kamareddy government area Hospital
-
ప్రారంభం కాని ‘ట్రామా’
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోని ట్రామాకేర్ సెంటర్ను త్వరలో ప్రారంభిస్తామని చెప్పిన అధికారుల మాటలు నీటిమూటలయ్యాయి. 2013 డిసెంబర్ 15వ తేదీన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కేశవ్ దేశ్రాజ్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వైవీ అనూరాధ, వైద్య ఆరోగ్యమిషన్ డెరైక్టర్లు డాక్టర్ బుద్ధ ప్రకాశ్, జ్యోతి కామారెడ్డి ఏరియా ఆస్పత్రి, ట్రామాకేర్ సెంటర్ భవనాన్ని సందర్శించారు. నివేదికలు పూర్తిగా సిద్ధం చేసుకుని వెళ్ళారు. అయితే వారు సందర్శించి 6 నెలలకుపైగా గడిచినా ట్రామాకేర్ సెంటర్ ప్రారంభం విషయంలో ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. రూ.4 కోట్లకు పైగా నిధులతో.. రహదారులపై ప్రమాదాలకు గురయ్యేవారికి వైద్యం అందించడానికి రూ. 4 కోట్లకుపైగా నిధులతో ట్రామాకేర్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికి ట్రామాకేర్ సెంటర్ భవన నిర్మాణానికి రూ. 67 లక్షలు ఖర్చు చేశారు. అలాగే మరో రూ. కోటితో ఆధునాతన అంబులెన్స్, ఎక్స్రే యంత్రం, ఈసీజీ యంత్రాలు, ఆపరేషన్ థియేటర్లోని పరికరాలు కొన్నారు. అయితే అవన్నీ ఆయా గదుల్లో తుప్పు పడుతున్నాయి. ఆస్పత్రి ఆవరణలో ఆంబులెన్స్ ధ్వసం అయి ఉంది. ఇంకా రూ. కోటిన్నర విలువగల యంత్రాలు రావాల్సి ఉంది. అలాగే ఈ సెంటర్కు కావాల్సిన ఆర్థోపెటిక్ సర్జన్లు, మత్తు డాక్టర్లు, న్యూరాలజిస్టు, స్టాఫ్నర్సులు, ఏఎన్ఎంలు, సిబ్బంది తదితరులను నియమించాల్సి ఉంది. లక్షల రూపాయలు గుల్ల కామారెడ్డి జాతీయ రహదారితోపాటు ఆయా మండలాల్లో రోడ్డు ప్రమాదాల్లో గాయాలపాలైన వారు మెరుగైన వైద్యం కోసం లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. ట్రామాకేర్ సెంటర్ ప్రారంభమైతే ఇక్కడే మెరుగైన వైద్యసేవలు అందేవి. సెంటర్ ప్రారంభం కాకపోవడంతో క్షతగాత్రులు ప్రైవేట్ ఆస్పత్రులు, హైదరాబాద్కు వెళ్లడంతో వేల రూపాయలు ఖర్చవుతున్నాయి. నెల రోజుల్లోనే 11 మంది మృతి కామారెడ్డి డివిజన్ పరిధిలో కేవలం జూన్ ఒక్క నెలల్లోనే జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృతిచెందగా 20 మందికి తీవ్ర గాయాల య్యాయి. రోడ్డు ప్రమాదంలో ఎక్కువగా యు వకులే మృతిచెందిన సందర్భాలు ఉన్నాయి. వీ రిలో తలకు గాయాలై చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలిస్తుండగా కొందరు మృతిచెందా రు. వీరికి ట్రామాకేర్ సెంటర్ ద్వారా మెరుగైన వైద్యసేవలు అందితే కొందరైన బతికుండేవా రు. మాచారెడ్డి, సదాశివనగర్, భిక్కనూరు, గాంధారి, దోమకొండ మండలాలతో పాటు డి చ్పల్లి నుంచి రామాయంపేట్ వరకు జాతీయరహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతూ చాలామంది మృత్యువాత పడుతున్నారు. -
అదే తీరు!
దేవునిపల్లి, న్యూస్లైన్ : కుటుంబ నియంత్రణ ఆపరేషన్ శిక్షగా మారుతోంది. సర్కా రు దవాఖానాల్లో సరైన వసతులు లేకపోవడంతో ఆపరేషన్ల అనంత రం నేలమీదే పడుకోబెడుతున్నారు. దీంతో ఆపరేషన్ చేయించుకున్నవారు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కామారెడ్డి ప్రభుత్వ ఏరి యా ఆస్పత్రిలో శుక్రవారం డీపీఎల్ క్యాంపు నిర్వహించారు. 80 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఆపరేషన్ అనంతరం వారిలో కొందరిని మొదటి అంతస్తులోని పురుషుల వార్డులో, మరికొందరిని వరండాలోని నేలపై పడుకోబెట్టారు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పశువుల హల్చల్ కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోకి సాయంత్రం ఆరు ఆవులు వచ్చి హల్చల్ చేశాయి. వాటిని అదిలించగా బెదిరిపోయి పరుగులు తీశాయి. మొదటి అంతస్తులోని పురుషుల, మహిళల వార్డు, ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్లి భయానక వాతావరణాన్ని సృష్టించాయి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నవారివైపూ రావడం తో వారు భయపడిపోయారు. అయితే అక్కడే ఉన్న ఆస్పత్రి సిబ్బంది వాటిని బయటికి పంపించివేయడంతో ప్రమాదం తప్పింది. -
గర్భిణులను గెంటేస్తున్నారు
దేవునిపల్లి, న్యూస్లైన్ : కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వెళ్లాలంటేనే గర్భిణులు జంకుతున్నారు. పురిటి నొప్పులతో ఆస్పత్రిలో అడుగు పెట్టగానే మత్తు వైద్యుడు లేడు.. స్త్రీ వైద్య నిపుణురాలు అందుబాటులో లేదు.. సిజేరియన్ చేయడానికి వైద్యులు అందుబాటులో లేరు.. బయట వేరే ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లండి లేకపోతే, నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ అస్పత్రికి రాసిస్తామని సిబ్బంది చెబుతున్నారు. ఒకవేళ గర్భిణుల బంధువులు ఎవరైనా గట్టిగా నిలదీస్తే బయటకు గెంటి వేస్తున్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి 108 అంబులెన్స్లలో బుధవారం రాత్రి 10 గంటలకు కామారెడ్డి పట్టణానికి చెందిన సీహెచ్. రాధ అనే గర్భిణి, భిక్నూర్ మండలం, పెద్ద మల్లారెడ్డి గ్రామ పరిధిలోని, అయ్యవారి పల్లి గ్రామానికి చెందిన వరాల్ల రేణుక పురిటి నొప్పులతో వచ్చారు. వీరిని చూసిన వెంటనే నర్సులు ఇక్కడ మత్తు మం దు డాక్టర్ లేడు నిజామాబాద్ ఆస్పత్రికి రాసిస్తామని అన్నారు. గర్భిణుల బంధువులు భర్త లు సతీష్, బాల్రాజు కలిసి నర్సులను గట్టిగా నిలదీయగా వారందరిని బయటకు గెంటి వేసారు. చేసేదేమీ లేక వారు చలికి ఆస్పత్రి బయట వణకుతూ గంటల తరబడి కూర్చున్నారు. ఆర్డీఓకు ఫోన్ చేస్తే వైద్యులు ఏలా చెప్తే అలా వినండి అంటూ సమాధానం చెప్పారని బాధితులు ‘న్యూస్లైన్’తో వాపోయారు. చేసేదేమి లేక రాధను బంధువులు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. రేణుకు మా త్రం అక్కడి నుంచి వెళ్లక పోవడంతో ఆస్పత్రిలో చేర్చుకున్నా ప్రసూతి గురించి మాత్రం బంధువలకు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇలాంటి ఘటనలు ప్రతి రోజు జరుగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. కామారెడ్డి పరిధిలోని 108 ఆంబులెన్స్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కూడా ఈ సంఘటనలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో తాము గ్రామాల నుంచి గర్భిణులను తీసుకుని వచ్చినా నర్సులు ఆపరేషనలు చేయలేమని చెబుతున్నారని తెలిపారు. బయటకు పంపించారు -సతీష్, గోసంగి కాలని, కామారెడ్డి. నా భార్య రాధను పురిటి నొప్పులతో తీసుకువచ్చాము. మత్తు డాక్టర్ లేడని, నిజామాబాద్కు రాసిస్తాము, వెళ్లమని నర్సులు సూచిం చారు. మేము గట్టిగా మాట్లాడితే గెంటేశారు.. నేను మేస్త్రి పని చేస్తాను. ఇలా సార్కారు దవాఖానాలో సౌకర్యాలు లేక పోతే మాలాం టి వాళ్లు ఎటు పోవాలే. ప్రాణాలు ఎలా కాపాడుకోవాలే. ఇంత పెద్ద ఆస్పత్రి ఉండి ఏందుకు...అసలు మొత్తానికే కాన్పులు చేయమని బోర్డులు పెడితే సరిపోతుంది కదా మా సావు మేం సస్తాం. ఎందుకు సర్కారు ఆస్పత్రికి రమ్మంటున్నారు మరి. ఆర్డీఓకు ఫోన్ చేస్తే డాక్టరు ఎలా చెబితే అలా చేయాలి అంటూ పెట్టేసారు. అడ్మిటైతే చేసుకున్నారు.. -బాల్రాజు, అయ్యవారిపల్లి, భిక్నూర్ నేను ఐకేపీలో విధులు నిర్వహిస్తున్నాను. నాభార్యకు పురిటి నొప్పులు వస్తే కాన్పు కోసం తీసుకువచ్చాను. నర్సులు చూడకుం డానే ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లమన్నారు. నేను ఆర్డీఓకు ఫోన్ చేసాను. గట్టిగా మాట్లాడితే అప్పుడు అడ్మిట్ చేసుకున్నారు. ఆపరేషన్ అంటే మరి భయంగా ఉం ది. మత్తు డాక్టర్ లేరని బయటకు పంపుతారో ఏమో..