ్యక్తి మరణ ధ్రువపత్రం కూడా సమర్పించాలి. సద్వినియోగం చేసుకోవాలి ఆర్బీఐ కల్పించిన ఈ అవకాశాన్ని అర్హులైన ఖాతాదార్లు వినియోగించుకోవాలి. ఇప్పటికీ వీటిపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటి వరకూ జిల్లాలో దాదాపు 3 కోట్ల మంది వరకూ ఖాతాదారులకు రిఫండ్ చేశాం. – చందాల శ్రీవెంకట ప్రసాద్, జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఎల్డీఎం), కాకినాడ ఉద్గమ్ పోర్టల్తో వివరాలు గతంలో ఏళ్ల తరబడి లావాదేవీలు జరగని ఖాతాల్లోని వివరాలు తెలుసుకోవాలంటే ఖాతాదార్లు ఆయా బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు అన్ని బ్యాంకులకు సంబంధించి ఈ వివరాలను ఉద్గమ్ పోర్టల్ ద్వారా ఒకేచోట తెలుసుకోవచ్చు. దీనికోసం మొదట ఉద్గమ్ అధికారిక వెబ్సైట్లో మొబైల్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. పేరు, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ ఎంటర్ చేయాలి. ఎవరి పేరిట డబ్బుందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారో వారి వివరాలు ఇచ్చి సెర్చ్ చేయాలి. ఆ వెంటనే ఆ పేరిట ఏ బ్యాంకులో ఎంత అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఉందో స్క్రీన్పై కనిపిస్తుంది. అనంతరం ఆయా బ్యాంకు బ్రాంచిలను పూర్తి ఆధారాలతో సంప్రదించాలి. సమాచారం ఇలా.. అన్క్లెయిమ్డ్ డిపాజిట్లకు సంబంధించి ఆయా బ్యాంకు మేనేజర్లు తమ పరిధిలోని ఖాతాదారులకు లేదా వారి వారసులకు ఫోన్, మెసేజ్, రిజిస్టర్డ్ పోస్టు ద్వారా సమాచారం అందించాలని ఆదేశించారు. అప్పటికీ స్పందన లేకపోతే సచివాలయ సిబ్బందికి వివరాలు అందజేయాలి. వారు ఆ సమాచారాన్ని ఆయా ఖాతాదారులకు లేదా వారి వారసులకు తెలియజేస్తారు. అన్క్లెయిమ్డ్ డిపాజిట్లపై బ్యాంకులు మూడు నెలలుగా ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నాయి. ఈ శిబిరాలు ఈ నెల 31తో పూర్తవుతాయి. ఈ అంశంపై ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులు ప్రతి వారం సమీక్షిస్తున్నారు. ఫ బ్యాంక్ ఖాతాలో వదిలేసిన నగదు తిరిగి పొందే చాన్స్ ఫ ఆర్బీఐ మార్గదర్శకాలు ఫ ఆధారాలతో దరఖాస్తు చేస్తే చెల్లింపులు ఫ బ్యాంకుల కసరత్తు ఫ 31 వరకూ గడువు -
జగ్గంపేటలో రక్తదాన శిబిరం
జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట నరసింహం ఆధ్వర్యాన జగ్గంపేటలోని పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి తోట శ్రీరాంజీ సహా నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు. కేక్ కట్ చేసి, వేడుకలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు జగ్గంపేటలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అన్నసమారాధన నిర్వహించారు. పార్టీ నాయకులు రామూర్తి జగాలు, గుల్లా ఏడుకొండలు, ఎంపీపీ చలగల్ల దొరబాబు, బండారు రాజా, పెద్దాడ రాజబాబు, దాసరి పెదకాపు, పాటి చినబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఒమ్మి రఘురాం, జెడ్పీటీసీ సభ్యురాలు బిందుమాధవి ఆధ్వర్యంలో జగ్గంపేటలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. గండేపల్లి, కిర్లంపూడిల్లో కూడా వేడుకలు ఘనంగా జరిగాయి. సామర్లకోటలో వైద్య శిబిరాలు సామర్లకోట అన్నపూర్ణ కల్యాణ మండపంలో వైఎస్సార్ సీపీ పెద్దాపురం కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆధ్వర్యాన భారీ ఎత్తున రక్తదాన, నేత్ర, వైద్య శిబిరాలు నిర్వహించారు. దొరబాబు, పార్టీ నేతలు కేక్ కట్ చేసి చిన్నారికి, దివ్యాంగునికి తినిపించారు. కాకినాడ రోటరీ బ్లడ్ బ్యాంకు వైద్యుడు కామరాజు ఆధ్వర్యాన సిబ్బంది రక్తం సేకరించారు. పలువురు ప్రజలు కంటి, బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకున్నారు. పెద్దాపురం క్రిస్టియన్పేటలో ఐటీ సెల్ అధ్యక్షుడు వి.ఇమ్మానియేల్ రాజు ఆధ్వర్యాన దొరబాబు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో రాష్ట్ర కార్యదర్శి నెక్కంటి సాయిప్రసాద్, రాష్ట్ర అయ్యెరక సంఘం అధ్యక్షుడు ఆవాల లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసీ మంగతాయారు, సీనియర్ నాయకుడు దవులూరి సుబ్బారావు, ఎంపీపీలు బొబ్బరాడ సత్తిబాబు, పెంకే సత్యవతి, జెడ్పీటీసీ సభ్యుడు గవరసాని సూరిబాబు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు అత్తిలి వెంకట సీతారామస్వామి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఇనకొండ విష్ణుచక్రం తదితరులు పాల్గొన్నారు. -
సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
కష్టాల్లో ఉన్న వారికి అండాదండ కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలిచిన వైఎస్ జగన్ నేటి రాజకీయాల్లో అరుదైన నాయకుడని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కాకినాడ సిటీ కో ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు. జగన్ పుట్టిన రోజు వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ సిటీ కార్యాలయంలో ద్వారంపూడి కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. జగన్నాథపురంలోని పార్టీ కార్యాలయంలో పేదలకు పండ్లు, చీరలు పంపిణీ చేశారు. మహర్షి సాంబమూర్తి ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అన్న సమారాధన చేశారు. ఈ సందర్భంగా ద్వారంపూడి మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిరంతరం పోరాడుతున్న జగన్కు ప్రతి కార్యకర్తా తోడుగా నిలవాలని అన్నారు. ప్రజల కోసమే నిరంతరం పోరాడిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడిగా జగన్కు ఉన్న ప్రజాదరణ ఎక్కడా చెక్కు చెదరలేదన్నారు. ఆయన మరోసారి సీఎం కావడం ఖాయమని అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, యువజన, బీసీ విభాగాల జిల్లా అధ్యక్షులు రాగిరెడ్డి బన్నీ, అల్లి రాజబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఉప్పాడలో వైఎస్ విగ్రహాష్కరణ
పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ.. పేదల పక్షపాతిగా నిలిచిన వైఎస్ జగన్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు, పిఠాపురం కో ఆర్డినేటర్ వంగా గీతా విశ్వనాథ్, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. జగన్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా కొత్తపల్లి మండలం ఉప్పాడలో వైఎస్సార్ విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. జెడ్పీటీసీ సభ్యుడు గుబ్బల తులసీకుమార్, పార్టీ ఎస్ఈసీ సభ్యుడు రావు చిన్నారావు, కారె శ్రీను, ఆనాల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. గీత ఆధ్వర్యాన శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకూ గొల్లప్రోలు, పిఠాపురం, ఉప్పాడ కొత్తపల్లి మండలాల్లో జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిఠాపురం ఉప్పాడ సెంటర్లో నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయంలో గీత కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచారు. పేదలకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు, దుర్గాడ, కొడవలి, వన్నెపూడి తదితర గ్రామాల్లో జెడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల లోవరాజు ఆధ్వర్యాన జగన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. గొల్లప్రోలులో పార్టీ జిల్లా కార్యదర్శి అముజూరి రాంబాబు వృద్ధులకు, దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర కార్యదర్శి కొప్పన శివనాథ్, గండేపల్లి బాబీ తదితరులు పాల్గొన్నారు. -
మహోన్నతుడు వాజ్పేయి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి దేశ సంక్షేమమే లక్ష్యంగా పని చేసిన మహోన్నత వ్యక్తి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో కలిసి ఆదివారం ఆయన ప్రారంభించారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సత్యనిష్టతో దేశానికి దిశానిర్దేశం చేసిన ఏకై క నేత వాజ్పేయి అని అన్నారు. మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, స్వర్ణ చతుర్భుజి, గ్రామీణ సడక్ యోజన, సర్వశిక్షాభియాన్ వంటి అనేక పథకాలకు వాజ్పేయి శ్రీకారం చుట్టారని అన్నారు. అమెరికాను సైతం ఎదిరించి అణు పరీక్షలు నిర్వహించారన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. -
ఫ శిరస్త్రాణం.. శిరో రక్షణం
ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న ఎంతో మంది హెల్మెట్పై సరైన అవగాహన లేక.. ఉన్నా పెట్టుకోక.. ప్రమాదాలకు గురైనప్పుడు అర్ధాంతరంగా అసువులు బాస్తున్నారు. కుటుంబ సభ్యులకు తీరని క్షోభను మిగిలిస్తున్నారు. ఈ నేపథ్యంలో హెల్మెట్ వాడకంపై వాహన చోదకులకు అవగాహన కల్పించే లక్ష్యంతో పోలీసులు ఆదివారం ఉప్పాడ బీచ్ రోడ్డులో వినూత్నంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ, ద్విచక్ర వాహనచోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ప్రాణ రక్షణ పొందాలని అన్నారు. ప్రాణరక్షణలో హెల్మెట్ పాత్ర, ప్రయోజనాలు, ట్రాఫిక్ నిబంధనలు, సేఫ్ డ్రైవింగ్, రోడ్డు ప్రమాదల నివారణ, ప్రయాణాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడపడం వలన ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే జరిమానా, జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. లైసెన్సులు, ఇన్సూరెన్సులు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్సై వెంకటేష్, సిబ్బంది పాల్గొన్నారు. – కొత్తపల్లి -
భారతం సమగ్ర వేదవాజ్మయం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్) భారతం సమగ్ర వేదవాజ్ఞ్మయమని, విజ్ఞాన సర్వస్వమని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. వ్యాసభారత ప్రవచన యజ్ఞాన్ని స్థానిక హిందూ సమాజంలో ఆయన ఆదివారం కొనసాగించారు. భారతంలోని కథలు, ఉపదేశాలు, ఉపాఖ్యానాలు, పాత్రల మధ్య కానవచ్చే సంవాదాల్లో విస్తారమైన ధర్మబోధ ఉంటుందని చెప్పారు. ధర్మం లేనప్పుడు జ్ఞానం వికసించదన్నారు. ‘భారతంలో ముఖ్యంగా మూడు విచారధారలు కనపడతాయి. జీవవిచారం– నేను ఎవరు అనే ప్రశ్న. ధర్మవిచారం– ఏది ధర్మం అనే ప్రశ్న, బ్రహ్మవిచారం– బ్రహ్మం అంటే ఏమిటి? ఈ మూడు విభాగాలకు సంబంధించిన రహస్యాలకు భారతం పరిష్కారం చూపుతుంది’ అని అన్నారు. ‘బ్రాహ్మణుడంటే ఎవరు అని ధర్మరాజును నహుషుడు అడుగుతాడు. సత్యం, దానం, క్షమ, శీలం, క్రూరత్వం లేకపోవడం, తపస్సు, దయ ఇత్యాది లక్షణాలు కలవాడే బ్రాహ్మణుడని ధర్మరాజు సమాధానం చెబుతాడు’ అని వివరించారు. వేదాలు, పురాణాలతో పాటు భారతంలో అనేక సందర్భాల్లో సరస్వతీ నది ప్రస్తావన కనబడుతుందని, అనేక పరిశోధనలు ఈ ప్రాచీన నది ఉనికిని నిర్ధారించాయని చెప్పారు. పాశ్చాత్యులు కుట్రలతో ఈ పరిశోధనలను అణగదొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘దివ్యాస్త్రాలతో తిరిగి వచ్చిన అర్జునుడు తన సోదరులను, ద్రౌపదిని కలుసుకుంటాడు. దివ్యాస్త్రాలను ప్రదర్శన కోసం వినియోగించరాదని, అల్పులపై ప్రయోగించరాదని అతడికి నారదుడు హితోపదేశం చేస్తాడు. అలాగే, క్రోధం పాపహేతువని, దీనిని నియంత్రించుకోవాలని భీముడికి కుబేరుడు చెబుతాడు’ అని సామవేదం చెప్పారు. తొలుత భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు మాట్లాడుతూ, సౌగంధికా పుష్పాలను తీసుకురావడానికి వెళ్లిన భీముడి ద్వారా మనకు హనుమద్దర్శనం జరిగిందని, ఇక రామ దర్శనమే తరువాయని అన్నారు. -
జాతీయ స్థాయి కరాటే పోటీలు ప్రారంభం
సామర్లకోట: స్థానిక ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని డీఎన్ఆర్ కల్యాణ మండపంలో జాతీయ స్థాయి కరాటే పోటీలు ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. స్థానిక కరాటే కోచ్ డి.శంకర్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ పోటీల్లో 10 రాష్ట్రాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వివిధ కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు. లయన్స్ క్లబ్ మొదటి వైస్ గవర్నర్ చిట్టినీడి శ్రీనివాసరావు, కరాటే ఇండియా చీఫ్ మల్లికార్జునగౌడ్ ఈ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పూర్వ గవర్నర్ ఈదల ఈశ్వర కుమార్, జిల్లా చైర్మన్ చిత్తూలూరి వీర్రాజు, క్లబ్ అధ్యక్షుడు డాక్టరు అమలకంటి శ్రీనివాసరావు, కార్యదర్శి బడుబు బాబీ, కోశాధికారి ఏలేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. సైక్లింగ్ మంచి వ్యాయామం నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ప్రతి రోజూ ఒక గంట సైకిల్ తొక్కడం శరీరానికి మంచి వ్యాయామమని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్డీఓ) వి.సతీష్ కుమార్ తెలిపారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా కాకినాడలో ఆదివారం నిర్వహించిన ర్యాలీని ఆయన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ(డీఎస్ఏ)లో జెండా ఊపి ప్రారంభించారు. డీఎస్ఏలో వివిధ క్రీడల్లో శిక్షణ పొందుతున్న చిన్నారులు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. డీఎస్ఏ నుంచి నాగమల్లితోట జంక్షన్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకూ, తిరిగి డీఎస్ఏ వరకూ ఈ ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో డీఎస్ఏ కోచ్లు సమీర్, నాగేంద్ర, సురేష్, సత్తి చిన్నారి, కనకదుర్గ, క్రీడాకారులు పాల్గొన్నారు. 75.11 శాతం మందికి పోలియో చుక్కలు కాకినాడ క్రైం: జిల్లావ్యాప్తంగా ఆదివారం పల్స్పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కాకినాడ రామారావుపేట అర్బన్ పీహెచ్సీలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ఓ) నరసింహ నాయక్తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ చుక్కల మందు ఇప్పించి, రాష్ట్రాన్ని పోలియో రహితంగా తీర్చిదిద్దడంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. కాగా, జిల్లావ్యాప్తంగా 1,94,437 మంది ఐదేళ్లలోపు పిల్లలుండగా 1,46,061 మందికి (75.11 శాతం) పోలియో చుక్కలు వేశామని డీఎంహెచ్ఓ ఒక ప్రకటనలో తెలిపారు. తొలి రోజు బూత్ల స్థాయిలో పూర్తి చేశామని, రానున్న రెండు రోజుల్లో క్షేత్ర స్థాయి బృందాలు ఇంటింటికీ వెళ్లి, మిగిలిన పిల్లలకు పోలియో చుక్కల మందు వేస్తాయని వివరించారు. రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి నిడదవోలు: రైలు నుంచి జారి పడి నిడదవోలు – నవాబుపాలెం రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి (40) మృతి చెందాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. ఆ వ్యక్తి ఒంటిపై పచ్చ రంగు టీ షర్టు, నాచు రంగు ఫ్యాంట్ ఉన్నాయి. మృతదేహన్ని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై పి.అప్పారావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతుని ఆచూకీ తెలిసినవారు 94906 17090 80191 57528 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. -
జననేతకు జేజేలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన దార్శనికుడు.. సంక్షేమ ప్రదాత.. పేదల బాంధవుడు.. విద్యార్థులకు మావయ్యగా.. పింఛనర్లకు పెద్ద కొడుకుగా.. అక్కచెల్లెమ్మలకు సోదరుడిగా.. రాజకీయాల్లో సమున్నత విలువలకు పెద్దపీట వేసిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు జిల్లావ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు జననేత జన్మదిన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని జేజేలు పలికారు. పెద్ద ఎత్తున కేక్లు కట్ చేసి, మిఠాయిలు పంచి, సంబరాలు చేసుకున్నారు. రక్తదాన శిబిరాలు, దుప్పట్లు, పండ్ల పంపిణీ తదితర రూపాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించి, తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమ ప్రియతమ నేతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పేదల అభ్యున్నతే జగన్ జీవితాయశం పేదల అభ్యున్నతి కోసం జీవిత కాలం పని చేసే శక్తిని, హోదాను వైఎస్ జగన్కు దేవుడు ప్రసాదించాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆకాంక్షించారు. రమణయ్యపేట వైద్య నగర్లోని పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో జగన్ బర్త్డే కేక్ను ఆయన కట్ చేసి, అందరికీ పంచారు. వృద్ధాశ్రమాల్లో పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఐదేళ్ల జగన్ పరిపాలనలో రెండేళ్లు కోవిడ్తో పోయినా.. ఆయన అందించిన సంక్షేమం, అభివృద్ధి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని కన్నబాబు అన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు నురుకుర్తి రామకృష్ణ, పార్టీ ఎస్ఈసీ సభ్యుడు బెజవాడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఫ ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఫ జిల్లావ్యాప్తంగా సంబరాలు చేసుకున్న ప్రజలు ఫ విస్తృతంగా సేవా కార్యక్రమాలు -
ఇల్లు ఇచ్చి.. సోదరిగా బట్టలు పెట్టారు
సామర్లకోట జగనన్న కాలనీకి చెందిన బండి విశాల భర్త సింహాచలం కోవిడ్ సమయంలో మరణించారు. ఎటువంటి ఉపాధీ లేక, దిక్కు లేని స్థితిలో ఉన్న ఆమె కుటుంబానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ప్రత్తిపాడు రోడ్డులో ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాకుండా స్వయంగా ఆమె ఇంటిని ప్రారంభించారు. గృహప్రవేశ సమయంలో సోదరిగా భావించి, తనకు బట్టలు పెట్టడం ఎప్పటికీ మరచిపోలేనని విశాల చెమర్చిన కళ్లతో చెప్పారు. అటువంటి ముఖ్యమంత్రినే ప్రజలు కోరుకుంటారని అన్నారు. మహిళా సంఘంలో సభ్యురాలు కావడంతో బ్యాంకు నుంచి తీసుకున్న రుణానికి ఉచిత వడ్డీ సైతం ఆమెకు అమలు చేశారు. దీంతో నాలుగు వాయిదాల్లోనే విశాల రుణ బకాయి మొత్తం చెల్లించారు. మహిళా సంఘంలో సభ్యురాలిగా ఉండటంతో ఇంటి నిర్మాణానికి రుణం సైతం సులభంగానే లభించింది. ప్రస్తుతం ఆ రుణ బకాయి ఉండటంతో నోటీసులు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలోనే విశాల పెద్ద కుమార్తె మేఘన ఫీజు రీయింబర్స్మెంట్ సాయంతో బీఎస్సీ పూర్తి చేసి, డిప్లమో చేసింది. చిన్న కుమార్తె కీర్తిప్రియకు అమ్మ ఒడి పథకం అమలైంది. ప్రస్తుతం ఆమె బీకాం చదువుతోంది. ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకూ ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు. తమ ఒక్క కుటుంబానికి ఇన్నివిధాల సాయం చేసిన జగన్ మేలును జీవితాంతం గుర్తుంచుకుంటామని, తమ ఆయుష్షు కూడా పోసుకుని, ఆయన నూరేళ్లు సంపూర్ణ జీవితం గడపాలని విశాల ఆకాంక్షించారు. -
ఐహెచ్ఆర్సీ ఉపాధ్యక్షుడిగా బిషప్ డాక్టర్ థామస్
నియామక పత్రం అందచేసిన జాతీయ అధ్యక్షుడు సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్(ఐహెచ్ఆర్సీ) భారతదేశ ఉపాధ్యక్షుడిగా బిషప్ డాక్టర్ అరుల్ థామస్ సెల్వనాథన్ నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కుందవరం రాజానందన్ విజ్ఞాన్ ఢిల్లీలో అందచేశారు. కొన్నేళ్లుగా మానవ హక్కులకు సంబంధించి డాక్టర్ థామస్ విశేషమైన సేవలను అందిస్తున్నారు. ఐహెచ్ఆర్సీ తరఫున ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ మానవ హక్కులపై ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. ఇందుకు గాను ఇండియన్ చాప్టర్ (దేశ) ఉపాధ్యక్షుడిగా డాక్టర్ థామస్ను నియమించారు. ఈ పదవి తనకు మరింత బాధ్యతను పెంచిందని డాక్టర్ థామస్ పేర్కొన్నారు. -
తొలి తిరుపతికి భక్తుల తాకిడి
పెద్దాపురం (సామర్లకోట): పెద్దాపురం మండలంలో తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తిరుపతి గ్రామంలో వెలసిన శృంగార వల్లభ స్వామి వారిని శనివారం సుమారు 15 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.1,40,560, అన్నదాన విరాళాలు రూ.58,652, కేశఖండన ద్వారా రూ.3,080, తులాభారం ద్వారా రూ.100, లడ్డూ ప్రసాద విక్రయం ద్వారా రూ.16,860 కలిపి మొత్తం రూ.2,19,252 ఆదాయం వచ్చిందని వివరించారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ధ్వజస్తంభంతో పాటు ఆలయ ప్రాంగణాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. 24న రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ పోటీలు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ చాంపియన్షిప్ పోటీలు ఈ నెల 24న పెద్దాపురం లూథరన్ హైస్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘ కార్యదర్శి కె.సుబ్రహ్మణ్యం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు తమ ఒరిజనల్ సర్టిఫికెట్లతో లూథరన్ హైస్కూల్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. ఆక్రమణలు తొలగించాలిబోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లావ్యాప్తంగా పంచాయతీ, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ కార్పొరేషన్, పబ్లిక్ హెల్త్ పరిధిలోని కాలువలు, చెరువులు, డ్రైన్లపై ఆక్రమణలను గుర్తించి, ప్రణాళిక ప్రకారం తొలగించాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం జరిగిన వాచ్ డాగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి నెలా లక్ష్యం నిర్దేశించుకుని ఆక్రమణలు తొలగించాలన్నారు. కాలువలు, చెరువులు, డ్రైనేజీల్లో ప్రవాహానికి అడ్డు తగిలే తూడు, గుర్రపు డెక్క, ఇతర చెత్త తొలగింపుపై దృష్టి పెట్టాలని సూచించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మనీష, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, కాకినాడ ఆర్డీఓ ఎస్.మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. జనవరి 18న చలో ఖమ్మం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వచ్చే నెల 18న ఖమ్మంలో జరిగే సీపీఐ శత వార్షికోత్సవ ముగింపు సభను విజయవంతం చేసేందుకు చలో ఖమ్మం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు తెలిపారు. చలో ఖమ్మం కరపత్రాలను స్థానిక పీఆర్ భవన్లో శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సీపీఐ శత వార్షికోత్సవాలు ఈ నెల 26తో పూర్తవుతాయన్నారు. ఖమ్మం సభకు జిల్లా నుంచి విద్యార్థులు, యువత భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 20 నుంచి 26 వరకూ వాడవాడలా సీపీఐ పతాకావిష్కరణలు, ప్రదర్శనలు, ఉత్సవాలు జరపాలని కోరారు. జిల్లా స్థాయి శత వార్షికోత్సవ ముగింపు బహిరంగ సభ ఈ నెల 27న సామర్లకోటలో జరగనుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఇంటింటి ప్రచారాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ చట్టం పేరు మార్పు వలన జరిగే నష్టాలపై పల్లె పల్లెనా కూలీలకు వివరించాలని, మోదీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు నిర్వహించాలని కోరారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థి, యువజన సంఘాలను కలుపుకుని విద్యాలయాల్లో సెమినార్లు, ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని మధు కోరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పిల్లలకు స్క్రీనింగ్ పరీక్షలు
కాకినాడ క్రైం: స్థానిక జీజీహెచ్లో చీలిక పెదాలు, అంగిలి సవరణ చికిత్సా శిబిరం శనివారం ప్రారంభమైంది. మిషన్ స్మైల్ ఇండియా ఫినాలెక్స్, ముకుల్ మహదేవ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ శిబిరాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి ప్రారంభించారు. బాధిత బాలల్ని గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ప్లాస్టిక్ సర్జరీ హెచ్ఓడీ డాక్టర్ రత్నభూషణ్ పర్యవేక్షణలో అనస్తీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రతాప్, డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ వైద్యులు శిశిర్రెడ్డి, రేఖాదేవి ఆధ్వర్యంలో చేపట్టారు. మొత్తం 66 మంది బాలలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. -
కల నెరవేరింది
కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామానికి చెందిన కర్రి చక్రధరరావు, విజయకుమారి దంపతులది పేద కుటుంబం. ముగ్గురు కుమారులు. కుటుంబ పోషణ కోసం గ్రామంలో చిన్న మెడికల్ షాపు నిర్వహించుకుంటున్నారు. పెద్దబ్బాయి పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. రెండో అబ్బాయి తమన్ సాయినందన్ కుటుంబానికి చేయూతగా ఉండాలని బీ ఫార్మసీ చేయాలని కలలు కన్నాడు. ఆర్థిక పరిస్థితి సహకరించక అతడిని చదివించేందుకు చక్రధరరావు దంపతులు వెనుకంజ వేశారు. అయితే, వారి మొరను వైఎస్ జగన్మోహన్రెడ్డి రూపంలో దేవుడు ఆలకించాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తమన్కు 2021లో భీమవరం విష్ణు కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో సీటు వచ్చింది. డబ్బులిచ్చి చదివించే స్తోమత లేకున్నా నాడు జగన్ అమలు చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ ఆదుకుంది. ఏడాదికి రూ.60,300 చొప్పున మొత్తం రూ.2,41,200 ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం కూడా వచ్చింది. తమన్ సాయినందన్ ఇప్పుడు రాజమహేంద్రవరంలోని ఓ మెడికల్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ, ప్రతి నెలా రూ.27,500 జీతం పొందుతూ తమకు ఆసరాగా ఉన్నాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. మూడో కుమారుడికి కూడా జగన్ ప్రభుత్వ హయాంలోనే బీటెక్ సీటు వచ్చింది. ప్రస్తుతం ఆంధ్రా యూనివర్సిటీలో అతడు బీటెక్ చదువుతున్నాడు. జగనన్న వల్లనే తమ కుటుంబంలో ముగ్గురు అబ్బాయిలు ఉన్నత విద్య చదువుకోగలిగారని, ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ చేదోడుగా ఉన్నారని చక్రధరరావు దంపతులు చెబుతున్నారు. తమ బిడ్డలకు మంచి భవిష్యత్తును అందించిన జగన్ నిండు నూరేళ్లూ చల్లగా ఉండాలని, మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు. తన ఉన్నత చదువుల కలను నిజం చేసిన జగన్కు తమన్ సాయినందన్ కృతజ్ఞతలు చెబుతున్నారు. – కాకినాడ రూరల్ -
చైతన్య కెరటం చెకుముకి
● రాష్ట్ర స్థాయి సంబరాలకు కాకినాడ సిద్ధం ● మూడోసారి ఆతిథ్యమిస్తున్న ఉమ్మడి జిల్లా ● రాష్ట్ర వ్యాప్తంగా 312 మంది హాజరు ● శాస్త్రవేత్తలతో 162 మంది విద్యార్థులు మమేకం కపిలేశ్వరపురం: మానవుని దైనందిన జీవితంలో సైన్స్ భాగం కావాలన్న లక్ష్యంతో జన విజ్ఞాన వేదిక 37 ఏళ్లుగా కృషి చేస్తోంది. విద్యార్థుల్లో విజ్ఞానం, సమాజం పట్ల చైతన్యం కల్పించే దిశగా చెకుముకి సంబరాలను ఏటా నిర్వహిస్తోంది. ఈ ఏడాది రాష్ట్ర స్థాయి సంబరాలను కాకినాడ జేఎన్టీయూకేలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కథనం.. విద్యార్థులు ప్రతిభ ఇలా.. అక్టోబర్ 18న పాఠశాల స్థాయిలోనూ, నవంబర్ 4న మండల స్థాయిలోనూ చెకుముకి పరీక్ష నిర్వహించి మండలానికి ఒక్కో బృందం చొప్పున జిల్లా పోటీలకు ఎంపిక చేశారు. నవంబర్ 23న కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో జిల్లా స్థాయి సంబరాలను నిర్వహించారు. వారిలో ప్రథమ స్థానంలో నిలిచిన ప్రభుత్వ, ప్రైవేటు విభాగాలకు ఒక్కో బృందం చొప్పున ఆదివారం నుంచి రాష్ట్ర స్థాయి సంబరాలకు ఎంపిక చేశారు. కోనసీమ జిల్లా ప్రభుత్వ విభాగం నుంచి మండపేట రూరల్ మండలం ద్వారపూడి జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థుల బృందం, ప్రైవేటు విభాగంలో మండపేట పట్టణంలోని అన్నపూర్ణ ఉన్నత పాఠశాల విద్యార్థుల బృందం ప్రథమ స్థానంలో నిలిచాయి. తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ విభాగం నుంచి సీతానగరం మండలం రఘుదేవపురం పీఎంశ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ప్రైవేటు విభాగం నుంచి రాజానగరంలోని శ్రీప్రకాష్ విద్యానికేతన్ విద్యార్థులు నిలిచారు. కాకినాడ జిల్లా ప్రభుత్వ విభాగం నుంచి పిఠాపురం ఆర్ఆర్ బీహెచ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ప్రైవేటు విభాగం నుంచి కాకినాడ గంగరాజునగర్లోని ఆదిత్య ఇంగ్లిష్ మీడియం పాఠశాల విద్యార్థుల బృందం ప్రథమ స్థానాల్లో నిలిచాయి. కాకినాడలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి చెకుముకి పోటీల్లో ఆయా బృందాల ప్రాజెక్టులు ప్రదర్శించనున్నారు. రాష్ట్ర స్థాయి సంబరాల ప్రత్యేకతలివీ కాకినాడలోని జేఎన్టీయూకేలో మూడు రోజుల పాటు రాష్ట్ర స్థాయి సంబరాలు నిర్వహించనున్నారు. 2015లో జేఎన్టీయూకేలోనూ, 2014లో పెద్దాపురం శ్రీప్రకాష్ విద్యాలయంలోనూ రాష్ట్ర స్థాయి సంబాలను నిర్వహించారు. ప్రస్తుత సంబరాలకు రాష్ట్రం నలుమూలల నుంచి 54 బృందాలుగా 162 మంది విద్యార్థులు చెకుముకి పరీక్షలో పాల్గొననున్నారు. మరో 150 మంది తల్లిదండ్రులు హాజరుకానున్నారు. ఒక్కో బృందానికి ఒక్కో గైడ్ టీచర్ హాజరవుతారు. హైదరాబాద్ సీసీఎంబీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వేగేశ్న రాధ, విశాఖపట్టణం డీఆర్డీఓ శాస్త్రవేత్త డాక్టర్ యు.అర్బన్కుమార్, ప్రొఫెసర్ రామచంద్రయ్య, ప్రొఫెసర్ లక్ష్మారెడ్డిలతో మీట్ ది సైంటిస్ట్ నిర్వహిస్తారు. అలాగే విద్యార్థి బృందాలకు రాత పరీక్ష నిర్వహిస్తారు. వ్యక్తిగతంగా కాకుండా విద్యార్థుల బృందంగానే ప్రతిభను పరిగణిస్తారు. ప్రాక్టికల్, ఆడియో, వీడియో విజువల్ క్విజ్ రౌండ్ తదితర ప్రతిభా పోటీలను నిర్వహిస్తారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థి బృందాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను ఎంపిక చేస్తారు. విద్యార్థులను క్షేత్ర పరిశీలన విభాగంలో మడ అడవుల సందర్శనకు తీసుకెళ్తారు. తల్లిదండ్రులకు వివిధ సామాజిక అంశాలపై చర్చావేదిక నిర్వహిస్తారు. జీవితంలో సైన్స్ భాగం కావాలి ప్రజల దైనందిన జీవితంలో సైన్స్ భావాలను కల్పించడమే లక్ష్యంగా జనవిజ్ఞాన వేదిక కృషి చేస్తోంది. ఆ లక్ష్యంలో భాగంగా 8, 9, 10 విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, చదువు పట్ల ఆసక్తి, చిన్ననాటి నుంచీ సమానత్వం, ఇచ్చిపుచ్చుకునే ధోరణి, సమష్టి ఆచరణ పద్ధతులను అలవాటు చేయడానికి కృషి చేస్తున్నాం. కాకినాడలోని రాష్ట్ర స్థాయి సంబరాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. జీఎస్హెచ్పీ వర్మ, ఆహ్వాన సంఘం కార్యదర్శి, కాకినాడ చెకుముకి సంబరాల నేపథ్యమిదీ మానవుల్లో అజ్ఞానాన్ని తొలగించేందుకు పలువురు మేధావులు 1988 ఫిబ్రవరి 28న జన విజ్ఞాన వేదికను స్థాపించారు. విద్యార్థి చెకుముకి పేరుతో 1990 డిసెంబరు నుంచి సైన్స్ మాస పత్రికను, 2010 నుంచి ‘చెకుముఖి సైన్స్ సంబరాలు’ను నిర్వహిస్తుంది. నేర్చుకున్నది గుర్తుంచుకోవడం కాకుండా ఆచరించగలగడమే గీటురాయి అని చెప్పడమే సంబరాల ఉద్దేశం. వ్యక్తిగా కాకుండా సమూహంగా విజ్ఞాన ప్రదర్శనకు ప్రాధాన్యం ఇస్తుండటం చెకుముకి మరో ప్రత్యేకత. -
జాతీయ ఖోఖో పోటీలకు లావణ్యశ్రీ
అంబాజీపేట: తొండవరం జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న సవరపు లావణ్యశ్రీ జాతీయ ఖోఖో పోటీలలో పాల్గొననున్నట్టు హెచ్ఎం పీవీ కేశవాచార్యులు, పీడీ పెచ్చెట్టి సూర్యనారాయణ తెలిపారు. గత నెల విజయనగరంలో జరిగిన అండర్–19 బాలికల ఖోఖో రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల పోటీల్లో లావణ్యశ్రీ పాల్గొందన్నారు. ఈ పోటీలలో ఆమె అత్యంత ప్రతిభ కనబర్చి ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున జాతీయ పోటీలకు ఎంపికై ందన్నారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఈ నెల 22 నుంచి 27 వరకు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఆమె పాల్గొననుందన్నారు. లావణ్యశ్రీని పలువురు అభినందించారు. -
అగ్ని ప్రమాదంలో పూరిళ్లు దగ్ధం
నిరాశ్రయులైన పేద కుటుంబాలు తొండంగి: మండలంలోని శృంగవృక్షంలో శనివారం అగ్నిప్రమాదం సంభవించి ఏడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. శృంగవృక్షం గ్రామశివారు పి.అగ్రహారం రహదారిలో సుమారు పది కుటుంబాల వారు ఈ ఇళ్లలో నివసిస్తున్నారు. కొబ్బరి చీపుర్లు, పాములు పట్టడం, ఉడుములు పట్టడం వంటి కుటుంబ వృత్తులతో వారు జీవిస్తుంటారు. శనివారం మధ్యాహ్నం ఓ ఇంటిలో వంట చేస్తుండగా పొయ్యిలోని మంటలు చెలరేగి పై కప్పునకు వ్యాపించాయి. ఈదురుగాలుల ప్రభావంతో మరో ఐదిళ్లకు మంటలు వ్యాపించి క్షణాల్లో అవి కాలిపోయాయి. మగవారు పనికి వెళ్లడంతో ఇళ్లలోని మహిళలు, పిల్లలు కేకలు వేయడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి ఈ లోపు మంటలు ఆర్పేందుకు చేతనైన చర్యలు తీసుకున్నారు. అగ్నిమాపక శకటం వచ్చేటప్పటికే ఆ పూరిళ్లన్నీ కాలిపోయాయి. తోట రమణ, రావూరి శివ, పుట్టం పోలయ్య, తుపాకుల వెంకటలక్ష్మి, బండి సత్తిబాబు, పంజాపు లక్ష్మి, పుట్టం రాజు తదితర కుటుంబాల వారి ఇంటి సామగ్రితో పాటు నగదు కాలిపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. సుమారు రూ.పది లక్షల ఆస్తినష్టం ఉంటుందని బాధితులు వాపోయారు. కట్టుబట్టలతో మిగిలిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్ కాంతారావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అట్టహాసంగా టెన్నిస్ టోర్నీ పెద్దాపురం (సామర్లకోట): సీనియర్ జాతీయ ర్యాంకర్స్ టెన్నిస్ టోర్నమెంట్ శనివారం పెద్దాపురం లిటరరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అట్టహసంగా ప్రారంభమైంది. 35 ప్లస్, 40 ప్లస్, 45 ప్లస్, 50 ప్లస్, 55 ప్లస్, 60 ప్లస్, 65ప్లస్, 70ప్లస్, 70 ప్లస్ విభాగాలలో టెన్నిస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏటా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పోటీలలో భాగంగానే ఈ పోటీలు ఈనెల 23 వరకు జరుగుతాయని చెప్పారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. లిటరరీ అసోసియేషన్ క్లబ్ ఆహ్లాదకరమైన వాతావారణంలో పోటీలు నువ్వా, నేనా అన్నట్టు సింగిల్స్, డబుల్స్ పోటీలు జరిగాయి. డ్రైవర్ నిర్లక్ష్యం... ప్రయాణికురాలికి గాయం ప్రత్తిపాడు: ఉచిత బస్సు.. ప్రయాణికుల రద్దీకి తోడు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ప్రయాణికురాలు గాయపడిన ఘటన శనివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు ఏలేశ్వరం మండల కేంద్రానికి చెందిన బి.దివ్య బంధువు వి.పరిమళతో కలిసి పెద్దాపురం మండలం పులిమేరు వెళ్లేందుకు పయనమయ్యారు. ఏలేశ్వరం నుంచి యర్రవరం వచ్చిన వారిద్దరూ ప్రత్తిపాడు వెళ్లేందుకు రాజమహేంద్రపురం డిపోకు చెందిన తుని వెళ్లే బస్సు ఎక్కుతుండగా డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును కదిలించారు. దీంతో దివ్య అదుపుతప్పి పడిపోయింది. దీనిపై ప్రయాణి కులు డ్రైవర్పై ఆగ్రహంతో విరుచుకుపడడంతో అదే బస్సులో ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో తరలించారు. చికిత్స అనంతరం ఆమె స్వగ్రామానికి వెళ్లిపోయింది. -
భక్తజన సంద్రమైన వాడపల్లి
కొత్తపేట: ఏడు వారాలస్వామి వాడపల్లి వెంకన్న ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసింది. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రానికి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులు స్వామిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు అర్చనలు చేశారు. దేవస్థానానికి ఒక్క రోజు ఆదాయం రూ 62.53 లక్షలు సమకూరినట్టు ఈఓ తెలిపారు. సాధారణ భక్తులతో పాటు ఏడు శనివారాలు.. ఏడు ప్రదక్షిణ చేస్తున్న భక్తులతో వాడపల్లి క్షేత్రం భక్తజన సంద్రమైంది. అనంతరం తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. ఎస్సై రాము ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ట్రాఫిక్ను క్రమబద్ధీకరణ, బందోబస్తు నిర్వహించారు. ఒక్క రోజు ఆదాయం రూ.53.36 లక్షలు వాడపల్లి క్షేత్రానికి వేలాదిగా తరలివచ్చిన భక్తుల విశిష్ట దర్శనం, ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనం, ఆన్లైన్, నిత్య, శాస్వత అన్నదానం విరాళాలు, లడ్డు విక్రయం తదితర రూపాల్లో శనివారం ఒక్కరోజు రాత్రి 9 గంటల వరకూ దేవస్థానానికి రూ.53,36,577 ఆదాయం వచ్చినట్టు ఈఓ చక్రధరరావు తెలిపారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా రాత్రి రావులపాలేనికి చెందిన సాయి నటరాజ కళాపీఠం కళాకారిణుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వారికి దేవస్థానం వారు మెమెంటోలు అందచేశారు. శనైశ్చరుని ఆదాయం రూ.2.49 లక్షలు కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన మందపల్లి ఉమా మందేశ్వర (శనైశ్చర) స్వామి వారిని శనివారం అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించి, ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు చేశారు. దేవస్థానం చైర్మన్ దారపురెడ్డి సురేష్బాబు ఆధ్వర్యంలో భక్తుల పూజలకు ఏర్పాట్లు చేశారు. భక్తుల ప్రత్యక్ష పూజలు, తైలాభిషేకాల టిక్కెట్ల ద్వారా దేవస్థానానికి రూ.1,28,670, పరోక్ష పూజలు, మనియార్డర్లు ద్వారా రూ.86,600, అన్నప్రసాదం విరాళాలు రూపంలో రూ.33,954 మొత్తం రూ.2,49,224 ఆదాయం వచ్చినట్టు ఈఓ సురేష్బాబు తెలిపారు. -
మా ఊరిని మార్చింది జగనే..
ఒకప్పుడు మా ఊరు అభివృద్ధికి ఆమడ దూరం. ఏ చిన్న పనికై నా పిఠాపురం వెళ్లాల్సిందే. దీంతో వృద్ధులు, దివ్యాంగులు, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలూ అవస్థలు పడేవారు. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి, మా గ్రామం రూపురేఖలు మారిపోయాయి. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే), ఆసుపత్రి, అంగన్వాడీ కేంద్రం, పాల కేంద్రం, తాగునీటి ఓవర్హెడ్ ట్యాంకు, డ్రైనేజీలు, పాఠశాలలకు నూతన భవనాలు.. ఇలా సుమారు రూ.5 కోట్ల వరకూ మా గ్రామంలో అభివృద్ధి పనులు జరిగాయి. విత్తు నాటిన నాటి నుంచి పంట డబ్బు చేతికి వచ్చే వరకూ అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే బాధ్యత తీసుకుంది. ఆర్బీకేల ద్వారా రైతులకు అన్ని సేవలూ అందుబాటులోకి వచ్చాయి. పింఛన్లు ఇంటింటికీ అందించారు. వైఎస్ జగన్ హయాంలో సర్పంచ్గా పని చేయడం పూర్వ జన్మ సుకృతం. ఒక మనిషి తలరాత దేవుడు రాస్తాడనేది ఎంత నిజమో.. గ్రామాల తలరాతను మార్చింది వైఎస్ జగన్ అనేది అంతే నిజం. – బండి వెంకట సుబ్బారావు (సుబ్బులు), సర్పంచ్, మాధవపురం, పిఠాపురం మండలంపిఠాపురం మండలం మాధవపురంలో జగన్ హయాంలో నిర్మించిన ఆస్పత్రి నాడు–నేడు పనులతో అభివృద్ధి చేసిన పాఠశాలఫ సంక్షేమ, అభివృద్ధి ప్రదాత వైఎస్ జగన్ ఫ గత వైఎస్సార్ సీపీ పాలనలో రూ.వేల కోట్లతో సంక్షేమంఫ మేనిఫెస్టోలో ప్రకటించని పథకాలు సైతం అమలుఫ జననేత మళ్లీ రావాలని సర్వత్రా ఆకాంక్ష ఫ నేడు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆ ఐదు వసంతాలు.. రాష్ట్ర సంక్షేమ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించాయి.. పల్లెపల్లెనా ప్రగతి గీతికను ఆలపించాయి.. ‘అన్నా.. నాకీ కష్టం వచ్చింద’ని చెప్పిందే తడవు.. గుండె కరగి.. కళ్లు చెమ్మగిల్లి.. ఆపన్నులకు అండగా నిలిచిన కాలమది. అది సంక్షేమ సారథి.. అభివృద్ధి వారధిగా నిలిచిన జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పరిపాలనకు మానవత్వాన్ని జోడించిన తరుణమది. 2019కి ముందు.. ‘పచ్చ’పాలకుల తుచ్ఛ విధానాలతో కష్టాల కొలిమిలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ను అడుగడుగునా స్పృశిస్తూ.. అన్ని వర్గాల ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ.. సుదీర్ఘ పాదయాత్ర సాగించిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్.. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి రాగానే ఆ సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. నవరత్న పథకాలు అమలు చేశారు. దేశ చరిత్రలోనే మునుపెన్నడూ చూడని రీతిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.వేల కోట్లతో సంక్షేమాన్ని అందించారు. ఫలితంగా నిరుపేద కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. పేదలు, మధ్యతరగతి వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయి. అంతకుముందు ఎప్పుడూ లేని విధంగా లక్షలాదిగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. కొత్త పరిశ్రమలకు, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) చేయూతనిచ్చారు. ప్రతి నెలా ఏదో ఒక రూపంలో ప్రజలకు లబ్ధి చేకూర్చారు. ఆ సంక్షేమ, అభివృద్ధి ప్రదాత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేక్ల కటింగ్తో పాటు, సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మళ్లీ ఆ జననేత ముఖ్యమంత్రి కావాలని, ప్రస్తుత పాలకుల హయాంలో ఎదుర్కొంటున్న కష్టాల నుంచి తమను గట్టెక్కించాలని ఆకాంక్షిస్తున్నారు. విద్యారంగం.. స్వర్ణయుగం ఫ జగన్ పాలనంతా విద్యారంగానికి స్వర్ణయుగంగానే నిలిచింది. ఫ జిల్లాలో 933 ప్రాథమిక, 105 ప్రాథమికోన్నత, 247 ఉన్నత కలిపి 1,285 పాఠశాలలున్నాయి. నాడు – నేడు మొదటి విడతలో 441 పాఠశాలల అభివృద్ధికి రూ.132 కోట్లు, రెండో విడతలో 881 పాఠశాలలకు రూ.334 కోట్లు మంజూరు చేశారు. ఫ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు కార్పొరేట్తో పోటీ పడేలా దృశ్య, శ్రవణ విద్యను జగన్ అందుబాటులోకి తెచ్చారు. 2022 డిసెంబర్ 21న తన పుట్టిన రోజును పురస్కరించుకుని 8వ తరగతి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు ట్యాబుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. మొత్తం 380 పాఠశాలల్లో రూ.126 కోట్లతో 41,230 మంది విద్యార్థులకు వీటిని సమకూర్చారు. దివ్యాంగ విద్యార్థులకు సైతం 250 ట్యాబులు అందజేశారు. ఫ 247 ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లు (ఐఎఫ్పీ) సమకూర్చడం ద్వారా డిజిటల్ విద్యా బోధనకు శ్రీకారం చుట్టారు. అలాగే, 933 ప్రాథమిక పాఠశాలల్లోని 1 నుంచి 5 తరగతుల విద్యార్థుల కోసం స్మార్ట్ టీవీలు అందజేశారు. ఫ ఏటా విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే విద్యార్థుల చేతికి జగనన్న విద్యా కానుక కింద ఒక్కో విద్యార్థికి రూ.2,419 విలువైన మూడు జతల యూనిఫాం, పాఠ్య, నోట్ పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, స్కూల్ బ్యాగ్, బెల్టు, బ్యాగ్, 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు, 1–5 తరగతి విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీలతో కూడిన కిట్ అందించేవారు. ఈవిధంగా 1,59,797 మంది విద్యార్థులకు ఏటా రూ.30 కోట్లు వెచ్చించారు. నాడు ఇచ్చిన స్కూల్ బ్యాగులనే ఇప్పటికీ విద్యార్థులు వినియోగిస్తున్నారంటే వాటి నాణ్యత ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జగనన్న విద్యాకానుకను చంద్రబాబు సర్కార్ గద్దెనెక్కాక అందజేసిన బ్యాగ్లు ఆరు నెలలు కూడా తిరగకుండానే చిరిగిపోయి మూలకు చేరాయి. ఫ అమ్మ ఒడి పథకం ద్వారా అర్హులైన 1.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఏటా రూ.1,140 కోట్ల మేర జమ చేసేవారు. ఫలితంగా అప్పటి వరకూ పనుల్లోకి వెళ్లే విద్యార్థులను వారి తల్లిదండ్రులు బడులకు పంపించడం, ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు, హాజరు శాతం పెరగడాన్ని అప్పట్లో విద్యాశాఖాధికారులు గుర్తించారు. గాలికొదిలేసిన నేటి సర్కారు విద్యారంగంలో వైఎస్ జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణలను నేడు చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. అమ్మ ఒడి పేరును తల్లికి వందనమంటూ మార్చి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఈ పథకం కింద ప్రతి ఇంట్లో పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామన్న చంద్రబాబు, పవన్ మాటలు వట్టి గారడీగా మిగిలాయి. పైగా అనేక సాకులతో విద్యార్థుల సంఖ్యలో గణనీయంగా కోత పెట్టేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకూ ఫీజు రీయింబర్స్మెంట్ ఊసే లేకుండా పోయింది. ఫలితంగా ప్రైవేటు విద్యా సంస్థల్లోని విద్యార్థులు నానా ఇబ్బందులూ పడుతున్నారు. అన్నదాతకు పెద్దపీట దేశానికి తిండి పెట్టే అన్నదాతలకు నాటి సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారు. దేశంలోనే తొలిసారిగా వినూత్న రీతిలో వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. తద్వారా రైతులపై ప్రీమియం భారం లేకుండా చేయూతనందించారు. దీనిని కౌలు రైతులకు, దేవదాయ భూములు కౌలుకు చేసే రైతులకు కూడా వర్తింపజేశారు. ఫలితంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గడచిన ఐదేళ్లలో ప్రకృతి విపత్తులతో పంటలు నష్టపోయిన 1,35,353 రైతులు రూ.29,638.79 కోట్ల మేర బీమా పరిహారాన్ని అందుకున్నారు. కౌలు రైతులకు కూడా గుర్తింపు కార్డులు, రైతులందరికీ ఈ–క్రాప్ నమోదు తప్పని సరి చేయడంతో ఇది సాధ్యమైంది. సొంతింటి కల సాకారం పేదల సొంతింటి కలను జగన్ సాకారం చేశారు. రూ.1,531.40 కోట్లతో 3,600.99 ఎకరాలు సేకరించి 319 జగనన్న కాలనీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1,52,316 మందికి ఇంటి స్థలాలు అందించారు. తొలి విడత ఇళ్ల నిర్మాణానికి గాను 71 వేల మందికి నిధులు కూడా మంజూరు చేశారు. కాకినాడలో ఐఐఎఫ్టీ జాతీయ స్థాయిలో ఢిల్లీ, కోల్కతా తరువాత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్టీ) మూడో క్యాంపస్ కాకినాడకు దక్కడం జగన్ సర్కార్ కృషి ఫలితమే. దీని కోసం గుజరాత్, రాజస్థాన్, ఒడిశా తదితర రాష్ట్రాల మధ్య గట్టి పోటీ నెలకొన్న తరుణంలో కాకినాడలో ఏర్పాటు చేసేలా నాటి ముఖ్యమంత్రి జగన్ అవిరళ కృషి చేశారు. దీని కోసం కాకినాడ ఎస్ఈజెడ్లో జగన్ 25 ఎకరాలు కేటాయించారు. ఆయన హయాంలోనే కేంద్రం నుంచి సాధించిన రూ.229 కోట్లతో ఈ క్యాంపస్లో భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. బాగుబడి మండల కేంద్రమైన గోకవరం గ్రామానికి చెందిన షేక్ నాగూర్ వలీబాబా, షేక్ యాకూబీబీ దంపతులది మధ్యతరగతి కుటుంబం. వలీబాబా కారు డ్రైవర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వారి ఒక్కగానొక కుమారుడు షేక్ బషీర్ను ఉన్నత చదువులు చదివించాలని దంపతులిద్దరూ ఆశ పడేవారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందో లేదోననే భయంతో ఐదో తరగతి వరకూ స్థానిక ప్రైవేటు పాఠశాలలో చేర్పించారు. ఫీజులు చెల్లించడానికి అప్పులు చేయాల్సి వచ్చేది. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత, ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించి మెరుగైన విద్యను అందించారు. ఆయనపై నమ్మకంతో వలీబాబా తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. 6 నుంచి 8వ తరగతి వరకూ స్థానిక ఎంపీయూపీ, 9, 10 తరగతులు జెడ్పీ హైస్కూల్లో చదివించారు. ఆ పాఠశాలలను నాడు–నేడు పథకంలో పూర్తిగా ఆధునీకరించి, మెరుగైన వసతులు కల్పించారు. దీంతో, షేక్ బషీర్ పదో తరగతిలో 447 మార్కులు సాధించాడు. తమ కుమారుడికి బంగారు భవిష్యత్తును అందించిన జగన్.. దేవుని ఆశీస్సులతో కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలని వలీబాబా దంపతులు కోరుకుంటున్నారు. – గోకవరం -
మీరు నిలిపిన ప్రాణాలే..
ఫ కాకినాడకు చెందిన అలీముద్దీన్ అన్సారీ రెండున్నరేళ్ల కుమారుడు 13 నెలల వయసులో ప్రైమరీ ఇమ్యూనో డెఫిషియన్సీతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్సకు భారీ ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. అమెరికన్ ఆంకాలజీ హాస్పిటల్ వైద్యులు చిన్నారికి చికిత్స అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అన్సారీ అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకున్నారు. ఇలా చేసుకున్న కొద్ది రోజుల వ్యవధిలోనే రూ.10 లక్షల ఆర్థిక సాయం అందింది. ఫ కాకినాడకు చెందిన పుచ్చకాయల మాధవి 50 ఏళ్ల వయసులో తలతో రక్తం గడ్డకట్టి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. నాటి ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వానికి తన బాధను చెప్పుకుంది. అప్పటి సీఎం జగన్ తక్షణమే స్పందించి ఆమె వైద్యానికి రూ.5 లక్షలు విడుదల చేసి ఆమె ప్రాణాలు నిలిపారు. ఆమె ఇప్పుడు పూర్తిగా కోలుకొని సాధారణ జీవితం గడుపుతోంది. తన యావత్ కుటుంబం తనపై ఆధారపడి ఉందని, తనకేమైనా అయి ఉంటే తన కుటుంబం రోడ్డున పడేదని ఆవేదన వ్యక్తం చేసింది. – కాకినాడ క్రైం -
మంగళసూత్రాలే టార్గెట్
కాకినాడ క్రైం: మహిళల మెడలో మంగళసూత్రాలు లాక్కుని వెళ్తున్న నలుగురు చైన్ స్నాచర్లను పోలీసులు అరెస్టు చేశారు. మంగళసూత్రాల చోరీలే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఈ నలుగురు రోడ్లపై వెళ్తున్న మహిళల మెడల నుంచి చాకచక్యంగా లాక్కుని వెళ్లడంలో ఆరితేరిపోయారు. వీరి ఆటలను జిల్లా పోలీసులు కట్టించారు. సంబంధిత వివరాలను ఎస్పీ బిందుమాధవ్ శనివారం కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. జిల్లాలో పలు ప్రాంతాలకు చెందిన నలుగురు దొంగలు ఇటీవల కాలంలో చైన్ స్నాచింగ్లు చేస్తూ బెంబేలు పుట్టిస్తున్నారు. మోటార్ సైకిళ్లపై సంచరిస్తూ రోడ్లపై వెళ్తున్న ఒంటరి మహిళలు, వృద్ధులను లక్ష్యంగా ఎంచుకుంటారు. పరస్పర సమన్వయంతో ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తారు. వరుస దొంగతనాలపై నిఘా పెట్టిన కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ డీఎస్ చైతన్యకృష్ణ తన బృందాన్ని అప్రమత్తం చేశారు. ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు, కాకినాడ ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ పర్యవేక్షణలో దొంగల జాడకోసం జల్లెడ పట్టారు. సీఐ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయని ఎస్పీ తెలిపారు. కాజులూరు, తాళ్లరేవు, కరప మండలాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతుండగా ఈ బృందాలు ఆయా ప్రాంతాల్లో దొంగల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాయన్నారు. ఎట్టకేలకు దొంగలు తాళ్లరేవు మండలం పరదేశమ్మ పేటకు చెందిన మల్లాడి విజయ్కుమార్, సీతారాంపురం కొత్తకాలనీకి చెందిన పెసింగి రాధాకృష్ణ, కాకినాడ జగన్నాథపురానికి చెందిన మల్లాడి సతీష్, తాళ్లరేవు మండలం సీతమ్మపురానికి చెందిన పరంశెట్టి బుజ్జి వెంకట దుర్గారావులను శుక్రవారం సాయంత్రం నామవానిపాలెం మార్గంలో అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు. వీరు 24 చోరీలకు పాల్పడ్డారని తెలిపారు. ముద్దాయిల నుంచి రూ.56 లక్షల విలువైన 452 గ్రాముల బంగారంతో పాటు, ఐదు ద్విచక్ర వాహనాలను, నేరాలకు వినియోగించిన రెండు ద్విచక్రవాహనాలను సీజ్ చేశామన్నారు. దొంగల్ని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఇన్స్పెక్టర్ డీఎస్ చైతన్యకృష్ణతో పాటు ఆయన బృందాన్ని ఎస్పి ప్రత్యేకంగా అభినందించారు. ● నలుగురు చైన్ స్నాచర్ల అరెస్టు ● రూ.56 లక్షల విలువైన 452 గ్రాముల బంగారం రికవరీ -
సదాచారమున్నచోట కలి ప్రవేశించలేడు
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): సదాచారమున్న చోట కలి ప్రవేశించలేడని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. హిందూ సమాజంలో వ్యాస భారత ప్రవచనాన్ని ఆయన శుక్రవారం కొనసాగించారు. ‘స్వయంవరంలో నలుడిని దమయంతి వరించిందని తెలుసుకున్న కలి పురుషుడు వారిద్దరినీ కష్టాలపాలు చేయాలనుకున్నాడు. నలుడిలో ప్రవేశించడానికి కలి పురుషునికి 12 సంవత్సరాలు పట్టింది. మూత్రవిసర్జనానంతరం ఒకనాడు పాద ప్రక్షాళన చేసుకోకుండా సంధ్యోపాసన చేయడంతో నలుడిలోకి కలి ప్రవేశించగలిగాడు. ఎంత ఉపాసన, పాండిత్యం ఉన్నా సదాచారాన్ని వదిలిపెట్టరాదు. ఆచారాలు చాదస్తాలు కావు. అంటూసొంటూ, ఎంగిలీ అన్నిటినీ వదలి లలితా, విష్ణు సహస్రనామాలు చదివితే ప్రయోజనం ఉండదు’ అని చెప్పారు. ‘‘ద్యూతానికి నలుడిని పుష్కరుడు ఆహ్వానించగా, కలి ప్రభావంతో అతడు అంగీకరిస్తాడు. తన నేస్తమైన ద్వాపరుడి పాచికల్లో కలి ప్రవేశిస్తాడు. పరాజితుడైన నలుడు దమయంతీ సమేతంగా వనాలకు వెళ్తాడు. పిల్లలను పుట్టింటికి పంపించి భర్తను దమయంతి అనుసరిస్తుంది. ద్యూతమాడటం తన భర్త దోషం కాదని, అతనిలో ఏదో మోహం ప్రవేశించిందని గుర్తిస్తుంది. కష్టకాలంలో భర్తను అనుసరించాలి. దుఃఖ సమయంలో భర్తను ఓదార్చగల భార్యతో సమానమైన ఔషధం లేదని నలునితో అంటుంది. ‘నాస్తి భార్యా సమం మిత్రమ్’ అని ఆమె మాటను అంగీకరిస్తూనే, తనతో ఆమె కష్టాలు పడరాదని, పుట్టింటికి వెళ్లిపోవాలని నలుడు అంటాడు. అందుకు దమయంతి అంగీకరించదు. భార్యాభర్తల మాట తీరు ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే– రామాయణంలో సీతారాముల సంభాషణ, భారతంలో యుధిష్ఠిర ద్రౌపదీ సంవాదాలు, నల దమయంతుల మాట తీరును పరిశీలించాలి. ఎంతటి విపత్కర పరిస్థితుల్లో సైతం నోరు మూసుకుని పడి ఉండాలంటూ వారు ఒకరినొకరు గద్దించుకోలేదు. పటిష్టమైన వివాహ వ్యవస్థ ఉన్న మన దేశంలో భార్యాభర్తలు స్పర్థలతో విడిపోవడాలు, విడాకుల తగాదాలు బాధాకరం. అంతరించిపోతున్న మహాసంస్కృతి చివరి దశలో ఉన్నామేమో’’ అని సామవేదం ఆందోళన వ్యక్తం చేశారు. జీవితంలో ఎదురయ్యే సుఖదుఃఖాలను బట్టి భార్యాభర్తలు నిర్ణయాలు తీసుకోరాదని, అవి శాశ్వతం కావని, ధర్మమొక్కటే శాశ్వతమని అన్నారు. శకుంతల, దమయంతి, ద్రౌపది, కుంతి వంటి పాత్రలు భారత సీ్త్ర ఔన్నత్యాన్ని తెలియజేస్తాయని వివరించారు. -
పవన్ సభ కోసం.. పచ్చని చెట్లపై వేటు
పెరవలి: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా ఉంది జనసేన నేతల తీరు. ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ శనివారం పెరవలిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు జాతీయ రహదారి పక్కన ఉన్న పలు చెట్లను నరికివేశారు. విషయం తెలియడంతో హైవే అధికారులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. చెట్లు ఎందుకు, ఎవరిని అడిగి నరుకుతున్నారని ప్రశ్నించారు. దీంతో, జనసేన కార్యకర్తలు వెనక్కు తగ్గారు. అయితే, అప్పటికే పచ్చగా ఉన్న సుమారు 10 చెట్లపై వేటు వేసేశారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎక్కడైనా సభ నిర్వహిస్తే చెట్లు నరికివేస్తున్నారంటూ ఏమీ జరగకపోయినా కూటమి నేతలు రచ్చ చేసేవారు. అటువంటిది ఇప్పుడు జనసేన శ్రేణులు చెట్లు నరికివేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. టీడీపీ, బీజేపీ దూరం! మరోవైపు పవన్ సభకు కూటమి నేతల నుంచి పెద్దగా సహకారం అందడం లేదని తెలుస్తోంది. జాతీయ రహదారి పైన, సభా ప్రాంగణం వద్ద జనసేన జెండాలు, ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. టీడీపీ, బీజేపీ జెండాలు, ప్లెక్సీలు మచ్చుకు కూడా కానరావడం లేదు. కొంత కాలంగా నిడదవోలు నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య విభేదాలు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, కందుల దుర్గేష్ కలసి మాట్లాడుకున్నా మండల, నియోజకవర్గ నాయకుల్లో మాత్రం అంతర్గత విభేదాలు బలంగానే ఉన్నాయి. అందువల్లనే జనసేన నేతలు తప్ప, కూటమిలోని మిగిలిన పార్టీల నాయకులెవ్వరూ సభా ప్రాంగణానికి రావడం లేదని పలువురు చెబుతున్నారు.పెరవలిలో జాతీయ రహదారి పక్కన నరికేసిన చెట్లు -
నీరు ఎలా పంపాలి?
అన్నవరంలోని పంపా రిజర్వాయర్ అన్నవరం: పంపా రిజర్వాయర్ కింద ఈ ఏడాది రబీ సాగుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినా.. ఎన్ని ఎకరాలకు నీరు సరఫరా చేస్తారనే దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. ప్రస్తుతం పంపా నదీ గర్భంలో నిర్మిస్తున్న పోలవరం అక్విడెక్ట్ పనులు జరుగుతున్నాయి. ఇవి వేగంగా జరగాలంటే పంపా రిజర్వాయర్ నీటిమట్టం 91 అడుగులకు తగ్గించాలని పోలవరం అధికారులు కోరుతున్నారు. మరోవైపు నీటిని వృథాగా వదిలేయడంకన్నా రబీకి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పంపా రిజర్వాయర్ అధికారులు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. ఇది జరగాలంటే పంపాకు ఏలేరు నుంచి నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. ఏలేరు నుంచి ఎన్ని క్యూసెక్కుల నీరు విడుదల చేస్తారనే దానిపై పంపా ఆయకట్టులో ఎన్ని వేల ఎకరాల్లో రబీ సాగు జరుగుతుందనేది ఆధారపడి ఉంటుంది. రబీకి నీటి కొరత పంపా రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 103 అడుగులు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 0.43 టీఎంసీలు. పంపా పూర్తి ఆయకట్టు 12,500 ఎకరాల్లో ఖరీఫ్ పంటల సాగుకు సుమారు 1.5 టీఎంసీల నీరు అవసరమవుతోంది. అయితే, ఆ సమయంలో వర్షాలు కురుస్తాయి కాబట్టి రిజర్వాయర్ నుంచి నీటి అవసరం తక్కువగా ఉంటుంది. ఈ ఏడాది ఖరీఫ్లోనూ అదే జరిగింది. వర్షాలు దండిగా కురవడంతో రైతులు పూర్తి స్ధాయి ఆయకట్టులో వరి సాగు చేశారు. అదే పూర్తి స్థాయి ఆయకట్టులో రబీ సాగు జరగాలంటే పంపా రిజర్వాయర్ నుంచి నీరు పుష్కలంగా అందాలి. పది వేల ఎకరాల్లో సాగు చేయాలంటే ఒక టీఎంసీ నీరు అవసరం. కానీ, పంపాలో గరిష్ట స్థాయిలో 0.43 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉంటోంది. ప్రస్తుతం పంపాలో నీటిమట్టం 97.5 అడుగులు ఉంది. నీటి నిల్వలు 0.25 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. మొత్తం 10 వేల ఎకరాల్లో రబీ సాగు జరగాలంటే మరో 0.75 టీఎంసీల నీరు అవసరం. ఏలేరే గతి పంపా ఆయకట్టులో నీటి కొరతను అధిగమించాలంటే ఏలేరు రిజర్వాయర్పై ఆధారపడటం మినహా మరో మార్గం కనిపించడం లేదు. రౌతులపూడి మండలం శృంగవరం వద్ద ఏలేరు కాలువ నుంచి రోజుకు గరిష్టంగా 50 క్యూసెక్కుల వరకూ నీటిని పంపాకు విడుదల చేయవచ్చు. అంతకంటే ఎక్కువ నీటిని విడుదల చేస్తే పక్కనే ఉన్న పొలాలు ముంపునకు గురవుతాయి. అందువలన అక్కడి రైతులు అంగీకరించరు. జనవరి 1 నుంచి మార్చి నెలాఖరు వరకూ ఏలేరు నుంచి నీటిని విడుదల చేసినా.. ప్రస్తుతం పంపాలో ఉన్న నీటితో కలిపి సుమారు 6 వేల ఎకరాల్లో మాత్రమే రబీ సాగుకు వీలవుతుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో రెండు పంటలకూ నీరు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో పంపా జలాశయం కింద రెండు పంటలకూ పుష్కలంగా నీరందించారు. పంపాతో పాటు పుష్కర కాలువ నీటితో ఖరీఫ్, ఏలేరు నుంచి విడుదల చేసిన నీటితో రబీ సాగు సుమారు 10 వేల ఎకరాల్లో జరిగేలా చర్యలు తీసుకున్నారు. గత ఏడాది అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ ఏడాది ఖరీఫ్ సాగుకు మాత్రమే నీరిచ్చింది. పంపా బ్యారేజీ గేట్ల మరమ్మతుల పేరిట గత ఏడాది రబీకి నీరివ్వలేదు. పైగా పోలవరం అక్విడెక్ట్ పనుల పేరుతో పంపా నీటిని దిగువకు వృథాగా వదిలేశారు. దీంతో, పంపా ప్రాజెక్ట్లో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటి, అన్నవరం గ్రామంతో పాటు, సత్యదేవుని ఆలయానికి కూడా నీటి సమస్య ఏర్పడే పరిస్థితి ఉత్పన్నమైంది. ఒక దశలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నవరం వచ్చి పరిస్థితిని సమీక్షించి, ఏలేరు నీటిని పంపాకు విడుదల చేసేలా ఆదేశించారు. అదే సమయంలో ఆ నీటి విడుదల వలన పోలవరం అక్విడెక్ట్ పనులకు ఆటంకం కలగకుండా ప్రత్యేకంగా కాలువ, పైప్లైన్ వేయించారు. స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసం.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గత ఏడాది రబీలో పంపా ఆయకట్టు నీటికి ఎగనామం పెట్టింది. వచ్చే ఏడాది స్థానిక సంస్ధల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అందువలన ఈసారైనా సాగునీరు ఇవ్వకపోతే తొండంగి, తుని మండలాల్లోని పంపా ఆయకట్టు రైతుల్లో తీవ్ర అసంతృప్తి వస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా 10 వేల ఎకరాల్లో రబీ సాగుకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఏలేరు నుంచి 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేయించి రబీకి నీరందిస్తామని వారు చెబుతున్నట్లు సమాచారం. అయితే, పంపా కాలువకు ఇరువైపులా ఉన్న గ్రామాల్లోని 6 వేల ఎకరాల్లో మాత్రమే రబీ సాగుకు నీరు సరఫరా చేయగలమని, అంతకు మించి సాగు చేస్తే పంట చివరిలో నీటి సమస్య తలెత్తుతుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకే.. పంపా ఆయకట్లులో రబీ సాగు ఎంత విస్తీర్ణంలో చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం పంపాలో ఉన్న నీరు, ఏలేరు నుంచి నీటి సరఫరా సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే రబీ ఆయకట్టు నిర్ణయించాలి. ఈ విషయాలన్నీ వివరిస్తూ జిల్లా కలెక్టర్కు నివేదిక ఇచ్చాం. ప్రభుత్వం అనుమతిస్తే జనవరి 1 నుంచి రబీ నారుమడులకు నీటిని విడుదల చేస్తాం. – జి.శేషగిరిరావు, ఈఈ, ఇరిగేషన్, పెద్దాపురం పంపా ఆయకట్టులో రబీ సాగుపై సందిగ్ధం 10 వేల ఎకరాలకు నీరివ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి 6 వేల ఎకరాలకు మించి ఇవ్వలేమంటున్న ఇరిగేషన్ అధికారులు -
సైన్్స సంబరానికి వేళాయె..
● నేడు జిల్లా స్థాయి సైన్స్ పోటీలు ● వేదిక కాకినాడ సాలిపేట బాలికోన్నత పాఠశాల ● 200 ప్రాజెక్టుల ప్రదర్శన బాలాజీచెరువు (కాకినాడ సిటీ): తరగతి గదుల్లో.. పాఠ్య పుస్తకాల్లో నేర్చుకున్న విజ్ఞానంతో.. ఆలోచనలకు పదును పెడితేనే సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టే అవకాశం కలుగుతుంది. సరికొత్త ప్రగతికి పునాది పడుతుంది. ఆవిధంగా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను, శాసీ్త్రయ విజ్ఞానాన్ని, అవగాహనను ప్రోత్సహించి.. ఆలోచనా శక్తిని పెంచి నూతన ఆవిష్కరణలు చేసేలా.. పాఠశాల విద్యా శాఖ, బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రీ అండ్ టెక్నలాజికల్ మ్యూజియం ఆధ్వర్యాన దక్షిణ భారత విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తోంది. తద్వారా ప్రయోగాత్మక నైపుణ్యాలు, సిద్ధాంతాలను స్వయంగా నిరూపించే అవకాశం కల్పిస్తోంది. దీనిలో భాగంగా విద్యార్థులు తమ ప్రాజెక్టులు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే పాఠశాల స్థాయిలో ప్రదర్శనలు పూర్తి చేశారు. గత వారంలో మండల స్థాయి సైన్స్ సంబరాలు నిర్వహించారు. ఇందులో జిల్లావ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు వివిధ ప్రాజెక్టులు ప్రదర్శించారు. వాటిల్లో వివిధ విభాగాల నుంచి అత్యుత్తమంగా గుర్తించిన 200 ప్రాజెక్టులను జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన కాకినాడ సాలిపేటలోని పైండా సత్తిరాజు మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో శనివారం జరగనుంది. ఇందులో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి 8, 9, 10 తరగతుల విద్యార్థులు తమ ఆలోచనలకు అనుగుణంగా రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శించనున్నారు. జిల్లా స్థాయిలో ప్రతి గ్రూపు నుంచి రెండేసి ప్రాజెక్టులు ఎంపిక చేసి, రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు పంపిస్తారు. మూడు కేటగిరిల్లో.. ● ఈ పోటీలు ప్రధానంగా మూడు కేటగిరీల్లో ఏడు అంశాలపై, తొమ్మిది సబ్జెక్టుల్లో నిర్వహిస్తున్నారు. ● ఉపాధ్యాయుల ప్రదర్శన : ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే పాల్గొనాలి. ● విద్యార్థుల వ్యక్తిగత ప్రదర్శన : ఒక విద్యార్థి, ఒక ఉపాధ్యాయుడు పాల్గొనవచ్చు. ● విద్యార్థుల గ్రూపు : ఇద్దరు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు పాల్గొనాలి. ● సబ్జెక్టు : భౌతిక, రసాయన శాస్త్రాలు, గణితం, ఎర్త్ అండ్ స్పేస్ సైన్స్ ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్, బయో సైన్స్, బయో కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్. ● అంశాలు : సస్టెయినబుల్ అగ్రికల్చర్, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఆల్టర్నేటివ్ ప్లాస్టిక్, గ్రీన్ ఎనర్జీ, ఎమర్జింగ్ టెక్నాలజీ, రీక్రియేషనల్ మ్యాథ్మెటికల్ మోడలింగ్, హెల్త్ అండ్ హైజీన్, వాటర్ కన్జర్వేషన్ మెథడ్ అండ్ మేనేజ్మెంట్. సృజనాత్మకతకు దోహదం విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడానికి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయి. మేధస్సుకు పదును పెట్టేందుకు ఉపకరించే ఈ ప్రదర్శనల్లో విద్యార్థులు పాల్గొనేలా ఉపాధ్యాయులు చైతన్యపరచాలి. – పిల్లి రమేష్, జిల్లా విద్యా శాఖాధికారి, కాకినాడ -
తలుపులమ్మ తల్లికి రూ.49.58 లక్షల ఆదాయం
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారికి హుండీల ద్వారా రూ.49.58 లక్షల ఆదాయం సమకూరింది. అన్నవరం వీర వేంకట సత్యనారాయణస్వామి దేవస్థానం సహాయ కార్యనిర్వహణాధికారి ఎం.మంజులాదేవి పర్యవేక్షణలో లోవ దేవస్థానంలో హుండీలను శుక్రవారం తెరచి నగదు లెక్కించారు. మొత్తం 71 రోజులకు గాను రూ.45,76,941 నగదు, రూ.3,81,514 నాణేలు కలిపి రూ.49,58,455 ఆదాయం సమకూరిందని లోవ దేవస్థానం డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. బంగారం 59.20 గ్రాములు, వెండి 1,156 గ్రాములు లభించిందన్నారు. కళాకారుడు కింతాడ మృతి కిర్లంపూడి: సీనియర్ కళాకారుడు కింతాడ సన్యాసిరావు శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. మండలంలోని చిల్లంగి గ్రామానికి చెందిన ఆయన వేలాదిగా జానపద గేయాలు, భక్తి గీతాలు రచించారు. అనేక సాంఘిక నాటకాల కథలు, వ్యాసాలు రాసి ప్రజలను మెప్పించారు. హైదరాబాద్ రవీంద్ర భారతితో పాటు అనేక కళాక్షేత్రాల్లో తన బృందంతో హరికథలు, బుర్రకథ ప్రదర్శనలు ఇచ్చారు. 20 ఏళ్ల క్రితం అమెరికాలో జరిగిన తానా సభలకు నిర్వాహకులు ఆయనను ప్రత్యేకంగా పిలిపించి గేయాలు పాడించారు. నాడు కాళ్లకు గజ్జెలు కట్టి, తప్పెటగుళ్లతో జానపద గేయాలు ఆలపించి, తానా సభలకు వచ్చిన ప్రముఖలను మైమరపించారు. ఎంతో మందిని కళాకారులుగా తీర్చిదిద్దారు. సన్యాసిరావు మరణించారనే సమాచారం తెలిసి కళాకారులు ద్రిగ్భాంతికి గురయ్యారు. ‘అన్నవరం, వాడపల్లి’ నిర్వహణలో గోదావరి హారతి అన్నవరం: రాజమహేంద్రవరంలో నిత్యం నిర్వహిస్తున్న గోదావరి హారతి కార్యక్రమాన్ని ఇకపై కాకినాడ జిల్లా అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం, కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ మేరకు దేవదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకూ అన్నవరం దేవస్థానం మాత్రమే ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్లో ప్రతి రోజూ సాయంత్రం 6.30 నుంచి 7 గంటల వరకూ జరిగే గోదావరి హారతి కార్యక్రమానికి అన్నవరం దేవస్థానం ప్రతి నెలా రూ.2.50 లక్షలు ఖర్చు చేస్తోంది. ఇకపై అన్నవరం దేవస్థానం రూ.1.5 లక్షలు (60 శాతం), వాడపల్లి దేవస్థానం రూ.లక్ష (40 శాతం) ఖర్చు చేయాలని కమిషనర్ ఆదేశించారు. దీనివలన అన్నవరం దేవస్థానానికి ఏడాదికి రూ.12 లక్షలు ఆదా కానున్నాయి. పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానంకంబాలచెరువు (రాజమహేంద్రవరం): చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పోస్టుల భర్తీకి అర్హులైన న్యాయవాదుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. దరఖాస్తులు జిల్లా న్యాయస్థాన అధికారిక వెబ్సైట్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నోటీస్ బోర్డులో అందుబాటులో ఉంటాయన్నారు. చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్కు క్రిమినల్ లాలో కనీసం పదేళ్లు, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్కు కనీసం ఏడేళ్ల అనుభవంతో పాటు మంచి సంభాషణ, లేఖన నైపుణ్యాలు ఉండాలని వివరించారు. అర్హులైన న్యాయవాదులు ఈ నెల 31వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. వివరాలకు డిస్ట్రిక్ట్స్.ఈకోర్ట్స్.జీఓవీ.ఇన్.ఈస్ట్గోదావరి వెబ్సైట్ను సంప్రదించాలని తెలిపారు. ‘తూర్పు’ పోలీసు విభాగానికి ఏబీసీడీ అవార్డు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాష్ట్రవ్యాప్తంగా కీలక కేసుల దర్యాప్తులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే వారికి ప్రతి మూడు నెలలకోసారి ప్రకటించే అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ (ఏబీసీడీ) అవార్డు తూర్పు గోదావరి జిల్లా పోలీసులు సాధించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నుంచి ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఈ అవార్డు అందుకున్నారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకూ మూడు నెలలకు గాను కొవ్వూరు టౌన్ స్టేషన్లో నమోదైన హత్య కేసును ఛేదించినందుకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించాలి
● సీపీఐ నేత మధు డిమాండ్ ● ప్రభుత్వాసుపత్రి వద్ద ధర్నా బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ యత్నాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు డిమాండ్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర సమితి పిలుపు మేరకు సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యాన స్థానిక ప్రభుత్వాసుపత్రి వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేష్లు మెడికల్ కాలేజీ సీట్లపై అనేక మాటలు చెప్పారని, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నట్లు ఆరోపించారని.. నేడు అధికారంలోకి రాగానే వారు మొత్తం మెడికల్ కాలేజీలనే అమ్మేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానం ద్వారా ప్రైవేటీకరించేందుకు జారీ చేసిన జీఓ–590ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైద్య కళాశాలలను పీపీపీ విధానంలోకి తీసుకుని రావడం వలన రూ.3,700 కోట్ల అభివృద్ధి ఖర్చు, ఏటా రూ.500 కోట్ల నిర్వహణ వ్యయం ఆదా అవుతాయని ప్రభుత్వం చెబుతోందని, వాస్తవానికి ఈ విధానం రాష్ట్రానికి దీర్ఘకాలంలో తీరని నష్టం కలిగిస్తుందని చెప్పారు. సుమారు 60 ఏళ్ల పాటు ప్రభుత్వ భూమి, వనరులు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లి, వారికి ఆదాయ వనరులుగా మారతాయని అన్నారు. వైద్య విద్య పూర్తిగా వ్యాపారపరమవుతుందని, మేనేజ్మెంట్ కోటా ద్వారా ఇచ్చే 25 శాతం సీట్లలో ఒక్కో దానికి దాదాపు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకూ వసూలు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ అధిక ఫీజు వలన పేద, సామాన్య, మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్యకు పూర్తిగా దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు సంస్థల లాభాపేక్ష వల్ల వైద్య సేవల్లో నాణ్యత తగ్గడంతో పాటు, పేదలకు ఉచిత వైద్య సేవలు అందని ద్రాక్షగా మారతాయని వివరించారు. పీపీపీ విధానం వలన రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలు సుమారు 55 శాతం వైద్య విద్య సీట్లను కోల్పోతారన్నారు. నాబార్డ్ నిధులతో నిర్మించే వైద్య కళాశాలలను కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చేలా కట్టబెట్టడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మధు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు సాకా రామకృష్ణ, ఏఐటీయూసీ నాయకులు రామయ్య, అనిల్ పాల్గొన్నారు. -
‘ధర్మంతో వ్యాపారం చేసేవాడు నీచుడు’
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ధర్మంతో వ్యా పారం చేసేవాడు నీచుడంటూ ధర్మరాజు చెబుతాడని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో వ్యాస భారత ప్రవచనాన్ని ఆయన గురువారం కొనసాగించారు. ‘భీష్మ, ద్రోణ, కృపాచార్యులను, అశ్వత్థా మ, కర్ణులను నిర్జించడానికి కావలసిన అస్త్ర సంపద మన వద్ద లేదని సోదరులకు ధర్మరాజు చెబుతాడు. ఆ సమయంలో వ్యాస మహర్షి వచ్చి ధర్మరాజును ఏకాంతంలోకి పిలిచి, ప్రతిస్మృతి విద్యను బోధించి, దీనిని అర్జునుడికి ఉపదేశించాలని చెబుతాడు. ఆయన స్వయంగా అర్జునుడికి ఉపదేశించకుండా అన్నగారికి ఎందుకు ఉపదేశించాడనే సందేహం మనకు రావచ్చు. మంత్రవిద్యకు కొన్ని సంప్రదాయాలు, మర్యాదలు ఉన్నాయి. కొడుక్కి తండ్రి, తమ్ముడికి అన్న, భార్యకు భర్త మంత్రాన్ని ఉపదేశించవచ్చు’ అని వివరించారు. ‘‘భూలోక కాలగణన ప్రకారం ఐదేళ్ల పాటు ఇంద్రలోకంలో ఉన్న అర్జునుడి ని నపుంసకుడివి కావాలని ఊర్వశి ఇచ్చిన శాపం అజ్ఞాతవాస కాలంలో వరమవుతుందని ఇంద్రుడు చెబుతాడు. రాజ్య సంపదలపై నీ బుద్ధి ఎందుకు నిలవడం లేదని ధర్మరాజును వనాలలో ద్రౌపది ఆక్షేపిస్తుంది. తాను ఫలాన్ని ఆశించి ధర్మాచరణకు పూనుకోనని ధర్మరాజు చెబుతాడు. స్వర్గాది భోగాల కోసం ధర్మాన్ని ఆశ్రయించడం లేదని స్పష్టం చేస్తాడు. ధర్మం పాటించాలి కనుకనే ధర్మాన్ని ఆశ్రయిస్తున్నానని, ధర్మంతో వ్యాపారం చేసేవాడు నీచుడని, ధర్మం వ్యాపార వస్తువు కాదని అంటాడు’’ అని సామవేదం వివరించారు. -
జ్వరమొచ్చింది
శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025కాకినాడ జీజీహెచ్లో జ్వరం కేసులు నెల కేసులు సెప్టెంబర్ 3,558 అక్టోబర్ 3,041 నవంబర్ 5,152 డిసెంబర్ 15 4,015 ● మంచం పడుతున్న జిల్లా ● జలుబు, దగ్గుతో అవస్థలు ● కిటకిటలాడుతున్న ఆస్పత్రులుసాక్షి ప్రతి నిధి, కాకినాడ: జిల్లాకు జ్వరమొచ్చింది. దాదాపు ప్రతి ఇంటా ఒకరిద్దరు దగ్గు, జలుబుతో మంచం పడుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా జిల్లా అంతటా ఉష్ణోగ్రతలు ఒకేసారి అమాంతం పడిపోయాయి. ఉదయం 10 గంటల వరకూ.. తిరిగి సాయంత్రం 4 దాటకుండానే వీస్తున్న శీతల గాలులతో జనం గజగజా వణికిపోతున్నారు. చలి వేళ బయటకు రావాలంటేనే హడలెత్తుతున్నారు. వృద్ధులు మరింతగా ఇబ్బందులు పడుతున్నారు. సూరీడు నడినెత్తికి వచ్చేంత వరకూ వీరు బయటకు రావడం లేదు. తప్పనిసరి అయి ఏదైనా పనిపై చలి వాతావరణంలో బయటకు వెళ్లి వస్తే చాలు.. తెల్లారేసరికి జలుబుతో కూడిన దగ్గు బారిన పడుతున్నారు. ఇంట్లో ఒకరికి ఈ తరహా అనారోగ్యం వస్తే ఇంటిల్లిపాదినీ చుట్టేస్తోంది. చాలా మంది వులెన్ స్వెట్టర్లు, మంకీ క్యాప్లు, మఫ్లర్లు లేకుండా బయటకు వెళ్లడం లేదు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా శీతల ప్రభావాన్ని తప్పించుకోలేకపోతున్నారు. జలుబు, దగ్గుతో మొదలై.. వయసుతో సంబంధం లేకుండా జలుబు, దగ్గుతో మొదలవుతున్న జ్వరాలు వైరల్ ఫీవర్లుగా మారుతున్నాయి. ఈ లక్షణాలతో జ్వరం వస్తే వారం పది రోజులకు గానీ ఆరోగ్యం కుదుట పడటం లేదు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి (జీజీహెచ్) సహా పెద్దాపురం, ప్రత్తిపాడు, తుని ఏరియా ఆస్పత్రులు, జిల్లాలోని పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు వైరల్ ఫీవర్ బాధితులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లా నలుమూలల నుంచి వైరల్ ఫీవర్లతో కాకినాడ జీజీహెచ్కు వస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది. వైరల్ ఫీవర్, ఫ్లూ, కామన్ కోల్డ్, ఇన్ఫ్లూయెంజా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మూడు నుంచి 60 ఏళ్ల లోపు వారిలో ఈ తరహా జ్వరాలు ఎక్కువగా ఉంటున్నాయి. వైరల్ ఇన్ఫెక్షన్లే ఈ జ్వరాలకు కారణమని వైద్యులు చెబుతున్నారు. అడినోవైరస్, ఇన్ఫ్లూయెంజా వైరస్, రైనోవైరస్లు జ్వర కారకాలని అంటున్నారు. డెంగీ చికన్గున్యాలు ఈ కోవకే వస్తాయని, ఈ జ్వరాలను అలక్ష్యం చేయవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా జ్వరం ఒకరి నుంచి మరొకరికి సంక్రమించదని అనుకుంటారు. కానీ, వైరల్ ఫీవర్ల విషయంలో అది పూర్తిగా తప్పని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. కరచాలనం, ఒకే వస్తువులు వాడటం, శారీరక ద్రవాల తాకిడి వైరస్ వ్యాప్తికి కారణమై జ్వరం సంక్రమణకు దారి తీస్తుంది. తప్పించుకుంటున్న ప్రభుత్వం వాతావరణ మార్పులే దీనికి కారణమంటూ తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే విమర్శలున్నాయి. వాస్తవానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ మంచి ఫలితాలు సాధించింది. ఇంటింటికీ ఫ్యామిలీ డాక్టర్తో పాటు వైద్యుల బృందం క్రమం తప్పకుండా వెళ్లడం, బీపీ, షుగర్, ఇతర వ్యాధి లక్షణాలను పరిశీలించి, అవసరమైన మందులు ముందుగానే ఇవ్వడం ద్వారా వైరల్ జ్వరాలను నియంత్రణలోకి తెచ్చేవారు. ప్రజలకు ఎంతో మేలు చేసిన ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రభుత్వం కేవలం రాజకీయ కోణంలో ఆలోచించి నీరుగార్చేసింది. ఫలితంగానే నేడు ప్రతి ఇంటా అనేక మంది మంచాన పడుతున్న దుస్థితి తలెత్తింది. సొంత వైద్యం.. ప్రమాదకరం.. జలుబు, దగ్గే కదా అని ఆస్పత్రులకు వెళ్లకుండా చేతికొచ్చిన నాలుగు మందు బిళ్లలు వేసుకుంటే అదే పోతుందనే భావనతో కొంత మంది సొంత వైద్యం చేసుకుంటున్నారు. మెడికల్ షాపులు, వైద్య పరిజ్ఞానం లేని వారు ఇచ్చే మందులను ఐదారు రోజులు వాడినా ఆరోగ్యం కుదుట పడకపోతూండటంతో అప్పుడు ఆస్పత్రుల వైపు పరుగులు పెడుతున్నారు. ఇది ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డెంగీ, టైఫాయిడ్, న్యూమోనియా వంటి ప్రమాదకర జ్వరాలను కూడా సాధారణ జ్వరాలనుకుని, బయటి మందులు ప్రాణాలకే ముప్పు వాటిల్లవచ్చని చెబుతున్నారు. అలాగే, అవసరం లేకుండా యాంటీబయోటిక్స్ వాడితే యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ పెరిగి మందులు శరీరానికి పని చేయని స్థితికి చేరుకుంటాం. సొంత వైద్యం వికటిస్తే కడుపులో పుండ్లు, లివర్, కిడ్నీలు దెబ్బ తినడం, అలర్జీలు, వాంతులు, విరేచనాల వంటి వాటి బారిన పడే ప్రమాదముంటుంది. పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సొంత వైద్యం అత్యంత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిర్లక్ష్యం తగదు వైరల్ ఫీవర్లను నిర్లక్ష్యం చేయడం తగదు. వైరల్ ముదిరితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కు చేరి న్యూమోనియాకు దారి తీసి, ప్రాణాంతకం కావచ్చు. పిల్లల్లో ఈ స్థితి మరింత ప్రమాదకరం. సొంత వైద్యాలకు స్వస్తి చెప్పి, వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స చేయించుకోవాలి. జీజీహెచ్లో నిష్ణాతులైన వైద్యుల ద్వారా వైరల్ ఫీవర్లకు నాణ్యమైన చికిత్స అందిస్తున్నాం. చలి వాతావరణంతో శ్వాసకోశ వ్యాధులకు ఆస్కారం ఉంటుంది. నిర్లక్ష్యం చేయవద్దు. ఆవిరి పట్టడం, మాస్క్, శానిటైజర్ వినియోగించడం వంటివి వైరస్ వ్యాప్తిని నిలువరిస్తాయి. రోగ నిరోధక శక్తి క్షీణించిన వారితో పాటు పౌష్టికాహార లోపం, వయోభారంతో బాధపడుతున్న వారు, గర్భం దాల్చిన వారు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ మాణిక్యాంబ, పీడియాట్రిక్స్ విభాగాధిపతి, జీజీహెచ్, కాకినాడ నియంత్రణపై దృష్టి పెట్టాం వాతావరణ మార్పుతో చలి తీవ్రత పెరిగి దగ్గు, జలుబుతో కూడిన జ్వరాలు నమోదవుతున్నాయి. వైరల్ జ్వరాలుంటే హైగ్రేడ్ ఫీవర్లు ఎక్కువగా వస్తాయి. కో మార్బిడిటీల వల్ల ప్రమాదం వాటిల్లవచ్చు. ఎస్–ఫాం, ఎల్–ఫాం, పీ–ఫాం యాప్ల ద్వారా జ్వరాలను నిత్యం పర్యవేక్షిస్తున్నాం. ఈ యాప్లలో నమోదవుతున్న కేసుల ఆధారంగా మెడికల్ ఆఫీసర్లు జ్వర పీడితులకు చికిత్స అందిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీములు చురుగ్గా పని చేస్తాయి. ఈ టీములోని ఎపిడమాలజిస్టు, మైక్రోబయోలజిస్టు, పాథాలజిస్టు, ఫిజీషియన్, పీడియాట్రీషియన్ జ్వరాలు వస్తున్న ప్రాంతాల్లో పరిస్థితిని విశ్లేషిస్తారు. – డాక్టర్ జరపల నరసింహ నాయక్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి, కాకినాడ -
పీడీలు ఏరీ..!
రాజమహేంద్రవరం రూరల్: ఇప్పటి వరకూ ఎటువంటి రూపురేఖలూ లేని అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే ఘనంగా చెప్పారు. ఒలింపిక్స్ సంగతి అలా ఉంచితే.. అసలు క్రీడల అభివృద్ధిలో.. క్రీడాకారులకు తగిన శిక్షణ ఇచ్చి తయారు చేయడంలో ఫిజికల్ డైరెక్టర్ల (పీడీ) పాత్ర ఎంతో కీలకం. వీరు ఆయా కళాశాలల్లో క్రీడా కార్యకలాపాలు నిర్వహిస్తారు. విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇస్తారు. వీరి విధుల్లో విద్యార్థులకు క్రీడా శిక్షణ ఇవ్వడం అత్యంత కీలకమైనది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పీడీలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు క్రీడల్లో వెనుకబడుతున్నారు. ఆరుచోట్ల ఇన్చార్జిలే.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బొమ్మూరు, అనపర్తి, ద్రాక్షారామ, కాకినాడ, ఎటపాక, పిఠాపురం, కాకినాడ(మహిళ)ల్లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. మరో 18 ప్రైవేటు కళాశాలలున్నాయి. మొత్తం ఏడు ప్రభుత్వ కళాశాలలకు గాను కాకినాడ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో మాత్రమే ప్రస్తుతం రెగ్యులర్ పీడీ ఉన్నారు. మిగిలిన అన్నిచోట్లా ఆయా కళాశాలల లెక్చరర్లనే ఇన్చార్జి పీడీలుగా నియమించి, ప్రభుత్వం చేతులు దులుపేసుకుంది. దీంతో, ఆయా లెక్చరర్లు అటు సబ్జెక్టుల బోధనకు.. ఇటు క్రీడా శిక్షణకు సమయం కేటాయించలేని దుస్థితి నెలకొంది. రెండు విధులూ నిర్వహించాల్సి వస్తూండటంతో వారు పనిభారంతో సతమతమవుతున్నారు. మరోవైపు ప్రైవేటు కళాశాలల్లో పీడీలు ఉండటంతో అక్కడి విద్యార్థులకు వారికి ఆసక్తి ఉన్న క్రీడల్లో మెరుగైన శిక్షణ లభిస్తోంది. ప్రభుత్వ కళాశాలల్లో కూడా పూర్తి స్థాయిలో పీడీలను నియమిస్తే వివిధ క్రీడల్లో మరింత మంది విద్యార్థులు మెరికల్లా తయారయ్యే అవకాశం ఉంది. కానీ, దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. తేడా స్పష్టం పీడీలు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందనే విషయం ప్రస్తుతం బొమ్మూరు పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్, గేమ్స్ రీజినల్ మీట్లో స్పష్టంగా కన్పిస్తోంది. ఈ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారుల్లో ఎక్కువ మంది వ్యక్తిగత నైపుణ్యంతో మాత్రమే వివిధ పోటీల్లో విజయం సాధిస్తున్నారు. నైపుణ్యం ఉన్నప్పటికీ తమకు తగిన మెళకువలు నేర్పాల్సిన పీడీలు లేకపోవడంతో వెనుకబడుతున్నామని పలువురు క్రీడాకారులు వాపోతున్నారు. ఈ మీట్లో ఉమ్మడి జిల్లాలోని మొత్తం 25 కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొంటున్నారు. ప్రైవేటు కళాశాలల విద్యార్థులకు గట్టి పోటీ ఇవ్వాలంటే తమకు సరైన శిక్షణ, ప్రోత్సాహం ఉండాలని ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. దీనికోసం అన్ని ప్రభుత్వ కళాశాలల్లోనూ పూర్తి స్థాయి పీడీలను నియమించాలని వారు కోరుతున్నారు. రీజినల్ స్పోర్ట్స్ మీట్కు వేదికగా నిలిచిన బొమ్మూరు జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో సైతం రెగ్యులర్ పీడీ లేరు. ఇక్కడ కెమిస్ట్రీ లెక్చరరే ఇన్చార్జి పీడీగా వ్యవహరిస్తున్నారు. అయితే, రీజినల్ స్పోర్ట్స్ మీట్కు ప్రొఫెషనల్ పీడీ అవసరం కావడంతో కాకినాడ మహిళా పాలిటెక్నిక్ కళాశాల పీడీని ఇన్చార్జిగా రప్పించుకోవాల్సి వచ్చింది. దీనినిబట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు పూర్తి స్థాయిలో పీడీలను నియమించాలని పలువురు కోరుతున్నారు. -
జేఎన్టీయూకేకి ఫైవ్స్టార్ క్వాలిటీ రేటింగ్
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్టీయూ–కాకినాడకు ఐఎస్ఓ సర్టిఫికేషన్ సంస్థ హెచ్వైఎం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ స ర్టిఫికెట్ మంజూరు చేసింది. వర్సిటీలో అకడమి క్, పరిపాలన, పర్యావరణ, ఎనర్జీ మేనేజ్మెంట్ వంటి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పరిశీలన చేసి ఈ గుర్తింపునిచ్చారు. ఈ సందర్భంగా వైస్ చాన్సలర్ సీఎస్ఆర్కే ప్రసాద్ గురువారం మాట్లాడుతూ, క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్ట మ్ ద్వారా విద్యా విధానాలు, పరిశోధన కార్యక లాపాలు, ఇన్నోవేషన్ హబ్, విశ్వవిద్యాలయం సేవల నాణ్యత గుర్తింపు వంటి ఐదంశాలపై సమ గ్ర పరిశీలన చేశారని చెప్పారు. ఈ సందర్భంగా వీసీని రిజిస్ట్రార్ ఆర్.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ మోహనరావు, డైరెక్టర్లు అభినందించారు. చీలిక పెదవులకు సవరణ చికిత్సకాకినాడ క్రైం: స్థానిక జీజీహెచ్లో శనివారం నుంచి ఈ నెల 23వ తేదీ వరకూ చీలిక పెదవులు, అంగిలి సవరణ చికిత్సలు నిర్వహించనున్నట్లు సూపరింటెండెంట్ ఎస్.లావణ్య కుమారి గురు వారం ఒక ప్రకటనలో తెలిపారు. మిషన్ స్మైల్ సంస్థ సౌజన్యంతో ప్లాస్టిక్ సర్జరీ హెచ్ఓడీ రత్నభూషణ్ ఆధ్వర్యాన ఈ చికిత్సలు పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నామని వివరించారు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి కౌమార దశ ముగిసే 19 ఏళ్ల వయసు వారి వరకూ చికిత్స అందిస్తామన్నారు. సర్జరీ సెమినార్ హాలులో నిర్వహించే శిబిరంలో స్క్రీనింగ్ పరీక్షలు చేస్తామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల పేర్ల నమోదుకు 99541 54017 నంబర్లో సంప్రదించాలని లావణ్య కుమారి సూచించారు. ఎరువు.. కరవు పెదపూడి: రబీ సాగు చేపట్టిన రైతులకు ఓవైపు సాగునీటి ఇబ్బందులు వెంటాడుతూండగా.. మరోవైపు అదునుకు ఎరువులు లభించని దుస్థితి నెలకొంది. పెదపూడి మండలం కాండ్రేగుల గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) వద్ద ఎరువుల కోసం అన్నదాతలు గురువారం ఇలా పడిగాపులు పడ్డారు. ప్రతి రైతుకు ఒక బస్తా యూరియా, ఒక బస్తా డీఏపీ ఎరువు ఇస్తున్నట్లు పీఏసీఎస్ సిబ్బంది చెప్పారు. దీంతో, అన్నదాతలు సాగు పనులు పక్కన పెట్టి ఉదయాన్నే పీఏసీఎస్ వద్దకు చేరుకున్నారు. సిబ్బంది జాప్యం చేయడంతో మధ్యాహ్నం వరకూ అక్కడే పడిగాపులు కాశారు. చివరకు కొంత మంది రైతులకు ఎరువులు అందలేదు. పీఏసీఎస్కు మళ్లీ ఎరువులు వచ్చిన తరువాత ఇస్తామని సిబ్బంది చెప్పడంతో ఆ రైతులు నిరాశగా వెనుదిరిగారు. విదేశీ పెట్టుబడుల పెంపు దారుణం రాజమహేంద్రవరం రూరల్: ½Ð]l* Æý‡…VýS…ÌZ ѧólÖ {ç³™èlÅ„ýS ò³r$tº-yýl$-ÌS(-G-‹œyîl-I)¯]l$ Ð]l…§ýl Ô>™é-°MìS ò³…^èl-yýl…, ½Ð]l* ^èlsêtÌS çÜÐ]l-Æý‡×æ §ólÔèæ {ç³fÌS BǦMýS ÝëÓÐ]l-ÌS…-º-¯]lMýS$ G…™èl Ð]l*{™èl… Ðól$Ë$ ^ólõÜÑ M>Ð]l° C¯ŒS-{çÜ*-ె¯ŒSÞ M>Æöµ-Æó‡-çÙ¯ŒS G…´ëÏ-Æ‡Ê‹Ü Ä¶æÊ°-Ķæ$¯ŒS (IïÜDĶæÊ) Æ>f-Ð]l$…{yìl yìlÑf¯ŒS {糫§é¯]l M>Æý‡Å-§ýlÇØ G….Mø-§ýl…-yýl-Æ>ÐŒl$ ÑÐ]l$-ÇØ…-^éÆý‡$. MóS…{§ýl {糿¶æ$™èlÓ Ñ«§é¯é°MìS °Æý‡-çÜ-¯]lV> GÌŒæ-IïÜ yìlÑ-f-¯]lÌŒæ M>Æ>ÅÌSĶæ$… Ð]l§ýlª M>Ï‹Ü&1 A«¨-M>-Æý‡$Ë$, M>Ï‹Ü&3 E§øÅ-VýS$Ë$ VýS$Æý‡$ÐéÆý‡… Ð]l$«§éÅçßæ²… ¿Z-f¯]l ÑÆ>Ð]l$ çÜÐ]l$-Ķæ$…ÌZ {ç³§ýlÆý‡Ø¯]l °Æý‡Ó-íßæ…-^éÆý‡$. D çÜ…§ýlÆý‡Â…V> IïÜ-DĶæÊ ¯ól™èlË$ Mø§ýl…-yýlÆ>ÐŒl$, Ð]l*£ýl*Å‹Ü, ÒÆý‡ MìSÚùÆŠæ, ç³§éÃÐ]l† Ð]l*sêÏ-yýl$™èl*, ѧólÖ ¿êVýS-ÝëÓÐ]l¬-ÌS™ø MýS*yìl¯]l {Oò³Ðólr$ ½Ð]l* MýS…ò³-±Ë$ ò³§ýlª çÜ…QÅÌZ iÑ™èl, Ýë«§éÆý‡×æ ½Ð]l* Æý‡…V>ÌZÏ ç³° ^ólçÜ$¢¯é²Ä¶æ$° ^ðl´ëµÆý‡$. MóS…{§ýl {糿¶æ$™èlÓ… G‹œyîlI ç³Ç-Ñ$-†° Ð]l…§ýl Ô>™é-°MìS ò³…_, Ð]l$¯]l §ólÔèæ…ÌZ M>Æý‡ÅMýS-Ìê´ëÌS °Æý‡Ó-çßæ-׿MýS$ BĶæ* MýS…ò³±-ÌSMýS$ ç³NÇ¢ õÜÓ^èle-°Ð]lÓyýl… Ð]lÌS¯]l ¿êÆý‡™èl BǦMýS Ð]lÅÐ]lçܦMýS$, ½Ð]l* MýS…ò³-±-ÌSMýS$ ¡{Ð]l ¯]lçÙt… Ðésìæ-Ë$Ï-™èl$…-§ýl-°, ™èl§éÓÆ> {ç³f-ÌSMýS$ G¯]lÌôæ° ¯]lçÙt… fÆý‡$-VýS$-™èl$…§ýl° B…§øâýæ¯]l Ð]lÅMýS¢… ^ólÔ>Æý‡$. M>Æý‡Å-{MýS-Ð]l$…ÌZ ç³Ë$-Ð]l#Æý‡$ E§øÅ-VýS$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. -
● అధినేతతో భేటీ
● ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో కొరత ● ఉండాల్సింది ఏడుగురు ● ఉన్నది ఒక్కరు ● క్రీడల్లో వెనుకబడుతున్న విద్యార్థులుప్రతి మహిళా పారిశ్రామికవేత్తగా ఎదగాలి కరప: ప్రభుత్వాలు అమలు చేస్తున్న రాయితీ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రతి మహిళా పారిశ్రామికవేత్తగా ఎదగాలని జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ) జనరల్ మేనేజర్ సీహెచ్ గణపతి అన్నారు. మహిళా శక్తి సంఘాలకు స్థానిక మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన ఉద్యమ్ రిజిస్ట్రేషన్ వర్క్షాపులో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ (ఆర్ఏఎంపీ – ర్యాంప్) కార్యక్రమం ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల స్థాపనకు రిజిస్ట్రేషన్ చేస్తామని వివరించారు. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికే బ్యాంకుల నుంచి రుణాలు, ప్రభుత్వ రా యితీలు లభిస్తాయని తెలిపారు. పలు పథకాల ద్వా రా 45 శాతం రాయితీపై రుణాలందిస్తారన్నారు. డీఆర్డీఏ, జిల్లా పరిశ్రమల కేంద్రం సంయుక్త ఆధ్వర్యాన జిల్లావ్యాప్తంగా ఇంతవరకూ రెండు విడతల్లో 44 వర్క్ షాపులు నిర్వహించామని తెలిపారు. వ్యాపారాలు చేసేవారు తప్పనిసరిగా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని గణపతి సూచించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంఎస్ఎంఈ కార్యకలాపాలను వివరించారు. అనంతరం పలువురు మహిళలకు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేసి, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. వర్క్షాపులో డీఐసీ ప్రమోషనల్ ఆఫీసర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
పరమాత్మ తప్ప రక్షకులు లేరు
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘కృష్ణా! మహావీరులు అయిన అయిదుగురు పతులు నిస్సహాయులుగా మిగిలిపోయినప్పుడు నీవే నిండుసభలో నన్ను రక్షించావు’ అని ద్రౌపది వనవాసం చేస్తున్న తమను చూడటానికి వచ్చిన కృష్ణ పరమాత్మతో అంటుందని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. హిందూ సమాజంలో ఆయన వ్యాసభారతం, వనపర్వంలోని పలు అంశాలను వివరించారు. పరమాత్మ తప్ప రక్షకులు లేరని నాటి సభలో నిరూపణ అయిందని ఆమె అంటుంది. కృష్ణ పరమాత్మ ద్రౌపదిని పరాభవిస్తున్న సమయంలో తాను ద్వారకలో లేనని, ఉంటే ఇలా జరిగేది కాదని అంటాడు. ఇక్కడ మనకు సందేహం రావచ్చు, ద్రౌపదికి అక్షయ వస్త్రాలు ఇచ్చి, ఆమెను కాపాడిన కృష్ణుడు తాను ద్వారకలో లేకపోవడం వలన ఈ అనర్థం జరిగిందని చెప్పడంలో అంతరార్థం మనం తెలుసుకోవాలని అన్నారు. నీలకంఠీయ వ్యాఖ్యానాన్ని అనుసరించి, ద్వారక అంటే నవద్వారాలు కల శరీరమని ఆయన వివరించారు. ద్రౌపదిని దుశ్శాసనాదులు అవమానిస్తుంటే, పాండవుల స్మరణలో కృష్ణుడు లేడు, వారు విధి బలీయమైందని అనుకున్నారే కానీ, కృష్ణ స్మరణ చేయలేదు. బుద్ధి ప్రపంచం వైపు తిరిగితే పరమాత్మ కనిపించడు, ఆయన వైపు తిరిగితే కనిపిస్తాడని సామవేదం అన్నారు. పాండవులు వనాలకు తరలిపోయాక, ధృతరాష్ట్రుడు కలత చెంది విదురుని పిలిచి, తనకు హితం ఏది కలిగిస్తుందో చెప్పమంటాడు. పాండవుల రాజ్యభాగం వారికి ఇచ్చి వేయాలి, దుశ్శాసనుడు తాను చేసిన అకృత్యానికి నిండు సభలో పాండవులను క్షమించమని అడగాలి. నీవు దుర్యోధనుని వదిలివేస్తే, అందరూ క్షేమంగా ఉంటారని విదురుడు చెబుతాడు. దానికి తీవ్ర కోపంతో ధృతరాష్ట్రుడు విదురుని నిందించి, నీవు ఉంటే ఉండు, పోతే పొమ్మని అంటాడు. విదురుడు కామ్యకవనంలో ఉన్న పాండవుల వద్దకు వెడతాడు. ధృతరాష్ట్రుడు పశ్చాత్తాపంతో సంజయుని పంపి, విదురుని చేర తీసుకుంటాడని సామవేదం అన్నారు. దుష్టచతుష్టయం కుటిల పన్నాగాలు తెలుసుకున్న వ్యాసుడు వచ్చి ధృతరాష్ట్రునితో పాండవుల రాజ్యం వారికి ఇచ్చివేయమని, లేని పక్షంలో దుర్యోధనుని అడవులకు పంపి పాండవులతో చెలిమి చేయమని అంటాడు. సత్పురుషులతో వైరం ప్రమాదకరం, స్వజనులతో వైరం అంతకన్నా ప్రమాదకరమని హెచ్చరిస్తాడు. హితం ఉపదేశించడానికి వచ్చిన మైత్రే య మహర్షి మాటలను లక్ష్యపెట్టక, వినయరాహిత్యంతో దుర్యోధనుడు తన కాలిని ముందుకు చాచి తొడ మీద కొట్టుకుంటాడు. పాండవులతో శాంతియుతంగా జీవించకపోతే, ధర్మయుద్ధంలో భీముడు నీ తొడను పగలగొడతాడని మైత్రేయ మహర్షి దుర్యోధనుని శపిస్తాడని సామవేదం వివరించారు. వంచన చేసి సుఖపడాలనుకున్నవాడు వధ్యుడేనని సామవేదం అన్నారు. -
‘నవీన’ యుద్ధంలో ‘సానా’ చిత్తు
అంతా ఒక్కటవడంతో చుక్కెదురుసాక్షి ప్రతినిధి, కాకినాడ: తెలుగుదేశం పార్టీ జిల్లా పగ్గాలు అనుచరుడికి కట్టబెట్టడంలో పెద్దల సభ (రాజ్యసభ) సభ్యుడు సానా సతీష్కు పరాభవం ఎదురైంది. అనుకున్నదొక్కటి, అయినదొక్కటి అంటూ సతీష్ వర్గం పార్టీలో కిమ్మనడం లేదు. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా జెడ్పీ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్కుమార్ కొనసాగుతున్నారు. నవీన్ను అధ్యక్ష స్థానం నుంచి తప్పించేందుకు సతీష్ వర్గీయులు గడచిన మూడు నెలలుగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వస్తున్నారు. ప్రజారాజ్యం సహా పలు పార్టీలు మారి ప్రస్తుతం టీడీపీలో సానాకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న మెట్ట ప్రాంతానికే చెందిన తోట నవీన్ను జ్యోతుల నవీన్ స్థానంలో తెరమీదకు తీసుకువచ్చారు. ఇందుకోసం ఐవీఆర్ఎస్ సర్వేను సైతం ప్రభావితం చేసే ప్రయత్నాలు తెర వెనుక తీవ్రంగా చేశారనే చర్చ జిల్లా టీడీపీ వర్గాల్లో విస్తృతంగా జరిగింది. ఒకపక్క జ్యోతుల నవీన్కుమార్కు మద్దతుగా తండ్రి, టీటీడీ సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే నెహ్రూ, తోట నవీన్కు అధ్యక్ష పగ్గాలు కట్టబెట్టేందుకు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్బాబు హోరాహోరీగా తలపడ్డారు. అలాగని ఎక్కడా బయటపడకుండా చాపకింద నీరులా వ్యూహ, ప్రతి వ్యూహాల్లో తలమునకలయ్యారు. ఇద్దరు నవీన్లలో అధ్యక్ష పగ్గాలు ఎవరికి దక్కుతాయో అన్న ఉత్కంఠ టీడీపీలో కొంత కాలంగా ఉంది. ఇరువర్గాలు ఎవరి ప్రయత్నాలలో వారుండగా పార్టీ అఽధిష్టానం మంగళవారం ప్రస్తుత అధ్యక్షుడు నవీన్కుమార్నే అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. రెండు, మూడు నెలలుగా ఇందుకోసం బాహాబాహీగా తలపడ్డ ఇరువర్గాల్లో జ్యోతులదే పై చేయి అయ్యింది. తోట నవీన్కు పగ్గాలు కట్టబెట్టడం ద్వారా జ్యోతులకు చెక్ పెట్టాలనే సానా వ్యూహం చివరకు బెడిసికొట్టింది. అప్పటి నుంచీ కుమ్ములాటలు ఇవి వీరి మధ్య ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన వైషమ్యాలు కాదు. సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి కాకినాడ ఎంపీ సీటు విషయమై ఈ రెండు వర్గాల మధ్య ప్రచ్చన్న యుద్ధం సాగింది. తన రాజకీయ వారసుడిగా నవీన్ను పార్లమెంటు సభ్యుడిని చేయాలనేది తండ్రి జ్యోతుల కల. అప్పటికే జిల్లా పరిషత్ చైర్మన్ పని చేయడం, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండటంతో ఎంపీ సీటు ఇవ్వడానికి అర్హత ఉందని చెప్పి జ్యోతుల నెహ్రూ నాడు గట్టిగా పట్టుబట్టారు. అప్పట్లో లోకేష్ అండదండలతో కాకినాడ పార్లమెంటు స్థానాన్ని సతీష్ ఆశించారు. అయినా ఆ సమయానికి సానా టీడీపీలో చేరలేదు. కానీ సేవా కార్యక్రమాలతో పాపులారిటీ కోసం ప్రయత్నిస్తున్నారు. తండ్రి నెహ్రూ ఎమ్మెల్యేగా, కొడుకు నవీన్ జెడ్పీ చైర్మన్గా, టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా, అప్పటికే పదవులు పొందారని, అదే కుటుంబం నుంచి మరొకరికి ఎంపీ సీటు కోసం ఎలా ప్రతిపాదిస్తారని సానా సతీష్ వర్గం అధిష్టానం వద్ద అడ్డుపుల్ల వేసిందనే ప్రచారం అప్పట్లో జరిగింది. రెండు వర్గాల మధ్య కాకినాడ ఎంపీ సీటు సిగపట్ల నేపథ్యంలో ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. అనంతరం జరిగిన పరిణామాల్లో సానా సతీష్ అనూహ్యంగా రాజ్యసభ సభ్యుడైన విషయం విదితమే. జ్యోతుల నవీన్కుమార్తోట నవీన్ టీడీపీ జిల్లా పగ్గాల కోసం సిగపట్లు ‘తోట’కు ఎంపీ సతీష్ మద్దతు జ్యోతులకు ముకుతాడు వేసే ప్రయత్నాలు ఐవీఆర్ఎస్ సర్వే పేరుతో కుతంత్రం అయినా ఆధిపత్యం నెహ్రూదే నాటి వైషమ్యాలే తాజాగా పార్టీ జిల్లా అధ్యక్ష పగ్గాల కోసం ఇరు వర్గాలు సిగపట్లకు కారణమైందనే చర్చ పార్టీ నేతల మధ్య జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోను జ్యోతుల నవీన్కు పార్టీ పగ్గాలు తిరిగి దక్కకుండా చేయాలనే వ్యూహంతో సతీష్ వర్గం సానా చేసిందంటారు. సర్వశక్తులూ ఒడ్డి చివరకు చినబాబు సహకారం కూడా తీసుకుందంటున్నారు. ఇందుకు పార్టీ నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేను కూడా తమకు అనుకూలంగా మలుచుకునే వ్యూహాలకు పదును పెట్టారంటున్నారు. ఐవీఆర్ఎస్ సర్వేలో తన మద్దతుదారుడైన తోట నవీన్కు అనుకూలంగా పెద్ద ఎత్తున కాల్స్ చేయించారనే ప్రచారం కూడా పార్టీ నేతల ప్రైవేటు సంభాషణల్లో వినిపించింది. పార్టీలో సీనియర్ అయిన నెహ్రూ వ్యూహం ముందు సానా సతీష్ వర్గం తేలిపోయిందంటున్నారు. పార్టీలో ఒకప్పుడు చంద్రబాబు తరువాత చంద్రబాబుగా చెప్పుకునే యనమల రామకృష్ణుడుకు జ్యోతుల నెహ్రూ మధ్య దశాబ్దాల కాలం రాజకీయ వైరం కొనసాగింది. అటువంటి యనమల సహా పలువురు జిల్లా నేతలు తాజా రాజకీయ పరిణామాల్లో జ్యోతుల తనయుడు నవీన్కు మద్దతుగా నిలిచారంటున్నారు. ఆవిర్భావం నుంచి ఉన్న పార్టీ నేతలు అంతా ఒక వైపు నిలవడంతో జ్యోతుల నవీన్కు పగ్గాలు దక్కి సానా వర్గానికి చుక్కెదురైంది. -
ఆ అమ్మాయి.. అవధానంలో దిట్టోయి
తాళ్లరేవు: అవధానం అనేది తెలుగు సాహిత్య ప్రక్రియలో మేథో ప్రతిభను పరీక్షించే ఒక క్లిష్టమైన కళ.. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు అతి చిన్న వయసులోనే చందాన జయలక్ష్మి అవధాన రంగంలో ఔరా అనిపిస్తుంది. కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని నిరూపిస్తోంది. అవధానం చేపట్టిన తొలి అడుగుల్లోనే తన ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సంస్కృతం అనగానే క్లిష్టమైనదని భావించి నేర్చుకోవడానికి కూడా భయపడే నేటి రోజుల్లో, ఆంధ్రాలో పుట్టి కర్ణాటకలో స్థిరపడిన 13 ఏళ్ల బాలిక అవలీలగా సంస్కృతాన్ని ఉచ్చరించడంతో పాటు అత్యంత క్లిష్టమైన అష్టావధానాన్ని చేస్తూ ఘనాపాఠీలను సైతం ఔరా అనిపిస్తోంది. అంతటితో ఆగకుండా సంస్కృతంతోపాటు తెలుగు, కన్నడ, ఇంగ్లిష్, హిందీ భాషలను అవలీలగా మాట్లాడుతూ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఆ చిన్నారి చెప్పే మాటలు వినడానికి వేద పండితులు సైతం ఆసక్తి చూపడం గమనార్హం. ఇంజరంలో పుట్టి.. బెంగళూరులో పెరిగి.. తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామానికి చెందిన నరసింహదేవర మైథిలీనాథ్ వృత్తి రీత్యా బెంగళూరులో స్థిరపడ్డారు. ఆయన ప్రముఖ హెచ్ఏఎల్ కంపెనీలో సీనియర్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయన సతీమణి కిరణ్మయి గృహిణి. వీరి గారాల పట్టి నరసింహదేవర జయలక్ష్మికి చిన్నతనం నుంచి చదువులో ముందుండేది. కుటుంబ నేపథ్యం, బాల్య దశ నుంచే సంస్కృతం సాహిత్యాభిలాషతో, శాసీ్త్రయ శిక్షణతో అవధానంలో అడుగుపెట్టింది. తాత సుబ్బారావు సూచనతో బెంగళూరు పూర్ణ ప్రమతి గురుకుల పాఠశాలలో జయలక్ష్మిని చేర్చించి సంస్కృతం నేర్పించారు. కాశీలో తొలిసారి.. ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీ మహానగరంలో జయలక్ష్మి ఈ ఏడాది అక్టోబర్ 26న సంస్కృతంలో తొలి అష్టావధానం చేసింది. అలాగే మధునాపంతుల సత్యనారాయణమూర్తి సూచనలతో కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామంలో రెండో అష్టావధానం చేసి అందరినీ ఆకట్టుకుంది. చిన్న వయసులో రాణిస్తున్న జయలక్ష్మిని ఘనంగా సత్కరించారు. ఫ సంస్కృతంలో అష్టావధానం చేస్తున్న బాలిక ఫ జయలక్ష్మికి ప్రశంసల వెల్లువ సంప్రదాయాలను కాపాడాలనే.. మన సనాతన ధర్మం, సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలనే లక్ష్యంతో జయలక్ష్మికి దేవభాష సంస్కృతం నేర్పించాం. ఏదీ కష్టతరం కాదని, నేర్చుకుంటే అన్నీ సులభతరమేనని రుజువు చేస్తూ ప్రతిభ కనబరుస్తుంది. నేటి బాల, బాలికలలో స్ఫూర్తి నింపే విధంగా తమ కుమార్తెను తీర్చిదిద్దుతాం. – నరసింహదేవర మైథిలీనాఽథ్, జయలక్ష్మి తండ్రి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు.. జయలక్ష్మిలో ఉన్న విశేష ప్రతిభను గుర్తించి తమ పాఠశాలకు తీసుకువచ్చి సత్కరించాం. తమ విద్యార్థులకు సంస్కృత భాషపై అవగాహన కల్పించడంతో పాటు స్ఫూర్తి నింపే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఐదు భాషల్లో అవలీలగా మాట్లాడుతున్న జయలక్ష్మిని చూసి విద్యార్థినీ, విద్యార్థులు ఎంతో స్ఫూర్తి పొందారు. –టీవీఎస్ఎస్వీ ప్రసాదరావు, హెచ్ఎం, రీజెన్సీ హైస్కూల్ -
ఉపాధి హామీ రద్దుకే కొత్త బిల్లు
● 22న కలెక్టరేట్ వద్ద నిరసన ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తాటిపాక మధు కాకినాడ రూరల్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకే కేంద్రం కొత్త బిల్లులను తీసుకువచ్చిందని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపాక మధు విమర్శించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సమితి ఆధ్వర్యంలో మండలంలోని నేమాం, తిమ్మాపురం, పండూరు గ్రామాలలో ఉపాధి పనుల వద్దకు బుధవారం వెళ్లి కూలీలతో మాట్లాడారు. కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 22న కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి తరలిరావాలని కూలీలను కోరారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ కొత్త బిల్లు చట్టమైతే ఉపాధి హామీ చట్టం తల లేని మొండెంగా తయారవుతుందన్నారు. హామీ అనే పదం తొలగించడం ద్వారా ఉపాధి చట్టం నిర్వీర్యమవుతుందన్నారు. పనిదినాలు 125 రోజులకు పెంచుతున్నామని చెప్పి 60 రోజుల పని నిషేధం విధించారని విమర్శించారు. కొత్త చట్టం ప్రకారం రాష్ట్రాలు 40శాతం వాటా భరించాలని పేర్కొనడం దారుణమని, పనులను నాలుగు రకాలుగా విభజించి యంత్రాలు, కాంట్రాక్టర్లకు ఉపాధి హామీగా మార్చుతున్నారని విమర్శించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉపాధి హామీ కార్మికులు, వ్యవసాయ కూలీలు 22న రాష్ట్ర వ్యాప్త నిరసనల్లో పాల్గొని బిల్లు కాగితాలను దగ్ధం చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ పేరు వింటుంటే మోదీకి నిద్ర పట్టడం లేదన్నారు. కార్యక్రమంలో రైతు సంఘ జిల్లా కన్వీనరు నక్కు శ్రీనివాసరావు, బీకేఎంయూ జిల్లా అధ్యక్షుడు అప్పలరాజు, కార్యదర్శి పప్పు ఆదినారాయణ, సరస్వతి మోహన్, వీరబాబు, కావలమ్మ, చిట్టమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలి
కాకినాడ లీగల్: ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని, అనవసర విషయాల్లోకి వెళ్లడం వలన మీకు, మీ కుటుంబ సభ్యులకు సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ (సీనియర్ సివిల్ జడ్జి) ఎన్.శ్రీలక్ష్మి బుధవారం తెలిపారు. స్థానిక స్పెషల్ సబ్జైలులో రికార్డులు, వంటగది, స్టోర్రూమ్ వంటి వాటిని తనిఖీ చేశారు. రిమాండ్ ఖైదీలతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులు, వసతులు, భోజనం ఎలా ఉందని, ఎన్ని రోజుల నుంచి జైలులో ఉన్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. సబ్జైలులో ఖైదీల కోసం ఉన్న ఫిర్యాదు బాక్స్ పరిశీలించారు. ఆ బాక్స్లో బూజుతో పాటు బల్లులు ఉండడం గమనించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఎవరికై నా న్యాయవాదులను పెట్టుకునే స్తోమత లేకపోతే తమ సంస్థకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సబ్ జైలు సూపరింటెండెంట్ ఎం.వీరబాబు, సబ్ జైలు డిప్యూటీ జైలర్ జోసఫ్, న్యాయవాదులు పాల్గొన్నారు. -
సమన్వయంతో పోలియో అంతం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లావ్యాప్తంగా ఈనెల 21న జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రణాళిక ప్రకారం పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. పోలియోను అంతమొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమం జిల్లాలో విజయవంతం చేసేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఆదివారం పోలియో బూతులతో పాటు, సోమ, మంగళవారాలు రెండు రోజుల పాటు ప్రతీ ఇంటిని సందర్శించాలని అధికారులకు స్పష్టం చేశారు. పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 5 సంవత్సరాలలోపు ఉన్న సుమారు 1.94 లక్షల చిన్నారుల కోసం 1,332 పోలియో బూత్లను ఏర్పాటు చేశామన్నారు. 61 మొబైల్ టీమ్స్ను అందుబాటులో ఉంచామని, 130 రూట్ ఆఫీసర్లను నియమించామన్నారు. ఈ పల్స్ పోలియో కార్యక్రమం జిల్లాలో సజావుగా జరిగేందుకు వైద్య ఆరోగ్యశాఖ నుంచి 1,302 పారామెడికల్ సిబ్బందిని, 1,442 మంది ఆశా వర్కర్లను, 1,968 మంది అంగన్వాడీ సిబ్బందిని, 656 మంది ఉపాధ్యాయులు నర్సింగ్ స్టూడెంట్స్, ఇతర వలంటీర్లను అందుబాటులో ఉంచామన్నారు. పట్టణ ప్రాంతాల్లోని స్లమ్ ఏరియాలు, నూతనంగా ఏర్పడిన హౌసింగ్ కాలనీలు, మత్స్యకార ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఐదు సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి పోలియో రెండు చుక్కలు వేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాల విద్యార్థులతో గ్రామాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించాలన్నారు. అనంతరం పల్స్ పోలియో కార్యక్రమంపై రూపొందించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. జిల్లావైద్యారోగ్యశాఖాధికారి జె.నరసింహనాయక్ పల్స్ పోలియో కార్యక్రమం సజావుగా జరిగేందుకు వైద్య ఆరోగ్యశాఖ ద్వారా చేపడుతున్న కార్యకలాపాలను అధికారులకు వివరించారు. -
పలువురికి కారుణ్య నియామకాలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా పరిషత్ పరిధిలో పని చేస్తూ మరణించిన వారి వారసులు 31 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ బుధవారం జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడలో ఆయన మాట్లాడుతూ 23 మందిని జూనియర్ సహాయకులుగా, 8 మందిని టైపిస్ట్లుగా నియమించినట్లు చెప్పారు. జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ నియామకాలను పారదర్శకంగా చేపట్టామన్నారు. కారుణ్య నియామక ఉత్తర్వులు అందుకున్న అభ్యర్థులు మాట్లాడుతూ తమ కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తమకు, ఈ ఉద్యోగ అవకాశం కల్పించడం ద్వారా కొండంత అండ ఇచ్చినట్లు అయ్యిందని భావోద్వేగానికి లోనయ్యారు. ఖాళీలు ఏర్పడిన వెంటనే త్వరితగతిన ఈ నియామక ప్రక్రియను పూర్తి చేసినందుకు జెడ్పీ చైర్మన్కు కృతజ్ఞతలు తెలిపారు. -
డెబిట్ కార్డు ఏమార్చి..
● జల్సాలకు అలవాటు పడి చోరీలు ● పోలీసుల అదుపులోకి నిందితుడు అనపర్తి: ఏటీఎంల వద్దకు వస్తున్న అమాయక ప్రజలే అతని టార్గెట్.. వారిని మాటల్లోకి దించి, ఆపై డెబిట్ కార్డులు మార్చి చోరీలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్తుడిని పోలీసులు పట్టుకున్నారు.. మళ్లీ కటకటాల్లోకి పంపారు.. జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న అతన్ని అనపర్తి పోలీసులు మంగళవారం చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై బుధవారం అనపర్తి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డీఎస్పీ విద్య వివరాలు వెల్లడించారు. నెల్లూరు పట్టణానికి చెందిన కందూకూరు ఫణీంద్ర బీటెక్ చదివాడు. అతను జల్సాలకు అలవాటు పడి చోరీల మార్గాన్ని ఎంచుకున్నాడు. ఏటీఎంల వద్ద చదువు రాని, వృద్ధులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేయడంలో సహాయం చేసినట్లు నటించి వారి డెబిట్ కార్డును తస్కరిస్తాడు. తన వద్ద ఉన్న డూప్లికేట్ కార్డును వారికిచ్చి, అనంతరం అసలు కార్డు ఉపయోగించి వారి ఖాతాల్లోని సొమ్ము డ్రా చేసి ఉడాయిస్తాడు. ఈ ఏడాది మార్చి నెల 13న అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన సిద్ధాబత్తుల ముత్యాలు అనపర్తి కెనాల్ రోడ్డులోని ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తుండగా, మాటలు కలిపి డెబిట్ కార్డును తస్కరించాడు. అనంతరం ఫణీంద్ర రూ.35 వేలు విత్ డ్రా చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అనపర్తి ఎస్సై ఎల్.శ్రీనునాయక్ దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ తెలిపారు. పలు జిల్లాల్లో నమోదైన 7 కేసుల్లో శిక్ష అనుభవించినా, నిందితుడి ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు. 2024 నుంచి తాడేపల్లిగూడెంలో ఉంటూ అనపర్తి, జగ్గంపేట, మండపేట టౌన్, రాజమహేంద్రవరం, అత్తిలి పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధ నేరాలకు పాల్పడగా, వచ్చిన సుమారు రూ.1.70 లక్షలతో కారును కొనుగోలు చేసి జల్సా చేస్తున్నాడని డీఎస్పీ వివరించారు. ఫణీంద్ర నుంచి కారు, నేరాలకు ఉపయోగించిన 10 డెబిట్ కార్డులను సీజ్ చేశామన్నారు. సీఐ సుమంత్ ఆధ్వర్యంలో కేసును ఛేదించిన ఎస్సై శ్రీనునాయక్, బృందాన్ని డీఎస్పీ అభినందించారు. -
వెంకన్న హుండీ ఆదాయం రూ.1.56 కోట్లు
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారికి ఆలయ హుండీల ద్వారా రూ.1,56,31,085 ఽఆదాయం వచ్చినట్టు దేవదాయ, ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. 28 రోజుల అనంతరం బుధవారం దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఆలయంలోని హుండీలను తెరిచి, వసంత మండపంలో లెక్కించారు. వేంకటేశ్వరస్వామి ప్రధాన హుండీలు, విశ్వేశ్వరస్వామివారి హుండీల ద్వారా రూ.1,28,07,874, అన్నప్రసాదం హుండీల ద్వారా రూ.28,23,211 ఽఆదాయం వచ్చినట్టు వివరించారు. అలాగే బంగారం 27 గ్రాములు, వెండి కిలో 150 గ్రాములు, వివిధ దేశాల కరెన్సీ నోట్లు 43 వచ్చాయని ఈఓ తెలిపారు. పర్యవేక్షణ అధికారులుగా దేవదాయ శాఖ ఏసీ, అండ్ అంతర్వేది దేవస్థానం ఈఓ ఎంకేటీఎన్వీ ప్రసాద్, రాజమహేంద్రవరం తనిఖీదారు ఎస్టీపీటీ శ్రీనివాస్, వెలిచేరు గ్రూపు దేవాలయాల గ్రేడ్– 3 ఈఓ ఎం.సత్యనారాయణ, అర్చకులు, దేవస్థానం సిబ్బంది, సేవకులు తదితరులు పాల్గొన్నారు. -
మట్టి... కొల్లగొట్టి
● ఆగని మట్టి అక్రమ తవ్వకాలు ● రెచ్చిపోతున్న మాఫియా కొత్తపేట: నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. పలువురు మట్టి వ్యాపారులు ప్రైవేట్ భూముల్లోనే కాదు.. నదీ పరీవాహక ప్రభుత్వ భూముల్లో సైతం మట్టిని అక్రమంగా తవ్వేస్తున్నా సంబంధిత అధికారులకు మాత్రం పట్టడం లేదనే విమర్శలున్నాయి. కొత్తపల్లి మండలం మందపల్లి, నారాయణలంక, కొత్తపేట సూర్యగుండాల పాయ ప్రాంతాల్లో మట్టిని అక్రమంగా తవ్వేస్తున్నారు. ఇక్కడ కొందరు నేతల అండదండలతో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఎటువంటి అనుమతులు లేకుండా జేసీబీలతో మట్టి తవ్వి, తరలిస్తున్నారు. రాత్రీ, పగలు అనే తేడా లేకుండా పక్క రోడ్లలోనే కాదు.. నిర్భయంగా ప్రధాన ఆర్అండ్బీ, జాతీయ రహదారులపై అధికారుల కళ్లముందే ట్రాక్టర్లపై మట్టి తరలిస్తున్నారు. మట్టి తవ్వకాలకు మైనింగ్, రెవెన్యూ అధికారుల అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా వాటిని ఖాతరు చేయడం లేదు. ‘కూటమి’గా ఏర్పడి మట్టి దందా నిర్భయంగా సాగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కొంతమంది రైతులు నిబంధనలకు విరుద్ధంగా తమ చేలల్లో మట్టిని లోతుగా తవ్వుకునేందుకు పెద్ద మొత్తానికి విక్రయించగా, పక్క చేలు విరిగిపోతాయని బాధిత రైతులు వాపోతున్నారు. పలు ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని అందిన సమాచారంతో అధికారులు వెళ్లి నిలిపివేస్తున్నా, చర్యలకు పలువురి నేతల నుంచి ఫోన్లు రావడంతో వారు వెనుతిరుగుతున్నారని తెలుస్తోంది. పలుచోట్ల గౌతమి, వశిష్ట నదీ పరీవాహక లంక భూముల్లో ఎక్కువగా ఈ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల గుట్టుచప్పుడు కాకుండా పుంత రోడ్లు, పక్క రోడ్లు వెంబడి తరలిస్తుంటే, కొన్నిచోట్ల ప్రధాన రహదారుల నుంచి తీసుకెళ్తున్నారు. -
జాతీయ రోలర్ స్కేటింగ్ విజేతలకు అభినందన
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): విశాఖలో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు అభినందన కార్యక్రమం బుధవారం కాకినాడలోని వైఎస్ఆర్ స్కేటింగ్ రింక్లో జరిగింది. ఈ పోటీల్లో ఆకుల కావ్యశ్రీ మూడు బంగారు, సత్తి శ్యామ్ సుందర్రెడ్డి రజిత, కాంస్య, చీకట్ల అశ్విన్ నిహాల్ రెండు కాంస్య, బిక్కిన శ్రీసాయి మహిత రెండు కాంస్య, కనకట్ల నిహారికి బంగారు, జానగౌరి సుప్రజ కాంస్య, వైట్ల కార్తిక్ శ్రీశౌర్య రెండు కాంస్య పతకాలు సాధించారు. రాజమహేంద్రవరానికి చెందిన కెల్ల భవ్యశ్రీ రెండు బంగారు, ఒక కాంస్య పతకం అందుకుంది. రావులపాలేనికి చెందిన కట్ట శ్రీరామ్ కాంస్య పతకం సాధించాడు. వీరు రోలర్ స్కేటింగ్ కోచ్లు ఈశ్వర్, చంటి వద్ద శిక్షణ పొందుతున్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు రోలర్ స్కేటింగ్ సంఘ అధ్యక్షుడు రావు రాజగోపాల్, కార్యదర్శి దొరైస్వామిలు మెమెంటోలు అందజేసి సత్కరించారు. వ్యక్తి అదృశ్యంపై కేసు అంబాజీపేట: కారు డ్రైవర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి విశాఖపట్నం కిరాయికి వెళ్లి అదృశ్యం కావడంతో కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. తొండవరం గ్రామానికి చెందిన వెంపరాల వెంకన్నబాబు గ్రామంలో ఎలక్ట్రికల్, కార్ డ్రైవింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల 12న బయటకు వెళ్లిన వెంకన్నబాబు తిరిగి ఇంటికి రాలేదు. 13న కారుపై విశాఖపట్నం కిరాయికి వెళుతున్నానని తన కుమారుడు నాగసాయిరామ్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. అప్పటి నుంచి రాకపోవడంతో చుట్టుపక్కల వారిని, బంధువులను అడిగినా చేసినా ఫలితం లేకపోవడంతో వెంకన్నబాబు భార్య అరుణశ్రీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై సూర్యనారాయణ తెలిపారు.కళాశాలకు వెళ్లేందుకు బస్సు ఎక్కి.. కోటనందూరు: ఓ విద్యార్థి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ బుధవారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. పాతకొట్టాం గ్రామానికి చెందిన కాపారపు జయవర్ధన గోపాలకృష్ణ తుని రాజా కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. రోజూ మాదిరిగానే ఈ నెల 15న కళాశాలకు వెళ్లేందుకు పాతకొట్టాంలో బస్సు ఎక్కాడు. కళాశాలకు చేరుకోకపోవడంతో యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ దొరకపోవడంతో విద్యార్థి తల్లి కాపారపు లోవతల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. అతని ఆచూకీ తెలిస్తే 94409 00773 ఫోన్ నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు. భార్య కనపడడం లేదంటూ ఫిర్యాదు నల్లజర్ల: తన భార్య పుట్టింటికి వెళ్తానని చెప్పి కనిపించకుండా పోయిందని ఓ వ్యక్తి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మండలంలో అనంతపల్లికి చెందిన ఒల్లు అప్పారావు భార్య దివ్యదుర్గ ఈ నెల 8న అదే గ్రామంలో ఉన్న తన పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పి కనిపించకుండా పోయింది. ఈ మేరకు అప్పారావు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై అదృశ్యం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ దుర్గాప్రసాదరావు తెలిపారు. -
పుంజుకున్న పెంపకం
పుంజుకున్న పెంపకం.. నిడదవోలు: సంక్రాంతి.. ఈ పేరు అంటేనే గోదావరి జిల్లాల్లో కోడి పందేలకు పెట్టింది పేరు. సామాన్యుల నుంచి రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు సైతం పందేలకు సై అంటారు. పండగ సమీపిస్తుండడంతో కోడి పుంజుల వేటలో పందెం రాయుళ్లు ఉంటే, మరోపక్క నిర్వాహకులు మూడు నెలల నుంచి పుంజుల పెంపకంలో నిమగ్నమవుతున్నారు. వీరు పుంజులకు రాజభోగాలతో మేత పెట్టి మరీ పందేలకు సిద్ధం చేస్తున్నారు. పోలీసులు హెచ్చరిస్తున్నా ఏటా బరుల్లో రక్తపుటేరులు పారిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందేలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పందేలకు అవసరమైన పుంజులను రెడీ చేస్తున్నారు. ఈ సీజన్లో పందెం కోళ్లకు మంచి డిమాండ్ ఉంది. వీటిపై వ్యాపారం చేసే కొందరు ముందుగా పెంచిన పుంజులను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే పందెం రాయుళ్లు పుంజుల వేట మొదలుపెట్టారు. వారికి కావాల్సిన రంగు, సైజుల్లో ఉన్న పుంజులు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకుని మరీ కొనుగోలు చేస్తున్నారు. సంక్రాంతి సమీపిస్తుండడంతో పుంజులను కంటికి రెప్పలా చూసుకుంటూ వాటికి అవసరమైన సపర్యలు చేస్తున్నారు. ప్రధానంగా కాకి, డేగ, నెమలి, పరదా, పచ్చకాకి, పెట్టమారు, రసంగి, సేతువా, మైలియా, పింగళ వంటి రకాల పుంజులను పెంచుతున్నారు. డిమాండ్ను బట్టి.. కత్తులు కట్టి బరిలో దింపే పుంజుల ధరలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. కోడి పుంజుల జాతులను పందెం రాయుళ్లు పలు రకాలుగా పిలుస్తారు. రకాన్ని బట్టి ఒక్కో పుంజు రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు ధర పలుకుతోంది. సరైన పందెం పుంజు దొరికితే ఎంత ధరైనా ముట్టజెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా సేతువా జాతి కోడి మీద పందేలు జోరుగా కాస్తారు. దీని ధర రూ.70 వేల వరకూ పలుకుతోంది. అలాగే వర్లా రకం కోడి ధర రూ. 50 వేలు ఉంది. నెమలి రకం కోడి పుంజు ప్రస్తుతం రూ.50 వేల నుంచి రూ.60 వేలు పలుకుతోంది. కాకి డేగ, పర్లా రూ.25 వేల నుంచి రూ.30 వేలు, ఎర్ర కెక్కిరాయి రూ.40 వేలు, పచ్చకాకి, డేగ రూ.30 వేల నుంచి రూ.40 వేలకు అమ్ముతున్నారు. డిమాండ్ను బట్టి పెంపకందారులు ధరను అమాంతం పెంచుకుపోతున్నారు. రసంగి, సేతువా, కెక్కిరాయి, పూల, అబ్రాసు, రసంగి, మైయిలా, సింగాలి, పెట్టమారు, పింగళ వంటి రకాల కోడి పుంజులు రూ.25 వేల నుంచి రూ.30 వేల ధరకు పందెం రాయుళ్లు కొనుక్కుపోతున్నారు. పౌష్టికాహారం.. ఆపై వ్యాయామం పుంజులను రోజూ ఈత కొట్టించడంతో పాటు వేడి నీళ్లతో స్నానం చేయించి శక్తివంతమైన పుంజులుగా తయారు చేస్తున్నారు. నవంబర్ మాసం నుంచి వీటికి గంట్లు, చోళ్లు, గుడ్లు, పిస్తాలు, బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, కిస్మిస్, నల్ల నువ్వులు, తాటి బెల్లం, మటన్ కై మా, నాస్తా వంటివి ఆహారంగా ఉదయం, సాయంత్రం ఇస్తున్నారు. పౌష్టికాహారం తీసుకున్న పుంజులకు అరుగుదలకు, బద్దకం, నీరసం రాకుండా రోజూ వ్యాయామాలు కూడా చేయిస్తున్నారు. వీటి కోసం ప్రత్యేకంగా నీటి తొట్టెలను నిర్మించి వాటిలో రోజు ఉదయం ఊత కొట్టిస్తున్నారు. కోళ్ల పెంపకందారులు, పందెం రాయుళ్లు పుంజులకు రాజభోగాలతో మేత పెట్టి మరీ పందెలకు సిద్ధం చేస్తున్నారు. కొందరు అదనంగా విటమిన్ ట్యాబ్లెట్లు ఇస్తున్నారు. ప్రత్యేక ఆహారంతో పెంచుతూ సంక్రాంతి బరిలోకి సిద్ధం చేస్తున్నారు. అబ్రాసు జాతి పుంజు ముహూర్తాలు చూసి మరీ.. సేతువా, పచ్చకాకి, డేగ, కాకి పుంజు, పెట్టమారు వంటి జాతి పుంజులు బరిలో దిగితే నువ్వా.. నేనా అనేలా తలపడతాయి. సేతువా రకం తెల్ల కోడిపుంజు బరిలో ప్రత్యర్థి పుంజును మట్టి కరిపించేందుకు గాయాలతో రక్తం కారుతున్నా లెక్క చేయకుండా కొనఊపిరి వరకూ పోరాడుతుంది. డేగ మీద కూడా ఎక్కువగా పందేలు కడతారు. ఇది కూడా బరిలో పందెం రాయుళ్లకు కాసుల వర్షం కురిపిస్తుంది. కొందరు కోడి పుంజుల జాతి పేర్ల ప్రకారం ముహూర్తాలు చూసుకుని మరీ పందేలు కాస్తారు. కోడి జాతిని బట్టి ఏ దిక్కుకు వెళ్లాలి, ఏ సమయంలో పుంజులను బరిలో దింపాలో ముందుగానే ముహూర్తాలు చూసుకుంటారు. రూ.కోట్లలో జూదం సంక్రాంతి పండగ మూడు రోజులూ ఈ కోళ్లతో ఏటా రూ.కోట్ల జూదం జరుగుతోంది. కోనసీమ జిల్లాలో ప్రధానంగా ఐ.పోలవరం మండలం, కాట్రేనికోన, రావులపాలెం, తూర్పుగోదావరి జిల్లాలో నిడదవోలు, గోపాలపురం, నల్లజర్ల, రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం, కోరుకొండ మండలాల్లో భారీ స్థాయిలో బరులు నిర్వహిస్తారు. నిడదవోలు పట్టణంలో ఫ్లడ్ లైట్లు, భారీ ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేసి మరీ పందేలు జరుపుతారు. పందెం కోళ్లకు రాజభోగాలు సంక్రాంతి బరిలో దింపేందుకు తర్ఫీదు రకాన్ని బట్టి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకూ ధర -
జాతీయ మ్యాథ్స్ ఒలింపియాడ్లో ప్రతిభ
బాలాజీచెరువు: రామానుజన్ మ్యాథ్స్ ఒలింపియాడ్ పరీక్ష ఫలితాల్లో కాకినాడ గంగరాజునగర్ ఆదిత్య హైస్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారు. షేక్ అబ్దుల్ షాహుల్ నవాజ్ (7వ తరగతి) ప్రథమ ర్యాంకు, ధైర్య సుమిత్ రామ (9వ తరగతి) ప్రథమ ర్యాంకును సాధించారు. జిల్లా స్థాయిలో అన్నమదేవర అభిరామ్ (6వ తరగతి) ప్రథమ, మోతూరి క్రిమ్సన్ (8వ తరగతి) రెండో ర్యాంకు, గుడివాడ వెంకట శివరామ అఖిలేష్ (9వ తరగతి) మొదటి ర్యాంకు, దంగేటి రోహిత్బాబు (10వ తరగతి) రెండో ర్యాంకును సాధించారని పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి జె.మొయినా తెలిపారు. ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులను, విజయానికి కారకులైన ఉపాధ్యాయులను ఆదిత్య సంస్థల ఛైర్మన్ ఎన్.శేషారెడ్డి అభినందించారు. -
రామానుజన్ టాలెంట్ టెస్ట్లో ‘భాష్యం’ ప్రతిభ
బోట్క్లబ్: జాతీయ స్థాయిలో నిర్వహించిన రామానుజన్ టాలెంట్ టెస్ట్లో స్థానిక శాంతినగర్ భాష్యం విద్యార్థులు ప్రతిభ కనబర్చినట్లు భాష్యం స్కూల్ జోనల్ ఇన్చార్జ్ గోవిందరాజులు తెలిపారు. జాతీయ, జిల్లా స్థాయిలో ర్యాంకులు సాధించారన్నారు. ఎ.నాగగంగావర్ధన్, షేక్ కహీషా కౌషర్ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు, కె.లక్ష్మీసాహితి, కె.హరిధర్మ కార్తికేయ 2వ ర్యాంకు సాధించారు. జిల్లా స్థాయిలో వై.ఉత్తేజ్, కె.తనిష్క్, జి.గోవర్ధని మొదటి ర్యాంకు, వై.ప్రదీష్ ద్వితీయ ర్యాంకు సాధించారు. విద్యుత్నగర్ బ్రాంచ్కు చెందిన వై.రిషిరెడ్డి జిల్లా స్థాయి మొదటి ర్యాంకు సాధించారు. ఈ విద్యార్థులను గోవిందరాజులు బుధవారం అభినందించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మరొకరికి తీవ్ర గాయాలు అమలాపురం టౌన్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. దీనిపై అమలాపురం పట్టణ సీఐ పి.వీరబాబు కథనం ప్రకారం.. అంబాజీపేట మండలం తొండవరం గ్రామానికి చెందిన ప్రస్తుతం అమలాపురంలో నివసిస్తున్న తోట వినయ్ (23), నిమ్మకాయల సాయివెంకట సత్యమూర్తిలు స్నేహితులు. మంగళవారం ఉదయం ఆ యువకులు అమలాపురం నుంచి మోటారు సైకిల్పై భీమవరం బయలు దేరారు. రోళ్లపాలెం 216 జాతీయ రహదారి బైపాస్లోకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొంది. మోటారు సైకిల్ వెనుక వినయ్ కూర్చోగా, కాలు విరిగిపోయి తలకు గాయమైంది. అతడిని తక్షణమే రాజమహేంద్రవరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వినయ్ బుధవారం మృతి చెందాడు. మృతుడికి ఇంకా వివాహం కాలేదు. అతనిది సాధారణ కుటుంబం. ఎదిగి వచ్చిన కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. సత్య వెంకట సత్యమూర్తి అమలాపురంలోని ఓ ఎమర్జెన్సీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అమలాపురం పట్టణ ఎస్సై మనోహర్ జోషి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కొలంబో క్రికెట్ టోర్నీకి కాకినాడ లాయర్లు
కాకినాడ లీగల్: శ్రీలంక రాజధాని కొలంబోలో ఈ నెల 20 నుంచి జనవరి 2 వరకూ జరిగే 37వ ఆలిండియా అడ్వొకేట్స్ క్రికెట్ టోర్నమెంట్లో రాష్ట్ర జట్టు తరఫున ఆడటానికి కాకినాడ న్యాయవాదులకు అవకాశం వచ్చింది. ఈ టోర్నీలో కాకినాడ బార్ అసోసియేషన్కు చెందిన న్యాయవాదులు ఎన్.భూచక్రవర్తి, కె.సందీప్ క్రికెట్ ఆడటానికి ఎంపికయ్యారు. టోర్నమెంట్ మేనేజర్గా జోకా వీఎస్ విజయకుమార్ను నియమించారు. వారిని బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఏలూరి సుబ్రహ్మణ్యం, వీరభద్రరావు, న్యాయవాదులు అభినందించారు.ఎన్.భూచక్రవర్తి కె.సందీప్ జె. విజయకుమార్ -
‘మోగ్లీ’ చిత్ర యూనిట్ సందడి
ప్రేక్షకులతో మమేకమైన హీరో, హీరోయిన్అమలాపురం టౌన్: మోగ్లీ సినిమా హీరో రోషన్ కనకాల, హీరోయిన్ సాక్షి మండోల్కర్తో పాటు చిత్ర యూనిట్ ప్రతినిధులు అమలాపురంలో మంగళవారం సందడి చేశారు. మూడు రోజుల క్రితం ఈ చిత్రం విడుదలై అమలాపుంలో ప్రదర్శితమవుతున్న లలిత థియేటర్కు చిత్ర యూనిట్ వచ్చి ప్రేక్షకులతో మమేకమైంది. సినిమా హీరో హీరోయిన్తోపాటు సినిమా దర్శకుడు సందీప్రాజ్ పాల్గొని సందడి చేశారు. తొలుత చిత్ర యూనిట్కు థియేటర్ యాజమాని తోట రాము, సిబ్బంది స్వాగతం పలికారు. సినిమా ప్రదర్శితమవుతున్న వేళ చిత్ర యూనిట్ థియేటర్లోకి వెళ్లి ప్రేక్షకులతో మాట్లాడింది. ముఖ్యంగా హీరో, హీరోయిన్, దర్శకుడు సినిమా ఎలా ఉందని ప్రేక్షకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం థియేటర్ వద్ద హీరో రోషన్, హీరోయిన్ సాక్షి మండోల్కర్ అభిమానుల సమక్షంలో కేక్ను కట్ చేశారు. కోనసీమ ప్రజలు కొత్త వారమైన తమకు ఆశీర్వాదాలు అందించాలని ిహీరో, హీరోయిన్ రోషన్, మండోల్కర్ అక్కడికి వచ్చిన అభిమానులను అభ్యర్థించారు. థియేటర్ మేనేజర్ కడలి త్రినాథ్, అనుశ్రీ సినిమాస్ ఏజెంట్ వి.శ్రీనివాస్, టూర్ ఆర్గనైజర్ నిమ్మకాయల దుర్గాప్రసాద్, చిరంజీవి అభిమాన సంఘాల ప్రతినిధులు నల్లా చిట్టి, గుమ్మళ్ల సురేష్ పాల్గొన్నారు. -
ట్రాక్టర్ బోల్తా...డ్రైవర్ మృతి
ముమ్మిడివరం: తవుడు లోడుతో వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో డ్రైవర్ దాని కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. ఉప్పలగుప్తం మండలం కూనవరానికి చెందిన వరసాల సత్యనారాయణ(50) మంగళవారం ట్రాక్టర్పై తవుడు లోడుతో కూనవరం వెళుతుండగా ముమ్మిడివరం శివారు బొండాయి కోడు తూము వద్ద 216 జాతీయ రహదారిపై స్కూటీపై వెళుతున్న బడుగు రాణిని ఢీకొన్నాడు. ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న పంట కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సత్యనారాయణ ట్రాక్టర్ కింద పడి ఊబిలో కూరుకుపోయాడు. ముమ్మిడివరం ఎస్సై డి.జ్వాలాసాగర్ ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో ట్రాక్టర్ను తీయగా డ్రైవర్ సత్యనారాయణ ట్రాక్టర్ కింద ఊబిలో చిక్కుకుని మృతి చెందాడు. స్కూటీపై వెళుతున్న బడుగు రాణికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధికార ప్రతినిధి, ఎస్ఈసీ మెంబర్ కాశి బాలమునికుమారి గాయపడిన బడుగురాణికి సపర్యలు చేసి, ఆమెను 108లో కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సాహితీ సూర్యుడు బోయి భీమన్నఅమలాపురం టౌన్: ఆధునిక సాహిత్యాన్ని తేజోవంతం చేసిన మహా కవి పద్మశ్రీ బోయి భీమన్న సాహితీ సూర్యుడని శ్రీశ్రీ కళా వేదిక అంతర్జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కత్తిమండ ప్రతాప్ అన్నారు. బోయి భీమన్న వర్ధంతి సందర్భంగా శ్రీశ్రీ కళా వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక వడ్డిగూడెంలోని వేమన కోనసీమ రెడ్డి జన సమైక్య కమ్యూనిటీ హాలులో మంగళవారం నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో డాక్టర్ ప్రతాప్ మాట్లాడారు. తొలుత బోయి భీమన్న చిత్రపటానికి డాక్టర్ ప్రతాప్తోపాటు కవులు, రచయితలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహాకవి బోయి భీమన్న –వ్యక్తిత్వం–రచనలు అనే అంశంపై డాక్టర్ ప్రతాప్ మాట్లాడారు. శ్రీశ్రీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు నల్లా నరసింహమూర్తి, కోనసీమ రచయితల సంఘం అధ్యక్షుడు బీవీవీ సత్యనారాయణ, కవయిత్రి సబ్బెళ్ల వెంకటమహాలక్ష్మి తదితరులు పాల్గొని బోయి భీమన్న సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. -
అవిశ్రాంత సేవకులు
● సామాజిక బాధ్యతతో ముందుకు.. ● హక్కుల కోసం పోరాటం ● నేడు జాతీయ పెన్షనర్స్ డే కపిలేశ్వరపురం/కొత్తపేట: సమాజంలో శ్రామికులు, ఉద్యోగులు, కీలక పాత్రధారులు. ఉద్యోగ విరమణ తర్వాత వారికి సామాజిక భద్రత కల్పించేందుకు పెన్షన్ ఓ భరోసా. ప్రస్తుత పాలనలో ఆ పెన్షన్ మంజూరు కావాలన్నా, మంజూరైనది పొందాలన్నా ఓ ప్రహసనంగా మారింది. పెన్షనర్లు తమ హక్కుల కోసం పోరాడుతూనే సామాజిక సేవా కార్యక్రమాలను సైతం చేస్తున్నారు. నేడు పెన్షనర్స్ డే సందర్భంగా కథనం.. ఉద్యమ బాటలో... ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఫ్యాక్టరీ, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో సేవలందించిన రిటైర్డ్ పెన్షనర్లు సుమారు 50 వేలు మంది ఉన్నారు. అత్యధికులు రూ.3వేలు లోపు పెన్షన్ తీసుకుంటున్నవారే ఉన్నారు. ఉదాహరణకు ఉమ్మడి జిల్లాలో ఏపీఎస్ ఆర్టీసీ సంస్థలో ఉద్యోగ విరమణ చేసిన వారిలో 1,700 మంది డ్రైవర్లు, కండక్టర్లు, 150 మంది కార్యాలయ ఉద్యోగులు, 1,350 మంది మెకానికల్ విఽభాగానికి చెందిన వారు మొత్తం 3,200 మంది ఉన్నారు. వారు నెలకు కేవలం రూ.2వేల లోపు మాత్రమే పెన్షన్ ఇవ్వడాన్ని నిరసిస్తూ పలుమార్లు ఉమ్మడి జిల్లాలో నిరసన తెలిపారు. వృద్ధులకు అందజేసే రూ.4వేలు సామాజిక పింఛనును వర్తింపజేయాలని కోరుతూ ధర్నాలు చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ సదుపాయం కల్పించాలంటూ సీఐటీయూ తదితర కార్మిక సంఘాలు ఉమ్మడి జిల్లాలో పలుమార్లు ధర్నాలు చేశాయి. ఆల్ ఇండియా కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్ సంఘం ఆధ్వర్యంలో ఈపీఎస్ –95 పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ.9వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9న ఢిల్లీలోని సుజిత్ భవన్లో సదస్సును నిర్వహించారు. 10న జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆయా కార్యక్రమాలకు కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం ప్రాంతాల నుంచి పెన్షనర్లు తరలివెళ్లారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ వ్యాలిడేషన్ బిల్లు –2025ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఒకటో తేదీకి అందని పెన్షన్ ఒకటో తేదీకల్లా ఉద్యోగుల జీతాలు, పెన్షన్ చెల్లిస్తామంటూ చంద్రబాబు, పవన్కల్యాణ్ 2024 ఎన్నికల ప్రచార సభల్లో ఉపన్యాసాలు ఊదరగొట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తున్నా పెన్షనర్స్ సమస్యలపై దృష్టి సారించలేదు. ఒకటో తేదీ దాటిన వారం తర్వాతనే చెల్లింపులు చేస్తున్నారు. సామాజిక సేవలో... రామచంద్రపురం, మండపేట, అమలాపురం, రాజోలు, కొత్తపేట, రాజమహేంద్రవరం, కాకినాడ తదితర ప్రాంతాల్లో పెన్షనర్లు ప్రణాళికాబద్దంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నెల నెలా పెన్షనర్లకు సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ లబ్ధి రాబట్టేందుకు సంబంధించిన పత్రాలను నింపడం, అధికారులకు నివేదించడం క్రమం తప్పకుండా చేస్తున్నారు. చనిపోయిన తర్వాత ఉద్యోగి ఇంటికి వెళ్ళి పెన్షన్కు సంబందించిన ఆన్లైన్ ప్రక్రియకు సహకరిస్తున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నారు. విశ్రాంత ఉద్యోగుల కుటుంబ సభ్యుల చదువు, ఆరోగ్యాలకు తోచిన సాయం చేస్తున్నారు. సామాజిక పెన్షన్లు వర్తింపజేయాలి దేశంలో 82 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వారిలో 36 లక్షల మంది రూ.వెయ్యి లోపు, మరో 36 లక్షల మంది రూ.రెండు వేల లోపు పెన్షన్ను తీసుకొంటున్నారు. కేవలం 10 లక్షల మంది మాత్రమే రూ.మూడువేలు దాటి పెన్షన్ను పొందుతున్నారు. వారందరికీ వృద్ధులు తదితర రకాల సామాజిక పింఛన్లను సైతం అమలు చేయాలి. హైయ్యర్ పెన్షన్ కోసం దేశంలో 17 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా కేవలం 50వేల మందికి న్యాయం జరిగింది. ఈపీఎఫ్ వద్ద రూ.10లక్షల కోట్లు కార్పస్ ఫండ్ ఉండగా దానికి రూ.60వేల కోట్లు నెలకు వడ్డీగా వస్తుంది. అందులోరూ.23 వేల కోట్లు పెన్షన్లుగా చెల్లిస్తున్నారు. మిగిలిన 37వేల కోట్లు తిరిగి ఈపీఎఎఫ్ కార్పస్ ఫండ్గా మళ్లిపోతుంది. ఈపీఎఫ్ ఫండ్ను షేర్మార్కెట్లో పెట్టుబడిగా పెట్టడం ప్రమాదకరమైన నిర్ణయం. – కంచపు సత్తిరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీఆర్పీఏ, కాకినాడ ఉద్యమాలలో పాల్గొనడానికి మేము యువకులమే గతంలో పనిచేసిన నాయకుల కృషితో ఇతర సంఘాలకు దీటుగా మా పెన్షనర్ల సంఘం అన్నింటా ముందు ఉంది. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు పోరాట కార్యక్రమాలలో పాల్గొనడానికి మా వయసు అడ్డురాదు. ఉద్యమాలలో పాల్గొనడానికి మేము యువకులమే. – కాశీరాజేంద్ర ప్రసాద్, అధ్యక్షుడు, పూర్వపు కొత్తపేట తాలూకా ప్రభుత్వ పెన్షనర్ల సంఘం డిమాండ్ల సాధనకు కృషి సంఘం బలోపేతంలో భాగంగా గత 18 నెలల్లో 361 మందిని నూతన సభ్యులుగా చేర్చాం. మా హయాంలో 61 మందికి అదనపు పెన్షన్ కలిసేలా చేయడం సంతృప్తినిచ్చింది. 2022 ఏప్రిల్ 1 నుంచి ఎరియర్స్ కూడా రావలసి ఉంది. అవి వచ్చేటట్టు చేయడానికి, రాష్ట్ర సంఘం అనుమతితో పోరాట కార్యక్రమానికి ప్రణాళిక తయారు చేస్తున్నాం. – యేడిద సత్తిరాజు, ప్రధాన కార్యదర్శి, పూర్వపు కొత్తపేట తాలూకా ప్రభుత్వ పెన్షనర్ల సంఘం మంజూరు కాని కొత్త పింఛన్లు 18 నెలల చంద్రబాబు పాలనా కాలంలో నూతన పింఛన్లు మంజూరు చేయలేదు. దీర్ఘకాలంగా ఇస్తున్న పింఛన్లలో కోత పెట్టారు. కాకినాడ జిల్లాలో 2,71,360 మందికి రూ.117.81 కోట్లు, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2,36,284 మందికి రూ.101.86 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో 2,35,060 మందికి రూ.1.03.27 కోట్లు ఎప్పటి నుంచో ఇస్తూ వస్తున్నారు. 18 నెలల చంద్రబాబు ప్రభుత్వం కొత్తవి మంజూరు చేయకుండా పాత పింఛన్లను సర్వే పేరుతో కోత పెట్టింది. నూతన పింఛన్ కోసం చేసుకున్న దరఖాస్తులు ఉమ్మడి జిల్లాలో సుమారు 30 వేలు, రాష్ట్రంలో 2.5 లక్షలు పెండింగ్లో ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గీయులకు 50 ఏళ్ళకే పెన్షన్ మంజూరు చేస్తామన్న హామీని చంద్రబాబు, పవన్ కల్యాణ్ గాలికి వదిలేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు, తుని మండలాల్లో ఇంటి పన్నుకు, పింఛన్లకు ముడిపెట్టడం చంద్రబాబు పాలనకే చెల్లింది. -
దైవ కుమారునికి స్వాగత సంరంభం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో.. ప్రేమ వెలుగులు ప్రసరింపజేసేందుకు.. పీడిత ప్రజలపై కరుణావర్షం కురిపించేందుకు.. సమస్త మానవాళి పాపాలను ప్రక్షాళన చేసేందుకు.. డిసెంబర్ 24వ తేదీ అర్ధరాత్రి.. కన్య మరియ గర్భాన.. దైవ కుమారుడైన క్రీస్తు జనియించిన శుభ సందర్భం క్రిస్మస్. ఆ బాల ఏసు రాకను స్వాగతిస్తూ ఈ నెల 25న ఈ పండగను ఆనందోత్సాహాలతో నిర్వహించుకునేందుకు జిల్లావ్యాప్తంగా క్రైస్తవులు సిద్ధమవుతున్నారు. నింగి వీధుల నుంచి ప్రభువు జాడను చూపిన నక్షత్రాన్ని తలపించేలా.. ఇళ్లు, వీధుల్లో ఇప్పటికే క్రిస్మస్ స్టార్లు ఏర్పాటు చేసుకున్నారు. చర్చిలను విద్యుద్దీప తోరణాలతో అందంగా అలంకరించారు. కాకినాడ రామారావుపేట లూథరన్, హౌస్ ఆఫ్ ప్రేయర్, రిజర్వ్ లైన్ బాప్టిస్టు, చర్చి స్క్వేర్ సెంటర్లోని ఆంధ్రా బాప్టిస్టు, సీఎస్ఐ, రోమన్ కేథలిక్, పిఠాపురం, తుని పట్టణాల్లోని సెంటినరీ బాప్టిస్టు, పెద్దాపురం లూథరన్ తదితర చర్చిలను విద్యుద్దీప కాంతుల్లో మెరిసిపోతున్నాయి. ఏసు ప్రభువు జననాన్ని కళ్లకు కట్టేలా.. నక్షత్రాలు, పశువుల పాకల సెట్టింగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నిత్య జీవానికి సూచికగా క్రిస్మస్ ట్రీలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో, ప్రార్థనా మందిరాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. చర్చిలతో పాటు వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ, మత ప్రబోధకులు క్రిస్మస్ దివ్య సందేశాన్ని అందిస్తున్నారు. చిల్డ్రన్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, వుమెన్ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారు. జోరుగా అమ్మకాలు క్రిస్మస్ పండగ నేపథ్యంలో సంబంధిత సామగ్రి అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఫ్యాన్సీ షాపులు, గిఫ్ట్ షాపుల్లో గ్రీటింగ్ కార్డులు, క్రిస్మస్ స్టార్లు, క్రిస్మస్ ట్రీలు, వాటి అలంకరణ వస్తువులు, విద్యుద్దీపాల అమ్మకాలు పెరిగాయి. ఒక్కో ట్రీ రూ.350 నుంచి రూ.10 వేల వరకూ, ట్రీ అలంకరణ వస్తువులను రూ.20 నుంచి రూ.500 వరకూ, విద్యుద్దీపాలను రూ.35 నుంచి రూ.600 వరకూ విక్రయిస్తున్నారు. విద్యుద్దీపాలంకరణలో కాకినాడ జగన్నాథపురంలోని సెంటినరీ బాప్టిస్టు చర్చి ఫ క్రిస్మస్ వేడుకలకు ప్రార్థనాలయాల ముస్తాబు ఫ జిల్లావ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు -
‘అంబా’ అని అరచినా..
ఏలేశ్వరం: మూగజీవాల అక్రమ తరలింపునకు 16వ నంబర్ జాతీయ రహదారి రాజమార్గంలా మారింది. ఈ హైవేలో నిత్యం వందలాదిగా ఆవులు, గేదెలను అక్రమార్కులు వివిధ ప్రాంతాలకు తరలించుకుపోతున్నారు. పోలీసు అధికారులు అప్పుడప్పుడు దాడులు చేస్తున్నా.. అక్రమ రవాణాదారులకు అడ్డూ అదుపూ ఉండటం లేదు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని విజయనగరం, పార్వతీపురం మన్యం తదితర జిల్లాలతో పాటు ఒడిశాలోని కొన్ని ప్రాంతాల నుంచి హైవే మీదుగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలతో పాటు తెలంగాణలోని హైదరాబాద్ వంటి నగరాలకు ప్రతి రోజూ వందల సంఖ్యలో పశువులను తరలిస్తున్నారు. ముఖ్యంగా విజయనగరం జిల్లా గనిశెట్టిపాలేనికి చెందిన ఓ ముఠా అండతో మూగజీవాల అక్రమ రవాణా సాగుతోంది. ఇదంతా తెలిసినా కొంత మంది ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై పలు ఆరోపణలు వస్తున్నాయి. లారీలు, వ్యాన్లతో పాటు చూపరుల కళ్లుగప్పేలా కంటైనర్లు, డబుల్ డెక్కర్ వాహనాల్లో యథేచ్ఛగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఎటువంటి అనుమతులూ లేకుండానే డబుల్ డెక్కర్ వాహనాలను పశువుల రవాణాకు వినియోగిస్తున్నారు. మార్గం మధ్యలో ఎటువంటి ఆటంకమూ లేకుండా ఉండేందుకు గనిశెట్టిపాలెం ముఠా ఒక్కో వాహనానికి రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకూ మామూళ్లు చెల్లిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలను ఉల్లంఘించి, ఆయా వాహనాల్లో పరిమితికి మించి ఎక్కిస్తూండటంతో కొన్ని పశువులు ఊపిరాడక మార్గం మధ్యలోనే ప్రాణాలు విడుస్తున్న దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కో వాహనంలో 40 నుంచి 50 వరకూ పశువుల చొప్పున నిత్యం 10 నుంచి 30 వరకూ వాహనాల్లో పశువులను తరలిస్తున్నట్లు సమాచారం. వీటి సంఖ్య శని, ఆది, సోమవారాల్లో 40 నుంచి 50 వరకూ ఉంటుందని చెబుతున్నారు. పశువుల అక్రమ రవాణా అర్ధరాత్రి జరుగుతూండగా.. దానికంటే ముందే ముఠా నాయకుడు ప్రత్యేక వాహనంపై ఆయా చెక్ పోస్టుల వద్దకు వెళ్లి కొంతమంది సిబ్బందికి, ప్రజాప్రతినిధులకు ముడుపులు చెల్లిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి బయలుదేరిన వాహనాల్లో పశువులను హనుమాన్ జంక్షన్ మీదుగా చిలకలూరిపేటకు చేర్చి, అక్కడి నుంచి వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తున్నారని తెలుస్తోంది. మూగజీవాల తరలింపుపై వస్తున్న ఫిర్యాదులపై అడపాదడపా పోలీసులు స్పందించి, వాటిని స్వాధీనం చేసుకుని, గోశాలలకు తరలిస్తున్నారు. అటువంటి సందర్భాల్లో ఆ ముఠాకు చెందిన వారు కొంత మంది గోశాలల వారితో కుమ్మక్కై పశువులను తిరిగి సొంతం చేసుకుని, తరలించుకుపోతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలి ఎటువంటి అనుమతులూ లేకుండా, పశువులకు కనీసం తిండి కూడా పెట్టకుండా సుదూర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నా పశువులను వధిస్తున్నారు. మూగజీవాలను అక్రమంగా తరలిస్తున్న వారిపై అధికారులు పక్కా చర్యలు తీసుకోవాలి. – దాడిశెట్టి వీరబాబు, జైభీమ్రావ్ భారత్ పార్టీ ఉపాధ్యక్షుడు అక్రమ రవాణాపై కేసులు పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు మా దృష్టికి వస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇటీవల అన్నవరంలో పశువుల అక్రమ రవాణాపై 3 కేసులు నమోదు చేశాం. – బి.సూర్య అప్పారావు, సీఐ, ప్రత్తిపాడుఫ మూగ జీవాల అక్రమ రవాణాకు ‘హైవే’ ఫ యథేచ్ఛగా తరలింపు ఫ అప్పుడప్పుడు అడ్డుకుంటున్నా ఆగని అక్రమార్కులు -
405 కేజీల గంజాయి స్వాధీనం
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గోకవరం పోలీసులు గోకవరం: మండలంలోని కామరాజుపేట గ్రామ శివారున ఆగిఉన్న వాహనంలో 405 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం వాహనం అనుమానాస్పద స్థితిలో ఆగి ఉండటాన్ని పిడతమామిడి ఫారెస్టు బీట్ ఆఫీసర్ వీరాబత్తుల రమణ గుర్తించారు. అతన్ని గుర్తించిన వాహనంలో ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. దీనిపై ఆయన గోకవరం ఎస్సై పవన్కుమార్కు సమాచారం అందించగా ఎస్సై సిబ్బందితో అక్కడకు చేరుకుని వ్యాన్లో 22 బస్తాల్లో ఉన్న 405 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సరకు విలువ రూ.2.05 కోట్లు ఉంటుంది. తహసీల్దార్ రామకృష్ణ ఆధ్వర్యంలో వాహనాన్ని, గంజాయిని సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఒకే రోజు ఇద్దరికి అరుదైన గుండె శస్త్ర చికిత్సలు
కాకినాడ రూరల్: తీవ్రమైన ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి గుండె సంబంధిత లక్షణాలతో ఆస్పత్రికి వచ్చిన ఇద్దరికి అరుదైన, క్లిష్టమైన గుండె శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్టు కార్డియాలజిస్ట్ ఓబుల్రెడ్డి తెలియజేశారు. సర్పవరం జంక్షన్లోని రమణయ్యపేట సంత మార్కెట్ వద్ద గల మిత్ర హార్ట్కేర్ ఇనిస్టిట్యూట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. కాకినాడ ఆర్ఆర్నగర్కు చెందిన 65 ఏళ్ల ద్వారంపూడి వెంకయ్యమ్మ, బలభద్రపురానికి చెందిన 54 ఏళ్ల కర్రి శ్రీనివాసరెడ్డి తమ ఆస్పత్రికి రాగా ఇద్దరిలోనూ గుండె ధమనుల అవరోధం గుర్తించామన్నారు. తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తమ వైద్య నిపుణుల బృందంతో ఆప్టికల్ కోహిరెన్స్ ట్రోమోగ్రఫీ ఆధారిత కార్డియాక్ ఇంటర్వెన్షన్(ఓసీటీ గైడెడ్ పీసీఐ) అనే అరుదైన గుండె చికిత్సను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. కోస్తా జిల్లాల్లో ఈ అత్యాధునిక ఓసీటీ పరికర సదుపాయం తమ మిత్ర హార్ట్ కేర్ సెంటర్లో ఉందన్నారు. ఏఐ క్యాథ్ ల్యాబ్, ఏఐ ఆధారిత వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నట్టు ఓబుల్రెడ్డి తెలిపారు. -
సహకార ఉద్యోగుల ధర్నా
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు జిల్లా సహకార కార్యాలయం వద్ద ఉద్యోగులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.ఆదినారాయణ మాట్లాడుతూ, 2019 పే రివిజన్ తక్షణమే అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించాలని, 62 సంవత్సరాలకు ఉద్యోగ విరమణ వయస్సు జీఓను అన్ని సహకార సంస్థల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాలతో వేతన ఒప్పందం జరిగి ఏళ్లు గడుస్తున్నా అమలు చేయకుండా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2019లో విడుదల చేసిన జీఓ నంబర్ 36 ప్రకారం హెచ్ఆర్ పాలసీ అమలు చేసేంత వరకూ సహకార ఉద్యోగుల పోరాటాలు కొనసాగుతాయని చెప్పారు. ఈ నెల 22న డీసీసీబీ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక సమ్మెకు సైతం వెనుకాడబోమని హెచ్చరించారు. ధర్నా అనంతరం జిల్లా సహకార అధికారి శ్రీనివాసరెడ్డికి నాయకులు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, సహకార ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నరసరాజు, కోశాధికారి జి.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. -
మంచు కమ్మేసి.. మృత్యువు కాటేసి..
● రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి ● ఘటనా స్థలిలో తల్లి, కొద్దిసేపటికి కుమారుడు.. గండేపల్లి: అన్నను ఆస్పత్రిలో చేర్చేందుకు తల్లిని, బాబాయిని, మరో వ్యక్తిని వాహనంలో వెంట తీసుకువెళుతుండగా కమ్ముకొచ్చిన మంచు, తరుముకొచ్చిన కునుకు మృత్యు ఒడికి తీసుకుపోయాయి. కళ్లముందే కన్నతల్లిని, కొద్దిసేపటికే అన్నను కోల్పోయిన వ్యక్తి హృదయ విదారక ఉదంతమిది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు ఆత్రేయపురం మండలం వెలిచేరుకు చెందిన తొర్లపాటి శశికుమార్ (27) క్యాన్సర్తో బాధపడుతుండగా ఇతనికి మెరుగైన వైద్యం కోసం తమ్ముడు తొర్లపాటి సంజయ్, తల్లి తులసి (49), బాబాయి తొర్లపాటి పాపారావు, నాగబత్తుల శ్రీను కలిసి కారులో విశాఖ ఆస్పత్రికి వెళుతున్నారు. మండలంలోని గండేపల్లి శివారు బంక్ సమీపంలోకి వచ్చేసరికి మంగళవారం తెల్లవారుజాము సుమారు 3.40 గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే నిలిచి ఉన్న ట్రాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తులసికి ముఖం, తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందగా కారులో ఉన్న శశికుమార్, నాగబత్తుల శ్రీనుకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న హైవే సేఫ్టీ వాహన సిబ్బంది, నైట్ డ్యూటీ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శశికుమార్ మృతి చెందాడు. తులసి మృతదేహాన్ని జెడ్ రాగంపేట సీహెచ్సీకి తరలించి, ప్రమాదానికి గురైన కారును క్రేన్ సహాయంతో పక్కకు తీయించారు. కారు నడుపుతున్న తొర్లపాటి సంజయ్ స్వల్పగాయాలతో బయటపడగా ప్రమాద సమయంలో కారులో ఉన్న ప్రయాణికులు నిద్రలో ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని సీఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్సై యూవీ శివ నాగబాబు పరిశీలించి ప్రమాద ఘటన గురించి తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్టు తెలియజేశారు. రాజమహేంద్రవరంలో టీ తాగి ప్రయాణం ప్రారంభించగా వీరు ప్రయాణిస్తున్న కారు గండేపల్లిలో ప్రమాదానికి గురైంది. తీవ్రమైన మంచు, తెల్లవారుజాము ప్రయాణంలో డ్రైవర్కు కునుకుపాటుకు గురవడంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆస్పత్రికి బదులు మృత్యుఒడికి.. కొత్తపేట: తొర్లపాటి వీరాస్వామి, తులసి దంపతులు తమ కుమారులు శశికుమార్, సంజయ్లతో కలసి వ్యవసాయ కూలీ పనులతో పాటు కొద్దిపాటి భూమి కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆనందంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో పెద్ద కుమారుడు శశికుమార్కు అనారోగ్యం పాలయ్యాడు. వైద్య పరీక్షల అనంతరం క్యాన్సర్గా నిర్ధారించారు. విశాఖపట్నంలో క్యాన్సర్ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. చిన్న కుమారుడు సంజయ్కు కారు డ్రైవింగ్ రావడంతో రోజువారీ అద్దెకు కారు తీసుకుని మంగళవారం రాత్రి వెలిచేరులో ఇంటి నుంచి బయలుదేరి వెళ్లారు. తెల్లవారు జామున ఈ ఘోరం జరిగిపోయింది. వెలిచేరులో విషాద ఛాయలు వెలిచేరు గ్రామ శివారు కాలనీకి చెందిన తొర్లపాటి తులసి, ఆమె కుమారుడు శశికుమార్ మృతితో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ కుటుంబ సభ్యులు కాలనీలో అందరితో కలసిమెలసి ఉంటారని, సహచర వ్యవసాయ కూలీలతో కలిసి పనులు చేసుకునేవారని స్థానికులు చెప్పారు. కొన్ని రోజులుగా శశికుమార్ అనారోగ్యానికి గురికాగా వారి కష్టార్జితంతోనే వైద్యం చేయిస్తూ వచ్చారని తెలిపారు. తల్లీ, కొడుకు చనిపోయారంటే జీర్ణించుకోలేకపోతున్నామని పలువురు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై రేపు ఆందోళన
సామర్లకోట: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈ నెల 18న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు తెలిపారు. ఇందులో రైతులు, పార్టీ శ్రేణులు, విద్యార్థులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో మడగల రమణ అధ్యక్షతన మంగళవారం జరిగిన పార్టీ పెద్దాపురం నియోజకవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. కార్పొరేట్ వర్గాలకు మేలు చేసేందుకే రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని అన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పు స్థలాలు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకూ ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. సీపీఐ ఈ నెల 26 నాటికి శత వసంతాలు పూర్తి చేసుకొని 101వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా పార్టీ పతాకాలను ఆవిష్కరిస్తామన్నారు. కాకినాడలో ఈ నెల 27న సీపీఐ శత వసంత ముగింపు సభ జరుగుతుందని చెప్పారు. ఈ సభలో పార్టీ సీనియర్ నాయకులను సన్మానిస్తామని మధు తెలిపారు. ప్రధాని మోదీ కార్పొరేట్ అనుకూల, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారీ ప్రదర్శనలు, సభలు, సమావేశాలు నిర్వహించనున్నామని చెప్పారు. జనవరి 18న 5 లక్షల మంది పార్టీ కార్యకర్తలు, సానుభూతిపనులతో ఖమ్మంలో శతవార్షిక బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యుడు పెదిరెడ్ల సత్యనారాయణ, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
సాయుధ దళాల పతాక నిధికి విరాళం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సిబ్బంది రూ.8,00,700 విరాళాలు సేకరించారు. జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో ఉన్న 8 వేల మంది మెప్మా సిబ్బంది ఒక్కొక్కరు రూ.10 చొప్పున ఈ విరాళం సమకూర్చారు. దీనికి సంబంధించిన చెక్కును కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ సమక్షంలో మెప్మా పీడీ బి.ప్రియంవదతో కలసి జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎం.కృష్ణారావుకు మంగళవారం అందజేశారు. జేసీ భరత్ మాట్లాడుతూ, మాజీ సైనికుల పునరావాసం, సంక్షేమం, అమర సైనిక కుటుంబాల సంక్షేమానికి ఈ నిధులు ఉపయోగిస్తారని చెప్పారు. ఇదే స్ఫూర్తితో ఇతర శాఖల అధికారులు, సిబ్బంది సాయుధ దళాల పతాక నిధికి విరాళాలందించాలని కోరారు. అర్జీలకు సంతృప్తికర పరిష్కారాలు చూపాలి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రతి సోమవారం జరుగుతున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో అందిన అర్జీలకు నూరు శాతం సంతృప్తికరమైన పరిష్కారాలు ఇవ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్పై అన్ని శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులతో మాట్లాడి, అర్జీల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ఏడాది జూన్ 15 నుంచి జిల్లావ్యాప్తంగా 41,694 అర్జీలు స్వీకరించగా ఈ నెల 10 వరకూ 36,463 అర్జీలు పరిష్కరించామని చెప్పారు. అర్జీదారు సమస్యను దృష్టిలో ఉంచుకుని సరైన పరిష్కారం చూపాలన్నారు. అర్జీల పరిష్కారంలో కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. రెవెన్యూ, రీ సర్వే, ఇతర భూ తగాదాలకు సంబంధించిన అర్జీలే ఎక్కువగా వస్తున్నాయని, క్షేత్ర స్థాయిలోని రెవెన్యూ, సర్వే, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి, గడువులోగా వీటిని పరిష్కరించాలని జేసీ ఆదేశించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నవీన్ జగ్గంపేట: టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా జ్యోతుల నవీన్ కుమార్ మరోసారి నియమితులయ్యారు. ఆ పదవిలో ఆయనను మరోసారి కొనసాగిస్తూ అధిష్టానం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. ‘సినిమాలు చూసి సంతోషించండి.. నమ్మకండి’ ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘పురాణ కథలకు సంబంధించిన సినిమాలు చూసి సంతోషించండి. ఇంకా ఆనందం కలిగితే చప్పట్లు కొట్టండి, కానీ నమ్మకండి’ అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ వ్యాఖ్యానించారు. స్థానిక హిందూ సమాజంలో చేస్తున్న వ్యాసభారత ప్రవచనంలో ఆయన మంగళవారం సభాపర్వం ముగించి, వనపర్వంలోకి ప్రవేశించారు. తండ్రి ఎముకలతో చేసిన పాచికలను శకుని ఉపయోగించాడంటూ ఓ సినిమాలో ప్రధానంగా చూపారని, ఇటువంటి కథనం భారతంలో కానీ, ఇతర పురాణాలలో కానీ లేదని చెప్పారు. నిజం చెప్పినా ప్రజలు శంకించేంతలా అసత్యాలు ప్రాచుర్యం పొందుతున్న పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ద్యూతానికి పాండవులను మళ్లీ పిలవాలని విదురుడిని ఆదేశించినప్పుడు భీష్మద్రోణ కృపాచార్యులు, గాంధారి తదితర పెద్దలందరూ ధృతరాష్ట్రుడిని వారించడానికి ప్రయత్నిస్తారు. అవినీతి, క్రౌర్యంతో సంపాదించుకున్న సంపద వినాశ హేతువు అవుతుందని హితైషులు హెచ్చరిస్తారు. కానీ, ధృతరాష్ట్రుని బుద్ధి వేరు. ద్యూతానికి మళ్లీ వచ్చిన ఆహ్వానాన్ని ధర్మరాజు అంగీకరించడాన్ని కొందరు విమర్శిస్తారు. బంగారు లేడి ఉండదని తెలిసే, రాముడు దానిని తేవడానికి బయలుదేరినట్టు.. మాయాద్యూతమని తెలిసే, తండ్రి ఆనతి మీర లేక, ధర్మరాజు తిరిగి ఆడటానికి వస్తాడు. పరాజితులైన పాండవులతో వెళ్తున్న ద్రౌపదిని చూసి హేళన చేస్తున్న దుశ్శాసనుడిని చూసి, భీముడు ఉగ్రుడై అతడి రొమ్ము పగులగొట్టి, రక్తం తాగుతానని ప్రతిన చేస్తాడు. తన తొడను ద్రౌపదికి చూపిన దుర్యోధనుడితో తొడలు పగులగొడతానని, లేకపోతే తనకు పుణ్యగతులు కలగవని ప్రతిన చేస్తాడు. తొడలు పగులగొట్టడం యుద్ధనీతికి వ్యతిరేకమే అయినా, ధర్మబద్ధమైన ప్రతిజ్ఞా పాలన కోసం యుద్ధనీతిని అతిక్రమించవచ్చు’’ అని సామవేదం వివరించారు. పాండవులను వేదవేత్తలు అనుసరించారంటూ ఆయన వనపర్వాన్ని ప్రారంభించారు. -
అన్ని సంఘాలకూ ఆదర్శంగా..
ఐకమత్యంగా ముందుకు వెళితే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు పూర్వపు కొత్తపేట తాలూకా ప్రభుత్వ పెన్షనర్ల సంఘం సభ్యులు. పెన్షనర్లకు పలు సేవలు అందిస్తూ ఉమ్మడి జిల్లాలో అన్ని సంఘాలకు ఆదర్శంగా నిలిచారు. ఫంక్షన్ హాలుగా సంఘ భవనం పూర్వం తాలూకా వ్యవస్థ ఉన్న సమయంలో కొత్తపే ట తాలూకా పరిధిలోని కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, పి.గన్నవరం మండలాలకు చెందిన పలువురు పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు సంఘంగా ఏర్పడ్డారు. తొలుత 80 మంది సభ్యులతో ప్రారంభమైన సంఘం నేడు 1,620 మందికి చేరింది. గతంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన మంగిపూడి గౌరీశంకరం, అజ్జరపు వెంకట సుబ్బారావు హయాంలో స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో మొదట స్థలాన్ని సమకూర్చుకుని, ప్రభుత్వ గ్రాంటులు మంజూరు చేయించుకుని సంఘ భవనాన్ని నిర్మించుకున్నారు. దాతలు, సభ్యు ల విరాళాలతో దశల వారీగా రెండంతస్తు ల నిర్మాణంతో ఫంక్షన్ హాలుగా అభివృద్ధి చేసుకున్నారు. నేడు సీనియర్ పెన్షనర్లకు సన్మానం పెన్షనర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం 1946లో జన్మించిన సీనియర్ పెన్షనర్లు 20 మందిని సత్కరించేందుకు పూర్వపు కొత్తపేట తాలూకా ప్రభుత్వ పెన్షనర్ల సంఘంలో ఏర్పాట్లు చేశారు. -
మద్దతు ధర దక్కలేదు
మద్దతు ధర కోసం ఆశ పడితే ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు వేస్తుందో తెలియదు. గత ఏడాది ఖరీఫ్లో మిల్లులకు ధాన్యం తోలితే మద్దతు ధర వచ్చింది. కానీ, మూడు నెలల తర్వాత ధాన్యం డబ్బులు నా ఖాతాలో వేశారు. చెల్లింపులు ఆలస్యం కావడంతో రబీ పెట్టుబడులకు బయట అప్పులు చేయాల్సి వచ్చింది. వచ్చిన లాభం వడ్డీలకు సరిపోయింది. అందుకే, ఈ ఏడాది రేటు తక్కువైనా ప్రైవేటు వ్యక్తులకే అమ్ముకున్నాను. – కర్నీడి వీర్రాజు, రైతు, తిమ్మాపురం, కాకినాడ రూరల్ -
కోటిగళ గర్జన
స్వచ్ఛందంగా పాల్గొన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి జగన్మోహన్రెడ్డి ఏ ఉద్యమానికి పిలుపునిచ్చినా ఆచరించడానికి సిద్ధంగా ఉన్నాం. జిల్లావ్యాప్తంగా అన్ని పార్టీలకు చెందిన 4 లక్షల మందికి పైగా స్వచ్ఛందంగా సంతకాలు చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచే చంద్రబాబు ప్రభుత్వ పతనం ప్రారంభమవుతుంది. – ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే జగన్కు పేరు వస్తుందనే దుగ్ధతో.. దేశంలోనే ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చిన ఘనత గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. ఇవి పూర్తయితే ప్రజల్లో ఆయనకు మంచి పేరు వస్తుందనే దుగ్ధతోనే చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్ని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టింది. – తోట నరసింహం, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జగ్గంపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ కోట్లాది మంది గుండె చప్పుడు సామాన్య విద్యార్థులకు వైద్య విద్యను అందించేందుకు వైఎస్ జగన్ కష్టపడి మెడికల్ కాలేజీలు తీసుకొస్తే చంద్రబాబు సర్కారు ఓర్వలేకపోతోంది. ప్రజలు చేసిన సంతకాలే ప్రభుత్వ కుట్రపై వ్యతిరేకతకు నిదర్శనం. కోటి సంతకాల ప్రతులను గవర్నర్ పరిగణనలోకి తీసుకుని, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ జీఓను రద్దు చేయాలి. – వంగా గీత, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ‘తూర్పు’ నుంచే మార్పు అప్పనంగా అమ్మేయడానికి రాష్ట్ర ఆస్తులు మీ అత్తగారి ఇంటి నుంచి తెచ్చిన పప్పు బెల్లాలు కావు. ప్రభుత్వ ఆస్తులు ప్రజలవి. వీటిని అమ్మేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ప్రజలను తాకట్టు పెట్టి, మితిమీరి అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని చంద్రబాబు నిండా ముంచుతున్నారు. మెడికల్ కాలేజీల విషయంలో ఎవరు టెండర్ వేసినా, వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని రద్దు చేసి, కాలేజీలను స్వాధీనం చేసుకుంటుందని జగన్ ఇప్పటికే హెచ్చరించారు. – కురసాల కన్నబాబు, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ సాక్షి ప్రతినిధి, కాకినాడ: సాగరతీర నగరం కాకినాడ జనసంద్రమైంది. ఎటు చూసినా జనమే జనం అన్నట్టుగా హోరెత్తిపోయింది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా.. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు.. ఆ పార్టీ శ్రేణులు కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గత 40 రోజులుగా జిల్లాలోని ఏడు నియోజకవర్గాల ప్రజల నుంచి 4 లక్షలకు పైగా సంతకాలు సేకరించారు. ఆయా నియోజకవర్గాలో సేకరించిన సంతకాల ప్రతులను ఇటీవల కాకినాడలోని పార్టీ జిల్లా కార్యాలయానికి తరలించిన విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి ఆ ప్రతులను తాడేల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయానికి ప్రత్యేక వాహనాల్లో పంపించే కార్యక్రమం కాకినాడలో సోమవారం అట్టహాసంగా జరిగింది. ఎటు చూసినా పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో కాకినాడ నగరమంతటా సందడే కనిపించింది. ఈ ఉద్యమంపై జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పార్టీ కో ఆర్డినేటర్లు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఫలితంగా ఈ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయ్యింది. తూర్పున తుని నుంచి మొదలై ప్రత్తిపాడు, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట మీదుగా కాకినాడ రూరల్ నుంచి కాకినాడ సిటీ నియోజకవర్గం వరకూ దాదాపు అన్ని ప్రాంతాలూ జనసునామీని తలపించాయి. కిక్కిరిసిన నగరం జిల్లా నలుమూలల నుంచీ పార్టీ శ్రేణులు, నేతలు మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ భానుగుడి సెంటర్కు చేరుకున్నారు. అప్పటికే కాకినాడ సిటీ నలుమూలల నుంచి తరలివచ్చిన జనసందోహంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. కొద్దిసేపటికి తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్, జగ్గంపేట నియోజకవర్గాల నుంచి ఆయా కో ఆర్డినేటర్ల ఆధ్వర్యాన పార్టీ శ్రేణులు వేలాదిగా తరలి వచ్చారు. దీంతో, భానుగుడి సెంటర్ ఇసుక వేస్తే రాలనంతగా జనంతో నిండిపోయింది. కాకినాడ – పిఠాపురం రహదారిలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. భానుగుడి సెంటర్ నుంచి వేలాది జనంతో పార్టీ నేతలు కాలి నడకన ర్యాలీ ప్రారంభించారు. ఇది పండగ వాతారణం మధ్య ఆద్యంతం అట్టహాసంగా సాగింది. తీన్మార్ నృత్యాలు, ఉరకలెత్తిన ఉత్సాహంతో కార్యకర్తలు చేసిన డ్యాన్సులతో సంబరం అంబరాన్ని అంటిన వాతావరణం కనిపించింది. జనం.. బ్రహ్మరథం భానుగుడి సెంటర్ మొదలుకొని ఆనంద్ థియేటర్, టూ టౌన్ ఫ్లై ఓవర్, టూటౌన్ పోలీస్ స్టేషన్, జెమినీ ప్లాజా సెంటర్, సూపర్ బజార్ కాంప్లెక్స్, బాలాజీ చెరువు సెంటర్ వరకూ ప్రతిచోటా ఈ ర్యాలీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రతి సెంటర్లోనూ బాణసంచా కాల్చి, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎదురొచ్చి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ర్యాలీకి ముందు వరుసలో సుమారు 3 వేల మంది పార్టీ కార్యకర్తలు జెండాలు చేబూని నిర్వహించిన బైక్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మెయిన్ రోడ్డు పొడవునా షాపుల్లో పనిచేసే వారు ఉత్సాహంగా బయటకు వచ్చి ర్యాలీకి మద్దతు ప్రకటించారు. భానుగుడి సెంటర్ నుంచి బాలాజీ చెరువు సెంటర్ వరకూ 5 కిలోమీటర్ల మేర ర్యాలీ పూర్తవడానికి సుమారు 2.30 గంటల సమయం పట్టింది. జనం తండోపతండాలుగా తరలిరావడం పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. ర్యాలీ అనంతరం బాలాజీచెరువు సెంటర్లో కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ మంత్రి తోట నరసింహం ప్రసంగించారు. దాడిశెట్టి రాజా ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, కాకినాడ పార్లమెంటరీ పరిశీలకుడు డి.సూర్యనారాయణరాజు, కో ఆర్డినేటర్లు దవులూరి దొరబాబు, ముద్రగడ గిరిబాబు, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ అంగులూరి లక్ష్మీశివకుమారి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాంజీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వాసిరెడ్డి జమీలు, కొప్పన శివ, ఒమ్మి రఘురామ్, నెక్కంటి సాయి, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, పార్టీ మహిళ, యువజన, బీసీ విభాగాల అధ్యక్షులు వర్ధినీడి సుజాత, రాగిరెడ్డి బన్నీ, అల్లి రాజబాబు, ఆవాల లక్ష్మీనారాయణ, పార్టీ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న తదితరులు పాల్గొన్నారు. ఉద్యమం విజయవంతం ఏ పనయినా ప్రజల సహకారం లేకపోతే విజయవంతం కాదు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లాలో అక్టోబర్ 15న చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. జిల్లావ్యాప్తంగా సుమారు 4.20 లక్షల మంది స్వచ్ఛందంగా సంతకాలు చేసి, ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. ఇదంతా బోగస్ అని టీడీపీ వారు అంటున్నారు. వారికి ఈ సంతకాలను డిజిటల్గా పంపిస్తాను. ఒకసారి చెక్ చేసుకుని, ప్రజల మనసులు కనుక్కోండి. నిజమైతే మీ నిర్ణయం ఆపుతారా? కచ్చితంగా అన్నీ మీ వద్దకు చేరతాయి. ర్యాండమ్గా పరిశీలించండి. ఐవీఆర్ఎస్ కాల్ చేయించడం మీకు కొత్త కాదు. నిన్న, మొన్న, ఎన్నికల ముందు రకరకాల పుకార్లు షికార్లు చేయించి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టిన తీరు ప్రజలందరికీ అర్థమైంది. రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే సదుద్దేశంతో ఈ రాష్ట్రానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 4 మెడికల్ కళాశాలలు తెస్తే, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏకంగా 17 వైద్య కళాశాలు తీసుకొచ్చారు. మీరు ఒక్క కాలేజీ అయినా తెచ్చారా? ఒక మెడికల్ కాలేజీ పర్మిషన్కే రూ.500 కోట్లు అవుతుంది. అలాంటిది భూమి, భవనాలు, మొత్తం మౌలిక వసతులన్నీ కలిపి రూ.వెయ్యి కోట్లు అయ్యింది. అలాంటిది ఒక్కో కాలేజీని రూ.5 వేలకు చంద్రబాబు మనుషులకు ఇచ్చేసుకుంటున్నారు. ప్రజవద్దంటున్నప్పటికీ ఎక్కడా ఆగడం లేదు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు ప్రజలందరూ ఆమోదం తెలుపుతున్నట్లు వాళ్ల పత్రికలో రాశారు. ప్రజల మనస్సులను రీ రైట్ చేస్తూ మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. జగన్ 4 పోర్టులు, 8 హార్బర్లు కట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు వచ్చినచోట్ల భూముల రేట్లు పెరిగాయి. తుని నియోజకవర్గానికి జగన్ ఓ పోర్టు తీసుకొచ్చారు. ఆ చుట్టుపక్కల ఇప్పుడు ఎకరం రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్లు పలుకుతోంది. ఇప్పుడు చంద్రబాబు దృష్టి ఆ భూములపై పడింది. పీపీపీ మోడ్లో భూములు సేకరించేసి, ఆయన అనుయాయులకు 90 పైసలకు, 95 పైసలకు దోచి పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. మెడికల్ కళాశాలల విషయంలో జగన్ ఇచ్చిన స్టేట్మెంట్తో వాటిని తీసుకోవడానికి ఇప్పుడు తటపటాయిస్తున్నారు. అలాగే, పోర్టుకు దగ్గరగా ఉన్న భూములను పీపీపీ మోడ్లో సేకరిస్తే అధికారంలోకి రాగానే తిరిగిచ్చేస్తానంటూ ప్రకటించాలని జగన్ను కోరుతున్నాను. చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం కదం తొక్కిన వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజలు వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వెల్లువెత్తిన నిరసన కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన తాడేపల్లికి సంతకాల ప్రతుల తరలింపు భానుగుడి సెంటర్ నుంచి బాలాజీ చెరువు వరకూ భారీ ర్యాలీ ఆకట్టుకున్న మోటార్ సైకిల్ ర్యాలీ కాకినాడలో ఎగసిన జనసునామీ -
సోపానం.. భక్త నీరాజనం..
● ఘనంగా సత్యదేవుని మెట్లోత్సవం ● రత్నగిరి మెట్లకు భక్తుల పూజలు అన్నవరం: సత్యదేవుని మెట్లోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను పల్లకీ మీద రత్నగిరి దిగువకు తీసుకువచ్చి గ్రామంలో ఊరేగించారు. అనంతరం, తొలి పావంచా వద్ద స్వామివారి పాదాల మండపం వద్దకు తీసుకువచ్చి, పండితులు ప్రత్యేక పూజలు చేశారు. తరువాత కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఉన్న తొలి మెట్టును ముత్తయిదువలు పసుపు, కుంకుమ, పూలతో అలంకరించారు. పండితుల మంత్రోచ్చారణల నడుమ దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వేండ్ర త్రినాథరావు దంపతులు మెట్లకు పసుపు, కుంకుమలతో పూజ చేసి, కొబ్బరి కాయ కొట్టి, హారతి వెలిగించి, మెట్లోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం పెద్ద సంఖ్యలో మహిళలు సత్యదేవుని ప్రధానాలయం వరకూ ఉన్న 450 మెట్లకూ పూజలు చేశారు. ప్రతి మెట్టునూ సాక్షాత్తూ సత్యదేవుని స్వరూపంగా భావించి, ఈ పూజలు నిర్వహించారు. ముత్తయిదువలు పసుపు, కుంకుమ, పూలతో ప్రతి మెట్టునూ అలంకరించగా.. పండితులు ఒక తమలపాకుపై హారతి కర్పూరం, మరో తమలపాకుపై పటిక బెల్లం నివేదించారు. భక్తులు ఆ హారతి వెలిగిస్తూ మెట్లోత్సవాన్ని కొనసాగించారు. స్వామి, అమ్మవార్లను ఆ మెట్ల మీదుగా మేళతాళాల నడుమ పల్లకీ మీద ఘనంగా ఊరేగిస్తూ ఆలయం వద్దకు తీసుకువెళ్లారు. దీంతో, మెట్ల మార్గంలో ఉత్సవ శోభ ఉట్టిపడింది. ఏటా ధనుర్మాసోత్సవాల ప్రారంభానికి ఒక రోజు ముందు సత్యదేవుని మెట్లోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ కమిషనర్ బాబూరావు, ఈఈ రామకృష్ణ, ఏఈఓలు, ఫార్మసీ సూపర్వైజర్ వల్లూరి మాధవి తదితర సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సత్యదేవుని ఆలయ వేద పండితులు గొల్లపల్లి గణపతి ఘనపాఠి, యనమండ్ర శర్మ, గంగాధరభట్ల గంగబాబు, చిట్టి శివ, రమేష్, ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, పురోహితులు, ఇతర వైదిక సిబ్బంది పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మెట్లోత్సవం ముగిశాక కూడా పెద్ద సంఖ్యలో మహిళలు మెట్లను పసుపు కుంకుమలతో అలంకరించి పూజించారు. మధ్యాహ్నం వరకూ మెట్ల మార్గంలో మహిళల సందడి కనిపించింది. నేటి నుంచి గ్రామోత్సవం ధనుర్మాసోత్సవాల సందర్భంగా మంగళవారం నుంచి జనవరి 15 సంక్రాంతి పర్వదినం వరకూ ప్రతి రోజూ ఉదయం 7 నుంచి 10 గంటల వరకూ సత్యదేవుడు, అమ్మవార్లను అన్నవరం గ్రామంలో పల్లకీ మీద ఊరేగిస్తారు. కనుమ పండగ నాటి సాయంత్రం జరిగే ప్రభోత్సవంతో ధనుర్మాసోత్సవాలు ముగుస్తాయి. -
జెడ్పీలో పలువురికి ఉద్యోగోన్నతులు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్లో పలువురికి ఉద్యోగోన్నతులు కల్పిస్తూ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు సోమవారం నియామక ఉత్తర్వులు అందజేశారు. నలుగురు సీనియర్ సహాయకులకు పరిపాలనాధికారులుగా, ఐదుగురు జూనియర్ సహాయకులకు, ముగ్గురు టైపిస్ట్లకు సీనియర్ సహాయకులుగా, పది మంది రికార్డు అసిస్టెంట్లకు జూనియర్ సహాయకులుగా ప్రమోషన్లు ఇచ్చారు. ఒకరికి కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేశారు. జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు కూడా పాల్గొన్నారు. సత్యదేవునికి ఘనంగా ఏకాదశి పూజలు అన్నవరం: మార్గశిర బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు సోమవారం విశేష పూజలు నిర్వహించారు. ఉదయం స్వర్ణ పుష్పాలతో అష్టోత్తర పూజ, తులసి దళాలతో సహస్ర నామార్చన ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఆలయాన్ని తెల్లవారుజామున 4 గంటలకు తెరచి సుప్రభాత సేవ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. సత్యదేవుని ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, క్యూలన్నీ భక్తులతో నిండిపోయాయి. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. స్వామివారి వ్రతాలు 2 వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. సత్యదేవుడు, అమ్మవారిని ముత్యాల కవచాలతో (ముత్తంగి సేవ) అలంకరించి పూజించారు. అమరజీవి ఆత్మబలిదానంతో ప్రత్యేక రాష్ట్రంబోట్క్లబ్ (కాకినాడ సిటీ): అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మబలిదానం ఫలితంగానే ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని, ఆయన త్యాగనిరతి తెలుగు ప్రజలకు ఎప్పటికీ చిరస్మరణీయమని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యాన కలెక్టరేట్లో ఆ మహనీయుని చిత్రపటానికి జేసీ సోమవారం పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ 48 రోజుల పాటు కఠోర నిరాహార దీక్ష చేసి పొట్టి శ్రీరాములు అమరులయ్యారన్నారు. ఆదర్శనీయమైన ఆయన జీవితాన్ని, అచంచల దీక్ష, పట్టుదలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి ఎం.లల్లి, కలెక్టరేట్ ఏఓ ఎస్.రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్కు 457 అర్జీలుబోట్క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 457 అర్జీలు సమర్పించారు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పాటు వివిధ శాఖల అధికారులు అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను గడువులోగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు జేసీ సూచించారు. నూకాలమ్మ వారికి రూ.7 లక్ష ఆదాయం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): స్థానిక సూర్యారావుపేటలోని నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో హుండీలను సోమవారం లెక్కించారు. మొత్తం రూ.7,02,573 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ వీర్రాజు తెలిపారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ వడ్డి ఫణీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. సూర్యారావుపేటలోని సీతారామ మందిరంలో హుండీల ఆదాయం లెక్కించగా రూ.39,383 వచ్చిందని ఈఓ ఉండవల్లి వీర్రాజు తెలిపారు. రేపు జాబ్ మేళా బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా ఉపాధి కార్యాలయంలో బుధవారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి జి.శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. ీమెడిప్లస్ ఫార్మాలో ఫార్మసిస్ట్, ఫార్మాయిడెడ్, కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఉద్యోగాలకు 150 మందిని ఎంపిక చేస్తారన్నారు. అలాగే, ఎండ్రా మేధాలో 25 సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు కూడాఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. ఇంటర్మీడియెట్ ఆపైన ఫార్మసీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆ రోజు ఉదయం 9 గంటలకు హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 86398 46568 నంబరులో సంప్రదించాలని కోరారు. -
భయం పోయేలా.. భవితకు బాట వేసేలా
● ఆంగ్ల భాషపై పట్టుకు స్పెల్బీ దోహదం ● ‘సాక్షి’ ఆధ్వర్యంలో స్పెల్బీ సెమీ ఫైనల్స్ ● ఉత్సాహంగా పాల్గొన్న 490 మంది విద్యార్థులుసెమీ ఫైనల్కు హాజరైన విద్యార్థులు రాజమహేంద్రవరం రూరల్: ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెల్బీ సెమీ ఫైనల్స్ పరీక్షలు ఆదివారం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. రాజమహేంద్రవరంలోని ఆదిత్య తక్ష్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన ఈ పరీక్షకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి 490 మంది విద్యార్థులు నాలుగు కేటగిరీల్లో పరీక్షలు రాశారు. తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ‘సాక్షి’ స్పెల్బీ పరీక్షలు ఎంతగానో దోహదపడతామని తల్లిదండ్రులు పేర్కొన్నారు. స్పెల్బీ ద్వారా ఆంగ్ల భాషపై మంచి పట్టు సాధించడానికి అవకాశం ఏర్పడిందని ఆనందం వ్యక్తం చేశారు. ‘సాక్షి’ స్పెల్బీ పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ జరిగింది. కేటగిరీలుగా విభజించి.. కేటగిరీ–1లో 1, 2 తరగతులకు చెందిన విద్యార్థులు, కేటగిరీ–2లో 3, 4 తరగతులు, కేటగిరీ–3లో 5, 6, 7 తరగతులు, కేటగిరీ–4లో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించడానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా పరీక్షల్లో పాల్గొనడం ద్వారా నూతనోత్తేజం తీసుకురావడానికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు. స్పెల్బీ నిర్వహించిన ‘సాక్షి’ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరీక్షలను ‘సాక్షి’ రీజినల్ మేనేజర్ (అడ్మిన్) ఎస్.రమేష్రెడ్డి, ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కోఆర్డినేటర్ వి.రాజేష్, ఆదిత్య తక్ష్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ లీజా పర్యవేక్షించారు. పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్పెల్బీకి డ్యూక్స్ వేఫీస్ మెయిన్ స్పాన్సరర్గా, ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ (రాజమహేంద్రవరం) అసోసియేట్ స్పాన్సరర్గా వ్యవహరిస్తున్నాయి. ఆదిత్య ఇంటర్నేషనల్ స్కూల్ సహకారం అందించింది. ●భవిష్యత్కు బాటలు ‘సాక్షి’ స్పెల్బీ పరీక్ష రాయడం ఆనందంగా ఉంది. ఇంగ్లిష్ భాషపై సంపూర్ణ అవగాహన ఏర్పడింది. పోటీ పరీక్షలు అంటే భయం పోయింది. స్పెల్లింగ్, వ్యాకరణంలో చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇది నా భవిష్యత్కు బాటలు వేస్తోంది. – వేగుంట నమస్వి, ఆరో తరగతి, ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్, రాజమహేంద్రవరం ●ఎంతో ఉపయుక్తం ఇంగ్లిష్ భాషలో ఒకాబులరీ పట్ల అవగాహన ముఖ్యం. ఇది ‘సాక్షి’ స్పెల్బీ పరీక్ష ద్వారా అవగతం చేసుకున్నాను. పరీక్ష ద్వారా తర్ఫీదు పొందాను. వర్డ్స్, స్పెల్లింగ్స్ పట్ల అవగాహన కలిగింది. ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంది. – గారపాటి రుద్రనాగ్చౌదరి, 9వ తరగతి, లారల్ హైగ్లోబల్ స్కూల్, గాడాల ●ఎంతో ఉత్సాహం వచ్చింది విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి ‘సాక్షి ’స్పెల్బీ పరీక్ష బాట వేస్తోంది. ఇంగ్లిష్లో స్పెల్లింగ్, ఒకాబులరీ చాలా ముఖ్యం. దీనిని నేర్చుకోవడానికి ఈ పరీక్ష దోహదపడుతుంది. పరీక్ష బాగా రాశాను. దీనివల్ల ఎంతో ఉత్సాహం వచ్చింది. – కాసర ప్రతిభ, 8వ తరగతి, ప్రతిభ స్కూల్, జంగారెడ్డిగూడెం ●రాణించేందుకు మంచి అవకాశం విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికితీసేలా ‘సాక్షి’ స్పెల్బీ పరీక్ష ఉంది. పోటీ పరీక్షల్లో రాణించడానికి ఇదో మంచి మార్గం. ఈ పరీక్షతో అనేక అంశాలు తెలుసుకున్నాను. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే అనేక పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటడానికి మార్గం సుగమమైంది. – పెన్మెత్స సాత్విక, 8వ తరగతి, ఆదిత్య స్కూల్, తాడేపల్లిగూడెం ●సులభంగా నేర్చుకునేందుకు.. ‘సాక్షి’ స్పెల్బీ పరీక్ష రాయడం ద్వారా ఇంగ్లిష్ భాష అంటే భయం పోయింది. పలకడం, రాయడం సులభతరం అయ్యింది. ఇక నుంచి సులభంగా ఇంగ్లిష్ నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఈ పరీక్ష రాయడంతో ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. – కఠారి చరిష్మా, 9వ తరగతి, కోనసీమ విద్యాశ్రమ్, ముక్తేశ్వరం ●థ్యాంక్యూ ‘సాక్షి’ నేను ముందుగా స్పెల్బీ నిర్వహిస్తున్న ‘సాక్షి’ యాజమాన్యానికి థ్యాంక్స్ చెబుతున్నా. నాలో ఉన్న నైపుణ్యాలను బయటకు తీసేందుకు ఈ పరీక్ష దోహదపడింది. నేను స్పెల్బీ పరీక్ష రాశాను. సెమీ ఫైనల్లో మంచి మార్కులు వస్తాయని ఆశిస్తున్నాను. పరీక్ష నా భవిష్యత్తుకు పునాది లాంటిది. – దాట్ల దీక్షిత, 7వ తరగతి, ఆదిత్య నగర్, శ్రీనగర్, కాకినాడ ●అవగాహన పెరిగింది స్పెల్బీ పరీక్ష ద్వారా ఇంగ్లిష్పై అవగాహన పెరిగింది. గతంలో ఈ భాష అంటే భయంగా ఉండేది. చదవాలన్నా, రాయాలన్నా అయిష్టంగా ఉండేది. స్పెల్బీ ద్వారా ఇంగ్లిష్ పదాలను స్పెల్లింగ్తో సహా నేర్చుకున్నాను. ప్రస్తుతం ఏ సబ్జెక్టయినా సునాయసంగా చదవగలుగుతున్నా. – ఎన్ఎస్ఎస్ ఆరాధ్య, 8వ తరగతి, ది ప్యూచర్ కిడ్స్ స్కూల్, రాజమహేంద్రవరం ●ఇంగ్లిష్పై భయం దూరం విద్యార్ధుల భవిష్యత్తును నిర్దేశించడానికి ‘సాక్షి’ స్పెల్బీ పరీక్ష ఉపయోపడుతుంది. ఇంగ్లిష్ భాషంటే భయం దూరం చేస్తోంది. పోటీతత్వం అలవాటు పడుతుంది. ఇంగ్లిష్లో ఒకాబులరీ చాలా ముఖ్యం. దీనిపై అవగాహన పెరుగుతుంది. ‘సాక్షి’ యాజమాన్యం ఇలాంటి పరీక్షలు మరిన్ని నిర్వహించాలి. – డాక్టర్ టీవీ ప్రసాద్, విద్యార్థిని తండ్రి, రాజమహేంద్రవరం ●ఆంగ్లంపై పట్టు సాధించవచ్చు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాష ప్రాధాన్యం పెరిగింది. విద్యార్థుల్లో చిన్నతనం నుంచి ఆంగ్లంపై పట్టు సాధించేందుకు స్పెల్బీ పరీక్ష దోహదపడుతుంది. సాక్షి స్పెల్బీ ద్వారా ఇంగ్లిష్లో ఒకాబులరీ, లాంగ్వేజ్ స్కిల్స్ పెంపొందుతాయి. విద్యార్థులు ఆంగ్ల భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. – డాక్టర్ దీప్తి చిగుళ్లపల్లి, విద్యార్థి తల్లి, రాజమహేంద్రవరం ●విద్యార్థులకు ప్రయోజనం ‘సాక్షి’ మీడియా గ్రూప్ నిర్వహిస్తున్న స్పెల్బీ పరీక్ష విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది. ఈ పరీక్షతో స్పెల్లింగ్లు, పదాలకు అర్థాలు చెప్పే సామర్థ్యం పెరుగుతుంది. ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ గత పదేళ్లుగా ‘సాక్షి’ స్పెల్బీ పరీక్షల్లో పాల్గొంటున్నాయి. అలాగే తమ ఆదిత్య విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ‘సాక్షి’ స్పెల్బీ ద్వారా విద్యార్థుల్లో ఉత్సాహం పెరుగుతోంది. పోటీ పరీక్షల్లో రాణించడానికి దోహదపడుతుంది. – వి.రాజేష్, కోఆర్డినేటర్, ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, రాజమహేంద్రవరం -
నేడు ‘కోటి సంతకాల’ ర్యాలీ
● పార్టీ కేంద్ర కార్యాలయానికి సంతకాల ప్రతుల తరలింపు ● శ్రేణులు కాకినాడ తరలి రావాలి ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పిలుపు సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించాలనే చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్వహించిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలో భాగంగా.. జిల్లావ్యాప్తంగా సేకరించిన సంతకాల ప్రతులను కాకినాడ నుంచి సోమవారం విజయవాడలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయానికి తరలించనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం నిర్వహించామని తెలిపారు. పేదలకు వైద్య విద్యను దూరం చేసే చంద్రబాబు కుట్రలను ప్రజలు తమ చేవ్రాలు చేయడం ద్వారా తిప్పి కొట్టారన్నారు. జిల్లావ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా స్వచ్ఛందంగా సంతకాలు చేయడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు అద్దం పడుతోందని చెప్పారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో సేకరించిన ఈ సంతకాల ప్రతులను విజయవాడకు తరలించడంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కాకినాడ భానుగుడి సెంటర్ నుంచి బాలాజీ చెరువు సెంటర్లోని దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకూ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనికి జిల్లావ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. బాలాజీ చెరువు సెంటర్ నుంచి కోటి సంతకాల ప్రతులను ప్రత్యేక వాహనాల్లో పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపిస్తామని రాజా చెప్పారు. పంచారామ క్షేత్రంలో హైకోర్టు న్యాయమూర్తి సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రం బాలాత్రిపుర సుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్రాయ్ ఆదివారం పూజలు చేశారు. ఆయనకు పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలో కాలభైరవస్వామి, ధ్వజస్తంభం, పెద్ద నంది, ఉప ఆలయాలను, మూల విరాట్టు, అమ్మవారిని ఆయన దర్శించుకుని, పూజలు చేశారు. అనంతరం ఆలయ పండితులు నంది మండపం వద్ద ఆయనకు ఆశీర్వచనాలు, ఆలయ అధికారి స్వామి వారి ఫొటో, ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు, రెవెన్యూ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. లోవలో భక్తుల రద్దీ తుని: తలుపులమ్మ లోవ దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ 16 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఈఓ విశ్వనాథరాజు తెలిపారు. ప్రసాదాల విక్రయాలకు రూ.2,00,805, పూజా టికెట్ల ద్వారా రూ.2,59,240, కేశఖండన టికెట్లకు రూ.10,200, వాహన పూజలకు రూ.10,240, కాటేజీల ద్వారా రూ.55,900, ఇతర డొనేషన్ల ద్వారా రూ.54,880, ఆన్లైన్ ద్వారా 17,539 కలిపి మొత్తం రూ.6,08,804 ఆదాయం సమకూరిందని వివరించారు. 21న జాతీయ శతాధిక కవి సమ్మేళనంఅమలాపురం టౌన్: స్థానిక వడ్డిగూడెంలోని కోనసీమ రెడ్డిజన సమైక్య వేమన కమ్యూనిటీ హాలులో ఈ నెల 21న జాతీయ శతాధిక కవి సమ్మేళనం, పాటల స్వర వేదిక జరుగుతుందని శ్రీశ్రీ కళా వేదిక అంతర్జాతీయ సీఈఓ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ తెలిపారు. కవి సమ్మేళనం బ్రోచర్లను వేమన కమ్యూనిటీ హాలులో ఆయన, శ్రీశ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు నల్లా నరసింహమూర్తి తదితరులు ఆదివారం విడుదల చేశారు. -
ముగిసిన వాలీబాల్ పోటీలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ సహకారంతో కాకినాడ జేఎన్టీయూలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ టోర్న్మెంట్ ఆదివారం రాత్రితో ముగిసింది. జేఎన్టీయూకే క్రీడా మైదానంతో పాటు రాజీవ్గాంఽధీ ఏంబీఏ కళాశాల, ఆదిత్య సూరంపాలెం కళాశాలలో పోటీలు నిర్వహించారు. ఫైనల్స్లో చెన్త్నె మద్రాస్ యూనివర్సిటీపై చైన్నె ఎస్ఆర్ఏం యూనివర్సిటీ గెలిచింది. రన్నర్గా మద్రాస్ యూనివర్సిటీ నిలవగా, కేరళ కాలికట్ యూనివర్సిటీ తృతీయ, భారతీయర్ యూనివర్సిటీ నాల్గో స్థానంలో నిలిచాయి. అంతర్జా తీయ వాలీబాల్ క్రీడాకారుడు ఎంసీహెచ్ఆర్ కృష్ణంరాజు, జిల్లా ఎస్పీ బిందుమాధవ్, వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్లు విజేతలకు బహుమతులు అందించారు. రిజిస్ట్రార్ శ్రీనివాసరావు, స్టూడెంట్స్ ఎఫైర్ డైరెక్టర్ కృష్ణమోహన్, ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్యామ్ కుమార్ పాల్గొన్నారు. -
హిందీపై ప్రత్యేక శ్రద్ధ
హిందీ పలకడం వచ్చినప్పటికీ రాయడం సాధన చేస్తే సులువుగా ఉంటుంది. వ్యాకరణం అభ్యసించాలి. పరిచయాలు నేర్చుకోవాలి. గద్య భాగంలోని రచయితల పరిచయాలు సాధన చేయాలి. ఆధునిక పద్య భాగ సారాంశాలు నిత్యం చదివి, బాగా నేర్చుకోవాలి. పత్ర లేఖన్లో ఔపచారిక్ లేదా అనౌపదారిక్ పత్రాల్లో ఏదో ఒకటి నేర్చుకుంటే ఉత్తమ మార్కులు పొందవచ్చు. వాక్య దోషాలు, వ్యాకరణ దోషాలు లేకుండా రాస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చు. – కె.సురేఖ, హిందీ ఉపాధ్యాయిని జీవశాస్త్రంపై శ్రద్ధ చూపాలి ప్రశ్నపత్రం ఒక్కటే అయినప్పటికీ జవాబు పత్రాలు భౌతిక, జీవ శాస్త్రాలకు వేర్వేరుగా ఇస్తారు. వివిధ వ్యవస్థలకు సంబంధించి డాక్టర్ను అడగాల్సిన ప్రశ్న ఒకటి ఇచ్చే అవకాశం ఉంది. మానవుడు శ్వాస తీసుకోవడం అనే విషయం చదవాలి. ఆయుర్వేద మొక్కలు – వాటి ఉపయోగాలపై ప్రశ్న ఉంటుంది. అవయవ దానం, రక్తదానం, బాల్య వివాహాల నియంత్రణ, పర్యావరణ, నీటి, చెట్ల సంరక్షణపై స్లోగన్లు, పునశ్చరణ ముఖ్యం. గుండె, నిర్మాణం, ఫలదీకరణ విధానంపై ముఖ్యంగా దృష్టి పెట్టాలి. – ఎం.శ్రీదేవి, బయాలజీ టీచర్ పద్యాలపై పట్టు సాధించాలి పరిచిత పద్యాలకు సంబంధించిన అంశాలపై పట్టు సాధించాలి. శతక మాధుర్యంలో పద్యాల భావాలు నేర్చుకోవాలి. రామాయణంలోని కాండలు (ప్రధాన అంశాలు), వ్యాసరూప ప్రశ్నలపై పట్టు పెంచుకోవాలి. అపరిచిత గద్యాల విభాగంలో సంభాషణ, ప్రకటన, కరపత్రం, గేయం, కవితల్లో ప్రశ్నలు వస్తాయి. లఘు ప్రశ్నలైన కవి పరిచయాలు, ప్రత్యక్ష దైవాలు, జలియన్ వాలాబాగ్, ప్రకృతి సందేశంలోని కథానిక, కథ, వ్యాసాలపై సాధన చేయాలి. అలంకారాలు బాగా నేర్చుకోవాలి. బహుళైచ్ఛిక ప్రశ్నలు చదవాలి. – ఐతి రాంబాబు, తెలుగు ఉపాధ్యాయుడు ‘భౌతిక’ంపై భయమేల! భాష్పీభవనం, మరుగుటకు భేదా లు, హ్రస్వ, దీర్ఘ దృష్టి లోపాల సవరణ, ఎండమావులు, ఇంద్రధనస్సు ఏర్పడే విధానం, విద్యుత్ మోటార్, ఏసీ, డీసీ జనరేటర్లు పని చేసే విధానం, క్వాంటం సంఖ్యలు, పాలీ ఆప్డే, హుండ్ నియమాలు, నూతన ఆవర్తన పట్టిక నిర్మాణం, ఘన పదార్థపు విశిష్టత కనుక్కోవడం, గాజు దిమ్మె, పట్టకం వక్రీభవన చర్యలకు సంబంధించిన ప్రయో గాలు, స్ఫటిక జలం కృత్యం, ఆల్కహాల్, గ్లూకోజ్ ఆమ్లాలు చదువుకోవాలి, ఆమ్లాలు – క్షారాలు, పరమాణు నిర్మాణం వంటి వాటిపై పట్టు సాధించాలి. – జి.శ్రీనివాస్, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు, జి.వేమవరం -
వచ్చే నెల 12న బాడీ బిల్డింగ్ పోటీలు
అమలాపురం టౌన్: జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా క్రీడాకారుడు, విశ్రాంత ఫిజికల్ డైరెక్టర్ దివంగత రంకిరెడ్డి కాశీ విశ్వనాథం (అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయిరాజ్ సాత్విక్ తండ్రి) పేరుతో వచ్చే జనవరి 12న అమలాపురం ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్లో ఉభయ గోదావరి జిల్లాల స్థాయి బాడీ బిల్డింగ్, ఫిజిక్ స్పోర్ట్స్ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వంటెద్దు వెంకన్నాయుడు వెల్లడించారు. అమలాపురంలోని వంటెద్దువారి వీధిలో ఈ చాంపియన్ షిప్ పోటీలకు సంబంధించిన పోస్టర్లను జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు ఆదివారం ఉదయం విడుదల చేశారు. ఈ పోటీల వివరాలను అసోసియేషన్ కార్యదర్శి, కోచ్ డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు తెలిపారు. పోటీలకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి దాదాపు 200 మంది క్రీడాకారులు హాజరవుతారని అన్నారు. మొత్తం 12 కేటగిరీల్లో పోటీలను నిర్వహిస్తున్నామని వివరించారు. విజేతలకు నేషనల్ షీల్డ్లు, మెడల్స్, మెరిట్ సర్టిఫికెట్లు, క్యాష్ అవార్డులు ప్రదానం చేయనున్నామన్నారు. పోస్టర్ల విడుదల కార్యక్రమంలో జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు యెనుముల కృష్ణ పద్మరాజు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి పప్పుల శ్రీరామచంద్రమూర్తి, కోనసీమ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు నగభేరి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడు గారపాటి చంద్రశేఖర్, వైస్ ఎంపీపీ అడపా వెంకట సుబ్రహ్మణ్యం, బాడీ బిల్డింగ్ అసోసియేషన్ సభ్యులు మట్టపర్తి వెంకట సముద్రం, నార్ని శ్రీను, చిక్కం రాజబాబు తదితరులు పాల్గొన్నారు. -
శత ప్రణాళిక.. పదిలమేనా!
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైనది పదో తరగతి. వారి జీవితాన్ని కీలక మలుపు తిప్పి, బంగారు భవితకు పునాది వేసే తరగతి ఇది. ఉన్నత శిఖరాల అధిరోహణకు తొలి మెట్టు. అటువంటి పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సమయం తరుముకొస్తోంది. వచ్చే ఏడాది మార్చి 16 నుంచి 31వ తేదీ వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర విద్యా శాఖ ఇటీవల విడుదల చేసింది. ఈ పరీక్షలకు 29,866 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది కంటే ఈసారి 2,315 మంది అధికంగా పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఇదీ వంద రోజుల ప్రణాళిక టెన్త్లో ప్రభుత్వ పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత, అత్యుత్తమ ఫలితాలు సాధించేలా జిల్లా విద్యా శాఖ అధికారులు వంద రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 353 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఈ నెలలో ప్రారంభమైన ఈ ప్రణాళిక మార్చి 15 వరకూ అమలు కానుంది. జిల్లావ్యాప్తంగా పలు ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉండటంతో వారిని సర్దుబాటు చేసి పాఠాలు బోధిస్తున్నారు. ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదు, సూచనలు ఇస్తున్నారు. ప్రత్యేక తరగతులు వంద రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతి రోజూ ఉదయం 8 నుంచి 9 గంటల వరకూ రెమిడియల్ క్లాసులు నిర్వహిస్తారు. తరువాత 9.15 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నాలుగు సబ్జెక్టులు బోధిస్తారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకూ ప్రతి రోజూ ఒక సబ్జెక్టులో పరీక్ష నిర్వహిస్తారు. ఆ పరీక్షలో వచ్చిన మార్కులు ఆన్లైన్ చేస్తారు. ఈ మార్కులపై మర్నాడు పునశ్చరణ తరగతులు ఉంటాయి. శని, ఆదివారాలు, సెలవు దినాల్లో సైతం ఈ ప్రణాళిక అమలవుతుంది. జనవరిలో కేవలం భోగి, సంక్రాంతి, కనుమ పండగలు మూడు రోజులూ మినహా మిగిలిన అన్ని రోజులూ ఈ ప్రణాళిక యథాతథంగా అమలు చేస్తారు. విద్యార్థులు ఏయే సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్నారో గుర్తించి, వారిలో భయాన్ని పోగొట్టి, ఆత్మవిశ్వాసం నింపేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. ఆంగ్లంపై ఆందోళన వద్దు ఆంగ్ల పుస్తకంలో గ్రామర్, ఒకాబ్యులరీ బాగా నేర్చుకోవాలి. దీంతో పాటు రఫోస్, పోయెట్రీలోని పాఠ్యాంశాలను అర్థం చేసుకుంటే మంచి మార్కులు పొందవచ్చు. బార్, ట్రీ డయాగ్రమ్స్ ఎక్కువ నేర్చుకోవాలి. డైరీ ఎంట్రీ, పద సమూహ ప్రశ్నలపై దృష్టి సారించాలి. లాంగ్వేజ్ స్కిల్స్ ముఖ్యం. బయోగ్రాఫికల్ స్కెచ్, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ ప్రశ్నలు ఇస్తారు. వీటిని బాగా నేర్చుకుంటే మంచి మార్కులు సాధించవచ్చు. డయాగ్రమ్ ఇచ్చి స్టేట్మెంట్ రాయండి అనే ప్రశ్న అడుగుతారు. యాక్టివ్, పాసివ్ వాయిస్ నుంచి ఎక్కువగా స్టేట్మెంట్ నుంచి ప్రశ్నలు వస్తాయి. – చింతాడ ప్రదీప్ కుమార్, ఇంగ్లిష్ టీచర్ మార్చి 16 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పాఠశాలల్లో 100 రోజుల ప్రణాళిక అమలు మెళకువలు నేర్పుతున్న టీచర్లు సర్కారీ స్కూళ్లల్లో ఉత్తమ ఫలితాలకు కసరత్తు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పరీక్షలకు జిల్లాలో 29,866 మంది దరఖాస్తు -
సాంఘిక శాస్త్రం సులువే
చరిత్రను అర్థం చేసుకుని, రాజుల పాలన గుర్తుంచుకుని, ప్రపంచ, దేశ చిత్రపటంపై పట్టు సాధిస్తే సాంఘిక శాస్త్రంలో అధిక మార్కులు పొందే అవకాశముంటుంది. భారతదేశ ప్రధాన భౌగోళిక స్వరూపాలు, పర్యావరణ ఉద్యమాలు, నేలలు – రకాలు, వ్యవసాయ పద్ధతులు, చరిత్రలో జాతీయోద్యమాలు, జాతీయాదాయం, తలసరి ఆదాయం, జలవనరులు, సంస్కృతి, ఆధునికత, ప్రపంచీకరణ వాటి పరిణామాలు, భారత ఆర్థిక వ్యవస్థ, వివిధ రంగాలు తదితర అంశాలపై పట్టు సాధించాలి. ప్రపంచ, భారతదేశ పటాలు గుర్తించేటప్పుడు సెక్షన్, మ్యాప్ ప్రశ్న నంబరు స్పష్టంగా రాయాలి. రాజ్యాంగం లక్షణాలపై పట్టు పెంచుకోవాలి. – వాకాడ వెంకట రమణ, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు గణిత సూత్రాలతో ఎక్కువ మార్కులు గణిత సూత్రాలపై పట్టు సాధిస్తే ఎక్కువ మార్కులు పాందే వీలుంటుంది. ‘విశ్లేషణాత్మకంగా రాయండి’ అని అడిగితే సూత్రాలతో వివరించాల్సి ఉంటుంది. సూత్రాలు, త్రిభుజాలను ప్రత్యేకంగా బాగా నేర్చుకోవాలి. వాస్తవ సంఖ్యల నుంచి సమితి నిర్మాణ రూపం, రోస్టర్ రూపంలోకి మార్చడం వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. నిష్పత్తుల సమస్యలు సాధించడం. పటం ఘన పరిమాణం, ఉపరిత వైశాల్యం కనుక్కోవడం, రేఖీయ సమీకరణాలు సాధించడం, అంకశ్రేణి లేదా గుణశ్రేణి నుంచి ప్రాథమిక సమస్యలు, సాంఖ్యక శాస్త్రం నుంచి కొన్ని ప్రాథమిక సమస్యలపై ప్రశ్నలు ఇస్తారు. – తోటకూర సాయిరామకృష్ణ, గణిత ఉపాధ్యాయుడు, సామర్లకోట -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
ప్రత్తిపాడు: జాతీయ జాతీయ రహదారిపై ప్రతిపాడు వద్ద జరిగిన ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. స్థానిక ఎన్హెచ్పై నరేంద్రగిరి సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి, రోడ్డు పక్కన పడి ఉన్నాడు. ఆ దారిన వెళ్లే వ్యక్తులు 108కు ఫోన్ చేయడంతో క్షతగాత్రుడిని స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉంటుంది. ఎరుపు రంగు చొక్కా, సిమెంట్ రంగు ఫ్యాంటు ధరించి ఉన్నాడు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 94407 96570, 94407 96530 ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని ప్రత్తిపాడు ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం కోరారు. -
ఓబీసీ రిజర్వేషన్ల సాధనకు ఉద్యమం
ఏలేశ్వరం: ఓబీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా ఉద్యమం చేపడతామని తూర్పు కాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ అన్నారు. స్థానిక వెంకటేశ్వరా ఫంక్షన్ హాలులో సంఘం జిల్లా అధ్యక్షుడు బంక కోదండ రాంబాబు అధ్యక్షతన ఆదివారం జరిగిన జిల్లా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తూర్పు కాపులందరికీ ఓబీసీ రిజర్వేషన్లు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు లేక లక్షలాది మంది ఓబీసీ విద్యార్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏలేశ్వరంలో కమ్యూనిటీ హాలు నిర్మాణానికి స్థలం కేటాయించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బడ్డుకొండ వెంకట రమణ, కనిశెట్టి అప్పలనాయుడు, రాష్ట్ర కార్యదర్శి మామిడి విష్ణుమూర్తి, అలమండ చలమయ్య, శిడగం వెంకటేశ్వరరావు, సామంతుల సూర్యకుమార్, సుంకర రాంబాబు, పైల సుభాష్చంద్రబోస్, రిటైర్డ్ ఆర్డీఓ కోరాడ సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. -
అమ్మో పులి
ఫ మెట్ట ప్రజలను వణికిస్తున్న వైనం ఫ అటవీ ప్రాంతంలో జల్లెడ పడుతున్న అధికారులు దేవరపల్లి: మెట్ట ప్రాంత ప్రజలను పులి వణికిస్తోంది. రెండు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. భీమోలు గ్రామంలోని పంట పొలాల్లో శుక్రవారం ఓ పులి, రెండు పిల్లలతో తిరుగుతున్నట్లు చూసినట్లు రైతు కె.రామకృష్ణ చెబుతున్నారు. గ్రామస్తుల సమాచారంతో అటవీ అధికారులు రంగలోకి దిగారు. పులి సంచరిస్తున్నట్టు రైతు చెప్పిన ప్రాంతంలో రెండు రోజులుగా అధికారులు గాలిస్తున్నారు. అటవీ ప్రాంతంలో జంతువు పాదముద్రను గుర్తించారు. అయితే అది పులి పాద ముద్రా? లేక ఏదైనా జంతువుదా అనేది నిర్ధారించాల్సి ఉంది. ఆదివారం జిల్లా అటవీ అధికారి దావీద్రాజు నాయుడు, డిప్యూటీ రేంజ్ అధికారి జి.వేణుగోపాల్, సిబ్బంది అటవీ ప్రాంతంలో పర్యటించారు. ఆరు ప్రదేశాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు దావీద్రాజు నాయుడు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా ఎవరూ పొలాలకు వెళ్లవద్దని సూచించారు. గతేడాదీ ఇదే పరిస్థితి.. గత ఏడాది కూడా గోపాలపురం నియోజకవర్గంలో ప్రజలకు దాదాపు రెండు నెలలు పులి కంటి మీద కునుకు లేకుండా చేసింది. 2024 ఫిబ్రవరిలో ద్వారకాతిరుమల మండలంలో కొద్ది రోజులు సంచరించిన పులి నల్లజర్ల, దేవరపల్లి మండలాల్లోని పొగాకు తోటల్లోనూ తిరిగింది. రెండు మండలాల్లో పులి తెల్లవారు జామున పొలాలకు వెళ్లిన రైతుల కంట పడడంతో భయంతో వణికిపోయారు. దాని ఆచూకీ కోసం అటవీ అధికారులు అనేక ప్రయత్నాలు చేశారు. పొలాల్లో పాదముద్రలను సేకరించి పులి సంచరిస్తున్నట్టు నిర్ధారించారు. ఫిబ్రవరి 3న పులి దేవరపల్లి మండలం యాదవోలు నుంచి గోపాలపురం మండలం వాదాలకుంట, కోమటికుంట, కరిచర్లగూడెం గ్రామాల మీదుగా మాతగమ్మ మెట్టపైకి చేరుకుని సంచరించింది. అక్కడ నుంచి గోపాలపురం మండలం కరగపాడు గ్రామ శివారున గల రిజర్వ్ ఫారెస్ట్కు చేరుకుంది. ఫారెస్ట్కు సమీపంలో కరగపాడుకు ఆనుకుని ఉన్న రైతు జక్కు అచ్చయ్య మొక్కజొన్న తోటలో పెంచుకుంటున్న పందిపై పులి దాడి చేసింది. ఆ పులి ఆచూకీ కోసం రిజర్వ్ ఫారెస్ట్లో పలు ప్రదేశాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయినా ఫలితం దక్కలేదు. మళ్లీ ఇప్పుడు పులి జాడలు కనిపించడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. -
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
● సత్యదేవుని దర్శించిన 40 వేల మంది ● దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం అన్నవరం: రత్నగిరికి ఆదివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. విజయవాడ భవానీ దీక్షల విరమణకు వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో సత్యదేవుని దర్శించుకున్నారు. వారు వచ్చిన టూరిస్టు బస్సులతో దేవస్థానం కళాశాల మైదానం నిండిపోయింది. ఆ భక్తులందరూ నడక దారిన సత్యదేవుని ఆలయానికి చేరుకున్నారు. వీరికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా తోడవడంతో సత్యదేవుని ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. రత్నగిరిపై పార్కింగ్ స్థలం కూడా భక్తుల వాహనాలతో నిండిపోయింది. స్వామివారి వ్రత, విశ్రాంతి మండపాలు, క్యూలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించారని అధికారులు తెలిపారు. స్వామివారి వ్రతాలు 2,500 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 6 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని టేకు రథంపై ఆలయ ప్రాకారంలో ఉదయం ఘనంగా ఊరేగించారు. నేడు సత్యదేవుని మెట్లోత్సవం సత్యదేవుని మెట్లోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రత్నగిరి దిగువన తొలి పావంచా నుంచి కొండ మీద సత్యదేవుని ఆలయం వరకూ ఉన్న 450 మెట్లకు భక్తులతో పూజలు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభిస్తారు. తొలుత రత్నగిరి పైనుంచి దిగువకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి, గ్రామంలో పల్లకీపై ఊరేగించి, తొలి పావంచా వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం, తొలి మెట్టుకు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు పూజలు చేసి, మెట్లోత్సవాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కొండపై సత్యదేవుని ఆలయం వరకూ ఉన్న మెట్లకు భక్తులు పసుపు, కుంకుమ రాసి, హారతి ఇచ్చి, నైవేద్యాలు సమర్పిస్తారు. ఆ మెట్ల మీదుగా స్వామి, అమ్మవార్లను ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్తారు. -
శృంగార వల్లభ స్వామి ఆలయం కిటకిట
పెద్దాపురం (సామర్లకోట): తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వేంచేసియున్న శృంగారవల్లభస్వామిని శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. కాలినడకన ఆలయానికి చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. సుమారు 14వేల మంది స్వామిని దర్శించుకున్నట్టు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.1,42,290 అన్నదాన విరాళాలు రూ.67,143, కేశ ఖండన ద్వారా రూ.5,239, తులాభారం ద్వారా రూ.300, లడ్డు ప్రసాదం విక్రయం ద్వారా రూ.19,635 ఆదాయం వచ్చిందని చెప్పారు. 3,500 మంది అన్న ప్రసాదం స్వీకరించారని ఈఓ తెలిపారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష పెద్దాపురం (సామర్లకోట): నవోదయ విశ్వవిద్యాలయంలో ఆరవ తరగతిలో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. నవోదయ ఆరవ తరగతిలో ప్రవేశానికి 7,140 మంది దరఖాస్తులు చేసుకున్నారని, వారి కోసం ఉమ్మడి జిల్లాలో 32 సెంటర్లు ఏర్పాటు చేసినట్టు నవోదయ ప్రిన్సిపాల్ బి సీతాలక్ష్మీ తెలిపారు. ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 6,034 హాజరయ్యారన్నారు. టెట్కు 1,588 మంది హాజరు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్–25)కు కాకినాడ జిల్లావ్యాప్తంగా మూడు కేంద్రాల్లో పరీక్ష శనివారం నిర్వహించారు. పరీక్షకు ఉదయం 795 మంది, మధ్యాహ్నం 793మంది హాజరు కాగా 143 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఽఖాధికారి పిల్లి రమేష్ తెలిపారు. అన్ని కేంద్రాలలో పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్టు తెలియజేశారు. అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు పెరవలి: అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణం చుట్టూ ఏర్పాటు చేసిన క్యూ లో నిలబడి దర్శనం చేసుకున్నారు. అర్చకులు స్వామి, అమ్మవార్లకు వివిధ రకాల పూలతో విశేష అలంకరణ చేశారు. కోనసీమ జిల్లా పెదపూడి గ్రామానికి చెందిన పోలిశెట్టి సూర్యావతి కుటుంబం ఇచ్చిన ఆర్థిక సహాయంతో 9,500 మందికి అన్న సమారాధన నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. రాజీయే రాజమార్గం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజీ పడడమే రాజమార్గమని, ప్రతీ ఒక్కరూ జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో జాతీయ లోక్ అదాలత్ శనివారం జరిగింది. ఆమె మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్కు 46 బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ట్రాఫిక్ చలానా కేసులు, ఎకై ్సజ్ విభాగానికి చెందిన డ్యూటీ పెయిడ్, నాన్ డ్యూటీ పెయిడ్ కేసులను రాజీ ద్వారా పరిష్కరించామన్నారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడం, తక్కువ ఖర్చుతో న్యాయం అందించడం ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. గత మూడు జాతీయ లోక్ అదాలత్లలో 10,700 కేసులు పరిష్కరించి రూ.100.99 కోట్ల ్టపరిహారం చెల్లించామన్నారు. నాలుగో జాతీయ లోక్ అదాలత్లో ఉమ్మడి జిల్లా పరిధిలో రాత్రి 9 గంటల వరకు 16,873 కేసులు పరిష్కరించగా రూ.27.32 కోట్ల పరిహారం చెల్లించామన్నారు. -
అందని కందిపప్పు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రేషన్కార్డుల ద్వారా నూనె, కందిపప్పు, గోధుమపిండి, రాగులు పంపిణీ చేస్తామని, సరకులు నెల మొత్తం అందుబాటులో ఉంచుతా మని పౌరసరఫరాల శాఖమంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చి మూడు నెలలు గడుస్తున్నా ప్రజలకు కందిపప్పు కష్టాలు తప్పడం లేదు. చంద్రబాబు ప్రభు త్వం వచ్చిన తర్వాత రేషన్ దుకాణాల్లో సక్రమంగా కందిపప్పు ఇవ్వడం లేదు. కార్డుదారులు నెలనెలా రేషన్దుకాణాల వద్ద డీలర్లను కందిపప్పు కోసం అడు గుతున్నా వారి దగ్గర సరైన సమాధానం ఉండడం లేదు. వచ్చే నెలలో వస్తుందని చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. దీంతో సాధారణ మధ్య తరగతి ప్రజలు మార్కెట్లో కందిపప్పు కొనలేక రేషన్షాపుల్లో ఎప్పు డు కందిపప్పు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. కాకినాడ జిల్లాలో 6.50 లక్షల తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. వీరందరికీ ప్రతి నెలా కిలో చొప్పున పంపిణీ చేయాలంటే 655 టన్నుల కందిపప్పు సరఫరా చేయాలి. కానీ చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలు మాత్రమే ఈ విధంగా ఇచ్చింది. ఈ ఏడాది మార్చి నెలలో చివరిగా కందిపప్పు ఇచ్చారు. తొమ్మిది నెలలుగా రేషన్షాపుల ద్వారా కందిపప్పు సరఫరా చేయడం లేదు. రెండు నెలల క్రితం దసరా, దీపావళి వంటి పండగల్లో నిరుపేద ప్రజలు కందిపప్పు కోసం ఎదురుచూశారు. అయినప్పటికీ వారికి నిరాశే ఎదురైంది. ఈ నెలలో క్రిస్మస్ పండగ నేపథ్యంలో కందిపప్పు ఇస్తారని కార్డుదారులు రేషన్షాపులకు వెళ్లినా అక్కడ నిరాశ తప్పలేదు. కార్డుదారులు కేవలం బియ్యం మాత్రమే తీసుకొని ఉసూరుమంటూ వెనుతిరగాల్సి వచ్చింది. బహిరంగ మార్కెట్లో కొందామంటే నాణ్యతను బట్టి కిలో రూ.110 నుంచి రూ.130 వరకూ విక్రయిస్తున్నారు. రాగులు, జొన్నలు కూడా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం కనీసం నెలనెలా ఇచ్చే కందిపప్పు కూడా ఇవ్వకపోవడంతో నిరుపేదలు అనేక అవస్థలు పడాల్సి వస్తోంది. గత ప్రభుత్వంలో ఇంటి వద్దకే సరకులు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఇంటి వద్దనే నిత్యావసర వస్తువులను అందించేందుకు ఎండీయూ వాహనాలు ఏర్పాటు చేశారు. ఇంటింటికీ వచ్చి సరకులు సరఫరా చేసేవారు. చంద్రబాబు సర్కార్ వచ్చాక రేషన్ షాపులకు వెళ్లి గంటల తరబడి క్యూ లో నిలబడినా బియ్యం, పంచదార తప్ప ఇంకేమీ దొరకడం లేదు. ఈ నెలలో కపంచదార కూడా పూర్తిగా సరఫరా చేయకపోవడంతో కార్డుదారులు తీవ్ర అంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పట్టణాల్లో ఎలా ఉన్నా గ్రామాల్లో ప్రజలు కందిపప్పు దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కిరణా షాపుల్లో కొనాలంటే రేటు ఎక్కువ కావడంతో ప్రభుత్వమే రేషన్షాపుల ద్వారా ఇవ్వాలని జనం డిమాండ్ చేస్తున్నారు. వినియోగదారులకు అదనపు భారం ప్రభుత్వం గతంలో కిలో రూ.67 కే రేషన్షాపుల ద్వా రా కందిపప్పు సరఫరా చేసేది. దీంతో సాధారణ, మఽ ద్యతరగతి ప్రజలు కిలో కందిపప్పును నెలరోజుల పా టు పొదుపుగా వాడుకొనేవారు. తొమ్మిది నెలలుగా రేషన్షాపులో కందిపప్పు ఇవ్వకపోవడంతో ప్రజలు బయట మార్కెట్లోనే కందిపప్పు కొనుగోలు చేసుకొంటున్నారు. దీంతో వినియోగదారులు సుమారు రూ. 50 నుంచి రూ.60 అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ప్రజలకు తప్పని అవస్థలు నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రజలు కడుపునిండా అన్నం తిందామన్నా కుదరని పరిస్థితి నెలకొంది. ప్రతీ నెలా 20వ తేదీ లోపు తమ షాపు పరిధిలోని కార్డుదారులకు కావాల్సిన బియ్యం, కందిపప్పు, పంచదార కోసం డీలర్లు డీడీలు తీస్తారు. రేషన్డీలర్లు డీడీలు తీసినా కందిపప్పు, పంచదార కూడా సరఫరా చేయడం లేదు. తొమ్మిది నెలలుగా కార్డుదారులకు ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొందని డీలర్లు వాపోతున్నారు. ప్రభుత్వం సరఫరా చేయకపోయినా కార్డుదారులు తమను నిలదీస్తున్నారని, ప్రతి నెలా కార్డుదారులకు సమాధానం చెప్పడం చాలా కష్టంగా ఉందని రేషన్డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము డీడీలు తీసినా ఉపయోగం లేకపోవడంతో డీలర్లు డీడీలు తీయడం మానివేశారు. ప్రభుత్వం ఎప్పుడు కందిపప్పు ఇస్తే అప్పుడే డీడీలు తీయాలని నిర్ణయించుకొన్నారు. తొమ్మిది నెలలుగా రేషన్ దుకాణాలకు సరఫరా బంద్ బహిరంగ మార్కెట్లో కిలో రూ.120 ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలు ప్రకటలనకే పరిమితమైన నాయకులు జిల్లాలో మొత్తం రేషన్ కార్డులు 6,50,716 ప్రతి నెలా 655 టన్నులు అవసరం ఈ నెలలో కూడా కేటాయించలేదు ఈ నెలలో కూడా జిల్లాకు కందిపప్పు ప్రభుత్వం కేటాయించలేదు. కేవలం అంగన్వాడీ కేంద్రాలకు మాత్రమే కందిపప్పు వచ్చింది. రేషన్షాపులకు కందిపప్పు కేటాయించలేదు. ప్రభుత్వం స్టాకు విడుదల చేయకపోవడంతో రేషన్షాపుల్లో కందిపప్పు పంపిణీ చేయడం కుదరలేదు. – దేవులానాయక్, డీఎం, జిల్లా పౌరసరఫరాలశాఖ బయట మార్కెట్లో ధరలు పెంచుతున్నారు ప్రభుత్వం కందిపప్పు సరఫరా చేయకపోవడంతో బయట మార్కెట్లో కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. ఇదే అదనుగా బయట మార్కెట్లో ధరలు పెంచుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రతి నెలా కందిపప్పు సరఫరా చేయాలి. – ఏలూరి రాణి, గృహిణి, కాకినాడ -
పద్యంలా ఘోషించే గోదావరి!
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గోదావరి తీరం తెలుగు శతక పద్య పఠనంతో, వందేమాతరం గీతాలాపనతో మారు మోగింది. 1,008 మంది విద్యార్థులతో గోదావరి గట్టు చాంబర్ భవనంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలుగు బాల శతక పద్య సహస్రాధిక గళ ధారణ, దశ సహస్ర వందేమాతర గీతాలాపన కార్యక్రమాలు జరిగాయి. మాతృ భాష పరిరక్షణ సమితి పెరవలి, ఆంధ్ర కేసరి యువజన సమితి సహకారంతో జరిగిన ఈ కార్యక్రమాలు నిర్వహించారు. 40 పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు భారతమాత, తెలుగు తల్లి వేషధారణలతో పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి జంధ్యాల పాపాయ్య శాస్త్రి (కరుణశ్రీ) కుమారుడు వెంకట రమణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 80 ఏళ్లు జీవించిన తన తండ్రి 80 తెలుగు సాహితీ గ్రంథాలను అందించారని ఆయన తెలిపారు. ఎక్కువ శాతం తెలుగు బాల సాహిత్య గ్రంథాలనే అందించిన ఘనత కరుణశ్రీ దే అన్నారు. శాసనమండలి సభ్యులు సోమ వీర్రాజు మాట్లాడుతూ 150 ఏళ్ల వందే మాతర గీతాన్ని వెయ్యి సార్లు ఆలపించడం ఆనందదాయకమన్నారు. నగర ప్రముఖులు తోట సుబ్బారావు, పంతం కొండలరావు, ఇయ్యపు మురళీధర్, లక్కోజు వీరభద్రరావు అతిథులుగా పాల్గొన్నారు. ఆంధ్ర కేసరి యువజన సమితి ప్రతినిధులు మాదిరాజు శ్రీనివాస్, దేశిరెడ్డి బలరామనాయుడు, తెలుగు ఉపాధ్యాయురాలు డాక్టర్ శ్రీపాద సీతామహాలక్ష్మి తెలుగు శతక పద్య విశిష్టతను వివరించారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి కుమారుడు వెంకటరమణకు ఈ సందర్భంగా నిర్వాహకులు సత్కారం చేశారు. -
రత్నగిరిపై భక్తుల రద్దీ
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవాలయానికి శనివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో స్వామివారి ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, విశ్రాంత మండపాలు భక్తులతో నిండిపోయాయి. సత్యదేవుని దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుడిని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. సుమారు 30 వేల మంది స్వామివారిని దర్శించినట్టు అధికారులు అంచనా వేశారు. స్వామివారి వ్రతాలు 2,100 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఐదువేల మంది నిత్యాన్నదాన పథకంలో భోజనం చేశారు. తిరుచ్చి వాహనంపై సత్యదేవుని ఊరేగింపు ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తిరుచ్చి వాహనంలో ఉంచి ఊరేగింపుగా తూర్పు రాజగోపురం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ స్వామి, అమ్మవార్లకు అర్చకుడు యడవిల్లి వేంకటేశ్వరరావు పూజలు చేసిన అనంతరం దేవస్థానం ఈఓ వీ త్రినాథరావు కొబ్బరికాయ కొట్టి ప్రాకారసేవ ప్రారంభించారు. వేద పండితుల మంత్రొచ్ఛాటన మధ్య, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో సేవ నిర్వహించారు. అనంతరం పండితులు స్వామి, అమ్మవార్లకు నీరాజనం ఇచ్చి, భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఆదివారం ఉదయం పది గంటలకు ఆలయ ప్రాకారంలో టేకు రథంపై సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని ఊరేగిస్తారు. -
బాబు సర్కారుది దుర్మార్గం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రజలకు ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని, అటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమైన చర్యని పలువురు వక్తలు పేర్కొన్నారు. నిరుపేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు అనారోగ్యం వస్తే వెళ్లేది ప్రభుత్వ ఆసుపత్రికేనన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రజలకు అందుబాటులో ఉంటే నాణ్యమైన వైద్యం అందుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం పేదలకు వైద్య విద్యను దూరం చేస్తుందని, ఇది నూరుశాతం సబబు కాదని ఏకకంఠంతో ఖండించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేయడాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వర్ణిక ఫంక్షన్ హాల్లో శనివారం ఉదయం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షతన జరిగింది. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ, ఆమ్ఆద్మీ పార్టీ, బీఎస్పీ, జై బీమ్ పార్టీ, 19 ప్రజాసంఘాల నాయకులు హాజరయ్యారు. ప్రజారోగ్య రంగాన్ని ఖూనీ చేయొద్దు సమావేశంలో వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ ప్రజారోగ్య రంగాన్ని ఖూనీ చేయవద్దన్నారు. ఎస్సీ, ఎస్టీ బీసీలకు వైద్య విద్యను దూరం చేయవద్దని, వైద్య రంగాన్ని పీ–4 పేరుతో ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గత ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపట్టిందన్నారు. బడ్జెట్ నిధులు కేటాయించి, మెడికల్ కాలేజీలను ప్రభుత్వంలోనే కొనసాగించిందన్నారు. కానీ నేడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందన్నారు. రాష్ట్రంలో కుటుంబాలు తమ ఆదాయంలో అత్యధిక భాగాన్ని నాణ్యమైన విద్య, వైద్యం కోసం ఖర్చు చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం పార్టీ ప్రయోజనాల కోసం అనేక సంక్షేమ పథకాలు మంజూరు చేస్తుందని, అవి చేసినా, చేయకపోయినా పేద వాళ్లకు వైద్యాన్ని మాత్రం దూరం చేయవద్దన్నారు. ఇప్పటికే ప్రభుత్వ సామాన్య, వైద్య విధాన, ఏరియా, సీహెచ్సీ, పీహెచ్సీ ఆసుపత్రులలో మందులు, పరికరాలు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉందన్నారు. అటువంటిది ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తే ప్రైవేటు వ్యక్తులు కేవలం లాభాలను దృష్టిలో ఉంచుకొని పనిచేస్తారని, దీనివల్ల మధ్యతరగతి, పేద ప్రజలకు తీవ్రతర ఇబ్బందులు వస్తాయన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు ఈ కళాశాలలు ఇస్తే వైద్య చికిత్సలు ఖరీదవుతాయని చెప్పారు. ప్రైవేటు వ్యక్తులు తమ పెట్టుబడిని రాబట్టుకోవడానికి రోగులపై అధిక భారాన్ని మోపుతారన్నారు. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు దోపిడీకి గురవుతారన్నారు. ఆరోగ్య విపత్తుల సమయంలో ప్రైవేటు యజమానులు సామాజిక బాధ్యత నుంచి తప్పుకుంటారని చెప్పారు. గత కోవిడ్ సమయంలో ప్రయివేటు ఆసుపత్రులు మూసివేస్తే ప్రభుత్వాసుపత్రులు మాత్రమే ఆ భారాన్ని మోశాయన్నారు. 60 ఏళ్లపాటు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి ప్రభుత్వ ఆస్తులు మాజీ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తే ప్రభుత్వ భూములు, భవనాలు, కాలేజీలు, ఆసుపత్రులు దాదాపు 60 ఏళ్లపాటు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతాయని తెలిపారు. దీంతో పేద మధ్యతరగతి వర్గాలకు వైద్య విద్య అందని ద్రాక్ష వలె మారడమే కాకుండా వైద్య విద్యలో పారదర్శకత లోపించే ప్రమాదం ఉందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ మెడికల్ కళాశాలలో పీపీపీ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయాలని అనుకోవడం అత్యంత దుర్మార్గమన్నారు. ఇది రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకు విరుద్ధమన్నారు. సామాజిక వర్గాల అభ్యున్నతికి భంగం కలిగించే చర్య అన్నారు. సీపీఎం సీనియర్ నాయకులు దువ్వా శేషుబాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రంలోని 10 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జీవో నంబర్ 590ను జారీ చేయడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యానందరావు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అవినీతి మయంగా మారిందని చెప్పారు. ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండా మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వం వెంటనే జీవో నంబర్ 590 ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు మహమ్మద్ రియాజ్ మాట్లాడుతూ ప్రజా వైద్యం ప్రజల హక్కు అని ఏ దేశంలోనైనా విద్య, వైద్యం ప్రభుత్వం చేతిలోనే ఉందన్నారు. రాష్ట్రంలో మాత్రం మెడికల్ కళాశాలలను చంద్రబాబు సామాజిక వర్గానికి తాకట్టు పెట్టేందుకే ఈ ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేస్తోందన్నారు. జై భీమ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జునరావు మాట్లాడుతూ ప్రజారోగ్య రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీస్తోందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకురాగా నేడు వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మాజీ మేయర్, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, సీపీఎం జిల్లా కార్యదర్శి కే బోడకొండ, జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, ఏఐటీయూసీ సీనియర్ నాయకులు కిర్ల కృష్ణారావు, బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ చొల్లంగి వేణుగోపాల్, 93 కులాల ఐక్యవేదిక నాయకులు మాదిరెడ్డి గణేష్బాబు, గాంధీనగర్ పార్క్ అసోసియేషన్ అధ్యక్షుడు పరస సురేష్ కుమార్, , ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి జి.రవికుమార్, ఐఎన్టీయూసీ ఏపీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లూరి రాజు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బొబ్బిలి శ్రీనివాసరావు, సీఐటీయూ జిల్లా నాయకులు పలివెల వీరబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సాకా రామకృష్ణ, రైతు సంఘం జిల్లా కన్వీనర్ నక్క శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రభుత్వమే మెడికల్ కళాశాలలను నిర్వహించాలి ప్రైవేటీకరిస్తే సహించేది లేదు సీపీఐ రౌండ్టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్ -
అన్నింటా మహిళల ముందంజ
కాకినాడ రూరల్: అన్ని రంగాల్లో మహిళలు ముందంజ వేస్తున్నారని, ముఖ్యంగా పాఠశాలల నుంచి కళాశాలల వరకూ బాలికలు, యువతుల విద్యాభ్యాసం పెరిగిందని నన్నయ యూనివర్సిటీ వీసీ, ప్రొఫెసర్ ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. కాకినాడ రూరల్ తిమ్మాపురంలోని నన్నయ ఎంఎస్ఎన్ పీజీ సెంటర్లో శుక్రవారం అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. పీజీ సెంటర్ ఇంగ్లిష్ డిపార్ట్మెంట్ ఆధ్యర్యంలో జరిగిన సదస్సును వీసీ ప్రారంభించారు. 55 శాతం మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని వీసీ అన్నారు. సదస్సుకు వచ్చిన వివిధ కళాశాలల విద్యార్థులకు శ్రీలంకకు చెందిన డాక్టర్ జేఎస్ రోహన్, అల్గిరీయాకు చెందిన డాక్టర్ నావెల్ ఆన్లైన్ ద్వారా భౌగోళిక మార్పులు, సమకాలీన సామాజిక దృక్కోణాలు, ప్రదర్శనలపై వివరించారు. ఎథియోపియా నుంచి హాజరైన ప్రొఫెసర్లు టెస్సెమా గేబ్రే కీమిసో, టెస్ఫాహున్ టెగెర్న్ సోర్సా తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు. ప్రొఫెసర్లు రమేష్, జ్యోతి పలు సూచనలు అందించారు. మాణిక్రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ మాణిక్యరెడ్డి, లయన్ గరికపాటి నమశ్శివాయలు వీసీ ప్రశాంతిశ్రీని సన్మానించి, మహాత్మా గాంధీ సేవారత్న పురస్కారాన్ని అందజేశారు. అనంతరం సావనీర్ను ఆవిష్కరించారు. ఆంగ్ల విభాగాధిపతి ఎం.పోచయ్య, రాధామాధవి, డాక్టర్ శ్రీదేవి, మనోజ్దేవా తదితరులు పాల్గొన్నారు. -
ఏం బ్యాగోలేవు
శనివారం శ్రీ 13 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, కాకినాడ: గత ప్రభుత్వం కంటే నాణ్యమైన స్కూల్ బ్యాగులు, బూట్లు ఇచ్చి విద్యా వ్యవస్థను పరుగులు పెట్టిస్తామని చెప్పారు. తీరా చూస్తే ఇదంతా వట్టి ప్రచారార్భాటమేననే చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థులకిచ్చిన స్కూల్ బ్యాగ్లను చూస్తే ఇట్టే అర్థమైపోతోంది. ఆరు నెలలు కూడా గడవకుండానే ఇచ్చిన బ్యాగులు నాసిరకమైనవనే విషయం తేటతెల్లమైపోయింది. చాలా వరకూ బ్యాగులకు జిప్లు ఊడిపోతున్నాయి. చివికిపోయి, చిరిగిపోతున్నాయి. కాస్త ఎక్కువ పుస్తకాలు పెడితే బ్యాగ్ పూర్తిగా చిరిగిపోయి, అన్నీ నేలపైకి జారిపోయే పరిస్థితి. తమ పిల్లలకు మరీ ఇంత నాణ్యత లేని బ్యాగులను ప్రభుత్వం ఇస్తుందని అస్సలు ఊహించలేదని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. జిల్లాలో శుక్రవారం ఏ స్కూల్కు వెళ్లి పరిశీలించినా విద్యార్థుల వీపులపై నాణ్యత లేని బ్యాగులే దర్శనమిచ్చాయి. కొన్ని పాఠశాలల్లో గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంతో పాటు తాజాగా చంద్రబాబు సర్కార్ ఇచ్చిన స్కూల్ బ్యాగులతో వచ్చిన విద్యార్థులు కనిపించారు. నాడు జగన్ ప్రభుత్వం అందజేసిన నీలి రంగు బ్యాగులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా కనిపించాయి. అదే ఆరు నెలలు క్రితం చంద్రబాబు ప్రభుత్వం అందించిన బ్యాగులు నాణ్యత లోపానికి నిలువెత్తు నిదర్శనంగా దర్శనమిచ్చాయి. భారీ ఆర్భాటం వేసవి సెలవుల అనంతరం గత జూన్లో ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందజేస్తామని అధికార పార్టీ నేతలు చెప్పారు. మాటలైతే చెప్పారు కానీ ఆచరణలో మాత్రం జూలై నెలాఖరు వరకు కూడా బ్యాగులు ఇస్తూనే ఉన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్యంలోని 1,280 పాఠశాలల్లో 1,28,988 మంది విద్యార్థులున్నారు. ఈ మేరకు జూన్ నెలలో 1,28,988 స్కూల్ బ్యాగుల కోసం విద్యా శాఖ ఇండెంట్ పెట్టింది. అయితే, జూన్ 20 నాటికి 20,850 బ్యాగులు మాత్రమే జిల్లాకు వచ్చాయి. అంత తక్కువగా వచ్చినా పార్టీ నేతలతో వాటిని పంపిణీ చేయడానికి భారీ ఆర్భాటమే చేశారు. మిగిలినవి కూడా జూలై రెండో వారానికి విడతల వారీగా వచ్చాయి. వేలాది మందికి మొండిచేయి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ స్కూల్ బ్యాగులు ఇవ్వడానికి బాబు సర్కార్కు చేతులు రాలేదని విద్యార్థి సంఘ నాయకులు ఆక్షేపిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా 5,600 మంది విద్యార్థులు చేరారు. వీరిలో ఏ ఒక్కరికీ ఇప్పటి వరకూ స్కూల్ బ్యాగులు ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండెంట్ పెట్టనందువల్లనే వారికి బ్యాగులు రాలేదని విద్యా శాఖ చెబుతోంది. మూడు నెలలకే ముక్కలు ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులు నాసిరకం కావడంతో ఇచ్చిన రెండు మూడు నెలలకే చిరిగిపోయాయి. కొన్ని బ్యాగులకై తే ఎక్కడికక్కడ జిప్లు వదిలేశాయి. వాటికి పిన్నీసులు పెట్టుకుని విద్యార్థులు వెళ్తున్న పరిస్థితి. కొన్నింటికై తే తాళ్లు తెగిపోయాయి. దీంతో, ఆ బ్యాగుల్లో పుస్తకాలు పెట్టుకుని పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. కాస్త స్తోమత ఉన్న వారైతే తమ పిల్లలకు సొంత డబ్బులతో మార్కెట్లో వేరే బ్యాగులు కొంటున్నారు. ప్రతి 100 బ్యాగుల్లో 25 చిరిగిపోవడంతో వాటిని మూలన పడేసి, కొత్తవి కొనుక్కున్నామని చెబుతున్నారు. ఇటీవల ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా రాజకీయ సభల్లా నిర్వహించిన మెగా పేరెంట్స్ – టీచర్స్ కమిటీ సమావేశాల్లో సైతం పలువురు తల్లిదండ్రులు స్కూల్ బ్యాగ్లు చిరిగిపోయాయంటూ అసహనం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో నాణ్యమైన కానుక గత జగన్ ప్రభుత్వ హయాంలో విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే విద్యార్థులందరికీ జగనన్న విద్యా కానుక పేరిట నాణ్యమైన బ్యాగ్లు, షూ, మూడు జతల యూనిఫామ్ రెండు జతల సాక్స్లు, బెల్ట్ అందజేశారు. అలాగే, ఆరు నుంచి పదో తరగతి వరకూ విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు, ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీలు అందజేశారు. ఈవిధంగా జిల్లా వ్యాప్తంగా 1.59 లక్షల మందికి పైగా విద్యార్థులకు సుమారు రూ.30 కోట్ల వ్యయంతో విద్యా కానుక అందించారు. జగన్ ఇచ్చిన బ్యాగే వాడుతున్నాడు మా మనవడు ప్రవీణ్ కుమార్ తాళ్లూరు హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన స్కూల్ బ్యాగ్ జిప్లు ఊడిపోయాయి. అక్కడక్కడ బ్యాగ్ చిరిగిపోయింది. దీంతో, దానిని పక్కన పెట్టేయాల్సి వచ్చింది. గత ప్రభుత్వంలో ఇచ్చిన స్కూల్ బ్యాగ్ ఇప్పటికీ బాగుంది. ఆ బ్యాగ్లోనే మా మనమడు పుస్తకాలు పెట్టుకుని స్కూల్కు వెళ్తున్నాడు. – బూరా అబ్బులు, తాళ్లూరు, గండేపల్లి మండలం 6 నెలలు గడవకుండానే.. ఆరు నెలలు కూడా గడవకుండానే చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులు చిరిగిపోయాయి. ఎస్ఎఫ్ఐ సభ్యులు స్కూళ్లకు పరిశీలనకు వెళ్లినప్పుడు విద్యార్థులు వద్ద చిరిగిన బ్యాగులు చూశాం. కొత్తగా చేరిన విద్యార్థులకు ఈ రోజుకు కూడా బ్యాగులు ఇవ్వలేదు. టీచర్స్ – పేరెంట్స్ మీటింగ్లో కూడా తల్లిదండ్రులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. విద్యా సంస్థల్లోకి విద్యార్థి సంఘాలు రాకూడదంటూ సర్కులర్ జారీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇంకోవైపు పాఠశాలల్లో జరిగిన పేరెంట్స్ – టీచర్స్ సమావేశాలకు పార్టీ కార్యకర్తలను పంపించి రాజకీయ ప్రసంగాలు ఇప్పించింది. విద్యార్థి సంఘాల కార్యకలాపాలు, జెండాలు వద్దని చెబుతూనే వారి పార్టీ కార్యకర్తలతో ఈ సమావేశాలు నిర్వహించారు. – సీహెచ్ లోవరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు, కాకినాడ విద్యార్థులకు నాసిరకం స్కూల్ బ్యాగుల పంపిణీ జిప్పులు ఊడిపోయి, చిరిగిపోయిన వైనం ఆర్భాటం గొప్ప.. నాణ్యత దిబ్బ అంటూ విమర్శలు -
కార్మిక మంత్రికి మా గోడు వినిపించదా?
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కార్మిక శాఖ మంత్రికి భవన నిర్మాణ కార్మికుల గోడు వినిపించదా అని ఏపీ బిల్డింగ్, కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పుప్పాల సత్యనారాయణ ప్రశ్నించారు. శుక్రవారం స్థానిక పీఆర్ భవన్లో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ నిర్మాణ రంగ కార్మికులకు బతుకు భారమైందని, సొంత ఊర్లో పనులు లేక వలసలు వెళ్లే పరిస్థితి దాపురించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.110 కోట్ల భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ కై ్లమ్ ఉన్నాయని, తక్షణమే విడుదల చేయాలని అనేకసార్లు వినతి పత్రం అందజేసినా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. కార్మికులకు పథకాల అమలు చేయాలంటే నిధులు లేవని కానీ స్కిల్ డెవలప్మెంట్ పేరుతో రూ.70 కోట్లు విడుదల చేస్తున్నారన్నారు. స్కిల్ డెవలప్మెంట్కు తానువ్యతిరేకం కాదని, కానీ భవన నిర్మాణ కార్మికుల కోసం చెల్లిస్తున్న సెస్ నిధులు ఖర్చు చేయకుండా ప్రభుత్వ నిధులు కేటాయించి స్కిల్ డెవలప్మెంట్ చేయాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు తక్షణమే అమలు చేయాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘాలను, కలిసొచ్చే ఇతర సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు తాటిపాక మధు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాటాలు చేయాలన్నారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ సంక్రాంతి తర్వాత భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాల అమలుపై భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందన్నారు. సదస్సులో ఏఐటీయూసీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కె.సత్తిబాబు, అమలాపురం యూనియన్ అధ్యక్షుడు బోనం చిన్న, తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ కె.రాంబాబు పాల్గొన్నారు. ఏపీ బిల్డింగ్, కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ -
వేతనాలు పెంచాలి
● యాప్ల భారం తగ్గించాలి ● అంగన్వాడీల డిమాండ్బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కార్యకర్తలకు వెంటనే వేతనాలు పెంచాలని ఏపీ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు దడాల పద్మ డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కలెక్టరేట్ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్కు వినతిపత్రం అందజేశారు. ఆరేళ్లుగా వేతనాలు పెరగలేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం తక్షణం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ మినీ కేంద్రాలను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ ఆదేశాలు మాత్రమే ఇచ్చారని, మెయిన్ సెంటర్ సిబ్బంది వేతనాలను వెంటనే మినీలకు కూడా చెల్లించాలని కోరారు. యాప్ల పేరుతో పెంచిన పని భారం తగ్గించాలని, అన్నింటినీ కలిపి ఒకే యాప్గా మార్చాలని, అంగన్వాడీ కేంద్రాలను పాఠశాలల్లో విలీనం చేయడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజనానంతరం అంగన్వాడీ చిన్నారులకు స్నాక్స్ వెంటనే పునరుద్ధరించేందుకు బడ్జెట్ పెంచాలని కోరారు. ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్లు అనేక హామీలు, సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం తప్ప, అధికారంలోకి వచ్చి 15 నెలలవుతున్నా సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అంగన్వాడీ కార్యకర్తలు దశల వారీ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ధర్నాలో యూనియన్ కార్యదర్శి ఏరుబండి చంద్రవతి, సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దువ్వా శేషుబాబ్జీ, చెక్కల రాజ్కుమార్, ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ తదితరులు పాల్గొన్నారు.


