breaking news
karman ghat
-
కర్మన్ఘాట్లో హనుమాన్ శోభాయాత్ర
హైదరాబాద్: హనుమాన్ జయంతి సందర్భంగా కర్మన్ఘాట్ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి హనుమాన్ శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఈ యాత్రలో రెండు వేల మంది భక్తులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు బందోబస్తు చేపట్టారు. కర్మన్ఘాట్, చంపాపేట్, సైదాబాద్, సరూర్ నగర్ చెరువు కట్ట, దిల్సుఖ్నగర్, మలక్పేట్, చాదర్ఘాట్ల మీదుగా నగరంలోకి ప్రవేశించనున్నది. భద్రతా ఏర్పాట్లను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. -
పాపం.. పాలబుగ్గల పసివాళ్లు!
-
పాపం.. పాలబుగ్గల పసివాళ్లు!
వాళ్లంతా పట్టుమని పదేళ్లు కూడా లేని పిల్లలు. మండుటెండలో, రోడ్డు కూడా దాటలేనంత ట్రాఫిక్ మధ్య .. ఒక చేతిలో బ్రోచర్, మరో చేతిలో డబ్బాతో ఒక్కొక్కరి దగ్గర డబ్బులు అడుగుతూ ప్రత్యక్షమయ్యారు. చిన్నారులను చూసి చలించిపోయిన కొందరు మానవతామూర్తులు, వాళ్లంతా ఎందుకిలా చేస్తున్నారో అని ఆరా తీయగా .. వాడిపోయిన మోములతో, రోజూ తమను డబ్బులు అడుక్కు రమ్మని ఆటోలో పంపిస్తున్నారని చెప్పారు. వాళ్లంతా ఒక అనాథాశ్రమంలో ఉండే చిన్నారులు. పిల్లలను రోడ్డుపై వదిలేయడంపై ఒక వంటమనిషి సాయంతో ఆశ్రమ నిర్వాహకురాలు క్రిష్ణమ్మను నిలదీయగా, ఇష్టమున్న చోట ఫిర్యాదు చేసుకోండని ఆమె దురుసుగా సమాధానమిచ్చింది. దీంతో హైదరాబాద్ కర్మన్ఘాట్ గ్రీన్పార్క్ కాలనీలోని అనాథాశ్రమానికి చెందిన రవికుమార్, రాహుల్, నితిన్, సాయితో పాటు మరో అమ్మాయిని వారు సైదాబాద్ పోలీసులకు అప్పగించారు. ఆశ్రమంలోని మరో 30 మంది విద్యార్థులు కూడా మరికొన్ని ప్రాంతాల్లో ఇలా నిధులు సేకరిస్తున్నారని ఈ పిల్లలు చెప్పడంతో, వెంటనే ఆశ్రమంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.