Kamareddy District News
-
బాన్సువాడ తైబజార్ వేలం
బాన్సువాడ : బాన్సువాడ మున్సిపాలిటీ తైబజార్కు మంగళవారం వేలం పాట నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు అధ్వర్యంలో ప్రక్రియ సాగింది. కాంట్రాక్టర్ జంషేర్ ఖాన్ రూ. 46.26 లక్షలకు మేకలు, గొర్రెలు సంతను దక్కించుకున్నారు. గతేడాది ఈ సంత తైబజార్ రూ.43.93 లక్షలు పలికింది. ● రోజువారి సంతను లింగాల ప్రీతంరెడ్డి రూ.9.02 లక్షలకు దక్కించుకున్నారు. ఈ సంతకు గతేడాది కూడా ఇదే ధర లభించింది. పశువుల దాఖలను ప్రీతంరెడ్డి రూ. 20 వేలకు దక్కించుకున్నారు. ఈ సంత గతేడాది రూ. 10 వేలే పలకడం గమనార్హం. ● వారసంతను జగన్మోహన్రావు రూ. 12.31 లక్షలకు దక్కించుకున్నారు. గతేడాది ఈ సంత రూ. 12.33 లక్షలు పలికింది. తైబజార్తోపాటు సంతలను వేలం వేయగా బల్దియాకు గతేడాది కంటే రూ. 2.40 లక్షల ఆదాయం అదనంగా సమకూరిందని బాన్సువాడ మున్సిపాలిటీ మేనేజర్ మల్లికార్జున్రెడ్డి తెలిపారు. -
నేడు కలెక్టర్తో ‘సాక్షి’ ఫోన్ఇన్
బస్వన్నపల్లిలో బావిలో పదుల సంఖ్యలో మోటార్లను ఏర్పాటు చేసుకున్న దృశ్యం● భూగర్భ జలాలు అడుగంటి అవస్థలు ● అంతటా తాగునీటికి కష్టాలు ● జిల్లా కేంద్రంలో నాలుగు రోజులకోసారి ‘భగీరథ’ నీటి సరఫరా ● వాటర్ ట్యాంకర్లకు పెరిగిన గిరాకీ ● నేడు కలెక్టర్తో ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి పోతుండడంతో బోరుబావులు ఎత్తిపోతున్నాయి. ‘మిషన్ భగీరథ’ కూడా గొంతు తడపడం లేదు. దీంతో రోజురోజుకు తాగు నీటి కష్టాలు పెరిగి పోతున్నాయి. వేసవి కాలం ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే ముందుముందు ఇంకెలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నీటి కష్టాలను ఎప్పటికప్పుడు పాలకుల దృష్టికి తీసుకువస్తున్న ‘సాక్షి’ మరో ప్రయత్నం మొదలుపెట్టింది. బుధవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్తో ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రజలు తమ నీటి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి ఆయన చర్యలు తీసుకోనున్నారు.సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో పక్షం రోజులుగా తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. భూగర్భజలాలు అడుగంటిపోయి బోర్లు వట్టిపోతుండడంతో ప్రజలు దాహార్తితో ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా లక్షపైచిలుకు జనాభా ఉన్న కామారెడ్డి పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రత పెరిగింది. పట్టణానికి గతంలో శ్రీరాంసాగర్ నుంచి మిషన్ భగీరథ నీరు రోజు విడిచి రోజు సరఫరా అయ్యేది. ఇటీవలి కాలంలో నాలుగైదు రోజులకోసారి సరఫరా అవుతోంది. అది కూడా కొద్దిసేపే వస్తుండడంతో ఏ ఒక్క కుటుంబానికీ సరిపోవడం లేదు. పట్టణంలోని అశోక్నగర్, శ్రీరాంనగర్, విద్యానగర్, ఎన్జీవోస్ కాలనీ, కాకతీయనగర్ తదితర ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం పడిపోయి వందలాది బోర్లు ఎత్తిపోయాయి. చాలా కుటుంబాలు నీళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నీటిని కొనుక్కోవాల్సి వస్తుండడంతో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. మొన్నటి వరకు 5 వేల లీటర్ల ట్యాంకర్కు రూ.5 వందలు తీసుకునేవారు. ఇప్పుడు రూ. 6 వందలకు పెంచారు. రెండు, మూడు అంతస్తులపైకి నీటిని ఎక్కించాలంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. పట్టణంలో 50కి పైగా ప్రైవేటు ట్యాంకర్లు పొద్దస్తమానం తిరుగుతూనే ఉన్నాయి. మార్చి నెలలోనే పరిస్థితి ఉండడంతో ఎండాకాలమంతా ఎలా గడుస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మిషన్ భగీరథ గతంలోలాగే రోజు విడిచి రోజు నీరు వ చ్చేలా చూడాలని, లేదంటే మున్సిపాలిటీ ద్వారా ట్యాంకర్లను ఏర్పాటు చేసి నిత్యం ఇంటింటికి నీటి ని అందించాలని ప్రజలు కోరుతున్నారు.రాజంపేటలో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరాఫోన్ చేయాల్సిన నంబర్: 99087 12421జిల్లాలో తాగునీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపేందుకు ‘సాక్షి’ బుధవారం ఫోన్ ఇన్ నిర్వహిస్తోంది. ప్రజలు నిర్దేశిత సమయంలో ఫోన్ చేస్తే కలెక్టర్ సమాధానమిస్తారు. తేది : 26–03–2025 (బుధవారం) సమయం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.00 గంట వరకు.. -
వంతెన నిర్మించరూ..
లెండి వాగులోంచి ప్రయాణిస్తున్న ప్రజలుమద్నూర్ : మద్నూర్ మండలం మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంటుంది. సరిహద్దుల్లోని గ్రామాల ప్రజల మధ్య బంధుత్వాలూ ఉంటాయి. ఇక్కడివారికి అక్కడ, అక్కడికివారికి ఇక్కడ వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి. మండలంలోని తడిహిప్పర్గా గ్రామ శివారులోని లెండి వాగు అవతలి వైపు మహారాష్ట్ర భూభాగం ఉంది. ఇక్కడ వంతెన లేకపోవడంతో వాగులోంచే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. వాగులో ప్రస్తుతం నడుములోతు వరకు నీళ్లున్నాయి. ఇటువారు అటువైపు వెళ్లాలంటే సుమారు 20 కిలోమీటర్లు తిరగాల్సి వస్తుంది. దీంతో ప్రమాదకరమని తెలిసినా ప్రజలు వాగులోంచే రాకపోకలు సాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. -
ముగిసిన గల్ఫ్ మృతుడి అంత్యక్రియలు
మోర్తాడ్: ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన ఈర్గల గంగాధర్(44) ఇటీవల యూఏఈలోని అబుదబిలో ప్రమాదవశాత్తు మృతిచెందగా, మంగళవారం మృతదేహం స్వగ్రామానికి రాగా, అంత్యక్రియలు పూర్తయ్యాయి. గల్ఫ్లో డెలివరీ బాయ్గా పని చేస్తున్న గంగాధర్ శనివారం బైక్పై వెళుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కంపెనీ యాజమాన్యం, గంగాధర్ సన్నిహితులు మృతదేహంను ఇంటికి తరలించడానికి వేగంగా స్పందించడంతో మూడురోజుల్లోనే మృతదేహం స్వగ్రామానికి చేరింది. గ్రామస్తులు, బంధుమిత్రులు అధిక సంఖ్యలో హాజరై అంత్యక్రియలు నిర్వహించారు. -
ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి క్రైం : జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యాసంగిలో 6.20 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి రావచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రైతుల ఇంటి అవసరాలు పోను కొనుగోలు కేంద్రాలకు 5.63 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రావచ్చని భావిస్తున్నామన్నారు. అధికారులు సమన్వయంతో పని చేసి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. వరి కోతలు ప్రారంభమై ధాన్యం వచ్చిన ప్రాంతాలలో వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు. అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రాలలో తగినన్ని టార్ఫాలిన్లను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి కేంద్రంలో రైతులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని, ఓఅర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, టెంట్లు వేయాలని సూచించారు. తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్, గన్నీ బ్యాగులను సిద్ధం చేయాలన్నారు. వడ్లకు కనీస మద్దతు ధర గ్రేడ్ ఏ రకానికి రూ. 2,320, సాధారణ రకానికి రూ. 2,300 చెల్లిస్తామని, సన్న రకం వడ్లకు రూ.500 బోనస్ రూపంలో ఇస్తామని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలను పరిష్కరించడానికి జిల్లా కార్యాలయంలో టోల్ఫ్రీ నంబర్ 08468–220051 ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, సివిల్ సప్లయ్ డీఎం రాజేందర్, డీఎస్వో మల్లిఖార్జున బాబు, డీఏవో తిరుమల ప్రసాద్, మార్కెటింగ్ అధికారి రమ్య, డీటీవో శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. -
వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య
ధర్పల్లి: మండలంలోని హోన్నాజిపేట్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన ధ్యాప పెద్ద నర్సయ్య (60)కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇటీవల ఆయన కొత్తగా ఇంటిని నిర్మించుకున్నారు. ఇంటి నిర్మాణానికి అప్పులు కావడంతోపాటు తన మూడో కుమార్తెకు ఆరోగ్యం బాగాలేక వివాహం కావడంలేదు. దీంతో పెద్ద నర్సయ్య మనస్థాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య కొమరవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ పేర్కొన్నారు. ఇష్టం లేని పెళ్లి చేయడంతో యువతి బాన్సువాడ రూరల్: మండలంలోని కొల్లూర్ గ్రామంలో ఇష్టం లేని పెళ్లి చేయడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బాన్సువాడ సీఐ మండలి అశోక్ తెలిపిన వివరాలు ఇలా.. కొల్లూర్ గ్రామానికి చెందిన వల్లెపు లక్ష్మికి ఫిబ్రవరి 23న అదే గ్రామంలో ఉంటున్న దగ్గరి బంధువైన వెంకటేష్ అనే యువకుడితో వివాహం జరిగింది. కాగా లక్ష్మికి వివాహం ఇష్టంలేక మంగళవారం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి చంద్రకళ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి
● గంగోత్రి రామానుజ దాసుస్వామి ● వైభవంగా కొనసాగుతున్న ‘ఇందూరు తిరుమల’ బ్రహ్మోత్సవాలుమోపాల్(నిజామాబాద్రూరల్): మనుషులు సదా భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలని ఆచార్య గంగోత్రి రామానుజ దాసుస్వామి అన్నారు. లోక కార్యానికి భగవంతుడు మనుషులను ఎంచుకుంటాడని, మనల్ని ఎంచుకునేలా అర్హత సాధించాలని తెలిపారు. మండలంలోని నర్సింగ్పల్లి ‘ఇందూరు తిరుమల’ ఆలయ 11వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరోరోజు మంగళవారం యాగశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు. ఆలయ పుష్కరిణిలో స్వామివారికి చక్రస్నానం, సాయంత్రం పుష్ప యాగం కార్యక్రమం చేపట్టారు. అనంతరం దేవనాథ జీయర్ స్వామి, ఆచార్య గంగోత్రి రామానుజ దాసుస్వామి భక్తులనుద్ధేశించి ప్రవచనాలు చేశారు. కలియుగంలో హరినామమే మోక్ష మార్గమని, ప్రతి క్షణం హరి నామం జపిస్తూ ఉండాలని సూచించారు. ఇందూరు తిరుమల దేవస్థానం ఇలలో మరో వైకుంఠంగా వెలుగొందుతుందన్నారు. వేడుకల్లో సినీ దర్శకుడు అనిల్ రావిపూడి, ఛాయాగ్రాహకుడు సమీర్రెడ్డి, హీరోలు నారాయణమూర్తి, ఆశిష్, ఆలయ ధర్మకర్తలు నర్సింహారెడ్డి, దిల్రాజు, శిరీష్రెడ్డి, విజయసింహారెడ్డి, హరీష్, సుదర్శన్రెడ్డి దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు పాల్గొన్నారు. -
ఇసుక పాయింట్పై టాస్క్ఫోర్స్ దాడి
ఖలీల్వాడి/బోధన్రూరల్: బోధన్ రూరల్ మండలంలోని మందర్నా ఇసుక పాయింట్పై టాస్క్ఫోర్స్ సీఐ అంజయ్య, ఎస్సై గోవింద్, స్పెషల్పార్టీ సిబ్బంది దాడి చేశారు. సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ ఇన్చార్జి అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వారు సోమవారం అర్ధరాత్రి ఇసుకను తరలిస్తున్న తొమ్మిది టిప్పర్లతోపాటు మూడు పొక్లెయిన్లను స్వాధీనం చేసుకున్నారు. 12మంది డ్రైవర్లను అదుపులోకి తీసుకుని తదుపరి చర్య నిమిత్తం బోధన్ రూరల్ ఎస్సైకి అప్పగించినట్లు టాస్క్ఫోర్స్ సీఐ అంజయ్య తెలిపారు. నిబంధనలు పాటించని వ్యాపారులు మందర్నా ఇసుక పాయింట్ నుంచి ప్రభుత్వ పనుల కోసం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కూలీల ద్వారా ట్రాక్టర్లలలో ఇసుకను తరలించడానికి అవకాశం ఉంటుంది. కానీ టిప్పర్లలలో నిబంధనల కంటే అదనంగా 10 టన్నుల వరకు ఇసుకను తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి బోధన్ పరిసర ప్రాంతాల వరకు మాత్రమే ఇసుకను తరలించాల్సి ఉంటుంది. కానీ నిజామాబాద్ వరకు తరలిస్తున్నారు. అధికారులు ఇసుక తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని బోధన్ ప్రజలు కోరుతున్నారు. 9టిప్పర్లు, 3 పొక్లెయిన్లు స్వాధీనం 12మంది అరెస్టు -
పశువుల పాకనా... ఇరిగేషన్ కార్యాలయమా..?
నిజాంసాగర్(జుక్కల్): మండంలోని అచ్చంపేట గెస్ట్ హౌస్, నిజాంసాగర్ నీటిపారుదల శాఖ డివిజన్ కార్యాలయ ప్రాంగణం పశువుల పాకను తలపిస్తోంది. గెస్ట్ హౌస్, ఇరిగేషన్ కార్యాలయాలు పక్క, పక్కనే ఉన్నాయి. సదరు కార్యాలయాల ఆవరణలో ఉన్న చెట్ల కింద పశువులను కట్టేస్తూ పెంటకుప్పలు వేస్తున్నారు. ఇరిగేషన్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన గేటుతో పాటు గెస్ట్ హౌస్కు వెళ్లే ప్రధాన గేటు, అచ్చంపేటకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో అధికారుల ఊదాసీనతను చూసి అటువైపు వెళ్లే వారు ఆశ్చర్యపోతున్నారు. అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. -
అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత..
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని అయిలాపూర్ గ్రామంలో ఓ వివాహిత అత్తింటి వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఏఎస్సై ప్రకాష్నాయక్ తెలిపిన వివరాలు ఇలా.. అయిలాపూర్ గ్రామానికి చెందిన గుడ్డోళ్ల సులోచన(32)కు 2018లో కొర్పోల్ గ్రామానికి చెందిన కుమార్తో వివాహం జరిగింది. వీరికి అభినయ్, దీక్షిత ఇద్దరు పిల్లలు. వీరు బతుకుదెరువు కోసం కొన్ని నెలల క్రితం హైదరాబాదుకు వెళ్లగా ఇటీవల కొర్పోల్ గ్రామానికి వచ్చారు. ఈక్రమంలో అత్త గంగవ్వ, ఆడపడుచు సాయవ్వ, భర్త కుమార్, బావ రవి, తోటి కోడలు లలిత కలిసి సులోచనను మానసికంగా వేధింపులకు గురిచేసేవారు. ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పగా పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి సర్దిచెప్పి పంపించారు. అయినప్పటికీ వేధింపులు కొనసాగుతుండటంతో అయిలాపూర్లోని తల్లిగారింటికి వచ్చేసింది. ఈక్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతురాలి తండ్రి బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కాలువలో పడి ఒకరి మృతి.. మరొకరు గల్లంతు
బాల్కొండ: మండలంలోని కాకతీయ కాలువలో పడి ఒకరు మృతిచెందగా, మృతుడి ఆచూకీ కోసం వచ్చిన మరో వ్యక్తి అదే కాలువలో పడి గల్లంతయ్యాడు. మెండోరా ఎస్సై నారాయణ తెలిపిన వివరాలు ఇలా.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ తాలుకకు చెందిన దేశ్ముఖ్ మారుతి(32) కూలీ పనుల కోసం ఇటీవల మెండోరాకు వచ్చాడు. రెండు రోజుల క్రితం మారుతి కాలకృత్యాలు తీర్చుకోవడానికి కాలువ వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. కాలువ వద్ద అతడి చెప్పులు ఆధారంగా మంగళవారం గాలింపు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వెతకడానికి వెళ్లి.. మారుతి గల్లంతయ్యాడని తెలియడంతో వెతుకుట కోసం అదే గ్రామానికి చెందిన హరి లఖోడి రాజారాం, అవినాష్ బైక్పై సోమవారం బయలుదేరారు. వెల్కటూర్ గ్రామ శివారులోని కాకతీయ కాలువ వద్ద వీరి బైక్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. వెనుక కూర్చున్న అవినాష్ పక్కకు దూకగా, బైక్పై ఉన్న రాజారాం బైక్తో సహ కాలువలో గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నారాయణ పేర్కొన్నారు. గాలింపు చేపట్టినట్లు తెలిపారు. అనారోగ్యంతో గన్నారం జీపీ కార్యదర్శి మృతి ఇందల్వాయి: గన్నారం గ్రామ పంచాయతీ కార్యదర్శి(గ్రేడ్1) వెంకటేశ్వర్లు అనారోగ్యంతో మృతి చెందారు. ఇందల్వాయి మండల కేంద్రంలో ఉంటూ గన్నారంలో విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు సోమవారం అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తోటి ఉద్యోగులు తెలిపారు. మృతుడి స్వస్థలం జోగులాంబ గద్వాల్ జిల్లా మానవపాడు మండలం అని తెలిసింది. మృతుడికి ఇద్దరు కొడుకులు ఉన్నట్లు సమాచారం. గుండెపోటుతో వివాహిత.. ఆర్మూర్టౌన్: పెర్కిట్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ వివాహితకు ఆపరేషన్ చేస్తుండగా గుండెపోటు రావడంతో మృతిచెందినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. వివరాలు ఇలా.. మోర్తాడ్ మండలం ఏర్గట్ల గ్రామానికి చెందిన మార్వాడి మాన్విత(23)కు ఐదేళ్ల క్రితం నందిపేట్ మండలం షాపూర్ గ్రామానికి చెందిన సురేష్తో వివాహం జరిగింది. పిల్లలు పుట్టటం లేదని మాన్వితకు మంగళవారం పెర్కిట్లోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన్ చేస్తుండగా గుండెపోటు రావడంతో మృతిచెందింది. భర్త సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మహిళ.. ఎల్లారెడ్డి: మెదక్ జిల్లా మాసాయిపేటలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎల్లారెడ్డి మండలం కొట్టాల్ గ్రామానికి చెందిన బోదాటి సాయవ్వ (43) అనే మహిళ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. సాయవ్వ దంపతులు కొన్ని నెలల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వెళ్లారు. ఈక్రమంలో మాసాయిపేటలో కూలి పనులు చేసేందుకు రైలు దిగి రోడ్డు దాటుతున్న సమయంలో సాయవ్వను ఓ ప్రయివేటు బస్సు ఢీకొట్టింది. ఈఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు వారు తెలిపారు. సాయవ్వ అంత్యక్రియలు ఆమె స్వగ్రామమైన కొట్టాల్లో నిర్వహించినట్లు తెలిపారు. -
రాజంపేట పీహెచ్సీలో ‘ఆరోగ్య మహిళ’
రాజంపేట: స్థానిక పీహెచ్సీ పరిధిలో మంగళవారం ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మెడికల్ ఆఫీసర్ విజయమహాలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 65 మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించమన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సంగీత, సూపర్వైజర్ మంజూర్,ల్యాబ్ టెక్నీషీయన్ సంతోష్ పాల్గొన్నారు. చలివేంద్రం ప్రారంభం బీబీపేట: మండలంలోని యాడారం, శివారు రాంరెడ్డిపల్లి గ్రామాల్లో మన ఊరు – మేము సైతం ఫౌండేషన్ సభ్యులు చలివేంద్రాలు మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. అవార్డు గ్రహీతకు సన్మానం తెయూ(డిచ్పల్లి): తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో ఈనెల 23 జరిగిన ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాంగ్రెస్–2025 కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ వృక్షశాస్త్ర విభాగం సీనియర్ ప్రొఫెసర్ ఎం.అరుణకు బోధన, పరిశోధన విభాగంలో ఇంటర్నేషనల్ అవుట్ స్టాండింగ్ రీసెర్చ్ అవార్డు లభించింది. ఈసందర్భంగా అవార్డు గ్రహీత అరుణను మంగళవారం తెయూ వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి అభినందించి, సన్మానించారు. వృక్షశాస్త్ర విభాగాధిపతి హలీంఖాన్, ప్రొఫెసర్ విద్యావర్థిని, అధ్యాపకులు శ్రీనివాస్, జలంధర్ తదితరులు పాల్గొన్నారు. -
మొక్కలను జాగ్రత్తగా పెంచాలి
గాంధారి(ఎల్లారెడ్డి) : వేసవిలో నర్సరీల్లోని మొక్కలను జాగ్రత్తగా పెంచాలని డీపీవో, మండల ప్రత్యేకాధికారి మురళి సూచించారు. హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను కాపాడాలన్నా రు. మంగళవారం ఆయన మండలంలోని నాగ్లూర్, నేరల్, నేరల్ తండా, చద్మల్, చద్మల్ తండా, బీర్మల్ తండాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నర్సరీలు, అంగన్వాడీ కేంద్రాలు, కంపోస్ట్షెడ్డులను పరిశీలించారు. తాగు నీటి ఎద్దడి రాకుండా చూడాలని, శానిటేషన్ బాగా చేయాలని కార్యదర్శులను ఆదేశించారు. గ్రామాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ జీపీ కార్యదర్శులకు సూచనలు ఇవ్వాలని ఎంపీడీవో రాజేశ్వర్, ఎంపీవో లక్ష్మీనారాయణలకు సూచించారు. ఆయన వెంట కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది ఉన్నారు.● తాగు నీటి ఎద్దడి రాకుండా చూడాలి ● డీపీవో మురళి -
మొక్కలకు నీళ్లు పట్టాలి
నిజాంసాగర్/బీబీపేట/లింగంపేట : మహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ గ్రామ వన నర్సరీని మండల ప్రత్యేక అధికారిణి అరుణ పరిశీలించారు. వన నర్సరీలో పెంచుతున్న మొక్కల సంరక్షణపై దృష్టి సారించాలని ఈజీఎస్ సిబ్బందికి ఆమె సూచించారు. పంచాయతీ కార్యదర్శి ప్రేమ్ సింగ్, ఫీల్డ్అసిస్టెంట్ శ్రీనివాస్గౌడ్ తదితరులున్నారు.బీబీపేట మండలం జనగామ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్ పరిశీలించారు.ఎండలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూలీలకు సూచించారు. అనంతరం బీబీపేటలో నర్సరీని పరిశీలించి మొక్కలకు క్రమం తప్పకుండా నీళ్లు పట్టాలని తెలిపారు. ఆయన వెంట ఎంపీడీవో పూర్ణచంద్రోదయ కుమార్, తదితరులున్నారు. లింగంపేట మండలం బోనాల్, బాయంపల్లి, కొర్పోల్, బాణాపూర్, నాగారం గ్రామాల శివారులో ఉపాధి హామీ పనులను ఎంపీడీవో నరేష్ పరిశీలించారు. ఉపాధి పనులు కొలతల ప్రకారం చేయాలని సూచించారు. అనంతరం నర్సరీ, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. నర్సరీలలోని మొక్కలకు ప్రతీ రోజు నీరు పట్టాలని సూచించారు. అలాగే సీసీ రోడ్డు, క్యాటిల్ షెడ్లను పరిశీలించారు. ఆయన వెంట క్షేత్రసహయకుడు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. -
‘బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలి’
కామారెడ్డి టౌన్ : బాల్య వివాహాల నిర్మూలనకు అందరూ కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా కోర్టు న్యాయమూర్తి టి.నాగరాణి తెలిపారు. సాధ న స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని సీనియర్ సిటిజన్స్ భవనంలో బాల్యవివాహాలపై వర్క్షాప్ ని ర్వహించారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి మా ట్లాడుతూ బాల్య వివాహాలతో నష్టాలు, పి ల్లల అక్రమ రవాణా, పిల్లలపై వేధింపులు అంశాలపై అవగాహన కల్పించారు. బాల్యవివాహాలు, చిన్నారుల సమస్యలపై హెల్ప్ లైన్ నంబర్ల(100, 1098, 181, 1930, 15100)కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యురా లు స్వర్ణలత, మెప్మా పీడీ శ్రీధర్రెడ్డి, లైట్ ఫర్ బ్లైండ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు మేదిని దేవి, సాధన సంస్థ కోఆర్డినేటర్లు గిరిజ, మమత పాల్గొన్నారు. ఇన్చార్జి డీటీసీపీవోగా గిరిధర్ కామారెడ్డి టౌన్: డైరెక్టర్ ఆఫ్ టౌన్ ఆండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) జిల్లా ఇన్చార్జి అధికారిగా కామారెడ్డి మున్సిపల్ టీపీవో గిరిధర్కు బాధ్యతలు అప్పగించారు. డీటీసీపీవోగా విధులు నిర్వహిస్తున్న సువర్ణదేవి ఈనెల 31 వరకు సెలవుపై వెళ్లడంతో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బల్దియాకు ముగ్గురు టీపీబీవోలు కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపాలిటీలో టౌన్ప్లానింగ్ బిల్డింగ్ ఆఫీసర్(టీపీబీవో)లుగా ముగ్గురు నియమితులయ్యారు. టీపీబీవోగా సాయికిరణ్ మంగళవారం విధుల్లో చేరారు. జె.మల్లికార్జున్, బి.వెంకట్ రెండు రోజుల్లో విధుల్లో చేరుతారని టీపీవో గిరిధర్ తెలిపారు. నేడు హిందీ ఔర్ రోజ్గార్ వర్క్షాప్ కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బుధవారం ఉదయం 11 గంటలకు ‘హిందీ భాష ఔర్ రోజ్ గార్’ అనే అంశంపై వర్క్షాప్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ విజయ్కుమార్, హిందీ విభాగాధిపతి జి.శ్రీనివాస్రావు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు వర్క్షాప్లో పాల్గొని హిందీతో ఉపాధి అవకాశాలను తెలుసుకోవాలని సూచించారు. ఘనంగా గోటి తలంబ్రాల దీక్ష నిజామాబాద్ రూరల్: శ్రీరామనవమి రోజున కనులపండువగా జరిగే భద్రాచల రామయ్య కల్యాణానికి తెలంగాణ నుంచి 250 కిలోల గోటి తలంబ్రాలు అందించాలనే సంకల్పంతో శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సంస్థ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నగరంలోని కోటగల్లిలో ఉన్న జైర్కోట్ హనుమాన్ మందిరంలో మంగళవారం వంద మందికిపైగా భక్తులు రామనామ స్మరణ చేస్తూ గోటితో వడ్లను ఒలిచి సంస్థ అధ్యక్షుడు రామకోటి రామరాజుకు అందజేశారు. మైసమ్మ, జైర్కోట్, మల్లికార్జున, విజయగణపతి భజన మండళ్ల ఆధ్వర్యంలో నాలుగు గంటలపాటు భజన కొనసాగింది. రామకోటి రామరాజును భక్తులు ఘనంగా సన్మానించారు. తాము భద్రాచలం వెళ్లలేకపోయినా.. తమ చేతులతో ఒలిచిన గోటి తలంబ్రాలు వెళ్లడం ఆనందంగా ఉందని భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. విశ్రాంత ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలి బాన్సువాడ: పట్టణంలో మంగళవారం ఆర్టీ సీ ఉద్యోగుల సంఘం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సంఘం అధ్యక్షులు కౌసర్ మాట్లాడుతూ ఆర్టీసీలో పని చేసి రిటైరయిన విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదన్నా రు. విశ్రాంత ఉద్యోగులకు వెంటనే బకాయి లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు మహమూద్, పండరి, యేషయ్య, గంగారాం, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎల్ఆర్ఎస్ను వేగవంతం చేయాలి
కామారెడ్డి టౌన్: ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ కార్యక్రమాలను పరిశీలించారు. అధికారులు, సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 25 శాతం రాయితీతో లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ఇచ్చిన గడువు ఈనెల 31 తో ముగియనుందన్నా రు. దరఖాస్తుదారులు త్వరగా ఫీజు చెల్లించి రాయి తీ పొందాలని సూచించారు. దరఖాస్తుదారులు రుసుము చెల్లించిన 48 గంటల్లోనే ప్రొసిడింగ్స్ జారీ చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి, డిప్యూటీ ఈఈ వేణుగోపాల్, టీపీవో గిరిధర్ పాల్గొన్నారు. -
అర్హులైన రైతులకు రుణమాఫీ చేయాలి
నాగిరెడ్డిపేట: అర్హులైనవారి పంట రుణాలను మాఫీ చేయాలని తాండూర్ సహకార సంఘం మహాజనసభలో రైతులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మండలంలోని తాండూర్ సహకార సంఘం చైర్మన్ గంగారెడ్డి అధ్యక్షతన మహాజనసభను నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార సంఘం ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలను సీఈవో చంద్రమురళి చదివి వినిపిస్తుండగా రైతులు అడ్డుకొని తమకెందుకు రుణమాఫీ కాలేదని ప్రశ్నించారు. సహకార సంఘం పరిధిలో అర్హులైన ప్రతిఒక్కరికీ రుణమాఫీ చేయాలన్నారు. ఇప్పటివరకు సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగిన తాండూర్, జలాల్పూర్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల సమాఖ్యకు అప్పగించడాన్ని సభ్యులు వ్యతిరేకించారు. దీనిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని చైర్మన్ తెలిపారు. కార్యక్రమంలోసంఘం వైస్చైర్మన్ బాబురావు, మాజీ ఎంపీపీ రాజ్దాస్, నాయకులు సంజీవులు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు పరీక్షే!
నిజాంసాగర్: పదో తరగతి పరీక్ష కేంద్రానికి వెళ్లడం అచ్చంపేట ఎస్సీ గురుకుల విద్యార్థులకు అగ్ని పరీక్షగా మారింది. రవాణా సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అచ్చంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు 76 మంది ఉన్నారు. వీరికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఆదర్శ పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను కేటాయించారు. అక్కడికి వెళ్లి రావడానికి రవాణా సౌకర్యం లేకపోవడంతో గురుకుల అధికారులు ట్రాలీ ఆటోలో పంపిస్తున్నారు. 38 మంది చొప్పున రెండు ట్రిప్పుల్లో వెళ్లి వస్తున్నారు. ట్రాలీతోపాటు టాప్పైనా కొందరు విద్యార్థులు కూర్చుని ప్రయాణిస్తున్నారు. పరీక్ష అనంతరం గురుకులానికి తిరిగి వచ్చే సమయంలో ఎండ తీవ్రంగా ఉంటోంది. మండుటెండలో ప్రయాణించాల్సి రావడంతో అసౌకర్యానికి గురవుతున్నారు. సరైన రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.● గురుకులం నుంచి పరీక్ష కేంద్రానికి రవాణా వసతి కరువు ● ట్రాలీ ఆటోలో ప్రమాదకర ప్రయాణం ● ఒక్కో ట్రిప్లో 38 మందిని తరలిస్తున్న వైనం -
సాక్షులు, బాధితులు, నిందితులు లేని కేసు..
సాయికుమార్, ఎస్సై నిఖిల్ (ఫైల్)శ్రుతి, కానిస్టేబుల్జిల్లాలో మూడు నెలల క్రితం సంచలనం సృష్టించిన మూడు మరణాల కేసు త్వరలో క్లోజ్ అయ్యే అవకాశాలున్నాయి. చెరువులో ముగ్గురి మృతదేహాలు లభించిన ఈ కేసులో సాక్షులు, బాధితులు, నేరస్తులు ఎవరూ లేరు. ముగ్గురూ నీళ్లలో మునిగిపోవడంతో నీళ్లు మింగి చనిపోయినట్లు ఫోరెన్సిక్ నివేదికలు వెల్లడించాయి. ఈ నివేదికతో వీరి మరణానికి ఇతరులెవరూ కారణం కాదనేది స్పష్టమవడంతో త్వరలోనే కేసును క్లోజ్ చేసే అవకాశాలున్నాయి. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా కేంద్రానికి సమీపంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో గతేడాది డిసెంబర్ 25న ముగ్గురి మృతదేహాలు లభించిన విషయం తెలిసిందే. మృతులను భిక్కనూరు ఎస్సైగా పనిచేసిన సాయికుమార్, బీబీపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేసిన శ్రుతి, బీబీపేట గ్రామానికి చెందిన నిఖిల్ అనే యువకుడిగా గుర్తించారు. మృతుల్లో ఎస్సై, కానిస్టేబుల్ ఉండడంతో పోలీస్ ఉన్నతాధికారులు అన్ని కోణాల్లో పరిశీలించారు. కేసును త్వరితగతిన తేల్చాలని భావించినా సరైన ఆధారాలు దొరక్కపోవడంతో సాంకేతిక అంశాలపై ఆధారపడాల్సి వచ్చింది. సంఘటన జరిగిన ప్రాంతంలో ఎక్కడా సీసీ కెమెరాలు లేకపోవడంతో ఎటూ తేల్చలేకపోయారు. మృతులు ముగ్గురు వాడిన సెల్ఫోన్లలోని వాట్సాప్ చాటింగ్, వాళ్ల మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన కాల్డేటా మాత్రమే కేసులో కొంతమేర పరిశోధనకు ఉపయోగపడినట్టు తెలుస్తోంది. ఎవరూ కారణం కాదు.. ముగ్గురి మరణానికి సంబంధించిన ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపిన పోలీసులు వాళ్ల చావులకు మరెవరూ కారణం కాదని, వాళ్లకు వాళ్లుగానే చనిపోయినట్టు నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే మూడు నెలలు గడిచింది. కేసు వివరాల నివేదికను రూపొందించి కోర్టుకు, అలాగే మృతుల బంధువులకు అప్పగించి కేసును క్లోజ్ చేయడమే మిగిలిందని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసును త్వరలోనే క్లోజ్ చేసే అవకాశాలున్నాయి.హత్య, ఆత్మహత్య ఏదైనా సరే కేసులో ఎవరో ఒకరు బాధితులు ఉంటారు. సాక్ష్యాలు కూడా దొరుకుతాయి. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసుల్లో నిందితులను గుర్తించి పట్టుకోగలుగుతున్నారు. అ యితే ఈ కేసులో ముగ్గురి మధ్య జరిగిన వ్యవహారం కావడం, ముగ్గురికి ముగ్గురూ ఏకకాలంలో చనిపోవడంతో కేసులో బాధితులు, నేరస్తు లు, సాక్షులు ఎవరూ లేకుండాపోయారు. ఇందులో ఎవరో ఇద్దరు చనిపోయి ఉంటే, మూడో వ్యక్తి గురించి ఆరా తీసి కారణాలు తేల్చే అవకాశాలుండేవి. కానీ ముగ్గురూ చనిపోవడంతో స రైన ఆధారాలు దొరక్క పోవడంతో విచారణ ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. చెరువు వద్ద కు ఎందుకు వెళ్లారు? అక్కడ ఏమైనా గొడవ పడ్డారా? ఎవరు ముందు దూకి ఉంటారు? ఒకరిని కాపాడేందుకు ఒకరి వెంట మరొకరు దూ కారా? ఇద్దరు దూకడంతో తమపైకి వస్తుందని మూడో వ్యక్తి కూడా దూకి ఉంటారా? ఇలా ఎన్నో అనుమానాలు వ్యక్తమైనా వాటికి సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు దొరకలేదు. ముగ్గురు చనిపోయిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడం, ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ ఉన్న దాఖలాలు కూడా లే కపోవడంతో ఆధారాలు, సాక్ష్యాలు లభించే అ వకాశాలు కూడా లేవు. కాగా ఫోరెన్సిక్ నివేదికల్లో నీళ్లు మింగడం ద్వారానే మరణం సంభవించినట్లుగా వెల్లడైంది. దీంతో ముగ్గురు నీళ్ల లో మునిగిపోవడం వల్లే చనిపోయినట్టు స్పష్టమవుతోంది. మూడు నెలల క్రితం సంచలనం సృష్టించిన మూడు మరణాలు మృతుల్లో ఎస్సై, కానిస్టేబుల్తో సహా మరో వ్యక్తి నీళ్లు మింగి చనిపోయినట్లు తేల్చిన ఫోరెన్సిక్ నివేదిక ఆధారాలు లేని కేసుగా పరిగణిస్తున్న పోలీసులు -
జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం యూనియన్ ఆధ్వర్యంలో జీపీ కార్మికులు నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతుకు వారు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి రమేష్, నాయకులు మురళి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 12,750 గ్రామపంచాయతీలలో 60వేల మందికి పైగా కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని, ఆరు నెలలుగా వారికి జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్గా రూ.5లక్షల ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగుల తరహా 30 శాతం పీఆర్సీ అమలు చేయాలని, జీవో నెంబర్ 51సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. పంచాయతీ కార్మికులకు జీవో నెంబర్ 60ప్రకారంగా రూ.16,500 వేతనాన్ని ఇవ్వాలన్నారు. నాయకులు అరవింద్, రాజేశ్వర్, సత్యమ్మ, కార్మికులు మహేష్, రాము, చింటూ, సురేష్, బాలు, నరేష్, గంగాధర్, భోజన్న, నరేష్, శ్రీకాంత్, రమేష్, లింగం, రాజేశ్వర్, సాయిలు, దుర్గ, తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగ ఆవశ్యకతను తెలియపర్చాలి
కామారెడ్డి టౌన్: కాంగ్రెస్ శ్రేణులు రాజ్యాంగ ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలను చైతన్యవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కత్తి వెంకటస్వామి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. హోం మంత్రి అమిత్ షాను పార్లమెంట్ నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ మహాత్మా గాంధీ చిత్రపటంతో ఊరూర పాదయాత్రలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని నాయకులచే ప్రమాణం చేయించారు. ఈ సమావేశంలో రాష్ట్ర గిరిజన శాఖ కార్పొరేషన్ చైర్మన్ కొట్నక తిరుపతి, ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్, డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్రావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ, కారంగుల అశోక్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, పండ్ల రాజు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఓబీసీ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కత్తి వెంకటస్వామి -
ముందుకొస్తున్న ఆపన్నహస్తాలు
డొంకేశ్వర్(ఆర్మూర్): లుకేమియా (బ్లడ్ క్యాన్సర్)తో బాధపడుతున్న డొంకేశ్వర్ మండలం గంగాసముందర్ గ్రామానికి చెందిన నిర్విన్ తేజ్ ప్రాణాలను కాపాడేందుకు ఆపన్నహస్తాలు ముందుకొస్తున్నాయి. తొండాకూర్ గ్రామానికి చెందిన షేక్ సలీం బాలుడి వైద్య ఖర్చుల కోసం రూ.30వేల చెక్కును సోమవారం అందజేశారు. గంగాసముందర్ గ్రామానికి చెందిన యువత సైతం ముందుకొచ్చి తోచిన ఆర్థిక సాయాన్ని అందజేశారు. నిర్విన్ తేజ్ చదువుతున్న తొండాకూర్ ఎస్ఎస్వీ పాఠశాల యాజమాన్యం ౖసైతం విరాళాలు సేకరిస్తోంది. నిర్విన్ తేజ్ ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ‘సాక్షి’లో ‘పాపం బాలుడిని ఆదుకోరూ’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించి చాలా మంది తమ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకున్నారు. దరఖాస్తుల ఆహ్వానం నిజామాబాద్అర్బన్: నిజామాబాద్ నగర శివా రులోని నాగారం గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఇంగ్లిష్ బోధించేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సైదా జైనబ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ, పీహెచ్డీ, నెట్ లేదా సెట్ ఉత్తీర్ణులైన మహిళా అభ్యర్థులు ఈ నెల 27 వరకు గురుకులంలో దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. ఇది పూర్తి తాత్కాలిక పద్ధతిలో జరిగే నియామకమని, 28న డెమో ఆధారంగా ఎంపిక ఉంటుందని తెలిపారు. పీహెచ్డీ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యతనిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యతోపాటు క్రీడలకు ప్రోత్సాహం తెయూ(డిచ్పల్లి): రాష్ట్ర ప్రభుత్వం విద్యతోపాటు క్రీడలకు సమ ప్రాధాన్యతను ఇస్తుందని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరి అన్నారు. తెయూలో సోమవారం తెలంగాణ యూనివర్సిటీ యాన్యువల్ డే–2025 స్పోర్ట్స్ మీట్లో భాగంగా బాలుర కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీలో విద్యతోపాటు క్రీడలను, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నామని, వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెయూ స్పోర్ట్స్ డైరెక్టర్ బాలకిషన్, పీఆర్వో పున్నయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఆర్ నేత తదితరులు పాల్గొన్నారు. కబడ్డీ తొలి పోరులో ఎంఎస్సీ కెమిస్ట్రీ జట్టు–అప్లయిడ్ ఎకనామిక్స్ జట్టు తలపడగా అప్లయిడ్ ఎకనామిక్స్ జట్టు విజయం సాధించింది. రెండవ పోరులో అప్లయిడ్ ఎకనామిక్స్ జట్టు, మాస్ కమ్యూనికేషన్ జట్టు తలపడగా మాస్ కమ్యూనికేషన్ జట్టు విజయం సాధించింది. 31లోపు పరీక్ష ఫీజు చెల్లించండినిజామాబాద్అర్బన్: గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2వ, 4వ, 6వ డిగ్రీ రెగ్యులర్ సెమిస్టర్ పరీక్షలకు, 1 నుంచి 6వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలకు ఈనెల 31లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని ప్రిన్సిపల్ రామ్మోహన్రావు ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100తో అపరాధ రుసుంతో ఏప్రిల్ 4లోపు, రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 6లోపు చెల్లించడానికి అవకాశం ఉందన్నారు. రూ.1000 అపరాధ రుసుంతో ఏప్రిల్ 7వరకు ఫీజు చెల్లించవచ్చునన్నారు. పరీక్ష ఫీజును ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలన్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత
ఖలీల్వాడి: నగరంలోని వీక్లీ మార్కెట్లో సాయికిరణ్ అనే వ్యక్తి దుకాణంలో రేషన్ బియ్యంను టాస్క్ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ ఇన్చార్జి అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వారు దుకాణంపై దాడి చేసి, 20 క్వింటాళ్ల రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. లక్ష ఉంటుందని, తదుపరి చర్య నిమిత్తం వన్టౌన్ ఎస్హెచ్వోకు అప్పగించినట్లు టాస్క్ఫోర్స్ సీఐ అంజయ్య తెలిపారు. ఎస్సై గోవింద్, స్పెషల్ పార్టీ సిబ్బంది ఉన్నారు. వన్నెల్(బి)లో మొరం టిప్పర్లు.. బాల్కొండ: మండలంలోని వన్నెల్(బి) శివారులో వరద కాలువ నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు టిప్పర్లను సోమవారం బాల్కొండ పోలీసులు పట్టుకున్నారు. టిప్పర్లను, పొక్లెయిన్ను బాల్కొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. కుక్కల దాడిలో 18 గొర్రెలు మృతి ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని వెల్లుట్లపేట గ్రామంలో కుక్కల దాడిలో 18 గొర్రెలు మృతి చెందినట్లు గ్రామస్తులు సోమవారం తెలిపారు. గ్రామానికి చెందిన కొర్వి నారాయణ గ్రామ శివారులో గొర్రెలను మేపుతుండగా అకస్మాత్తుగా కుక్కల గుంపు గొర్రెలపై దాడి చేయడంతో మృత్యువాత పడ్డాయని తెలిపారు. మృతి చెందిన 18 గొర్రెల విలువ సుమారు రూ.2లక్షల వరకు ఉంటుందని బాధితుడు తెలిపారు. అధికారులు స్పందించి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. పేకాడుతున్న 8మంది అరెస్టు బోధన్: సాలూర మండల కేంద్రంలో పేకాడుతున్న 8మందిని అరెస్టు చేసినట్లు టాస్క్ఫోర్స్ సిబ్బంది తెలిపారు. సాలూరలోని పంటపొలాల్లో గల పేకాట స్థావరంపై సోమవారం రాత్రి టాస్క్ఫోర్స్ ఇన్చార్జి అడిషనల్ డీసీపీ శ్రీనివాస్రావు ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, ఎస్సై గోవింద్, సిబ్బంది దాడి చేశారు. ఈ దాడిలో పేకాడుతున్న 8మందిని పట్టుకున్నట్లు తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి 9 సెల్ఫోన్లు, సుమారు రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి చర్యల కోసం బోధన్ రూరల్ ఎస్సైకి అప్పగించినట్లు వెల్లడించారు. -
వర్నిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
వర్ని: మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి కాంగ్రెస్ పార్టీ లో రెండు వర్గాలు ఘర్షణ పడినట్లు వర్ని ఎస్సై మహేష్ వెల్లడించారు. మండల కేంద్రంలో ఒక టీ పాయింట్ వద్ద చిన్నపాటి గొడవ ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పారు. ఘర్షణకు పాల్పడ్డ ఇరువర్గాలకు చెందిన 20మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. అలాగే వర్నిలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. 20మందిపై కేసు నమోదు -
తాగునీటి మానిటరింగ్ సెల్ ఏర్పాటు
కామారెడ్డి క్రైం: జిల్లాలో ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తితే వెంటనే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన తాగునీటి మానిటరింగ్ సెల్కు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మానిటరింగ్ సెల్ను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాగు నీటి సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే 99087 12421 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ మానిటరింగ్ సెల్ రోజూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుందని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను నమోదు చేసుకుని సంబంధిత శాఖల అధికారుల ద్వారా సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, డీపీవో మురళి, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలి
మద్నూర్(జుక్కల్) : విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలని ట్రాన్స్కో డీఈ గంగాధర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో సోమవారం మూడు నూతన ట్రాన్స్ఫార్మర్లను ఆయన ప్రారంభించారు. ఈ ప్రాంతంలో అధిక లోడ్ ఉండడంతో వోల్టెజ్ సమస్య వస్తుండడం, వేసవికాలంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా అవసరం ఉండడంతో అదనంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. ట్రాన్స్కో ఏడీఈ సంజీవన్రావ్, ఏఈ గోపికృష్ణ, సిబ్బంది స్వామి ఉన్నారు. పాఠశాలల అభ్యున్నతికి సహకారం నిజాంసాగర్(జుక్కల్): పాఠశాలల అభ్యున్నతికి తల్లిదండ్రులు, గ్రామస్థులు, స్వచ్ఛంద సంస్థలు తమవంతు సహకారం అందించాలని పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్కుమార్ పటేల్ అన్నారు. సోమవారం మండలంలోని మాగి గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో మైల్ స్టోన్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో మార్కెట్ కమిటీ చైర్మన్ చేతుల మీదుగా విద్యార్థులకు బ్యాగులు, సోలార్ బల్బులను అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గుర్రపు. శ్రీనివాస్ పటేల్, శేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయు రాలు షమీన, ఉపాధ్యాయులు ప్రవళిక, శైలజ తదితరులు ఉన్నారు. గ్రంథాలయానికి కుర్చీలు అందజేత బాన్సువాడ : బాన్సువాడ గ్రంథాలయానికి కుర్చీలు, ప్యాడ్లను సోమవారం బీజేపీ నియోజకవర్గ నాయకులు శ్రీనివాస్ గార్గె అందజేశారు. మినీ స్టేడియంలో కొనసాగుతున్న గ్రంథాలయంలో చదువుకునే వారి సౌకర్యం కోసం చల్లటి వాటర్ ట్యాంకుతో పాటు 20 కుర్చీలు, 20 ప్యాడ్లు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయం భవన నిర్మాణానికి రూ.60 లక్షలు మంజురైనప్పటికి పనులు ప్రారంభించడం లేదని అన్నారు.కార్యక్రమంలో నాయకులు అర్షపల్లి సాయిరెడ్డి, ర్యాల మోహాన్రెడ్డి, దావుగారి డాకయ్య, ప్రసాద్, రాజాసింగ్, సాయికిరణ్, బోడ లక్మణ్, శ్యాంకుమార్ తదితరులు ఉన్నారు. ఏవో విజయ్కుమార్ మరణం తీరని లోటుబాన్సువాడ : పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవోగా పని చేసి బదిలీపై వెళ్లిన విజయ్కుమార్ మరణం తీరని లోటు అని సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో విజయ్కుమార్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సహచర అధికారులతో కలుపుగొలుపుగా ఉండే విజయ్కుమార్ మృతి బాధకరమన్నారు. రెండు రోజుల క్రితమే ఎల్లారెడ్డి డివిజన్ కార్యాలయానికి బదిలీ అయ్యారని గుర్తు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ వరప్రసాద్, రెవిన్యూ అధికారులు సంగమేశ్వర్, అశోక్, ఆంజనేయులు, భాస్కర్ తదితరులున్నారు. ఆకట్టుకున్న కుస్తీపోటీలుబాన్సువాడ రూరల్: మండలంలోని కొల్లూర్ గ్రామంలో సోమవారం నిర్వహించిన కుస్తీపోటీలు ఆకట్టుకున్నాయి. వివిధ గ్రామాల నుంచి వచ్చిన మల్లయోధులు తమ ప్రతిభను చాటి బహుమతులు అందుకున్నారు. గ్రామంలో ప్రతి ఏటా పాడిపంట, ప్రజలు బాగుండాలని జాతర మహోత్సవం నిర్వహిస్తామని గ్రామకమిటీ అధ్యక్షులు పరిగె బాపురెడ్డి తెలిపారు. ఈసందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సంజీవ్రెడ్డి, సాయిలు, పర్వయ్య, దుర్గారెడ్డి, శ్రీనివాస్, వీరేందర్, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు. -
మత్తు పదార్థాలను నిర్మూలించాలి
కామారెడ్డి క్రైం : నిషేధిత మత్తు పదార్థాల నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసు, విద్య, వైద్య ఆరోగ్య, ఎకై ్సజ్, వ్యవసాయ, డ్రగ్స్ నియంత్రణ, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ మాదక ద్రవ్యాలు సరఫరా కాకుండా చూడాలన్నారు. జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలలో యాంటీ డ్రగ్స్ కమిటీలను వేశామన్నారు. మాదక ద్రవ్యాలతో కలిగే నష్టాలపై విద్యార్థులకు క్విజ్, ఉపన్యాసం, వ్యాస రచన పోటీలను నిర్వహించాలని సూచించారు. డ్రగ్స్కు అలవాటు పడిన వారికి వైద్యం అందించడానికి కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ప్రత్యేక సదుపాయం ఉందన్నారు. దానిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గంజాయి సాగు జరగకుండా వ్యవసాయ అధికారులు, అటవీశాఖ అధికారులు చూడాలన్నారు. 5 కేసులు నమోదు చేశాం జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 5 గంజాయి కేసులను నమోదు చేశామని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్, బిచ్కుంద, భిక్కనూరు, దేవునిపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు అవుతున్నాయన్నారు. వ్యసనాలకు, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. జిల్లాలోని కల్లు దుకాణాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని పోలీసులకు సూచించారు. ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ ఇన్స్పెక్టర్, ఎకై ్సజ్, పోలీసు శాఖల అధికారులు కలిసి కల్లు దుకాణాల్లో తనిఖీలు చేయాలన్నారు. కల్లు శాంపిళ్లు సేకరించి ల్యాబ్ లకు పంపాలని, ఆల్ప్రాజోలం ఉన్నట్లు గుర్తిస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. డ్రగ్స్ సమాచారం తెలిస్తే 87126 86133 నంబర్కు గానీ టోల్ ఫ్రీ నంబర్ 1908 కి గానీ సమాచారం ఇవ్వాలని కోరారు. డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయించినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం యాంటీ డ్రగ్స్కు సంబంధించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి, డీటీవో శ్రీనివాస్రెడ్డి, డీఈవో రాజు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హన్మంతరావు, డీఏవో తిరుమల ప్రసాద్, డ్రగ్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి, ఇంటర్ బోర్డు నోడల్ అధికారి షేక్ సలాం, సీడబ్ల్యూసీ సభ్యురాలు స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం
రుద్రూర్: పోతంగల్ మండలం కల్లూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి ఇల్లు దగ్ధమైంది. గ్రామస్తులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా. కల్లూర్ గ్రామానికి చెందిన బీర్కూర్ గంగారాం కుటుంబ సభ్యులు రేకుల ఇంట్లో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. సోమవారం ఉదయం వారు ఇంట్లో పూజాకార్యక్రమాలు ముగించుకుని ఇంటికి తాళం వేసి, వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిపోయారు. కొద్దిసేపటికి ఇంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు గమనించి గంగారాంకు సమాచారం అందించారు. వెంటనే బాధిత కుటుంబ సభ్యులు స్థానికుల సహాయంతో మంటలు ఆర్పివేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. ఇల్లు నిర్మించుకునేందుకు అప్పుగా తెచ్చుకున్న నగదుతోపాటు, బీరువాలోని బంగారం, వెండి ఆభరణాలు, బట్టలు, వంట సామగ్రి, ఫర్నిచర్ అగ్నికి ఆహుతయ్యాయి. రెవెన్యూ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని రూ.మూడు లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. పూజ కోసం వెలిగించిన దీపం కింద పడిపోవడంతో మంటలు అంటుకుని ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
మొరం తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి
జిల్లాలో జరుగుతున్న అక్రమమొరం తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీఎం జిల్లా కమిటీ నాయకులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కమిటీ ప్రతినిధులు వెంకటి గౌడ్, కొత్తనరసింహులు మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల పరిధిలో మొరం అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయన్నారు. సంబంధిత అధికారులు మొరం వ్యాపారులతో కుమ్మకై ్కపోయారని ఆరోపించారు. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. వ్యాపారులకు సహకరిస్తున్న అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. -
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 131 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూ సంబంధిత, డబుల్ బెడ్రూం ఇళ్లు, పింఛన్లకు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ప్రజావాణిలో 20,370 ఫిర్యాదులు రాగా 19,567 ఫిర్యాదులను పరిష్కరించమన్నారు. 803 వినతులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. వినతులను పరిష్కరించడం గానీ, పరిష్కార మార్గాలు చూపడం గానీ చేయాలన్నారు. ఫిర్యాదులను పెండింగ్లో పెట్టరాదన్నారు. తీసుకున్న చర్యలకు సంబంధించిన సమాచారాన్ని ఫిర్యాదుదారునికి తప్పనిసరిగా అందజేయాలన్నారు. పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో వీణ, జెడ్పీ సీఈవో చందర్, ఏవో మస్రూర్ అహ్మద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజావాణికి 131 ఫిర్యాదులు -
‘బెట్టింగ్ చట్టరీత్యా నేరం’
కామారెడ్డి క్రైం : ఐపీఎల్ బెట్టింగ్ చట్టరీత్యా నేరమ ని ఎస్పీ రాజేశ్ చంద్ర పేర్కొన్నా రు. సులభంగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాశ మంచిది కాదన్నారు. ఇది ఎన్నో స మస్యలకు దారి తీస్తుందన్నారు. బెట్టింగ్ కా రణంగా అనేక మంది ఆర్థిక ఇబ్బందుల పా లవుతున్నారన్నారు. ప్రజలు దీనికి దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల ప్రవర్తనపై కన్నేసి ఉంచాలన్నారు. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కొనసాగుతున్న ఎస్సెస్సీ పరీక్షలు కామారెడ్డి టౌన్: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం జరిగిన ఇంగ్లిష్ పరీక్షకు 12,579 మంది విద్యార్థులకుగాను 12,556 మంది హాజరయ్యారు. 23 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణను డీఈవో రాజు పర్యవేక్షించారు. ‘ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి’ నిజాంసాగర్: జుక్కల్ నియోజకవర్గంలో ఫిషరిస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆయన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడారు. విద్య, ఉపాధి అవకాశాల కల్పన దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్న తరుణంలో జుక్కల్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటేడ్ ఫిషరిస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని మత్స్యశాఖ మంత్రిని కోరారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో చేప పిల్లల విత్తనోత్పత్తి కేంద్రం ఉందన్నారు. ఇక్కడ ఫిషరీస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కోరారు. మున్సిపాలిటీగా బిచ్కుంద బిచ్కుందను మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. బిచ్కుంద, గోపన్పల్లి, కందర్పల్లి, దౌల్తాపూర్ గ్రామాలను కలుపుతూ బిచ్కుంద మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. బిచ్కుంద మండల ప్రజలు, వ్యాపారులు ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుకు, మంత్రి శ్రీధర్ బాబుకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘మనిషి నియంత్రణలోనే కృత్రిమ మేధ ఉండాలి’ కామారెడ్డి అర్బన్: కృత్రిమ మేధస్సు (ఏఐ) విద్య, వ్యాపారం, వ్యవసాయం అన్ని రంగా ల్లో విస్తరించిందని, మనిషి నియంత్రణలోనే కృత్రిమ మేధ ఉండాలని కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం కళాశాల ఫిజికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘కృత్రిమ మేధస్సు ఆగమనం.. సైన్స్ అండ్ టెక్నాలజీ’ అంశంపై వర్క్షాప్ నిర్వహించా రు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపల్ కిష్టయ్య మాట్లాడారు. వర్క్షాప్లో సమన్వయకర్తలు విశ్వప్రసాద్, జయప్రకాష్, అధ్యాపకులు రాములు, శ్రీనివాస్రావు, మానస, శ్రీవల్లి, రాజశ్రీ, కే.శ్రీనివాస్, స్వామి, రాజు, శ్రీలత, భాగ్యలక్ష్మి, రాంప్రసాద్, అనిల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. 155 రకాల వంగడాల ప్రదర్శన డొంకేశ్వర్(ఆర్మూర్): మధ్యప్రదేశ్లోని ఉజ్జ యిని నగరంలో ఇండియా ఫార్మర్స్ 68వ కౌన్సిల్ సమావేశం సోమవారం నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వెయ్యి మంది రైతులు సమావేశానికి హాజరుకాగా, రాష్ట్రం నుంచి ఐదుగురు పా ల్గొన్నారు. ఇందులో జక్రాన్పల్లి మండలం చింతలూరుకు చెందిన ఆదర్శరైతు నాగుల చిన్నగంగారాం (చిన్ని కృష్ణుడు) ఉన్నారు. సొంతగా అభివృద్ధి చేసిన 155 రకాల దేశీ వరి వంగడాలను ప్రదర్శనకు ఉంచారు. సమావేశానికి వచ్చిన రైతులు వరి విత్తనాలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం చి న్నికృష్ణుడు ప్రకృతి వ్యవసాయంపై సమావేశంలో ప్రసంగించారు. -
కరెంట్ షాక్తో రైతు మృతి
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని రాంపూర్గడ్డ తండాలో కరెంటు షాక్తో ఓ రైతు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వివరాలు ఇలా.. తండాకు చెందిన పిట్ల శ్రీను(30) అనే రైతు సోమవారం సాయంత్రం ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతుల కోసం పోతంగల్ కలాన్ సబ్స్టేషన్ నుంచి ఎల్సీ తీసుకుని పనులు చేపట్టాడు. కానీ ట్రాన్స్ఫార్మర్ నుంచి అతడు కిందికి రాకముందే అధికారులు కరెంటు సరఫరా చేశారు. దీంతో ట్రాన్స్ఫార్మర్పై ఉన్న శ్రీను కరెంట్ షాక్కు గురయ్యాడు. స్థానికులు గమనించి వెంటనే అతడిని 108 అంబులెన్సులో చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దీంతో ఆగ్ర హించిన గ్రామస్తులు మృతదేహాన్ని పోతంగల్ కలాన్ స్టేజి వద్ద ఉంచి ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనను విరమింప జేశారు. మృతదేహాన్ని సమీపంలోని సబ్స్టేషన్ వద్ద ఉంచారు. సబ్స్టేషన్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే రైతు మృతి చెందాడని, ఉన్నతాధికారులు వచ్చేంత వరకు మృతదేహాన్ని అక్కడే ఉంచుతామని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్న గ్రామస్తులు సబ్స్టేషన్లోనే మృతదేహాన్ని ఉంచిన వైనం రాంపూర్గడ్డ తండాలో ఘటన -
బాన్సువాడ గడ్డ.. బీఆర్ఎస్ అడ్డా
బాన్సువాడ: బాన్సువాడ గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. సోమవారం బాన్సువాడ పెద్ద మజీద్ వద్ద నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో ముస్లింల కోసం షాదీముబారక్ పథకం ప్రవేశపెట్టామన్నారు. రంజాన్ పండుగను అధికారికంగా నిర్వహించి పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశామని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రంజాన్ తోఫా ఇవ్వడం లేదని విమర్శించారు. విదేశాల్లో చదివే విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న పోచారం శ్రీనివాస్రెడ్డి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్పై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నాయకులు వస్తారు.. పోతారని, కానీ కార్యకర్తలు మాత్రం ఎప్పటికీ ఉంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బీఆర్ఎస్ నాయకులు అయెషాబేగం, సుమిత్ర, జుబేర్, కిషన్, మోచీ గణేష్, గౌస్, సాయిబాబా, సాయిలు, శివ, రమేష్యాదవ్ తదితరులు ఉన్నారు. మళ్లొచ్చేది మన ప్రభుత్వమేనిజాంసాగర్: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలి చేది బీఆర్ఎస్ పార్టీనేనని, వచ్చేది కేసీఆర్ ప్ర భుత్వమేనని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. సో మవారం బాన్సువాడ పట్టణంలో నిర్వహించే ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్సీ కవితకు మండల బీఆర్ఎస్ నాయకులు నర్సింగ్రావ్పల్లి చౌరస్తా వద్ద ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఉత్సాహం చూస్తే ఎన్నికలు ఏవైనా బీఆర్ఎస్ ప్రభంజనం తప్పదన్న అభిప్రాయం కలుగుతోందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు దుర్గారెడ్డి, విఠల్, రమేశ్గౌడ్, రమేశ్, విఠల్గౌడ్, శ్రీకాంత్రెడ్డి, రాములు, సుభాష్గౌడ్ పాల్గొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రంజాన్ తోఫా ఇవ్వడం లేదు ఇఫ్తార్ విందులో ఎమ్మెల్సీ కవిత -
మోడల్ హౌస్ పరిశీలన
లింగంపేట : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం సమీపంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్ను హౌసింగ్ డిపార్ట్మెంట్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ విజయపాల్రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పలు మండలాల్లో మోడల్ హౌస్ల నిర్మాణం కొనసాగుతోందన్నారు. కొన్ని మండలాల్లో స్లాబ్ లెవల్లో, మరికొన్ని మండలాల్లో రూఫ్లెవల్లో పనులు ఉన్నాయని పేర్కొన్నారు. మోడల్ హౌస్ల నిర్మాణాన్ని వేగవంతం చేశామన్నారు. ఆయన వెంట డీఈ శుభాష్, ఏఈ అశోక్, ఎంపీడీవో నరేష్ తదితరులు ఉన్నారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్లో సత్తా చాటిన క్రీడాకారులు కామారెడ్డి అర్బన్: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు బి.ఈశ్వర్ప్రసాద్, ఎల్.సునీత సత్తాచాటారు. హైదరాబాద్లో ఆదివారం నిర్వహించిన జావెలిన్ త్రో అండర్–20 విభాగంలో ఈశ్వరప్రసాద్ రజత పతకం సాధించగా.. 400 మీటర్ల పరుగు పందెం అండర్–18 విభాగంలో సునీత కాంస్య పతకం సాధించారు. ఈ విషయాన్ని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్రెడ్డి, అనిల్కుమార్ తెలిపారు. పతకాలు సాధించిన క్రీడాకారులతోపాటు కోచ్ నవీన్కుమార్, మేనేజర్ అనిల్లను అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు. పోచమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత భిక్కనూరు: పోచమ్మ ఆలయం వద్దనున్న మర్రిచెట్టును నరికేందుకు కొందరు యత్నించగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివ రాలిలా ఉన్నాయి. భిక్కనూరు దళితవాడ సమీపంలో పోచమ్మ ఆలయం ఉంది. భక్తు లు ఏటా ఈ ఆలయం చుట్టూ ఎడ్ల బండ్ల ప్రదర్శన నిర్వహించి, అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఆ స్థలాన్ని కొనుగోలు చేశామంటూ ఆదివారం కొందరు వ్యక్తులు ఆల యం వద్దనున్న మర్రిచెట్టు కొమ్మలను నరక డం ప్రారంభించారు. దీనిని గమనించిన స్థా నికులు వారిని అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అన్య మత స్తులు ఆలయానికి సంబంధించిన మర్రిచెట్టును తొలగించేందుకు కుట్రచేశారని స్థానికులైన దళితులు ఆరోపిస్తున్నారు. అనంత రం ఆలయానికి సంబంధించిన భూమిని కా పాడాలని తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. -
ఆర్అండ్బీ పరిధిలో ఉన్న రోడ్ల వివరాలు.. (కి.మీ.లలో)
మైలారంలో కంకర రోడ్డుపై దుమ్ముతో ఇబ్బందిపడుతున్న వాహనదారులు బీబీపేట నుంచి రాంరెడ్డిపల్లి మార్గంలో కంకర తేలిన రోడ్డురోడ్డు, రవాణా సౌకర్యాలు మెరుగుపడితేనే అభివృద్ధికి బాటలు పడతాయి. అందుకే ప్రభుత్వాలు రోడ్ల నిర్మాణాలకు, అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుంటాయి. అవసరానికి అనుగుణంగా మట్టి రోడ్లను కంకర రోడ్లుగా.. తారు రోడ్లుగా.. డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేస్తుంటాయి. అయితే నాలుగైదేళ్లుగా రోడ్ల నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరైనప్పటికీ బిల్లుల చెల్లింపుల్లో తలెత్తిన సమస్యలతో చాలామంది కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే ఆపేశారు. కొన్ని కొత్త పనులు మంజూరైనా చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ప్రజల రవాణా కష్టాలు తీరడం లేదు. జిల్లాలో రోడ్ల పరిస్థితిపై ‘సాక్షి’ ఫోకస్.. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో చాలా ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలు మధ్యలో నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లను అభివృద్ధి చేసే క్రమంలో కొ న్నిచోట్ల కంకర పరిచి వదిలేశారు. దుమ్ము లే స్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టు, జిల్లా పరిషత్, ఆర్డీవో కార్యాలయాల వద్ద కంకర పరిచి ఏళ్లు గడుస్తోంది. మున్సిపల్, రోడ్లు భవనాలు, రైల్వే శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ పనులు ముందుకు సాగడం లేదు. రోడ్లు భవనాల శాఖ ద్వారా పాత బస్టాండ్ నుంచి పంచముఖి రైల్వే గేట్, అడ్లూర్ మీదుగా పోసానిపేట వరకు వెళ్లే రహదారి విస్తరణకు మూడేళ్ల క్రితం రూ.2 కోట్లు మంజూరవగా, పంచముఖి హనుమాన్ ఆలయం సమీపంలో డ్రెయినేజీపై వంతెన నిర్మించారు. అయితే వంతెనపై తారు వేయలేదు. ఈ రోడ్డు విస్తరణకు రాజకీయ గ్రహణం పట్టింది. జిల్లా కేంద్రంలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తిరిగే రోడ్ల పరిస్థితి ఇలా ఉంటే మారుమూల గ్రామాల రోడ్ల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ● కామారెడ్డి నుంచి రామారెడ్డి మీదుగా రెడ్డిపేటకు వెళ్లే రహదారిపై మద్దికుంట శివారులో అటవీ అనుమతులు రాక పనులు ఆగిపోయాయి. ఈ మార్గంలో ప్రయాణించేవారు ఇబ్బందిపడుతున్నారు. ● లింగంపేట మండలం నాగారం శివారులో వంతెన నిర్మించినా, గతేడాది వర్షాలకు రోడ్డు కొట్టుకుపోయింది. తాత్కాలికంగా మొరం పోసి వదిలేశారు. వాహనాల రాకపోకలతో దుమ్మ లేస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ● పిట్లం మండల కేంద్రంలో నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం పనులు ఆగిపోయాయి. పిట్లం నుంచి మద్దెలచెరువు, పిట్లం నుంచి కుర్తి వెళ్లే రోడ్లు అధ్వానంగా మారాయి. ● తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి శివారులో వాగుపై వంతెన నిర్మించి రోడ్డుపై తారు వేయకుండా వదిలేశారు. ● దోమకొండ మండల కేంద్రం నుంచి ముత్యంపేట వరకు బీటీ రోడ్డు విస్తరణ పనులు ఆగిపోయాయి. ● మాచారెడ్డి మండలం మైసమ్మచెరువు తండా నుంచి తడ్కపల్లి వరకు బీటీ రోడ్డుకు నిధులు మంజూరైనా అటవీ అనుమతులు లేక పనులు ఆగిపోయాయి. ● బిచ్కుంద నుంచి కందార్పల్లి రోడ్డు అధ్వానంగా తయారైంది. ● రాజంపేట మండల కేంద్రం నుంచి మెదక్కు వెళ్లే రహదారిపై కొండాపూర్ శివారులో వంతెన నిర్మించినా రోడ్డుపై తారు విస్మరించారు. ● బాన్సువాడ మండలంలోని కోనాపూర్ – కాద్లాపూర్ రోడ్డు కంకర తేలి అధ్వానంగా ఉంది. ● ఇబ్రహీంపేట్ పంచాయతీలోని రేకుల కుంట తండాకు రోడ్డు కోసం కంకర వేసి ఏడాది అవుతున్నా తారు వేయలేదు. ● పెద్దకొడప్గల్ మండలంలోని అంజని గ్రామం నుంచి శివాపూర్ వెళ్లే రోడ్డుపై మూడేళ్ల క్రితం కంకరపోసి వదిలేశారు. ఈ మార్గంలో వాహనాల రాకపోకలతో విపరీతంగా దుమ్ములేస్తోంది. ఇలా జిల్లాలో చాలాచోట్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఆయా మార్గాలలో ప్రయాణిస్తున్నవారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కంకర రాళ్లతో వాహనాల టైర్లు దెబ్బతింటున్నాయని, వాహనాలు చెడిపోతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కారు స్పందించి నిలిచిన పనులను పూర్తి చేయించాలని కోరుతున్నారు.తారుకు నోచుకోని సర్దాపూర్ తండా – కొత్తగూడెం తండా రోడ్డు పిట్లంలో రోడ్డు విస్తరణలో కంకరవేసి వదిలేసిన దృశ్యం పంచాయతీరాజ్ పరిధిలోని రోడ్ల వివరాలు.. (కి.మీ.లలో)బిల్లులు రాకపోవడమే సమస్యకాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంతో వారు పనులను మధ్యలోనే ఆపేశారని స్పష్టమవుతోంది. జిల్లాలో వివిధ పథకాల ద్వారా చేపట్టిన రోడ్ల అభివృద్ధి పనులకు సంబంధించి రూ. 30 కోట్లకుపైగా బిల్లులు రావాల్సి ఉందని తెలుస్తోంది. కాంట్రాక్టర్లు ఎవరిని కదిలించినా ఏళ్లుగా బిల్లులు రావడం లేదని, ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లుల కోసం అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం ఉండడం లేదని పేర్కొంటున్నారు. పాత బిల్లులు రాకపోవడంతో కొత్తగా మంజూరైన పనులు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. రోడ్ల నిర్మాణానికి బిల్లుల గ్రహణం చాలాచోట్ల మధ్యలోనే ఆగిన పనులు బిల్లులు రాక చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు నిధులు మంజూరైనా ప్రారంభం కాని పనులెన్నో.. ఇబ్బందులు పడుతున్న ప్రజలు -
ఆస్తుల విభజనలో ఈ–పంచాయితీ
పోర్టల్లో సాంకేతిక లోపాలు ● అసెస్మెంట్లో బ్లాక్నంబర్ తప్పుగా వస్తున్న వైనం ● అధికారుల చుట్టూ తిరుగుతున్న బాధితులుదోమకొండ : ఈ –పంచాయతీ పోర్టల్లో సాంకేతిక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ స్తుల పంపకం చేసుకుంటున్న సమయంలో అసెస్మెంట్లో బ్లాక్నంబర్ తప్పుగా రావడంతో సబ్రిజిస్ట్రార్ కార్యాలయం, గ్రామ పంచాయతీ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం ఉండడంలేదు. గ్రామపంచాయతీతో సంబంధం లేకుండా సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలోనే మ్యూటేషన్ ప్ర క్రియతో పాటు అసెస్మెంట్ నంబరు కేటాయించడంతో ఈ సమస్య తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. గ తంలో పంచాయతీ డిమాండ్ రిజిస్టర్తో పాటు ధ్రు వీకరణ పత్రం, ఇంటి రసీదుతో అసెస్మెంటు నంబర్లు తప్పుగా నమోదైతే వాటిని జీపీ కార్యదర్శి రివిజన్ రిజిస్టర్ ఆధారంగా సరిదిద్దేవా రు. కానీ ప్రస్తుతం సంబంధిత వెబ్సైట్లో ఎడిట్ ఆప్షన్ లేకపోవడంతో సమస్య పరిష్కారం కావడంలేదు. బ్లాక్ మారడంతో.. ప్రభుత్వం గ్రామాల్లో ఇంటి నిర్మాణం, ఇతరత్రా అ నుమతుల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేందు కు ఈ–పంచాయతీ పోర్టల్ను ప్రవేశపెట్టింది. సిటిజన్ లాగిన్ అనుమతులతో పాటు ఇతరత్రా అవసరాలకు లబ్ధిదారులు మీసేవ కేంద్రాల ద్వారా దర ఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఖాళీ స్థలా లు, ఇళ్లు వంటి ఆస్తులను పంపకాలు చేసుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకు నేప్పుడు మ్యూటేషన్ ప్రక్రియ ఇక్కడే పూర్తవుతోంది. కానీ సాంకేతిక సమస్యల కారణంగా బ్లాక్ మారి అసెస్మెంట్ నంబర్ కేటాయింపు జరుగుతోంది. బీబీపేటకు చెందిన రాజయ్య అనే వ్యక్తికి చెందిన స్థలాన్ని ఆయన ఇద్దరు కుమారులు పంచుకుని స్థానిక సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పెద్దకుమారుడికి ప్రస్తుతం స్థలానికి ఉన్న ఇంటి నంబర్ను అసెస్మెంట్ ఆధారంగా కేటాయించారు. అదే నంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకున్న చిన్నకుమారుడికి బ్లాక్ మారి అసెస్మెంట్ తప్పుగా వచ్చింది. చిన్న కుమారుడు ఇంటి నిర్మాణం అనుమతి కోసం గ్రామ పంచాయతీకి వెళ్లగా పంచాయతీ అధికారులు అసెస్మెంట్ తప్పుగా వచ్చిందంటూ అనుమతి నిరాకరించారు. దీంతో సమస్య పరిష్కారం కోసం ఆయన ఇటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం.. అటు పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులకు వివరించాం ఆస్తుల పంపకాల విషయంలో రిజిస్ట్రేషన్ చేయించుకు న్న తర్వాత అసెస్మెంట్ నంబర్ తప్పుగా వస్తోంది. మ్యూటేషన్ సమయంలో ఇంటినంబర్ వద్ద బ్లాక్ త ప్పుగా చూపిస్తోంది. సమస్యను జిల్లా ఉన్నతాధికారులతోపాటు రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. – శ్రీనివాస్, డీఎల్పీవో, కామారెడ్డి ఇష్టారాజ్యంగా నమోదు..వ్యవసాయేతర భూములు, వ్యవసాయ భూ ముల ఆస్తుల రిజిస్ట్రేషన్లను ధరణి పోర్టల్ ప్రా మాణికంగానే నిర్వహించాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం పంచాయతీల్లో ఎన్పీబీ (నాన్ ప్రాపర్టీ బుక్)లో ఇళ్లతో పాటు వ్యవసాయేతర భూ ముల వివరాలను నమోదు చేయించింది. ఈ సమయంలో పంచాయతీ డిమాండ్ రిజిస్టర్తో సంబంధం లేకుండా గ్రామాలు, పట్టణాల్లో జ నాభా ఆధారంగా ఇళ్లు, ప్లాట్ల సంఖ్యను నిర్దేశించి నమోదు చేయాలని సూచించారు. అయితే అప్పట్లో గ్రామపంచాయతీ కార్యదర్శులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఇళ్లతో పాటు వ్యవసాయేతర ప్లాట్లకు అసెస్మెంట్ నంబర్లను కేటాయించారు. ఈ నంబర్లను ఆన్లైన్లో నమోదు చేశాక, నిర్దేశిత పోర్టల్ను సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు అనుసంధానం చేశారు. అప్పట్లో సరిగా నమోదు చేయకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. -
తెయూ విద్యార్థికి ‘సాహిత్య పురస్కారం’
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ తెలుగు అధ్యయన శాఖ విద్యార్థి రాజు సాహిత్య పురస్కారం అందుకున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆదివారం వెన్నెల సాహితీ సంగమం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనంలో రాజు పాల్గొన్నారు. తను రచించిన ఉగాది పండుగ కవితా రచనను సమ్మేళనంలో విన్పించగా వెన్నెల సాహితీ సంగమం ప్రతినిధులు, సాహితీప్రియులు, కవులు, రచయితలు రాజును ప్రత్యేకంగా అభినందించారు. కవితా రచనను ప్రోత్సహిస్తూ ‘సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య పురస్కారం’, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. పురస్కారాన్ని అందుకున్న రాజును తెయూ తెలుగు అధ్యయన శాఖ ప్రొఫెసర్ డీ కనకయ్య, అధ్యాపకులు అభినందించారు. గుండె పోటుతో ఏవో విజయ్కుమార్ మృతి ఎల్లారెడ్డి: స్థానిక ఆర్డీవో కార్యాలయం ఏవోగా బదిలీ అయిన విజయ్కుమార్ (59) ఆదివారం గుండె పోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవోగా విధులు నిర్వర్తించిన విజయ్కుమార్ ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఏవోగా బదిలీ అయినట్లు వారు తెలిపారు. శనివారం బాన్సువాడ కార్యాలయం నుంచి రిలీవ్ కాగా సోమవారం ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో జాయిన్ కావాల్సి ఉంది. ఆదివారం ఉదయం గుండె పోటు రావడంతో మృతి చెందాడు. విజయ్కుమార్ మృతికి రెవెన్యూ అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. -
పాపం బాలుడిని ఆదుకోరూ!
డొంకేశ్వర్(ఆర్మూర్): పాఠశాల తరగతి గదిలో ఉండాల్సిన సమయంలో ఆస్పత్రిలో చేరి మహమ్మారి వ్యాధితో పోరాడుతున్నాడు బాలుడు నిర్విన్ తేజ్. డొంకేశ్వర్ మండలం గంగాసముందర్ గ్రామానికి చెందిన మోతె అశోక్, గంగామణిల కుమారుడు నిర్విన్ తేజ్ తొండాకూర్లో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఇటీవల సైకిల్ పైనుంచి పడడంతో కాలుకు పెద్ద గాయం తగిలింది. చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు రక్త పరీక్షలు చేశారు. అందులో తెల్లరక్త కణాలు ఎక్కువగా ఉండటంతో మరిన్ని పరీక్షలు చేయగా బాలుడికి (అక్యూట్ మైలోయిడ్ లుకేమియా) బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు నాణ్యమైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఎంఎంజే ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారం రోజులుగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రోజుకు కొన్ని యూనిట్ల రక్తం అవసరం అవుతోంది. ఇప్పటికే రూ. నాలుగైదు లక్షల వరకు ఖర్చు అయింది. ఇంకా పదిహేను రోజుల వరకు వైద్యం అందించాల్సి ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు. తల్లిదండ్రులది నిరుపేద కుటుంబం కావడంతో వైద్య ఖర్చులకు స్థోమత లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. దాతలు ముందుకు వచ్చి తన కొడుకును కాపాడాలని వేడుకుంటున్నారు. బ్యాంక్ అకౌంట్ వివరాలు.. తండ్రి: మోతె అశోక్ బ్యాంకు ఖాతా నంబరు: 75010100025228 ఐఎఫ్ఎస్సీ కోడ్ : UBIN0817503 ఫోన్ పే నంబర్: 9705612610 (గంగామణి, తల్లి) లుకేమియాతో బాధపడుతున్న నిర్విన్ తేజ్ ఆపన్నహస్తం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు -
కోర్టు దూరం.. ప్రజలకు భారం
ఆర్మూర్: జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ కోర్టు ఏర్పాటు కోసం భీమ్గల్తోపాటు ఐదు మండలాల ప్రజలు ప్రయత్నాలు చేస్తున్నారు. క్రిమినల్, సివిల్ కేసుల విషయంలో ఆర్మూర్ కోర్టుకు వెళ్లేందుకు ఇబ్బందులుపడుతున్నారు. సిరికొండ, వేల్పూర్, కమ్మర్పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల మండలాలకు అందుబాటులో ఉండేలా భీమ్గల్లో జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ కోర్టు 2007లో మంజూరైంది. కాగా, ఆ కోర్టును ఆర్మూర్లో ఏర్పాటు చేయడంతో సమస్య మొదలైంది. ప్రజలు, న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులు, పోలీసులు వివిధ కేసుల విషయంలో ఆర్మూర్కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దూరభారం, సరైన రవాణా వ్యవస్థ లేకపోవడంతో ఇక్కట్లు పడుతున్నారు. దీంతో కోర్టును సాధించుకునేందుకు భీమ్గల్ ప్రాంతీయులు ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా భీమ్గల్లో కోర్టు ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై నివేదిక సమర్పించాలంటూ 2023 నవంబర్ 8న ఆర్మూర్ కోర్టుకు ఆదేశాలు వచ్చాయి. 500 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉంటేనే కొత్తగా కోర్టు మంజూరు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ, భీమ్గల్ పరిధిలోని ఆరు మండలాలను కలిపి సుమారు 2,500 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉండడంతోపాటు భీమ్గల్ మున్సిపాలిటీగా ఏర్పడింది. ఈ గణాంకాల ప్రకారం భీమ్గల్లో జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ కోర్టు ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ తెలంగాణ రాష్ట్ర లా సెక్రటరీకి నివేదిక రూపంలో సమర్పించి భీమ్గల్కు కోర్టు మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఆర్మూర్ పట్టణంలోని కోర్టు భీమ్గల్లో జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ కోర్టు ఏర్పాటుకు విజ్ఞప్తులు ఆర్మూర్లో నిర్వహణతో ఇక్కట్లుపడుతున్నామని ఆవేదన భీమ్గల్ పరిధి మండలాల్లో 2,500కు పైగా క్రిమినల్ కేసుల పెండింగ్ ఇబ్బందిగా ఉంది ఆర్మూర్ కోర్టులో గృహహింస, మెయింటెనెన్స్ కేసు నడుస్తోంది. నేను ఆర్మూర్కు వెళ్లాలంటే 62 కి.మీ ప్రయాణించాలి. మా గ్రామం నుంచి ఆర్మూర్కు బస్సు సౌకర్యం కూడా లేదు. ఇబ్బందిగా మారుతోంది. అదే కోర్టు భీమ్గల్లో ఉంటే మాలాంటి వారికి సౌకర్యంగా ఉండేది. – భూక్య లత, పాకాల, సిరికొండ మండలం -
గేదెను తప్పించబోయి ట్రాక్టర్ బోల్తా
మాక్లూర్: అడ్డుగా వచ్చిన గేదెను తప్పించబోయి ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడగా ఒకరు మృతి చెందిన ఘటన ఆదివారం నందిపేట మండలం సీహెచ్ కొండూర్ శివారులో చోటు చేసుకుంది. నందిపేట పోలీసుల కథనం ప్రకారం.. వెల్మల్ గ్రామానికి చెందిన చిన్నోల్ల సాయిలు(51) నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పంచగుడి వద్ద వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. నిత్యకృత్యంలో భాగంగా తన ట్రాక్టర్పై వెల్మల్ నుంచి పంచగుడిలోని పొలానికి వెళుతున్నాడు. సీహెచ్ కొండూర్ వద్ద ఒక్కసారిగా గేదె అడ్డురావడంతో దాన్ని తప్పించబోయే ప్రయత్నంలో ట్రాక్టర్ బోల్తా కొట్టింది. దీంతో ట్రాక్టర్ నడుపుతున్న చిన్నోల్ల సాయిలుకు తీవ్రగాయాలు కావడంతో అంబులెన్సులో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయిలు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకరి దుర్మరణం -
జుక్కల్లో బంజార భవన్ నిర్మిస్తాం
పిట్లం/నిజాంసాగర్/బిచ్కుంద : సేవాలాల్ మహరాజ్ చూపిన మార్గంలో గిరిజనులు నడవాలని ఎమ్మె ల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. పిట్లంలోని సాయిగార్డెన్ ఫంక్షన్ హాల్లో ఆదివారం మండల బంజార నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన సేవాలాల్ మ హరాజ్ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎ మ్మెల్యే హాజరయ్యారు. భోగ్ బండార్లో పాల్గొని ప్ర త్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గంలో బంజారా భవన్ ని ర్మిస్తామన్నారు. జుక్కల్ మండలం బంగారుపల్లి, దోస్త్ పల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. దోస్త్పల్లి గ్రామం నుంచి జుక్కల్ మండల కేంద్రం వరకు బీటీ రోడ్డు పనులను నాణ్య తగా చేపట్టాలని కాంట్రాక్టర్, ఆర్ఆండ్బీ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. బిచ్కుంద క్లాసిక్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. షాదీఖానాల మరమ్మతులకు నిధులు మంజూరు చేయిస్తానన్నారు. కార్యక్రమంలో బంజారా, కాంగ్రెస్ నాయకులు రమే ష్దేశాయ్, సాయాగౌడ్, మల్లికార్జునప్ప షెట్కార్, విఠల్రెడ్డి, నాగ్నాథ్, గంగాధర్, నాగ్నాథ్ పటేల్, సాహిల్, గౌస్, పాషా,అజీం, ఖలీల్, నౌషా నాయక్, తుకారం పాల్గొన్నారు. -
ఆస్తి పన్ను చెల్లించని దుకాణాల సీజ్
బోధన్టౌన్(బోధన్): బోధన్ పట్టణంలో ఆస్తి పన్ను చెల్లించని పలు దుకాణాలను ఆదివారం బల్దియా అధికారులు సీజ్ చేశారు. అనిల్ టాకీస్ రోడ్డులోని కేకే సూపర్ మార్కెట్, లక్ష్మి అపార్ట్మెంట్లోని దుకాణ సముదాయాలతోపాటు మరో దుకాణ సముదాయాన్ని సీజ్ చేశారు. దు కాణాదారులు బల్దియాకు రూ.3,16,629ల ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆస్తి పన్ను చెల్లించకపోతే దుకాణాలను సీజ్ చేస్తామని, ఇంటికి తాగునీటి సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించారు. వాహనాల తనిఖీ నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని గోర్గల్ గ్రామ శివారులో ఆదివారం ఎస్సై శివకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి ద్విచక్రవాహనం నడుపుతున్న ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
అబుదాబిలో రోడ్డు ప్రమాదం.. తొర్తివాసి మృతి
మోర్తాడ్(బాల్కొండ): దుబాయ్ దేశంలోని అబుదాబి నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏర్గట్ల మండలం తొర్తికి చెందిన ఈర్గల గంగాధర్(44) మరణించినట్లు అతని సన్నిహితుల ద్వారా తెలిసింది. ఉపాధి కోసం అబుదాబిలో డెలివరీ బాయ్గా పని చేస్తున్న గంగాధర్.. శనివారం బైక్పై డ్యూటీకి వెళుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్ర గాయాలపాలైన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. గంగాధర్కు భార్య, కూతురు, కొడుకు, తల్లి ఉన్నారు. గతంలో గీతా కార్మికునిగా పనిచేసిన గంగాధర్ ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టాడు. విధి వక్రీకరించి ప్రమాదంలో మృత్యువాత పడడంతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మృతదేహాన్ని త్వరగా రప్పించి, బాధిత కుటుంబానికి ప్రభుత్వం సాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి..బోధన్రూరల్: సాలూర మండలం జాడిజమాల్పూర్ గ్రామ శివారులోని చెరువు ప్రమాదవశాత్తు పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్రెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన రమేశ్ ఆదివారం ఉదయం పొలం పనులకు వెళ్లి ఇంటికి తిరిగివస్తుండగా గ్రామ శివారులోని చెరువులో కాలకృత్యాల కోసం వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్ లీకేజీ.. ఒకరికి తీవ్రగాయాలురెంజల్(బోధన్): ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పైపు లీకేజీ కావడంతో మంటలు వ్యాపించి దంపతులకు గాయాలైన ఘటన రెంజల్ మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మోతీలాల్ ఇంట్లో మధ్యాహ్నం వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పైపు లికేజీ అయ్యి రెగ్యులేటర్ పేలింది. దీంతో మంటలు వ్యాపించి మోతీలాల్కు తీవ్రగాయాలు కాగా, భార్య లతకు స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరినీ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.బాలికపై లైంగిక దాడిగాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన వేణు అనే యువకుడు లైంగిక దాడికి పాల్పడినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. బాలిక కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేశామన్నారు. గ్రామంలో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ విచారణ నిర్వహించినట్లు తెలిపారు. -
భారత సాఫ్ట్బాల్ జట్టుకు విద్యార్థిని ఎంపిక
జక్రాన్పల్లి : మండలంలోని మునిపల్లి గ్రామానికి చెందిన గన్న వర్షిణి భారత సాఫ్ట్బాల్ అండర్–15 సబ్జూనియర్ జట్టుకు ఎంపికై ంది. ఈనెల 25 నుంచి 30 వరకు తైవాన్లో జరిగే ఏషియన్ చాంపియన్షిప్ పోటీల్లో వర్షిణి పాల్గొననుంది. అంతర్జాతీయ పోటీల్లో భారత జట్టు తరఫున వర్షిణి ప్రాతినిథ్యం వహిస్తుండడంతో మునిపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తంచేశారు. మాజీ సర్పంచ్ ముస్కు చిన్న సాయిరెడ్డి ఆదివారం వర్షిణిని సన్మానించారు. ఖర్చుల నిమిత్తం రూ.10వేలు ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో లక్ష్మాపూర్ గ్రామశాఖ అధ్యక్షుడు నరేశ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముగ్గులు నిజాంసాగర్(జుక్కల్): జుక్కల్ మండలం దోస్త్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆదివారం హౌసింగ్ డీఈఈ గోపాల్, ఎంపీడీవో శ్రీనివాస్ ముగ్గులు వేయించారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం, భవనాలకు సంబందించి మార్కింగ్ వేయించారు. పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ..
రామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన పద్మ దినేష్ (52) మండల కేంద్రంలో ఆధార్, మీసేవ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. దుకాణ పని నిమిత్తం అతడు బైక్పై శుక్రవారం కామారెడ్డి వెళ్లి, సాయంత్రం తిరుగుపయనమయ్యాడు. గొల్లపల్లి ఎక్స్ రోడ్డు సమీపంలో బైక్ అదుపుతప్పి అతడు కింద పడగా, ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో దినేష్తోపాటు ఆటోలో ఉన్న పెద్ద బోయిన లింబాద్రి, అతడి భార్యకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ దినేష్ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. -
వేతనాలు చెల్లించాలని జీపీ కార్మికుల ధర్నా
కామారెడ్డి టౌన్: గ్రామపంచాయతీ సిబ్బందికి బకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంకట్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు బాలనర్సులు మాట్లాడుతూ గత తొమ్మిది నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు బి.సాయిలు, రూప్సింగ్, సాయి లు, కిషన్, కీర్తి, తదితరులు పాల్గొన్నారు. పదో తరగతి విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం దోమకొండ: పదోతరగతి విద్యార్థులకు పరీక్షలు కొనసాగుతున్నాయి. మండలంలోని అంబారిపేట గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు 10 కిలోమీటర్ల దూరంలోని బీబీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రం సెంటర్ పడింది. విద్యార్థులకు పరీక్ష రాయడానికి వీలుగా గ్రామానికి చెందిన యువకుడు అరుట్ల అనిల్ తన సొంత డబ్బులతో నాలుగు ఆటోలను ఏర్పాటు చేశాడు. ఉచిత ఆటో రవాణా సౌకర్యం కల్పించిన సదరు యువకుడిని పాఠశాల ఉపాధ్యాయుడు, గ్రామస్తులు అభినందించారు. -
అక్రమ ఇళ్ల నిర్మాణాలపై బీజేపీ ధర్నా
బాన్సువాడ : మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇళ్లు నిర్మించారని, అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చేవేయాలని డిమాండ్ చేస్తూ శనివారం మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ పట్టణంలో అక్రమంగా ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. మున్సిపల్కు కేటాయించి 10 శాతం స్థలాలను మున్సిపల్ స్వాధీనం చేసుకోవాలని, ఖాళీ స్థలాలకు ఇళ్ల స్థలాలు కేటాయించారని ఆరోపించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డికి, సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతి పత్రం అందజేశారు.కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీనివాస్, మజ్జిగ శ్రీనివాస్, హరి, సాయికిరణ్, లక్ష్మినారాయణ, కోనాల గంగారెడ్డి, శేఖర్గౌడ్, హన్మండ్లు తదితరులు ఉన్నారు. -
సైబర్ మోసాలపై అవగాహన
సదాశివనగర్/రామారెడ్డి/పెద్దకొడప్గల్ : మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలు, పోక్సో చట్టాలు, లైంగిక అక్రమ రవాణా చట్టాలపై సదాశివనగర్, రామారెడ్డి ఏపీఎంలు రాజిరెడ్డి, ప్రసన్నకుమార్, పెద్దకొడప్గల్ ఇన్చార్జి ఏపీఎం దూప్యా అవగా హన కల్పించారు. శనివారం రామారెడ్డి రైతు వేదిక, సదాశివనగర్, పెద్దకొడప్గల్ మండల సమాఖ్య కార్యాలయంలో వీవోఏలు, సీఏలకు గ్రామసంఘం అధ్యక్షులకు ఒక రోజు శిక్షణ నిర్వహించారు. అపరిచితులకు ఓటీపీలు తెలుపొద్దన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల అధ్యక్షులు, వీవోఏలు, సీసీలు పాల్గొన్నారు. -
ఎండీఎం కార్మికులకు రూ. 10వేల వేతనం చెల్లించాలి
కామారెడ్డి టౌన్: మధాహ్న భోజన కార్మికులకు రూ. 10 వేల వేతనం ఇవ్వాలని మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చక్రపాణి డీఈవో ఎస్.రాజుకు వినతిప్రతం అందజేశారు. ఈనెల 26న ఎండీఎం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నిరసనకు జిల్లాలోని కార్మికులు తరలివచ్చి విజయంతం చేయాలని కోరారు. చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలివెళ్లేందుకు ఒక రోజు అనుమతి ఇవ్వాలని డీఈవోకు కోరారు. కార్మికులు అంబవ్వ, సంగీత తదితరులున్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలి
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని బ్రాహ్మణపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మార్కింగ్ చేసి నిర్మాణాలు ప్రారంభించాలని డీపీవో, మండల ప్రత్యేకాధికారి మురళి అన్నారు. శనివారం ఆయన మండలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రాజేశ్వర్, ఎంపీవోలక్ష్మి నారాయణ, ఏఈలు దామోదర్, భాను చందర్, ఏపీవో శ్రుతి తో కలిసి పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బందితో సమీక్షించారు. పలు విషయాలపై చర్చించి సూచనలు చేశారు.కార్యక్రమంలో జీపీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. బీబీపేట/నాగిరెడ్డిపేట : బీబీపేట మండలం శివారు రాంరెడ్డిపల్లి, నాగిరెడ్డిపేట మండలం అచ్చాయపల్లిలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్, ఎంపీడీవో ప్రభాకరచారి పరిశీలించారు. శనివారం గ్రామాల్లోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముగ్గు పోశారు. అనంతరం యాడారం గ్రామంలో నర్సరీ, తాగునీటి వసతులను పరిశీలించారు. బీబీపేట లో ఉన్నటువంటి నర్సరీలో పెరుగుతున్న మొక్కలను పరిశీలించి తగిన సలహాలు ఇచ్చారు. మల్కాపూర్లో జరగుతున్న సీసీ రోడ్ల పనులను సందర్శించారు. ఆయన వెంట ఎంపీడీవో పూర్ణచంద్రోదయకుమార్, కార్యదర్శి వెంకట స్వామి, పంచాయతీ కార్యదర్శి వెంకటరామలు, ఫీల్డ్అసిస్టెంట్ మల్లేశం తదితరులున్నారు. -
మున్సిపాలిటీ వద్దు జీపీ ముద్దు
బిచ్కుంద(జుక్కల్): కొత్తగా ఏర్పాటు కానున్న బిచ్కుంద మున్సిపాలిటీలో గోపన్పల్లి గ్రామాన్ని కలపడం విషయమై శనివారం అధికారులు గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆధ్వర్యంలో గ్రామ చావడి వద్ద గ్రామ సభ ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ వద్దు జీపీ ముద్దు.. జీపీతో అన్ని సాధించుకుంటామని ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనుల నుంచి దూరం కావాల్సి వస్తుందని, అన్ని రకాల పన్నులు పెరిగిపోతాయని, అందరి ఏకాభిప్రాయంతో గ్రామ పంచాయతీగా ఉంచాలని నిర్ణయించుకున్నామని గ్రామస్తులు అధికారులకు నివేదించారు. ప్రభుత్వానికి పంపించిన ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలని జీపీగా ఉంచాలని ప్రజలు కోరారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీతో గ్రామంలో జరిగే అభివృద్ధి తదితర అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామస్తుల అభిప్రాయాలను అధికారులకు నివేదిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో గోపాల్ తదితరులున్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో గోపన్పల్లివాసులు ఉన్నతాధికారులకు నివేదిస్తామన్న అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి -
బెట్టింగ్లకు పాల్పడితే చర్యలు తప్పవు
రాజంపేట : ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో యువకులు, ప్రజలు బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ బెట్టింగ్, ప్రేడిక్షన్ ఛానల్స్పై అప్రమత్తంగా ఉండాలని ఎస్సై పుష్పరాజ్ సూచించారు. తెలియని యాప్లతో జాగ్రత్తంగా ఉండాలని, డబ్బులు పోగొట్టుకోవద్దని తెలిపారు. ఎవరైనా ఐపీఎల్ బెట్టింగ్ లకు పాల్పడితే స మాచారం అందించాలన్నారు. వారిపై చట్టరీ త్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాతెల్లిలో ఒకరు అదృశ్యం ఎల్లారెడ్డి: మండలంలోని సాతెల్లి గ్రామంలో ఓ వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్సై మహేష్ శనివారం తెలిపారు. వివరాలు ఇలా.. మెదక్ జిల్లా పోచమ్మరాల్ గ్రామానికి చెందిన కుమ్మరి గోపాల్ (54) సాతెల్లిలో కొద్ది రోజులుగా పొలం కౌలుకు చేస్తున్నాడు. ఈనెల 18న అతడు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎంత వెతికిన అతడి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
వాతావరణంలో మార్పులతో కోళ్లు మృతి
బీబీపేట: వాతావరణంలో ఉష్ణోగ్రత మార్పులతో కోళ్లలో వ్యాధి నిరోధకశక్తి తగ్గిపోయి మృతి చెందుతున్నాయని మండల పశువైద్యురాలు హేమశ్రీ అన్నారు. శనివారం మండలంలోని మల్కాపూర్, తుజాల్పూర్, బీబీపేటలో ఉన్నటువంటి కోళ్ల ఫారాలను ఆమె పరిశీలించారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో బర్డ్ ఫ్లూ వైరస్ ప్రభావం ఉన్నట్లు నిర్ధారణ జరిగిందని, బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లలో ముక్కు నుంచి నీరు కారడం, రెక్కలకి పక్షపాతం, మెడ వాయడం వంటి లక్షణాలు కనిపించి చనిపోతాయన్నారు. పౌల్ట్రీ రైతులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమ ఫారంలో కోళ్లు చనిపోయినట్లైతే ఆకోళ్లను పడేయకుండా భూమిలో పాతిపెట్టాలని, దహనం చేయాలని సూచించారు. షెడ్లని శానిటైజేషన్ చేయాలని తెలిపారు. ఫారాల వద్దకు కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే అన్ని జాగ్రత్తలూ తీసుకొని లోనికి పంపాలని పేర్కొన్నారు. కోళ్లలో మార్పుల కనిపిస్తే పశువైద్యాధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. ఆమె వెంట సిబ్బంది ఉన్నారు. -
చోరీ చేశారు.. వైరల్ అవడంతో వదిలేశారు..
మోర్తాడ్: గుర్తుతెలి యని దుండగులు పొ క్లెయిన్ని చోరీ చేయ గా, ఈ ఘటన సా మాజిక మాధ్యమా ల్లో వైరల్ కావడంతో వాహనాన్ని వదిలేశారు. వివరాలు ఇలా.. భీమ్గల్ మండలం జాగిర్యాల్లో చిన్నోల్ల గంగాప్రసాద్ తన పొక్లెయిన్ని శుక్రవారం రాత్రి ఇంటి వెనుక ఉన్న ఖా ళీ స్థలంలో నిలిపి ఉంచారు. శనివారం ఉదయం లే చి చూసేసరికి పొక్లెయిన్ కనిపించకపోవడంతో డ్రై వర్ తీసుకువెళ్లి ఉంటాడని భావించాడు. అంతలోనే డ్రైవర్ రావడం పొక్లెయిన్ను తాను తీసుకపోలేదని వెల్లడించడంతో చోరీకి గురైనట్లు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో పొక్లెయిన్ని దొంగలు వేల్పూర్ మండలం పడగల్ క్రాస్రోడ్డు వద్ద పొదల్లో నిలిపి ఉంచగా, స్థానికులు గమనించి వాహన యజమానికి సమాచారం ఇచ్చారు. దీంతో పొక్లెయిన్ను వారు స్వాధీ నం చేసుకున్నారు. నిందితులను గుర్తించడానికి పో లీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. -
వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి
బాల్కొండ: మెండోరా మండలం బుస్సాపూర్–పోచంపాడ్ గ్రామాల మధ్యగల జాతీయ రహదారి 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరా లు ఇలా.. ౖభైంసా మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన జాదవ్ గజారం(32) మూడేళ్ల క్రితం కూలీ పనుల కోసం మెండోరా మండల కేంద్రానికి వచ్చాడు. ఈక్రమంలో శనివారం ఉదయం బుస్సాపూర్ నుంచి పోచంపాడ్ వైపు జాతీయ రహదారి 44పై నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం వచ్చి అతడిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో అతడి తలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు మెండోరా ఎస్సై నారాయణ పేర్కొన్నారు. అనుమానాస్పద స్థితిలో ఒకరు.. వేల్పూర్: మండలంలోని పచ్చలనడ్కుడ గ్రామంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఎస్సై సంజీవ్ తెలిపిన వివరాలు ఇలా.. మహారాష్ట్రకు చెందిన శంకర్(32) కూలీ పని కోసం కొన్ని నెలల పచ్చలనడ్కుడకి వచ్చాడు. మహారాష్ట్రకు చెందిన బాలాజీ అనే వ్యక్తితో కలిసి ఒకే గదిలో నివాసముంటూ గ్రామంలో కూలీ పనులు చేసేవారు. గురువారం రాత్రి ఇద్దరు గొడవ పడగా చుట్టుపక్కల వారు సర్ధిచెప్పారు. శనివారం ఉదయం వారి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు వచ్చి ఇంట్లో చూడగా శంకర్ మృతిచెంది ఉండడాన్ని గుర్తించారు. మరో వ్యక్తి బాలాజీ లేకపోవడం, మృతుడి వివరాలు తెలిపేందుకు ఎవరూ లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం కోసం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్రెడ్డి సందర్శించారు. చేపల వేటకు వెళ్లి.. మోపాల్: మండలంలోని మంచిప్ప గ్రామంలో ఓ వ్యక్తి చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందాడు. ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపిన వివరాలు ఇలా.. మంచిప్ప గ్రామానికి చెందిన సుంకరి సాయిలు (55), దండ్ల శ్రీను శుక్రవారం సాయంత్రం గ్రామంలోని కొండెం చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. సాయిలు చెరువులోకి దిగగా, శ్రీను కట్టపై ఉన్నాడు. చెరువులోకి దిగిన సాయిలు బురదలో కూరుకుపోయి ఊపిరాడక మునిగిపోయాడు. విషయాన్ని శ్రీను కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సాయిలు కోసం గాలించగా, శనివారం మృతదేహం లభ్యమైంది. మృతుడి భార్య శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. సాగర్ కాలువలో పడి.. రుద్రూర్: మండలంలోని రాయకూర్ గ్రామంలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు సాగర్ కాలువలో పడి మృతిచెందాడు. ఎస్సై సాయన్న తెలిపిన వివరాలు ఇలా.. రాయకూర్ గ్రామానికి చెందిన మాగిరి సుభాష్ (40)కు గతంలో యాక్సిడెంట్ కావడం వల్ల కాలు విరిగి ఇంటి వద్ద ఉంటున్నాడు. ఈనెల 19న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన సుభాష్ తిరిగి రాలేదు. 21న రాత్రి సులేమాన్ నగర్ శివారులోని సాగర్ కాలువలో అతడి మృతదేహం లభ్యమైంది. సుభాష్ కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లగా, ఫిట్స్ రావడంతో ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెంది ఉంటాడని మృతుడి తండ్రి సాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
చలో హైదరాబాద్ను విజయవంతం చేయాలి
బాన్సువాడ : ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారానికి సోమవారం నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా గౌరవ అధ్యక్షులు రవీందర్ అన్నారు.ఆశవర్కర్ల సమస్యలపై అసెంబ్లీలో చర్చించి రూ.18 వేల వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర డిమాండ్లతో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఆశ వర్కర్లు లావణ్య, గంగమణి, అనురాధ, వరలక్ష్మి తదితరులు ఉన్నారు. బార్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం ఖలీల్వాడి: నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ శనివారం ప్రారంభమమైంది. ఎన్నిక అధికారు లు వెంకటేశ్వర్, ఆర్ఎస్ఎల్ గౌడ్ జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ ఎన్నికల కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించారు.మార్చి 26వరకు నామినేషన్ పత్రాలను స్వీకరిస్తామని చెప్పారు. -
మిల్లెట్స్ వ్యాపారం
● అవసరాలే వ్యాపార వనరులు ● ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న మహిళలుమిల్లెట్స్ వ్యాపారందుకాణం నిర్వహిస్తున్న యాస్మిన్ బేగంబీర్కూర్ మండల కేంద్రానికి చెందిన యాస్మిన్ బేగం కుటుంబానికి పిండి గి ర్నీ ఉంది. తోడుగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుని రాగులు, జొన్నలు తదితర మిల్లె ట్స్ వ్యాపారం మొదలుపెట్టింది. రోజుకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు వ్యాపా రం నడుస్తోంది. దీని ద్వారా రోజుకు రూ. 800 నుంచి రూ.900 సంపాదిస్తున్నారు. నా లుగు చక్రాల రవాణా వాహనం కొనుగోలు చేశారు. సొంతంగా అటుకులు, పేలాలు, బ ఠానీలు, చుడువా అటుకులు తయారు చేస్తున్నారు. పేలాల రోస్టర్ మిషన్ తీసుకోవాలని భావిస్తున్నట్లు యాస్మిన్ బేగం తెలిపారు. -
బ్యాంగిల్ స్టోర్తో ఉపాధి
పాల్వంచ మండలం ఫరీదుపేటకు చెందిన యెంకోళ్ల మంజుల భర్తతో కలిసి కూరగాయలు సాగు చేయ డం ద్వారా కొంతకాలం ఉపాధి పొందారు. తర్వాత గ్రామంలో బ్యాంగిల్ స్టోర్ ఏర్పాటు చేశారు. దుస్తులు కుడుతున్నారు. ఆసక్తిగలవారికి దుస్తులు కుట్టడంతో శిక్షణ కూడా ఇస్తున్నారు. షాప్ ఏర్పాటు కోసం మహిళా సంఘం నుంచి రూ. 9 లక్షల అప్ప తీసుకున్నానని మంజుల తెలిపారు. వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుతో అప్పు తీరుస్తున్నామన్నారు. ఇంకా రూ. 2.46 లక్షల అప్పు ఉందన్నారు. వ్యాపారాన్ని మరింత వృద్ధి చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. -
బొందలగడ్డకు రైతుబంధు!
నిజాంసాగర్ : దశాబ్దాలుగా శ్మశానానికి ఉపయోగిస్తున్న అసైన్డ్, పరంపోగు భూములపై కొందరు కన్నేశారు. రికార్డులు మార్చి పట్టాలు పొందడమే కాకుండా ఏళ్లుగా రైతుబంధును తీసుకుంటూ లబ్ధి పొందుతున్నారు. మహమ్మద్నగర్ మండలంలోని తెల్గాపూర్ గ్రామశివారులో ఉన్న అసైన్డ్, పరంపోగు భూములను కొన్నేళ్ల క్రితం శ్మశానం, బొందల గడ్డకు కేటాయించారు. దీంతో అప్పటి నుంచి గ్రామంలో ఎవరైనా మరణిస్తే ఆ భూముల్లోనే సమాధి చేస్తున్నారు. గత ప్రభుత్వం కొత్త పట్టాదారు పాసుబుక్కులు జారీ చేయడంతో ఓ గ్రామ రెవెన్యూ అధికారి సహకారంతో రెండు కుటుంబాలు ఆ భూములను తమ పేరిట పట్టా చేయిచుకున్నాయి. 310 సర్వే నంబరుతోపాటు 310 /2, 312, 313, 315, 316, 317, 318 సర్వే నంబర్లల్లో ఉన్న దాదాపు 10 ఎకరాల భూములకు పట్టాలు పొందారు. ఆ భూములలో పెద్దపెద్ద బండరాళ్లు, భారీ వృక్షాలున్నాయి. 2018 సంవత్సరం నుంచి ఆ భూములకు రైతుబంధు అందుతోంది. భూకబ్జాపై ఆందోళనలు బొందలగడ్డ భూములను పట్టా చేయించుకోవడంతోపాటు రైతుబంధు చెల్లింపులపై గ్రామస్తులు ఆందోళనబాట పట్టారు. తెల్గాపూర్ వాసులంతా ఇటీవల మహమ్మద్నగర్ తహసీల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ విషయాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి దృష్టికి తీసుకువెళ్లారు. త్వరలోనే ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. రికార్డులు మార్చి పట్టాలు పొందిన వైనం చర్యలు తీసుకోవాలని కోరుతున్న తెల్గాపూర్వాసులు -
పరిశ్రమలు ఏర్పాటు చేయాలి
● అసెంబ్లీ సమావేశాల్లో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు నిజాంసాగర్: అత్యంత వెనకబడిన జుక్కల్ నియోజకవర్గంలో పరిశ్రమలు నెలకొల్పాల ని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఆయన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడారు. శ్రామిక శక్తిలో, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం ఎనలేనిదన్నారు. మహిళలకు వ్యా పార రంగంలో అవకాశాలు ఇవ్వాలని, పరిశ్రమలను ఏర్పాటు చేసి వారిని భాగస్వాములను చేయాలని కోరారు. నియోజకవర్గంలో నిజాంసాగర్ ప్రాజెక్టుతోపాటు 150 చెరువు లు ఉన్నాయని, ఫిష్ మార్కెటింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంద ని పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా సో యా పంట పండే జుక్కల్ నియోజకవర్గంలో సోయా, చిరుధాన్యాల ప్రాసెసింగ్ యూని ట్లు ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై పరి శ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు సానుకూలంగా స్పందించారు. ఫిష్ మార్కెటింగ్ సౌ కర్యంతోపాటు సోయా ఆధారిత పరిశ్రమ లు ఏర్పాటు చేయిస్తామని పేర్కొన్నారు. ‘మత్స్యకారులకు ఇన్సూరెన్స్ తప్పనిసరి’ నిజాంసాగర్: చేపల వేటపై ఆధారపడి జీవి స్తున్న మత్స్యకారులకు ఇన్సూరెన్స్ తప్పనిసరని ఆ శాఖ జిల్లా అధికారి శ్రీపతి పేర్కొన్నారు. శనివారం అచ్చంపేట మత్స్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మత్స్యకారుల సదస్సులో ఆయన మాట్లాడారు. చేప ల వేట సమయంలో సంభవిస్తున్న ప్రమాదాల్లో కార్మికులు మృత్యువాత పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు బీమా చేసుకోవాలన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి ఉద్దేశించిన ప్రధానమంత్రి మత్స్య సంపద పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం జలయజ్ఞం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎఫ్డీవో డోలిసింగ్, ఫీల్డ్మెన్ నవీన్, అత్తర్, సంపత్, ఎల్లేష్, జయరాం తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న ఎస్సెస్సీ పరీక్షలు కామారెడ్డి టౌన్: జిల్లాలో ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. శనివారం జరిగిన హిందీ పరీక్షకు 12,579 మంది విద్యార్థులకు గాను, 12,554 మంది హాజరయ్యారు. 25 మంది గైర్హాజరయ్యారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నామని డీఈవో రాజు తెలిపారు. వొకేషనల్ పరీక్షకు 60 మంది గైర్హాజరు కామారెడ్డి టౌన్: జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్మీడియట్ వొకేషనల్ పరీక్షకు 60 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఈ విషయాన్ని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. 1,123 మంది విద్యార్థులకుగాను 1,063 మందే పరీక్ష రాశారని పేర్కొన్నారు. 26న బల్దియా తైబజార్, మేకల సంత వేలం కామారెడ్డి టౌన్: మున్సిపాలిటీ పరిధిలోని తైబజార్, మేకల సంతకు సంబంధించి ఈ నెల 26న బహిరంగ వేలం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని బల్దియా కమిషనర్ రాజేందర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో 26న ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు వేలంలో పాల్గొనాలని, ఇతర వివరాలకు బల్దియా కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. దెబ్బతిన్న పంటల వివరాలు సేకరించాలి నిజామాబాద్ సిటీ: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలను సేకరించాలని రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులకు సూచించారు. యాసంగిలో సాగుచేస్తున్న పంటలు, అందులో వడగళ్ల వానకు దెబ్బతిన్న వాటి వివరాలు సేకరించాలని తెలిపా రు. సీఎం రేవంత్రెడ్డి కలెక్టర్లు, వ్యవసాయ అధికారులను అప్రమత్తం చేశారని పేర్కొన్నారు. వ్యవసాయ కమిషన్ రైతులకు అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. -
‘శవ రాజకీయాలు మానండి’
బాన్సువాడ: నియోజకవర్గంలో కొందరు శవ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్ విమర్శించారు. శనివారం ఆయన బాన్సువాడలో విలేకరులతో మాట్లాడారు. పోచారం శ్రీనివాస్రెడ్డికి వ్యతిరేకంగా కొందరు కాంగ్రెస్ నాయకులు నిజామాబాద్ కలెక్టర్ వద్ద ధర్నా చేయడాన్ని తప్పుపట్టారు. బీర్కూర్ మండలం దామరంచకు చెందిన కాంగ్రెస్ నాయకుడు ఇక్బాల్ అనారోగ్యంతో మరణిస్తే.. కొత్తగా కాంగ్రెస్లో చేరిన వారు ఇబ్బందులు పెట్టడంతోనే చనిపోయినట్లుగా చిత్రీకరించడాన్ని ఖండించారు. ఈజీఎస్ పనులు కాంగ్రెస్ కార్యకర్తలకే అప్పగిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ చైర్మన్లను పాత కాంగ్రెస్ నాయకులకే ఇచ్చామని గుర్తు చేశారు. ఎల్లారెడ్డి నుంచి వచ్చిన రవీందర్రెడ్డి, హైదరాబాద్లో ఉండే యలమంచలి శ్రీనివాస్రావు పార్టీకోసం పని చేయాలిగానీ ఇలాంటి రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. సమావేశంలో నాయకులు శంకర్, కాశీరాం, ఖాలేక్, మధుసూదన్రెడ్డి, అసద్, అప్రోజ్, సురేశ్గుప్తా, హన్మండ్లు, ఖమ్రొద్దీన్, ఎజాస్, రాజు, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వడగళ్ల వానతో పంట నష్టం
గాంధారి: మండలంలోని పలు గ్రామాల్లో శనివా రం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురసింది. తిప్పారం, తిప్పారం తండా, గొల్లాడి తండా, సోమారం తండా తదితర తండాల్లో వడగళ్లు పడ్డాయి. దీంతో కోతకొచ్చిన జొన్న, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. గొల్లాడి తండా శివారులో వందల ఎకరాల జొన్న పంటకు నష్టం జరిగింది. పంటల పరిశీలన సదాశివనగర్: మండల కేంద్రంతో పాటు అడ్లూర్ ఎల్లారెడ్డి, కుప్రియాల్, మర్కల్, తిర్మన్పల్లి, ధర్మారావ్పేట్లలో శుక్రవారం కురిసిన వర్షానికి దెబ్బతిన్న పంటలను వ్యవసాయ విస్తీర్ణాధికారులు పరిశీలించారు. మండలంలో 42 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ఏవో ప్రజాపతి తెలిపారు. భిక్కనూరు: అంతంపల్లి శివారులో శుక్రవారం కురిసిన వర్షానికి దెబ్బతిన్న పంటలను జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్ పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులతో మాట్లాడారు. ఆయన వెంట ఏడీఏ అపర్ణ, ఏఈవో లిఖిత్రెడ్డి, రైతులు ఉన్నారు. లక్ష్మీదేవునిపల్లి గ్రామానికి చెందిన సుభాన్రెడ్డికి చెందిన వందకుపైగా బొప్పాయి చెట్లు గాలిదుమారంతో నేలకూలాయి. రాజంపేట: రాజంపేట, ఆరేపల్లి, బసవన్నపల్లి, అరగొండ గ్రామాలలో వర్షంతో దెబ్బతిన్న మక్క, వరి పంటలను వ్యవసాయాధికారులు పరిశీలించారు. 26 ఎకరాలలో మొక్కజొన్న పంట నేలవాలిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏవో శ్రుతి, ఏఈవోలు శిల్ప, సవిత, బాలకిషన్ పాల్గొన్నారు. ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలో శుక్రవారం రాత్రి 9.3 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని రెవెన్యూ అధికారులు తెలిపారు. -
‘నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోండి’
కామారెడ్డి క్రైం: నిబంధనలు పాటించని స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా జడ్జి డాక్టర్ సీహెచ్వీఆర్ఆర్ వరప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ‘గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షా చట్టం’ అమలుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి వరప్రసాద్ మాట్లాడుతూ మాట్లాడుతూ స్కానింగ్ కేంద్రాల్లో రికార్డుల నిర్వహణ పకడ్బందీగా ఉండేలా చూడాలన్నారు. నిబంధనలు పక్కాగా అమలయ్యేలా పర్యవేక్షించాలని వైద్యాధికారులకు సూచించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు.. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న స్కానింగ్ కేంద్రాల పై చట్టపరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. స్కానింగ్ కేంద్రాలను తర చుగా వైద్య శాఖ అధికారులు తనిఖీ చేయాలన్నా రు. నిబంధనలు పాటించని కేంద్రాల గుర్తింపు ర ద్దు చేయాలని సూచించారు. రిజిస్ట్రేషన్ లేకుండా ఏవైనా ఆస్పత్రులను నిర్వహిస్తుంటే వెంటనే నోటీసులు జారీ చేయాలన్నారు. ఆర్ఎంపీలపై నిఘా పెంచాలన్నారు. అర్హత లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మందుల చీటీ లేకుండా మందులు ఇస్తు న్న మెడికల్ షాప్లపైన చర్యలు తీసుకోవాలన్నా రు. సమావేశంలో ఏఎస్పీ నరసింహారెడ్డి, డీఎంహెచ్వో చంద్రశేఖర్, ప్రోగ్రాం అధికారులు శిరీష, విద్య, ప్రభు కిరణ్, ఐఎంఏ కార్యదర్శి అరవింద్, అ ధికారులు వేణుగోపాల్, చలపతి పాల్గొన్నారు.‘ఎల్ఆర్ఎస్పై దృష్టి సారించాలి’ కామారెడ్డి క్రైం: ఎల్ఆర్ఎస్, ఇంటి పన్నుల వసూళ్లపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శనివారం కలెక్టరేట్లోని తన క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 31 లోగా ఇంటి పన్నుల వసూళ్లను వంద శాతం పూర్తి చేయాలన్నారు. ఎల్ఆర్ఎస్ ఫీజులు, ఇంటి పన్నుల వసూళ్ల కోసం నెలాఖరు వరకు సెలవు దినాలతో సహా ప్రతి రోజు కార్యాలయాలను తెరచి ఉంచాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారందరూ రెగ్యులరైజ్ చేసుకునేలా ఎల్ఆర్ఎస్పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో మూడు బల్దియాల కమిషనర్లు రాజేందర్రెడ్డి, హేమంత్ రాజు, మహేశ్, టీపీవోలు, ఆర్ఐలు పాల్గొన్నారు. -
తాగు నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలి
తాడ్వాయి(ఎల్లారెడ్డి) : గ్రామాలలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని డీపీవో మురళి అన్నారు. తాడ్వాయి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యదర్శుల ప్రత్యేక సమావేశానికి హాజరై ఆయన మాట్లాడారు. గ్రామాలలో అధికారులు పర్యటించి తాగునీటి సమస్యలను పరిష్కారించాలన్నారు. అలాగే ప్రతిగ్రామంలో 100శాతం ఇంటి పన్ను వసూలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో సయ్యద్ సాజీద్ అలీ, కార్యదర్శులు పాల్గొన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలి లింగంపేట(ఎల్లారెడ్డి): తాగునీటి కొరతను అధిగమించడానికి నీటిని పొదుపుగా వాడుకోవాలని ఎంపీవో మల్హారి సూచించారు. శుక్రవారం వాటర్ డే సందర్భంగా మండల కేంద్రంలోని వీధుల్లో కుళాయిల వద్ద గుంతలను పరిశీలించారు. కుళాయిలకు మోటార్లు ఏర్పాటు చేస్తే సీజ్ చేస్తామన్నారు. గ్రామ శివారులోని నర్సరీ, కంపోస్టు షెడ్డు, పరిశీలించారు. ఆయన వెంట కార్యదర్శి శ్రావణ్కుమార్, సిబ్బంది ఉన్నారు. నీటి చౌర్యానికి పాల్పడితే కేసులు నమోదు చేస్తాం లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని గ్రామీణ ప్రాంతాలు, తండాల్లో నీటి చౌర్యానికి పాల్పడితే పోలీసు కేసులు నమోదు చేయిస్తామని మండల మిషన్ భగీరథ ఏఈ విష్ణు, ఎంపీవో మల్హారి హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని సురాయిపల్లి ఎర్రోళ్ల తండా, జగదాంబ తండా, కొట్టాల్గడ్డ తండాలకు చెందిన పలువురు రైతులు మిషన్ భగీరథ పైపులైన్ గ్రిడ్కు అమర్చిన ఎయిర్ వాల్స్ నుంచి నీటి చౌర్యానికి పాల్పడుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయన్నారు. 100 శాతం ఇంటి పన్ను వసూలు చేయాలి డీపీవో మురళి -
సమస్యలు తెలుసుకోవడానికి పరిష్కార వేదిక
బిచ్కుంద(జుక్కల్) : విద్యుత్ వినియోగదారుల సమస్యలు తెలుసుకోవడానికి ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక చైర్మన్ (సీజీఆర్ఎఫ్) ఎరుకల నారాయణ అన్నారు. శుక్రవారం బిచ్కుంద సబ్స్టేషన్లో నిర్వహించిన సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వినియోగదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకొని వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు సేవలు అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదన్నారు. వినియోగదారుల ఇళ్లకు వెళ్లి రెండు రోజుల్లో సమస్య పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సభ్యులు సలంద్ర రామకృష్ణ, రాజాగౌడ్, కిషన్, డీఈ గంగాధర్, ఏడీఏ సంజీవ్ కుమార్, ఏఈ పవన్ కుమార్ పాల్గొన్నారు. -
ఉన్నత విద్యారంగంలో సమూల మార్పులు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభు త్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని, ఉన్నత చదువులు పూర్తి చేసిన విద్యార్థుల చేతికి సర్ట్టి ఫికెట్లు వస్తున్నాయి.. కానీ ఉద్యోగాలు రావడం లేదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం పేర్కొన్నారు. విద్యార్థులు చిన్న సమస్యలకే పిరికితనంతో చనిపోతున్నారని ఆ వేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ యూ నివర్సిటీలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన కీలకవక్తగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న తన సేవలను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన త ర్వాత సీఎం రేవంత్రెడ్డి తనకు చెప్పకుండానే ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్గా అవకాశం కల్పి ంచారని తెలిపారు. తెలంగాణ విద్యారంగాన్ని ఉన్న త స్థాయికి చేర్చాలని, నైపుణ్యం కలిగిన యువతను తీర్చిదిద్దాలనే సంకల్పంతో సీఎం ముందుకు సాగుతున్నారని అన్నారు. విద్యను అర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఒక ప్రణాళిక ప్రకారం సిలబస్ మార్పునకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇందు లో భాగంగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రతి కోర్సుకు ఇంటర్న్షిప్ తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి కోర్సు లో చేరే విద్యార్థులు చదువుతో పాటు ఇంటర్న్షిప్ లో పాల్గొనడం వల్ల ఉపాధి, ఉద్యోగావకాశాలు సాధించగలుగుతారని తెలిపా రు. అలాగే సివిల్ సర్వీస్ లో తెలంగాణ యువతకు తక్కువ అవకాశాలు వస్తున్నాయని, ఉత్తరాధి రాష్ట్రాల వారే సివిల్ సర్వెంట్లుగా మనపై పెత్తనం చెలాయిస్తున్నారని పేర్కొన్నారు. సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉండటం ఒక కారణమని గుర్తించి, దీనిపై కేంద్రంతో పోరాడి ప్రాంతీయ భాషల్లో సైతం ఇంటర్వూలు చేపట్టేలా చేశామన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ హానర్స్ సబ్జెక్టు ను తెలుగులో ప్రవేశపెట్టామని, ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు సివిల్ పరీక్షల్లో మెరుగ్గా రాణించే అవకాశం ఉంటుందన్నారు. అ లాగే మ్యాథ్స్ సబ్జెక్టులో పోటీ పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నలను విద్యార్థులకు నేర్పిస్తారని తెలిపారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లలో సమయాన్ని వృథా చేయవద్దని, చదువుపై దృష్టి సారించి ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. మారుమూల గ్రామం నుంచి వచ్చిన తాను విద్య వల్లనే నేడు ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ స్థాయికి చేరుకున్నట్లు పు రుషోత్తం తెలిపారు. ఇప్పటికీ తమ గ్రామస్తులు ఆర్టీసీ బస్సును చూడలేదన్నారు. పురుషోత్తం యా దాద్రి భువనగిరి జిల్లా బొమ్మర రామారం మండలం గందమల్ల గ్రామానికి చెందిన వారు. దేశాన్ని నడిపించేది అర్థశాస్త్రమే దేశాన్ని నడిపించేది అర్థశాస్త్రమేనని రాష్ట్ర ఉన్నత వి ద్యామండలి వైస్ చైర్మన్ పురుషోత్తం అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ అప్లయిడ్ ఎకనామిక్స్ విభాగాధిపతి పున్నయ్య అధ్యక్షతన శుక్రవారం క్యాంపస్ కా మర్స్ అండ్ మేనేజ్మెంట్ కాలేజ్ సెమినార్ హాల్లో ‘రాష్ట్ర బడ్జెట్పై విశ్లేషణ’ అనే అంశంపై సెమినార్ ని ర్వహించారు. ఈసందర్భంగా వీసీ యాదగిరిరావు, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ పురుషోత్తం, రిజి స్ట్రార్ యాదగిరి మాట్లాడారు. అనంతరం పురుషోత్తంను వీసీ, రిజిస్ట్రార్లు సత్కరించారు. ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్, సెమినార్ కన్వీనర్ పున్నయ్య, కోకన్వీనర్ సంపత్, అధ్యాపకులు రవీందర్రెడ్డి, పా త నాగరాజు, స్వప్న, శ్రీనివాస్, దత్తహరి ఉన్నారు. సర్టిఫికెట్స్ వస్తున్నాయి.. ఉద్యోగాలు రావడం లేదు.. ప్రణాళిక ప్రకారం సిలబస్ మార్పునకు శ్రీకారం ప్రతి కోర్సుకు ఇంటర్న్షిప్ తప్పనిసరి రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం -
కాపురానికి తీసుకెళ్లడం లేదని భార్య ఆందోళన
ఆటో–బైక్ ఢీ: పలువురికి తీవ్ర గాయాలు రామారెడ్డి: రామారెడ్డి శివారులో శుక్రవారం రాత్రి ఆటో–బైకు ఢీకొనడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కామారెడ్డి వైపు నుంచి రామారెడ్డి వచ్చే క్రమంలో వాహనాలు ఢీకొన్నట్లు సమాచారం. ప్రమాదంలో ఆటోలోని ఇద్దరు వ్యక్తులకు, బైక్పై ఉన్న దినేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అర్గుల్ గ్రామస్తులపై కేసు నమోదు జక్రాన్పల్లి: మండలంలోని అర్గుల్ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి శుక్రవారం తెలిపారు. అర్గుల్ గ్రామ శివారులోని తన భూమిలోకి కొందరు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి డ్యామేజ్ చేసినట్లు పాలెం గ్రామానికి చెందిన ఏలేటి రవీందర్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అర్గుల్ గ్రామస్తులు భాస్కర్రెడ్డి, అల్కన్న, శేఖ్పాషా, రాంరెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.లింగంపేట(ఎల్లారెడ్డి): ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తనను కాపురానికి తీసుకెళ్లడం లేదని ఓ భార్య ఆందోళన చేపట్టిన ఘటన లింగంపేట మండలం కోమట్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. కేశాయిపేట గ్రామానికి చెందిన నెల్లూరి భాగ్య, కోమట్పల్లి గ్రామానికి చెందిన చీటూరి రాకేష్ ప్రేమించుకొని, పెద్దలను ఎదిరించి 2023లో పెళ్లి చేసుకున్నారు. కొన్ని నెలలు హైదరాబాద్లో కాపురం చేయగా భాగ్య గర్భం దాల్చింది. ఈక్రమంలో ఆమెకు కడుపు నొప్పి రావడంతో భర్త కొన్ని మందులు ఇచ్చాడు. గత నెల 21న నొప్పి తీవ్రం కావడంతో వైద్య పరీక్షలు చేయించగా గర్భంలోని శిశువు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అప్పటినుంచి భార్యను రాకేష్ మానసికంగా వేధింపులు గురిచేస్తుండేవాడు. ఈక్రమంలో ఆమెను హైదరాబాద్ నుంచి కేశాయిపేటలోని తన ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టాడు. శుక్రవారం రాకేశ్ కోమట్పల్లికి వచ్చినట్లు తెలియడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె రాకేశ్ ఇంటికి వచ్చింది. దీంతో రాకేశ్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి పారిపోయాడు. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి వెళ్లనంటూ బాధితురాలు టెంట్ వేసుకొని ఆందోళనకు దిగింది. అధికారులు, గ్రామస్తులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతుంది. -
8.5 శాతానికి తగ్గిన ఎన్పీఏ
● డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి సుభాష్నగర్: ఎన్డీసీసీబీని రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిపేలా సిబ్బంది, పాలకవర్గ సభ్యులు, సొసైటీ చైర్మన్లు కృషి చేయాలని ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి అన్నారు. 2024– 25 ఆర్థిక సంవత్సరంలో 14 శాతం ఉన్న ఎన్పీఏ 8.5 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. నగరంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాల యంలో శుక్రవారం పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు వ్యా పార కార్యకలాపాలు రూ.1800 కోట్ల నుంచి రూ. 2100 కోట్లకు పెరిగిన సందర్భంగా చైర్మన్ కేక్ కట్ చేసి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చైర్మన్ రమేశ్రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరంలో ఎన్పీఏ తగ్గింపునకు సిబ్బంది చేసిన కృషి అభినందనీయమన్నారు. ఓటీఎస్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నల్ల చంద్రశేఖర్రెడ్డి, సీఈవో నాగభూషణం వందే, డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల్ల నిర్మాణం ప్రారంభించాలి బాన్సువాడ రూరల్: మండలంలోని నాగారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారు వెంటనే నిర్మాణాలు ప్రారంభించాలని ఎంపీడీవో బషీరుద్దీన్ సూచించారు. శుక్రవారం డీఎల్పీవో సత్యనారాయణరెడ్డితో కలిసి నాగారం గ్రామంలో లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. నాయకులు వెంకట్రాంరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు నవీన్గౌడ్, సృజన్రెడ్డి తదితరులు ఉన్నారు. -
మహిళాచట్టాలపై అవగాహన పెంచుకోవాలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మహిళాచట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా అడిషనల్ డీఆర్డీవో మురళీకృష్ణ సూచించారు. మండలకేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో శుక్రవారం మానవ అక్రమరవాణా నిరోధకతపై గ్రామసంఘం అధ్యక్షులతోపాటు వీవోఏలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ అక్రమరవాణాను నిరోధించడానికి, మహిళలను లైంగిక వేధింపుల నుంచి రక్షించేందుకు మహిళాసంఘాల సభ్యులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శాంత, ఏపీయం జగదీశ్, అకౌంటెంట్ రాజు తదితరులున్నారు. లింగంపేటలో.. లింగంపేట(ఎల్లారెడ్డి): మానవ అక్రమ రవాణ నేరం అని అడిషనల్ డీఆర్డీవో మురళీకృష్ణ వెల్లడించారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఆయా గ్రామాల గ్రామ సంఘాల అధ్యక్షుల సమావేశంలో మాట్లాడారు. మానవ అక్రమ రవాణా నిరోధానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. మండల సమాఖ్య అధ్యక్షురాలు సులోచన, సీసీలు మేహర్, గంగరాజు, రాజిరెడ్డి, నజీర్, శ్రావణ్, స్వప్న, అంజయ్య, మన్సూర్ఖాన్, ఆయా గ్రామాల గ్రామ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. అడిషనల్ డీఆర్డీవో మురళీకృష్ణ -
తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలి
కామారెడ్డి క్రైం: ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలతో నీటి సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్తో కలిసి కామారెడ్డి నియోజకవర్గంలో తాగునీటి సమస్యపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలు ఉత్పన్నం కాకముందే ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో అవసరం మేరకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. మిషన్ భగీరథ ద్వారా చేపడుతున్న పైప్ లైన్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మున్సిపల్ ఏరియాలో రోజుకు రెండు సార్లు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పట్టణంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన భూమిని గుర్తించాలన్నారు.సమావేశంలో భాగంగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, తాగునీటి అవసరాలకు అవసరమైన చర్యలు తీసుకోవాలనీ, జీపీల నిధులను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, మిషన్ భగీరథ, పంచాయతీ రాజ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ముందస్తు చర్యలు చేపట్టాలి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ -
మహిళల చైతన్యంతోనే మానవ అక్రమ రవాణా నిర్మూలన
కామారెడ్డి రూరల్: మానవ అక్రమ రవాణాపై గ్రామ సంఘం అధ్యక్షురాళ్లకు, వీవోఏలకు విశ్రాంత ఉద్యోగుల సంఘంలో శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా టీవీటీ రాజేందర్ మానవ అక్రమ రవాణా నిర్మూలన కోసం గ్రామాల్లో మహిళలు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. మహిళా చట్టాలు, లైంగిక, శ్రమ, అవయావాలు, దోపిడి తదితర అంశాలపై అవగాహన కల్పించి గ్రామీణ మహిళలను చైతన్యవంతులు చేయాలని సూచించారు. ఈ శిక్షణ అనంతరం గ్రామాల్లోని చిన్న సంఘాల సమావేశాలలో సభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో మానవ అభివృద్ధి విభాగం రమేష్బాబు, ఏపీఎం మోయిజ్, గ్రామ సంఘాల అధ్యక్షులు, వీవోఏలు, సీసీలు, విశ్వనాథ్, అంజాగౌడ్, స్వరూపరాణి, సంజీవులు, మండల సమాఖ్య సిబ్బంది లావణ్య, లత, సవిత, టీవోటీలు రాజేందర్, జగదీష్ కుమార్, శ్రీనివాస్, అన్నపూర్ణ, గీత, మహిళ సాధికారిత కేంద్ర ప్రతినిధులు శిరీష, శారద, సౌందర్య తదితరులు పాల్గొన్నారు.పల్లెదవాఖానాను పరిశీలించిన ఏఎస్పీభిక్కనూరు: మండలంలోని బస్వాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న పల్లె దవాఖానా వద్ద రెండు రోజుల క్రితం దినసరి కూలీ రాము మృతిచెందాడు. ఈ విషయమై ఏఎస్పీ చైతన్యారెడ్డి బస్వాపూర్ గ్రామానికి వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిర్మాణ పనులు జరుగుతున్నపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆమె వెంట ఎస్సై ఆంజనేయులు, సిబ్బంది ఉన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది కామారెడ్డి రూరల్: మహిళల ఆర్థిక అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా గ్రామీణాభివృద్ధ్ది అధికారి సురేందర్ అన్నారు. కామారెడ్డి మండల సమాఖ్య కార్యాలయంలో శుక్రవారం 11 మండలాలకు చెందిన వారిలో మండలానికి ఆరుగురి చొప్పున శిక్షణను ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల పాఠశాల ఏకరూప దుస్తుల తయారీ బాధ్యత ప్రభుత్వంమహిళలకు అప్పగించిందన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల యూనిఫామ్స్ కుట్టు మిషన్లను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగించిందని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్లో శిక్షణ ఇప్పించి ముందు యూనిఫామ్ కుట్టడం నేర్పించినట్లు తెలిపా రు. బల్క్ కటింగ్, ఖాజాలు, బటన్లు, కొలతలు ఏవిధంగా తీసుకోవాలనే దానిపై శిక్షణ ఇచ్చారు. ఈ సమావేశంలో డీపీఎం కె రమేష్ బాబు, ఏపీఎంలు రాజేందర్, మోయిజ్, టీవోటీలు, ఆజేశ్వరీ, సల్మా, 11 మండలాలకు చెందిన మహిళ సంఘ సభ్యులు పాల్గొన్నారు. -
సలహాలు, సూచనలు ఇవ్వండి
కామారెడ్డి క్రైం: ఓటరు జాబితా విషయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు సలహాలు, సూచనలు అందజేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా, ఎన్రోల్మెంట్, మార్పులు, చేర్పులు, ఓటర్ల తొలగింపులు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతేడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజక ర్గాల పరిధిలో ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం 58,501 దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిని పరిశీలించి వివిధ కారణాలతో 6,310 దరఖాస్తులను తిరస్కరించామన్నారు. 51,969 దరఖాస్తులను ఆమోదించామని, 222 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు. బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని పార్టీల ప్రతినిధులకు సూచించారు. ఆయా బూత్ల పరిధిలో జరిగే విషయాలను బూత్ స్థాయి ఏజెంట్లకు తెలియజేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ, తహసీల్దార్ జనార్దన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సరళ, డీటీ అనిల్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
కల్యాణ తలంబ్రాల వాల్పోస్టర్ల ఆవిష్కరణ
బాన్సువాడ : భద్రాది శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ తలంబ్రాల వాల్పోస్టర్లను శుక్రవారం బాన్సువాడ ఆర్టీసీ డిపోలో డీఎం సరితాదేవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీరామ నవమి పుర్కరించుకొని స్వామివారి కల్యాణ తలంబ్రాలను ఆర్టీసీ కార్గో హోం డెలివరీ చేస్తోందన్నారు. ఆర్టీసీ డిపో పరిధిలోని భక్తులు రూ.151 చెల్లిస్తే భద్రాది శ్రీ సీతారామచంద్ర స్వామి గోటి తలంబ్రాలతో పాటు రెండు ముత్యాల కల్యాణ తలంబ్రాలు ఇంటికి పంపిస్తామన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 9154298729ను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో డిపో సూపరింటెండెంట్ బసంత్, ఆర్ఎంఈ కాశిరాం, డీఎంఈ ఇర్పాన్ ఉన్నారు. -
అనాథలైన పిల్లలెందరో..
జీవితాలను అతలాకుతలం చేసిన కరోనా ● జిల్లాలో 341 మంది మృత్యువాత ● వేలాది మంది ఆస్పత్రులపాలు ● వైద్యం కోసం రూ. లక్షలు ఖర్చు ● ఇప్పటికీ కోలుకోని కుటుంబాలెన్నో.. ● జనతా కర్ఫ్యూకు ఐదేళ్లు కరోనా వైరస్ ఎన్నో జీవితాలను బలి తీసుకుంది. ఇంకెన్నో కుటుంబాలను కోలుకోలేని విధంగా చేసింది. జిల్లాలో వేలాది మంది కోవిడ్తో ఆస్పత్రుల పాలయ్యారు. కొందరు మృత్యువుతో పోరాడి తనువు చాలించారు. కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ విధించి శనివారంతో ఐదేళ్లవుతోంది. ఈ సందర్భంగా జిల్లాలో ఆనాటి పరిస్థితులపై కథనం..సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కరోనా వైరస్ అన్ని దేశాలను వణికించింది. మన దేశంలోనూ వైరస్ ప్రభా వం కనిపించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడికి అనేక చర్యలు తీసుకున్నాయి. మొదటగా 2020 మార్చి 22న దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విధించారు. ఏ ఒక్కరూ గ డప దాటొద్దని పిలుపునివ్వగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కో విడ్ను అదుపు చేయడానికి ప్రభు త్వం మరుసటి రోజు నుంచే లాక్డౌన్ విధించింది. ఎన్నడూ ఊహించని రీతిలో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. నెలల తరబడిగా లాక్డౌన్ కొనసాగడంతో జనజీవనం ఆగమైంది. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి. కోవిడ్ బారిన పడి వేలాది మంది ఆస్పత్రుల పాలయ్యారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఒక ఇంట్లో ఒకరికి కరోనా సోకిందంటే చాలు కుటుంబసభ్యులందరూ వైరస్ బారిన పడ్డారు. కొన్ని కుటుంబాల్లో ఇద్దరు, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 14,093 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 341 మంది మృత్యువాతపడ్డారు. అయితే ప్రైవేటు ఆస్పత్రులు, ఇంటి వద్ద చికిత్సలు పొందిన వారు, మృతిచెందినవారు అంతకన్నా రెట్టింపు సంఖ్యలో ఉంటారు. ఒక్కరితో మొదలై.. 2020 మార్చి 27న కామారెడ్డి పట్టణ పరిధిలోని దే వునిపల్లికి చెందిన ఓ వృద్ధుడు హైదరాబాద్ ఆస్ప త్రిలో చేరగా.. అతడికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులందరినీ హోం క్వా రంటైన్ చేశారు. చుట్టుపక్కల రోడ్లన్నింటినీ మూసివేసి కట్టడి చేశారు. ఆ ప్రాంతాన్ని సానిటైజ్ చేశారు. ఇరుగుపొరుగు నివసించే వారందరికీ పరీక్షలు చేశా రు. అదే సమయంలో ఢిల్లీకి వెళ్లొచ్చిన బాన్సువాడ, కామారెడ్డి, పిట్లం ప్రాంతాలకు చెందిన పలువురికి కరోనా నిర్ధారణ అయ్యింది. వారి ద్వారా వారి కు టుంబ సభ్యులకు కరోనా వ్యాపించింది. కోవిడ్ కట్ట డికి జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. వైద్యులు, వైద్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి బాధితులకు సేవలందించారు. అయినా ఏప్రి ల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో కరోనా వ్యాప్తి వేగంగా జ రిగింది. కాగా కోవిడ్తో ఆస్పత్రుల పాలై చికిత్సలు పొంది కోలు కున్న వారిలో చాలామంది ఇప్పటికీ ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. బంధాలను తెంచేసిన వైరస్ కరోనా సమయంలో ఎవరికి ఎవ రూ కాకుండాపోయారు. వైరస్ బా రిన పడి ఆస్పత్రిలో ఉన్న వారి వద్దకు కుటుంబ సభ్యులు కూడా వెళ్లి పరామర్శించే సాహసం చేయలేకపోయారు. కోవిడ్తో చ నిపోయిన వారి అంత్యక్రియల కు కూడా హాజరుకాలేని పరిస్థితులు ఎదురయ్యాయి. మున్సిపల్, పంచాయతీ కార్మికులు ట్రాక్టర్లలో శవాలను తీసుకువెళ్లి, పొక్లెయిన్లతో గుంతలు తవ్వించి ఖననం చేయాల్సి వచ్చింది. హైదరాబాద్ ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతూ చనిపోయిన వారి మృతదేహాలను అక్కడే దహనం చేయించారు. చివరి చూపునకూ కుటుంబ సభ్యులు నోచుకోలేకపోయారు. కొందరు మాత్రమే ధైర్యం చేసి రక్షణ చర్యలు తీసుకుని దూరం నుంచి ఆఖరు చూపు చూశారు. కరోనా కాలంలో సాధారణ మరణం సంభవించినా సరే కనీసం శవాన్ని మోయడానికి రక్త సంబంధీకులు కూడా రాలేదు.లారీలో తరలివెళ్తున్న వలసకూలీలు (ఫైల్)లాక్డౌన్ సమయంలో ఖాళీగా ఉన్న కామారెడ్డి బస్టాండ్ (ఫైల్)అప్పుల పాలు..జిల్లాలో కరోనా మహమ్మారి చాలా కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. కొన్ని కుటుంబాల్లో భార్య, భర్త ఇద్దరూ కరోనాతో చనిపోయారు. దీంతో వారి పిల్లలు అనాథలయ్యారు. మరికొన్ని కుటుంబాల్లో తల్లి లేదా తండ్రి చనిపోయారు. జిల్లాలో తల్లి, తండ్రి ఇద్దరినీ కోల్పోయిన పిల్లలు 17 మంది ఉండగా, తల్లి లేదా తండ్రిని కోల్పోయిన పిల్లలు 198 మంది ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పిల్లల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నాయి.కరో నా బారిన పడి ఆస్పత్రుల్లో చేరిన వారి వైద్యం కో సం రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది. కొందరికి రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షల దాకా ఖర్చయ్యాయి. పాల్వంచ మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు కరోనా బారిన పడగా వైద్యానికి రూ. 16 లక్షల వరకు ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో అతడి కుటుంబం దిక్కులేనిదయ్యింది. ఇదే సమయంలో వైద్యం కోసం చేసిన అప్పులు తీర్చేందుకు ఆ కుటుంబం ఆస్తులు అమ్మాల్సి వచ్చింది. చాలామంది కరోనా వైద్యానికి చేసిన అప్పుల నుంచి తేరుకోలేకపోయారు. -
ఎస్సెస్సీ పరీక్షలు ప్రారంభం
కామారెడ్డి టౌన్: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్ష లు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కావడంతో పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులతో సందడి నెలకొంది. స మయానికి ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకున్నారు. సిబ్బంది వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. జిల్లావ్యాప్తంగా 64 కేంద్రా ల్లో 12,579 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 12,552 మంది పరీక్ష రాశారు. 27 మంది గైర్హాజరయ్యారు. డీఈవో రాజు పరీక్షలను పర్యవేక్షించారు. పట్టణంలోని గౌతమ్ మోడల్ ఉన్నత పా ఠశాల కేంద్రాన్ని కలెక్టర్ అశీష్ సంగ్వాన్ తనిఖీ చేశా రు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా చర్యలు తీసుకోవా లని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట కామారెడ్డి తహసీల్దార్ జనార్దన్ ఉన్నారు. పరీక్ష కేంద్రం తనిఖీ కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ రాజేశ్ చంద్ర శుక్రవారం పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు చేపట్టాలన్నారు. ఏఎస్పీ చైతన్యరెడ్డి, పట్టణ ఎస్హెచ్వో చంద్రశేఖర్రెడ్డి, ఎస్బీ సీఐ తిరుపయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
‘మహిళలు చట్టాలపై అవగాహన కలిగిఉండాలి’
కామారెడ్డి టౌన్ : మహిళలు చట్టాలు, హ క్కులపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి టి.నాగరాణి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇంస్లాపురా కాలనీలో కేఆర్కే సన్షైన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయమూర్తి మాట్లా డుతూ అడపిల్లలపై వివక్ష చూపవద్దన్నారు. మహిళా చట్టాలు, హక్కులపై అవగాహన క ల్పించారు. న్యాయపరమైన సమస్యలుంటే టోల్ ఫ్రీ నంబర్ (15100)కు కాల్ చేయాల ని సూచించారు. చిన్నపాటి సమస్యలుంటే కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లో పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషాలిటీ వైద్య సేవలు కామారెడ్డి టౌన్ : జిల్లాలోని వైద్య విధాన ప రిషత్ పరిధిలోగల ప్రభుత్వ ఆస్పత్రులలో స్పెషలిస్టు వైద్యుల సేవలు అందుబాటులో ఉన్నాయని డీసీహెచ్ఎస్ విజయలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 18 న ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చే శామని తెలిపారు. జిల్లా ఆస్పత్రితో పాటు బాన్సువాడ, దోమకొండ, మద్నూర్, ఎల్లారె డ్డి ఏరియా ఆస్పత్రులలో గైనకాలజిస్ట్, అనస్తిషియాలజిస్ట్, ఆర్థోపెడిక్, రేడియాలాజిస్ట్, ఈఎన్టీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు 24 గంట ల పాటు అందుబాటులో ఉంటారన్నారు. ప్రజలు సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ‘మక్కిన తర్వాతే పంట కోయాలి’ బాన్సువాడ : ధాన్యం గింజలు మక్కిన త ర్వాతనే పంటను కోయాలని డీఏవో తిరుమ ల ప్రసాద్ సూచించారు. శుక్రవారం బాన్సువాడ వ్యవసాయ శాఖ కార్యాలయంలో వరికోత యంత్రాల యజమానులు, ఏజెంట్లు, డ్రైవర్లకు వరి కోతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వం అందించే బోనస్ కు ఏ రకం ధాన్యం వర్తిస్తుందో వివరించా రు. యంత్రం ద్వారా ధాన్యం గింజల పొడ వు, వెడల్పుల కొలతలు తీసుకునే విధానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ విజేందర్, సి విల్ సప్లయ్ అధికారి మల్లికార్జున్బాబు, జి ల్లా వ్యవసాయ సంచాలకులు అరుణ, బా న్సువాడ ఏడీఏ లక్ష్మీప్రసన్న, సహకార సంఘం అధ్యక్షులు కృష్ణారెడ్డి పాల్గొన్నారు. 24న కాంగ్రెస్ పార్టీ సమావేశం కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని శుభం కన్వెన్షన్ హాల్లో ఈనెల 24వ తేది మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ పార్టీ జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్రావు తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్, ఎమ్మెల్యేలు పోచారం, మదన్ మోహన్రావు, లక్ష్మీకాంతారావు హాజరయ్యే సమావేశాన్ని పార్టీ నేతలు విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు పండ్ల రాజు, గూడెం శ్రీనివాస్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్, రాజాగౌడ్, శ్రీనివాస్ యాదవ్, అశోక్రెడ్డి, మోహన్రెడ్డి, లక్ష్మణ్, కిషన్రావు, కన్నయ్య, సందీప్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్రావు -
తై బజార్ రేట్లు తగ్గించాలని వినతి
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని వ్యాపారులు గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయానికి తరలివచ్చి ప్రత్యేకాధికారి రాణికి తై బజార్ రేట్లు తగ్గించాలని వినతి పత్రం అందించారు. గ్రామ పంచాయతీ పరిధిలో కురగాయలు, పండ్ల దుకాణాలు ఇతర చిరు వ్యాపారులకు తై బజార్ తగ్గించాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో వెంకటనర్సయ్య, పంచాయతీ కార్యదర్శి సందీప్, వ్యాపార సంఘం ఉపాధ్యక్షుడు ఉడుతావార్ సురేష్, పండరి, కార్యదర్శి రచ్చ కుషాల్, కోశాధికారి సంతోష్ వ్యాస్, వ్యాపారులు బండి దత్తు తదితరులున్నారు. క్యూరియాసిటీ సైన్స్ కిట్పై కార్యశాల కామారెడ్డి రూరల్ : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్ కేజీబీవీ పాఠశాలలో సీసీఎల్(సెంటర్ ఫర్ క్రియేటివ్ లర్నింగ్) ఐఐటీ గాంధీనగర్ గుజరాత్ నుంచి పంపిన క్యూరియాసిటీ సైన్స్ కిట్ వర్క్షాప్ను జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి వేణుశర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో సీడి విజిల్, యాంటి గ్రావిటీ టన్నెల్, భౌతిక రసాయన శాస్త్రంలోని వివిధ అంశాలపై రిసోర్స్ పర్సన్లు ప్రవీణ్కుమార్, టి శ్రీనివాస్, ఎన్ శ్రీనివాస్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 20 కేజీబీవీ పాఠశాలలోని భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్లు తదితరులు పాల్గొన్నారు. -
సబ్స్టేషన్లో మంటలు
మాచారెడ్డి : పాల్వంచ మండలం ఫరీద్పేట గ్రామంలోని 33/11 కేవీ సబ్స్టేషన్లో గురువారం మంటలు చెలరేగాయి. వెంటనే తేరుకున్న సిబ్బంది సరఫరాను నిలిపివేసి మంటలను ఆర్పారు. ఎండవేడిమికి కెపాసిటర్లు కాలిపోవడంతో మంటలు అంటుకున్నట్లు విద్యుత్ సిబ్బంది తెలిపారు. అనంతరం కెపాసిటర్కు మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఫైనాన్స్ కార్యాలయానికి నిప్పు లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో జక్సాని శ్రీహరికి చెందిన ఫైనాన్స్ కార్యాలయ తలుపులకు బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. గమనించిన స్థానికులు యజమానికి సమాచారం అందించి మంటలను ఆర్పివేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. కాగా, ఇదే కాలనీలో గతంలో ఓ ఇంట్లో బంగారు ఆభరణాలు అపహరించి దుండగులు బట్టలకు నిప్పు పెట్టి పారిపోయారు. మరోసారి అదేవిధంగా జరగడంతో కాలనీవాసులు భయాందోళన చెందుతున్నారు. కిరాణా దుకాణం దగ్ధం మాక్లూర్: మండలంలోని మదన్పల్లి గ్రామంలో గురువారం తెల్లవారుజామున ఓ కిరాణా దుకాణం కాలిబూడిదైంది. మ దన్పల్లికి చెందిన అమ్ముల నాగరాజు జీవనోపాధి కోసం నెల రోజుల క్రితం గ్రామంలో ఓ మడిగెను అద్దెకు తీసుకొని కిరాణా దుకాణం నడుపుతున్నాడు. గురువారం దుకాణం పూర్తిగా దగ్ధం కాగా, అందులో ఉన్న సుమారు రూ.2 లక్షల విలువజేసే సరుకులు కాలిబూడిదయ్యాయి. విద్యుదాఘాతంతో జరిగిందా? ఎవరైనా నిప్పు పెట్టారా? అనేది తెలియడం లేదని బాధితుడు పేర్కొన్నాడు. ఈ విషయమై తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేశామని నాగరాజు తెలిపారు. -
పోలీసుల పేరిట డబ్బులు వసూలు.. యువకుడి అరెస్టు
రెంజల్(బోధన్): టాస్క్ఫోర్స్ పోలీసునంటూ ఓ వ్యక్తిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన యువకుడిని గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు రెంజల్ ఎస్సై సాయన్న తెలిపారు. ఈ నెల 17న నిజామాబాద్కు చెందిన రఫీక్ అనే వ్యక్తి తన ఆటోలో ధర్మాబాద్కు నూకలు, బియ్యం తరలిస్తు న్నాడు. రెంజల్ మండలం కందకుర్తి బ్రిడ్జి వద్ద అదే గ్రామానికి చెందిన తానాజీ సతీశ్ తాను టాస్క్ ఫోర్స్ పోలీసునంటూ ఆటోను ఆపాడు. రఫీక్ను బెదిరించి తనకు డబ్బులు ఇవ్వకపోతే ఆటోను సీజ్ చేస్తాననడంతో బాధితుడు రూ. 3 వేలు ఫోన్ పే చే శాడు. ప్రతినెలా రూ. 5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా రఫీక్ అంగీకరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. చివరికి అనుమానం వచ్చి డయల్ 100కు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు డ బ్బులు వసూలు చేసిన సతీశ్ ఓ యూట్యూబ్ చానల్లో విలేకరిగా పనిచేస్తున్నట్లు గుర్తించి రిమాండ్కు తరలించారు. భిక్కనూరులో ఇద్దరిపై కేసుభిక్కనూరు: విలేకరుల ముసుగులో డబ్బులు డి మాండ్ చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎ స్సై ఆంజనేయులు తెలిపారు. మండల కేంద్రానికి చెందిన లింగాల నవీన్ గౌడ్, అర్జున్ విలేకరులమంటూ డబ్బులు డిమాండ్ చేశారని భిక్కనూరులోని సిద్ధిరామేశ్వర మోటార్ షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. -
మానవ అక్రమ రవాణాను అరికడదాం
కామారెడ్డి రూరల్: మానవ అక్రమ రవాణాను అరికడదామని మానవ అభివృద్ధి విభాగం డీపీఎం రమేష్బాబు అన్నారు. కామారెడ్డి మండల సమాఖ్య కార్యాలయంలో జిల్లాలోని 8 మండలాల ఐకేపీ ఏపీఎంలకు, సీసీలకు మానవ అక్రమ రవాణా అంశంపై గురువారం శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాలలు అక్రమ రవాణాకు గురవుతున్నట్లు గమనిస్తే డయల్ 100, చైల్డ్లైన్ 1098, ఉమెన్స్ హెల్ప్లైన్ 181 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. మానవ అక్రమ రవాణాపై మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాలకు చెందిన ఏపీఎంలు, సీసీలు, టీవోటీలు రాజేందర్, జగదీష్ కుమార్, శ్రీనివాస్, అన్నపూర్ణ, గీత తదితరులు పాల్గొన్నారు. ఒక రోజు శిక్షణ కార్యక్రమం నస్రుల్లాబాద్/దోమకొండ : మానవ అక్రమ రవాణా నిర్మూలనకు అందరూ కృషి చేయాలని దోమకొండ ఐకేపీ రాజు అన్నారు. దోమకొండ మండల సమాఖ్య కార్యాలయంలో, నస్రుల్లాబాద్ ఐకేపీ కార్యాలయంలో గురువారం గ్రామ సంఘాల కార్యకర్తలు, గ్రామ సంఘాల సభ్యులకు మానవ అక్రమ రవాణా నిరోధంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా దోమకొండ ఐకేపీ రాజు, నస్రుల్లాబాద్ ఏపీఎం గంగాధర్ మాట్లాడారు. ఈ శిక్షణా కార్యక్రమంలో సీసీలు రమేష్, రాజు, రవి, శ్రీనివాస్, సుజాత,నాగరాజ కుమారి,హన్మండ్లు, నస్రుల్లాబాద్ మహిళా సంఘం అధ్యక్షురాలు శోభారాణి, గ్రామ సంఘం కార్యకర్తలు, గ్రామ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మానవ అభివృద్ధి విభాగం డీపీఎం రమేష్బాబు -
ఆఫీసర్ లోపల.. బయట తాళం
● ఆర్అండ్బీ గెస్ట్హౌస్కు తాళం వేసిన మతిస్థిమితం లేని వ్యక్తి కామారెడ్డి టౌన్: ప్రభుత్వ అతిథి గృహంలో అధికారి విశ్రాంతి తీసుకుంటుండగా, మతిస్థితిమితం లేని వ్యక్తి బయట నుంచి తాళం వేసి వెళ్లిన ఘటన గురువారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కామారెడ్డి ఆర్అండ్బీ అతిథి గృహంలో బుధవారం రాత్రి విద్యుత్ శాఖకు సంబంధించిన ఒక అధికారి విశ్రాంతి తీసుకున్నారు. గెస్ట్హౌస్ సిబ్బంది వస్తే ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు లోపల నుంచి గొళ్లెం పెట్టకుండా తాళం సోఫాపై పెట్టి విశ్రాంతి తీసుకున్నారు. గురువారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు పైఅంతస్తులోకి వెళ్లగా అదే సమయంలో ఓ మతిస్థిమితం లేని వ్యక్తి నేరుగా గెస్ట్హౌస్ లోపలికి వచ్చి సోఫాపై ఉన్న తాళం తీసుకుని డోర్కు తాళం వేసి వెళ్లిపోయాడు. కాసేపటికి కిందికి వచ్చిన అధికారి.. డోర్కు బయటి నుంచి తాళం వేసి ఉండడంతో కంగుతిన్నాడు. సిబ్బందికి ఫోన్ చేయగా, సుమారు గంటపాటు శ్రమించి తాళం తీశారు. తాగునీటి కోసం తండ్లాట మాచారెడ్డి : మండలంలోని మైసమ్మచెరువు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న దుర్గమ్మగుడి తండాలో తాగునీటి కోసం తండ్లాడుతున్నారు. 25 కుటుంబాలు నివసిస్తున్న తండాలో ఉన్న ఒక్క బోరు వట్టిపోయింది. దీంతో ఆ తండా వాసులు కిలోమీటరు దూరంలో ఉన్న పంట చేల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. నిత్యం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కొందరు పంట చేలకు రానీయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తండాలో నెలకొన్ని నీటి ఎద్దడిని తీర్చాలని కోరారు. వాహనాల తనిఖీ కామారెడ్డి క్రైం: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్ బైపాస్ వద్ద దేవునిపల్లి పోలీసులు గురువారం విస్తృతంగా వాహనాల తనిఖీల చేపట్టారు. పాత ఫైన్లు వసూలు చేయడంతో పాటు వాహనదారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా దేవునిపల్లి ఎస్సై రాజు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్ బెల్టు తప్పనిసరిగా ధరించాలన్నారు. స్పీడ్గన్ ఉందనీ, నిర్ణీత వేగం దాటితే జరిమానాలు తప్పవన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి నిజాంసాగర్(జుక్కల్): సైబర్ నేరాలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై శివకుమా ర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో మహిళా సమాఖ్య సమావే శంలో ఆయన మాట్లాడారు. మానవ అభివృద్ధి విభాగంలో మానవ అక్రమ రవాణా, లైంగిక వ్యాపారం నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు దుడ్డె. అనిత, ఐకేపీ ఏపీఎం రాంనారాయణగౌడ్, ఐసీడీఎస్ సూపర్ వైజర్ రాజేశ్వరి తదితరులున్నారు. -
ఇసుక తరలిస్తున్న వాహనాల సీజ్
మాచారెడ్డి : పాల్వంచ మండల కేంద్రంలో అను మతి లేకుండా ఇసుక తరలిస్తున్న లారీ, రెండు ట్రా క్టర్లను మాచారెడ్డి పోలీసులు గురువారం సీజ్ చేశా రు. ఈ సందర్భంగా ఎస్సై అనిల్ మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మోపాల్లో పొక్లెయిన్, ట్రాక్టర్.. మోపాల్ : మండలంలోని బాడ్సి గ్రామ వాగులోంచి అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్న పొక్లెయిన్, ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్సై యాదగిరి గౌడ్ గురువారం తెలిపారు. బుధవారం అర్ధరాత్రి వాగులో ఇసుక తవ్వుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పట్టుకొని ఆరుగురిపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రుద్రూర్లో రెండు టిప్పర్లు.. రుద్రూర్: మండలంలోని లక్ష్మీపూర్ క్యాంపు శివారులో బుధవారం రాత్రి రెండు ఇసుక టిప్పర్లను పట్టుకున్నట్లు ఎస్సై సాయన్న తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో టిప్పర్లను పట్టుకొని కేసు నమోదు చేశామన్నారు. -
ప్రజలు రోడ్డెక్కకుండా చూడండి
కామారెడ్డి క్రైం: నీటి సమస్యలు పెరిగి ప్రజలు రోడ్ల పైకి రాకుండా ముందే అధికారులు సమస్యల పరిష్కారం కోసం ముందస్తు చర్యలు చేపట్టాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సూచించారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవోలు, ఎంపీడీవోలు, డివిజనల్ పంచాయతీ అధికారులతో సమావేశాన్ని గురువారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నీటి సమస్యలతో ప్రజలు రోడ్లెక్కకుండా చూడాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులపై ఉందన్నారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తూ ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. స్థానిక అవసరాలను బట్టి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. వచ్చే జూన్ వరకు నీటి సమస్యలు ఉండే అవకాశం ఉందన్నారు. గ్రామాల్లో ఉన్న ట్యాంకర్లను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఏవైనా మరమ్మత్తులు ఉంటే చేయించాలని సూచించారు. ట్యాంకర్లతో నీటి సరఫరా.. జిల్లా కేంద్రంలో ట్యాంకర్లతో నీటి సరఫరా చేయనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. సమావేశంలో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ, నియోజక వర్గం లోని 48 గ్రామాల్లో నీటి సమస్యల పరిష్కారాలకు రూ.53.36 లక్షల నిధులు కేటాయించామన్నారు. ఆనిధులతో ఆయా గ్రామాలలో పనులు చేపట్టి వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో 5 కొత్త ట్యాంకర్లను కొనుగోలు చేస్తున్నామని, మరో 3 పాత ట్యాంకర్లతో కలిపి అవసరం ఉన్న ప్రాంతాల్లో నీటి సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. అవసరమైతే మరో 4 ట్యాంకర్లు కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో ఏమైనా సమస్యలు వస్తే గ్రామ పంచాయతీ నిధుల నుంచి పనులు చేపట్టాలని, ఇతర నిధులను సైతం సమకూరుస్తామని కలెక్టర్ తెలిపారు. ఎక్కడైనా తాగు నీటి ఇబ్బందులు ఏర్పడితే వెంటనే అవసరమైన పనులకు ప్రతిపాదనలు సమర్పించాలని మిషన్ భగీరథ, జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఎంపీడీవోలు, మండల పరిషత్ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి నీటి సమస్యలు రాకుండా చూడాలన్నారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద మంజూరు చేసిన సీసీ రోడ్ల పనులు ఈ నెలాఖరు లోగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ రమేష్, డీపీవో మురళి, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, ఎంపీడీవోలు, డీపీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. హాజరైన అధికారులు నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోండి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యేను కలిసిన పట్టణ అభివృద్ధి సంఘం సభ్యులు కామారెడ్డి టౌన్: పట్టణ అభివృద్ధి సంఘం, ఉగాది ఉత్సవ సమితి సభ్యులు గురువారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని కలిశారు. ఉగాది ఉత్సవాలకు హజరుకావాలని ఆహ్వానించారు. అలాగే వీక్లీమార్కెట్లో ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.కార్యక్రమంలో సభ్యులు ముదాం శ్రీనివాస్, బొజ్జ రవీందర్, స్వామి, బాల్రాజు, శ్రీనివాస్, నరేష్రెడ్డి తదితరులున్నారు. -
జుక్కల్ నియోజకవర్గానికి కోట్ల నిధులు
బిచ్కుంద/పిట్లం/నిజాంసాగర్ (జుక్కల్): అన్ని రంగాల్లో వెనకబడి ఉన్న జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్ల నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. గురువారం బిచ్కుందలో సీసీ రోడ్లు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఆర్ధిక సంవత్సరానికి సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం కోసం రూ.18 కోట్లు తెచ్చానన్నారు. బిచ్కుంద మండలానికి రూ.4 కోట్లు నిధులతో పనులు చేపడుతున్నామన్నారు. గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు పనులు కొనసాగుతున్నాయన్నారు. పిట్లం మండల పరిషత్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ సౌజన్యంతో ఎస్సీ నిరుద్యోగ మహిళలకు కుట్టు మిషన్లను ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు పంపిణీ చేశారు. మండలంలోని హస్నాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి, పిట్లం మండలంలోని ఎంఎం కాలనీలో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా ఉంటూ ప్రోత్సహిస్తుందన్నారు. జుక్కల్ క్యాంపు కార్యాలయంలో అన్ని మండలాల, అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాజీవ్ యువ వికాసం రుణాలు ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు బాధ్యత వహించాలన్నారు. రాజీవ్ యువ వికాసం రుణాలపై జోరుగా ప్రచారం చేయాలన్నారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జుక్కల్ మండలంలోని దోస్త్ పల్లి, కేంరాజ్ కల్లాలి, వజ్రఖండి,ఖండేబల్లూర్, సవర్గావ్,దోస్తపల్లి,పెద్ద ఎడిగి, చండేగావ్ గ్రామాలకి చెందిన బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో పిట్లం,బిచ్కుంద మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పలు చోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం -
సంక్షేమ పథకాలలో అధిక భాగం మహిళలకే
ఎల్లారెడ్డి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో అధిక భాగం మహిళలకే కేటాయించిందని ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట మండలాల మహిళా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళలకు వ్యాపార రంగాలలో రాణించేందుకు స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందిస్తుందన్నారు. మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి తనహయాంలో జరిగిందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రజిత, ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట మండలాల మహిళా అధ్యక్షురాల్లు వాసవి, స్వరూప, జిల్లా మహిళా కార్యదర్శి అరుణ, మండల పార్టీల అధ్యక్షులు సాయిబాబా, నారాగౌడ్, శ్రీధర్గౌడ్, ఎల్లారెడ్డి పట్టణ అధ్యక్షులు వినోద్గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్లు కుడుముల సత్యనారాయణ, పద్మశ్రీకాంత్, సామెల్, వెంకట్రాంరెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ ప్రశాంత్గౌడ్ తదితరులున్నారు. భవన నిర్మాణ కార్మికుల భవనం ప్రారంభం.. పట్టణంలో భవన నిర్మాణ కార్మికుల భవనాన్ని ఎమ్మెల్యే మదన్మోహన్రావు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అందిస్తున్నదన్నారు. కార్యక్రమంలో సాయిబాబా, లక్ష్మణ్ తదితరులున్నారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్లను ఎమ్మెల్యే మదన్మోహన్రావు ప్రారంభించారు. పట్టణంలో సెంట్రల్ లైటింగ్ స్తంభాలకు నూతనంగా ఎల్ఈడీ లైట్లను అమర్చారు. ఎల్ఈడీ లైట్లతో వెలుగులు విరజిమ్ముతాయని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలి ఎమ్మెల్యే మదన్మోహన్రావు -
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి
రామారెడ్డి : విశ్వహిందూ పరిషత్ కామారెడ్డి సేవ విభాగం ఆధ్వర్యంలో రామారెడ్డి గ్రామంలో కుట్టు మిషన్లో శిక్షణ పొందిన 30 మహిళలకు గురువారం భాగ్యనగర క్షేత్ర సంఘటన మంత్రి గుమ్మల సత్యం సర్టిఫికెట్లను అందజేశారు. ఈసందర్భంగా గుమ్మల సత్యం మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. భవిష్యత్తులో మాతృమూర్తుల కోసం వివిధ రకాల శిక్షణలను రామారెడ్డి కేంద్రంగా నిర్వహిస్తామన్నారు. అఖిల భారతీయ జనహిత సేవ ట్రస్ట్ ప్రముఖ్ ఉమాదేవి, ప్రాంత సేవా ప్రముఖ్ రాజేందర్, జిల్లా అధ్యక్షులు నిత్యానందం, ఉపాధ్యక్షులు గంగారెడ్డి, జిల్లా కార్యదర్శి బొల్లి రాజు, సహకార్యదర్శి దరి, జిల్లా సేవా ప్రముఖ్ అజయ్, దుర్గా వాహిని జిల్లా సహసంయోజిక భవాని, విశ్వహిందూ పరిషత్ రామారెడ్డి ప్రఖండ అధ్యక్షులు, తదితరులున్నారు. -
నేటినుంచి పదో తరగతి పరీక్షలు
రాజంపేట సెంటర్లో హాల్టికెట్ నంబర్లు వేస్తున్న సిబ్బందినిజాంసాగర్/కామారెడ్డి టౌన్ : జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. శుక్రవారం ప్రారంభమయ్యే పరీక్షలు వచ్చేనెల 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. జిల్లాలో 12,579 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో బాలురు 6,127 మంది, బాలికలు 6,452 మంది ఉన్నారు. వీరికోసం 64 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అధికారులు ఇప్పటికే పరీక్ష కేంద్రాలలో అవసరమైన వసతులు కల్పించారు. -
దూసుకొచ్చిన మృత్యువు
కామారెడ్డి క్రైం/గాంధారి : తెల్లవారుజామున గాంధారి నడిబొడ్డున అదుపుతప్పిన ఓ కారు బీభత్సం సృష్టించింది. బీట్ విధులు నిర్వహిస్తున్న పోలీసులపైకి మృత్యువు రూపంలో దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ అక్కడికక్కడే మరణించగా మరొకరు గాయాలతో బయటపడ్డారు. గురువారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో జరిగిన వివరాలిలా ఉన్నాయి. గాంధారి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు వడ్ల రవికుమార్ (35) సుభాష్ గురువారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో హనుమాన్ టిఫిన్ సెంటర్ ఎదురుగా బీట్ డ్యూటీ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో కామారెడ్డి వైపు నుంచి బాన్సువాడ వైపు వెళ్తున్న ఓ కారు అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చి బీభత్సం సృష్టించింది. కారు ఢీకొనడంతో రవికుమార్ అక్కడికక్కడే మరణించాడు. కారు ప్రమాదకరంగా రావడాన్ని సెకండ్ల వ్యవధిలో గమనించిన మరో కానిస్టేబుల్ సుభాష్ వేగంగా పక్కకు దూకడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కారు నడుపుతూ ప్రమాదానికి కారణమైన సన్నిత్కు సైతం గాయాలు కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడిని స్థానిక ఆర్ఎంపీ కుమారుడిగా గుర్తించారు. వాహనం నడుపుతున్న సమయంలో మద్యం మత్తులో ఉండవచ్చని భావిస్తున్నారు. కాగా కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో సమీపంలోని దుకాణాల సామగ్రి, బోర్డులు, మెట్లకు ఉండే రెయిలింగ్ చిందరవందర అయ్యాయి. ఎస్సై ఆంజనేయులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. కానిస్టేబుల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు.మిన్నంటిన రోదనలు.. తాడ్వాయి మండలం దేమె గ్రామానికి చెందిన కానిస్టేబుల్ రవికుమార్ కుటుంబం కొంతకాలం క్రితం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో స్థిరపడింది. 2007 బ్యాచ్కు చెందిన రవి కుమార్.. జిల్లా పోలీసు కార్యాలయంలోని స్పెషల్ బ్రాంచ్ విభాగంలో విధులు నిర్వహించి ఇటీవలే గాంధారికి బదిలీ అయ్యాడు. మృతుడికి భార్య సౌఖ్య, కూతుళ్లు రసజ్ఞ, రవిజ్ఞ, కుమారుడు రితేష్ చంద్ర ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కయిన రవికుమార్ అకాల మరణం అతని కుటుబంలో తీరని విషాదాన్ని నింపింది. పోస్టుమార్టం నిర్వహించే జనరల్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు, బంధువులు భారీగా తరలివచ్చారు. పోస్టుమార్టం అనంతరం కానిస్టేబుల్ రవి కుమార్ అంత్యక్రియలను పోలీసు లాంఛనాలతో దేవునిపల్లిలో నిర్వహించారు. అంత్యక్రియల్లో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్రావు, సీఐ సంతోష్ కుమార్, పలువురు ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటాంకానిస్టేబుల్ రవికుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని ఎస్పీ రాజేశ్ చంద్ర పేర్కొన్నారు. కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద రవికుమార్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విధుల్లో ఉన్న పోలీసులను ఢీకొన్న కారు ఓ కానిస్టేబుల్ మృతి, మరో కానిస్టేబుల్కు స్వల్ప గాయాలు గాంధారిలో వేకువజామున కలకలం రేపిన ఘటన -
మద్యం మత్తు.. యువత చిత్తు
● మందు, విందుల్లో మునిగి తేలుతున్న యువకులు ● డ్రంకెన్ డ్రైవ్తో రోడ్డు ప్రమాదాలు ● తాగి దారుణాలకు పాల్పడుతున్న పలువురు సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : సరదాగా అలవాటైన మద్యపానం.. వ్యసనంగా మారి జీవితాలను నాశనం చేస్తోంది. హత్యలు, అత్యాచారాలు, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మద్యం మత్తులోనే జరుగుతున్నాయి. నలుగురు స్నేహితులు కలిస్తే చాలు మందు కొనడం, ఎక్కడో ఒకచోట కూర్చుని జల్సా చేయడం అలవాటుగా మారింది. తాగిన మైకంలో కొందరు నేరాలకు పాల్పడుతున్నారు. మత్తులో తూలుతూనే బైకులు, కార్లు నడుపుతూ రోడ్లపై వెళ్లే వారిని ఇబ్బంది పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో తాగి వాహనాలు నడిపేవారి మూలంగా ఇతరులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. తమ జల్సాకు డబ్బులు లేకుంటే దొంగతనాలకూ పాల్పడుతున్నారు. మరికొందరు గంజాయి దందాలోనూ దిగుతున్నారు. ఇటీవల దేవునిపల్లి, భిక్కనూరు పోలీసు స్టేషన్ల పరిధిలో పోలీసులకు చిక్కిన గంజాయి ముఠాలో స్థానికంగా ఉన్న యువకులే మత్తుకు అలవాటు పడి గంజాయి దందాలో దిగినట్టు తేలింది. డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడుతున్నవారికి జరిమానాలు, జైలు శిక్షలు పడుతున్నా మార్పు రావడం లేదు. మత్తే కారణం... జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్లే జరుగుతున్నట్టు తెలుస్తోంది. గతేడాది జిల్లాలో 513 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 258 మంది మరణించగా 255 మంది గాయపడ్డారు. అన్ని రూట్లలో పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ, తాగి వాహనాలు నడిపేవారికి జరిమానాలు విధిస్తున్నా మార్పు రావడం లేదు. గతేడాది జిల్లాలో 38 హత్యలు జరిగాయి. ఇందులో చాలా వరకు మత్తులో ఆవేశంతో చేసినవే ఉన్నాయి. 60 వరకు రేప్ కేసులు నమోదయ్యాయి. మత్తులో ఏం చేస్తున్నామన్న విచక్షణ కోల్పోయినవారు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కొన్ని కేసుల్లో తోడబుట్టిన వాళ్లు, కన్నవాళ్లు, ఇతర రక్తసంబంధీకులు, బంధువులే నిందితులుగా ఉంటుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే సమయంలో వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరిగిన హత్యలన్నింటిలోనూ నిందితులు మత్తులో ఉన్నట్లు తేలుతోంది. ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనల్లోనూ మద్యం మత్తులో కుటుంబ సభ్యులతో గొడవలు పడి చేసుకుంటున్నవే ఎక్కువగా ఉంటున్నాయి. పెరిగిన గంజాయి సేవనం.. యువత మత్తు కోసం గంజాయికి అలవాటు పడుతోంది. చిన్నచిన్న పొట్లాల రూపంలో అందుబాటులోకి రావడంతో కొనుగోలు చేసి సిగరెట్లల్లో నింపేసి పీలుస్తున్నారు. ఒకసారి అలవాటు పడిన వాడు నిరంతరం అదే మత్తును కోరుకుంటున్నాడు. గంజాయికి అలవాటు పడినవారు కొందరు.. గంజాయి ఎక్కడ దొరుకుతుందో మూలాలు కనుక్కుని దందా నడుపుతున్నారు. ఇటీవల పోలీసులకు చిక్కిన ముఠాలన్నీ మత్తుకు అలవాటు పడి దందాలో దిగినట్టు వెల్లడైంది. బెల్ట్ షాప్లు, గంజాయి దందాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.విచ్చలవిడిగా అమ్మకాలు..జిల్లాలో తాగు నీరు దొరకని గ్రామాలున్నాయి గానీ మద్యం దొరకని ఊళ్లు లేవు. ఊరూరా బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. కొన్ని ఊళ్లలో వేలం పాటలు కూడా నిర్వహిస్తున్నారు. పట్టణాల్లో కూడా గల్లీగల్లీలో మద్యం అమ్మకాలు నడుస్తున్నాయి. అర్ధరాత్రి, అపరాత్రి కూడా మద్యం దొరుకుతోంది. కొన్ని గ్రామాల్లో అయితే ఫోన్ చేస్తే చాలు మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారు. మరొకొన్ని గ్రామాల్లో బెల్టు షాపులు ప్రత్యేకంగా షెడ్లు వేసి, అక్కడ కూర్చుని మద్యం సేవించేందుకు కుర్చీలు, టేబుళ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. -
సాధారణ కాన్పులు పెంచాలి
కామారెడ్డి క్రైం : ప్రభుత్వ ఆస్పత్రులలో సాధారణ కాన్పులకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్యులు, ఇతర సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు పెరగాలన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు నిర్వహిస్తూ జిల్లా జనరల్ ఆస్పత్రిలో రద్దీ తగ్గేలా చూడాలన్నారు. వడదెబ్బ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, మండలాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా సమయ పాలన పాటించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో చంద్రశేఖర్, ప్రోగ్రాం అధికారులు శిరీష, రాధిక, విద్య, ప్రభు కిరణ్, అనురాధ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
జీజీహెచ్లో దంపతుల హల్చల్
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పతిలో గురువారం ఓ జంట హల్చల్ చేసింది. వివరాలిలా ఉన్నాయి. తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన పులి స్వప్నకు 2022లో సిజేరియన్ ఆపరేషన్ అయ్యింది. అయితే వైద్యులు సరిగ్గా కుట్లు వేయకపోవడంతో ఆమె ఇబ్బందిపడింది. పలుమార్లు అనారోగ్యానికి గురికావడంతో 2023 నవంబర్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా ఆపరేషన్ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో తన భార్యకు ఆపరేషన్ చేసిన వైద్యులెవరనే సమాచారం కోసం ఆమె భర్త ప్రభాకర్ సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశాడు. అయితే 14 నెలలు గడుస్తున్నా ఆస్పత్రి సిబ్బంది సమాచారం ఇవ్వకపోవడంతో 20 రోజుల క్రితం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సమాచారం ఇవ్వకుండా ఆస్పత్రి సిబ్బంది ఇంకా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ గురువారం ఆ దంపతులు పురుగుల మందు డబ్బా తీసుకుని ఆస్పత్రిలోని కార్యాలయానికి వచ్చి ఆందోళన చేశారు. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ లక్ష్మణ్రావు దీనిని గమనించి వారి వద్దనుంచి పురుగుల మందు డబ్బాను లాక్కొని, వారిని సముదాయించారు. దీంతో భార్యాభర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ‘సమాచారం’ ఇవ్వడం లేదని ఆరోపణ పురుగుల మందు డబ్బాతో ఆందోళన -
నీరందక దిగుబడులపై ప్రభావం..
● జిల్లాలో 2.61 లక్షల ఎకరాల్లో వరి సాగు ● 5.63 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం ● 424 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం ● ఏర్పాట్లు చేస్తున్న జిల్లా యంత్రాంగం కామారెడ్డి క్రైం : యాసంగి సీజన్కు సంబంధించిన వరి ధాన్యం సేకరణకు వేళయ్యింది. ముందుగా నాట్లు వేసిన ప్రాంతాలలో వరి కోతలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ధాన్యం సేకరణకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. జిల్లావ్యాప్తంగా 424 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన అధికారులు.. ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో యాసంగి సీజన్లో 2,61,110 ఎకరా ల్లో వరి సాగయ్యింది. ఇందులో దొడ్డు రకం వరి ధా న్యాన్ని 2,03,665 ఎకరాల్లో, సన్నరకం 57,445 ఎకరాల్లో సాగు చేశారు. 4,88,796 మెట్రిక్ టన్నుల దొ డ్డు రకం, 1,32,121 మెట్రిక్ టన్నుల సన్నరకం ధా న్యం దిగుబడి వచ్చే అవకాశాలున్నాయని అధికా రులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద 6,10,917 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావ చ్చని భావిస్తున్నారు. ఇందులో నుంచి రైతుల ఇంటి అవసరాలకుపోను కొనుగోలు కేంద్రాలకు 5.63 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేసిన అధికారులు.. ఆ మేరకు ధాన్యాన్ని సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, తూకం యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, ఇతర సామగ్రితోపాటు మౌలిక సదుపాయాలను సమకూర్చే పనిలో ఉన్నారు. 1.40 కోట్ల గన్నీ సంచులు అవసరం ఉండగా ప్రస్తుతం 12.18 లక్షలు అందుబాటులో ఉన్నాయి. మిగతావి ఎప్పటికప్పుడు తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సింగిల్ విండోలు, ఐకేపీ ఆధ్వర్యంలో.. యాసంగి సీజన్కు సంబంధించిన ధాన్యం సేకరణ కు జిల్లాలో 424 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 397 కేంద్రాలను సింగిల్ విండో ఆధ్వర్యంలో, 27 కేంద్రాలను ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తారు. వీటిలో 63 కేంద్రాలలో కేవలం సన్న రకం ధాన్యం సేకరిస్తారు. గ్రేడ్– ఏ ర కం ధాన్యానికి క్వింటాలుకు రూ. 2,320, సాధారణ రకానికి రూ. 2,300 మద్దతు ధర చెల్లిస్తారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఇటీవల సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పై దిశానిర్దేశం చేశారు. త్వరలోనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని, అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని సూచించారు. ఏర్పాట్లు చేస్తున్నాం జిల్లాలో 5.63 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొ నుగోలు కేంద్రాలకు రావొ చ్చని అంచనాలు వేశాం. ఇందుకు అనుగుణంగా 424 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – రాజేందర్, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్, కామారెడ్డి యాసంగి సీజన్ ప్రారంభంలో భూగర్భ జలా లు సమృద్ధిగా ఉండడంతో రైతులు వరి సాగు కు ఆసక్తి చూపారు. దీంతో జిల్లావ్యాప్తంగా 2,61,110 ఎకరాల్లో వరి సాగయ్యింది. అయి తే ఎండలు ముదురుతుండడంతో కొద్ది రోజు లుగా భూగర్భ జలాలు పడిపోతున్నాయి. దీంతో బోరుబావులు ఎత్తిపోతుండడంతో సా గు నీటికి తిప్పలు తప్పడం లేదు. నిజాంసాగ ర్ ఆయకట్టు ప్రాంతమైన బాన్సువాడ రూర ల్ తదితర ప్రాంతాల్లోని చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీరందే పరిస్థితి లేకుండా పో యింది. నీరందక పంటలు ఎండుముఖం పడుతుండడంతో ఈసారి ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవచ్చని భావిస్తున్నారు. -
అడవిపంది దాడిలో వరి పంట ధ్వంసం
మాచారెడ్డి: పాల్వంచ మండలం ఫరిదిపేట శివారులో ఉన్న బండ రామేశ్వర్పల్లి గ్రామానికి చెందిన బక్కోళ్ల రాజుకు చెందిన వరి చేనులో బుధవారం వేకువ జామున అడవి పందులు చొరబడి పంటను ధ్వంసం చేశాయి. పంటను నష్టపోవడంతో తనను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కోరారు. ప్రొఫెసర్ కనకయ్యకు పురస్కారం తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ తెలుగు అధ్యయన శాఖ అధ్యాపకులు ఆచార్య గుండె డప్పు కనకయ్యకు తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ‘ఆచార్య మడుపు కులశేఖరరావు’ పురస్కారం ప్రదానం చేశారు. హైదరాబాద్లో బుధవారం రాత్రి జరిగిన ‘ధర్మనిధి సాహిత్య పురస్కారాల ప్రదానోత్సవం’ కార్యక్రమంలో ఆచార్య కనకయ్యకు పురస్కారం అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, సంస్థ ప్రతినిధులు, కవులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు. పన్ను చెల్లించని సీడ్స్ కంపెనీ సీజ్ ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న మారుతీ సీడ్స్ కంపెనీని కమిషనర్ రాజు ఆదేశాల మేరకు సీజ్ చేసినట్లు మున్సిపల్ మేనేజర్ హయ్యూమ్ తెలిపారు. రెండు సంవత్సరాలుగా సీడ్స్ కంపెనీ మున్సిపల్కు ఆస్తిపన్ను చెల్లించడం లేదని పేర్కొన్నారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో సీజ్ చేశామన్నారు. హనుమాన్ మందిరంలో చోరీసదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని ఉత్తునూర్ గ్రామ హనుమాన్ మందిరంలో మంగళవారం రాత్రి అదే గ్రామానికి చెందిన తూర్పు శ్రీకాంత్(28) చోరీకి పాల్పడ్డాడు. గుడిలోని హుండిని పగులగొట్టడంతో గ్రామస్తులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడ్డ శ్రీకాంత్ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువకుడు బుధవారం ఉదయం మృతి చెందాడు. మృతుడు గతంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని కత్తితో పొడిచి తీవ్రంగా గాయపర్చినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంజిత్ తెలిపారు. -
శిథిలావస్థలో వాటర్ ట్యాంక్
ఆశాల సమస్యలను పరిష్కరించాలికామారెడ్డి టౌన్: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు ఆశా కార్యకర్తలతో కలిసి బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెంకటిగౌడ్ మాట్లాడుతూ.. ఆశాలకు రూ. 18వేల ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. న్యాయమైన సమస్యలను చెప్పుకుందామంటే జిల్లాలో ఆశలను ఎక్కడికక్కడ, రాత్రి పూట అరెస్టు చేయడం సరికాదన్నారు. అనంతరం ధర్నా స్థలానికి వచ్చిన డీఎంహెచ్వో చంద్రశేఖర్కు వినతిపత్రం అందజేశారు. నాయకులు మెతిరాం నాయక్, కోత్త నర్సింలు, ముదాం అరుణ్, రాజశ్రీ, మమత, భాగ్యలక్ష్మి, లత తదితరులు పాల్గొన్నారు. ముందస్తు అరెస్టులు.. కామారెడ్డి టౌన్/తాడ్వాయి: కలెక్టరేట్ ధర్నా కార్యక్రమం నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ముందుస్తుగా కొందరు ఆశా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. స్థానిక పోలీసు స్టేషన్లకు తరలించారు. మరికొందరు జిల్లా కేంద్రానికి చేరుకుని ధర్నాలో పాల్గొన్నారు. -
మానసిక వికాసానికి క్రీడలు దోహదం
తెయూ(డిచ్పల్లి): విద్యార్థులు చదువుతోపాటు క్రీడా నైపుణ్యాలను అలవర్చుకోవాలని, మానసిక వికాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీ యాదగిరి రావు తెలిపారు. తెయూ క్యాంపస్ క్రీడామైదానంలో యాన్యువల్ డే స్పోర్ట్స్ మీట్ –2025ను బుధవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ జీవితంలో గెలుపు, ఓటములు సహజమని ఈ విషయాన్ని విద్యార్థులు క్రీడాపోటీల ద్వారా అలవర్చుకోవాలన్నారు. ఈ నెల 29వరకు పోటీలు జరుగుతాయన్నారు. వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, క్రికెట్, బ్యాడ్మింటన్ పోటీలను బాలికలకు, బాలురకు వేర్వేరుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధ్యాపకులకూ వాలీబాల్, క్రికెట్ పోటీలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్, పీఆర్వో ఏ పున్నయ్య, స్పోర్ట్స్ డైరెక్టర్ జీ బాలకిషన్, పీడీ బీఆర్నేత, కోచ్లు, పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు. వీసీ ప్రొఫెసర్ యాదగిరి రావు తెలంగాణ యూనివర్సిటీలో స్పోర్ట్స్ మీట్– 2025 ప్రారంభం -
ఓటరు నమోదులో తప్పులు ఉండొద్దు
మద్నూర్(జుక్కల్): నూతన ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల్లో తప్పులు లేకుండా సజావుగా చేయాలని జుక్కల్ నియోజికవర్గ ఓటరు నమోదు అధికారి, అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) శ్రీనివాస్రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో, ఎనిమిది మండలాల తహసీల్దార్లతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ లింక్ చేసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ఆయా మండలాల్లో 80 శాతానికి పైగా ఆధార్ లింక్ జరిగిందని, మిగిలిన వారిని లింక్ చేసుకునే విధంగా ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు. తహసీల్దార్లు ముజీబ్, భిక్షపతి, దశరథ్, సవాయిసింగ్, మహెందర్కుమార్, డిప్యూటి తహసీల్దార్లు శరత్కుమార్, శివరామక్రిష్ణ, ఆర్ఐ శంకర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు బాలుషిండే, కృష్ణపటేల్, హన్మండ్లు, రోహిదాస్, హన్మాండ్లు పాల్గొన్నారు. -
అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
కామారెడ్డి క్రైం: విధి నిర్వహణలో అలసత్వం వహించే వారిపై చర్యలు తప్పవని ఎస్పీ రాజేశ్ చంద్ర హెచ్చరించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అన్ని పీఎస్ల ఎస్హెచ్వోలతో సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా పరిస్థితులు, కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి, గ్రామానికి సంబంధించిన సమాచారం వెంటనే తెలుసుకోవడానికిగాను ప్రతి గ్రామానికి ఒక పోలీస్ అధికారి ఇన్చార్జీగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రౌడీ, అనుమానిత హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. బ్యాంక్, ఏటీఎం, పెట్రోల్ బంక్, ప్రార్థన స్థలాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై అన్ని స్థాయిల అధికారులు దృష్టి సారించాలన్నారు. కేసు నమోదు నుంచి చార్జిషీట్ దాఖలు వరకు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. కేసుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వేగంగా విచారణ పూర్తి చేయడంతో పాటు నిర్ణీత సమయంలో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. కేసులలో నేరస్తులకు శిక్ష పడేలా కృషిచేయాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, కామారెడ్డి అసిస్టెంట్ ఎస్పీ చైతన్యరెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్రావు, సత్యనారాయణ, ఎస్బీ సీఐ తిరుపయ్య, డీసీఆర్బీ సీఐ మురళి తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మవిశ్వాసంతో సాగాలి
కామారెడ్డి క్రైం: దివ్యాంగ విద్యార్థులు ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగడం ద్వారా జీవితంలో అద్భుత ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. సమగ్ర శిక్ష, భారతీయ దివ్యాంగుల పరికరాల పంపిణీ సంస్థల ఆధ్వర్యంలో కామారెడ్డిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులను వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహించాలన్నారు. 2014 లో ఓ దివ్యాంగుడు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో టాపర్గా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం జిల్లాలో గుర్తించిన 207 మంది దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, డీఈవో రాజు, ఆర్డీవో వీణ, జిల్లా సమగ్ర శిక్ష సమన్వయకర్తలు నాగవేందర్, కృష్ణ చైతన్య, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు
కామారెడ్డి టౌన్: ఎసెస్సీ వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 4వ తేదీ వరకు కొనసాగుతాయి. పరీక్షల నిర్వహణ కోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 12,579 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఇందులో 6,127 మంది బాలురు, 6,452 మంది బాలికలున్నారు. వీరి కోసం జిల్లావ్యాప్తంగా 64 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలను మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. ఏ కేటగిరీలో 17, బీలో 35, సీలో 12 కేంద్రాలున్నాయి. పరీక్షల నిర్వహణ కోసం 64 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 64 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఐదుగురు రూట్ ఆఫీసర్లు, 22 మంది కస్టోడియన్లు, 22 మంది జాయింట్ కస్టోడియన్లు, 12 మంది సీ సెంటర్ కస్టోడియన్లు, ముగ్గురు ఫ్లయింగ్ స్క్వాడ్స్, 12 మంది సిట్టింగ్స్ స్క్వాడ్స్, 699 మంది ఇన్విజిలెటర్లను నియమించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఒక ఏఎన్ఎం, కానిస్టేబుల్ అందుబాటులో ఉండనున్నారు. ఐదు నిమిషాల వరకు అనుమతి ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. పరీక్ష ప్రారంభమయ్యాక ఐదు నిమిషాల వరకే కేంద్రం లోనికి అనుమతిస్తారు. పరీక్ష కేంద్రానికి చుట్టుపక్కల 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలులో ఉండనుంది. పరీక్ష కేంద్రానికి సమీపంలోని జిరాక్స్ సెంటర్లను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం వరకు మూసి ఉంచాలని అధికారులు సూచించారు. విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టీసీ కామారెడ్డి డిపో మేనేజర్ ఇందిర తెలిపారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే కంట్రోల్ రూం ( 90326 95219)లో సంప్రదించాలని అధికారులు సూచించారు. తొలిసారిగా క్యూఆర్ కోడ్తో.. పరీక్ష పత్రాలు లీక్ కాకుండా విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. తొలిసారిగా ప్రశ్నపత్రంతోపాటు జవాబు పత్రంపైనా క్యూఆర్ కోడ్ ముద్రించారు. ఒకవేళ ప్రశ్నపత్రం లీక్ అయినా ఏ సెంటర్ నుంచి ప్రశ్నపత్రం లీక్ అయ్యిందో తెలిసే అవకాశం ఉంటుంది. ఈ విధానంతో ఏ విద్యార్థికి సంబంధించిన ప్రశ్నపత్రం, ఏ సెంటర్ నుంచి బయటకు వచ్చిందో సులభంగా తెలిసిపోతుంది. దీంతో పాటు విద్యార్థులు జవాబు పత్రాలు ఒకరికొకరు మార్చుకోకుండా చూడవచ్చు. ఈ క్యూఆర్ కోడ్లో విద్యార్థికి సంబంధించిన వివరాలుంటాయి. అలాగే ఈసారి జవాబు పత్రాలకు బదులుగా విద్యార్థులకు 24 పేజీలతో కూడిన బుక్లెట్ను అందించనున్నారు. విద్యార్థులు ప్రతిసారి అదనపు జవాబు పత్రాలను అడగాల్సిన అవసరం ఉండకుండా ఈ చర్యలు తీసుకున్నారు. భౌతిక, రసాయన శాస్త్రం, జీవ శాస్త్రాలకు మాత్రం 12 పేజీల చొప్పున జవాబు పత్రాల బుక్లెట్ ఇస్తారు. అలాగే ఈసారి గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలికారు. పాత పద్ధతిలో 100 మార్కుల విధానాన్ని అమలు చేయనున్నారు. రేపటి నుంచి పరీక్షల నిర్వహణ జిల్లాలో 64 కేంద్రాలు.. పరీక్ష రాయనున్న 12,579 మంది విద్యార్థులుఅన్ని ఏర్పాట్లు చేశాం పదో తరగతి పరీక్ష నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశాం. పరీక్ష కేంద్రాలలో అవసరమైన సౌకర్యాలు కల్పించాం. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. – ఎస్.రాజు, డీఈవో, కామారెడ్డి -
విద్యుదాఘాతంతో కూలీ మృతి
భిక్కనూరు: మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఆ రోగ్య ఉప కేంద్రం భవన ని ర్మాణ పనులు చేస్తున్న ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో బుధవారం మృతి చెందాడు. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన రాములు (32) బస్వాపూర్ ఆ రోగ్య ఉప కేంద్రం భవన నిర్మాణ పనుల్లో కూలీగా పనిచేస్తున్నాడు. బుధవారం సెంట్రింగ్ పనులు చేస్తుండగా పైన ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తులు భిక్కనూరు పోలీసులకు సమాచారం అందించారు. సిరికొండలో రైతు.. సిరికొండ: మండలంలోని దుప్యతండాకు చెందిన రైతు మలావత్ రమేశ్(45) పొలం వద్ద విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు ఎస్సై ఎల్ రామ్ బుధవారం తెలిపారు. పొలానికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన రమేశ్ తిరికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెళ్లి చూడగా మోటారు వైరు తగిలి చనిపోయినట్లు గుర్తించారన్నారు. మృతుడి భార్య నీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
‘మోడల్’ నిర్మాణాలను వేగవంతం చేయాలి
కామారెడ్డి క్రైం: ఇందిరమ్మ మోడల్ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రతి మండల కేంద్రంలో ఇందిరమ్మ మాడల్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. రెండు పడక గదుల ఇళ్ల కాలనీలకు మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయడానికి పైప్లైన్లు, ట్యాంకులు, సంప్ల నిర్మాణాలను తొందరగా పూర్తి చేయాలని సూచించారు. మిషన్ భగీరథ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి అధికారులతో సమావేశాల్లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
అభివృద్ధి పనుల పరిశీలన
బాన్సువాడ రూరల్: మండలంలోని పులికుచ్చ తండా, చిన్న రాంపూర్ గ్రామాల్లో బుధవారం బాన్సువాడ ఎంపీడీవో బషీరుద్దీన్ పర్యటించారు. పులికుచ్చతండా లోని పలు అభివృద్ధి పనులతోపాటు కంపోస్టుషెడ్, న ర్సరీ, ప్రకృతి వనంను ఆయన పరిశీలించారు. పంచాయతీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం చిన్నరాంపూర్ గ్రామంలో పర్యటించారు. పంచాయతీ నూతన భవన నిర్మాణ పనులు, సీసీ రోడ్ల పనులు పరిశీలించి పలు సూచనలు చేశారు. జీపీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు.. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని అచ్చాయపల్లి, రామక్కపల్లి గ్రామాల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను బుధవారం ఎంపీడీవో ప్రభాకరచారి పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని లబ్ధిదారులకు ఆయన సూచించారు. నిర్మాణాలను ప్రారంభించని లబ్ధిదారులు సైతం వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలన్నారు. జీపీ కార్యాదర్శులుర్శి వెంకటరాములు, మల్లికార్జున్ ఉన్నారు. -
రుణ లక్ష్యాలను చేరుకోవాలి
కామారెడ్డి క్రైం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వివిధ అంశాల్లో లక్ష్యానికి అనుగుణంగా అర్హత గల వారికి రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బ్యాంకర్లకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో వివిధ బ్యాంకుల అధికారులు, మేనేజర్లు, ప్రభుత్వ శాఖల అధికారులతో రుణాల మంజూరు, లక్ష్యాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంట, వ్యవసాయ అనుబంధ రుణాలు, ఎంఎస్ఎంఈ, హౌసింగ్, విద్య రుణాల లక్ష్యాలను చేరకోవాలన్నారు. ప్రాధాన్యత రంగాలకు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రుణాలను మంజూరు చేయాలని సూచించారు. అనంతరం వచ్చే ఆర్థిక సంవత్సరానికి నాబార్డ్ సిద్ధం చేసిన యాక్షన్ ప్లాన్ ప్రతులను ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, నాబార్డ్ డీడీఎం ప్రవీణ్, ఆర్బీఐ ఏజీఎం పృథ్వీ, ఎల్డీఎం రవికాంత్, డీఆర్డీవో సురేందర్, మోడల్ సీఎస్సీ రాష్ట్ర ప్రాజెక్ట్ మేనేజర్ హరికృష్ణ కుమార్, జిల్లా మేనేజర్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు. నీటి ఎద్దడి నివారణకు చర్యలు కామారెడ్డి క్రైం: జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేశామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై గ్రామాలలో తాగు నీటి సమస్యపై చర్చించారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మిషన్ భగీరథ ఈఈ, జిల్లా పంచాయతీ అధికారుల ప్రతిపాదనల మేరకు తొలి విడతలో జిల్లావ్యాప్తంగా 125 గ్రామాల్లో రూ. 1.18 కోట్ల అంచనాలతో పనులు చేపట్టడానికి నిధులు మంజూరు చేశామన్నారు. ఈ నిధులతో తాగునీటి వనరుల మరమ్మతులు, బోరు బావుల తవ్వకం, పైప్లైన్లు తదితర పనులు చేపడతామని పేర్కొన్నారు. ఎక్కడైనా తాగు నీటి ఇబ్బందులు తలెత్తితే అవసరమైన పనులకోసం ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మిషన్ భగీరథ ఈఈ రమేశ్, డీపీవో మురళి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కలెక్టరేట్లో బ్యాంకర్లతో సమావేశం యాక్షన్ ప్లాన్ పోస్టర్ల ఆవిష్కరణ -
నీటితొట్టిలో పడి చిన్నారి మృతి
నిజాంసాగర్(జుక్కల్): ఇంటి ఎదుట సరదాగా ఆడుకుంటూ వెళ్లి పశువుల నీటి తొట్టిలో పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా మహమ్మద్నగర్ మండలం సింగీతంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సింగీతం గ్రామానికి చెందిన బిచ్చం గజ్జెలయ్యకు ఇద్దరు భార్యలు. చిన్న భార్య సుశీల కూతురు దుర్గాభవాని(3) బుధవారం మధ్యాహ్నం ఇంటి వద్ద ఆడుకుంటూ వెళ్లి పశువుల నీటి తొట్టిలో పడింది. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న దుర్గాభవానీ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అనుమానం వచ్చి నీటితొట్టిలో చూడగా అప్పటికే చిన్నారి నీట మునిగి మరణించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
‘పది’ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు
కామారెడ్డి టౌన్: ఎసెస్సీ వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 4వ తేదీ వరకు కొనసాగుతాయి. పరీక్షల నిర్వహణ కోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 12,579 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఇందులో 6,127 మంది బాలురు, 6,452 మంది బాలికలున్నారు. వీరి కోసం జిల్లావ్యాప్తంగా 64 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలను మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. ఏ కేటగిరీలో 17, బీలో 35, సీలో 12 కేంద్రాలున్నాయి. పరీక్షల నిర్వహణ కోసం 64 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 64 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఐదుగురు రూట్ ఆఫీసర్లు, 22 మంది కస్టోడియన్లు, 22 మంది జాయింట్ కస్టోడియన్లు, 12 మంది సీ సెంటర్ కస్టోడియన్లు, ముగ్గురు ఫ్లయింగ్ స్క్వాడ్స్, 12 మంది సిట్టింగ్స్ స్క్వాడ్స్, 699 మంది ఇన్విజిలెటర్లను నియమించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఒక ఏఎన్ఎం, కానిస్టేబుల్ అందుబాటులో ఉండనున్నారు. ఐదు నిమిషాల వరకు అనుమతి ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. పరీక్ష ప్రారంభమయ్యాక ఐదు నిమిషాల వరకే కేంద్రం లోనికి అనుమతిస్తారు. పరీక్ష కేంద్రానికి చుట్టుపక్కల 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలులో ఉండనుంది. పరీక్ష కేంద్రానికి సమీపంలోని జిరాక్స్ సెంటర్లను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం వరకు మూసి ఉంచాలని అధికారులు సూచించారు. విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టీసీ కామారెడ్డి డిపో మేనేజర్ ఇందిర తెలిపారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే కంట్రోల్ రూం ( 90326 95219)లో సంప్రదించాలని అధికారులు సూచించారు. తొలిసారిగా క్యూఆర్ కోడ్తో.. పరీక్ష పత్రాలు లీక్ కాకుండా విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. తొలిసారిగా ప్రశ్నపత్రంతోపాటు జవాబు పత్రంపైనా క్యూఆర్ కోడ్ ముద్రించారు. ఒకవేళ ప్రశ్నపత్రం లీక్ అయినా ఏ సెంటర్ నుంచి ప్రశ్నపత్రం లీక్ అయ్యిందో తెలిసే అవకాశం ఉంటుంది. ఈ విధానంతో ఏ విద్యార్థికి సంబంధించిన ప్రశ్నపత్రం, ఏ సెంటర్ నుంచి బయటకు వచ్చిందో సులభంగా తెలిసిపోతుంది. దీంతో పాటు విద్యార్థులు జవాబు పత్రాలు ఒకరికొకరు మార్చుకోకుండా చూడవచ్చు. ఈ క్యూఆర్ కోడ్లో విద్యార్థికి సంబంధించిన వివరాలుంటాయి. అలాగే ఈసారి జవాబు పత్రాలకు బదులుగా విద్యార్థులకు 24 పేజీలతో కూడిన బుక్లెట్ను అందించనున్నారు. విద్యార్థులు ప్రతిసారి అదనపు జవాబు పత్రాలను అడగాల్సిన అవసరం ఉండకుండా ఈ చర్యలు తీసుకున్నారు. భౌతిక, రసాయన శాస్త్రం, జీవ శాస్త్రాలకు మాత్రం 12 పేజీల చొప్పున జవాబు పత్రాల బుక్లెట్ ఇస్తారు. అలాగే ఈసారి గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలికారు. పాత పద్ధతిలో 100 మార్కుల విధానాన్ని అమలు చేయనున్నారు. రేపటి నుంచి పరీక్షల నిర్వహణ జిల్లాలో 64 కేంద్రాలు.. పరీక్ష రాయనున్న 12,579 మంది విద్యార్థులుఅన్ని ఏర్పాట్లు చేశాం పదో తరగతి పరీక్ష నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశాం. పరీక్ష కేంద్రాలలో అవసరమైన సౌకర్యాలు కల్పించాం. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. – ఎస్.రాజు, డీఈవో, కామారెడ్డి -
ముగిసిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
కామారెడ్డి టౌన్: ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు బుధవారం ముగిశాయి. చివరిరోజు జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షకు 9,813 మంది విద్యార్థులకుగాను 9,414 మంది హాజరయ్యారు. 399 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షలను జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం పర్యవేక్షించారు. 13న క్రెడా ఎన్నికలుకామారెడ్డి అర్బన్: కామారెడ్డి రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ ఏజెంట్స్ అసోసియేషన్ (క్రెడా) ఎన్నికలను వచ్చేనెల 13న నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి శేఖర్, సహాయకులు బట్టు రవి, పందిరి శ్రీనివాస్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో మాట్లాడారు. ఈనెల 24 నుంచి 31 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని పేర్కొన్నారు. 13న పోలింగ్, అదేరోజు కౌంటింగ్ ఉంటాయని తెలిపారు. చిరుధాన్యాల వినియోగంపై అవగాహన నాగిరెడ్డిపేట: జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్) కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని రాజేంద్రనగర్లోగల వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు బుధవారం పోచారం గ్రామంలో పర్యటించారు. గ్రామ స్తులకు చిరుధాన్యాల వినియోగంపై అవగాహన కల్పించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహార పదార్థాలను తయారు చేసుకునే తీరును వివరించారు. అనంతరం గ్రామ శివారులోని వరిపంటను పరిశీలించారు. యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు శ్రీలత, మీనా, ఎన్ఎస్ఎస్ అధికారి చైతన్య పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్కు ఎంపిక కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో బుధవారం రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు. అండర్–14, 16, 18, 20 మెన్, ఉమెన్ విభాగాలలో పోటీలు జరిగాయి. 180 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు. ప్రతిభ చూపిన 18 మంది క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్రెడ్డి, అనిల్కుమార్ తెలిపారు. వీరు ఈనెల 23న హైదరాబాద్లోని కొల్లూరు గార్డియం స్పోర్టియం స్కూల్ మైదానంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఎంపికై ంది వీరే: జె.ఈశ్వర్, ఎ.పల్లవి, ఎన్.విజయేందర్, ఎం.గణేష్, జి.జగదీష్, ఎన్.నితిన్, ఎ.నక్షత్ర, కె.సునీత, డి.ప్రతాప్సింగ్, డి.పరమేశ్, బి.భవిత, ఎల్.సునీత, ఎం.రోహనా, బి.ఈశ్వరప్రసాద్, ఎ.పవన్కళ్యాణ్, జి.రాహుల్, టి.రాజేశ్, ఎన్.సిరి. ‘మానవ అక్రమ రవాణాను అరికట్టాలి’ కామారెడ్డి రూరల్: మానవ అక్రమ రవాణాను అరికట్టాలని మానవ అభివృద్ధి విభాగం డీపీఎం రమేశ్బాబు సూచించారు. కామారెడ్డి మండల సమాఖ్య కార్యాలయంలో మానవ అక్రమ రవాణా నిరోధంపై జిల్లాలోని 7 మండలాల ఐకేపీ ఏపీఎంలు, సీసీలకు బుధవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి మహిళలు, యువతులు ఎక్కువగా హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడుతున్నారన్నారు. ఈ అంశంపై పాఠశాల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సైబర్ ట్రాఫికింగ్ ఇప్పుడు వేగంగా విస్తరిస్తోందని, దీనిపైనా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఆయా అంశాలపై చిన్న సంఘాల సమావేశంలో సభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీవో మురళీకృష్ణ, ఏపీఎంలు మోయిజ్, రాంనారాయణగౌడ్, సీసీలు, టీవోటీలు రాజేందర్, జగదీష్ కుమార్, శ్రీనివాస్, అన్నపూర్ణ, గీత తదితరులు పాల్గొన్నారు. -
లే అవుట్ల నివేదికలు అందించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం: లే అవుట్లు, ప్లాట్ల అనుమతులకు సంబంధించిన నివేదికలను పూర్తి వివరాలతో అందించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం తెలంగా ణ బి–పాస్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో లే అవుట్ లు, ప్లాట్లను సంబంధిత శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి పూర్తి నివేదికలు అందజేయాలన్నారు. రెవెన్యూ, విద్యుత్, రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్, నీటిపారుదల, మున్సిపల్, టౌన్ ప్లా నింగ్ తదితర శాఖల అధికారులు సంయుక్తంగా ప రిశీలన చేపట్టాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రావణ్ కుమార్, పంచాయతీ రాజ్ ఈఈ దుర్గా ప్రసాద్, రోడ్లు భవనాల శాఖ ఈఈ రవి శంకర్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి, డీటీసీపీవో సువర్ణ తదితరులు పాల్గొన్నారు.ప్రతిపాదనలు సిద్ధం చేయాలిప్రభుత్వ మెడికల్ కళాశాలకు మిషన్ భగీరథ నీటిని సరఫరా చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. తన చాంబర్లో మిషన్ భగీరథ, మెడికల్ కళాశాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం అద్దె భవనాల్లో కొనసాగుతున్న హాస్టల్లలో నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని మున్సిపల్ కమిషనర్కు సూచించారు. -
వివాదాలకు కేరాఫ్గా మారుతున్న అధికారులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి జిల్లాలో బీజేపీ నాయకులు అధికారుల వ్యవహార శైలిపై బహిరంగంగా నిప్పులు చెరుగుతున్నారు. అధి కారంలో ఏ పార్టీ ఉన్నా.. సుదీర్ఘకాలం సర్వీసు లో ఉండే బ్యూరోక్రాట్లు, అధికారులు, ఉద్యోగు లు ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ నిష్పక్షపాతంగా పనిచేయాల్సి ఉండగా, తరచూ వివాదాస్పదమవుతున్నారు. ఈ పరిస్థితులు సాధారణ ప్రజల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఇలా వివాదాలకు కేరాఫ్గా మారుతుండడంపై విమర్శలు వస్తున్నాయి. ● కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి శాసనసభలోనే ప్రభుత్వం, ప్రభుత్వ అధికారుల తీరుపై ని ప్పులు చెరిగారు. కామారెడ్డిలో విద్య, వైద్య శాఖల్లో వివిధ అంశాలకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద 86 దర ఖాస్తులు ఇస్తే ఏమాత్రం సమాధానాలు ఇవ్వలేదన్నారు. పైగా తానే స్వయంగా దరఖాస్తు ఇవ్వడానికి వెళి తే ఇలాంటివి చాలా చూశాం.. అ య్యేవా.. పోయేవా అంటూ ఉద్యోగులు, అధికారు లు మాట్లాడారన్నారు. అధికారులకు ఇది మంచి పద్ధతి కాదని, సదరు అధికారుల పేర్లు సైతం చెప్పగలుగుతానన్నారు. సమాచారం ఇచ్చేది లేద ని అధికారులే అంటే ఎలా అన్నారు. ప్రతీది ఫైల్ తో సహా తనవద్ద ఉందన్నారు. అధికారులు గౌర వంగా వ్యవహరిస్తే బాగుంటుందన్నారు. ఈ ప్రవర్తన అందరికీ సిగ్గుచేటన్నారు. పద్ధతి మార్చుకోకుండా రాబోయే కాలంలో తన పద్ధతి మార్చుకునేలా చేస్తారా అని అసెంబ్లీలో నిప్పులు చెరిగారు. ఇదిలా ఉండగా నియోజకవర్గంలో ఓ డినవారు, నియోజకవర్గం నుంచి పారిపోయిన వారి పేరిట ప్రతిపాదనలు ఇవ్వడమేమిటి.. ఇన్చార్జి మంత్రి మంజూరు చేయడమేమిటన్నారు. ఇలా అయితే ప్రజల ద్వారా ఎన్నికైన తానేం చేయాలంటూ పరోక్షంగా షబ్బీర్ అలీపై కేవీఆర్ విమర్శలు ఎక్కుపెట్టారు. ● తాజాగా నిజామాబాద్లో కేంద్ర వాణిజ్య పన్నుల శాఖ పరిధిలోని పసుపు బోర్డు సమావేశంలో పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి నేరుగా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతుపైనే విమర్శలు సంధించారు. జనవరిలో పసుపు బో ర్డు తాత్కాలిక కార్యాలయాన్ని వర్చువల్ విధానంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కలెక్టరేట్లో నిర్వహించేందుకు కలెక్టర్ను సంప్రదించగా.. పండుగ సమయంలో ఎవరూ అందుబాటులో ఉండరంటూ కార్యక్రమ నిర్వహణకు తిరస్కరించారని గంగారెడ్డి అధికారిక సమావేశంలో నే తెలిపారు. కొన్ని అపోహలు తొలగించేందుకు ఈ విషయాన్ని జిల్లా ప్రజలకు తెలపాల్సిన బాఽ ద్యత తనపై ఉందన్నారు. దీనిపై రైతులు, ఉన్నతాధికారుల్లో చర్చ జరిగింది. మంగళవారం పసుపు బోర్డు ఆధ్వర్యంలో సీనియర్ ఐఏఎస్లు, జిల్లా అదనపు కలెక్టర్ పాల్గొన్న సమావేశం గురించి సైతం జిల్లా పౌరసంబంధాల అధికారికి తెలియకపోవడం గమనార్హం. ● జక్రాన్పల్లి మండలం లక్ష్మాపూర్లో ప్రభుత్వ భూమిలో అక్రమంగా స్టోన్ క్రషర్ నిర్వహించడంపై కేఆర్ సుదర్శన్రెడ్డి అనే వ్యక్తి సమాచార హ క్కు చట్టం ద్వారా పూర్తి వివరాలు తీసుకుని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్కు ఫిర్యాదు చేశారు. అక్రమ క్రషర్ నిర్వాహకుడికి అనేకసార్లు నోటీసులు ఇచ్చారు. చర్యలు తీసుకోలేదని అడిగితే ఆ విషయమే తమకు తెలియదని కలెక్టర్, అదనపు కలెక్టర్ చెబుతున్నారని సుదర్శన్రెడ్డి తెలిపారు. దీనిపై సీఎంకు ఫిర్యాదు చేయనున్నట్లు సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యంపై నిప్పులు చెరుగుతున్న బీజేపీ నేతలు ఆర్టీఐ దరఖాస్తులను పట్టించుకోవడంలేదంటూ అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే కేవీఆర్ పసుపు బోర్డు ప్రారంభ సమావేశానికి సహకరించని జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లో ఏర్పాటు చేయనీయలేదు : బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి -
సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే తోట
నిజాంసాగర్(జుక్కల్): ఎస్సీ వర్గీకరణ బిల్లు కు అసెంబ్లీ ఆమోదం తెలపడంతో రాష్ట్ర ము ఖ్యమంత్రి రేవంత్రెడ్డిని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు మంగళవారం సాయంత్రం మ ర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు వారు కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, మానకొండూర్ ఎమ్మెల్యే సత్యనారాయణ, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తదితరులున్నారు. పక్కా ప్రణాళికతో చదవాలి గాంధారి/నస్రుల్లాబాద్ : పదో తరగతి విద్యార్థులు పక్కా ప్రణాళికతో చదివి వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈవో రాజు అన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించి తాము చదివిన పాఠశాలకు, పాఠాలు బోధించిన ఉపాద్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. గాంధారి, నస్రుల్లాబాద్ మండలాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. గాంధారి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 111 మంది పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక ఉపాధ్యాయుడు పెంటయ్య సమకూర్చిన పరీక్ష ప్యాడ్లు, పెన్నులను అందజేశారు. అలాగే నస్రుల్లాబాద్ మండలంలోని నెమ్లి జెడ్పీహెచ్ఎస్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. ఆయనవెంట ఎంఈవోలు శ్రీహరి, చందర్, గాంధారి హెచ్ఎం వెంకటేశ్వర్లుగౌడ్, నస్రుల్లాబాద్ మండల పీఆర్టీయూ అధ్యక్షుడు హన్మాండ్లు, ఉపాధ్యాయులు ఉన్నారు. కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు కామారెడ్డి టౌన్: జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఇంటర్ ద్వితియ సంవత్సరం విద్యార్థులకు పరీక్ష జరిగింది. మొత్తం 38 కేంద్రాలలో 8423 మంది విద్యార్థులకు గాను 8243 మంది హాజరుకాగా, 180 మంది గైర్హాజరయ్యారు. ఇందులో 7140 మంది జనరల్ విద్యార్థ్లుకు గాను 6999 మంది హాజరు కాగా, 141 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ కోర్సులో 1283 మందికి గాను 1244 హాజరుతో 39 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షలను జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం పర్యవేక్షించారు. -
అంగన్వాడీల నిర్వీర్యానికి కుట్ర
కామారెడ్డి టౌన్ : బడ్జెట్లో తక్కువ నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తోందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కందూరి చంద్రశేఖర్ ఆరోపించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో 48 గంటల పాటు చేపట్టిన మహాధర్నాలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ను అంగన్వాడీలు ముట్టడించారు. కలెక్టరేట్ ఎదుట గంటన్నరపాటు బైఠాయించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అంగన్వాడీలకు కనీన వేతనం రూ.26 వేలు చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు వేధింపులు మానుకోవాలని, సెంటర్లకు ఎండకాలం సెలవులు ప్రకటించాలన్నారు. యూనియన్ గౌరవ అధ్యక్షుడు సురేశ్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కార్యకర్తల 23 డిమాండ్లను వెంటనే పరిష్కరించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ధర్నా అనంతరం బారికేడ్లను తోసుకుని కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు అంగన్వాడీ టీచర్లు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది. అనంతరం అడిషనల్ కలెక్టర్ విక్టర్, ఐసీడీఎస్ పీడీ ప్రమీల వారి వద్దకు రాగా వినతిపత్రాలు అందజేశారు. నాయకులు కొత్త నర్సింలు, మోతీరాంనాయక్, వెంకట్గౌడ్, రాజనర్సు, అరుణ్, అజయ్, అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకులు కల్పన, బాబాయ్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రెండో రోజూ కొనసాగిన అంగన్వాడీల ధర్నా బారికేడ్లను తోసుకుని కలెక్టరేట్లోకి వెళ్లేందుకు యత్నం అడ్డుకున్న పోలీసులు -
వాగ్దానానికే పరిమితం
సదాశివనగర్ మండలం లింగంపల్లి వద్ద చేపట్టిన తవ్వకం పనులుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మెట్ట ప్రాంతానికి గోదారమ్మను మళ్లించి రైతుల కష్టాలను తీర్చేందుకు రూ పొందించిన కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులకు ని ధుల గ్రహణం పట్టింది. ప్రభుత్వాలు మారుతున్నా ఈ ప్యాకేజీకి సంబంధించిన పనులపై రివ్యూలు జ రగకపోగా, నిధులూ ఇవ్వడం లేదు. దీంతో ఏళ్లు గడుస్తున్నా పనులు ముందుకు సాగడం లేదు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో ప్రవెశ పెట్టనున్న బడ్జెట్లో 22వ ప్యాకేజీకి ఏ మైనా నిధులు ఇస్తారేమోనని రైతు లు ఆశగా ఎదురుచూస్తున్నారు. జి ల్లాలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి ని యోజవర్గాల్లో బొర్లు తవ్వించి అ ప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి తన ప్ర జాప్రస్థానం పాదయాత్రలో భాగంగా పరామర్శించారు. తాము అధికారంలోకి రాగానే గోదావరి జలాలతో సాగునీటి క ష్టాలను తీరుస్తామని భరోసా ఇచ్చారు. ఇచ్చి న మాట ప్రకారం కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజక వర్గాలతోపాటు పొరుగున ఉన్న మెదక్ జిల్లాలోని రామాయంపేట ప్రాంతానికి సాగునీటిని అందించేందుకు ప్రాణహిత–చేవెళ్ల పథకంలో 22వ ప్యాకేజీని రూపొందించారు. పనులకు కామారెడ్డి పట్టణం నడిబొడ్డున శంకుస్థాపన చేశారు. నిధులు మంజూరు కావడంతో పనులు మొదలయ్యాయి. భూంపల్లి రిజర్వాయర్ పనులు చేపట్టి కాలువలూ తవ్వారు. సొరంగం పనులు చేప ట్టారు. అయితే వైఎస్సార్ మరణానంతరం నిధుల సమస్య వచ్చిపడింది. పేరుమార్పు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రాణహిత–చేవెళ్లను కాళేశ్వరం ప్రాజెక్టుగా పేరు మార్చినా 22వ ప్యాకేజీని అలాగే కొనసాగించారు. అయితే నిధులు విడుదల కాకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. ప్యాకేజీలో కీలకమైన భూంపల్లి రిజర్వాయర్ పనులు చేపట్టారు. అక్కడి నుంచి నీటిని గ్రావిటీ ద్వారా మూడు ప్రాంతాలకు తరలించేందుకు లెఫ్ట్, రైట్, రిడ్జ్ కెనాల్స్ పనులు చేపట్టారు. అయితే కామారెడ్డి, భిక్కనూరు, లింగంపేట, రాజంపేట, గాంధారి మండలాల్లో రిజర్వాయర్ల నిర్మాణానికి అవసరమైన 3 వేల ఎకరాల భూసేకరణ ఇప్పటికీ పూర్తి కాలేదు. భూసేకరణ జరిగితే ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పనులు మొదలుపెట్టొచ్చు. ప్రాజెక్టు పూర్తి చేయాలంటే రూ.2,100 కోట్లు అవసరం అవుతాయని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. పనులు మొదలుపెట్టి రెండు దశాబ్దాలు కావొస్తున్నా పూర్తి కావడం లేదు. 22వ ప్యాకేజీ పూర్తి చేస్తే ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని గాంధారి, లింగంపేట, తాడ్వాయి, సదాశివనగర్, రామారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గంలోని కామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ, దోమకొండ, బీబీపేట, భిక్కనూరు, రాజంపేట మండలాలతోపాటు మెదక్ జిల్లాలోని రామాయంపేట, నిజాంపేట తదితర మండలాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఏళ్లు గడుస్తున్నా పనులు ముందుకు కదలకపోవడానికి ప్రధాన కారణం నిధులు కేటాయించకపోవడమే. కాళేశ్వరం 22వ ప్యాకేజీకి రూ. 2,100 కోట్లు అవసరం నిధులు కేటాయిస్తేనే నీళ్లు పరవళ్లు తొక్కేది! ఏళ్లుగా ముందుకు కదలని పనులు ఈ బడ్జెట్లోనైనా నిధులు కేటాయిస్తారా..కాళేశ్వరం 22వ ప్యాకేజీ.. ఏళ్లు గడుస్తున్నా ముందుకు కదిలింది లేదు. రైతుల సాగునీటి గోసను పరిష్కరించే పనులను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నామని ఎన్నికల సమయంలో ప్రకటిస్తున్న నాయకులు తరువాత ఆ ఊసే ఎత్తడం లేదు. ఫలితంగా తమ భూముల్లోకి గోదారమ్మ ఎప్పుడొచ్చేదని రైతులు వాపోతున్నారు. పనులు పూర్తి చేసేందుకు రూ.2,100 కోట్లు అవసరం కాగా.. అసెంబ్లీలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై ఆశలు పెరిగాయి. కాళేశ్వరం 22వ ప్యాకేజీకి రూ. 2,100 కోట్లు అవసరం నిధులు కేటాయిస్తేనే నీళ్లు పరవళ్లు తొక్కేది! ఏళ్లుగా ముందుకు కదలని పనులు ‘భట్టి’ బడ్జెట్పై రైతుల ఆశలుప్రతిసారి ఎన్నికల్లో 22వ ప్యాకేజీ అంశం వాగ్దానంగా మారుతోంది తప్ప పనులు ముందుకు కదలడం లేదు. సాగునీటి కోసం రైతులు దశాబ్దాలు పడుతున్న కష్టాలకు 22వ ప్యాకేజీ ఒక్కటే పరిష్కారమని పదే పదే చెప్పే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు నిధుల కోసం గట్టిగా ప్రయత్నించడం లేదు. ఏటా భూగర్భజలాలు అడుగంటిపోయి చేతికందే సమయంలో పంటలు ఎండిపోతుండడం, రైతులు అప్పులపాలవుతున్న విషయం తెలిసి కూడా నిధులు సాధించేందుకు చొరవ చూపడం లేదనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఉన్నత స్థాయిలో సమీక్షలు జరిపి, అవసరమైన నిధులు సాధించేందుకు రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు ఒక్కటి కావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భట్టి బడ్జెట్పై ఆశలు రాష్ట్ర వార్షిక బడ్జెట్ను బుధవారం శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రూ.2,100 కోట్లు కేటాయిస్తే 22వ ప్యాకేజీ పనులు ముందుకు కదులుతాయి. నిధులు మంజూరు చేస్తేనే బీడు భూముల్లో గోదారమ్మ పరవళ్లు తొక్కుతుందని, అప్పటి దాకా తమ కష్టాలు తీరేట్టు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రాజెక్టు పనుల పూర్తికి నిధులు కేటాయించి సాగునీటి కష్టాల నుంచి గట్టెక్కించాలని కోరుతున్నారు. అలాగే జుక్కల్ నియోజక వర్గ రైతులకు ఉపయోగపడే అంతర్రాష్ట్ర ప్రాజెక్టు అయిన లెండితోపాటు నాగమడుగు ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. -
ఘనంగా విమాన రథోత్సవం
● కొనసాగుతున్న సిద్దరామేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలుభిక్కనూరు: దక్షిణ కాశీగా పేరొందిన భిక్కనూరు సిద్దరామేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా మంగళవారం విమాన రథోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాలను రథంపై ప్రతిష్టించి ఊరేగించారు. రథంను లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. అంతకు ముందు ఆలయ పీఠాధిపతి సదాశివమహంత్ శ్రీసిద్దగిరి సమాధి వద్దకు వచ్చి అక్కడ రుద్రాకారుడిగా మారి పూజలు నిర్వహించారు. అర్చకులు సిద్దగిరిశర్మ, రామగిరిశర్మ, రాజేశ్వరశర్మ, సిద్ధేశ్ల ఆధ్వర్యంలో స్వామివారికి అర్చనలు అభిషేకాలను నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
మొక్కలు ఎండిపోతున్నా పట్టించుకోరా?
నస్రుల్లాబాద్(బాన్సువాడ): పల్లె ప్రకృతి వనంలో మొక్కలు ఎండిపోతున్నా పట్టించుకోరా..? అంటూ నాచుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి వినయ్పై సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని నెమ్లి, నాచుపల్లి గ్రామాలను సబ్ కలెక్టర్ మంగళవారం సందర్శించారు. నెమ్లి గ్రామంలోని వెల్నెస్ సెంటర్ను సందర్శించిన ఆమె రిజిస్టర్లో సీఎల్ వేసి ఉండడాన్ని గమనించి సిబ్బంది విధుల్లోకి వస్తున్నారో లేదో పరిశీలించాలని తహసీల్దార్ ప్రవీణ్ను ఆదేశించారు. అనంతరం నాచుపల్లి గ్రామంలోని నర్సరీ, పల్లె ప్రకృతి వనం, గిరిజన మినీ గురుకుల బాలికల పాఠశాలను పరిశీలించారు. పల్లె ప్రకృతి వనంలో ప్రతి మొక్కనూ కాపాడాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శిదే అంటూ సూచించారు. మరొక సారి ఇలా జరిగితే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఎంపీడీవో సూర్యకాంత్ను ఆదేశించారు. అనంతరం నెమ్లి జెడ్పీహెచ్ఎస్లో నిర్వహించిన పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో పాల్గొన్నారు. ఆమె వెంట తహసీల్దార్ ప్రవీణ్, ఎంపీడీవో సుబ్రమణ్యం, గిర్దావార్ సాయిలు, అంజు తదితరులు ఉన్నారు. పంచాయతీ కార్యదర్శిపై సబ్ కలెక్టర్ ఆగ్రహం -
జమిలి ఎన్నికలతోనే అభివృద్ధి సాధ్యం
కామారెడ్డి టౌన్: జమిలి ఎన్నికలతోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక (జమిలి ఎన్నిక)లపై కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు అధ్యక్షతన ఒకే దేశం ఒకే ఎన్నిక బీజేపీ దృక్కోణం అంశంపై నిర్వహించిన వర్క్ షాప్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండటంతో అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని ఆరోపించారు. ఆర్థికంగా తీవ్ర భారం తగ్గుతుందన్నారు. దేశంలో జమిలి ఎన్నికల కోసం ప్రజలకు అవగాహన కల్పించాలని ఇందుకోసం కార్యకర్తలు కృషి చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల స్థాయిలో వర్క్షాప్లు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు మురళీధర్ గౌడ్, రంజిత్ మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శులు నరేందర్ రెడ్డి, రవీందర్ రావు, నాయకులు లింగరావు, వేణు, శ్రీనివాస్, లక్ష్మి నారాయణ, భరత్, నరేందర్, రమేష్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అవగాహన కల్పించాలి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ -
ట్రాఫిక్ నియమాలు పాటించాలి
కామారెడ్డి క్రైం: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిస్తున్న కమాండ్ కంట్రోల్ రూం ను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీటు బెల్టులను ధరించాలన్నారు. అతివేగం మంచిదికాదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జిల్లాలోని జాతీయ రహదారి ఎన్హెచ్ 44 వెంబడి(భిక్కనూరు నుంచి దగ్గి అటవీ ప్రాంతం వరకు) వాహనాల వేగాన్ని గంటకు 80 కిలో మీటర్లకు కుదించడం జరిగిందన్నారు. అంతకుమించి ఎవరైనా వాహనాలు వేగంగా నడిపితే జరిమానాలు విధించడం జరుగుతుందని తెలిపారు. అతిక్రమిస్తే చర్యలు తప్పవు ఎస్పీ రాజేష్ చంద్ర ధర్నా చౌక్ పరిశీలన జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ పరిసరాలను ఎస్పీ రాజేశ్చంద్ర పరిశీలించారు. ధర్నా చౌక్, కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి, అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్ఐ రాజు పాల్గొన్నారు. -
డివైడర్ను ఢీకొన్న బైక్.. ఒకరు మృతి
పెళ్లయిన పదమూడు రోజులకే మృత్యు ఒడికి..● చెరువులో పడి యువకుడి మృతి సదాశివనగర్: పెళ్లయిన పదమూడు రోజులకే ఓ యువకుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన సదాశివనగర్ మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన కడమంచి రాములు(26) ఆరు నెలల క్రితం దుబాయి నుంచి వచ్చాడు. ఈ నెల 6న మెట్పల్లికి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. గ్రామ సమీపంలోని పాత చెరువులో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన రాములు ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడిపోయాడు. రాములకు ఈత రాకపోవడంతోనే నీట మునిగి మృతి చెందాడు. మృతుడి తండ్రి సిద్ధిరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యంనిజాంసాగర్: నిజాంసాగర్ ప్రధాన కాలువలో గల్లంతైన రామగళ్ల దశరథం(38) అనే వ్యక్తి మృతదేహం మంగళవారం సాయంత్రం లభ్యమైంది. మహమ్మద్నగర్ మండలం బూర్గుల్ గ్రామానికి చెందిన దశరథం సోమవారం గ్రామ శివారులోని ప్రధాన కాలువలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడి గల్లంతయ్యాడు. అతని ఆచూకీ కోసం అగ్నిమాపక సిబ్బంది ప్రధాన కాలువ నీటిలో గాలించారు. సింగీతం గ్రామ శివారులోని ప్రధాన కాలువ బ్రిడ్జి వద్ద మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చికిత్స పొందుతూ మహిళ మృతిమాచారెడ్డి: జీవితంపై విరక్తితో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు య త్నించిన ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మాచారెడ్డి మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన బానోత్ పద్మ(43) అంగవైకల్యంతో బాధపడుతోంది. జీవితంపై విరక్తితో ఈ నెల 15న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు సేవించింది. కొద్ది సేపటికి విషయాన్ని గమనించిన కుటుంబీకులు సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు. రెండు బోరు మోటార్ల చోరీమాచారెడ్డి: పాల్వంచ మండల శివారులోని ఇద్దరు రైతుల బోరు మోటార్లను గుర్తు తెలియని దుండగులు సోమవారం రాత్రి దొంగిలించినట్టు ఎస్సై అనిల్ తెలిపారు. గ్రామానికి చెందిన గాలి బొందయ్య, కొండె శ్రీనివాస్లకు చెందిన వ్యవసాయ భూమిలోని బోరు మోటార్లతో పాటు వైర్లను ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. ఇసుక టిప్పర్ పట్టివేత బోధన్ టౌన్: మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు టిప్పర్ను పట్టుకున్నట్లు సీఐ వెంకటనారాయణ తెలిపారు. బోధన్ పట్టణంలోని బెల్లాల్ రైల్వేగేట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ టిప్పర్ను ఆపి పరిశీలించగా అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే టిప్పర్ను స్వాధీనం చేసుకొని డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.భిక్కనూరు: జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రగాయాలైన ఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులో మంగళవారం వేకువజామున చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని ఈసీఎల్ ప్రాంతానికి చెందిన అనంత్(23), సంజన స్నేహితులు. వీరు సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చి మంగళవారం వేకువజామున తిరిగి హైదరాబాద్కు బైక్పై వెళ్తుండగా జంగంపల్లి శివారులోని జాతీయ రహదారిపై అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్నారు. ఈ ఘటనలో అనంత్ అక్కడికక్కడే మృతి చెందగా సంజనకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు సంజనను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, అనంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. కరెంట్ షాక్తో.. సదాశివనగర్: షార్ట్ సర్క్యూట్తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన సదాశివనగర్ మండలం ఉత్తునూర్లో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై రంజిత్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుడిసె సతీశ్(25) మంగళవారం ఉదయం పొలంలో మందు పిచికారీ చేసేందుకు వెళ్లాడు. పిచికారీ కోసం కావాల్సిన నీటిని తెచ్చేందుకు తన వ్యవసాయ బావిలోకి దిగాడు. బావిలో ఉన్న మోటర్ వైర్ తెగి నీటిలో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించని సతీశ్ నీటిని తీసుకుంటుండగా కరెంట్షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.చెరువులో పడి మహిళ..పిట్లం: ప్రమాదవశాత్తు చెరువులో పడి మహిళ మృతి చెందిన ఘటన పిట్లం మండలం కిష్టాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్నోళ్ల సత్యవ్వ(45) మంగళవారం ఉదయం 10 గంటలకు గ్రామ చెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లింది. ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడిపోవడంతో నీట మునిగి మృతి చెందింది. భర్త బాలరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.మద్నూర్: ట్రాక్టర్పై నుంచి పడి ఒకరు మృతి చెందిన ఘటన మద్నూర్ మండలం చిన్న ఎక్లార గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఇన్చార్జి ఎస్సై సాయన్న తెలిపిన వివరాల ప్రకారం.. మద్నూర్ మండలం మేనూర్ గ్రామానికి చెందిన దశరథ్(25) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. చిన్న ఎక్లార శివారులో ట్రాక్టర్పై మట్టిని తరలిస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ట్రాక్టర్ వెనుక చక్రాలు అతనిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.ట్రాక్టర్పై నుంచి పడి యువకుడు.. మరొకరికి తీవ్రగాయాలు -
ఘనంగా ప్రపంచ సోషల్ వర్క్ దినోత్సవం
భిక్కనూరు: తెలంగాణ యునివర్సీటీ సౌత్క్యాంపస్లో ప్రపంచ సోషల్ వర్క్ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి టి.నాగరాణి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సేవ కార్యక్రమాలపై దృష్టిసారించాలన్నారు. సమాజసేవతోనే గుర్తింపు వస్తుందన్నారు. తదుపరి రెడ్ క్రాస్ సంస్థ ఆద్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుధాకర్గౌడ్, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరీ, వార్డు సంస్థ డైరెక్టరర్ మల్లవరపు ప్రసాద్ అధ్యాపకులు యాలాద్రి నర్సయ్య, రమాదేవి, సబిత మోహన్బాబు, లలిత, హరిత ఏపీఆర్వో సరిత,నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మానవ అక్రమ రవాణాను నిర్మూలించాలి
కామారెడ్డి రూరల్: మానవ అక్రమ రవాణా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని మానవ అభివృద్ధి విభాగం డీపీఎం రమేష్బాబు అన్నారు. కామారెడ్డి మండల సమాఖ్య కార్యాలయంలో మానవ అక్రమ రవాణా నిరోధకపై జిల్లాలోని 8 మండలాల ఐకేపీ ఏపీఎంలకు, సీసీలకు మానవ అక్రమ రవాణా అంశంపై మంగళవారం శిక్షణ నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మానవ అక్రమ రవాణా ద్వారా లైంగిక దోపిడి, అవయవ దోపిడి, శ్రామిక దోపిడి, డ్రగ్స్ రవాణా లాంటి అసాంఘిక కార్యకలపాలపై తరుచూ ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలు, పోక్సో చట్టం, బీఎన్ఎస్ చట్టం, నివారణ చర్యలు చట్టాల పై అవగాహన, సైబర్ ఆధారిత అక్రమ రవాణా లైంగిక అక్రమ రవాణా చట్టాలపై అవగాహన కల్పించారు. శిక్షణ అనంతరం గ్రామాలలోని చిన్న సంఘాల సమావేశం లలో సభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీవో మురళీ కృష్ణ, ఏపీఎంలు ప్రసన్న రాణి, శ్రీనివాస్, గజాబింకర్ శ్రీనివాస్, రాజు, శిరీష, గంగాధర్, మోయిజ్, రామచంద్ర గౌడ్, ఎనిమిది మండలాల సీసీలు, టీవోటీలు రాజేందర్, జగదీష్ కుమార్, శ్రీనివాస్, అన్నపూర్ణ, గీత తదితరులు పాల్గొన్నారు. పాఠశాలకు ప్రింటర్ అందజేతగాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని పోతంగల్ కలాన్ జెడ్పీ ఉన్నత పాఠశాలకు బదిలీపై వెళ్లిన సైన్స్ ఉపాధ్యాయురాలు వేల్పుల గీత మంగళవారం ప్రింటర్ ను బహూకరించినట్లు హెచ్ఎం రంగారావు తెలిపారు. పాఠశాలలో మంగళవారం ఆమెకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామస్తులు పాల్గొన్నారు. పాఠశాలలో బెంచీల కోసం విరాళం బాన్సువాడ రూరల్: మండలంలోని బోర్లం జెడ్పీహైస్కూల్లో విద్యార్థులకు ఇనుప బెంచీల కోసం ఆపాఠశాల పూర్వవిద్యార్థులు విరాళాలు అందజేస్తున్నారు. మంగళవారం 2008–09 పదోతరగతి బ్యాచ్కు చెందిన విద్యార్థులు పలువురు రూ.10వేల ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ, మన్నె అనిల్, సయ్యద్ మెహరాజ్, వేణుగోపాల్రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ప్రసంగ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి
కామారెడ్డి టౌన్: విద్యార్థులు, యువత పలు కార్యక్రమాల వేదికలపై మాట్లాడేందుకు ప్రసంగ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని ఇంపాక్ట్ ట్రైనర్, ప్రముఖ మోటివేటర్ వజ్జ నవనీత తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్కే డిగ్రీ, పీజీ కళాశాలలో ఎఫెక్టీవ్ పబ్లిక్ స్పీచ్ అంశంపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఆత్మవిశ్వాసంతో మాట్లాడే పద్ధతులు, స్వర నిబంధన, శరీర భాష, ప్రేక్షకులను ఆకర్షించే విధానాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల సీఈవో జైపాల్రెడ్డి, ట్రైనర్ నారాపురం రాజు, జేసీఐ ఉపాధ్యక్షుడు మర్రి సదాశివరెడ్డి, ప్రిన్సిపల్ సైదయ్య, దత్తాద్రి, నవీన్కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. -
విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి
నస్రుల్లాబాద్(బాన్సువాడ)/దోమకొండ: విద్యార్థి దశలోనే విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. నెమ్లి గ్రామంలో మంగళవారం పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో ఆమె పాల్గొని విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించాలన్నారు. విద్యార్థుల నృత్యాలను చూసి అభినందించారు. ఆమె వెంట డీఈవో రాజు, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బాల్రాజు, ఎంఈవో చందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. దోమకొండ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా ఎంఈవో విజయ్ కుమార్ హాజరై మాట్లాడారు. పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు బాన్సువాడ రూరల్/లింగంపేట/ఎల్లారెడ్డిరూరల్/నాగిరెడ్డిపేట/సదాశివనగర్/మద్నూర్ : బాన్సువాడ మండలం కోనాపూర్ జెడ్పీహైస్కూల్లో, ఎల్లారెడ్డి మండలం కళ్యాణి జెడ్పీ పాఠశాలలో, నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద హైస్కూల్లో, సదాశివనగర్ మండలం ధర్మారావ్పేట్ ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం పదోతరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన డ్యాన్సులు ఆకట్టుకున్నాయి. మద్నూర్లోని బాలుర గురుకుల పాఠశాల, కళాశాల వార్షికోత్సవం నిర్వహించారు. లింగంపేట మండలం పొల్కంపేట బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో, ఎల్లారెడ్డి మండలం మల్లయ్యపల్లి ప్రాథమిక పాఠశాలలో మంగళవారం స్వయం పాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదవ తరగతి విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులుగా మారి కింది తరగతుల విద్యార్థులకు విద్యా బోధన చేశారు. -
కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు
కామారెడ్డి టౌన్/బాన్సువాడ : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం ముందు నాయకులు సంబురాలు జరుపుకున్నారు. బాన్సువాడలో అంబేడ్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డి చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేసి టపాసులు పేల్చారు. ఈ సందర్భంగా కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించినందుకు ప్రభుత్వానికి, సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సీఎం, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు చాట్ల రాజేశ్వర్, షేరు, కన్నయ్య, ఓబీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు ప్రవీణ్, నాయకులు సంపంగి, శంకర్, సాప శివరాములు, మల్లయ్య, రాజేష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించినందుకు.. -
ప్రతిపాదనలు పంపించాం
పెద్దకొడప్ల్(జుక్కల్): పంట చేతికొచ్చినా తెల్ల జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభంకాకపోవడంపై ‘దళారులే దిక్కు..!’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ మహేశ్ కుమార్ స్పందించారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, ఆదేశాలు అందగానే ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎంపీవో, సెక్రెటరీకి మెమోలు గాంధారి(ఎల్లారెడ్డి): జిల్లాలో తాగునీటి సమస్యలపై ‘సాక్షి’లో ‘గొంతు తడిసేదెలా?’ శీర్షికన ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. తాగు నీటి సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో గాంధారి ఎంపీవో లక్ష్మీనారాయణ, సోమ్లానాయక్ తండా పంచాయతీ కార్యదర్శి దేవీసింగ్కు కలెక్టర్ మెమోలు జారీ చేసినట్లు ఎంపీడీవో రాజేశ్వర్ తెలిపారు. సోమ్లానాయక్ తండాను అధికారులు సోమవారం సందర్శించి విచారణ చేపట్టారు. పరిస్థితులను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదికను అందజేశారు. -
వడదెబ్బ నివారణ చర్యలపై అవగాహన
భిక్కనూరు: మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రితో పాటు పలు చోట్ల వడ దెబ్బ తగులకుండా తీసుకోవాల్సిన చర్యలను ఎంపీహెచ్ఈవో వెంకటరమణ సోమవారం అవగాహన కల్పించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు బయట తిరగొద్దని సూచించారు. అలాగే ఎక్కడ పడితే అక్కడ నీటిని తాగవద్దని శుభ్రమైన నీరునే సేవించాలన్నారు. వాంతులు విరేచనాలు అయితే వెంటనే వైద్యసిబ్బందిని సంప్రదించాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లను వినియోగించే విధానంపై అవగాహన కల్పించారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపిక నిజాంసాగర్(జుక్కల్):టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి మహమ్మద్ నగర్ మండలం దూప్సింగ్ తండాకు చెందిన కొర్ర వెన్నెల ఎంపికై ంది. రాజన్న సిరిసిల్లా జోన్ పరిధిలో మహిళా విభాగంలో వెన్నెల 180 మార్కులతో మూడో ర్యాంక్ సాధించింది. ఈసందర్భంగా వెన్నెలను తండావాసులు అభినందించారు. రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి కామారెడ్డి టౌన్ : రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా పౌరసరఫరా శాఖ కార్యాలయంలో అధికారికి వినతిపత్రం అందజేశారు. ఇంకో 20 రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. తరుగు పేరిట అక్రమాలకు పాల్పడే రైస్మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ప్రకాష్, వసంత్ తదితరులున్నారు. ప్రత్యేకాధికారుల జాబితాలో మార్పులు కామారెడ్డి క్రైం: మండల ప్రత్యేకాధికారుల జాబితాలో మార్పులు చేస్తూ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని ఆరు మండలాలకు కొత్తగా ప్రత్యేకాధికారులను నియమించారు. జుక్కల్ మండలానికి జెడ్పీ సీఈవో చందర్, సదాశివనగర్కు భూగర్భ జల శాఖ ఏడీ సతీశ్యాదవ్, పాల్వంచకు జిల్లా మత్య్సశాఖ అధికారి శ్రీపతి, గాంధారికి డీపీవో మురళి, మాచారెడ్డికి మిషన్ భగీరథ ఈఈ డి రమేశ్, ఎల్లారెడ్డికి డీఎల్పీవో సురేందర్ను మండల ప్రత్యేకాధికారులుగా నియమించారు. నూతనంగా నియమితులైన ప్రత్యేకాధికారులు వారికి కేటాయించిన మండలాల్లో క్రమం తప్పకుండా పర్యటిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి మంగళ, శుక్ర వారాల్లో గ్రామాలను సందర్శించాలని సూచించారు. ప్రజాపాలన, తాగు నీరు, ఇందిరమ్మ ఇండ్లు, స్వచ్ఛదనం–పచ్చదనం, పారిశుధ్యం, హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, నర్సరీల నిర్వహణ తదితర ప్రభుత్వ కార్యక్రమాల అమలును పర్యవేక్షించాలని ఆదేశించారు. -
సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలి
మద్నూర్/బిచ్కుంద/నిజాంసాగర్/పెద్దకొడప్గల్(జుక్కల్): మద్నూర్ మండలం రాష్ట్ర సరిహద్దులో ఉండడంతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. మద్నూర్, నిజాంసాగర్, పెద్దకొడప్గల్ పోలీస్ స్టేషన్లను సోమవారం ఆయన తనిఖీ చేశారు. స్టేషన్లోని గదులను, సిబ్బంది క్వార్టర్లను ఎస్పీ పరిశీలించారు. ఆయా స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను ఆరా తీసి రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులతో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. న్యాయం త్వరగా జరిగేలా చూడాలన్నారు. రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తే అదుపులోకి తీసుకోని విచారించాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. పేకాట, అక్రమంగా మద్యం విక్రయిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పెద్దకొడప్గల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. అనంతరం మండలంలోని సలాబత్పూర్ వద్ద తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దును పరిశీలించారు. చిల్డ్రన్ ప్లే పార్క్ ప్రారంభించిన ఎస్పీ బిచ్కుంద పోలీస్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో ఎస్పీ రాజేష్ చంద్ర చిల్డ్రన్ ప్లే పార్క్ను ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ సందర్శించి రికార్డులు పరిశీలించి సమస్యలు, క్రైమ్ రికార్డుల వివరాలు తెలుసుకున్నారు. సరిహద్దులో ప్రత్యేక నిఘా ఉంచాలని, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన క ల్పించాలని సీఐ నరేష్కు సూచించారు. అనంతరం పొలీస్స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట బాన్సువాడ డీఎస్పీ సత్యానారాయణ, బిచ్కుంద సీఐ నరేష్, రూరల్ సీఐ రాజేశ్, ఎస్సైలు మోహన్రెడ్డి, శివకుమార్, ఏఎస్సై సుధాకర్, పోలీసు సిబ్బంది తదితరులున్నారు. పెట్రోలింగ్ ముమ్మరం చేయాలి ఎస్పీ రాజేశ్ చంద్ర ఆదేశం పలు పోలీస్స్టేషన్ల తనిఖీ -
వైభవంగా సిద్దరామేశ్వరస్వామి కల్యాణం
భిక్కనూరు : దక్షిణ కాశీగా పేరొందిన భిక్కనూరు సిద్దరామేశ్వరస్వామి కల్యాణాన్ని అర్చకులు సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వేదబ్రాహ్మణులు సిద్దగిరిశర్మ, రామగిరిశర్మ, రాజేశ్వరశర్మ, సిద్దెశ్ల ఆధ్వర్యంలో మాత భువనేశ్వరీదేవితో స్వామి వారి కల్యాణం కనులపండువగా జరిపారు. వేకువజామున వీరభద్ర స్వామి ఆలయం వద్ద తమ కొర్కెలు నెరవేరాలని భక్తులు అగ్నిగుండాలను తొక్కారు. ఆలయం ప్రధాన మండపంలో దక్షయజ్ఞం జరిపించారు. తదుపరి బాజభజంత్రీలతో ఆలయ పీఠాధిపతి సదాశివమహంత్ ఆలయం నుంచి శ్రీసిద్దగిరి సమాధి వద్దకు వచ్చి అక్కడ పూజా కార్యక్రమాలను నిర్వహించి కాషాయపతాకాన్ని ఎగురవేశారు. భక్తులకు హైకోర్టు న్యాయవా ది పెద్దబచ్చగారి రాంరెడ్డి–కృష్ణవేణి దంపతులు అన్నదానం చేశారు. ఈకార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషన్ శ్రీరాం రవీందర్, ఈవో శ్రీధర్తో, ఆలయ పునర్నిర్మాణకమిటీ చైర్మన్ అందే మహేందర్రెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ లింబాద్రి, మాజీ ఎంపీపీలు బల్యాల రేఖ సుదర్శన్, గాలిరెడ్డి, మాజీ సర్పంచ్లు నర్సింహరెడ్డి, తున్కివేణు, తదితరులు పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన భక్తులు భక్తి శ్రద్ధ్దలతో అగ్నిగుండాలు, కాషాయ పతాకావిష్కరణ -
భూమి కబ్జాకు యత్నిస్తున్నారు
గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తన భూమిని కబ్జా చేయడానికి యత్నిస్తున్నారనీ, వారి నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ పాల్వంచ మండలం భవానీపేట గ్రామానికి చెందిన గంగాని చిన్న నర్సింలు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించాడు. అతను మాట్లాడుతూ.. గ్రామ శివారులోని సర్వే నెంబరు 841 లో 2.37 ఎకరాల స్వంత భూమి ఉందన్నాడు. కొద్ది రోజులుగా అదే గ్రామానికి చెందిన కొందరు భూమి ఖాళీ చేయాలని బెదిరింపులకు పాల్పడటమే కాకుండా దాడులకు సైతం దిగుతున్నారని వాపోయాడు. చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరాడు. – గంగాని చిన్న నర్సింలు, భవానీపేట, పాల్వంచ మండలం -
పాత సీఎస్ఐ స్కూల్లో అగ్నిప్రమాదం
ఖలీల్వాడి: నగరంలో ని కంఠేశ్వర్లోని పాత సీఎస్ఐ స్కూల్లో సో మవారం ప్రమాదవ శాత్తు అగ్నిప్రమాదం జరిగింది. పాఠశాలలో ని స్టోర్రూం నుంచి అ కస్మాత్తుగా మంటలు రావడంతో స్థానికులు అగ్నిమాపకశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేసినట్లు అగ్నిమాపకశాఖ అధికారి నర్సింగ్రావు తెలిపారు. పేకాడుతున్న నలుగురి అరెస్టు మాచారెడ్డి: పాల్వంచ మండల కేంద్రంలోని పేకాట స్థావరంపై సోమవారం పోలీసులు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేయగా పేకాడుతున్న నలుగురిని పట్టుకున్నట్లు ఎస్సై అనిల్ తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి రూ.3338 నగదు, నాలుగు సెల్ఫోన్లు, రెండు బైక్లు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
ఆభరణాలు ఎత్తుకెళ్లిన నిందితుల రిమాండ్
నిజాంసాగర్(జుక్కల్): మహిళను నమ్మించి నగలు ఎత్తుకు వెళ్లిన ఆటో డ్రైవర్ సుందర్రాజుతోపాటు వడ్డే లక్ష్మిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు బాన్సువాడ రూరల్ సీఐ రాజేష్ సోమవారం తెలిపారు. వివరాలు ఇలా.. సంగారెడ్డి జిల్లా మార్డి గ్రామానికి చెందిన మ్యాతరి భూమవ్వ ఆదివారం అచ్చంపేట వెళ్లడానికి నిజాంసాగర్ బస్టాండ్ సమీపంలోని రోడ్డుపై నిల్చుంది. ఆటోలో వచ్చిన సుందర్రాజుతోపాటు వడ్డె లక్ష్మి కలిసి భూమవ్వను అచ్చంపేటకు తీసుకెళ్తామని నమ్మించి ఆటోలో ఎక్కించుకున్నారు. నిర్మానుష్య ప్రదేశంలో ఇద్దరు కలిసి భూమవ్వ మెడలోని రెండు తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకువెళ్లారు. సోమవారం బొగ్గు గుడిసె చౌరస్తా వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆటో డ్రైవర్ పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. వారిని విచారించగా భూమవ్వ వద్ద చోరీకి పాల్పడినట్లు తెలిపారు. వెంటనే వారి వద్ద నుంచి పోలీసులు ఆభరణాలను స్వాధీనం చేసుకొని, వారిని రిమాండ్కు తరలించామని సీఐ తెలిపారు. నిజాంసాగర్ ఎస్సై శివకుమార్, కానిస్టేబుళ్లు శ్యామ్, మహేష్లను సీఐ అభినందించారు. -
ఆవుల యజమానులపై ఫిర్యాదు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రానికి చెందిన ఆవుల యజమానులపై లింగంపేట పోలీస్ స్టేషన్లో సోమవారం స్థానిక రైతులు ఫిర్యాదు చేశారు. ఆవుల యజమానులు వారి పశువులను ఇష్టానునుసారంగా వదిలేయడంతో పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు తెలిపారు. దీంతో పంటను నష్టపోతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈక్రమంలో ఆవుల యజమానులు చేపూరి కృష్ణమూర్తి, శెట్పల్లి రాములు, మంగళి విఠల్, పోతపల్లి సాయిలుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతులు వెంకట్గౌడ్, గురుప్రసాద్, లక్ష్మన్, సాయిలు, ఆలియా, కాశీరాం, బాలయ్య తదితరులు ఉన్నారు. -
ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆయా శాఖల అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 145 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో భూ సంబంధిత, డబుల్ బెడ్రూం ఇండ్లు, పించన్ లకు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఫిర్యాదులను పెండింగ్లో ఉంచొద్దన్నారు. తీసుకున్న చర్యలకు సంబంధించిన సమాచారాన్ని ఫిర్యాదుదారునికి తప్పనిసరిగా అందజేయాలన్నారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ, జెడ్పీ సీఈవో చందర్, ఏవో మస్రూర్ అహ్మద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజావాణికి 145 ఫిర్యాదులు -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా
మద్నూర్(జుక్కల్)/లింగంపేట(ఎల్లారెడ్డి) : మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం, పాఠశాల వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో సరస్వతి మాత చిత్రపటానికి పూల మాలలు వేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల నోడల్ అధికారి మల్లేశం మాట్లాడారు. అలాగే లింగంపేట మండలం శెట్పల్లి ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా గడిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. హెచ్ఎంలు నాగ్నాథ్, వసుధ, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. -
ఇష్టపడి చదివితే మంచి మార్కులు
భిక్కనూరు: విద్యార్థులు చదువును కష్టం అనుకోకుండా ఇష్టపడి చదివితే మంచి మార్కులు సాధించవచ్చని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంధ్రకాంత్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని జంగంపల్లిలో కస్తూర్బా పాఠశాలతో పాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో రాజ్గంగారెడ్డి, హెచ్ఎం రాజేంద్రప్రసాద్, కేజీబీవీ ఎస్వో హరిప్రియ, మాజీ ఎంపీపీ గాలిరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ స్వామి కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యాక్షులు లింగారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మమత, నాయకులు మూర్తి ప్రకాశ్గౌడ్, రామస్వామి,బాబు, ఆమీర్, నర్సింలు పాల్గొన్నారు. పరీక్ష సామగ్రి వితరణ బీబీపేట/నిజాంసాగర్/తాడ్వాయి/కామారెడ్డి రూరల్/పిట్లం/మాచారెడ్డి/బాన్సువాడ రూరల్ : బీబీపేట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినులకు అదే గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ శ్రీగాధ శంకర్ పరీక్షల సామగ్రి వితరణ చేశారు. జుక్కల్ మండలం పెద్ద ఎడ్గి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు జుక్కల్ యూత్ ఫోరం ఆధ్వర్యంలో, తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్ ఉన్నతపాఠశాలలో కాంప్లెక్స్ హెచ్ఎం సంగారెడ్డి ఆధ్వర్యంలో, కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ జెడ్పీపాఠశాలలో సేవా భారతి ఆధ్వర్యంలో, పిట్లం మండలం చిన్నకొడప్గల్ జెడ్పీ పాఠశాలలో లయన్స్ క్లబ్, మాచారెడ్డి మండలంలోని సోమారంపేట ఉన్నత పాఠశాలలో బంజారా టైగర్స్ స్వచ్ఛంద సంస్థ, పాల్వంచ మండలం భవానీపేట ఉన్నత పాఠశాలలో మాజీ ఉపసర్పంచ్ రమేశ్గౌడ్ ఆధ్వర్యంలో, బాన్సువాడ మండలం చిన్న రాంపూర్ జెడ్పీ హైస్కూల్లో హెచ్ఎం వీరప్ప పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, కంపాక్స్ బాక్స్లు అందజేశారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల అందజేత -
అసెంబ్లీలో గొంతెత్తిన జిల్లా ఎమ్మెల్యేలు
నాగిరెడ్డిపేట/కామారెడ్డి టౌన్: జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సోమవారం అసెంబ్లీలో పలు అంశాలపై మాట్లాడారు. ఎల్లారెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యేలు మదన్మోహన్రావు, కాటిపల్లి వెంకటరమణారెడ్డి వివిధ అంశాలను లేవనెత్తారు. పర్యాటకంగా అభివృద్ధి చేయాలి ఎల్లారెడ్డిని పర్యాటకంగా అభివృద్ధి చేయా లని ఎమ్మెల్యే మదన్మోహన్రావు కోరారు. నాగిరెడ్డిపేట, లింగంపేట, తాడ్వాయి, రా మారెడ్డి మండలాల్లోని పర్యాటకప్రాంతాలతోపాటు పలు దేవస్థానాల గురించి వివరించారు. పోచారం ప్రాజెక్టుతోపాటు అక్కడే ఉన్న నిజాంకాలంనాటి అతిథిగృహాలను, పోచారం అభయారణ్యాన్ని ఎకో టూరిజంగా అభివృద్ధి చేయాలని కోరారు. అలాగే త్రిలింగేశ్వర, కాలభైరవస్వామి, భీమేశ్వరాలయాల వద్ద సౌకర్యాలు కల్పించాలని, నాగన్నబావిని పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందిస్తూ నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు, నాగన్న బావి అభివృద్ధి చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని సమాధానమిచ్చారు. ఎమ్మెల్యేగా చెప్పినా పనులు కావడం లేదు ఎమ్మెల్యేగా తాను చె ప్పినా కామారెడ్డి ని యోజకవర్గంలో పను లు కావడం లేదని కాటి పల్లి వెంకటరమణారె డ్డి సభలో వాపోయా రు. ఓడిపోయి వారు చె ప్పిన వాటికి మాత్రం నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు. తాను రాష్ట్ర ప్రభుత్వానికి 84 ప్రశ్నలు అడిగితే ఇప్పటివరకు కనీసం 9శాతం ప్రశ్నలకు కూడా జవాబు చెప్పలేదన్నారు. అధికారులు వచ్చి తన ఎదురుగా నిలబడాలని కోరుకోవడం లేదని, రాజకీయాల్లో హుందాగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. -
కదిలిన అధికార యంత్రాంగం
నాగిరెడ్డిపేట/గాంధారి(ఎల్లారెడ్డి): జిల్లాలో తాగునీటి సమస్యపై ‘సాక్షి’లో సోమవారం గ్రౌండ్ రిపోర్ట్ ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు వెళ్లి సమస్య తీవ్రతను తెలుసుకున్నారు. నాగిరెడ్డిపేట మండలకేంద్రం గోపాల్పేటలోని ఎస్సీ కాలనీని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాజ్కుమార్, పంచాయతీ కార్యదర్శి కిష్టయ్య సందర్శించారు. కాలనీకి మిషన్ భగీరథ నీరు సరఫరా చేసే పైప్లైన్లో సమస్య ఉందని, రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామన్నారు. గాంధారి మండలం సోమ్లానాయక్ తండాను డీపీవో మురళి, ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్, డీఎల్పీవో సురేందర్, తహసీల్దార్ సతీశ్రెడ్డి, ఎంపీడీవో రాజేశ్వర్ సందర్శించారు. తండా శివారులోని వ్యవసాయ బావిని పరిశీలించి తాగు నీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బోరు వేయిస్తామని అప్పటి వరకు ట్యాంకర్తో నీరు సరఫరా చేస్తామన్నారు. తమ సమస్యను త్వరగా పరిష్కరించాలని తండావాసులు అధికారులను కోరారు.సోమ్లానాయక్ తండాలో సమస్యను పరిష్కరిస్తాంకామారెడ్డి క్రైం: గాంధారి మండలం సోమ్లానాయక్ తండాలో నీటి సమస్య లేకుండా సమస్యను పరిష్కరిస్తామని మిషన్ భగీరథ ఎస్ఈ రాజేంద్ర కుమార్ అన్నారు. ఈమేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తండాలో 310 జనాభాకుగాను 68 నీటి కుళాయి కనెక్షన్లు, 20 వేల లీటర్ల సామర్ధ్యం కలిగిన మంచి నీటి ట్యాంకు ఉన్నాయని తెలిపారు. సింగిల్ ఫేజ్ మోటారు ద్వారా నీటి సరఫరా అవుతోందని, బోరు బావిలో నీరు అడుగంటి సమస్య తలెత్తిందని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ’సాక్షి‘ గ్రౌండ్ రిపోర్ట్కు స్పందన పలు గ్రామాలను సందర్శించిన అధికారులు నీటి సరఫరా, ఎద్దడి సమస్యలను పరిష్కరిస్తామని హామీ -
నస్రుల్లాబాద్లో ఒకరి ఆత్మహత్య
నస్రుల్లాబాద్(బాన్సువాడ): బాన్సువాడకు చెందిన ఓ వ్యక్తి నస్రుల్లాబాద్ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. నస్రుల్లాబాద్ చెరువులో సోమవారం ఓ వ్యక్తి మృతదేహం కనబడటంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు బాన్సువాడ గ్రామానికి చెందిన కొత్తకొండ శ్రీనివాస్(53)గా గుర్తించారు. శ్రీనివాస్ విరిగిన కాలు తీవ్రంగా నొప్పి రావడంతో నిత్యం బాధపడేవాడు. ఈక్రమంలో ఈనెల 14న ఇంటి నుంచి బయటకు వెళ్లి, తిరిగి రాలేడు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. కాలు నొప్పి భరించలేకనే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని భార్య అనిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
తండ్రిని హతమార్చిన తనయుడు
ధర్పల్లి: తన అవసరాలకు డబ్బులు ఇవ్వడం లేదని కన్న తండ్రిని కొడుకు హతమార్చిన ఘటన ధర్పల్లి మండలంలో చోటుచేసుకుంది. తల్లి సైతం కొడుకుకు సహకరించడంతో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ధర్పల్లి సీఐ భిక్షపతి, ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని హొన్నాజీపెట్ గ్రామానికి చెందిన పాలెం చిన్న మల్లయ్య (65)కు భార్య లక్ష్మి, కొడుకు మధు ఉన్నారు. మల్లయ్య తనకున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ, ఆవుల కాపరిగా జీవనం కొనసాగిస్తున్నారు. కొడుకు వివాహం జరుగగా, పొలం పనులు చేసుకుంటు ఉండేవాడు. డబ్బుల విషయంలో మల్లయ్యతో లక్ష్మి, కొడుకు మధు తరచూ గొడవపడేవారు. శనివారం రాత్రి గ్రామంలో ని ఒక కిరాణా దుకాణం వద్ద తనకు డబ్బులు కావాలని కొడుకు, తండ్రితో గొడవకు దిగగా, స్థానికులు సర్ధిచెప్పారు. కానీ కోపం పెంచుకున్న కొడుకు తండ్రిని చంపాలని నిర్ణయించుకొని, బీరు సీసాతో ఇంటికి వెళ్లాడు. గొడవ విషయాన్ని తల్లికి చెప్పడంతో ఇద్దరు కలిసి మల్లయ్యతో గొడవకు దిగారు. తల్లి, కొడుకు ఇద్దరు కలిసి మల్లయ్య గొంతు పట్టుకొని కిందకు పడేశారు. వెంటనే మధు, మల్లయ్యపై సీసాతో దాడి చేశారు ఈ క్రమంలో మల్లయ్య తలకు గాయమై, రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని నిందితులను ఆదివారం రిమాండ్ కు తరలించారు. సహకరించిన తల్లి డబ్బులు ఇవ్వడం లేదని ఘాతుకానికి పాల్పడ్డ నిందితులు -
పేదల సొంతింటి కల నెరవేరుతోంది
బిచ్కుంద(జుక్కల్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేదలకు సొంతింటి కల నెరవేరుతుందని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. ఆదివారం గుండెకల్లూర్లో ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం మొగ్గువేసి పనులు ప్రారంభించారు. అలాగే సీసీ రోడ్డు పనులు, కొత్త రేషన్ షాపును ప్రారంభించారు. లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తానని నియోజక వర్గంలో ఒక్కటీ ఇవ్వలేదన్నారు. జుక్కల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తానన్నారు. దశల వారిగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు విఠల్రెడ్డి, రాజు పటేల్, దడ్గి నాగ్నాథ్, పార్టీ అధ్యక్షుడు గంగాధర్, నాగ్నాథ్ పటేల్, తహసీల్దార్ నరేష్ పాల్గొన్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం మద్నూర్(జుక్కల్): మండలంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతా రావు అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం రూ. 50 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జుక్కల్ నియోజకవర్గ రూపురేఖలు మారుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు దరాస్ సాయిలు, నాయకులు సాయి పటేల్, హన్మండ్లు స్వామి, ప్రజ్ఞకుమార్ తదితరులున్నారు. సీసీ రోడ్లతో గ్రామాలకు మహర్దశ నిజంసాగర్ (జుక్కల్): సిమెంట్ రోడ్ల నిర్మాణంతో గిరిజన తండాలు, గ్రామ పంచాయతీలు మహర్దశను సంతరించుకుంటున్నాయని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. ఆదివారం జుక్కల్ మండల కేంద్రంలో సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామం, గిరిజన తండాలకు సిమెంట్ రోడ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ దేశాయ్, సాయా గౌడ్ తదితరులున్నారు. ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం భూమి పూజ -
సాహిత్యంలో రాణిస్తున్న చుక్కాపూర్వాసి
మాచారెడ్డి: మండలంలోని చుక్కాపూర్ గ్రామానికి చెందిన కందాళ పద్మావతి వచన కవితలు, కథనాలు రాసి సాహితీరంగంలో రాణిస్తున్నారు. ఆమె రచించిన 55 కవితలతో కూడిన ‘హది స్వప్నం’ అనే పుస్తకాన్ని ఇటీవల హైదరాబాద్లోని త్యాగరాయ గాన సభలో ఆవిష్కరించారు. పద్మావతికి చుక్కాపూర్ గ్రామానికి చెందిన వేల్పూరి నరసింహచారితో వివాహమైంది. పదో తరగతి నుంచే ఆమెకు చిన్న కవితలు రాయడం ప్రారంభించింది. పెళ్లయిన 20 ఏళ్లకు కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో ఇంటర్, డిగ్రీ, తెలుగు పండిట్ కోర్సు పూర్తి చేసి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ రచనపై దృష్టి సారించింది. సామాజిక స్పృహ, సమానత్వం, మహిళాభ్యుదయం భావాలతో కవితలు రాస్తుంది. ఆమె రాసిన కవితలకు పలు బహుమతులతో పాటు ఎన్నో అవార్డులు లభించాయి. స్వర్గీయ సినారె చేతుల మీదుగా పలు ప్రశంసలు, అవార్డులు అందుకున్నారు. పద్మావతి అందరి మన్ననలను పొందుతోంది. డ్రెయినేజీ పాలవుతున్న సాగునీరు నస్రుల్లాబాద్(బాన్సువాడ) : మండలంలోని నాచుపల్లి గ్రామంలో సాగు నీరు మురికి కా లువ పాలవుతుంది. పలు చోట్ల సాగు నీరు అందక పంట పొలాలు బీటలు వారుతున్నా యి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నా రు. అధికారులు స్పందించి వృథాగా పోతున్న నీటిని అరికట్టాలని రైతులు కోరుతున్నారు. ఎమ్మార్పీఎస్ నిరసనలు ఎల్లారెడ్డిరూరల్ : ఎస్సీ వర్గీకరణలో భాగంగా జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు. పట్టణంలోని తెలంగాణ తల్లి ప్రాంగణంలో నిర్వహిస్తున్న దీక్షలు ఆదివారంతో ఐదో రోజుకు చేరాయి. రిజర్వేషన్లు అమలు అనంతరం ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పద్మారావు, శివానందం, సామెల్ తదితరులున్నారు. ఎమ్మెల్యే సహకారంతో బోరు మోటారు భిక్కనూరు: మండలంలోని తిప్పాపూర్ గ్రామంలోని నాలుగో వార్డులో ఎమ్మెల్యే కేవీఆర్ సహకారంతో నీటి ఎద్దడిని నివారించినట్లు బీజేవైఎం జిల్లాకార్యదర్శి పైడి రాజశేఖర్రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే నిధులతో బోరును తవ్వించి, మోటారు పంపును బిగింపజేశామన్నారు. ఆదివారం పూజ కార్యక్రమాలను నిర్వహించి బోరుమోటర్ను ప్రారంభించారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోరా..? కామారెడ్డి అర్బన్: పట్టణ పరిధిలోని కాకతీయనగర్ 35వ వార్డు రోడ్డు నంబర్ –8లో మురికికాలువను మట్టితో మూసివేశారు. దీంతో ఖా ళీ ప్లాట్లలోకి మురుగునీరు చేరి దోమలు వస్తున్నాయని, దుర్గంధం వ్యాపిస్తున్నట్టు గతనెల 22న మున్సిపల్లో కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. అధికారులు పట్టించుకోవడంలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. నేడు ఇసుక డంపుల వేలం నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని మర్పల్లి గ్రామంలో సీజ్ చేసిన ఇసుక డంపులకు సోమవారం వేలంపాట నిర్వహించనున్నట్లు తహసీల్దార్ భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. మండలానికి సంబంధించిన వ్యక్తులు వేలంలో పాల్గొనాలని ఆయన కోరారు. -
మక్కల ట్రాక్టర్ బోల్తా
బాల్కొండ: ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన రైతు అమ్మక్కపేట్ కిషన్ మక్కల లోడ్తో ట్రాక్టర్ను చేనులో నుంచి కల్లాం వద్దకు తీసుకొస్తుండగా మార్గమధ్యలో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో రైతుకు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ మక్కలు వరి పొలంలో పడటంతో నీటిపాలయ్యాయి. పొక్లెయిన్ సహాయంతో ట్రాక్టర్ను పంట పొలాల నుంచి బయటకు తీశారు. ఇసుక టిప్పర్, పొక్లెయిన్ సీజ్ ఆర్మూర్టౌన్: ఆలూర్ మండలం దేగాం గ్రామ శివారులోని వాగు నుంచి ఇసుకను తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ ఆదివారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించగా పొక్లెయిన్తోపాటు టిప్పర్ను సీజ్ చేశామన్నారు. అలాగే ముగ్గురిపై కేసు నమోదు చేశామన్నారు. -
28 ఏళ్లకు కలుసుకున్న మిత్రులు
కామారెడ్డి రూరల్: చిన్నతనంలో కలిసి చదువుకున్న మిత్రులు 28ఏళ్ల తర్వాత కలుసుకున్న అపూర్వ ఘట్టం మండలంలోని దేవునిపల్లిలో చోటుచేసుకుంది. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి జి ల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1997–98 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఏళ్ల తర్వాత కలుసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆనాడు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం వారంతా సహపంక్తి భోజనాలు చేశారు. పడకల్లో 25 ఏళ్ల తర్వాత.. జక్రాన్పల్లి: మండలంలోని పడకల్ జిల్లా పరిషత్ ఉ న్నత పాఠశాల 1999–2000 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు స్థానిక మున్నూరుకాపు సంఘ భవనంలో ఆ త్మీయ సమ్మేళనం నిర్వహించారు. విద్యార్థులు ఒకరినొకరు కలుసుకొని చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలాగే అదే పాఠశాలకు చెందిన 2011–12 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు బడిలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆనాటి టీచర్లు గోపాలకృష్ణ, స్వామి, జెడ్పి సింధూర, ప్రసాద్, మమతలను పూర్వ విద్యార్థులు సత్కరించారు. -
గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
బాన్సువాడ రూరల్: నిజాంసాగర్ ప్రధాన కాలువలో గల్లంతైన సంగ్రాం తండాకు చెందిన యువకుడు సిద్ధార్థ (19) మృతదేహం ఆదివారం లభ్యమైంది. బాన్సువాడ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. శనివారం సిద్ధార్థ, అన్న వరుసయ్యే రాజు ఇద్దరు కలిసి బైక్పై తండాకు వస్తుండగా మార్గమధ్యలో కాలువ వద్ద ఆగారు. రాజు కాలువలోకి దిగి కాళ్లుచేతులు కడుగుతుండగా నీటిలో పడిపోయాడు. రాజును రక్షించే క్రమంలో సిద్ధార్థ కాలువలో జారిపోగ స్థానికులు గమనించిన రాజును రక్షించారు. కానీ సిద్ధార్థ నీటిప్రవాహంలో కొట్టుకుపోయి మృతిచెందినట్లు తండాపెద్దలు సంగ్రాం నాయక్ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువకుడి ఆత్మహత్యాయత్నం ● గోదావరిలో దూకుతుండగా అడ్డుకున్న పోలీసులు నవీపేట: ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకొని కాపాడారు. వివరాలు ఇలా.. జిల్లా కేంద్రంలోని శివాజీనగర్ కాలనీకి చెందిన బయ్యాని వంశీకృష్ణ(30) వడ్రంగి పని చేస్తూ జీవించేవాడు. ఇటీవల ఇంట్లో కుటుంబ సభ్యులతో జరిగిన ఘర్షణతో అతడు తీవ్ర మనస్థాపం చెందాడు. ఆదివారం గోదావరి నదిలో దూకి చనిపోతానని కుటుంబ సభ్యులను బెదిరించి ఇంట్లోను వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని వారు నవీపేట పోలీసులకు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మండలంలోని యంచ శివారులోగల గోదావరి బ్రిడ్జిపై నడుచుకుంటూ నదిలో దూకేందుకు య త్నించిన యువకుడిని అడ్డుకున్నారు. కౌన్సెలింగ్ చేసి అతడిని తల్లిదండ్రులకు అప్పగించారు. -
సిబ్బందిపై నిఘా పెట్టేదెవరు?
నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అతి కీలకమైన మున్సిపల్ హెల్త్ ఆఫీసర్(ఎంహెచ్వో) పోస్టు రెండేళ్లుగా ఖాళీగా ఉంది. దీంతో కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో నగరంలో పారిశుధ్య పనులు, తనిఖీలు సరిగా చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పరిస్థితి.. నగరంలోని ఐదు జోన్లకు గాను ఐదుగురు శానిటరీ ఇన్స్పెక్టర్లున్నారు.వీరిపై శానిటరీ సూపర్వైజర్, ఆ యనపై ఎంహెచ్వో పర్యవేక్షణ ఉండాలి. కానీ పారిశుధ్య పనులు కేవలం శానిటరీ ఇన్స్పెక్టర్లు మాత్ర మే చూస్తున్నారు. కానీ పైఅధికారి లేకపోవడంతో వారు విధుల్లో తీవ్ర అలసత్వం వహిస్తున్నారు. నగరంలో ప్రతిరోజు 300 మెట్రిక్ టన్నుల చెత్త తయారవుతోంది. ఈ చెత్తను ఇంటింటి నుంచి సేకరించడం, మున్సిపల్ వాహనాల్లో తరలించడం, కూడళ్లలో వేసిన చెత్తను తొలగించడం వంటి నిత్య ప్రక్రియలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. డ్రైనేజీలు చెత్త, మురికినీటితో నిండిపోయాయి. అలాగే రెగ్యులర్ ఉద్యోగులు రాకున్నా వారికి హాజరువేసి వారి వద్దనుంచి నెలనెలా వసూళ్లకు పాల్పడుతున్నారు. అయినా వీరిపై అధికారులు నిఘా ఉంచడం లేదు. తనిఖీలు కరువు.. నగరంలో 200 వరకు ఫుట్పాత్ల మీదనే హోటళ్లు, దుకాణాలు నిర్వహిస్తున్నారు. నాణ్యతలేని సరుకు లు వాడటంతోపాటు అపరిశుభ్రంగా ఉన్న స్థలాల్లో తినుబండారాలు విక్రయించడంతో నగరవాసులు అనారోగ్యం పాలవుతున్నారు. అయినా వీరిపై ఎ లాంటి తనిఖీలు లేవు. టిఫిన్సెంటర్ల వద్ద ప్రతీనెల సిబ్బంది మాముళ్లు వసూలు చేసినా పట్టించుకునేవారు లేదు. పాలిథిన్ బ్యాగ్లపై నిషేదం ఉన్నా కిరాణదుకాణాలు, టిఫిన్సెంటర్లు, కూరగాయలు, పండ్ల వర్తకుల వద్ద తనిఖీలు చేయడం లేదు. కొందరు శానిటరీ ఇన్స్పెక్టర్లు ట్రేడ్ లైసెన్స్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎంహెచ్వో పోస్టు భర్తీ చేస్తే బల్దియా సిబ్బందిపై నిఘా ఉంచి, అందరూ సక్రమంగా విధుల నిర్వహించేలా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి బల్దియాలో ఎంహెచ్వో పోస్టును భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు. బల్దియా కార్యాలయం నిజామాబాద్ బల్దియాలో ఎంహెచ్వో పోస్టు ఖాళీ రెండేళ్లుగా భర్తీ చేయని అధికారులు నియంత్రణ లేక ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బందిత్వరలో నియమిస్తాం బల్దియాలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంహెచ్వో పోస్టు కూడా ఖాళీగా ఉంది. సీడీఎంఏకు తెలియజేశాం. డిప్యూటీ కమిషనర్ అదనపు బాధ్యతలు చూస్తున్నారు. ప్రతిరోజు ఉదయం నేను తనిఖీలు నిర్వహిస్తున్న. నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిని హెచ్చరిస్తున్నా. –దిలీప్కుమార్, మున్సిపల్ కమిషనర్ అధికారులు పట్టించుకోవడం లేదు మా ఇంటిముందు డ్రెయినేజీ లు నిండిపోయి మురికినీరు రో డ్డుమీద పారుతోంది. మున్సిప ల్ అధికారులకు ఎన్నిసార్లు చె ప్పినా పనులు చేయడం లేదు. నగరంలో పారిశుధ్య వ్య వస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఉన్నతాధికారులు సంబంధిత అధికారిని నియమిస్తే సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంది. –శ్రీనివాస్, జవహర్ రోడ్డు వాసి -
ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కృషి చేయాలి
బీబీపేట: రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను ఇస్సానగర్ గ్రామ మాజీ సర్పంచ్ పొట్టి గారి పొట్టయ్య, గ్రామ నేతలు కలిసి కోరారు. అనంతరం వెంకటయ్యను వారు సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ అధికారుల వద్ద ఎస్సీ, ఎస్టీ మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులకు ప్రభుత్వ ఆఫీసులలో గుర్తింపు లేదని వారు ఆయనకు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, బాబు, జోగు సురేష్, ప్రశాంత్, చిన్న బాబు, కమలాకర్ తదితరులున్నారు. -
సమాజ పరివర్తనకు ‘సంఘ్’ కృషి
● ధర్మ రక్షణ కోసం శక్తిమంతులుగా తయారవ్వాలి ● దక్షిణ మధ్య క్షేత్ర ధర్మజాగరణ ప్రముఖ్ అమర లింగన్న ● ఘనంగా ఇందూరు నగర శాఖల సమ్మేళనంసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే హిందూ సమాజానికి శ్రేయస్సు అని, సమాజ పరివర్తనే స్వయం సేవక్ల బాధ్యత అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దక్షిణ మధ్య క్షేత్ర ధర్మజాగరణ ప్రముఖ్ అమర లింగన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఆదివారం ఇందూరు నగర శాఖ ఆధ్వర్యంలో 56 శాఖల సంగమం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రధాన వక్తగా లింగన్న హాజరై ప్రసంగించారు. కుటుంబ వ్యవస్థ మనచేతిలోనే ఉందని, కుటుంబం నుంచే భావి పౌరులకు జీవన విలువలు తెలపాలని అన్నారు. హిందూ సమాజాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఉద్భవించిన కలియుగ ప్రత్యేక అవతారం ఆర్ఎస్ఎస్ అన్నారు. ధర్మాన్ని కాపాడుకోవాలంటే శక్తిమంతంగా తయారు కావాలని, హిందువులందరూ సంఘటితంగా ఉంటేనే శక్తి సముపార్జన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. భారతదేశంలో బ్రిటిష్ వాడు సృష్టించిన హిందువుల్లోని ఓ వర్గం విభజనవాదం చేస్తోందని విమర్శించారు. కమ్యూనిస్టులు చీడపురుగుల్లా తయారయ్యారని, అన్నిమతాలు సమానమని చెబుతూనే మతమార్పిడులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. హిందువులను మైనారిటీలుగా చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. గిరిజనులు, బంజారాలు, లింగాయత్లలో తాము హిందువులం కాదనే భావనను సృష్టిస్తున్నారన్నారు. ఇలాంటి కుట్రలకు ఫండింగ్ చేస్తున్న దొంగలెవరో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు.బానిసత్వంలోకి నెట్టారు.. మహాపురుషులకు కొదువ లేని భారతదేశం కొందరి స్వార్థం, కుట్రల కారణంగా ఆత్మన్యూనత, అనైక్యతలకులోనై బానిసత్వంలోకి నెట్టబడిందని అమర లింగన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డాక్టర్ హెడ్గేవార్ భారత్ను మళ్లీ గురుస్థానంలోకి తీసుకొచ్చేందుకు స్వాతంత్రోద్యమం చేస్తూనే ఆర్ఎస్ఎస్ను స్థాపించారన్నారు. హిందువుల్లో సమైక్యత నిర్మాణం కోసం కృషి చేశారని, ప్రతిరోజూ హిందువులు కలిసేలా సఫలపూరిత కార్యపద్ధతి నెలకొల్పారన్నారు. సమయపాలన, ఆజ్ఞాపాలన విషయమై పుస్తకాలు రాయలేదని, హెడ్గేవార్ ఆచరించి చూపారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నగర కార్యవాహ అర్గుల సత్యం, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారితోపాటు స్వయం సేవక్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
బైక్, కంటెయినర్ను ఢీకొన్న కారు
● ఒకరి మృతి, నలుగురికి గాయాలు ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఓ కారు అతివేగంగా వచ్చి బైక్, కంటెయినర్ను ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా నలుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఉత్తర ప్రదేశ్కు చెందిన ఇషాద్, కర్ణల్ ఉపాధి నిమిత్తం భీమ్గల్కు వచ్చారు. తమ స్నేహితులు ఆర్మూర్ నుంచి యూపీకి వెళుతుండగా కలవాలనుకున్నారు. దీంతో శనివారం రాత్రి ఇద్దరు కలిసి బైక్పై బయలుదేరగా, మార్గమధ్యలో పెర్కిట్లో ఉన్న మరో స్నేహితుడు మనీష్ను ఎక్కించుకుని వెళ్లారు. ఆర్మూర్లోని హైవే పైగల మహిళా ప్రాంగణం వద్ద వీరి బైక్ను ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. అనంతరం ఆగిఉన్న కంటెయినర్ను ఢీకొట్టింది. ఈఘటనలో ఇషాద్ అక్కడికక్కడే మృతిచెందగా బైక్పై ఉన్న మరో ఇద్దరు కర్ణల్, మనీష్, కారులోని రాహుల్, గణేష్లు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతదేహాన్ని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.మృతుడి బావ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. -
రెండు ఆలయాల్లో చోరీ
వర్ని: మండలంలోని జలాల్పూర్ గ్రామంలోగల మల్లికార్జునస్వామి, కృష్ణ దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తి శనివారం రాత్రి చోరీకి పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు చోరీని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దుండగుడు ఐదు తులాల బంగారం, 25 తులాల వెండి, హుండీలోని నగదును ఎత్తుకెళ్లాడు. సీసీ కెమెరా ఫుటేజీలో నిందితుడి దృశ్యం రికార్డయింది. గ్రామస్తులు వర్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్.. రుద్రూర్: కోటగిరి మండలం కొత్తపల్లి శివారులో ట్రాన్స్ఫార్మర్ నుంచి గుర్తుతెలియని దుండగులు కాపర్ కాయిల్స్ను ఎత్తుకెళ్లారు. పొలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను దుండగులు కిందపడవేసి అందులోని కాపర్ కాయిల్స్ దొంగిలించారు. ఘటనపై విద్యుత్ అధికారులకు సమాచారం అందించినట్టు రైతులు ఆదివారం తెలిపారు. పోతంగల్లో బైక్.. రుద్రూర్: పోతంగల్ మండల కేంద్రంలో బైక్ను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. వివరాలు ఇలా.. పోతంగల్లోని ఆబాది బీసీ కాలనీలోగల కిరాణ షాపు వద్ద రెండు రోజుల క్రితం ఇందూర్ గంగాధర్ తన బైక్ను నిలిపాడు. దుకాణంలోకి వెళ్లివచ్చేసరికి దుండగులు బైక్ను చోరీ చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు ఆదివారం తెలిపారు. -
కేటీఆర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి
కామారెడ్డి టౌన్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, జగదీశ్రెడ్డిల శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయాలని డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్రావు డిమాండ్ చేశారు. స్పీకర్పై వారు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేశారు. జిల్లాకేంద్రంలోని ఇందిరా చౌక్ వద్ద కేటీఆర్, జగదీశ్రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్ల రాజు, నాయకులు శ్రీనివాస్, షేరు, అంజాద్, ప్రసాద్, రవి, గణే ష్, నర్సింలు, మహేష్, గంగాధర్ పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్రావు జిల్లావ్యాప్తంగా కేటీఆర్, జగదీశ్రెడ్డి దిష్టిబొమ్మల దహనం -
గొంతు తడిసేదెలా?
వేసవి ప్రారంభంలోనే ఎండలు మండుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో బోరుబావులు ఎత్తిపోతున్నాయి. మరోవైపు మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా సరఫరా కావడం లేదు. అప్పుడప్పుడు వస్తున్న నీళ్లు దాహార్తి తీర్చలేకపోతున్నాయి. సర్కారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో తాగునీటి సమస్యలపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. – సాక్షి నెట్వర్క్కిలోమీటరు దూరంనుంచి నీటిని తెచ్చుకుంటున్న పెద్దకొడప్గల్ మండలంలోని మనిసిరాం తండావాసులుగోపాల్పేట ఎస్సీ కాలనీలో నల్లా వద్ద బిందెలు, బకెట్లతో మహిళల నిరీక్షణజిల్లాలో నీటి కష్టాలు మొదలయ్యాయి. పల్లె, పట్నం తేడా లేకుండా అంతటా తాగునీటి కోసం మైళ్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో నీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. మిషన్ భగీరథ నీరు చాలా గ్రామాలకు సరఫరా కావడం లేదు. కొన్నిచోట్ల నాలుగైదు రోజులకోసారి కూడా రావడం లేదు. వచ్చిన నీరు అందరికీ అందడం లేదు. ఇంకొన్ని చోట్ల ట్యాంకులు నిరుపయోగంగా ఉన్నాయి. మరోవైపు భూగర్భ జలమట్టం పడిపోయి బోర్లు కూడా ఎత్తిపోతున్నాయి. పంచాయతీ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తారనుకుంటే.. ఖజానా ఖాళీగా ఉందని, ట్రాక్టర్లను నడిపేందుకు డీజిల్ ఎక్కడినుంచి తెచ్చిపోయాలని పంచాయతీ కార్యదర్శులు చేతులెత్తేస్తున్నారు. ఇంటింటికి నల్లా ద్వారా నీరు సరఫరా కాకపోవడంతో కొన్ని గ్రామాల్లో పంచాయతీ బోర్ల వద్ద నుంచి మోసుకువెళ్తున్నారు. ఇంకొన్నిచోట్ల పొలాల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. పల్లెలు, తండాల్లో నీటి కష్టాలు... గాంధారి మండలంలోని సోమ్లానాయక్ తండా, కర్ణంగడ్డతండా, గుడిముందు తండా, జెమినితండా, డప్పు తండాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. వ్యవసాయ బావుల వద్ద నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. ఎల్లారెడ్డి మండలంలోని సోమర్యాగడి తండాలో నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్పేట ఎస్సీ కాలనీ, బద్యానాయక్ తండాల్లో నీటి కష్టాలు పెరిగాయి. రామారెడ్డి మండల కేంద్రంతో పాటు మొండివీరన్నతండా, సున్నపురాళ్ల తండాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి ఎస్సీ కాలనీలో నీటి సమస్య ఉంది. లింగంపేట మండలంలోని పర్మల్ల గ్రామంలో నీటికి ఇబ్బందులు పడుతున్నారు. రాజంపేట మండలం బస్వన్నపల్లిలో బోర్లు పడవు. దీంతో బావులే ఆధారం. ఒక బావిలో 15 మోటార్లు ఏర్పాటు చేసుకుని నీటిని తవ్వుకుంటున్నారు. సదాశివనగర్ మండలం అమర్లబండలో దశాబ్దాలుగా నీటి సమస్య తీరడం లేదు. గ్రామ శివారు నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. పెద్దకొడప్గల్ మండలంలోని కుబ్యానాయక్ తండా, పోచారం తండా, సముందర్తాండాలలో ప్రజలు పొలాల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. పిట్లం మండలం అన్నారంలో కిందిగల్లీలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. బిచ్కుంద మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదు. ఎల్లారం తండాలో ప్రజలు వ్యవసాయ బోర్ల వద్ద నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. బాన్సువాడ మండలంలోని కాద్లాపూర్లో నీటి కష్టాలు పెరిగాయి. నల్లాల ద్వారా రాకపోవడంతో బోర్ల వద్ద నుంచి తెచ్చుకుంటున్నారు. రాజారాం దుబ్బ, అవాస్పల్లి ప్రాంతాల్లోనూ నీటికి కష్టాలు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ బావినుంచి నీటిని తెచ్చుకుంటున్న సోమ్లానాయక్తండావాసులుఏ ఊరికి వెళ్లినా..జిల్లాలో ఏ ఊరికి వెళ్లినా నీటి సమస్య కనబడుతోంది. మిషన్ భగీరథ నీరు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు నిలిచిపోతుందో తెలియని పరిస్థితి ఉంది. ఎస్సారెస్పీ గ్రిడ్ ద్వారా కామారెడ్డి ప్రాంతంలోని కామారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి, మాచారెడ్డి, రామారెడ్డి, బీబీపేట, భిక్కనూరు, రాజంపేట, దోమకొండ మండలాలకు నీటిని అందిస్తుండగా, సింగూరు గ్రిడ్ నుంచి ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, జుక్కల్, మద్నూర్, పెద్దకొడప్గల్, పిట్లం, బిచ్కుంద, డోంగ్లీ, మహ్మద్నగర్, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ తదితర మండలాలకు నీటిని సరఫరా చేస్తారు. రెండు గ్రిడ్ల పరిధిలో చాలాచోట్ల పైప్లైన్ల సమస్య నీటి సరఫరాకు ఆటంకంగా మారుతోంది. రికార్డుల్లో మాత్రం అన్ని ఆవాసాలకు నీరు సరఫరా అవుతుందని చెబుతున్నా ఇప్పటికీ మిషన్ భగీరథ నీరు చేరని గ్రామాలెన్నో ఉన్నాయి.మోటార్లు, ట్యాంకర్ల నిర్వహణ భారం...పంచాయతీలకు నిధులు రాక, ఇప్పటికే రూ.లక్షలు అప్పులు తెచ్చి పెట్టిన కార్యదర్శులు బోర్ల నిర్వహణ, ట్యాంకర్లకు డీజిల్ తీసుకురావడం తమతో కాదని చేతులెత్తేస్తున్నారు. దీంతో పల్లెల్లో నీటి కష్టాలు మరింత పెరుగుతున్నాయి. గ్రామాలకు ప్రత్యేక అధికారులున్నా, వారు పర్యవేక్షణ మాత్రమే చేస్తున్నారు. డబ్బులు కార్యదర్శులే సర్దుబాటు చేయాల్సి వస్తోంది. దాదాపు ప్రతి కార్యదర్శి రూ. లక్ష నుంచి రూ.5 లక్షల వరకు అప్పులు చేసి మరీ పంచాయతీలను నెట్టుకువస్తున్నారు. తాగునీటి సమస్య పెరుగుతుండడంతో బోర్లు, మోటార్లు, ట్యాంకర్ల నిర్వహణకు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో తెలియక సతమతమవుతున్నారు. నీటి సమస్య పరిష్కారానికి నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.పైప్లైన్ పనులు పూర్తయ్యేదెప్పుడో...ఎస్సారెస్పీ గ్రిడ్లో భాగమైన కామారెడ్డి ప్రాంతానికి నీటిని అందించే పైప్లైన్ పగిలిపోయి ఒక్కోసారి వారం, పది రోజులు నీటి సరఫరా నిలిచిపోతోంది. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం రూ.2 వందల కోట్లతో కొత్త పైపులైన్ పనులు చేపట్టారు. వేసవి సీజన్ వచ్చినా పనులు పూర్తి కాలేదు. అలాగే అమృత్–2 పథకం ద్వారా జిల్లా కేంద్రంలో పనులు నడుస్తున్నాయి. జిల్లా కేంద్రంలో భూగర్భ జలమట్టం పడిపోయి ఇళ్లల్లో బోర్లు ఎత్తిపోతున్నాయి. దీంతో గల్లీ వాసులంతా ఏకమై సొంతంగా తలా కొంత డబ్బు జమ చేసుకుని వెయ్యి నుంచి 15 వందల అడుగుల లోతు వరకు బోర్లు తవ్వించుకుంటున్నారు. నీరు పడితే ఎలాగోలా సర్దుకునే పరిస్థితి.. లేదంటే ట్యాంకులతో నీరు కొనాల్సిందే. పట్టణంలోని అశోక్నగర్, శ్రీరాంనగర్, ఎన్జీవోస్ కాలనీ, రుక్మిణికుంట, కాకతీయనగర్ తదితర ప్రాంతాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. ట్యాంకర్కు రూ.5 వందలు వెచ్చించి నీటిని కొనుగోలు చేస్తున్నారు. నీటి సమస్య ఎదురవుతుందని తెలిసి కూడా పైప్లైన్ పనులు పూర్తి చేయకపోవడంతో ఈసారి కూడా ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. గతంలో రోజు విడిచి రోజు నీరు సరఫరా అయ్యేది. ఇప్పుడు మూడు, నాలుగు రోజులకోసారి కూడా నీరు రావడం లేదు. ముదురుతున్న ఎండలు.. ఎత్తిపోతున్న బోర్లు సక్రమంగా సరఫరా కాని ‘భగీరథ’ నీళ్లు తాగునీటి కోసం గోసపడుతున్న ప్రజలు -
జాతీయ స్థాయి ఫుట్బాల్ టోర్నీకి ఎంపికై న శరత్ చంద్ర
భిక్కనూరు: జమ్ముకాశ్మీర్లో వ చ్చే నెలలో జరుగనున్న అండర్–14 ఎస్బీఎఫ్ ఫుట్బాల్ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి భిక్కనూరుకు చెందిన కై రంకొండ శరత్చంద్ర ఎంపిక య్యాడని ఆదివారం కుటుంబసభ్యులు తెలిపారు.వనపర్తి జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఫుట్బాల్ పోటీల్లో ప్రతిభ చూపిన 11 మంది క్రీడాకారులను జాతీయ స్థాయి ఫుట్బాల్ టోర్నీకి ఎంపిక చేశారు.శరత్చంద్ర మెదక్ జిల్లా ఫు ట్బాల్ జట్టు కెప్టెన్గా వ్యవహరించాడు. ఈసందర్భంగా శరత్చంద్రను పలువురు అభినందించారు. జోరుగా పంట నూర్పిళ్లు బాన్సువాడ రూరల్ : మండలంలోని మెట్ట ప్రాంతాలైన గట్టుమీది గ్రామాల్లో జోరుగా పంట నూర్పి ళ్లు సాగుతున్నాయి. సాగునీటి సౌకర్యం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈప్రాంతవాసులు మొక్కజొన్న, జొన్న తదితర పంటలు సాగు చేశారు. ముందస్తుగా వేసిన మొక్కజొన్న, జొన్న కోతకు రావడంతో నూర్పిడి పనులు సాగుతున్నాయి. వీటితో పాటు పలుచోట్ల రైతులు పుచ్చకాయ, మునగ తదితర పంటలు సాగు చేశారు. -
న్యాయ వ్యవస్థకు డిజిటల్ సొబగులు
న్యాయవ్యవస్థ డిజిటలైజేషన్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే జిల్లాలో ఈ –కోర్ట్స్ సర్వీసెస్ ప్రారంభమైంది. దీని ద్వారా కేసు స్థితిగతులను ఆన్లైన్లో తెలుసుకునే వెసులుబాటు న్యాయమూర్తులు, న్యాయవాదులతోపాటు కక్షిదారులకు లభించింది. కేసులకు సంబంధించిన పత్రాల డిజిటలైజేషన్ పూర్తి చేసి రికార్డులు, పత్రాలు ఏవి కావాలన్నా ఇట్టే సర్టి ఫైడ్ కాపీ ఇచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ–ఫైలింగ్ విధానంతో న్యాయ సేవలు మరింత సులభతరం కానున్నాయి. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డిఆదివారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2025– 8లో uసత్వర న్యాయం అందించేందుకు..ప్రజలకు సత్వర న్యాయం అందించే దిశగా న్యాయవ్యవస్థలో అనేక మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ ద్వారా కేసుల వాయిదాలు, కేసుల స్థితిగతులు తెలుసుకోవడం నుంచి కేసుల ఫైలింగ్ ఇంకా అనేక రకాల సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. న్యాయవాదులు తమ కార్యాలయం నుంచే ఈ –ఫైలింగ్ ద్వారా కేసును ఫైల్ చేసి, వర్చువల్ ద్వారా కేసు విచారణల్లో పాల్గొనవచ్చు. కేసుల విచారణ వేగంగా జరగడంతో పాటు ప్రజలకు సత్వర న్యాయం అందుతుంది. కేసులకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని డిజిటలైజ్ అవుతున్నాయి. లైఫ్లాంగ్ అవి భద్రంగా ఉంటాయి. ఎవరికి ఏది అవసరం అయినా వారికి సర్టిఫైడ్ కాపీ సులువుగా పొందే వీలు కలుగుతుంది. ప్రతీది ఆన్లైన్ ద్వారా జరిగితే పేపర్ అవసరం కూడా ఉండదు. లాప్టాప్లోనే కేసుల వివరాలను చదువుకునేందుకు న్యాయవాదులకు, న్యాయమూర్తులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికే ఎన్నో మార్పులు జరిగాయి. త్వరలోనే పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ జరిగి సేవలు మరింత అందుబాటులోకి వస్తాయి. – డాక్టర్ సీహెచ్వీఆర్ఆర్ వరప్రసాద్, జిల్లా ప్రిన్సిపల్ జడ్జి, కామారెడ్డి● సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటున్న కోర్టులు ● ఇప్పటికే అందుబాటులో ఈ –కోర్ట్స్ సర్వీసులు ● సులభంగా కేసు స్థితి తెలుసుకునేందుకు అవకాశం ● ఈ–ఫైలింగ్తో మరిన్ని ప్రయోజనాలు.. ● వర్చువల్ విధానంలోనూ విచారణలుభారతదేశ న్యాయ వ్యవస్థ ఎప్పటికప్పుడు నవ్యత్వాన్ని సంతరించుకుంటోంది. ప్రజలకు న్యాయ సేవలను చేరువ చేయడంతోపాటు పెండింగ్లో ఉన్న కేసులను తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారు. చట్టపరమైన సేవలు, న్యాయాన్ని ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఇప్పటికే ఈ–కోర్టు విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ–కోర్టు అనేది కాగిత రహిత కోర్టు. ఇందులో కోర్టు కార్యకలాపాలన్నీ డిజిటల్ ఫార్మాట్లో జరుగుతాయి. కేసుకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. కక్షిదారు తమ కేసు ఏ స్థాయిలో ఉంది, వాయిదా ఎప్పుడు ఉంది అన్న వివరాలు తెలుసుకునే సదుపాయం ఈ విధానం ద్వారా అందుబాటులోకి వచ్చింది. ఈ–ఫైలింగ్.. న్యాయవ్యవస్థలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఈ–కోర్ట్స్ సర్వీసెస్ ద్వారా ఎన్నో రకాల సేవలు అందుతున్నాయి. కోర్టు ఇన్ఫర్మేషన్ సిస్టం (సీఐఎస్) ద్వారా కేసుకు సంబంధించిన వ్యక్తుల ఫోన్ నంబర్లు, మెయిల్ అడ్రస్లు ఇస్తే వారికి మెసేజ్లు కూడా వెళతాయి. ఈ –ఫైలింగ్ విధానం ద్వారా న్యాయవాది తన ఆఫీసులోనుంచే ఆన్లైన్లో కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించి కేసును ఫైల్ చేయవచ్చు. రాబోయే రోజుల్లో తన కార్యాలయం నుంచే కేసులను వర్చువల్ విధానంలో వాదించే అవకాశం కూడా కలగనుంది. ఇప్పటికే కొన్ని కేసుల్లో దూరాన ఉన్న వారితో వర్చువల్ పద్ధతుల్లో విచారణ చేస్తున్నారు. కామారెడ్డి నుంచి కొందరు న్యాయవాదులు హైకోర్టులో ఉన్న కేసులకు సంబంధించి వర్చువల్ పద్ధతిలో హాజరవుతున్నారు. అలాగే ఇక్కడి కేసులకు సంబంధించిన సాక్షులు విదేశాల్లో ఉన్నపుడు కేసును పరిష్కరించే ఉద్దేశంతో న్యాయవాదులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా వారి వాంగ్మూలం రికార్డు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ జరిగితే మరింతగా సేవలు మెరుగుపడనున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టుల సముదాయంలో ఈ –సేవా కేంద్రం కూడా ఏర్పాటైంది. దీని ద్వారా పన్నెండు రకాల సేవలు అందించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే కొన్ని సేవలు అందుతున్నాయి.త్వరలో కేసు పత్రాల డిజిటలైజేషన్న్యూస్రీల్మార్పు మంచిదే...మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని వాడుకోవలసిన అవసరం ఉంది. పనులు వేగంగా జరగాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాల్సిందే.. ఆ దిశగా న్యాయవ్యవస్థలో మార్పులు వస్తుండడం ఆహ్వానించదగ్గ పరిణామమే. ఈ విధానాలపై న్యాయవాదులు, కక్షిదారులకు అవగాహన కల్పించాలి. – శ్రీకాంత్గౌడ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, కామారెడ్డికోర్టుల్లో గుట్టల్లా పెరిగిపోతున్న కేసులకు సంబంధించి రికార్డులను కాపాడడం కూడా న్యాయస్థానాలకు పెద్ద సవాల్గా మారింది. దశాబ్దాలుగా పేరుకుపోయిన కేసుల ఫైళ్లకు చెదలు పట్టడమో, తడితో చెడిపోవడమో జరుగుతోంది. ఒక్కోసారి ముఖ్యమైన ఫైల్స్ కూడా దెబ్బతింటున్నాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు ఆయా కేసులకు సంబంధించిన రికార్డులన్నింటినీ డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ చేపట్టబోతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే కేసుకు సంబంధించిన రికార్డులు, పత్రాలు ఏవి కావాలనుకున్నా ఇట్టే సర్టిఫైడ్ కాపీ ఇచ్చే అవకాశం ఏర్పడుతుంది. కేసుల వివరాలన్నీ డిజిటలైజ్ అయ్యాక న్యాయవాదులు, న్యాయమూర్తులు ఎప్పుడంటే అప్పుడు ల్యాప్టాప్లో చదువుకునే వీలు కలుగుతుందని కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సీహెచ్వీఆర్ఆర్ వరప్రసాద్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో 16,500 కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. కేసుల వివరాలను డిజిటలైజ్ చేసి ఆన్లైన్లో భద్రపరిస్తే వంద ఏళ్లయినా భద్రంగా ఉంటాయని పేర్కొన్నారు.