Kakinada District Latest News
-
రత్నగిరిపై భక్తుల సందడి
● సత్యదేవుని దర్శించిన 30 వేల మంది ● ఘనంగా సత్యదేవుని రథ సేవ అన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుడిని ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించి పూజలు చేశారు. సెలవు దినం కావడంతో ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వీరంతా స్వామివారి వ్రతాలాచరించి దర్శనం చేసుకున్నారు. దీంతో సత్యదేవుని ఆలయం వద్ద రద్దీ ఏర్పడింది. సత్యదేవుని దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుడిని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. ఆదివారం స్వామివారిని 30 వేల మంది దర్శించగా, వ్రతాలు 1,500 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఐదు వేల మంది భక్తులకు సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో ఉచిత భోజన సౌకర్యం కలుగచేశారు. ఆదివారం సత్యదేవుని రథసేవ ఆలయ ప్రాకారంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి టేకు రథంపై ఉంచారు. స్వామి, అమ్మవార్లకు పూజలు చేసిననంతరం పండితులు రథసేవ ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛాటన మధ్య, మంగళవాయిద్యాల నడుమ మూడుసార్లు రథంపై ఆలయ ప్రాకారంలో సేవ నిర్వహించారు. సేవ అనంతరం పండితులు స్వామి, అమ్మవార్లకు నీరాజనం ఇచ్చి ఇచ్చారు. వేదపండితులు గొల్లపల్లి ఘనపాఠీ, శివ, యనమండ్ర శర్మ, గంగాధరబట్ల గంగబాబు, అర్చకులు సుధీర్. పరిచారకులు పవన్ తదితరులు కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తరకంచికి చెందిన భక్తులు రూ.2,500 చెల్లించి రథసేవలో పాల్గొన్నారు. సోమవారం సత్యదేవుడు, అమ్మవారు ముత్యాల కవచాలను (ముత్తంగిసేవ) ధరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
ప్రజలు కమ్యూనిస్టులను ఆదరిస్తారు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు కాకినాడ సిటీ: అమరవీరుల స్ఫూర్తితో నిరంతరం ప్రజాసేవ చేస్తే ప్రజలు కమ్యూనిస్టులను తప్పనిసరిగా ఆదరిస్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ అన్నదాన సమాజంలో నవ సమాజం కోసం పుస్తకావిష్కరణ సభ సీపీఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు అధ్యక్షతన జరిగింది. ఈ సభలో శ్రీనివాసరావు ముఖ్యవక్తగా మాట్లాడారు. కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర అంటే ఆ కాలంలో ప్రజా పోరాటాల చరిత్రే అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్వాతంత్రోద్యమ కాలంలోనే కమ్యూనిస్టు బీజాలు పడ్డాయన్నారు. ఆనాడు కాకినాడ అన్నదాన సమాజంలో రహస్యంగా పార్టీ ఏర్పడిందన్నారు. 1934–1964 మధ్య జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ ఘట్టాలను వివరిస్తూ సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు దువ్వా శేషుబాబ్జీ నవ సమాజం కోసం పేరుతో పుస్తకం రచించడం అభినందనీయమన్నారు. కమ్యూనిజం అంతరించిపోయిందని ప్రచారం జరిగిన అమెరికాలోనే కమ్యూనిస్టు పేరు వింటేనే ట్రంప్ ఉలిక్కి పడతున్నారన్నారు. దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ప్రజలు ఎర్రజెండా వైపు చూస్తారన్నారు. అమరుల స్ఫూర్తితో ప్రజల నుంచి నేర్చుకుని ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవాలన్నారు. డాక్టర్ చెలికాని స్టాలిన్, డాక్టర్ పి.చిరంజీవినీకుమారిలతో పాటు సీపీఐ నాయకులు తాటిపాక మధు, బోడకొండ, కె.సత్తిబాబు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు, లిబరేషన్ నాయకులు గొడుగు సత్యనారాయ, చిన్నిబిల్లి నాగేశ్వరరావు, సీపీఐ ఎంఎల్ నాయకులు నాగరాజు, కొండ దుర్గారావు, సీపీఎం నాయకులు టి.అరుణ్ తదితరులు సమావేశంలో మాట్లాడారు. దేశాన్ని మతోన్మాద శక్తుల బారి నుంచి కాపాడుకోవాలన్నారు. ఐక్య ఉద్యమాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. శేషుబాబ్జీ కృషిని నాయకులు అభినందించారు. కమ్యూనిస్టు ఉద్యమంలో అమరులైన నాయకుల కుటుంబ సభ్యులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సభా ప్రాంగణంలో అమరుల ఫొటోలతో పాటు వారి గురించి క్లుప్తంగా తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సభకు ముందుగా అమరులకు నివాళులర్పించారు. సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఏవీ నాగేశ్వరరావుతో పాటు రచయిత దువ్వా శేషుబాబ్జీ, నాయకులు జి బేబీరాణి, కేఎస్ శ్రీనివాస్, పలివెల వీరబాబు, సీహెచ్ రమణి, సీహెచ్ రాజ్కుమార్, నీలపాల సూరిబాబు, కె సత్తిరాజు, మలక వెంకటరమణ, దుంపల ప్రసాద్, కె నాగజ్యోతి, చంద్రమళ్ల పద్మ, చంద్రావతి, రాణి, నాగలక్ష్మి పాల్గొన్నారు. -
12న ఫీజు పోరును విజయవంతం చేయండి
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీత పిఠాపురం: రాష్ట్ర వైఎస్సార్ సీపీ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఈనెల 12న నిర్వహించనున్న ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ వంగా గీత పిలుపు నిచ్చారు. ఆమె ఆదివారం మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రస్టు పట్టించిందని ఆమె విమర్శించారు. విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అండగా జిల్లా కేంద్రం కాకినాడలో ఫీజు పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తరపున చేపట్టనున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు వైఎస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అదే రోజు పిఠాపురం పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్న వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని ఆమె పిలుపు నిచ్చారు. లోవ దేవస్థానంలో భక్తుల సందడి రూ.3.65 లక్షల ఆదాయం తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో సందడి నెలకొంది. ఆదివారం వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చిన 18వేల మంది భక్తులు క్యూలైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకున్నట్టు ఇన్చార్జ్ డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,39,305, పూజా టికెట్లకు రూ.86,900, కేశఖండన శాలకు రూ.13,960, వాహన పూజలకు రూ.3,890, వసతి గదులు, పొంగిలి షెడ్లు, కాటేజీల అద్దెలు రూ.43,756, విరాళాలు రూ.77,609 వెరసి మొత్తం రూ.3,65,420లు ఆదాయం సమకూరినట్టు ఈఓ వివరించారు. మోరి చేనేత వస్త్రాలకు రాష్ట్రపతి ప్రశంస సఖినేటిపల్లి: జిల్లాలోని మోరి చేనేత సొసైటీ వస్త్రాలను ఆదివారం న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. నేషనల్ డిజైన్ సెంటర్(సెట్ అప్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్) ఆధ్వర్యంలో సౌత్ ఇండియా అమృత్ మహోత్సవ్లో ఏపీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మోరి చేనేత స్టాల్ను న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోరి చేనేత సొసైటీ స్టాల్లోని చేనేత వస్త్రాలను రాష్ట్రపతి పరిశీలించారు. ఆమె వెంట ఏపీ గవర్నర్ ఉన్నారు. చేనేత చీరల తయారీలో కార్మికుల నైపుణ్యాన్ని రాష్ట్రపతి ప్రసంశించినట్టు స్టాల్ సేల్స్మన్, మోరికి చెందిన నల్లా ప్రసాద్ తెలిపారు. -
వినిపించని ఆకలి కేకలు
కాకినాడ క్రైం: మహిళా దినోత్సవం ముగిసింది, జిల్లాలో ఈ సంబరాలు అంబరాన్ని తాకాయి. వారోత్సవాలతో వారం రోజులూ పండగ వాతావరణం నెలకొంది. ర్యాలీలు, మారథాన్లు, ఆటలు, పాటలు, ఉపన్యాసాలు, మానవహారాలు ఒకటా, రెండా.. విమెన్స్ డే వేడుకలతో జిల్లా దద్దరిల్లింది. ఇది నాణానికి ఓ వైపు మాత్రమే. మరోవైపు సదరు శాఖలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగులు ఎవరికీ జీతాలు లేవు. ఊకదంపుడు ఉపన్యాసాల్లో మాటలన్నీ ముఖస్తుతికేనన్న విషయం తేలిపోయింది. గతేడాది ఆగస్టు నుంచి గొడ్డు చాకిరీ చేస్తున్నా జీతాలకు మాత్రం వారు నోచుకోలేదు. కష్టపడి పని చేసినా వారికి జీతం ఇవ్వడం లేదు. ఈ దుస్థితి ఇంకేదో డిపార్టుమెంట్లో కాదు. మహిళా భద్రత, భవిత, భరోసా కోసం నిర్దేశించిన సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులదే. పేరుకు తగ్గట్టుగానే జిల్లాలో ఈ శాఖలో మహిళా ఉద్యోగులే ఎక్కువ. ఈ డిపార్టుమెంట్లో ఉన్న మూడు కీలక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న సుమారు 800 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు నెలల తరబడి జీతాల్లేకపోవడంతో, అప్పులపాలై వారి కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి నెలకొంది. శనివారం మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. కానీ సిబ్బంది ఆకలి కేకలు వారిలో ఏ ఒక్కరికీ వినిపించ లేదు. విమెన్ అండ్ చైల్డ్ డెవలెప్మెంట్ డిపార్టుమెంట్లో ఉన్న రెగ్యులర్ ఉద్యోగులకు జీతాలు అందుతుండగా, వారంతా అధికార హోదాలో కొనసాగుతున్నారు. క్షేత్ర స్థాయిలో వారు నిర్దేశించే ప్రతి పని పూర్తి చేయాల్సిన కష్టం.. చిరుద్యోగులైన కాంట్రాక్టు సిబ్బందిదే. ఈ డిపార్టుమెంట్ పరిధిలో సేవలందిస్తున్న ఐసీడీఎస్కు చెందిన అంగన్వాడీలకు ఈ నెలలో నేటికీ జీతాలే పడలేదు. వీరంతా మహిళలే, కనీసం 600 మంది ఉంటారు. అంగన్వాడీ కేంద్రాల అద్దెలను కూడా వీరు తమ జీతాల నుంచే చెల్లిస్తారు. ఈ అద్దెలు విడుదల చేసి ఆరు నెలలకు పైగా అయింది. సీమంతాల కోసం ప్రతి అంగన్వాడీ కార్యకర్త చేతిలో సొంత డబ్బు వెచ్చిస్తారు. నెలవారీ రూ.500 చొప్పున ఖర్చు చేస్తారు. ఇవి తిరిగి చెల్లించి ఏడాది కావస్తోంది. తప్పని నరకయాతన మహిళా దినోత్సవాల పేరుతో అంగన్వాడీలు ప్రత్యక్ష నరకం చూశారు. అధికారులు వీరితో ఓ ఆటాడుకున్నారు. జీతాలు నేటికీ రాకపోయినా చాకిరీ చేయించారు. ఠంచనుగా జీతాలు తీసుకుంటున్న రెగ్యులర్ హోదాలో కొనసాగుతున్న ఉద్యోగులకు విధి నిర్వహణలో ఇంతటి కష్టం లేదు. అఽధికార హోదాలో వారు తీవ్రమైన పని ఒత్తిడిని అంగన్వాడీలపై పెడుతున్నారు. వారోత్సవాలంటూ రేయింబవళ్లు తేడా లేకుండా పోయింది. ర్యాలీలు, మారథాన్లకు ఉదయాన్నే వచ్చి వాలిపోవాలన్నారు. రానివారికి మెమోలు ఇస్తామని బెదిరించారు. వచ్చి పడిగాపులు కాస్తే అఽధికారులు ఎప్పటికో తీరికగా కార్లు దిగేవారు. పోషకాహార గొప్పతనాన్ని చెబుతూ, ప్రతి అంగన్వాడీ సిబ్బంది రెండు, మూడు రకాల చిరుధాన్యాల వంటలు వండి తేవాలన్నారు. ఆకలి పస్తులున్నా, ఆటల్లో పాల్గొనక తప్పదని ఒత్తిడి తెచ్చారు. వీటన్నింటినీ మించి ఇల్లూ వాకిలి వదిలి, పిల్లలు, భర్తను విడిచి ఉదయాన్నే వాలిపోవాలంటూ హుకుం జారీ చేశారు. ఉన్నతాధికార్లకు నివేదించాం సిబ్బందికి జీతాలు చెల్లించలేదనేది వాస్తవమే. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాం. ఫైల్ కూడా పంపించాం. త్వరలో పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాం. – కె.విజయకుమారి, పీడీ, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ, కాకినాడ మహిళా దినోత్సవం నాటికీ అందని వేతనాలు ఉసూరుమంటున్న మహిళా సిబ్బంది సీ్త్ర, శిశు సంక్షేమ శాఖలో దయనీయ స్థితి వారోత్సవాల పేరుతో అంగన్వాడీలకు ప్రత్యక్ష నరకం మూడు నెలలు దాటినా.. అలాగే ఐసీపీఎస్, శిశు గృహ పరిఽధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు చేతికంది మూడు నెలలు దాటింది. ఇదే పరిధిలో ఉన్న దిశ వన్స్టాప్ సెంటర్ ఉద్యోగులకు గతేడాది ఆగస్టు తర్వాత జీతాలే లేవు. వీరంతా ఆకలి పస్తులుంటూ, అప్పులు చేసుకుంటూ, వారి జీవితాలను నెట్టుకొస్తున్నారు. కష్టాన్నంతా పంటికింద బిగువపట్టి ఉద్యోగాలు చేస్తున్నారు. కనీసం తమ ద్విచక్ర వాహనాల్లో పెట్రోల్కై నా చేతిలో చిల్లిగవ్వ ఉండడం లేదంటూ తమ ఆవేదనను వెళ్లబోసుకుంటున్నారు. జీతాలు ఇవ్వకున్నా ఫీల్డ్ వర్క్ తప్పడం లేదని చెబుతున్నారు. -
మెట్టకు సాగునీటి కష్టం
ఇవీ లెక్కలు.. ● జిల్లాలో పంట భూములు– 1,77,030 ఎకరాలు ● గోదావరి డెల్టా – (10 మండలాలు) 1,24,798 ఎకరాలు ● ఏలేరు కాలువ భూములు – (6 మండలాలు) 44,250 ఎకరాలు ● ఏలేరు నిల్వ సామర్థ్యం – 86.56 మీటర్లు ● నీటి నిల్వ సామర్థ్యం– 24.11 టీఎంసీలు ● డెడ్స్టోరేజ్ – 6.16 టీఎంసీలు ● కాలువల ద్వారా సరఫరా – 17.95 టీఎంసీలు ● ప్రస్తుతం రిజర్వాయర్లో నిల్వ – 12.98 టీఎంసీలు ● ఇన్ఫ్లో రోజుకు సగటున – 266 క్యూసెక్కులు ● ఎడమ కాలువకు – 200 క్యూసెక్కులు ● డీసీఆర్కు – 500 క్యూసెక్కులు ● స్పిల్వే విడుదల – 900 క్యూసెక్కులు ● రైతు గోడు పట్టని పవన్ ● సొంత నియోజకవర్గంలో నీటి ఎద్దడి ● సందిగ్ధంలో శివారు ఆయకట్టు ● సాగునీరు అందక మెట్ట రైతు పాట్లు ● పీబీసీ శివారున ఇదే దుస్థితి ● నిండుకున్న ఏలేరు జలాలు సాక్షి ప్రతినిధి, కాకినాడ: సాగునీటి ఎద్దడితో జిల్లాలో మెట్ట ప్రాంత రైతులు గొల్లుమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రబీ సాగునీటి సరఫరాపై ముందుచూపు లేకపోవడం ఈ ప్రాంత రైతులకు శాపంగా పరిణమించింది. ఏలేరులో నీటి కొరతను అధిగమించడంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని రైతు సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా అంతా ఒక ఎత్తు పిఠాపురం నియోజకవర్గం పరిస్థితి మరో ఎత్తు అన్నట్టుగా ఉంది. స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలోనే రైతులు సాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో సాగునీటి ఎద్దడితో రైతుల గోడు కనీసం పట్టించుకోకుండా జనసేన పార్టీ 12వ వార్షికోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా చేసుకోవడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏలేరు, పిఠాపురం బ్రాంచ్ కెనాల్స్పై ఆధారపడ్డ ఆయకట్టు శివారున ఉన్న పలు ప్రాంతాల్లో రబీ సాగు సందిగ్ధంలో పడింది. జనసేనలో నంబర్–2గా ఉన్న నాదెండ్ల మనోహర్ వారం తిరగకుండానే ఒక పర్యాయం పిఠాపురం, రెండు పర్యాయాలు కాకినాడలో పర్యటించినా నియోజకవర్గ రైతుల రబీ కష్టాల వైపు కన్నెత్తి చూడకపోవడాన్ని రైతు సంఘాల ప్రతినిధులు ఆక్షేపిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు ఇచ్చే ప్రాధాన్యం శివారు ఆయకట్టులో ఇబ్బందులకు ఇవ్వరా అని రైతులు నిలదీస్తున్నారు. రబీ సన్నాహానికి ముందు మాత్రం అధికార యంత్రాంగం పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో 32,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేస్తామని ప్రకటించింది. ఇందులో 22,260 ఎకరాల్లో వరి, 10,240 ఎకరాల్లో అపరాల సాగుకు ఢోకా లేదనడంతో రైతులు గంపెడాశలతో రబీ సాగుకు సమాయత్తమయ్యారు. ఇంతలో ఏలేరులో ఎదురైన నీటి కొరత రైతులకు గుదిబండగా మారింది. శివారు రైతుల గగ్గోలు రబీ సీజన్లో రైతులు సాగుకు సమాయత్తమయ్యే సమయానికి ఏలేరులో 20 టీఎంసీలు ఉంది. ప్రస్తుతం 12.98 టీఎంసీలు మాత్రమే కనిపిస్తోంది. వీటిలో 4.50 టీఎంసీలు విశాఖ స్టీల్ ప్లాంట్కు పోగా మిగిలిన 6.16 టీఎంసీలు డెడ్ స్టోరేజ్గా పరిగణిస్తున్నారు. మరో 1.31 టీఎంసీలు ఏలేరు ప్రాంత ఆయకట్టు భూములు 53 వేల ఎకరాలకు అందించాల్సి ఉంది. 28 వేల ఎకరాల్లో వరి, 25 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలకు సాగు నీరు అందించాలి. ఏలేరు పరిధిలో రబీకి సాగునీటి ఎద్దడి కారణంగా పిఠాపురం నియోజకవర్గంలో శివారు ఆయకట్టు ప్రాంతాల్లో రైతులు గగ్గోలు పెడుతున్నారు. పంట చేతికందే దశలో సా గునీటికి కటకటలాడిపోతున్నామని ఆందోళన చెందుతున్నారు. అసలే ఎండల తీవ్రతతో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతోన్న తరుణంలో సాగునీరు లేక పంట భూములు నెర్రలు బారడంతో ఏలేరు రైతు కంటకన్నీరు పెడుతున్నారు. ఏలేరు రిజర్వాయర్లో నిలువలు అడుగంటడంతో శివారు ఆయకట్టు రైతుల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కను తలపిస్తోంది. రిజర్వాయర్లో ఉన్న అరకొర నీటిని కాలువల ద్వారా సరఫరా చేసినా ఏలేరుకు ఎగువనున్న ప్రత్తిపాడు, పెద్దాపురం తదితర మండలాల ఆయకట్టుకే సరిపోతోందని చెబుతున్నారు. దిగువన ఉన్న తమ పొలాలకు చుక్కనీరు రావడం లేదని స్థానిక రైతులు మదనపడుతున్నారు. సర్కారు తీరుపై రైతుల ఆగ్రహం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో రబీ సీజన్లో డెడ్ స్టోరేజీ 6.16 టీఎంసీలు ఉంది. అయినప్పటికీ పంపింగ్ చేసి సాగుకు సరిపడా రెండు టీఎంసీలు సరఫరా చేసి రైతుల కడగండ్లకు పుల్స్టాప్ పెట్టారు. ఫలితంగా నాడు రబీ పంటకు ఎటువంటి సాగునీటి ఎద్దడి ఎదురు కాకుండా రైతులు పంట పండించారు. ఇప్పుడు ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైతులపై మానవత్వం చూపని ప్రభుత్వం ఏలేరు శివారు ఆయకట్టు రైతుల గోడు పట్టించుకోలేదు. ప్రస్తుతం ఏలేరు డెడ్ స్టోరేజ్ 6.16 టీఎంసీలలో 2 టీఎంసీలు పంపింగ్ చేయాలన్న రైతుల డిమాండ్ను పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. పైకి మాత్రం రైతులంటే వల్లమాలిన అభిమానం ఉన్నట్టుగా చంద్రబాబు సర్కార్ ప్రచారం చేసుకుంటోందని రైతు సంఘాల ప్రతినిధులు ఆక్షేపిస్తున్నారు. ఏలేరు ఆయకట్టు పరిధి రైతుల్లో 70 శాతం మంది కౌలు రైతులే. కౌలుకు తీసుకుని రూ.లక్షలు పెట్టుబడులు పెట్టారు. రబీలో ఎకరాకు రూ.20 వేల వరకు కౌలు చెల్లించి మరో రూ.25 వేలు పెట్టుబడులు పెట్టిన కౌలు రైతులు గగ్గోలు పెడుతున్నారు. రైతులపై కపట ప్రేమ చూపించే కూటమి నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. నెర్రలు తీసిన పొలాలు పిఠాపురం మండలం రాపర్తి, రాయవరం, భోగాపురం, కొత్తపల్లి మండలం ఎండపల్లి, గోల్లప్రోలు మండలంలో శివారు ఆయకట్టుకు సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. బోగాపురం, రాయవరం, రాపర్తి గ్రామాల్లోని ఆయకట్టుకు సాగునీరందడం లేదు. వారం పది రోజులుగా ఇదే దుస్థితి కొనసాగుతోంది. రైతుల మొర ఆలకించే ఓపిక ఈ ప్రాంత ప్రజాప్రతినిధులకు లేకుండా పోయింది. వంతుల వారీగా విడుదల చేసిన నీరు ఎంత మాత్రం సరిపోవడం లేదని రైతులు అంటున్నారు. పంట ఇప్పుడిప్పుడే గింజ గట్టిపడే దశలో ఉంది. సాగు నీటి అవసరం ఇప్పుడే ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా ఇదే సమయంలో సాగునీరు అందక పంట పొలాలు నెర్రలు తీసి రైతులు కన్నీరు పెడుతున్నారు. తొండంగి మండలంలోని శివారు ప్రాంత ఆయకట్టు రైతులు సాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పై ఆధారపడ్డ తొండంగి మండలంలోని దిగువ ప్రాంత ఆయకట్టుకు అరకొరగా నీరు అందుతోంది. గొల్లప్రోలు మండలం మల్లవరం చెరువు(ఆర్ఆర్బీ ట్యాంక్) నుంచి పిఠాపురం బ్రాంచి కెనాల్ ద్వారా తొండంగి మండలం రావికంపాడు, ఏవి నగరం, కొమ్మనాపల్లి మీదుగా కోదాడ ఉప్పుచెరువుకు సాగునీరు సరఫరా అవుతుంది. ఈ చెరువు ఆయకట్టు కింద శృంగవృక్షంపేట, శృంగవృక్షం, పాత కోదాడ, కొత్తకోదాడ గ్రామాల్లో రబీ సాగవుతోంది. ఈ గ్రామాల్లోని శివారు ఆయకట్టుకు సాగునీటి ఎద్దడి ఏర్పడటంతో ఇటీవల రైతులు ఆందోళనకు దిగారు. విషయం తెలిసి జిల్లా వ్యవసాయాధికారి వచ్చి సమస్య పరిష్కారిస్తామని చెప్పి వెళ్లారు. రెండు, మూడు రోజులు నీటి ఎద్దడి తీరిందనుకుంటుండగా ఇప్పుడు మళ్లీ ఇబ్బంది ఎదురవుతోందని రైతులు చెబుతున్నారు. చిరు పొట్ట దశలో ఉన్న తరుణంలో సాగునీటి ఎద్దడితో నష్టపోతామని రైతులు ఆవేదన చెందుతున్నారు. గోడు వినే నాధుడేడి సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా నీరు ఇవ్వడం లేదు. పంటలు ఎండిపోతుంటే ఏమి చేయాలో తెలియక గుడ్లు అప్పగించి చూస్తున్నాం. సుమారు 40 వేల పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేశా. ఇప్పుడు పంట ఎండిపోతే పెట్టుబడి కూడా రాదు. అన్ని అప్పు చేసి పెట్టినవే పంటలకు నీరు ఇచ్చి ఆదుకోక పోతే ఇక చావే శరణ్యం. – పోతుల తాతారావు, కౌలు రైతు, భోగాపురం, పిఠాపురం మండలం వంతులవారీతో కొంత ఆలస్యం ఏలేరు శివారు ప్రాంతాలకు వంతుల వారీ విధానం వల్ల కొంత ఆలస్యం అవుతుంది. వంతు వచ్చే సరికి భూమి నెర్రలు తీస్తోంది. తేమ ఉండడం వల్ల పంటలు ఎండిపోవు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వేసవికాలం ముందుగా రావడంతో నీటి ఎద్దడి ఏర్పడింది. ఏలేరు రిజర్వాయర్లో తగినంత నీరు ఉంది. కాలువలు బాగోక సరఫరా ఇబ్బంది అవుతోంది. ఉపాధి హామీ పథకంలో కాలువలు శుభ్రం చేయించి నీరు వదులుతున్నాం. – శేషగిరిరావు, ఈఈ, నీటిపారుదల శాఖ, ఏలేరు08కేకేడీ 04:మరమ్మతులతో రబీకి నష్టం ఈ సీజన్లో రైతులకు పంపా ఆయకట్టు పరిధిలో రబీ సాగే లేకుండా పోయింది. పంపా ఆయకట్టు రైతులకు గడచిన నాలుగు సంవత్సరాలు స్వర్ణ యుగమనే చెప్పాలి. ప్రతి ఏటా రబీకి ఇబ్బంది లేకుండా అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేసింది. స్థానిక ప్రజాప్రతినిధులు పట్టుబట్టి రబీలో సాగునీటికి ఇబ్బంది లేకుండా చూశారు. అటువంటిది చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో పంపా ఆయకట్టు రైతులకు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. పంపా ప్రాజెక్ట్ కింద 12,500 ఎకరాలు సాగవుతోంది. బ్యారేజీ ఆధునీకరణ పేరుతో రబీ నీరు విడుదలకు బ్రేక్లు వేశారు. నాలుగేళ్లుగా రబీలో సాగుచేస్తోన్న రైతులు ఈ రబీలో సాగునీరు లేక పంట గాలికొదిలేశారు. గేట్లు మరమ్మతులకని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో 3.36 కోట్లు ప్రకటించారు. ఈ నిధులతో గేట్లు మరమ్మతులు నెలాఖరులోపు పూర్తి చేయాలి. లేకపోతే ఆ నిధులు మురిగిపోయే ప్రమాదం ఉంది. ఈ మరమ్మతుల పేరుతో రబీ కోల్పోవాల్సి వచ్చిందని ఆయకట్టు రైతులు లబోదిబోమంటున్నారు. -
యువతకు అండగా పోరుబాట
కాకినాడ రూరల్: నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం, వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడం తదితర కూటమి ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ యువతకు అండగా వైఎస్సార్ సీపీ పోరుబాట పట్టనుంది. ‘యువత పోరు’ పేరిట ఈ ఆందోళనకు సంబంధించిన కార్యాచరణపై పార్టీ నేతలు శనివారం కాకినాడలోని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు నివాసంలో శనివారం సమావేశమయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అధ్యక్షతన జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కో ఆర్టినేటర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ కాకినాడ సిటీ కార్యాలయంలో ఈ 12వ తేదీ ఉదయం వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించిన అనంతరం, యువత పోరు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పార్టీ కాకినాడ సిటీ కార్యాలయం నుంచి కలెక్టరేట్కు ర్యాలీగా చేరుకోవాలని నిర్ణయించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణం చెల్లించి, విద్యార్థుల్లో ఆందోళన తగ్గించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నారు. సమావేశం అనంతరం ఈ వివరాలను కన్నబాబు, దాడిశెట్టి రాజా మీడియాకు వెల్లడించారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 12న యువత పోరు పేరిట పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించనున్నామని చెప్పారు. ఏరుదాటాక తెప్ప తగలేస్తున్న చందంగా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరును ఎండగట్టనున్నామన్నారు. నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరింత మెరుగుపరచి అమలు చేశారని, నేడు ఆ పథకాన్ని కూటమి ప్రభుత్వం ఆపేసిందని చెప్పారు. ఇప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు హాల్ టికెట్ ఇస్తాయో, ఇవ్వవో, పరీక్షలకు కూర్చోనిస్తారో లేదో తెలియని పరిస్థితి సృష్టించారని దుయ్యబట్టారు. విద్యార్థులపై కళాశాలలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయని, ఈ విషయాలు టీడీపీ అనుకూల మీడియాలో ఎక్కడా రావని దుయ్యబట్టారు. ఒత్తిడి ఉంటే విద్యార్థులు ఏవిధంగా పరీక్షలు రాయగలుగుతారని వారు ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలిస్తామని, లేకుంటే రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన కూటమి నేతలు ఇప్పటి వరకూ ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని నిలదీశారు. మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ వంటి వాటికీ అతీగతీ లేదన్నారు. గత సీఎం జగన్ రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలు తీసుకురావడం చరిత్రాత్మకమన్నారు. వీటన్నింటినీ ప్రైవేటు పరం చేస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వం నిస్సిగ్గుగా చెబుతోందని దుయ్యబట్టారు. వైద్య కళాశాలలకు అనుబంధంగా పెద్ద ఎత్తున ఆస్పత్రులు వస్తాయని, తద్వారా ప్రజలకు మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయని చెప్పారు. ఈ నేపథ్యంలో వైద్య కళాశాలను ప్రైవేటుపరం చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. జగన్మోహన్రెడ్డి చెప్పింది చేస్తారనేది ప్రజల నమ్మకమని, చంద్రబాబు చెప్పింది చేయరనే విషయాన్ని ఆయన పాలన చెబుతోందని కన్నబాబు, రాజా విమర్శించారు. సమావేశంలో కాకినాడ సిటీ, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, వంగా గీత, దవులూరి దొరబాబు, తోట నరసింహం, ముద్రగడ గిరి బాబు, జెడ్పీ వైస్ చైర్మన్ గుబ్బల తులసీరామ్, పార్టీ వివిధ విభాగాల ప్రతినిధులు, నాయకులు కురసాల సత్యనారాయణ, రావూరి వెంకటేశ్వరరావు, కొప్పన శివ, సుంకర విద్యాసాగర్, కాకినాడ రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు నురుకుర్తి రామకృష్ణ, సర్పంచ్ రామదేవు చిన్నా, పెదపాటి అమ్మాజీ, మురళీరాజు, వాసిరెడ్డి జమీలు తదితరులు పాల్గొన్నారు. ఫ 12న కాకినాడలో వైఎస్సార్ సీపీ ఆందోళన ఫ కన్నబాబు నివాసంలో కో– ఆర్డినేటర్ల సమావేశం ఫ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అధ్యక్షతన కార్యాచరణ -
మహిళలతోనే సమాజాభివృద్ధి
కాకినాడ రూరల్: మహిళలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని వైఎస్సార్ సీపీ మహిళా నేత, పిఠాపురం నియోజవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎంపీ వంగా గీత అన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే మహిళలకు సంపూర్ణ గౌరవం దక్కిందని గుర్తు చేశారు. కాకినాడ వైద్య నగర్లోని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు నివాసం వద్ద పార్టీ మహిళా నేత వంగా గీత, మహిళా విభాగం అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత ఆధ్వర్యాన అంతర్జాతీయ మహిళా దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. గీత కేక్ కట్ చేసి పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, కన్నబాబు, కాకినాడ సిటీ, జగ్గంపేట, ప్రత్తిపాడు, పెద్దాపురం కో ఆర్టినేటర్లు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, తోట నరసింహం, ముద్రగడ గిరిబాబు, దవులూరి దొరబాబులతో పాటు మహిళా నేతలకు తినిపించారు. జై జగన్ అంటూ మహిళలు పెద్ద ఎత్తున నినదించారు. వారికి కన్నబాబు, దాడిశెట్టి రాజా తదితరులు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ, అన్ని రంగాల్లోనూ మహిళలు ముందుండాలని, వారు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం బాగుంటుందని నమ్మి, వారి అభివృద్ధిని చేతల్లో చూపిన నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అని అన్నారు. పిల్లల చదువు కోసం అమ్మ ఎక్కడా చేయి చాచకూడదనే సమున్నత లక్ష్యంతో అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టారన్నారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చారని, మహిళల రక్షణకు దిశా చట్టం తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించారని చెప్పారు. మహిళలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారన్నారు. ప్రజల కోసం పోరాటం చేసే జగన్ కోసం ముందుకు నడుస్తామని అన్నారు. వర్ధినీడి సుజాత మాట్లాడుతూ, ఇప్పటి ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మహిళల పేరిట జగన్ సంక్షేమ పథకాలు ఇచ్చారని చెప్పారు. పార్టీ బలోపేతానికి మహిళలు కృషి చేయాలని కోరారు. కన్నబాబు మాట్లాడుతూ, జగన్మోహన్రెడ్డి మహిళా పక్షపాతిగా మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించారని అన్నారు. మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ప్రతి నెలా రూ.1,500, ఉచిత బస్సు అంటూ చంద్రబాబు అబద్ధాలు చెప్పారన్నారు. మాట ఇస్తే నిలబెట్టుకునే జగన్మోహన్రెడ్డి వెనుక ఉండటం మనందరి అదృష్టమని అన్నారు. కార్యక్రమంలో పార్టీ మహిళా నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు పెదపాటి అమ్మాజీ, జమ్మలమడక నాగమణి, సుంకర శివప్రసన్న, రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, లక్ష్మీశివకుమారి, కవికొండల సరోజ, జెడ్పీ వైస్చైర్పర్సన్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఫ జగన్ ప్రభుత్వంలోనే వారికి సంపూర్ణ గౌరవం ఫ వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎంపీ వంగా గీత ఫ కాకినాడలో ఘనంగా మహిళా దినోత్సవం -
రత్నగిరి.. భక్తజనసిరి
అన్నవరం: సత్యదేవుడిని శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించి, పూజలు చేశారు. రత్నగిరితో పాటు వివిధ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు తమ బంధుమిత్రులతో కలసి సత్యదేవుని ఆలయానికి తరలివచ్చారు. వీరందరూ స్వామివారి వ్రతాలాచరించి, దర్శనాలు చేసుకున్నారు. దీంతో ఆలయం వద్ద రద్దీ ఏర్పడింది. ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. స్వామివారిని 40 వేల మంది దర్శించుకున్నారు. వ్రతాలు 1,800 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సత్యదేవుని అన్న ప్రసాదాన్ని సుమారు 4 వేల మంది స్వీకరించారు. ఆలయంలో సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. సెలవు కావడంతో ఆదివారం కూడా రత్నగిరిపై భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆదివారం ఉదయం 10 గంటలకు సత్యదేవుడు, అమ్మవారిని టేకు రథంపై ఊరేగించనున్నారు. -
మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి ˘
కాకినాడ సిటీ: ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళ వ్యాపారవేత్తగా, పారిశ్రామికవేత్తగా ఎదగాలని జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, డీఆర్డీఏ, మెప్మా శాఖల సంయుక్త ఆధ్వర్యాన రాజా ట్యాంక్ ప్రాంగణంలో శనివారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని తమ ప్రభుత్వం త్వరలోనే కల్పిస్తుందని, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే మే నెలలో చదువుకునే పిల్లలందరికీ రూ.15 వేల చొప్పున వారి తల్లుల ఖాతాలో జమ చేస్తుందని చెప్పారు. డీఆర్డీఏ ద్వారా ఈ ఏడాది బ్యాంకు లింకేజీ కార్యక్రమం కింద 588 మహిళా స్వయం సహాయ బృందాలకు రూ.100 కోట్లు అందించామన్నారు. దీనికి సంబంధించిన మెగా చెక్ను అందజేశారు. ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ మిషన్ ద్వారా 78 వేల మంది మహిళలకు రూ.39 లక్షల మేర లబ్ధి చేకూర్చామన్నారు. కార్యక్రమంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎస్పీ జి.బిందుమాధవ్, నగరపాలక సంస్థ కమిషనర్ భావన తదితరులు పాల్గొన్నారు. స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి కాకినాడ రూరల్: మహిళలు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం ఆధ్వర్యాన కాకినాడ ఒకటో డివిజన్ వినాయక కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, టైలరింగ్పై మహిళలకు మూడు నెలల శిక్షణ అనంతరం ఉచితంగా కుట్టు మెషీన్లు అందిస్తామన్నారు. ఈ పథకం కింద జిల్లాలో 3,789 మందికి రూ.9.47 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బాల బాలాజీకి రూ.3.36 లక్షల ఆదాయం మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వామి ఆలయానికి శనివారం భారీగా భక్తులు తరలి వచ్చారు. తెల్లవారు జామున సుప్రభాత సేవ, తొలి హారతితో దర్శనాలు ప్రారంభమయ్యాయి. వివిధ సేవల ద్వారా రూ.3,36,594 ఆదాయం వచ్చింది. స్వామి వారిని ఐదు వేల మంది భక్తులు దర్శించుకున్నారు. మూడు వేల మంది అన్న ప్రసాదం స్వీకరించారు. -
ప్లేట్లెట్లు తగ్గిపోయిన గర్భిణికి ప్రసవం
అమలాపురం టౌన్: మనిషి శరీరంలో రక్త కణాలు (ప్లేట్లెట్లు) లక్షల్లోంచి వేలల్లోకి పడిపోతే మనం కంగారు పడతాం. అలాంటిది ఓ గర్భిణికి ప్లేట్లెట్లు 15 వేలకు పడపోవడమే కాకుండా మధుమేహం కూడా తోడవడంతో ఆమె ప్రసవం కష్టమైంది. ఈ తరుణంలో వైద్యులు రిస్క్తో శస్త్ర చికిత్స చేశారు. ఇప్పుడు తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. అల్లవరం మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి నెలల నిండడంతో ప్రసవం కోసం అమలాపురంలోని సాయి రవీంద్ర హాస్పిటల్లో చేరింది. చేరే సమయానికే ఆమె ఇమ్యూన్ థ్రోంబోసైటోపెనియా (ఐటీపీ) ప్లేట్లెట్లు 15 వేలకు పడిపోయి మధుమేహంతో బాధపడుతోంది. హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ గంధం భవానీ ..ఆమె ప్రసవం ప్రమాదకరంగా ఉన్నప్పటికీ ఫిజిషియన్ డాక్టర్ శ్రీహరి, మత్తు వైద్యుడు సందీప్, పిల్లల డాక్టర్ యోగానంద్, ఆర్థోపెడిక్ రవీంద్రలతో కూడిన వైద్య బృందం శస్త్ర చికత్స చేసి ప్రసవం చేశారు. ఇప్పుడు తల్లీ బిడ్డ ఆరోగ్యంగా కోలుకుంటున్నారని డాక్టర్ భవాని తెలిపారు. -
పొలాలను వదిలి.. రోడ్డుపై బైఠాయించి..
● సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు ● జాతీయ రహదారి 216పై రాస్తారోకో ● అధికారుల హామీతో ఆందోళన విరమణ తాళ్లరేవు: సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కారు. జాతీయ రహదారి 216పై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పి.మల్లవరం పంచాయతీ పరిధిలోని శివారు భూములకు కొన్ని రోజులుగా సాగునీరు అందక వరి చేలు ఎండిపోతుండడంతో శనివారం రైతులు పోలేకుర్రు ఇరిగేషన్ కార్యాలయం వద్దకు వచ్చారు. అయితే కార్యాలయంలో ఒక్క అధికారి కూడా అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. చెంతనే ఉన్న జాతీయ రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. దీంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఆందోళకారులతో చర్చలు విషయం తెలుసుకున్న కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. రైతులు తమ సమస్యలను ఎస్సైతో పాటు రెవెన్యూ అధికారులకూ మొరపెట్టుకున్నారు. పి.మల్లవరం పంచాయతీ శివారు మూలపొలం, గ్రాంటు, రాంజీనగర్ గ్రామాలకు 20 రోజులుగా సాగునీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వరిచేలు పొట్టదశలో ఉన్నాయని, ఈ సమయంలో సరిపడా నీరు లేకపోతే తీవ్రంగా నష్టపోతామన్నారు. వంతుల వారీ విధానం పెట్టినప్పటి నుంచి సాగునీరు సరఫరా కావడం లేదన్నారు. ఎగువ రైతులకు మేలు జరుగుతుందని, తమ వంతు వచ్చేసరికి కాలువ చివరికే నీరు రావడం లేదన్నారు. తూతూమంత్రంగా.. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు ఈ సమస్యను విన్నవించినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని రైతులు వాపోయారు. అధికారులు తూతూ మంత్రంగా వచ్చి వెళుతున్నారని, అయితే సాగునీరు మాత్రం వరిచేలోకి రావడం లేదన్నారు. సాగు ప్రారంభంలో అధికారులను సంప్రదిస్తే ప్రతి ఎకరాకు నీరిస్తామని చెప్పారని అయితే ప్రస్తుతం నీరు అందక సుమారు 600 ఎకరాలు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. కాగా.. ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి పూర్తిస్థాయిలో నీటిని సరఫరా చేస్తామని అధికారులు చెప్పడంతో ఆందోళన విరమించారు. తక్షణమే సరఫరా చేయాలి సాగునీరు లేక ఎండిపోతున్న శివారు ప్రాంత భూములకు తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా మండలంలో పర్యటిస్తున్న ఆయన రైతుల ఆందోళన విషయం తెలుసుకుని అక్కడకు వచ్చారు. రైతుల సమస్యలు తెలుసుకుని ధవళేశ్వరం సర్కిల్ ఇరిగేషన్ ఈఈ రామకృష్ణతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ పంటలు కళ్లెదుటే ఎండిపోతుంటే చూడలేక రైతులు రోడ్డు మీదకు వచ్చారననారు. ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే సాగునీటి సమస్య వచ్చిందన్నారు. దీన్ని అత్యవసర పరిస్థితిగా భావించి అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన కదిలి, ప్రత్యేక అధికారిని వేయడంతో పాటు, ఎత్తిపోతల ద్వారానైనా ప్రతి ఎకరాకు సాగునీరందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం ప్రతినిధులు మోర్త రాజశేఖర్, వల్లు రాజబాబు, టి.ఈశ్వరరావు, రైతులు మేడిశెట్టి శ్రీనివాసరావు, పితాని సత్తిబాబు, కె.వెంకన్నబాబు రాజు, కాదా సాయిబాబు, కావూరి వెంకన్న, పేరాబత్తుల సాయి తదితరులు పాల్గొన్నారు. -
ప్రాజెక్ట్.. పర్ఫెక్ట్
● ఇన్స్పైర్ మనక్లో సత్తా చాటిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు ● ఉత్తమ ప్రాజెక్టులుగా 305 ఎంపిక ● ఎంపికై న ప్రాజెక్టుకు రూ.10 వేల కేటాయింపు ● మెరుగులు దిద్దుకునేందుకు అవకాశం రాయవరం: వినూత్న ఆలోచనలతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విద్యార్థులు సైన్స్ ప్రయోగాల్లో దూసుకుపోతున్నారు. సరికొత్త ఆలోచనలతో తమ మెదళ్లకు పదును పెడుతూ నూతన ఆవిష్కరణలకు జీవం పోస్తున్నారు. విద్యార్థుల్లో సైన్స్పై అభిరుచి, ఆసక్తి కలిగేలా ఉపాధ్యాయులు బోధన చేస్తుంటే, దానికి అనుగుణంగా విద్యార్థులు కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏటా ఇన్స్పైర్ మనక్ పురస్కారాలతో విద్యార్థులను ప్రోత్సహిస్తోంది. 2024–25 విద్యా సంవత్సరంలో మనక్ నామినేషన్లకు అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 3,200 నామినేషన్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. వాటిలో ఉత్తమ ప్రాజెక్టులుగా 305 నామినేషన్లు ఎంపికయ్యాయి. వీటిలో కోనసీమ జిల్లా నుంచి 85, తూర్పుగోదావరి జిల్లా నుంచి 100, కాకినాడ జిల్లా నుంచి 120 నుంచి ఉన్నాయి. ప్రాజెక్టులకు ప్రోత్సాహకం : డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్నోవేషన్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఇన్స్పైర్ మనక్ 2024–25 పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి 305 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. గతేడాది 397 ప్రాజెక్టులు జిల్లా స్థాయిలో ఎంపిక కాగా, ఉమ్మడి జిల్లా నుంచి 27 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం గమనార్హం. జాతీయ స్థాయికి మూడు జిల్లాల నుంచి మూడు ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఇదిలా ఉంటే జిల్లా స్థాయికి ఎంపికై న 305 ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10 వేల వంతున ప్రతి ప్రాజెక్టుకు ప్రోత్సాహకం అందజేయనున్నారు. సైన్స్ సాంకేతిక రంగాలపై విద్యార్థులకు ఆసక్తి పెంచేలా కేంద్ర ప్రభుత్వం ఈ పోటీలను నిర్వహిస్తోంది. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులను వీటిలో భాగస్వాములను చేశారు. ప్రాథమికోన్నత పాఠశాల నుంచి మూడు, ఉన్నత పాఠశాల నుంచి ఐదు వంతున నామినేషన్లను పంపించారు. పర్యావరణ పరిరక్షణ, అధునాతన వ్యవసాయ విధానాలు, హెల్త్ న్యూట్రిషన్ వంటి అంశాలపై నూతన ఆవిష్కరణలు రూపొందించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి జాతీయ స్థాయికి ఎంపికై న ప్రాజెక్టు -
వెంబడించిన ఎక్సైజ్ పోలీసులు
● బైక్ పై వేగంగా వెళుతూ లారీని ఢీకొన్న యువకులు ● ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం తాళ్లరేవు: యానాం – ద్రాక్షారామ రహదారిలోని ఇంజరం వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరప మండలం గురజనాపల్లి శివారు అడివిపూడి గ్రామానికి చెందిన కోట శ్రీరామ్ (21), పిఠాపురానికి చెందిన మరో యువకుడు పెద్దాపురంలోని ఒక కళాశాలలో చదువుతున్నారు. వీరు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం వచ్చి తిరిగి వెళుతుండగా మద్యం తరలిస్తున్నారనే అనుమానంతో సుంకరపాలెం ఎకై ్సజ్ చెక్పోస్టు వద్ద పోలీసులు ఆపారు. అయితే వీరు బైక్ ఆపకుండా వెళ్లిపోవడంతో ఎకై ్సజ్ పోలీసులు వెంబడించారు. దీంతో వేగంగా బైక్ నడుపుతూ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కోట శ్రీరామ్కు తీవ్రగాయాలై రక్తస్రావమైంది. స్థానికులు హుటాహుటీన యానాం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మరో యువకుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఎకై ్సజ్ చెక్ పోస్టు ముట్టడి యువకుడు మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న స్థానికులు ఎకై ్సజ్ చెక్పోస్టు వద్దకు చేరుకుని ముట్టడించారు. ఎకై ్సజ్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే నిండుప్రాణం బలై పోయిందని సిబ్బందిని నిలదీశారు. డిపార్ట్మెంట్కు సంబంధం లేని ఒక ప్రైవేటు వ్యక్తిని మద్యం దుకాణాల వద్ద నిఘా పెట్టి.. అతడు ఇచ్చిన సమాచారంతో ప్రతి రోజూ ఇదే మాదిరిగా వేధిస్తున్నారన్నారని ఆరోపించారు. సమాచారం తెలుసుకున్న కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ సుంకరపాలెం చెక్పోస్టు వద్ద పరిస్థితిని సమీక్షించారు. తీవ్ర ఉద్రిక్తత సుంకరపాలెం పరిసర గ్రామాల నుంచి అనేక మంది ప్రజలు ఎకై ్సజ్ చెక్పోస్టును ముట్టడించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కోట శ్రీకాంత్ కుటుంబాన్ని ఆదుకోవాలని, ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. వారితో కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ, ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ ఏనుగుల చైతన్య మురళి, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరెంటెండెంట్ మౌనిక, ఎకై ్సజ్ సీఐ స్వామి చర్చిస్తున్నారు. ఇంద్రపాలెం, గొల్లపాలెం, తిమ్మాపురం ఎస్సైలు వీరబాబు, మోహన్కుమార్, రవీంద్ర శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. -
ఆ మృతదేహం ఎవరిదో..
పిఠాపురం: మృతుడి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో వారికి దొరికిన రాగి కడియం, మొలతాడే కీలక ఆధారాలుగా మారాయి. హత్య జరిగిందని నిర్ధారించినా అసలు హతుడు ఎవరో తెలియక దర్యాప్తు ముందుకు కదలడం లేదు. వివర్లాలోకి వెళితే.. గొల్లప్రోలు మండలం చేబ్రోలు 216 జాతీయ రహదారి పక్కన ఈ నెల 3వ తేదీన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలు ఆ కేసు దర్యాపు చేస్తున్నారు. అన్ని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలలోను మిస్సింగ్ కేసులను వెతుకుతున్నారు. హతుడి వద్ద లభించిన రాగి కడియం, మొలతాడు ఆధారంగా ఆచూకీ తెలుసుకోవడానికి పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లకు మృతుడి ఫోటోలు పంపారు. ఘటనా స్థలం సమీపంలోని ప్రాంతాలలో సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. అయితే ఆరు రోజులు గడుస్తున్నా ఎటువంటి చిన్న ఆధారం ఆచూకీ దొరకలేదు.● ముమ్మరంగా పోలీసుల దర్యాప్తు ● రాగి కడియం, మొలతాడే కీలక ఆధారాలు ● ఆరు రోజులైనా దొరకని ఆచూకీ -
హెల్త్ సిటీలో రక్త రుగ్మతల కేంద్రం
ఆరిలోవ (విశాఖపట్నం): మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని హెల్త్ సిటీ యునిక్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన రక్త రుగ్మతుల కేంద్రాన్ని హెమటాలజీ పితామహుడు డాక్టర్ మామ్మెన్ చాందీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సికిల్ సెల్, తలసేమియాతో బాధపడుతున్నవారికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మురళీకృష్ణను అభినందించారు. నిమ్స్ మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ సదాశివుడు మాట్లాడుతూ విశాఖలో రక్త రుగ్మతుల కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఆరోగ్య సంరక్షణలో కీలక ముందుడుగు పడిందన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ ఏపీతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఎక్కడా రక్త వ్యాధులను సమగ్రంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా హెమటాలజీ కేంద్రం లేదన్నారు. ఈ లోటును భర్తీ చేయడానికి ఇక్కడ సమగ్ర రక్త రుగ్మతల కేంద్రం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. -
బాధితులకు రూ.18.34 కోట్ల నష్టపరిహారం పంపిణీ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉమ్మడి జిల్లా పరిధిలో 42 బెంచ్లలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో రూ.18,33,80,798 నష్ట పరిహారాన్ని బాధితులకు అందజేశారు. రాజమహేంద్రవరం కోర్టు ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా ఇరు పార్టీలకు డబ్బు, సమయం వృథా కాకుండా చూడడమే ముఖ్య ఉద్దేశమన్నారు. ఉమ్మడి జిల్లాలో రాత్రి 9 గంటల వరకూ 5,297 క్రిమినల్, 474 సివిల్, 147 ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించామన్నారు. డీఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి మాట్లాడుతూ కేసుల పరిష్కారం ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం జరిగేలా న్యాయమూర్తులు, కోర్టులు పనిచేస్తాయన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,000 గటగట (వెయ్యి) 16,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,000 గటగట (వెయ్యి) 15,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
గౌరవిస్తేనే సంపూర్ణ మహిళా సాధికారిత
– జేఎన్టీయూకే వీసీ డాక్టర్ ప్రసాద్ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): సీ్త్రలను గౌరవించినప్పుడే సంపూర్ణ మహిళా సాధికారిత సాధ్యమవుతుందని జేఎన్టీయూకే వీసీ డాక్టర్ సీఎస్ఆర్కే ప్రసాద్ పేర్కొన్నారు. జేఎన్టీయూకేలో వుమెన్ ఎంపవర్మెంట్ గ్రీవెన్స్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద్ మాట్లాడుతూ కాలం ఎంతో విలువైందని, మహిళలు తమ కంటూ లక్ష్యం ఏర్పరచుకుని ఆ లక్ష్యాన్ని చేరేవరకూ నిరంతరం శ్రమించాలన్నారు. ఫిలిప్పీన్ దేశ జనాభాలో అత్యధికంగా మహిళలే ఉద్యోగం చేస్తున్నారన్నారు. మహనీయులను ఆదర్శంగా తీసుకుని నలుగురికి ఉపయోగపడేలా సేవలందిస్తూ ఉన్నత శిఖారాలు అధిరోహించాలన్నారు. వర్సిటీలో మహిళా సాఽధికారత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని, మహిళలు విద్యార్థి దశలో విద్యకు అధిక ప్రాధాన్యమివ్వడంతో పాటు ఇతరులకు విద్యపట్ల అవగాహన కల్పించాలన్నారు. మరో ముఖ్యఅతిథి నన్నయ వర్సిటీ వీసీ ప్రసన్నశ్రీ మాట్లాడుతూ సమాజంలో మహిళను బలపరిస్తే ఆమె ఒక కుటుంబాన్ని బలపరుస్తుందని, ఒక కుటుంబం బలంగా ఉంటే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. సమాజంలో ప్రతి మనిషికి ఆత్మ గౌరవం ఉంటుందని, మహిళలు ఆ ఆత్మగౌరవంతో అవకాశాలు చేజిక్కించుకోవాలన్నారు. అనంతరం లక్ష్మీ ఫౌండేషన్ ద్వారా ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు రూ.20 వేలు ఉపకార వేతనం ఇస్తుండగా వచ్చే విద్యాసంవత్సరం ప్రతి విద్యార్థికి స్కాలర్ షిప్ ఇవ్వడానికి ముందుకు రావడంపై అభినందించారు. అనంతరం నన్నయ వీసీ ప్రసన్నశ్రీని సత్కరించారు. రెక్టార్ కేవీ రమణ, ఇన్చార్జి రిజిస్ట్రార్ రవీంద్రనాథ్, డైరెక్టర్ రత్నకుమారి పాల్గొన్నారు. -
గేట్లు.. పాట్లు
అన్నవరం: పంపా రిజర్వాయర్ వద్ద కొత్త గేట్ల ఏర్పాటుకు రూ.3.36 కోట్లు మంజూరై దాదాపు మూడు నెలలైనా ఇంకా పనులు ప్రారంభం కాలేదు. నెలాఖరులోగా ఖర్చు చేయకపోతే ఈ నిధులు మురిగిపోయే అవకాశం ఉండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇదీ పరిస్థితి పంపా జలాశయం కింద తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో 12,500 ఎకరాల ఆయకట్టు ఉంది. ఒకసారి ఆయకట్టు మొత్తం సాగు జరగాలంటే 1.5 టీఎంసీల నీరు అవసరం. పంపా గర్భంలో నుంచి పుష్కర కాలువ నిర్మాణం జరగక ముందు ఈ రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 105 అడుగులుండేది. 105 ఆ స్థాయికి నీటిమట్టం చేరితే రిజర్వాయర్లో 0.5 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. అయితే పుష్కర కాలువను రిజర్వాయర్కు 103 అడుగుల ఎత్తులో నిర్మించారు. దీంతో పంపా రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టాన్ని 103 అడుగులకు పరిమితం చేశారు. దీంతో దీని నీటినిల్వ సామర్థ్యం 0.44 టీఎంసీలకు పరిమితమైపోయింది. ఇప్పుడు పంపా బ్యారేజీ గేట్లు బలహీనంగా ఉండటంతో నీటిమట్టాన్ని 99 అడుగులకే పరిమితం చేశారు. దీంతో రిజర్వాయర్లో 0.26 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయడం సాధ్యమవుతోంది. ఫలితంగా ఖరీఫ్ పంట కాలంలో రిజర్వాయర్ నాలుగుసార్లు నిండితే తప్ప ఆయకట్టు రైతులు గట్టెక్కలేని దుస్థితి ఏర్పడింది. తాత్కాలిక మరమ్మతులతో సరి అన్నవరం వద్ద పంపా రిజర్వాయర్ నిర్మించి దాదాపు 56 ఏళ్లు పూర్తయింది. అప్పట్లో ఏర్పాటు చేసిన ఐదు గేట్లకు సమస్యలు ఎదురైనపుడు ఎప్పటికప్పుడు తాత్కాలిక మరమ్మతులు మాత్రమే చేస్తున్నారు. రిజర్వాయర్ గేట్లను అప్పటి సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం అర్ధచంద్రాకారంగా అంటే సినిమా స్కోప్ తెర మాదిరిగా నిర్మించారు. ఈ గేట్లు కాస్త వంపుగా ఉండటంతో భారీ వర్షాలు, తుపాన్ల సమయంలో రిజర్వాయర్ నుంచి మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేయడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గేట్లు ఎత్తడం, దించడం సమస్యగా మారింది. ఈ పరిస్థితుల్లో పాత గేట్లు మార్చాలనే ప్రతిపాదన సుమారు పదేళ్లుగా ఉంది. వైఎస్సార్ సీపీ హయాంలోనే మంజూరు రైతుల ఇబ్బందిని గుర్తించిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పంపా బ్యాకేజీకి పాత గేట్ల స్థానంలో కొత్తవి అమర్చాలని నిర్ణయించింది. ఈ మేరకు 2023 జూలై నెలలో ఇరిగేషన్ అధికారులు బ్యారేజీ గేట్లు పరిశీలించారు. వీటిని మార్చి కొత్త గేట్లు అమర్చాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీనికి నాటి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2023 డిసెంబర్లోనే కొత్త గేట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తరువాత ఎన్నికల కోడ్ కారణంగా నిధులు విడుదల కాలేదు. ఆ తరువాత ఏర్పడిన కూటమి ప్రభుత్వం మళ్లీ ఈ ప్రతిపాదనలను పరిశీలించి కేంద్రానికి పంపించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత ఏడాది డిసెంబర్లో విపత్తు రక్షణ నిధుల నుంచి రూ.3.36 కోట్లు విడుదల చేశాయి. మరోవైపు గేట్ల పనులకు ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో రిజర్వాయర్లోని నీటిని దిగువకు వదిలేశారు. దీంతో జలాశయం అడుగంటి కనిపిస్తోంది. మళ్లీ వర్షాలు కురిస్తే తప్ప నిండే పరిస్థితి కనిపించడం లేదు. ఫ పంపా రిజర్వాయర్ కొత్త గేట్లకు ఖరారవని టెండర్లు ఫ నీరుగారుతున్న రూ.3.36 కోట్లు ఫ నెలాఖరులోగా ఖర్చు చేయకపోతే మురిగిపోయే అవకాశం త్వరలోనే కొత్త గేట్లు నీటి సంఘాల ఎన్నికలు తదితర కారణాలతో పంపా రిజర్వాయర్ కొత్త గేట్ల ఏర్పాటుకు టెండర్లు పిలవడం ఆలస్యమైంది. గత నెలలోనే టెండర్లు పిలిచాం. వాటిని ఖరారు చేసి పనులు ప్రారంభించాల్సి ఉంది. మార్చి నెలాఖరులోగా ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. అందువలన త్వరలోనే పనులు ప్రారంభించి కొత్త గేట్లు ఏర్పాటు చేస్తాం. – జి.శేషగిరిరావు, ఇరిగేషన్ ఈఈ -
సాగులో వనితర సాధ్యులు
ప్రేమాదరణకు ‘సిరి’ సామర్లకోట: పట్టణంలోని సిరి మానసిక దివ్యాంగుల కేంద్రం అక్కడి విద్యార్థులకు ప్రేమాదరణలతో విరాజిల్లుతోంది. సుమారు వంద మంది మానసిక దివ్యాంగులకు వివిధ రకాల సేవలు అందించడమే కాకుండా, వారు ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి వృత్తి శిక్షణ ఇస్తున్నారు సంస్థ నిర్వాహకురాలు గోపీదేవి. సాధారణ మహిళగా 1994లో పెద్దాపురం రోడ్డు బడేలమ్మ చెరువు ఎదురుగా మానసిక దివ్యాంగుల సేవా సంస్థ సిరి స్థాపించారు. అనేక మందికి ఈ సంస్థ సేవలందిస్తూ, మానసిక పరిస్థితి సక్రమంగా లేనివారికి ఆమె ఆధ్వర్యంలో సేవలందిస్తున్నారు. దాంతో ఆమె ఇప్పటి వరకు అనేక సేవా పథకాలను అందుకున్నారు. నిరుపేద మహిళలకు ఉచితంగా విద్య, వసతి, ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా మానసిక వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ ఆ వెలుగుల్లో తానూ ప్రకాశిస్తూ తన జీవితానికి అర్థం పరమార్థం సేవలోనే లభిస్తుందని ఎంతో ఆనందం వెలిబుచ్చారు గోపీదేవి. శ్రీకాకుళంలో బీఏ పట్టా తీసుకున్న అనంతరం మానసిక వికలాంగులకు సేవ చేయాలనే కోరికతో మెంటల్ రిటార్డేషన్లో డిప్లామా కోర్సు చేశారు. తండ్రి దాశెట్టి సూర్యకుమార్ ఇచ్చిన రూ.రెండు లక్షలతో తాత అప్పలరాజు స్వస్థలమైన సామర్ల కోటలో మానసిక వికలాంగుల సేవాసంస్థ ‘సిరి’ని స్థాపించారు. తల్లిదండ్రుల ఆర్థిక సహాయంతోనూ, ప్రజల నుంచి సేకరించిన విరాళాలతోనూ సంస్థ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. 2000 సంవత్సరంలో సిరికి ప్రభుత్వ గుర్తింపు లభించింది. మతిస్థిమితం లేని బాలబాలికలకు ఉచిత విద్య, భోజనం, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, శారీ పెయింటింగ్, సర్ఫ్ తయారీ, రీడింగ్, రైటింగ్, ప్రవర్తనా సర్దుబాటు, వృత్తి విద్యల్లో నాణ్యమైన శిక్షణ ఇస్తున్నారు. ఆమె సేవలకు రాష్ట్ర ప్రభుత్వం 10 సార్లు ‘బెస్ట్ సోషల్ వర్కర్’ అవార్డులు ఇచ్చింది. కేవలం అవార్డుల కోసం కాకుండా మానసిక పరిపక్వత లేని 5–15 సంవత్సరాల వయస్సు కలిగిన బాలబాలికలకు శిక్షణ ఇస్తున్నట్టు గోపీదేవి తెలిపారు.● ఇంటి పని నుంచి పంట పనిలోకి.. ● అగ్రి‘కల్చర్’లో దూసుకుపోతున్న మహిళలు ● ప్రకృతి వ్యవసాయ రంగంలో మహిళామణులు పిఠాపురం: ఈ వనితలు చెట్టూ పుట్టా గట్టూ దాటుకుంటూ చేలల్లో కలియతిరుగుతూ పురుషులకు దీటుగా పని చేసి చూపిస్తున్నారు. పురుషులు మాత్రమే చేయగలరనే వ్యవసాయ రంగంలోను తమకు సాటి లేరని నిరూపిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ శాఖలోని మహిళలు వ్యవసాయ రంగంలో ఇష్టపడి మరీ అడుగు పెట్టి రైతులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. దుక్కి దున్నే నాటి నుంచి పంట చేతికొచ్చే వరకు రైతులకు తలలో నాలుకగా ఉంటున్నారు. కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్గా పనిచేస్తున్న మహిళలు రైతుల పొలాలు, ఇంటి పరిసరాల పరిశీలించి కిచెన్ గార్డెన్లు, సూర్య మండలం మోడల్స్, ఏటీఎం మోడల్స్, ఏ గ్రేడ్ మోడల్స్ రైతులతో వేయిస్తూ ప్రకృతి వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రైతులు పొలంలో పంటకు ముందు పచ్చి రొట్ట ఎరువులు వేయించి భూమిలో కర్పన శాతం పెంచేలా చేస్తున్నారు. రైతులు పొలాల్లో కెమికల్స్ స్ప్రే చేయకుండా కషాయాలపై ఒక అవగాహనా కల్పిస్తూ, రక్షక పంటలు అంతర పంటలు వేయిస్తూ రైతు ఆదాయం పెంచడంతోపాటు, రైతు కుటుంబాల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. గతంలో వ్యవసాయ రంగంలో కేవలం మహిళలు కూలీలుగా మాత్రమే కనిపించే వారు. కానీ ఇప్పుడు పకృతి వ్యవసాయ శాఖలో సీఆర్పీలు 90 శాతం మంది మహిళలే ఉండడం మారిన పరిస్థితికి అద్దం పడుతుంది. అలాంటి వనితల్లో కొందరిని పలకరిస్తే ...ఇంటి పంటపై మహిళలకు అవగాహన కల్పిస్తూవ్యవ‘సాయం’ చేయాలనే నేను ఇంటర్ వరకు చదువుకున్నా. మాది రైతు కుటుంబం. చిన్నప్పటి నుంచి మానాన్న వ్యవసాయం చేయడం చూస్తుండే దానిని. సరదాగా మాఇంటికి దగ్గరలో ఉన్న పంట పొలాల్లో ఆడుకుంటూ వ్యవసాయం చూసి ముచ్చటపడి మా నాన్నకు చేదోడువాదోడుగా ఉండే దాన్ని. అలా వ్యవసాయంపై మక్కువ ఏర్పడి అవకాశం కోసం ఎదురు చూస్తుండగా కమ్యూనిటీ రిసోర్సు పర్సన్గా ఐసీఆర్పీగా అవకాశం వచ్చింది. దీంతో ప్రకృతి వ్యవసాయం పట్ల రైతుల్లో, మహిళల్లో అవగాహన కల్పిస్తూ ఆరోగ్యకరమైన పంటలు పండించడానికి కృషి చేస్తున్నాను. ఉద్యోగం చేయాలన్న కోరిక తీరడంతో పాటు ఆసక్తి ఉన్న వ్యవసాయంలో పని చేయడం చాలా సంతృప్తినిస్తోంది. – శ్రీరంగ రామేశ్వరి, ప్రకృతి వ్యవసాయ శాఖ సీఆర్పీ, దుర్గాడ, గొల్లప్రోలు మండలం ఆనందంగా ఉంది పొలాల్లో తిరిగే ఉద్యోగంలోకి అడుగు పెట్టేటప్పుడు నేను చేయగలనా అనే భయాందోళన కలిగింది. కానీ ప్రకృతిని కాపాడుకునే ఉద్యోగం అని తెలిసి పట్టుదలతో చేసి తక్కువ సమయంలోనే మంచి ఫలితాలను సాధించి నా సత్తా నిరూపించుకుంటున్నాను. అందరూ తెలుసున్న వారే కావడంతో రైతులు పూర్తి సహకారం అందిస్తున్నారు. మా గ్రామంలో ఇంటి పంటలు వేయిస్తూ ఎవరికి ఎక్కడా కూరగాయల ఇబ్బంది లేకుండా చేయగలిగాం. అటు రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని పరుగులు పెట్టిస్తున్నాం. – రోజా, ప్రకృతి వ్యవసాయ శాఖ సీఆర్పీ దుర్గాడ, గొల్లప్రోలు మండలం -
పారదర్శకంగా పి–4 సర్వే : కలెక్టర్ షణ్మోహన్
కాకినాడ సిటీ: జిల్లాలో పి–4 సమగ్ర సర్వే ప్రక్రియను పారదర్శక రీతిలో నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశపు హాలులో కలెక్టర్ షణ్మోహన్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో శనివారం నుంచి నిర్వహించనున్న పి–4 సర్వే, సాగునీటి ఎద్దడి నుంచి రబీ పంటలను కాపాడటం, ల్యాండ్ కన్వర్షన్, మ్యూటేషన్ల ప్రక్రియలో దళారులను అరికట్టడం, లారీ రవాణా రంగంలో స్వేచ్ఛాయుత వాతావరణం, కాకినాడ ఎన్టీయార్ బీచ్ ఫ్రంట్లో పరిశుభ్రమైన ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పడం అంశాలలో చేపట్టిన చర్యలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టిసిపేషన్–4 విధానం చేపట్టిందని, ఇప్పటికే 10 జిల్లాల్లో ఈ సర్వే ప్రక్రియ జరుగుతుందన్నారు. కాకినాడ జిల్లాలో ఈ సర్వే ప్రక్రియను ఎంపీడీవోల ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది నిర్వహిస్తారని, డీఆర్వో మొత్తం ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారన్నారు. మండల అధికారులకు ఇందుకు అవసరమైన శిక్షణ, అవగాహన కార్యక్రమాలను శుక్రవారం నిర్వహించామన్నారు. ఆరు అంచెల అర్హతా ప్రామాణికాల కింద అర్హులైన ప్రతి ఒక్కరి ఇంటికీ సచివాలయ సిబ్బంది వెళ్లి 25 అంశాల సమాచారాన్ని సేకరిస్తారన్నారు. దాదాపు 4 నుంచి 5 లక్షల కుటుంబాల నుంచి సేకరించిన ఈ సర్వే ఆధారిత సమాచారాన్ని గ్రామసభలో ప్రదర్శించి, పారదర్శకమైన రీతిలో పేదలను గుర్తిస్తామని కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. జిల్లాలో తాళ్లరేవు, పిఠాపురం మండలాల్లో రబీ పంటలకు ఎదురవుతున్న నీటి ఎద్దడి నివారణకు చేపట్టిన చర్యలను వివరించారు. రైతులు వంతుల వారీ విధానానికి కట్టుబడక మోటార్లతో అక్రమంగా నీటిని వాడుకోవడం వల్లే ఈ కృత్రిమ నీటి ఎద్దడి తలెత్తినట్టు గమనించామని కలెక్టర్ అన్నారు. క్షేత్రస్థాయిలో విస్తృతమైన తనిఖీలు నిర్వహించి అక్రమంగా నీరు తరలిస్తున్న మోటార్లను సీజ్ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. కాకినాడలోని లారీ యజమానులు, పరిశ్రమల మధ్య సరుకు రవాణా లావాదేవీలు, చార్జీల అంశాలలో నెలకొన్న అవాంఛనీయ వివాదంపై మాట్లాడుతూ ఇరు వర్గాలు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ కార్యకలాపాలను నిర్వహించుకోవాలని ఆదేశించారు. -
ప్రకృతి మాత ఒడిలో పని చేయడం ఆనందంగా ఉంది
నేను ఒక తల్లిగా ప్రకృతి మాత ఒడిలో పని చేయడం ఆనందంగా ఉంది. వ్యవసాయం ఆడవారు ఏమి చేస్తారు అనే వారే ఇప్పుడు ఏది చేసినా మీరే చేయాలి అంటూ ప్రశంసిస్తున్నారు. వ్యవసాయం అంతా రసాయనాల మయంగా మారిన తరుణంలో రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మరల్చడానికి మేము చేసిన ప్రయత్నం విజయవంతం అయ్యింది. అందరికీ ఆరోగ్యకరమైన పంటలను అందించడంలో మా పాత్ర ఉండడం చాలా గర్వంగా ఉంది. – కర్రి సత్య, ప్రకృతి వ్యవసాయ శాఖ, ఐసీఆర్పీ, గుమ్మరేగల ఉద్యోగంలా కాదు ఉత్సాహంగా చేస్తున్నాం ఆడవారికి వ్యవసాయం ఏమిటీ అనే పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయంలో అడుగు పెట్టాను. నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయ శాఖలో సీఆర్పీగా పని చేస్తూ ఎందరో రైతులకు సలహాలు ఇస్తూ వారితో పాటు పొలంలో పని చేస్తుండడం ఎక్కడ లేని ఆనందాన్నిస్తోంది. ఇది ఒక ఉద్యోగంలా కాకుండా ఉత్సాహంగా మనసు పెట్టి పని చేస్తున్నాం. మగ వారితో సమానంగా పొలాల్లో తిరుగుతూ భూమి సారవంతంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. – సోమాల సునీత, ప్రకృతి వ్యవసాయ శాఖ సీఆర్పీ దుర్గాడ, గొల్లప్రోలు మండలం చాలెంజ్గా పని చేస్తున్నా మీకేం తెలుసు మీరేం చేయగలరు అనే మనుషుల మధ్య పకృతి వ్యవసాయంలోకి అడుగు పెట్టి ఇప్పుడు అలా అన్నవారికే వ్యవసాయంలో మెళుకువలు చెప్పే స్థాయిలో ఉన్నాను. ఇంటి పని, వంట పని తప్ప ఏమీ చేయలేరనే నానుడి నుంచి పంట పని కూడా వీళ్లు చేయగలరు అనిపించుకున్నాం. ముఖ్యంగా మహిళల్లో ప్రకృతి వ్యవసాయం పట్ల మక్కువ పెంచి ప్రతీ ఇంటి పెరట్లోను ఇంటి పంటలు వేయించి వారికి సరిపడా ఆహారం వారే పండించుకుని తినడంతో పాటు ఆదాయం కూడా పొందేలా చేస్తున్నాం. – శివకోటి పాప, ప్రకృతి వ్యవసాయ శాఖ సీఆర్పీ దుర్గాడ, గొల్లప్రోలు మండలం వంట శాల నుంచి పంట శాలకు నేను పదవ తరగతి వరకు చదువుకున్నా వివాహం అయ్యాకా ఇంటి పని వంట పనికి పరిమితమయ్యా. కాని ఏదో ఒక చిన్న ఉద్యోగం చేయాలని ఆసక్తి ఉండేది. ఇంతలో ప్రకృతి వ్యవసాయంలో సీఆర్పీగా అవకాశం ఉందని తెలిసి ప్రయత్నం చేశా. తొలుత చాలా భయమేసింది. కాని రంగంలోకి దిగాకా చాలా సులువుగా అనిపించింది. మనం తినే తిండిని ఆరోగ్యకరంగా మార్చే బాధ్యత నేను తీసుకోవడం చాలా ఆనందాన్ని కలిగించింది. – పి.గంగా పార్వతి, ప్రకృతి వ్యవసాయ శాఖ సీఆర్పీ దుర్గాడ, గొల్లప్రోలు మండలం -
సీఆర్వో కార్యాలయ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు
అన్నవరం: రత్నగిరి గదుల రిజర్వేషన్ కార్యాలయ (సీఆర్వో) సిబ్బందిపై ఈఓ వీర్ల సుబ్బారావు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. హరిహరసదన్ పక్కన గల స్థలం ఈ నెల 22న వివాహానికి అద్దెకి తీసుకున్న పెళ్లిబృందం వివాహం అనంతరం ఆ స్థలం ఖాళీ చేసినప్పటికీ సిబ్బంది పది రోజుల వరకు కంప్యూటర్లో చెకౌట్ చేయని విషయం విదితమే. దీని ఫలితంగా ఈ స్థలం ఒక రోజు అద్దె రూ.29 వేలు కాగా, పది రోజులకు రూ.2.90 లక్షలు చెల్లించాలని కంప్యూటర్లో నమోదైంది. దీనికి బాధ్యులుగా భావిస్తూ సీఆర్వో కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ పెన్నాడ వేంకటేశ్వరరావుకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆ కార్యాలయంలో కౌంటర్ క్లర్క్గా పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి శ్రీకృష్ణను సస్పెండ్ చేస్తూ ఈఓ శుక్రవారం ఆదేశాలిచ్చారు. -
ప్రభుత్వానికి, వ్యాపారులకు వారధిగా సీఏలు
బోట్క్లబ్ (కాకినాడ) : ప్రభుత్వానికి, వ్యాపారులకు మధ్య వారధులుగా సీఏలు పనిచేస్తున్నారని ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు డి.ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ చార్టర్డ్ అకౌంట్స్ కాకినాడ చాప్టర్ కార్యాలయంలో చార్టర్డ్ అకౌంటెంట్స్ కాకినాడ బ్రాంచ్ చైర్మన్ తాలూరి శ్రీనివాసరాజు అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ దేశ ఆర్థిక అభివృద్ధిలో సీఏలు కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. 1956లో ఇన్కమ్టాక్స్ వ్యవస్థ ఏర్పడిందని అప్పటి నుంచి ఇప్పటి వరకూ సీఏలు ఎంతగానో సేవలందిస్తున్నారన్నారు. జీఎస్టీ బిల్లును ప్రవేశ పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్న ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉత్తమ అవార్డు సైతం అందించిందన్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా 11 సెంట్రల్ ఆఫ్ ఎక్స్లెన్స్ కార్యాలయాలను తీసుకువస్తుందన్నారు. త్వరలోనే విజయవాడ కేంద్రంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కాకినాడ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు టి.పవన్కుమార్, సెక్రటరీ పాండురంగమూర్తి, ట్రెజరర్ సూర్యనారాయణమూర్తి పాల్గొన్నారు. 10న అప్రెంటిస్ మేళా బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వివిధ కంపెనీల్లో ఉన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఈ నెల 10వ తేదీన కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాలవర్మ శుక్రవారం తెలిపారు. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఐటీఐలో ఉత్తీర్ణులై ఎన్టీసీ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు ఉదయం 9గంటలకు కళాశాలకు హాజరుకావాలని, ఇతర వివరాలకు 86392 30775 నంబర్లో సంప్రదించవచ్చని సూచించారు. అధికారుల 2కే రన్ కాకినాడ క్రైం: మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. శుక్రవారం నాగమల్లితోట నుంచి ప్రారంభమైన ఈ రన్ భానుగుడి కూడలి వరకు సాగింది. అక్కడ మానవహారాన్ని ఏర్పాటు చేసి మహిళల భద్రత, రక్షణపై నినాదాలు చేశారు. కార్యక్రమంలో పోలీస్శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
టీచర్లకు రెండు రోజుల అవకాశం
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సీనియార్టీ జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలపాలని జిల్లా విద్యాశాఖదికారి వారి వెబ్సైట్లో ఉంచినట్టు జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాల్లో ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్స్ తత్సమానమైన ఉపాధ్యాయులు, ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు. పీఈటీ ఉపాధ్యాయులు, లాంగ్వేజ్ పండిట్ ఉపాధ్యాయులు తదితర ఉపాధ్యాయులు సీనియార్టీ వివరాలు జిల్లా విద్యాశాఖాధికారి వెబ్సైట్లో ఉంచినట్టు డీఈవో తెలిపారు. వెబ్సైట్లో ఉన్న సీనియార్టీ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత నమూనా ప్రొఫార్మాతో శని, ఆదివారాలలో కార్యాలయ పని వేళలలో సమర్పించేందుకు అవకాశం ఉందన్నారు. -
గురుకుల ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
రంగంపేట: గురుకుల విద్యాలయాలలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు లక్ష్మీ నరసాపురం బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వై.లక్ష్మణకుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ సాంఘిక, సంక్షేమ గురుకుల విద్యాలయాల ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహిస్తున్న 21 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులాలలో 2025–26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్మీడియెట్ (ఇంగ్లిషు మీడియం)లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అన్నారు. ఈ నెల 13వ తేదీ నాటికి దరఖాస్తులు అందించాలన్నారు. ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేయవచ్చునని తెలిపారు. ఈ గురుకుల విద్యాలయాలు ప్రత్యేకంగా పేద, నిరుపేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఒక గొప్ప అవకాశం ఉందని, వీటిలో విద్యార్థులు సెల్ఫోన్ సంస్కృతి నుంచి దూరంగా క్రమ శిక్షణ, ఆత్మస్థైర్యం, మంచి ఆరోగ్యం, మంచి జీవన శైలి నేర్చుకోవచ్చునని తెలిపారు. ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్య, పౌష్టికాహారం, ఉచిత పుస్తకాలు, యూనిఫాం, బూట్లు, స్టూడెంట్ స్టేషనరీ, స్పోర్ట్స్ తదితర సౌకర్యాలు ఉన్నాయన్నారు. ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. -
పాల దుకాణంపై ఫుడ్సేఫ్టీ అధికారుల దాడులు
బోట్క్లబ్: స్థానిక అచ్యుతాపురం రైల్వే గేటు సమీపంలోని శ్రీసాయి శ్రీనివాస్ మిల్క్ షాప్పై శుక్రవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. పాలు, పెరుగు నిల్వ ఉండడానికి స్పైడ్రైయ్ మిల్క్పౌడర్, బెంజోయాక్ యాసిడ్ వినిగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పాలు ఎక్కువ రోజు నిల్వ ఉంచేందకు ఈ యాసిడ్ వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పాలు తోడుపెట్టే క్రమంలో ఈ పౌడర్ను వినియోగిస్తున్నట్టు ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ కంట్రోలర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు నిర్వాహకునిపై కేసు నమోదు చేస్తున్నామన్నారు. ఇతని వద్ద స్వాధీనం చేసుకొన్న పాలు, పెరుగు ల్యాబ్కు పంపుతామన్నారు. ఇవి హానికరమని తేలితే మరో కేసు నమోదు చేస్తామన్నారు. పాలు, పెరుగు, రసాయనాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఫుడ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు తెలిపారు. యాసిడ్ వినియోగించి నిల్వ ఉంచి పాలు మనం తాగితే జీర్ణకోశ సమస్యలు వస్తాయని ఆయన తెలిపారు. గొర్రిపూడి హెచ్ఎంపై పోక్సో కేసు కరప: విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడిన గొర్రిపూడి జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం అడబాల కాశీవిశ్వేశ్వరరావుపై పోక్సో కేసు నమోదైంది. అధికారుల విచారణలో ఫిర్యాదులు నిర్థారణ కావడంతో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ సునీత శుక్రవారం తెలిపారు. కేసు విచారణలో ఉన్నందున నిందితుడిని అరెస్టు చేయలేదని, విచారణ నివేదికతో కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి
● అటవీశాఖ ఉద్యోగినికి తీవ్ర గాయాలు ● బైక్ను కారు ఢీకొట్టడంతో ఘటన గోకవరం: గోకవరం మండలం కొత్తపల్లి శివారున పెట్రోల్బంక్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి చెందగా అటవీశాఖ ఉద్యోగిని తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం అల్లూరి సీతారామరాజు జిల్లా వై.రామవరం మండలం దొలిపాడుకు చెందిన వలాల చిన్నబ్బాయి (52) జగ్గంపేట మండలం గోవిందపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో 2023 నుంచి సాంఘిక శాస్తం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. కొంత కాలంగా గోకవరంలో నివాసం ఉంటూ బైక్పై వెళ్లి వస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆయన వెళ్తుండగా అటవీశాఖలో గార్డుగా పని చేస్తున్న రెడ్డి విజయదుర్గ లిఫ్ట్ అడగడంతో ఆమెను ఎక్కించుకుని మళ్లీ ముందుకు సాగిపోయారు. కొత్తపల్లి శివారున పెట్రోల్ బంకు సమీపంలో వారు ప్రయాణిస్తున్న బైక్ను జగ్గంపేట వైపు నుంచి ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నబ్బాయి అక్కడికక్కడే మృతి చెందగా విజయదుర్గ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న గోకవరం ఎస్సై పవన్కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. పిల్లలను పాఠశాల వద్ద దించి.. చిన్నబ్బాయికి భార్య పార్వతి, తొమ్మిదో తరగతి చదువుతున్న మేఘవర్షిణి, ఎనిమిదో తరగతి చదువుతున్న స్నేహిత ఉన్నారు. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న వారిని పాఠశాల వద్ద దించి, అనంతరం ఇంటి నుంచి బయలుదేరి కొద్దిసేపటికే ఆయన మృత్యువాతపడ్డారు. యాన్యువల్ డేకి వెళ్లాలి డాడి లే.. ఆ చిన్నారులు చదువుతున్న పాఠశాల వార్షికోత్సవం శనివారం జరగనుంది. తన పిల్లలు ఆ కార్యక్రమానికి రావాలి డాడీ అని పిలవగా నేను రాను అన్న ఆయన మాటే నిజమైందని చిన్నబ్బాయి భార్య రోదించారు. యాన్యువల్డేకి వెళ్లాలి లే డాడీ అంటూ చిన్నారులు పోలీసులు వద్ద రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పోలీస్స్టేషన్ వద్ద నుంచి ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించడానికి వాహనాన్ని నిలపగా భార్య, కుమార్తెలు మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించారు. ఈ క్రమంలో వారిని ఎవరూ వారించలేకపోయారు. హెల్మెట్ ఉన్నా.. బైక్ నడిపే సమయంలో చిన్నబ్బాయి హెల్మెట్ కచ్చితంగా వాడతారు. ప్రమాదం జరిగినపుడు కూడా హెల్మెట్ ధరించినప్పటికీ కారు ఢీకొట్టిన వేగానికి హెల్మెట్ ముక్కలైపోయి తలకు గట్టి దెబ్బ తగలడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఉపాధ్యాయుడి మృతి విషయం తెలుసుకున్న సహచర ఉపాధ్యాయులు భారీగా అక్కడకు చేరుకుని విచారం వ్యక్తం చేశారు. -
వ్యక్తి అదృశ్యం
కొవ్వూరు: వాడపల్లి గ్రామానికి చెందిన డొంకిన నాగర్జున (28) శుక్రవారం ఇంటి నుంచి అదృశ్యమైనట్టు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పి.విశ్వం తెలిపారు. పలుచోట్ల వెతికినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదన్నారు. భార్య దుర్గ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేశామన్నారు. నాగార్జున లారీ డ్రైవర్గా పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. తన గురించి వెతకవద్దని మెసేజ్ పెట్టినట్టు ఆ ఫిర్యాదులో దుర్గ పేర్కొన్నారు. నాగార్జునకు వేరోకరితో వివాహేతర సంబంధం ఉన్నట్లుగా చెబుతున్నారు. వివరాల తెలిసిన వారు 94407 96622 నంబర్కు కాల్ చేయాలని ఆయన సూచించారు. -
సంక్షేమం నుంచి సంక్షోభం
కూటమి పాలనలో మహిళా ఉద్యమాలిలా.. కూటమి ప్రభుత్వం రాగానే మహిళా శ్రామికులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రంగా దగాపడ్డారు. 8 నెలల వేతన బకాయిలు ఇవ్వాలని వీఓఏలు జనవరి 27, 28, 29లలో నిరసన కార్యక్రమాలు చేశారు. కోనసీమ జిల్లాలో 1,726, తూర్పుగోదావరి జిల్లాలో 1,556 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో విస్తారంగా అంగన్వాడీలున్నారు. కాకినాడ జిల్లాలో సుమారు 3500 మంది అంగన్వాడీలు సేవలందిస్తున్నారు. వారంతా కూటమి సర్కార్ ఇచ్చిన హామీలుకు గత నెల 18న ఐసీడీఎస్ కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు. అదే నెల 24న కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు ధర్నాకు దిగారు. వలంటీర్లకు రూ.10వేలు గౌరవ వేతనమిస్తూ విధుల్లో చేర్చుకుంటామన్న కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ మూడు జిల్లాల్లో వివిధ స్థాయిల్లో ఆందోళన చేపట్టారు. పుట్టని బిడ్డకు పేరు ఎలా పెడతామంటూ ఒక మంత్రి, విధుల్లోకి తీసుకుంటే న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయంటూ మరో మంత్రి అనడంపై నిరసన వ్యక్తం చేశారు. ● మహిళను మరచిన కూటమి సర్కార్ ● అడుగడుగునా అవమానాలు ● హామీలన్నీ నీటి మూటలు ● ప్రతి విషయంలో తప్పని ప్రతిఘటన ● నిత్యం ఎదురవుతున్న ఉద్యమ నినాదాలు ● ఆమెకు అందలం వేసిన జగన్ ప్రభుత్వం కపిలేశ్వరపురం: అమ్మ గర్భంలో ఊపిరి తీసుకున్న బిడ్డ ఆ ఊపిరి ఉన్నతంతకాలం ఆమెకు రుణపడి బతకాల్సిందే. అమ్మగా, జీవిత భాగస్వామిగా, కుమార్తెగా బంధమేదైనా బతుకు ఆమెతోనే. సంపద సృష్టి నుంచి సమాజ ప్రగతి వరకు ఎంతో ప్రాధాన్యమున్న మహిళ గౌరవం, రక్షణ ఇవ్వడంలో ప్రభుత్వం శాసీ్త్రయ పద్ధతిని అనుసరించాలి. ఇది వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో కచ్చితంగా అమలైంది. అనంతరం వచ్చిన కూటమి సర్కార్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహిళలను దగా చేస్తూనే ఉన్నారు. అందుకు ప్రతిగా వారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు నిరసనలు చేస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెకు జరుగుతున్న అన్యాయంపై ప్రత్యేక కథనం. ఉపాధి కరవు ఉమ్మడి జిల్లాలో మహిళా విద్యా వంతులు ఎందరో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు ఉపాధి కల్పనపై ఎన్నో హామీలిచ్చి 9 నెలలు గడుస్తున్నా సమీక్షలు, సర్వేలు పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప ఒక్క నోటిఫికేషనూ విడుదల చేయలేదు. ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న హామీని తుంగలో తొక్కారు. అలాగే డీఎస్సీ ప్రకటించేస్తామని, 25 వేల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటనలు గుప్పించేశారు. తీరా చూస్తే 16,347 ఖాళీ పోస్టులను చూపిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విద్యా శాఖ వెబ్సైట్లో కేవలం 1,146 మాత్రమే చూపిస్తున్నట్టు సమాచారం. జూలైలో నోటిఫికేషన్ ఇచ్చి, ఆగస్టులో పరీక్ష నిర్వహిస్తామన్న ప్రకటన అమలుకు నోచుకోలేదు. సుమారు 60 వేల మంది పోస్టుల భర్తీకై ఎదురు చూస్తున్నారు. మహిళాభ్యుదయం గాలికి.... మహిళాభ్యుదయం కూటమితోనే సాధ్యమంటూ ఆ నేతలు ఉపన్యాసాలు ఊదరగొట్టారు. ఎస్సీ, బీసీ, మైనారిటీ మహిళలకు 50 ఏళ్లకే పింఛను అన్నారు. దాని ఊసే లేదు. కొత్త పింఛన్లు ఇస్తామని తొలగింపులకు దిగారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వితంతు పింఛను లబ్ధిదారులు 49,906 మంది, ఒంటరి మహిళ పింఛను దారులు 4,557 ఉండగా తూర్పు గోదావరి జిల్లాలో వితంతు 64,376 మంది, ఒంటరి మహిళ పింఛను లబ్దిదారులు 9,107 మంది వైఎస్ జగన్ సర్కార్ నుంచి పింఛను పొదుతున్నారు. వాటిలో చాలా వరకు రద్దు చేస్తున్నారు. దివ్యాంగ పింఛన్ల సర్వే ఆ వర్గాల్లో ఆందోళన నింపుతోంది. ఏరులైపారుతున్న మద్యం... మద్యం ధరలు తగ్గిస్తామంటూ పురుషులను, నాణ్యతలేని మద్యం విక్రయిస్తూ మీ మగవారి ఆరోగ్యాలను వైఎస్సార్ సీపీ పాడుచేస్తోంది, మేలుకోండంటూ మహిళలను ఆకట్టుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుమతులు ఇచ్చి దండిగా ఆర్జిస్తున్నారు. మహిళా ప్రగతికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ వైఎస్ జగన్ సర్కార్ రాగానే ప్రైవేటు మద్యం దుకాణాలను రద్దు చేసింది. నిబంధనలను కఠినతరం చేస్తూ ప్రభుత్వం ద్వారా పరిమిత సంఖ్యలో మద్యం దుకాణాలకు అనుమతినిస్తూ మద్యం విక్రయాలను పరిమితం చేసింది. మహిహిళలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పెంచింది. ఊరికి ఒకటి నుంచి రెండు చొప్పున సచివాలయం, ఆర్బీకే, హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసి స్థానికంగానే మహిళకు ఉద్యోగాలిచ్చింది. కాకినాడ జిల్లాలో 620, కోనసీమలో 384, తూర్పుగోదావరిలో 512 సచివాలయాల్లో అత్యధిక సంఖ్యలో మహిళలకు ఉద్యోగాలు ఇచ్చింది. అక్క చెల్లెమ్మలకు రూ.5 లక్షలు విలువైన ఇంటి స్థలాన్ని అందజేసింది. తాజా ప్రభుత్వం వాటిని రద్దుచేసే యోచనలో ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో 431, కాకినాడ జిల్లాలో 241 లేఅవుట్లలో సుమారు 90 వేల ఇళ్ల పట్టాలను జగన్ సర్కార్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజకీయ, సామాజిక రంగాల్లో.. గత ప్రభుత్వంలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేసింది. వైఎస్సార్ సీపీలో అంతకంటే ఎక్కువ శాతం పదవులను మహిళలకు కట్టపెట్టింది. దేశంలో తొలిసారిగా దళిత మహిళను హోమ్ మినిస్టర్ను చేసింది. శాసన మండలి చరిత్రలో తొలిసారిగా మైనారిటీ మహిళను డిప్యూటీ చైర్ పర్సన్ను చేసింది. దాదాపు స్థానిక ప్రజాప్రతినిధులు వైఎస్సార్ సీపీ మద్దతుదారులు కావడంతో క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవకుండా అవమానిస్తున్న ఘటనలు అనేకం ఉన్నాయి. -
వ్రత పురోహితులకు పారితోషికం పెంపు
దేవస్థానం ధర్మకర్తల మండలి తరఫున చైర్మన్ ఐవీ రోహిత్ తీర్మానాలు అన్నవరం: రత్నగిరి వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలోని 260 మంది వ్రత పురోహితుల పారితోషికాన్ని నెలకు రూ. రెండు వేలు చొప్పున, విశ్రాంత వ్రతపురోహితుల పెన్షన్ను రూ.వేయి చొప్పున పెంచేందుకు దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త, ఆలయ చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన గల ఏకసభ్య ధర్మకర్తల మండలి శుక్రవారం తీర్మానించింది. ధర్మకర్తల మండలి పదవీ కాలం గత ఫిబ్రవరితో ముగిసింది. దీంతో ఆలయ చైర్మన్ హోదాలో రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావుతో కలిసి శుక్రవారం ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. గతంలో దేవస్థానం వ్రతపురోహిత సంఘం అధ్యక్షుడు, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు ఆధ్వర్యంలో వ్రత పురోహితులు దేవస్థానం చైర్మన్, ఈఓలకు సమర్పించిన వినతి మేరకు తీర్మానం చేసి కమిషనర్ ఆమోదానికి పంపించినట్టు చైర్మన్ రోహిత్ తెలిపారు. మిగిలిన తీర్మానాలివీ.. ● సత్యదేవుని ప్రసాదం తయారీకి ఆవునెయ్యి కిలో రూ.590 చొప్పున విజయ డైరీ, సంగం డైరీల నుంచి కొనుగోలు చేయడం. ● రూ.1.2 కోట్లతో ప్రకాష్సదన్, న్యూ సెంటినరీ, ఓల్డ్ సెంటినరీ కాటేజీల మరమ్మత్తులు. ● దేవస్థానంలో 123 సీసీ కెమేరాల ఏర్పాటుకు కొటేషన్ల ఆమోదం. ● దేవస్థానం ఆసుపత్రి కి రూ.3.75 లక్షలతో రంగులు, కేశఖండన శాలలో రూ.తొమ్మిది లక్షల అంచనా వ్యయంతో మరమ్మత్తులు. ● మే నెలలో జరుగనున్న సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలకు రూ.22 లక్షలతో ఆలయం, ఇతర భవనాలు, మండపాలకు రంగులు వేయించడం. ● ఆదివారం నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్న అన్నవరం దేవస్థానం దత్తత ఆలయం కోరుకొండ లక్ష్మీ నర్శింహస్వామి వారి కల్యాణ మహోత్సవాలకు రూ.11.40 లక్షలతో ఏర్పాట్లు. సమావేశంలో దేవస్థానం డీసీ చంద్రశేఖర్, ఏసీ రామ్మోహన్రావు, ఏఈఓలు జగ్గారావు, కొండలరావు, కృష్ణారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
యూనియన్ బ్యాంక్ ఉద్యోగుల వాక్థాన్
బాలాజీచెరువు: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో మహిళా సాధికారత కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వాక్థాన్ నిర్వహించారు. బ్యాంక్ మహిళా ఉద్యోగులు మెయిన్రోడ్ మీదుగా ప్లకార్డులు చేతపట్టుకుని, ర్యాలీ నిర్వహించారు. అన్ని రంగాల్లో మహిళల ప్రతిభను తెలియజేస్తూ ప్రదర్శన కొనసాగించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ రీజనల్ హెడ్ కాకి సాయిమనోహర్, కృష్ణమాచారి, నారాయణ, అర్చన, యూనియన్ నాయకులు జేఎన్వీ శ్రీనివాస్, ఆకుల సాంబశివరావు, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
బతుకు పూలబాట కాదు..
పోలీసు ఇన్ఫార్మర్ అనుకునే వారు మొదట్లో గిరిజనులు నాతో మాట్లాడేవారు కాదు. బయటి నుంచి వచ్చానని, నన్నో పోలీసు ఇన్ఫార్మర్గా భావించి భయపడేవారు. రకరకాలుగా ఇబ్బంది పెట్టేవారు. వారు చెప్పేది అర్థమయ్యేది కాదు. ఆ సమయంలోనే ముందుగా వారి భాష నేర్చుకోవాలని అనుకున్నాను. అలా వారి భాష నేర్చుకుని వారిలో ఒకరిగా కలిసిపోయాను. ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలనే తపనతో పని చేశాను. ‘ఈ పని నేనే చేయగలనని అనుకుంటే ఏదైనా సాధించగలరు. నేను చేయగలనా? అనుకుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు’. నా ద్వారా ఆ గిరిజనులకు భాషాపరంగా మేలు జరగాలనే తలంపుతోనే ముందుకు వెళ్లాను. ఆ సమయంలో ప్రొఫెసర్ సింథియా వెస్లీతో పాటు చాలా మంది విదేశీయుల నుంచి ప్రోత్సాహం నన్ను మరింత కార్యోన్ముఖురాలిని చేసింది. ఆల్ఫా, బీటా ఏవిధంగా రాయాలో వారి నుంచి నేర్చుకున్నాను. అంతరించి పోతున్న బగత, గదబ, కొలామి, కొండదొర వంటి 19 గిరిజన భాషలకు లిపిని రూపొందించడంలో విజయం సాధించాను. తద్వారా 2022లో అప్పటి భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారం అందుకున్నాను.● నా దారిలో ఎన్నో ముళ్లు గుచ్చుకున్నాయి ● ఎవరిని ఉద్ధరించాలని అంటూ హేళన చేశారు ● అయినా వెనుకడుగు వేయలేదు ● అలా 19 గిరిజన భాషలకు లిపి రూపొందించా.. ● ‘నన్నయ’ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ వ్యక్తిగతం.. గుంటూరు జిల్లా సీతానగరంలో 1964 సెప్టెంబరు 2న జన్మించాను. నాన్న సత్తుపాటి ప్రసాదరావుది రైల్వేలో ఉద్యోగం కావడంతో విజయవాడ, కోల్కతా, మిరాజ్(మహారాష్ట్ర)లో చదువుకున్నాను. విజయవాడలో పదో తరగతి, కేబీఎన్ కళాశాలలో ఇంటర్, మాంటిస్సోరి మహిళా కళాశాలలో డిగ్రీ (1982–84) చదివాను. తరువాత విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ(ఏయూ)లో ఎంఏ, తిరుపతి పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేశాను. అమ్మ వసుంధరాదేవి గృహిణి. అయినా పేపర్, పుస్తకాలు ఎక్కువగా చదివేది. నాకు ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. పెద్ద చెల్లెలు విజయవాడ, చిన్న చెల్లెలు కాకినాడ, తమ్ముడు రామచంద్రపురంలో ఉద్యోగాలు చేస్తున్నారు. వృత్తిగతం.. 1987లో పద్మావతి మహిళా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా బోధనా వృత్తి చేపట్టి, 14 ఏళ్లు పని చేశాను. అక్కడి నుంచి విశాఖపట్నం ఏయూకు వచ్చాను. పాత సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవడంతో 2002లో అక్కడ ప్రొఫెసర్ చేరాను. ఆవిధంగా ప్రొఫెసర్గా ఆంధ్రప్రదేశ్లో 23 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించిన ఏకై క మహిళగా గుర్తింపు పొందాను. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 10 సెమినార్లు నిర్వహించి, 60 సెమినార్లలో పాల్గొన్నాను. నేను రాసిన 125 పరిశోధన వ్యాసాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రచురితమయ్యాయి. అలా.. గోదారి బిడ్డనయ్యా.. నా భర్త హరి వెంకట లక్ష్మణ్, మాది ప్రేమ వివాహం. మమ్మల్ని ఏయూనే కలిపింది. నేను ఇంగ్లిష్, ఆయన సోషియాలజీలో పీజీ చేస్తూండగా మా మనసులు కలిశాయి. మొదట పెద్దలు అంగీకరించకపోయినా, తరువాత ఓకే అన్నారు. ఆవిధంగా ఈ ప్రాంతానికి చెందిన అల్లు ఎరకయ్య కోడలిగా గోదావరి ప్రాంత బిడ్డనయ్యాను. మా అమ్మాయిని కూడా ఈ ప్రాంతంలోనే ఇచ్చాం. గోదావరి వాసే. నా ఎదుగుదలకు ఆయన దివిటీ ప్రస్తుతం నేనీ ఉన్నత స్థితిలో ఉండటానికి ప్రధాన కారణం నా భర్త హరి వెంకట లక్ష్మణ్ అని గర్వంగా చెబుతా. ఆయన ఓ కొవ్వొత్తిలా కరిగిపోతూ నా ఎదుగుదలకు దివిటీలా నిలిచారు. గిరిజన భాషలకు లిపిని రూపొందించే క్రమంలో ఎంతో బిజీగా ఉండేదాన్ని, ఆ సమయంలో మాకున్న ఒకే ఒక్క పాప హర్షిత ఆలనా పాలనా ఆయనే చూసుకుంటూ, కార్యోన్ముఖురాలిని కావాలని ప్రోత్సహించారు. హర్షిత ప్రస్తుతం మెకానికల్ ఇంజినీర్గా వర్క్ ఫ్రమ్ హోం చేస్తోంది. ఒక బాబు ఉన్నాడు. పుట్టింటి వారు ఉన్నత స్థాయిలో ఉన్నవారే.. అమ్మ, నాన్న వైపు వారంతా ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్–1 ఉద్యోగాలు చేసిన వారే. నలుగురు మావయ్యలలో ఇద్దరు ఐపీఎస్, ఒకరు ఐఏఎస్. చిన్నమ్మలిద్దరూ వైద్యులు. మా తాతయ్య వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు, ధనవంతుడు కూడా. ఆ సమయంలో ధనాన్ని బానల్లో దాచుకునేవారంటారు. ఒక విద్యార్థి నమ్మకంగా ఉంటూనే కొంత ధనాన్ని దోచుకున్నాడట. నాకు 6 నెలల వయసులోనే తాతయ్య చనిపోయారు. నా ఎదుగుదల ఎక్కువగా కోల్కతాలోనే. ఆ తరువాత మహారాష్ట్ర, విజయవాడల్లో పెరిగాను. అందుకనే 23 భాషలు మాట్లాడతాను. అన్నయ్య ఆశయం నెరవేరింది మా అన్నయ్య (కజిన్) ఐజీగా పని చేస్తూ చనిపోయా రు. కొన్నేళ్ల క్రితం ఆయన నాకు ఒక చీర బహుమతిగా ఇస్తూ, ‘నువ్వు కచ్చితంగా వైస్ చాన్సలర్ అవుతావు. అప్పుడు కట్టుకో’ అన్నాడు. ఆయన నమ్మకం నిజమైంది. అందుకే ఆ చీరను నన్నయ వీసీగా బాధ్యతలు తీసుకునే సమయంలో కట్టుకున్నాను. స్టూవర్టుపురం అంటూ ఇంకా వదిలిపెట్టరా? తాతగారి ఊరి పేరు స్టూవర్టుపురం అని చెప్పడమే గానీ, నేను ఏనాడూ అక్కడ లేను. ఊహ తెలిసిన తరువాత స్టూవర్టుపురం అంటే దొంగల ఊరు అంటారని కాస్త భయపడ్డాను. కానీ అక్కడి వారు చాలా మంచివారు. నిజానికి ఏ ఊళ్లో దొంగలు లేరు చెప్పండి? ‘పూర్వం చదువుకోనందు వల్లనే చాలా మంది దొంగలుగా తయారయ్యారు. కానీ నేటి కాలంలో చదువుకున్న వాళ్లు కూడా దొంగలుగా మారుతున్నారు, దీన్ని ఏమనాలి?’ అని మా నాన్నమ్మ అంటూండేది. ఆచార్య ప్రసన్నశ్రీ ఎలా ఎదిగిందనేది వదిలేసి, స్టూవర్టుపురానికి చెందిన.. అంటూ ఆ గ్రామం మూలాలున్న వారిని ఇంకా వదిలిపెట్టరా? ‘జీవితం పూలబాట కాదు. దారిలో ఎన్నో ముళ్లు గుచ్చుకున్నాయి. ఏనాడూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. ఎంచుకున్న లక్ష్యం వైపు అడుగులు వేశాను. ఆడ పిల్లలకు పెద్ద చదువులు ఎందుకనే సమాజం నుంచి.. ఆడపిల్లలు తలచుకుంటే దేనిలోనూ తీసిపోరనే నమ్మకంతో పయనించాను. ఉనికి కోల్పోతున్న 19 గిరిజన భాషలకు లిపి రూపొందించి.. ఆయా వర్గాలకు ఎంతో కొంత మేలు చేసేందుకు ప్రయత్నించాను. ఈ క్రమంలో కన్నవారితో పాటు కట్టుకున్న భర్త ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. గిరిజన భాషలకు లిపిని కూర్చే క్రమంలో ఒకసారి నాటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ను కలిసే అవకాశం వచ్చింది. నా ప్రయత్నం గురించి తెలుసుకున్న ఆయన.. ‘నీ కాళ్లలో ఎన్ని ముళ్లు గుచ్చుకున్నాయ్ ప్రసన్నా’ అని అన్న మాటలు మరువలేను’ అన్నారు ‘నారీ శక్తి’ పురస్కార గ్రహీత.. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సత్తుపాటి ప్రసన్నశ్రీ. ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ది, సమాజానికి అందించే నన్నయ వర్సిటీకి ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన ఈ తొలి గిరిజన మహిళ.. మార్చి 8– అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన జీవనపథంలోని వెలుగుచీకట్లను తనను కలసిన ‘సాక్షి’తో పంచుకున్నారు. – రాజానగరం భగత గిరిజన భాషకు ఆచార్య ప్రసన్నశ్రీ రూపొందించిన లిపి పిచ్చిగీతలంటూ హేళన 1982లో ఇంటర్మీడియెట్ అయిన తరువాత అటవీ ప్రాంతానికి వెళ్లాను. అక్కడి వారిని చూసి, వారి కోసం ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను. ఉద్యోగం వచ్చిన తరువాత వాచకంగా ఉన్న భాషకు లిపిని అందించాలనే సంకల్పించాను. శూన్యం నుంచి ఒక ప్రపంచాన్ని సృష్టించుకుని ఎదగడానికి ప్రయత్నించాను. నా ప్రయత్నాన్ని కొందరు ఉన్నతాధికారులు, నాయకులు ప్రోత్సహించకపోగా ఏమిటీ పిచ్చి గీతలు, ఎవరిని ఉద్ధరించాలని అంటూ అవమానించారు. ఆ సమయంలో నిజంగా నరకం చూశాను. చాలా బాధ వేసేది. వాటన్నిటినీ భరిస్తూనే నా ప్రయత్నాన్ని వదలలేదు. మనిషి మనుగడ అభివృద్ధి వైపు అడుగులు వేయాలంటే అక్షరం అవసరం. దానిని గుర్తించి, నా ప్రయత్నాన్ని కొనసాగించాను. -
నేడు 2కే రన్
కాకినాడ సిటీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 7 గంటలకు కాకినాడ భానుగుడి జంక్షన్ నుంచి సర్పవరం జంక్షన్ వరకూ 2కే రన్ నిర్వహిస్తున్నారు. కలెక్టర్ షణ్మోహన్ గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, మహిళలు తదితరులు పాల్గొంటారన్నారు. కూటమి సిండికేట్కే గీత కార్మికుల మద్యం షాపులు అమలాపురం రూరల్: జిల్లాలో కల్లు గీత కార్మికులకు కేటాయించిన మద్యం షాపులను కూటమి సిండికేట్లే దక్కించుకున్నారు. జిల్లాలో మొత్తం 13 మద్యం షాపులను గీత కార్మికులకు కేటాయించారు. అమలాపురం మున్సిపాలిటీ, అమలాపురం మండలం, ఆలమూరు, అయినవిల్లి, ఐ.పోలవరం, కె.గంగవరం, కపిలేశ్వరపురం, కొత్తపేట, మండపేట మున్సిపాలిటీ, ముమ్మిడివరం రూరల్, పి.గన్నవరం, రామచంద్రపురం మున్సిపాలిటీ, రామచంద్రపురం రూరల్ ప్రాంతాల్లోని ఈ షాపుల్లో ఒకటి గౌడ కులస్తులకు, 12 శెట్టిబలిజలకు కేటాయించి, టెండర్లు పిలిచారు. గీత కార్మికుల ముసుగులో కూటమి సిండికేట్లు ఒక్కో దుకాణానికి 5 నుంచి 15 వరకూ టెండర్లు వేశారు. మొత్తం 261 టెండర్లు దాఖలయ్యాయి. వీటికి కలెక్టరేట్లో జేసీ నిషాంతి, డీఆర్ఓ రాజకుమారి, అమలాపురం ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎస్కేడీవీ ప్రసాద్ పర్యవేక్షణలో గురువారం లక్కీ డ్రా తీసి, షాపులు కేటాయించారు. గ్రహణం మొర్రికి నేడు ఉచిత వైద్య శిబిరం ముమ్మిడివరం: ఏపీ సమగ్ర శిక్ష, హైదరాబాద్ బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యాన గ్రహణం మొర్రి, గ్రహణ శూలతో బాధ పడుతున్న చిన్నారులకు శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి, సమగ్ర శిక్ష అదనపు పథక సంచాలకుడు షేక్ సలీం బాషా గురువారం ఒక ప్రకటన లో ఈ విషయం తెలిపారు. ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నిర్వహించే ఈ శిబిరంలో చిన్నారులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయనున్నారు. శిబిరానికి వచ్చే చిన్నారులకు ఉచిత రవాణా ఖర్చులు ఇస్తారు. జిల్లాలోని చిన్నారుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అదనపు సమాచారానికి జిల్లా సహిత విద్య కో ఆర్డినేటర్ మర్రెడ్డి వెంకట సత్యనారాయణను 99636 54283 మొబైల్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. విపత్కర పరిస్థితిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి అమలాపురం టౌన్: ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలని విద్యార్థినులకు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు సూచించారు. పోలీసు విధులు, ఆయుధాలు, మహిళా పోలీసు స్టేషన్ పనితీరు, ఎఫ్ఐఆర్ నమోదు, దర్యాప్తు, విచారణలపై విద్యార్థినులు, మహిళలు అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినులకు తన కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. పోలీసు విధుల పట్ల అవగాహన కల్పించారు. సమస్యల్లో చిక్కుకున్న మహిళలు, యువతులు మహిళా పోలీస్ స్టేషన్ సేవలను సద్వినియోగం చేసుకునే విధానాన్ని వివరించారు. పోలీసు విధులపై జిల్లా ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్ కూడా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచి సీఐ బి.రాజశేఖర్, డీసీఆర్బీ సీఐ వి.శ్రీనివాస్, అమలాపురం పట్టణ సీఐ కిషోర్బాబు పాల్గొన్నారు. మహిళల సమగ్రాభివృద్ధికి కృషిఅమలాపురం రూరల్: ప్రభుత్వ పథకాల ద్వారా మహిళల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. డీఆర్డీఏ, మెప్మా, వైద్య, ఆరోగ్యం, సీ్త్ర, శిశు సంక్షేమం, పరిశ్రమల శాఖల అధికారులతో కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సత్యనారాయణ గార్డెన్స్లో నిర్వహించే జిల్లా స్థాయి మహిళా దినోత్సవాన్ని ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని సూచించారు. మహిళా సాధికారతను ప్రతిబింబించేలా వివిధ శాఖల ఆధ్వర్యాన సూర్యఘర్, డ్వాక్రా ఉత్పత్తులు, విశ్వకర్మ యోజన, పోషకాహారం వంటి ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. స్వీయ రక్షణపై మహిళలకు అవగాహన కల్పించడంపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ శివశంకర్ ప్రసాద్, జిల్లా పరిశ్రమల కేంద్రం ఏడీ శివరాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మృత్యు శకటం
శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025పల్లిపాలెంలో విషాద ఛాయలుకాజులూరు: ఏలూరు బస్సు ప్రమాదంలో జుత్తుగ భవాని దుర్మరణం పాలవడంతో ఆమె స్వగ్రామం కాజులూరు మండలం పల్లిపాలెం శివారు కళావారిపేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన జుత్తుగ అప్పారావు, భవాని దంపతులకు ఇద్దరు కుమారులు. భార్యాభర్తలిద్దరూ జీవనోపాధి నిమిత్తం కొంత కాలంగా హైదరాబాద్లో ఉంటున్నారు. అప్పారావు ఒక అపార్టుమెంట్లో వాచ్మన్గా చేస్తూండగా భవాని పలువురి ఇళ్లలో పని చేస్తోంది. పెద్ద కుమారుడు ఇంజినీరింగ్, చిన్న కుమారుడు ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. బంధువుల ఇంట్లో వివాహ వేడుకకు భవాని కాకినాడ బయలుదేరింది. ఈ క్రమంలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందింది. ఆమె మరణ వార్త తెలియగానే గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. హైదరాబాద్లో ఉంటున్నప్పటికీ భవాని తరచూ గ్రామానికి వచ్చి వెళ్లేదని, వచ్చిన ప్రతిసారీ అందరితో కలివిడిగా మసులుతూండటంతో అసలు ఆమె ఎప్పుడూ గ్రామంలోనే ఉన్నట్టుండేదని స్థానికులు చెబుతున్నారు. బస్సును పక్కకు తీస్తున్న క్రేన్ ● ఏలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ● లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు ● వేకువజామున ఘటన ● ఘటనా స్థలంలో ముగ్గురు, చికిత్స పొందుతూ మరొకరు మృతి ● 21 మందికి గాయాలు ● మృతులు, క్షతగాత్రుల్లో అత్యధికులు ఉమ్మడి జిల్లా వాసులు ఏలూరు రూరల్: తెల్లవారకముందే వారి జీవితాలు తెల్లారిపోయాయి. కొద్ది గంటల్లోనే గమ్య స్థానాలకు చేరుకోవాల్సిన వారిని మృత్యువు కబళించింది. జిల్లా కేంద్రం ఏలూరులోని చొదిమెళ్ల వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై రత్నాస్ హోటల్ సమీపాన ఆగి ఉన్న ఓ లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సంఘటన స్థలంలోనే ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. చికిత్స పొందుతూ డ్రైవర్ మృతి చెందారు. మరో 21 మంది గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రుల్లో అత్యధికులు కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన వారు. ప్రమాదం అనంతరం బస్సు నుంచి కారిన రక్తధారలు చూసిన వారు భయభ్రాంతులకు గురయ్యారు. సంఘటన స్థలంలో క్షతగాత్రుల హాహాకారాలు మిన్నంటాయి. ప్రమాదం జరిగిందిలా.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న సిమెంట్ లారీ మరమ్మతులతో నిలిచిపోయింది. గురువారం వేకువజామున 5 గంటల సమయంలో రమణ ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తోంది. బస్సును అతి వేగంగా నడుపుతున్న డ్రైవర్ మధు.. పొగమంచు కమ్ముకోవడంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న సిమెంట్ లారీని గుర్తించలేకపోయాడు. చివరి నిమిషంలో గమనించి, తప్పించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో లారీ వెనుక భాగాన్ని బస్సు ఢీకొంది. ఆ వేగానికి కండక్టర్ వైపు భాగాన్ని బస్సు చీల్చుకుంటూ వెళ్లి డివైడర్ను ఢీకొట్టి రోడ్డుపై బోల్తా పడింది. దీంతో బస్సులో నిద్రిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. ఘోర ప్రమాదంతో ఉలిక్కిపడిన స్థానికులు, ఇతర వాహనాల డ్రైవర్లు హుటాహుటిన వచ్చి ప్రయాణికులను రక్షించేందుకు ప్రయత్నించారు. హైవే పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. గాయపడిన వారిని 108 అంబులెన్సులో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘోర ప్రమాదంతో ఘటనా స్థలం రక్తసిక్తం కాగా.. పరిసరాల్లో బస్సులోని విడి భాగాలు చెల్లాచెదురుగా పడి, ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. శకలాల మధ్య ఇరుక్కుపోయి.. నుజ్జునుజ్జయిన బస్సులో కండక్టర్ సీటు వైపు కూర్చున్న మహిళలు మట్టపర్తి భవాని, జుత్తుగ భవాని (38), బొంతు భీమేశ్వరరావు చిక్కుకుపోయి విలవిలలాడారు. బస్సు డ్రైవర్ మధు సైతం స్టీరింగ్ వద్ద ఇరుక్కుపోయాడు. పోలీసులు క్రేన్తో బస్సును లేపి పక్కకు చేర్చారు. బస్సులో చిక్కుకుపోయిన ఈ నలుగురినీ ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మట్టపర్తి భవాని, జుత్తుగ భవాని, భీమేశ్వరరావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. డ్రైవర్ మధుకు అత్యవసర చికిత్స అందించారు. నాలుగు గంటల పాటు మృత్యువుతో పోరాడిన అనంతరం అతడు మృతి చెందాడు. మధు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై ఏలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. క్షత్రగాత్రులు వీరే.. ఈ ప్రమాదంలో కాకినాడకు చెందిన కోలా సురేఖ, కోలా రాజబాబు, కోలా లిఖిత, వనమనీడి ఆదిలక్ష్మి, పి.అక్కమ్మ, కోట వేణి, రాజమహేంద్రవరానికి చెందిన పి.హేమలత, మాచర్ల సుజాత, పాలకొల్లుకు చెందిన మండపాక శ్రీదేవి, మండపాక శశిరేఖతో పాటు మద్దాల కీర్తి, మాచర్ల సుజాత, మండపాక బాలాజీ, మండపాక హరిణి, ఆర్నాలకంటి శ్రీలక్ష్మి, పువ్వుల శ్యామ్కుమార్, శీలం ప్రకాష్, ఎం.ప్రతాప్, గోణజ విజయకుమార్, రామిశెట్టి సోమ సత్యనారాయణ, టి.రవికుమార్, జి.మణికంఠ (క్లీనర్) ఉన్నారు. క్షతగాత్రులకు అధికారులు చికిత్స చేయించి గమ్యస్థానాలకు పంపించారు. అతి వేగం.. పొగమంచు ఈ ఘోర ప్రమాదానికి అతి వేగం, పొగమంచు కారణమని స్థానికులు భావిస్తున్నారు. వేకువజామున పొగమంచు కమ్ముకోవడంతో బస్సు డ్రైవర్ ఆగి ఉన్న లారీని గుర్తించలేకపోయాడు. అదే సమయంలో బస్సును అతి వేగంగా నడుపుతూండటంతో దగ్గరకొచ్చిన తర్వాత లారీని గుర్తించాడు. వెంటనే బస్సును అదుపు చేసే ప్రయత్నం చేసినా అప్పటికే ఘోరం జరిగిపోయింది. మరోవైపు ప్రమాద స్థలానికి 30 మీటర్ల దూరంలో పార్కింగ్ లేన్ ఉండగా.. సిమెంట్ లారీని జాతీయ రహదారి పక్కన నిలపడం కూడా ఈ ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. శోకసంద్రంలో భవానీ కుటుంబం జగ్గంపేట: ఈ ప్రమాదంలో మృతురాలు మట్టపర్తి భవానీ స్వస్థలం కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తోంది. ఆమె తండ్రి రాజు కౌలు రైతు. ఆమెకు ఓ తమ్ముడు ఉన్నాడు. కష్టపడి చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన భవాని.. వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా స్వగ్రామానికి వస్తోంది. ఈ క్రమంలో ఏలూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృత్యువాత పడింది. తమ గారాలపట్టి అయిన భవాని.. తమ కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉంటుందనుకుంటే.. దేవుడు తమపై దయ చూపలేదంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. భవానీ మృతితో ఆమె కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. -
హాకీ జట్టు ఎంపిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): అంతర్ జిల్లాల హాకీ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టు ఎంపిక స్థానిక జిల్లా క్రీడా మైదానంలో మంగళవారం జరిగింది. జిల్లా హాకీ సంఘం ఆధ్వర్యాన జరిగిన ఈ ఎంపికలకు 25 మంది హాజరయ్యారు. డీఎస్ఏ హాకీ కోచ్ నాగేంద్ర పర్యవేక్షణలో 18 మందిని జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకూ గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జరిగే అంతర్ జిల్లాల హాకీ పోటీలో పాల్గొంటారు. ఈ జట్టుకు కోచ్గా దుర్గాప్రసాద్, మేనేజర్గా బాబ్జీ వ్యవహరిస్తారని హాకీ సంఘం ప్రతినిధి రవిరాజు తెలిపారు. ‘మన మిత్ర’ నుంచి టెన్త్ హాల్ టికెట్లు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను మన మిత్ర వాట్సాప్ (వాట్సాప్ గ్రీవెన్స్) ద్వారా విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకూ ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకూ ఈ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. సంబంధిత ప్రధానోపాధ్యాయులు మన మిత్ర వాట్సాప్ యాప్ ద్వారా హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేయవచ్చునని తెలిపారు. అభ్యర్థులు తమ వాట్సాప్ ద్వారా 95523 00009 నంబర్కు హాయ్ అనే సందేశం పంపించి, సేవ, పదో తరగతి హాల్ టికెట్ ఎంపిక చేసుకోవాలన్నారు. అనంతరం అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేస్తే హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుందని డీఈఓ వాసుదేవరావు తెలిపారు. -
వేసవిలో విద్యుత్ సమస్యలపై దృష్టి
అమలాపురం రూరల్: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వేసవిలో విద్యుత్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, కోనసీమకు 6 పవర్ ట్రాన్స్ఫార్మర్లు కేటాయిస్తామని ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ తెలిపారు. అమలాపురం మండలం భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లాలోని విద్యుత్ శాఖ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వేసవిలో ఎక్కడా లోఓల్టేజీ సమస్య లేకుండా చూడాలని, ట్రాన్స్ఫార్మర్ల ఓవర్ లోడ్ను గుర్తించి అందుకు తగిన యాక్షన్ ప్లాన్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. వేసవిలో విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ బిల్లుల బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ప్యానల్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని, వినియోగదారులకు చౌకగా సోలార్ విద్యుత్ అందించే విధానంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. సర్కిల్ కార్యాలయం ఏర్పాటుకు నల్లవంతెన వద్ద అనువైన భవనాలను పరిశీలించారు. తొలుత ఈదరపల్లిలోని విద్యుత్ కార్యాలయం వద్ద లైన్మెన్ దివస్ కార్యక్రమంలో లైన్మన్లను సత్కరించారు. సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్.రాజబాబు, టెక్నికల్ డీఈ ఎస్.నాగేశ్వరరావు, ఈఈలు కె.రాంబాబు, కె.రత్నాలరాజు, అక్కౌంట్ ఆఫీసర్ సత్యకిషోర్, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీగా పేరాబత్తుల విజయం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజేశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులు మధ్య ప్రధానంగా పోటీ జరిగింది. మరో 33 మంది స్వతంత్రులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ ఎన్నికల్లో పేరాబత్తుల తన సమీప ప్రత్యర్థి, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులుపై 77,461 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొదట ప్రాధాన్య ఓట్లు 50 శాతం పైచిలుకు సాధించడంతో ఆయనను విజేతగా ప్రకటించారు. ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది. సోమవారం ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకూ బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను కట్టలు కట్టడానికే సమయం సరిపోయింది. 28 టేబుల్స్ ఏర్పాటు చేసి 17 రౌండ్లు నిర్వహించేలా కట్టలు కట్టారు. ఎట్టకేలకు రాత్రి 10 గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు. ప్రతి టేబుల్కు వెయ్యి చొప్పున సగటున ప్రతి రౌండ్లో 28 వేల ఓట్లు లెక్కించి, 8 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియను ముగించారు. మొత్తం 2,18,997 ఓట్లు పోలవగా వాటిలో 19,789 ఓట్లు చెల్లనివిగా నిర్ధారించారు. మిగిలిన 1,99,208 ఓట్లను లెక్కించారు. ప్రతి రౌండ్లోనూ కూటమి అభ్యర్థి ఆధిక్యం కొనసాగింది. మొదటి రౌండ్లో 28 వేల ఓట్లు లెక్కించగా కూటమి అభ్యర్థికి 16,520, పీడీఎఫ్ అభ్యర్థి 5,815 చొప్పున ఓట్లు దక్కాయి. ఎనిమిది రౌండ్లు కలిపి టీడీపీ అభ్యర్థికి 1,24,702 మొదటి ప్రాధాన్య ఓట్లు రాగా.. పీడీఎఫ్ అభ్యర్థి 47,241 ఓట్లు దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తనయుడు జీవీ సుందర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, మెరుగైన ఓట్లు సాధించారు. ఎనిమిది రౌండ్లలో ఆయనకు 16,183 ఓట్లు దక్కాయి. మిగిలిన అభ్యర్థులు తక్కువ ఓట్లతో సరిపెట్టుకున్నారు. విజేత పేరాబత్తులకు రిటర్నింగ్ అధికారి వెట్రిసెల్వి ధ్రువీకరణ పత్రం అందించారు. ·˘ 77,461 KrÏ Ððl$gêÈt™ø VðSË$ç³# ·˘ ï³yîlG‹œ A¿ýæÅÇ®MìS 47,241 Kr$Ï ·˘ 8 Æú…yýlÏÌZ Ð]l¬Wíܯ]l KrÏ ÌñæMìSP…ç³# -
భయం గుప్పెట్లో వేట్లపాలెం ప్రజలు
సామర్లకోట: వేట్లపాలెంలో గత ఏడాది డిసెంబరు 15న రెండు (కల్దారి, బత్సల) కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు వ్యక్తు లు హత్యకు గురి కావడంతో 23 మంది నిందితులను గుర్తించి కేసు నమోదు చేసిన విషయం విదితమే. 23 మందిని కోర్టుకు హాజరు పర్చగా జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. వీరిలో 20 మంది బెయిల్పై సోమవారం సాయంత్రం విడుదల కావడంతో మంగాయమ్మ కాలనీ వాసులు భయం గుప్పెట్లో జీవిస్తున్నారు. కత్తులతో దాడి చేయడంతో కాల్దారి చంద్రరావు(60, కాల్దారి ప్రకాశరావు(55) కల్దారి ఏసు (45) చనిపోయిన విషయం తెలిసిందే. హత్య జరిగినప్పటి నుంచి మంగాయ్మమ్మ కాలనీలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు తక్కువగా ఉండటంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు. పోలీసులను పెంచి పికెట్ కొనసాగించి గ్రామంలో ప్రశాంత వాతావరణం ఏర్పడే విధంగా కృషి చేయాలని వేట్లపాలెం గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఆ ప్రాంతంలో ఎప్పటికప్పుడు నిఘా ఉండే విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరిరావు ఆధ్వర్యంలో సీఐ ఎ.కృష్ణభగవాన్ ప్రత్యేక నిఽఘా ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలు శాంతంగా ఉండాలని సీఐ రెండు వర్గాలకు సూచించారు. హత్య కేసులో 20 మంది నిందితులు విడుదల పోలీసు పికెట్ కొనసాగించాలని డిమాండ్ -
తండ్రి మందలించాడని ఆత్మహత్యాయత్నం
అమలాపురం టౌన్: ఉప్పలగుప్తానికి చెందిన బి.ఫార్మసీ చదువుతున్న విద్యార్థిని అమలాపురంలో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్యహత్యాయత్నం చేసిన ఘటన పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది, స్థానికులకు ముచ్చెమటలు పట్టించింది. అమలాపురం గాంధీనగర్ శివారులో నిర్మాణం పూర్తయి ఇంకా ప్రారంభం కాని దాదాపు 60 అడుగుల ఎత్తు ఉన్న వాటర్ ట్యాంక్పై ఆ యువతి ప్రమాదకర పరిస్థితుల్లో నిలబడి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ యువతి భీమవరం విష్ణు కళాశాలలో బి.ఫార్మసి చివరి సంవత్సరం చదువుతోంది. 15 రోజులకోసారి ఇంటికి రావడం, చదువుపై అంతగా దృష్టి పెట్టకపోవడంపై తల్లిదండ్రులు ఆమెను తరుచూ మందలిస్తున్నారు. భీమవరం నుంచి ఇంటికి వచ్చిన విద్యార్థిని వైఖరిపై తండ్రి సోమవారం అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం విద్యార్థిని తన ల్యాప్ ట్యాప్లో సినిమా చూస్తోంది. ఇది గమనించిన ఆమె తండ్రి మందలించి పొలం వెళ్లిపోయాడు. తండ్రి మందలింపులతో మనస్తాపం చెందిన ఆ విద్యార్థిని తన బ్యాగ్ తీసుకుని ఉప్పలగుప్తం నుంచి అమలాపురం వెంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో గల తమ బంధువుల ఇంటికి చేరుకుంది. ఆ బ్యాగ్ను బంధువుల ఇంట్లో పడేసి విద్యార్థిని నేరుగా వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లి ట్యాంక్ ఎక్కేసింది. యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుంటోందని గమనించిన స్థానికులు తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో ఆ ట్యాంక్ వద్దకు స్థానికులు చేరకున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి వచ్చారు. పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది తాళ్లు, వలలు కూడా సిద్ధం చేశారు. ఆమెను ట్యాంక్ నుంచి దూకితే రక్షించేందుకు సన్నాహాలు కూడా చేశారు. విద్యార్థినిని ట్యాంక్ దిగాలని అటు స్థానికులు, ఇటు పోలీసులు పదే పదే చెప్పారు. ఇలా గంటకు పైగా సమయం గడిచిపోయింది. ఎట్టకేలకు ట్యాంక్ నుంచి విద్యార్థిని ఏడుస్తూ కిందకు దిగడంతో స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పట్టణ సీఐ పి.వీరబాబు, పట్టణ ఎస్సైలు, అగ్నిమాపక సిబ్బంది విద్యార్థిని ట్యాంక్ నుంచి దింపడంతో సఫలీకృతులయ్యారు. విద్యార్థినికి కౌన్సెలింగ్ నిర్వహించి ఆమె తల్లికి అప్పగించడంతో కథ సుఖాంతమైంది. వాటర్ ట్యాంక్ ఎక్కిన బి.ఫార్మసీ విద్యార్థిని గంటన్నర సేపు పోలీసులు, స్థానికుల్లో ఉత్కంఠ ఎట్టకేలకు విద్యార్థిని ట్యాంక్ దిగడంతో కథ సుఖాంతం -
బస్సులో సూట్ కేసు చోరీ
తస్కరించిన మహిళ నుంచి 117 గ్రాముల బంగారు నగల రికవరీ అమలాపురం టౌన్: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న దంపతులకు చెందిన బంగారు నగలతో ఉన్న సూట్ కేసును వారితో ప్రయాణించిన ఓ మహిళ కాజేసిన కేసును అమలాపురం పట్టణ పోలీసులు ఛేదించారు. దాదాపు రూ.6 లక్షల విలువైన 117 గ్రాముల బంగారు నగలను ఆ మహిళ నుంచి రికవరీ చేయడంతోపాటు ఆమెను మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. ఈ కేసు వివరాలను ఆయన వివరించారు. గత నెల 17వ తేదీన విశాఖపట్నం జిల్లా కూర్మన్నపాలేనికి చెందిన దుర్గమ రామకృష్ణ దంపతులు కాకినాడ ఆర్టీసీ బస్స్టేషన్లో అమలాపురం నాన్ స్టాప్ బస్సు ఎక్కారు. బస్సులో రామకృష్ణ భార్య పక్కనే ఓ మహిళ కూర్చుంది. బస్సులో కాళ్ల దగ్గర బంగారు నగలతో ఉన్న సూట్ కేసును ఆ దంపతులు పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ఆ మహిళ ముమ్మిడివరంలో దిగిపోయింది. రామకృష్ణ దంపతులు అమలాపురంలోని తమ బంధువులు ఇంటికి వెళ్లిన తర్వాత బస్సులో సూట్ కేసు పోయినట్లు గుర్తించారు. ఆ సూట్ కేసులో ఒక బంగారు తెల్ల రాళ్ల నక్లెస్, ఎరుపు ఆకుపచ్చ రాళ్ల బంగారు నక్లస్, బంగారపు ఆకు పచ్చ రాళ్ల నక్లెస్, రెండు బంగారపు లాకెట్లు మొత్తం 117 గ్రాముల బంగారు నగలు ఉన్నట్లు అదే రోజు పట్టణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రామకృష్ణ పేర్కొన్నారు. బస్సులో తన భార్య చెంతన కూర్చున్న మహిళపైనే తమకు అనుమానం ఉందని ఆ ఫిర్యాదులో రాశారు. ఈ కేసును డీఎస్సీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఆధ్వర్యంలో సీఐ వీరబాబు, క్రైమ్ ఎం.గజేంద్రకుమార్ పర్యవేక్షణలో పట్టణ ఎస్సై ఎస్ఆర్ కిషోర్బాబు, క్రైమ్ సిబ్బంది లోతుగా దర్యాప్తు చేశారు. ఆ రోజు బస్సులో బంగారు నగలతో ఉన్న సూట్ కేసును గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం ఎర్ర చెరువు గ్రామానికి చెందిన ఆవుల యశోద దొంగిలించినట్లు తమ దర్యాప్తులో పోలీసులు గర్తించారు. అమలాపురం ఆర్టీసీ బస్సు స్టేషన్లో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న యశోదను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి 117 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. దొంగను రెండు వారాల్లో అరెస్ట్ చేయడమే కాకుండా నూరు శాతం సొత్తును రికవరీ చేసిన సీఐలు వీరబాబు, గజేంద్రకుమార్, ఎస్సై కిషోర్బాబు, క్రైమ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ చోరీలో మహిళా దొంగ యశోదకు సహకరించిన మరో నిందితురాలిని అరెస్ట్ చేయాల్సి ఉందని సీఐ వీరబాబు తెలిపారు. -
నాలుగేళ్లుగా జిల్లాలో మంజూరు చేసిన కౌలు కార్డులు, కౌలు రైతులకిచ్చిన రుణాలు (రూ.కోట్లలో)
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కూటమి ప్రభుత్వ హయాంలో తమకు తీరని అన్యాయం జరుగుతోందని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం పండగ మాదిరిగా ఉండేది. గ్రామ స్థాయిలో విత్తనాలు మొదలుకొని ధాన్యం అమ్మకాల వరకూ రైతులకు వారి చెంతనే సేవలు అందజేసేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వ్యవసాయంపై నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోందని చెబుతున్నారు. అన్నదాతా సుఖీభవ పేరిట ఇస్తామన్న రూ.20 వేల పెట్టుబడి సాయం హామీని గాల్లో కలిపేశారు. మరోవైపు కౌలు రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. గుర్తింపు కార్డులతో సరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఖరీఫ్లో కౌలు రైతుల గుర్తింపులో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. ఎట్టకేలకు జిల్లాలో 35 వేల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చారు. కానీ వారికి ప్రభుత్వం నుంచి ఒక్క పథకం కూడా దక్కలేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కౌలు రైతులకు విత్తనాలు, ఎరువులు, పంట నష్టపరిహారంతో పాటు బ్యాంకుల్లో రుణాలు కూడా ఇచ్చేవారు. ప్రస్తుతం ఖరీఫ్ ముగిసి, రబీ సీజన్ కూడా మొదలై నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకూ కౌలు రైతులకు ప్రభుత్వం పంట నష్టపరిహారం కానీ, ఎరువులు, విత్తనాలు, రుణాలు ఇవ్వడం లేదు. కౌలు రైతులపై రుణపాశం ప్రస్తుతం ఎకరా భూమికి యజమానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకూ కౌలు చెల్లించాల్సి వస్తోంది. ఆ మొత్తం చెల్లించిన అనంతరమే కౌలు రైతులు సాగు చేపడుతున్నారు. దీనికి తోడు విత్తనాల కొనుగోలు మొదలు, పంట దమ్ము, వరి నాట్లు, ఎరువులు, పురుగు మందుల వంటి వాటికి మరో రూ.25 వేలు పైగా పెట్టుబడి అవుతోంది. మొత్తం మీద ఎకరం భూమి కౌలుకు చేయాలంటే రూ.50 వేల వరకూ అవసరం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కౌలు గుర్తింపు కార్డు ఉన్న ప్రతి రైతుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ ఎటువంటి హామీ లేకుండా పంట రుణాలు ఇచ్చేవారు. ప్రస్తుతం గుర్తింపు కార్డులు ఇచ్చినా ఎటువంటి రుణాలూ ఇవ్వకుండానే చేతులు దులుపుకొన్నారు. గత్యంతరం లేక కౌలు రైతులు బయటి వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. పడిన శ్రమంతా కౌలుకు, పెట్టుబడులు, వడ్డీలకే పోతోందని, తమకు మిగులుతున్నదేమీ ఉండటం లేదని కౌలు రైతులు వాపోతున్నారు. కనీసం ప్రభుత్వం బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తే తక్కువ వడ్డీ కావడంతో కనీసం ఆ మొత్తమైనా మిగిలేదని అంటున్నారు. గత ప్రభుత్వంలోనే తమకు ఎంతో మేలు జరిగిందని, ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు మండిపడుతున్నారు. పరిహారం.. పరిహాసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేసేవారు. వైఎస్సార్ రైతు భరోసా కింద నిరుపేద ఎస్సీ, బీసీ కౌలు రైతుల ఖాతాల్లో ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్ల పాటు పెట్టుబడి సాయం జమ చేశారు. ప్రకృతి వైపరీత్యాలకు పంట దెబ్బ తింటే కౌలు రైతులకు కూడా నష్ట పరిహారం అందించేవారు. గత ఏడాది అధిక వర్షాలకు భారీగా పంట నష్టం జరిగినా కౌలు రైతులకు కూటమి ప్రభుత్వం ఎక్కడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. భూమి సర్వే నంబర్ల ఆధారంగా ప్రతి ఎకరాకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వం ఆయా రైతుల ఖాతాల్లో పంట నష్ట పరిహారం జమ చేసింది. ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు భూమి యజమానులు ససేమిరా అనడంతో కౌలు రైతులు నిండా మునిగారు. ఫ గుర్తింపుతో సరి.. రుణాలేవీ మరి! ఫ పట్టించుకోని కూటమి సర్కారు ఫ కౌలు రైతులకు అందని పథకాలు సంవత్సరం కౌలు కార్డులు రుణాలు 2020–21 36,795 18.73 2021–22 44,580 47.17 2022–23 41,322 46.46 2023–24 56,399 53.80 రుణాలిచ్చి ఆదుకోవాలి ఈ ఏడాది కౌలు రైతులకు బ్యాంకుల నుంచి రుణాలివ్వలేదు. బయటి వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకొని తొలకరి సీజన్లో ఇబ్బందులు పడ్డాం. కనీసం దాళ్వాలోనైనా బ్యాంకు రుణాలిప్పించాలి. లేకుంటే కౌలు రైతులు సాగు చేయడం కష్టమే. – రాయుడు శ్రీనివాస్, కౌలు రైతు, యండమూరు, కరప మండలం కౌలు రైతులను పట్టించుకోవడం లేదు ఈ ప్రభుత్వం కౌలు రైతులను అసలు గుర్తించడం లేదు. ఎటువంటి సహాయమూ చేయడం లేదు. గత ప్రభుత్వం కౌలు రైతులను ఎంతగానో ఆదుకొంది. గుర్తింపు కార్డులివ్వడమే కాకుండా బ్యాంకుల ద్వారా పంట రుణాలు కూడా ఇచ్చింది. – తుమ్మల అచ్చియ్య, కౌలు రైతు, పులిమేరు, పెద్దాపురం మండలం -
ఫెన్సింగ్లో జాతీయస్థాయికి ‘లక్ష్య’ విద్యార్థులు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఈనెల ఒకటో తేదీన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో జరిగిన 11వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ ఫెన్సింగ్ పోటీలలో స్థానిక లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు నల్లమిల్లి శేషు రిషిత్ రెడ్డి, ఆప్తి వర్ణిక శేఖర్ ప్రతిభ చూపి వ్యక్తిగత విభాగంలో జాతీయస్థాయికి ఎంపికయ్యారని పాఠశాల డైరెక్టర్ డాక్టర్ సుగుణ మంగళవారం తెలిపారు. జట్టు విభాగంలో రిషిత్ రెడ్డి బంగారు, ఆప్తి వర్ణికశేఖర్ రజత, భవ్య సహజ రెడ్డి రజత, బృహతి ఖడ్గ కాంస్య, బి.లక్ష్మీ కృతిక కాంస్య, ఆన్యజైన్ రజత, వర్ణిక రజత, కె.నిహాంత్ కాంస్య, విరాజ్ బంగారు, హితేష్ బంగారు పతకాలు గెలుచుకున్నారన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి, లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ వందన బొహరా, కోచ్ సతీష్ అభినందించారు. -
కాకినాడకు మినీ రెస్క్యూ టెండర్లు
కాకినాడ క్రైం: కాకినాడ పరిధిలో అగ్నిప్రమాదాలతో పాటు నీటి వనరులు ఎక్కువగా ఉండటంతో జల ప్రమాదాలకు సంబంధించిన కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని రాష్ట్ర అగ్నిమాపక శాఖ నార్త్ రీజియన్ అదనపు డైరెక్టర్ జి.శ్రీనివాసులు తెలిపారు. వీటి నిర్వహణకు గాను కాకినాడకు మినీ రెస్క్యూ టెండర్లు మంజూరు చేస్తామని చెప్పారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆయన స్థానిక వివేకానంద పార్క్ ఎదురుగా ఉన్న జిల్లా అగ్నిమాపక శాఖ కార్యాలయంతో పాటు, సాలిపేట ఫైర్ స్టేషన్ను మంగళవారం సందర్శించి, రికార్డులు పరిశీలించారు. సిబ్బంది కార్యకలాపాలు, పరికరాలు, స్టేషన్ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా సహాయ ఫైర్ అధికారి వి.సుబ్బారావును అభినందించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ, మినీ రెస్క్యూ టెండర్లలో ప్రత్యేక నైపుణ్యంతో కూడిన సిబ్బందితో పాటు అవసరమైన పరికరాలు ఉంటాయని చెప్పారు. జిల్లాలో పరిశ్రమలు అధికమని, రసాయనాల వల్ల అనుకోని దుర్ఘటనలు జరిగితే ప్రాణ నష్టాన్ని ఊహించలేమని అన్నారు. అటువంటి రసాయన ప్రమాదాల నివారణకు గాను త్వరలో కాకినాడకు హజ్మత్ వాహనాన్ని కేటాయించనున్నామని తెలిపారు. పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగితే తక్షణమే బయట పడేందుకు అక్కడి భద్రతా సిబ్బందికి ప్రత్యేక రెస్క్యూ శిక్షణ ఇస్తామని శ్రీనివాసులు తెలిపారు. దీనికోసం స్థానిక జగన్నాథపురంలోని అగ్నిమాపక కేంద్రం ఆవరణలో ప్రత్యేక శిక్షణా విభాగం ఏర్పాటు చేస్తామని చెప్పారు. దట్టమైన పొగలో సిబ్బంది ఎటువంటి ప్రమాదానికీ గురి కాకుండా త్వరలో జిల్లాకు బ్రీతింగ్ ఆపరేటర్లు ఇస్తున్నామని తెలిపారు. సాలిపేట అగ్నిమాపక కార్యాలయానికి త్వరలో కొత్త భవనం నిర్మాణం ప్రారంభం కానుందన్నారు. దీనికి అన్ని అనుమతులూ పూర్తయ్యాయని వెల్లడించారు. జగన్నాథపురం ఫైర్ స్టేషన్లో నిర్మాణం, మరమ్మతు పనులు పూర్తి చేసేందుకు మంగళవారం టెండర్లు పిలిచామని శ్రీనివాసులు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఫైర్ అధికారి పీవీఎస్ రాజేష్, ఏడీఎఫ్వో సుబ్బారావు కూడా పాల్గొన్నారు.ఫ హజ్మత్ వాహనం కూడా త్వరలో మంజూరు ఫ అగ్నిమాపక శాఖ ఏడీ శ్రీనివాసులు -
రత్నగిరిపై రూ.1.60 కోట్లతో అభివృద్ది పనులు
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో రూ.1.60 కోట్లతో పలు అభివృద్ది పనులు చేపట్టనున్నారు. రూ.40 లక్షలతో రెండో ఘాట్ రోడ్డుపై బీటీ రోడ్డు నిర్మాణం, రూ.1.20 కోట్లతో న్యూ సీసీ, ఓల్డ్ సీసీ సత్రాలు, ప్రకాష్ సదన్ సత్రాల గదుల మరమ్మతులు నిర్వహించనున్నారు. ఈ పనులకు త్వరలో టెండర్లు పిలవనున్న నేపథ్యంలో దేవదాయ శాఖ సాంకేతిక సలహాదారు కొండలరావు, చీఫ్ ఇంజినీర్ జీవీ శేఖర్ తదితరులు ఆయా సత్రాలను మంగళవారం సందర్శించి, పనుల ఆవశ్యకతను పరిశీలించారు. రెండో ఘాట్ రోడ్డు నిర్మాణ పనులకు టెండర్లు పిలిచారు. మిగిలిన మూడింటికీ టెండర్లు పిలవాల్సి ఉంది. కార్యక్రమంలో దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు, ఈఈలు రామకృష్ణ, నూకరత్నం, డీఈలు రాంబాబు, గుర్రాజు, ఎలక్ట్రికల్ డీఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్పోర్ట్ కేంద్రాల్లో తనిఖీలు కాకినాడ క్రైం: బాణసంచా అక్రమ తరలింపు నేపథ్యంలో సోమవారం కాకినాడలో చోటు చేసుకున్న పేలుడుతో జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. నగరంలోని పలు కొరియర్, ట్రాన్స్పోర్ట్ కేంద్రాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పార్శిళ్లను బాంబ్ స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీ చేస్తోంది. సంస్థ యాజమాన్యాలకు బాణసంచా, ఇతర పేలుడు పదార్థాలు, రసాయనాలు, మాదక ద్రవ్యాలు బుక్ చేయొద్దంటూ ఆదేశాలు ఇచ్చారు. అనుమానాస్పద పార్సిళ్లను గుర్తిస్తే తక్షణమే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ తనిఖీల్లో కాకినాడ వన్టౌన్ సీఐ నాగదుర్గారావు, టూటౌన్ సీఐ మజ్జి అప్పలనాయుడు, డాగ్ స్క్వాడ్ బృందాలు పాల్గొన్నాయి. ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పరీక్షలు జిల్లాలో మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షకు 21,502, మంది హాజరు కాగా, 732 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,673 మంది హాజరవగా 135 మంది గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి నూకరాజు తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి శిక్షణ కాకినాడ రూరల్: రమణయ్యపేటలోని ఏపీఎస్పీ మూడో బెటాలియన్ కార్యాలయంలో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) సిబ్బందికి రెండు వారాల శిక్షణను కమాండెంట్ ఎం.నాగేంద్రరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ కమాండెంట్ ఎస్.దేవానందరావు మాట్లాడుతూ, పోలీస్ శాఖలో ఎస్డీఆర్ఎఫ్ పాత్ర ఎంతో కీలకమైనదని అన్నారు. ఆపదలో ఉన్నవారిని ముందుండి రక్షించే లక్ష్యంతో తొలిసారిగా మూడో బెటాలియన్లోనే ఎస్డీఆర్ఎఫ్ను ప్రారంభించారని తెలిపారు. కమాండెంట్ నాగేంద్రరావు మాట్లాడుతూ, తిత్లీ తుపాను, దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు బోల్తా, ఇటీవల విజయవాడ సింధు నగర్ అర్బన్ ప్లాంట్లో జరిగిన ప్రమాద ఘటనల్లో ఏపీఎస్పీ మూడో బెటాలియన్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది మంచి ప్రతిభ చూపారన్నారు. ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రత్యేకంగా రివార్డులు ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది తాము ఉపయోగించే వివిధ పరికరాలను కమాండెంట్కు చూపించి, వాటి పనితీరును వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు మోహన్రావు, బి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పాదగయకు రూ.11.75 లక్షల ఆదాయం పిఠాపురం: పాదగయ క్షేత్రంలో శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి ఆలయం హుండీని మంగళవారం తెరచి ఆదాయం లెక్కించారు. సీఎస్ఓ సీహెచ్ రామ్మోహనరావు, ఇన్స్పెక్టర్లు వడ్డి ఫణీంద్రకుమార్, జోగా సత్యనారాయణ పర్యవేక్షణలో ఆలయ ఈఓ కె.జగన్మోహన్ శ్రీనివాస్ ఆధ్వర్యాన ఈ కార్యక్రమం జరిగింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని 17 రోజులకు గాను హుండీల ద్వారా రూ.11,74,660 ఆదాయం లభించిందని ఈఓ తెలిపారు. -
సత్రం భవనం నిర్మాణంపై సందిగ్ధం
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో రూ.11.40 కోట్లతో నిర్మించనున్న శ్రీ సీతారామ సత్రం (ఎస్ఆర్సీ) నిర్మాణం సందిగ్ధంలో పడింది. దీని టెండర్లను ఒకటి రెండు రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉండగా.. మంగళవారం దేవదాయ శాఖ సాంకేతిక సలహాదారు పి.కొండలరావు, చీఫ్ ఇంజినీర్ జీవీ శేఖర్, సాంకేతిక కమిటీ సభ్యులు దేవస్థానానికి వచ్చారు. ఈ సత్రాన్ని పడగొట్టి కొత్త భవనం నిర్మించేకన్నా పాత భవనానికి మరమ్మతులు చేసే విషయం పరిశీలించాలని సూచించారు. అయితే, పాత సత్రాన్ని కూల్చివేసి ఇనుము, కలప తీసుకు వెళ్లడానికి, సత్రం కూల్చివేయగా వచ్చిన వ్యర్థాలను బయటకు తరలించడానికి గాను దేవస్థానానికి రూ.4.50 లక్షలు చెల్లించేలా టెండర్ ఇప్పటికే ఖరారైంది. ఈ పరిస్థితుల్లో పాత భవనానికి మరమ్మతులు చేయాలంటూ నిపుణులు, ఉన్నతాధికారులు చేసిన సూచనలతో స్థానిక అధికారులు డోలాయమానంలో పడ్డారు. గతంలోనే నిర్ణయం రత్నగిరిపై భక్తుల వసతి గదుల సమస్య పరిష్కారానికి గాను సీతారామ సత్రం స్థలంలో రెండు బ్లాకులతో నూతన భవనం నిర్మాణానికి గత ఏడాదే ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ మేరకు అప్పట్లో అన్నవరం దేవస్థానం ఈఓగా పని చేసిన ప్రస్తుత దేవదాయ శాఖ ఇన్చార్జి కమిషనర్ కె.రామచంద్ర మోహన్ గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. శిథిలావస్థకు చేరిన పాత సత్రాన్ని కూల్చివేయాలంటూ ఆర్అండ్బీ అధికారులు ఇచ్చిన నివేదిక మేరకు ఆ నిర్ణయం తీస్కున్నారు. నూతన సత్రాన్ని రెండు దశల్లో నిర్మించాలని నిర్ణయించారు. తొలి దశలో దక్షిణం వైపు నాలుగంతస్తుల్లో 105 గదులతో బ్లాక్–ఎ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. దీనికి అప్పటి దేవదాయ శాఖ కమిషనర్ పరిపాలనా అనుమతులు కూడా మంజూరు చేశారు. ఈ మేరకు గత జనవరిలో టెండర్లు పిలిచారు. గ్రౌండ్ ఫ్లోర్ వాహనాల పార్కింగ్కు వదిలేయాలని, 1, 2, 3 అంతస్తుల్లో ఫ్లోర్కు 35 చొప్పున 105 గదులు నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి 12 మంది కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయగా ఈ వారంలో ఖరారు చేయాలని నిర్ణయించారు. ఈ పరిస్థితుల్లో దేవదాయ శాఖ అధికారులు, నిపుణులు పాత సత్రాన్ని కూల్చకుండా తాత్కాలిక మరమ్మతులు చేయిస్తే ఇంకో పదేళ్లు ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ సత్రంలో కొన్ని గదులు వర్షానికి కారిపోతున్నాయని చెప్పగా.. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో లీకేజీలు అరికట్టాలని సూచించారు. రూ.11.40 కోట్లతో మరోచోట సత్రం 105 గదుల సత్రం నిర్మించాలని చెప్పారు. దీంతో సీతారామ సత్రం నూతన భవనం నిర్మాణంపై సందిగ్ధత ఏర్పడింది. ఈ విషయాన్ని కమిషనర్ రామచంద్రమోహన్ దృష్టికి తీసుకువెళ్లి ఆయన ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని దేవస్థానం ఈఈ వి.రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు, ఈఈలు రామకృష్ణ, నూకరత్నం, డీఈలు గుర్రాజు, రాంబాబు, ఎలక్ట్రికల్ డీఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఫ పరిశీలించిన అధికారులు ఫ మరమ్మతులకు అవకాశాలను పరిశీలించాలన్న నిపుణులు ఫ ఇప్పటికే రూ.11.40 కోట్లతో కొత్త సత్రం నిర్మాణానికి టెండర్లు ఫ నిపుణుల సలహాతో డోలాయమానం -
నైతిక విలువలు లేకుంటే ఎన్ని డిగ్రీలు ఉన్నా వృథాయే
● ‘నన్నయ’ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ ● నారీ ఫెస్ట్ 2025 ఉత్సవాలు ప్రారంభం రాజానగరం: సమాజంలో నైతిక విలువలు పాటించని వారికి ఎన్ని డిగ్రీలు ఉన్నా వృథాయేనని, వాటికి విలువ కూడా ఉండదని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య సత్తుపాటి ప్రసన్నశ్రీ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యూనివర్సిటీ మూడు రోజులపాటు నిర్వహించే ‘నారీ ఫెస్ట్ 2025’ ఉత్సవాలను మంగళవారం ఒక చిన్నారితో జ్యోతిని వెలిగింపజేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన సభలో వీసీ మాట్లాడుతూ ఆడవారిని ఆకాశంలో సగం, అవకాశాలలో సగం అంటే సరిపోదని, ఆదరించడంలో కూడా సగం కావాలన్నారు. ఆడవారికి ఆదరణే ఆధారమని, ఆ ఆదరణ తల్లిదండ్రుల నుంచి, జీవిత భాగాస్వామి నుంచి, పిల్లల నుంచి లభిస్తుందన్నారు. గతంలో ఆడవారి పట్ల వివక్ష చూపేవారని, ఆధునిక సమాజంలో కొంత మార్పు వచ్చిందన్నారు. ఇదే క్రమంలో రాబోయే కాలంలో వివక్ష లేని సమాజం వైపు అడుగులు వేయాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు. తరాలు మారుతున్నా అంతరాలు మారకూడదనే ఉద్దేశంతో బామ్మ – మనుమరాలి షో నిర్వహిస్తున్నామన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచే బామ్మలను స్ఫూర్తినగా మార్గదర్శకంగా తీసుకుని ఆమె చేయి పట్టుకుని మనుమరాళ్లు నడుస్తుంటే ముచ్చటగొలుపుతుందన్నారు. పెద్దలను ఎల్లప్పుడూ గౌరవించాలని, వృద్ధాశ్రమాల అవసరం లేని సమాజం వైపు పయనించాలన్నారు. అలరించిన వెల్ బేబీ షో బామ్మ – మనుమరాలు షోతోపాటు నిర్వహించిన వెల్ బేబీ షోకు కూడా అపూర్వ స్పందన లభించింది. రాజమహేంద్రవరం పరిసరాల నుంచి తరలివచ్చిన అనేక మంది తల్లిదండ్రులు తమ చిన్నారులను వేదిక పైకి తీసుకువచ్చి, బుడగలతో పోటీలు నిర్వహించడంలో ఎంజాయ్ చేశారు. అలాగే గ్రూప్ సింగింగ్, గ్రూప్ డాన్స్, ఫ్యాషన్ షో, స్కిట్స్లలో పోటీలు జరిగాయి. పరిసరాలలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉమెన్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ పి. ఉమామహేశ్వరిదేవి, ప్రిసైడింగ్ అధికారి డాక్టర్ వి.పెర్సిస్, డాక్టర్ ఎన్.సజనారాజ్, డాక్టర్ కె.దీప్తి, డాక్టర్ డి. లతా, డాక్టర్ బి.విజయకుమారి, ఆచార్య డి.జ్యోతిర్మయి, డాక్టర్ పి.విజయనిర్మల, డాక్టర్ కె.సుబ్బారావు, డాక్టర్ కె.నూకరత్నం, డాక్టర్ పద్మావతి, డాక్టర్ కె.రమణేశ్వరి పాల్గొన్నారు. -
బోటురైడర్, హెల్పర్పై హత్యాయత్నం కేసు
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): బోటులో అనధికారికంగా తీసుకువెళ్లి మళ్లీ సోమవారం రాత్రి తిరిగి వస్తుండగా బోటు తిరగబడి ఇద్దరు మృతిచెందిన ఘటనపై త్రీటౌన్ పోలీసులు సుబ్బారావుపేటకు చెందిన బెజవాడ సత్తిబాబు ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సుబ్బారావుపేటకు చెందిన బెజవాడసత్తిబాబు, సింహాచలనగర్కు చెందిన చవల అన్నవరం(54), కాతేరు మిలటరీకాలనీకి చెందిన గాడారాజు(24), కోట రాంబాబు, భవానీపురానికి చెందిన మరికొందరుతో కలిసి కోటిలింగాలరేవు నుంచి సోమవారం మధ్యాహ్నం బోటులో బ్రిడ్జిలంక వెళ్లారు. రాత్రి తిరిగి వస్తుండగా బోటులోకి నీరు రావడంతో తిరగబడింది. -
అగ్ని ప్రమాదానికి పశువుల శాల ఆహుతి
● కాలిపోయిన 4 గేదెలు, రెండు ఆవులు, నాలుగు దూడలు ● రూ.ఐదు లక్షల నష్టం సామర్లకోట: మండల పరిధిలో వీకే రాయపురంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు గేదెలు, రెండు ఆవులు, నాలుగు దూడలు పూర్తిగా కాలిపోయాయి. వీటిలో రూ.1.50 లక్షల విలువ కలిగిన గేదె అక్కడికక్కడే మృతి చెందింది. రైతులు, బాధితుల కథనం ప్రకారం వీకే రాయపురం సమీపంలోని మామిళ్లదొడ్డిలోని పశువుల పాకపై విద్యుత్తు వైరు తెగి పడిపోవడంతో మంటలు చెలరేగి పశువుల పాక పూర్తిగా కాలి బూడిద అయింది. ఆ పాకలో ఉన్న పశువులు పూర్తిగా కాలిపోయాయి. మూగజీవాల ఆర్తనాదాలకు సమీపంలో ఉన్న రైతులు పశువుల పాక వద్దకు చేరుకొని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేసి పశువుల యజమాని రంగనాథం వీరభద్రరావుకు సమాచారం ఇచ్చారు. మంగళవారం ఉదయం పశువైద్యాధికారి మాకినీడి సౌమ్య ఘటనా ప్రదేశానికి చేరుకొని కాలిపోయిన పశువులను పరిశీలించారు. కాలిపోయిన పశువులు జీవించే అవకాశం లేదన్నారు. సుమారు రూ.5 లక్షల వరకు నష్టం ఉంటుందని చెప్పారు. కాలిపొయిన పశువుల ఆర్తనాదాలు రైతుల హృదయాలను కదిలించి వేశాయి. పశువుల పరిస్థితిని చూచి వైఎస్సార్ సీపీ మండల పార్టీ అధ్యక్షుడు తలారి దొరబాబు, రైతు సంఘ నాయకుడు ఇంటి వెంకట్రావులు కంటతడి పెట్టుకున్నారు. వైద్యం అందించినా పశువులు జీవించే అవకాశం లేదని వైద్యాధికారి సౌమ్య తెలిపారు. రెండు పశువులకు మాత్రమే బీమా ఉన్నదని ఆమె చెప్పారు. పశువులకు జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన రిపోర్టును ఉన్నతాధికారులకు పంపుతానని చెప్పారు. వీఆర్వో రైతుల నుంచి సమాచారం సేకరించి తహసీల్దార్ను నివేదిక సమర్పించారు. స్విమ్మింగ్ పూల్లో తప్పిన ప్రమాదం నీట మునిగి సీపీఆర్తో బతికిన స్విమ్మర్ నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడామైదానంలోని స్విమ్మింగ్ పూల్లో ప్రమాదవశాత్తూ మునిగిపోయి ఓ వ్యక్తి స్పృహ కోల్పోగా స్విమ్మింగ్ పూల్ సిబ్బంది సకాలంలో స్పందించడంలో పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే జిల్లా క్రీడామైదానంలోని స్విమ్మింగ్ పూల్లో ఉదయం 8 నుంచి 9 గంటల బ్యాచ్లో శంఖవరం గ్రామానికి చెందిన ప్రదీప్కుమార్ నెల రోజుల నుంచి కాకినాడ స్విమ్మింగ్ చేస్తున్నాడు. రోజులాగే మంగళవారం కూడా స్విమ్మింగ్ పూల్కు వచ్చిన ఆయన ఈత కొడుతున్న సమయంలో ముక్కులోకి నీరు వెళ్లి ఊపిరి ఆడక అస్మారక ిస్థితిలోకి వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న స్విమ్మింగ్ కోచ్ అప్పలనాయుడు, సీనియర్ స్విమ్మర్లు దానిని గమనించి ప్రదీప్కుమార్ను కొలనులోనుంచి బయటకు తీసి సీపీఆర్ చేసి అంబులెన్సులో దగ్గర ఉన్న ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి ప్రదీప్కు ఆస్తమా ఉన్న కారణంగా ఊపిరి సమ్యస్య వచ్చిందని తెలిపి చికిత్సను ప్రారంభించారు. స్విమ్మింగ్ పూల్ వద్ద లైఫ్గార్డుల స్థానంలో సీనియర్ స్విమ్మర్లను డీఎస్ఏ అధికారులు కొనసాగిస్తున్నారు. లైఫ్గార్డుల నియామకానికి శాప్కు లేఖ రాసినా ఇంతవరకు అనుమతి రాకపోవడంతో సీనియర్లను కొనసాగించాల్సి వస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. డీఎస్డీఓ శ్రీనివాస్కుమార్ను వివరణ కోరగా త్వరలోనే లైఫ్గార్డులను నియమిస్తామని తెలిపారు. క్షతగాత్రులకు కొనసాగుతున్న చికిత్స కాకినాడ క్రైం: కాకినాడలోని జై బాలాజీ ట్రాన్స్పోర్ట్లో సోమవారం చోటు చేసుకున్న బాణసంచా పేలుడు ఘటనలో క్షతగాత్రులకు కాకినాడ జీజీహెచ్లో చికిత్స కొనసాగుతోంది. కాకినాడ వన్టౌన్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేయగా విచారణ కొనసాగుతోంది. మంగళగిరి నుంచి వచ్చిన ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ బృందం పేలుడు జరిగిన ప్రదేశంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టింది. పలు నమూనాలు సేకరించింది. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,500 గటగట (వెయ్యి) 16,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ఆశాభంగం
ప్రభుత్వం ప్రకటించిన వరాలు పనికిరావు జిల్లాలో ఎన్నికల కోడ్ ఉన్నా హడావుడిగా ఆశా కార్యకర్తలను సంతృప్తి పరచేందుకు పలు రాయితీలను అందిస్తుందంటూ ప్రభుత్వం ఇచ్చిన లీకేజీల వల్ల ఆశా కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. 2006లో పూర్తి స్థాయిలో ఆశా కార్యకర్తలను పోస్టులు భర్తీ చేయగా మధ్యలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసుకుంటూ వచ్చారు. గత పదేళ్ల నుంచి ఆశా కార్యకర్తల పోస్తుల భర్తీకి అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వం ప్రకటించిన ప్రసూతి సెలవులు ఉపయోగించుకొనే అవకాశం లేదని ఆశా కార్యకర్తలు చెబుతున్నారు. గ్రాడ్యుటీని ప్రవేశపెట్టి రూ.1.50 లక్షలు పదవీ విరమణ అనంతరం ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటన కూడా బూటకమని వారు చెబుతున్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ సర్వీసు ఉంటేనే గ్రాడ్యుటీ అమలు చేస్తామని మెలిక పెట్టడం ఆశా కార్యకర్తలను వంచించడమేనని మండిపడుతున్నారు. వేతనాల పెంపు లేకుండా కేవలం పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడంలో ఆశా కార్యకర్తలకు ఒరిగేదేమీ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాటి వైఎస్సార్ సీపీ సర్కారులో స్వర్ణయుగం 2019–24 మధ్య కాలంలో పాలించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంది. చాలీచాలని వేతనాలతో దుర్భర జీవితం అనుభవించిన ఆశా కార్యకర్తలకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాడు చేసిన పాదయాత్రలో ఆశా కార్యకర్తల దుస్థితిని గుర్తించారు. అందుకనుగుణంగా వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టిన వెంటనే అప్పటి వరకూ రూ.మూడు వేలు ఉన్న వేతనాన్ని ఒక్కసారిగా 2019 ఆగస్టు 12న రూ.పది వేలకు పెంచారు. ఆశా కార్యకర్తల కులం, మతం, ప్రాంతం, వర్గం చూడకుండా సజావుగా విధులు నిర్వహించేందుకు భరోసా కల్పించారు. నేటి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో పోల్చుకుంటున్న ఆశా కార్యకర్తలు నాటి స్వర్ణయుగాన్ని తలుచుకుంటున్నారు. ఆలమూరు: రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రతకు అహర్నిశలు శ్రమిస్తున్న ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పిచడంతో పాటు దీర్ఘకాలిక డిమాండ్లు పరిష్కరిస్తామన్న కూటమి ప్రభుత్వం హామీ నీటిమూటగా మారింది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అలవి కాని హామీలిచ్చి అమలు చేయలేక అన్ని వర్గాల ప్రజలు మాదిరిగానే ఆశా కార్యకర్తలను కూడా నయవంచనకు గురిచేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అఽధికారం చేపట్టి 9నెలలు అయినా ఇంకా హామీలు అమలు చేయకపోవడంతో రాష్ట్ర ఆశా కార్యకర్తల సమాఖ్య పిలుపు మేరకు గత ఏడాది నవంబర్ 18న ఆశా కార్యకర్తలు జిల్లా కేంద్రమైన అమలాపురంలోని డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద తమ నిరసనలను తెలియజేశారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం ఆశా కార్యకర్తల డిమాండ్లను సానుకూల దృక్పథంతో పరిష్కారిస్తామని ఆ సమయంలో హామీ ఇచ్చింది. ప్రభుత్వం మాట తప్పిన వైనాన్ని జీర్ణించుకోలేని ఆశా కార్యకర్తలు తాడోపేడో తేల్చుకునేందుకు ఈ నెల ఆరవ తేదీన చలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీంతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పోలీసులు ధర్నాకు వెళ్లే వారిని గుర్తించే పనిలో నిమగ్నమై బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనుకాడవద్దని ఆశా కార్యకర్తలు తీర్మానించుకున్నారు. ఆశా కార్యకర్తలపై పెరిగిన పని ఒత్తిడి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనున్న 56 ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రస్తుతం 1395 మంది ఆశా కార్యకర్తలు విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి వెయ్యి జనాభాకు ఒక ఆశా కార్యకర్తను ప్రభుత్వం నియమించవలసి ఉంది. జిల్లాలో 2011 జనాభా గణాంకాల ప్రకారం 17.19 లక్షల మంది జనాభా ఉండగా ఆశా కార్యకర్తలను దాదాపు 1,700 మందిని నియమించవలసి ఉంది. ప్రస్తుతం వివిధ కారణాల రీత్యా ఖాళీ అయిన ఆశా కార్యకర్తల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. దీంతో ప్రస్తుతం ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలపైనే అదనపు భారం పడుతోంది. రోజు రోజుకు ప్రవేశపెడుతున్న యాప్లతో పాటు పని ఒత్తిడితో ఆశా కార్యకర్తలు సతమతమవుతున్నారు. దైనందిన జీవితంలో నిత్యవసరాల ధరలతో పాటు ఖర్చులు పెరిగినట్లుగా వేతనం పెరగక ఆశా కార్యకర్తలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఆశా కార్యకర్తల డిమాండ్లు ఇవీ కనీస వేతనం రూ.20 వేలు చెల్లించాలి. ఒప్పంద జీవోలన్నింటిని విడుదల చేయాలి. ఏఎన్ఎం శిక్షణ పొందిన వారందరికి పర్మి నెంట్ పోస్టుల భర్తీ సమయంలో తగిన ప్రాధాన్యం కల్పించాలి. అర్హతను బట్టి దశల వారీగా ఏఎన్ఎం శిక్షణను ఇచ్చి ధ్రువపత్రాలను మంజూరు చేయాలి. ఆరోగ్య రంగానికి బడ్జెట్లో ప్రకటించిన వాటి కంటే అధికంగా నిధులు పెంచాలి. ఆరోగ్య భద్రతా చట్టం చేయాలి. ప్రతి యేటా రెండు జతలకు యూనిఫామ్ అలావెన్స్ ఇవ్వాలి. లెప్రసీ సర్వేకు సంబంధించిన పారితోషికాలు వెంటనే చెల్లించాలి.న్యాయబద్ధమైన డిమాండ్లు అంగీకరించాలి రాష్ట్ర ప్రభుత్వం గత సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఆశా కార్యకర్తల న్యాయబద్ధమైన డిమాండ్లను అంగీకరించాలి. ఏఎన్ఎంలుగా పదోన్నతికి అవకాశం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఆశా కార్యకర్తల డిమాండ్లను ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిశీలించి సమస్యలను పరిష్కరించాలి. – కె.కృష్ణవేణి, కోనసీమ జిల్లా ఆశా కార్యకర్తల సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు ఆశా కార్యకర్తలను నయవంచన చేస్తున్న ప్రభుత్వం గత వైఎస్సార్ సీపీలో వేతనం రూ.పది వేలకు పెంపు రేపు చలో విజయవాడకు పిలుపునిచ్చిన సీఐటీయూ పోలీసు కేసులకు, వేధింపులకు భయపడేది లేదు -
విద్యార్థులే.. ఉపాధ్యాయులై..
●● స్వీట్లు పెట్టి.. పాఠాలు చెప్పి.. ● ప్రభుత్వ పాఠశాలలోనే చేరాలని ప్రచారం ● పి.దొంతమూరు హైస్కూల్ విద్యార్థుల వినూత్న ప్రయత్నం పిఠాపురం: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు ఎంతటి ఉత్తమ ఫలితాలను ఇచ్చాయో పిఠాపురం మండలం పి.దొంతమూరు ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులను చూస్తే అర్థమవుతోంది. నాడు–నేడుతో పాఠశాలల రూపురేఖలను కార్పొరేట్కు దీటుగా మార్చడంతో పాటు, ఆంగ్ల మాధ్యమం, విద్యా కానుక, బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు, ఇంగ్లిష్ మీడియం వంటి వినూత్న కార్యక్రమాలను నాటి సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేసింది. దీనిని అందిపుచ్చుకున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాఠాలు వినే స్థాయి నుంచి.. ఏకంగా ఉపాధ్యాయులుగా మారి పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగారు. అది కూడా ఆంగ్లంలో. ఈ పాఠశాల విద్యార్థులు కర్నీడి సత్యకృష్ణ, దొడ్డి సిరి, అడపా జీవమణి, ఎలుగుబంటి నందిని, ఎస్.రేవతి తదితరులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరాలంటూ ఇటీవల వినూత్న ప్రచారం నిర్వహించారు. తమ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్లారు. గడచిన ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలలు ఏవిధంగా మారాయో స్వయంగా వివరించారు. కొంతసేపు ఆ పిల్లలకు పాఠాలు చెప్పారు. వారికి స్వీట్లు పంచి, వచ్చే ఏడాది తమ స్కూల్లోనే చేరాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన ఏవిధంగా ఉందో ఇంగ్లిషులో అనర్గళంగా మాట్లాడి, ఆ చిన్నారులకు అవగాహన కల్పించారు. ఇలా ప్రతి వారం ఆయా పాఠశాలలకు వెళ్లి, ఈ ప్రచారాన్ని కొనసాగించనున్నారు. ఆశ్చర్యం కలిగింది ఇంకా పదో తరగతిలోకి కూడా రాని విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు చెప్పడం, ఇంగ్లిషులో అనర్గళంగా మాట్లాడటం చూసి ఆశ్చర్యం కలిగింది. వీరు బెండపూడి విద్యార్థులనే మించిపోయారు. చాలా బాగా చదువుతున్నారు. ఇతర పాఠశాలలకు వెళ్లి విద్యా బోధన చేయడం, వారితో ముచ్చటించడం వంటివి చేస్తే, పది మందిలో మర్యాదగా మాట్లాడటం అలవాటవుతుంది. పి.దొంతమూరు హైస్కూలు విద్యార్థులు ఇప్పుడదే చేస్తున్నారు. వారితో మాట్లాడి అభినందించా. – నాగమణి, రీజినల్ జాయింట్ డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ -
రత్నగిరిపై కనకవర్షం
● సత్యదేవునికి రికార్డు స్థాయి ఆదాయం ● 30 రోజులకు హుండీల ద్వారా రూ.1.89 కోట్ల రాబడి అన్నవరం: మాఘ మాసం పుణ్యమా అని రత్నగిరిపై కనకవర్షం కురిసింది. గడచిన 30 రోజులకు గాను అన్నవరం దేవస్థానానికి హుండీల ద్వారా రికార్డు స్థాయిలో రూ. 1,88,91,940 ఆదాయం సమకూరింది. దేవస్థానంలోని హుండీలను సోమవారం తెరచి, భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. నగదు రూ. 1,80,63,749, చిల్లర నాణేలు రూ.8,28,191 వచ్చా యని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సు బ్బారావు తెలిపారు. వీటితో పాటు బంగారం 66.010 గ్రాములు, వెండి 693 గ్రాములు వచ్చాయని చెప్పారు. విదేశీ కరెన్సీ హుండీల ద్వారా సత్యదేవునికి పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ కూడా లభించింది. అమెరికన్ డాలర్లు 129, సింగపూర్ డాలర్లు 50, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ దీనార్ 21, ఇంగ్లండ్ పౌండ్లు 10, ఖతార్ రియల్స్ 28, ఆస్ట్రేలియా డాలర్లు 25, యూఏఈ దీరామ్స్ 530, యూరోలు 5, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ బైసా 100, మలేషియా రింగిట్స్ 6 లభించాయి. కలిసొచ్చిన మాఘం గడచిన మాఘ మాసంలో రత్నగిరిపై పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. అలాగే ఫాల్గుణ మాసంలో కూడా గత మూడు రోజులుగా రత్నగిరిపై జోరుగా వివాహాలు జరుగుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న వారు కూడా అధిక సంఖ్యలో సత్యదేవుని ఆలయానికి తరలి వస్తున్నారు. అలాగే, గత నెలలో భీష్మ ఏకాదశి సందర్భంగా సుమారు లక్ష మంది భక్తులు సత్యదేవుని దర్శనానికి వచ్చారు. ఇలా వచ్చిన భక్తులందరూ పెద్ద మొత్తంలో హుండీల్లో కానుకలు సమర్పించారు. దీంతో రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిందని, హుండీల ద్వారా రోజుకు సగటున రూ.6,09,412 రాబడి వచ్చిందని చైర్మన్, ఈఓ తెలిపారు. వచ్చిన నగదును స్థానిక స్టేట్ బ్యాంకుకు తరలించారు. -
మా అభివృద్ధిని వివరించాం
మేం చిన్నప్పుడు ఈ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి వరకూ చదువుకున్నాం. మా గ్రామంలోని ఉన్నత పాఠశాలలో సౌకర్యాలు లేక వేరే ఊరిలోని ప్రైవేటు పాఠశాలలో చేరాలనుకునే వాళ్లం. కానీ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాడు–నేడుతో మా గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. సకల సౌకర్యాలూ వచ్చాయి. విద్యా బోధనలోనూ మార్పులు రావడంతో ఇంగ్లిషులో అనర్గళంగా మాట్లాడుతున్నాం. అందుకే మా గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మా ఉన్నతిని వివరించి, వారు ఇదే పాఠశాలలో చేరే విధంగా అవగాహన కల్పించాలని భావించాం. – ఎలుగుబంటి నందిని, 9వ తరగతి విద్యార్థిని, పి.దొంతమూరు మంచి అనుభూతి చిన్నప్పుడు చదువుకున్న స్కూలుకు వెళ్లి మేం పాఠాలు చెప్పడం మంచి అనుభూతిని కలిగించింది. మా గ్రామ ప్రాథమిక పాఠశాలలోని చిన్నారులను మా పాఠశాలకు ఆహ్వానించాలని అనిపించింది. చాక్లెట్లు తీసుకుని వెళ్లి, వారితో కొంతసేపు గడిపాం. పాఠాలు చెప్పి, మా పాఠశాలలో జాయిన్ అవ్వాలనే ఆసక్తిని పెంచాం. మమ్మల్ని చూసి వారు చాలా ఆనందపడ్డారు. తామూ అదే స్కూలులో చదువుకుంటామన్నారు. మేం మాట్లాడుతున్న ఇంగ్లిషు విని తాము కూడా అలా నేర్చుకుంటామంటూ ఆసక్తి చూపారు. – కిల్లాడి సంధ్యారాణి, 9వ తరగతి విద్యార్థిని, పి.దొంతమూరు -
ఉద్యోగినులకు రేపు క్రీడా పోటీలు
కాకినాడ సిటీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉద్యోగినులకు సాంస్కృతిక, ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎన్జీవో సంఘం మహిళా విభా గం చైర్పర్సన్ బి.సుజాత తెలిపారు. ఈ పోటీలకు క లెక్టర్ షణ్మోహన్ను ఎన్జీవో సంఘం నేతలు సోమ వారం ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారితో కలసి క్రీడా పోటీల పోస్టర్ను కలెక్టర్ కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ, ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ క్రీడా మైదానంలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి జరిగే క్రీడా పోటీల్లో మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సంఘం ఉమ్మ డి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు గుద్దటి రామ మోహన్రావు, కార్యదర్శి పేపకాయల వెంకటకృష్ణ, కోశాధికారి వై.పద్మమీనాక్షి తదితరులు పాల్గొన్నారు. నెలాఖరు వరకూ గాలికుంటు నివారణ టీకాలు కాకినాడ సిటీ: పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణకు ఈ నెలాఖరు వరకూ టీకాలు వేస్తామని జిల్లా పశు సంవర్ధక శాఖ అదనపు సంయుక్త సంచాలకుడు డాక్టర్ ఆర్.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కలెక్టరేట్లో కలెక్టర్ ష ణ్మోహన్ను సోమవారం మర్యాద పూర్వకంగా కలిశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆరో విడత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఈ నెల 31వ తేదీ వర కూ వేస్తామని చెప్పారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వెంకటేశ్వరరావు కోరారు. సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లాలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలుంటే ఈ నెల 10వ తేదీలోగా తన కార్యాలయంలో సమర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా విద్యా శాఖ వెబ్సైట్లో సీనియారిటీ జాబితా ఉందని, అభ్యంతరం తెలిపేవారు ఉపాధ్యాయుడి పూ ర్తి పేరు, అభ్యంతరానికి కారణాన్ని సాక్ష్యాలతో సహా వివరించాలని సూచించారు. గడువు తరువాత వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని తెలిపారు. డ్వామా పీడీగా శ్రీనివాసరావు కాకినాడ సిటీ: డీఆర్డీఏ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్గా జి.శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నెల్లూరు జిల్లా డ్వామా పీడీగా పని చేస్తూ బదిలీపై ఇక్కడకు వస్తున్నారు. -
సత్యదేవునికే శఠగోపం!
● షార్ట్ టెండర్ లేకుండానే కాంట్రాక్ట్ ● ఇప్పటి వరకూ రూ.49 లక్షలకే పనులు ● ఇప్పుడు ఆరింటిగా విభజించి రూ.70 లక్షలకు పెంపు ● చక్రం తిప్పిన ఓ ఇన్స్పెక్టర్ ● అన్నవరం దేవస్థానంపై ప్రతి నెలా రూ.21 లక్షల భారంసాక్షి ప్రతినిధి, కాకినాడ: అధికారం అండతో అక్రమార్కులు ఏకంగా అన్నవరం సత్యదేవుడికే శఠగోపం పెట్టేశారు. నిబంధనలకు పాతరేసి తస్మదీయులకు రూ.లక్షల విలువైన కాంట్రాక్ట్ కట్టబెట్టేశారు. నిబంధనల ప్రకారం రూ.5 లక్షలు దాటే పనులకు టెండర్లు పిలవాలి. ఒకవేళ టెండర్లకు సమయం తక్కువగా ఉంటే కనీసం షార్ట్ టెండర్ అయినా ఆహ్వానించాలి. కానీ, అన్నవరం దేవస్థానంలో కొందరు అధికారులు, టీడీపీ నేతలు కుమ్మకై ్క అటువంటి నిబంధనలకు మంగళం పాడేశారు. ఏం జరిగిందంటే.. సత్యదేవుని సన్నిధికి వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఇబ్బంది కలగకూడదని పారిశుధ్యం, హౌస్ కీపింగ్, ధోబీ, ఎలక్ట్రికల్ వంటి పనులను కాంట్రాక్ట్కు ఇచ్చేందుకు రెండేళ్లకోసారి టెండర్లు పిలుస్తూంటారు. దేవస్థానంలో ఈ పనులను రెండేళ్లుగా ఒక సంస్థ నిర్వహించేది. దీనికి గాను ఆ సంస్థకు ప్రతి నెలా రూ.49 లక్షల చొప్పున చెల్లించేవారు. దీని కాంట్రాక్టు గడువు గత నవంబర్తో ముగిసింది. అయినప్పటికీ ప్రభుత్వం టెండర్ ద్వారా కొత్త ఏజెన్సీని ఎంపిక చేయలేదు. దీంతో దేవస్థానం అధికారుల అభ్యర్థన మేరకు ఆ ఏజెన్సీ గత నెల 28వ తేదీ వరకూ సేవలు కొనసాగించింది. గడువు ముగిసినా కాంట్రాక్ట్ కొనసాగిస్తూ పోతే ప్రతి నెలా తాము రూ.10 లక్షల మేర నష్టపోతామని నెలన్నర క్రితమే ఆ సంస్థ దేవస్థానం అధికారులకు తెలియజేసింది. చక్రం తిప్పిన ‘నంబర్–2’! గడువు ముగిసినా సేవలు కొనసాగిస్తున్న ఆ సంస్థను తప్పించి, తమ అనుయాయుడికి కట్టబెట్టేందుకు టీడీపీలో నంబర్–2గా చెప్పుకొనే ఓ నేత గట్టి ప్రయత్నమే చేశారు. అయితే, ఆ అనుయాయుడికి ఈ పనుల్లో కనీస అనుభవం కూడా లేకపోవడంతో చివరకు వెనుకడుగు వేశారు. అయినప్పటికీ పాత సంస్థ కాంట్రాక్ట్ గడువు ముగిసిపోవడంతో.. తాత్కాలిక సర్దుబాటు అనే సాకుతో ఇన్నాళ్లూ ఒకే ఏజెన్సీ నిర్వహించిన పనులను ఆరింటిగా విభజించి, తన అనుయాయులకు కట్టబెట్టారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. పారిశుధ్య కార్మికుల సరఫరా, పారిశుధ్య పనుల నిర్వహణ, శానిటేషన్ మెటీరియల్ సరఫరా, పెస్ట్ కంట్రోల్, గార్బేజ్ తరలింపు, ధోబీ, ఎలక్ట్రిసిటీ.. ఇలా పనులను విభజించేసి, షార్ట్ టెండర్లు పిలవకుండానే గుంటూరుకు చెందిన ఓ కాంట్రాక్టర్తో పాటు పలువురికి కట్టబెట్టేయడం విస్మయానికి గురి చేస్తోంది. దీనికోసం సంబంధిత ఏజెన్సీలతో ముందస్తు ఒప్పందాలు చేసుకున్నారని అంటున్నారు. అంతేకాదు.. నిన్న మొన్నటి వరకూ నెలకు రూ.49 లక్షలకే జరిగిన ఈ పనులను ఇప్పుడు రూ.70 లక్షలకు పెంచేశారు. దీనంతటి వెనుక టీడీపీలో నంబర్–2గా చెప్పుకొనే ఓ సీనియర్ నేత చక్రం తిప్పారని, అందువల్లనే టెండర్లతో ప్రమేయం లేకుండానే పనులు కట్టబెట్టేశారని అంటున్నారు. దీనంతటి ఫలితంగా దేవస్థానంపై ప్రతి నెలా రూ.21 లక్షల మేర అదనపు భారం పడుతోంది. ఈ అంశం అన్నవరం కొండపై ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ముఖ్య నేత ఆదేశాలతో.. ‘దేశం’ ముఖ్య నేత ఆదేశాలతో దేవస్థానం అధికారులు దేవదాయ శాఖ కమిషనర్కు నోట్ ఫైల్ పంపించి, ఆగమేఘాలపై అనుమతులు రప్పించారనే ఆరోపణలు వస్తున్నాయి. విజయవాడ నుండి డెప్యూటేషన్పై వచ్చి, గడువు కూడా ముగిసినా దేవస్థానాన్ని వదిలిపెట్టని ఓ ఇన్స్పెక్టర్ ఈ వ్యవహారంలో చక్రం తిప్పారని కొండపై ప్రచారం జరుగుతోంది. పైగా ఆయన కూడా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన తన సన్నిహితుడికి ఒక విభాగాన్ని ఇప్పించుకున్నారని తెలిసింది. స్వామి సన్నిధిలో సేవలన్నింటినీ ఒకే ఏజెన్సీ నిర్వహిస్తే బాధ్యతగా ఉంటుందనే ఉద్దేశంతో గతంలో తీసుకున్న నిర్ణయాన్ని గాలికొదిలేసి.. అనుయాయులకు అయాచిత లబ్ధి చేకూర్చే పన్నాగం పన్నారని అంటున్నారు. రెండేళ్లుగా ప్రతి నెలా రూ.49 లక్షలకే జరిగిన పనులను.. ఇప్పుడు ఆరింటిగా విభజించి రూ.70 లక్షలు చెల్లించేందుకు దేవదాయ శాఖ ఏవిధంగా ఆమోదం తెలిపిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేవలం తమ వారికి లబ్ధి చేకూర్చాలనే దుర్బుద్ధితోనే ఇలా చేశారని పలువురు విమర్శిస్తున్నారు. వాస్తవానికి ఇన్ని లక్షల రూపాయల విలువైన కాంట్రాక్ట్ను కనీసం షార్ట్ టెండరయినా పిలవకుండా.. అధికారం చేతిలో ఉందనే ధైర్యంతో ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయి వరకూ గట్టి లాబీయింగ్ చేసి పని చక్కబెట్టేశారని అంటున్నారు. పాత సంస్థ కాంట్రాక్ట్ కాలపరిమితి గత నవంబర్లోనే ముగిసింది. ఇన్ని నెలలైనా దేవస్థానం అధికారులు షార్ట్ టెండర్ పిలవాలనే ఆలోచన చేయకపోవడం వెనుక.. తమ వారికి కాంట్రాక్ట్ కట్టబెట్టాలనే టీడీపీ నేత వ్యూహం ఉందని కొండపై చర్చ జరుగుతోంది. అన్నవరం దేవస్థానంలో వస్తున్న ఆదాయానికి, ఖర్చులకు పొంతన లేకుండా పోతోందని కొంత కాలంగా భక్తుల నుంచి ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో దేవస్థానం అధికారులు ఖర్చులు తగ్గించుకుని, ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించాలి. అలా కాకుండా అధికార పార్టీ నేతలకు అయాచిత లబ్ధి చేకూర్చేలా చర్యలు చేపట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. -
కట్టలు కట్టేందుకే 12 గంటలు
●● ఉదయం 8 గంటలకు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం ● రాత్రి 8.30 గంటల వరకూ కట్టలతోనే సరి ● రాత్రి 9 గంటలకు ప్రారంభమైన చెల్లిన, చెల్లని ఓట్ల లెక్కింపు ● తొలిసారి ఏలూరు జిల్లాలో కౌంటింగ్ తంతుసాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రహసనంలా మారింది. పోలయిన ఓట్లను కట్టలు కట్టడానికే 12 గంటలకు పైగా సమయం పట్టింది. మూడు షిఫ్టుల్లో 700 మంది సిబ్బందిని నియమించినా కౌంటింగ్ ప్రక్రియ వేగంగా సాగడం లేదు. 2.18 లక్షల ఓట్లు గత నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ జరిగింది. ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. కౌంటింగ్ ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమును ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేశారు. మొత్తం ఆరు జిల్లాల్లోని 456 పోలింగ్ కేంద్రాల్లో 3,14,984 మందికి గాను 2,18,997 మంది ఓటు వేశారు. సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. ఉదయం 6.30 గంటలకే దాదాపు 250 మంది సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. మొత్తం 1,368 బ్యాలెట్ బాక్సులను 17 రౌండ్లుగా విభజించి కట్టలు కట్టే ప్రక్రియ ప్రారంభించారు. ఈ ప్రక్రియ రాత్రి 8.30 గంటల వరకూ సాగింది. 28 టేబుళ్లు ఏర్పాటు చేసి, 17 రౌండ్లుగా విభజించి, కట్టలు కట్టి, ఓట్ల లెక్కింపునకు సిద్ధం చేశారు. రాత్రి 9 గంటల నుంచి చెల్లిన, చెల్లని ఓట్లను వేరు చేసి, లెక్కింపు మొదలు పెట్టారు. ఈ ప్రక్రియకు సుమారు 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో రాత్రి సుమారు 11 గంటల తర్వాత కానీ మొదటి రౌండ్ లెక్కింపు ప్రారంభం కాలేదు. 28 టేబుళ్లకు సగటున 10 వేల నుంచి 15 వేల ఓట్లు కేటాయించి, చెల్లిన, చెల్లని ఓట్లు, మొదటి ప్రాధాన్యతా క్రమంలో ఓట్లను వేరు చేసి లెక్కింపు ప్రారంభించారు. మొదటి రౌండ్లో 10,783, రెండో రౌండ్లో 13,929, మూడో రౌండ్ 11,870, నాలుగో రౌండ్ 13,777, ఐదో రౌండ్ 13,168, ఆరో రౌండ్ 14,783, ఏడో రౌండ్ 12,841, ఎనిమిదో రౌండ్ 14,296, తొమ్మిదో రౌండ్లో 14,162, పదో రౌండ్ 11,654, పదకొండో రౌండ్ 13,674, పన్నెండో రౌండ్ 12,296, పదమూడో రౌండ్ 12,523, పధ్నాలుగో రౌండ్లో 13,876, పదిహేనో రౌండ్ 14,668, పదహారో రౌండ్ 15,823, పదిహేడో రౌండ్లో 4,879 చొప్పున ఓట్లను లెక్కించనున్నారు. ఆరు జిల్లాల అధికారులున్నా.. ఆరు జిల్లాల్లో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించిన డీఆర్వోలు, ఇతర జిల్లా స్థాయి అధికారులతో పాటు తహసీల్దార్లు, వివిధ విభాగాల అధికారులు కౌంటింగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్నా ఓట్ల లెక్కింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఉదయం 6 గంటలకు విధుల్లోకి వచ్చిన సిబ్బంది మధ్యాహ్నం 2 గంటలకు వెళ్లిపోతారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకూ, రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకూ మూడు షిఫ్టుల్లో లెక్కింపు జరుగుతోంది. కృష్ణా – గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గుంటూరులో జరుగుతూండగా, అక్కడి సిబ్బంది రాత్రి 8.30 గంటలకే మూడో రౌండ్ లెక్కింపు పూర్తి చేశారు. గతంలో నాలుగుసార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ గుంటూరులో నిర్వహించడం తదితర కారణాలతో అక్కడ ఓట్ల లెక్కింపు వేగంగా సాగుతోంది. ఏలూరు జిల్లాకు తొలిసారి కావడం, అధికారులకు అనుభవం తక్కువగా ఉండటం వంటి కారణాలతో ఇక్కడ మాత్రం జాప్యం జరుగుతోంది. కౌంటింగ్ సిబ్బంది మొత్తానికి భోజనాలతో సహా అన్ని ఏర్పాట్లూ కౌంటింగ్ కేంద్రం వద్దే చేశారు. ఉదయం 8 గంటల నుంచే ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లు మొదటి రౌండ్ కౌంటింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. కూటమి పార్టీల మద్దతుతో టీడీపీ నేత పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులుతో పాటు మరో 33 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో నిలిచి విషయం తెలిసిందే. -
మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
తుని రూరల్: హంసవరంలోని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ విద్యాలయంలో (ఏపీ మోడల్ స్కూల్) 2025–26 విద్యా సంవత్సరం ఆరో తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ పుల్లా పద్మజ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31వ తేదీ లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ జరిగే ప్రవేశ పరీక్షకు హాజరు కావాలని తెలిపారు. ప్రతిభవంతులైన విద్యార్థులను ఎంపిక చేసి, జాబితా 27న ప్రకటిస్తామన్నారు. ఏప్రిల్ 30 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన, కౌన్సెలింగ్ జరుగుతాయన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.cse.ap.gov.in లేదా www.apms.apcfss.in వెబ్సైట్లలో దరఖాస్తు చేసుకోవాలని పద్మజ సూచించారు. ధర్మ పరిరక్షణలో భాగస్వాములు కావాలి తుని: జీవాత్మకు పరమాత్మను అనుసంధానం చేసేదే ధర్మమని, ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య, ఆధ్మాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని కహెన్ షా వలీ దర్గాలో సోమవారం జరిగిన 28వ వార్షిక సర్వధర్మ సమ్మేళన సభకు ఆయన అధ్యక్షత వహించారు. సికింద్రాబాద్ యోగాలయ నిర్వహకుడు డాక్టర్ వాసిలి వసంత్ కుమార్, హిందూ ధర్మ ప్రతినిధి స్వామి విజయానంద, ఇస్లాం ప్రతినిధి సూఫీ షేక్ అహ్మద్ జానీ, క్రైస్తవ ప్రతినిధి ఎస్.బాలశౌరి, బౌద్ధం ప్రతినిధి పూజ్య భంతే, సిక్కు మత ప్రతినిధి గురుచరణ్ సింగ్తో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి, సమ్మేళనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సమాజంలో శాంతి, మానవత్వం విలువలను తెలియజేయడానికి సర్వధర్మ సమ్మేళన సభలు నిర్వహిస్తున్నామని అన్నారు. మానవ జన్మను సార్థకం చేసుకునేందుకు ఆధ్యాత్మికతను అలవరచుకోవాలని సూచించారు. మానవత్వమే మతమని గ్రహించాలని, ఈశ్వర తత్వాన్ని పాటించాలని అన్నారు. ఉమర్ ఆలీషా రూరల్ ట్రస్ట్ ఆధ్వర్యాన పక్షుల ఆహారానికి ధాన్యం వరి కుచ్చులు, మహిళలకు కుట్టు మెషీన్లు, విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేశారు. ఉమర్ ఆలీషాను తుని కమిటీ ఆధ్వర్యంలో సత్కరించారు. కార్యక్రమంలో జి.సత్యనారాయణ, ప్రసాదవర్మ, పింగళి ఆనందకుమార్, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహంగా ఫైరింగ్ ప్రాక్టీస్ పెద్దాపురం: స్థానిక ఫైరింగ్ రేంజ్లో జిల్లా సాయిధ దళాల వార్షిక మొబలైజేషన్ ఫైరింగ్ ప్రాక్టీస్ సోమవారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ బింధుమాధవ్ పాల్గొని, ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. పోలీసులు ఉపయోగింగే అత్యాధునిక ఏకే–47, ఎస్ఎల్ఆర్, ఎం–5 తదితర ఆయుధాలతో లాంగ్రేంజ్, 9 ఎంఎం పిస్టల్స్తో షార్ట్ రేంజ్లో ప్రాక్టీస్ చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తెలుగు, హిందీ, సంస్కృతం పరీక్షలకు 17,748 మంది విద్యార్థులు హాజరు కాగా 461 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,493 మంది పరీక్ష రాయగా, 52 మంది హాజరు కాలేదని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి నూకరాజు తెలిపారు. పరక్షలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొన్నారు. నేడు మద్యం అమ్మకాల నిషేధం కాకినాడ సిటీ: ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా మంగళవారం మద్యం అమ్మకాలను నిషేధిస్తూ కలెక్టర్ షణ్మోహన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. లిక్కర్ షాపులతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్లలో కూడా మద్యం అమ్మరాదని స్పష్టం చేశారు. -
ఉమ్మడి జిల్లా ట్రెజరీ ఉద్యోగుల కార్యవర్గం
కాకినాడ లీగల్: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ట్రెజరీ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఈ ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. ఎన్నికల అధికారిగా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎ.రామ్మోహన్రావు వ్యవహరించగా, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా పి.కిరణ్ కుమార్(నెల్లూరు), రాష్ట్ర పరిశీలకుడిగా డి.రమణ రెడ్డి(నెల్లూరు) వ్యవహరించారు. ఎన్నికల అనంతరం పి. శ్రీనివాసరావు ప్యానెల్ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ఎ.రామ్మోహన్రావు ప్రకటించారు. నూతన అధ్యక్షుడిగా పి.శ్రీనివాసరావు, సహాధ్యక్షుడిగా వి.చంద్రశేఖర్, ఉపాధ్యక్షులుగా ఎస్.ఈశ్వరి, వి.శ్రీనివాస్, వి.శశికుమార్, ఎం.విశ్వనాథం, కార్యదర్శిగా వై.భాస్కరావు ఎన్నికయ్యారు. అలాగే సంయుక్త కార్యదర్శులుగా నజీరా బేగం, బీవీవీ సత్యనారాయణ, ఆర్.జయకృష్ణ, కోశాధికారిగా వైఎన్ మూర్తి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎస్.శ్రీనివాస్, ఎ.పాపారావు, హైదర్ ఆలీపాషా, ఉదయ్కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా శ్రీనివాసరావు కార్యదర్శిగా భాస్కరరావు -
ఉచితంగా వినికిడి పరీక్షలు
కాకినాడ క్రైం: ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా సోమవారం ఉచితంగా వినికిడి పరీక్షలు నిర్వహించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆడియోలజిస్ట్స్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పేథోలజిస్ట్స్ అసోసియేషన్ (ఏపీఏఎస్ఎల్పిఏ), ఇండియన్ స్పీచ్, లాంగ్వేజ్ అండ్ హియరింగ్ అసోసియేషన్ (ఐఎస్హెచ్ఏ) ఆంధ్రప్రదేశ్ శాఖ జనరల్ సెక్రటరీ డాక్టర్ పెబ్బిలి గోపి వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ పి.రేణుకాదేవి తెలిపారు. ఈ మేరకు ఆదివారం స్థానిక లచ్చిరాజు వారి వీధిలో వాగ్దేవి స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్లో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, వినికిడి సమస్యను నిర్లక్ష్యం చేస్తే జీవితాలు దుర్భరం అవుతాయన్నారు. వినికిడి లోపం ఉన్న చిన్నపిల్లల్లో మాట్లాడే లోపం లేకపోయినా మాటలు రావని అన్నారు. వివిధ కారణాలు ఇందుకు దారితీస్తాయని తెలిపారు. సోమవారం ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా ఐఎస్హెచ్ఏ, ఏపీఏఎస్ఎల్పీఏల సంయుక్త ఆధ్వర్యంలో వినికిడి లోపంతో బాధపడుతున్న ఐదేళ్లలోపు పిల్లలకు ఓఏఈ, పెద్దలకు ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ అనే పరీక్షలను ఉచితంగా నిర్వహించాలని నిర్ణయించనున్నట్లు తెలిపారు. సదస్సులు ఏర్పాటు చేసి వినికిడి ప్రాధాన్యం, అది లోపించడం వల్ల తలెత్తే సమస్యలు, వినికిడిని కాపాడుకోవడం, లోపం ఉన్నవారిలో గుర్తించడంపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం కాకినాడలో వాగ్దేవి స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ (లచ్చిరాజు వారి వీధి), శ్రావ్య స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ (సాలిపేట, శ్రావణి ఈఎన్టీ హాస్పిటల్లో), హియర్ జాప్ (మెయిన్ రోడ్ అపోలో ఆసుపత్రి ఎదురుగా), మహి స్పీచ్(రమణయ్యపేట, అపోలో ఫార్మసీ పై అంతస్తు)లో ఉచిత వినికిడి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సహాయం కోసం 99899 85385, 99121 11107 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏపీఏఎస్ఎల్పీ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి డాక్టర్ డి.సూర్యనారాయణ, అసోసియేషన్ సభ్యులు డాక్టర్ వి.హరీష్, డాక్టర్ ఫీబి, డాక్టర్ వి.తేజ, డాక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. నేడు కాకినాడలో నాలుగు కేంద్రాల్లో ఏర్పాటు -
కారు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
● లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ఘటన ● క్షతగాత్రులు రాజమహేంద్రవరం వాసులు దెందులూరు: వివాహానికి కారులో వెళ్లి తిరిగివస్తుండగా జరిగిన ప్రమాదంలో ఐదుగురు గాయాలపాలయ్యారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం గుండేరు వాగు వద్ద శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో నివాసం ఉంటున్న ఊట్ల రామకృష్ణ కుటుంబ సభ్యులు ఐదుగురు కలసి తమ సొంత కారులో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వివాహానికి వెళ్లారు. వివాహానంతరం శనివారం రాత్రి తిరిగి రాజమహేంద్రవరానికి బయలుదేరారు. రాత్రి రెండు గంటల సమయంలో వీరు ఏలూరు జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం గుండేరు వాగు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వెళుతున్న లారీని దాటేందుకు ప్రయత్నించగా, కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ఊట్ల రామకృష్ణకు తలపై, ఆయన భార్య అరుణకు కాలిపై గాయాలయ్యాయి. ఈ ఘటనలో రామకృష్ణ నాన్నమ్మ అనంతలక్ష్మి, అరుణ అమ్మమ్మ సామ్రాజ్యం, వారి కుటుంబ సభ్యుడు ఇరుసుమల్లి మణికంఠ కూడా గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న దెందులూరు ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, హైవే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 అంబులెన్న్సులో ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులకు అక్కడే చికిత్స అందిస్తున్నారు. నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోందని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శివాజీ తెలిపారు. -
హెచ్ఎం వేధింపులపై కేసు నమోదు
కరప: మండలం గొర్రిపూడిలోని జెడ్పీ హైస్కూల్ హెచ్ఎంపై వేధింపుల కేసు నమోదైంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటనపై స్థానికులు, విద్యార్థినులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గొర్రిపూడి జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం అడబాల కాశీవిశ్వేశ్వరరావు కొంతకాలంగా పదో తరగతి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, వేధిస్తున్నారు. విద్యాశాఖాధికారులు సైతం ఆయనపై వచ్చిన ఫిర్యాదులను పట్టించుకోకపోవడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీసు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి హెచ్ఎంపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్థానిక ఎస్ఐ టి.సునీత శనివారం ఆ పాఠశాలకు విచారణకు వెళ్లారు. అదే సమయంలో ఎంఈఓ కె.బుల్లికృష్ణవేణి పాఠశాల సందర్శనకు వెళ్లి తిరిగి వస్తుండగా ఎస్ఐ సునీత చూసి పలకరించగా చిన్న విచారణకు వచ్చామని చెప్పడంతో ఎంఈఓ వెళ్లిపోయారు. తరువాత ఎస్సై అక్కడి విద్యార్థినులను కలసి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ విషయమై డీవైఈఓ ఎన్.వెంకటేశ్వరరావు సోమవారం పాఠశాలకు విచారణకు వస్తున్నట్టు తెలిసింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యుడిపై కఠినచర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫిర్యాదు చేసిన విద్యార్థినులు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,500 గటగట (వెయ్యి) 16,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
‘జయలక్ష్మి’ బాధితులకు న్యాయం చేయండి
కాకినాడ రూరల్: జయలక్ష్మి సొసైటీ బాధితులకు న్యాయం చేయాలని బాధితుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. స్థానిక చల్లా కళ్యాణ మండపంలో ఆదివారం మధ్యాహ్నం జయలక్ష్మి ఎంఏఎం సొసైటీ లిమిటెడ్ డిపాజిటర్ల బాధితుల సంఘం సమావేశం నిర్వహించింది. సమావేశానికి అధ్యక్షుడు జి.బదరీనారాయణ అధ్యక్షత వహించారు. 2022లో సుమారు 560 కోట్ల రూపాయలు డిపాజిటర్ల సొమ్ముతో జయలక్ష్మి సొసైటీ గత పాలకవర్గం బోర్డు తిప్పేసిందని, ఇప్పటికీ న్యాయం జరగలేదని పలువురు బాధితులు పేర్కొన్నారు. సమావేశానికి హాజరైన పలువురు బాధితులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బదిరీనారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం గంగిరెడ్డి త్రినాథరావు అధ్వర్యంలో ఉన్న పాలకవర్గానికి జవాబుదారీతనం లోపించిందన్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, బాధితులకు సత్వర న్యాయం జరగడం లేదన్నారు. పలువురు వృద్ధాప్యంలో ఉండి ఇబ్బందులు పడుతున్నందున వారికోసం పోరాడాల్సింది పోయి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, దీనిపై తాము గత నెలలో అవిశ్వాస తీర్మానం చేశామన్నారు. ప్రస్తుతం ఉన్న బోర్డులను తొలగించి రహస్య ఓటింగ్ ద్వారా కొత్తగా బోర్డును ఏర్పాటు చేయాలని, అందులో ప్రభుత్వ ఉద్యోగి విధిగా ఉండాలని సభ్యులు సూచిస్తున్నారన్నారు. తాము బాధితుల పక్షాన పోరాడతామని, త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సమావేశంలో పిల్లి గణేష్, రామారావు, వీఎస్వీ సుబ్బారావు, రఘు, భూషణ్, నాగేశ్వరరావు, ప్రభాకరరావు, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఐదు నుంచి వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలు
● ఐదు రోజులు విశేష వాహన సేవలు ● 6న వైభవంగా శ్రీవారి కళ్యాణోత్సవం కొత్తపేట: ఆత్రేయపురంలోని లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకూ వైభవంగా నిర్వహించనున్నారు. ఆ మేరకు ఆలయ శాశ్వత ధర్మకర్త, ఆలయ కమిటీ చైర్మన్ పాతపాటి వెంకట సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో వెంకట సత్యరాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో ఐదు రోజుల పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల వివరాలను ఉత్సవ కమిటీ సభ్యులు ఆదివారం విలేకరులకు తెలిపారు. ఐదో తేదీ తెల్లవారు జాము నుంచి ప్రారంభం కానున్న ఉత్సవాలలో ఆ రోజు నుంచి వివిధ వాహనాలపై శ్రీవారి ఊరేగింపులు కనువిందు చేయనున్నాయి. రాత్రి 7.30 గంటలకు శేష వాహనోత్సవం నిర్వహిస్తారు. ఆరో తేదీ ఉదయం 10.30 గంటలకు శ్రీవారి కళ్యాణోత్సవం, సాయంత్రం 6 గంటలకు హనుమద్ వాహనోత్సవం, 7న ఉదయం 108 బిందెలతో కలశాభిషేకం, మహిళలచే సామూహిక కుంకుమార్చన, సాయంత్రం 108 తామర పుష్పాలతో మహాలక్ష్మీహోమం, అనంతరం సింహ వాహనోత్సవం నిర్వహిస్తారు. 8న గరుడ వాహనోత్సవం, అనంతరం శంకు, చక్ర నామార్చన, సహస్ర దీపాలంకరణ సేవ, ఊంజల్ సేవ నిర్వహిస్తారు. 9 న మహా శాంతి హోమం, పూర్ణాహుతి, అనంతరం శ్రీచక్ర స్నానం, అన్న సమారాధన, పల్లకిసేవ, రాత్రి శ్రీపుష్పయాగోత్సవం నిర్వహించనున్నారు. -
పడిపోతున్న ఏలేరు నీటి నిల్వలు
ఏలేశ్వరం: ఎగువ నుంచి ప్రవాహం తగ్గడం.. నానాటికీ ఎండలు పెరుగుతూండటంతో ఏలేరు రిజర్వాయర్లో నీటి నిల్వలు క్రమేపీ పడిపోతున్నాయి. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా, ఆదివారం 80.32 మీటర్లుగా నమోదైంది. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 13.82 టీఎంసీల మేర మాత్రమే నీటి నిల్వలున్నాయి. ఆయకట్టుకు 1,200, విశాఖకు 200, తిమ్మరాజు చెరువుకు 100 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. లోవలో భక్తుల సందడి తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో ఆదివారం రద్దీ నెలకొంది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 15 వేల మంది క్యూలైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకున్నట్లు ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1.12.800. పూజా టికెట్లకు రూ.68 వేలు, కేశఖండనకు రూ.11,400, వాహ న పూజలకు రూ.4,500, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.34,610, విరాళాలు రూ.72,972 కలిపి మొత్తం రూ.3,04,285 ఆదాయం సమకూరిందని వివరించారు. నేడు హుండీల ఆదాయం లెక్కింపు అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో హుండీల ఆదాయాన్ని సోమవారం లెక్కించనున్నారు. అన్నవరం దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని గత జనవరి 30వ తేదీన లెక్కించారు. తిరిగి 30 రోజుల అనంతరం లెక్కింపు చేపట్టనున్నారు. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకూ మాఘ మాసం కావడంతో సత్యదేవుని ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. వారు హుండీల్లో పెద్ద మొత్తంలో కానుకలు సమర్పించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఈసారి హుండీల ద్వారా సుమారు రూ.1.5 కోట్లు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హుండీల ఆదాయం లెక్కింపును దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.సుబ్బారావు పర్యవేక్షించనున్నారు. లెక్కింపులో దేవస్థానం సి బ్బంది అందరూ పాల్గొనాలని ఈఓ ఆదేశించారు. ఘనంగా సత్యదేవుని రథసేవ అన్నవరం: రత్నగిరిపై ఆలయ ప్రాకారంలో ఆదివారం సత్యదేవుని రథసేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి రథంపై వేంచేయించారు. స్వామి, అమ్మవార్లకు పూజల అనంతరం పండితులు కొబ్బరి కాయ కొట్టి రథసేవను ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల ఘోష నడుమ మూడుసార్లు రథంపై ఆలయ ప్రాకారంలో సేవ నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు పండితులు నీరాజనం ఇచ్చి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అర్చకుడు ప్రయాగ రాంబాబు, పరిచారకుడు ముత్య వేంకట్రావు తదితరులు పూజలు చేశారు. రత్నగిరిపై రామారాయ కళావేదిక మీద సూర్య నమస్కారాలు, సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ ఈ కార్యక్రమం జరిగింది. సత్యదేవుడు, అమ్మవారు సోమవారం ముత్యాల కవచాలు (ముత్తంగి సేవ) ధరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. రేపు హాకీ క్రీడాకారుల ఎంపికలు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): సీనియర్ మెన్ విభాగంలో హాకీ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా హాకీ సంఘం కార్యదర్శి నంబు శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా క్రీడా మైదానంలో మంగళవారం ఉదయం 8 గంటలకు ఈ ఎంపికలు ప్రారంభమవుతాయన్నారు. ఎంపికై న జట్టు ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకూ గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో జరిగే అంతర్ జిల్లాల హాకీ పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. -
తెగుళ్లతో ఖాళీఫ్లవర్
పెరవలి: కూరగాయల పంటలో కాలీఫ్లవర్ ఆదాయాన్ని ఇచ్చే పంట.. ఇప్పుడు ఈ పంట రైతుల గుండెల్లో మంట పెడుతోంది. తెగుళ్లు ముప్పేట దాడి చేయడంతో ఇబ్బందిగా మారుతోంది. ఈ నేపథ్యంలో సస్యరక్షణ చర్యలు అవశ్యమని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 2,795 హెక్టార్లలో కూరగాయల సాగు జరుగుతుండగా, ఇందులో కాలీఫ్లవర్ 425 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ పంట సాధారణంగా శీతల ప్రాంతంలో వేయాల్సి ఉండగా, ప్రస్తుతం వేసవి ప్రారంభం కావడంతో తెగుళ్ల ఉధృతి అధికంగా ఉంది. దీనికి వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కొవ్వూరు ఉద్యాన అధికారి సీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. ఈ పంటపై ప్రస్తుతం ఆకుమచ్చ, పచ్చపురుగు, బట్టవింగ్, రైసీనెస్, కొరడా తెగుళ్లు ఎక్కువగా ఆశించాయి. ఈ తెగుళ్ల నివారణకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన వివరించారు. బట్టవింగ్ ఈ తెగులు ఆశించిన తోటల్లో పూలు చిన్నవిగా వస్తాయి. నత్రజని తక్కువగా అందించటం వల్ల లేక ఆలస్యంగా నారు నాటటం వలన ఈ ప్రభావం కనిపిస్తుంది. దీనిని అరికట్టాలంటే 21 నుంచి 25 రోజుల వయసు కలిగిన నారును మాత్రమే నాటుకోవాలి. సరియైన సమయానికి తగు మోతాదులో నత్రజని ఎరువును అందించాలి. సరియైన సమయంలో నాటుకోవాలి. రైసీనెస్ ఈ తెగులు వాతావరణంలో వేడి ప్రారంభమైనప్పుడు వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు ఆశిస్తే పువ్వు వదులై, విచ్చుకున్నట్లుగా అయ్యి పువ్వు గుడ్డుపై మాగు వస్తుంది. దీనివల్ల పువ్వు అంద విహీనంగా కనిపించి మార్కెట్టులో ధరపడిపోతుంది. దీని నివారణకు పువ్వులకు ఎండ ఎక్కువగా తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పువ్వు విచ్చుకున్న వెంటనే సరైన సమయంలో పువ్వులను కోయాలి. బ్రౌవింగ్ ఈ తెగులు బోరాన్ లోపం వల్ల వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా క్షార నేలల్లో ఈ పంటలను వేసినప్పుడు తెగులు వ్యాప్తి అధికంగా ఉంటుంది. ఈ తెగులు ఆశించిన పువ్వులపై గోధుమరంగు మచ్చలు ఏర్పడతాయి. కాండం గుల్లగా మారి నీరుకారుతుంది. దీని నివారణకు ఆఖరి దుక్కులో ఎకరాకు 8నుంచి 10 కిలోలు బోరాక్స్ వేయాలి. లీటరు నీటిలో 3 గ్రాములు బోరాక్స్ కలిపి పువ్వు గడ్డ ఏర్పడే దశలో పిచికారీ చేయాలి. కొరడా ఈ తెగులు మాలిబ్దినం ధాతు లోపం వల్ల సోకుతుంది. ఆకులు పసుపుగా మారి, అంచులు తెల్లబడతాయి. తెగులు తీవ్రత ఎక్కుగా ఉంటే ఆకు మధ్య మాత్రమే పొడవుగా పెరుగుతుంది. ఇలా పెరిగితే కొరడా తెగులు ఆశించినట్లు గుర్తించాలి. దీని నివారణకు నత్రజనిని సరైన మోతాదులో అందించాలి. ఎకరాకు 400 గ్రాములు సోడియం లేదా అమ్మోనియం మాలిబ్డేట్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ● కాలీప్లవర్ పువ్వు తెల్లగా ఉండాలంటే పువ్వు ఏర్పడిన దశలో పువ్వు చుట్టూ ఉన్న ఆకులను పువ్వుపై కప్పుతూ సూర్యరశ్మి సోకకుండా దారంతోకానీ రబ్బరు బ్యాండ్ కానీ వేయాలి. 4 నుంచి 5 రోజుల తరువాత పువ్వును కోయాలి. సస్యరక్షణ చర్యలు అవశ్యం లేకుంటే దిగుబడులపై ప్రభావం కుళ్లు తెగులు ఈ తెగులు సాధారణంగా నారుమడి నుంచి ప్రారంభమై నాటిన తోటలోనూ వ్యాప్తి చెందుతుంది. ఆకుల అంచుల నుంచి పసుపు రంగుకు మారి ఈనెలు నల్లబడి కాండం కుళ్లిపోతుంది. ఈ తెగులు అధికంగా ఉంటే పువ్వును కూడా ఆశిస్తుంది. అది కూడా కుళ్లిపోతుంది. నివారణ చర్యలు ఈ తెగులు ఆశించిన తోట పూర్తయిన తరువాత మళ్లీ ఇదే పంటను వేయకూడదు. పంట మార్పిడి తప్పని సరిగా చేయాలి. ఈ తెగులు ఆశించినట్లు గుర్తించిన వెంటనే కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి 3 గ్రాములు చొప్పన కలిపి మొక్క అంతా తడిసేలా పిచికారీ చేయాలి. ఇలా చేయటం వలన తెగులును కొంతవరకు నివారించవచ్చు. ఆకుమచ్చ తెగులు ఈ తెగులు ఆశించిన తోటల ఆకులపై గుండ్రని బూడిద రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా పెద్దవిగా మారతాయి. ఈ తెగులు సాధారణంగా వాతవరణంలో తేమశాతం అధికంగా ఉన్నప్పుడు వ్యాప్తి చెందుతుంది. నివారణ చర్యలు ఈ తెగులు నివారణకు మాంకోజెబ్ మందును లీటరు నీటికి 2.5 గ్రాములు లేదా కాఫర్ ఆక్సీక్లోరైడ్ లీటరు నీటికి 3 గ్రాములు చొప్పున కలిపి పైరుపై పిచికారీ చేస్తే నివారణ అవుతుంది. తెగులు అధికంగా ఉంటే 10 రోజుల వ్యవధిలో రెండు నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి. -
ఓపెన్కు సర్వం సిద్ధం
పకడ్బందీగా చేపట్టాలి ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాం. ఇప్పటికే సీఎస్, డీవోలకు ఓరియంటేషన్ నిర్వహించాం. ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా పరీక్షలు నిర్వహించాలని డీఈవోలకు ఆదేశాలిచ్చాం. – జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ ● నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం ● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 63 కేంద్రాలు ● హాజరు కానున్న 16,072 మంది విద్యార్థులు ● 17 నుంచి పదో తరగతి పరీక్షలు రాయవరం: ఈ నెల ఒకటో తేదీ నుంచి రెగ్యులర్ ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభంగా కాగా, ఏపీ సార్వత్రిక విద్యా పీఠం ద్వారా ఏటా నిర్వహించే ఇంటర్ పరీక్షలను సైతం సోమవారం నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉన్నత చదువు కోసం ఆశ పడినప్పటికీ అనుకోని అవాంతరాలు, ఆర్థిక ఇబ్బందులతో చదువు నిలిపివేసిన వారి కోసం ఏపీ సార్వత్రిక విద్యా పీఠం ద్వారా ఓపెన్ స్కూల్ విధానం ద్వారా అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఓపెన్ స్కూల్ ద్వారా పది, ఇంటర్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు ఇప్పటికే హాల్ టిక్కెట్లను విడుదల చేశారు. ఉత్తీర్ణులు కానివారు సైతం ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ ప్రవేశాలకు గతేడాది ఆగస్టులో విడుదల చేసిన నోటిఫికేషన్ మేరకు ఇంటర్ పరీక్షలకు 16,072 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతంలో పరీక్షలు రాసి, ఉత్తీర్ణులు కానివారు కూడా ఇప్పుడు పరీక్షలు రాయనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 63 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే విద్యార్థులకు హాల్టికెట్లు విద్యార్థులకు చేరాయి. ఈ పరీక్షలు ఈ నెల 3వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షలు ఇలా.. ఏపీ సార్వత్రిక విద్యా పీఠం ద్వారా నిర్వహించే పదో తరగతి పరీక్షలు ఈ నెల 17 నుంచి 28వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. రెగ్యులర్ విద్యార్థులతో పాటే ఓపెన్ విద్యార్థులకూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 74 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 5,947 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారుజిల్లాల వారీగా పరీక్షా కేంద్రాలు, విద్యార్థుల వివరాలు జిల్లా పది ఇంటర్ విద్యార్థులు విద్యార్థులు కోనసీమ 1,195 4,645 కాకినాడ 2,248 6,625 తూర్పు 2,504 4,802 మొత్తం 5,947 16,072 -
ఎవరో విజేత!
● నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ● ఏలూరులో నిర్వహణ ● మధ్యాహ్నానికి మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ● గెలుపునకు సరిపడా ఓట్లు రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ షురూ ● ఆ తరువాతే రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు కాకినాడ సిటీ: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజేత ఎవరో సోమవారం తేలనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ఏలూరులో జరగనుంది. జిల్లాలో మొత్తం 70,540 మంది పట్టభద్ర ఓటర్లు ఉండగా గత గురువారం 98 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఎన్నికల్లో 47,150 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లు వినియోగించడం, ఓట్ల లెక్కింపు ప్రక్రియ భిన్నంగా ఉండటంతో ఫలితం తేలడానికి ఎక్కువ సమయమే పట్టే అవకాశం ఉంది. స్త్రాంగ్ రూములు తెరచి.. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా సోమవారం ఉదయం 7 గంటలకు ఆయా అభ్యర్థులు లేదా వారి తరఫున వచ్చే కౌంటింగ్ ఏజెంట్లు, పరిశీలకుల సమక్షంలో బ్యాలెట్ పెట్టెలు భద్రపరచిన స్ట్రాంగ్ రూములు తెరుస్తారు. మొదటిగా 25 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన బాక్సులు తెరుస్తారు. వాటిలో ప్రతి 25 బ్యాలెట్ పేపర్లను ఒక కట్టగా కట్టి డ్రమ్ములో వేస్తారు. తర్వాత స్ట్రాంగ్ రూముల నుంచి మరో 25 పోలింగ్ బూత్లకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు తీసుకువస్తారు. ఇలా 200 పోలింగ్ బూత్లకు సంబంధించిన బ్యాలెట్ బ్యాక్సులను ఎనిమిది విడతల్లో తెచ్చి, బ్యాలెట్ పేపర్లను కట్టలుగా కడతారు. ఈ ప్రక్రియ గంటలో పూర్తి చేస్తారు. ఒక్కో టేబుల్పై వెయ్యి ఓట్లు ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. దీని కోసం 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ వద్ద పోటీలో ఉన్న 35 మంది అభ్యర్థులకు కనిపించేలా ఏర్పాటు చేస్తారు. అభ్యర్థుల ఏజెంట్లకు బ్యాలెట్ పేపర్ చూపిస్తారు. మొదటి ప్రాధాన్య ఓటు పోలైన అభ్యర్థికి సంబంధించిన గడిలో ఆ బ్యాలెట్ పేపర్ వేస్తారు. చెల్లని ఓట్లను ఏజెంట్లందరికీ చూపించి పక్కన పెడతారు. ఇలా మొదటి రౌండ్ కౌంటింగ్ మధ్యాహ్నం 4 గంటల్లోగా పూర్తయ్యే అవకాశం ఉంది. సగానికి పైగా ఓట్లు వస్తేనే.. సాధారణ ఎన్నికల్లో ప్రత్యర్థి కంటే ఎక్కువ ఓట్లు సాధించిన వారిని విజేతగా ప్రకటిస్తారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నియోజకవర్గంలో పోలైన ఓట్లలో చెల్లుబాటు అయిన వాటిలో మొదటి ప్రాధాన్య ఓట్లు సగానికి పైగా సాధించిన వారినే విజేతగా ధ్రువీకరిస్తారు. లెక్కింపు ప్రక్రియ రౌండ్ల వారీగా ఎలిమినేషన్ పద్ధతిలో సాగుతుంది. ● మొదటి ప్రాధాన్యం గుర్తించకపోయినా ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఓటు వేసినా, సరైన ప్రాధాన్యం లేకపోయినా ఆ ఓట్లను చెల్లనివిగా పరిగణిస్తారు. ● చెల్లుబాటైన ఓట్లలో మొదటి ప్రాధాన్య ఓట్లను అభ్యర్థుల వారీగా లెక్కిస్తారు. వీటిని 25 బ్యాలెట్లకు ఒక కట్టగా కడతారు. ● ఉదాహరణకు జిల్లాలో 47,150 ఓట్లు పోలవగా 2,500 ఓట్లు చెల్లకుండా పోయాయని అనుకుంటే.. వాటిని తీసివేసి, మిగిలిన 44,650 ఓట్లలో సగానికి పైగా మొదటి ప్రాధాన్యం ఓట్లు సాధించిన అభ్యర్థి గెలుపొందినట్లు ప్రకటిస్తారు. ● ఏ అభ్యర్థికీ సగానికి పైగా మొదటి ప్రాధాన్య ఓట్లు రాకుంటే ఎలిమినేషన్ రౌండ్ చేపడతారు. ● పోటీ చేసిన అభ్యర్థుల్లో అతి తక్కువ ఓట్లు సాధించిన వారిని ముందుగా ఎలిమినేట్ చేస్తారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులు సమానంగా ఓట్లు సాధించి, చివరి స్థానంలో ఉంటే ఎన్నికల అధికారి డ్రా తీస్తారు. డ్రాలో వచ్చిన అభ్యర్థి బ్యాలెట్ పేపర్లోని మొదటి ప్రాధాన్య ఓట్లను అలాగే ఉంచి, రెండో ప్రాధాన్య ఓట్లు ఏ అభ్యర్థికి వచ్చాయో వారికి కలుపుతారు. ● ఒక అభ్యర్థి ఎలిమినేషన్ తర్వాత కూడా ఫలితం తేలకపోతే మరో అభ్యర్థికి వచ్చిన రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తారు. ఇలా రౌండ్ల వారీగా ఒక్కో అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తారు. ● నిర్దేశించిన ఓట్లు సాధించలేకపోతే మూడో రౌండ్ ఎలిమినేషన్ చేపడతారు. మూడో ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తూ కలుపుతారు. ఫలితం తేలే వరకూ ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగిస్తారు. ఈ క్రమంలో సగానికి పైగా నిర్దేశిత ఓట్లను ఎవరు సాధిస్తే వారు గెలిచినట్లు ప్రకటిస్తారు. ● ఒకవేళ 35 మందిలో 33 మంది ఎలిమినేట్ అయినప్పటికీ గెలుపు కోటా రాకపోతే చివరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరికి తక్కువ ఓట్లు వచ్చాయో ఆ అభ్యర్థిని ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్య ఓట్లను 35వ అభ్యర్థికి కలుపుతారు. అప్పటికి కోటా వస్తే సరి. కోటా రాకపోయినా ఎలిమినేట్ కాకుండా చివరి వరకూ ఉన్న అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. ● మొదటి ప్రాధాన్య ఓట్లతో ఏ అభ్యర్థికీ గెలుపు కోటా రాక.. ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టి రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కిస్తే మాత్రం కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. అదే కనుక జరిగితే ఫలితం వెల్లడి కావడానికి మరుసటి రోజు వరకూ సమయం పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. -
కౌంటింగ్కు సర్వం సిద్ధం
● 28 టేబుళ్లు.. 17 రౌండ్లు ● 2,18,902 ఓట్ల లెక్కింపుఏలూరు (మెట్రో): ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు సోమవారం ప్రారంభం కానుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆధ్వర్యంలో కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని ఆరు జిల్లాల్లోని 456 పోలింగ్ కేంద్రాల్లో గత నెల 27న పోలింగ్ జరిగింది. 69.50 శాతం పోలింగ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3,637, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 47,125, ఏలూరు జిల్లాలో 29,651, కాకినాడ జిల్లాలో 47,150, తూర్పు గోదావరి జిల్లాలో 42,446, పశ్చిమ గోదావరి జిల్లాలో 48,893 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 69.50 శాతం ఓటింగ్ నమోదు కాగా, బ్యాలెట్ బాక్సులను ఏలూరులోని స్ట్రాంగ్ రూములో భద్రపరిచారు. ఈ ఎన్నికల బరిలో 35 మంది నిలిచారు. టీడీపీ బలపర్చిన పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులు మధ్య ప్రధాన పోటీ నెలకొందని భావిస్తున్నారు. ఉదయం 7 గంటలకు.. కౌంటింగ్ కేంద్రానికి సిబ్బంది 6.30 గంటలలోపు చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. మూడు షిప్టుల్లో 700 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొంటారు. మొత్తం 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 17 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. ప్రతి టేబుల్కు కౌంటింగ్ సిబ్బంది, సూపర్వైజర్, రోల్ ఇన్చార్జి, షిఫ్ట్ ఇన్చార్జి, మైక్రో అబ్జర్వర్లు విధులు నిర్వహిస్తారు. సమగ్ర శిక్షణ ఏలూరు (ఆర్ఆర్ పేట): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కౌంటింగ్ ఏర్పాట్లను ఆదివారం ఆమె పరిశీలించారు. కౌంటింగ్పై సిబ్బందికి సమగ్ర శిక్షణ ఇచ్చామన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి రెండు మూడు రోజుల సమయం పట్టవచ్చన్నారు. పూర్తి భద్రతా ఏర్పాట్ల మధ్య కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు. కౌంటింగ్ సిబ్బందికి డ్యూటీ పాసులు, ఏజెంట్లకు ఐడీ కార్డులు జారీ చేశామన్నారు. పాస్ లేనిదే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రంలోనికి సెల్ఫోన్లను నిషేధించామన్నారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద నిర్వహిస్తామని తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఈపీడీసీఎల్ ఎస్ఈ పి.సాల్మన్రాజును కలెక్టర్ ఆదేశించారు. -
స్నాతకోత్సాహం.. మిన్నంటిన వేళ..
● 248 మందికి పట్టాల ప్రదానం ● ఘనంగా ఆర్ఎంసీ 62వ స్నాతకోత్సవం కాకినాడ క్రైం: ఐదున్నరేళ్ల నిర్విరామ శ్రమ.. ఇకపై నువ్వు డాక్టర్వి అంటే మనసు కదిలిపోయిన భావోద్వేగాలు.. అందుకున్న పట్టాను తనివితీరా చూసుకుంటూ చెమ్మగిల్లిన కళ్లు.. పుత్రోత్సాహం పొంగిపొర్లి ఆనందబాష్పాలు కురిపిస్తున్న అమ్మనాన్నల మోములు.. వియ్ మిస్ యూ అంటూ దాచి పెట్టుకున్న గాంభీర్యం నడుమ చెప్పలేక చెబుతున్న టీచర్ల హావభావాలు.. ఇలా ఒకటా రెండా చెప్పుకోవడానికి చాలని, పంచుకోవడానికి పట్టని ఎన్నో వెలకట్టలేని భావోద్వేగాలు కాకినాడలోని ప్రతిష్టాత్మక రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసీ) స్నాతకోత్సవంలో ఆవిష్కృతమయ్యాయి. కళాశాల యాజమాన్యం సహకారంతో 2019 బ్యాచ్కు చెందిన సుప్రీం స్టాల్వార్ట్స్ ఈ సంబరాన్ని మిన్నంటే ఉత్సాహంతో భళా అనిపించేలా నిర్వహించారు. ఆర్ఎంసఅ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.విష్ణువర్ధన్ అధ్యక్షతన జరిగిన ఈ స్నాతకోత్సవానికి 5 వేల మంది హాజరయ్యారు. మొత్తం 248 మంది విద్యార్థులు వైద్య పట్టాలు అందుకున్నారు. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్, రాష్ట్ర వైద్య విద్యా సంచాలకుడు, ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ డీఎస్వీఎల్ నరసింహం ముఖ్య అతిథిగా, కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. వీరితో పాటు జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ ఎంపీఆర్ విఠల్, డాక్టర్ శ్రీనివాసన్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శశి, విజయనగరం వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ దేవీ మాధవి, వివిధ విభాగాల అధిపతులు డాక్టర్ మాణిక్యాంబ, డాక్టర్ ఉమామహేశ్వరరావు, ప్రొఫెసర్ డాక్టర్ శైలజ, డాక్టర్ లక్ష్మీనారాయణ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నుంచి వైద్యులు చిట్ల కిరణ్, ఆనంద్, ఆదిత్య సత్య ప్రసన్న, ఆర్ఎంసీ ఏడీ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అబ్బురపరిచాయి. డాక్టర్కు ఏఐ ప్రత్యామ్నాయం కాదు విద్యార్థులునుద్దేశించి డాక్టర్ నరసింహం మాట్లాడుతూ, వైద్య ప్రక్రియల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కీలక పాత్ర పోషిస్తోందని, అయితే వైద్యుడికి మాత్రం ఇది ప్రత్యామ్నాయం కాదని అన్నారు. రోగి భావోద్వేగాలను అంచనా వేసే శక్తి ఏఐకి లేదని చెప్పారు. పట్టాలు పొందిన విద్యార్దులందరూ తమ తల్లిదండ్రుల కలలు నెరవేర్చారని అన్నారు. తాను రాష్ట్ర స్థాయి విధుల్లో కొనసాగుతూ ఎటువంటి ఆటంకాలూ లేకుండా ముందుకు సాగడానికి వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్ధన్ సమర్థంగా విధులు నిర్వహించడమే కారణమని అన్నారు. ఆయన హయాంలోనే 2019–25 బ్యాచ్ విద్యార్థులు అసామాన్య విజయాలు సాధించారన్నారు. నేను రాయల్ రంగరాయన్ని.. ఆర్ఎంసీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని కీర్తి ప్రతిష్టలు సాధించారు డాక్టర్ సాయి అనిరుధ్. 2019–25 బ్యాచ్కు చెందిన ఈయన తొమ్మిది అవార్డులు, 5 బంగారు పతకాలు సాధించి, స్నాతకోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘మనం ట్రైన్డ్, టెస్టెడ్, రెడీ టు సర్వ్’ అంటూ సహ విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. రాయల్ రంగరాయన్గా ఎంతో గర్వపడుతున్నానని అన్నారు. హౌస్ సర్జన్గా తొలిసారి కాన్యులా పెట్టిన సందర్భం, ఓ గర్భిణికి డెలివరీ చేసి, శిశువును బయటకు తీసినప్పుడు కలిగిన భావోద్వేగం, వెన్ను విరిగేలా శ్రమించినా సీపీఆర్ తర్వాత వ్యక్తి చనిపోతే కలిగిన బాధ వర్ణించలేనంటూ చెప్పిన సందర్భంలో సభాస్థలిలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. ఐదున్నరేళ్ల చదువును సబ్జెక్టుల వారీగా వర్ణిస్తూ హాస్యాన్ని జోడిస్తూ చెప్పిన తీరు ఆకట్టుకుంది. పట్టా పొందడం అంటే పరుగు ఆపేయడం కాదని, మరింత వేగంగా పరిగెట్టడమేనని డాక్టర్ అనిరుధ్ అన్నారు. పేరుకు ముందు డాక్టర్.. ఆ కిక్కే వేరు పేరుకు ముందు డాక్టర్ అనే ప్రిఫిక్స్ చేరితే ఆ కిక్కే వేరని డాక్టర్ విష్ణువర్ధన్ అనడంతో విద్యార్థుల్లో ఒక్కసారిగా ఉత్సాహం వెల్లివిరిసింది. కళాశాలను అత్యంత క్రమశిక్షణతో నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. డాక్టర్ లావణ్యకుమారి మాట్లాడుతూ, వైద్య విద్యార్థులకు ఇదో కొత్త అధ్యాయమని అన్నారు. వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం సమన్వయం చేసుకోగలిగితేనే పరిపూర్ణ మానవుడిగా ఎదగగలమని హితవు పలికారు. తల్లిదండ్రుల శ్రమను గుర్తించి జీవించాలని సూచించారు. డాక్టర్ దేవీ మాధవి మాట్లాడుతూ, వైద్యుడిగానే కాదు, రోల్మోడల్గానూ ఎదగాలంటూ ఆకాంక్షించారు. విద్యార్థులతో డాక్టర్ శైలజ, డాక్టర్ దేవీ మాధవి వైద్య ప్రమాణం చేయించారు. అనంతరం డాక్టర్ నరసింహాన్ని సత్కరించారు. -
ఎవరో విజేత!
● నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ● ఏలూరులో నిర్వహణ ● మధ్యాహ్నానికి మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ● గెలుపునకు సరిపడా ఓట్లు రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ షురూ ● ఆ తరువాతే రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు కాకినాడ సిటీ: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజేత ఎవరో సోమవారం తేలనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ఏలూరులో జరగనుంది. జిల్లాలో మొత్తం 70,540 మంది పట్టభద్ర ఓటర్లు ఉండగా గత గురువారం 98 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఎన్నికల్లో 47,150 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లు వినియోగించడం, ఓట్ల లెక్కింపు ప్రక్రియ భిన్నంగా ఉండటంతో ఫలితం తేలడానికి ఎక్కువ సమయమే పట్టే అవకాశం ఉంది. స్త్రాంగ్ రూములు తెరచి.. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా సోమవారం ఉదయం 7 గంటలకు ఆయా అభ్యర్థులు లేదా వారి తరఫున వచ్చే కౌంటింగ్ ఏజెంట్లు, పరిశీలకుల సమక్షంలో బ్యాలెట్ పెట్టెలు భద్రపరచిన స్ట్రాంగ్ రూములు తెరుస్తారు. మొదటిగా 25 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన బాక్సులు తెరుస్తారు. వాటిలో ప్రతి 25 బ్యాలెట్ పేపర్లను ఒక కట్టగా కట్టి డ్రమ్ములో వేస్తారు. తర్వాత స్ట్రాంగ్ రూముల నుంచి మరో 25 పోలింగ్ బూత్లకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు తీసుకువస్తారు. ఇలా 200 పోలింగ్ బూత్లకు సంబంధించిన బ్యాలెట్ బ్యాక్సులను ఎనిమిది విడతల్లో తెచ్చి, బ్యాలెట్ పేపర్లను కట్టలుగా కడతారు. ఈ ప్రక్రియ గంటలో పూర్తి చేస్తారు. ఒక్కో టేబుల్పై వెయ్యి ఓట్లు ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. దీని కోసం 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ వద్ద పోటీలో ఉన్న 35 మంది అభ్యర్థులకు కనిపించేలా ఏర్పాటు చేస్తారు. అభ్యర్థుల ఏజెంట్లకు బ్యాలెట్ పేపర్ చూపిస్తారు. మొదటి ప్రాధాన్య ఓటు పోలైన అభ్యర్థికి సంబంధించిన గడిలో ఆ బ్యాలెట్ పేపర్ వేస్తారు. చెల్లని ఓట్లను ఏజెంట్లందరికీ చూపించి పక్కన పెడతారు. ఇలా మొదటి రౌండ్ కౌంటింగ్ మధ్యాహ్నం 4 గంటల్లోగా పూర్తయ్యే అవకాశం ఉంది. సగానికి పైగా ఓట్లు వస్తేనే.. సాధారణ ఎన్నికల్లో ప్రత్యర్థి కంటే ఎక్కువ ఓట్లు సాధించిన వారిని విజేతగా ప్రకటిస్తారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నియోజకవర్గంలో పోలైన ఓట్లలో చెల్లుబాటు అయిన వాటిలో మొదటి ప్రాధాన్య ఓట్లు సగానికి పైగా సాధించిన వారినే విజేతగా ధ్రువీకరిస్తారు. లెక్కింపు ప్రక్రియ రౌండ్ల వారీగా ఎలిమినేషన్ పద్ధతిలో సాగుతుంది. ● మొదటి ప్రాధాన్యం గుర్తించకపోయినా ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఓటు వేసినా, సరైన ప్రాధాన్యం లేకపోయినా ఆ ఓట్లను చెల్లనివిగా పరిగణిస్తారు. ● చెల్లుబాటైన ఓట్లలో మొదటి ప్రాధాన్య ఓట్లను అభ్యర్థుల వారీగా లెక్కిస్తారు. వీటిని 25 బ్యాలెట్లకు ఒక కట్టగా కడతారు. ● ఉదాహరణకు జిల్లాలో 47,150 ఓట్లు పోలవగా 2,500 ఓట్లు చెల్లకుండా పోయాయని అనుకుంటే.. వాటిని తీసివేసి, మిగిలిన 44,650 ఓట్లలో సగానికి పైగా మొదటి ప్రాధాన్యం ఓట్లు సాధించిన అభ్యర్థి గెలుపొందినట్లు ప్రకటిస్తారు. ● ఏ అభ్యర్థికీ సగానికి పైగా మొదటి ప్రాధాన్య ఓట్లు రాకుంటే ఎలిమినేషన్ రౌండ్ చేపడతారు. ● పోటీ చేసిన అభ్యర్థుల్లో అతి తక్కువ ఓట్లు సాధించిన వారిని ముందుగా ఎలిమినేట్ చేస్తారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులు సమానంగా ఓట్లు సాధించి, చివరి స్థానంలో ఉంటే ఎన్నికల అధికారి డ్రా తీస్తారు. డ్రాలో వచ్చిన అభ్యర్థి బ్యాలెట్ పేపర్లోని మొదటి ప్రాధాన్య ఓట్లను అలాగే ఉంచి, రెండో ప్రాధాన్య ఓట్లు ఏ అభ్యర్థికి వచ్చాయో వారికి కలుపుతారు. ● ఒక అభ్యర్థి ఎలిమినేషన్ తర్వాత కూడా ఫలితం తేలకపోతే మరో అభ్యర్థికి వచ్చిన రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తారు. ఇలా రౌండ్ల వారీగా ఒక్కో అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తారు. ● నిర్దేశించిన ఓట్లు సాధించలేకపోతే మూడో రౌండ్ ఎలిమినేషన్ చేపడతారు. మూడో ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తూ కలుపుతారు. ఫలితం తేలే వరకూ ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగిస్తారు. ఈ క్రమంలో సగానికి పైగా నిర్దేశిత ఓట్లను ఎవరు సాధిస్తే వారు గెలిచినట్లు ప్రకటిస్తారు. ● ఒకవేళ 35 మందిలో 33 మంది ఎలిమినేట్ అయినప్పటికీ గెలుపు కోటా రాకపోతే చివరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరికి తక్కువ ఓట్లు వచ్చాయో ఆ అభ్యర్థిని ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్య ఓట్లను 35వ అభ్యర్థికి కలుపుతారు. అప్పటికి కోటా వస్తే సరి. కోటా రాకపోయినా ఎలిమినేట్ కాకుండా చివరి వరకూ ఉన్న అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. ● మొదటి ప్రాధాన్య ఓట్లతో ఏ అభ్యర్థికీ గెలుపు కోటా రాక.. ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టి రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కిస్తే మాత్రం కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. అదే కనుక జరిగితే ఫలితం వెల్లడి కావడానికి మరుసటి రోజు వరకూ సమయం పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. -
నేత్రపర్వం.. పుష్పయాగోత్సవం
సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రంలో బాలాత్రిపుర సుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి వారి శ్రీపుష్పయాగోత్సవం శనివారం రాత్రి నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ నెల 24వ తేదీ రాత్రి స్వామి వారి కల్యాణం, 27న రథోత్సవం, 28న త్రిశూలస్నానం నిర్వహించగా, ఉత్సవాల ముగింపులో భాగంగా శ్రీపుష్పయాగోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని పూలతో అలంకరించారు. వివిధ రకాల పండ్లు, మిఠాయిలు ఉంచారు. పూలమాలలతో అందంగా అలంకరించిన ఊయలలో స్వామివారి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి, పవళింపు సేవ నిర్వహించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ కంటే బాబు దంపతులు, ఈఓ బళ్ల నీలకంఠం దంపతులతో పాటు ఉత్సవ కమిటీ, భక్త కమిటీ దంపతులకు దంపత తాంబూలాలు అందజేశారు. ఉత్సవాన్ని తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. వారికి ప్రసాద వితరణ చేశారు. ఆలయ పండితులు వేమూరి సోమేశ్వరశర్మ, అళ్లకి రాజ్గోపాల్శర్మ, సన్నిధిరాజు వెంకన్న, అంజిబాబు, శ్రీకాకుళపు సత్యనారాయణమూర్తి, వినయ్ పూజలు నిర్వహించారు. శ్రీపుష్పయాగోత్సవాన్ని పురస్కరించుకొని కూచిపూడి గ్రామానికి చెందిన శ్రీసత్యకృష్ణ కూచిపూడి కళానిలయం కళాకారులు ప్రదర్శించిన నృత్యప్రదర్శన భక్తులను అలరించింది. -
నేడు జయలక్ష్మీ సొసైటీ బాధితుల సమావేశం
కాకినాడ రూరల్: జయలక్ష్మి సొసైటీ బాధితుల సంఘం సమావేశం ఆదివారం మధ్యాహ్నం స్థానిక చల్లా కల్యాణ మండపంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చైర్మన్, డైరెక్టర్ల పని తీరుపై చర్చించడంతో పాటు సభ్యుల అభిప్రాయాల మేరకు తీర్మానాలు చేస్తామని సంఘం అధ్యక్షుడు బదరీ నారాయణ తెలిపారు. అయితే, బాధితులకు అండగా పని చేస్తున్న తమపై నిందలు తగవని పాలకవర్గం చైర్మన్ గంగిరెడ్డి త్రినాథరావు చెబుతున్నారు. 20 వేల మంది బాధితులు సర్పవరం జంక్షన్ మెయిన్ బ్రాంచ్గా ఆరు జిల్లాల్లో దాదాపు 29 బ్రాంచ్లతో గతంలో ఏర్పాటైన జయలక్ష్మి ఎంఏఎం సొసైటీ 2022 మార్చి 31న బోర్డు తిప్పేసింది. అప్పటి పాలవర్గం ఆర్థిక నేరాలకు పాల్పడడటంతో సుమారు 20 వేల మంది సభ్యులు వీధిన పడ్డారు. దీనిపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, నాటి సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు తీవ్రంగా స్పందించారు. బాధితులకు న్యాయం చేసేందుకు తక్షణం సిట్ ఏర్పాటు చేసి, ఈ కేసును సీఐడీకి అప్పగించారు. సీఐడీ అధికారులు గత పాలకవర్గం చైర్పర్సన్ విశాలాక్షితో పాటు డైరెక్టర్ జైలుకు పంపారు. బాధితులకు సొమ్ము తిరిగి ఇప్పించేందుకు అప్పట్లో భారీ రుణాలు తీసుకున్న వారి నుంచి రికవరీ కోసం కేసులు నమోదు చేశారు. రుణ గ్రహీతలకు సంబంధించి 84 కేసుల్లో రూ.300 కోట్ల మేర ఆస్తులపై సీఐడీ అధికారులు చార్జిషీట్ దాఖలు చేశారు. మరో 110 కేసుల్లో రూ.200 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసి 465 కేసులకు సంబంధించి రూ.497 కోట్లకు ఒక కేసు సివిల్ కోర్టులో, వాటిలో మరో 190 కేసులకు కో ఆపరేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితుల్లో గంగిరెడ్డి త్రినాథరావు చైర్మన్గా నూతన పాలకవర్గం ఏర్పాటైంది. పట్టించుకోని కూటమి బాధితులకు న్యాయం చేస్తామని ఎన్నికల ముందు కూటమి నేతలు హామీలు గుప్పించినా నేటికీ న్యాయం జరగలేదు. రుణాల ఎగవేతదారుల ఆస్తులు స్వాధీనం చేసుకుని విక్రయిస్తేనే బాధితులకు సొమ్ము ఇచ్చేందుకు వీలవుతుంది. ఈ పరిస్థితుల్లో పాలకవర్గంపై బదరీ నారాయణ అవిశ్వాసం తీర్మానం చేసి, ఫిబ్రవరి 21న రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్కు నివేదించారు. దీనిపై కలెక్టర్కు కూడా శుక్రవారం వినతిపత్రం అందించారు. అనేక విషయాల్లో నూతన పాలకవర్గం గోప్యత పాటిస్తోందని, అనుమానాస్పద రీతిలో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే, తమ బోర్డు హయాంలోనే రూ.700 కోట్ల వరకూ సీఐడీ, ట్రిబ్యునల్ ద్వారా రాబట్టేందుకు కేసు వేశామని చైర్మన్ త్రినాథరావు చెబుతున్నారు. బాధితుల సంఘం సమావేశం నేపథ్యంలో సర్పవరం జంక్షన్లోని మెయిన్ బ్రాంచ్లో చైర్మన్ త్రినాథరావు ఆధ్వర్యాన పాలకవర్గం శనివారం మధ్యాహ్నం భేటీ అయింది. -
పట్టాల పండగకు సర్వం సిద్ధం
● నేడు రంగరాయ వైద్య కళాశాల 62వ స్నాతకోత్సవం ● పట్టాలు పొందనున్న 248 మంది వైద్య విద్యార్థులు కాకినాడ క్రైం: స్థానిక రంగరాయ వైద్య కళాశాల 62వ స్నాతకోత్సవం ఆదివారం జరగనుంది. దీనికి కళాశాల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.విష్ణువర్ధన్ పర్యవేక్షణలో ఈ పట్టాల పండగ నిర్వహిస్తున్నారు. కళాశాల ప్రాంగణంలోని ఆడిటోరియం పక్కన ఉన్న ఓపెన్ గ్రౌండ్లో సాయంత్రం 4 గంటలకు స్నాతకోత్సవ సంబరం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా 2019 బ్యాచ్కు చెందిన 248 మంది వైద్య విద్యార్థులకు డాక్టర్ పట్టాలు ప్రదానం చేయనున్నారు. ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్, ఆంధ్రప్రదేశ్ వైద్య విద్య సంచాలకుడు, రంగరాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీఎస్వీఎల్ నరసింహం హాజరు కానున్నారు. గౌరవ అతిథిగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.లావణ్యకుమారి హాజరవుతారు. విజయనగరం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దేవీ మాధవి కూడా అతిథిగా పాల్గొంటున్నారు. ఐదున్నరేళ్ల విద్యలో అత్యంత ఉత్తమ ప్రతిభ కనబరిచిన డాక్టర్ ఎ.సాయి అనిరుధ్ స్నాతకోత్సవ భాషణానికి ఎంపికయ్యారు. డాక్టర్ విష్ణువర్ధన్ స్నాతకోత్సవ ప్రారంభోపన్యాసం ఇస్తారు. విద్యార్థులతో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ డీఏవీఎస్ శశి వైద్య ప్రమాణం చేయిస్తారు. స్నాతకోత్సవ వేడుకకు 5 వేల మంది హాజరవుతారని అంచనా. -
వరాల వసంతం
30 రోజులు ప్రత్యేకం ● రంజాన్ మాసంలో తొలి 10 రోజులు కారుణ్య దినాలు. ● 10 నుంచి 20 క్షమాపణ రోజులు, ● 20 నుంచి 30 వరకూ నరకాగ్ని నుంచి విముక్తి దినాలు.ప్రత్యేక ప్రార్థనలు ముస్లింలు ఈ మాసమంతా ఆధ్యాత్మికంగా గడుపుతారు. ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనల్లో నిమగ్నమవుతారు. రోజూ సూర్యాస్తమయం వరకూ కఠోర ఉపవాస దీక్షలు పాటిస్తారు. దానధర్మాలు చేస్తారు. ఐదు పూటలా నమాజ్తో పాటు తరావీ ప్రార్థనల్లో పాల్గొంటారు. 30 అధ్యాయాలున్న ఖురాన్ను నెలలోగా పఠించాలన్న ప్రవక్త ఆదేశాన్ని తప్పక పాటిస్తారు. పేదలకు సంపన్నులు జకాత్ చెల్లిస్తారు. చివరి పది రోజులూ ఇంటిని వదిలి మసీదుల్లో ఉంటూ దైవస్మరణ చేస్తారు. పండగకు ముందు ఫిత్రా ఇస్తారు. ఉపవాస సమయంలో జరిగిన తప్పులు, లోటుపాట్లకు ఈ ఫిత్రా పరిహారం. ఉపవాసాలు పాటించిన వారు, పాటించని వారు, చిన్నాపెద్దా అనే తారతమ్యం లేకుండా దానం చేస్తారు. ● నెలవంక దర్శనంతో ప్రారంభమైన పవిత్ర రంజాన్ మాసం ● ఉపవాస దీక్షలకు సిద్ధమైన ముస్లింలు ● తరావిహ్ నమాజ్ ప్రారంభం ● ఉమ్మడి జిల్లా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు ● విద్యుద్దీపాలతో శోభిల్లుతున్న ప్రార్థనా స్థలాలుసాక్షి, రాజమహేంద్రవరం: ముస్లింలకు సమస్త శుభాలూ కలిగించే పవిత్ర మాసం రంజాన్. శనివారం సాయంత్రం నెలవంక దర్శనంతో ఈ మాసం ప్రారంభమైంది. ‘ఓ నెలవంకా! నీ దేవుడు, మా దేవుడు, అందరి దైవం అల్లాహ్ మాత్రమే’ అంటూ ప్రార్థించి నెలవంకను ముస్లింలు వీక్షించారు. మసీదుల్లో ఇమామ్లు రంజాన్ మాసాన్ని ప్రకటించారు. దీంతో శనివారం రాత్రి నుంచే తరావీహ్ నమాజ్ ప్రారంభమైంది. ఆదివారం వేకువజాము నుంచి ఉపవాస దీక్షలను ముస్లింలు ప్రారంభిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎలాంటి ఆహారం, కనీసం నీళ్లు కూడా తాగకుండా కఠోర నిష్టతో దీక్ష పాటిస్తారు. ఉమ్మడి ‘తూర్పు’న ఆధ్యాత్మిక శోభ.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా దాదాపు 400 మసీదులున్నాయి. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మసీదులన్నీ ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. రంగురంగుల విద్యుద్దీపాలతో శోభిల్లుతున్నాయి. ముస్లింలు రోజా, నమాజ్, జికర్, దువాలతో గడపనున్నారు. మసీదుల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంటోంది. సహెరి, ఇఫ్తార్ విందులతో హడావుడి కనిపించనుంది. ఉపవాస దీక్షలు ఆచరించేందుకు అవసరమైన నిత్యావసరాలను ముస్లింలు విరివిగా కొనుగోలు చేశారు. ఉపవాసం ప్రత్యేకత ఇస్లాంలో నాలుగో మూలస్తంభం ఉపవాసం. ముస్లిం సమాజం త్రికరణ శుద్ధితో ఆచరించే ఆరాధనా వ్రతమిది. ఎదుటి వారి ఆకలి విలువ గుర్తించాలన్నది దీని ప్రధాన ఉద్దేశం. ఉపవాసాన్ని అరబీ భాషలో ‘సౌమ్’గా, ఉర్దూలో ‘రోజా’గా పిలుస్తారు. ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం తొమ్మిదో నెల అయిన రంజాన్ మాసంలో ఈ ఆరాధన వ్రతాన్ని పాటిస్తారు. ఇస్లాం ధర్మశాస్త్ర పరిభాషలో సౌమ్ అంటే ఆగి ఉండటం. అంటే ఉషోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ తినడానికి, తాగడానికి, మనోవాంఛలకు దూరంగా ఉండటమని అర్థం. ఉపవాసం మినహాయింపు మనిషి బలహీనతలను, వారి కష్టసుఖాలను బాగా ఎరిగిన దైవం ఉపవాసాన్ని విధిగా నిర్ణయించినప్పటికీ, కొందరికి మినహాయింపులు కూడా ఇచ్చారు. చిన్న పిల్లలు, బాటసారులు, వ్యాధిగ్రస్తులు, వృద్ధాప్యం మరీ ఎక్కువైనవారు, మతిస్థిమితం లేనివారు, అశుద్ధావస్థలో ఉన్న మహిళలకు ఉపావాసం నుంచి మినహాయింపు ఉంది. దివ్య ఖురాన్ అవతరణ మాసం ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించి, సదా ఆచరించే దివ్య గ్రంథం ఖురాన్ ఈ మాసంలోనే అవతరించింది. ఇతర ప్రవక్తలపై ఫర్మానులు సైతం ఇదే నెలలో అవతరించాయి. అందుకే ఈ నెలకు అంత ప్రాధాన్యం. ఈ సమయంలో సైతాను బందీ అవుతాడని, నరక ద్వారాలు మూతపడి స్వర్గ ద్వారాలు తెరచుకుంటాయని ముస్లింల ప్రగాఢ విశ్వాసం. తరావిహ్ నమాజ్ ప్రారంభం రంజాన్ మాసంలో నెలవంక దర్శనమిచ్చినప్పటి నుంచే తరావిహ్ నమాజ్ ప్రారంభమవుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మసీదుల్లో రంజాన్ మాసం ముగిసే (మళ్లీ నెలవంక దర్శనమిచ్చేంత) వరకూ ప్రతి రోజూ రాత్రివేళ నమాజ్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా రోజుకు ఖురాన్లోని కొన్ని అధ్యాయాలు చదివి వినిపిస్తారు. మాసం పూర్తయ్యేలోగా ఖురాన్ పఠనం పూర్తి చేస్తారు. నాలుగు వాక్యాలే ప్రధానం పవిత్ర రంజాన్ మాసంలో మహ్మద్ ప్రవక్త నాలుగు విషయాల్ని అధికంగా స్మరించాలని ఉపదేశించారు. వాటి ప్రాముఖ్యతను ధార్మిక పండితులు వివరిస్తారు. లాయిలాహ ఇల్లల్లాహ్, అస్తగ్ఫిరుల్లా.., అస్ అలుకజన్నత్, అవుజుబికమిన్నార్.. ఎక్కువగా పఠించాలి.సంకల్పం ప్రవక్త బోధించిన ‘నవయతు అన్ అసుముగజన్ లిల్లాహి తాలా మిన్ సౌమిరమజాన్’ అనే వచనాలు పఠించి ముస్లింలు ఉపవాస వ్రతానికి శ్రీకారం చుడతారు. ఉపవాస విరమణ సమయంలో ‘అల్లాహుమ్మ లకసుంతు వబిక ఆమంతు, వ అలైక తవక్కత్తు, వ ఆలారిస్కిక అఫ్తర్తు ఫతఖబ్బల్ మిన్ని’ అని వచిస్తారు. ఇఫ్తార్ సూర్యాస్తమయం తరువాత ఏదైనా ఆహారం తీసుకుని ఆ రోజు దీక్షను విరమించడమే ఇఫ్తార్. ఖర్జూరాలతో ఇఫ్తార్ చేయడం ప్రవక్త సంప్రదాయం. అందుకే ముస్లింలందరూ ఖర్జూరాలతోనే ఇఫ్తార్ చేస్తారు. దీక్ష విరమించే సమయంలో ఉపవాసి దేనిని అర్ధించినా అల్లాహ్ స్వీకరిస్తాడని ప్రగాఢ విశ్వాసం. ఉపవాసికి ఇఫ్తార్ ఇవ్వడం దైవసేవగా భావించి, విందు ఇచ్చేవారి పాపాలను దేవుడు క్షమిస్తాడని ముస్లింలు నమ్ముతారు. సహర్ ఉపవాసం (రోజా) ఉండదలచిన వారు తెల్లవారుజామున 4 గంటల సమయంలో భోజనం చేస్తారు. దీనినే సహర్ అంటారు. సాయంత్రం వరకూ ఏ పదార్థాన్నీ తినరు. ఏదైనా కారణం వల్ల సహర్ తీసుకోకపోయినా వ్రతాన్ని మాత్రం ఆపరు. -
అందని ప్రసాద్ం
అన్నవరం: కేంద్ర ప్రభుత్వ ‘పిలిగ్రిమేజ్ రీజువినేషన్ అండ్ స్పిరిట్యువల్ అగ్మెంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీముకు అన్నవరం దేవస్థానం ఏ ముహూర్తాన ఎంపికై ందో కానీ ఆది నుంచీ అడుగడుగునా అవాంతరాలే ఎదురవుతున్నాయి. ఫలితంగా వస్తాయనుకున్న నిధులు రాక, రత్నగిరికి ‘ప్రసాద్’ం అందడంలో తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఈ పథకం కింద రూ.20 కోట్లతో చేపట్టే నిర్మాణాలకు రీ టెండర్లు పిలిచిన 35 రోజులు గడిచినా ఇంకా ఖరారు కాలేదు. ఇవి మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధాని శ్రీకారం చుట్టినా.. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను పర్యాటక కేంద్రా లుగా అభివృద్ధి చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పదేళ్ల క్రితం ప్రసాద్ పథకానికి శ్రీకారం చుట్టింది. దీనికి అన్నవరం దేవస్థానం కూడా ఎంపికై ంది. అప్పటి ప్రజాప్రతినిధులు దఫదఫాలుగా చేసిన విజ్ఞప్తులు, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం, నాటి కాకినాడ ఎంపీ వంగా గీత తదితరుల కృషితో కేంద్ర ప్రభుత్వ అధికారులు అన్నవరం దేవస్థానాన్ని సందర్శించారు. ఇక్కడ చేపట్టాల్సిన పనులపై ఒక అంచనాకు వచ్చారు. ఈ క్రమంలో ఇక్కడి అధికారులు సుమారు రూ.100 కోట్లతో వివిధ పనులకు ప్రతిపాదించగా.. తర్వాత దీనిని సుమారు రూ.55 కోట్లకు, ఆ తర్వాత సుమారు రూ.20 కోట్లకు ఈ పనులను కుదించారు. ఆ మేరకు సుమారు రూ.20 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో చేపట్టే వివిధ పనులకు గత ఏడాది మార్చి 7న ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుంచి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. కొద్ది రోజులు గడిస్తే ఈ పనులను ప్రధాని ప్రారంభించి ఏడాది కానుంది. అయినప్పటికీ ఇప్పటికీ ఈ పనుల్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. ‘ప్రసాద్’ పనులివీ.. ● దేవస్థానంలోని పాత టీటీడీ భవనం స్థలంలో రూ.10 కోట్లతో రెండంతస్తుల అన్నదాన భవనం నిర్మాణం. ● ప్రస్తుతం అన్నదాన భవనం పక్కనే రూ.6 కోట్లతో క్యూ కాంప్లెక్స్. ● ప్రకాష్ సదన్ భవనం వెనుక ప్రస్తుతం పార్కింగ్ స్థలంగా ఉన్న ప్రదేశంలో అటు సత్యగిరి, ఇటు రత్నగిరికి దగ్గరగా ఉండేలా రూ.3 కోట్లతో టాయిలెట్ బ్లాక్ల నిర్మాణం. ● సత్రాల నుంచి ఆలయానికి, వ్రత మండపాలకు భక్తులను తరలించేందుకు రూ.కోటితో రెండు బ్యాటరీ కార్ల కొనుగోలు. తొలుత రెండు ప్యాకేజీలుగా.. అన్నవరం దేవస్థానంలో ప్రసాద్ పనులపై గత ఏడాది అక్టోబర్ 9న రెండు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. మొత్తం 12 మంది కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. వీటిని అదే నెల 25న ఖరారు చేయాల్సి ఉండగా కూటమి సర్కార్ ఆ పని పూర్తి చేయలేదు. చివరకు గత డిసెంబర్లో ఆ టెండర్లను రద్దు చేశారు. ఒకే ప్యాకేజీగా రీటెండర్ ప్రసాద్ పనులకు ఈ ఏడాది జనవరి 9న రీటెండర్ పి లిచారు. ఈసారి రూ.18.97 కోట్లకు ఒకే ప్యాకేజీగా టెండర్లు ఆహ్వానించారు. ఈసారి ఆరుగురు మాత్రమే టెండర్లు వేశారు. వీటిని జనవరి 24న తెరచి ఖరారు చేయాల్సి ఉండగా ఆ పని ఇప్పటి వరకూ జరగలేదు. ఫిబ్రవరి నెల కూడా గడిచిపోయినా దీనిపై ఇంతవర కూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీనికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణమని అధికారులు చెబుతున్నారు. ‘టెండర్’ పెట్టేందుకేనని ఆరోపణలు రాష్ట్రంలోని అన్ని పథకాల టెండర్లలో చక్రం తిప్పుతున్న కూటమి ప్రభుత్వ పెద్దల కన్ను రత్నగికి ‘ప్రసాద్’ టెండర్లపై కూడా పడిందనే ఆరోపణలు రెండు నెలలుగా వినిపిస్తున్నాయి. తమకు అనుకూలమైన కాంట్రాక్టర్కు ఈ టెండర్లు దక్కాలనే ఆలోచనతో కూటమికి చెందిన ఒక మంత్రి చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. ఆ విధంగా తమ అనుకూల కాంట్రాక్టర్కు పనులు దక్కే అవకాశం లేదని తేలినందువల్లనే తొలుత పిలిపించని టెండర్లను డిసెంబర్లో రద్దు చేశారనే ఆరోపణలు వచ్చాయి. రెండోసారి టెండర్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లలో అర్హత పత్రాలు జత చేయలేదనే కారణంతో టెక్నికల్ బిడ్ సమయంలో ఇద్దరిని అనర్హులను చేసినట్లు సమాచారం. ఈ విధంగా తమకు అనుకూలమైన కాంట్రాక్టర్కే ఈ టెండర్లు దక్కేలా కూటమి నేత ఒకరు తెర వెనుక చక్రం తిప్పుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ వల్లనే.. అన్నవరం దేవస్థానంలో ప్రసాద్ స్కీమ్ పనులకు రీ టెండర్లను ఖరారు చేసే ప్రక్రియ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యమైంది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వీటిని ఖరారు చేస్తారు. – ఈశ్వరయ్య, చీఫ్ ఇంజినీర్, పర్యాటక శాఖ రత్నగిరిపై మరింత జాప్యం అక్టోబర్లో పిలిచిన మొదటి టెండర్ రద్దు జనవరిలో మళ్లీ టెండర్లు రూ.18.98 కోట్లతో ఒకే ప్యాకేజీగా ఆహ్వానం 35 రోజులైనా ఖరారవ్వని వైనం మరింత ఆలస్యం జరిగే అవకాశం -
పోలవరం కాలువ పనుల అడ్డగింపు
తుని రూరల్: పోలవరం ఎడమ ప్రధాన కాలువపై బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ తాళ్లూరు గ్రామస్తులు, రైతులు శనివారం మరోసారి ఆందోళన చేశారు. కాలువ తవ్వకం పనులను అడ్డుకున్నారు. అయినప్పటికీ ఉన్నతాధికారులు స్పందించ లేదు. ఎప్పటిలాగే డీఈ మురళి, ఏఈ వచ్చి ఉన్నతాధికారులకు తెలియజేస్తామని చెప్పారు. బాధితులు ఆందోళన విరమించకపోవడంతో కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు, పోలీసులతో అక్కడకు చేరుకుని, పనులు అడ్డుకోరాదని, ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. జాతీయ ప్రాజెక్టు పనులు అడ్డుకోవడం సరికాదని రూరల్ ఎస్సై బి.కృష్ణామాచారి అన్నారు. తమ సమస్యపై గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయాలని, జిల్లా స్థాయి అధికారుల వద్దకు వెళ్లాలని చెప్పారు. అప్పటి వరకూ రోడ్డు మార్గాన్ని తొలగించబోమని తెలిపారు. ఇదే సమస్యపై గత నెల 25, 27 తేదీల్లో గ్రామస్తులు ఆందోళన చేయగా, బ్రిడ్జి నిర్మాణంపై అధికారులు ఎటువంటి హామీ ఇవ్వలేదు. ప్రత్యామ్నాయం పరిశీలిస్తామని అసిస్టెంట్ కలెక్టర్ భావన, పెద్దాపురం ఆర్డీఓ శ్రీరమణి, పోలవరం ఇరిగేషన్ ఈఈ గోవిందు చెప్పారు. దీంతో, కలెక్టర్ వద్దకు వెళ్లి తమ ఇబ్బందులను వివరిస్తామని గ్రామస్తులు, రైతులు పేర్కొని ఆందోళన విరమించారు. -
అందుబాటులో అత్యాధునిక జ్యూయలరీ
బోట్క్లబ్ (కాకినాడసిటీ): అత్యాధునిక జ్యూయలరీ కాకినాడ నగరంలోని జోయాల్కూకాస్ షోరూమ్లో అందుబాటులో ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. స్థానిక దేవాలయం వీధిలో ఆధునీకరించిన జోయాల్కూకాస్ షోరూమ్ను శనివారం ప్రారంభించారు. ప్రజలకు నచ్చే అన్ని రకాల జ్యూయలరీ ఈ షోరూంలో ఉన్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలపి కొండబాబు అన్నారు. జోయాల్కూకాస్ చైర్మన్ జోయాల్కూకాస్ మాట్లాడుతూ తమ షోరూమ్లో అంతర్జాతీయ ప్రమాణాలు గల ఇంటీరియర్ డిజైన్స్ లభిస్తాయన్నారు. షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తున్నామన్నారు. అనుగ్రహ, ఫ్రైడ్, ఎలిగంజా, యువ, అపూర్వ, రత్న కలక్షన్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. గోల్డ్, డైమండ్స్ తాజా డిజైన్లు కూడా ఇక్కడ ఉన్నాయన్నారు. -
సద్వినియోగం చేసుకోండి
విద్యార్థులు కలలను సాకారం చేసుకోవడానికి ఇది చక్కని అవకాశం. దీనిని అందిపుచ్చుకునేందుకు విద్యార్థులు ప్రయత్నించాలి. ఇస్రో పేర్కొన్న అర్హతలు కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకునేలా సైన్స్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు ఇది మంచి మార్గం. –జీవీఎస్ సుబ్రహ్మణ్యం, జిల్లా సైన్స్ అధికారి, అమలాపురం ఎంతో ఉపయుక్తం యువికాకు అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి. శాస్త్రవేత్తలు కావాలనుకునే వారికి ఇది ఎంతో ఉపయుక్తం. ప్రశ్నించేతత్వమే ప్రయోగాలకు, శాస్త్రవేత్తలు కావడానికి కారణమవుతుంది. డీఈఓలు, డీవైఈఓలు, జిల్లా సైన్స్ అధికారులు, సైన్స్ టీచర్లు శ్రద్ధ తీసుకుని అధిక సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా చూడాలి. –జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ