Kamareddy District Latest News
-
‘సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మంత్రి పాల్గొంటారు’
బాన్సువాడ : పట్టణంలోని ఎస్ఆర్ఎన్కే డి గ్రీ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలను గురువారం నిర్వహించనున్నామని, ఇందులో జి ల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పా ల్గొననున్నారని వ్యవసాయ సలహాదారు పో చారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మంగళవా రం డిగ్రీ కళాశాలలో సిల్వర్ జూబ్లీ వేడుకల కరపత్రాలను ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసు ల బాల్రాజ్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కళాశాల ఏర్పాటు చేసినప్పటి నుంచి గత సంవత్సరం వరకు 13,050 మంది చదువుకున్నారని, ఇందులో సుమారు 10 వేల మంది ప్ర భుత్వ ఉద్యోగాలు సాధించారని, మూడు వే ల మంది ప్రైవేటు రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. పూర్వ విద్యార్థులందరూ వ చ్చి సిల్వర్ జూబ్లీ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏ ర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో కళా శాల ప్రిన్సిపల్ వేణుగోపాల్స్వామి, కాంగ్రె స్ నాయకులు పోచారం సురేందర్రెడ్డి తదితరులున్నారు. ‘వక్ఫ్ సవరణ చట్టంపై అవగాహన కల్పించాలి’ నాగిరెడ్డిపేట: వక్ఫ్ సవరణ చట్టంపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని బీజేపీ కి సాన్ మోర్చా రాష్ట్ర హార్టికల్చర్ కన్వీనర్ గంగారెడ్డి పేర్కొన్నారు. ధర్మారెడ్డిలో మంగళవా రం వక్ఫ్ సవరణ చట్టంపై కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టంపై కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు తప్పుడు ప్రచారం ద్వారా అపోహలు సృష్టిస్తూ, శాంతిభద్రతల సమస్య తలెత్తేలా చేస్తున్నాయని ఆరోపించారు. నిరుపేద ముస్లింల కు న్యాయం చేసేందుకే కేంద్రప్రభుత్వం వ క్ఫ్ సవరణ చట్టం తీసుకువచ్చిందన్నారు. వాస్తవమేమిటో ప్రజలకు తెలిసేలా కార్యకర్త లు కృషి చేయాలన్నారు. సమావేశంలో బీజే పీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు హన్మండ్లు, నరేందర్రెడ్డి, దేవిసింగ్, మండల ఉపాధ్యక్షులు ఈశ్వర్గౌడ్, మల్లేశ్, విష్ణు, నాయకులు భాస్కర్ నాయక్, పోచయ్య, గణేష్ నాయక్, బాలు తదితరు లు పాల్గొన్నారు. టీఎస్ఎన్ఏ వైస్ ప్రెసిడెంట్గా ఆరోగ్య లక్ష్మి బాన్సువాడ రూరల్ : తెలంగాణ స్టేట్ న ర్సింగ్ అసోసియేషన్(టీఎస్ఎన్ఏ) వై స్ ప్రెసిడెంట్గా బా న్సువాడ సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ పూదోట ఆరోగ్య లక్ష్మి ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్లో ని ర్వహించిన కార్యక్రమంలో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్ ప్రెసిడెంట్గా ఎ న్నికైన ఆరోగ్య లక్ష్మిని స్థానిక వైద్యులు, న ర్సులు అభినందించారు. ఫుట్బాల్ అండర్ –14 రాష్ట్ర జట్టుకు ఎంపిక కామారెడ్డి టౌన్: ఈనెల 25 నుంచి మహారాష్ట్రలోని కొల్లాపూర్లో జరిగే జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు జిల్లాకు చెందిన విద్యార్థిని ఎంపికై నట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి హీరాలాల్ తెలిపారు. రామారెడ్డి మండలం అన్నారం గ్రామ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి అక్షయ అండర్–14 బాలికల విభాగంలో రాష్ట్ర జట్టుకు ఎంపికైందని పేర్కొన్నారు. మంగళవారం డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అక్షయను డీఈవో కార్యాలయ సూపరింటెండెంట్ జగన్నాథం, వ్యాయామ ఉపాధ్యాయుడు చంద్రయ్య తదితరులు అభినందించారు. -
‘పిల్లల భద్రత కోసం కృషి చేయాలి’
కామారెడ్డి క్రైం: చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులుగా ఎంపికై న ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో పిల్లల భద్రత కోసం కృషి చేయాలని, లైంగిక దాడులు జరగకుండా చూడాలని అదనపు కలెక్టర్ విక్టర్ సూచించారు. జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో మంగళవారం చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా ప్రతి పాఠశాలకు ఒక చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ను నియమించామన్నారు. పిల్లలపై ఎలాంటి లైంగిక దాడులు జరగకుండా చూడాలన్నారు. అవసరమైతే తప్పు చేసే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, డీసీపీవో స్రవంతి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి
కామారెడ్డి క్రైం: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని రెవె న్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. మంగళవా రం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, తదితర అంశాలపై కలెక్టర్లతో సమీక్షించారు. ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా చూడాలన్నారు. బలహీన వర్గాల వారికి ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుక సరఫరా చేయడంకోసం అవసరమైన ఇసుకను అందుబాటులో ఉంచాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభం కాకముందే ఇందిరమ్మ ఇళ్లను మంజూ రు చేసి పనులు ప్రారంభించాలన్నారు. భూ భారతిని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణలో 25 శాతం రాయితీ గడువును మరోసారి పొడిగించబోమని పేర్కొన్నారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద లింగంపేట్ మండలంలో భూ భారతి అమలు చేస్తున్నామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఈ మండలంలో 23 రెవెన్యూ గ్రామాలున్నాయని, ఇప్పటివరకు 8 గ్రామాల్లో సదస్సులు నిర్వహించామని పేర్కొన్నారు. భూ సమస్యలపై 810 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, డీఎఫ్వో నికిత, ఆర్డీవోలు వీణ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రణాళికలు సిద్ధం చేయాలి జిల్లాలో భూగర్భ జలాలను సంరక్షించడానికి అవసరమైన కట్టడాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఉన్న మూడు మున్సిపాలిటీలలో రాబోయే వానాకాలంలో తీసుకునే వర్షపు నీటి సంరక్షణ చర్యల కోసం వెంటనే సర్వే చేపట్టాలన్నారు. ఈ వేసవిలో భూగర్భ జలాల సంరక్షణకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని డీఆర్డీవో సురేందర్ను ఆదేశించారు. వాగులను గుర్తించి వాటిలో నీటి ప్రవాహానికి అడ్డుగా రాతి కట్టడాలను నిర్మించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. భూగర్బ జలాల సంరక్షణ కోసం ఫాంపాండ్స్, బోర్వెల్ రీచార్జ్ స్ట్రక్చర్, ఇంకుడు గుంతలు ఎక్కువగా నిర్మించాలన్నారు. వానాకాలంలో కురిసే ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్ నాయక్, జిల్లా భూగర్భజల అధికారి సతీశ్ యాదవ్, మున్సిపల్ కమిషనర్లు రాజేందర్, శ్రీహరి, మహేష్, ఇరిగేషన్, పంచాయతీరాజ్ ఇంజినీర్లు పాల్గొన్నారు. భూభారతిని పకడ్బందీగా అమలు చేయాలి వీసీలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సరైన పోషకాహారం తీసుకోవాలి గర్భిణులు, బాలింతలు సరైన పోషకాహారం తీ సుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించా రు. కలెక్టరేట్లో మంగళవారం మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పోషణా పక్షం కార్య క్రమాన్ని నిర్వహించారు. అధికారులు లబ్ధిదారులతో పోషణ ప్రతిజ్ఞ చేయించారు. సామూహిక సీమంతాలు, అన్నప్రసాన కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పా టు చేసిన పోషకాహార ప్రదర్శనను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లలో అంగన్వాడి టీచర్లు తయారు చేసిన మునుగ ఆకు ర సం, రాగి జావా, నువ్వుల లడ్లు తదితర పోషకాహారాలను రుచి చూసి వారిని అభినందించారు. -
‘రైతులకు ఇబ్బందులు కలగనీయొద్దు’
భిక్కనూరు : కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇ బ్బందులు కలగకుండా చూడాలని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ సూచించారు. మంగళవారం ఆయన అంతంపల్లి, పెద్దమల్లారెడ్డిలలోని కొనుగో లు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతంపల్లి కేంద్రం వద్ద రైతుల కోసం పందిళ్లు వేయడం, తాగునీటి సౌకర్యం కల్పించడంపై విండో సీఈవో శ్రీనివాస్ను అభినందించారు. వేగంగా కాంటాలు పూర్తి చేసి రైస్మిల్లులకు పంపించాలని సూచించారు. ఆయన వెంట క్లస్టర్ అధికారి రమేశ్, మానిటరింగ్ అధికారి నగేశ్, విండో చైర్మన్లు వెంకట్రెడ్డి, రాజాగౌడ్, సీఈవో శ్రీనివాస్ ఉన్నారు. -
తూకాలు ప్రారంభించాలంటూ రైతుల ధర్నా
రామారెడ్డి: రెడ్డిపేట కొనుగోలు కేంద్రంలో తూకాలు ప్రారంభించకపోవడంతో రైతులు మంగళవారం కొంతసేపు రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి వడ్లను తీసుకువచ్చి పదిహేను రోజులవుతున్నా కాంటాలు చేయడం లేదన్నారు. దీంతో కొనుగోలు కేంద్రం వద్ద వడ్ల కుప్పలు పేరుకుపోతున్నాయన్నారు. కొనుగోలు కేంద్రం వద్ద కనీస వసతులు కూడా లేవని, ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సౌకర్యాలు కల్పించాలని, వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని, లేకపోతే రోడ్ బ్లాక్ చేస్తామని డిమాండ్ చేశారు. -
మళ్లీ అట్టడుగునే..
బుధవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 10లో u● ఇంటర్ ఫస్టియర్లో 50.09 శాతం ఉత్తీర్ణత ● సెకండియర్లో 56.38 శాతం.. ● ఫలితాల్లో బాలికలదే పైచేయికామారెడ్డి టౌన్: ఇంటర్ ఫలితాలలో జిల్లా విద్యార్థులు నిరాశ పరిచారు. దాదాపు సగం మందే ఉత్తీర్ణులయ్యారు. దీంతో ఫలితాల్లో కామారెడ్డి జిల్లా వరుసగా రెండో ఏడాదీ రాష్ట్రంలో అట్టడుగున ఉండిపోయింది. ఇంటర్మీయట్ బోర్డు మంగళవారం ఇంటర్ ఫలితాలను విడుదల చేసింది. ఫస్టియర్లో 50.09 శాతం, సెకండియర్లో 56.38 శాతం ఉత్తీర్ణులయ్యారు. షరా మామూలుగా ఫలితాల్లో ఈసా రి కూడా బాలికలదే పైచేయిగా నిలిచింది. ఫస్టియర్ ఫలితాలు.. జిల్లాలో 8,740 మంది ఫస్టియర్ పరీక్షలు రాయగా 4,378 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 50.09గా నమోదైంది. ఇందులో బాలురు 4,053మంది పరీక్షలు రాయగా 1,496 ఉత్తీర్ణులయ్యారు. 36.91 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికల్లో 4,687 మందికి 2,882 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 61.49గా ఉంది. జనరల్ గ్రూప్స్లో 6,828 మంది పరీక్షలు రాయ గా 3,343మంది(48.96 శాతం) పాసయ్యారు. వొకేషనల్ విభాగంలో 1,912 మందికిగాను 1,035 మంది(54.13 శాతం) పాసయ్యారు. సెకండియర్ ఫలితాలు.. జిల్లాలో 7,722 మంది విద్యార్థులు సెకండియర్ ప రీక్షలు రాయగా 4,354 మంది పాసయ్యారు. 56.38 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలు రు 3,580 మంది పరీక్షలు రాయగా 1,569 (43.83 శాతం) పాసయ్యారు. బాలికల్లో 4,141 మందికిగా ను 2,785 (67.24 శాతం) ఉత్తీర్ణులయ్యారు. జనరల్ విభాగంలో 6,485 మంది పరీక్షలు రాయగా 3,562 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 54.93గా నమోదైంది. వొకేషనల్ విభాగంలో 1,237 మందికిగాను 792 మంది పాసయ్యారు. 64.03 శాతం ఉత్తీర్ణులయ్యారు. న్యూస్రీల్అందరూ ఫెయిల్నాగిరెడ్డిపేట: ఈ ఏడాది నూతనంగా ప్రారంభమైన నాగిరెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫలితాలు నిరాశ పరిచాయి. 45 మంది మొదటి సంవత్సరం పరీక్షలు రాయగా అందరూ అనుత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరైన ఒక విద్యార్థి సైతం ఫెయిల్ అయ్యారు.ఇంటర్ ఫలితాల్లో జిల్లా వరుసగా రెండో ఏడాది కూడా చిట్టచివరి స్థానంలో నిలిచింది. 2023 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 13వ స్థానంలో ఉన్న జిల్లా.. 2024 సంవత్సరానికి వచ్చేసరికి 35 వ స్థానానికి పడిపోయింది. ఈసారి కూడా చివరిస్థానంలోనే నిలవడం గమనార్హం. -
రైతులందరికి భూధార్ కార్డులిస్తాం
భిక్కనూరు/రామారెడ్డి : భూ భారతి చట్టం అమలులోకి వచ్చిన వెంటనే రైతులందరికీ భూధార్ యునిక్ కార్డులను పంపిణీ చేస్తామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం భిక్కనూరు రైతు వేదికలో, రామారెడ్డి రైతు వేదికలలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులలో ఆయన మాట్లాడారు. లింగంపేట మండలంలో పైలట్ ప్రాజెక్టుగా భూభారతిని అమలు చేస్తున్నామన్నారు. జూన్ రెండు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ చట్టం అమలులోకి వస్తుందన్నారు. ర్యాగట్లపల్లికి చెందిన రైతు నరేందర్రెడ్డి, భిక్కనూరుకు చెందిన రైతు అందె దయాకర్రెడ్డి, తిప్పాపూర్కు చెందిన రైతు కుంట లింగారెడ్డి ధరిణి పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారం కోసమే భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయసంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, ఆర్డీవో వీణ, భిక్కనూరు, రామారెడ్డి తహసీల్దార్లు శివప్రసాద్, ఉమాలత, ఎంపీడీవోలు రాజ్కిరణ్రెడ్డి, తిరుపతిరెడ్డి, భిక్కనూరు డిప్యూటీ తహసీల్దార్ రోజా తదితరులు పాల్గొన్నారు. -
లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోవాలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలని ఎల్లారెడ్డి డీఎల్పీవో సురేందర్ సూచించారు. నాగిరెడ్డిపేట మండలం అచ్చాయపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం ఇందిరమ్మ లబ్ధిదారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైలెట్ గ్రామంగా ఎంపికై న అచ్చాయపల్లి గ్రామపంచాయతీ పరిధిలో మొత్తం 90మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరుకాగా ఇప్పటివరకు కేవలం 13మంది మాత్రమే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారన్నారు. మిగతా లబ్ధిదారులు ఎందుకు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించడంలేదని ఆయన ఆరా తీశారు. సమావేశంలో నాగిరెడ్డిపేట ఎంపీడీవో ప్రభాకరచారి, గ్రామపంచాయతీ ప్రత్యేకాధికారి పిచ్చయ్య, పంచాయతీ కార్యదర్శి వెంకటరాములు తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అర్హులను గుర్తించాలి దోమకొండ/ఎల్లారెడ్డిరూరల్/ నిజాంసాగర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అర్హులైన పేదలను గుర్తించాలని ఎంపీడీవో ప్రవీణ్కుమార్ అన్నారు. మంగళవారం దోమకొండ మండలం లింగుపల్లి గ్రామంలో లబ్ధిదారుల గుర్తింపుకు అధికారులు ఇంటింటికి తిరిగి గుర్తించారు. గ్రామంలో 12 మంది లబ్ధిదారులను గుర్తించాల్సి ఉండగా, 10 మంది ఇంటి నిర్మాణానికి ముందుకు వచ్చినట్లు ఎంపీడీవో వివరించారు. ఎల్లారెడ్డి మండలం అడివిలింగాల గ్రామంలో ఎంపీవో ప్రకాష్ ఇందిరమ్మ ఇళ్ల సర్వేను నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు చేసుకున్న వారికి సంబంధించిన వారి వివరాలను పరిశీలించారు.నిజాంసాగర్ మండలం మల్లూర్తండా గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల స్థలాలను ఎంపీడీవో గంగాధర్ పరిశీలించారు. ఇందిరమ్మ గృహాలు మంజూరైన లబ్ధిదారుల ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణ పనులపై లబ్ధిదారులతో చర్చించారు. ఈకార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
చెరువులో పడి ఒకరి మృతి
ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామ శివారులోని గుండ్ల చెరువులో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఇందల్వాయి మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన రమేష్(35) బతుకుతెరువు కోసం అంకాపూర్కు వచ్చి, పనిచేస్తున్నాడు. కాగ మంగళవారం బర్రెలను మేపుతుండగా చెరువులో పడిన బర్రెను కాపాడే ప్రయత్నంలో రమేష్ నీటిలోకి దిగాడు. చెరువులోని చేపల వల అతడికి తట్టుకోవడంతో నీటిలో మునిగి మృతిచెందాడు. మృతుడి భార్య అపర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. అనుమానాస్పద స్థితిలో ఒకరు.. వర్ని: మండల కేంద్రంలోని వీక్లీ మార్కెట్లో సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఆర్య రాకేష్ (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియ రాలేదని, విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రైతులు రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో మన్నే ప్రభాకర్ సూచించారు. మంగళవారం లింగంపేట మండలంలోని మెంగారం, ఎల్లారం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా మెంగారంలో ఆయన మాట్లాడారు. భూభారతి పోర్టల్ ద్వారా రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన వెల్లడించారు. రెవెన్యూ, అటవీ శాఖ భూముల వివాదాలను ఇరు శాఖల అధికారులు కలిసి సంయుక్తంగా సర్వే చేసి పరిష్కరించనున్నట్లు తెలిపారు. మండలంలోని మెంగారం గ్రామంలో 321, 322 సర్వే నంబర్లలో 60 మంది రైతులకు చెందిన 185 ఎకరాలు పట్టాలు ఉన్నా ఆన్లైన్లో సర్కారు భూమిగా చూపిస్తున్నట్లు అధికారుల దృష్టికి తెచ్చినట్లు రైతులు తెలిపారు. అలాగే రెవెన్యూ, అటవీ శాఖ వివాదంలో మరికొన్ని భూములు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్, ఆర్ఐ కిరణ్, ఎఫ్ఆర్వో ఓంకార్, అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
భిక్కనూరు మండల క్రైస్తవ సంఘం కార్యవర్గం ఎన్నిక
భిక్కనూరు: మండల క్రైస్తవ సంఘం నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలోని అన్ని గ్రామలకు చెందిన క్రైస్తవుల ప్రతినిధులు బస్వాపూర్లో సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా కమలాకర్, ఉపాధ్యాక్షులుగా శాంతికుమార్, జోసెప్, ప్రధానకార్యదర్శిగా ఈ. కిషన్, హయకార్యదర్శిగా పి.సుధాకర్, కోషాధికారిగా ఎస్.డేవిడ్, సంయుక్తకార్యదర్శిగా కే.యాదగిరి. సలహదారులుగా ప్రశాంత్కుమార్, డేవిడ్లు ఎన్నికయ్యారు. పాస్టర్ల కార్యవర్గం.. భిక్కనూరు మండలంలోని చర్చిల పాస్టర్లు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జాన్సన్ ఉపాధ్యాక్షుడిగా జోసెఫ్, ప్రధానకార్యదర్శిగా ఎన్.స్వామి, సహయకార్యదర్శిగా పౌల్, కోశాధికారిగా జెమ్స్, కార్యవర్గసభ్యులుగా పరిశుద్ధరావు, బాల్రాజులు ఎన్నికయ్యారు. ఈ సందర్బంగ నూతన అధ్యక్షునిగా ఎన్నికై న జాన్సన్ మాట్లాడుతూ చర్చిల అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. -
జొన్న కొనుగోలు పరిమితి పెంపుపై హర్షం
మద్నూర్/నిజాంసాగర్ (జుక్కల్): రైతుల శ్రేయస్సు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేశ్ పటేల్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో, నిజాంసాగర్ మండలం అచ్చంపేట సొసైటీ కార్యాలయం ఆవరణలో మంగళవారం సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, మంత్రి తుమ్మల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ మాట్లాడుతు ప్రభుత్వ జొన్న కొనుగోలు పరిమితిని ఎకరాకు 8 క్వింటాళ్ల నుంచి 14 క్వింటాళ్ల వరకు పెంపుపై వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వర్రావు దృష్టికి తీసుకువెళ్లి కృషి చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సలాబత్పూర్ హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ రాంపటేల్, సొసైటీ చైర్మన్ శీను పటేల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, అచ్చంపేట సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి, నాయకులు రైతులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ఆయా గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. మంగళవారం స్థానిక ఐకేపీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తాగునీరు ఏర్పాటు చేసి, నీడకోసం పచ్చని పందిర్లు వేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు వేగం పెంచి ట్యాబ్లో నమోదు చేయాలన్నారు.అలాగే మహిళా సంఘాల సభ్యులు పాఠశాలల యునిఫామ్స్ కుట్టే ప్రతీ విద్యార్థి కొలతలు తీసుకొని ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. స్కూల్ యునిఫాం కుట్టే మహిళలకు మంచి ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎం శ్రీనివాస్, సీసీలు రాజిరెడ్డి, గంగరాజు, నజీర్, మేహర్, మన్సూర్, స్వప్న, శ్రావణ్, బాలయ్య, సీ్త్రనిధి మేనేజర్ అమల, నరేందర్, రవి పాల్గొన్నారు. -
చౌదరి చెరువు మరమ్మతులకు రూ.37లక్షలు మంజూరు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పొల్కంపేట చౌదరి చెరువు మరమ్మతులకు రూ. 37 లక్షలు మంజూరైనట్లు కాంగ్రెస్ పార్టీ మండల సమన్వయకర్త నాగరాజు తెలిపారు. చౌదరి చెరువు తూము గత నాలుగు సంవత్సరాల క్రితం భారీ వర్షానికి తెగిపోయి కొట్టుకుపోయినట్లు తెలిపారు. ఈ విషయాన్ని గ్రామ రైతులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే స్పందించి ఎస్డీఎఫ్ నిధుల నుంచి రూ.37 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి అశ్వక్, గ్రామ కమిటీ అధ్యక్షుడు అజయ్గౌడ్, శివ్వయ్య, శ్రీనివాస్, సంజీవరెడ్డి, కృష్ణమూర్తి, దాసరి శ్రీనివాస్, రమేశ్, సతీష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.పెద్దమ్మ.. కరుణించమ్మా మాచారెడ్డి: మండలంలోని లచ్చాపేటలో మంగళవారం పోచ మ్మ, పెద్దమ్మ బోనాలను ఊరేగించారు. ముదిరాజులు ఇంటికో బోనం చొప్పున అలంకరించి అమ్మ వారికి సమర్పించారు. ఈసారి వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని పెద్దమ్మ తల్లిని వేడుకున్నారు. ఉద్యోగ భద్రత కల్పించే వరకు సమ్మె భిక్కనూరు: ఇచ్చిన హమీ మేరకు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల ఉద్యోగ భద్రత కల్పించేవరకు సమ్మెను కొనసాగిస్తామని కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర ఉపాధ్యాక్షుడు నారాయణగుప్తా అన్నారు. మంగళవారం తెలంగాణ యునివర్సీటీ సౌత్ క్యాంపస్లో కాంట్రాక్టు అధ్యాపకుల సమ్మె శిబిరాన్ని ఆయన సందర్శించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో 1100 మంది కాంట్రాక్లు అధ్యాపకులు ఉన్నారని వీరందరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీ మేరకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో కాంట్రాక్టు అధ్యాపకులు యాలాద్రి, సునిత, నరసయ్య,రమాదేవి, నిరంజన్, వైశాలి, సరిత, శ్రీకాంత్, దిలీప్లు పాల్గొన్నారు. -
పార్టీ వదలి వెళ్లిన వారిని తిరిగి చేర్చుకోం
కామారెడ్డి క్రైం/భిక్కనూరు : బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదవులు పొంది అధికారం పోగానే కాంగ్రెస్లో చేరిన నేతలను తిరిగి ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని మాజీ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. భిక్కనూరు మండల కేంద్రంలో, కామారెడ్డి పట్టణ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులకు రెండు లక్షల రుణ మాఫీ చేశామని కాంగ్రెస్నేతలు ప్రగల్బాలు పలుకుతున్నారని, వంద శాతం రుణమాపీ జరిగినట్లు నిరూపిస్తే తన ముక్కును నేలకు రాస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలను కన్నతల్లికి మోసం చేసిన వారిగానే పరిగణిస్తామన్నారు. ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజత్సోవ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కామారెడ్డి పట్టణంలో చలో వరంగల్ ఆటో స్టిక్కర్ లను ఆటోలకు ఆయన అతికించారు. బీఆర్ఎస్ లో పలువురు యువకుల చేరిక.. జిల్లా కేంద్రానికి చెందిన 30 మంది యువకులు మంగళవారం కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రేస్ నాయకులు యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, నాయకులు కుంభాల రవి, ప్రభాకర్ యాదవ్, క్రిష్ణాజీ రావు, పార్టీ అధికార ప్రతినిధి బల్వంత్ రావు, నాయకులు పిట్ల వేణు, లక్ష్మీ నారాయణ, స్వామి, గైని శ్రీనివాస్, హాఫిజ్ భాను ప్రసాద్, కాంగ్రెస్ నేతలు అత్తెల్లి శ్రీనివాస్, నాగార్తి భూంరెడ్డి, వంగేటి చిన్ననర్సరెడ్డి, అందే మహేందర్రెడ్డి, తున్కి వేణు, పాలరాంచంద్రం, ద్యావర సాయిరెడ్డి, రవీందర్రెడ్డి, బస్వయ్య, ఎనుగు వెంకట్రెడ్డి, వలకొండ వెంకట్రెడ్డి. అంబల్ల మల్లేషం, తక్కళ్ళ రవీందర్రెడ్డి, అనంత్గౌడ్, ముచ్చర్ల రాజిరెడ్డి,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. రుణమాీఫీ వందశాతం చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ -
జల్సాల కోసం చోరీలు
కామారెడ్డి క్రైం: జల్సాలకు అలవాటు పడి తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని దేవునిపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కామారెడ్డి సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి వివరాలు వెల్లడించారు. పది రోజుల క్రితం పట్టణ శివారు కాలనీలో ఓ దొంగతనం జరిగింది. పోలీసులు విచారణ చేపట్టగా మాసాయిపేట్కు చెందిన పందిగోటి రామును నిందితుడిగా గుర్తించారు. అతడిని తూఫ్రాన్ ప్రాంతంలో మంగళవారం పట్టుకుని విచారించగా దేవునిపల్లితోపాటు నిజామాబాద్, బోధన్, మేడ్చల్, మనోమరాబాద్ పీఎస్ల పరిధిలో మొత్తం 9 చోట్ల చోరీలకు పాల్పడినట్లు తేలింది. దీంతో అతడికి సహకరించిన బంధాపురం మల్లేష్, వడ్డెర నవీన్, శ్యాంలాల్, రినివర్ రాజారాం, మునివర్ గౌతంలను సైతం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నామని ఏఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 6 తులాల బంగారం, అర కిలో వెండి ఆభరణాలు రికవరీ చేశామన్నారు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్ 9 కేసుల్లో నిందితుడితో పాటు మరో ఐదుగురు అరెస్ట్ వివరాలు వెల్లడించిన ఏఎస్పీ చైతన్యరెడ్డి -
డ్రంకన్డ్రైవ్ కేసులో ఒకరికి ఐదురోజుల జైలు
ఎడపల్లి(బోధన్): మండలం కేంద్రంలో ఇటీవల పోలీసులు డ్రంకన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా అంబం(వై)గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. అతడిని పోలీసులు మంగళవారం కోర్టులో హాజరు పరచగా ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు వెల్లడించారు. సమయపాలన పాటించని వ్యాపారికి.. ఆర్మూర్టౌన్: పెర్కిట్లో షేక్ మాజీద్ తన దుకాణంను రాత్రివేళ సమయపాలన పాటించకుండా నడపడంతో ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ కేసు నమోదు చేశారు. దీంతో షేక్ మాజీద్ను మంగళవారం కోర్డులో హాజరుపర్చగా జడ్జి రెండు రోజుల జైలు శిక్ష విధిస్తు తీర్పును వెల్లడించినట్లు ఎస్హెచ్వో తెలిపారు. తాళం వేసిన ఇంట్లో చోరీ ఆర్మూర్టౌన్: పట్టణంలోని యోగేశ్వర కాలనీలో తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. వివరాలు ఇలా.. కాలనీకి చెందిన తోగటి భమేశ్వర్ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఉదయం ఇంటికి తాళం వేసి మామిడిపల్లిలోని వృద్ధాశ్రమానికి వెళ్లాడు. తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి తాళం ధ్వంసం చేసిఉండటంతో పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దుండగులు బీరువాలోని 5తులాల బంగారం, 80గ్రాముల వెండిన దొంగిలించినట్లు తెలిపారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. కులాస్పూర్ తండా, బాడ్సిలో అగ్నిప్రమాదం మోపాల్: మండలంలోని కులాస్పూర్ తండా, బాడ్సి గ్రామాల్లో మంగళవారం మధ్యాహ్న సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. కులాస్పూర్ తండాలో బంతిలాల్కు చెందిన గడ్డివాముకు మంటలు అంటుకుని పెళ్లి కోసం కొనుగోలు చేసిన కలప దగ్ధమైంది. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారమివ్వగా, నిజామాబాద్ నుంచి వచ్చిన సిబ్బంది మంటలార్పేశారు. ప్రమాదంలో సుమారు రూ.40వేల వరకు నష్టం జరిగినట్లు బంతిలాల్ పేర్కొన్నాడు. అలాగే బాడ్సిలో కోసిన వరి గడ్డికి నిప్పంటుకుంది. డయల్ 100కు గ్రామస్తులు ఫోన్ చేయడంతో ఎస్ఐ యాదగిరి గౌడ్, సిబ్బందితో అక్కడికి వెళ్లి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తుండగా, ఇందల్వాయి నుంచి వచ్చిన ఫైరింజన్ మంటలను అదుపులోకి తెచ్చింది. బదావత్ చత్రు గడ్డి, కె శ్రీనివాస్ పైపులు ప్రమాదంలో కాలిబూడిదయ్యాయి. సిర్నాపల్లి అడవుల్లో ఇసన్నపల్లి వాసి హత్య? రామారెడ్డి: కామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని సిర్నాపల్లి అడవులలో ఏడు నెలల క్రితం హత్య చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. హత్యకు కారకులైన ఇద్దరు వ్యక్తులతో పాటు మృతుడి భార్యను రామారెడ్డి పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. హత్య ఘటనలో ఆరు నుంచి ఎనిమిది మంది పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతోంది. మృతుడు గల్ఫ్కు వెళ్లినట్లుగా మృతుడి భార్య బంధువులను నమ్మించింది. మృతుడి అన్నకు అనుమానం రావడంతో రామారెడ్డి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశాడు. తన తమ్ముడు గల్ఫ్ దేశం వెళ్లలేదని, తమ్ముడి భార్య వివాహేతర సంబంధం పెట్టుకొని ప్రియుడితో కలిసి అతడిని హత్య చేయించిందని ఫిర్యాదు చేశాడు.మృతుడు గల్ఫ్ దేశం వెళ్లినట్లు ఇమిగ్రేషన్ లేదనే సమాచారం పోలీసులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుపై ఎస్పీ నేరుగా రంగంలోకి దిగడంతో హత్య ఘటన కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. -
కుక్కల దాడిలో పసి బాలుడికి గాయాలు
ఆర్మూర్టౌన్: పట్టణంలోని 11వ వార్డులో మంగళవారం ఉదయం శ్రేయన్స్ అనే బాలుడిపై కుక్క దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు గమనించి కుక్కను తరిమేసి, గాయపడ్డ బాలుడిని చికిత్స నిమిత్తం ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. మున్సిపల్ అధికారులు ఇప్పటిౖకైనా కుక్కల నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. మద్నూర్లో లేగదూడలకు.. మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణ గోశాలలోని రెండు లేగదూడలపై కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. గోశాలలోకి మంగళవారం ఉదయం కుక్కల గుంపు ప్రవేశించి లేగదూడలపై దాడి చేశాయన్నారు. దీంతో లేగదూడలకు తీవ్ర రక్తస్రావం జరిగిందన్నారు. మరో రెండు లేగదూడలు పారిపోయాయని వాటి కోసం వెతుకుతున్నామని గోశాల నిర్వాహకులు తెలిపారు. -
వేర్వేరు కారణాలతో పలువురి ఆత్మహత్య
తాడ్వాయి మండలంలో.. తాడ్వాయి (ఎల్లారెడ్డి): మండలంలోని కాళోజివాడిలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై రాజయ్య తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన మల్లమారి రాకేష్ (25)కు ఐదేళ్ల క్రితం రామారెడ్డి మండలంలోని పోసానిపేట గ్రామానికి చెందిన సంధ్యతో వివాహం జరిగింది. వారికి మూడేళ్ల కుమారుడు అనూష్ ఉన్నాడు. రెండేళ్లుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈక్రమంలో ఇటీవల సంధ్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటినుంచి రాకేష్ తీవ్ర మనస్థాపంతో బాధపడుతుండేవాడు. కాగా సోమవారం మధ్యాహ్నం గ్రామ శివారులోని తన వ్యవసాయ భూమి వద్ద గల వేపచెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ ప్రాజెక్టులో పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. వివరాలు ఇలా.. బోధన్ పట్టణంలోని శక్కర్నగర్ ప్రాంతంలో అబ్దుల్ సలాం (37) నివసిస్తుండేవాడు. అతడి భార్య ఏడాది క్రితం మృతిచెందడంతో ఆమె తల్లితరపువారు సలాంపై కేసు వేశారు. దీంతో సలాం జైలుకు వెళ్లగా ఇటీవల బయటకు వచ్చాడు. తన పిల్లలను చూడడానికి అత్తగారింటికి వెళ్లిన సలాంను వారు అడ్డుకోవడంతో మనస్థాపం చెందాడు. దీంతో సలాం వాట్సప్ స్టేటస్ పెట్టి, నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వర్ని మండలంలో..వర్ని: మండలంలోని చందూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై మహేష్ తెలిపిన వివరాలు ఇలా.. చందూర్ గ్రామానికి చెందిన అర్కల గోపాల్రెడ్డి ఆర్థిక ఇబ్బందులు భరించలేక సోమవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ముప్కాల్ మండలంలో.. బాల్కొండ: ముప్కాల్ మండలంలో ఓ వ్యక్తి ఇటీవల ఆత్మహత్యకు యత్నించగా ఆస్పత్రి లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా.. నా గంపేట్ గ్రామానికి చెందిన ఏ లేటి గంగాధర్ అలియాస్ వకీ ల్ (49) కొంతకాలంగా తనకు ఎవరో మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో మానసికంగా బాధపడుతున్నాడు. మానసిక ప్రశాంతత కోసం ఈనెల 15న గ్రామస్తులతో కలిసి తిరుపతిలో శ్రీవారి సేవ చేయుటకు వెళ్లాడు. గంగాధర్ నిత్యం కల్లు తాగే అలవాటు ఉంది. తిరుపతిలో కల్లు లభించకపోవడంతో మానసిక ఆందోళనకు గురై ఆదివారం గ్రామానికి వస్తుండగా మార్గమధ్యలో పురుగులమందు తాగాడు. అనంతరం కొత్తపల్లికి గ్రామంలో ఓ ఇంటి వద్ద నీరు తాగి అక్కడే కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆర్మూర్లోని ఓ ప్రయివేలు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతిచెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. -
గల్ఫ్లో తప్పిపోయిన భర్తను వెతికించండి
● ప్రజావాణిలో భార్య వినతిరామారెడ్డి: గల్ఫ్లో తప్పిపోయిన భర్తపై భార్య ఆవేదన చెందుతోంది. ఈమేరకు సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె వినతి పత్రం అందజేసింది. వివరాల్లోకి వెళ్తే.. రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామానికి చెందిన ఎగ్గిని బక్క మల్లవ్వ భర్త బక్క మల్లయ్య ఉపాధి నిమిత్తం పదేళ్ల కింద రూ. లక్ష అప్పు చేసి ముంబయి నుంచి మస్కట్ దేశానికి వెళ్లాడు. మంబయి విమానాశ్రయానికి బయలుదేరే ముందు భర్త ఫోన్లో మాట్లాడిందే చివరి మాట అని బక్కమల్లవ్వ ‘సాక్షి’తో తెలిపారు. తన భర్త ఆచూకీ కనిపెట్టి ఇండియాకు రప్పించాలని, లేనిచో తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ దేశాల్లో చనిపోయిన వారికి రూ.5 లక్షల నష్టపరిహారం ఇస్తున్న నేపథ్యంలో అందించాలని ప్రజావాణిలో వినతి ప్రతం అందించినట్లు ఆమె తెలిపారు. -
గ్రామీణ విద్యార్థులకు పట్టుదల ఎక్కువ
భిక్కనూరు: పట్టణ ప్రాంత విద్యార్థులకంటే గ్రామీ ణ ప్రాంత విద్యార్థులకు పట్టుదల, చురుకుదనం ఎక్కువని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన భిక్కనూరులోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్క్యాంపస్ను సందర్శించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని క్రమశిక్షణతో ముందుకు సాగితే బంగారు భవిష్యత్తు సొంతమవుతుందన్నారు. సౌత్క్యాంపస్ సమస్యలను వైస్చాన్స్లర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేస్తానన్నారు. అనంతరం బాలకల వసతి గృహంలో విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఆయన వెంట ప్రిన్సిపల్ సుధాకర్గౌడ్, హాస్టల్ వార్డెన్లు యాలాద్రి, సునీత, అధ్యాపకులు మోహన్బాబు, సబిత, హరిత, లలిత, అంజయ్య, నారాయణ, రమాదేవి, నర్సయ్య ఏపీఆర్వో సరిత పాల్గొన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలి వర్సిటీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్టు అధ్యాపకులు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డిని కోరారు. ఈ విషయమై వారు సోమవారం వినతి పత్రం అందించారు. ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీల్లో పనిచేసిన కాంట్రాక్టు అధ్యాపకులకు పర్మినెంట్ చేశారని గుర్తు చేశారు. కాంట్రాక్టు అధ్యాపకుల సమస్య ప్రభుత్వం దృష్టిలో ఉందని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని బాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో నారాయణగుప్తా, యాలాద్రి, సునీత, నరసయ్య, రమాదేవి, శ్రీకాంత్, నిరంజన్, దిలీప్, సరిత పాల్గొన్నారు. 50 పడకల ఆస్పత్రి నిర్మాణానికి స్థల పరిశీలనదోమకొండ : మండల కేంద్రంలో 50 పడకల ఆ స్పత్రి నిర్మాణానికి అధికారులు సోమవారం స్థలాన్ని పరిశీలించారు. హైదరాబాద్కు చెందిన ఎంఐడీపీ అధికారి కుమార్ నరసింహ, డీసీహెచ్ఎస్ విజయలక్ష్మి తదితరు లు మండల అధికారులతో కలిసి మండల కేంద్రంలోని దేవునికుంట, గుండ్ల చెరువు ప్రాంతం, ముత్యంపేట రోడ్డు ప్రాంతాలలోని స్థలాలను పరిశీలించారు. అనంతరం స్థానిక అధికారుల తోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులతో ప్రభుత్వ ఆస్పత్రిలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. వారి వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ సంజయ్రావ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, నాయకులు తిరుమల్గౌడ్, స్వామి, మధుసూదన్, రామస్వామిగౌడ్, తదితరులున్నారు. తెయూ డిగ్రీ పరీక్షలు వాయిదా తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 28 నుంచి ప్రారంభం కావాల్సిన డిగ్రీ రెగ్యులర్ 2, 4, 6వ సెమిస్టర్, బ్యాక్లాగ్ 1, 3, 5 వ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి సంపత్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఫీ జు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చే యకపోవడం, ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో ప్రయివేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు పరీక్షల నిర్వహణకు నిరాకరించడంతో వాయిదా వేసినట్లు సమాచారం. -
బైక్పై వెళ్తున్న వ్యక్తిని అటకాయించి గొడ్డలితో దాడి
మాచారెడ్డి: బైక్పై వెళ్తున్న వ్యక్తిని అటకాయించి గుర్తుతెలియని దుండగులు ఇనుపరాడ్లు, గొడ్డలితో దాడికి పాల్పడ్డారు. ఈఘటన సోమవారం ఫరీదుపేట, దోమకొండ శివారులో చోటు చేసుకుంది. మాచారెడ్డి ఎస్సై అనిల్ తెలిపిన వివరాలు .. మండలంలోని ఘన్పూర్(ఎం) గ్రామానికి చెందిన సాడెం కుమార్ తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే తన బైక్పై ఫరీదుపేట మీదుగా దోమకొండ వైపు వెళ్తున్నాడు. ఫరీదుపేట, దోమకొండ గ్రామాల శివారులో రెండు బైకులు, ఒక ఆటోలో దుండగులు అతడిని వెంబడించి ఇనుపరాడ్లు, గొడ్డలితో తలపై బాదారు. కుమార్ రోడ్డు పక్కన కుప్పకూలిపోయాడు. అదే సమయంలో దోమకొండ వైపు నుంచి ఫరీదుపేటకు కారులో వస్తున్న పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రమేశ్గౌడ్ అతడిని గమనించి కారు ఆపాడు. దీంతో దుండగులు దోమకొండ వైపు పారిపోయారని ఎస్సై తెలిపారు. కుమార్కు తలపై నాలుగు చోట్ల గాయాలు కావడంతో అంబులెన్స్లో కామారెడ్డిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. పథకం ప్రకారం దాడి జరగడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యువకుడికి తీవ్ర గాయాలు -
30 కిలోల గంజాయి పట్టివేత
ఖలీల్వాడి: ఎండుగంజాయి తరలిస్తున్న ఐదుగురిని పట్టుకుని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్లు ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నగరంలోని గంజ్ ప్రాంతంలో ఆటోనగర్కు చెందిన మొహమ్మద్ ఆయూబ్ వద్ద గంజాయి ఉన్నదనే సమాచారం మేరకు అతని వద్ద తనిఖీ చేయగా 250 గ్రాముల ఎండుగంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొహమ్మద్ ఆయూబ్ను విచారించగా మహారాష్ట్ర, నాందేడ్లోని బోకార్కు చెందిన ఫరూక్ఖురేషీ వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఆదివారం రాత్రి నవీపేట్ మండలం యంచ వద్ద ఫారూఖ్ఖురేషీతోపాటు నాందేడ్లోని బోకార్కు చెందిన యషేక్ ఫయీమ్, షేక్ సిద్ధిక్, జుబేర్ పఠాన్లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారి కారులో తనిఖీలు చేయగా అందులో 30కిలోల ఎండుగంజాయి దొరికినట్లు తెలిపారు. ఫారూక్ఖురేషీ ఆంధ్ర, ఛత్తీష్గఢ్ సరిహద్దు ప్రాంతం నుంచి ఎండుగంజాయిని కొనుగోలు చేసి నిజామాబాద్, నాందేడ్ చుట్టుపక్కల ప్రాంతాలలో అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలిపారు. 30.250 కిలోల ఎండు గంజాయి విలువ రూ.6లక్షల వరకు ఉంటుదన్నారు. నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి కారు, రెండు బైక్లు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎ క్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ స్వప్న, ఎస్సై రాంకుమార్, సిబ్బంది హమీద్, రాజన్న, రాంబచన్, సుకన్య, ఆశన్న, అవినాష్, శ్యాంసుందర్, సాయికుమార్ పాల్గొన్నారు. -
టేకుచెట్ల నరికివేతపై విచారణ
ఎల్లారెడ్డి: పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో టేకుచెట్ల నరికివేతపై అటవీశాఖ అధికారులు సోమవారం విచారణ నిర్వహించారు. వార్డెన్ శారదను అటవీశాఖ కార్యాలయంలో ఎఫ్ఆర్వో ఓంకార్ టేకు చెట్ల నరికివేత గురించి వివరాలు సేకరించారు. హాస్టల్లో కోతులు విద్యార్థులపై దాడులు చేస్తుండడంతో చెట్లను నరికివేయించినట్లు వార్డెన్ తెలిపారు. అనుమతులు లేకుండా టేకు చెట్లను నరికినందున అటవీశాఖ చట్టం కింద కేసు నమోదు చేసి నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. స్ట్రైకింగ్ ఫోర్స్ డీఆర్వో అనురంజని, ఎల్లారెడ్డి డీఆర్వో శ్రీనివాస్నాయక్ తదితరులున్నారు. మెడికల్ కళాశాలకు మృతదేహం దానం బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రానికి చెందిన చెల్లల గంగారాం (65) సోమవారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈక్రమంలో కుటుంబ సభ్యులు గంగారాం మృతదేహాన్ని నిజామాబాద్ మెడికల్ వైద్య కళాశాలకు దానం చేశారు. జుక్కల్ మండలం దోస్పల్లి తెలంగాణ ఉప పీఠం జగద్గురు రామానంద ఉపదేశాల మేరకు కుటుంబసభ్యులు మృతదేహాన్ని వైద్య విద్యార్థుల శిక్షణ కోసం అప్పగించారు. జగద్గురు స్వామిజీ భక్తులు ఇప్పటి వరకు 94 శవాలను మహారాష్ట్ర, తెలంగాణలోని ఆయా జిల్లాలో మెడికల్ వైద్య కళాశాలకు దానం చేశారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని గాంధారి–లింగంపేట్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు ఇలా.. చద్మల్ తండాకు చెందిన మాండు జీవన్(45) సోమవారం బైక్పై రాంలక్ష్మణ్పల్లి వైపు నుంచి గుర్జాల్తండా వైపు బయలుదేరాడు. బ్రాహ్మణ్పల్లి స్టేజీ సమీపంలో అతడి బైక్ అదుపుతప్పడంతో కిందపడిపోయాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య కమలాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సో మవారం నిర్వహించిన ప్రజావాణికి 108 ఫిర్యా దులు వచ్చాయి. వాటిలో భూ సంబంధిత ఫిర్యాదు లే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించాలన్నారు. వాటిని పరిస్కరించడం గానీ, పరిష్కార మార్గాలు చూపడం గానీ చేయాలన్నారు. తీసుకున్న చర్యలపై ఫిర్యాదుదారునికి సమాచారం ఇవ్వాలన్నారు. రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల విచారణ త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కొన్ని కేంద్రాల్లో ధాన్యం ఉన్నప్పటికీ కొనుగోళ్లు జరగడం లేదని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపులకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని సూచించారు. ధరణి ఫైళ్లు ఆన్లైన్లో మాత్రమే వస్తున్నాయనీ, తహసీల్దార్లు మ్యానువల్ ఫైళ్లను పంపడం లేదని, వెంటనే పంపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్, ఆర్డీవో వీణ, కలెక్టరేట్ పాలనాధికారి మసూద్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ ప్రజావాణికి 108 వినతులు -
తాగునీటి కోసం ఆందోళన
లింగంపేట: తాగునీటి కోసం గాంధీనగర్వాసులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి –ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి నీటిని సరఫరా చేసే బోరుబావిలో నీరు అడుగంటిందన్నారు. మరికొన్ని పైపులు దించితే నీరు అందించే అవకాశం ఉన్నా నిధుల కొరతతో పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. సమీపంలోని వ్యవసాయ బోరుబావులలోనూ నీరు అడుగంటడంతో నీటికోసం అవస్థలు పడుతున్నామన్నారు. ట్యాంకర్ ద్వారా సరఫరా చేస్తున్న నీరు సరిపోవడం లేదన్నారు. సమస్య పరిష్కరించాలంటూ సుమారు గంటపాటు రాస్తారోకో చేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎంపీడీవో గ్రామానికి వచ్చి మాట్లాడారు. తాగునీరు సరఫరా చేయిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఎంపీడీవో వెంటనే మరో ట్యాంకరు ఏర్పాటు చేసి తాగునీరు సరఫరా చేశారు. అలాగే మిషన్ భగీరథ పైపులైన్కు మరమ్మతులు చేయించి నీటి సరఫరాను పునరుద్ధరించారు. -
‘భద్రత’తో పోలీసు కుటుంబాలకు భరోసా
కామారెడ్డి క్రైం: భద్రత పథకం కింద మృతి చెందిన పోలీసు కుటుంబాలకు ఆర్ధిక భరోసా లభిస్తుందని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన రామన్ అనే కానిస్టేబుల్ కుటుంబానికి మంజూరైన రూ. 8 లక్షల పోలీసు భద్రత చెక్కును సోమవారం కుటుంబ సభ్యులకు ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు రావాల్సిన సదుపాయాలను వీలైనంత త్వరగా ఇప్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కార్యాలయ ఏవో అఫ్సరుద్దీన్, సూపరింటెండెంట్ నయీం, సిబ్బంది పాల్గొన్నారు. బెట్టింగులు, ఆన్లైన్ గేమ్లపై ఉక్కుపాదం లింగంపేట(ఎల్లారెడ్డి): బెట్టింగులు, ఆన్లైన్ గేమ్లపై ఉక్కుపాదం మోపనున్నట్లు ఎస్పీ రాజేశ్ చంద్రం వెల్లడించారు. సోమవారం ఆయన లింగంపేట పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో క్రికెట్ బెట్టింగులు పెరగడంతో వాటిపై నిఘా పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు సైతం సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ. 73 లక్షలు పోగొట్టుకున్నట్లు తెలిపారు. అలాగే కల్తీ కల్లులో అల్ప్రాజోలం వాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిన కొంత మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మత్తు మందులు గుర్తించడానికి టెస్టింగ్ కిట్లు వచ్చాయని, ల్యాబ్కు పంపకుండానే ఎంత మేరకు మత్తు మందు కలిపారనేది తేలిపోతుందన్నారు. ఎస్పీ రాజేష్ చంద్ర -
ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్
ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని పంచాయతీరాజ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ఎస్ శ్రీనివాస్ శ ర్మ రూ.7 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. డొంకేశ్వర్లో సీసీ రోడ్డు నిర్మాణం పనులకు సంబంధించిన రూ.4 లక్షల 75 వేల బిల్లుల మంజూరు చేసేందుకు రూ.7,500 ఇవ్వాలని కాంట్రాక్టర్ను శ్రీనివాస్ డిమాండ్ చేసాడు. దీంతో కాంట్రాక్ట ర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పక్కా ప్రణాళిక ప్రకారం సోమవారం కాంట్రాక్టర్ రూ.7 వేలు ఇవ్వగా తీసుకుంటున్న శ్రీనివాస్ శర్మను పట్టుకున్నట్లు డీఎస్పీ శేఖర్గౌడ్ వివరించారు. విచారణ పూర్తయిన అనంతరం నిందితుడిని హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు తరలిస్తామని డీఎస్పీ వివరించారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు నగేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
భూభారతితో రైతుల సమస్యలు పరిష్కారం
లింగంపేట: భూభారతి పోర్టల్ ద్వారా రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. సోమవారం పర్మళ్ల, పొల్కంపే ట గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించా రు. పర్మళ్ల సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ దశాబ్దా లుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలపై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వాటిని చట్ట ప్రకా రం పరిష్కరిస్తామని పేర్కొన్నారు. రైతులు తమ స మస్యలను దరఖాస్తులో స్పష్టంగా రాసి అందించా లన్నారు. భూభారతి పోర్టల్లో భూముల రిజిస్ట్రే ష న్లు, సాదాబైనామాలు, రెవెన్యూ భూ రికార్డుల్లో తప్పుల సవరణ, వారసత్వ భూములు, సర్వే నంబర్లలో తప్పులు, ఒకరి భూమి మరొకరి పేరుపై నమోదు కావడం, సర్వే నంబర్లు తప్పుగా నమోదు కావడం తదితర సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. భూ సమస్యలను జూన్ 2లోగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. పరిష్కారం కాని సమస్యల పై ట్రిబ్యునల్కు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. పర్మళ్లలో 165 దరఖాస్తులు, పొల్కంపేటలో 165 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపా రు. పర్మళ్లలో 331 సర్వే నంబరులో పలువురు రైతులకు చెందిన 62 ఎకరాలు, 380 సర్వే నంబరులో మరికొంతమంది రైతులకు సంబంధించిన 96 ఎకరాలు, 400 సర్వే నంబరులో 120 ఎకరాలు సీలింగ్ భూములుగా నమోదయ్యాయని అధికారుల దృష్టి కి తీసుకువెళ్లారు. వాటిపై విచారణ చేపట్టి పరిష్కా ర మార్గాలు చూపుతామని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మన్నె ప్రభాకర్, తహసీల్దార్ సురేశ్ తదితరులు పాల్గొన్నారు. పెద్దకొడప్గల్లో.. పెద్దకొడప్గల్: మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం భూభారతి అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ధరణి వల్ల నష్టపోయిన వారికి మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభు త్వం భూభారతి తీసుకువచ్చిందన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, మండల ప్రత్యేకాధి కారి కిషన్, తహసీల్దార్ దశరథ్, ఎంపీడీవో లక్ష్మీకాంత్రెడ్డి, ఏవో కిషన్, కాంగ్రెస్ మండల అధ్యక్షు డు మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనుల పరిశీలన
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను సోమవారం జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పరిశీలించారు. ఇంజినీర్లతో పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూ.40 కోట్లతో రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయన్నారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంపీ రైల్వే అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమీపంలో బ్రిడ్జి లేదా ఆర్వోబీ నిర్మించేందుకు సర్వే జరుగుతోందన్నారు. పాతరాజంపేట వద్ద కూడా రైల్వే బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఇన్, ఔట్ గేట్లను ఏర్పాటు చేసే క్రమంలో ఉపాధి కోల్పోతున్న వారికి రైల్వేశాఖ నిర్మించే మడిగెలు కేటాయించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ అధికారులకు సూచించారు. వారి వెంట అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వాణి, మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, కాంగ్రెస్ నేతలు అశోక్రెడ్డి, పాత రాజు, పండ్ల రాజు, శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్ తదితరులున్నారు. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించిన ఎంపీ సురేశ్ షెట్కార్ మడిగెలు కోల్పోయే వారికి ప్రత్యామ్నాయం చూపాలి: షబ్బీర్ అలీ -
రైతు ప్రయోజనాలే పరమావధి
ప్రాజెక్టులు పూర్తి చేస్తాం సుభాష్నగర్: రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలే పరమావధి అని, ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతాంగానికి ఇచ్చిన ప్రతి హామీ అమలు కోసం పని చేస్తామన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో రైతు మహోత్సవం కార్యక్రమం సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ అధ్యక్షుడు మ హేశ్కుమార్గౌడ్, ప్రభుత్వ సలహాదారులు పోచా రం శ్రీనివాస్రెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, భూపతిరెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డితో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రైతు మహోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో తుమ్మలో మాట్లాడుతూ.. సేంద్రియ వ్యవసాయం చేయాలని, సాగుకు ఆధునిక సాంకేతికతను జోడించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించేలా మెళకువలు అందించేందుకు రైతుమహోత్సవం ఎంతగానో ఉపకరిస్తుందని, దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతర దేశాల్లో సాగు చేసే పంటలు, ఆధునిక సాగుపై మూడురోజులపాటు శాస్త్రవేత్తలు, నిపుణులు అవగాహన కల్పిస్తారని తెలిపారు. అత్యంత లాభదాయకమైన పంట పామాయిల్ అని, జంతువులు, చీడ పురుగులు నష్టం చేయవని, రైతులు సాగు చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న జిల్లాలో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు సీఎం రేవంత్రెడ్డితో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి తుమ్మల తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్లో జిల్లాకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులుగా ఎంపిక చేసిన రైతులకు సబ్సిడీతో కూడిన ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలు, చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, కార్పొరేషన్ చైర్మన్లు ఈరవత్రి అనిల్, అన్వేష్రెడ్డి, తాహెర్ బిన్ హందాన్, మా నాల మోహన్రెడ్డి, కాసుల బాల్రాజ్, జంగా రాఘవరెడ్డి, డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, నాయకులు ఏనుగు రవీందర్రెడ్డి, అరికెల నర్సారెడ్డి, నగేశ్రెడ్డి, బాడ్సి శేఖర్గౌడ్, మునిపల్లి సాయిరెడ్డి, కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, సీపీ సాయిచైతన్య, పసుపు బోర్డు కార్యదర్శి భవానీ శ్రీ, వ్యవసాయశాఖ డైరెక్టర్ఎన్ గోపి, ఉద్యానవనశాఖ కమిషనర్ యాస్మిన్ బాషా, మార్కెటింగ్శాఖ జేడీ మల్లేశం, డీడీ పద్మహర్ష, అనుబంధశాఖల ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, ఐదు జిల్లాల నుంచి రైతులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. జిల్లాలో కాళేశ్వరం 20, 21, 22 ప్యాకేజీల పెండింగ్ పనులతోపాటు గుత్ప ఎత్తిపోతల పథకం మిగులు పనులకు అవసరమైన నిధులు కేటాయించి త్వరలో పూర్తి చేయిస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల పూడికతీతకు ఈనెలాఖరులోగా టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. భూగర్భ జలాలు వృద్ధి చెందేలా అవసరమైన చోట విరివిగా చెక్ డ్యామ్లు నిర్మిస్తామని అన్నారు. రైతు మహోత్సవం ప్రారంభ సభావేదికపైనే జిల్లా ఎమ్మెల్యేల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి ప్రసంగిస్తూ గన్నీ బ్యాగుల కొరత ఉందని మంత్రుల దృష్టికి సమస్యను తీసుకొచ్చారు. ఆ తర్వాత మాట్లాడిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి.. రాకేశ్రెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి సమస్యలు లేవని, బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి ఉద్దేశపూర్వకంగానే గన్నీ బ్యాగుల కొరత ఉందని చెబుతున్నారని అన్నారు. భూపతిరెడ్డి ప్రసంగం ముగిసిన తర్వాత రాకేశ్రెడ్డి మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు వద్దకు వెళ్లి తనపై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇరువురు మంత్రులు రాకేశ్రెడ్డిని సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది. వేదికపై వాగ్వాదం సాగుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాలి ఆయిల్పామ్ సాగుపై ఆసక్తి చూపాలి రైతులకిచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అట్టహాసంగా ప్రారంభమైన రైతు మహోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన స్టాళ్లు ఐదు జిల్లాల నుంచి తరలివచ్చిన రైతులు -
రైతులు తలెత్తుకుని తిరిగే రోజు రావాలి
రాష్ట్రంలోని ప్రతి రైతు తలెత్తుకుని తిరిగే రోజు రావాలని, పంట పండించే రైతుకు బోనస్ ఇవ్వడంతో ప్ర భుత్వంపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. సేంద్రియ ఎరువులను ప్రోత్సహించాలని, పెట్టుబడి ఖర్చు తగ్గించాలని, అధిక దిగుబడులు పెరగాలన్నారు. రైతులు అప్పుల నుంచి బయట పడేలా అధికారులు, ప్రభుత్వం పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. పంటలకు బోనస్ ఇస్తే, రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. -
రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
కామారెడ్డి క్రైం : వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నె ల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ కార్యకర్తలు విజయవంతం చేయాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పిలుపునిచ్చారు. సోమవారం కామారెడ్డిలోని ఆయన నివాసంలో రాజంపేట, కామారెడ్డి మండలాల పార్టీ నేతలతో సన్నాహక సభ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇ చ్చిన హామీలను సీఎం రేవంత్రెడ్డి గాలికి వదిలేశా రని ఆరోపించారు. హామీల అమలు చేతకాక ప్రతిపక్షాలపై నోరు పారేసుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు. పంట రుణాల మాఫీ, రైతుబంధు అమలు లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో మాజీ సీఎం కేసీ ఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. బీఆర్ఎస్ సభకు నియోజకవర్గం నుంచి 3 వేల మంది కార్యకర్తలను తరలించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్ గోపి గౌడ్, పార్టీ మండలాల అధ్యక్షులు ఆంజనేయులు, బలవంతారావు, సింగిల్ విండో చైర్మన్ నల్లవెల్లి అశోక్, వైస్ చైర్మన్ రమేష్, నాయకులు మోహన్రెడ్డి, గూడెం బాల్రాజు, కమలాకర్రావు పాల్గొన్నారు. -
‘వేగంగా కాంటాలు వేయాలి’
భిక్కనూరు: కొనుగోలు కేంద్రాలలో ధాన్యా న్ని వేగంగా కాంటాలు వేయాలని టాస్క్ఫో ర్స్ ఓఎస్డీ శ్రీధర్రెడ్డి సూచించారు. సోమ వారం టాస్క్ఫోర్స్ అధికారులు భిక్కనూరు మండల కేంద్రంలో సింగిల్విండో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలోని రికార్డులను, వడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఓఎస్డీ శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ కాంటాలు అయిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ చే యాలని సూచించారు. వారి వెంట సింగిల్విండో అధ్యక్షుడు గంగళ్ల భూమయ్య, ఉపా ధ్యక్షుడు ముచ్చర్ల రాజిరెడ్డి, టాస్క్ఫోర్స్ అ ధికారులు అజయ్బాబు, లక్ష్మయ్య, శ్రీనివాస్రావు, సుదర్శన్, ఎన్ఫోర్స్మెంట్ డిప్యూ టీ తహసీల్దార్ కిష్టయ్య, అసిస్టెంట్ రిజిస్ట్రా ర్ రమేశ్ ఉన్నారు. బ్లూ కోల్ట్స్ సిబ్బందికి అభినందన కామారెడ్డి క్రైం: పిట్లం మండల కేంద్రంలో రెండు రోజుల క్రితం చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిన మహిళను కాపాడిన బ్లూ కోల్ట్స్ సిబ్బంది కానిస్టేబుల్ రవిచంద్ర, హోంగార్డు మారుతిలను ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వారిని అభినందించి నగ దు ప్రోత్సాహకాన్ని అందించారు. ప్రజల ర క్షణ కోసం పోలీసులు ప్రదర్శించే ధైర్య సా హసాలు శాఖకు గౌరవాన్ని తీసుకువస్తాయ ని పేర్కొన్నారు. నేడు బీఎస్ఎన్ఎల్ సేవా శిబిరం కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ రోడ్లో గల బీఎస్ఎన్ఎల్ సంస్థ కా ర్యాలయంలో మంగళవారం వినియోగదారుల సేవా శిబిరం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని సంస్థ డీఈ సురేందర్ సోమవా రం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఏవైనా ఫిర్యాదులు, బిల్లులకు సంబంఽధించిన సమస్యలు, ఇతర సేవలపై సలహా లు, సూచనల కోసం శిబిరాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ‘సంఘాల పనితీరు భేష్’ దోమకొండ : స్వయం సహాయక సంఘాల పనితీరు బాగుందని గ్రామీణ పేదరిక ని ర్మూలన సంస్థ జీవనోపాధుల డైరెక్టర్ జాన్స న్ పేర్కొన్నారు. సోమవారం దోమకొండలో మహిళా సంఘాలు చేపడుతున్న జీవనోపాధుల కార్యక్రమాలను ఆయన డీఆర్డీవో సు రేందర్తో కలిసి పరిశీలించారు. లింగుపల్లి గ్రామంలో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. మండల కేంద్రంలో మహిళలు నిర్వహిస్తున్న ఎంటర్ప్రైజెస్ని సందర్శించా రు. అనంతరం గ్రామ సంఘంలో ఏర్పాటు చేసిన స్టిచ్చింగ్ సెంటర్ను ప్రారంభించారు. ముండల సమాఖ్య ద్వారా నిర్వహిస్తున్న మ హిళా శక్తి క్యాంటీన్ను సందర్శించి, భోజనం చేసి వారి పనితీరు మెచ్చుకున్నారు. నాణ్యమైన ఆహారం అందించాలని, పరిశుభ్రత పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీడీ కృష్ణమురళి, ఎంపీడీవో ప్రవీణ్కుమా ర్, డీపీఎం సుధాకర్, ఏపీఎం రాజు తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కామారెడ్డి టౌన్:ప్రాథమిక, ఉన్నతపాఠశాల ల ఉపాధ్యాయులకు మండల, జిల్లా స్థాయిలలో శిక్షణ ఇవ్వడంకోసం సబ్జెక్ట్ రిసోర్స్ ప ర్సన్స్ను నియమించనున్నట్లు డీఈవో రాజు తెలిపారు. ఇందుకోసం అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయుల శిక్షణ కోసం మండల రిసోర్స్ పర్సన్స్ –8 (తెలుగు/ఇంగ్లిష్), జిల్లా రిసోర్స్ పర్సన్స్ –10 (తెలుగు/ఇంగ్లిష్), 4 (ఉర్దూ), అలాగే స్కూల్ అసిస్టెంట్ హైస్కూల్ ఉపాధ్యాయు ల శిక్షణ కోసం డీఆర్పీలు–36(తెలుగు/ఇంగ్లిష్)–10,(ఉర్దూ), అలాగే హెచ్ఎంల శిక్షణ కోసం డీఆర్పీలు–8 పోస్టుల భర్తీ కోసం ఈ నెల 24లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఎంఆర్పీ పోస్టుల కోసం స్థానిక మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో, డీఆర్పీ పోస్టుల దరఖాస్తుల కోసం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. -
ట్రాక్టర్ కింద పడి బాలుడి మృతి
రాజంపేట: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ టైరు కింద పడి బాలుడు మృతి చెందిన ఘటన రాజంపేట మండలం గుడితండా గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై పుష్పరాజ్ ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన మాలోత్ అనిత గణేశ్లకు ముగ్గురు పిల్లలు. చిన్న కుమారుడైన మాలోత్ చిన్న(3) శనివారం సాయంత్రం ఇంటి వద్ద పార్క్ చేసి ఉన్న ట్రాక్టర్పై కూర్చుని ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో బాలుడు ట్రాక్టర్ గేర్ను న్యూట్రల్ మార్చడంతో కదిలింది. ట్రాక్టర్ ట్రాలీతోపాటు రివర్స్లో వెనక్కి వెళ్తుండడంతో భయాందోళనకు గురైన బాలుడు ట్రాక్టర్పై నుంచి కింది దూకే ప్రయత్నంలో టైర్ కిందపడ్డాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే బాలుడిని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్సై తెలిపారు. నీట మునిగి వృద్ధురాలు..మాచారెడ్డి: పాల్వంచ మండలం ఇసాయిపేటలో కోలాపురం లక్ష్మి(62) అనే వృద్ధురాలు ఆదివారం నీట మునిగి మృతి చెందినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. కొద్ది రోజులుగా మతిస్థిమితం కోల్పోయిన వృద్ధురాలు శనివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆదివారం చెరువులో శవమై తేలింది. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి ..మాక్లూర్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లిలో ఓ వ్యక్తి భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. మూడు రోజుల క్రితం అతను అనారోగ్యానికి గురికావడంతో గమనించిన స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు. -
ఎస్ఆర్ఎన్కే @ 25 ఏళ్లు
బాన్సువాడలోని ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలబాన్సువాడ : రెండున్నర దశాబ్దాల క్రితం వెలసిన ఈ చదువులమ్మ గుడి.. ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థితికి చేర్చింది. తన నీడన చేరిన వారికి జ్ఞానాన్ని అందిస్తూ విద్యావృక్షంగా ఎదిగిందీ డిగ్రీ కళాశాల. బాన్సువాడలోని ఎస్ఆర్ఎన్కే (శ్రీరాం నారాయణ్ ఖేడియా) డిగ్రీ కళాశాల ఏర్పాటై 25 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా ఈనెల 24న రజతోత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అందుబాటులో ఉన్న గ్రూపులు... ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలలో బీఏ, బీకాం, బీకాం కంప్యూటర్స్, బీఎస్సీ (ఎంపీసీ), బీఎస్సీ (ఎంపీసీఎస్), బీజెడ్సీ, ఎంజెడ్సీ, ఎంజెడ్సీఎస్, పీజీ తెలుగు, పీజీ ఇంగ్లిష్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 52 తరగతి గదులు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్లు ఉన్నాయి. కళాశాలకు 2022– 23 సంవత్సరంలో బీ+ న్యాక్ గుర్తింపు లభించింది. 2024–2025లో అటానమస్ (స్వయం ప్రతిపత్తి) హోదా లభించింది. ప్రస్తుతం 1,338 మంది విద్యార్థులు చదువుతున్నారు.అంకురార్పణ ఇలా..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాన్సువాడకు డిగ్రీ కళాశాల మంజూరు కాగా దేశాయిపేట్ సమీపంలోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటు చేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుందని భావించారు. యజమాని, పారిశ్రామికవేత్త శ్రీరాం నారాయణ్ ఖేడియాను సంప్రదించగా స్థలాన్ని ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించారు. కానీ కళాశాలకు తన పేరు పెట్టాలని కోరడంతో అప్పటి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి సుముఖత వ్యక్తం చేసి ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలగా నామకరణం చేశారు. దీంతో బాన్సువాడకు రెండు కిలోమీటర్ల దూరంలో 11.16 ఎకరాల స్థలంలో 25 ఏళ్ల క్రితం అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కళాశాలను ప్రారంభించారు. 25 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ కళాశాలలో చదివిన వారు ప్రభుత్వ ఉద్యోగులుగా, వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డారు. కళాశాల ఏర్పాటై 25 ఏళ్లవుతున్న సందర్భంగా రజతోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 24న సిల్వర్ జూబ్లీ నిర్వహణకు ఏర్పాట్లు పూర్వ విద్యార్థులకు ఆహ్వానంపూర్వ విద్యార్థులను సన్మానిస్తాం ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల ప్రారంభమై 25 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ నెల 24న సిల్వర్ జూబ్లీ వేడుకలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. పూర్వ విద్యార్థులందరినీ ఆహ్వానిస్తున్నాం. వివిధ హోదాల్లో ఉన్న పూర్వ విద్యార్థులను సన్మానిస్తాం. – వేణుగోపాల్ స్వామి, ప్రిన్సిపల్, ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల -
భవిష్యత్తుకు విద్యార్థి దశ కీలకం
భిక్కనూరు: భవిష్యత్తుకు విద్యార్థి దశ పునాది లాంటిదని సాంఘిక సంక్షేమ గురుకులాల రిటైర్డ్ రీజినల్ కో–ఆర్డినేటర్ తులసీదాస్ అన్నారు. ఆదివారం భిక్కనూరు గురుకుల కళాశాలలో నిర్వహించిన 2007–08 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆ త్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. 18 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న విద్యార్థులు నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. మాజీ ప్రిన్సిపాల్ జనార్దన్, టీచర్లు గులాం యస్దాని, నర్సింగ్రావు, నగేశ్, అమర్నాద్, రమేశ్, రాంచంద్రబాబు, సురేందర్రెడ్డి, ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు. -
బొప్పాపూర్లో పోలీసులకు చేదు అనుభవం
రుద్రూర్: మండలంలోని బొప్పాపూర్లో మహిళ మృతి విచారణకు వెళ్లిన పోలీసులకు చేదు అను భవం ఎదురైంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గంగవ్వ(50) ఆదివారం ఉదయం మృతి చెందింది. మహిళది సహజ మరణం కాదంటు మండల కేంద్రంలో పుకార్లు వ్యాపించాయి. ఈ విషయమై విచారణ నిమిత్తం ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో బొప్పాపూర్ గ్రామానికి పోలీసులు మధ్యాహ్నం వెళ్లారు. అప్పటికే శవయాత్ర కొనసాగుతోంది. శవయాత్రను అడ్డుకున్న పోలీసులతో మృతురాలి బంధువులు వాగ్వాదానికి దిగారు. దింపుడు కళ్లెం దాటిన తర్వాత ఆపితే గ్రామానికి అరిష్టం వస్తుందని స్థానికులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టుమార్టంకు అంగీకరించేది లేదంటూ శ్మశాన వాటికలో దహనం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళ సహజంగానే మరణిస్తే పోలీసులతో ఎందుకు వాగ్వాదానికి దిగారు. పోస్ట్మార్టం చేయడానికి అంగీకరించక పోవడం అనుమానానికి తావిస్తోంది. పోలీసులు మహిళ ఎలా మృతి చెందిందనే విషయమై గ్రామంలో విచారణ చేపడుతున్నారు. -
నేటి నుంచి రైతు మహోత్సవం
● ప్రారంభించనున్న మంత్రులు తుమ్మల, ఉత్తమ్, జూపల్లి ● మూడు రోజులపాటు కొనసాగనున్న కార్యక్రమం ● వ్యవసాయ, అనుబంధ రంగాల స్టాళ్ల ప్రదర్శన ● గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాట్లు పూర్తి నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో సోమవారం నుంచి బుధవారం వరకు రైతు మహోత్సవం నిర్వహించనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, పర్యాటక, సాంస్కృతిక శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ఉదయం 11.00 గంటలకు ప్రారంభించనున్నారు. మూడు రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమం పురస్కార గ్రహీతలైన అభ్యుదయ రైతులతోపాటు రైతు ఉత్పాదక సంస్థలు తమ అనుభవాలు పంచుకునేందుకు వేదిక కానుంది. వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచనున్నారు. ఇందుకోసం సుమారు 150 స్టాల్స్ ఏర్పాటు చేశారు. వ్యవసాయ, ఉద్యానవన శాస్త్రవేత్తలు, పశుసంవర్ధక, మత్స్యశాఖ నిపుణులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు నూతన వ్యవసాయ పద్ధతులపై మూడు రోజుల పాటు వర్క్షాప్ నిర్వహిస్తారని, అందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. -
వివాహ వేడుకలో ఉమ్మడి జిల్లా నేతలు
నిజాంసాగర్: జిల్లా కేంద్రంలోని సత్య కన్వెన్షన్లో ఆదివారం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దఫేదార్ శోభ రాజు దంపతుల పెద్ద కూతురు కీర్తన వివాహం జరిగింది. వ్యవసాయశాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ బాల్రాజ్, మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, జాజాల సురేందర్, హన్మంత్ సింధే, రవీందర్రెడ్డి, సౌదాగర్ గంగారాం, జనార్దన్ గౌడ్, అరుణతార, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్ తదితరులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. -
విజేతలకు సీపీ సన్మానం
నిజామాబాద్ అర్బన్: అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా నగర అగ్నిమాపక శాఖ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలలో కాకతీయ ఒలంపియాడ్ విద్యార్థులు ఆయా విభాగాలలో విజేతలుగా ని లిచారు. వ్యాసరచన పోటీలలో పాఠశాలకు చెందిన లక్ష్మీమేఘన(9వ తరగతి), డ్రాయింగ్ పోటీలలో వైభవి(7వతరగతి) విజేతలుగా నిలిచారు. ఆదివారం పోలీసు కమిషనర్ సాయిచైతన్య.. మెమోంటోలతో విద్యార్థులను సన్మానించారు. పాఠశాల డైరెక్టర్ రామోజీరావు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు కో–కరికులర్ యాక్టివిటీస్ మీద కూడా శ్రద్ధ పెంచుకొని ఇలాంటి మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. పాఠశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపల్ దిగంబర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
అగ్ని ప్రమాదాల నివారణకు కృషి చేయాలి
ఖలీల్వాడి: అగ్ని ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీ పోతరాజు సాయిచైతన్య అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రంలో నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి సీపీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అగ్నిప్రమాదం సంభవిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్యక్రమానికి హాజరైన పలు పాఠశాలల విద్యార్థులకు అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు సంభవించిన స్థానిక ప్రజలు మంటలను ఆర్పివేస్తే ఆస్తి, ప్రాణ నష్టం తక్కువగా ఉంటుందని అన్నారు. అనంతరం విద్యార్థులకు పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్లు పి.నర్సింగ్ రావు, మధుసూదన్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. సీపీ పోతరాజు సాయిచైతన్య -
చిన్నారులను బలిగొన్న లారీ
ఆర్మూర్టౌన్: వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తు న్న ఇద్దరు చిన్నారులను లారీ రూపంలో మృత్యువు కబళించింది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ వద్ద 44వ నంబరు జాతీయ రహదారి బైపాస్ మార్గంపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓంకార్(14), భానుప్రసాద్(11) అనే ఇద్దరు బాలురు దుర్మరణం చెందగా విశ్వనాథ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్మూర్ పట్టణానికి చెందిన బంజ విశ్వనాథ్, లక్ష్మి దంపతుల కుమారుడు ఓంకార్ జక్రాన్పల్లి మండలం అర్గుల్ వసతిగృహంలో 8వ తరగతి చదువుతున్నాడు. సెలవుల్లో ఇంటికి వచ్చిన ఓంకార్ ఇంటి పక్కనే ఉండే స్నేహితుడు భానుప్రసాద్తో కలిసి ఉదయం వరకు ఆడుకున్నారు. కాగా, విశ్వనాథ్ పెర్కిట్లో జరుగుతున్న ఓ వివాహానికి హాజరయ్యేందుకు ఓంకార్, భాను ప్రసాద్ను తీసుకొని బైక్పై బయలుదేరాడు. పెర్కిట్ జాతీయ రహదారి బైపాస్ మార్గం వద్ద రోడ్డు దాటుతుండగా నిర్మల్ వైపు నుంచి వస్తున్న లారీ బైక్ను ఢీకొట్టింది. భానుప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడ్డ తండ్రీకొడుకులు విశ్వనాథ్, ఓంకార్ను పోలీసులు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగానే పరిస్థితి విషమించి ఓంకార్ మరణించాడు. విశ్వనాథ్ను జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న ఇరుకుటుంబాల వారు తమ పిల్లలు ఇక లేరని తెలుసుకొని గుండెలవిసేలా విలపించారు. ప్రమాదానికి కారణమైన లారీతోపాటు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి ఒకరికి తీవ్రగాయాలు -
ఫ్రూట్ సలాడ్ కోసం వెళ్తే రూ. లక్ష మాయం
బాన్సువాడ : ఫ్రూట్ సలాడ్ తాగేందుకు వచ్చిన ఓ వ్యక్తి రూ. లక్ష నగదును పోగొట్టుకున్న ఘటన బాన్సువాడలో చోటు చేసుకుంది. బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తి శనివారం బాన్సువాడలోని ఓ బ్యాంకులో రూ. లక్ష నగదును డ్రా చేసుకుని ఫ్రూట్ సలాడ్ తాగేందుకు కూల్డ్రింక్ దుకాణానికి వెళ్లాడు. ఫ్రూట్ సలాడ్ తాగుతున్న సమయంలో చేతిలో ఉన్న నగదు కవరును టేబుల్పై పెట్టి సలాడ్ తాగి కవర్ను అక్కడే మరిచి వెళ్లిపోయాడు. పది నిమిషాల తర్వాత అక్కడికి రాగా నగదు ఉన్న కవర్ కనిపించలేదు. అక్కడున్న సీసీ కెమెరాను పరిశీలించగా ఓ యువకుడు కవరును తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. వెంటనే సాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడిపై కేసు నమోదు రుద్రూర్: మండలంలోని బొప్పాపూర్లో మూడు గడ్డివాములు దగ్ధమైన ఘటనలో నందిగామ ప్రవీణ్పై కేసు నమోదు చేసినట్టు ఎస్సై సాయన్న తెలిపారు. ఆదివారం తెల్లవారు జామున సంగోళ్ల వినోద్, పట్ల సాయిలు, నరోజి లచ్చయ్య గడ్డివాములకు నిప్పంటించి ప్రవీణ్ పారి పోయినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు. అనుమతులు లేకుండా టేకు చెట్ల నరికివేత ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలోని ఎస్సీ బాలికల హాస్టల్లో అనుమతులు లేకుండా టేకు చెట్లను నరికి వేసిన ఘటనపై కామారెడ్డి అటవీశాఖ స్ట్రైకింగ్ ఫోర్స్ అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. హాస్టల్లో అనుమతులు లేకుండా టేకు చెట్లను నరికి వేశారన్న సమాచారం మేరకు కామారెడ్డి అటవీశాఖ స్ట్రైకింగ్ ఫోర్స్ డీఆర్వో అనురంజని, సెక్షన్ ఆఫీసర్ గోపాల్ పరిశీలించారు. నాలుగు చెట్లను నరికి టేకు దుంగలను ఓగదిలో ఉంచిన దానిని పరిశీలించడంతో పాటు, నరికి వేసిన టేకు చెట్ల కొలతలను తీసుకున్నారు. నరికిన టేకు దుంగల విలువ సుమారు రూ. 30 వేల వరకు ఉంటుందన్నారు. టేకు దుంగలను సీజ్ చేసి ఉన్నతాధికారులకు నివేదికను అందిస్తామని డీఆర్వో తెలిపారు. -
మున్సిపాలిటీ పేరుతో పన్ను వసూలు
బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద మున్సిపాలిటీగా చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో గోపన్పల్లి, దౌల్తాపూర్, కందర్పల్లి గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఇదే అదునుగా భావించిన పంచాయతీ అధికారులు పన్ను వసూళ్ల పై ప్రత్యేక దృష్టి సారించారు. మున్సిపాలిటీ అయితే నాలుగైదు రెట్లు అన్ని రకాల పన్నులు పెరిగిపోతాయి. ఇప్పుడు పన్ను కడితే తక్కువ ఖర్చులో చెల్లించవచ్చని జోరుగా ప్రచారం చేస్తున్నారు. అధికారుల పనితీరు చెట్టు పేరుచెప్పి కాయలు అమ్ముకున్నట్లుగా ఉంది. మున్సిపాలిటీ భయంతో ప్రజలు ఇంటి, కుళాయి,వాణిజ్య సముదాయాలు, ట్రెడ్ లైసెన్సులు, ప్లాట్ల నాలా కన్వర్షన్ వివిధ రకాల పన్నులు కట్టడానికి ప్రజలు ముందుకు వస్తున్నారు. దీంతో జీపీలకు పన్ను ఆదాయం పెరుగుతోంది. గతంలో నిలదీశారు... ఇంటింటికి వెళ్లి పన్ను కట్టాలని సిబ్బంది అడిగితే తాగునీరు రావడం లేదని, మురికి కాలువలు శుభ్రం చేయడంలేదని, రోడ్డు పై చెత్త అలాగే ఉందని, వీధిలైట్లు వెలగడం లేదని ప్రజలు నిలదీసేవారు. ఇప్పుడు ఏకంగా ప్రజలే జీపీ వెళ్లి పన్ను చెల్లిస్తున్నారు. బిచ్కుంద గ్రామ పంచాయతీకి 97 శాతం రూ.30 లక్షల పైన పన్ను వసూలైంది. దౌల్తాపూర్లో 98 శాతం, కందర్పల్లిలో 95 శాతం, గోపన్పల్లిలో 90 శాతం పన్ను వసూలైందని అధికారులు తెలిపారు. ఏమైనా మున్సిపాలిటీ పేరుతో పన్ను ఆదాయం రెట్టింపు పెరిగింది. గృహ నిర్మాణాల కోసం దరఖాస్తులు.. బిచ్కుంద, గోపన్పల్లి, కందర్పల్లి, దౌల్తాపూర్ గ్రామ శివారులలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఎన్నో వెంచర్లు వెలిశాయి. భవిష్యత్తులో మున్సిపాలిటీ అధికారుల నిబంధనలు కఠినంగా ఉంటాయని భావించి, ఓపెన్ ప్లాట్లు ఉన్న వారు గృహ నిర్మాణాల అనుమతి కోసం జీపీలలో దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. మున్సిపాలిటీ గెజిట్ రాకముందే నిర్మాణాల అనుమతులు పొందాలని జీపీల చుట్టూ తిరుగుతున్నారు. జీపీ అధికారులు ఎలాంటి షరతులు లేకుండా అనుమతులు ఇవ్వాలని కొందరు రాజకీయ నాయకులతో సిఫార్సు చేయిస్తున్నారు. మరికొందరు అధికారులకు అడిగినకాడికి మట్టు జెప్పుతున్నారని విమర్శలున్నాయి. జీపీలకు పెరిగిన పన్ను ఆదాయం బిచ్కుంద మున్సిపాలిటీలో మూడు గ్రామాలు విలీనం నాలుగైదు రెట్లు పన్ను పెరుగుతుందని ప్రచారం -
దాది రతన్ మోహిని సేవలు ప్రశంసనీయం
కామారెడ్డి అర్బన్: బ్రహ్మకుమారి చీఫ్ అడ్మినిస్ట్రేటర్ దాది రతన్ మోహిని సేవలు ప్రశంసనీయమని బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఇన్చార్జి జయ దిదీ అన్నారు. ఆదివారం కామారెడ్డి ఓంశాంతి కేంద్రంలో రతన్ మోహిని దాది చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బ్రహ్మకుమారీలు గంగలత, కవిత, లలిత, చంద్రకళ, అనిల్కుమార్, జిల్లాలోని ఆయా గ్రామాల ఓంశాంతి కేంద్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. నేలకూలిన చెట్లు బీబీపేట: గత రెండు రోజుల క్రితం వీచిన ఈదురు గాలులు, వడగళ్ల వర్షాలకు నేలకూలిన చెట్లను అధికారులు నామమాత్రంగా తొలగించి చేతులు దులుపుకుంటున్నారు. బీబీపేట నుండి తుజాల్పూర్ ప్రదాన రహదారిలో సుమారుగా ఆరు చెట్లు నేలకూలగా అధికారులు వాటిని పట్టించుకోవడం లేదు. రోడ్లపై సగం వరకు అలాగే చెట్లు ఉండడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ఇప్పటికై నా అధికారులు స్పందించాలని వాహనదారులు కోరుతున్నారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తాల గోల్మాల్ నస్రుల్లాబాద్: మండలంలోని అంకోల్ గ్రామంలో ఐకేపీ వారు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తాలు గోల్మాల్ జరిగినట్లు బాధిత రైతు వాపోతున్నారు. ఈ నెల 16న అంకోల్ గ్రామానికి చెందిన సంతోష్రెడ్డి అనే రైతు ఐకేపీ అధికారులకు 281 సంచులను తూకం చేసి ఇచ్చాడు. ప్రస్తుతం 240 సంచులు మాత్రమే తనయంటు అధికారులు తెలుపుతున్నారని, 40 సంచుల వరకు తేడా వచ్చిందని తనకు న్యాయం చేయాలని బాధిత రైతు కోరుతున్నాడు. ఈ విషయమై ఏపీఎం గంగాధర్ను వివరణ కోరగా గ్రామంలో పూర్తి విచారణ చేపట్టి ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకుంటామని అన్నారు. -
ఆనవాయితీగా మారింది
ప్రతి శుభాకార్యానికి కేక్ను కట్ చేసుకుని సంబురాలు చేసుకోవడం ఆనవాయితీగా మారింది. జన్మదినం, వివాహం, ఎంగేజ్మెంట్, స్పెషల్ డేలకు తప్పకుండా కేక్ కట్ చేస్తున్నారు. గతంలో జన్మదిన వేడుకలకు మాత్రమే కేక్ కట్ చేయడం చూశాం. ఇప్పుడు అన్నింటికి తప్పనిసరిగా మారింది. – గాండ్ల కృష్ణ, కామారెడ్డి ప్రతి అకేషన్కు.. పెళ్లి రోజైన, పుట్టిన రోజైనా మా ఇంటివాళ్లు, మా ఫ్రెండ్స్ అందరం కలిసి కేక్ కట్ చేస్తాం. మా ఫ్రెండ్స్ అందరి పుట్టిన రోజు నాడు నేను కేక్ తీసుకెళ్లి వారితో కట్ చేయిస్తాను. ఆ రోజంతా అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం. – సక్కర్లవార్ నరేశ్, మద్నూర్ -
సిద్ధంగా ఉంచుతున్నాం..
ఒకప్పుడు జన్మదినానికి మాత్రం ముందుగా ఆర్డర్ ఇస్తే కేక్ తయారు చేసి ఇచ్చేవాళ్లం. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతి శుభకార్యానికి కేక్ కట్ చేస్తున్నారు. దీంతో ఎప్పుడంటే అప్పుడు 2 నిమిషాల్లోనే కేక్లను ఇచ్చేస్తున్నాం. చాలా రకాల కేక్లను తయారు చేసి సిద్ధంగా ఉంచుతున్నాం. – నరేశ్, బేకరీ యజమాని, కామారెడ్డి పిల్లల బర్త్డేకు తప్పనిసరి పిల్లల బర్త్డేకు తప్పనిసరిగా మేం కేక్ కట్ చేస్తాం. పిల్లలు వారి ఫ్రెండ్స్ ఆహ్వానిస్తారు. చాలా ఆనందంగా గడుపుతారు. అలాగే మా ఫ్రెండ్స్ను కూడా బర్త్డేలకు ఆహ్వానిస్తాం. మ్యారేజ్ డేకు కూడా కేక్ కట్ చేస్తాం. – వంగపల్లి వైష్ణవి, మద్నూర్ -
పెద్దమ్మా.. చల్లంగ చూడమ్మా..
మండల కేంద్రంలో పెద్దమ్మ ఆలయ ఉత్సవాల్లో భాగంగా శనివారం బోనాల పండుగ జరుపుకున్నారు. రాత్రి బోనాలతో శోభాయాత్ర నిర్వహించారు. అమ్మవారికి బోనాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆలయాన్ని సందర్శించి, అమ్మవారికి పూజలు చేశారు. ఆదివారం తిరుగుబోనాలతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ కమిటీ అధ్యక్షుడు నాగారపు ఎల్లయ్య తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పున్న లక్ష్మణ్, కామిండ్ల కృష్ణ, పురుషోత్తం, రాజేందర్, సంతోష్కుమార్, రాములు తదితరులు పాల్గొన్నారు. – దోమకొండ -
‘దోషులకు శిక్ష పడేలా చూడాలి’
కామారెడ్డి క్రైం: కేసులలో దోషులకు శిక్ష పడే లా చూడాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివా రం నిర్వహించిన సమావేశంలో కోర్టు వి ధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరస్తులకు శిక్ష పడితే నే నేరాల సంఖ్య తగ్గుతుందని, బాధితులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఎఫ్ ఐఆర్ మొదలుకొని చార్జిషీట్, సాక్షులను ప్ర వేశపెట్టడం వరకు అన్ని రకాల కోర్టు విధుల ను పకడ్బందీగా నిర్వహించాలని సూచించా రు. సమావేశంలో ఏఎస్పీ నర్సింహారెడ్డి, అ ధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తాడ్వాయి ఎస్సైపై సస్పెన్షన్ వేటు కామారెడ్డి క్రైం: విధుల్లో నిర్లక్ష్యాన్ని కనబరిచినందుకు తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్లుపై స స్పెన్షన్ వేటు పడింది. ఇటీవల ఎస్పీ రాజేశ్ చంద్ర తాడ్వాయి పోలీస్ స్టేషన్ను తనిఖీ చే శారు. ఆ సమయంలో ఎస్సై వెంకటేశ్వర్లు అందుబాటులో లేరు. ఎక్కడికి వెళ్లారన్న వి షయమై సిబ్బంది సరైన సమాధానం ఇవ్వలేదు. అనంతరం ఎల్లారెడ్డిలో పర్యటించిన ఎస్పీ.. కామారెడ్డికి తిరిగి వస్తూ తాడ్వాయి పీఎస్ను మరోసారి సందర్శించారు. అప్పు డు కూడా ఎస్సై లేకపోవడంతో వాకబు చే యగా.. సీఐకిగాని, డీఎస్పీకి గాని సమాచా రం ఇవ్వకుండా స్థానికంగా అందుబాటులో లేరని తెలిసింది. సదరు ఎస్సై వ్యవహారంపై విచారణ జరపగా స్థానికంగా సరిగా అందుబాటులో ఉండరని తేలింది. దీంతో శాఖాపరమైన చర్యలకు ఎస్పీ ఉన్నతాధికారులకు నివేదించారు. దీంతో విధుల్లో నిర్లక్ష్యం కనబరిచిన ఎస్సైని సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ ఐ జీ చంద్రశేఖర్రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వరిధాన్యం తూకాలు ప్రారంభం నిజాంసాగర్: నిజాంసాగర్, మహమ్మద్నగర్ మండలాల్లోని మల్లూ ర్, మహమ్మద్నగర్ గ్రా మాల్లో శనివారం వరిధాన్యం తూకాలను ప్రా రంభించారు. ‘వడ్లు కొనేదెప్పుడో’ శీర్షికన శ నివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు.. వెంటనే కాంటాలకు చర్యలు తీసుకున్నారు. రెండు గ్రామా ల్లోని కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని కాంటా వేయించారు. మిగిలిన గ్రామాల్లో రెండు, మూడు రోజుల్లో తూకాలు ప్రారంభి స్తామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో మహమ్మద్నగర్ మండల వ్యవసాయ శాఖ అధికారి నవ్య, సొసైటీ సీఈవోలు చింతరాములు సేట్, సాయిలు పాల్గొన్నారు. 350 ఎకరాల్లో నష్టం బీబీపేట: మండల కేంద్రంతో పాటు యాడారం, మల్కాపూర్, శివారు రాంరెడ్డిపల్లి గ్రా మాల్లో శుక్రవారం రాత్రి కురిసిన వడగళ్ల వా నకు సుమారు 350 ఎకరాల్లో వరి, మామిడి తోటలకు నష్టం వాటిల్లిందని మండల వ్యవసాయ అధికారి నరేంద్ర తెలిపారు. అధికారులు శనివారం ఉదయం నుంచి ఆయా గ్రా మాల్లో పంటలను పరిశీలించారు. కోళ్ల ఫా రాల పైకప్పులు లేచిపోవడంతో పౌల్ట్రీ రైతు లూ నష్టపోయారన్నారు. ఏవో వెంట ఏఈ వో రాఘవేంద్ర తదితరులున్నారు. ‘మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి’ కామారెడ్డి క్రైం: యువత మత్తు పదార్థాలకు, కల్తీ కల్లుకు దూరంగా ఉండాలని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హన్మంతరావు సూచించారు. ఈ విషయమై జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కల్తీకల్లు, మత్తుపదార్థాల కారణంగా కలిగే దుష్ప్రభావాలపై శనివారం జిల్లావ్యాప్తంగా 22 మండలాల పరిఽధిలో 86 గ్రామాల్లో అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించామన్నారు. మత్తు పదార్థాలను రవాణా చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలను సరఫరా చేసినా, విక్రయించినా 1908 నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతోపాటు, పారితోషికం అందిస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ప్రణాళికాబద్ధంగా కొనుగోళ్లు చేపట్టాలి
కామారెడ్డి క్రైం/ఎల్లారెడ్డి : ప్రణాళికాబద్ధంగా యా సంగి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కా న్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సన్న బియ్యం సరఫరా, ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోకుండా ధాన్యాన్ని వేగంగా కొనుగో లు చేయాలన్నారు. ధాన్యం సేకరణపై కలెక్టర్లు ప్ర త్యేక దృష్టి సారించి ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నా రు. తాలు, తరుగు పేరు మీద రైస్ మిల్లర్లు ఎలాంటి కోతలు విధించకుండా చూడాలన్నారు. సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు. గ్రామాలలో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలని సూచించారు. జిల్లాలో 446 కొనుగోలు కేంద్రాలు.. జిల్లాలో 446 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేశామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఎ ల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయం నుంచి వీసీలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల గురించి మంత్రికి వివరించారు. 63 కేంద్రాల ద్వారా సన్న ధాన్యం సేకరిస్తున్నామన్నారు. జిల్లాకు సంబంధించి 4.49 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం, 1.13 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కొనుగో లు కేంద్రాలకు రావచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 4,314 మెట్రిక్ టన్నుల దొడ్డు బి య్యం, 53,340 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కొనుగోలు చేశామన్నారు. ఆయా కేంద్రాల్లో అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచామని, సౌకర్యాలు కల్పించామని వివరించారు. వీడి యో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, ఆర్డీవో ప్రభాకర్, డీఆర్డీవో సురేందర్, పౌర సరఫరాల సంస్థ డీఎం రాజేందర్, డీఎస్వో మల్లికార్జున్ బాబు, డీసీవో రామ్మోహన్, మార్కె టింగ్ శాఖ అధికారి రమ్య పాల్గొన్నారు. ధాన్యం సేకరణను కలెక్టర్లు పర్యవేక్షించాలి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
లింగంపేట : ఏళ్ల తరబడిగా పెండింగ్లో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని భూ భారతి ప్రత్యేకాధికారి రాజేందర్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని బాయంపల్లి, కన్నాపూర్ గ్రామాల్లో భూ భారతి సదస్సులు నిర్వహించారు. బాయంపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో భూభారతి ప్రత్యేకాధికారి రాజేందర్ మాట్లాడారు. రైతులకు భూ భారతి పోర్టల్పై అవగాహన కల్పించారు. రైతులు తమ సమస్యలను ధరఖాస్తులో స్పష్టంగా రాసి అధికారులకు అందించాలని సూచించారు. పథకం అమలు తీరు, పథకంలో ఏ ఏ సమస్యలు పరిష్కారం అవుతాయో వివరించారు. సదస్సుల్లో ఈనెల 30వ తేదీ వరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఆ తర్వాత జూన్ 2వ తేదీ వరకు రైతుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. 30 రోజుల్లో పరిష్కారం కాని సమస్యలను ఆర్డీవో, కలెక్టర్ పరిధిలో పరిష్కరిస్తామన్నారు. అప్పటికీ పరిష్కారం కానివాటిపై ట్రిబ్యునల్కు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య భూ వివాదాలపై సంయుక్తంగా సర్వే చేసి పరిష్కార మార్గాలు సూచిస్తామన్నారు. కోర్టు కేసులు ఉంటే తమ దృష్టికి తెస్తే సాధ్యమయ్యేవి అయితే అమ్మిన వారికి, కొన్న వారికి నోటీసులు ఇచ్చి పరిష్కరిస్తామన్నారు. బాయంపల్లిలో 86 దరఖాస్తులు, కన్నాపూర్ గ్రామంలో 74 దరఖాస్తులు వచ్చాయన్నారు. బాయంపల్లిలో 19 సర్వే నంబరులో 50 మంది రైతులకు చెందిన 408 ఎకరాలు, 75 సర్వే నంబరులో 25 మందికి సంబంధించిన 135 ఎకరాలు సీలింగ్ భూములుగా నమోదై ఉన్నట్లు రైతులు తన దృష్టికి తెచ్చారన్నారు. వాటిని విచారించి పరిష్కార మార్గాలు చూపుతామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్, ఉపతహసీల్దార్ రాందాస్, ఎఫ్ఆర్వో ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. భూ భారతి ప్రత్యేకాధికారి రాజేందర్ -
‘అనవసర రాద్ధాంతం చేస్తున్నారు’
కామారెడ్డి టౌన్: వక్ఫ్ బోర్డు సంస్కరణల చట్టం విషయంలో ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర వక్ఫ్ సుధార్ జన జాగరణ్ అభియాన్ సభ్యుడు వెంకట్రెడ్డి విమర్శించా రు. శనివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయ న మాట్లాడారు. ఈ చట్ట సవరణ వల్ల ముస్లింలకు ఎలాంటి నష్టం జరగదన్నారు. వక్ఫ్ భూముల దుర్వినియోగాన్ని అరికడుతుందన్నారు. దేశంలో వక్ఫ్ ఆస్తుల ద్వారా భారీగా ఆదాయం వస్తున్నా 3 శాతం ముస్లింలు మాత్రమే వీటిని అ నుభవిస్తున్నారని, 97 శాతం మందికి ప్రయోజనం లేదని పేర్కొన్నారు. ప్రతిపక్షాల రాజకీయ లబ్ధికోసం అసత్య ప్ర చారం చేస్తున్నాయని, వారిని నమ్మవద్దని ప్రజలను కోరారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీ లం చిన్నరాజులు, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి, రంజిత్ మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శులు రాము, నరేందర్రెడ్డి, రవీందర్రావు, నాయకులు కుంట లక్ష్మారెడ్డి, నేహల్, హారిక, బాలమణి, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లా రైతులు తరలిరావాలి
సుభాష్నగర్: నిజామాబాద్లోని జీజీ కాలేజీలో సోమవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న రైతు మహోత్సవానికి ఉమ్మడి జిల్లా రైతులు తరలిరావాలని డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి కోరారు. నగరంలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయంలో నూతన పద్ధతులు, సాంకేతిక విజ్ఞానం ద్వారా లాభసాటి వ్యవసాయం, రైతుకు అధిక దిగుబడి వచ్చే అంశాలు, డ్రోన్ వ్యవసాయం, వివిధ రకాల వంగడాలకు సంబంధించిన స్టాళ్లు ఉత్సవాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నా రు. సమావేశంలో బ్యాంకు వైస్ చైర్మన్ నల్ల చంద్రశేఖర్రెడ్డి, డైరెక్టర్లు గిర్దావర్ గంగారెడ్డి, గోర్కంటి లింగన్న, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా ఎంపిక చేయాలి
పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడుతున్న కలెక్టర్ సంగ్వాన్ఎల్లారెడ్డిరూరల్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. శనివారం ఆర్డీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిర మ్మ ఇళ్ల సర్వేను సక్రమంగా నిర్వహించాలని, అ నర్హులకు ఇళ్లను మంజూరు చేయరాదని ఆదేశించారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావాలన్నారు. ఆర్థికంగా వెనకబడిన వారికి స్వయం సహాయక సంఘాల ద్వారా లక్ష రూపాయల రుణం మంజూరు చేయాలని సూచించా రు. రేషన్ కార్డుల సర్వే సైతం పారదర్శకంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్ట ర్లు విక్టర్, చందర్నాయక్, డీపీవో మురళి, డీఎల్పీవో సురేందర్, మున్సిపల్ కమిషనర్ మహేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. 57 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం జిల్లాలో ఇప్పటివరకు యాసంగికి సంబంధించి 57వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చే శామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. శ నివారం ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయ న సందర్శించారు. నూతనంగా వచ్చిన ప్యాడీ క్లీనర్ను పరిశీలించారు. అనంతరం ఆయన విలే కరులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూ డాలని అధికారులను ఆదేశించామన్నారు. కొ నుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు తరలించే పనులు జరుగుతున్నాయన్నారు. కాంటాలు ప్రారంభంకాని చోట కాంటాలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించామన్నారు. -
ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతుల వివరాలకు సంబంధించి ట్యాబ్ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలని టాస్క్ఫోర్స్ బృందం అధికారులు శ్రీధర్రెడ్డి, శేఖర్రెడ్డి సూచించారు. గోపాల్పేట, బంజరతండా, ధర్మారెడ్డి, తాండూర్ గ్రామాల్లో గల ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యంలో తేమశాతం, తూకం సేకరణ ప్రక్రియను వారు పరిశీలించారు. టాస్క్ఫోర్స్ బృందం సభ్యులు లక్ష్మయ్య, శ్రీనివాస్, అసిస్టెంట్ సివిల్ సప్లయ్ అధికారి సుదర్శన్రెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ ఖలీద్, తదితరులున్నారు. -
న్యాయవాదుల సహకారం మరువలేనిది
ఖలీల్వాడి : జిల్లా న్యాయసేవాధికార సంస్థ నిర్వహించిన ప్రతి కార్యక్రమంలో న్యాయవాదుల సహకారం మరువలేనిదని డీఎల్ఎస్ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని సమావేశపు హాల్లో బార్ అధ్యక్షుడు మామిల్ల సాయారెడ్డి అధ్యక్షత ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఆమె మా ట్లాడారు. ఉద్యోగరీత్యా బదిలీపై వచ్చానని, బదిలీపై వెళ్లడం సహజమని, పదవికి న్యాయం చేశా మా లేదా అనేదే ముఖ్యమని తెలిపారు. న్యాయసేవాధికార సంస్థ తరఫున కక్షిదారులకు న్యాయ సేవలు అందించడంలో అగ్రస్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. బార్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి సాయారెడ్డి, మాణిక్ రాజు మాట్లాడుతూ లోక్ అదాలత్లను విజయవంతం చేయడంలో న్యాయవాదులు క్రీయాశీలక పాత్ర పోషించారని తెలిపారు. అనంతరం జడ్జి పద్మావతిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు దిలీప్, సంయుక్త కార్యదర్శి ఝాన్సీరాణి, కోశాధికారి నారాయణ దాసు, లైబ్రరీ కార్యదర్శి శ్రీమాన్, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేకు వినతి
కామారెడ్డి అర్బన్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ(టీజీఈజేఏసీ) ఉద్యమ కార్యాచరణలో భాగంగా కేంద్ర కమిటీ పిలుపు మేరకు శనివారం జిల్లా జేఏసీ నాయకులు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఉద్యోగులు, పెన్షనర్లు, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల 57 సమస్యల పరిష్కరించాలని ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకపోవడంతో దశలవారీగా ఉద్యమబాట పట్టినట్టు జేఏసీ జిల్లా చైర్మన్ నరాల వెంకట్రెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణరెడ్డికి వివరించగా.. తాను తప్పకుండా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని హామీ ఇచ్చారు. జేఏసీ సెక్రటరీ జనరల్ ఆర్.దేవేందర్, వివిధ సంఘాల నాయకులు పి.శ్రీనివాస్రెడ్డి, బాబు, నాగరాజు, సాయిరెడ్డి, బి.రాజు, హన్మంతురెడ్డి, దేవులా, తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలల అభివృద్ధికి చేయూతనివ్వాలి
రుద్రూర్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులు ఆయా పాఠశాలల అభివృద్ధికి చేయూత అందించాలని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ సూచించారు. రుద్రూర్ హైస్కూల్లో 1965 నుంచి 2015 వరకు చదివిన విద్యార్థులతో రైడ్స్ (రుద్రూర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ)ని ఏర్పాటు చేయగా.. అందుకు సంబంధించిన లోగోను జేటీసీ శనివారం ఆవిష్కరించారు. అనంతరం రైడ్స్ నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. రైడ్స్ శాశ్వత గౌరవ అధ్యక్షుడిగా తనను ఎన్నుకోవడంపై సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జేటీసీ చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ రైడ్స్ కార్యక్రమాలకు మామిండ్ల రామాగౌడ్ స్మారక ట్రస్ట్ అండగా ఉంటుందని అన్నారు. విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడంతోపాటు పేద విద్యార్థుల ఉన్నత చదువులకు రైడ్స్ ద్వారా తోడ్పాటు అందిస్తామన్నారు. -
నేరాల నియంత్రణకు చర్యలు
వర్ని/రుద్రూర్: నేరాల నియంత్రణకు కఠినచర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైత న్య పేర్కొన్నారు. వర్ని, రుద్రూర్, కోటగిరి పోలీస్ స్టేషన్లను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసిప్షన్ సెంటర్, కంప్యూటర్ సిబ్బంది పని తీరును అడిగి తెలుసుకున్నారు. స్టేషన్లో సౌకర్యా లు, సమస్యలపై ఆరా తీశారు. మత్తు పదార్థాలు, గంజాయి, గేమింగ్ యాప్స్, సైబర్ నేరాల బారినపడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సీపీ వెంట బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ఎస్సైలు సాయన్న, మహేశ్ ఉన్నారు. రైతు మహోత్సవాన్ని విజయవంతం చేయాలి సదాశివనగర్(ఎల్లారెడ్డి): వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 23 వరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చేపట్టే రైతు మహోత్సవాన్ని విజయవంతం చేయాలని మండల వ్యవసాయాధికారి ప్రజాపతి తెలిపారు. జిల్లా కేంద్రంలోని జీజీ కాలేజీ గ్రౌండ్లో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో రైతులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. -
‘అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి’
ఎల్లారెడ్డిరూరల్: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని, టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచుకోవాలని డీఆర్డీవో సురేందర్, ఐకేపీ సిబ్బందికి సూచించారు. ఎల్లారెడ్డి ఐకేపీ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మహిళా సంఘాల ద్వారా 183 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా ఇంత వరకు 9వేల 927 మెట్రిక్ టన్నుల ధాన్యం 867 మంది రైతుల నుంచి కొనుగోలు చేశామని అన్నారు. రైతులకు ఇంత వరకు 13 కోట్ల 46 లక్షల రూపాయలు వారి ఖాతాలలో ధాన్యం డబ్బులను వేసినట్లు తెలిపారు. ఏపీఎం ప్రసన్నరాణి తదితరులున్నారు. బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తి అరెస్ట్ మాచారెడ్డి: మేన మామను బ్లాక్ మెయిల్ చేస్తూ రూ. 40 లక్షలు డిమాండ్ చేసిన మేనల్లుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. పాల్వంచ మండలం ఫరీదుపేట గ్రామానికి చెందిన జీడిపల్లి నరసింహారెడ్డి ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్లాట్లు చేసి షట్టర్లను నిర్మించాడని తన మేనల్లుడు ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన గురిజాల మధుసూదన్రెడ్డి సోషల్ మీడియాతోపాటు పత్రికల్లో(సాక్షి కాదు) దుష్ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నావని మధుసూదన్రెడ్డిని అడిగిన నరసింహారెడ్డిని చంపుతానని బెదిరించి, తప్పుడు ప్రచారం చేయకుండా ఉండాలంటే రూ.40 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు మధుసూదన్రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. చోరీ కేసులో నిందితుడి అరెస్టు కామారెడ్డి క్రైం: పిట్లం మండల కేంద్రంలో ఇటీవల జరిగిన ఓ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఎ స్పీ రాజేష్ చంద్ర శనివారం సాయంత్రం కేసుకు సంబంధించిన వివరాలను ఒక ప్రకటనలో వెల్లడించారు.ఈ నెల 7న రాత్రి పిట్లం మండల కేంద్రంలో ని నరసింహ జువెలరీ దుకాణంలో చోరీ జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు..సాంకేతిక పరిజ్ఞా నం ఆధారంగా నిందితుడిని మద్నూర్కు చెందిన ఉ ప్పల్వారి శ్రీనివాస్గా గుర్తించారు.నిందితుడిని శనివారం అదుపులోకి తీసుకొని విచారించగా,నేరం అంగీకరించడంతో రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి 22 గ్రాముల బంగారం,9.732 కి లోల వెండిని రికవరీ చేశామని ఎస్పీ తెలిపారు. కేసు ఛేదనలో కృషి చేసిన బాన్సువాడ సీఐ రాజేశ్, పి ట్లం ఎస్సై రాజు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
తెల్లారితే కొడుకు పెళ్లి..
● రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి రుద్రూర్: కొడుకు పెళ్లిని ఘనంగా నిర్వహించాలనుకున్న తండ్రి కానరాని లోకానికి వెళ్లిపోయాడు. భాజాభజంత్రీలు మోగాల్సిన ఇంట్లో రోదనలు మిన్నంటాయి. వివరాలు ఇలా ఉన్నాయి. రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన తండ్రి గొర్ల నాగయ్య (52) కుమారుడి వివాహం ఆదివారం జరగాల్సి ఉంది. పోతంగల్ మండలం కారేగాం గ్రామంలో పెళ్లి పత్రికలు ఇచ్చేందుకు నాగయ్య శనివారం ఉదయం బైక్పై బయలుదేరాడు. హంగర్గా ఫారం సమీపంలో బైక్కు అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించబోయి చెట్టుకు ఢీకొన్నాడు. తీవ్రగాయాలైన నాగయ్యను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాగయ్య మరణవార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, నాగయ్య మిషన్ భగీరథలో హెల్పర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. -
ప్రతిభను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది
డీఈవో రాజు కామారెడ్డి రూరల్: విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరికీ ఉందని డీఈవో రాజు అన్నారు. శనివారం చిన్నమల్లారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల వార్షికోత్సవ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఈవో రాజు హాజరై ప్రసంగించారు. విద్యార్థులు చదువుతోపాటు ఆట పాటల్లో ముందుండాలన్నారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఇది మంచి వేదికగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఎంఈవో ఎల్లయ్య, హెచ్ఎంలు సాయిరెడ్డి, హన్మాండ్లు, సెక్టోరియల్ అధికారి నాగవేందర్, ఎఫ్ఏవో రమేష్, ఏసీజీ బలరాం, జీసీడీవో సుకన్య తదితరులు పాల్గొన్నారు. -
భూభారతితో భూ సమస్యలు పరిష్కారం
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ నాగిరెడ్డిపేట/ఎల్లారెడ్డి: దశాబ్దాలుగా నెలకొన్న భూ సమస్యలు భూ భారతి చట్టం వల్ల పరిష్కారం కానున్నాయని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. నాగిరెడ్డిపేట మండల కేంద్రం గోపాల్పేట, ఎల్లారెడ్డి మండలంలోని మీసాన్పల్లి రైతువేదికలలో శనివారం భూభారతి అవగాహన సదస్సులకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ధరణి స్థానంలో ప్రస్తుత ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భారతిపై రైతులకు అవగాహన కల్పించడానికే సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. భూ భారతి చట్టంలో భూరిజిస్ట్రేషన్, భూ రికార్డుల్లో తప్పుల సవరణ, సాదాభైనామా దరఖాస్తులకు, వారసత్వంగా వచ్చిన భూముల దరఖాస్తులకు పరిష్కారం లభించనుందన్నారు. గతంలో ధరణిలో అప్పీల్కు ఆస్కారం లేనందున సివిల్ కోర్టుకు వెళ్లవలసి ఉండేదని, కాని ప్రస్తుత భూ భారతి చట్టం ద్వారా భూ రిజిస్ట్రేషన్లపై అభ్యంతరాలుంటే భూ యజమానులు ఆర్డీవో, కలెక్టర్, ట్రిబ్యునల్కు అప్పీల్ చేసుకోవచ్చని వివరించారు. 2014 జూన్ 2 కంటే ముందు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూమిని సాదాభైనామాల ద్వారా కొనుగోలు చేసి, గడిచిన 12 ఏళ్లుగా అనుభవంలో ఉంటూ 12.10.2020 నుంచి 10.11.2020 మధ్య కాలంలో క్రమబద్ధీకరణ కోసం రైతులు పెట్టుకున్న దరఖాస్తులపై ఆర్డీవో విచారణ చేసి అర్హత కల్గిన రైతుల నుంచి ప్రస్తుత రిజిస్ట్రేషన్, స్టాంప్డ్యూటీ వసూలుచేసి సర్టిఫికేట్ జారీ చేస్తారన్నారు. అదనపు కలెక్టర్ విక్టర్, ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నె ప్రభాకర్, నాగిరెడ్డిపేట తహసీల్దార్ శ్రీనివాస్రావు, ఆర్ఐ మహ్మద్, ఎల్లారెడ్డి తహసీల్దార్ ప్రేమ్కుమార్, ఏఎంసీ చైర్పర్సన్ రజిత, తదితరులు పాల్గొన్నారు. -
ఆపన్నహస్తం అందించండి
జక్రాన్పల్లి: మండలంలోని పడకల్ గ్రామానికి చెందిన యువకుడు పసుల ఆకాశ్ ఈ నెల 11న బైక్పై వస్తుండగా నూర్సింగ్ తండా వద్ద మరో వ్యక్తి బైక్పై వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆకాశ్కు తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్లోని సరోజిని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి బ్రెయిన్లోని నరాలు చిట్లిపోయాయని, కుడి కన్ను పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపారు. ఆపరేషన్ కోసం రూ. 6లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. అంత స్థోమత లేకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు దాతల చేయూత కోసం ఎదురుచూస్తున్నారు. పోలీస్ ఉద్యోగం రాకపోవడంతో ఇడ్లీ సెంటర్తో ఉపాధి.. ఆకాశ్కు భార్య మౌనిక, ఐదేళ్ల లోపు పాప, ఓ బాబు ఉన్నారు. ఆకాశ్ ఇటీవల కానిస్టేబుల్ ఉద్యోగం కోసం కొంత వరకు అప్పులు చేసి హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నాడు. కానీ ఉద్యోగం రాలేదు. దీంతో చేసిన అప్పులు తీర్చాలన్న ఉద్దేశంతో ఇటీవల కలిగోట్లో చిన్న ఇడ్లీ సెంటర్ ప్రారంభించాడు. ఇడ్లీ సెంటర్ ద్వారా వచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆకాశ్ రో డ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలు కావడంతో కుటుంబం దిక్కుతోచనిస్థితికి చేరింది. ప్ర స్తుతం ఆకాశ్ పరిస్థితి విషమంగా ఉందని వెంటనే డబ్బులు సమకూర్చుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆకాశ్కు మెరుగైన వై ద్యం కోసం పడకల్ గ్రామస్తులు, యువకులు తమవంతుగా ఆర్థికంగా సహాయ సహకారాలు అందజేస్తున్నారు. మరికొంత మంది దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించాలని బాధిత కుటుంబీకులు కోరుతున్నారు. ఆర్థికసాయం చేయదల్చిన దాతలు ఆకాశ్ సోదరుడు పసుల రవి సెల్ నంబర్కు 91823 98298కు ఫోన్పే చేయగలరు. రోడ్డు ప్రమాదంలో పడకల్ యువకుడికి తీవ్ర గాయాలు చికిత్సకు సుమారు రూ.6లక్షల వరకు అవసరం దాతల కోసం బాధిత కుటుంబ సభ్యుల ఎదురుచూపు -
వరిధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం నజర్
నిజాంసాగర్(జుక్కల్): కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. యాసంగి సీజన్లో సన్నరకం క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తుండటంతో విక్రయాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తోంది. శనివారం గోర్గల్ గ్రామ కొనుగోలు కేంద్రంలో వరిధాన్యం విక్రయాలను రాష్ట్ర ఎన్న్ఫోర్స్మెంట్ టీం–3 ఓఎస్డీ శ్రీధర్రెడ్డి నేతృత్వంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఓఎస్డీ వెంట డీఎస్పీ శేఖర్రెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ డీటీలు సురేశ్, సీఐ, ఎస్సైలు, అచ్చంపేట సొసైటీ సీఈవో సంగమేశ్వర్గౌడ్ తదితరులు ఉన్నారు. కొనుగోలు కేంద్రం పరిశీలన ఎల్లారెడ్డిరూరల్: మాచాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏపీఎం ప్రసన్నరాణి శనివారం పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, విద్యుత్, త్రాగునీరు, టెంట్ సౌకర్యాలు కొనుగోలు పూర్తయ్యే వరకు ఉంచాలని అన్నారు. తడిసిన ధాన్యం తరలింపు రామారెడ్డి: కన్నాపూర్లో గురువారం కురిసిన వడగండ్ల వానకు ధాన్యం కొనుగోలు కేంద్రంలోని 1100 సంచుల ధాన్యం తడిశాయి. వెంటనే విషయం తెలుసుకున్న సొసైటీ చైర్మన్ మర్రి సదాశివ రెడ్డి సివిల్ సప్లయ్స్ అధికారులతో మాట్లాడి తడిసిన ధాన్యం కాంటా చేసి రైస్మిల్కు తరలించారు. వైస్ చైర్మన్ అమ్ముల పశుపతి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు లక్ష్మా గౌడ్, సీఈవో బైరయ్య, తదితరులు పాల్గొన్నారు. -
నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వాలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపిక విషయంలో నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ సూచించారు. నాగిరెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో శనివారం పలుగ్రామాల పంచాయతీల కార్యదర్శులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి నిరుపేదలకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలని చెప్పారు. దీంతోపాటు రేషన్కార్డుల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అర్హులకు మాత్రమే కార్డులు అందేలా సర్వే చేయాలన్నారు. డీపీవో మురళీ, ఎంపీడీవో ప్రభాకరచారి తదితరులు పాల్గొన్నారు. 11కేవీ లైన్ ఏబీ స్విచ్ల ఏర్పాటు లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట మండలం సబ్ డివిజన్ పరిధిలోని శెట్పల్లిసంగారెడ్డి శివారులో శనివారం 11కేవీ లైన్ ఏబీ స్విచ్లు బిగించినట్లు ట్రాన్స్కో ఏడీఈ మల్లేశం తెలిపారు. శెట్పల్లిసంగారెడ్డి పరిధిలో 24, లింగంపేటలో 10, గాంధారిలో 18, సర్వాపూర్లో 6, మొత్తం 58 ఏబీ స్విచ్లు రన్నింగ్లో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. వీటి ద్వారా 11కేవీ లైన్లో ఏమైనా సమస్యలుంటే అదే భాగాన్ని ఓపెన్ చేసి మిగతా 11కేవీలకు సప్లై ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నారు. ఏఈలు హరీష్రావు, సాయినాథ్, సిబ్బంది పాల్గొన్నారు. హోరాహోరీగా కుస్తీ పోటీలు బాన్సువాడ రూరల్: మండలంలోని బోర్లం గ్రామంలో మత్తడి పోచమ్మ జాతర సందర్భంగా శనివారం స్థానిక జెడ్పీ హైస్కూల్ ఆవరణలో కుస్తీ పోటీలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన మల్లయోధులు హోరాహోరీగా తలపడ్డారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతానికి చెందిన మల్లయోధులు తమ కుస్తీలతో వీక్షకులను అలరించారు. నిర్వాహకులు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.బాన్సువాడ పోలీసులు, బందోబస్తు పర్యవేక్షించారు. ప్రైవేటుకు దీటుగా విద్యా బోధన భిక్కనూరు: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యాబోధన చేస్తాం...మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించండని లక్ష్మీదేవునిపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రజిత అన్నారు. శనివారం గ్రామంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయని, పుస్తకాలు కూడా ఉచితంగా అందజేస్తామన్నారు. మాజీ ఉపసర్పంచ్ పరమేశ్వర్రెడ్డి, రిటైర్టు ఉపాధ్యాయుడు రాంరెడ్డి, కాంప్లెక్సు హెచ్ఎం ప్రసూన, అంగన్వాడి టీచర్ సువర్ణ పాల్గొన్నారు. -
చారిత్రక కట్టడాల విశిష్టతపై అవగాహన
దోమకొండ: ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని గడికోట, బురుజు, ఉపగడ్డ తదితర చారిత్రక కట్టడాలపై శనివారం విద్యార్థులకు గడికోట ట్రస్టు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా విద్యార్థులకు కట్టడాలను ప్రక్ష్యతంగా చూపించి వాటి విశిష్టతను తెలియజేశారు. గడికోట నుంచి బురుజు వరకు ర్యాలీగా వెళ్లి బురుజు కట్టడం దాని చరిత్ర వా రికి వివరించారు. గడికోట ట్రస్టు మేనేజర్ బా బ్జీ, ట్రస్టు ప్రతినిధులు గణేష్యాదవ్, రాజశేఖ ర్, హరీష్, కల్పన విద్యార్థులు ఉన్నారు. -
స్విమ్మింగ్పూల్లో యువకుడి మృతి
మృతుడు మెదక్ జిల్లా చేగుంటవాసి భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఉన్న స్విమ్మింగ్పూల్లో మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రానికి చెందిన యువకుడు శనివారం మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చేగుంట మండల కేంద్రానికి చెందిన తిరుపతి సంజయ్ అలియాస్ లాల్ (21) కూలి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామరచెర్వులోని బంధువుల ఇంటికి వచ్చాడు. వారితో కలిసి పెద్దమల్లారెడ్డిలో ఉన్న ప్రైవేట్ స్విమ్మింగ్పూల్లో ఈత కొట్టేందుకు వచ్చాడు. ఈత కొడుతుండగా తలకు గాయమై ఫిట్స్ రావడంతో నీటిలో మునిగిపోయాడు. గమనించిన బంధువులు వెంటనే సంజయ్ను ఒడ్డుకు తీసుకొచ్చి 108లో రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, సంజయ్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి ఇంకా పెళ్లి కాలేదు. తల్లి మంజుల ఉంది. మృతదేహాన్ని చేగుంటకు తరలించారు. అపరిశుభ్ర హోటళ్లకు జరిమానా నిజామాబాద్ సిటీ: జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లపై మున్సిపల్ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ జయకుమార్ సిబ్బందితో కలిసి నగరంలోని పలు హోటళ్లను పరిశీలించారు. రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న టీ హోటళ్లు అపరిశుభ్రంగా ఉండడంతో వారికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించారు. కంఠేశ్వర్ బైపాస్లోని లహరి హోటల్లో పాడైపోయిన చికెన్ను గుర్తించి, నిర్వాహకులకు రూ. 10 వేల ఫైన్ వేశారు. ముబారక్నగర్, కుమార్గల్లి, ఖలీల్వాడీల్లోని పలు హోటళ్లలో తనిఖీలు చేపట్టి రూ.45 వేల జరిమానా విధించినట్లు ఏఎంసీ జయకుమార్ తెలిపారు. వారి వెంట శానిటరీ ఇన్స్పెక్టర్లు షేక్ షాదుల్లా, కృష్ణ, జవాన్లు, సిబ్బంది ఉన్నారు. ఆటో బోల్తా.. విద్యార్థులకు గాయాలు ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఆటో బో ల్తా పడి విద్యార్థులకు గా యాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. పెర్కిట్లోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థులు తరగతులు ముగించుకొని రోజూ మాదిరిగానే ఆటోలో మొత్తం 9 మంది ఇంటికి బయల్దేరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోకి రాగానే ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో సాత్విక్, శ్రీవల్లి అనే విద్యార్థులకు గాయాలు కాగా స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు విద్యార్థులకు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. డ్రైవర్ రోజూ టాటాఏస్ వ్యాన్ తీసుకువచ్చేరని అది రిపేర్కు వెళ్లడంతో ఆటో తీసుకొచ్చినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పీడీఎస్యూ నాయకులు మమత, వినోద్, సిద్ధు గాయపడిన విద్యార్థులను పరామర్శించారు. కీచక ఉపాధ్యాయుడిపై మరో కేసు రామారెడ్డి: పోక్సో కేసులో బెయిల్పై వచ్చి బాధితులను బెదిరించిన ఉపాధ్యాయుడిని పోలీసులు రిమాండ్కు తరలించారు. రామారెడ్డి ఎస్సై నరేశ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలోని ఓ పాఠశాలలో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు మహేశ్పై ఇటీవల విద్యార్థినులు షీటీంకు సమాచారం ఇచ్చారు. షీ టీం సభ్యులు విచారణ చేసి రెండ్రోజుల క్రితం మహేశ్పై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. బెయిల్పై బయటికి వచ్చిన మహేశ్ .. బాధితులను తీవ్రంగా బెదిరించగా శనివారం మరో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. -
రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
ఖలీల్వాడి: గుర్తు తెలియని వ్యక్తి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి శుక్రవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి వస్తున్న గూడ్స్ రైలు డిచ్పల్లి పరిధిలోకి రాగానే గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వయస్సు 40 ఏళ్ల వరకు ఉంటాడని, అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మృతుడి ఫొటో ఆధారంగా ఎవరికై నా సమాచారం తెలిస్తే 8712658591 నంబర్కు సమాచారం అందించాలని ఎస్సై కోరారు. జీవితంపై విరక్తితో మరొకరు.. కామారెడ్డి క్రైం: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి జీవితంపై విరక్తితో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి మండలం క్యాసంపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శివోళ్ల చిన్నగంగయ్య(55) కొద్ది రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. డబ్బుల కోసం కుటుంబ సభ్యులను వేధించేవాడు. గురువారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన అతను కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. శుక్రవారం ఉదయం తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పెరిగిన వరికోత యంత్రాల కిరాయి
బాన్సువాడ : బాన్సువాడ ప్రాంతంలో యాసంగి వరికోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరి కోత యంత్రాల కిరాయిలు భారీగా పెరిగాయి. గత వర్షకాలం వరి కోతలు చేసే టూ వీలర్ హార్వేస్టర్ యంత్రానికి గంటకు రూ.2200 ఉండగా ఇప్పుడు రూ.2400 నుంచి రూ.2500 వరకు పెంచారు. ఫోర్ వీలర్ యంత్రానికి గతంలో గంటకు రూ.2500 చొప్పున తీసుకోగా ఇప్పుడు ఆ ధరను రూ.2600 నుంచి రూ.2800 వరకు పెంచారు. తడి నేలలు నీటితో ఉన్న కమతాల్లో వరిని కోసేందుకు ట్రాక్ యంత్రానికి (చైన్) గత వర్షకాలంలో గంటకు రూ.2800 ఉండగా ఇప్పుడు రూ.2900 చేశారు. పశుగ్రాసం సేకరణలో భాగంగా ఎండుగడ్డిని కట్టలు కట్టేందుకు వినియోగించే బేలర్ యంత్రం ధరను యాజమానులు పెంచారు. గతంలో కట్టకు రూ.20 తీసుకోగా ప్రస్తుతం రూ.30 నుంచి రూ.35 కి పెంచారు. ధాన్యాన్ని బస్తాల్లోకి, ట్రాక్టర్ల మీదకు చేర్చేందుకు కూలీ రెట్టింపు అయింది. గతంలో బస్తాకు రూ. 20 ఉండగా ఇప్పుడు రూ.30 తీసుకుంటున్నారు. ట్రాక్టర్ల యాజమానులు సైతం రవాణా చార్జీలు భారీగా పెంచారు. గతంలో ఒక్కో లోడ్ రూ.500 తీసుకుంటే ప్రస్తుతం రూ.700 పెంచారు. గడ్డి కట్టలను సైతం ఇంటికి చేర్చేందుకు ఒక్కో కట్టకు రూ.30 చొప్పున వసూలు చేస్తున్నారు .ధాన్యాన్ని కల్లాలు, మిల్లులు, ఇళ్లకు తరలించేందుకు రవాణా చార్జీలు సైతం తడిపి మోపెడవుతున్నాయి. డీజిల్, పెట్రోల్ ధరలను సాకుగా చూపుతూ యంత్రాలు, ట్రాక్టర్ల యజమానులు ధరను అమాంతం పెంచేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిపి మోపెడవుతున్న రవాణా చార్జీలు ఆర్థికంగా కుదేలవుతున్న రైతులుదిగుబడి తగ్గే అవకాశం ఈ యాసంగిలో 5 ఎకరాల్లో వరి సాగు చేశా. పైరుకు రెండు సార్లు స్ప్రే చేశా. గింజ పాలుపొసుకోక తాలుగా మారింది. తాలువల్ల పొలమంతా తెల్లగా కనిపిస్తోంది. గతంలో 25 క్వింటాళ్ల దిగుబడి సాధించా. ఇప్పుడు దిగుబడి తగ్గే అవకాశం ఉంది. వరి కోతలకు యంత్రాల ధరలను పెంచితే మాకు మిగిలేది అంతంత మాత్రమే. – నారాయణ, రైతు, బాన్సువాడఏం మిగిలేలా లేదు నాకున్న పదెకరాల్లో వరి పంట వేశాను. గతంలో ఎన్న డూ లేని విధంగా ఈ సారి పంట బాగానే వచ్చింది. మూడు సార్లు స్ప్రే చేశా. ఆకాల వర్షానికి పంట పూర్తిగా నేలకొరిగింది. ట్రాక్టర్లు, యంత్రాలకు రేట్లు పెంచారు. ఖర్చులు పోను ఏమి మిగిలేలా లేదు. – దోసాయి వెంకట్, రైతు, అన్నారం -
200 సైలెన్సర్ల ధ్వంసం
ఖలీల్వాడి: వాహన సైలెన్సర్లు మార్చి శబ్ధ కాలుష్యానికి కారకులవుతున్న యువకులపై నగర పోలీసులు కొరడా ఝలిపించారు. వాహనాల తయారీ కంపెనీ ఇచ్చిన సైలెన్సర్ కాకుండా మాడిఫైడ్ సెలెన్సర్లను అమర్చుకుని కొందరు నగరంలో తిరుగుతున్నారు. ఆయా వాహనాలు రోడ్లపై వెళ్తుంటే భారీ శబ్ధం వెలువడుతుంది. దీంతో గుండెజబ్బులు ఉన్నవారు, చిన్నారులు, వృద్ధులు ఆందోళనకు గురవుతుంటారు. ఈ నేపథ్యంలో నగర పోలీసులు ఇటీవల స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 200 వాహనాలకు ఉన్న మాడిఫైడ్ సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటన్నింటినీ శుక్రవారం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ట్రాఫిక్ ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. వాహనదారులకు జరిమానాలు విధించి వాటిని రోడ్డు రోలర్తో తొక్కించినట్లు ఏసీపీ తెలిపారు. పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తప్పవన్నారు. మైనర్లకు తల్లి దండ్రులు వాహనాలను ఇవ్వొద్దని అన్నారు. శబ్ధ కాలుష్యం ఏర్పడితే జరిమానా, జైలు శిక్ష విధిస్తామన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐలు ప్రసాద్, శేఖర్, ఎస్సై సుమన్, రహిమాతుల్లా సిబ్బంది ఉన్నారు. -
గుండెపోటుతో ఆటో డ్రైవర్ మృతి
ఖలీల్వాడి: గుండెపోటుతో ఓ ఆటో డ్రైవర్ మృతి చెందినట్లు మూడో టౌన్ ఎస్సై గంగాధర్ శుక్రవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని న్యూ ఎన్జీవోస్ కాలనీకి చెందిన బాచుపల్లి భానుచందర్(36) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మూడో టౌన్ పరిధిలోని రైతు బజార్ వద్ద ఉన్న వైన్స్ దుకాణం ఎదురుగా ఆటోను నిలిపి పాటలు వింటున్నాడు. ఆటోలో మూడు గంటల పాటు అతను కదలకుండా ఉండడాన్ని గమనించిన స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. లారీని ఢీకొన్న మరో లారీభిక్కనూరు: మండల సమీపంలోని టోల్ప్లాజా వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. టోల్ప్లాజా వద్ద నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ వేగంగా ఢీకొన్నది. ఈ ఘటనలో వెనుక లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో కామారెడ్డికి తరలించారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేతనాగిరెడ్డిపేట: మండలంలోని గోలి లింగాల సమీపంలో ఉన్న మంజీరా నది నుంచి గురువారం రాత్రి ఇసుక ను తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను పట్టు కొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై మల్లారెడ్డి తెలిపారు. గోలిలింగాలకు చెందిన కోడె గంగారాం, తొంట సిద్ధిరాములు, పిట్ల సత్యనారాయణ, పుట్ల సంతోష్, కాంచనపల్లి లింగాగౌడ్, పుట్ల కిష్టయ్య ఎలాంటి అనుమతులు లేకుండా మంజీరా నుంచి అక్రమంగా ఇసుకను తరలించేందుకు యత్నిస్తుండగా సిబ్బందితో కలిసి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ట్రాక్టర్లను సీజ్చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. రైల్వేస్టేషన్లో ఒకరిపై దాడి ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్లో బుకింగ్ కౌంటర్ వద్ద పడుకొని ఉన్న కుభీర్ మండలానికి చెందిన కుంచెపు బాబుపై గుర్తు తెలియని వ్యక్తి బ్లేడ్తో దాడి చేసినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి శుక్రవారం తెలిపారు. రైల్వే టికెట్ కౌంటర్ వద్ద బాబుతో అనవసరంగా గొడవ పడి మెడపై బ్లేడ్తో దాడి చేశాడన్నారు. ఈ ఘటనలో అతనికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. నిందుతుడి పరారీలో ఉన్నాడని అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఒకరిపై పోక్సో కేసు నమోదుతాడ్వాయి: తాడ్వాయి పోలీసు పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. తన ఇంటి ఎ దుట ఉన్న మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడన్నారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం పెద్దకొడప్గల్: మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యమైన ఘటన పెద్దకొడప్గల్ మండలం రతన్సింగ్ తండాలో చోటు చేసుకుంది. ఎస్సై మహేందర్ తె లిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన వెంక ట్ అనే వ్యక్తి కొన్ని నెలల క్రితం మతిస్థిమితం కో ల్పోయాడు. పలుమార్లు ఇంటి నుంచి వెళ్లి తిరిగి వ చ్చేవాడు. ఈ నెల 6న ఇంటి నుంచి వెళ్లిన వెంకట్ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
విద్యుదాఘాతంతో మరొకరు..
పెద్దకొడప్గల్: పనిచేస్తున్న ప్రాంతంలో వెలగని బల్బును సరిచేస్తున్న ఓ వ్యక్తికి విద్యుదాఘాతం సంభవించి మృతి చెందిన ఘటన పెద్దకొడప్గల్ మండలం జగన్నాథ్పల్లి తండా శివారులో చోటు చేసుకుంది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నాందేడ్కు చెందిన గజానన్(25) తండా శివారులోని ఇటుక బట్టీలో ఐదు నెలలుగా కూలీగా పనిచేస్తున్నాడు. శుక్రవారం వేకువ జామున పనిచేస్తున్న ప్రదేశంలో వెలగని బల్బును సరిచేస్తుండగా విద్యుదాఘాతం సంభవించి కిందపడిపోయాడు. గమనించిన తోటి కూలీలు బాన్సువాడకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
రసవత్తరంగా కుస్తీ పోటీలు
బాన్సువాడ : బాన్సువాడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో శుక్రవారం నిర్వహించిన కుస్తీ పోటీలు రసవత్తరంగా సాగాయి. బాన్సువాడ డివిజన్లో అతి పెద్ద జాతరగా భేతాళస్వామి జాతరకు ఆదరణ ఉంది. ఏటా ఉత్సవాల సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. శుక్రవారం నిర్వహించిన జాతరలో పాల్గొని, పోటీలను తిలకించడానికి స్థానికులు, చుట్టుపక్కల గ్రామాలనుంచే కాకుండా మహారాష్ట్ర– కర్ణాటక సరిహద్దు గ్రామాల నుంచి జనం కూడా జనం తండోపతండాలుగా వచ్చారు. మల్లయోధులు కూడా అంతే ఉత్సాహంతో తొడకొట్టి తలపడ్డారు. కొబ్బరి కాయ కుస్తీతో మొదలైన పోటీలు రూ. 5,001 కుస్తీ వరకు సాగాయి. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పోటీలను తిలకించారు. విజేతలకు బహుమతులు అందించారు. -
ఆర్టీసీ బస్టాండ్లో షటర్ వివాదం
కామారెడ్డి టౌన్: కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్ ముందు శుక్రవారం ఓ షటర్ వ్యవహారంలో వివాదం చోటుచేసుకుంది. 20 ఏళ్ల క్రితం నుంచి బస్టాండ్ ముందు షటర్ వేసుకుని టీ వ్యాపారం చేసుకుంటున్నామని తమదే ఆ షటర్ అని ఓ మహిళ తెలిపింది. ఆ షటర్ను ఆర్టీసీ యూనియన్కు కేటాయించినట్లు నాయకులు తెలిపారు. ఆ షటర్ తమదేనంటూ ఇరు వర్గాలు వాగ్వాదం చేసుకున్నాయి. పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు. ఆర్టీసీ అధికారులు విచారణ జరుపుతారని పోలీసులు వారికి నచ్చజెప్పి గొడవను సద్దుమనిగించారు.రోడ్డుపైనే ధాన్యం ఆరబోతలింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని శెట్పల్లిసంగారెడ్డి, పర్మళ్ల, శెట్పల్లి, భవానిపేట, ఒంటర్పల్లితో పాటు పలు గ్రామాలకు వెళ్లే రోడ్డుపైనే ధాన్యం ఆరబోశారు. రైతులకు ధాన్యం ఆరబెట్టడానికి కళ్లాలు లేకపోవడంతో రోడ్లపైనే ఆరబోస్తున్నారు. దీంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. దగ్ధమైన ఈత వనాల పరిశీలన గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రం సమీపంలో ఈదుల్ల వాగు వద్ద ఇటీవల దగ్ధమైన ఈత వనాన్ని శుక్రవారం పరిశీలించినట్లు ఎల్లారెడ్డి ఎకై ్సజ్ సీఐ షాకీర్ అహ్మద్ తెలిపారు. సుమారు 300 ఈత చెట్లు దగ్ధమయ్యాయి. ప్రమాద వశాత్తు దగ్ధమయ్యాయా, ఎవరైనా దహనం చేశారా అనే కోణంలో విచారణ చేస్తున్నామని సీఐ తెలిపారు. ఆయన వెంట ఎల్లారెడ్డి ఎకై ్సజ్ ఎస్సై జగన్మోహన్, సిబ్బంది ఉన్నారు. -
యువతిని వేధించిన యువకుడి అరెస్ట్
బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రానికి చెందిన ఓ యువతిని సోషల్ మీడియాలో వేధించిన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందుకుర్తి గ్రామానికి చెందిన అలీమ్ బేగ్ను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు బోథ్ ఎస్సై ఎల్ ప్రవీణ్కుమార్ తెలిపారు. యువతిని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అలీమ్బేగ్ వేధిస్తున్నాడని తెలిపారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు అలీమ్బేగ్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కాగా అలీమ్బేగ్పై రౌడీషీట్ ఉన్నట్లు పేర్కొన్నారు. రెంజల్ పోలీస్స్టేషన్లో నాలుగు కేసులు ఉన్నాయన్నారు. డిచ్పెల్లి పోలీస్స్టేషన్లో 2023లో అలీమ్బేగ్ వద్ద నుంచి 17 బైక్లు రికవరీ చేసినట్లు తెలిపారు. నాటు తుపాకులతో పాటు ఇద్దరి అరెస్టుతాడ్వాయి: మండలంలోని కన్కల్ గ్రామంలో నాటు తుపాకులతో తిరుగుతున్న ఇద్దరిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. బాన్సువాడ మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన తిల్ పీత్య మహేందర్సింగ్, తిల్ పీత్య ఇందర్సింగ్ మండలంలోని కన్కల్లో కొంతకాలంగా నివసిస్తూ లేబర్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరు శుక్రవారం తాడ్వాయిలోని కల్లు డిపో వద్ద నాటుతుపాకులతో తిరుగుతున్నట్లు సమాచారం రావడంతో వెంటనే అక్కడికి చేరుకొని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన ఎల్లారెడ్డి: పట్టణంలోని గ్యాస్ గోదాంలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై అగ్నిమాపక అధికారులు శుక్రవారం అవగాహన కల్పించారు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా పట్టణంలోని హెచ్పీ గ్యాస్ గోదాంలో అవగాహన నిర్వహించారు. కార్యక్రమంలో ఫైర్ అధికారులు వినోద్, నరేందర్ తదితరులున్నారు. -
అక్రమ నియామకాలపై కలెక్టర్ స్పందించాలి
కామారెడ్డి టౌన్: మెడికల్ కళాశాలలో ఇటీవల జరిగిన ఔట్ సోర్కింగ్ ఉద్యోగ నియామకాలలో అక్రమాలు జరిగాయని తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా మెరిట్ ఆధారంగా తీసుకోకుండా కామారెడ్డి మ్యాన్ పవర్ ఏజెన్సీ అక్రమ నియామకాలకు పాల్పడినట్లు తెలిపారు. రూ. కోటికిపైగా కుంభకోణం జరిగిందని ఆరోపించారు. తక్షణమే కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ నియమకాలు రద్దు చేయకపోతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, బీసీ విద్యార్థి సంఘాల జిల్లా అధ్యక్షుడు అరుణ్కుమార్, నాగరాజు, బీవీయం రాష్ట్ర కార్యదర్శి విఠల్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ శివ, నాయకులు అజయ్, రాహుల్, మనోజ్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
పిట్లం: ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఓ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన పిట్లం మండలం సిద్ధాపూర్ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై రాజు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడకు చెందిన కె బుచ్చయ్య చారి(42) పిట్లం మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి విధులు ముగించుకొని పిట్లం నుంచి బాన్సువాడకు బైక్పై వెళ్తుండగా సిద్ధాపూర్ శివారులోని చెరువు కట్ట ప్రాంతంలో ప్రమాదవశాత్తు బైక్ అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొన్నాడు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు..భిక్కనూరు: లారీని వెనుక నుంచి ఓ బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందిన ఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివనగర్ మండలం కల్వరాలకు చెందిన శ్రీనివాస్(42) బీబీపేటలో ఉన్న బంధువుల శుభకార్యానికి వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి బైక్పై వస్తుండగా జంగంపల్లి శివారులో రోడ్డుపై నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో గురువారం అర్ధరాత్రి, శుక్రవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ధాన్యం తూకంలో మోసం
● రైతుల ఆందోళన ● సరి చేస్తామన్న నిర్వాహకులుకామారెడ్డి రూరల్ : శాబ్దిపూర్ కొనుగోలు కేంద్రంలో బస్తాకు రెండు కిలోలు ఎక్కువగా తూకం వేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. నిబంధనల ప్రకారం ధాన్యం బస్తా బరువు 40.600 కిలోలు ఉండాల్సి ఉండగా తరుగు కోసం 42.500 కిలోలు తూకం వేయడానికి ఒప్పుకున్నామన్నారు. అయినా సెంటర్ నిర్వాహకులు అదనంగా రెండు కిలోలు జోకుతున్నారని ఆరోపించారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న పీఏసీఎస్ సెక్రెటరీ కొనుగోలు కేంద్రం వద్దకు వచ్చి కాంటాను సరి చేస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు. -
అకాల వర్షంతో ఆగమాగం
మాచారెడ్డి/కామారెడ్డి రూరల్/రాజంపేట/బీబీపేట: జిల్లాలోని పలు ప్రాంతాలలో శుక్రవారం బలమైన గాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఇళ్లు, షెడ్లకు సంబంధించిన రేకులు కొట్టుకుపోయాయి. మాచారెడ్డి మండలంలోని చుక్కాపూ ర్, అక్కాపూర్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. మామిడి కాయలు రాలిపోయాయి. పాల్వంచలో కామారెడ్డి –సిరిసిల్ల రహదారిపై చెట్లు విరిగి రోడ్డుకు అడ్డం పడిపోయాయి. కామారెడ్డి మండలంలోని గూడెం గ్రామంలో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. గ్రామానికి చెందిన తెడ్డు బాలరాజు, చిట్టపురం బాలరాజు, కిష్టయ్య, స్వామి, గుడుగుల బాలరాజులకు చెందిన రేకుల ఇండ్లు, చిందాల రాజిరెడ్డి కోళ్ల ఫారం రేకులు కొట్టుకుపోయాయి. రాజంపేట మండలంలోని ఎల్లారెడ్డిపల్లి తండా గ్రామ పంచాయతీ పరిధిలోని జీత్యానాయక్ ఇంటి పైకప్పు రేకులు కొట్టుకుపోయాయి. ఇంట్లో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బీబీపేట మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో బలమైన గాలులు వీచాయి. మల్కాపూర్ రోడ్లోని రైస్ మిల్ రేకులు కూలిపోయాయి. శివారు రాంరెడ్డిపల్లిలో గ్రామ పంచాయతీ కార్మికుడి ఇంటి పైకప్పు రేకులు లేచిపోయాయి. బీబీపేటలో ఏడు విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బీబీపేటలో రెండు ఇళ్ల పై రేకులు లేచిపోయాయి. ఎంపీడీవో కార్యాలయం ముందున్న నర్సరీకి ఏర్పాటుచేసిన నెట్ మొక్కలపై పడిపోయింది. -
తప్పుడు పత్రాలతో కొలువులు!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సినవారే.. ఉద్యోగం కోసం త ప్పుదారిన వెళ్లారు. దివ్యాంగుల కోటా కోసం తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించారు. అయితే ఈ విషయం నిర్ధారణ కావడంతో ఉ ద్యోగాల నుంచి ఎందుకు తొలగించకూడదంటూ జిల్లా విద్యాశాఖ అధికారి షోకాజ్ నోటీసు లు జారీ చేశారు. దీనిపై సదరు టీచర్లు కోర్టుకు వెళ్లగా.. విద్యాశాఖ కౌంటర్ దాఖలు చేసింది. డీఎస్సీ–2024లో విజువల్ హ్యాండీకాప్డ్ (దృష్టిలోపం) కోటాలో వివిధ సబ్జెక్టుల్లో 17 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారు. అయితే 11 మంది మాత్రమే ఎంపికయ్యారు. అందరూ సదరం సర్టిఫికెట్లను చూపి రిజర్వేషన్ కోటాలో ఉద్యోగాలు పొందారు. తర్వాత రాష్ట్ర విద్యా శాఖ డైరెక్టరేట్ ఆదేశాల మేరకు 11 మందిని సరోజినిదేవీ కంటి ఆస్పత్రికి పరీక్షల నిమిత్తం పంపించారు. అక్కడి వైద్యులు పరీక్షించి ఆరుగురికి 40 శాతానికిపైగా దృష్టి లోపం ఉందని, మిగతా ఐదుగురు 40 శాతంలోపు దృష్టి దోషంతో ఉన్నారని నిర్దారించారు. నిబంధనల ప్రకా రం 40 శాతానికిపైగా దృష్టి లోపం ఉంటేనే రిజర్వేషన్కు అర్హులు. సదరం సర్టిఫికెట్లలో దృష్టిలోపం ఎక్కువగా ఉండగా, సరోజినీ దేవి కంటి ఆస్పత్రి వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో తక్కు వ ఉన్నట్లు తేలింది. ఐదుగురిలో ఇద్దరికి పది శాతం, ముగ్గురికి 30 శాతం మాత్రమే ఉన్నట్లు నిర్ధారణ కావడంతో వారికి విజువల్ హ్యాండీ కాప్డ్ (దృష్టిలోపం) రిజర్వేషన్ కోటా వర్తించదని విద్యాశాఖ అధికారులు తేల్చారు. చర్యలు తీసుకునే అధికారం ఉంది ఉద్యోగంలో చేరిన సమయంలో తప్పుడు ప త్రాలు సమర్పిస్తే చర్యలు తీసుకునే అధికారం ఉంది. 40శాతంకన్నా ఎక్కువ దృష్టి లో పం ఉన్నట్లు వారు సదరం సర్టి ఫికెట్లు ఇచ్చారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా దృష్టిలోపం, చెవుడు వంటి వాటికి సంబంధించిన కోటాలో ఉద్యోగాలు పొందిన వారిని ప్రభుత్వాస్పత్రుల్లో పరీక్షలు జరిపించగా.. జిల్లాకు చెందిన ఐదుగురికి తక్కువ దృష్టిలోపం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అందుకే వారికి నోటీసులు ఇచ్చాం. వారు కోర్టును ఆశ్రయించగా.. మేం కౌంటర్ దాఖలు చేశాం. కోర్టు ఆదేశాలు వచ్చాక చర్యలు తీసుకుంటాం. –రాజు, జిల్లా విద్యాశాఖ అధికారి, కామారెడ్డిఆ ఐదుగురికి...నిబంధనల ప్రకారం రిజర్వేషన్ పొందడానికి అర్హత లేనందున ఎందుకు చర్య లు తీసుకోకూడదంటూ జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.రాజు ఫిబ్రవరి 28న షోకా జ్ నోటీసులు జారీ చేశారు. నోటీసులకు వారు ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదంటూ వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని నిర్ణయించారు. అయితే తాము సదరం సర్టిఫికెట్ల ఆధారంగానే ఉద్యోగాలకు ఎంపికయ్యామని, తమదెలాంటి తప్పిదం లేదని ఆ ఉపాధ్యాయు లు కోర్టును ఆశ్రయించారు. దీంతో వి ద్యా శాఖ అధికారులకు కోర్టు నుంచి నో టీసులు వచ్చాయి. దీనిపై విద్యాశాఖ అ ధికారులు కౌంటర్ దాఖలు చేశారు. సరోజినీ దేవి ఆస్పత్రి వైద్యులు చేసిన పరీక్షల రిపోర్టులను న్యాయస్థానం ముందుంచారు. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. దృష్టిలోపం కోటాలో ఉద్యోగాలు లోపం 40 శాతంలోపే ఉన్నట్లు నిర్ధారణ ఐదుగురిని అనర్హులుగా గుర్తిస్తూ విద్యాశాఖ నోటీసులు కోర్టుకు వెళ్లిన సదరు ఉపాధ్యాయులు.. కౌంటర్ దాఖలు చేసిన విద్యాశాఖ అధికారులు -
వడ్లు కొనేదెప్పుడో?
ఒడ్డేపల్లిలో ధాన్యం కుప్పలు● కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సర్కారు ● తూకాల ప్రారంభంలో జాప్యం ● పేరుకుపోతున్న ధాన్యం నిల్వలు ● మూడు వారాలుగా ధాన్యం రాసుల వద్దే అన్నదాతల మకాం ● ఇబ్బంది పడుతున్న రైతులుజిల్లావ్యాప్తంగా యాసంగి వరి కోతలు ఊపందుకున్నాయి. అధికారులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అయితే చాలాచోట్ల ఇప్పటికీ తూకాలను మాత్రం మొదలుపెట్టలేదు. దీంతో రైతులు తరలించిన ధాన్యం రాశులు కొనుగోలు కేంద్రాల వద్ద పేరుకుపోతున్నాయి. మరోవైపు కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.ప్రారంభం కాని కాంటాలు.. -
‘ఓపెన్’ అక్రమాలకు కళ్లెం పడేనా?
నిబంధనలకు విరుద్ధంగా..డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): ఓపెన్ స్కూల్ పరీక్షలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి. గతంలో చూచిరాతలు, మాస్ కాపీయింగ్కు పాల్పడిన సందర్భాలున్నాయి. ఈ ఏడాది కూడా పరీక్షల్లో అక్రమాలకు కొందరు చక్రం తిప్పుతున్నారు. పరీక్షల నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించే చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్), డిపార్ట్మెంటల్ అధికారులు(డీవో), ఇన్విజిలేటర్లను తమకు అనుకూలమైన వారిని నియమించుకునేందుకు విద్యాశాఖ అధికారుల వద్ద పావులు కదుపుతున్నారు. కాగా, ప్రతి ఏడాది వేసవిలో నిర్వహించే ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా చేసేందుకు పోటీ ఎక్కువగా ఉంటోంది. వేసవిలో వచ్చే సంపాదిత సెలవుల (ఈఎల్స్) కోసం ఉపాధ్యాయులు పోటీ పడుతుంటారు. పరీక్షా కేంద్రాల్లో చూచిరాతలనూ ప్రోత్సహిస్తుంటారనే ఆరోపణలున్నాయి. ఒక్కొక్కరి నుంచి రూ.600 వసూలు నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన 17 పరీక్షా కేంద్రాలలో సింహభాగం కేంద్రాలు చూచిరాతలకు అడ్డాగా మారాయి. గతేడాది ఆర్మూర్ పట్టణంలోని ఓ పరీక్షా కేంద్రంలో ఒక్కో అభ్యర్థి నుంచి రూ.600 వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. గత సంవత్సర తప్పిదాలు పునరావృతం కాకుండా ఇటీవల అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మరి ఈసారైనా చూచిరాతలకు పుల్స్టాప్ పడుతుందా? అనేది వేచి చూడాల్సిందే. ఏర్పాట్లు పూర్తి చేశాం.. ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచే శాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 25 పరీక్షా కేంద్రాల్లో 4,600 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. డీఈవో ఆధ్వర్యంలో సీఎస్లు, డీవోలకు అవగాహన కల్పించాం. శనివారం ఇన్విజిలేటర్లకు అవగాహన కల్పిస్తారు. ప్రశ్నపత్రాలు సంబంధిత పోలీస్ స్టేషన్లకు చేర్చాం. ఈసారి ఈఎల్స్ ఇవ్వడం లేదు. కొందరు ఇన్విజిలేటర్లను కూడా మార్చాం. చూచిరాతలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం. – రవీందర్, జిల్లా కోఆర్డినేటర్, ఉమ్మడి నిజామాబాద్ రేపటి నుంచి ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు సమన్వయకర్తలు చెప్పిన వారికే సీఎస్, డీవో విధులు మూడేళ్లుగా అనుకూలమైన వారే ఇన్విజిలేటర్లు పైరవీలకు పెద్దపీట వేస్తున్న విద్యాశాఖాధికారులుఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు నిజామాబాద్ జిల్లాలో 17, కామారెడ్డి జిల్లాలో 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది సీఎస్, డీవోలు, ఇన్విజిలేటర్ల జాబితా పరీక్షలు ప్రారంభమయ్యేంత వరకు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ ఏడాది కూడా జాబితాను పబ్లిక్ డొమైన్లో ఇంకా పెట్టలేదు. గత మూడేళ్లుగా జిల్లాలో ప్రధానంగా ఆర్మూర్ డివిజన్లోని పరీక్షా కేంద్రాల్లో పాత వారినే సీఎస్, డీవోలుగా నియమిస్తున్నారు. ఈ సెంటర్లకు సంబంధించి వేల్పూర్, జక్రాన్పల్లి, ఆర్మూర్, భీంగల్కు చెందిన దాదాపు 10 మంది ఉపాధ్యాయులు ఐదేళ్లుగా డ్యూటీలు చేస్తున్నారు. ఇందులో ఒక ప్రధాన ఉపాధ్యాయ సంఘానికి చెందిన డివిజన్ నాయకుడు చక్రం తిప్పుతున్నాడనేది బహిరంగ రహస్యంగా చెప్పవచ్చు. అలాగే ప్రతి కేంద్రంలో అవసరానికి మించి ఎక్కువ మందికి డ్యూటీలు వేయడంతో వారిలో చాలా మంది కేంద్రాలకు రాకుండానే డ్యూటీ సర్టిఫికెట్లు పొందుతూ సంపాదిత సెలవులు పొందుతున్నారు. గత మూడేళ్లుగా పై నాలుగు మండలాల ఎంఈవోలు తీసిన ఉత్తర్వు కాపీలను విద్యాశాఖ ఉన్నతాధికారులు పరిశీలిస్తే అవకతవకలు బయటపడుతాయని ఉపాధ్యాయవర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్మూర్ పట్టణంలోని బాలికల పాఠశాలలో గతేడాది 13 మంది ఇన్విజిలేటర్లకు డ్యూటీ వేయగా అందులో 10 మందికి గత మూడేళ్లుగా సెంటర్లు మారుస్తూ డ్యూటీ వేస్తున్నారు. జిల్లాలో చాలా కేంద్రాల్లో పాత వారికే డ్యూటీలు వేస్తూ చూచిరాతలు నడిపిస్తున్నట్లు సమాచారం. -
సోనియా, రాహుల్పై తప్పుడు కేసులు
బాన్సువాడ : కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై తప్పుడు కేసులు పెట్టాయని ఆగ్రో ఇండస్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్ అన్నారు. గురువారం బాన్సువాడ అంబేడ్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సంద ర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీజేపీ కక్ష కట్టి కేసులు పెట్టిస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జంగం గంగాధర్, ఖలేక్, గురువినయ్, మధుసూదన్రెడ్డి, కృష్ణరెడ్డి, నార్ల సురేష్, ఎజాస్, అలిబిన్అబ్దుల్లా, అజీం, సాయిబాబా, నర్సగొండ, ఉప్పరి లింగం, గడుమల లింగం, ఉదయ్, నర్సింలు, వాహాబ్, గంగుల గంగారం, కనుకుట్ల రాజు, కిరణ్ తదితరులున్నారు. పీఎం దిష్టిబొమ్మ దహనం సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని నంది విగ్రహం వద్ద పీఎం నరేంద్ర మోదీ దిష్టి బొమ్మను కాంగ్రెస్ ఆధ్వర్యంలో దహనం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రధానమంత్రి దిష్టి బొమ్మను దహనం చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సంగారెడ్డి, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు లింగాగౌడ్, సీడీసీ చైర్మన్ ఇర్షా దొద్దిన్, మండల నాయకులు పాల్గొన్నారు. పగిలిన మిషన్ భగీరథ పైపునిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్నగర్ మండల కేంద్రంలో గురువారం వేకువజామున మిషన్ భగీరథ పైపు పగలడంతో బస్టాండ్ ప్రాంతంతోపాటు ప్రధాన రహదారి జలమయమైంది. రెండు గంటల పాటు నీరు రోడ్డుపై ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. భగీరథ పైపు పగిలిన విషయాన్ని తెలుసుకున్న ఏఈ రాజశేఖర్రెడ్డి సిబ్బందిని అప్రమత్తం చేసి నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేయించారు. అనంతరం పైప్లైన్కు మరమ్మతులు చేయించి సరఫరాను పునరుద్ధరించారు. -
ధాన్యం తూకం త్వరగా ప్రారంభించాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): ధాన్యం తూకం త్వరగా ప్రా రంభించాలని కొనుగోలు కేంద్రాల జిల్లా మానిటరింగ్ అధికారి రాధిక సూచించారు. గురువారం ఆ మె మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రై తులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి 10 రోజులు దాటిపోతున్నందున వెంటనే తూకం ప్రా రంభించాలని సొసైటీ సీఈవో పెంటయ్యకు సూ చించారు. అంతకు ముందు రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ కొనుగోలు కేందంలో ధాన్యం తేమశాతా న్ని పరిశీలించారు.అకాల వర్షాల కారణంగా రైతు లు నష్టపోకుండా వెంటనే తూకం ప్రారంభించాల ని సొసైటీ సిబ్బందిని ఆదేశించారు. తూకం వేయడానికి హమాలీల కొరత ఉందని సీఈవో పెంట య్య ఆయన దృష్టికి తెచ్చారు. తొందరగా హమాలీలను ఏర్పాటు చేసుకొని సోమవారం లోపు తూకం ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి నస్రుల్లాబాద్(బాన్సువాడ): కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించాలని డీఆర్డీవో సురేందర్ అన్నారు. గురువారం మండలంలో అంకోల్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. వాతావరణం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తూకం చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపించాలన్నారు. ఐకేపీ ఏపీఎం గంగాధర్, రైతులు ఉన్నారు. -
కృత్రిమమేధ ద్వారా సమాజంపై ప్రతికూల ప్రభావం
తెయూ(డిచ్పల్లి): కృత్రిమమేధ ద్వారా సమాజంపై అనుకూలత కంటే ప్రతికూల ప్రభావం పడుతోందని తెలంగాణ యూనివర్సిటీ మాస్ కమ్యూనికేషన్ అధ్యాపకుడు, సోషల్సైన్స్ డీన్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ అన్నారు. పీస్ జర్నలిజం స్టడీస్ అంశంపై సౌత్కొరియా దేశ రాజధాని సియోల్లో హెచ్డబ్ల్యూపీఎల్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన అంతర్జాతీయ వర్క్షాప్లో ఆయన ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరై జూమ్ ద్వారా ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమమేధ ద్వారా సృష్టించిన వీడియోలు వైరల్ కావడం వల్ల కొన్ని సందర్భాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా తయారయ్యాయన్నారు. వాటి విశ్వసనీయతపై అనుమానాలు రేకెత్తుతున్నాయన్నారు. సమాజాన్ని అశాంతికి గురిచేసే అంశాలపై నియంత్రణకు ప్రత్యేక మెకానిజం అవసరమన్నారు. పౌరుల హక్కుల రక్షణకు, వ్యక్తిగత గోప్యతకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన విధంగా చట్టాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో వివిధ దేశాల నుంచి వందకుపైగా ప్రతినిధులు హాజరయ్యారు. తెయూ మాస్ కమ్యూనికేషన్ ప్రొఫెసర్, సోషల్సైన్స్ డీన్ ఘంటా చంద్రశేఖర్ -
తిమ్మాపూర్లో చోరీకి యత్నం
దుండగుడిని పట్టుకున్న గ్రామస్తులు గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలోగల ఓ ఇంట్లో ఇద్దరు దుండగులు చోరీకి యత్నించగా, ఓ దుండగుడిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు ఇలా.. బిచ్కుందకు చెందిన ఇద్దరు యువకులు కడమంచి రమేష్, శ్రీకాంత్ గురువారం ఉదయం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన భాస్కర్రెడ్డి పాత ఇంటిలో ఉంచిన ట్రాక్టర్కు సంబంధించిన పాత ఇనుప సామాన్లను చోరీ చేసేందుకు యత్నించారు. వెంటనే ఇంటి యజమాని వారిని గుర్తించి కేకలు వేశారు. గ్రామస్తులు ఇంటి వద్దకు వచ్చి నిందితులను పట్టుకునేందుకు యత్నించగా ఒకరు పారిపోగా రమేష్ గ్రామస్తులకు చిక్కాడు. గ్రామస్తులు వివరాలు సేకరించి అతడిని పోలీసులకు అప్పగించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
కల్తీ కల్లుకు దూరంగా ఉండాలి
కామారెడ్డి క్రైం: కల్తీ కల్లు కు దూరంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కల్తీ కల్లు సేవించడం ద్వారా కలిగే ఆరోగ్య సమస్యలు, దుష్ప్రభావాలపై ప్రజలను అప్రమత్తం చేయడానికి ఈ నెల 19 నుంచి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గురువారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో ఇందుకు సంబంధించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 7, 8 తేదీల్లో బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల పరిధి లోని దుర్కి, దామరాంచ, అంకోల్, రాంపూర్, సంగెం, గాంధారి మండలం లోని గౌరారం గ్రామాల్లో కల్తీ కల్లు బారిన పడి ఎంతో మంది ఆస్పత్రుల పాలైన సంఘటనలను గుర్తు చేశారు. కల్తీ కల్లు కారణంగా ఆయా గ్రామాలకు చెందిన 80 మందికి పైగా అస్వస్థతకు గురై బాన్సువాడ, కామారెడ్డి, నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల పాలయ్యారన్నారు. ఈ వ్యవహారంలో కల్తీ కల్లు విక్రయించిన నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. కల్తీ కల్లు సేవిస్తే కలిగే అనర్ధాలు, దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యకు పరిష్కారం చూపే విధంగా ఈ వ్యసనం నుంచి బయట పడేలా ఆయా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందని గుర్తించామన్నారు. కల్తీ కల్లు ఘటనలు వెలుగు చూసిన ఆయా గ్రామాల్లో ఓ మెడికల్ ఆఫీసర్, ఎస్హెచ్వో, ఎకై ్సజ్ అధికారి, రెవెన్యూ, జీపీ అధికారులు బృందంగా 19 న పర్యటించి అవగాహన కార్యక్రమాలు చేపడతారని వెల్లడించారు. ఈ అవగాహన కార్యక్రమాల్లో పౌర సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆశ వర్కర్లు, పోలీస్ సిబ్బంది, స్వయం సహాయక సంఘాలు, గ్రామ సమాఖ్య, మండల సమైఖ్య లను భాగస్వామ్యం చేయాలన్నారు. ఆయా గ్రామాల్లోని ముఖ్యమైన ప్రదేశాల్లో అవగాహన పోస్టర్లను అతికించాలన్నారు. విద్యార్థులు మరియు స్థానిక సంఘాలతో ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన ఈ నెల 19 నుంచి గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
వ్యవసాయ విశ్వవిద్యాలయం సలహా కమిటీ సభ్యుడిగా కోటపాటి
ఆర్మూర్: పట్ట ణానికి చెందిన ఉద్యమ నాయకుడు కోటపాటి నర్సింహం నా యుడును ప్రొఫె సర్ జయశంకర్ వ్యవసాయ వి శ్వవిద్యాలయం విస్తరణ, సలహా కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచన మేరకు వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతినిధులు ఆయనను సలహా కమిటీలోకి తీసుకున్నారు. ఈసందర్భంగా హైదరాబాద్లోని యూనివర్సిటీ ప్రాంగణంలో వీసీ అల్డాస్ జానయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రతినిధులు ఆయనను అభినందించారు. ఈ హోదా రెండేళ్ల కాలం కొనసాగుతుందని వివరించారు. -
ఆడవాళ్ల ఆత్మగౌరవం పట్టదా?
బిచ్కుంద(జుక్కల్): మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న అధికారులు వారి ఆత్మగౌరవాన్ని కాపాడే చర్యలను పట్టించుకోవడం లేదు. బిచ్కుంద బస్టాండ్లోని మరుగుదొడ్ల తలుపులు పూర్తిగా విరిగిపోయినా పట్టించుకోకపోవడమే ఇందుకు నిదర్శనం. మరుగుదొడ్లకు తలుపులు లేకపోవడంతో మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే ఒకరు బయట నిల్చుని చున్నీ లేదా చీర కొంగు అడ్డుగా పెట్టి నిల్చోవాల్సిన పరిస్థితి ఉంది. బిచ్కుంద బస్టాండ్ నుంచి ప్రతిరోజూ దెగ్లూర్, జుక్కల్, మద్నూర్, బిచ్కుంద, పిట్లం, బీదర్, ఔరాద్ ప్రాంతాలకు చెందిన వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. బస్టాండ్లోని స్టాల్స్ ద్వారా ప్రతి నెలా ఆర్టీసీకి లక్షల్లో ఆదాయం సమకూరుతున్నా కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్ల కాంట్రాక్టర్ తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై బాన్సువాడ డిపో మేనేజర్ సరితాదేవిని వివరణ కోరగా.. మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత కాంట్రాక్టర్పై ఉంది. బాధ్యులపై చర్యలు తీసుకొని మరమ్మతులు చేయిస్తామన్నారు. అపరిశుభ్రంగా ఉన్న మూత్రశాలలు -
అక్రమ నియామకాలను రద్దు చేయాలని డీఎంఈకి వినతి
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి మెడికల్ కళాశాలలో అక్రమంగా అవుట్ సోర్కింగ్ నియామకాలను చేపట్టారని విద్యార్థి సంఘాల నాయకులు గురువారం డీఎంఈ డాక్టర్ నరేంద్రకుమార్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మ్యాన్ పవర్ ఏజెన్సీ సంస్థ నిర్వహకులు రూ. లక్షల్లో డబ్బులు వసూళ్లు చేసి ఉద్యోగాలు ఇచ్చారని వివరించారు. రూ. కోటి వరకు కుంభకోణం జరిగిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి లావాదేవీలు విచారణ చేస్తే అవినీతి గుట్టురట్టవుతుందని తెలిపారు. అర్హులైన నిరుద్యోగులకు అన్యాయం చేశారన్నారు. కళాశాల ప్రిన్సిపల్ హస్తం సైతం అక్రమ నియామకాల్లో ఉందని ఆరోపించారు. డీఎంఈకి వివరాలతో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్ఎఫ్ఐ, గిరిజన విద్యార్థి సంఘాల జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు, ముదాం అరుణ్, వినోద్, బీవీఎం రాష్ట్ర కార్యదర్శి జీవిఎం. విఠల్, నాయకులు బుల్లెట్, అరవింద్, రవి, సంజయ్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
నీటి సమస్య లేకుండా చర్యలు
● ఆర్డీఎంఏ షాహీద్ మసూద్ ● మున్సిపల్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ కామారెడ్డి టౌన్: పట్టణ ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నట్లు రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్(ఆర్డీఎంఏ) షాహీద్ మసూద్ తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో రెండు రోజులకోసారి పుష్కలంగా కుళాయిల ద్వారా నీటి సరఫరా అవుతోందని, కొన్ని కాలనీల్లో మాత్రం కొంచెం ఇబ్బందులు ఉన్నాయన్నారు. నీటి ఎద్దడి ఉన్న కాలనీలకు ప్రస్తుతం 10 ట్యాంకర్ల ద్వారా నీటిని చేస్తున్నారన్నారు. భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో ఆయా కాలనీల్లో నీరు రావడం లేదన్నారు. తీవ్ర నీటిఎద్దడి ఉన్న కాలనీల్లో నీటి సరఫరాపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అభివృద్ధి అంశాలు, సమస్యలపై అధికారులతో సమీక్షించారు. మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి, డీఈ వేణుగోపాల్, ఆర్వో రవిగోపాల్, ఏఈ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి
మాచారెడ్డి : అర్హులను ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో ఎంపిక చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మాచారెడ్డి, పాల్వంచ మండల కేంద్రాల్లో గురువారం ఆయా మండలాల పంచాయతీ కార్యదర్శులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు పేద కుటుంబాలను ఎంపిక చేసే విధంగా ఇందిరమ్మ కమిటీ సభ్యులు చొరవ తీసుకోవాలన్నారు. అర్హుల జాబితాలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఎంపిక ప్రక్రియ జరగాలన్నారు. గ్రామ పంచాయతీల వారీగా సర్వే నిర్వహించి జాబితా తయారు చేయాలన్నారు. అనంతరం మాచారెడ్డిలో కొనసాగుతున్న మోడల్ ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. ఆయన వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్నాయక్, మండల ప్రత్యేకాధికారి సురేశ్, జిల్లా పంచాయతీ అధికారి మురళి, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. -
భూ భారతిలో మూడంచెల వ్యవస్థ
● చట్ట ప్రకారమే సమస్యల పరిష్కారం ● రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ ● లింగంపేట మండలంలో అందుబాటులోకి వచ్చిన పోర్టల్ ● గ్రామాల్లో దరఖాస్తులు స్వీకరించిన అధికారులులింగంపేట(ఎల్లారెడ్డి): దశాబ్దాలుగా పరిష్కారం కాని భూ సమస్యలను పరిష్కరించేందుకే భూ భా రతి పోర్టల్ను ప్రభుత్వం తీసుకొచ్చిందని రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ అన్నారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా భూభారతి పోర్టల్ను నాలుగు మండలాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురాగా, అందులో లింగంపేట మండలం ఒకటి. కాగా, మండలంలోని పోతాయిపల్లిలో గురువారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో అదనపు కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. బోనాల్ గ్రామంలో నిర్వహించిన సదస్సులో ఆర్డీవో మన్నె ప్రభాకర్ పాల్గొని రైతుల సందేహాలను నివృత్తి చేసి భూ భారతి పోర్టల్పై అవగాహన కల్పించారు. పోతాయిపల్లిలో అదనపు కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ.. భూ భారతిలో రాష్ట్ర ప్రభుత్వం మూడంచెల వ్యవస్థను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తులను పరిశీలించి చిన్నచిన్న సమస్యలను ఏడు రోజుల్లో పరిష్కరిస్తామని, ఏడు రోజుల్లో సమస్య పరిష్కారం కానిపక్షంలో మొదటి అప్పీలు ఆర్డీవోకు చేసుకోవచ్చని, 30 రోజుల్లో పరిష్కారం కానిపక్షంలో ట్రిబ్యునల్కు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. గతంలో పౌతి, ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల వివాదాల పరిష్కా రం కోసం కోర్టుకు వెళ్లేవారని, ప్రస్తుతం భూ భారతి పోర్టల్ ద్వారా వాటిని పరిష్కరించుకునే అవకాశం ఏర్పడిందన్నారు. రెవెన్యూ, అటవీశాఖ భూముల వివాదాలకు రెండు శాఖల అధికారులు సంయుక్తంగా సర్వే చేసి పరిష్కారం సూచిస్తారన్నారు. భూభారతి లింగంపేట మండలంలో పైలట్ ప్రాజెక్టుగా అందుబాటులోకి రావడం రైతుల అదృష్టంగా భావించాలన్నారు. భూ సమస్యలు సత్వరమే పరిష్కారమవుతాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోతాయిపల్లిలో 260, బోనాల్లో 47 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. సదస్సులో తహసీల్దార్ సురేశ్, డిప్యూటీ తహసీల్దార్ రాందాస్, ఎఫ్ఆర్వో ఓంకార్, మొబైల్పార్టీ ఎఫ్ఆర్వో చరణ్తేజ్, నారాగౌడ్, రాజు, లక్ష్మీనారాయణ, బా లయ్య, రామలింగం, అల్లూరి, గంగారాం, ఆయా గ్రామాల రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.అధికారుల దృష్టికి రైతులు తీసుకొచ్చిన సమస్యలు.. దశాబ్దాలుగా తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను పోతాయిపల్లి రెవెన్యూ పరిధిలోని కోమట్పల్లి, కేశాయిపేట, అన్నారెడ్డిపల్లి, సురాయిపల్లితోపాటు తండాలకు చెందిన రైతులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. రెవెన్యూ, అటవీశాఖ మధ్య వివాదం కారణంగా 62 సర్వే నంబరులోని 80 మంది రైతులకు సంబంధించి 183 ఎకరాల సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. 830 సర్వే నంబరులోని 400కుపైగా ఎకరాల భూమి పట్టాలను 200 మంది రైతులకు ఇవ్వగా, అందులో ప్రభుత్వ భూమి అని నమోదైంది. 543 సర్వే నంబరులో 300 ఎకరాలు ప్రభుత్వ భూమి అని చూయిస్తోంది. 367 సర్వే నంబరులోని 300 ఎకరాల్లో పోతాయిపల్లి రైతులు దశాబ్దాలుగా కాస్తులో ఉన్నారు. ఆన్లైన్లో ప్రభుత్వ భూమిగా నమోదైంది. పోతాయిపల్లి, బోనాల్ రెవెన్యూ పరిధిలోని గ్రామాల్లో పలువురు రైతులకు చెందిన భూముల సర్వే నంబర్లు తప్పుగా పడడం, సాదాబైనామాలు, కోర్టు కేసులకు సంబంధించినవి, ఒకరి సర్వే నంబరు మరొకరికి రావడం, సాగులో ఉన్న భూమి ఆన్లైన్లో పూర్తిగా నమోదు కాకపోవడం తదితర సమస్యలు ఉన్నాయి. -
భూ సమస్యల పరిష్కారానికే కొత్త పోర్టల్
మాచారెడ్డి : ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం భూ భారతిని తీసుకొచ్చిందని, దీనిపై అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. పాల్వంచ, మాచారెడ్డి మండలాల రైతు వేదికల్లో భూ భారతి చట్టంపై గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భ కలెక్టర్ మాట్లాడుతూ.. రోజూ రెండు మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని, హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణ, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసేందుకు భూముల సర్వే, పెండింగ్ సాదాబైనా మా దరఖాస్తులను పరిశీలించనున్నట్లు తెలిపా రు. 2014 జూన్ 2కు ముందు గ్రామీణ ప్రాంతాల్లో సాదాబైనామా ద్వారా వ్యవసాయ భూమి కొను గోలు చేసి గడిచిన పన్నెండేళ్లుగా అనుభవంలో ఉంటున్న వారికి క్రమబద్ధీకరణ చేయనున్నట్టు పేర్కొన్నారు. 2020 ఏడాదిలో అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10వ తేదీ మధ్య కాలంలో క్రమబద్ధీకరణ కోసం అందిన రైతుల దరఖాస్తులపై ఆర్డీవోలు విచారణ చేపడతారని తెలిపారు. అర్హుల నుంచి ప్రస్తుత రిజిస్ట్రేషన్ చార్జి వసూలు చేసి సర్టిఫికెట్లు జారీ చేసి, రికార్డుల్లో నమోదైన తరువాత పట్టాపాస్ పుస్తకాలు అందజేస్తారని వెల్లడించారు. తహసీల్దార్ చేసిన మ్యుటేషన్లపై జారీ చేసిన పాస్ పుస్తకాలపై అభ్యంతరాలు ఉంటే ఆర్డీవోకు అప్పీల్ చేసుకోవచ్చని, ఆర్డీవో ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం ఉంటే కలెక్టర్కు, కలెక్టర్ ఇచ్చిన తీర్పుపై అభ్యంతం ఉంటే భూమి ట్రిబ్యునల్లో అప్పీల్ చేసుకోవచ్చన్నారు. భూధార్ కార్డుల జారీతో రైతులకు ఉచిత న్యాయ సహాయం అందుతుందన్నారు. కామారెడ్డి ఆర్డీవో వీణ మాట్లాడుతూ.. భూ పట్టాల మార్పు లు, చేర్పుల కోసం తహసీల్దార్లు, ఆర్డీవోలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సాదాబైనామాలు, వారసత్వంగా వచ్చిన భూములపై ముప్పై రోజుల్లో విచారణ చేయడం జరుగుతుందన్నారు. గడువులోగా విచారణ చేయని పక్షంలో రిజిస్ట్రేషన్ అయినట్టుగా భావించొచ్చని స్పష్టం చేశారు. రైతులు భూభారతిపై అవగాహన పెంచుకొని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తహసీల్దార్లు హిమబిందు, శ్వేత, ప్రత్యేక అధికారులు శ్రీపతి, సురేశ్, ఎంపీడీవోలు శ్రీనివాస్, గోపిబాబు తదితరులు పాల్గొన్నారు. రైతులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు సదస్సులు 2014 జూన్ 2కు ముందు సాదాబైనామాల క్రమబద్ధీకరణ అవగాహన సదస్సులో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్డబ్బులు అడుగుతుండ్రు.. తాతల నాటి భూమి రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాలకు వెళితే డబ్బులు ఇవ్వనిదే పనులు చేయడం లేదు. ప్రభుత్వమే హక్కు పత్రాలు ఇచ్చిన భూములను రిజిస్ట్రేషన్ చేయాలని వెళితే అవమానిస్తున్నారు. చట్ట ప్రకారం ఇచ్చిన హక్కు పత్రాలు దేనికీ పనికిరాకుండా పోతున్నాయి. ఇప్పటిౖకైనా భూ భారతి చట్టం ద్వారా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. – అంజయ్య, రైతు, సింగరాయపల్లి -
దళారులను నమ్మి మోసపోవద్దు
పిట్లం(జుక్కల్): దళారులను నమ్మి మోసపోవద్దని, పంట దిగుబడులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని జుక్కల్ ఎమ్మె ల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. సహకార సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం జొన్నలకు క్వింటాల్కు రూ.3,371 గిట్టుబాటు ధర కల్పించిందని తెలిపారు. కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ శపథంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ చీకోటి మనోజ్కుమార్, డైరెక్టర్లు, నాయకులు, సహకార సంఘం కార్యదర్శి సంతోష్రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలికామారెడ్డి టౌన్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ నరేంద్రకుమా ర్ వైద్యులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని గురువారం ఆయన సందర్శించా రు. మెడికల్ కళాశాలలోని ఆయా విభాగాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం జీజీహెచ్ను సందర్శించారు. రోగులతో ఆయన మాట్లాడగా నీటి సమస్య ఉందని వారు తెలిపారు. ఆపరేషన్ థియే టర్, ప్రసూతి, మహిళ, పురుషుల వార్డులు, మెడికల్ డ్రగ్స్స్టోర్, ల్యాబ్, డయాలసిస్, ఐసీయూ విభాగాలను సందర్శించారు. అనంతరం సూపరింటెండెంట్ చాంబర్లో వైద్యాధికారులతో సమీక్షించారు. ఆస్పత్రిలో సిటీ స్కాన్, ఎంఆర్ఐ సేవలు అందుబాటులో లేవని సూపరింటెండెంట్ షరీదా డీఎంఈకి వివరించారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ శివప్రసాద్, ఆర్ఎంవో రవీందర్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.వృద్ధులకు చట్టాలపై అవగాహనకామారెడ్డి టౌన్: పట్టణ శివారులోని వృద్ధాశ్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి టి నాగరాణి గురువారం సందర్శించారు. న్యాయచైతన్య సదస్సు ఏర్పాటు చేసి వృద్ధులకు చట్టాలపై అవగాహన కల్పించారు. వారితో ఆప్యాయంగా మాట్లాడి పెన్షన్, అక్కడ కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఆయూష్ వి భాగం ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పా టు చేసి వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యులు మల్లిక, దేవయ్య, శ్రీకాంత్, ఫార్మాసిస్ట్లు రాజ్యలక్ష్మి, పద్మ, కిశోర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలిమద్నూర్(జుక్కల్): గర్భిణులు నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల అన్నారు. మండల కేంద్రంలోని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన పోషణ్ పక్వాడా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గర్భిణులకు సామూహిక సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన చేశారు. కార్యక్రమంలో సీడీపీవో కళావతి, ఎంపీడీవో రాణి, ఏఐఐ ఎంఎస్ జిల్లా కో ఆర్డినేటర్ మోహన్, పోషణ్ అభియాన్ జిల్లా కో ఆర్డినేటర్ ప్రియాంక, బాలకృష్ణ, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
భూ సమస్యల పరిష్కారానికి చర్యలు
కామారెడ్డి క్రైం: భూ భారతి పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికై లింగంపేట్ మండలంలో గురువారం నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఇందులో భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. బుధవారం కలెక్టరేట్లో రెవెన్యూ, అటవీ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సదస్సులలో భూ సమస్యలను పరిష్కరించేందుకు గాను ప్రజల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సంయుక్తంగా సర్వే చేసి, అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అంతకు ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భూ భారతి విధి విధానాలను కలెక్టర్ వివరించారు. సమావేశంలో డీఎఫ్వో నిఖిత, రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నె ప్రభాకర్, అటవీ అభివృద్ధి అధికారి రామకృష్ణ, లింగంపేట్ తహసీల్దార్ సురేష్, ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. లింగంపేట మండలంలో.. లింగంపేట: మండలంలో గురువారం నుంచి భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నె ప్రభాకర్ తెలిపారు. భూభారతి కోసం లింగంపేట మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత అన్ని గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ను ఆర్డీవో ప్రకటించారు. 17న పోతాయిపల్లి, బోనాల్ గ్రామాలలో సదస్సు లు నిర్వహించనున్నారు. 19న బాయంపల్లి, కన్నాపూర్, 21న పర్మళ్ల, పొల్కంపేట, 22న ఎల్లారం, మెంగారం, 23న రాంపూర్, జల్దిపల్లి, 24న బాణాపూర్, కొర్పోల్, లింగంపల్లి(ఖుర్దు), 25న భవానీపేట, లింగంపేట, ముంబోజీపేట, 26న కంచుమల్, కొండాపూర్, 28న నల్లమడుగు, నాగారం, శెట్పల్లి సంగారెడ్డి, 30న శెట్పల్లి, మోతె గ్రామాల్లో సదస్సులు ఉంటాయి. రైతులు తమ భూసమస్యలను రెవెన్యూ సదస్సుల్లో అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆర్డీవో సూచించారు. నేటినుంచి అవగాహన సదస్సులు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
చికిత్స పొందుతూ ఒకరి మృతి
పెద్దకొడప్గల్: బైక్పై నుంచి పడి తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పెద్దకొడప్గల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన ఆర్ఎంపీ పండరి ఈ నెల 10న అంజని గ్రామంలో నిర్వహిస్తున్న అఖండ హరినామ సప్తాహం కార్యక్రమంలో పాల్గొనేందుకు బైక్పై వెళ్తున్నాడు. రోడ్డుపై ధాన్యం కుప్పలు ఉండడాన్ని గమనించని అతను వాటిపై ప్రయాణించడంతో కిందపడిపోయాడు. తలకు తీవ్రమైన గాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. తాడ్కోల్లో మరో వ్యక్తి..బాన్సువాడ రూరల్: ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ అశోక్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. బాన్సువాడ మండలం తాడ్కోల్కు చెందిన కుర్మసాయిలు (51) గ్రామంలో పనులు చేస్తూ జీవిస్తున్నాడు. కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 9న కుమార్తె వివాహం విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆర్థిక ఇబ్బందులతో సాయిలు ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు నిజామాబాద్కు తరలించిగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి భార్య గంగామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్త్నుట్లు సీఐ పేర్కొన్నారు. -
కరెంట్పోతే గొంతెండుడే!
ఎల్లారెడ్డి: జిల్లాలో హ్యాండ్ బోర్లు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. మరమ్మతలు చేయించకపోవడంతో కాలగర్భంలో కలిసిపోతున్నాయి. దీంతో విద్యుత్ సరఫరా లేకపోతే గుక్కెడు నీళ్ల కోసం విలవిలలాడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. జిల్లాలో గతంలో 254 హ్యాండ్ బోర్లు ఉండేవి. వాటిలో 80 పూడుకుపోగా 174 హ్యాండ్ బోర్లు పనిచేస్తున్నాయని అధికారులు కాకి లెక్కలు చెబుతున్నారు. కానీ ఎక్కడా పనిచేస్తున్న దాఖలాలు లేవు. చిన్నచిన్న మరమ్మతులతో పనిచేసే అవకాశాలున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 52.. ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో 12 హ్యాండ్ బోర్లు పనిచేస్తున్నట్లు మిషన్ భగీరథ అధికారులు చెబుతున్నారు. అయితే వాస్తవానికి వీటిలో రెండు మూడు కూడా పనిచేయడం లేదు. వెల్లుట్ల గ్రామపంచాయతీ పరిధిలో 5 హ్యాండ్ బోర్లు పనిచేస్తున్నాయని అధికారులు అంటున్నా గ్రామ పాఠశాలలోని చేతి పంపు తప్ప మరేదీ పనిచేయడం లేదని స్థానికులు అంటున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని 9, 10 వార్డుల్లో నీటి సామర్థ్యం ఉన్న హ్యాండ్బోర్లు చెడిపోయి నెలలు కావస్తున్నా అధికారులు మరమ్మతులు చేయించడం లేదు. గతేడాది ఆగస్టు 20 న ఎల్లారెడ్డిలోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో రాత్రి బస చేసిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ దృష్టికి చేతిపంపుల మరమ్మతుల విషయం తీసుకెళ్లగా ఆయన తక్షణం ప్రైవేట్ మెకానిక్లతో బోర్లు రిపేర్లు చేయించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఏడు నెలలు గడిచినా ఇప్పటికీ మరమ్మతులు చేయించలేదు.సింగిల్ ఫేజ్ మోటార్లను బిగించడంతో.. కొన్నిచోట్ల హ్యాండ్బోర్లను తొలగించి, సింగిల్ ఫేజ్ మోటార్లను బిగించారు. ఇలా చేయడంవల్ల ఎక్కువ నీరు వృథా అవుతోంది. ఒక్క బిందె నీరు అవసరమైనా స్థానికులు మోటార్ ఆన్ చేసి వదిలేస్తుండడంతో ఆ మోటార్ పరిధి కింద ఉండే అన్ని కుళాయిల నుంచి నీరు వృథాగా మురుగు కాలువల్లో కలుస్తోంది. దీంతో భూగర్భ జలాలు తగ్గి బోర్లు ఎత్తిపోతున్నాయి. మోటార్లు బిగించకుండా ఉండిఉంటే చేతిపంపులు చక్కగా పనిచేసేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చేతి పంపులకు రిపేర్లు చేయించి వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. హ్యాండ్ బోర్లకు రిపేర్లు కరువు పట్టించుకోని బల్దియా అధికారులు కలెక్టర్ ఆదేశాలూ బేఖాతరుమరమ్మతులు చేయిస్తాం ఎల్లారెడ్డి పట్టణంలో చెడిపోయిన బోర్ల వివరాలు సేకరిస్తున్నాం. త్వరలో ప్రైవేట్ మెకానిక్లతో వాటికి మరమ్మతులు చేయిస్తాం. హ్యాండ్ బోర్ల చుట్టూ 100 మీటర్ల దూరం వరకు ప్రైవేట్ బోర్లు వేయడం నిషిద్ధం. ఎవరైనా బోర్లు వేస్తుంటే సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం. – మహేశ్ కుమార్, ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ -
చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలింపు
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని నాగ్లూర్ చెరువు నుంచి కొందరు నాయకులు అక్రమంగా నల్ల మట్టిని తరలిస్తున్నారని నాగ్లూర్ గ్రామస్తులు అన్నారు. మట్టి తరలింపును వెంటనే నిలిపివేయాలని కోరుతూ బుధవారం తహసీల్దార్ రేణుక చౌహాన్కు వినతి పత్రం ఇచ్చారు. ఈవిషయమై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, అలాగే చెరువు కట్టపై ఉన్న దారిని ఆక్రమించారని వారు ఆరోపించారు. ఇరిగేషన్ ఏఈ వంశీ నిర్లక్ష్యంతో మట్టిని తరలిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి చెరువులో నుంచి మట్టిని తరలించకుండా చర్యలు తీసుకుంటామని ఏఈ వంశి గ్రామస్తులకు హామీ పత్రం రాసి ఇచ్చారు. చెరువు ను సర్వే చేయించి హద్దులు నిర్ణయిస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. వీలైనంత తొందరగా సర్వే చేయించి చెరువు విస్తీర్ణం నిర్ణయించాలని గ్రామస్తులు కోరారు. నిలిపివేయాలని తహసీల్దార్కు నాగ్లూర్ గ్రామస్తుల వినతి నిలిపివేస్తామని హామీ పత్రం ఇచ్చిన ఇరిగేషన్ ఏఈ వంశి -
ఉద్యానవన పంటలతో రైతులకు లాభాలు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఉపాధిహామీ పథకంలో ఉద్యానవన పంటలను పెంచుకునే అవకాశముందని, ఉద్యానవన పంటలు రైతులకు ఎంతో లాభదాయకమని డీఆర్డీవో సురేందర్ అన్నారు. ఆయన బుధవారం తాడ్వాయి శివారులో ఉద్యానవన పంటలో భాగంగా వేసిన మునగ పంట పెంపకంను పరిశీలించారు. మొక్కల పెంకం, మునక్కాయల దిగుబడిని రైతును అడిగి తెలుసుకున్నారు. ఎకరానికి సుమారు వేయి మొక్కల చొప్పున రెండు ఎకరాలలో రెండువేల మొక్కలను నాటామని, క్వింటాల్ మునగ కాయకు మార్కెట్లో రూ. 2వేలు వస్తాయని రైతు సమధానం ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 400ఎకరాలలో ఉద్యానవన పంటలను పెంచుకునేందుకు అవకాశముందని, ఆసక్తిగల రైతులు ముందుకు రావాలన్నారు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి పొందే అవకాశముందని తెలిపారు. అనంతరం మండలపరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డు అసిస్టెంటులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి గ్రామంలో కూలీల సంఖ్యను పెంచాలని, కూలీరేటు రూ.307వచ్చేలా చూడాలన్నారు. పండ్ల తోటల పెంపకం నిమిత్తం ప్రతిగ్రామం నుంచి ఒకరి నుంచి ఐదుగురి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సయ్యద్ సాజీద్అలీ, ఎంపీవో సవితారెడ్డి, ఏపీవో కృష్ణగౌడ్, టెక్నికల్ అసిస్టెంట్లు స్వామి, మహిపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి డీఆర్డీవో సురేందర్ -
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రధాని దిష్టి బొమ్మ దహనం
కామారెడ్డి టౌన్ : నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంఽధీలపై కేంద్ర ప్రభుత్వం అనుచితమైన కేసులు నమోదు చేశాయని ఆరోపిస్తూ బుధవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రజా సమస్యల పైన మోడీని నిలదీస్తున్నందున కక్ష పూరితంగా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్, యువజన అధ్యక్షుడు శ్రీనివాస్, ఓబీసీ సెల్ చైర్మన్ శ్రీనివాస్, నాయకులు రాజాగౌడ్, బ్రహ్మానందరెడ్డి, పంపర లక్ష్మణ్, చాట్ల రాజేశ్వర్, శివకుమార్,నర్సింలు, అంజాద్, బట్టు మోహన్, తేజపు ప్రసాద్,ఎల్.గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
‘బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’
కామారెడ్డి క్రైం: రిసెప్షన్ విధులు నిర్వహించేవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం రిసెప్షన్ వర్టికల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పీఎస్లకు వచ్చే ఫిర్యాదును తక్షణమే నమోదు చేయాలన్నారు. దానికి వెంటనే రశీదు ఇవ్వాలన్నారు. ఈ ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. 19న మామిడి చెట్ల కాత వేలం నాగిరెడ్డిపేట: మాల్తుమ్మెద ఉద్యానక్షేత్రంలో 20 ఎకరాలలో గల మామిడి చెట్ల కాతను ఈనెల 19న వేలం వేయనున్నట్లు ఉద్యాన క్షేత్ర అధికారి కమలాకర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలం పాటలో పాల్గొనేవారు ముందుగా వెయ్యి రూపాయల డిపాజిట్ చెల్లించాలని పేర్కొన్నారు. 19న ఉదయం 11 గంటలకు వేలం ప్రారంభమవుతుందని తెలిపారు. గాలికుంటు నివారణ టీకాలు వేయించాలి తాడ్వాయి/రాజంపేట: పశువులకు తప్పనిసరిగా గాలికుంటు నివారణ టీకా వేయించాలని జిల్లా పశు వైద్యాధికారి సంజయ్ కుమార్ సూచించారు. బుధవారం తాడ్వాయి మండలంలోని దేవాయిపల్లి, రాజంపేట మండల కేంద్రంలలో నిర్వహించిన పశువైద్య శిబిరాలలో పాల్గొన్నారు. పశువులకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 15 వరకు అన్ని గ్రామాలలో పశువైద్య శిబిరాలు నిర్వహించి టీకాలు వేస్తామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, మండల పశు వైద్యాధికారులు రమేశ్, అనిల్రెడ్డి, వీఎల్వో పోచయ్య, సిబ్బంది కొండల్రెడ్డి, ప్రేంసింగ్, రాజ వీరయ్య, రాజేశ్వర్, రమేశ్రెడ్డి, రైతులు పాల్గొన్నారు. జాబ్మేళాలను సద్వినియోగం చేసుకోవాలి బాన్సువాడ రూరల్: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో బుధవారం బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన జాబ్మేళాకు మంచి స్పందన లభించిందని ఇంటర్ కామారెడ్డి జిల్లా నోడల్ అధికారి షేక్ సలామ్ అన్నారు. న్యూ లాండ్ లాబరేటరీ ఆధ్వర్యంలో జాబ్మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 17న ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, 18న బిచ్కుంద ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్మేళా ఉంటాయన్నారు. ప్రిన్సిపల్ శివ, అధ్యాపకులు స్వరూప్, సమీ, జూనియర్ అసిస్టెంట్ అబ్దుల్ రజాఖ్, లైబ్రేరియన్ కార్తిక్, న్యూలాండ్ ల్యాబరేటరీ సంస్థ ప్రతినిధులు, కళాశాల అభివృద్ది కమిటి సభ్యులు, నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
23 వరకు డిగ్రీ ప్రాక్టికల్స్
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రాక్టికల్ / ప్రాజెక్టు పరీక్షలను ఈ నెల 16 నుంచి 23 వరకు నిర్వహించాలని కంట్రోలర్ ప్రొఫెసర్ కె సంపత్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీ పరిధిలోని అన్ని అనుబంధ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాళ్ల పర్యవేక్షణలో ప్రాక్టికల్స్/ ప్రాజెక్టు పరీక్షలు నిర్వహించి వెంటనే మార్కులను ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేయాల్సిందిగా కంట్రోలర్ తెలిపారు. పూర్తి వివరాలను తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. కామర్స్లో డాక్టరేట్ తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ కామర్స్ విభాగంలో పరిశోధక విద్యార్థిని కె రంజిత పీహెచ్డీ డాక్టరేట్ సాధించారు. తెయూ కామర్స్ అధ్యాపకులు, రిజిస్ట్రార్ యాదగిరి పర్యవేక్షణలో ‘అకౌంటింగ్ పాలసీస్ అండ్ ప్రాక్టీసెస్ ఇన్ మున్సిపల్ కార్పొరేషన్ – ఏ స్టడీ ఆఫ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్, తెలంగాణస్టేట్’ అనే అంశంపై రంజిత పరిశోధన పూర్తి చేసి సి ద్ధాంత గ్రంథం మంగళవారం సమర్పించారు. రంజిత గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నిజామాబాద్ లో కామర్స్ విభాగం అసిస్టెంట్ ప్రొ ఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. అనంతరం రంజితను వీసీ యాదగిరిరావు,రిజిస్ట్రార్ యాదగిరి ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో కామర్స్ డీన్ రాంబాబు, అధ్యాపకులు శ్రీనివాస్, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. పరిమితికి మించి ప్రయాణం చేయొద్దు ఖలీల్వాడి: ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణం చేపటొద్దని ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, సీఐ ప్రసాద్ ఆటో డ్రైవర్లకు సూచించారు. నగరంలోని ట్రాఫిక్ పీఎస్లో ఆటో డ్రైవర్లకు పలు అంశాలపై సూచనలు చేశారు. డ్రైవర్ సీటు పక్కన మరో సీటు పెట్టవద్దని, విధిగా యూనిఫామ్ ధరించాలన్నారు. ఎక్కువ ప్యాసింజర్లను ఎక్కించుకోరాదని, నంబర్ల ప్లేట్ లేని ఆటోలను నడపరాదని సూచించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు తమ వద్ద ఉంచుకోవాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని సూచించారు. ఇన్చార్జి మంత్రిని కలిసిన సీపీ నిజామాబాద్అర్బన్/ ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో బుధవా రం నిర్వహించిన సమీక్ష సమావేశానికి వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును సీపీ సాయిచైతన్య మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. అలాగే జర్నలిస్టుల సమస్యలపై స్పందించాలని కోరు తూ టీయూడబ్ల్యూజే ఐజే యూ నాయకులు ఇన్చార్జి మంత్రికి వినతిపత్రం అందజేశారు. -
ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి
కామారెడ్డి టౌన్: జిల్లాలోని ప్రముఖ ఆలయాల అభివృద్ధికి టీటీడీ నుంచి నిధులు మంజూరు చేసి అభివృద్ధికి కృషి చేయాలని కామారెడ్డి జిల్లా ఏబీవీపీ పూర్వ నాయకులు బుధవారం తిరుపతిలో టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని భిక్కనూరు సిద్దరామేశ్వరాలయం, చుక్కాపూర్ లక్ష్మినర్సింహాస్వామి, ఇసన్నపల్లి కాలభైరవస్వామి ఆలయాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏబీవీపీ పూర్వ నాయకులు రణజీత్ మోహన్, జంగం నరేష్, కోడేం లక్ష్మిపతి, వంగారాహుల్, సంతోష్గౌడ్ తదితరులున్నారు. -
తగ్గిన లిక్కర్ అమ్మకాలు
మద్యం అమ్మకాలను ఆర్థిక సంవత్సరానికి లెక్కిస్తారు. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఎంత మద్యం అమ్మారు? ఎంత ఆదాయం వచ్చింది? అంతకుముందు సంవత్సరం ఎంత ఆదాయం వచ్చిందని పరిశీలించి, వచ్చే ఏడాది ఎంత ఆదాయం పెరగవచ్చో అంచనా వేసుకుంటారు. అయితే గత ఆర్థిక సంవత్సరంలో మద్యం ధరలు పెరిగినప్పటికీ ఆదాయం మాత్రం పెద్దగా పెరగకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 2023–24 సంవత్సరంలో జిల్లాలో మద్యం అమ్మకాల ద్వారా రూ. 551 కోట్ల ఆదాయం రాగా.. 2024–25 సంవత్సరంలో రూ. 559 కోట్లు మాత్రమే వచ్చింది. కేవలం రూ.8 కోట్ల ఆదాయం మాత్రమే పెరిగింది. పెరిగిన మద్యం ధరలకు అనుగుణంగా ఆదాయం భారీగా పెరగాల్సి ఉన్నా ఆ స్థాయిలో ఆదాయం పెరగకపోవడం గమనార్హం. జిల్లాలో 49 వైన్ షాపులు, ఎనిమిది బార్లు ఉన్నాయి. పట్టణాల్లో గల్లీగల్లీలో, అలాగే దాదాపు అన్ని ఊళ్లలో బెల్ట్షాపులు కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల బార్లను తలపించేలా ఏర్పాట్లు చేశారు. అంతటా బహిరంగంగానే మద్యం అమ్మకాలు నడుస్తున్నాయి. అయితే మద్యం ఆదాయం ఎందుకు పెరగలేదన్న దారికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. భూములు, ప్లాట్ల అమ్మకాలు పడిపోయాయి. అలాగే వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగాయే తప్ప ఆదాయం వృద్ధి చెందలేదు. అకాల వర్షాలతోపాటు తెగుళ్లతో పంటలు దెబ్బతినడం, ఆపై భూగర్భజలాలు అడుగంటి పంటలు ఎండిపోవడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారు. ఆయా కారణాల వల్ల జనం వద్ద డబ్బుల సర్దుబాటుకు ఇబ్బందులు పెరిగాయి. చాలా కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో గతంలోలాగా మద్యం తాగడానికి కొందరు వెనకా ముందవుతున్నట్లు తెలుస్తోంది.రాష్ట్రంలో గతేడాది జ రగాల్సిన గ్రామ పంచాయతీ, మండ ల, జిల్లా పరిషత్ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నా యి. ఎన్నికలు ఇప్పట్లో జరుగుతా యన్న నమ్మకం కూడా లేకుండాపోయింది. ఎన్నికల సీజన్లో సాధారణంగా మద్యం అమ్మకాలు రెట్టింపవుతాయి. అవి ఏడాది టార్గెట్ ను సులువుగా రీచ్ చేయగలుగుతాయి. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపేవారు నెల రెండు నెలల ముందు నుంచే ప్రలోభాల పర్వం మొదలుపెడతారు. ముఖ్యంగా దావత్లతో ఆకర్శి స్తుంటారు. ఈసారైనా ఎన్నికలు వస్తా యేమోనని ఎకై ్సజ్ శాఖ అధికారులు ఎదురుచూస్తున్నారు. టార్గెట్ను దాటాలంటే ఎన్నికలు రావలసిందేనన్న అభిప్రాయం ఆ శాఖ అధికారుల నుంచి వ్యక్తమవుతోంది.పెరిగిన గుడుంబా, గంజాయి విక్రయాలు..మద్యం ధరలు పెరగడంతో చాలా మంది తక్కువ ధరల్లో లభించే మత్తు పదార్థాల వైపు మళ్లుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో గుడుంబా అమ్మకాలు పుంజుకున్నాయి. అలాగే పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ యువత గంజాయికి అలవాటు పడుతున్నారు. సులువుగా గంజాయి లభిస్తుండడంతో యువకులు తక్కువ ధరల్లో దొరికే గంజాయితో మత్తు పీలుస్తున్నారు. దీనిని అరికట్టేందుకు ఎకై ్సజ్, పోలీస్ శాఖలు దాడులు నిర్వహిస్తున్నా దందా ఆగడం లేదు. గుడుంబా తయారీ, అమ్మకాలు కూడా యథేచ్ఛగా నడుస్తున్నాయి. గతంలో క్లోరోహైడ్రేట్తో తయారైన కల్లు దొరికేది. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో కల్లులో అల్ప్రాజోలం వాడుతున్నారు. ఎక్కువ మత్తు ఇస్తుండడంతో చాలామంది మందు కల్లు తాగుతున్నట్టు తెలుస్తోంది. అలాగే జిల్లాకు పొరుగునే ఉన్న మహారాష్ట్రలో దేశీదారు తక్కువ ధరకు లభిస్తుంది. అక్కడి నుంచి అడ్డదారుల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు దేశీదారు తరలివస్తోంది. వీటి ప్రభావంతోనూ జిల్లాలో మద్యం అమ్మకాలు పడిపోయినట్లు భావిస్తున్నారు.ఊరూవాడా విచ్చలవిడిగా బెల్ట్షాపులు కొనసాగుతున్నా.. జిల్లాలో మద్యం అమ్మకాలు మాత్రం తగ్గాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే గత ఆర్థిక సంవత్సరంలో రూ. 8 కోట్ల ఆదాయం మాత్రమే పెరిగింది. మద్యం ధరలు పెరగడంతో మందుబాబులు గుడుంబా, గంజాయి వంటివాటిని సేవిస్తున్నట్లు తెలుస్తోంది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి ఊరూవాడా బెల్టుషాపులు విస్తరించినా పెరగని ఆదాయం మద్యం అమ్మకాలు తగ్గడానికి కారణాలు ఎన్నో.. ‘స్థానిక’ ఎన్నికలపైనే ఎకై ్సజ్ శాఖ ఆశలు -
పేదల కడుపు నింపేందుకే సన్నబియ్యం
పెర్కిట్(ఆర్మూర్): పేద, సామాన్య ప్రజల కడుపు నింపేందుకే రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేపట్టిందని రాష్ట్ర పర్యాటక, ఎకై ్సజ్, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి రేషన్ లబ్ధిదారుడు లక్కారం తవ్వన్న ఇంట్లో సన్నబియ్యంతో మంత్రి బుధవారం భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పంపిణీ చేసిన దొడ్డు బియ్యాన్ని తినేందుకు లబ్ధిదారులు విముఖత చూపుతూ ఇతరులకు విక్రయించి మార్కెట్లో సన్న బియ్యం కొనుగోలు చేసుకునే వారన్నారు. ప్రభుత్వానికి భారమైనా పేదలకోసం సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారు ఇంట్లో భోజనం చేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు -
ఉమ్మడి కుటుంబ సంస్కృతి కొనసాగాలి
పెర్కిట్(ఆర్మూర్): ఆధునిక సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగవుతుండడంతో ఆనందానికి దూరమవుతున్నారని, ఉమ్మడి కుటుంబ సంస్కృతి కొనసాగాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లికి చెందిన లక్కారం తవ్వన్న ఉమ్మడి కుటుంబంతో కలిసి సన్నబియ్యంతో భోజనం చేసిన మంత్రి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆనందం వ్యక్తం చేశారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. మంత్రి వెంట ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల ఇన్చార్జీలు పొద్దుటూరి వినయ్రెడ్డి, ముత్యాల సునీల్రెడ్డి, డీఎస్వో అరవింద్రెడ్డి, సవిల్ సప్లయీస్ డీఎం శ్రీకాంత్రెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, నాయకులు వెంకట్రాంరెడ్డి, మారుతిరెడ్డి, రవిగౌడ్, కాశీరాం, కొంతం మురళీధర్ తదితరులు ఉన్నారు. -
వేసవి సెలవుల్లో అప్రమత్తంగా ఉండాలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): వేసవి సెలవుల్లో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై మల్లారెడ్డి తెలిపారు. నాగిరెడ్డిపేట కస్తూర్భా పాఠశాలలో బుధవారం షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సెలవుల్లో ఇంటికి వెళ్లినప్పుడు అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలన్నారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఆయన చెప్పారు. చెరువులకు ఈతకు వెళ్లకూడదన్నారు. పాఠశాల స్పెషల్ ఆఫీసర్ గీతతోపాటు షీ టీం బృందం సభ్యులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. సైబర్ నేరగాళ్ల నుంచి అప్రమత్తంగా ఉండాలి నస్రుల్లాబాద్(బాన్సువాడ) : సైబర్ నేరగాళ్ల నుంచి అప్రమత్తంగా ఉండాలని ఏఎస్సై అబీద్ బేగ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సంతలో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కోతలు ముగిసి డబ్బులు ఖాతాల్లో వచ్చే సమయమని, తమ బ్యాంక్ ఖాతా వివరాలను తెలియజేయవద్దని సూచించారు.ఆయన వెంట సిబ్బంది ఉన్నారు. పోగొట్టుకున్న సెల్ ఫోన్ అప్పగింత మాచారెడ్డి: పోగొట్టుకున్న సెల్ ఫోన్ను బుధవారం బాధితునికి అప్పగించినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. పాల్వంచ మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన కామటి నర్సింలు పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి అందజేసినట్లు వివరించారు. -
నీటి ఎద్దడి లేకుండా చూడాలి
కామారెడ్డి క్రైం: జిల్లాకేంద్రంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. పట్టణ పరిధిలో నీటి సరఫరా కోసం రూ. 50 లక్షలతో కొనుగోలు చేసిన ఐదు ట్యాంకర్లను, రూ. 40 లక్షలతో కొనుగోలు చేసిన పొక్లెయిన్ను బుధవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఇప్పటికే 8 ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నామన్నారు. పట్టణ విస్తీర్ణం పెరగడం, నీటి ఎద్దడి తలెత్తడంతో అదనంగా ఐదు ట్యాంకర్లను కొనుగోలు చేశామన్నారు. సమస్య ఎక్కువ ఉన్న ప్రాంతాలకు నీటిని సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం కార్యాలయంలో కొనసాగుతున్న ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పరిశీలించారు. హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో ఉన్న మున్సిపల్ బోర్ల నుంచి ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఈ ప్రాంతంలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి, హౌజింగ్ పీడీ విజయ్పాల్రెడ్డి, మున్సిపల్ ఏఈ శంకర్, సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి బల్దియాకు ఐదు కొత్త ట్యాంకర్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
పారిశుధ్య కార్మికులకు భద్రతేది..?
కామారెడ్డి టౌన్: పారిశుధ్య కార్మికుల భద్రతను బల్దియా అధికారులు పట్టించుకోవడంలేదు. వారికి విధుల్లో భాగంగా సబ్బులు, నూనెలు, బట్టలు, చెప్పులు, షూ, చేతి గ్లౌజ్లు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వడం లేదు. 9నెలల క్రితం కేవలం రెండు జతల దుస్తులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో కార్మికులు మురికి కాలువల్లో, రోడ్లను శుభ్రం చేసే పనుల్లో చేతికి గ్లౌజ్లు, కాళ్ల షూ లేకుండా పనులు చేయడంతో అనారోగ్యపాలవుతున్నారు.పాలక వర్గం ముగిసి ప్రత్యేకపాలన వచ్చిన పరిస్థితిలో ఎలాంటి మార్పులేదని కార్మికులు వాపోతున్నారు. బుధవారం పట్టణంలోని సిరిసిల్లారోడ్లో నిలిచిన మురుగు నీటిలో కార్మికుడు దిగి పూడికను శుభ్రం చేశాడు. సంరక్షణగా చేతులకు ఎలాంటిి గ్లౌజ్లు, కాళ్లకుబూట్లు లేకుండానే పని చేశాడు. టెండర్లో భారీ కుంభకోణం ఆరోపణలు కామారెడ్డి మున్సిపల్ శానిటేషన్ విభాగంలో 256 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రతి ఏటా వీరికి సబ్బులు, నూనెలు, ఆర్పన్స్, చెప్పులు,షూ పంపిణి చేయాల్సి ఉంటుంది. వీటిని కార్మికులకు ఇచ్చేందుకు ఏటా టెండర్లు పిలవాల్సి ఉంటుంది. అలా కాకుండా అత్యవసరం పేరిట మూడు, నాలుగు ఏళ్లకు ఒక సారి పంపిణీ చేస్తున్నారు. ఓ ఏడాది ప్రజాప్రతినిధి బినామి పేరిట టెండర్ వేసి భారీ కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. రూ. లక్షల్లో బిల్లులు తీసుకుని కేవలం దుస్తులు మాత్రమే పంపిణీ చేసినట్లు విమర్శలు ఉన్నాయి. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న కార్మికులను పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఉత్త చేతులు, కాళ్లతో మురికి కాలువల్లో, రోడ్లపై చెత్త తొలగింపు అనారోగ్యం బారిన పడుతున్న బల్దియా కార్మికులు సబ్బులు, నూనెలు, గ్లౌజ్లు, బూట్లు ఇవ్వని అధికారులు త్వరలో కార్మికులకు అందజేస్తాం కార్మికులకు త్వరలో సబ్బులు, నూనెలు ఇతర సామాగ్రి అందజేస్తాం. అన్ని అందేలా చర్యలు తీసుకుంటాం. 8 నెలల క్రితం దుస్తులను పంపిణీ చేశాం. ఆర్థికం సంక్షోభంతో కాస్తా ఇబ్బందులు ఉన్నాయి. త్వరలోనే కార్మికులకు అన్ని వస్తువులను అందజేస్తాం. – రాజేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డి -
కాచాపూర్ గ్రామ సమస్యలు పరిష్కరించాలి
భిక్కనూరు: మండలంలోని కాచాపూర్ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని గ్రామానికి చెందిన పలువురు యువకులు అధికారులను కోరారు. బుధవారం తహసీల్దార్ శివప్రసాద్ తో పాటు ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. గ్రామంలో సిమెంటు రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని, ఇరిగేషన్ ప్రధాన కాలువ పిచ్చి మొక్కలతో నిండి పోయిందని, తాగునీటి లీకేజీలు అధికంగా ఉన్నాయని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఎంఎస్ఎన్ కంపెనీ ద్వారా దుర్వాసన గ్రామంలోకి వస్తుందని వినతి పత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా మానవ హక్కుల కమిటీ చైర్మన్ మహిపాల్, జిల్లా వైస్ చైర్మన్ సందీప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సింలు, గ్రామ బీజేపీ అధ్యక్షులు అనిల్, మండల బీజేపీ ఉపాధ్యక్షులు శంకర్, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, గ్రామ సేవా సమితి సభ్యులు మోహన్ గౌడ్, నవీన్ చారి స్వామి ఉన్నారు. -
వరంగల్ సభను జయప్రదం చేయాలి
నిజాంసాగర్(జుక్కల్): ఈ నెల 27న వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లి వార్షికోత్సవ సభను జయప్రదం చేయాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్సింథే అన్నారు. మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వరంగల్ సభకు జనసమీకరణ ఏర్పాట్లపై ముఖ్యనాయకులతో చర్చించారు. జుక్కల్ నియోజకవర్గం నుంచి 3వేల మంది కార్యకర్తలను వరంగల్ సభకు తరలిస్తున్నామన్నారు. మండల నాయకులు దుర్గారెడ్డి, గైని. విఠల్, నర్సింహారెడ్డి, రమేష్గౌడ్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
పైప్లైన్ల లీకేజీ.. తాగునీరు వృథా
బాన్సువాడ రూరల్: మిషన్ భగీరథ పథకం నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా తాగునీరు వృథా అవుతోంది. మండలంలోని ఎక్కడో ఓచోట ప్రతిరోజు పైప్లైన్లు లీకేజీకి గురికావడంతో నీరు కలుషితమవుతున్నాయి. పైప్లైన్ లీకేజీలను సరిచేయించాల్సిన అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో ప్రజలకు కలుషిత నీరే సరఫరా అవుతోంది. దీంతో ప్రజలు మినరల్ వాటర్ క్యాన్లలో నీటిని కొనితెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి పైప్లైన్ లీకేజీలను పూడ్చి స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
అంగన్వాడీ కేంద్రం తనిఖీ
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని కొర్పోల్ గ్రామంలోగల అంగన్వాడీ కేంద్రాన్ని మంగళవారం ఎంపీవో మలహరి తనిఖీ చేశారు. విద్యార్థులు, టీచర్ హాజరు పట్టికలను పరిశీలించారు. అనంతరం గ్రామ శివారులోని వైకుంఠధామం, కంపోస్టు షెడ్డు, పల్లె ప్రకృతి వనం, నర్సరీలను పరిశీలించారు. ఉద్యమకారుడికి పరామర్శ బాన్సువాడ రూరల్: ఇటీవల అనారోగ్యానికి గురైన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు దండు విజయ్కుమార్ను మంగళవారం ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. బాన్సువాడలోని జర్నలిస్టు కాలనీలో దండు విజయ్కుమార్ ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నాయకులు గంగాధర్, సాయిబాబా, చందు, రాజు, గైని గంగారాం, భాస్కర్గౌడ్, ఖాదర్, మహేష్, కృష్ణ తదితరులు ఉన్నారు. -
అనారోగ్యంతో బీఆర్ఎస్ నాయకుడి మృతి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బాపురావు(50) మంగళవారం అనార్యోగంతో మృతి చెందినట్లు పార్టీ నాయకులు, గ్రామస్తులు తెలిపారు. స్వగ్రామమైన చిట్యాలలో అంత్యక్రియలను జరిపించారు. ప్రమాదవశాత్తు చెరువులోపడి వృద్ధుడి మృతిఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణ శివారులోని గుండ్ల చెరువులో ప్రమాదవశాత్తు పడి కుంట గంగా మోహన్రెడ్డి(65) మృతి చెందినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. మంగళవారం గుండ్ల చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లిన కుంట గంగామోహన్రెడ్డి ప్రమాదవశాత్తు చెరువులో పడి చెందాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో పేర్కొన్నారు. మృతుడు తెలంగాణ మలిదశ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్తో కలిసి పాల్గొన్నాడని స్థానికులు తెలిపారు. గంగామోహన్రెడ్డి అంత్యక్రియల్లో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. దుబాయ్లో రెడ్డిపేటవాసి..రామారెడ్డి: మండలంలోని రెడ్డిపేట గ్రామానికి చెందిన బట్టు సురేశ్(42) అనే వ్యక్తి దుబాయ్లో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఐదు నెలల క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన సురేశ్కు ఈ నెల 12న బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మరణించాడు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సురేశ్ మృతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు దుబాయ్లో ఉన్న బట్టు శంకర్, నవీన్ ప్రయత్నిస్తున్నట్లు గల్ఫ్ సంఘ సభ్యులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గల్ఫ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బండ సురేందర్రెడ్డి కోరారు. అడవిపంది దాడి.. ఒకరికి గాయాలుఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలోని అన్నాసాగర్ గ్రామానికి చెందిన కొనగోళ్ల సాయిబాబా అనే వ్యక్తిపై అడవిపంది దాడి చేసినట్లు స్థానికులు మంగళవారం తెలిపారు. సాయిబాబా తన పొలానికి వెళ్తున్న సమయంలో అడవిపంది దాడి చేయడంతో చేతు, కాలికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన సాయిబాబాను ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించగా మున్సిపల్ మాజీ చైర్మన్ కుడుముల సత్యనారాయణ పరామర్శించారు. అటవీశాఖ అధికారులు బాధితుడికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బైక్ను ఢీకొన్న లారీ● ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు కామారెడ్డి క్రైం: లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. అతివేగంగా వచ్చిన లారీ ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన జిల్లా కేంద్రానికి సమీపంలోని ఉగ్రవాయి మైసమ్మ స్టేజీ వద్ద కామారెడ్డి–సిరిసిల్లా ప్రధాన రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామానికి చెందిన నాగుల వినోద్ కుమార్ (30) చేపలు పట్టడం, కూలీ పనులు చేసుకుంటూ జీవించేవాడు. చేపల పని మీద తన స్నేహితుడు జక్కుల దేవేందర్తో కలిసి బైక్పై కామారెడ్డికి బయల్దేరారు. ఉగ్రవాయి మైసమ్మ స్టేజీ సమీపంలోకి రాగానే బైక్ను లారీ ఢీకొనగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే కామారెడ్డిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే చికిత్స పొందుతూ వినోద్ కుమార్ మృతి చెందాడు. దేవేందర్ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ రిఫర్ చేశారు. మృతుడి తల్లి సత్తవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు. -
ఉద్యోగ భద్రత కల్పించాలి
భిక్కనూరు: విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈమేరకు తెయూ సౌత్ క్యాంపస్లో మంగళవారం ‘సెక్రటేరియట్ ముట్టడి’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను తాత్కాలిక అధ్యాపకులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన పార్ట్ టైం అధ్యాపకులు, కాంట్రాక్ట్ అధ్యాపకులు పాల్గొన్నారు. సూపర్ బీడీ బ్రాంచ్లను తెరిపించాలి కామారెడ్డి టౌన్: సూపర్ బీడీ కంపెనీ మూసి వేసిన 152 బ్రాంచ్లను తక్షణమే తెరిపించాలని తెలంగాణ బీడీ రోలర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 10వేలకు పైగా బీడీ కార్మికులు ఈ కంపెనీలో పని చేస్తున్నారని అకారణంగా కంపెనీని మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించడం దారుణమన్నారు. తక్షణమే అన్ని బ్రాంచ్లను తెరిపించి కార్మికులకు ఉపాధినివ్వాలని డిమాండ్ చేశారు. బహుజనులపై దాడులు సరికావు సదాశివనగర్(ఎల్లారెడ్డి): బహుజనులపై దాడులు సరికావని, ఎవరైనా దాడులకు పాల్పడితే సహించేదిలేదని మాజీ జెడ్పీటీసీ రాజేశ్వర్ రావు అన్నారు. మండలంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లింగంపేట్లో అకారణంగా అధికార పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ సాయిలుపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సాయిలుకు అండగా ఉంటామన్నారు. బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నిరుపయోగంగా ధోబీఘాట్బాన్సువాడ రూరల్: మండలంలోని కోనాపూర్ గ్రామంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన ధోబీఘాట్ నిరుపయోగంగా మారింది. అధికారులు నీటి సౌకర్యం కల్పించకపోవడంతో ఏళ్లుగా వృథాగా మారడంతోపాటు శిథిలావస్థకు చేరుకుంది. అధికారులు స్పందించి ధోబీఘాట్కు మరమ్మతులు చేపట్టి, నీటిసౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పీజీ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదలతెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ 1, 3వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వీసీ ప్రొఫెసర్ టీ యాదగిరి రావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కే సంపత్కుమార్, ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్, అడిషనల్ కంట్రోలర్ టీ సంపత్, పీఆర్వో ఏ పున్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఫలితాల వివరాలను వర్సిటీ వెబ్సైట్ www.telanganauniversity.ac. inలో పొందుపర్చినట్లు కంట్రోలర్ తెలిపారు. -
వాల్ పోస్టర్ల ఆవిష్కరణ
కామారెడ్డి టౌన్: గ్రామీణ ప్రాంతంలోని మహిళల సురక్షితమైన ఆరోగ్యం కోసం ఏబీవీపీ ఆధ్వర్యంలో రుతుమర్తి అభియాన్ కార్యక్రమాన్ని రూపొందించినట్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ప్రత్యూష రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మంగళవారం కార్యక్రమ వాల్ పోస్టర్లను వారు ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలను చైతన్యపరుస్తామన్నారు. ప్రిన్సిపల్ విజయ్కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు. -
వేసవి క్రీడా శిబిరాలకు వేళాయే..!
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): జిల్లాలోని పలు ప్రాంతాల్లో జిల్లా యువజన, క్రీడల శాఖ వేసవి క్రీడాశిబిరాలను నిర్వహించేందుకు సన్నద్ధమవుతుంది. ఇన్నాళ్లు పుస్తకాలతో దోస్తి చేసి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు వేసవిసెలవుల్లో ఆటలపై పట్టు సాధించేలా ఈ శిబిరాలను ఏర్పాటు చేయనుంది. క్రీడాశిబిరాల నిర్వాహణ కోసం ఆసక్తి గల సీనియర్ క్రీడాకారులు, జాతీయస్థాయి క్రీడాకారులు, పీఈటీ, పీడీల నుంచి సంబంధిత అధికారులు ఇదివరకే దరఖాస్తులను సైతం స్వీకరించారు. 14ఏళ్లలోపు బాలబాలికలకు.. క్రీడలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు జిల్లాలో 10 శిబిరాలను అధికారులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. మే 1నుంచి 31వరకు శిబిరాలను నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. 14ఏళ్లలోపు బాలబాలికలకు ఎంపిక చేయబడ్డ క్రీడలలో నెలరోజులపాటు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు. నెలరోజులపాటు శిబిరాలను నిర్వహించేవారికి రూ.4వేలు పారితోషికంగా చెల్లించడంతోపాటు శిబిరాల నిర్వాహణకు అవసరమైన క్రీడాసామగ్రిని పంపిణీ చేయనున్నారు. విద్యార్థులకు మరో పది రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభంకానున్నాయి. ఈక్రమంలో వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా, వారిలో దాగి ఉన్న క్రీడానైపుణ్యాలను వెలికితీయడంతోపాటు క్రీడలపై వారికి తగిన శిక్షణ ఇచ్చేలా శిక్షణ శిబిరాలను నిర్వహించనున్నారు. జిల్లాలో పది కేంద్రాల ఏర్పాటుకు అధికారుల కసరత్తు మే 1 నుంచి 31 వరకు కొనసాగనున్న శిక్షణ -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ఆర్మూర్ టౌన్: ఆర్మూర్ పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద మంగళవారం సాయంత్రం లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. జిరాయత్నగర్లో నివాసముండే ఒడ్డె గంగాధర్(55) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం పని నిమిత్తం ఎక్సెల్ బైక్పై వెళ్తున్న గంగాధర్ను క్లాక్ టవర్ వద్ద రెడీమిక్స్ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో గంగాధర్ అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ధాన్యం లారీ ఢీకొని మరొకరు..బోధన్టౌన్(బోధన్): బోధన్ పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని లంగ్డాపూర్ బ్రిడ్జి వద్ద సోమవారం రాత్రి ధాన్యం లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మోస్రా మండలంలోని గోవూర్ గ్రామానికి చెందిన రాజాగౌడ్, లాలూ ద్విచక్ర వాహనంపై పని నిమి త్తం కందకుర్తికి వెళ్లి పెగడాపల్లి మీదుగా బోధన్కు తిరిగి వస్తున్నారు. బోధన్ నుంచి పెగడాపల్లి వైపు ధాన్యం లోడ్తో వెళ్తున్న లారీ లంగ్డాపూర్ బ్రిడ్జి వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న లాలూ(43)కు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతి చెందగా, రాజాగౌడ్కు గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని లా లూ మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లారీని అదుపులోకి తీసుకొని, మృతుడి భార్య ఎల్లవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
అర్ధంతరంగా నిలిచిన ‘అంగన్వాడీ’
నస్రుల్లాబాద్(బాన్సువాడ): మండలంలోని రాములగుట్ట తండాలో నూతనంగా నిర్మిస్తున్న అంగన్వాడీ భవన నిర్మాణ పనులు అర్ధంతరంగా నిలిచి పోయాయి. గతంలో రూ.9లక్షల నిధులు కేటాయించి భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. పనులు మొదలుపెట్టి ఏళ్లు గడుస్తున్నా పనులు పూర్తికావడం లేదు. అసంపూర్తి పనుల కారణంగా భవనం మందుబాబులకు అడ్డాగా మారింది. భవనం అందుబాటులోకి రాకపోవడంతో చిన్నారులు అద్దె భవనంలో ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
హత్య కేసులో నిందితుల అరెస్టు
మాక్లూర్ : పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 13న చిక్లి గ్రామశివారులో వడ్డె చిన్న గంగాధర్ (48) అనే వ్యక్తిని ట్రాక్టర్తో ఢీ కొట్టి మరణానికి కారణమైన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మాక్లూర్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నార్త్ జోన్ సీఐ బీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. చిక్లి గ్రామానికి చెందిన వడ్డె చిన్న గంగాధర్కు అదే గ్రామానికి చెందిన కారం నవీన్కు మధ్య భూ తగాదాలు ఉన్నాయి. ఈ విషయంలో విడగొట్టు ప్రసాద్ అనే వ్యక్తి కారం నవీన్కు మద్దతు తెలపడంతో ఈ నెల 13న సొసైటీ గోదాం వద్ద ఘర్షణ జరిగిందన్నారు. నవీన్ వ్యక్తిగత విషయాలను మృతుడు వడ్డె చిన్న గంగాధర్ బహిరంగంగా విమర్శించేవాడని తెలిపారు. ఇద్దరి మధ్య తగాదాను పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడే క్రమంలోనే చిన్న గంగాధర్ను నవీన్ ఉద్దేశపూర్వకంగానే ట్రాక్టర్తో ఢీకొట్టి మరణానికి కారణమైనట్లు పేర్కొన్నారు. విడగొట్టు ప్రసాద్ను ఏ–2గా చేర్చినట్టు సీఐ శ్రీనివాస్ తెలిపారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై శేఖర్, పోలీసు సిబ్బందిని సీఐ అభినందించారు. వేంకటేశ్వర ఆలయంలో చోరీబాల్కొండ: మండలంలోని వన్నెల్(బీ) వేంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు హుండీ పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. 15 రోజుల క్రితమే ఉత్సవాలు జరగడంతో భక్తులు హుండీలో అధికంగా ముడుపులు వేసినట్లు స్థానికులు తెలిపారు. నస్రుల్లాబాద్లో.. నస్రుల్లాబాద్(బాన్సువాడ): మండలంలోని మైలారం గ్రామానికి చెందిన మహేందర్ గౌడ్కు చెందిన కిరాణా షాపు, నస్రుల్లాబాద్ మండల కేంద్రానికి చెందిన మోయిన్ ఖాన్ పాన్షాపులలో చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మూసి ఉన్న షాపుల తాళాలు పగులకొట్టి నగదును అపహరించారని పేర్కొన్నారు. దుండగులు నస్రుల్లాబాద్లోని పాల కేంద్రం, కిరాణాషాపులో చోరీకి యత్నించారని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాయిలర్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదంమద్నూర్(జుక్కల్): మండల కేంద్రానికి సమీపంలోని సాయిరాం ఆగ్రో బాయిలర్ ఫ్యాక్టరీలో మంగళవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. బాయిలర్ ఫ్యాక్టరీలో బ్రిక్స్ తయారి కోసం పెద్ద మొత్తంలో సోయాబీన్, శనగ, కంది పొట్టును సేకరించారు. ఫ్యాక్టరీ నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో కూలీలు, యజమానులు బయటకు పరుగు లు తీశారు. మద్నూర్ అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో మహారాష్ట్ర లోని దెగ్లూర్ ఫైర్స్టేషన్కు సమాచారం అందించారు. రెండు ఫైరింజన్లతో సి బ్బంది మూడు గంటలపాటు కష్టపడి మంటలను ఆర్పివేశారు. సుమారు రూ. 10లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. -
సీఐపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్కు ఫిర్యాదు
లింగంపేట(ఎల్లారెడ్డి): ఎల్లారెడ్డి సీఐపై మంగళవారం దళిత నాయకులు హైదరాబాదు నాంపల్లిలోని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు ఫిర్యాదు చేశారు. అంబేడ్కర్ జయంతి రోజున లింగంపేటలో దళిత నాయకుడిని అర్ధనగ్నంగా పోలీసులు ఈడ్చుకెళ్లి అరెస్టు చేసిన ఘటనపై ఎల్లారెడ్డి సీఐ రవీందర్నాయక్తో పాటు సంబందిత పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా చైర్మన్ వెంటనే కామారెడ్డి ఎస్పీతో ఫోన్లో మాట్లాడి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యే సురేందర్, ముదాం సాయిలు, జిల్లా అధ్యక్షుడు గంగారాం, సంగమేశ్వర్, నెల్లూరి గంగారాం, భూపతి, రాజు, జిల్లా, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. కామారెడ్డి ఎస్పీకి.. లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో జరిగిన ఘటనలో ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్పై చర్యలు తీసుకోవాలని దళిత సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు మంగళవారం జిల్లా ఎస్పీ రాజేష్చంద్రకు ఫిర్యాదు చేశారు. అంబేడ్కర్ సంఘ ప్రతినిధులు ముదాం సాయిలు, సంఘమేశ్వర్, గంగారాం, భూపతి, లెగ్గల రాజు, ఆశయ్య, అల్లూరి, మన్నె శ్రీనివాస్, సాయిలు, క్రాంతి, చెన్నం సాయిలు, భూషణం తదితరులు పాల్గొన్నారు. -
భూభారతితో భూసమస్యలకు చెక్
‘ఇందిరమ్మ’కు ప్రత్యేకాధికారులు..‘జల సంరక్షణ చర్యలు చేపట్టాలి’సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ‘‘భూముల సమస్యలకు శాశ్వత పరి ష్కారం చూపేందుకు ప్రభుత్వం భూ భారతి పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో నాలు గు మండలాలను ఏర్పాటు చేయగా అందులో మన లింగంపేట కూడా ఉంది. ముందుగా లింగంపేట మండలంలోని 23 రెవె న్యూ గ్రామాల్లో భూభారతిపై ప్రజలకు అవగాహన క ల్పిస్తాం. వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి ఆ యా సమస్యలను పరిష్కరిస్తాం. భూసరిహద్దులు నిర్ణయించి నక్షతో కూడిన భూధార్ కార్డును జారీ చేస్తాం’’ అని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. జిల్లాలో భూభారతి అమలు, తాగునీటి సమస్య, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై మాట్లాడారు. ఆ వివరాలు.. భూభారతి అమలు కోసం పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై న లింగంపేట మండలంలోని 23 రెవెన్యూ గ్రామాల్లో పని మొదలవుతుంది. ఈనెల 17 నుంచి 30 వరకు రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఆయా గ్రామాలకు వెళ్లి ప్ర జలకు భూ భారతి గురించి అవగాహన కల్పిస్తారు. తహసీల్దార్, డి ప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్, ఆర్ఐ, జూనియర్ అసిస్టెంట్లు రెండుమూడు బృందాలుగా విడిపోయి రోజూ రెండు, మూడు గ్రామాల్లో జరిగే సభల్లో పాల్గొంటారు. భూ సమస్యలపై ప్రజలనుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అన్ని మండలాల్లో అవగాహన శిబిరాలు.. జిల్లాలోని 25 మండల కేంద్రాల్లో ఈనెల 17 నుంచి 30 వరకు భూ భారతిపై అవగాహన సభలు నిర్వ హిస్తాం. అన్ని కార్యక్రమాలలో నేను పాల్గొంటాను. అయితే పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికై న లింగంపేట మండలంలో మాత్రమే తొలుత దరఖాస్తులు స్వీకరిస్తాం. మిగతా మండలాల్లో భూభారతిపై అవగాహన మాత్రమే కల్పిస్తాం. భూ భారతి పోర్టల్లో రికార్డులన్నీ నమోదయ్యేదాకా ధరణి పోర్టల్ ద్వారా పనులు కొనసాగుతాయి. మ్యాపింగ్ అయ్యాక భూధార్... భూభారతిపై అవగాహన కల్పించాక.. ప్రజలనుంచి దరఖాస్తులు స్వీకరిస్తాం. వాటిని పరిష్కరించిన తర్వాత భూముల సర్వే చేసి మ్యాపింగ్ చేస్తాం. అనంతరం భూధార్ కార్డు జారీ చేస్తాం. భూభారతిలో రైతులు తమ సమస్యలకు సంబంధించి తహసీల్దార్ ఇచ్చిన ఆదేశాలపై ఆర్డీవోకు, ఆర్డీవో ఇచ్చిన వాటికి కలెక్టర్కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కలెక్టర్ ఇచ్చిన వాటిపై ల్యాండ్ ట్రిబ్యునల్కు వెళ్లవచ్చు. ధాన్యం కొనుగోళ్లు షురూ... జిల్లాలో 446 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇందులో 183 కేంద్రాలను మహిళా సంఘాలకు కేటాయించాం. ఇప్పటికే 426 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 15 వేల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేసి మిల్లులకు పంపించాం. అకాల వర్షాల నేపథ్యంలో రైతులను అప్రమత్తం చేశాం. వడ్లు నానకుండా అవసరమైన టార్పాలిన్లు సిద్ధంగా ఉంచాం. కొనుగోలు కేంద్రాలకు 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రావచ్చని అంచనా వేశాం. మే నెలాఖరునాటికి కొనుగోళ్లను పూర్తి చేస్తాం. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా.. వేసవి నేపథ్యంలో నీటి ఎద్దడి నివారణకు ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నాం. తాజాగా రూ. కోటి మంజూరయ్యాయి. నీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ నిధులను పంచాయతీలకు కేటాయిస్తాం. వాటిని మోటార్లు, పైప్లైన్ల మరమ్మతులు, నీటి సరఫరా, ఇతర పనులకు వినియోగిస్తాం.ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం గురువారం వరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తాం. కామారెడ్డి నియోజకవర్గానికి స్థానిక ఆర్డీవో, బాన్సువాడకు స బ్ కలెక్టర్, ఎల్లారెడ్డికి ఆర్డీవో, జుక్కల్కు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ను ప్రత్యేకాధికారులుగా నియమించాం. లబ్ధిదారులఎంపికలో అత్యంత నిరుపేద లు, వితంతువులువంటి వారికి ప్రాధాన్యతనిస్తాం. మండలాల్లో ఎంపీడీవోలు, ఎంపీవోలతో బృందాల ను ఏర్పాటు చేసి గ్రామాల వారీగా లబ్ధిదారుల జా బితాలు రూపొందిస్తాం. వచ్చేనెల 2 వరకు అర్హుల జాబితాలను ప్రదర్శిస్తాం. ఇంటి స్థలం లేని పేదలకు అందుబాటులో ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయిస్తాం. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లో 350 ఇళ్లు గ్రౌండ్ అవగా, 50 ఇళ్లు బేస్మెంట్ లెవల్కు చేరాయి. పైలట్ ప్రాజెక్టు మండలంలో సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తాం మిగతా మండలాల్లో రేపటినుంచి అవగాహన శిబిరాలు పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు ‘సాక్షి’ ఇంటర్వ్యూలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి క్రైం : జల సంరక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. భూగర్భ జలాల సంరక్షణపై కలెక్టరేట్లో మంగళవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయన్నారు. భూగర్భ జలాల సంరక్షణకోసం ఉపాధి హామీ పనుల కింద సోక్ పిట్, ఫాంపాండ్స్, కాంటూరు కందకాలు వంటివి నిర్మించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చందర్ నాయక్, భూగర్భ జల శాఖ ఏడీ సతీష్ యాదవ్, డీఆర్డీవో సురేందర్, డీఏవో తిరుమల ప్రసాద్, ఉద్యాన శాఖ అధికారి జ్యోతి, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆస్పత్రుల్లో హాజరుపై నిఘా!
కామారెడ్డి టౌన్ : విధులకు డుమ్మా కొట్టేవారికి చెక్ పెట్టేందుకు వైద్యారోగ్య శాఖ నూతన హాజరు విధానాన్ని తీసుకురాబోతోంది. ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్(అభాస్) అమలు చేయబోతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు, సిబ్బంది విధులకు హాజరైనా మధ్యలోనే వెళ్లిపోవడం, క్షేత్ర స్థాయి విధులకు వెళ్లామని చెప్పి తప్పించుకోవడం, విధులకు రాకపోయినా వచ్చినట్లు సంతకాలు చేయడంలాంటివి జరుగుతున్నట్లు వైద్యారోగ్య శాఖ గుర్తించింది. ఇలా వ్యహరించే ఉద్యోగులకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. అలాంటి వారిపై ఇక ప్రత్యేక నిఘా ఉండనుంది. ఇందుకోసం కొత్త హాజరు విధానాన్ని ప్రవేశ పెట్టబోతోంది. అందులో కిందిస్థాయి సిబ్బందినుంచి ఉన్నతాధికారుల వరకు ఒకే రకమైన హాజరు విధానం ఉండనుంది. జిల్లాలో మూడు ఏరియా ఆస్పత్రులు, ఏడు సీ హెచ్సీలు, 20 పీహెచ్సీలు, రెండు యూపీహెచ్సీ లు ఉన్నాయి. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారులు ఇ ప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ ఆస్పత్రు లు, కార్యాలయాల్లో పని చేసేవారి ఆధార్ వివరా లు సేకరించి, ఉన్నతాధికారులకు పంపించారు. అ భాస్ హాజరు విధానం అమలులోకి వస్తే.. మొబైల్ యాప్ ద్వారా లొకేషన్ ఆధారంగా హాజరు నమో దు చేయాల్సి ఉంటుంది. వైద్యులు, ఇతర సిబ్బంది ఆస్పత్రికి ఉదయం వచ్చిన తర్వాత, సాయంత్రం తిరిగి వెళ్లే సమయంలో తప్పనిసరిగా ఈ యాప్లో హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో డుమ్మాలకు చెక్ పడుతుందని ఆశిస్తున్నారు. వివరాలు పంపించాం జిల్లాలోని పీహెచ్సీలు, యూపీహెచ్సీ, సీహెచ్సీ లు, ఏరియా ఆస్పత్రుల నుంచి వైద్యులు, సిబ్బంది ఆధార్ వివరాలను సేకరించి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు పంపించాం. నూతన హాజరు విధా నానికి సంబంధించి ఇంకా పూర్తిగా విధివిధానాలు ఖరారు కాలేదు. ఉన్నతాధికారుల ఆదేశాలను అమ లు చేస్తాం. – చంద్రశేఖర్, డీఎంహెచ్వో, కామారెడ్డి వైద్యులు, సిబ్బంది డుమ్మాలకు చెక్ పెట్టేందుకు చర్యలు జిల్లాలోని ఆస్పత్రులలో పనిచేస్తున్నవారి వివరాల సేకరణ పూర్తి త్వరలో ‘అభాస్’ హాజరు విధానం అమలయ్యే అవకాశం -
ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్లకు ఆటంకాలు
దోమకొండ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్తో పాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, దోమకొండలలో కార్యాలయాలున్నాయి. ప్రభుత్వం ఈనెల 7వ తేదీ నుంచి స్లాట్ విధానంలో సవరణలు చేసింది. గ్రామాల్లో ఇళ్లు, ఖాళీ స్థలాలకు గ్రామ పంచాయతీ ధ్రువీకరణ పత్రాలు, ఇంటి పన్ను రశీదు పత్రాలతో ఇప్పటివరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. కానీ ప్రస్తుతం సవరించిన స్లాట్ విధానంలో ఖాళీ స్థలానికి డీటీసీపీ లేఅవుట్ నంబర్ లేదా లింక్ డాక్యుమెంట్ నంబర్, లేదా బిల్డింగ్ పర్మిషన్ ఆన్లైన్ నంబర్ అడుగుతోంది. దీంతో కొత్తగా గ్రామ పంచాయతీ ధ్రువీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో ఇళ్ల నిర్మాణానికి ఇప్పటివరకు మ్యాన్వల్ పర్మిషన్ మాత్రమే ఇచ్చారు. ఆన్లైన్ పర్మిషన్ లేకపొవడం వల్ల ఇళ్ల రిజిస్ట్రేషన్లకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. ఖాళీ స్థలాలకు సైతం ఆన్లైన్ అసెస్మెంట్ కాపీ, ట్యాక్స్ చెల్లించిన రశీదు ఉంటే రిజిస్ట్రేషన్ జరిగేది. కానీ కొత్త విధానం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయంలో సబ్ రిజస్ట్రార్లకు సైతం ఎలాంటి సమాచారం లేదని తెలుస్తోంది. పైఅధికారుల నుంచి ఇలాంటి వాటికి గతంలో మాదిరిగా రిజిస్ట్రేషన్ చేయడానికి వారికి ఏ విధమైన సూచనలు లేవు. దీంతో వారం రోజులుగా ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్లు ఆగిపొయాయి.ఈ–పంచాయతీతో ఇప్పటికే తలనొప్పులు..ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ–పంచాయతీ పోర్టల్తో ప్రజలు ఇప్పటికే తిప్పలు పడుతున్నారు. ఆస్తులను విభజించే విషయంలో రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఒకరికి మాత్రమే ఇంటి నంబర్ రాగా, ఇంకొకరికి తప్పుగా వస్తోంది. ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రవేశపెట్టిన ఈ–పంచాయతీ పోర్టల్లో రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత బ్లాక్ నంబర్ తప్పుగా వస్తోంది. దీంతో వారు అటు గ్రామ పంచాయతీ, ఇటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఆ సమస్య పరిష్కారం కాకముందే మళ్లీ కొత్త సమస్య రావడంతో రిజిస్ట్రేషన్ల కోసం వస్తున్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై రాష్ట్ర స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.దోమకొండకు చెందిన ఓ వ్యక్తికి గ్రామంలో పాత భవనం, ఖాళీ స్థలం ఉంది. దానిని తన ఇద్దరు కుమారులకు చేరి సగం రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించి గ్రామ పంచాయతీ నుంచి తన పేరుమీద ఇల్లు, స్థలం ఉన్నట్లుగా ధ్రువీకరణ పత్రాలు తీసుకుని రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ కోసం వచ్చాడు. అయితే పాత ఇంటికి సైతం ఆన్లైన్ బిల్డింగ్ పర్మిషన్ అడుగుతుండడంతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు. అంతేకాకుండా ఖాళీ స్థలానికి డీటీసీపీ లేఅవుట్ నంబర్ సైతం అడుగుతోంది. దీంతో ఇల్లు, ఖాళీ స్థలం రిజిస్ట్రేషన్ నిలిచిపోయాయి. వారం నుంచి వారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఇలా చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. స్లాట్ విధానంలో సవరణలు చేసిన ప్రభుత్వం ఖాళీ స్థలాలకు సైతం బిల్డింగ్ పర్మిషన్ అడుగుతున్న వైనం వారం రోజులుగా నిలిచిన ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్లు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ప్రజలుస్లాట్ విధానంలో మార్పులతో ఇబ్బందులు.. ఈనెల 7వ తేదీ నుంచి స్లాట్ విధానంలో మార్పు లు వచ్చాయి. సవరించిన స్లాట్ విధానం వల్ల గతంలో మాదిరిగా ఖాళీ స్థలాలు, ఇళ్లను గ్రామ పంచా యతీ ధ్రువీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయడా నికి వీలులేదు. వాటికి లేఅవుట్ పర్మిషన్ లేదా గ్రా మ పంచాయితీ బిల్డింగ్ ఆన్లైన్ పర్మిషన్ అవసరం అవుతాయి. లేదంటే లింకు డాక్యుమెంట్ ఉండాలి. కొత్త విధానం వల్ల రిజిస్ట్రేషన్లు బాగా తగ్గాయి. విషయాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. – రమేశ్, ఇన్చార్జి సబ్రిజిస్ట్రార్, దోమకొండ -
ప్రతి ఇంటి నుంచి తరలిరావాలి
బాన్సువాడ : బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు అవు తున్న నేపథ్యంలో వరంగల్లో నిర్వహించే రజతోత్సవ సభకు ప్రతి ఇంటి నుంచి తరలిరావాలని ఎ మ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. మంగళవారం బా న్సువాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనడానికి ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ నుంచి బాన్సువాడకు వచ్చారు. ఆమెకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలి కాయి. ఈ సందర్భంగా తాడ్కోల్ బస్టాండ్ నుంచి భారత్ గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంత రం నిర్వహించిన సమావేశంలో కవిత మాట్లాడా రు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎవరో పెట్టిన భిక్ష కా దన్నారు. కేసీఆర్ త్యాగాలు, పోరాటాల వల్లే ప్రత్యే క రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. తెలంగాణ రాష్ట్రా న్ని పదేళ్లలో ఎంతో అభివృద్ధి చేశారన్నారు. త్వరలో బాన్సువాడలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి పేర్కొన్నారు. అధికారం కోసం పార్టీ మారిన పోచా రం శ్రీనివాస్రెడ్డికి ఉప ఎన్నికలలో ఘోర పరాజ యం తప్పదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా బాన్సువాడ ని యోజకవర్గానికే నిధులు కేటాయించారని మాజీ ఎ మ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. ఈ ప్రభా వం మిగతా నియోజకవర్గాలపై పడిందని, పోచా రం వల్లే బీఆర్ఎస్ ఓటమి పాలయ్యిందని విమర్శించారు. కార్యక్రమంలో నస్రుల్లాబాద్ మండలం సంగెం గ్రామానికి చెందిన మణియమ్మ అనే మహి ళ తన కూతురుకు వచ్చిన కల్యాణ లక్ష్మి డబ్బుల నుంచి రూ. 2 వేలను పార్టీ కోసం ఎమ్మెల్సీ కవితకు అందించారు. బాన్సువాడ పట్టణానికి చెందిన పలువురు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. రజతోత్సవ సభను విజయవంతం చేయాలి ఎమ్మెల్సీ కవిత పిలుపుఇవిగో కేసీఆర్ ఆనవాళ్లు.. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సస్యశ్యామలంగా తీర్చిదిద్దారని చెప్పడానికి చెక్డ్యామే సాక్ష్యమని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో బాన్సువాడ చింతల్నాగారం శివారులోని మంజీర నదిపై నిర్మించిన చెక్ డ్యాంను ఆమె సందర్శించారు. మండు వేసవిలోనూ మత్తడి దూకుతుండడాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఇలాంటి చెక్డ్యాంలు నాలుగు నిర్మించారని, ఒక్కో చెక్ డ్యాం కింద 1,600 ఎకరాలలో రెండు పంటలు పండుతున్నాయని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, కార్యకర్తలతో కలిసి కవిత సెల్ఫీ దిగారు. -
విస్త ృతంగా ప్రచారం చేయాలి
కామారెడ్డి క్రైం : భూ భారతి పోర్టల్పై విస్తృతంగా ప్రచారం చేయాలని,, రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. మంగళవారం సాయంత్రం భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, తాగునీరు, రేషన్ కార్డుల వెరిఫికేషన్, భూగర్భ జలాల పెంపు అంశాలపై ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీవోలు, మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతిపై అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించాలని, ఒక్కో సదస్సుకు కనీసం 200 మంది రైతులు హాజరయ్యేలా చూడాలని సూచించారు. సదస్సు ఏర్పాట్ల కోసం ప్రతి మండలానికి రూ.10 వేలు కేటాయించామన్నారు. రోజుకు రెండు మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రస్తుతం ధరణి పోర్టల్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. బుధవారంలోగా లబ్ధిదారుల జాబితాలను ఇందిరమ్మ కమిటీలకు ఇస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్ పాల్గొన్నారు. -
గ్రామాలను అభివృద్ధి వైపు నడిపించాలి
నిజాంసాగర్(జుక్కల్): స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు సేవా కార్యక్రమాలతో గ్రామాలను అభివృద్ధి వైపు నడిపించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. సోమవారం మహమ్మద్ నగర్ మండలం గాలీపూర్ గ్రామంలో జీవీఆర్ ట్రస్టును ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. సేవా కార్యక్రమాలు ఎంత చేశామని కాకుండా గ్రామాల్లో మార్పు కన్పించాలన్నారు. గాలీపూర్ గ్రామాన్ని దత్తత తీసుకొని ఏడాదిలో అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. అంబేడ్కర్ను స్ఫూర్తిగా తీసుకోని ముందుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో జీవీఆర్ ట్రస్టు నిర్వహకుడు శ్రీధర్ రెడ్డి, పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్కుమార్పటేల్, మహమ్మద్నగర్, నిజాంసాగర్ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్రెడ్డి, ఏలే.మల్లికార్జున్, నాయకులు రమేష్యాదవ్, లోక్యానాయక్, సవాయ్సింగ్, ఆకాష్, సంతోష్రాథోడ్, హన్మండ్లు, తాటిపల్లి సరస్వతి తదితరులున్నారు. నాయక్పోడ్ సర్టిఫికెట్లు ఇప్పించాలని వినతి తమకు ఎస్టీ కులధ్రువీకరణ పత్రాలు ఇప్పించాలని సోమవారం గాలీపూర్ గ్రామంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావును ఆదివాసి నాయక్పోడ్ కులస్తులు కోరారు. మూడు నెలల నుంచి మహమ్మద్ నగర్ మండల తహసీల్దార్ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదన్నారు. ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలుు లేకపోవడంతో రాజీవ్ యువవికాస్ రుణాలతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు దూరం అవుతున్నామని వారు ఎమ్మెల్యేను కోరారు. ఈ విషయమై ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు జిల్లా అడిషనల్ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి సమస్యను ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. సేవా కార్యక్రమాలతో మార్పు తీసుకురావాలి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు -
ఫ్లెక్సీ వివాదం.. ఐదు గంటల నిరసన
లింగంపేట: మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సోమవారం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదానికి దారితీశాయి. సుమారు ఐదు గంటల పాటు లింగంపేటలో ఉద్రిక్తత నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. సోమవారం కాంగ్రెస్ నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విగ్రహం వద్ద దళిత సంఘాలు ఏర్పాటు చేసిన ఫెక్సీలో మాజీ ఎమ్మెల్యే జాజాల, ఎమ్మెల్సీ కవిత ఫొటోలు ముద్రించి ఉండడాన్ని గమనించారు. అందులో ప్రస్తుత ఎమ్మెల్యే మదన్మోహన్రావు ఫొటో ముద్రించకపోవడంతో కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. ఆ ఫెక్సీలు తొలగించాలని పంచాయతీ కార్యదర్శి శ్రవణ్కుమార్కు ఫిర్యాదు చేశారు. ఆయన విగ్రహం వద్దకు చేరుకొని ఫెక్సీలను తొలగించాలని అంబేడ్కర్ సంఘం నాయకులకు సూచించారు. నిబంధనల ప్రకారం 50 ఫీట్ల దూరంలో ఎలాంటి ఫెక్సీలు ఉండవద్దన్నారు. ఫ్లెక్సీలను తొలగించడానికి అంగీకరించకపోవడంతో లింగంపేట ఎస్సై వెంకట్రావు ఈ విషయాన్ని ఎస్సై ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్ దృష్టికి తీసుకువెళ్లారు. సీఐ ప్రవర్తనతో పెరిగిన ఉద్రిక్తత సీఐ రవీందర్నాయక్ లింగంపేటకు వచ్చి దళిత సంఘాల నేతలతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సీలు కూడా తొలగించాలని వారు పేర్కొన్నారు. ఈ క్రమంలో సీఐ సూచనతో గ్రామ పంచాయతీ సిబ్బంది కొన్ని ఫ్లెక్సీలు తొలగించి ట్రాక్టర్లో తరలిస్తుండగా దళిత సంఘాల నాయకులు వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ ఫ్లెక్సీలు కూడా తొలగించాలని పట్టుబట్టారు. కాంగ్రెస్ ఫ్లెక్సీలు తొలగించనంటూనే ఏం చేసుకుంటారో చేసుకోండంటూ సీఐ అసభ్య పదజాలంతో దూషించారని దళిత సంఘాల నాయకులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో రాస్తారోకో చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మండల అంబేడ్కర్ సంఘం గౌరవ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ ముదాం సాయిలును అరెస్టు చేసే క్రమంలో ఆయన చొక్కా చిరిగిపోగా ప్యాంటు ఊడిపోయింది. అర్ధనగ్నంగా ఉన్న సాయిలును పోలీసులు లాక్కెళ్లి పోలీసు వాహనంలోకి ఎక్కించారు. విషయం తెలుసుకున్న మండలంలోని దళిత సంఘాల నేతలంతా వచ్చి ధర్నాకు దిగారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ లింగంపేటకు చేరుకొని కామారెడ్డి –ఎల్లారెడ్డి చౌరస్తాలో బైఠాయించారు. దళితులను అవమానించిన సీఐ రవీందర్ నాయక్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ, కామారెడ్డి సీఐ చంద్రశేఖర్రెడ్డితోపాటు పలువురు ఎస్సైలు, పోలీసులు లింగంపేటకు చేరుకుని పరిస్థితి అదుపు తప్పకుండా చూశారు. డీఎస్పీ సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్తో చర్చలు జరిపారు. దళిత సంఘాల నేతల డిమాండ్ మేరకు అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేస్తామని పేర్కొన్నారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఎల్లారెడ్డి సీఐపై ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని పేర్కొనడంతో దళిత సంఘాల నాయకులు శాంతించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సురేందర్, మాజీ ఎంపీపీ ముదాం సాయిలు, దళిత సంఘాల నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నలుగురు దళిత నాయకులను అరెస్టు చేసిన పోలీసులు సీఐ క్షమాపణ చెప్పాలంటూ దళిత సంఘాల పట్టు డీఎస్పీ చొరవతో ఆందోళన విరమణ -
ట్రాక్టర్ ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు
మాక్లూర్: మండలంలోని చిక్లీ గ్రామ శివారులో రోడ్డు పక్కన ఉన్న ఓ వ్యక్తిని ట్రాక్టర్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని చిక్లీ గ్రామానికి చెందిన ర్యాపని ఒడ్డె గంగాధర్(48) ఆదివారం సాయంత్రం గ్రామ శివారులో రోడ్డు పక్కన తన బైక్ను నిలిపి, కూర్చున్నాడు. అదే గ్రామానికి చెందిన కారం నవీన్ ట్రాక్టర్ నడుపుతూ వేగంగా వచ్చి గంగాధర్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం అతడు మృతిచెందాడు. ఇదిలా ఉండగా ట్రాక్టర్ నడిపిన కారం నవీన్ ట్రాక్టర్తోపాటు స్థానిక పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. ఇద్దరి మధ్య భూ తగాదాలు.. నవీన్కు, మృతుడు గంగాధర్కు మధ్య కొంతకాలంగా భూ తగాదాలు నడుస్తున్నాయి. ఆదివారం సాయంత్రం గ్రామ శివారులోని కొనుగోలు కేంద్రం వద్ద ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈక్రమంలో నవీన్ ట్రాక్టర్తో కావాలనే అతడిని ఢీకొట్టాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు ముందస్తు చర్యగా చిక్లీలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటుచేసి, ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి కుమారుడు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు నవీన్పై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. చికిత్స పొందుతూ మృతి పోలీసులకు లొంగిపోయిన నిందితుడు -
వారసత్వ చెరువు.. నోచుకోని అభివృద్ధి
కామారెడ్డి అర్బన్ : ప్రపంచ వారసత్వ కామారెడ్డి పెద్ద చెరువు అభివృద్ధికి నోచుకోవడంలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో 2016 సంవత్సరంలో మిషన్ కాకతీయ ఫేజ్–2 కింద రూ. 8కోట్ల 96 లక్షల వ్యయం అంచనాతో కామారెడ్డి పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్, పునరుద్ధరణ పనులు చేపట్టారు. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్రావు జూలై 17, 2016 లో పనులకు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి పనులు కొనసాగుతునే ఉన్నాయి. చెరువు కట్టపై నిర్మించిన పాదచారుల బాట ముళ్ల చెట్లతో బీటలు వారుతు ఎక్కడికక్కడ పగిలిపోయింది. భూసత్తెమ్మ గుడి సమీపంలో చెరువు కట్టకుంగిపోయింది. పట్టణానికి ప్రధాన నీటి వనరుగా ఉండడంతో పాటు పాత పట్టణానికి నీరు అందించే ఈ చెరువుపై పాలకులు నిర్లక్ష్యం వహించడంపై పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి చెరువు కట్టపై వాకింగ్ చేసి పనులను కళ్లరా చూసినా నేటికి ఒక్క అడుగు ముందుకు పడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వమైన పెద్ద చెరువుపై శ్రద్ధ వహించి పునరుద్ధరణ పనులు పూర్తి చేసి సుందరీకరణ చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. నిధులున్న మేరకు పనులు చేశాం కాకతీయ ఫేజ్ –2 కింద మంజూరైన నిధులతో చెరువు కట్ట బలోపేతం, పాదచారుల బాట, సోలార్ దీపాలు, అలుగు పనులు పూర్తి చేశాం. మద్యంబాబులు సోలార్ దీపాలు పగులగొట్టారు. ముళ్ల చెట్టుతో పాదచారుల బాట ధ్వంసమైంది. కట్టపై పిచ్చి మొక్కలు ఇలా తొలిగిస్తే అలా మొలుస్తున్నాయి. పురపాలక సంఘం నిత్యం చూసుకుంటే తప్ప అక్కడ సుందరీకరణ సాధ్యం కాదు. నిధులు వస్తే కట్ట కుంగిన ప్రాంతాల్లో మరమ్మతులు చేస్తాం. – సాయి సుధాకర్, డీఈఈ, కామారెడ్డి, నీటిపారుదల శాఖ రూ.8.96 కోట్ల వ్యయంతో మినీ ట్యాంక్ బండ్, పునరుద్ధరణకు శంకుస్థాపన ముళ్లచెట్లతో దర్శనమిస్తున్న కామారెడ్డి పెద్దచెరువు అధికారుల నిర్లక్ష్యంపై పట్టణ ప్రజల ఆగ్రహం -
శాంతి భద్రతలకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
భిక్కనూరు: శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్ కోరారు. సోమవారం మండల కేంద్రంలో జరిగిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు ఆయనను అభినందిస్తూ శాలువాలతో సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ దొంగతనాల నివారణకు ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై ఆంజనేయులు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి శంకర్, జిల్లా ప్రతినిధి లక్ష్మణ్ పలువురు నాయకులు ఉన్నారు. ‘భూభారతి’ ప్రారంభ కార్యక్రమాన్ని తిలకించిన రైతులు సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి రైతు వేదికలో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూ భారతి పోర్టల్ ప్రారంభ కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు తిలకించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ప్రజాపతి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగారెడ్డి, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు లింగాగౌడ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మద్దెల బాగయ్య, సీడీసీ చైర్మన్ ఇర్షాదొద్దిన్, విండో చైర్మన్ సదాశివరెడ్డి, సాదీక్ అలీ, తదితరులు పాల్గొన్నారు. మహమ్మద్ నగర్ రైతువేదికలో.. నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్లోని రైతువేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూ భారతి పోర్టల్ ప్రారంభ కార్యక్రమాన్ని పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్కుమార్, అధికారులతో కలిసి తిలకించారు.కార్యక్రమంలో మహమ్మద్ నగర్, నిజాంసాగర్ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్రెడ్డి, ఏలే. మల్లికార్జున్, మహమ్మద్ నగర్ మండల వ్యవసాయశాఖ అధికారిణి నవ్య, ఏఈవోలు మధుసూదన్, రేణుక, రైతులు ఉన్నారు. కల్తీ కల్లు బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలిబాన్సువాడ : కల్తీ కల్లు సేవించి ఆస్పత్రి పాలైన బాధితులందరికి నష్టపరిహారం ఇవ్వాలని పౌరహక్కులసంఘం నిజనిర్ధారణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం నస్రుల్లాబాద్ మండలం దుర్కి, అంకోల్, అంకోల్తండా గ్రా మాల్లో కమిటీ సభ్యులు పర్యటించారు. ఇటీ వల కల్తీకల్లు సేవించి ఆస్పత్రి పాలైన బాధితులను కలిసి వివరాలు సేకరించారు. కల్లు బాధితులందరికి ఒక్కొక్కరికి రూ. లక్ష నష్టపరిహారాన్ని కల్తీ కల్లు కాంట్రాక్టరు వద్ద ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. మత్తు, పదార్థాలైన డైజోఫాం, క్లోరోఫాం రవాణాను అరికట్టాలన్నా రు.అర్హులైన గీత కార్మికులకు మాత్రమే లైసెన్సు లు ఇవ్వాలని, గీత కార్మికులందరికి నెలకు రూ. 3 వేల పింఛను ఇవ్వాలని, గీత పారిశ్రామిక సహకార సొసైటీలను ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. కల్తీ కల్లు తయారు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభ్యులు అల్గోట్ రవీందర్, సంగం, ఎడ్ల రాజు, గైని శ్రీనివాస్ తదితరులున్నారు. -
కల్యాణ మండపం నిర్మాణానికి భూమి పూజ
భిక్కనూరు: కుల సంఘాలను అభివృద్ధి చేస్తామని బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పెద్దమల్లారెడ్డిలో ఎమ్మెల్యే సొంత నిధులతో చేపట్టిన ముదిరాజ్ సంఘం కల్యాణ మండపం నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఎమ్మెల్యే ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారన్నారు.కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు రమేష్, గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు లింగం, ప్రతినిధులు యాదగిరి, నరసింహులు, స్వామి, శంకర్, రాజు పాల్గొన్నారు. -
గుంతలకే పరిమితమైన ఇందిరమ్మ మోడల్హౌస్
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో చేపట్టిన ఇందిరమ్మ మోడల్హౌస్ నిర్మాణం గుంతలకే పరిమితమైంది. నిర్మాణ పనులు ప్రారంభించినప్పటి నుంచి ఇందిరమ్మ మోడల్హౌస్ నిర్మాణం నాలుగునెలల్లో పూర్తి చేయాలని అధికారు లు ముందుగా నిర్ణయించారు. నాగిరెడ్డిపేటలో మా త్రం గత ఫిబ్రవరి ఒకటో తేదీన ఇందిరమ్మ మోడల్హౌస్ నిర్మాణ పనులను అధికారులు ప్రారంభించారు. మూడు నెలలు గడుస్తున్నా నిర్మాణ పనులు ముందుకు సాగక అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మండల వ్యవసాయ కార్యాలయం ఎదురుగా ఇందిరమ్మ మోడల్హౌస్ నిర్మాణం కోసం తీసిన గుంతలతో కార్యాలయానికి వచ్చేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇందిరమ్మ మోడల్హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే రూ.5లక్షలు సరిపోవనే కారణంతో కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు ఎవరూ మందుకు రావడం లేదని తెలుస్తోంది. మోడల్హౌస్ నిర్మించేందుకు ముందుకురాని కాంట్రాక్టర్లు -
మొక్కజొన్న పంట దగ్ధం
పెద్దకొడప్గల్(జుక్కల్): మండలంలోని వడ్లం గ్రామ శివారులో ఓ రైతు సుమారు రెండు ఎకరాల్లో వేసిన మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని వడ్లం గ్రామానికి చెందిన మల్లయ్యల హన్మండ్లు తనకున్న 2.20 ఎకరాలల్లో మొక్కజొన్న పంటను సాగుచేశాడు. సోమవారం పొలం దగ్గరకు వెళ్లి చూడగా చేతికొచ్చిన పంటంతా కాలిపోయింది. పంటను అమ్మి అప్పులు తీర్చుకుందామంటే అగ్ని ప్రమాదంతో కష్టమంతా బూడిదపాలయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు రూ.లక్ష 50వేల నష్టం అయిందని, ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నాడు. రేపల్లెవాడలో గుడిసె.. ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని రేపల్లెవాడలో గ్యాస్ సిలెండర్ పేలి గుడిసె దగ్ధమైనట్లు గ్రామస్తులు సోమవారం తెలిపారు. గ్రామంలోని కుమ్మరి తిరుపతికి చెందిన గుడిసెలో అకస్మాత్తుగా గ్యాస్ సిలెండర్ పేలడంతో మంటలు అంటుకున్నాయి. ప్రమాదంలో ఇంట్లోని దుస్తులు, వంటసామగ్రి, అరతులం బంగారం, 20 తులాల వెండి కాలిబూడిదైనట్లు బాధితుడు తెలిపారు. ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నాడు. -
భారత్ను విశ్వగురువుగా నిలబెట్టడమే బీజేపీ లక్ష్యం
రాజంపేట/కామారెడ్డి రూరల్/భిక్కనూరు : భారత్ను విశ్వగురువుగా నిలబెట్టడమే బీజేపీ లక్ష్యమని, ఇందుకు మోదీతో పాటు ప్రతి కార్యకర్త నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారని రాజంపేట మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు సంపత్రెడ్డి అన్నారు. మండల శాఖ ఆధ్వర్యంలో పొందుర్తి శాఖ ఆధ్వర్యంలో, కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి శాఖ ఆధ్వర్యంలో, భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో ‘గావ్ చలో బస్తీ చలో’ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బూత్ కమిటీల సమావేశంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కుంటా లక్ష్మారెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి రాయపల్లి సంతోష్రెడ్డి, రాజంపేట మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు సంపత్రెడ్డిలు మాట్లాడారు.పెద్దమల్లారెడ్డి గ్రామంలో నల్ల పోచమ్మ ఆలయం వద్ద నాయకులు స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. కేంద్రం ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల కరపత్రాలను పలు చోట్ల పంపిణీ చేశారు. భిక్కనూరు మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు రమేష్, నియోజకవర్గ ఇన్చార్జి శ్రీధర్రెడ్డి, రాజంపేట మండల బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
మన పనుల్లో ఉత్తరాది కార్మికులు
ఉమ్మడి జిల్లాలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కార్మికులు గణనీయంగా పెరిగారు. ప్రతి రంగంలో వారి ఉనికి కనిపిస్తోంది. సుమారు ఐదువేల మంది వరకు కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నట్లు అంచనా. హోటళ్లలో కార్మికులుగా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. వ్యవసాయం, నిర్మాణ రంగం, ఇంటీరియర్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, టైల్స్, కార్పెంటర్ కార్మికులుగా బిహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వారు పని చేస్తున్నారు. బొటిక్స్, డిజైనింగ్ వంటి మహిళల వస్త్రాల పనులు పశ్చిమబెంగాల్ కార్మికులే చేస్తున్నారు. బంగారం పనులను బెంగాలీలే చేస్తున్నారు. అన్ని రంగాల్లో వారి ఉనికి ● నగరం నుంచి గ్రామం వరకు విస్తరించిన వలస కార్మికులు ● సుమారు ఐదు వేల మంది ఉన్నట్లు అంచనా ● హోటళ్లు, నిర్మాణ రంగం, వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వారే.. ● బంగారం పని, మహిళల వస్త్రాల డిజైనింగ్ పనుల్లోనూ వారి మార్క్ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కార్మికు లు రోజురోజుకూ పెరుగుతున్నారు. దీంతో ప్రతి రంగంలోనూ ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహా ర్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు, పనివాళ్లే కనిపిస్తున్నారు. గతంలో ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి ముంబయి, సూరత్, గల్ఫ్ దేశాలకు పనుల కోసం ఎక్కువగా వలసలు వెళ్లేవారు. ఇప్పటికీ ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళుతున్నప్పటికీ గతంతో పోలిస్తే సంఖ్య తగ్గింది. వివిధ రంగాల అభివృద్ధితో జిల్లాలోనూ ఉపాధి అవకాశాలు పెరిగాయి. స్థానికంగానూ ఎకానమీ పెరిగింది. అయితే స్థానికుల కంటే ఉత్తరాది రాష్ట్రాల వారినే పనిలో పెట్టుకునేందుకు జిల్లాలోని రైతులు, వ్యాపారులు మొగ్గు చూపుతున్నారు. నిర్దేశించుకున్న సమయానికి, తక్కువ వేతనాలతోనే ఉత్తరాది రాష్ట్రాల కార్మికులు పనులు చేస్తున్నారని, పైగా నైపుణ్యం ఎక్కువగా చూపిస్తున్నారని పలువురు చెబుతున్నారు. ఉత్తర భారతం నుంచి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు వివిధ పనుల నిమిత్తం సుమారు ఐదువేల మంది వరకు కార్మికులు వచ్చినట్లు అంచనా. ముఖ్యంగా హోటళ్లలో కార్మికులుగా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన సుమారు 500 మంది కార్మికులు ఉన్నారు. ఇటుక బట్టీలు మొదలు నిర్మాణరంగంలో బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుమారు 1,500 మంది కార్మికులు ఇంటీరియర్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, టైల్స్, కార్పెంటర్ కార్మికులుగా పని చేస్తున్నారు. సెలూన్స్లో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వాళ్లు పనిచేస్తున్నారు. వ్యవసాయ రంగంలో బిహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల కార్మికులు సుమారు 1,000 మంది వరకు పనిచేస్తున్నారు. వరినాట్ల సీజన్లో బిహార్ కూలీలు పనిచేస్తున్నారు. డెయిరీ పనితోపాటు చేపలు పట్టే పనులు సైతం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీలుగా చేస్తున్నారు. ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, బేకరీలు, స్వీట్హోంలలో ఒడిశా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ వాళ్లు పనిచేస్తున్నారు. బొటిక్స్, డిజైనింగ్ వంటి మహిళల వస్త్రాల పనులు పశ్చిమబెంగాల్ కార్మికులే చేస్తున్నారు. బంగారం పనులను బెంగాల్ వాళ్లే చేస్తున్నారు. వీరు 1,000 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. బిహార్కు చెందిన కూలీలు ఇటుకబట్టీలో సుమారు 500 మంది వరకు పనిచేస్తున్నారు. బోర్ డ్రిల్లింగ్, పొక్లెయిన్ ఆపరేటింగ్ పనుల్లో ఉత్తరప్రదేశ్, బిహార్కు చెందిన వాళ్లు పనిచేస్తున్నారు. ఇందులో కొందరు సీజన్ను బట్టి పనుల కోసం వచ్చి వెళుతుండగా, ఎక్కువమంది పనిచేసుకుంటూ కూలీలుగా జీవిస్తూ ఇక్కడే స్థిరపడినవారు సు మారు 3వేల మంది వరకు ఉండడం గమనార్హం. రాజస్తాన్కు చెందిన కొందరు నిజామాబాద్తో పాటు వివిధ మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీ గ్రామాల్లో స్వీట్హోమ్లు నిర్వహిస్తూ స్థిరపడ్డారు. కొన్ని ప్రైవేట్ పరిశ్రమలు, వాణిజ్య కేంద్రాల్లో సెక్యూరిటీ గార్డులుగా బిహార్, ఉత్తరప్రదేశ్కు చెందిన వారు పనిచేస్తున్నారు. పెద్ద హోటళ్లలో వర్కర్లుగా అస్సాంకు చెందిన యువకులు పనిచేస్తున్నారు. -
మహాలక్ష్మి బకాయిలను చెల్లించాలి
కామారెడ్డి టౌన్ : మహాలక్ష్మి పథకానికి సంబంధించిన బకాయిలను ఆర్టీసీకి వెంటనే చెల్లించాలని భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) రాష్ట్ర సంఘటన మంత్రి రామ్మోహన్ డిమాండ్ చేశారు. సో మవారం జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్ మైదానంలో బీఎంఎస్ అనుబంధ టీజీఎస్ఆర్టీసీ కార్మిక సంఘ్ నాలుగో రాష్ట్ర మహాసభ నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించాలన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ సంస్థ ద్వారా కొనుగోలు చేయాలన్నారు. కార్మికులపై వేధింపులు మానుకోవాలని, రిమూవ్ విధానాన్ని రద్దు చేయాలని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సంస్థలో అన్ని విభాగాల్లో చాలా ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ అధ్యక్షుడు కొండల సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్మిక్ సంఘ్ రాష్ట్ర కార్యవర్గం ఎన్నికబీఎంఎస్ అనుబంధ టీజీఎస్ఆర్టీసీ కార్మిక్ సంఘ్ రాష్ట్ర కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకటాచారి, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బసంత్, ఉపాధ్యక్షుడిగా శోభన్ బాబు, ప్రధాన కార్యదర్శిగా ఎర్ర స్వామి, కోశాధికారిగా రమేష్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా నోముల ప్రసాద్, సెక్రెటరీలుగా వెంకట్ యాదవ్, మాణిక్యం, ఎల్లం, రమేష్, నర్సింలు, శివకుమార్, అనసూయ, రవీందర్ గౌడ్, మనోహర్రావు, కులకర్ణి, సలహాదారులుగా వెంకట్రెడ్డి, తిరుపతి గౌడ్, రాఘవులు, గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఇన్చార్జీగా పి.శ్రీపతి, హైదరాబాద్ జోన్ ఇన్చార్జీగా టి.పోషాద్రి ఎన్నికయ్యారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి బీఎంఎస్ రాష్ట్ర సంఘటన మంత్రి రామ్మోహన్ -
పరిష్కారం దొరికేనా?
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : భూ భారతి ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతామని ప్రభుత్వం చెబుతోంది. అందులో భాగంగా ఎంపిక చేసిన మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి అక్కడ వచ్చిన ఫలితాల ఆధారంగా మార్పులు చేర్పులతో రాష్ట్రమంతటా అమలు చేయాలని సంకల్పించింది. కాగా లింగంపేట మండలంలో అనేక వివాదాలున్నాయి. గతంలో నకిలీ పాస్పుస్తకాల తయారు చేయడంతోపాటు వాటిపై రుణాలు తీసుకున్న ఉదంతాలు ఎన్నో వెలుగు చూశాయి. ఇప్పటికీ లింగంపేట మండలంలో అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. చాలా గ్రామాల్లో అటవీ భూములు, ప్రభుత్వ భూములు, అసైన్మెంట్ భూములకు సంబంధించిన వివాదాలున్నాయి. రైతులు సాగు చేసుకుంటున్న అటవీ భూములకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చింది. అయితే వాటిపై రైతులకు హక్కు లేదంటూ అటవీ అధికారులు పంటలను ధ్వంసం చేసిన సంఘటనలున్నాయి. మండల కేంద్రంలోనూ వివాదాలు.. లింగంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంతో సహా అన్ని కార్యాలయాలు, జూనియర్ కాలేజీ భవనం ఉన్న భూములకు సంబంధించిన వివాదాలు ఉన్నాయి. ధరణిలో వాటికి ఎలాంటి పరిష్కారం చూపలేదు. సాగు భూములు, నివాస గృహాలకు సంబంధించి కొన్ని సర్వే నంబర్లను ఫారెస్ట్ గెజిట్లో పేర్కొన్నారు. దీంతో ఆ భూములకు పాస్ పుస్తకాలు జారీ కాలేదు. ఫలితంగా రైతులకు రైతుబంధు అందలేదు. భూభారతి అయినా దారి చూపేనా... ప్రభుత్వం భూములకు సంబంధించిన అన్ని వివాదాలను పరిష్కరిస్తామని చెబుతోంది. ఆయా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే దీనిని తీసుకువచ్చామంటోంది. ఈ నేపథ్యంలో లింగంపేట మండలంలో దశాబ్దాలుగా ఉన్న భూ వివాదాలకు భూభారతి ద్వారానైనా పరిష్కారం దొరుకుతుందా అన్న అంశంపై చర్చ నడుస్తోంది. రాష్ట్రానికి దిక్సూచిలా ఉండేలా ఇక్కడ అమలు జరిగితేనే సత్ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. సర్కారు తీసుకువచ్చిన నూతన పోర్టల్పై ఈ ప్రాంత రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.అసైన్డ్ పట్టాల లెక్క తేలేనా?ప్రభుత్వాలు భూ మిలేని పేదలకు ము ఖ్యంగా దళితలు, గిరిజనులకు ఇచ్చిన అసైన్డ్ భూములకు సంబంధించి చాలా వివాదాలున్నా యి. అప్పట్లో ఇష్టారీతిన పట్టాలు జారీ చేశారు. ప్రభుత్వాలు ఏటా కొందరికి అసైన్డ్ భూముల పట్టాలు ఇస్తూ పోయాయి. ఒక్కో సర్వే నంబరు లో ఉన్న భూవిస్తీర్ణం కన్నా ఎక్కువ విస్తీర్ణానికి ప ట్టాలు ఇచ్చారు. విస్తీర్ణం కన్నా ఎక్కువ పట్టాలు ఉండడంతో వివాదాలు ఏర్పడ్డాయి. దీంతో త మకు పట్టా ఉందంటే తమకు ఉందంటూ గొడ వలకు దిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అ లాగే అటవీ భూముల్లో పోడు సేద్యం చేస్తున్న రై తులకు గతంలో ప్రభుత్వాలు ఆర్వోఎఫ్ఆర్ ప ట్టాలు ఇచ్చాయి. అయితే పట్టాలు ఉన్నా అటవీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకోవడంతో రైతులకు, అటవీ అధికారులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. భూ వివాదాలను పరిష్కరించడంలో ధరణి విఫలమవడమే గాకుండా అనేక సమస్యలను తెచ్చిపెట్టిందని భావిస్తు న్న ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం.. దాని స్థానంలో భూ భారతి పోర్టల్ను తీసుకువచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి ప్రయోగాత్మకంగా రాష్ట్రంలో నాలుగు మండలాలను ఎంపిక చేసింది. అందులో జిల్లాలోని లింగంపేట మండలం ఒకటి. మంగళవారంనుంచి లింగంపేట మండలంలో భూభారతి పోర్టల్ పనిచేయనుంది. ఇక్కడి అధికారులు భూభారతి పోర్టల్ ద్వారానే భూ రికార్డుల పరిశీలన, సరిచేయడం, రిజిస్ట్రేషన్లు... ఇలా ప్రతీది చేపట్టనున్నారు. ధరణి పోర్టల్ స్థానంలో ‘భూ భారతి’ పైలట్ ప్రాజెక్టుగా లింగంపేట ఎంపిక నేటి నుంచి అమలుకు చర్యలు -
కేంద్రీయ విద్యాలయం కోసం ఉన్నత పాఠశాల పరిశీలన
మద్నూర్: కేంద్రీయ విద్యాలయం కోసం మద్నూర్లోని బాలుర ఉన్నత పాఠశాలను సోమవారం ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పరిశీ లించారు. కేంద్రీయ విద్యాలయం కోసం పక్షం క్రితం కేంద్రీయ విద్యాలయాల డిప్యూ టీ కమిషనర్ మంజునాథ్, డీఈవో రాజు మద్నూర్లో రెండు స్థలాలను పరిశీలించా రు. కానీ అవి అనుకులంగా లేవని తిరస్కరించారు. ఈసారి సరైన స్థలం చూపించకపోతే కేంద్రీయ విద్యాలయం ఇతర ప్రాంతాలకు తరలిపోయే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే హైస్కూల్ను పరిశీలించి, గదుల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలుర ఉన్నత పాఠశాలలో తాత్కాలికంగా కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామన్నారు. బాలుర ఉన్నత పాఠశాలను పక్కనే ఉన్న ప్రాథమిక, ఉర్దూ మీడియం పాఠశాల భవనంలో సర్దుబాటు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులు ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగ్నాథ్, విజయ్, భీం తదితరులున్నారు. నేడు కామారెడ్డిలో జాబ్ మేళా కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో న్యూలాండ్ లాబోరేటరీస్ ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధి కారి షేక్ సలాం సోమవారం ఒక ప్రకట న లో తెలిపారు. ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీ సీ, ఫార్మాటెక్, ఎంఎల్టీ బ్రిడ్జి కోర్సు, బీఎ స్సీ కెమిస్ట్రీ పూర్తి చేసినవారు ఒరిజినల్ సర్టి ఫికెట్లతో జాబ్మేళాకు హాజరుకావాలన్నా రు. ఈనెల 16న బాన్సువాడ, 17న ఎల్లారె డ్డి, 18న బిచ్కుంద ప్రభుత్వ జూనియర్ క ళాశాలల్లో జాబ్ మేళాలు ఉంటాయన్నారు. ఓరియంటల్ స్కూల్కు పూర్వ విద్యార్థుల విరాళం కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఓరియంటల్ స్కూల్ అభివృద్ధి కోసం 2000–2001 పూర్వ విద్యార్థులు సోమవా రం లక్ష రూపాయల విరాళం ఇచ్చారు. ప్ర స్తుత హెచ్ఎం సుధాకర్, పూర్వ హెచ్ఎం మురళిరెడ్డి, ఉపాధ్యాయుడు భాస్కరశర్మల ను సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ వి ద్యార్థులు రంజిత్కుమార్, చంద్రశేఖర్, అని ల్, కళ్యాణ్, స్వామి, ప్రసన్న, సంధ్య, కరుణ శ్రీ తదితరులు పాల్గొన్నారు. నేడు బాన్సువాడకు ఎమ్మెల్సీ కవిత రాక బాన్సువాడ : బాన్సువాడకు మంగళవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రానున్నారు. పట్టణంలోని భారత్ గార్డెన్లో నిర్వహించే పార్టీ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో వారు పాల్గొంటారని బీఆర్ఎస్ పట్టణ నాయకులు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. సబ్స్టేషన్లో వీసీబీ ప్రారంభం లింగంపేట: అయిలాపూర్లోని సబ్ స్టేషన్ లో వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్(వీసీబీ) ఫీ డర్ను సోమవారం ఎస్ఈ శ్రవణ్కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీడర్ బ్రేకర్ ద్వారా అయిలాపూర్ గ్రామానికి 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి డీఈ విజయసారథి, ఏడీఈ మల్లేశం, ఎల్ఎం మోతీలాల్, ఏఎల్ఎంలు మల్లయ్య, ఆదిరెడ్డి, సాయిలు తదితరులు పాల్గొన్నారు. జింక పిల్ల లభ్యం రుద్రూర్: పోతంగల్ మండలం కల్లూర్ గ్రా మ శివారులో సోమవారం రైతులకు జింక పిల్ల కనిపించింది. దానిని వారు అటవీశాఖ సిబ్బందికి అప్పగించారు. అధికారులు వర్ని ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించి చికిత్స చేయించారు. -
రికార్డు స్థాయిలో రక్తసేకరణ
తాడ్వాయి : అంబేడ్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా 135 యూనిట్ల రక్తాన్ని సేకరించడం గొప్ప విషయమని అడిషనల్ కలెక్టర్ చందర్నాయక్ పేర్కొన్నారు. తలసేమియా బాధిత చిన్నారుల కోసం సోమవారం తాడ్వాయి హైస్కూల్లో జిల్లా రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్యఫెడరేషన్, అంబేడ్కర్ సంఘాల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రక్త సేకరణలో తాడ్వాయి మండలం ఆదర్శంగా నిలిచిందన్నారు. మానవతా దృక్పథంతో రక్తదానానికి ముందుకు వచ్చిన వారిని అభినందించారు. రక్తదాతలకు ప్రశంసాపత్రాలను అందజేశారు. అనంతరం ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ బాలు, రక్తదాతల సమూహం జిల్లా అధ్యక్షుడు జమీల్ మాట్లాడారు. రెండేళ్లలో కామారెడ్డి జిల్లాలో తలసేమియావ్యాధితో బాధపడుతున్న వారికోసం నాలుగు వేల యూనిట్ల రక్తం సేకరించినట్లు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో అధిక రక్తాన్ని సేకరించిన ఘనత కామారెడ్డి జిల్లాకు దక్కిందన్నారు. దీంతో ఇండియన్ బుక్ఆఫ్ రికార్డులో కూడా చోటు దక్కిందన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొని యువకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో రామస్వామి, కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, సింగిల్విండో చైర్మన్ కపిల్ రెడ్డి, కాంగ్రెస్ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు భాగయ్య, నియోజకవర్గ అధ్యక్షుడు గైని శివాజీ, నాయకులు వెంకటి, వేదప్రకాష్, వెంకటరమణ, ఎర్రం చంద్రశేఖర్, సంజీవులు, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తలసేమియా వ్యాధి బాధితుల కోసం నిర్వహించిన శిబిరానికి విశేష స్పందన అభినందించిన అడిషనల్ కలెక్టర్ చందర్నాయక్ -
పంటను కాపాడుకునేందుకు భగీరథయత్నం
● బండరామేశ్వర్పల్లి గ్రామానికి చెందిన గోత్రాల శంకర్ అనే రైతు ఐదెకరాలలో వరి వేశాడు. రెండు బోరు బావులు వట్టిపోయాయి. దీంతో పక్కరైతు బోరు నుంచి పైపు వేసుకుని పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ● అక్కాపూర్ గ్రామానికి చెందిన అరిగె లక్ష్మణ్ అనే రైతు ఉన్న ఒక్క బోరు కింద ఆరు ఎకరాల వరి సాగు చేశాడు. మండుతున్న ఎండలతో భూగర్భజలాలు తగ్గిపోయి బోరు వట్టిపోయింది. దీంతో ఎకరం వరకు పంట ఎండిపోయింది. మిగిలిన పంటను కాపాడుకునేందుకు అప్పులు చేసి మరో బోరు తవ్వించాడు. ప్రస్తుతం ఆ బోరు నీటితో వరుస తడులు అందిస్తున్నాడు.మాచారెడ్డి : మండుతున్న ఎండలతో భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోతున్నాయి. కళ్లముందే పంటలు ఎండిపోతుండడంతో తట్టుకోలేని రైతులు.. సాగునీటి కోసం భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్తగా బోరుబావులు తవ్విస్తున్నారు. అయినా ఫలితం ఉండడం లేదు. దీంతో చేసేదేమీ లేక పలువురు రైతులు పంటపై ఆశలు వదిలేసుకుని పశువులను మేపుతున్నారు. ఓవైపు సాగునీరందక పంటలు ఎండిపోతుంటే.. మరోవైపు తెగుళ్లతో మరింత నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
కల్వర్టు గుంతలో పడి ఇద్దరికి గాయాలు
ఎల్లారెడ్డి: మండలంలోని తిమ్మారెడ్డి గ్రామ శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. అన్నాసాగర్ గ్రామానికి చెందిన బాలరాజు, తన కూతురు భావనతో కలిసి ఆదివారం బైక్పై ఎల్లారెడ్డికి బయలుదేరారు. తిమ్మారెడ్డి గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదవశాత్తు కల్వర్టు గుంతలో వారు పడిపోయారు. ఈ ఘటనలో తండ్రి, కూతురికి గాయాలు కావడంతో స్థానికులు ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలరాజుకు తీవ్రగాయాలు కావడంతో కామారెడ్డికి రిఫర్ చేసినట్లు వైద్యులు తెలిపారు. రోడ్డు పనులు జరుగుతున్న సమయంలో ఎలాంటి ప్రమాద సూచికలు ఏర్పా టు చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నా యని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
బడిలో చోరీకి యత్నించిన దుండగులు
కామారెడ్డి రూరల్: పాఠశాలలో చొరబడిన ముగ్గురు దొంగలు చోరీకి యత్నించగా గ్రామస్తులు వారిని వెంబడించి, ఒకరిని పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా.. టేక్రియాల్ జెడ్పీహెచ్ఎస్లో ఆదివారం పాఠశాల వెనకాల ఉన్న ప్రహరీ నుంచి గుర్తుతెలియని ముగ్గురు దుండగులు బడిలోకి ప్రవేశించారు. వరండాలోని ఓ సెల్ఫ్ పైన ఉన్న ఫ్యాన్లు, ఇతర ఎలక్ట్రికల్ వస్తువులను సంచిలో వేసుకొని ఎత్తుకెళ్తుండగా స్థానికులు గమనించి వెంబడించారు. ఇద్దరు దుండగులు ప్రహరీ దూకి పారిపోగా, ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్రూం తాళాన్ని కూడా పగలగొట్టడానికి దొంగలు యత్నించినట్లు తెలిపారు. -
టర్బయిన్ల ఆధునికీకరణ పనుల్లో జాప్యం
నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ ప్రాజెక్టు జల విద్యుదుత్పత్తి కేంద్రం టర్బయిన్ల ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. విద్యుదుత్పత్తి చేయడానినికి మరింత ఆలస్యం కానుంది . ఈటర్బయిన్ల మరమ్మతుకు 2020 సంవత్సరంలో రూ. 12 కోట్లు మంజూరు అయ్యాయి. నిజాంసాగర్ ప్రాజెక్టుకు అనుసంధానంగా హెడ్స్లూయిస్ వద్ద 15 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి సామర్థ్యంతో జల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని 1954 ఏర్పాటు చేశారు. హైడ్రో ఎలక్ట్రిక్ జనరేషన్ కింద మూడు టర్బయిన్లు ఏర్పాటు చేశారు. మూడో టర్బయిన్ 1974లో చెడిపోయి మూలనపడింది. సదరు టర్బయిన్ మూలన పడి 50 ఏళ్లు గడిచినా ఇంత వరకు మరమ్మతుకు నోచుకోవడం లేదు. జలవిద్యుదుత్పత్తి చేపడుతున్న రెండు టర్బయిన్లు సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అవుతుండటంతో మరమ్మతులకు అనుమతించారు. రెండో టర్బయిన్ మరమ్మతులు ప్రారంభించారు. సదరు టర్బయిన్లో పరికరాలు పూర్తిగా దెబ్బతినడంతో అనుకున్నంతగా పనులు ముందుకు సాగడం లేదు.జలవిద్యుదుత్పత్తి కేంద్రం ఆధునికీకరణతో పాటు టర్బయిన్లకు పూర్తి మరమ్మతు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దాంతో ప్రభుత్వం రూ. 12 కోట్లు మంజూరు చేసినా పనులు అసంపూర్తిగా ఉన్నాయి. టర్బయిన్ల మరమ్మతులు ఆలస్యం అవుతుండటంతో జలవిద్యుద్పుత్తి నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు స్పందించి వేసవిలో పనులు త్వరగా పూర్తి చేస్తే వానకాలంలో జలవిద్యుదుత్పత్తి ప్రారంభించవచ్చు. హెడ్స్లూయిస్ జల విద్యుద్పుత్తి కేంద్రం నిజాంసాగర్ ప్రాజెక్టు జలవిద్యుదుత్పత్తి కేంద్రంలో తలెత్తిన సాంకేతిక సమస్యలు మూడోటర్బయిన్కు యాభై ఏళ్లుగా మరమ్మతులు కరువు దెబ్బతిన్న పరికరాలకు నిధులు మంజూరైనా ముందుకు సాగని పనులు రూ. కోటి మంజూరుకు ప్రతిపాదనలు జల విద్యుద్పుత్తి కేంద్రం మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. రెండవ టర్బయిన్ అనుకున్న దానికన్నా ఎక్కువగా మరమ్మతులు చేపట్టాల్సిన పరిస్థితి ఉంది. ప్యానల్ బోర్డు, ఎలక్ట్రికల్ పరికరాలు, వైరింగ్, టర్బయిన్ మరమ్మతులకు నిధులు ఏమాత్రం సరిపోవడం లేదు. రూ.కోటి మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదించాం. – రవికుమార్, ఏడీ, సివిల్ ఆర్అండ్ఎం -
నందిపేటలో ధాన్యం బస్తాల చోరీ
నందిపేట్(ఆర్మూర్): వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం నుంచి రైస్మిల్కు లారీ తరలిస్తుండగా మార్గమధ్యలో డ్రైవర్ చోరీ చేసిన ఘటన నందిపేట మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. నందిపేట మండలం చింరాజ్పల్లి సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఆదివారం డొంకేశ్వర్ మండలం నూత్పల్లి గ్రామంలోని రాజరాజేశ్వర రైస్మిల్కు తరలించారు. మార్గమధ్యలో నందిపేట వద్ద డ్రైవర్ లారీని నిలిపి, కొన్ని ధాన్యం బస్తాలను ఆటోలో ఎక్కించాడు. ఈ తతంగాన్ని స్థానికులు అనుమానంతో వీడియో తీసి, సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్ అయింది. వీడియోను చూసిన రైతులు సొసైటీకి వెళ్లి అధికారులను అడగడంతో తాము కూడ లారీ ఇంకా రైస్మిల్కు చేరలేదని ఆందోళన చెందుతున్నామన్నారు. అనంతరం అధికారులు రైతులతో కలిసి ఘటన స్థలానికి వెళ్లి లారీ డ్రైవర్ను నిలదీయగా, చోరీని ఒప్పుకున్పాడు. గత మూడు రోజుల నుంచి ఇలాగే లారీలో బస్తాలు తక్కువగా రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
రాజీవ్ యువ వికాసానికి ఆన్లైన్ అవస్థలు
బిచ్కుంద(జుక్కల్) : నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం ఆశావాహుల్లో ఆందోళన కనిపిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలకు మూడు రోజులు సెలవులు రావడంతో కుల, ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందలేదు. వీటితో పాటు మీసేవాలో దరఖాస్తులు చేసుకుంటున్న యువతకు ఆన్లైన్ అవస్ధలు, సర్వర్ బిజీతో సైట్ ఓపెన్ కావడం లేదు. అందరు ఒకేసారి దరఖాస్తులు చేసుకోవడం సర్వర్ బిజీతో మీసేవా వద్ద దరఖాస్తుదారులు పడిగాపులు కాస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ సమస్యనే ఎదుర్కొంటున్నారు. దరఖాస్తు కోసం సోమవారం ఆఖరు. శని, ఆది సెలవులు రావడంతో తహసీల్ కార్యాలయాలు మూసి ఉన్నాయి. కొందరికి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు అందక దరఖాస్తులు చేసుకోలేకపోతున్నారు. ప్రభుత్వం గడువు పెంచి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దరఖాస్తు చేసుకునే విధంగా మరోసారి అవకాశం కల్పించాలని నిరుద్యోగ యువత కోరుతున్నారు. నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు వరుసగా సెలవులు అందని ధ్రువీకరణ పత్రాలు -
51ఏళ్ల తర్వాత కలిసిన బాల్య మిత్రులు
డిచ్పల్లి: వారంతా పూర్వ విద్యార్థులు. 51ఏళ్ల క్రితం పదోతరగతి చదివి ఎక్కడెక్కడో స్థిరపడిన వారు. మళ్లీ ఇన్నాళ్లకు కలిశారు. గత మధురస్మృతులను నెమరువేసుకుని పరవశించి పోయారు. జిల్లా కేంద్రంలోని మాణిక్ భవన్ పాఠశాలలో 1973–74 పదోతరగతి బ్యాచ్ విద్యార్థులు డిచ్పల్లిలోని ఫాంహౌస్లో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆటపాటలతో అలరించారు. హైదరాబాద్, విశాఖపట్నంతో పాటు అమెరికాలో స్థిరపడిన ఒకరు సమ్మేళనానికి తరలివచ్చారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఈగ సంజీవ్రెడ్డి ముఖ్యఅతిథిగా ఆటపాటలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. డిచ్పల్లి సొసైటీ మాజీ చైర్మన్ గజవాడ జైపాల్, నాగరాజు, అశోక్, చిరంజీవి, ఉమాపతి, చంద్రసేన్, సుబ్రహ్మణ్యం, రాజేశ్వర్, జనార్ధన్ యాదవ్, వీరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డిలో 22ఏళ్లకు.. కామారెడ్డి రూరల్: కామారెడ్డిలోని వివేకనంద పాఠశాలలో 2002–2003 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు 22 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. 60 మంది విద్యార్థులకుగాను 45 మంది పూర్వ విద్యార్థులు ఆదివారం పట్టణంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరై, ఆనాటి తీపి గుర్తులను గుర్తుచేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆనాటి గురువులను సన్మానించారు. అనంతరం ఆటపాటలు, వింధుభోజనంతో ఆహ్లాదంగా గడిపారు. నగేష్గుప్తా, మహేశ్వరీ, బబిత, జ్యోతి, దొడ్లె సంజీవ్కుమార్, సుధాకర్, భాస్కర్, రణధీర్ తదితరులు ఉన్నారు. ఎల్లారెడ్డిలో ముప్పై ఏళ్లకు.. ఎల్లారెడ్డిరూరల్: పట్టణంలోని జిల్లా పరిషత్ బాలు ర ఉన్నత పాఠశాలకు చెందిన 1994–95 బ్యాచ్ ఎస్సెస్సీ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి 30 ఏళ్ల తరువాత విద్యార్థులంతా కలుసుకున్నారు. అనంతరం వారికి పాఠాలను బోధించిన ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పద్మ శ్రీకాంత్, వెంకట్రాములు, వెంకటేశం, దత్తు, విజయ్, నర్సింలు తదితరులున్నారు. పెద్దవాల్గోట్లో 21ఏళ్లకు.. సిరికొండ: మండలంలోని పెద్దవాల్గోట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం 2003–04 ఎస్సెస్సీ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వారు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకొని సరదాగా గడిపారు. ఆనాడు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. పద్మాజీవాడిలో 25ఏళ్లకు.. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని పద్మాజీవాడిలో ఆదివారం మాతృశ్రీ జూనియర్ కళాశాలకు చెందిన 1998–2000 బ్యాచ్ ఇంటర్ విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత ఒక్కచోట చేరారు. పద్మాజీవాడి శివారులో ఓ వ్యవసాయ క్షేత్రంలో కలుసుకుని గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆనాటి గురువులను సన్మానించారు. గురువులు రాజ గంబీర్రావు, గోపాల్రెడ్డి, లింగారెడ్డి, కృష్ణ, కృష్ణ ప్రసాద్, పూర్వ విద్యార్థులు శ్రీధర్ రెడ్డి, కృష్ణరెడ్డి, సంతోష్, రాజేందర్, శ్రీకాంత్, మోహన్, గంగాధర్, సురేందర్, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.