Kamareddy District News
-
ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలి
భిక్కనూరు: యువత పదిమందికి ఉద్యోగాలు ఇచ్చే స్థితికి చేరుకోవాలని, దానికి అనుగుణంగా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి సూచించారు. భిక్కనూరులోని తెయూ సౌత్క్యాంపస్లో సోషల్ వర్క్ విభాగం ఆధ్వర్యంలో గురువారం రెండురోజుల జాతీయ స్థాయి సెమినార్ ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులకు జాబ్ ఓరియంటెడ్ కోర్సులను ప్రవేశపెట్టడానికి ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోందన్నారు. అలాగే వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకుంటూ ఇంటర్న్షిప్ అవకాశాలు కూడా అందేలా చర్యలు తీసుకుంటోందన్నారు. సోషల్ వర్క్ కోర్సుతో విద్యార్థులకు ఉద్యోగావకాశాలు పెరిగాయని తెయూ వైస్ చాన్స్లర్ యాదగిరిరావు పేర్కొన్నారు. విద్యార్థుల పరిశోధనలకు కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులు చదువుతో పాటు జీవితానికి అవసరమైన పనులు నేర్చుకోవాలని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు, సామాజికవేత్త ప్రసన్నకుమార్ సూచించారు. చదువుకుంటూనే కొత్త ఆవిష్కరణలు చెయ్యాలన్నారు. స్థానిక వనరులను ఉపయోగించుకుంటూ ఉద్యోగ అవకాశాల కల్పనకు కృషిచేయాలని వరంగల్ నిట్ ప్రొఫెసర్ పి.రాములు సూచించారు. సెమినార్ అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మన్ సౌత్క్యాంపస్లోని కెమిస్ట్రీ ల్యాబ్ను పరిశీలించారు. సెమినార్లో తెయూ రిజిస్ట్రార్ యాదగిరి, సౌత్క్యాంపస్ ప్రిన్సిపల్ సుధాకర్గౌడ్, సెమినార్ కన్వీనర్ వీరభద్రం, సోషల్ వర్క్ హెచ్వోడీ రాజేశ్వరి, ఫిజిక్స్ హెచ్వోడీ మోహన్బాబు, కెమిస్ట్రీ బీవోఎస్ నాగరాజు, ఏపీఆర్వో సరిత, అధ్యాపకులు యాలాద్రి, నర్సయ్య, రమాదేవి, వైశాలి, నవీన్రావు, లలిత, ప్రతిజ్ఞ, కవిత పాల్గొన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి ప్రారంభమైన జాతీయ స్థాయి సెమినార్ -
ఆటలకు చోటేదీ?
లింగంపేట: జిల్లాలో కోచ్లు, వసతుల లేమితో ఆటలపై ఆదరణ తగ్గుతోంది. మైదానాలు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభ వెలుగులోకి రావడం లేదు. జిల్లా కేంద్రంలో అథ్లెటిక్స్ మినీ స్టేడియం తప్ప జిల్లాలోని 25 మండలాల్లో ఎక్కడా మినీ స్టేడియంలు లేవు. మండల స్థాయిలో కూడా సరైన మైదానాలు లేవు. దీంతో ఆయా గ్రామాల్లోని పాఠశాలల గ్రౌండ్నే క్రీడాకారులు ఉపయోగించుకుంటున్నారు. గతంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. అయితే వాటిని పట్టించుకునేవారు లేకపోవడంతో మరుగునపడ్డాయి. వాటిని క్రీడా మైదానాలుగా మార్చి వసతులు కల్పించాలని క్రీడాకారులు కోరుతున్నారు. సౌకర్యాలు లేకున్నా రాణిస్తున్న క్రీడాకారులు జిల్లాలో సరైన వసతులు లేకపోయినా పలువురు క్రీడాకారులు ఆటల్లో సత్తా చాటుతున్నారు. కోమట్పల్లి గ్రామానికి చెందిన నాయిని అల్లురాజు వాలీబాల్, కబడ్డీ, హైజంప్, లాంగ్ జంప్, రన్నింగ్ అంశాలలో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభచాటాడు. బాణాపూర్కు చెందిన బరిగె నరేశ్, లింగంపేటకు చెందిన షానవాజ్, మోతె గ్రామానికి చెందిన సయ్యద్ సద్దాం హుస్సేన్, ప్రసాద్ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో రాణించారు. శెట్పల్లి హైస్కూల్ విద్యార్థినులు రుచిత, మేనక రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో సత్తా చాటారు. వీరంతా కేవలం పాఠశాలలు, గ్రామాల్లో ఉన్న ఖాళీ స్థలాలను వినియోగించుకుంటూ ఆటల్లో రాణిస్తున్నారు. మండల స్థాయిలో మినీస్టేడియాలు నిర్మిస్తే చాలా మంది క్రీడాకారులను తయారు చేయొచ్చని సీనియర్ క్రీడాకారులు పేర్కొంటున్నారు. మండల కేంద్రాలలో మైదానాలు కరువు కలగానే మినీ స్టేడియాలు ఆసక్తి ఉన్నా ఆటలాడలేకపోతున్న క్రీడాకారులు -
రైతులకు భారీ నష్టం
వైరస్ కారణంగా పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వేల సంఖ్యలో కోళ్లు మూకుమ్మడిగా మృత్యువాత పడుతుండడంతో ఆవేదన చెందుతున్నారు. చాలామంది రైతులు చికెన్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని కోళ్లను పెంచుతున్నారు. కోడి పిల్లలు, దాణా కంపెనీలు సరఫరా చేస్తుంటాయి. మ్యాన్పవర్తోపాటు మిగతా ఏర్పాట్లు కోళ్ల ఫారాల నిర్వాహకులే చూడాల్సి ఉంటుంది. కోళ్లు చేతికొచ్చే సమయంలో ఒక్కసారిగా మృత్యువాతపడుతుండడంతో పౌల్ట్రీ రైతులకు దిక్కుతోచడం లేదు. బాన్సువాడ డివిజన్ పరిధిలోని తిర్మలాపూర్లో వెయ్యి, కిష్టాపూర్లో 2 వేలు, బోర్లంలో 6 వేలు, చించోలి లో 1,500 కోళ్లు మృతిచెందాయి. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ ప్రాంతంలో పది రోజుల్లో సుమారు 60 వేల కోళ్లు చనిపోయాయి. వైరస్ కారణంగా కోళ్లు చనిపోతుండడంతో లక్షల రూపాయలు నష్టపోతున్నామని పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కారు ఆదుకోవాలని కోరుతున్నారు. -
పరీక్షలంటే భయం వీడాలి
ఎల్లారెడ్డిరూరల్: విద్యార్థులు పరీక్షలంటే భయం వీడాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. గురువారం ఆయన ఎల్లారెడ్డి పట్టణంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. కష్టపడి చదవాలని సూచించారు. ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ ద్వారా చదువుపై దృష్టి సారించాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో ప్రభాకర్, తహసీల్దార్ మహేందర్, మున్సిపల్ కమిషనర్ మహేష్కుమార్, ఆర్సీవో గంగారాం నాయక్, ప్రిన్సిపల్ సావిత్రి, ఎంపీవో ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. డబుల్బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గిరిజన బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి వెళ్తుండగా స్థానికులు ఆయనను కలిశారు. నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. చదువులపై దృష్టి సారించాలి గురుకుల విద్యార్థులతో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
నేడు డయల్ యువర్ ఆర్టీసీ ఆఫీసర్
కామారెడ్డి టౌన్: నిజామాబాద్ రీజియన్ పరిధిలోని ఆర్టీసీ డిపోలలో శుక్రవారం డయల్ యువర్ ఆర్టీసీ ఆఫీసర్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంస్థ రీజినల్ మేనేజర్ టి.జ్యోత్స్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు ఫోన్ చేసి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఫోన్ చేయాల్సిన నంబర్లు.. రీజినల్ మేనేజర్, నిజామాబాద్ 99592 26011 డిపో మేనేజర్, కామారెడ్డి 99592 26018 డిపో మేనేజర్, బాన్సువాడ 99592 26020 ‘నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తాం’ కామారెడ్డి టౌన్: వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రావణ్ కుమార్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని పలు సబ్ స్టేషన్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి సర్కిల్ పరిధిలో ఈ నెలలో ఒకరోజులో గరిష్ట విద్యుత్ డిమాండ్ 7.045 మిలియన్ యూనిట్లుగా నమోదయ్యిందన్నారు. రాబోయే మూడు నెలల్లో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. -
పౌల్ట్రీపై వైరస్ దాడి
కోళ్లకు అంతుచిక్కని వైరస్ సోకుతోంది. దీంతో 15 రోజులుగా కోళ్లు మృతిచెందుతున్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతంలో బర్డ్ఫ్లూ కేసులు వెలుగు చూడడంతో ఇక్కడా అదే వైరస్తో కోళ్లు మృతి చెందుతున్నాయని అనుమానిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన వెటర్నరీ అధికారులు.. కోళ్ల నుంచి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం మధ్యప్రదేశ్లోని భోపాల్లోగల ల్యాబ్కు పంపించారు. వాటి ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. ఫలితాలు వచ్చేంతవరకు ఏ వైరస్తో కోళ్లు మృతిచెందుతున్నాయో చెప్పలేమని అధికారులు పేర్కొంటున్నారు. గిరాకీ లేక.. వైరస్ సోకి కోళ్లు మృతిచెందుతూ ఓవైపు కోళ్ల ఫారాలు ఖాళీ అవుతుండగా.. మరోవైపు చికెన్ తినాలంటే జనం జంకుతున్నారు. దీంతో పట్టణాలు, గ్రామాలు అనే వ్యత్యాసం లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ చికెన్ సెంటర్లు వెలవెలబోతున్నాయి. కోళ్ల అమ్మకాలు లేక ఇబ్బందిపడుతున్నామని చెకెన్ సెంటర్ల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేల సంఖ్యలో కోళ్ల మృత్యువాత మూతపడుతున్న కోళ్ల ఫారాలు చికెన్ తినేందుకు జంకుతున్న జనం వెలవెలబోతున్న చికెన్ సెంటర్లు -
అటవీ ప్రాంతంలో మంటలు
నాగిరెడ్డిపేట: తాండూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఫారెస్ట్ అధికారులు పెంచుతున్న నీలగిరి చెట్లు కొంతమేర దెబ్బతిన్నాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న డీఎఫ్ఆర్వో రవికుమార్, బీట్ అధికారి నవీన్ ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. చెలరేగిన మంటలను ఆర్పివేశారు. కాగా మండలంలోని బంజర సమీపంలో గల అటవీ ప్రాంతంలోనూ బుధవారం రాత్రి మంటలు చెలరేగడంతో ఫారెస్ట్ అధికారులు అక్కడికి వెళ్లి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఇటీవల మాల్తుమ్మెద విత్తనోత్పత్తి క్షేత్రంలోనూ మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. మండలంలో జరుగుతున్న వరుస ఘటనలతో ఫారెస్ట్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. -
సీసీ కెమెరాలతో అనేక ప్రయోజనాలు
కామారెడ్డి క్రైం: సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయని మల్టీ జోన్–1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాల ప్రాధాన్యతను గుర్తించాలన్నారు. గురువారం ఆయన కామారెడ్డికి వచ్చారు. జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూం, పట్టణంలోని ఇంటర్నేషనల్ హోటల్ నుంచి ఆర్అండ్బీ అతిథి గృహం వరకు ప్రధాన రహదారి వెంట నూతనంగా ఏర్పాటు చేసిన 98 సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో సహకరించిన ఈ ప్రాంతంలోని దాతలందరినీ అభినందించారు. దొంగతనాలు, మహిళలపై వేధింపులు, చైన్స్నాచింగ్, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా ఉండడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఏదైనా ఘటన జరిగినా వెంటనే గుర్తించడానికి వీలు ఉంటుందన్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు, వ్యాపార సముదాయాల వారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని సూచించారు. అనంతరం సీసీ కెమెరాల కోసం విరాళాలు అందించినవారిని, సేకరణకు కృషి చేసిన కానిస్టేబుల్ కమలాకర్ రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో ఎస్పీ సింధు శర్మ, అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, అసిస్టెంట్ ఎస్పీ చైతన్యరెడ్డి, పట్టణ ఎస్హెచ్వో చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు గుర్తించాలి మల్టీ జోన్–1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి -
అప్రమత్తమైన యంత్రాంగం..
కోళ్లపై వైరస్ దాడి నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వారం రోజులక్రితం కలెక్టరేట్లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో పౌల్ట్రీ రైతులు, వెటర్నరీ అధికారుల సమావేశం జరిగింది. పౌల్ట్రీ రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వెటర్నరీ అధికారులు వివరించారు. అంతే కాకుండా మహారాష్ట్ర నుంచి కోళ్లు మన జిల్లాలోకి రాకుండా సరిహద్దుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయించారు. జిల్లాలోని సలాబత్పూర్తో పాటు నిజామాబాద్ జిల్లాలోని సాలూర, కందకుర్తి చెక్పోస్టుల వద్ద వెటర్నరీ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కోళ్ల ఫారాల్లోకి ఎలాంటి వైరస్లు ప్రవేశించకుండా లోడింగ్, అన్లోడింగ్, ఇతర అవసరాల నిమిత్తం వచ్చే వాహనాలను, సిబ్బంది వస్తువులను 100 శాతం శానిటైజ్ చేయిస్తున్నారు. -
పందుల కోసం వెళ్తే.. మృత్యుఒడికి
● విద్యుదాఘాతానికి ముగ్గురి బలి ● ఒకరిని కాపాడబోయి మరొకరు.. ● మృతులందరిదీ ఒకే కుటుంబం ●● ప్రాణాలతో బయటపడ్డ మరో ఇద్దరు కుటుంబ సభ్యులు ● సాటాపూర్లో నెలకొన్న విషాదంరెంజల్(బోధన్) : విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన ము గ్గురు దుర్మరణం పాలైన ఘటన తీవ్ర కలకలం రేపింది. రెంజల్ మండలం సాటాపూర్లో విషాదం నింపింది. పోలీసులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన ఓర్సు గంగారాం(50)కు ఇద్దరు భార్యలు, ము గ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఒకే ఇంట్లో ఉండే వీరందరూ వ్యవసాయ కూలీలుగా పనిచేసుకుంటూ అనుబంధంగా పందుల పెంపకం చేస్తుంటారు. ఇటీవల పెగడపల్లి, చిన్న మావంది గ్రామాల శివారులోని పంటపొలాల్లోకి పందు లు వస్తున్నాయని రైతులు చెప్పారు. దీంతో వాటిని పట్టుకునేందుకు గురువారం తెల్లవారు జామున ఓర్సు గంగారాం, మొదటి భార్య ఓర్సు బాలమణి (45), కొడుకు ఓర్సు కిషన్ (22) మిగతా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. పట్టుకునే క్రమంలో కొన్ని పందులు పంటపొలాల్లోకి చొరబడ్డాయి. వాటి వెనకాలే వెళ్లిన గంగారాం, బాలమణి, కిషన్ పొలంలో ఉన్న విద్యుత్ తీగ లు తగిలి అక్కడికక్కడే కుప్పకూలారు. ప్రమాదాన్ని గమనించిన మిగతా కుటుంబసభ్యులు ఎక్కడికక్కడ నిలబడటంతో ప్రాణాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ విజయ్ బాబు, వెంకట నారాయణ, ఎస్సై మచ్చేందర్ రెడ్డి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నా రు. పోలీసులే స్వయంగా స్థానికులతో కలిసి మృతదేహాలను బయటికి తీశారు. పోస్టుమార్టం నిమి త్తం జిల్లా ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మచ్చేందర్ రెడ్డి తెలిపారు. కాగా, ముగ్గురి మృతికి ట్రాన్స్కో నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నా రు. విద్యుత్ తీగలు కిందికి వేలాడటంతో పందులను పట్టుకునే క్రమంలో తగిలి మొదట కిషన్ మృతిచెందగా, విద్యుత్ తీగలు పొలంలో పడటంతో తల్లిదండ్రులు సైతం విద్యుదాఘాతంతో మరణించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.పెద్ద దిక్కును కోల్పోయి..పందుల పెంపకంతో పాటు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవించే పేద కుటుంబం అనాథగా మారింది. విద్యుదాఘాతంతో గంగారాం, బాలమణి, కిషన్ మరణించగా మొదటి భార్య కుమారుడు ప్రవీణ్, కూతురు యశోద, రెండో భార్య శీల, పిల్లలు కృష్ణ, ప్రేమలత ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ముగ్గురినీ ఒకేసారి కోల్పోవడంతో రోదనలు మిన్నంటాయి. అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి పేద కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ముగ్గురు బైండోవర్
బిచ్కుంద(జుక్కల్): మండలకేంద్రంలోని తహసీల్దార్ సురేష్ ఎదుట గురువారం ముగ్గురు వ్యక్తులను పొలీసులు బైండోవర్ చేశారు. సాయిలు, యాదవ్, నరేష్ అనే వ్యక్తులు చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడుతుండేవారు. అలాగే దేవాడకు చెందిన రాజు అక్రమంగా మద్యం అమ్ముతుండేవాడు. ఈక్రమంలో వారిని పొలీసులు పట్టుకొని కేసునమోదు చేసి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. ఒకరిపై పోక్సో కేసు నమోదు రామారెడ్డి: మండలంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన గుజ్జుల నవీన్ అదే గ్రామానికి చెందిన ఓ 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటన చోటుచేసుకుందని రామారెడ్డి ఎస్సై నరేష్ గురువారం తెలిపారు. దీంతో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. డ్రంకన్ డ్రైవ్ కేసులో ఒకరికి ఒకరోజు జైలు బోధన్టౌన్(బోధన్): మద్యం తాగి వాహనం నడిపిన ఓ వ్యక్తికి బోధన్ సెకండ్క్లాస్ మెజిస్ట్రేట్ ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు సీఐ వెంకటనారాయ ణ గురువారం తెలిపారు. పట్టణంలోని శక్కర్నగర్ కాలనీకి చెందిన షేక్ హుస్సేన్ ఇటీవల మద్యం తాగి వాహనం నడుపుతుండగా, పోలీసుల డ్రంకన్డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డాడు. అతడిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఒకరోజు జైలు శిక్షను విధించాడని సీఐ తెలిపారు. -
తీసుకున్న అప్పు చెల్లించాలన్నందుకే హత్య
మోర్తాడ్(బాల్కొండ): ఏర్గట్ల మండలం నాగేంద్రనగర్కు చెందిన ఆశావర్కర్ కొండ లక్ష్మి(45) జనవరి 21న అదృశ్యమై, చివరకు హత్యకు గురైన విషయం విదితమే. ఈఘటనలో నిందితుడిని బుధవారం పోలీసుల అరెస్టు చేశారు. ఈక్రమంలో హత్యకు సంబంధించి ‘సాక్షి’ సేకరించిన సమాచారంలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్కు చెందిన కుంచపు వెంకటేష్ కూలీ పని చేయడానికి గతంలో నాగేంద్రనగర్కు వచ్చాడు. ఈక్రమంలో ఒంటరిగా ఉంటున్న లక్ష్మితో పరిచయం పెంచుకుని ఆమె ఇంటిలో కూలీ పని చేసేవాడు. ఆమెను నమ్మించి కొంత నగదును చేబదులుగా తీసుకున్నాడు. ఆమె ఇచ్చిన సొమ్మును తిరిగివ్వాలని అడగడంతో కోపం పెంచుకున్న వెంకటేష్ ఫోన్ చేసి పొన్కల్కు వస్తే డబ్బులు ఇస్తానని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన లక్ష్మి పొన్కల్ వెళ్లగా మాయమాటలు చెప్పి, దట్టమైన అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అనంతరం ఆమైపె దాడి చేసి మెడలో ఉన్న బంగారు గొలుసును తీసుకున్నాడు. హత్య చేసి మృతదేహాన్ని ఎవరికి కనపడకుండా చెట్టు చాటున ఉంచి గ్రామానికి చేరుకున్నాడు. ఏమీ ఎరుగనట్లు నిజామాబాద్, నిర్మల్ మార్కెట్లలో ఉల్లిగడ్డలు అమ్ముతున్నాడు. తనకు ఆరోగ్యం బాగలేదని ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నట్లు పత్రాలను సైతం సృష్టించాడు. కానీ మృతురాలు లక్ష్మి, నిందితుడు వెంకటేష్ ఫోన్లు ఒకే సమయంలో ఒకేచోట స్విచ్ఆఫ్ కావడంతో వెంకటేష్ కుట్ర కోణంపై పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితుడి కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అదుపులోకి తీసుకుని, తమదైన శైలిలో విచారించారు. దీంతో ఆమెను ఇంటి వద్ద నుంచి వచ్చిన రోజునే హత్య చేసి, శవంను అటవీ ప్రాంతంలో దాచి ఉంచినట్లు నిందితుడు అంగీకరించాడు. మృతదేహాన్ని దాచిన ప్రాంతానికి పోలీసులను తీసుకువెళ్లి చూయించాడు. అందరితో కలుపుగోలుగా ఉండే లక్ష్మి హత్యకు గురికావడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. నాగేంద్రనగర్ ఆశావర్కర్ మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు నిందితుడి పట్టివేత -
ట్రాలీ ఆటో ఢీకొనడంతో విద్యార్థులకు గాయాలు
గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రం తిప్పారం రోడ్డులోని ఎస్టీ హాస్టల్ వద్ద గురువారం సాయంత్రం ఇద్దరు విద్యార్థులను ట్రాలీ ఆటో (టాటా ఏస్) వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండలానికి చెందిన ఇద్దరు చిన్నారులు అర్జున్–4వతరగతి, సాయికల్యాణ్–3వ తరగతి (అన్నదమ్ములు) హాస్టల్ బయట ఉండగా, మండల కేంద్రంలోని ఓ వాటర్ ప్లాంటుకు చెందిన టాటా ఏస్ వాహనం నీటిక్యాన్లతో తిప్పారం వైపు వెళ్తుండగా వారిని ఢీకొట్టింది. ఈఘటనలో కల్యాణ తలకు బలమైన గాయాలు కాగా, అర్జున్ కాలు విరిగింది. క్షతగాత్రులను 108 అంబులెన్సులో కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. హాస్టల్ పీఈటీ ఫిర్యాదు మేరకు వాహనాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్ అస్లామ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మెరుగైన వైద్యం అందిస్తున్నాం.. కామారెడ్డి క్రైం: ప్రమాదం విషయంపై కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ స్పందించారు. వివరాలు తెలుసుకున్న ఆయన జరిగిన ఘటనపై ఆరా తీశారు. గాయపడిన ఇద్దరు విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వారిని నిజామాబాద్ జనరల్ ఆస్పత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని డీపీఆర్వో భీంకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొని.. ఇందల్వాయి: మండలంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై గన్నారం గ్రామ శివారులో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇందల్వాయి టోల్ప్లాజా సిబ్బందికి గాయాలయ్యాయి. పెట్రోలింగ్ వాహనంలో టోల్ప్లాజా సిబ్బంది ఒకరు రోడ్డు నిర్వహణ పనులు పర్యవేక్షిస్తున్న సమయంలో, కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు స్టీల్ లోడ్తో వేగంగా వెళుతున్న ఐచర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెట్రోలింగ్ వాహన డ్రైవర్ వడ్ల బ్రహ్మం గాయపడ్డాడు. వెంటనే అతడిని టోల్ప్లాజా అంబులెన్స్లో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించారు. -
పురాతన ఆలయాలను అభివృద్ధి చేయాలి
భిక్కనూరు: కొత్త దేవాలయాలను నిర్మించడం కంటే పురాతన ఆలయాలను అభివృద్ధి చేయడంతో పాటు జీర్ణోద్ధరణ కార్యక్రమాలను చేపట్టాలని తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ అన్నారు. బుధవారం బస్వాపూర్లో అతిపురాతన ఉమామహేశ్వరాలయం జీర్ణోద్ధరణ కార్యక్రమంలో స్వామీజీ పాల్గొని భక్తులనుద్దేశించి మాట్లాడారు. రానున్న రోజుల్లో సనాతన ధర్మమే ప్రపంచానికి మార్గదర్శకం చూపిస్తుందన్నారు. అన్ని మతాల వారు సనాతన ధర్మం వైపు వస్తున్నారన్నారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహకుంభమేళాలో ప్రపంచంలోని నలుమూలల నుంచి ప్రజలు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించటం దీనికి నిదర్శనమన్నారు. సామూహిక వ్రతాలు, పూజలు చేయడం వల్ల సోదరభావం పెంపొందుతుందన్నారు. ప్రపంచమంతా మన దేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తుంటే మన దేశ యువతలో కొందరు పాశ్చాత్య పోకడలకు వెళ్లి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. ఉమామహేశ్వరాలయం అభివృద్ది కమిటీ చైర్మన్ మద్ద లింగం, ప్రతినిధులు గౌరిగారి రాజిరెడ్డి, చాపత్త స్వామి, సిద్దరాములు, తదితరులు పాల్గొన్నారు. సనాతన ధర్మమే ప్రపంచానికి మార్గదర్శి తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ -
క్రైం కార్నర్
కామారెడ్డి క్రైం: అదుపు తప్పిన కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో వృద్ధురాలు మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలోని గోదాం రోడ్డులో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు ఇలా. కామారెడ్డి మండలం శాబ్దిపూర్ గ్రామానికి చెందిన రేకులపల్లి యశోద (68) అనే వృద్ధురాలు వ్యక్తిగత పనుల మీద కామారెడ్డికి వచ్చి, ఇంటికి తిరిగి వెళ్లేందుకు గోదాం రోడ్డులో ఉన్న ఎఫ్సీఐ గోదాం వద్ద రోడ్డు పక్కన నిలబడి ఉంది. అదే సమయంలో డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన కారు మొదట వృద్ధురాలిని ఢీకొని ఆపై పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని సైతం ఢీకొంది. స్తంభానికి, కారుకు మధ్య వృద్ధురాలు చిక్కుకోవడంతో స్థానికులు గమనించి, వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. మృతురాలి కుమారుడు తిరుపతిరెడ్డి ఫిర్యాదు మేరకు డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్వో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. రెండు బైక్లు ఢీకొని.. బోధన్రూరల్: మండలంలోని చిన్నమావంది బ్రిడ్జి వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరా లు ఇలా.. చిన్నమావంది గ్రామానికి చెందిన గంగొండ (64) బుధవారం రాత్రి పెగడపల్లి వెళ్లి తన బైక్పై గ్రామానికి తిరిగివస్తున్నాడు. అదే సమయంలో కల్దుర్కి గ్రామానికి చెందిన ఉమాకాంత్, తన చిన్నమ్మతో కలిసి పెగడపల్లి వైపు వెళ్తుండగా చిన్నమావంది బ్రిడ్జి వద్ద గంగొండ వాహనాన్ని ఎదురుగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గంగొండ అక్కడిక్కడే మృతిచెందగా ఉమాకాంత్, అతని చి న్నమ్మ శోభ గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. మృతుడు గంగొండ కుటుంబసభ్యుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్పై మచ్చేందర్రెడ్డి గురువారం తెలిపారు. సంపులో పడి గుర్తు తెలియని మహిళ.. ఆర్మూర్టౌన్: పట్టణంలోని కమలానేహ్రు కాలనీ బృందాన్ టాకీస్ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న భవనంం సంపులో పడి గుర్తుతెలియని మహిళ మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. నూతనంగా నిర్మిస్తున్న భవనంలో వాచ్మెన్ లేకపోవడంతో బుధవారం రాత్రి సమయంలో గుర్తుతెలియని మహిళ భవనం లోపల నిద్రించింది. ఒక్కసారిగా ఆమెకు ఫిట్స్ రావడంతో పక్కనే ఉన్న సంపుపడి మృతిచెందింది. మృతురాలి వయస్సు సుమారు 40ఏళ్లు ఉంటాయని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రిలో తరలించామని పోలీసులు తెలిపారు. మృతురాలి సంబంధికులు ఎవరైన ఉంటే పోలీస్స్టేషన్లో సంప్రదించాలని ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ పేర్కొన్నారు. చేపలవేటకు వెళ్లి మత్స్యకారుడు.. బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో చేపల వేటకు వెళ్లిన ఓ మ త్స్యకారుడు ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ముప్కాల్ ఎస్సై రజనీకాంత్ తెలిపిన వివరాలు ఇలా.. ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన బట్టు నడ్పిరాజన్న (52) రోజు మాదిరిగా బుధవారం రాత్రి ఎస్సారెస్పీలోకి చేపలవేటకు వెళ్లాడు. రాత్రి భోజన సమయానికి గట్టుకు రాకపోవడంతో తోటి మత్స్యకారులు అనుమానంతో గాలింపు చేపట్టారు. గురువారం ఉదయం అతడి మృత దేహం లభ్యమైంది. కాళ్లకు వల చుట్టుకుని ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతిచెందినట్లు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వేర్వేరు ఘటనల్లో నలుగురి మృతి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురువారం జరిగిన వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతిచెందారు. రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు, సంపులో పడి ఒకరు, చేపలవేటకు వెళ్లి ఒకరు మృత్యువాతపడ్డారు. -
ఉద్యోగ భద్రత కల్పించాలి
● ఉన్నత విద్యామండలి చైర్మన్కు కాంట్రాక్టు అధ్యాపకుల వినతి భిక్కనూరు: ఎన్నో ఏళ్లుగా యూనివర్సిటీల్లో పని చేస్తూ విద్యాభివృద్ధికి కృషిచేస్తున్న తమకు యూజీసీ స్కేలు వర్తింపజేయడంతో పాటు, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ సౌత్క్యాంపస్లో ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డికి కాంట్రాక్టు అధ్యాపకులు గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, తొందరలోనే పరిష్కరిస్తుందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ కాంట్రాక్టు టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణ గుప్తా, మహత్మాత్మగాంధీ యూనివర్సిటీ నేత నవీన్, కాంట్రాక్టు అధ్యాపకులు యాలాద్రి, సునీత, పిట్ట సరిత, రమాదేవి, నరసయ్య, దిలీప్, శ్రీకాంత్ పాల్గొన్నారు. నిధులు విడుదల చేయకపోతే బహిష్కరిస్తాం లింగంపేట(ఎల్లారెడ్డి): నిధులు విడుదల చేయని పక్షంలో మార్చి 1 నుంచి విధులు బహిష్కరిస్తామని, గ్రామ పంచాయతీల్లో నిధులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలుపుతూ పంచాయతీ కార్యదర్శులు మండల ప్రత్యేకాధికారి, డీఆర్డీవో సురేందర్కు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సంవత్సర కాలంగా పంచాయతీల్లో నిధులు లేక చేతి డబ్బులు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు. లేదంటే కార్యదర్శులు గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఉండదన్నారు. అంతకు ముందు ప్రత్యేకాధికారి కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఎంపీడీవో నరేశ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. క్రమబద్ధీకరించి పేస్కేల్ అమలు చేయాలి కామారెడ్డి టౌన్: సమగ్ర శిక్ష ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పేస్కేల్ అమలు కోసం కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరుతూ గురువారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మంద్ర ప్రధాన్ను ఢిల్లీలో సమగ్ర శిక్ష ఉద్యోగులు కలిసి వినతిపత్రం అందజేసినట్లు సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ తెలిపారు. బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రిని కలిసి తమకు న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. పే స్కేల్ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం నివేదిస్తే కేంద్రం వాటా 60 శాతం చెల్లిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు సత్యనారాయణ చెప్పారు. -
నిరుద్యోగ భృతి ఇచ్చి ఓట్లు అడగాలి
బాన్సువాడ: నిరుద్యోగ భృతి ఇచ్చి నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఓట్లు అడగాలని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ వ్యాఖ్యానించారు. గురువారం బాన్సువాడలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓట్లు అడిగే హక్కు లేదని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముందు అమలు చేసి పట్టభద్రులను ఓట్లు అడగాలని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నరేందర్రెడ్డి ముందు ప్రభుత్వం బకాయిపడ్డ ఫీజురియంబర్స్మెంట్ను విడుదల చేయించాలని అన్నారు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని విమర్శించారు. తనను గెలిపిస్తే స్కిల్ డెవలప్మెంట్ను పెట్టిస్తానని అన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు తనకే వేయాలని పట్టభద్రులను కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు, మాజీ ఎంపీ బీబీ పాటిల్, నాయకులు పెద్దోళ్ల గంగారెడ్డి, పైడి ఎల్లారెడ్డి, చీదరి సాయిలు, శంకర్గౌడ్, కోనాల గంగారెడ్డి, తదితరులు ఉన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని గుర్జాల్ గ్రామానికి చెందిన ఓ రైతు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై ఆంజనేయులు తెలిపిని వివరాలు ఇలా.. గుర్జాల్ గ్రామానికి చెందిన సొప్పరి మాణిక్యం(40) అనే రైతు తనకున్న పొలంలో రెండు బోర్లు వేయగా విఫలం అయ్యాయి. కొన్ని రోజులు బతుకుదెరువు కోసం గల్ఫ్కు వెళ్లి వచ్చాడు. అయినా చేసిన అప్పులు తీరక, తీర్చే మార్గం లేక మనోవేదనకు గురయ్యాడు. ఈక్రమంలో బుధవారం ఉదయం పొలం వద్దకు వెళ్లిన మాణిక్యం అక్కడే పురుగుల మందు తాగి తూలుతు ఇంటికి వచ్చాడు. గమనించిన ఆయన కుమారులు, భార్య చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. జీవితంపై విరక్తి చెంది ఒకరు.. మాక్లూర్: మండలంలోని బోర్గాం(కె) గ్రామంలో ఓ వ్యక్తి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాలు ఇలా.. బోర్గాం(కె) గ్రామానికి చెందిన రెంజర్ల లస్మన్న (57)కు మూడేళ్ల క్రితం గుండె ఆపరేషన్ అయింది. అప్పటి నుంచి వ్యాధికి సంబంధించిన మందులు వాడుతునే ఉన్నాడు. మరిన్ని వ్యాధులకు గురికావడంతో జీవితంపై విరక్తి చెందాడు. ఈక్రమంలో బుధవారం రాత్రి సమీపంలో ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుమారుడు మహేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కామారెడ్డిలో మరొకరు.. కామారెడ్డి క్రైం: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా కేంద్రంలో గురువారం వెలుగుచూసింది. వివరాలు ఇలా.. కాలనీలో నివాసం ఉండే పసుపునూరి నాగయ్య (30) స్థానికంగా ఓ మొబైల్ షాప్లో పనిచేసేవాడు. అతడికి నాలుగేళ్ల క్రితం రమ్యతో వివాహం జరుగగా, వారికి ఇద్దరు పిల్లలున్నారు. నాగయ్య ఇటీవల మద్యానికి బానిస కాగా, దంపతుల మధ్య తరచు గొడవలు జరిగేవి. బుధవారం రాత్రి కూడా గొడవలు జరుగగా భార్య వేరే గదిలో పడుకుంది. నాగయ్య మరో గదిలో పడుకోగా ఉదయం చూసేసరికి చీరతో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్హెచ్వో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. -
కొత్తపేటలో దారిదోపిడీ
నిజామాబాద్ రూరల్: మండలంలోని కొత్తపేట గ్రామ శివారులో బీహార్కు చెందిన పలువురు హమాలీలు దారిదోపిడీకి పాల్పడారు. రూరల్ ఎస్హెచ్వో మహ్మద్ ఆరీఫ్ తెలిపిన వివరాలు ఇలా.. ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామానికి చెందిన జితేష్ బుధవారం ఉదయం నిజామాబాద్కు శుభకార్యం నిమిత్తం వెళ్లగా, అర్ధరాత్రి తిరిగి సొంతూరికి బయలుదేరాడు. రూరల్ మండలం కొత్తపేట గ్రామ శివారులోని నిజాంసాగర్ కెనాల్ వద్ద అతడిని స్థానికంగా ఉన్న రైస్మిల్లో పనిచేస్తున్న హమాలీలు అడ్డుకొని కర్రలతో కొట్టి, చేతిపై తీవ్రగాయాలు చేశారు. అనంతరం అతడి వద్ద ఉన్న రూ.1000 నగదు, సెల్ఫోన్ దొంగిలించారు. బాధితుడు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు వివరించారు. -
ఇంట్లోకి వెళ్లి బంగారం అపహరణ
ఖలీల్వాడి: నగరంలోని బోర్గాం(పి)లోగల ఓ ఇంట్లోకి గుర్తుతెలియని దుండుగుడు వెళ్లి, మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును ఎత్తుకెళ్లినట్లు 4వ టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం బైక్పై వచ్చిన దుండగుడు ఇంట్లోకి వెళ్లి సుంకరి కళావతి అనే మహిళ మెడలో నుంచి తొమ్మిది మాసాల బంగారం ఎత్తుకెళ్లాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పేకాడుతున్న ఆరుగురు అరెస్టు బోధన్టౌన్(బోధన్): పట్టణ శివారులోని ఆటోనగర్ కాలనీలో గురువారం రాత్రి పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సీఐ నారాయణ తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి రూ. 10,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. 6బైక్లు, 5 సెల్ఫోన్లను సీజ్ చేశామన్నారు. -
ముగ్గురు బైండోవర్
బిచ్కుంద(జుక్కల్): మండలకేంద్రంలోని తహసీల్దార్ సురేష్ ఎదుట గురువారం ముగ్గురు వ్యక్తులను పొలీసులు బైండోవర్ చేశారు. సాయిలు, యాదవ్, నరేష్ అనే వ్యక్తులు చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడుతుండేవారు. అలాగే దేవాడకు చెందిన రాజు అక్రమంగా మద్యం అమ్ముతుండేవాడు. ఈక్రమంలో వారిని పొలీసులు పట్టుకొని కేసునమోదు చేసి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. ఒకరిపై పోక్సో కేసు నమోదు రామారెడ్డి: మండలంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన గుజ్జుల నవీన్ అదే గ్రామానికి చెందిన ఓ 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటన చోటుచేసుకుందని రామారెడ్డి ఎస్సై నరేష్ గురువారం తెలిపారు. దీంతో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. డ్రంకన్ డ్రైవ్ కేసులో ఒకరికి ఒకరోజు జైలు బోధన్టౌన్(బోధన్): మద్యం తాగి వాహనం నడిపిన ఓ వ్యక్తికి బోధన్ సెకండ్క్లాస్ మెజిస్ట్రేట్ ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు సీఐ వెంకటనారాయ ణ గురువారం తెలిపారు. పట్టణంలోని శక్కర్నగర్ కాలనీకి చెందిన షేక్ హుస్సేన్ ఇటీవల మద్యం తాగి వాహనం నడుపుతుండగా, పోలీసుల డ్రంకన్డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డాడు. అతడిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఒకరోజు జైలు శిక్షను విధించాడని సీఐ తెలిపారు. -
తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. గురువారం ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా నీటి సమస్య రాకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. నీటి ఎద్దడి ఉండే ప్రాంతాలను గుర్తించి అక్కడ బోరుబావులకు అవసరమైన మరమ్మతులు చేయించాలన్నారు. వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి నీటిని అందించాలని సూచించారు. అనంతరం డంపింగ్ యార్డును పరిశీలించారు. తడి చెత్తతో కంపోస్టు ఎరువులను తయారు చేయాలని సూచించారు. చె ట్లకు నీరు పట్టాలన్నారు. -
నేడు సబ్జూనియర్ బేస్బాల్ జట్ల ఎంపికలు
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): జిల్లా సబ్జూనియర్ బేస్బాల్ బాలికలు, బాలుర జట్ల ఎంపిక పోటీలను శుక్రవారం నిర్వహించనున్నట్లు జిల్లా బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మదుసూదన్రెడ్డి, సొప్పరి వినోద్ ఒక ప్రకటనలో తెలిపారు. డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామ శివారులోగల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలలో నేడు ఉదయం 9 గంటలకు బాలికల జట్టు ఎంపిక పోటీలను నిర్వహిస్తామని వారు తెలిపారు. అలాగే బాలుర జట్టు ఎంపిక పోటీలకు ఆర్మూర్లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల/కళాశాలలో నిర్వహిస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు జనవరి 2010 తర్వాత జన్మించి ఉండాలని, ఆసక్తి గలవారు జిల్లా కోచ్లు నరేష్, మౌనిక, జోత్స్నలకు రిపోర్ట్ చేయాలని సూచించారు. -
ఒత్తిడిలో విద్యార్థులు
● మార్కుల వేటలో పెరుగుతున్న ఆందోళన ● ఆత్మవిశ్వాసం కల్పించాలంటున్న మానసిక నిపుణులు సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: మార్కుల వేటలో విద్యార్థులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా భవిష్యత్తును నిర్దేశించే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలన్న ఆరాటం వారిని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తోంది. బోర్డ్ ఎగ్జామ్స్ వస్తున్నాయంటే సహజంగానే విద్యార్థులు ఒత్తిడికి గురవుతుంటారు. దీనికితోడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల నుంచి ఒత్తిడి ఉండనే ఉంటుంది. కొందరు విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాయడానికి ప్రిపేర్ అవుతుండగా, చాలా మంది తాము ప్రిపేర్ అయిన ప్రశ్నలు రాకుంటే మార్కులు తగ్గుతాయేమోననే భయంతో వణికిపోతుంటారు. పిల్లల్లో ధైర్యం నింపడానికి ఉపాధ్యాయులు ప్రయత్నాలు చేస్తున్నా కొందరు మాత్రం పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ భయంతోనే గడుపుతుంటారు. ఈ తరుణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు వారికి అండగా నిలవాలి. వారిలో ధైర్యాన్ని నింపాలి. అన్నింటికంటే ముఖ్యంగా వారిపై వారికి ఆత్మవిశ్వాసం కల్పించాలి. ఎంత చదవగలిగితే అంత చదువు, టెన్షన్ అవసరం లేదు, మార్కులు కొలమానం కానేకాదని వారికి నచ్చజెప్పాలి తప్ప, వేరే వాళ్ల పిల్లలతో పోల్చే ప్రయత్నం చేయొద్దు. అలా చేయడం వల్ల విద్యార్థులు మరింత ఒత్తిడికి లోనవుతారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు మానసిక స్థైర్యాన్ని కలిగించే ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఉంది. మార్చి 5 నుంచి పరీక్షలు.. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు వచ్చే నెల 5 నుంచి మొదలై 25 వరకు కొనసాగుతాయి. జిల్లాలో మొదటి సంవత్సరం పరీక్షలకు 8,743 మంది విద్యార్థులు, రెండో సంవత్సరం పరీక్షలు 9,729 మంది విద్యార్థులు రాయనున్నారు. అలాగే జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 12,579 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇప్పటికే సిలబస్ పూర్తి చేయడంతో పాటు రివిజన్ కూడా జరిగింది. ప్రిఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పిల్లలకు ప్రత్యేక క్లాసులు జరుగుతున్నాయి. రాత్రింబవళ్లూ చదువుతున్నారు. ఆందోళన అధిగమిస్తేనే విజయం.. పరీక్షలు అనే సరికి విద్యార్థుల్లో రకరకాల ఆందోళనలు వస్తాయి. కొన్ని వారిని తీవ్రంగా వేదనకు గురిచేస్తాయి. ఈ తరుణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు వారికి అండగా నిలవాలి. ఆందోళన అధిగమిస్తే విజయం సొంతమవుతుందన్న విషయాన్ని వారికి విడమర్చి చెప్పాలి. నిరంతరం చదువు మీద తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఒత్తిడి పెట్టకుండా ఉండాల్సిన అవసరమూ ఉంది. ప్రస్తుత చదువులు మార్కులే కొలమానంగా సాగుతున్నాయి. విద్యార్థులు పోటీపడి మార్కులు తెచ్చుకుంటున్నారు. చదువులు, పరీక్షల సమయంలో కొందరు తీవ్ర ఒత్తిడికి గురవుతూ మానసికంగా కుంగిపోతున్నారు. దీంతో ఆరోగ్యమూ దెబ్బతింటోంది. మార్కులు తక్కువ వచ్చాయనో, ఫెయిల్ అయ్యామనో ఆవేదనకు గురై కొందరు ఆత్మహత్యలకు పాల్పడి తల్లిదండ్రులకు మనోవేదన మిగుల్చుతున్నారు. మానసిక స్థైర్యాన్ని నింపాలి పరీక్షలు అనగానే సహజంగానే విద్యార్థులకు భయం ఉంటుంది. భయాన్ని తొలగించే ప్రయత్నం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి రావాలి. ప్రస్తుత విద్యావ్యవస్థలో ఉన్న ఒత్తిడి వల్ల పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. వారిని జాగ్రత్తగా గమనించాలి. మానసిక స్థైర్యాన్ని ఇవ్వడం ద్వారా వారు ధైర్యంగా పరీక్షలు రాయడానికి సమాయత్తమవుతారు. ఆ దిశగా ప్రయత్నించాలి. – సి.వీరేందర్, సైకాలజిస్ట్ అందరిలో మార్పు రావాలి ఇప్పుడందరి ఆలోచన తన బిడ్డ టాప్లో నిలవాలన్నదే. పిల్లల మానసిక పరిస్థితిని చూడటం లేదు. ఇతరుల పిల్లల మాదిరిగా తమ పిల్లలు చదవాలనే పట్టుదలకు పోతున్నారు. మార్కుల కన్నా జ్ఞానం అవసరం అన్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి. చదువు విషయంలో వారికి ధైర్యమివ్వాలే తప్ప వారిపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేయొద్దు. – జి.లచ్చయ్య, రిటైర్డ్ డైట్ లెక్చరర్ -
‘బాల్య వివాహాలను అడ్డుకోవాలి’
రాజంపేట: బాల్య వివాహాలు జరిపించడం చట్ట రీత్యా నేరమని, వాటిని అడ్డుకోవాలని జిల్లా సీని యర్ సివిల్ జడ్జి నాగరాణి పిలుపునిచ్చారు. సఖి కేంద్రం, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీల ఆధ్వర్యంలో బుధవారం కొండాపూర్ రైతు వేదికలో సీ్త్రలకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయమూర్తి మాట్లాడుతూ ఆడ మగ తేడా లేకుండా అందరినీ ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కృషి చేయాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు, ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్ల విషయంలో అలా చేయించినవారితోపాటు డాక్టర్లు కూడా శిక్షార్హులు అవుతారన్నారు. ఎలాంటి సమస్య ఎదురైనా సీ్త్రలు 181 నంబర్కు ఫోన్ చేస్తే వెంటనే పోలీసులు వచ్చి రక్షణ కల్పిస్తారన్నారు. సఖి కేంద్రం అందిస్తున్న సేవలు, పోక్సోతోపాటు బాలికలు, మహిళల రక్షణకు ఉద్దేశించిన చట్టాలపై అవగాహన కల్పించారు. సఖి సెంటర్ పోస్టర్, బేటీ బచావో బేటీ పఢావో పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సఖి కేంద్రం నిర్వాహకులు భారతి, జీజీహెచ్ సూపరింటెండెంట్ ఫరీదా, సీడీపీవో సుష్మ, ఎస్సై పుష్పరాజ్, ఏపీఎం సాయిలు తదితరులు పాల్గొన్నారు. బాలసదనం తనిఖీ కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని హరిజనవాడలోగల బాలసదనాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి టి.నాగరాణి బుధవారం తనిఖీ చేశారు. చిన్నారులతో మాట్లాడి సమస్యలు, సౌకర్యాలను గురించి తెలుసుకున్నారు. పిల్లలకు సంబంధించిన హక్కులను వివరించారు. ఆపరేషన్ స్మైల్లో కాపాడపడిన బాలికలను బడిలో చేర్పించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది శ్రావణ్ కుమార్, సాయి, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. -
విజయం కోసం కృషి చేయాలి
ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని రాష్ట్ర పర్యాట క, సాంస్కృతిక, ఎకై ్సజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్లో బీహార్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నిధులిచ్చిన కేంద్రం.. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపించి నయా పైసా ఇవ్వలేదని ఆరో పించారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందం వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయలేదన్నారు. పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపుతాయని గుర్తించాలని, ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేసి ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్రెడ్డిని గెలిపించాలని కోరారు. బీజేపీకి కులం, మతం తప్ప అభివృద్ధి తెలియదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ విమర్శించారు. జిల్లాలో పట్టభద్రు లు కాంగ్రెస్కు భారీ మెజారిటీ ఇవ్వాలని కోరా రు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కానున్నాయన్నారు. సమావేశాలలో డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్రావు, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యేలు లక్ష్మీకాంతారావు, మదన్మోహన్రావు, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, నాయకులు ఇందుప్రియ, సందీప్, జంగం గంగాధర్, శ్యామల, కునీపూర్ రాజిరెడ్డి, గంగారాం పాల్గొన్నారు. -
బైక్ స్కామ్ నిందితుల అరెస్టు
ఆర్మూర్టౌన్: ఇన్సూరెన్స్ కంపెనీ వారిని మోసగించి బైకులను విక్రయించిన కేసులో తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 27 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. ఆర్మూర్ పీఎస్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ నిందితుల వివరాలను వెల్లడించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్కు చెందిన షాహిద్ అలీ అతని స్నేహితుడు సయ్యద్ ఒమేర్ బీమా కంపెనీని మోసం చేసి బైక్లతో డబ్బులు సంపాదించడానికి పథకం రచించారు. పథకంలో భాగంగా అడ్రస్ ప్రూఫ్ సరిగా లేని వారి ఐడీ కార్డులు సృష్టించారు. వాటి ద్వారా హైదరాబాద్లోని బైక్ షో రూంలో సయ్యద్ ఒమేర్ డౌన్ పేమెంట్ కట్టి హీరో ఫిన్కార్ప్ లిమిటెడ్ ఫైనాన్స్ ద్వారా లోన్ తీసుకొని హీరో కంపెనీకి చెందిన బైకులను కొనుగోలు చేసేవారు. తర్వాత అనుమానం రాకుండా ఫైనాన్స్ కంపెనీకి బైకుల రుణాలకు సంబంధించి రెండు వాయిదాలు చెల్లించి బైక్లను ఇతర ప్రాంతాలకు తరలించేవారు. అనంతరం బైక్లు చోరీకి గురయ్యాయని పోలీసుల నుంచి ఎఫ్ఐఆర్ పొంది బీమా కంపెనీ నుంచి సదరు వాహనాల బీమా డబ్బులు పొందేవారు. కొనుగోలు చేసిన వాహనాలను హైదరాబాద్కు చెందిన సాబీర్ ఖాన్ ద్వారా కామారెడ్డికి చెందిన మహ మ్మద్ యాసిన్కు పంపేవారు. ఆ బైకులను ఆర్మూ ర్, డొంకేశ్వర్, సిరికొండ, ధర్పల్లి, మాక్లూర్ మండల ప్రజలకు విక్రయించినట్లు ఏసీపీ తెలిపారు. బైక్లను అమ్మిన వ్యక్తికి, ఏజెంట్లుగా వ్యవహరించిన వారికి కమీషన్ ఇచ్చేవారు. ఫైనాన్స్ చేసిన బైక్లు చోరీకి గురవుతుండడంతో అనుమానం వచ్చిన హైదరాబాద్కు చెందిన హీరో ఫిన్ కార్ప్ లిమిటెడ్ సేల్స్ మేనేజర్ షేక్ అబ్దుల్ రఫీ ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా నిందితులను పట్టుకున్నారు. కేసును చేధించిన పోలీసులను ఏసీపీ అభినందించారు. సమావేశంలో ఆర్మూర్ ఎస్హెచ్వో సత్యనారాయణ, ఎస్సై ఇంద్రకరణ్ రెడ్డి, తిరునగరి గోవింద్, మహేశ్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఢిల్లీ ఫలితాలు.. తెలంగాణలో పునరావృతం !
సుభాష్నగర్: పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి బీజేపీ కార్యకర్త కర్తవ్యంగా భావించి పని చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ పిలుపు నిచ్చారు. బుధవారం రాత్రి నగర శివారులోని ఓ ప్రైవేట్ హోటల్ లో ఉమ్మడి నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్ష సమావేశం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా సునీల్ బన్సల్, పార్టీ తెలంగాణ సంఘటన మంత్రి చంద్రశేఖర్ జీ, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ గ్రాడ్యుయేట్ ఎన్నికల బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, బీజేపీ, తపస్ బలపరిచిన టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభావిత ఓటర్లను గుర్తించి వారితో వ్యక్తిగతంగా పరిచయం పెంచుకోవాలన్నారు. ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలుసుకుని అభ్యర్థి గురించి అవగాహన కల్పించాలన్నారు.ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో పునరావృతం అవుతున్నాయని ఓటర్లకు తెలియజేయాలన్నారు. ఢిల్లీలో మొదలైన విజయం, గల్లీలో కా షాయ జెండా ఎగురవేసే వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అవిశ్రాంతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత ఎన్నికలు అంజిరెడ్డి, కొమరయ్యకు చెందినవి కావని, ఈ ఎన్నికలు ప్రతి బీజేపీ కార్యకర్త భవిష్యత్కు పునాది వేసే ఎన్నికలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలిస్తేనే, భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీకి బలమైన స్థానం ఏర్పడుతుందన్నారు. ఈ ఎన్నికలో మనం విజయపథాన్ని అందుకోవాలంటే, ప్రతి కార్యకర్త బాధ్యతతో పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, నాయకులు పల్లె గంగారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ ఎస్ ప్రభాకర్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ -
అదృశ్యమైన మహిళ హత్య
మోర్తాడ్: నెల రోజుల క్రితం అదృశ్యమైన మహిళ హత్యకు గురైంది. ఈ ఘటనకు సంబంధించి భీమ్గల్ సీఐ సత్యనారాయణ, ఎస్సై రాము బుధవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని ఏర్గట్ల మండలం నాగేంద్రనగర్కు చెందిన కొండ లక్ష్మి(45) గ్రామంలో ఆశావర్కర్గా పనిచేస్తోంది. ఈ ఏడాది జనవరి 21న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె కుమార్తె అనూష ఏర్గట్ల పోలీసులకు ఫిర్యా దు చేయగా కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భా గంగా నిర్మల్ జిల్లా మామ డ మండలం పొన్కల్కు చెందిన కొంచపు వెంకటే శ్, లక్ష్మిని నమ్మించి తనవద్దకు పిలిపించుకొని హ త్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా నెల రోజుల క్రితమే ఆమెను పొన్కల్ అటవీ ప్రాంతంలో హత్య చేసినట్లు అంగీకరించాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. అక్క డే పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు. నిందితుడిని అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. -
ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు
నాగిరెడ్డిపేట: మండలంలోని మాల్తుమ్మెద శివారులో బైక్ అదుపుతప్పి కిందపడిన ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నవాబుపేట గ్రామానికి చెందిన అబ్రహం, వీరేశంగౌడ్ బడాపహాడ్కు బైక్పై వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద శివారులో బైక్ అదుపు తప్పి కిందపడిపోయింది. దీంతో బైక్పై ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108 సమాచారం అందించారు. సిబ్బంది అనిల్, మహే శ్ ఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని మొదటగా చికిత్స నిమిత్తం నాగిరెడ్డిపేటకు మెరుగైన వైద్యం కోసం మెదక్కు తరలించారు. -
ఆటో కోసమే స్నేహితుడి హత్య
ఖలీల్వాడి: జల్సాలకు అలవాటు పడిన ఓ వ్యక్తి సొంత స్నేహితుడినే ఆటో కోసం హత్య చేశాడు. ఘటనకు సంబంధించి ఏసీపీ రాజావెంకట్రెడ్డి బుధవారం నగరంలోని ఏసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నగరంలోని నాగారం 80 క్వార్టర్స్కు చెందిన సతీశ్ గౌడ్ అలియాస్ బబ్లూకు 2010లో హైదరాబాద్కు చెందిన లావణ్యతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సతీశ్ మద్యానికి బానిస కావడంతో పాటు జల్సాలకు అలవాటుపడ్డాడు. అతని తీరు నచ్చక భార్య పిల్లలతో కలిసి ఐదేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లింది. సతీశ్ గత మూడు నెలలుగా నాగారంలో ఉంటున్న తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. గతంలో సతీశ్ ఆటో నడుపుతున్న సమయంలో బ్రాహ్మణ కాలనీకి చెందిన కండెల సందీప్(28)తో పరిచయం ఏర్పడడంతో మిత్రులుగా మారారు. కొన్ని రోజులుగా వీరిద్దరు ఆటోలో కిరాయిలకు తిరుగుతున్నారు. జల్సాలకు అలవాటుపడ్డ సతీశ్ డబ్బుల కోసం దొంగతనం చేద్దామని అనుకుంటున్న సమయంలో సందీప్ ఆటోను కొనుగోలు చేశాడు. సందీప్ కొనుగోలు చేసిన ఆటోను, ఫోన్ను కాజేయాలని సతీశ్ పథకం రచించాడు. ఈ నెల 15న ఇద్దరు ఆటోలో కిరాయికి వచ్చిన డబ్బులతో పలుచోట్ల మద్యం సేవించారు. సందీప్ మత్తులో ఉన్నట్లు గుర్తించిన సతీశ్ కామారెడ్డికి కిరాయికి వెళ్దామని చెప్పి తీసుకెళ్లాడు. ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి దాటిన తర్వాత మూత్రం పోసేందుకని ఇద్దరు రోడ్డుకు సమీపంలో ఉన్న చెరువు ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలో సందీప్ సతీశ్ను వెనుక నుంచి కిందికి నెట్టేసి బండరాయితో ఛాతి భాగంలో దాడి చేసి హత్య చేశాడు. మృతదేహం కనిపించకుండా ఉండేందుకు చుట్టుపక్కల ఉన్న కట్టెలు తెచ్చి దహనం చేసి ఆటోలో హైదరాబాద్కు వెళ్లాడు. ఈ నెల 16న సందీప్ కనిపించడం లేదంటు అతని భార్య లత స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి సెల్ డాటా ప్రకారం వివరాలు సేకరించారు. సందీప్ సెల్ఫోన్ నుంచి సిమ్ తీసేసిన సతీశ్ తన వద్ద ఉన్న సిమ్ వేయడంతో పోలీసులు నిందితుడిని గుర్తించారు. రెండు రోజుల పాటు హైదరాబాద్లో తిరిగి జిల్లాకు వస్తున్న సతీశ్ను ఇందల్వాయి ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నారు. అంతేకాకుండా నిందితుడు అనేక హత్య, దొంగతనాల కేసుల్లో నేరస్తుడని తెలిపారు. ఈ కేసును త్వరగా చేధించిన నార్త్ సీఐ బి శ్రీనివాస్, ఎస్సై ఎం గంగాధర్, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. ఇందల్వాయి అటవీ ప్రాంతంలో దహనం చేసిన మృతదేహం కేసును చేధించిన పోలీసులు -
ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పుల సంఖ్యను పెంచాలి
బోధన్టౌన్ : జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పుల సంఖ్యను పెంచాలని జిల్లా వైద్యాధికారి రాజశ్రీ అన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. పట్టణంలోని బస్తీ దవాఖానాలో ఫైలేరియాపై బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రజలకు ఫైలేరియా వ్యాధి (బోధకాలు)పై అవగాహన కల్పి ంచాలని సూచించారు. మార్చి 13, 18, 23 తేదీల్లో డివిజన్లో ఎంపిక చేయబడిన ప్రాంతాల్లో ఫైలేరి యా వ్యాధి నిర్ధారణకు రక్తనమూనాలు సేకరిస్తామన్నారు. ఈసదస్సులో మలేరియా జిల్లా అధికారి తుకారాం రాథోడ్, డిప్యుటీ డీఎంహెచ్వో సమత, మెడికల్ ఆఫీసర్స్, పర్యవేక్షకులు పాల్గొన్నారు. -
ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం
బాన్సువాడ/కామారెడ్డి టౌన్: రాబోయే నాలుగేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం జిల్లా కేంద్రంలోని సత్య గార్డెన్లో, మధ్యాహ్నం బాన్సువాడలోని ఎస్ఎంబీ ఫంక్షన్ హాల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాలలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో 50 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పటికే 56 వేల ఉద్యోగాలిచ్చిందని పేర్కొన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి మోసం చేసిన బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లేస్తారా అని పట్టభద్రులను ప్రశ్నించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టబోతున్నామన్నారు. బాన్సువాడతో తనకు 40 ఏళ్ల బంధం ఉందని, ఆ బంధం విడదీయరానిదని పేర్కొన్నారు. కేంద్రం నుంచి గుండు సున్నా నిధులు తెచ్చిన బీజేపీ నేతలను పట్టభద్రులు నిలదీయాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ అంతర్గతంగా ఒక్కటే.. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పట్టభద్రులకు పిలుపు -
మత్తెక్కిస్తున్న దందా!
జిల్లాలో చాపకింద నీరులా గంజాయి దందా విస్తరిస్తోంది. పల్లె, పట్నం తేడాలేకుండా అంతటా గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పోలీసులు దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నా ఈ దందాకు అడ్డుకట్ట పడడం లేదు. యువత మత్తుకు బానిసగా మారి విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటోంది. – కామారెడ్డి క్రైంఖాళీ ప్రదేశాలే అడ్డాలుగా.. జిల్లాలో టీ పాయింట్లు, ఖాళీ ప్రదేశాలు అడ్డాలుగా గంజాయి దందా నడుస్తోంది. ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్ల రూపంలో తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. కొద్ది నెలల క్రితం లిక్విడ్ రూపంలో తయారు చేసి విక్రయిస్తున్న గంజాయి డబ్బాలను కామారెడ్డి పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గంజాయి సరఫరాపై ఉక్కుపాదం మోపాలని భావించి అధికార యంత్రాంగానికి సూచనలు చేసింది. అప్పటి నుంచి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి సరఫరా, విక్రయాలు, సేవనంపై పోలీసు, ఎక్సైజ్ శాఖలు ప్రత్యేక నిఘా పెట్టాయి. తనిఖీలు, దాడులు పెరిగాయి. కేసులూ నమోదు చేస్తున్నారు. కానీ గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సేవనం, విక్రయాలు సాగుతూనే ఉన్నాయి. ఈ వ్యవహారంలో సంబంధిత శాఖలు మరింత కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. ● విస్తరించిన గంజాయి సామ్రాజ్యం ● జిల్లాలో జోరుగా విక్రయాలు ● బానిసలుగా మారుతున్న యువతరం ● దాడులు చేస్తున్నా తగ్గని స్మగ్లర్లుజిల్లాలో గతంలో గంజాయి వ్యాపారం మాత్రమే సాగేది. ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు గ్రామాల నుంచి వరంగల్ మీదుగా జిల్లాకు తెచ్చి గాంధారి, లింగంపేట, బాన్సువాడ ప్రాంతాల్లో డంప్ చేసేవారు. అదును చూసుకుని మహారాష్ట్రలోని ముంబయి, పుణే లాంటి ప్రాంతాలకు సరఫరా చేసేవారు. కానీ కొన్నేళ్లుగా జిల్లాలోనూ గంజాయి విక్రయాలు సాగుతున్నాయి. మత్తుకు బానిసలవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. పట్టణాలు, మండల కేంద్రాల్లోనే కాదు చివరకు గ్రామాల్లో కూడా చాలామంది యువకులు గంజాయి సేవనానికి అలవాటు పడినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో గంజాయి వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. ప్రధానంగా యువతరం గంజాయికి అలవాటు పడి కెరీర్ను నాశనం చేసుకుంటున్నారు. కెరీర్ దెబ్బతినడంతోపాటు ఆరోగ్య సమస్యలూ ఎదురవుతున్నాయి. -
కుమార్తైపె లైంగిక దాడి కేసులో తండ్రికి ఏడేళ్ల జైలు
కామారెడ్డి క్రైం: కుమార్తైపె లైంగిక దాడి కేసులో తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ మొదటి అదనపు జిల్లా జడ్జి లాల్సింగ్ శ్రీనివాస్ నాయక్ బుధవారం తీర్పు వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి. బీబీపేట పీఎస్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన దేవరాజు అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన 15 ఏళ్ల కుమార్తైపె లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లి వచ్చాక విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా బీబీపేట పీఎస్లో జనవరి 14న కేసు నమోదైంది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసు పూర్వపరాలను పరిశీలించిన జడ్జి నిందితుడు దేవరాజుకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. కేసును సరైన పద్ధతిలో విచారించి, కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టిన ఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీలు ఆర్ ప్రకాశ్, శ్రీనివాసులు, నాగేశ్వర్ రావు, సీఐ తిరుపయ్య, సంపత్ కుమార్, ఎస్సై అనిల్, పీపీ శేషు, పోలీసు సిబ్బంది మురళీ, ప్రమోద్ రెడ్డి, ప్రవీణ్ లను ఎస్పీ సింధు శర్మ అభినందించారు. డ్రంకన్ డ్రైవ్ కేసులో ముగ్గురికి రెండు రోజులు.. ఖలీల్వాడి: డ్రంకన్ డ్రైవ్ కేసులో ముగ్గురికి జైలు శిక్ష పడినట్లు ట్రాఫిక్ సీఐ పి ప్రసాద్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలో మద్యం తాగి వాహనాలు నడిపిన 18 మందికి నగరంలోని ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం వీరిని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపర్చగా 15 మందికి రూ. 36,200 జరిమానా విధించారు. నగరంలోని కోటగల్లీకి చెందిన ఎస్ శ్రీనివాస్. నిర్మల్ జిల్లాకు చెందిన ఎం రాజేశ్, ఖిల్లారోడ్డులోని అఖిల్కు రెండు రోజుల జైలు శిక్షను జడ్జి విధించినట్లు ట్రాఫిక్ సీఐ పేర్కొన్నారు. కమ్మర్పల్లిలో ఒకరికి..కమ్మర్పల్లి: డ్రంకన్ డ్రైవ్ కేసులో ఒకరికి రెండు రోజుల జైలు శిక్ష పడినట్లు కమ్మర్పల్లి ఎస్సై అనిల్రెడ్డి బుధవారం తెలిపారు. మండల కేంద్రంలో వాహనాల తనిఖీ చేస్తుండగా మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామానికి చెందిన గంగాధర బాబురావు అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు. అతన్ని ఆర్మూర్ కోర్టులో హాజరుపర్చగా ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి గట్టు గంగాధర్ బాబురావుకు రెండు రోజుల జైలు శిక్షను విధించినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ఆలయాల్లో సమస్యలు పట్టేదెవరికి..?
నిజామాబాద్ రూరల్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో కార్యనిర్వహణాధికారుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఉన్న వారికే అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఆలయ పరిపాలన దారితప్పుతోంది. పూర్తి స్థాయి లో ఈవోలను నియమించాలని సిబ్బంది కోరు తున్నారు. జిల్లా కేంద్రంలోని మాధవనగర్ సాయిబాబా ఆలయ కార్యనిర్వాహుకుడిగా(ఈవో) పనిచేస్తున్న ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శ్రీరాం రవీందర్కు నీలకంఠేశ్వర ఆలయంతో పాటు ఆరు ఆలయాల కార్యనిర్వహణ బాధ్యతలను ఉన్నతాధికారులు అప్పగించారు. ఇదివరకు గ్రేడ్–1 ఉన్న ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లారు. దీంతో శ్రీరాం రవీందర్కు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. అదేవిధంగా జెండా బాలాజీ మందిరానికి ఈవోగా ఉన్న వేణు జానకంపేట శ్రీలక్ష్మీనృసింహ స్వామి ఆలయంతో పాటు మరో ఐదు ఆలయాలకు కార్యనిర్వహణ బాధ్యతలను అప్పగించారు. అంతేకాకుండా జిల్లా కేంద్రంలోని బడా రాంమందిర్ భూములకు సంబంధించిన రూ. వేల కోట్లు విలువ చేసే భూములు అన్యాక్రాంతం కాకుండా ఫిట్పర్సన్గా నియమించారు. దీంతో నిజామాబాద్, ఆదిలాబాద్, మహారాష్ట్రతోపాటు నాందేడ్లో ఉన్న భూములు సర్వే చేయాల్సి ఉంటుంది. ఆలయాల్లో ప్రధాన బాధ్యత ఈవోలదే.. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ప్రధాన ఆలయాల్లో హుండీ లెక్కింపు, ఆలయాల భూముల పరిరక్షణ, సీసీ కెమెరాల ఏర్పాటు, ఆలయాల సిబ్బందికి, అధికారులకు కార్యనిర్వహణ అధికారుల(ఈవో) బాధ్యత ఎంతగానోఉంటుంది. వీరు ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దూపదీప నైవేద్యాల నిధులను సమకూర్చడంలోనూ వీరు బాధ్యత వహిస్తారు. పనిభారం పెరిగి.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో మొత్తం 11 మంది కార్యనిర్వహణ అధికారులు(ఈవో) ఉండాలి. కానీ ఆరుగురే ఉన్నారు. దీంతో ఉన్నవారికే ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. దీంతో వీరి పరిధిలో ఉన్న ఆలయాలే కాక అదనపు బాధ్యతలతో సతమతమవుతున్నారు. ఒక్కొక్క ఈవో పదికి మించి ఆలయాల పర్యవేక్ష చేయాల్సి వస్తోంది. దీంతో పనిభారం పెరిగి పాలన అస్తవ్యస్తంగా మారుతోందనే ఆరోపణలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఈవోలను నియమించి ఆలయాల్లో నెలకొంటున్న సమస్యలను పరిష్కరించాలని సిబ్బంది కోరుతున్నారు. నీలకంఠేశ్వర ఆలయం కార్యనిర్వహణాధికారుల కొరత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 11 మందికి ఆరుగురే ఈవోలు ఉన్న వారికి అదనపు బాధ్యతలు పనిభారంతో అస్తవ్యస్తంగా మారిన ఆలయాల పాలన నివేదిక అందించాం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో ఖాళీగా ఉన్న ఈవో పోస్టుల కోసం దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులకు నివేదిక అందించాం. పూర్తి స్థాయిలో ఆలయాల్లో అధికారులు, సిబ్బంది ఉంటే ఉత్సవాలు, పండుగలకు ఇబ్బందులు ఉండవు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ఆలయాలకు ఐదుగురు కార్యనిర్వహణ అధికారులు అవసరం. ఆలయ భూముల పరిరక్షణ సర్వే వివరాల కోసం సిబ్బంది కూడా అవసరమే. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాము. – శ్రీరాం రవీందర్, ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఉమ్మడి జిల్లాలో 1,359 ఆలయాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1,359 ఆలయాలు ఉన్నాయి. వీటిలో రూ. కోటి ఆదాయం వచ్చే ఆలయాలు 6(ఏ)కింద ఆరు ఆలయాలు ఉంటే, రూ. 25 లక్షలు ఆదాయం ఉన్నవి 6(బీ) కింద11 దేవాలయాలు, రూ. రెండు లక్షల వరకు ఆదాయం ఉన్న ఆలయాలు 6(సీ)కింద 1,340 ఆలయాలు ఉన్నా యి. మఠాలు 6(డి) కింద ఉన్నాయి. ఇందులో 384 దేవాలయాలకు 4,153.25 ఎకరాల భూములు ఉన్నాయి. వాటిలో 568.94 ఎకరాలను రైతులకు కౌలుకు ఇచ్చారు. దీని ద్వారా ఆలయాలకు రూ.27.53 లక్షల ఆదాయం సమకూరుతోంది. -
రైల్వే స్టేషన్ను తనిఖీ చేసిన జీఎం
కామారెడ్డి టౌన్: కామారెడ్డి రైల్వే స్టేషన్ను రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ బుధవారం తనిఖీ చేశారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద కామారెడ్డి రైల్వే స్టేషన్లో రూ. 39.09 కోట్లతో చేపట్టిన పనులను పరిశీలించారు. అలాగే గేట్ నంబర్ 238 వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి, సిబ్బందికి సూచనలిచ్చారు. ట్రాక్ భద్రత, వేగ సామర్థ్యం, ప్రయాణికులకు సౌకర్యాలపై అధికారులతో సమీక్షించారు. ప్రయాణికులు వేచి ఉండే గదులు, స్టాల్స్, బుకింగ్ కౌంటర్లు, లిఫ్ట్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. స్టేషన్లోని సమస్యలను పలువురు జీఎం దృష్టికి తీసుకెళ్లగా.. స్థానిక స్టేషన్ అధికారులతో మాట్లాడి ఆయా సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్లో పతకాల పంట కామారెడ్డి అర్బన్: రాష్ట్రస్థాయి యూత్, ఆల్ ఏజ్ గ్రూప్ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు అత్యంత ప్రతిభ చూపి బంగారు, కాంస్య పతకాలు సాధించారు. రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం మైదానం సింథటిక్ట్రాక్పై మంగళ, బుధవారాల్లో ఈ పోటీలు నిర్వహించారు. అండర్ –20 విభాగంలో జావెలిన్ త్రోలో బి.ఈశ్వర్ప్రసాద్ బంగారు పతకం సాధించగా, అండర్–18 విభాగంలో షాట్పుట్లో ఎన్.స్పందన కాంస్య పతకం సాధించారని జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్రెడ్డి, అనిల్కుమార్ తెలిపారు. విజేతలను అసోసియషన్ ప్రతినిధులు అభినందించారు. నేడు సౌత్క్యాంపస్లో సెమినార్ భిక్కనూరు: భిక్కనూరులోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్లో గురువారం జాతీయ సెమినార్ నిర్వహించనున్నారు. ‘యువత.. సామాజిక వ్యాపార వేత్తలు’ అనే అంశంపై జాతీయ సెమినార్ నిర్వహించనున్నట్లు సెమినార్ ఇన్చార్జి వీరభద్రం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారతదేశంలో మార్పుల సృష్టికర్తలు, తర్వాతి తరాన్ని ప్రేరేపించడంపై చర్చిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కిష్టారెడ్డి, ఐసీఎస్ఎస్ఆర్ సౌత్ రీజినల్ డైరెక్టర్ సుధాకర్రెడ్డి, తెలంగాణ యూనివర్సిటీ వైస్చాన్స్లర్ యాదగిరిరావు, సామాజికవేత్త ప్రసన్నకుమార్, రిజిస్ట్రార్ యాదగిరి హాజరవుతారని తెలిపారు. విద్యార్థులు, యువకులు, వ్యాపారులు సెమినార్లో పాల్గొనాలని కోరారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలి కామారెడ్డి క్రైం: నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. జిల్లా కేంద్రంలోని కాకతీయ నగర్లోగల 33/11 కేవీ సబ్స్టేషన్ను బుధవారం ఆయన సందర్శించారు. ఏసీ, డీసీ కంట్రోల్ ప్యానల్లను పరిశీలించారు. అనంతరం ఎస్ఈ శ్రావణ్ కుమార్తో మాట్లాడి విద్యుత్ సరఫరాకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఈ కల్యాణ్ చక్రవర్తి, ఏడీఈ కిరణ్ చైతన్య, ఏఈ వెంకటేశ్, డీఈ నాగరాజు, ప్రొటెక్షన్ ఏడీఈ జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక నిఘా ఉంచాం
ఇప్పటికే గంజాయి సరఫరా, విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టాం. ఎవరైనా సరఫరా చేసినా, విక్రయించినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తప్పవు. గంజాయితో ఎదురయ్యే దుష్పరిణామాలపై యువతకు అవగాహన కల్పించే కార్యక్రమాలు సైతం చేపడుతున్నాం. యువత గంజాయికి దూరంగా ఉండాలి. – చంద్రశేఖర్రెడ్డి, ఎస్హెచ్వో, కామారెడ్డిఈనెల 9 న భిక్కనూరు మండలంలోని నాలుగు గ్రామాల్లో దాడులు చేసిన పోలీసులు.. మొత్తం 8 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 250 గ్రాముల గంజాయి పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా విక్రయించేందుకు మహారాష్ట్ర నుంచి గంజాయిని తీసుకువచ్చారని విచారణలో తేలింది. -
న్యాయం చేయాలని అడిగితే బెదిరిస్తున్నారు
కామారెడ్డి టౌన్: భూసమస్యపై న్యాయం చేయాలని వేడుకుంటే తమపై పోలీసు కేసు పెడతానని గ్రామ పంచాయతీ కార్యదర్శి బెదిరింపులకు గురి చేస్తున్నారని గాంధారికి చెందిన బాధితులు బంజ శంకరప్ప, రాజప్పలు తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్లో మాట్లాడారు. వంశపార్యపరంగా వస్తున్న తమ భూమిని కొందరు అక్రమంగా కబ్జా చేసుకుని వెంచర్లు వేసేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఈ విషయంలో ఆక్రమణదారులకు కార్యదర్శి సహకరిస్తూ తమను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని వేడుకున్నారు. -
పురాతన ఆలయానికి పునర్వైభవం
బిచ్కుంద: మూడు వందల ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయం ధూపదీప నైవేద్యాలు కరువై మూతబడింది. దశాబ్దాలుగా పట్టించుకునేవారు కరువవడంతో ఆలయం శిథిలమైపోయింది. సుమారు 150 ఏళ్లుగా నిరాదరణకు గురైన ఆ ఆలయానికి ఓ భక్తుడు పునర్వైభవం తీసుకువచ్చాడు. వివరాలిలా ఉన్నాయి. బిచ్కుంద మండల కేంద్రంలోని తక్కడ్పల్లి రోడ్డులో గుట్ట వద్ద పురాతన శివాలయం ఉంది. దీనిని సుమారు మూడు శతాబ్దాల క్రితం నిర్మించారు. ప్రాచీన శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ ఆలయం భక్తుల కొంగుబంగారంగా విలసిల్లింది. ఈ ఆలయాన్ని అప్పట్లో దైవాల గుడిగా పిలిచేవారని స్థానికులు చెబుతారు. అయితే తర్వాతి కాలంలో పాలకులు పట్టించుకోకపోవడంతో నిరాదరణకు గురై ఆనవాళ్లను కోల్పోయింది. గుడి సమీపంలో దయ్యాలు ఉన్నాయని ప్రచారం జరగడంతో చీకటి పడితే ప్రజలు ఆ దారిలో వెళ్లడం మానేశారు. దీంతో దైవాల గుడి కాస్తా దయ్యాల గుడిగా మారింది. కొందరు గుప్తనిధులకోసం గుడి ముందు భాగంలో తవ్వి ఆలయాన్ని ధ్వంసం చేయడంతో పూర్తిగా శిథిలమైంది. వైవిధ్యమైన శిల్పాలతో.. ఈ ఆలయం మొత్తం వైవిధ్యమైన శిల్పాలతో నిండి ఉంది. గర్భగుడిలో ఆరడుగుల రాళ్లపై అద్భుతమైన శిల్పాలను తీర్చిదిద్దారు. ఈ ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని బిచ్కుందకు చెందిన జంగం నాగరాజు సంకల్పించారు. ఆయన రూ. 40 లక్షలతో ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టి సుందరంగా నిర్మించారు. పాత శిల్పాలను యథావిధిగా ఉంచి కొత్తగా గోడలు కట్టించారు. ఈ శివాలయాన్ని పునఃప్రారంభించేందుకు భక్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల 10న అంగరంగ వైభవంగా శివ పార్వతుల విగ్రహాలను ప్రతి ష్ఠించనున్నట్లు స్థానికులు తెలిపారు.శిథిలావస్థకు చేరిన ఆలయం(ఫైల్) 150 ఏళ్ల క్రితం శిథిలమైన శివాలయం రూ.40 లక్షలతో పునర్నిర్మించిన భక్తుడు వచ్చే నెల 10న విగ్రహ ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లుసొంత నిధులతో.. వందల ఏళ్ల చరిత్ర కలిగిన గుడి శిథిలావస్థకు చేరడం బాధగా అనిపించింది. ఆలయానికి పూర్వవైభవం తీసుకురావాలని సంకల్పించాను. నేను రూ.40 లక్షలు వెచ్చించి పునర్నిర్మించాను. పాత ఆలయంలో చెక్కుచెదరకుండా ఉన్న రాతి శిల్పాలను అలాగే ఉంచాం. – జంగం నాగరాజ్, బిచ్కుంద -
తాళం వేసిన ఇంట్లో చోరీ
ఖలీల్వాడి: నగరంలోని రెండో టౌన్ పీఎస్ పరిధిలో తాళం వేసిన ఓ ఇంట్లో దొంగతనం జరిగినట్లు ఎస్సై యాసిన్ అరాఫత్ బుధవారం తెలిపారు. గాజుల్పేట్కు చెందిన రణ్పాల్ సింగ్ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం బంధువుల ఫంక్షన్కు వెళ్లారు. బుధవారం ఉదయం తిరిగి వచ్చి చూడగా ఇంటి తలుపులు పగులగొట్టి ఉన్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. ఇంట్లో ఉన్న తులంన్నర బంగారం, రూ. 25 వేల నగదు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. పేకాట స్థావరంపై దాడి సిరికొండ: మండలంలోని పెద్దవాల్గోట్ గ్రామ సమీపంలో మామిడి తోటలో పేకాట ఆడుతున్న వారిని బుధవారం పట్టుకున్నట్లు ఎస్సై ఎల్ రామ్ తెలిపారు. పేకాట ఆడుతున్న ఐదుగురిని పట్టుకొని వారి నుంచి రూ.7550 నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ఆరు ట్రాక్టర్ల ఇసుక డంప్ సీజ్
రుద్రూర్: మండలంలోని సులేమాన్నగర్ శివారులో నిల్వ చేసిన ఇసుక డంప్ను రెవెన్యూ అధికారులు బుధవారం సీజ్ చేశారు. గ్రామ శివారులో అక్రమంగా ఇసుక డంప్ చేశారనే సమాచారం మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ భారతి వెళ్లి ఇసుక డంప్ను పరిశీలించారు. స్థానికంగా విచారణ చేపట్టగా అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించి సీజ్ చేశారు. సీజ్ చేసిన ఇసుక సుమారు ఆరు ట్రాక్టర్ల వరకు ఉంటుందన్నారు. ఇసుకను ప్రభుత్వ అభివృద్ధి పనులకు కేటాయించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. షార్ట్ సర్క్యూట్తో మీసేవ కేంద్రం దగ్ధం నిజాంసాగర్: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మీసేవ కేంద్రం దగ్ధమైన ఘటన మండలంలోని మల్లూర్లో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మైపాల్ మీసేవ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరిగానే సోమవారం రాత్రి మీసేవ కేంద్రానికి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్తో మీసేవ కేంద్రంలోని కంప్యూటర్, ప్రింటర్తో పాటు జిరాక్స్ మిషన్, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతైంది. ప్రమాదంలో రూ.1.5 లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. ప్రభుత్వ ప రిహారం చెల్లించి ఆదుకోవాలని బాధితుడు, గ్రామస్తులు కోరుతున్నారు. -
‘ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి’
కామారెడ్డి టౌన్: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్ బోర్డు డైరెక్టర్, సెక్రెటరీ కృష్ణ ఆదిత్య సూచించారు. బుధవారం ఆయన కామారెడ్డి ఆర్అండ్బీ అతిథి గృహంలో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. పరీక్ష కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, అధికారులు పాల్గొన్నారు. క్రమశిక్షణతో ముందుకు సాగాలి ● అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి భిక్కనూరు: విద్యార్థులు క్రమశిక్షణతో ముందు కు సాగితే ఉన్నత శిఖరాలను అధిరోహించవ చ్చని అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నా రు. బుధవారం రాత్రి ఆయన మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన వి ద్యార్థులతో మాట్లాడారు. తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలని సూచించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవి, ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు.అనంతరం ఆయన విద్యార్థుల తో కలిసి భోజనం చేశారు. ఆయన వెంట మండల ప్రత్యేకాధికారి రజిత తదితరులున్నారు. అభ్యసన సామర్థ్యాల పెంపుపై దృష్టిసారించాలి బోధన్: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఉపాధ్యాయులకు సూచించారు. చదువుతో పాటు ఆరోగ్య అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. బుధవారం సాలూ ర జెడ్పీహెచ్ఎస్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను సబ్ కలెక్టర్, స్థానిక తహసీల్దార్ శశిభూషణ్తో కలిసి సందర్శించారు. పాఠశాలలో మధ్యా హ్న భోజన వంటశాలను పరిశీలించారు. విద్యార్థు లతో మాట్లాడి, వారి అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని హెచ్ఎంలకు ఆదేశించారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పట్టభద్రుల శాసన మండలి స్థానంపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో ప్రచారాన్ని ముమ్మరం చేయడానికి పార్టీ ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా బుధవారం కామారెడ్డి, బాన్సువాడ పట్టణాల్లో కేడర్తో సమావేశాలు నిర్వహించనున్నారు. శాసన మండలి ఎన్నికలు ఈనెల 27న జరగనున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానీ, ముఖ్య నేతలు గానీ ప్రచారం నిర్వహించలేదు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీ ముఖ్య నేతలంతా రంగంలో దిగుతున్నారు. ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా జిల్లాలో రెండు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. బుధవారం ఉదయం 10 గంటలకు కామారెడ్డి పట్టణంలోని సత్య గార్డెన్లో, మధ్యాహ్నం 1.30 గంటలకు బాన్సువాడ పట్టణంలోని ఎస్ఎంబీ గార్డెన్లో సమావేశాలు నిర్వహించనున్నారు. ఆయా సమావేశాలకు పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్అలీ, పోచారం శ్రీనివాస్రెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు మదన్మోహన్రావు, లక్ష్మీకాంతారావు హాజరుకానున్నారు. సన్నాహక సమావేశానికి తరలిరావాలిబాన్సువాడ : బాన్సువాడలో బుధవారం నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి కార్యకర్తలు తరలిరావాలని ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్ కోరారు. మంగళవారం నియోజకవర్గంలోని పొతంగల్, బీర్కూర్, వర్ని, కోటగిరి, నస్రుల్లాబాద్ మండలాల్లో ఆయన కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం మధ్యాహ్నం బాన్సువాడలో నిర్వహించే సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్తోపాటు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరు కానున్నారన్నారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు పవన్, బోయిని శంకర్, యామ రాములు, కాశీరాం, విజయ్ప్రకాష్, దాసరి శ్రీనివాస్, ప్రసాద్, ప్రశాంత్, గౌస్ తదితరులు ఉన్నారు. నేడు కామారెడ్డి, బాన్సువాడలలో సమావేశాలు హాజరుకానున్న పీసీసీ చీఫ్, జిల్లా మంత్రి -
నిరంతరం పర్యవేక్షించాలి
కామారెడ్డి క్రైం: రానున్న వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని సీఎస్ శాంతికుమారి సూచించారు. మంగళవారం ఆమె హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్ సరఫ రా, రైతు భరోసా, యూరియా కొరత, రేషన్ కార్డు ల జారీ, రెసిడెన్షియల్ పాఠశాలల సందర్శన తది తర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ తాగునీటి సమస్య ఏర్పడకుండా తగిన కార్యాచరణ రూపొందించాలన్నారు. రబీ సీజన్కు సాగునీటి సమస్య లేకుండా ప్రాజెక్టులు, చెరువుల పై సమీక్షించి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. యూరియా కొరత లేకుండా చూడాలన్నారు. వేసవి లో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చ ర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హత గల ప్రతి రైతుకు రైతు భరోసా అందేలా చూడాలన్నారు. ప్ర జాపాలనలో రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ చే యాలన్నారు. గురుకుల పాఠశాలలను జిల్లా అధికారులు సందర్శించి, సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీటి ఎద్దడి తలెత్తకుండా కార్యాచరణ రూపొందించాలి వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ శాంతికుమారి17 ప్రాంతాల్లో సమస్య.. జిల్లాలో 860 ఆవాస ప్రాంతాలు ఉండగా 17 చోట్ల తాగునీటి సమస్య ఉందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అ నంతరం ఆయన జిల్లా అధికారులతో మాట్లాడారు. సమస్య ఉన్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వా రా నీటిని సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. బోర్ వెల్స్కు అవసరమైన మర మ్మతులు చేయించాలన్నారు. రేషన్ కార్డుల వెరి ఫికేషన్కు సంబంధించి రోజువారీ రిపోర్టులు స మర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అ దనపు కలెక్టర్లు విక్టర్, శ్రీనివాస్రెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయి, నీటిపారుదల శాఖ సీఈ రవి, మిష న్ భగీరథ ఎస్ఈ రాజేంద్ర కుమార్, విద్యుత్ శా ఖ ఎస్ఈ శ్రావణ్ కుమార్, డీఏవో తిరుమల ప్ర సాద్, ఆర్డీవో ప్రభాకర్, డీపీవో శ్రీనివాస్రావు, డీఎస్వో మల్లికార్జున్ బాబు పాల్గొన్నారు. -
కుటుంబ కలహాలతో ఒకరి ఆత్మహత్య
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాలు ఇలా.. మహమ్మద్ నగర్కు చెందని తూర్పటి మోహన్(28) నిత్యం మద్యం తాగి వస్తుండటంతో భార్య కాశవ్వ మందలించేది. అలాగే తరుచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. సోమవారం రాత్రి మద్యం తాగివచ్చిన మోహన్, భార్యతో గొడవపడి, అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మనస్తాపం చెంది గ్రామశివారులోని తన తల్లి సమాధి వద్ద ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ఇందల్వాయి మండలంలో ఒకరు.. ఇందల్వాయి: మండలంలోని ఓ వ్యక్తి మానసికంగా సరిగా లేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా.. మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన గాండ్ల శ్యామ్(24) గతంలో గల్ఫ్కి వెళ్లి వచ్చాడు. ప్రస్తుతం ఇంటివద్దనే వ్యవసాయ పనులతోపాటు ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈమధ్య అతను మానసికంగా ఆరోగ్యంగా లేకపోవడంతోపాటు మంగళవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి ఇంకా పెళ్లి కాలేదని, మృతుడి తల్లి పోశవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మనోజ్ తెలిపారు. -
మొక్కలు ఎండిపోకుండా చూడాలి
గాంధారి: నర్సరీల్లోని మొక్కలు ఎండిపోకుండా షేడ్ నెట్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన పేట్సంగెం గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్, నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ కంపోస్టు ఎరువులను తయారు చేయాలని ఆదేశించారు. వేసవిలో మారుమూల గ్రామాలు, తండాల్లో తాగు నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రశ్నలు సంధించి వారి సామర్థ్యాలను పరీక్షించారు. అర్థం కాని విషయాలుంటే టీచర్లను అడిగి తెలుసుకోవాలని విద్యార్థులకు సూచించారు. పదో తరగతి తరువాత ఐఐఐటీల్లో చేరాలని సూచించారు. విద్యార్థులను పదో తరగతి పరీక్షలకు సన్నద్ధం చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. మధ్యాహ్న భోజనాన్ని, వంటశాలను పరిశీలించారు. నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు. ఆయనవెంట డీఆర్డీవో సురేందర్, డీపీవో శ్రీనివాస్రావు, మండల ప్రత్యేకాధికారి లక్ష్మీప్రసన్న, డీఎల్పీవో సురేందర్, తహసీల్దార్ సతీష్ రెడ్డి, ఎంపీడీవో రాజేశ్వర్, ఎంపీవో లక్ష్మీనారాయణ తదితరులున్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
లైంగిక దాడులు జరగకుండా చూడాలి
● సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి కామారెడ్డి క్రైం : పాఠశాలల్లో విద్యార్థులపై లైంగిక దాడులు జరగకుండా చూడాలని సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి ఉపాధ్యాయులకు సూచించారు. మంగళవారం కా మారెడ్డిలోని కళాభారతి ఆడిటోరియంలో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులుగా ఎంపిక చేసి న ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు పో క్సో చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలల్లో ఏవైనా పోక్సో సంబంధిత ఘటనలు ఎదురైతే వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదు చేసిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతారన్నారు. పిల్లల విష యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులకు బ్యాడ్జీలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, యునిసెఫ్కు చెందిన చైల్డ్ ప్రొటెక్షన్ స్పెషలిస్ట్ సోని కుట్టి, జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, డీసీపీవో స్రవంతి, సీడబ్ల్యూసీ మెంబర్ స్వర్ణలత, బాల రక్షక్ భవన్ సిబ్బంది పాల్గొన్నారు. తాగునీటి సమస్యపై దృష్టి సారించండి కామారెడ్డి క్రైం: వేసవి కాలంలో జిల్లాలో తా గునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్ర ణాళికలు సిద్ధం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ.శరత్ సూచించారు. మంగళవా రం జిల్లాకు విచ్చేసిన ఆయన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్తో సమావేశమై పలు అంశాలపై చ ర్చించారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉ న్న చోట్ల ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చే యాలన్నారు. అవసరమైతే బోరుబావులను అద్దెకు తీసుకోవాలని సూచించారు. ‘మహిళల భద్రతకు ప్రాధాన్యత’ కామారెడ్డి క్రైం: మహిళలు, బాలికల భద్రతకు భరోసా కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందని ఏఎస్పీ నరసింహారెడ్డి పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో భరోసా కేంద్రం ప్రారంభమై ఏడాది గడుస్తున్న సందర్భంగా మంగళవారం వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ పోక్సో, మహిళలపై అత్యాచారాల కేసులను నియంత్రించడానికి భరోసా కేంద్రం ద్వారా పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. బాధితులకు అండగా ఉంటున్నామని, న్యాయ సలహాలు, వైద్యం తదితర సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 72 కేసులలో బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. ఆర్థికంగా వెనకబడిన 45 కుటుంబాలకు రూ. 10.12 లక్షలు సహాయం అందించామన్నారు. పోక్సో, అత్యాచార కేసుల్లో బాధిత మహిళలు, బాలికలకు సత్వర న్యాయం జరిగేలా కృషి చేస్తున్న భరోసా కేంద్రం సిబ్బందిని అభినందించారు. ‘మర్యాదపూర్వకంగా మెలగాలి’ కామారెడ్డి టౌన్ : ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా మెలగాలని కరీంనగర్ జోన్ ఎ గ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుస్రోషా ఖాన్ సూచించా రు. మంగళవారం కామారెడ్డి ఆర్టీసీ డిపోలో సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో ఈడీ పాల్గొన్నారు. సంస్థ ఆ దాయాన్ని పెంచేందుకు కృషి చేయాలన్నా రు. ప్రమాద రహిత డిపోగా పేరు తేవాలని సూచించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ ఇందిర, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. -
ట్రాక్టర్ బోల్తాపడి యువకుడి మృతి
బాల్కొండ: పంటభూమిని దుక్కి దున్నుటకు ఓ వ్యక్తి ట్రాక్టర్పై వెళుతుండగా ప్రమాదవశాత్తు వాహనం బోల్తాపడి మృతిచెందాడు. మెండోరా ఎస్సై నారాయణ తెలిపిన వివరాలు ఇలా.. కర్నేబోయిన శ్రీనివాస్(27) అనే వ్యక్తి బతుకు దెరువు కోసం మెదక్ నుంచి వెల్కటూర్కు కొన్నేళ్ల క్రితం వలస వచ్చాడు. గ్రామంలో ఇతరుల భూములను కౌలుపై సాగు చేసేవాడు. ఈక్రమంలో గ్రామానికి చెందిన గంగాధర్ ట్రాక్టర్ను మంగళవారం అతడు తీసుకుని తాను కౌలు చేస్తున్న పంట భూమిని దుక్కి దున్నుటకు బయలుదేరాడు. మార్గమధ్యలో ట్రాక్టర్ బోల్తాపడటంతో శ్రీనివాస్ ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయి అక్కడిక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాలువలో పడి ఒకరు.. నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ ప్రధాన కాలువలో పడి ఓ వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. మహమ్మద్ నగర్ మండల కేంద్రానికి చెందిన జగ్గంపల్లి సాయిలు(55) అనే వ్యక్తి ఈ నెల 14న ఇంటి నుంచి బయటకు వెళ్లి, తిరిగిరాలేడు. దీంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. మంగళవారం సింగితం శివారులోని నిజాంసాగర్ ప్రధాన కాలువ అతడి మృతదేహం పోలీసులకు లభ్యమైంది. మృతుడి భార్య సాయవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
డీసీసీబీని అగ్రస్థానంలో నిలపాలి
సుభాష్నగర్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (ఎన్డీసీసీబీ) ద్వారా రైతులకు స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు అందించి రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో నిలపాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. డీసీసీబీ పాలకవర్గం, సహకార సంఘాల కాల పరిమితిని ఆరు నెలలు పొడిగించినందుకు మంగళవారం సీఎం రేవంత్రెడ్డిని డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. రైతుల సంక్షేమానికి కృషి చేయడంతోపాటు అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం బాధ్యతతో పని చేయాలని సీఎం సూచించారని రమేశ్రెడ్డి తెలిపారు. -
సరికొత్త పోలీసు!
కామారెడ్డి క్రైం: నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా పోలీస్ శాఖ సరికొత్తగా ముందుకు సాగుతోంది. అత్యవసర విభాగాల్లో పని చేసే సిబ్బందికి డ్రైవింగ్ నైపుణ్యాలు పెంపొందించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే తొలిసారిగా జిల్లాలో మహిళా కానిస్టేబుళ్లతో క్యూఆర్టీ(క్విక్ రియాక్షన్ టీం)లను ఏర్పాటు చేశారు. ఆందోళన కార్యక్రమాలు, శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడే అవకాశం ఉన్న సమయాల్లో ఆయా బృందాలు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కబెట్టేందుకు అవకాశాలుంటాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 189 మంది కొత్త కానిస్టేబుళ్లు.. కొత్తగా ఉద్యోగాలు సాధించిన 189 మంది కానిస్టేబుళ్లు 9 నెలల శిక్షణ పూర్తి చేసుకుని గతేడాది నవంబర్లో విధుల్లో చేరారు. ఇందులో సివిల్ కానిస్టేబుళ్లు 115 మంది, ఏఆర్ కానిస్టేబుళ్లు 74 మంది ఉన్నారు. సివిల్లో 75 మంది పురుషులు, 40 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉండగా.. ఆర్మ్డ్ రిజర్వ్లో 58 మంది పురుషులు, 16 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరికి విధుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు, వ్యవహరించాల్సిన తీరు, అప్రమత్తత, బందోబస్తు తదితర అంశాలపై ఇప్పటికే జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. సీనియర్లతో శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి ఆయా అంశాలపై అవగాహన కల్పించారు. అత్యవసర విభాగాల్లో పని చేసే సిబ్బందికి వాహనాలను నడపడంలో నైపుణ్యాలు ఎంతో ముఖ్యం. ఈ నేపథ్యంలో కొత్త కానిస్టేబుళ్లందరికీ డ్రైవింగ్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఎస్పీ సింధు శర్మ సూచనల మేరకు సబ్ డివిజన్ల వారీగా శిక్షణ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇప్పటికే పలు విడతలలో 75 మందికి డ్రైవింగ్లో శిక్షణ పూర్తయ్యింది. మిగిలినవారికి త్వరలోనే శిక్షణ ఇవ్వనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.క్విక్ రియాక్షన్ టీంలు.. ఇప్పటివరకు పురుష కానిస్టేబుళ్లతో కూడిన క్విక్ రియాక్షన్ టీంలు ఉన్నాయి. ప్రస్తుతం తొలిసారిగా మహిళా కానిస్టేబుళ్లతో డివిజన్ల వారీగా క్యూఆర్టీలు ఏర్పాటు చేశారు. ఎక్కడైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగే ఘటనలు జరిగితే క్యూఆర్టీ బృందాలు వెంటనే అక్కడకు చేరుకుంటాయి. పరిస్థితిని అదుపు చేయడానికి వారు కృషి చేస్తారు. క్యూఆర్టీ సభ్యులు నిత్యం వాహనాల తనిఖీలు, బందోబస్తు చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీగా ఉండే ప్రదేశాల్లో తనిఖీ చేపట్టడంలాంటి విధుల్లో పాల్గొననున్నారు. ప్రతి కానిస్టేబుల్కు డ్రైవింగ్లో శిక్షణ తొలిసారిగా మహిళా కానిస్టేబుళ్లతో క్యూఆర్టీ ఏర్పాటు -
నిరంతరం పర్యవేక్షించాలి
కామారెడ్డి క్రైం: రానున్న వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని సీఎస్ శాంతికుమారి సూచించారు. మంగళవారం ఆమె హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్ సరఫ రా, రైతు భరోసా, యూరియా కొరత, రేషన్ కార్డు ల జారీ, రెసిడెన్షియల్ పాఠశాలల సందర్శన తది తర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ తాగునీటి సమస్య ఏర్పడకుండా తగిన కార్యాచరణ రూపొందించాలన్నారు. రబీ సీజన్కు సాగునీటి సమస్య లేకుండా ప్రాజెక్టులు, చెరువుల పై సమీక్షించి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. యూరియా కొరత లేకుండా చూడాలన్నారు. వేసవి లో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చ ర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హత గల ప్రతి రైతుకు రైతు భరోసా అందేలా చూడాలన్నారు. ప్ర జాపాలనలో రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ చే యాలన్నారు. గురుకుల పాఠశాలలను జిల్లా అధికారులు సందర్శించి, సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 17 ప్రాంతాల్లో సమస్య.. జిల్లాలో 860 ఆవాస ప్రాంతాలు ఉండగా 17 చోట్ల తాగునీటి సమస్య ఉందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అ నంతరం ఆయన జిల్లా అధికారులతో మాట్లాడారు. సమస్య ఉన్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వా రా నీటిని సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. బోర్ వెల్స్కు అవసరమైన మర మ్మతులు చేయించాలన్నారు. రేషన్ కార్డుల వెరి ఫికేషన్కు సంబంధించి రోజువారీ రిపోర్టులు స మర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అ దనపు కలెక్టర్లు విక్టర్, శ్రీనివాస్రెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయి, నీటిపారుదల శాఖ సీఈ రవి, మిష న్ భగీరథ ఎస్ఈ రాజేంద్ర కుమార్, విద్యుత్ శా ఖ ఎస్ఈ శ్రావణ్ కుమార్, డీఏవో తిరుమల ప్ర సాద్, ఆర్డీవో ప్రభాకర్, డీపీవో శ్రీనివాస్రావు, డీఎస్వో మల్లికార్జున్ బాబు పాల్గొన్నారు. నీటి ఎద్దడి తలెత్తకుండా కార్యాచరణ రూపొందించాలి వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ శాంతికుమారి -
బైక్ను ఢీకొన్న బొలెరో వాహనం
పిట్లం(జుక్కల్): కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రం శివారులోని జాతీయ రహదారిపై మంగళవారం సంగారెడ్డి జిల్లాకు చెందిన దంపతులిద్దరూ బైక్పై వెళుతుండగా బొలెరో వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని అంతర్గామ గ్రామానికి చెందిన శకుంతల, సంగయ్య దంపతులు బైక్పై చిన్నకొడప్గల్ వైపు బయలుదేరారు. పిట్లం శివారులో వారి బైక్ను బొలెరో వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈఘటనలో శకుంతల (45) మృతి చెందగా, సంగయ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న హైవే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని పిట్లం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం బాన్సువాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు నమోదు చేశారు. ప్రమాదంలో భార్య మృతి, భర్తకు గాయాలు -
యువకుడి అదృశ్యం
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని వెల్గనూర్ గ్రామానికి చెందిన సురిసాని రాజశేఖర్రెడ్డి అనే యువకుడు రెండు రోజుల నుంచి కనిపించకుండా పోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివకుమార్ మంగళవారం తెలిపారు. రాజశేఖర్ రెడ్డి ఎల్లారెడ్డి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. ఈ నెల 17న ఉదయం కళాశాలకు వెళ్లిన అతడు ఇంటికి తిరిగిరాలేడు. అతడి తండ్రి హన్మంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. దోమకొండలో తల్లీ కూతురు.. దోమకొండ: మండల కేంద్రానికి చెందిన నర్రాగుల కళావతి ఆమె కూతురు భవానీ అదృశ్యమైనట్లు దోమకొండ ఎస్సై స్రవంతి మంగళవారం తెలిపారు. కళావతి సోమవారం భర్త నరసింహులుతో గొడవపడింది. అనంతరం కూతురు భవానీని తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు ఎంత వెతికినా వారి ఆచూకీ లభించలేదు. దీంతో కళావతి పెద్ద కూతురు నికిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గంజాయి రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్ ● 445 గ్రాముల గంజాయి స్వాధీనం కామారెడ్డి క్రైం: గంజాయి రవాణా చేస్తున్న ఓ ముఠాను కామారెడ్డి రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి 445 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ రామన్ వివరాలు వెల్లడించారు. గంజాయి రవాణాపై విశ్వసనీయ సమాచారం రావడంతో దేవునిపల్లి ఎస్సై రాజు ఆధ్వర్యంలో రామారెడ్డి బ్రిడ్జి వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ కారు, బైక్లపై గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని నిజామాబాద్కు చెందిన రాథోడ్ రవి, సయ్యద్ సాజిద్, కామారెడ్డికి చెందిన దేవుని పృఽథ్వీ, నిట్టూరి సిద్దార్థరావు, పసులోటి భానుచందర్గా గుర్తించారు. గంజాయిని, వాహనాలను సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. నగరంలో పోలీసు కవాతు ఖలీల్వాడి: నగరంలోని రెండో పోలీస్స్టేషన్ పరిధిలోని పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ఫోర్స్ మంగళవారం కవాతు నిర్వహించారు. రానున్న రంజాన్, హనుమాన్ జయంతి వేడుకల నేపథ్యంలో స్టేషన్ పరిధిలోని గోల్హనుమాన్ నుంచి కసాబ్గల్లీ, గాజులపేట్ తోపాటు హైమద్బజార్, నెహ్రూపార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఏసీపీ రాజావెంకట్రెడ్డి, టౌన్ సీఐ శ్రీనివాసురాజు, ఎస్సై యాసీన్ఆరాఫత్ తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): గ్రామాలలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం తాడ్వాయి మండల కేంద్రాన్ని సందర్శించారు. అధికారులు గ్రామాలలో తిరుగుతూ తాగునీటి సమస్యలు ఉన్న గ్రామాలను గుర్తించి సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. మండల పరిషత్ కార్యాలయాన్ని తనిఖీ చేసి సమగ్ర కుటుంబసర్వేకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాలలో పెండింగ్లో ఉన్న ఇంటి పన్నులను 100 శాతం వసూలు చేయాలని సూచించారు. అనంతరం తాడ్వాయి శివారులోని నర్సరీని పరిశీలించారు. ప్రతిరోజు మొక్కలకు నీటిని పోసి మొక్కలు ఏపుగా పెరిగేలా చూడాలన్నారు. మండల ప్రత్యేక అధికారి రాజారాం, ఎంపీడీవో సయ్యద్ సాజిద్, ఎంపీవో సవితారెడ్డి, గ్రామ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి
రాజంపేట: ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని రాజంపేట్ మండల వైద్యాధికారి విజయ మహాలక్ష్మి తెలిపారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 76 మంది మహిళలకు రక్త పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. మహిళలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని, పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. హెల్త్ సూపర్వైజర్ మంజూర్ తదితరులు పాల్గొన్నారు. లింగంపేట పీహెచ్సీలో అమ్మ ఒడి లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని పీహెచ్సీలో మంగళవారం అమ్మ ఒడి కార్యక్రమం నిర్వహించినట్లు డాక్టర్ హిమబిందు తెలిపారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీ్త్రలు, గర్భిణులు తీసుకోవాల్సిన పౌష్టికాహారం, ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పలువురికి రక్త పరీక్షలు చేసి నమూనాలను టి–హబ్కు పంపినట్లు తెలిపారు. రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఐరన్ మాత్రలు పంపిణీ చేశారు. -
‘నిరుపేద ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి’
భిక్కనూరు: నిరుపేద ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషిచేస్తానని భిక్కనూరు ఆర్యవైశ్యసంఘం నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన పురాం రాజమౌళి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా చల్ల లక్ష్మణ్, కోశాధికారిగా కోడిప్యాక వెంకటేశంలతో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడు పురాం రాజమౌళి మాట్లాడుతూ.. వైశ్య సంఘం అభివృద్ధితో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతానన్నారు. అలాగే విద్యలో ప్రతిభ చూపుతున్న నిరుపేదల ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం అందజేస్తానన్నారు. ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పబ్బ నాగరాజు, శ్రీరాం చంద్రశేఖర్, గంగెళ్లి మధుసూదన్, అతిమాముల శ్రీధర్, చీకోటి నాగభూషణం, అతిమాముల రమేష్, బంక్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
పాత కక్షలతో ఒకరి హత్య!
లింగంపేట(ఎల్లారెడ్డి): పాత కక్షలతో ఒకరిని హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిట్లం మండలం బొల్లక్పల్లి, లింగంపేట మండలం బాణాపూర్ గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. పిట్లం మండలం బొల్లక్పల్లి గ్రామానికి చెందిన ఉప్పరి పోచయ్య(70) ఈనెల 1న తన ఇంటి ఆరుబయట నిద్రించాడు. మరుసటి రోజు నుంచి అతడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా బొల్లక్పల్లి గ్రామానికి చెందిన అనుమానితుడిని విచారించారు. అనుమానితుడికి, మృతుడికి మధ్య భూ వివాదంతోపాటు పలు విషయాలపై పాత కక్షలు ఉండగా, తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. దీంతో హత్య చేసిన ప్రదేశమైన లింగంపేట మండలం బాణాపూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలోకి పోలీసులు అనుమానితుడిని తీసుకెళ్లి ఆధారాలు సేకరించారు. పోచయ్యను ఒక్కడే హత్య చేశాడా..? మరెవరైనా సహకరించారా..? అనే కోణంలో విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ విషయమై పిట్లం ఎస్సై రాజును వివరణ కోరగా విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతిభిక్కనూరు: మండలంలోని అంతంపల్లి గ్రామ శివారులో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలు ఇలా.. భిక్కనూరులో హేయిర్ కటింగ్ షాపు నిర్వహిస్తున్న కొత్తపల్లి అఖిల్ (30) మంగళవారం వేములవాడకు స్నేహితులతో కలిసి వెళ్తున్నా అని ఇంట్లో వారికి చెప్పి, బైక్పై బయలుదేరి వెళ్లాడు. అంతంపల్లి–బీటీఎస్ మధ్యలో జాతీయ రహదారిపై రాత్రివేళ అఖిల్ అపస్మారక స్థితిలో కనిపించాడు. స్థానికులు గమనించి నేషనల్ హైవే అంబులెన్స్కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది వెంటనే అక్కడికి అఖిల్ను కామారెడ్డికి ఆస్పత్రికి తరలించారు. కానీ వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించాడని నిర్ధారించారు. మృతుడికి భార్య సింధు, రెండేళ్ల కూతురు, తల్లిదండ్రులు ఉన్నారు. అఖిల్ బైక్పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి మరణించాడా? లేక ఇంకా ఏదైనా కారణం ఉందా అన్న విషయాలు తెలియరాలేదు. -
బైక్ల చోరీ కేసులో ఇద్దరికి ఏడాది జైలు శిక్ష
కమ్మర్పల్లి: మండల కేంద్రంలో బైక్లను చోరీ చేసిన కేసులో ఇద్దరు నిందితులకు ఏడాది సాధారణ జైలు శిక్ష పడినట్లు ఎస్సై అనిల్రెడ్డి సోమవారం తెలిపారు. వివరాలు ఇలా.. గత ఏడాది వరంగంటి మోహన్, తెడ్డు నరేష్లు తమ ఇంటి ముందర నిలిపిన బైక్లను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మోహన్ బైక్ను బోధన్కు చెందిన మాలవత్ తులసీరాం, నరేష్ బైక్ను బోధన్కు చెందిన అబ్దుల్ ఆయాజ్ఖాన్ చోరీ చేసినట్లు గుర్తించి, అరెస్టు చేశారు. వారిని ఆర్మూర్ కోర్టులో హాజరుపర్చగా, విచారణ అనంతరం జడ్జి నిందితులిద్దరికి ఏడాది సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. మట్కా నిర్వాహకుడికి రెండు రోజులు.. బోధన్టౌన్(బోధన్): పట్టణంలోని ఆచన్పల్లికి చెందిన షేక్ గఫార్ బోధన్లో మట్కా నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బోధన్ కోర్టులోని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట అతడిని హాజరుపరుచగా జడ్జి రెండు రోజుల జైలుశిక్షను విధించినట్లు పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు. డ్రంకన్డ్రైవ్ కేసులో.. ధర్పల్లి: ధర్పల్లి శివారులోని ఎల్లమ్మ టెంపుల్ వద్ద ఇటీవల పోలీసులు డ్రంకన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా ఇందిరానగర్ తండాకు చెందిన సీతారాం మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. దీంతో సీతారాంను మంగళవారం నిజామాబాద్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా జడ్జి అతడికి రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. నవీపేట మండలంలో.. నవీపేట: నవీపేట్ గ్రామానికి చెందిన మహమ్మద్ నబీసాబ్, అబ్బాపూర్ (బి) గ్రామానికి చెందిన బాబు, నిర్మల్ జిల్లా కుబీర్కు చెందిన ఇసాల రాకేష్ ఇటీవల మద్యం తాగి వాహనాలు నడుపుతూ నవీపేట పోలీసులకు పట్టుబడ్డారు. మంగళవారం వారిని నిజామాబాద్ కోర్టులో హాజరుపర్చగా స్పెషల్ జ్యుడీ షియల్ సెకండ్క్లాస్ మెజిస్ట్రేట్ 2 రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై వినయ్ తెలిపారు. -
రెండు బైకులు ఢీ: ఇద్దరికి గాయాలు
ఇందల్వాయి: మండలంలోని చంద్రాయన్పల్లి గ్రామ శివారులోగల 44వ నంబరు జాతీయ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం ఓ బైక్ ముందున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. స్థానికులు, అంబులెన్స్ సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా.. చంద్రాయన్పల్లి విద్యుత్ సబ్ స్టేషన్లో ఆపరేటర్గా పని చేస్తున్న అశోక్ కామారెడ్డి నుంచి బైక్పై వస్తున్నాడు. కామారెడ్డికి చెందిన భరత్ అదేమార్గంలో కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు బైక్పై వెళ్తుండగా వెనుక నుంచి అతడిని ఢీకొన్నాడు. ఈప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఇరువురిని టోల్ప్లాజా అంబులెన్స్లో నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. పేకాడుతున్న ఆరుగురి అరెస్టు ఖలీల్వాడి: రెంజల్ పోలీస్స్టేషన్ పరిధిలోని తాడ్బిలోలి గ్రామశివారులోగల పేకాట స్థావరంపై దాడి చేసినట్లు టాస్క్ఫోర్స్ సీఐ అంజయ్య, స్పెషల్ పార్టీ సిబ్బంది మంగళవారం తెలిపారు. పేకాడుతున్న ఆరుగురిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే వారి వద్ద నుంచి ఐదు బైక్లు, నాలుగు సెల్ఫోన్లు, రూ. 31,100 నగదును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. తదుపరి చర్య నిమిత్తం రెంజల్ ఎస్సై సాయన్నకు అప్పగించినట్లు తెలిపారు. అటవీ భూమిని చదును చేసిన ట్రాక్టర్లు స్వాధీనం సిరికొండ: మండలంలోని తాటిపల్లి గ్రామ సమీపంలోగల అటవీభూమిని చదును చేసిన రెండు ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసినట్లు ఇన్చార్జి ఎఫ్ఆర్వో రవీంధర్ మంగళవారం తెలిపారు. ట్రాక్టర్లను స్వాధీనపర్చుకునే సమయంలో అటవీశాఖ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన మాలావత్ మదన్లాల్, సావిత్రి, నందిలాల్, మాలావత్ భూపతి అనే వ్యక్తులపై సిరికొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామన్నారు. న్యాల్కల్లో ఒకరిపై దాడి మోపాల్(నిజామాబాద్రూరల్): మండలంలోని న్యాల్కల్ గ్రామంలో సోమారపు గంగాధర్పై అదే గ్రామానికి చెందిన ముగ్గురు దాడి చేసి గాయపర్చిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన గంగాధర్కు రమణ రావు, లక్ష్మణ్, మరో వ్యక్తి ఆదివారం ఫోన్ చేసి పేకాట ఆడుదామని పిలిపించారు. అక్కడికి వెళ్లిన గంగాధర్ తాను పేకాట ఆడబోనని చెప్పడంతో తాగిన మైనంలో ముగ్గురు కలిసి దాడికి పాల్పడ్డారు. గంగాధర్కు తీవ్ర గాయాలు కావడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. బైక్ చోరీ కేసులో నిందితుల అరెస్టు భిక్కనూరు: బైక్ చోరీ నిందితులిద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి నాలుగు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు భిక్కనూరు సీఐ సంపత్కుమార్, ఎస్సై ఆంజనేయులు మంగళవారం తెలిపారు. భిక్కనూరు టోల్ప్లాజా వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా కామారెడ్డిలోని రాజీవ్నగర్కు చెందిన సోదరులు షేక్ తోఫిక్, షేక్ ఆఫ్రోజ్లను అనుమానంతో పట్టుకుని విచారించారు. దీంతో వారు జంగంపల్లి గ్రామంలో, భిక్కనూరులో బైక్లను చోరీ చేసినట్టు అంగీకరించారు. అనంతరం వారి వద్ద నుంచి నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు వివరించారు. ఐదుగురికి 14రోజుల రిమాండ్ ఖలీల్వాడి: పోలీసుల వాహనం అద్దాలు ధ్వంసం చేసిన కేసులో ఐదుగురు వ్యక్తులకు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించినట్లు మూడోటౌన్ ఎస్సై హరిబాబు మంగళవారం తెలిపారు. నగరంలోని శ్రద్ధానంజ్ గంజ్లో ఈనెల 15న సెక్యూరిటీ గార్డుపై కొందరు వ్యక్తులు దాడి చేస్తున్నారనే సమాచారం మేరకు పెట్రో కారులో పోలీసులు ఘటన స్థలానికి వెళ్లారు. ఈక్రమంలో కొంత మంది వ్యక్తులు పెట్రోకారు అద్దాలు పగలగొట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, ఐదుగురు వ్యక్తులను కోర్టు ముందు హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఆయన తెలిపారు. ఎస్సైని ఢీకొట్టిన కారు ఖలీల్వాడి: నగరంలోని నాలుగో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎస్సై–2 ఉదయ్కుమార్ మంగళవారం ఆర్ఆర్చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో ఓ కారును అపే సమయంలో ఎస్సైని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయనకు గాయాలు కాగా, వెంటనే సిబ్బంది, స్థానికులు ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. టౌన్ సీఐ శ్రీనివాస్రాజు, ఎస్సై శ్రీకాంత్ వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ప్రస్తుతం ఎస్సై ఆరోగ్యం కుదుటపడిందని వైద్యులు తెలిపారు. -
నేడు పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం
కామారెడ్డి టౌన్: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు జిల్లా కేంద్రంలోని సత్యగార్డెన్లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్రావు తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీలు హాజరవుతున్నారని తెలిపారు. పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, నాయకులు సందీప్, చందు, కిరణ్, గంగాధర్ తదితరులున్నారు. -
కలుషిత నీరు తాగి తొమ్మిది మేకలు మృతి
మాచారెడ్డి: కలుషిత నీటిని తాగి తొమ్మిది మేకలు మృతిచెందిన ఘటన సోమవారం మండలంలోని లచ్చాపేటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుల్లె దేవయ్యకు చెందిన మేకలు గ్రామ శివారులోని రైస్మిల్లు సమీపంలో మేస్తుండగా, రైస్మిల్లు నుంచి వెలువడిన కలు షిత నీటిని తాగాయి. దీంతో మేకలు అక్కడికక్కడే మృతిచెందినట్టు బాధితుడు తెలిపారు. ఈమేరకు పశువైద్యాధికారితో పోస్టుమార్టం చేయించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు బాధితుడు తెలిపారు. చనిపోయిన మేకల విలువ సుమారు రూ.2లక్షల వరకు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
కాలువలో పడి రైతు మృతి
బాల్కొండ: కాకతీయ కాలువలోని పంపుసెట్లో చెత్తను తొలగించడానికి నీటిలోకి దిగిన ఓ రైతు ప్రమాదవశాత్తు నీటమునిగి మృతిచెందాడు. ముప్కాల్ ఎస్సై రజనీకాంత్ తెలిపిన వివరాలు ఇలా.. ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన రైతు కోమటిశెట్టి చిన్నయ్య(46) కాకతీయ కాలువ నీటి ఆధారంగా పంపుసెట్ ఏర్పాటు చేసుకొని, ఆ నీటితో పొలం సాగుచేసేవాడు. పంపుసెట్లో చెత్త పేరుకుపోవడంతో తొలగించడానికి ఆదివారం సాయంత్రం అతడు ఇంటినుంచి బైక్పై బయలుదేరాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో సోమవారం ఉదయం అతడి కుటుంబ సభ్యులు కాలువ వద్దకు వెళ్లారు. అక్కడ అతడి బైక్ ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. వారు కాలువలో ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టగా సాయంత్రం చిన్నయ్య మృతదేహం లభ్యమైంది. చిన్నయ్య పంపుసెట్లోని చెత్తను తొలగించడానికి కాలువలోకి దిగి, ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. చికిత్సపొందుతూ ఒకరు.. నిజాంసాగర్(జుక్కల్): చెట్టు పైనుంచి పడి గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన బేగరి లింగయ్య (31) ఆదివారం మేకలను మేత కోసం పంటపొలాల వైపు తీసుకువెళ్లాడు. ఈక్రమంలో అతడె పొలాల గట్టుపైన ఉన్న చింతచెట్టు ఎక్కి కొమ్మలను నరుకుతుండగా ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. తలకు బలమైన గాయాలు కావడంతో స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడినుంచి హైద్రాబాద్ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి భార్య ఐశ్వర్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు.తలమడ్లలో ఒకరు..రాజంపేట: ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై పుష్పరాజ్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని తలమడ్ల గ్రామానికి చెందిన కోదండమ్ సాయికుమార్(18) తూప్రాన్లో ఐటీఐ చదువుతున్నాడు. ఇటీవల తలమడ్ల గ్రామానికి వచ్చిన సాయికుమార్ శనివారం అకస్మాత్తుగా గడ్డిమందు తాగి, ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబసభ్యులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిపేటలోని అశ్విని హాస్పిటల్కు తరలించారు. సోమవారం చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతికి గల కారణాలు తెలియలేదని విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు. -
విద్యార్థులకు ప్రజ్ఞోత్సవ పోటీలు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గోపాల్పేట కాంప్లెక్స్ స్కూల్లో సోమవారం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ప్రజ్ఞోత్సవ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కథలు చెప్పడం, చదవడం, రాయడం, పద్యాలు చెప్పడం, చతుర్విద ప్రక్రియలపై విద్యార్థులకు పోటీలు పెట్టారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు కాంప్లెక్స్ హెచ్ఎం వెంకట్రాంరెడ్డి చేతులమీదుగా బహుమతులను ప్రదానం చేశారు. కాంప్లెక్స్స్కూల్ సెక్రెటరీ మాణిక్యమ్మ, రిసోర్స్ పర్సన్ కిష్టయ్య, సీఆర్పీ రాజయ్య పాల్గొన్నారు. -
కోళ్లకు వైరస్.. సజీవంగా పూడ్చివేత
బాన్సువాడ రూరల్ (బాన్సువాడ): బాన్సువాడ మండలం బోర్లం గ్రామానికి చెందిన దామరంచ సాయిలు అనే వ్యక్తికి చెందిన కోళ్లఫారంలో 6వేల బ్రాయిలర్ కోళ్లను సజీవంగానే పూడ్చిపెట్టారు. గత మూడు రోజులుగా కోళ్లు అస్వస్థతకు గురికావడంతో కోళ్ల కంపెనీ ప్రతినిధులను సంప్రదించగా వారు వైద్య పరీక్షలు జరిపి, కోళ్లకు వైరస్ సోకిందని నిర్ధారించారు. దీంతో వారి సూచనల మేరకు కోళ్లను సజీవంగా పూడ్చి వేశారు. కోళ్లకు వైరస్ సోకడంతో తాను తీవ్రంగా నష్టపోయినట్లు, సుమారు లక్షల నష్టం వాటిల్లిందని పౌల్ట్రీ రైతు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నాడు. తప్పిపోయిన వ్యక్తి.. వెతికి, పట్టుకున్న రైల్వేపోలీసులు ఖలీల్వాడి: నిజామాబాద్ రైల్వేస్టేషన్లో తప్పిపోయిన షేక్బాబా అనే వ్యక్తిని, పట్టుకొని అతడి బంధువులకు అప్పగించినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. వివరాలు ఇలా.. నాందేడ్లోని శివాజీనగర్కు చెందిన షేక్ బాబా(58) ఈనెల 14న తన చిన్న కూతురు ఉంటున్న కరీంనగర్కు వెళ్లినట్లు తెలిపారు. తిరుగు ప్రయాణంలో కరీంనగర్ నుంచి నాందేడ్కు వెళుతున్న క్రమంలో నిజామాబాద్ రైల్వేస్టేషన్లో దిగి ఇక్కడ నుంచి బయటకు వెళ్లి కనిపించకుండాపోయాడు. దీనిపై అతడి కూతురు ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా షేక్బాబా ముత్ఖేడ్ రైల్వేస్టేషన్లో దిగి అక్కడే ఉండిపోయినట్లు గుర్తించి, అక్కడికి వెళ్లి పట్టుకొని బంధువులకు అప్పగించారు. -
ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 58 ఫిర్యాదులు వచ్చాయి. రెవెన్యూ సమస్యలు, డబుల్ బెడ్రూం ఇళ్లు, రైతు భరోసా, వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన వినతులు ఎక్కువగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన వినతులను పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ వి.విక్టర్, జెడ్పీ సీఈవో చందర్ నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలి.. జిల్లా, మండల స్థాయి అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించాలని కలెక్టర్ సంగ్వాన్ సూచించారు. ప్రజావాణి అనంతరం అధికారులతో సమావేశమై మాట్లాడారు. అధికారులు తమ శాఖలకు సంబంధించిన పనులను పర్యవేక్షించాలన్నారు. అధికారులు, సిబ్బందితో సమీక్షలు నిర్వహించాలని సూచించారు. ఎల్ఆర్ఎస్, ధరణి ఫిర్యాదులపై తహసీల్దార్లు చర్యలు చేపట్టాలని సూచించారు. ఆస్తి పన్నుల వసూళ్లు, పారిశుధ్యం, నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం లాంటి పనులను ఎంపీడీవోలు నిరంతరంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొనని కుటుంబాల వివరాలు ఈ నెల 28 వరకు ఎంట్రీ చేసుకునేలా ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించిందని తెలిపారు. ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లోని ప్రజాపాలన సేవా కేంద్రాల్లో పూర్తి వివరాలు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 040 21111111 కు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోగా ఫోన్ చేసి కుటుంబ వివరాలు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజావాణికి 58 వినతులు -
చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
బాల్కొండ: ముప్కాల్ మండల కేంద్రం శివారులోని చెరువులో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ముప్కాల్ ఎస్సై రజనీకాంత్ కేసు నమోదు చేసుకుని శవాన్ని చెరువులో నుంచి బయటకు తీయించారు. మృతుడి వయస్సు సుమారు 30–35ఏళ్లు ఉంటుందని, బూడిద కలర్ చొక్కా, గోధుమ కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడని ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే ముప్కాల్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు. మృతదేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రి మార్చురీలో ఉంచినట్లు తెలిపారు. సగం కాలినస్థితిలో ఒకరి మృతదేహం.. ఇందల్వాయి: మండలంలోని చంద్రాయన్పల్లి శివారులోగల అటవీప్రాంతంలో సోమవారం ఓ వ్యక్తి మృతదేహం సగం కాలిన స్థితిలో లభ్యమైంది. మృతుడు జిల్లాకేంద్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. వివరాలు ఇలా.. జిల్లా కేంద్రంలోని నాగారం 300 క్వార్టర్స్లోని బీడీ కాలనీకి చెందిన సందీప్(28) ఈనెల 15న అదృశ్యమయ్యాడు. 5వ టౌన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందల్వాయి పోలీసులకు సగం కాలిన స్థితిలో ఉన్న మృతదేహం లభించగా, దుస్తులు, ఇతర ఆనవాళ్ల ఆధారంగా సందీప్గా 5వ టౌన్ పోలీసులు గుర్తించారు. కేబుల్ ఆపరేటర్గా పని చేస్తున్న అతడిని అతని స్నేహితులే శనివారం ఆటోలో తీసుకెళ్లినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆస్పత్రికి తరలించి విచారణ చేస్తున్నట్లు ఇందల్వాయి ఎస్సై మనోజ్ తెలిపారు. త్వరలో వివరాలు వెళ్లడిస్తామని ఐదో టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపారు. భిక్కనూరులో బైక్ చోరీ భిక్కనూరు: మండల కేంద్రంలో ఇటీవల ఓ బైక్ చోరీకి గురైందని భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మండల కేంద్రానికి చెందిన బండి సిద్దగిరి ఈనెల 14న తన ఇంటి ముందర బైక్ పెట్టి, ఇంట్లోకి వెళ్లాడు. గంటన్నర తర్వాత బయటకు వచ్చి చూడగా బైక్ కనిపించలేదు. ఈ విషయమై బాధితుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. నిజామాబాద్ రైల్వేస్టేషన్లో.. ఖలీల్వాడి: నిజామాబాద్ రైల్వేస్టేషన్ ఎదుట నిలిపిన ఓ బైక్ చోరీకి గురైనట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి సోమవారం తెలిపారు. నగరానికి చెందిన రాజ్కుమార్ అనే వ్యక్తి జనవరి 31న తన బైకును రైల్వేస్టేషన్ ముందు పార్క్ చేసి హైదరాబాద్ వెళ్లాడు. తిరిగి ఈనెల 2న అతడు వచ్చేసరికి రైల్వేస్టేషన్లో పార్క్ చేసిన బైక్ కనబడలేదు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జగదాంబ ఆలయంలో.. నిజామాబాద్ రూరల్: మండలంలోని గొల్లగొట్టతండాలోగల సేవాలాల్ జగదాంబ ఆలయంలో చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని దుండగులు ఆదివారం అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడి అమ్మవారి ముక్కుపుడుక, పుస్తెలు ఎత్తుకువెళ్లారని రూరల్ ఎస్సై–2 ఆనంద్ సాగర్ తెలిపారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నమ్మకంగా ఉంటూనే దోచేశారు ఖలీల్వాడీ: నగరంలోని ఓ వైద్యురాలి వద్ద ఇద్దరు వ్యక్తులు కొన్ని నెలలుగా పనులు చేస్తూ, నమ్మకంగా ఉంటూ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపిన వివరాలు ఇలా.. ఖలీల్వాడిలోని భాగ్య అనే వైద్యురాలి వద్ద రాజు, పవన్ అనే ఇద్దరు వ్యక్తులు కొన్ని నెలలుగా పనిచేస్తుండేవారు. నమ్మకంగా ఉండటంతో వైద్యురాలు వారికి ఇంటి తాళాలను ఇచ్చింది. ఈక్రమంలో ఇద్దరు కలిసి ఆరు నెలలుగా విడతల వారీగా 35 తులాల బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. విషయం తెలిసిన వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. టీచర్పై పోక్సో కేసు గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సాంఘికశాస్త్రం ఉపాధ్యాయుడు రమేష్పై సోమవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. సదరు ఉపాధ్యాయుడు ఓ విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా విద్యార్థిని తల్లిదండ్రుల సెల్ఫోన్కు అసభ్యకర మెసేజ్లు పంపాడు. దీంతో విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మేకను గావుపట్టిన వారిపై కేసు.. బాల్కొండ: మండల కేంద్రంలో ఈ నెల 12న మల్లన్న ఆలయ ఉత్సవాల్లో మేక పిల్లను గావుపట్టిన వారిపై బాల్కొండ పోలీస్ స్టేషన్లో సోమవారం కేసు నమోదైంది. జంతు సంరక్షణ సమితికి చెందిన గౌతమ్, శ్రీవిద్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. -
పరిశోధనలపై ఆసక్తిని పెంపొందించుకోవాలి
భిక్కనూరు: విద్యార్థులు మారుతున్న కాలానికనుగుణంగా నూతన పరిశోధనలపై ఆసక్తిని పెంపొందిచుకోవాలని జేఎన్యూ ప్రొఫెసర్ రాజు చౌహాన్ అన్నారు. సోమవారం తెలంగాణ యూనివర్సిటీ సౌత్క్యాంపస్లో రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘స్పెక్ట్రోస్కోపి– దాని అనువర్తనాలు’ అనే అంశంపై నిర్వహించిన ఒక రోజు సెమినార్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పరిశోధన విద్యార్థులకు స్పెక్ట్రోస్కోపి అంశంపై అవగాహన కల్పించారు. భవిష్యత్తులో పరిశోధన రంగంలో వేలాది ఉద్యోగాలు ఉంటాయని, విద్యార్థులు ఆ వైపు మొగ్గు చూపాలన్నారు. ప్రిన్సిపాల్ సుధాకర్గౌడ్, అధ్యాపకులు సునీత, నిరంజన్శర్మ, శ్రీకాంత్, రసాయనశాస్త్ర విద్యార్థులు పాల్గొన్నారు. జేఎన్యూ ప్రొఫెసర్ రాజు చౌహాన్ -
విషాదాన్ని మిగిల్చిన రోడ్డు ప్రమాదం
మోర్తాడ్(బాల్కొండ): నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బైక్పై వెళ్లిన ఇద్దరు స్తంభాన్ని ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి. తిమ్మాపూర్కు చెందిన సోహెల్(26) బతుకుదెరువు కోసం బహ్రెయిన్ వెళ్లి, రెండు రోజుల క్రితం సొంతూరుకు వచ్చాడు. అతడిని, కుటుంబ సభ్యులను కలవడంకోసం సమీప బంధువు జగిత్యాల జిల్లా యూసుఫ్నగర్కు చెందిన మహమ్మద్ సుమేర్(21) తన బైక్పై తిమ్మాపూర్కు వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం సోహెల్, సుమేర్ ఇద్దరు కలిసి బైక్పై పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి వస్తుండగా ప్రమాదవశాత్తు స్తంభాన్ని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న భీమ్గల్ సీఐ సత్యనారాయణ, మోర్తాడ్ ఎస్సై విక్రమ్ ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. భార్య, కూతురును చూడకుండానే.. సోహెల్ భార్య ఆర్మూర్ మండలం మామిడిపల్లిలోగల తన తల్లి వద్ద ఉంటోంది. నాలుగు రోజుల క్రితమే కూతురు మొదటి పుట్టిన రోజు జరిగింది. రెండు రోజుల క్రితం బహ్రెయిన్నుంచి వచ్చిన సోహెల్.. త్వరలోనే భార్య, కూతురును ఇంటికి తీసుకువెళ్లాలనుకున్నాడు. అంతలోనే రోడ్డు ప్రమాదం జరిగి భార్య, కూతురును చూడకుండానే సోహెల్ మృతిచెందాడు. స్తంభాన్ని ఢీకొన్న బైక్.. ఇద్దరి మృతిగుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు..ఇందల్వాయి: మండల కేంద్రంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొని ఎల్లారెడ్డిపల్లె గ్రామానికి చెందిన వేముల గంగాధర్(55) మృతి చెందినట్లు ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని ఓ వాటర్ ప్లాంట్లో పని చేస్తున్న గంగాధర్ పని ముగించుకొని హోటల్కి వెళుతుండగా ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆస్పత్రికి తరలించామని, మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
చోరీ కేసులో ముగ్గురి రిమాండ్
బోధన్టౌన్(బోధన్): చోరీ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు. బోధన్ పోలీస్ స్టేషన్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజస్థాన్కు చెందిన బచ్చుసింగ్ బాగ్రియా కుటుంబంతో కలిసి బతుకు దెరువు కోసం 15 రోజుల క్రితం బోధన్కు వచ్చాడు. స్థానికంగా బొమ్మలు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. ఇటీవల బాగ్రియా తన వద్ద ఉన్న రూ. 40వేల నగదును సమీప బ్యాంక్లో డిపాజిట్ చేయడానికి వెళ్లాడు. బ్యాంక్ బంద్ ఉండటంతో అతడు తిరిగి తన ఇంటికి వెళుతుండగా మార్గమధ్యలో సాత్పూల్ కల్లుబట్టి వద్ద ముగ్గురు వ్యక్తులు కలిసి, కల్లుబట్టిలోకి తీసుకువెళ్లారు. కల్లు తాగిన అనంతరం బాగ్రియాను సదరు వ్యక్తులు బెదిరించి రూ. 40వేల నగదును తీసుకొని పారిపోయారు. మరుసటి రోజు బాగ్రియా పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా కొత్త బస్టాండ్ వద్ద ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో పట్టుకున్నారు. పట్టణానికి చెందిన షేక్ మహ్మద్, వసీం, సయ్యద్ సజ్జన్లను అదుపులోకి తీసుకొని విచారించగా బాగ్రియా వద్ద తామే డబ్బులు తీసుకున్నామని అంగీకరించారు. అనంతరం వారి వద్ద నుంచి రూ. 10,500 నగదును స్వాధీనం చేసుకొని, అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు సీఐ వెల్లడించారు. పొక్లెయిన్, ఇసుక ట్రాక్టర్ల పట్టివేత సిరికొండ: మండలంలోని గడ్కోల్ గ్రామంలో కప్పలవాగులో నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న పొక్లెయిన్, రెండు ట్రాక్టర్లను సోమవారం పట్టుకున్నట్లు ఎస్సై రామ్ తెలిపారు. పొక్లెయిన్, ట్రాక్టర్లు తాళ్లపల్లి వెంకగౌడ్కు చెందినవని ఆయన తెలిపారు. వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశామన్నారు. తదుపరి విచారణ కోసం వాహనాలను మైనింగ్ శాఖకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. మోపాల్ మండలంలో.. మోపాల్: మండలంలోని కాస్బాగ్తండాకు చెందిన హరిసింగ్ అనుమతులు లేకుండా ఆదివారం అర్ధరాత్రి ట్రాక్టర్లో ఇసుకను తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై యాదగిరి తెలిపారు. ట్రాక్టర్ను పోలీస్స్టేషన్కు తరలించారు. పోతంగల్ మండలంలో.. రుద్రూర్: పోతంగల్ మండలం కారేగాం శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్నట్టు ఎస్సై సందీప్ సోమవారం తెలిపారు. ట్రాక్టర్లను కోటగిరి పోలీస్స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. వేర్వేరు కేసుల్లో ఇద్దరికి రెండు రోజుల జైలు బోధన్టౌన్(బోధన్): వేర్వేరు కేసుల్లో ఇద్దరికి రెండు రోజులు జైలు శిక్షను బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ విధించినట్లు పట్టణ సీఐ నారాయణ సోమవారం తెలిపారు. ఇటీవల పట్టణానికి చెందిన షేక్ జలాల్ మద్యం తాగి వాహనం నడుపగా పోలీసులకు పట్టుబడ్డాడు. అలాగే మరోవ్యక్తి బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతుండగా అతడిని పోలీసులు పట్టుకున్నారు. అనంతరం ఇద్దరిని బోధన్ కోర్టులోని సెకండ్క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుచగా జైలుశిక్ష విధించినట్లు సీఐ తెలిపారు. -
విద్యుత్ అధికారుల పొలంబాట
లింగంపేట(ఎల్లారెడ్డి): వ్యవసాయ బోరుబావుల వద్ద కెపాసిటర్లు బిగించుకోవాలని శెట్పల్లిసంగారెడ్డి ఏఈ హరీష్రావు సూచించారు. సోమవారం బోనాల గ్రామంలో విద్యుత్ అధికారులు పొలం బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కెపాసిటర్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల కలిగే లాభాలు, విద్యుత్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. అలాగే వ్యవసాయ క్షేత్రాల్లో వంగిన స్తంభాలను సరిచేశారు. లైన్ఇన్స్పెక్టర్ కిష్టయ్య, లైన్మెన్లు అంబ్రియా, గంగాధర్, ఏఎల్ఎం రవీందర్, రాజు, జహీర్, నరేశ్, రైతులు పాల్గొన్నారు. -
జీవావరణ వ్యవస్థను కాపాడుకోవాలి
కామారెడ్డి అర్బన్: వ్యనప్రాణులతో జీవావరణ వ్యవస్థను కాపాడుకోవాలని కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ కె.విజయ్ కుమార్ అన్నారు. ఎలక్ట్రానిక్స్ పరికరాల ద్వారా అడవుల్లో వ్యనప్రాణుల కదలికలు, ఉనికి గుర్తించి వాటిని లెక్కించే విధానం, సాంకేతిక పద్ధతులపై సోమవారం కళాశాల వృక్ష, అటవీ శాస్త్ర విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఒక రోజు వర్క్షాప్ నిర్వహించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వు రీజినల్ కో–ఆర్డినేటర్ బాపురెడ్డి, ఏవో అఖిల్గౌడ్లు రిసోర్స్ పర్సన్గా వివిధ అంశాలపై విద్యార్థులకు వివరించారు. పులులు, పక్షులు, పాములు, ఇతర వన్యప్రాణుల కదలికలతో పాటు వాటి సంఖ్యను సాంకేతికంగా ఎలా లెక్కించవచ్చో ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. వైస్ ప్రిన్సిపల్ కె.కిష్టయ్య, సమన్వయకర్తలు విశ్వప్రసాద్, జయప్రకాష్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
స్థలం విషయంలో వివాదం
తాడ్వాయి (ఎల్లారెడ్డి): దేమికలాన్లో రెండు ఇళ్ల మధ్య స్థలం విషయంలో వివాదం చెలరేగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. వివరాలు.. దేమికలాన్ గ్రామానికి చెందిన పురం లక్ష్మీపతి(42), మంగళి రాజయ్యలకు మధ్య స్థలంలో విషయంలో ఆదివారం మాటామాట పెరిగి గొడవ పెద్దగా తయారైంది. దీంతో రాజయ్య కోపంతో కర్రతో లక్ష్మీపతిని కొట్టడానికి ప్రయత్నించాడు. దీంతో లక్ష్మీపతికి అకస్మాత్తుగా గుండెనొప్పి వచ్చి కిందపడిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మీపతిని కామారెడ్డిలోని ఓ ప్రవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. లక్ష్మీపతి మృతికి కారకుడైన రాజయ్యపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయంచేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తాడ్వాయి పోలీసుస్టేషన్కు తరలి వచ్చారు. లీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పెనుగులాటలో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి న్యాయం చేయాలని కోరుతున్న దేమికలాన్ గ్రామస్తులు -
పేకాడుతున్న ఆరుగురి అరెస్టు
బోధన్రూరల్: సాలూర మండలకేంద్రంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పట్టుకున్నట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్రెడ్డి ఆదివారం తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి రూ.11,600లు నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత బోధన్రూరల్: మండలంలోని కల్దుర్కి గ్రామం నుంచి అక్రమంగా బోధన్కు ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్నట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్రెడ్డి ఆదివారం తెలిపారు. పట్టుబడిన ట్రాక్టర్ సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించామని, కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. మాజీ ప్రజాప్రతినిధిపై ఫిర్యాదు రుద్రూర్: మండలంలోని సులేమాన్నగర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ గౌస్పై అతడి వదిన పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈసందర్భంగా ఆమె ఆదివారం మాట్లాడుతూ.. తాను గ్రామంలో లేనిసమయంలో సదరు మాజీ ప్రజాప్రతినిధి తన ఏటీఎం తీసుకుని రెండు పెట్రోల్ బంకుల్లో స్వైప్ చేసి రూ. లక్షా9వేలు తీసుకున్నట్టు ఆవేదన వ్యక్తం చేసింది. విచారణ జరిపి న్యాయం చేయాలని మహిళ విజ్ఞప్తి చేసింది. ఈ విషయమై పోలీస్ష్టేషన్లో సంప్రదించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మద్నూర్లో పెంటకుప్ప దగ్ధం మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని గాంధీచౌక్లో ఆదివారం ప్రమాదవశాత్తు పెంటకుప్ప దగ్ధమయినట్లు బాధితుడు హుల్లాజీ తెలిపారు. తన ఇంటికి సమీపంలో గల పెంటకుప్పకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడంతో మంటలు చెలరేగాయని ఆయన తెలిపారు. ఈ విషయమై ఫైర్స్టేషన్కు స మాచారం అందించడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారన్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.పదివేల నష్టం జరిగిందని వారు తెలిపారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
నస్రుల్లాబాద్(బాన్సువాడ): మండలంలోని దుర్కి గ్రామంలో తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన రేఖవార్ రాజు తన భార్య స్వరూపారాణితో కలిసి ఈ నెల 9న ఇంటికి తాళం వేసి మహా కుంభమేళ కోసం ప్రయాగ్ రాజ్కు వెళ్లారు. ఈనెల 15న పక్కింటి వారు వాళ్లకి ఫోన్ చేసి, మీ ఇంటి తలుపులు తెరచి ఉన్నాయంటూ సమాచారం అందించారు. వారు ఆదివారం ఇంటికి వచ్చి చూడగా, చోరీ జరిగినట్లు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు వివరాలు సేకరించారు. తాళం పగలగొట్టిన గుర్తుతెలియని దుండగులు ఇంట్లోని సుమారు 3తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. ఈమేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లావణ్య తెలిపారు. -
క్రైం కార్నర్
అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య నిజాంసాగర్(జుక్కల్): జు క్కల్ మండలకేంద్రానికి చెందిన బెజ్జవార్ చంద్రమోహన్(34) అనే వ్యక్తి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై భువనేశ్వర్ తెలిపారు. వివరాలు ఇలా.. జుక్కల్కు చెందిన చంద్రమోహన్కు అప్పులు ఎక్కువవడంతో మద్యానికి బానిసయ్యాడు. శనివారం తాను అప్పులు తీర్చేది ఎట్లా అంటూ ఇంటి వద్ద రోధించి బయటకు వెళ్లి, తిరిగి రాలేడు. ఆదివారం తెల్లవారుజామున ఉప్పలంచవార్ లక్ష్మణ్ ఇంటి వద్ద ఉన్న పాడుబడ్డ బావిలో చంద్రమోహన్ శవమై కన్పించాడని ఎస్సై తెలిపారు. అప్పుల బాధతో అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఈమేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. అనారోగ్యంతో ఒకరు.. ఖలీల్వాడి: నగరంలోని సంజీవ్నగర్ కాలనీకి చెందిన వర్షపల్లి మల్లేష్(64) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై హరిబాబు ఆదివారం తెలిపారు. వివరాలు ఇలా.. మల్లేష్ గత కొన్ని సంవత్సరాల నుంచి బ్రెయిన్ స్ట్రోక్ వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది శనివారం బాత్రూంలో ఉన్న ఫినాయిల్ తాగి, ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని గమనించి, ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసినట్లు తెలిపారు. -
సంరక్షణ చర్యలేవి?
● గతనెలలో మాల్తుమ్మెద ఉద్యాన క్షేత్రంలో అగ్నిప్రమాదం ● పాక్షికంగా కాలిపోయిన చెట్లు.. నీరందక ఎండుతున్న వైనంనాగిరెడ్డిపేట: అగ్నిప్రమాదంలో పాక్షికంగా దెబ్బతిన్న చెట్లను సంరక్షించడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో చెట్టు పూర్తిగా ఎండుముఖం పడుతున్నాయి. మాల్తుమ్మెద ఉద్యాన క్షేత్రంలో గతనెల 20న అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఉద్యానక్షేత్రం బయటవైపు గుర్తుతెలియని వ్యక్తులు పెట్టిన నిప్పు గాలికి వ్యాపించి క్షేత్రంలోకి ప్రవేశించింది. క్షేత్రంలో గడ్డి దట్టంగా పెరగడం వల్ల ఉద్యానక్షేత్రాన్ని మంటలు చుట్టుముట్టాయి. దీంతో ఉద్యాన క్షేత్రంలోని ఆయిల్పాం చెట్లు పూర్తిగా దగ్ధమవ్వగా 35 మామిడి చెట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. జిల్లా ఉద్యాన శాఖ అధికారి జ్యోతి ఉద్యాన క్షేత్రాన్ని పరిశీలించి, పాక్షికంగా కాలిపోయిన చెట్లను సంరక్షించడానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రమాదం జరిగి నెల కావస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఫలితంగా క్షేత్రంలోని మామిడి చెట్లు ఎండుముఖం పడుతున్నాయి. బోరుమోటారుకు మరమ్మతులు చేయిస్తాం గత నెలలో ఉద్యాన క్షేత్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కొన్ని మామిడి చెట్లు దెబ్బతిన్నాయి. వాటికి నీరందించి సంరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. కానీ క్షేత్రంలో బోరు మోటారు చెడిపోయింది. దానికి మరమ్మతులు చేయించి చెట్లను సంరక్షిస్తాం. – కమలాకర్రెడ్డి, హార్టికల్చర్ అధికారి, మాల్తుమ్మెద -
‘పిగ్మి’ పేరుతో కుచ్చుటోపి
బిచ్కుంద: బ్యాంక్ ఉద్యోగినని నమ్మించి, పిగ్మీ పేరుతో డిపాజిట్లు సేకరించి అమాయకులకు కుచ్చుటోపీ పెట్టాడో మోసగాడు.. పలువురిని ముంచి, రూ. 60 లక్షలతో ఉడాయించాడు. వివరాలిలా ఉన్నాయి. బిచ్కుందకు చెందిన జంగం రాజు కెనరా బ్యాంక్లో ఉంటూ ఖాతాదారులకు దరఖాస్తులు, ఓచర్లు నింపడం, డీడీలు తీయడంలో సహకరించేవాడు. తనను బ్యాంకు సిబ్బందిగా పరిచయం చేసుకుంటూ మహిళలు, వ్యవసాయ కూలీలు, చిరు వ్యాపారులను టార్గెట్ చేసుకుని బ్యాంక్ పిగ్మీ డిపాజిట్ స్కీం గురించి వివరించేవాడు. రోజూ కొంత మొత్తాన్ని జమ చేస్తే ఆకర్షణీయమైన వడ్డీ వస్తుందని నమ్మించాడు. అతడిని నమ్మిన వందలాది మంది డబ్బులు డిపాజిట్ చేశారు. డిపాజిట్ చేసినవారికి అప్పుడప్పుడు వడ్డీ ఇచ్చేవాడు. కొందరికి చెక్కులు రాసి ఇచ్చాడు. నాలుగేళ్లనుంచి డిపాజిట్లు సేకరిస్తూ వస్తున్న రాజు.. సుమారు రూ. 60 లక్షలతో వారం క్రితం కుటుంబంతో సహా పరారయ్యాడు. రాజు కనిపించకపోవడంతో అనుమానించిన డిపాజిట్దారులు.. బ్యాంకు అధికారులను ప్రశ్నించగా అతడు తమ సిబ్బంది కాదని తెలిపారు. అతడితో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో ఖాతాదారులు అవాక్కయ్యారు.తండ్రి ఏజెంట్ కావడంతో..చిరు వ్యాపారులు ఆదాయంలో కొంత నగదును ప్రతిరోజు తమ బ్యాంక్ ఖతాలో జమ చేసుకోవడానికి కెనరా బ్యాంక్(సిండికెట్ బ్యాంక్) అవకాశం కల్పించింది. వీటిని పిగ్మీ డిపాజిట్లుగా పేర్కొంటారు. రాజు తండ్రి బస్వంత్ గతంలో బ్యాంక్ ఏజెంట్గా పనిచేశాడు. ఆయన పిగ్మీ డిపాజిట్లను వసూలు చేసి బ్యాంకులో జమ చేసేవాడు. దీంతో రాజు కూడా బ్యాంకు సిబ్బంది అని ఖాతాదారులు నమ్మారు. వారి నమ్మకాన్ని రాజు సొమ్ము చేసుకుని డిపాజిట్లతో ఉడాయించాడు. రూ. 60 లక్షలతో వ్యక్తి పరారు ఆందోళనలో బాధితులు -
కుళ్లిపోయిన మటన్ అమ్ముతున్నారని ఫిర్యాదు
బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలోని మటన్ షాపుల్లో కుళ్లిపోయిన మేక మాంసం అమ్ముతున్నారని ఆదివారం పంచాయతీ, వెటర్నరీ అధికారులకు ప్రజలు ఫిర్యాదు చేశారు. దీంతో పంచాయతీ సిబ్బంది మటన్ విక్రయించే షాపులకు వెళ్లి తనిఖీ చేశారు. రెండు రోజు క్రితం కోసిన మేక మాంసం ఫ్రిజ్లో పెట్టి అమ్ముతున్నారని, వాసన వస్తుందని అధికారులు తెలిపారు. ఇలాంటి మాంసం అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాంసం కోసం కోస్తున్న మేకలు, గొర్రెలు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా వెటర్నరీ అధికారులు పరిశీలించకుండానే కోస్తున్నారు. అలాగే చాలా మంది చికెన్, మటన్ షాపుల లైసెన్స్ లేకుండానే నిర్వహిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని మాంసంప్రియులు కోరుతున్నారు. -
పేకాడుతున్న ఆరుగురి అరెస్టు
బోధన్రూరల్: సాలూర మండలకేంద్రంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పట్టుకున్నట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్రెడ్డి ఆదివారం తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి రూ.11,600లు నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత బోధన్రూరల్: మండలంలోని కల్దుర్కి గ్రామం నుంచి అక్రమంగా బోధన్కు ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్నట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్రెడ్డి ఆదివారం తెలిపారు. పట్టుబడిన ట్రాక్టర్ సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించామని, కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. మాజీ ప్రజాప్రతినిధిపై ఫిర్యాదు రుద్రూర్: మండలంలోని సులేమాన్నగర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ గౌస్పై అతడి వదిన పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈసందర్భంగా ఆమె ఆదివారం మాట్లాడుతూ.. తాను గ్రామంలో లేనిసమయంలో సదరు మాజీ ప్రజాప్రతినిధి తన ఏటీఎం తీసుకుని రెండు పెట్రోల్ బంకుల్లో స్వైప్ చేసి రూ. లక్షా9వేలు తీసుకున్నట్టు ఆవేదన వ్యక్తం చేసింది. విచారణ జరిపి న్యాయం చేయాలని మహిళ విజ్ఞప్తి చేసింది. ఈ విషయమై పోలీస్ష్టేషన్లో సంప్రదించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మద్నూర్లో పెంటకుప్ప దగ్ధం మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని గాంధీచౌక్లో ఆదివారం ప్రమాదవశాత్తు పెంటకుప్ప దగ్ధమయినట్లు బాధితుడు హుల్లాజీ తెలిపారు. తన ఇంటికి సమీపంలో గల పెంటకుప్పకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడంతో మంటలు చెలరేగాయని ఆయన తెలిపారు. ఈ విషయమై ఫైర్స్టేషన్కు స మాచారం అందించడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారన్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.పదివేల నష్టం జరిగిందని వారు తెలిపారు.