breaking news
Karnataka News
-
వాలిన 3 అంతస్తుల భవనం
● నెలమంగళలో కలకలం దొడ్డబళ్లాపురం: బెంగళూరు లో భవనాలు వాలిపోవడం పరిపాటిగా మారుతోంది. కోరమంగళలోని జక్కసంద్రలో చిన్న స్థలంలో 5 అంతస్తుల భవనాన్ని కట్టగా, అది వారంరోజుల కింద వాలిపోవడంతో కూల్చివేస్తున్నారు. ఇంతలోనే నెలమంగల సమీపంలోని మాదావరలో ఒక భవనం ఒరగడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల క్రితం శ్రీనివాస్ అనే వ్యక్తి నిర్మించిన ఈ మూడు అంతస్తుల భవనం హఠాత్తుగా అర అడుగు మేర పక్కకు వాలింది. దీంతో ఇందులో నివసిస్తున్న 6 కుటుంబాలు భవనాన్ని ఖాళీ చేశాయి. నాసిరకంగా కట్టినట్లు స్థానికులు ఆరోపించారు. యజమాని మాట్లాడుతూ తాను కాంట్రాక్టర్నని, తన ఇంటిని ఎందుకు నాణ్యత లేకుండా కట్టుకుంటానని అన్నాడు. రూ.80 లక్షల ఖర్చుతో పటిష్టమైన పిల్లర్లు వేసి ఇల్లు కట్టించానన్నాడు. పోలీసులు, నగరసభ అధికారులు భవనాన్ని పరిశీలించారు. ఆనుకుని ఉన్న ఇళ్లవారిని ఖాళీ చేయాలని సూచించారు. దీనిని కూల్చివేసే అవకాశాలున్నాయి. రోడ్ల గుంతలు, చెత్త ఉండరాదు బనశంకరి: బెంగళూరు కేంద్ర నగర పాలికె పరిధిలో రోడ్ల గుంతలను పూడ్చివేయాలని ఆ ప్రాంత పాలికె కమిషనర్ రాజేంద్రచోళన్ అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం చిక్కపేటేలో స్కూటర్లలో సంచరిస్తూ పలు రోడ్లను పరిశీలించారు. రోడ్ల గుంతలను సరిచేసి జీబ్రా క్రాసింగ్లు, మార్కింగ్లు వేయాలని తెలిపారు. జంక్షన్లలో మిగిలిపోయిన మరమ్మతులు చేయాలన్నారు. హోసూరురోడ్డు అధ్వాన్నంగా ఉందని, తారు వేయాలని తెలిపారు. రోడ్ల పక్కన చెత్త రాశులను చూసి వెంటనే తొలగించాలని ఆదేశించారు. జేసీ రోడ్డులోని నగరపాలికె స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి అభివృద్ధి చేయాలన్నారు. అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. -
మహిషాసుర మర్దిని
తుమకూరు: తుమకూరు దసరా వేడుకల్లో కేఆర్ లేఔట్లో ఉన్న శ్రీరామ మందిరంలో సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను అలరించాయి. మహిషాసుర మర్దిని నృత్య వైభవం సమ్మోహితుల్ని చేసింది. అలాగే హిరణ్యక సంహార ఘట్టం, జానపద కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.భార్యను హత్య చేసి.. భర్త ఆత్మహత్య యశవంతపుర: భార్యను 15 సార్లు కత్తితో పొడిచి చంపి, ఆపై భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు జ్ణానభారతి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఉళ్లాళ మెయిన్ రోడ్డు ప్రైస్ లేఔట్లో నివాసం ఉంటున్న మంజు (27), ఆమె భర్త ధర్మశీలన్ (29) మృతులు. తమిళనాడుకు చెందిన ధర్మశీలన్ దుబాయ్లో పెయింటర్గా పని చేసేవాడు. తరువాత బెంగళూరుకు వచ్చి ఓ ఇంటిలో బాడుగకు దిగారు. వ్యాపారం చేసేవాడు. అతడు మద్యానికి అలవాటు పడ్డాడు. దీంతో తరచూ భార్యతో గొడవ పడేవాడని స్థానికులు తెలిపారు. ఆదివారం రాత్రి కూడా పెద్ద రగడ జరిగింది. ఈ ఆవేశంలో అకృత్యానికి పాల్పడ్డాడు. సోమవారం ఉదయం పోలీసులు కేసు నమోదు చేశారు. వర్ష బాధితులను పట్టించుకోరా? ● సర్కారుకు బీజేపీ ప్రశ్న శివాజీనగర: కళ్యాణ కర్ణాటక, కిత్తూరు కర్ణాటక భాగంలో 8కి పైగా జిల్లాల్లో గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షంతో ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారిందని, రాష్ట్ర ప్రభుత్వం వర్ష బాధితుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని బీజేపీ ఆరోపించింది. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, బీజేపీ పక్ష నాయకుడు ఆర్.అశోక్ నేతృత్వంలో రెండు బృందాలు ఆయా జిల్లాలలో పర్యటించాయి. ఓవైపు అతివృష్టి, నదులు ఉప్పొంగి ఇబ్బందులు పడుతున్నా పరిష్కార చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. పలు ప్రదేశాలలో ఇళ్లు కూలిపోగా వందలాది మంది నిరాశ్రయులయ్యారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరూ బాధితులను కలిసింది లేదని దుయ్యబట్టారు. ఆ భవనాలకూ నీరు, కరెంటు వసతి! శివాజీనగర: గ్రేటర్ బెంగళూరు పరిధిలో, రాష్ట్రంలో వివిధ చోట్ల పెద్ద స్థలాల్లో ప్లాన్ అనుమతి పొందకుండా, ప్లాన్ ఉల్లంఘించి నిర్మించిన భవనాలకు విద్యుత్, నీటి కనెక్షన్ల అంశం మీద సీఎం సిద్దరామయ్య సోమవారం అధికారులతో సమావేశమయ్యారు. 30 ఇన్టు 40 చదరపు గజాల్లో అనుమతులు లేకుండా కట్టిన ఇళ్లకు కరెంటు, నీటి కనెక్షన్లు ఇవ్వాలని గతంలో సర్కారు ఆదేశించింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న భవనాలకు కూడా ఇలాంటి వెసులుబాటు ఇవ్వడంపై చర్చించారు. చివరకు వాటికి కూడా ఓసీ, సీసీ ద్వారా రాయితీ ఇవ్వడానికి ఆమోదం తెలిపారని అధికారులు చెప్పారు. ఈ భేటీలో ఇంధన మంత్రి కే.జే.జార్జ్, నగరాభివృద్ధి మంత్రి భైరతి సురేశ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
గానామృతం.. నిప్పుల వర్షం
సోమవారం సాయంత్రం మైసూరు ప్యాలెస్ ముందు జంబూసవారీ సాధన ఫిరంగుల విస్ఫోటాలతో ఏర్పడిన అగ్నిగోళాలు మైసూరు: పాటలు, సంగీతం మైసూరువాసులను, పర్యాటకులను తన్మయుల్ని చేస్తున్నాయి. మైసూరు దసరా వేడుకల సందర్భంగా ప్యాలెస్ ముందు వేదికపై ఆదివారం రాత్రి గాయకుడు విజయ్ ప్రకాశ్ బృందం పాడిన పాటలకు ప్రేక్షకులు ఆనందంతో స్టెప్పులు వేశారు. విజయప్రకాశ్ వేదిక పైకి వస్తూనే చాముండేశ్వరి కీర్తనను ఆలపించారు. తరువాత హబ్బ హబ్బ ఇది కరునాడు హబ్బ మనె అనే పాటలో అలరించారు. పవర్స్టార్ పునీత్ రాజ్ పాట అయిన బొంబే హేళుతైతె.. నీనే రాజకుమార అనే పాటకు ప్రేక్షకులు లేచి నిలబడి మొబైల్లో లైట్లు వేసి పునీత్కు నివాళులర్పించారు. ఇక బన్నిమంటప కవాతు మైదానంలో డ్రోన్లతో చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. మరోసారి ఫిరంగుల గర్జన గజరాజులకు మరోసారి ఫిరంగుల తాలీమును నిర్వహించారు. సోమవారం కవాతు మైదానంలో ఏనుగులు, గజరాజులను నిలబెట్టి ఫిరంగి మోతలను మోగించారు. భీకరంగా అగ్నిగోళాలు, శబ్ధాలు వెలువడినా అవి బెదరలేదు. అలాగే గజరాజు అభిమన్యుతో కలిసి ప్యాలెస్ ముందు జంబూసవారీ రిహార్సల్ను జరిపారు. నిజమైన జంబూసవారీలో మాదిరిగా పోలీసులు అంబారీ మీద పూలు చల్లి సెల్యూట్ చేశారు. డిసిఎఫ్ ప్రభుగౌడ, అధికారులు పాల్గొన్నారు. విజయ్ ప్రకాశ్ గానాలాపన అంబరంలో అద్భుతం.. వేలాది డ్రోన్లతో ఏనుగు అంబారీ రూపంభూగోళంలో భారతదేశం ఆవిష్కారం పతాకస్థాయికి మైసూరు దసరా సంబరాలు -
హౌస్కీపర్ దొంగావతారం
యశవంతపుర: పని చేస్తున్న ఇంటిలో బంగారం, వజ్రాలను చోరీ చేసిన ఉత్తరప్రదేశ్కు చెందిన దొంగని బెంగళూరు జేసీ నగర పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. మిల్లర్ రోడ్డులోని ఒక ఇంటిలో యూపీ నుంచి వచ్చిన వలస కార్మికుడు హౌస్కీపర్గా పని చేస్తున్నాడు. ఇంటిలో విలువైన బంగారం, వజ్రాల నగలు ఉన్నట్లు చూశాడు. ఇటీవల 236 గ్రాముల బంగారం, వజ్రాల నగలను దోచుకొని పరారయ్యాడు. యజమాని జేసీ నగర పోలీసులకు ఫిర్యాదు చేయగా, యూపీలో దాగి ఉన్న దొంగని పట్టుకుని వచ్చారు. రూ.53 లక్షల విలువైన సొత్తుని స్వాధీనం చేసుకున్నారు. హైవేలలో పిల్ల దొంగల ముఠా.. దొడ్డబళ్లాపురం: 3 రోజుల్లో 37 దోపిడీలకు పాల్పడిన 6 మంది మైనర్ల గ్యాంగ్ను దొడ్డబళ్లాపురం గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. మాదనాయకనహళ్లి, దొడ్డబళ్లాపురం, సూర్యనగర, బ్యాడరహళ్లి నెలమంగల పోలీస్స్టేషన్ల పరిధిలో మూడు బైక్లపై హైవేలలో తిరిగేవారు. బైకిస్టులు, లారీలు, కార్లు తదితర వాహనదారులను అడ్డగించి దోపిడీలకు పాల్పడేవారు. డబ్బులు ఇస్తే సరే, ఎవరైనా ఎదురుతిరిగితే కత్తితో దాడి చేసి దోచుకుని పరారయ్యేవారు. అన్ని దోపిడీలు ఒకే రకంగా జరగడంతో సీసీ కెమెరాల చిత్రాలు, బాధితుల సమాచారం మేరకు సోదాలు చేసి పిల్ల దొంగల ముఠాను పట్టుకున్నారు. కొంత డబ్బు, విలువైన వస్తువులు, బైక్లను సీజ్ చేశారు. వజ్రాల నగలు సీజ్ -
ఇద్దరు శ్రీలంక పౌరులు అరెస్ట్
యశవంతపుర: బెంగళూరులో అక్రమంగా నివాసం ఉన్న ముగ్గురు శ్రీలంక పౌరులను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. దేవనహళ్లి సమీపంలోని అపార్ట్మెంట్లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో తనిఖీలు చేపట్టారు. విదేశీ చట్టం కింది కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. బెంగళూరులో ఎందుకు నివాసం ఉంటున్నారనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. పాస్పోర్టు, వీసా లేకూండా 2024లో జాప్నా నుంచి బోటులో తమిళనాడు రామేశ్వరానికి శ్రీలకం పౌరులు వచ్చారు. అక్కడి నుంచి బెంగళూరుకు చేరుకుని.. దేవనహళ్లి సమీపంలోని ఒక అపార్ట్మెంట్ను అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. విదేశీ పౌరులకు బాడుగ ఇళ్లు ఇవ్వాలంటే బాడిగ ఇంటి యజమాని పోలీసులకు సీ ఫారం ఇవ్వాలనే నిబంధన తప్పనిసరిగా ఉంటుందని పోలీసులు తెలిపారు. కంటైనర్ పల్టీదొడ్డబళ్లాపురం: అదుపు తప్పిన కంటెయినర్ వాహనం రహదారిపై పల్టీ కొట్టిన సంఘటన నెలమంగల టోల్ వద్ద చోటుచేసుకుంది. తుమకూరు నుంచి బెంగళూరు వస్తున్న కంటెయినర్ ఒకటి నెలమంగల టోల్ వద్ద హఠాత్తుగా అదుపుతప్పింది. రోడ్డుపై అడ్డంగా బోల్తా పడింది. గంటల పాటు వాహనాల రాకపోకలు స్తంభించాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టోల్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్రేన్ల సాయంతో కంటెయినర్ను రోడ్డు పక్కకు తొలగించారు. కంటెయినర్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులకు ఆరోగ్య శిబిరంయశవంతపుర: బెంగళూరు నగరంలో పని చేస్తున్న పోలీసు సిబ్బంది, అధికారులకు అరోగ్య శిబిరం నిర్వహించారు. నగర పోలీసు కమిషనర్ సీమంత కుమార్ సింగ్ నేతృత్వంలో ఉప పోలీసు కమిషనర్ల సహకారంతో ఒక వారం వ్యవధిలో మానసిక అరోగ్య శిబిరం నిర్వహించారు. మానసిక అరోగ్య సమస్యలు, ఆత్మహత్యల నివారణపై వైద్యులు కౌన్సెలింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో 100 మంది అధికారులు, సిబ్బంది పాల్లొన్నారు. నవదుర్గ నృత్య రూపకం గౌరిబిదనూరు: ఆదివారం రాత్రి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నగరంలో శారదామాత ఆలయంలో నాట్యాలయ విద్యార్థుల నవదుర్గా భరతనాట్య రూపకం భక్తులను ఆకటుకుంది. దుర్గామాత గొప్పతనాన్ని నృత్యం ద్వారా మనోహరంగా చాటిచెప్పారు. గ్రామ చెరువులోకి భైరప్ప చితాభస్మందొడ్డబళ్లాపురం: ప్రముఖ రచయిత, పద్మభూషణ్ ఎస్ఎల్ భైరప్ప చితాభస్మాన్ని ఆయన స్వగ్రామం చెన్నపట్టణ తాలూకా సంతేశివర చెరువులో కలిపారు. సోమవారంనాడు ఆయన కుమారులు రవిశంకర్, ఉదయ్లు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే సీఎన్ బాలక్రిష్ణ, మాజీ ఎమ్మెల్సీ గోపాలస్వామి, వందలాది మంది గ్రామస్తులు హాజరయ్యారు. హాస్యనటుడు యశ్వంత్ మృతియశవంతపుర: రంగస్థల కళాకారుడు, కన్నడ సినిమా రంగంలో హాస్యనటుడిగా గుర్తింపు పొందిన యశ్వంత్ సరదేశ పాండె (62) గుండెపోటుతో కన్ను మూశారు. బెంగళూరు బన్నేరఘట్ట సమీపంలోని ఫోటీస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించిన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కన్నడ సూపర్ హిట్ సినిమా రామ శామ భామ సినిమాలో నటించడంతో యశ్వంత్కు గుర్తింపు వచ్చింది. గస్థలంలో మంచి నాటకాలకు దర్శకత్వం వహించారు. ఈయన విజయపుర జిల్లా బసవన బాగేవాడి తాలూకా ఉక్కలి గ్రామానికి చెందిన వారు. ఆల్ ది బెస్ట్ నాటకాన్ని అయనే రచించి, దర్శకత్వం వహించి అందులో నటించి మంచి పేరు సంపాదించారు. ఈయనకు భార్య మాలతి, పిల్లలు ఉన్నారు. శారదా మాతగా దర్శనంతుమకూరు: తుమకూరు జిల్లా పరిపాలనా విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న దసరా వేడుకల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన మండపంలో చాముండేశ్వరి దేవిని సోమవారం శారదా దేవి రూపంలో అలంకరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే టీబీ జయచంద్ర, భార్య నిర్మల, జడ్పీ సీఈఓ ప్రభు, నాగన్న తదితరులు దర్శించుకుని పూజలు చేశారు. -
రాయలసీమ రైతులకు న్యాయం చేయాలి
బనశంకరి: కేంద్ర ప్రభుత్వం రాయలసీమ పై కళ్లు తెరవాలని, తరతరాలుగా రాయలసీమ కు పాలకులు అన్యాయం చేస్తున్నారని రాయలసీమ రాష్ట్రసమితి వ్యవస్దాపక అద్యక్షుడు ఉద్యమనేత డాక్టర్ కుంచం వెంకటసుబ్బారెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ద్వజమెత్తారు. సోమవారం యలహంకలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రాయలసీమరైతులు కష్టాలు ఏనాటికి నెరవేరుతాయో కాలమే చెప్పాలన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే జలయజ్ఞం పేరుతో రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. జలయజ్ఞంలో మరో ముఖ్యమైన ప్రాజెక్టు దుమ్ముగూడెం నాగార్జున టైల్ పాండ్ ఆయన మరణంతో నిలిచిపోయిందన్నారు. ఆయన జీవించి ఉంటే 160 టీఎంసీల గోదావరిజలాలను నాగార్జునసాగర్లోనికి పంపి, ఆ మేరకు కృష్ణా జలాలను శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు మళ్లించి ఉండేవారన్నారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం పట్టిసీమ ద్వారా నీళ్లు ఇస్తామని అవాస్తవాలు చెప్పారన్నారు. ఈసారైనా గోదావరి జలాలను రాయలసీమ ప్రాజెక్టులకు తరలిస్తారని రైతులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారని, ఆ మేరకు ప్రభుత్వం సాకారం చేయాలని డిమాండ్ చేశారు. -
బోల్తాపడిన టెంపో ట్రావెలర్
శివమొగ్గ: వేగంగా వెళ్తున్న టెంపో ట్రావెలర్ వాహనం అదుపు తప్పడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న సుమారు 14 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన శివమొగ్గ జిల్లా, సాగర తాలుకా సిగందూరు రోడ్డులో ఉన్న హులిదేవరబన సమీపంలోని కోరనకొప్ప గ్రామం వద్ద ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. గాయపడిన వారందరూ బెంగళూరు నగరానికి చెందిన వారని గుర్తించారు. బెంగళూరుకు చెందిన కొందరు సిగందూరు దేవాలయానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. తొలుత బెంగళూరు నగరం నుంచి సాగర వరకు రైలులో వచ్చారు. అక్కడి నుంచి సిగందూరుకు అద్దెకు టెంపో ట్రావెలర్ వాహనం మాట్లాడుకుని బయలుదేరారు. హులిదేవరబన సమీపంలోని కోరనకొప్ప గ్రామం వద్దకు చేరుకోగానే.. ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయిన టెంపో ట్రావెలర్ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రెక్ వేశాడు. అదుపుతప్పిన వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సాగర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 14 మంది ప్రయాణికులకు గాయాలు -
కేసు కొట్టివేతకు ప్రజ్వల్ అర్జీ
శివాజీనగర: ఇంటి పనిమనిషి మీద అత్యాచారం, అశ్లీల వీడియోల కేసులో జేడీఎస్ నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరు ఆగస్టు నుంచి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో జీవితఖైదును అనుభవిస్తుండడం తెలిసిందే. కింద కోర్టు విధించిన యావజ్జీవిత శిక్షను రద్దు చేయాలని ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లో ఏముంది? 2021 జనవరి నుంచి 2022 జనవరి ఆఖరి వరకు బెంగళూరు బసవనగుడిలోని ఇంట్లో ఆమె మీద అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో ఆరోపించారు. 2024 మే 10న మా ఇంటికి వచ్చిన సిట్ అధికారులు పరుపులు, దిండ్లను తీసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. మూడేళ్లపాటు బెడ్పై బట్టలను మార్చకుండా, క్లీన్ చేయకుండా ఉంటారా అనేది కింది కోర్టు పరిగణించలేదు అని ప్రజ్వల్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. ఇంకా అనేక అంశాలను అందులో ప్రస్తావించి కేసును కొట్టివేయాలని కోరాడు. గోదాములో కూడా మూడేళ్ల తరువాత దుస్తులపై మరకలు, ఇతర ఆధారాలను సేకరించామనడం నమ్మశక్యం కాదని, కాబట్టి కేసును రద్దు చేయాలని విన్నవించాడు. హైకోర్టులో పిటిషన్ దాఖలు -
గోతుల రోడ్లు.. లారీ అతివేగం.. విద్యార్థిని దుర్మరణం
కృష్ణరాజపురం: సిలికాన్ సిటీలో విపరీతమైన వాహన రద్దీ, గుంతల రోడ్లు కలిసి యువత ప్రాణాలను తీస్తున్నాయి. తరచూ రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడమో, తీవ్ర గాయాలు కావడమో జరుగుతున్నా సర్కారులో చలనం రావడం లేదు. కాలేజీకి వెళుతున్న విద్యార్థినిని టిప్పర్ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టిన ప్రమాదంలో ఆమె అక్కడే దుర్మరణం చెందింది, ఈ దుర్ఘటన బెంగళూరులోని కృష్ణరాజపురం ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఆవులహళ్ళి మెయిన్రోడ్డులో జరిగింది. వివరాలు.. నారాయణమఠం నివాసి అయిన ధనుశ్రీ (22) అనే యువతి ఓ ప్రైవేటు కాలేజీలో బీకాం రెండో ఏడాది చదువుతోంది. సోమవారం ఉదయం 8:30 గంటలకు ఆమె కాలేజీకి స్కూటర్లో బయల్దేరింది. భూదిగెరె క్రాస్ రోడ్డులో ఎక్కడ చూసినా గుంతలు తేలాయి. ఆమె గుంతలను తప్పించుకుని నెమ్మదిగా వెళ్తుండగా వేగంగా వచ్చిన టిప్పర్ లారీ స్కూటర్ను ఢీకొని ఆమె మీద నుంచి వెళ్లిపోయింది. కిందపడి తీవ్ర గాయాలు అయిన ధనుశ్రీ రక్తపుమడుగులో ప్రాణాలు విడిచింది. మృతదేహం నుజ్జునుజ్జయి శరీరభాగాలు చెల్లాచెదరుగా పడ్డాయి. స్థానికులు చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆవులహళ్ళి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో గంటలకొద్దీ ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. లారీ కోసం గాలింపు చేపట్టారు. బెంగళూరులో ఘోరం -
చదువుల తల్లీ పాహిమాం
చంద్రలేఖ విభూషిత మాత రూపంలో శాకంబరీ దేవి సరస్వతీ దేవి అలంకరణలో లక్ష్మీ వేంకటేశ్వరుడుసరస్వతీ దేవి అలంకారంబనశంకరి: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో 8వ రోజు సరస్వతీ మాత అలంకారంలో భక్తులకు బనశంకరీదేవీ దర్శనమిచ్చింది. అర్చకులు సోమవారం వేకువజామున సుప్రభాతసేవ, పంచామృతాభిషేకం చేపట్టి తరువాత అమ్మవారికి విశేష అలంకారం చేశారు. యాగశాలలో శ్రీసరస్వతి హోమం చేపట్టి మధ్యాహ్నం 1 గంటకు పూర్ణాహుతి చేశారు. ఆలయంలోని శాకంబరీదేవిని శ్రీచంద్రలేఖ విభూషిత దేవి రూపంలో అలంకరించారు. పెద్దఎత్తున అమ్మవారిని దర్శించుకుని నిమ్మకాయల ప్రమిదలతో దీపారాధన గావించారు. బొమ్మనహళ్లి: హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోని ఆగర గ్రామంలో వెలసిన లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. సోమవారం స్వామివారు సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవాలయ ప్రధాన అర్చకుడు అనంతపురం చంద్రమౌళి ఆధ్వర్యంలో స్వామిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యుడు అయిన సత్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామికి ప్రత్యేక పూజలు చేయించారు. -
ఆకాశంలో మాయాజాలం
ఆకట్టుకున్న పాలపుంత, గర్జిస్తున్న పులి ఆకారాలు పొట్టేళ్ల ప్రదర్శనలో విన్యాసాలు మైసూరు: మైసూరు దసరా ఉత్సవాలలో ఆకాశంలో అద్భుతం జరిగింది. సింహవాహనంపై ఆసీనురాలైన చాముండేశ్వరి అమ్మవారు, దసరా అంబారీ ఏనుగు, పెద్ద పులి, సర్పంపై నర్తిస్తున్న శ్రీకృష్ణుడు, పాల పుంత ఇలా అనేక రూపాలు ఆవిష్కృతమయ్యాయి. వాటిని చూస్తూ ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. డ్రోన్ల ఇంద్రజాలం ఆదివారం రాత్రి అత్యంత ఆకర్షణీయమైన డ్రోన్ల కళా ప్రదర్శన విజయవంతంగా సాగింది. బన్ని మంటప కవాతు మైదానంలో రాష్ట్ర విద్యుత్ సంస్థ ఆధ్వర్యంలో సుమారు 3 వేల డ్రోన్లతో ప్రదర్శన ఆద్యంతం అబ్బురపరచింది. టెక్నీషియన్లు ఆకాశంలో డ్రోన్లను క్షణాల్లోనే రకరకాల రూపాల్లో అమర్చుతూ కళారూపాలను ఏర్పరిచారు. ఈ కార్యక్రమం గిన్నిస్బుక్ రికార్డులోకి ఎక్కడం గమనార్హం. వేలాదిమంది ప్రజలు తరలివచ్చి డ్రోన్ షోను వీక్షించారు. కొన్ని ఆకారాలకు 2 వేల డ్రోన్లు, కొన్ని ఆకారాలకు 3 వేల డ్రోన్లను ఉపయోగించారు. అవాంతరాలు లేకుండా సజావుగా సాగింది. నల్లటి ఆకాశంలో రకరకాల లైట్లతో డ్రోన్లు ఆకారాలను ఏర్పరిచాయి. ప్రజలు మొబైళ్లు, కెమెరాలతో బంధించారు. హుషారుగా గాన కచేరీ ప్యాలెస్ ఎదుట వేదికపై ప్రముఖ గాయకుడు కునాల్ గంజన్వాలా బృందం హిందీ, కన్నడ పాటల గానకచేరీ ప్రేక్షకులను ముగ్ధుల్ని చేసింది. పాటలు, సంగీతానికి మైమరిచి చిందులేశారు. అలాగే శునకాల ప్రదర్శన ఆకట్టుకుంది. గాన కచేరీలో ప్రేక్షకుల ఉత్సాహం కునాల్ గంజన్వాలా పాట కచేరీకాళీయ మర్ధనం చేస్తున్న కన్నయ్య సింహ వాహనంపై చాముండేశ్వరి మాత రూపం ఆవిష్కరణ 3 వేల డ్రోన్లతో వినూత్న ప్రదర్శన మైసూరు దసరాలో మంత్రముగ్ధం -
నగదు దొంగ అరెస్ట్
చిక్కబళ్లాపురం: నగదు చోరీ చేసిన దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. ఈనెల 23వ తేదీన నగరంలోని బీబీ రోడ్డులో ఉన్న శనేశ్వర స్వామి ఆలయంలో తాలూకా పరిధిలోని దిబ్బూరు గ్రామానికి చెందిన మునిరాజు దేవుడి దర్శనానికి వెళ్లాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి మునిరాజు జేబులో నుంచి రూ.50 వేలు చోరీ చేశాడు. బాధితుడు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఒడిషాకు చెందిన దాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. నగదు తానే చోరీ చేసినట్లు దాస్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. అనంతరం అతడి నుంచి రూ.5 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీఐ మంజునాథ్, పీఎస్ఐ రత్నాబాయి ఇతర సిబ్బందిని జిల్లా ఎస్పీ కుశాల్ చౌక్సె అభినందించారు. ఉచిత ఆరోగ్య శిబిరాలను వినియోగించుకోండిగౌరిబిదనూరు: గ్రామీణ ప్రదేశాల్లో వివిధ సంస్థలు నిర్వహించే ఉచిత ఆరోగ్య పరీక్షా శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తాలూకా వైద్యాధికారి హేమలత పిలుపునిచ్చారు. సోమవారం నక్కలపల్లి పీహెచ్సీలో ధర్మస్థల గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య పరీక్షా శిబిరం నిర్వహించారు. రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ క్యాన్సర్ తదితరుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ధర్మస్థల గ్రామీణాభివృద్ధి సంస్థలోని జ్ఞానవికాస కార్యక్రమాల గురించి ప్రాజెక్ట్ అధికారి నాగరాజ నాయక్ తెలిపారు. కార్యక్రమంలో అశ్విని, సుధ, తదితరులు పాల్గొన్నారు. రక్తదానంతో ప్రాణదానం బొమ్మనహళ్లి: అన్నిదానాల్లోకి రక్తదానం చాలా గొప్పదని, ఒకరు రక్తదానం చేయడం ద్వారా ప్రమాదాలలో గాయపడిన, ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న సుమారు ఐదుమంది ప్రాణాలను కాపాడవచ్చని, ఇందుకోసం యువతతో పాటు ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని బొమ్మనహళ్ళి ఎమ్మెల్యే.ఎం.సతీష్రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సాయిబాబా ఆలయ ఆవరణలో ఉచిత ఆరోగ్య శిబిరం, రక్తదాన శిబిరాలను ఆయన ప్రారంభించారు. సమారు 70 మందికి పైగా యువకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. విద్యతోనే ఉన్నతస్థాయికిగౌరిబిదనూరు: శ్రీకృష్ణుడు గొప్ప తత్వజ్ఞాని, దార్శనికుడని, ఆయన ఆదర్శాలు ఆచరణయోగ్యమని ఎమ్మెల్యే పుట్టస్వామిగౌడ అన్నారు. హెచ్ఎన్ కళాభవనంలో యాదవ సంఘంచే ఆదివారం సాయంకాలం జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ప్రారంభించి ప్రసంగించారు. మీ పిల్లలను విద్యావంతులు చేయండి, చదువుద్వారానే అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి, బీపి కృష్ణమూర్తి, దొడ్డబళ్ళాపురం ఎమ్మెల్యే ధీరజ్ మునిరాజు, ఆ వర్గం ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభావంత విద్యార్థులను సన్మానించారు. ప్రైవేట్ ప్రాణి పాలన కేంద్రంపై దాడి యశవంతపుర: ఉడుపి జిల్లా బ్రహ్మవర తాలూకా సాలుగ్రామంలో అనధీకృతంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ ప్రాణిపాలనా కేంద్రంపై అధికారులు దాడులు నిర్వహించారు. అక్కడ ఉన్న అనేక జంతువులను రక్షించారు. పేటా ఇండియా సంస్థ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ దాడులు చేశారు. గతంలోనూ ఇలానే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దాడులు చేపట్టారు. మళ్లీ నిర్వహకులు అనధీకృతంగా కుక్కలను పెంచుతుండటంతో నిర్వహకుడు సుదీంద్ర ఐతాళను అధికారులు హెచ్చరించి పంపారు. అక్కడ దొరికిన కుక్కలను సురక్షితమైన చోట వదిలినట్లు అధికారులు తెలిపారు. కుక్కలతో పాటు పిల్లులను రక్షించారు. -
శరావతిపై 2 వేల మెగావాట్ల ప్రాజెక్టు!
బనశంకరి: శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి తాలూకాలోని అంబుతీర్థ వద్ద జన్మించే శరావతి నది పశ్చిమ కనుమల్లో అత్యంత ప్రకృతి రమణీయ ప్రదేశంగా పేరుపొందింది. పర్యావరణపరంగా వైవిధ్యభరితమైన ప్రాంతాల గుండా దాదాపు 130 కిలోమీటర్లు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇది కర్ణాటకలో విద్యుత్ ఉత్పత్తికి కూడా ప్రధాన వనరు. ఈ నదీజలాలపైనే... శరావతి జనరేటింగ్ స్టేషన్ (1,035 మెగావాట్లు), మహాత్మగాంధీ జలవిద్యుత్ కేంద్రం (139 మెగావాట్ల), లింగనమక్కి డ్యామ్ పవర్హౌస్ (55 మెగావాట్లు) విద్యుదుత్పాదనలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. విద్యుత్ వెలుగుల శరావతి దశాబ్దాలుగా ఈ కేంద్రాలు, థర్మల్ పవర్ యూనిట్లు కంటే తక్కువ ఖర్చుతో కర్ణాటకకు మిలియన్ల కొద్దీ యూనిట్ల విద్యుత్ను అందిస్తున్నాయి. కానీ ఈ నది వెంబడి ఉన్న ప్రాజెక్టులు తరచుగా పర్యావరణవేత్తలు, అధికారంలో ఉన్న ప్రభుత్వాల మధ్య వివాదానికి కారణమౌతున్నాయి. ప్రస్తుతం కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేపీసీఎల్) శరావతి లోయ పంప్డ్ స్టోరేజ్ జల విద్యుదుత్పత్తి పథకాలకు ప్రణాళికవేస్తోంది. శివమొగ్గ– ఉత్తర కన్నడ జిల్లా పరిధిలో ఈ ప్రాజెక్టు నిర్మాణమవుతోంది. లోయలో ఉన్న రెండు జలాశయాలను ఉపయోగించి మరో 2 వేల మెగావాట్లను ఉత్పత్తి చేయడానికి ఈ ప్రాజెక్టు ప్లాన్ చేశారు. రాష్ట్రంలో ఇదే మొట్టమొదటి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు అవుతుంది. దీని వల్ల మరింత విద్యుదుత్పత్తి జరిగి పరిశ్రమలకు, ఇళ్లకు వెలుగులు నింపుతుంది. అలాగే వేలాది ఉద్యోగ, ఉపాధి అవకావాలను సృష్టిస్తుందని విద్యుత్ అధికారులు తెలిపారు. మరింత ఉప్పునీటి సమస్య ఇది పర్యావరణ చట్టాల ఉల్లంఘన అని జీవవైవిధ్య మండలి మాజీ అధ్యక్షుడు అనంతహెగ్డే చెబుతున్నారు. వేలాది చెట్లను కొట్టివేస్తున్నారు. మామూలుగా శరావతి నదిలో 14 కిలోమీటర్ల వరకు సముద్రం నుంచి ఉప్పు నీరు చొరబడుతుంది. పంప్డ్ స్టోరేజ్ పథకం అమలైతే కోట్ల లీటర్ల నీటిని పైన ఉన్న రిజర్వాయరుకు తరలిస్తారు. గేరుసొప్పు జలాశయం నుంచి నదిలోకి ప్రవహించే నీటి ప్రమాణం తగ్గుతుంది. దీంతో ఉప్పు నీరు మరితం దూరం వరకు చొరబడి నది, అందులోని జలచరాల సంతతి ఆహారం దొరక్క నశిస్తుందని చెప్పారు. మరింత విద్యుదుత్పత్తి, ఉపాధి అవకాశాలు ప్రకృతికి నష్టమని పర్యావరణవేత్తల ఆందోళనలు అడకత్తెరలో చిక్కిన భారీ పథకం భూమి కుంగే ప్రమాదం శరావతి నది పరిసరాలు సున్నితమైన భూ ప్రదేశాలని, ఇక్కడ భారీ యంత్రాలతో సొరంగాలు, రిజర్వాయర్లను తవ్వితే భూమిపొరలు సడలిపోయి కుంగిపొయే ప్రమాదం సంభవించవచ్చని చెప్పారు. తవ్వకాల కోసం జరిపే పేలుళ్ల వల్ల వన్యజీవులు వలస వెళ్లవచ్చు. అంతేగాక లింగనమక్కితో పాటు ప్రముఖ జలాశయాలకు ఇది ప్రమాదం కావచ్చుననే భయం ఉందని సంరక్షణా జీవశాస్త్రవేత్త కేశవ కోర్క అన్నారు. గేరుసొప్ప నుంచి భూమి లోపల సొరంగం తవ్వడానికి కనీసం 1500 కార్మికులు 5– 6 ఏళ్లు పనులు చేస్తారు. నీటి వనరులు, అడవి కలుషితమౌతుందని పేర్కొన్నారు. రూ.10 వేల కోట్ల పథకంతో నష్టాలా? మరోవైపు ఇది పర్యావరణానికి మంచిది కాదని మేధావులు, పర్యావరణ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. రూ.10 వేల కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్టు వల్ల వేలాదిగా చెట్లను కొట్టివేస్తారు, అడవి, నది ముప్పులో పడతాయన్నారు. విస్తృతమైన జంతువులు, వృక్ష జాతుల జీవ వైవిధ్యంతో కూడిన అభయారణ్యాన్ని సంరక్షించాల్సిన ప్రభుత్వమే ఉల్లంఘించి పథకం అమలుకు సిద్ధమైందని పర్యావరణవాదులు ఆరోపిస్తున్నారు. ఈ విద్యుత్ పథకం వద్దని అటవీశాఖ అధికారులు సర్కారుకు నివేదిక అందజేసినప్పటికీ సర్కారు పక్కన పెట్టి అనుమతి ఇచ్చిందని ఆరోపణలున్నాయి. -
పండుగ వేళ.. వానల హోరు
యశవంతపుర: కన్నడనాట అనేక జిల్లాలలో నేటి నుంచి అక్టోబరు 4 వరకు భారీగా వానలు పడే అవకాశం ఉందని బెంగళూరు వాతావారణశాఖ ఆధికారులు తెలిపారు. ఈ కారణంగా కరావళి, మలెనాడు జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించారు. ఈ నెల 30న తుపాన్గా ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఒడిశా తీరంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అలజడి వల్ల కర్ణాటకలో వారంరోజులు కుండపోత వానలు పడే ఆస్కారముంది. చేపలు పట్టడానికి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని అధికారులు తెలిపారు. మరోవైపు బెంగళూరుతో పాటు ఽహావేరి, ధారవాడ, చిత్రదుర్గ, దావణగెరె, కోలార, రామనగర, మైసూరు, చామరాజనగర, శివమొగ్గ జిల్లాలో ఆదివారం నుంచి ఓ మోస్తరు వానలు పడ్డాయి. కరావళి జిల్లాల్లో భారీ వానలు పడే అవకాశం ఉంది. ఉత్తర కర్ణాటకలో బాగలకోట, బీదర్, గదగ్, కలబురగి, కొప్పళ, రాయచూరు, విజయపుర, దక్షిణకన్నడ, ఉడుపి, యాదగిరితో పాటు 8 జిల్లాలలో ఆరెంజ్ ఆలర్ట్ను ప్రకటించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఇప్పటికే అక్కడ వానలు జోరందుకున్నాయి. అత్యవసర చర్యలకు సీఎం ఆదేశం ఉత్తర కర్ణాటకతో సహా రాష్ట్రంలో భారీ వానలు పడే అవకాశం ఉన్నందున కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సీఎం సిద్ధరామయ్య సూచించారు. మహారాష్ట్రలో కురుస్తున్న వానలతో కృష్ణా, భీమా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భీమా తీరంలో నదికి అటు ఇటు ఉన్న గ్రామాలలోకి వరదనీరు ప్రవేశించింది. వరద ప్రాంతాలలో మకాం వేసి సహాయక చర్యలను చేపట్టాలని, జిల్లా ఇన్చార్జి మంత్రులు, ఐఏఎస్లు పర్యటించాలని సీఎం ఆదేశించారు. కలబురగి జిల్లాలో అతివృష్టి నెలకొంది. ఉత్తర జిల్లాల్లో అతలాకుతలం కళ్యాణ కర్ణాటకలో కలబురగి, విజయపుర, బీదర్, రాయచూరు, కొప్పళలో భారీ వానల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నవరాత్రుల సమయంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. వ్యాపారాలు స్తంభించిపోయాయి. చేతికి వచ్చిన పంట నీటి పాలయ్యే ప్రమాదం ఉందని అన్నదాతలు వాపోతున్నారు. వరద ప్రాంతాలలో సహాయక చర్యలను చేపట్టాలని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత తాలూకాలలో గంజి కేంద్రాలను తెరవాలి, అత్యవసర సౌకర్యాలను కల్పించాలని కోరారు. బెళగావి బస్టాండు వద్ద జల్లువాన ఉత్తర కర్ణాటక జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ అయ్యింది అక్టోబర్ 4 వరకు భారీ వర్షసూచన ఉత్తర కర్ణాటకకు ఆరెంజ్ అలర్ట్ ఇప్పటికే ముమ్మరంగా వానలు పొంగిపొర్లుతున్న కృష్ణా, భీమా నదులు -
యువ దసరా ఉల్లాసం
మైసూరు: నాడ హబ్బ మైసూరు దసరాలో సుమారు 10 రోజుల నుంచి నిత్యం సాయంత్రం నగరవాసులను, పర్యాటకులను గాన సుధామృతంతో, నృత్యాలతో రంజిపంజేసిన యువ దసరా సంభ్రమం కన్నుల పండువగా ముగిసింది. నగర సమీపంలోని ఉత్తనహళి జ్వాలాముఖి దేవాలయం వద్ద సాగిన యువత దసరాలో ఆద్యంతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. చివరిరోజు శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ పాటలు, డ్యాన్సులు, డీజే ఇంద్రజాలంతో ఉత్సాహభరింతగా సాగింది. ధూమ్ మచాలే, ధూమ్ మచాలే అనే పాట పాడుతూ ప్రఖ్యాత గాయని సునిధి చౌహాన్ డ్యాన్సు చేస్తూ ఉంటే ప్రేక్షకులు ఉత్సాహంతో ఊగిపోయారు. వేదిక ముందు భాగంలో వేలాదిమంది యువత సైతం నృత్యాలు చేస్తూ మైమరిచారు. ఆమె పలు హిట్ కన్నడ, హిందీ పాటలను ఆలపిస్తూ నృత్యంతో ఆకట్టుకున్నారు. జల్లుల మధ్య యువతరం కేరింతలు కొట్టారు. ● సునిధి చౌహాన్ గానంతో సమాప్తం ● పదిరోజులు నాన్ స్టాప్ కేరింతలు -
ఖాకీలమంటూ రూ.1.1 కోట్లు దోపిడీ
దొడ్డబళ్లాపురం: దంపతులను, కారు డ్రైవర్ను కిడ్నాప్ చేసి రూ.1.1 కోట్లు దోచుకున్న 8 మంది దుండగులను బెంగళూరు హుళిమావు పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు... శనివారం సాయంత్రం ఆర్ఆర్ నగర్కు చెందిన వ్యాపారి మోహన్ తన కారుడ్రైవర్ హేమంత్కు ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్లి రియల్ ఎస్టేట్ వ్యాపారి మోటరామ్ వద్ద డబ్బును తీసుకురావాలని చెప్పాడు. ఆ మేరకు హేమంత్ హుళిమావు పీఎస్ పరిధిలోని అక్షయనగరకు వెళ్లి మోటరామ్కు ఫోన్ చేశాడు. కాసేపటికి అక్కడకు తన భార్యతో కలిసి కారులో వచ్చిన మోటరామ్ కారు వెనుక డబ్బు ఉందని తీసుకోవాలని చెప్పాడు. అయితే అదే సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు తాము పోలీసులమని, కారు చెక్ చేయాలని వీడియో తీస్తూ బెదిరించారు. దంపతులపై దాడి చేశారు. హేమంత్ను, మోటరామ్ దంపతులను బలవంతంగా నిర్జన ప్రదేశానికి తీసికెళ్లారు. అక్కడ మరో ఆరుగురు దుండగులు కలిసి వారిని బంధించారు. మరో 10 లక్షలు పంపాలని ఫోన్ హేమంత్ చేత యజమాని మోహన్కు ఫోన్ చేయించి రూ.10 లక్షలు పంపించాలని, లేదంటే హేమంత్ను చంపేస్తామని బెదిరించారు. అందుకు మోహన్ ఒప్పుకోలేదు. వెంటనే హుళిమావు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు గాలింపు జరిపి 15 నిమిషాల్లో దుండగులు ఉన్న స్థలాన్ని కనిపెట్టారు. 8 మంది నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.1.1 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు కమిషనర్ సీమంత్కుమార్ సింగ్ నగదును, స్వాధీనం చేసుకున్న 2 కార్లు, ఇతరత్రా సామగ్రిని పరిశీలించారు. ముగ్గురి కిడ్నాప్... పావుగంటలో పట్టేసిన పోలీసులు బెంగళూరు హుళిమావులో ఘటన -
దసరా ఆఫర్.. లాఠీచార్జీ
బనశంకరి: దుస్తులు తక్కువ రేటు అని ఆఫర్ ఇవ్వడంతో ఒక్కసారి కస్టమర్లు దుకాణంలోకి ఎగబడటంతో తొక్కిసలాట నెలకొంది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటన హాసన్ నగర ఉదయగిరి లేఔట్లో జరిగింది. లక్ష్మీ బ్యాడ్మింటన్ అకాడమి భవనంలో ఓ షాపులో దసరా ఆఫర్ని ప్రకటించారు. ఆదివారం భారీగా యువకులు రావడంతో తొక్కిసలాట ఏర్పడింది. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పి చెదరగొట్టారు. ఈ సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. కేరళ విద్యార్థుల గంజాయి దందా బనశంకరి: గంజాయి భూతం విద్యార్థులు, యువత మీద పంజా విసురుతోంది. ఆదివారం మంగళూరు దక్షిణ పోలీసులు ఓ ఫ్లాటులో సోదాలు చేయగా 12 కేజీల గంజాయి లభించింది. అందులో ఉంటున్న 11 మంది కేరళ విద్యార్థులను అరెస్టు చేశారు. నగర పోలీస్ కమిషనర్ సుధీర్కుమార్ రెడ్డి వివరాలను వెల్లడించారు. అత్తావర కాపీగుడ్డ మసీదు వద్ద గల కింగ్స్ కోర్ట్ అపార్టుమెంట్లోని ఓ ఫ్లాట్లో గంజాయిని అమ్ముతున్నట్లు తెలిసింది. వెంటనే పోలీసులు దాడిచేశారు. 11 మంది బీబీఏ విద్యార్థులను అరెస్టు చేశారు. వీరు మంగళూరు కాలేజీలో బీబీఏ రెండో ఏడాది చదువుతున్నారు. గంజాయిని సేవించడంతో పాటు ఈజీ మనీ కోసం దానిని అమ్మేవారని గుర్తించారు. అరెస్టు చేసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. గంజాయి దందాపై లోతుగా దర్యాప్తు చేపట్టారు. మహిళలకు బైక్ రైడింగ్ పోటీలుతుమకూరు: తుమకూరు దసరా ఉత్సవాల సందర్భంగా ఆదివారం మహిళా దసరా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా బైక్ రైడింగ్ పోటీలు నిర్వహించగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. హెల్మెట్ ధరించి రోడ్లపై దూసుకెళ్లారు. అంతకుముందు బైక్ రైడింగ్ను మంత్రి పరమేశ్వర్ ప్రారంభించారు. కలెక్టర్ శుభకళ్యాణ్, ఉప విభాగం అధికారి పాల్గొన్నారు. -
బైక్ను ఆర్టీసీ బస్సు ఢీ.. ముగ్గురు బలి
దొడ్డబళ్లాపురం: బస్సు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందిన సంఘటన హాసన్ జిల్లా హొళేనరసీపుర తాలూకా యడెగౌడనహళ్లిలో జరిగింది. మృతులను హొళేనరసీపుర పట్టణ నివాసులు తరుణ్ (19), రేవంత్ (26), ఇర్ఫాన్(20)లుగా గుర్తించారు. హాసన్ నుంచి మైసూరు వెళ్తున్న కేఎస్ఆర్టీసీ బస్సు.. ఘటనాస్థలిలో వేగంగా బైక్ను ఢీకొంది. బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు తీవ్ర గాయాలతో పడిపోయారు. ఇర్ఫాన్ అక్కడే చనిపోగా, రేవంత్, తరుణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. హళ్లి మైసూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రామకోటి మహాయజ్ఞంచింతామణి: తాలూకాలో కై వారం గవి దగ్గర ప్రకృతి ఒడిలో ఉన్న యోగా నరసింహస్వామి వైకుంఠ యోగశాలలో రామభావతార మంత్ర రామకోటి జపయజ్ఞ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. గోపూజతో ప్రారంభించారు. గణపతి, మహాలక్ష్మీ ,యోగానరసింహస్వామి, సద్గురు యోగినారేయణ తాతయ్య విగ్రహాలకు విశేష పూజలను నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రామకోటిని 24 గంటలపాటు చేపట్టారు. కై వార ధర్మాధికారి జయరాం దంపతులు, విభాకరరెడ్డి, సత్యనారాయణ, విద్వాన్ బాలకృష్ణ పాల్గొన్నారు. నకిలీ పత్రాలతో బీడీఏ స్థలాలకు ఎసరు దొడ్డబళ్లాపురం: నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బీడీఏ స్థలాలను కబళిస్తున్న ముగ్గురు కిలాడీలను బెంగళూరు శేషాద్రిపురం పోలీసులు అరెస్టు చేశారు. కే.చిక్కరాయి (68), మురళీధర్ (60), మంజునాథ్ (48)అరైస్టెన నిందితులు. బీడీఏ నాడప్రభు కెంపేగౌడ కాలనీలో ఓ స్థల యజమాని మరణించారు. ఆ స్థలాన్ని వీరు నకిలీ పత్రాలతో వారి పేరున రిజిస్టర్ చేయించుకున్నారు. మృతుని భార్య లక్ష్మిదేవమ్మ స్థలం వద్దకు వెళ్లగా నీది కాదు అని దౌర్జన్యం చేశారు. దీంతో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. గతంలో బీడీఏలో పని చేసి రిటైరైన ఉద్యోగి కే చిక్కరాయి, మంజునాథ్, బ్రోకర్ మురళీధర్ ముగ్గురూ కలిసి బోగస్ డాక్యుమెంట్లు సృష్టించి మరో వ్యక్తిని స్థల యజమాని చూపి సైటును రిజిస్టర్ చేసుకున్నారు. ఇదేమాదిరిగా అనేక సైట్లను బోగస్ పత్రాలతో సొంతం చేసుకుని విక్రయించినట్టు తేలింది. వీరిని అరెస్టు చేసిన పోలీసులు మరిన్ని వివరాలు రాబడుతున్నారు. మైసూరుకు బస్సు చార్జీల వాత దొడ్డబళ్లాపురం: మైసూరు దసరా నేపథ్యంలో ప్రభుత్వం ప్రయాణికుల జేబుల్ని గుల్ల చేస్తోంది. కేఎస్ ఆర్టీసీ బస్సుల్లో టికెట్ రేట్లను రూ.20 చొప్పున పెంచింది. దసరా ఉత్సవాలు ప్రజలందరూ చూడాలని చార్జీలను తగ్గించి ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్రంలోని ఎక్కడి నుంచైనా మైసూరుకు బస్సులో వెళ్తే రూ.20 అదనపు చార్జీని చెల్లించాలి. వేగదూత, ఐరావత, నాన్ స్టాప్, రాజహంస తదితర బస్సుల్లో కూడా ఇదే వర్తిస్తుంది. దసరా ఉత్సవాలు ముగిసే వరకూ చార్జీల బాదుడే. -
బీవీబీ కళాశాలలో స్నేహ సమ్మేళనం
హుబ్లీ: తాలూకాలోని నుల్వి గ్రామంలో ఉన్న శ్రీ జగద్గురు రేణుకాచార్య బీవీబీ కళాశాలలో ఆదివారం వార్షిక స్నేహ సమ్మేళనం, దీపదాన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ విశ్వవిద్యాలయం సిండికేట్ సభ్యుడు డాక్టర్.ఎస్వీ బెళగలి మాట్లాడుతూ.. గురువు కన్నా శ్రేష్టమైన స్థానం సమాజంలో ఏది లేదన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. బీవీబీ విభాగం ముఖ్యులు ఎంఆర్ పాటిల్, సువర్త న్యూస్ చానల్ సీనియర్ పాత్రికేయుడు గురురాజ హుగారను సన్మాంచారు. కార్యక్రమంలో డాక్టర్ బండివాడ కావ్య ఉమాసారే పాల్గొన్నారు. -
కాత్యాయనీ.. జగజ్జననీ
● కొనసాగుతున్న శరన్నవ రాత్రి ఉత్సవాలు బళ్లారి రూరల్/బళ్లారి అర్బన్: నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆదివారం బళ్లారి నగరంలోని విద్యా నగర్లో గంగా మాత, అభయాంజనేయ స్వామి ఆలయాల్లో కాత్యాయిని అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా పుష్పాలంకరణ, అర్చనలు, ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. బళ్లారి నగర ఆరాధ్య దైవమైన కనక దుర్గమ్మను ఆభరణాలతో అలంకరించారు. విజయదశమి వరకు రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈఓ హనుమంతప్ప తెలిపారు. అలాగే హవంబావి సీతారామ ఆశ్రమంలో మహాలక్ష్మి అలంకరణ, పటేల్ నగర్ చిన్నదుర్గమ్మను సరస్వతీ దేవిగా అలంకరించారు. మిల్లర్పేట్ మల్నాడు దుర్గమ్మను విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఏళ్లు మక్కళ తాయి, బెంగళూరు రోడ్డు వాసవీ మాత, నగరేశ్వరి, బెంకి మారెమ్మ తదితర అమ్మవారి ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. బన్ని మహంకాళికి పూజలు.. సిరుగుప్ప: శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఏడవ రోజున ఆదివారం నగరంలో వివిధ ఆలయాల్లో అమ్మవార్లను విశేషంగా అలకరించారు. 16వ వార్డు కృష్ణానగర్లో బన్ని మహంకాళి అమ్మవారికి విశేష పూజలు చేపట్టారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. అమ్మవార్లకు విశేష అలంకరణ.. హొసపేటె: ఆలయాల్లో దసరా శరన్నవ రాత్రి ఉత్సవాల కోలాహలం నెలకొంది. ఏడవ రోజు ఆదివారం నగరంలోని అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. ఎంజీ నగర్, టీబీ డ్యాం రహదారిలో ఉన్న ముకాంబిక దేవాలయం, ఎల్లమ్మగుడ్డలో ఉన్న రేణుక దేవికి పూజలు చేశారు. ఉచ్చమ్మ దేవిని తమలపాకులతో విశేషంగా అలంకరించారు. మహిళలతో అమ్మవారి ఆలయాలు కిటకిటలాడాయి. ఉదయం ఆలయాల్లో అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన, మంగళహారతి తదితర పూజలు నిర్వహించారు. పల్లకీలో ఊరేగిన కాళికా మాత.. రాయచూరు రూరల్: నగరంలోని కాళికా దేవాలయంలో అమ్మవారిని పల్లకీలో ఊరేగించారు. మమదాపూర్లో మారికాంబ దేవి, కాస్ బావి అంబా భవానీ, కందగడ్డ మారెమ్మ, గుంజల్లిలో శారదా దేవి రూపంలో అలకరించారు. సుంకులమ్మ దేవిని దుర్గామాతగా పూజించారు. కిల్లేరి మఠంలో శాంత మల్ల శివాచార్యులు మహిళలకు ఒడి బియ్యం పంచారు. ఉప్పరవాడి లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం, కన్యకా పరమేశ్వర ఆలయంలో గరుడ వాహనంలో స్వామిని ఊరేగించారు. మూన్నూరు కాపు సమాజం ఆధ్వర్యంలో శరన్నవ రాత్రి సాంస్కృతిక ఉత్సవాలను మాజీ శాసన సభ్యుడు పాపారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శంకరప్ప ప్రారంభించారు. తెలంగాణ, కర్ణాటక, కేరళ, పంజాబ్, న్యూఢిల్లీ నుంచి వచ్చిన కళా బృందాలు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నాయి. కళాకారులు చేసిన డ్యాన్స్ ప్రేక్షకులను అలరించింది. ఇక వైజాగ్ నుంచి వచ్చిన కళాకారులు తమ ప్రతిభను చాటారు. -
ఎత్తిపోతల పథకాల అభివృద్ధికి ప్రాధాన్యత
రాయచూరు రూరల్: జిల్లాలో ఎత్తిపోతల పథకాల అభివృద్ధిఇక ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్, చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం మాన్వి తాలూకా ముద్దన గుడ్డ ఎత్తిపోతల పథకాల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్నదాతలకు శాశ్వత నీటి పారుదల సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వహిస్తే రైతులకు ఎలాంటి ఇబ్బందులు రావని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల రైతుల జీవన విధానంలో మార్పులు తెచ్చేందుకు సర్కార్ కృషి చేస్తుందని వెల్లడించారు. కార్యక్రమంలో శాసన సభ్యుడు హంపయ్య నాయక్, జిల్లా అధికారి నితీష్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ కాందూ, ఎస్పీ పుట్ట మాదయ్య, అమరేశప్ప, అబ్దుల్, బసనగౌడ పాటిల్, బాల స్వామి, రుద్రప్ప తదితరులు పాల్గొన్నారు. -
వైద్య శిబిరానికి స్పందన
రాయచూరు రూరల్: పేదలు ఉచిత ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని నగర సభ ప్రొబేషన్ కమిషనర్ పురురాజ్ సింగ్ సోలంకి, సభ్యుడు రమేష్ పేర్కొన్నారు. ఆదివారం ఆజాద్ నగరంలోని వి.జి.కులకర్ణి ఆస్పత్రిలో ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ముందు జాగ్రత్తలు పాటించి వ్యాధి నివారణకు సలహాలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో విజి కులకర్ణి, ఆస్పత్రి వైద్యుడు అజిత్ కులకర్ణి, హరీష్, అమరేష్, దండెప్ప బిరదార్ తదితరులు పాల్గొన్నారు. శిబిరంలో 150 మందికి వైద్య చికిత్సలు చేశారు. 2న మైలార లింగేశ్వర కార్నికోత్సవం హుబ్లీ: తాలూకాలోని అమరగోళ అధ్యాపక నగర్లో వెలసిన లింగేశ్వర దేవస్థానంలో మాళతేశ స్వామి దసరా ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 2న సాయంత్రం 5 గంటలకు కార్నికోత్సవం జరగనుంది. ఈనెల 30 దుర్గాష్టమి, అక్టోబర్ 2న మహానవమి, అక్టోబర్ 2 విజయదశమి సందర్భంగా ఉదయం 11:15 గంటలకు పల్లకీ ఉత్సవం, మధ్యాహ్నం 3 గంటలకు జాతర, సాయంత్రం 5:15 గంటలకు గురువుల ఆశీర్వాదంతో కార్నికోత్సవం నిర్వహించనున్నారు. జమ్మిపత్రి సమర్పణ కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నదానం చేస్తారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని మైలార లింగేశ్వర దేవస్థాన కమిటీ సభ్యులు కోరారు. దివ్యాంగులకు స్కాలర్షిప్స్ హుబ్లీ: దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత, మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు స్కాలర్షిప్స్ మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. 40 శాతం అంతకంటే ఎక్కువ అంగవైక్యలం కలిగిన వారు స్కాలర్షిప్నకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం 9, 10వ తరగతుల విద్యార్థులు ఈనెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్ నుంచి పీజీ చదువుతున్న విద్యార్థులు అక్టోబర్ 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రీ, పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్కు తల్లిదండ్రులు వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల్లోపు ఉండాలి. ఇంటర్ నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.8 లక్షల్లోపు ఉండాలి. దేశ వ్యాప్తంగా 25 వేల మందికి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్, 17 వేల మందికి పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్స్, టాప్క్లాస్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ 300 మందికి మంజూరు చేస్తామని జిల్లా వృద్ధుల, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారిణి కవిత ఓ ప్రకటనలో తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ అధికారి సస్పెండ్రాయచూరు రూరల్: రాష్ట్రంలో జరుగుతున్న కులగణన సమీక్షలో నిర్లక్ష్యం వహించిన అధికారిని సస్పెండ్ చేశారు. రాయచూరు జిల్లా లింగసూగురు తాలుకా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రమేష్ రాథోడ్పై సస్పెన్షన్ వేటు పడింది. ఆదివారం తహసీల్దార్ సత్యమ్మ ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లా అధికారి నితీష్ రాథోడ్ విచారణ చేపట్టారు. విధుల నిర్వహణలో అలసత్వం, బీఎల్ఓలకు సహకారం అందించ పోవడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురిపై వేటు బళ్లారి రూరల్: దావణగెరె జిల్లాలో ఇద్దరు ఉపాధ్యాయులు, సిబ్బంది ఒకరిని శనివారం జిల్లా అధికారి జి.ఎం.గంగాధరయ్య స్వామి సస్పెండ్ చేశారు. జిల్లాలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 7 వరకు సామాజిక, శైక్షిణిక సమీక్ష నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జమాపురం ప్రాథమిక పాఠశాల సహ ఉపాధ్యాయుడు డి.కె.మంజునాథ్, దావణగెరె ఉత్తర వలయ వ్యాయామ ఉపాధ్యాయుడు హెచ్.బసవరాజును సస్పెండ్ చేశారు. అదేవిధంగా సిబ్బంది కె.ఆర్.దుర్గప్పను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
ఉల్లి ధరలు ఢమాల్
సాక్షి, బళ్లారి/హొసపేటె/హుబ్లీ: ఈ ఏడాది ఉల్లి ధరలు భారీగా పతనమయ్యాయి. దేశంలో ఉల్లిగడ్డలు సాగు చేసే రాష్ట్రాల్లో మహారాష్ట్ర తర్వాత కర్ణాటక అగ్రస్థానంలో ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో ఉల్లి ధరలు ఆశాజనకంగా ఉండటంతో హావేరి, బాగల్కోట, చిత్రదుర్గం తదితర జిల్లాల్లో వేలాది ఎకరాల్లో రైతులు ఉత్సాహంగా ఉల్లి సాగు చేశారు. విజయనగర జిల్లాలో ఈ సంవత్సరం 6,300 హెక్టార్ల విస్తీర్ణంలో ఉల్లి సాగు చేశారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, మంచు కారణంగా 50 శాతానికి పైగా పంట దెబ్బతింది. ఉల్లికి మజ్జిగ వ్యాధి, ట్విస్టర్ వ్యాధి, తెగుళ్లు సోకాయి. పంట నాణ్యత లేకపోవడంతో ధరలు పడిపోయాయి. ధర ఒక్క సారిగా క్వింటాల్ రూ.300 పడిపోయింది. దళారులు, వ్యాపారులు, బ్రోకర్లు ఉల్లిని రిటైల్ వ్యాపారులకు మంచి ధరకు అమ్ముతున్నారని రైతులు భీమన్న సోము, దళవాయి వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పంట సాగుకు చేసిన పెట్టుబడి ఖర్చు కూడా రాలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉల్లికి సరైన మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు. ఒక వైపు భారీ వర్షాలు మరో వైపు పడిపోయిన ధరలతో హావేరి రైతన్నలు ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. హవేరి జిల్లాలో 744 హెక్టార్ల ప్రాంతంలో ఉల్లి సాగు చేశారు. అయితే విఫరీతమైన వానలతో నాణ్యత లేకుండా పంట మారడంతో పైగా సగం పంట భూమిలోనే కుళ్లి పోయింది. ఉన్న ఫలంగా క్వింటా రూ.300లకు పడిపోవడంతో రైతన్నలు దిగులు చెందుతున్నారు. ఎకరాకు రూ.20 వేలు పెట్టుబడి పెట్టి తక్కువ ధరకు విక్రయించడంతో వాహనం అద్దెకు కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. ఒక్క హావేరిలోనే కాక బాగళకోట జిల్లాలోని ముదోళ, బాదామి తాలూకాల్లోని సివికేరి, నీరళగేరి, భగవతి, హొన్నకట్టి, అలాగు ముదోళ తాలూకాలోని లోకపుర, బోమ్మనగుడ్ని, మెట్టగుడ్డ, తిమ్మపురలో సాగు చేసిన ఉల్లి పరిస్థితి కూడా దయనీయంగా మారింది. సంబంధిత అధికారులు తక్షణమే దృష్టి సారించి పంట నష్ట పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. లబోదిబోమంటున్న రైతులు -
భగత్సింగ్కు ఘన నివాళి
రాయచూరు రూరల్: నగరంలో ఆదివారం భగత్సింగ్ జయంతిని ఘనంగా నిర్వమించారు. సూపర్ మార్కెట్ వద్ద ఏఐడీవైఓ, ఏఐడీఎస్ఓ ఆధ్వర్యంలో నాయకులు భగత్సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చెన్నబసవ మాట్లాడుతూ.. భగత్సింగ్ క్రాంతితో కూడిన ఆందోళనలు చేపట్టారన్నారు. దేశంలో ప్రజలకు గృహం, విద్య, ఉద్యోగం, ఆహార భద్రత లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరుస్తున్న వ్యతిరేక విధానాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అంతకు ముందు భగత్సింగ్ చిత్రపటం వద్ద నినాదాలు చేశారు. హొసపేటె: షహీద్ భగత్ సింగ్ ఆశయ సాధనకు నేటి యువత కృషి చేయాలని ఏఐడీవైఓ జిల్లా నేత పాలక్ష కోరారు. ఆదివారం స్థానిక పునీత్ రాజ్కుమార్ మైదానంలో భగత్సింగ్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాలక్ష మాట్లాడుతూ.. భగత్సింగ్ ఆశయం దోపిడీని అంతం చేయడమే నిజమైన స్వేచ్ఛ అని తెలిపారు. కార్యక్రమంలో ప్రకాష్ నాయక్ ఉమా తదితరులు పాల్గొన్నారు. -
హళేబాతి గ్రామంలో శ్రమదానం
బళ్లారి రూరల్: దావణగెరె జిల్లా జెడ్పీ సీఈఓ గిత్తమాధవ విఠల్రావు శనివారం హళేబాతి గ్రామంలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. జెడ్పీ సీఈఓ స్వయంగా పరకను చేతపట్టుకుని వీధుల్లో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేశారు. చెత్తబండిని నడిపారు. ఇంటింటికి వెళ్లి పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించారు. రోడ్లపై చెత్త వేయడం ద్వారా పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతాయని తెలిపారు. ఇంటి వద్ద పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. స్వచ్ఛత హీ సేవా పాక్షిక–2025లో భాగంగా శ్రమదానం కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ అధికారులు, జీపీ అధ్యక్షుడు, సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
వరద హోరు
వరుణుడి జోరు.. రాయచూరు రూరల్: మహరాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరుణుడు దంచికొడుతున్నాడు. భారీ వర్షాలకు వాగులు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. కలబుర్గి, యాదగిరి, బీదర్ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఉజ్జయిని, సీనా, బోరి వాగులు నీటితో కళకళలాడుతున్నాయి. భీమా నది నుంచి 3.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో గంజి కేంద్రాలను ఏర్పాటు చేశామని కలబుర్గి జిల్లా కలెక్టర్ పౌజియా తర్నూమ్ వెల్లడించారు. బీదర్ జిల్లా కమలా నగర్, ఔరాద్, హులసూరు, బాల్కీ, బీదర్లో పంట పొలాలు, ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. కలబుర్గి జిల్లా షేడమ్ తాలూకా ఉత్తరాది మఠం నీటిలో మునిగింది. వరద ఉధృతికి నీటిలో రెండు లారీలు ఆగిపోయాయి. జేవర్గి తాలూకా కట్ట సంగావి వద్ద జాతీయ రహదారి–50పై రాకపోకలకు ఆంటకం కలిగింది. ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోవడంతో ప్రజలు నడుచుకుంటూ వెళ్లిపోయారు. బెళగావి జిల్లాలో బాదామి, రామదుర్గలో నవిల్ తీర్థ జలాశయాల నుంచి నీరు దిగువకు విడుదల చేశారు. బస్సులు నీటిలోనే రాకపోకలు సాగించాయి. విజయపుర సోలాపూర్ మధ్య వాహనాల రాకపోకలను బంద్ చేశారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. బీదర్లో కురిసిన భారీ వర్షాలకు చెరువు కట్ట తెగిపోయింది. వర్షపు నీరు గ్రామంలోకి చేరింది. చించోళి తాలుకా జెట్టూరులో వాగులో నీటి ప్రవాహానికి 40 ఎద్దులు కొట్టుకుని పోయాయి. బీదర్ తాలూకా మల్ఖేడ్లో నెల రోజుల పసికందుతో మహిళ మిద్దె పైకి ఎక్కింది. క.క.భాగంలో విస్తారంగా వర్షాలు భీమా నది నుంచి 3.50 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల దెబ్బతిన్న పంటలు నీటిలో కొట్టుకుపోయిన 40 ఎద్దులు బీదర్లో చెరువు కట్ట తెగడంతో గ్రామంలోకి ప్రవేశించిన నీరు -
నకిలీ బంగారం.. రూ.65 లక్షలు మాయం
కృష్ణరాజపురం: బంగారం రేటు భారీగా పెరగడంతో మోసాలు చేసేవారికి అనువుగా మారింది. నకిలీ బంగారాన్ని అసలు బంగారమంటూ విక్రయించిన కోలారుకు చెందిన ఖతర్నాక్ ముఠాను హొసకోటె పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు నగర శివారు ప్రాంతాలనే లక్ష్యంగా పెట్టుకున్న ఈ ముఠా హొసకోటె, నందగుడి, శిడ్లఘట్టల్లో ఎనిమిది మందికి రూ.65 లక్షలు టోకరా వేసింది. తాలూకాఫీసు, హోటళ్ల వద్ద తెలుగులో మాట్లాడేవారిని గమనించి, వారితో ఎంతో తీయగా మాట్లాడేవారు. కేరళలో ఒక చోట భూమి చదును చేసే పనిని చేస్తుండగా రాజుల కాలంనాటి బంగారు గొలుసు దొరికిందని నమ్మిస్తారు. రెండు అసలైన బంగారు గుండ్లను చూపించి, ఇవి గొలుసులోనివని చెబుతారు. ఎనిమిది కేజీల బంగారు హారాన్ని తక్కువ ధరకు ఇస్తామని చెప్పి కొందరికి ఫలానా చోటుకు రమ్మన్నారు. అక్కడికి వెళ్లగా నకిలీ గొలుసును ఇచ్చి రూ.65 లక్షలను తీసుకుని వెళ్లిపోయారు. ఇంటికి వచ్చి పరిశీలించిన కొనుగోలుదారులు అది నకిలీదని తెలిసి నివ్వెరపోయారు. హొసకోటె పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు జరిపి ప్రధాన నిందితుడు రాజేష్ తో పాటు నలుగురిని అరెస్ట్ చేశారు. తెలుగువారే లక్ష్యం కోలారు ముఠా పట్టివేత -
గుప్పెడంత స్థలంలో 5 అంతస్తులు
వాలిపోయిన భవనం ఇదే కూల్చివేత పనుల్లో కార్మికులు బనశంకరి: బెంగళూరులో మరో భవనం కూలిపోవడానికి సిద్ధమైంది. కోరమంగల జక్కసంద్రలో ప్లాన్ను ఉల్లంఘించి అతి తక్కువ స్థలంలో నిర్మించిన ఐదు అంతస్తుల బిల్డింగ్ వాలిపోయింది. మూడు అంతస్తులకు అనుమతి తీసుకుని ఐదు అంతస్తులు నిర్మించారు. రూ. కోటితో నిర్మాణం వివరాలు.. శాంతమ్మ అనే మహిళ ఏడాది క్రితం 3 అంతస్తుల కట్టడానికి పాలికె నుంచి అనుమతి తీసుకుంది. కానీ 15 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవు స్థలంలో 5 అంతస్తుల కట్టడాన్ని నిర్మించింది. దీనికి రూ. కోటి వరకూ ఖర్చు చేసింది. వచ్చేవారం గృహప్రవేశం చేయాలని సిద్ధమయ్యారు. ఇంతలోనే భవనం పిల్లర్లు, గోడల్లో తీవ్రంగా పగుళ్లు వచ్చి ఓ వైపునకు వాలిపోయింది. ఎప్పుడైనా కూలితుందని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దక్షిణ నగర పాలికె అధికారులు పరిశీలించి కూల్చివేయాలని తీర్మానించారు. 2 రోజుల నుంచి కూల్చివేత పనులు జరుగుతున్నాయి. ఈ ఖర్చును భవన యజమానే భరించాలని తెలిపారు. ఈ పని పూర్తయ్యేవరకు చుట్టుపక్కల ఇళ్లవారిని ఖాళీ చేయించారు. గృహ ప్రవేశానికి ముందే పగుళ్లు కూల్చివేస్తున్న పాలికె సిబ్బంది -
నింగీ నేలా వినోదహేల
మైసూరు/ మండ్య: మైసూరు నగరం దసరా నవరాత్రి వేడుకలతో మురిసిపోతోంది. పలు వేదికలలో జరుగుతున్న నానారకాల వినోద సాంస్కృతిక కార్యక్రమాలను చూడడానికి నగరవాసులు, టూరిస్టులు చలో అంటున్నారు. జట్కా బండ్లలో విహారం ● శనివారం వాయుసేన హెలికాప్టర్ల ప్రదర్శన ఆకట్టుకుంది. ఎర్రని పొగ వదులుతూ గాలిమోటార్లు చేసిన విన్యాసాలను కేరింతలు కొడుతూ తిలకించారు. ● తరువాత వారసత్వ జట్కా బండ్ల ర్యాలీ సాగింది. టూరిస్టులను తీసుకుని గుర్రపుబండ్లు నగరంలో రౌండ్లు వేశాయి. ● మరోవైపు మైసూరు దసరా గజరాజులు బంగారు అంబారీని మోసే సాధనను తీవ్రతరం చేశాయి. గజరాజు అభిమన్యుపై చెక్క అంబారీని బిగించి నగరవీధుల్లో నడిపించారు. ● పర్యాటక దినోత్సవాల పేరుతో ప్యాలెస్ ముందు మహిళల నృత్యాలు అబ్బురపరిచాయి ● సాయంత్రం నుంచి విద్యద్దీపాల వెలుగుల మధ్య టాప్లెస్ బస్సులో పర్యాటకుల నగర యాత్ర హుషారుగా సాగింది. శ్రీరంగపట్టణంలో యోగా మండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణంలో దసరా సంబరాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఆలయం ముందు శనివారం సామూహిక యోగా వేడుకను నిర్వహించారు. జిల్లాధికారి డా.కుమార్ ప్రారంభించారు. జీవితంలో యోగాను నిత్యం ఆచరించి ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. మైసూరులో దసరా సంబరాల అట్టహాసం -
బెంగళూరులో సైబర్ కమాండ్
రియల్ ఎస్టేట్ అని రూ.11 కోట్లు టోపీ● సైబర్క్రైం వింగ్, సైబర్ సెక్యూరిటీ వింగ్, జనజాగృతి దళం సహా మరో విభాగం ఈ సీసీసీలో ఉంటుంది. ● బెంగళూరులో మొత్తం 45 సైబర్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వాటిలోను, సైబర్క్రైం సహాయవాణి 1930లో నమోదయ్యే ఫిర్యాదులను సీసీసీ నిర్వహిస్తుంది. కేసు నమోదు చేయడంతో పాటు దర్యాప్తు నివేదికను కోర్టుకు అందజేస్తుంది. ● అన్నిరకాల ఆన్లైన్ నేరాలు, నేరగాళ్ల ఆచూకీ కనిపెట్టడమే సీసీసీ పని. ● ఆధునిక టెక్నాలజీ ద్వారా దుండగుల ఫోన్లు, కంప్యూటర్ల ఐపీ అడ్రస్ను కనిపెట్టడం, ఎక్కడి నుంచి వంచనకు పాల్పడుతున్నారో గుర్తించి అరెస్ట్ చేస్తుంది. ● అలాగే పోలీసు సిబ్బంది, ఇతర విభాగాలకు సైబర్ నేరాల కట్టడి గురించి శిక్షణనందిస్తుంది.బనశంకరి: కన్నడనాట సైబర్ నేరాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. డిజిటల్ అరెస్టు చేసి, ఈకేవైసీ అని లక్షల రూపాయలను కేటుగాళ్లు దోచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ సైబర్ కమాండ్ సెంటర్ (సీసీసీ)ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో పెరిగిపోతున్న సైబర్నేరాలకు అడ్డుకట్టవేయడానికి స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పరచాలని ఏప్రిల్నెలలో ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం సీసీసీని ఏర్పాటు చేసి దానికి చీఫ్గా డీఐజీ ప్రణవ్ మొహంతిని నియమించింది. సైబర్ నేరాల కేసులను సీఐడీ నుంచి సీసీసీ కి అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చింది. సీఐడీ కార్యాలయంలోనే సీసీసీ ఏర్పాటైంది. మహిళ డిజిటల్ అరెస్టు, రూ.8.80 లక్షల వసూలు మహిళా శాస్త్రవేత్తను మూడురోజుల పాటు డిజిటల్ అరెస్టు చేసిన సైబర్ వంచకులు రూ.8.80 లక్షలు దోచేశారు. బెంగళూరు న్యూ హౌసింగ్కాలనీ నివాసి డాక్టర్ ఎస్.సంధ్య బాధితురాలు. ఈ నెల 16న ఆమెకు ఫోన్ చేసిన గుర్తుతెలియని వ్యక్తి.. తాను పోలీస్ అధికారిని, మీ సిమ్ను దుర్వినియోగం చేయడం వల్ల 17 కేసులు ఉన్నాయి, అంతర్జాతీయ స్థాయిలో మానవ అక్రమ రవాణా దందాలో మీరు భాగస్వాములయ్యారు అని బెదిరించారు. అలా ఆమె నుంచి రూ.8.80 లక్షలను తమ ఖాతాల్లోకి జమ చేసుకున్నారు. తరువాత మోసాన్ని గుర్తించిన బాధితురాలు సైబర్క్రైం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆన్లైన్ నేరాల సత్వర దర్యాప్తు ఏర్పాటు చేసిన సర్కారు 4 విభాగాలుగా నిఘా16 వేలకు పైగా పెండింగ్ కేసులు 2025 జూలై చివరినాటికి రాష్ట్రంలో 16 వేలకు పైగా సైబర్క్రైం కేసులు పెండింగ్లో ఉన్నాయి. పోలీసు సిబ్బంది కొరత ఇందుకు కారణం. సీసీసీలో అధికారులు, టెక్ నిపుణులను నియమిస్తారు. దీనివల్ల కేసుల పరిష్కారం వేగవంతమవుతుందని ఆశాభావం ఉంది.బనశంకరి: స్థిరాస్తి వ్యాపారంలో అధిక లాభం ఇప్పిస్తామని రూ.11.28 కోట్లు వంచనకు పాల్పడ్డాడో మోసగాడు. బెంగళూరు ఇందిరానగర డిఫెన్స్ కాలనీ నివాసి అశోక్కుమార్, అతని మిత్రులు బాధితులు. అతని ఫిర్యాదు మేరకు.. అశోక్కుమార్ 2014 నుంచి రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇతడి స్నేహితుడైన మధుబాబు, భాస్కర్ అనే వ్యక్తిని పరిచయం చేశారు. తాను రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని, మీరు డబ్బు పెట్టుబడిపెడితే దండిగా లాభం ఇస్తానని చెప్పాడు. ఇతని మాటలు నమ్మిన అశోక్కుమార్ తనకు పరిచయం ఉన్న 9 మందిని భాస్కర్ వద్దకు తీసుకెళ్లాడు. వారి నుంచి భాస్కర్ రూ. 6.54 కోట్లు, అశోక్కుమార్ నుంచి రూ.4.74 కోట్లు వసూలు చేశాడు. అందరూ కలిసి రియల్ఎస్టేట్ను ప్రారంభిద్దామని చెప్పి ఓ ఆఫీసును తెరిచాడు. కానీ భాస్కర్ మోసగాడు అని గుర్తించారు. తమ డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా అతడు పట్టించుకోలేదు. అంతేగాక వీరు ఇచ్చిన చెక్లను కూడా దుర్వినియోగానికి చేశాడు. దీంతో బాధితులు వైట్ఫీల్డ్ సీసీబీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. -
శారదామాత నమోస్తుతే
కోలారు: శరన్నవరాత్రుల సందర్భంగా నగరంలోని శంకరమఠంలో ఉన్న శ్రీశారదా మాత ఆలయంలో అమ్మవారికి తామర పుష్పాలతో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకం చేసి విశేషాలంకరణ చేశారు. సాయంత్రం మహిళలు లలితా సహస్రనామం పఠించారు. శిశువు తండ్రి అతడే.. తేల్చిన డీఎన్ఏ టెస్టు యశవంతపుర: దక్షిణకన్నడ జిల్లా పుత్తూరు బీజేపీ నాయకుడు జగన్నివాస్రావు కుమారుడు కృష్ణాజీరావ్ ఓ యువతిని ప్రేమపేరుతో మభ్యపెట్టి వాంఛలు తీర్చుకున్నాడు, ఆమె గర్భం దాల్చి శిశువు జన్మించగా తనకు సంబంధం లేదని కృష్ణాజిరావ్ ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం కోర్టుకెళ్లింది. కోర్టు ఆదేశాలతో తల్లీ బిడ్డ, నిందితుని నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించి పరిశీలించారు. ఈ కేసులో మహత్వమైన తీర్పు వచ్చింది. శిశువు, కృష్ణాజిరావ్ డీఎన్ఏ ఒక్కటేనని నిర్ధారణ అయ్యింది. దీంతో అతడే తండ్రి అని శాసీ్త్రయంగా నిర్ధారణ అయినట్లు యువతి కుటుంబీకులు, విశ్వకర్మ సంఘం నాయకులు తెలిపారు. మంగళూరులో వారు విలేకరులతో మాట్లాడారు. కొద్దిరోజుల నుంచి యువతి కుటుంబం న్యాయం కోసం పోరాటం చేస్తోంది. పుత్తూరు కోర్టు ఆదేశాల మేరకు రక్తనమూనాలను సేకరించి డీఎన్ఏ పరీక్షలు చేయగా పాజిటివ్గా వచ్చినట్లు తెలిపారు.బెంగళూరు– ముంబై మధ్య త్వరలో సూపర్ఫాస్ట్ రైలు శివాజీనగర: ఉద్యాననగరి– ముంబై మహానగరాల మధ్య కొత్త సూపర్ఫాస్ట్ రైలుకు కేంద్ర రైల్వే శాఖ ఆమోదించిందని బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య సోషల్ మీడియాలో తెలిపారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ బెంగళూరు, ముంబై మధ్య తాము త్వరలోనే సూపర్ఫాస్ట్ రైలును ప్రారంభిస్తామని తెలిపారన్నారు. ప్రధాన ఆర్థిక నగరాలైనప్పటికీ బెంగళూరు, ముంబై మధ్య ఉద్యాన ఎక్స్ప్రెస్ ఒక్క రైలే నడుస్తోందని చెప్పారు. సుమారు వెయ్యి కిలోమీటర్ల ప్రయాణానికి 24 గంటల కంటే అధిక సమయం పడుతోంది. 30 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న డిమాండ్ త్వరలో తీరుతోందన్నారు. గతేడాది 26 లక్షల మందికి పైగా ఈ రెండు నగరాల మధ్య విమానంలో ప్రయాణించారన్నారు. సూపర్ఫాస్ట్ రైలుతో తక్కువ ఖర్చు, సమయంతో ప్రయాణం చేయవచ్చన్నారు. బొమ్మల కొలువు ముచ్చట బనశంకరి: దసరా అంటే బొమ్మల కొలువులను ఏర్పాటు చేయడం కొందరికి సరదా. బెంగళూరు జేపీ నగరలో రూపశ్రీ నివాసంలో దసరా బొమ్మల కొలువు ఆకట్టుకుంటోంది. రకరకాల బొమ్మలతో అలంకరించారు. శనివారం కొలువు చుట్టూ మహిళలు చేరి భక్తి గీతాలు ఆలపించారు. గజదళంతో రీల్స్కు జరిమానాతో సరి మైసూరు: మైసూరులో అంబా విలాస ప్యాలెస్ ఆవరణలో బస చేసిన దసరా ఏనుగులతో దొంగచాటుగా రాత్రివేళ ఫొటో, వీడియోలు తీసుకున్న నలుగురిపై అటవీ శాఖ జరిమానాస్త్రం సంధించింది. ఈ నెల 18న ఓ యువతి ఏనుగుల వద్ద రీల్స్ చేసిన వీడియో వైరలైంది. పోలీసు, అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై జోరుగా విమర్శలు వినవచ్చాయి. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు గాలింపు జరిపి రీల్స్ చేసిన ప్రజ్వల్, ఎండీ రాఘవేంద్రలకు రూ.500, కే.నవీన్కు రూ.2 వేలు, యువతి కృతికి రూ.1000 చొప్పున జరిమానాలను విధించారు. -
రోడ్లపై కళ్లు మూసుకుని తిరుగుతున్నారా?
బనశంకరి: రోడ్లపై కళ్లు మూసుకుని తిరుగుతున్నారా? రోడ్ల పక్కన ఉన్న చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకోరా అని సీఎం సిద్దరామయ్య అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం ఆయన బెంగళూరులో నగర పర్యటన చేశారు. బళ్లారి రోడ్డు విండ్సర్ మ్యానర్ సర్కిల్ డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో నీరు నిలుస్తుందని అధికారులు తెలిపారు. రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని గ్రేటర్ అధికారులకు సూచించారు. విండ్సర్ మ్యానర్ సర్కిల్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రింగ్ రోడ్డులో కట్టడ వ్యర్థాలు పడేయడంతో అసహనం వ్యక్తం చేశారు. చెత్త పడేసిన వారిని కనిపెట్టి వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేయాలన్నారు. హెణ్ణూరు ఫ్లై ఓవర్ కింద ఉన్న కట్టడ నిర్మాణ వ్యర్థాలు, చెత్తను 24 గంటల్లోపు తొలగించాలని తెలిపారు. బీస్మైల్ సాంకేతిక డైరెక్టర్ ప్రహ్లాద్కు నోటీస్ ఇవ్వాలని సూచించారు. వార్డు నంబరు 23లో పొడిచెత్త సేకరణ కేంద్రం లోపల ఉండాల్సిన చెత్త బయటి ఉండటాన్ని గమనించిన ముఖ్యమంత్రి.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ నుంచి కొద్ది దూరంలో రోడ్డులో కంకరజెల్లి పడటాన్ని గమనించి దీనికి కారణమైన ఇంజనీర్ రాఘవేంద్ర ప్రసాద్కు నోటీసులు ఇవ్వాలని సూచించారు. హెణ్ణూరు బాగలూరు వైట్ టాపింగ్ రోడ్డుపై గుంతలు పూడ్చేందుకు కాంట్రాక్టర్లు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సమర్థవంతంగా వైట్ టాపింగ్ రోడ్లు నిర్వహణ చేపట్టని కాంట్రాక్టర్లు, ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు బైరతి సురేశ్, కేజే జార్జ్ పాల్గొన్నారు. అధికారులపై సీఎం సిద్దరామయ్య ఆగ్రహం -
కోముల్ భేటీలో ఎమ్మెల్యేల గొడవ
కోలారు: నగర సమీపంలోని నందిని ప్యాలెస్లో నిర్వహించిన కోముల్ సర్వ సభ్య వార్షిక సమావేశంలో పాలక మండలి తీర్మానాలపై డైరెక్టర్ల మధ్య న వాడి వేడి చర్చ జరిగింది. సమావేశంలో బంగారుపేట ఎమ్మెల్యే, కోముల్ డైరెక్టర్ అయిన ఎస్ ఎన్ నారాయణస్వామి, కోముల్ పాలనాధికారి డాక్టర్ మైత్రి అవధిలో తీసుకున్న పలు నిర్ణయాల పై ఆక్షేపణలు వ్యక్తం చేశారు. మైత్రి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని దీని వల్ల పాడి రైతులకు నష్టం కలిగిందన్నారు. ఇందుకు మాలూరు ఎమ్మెల్యే, కోముల్ అధ్యక్షుడు కైవె నంజేగౌడ సర్ది చెప్పే ప్రయత్నం చేయడంతో మీరు పాలనాధికారి డాక్టర్ మైత్రి పరంగా ఎందుకు వకాలత్తు తీసుకుంటారని ప్రశ్నించారు. నారాయణస్వామి మాట్లాడుతూ గతపాలక మండలి తీసుకున్న నిర్నయాల పట్ల తమ అభ్యంతరం లేదని అయితే పాల సమాఖ్యకు జరిగిన నష్టం మరియు చట్టవ్యతిరేక కార్యకలాపాల పై తమ వ్యతిరేకత ఉందని అన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్యన వాగ్వాదం తీవ్రం కాగా డైరెక్టర్లు, సభ్యులు ఇద్దరికి సర్ధిచెప్పారు. రైతుల సమస్యలపై చర్చకు బదులు రభస చోటుచేసుకుంది. -
అధికారులు సమర్థంగా పని చేయాలి
హొసపేటె: అధికారులు తమ ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి ప్రజలకు న్యాయం చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ సూచించారు. శనివారం జిల్లా పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ప్రగతి పరిశీలన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా స్థాయి అధికారులు జిల్లాలోని తమ కార్యాలయానికే పరిమితం కాకుండా జిల్లాలోని ఇతర తాలూకాలో ఉన్న తాలూకా కార్యాలయాలను సందర్శించి తనిఖీ చేయాలని ఆదేశించారు. అధికారులు ఆయా తాలూకాలను సందర్శించినప్పుడు తప్పకుండా మూమెంట్ బుక్ను మెయింటెయిన్ చేయాలన్నారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని అనేక తాలూకాల్లో ఉల్లి పంటకు తీవ్ర నష్టం ఏర్పడిందన్నారు. ఈ విషయంపై ఉల్లి పంటకు మద్దతు ధర కల్పించాలని హరపనహళ్లి ఎమ్మెల్యే లతా మల్లికార్జున జిల్లా మంత్రిని కోరారు. బస్సు సౌకర్యం కల్పించండి గ్రామీణ భాగంలో అనేక మంది విద్యార్థులకు సరిగ్గా బస్సు సౌకర్యం లేకుండా పోవడంతో విద్యార్థులు ట్రాక్టర్లలో వెళుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయం పై జిల్లా విద్యాశాఖ అధికారి తగిన చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. వాతావరణం సరిగా అనుకూలించక పోవడంతో రోజురోజుకు రోగుల సంఖ్య పెరుగుతోందని, ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యులు అన్ని విధాలుగా ఉత్తమ వైద్య చికిత్స అందించాలని మంత్రి జిల్లా వైద్యాధికారి శంకర్నాయక్కు సూచించారు. పక్కా సమాచారంతో రావాలి అధికారులు సమావేశానికి వచ్చే ముందు పక్కా, సరైన సమాచారంతో హాజరు కావాలన్నారు. సరైన సమాచారం లేకుండా వస్తే సహించబోనని అన్నారు. అదే విధంగా వివిధ కార్యాలయాల్లో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించడంపై సుదీర్ఘ చర్చ జరిపారు. ఈ సందర్భంగా ఎంపీ ఈ.తుకారాం, ఎమ్మెల్యేలు నేమిరాజ్ నాయక్, లతా మల్లికార్జున, డాక్టర్ శ్రీనివాస్, కృష్ణనాయక్, జిల్లాధికారి కవితా ఎస్ మన్నికేరి, జెడ్పీ సీఈఓ నోంగ్జోయ్ మహమ్మద్ అక్రమ్ షా, ఎస్పీ జాహ్నవి, అదనపు జిల్లాధికారి బాలకృష్ణ, వివిధ శాఖల జిల్లా కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు ప్రారంభం విజయనగర జిల్లా నూతన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టును శనివారం హైకోర్టు న్యాయమూర్తి ఆర్.నటరాజ్, మంత్రి జమీర్ అహమ్మద్ఖాన్ ప్రారంభించారు. హొసపేటె కోర్టు సముదాయం ప్రాంగణంలో ఉన్న జిల్లా కోర్టు ప్రారంభోత్సవానికి వధువులా అలంకరించారు. జిల్లా స్థాయి న్యాయమూర్తులు, జిల్లాధికారిణి కవితా మన్నికేరి, ఎస్పీ జాహ్నవి, జెడ్పీ సీఈఓ అక్రమ్ షా, ఇతర అధికారులు పాల్గొన్నారు. విజయనగర జిల్లా స్థాపితమైన నాలుగేళ్ల తర్వాత కూడా జిల్లా కోర్టు లేదు. న్యాయవాదుల ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ కల నెరవేరినట్లు కనిపిస్తోంది. ఏ సమస్య ఉన్నా ఇంతకు ముందు విజయనగర జిల్లా ప్రజలు కేసులను విచారించడానికి బళ్లారికి వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం జిల్లా కోర్టు ప్రారంభం కావడంతో ఆ సమస్య పరిష్కారమైంది. జిల్లా ఇన్చార్జి మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ వాడీవేడిగా జిల్లా స్థాయి ప్రగతి పరిశీలన సమావేశం -
పంచాయతీపై
నిందలు వేయొద్దు కోలారు: పారదర్శక పాలన, అత్యుత్తుమ గ్రామ పంచాయతీగా పేరుపొందిన సూలూరు గ్రామ పంచాయతీపై కొంతమంది అకారణంగా యూట్యూట్లలో దుష్ప్రచారం చేస్తున్నారని పంచాయతీ అధ్యక్షుడు పెమ్మశెట్టి హళ్లి సురేష్ తెలిపారు. శనివారం నగరంలోని పాత్రికేయుల భవనంలో విలేకరులతో మాట్లాడారు. చొక్కహళ్లి చిన్మయ విద్యాలయ పన్నుల వసూలు గురించి తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారు, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీనిని ఆపకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. పంచాయతీ సభ్యులు ఎం నారాయణస్వామి, సూలూరు అశోక్, గాయత్రమ్మ, నందిని మాలతేష్, శ్యామలమ్మ పాల్గొన్నారు. వేమగల్ ప్రగతికి పెద్దపీట కోలారు: వేమగల్– కురుగల్ పట్టణ పంచాయతీ కి అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా డి.అనూష, సీఎస్ వెంకటేష్లు శనివారం పట్టణ పంచాయతీ కార్యాలయంలో పదవులను స్వీకరించారు. సభ్యులందరి సహకారంతో అభివృద్ది కార్యక్రమాలను పెద్దపీట వేస్తామన్నారు. తాగునీరు, స్వచ్చత, డ్రైనేజీ వ్యవస్థ తదితర మౌలిక సౌలభ్యాలను అందించడానికి ప్రామాణిక ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వారిని పూలదండలతో సన్మానించారు. అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవం మాలూరు : తాలూకాలోని చిక్కతిరుపతి జీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు శనివారం జరిగిన ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్ష స్థానానికి కాంగ్రెస్కు చెందిన జీవీ కుమార్ , ఉపాధ్యక్ష స్థానానికి గాయత్రి మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎమ్మెల్యే కైవె నంజేగౌడ అభినందించారు. పంచాయతీ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను సన్మానించారు. తాపం స్థాయీ సమితి మాజీ అధ్యక్షుడు నాగేష్, దరఖాస్తు సమితి అధ్యక్షుడు హనుమంతప్ప పాల్గొన్నారు. -
పేలిన వంట గ్యాస్ సిలిండర్
హొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె తాలూకా గాదిగనూరు గ్రామంలో శనివారం తెల్లవారుజామున ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి తృటిలో పెనుప్రమాదం తప్పింది. గ్రామంలోని హాలప్ప అనే న్యాయవాదికి చెందిన ఇంట్లో ప్రతి రోజూ మాదిరిగానే కాఫీ కలిపేందుకు పొయ్యిని వెలిగిస్తుండగా అప్పటికే సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఉన్నఫళంగా సిలిండర్ పేలి మిద్దె పైకప్పు కూలిపోయింది. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. హాలప్ప(42), కవిత(32) గంగమ్మ(63), మైలారప్ప(48), మల్లమ్మ, మల్లికార్జున, మలియమ్మ, కృత్తిక, గంగమ్మ తదితర 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వెంటనే మెరుగైన చికిత్స కోసం సండూరు తాలూకా తోరణగల్లులోని సంజీవిని ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది, హొసపేటె గ్రామీణ పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఘటన స్థలానికి పలువురు ప్రముఖులు చేరుకొని బాధితులకు అండగా నిలిచారు. ఘటనపై గాదిగనూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందగానే జిల్లా పర్యటనలో ఉన్న ఇన్చార్జి మంత్రి జమీర్ అహమ్మద్ఖాన్ ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. గాయపడిన వారికి అన్ని విధాలుగా మెరుగైన వైద్యచికిత్సలు అందించాలని ఆస్పత్రి వైద్యులకు సూచించారు. గాయపడిన వారిని ఆస్పత్రిలో పరామర్శిస్తున్న మంత్రి తదితరులు పేలుడు తీవ్రతకు ధ్వంసమైన ఇల్లు 8 మందికి తీవ్ర గాయాలు ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం తృటిలో తప్పిన పెనుప్రమాదం పేలుడు తీవ్రతకు ఇల్లు ధ్వంసం -
బన్నినగరలో ఫ్లెక్స్ వివాదం
హుబ్లీ: ఓ ఫ్లెక్స్ విషయంగా కారల్మార్క్స్ నగర్లో జరిగిన రెండు గుంపుల మధ్య వాగ్వాదం కేసుకు సంబంధించి మూడు కేసులు దాఖలు చేసుకున్న పోలీస్ శాఖ మొత్తం 8 మందిని అరెస్ట్ చేసింది. ఈ గొడవకు సంబంధించి ఆజాద్ నగర్ పోలీసులు రెండు కేసులు నమోదు చేసుకున్నట్లు ఆ జిల్లా ఎస్పీ ఉమా ప్రశాంత్ మీడియాకు వివరణ ఇచ్చారు. ఇదే కేసుకు సంబంధించి ఆమె మీడియాతో మాట్లాడుతూ సదరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేశాం. దర్యాప్తు చురుగ్గా సాగుతోందన్నారు. ఎవరూ కూడా సోషల్ మీడియాలో ఉద్వేగ, ఉద్రేకంతో కూడిన ప్రకటనలు చూడరాదని, పోస్టులు పెట్టరాదని హెచ్చరించారు. ఈ హెచ్చరికలను ఉపేక్షిస్తే అలాంటి వారిపై నిర్దాక్షిణ్యంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం పరిస్థితి శాంతియుతంగా ఉందన్నారు. ఎవరూ కూడా అసత్య వార్తలను వ్యాపింపజేయరాదన్నారు. ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వరాదని ఆమె సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫ్లెక్స్ని తొలగించాలని ఓ గుంపు, కుదరదని మరో గుంపు మధ్య వివాదం రేకెత్తింది. తక్షణమే ఘర్షణ హద్దుమీరకుండా పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిహొసపేటె: అతి వేగంగా వస్తున్న బస్సును బైక్ ఢీకొనడంతో ద్విచక్రవాహన చోదకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. వెనుక ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడిని విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకాలోని మోరగేరి గ్రామానికి చెందిన హరీష్(23)గా గుర్తించారు. అతని స్నేహితుడు సంతోష్ పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు స్నేహితులు బైక్పై ఇట్టిగి గ్రామం నుంచి హగరిబొమ్మనహళ్లికి వెళుతుండగా హొసపేటె నుంచి దావణగెరెకు వెళుతున్న బస్సును బైక్ ఢీకొంది. గాయపడిన సంతోష్ను చికిత్స కోసం హగరిబొమ్మనహళ్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఇట్టిగి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. పర్యాటక కేంద్రాల అభివృద్ధిపై నిర్లక్ష్యం రాయచూరు రూరల్: రాష్ట్రంలో పర్యాటక కేంద్రాలను అభివృద్ధి పరచడంలో అధికారులు, ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం తగదని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు చెన్నారెడ్డి విచారం వ్యక్తం చేశారు. శనివారం నవరంగ్ దర్వాజ భవనంలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో చారిత్రకత కలగిన పర్యాటక కేంద్రాలను అభివృద్ధి పరచడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడాన్ని ఖండించారు. కార్యక్రమంలో సుగుణ, శివ ప్రకాష్, కాశప్ప, చంద్రశేఖర్లున్నారు. ఇద్దరిపై పోక్సో కేసు నమోదు హుబ్లీ: ౖమెనర్ విద్యార్ధినిని లిఫ్ట్ ఇస్తామంటూ మభ్య పెట్టి కారులో ఎక్కించుకొని దారి మధ్యలో లైంగికంగా అత్యాచారం చేసిన కేసులో ఇద్దరిపై తడక్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసుకున్నారు. ప్యారా మెడికల్ కోర్సు తొలి సంవత్సరం చదువుతున్న ఆ విద్యార్థిని కళాశాలకు వెళ్లి కున్నూరు గ్రామం నుంచి మమదాపుర గ్రామానికి నడుచుకుంటూ తిరిగి వస్తుండగా ఆ గ్రామ పరిచయస్తుడు ప్రవీణ్ లమాణి, అభిషేక్ లిఫ్ట్ ఇస్తామంటూ కారులో కూర్చొబెట్టుకున్నారు. అనంతరం మార్గమధ్యంలో అటవీ ప్రాంతంలో నోటిలో దుస్తులు కుక్కి అత్యాచారం చేసినట్లు విద్యార్థిని తల్లి గంగవ్వ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన క్రమంలో తడక్ పోలీసులు పోక్సో కేసు దాఖలు చేసుకున్నట్లు ఎస్ఐ పరశురామ తెలిపారు. బాధిత విద్యార్థినిని ఆ జిల్లా బాలల సంరక్షణాధికారి కార్యాలయ సిబ్బందికి అప్పగించారు. అధ్యాపకులను నియమించాలని ధర్నా రాయచూరు రూరల్: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అతిథి అధ్యాపకులను భర్తీ చేయాలని కోరుతూ ఏఐడీఎస్ఓ ఆధ్వర్యంలో విద్యార్థులు కళాశాల తరగతులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. శనివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఆందోళన చేపట్టి మాట్లాడారు. ఖాళీగా ఉన్న పోస్టుల్లో కాంట్రాక్ట్ పద్ధతిపై నియమించుకోకుండా కాలయాపన చేయడాన్ని తప్పుబట్టారు. త్వరితగతిన అతిథి అధ్యాపకులను నియమించాలని ఒత్తిడి చేశారు. -
వరుణ ప్రతాపం.. లోతట్టు జలమయం
రాయచూరు రూరల్: ఎగువ భాగంలోని మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. రాయచూరు, కలబుర్గి, యాదగిరి, బీదర్ జిల్లాల్లో కురిసిన వర్షాలకు భీమా నదికి వరద పోటెత్తింది. నదిలో 3.40 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నందున నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలబుర్గి జిల్లాధికారి ఫౌజియా తరన్నుమ్ హెచ్చరించారు. బీదర్ జిల్లా హులసూరు, బసవ కళ్యాణ ప్రాంతాల్లో పంట పొలాల్లోకి, ఇళ్లలోకి నీరు చేరాయి. హులసూరు శాసన సభ్యుడు శరణు సలగార్ అంబేవాడి, సూలదాబాక, గోవర్దన తాండా, అంతర్ భారతి తాండాల్లో నీటిలో నడుచుకుంటూ వెళ్లి పంటలను పరీశీలించారు. కలబుర్గి గాణాగపుర నారద దత్తాత్రేయ ఆలయంలోకి నీరు చేరాయి. భక్తులు నీటిలో వెళ్లి పూజలు చేశారు.చిత్తాపూర్ తాలూకా దండోతి, సేడం తాలూకా సటపటనహళ్లి పూర్తిగా నీట మునిగింది. గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే, కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి అధ్యక్షుడు అజయ్సింగ్ పలు ప్రాంతాల్లో పర్యటించారు. భీమా నది ప్రవాహాన్ని పరిశీలించి బాధిత ప్రజలను పరామర్శించారు. విజయపుర–షోలాపూర్ మధ్య రాకపోకలు బంద్ కావడంతో వాహనాలు స్తంభించి పోయాయి. బాగల్కోటె జిల్లా రబకవి బనహట్టి తాలూకాలోని మహాలింగపురలో దర్శన్(11) అనే బాలుడు గోడ కూలి మరణించాడు. కల్యాణ కర్ణాటకలో వరద విలయం భీమా నదికి 3.40 లక్షల క్యూసెక్కుల నీరు బాధిత ప్రాంతాల్లో మంత్రి, ఎమ్మెల్యేల పర్యటన -
తుంగభద్ర నదీ తీరంలో మొసలి ప్రత్యక్షం
హొసపేటె: కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలోని శివాపుర సమీపంలో తుంగభద్ర నది ఒడ్డున ఒక పెద్ద మొసలి సేద తీరుతూ శనివారం కనిపించింది. ఉన్నట్టుండి మొసలి ప్రత్యక్షం కావడంతో నది ఒడ్డున ఉన్న గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. శివాపుర గ్రామ పంచాయతీలోని నారాయణపేట సమీపంలో ప్రవహించే తుంగభద్ర నది ఒడ్డున ఈ మొసలి కనిపించింది. ఈ అరుదైన దృశ్యాన్ని ఒక పర్యాటకుడు తన మొబైల్ కెమెరాలో బంధించాడు. కత్తితో యువకుడి హల్చల్హుబ్లీ: దావణగెరెలో ఓ ఆలయం ఎదుట ఇతర మతానికి చెందిన యువకుడు తల్వార్ పట్టుకొని సినీ ఫక్కీలో సంచరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మట్టికల్లోని బసవేశ్వర ఆలయం ఎదుట ఉన్న రోడ్డులో ఓ యువకుడు తల్వార్ చేతపట్టుకొని సినిమా స్టైల్లో నడుస్తున్నాడు. దీనిని స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో ఆధారంగా ఆర్ఎంసీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
డ్రగ్స్ రహిత బళ్లారిగా మారుద్దాం
సాక్షి బళ్లారి: మారుతున్న కాలానుగుణంగా శాస్త్ర సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో అభివృద్దితో పాటు చెడు అలవాట్లకు కూడా యువత తొందరగా లోను కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అయితే వాటికి దూరంగా ఉంటూ సన్మార్గంలో దేశ భవిష్యత్తుకు, తోడ్పాటుకు కృషి చేయాల్సిన అవసరముందని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన శనివారం జిల్లా బీజేపీ బళ్లారి నగరచ మండల, నగర యువ మోర్చా ఆధ్వర్యంలో డగ్స్ రహిత భారత్ సంకల్ప అనే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ముందుగా కనక దుర్గమ్మ ఆలయం నుంచి నమో మారథాన్ను ప్రారంభించి యువతను ఉత్సాహపరిచేలా నేతలందరూ పాల్గొని మాట్లాడారు. నగరంలోని కనకదుర్గమ్మ ఆలయం నుంచి అండర్బ్రిడ్జి, రాయల్ సర్కిల్, జిల్లాధికారి కార్యాలయం నుంచి మోతీ సర్కిల్ వరకు మారథాన్ చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ డ్రగ్స్ రహిత బళ్లారిగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాల్సిన అవసరముందన్నారు. యువత దేశాభివృద్ధికి మూల స్తంభాలన్నారు. దురలవాట్లకు దూరంగా ఉండండి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా మంచి నడక అలవర్చుకోవాలన్నారు. డ్రగ్స్, మద్యానికి ఎట్టిపరిస్థితుల్లోను అలవాటు పడకుండా ఉండాలన్నారు. డ్రగ్స్ అమ్మినా, కొన్నా చట్టరీత్య నేరమన్నారు. అలాంటి పరిస్థితుల్లో వాటిని గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతూ కొందరు వ్యాపారాలు చేసుకుంటూ యువతను చెడు దారుల్లో నడిపిస్తున్నారన్నారు. తోటి స్నేహితులు, అలాంటి అలవాట్లకు దగ్గర ఉంటే వారిని కూడా మంచి మార్గంలో నడిపించాలని యువతకు సూచించారు. డ్రగ్స్ రహిత భారత్గా ప్రధాని మోదీ సంకల్పించారన్నారు. డ్రగ్స్కు దూరంగా ఉంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వీలుంటుందన్నారు. ఆరోగ్యాన్ని క్షీణింపజేసే డ్రగ్స్ను ముట్టకోకూడదన్నారు. ప్రభుత్వాలు కూడా డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. బీజేపీ ప్రముఖులు డాక్టర్ బీకే.సుందర్, కేఎస్.దివాకర్, గుర్రం వెంకటరమణ, కోనంకి తిలక్, ఐనాథ్రెడ్డి, హనుమంతప్ప, విరుపాక్షిగౌడ తదితరులు పాల్గొన్నారు. వివిధ కళాశాలల విద్యార్థులు నమో మారథాన్లో పాల్గొన్నారు. నేటి బాలురే రేపటి దేశ పౌరులు మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్రెడ్డి -
ఆర్టీసీ బస్సు బోల్తా
రాయచూరు రూరల్: రాయచూరుకు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. దావణగెర నుంచి రాయచూరుకు వస్తున్న బస్సుకు కుక్క అడ్డుగా వచ్చింది. కుక్క తప్పించే క్రమంలో డ్రైవర్ బస్సును పక్కకు తిప్పడంతో బోల్తా పడింది. ఏడవ మైలు మలుపు తిరుగు ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం ప్రొక్లెయిన్ ద్వారా ద్వారా బస్సును యాథాస్థితికి తీసుకొచ్చారు. గాయపడిన 15 మందిని ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు. 15 మందికి గాయాలు -
స్వచ్ఛతపై దృష్టి సారించాలి
హొసపేటె: ప్రతి ఒక్కరూ స్వచ్ఛతపై దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నోంగ్జోయ్ మొహమ్మద్ అలీ అక్రమ్ షా సూచించారు. స్వచ్ఛతా హీ సేవ పక్షం రోజుల ప్రచారంలో భాగంగా, జిల్లా పంచాయతీ, హోస్పేట్ తాలూకా పంచాయతీ నగరసభ, సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఏక్దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లాలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా తాలూకా, గ్రామ పంచాయతీ స్థాయిలో స్వచ్ఛత కార్యకలాపాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలకు ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ యూనిట్లను నిర్మించడం ద్వారా స్థిరమైన పరిశుభ్రమైన వాతావరణాన్ని సృష్టించడానికి జిల్లా పంచాయతీ చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. చెత్తను రోడ్లపై వేయరాదని ప్రజలకు సూచించారు. ఇంటి వద్దకు వచ్చే కార్మికులకు చెత్త ఇవ్వాలని సూచించారు. ప్రతి 3 నెలలకు ఒక సారి తమ ఇళ్ల చుట్టూ శ్రమదానం చేయడం ద్వారా జిల్లా అంతటా స్థిరమైన, పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన గ్రామాల నిర్మాణానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ సెక్రటరీ కె.తిమ్మప్ప, గ్రామీణ తాగునీరు, పారిశుధ్య విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దీప, జెడ్పీ చీఫ్ అకౌంటెంట్ రుద్రప్ప అక్కి, సహాయ కార్యదర్శి వీబీ మౌనేషా, సహాయ ప్రణాళిక అధికారి ఎం.ఉమేష్, హోస్పేట్ తాలూకా పంచాయతీ కార్యనిర్వహక అధికారి ఆలం భాషా, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) ప్రాజెక్టు జిల్లా కన్సల్టెంట్, జిల్లా పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు ప్రారంభం
హొసపేటె: స్థానిక కోర్టు ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ కోర్టును శనివారం ప్రధాన న్యాయమూర్తి ఆర్ఏ నటరాజ ప్రారంభించనున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా చట్టం, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కే.పాటిల్, రక్షణ, మైనార్టీ సంక్షేమ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్, ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు జేఎం అనిల్ కుమార్ కే.కొట్రేశ్వర రావు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి బళ్లారిలోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కేజీ.శాంతి అధ్యక్షత వహిస్తారు. అభివృద్ధి పనులకు భూమిపూజ రాయచూరు రూరల్: నగరంలోని వార్డుల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని మాజీ నగర సభ అధ్యక్షురాలు లలిత పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని 14వ వార్డులో వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్తులో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి పాటుపడుతామన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పేదలకు ఇళ్లు కేటాయించాలి రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు భూమి పంపిణీ చేసి, ఇళ్లు కేటాయించాలని ఎస్టీ, ఎస్టీ సమితి అధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం రాయచూరు అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. అటవీ శాఖ ఆధీనంలోని భూములను సాగు చేస్తున్న సన్నకారు రైతులపై కేసు నమోదు చేయడం సరికాదన్నారు. వెంటనే కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. అనంతరం అసిస్టెంట్ కమిషనర్ గజాననకు వినతిపత్రం సమర్పించారు. స్వచ్ఛత అభియాన్కు శ్రీకారం రాయచూరు రూరల్: సమాజంలో మానవుడు స్వచ్ఛతకు చేతులు జోడించాలని యాదగిరి నగర సభ అధ్యక్షురాలు లలిత అనపూర్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలో స్వచ్ఛత అభియాన్కు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరంలో ఎక్కడ పడితే అక్కడ వేయడవ ద్వారా పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతున్నట్లు పేర్కొన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేందుకు అందరూ సహకరించాలని కోరారు. నగరంలో ఐదు రోజుల పాటు చేపట్టనున్న శ్రమదానంలో అందరూ పాల్గొనాలని సూచించారు. జనగణన సహాయవాణి ఏర్పాటు హుబ్లీ: రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమ కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక విద్య స్థితిగతులపై వివరాలు తెలియజేసేందుకు బీసీ సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయంలో సహయవాణి (ఫోన్ నంబర్) ఏర్పాటు చేశారు. 08062447961 నంబర్కు ఫోన్ చేయాలని సంబంధిత అధికారులు ఓ ప్రకటనలో సూచించారు. -
కొనసాగుతున్న భారీ వర్షాలు
నీట మునిగిన వరి పంటహొసపేటె: బురదమయంగా మారిన ఏపీఎంసీ మార్కెట్ ఆవరణరాయచూరు రూరల్: జిల్లాలో వరుణుడి జోరు కొనసాగుతోంది. భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము వరకు జడివాన కురిసింది. జిల్లాలో 52 మి.మీ వర్షపాతం నమోదైంది. రహదారులు బురదమయంగా మారాయి. మూన్నూరు వాడి, గాంధీ చౌక్, మహవీర చౌక్, కూరగాయల మార్కెట్లోకి వర్షపు నీరు చేరింది. తీన్ కందిల్ రాతి ఏనుగు విగ్రహం వద్ద మురుగు నిలిచింది. అరబ్ మెహల్లా, షియాత లాబలో, ఖాదర్ గుండా, నవాబ్ గడ్డలో నీరు చేరింది. మహరాష్ట్ర పైభాగంలో కురుస్తున్న వర్షాలకు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. రాయచూరు, కలబుర్గి, యాదగిరి, బీదర్ జిల్లాలో కురిసిన వర్షాలకు రెండు అడుగుల మేర నీరు ప్రవహించింది. వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఉజ్జయిని, సీనా, బోరి వాగుల నుంచి నీరు రావడంతో భీమా నది నుంచి 3.40 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదిలారు. నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలబుర్గి జిల్లా కలెక్టర్ పౌజియా తర్నూమ్ సూచించారు. బీదర్ జిల్లా హులసూరు, బసవ కళ్యాణలో ఇళ్లు, పంట పొలాల్లోకి నీరు చేరింది. రోడ్డు బురదమయం హొసపేటె: నగరంలో జోరువాన కురవడంతో ప్రముఖ ఏపీఎంసీ మార్కెట్ బురదమయంగా మారింది. మార్కెట్ మొత్తం రచ్చరచ్చగా ఉండటంతో అడుగు తీసి బయట వేయలేని పరిస్థితి నెలకొంది. చిరు వ్యాపారులు బురదలోని కూర్చొని కూరగాయలు విక్రయించారు. మార్కెట్లో అపరిశుభ్రత పేరుకుపోవడంతో దుర్వాసన వస్తోంది. మార్కెట్ వచ్చే వారు ముక్కు మూసుకొని కూరగాయలు కొన్నారు. మార్కెట్లో నెలకొన్న సమస్యలను ప్రజా ప్రతినిధులు, అధికారులు వెంటనే పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. నీటిలో నడుస్తున్న కూరగాయల వ్యాపారిఇళ్లలో చేరిన మురికి నీరు రాయచూరులో కాలనీలు జలమయం భీమా నది నుంచి దిగువకు నీరు విడుదల -
పీజీలో యువతి అనుమానాస్పద మృతి
దొడ్డబళ్లాపురం: పీజీలో ఉంటున్న యువతి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన బాగలకోటెలోని విద్యాగిరి కాలనీలో చోటు చేసుకుంది. సునగ తండాకు చెందిన సీమా రాథోడ్(17) స్థానిక కళాశాలలో ప్రథమ పీయూసీ చదువుతూ పీజీలో నివాసం ఉంటోంది. ఆమె శుక్రవారం స్లాబ్హుక్కి ఉరి వేసుకున్న స్థితిలో విగతజీవిగా కనిపించగా విద్యార్థినులు భయంతో గట్టిగా అరుస్తూ బయటకు పరుగులు తీశారు. అయితే సీమా తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తెకు ఫిట్స్(మూర్ఛ) వచ్చాయని కాల్ చేశారని, వచ్చి చూసేసరికి విగతజీవిగా కనిపించిందని, తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు. నవనగర పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు దొడ్డబళ్లాపురం: గ్రేటర్ బెంగళూరు ప్రాధికార అస్తిత్వంలోకి వచ్చాక రాష్ట్ర మంత్రులు డీకే శివకుమార్, రహీమ్ ఖాన్ శాఖల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈమేరకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్ నోటిఫికేషన్ జారీ చేశారు. గతంలో డీకే శివకుమార్కు భారీ చిన్న తరహా నీటిపారుదల, బీబీఎంపీ, బీడీఏ, బీఎంఆర్డీఏ, బీఎంఆర్సీఎల్తోపాటు బెంగళూరు నగర అభివృద్ధి బాధ్యతలు నిర్వహించేవారు. తాజాగా వాటితోపాటు గ్రేటర్ బెంగళూరు ప్రాధికార కింద వచ్చే 5 పాలికెలు, బెంగళూరు నగర జిల్లా పరిధిలోకి వచ్చే అన్ని స్థానిక సంస్థల బాధ్యతలు అప్పగించారు. ఈ బాధ్యతలు ఇప్పటి వరకూ మంత్రి రహీమ్ ఖాన్ శాఖ పరిధిలో ఉండేవి.బోనులో చిక్కిన చిరుత దొడ్డబళ్లాపురం: కొన్ని రోజులుగా కనకపుర తాలూకా కచ్చువనహళ్లి గ్రామస్తులకు కంటికి కునుకు లేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. చిరుత ఆ గ్రామ పరిసరాల్లో సంచరిస్తూ కుక్కలు, పశువులను హతమార్చుతోంది. దీంతో గ్రామస్తులు పొద్దుపోయాక బయటకు రావాలంటే జంకేవారు. అటవీశాఖ అధికారులు స్పందించి గ్రామ సమీపంలో బోను ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి ఆహారం కోసం వచ్చిన చిరుత బోనులో చిక్కింది. శుక్రవారం అటవీ సిబ్బంది వచ్చి చిరుతను బంధించి తీసుకెళ్లారు. రష్యా మహిళ,ఆమె పిల్లలను స్వదేశానికి పంపించండి దొడ్డబళ్లాపురం: తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణలోని రామతీర్థం కొండపై ఉన్న దట్టమైన గుహలో అక్రమంగా నివసిస్తూ అటవీశాఖ సిబ్బందికి పట్టుబడ్డ రష్యన్ మహిళను పిల్లలతోపాటు స్వదేశానికి పంపించేందుకు హైకోర్టు అనుమతించింది. ఆమెకు, ఆమె పిల్లలకు అవసరమైన డాక్యుమెంట్లు ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వానికి సూచించింది.రాష్ట్రం మరో నేపాల్ కాబోతోంది దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తాండవమాడుతోందని, రాబోయే రోజుల్లో రాష్ట్రం మరో నేపాల్గా మారినా ఆశ్చర్యపోనక్కరలేదని బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ అన్నారు. దావణగెరెలో ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మైనారిటీలను మచ్చిక చేసుకోవడానికి దిగజారి మాట్లాడుతూ, అదే స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ఈక్రమంలో ఆయన హిందూ మతాన్ని అవమానిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్నారు. రాష్ట్రంలో శాంతిభధ్రతలు క్షీణించాయన్నారు. వినాయకచవితి పండుగకు ఎక్కడా లేని నిబంధనలు విధించారని మండిపడ్డారు. -
హోంమంత్రితో సిట్ చీఫ్ భేటీ
బనశంకరి: ధర్మస్థల కేసు దర్యాప్తు చేపడుతున్న సిట్ చీఫ్ ప్రణబ్ మొహంతి శుక్రవారం హోంమంత్రి పరమేశ్వర్ను కలిసి చర్చించారు. ధర్మస్థల కేసు దర్యాప్తుపై చిన్నయ్య గ్యాంగ్ ప్రజాప్రయోజనాల వ్యాజ్యం పిటిషన్ను సుప్రీంకోర్టు మే 5 తేదీన తిరస్కరించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం చిన్నయ్య తలపుర్రె తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచి సుమోటో కేసు పెట్టడంతో మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. అనంతరం కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మీ చౌధరి వందలాది మంది మహిళలపై అత్యాచారం, హత్య చేసిన మృతదేహాలు పూడ్చిపెట్టిన కేసు దర్యాప్తు చేపట్టడానికి సిట్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లేఖ రాశారు. దీని ఆధారంగా సిద్దరామయ్య ప్రణబ్ మొహంతి నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేశారు. సిట్ అనేక స్థలాల్లో తవ్వకాలు చేపట్టింది. ధర్మస్థలపై అసత్యప్రచారం చేసిన వారిపై దర్యాప్తు చేసింది. మే 5న పిటిషన్ తిరస్కృతి పిటిషన్ మే 5 తేదీన తిరస్కరణకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుప్రీంకోర్టు దర్యాప్తు అవసరం లేదంటూ పిటిషన్ను తిరస్కరించడంతో సిట్ ఏర్పాటుపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రణబ్ మొహంతి, హోంమంత్రి పరమేశ్వర్ నివాసానికి వెళ్లి ఆధారాలతో సహా వివరించారు. సీనియర్ న్యాయవాది కేవీ.ధనంజయ చిన్నయ్య పేరుతో సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో 1995 నుంచి 1998 మధ్య అనేక మృతదేహాలు నేత్రావతి నదిలో తేలియాడుతూ వచ్చాయని, వాటిలో ధర్మస్థల పర్యవేక్షకుడితో బలవంతంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ విధంగా తేలుతూ వచ్చిన శవాల్లో లైంగిక దాడికి గురైన మృతదేహాలు కూడా ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. 2010లో బాలిక మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన గుర్తులు ఉన్నాయని 2008 నుంచి 2014 మధ్య అనేక మృతులు సంభవించగా, వారిలో హత్య, అత్యాచారాలకు గురైనవారు ఉన్నారన్నారు. సుప్రీంకోర్టు ఆగ్రహం పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు ఇది ప్రజాప్రయోజనాల పిటిషన్ కాదని, పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్, పైసా ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రైవేటు ఇంట్రెస్ట్ లిటిగేషన్, పొలిటికల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమాచారం తలపుర్రె గ్యాంగ్ దాచిపెట్టి ప్రభుత్వాన్ని దృష్టి మళ్లించి సిట్ ఏర్పాటు చేయడంపై ప్రస్తుతం చర్చకు దారి తీస్తోంది. సిట్ను రద్దు చేసి స్దానిక పోలీసులతో కేసు దర్యాప్తు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. హోంమంత్రి పరమేశ్వర్ శుక్రవారం సిద్దరామయ్యను కలిసి పిటిషన్ తిరస్కరణ, సిట్ ఏర్పాటు, దర్యాప్తు గురించి పూర్తి వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి భేటీకి ముందు ప్రణబ్ మొహంతి ఆధారాలతో సహా హోంమంత్రికి వివరణ ఇచ్చారు. శివమొగ్గ జైలులో ఉన్న చిన్నయ్య బెళ్తంగడి కోర్టుకు హాజరై బయటికి వచ్చి కన్నీరుపెట్టారు. చిన్నయ్య వ్యాఖ్యలను గత నాలుగు రోజులుగా నమోదుచేస్తున్న కోర్టు శనివారం కూడా హాజరు కావాలని సూచించింది. నిజాలు తెలుస్తాయి యశవంతపుర: ధర్మస్థలపై జరుగుతున్న తప్పుడు ప్రచారంతో రాష్ట్రప్రభుత్వం సిట్ని రచించి నిజాలను బయట పెడుతున్నట్లు ధర్మస్థల ధర్మాధికారి డాక్టర్ వీరేంద్ర హెగ్డే తెలిపారు. ఆయన శుక్రవారం ధర్మస్థలలో విలేకరులతో మాట్లాడారు. ఇన్ని రోజుల పాటు ధర్మస్థలపై ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారో తనకు అర్థం కావటం లేదన్నారు. ధర్మస్థలపై వస్తున్న తప్పుడు ప్రచారంతో ప్రభుత్వం సిట్ని రచించి రాష్ట్ర ప్రజలకు నిజాలను తెలిసేలా చేసినందుకు కృతజ్ఞతలు చెప్పారు. ధర్మస్థల సంస్థచే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సేవ అనేది ప్రచార వస్తువు కాదన్నారు. ఇన్ని రోజుల పాటు ఆరోగ్యంగా ఉన్నానంటే దీనికి తన నిస్వార్థ సేవలు కారణమన్నారు. ఈ విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. నేను అనేక పుస్తకాలను చదివాను. తుమకూరు సిద్ధగంగా మఠాధిపతి శివకుమారస్వామి రచించిన పుస్తకాలను చదివాను. సేవ కంటే గొప్పది ఏమీ లేదని 108 ఏళ్లు బతికిన వ్యక్తి చెప్పిన మాటలు వాస్తవం అన్నారు. ధర్మస్థలలో మృతదేహాల కోసం గాలింపు(ఫైల్)ముసుగు వ్యక్తి చెన్నయ్యతో అధికారులు(ఫైల్) వివాదిత ధర్మస్థల కేసుపై డాక్టర్ పరమేశ్వర్తో చర్చ కీలక ఆధారాలతో సహా ప్రణబ్ మొహంతి వివరణతిమరోడి ఇంటికి మూడో నోటీసుఆక్రమంగా ఇంటిలో తుపాకులు భద్రపరిచిన కేసులో పోరాటదారుడు మహేశ్ శెట్టి తిమరోడి ఇంటికి శుక్రవారం మూడో నోటీసును అంటించారు. తిమరోడి ఇంటిలో రెండు తల్వార్లు, ఒక తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై బెళ్తంగడి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు నోటీసును అంటించి వెళ్లారు. ఆయన విచారణకు హాజరు కాని కారణంగా బెళ్తంగడి పోలీసులు శుక్రవారం మూడో నోటీసును ఇంటి గోడకు అంటించి విచారణకు రావాలని కోరారు. ముందస్తు బెయిల్ కోసం మంగళూరు సెషన్స్ కోర్టులో పిటిషన్ వేయగా శనివారం విచారించనున్నారు. -
కులగణన లోపాలు నివారించండి
శివాజీనగర: సర్వర్ సమస్య, యాప్లో దోషాలు నివారించి కులగణన వేగాన్ని పెంచాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వెనుకబడిన వర్గాల శాశ్వత కమిషన్ ఈ నెల 22 నుంచి ప్రారంభించిన విద్య, సామాజిక, ఆర్థిక సమీక్ష 4 రోజులు గడిచినా సక్రమంగా జరగక వివాదానికి గురైనట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో శుక్రవారం నివాస కార్యాలయం కృష్ణా నుంచి అన్ని జిల్లాధికారుల, జిల్లా పంచాయతీ సీఈఓలు, వివిధ శాఖల ప్రధాన అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కులగణన ఇబ్బందులు తెలుసుకున్నారు. విద్య, ఆర్థిక, సామాజిక సమీక్షకు రాష్ట్ర హైకోర్టు సైతం ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఆ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అన్ని సదుపాయాలు కల్పించండి సర్వే సక్రమంగా సాగేలా కులగణనదారులకు సదుపాయాలను కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సర్వేలో పలుచోట్ల సమస్యలు వచ్చినట్లు వార్తలు వస్తున్నా పరిష్కరించేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదని సీఎం అధికారులపై మండిపడ్డారు. సమీక్ష సందర్భంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాధికారులతో సమాచారం ఈ వీడియో కాన్ఫరెన్స్ సందర్భంలో ప్రతి జిల్లాఽధికారి నుంచి సమాచారాన్ని పొందారు. సమీక్ష సమయంలో ఇబ్బంది కలిగితే దానిని తక్షణమే వెనుకబడిన వర్గాల కమిషన్ దృష్టికి తెచ్చి లోపదోషాలను సరిచేసి కుల గణనను సక్రమంగా జరపాలని తెలిపారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్, మంత్రులు హెచ్.కే.పాటిల్, శివరాజ్ తంగడగి, కృష్ణభైరేగౌడ, రహీంఖాన్, భైరతి సురేశ్, మధు బంగారప్ప, బోసురాజు, వెనుకబడిన వర్గాల కమిషన్ అధ్యక్షుడు మధుసూదన్ నాయక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీశ్, ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి నజీర్ అహమ్మద్, న్యాయ సలహాదారుడు పొన్నణ్ణ, ఆర్థిక సలహాదారుడు బసవరాజ రాయరెడ్డి, అదనపు ప్రధాన కార్యదర్శి అంజుం పర్వేజ్తో పాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
అలరించిన తుమకూరు దసరా
కళాకారిణుల సామూహిక నృత్యప్రదర్శనతుమకూరు దసరా వేదికపై కళాకారుల యక్షగాన ప్రదర్శనతుమకూరు: సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సాంస్కృతిక రాయబారిగా ఆయ్యే వ్యక్తి జీవితం సన్మార్గంలో సాగుతుందని జెడ్పీ సీఈఓ జీ.ప్రభు తెలిపారు. తుమకూరు నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో తుమకూరు దసరా వేడుకలు, ఉత్సవం సందర్భంగా నరసింహరాజు వేదికలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల కళాకారులు, విద్యార్థులు చేసిన నృత్యాలను చూసి వారికి బహుమతులు అందించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థి, కళాకారుడు ప్రతిఒక్కరూ కూడా సంస్కారవంతులు అవుతారని, కళలపై చిన్నారులు, యువత మక్కువను పెంచుకోవాలని అన్నారు. అనంతరం కళాకారులు చేసిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అదుర్స్ -
పంచభూతాల్లో డాక్టర్ భైరప్ప లీనం
మైసూరు: వయోసహజ అనారోగ్యంతో బుధవారం బెంగళూరు నగరంలో మృతి చెందిన కన్నడ సీనియర్ సాహితీవేత్త, ప్రముఖ నవలా రచయిత డాక్టర్ ఎస్.ఎల్.భైరప్ప అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో శుక్రవారం మైసూరు నగరంలోని చాముండికొండ తప్పలిలో ఉన్న శ్మశాన వాటికలో బ్రాహ్మణ సంప్రదాయాల ప్రకారం నిర్వహించారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోశి, రాష్ట్ర హోం మంత్రి డాక్టర్ జీ.పరమేశ్వర్తోపాటు మైసూరు జిల్లా ఇన్చార్జ్ మంత్రి డాక్టర్ హెచ్.సీ.మహదేవప్పతో పాటు అనేక మంది నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు. ప్యాలెస్ పురోహితులు చంద్రశేఖర్ శాస్త్రి ఆధ్వర్యంలో ఏడు మంది మంది పురోహితులు సాంప్రదాయ పద్ధతిలో విధివిధానాల ప్రకారం భైరప్ప అంత్యక్రియలను పూర్తి చేశారు. స్థానికులకు అంతిమ దర్శనానికి అవకాశం ఈనెల 24వ తేదీన బెంగళూరులో గుండెపోటుతో మృతి చెందిన భైరప్ప భౌతికకాయాన్ని 25వ తేదీ సాయంత్రం మైసూరు నగరంలోని కళామందిరంలో ఉన్న కిందరజోగి ఆవరణలో స్థానికుల అంతిమ దర్శనం కోసం ఏర్పాటు చేశారు. అనంతరం రాత్రి జేఎస్ఎస్ ఆస్పత్రిలో ఉన్న మార్చురీలో పెట్టి శుక్రవారం ఉదయం 9 గంటలకు భైరప్ప నివాసానికి తీసుకొని వచ్చి కొంత సమయం ప్రముఖుల దర్శనం కోసం అవకాశం కల్పించిన అనంతరం విధి విధానాలు ప్రారంభించి అంత్యక్రియలు పూర్తి చేశారు. డాక్టర్ లక్ష్మీనారాయణ, రైతు సంఘం అధ్యక్షుడు బడగలపుర నాగేంద్ర, సాహితీవేత్త ఫ్రొఫెసర్ కే.ఎస్.భగవాన్, బసవరాజు హొసకోటె, హాళతి సోమశేఖర్, జైనహళ్లి సత్యనారాయణగౌడ, రవీంద్ర స్వామితో పాటు అనేక మంది ప్రముఖులు తరలివచ్చి నివాళి ఆర్పించారు. వేలాది మంది ఆశ్రునయనాల మధ్య వీడ్కోలు బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించిన వైనం -
నేటి నుంచి జాతీయ మార్షల్ ఆర్ట్స్ క్రీడలు
హొసపేటె: కొప్పళ నగరంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న 13వ జాతీయ మార్షల్ ఆర్ట్స్ క్రీడలకు మద్దతు ఇవ్వాలని కొప్పళ ఎంపీ, రాష్ట్ర పెస్కాక్ సిలాత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే.రాజశేఖర్ హిట్నాల్ విజ్ఞప్తి చేశారు. గురువారం నగరంలోని తన నివాసంలో ఆయన ఈ క్రీడల ఆహ్వాన పత్రికను విడుదల చేస్తూ దాదాపు 27 రాష్ట్రాల నుంచి 1200 మందికి పైగా అథ్లెట్లు, 250 మంది కోచ్లు, మేనేజర్లు, రిఫరీలు తొలిసారిగా పాల్గొంటున్నారని అన్నారు. ప్రముఖులు, మీడియా వ్యక్తులు, అధికారులు, క్రీడాభిమానులు మరింత సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గవిమఠం గవిసిద్దేశ్వర మహాస్వామి వసతి, ఆహారం కోసం గొప్ప మద్దతు ఇచ్చారని ఆయన అన్నారు. ఇక్కడ దాదాపు 800 మంది బాలురు, ప్రధానోపాధ్యాయులకు, టణకనకల్ మైనార్టీ మొరార్జీ రెసిడెన్షియల్ స్కూల్లో సుమారు 400 మంది బాలికలకు వసతి కల్పించారు. ఈ క్రీడా పోటీల్లో నాలుగు విభాగాల్లో విజేతలకు అవార్డులు ప్రదానం చేస్తున్నారు. జిల్లా హామీల అమలు అథారిటీ ఉపాధ్యక్షుడు, రాష్ట్ర సిలాట్ జాయింట్ సెక్రటరీ మంజునాథ్ జి.గొండబాళ, నేషనల్ పెన్కాక్ సిలాట్ ఫెడరేషన్ టెక్నికల్ డైరెక్టర్ అబ్దుల్ రజాక్ టైలర్, జిల్లా అధ్యక్షుడు మౌనేషా వద్దట్టి, ప్రధాన కార్యదర్శి ఈరన్న బాదామి, కాంగ్రెస్ నాయకుడు గాళెప్ప పూజార తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణ కర్ణాటకను వీడని వరుణుడు
రాయచూరు రూరల్: మహారాష్ట్ర పైభాగంలో కురుస్తున్న వర్షాలకు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. రాయచూరు, కలబుర్గి, యాదగిరి, బీదర్ జిల్లాల్లో కురిసిన వర్షాలకు రెండు అడుగుల మేర నీరు ప్రవహించాయి. వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి. ఉజ్జయిని, సీనా, బోరి వాగుల నుంచి అధిక ప్రమాణంలో నీరు పారడంతో భీమా నది నుంచి 2.75 లక్షల క్యూసెక్కుల నీరు వదిలారని తహసీల్దార్ సంజీవ్ కుమార్ తెలిపారు. నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలబుర్గి జిల్లాధికారిణి ఫౌజియా తరన్నుమ్ వెల్లడించారు. బీదర్ జిల్లా హులసూరు, బసవ కళ్యాణల మధ్య మహారాష్ట్రకు వెళ్లే రహదారిలో రాకపోకలు పూర్తిగా బంద్ చేశారు. కలబుర్గి జిల్లా దేవలగాణగావ్లో భీమా నది ప్రవాహంలో ఘత్తరిగి వంతెన నిండిపోయింది. మణ్ణూరు యల్లమ్మ దేవాలయం నీటిలో మునిగింది. విజయపుర జిల్లా తాళికోటెలో వంతెన దాటుతుండగా ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంలో వెళుతూ నీటి ప్రవాహానికి సంతోష్(22) కొట్టుకు పోయాడు. మహేంతేష్ హొసగౌడ(20) ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వాన నీరు చేరింది. పొంగి ప్రవహిస్తున్న నదులు నీటమునిగిన ఆలయాలు -
మహనీయుల జయంతులను అర్థవంతంగా ఆచరించాలి
హొసపేటె: జాతిపిత మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహనీయుల జయంతులను ఈసారి తాలూకా యంత్రాంగం చాలా అర్థవంతంగా జరుపుకుంటుందని తహసీల్దార్ నేత్రావతి తెలిపారు. గురువారం కూడ్లిగి పట్టణంలోని తాలూకా కార్యాలయంలో తహసీల్దార్ అధ్యక్షతన జరిగిన ప్రాథమిక సమావేశంలో ఆమె మాట్లాడారు. జయంతిలో భాగంగా, మహాత్మా గాంధీ అస్థికలను ఉంచిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని త్రివర్ణ పతాకం రంగులతో అలంకరించనున్నారు. ఉదయం 9 గంటలకు, ఎమ్మెల్యే డాక్టర్ ఎన్టీ శ్రీనివాస్, అధికారులు గాంధీ చిత్రపటానికి పుష్పగుచ్ఛాలు అర్పిస్తారు. తరువాత ఆయన గాంధీజీ గురించి ఉపన్యసిస్తారు. అక్టోబర్ 2న తాలూకాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల చిత్రపటాలను పూజించి వారి విజయాల గురించి తెలియజేయాలని ఆమె ఆదేశించారు. కార్యక్రమంలో తాలూకా స్థాయి అధికారులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. టీపీ అధ్యక్షుడు కావలి శివప్పనాయక, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తాలూకా అధ్యక్షుడు ఎస్.వెంకటేష్, ఒనకె ఓబవ్వ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హిరేకుంబలగుంటె ఉమేష్, బీఈఓ ఎస్.ఎస్.జగదీష్, టీపీ చీఫ్ ఆఫీసర్ దాదాపీర్, డీ.నాగరాజ్, హామీ పథకం తాలూకా అధ్యక్షుడు జిలాన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కురుబలను ఎస్టీల్లోకి చేర్చవద్దు
సాక్షి,బళ్లారి: కర్ణాటకలో బలమైన, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందంజలో ఉన్న కురుబ సమాజాన్ని ఎస్టీ జాబితాలోకి చేర్చాలనే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని వాల్మీకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గురువారం అఖండ కర్ణాటక వాల్మీకి నాయక ఐక్య వేదిక, బళ్లారి జిల్లా వాల్మీకి నాయక విద్యాభివృద్ధి సంఘం, అఖిల కర్ణాటక వాల్మీకి మహాసభ, వీరసింధూర లక్ష్మణ యువక సంఘం, ఏకలవ్య యువక సంఘం తదితర వాల్మీకి సమాజానికి చెందిన పలు సంఘాల నాయకులు, కార్యకర్తల సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన చేపట్టారు. నగరంలోని నారాయణరావ్ పార్క్ నుంచి రాయల్ సర్కిల్కు చేరుకొని బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లాధికారి కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి జిల్లాధికారికి వినతిపత్రాన్ని సమర్పించారు. ఆ సంఘం అధ్యక్షుడు జోళదరాశి తిమ్మప్ప మాట్లాడుతూ కురుబ సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలోకి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. దీంతో వాల్మీకులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య తమ సామాజిక వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. ఈ ప్రయత్నాన్ని విరమించుకోక పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు. వాల్మీకి సమాజ నాయకులు జనార్ధన నాయక, జయరాం, హనుమంతప్ప, గోవిందప్ప తదితరులు పాల్గొన్నారు. కురుబలను ఎస్టీల్లో చేర్పించరాదని ర్యాలీ హొసపేటె: హాలుమత కురుబ కులాన్ని షెడ్యూల్డ్ తెగల కేటగిరిలో ఎట్టి పరిస్థితిలో చేర్పించరాదని డిమాండ్ చేస్తూ గురువారం వాల్మీకి సమాజ సోదరులు నగరంలో ర్యాలీ చేపట్టారు. ర్యాలీని వాల్మీకి సర్కిల్ నుంచి చేపట్టి పునీత్ రాజ్కుమార్ సర్కిల్, తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాలూకా వాల్మీకి సమితి నిరసిస్తూ తహసీల్దార్ కార్యాలయం ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించింది. వాల్మీకి సంఘం తాలూకా అధ్యక్షులు గోసల భరమప్ప, కార్యదర్శి దేవరమని శ్రీనివాస్, జంబయ్య నాయక్ తదితరులు మాట్లాడుతూ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎం సిద్ధరామయ్యను డిమాండ్ చేశారు. బళ్లారి, విజయనగరల్లో కదం తొక్కిన వాల్మీకులు పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టి ప్రభుత్వ తీరును నిరసించిన వైనం -
కరుణించమ్మా కాత్యాయిని
రాయచూరులో పూజలందుకున్న బిల్వ మందిరం మాతరాయచూరు రూరల్: జిల్లాలో గురువారం శరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా నగరంలోని అల్లమ ప్రభు కాలనీలోని బిల్వ మందిరంలో అంబా భవాని మాతకు పూజలు జరిపారు. కోటలో కాళికా దేవి ఆలయంలో అమ్మవారిని పల్లకీలో ఊరేగించారు. దేవసూగూరు నాగర యల్లమ్మకు పువ్వులతో అలంకరణ చేశారు. మమదాపురలో మారికాంబను, కిల్లే బృహన్మఠంలో దేవిని అలంకరించారు. గుంజళ్లిలో కిల్లే బృహన్మఠ శాంత మల్ల శివాచార్యులు విశేష పూజలు జరిపారు. సిరవారలో దేవి విగ్రహం కోసం రూ.లక్ష విలువ చేసే అభరణాలను వెంకటేష్, పద్మావతిలు అందజేశారు. అమ్మవారిని దర్శించుకొన్న మహిళలు హొసపేటె: శరన్నవరాత్రుల సందర్భంగా నాలుగో రోజు గురువారం నగరంలోని చప్పరదహళ్లి, వాల్మీకి నగర్, బాణదకెరె, పటేల్ నగర్, టీబీ డ్యాం గాళెమ్మ గుడి, రాణిపేట, రైల్వే రహదారి, అంబా భవాని దేవాలయం, సాయిబాబా మందిరం, మూకాంబిక ఆలయం తదితర ప్రాంతాల్లో వివిధ వార్డుల్లో వెలసిన అమ్మవారి ఆలయాలు విశేష అలంకరణతో కనువిందు చేశాయి. ఉదయం ఆలయాల్లో అమ్మవారికి విశేష అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన, మంగళ హారతి తదితర పూజలు జరిపించారు. భక్తులు అమ్మ వారి ఆలయాలకు వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. బన్ని చెట్టుకు ప్రత్యేక పూజలు దసరా నవరాత్రుల సందర్భంగా నగరంలోని అమరావతిలో ఉన్న జమ్మి(బన్ని) చెట్టుకు గురువారం కాలనీ మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు సాంప్రదాయ పసుపు రంగు దుస్తులు ధరించి బన్ని చెట్టుకు పూజలు చేశారు. విద్యానగర్లో కాత్యాయినిగా అమ్మవారు బళ్లారిటౌన్: విద్యానగర్లో ఆభయ ఆంజనేయ స్వామి ఆలయంలో దసరా శరన్నవ రాత్రి ఉత్సవాల సందర్భంగా గురువారం నాలుగో రోజున కాత్యాయిని రూపంలో అమ్మవారిని అలంకరించారు. స్థానికులు ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకొని పూజలు సమర్పించారు. బళ్లారిలో.. బళ్లారిఅర్బన్: విజయదశమి దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా నాలుగో రోజు గురువారం నగరంలోని అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక అలంకరణ, పూజలు జరిపారు. నగర ప్రజల ఆరాధ్య దైవం కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారికి ఆభరణాలు, పూలతో అలంకరణ, ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి భ్రమరాంబా దేవి అలంకరణ, పటేల్నగర్ చిన్న దుర్గమ్మకు విశేష అలంకరణ, హవంబావి సీతారామ ఆశ్రమంలో లలితా దేవి అలంకరణ, బెంగళూరు రోడ్డు కన్యకాపరమేశ్వరి ఆలయంలో లక్ష్మీదేవి అలంకరణ, ఆలయ ప్రాంగణంలో వాసవీ దేవస్థాన ఆలయ ప్రాంగణంలో పూరీ జగన్నాథ్ అలంకరణ, నగరేశ్వరి ఆలయంలో పార్వతి దేవికి వెండి పూలతో అలంకరణ, బెంకి మారెమ్మకు విశేష అలంకరణ, మిల్లర్పేటె మల్నాడు దుర్గమ్మ ఆలయంలో విశేష అలంకరణ, చిన్నమార్కెట్ శాంభవి దేవి ఆలయంలో, సిరుగుప్ప రోడ్డు తుళజా భవానికి పండ్లతో అలంకరణ, ఫైర్ ఆఫీస్ ఆదిశక్తి ఆలయంలో, దేవినగర్ రేణుకా యల్లమ్మ ఆలయంలో, విద్యానగర్ కొల్హాపురి మహాలక్ష్మీ ఆలయంలో, సంతోషిమాత ఆలయం తదితర అమ్మవారి ఆలయాల్లో దేవీ నవరాత్రులను పురస్కరించుకొని విశేష అలంకరణ, ధార్మిక పూజలను నిర్వహించారు. హొసపేటెలో వివిధ రూపాల్లో అమ్మవారికి అలంకరణలు వైభవంగా శరన్నవ రాత్రి ఉత్సవాలు నాలుగో రోజుకు అమ్మవార్లకు పూజలు -
పోలీసు క్యాంటీన్ నిర్మాణానికి భూమిపూజ
రాయచూరు రూరల్: నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో గురువారం నూతనంగా పోలీస్ క్యాంటీన్ నిర్మాణ పనులకు ఎస్పీ పుట్టమాదయ్య భూమిపూజ చేశారు. పోలీస్ మైదానంలో రూ.10 లక్షలతో నూతన క్యాంటీన్ నిర్మాణం వల్ల పోలీసులకు, అధికారులకు, ఉద్యోగులకు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి మంచి ఆహార పదార్థాల సేవనకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు కుమారస్వామి, శాంతవీర హరీష్, మేకా నాగరాజ్, ఉమేష్ కాంబ్లే, ఈరణ్ణలున్నారు.పేదలకు భూమి, ఇళ్లు కేటాయించాలని ర్యాలీరాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు మిగులు భూములు, ఇళ్లు కేటాయించాలని దళిత సంఘర్ష సమితి అధ్యక్షుడు శ్రీనివాస్ కొప్పర్ డిమాండ్ చేశారు. గురువారం రాయచూరు తాలూకా చంద్రబండలో చేపట్టిన ర్యాలీలో మాట్లాడారు. రారష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ ఆధీనంలో సాగు చేస్తున్న భూములను సన్న కారు రైతులకు పంపిణీ చేసేందుకు అవకాశం ఉన్నా అధికారులు రైతులపై కేసులు నమోదు చేస్తుండడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వ స్థలాల్లో పేదలు వేసుకున్న గుడిసెలను అధికారులు రాజకీయ నాయకుల కుమ్మక్కుతో స్వాధీనం చేసుకుంటున్నట్లు ఆరోపించారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ అనే సామెతను నిర్వీర్యం చేస్తున్నట్లు తెలిపారు.అనాథగా జాతీయ నేతల చిత్రపటాలురాయచూరు రూరల్: నగరంలోని నగరసభ కార్యాలయం పైఅంతస్తులో అధికారులు జాతీయ నేతల చిత్రపటాన్ని అవమానించారు. బుధవారం మహాత్మా గాంధీ, బాబూ జగ్జీవన్ రామ్ల చిత్రపటాలను నేలపైనే వదిలేసి అవమాన పరిచారని జయ కర్ణాటక సంఘం సంచాలకుడు రవి కుమార్ ఆరోపించారు. ఈ విషయంలో నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, కమిషనర్ జుబిన్ మహాపాత్రో స్పందించక పోవడంపై నిరసన వ్యక్తం చేశారు.కసాప జిల్లాధ్యక్షుని రాజీనామాకు డిమాండ్రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు రంగణ్ణ పాటిల్ రాజీనామా చేయాలని బెళకు సంస్థ అధ్యక్షుడు అణ్ణప్ప మేటిగౌడ డిమాండ్ చేశారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నాలుగేళ్ల నుంచి జిల్లాలో ఎలాంటి సాహిత్య పరిషత్ కార్యక్రమాలను నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించారన్నారు. అనారోగ్యంతో సాహిత్య పరిషత్ సేవలు చేయడానికి చేతకానప్పుడు రాజీనామా చేసి ఇతరులకు అవకాశం కల్పించాలన్నారు. రెండు రోజుల క్రితం రాష్ట్ర కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుని అనుమతి లేకుండా నేరుగా ఏడు తాలూకాల అధ్యక్షులను మార్చి నూతన అధ్యక్షులను నియమించారన్నారు. వారం రోజుల్లోపు పాటిల్ రాజీనామా చేయక పోతే పరిపాలనాధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు.వేశ్యావాటికపై దాడి.. నలుగురు అరెస్ట్రాయచూరు రూరల్: వేశ్యా వాటికపై దేవదుర్గ పోలీసులు దాడి చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ తెలిపారు. బుధవారం రాత్రి కొప్పర రహదారిలో నిర్వహిస్తున్న వేశ్యా వాటికపై దాడి చేసి సుమంగళ(55), రాజవర్దన్(21), ద్యావప్ప(40), రవి(30)లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 4 మొబైల్ ఫోన్లు, రూ.6,460 నగదు, ఇతర సామగ్రిని స్వాధీనపరచుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. -
దీన్దయాళ్ సేవలు మరువలేనివి
సాక్షి, బళ్లారి: దేశ అభ్యున్నతి, స్వావలంబన కోసం దీన్దయాళ్ ఉపాధ్యాయ దేశానికి చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్రెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకొని నగరంలో దీన్దయాళ్ చిత్రపటానికి పూలమాల సమర్పించిన అనంతరం మాట్లాడారు. దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుల్లో దీన్దయాళ్ కూడా ఒకరుగా నిలిచారన్నారు. 1916 సెప్టెంబర్ 25న ఉత్తరప్రదేశ్లోని చంద్రఖాన్ గ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించారన్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారన్నారు. మేనమామ ఇంట్లో పెరుగుతూ కష్టపడి చదివి డిగ్రీ పూర్తి చేసి ఆర్ఎస్ఎస్లో చేరడంతో ఆయన జీవితం మారిపోయిందన్నారు. ఆర్ఎస్ఎస్ కోసం చదువును సైతం మానేసి జీవిత కాలం ఆర్ఎస్ఎస్లో పని చేసేందుకు నిర్ణయం తీసుకొని దేశ సేవకు తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. వివిధ పత్రికల్లో ఎడిటర్గా కూడా పని చేశారన్నారు. పార్టీని ముందుకు నడిపించారు శ్యామ ప్రసాద్ ముఖర్జీ మరణం తరువాత పార్టీ బాధ్యతలను తీసుకొన్న దీన్దయాళ్ పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారన్నారు. దీన్దయాళ్ ఉపాధ్యాయ కృషి వల్లనే నేడు బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించిందన్నారు.అనంతరం మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్కుమార్ మోకా, నగర మాజీ మేయర్ వెంకటరమణ, మాజీ బుడా అధ్యక్షుడు మారుతీప్రసాద్, కార్పొరేటర్లు మోత్కూర్ శ్రీనివాస్రెడ్డి, హనుమంతు, సురేఖ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్రెడ్డి -
టెలికాం పరికరాల దొంగల అరెస్ట్
బళ్లారిటౌన్: ఎయిర్టెల్, జియో టెలికాం టవర్ల బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ పరికరాలను చోరీ చేసిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి సుమారు రూ.30.50 లక్షల విలువ గల పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శోభారాణి తెలిపారు. బళ్లారి జిల్లా సరిహద్దులోని ఆంధ్రప్రదేశ్లో ఇటీవల టెలికాం టవర్ల బ్యాటరీలు, పరికరాల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఈ ఘటనలపై కేసులు దాఖలైనందున నిందితుల ఆచూకీ కోసం ఓ బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. బళ్లారి గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో 5, పీడీ హళ్లి స్టేషన్ పరిధిలో 4, కుడితినిలో ఒకటి, ఆంధ్రప్రదేశ్ 5 కలిపి మొత్తం 15 చోట్ల చోరీలు జరిగినందున నిఘా బృందం తనిఖీ చేసి నిందితులు ఉత్తర్ప్రదేశ్కు చెందిన వారని, వీరిలో అనాస్, ఇఫ్తార్, దిల్ నవాజ్, మరొకరు అనాస్ అలియాస్ హరెహన్ అనే నలుగురిని బంధించి పరికరాలతో పాటు రూ.5 లక్షల విలువ గల లగేజ్ పికప్ ఆటోను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
పసివయసులో ప్రేమభూతం
●యువకుడు, బాలిక ఆత్మహత్య మాలూరు: చదువుకుని ఉన్నత జీవితానికి బాటలు వేసుకోవాల్సిన పసివయసులో ప్రేమ మాయలో పడి ఓ అమ్మాయి, అబ్బాయి ప్రాణాలు తీసుకున్నారు. కన్నవారికి జీవితాంతం శోకాన్ని మిగిల్చిన ఈ దుర్ఘటన కోలారు జిల్లాలో జరిగింది. రైలు కింద పడి ప్రేమికుల జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన తాలూకాలోని బ్యాటరాయనహళ్లి వద్ద చోటు చేసుకుంది. వివరాలు.. టీకల్ ఫిర్కా శెట్టిహళ్లి గ్రామానికి చెందిన సతీష్ (18), పనసమాకనహళ్లి అమ్మాయి (17), వీరిద్దరూ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. వేర్వేరు కులాలు కావడంతో ఇంట్లో తమ ప్రేమకు అంగీకరించరని, తాము కలిసి జీవించలేమని తెలిసీ తెలియని వయసులో ఏదేదో ఊహించుకున్నారు. గురువారం ఉదయం బ్యాటరాయనహళ్లి వద్ద బెంగళూరుకు వెళ్లే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. సతీష్ బుధవారమే పుట్టిన రోజు జరుపుకున్నాడు. రైలు తాకిడికి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమయ్యాయి. బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందించారు. హిందీ భేటీలో కరవే రచ్చ ● పంచతార హోటల్లో ఘటన శివాజీనగర: కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని రాజ భాషా కమిటీ బెంగళూరులోని తాజ్వెస్ట్ఎండ్ హోటల్లో గురువారం హిందీ ప్రచార సభని నిర్వహించగా, కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు, నేతలు చొరబడి రభస సృష్టించారు. వందలాది మంది కార్యకర్తలు హోటల్లోకి దూసుకొచ్చారు. ఆరుమంది పార్లమెంట్ సభ్యుల సమక్షంలో జరుగుతున్న కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. కొంతసేపు ఉద్విగ్న పరిస్థితి ఏర్పడింది. హిందీని హిందీయేతర రాష్ట్రాలపై బలవంతంగా రుద్దే పని చేస్తున్నారని కార్యకర్తలు ఆరోపించారు. కొంతసేపటికి హైగ్రౌండ్స్ పోలీసులు చేరుకుని కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఈ గొడవతో సమావేశానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. నీటి ట్యాంకర్ ఢీ, బైకిస్టు మృతి దొడ్డబళ్లాపురం: బైక్ను వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ ఢీకొన్న సంఘటనలో తండ్రి మృతి చెందగా, కుమారుడు తీవ్రంగా గాయపడ్డ సంఘటన బెంగళూరు వైట్ఫీల్డ్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. మునిరాజు (52), కుమారుడు ధనంజయ్గౌడ (16) నాగగొండనహళ్లి నుండి ఇమడిహళ్లి వైపు బైక్పై వెళ్తుండగా దారిమధ్యలో సాయి సన్షైన్ అపార్ట్మెంట్ ముందు ఎదురుగా వచ్చిన వాటర్ ట్యాంకర్ ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరినీ వైదేహి ఆస్పత్రికి తరలించగా మునిరాజు చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దావణగెరెలో ఫ్లెక్సీ ఘర్షణ దొడ్డబళ్లాపురం: ఓ మతపరమైన ఫ్లెక్సీ దావణగెరెలో చిచ్చు రేపింది. ఘర్షణ జరిగి పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాలు.. దావణగెరెలోని కార్ల్ మార్క్ నగరలోని 13వ క్రాస్లో ఓ ఇంటి ముందు ఓ మతంవారు ఫ్లెక్సీని కట్టారు. ఇక్కడ ఎందుకు కట్టారని ఇంటి వారు ప్రశ్నించడంతో వారిపై దాడికి పాల్పడ్డారు. ఇంటి మీద రాళ్లు విసిరారు. ఒక మతానికి చెందిన సుమారు 500 మందిపైగా జనం అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది, కొట్టుకుని పలువురు గాయపడ్డారు. గొడవలపై రెండు కేసులు నమోదు చేసినట్టు దావణగెరె ఎస్పీ ఉమా ప్రశాంత్ తెలిపారు. ప్రశాంత వాతావరణం నెలకొందని, సదరు ఫ్లెక్స్ని తొలగించామని తెలిపారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయవద్దని ప్రజలను హెచ్చరించారు. ఆడని సినిమా.. ప్రేక్షకుల హంగామాచింతామణి: పట్టణంలోని ఎంజీ రోడ్డులో ఉన్న ఆదర్శ సినిమా టాకీసులో బుధవారం రాత్రి ఓ కొత్త తెలుగు సినిమా ప్రీమియర్ షో వేస్తామని రూ.400 చొప్పున టికెట్లను అమ్ముకున్నారు. 300 మంది ఆన్లైన్లో టికెట్లను కొని సినిమాచూడాలని వచ్చారు. అయితే ఎంతసేపయినా షో మొదలు కాలేదు. సినిమా చిప్ డౌన్లోడు కాలేదంటూ షోను రద్దు చేస్తున్నట్లు టాకీస్ సిబ్బంది ప్రకటించారు. దీంతో ఆగ్రహానికి లోననైన ప్రేక్షకులు సినిమా తెరను చించి, సీసీ కెమెరాలు, చైర్లు, ఫర్నిచర్ను ధ్వంసం చేసి కిష్కింధకాండ చేశారు. పట్టణ సీఐ విజికుమార్, పోలీసులు, ఇతర ఠాణాల నుంచి పోలీసులు వచ్చారు. ప్రేక్షకులను టాకీస్ నుంచి బయటకు పంపించగా, వారు బయట ధర్నాకు దిగారు. సినిమాను చూపించాలి, లేదా డబ్బయినా వెనక్కి ఇవ్వాలని పట్టుబట్టారు. డబ్బులు ఇస్తామని యజమాని హామీ ఇచ్చాడు, సినిమా చూపాలని ప్రేక్షకులు గొడవ చేశారు. ఇక్కడే ఉంటే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించారు. చివరకు అర్ధరాత్రి అందరూ వెళ్లిపోయారు, గురువారం టికెట్ల డబ్బులను వెనక్కి ఇచ్చారు. -
లోకాయుక్త వలలో నగరసభ ఇంజనీరు
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం నగరసభ ఇంజనీరు అరుణ్ ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ లోకాయుక్తకు దొరికిపోయాడు. వివరాలు.. నగరంలోని పలు వార్డులలో ఓ కాంట్రాక్టరు పనులు చేశాడు, వాటి బిల్లులను మంజూరు చేయాలని ఇంజనీరు అరుణ్కు దరఖాస్తు చేశారు. రూ. 75 వేలు లంచం ఇవ్వాలని అరుణ్ సతాయించసాగాడు. డబ్బు ఇవ్వకపోతే పని జరగదని కిరికిరి పెట్టాడు. దీంతో బాధితుడు లోకాయుక్త అధికారులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం సాయంత్రం అరుణ్ లంచం డబ్బు తీసుకుంటూ ఉండగా లోకాయుక్త అధికారులు దాడి చేసి అరుణ్ని అరెస్టు చేశారు. పోలీసును బలిగొన్న హైనా దొడ్డబళ్లాపురం: రోడ్డుపై వెళ్తుండగా హైనా అనే జంతువు అడ్డు రావడంతో దాన్ని ఢీకొన్న పోలీస్ జీప్ ప్రమాదానికి గురై ఏఎస్ఐ చనిపోయాడు. గదగ్ జిల్లా సొరటూర గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. వివరాలు.. బెటగేరి ఠాణా ఏఎస్ఐ ఖాసీంసాబ్, కొందరు పోలీసులు ఈ నెల 23న జీపులో లక్ష్మేశ్వరలో వినాయక నిమజ్జనం బందోబస్తును చూసుకుని తిరిగి వస్తున్నారు. రోడ్డుపై హఠాత్తుగా అడవి జంతువు హైనా అడ్డు వచ్చింది. దీంతో డ్రైవర్ అదుపు తప్పడంతో జీపు రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖాసీంసాబ్ గురువారంనాడు చనిపోయారు. ఇన్స్పెక్టర్ ఉమేశ్ గౌడ, డ్రైవర్ ఓంనాథ్కు గాయాలయ్యాయి. ఖాసీం మరో 5 నెలల్లో రిటైరు కావాల్సి ఉండగా ఇలా జరిగింది. దర్శన్కు దక్కని ఊరట ● సదుపాయాలపై విచారణ వాయిదా యశవంతపుర: రేణుకాస్వామి హత్య కేసులో మళ్లీ పరప్పన జైలుపాలైన ప్రముఖ నటుడు దర్శన్కు ఊరట దక్కడం లేదు. జైల్లో పరుపు, దిండు సౌకర్యం, బయట వాకింగ్ వసతిని కల్పించాలని బెంగళూరు సిటీ 57వ సివిల్ కోర్టులో దర్శన్ గతంలో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. ఆ వసతులను ఇవ్వాలని కోర్టు కూడా ఆదేశించింది. అయితే జైలు అధికారులు పట్టించుకోవడం లేదని దర్శన్ వకీలు వాదించారు. గురువారం దర్శన్ కోర్టుకు హాజరయ్యారు. వాకింగ్ చేయడానికి, ఆరుబయట ఉండడానికి జైలు అధికారులు అనుమతించడం లేదని దర్శన్ జడ్జికి వివరించాడు. సాధారణ సెల్కు బదిలీ చేయాలని దర్శన్ న్యాయవాది మనవి చేశారు. ఇదీ రౌడీల రాజ్యమా?, కోర్టు ఆదేశాలను జైలు సిబ్బంది పాటించటం లేదు అని ఘాటుగా అన్నారు. మరో నిందితురాలు పవిత్రగౌడను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి విచారించారు. విచారణను వచ్చే నెల 9 కి వాయిదా వేశారు. రేణుకాస్వామి హత్య కేసుతో తనకు సంబంధం లేదని, విముక్తి చేయాలని దర్శన్ మరో పిటిషన్ను వేశాడు. తనను కావాలనే ఇరికించారని అందులో పేర్కొన్నాడు. సరస్వతీపుత్ర భైరప్పకు కన్నీటి నివాళిశివాజీనగర: బెంగళూరులో బుధవారం కన్నుమూసిన పద్మభూషణ్, సరస్వతి సమ్మాన్ పురస్కార గ్రహీత, సాహితీవేత్త ఎస్.ఎల్.భైరప్పకు సాహితీలోకం కన్నీటినివాళి అర్పిస్తోంది. గురువారం బెంగళూరులోని జే.సీ.రోడ్డులో ఉన్న రవీంద్ర కళాక్షేత్రానికి ఆయన పార్థివదేహాన్ని తీసుకువచ్చారు. అక్కడ వేలాదిమంది ప్రజలు, అభిమానులు, రచయితలు అంతిమ దర్శనం చేసుకున్నారు. సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్, మంత్రులు నివాళులర్పించారు. మైసూరులో భైరప్ప స్మారకాన్ని నిర్మించనున్నట్లు సీఎం తెలిపారు. శుక్రవారం మైసూరు చాముండి కొండ వద్ద తప్పలి శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయి. -
మైసూరులో హెలికాప్టర్ల ఆర్భాటం
మైసూరు: హెలికాప్టర్ల విన్యాసాలు నగరవాసుల్ని అబ్బురపరిచాయి. మైసూరులో దసరాలో భాగంగా గురువారం సాయంత్రం వాయుసేన హెలికాప్టర్ల ప్రదర్శన కనువిందుగా సాగింది. వేలాదిమంది యువత, ప్రజలు తరలివచ్చారు. ఐదు హెలికాప్టర్లు పాల్గొన్నాయి. ఈ నెల 27వ తేదీన వైమానికి ప్రదర్శన భారీఎత్తున జరుగుతుందని సమాచారం. పట్టుచీరల్లో నడక మైసూరు పట్టుచీరలు ధరించి, మల్లెలు అలంకరించుకుని మగువలు ర్యాలీ చేశారు. మహిళా దసరాను అట్టహాసంగా ఆరంభించారు. వేలాదిమంది మహిళలు నగరంలో ఊరేగింపుగా సాగారు. కోటె ఆంజనేయస్వామి ఆలయం నుంచి నడక సాగింది. డొళ్లు కుణిత, వీరగాసె సందడి మిన్నంటింది. -
సర్వేకు రాని ఉపాధ్యాయులపై చర్యలు
బనశంకరి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన విధులకు హాజరుకాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించినట్లు న్యాయశాఖమంత్రి హెచ్కే.పాటిల్ తెలిపారు. గురువారం సీఎం సిద్దరామయ్య అద్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ భేటీలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. ఆ వివరాలను పాటిల్ మీడియాకు వెల్లడించారు. సర్వేలో ఉపాధ్యాయులు పాల్గొనలేదని ఫిర్యాదులు అందుతున్నాయి, హాజరు కానివారిపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర వెనుకబడిన వర్గాల కమిషన్కు అప్పగించామని చెప్పారు. కొన్ని ముఖ్య తీర్మానాలు ● డీఎస్పీ గణపతి ఆత్మహత్య మీద కేఎన్.కేశవనారాయణ విచారణ కమిటీ నివేదికను కేబినెట్ తిరస్కరించింది. ● ప్రభుత్వ అధికారులకు వారి స్థాయికి అనుగుణంగా వృత్తి నైపుణ్య కోర్సులు తప్పనిసరి ● బెంగళూరులో అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్స్ పథకానికి రూ.56.45 కోట్లు కేటాయింపు ● ఢిల్లీలో చాణక్యపురిలో రూ.16 కోట్లతో కర్ణాటక భవన్ అభివృద్ధి పనులు ● 2019కి ముందు ఉన్న అన్ని వాహనాల డిజిటలరీకరణ కోసం రవాణాశాఖకు రూ.40 కోట్లు ● బెంగళూరులో పలు ప్రాంతాలలో భూగర్భ మురుగునీటి సరఫరా, నీటి శుద్ధీకరణ ప్లాంట్ల ఏర్పాటు. దేవనహళ్లి వద్ద ఐటీపార్కు, ఎలెమల్లప్పబెట్ట, సాదరమంగల తదితర ప్రాంతాలలో ఏర్పాటుకు నిర్ణయం. కేబినెట్ భేటీలో నిర్ణయం -
నకిలీ సర్టిఫికెట్లు
రూ.లక్షలు కొడితేబనశంకరి: డాక్టర్ కావాలనేది ఎంతోమంది యువత, తల్లిదండ్రుల కల. ఆ కలను తీర్చుకోవడానికి పక్కదారులు పట్టేవారికి కొదవలేదు. కర్ణాటక పరీక్షా ప్రాధికార (కేఇఏ)కు నకిలీ అంగవైకల్య మెడికల్ ధ్రువపత్రాలను అందజేసి దివ్యాంగుల కోటాలో ప్రభుత్వ మెడికల్ సీట్లు పొందడానికి 21 మంది అభ్యర్థులు ప్రయత్నించిన కేసులో డొంకంతా కదిలింది. అభ్యర్థులతో పాటు వారికి సహకరించినవారి జాబితాను బెంగళూరు మల్లేశ్వరం పోలీసులు బయటకు తీశారు. నకిలీ సర్టిఫికెట్లను సృష్టించిన ఇద్దరు ప్రభుత్వ డాక్టర్లతో పాటు ఐదుమందిని అరెస్ట్చేశారు. నకిలీ సర్టిఫికెట్లు ఇవ్వడానికి ఒక్కో అభ్యర్థి నుంచి రూ.5 లక్షల నుంచి 10 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది. చెవులు వినిపించవంటూ నాటకం ఇటీవల మెడికల్ కౌన్సెలింగ్లో కొందరు నకిలీ సర్టిఫికెట్లను సమర్పించినట్లు పరీక్షా ప్రాధికార (కేఈఏ) అధికారులు గమనించారు. దీంతో స్థానిక మల్లేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 21 మంది యువతీ యువక అభ్యర్థులు ఎంబీబీఎస్ సీట్ల కు దరఖాస్తు చేసిన సమయంలో తమకు బధిరత్వం ఉందని, దివ్యాంగుల కోటాలో సీట్లను కేటాయించాలని దరఖాస్తులో పేర్కొన్నారు. ఆ అభ్యర్థులకు కేఈఏ నిబంధనల ప్రకారం జూలై 17వ తేదీన విక్టోరియా ఆసుపత్రి, నిమ్హాన్స్లో ఆడియోగ్రామ్ పరీక్షలను నిర్వహించారు. ఈ సమయంలో వారికి చక్కగా వినిపిస్తోందని, ఎలాంటి బధిరత్వం లేదని వైద్యులు గుర్తించారు. అభ్యర్థులు అందజేసిన ఆడియోలాజికల్ నివేదిక అధికారికం కాదని ధృవీకరించారు. మరిన్ని వివరాలను అందించాలని 21 మంది అభ్యర్థులకు నోటీస్ జారీచేశారు. వెంటనే ముగ్గురు విద్యార్థులు, తల్లిదండ్రులు విచారణకు హాజరై తాము మోసపోయామని, కొందరు నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారని వివరించారు. ఎంబీబీఎస్ సీట్ల కోసం 21 మంది అభ్యర్థులకు ఆశ తనిఖీలలో దొరికిన యువత ఇద్దరు వైద్యులు, ఇద్దరు ఉపాధ్యాయులు, ఓ క్లర్కు అరెస్టు = బెంగళూరు నుంచి హొసపేటెకు లింకు సూత్రధారి భర్మప్ప ఉపాధ్యాయుడు భర్మప్ప.. తోటి ఉపాధ్యాయులు పిల్లలకు నీట్ ద్వారా మెడికల్ సీట్లు ఇప్పిస్తానని ప్రచారం చేసుకునేవాడు. పై అభ్యర్థుల తల్లిదండ్రులను సంప్రదించి ఇదే మాట చెప్పాడు. ఇందుకోసం అంగ వైకల్యం ఉన్నట్లు నకిలీ సర్టిఫికెట్లు పుట్టించాడు. అభ్యర్థుల నుంచి రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు బేరం మాట్లాడారు. మొదట రూ.2 లక్షల నుంచి 5 లక్షల వరకు అడ్వాన్స్ తీసుకున్నారు. భర్మప్ప ప్రభుత్వ డాక్టర్లు, సిబ్బందితో మాట్లాడి వారందరికీ బధిరత్వం ఉన్నట్లు సర్టిఫికెట్లను సంపాదించాడు. ఇందుకుగాను ఆ వైద్యులకు కూడా సొమ్ములో వాటా ఇచ్చాడని పోలీసులు తెలిపారు. నిందితులు అందరిపై చర్యలు తీసుకుంటామని, కానీ అభ్యర్థుల భవిష్యత్తు పాడైపోరాదని వారిని హెచ్చరించి వదిలిపెట్టే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
మది మదిలో దసరా ఉల్లాసం
బొమ్మనహళ్లి: రాష్ట్రంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. సాంస్కృతిక సంబరాలు అలరిస్తున్నాయి. మైసూరులో ప్యాలెస్ ముందు వేదికపై కళాకారుల ప్రతిభ పరవళ్లు తొక్కుతోంది. నృత్యాలు, పాట కచేరీలతో వేలాది ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు. మంగళవారం, బుధవారం రాత్రి పొద్దుపోయేవరకూ సంగీత, గానాలాపన తన్మయుల్ని చేసింది. ప్రజలు ఉత్సాహం పట్టలేక వయోభేదం లేకుండా చిందులేస్తూ ఆడిపాడారు. మడికెరిలో.. కాఫీనాడు మడికెరి సిటీలోని గాంధీ మైదానంలో మంగళవారం రాత్రి దసరా సంబరాలను అట్టహాసంగా ప్రారంభించారు. కళాకారిణి మహిషామర్దిని నృత్యం ప్రజలను ముగ్ధుల్ని చేసింది. గాయకుల పాట కచేరీలు మైమరిపించాయి. మంగళూరులో రేవు నగరి మంగళూరులో నవరాత్రుల సందర్భంగా కుద్రోళి గోకర్ణనాథ ఆలయంలో నిత్యం వేడుకలు జరుగుతున్నాయి. శారదా దేవి మండంపంలో భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు. నిత్యం మహాగణపతి, శారద, నవదుర్గల ఆరాధన సాగుతోంది. తుళునాడు సంస్కృతికి అద్దం పట్టేలా సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతున్నాయి.ప్యాలెస్ వేదిక మీద సినీ పాటల ఆలాపన మైసూరులో ప్రేక్షకుల కేరింతలు మైసూరు సహా పలు నగరాల్లో సంబరాల అట్టహాసం -
కులగణనకు వంద ఇబ్బందులు
సాక్షి, బెంగళూరు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండోదఫా ప్రారంభించిన కులగణన నత్తనడకన సాగుతోంది. 22వ తేదీన తొలిరోజు 20 లక్షల ప్రజల మంది సమాచారం సేకరించాలి అని లక్ష్యంగా పెట్టుకుంటే, కేవలం 10 వేల మంది సమాచారం మాత్రమే సాధ్యమైంది. వివిధ రకాల గందరగోళాలు తలెత్తాయి. ఇవీ కొన్ని సమస్యలు ● మొత్తం 2 కోట్ల ఇళ్లలో ఏడు కోట్లకు పైగా ఉన్న ప్రజలందరి సమాచారాన్ని సేకరించాలి. మంగళవారం కూడా వేగం పుంజుకోలేదు. ● వివరాలను నమోదు చేసే మొబైల్ యాప్ ఎంతో నెమ్మదిగా పని చేస్తుండడంతో ఉపాధ్యాయులు విసిగిపోతున్నారు. ● యాప్ వినియోగం గురించి సిబ్బందికి అవగాహన రాలేదు. కొన్ని చోట్ల నెట్ రావడం లేదు. ఇంకొందరికి కిట్లు అందలేదు. ● ఆధార్ నంబర్ ద్వారా కేవైసీ చేస్తున్నప్పుడు ఓటీపీ ఆలస్యంగా వస్తోంది. కొందరికి ఓటీపీలే రావడం లేదు. ● యాప్ ఓపెన్ కావడం లేదని, క్రాష్ అవుతోందని ఎక్కువ మంది ఫిర్యాదు చేస్తున్నారు. ఇలా కులగణన సమస్యల్లో చిక్కుకుంది. ● రాష్ట్ర జనాభాలో 20 శాతం ఉన్న బెంగళూరులో ఇప్పటివరకు సమీక్ష ప్రారంభం కాలేదు. నత్తనడకన సర్కారు కార్యక్రమం ఇంటర్నెట్, యాప్లో లోపాలు ఇబ్బందులను తొలగిస్తాం: మంత్రి యశవంతపుర: సామాజిక విద్యా సమీక్షపై రెండు రోజుల నుంచి ఏర్పడిన ఇబ్బందులపై అధికారులతో చర్చించి తీర్చేస్తామని మంత్రి శివరాజ తంగడిగి తెలిపారు. ఆయన బుధవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి, సర్వర్ సమస్య కారణంగా జనగణన ఆలస్యం అవుతోందని అన్నారు. సర్వర్ సమస్యను అధికారులతో చర్చించి రేపోమాపో పరిష్కరిస్తామన్నారు. జనగణనపై హైకోర్టులో కేసులు దాఖలైనట్లు ప్రస్తావించగా, కోర్టు తీర్పు వచ్చే వరకు ఏమీ మాట్లాడనన్నారు. అక్టోబర్ 7 వరకు జనగణన ఉంటుంది, తేదీని పొడిగింపును పరిశీలిస్తామన్నారు. -
బెంగళూరులోని ఆస్పత్రిలో కన్నుమూత
శివాజీనగర: ప్రముఖ కన్నడ సాహితీవేత్త, నాటకరచయిత, తత్వవేత్త, విద్యావేత్తగా పేరుపొంది, సరస్వతి సమ్మాన్ సహా పలు పురస్కారాల గ్రహీత ఎస్.ఎల్.భైరప్ప అస్తమించారు. బెంగళూరులోని రాజారాజేశ్వరి నగరంలో ఉన్న ఓ ఆసుపత్రిలో మతిమరుపు సహా వృద్ధాప్య సమస్యలతో చికిత్స పొందుతున్న భైరప్ప (94) గుండె ఆగిపోవటంతో బుధవారం మధ్యాహ్నం 2.38 గంటలకు కన్నుమూశారు. ఆయన సాహితీ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారం అందజేసి గౌరవించింది. 3 రోజుల కిందటే ఆస్పత్రిలో చేరారు. హాసన్లోని పల్లెటూరి నుంచి.. ఆయన రచనల మాదిరిగానే భైరప్ప జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమైనది. హాసన్ జిల్లా చన్నరాయపట్టణం సంతేశివరలో 1931, ఆగస్టు 20న భైరప్ప ఓ సాధారణ హొయసళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ప్రాథమిక విద్యను పూర్తి చేసి మైసూరులో హైస్కూల్, కాలేజీ చదువులను కొనసాగించారు. ప్లేగు వ్యాధి వల్ల చిన్నప్పుడే తల్లి, సోదరులు మరణించారు. పేదరికం వల్ల ఆయన ఇబ్బందులు పడ్డారు. చిన్నా చితకా పనులు చేస్తూ విద్యాభ్యాసానికి డబ్బులు పోగుచేసుకునేవారు. మైసూరు వర్సిటీలో ఫిలాసఫీలో ఎంఏలో గోల్డ్ మెడల్ను పొందారు. బరోడాలోని మహారాజ సయ్యాజిరావు విశ్వవిద్యాలయం నుంచి ఫిలాసఫీలో డాక్టరేట్ పట్టాను పొందారు. తరువాత ప్రభుత్వ కాలేజీలో లెక్చరర్గా, ప్రొఫెసర్గా ఉద్యోగం చేస్తూ రచనా వ్యాసంగంలో విజృంభించారు. ఇంగ్లీషు భాషతో పాటుగా భారతీయ పలు భాషల్లోకి భైరప్ప కావ్యాలు అనువాదమయ్యాయి. ఆయన రచించిన నాటకాలు హిందీ, మరాఠీలోనూ ప్రజాభిమానం పొందాయి.అసమాన సాహితీవేత్తగా ప్రసిద్ధి ప్రఖ్యాత కన్నడ సాహితీవేత్తగా ప్రసిద్ధి ప్రధాని సహా ప్రముఖుల సంతాపం -
డ్రాప్ పేరుతో దోపిడీలు
● ఐటీ సిటీలో ఘరానా ముఠా అరెస్టు యశవంతపుర: కారులో డ్రాప్ ఇస్తామని నమ్మించి తుపాకులు చూపి దోచుకునే నలుగురి సభ్యుల ముఠాను బెంగళూరు పీణ్య పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా దోపిడీలు ఇలా బయటపడ్డాయి. ఓ వ్యక్తి ఆగస్ట్ 14న రాత్రి విజయనగరకు వెళ్లడానికి పీణ్య జాలహళ్లి బస్టాప్లో నిలిచి ఉండగా ఓ కారు వచ్చింది. తాము విజయనగరకు డ్రాప్ చేస్తామని కారులో ఎక్కించుకున్నారు. దాబస్పేటకు వెళ్లగానే కారులోని దుండగులు పిస్టల్ను చూపించి ఆ వ్యక్తిని బెదిరించారు. అతని వద్ద ఉన్న రూ.75 వేలు నగదు, రెండు మొబైల్ఫోన్లను లాక్కుని కారులో నుంచి తోసేశారు. బాధితుడు పీణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అప్పటి నుంచి పలు విధాలుగా విచారణ చేపట్టారు. చివరకు మారతహళ్లి దొడ్డనక్కుందిలోని రూంలో ముగ్గురు నిందితులు ప్లాన్ వేసినట్లు బయట పడింది. ముగ్గురినీ అరెస్టు చేశారు. బిజాపుర జిల్లాకుచెందిన వ్యక్తి పిస్టల్ను సమకూర్చాడు. అతనిని కూడా అరెస్టు చేసి విచారణ చేపట్టారు. నిందితుల నుంచి ఐదు మొబైల్ ఫోన్లు, పిస్టల్, కారుతో పాటు రూ.4 లక్షల సొత్తును స్వాఽధీనం చేసుకున్నారు. కాముక డ్రిల్మాస్టర్పై కేసు ● మహిళలతో అనైతిక సంబంధాలు బనశంకరి: అతడు ఓ స్కూల్లో డ్రిల్ మాస్టర్, క్రికెట్ కోచ్. కానీ ప్రవృత్తి మాత్రం మహిళలను లోబర్చుకోవడం. విడాకులు తీసుకున్న మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించిన కామాంధునిపై బెంగళూరు కోణణకుంటె పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. వివరాలు.. ఓ ప్రైవేటు పాఠశాల పీఈటీ అభయ్ మాథ్యూకు, కుమార్తెను క్రికెట్ శిక్షణకు వదిలేందుకు వచ్చే మహిళతో పరిచయమైంది. ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మించి కామవాంఛలు తీర్చుకోసాగాడు. ఆమె ఓసారి అభయ్ మొబైల్ఫోన్ని చూసి షాక్ కు గురైంది. ఆమెతో పాటు అనేక మంది మహిళల అశ్లీల వీడియోలు అందులో ఉన్నాయి. అతడే వాటిని చిత్రీకరించి సేవ్ చేసుకున్నాడు. ఆమె కోపం పట్టలేక నిలదీయగా, నిన్ను పెళ్లి చేసుకునేది లేదని బెదిరించాడు. బాధిత మహిళ కోణణకుంటే ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కాముక కోచ్పై కేసు నమోదుచేశారు. తనతో పాటు అనేకమంది మహిళల నగ్న వీడియోలు అతని వద్ద ఉన్నాయి, స్కూలు విద్యార్థినులతో కూడా అశ్లీలంగా ప్రవర్తిస్తున్నాడని ఆమె ఆరోపించింది. నిందితుడు పరారీలో ఉండగా పోలీసులు గాలిస్తున్నారు. హత్య కేసులో ఎమ్మెల్యేకు అరెస్టు భయం శివాజీనగర: గత నెల బెంగళూరులో హలసూరు ఠాణా పరిధిలో రౌడీషీటర్ బిక్లు శివకుమార్ను కొందరు దుండగులు హత్య చేయడం తెలిసిందే. ఈ కేసులో మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే బైరతి బసవరాజ్ను 5వ నిందితునిగా ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఆ కేసు నుంచి విముక్తి ఇవ్వాలని ఆయన హైకోర్టుకు వెళ్లారు. ఆయనను అరెస్టు చేసి విచారించాల్సిందే, ఆయనకు ఉన్న భద్రతను తొలగించాలని ప్రభుత్వ న్యాయవాది బుధవారం హైకోర్టు విచారణలో కోరారు. విచారణకు భైరతి బసవరాజ్ సహకరిస్తున్నారని, పోలీసుల చర్యలు సరికాదని ఎమ్మెల్యే ప్లీడర్లు పేర్కొన్నారు. రాజకీయ వేధింపులకు గురిచేయరాదన్నారు. ఎన్నిరోజుల పాటు కస్టడీకి కావాలని న్యాయమూర్తి.. ప్రభుత్వ న్యాయవాదిని అడిగారు. అభ్యంతరాలు ఉంటే సమర్పించాలని బైరతికి సూచించారు. ఈ కేసులో ఎమ్మెల్యేను పోలీసులు రెండుసార్లు విచారించారు. -
రోడ్ల గుంతలు పూడ్చడంలో సర్కార్ విఫలం
రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ సర్కార్లో రహదారులపై గుంతలు పడలేదా? అని ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ పేర్కొనడాన్ని బీజేపీ ఖండించింది. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో మాజీ విధాన పరిషత్ సభ్యుడు శంకరప్ప మాట్లాడారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పంచ గ్యారెంటీలకు నిధులు వినియోగించుకొని రోడ్లకు మరమ్మతులు చేపట్టే విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని దూషించడం తగదన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గుంతలు పడి ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం సరికాదన్నారు. ఆందోళనలో శరణమ్మ, ఆంజనేయ, కొట్రేష్, రాఘవేంద్ర, బండేష్, వీరనగౌడ, నాగరాజ్, శ్రీనివాస్, రామచంద్ర, రవీంద్ర జాలదార్, నరసింహులు, రమానంద, విజయ రాజేశ్వరి, సుమా, సంగీతతదితరులు పాల్గొన్నారు. దాడి నిందితుల అరెస్ట్కు డిమాండ్ రాయచూరు రూరల్: నగరసభ సభ్యుడు జిందప్పపై దాడి చేసిన నగరసభ సభ్యురాలు కవిత భర్త తిమ్మారెడ్డి, మద్దతుదారులను అరెస్ట్ చే యాలని జిల్లా గంగా మతస్థుల సంఘం డిమాండ్ చేసింది. బుధవారం ఎస్పీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు శాంతప్ప మాట్లాడారు. నగరంలోని ఎల్బీఎస్ కాలనీలో తిమ్మారెడ్డి భూమి కొనుగోలు చేశారని, ఈ విషయంలో భూమిని విక్రయించిన వారు తమకు న్యాయం చేయాలని జిందప్ప వద్దకు వెళ్లారని, ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం చెలరేగి మనస్పర్థలు ఏర్పడ్డాయన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. సమాజాభివృద్ధికి పిలుపు రాయచూరు రూరల్: సాంఘీకంగా, ఆర్థికంగా సవితా సమాజం అభివృద్ధి చెందాలని నగరసభ సభ్యుడు జయన్న పేర్కొన్నారు. ఆయన బుధవారం శివ శరణ మాదయ్య భవనంలో జరిగిన పదవీ విరమణ ఉద్యోగుల సహకార సంఘం 6వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. నేటిి కాలంలో పిల్లలకు తప్పనిసరిగా చదువు చెప్పించాలన్నారు. డబ్బులను పొదుపుగా వాడుకొనేలా వారికి బుద్ధి చెప్పాలన్నారు. సహకార సంఘం నుంచి రుణాలు పొంది జీవితాలను మెరుగు పరుచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉడుపి నవీన్, చంద్రు బండారి, శ్రీనివాస్, దరేసాబ్, నరసప్ప, దొడ్డ అయ్యప్ప, చంద్రశేఖర్, నరసింహులు, వెంకటేష్, వీరణ్ణ, విజయ్ భాస్కర్, నాగరాజ్, మేనేజర్ గాయత్రిలున్నారు. తిమరోడిని రాయచూరుకు తరలించవద్దురాయచూరు రూరల్: దక్షిణ కన్నడ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ మహేష్శెట్టి తిమరోడిని జిల్లా నుంచి తొలగించి రాయచూరు జిల్లా సరిహద్దుల్లో ఉంచాలని జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని దళిత సేన, సమాన మనస్కుల వేదిక డిమాండ్ చేసింది. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు మారుతి బడిగేర్ మాట్లాడారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లా ప్రజలు తిమరోడిని మాన్వికి పంపకుండా నిరోధించాలన్నారు. ధర్మస్థలలో పుర్రెల గ్యాంగ్ ప్రధాన నిందితుడిపై 32 క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. నేరారోపణలున్న తిమరోడిని జిల్లాలో అడుగు పెట్టకుండా అడ్డకుంటామన్నారు. రాయచూరు జిల్లాలో హిందూ ముస్లింలు అన్నదమ్ములుగా శాంతియుతంగా జీవిస్తున్న తరుణంలో ఇలాంటి అకృత్యాలు, నేరాలు చేసిన మహేష్ శెట్టి తిమరోడిని జిల్లాకు దూరంగా తరలించాలన్నారు. -
ఆన్లైన్ ట్యాక్సీ సేవలు అరికట్టండి
సాక్షి,బళ్లారి: బెంగళూరు తరహాలో గుట్టుచప్పుడు కాకుండా బళ్లారిలో కూడా ద్విచక్ర వాహనాలు ఆన్లైన్ ట్యాక్సీ సేవలు అందిస్తున్నాయని, మొబైల్ యాప్ల ద్వారా ర్యాపిడో, ఓలా, ఇతర యాప్లను ఉపయోగించి ద్విచక్ర వాహనాల్లో ఆటోల తరహాలో పని చేస్తున్నాయని, దీంతో ఆటో యజమానులకు, డ్రైవర్లకు తీవ్ర సమస్యలు, నష్టాలు ఏర్పడుతున్నాయని ఆటో డ్రైవర్లు, యజమానుల సంఘం అధ్యక్షుడు హుండేకర్ రాజేష్ మండిపడ్డారు. బుధవారం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నగరంలోని కనకదుర్గమ్మ గుడి వద్ద నుంచి అండర్ బ్రిడ్జి, రాయల్ సర్కిల్, జిల్లాధికారి కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి అదనపు జిల్లాధికారికి వినతిపత్రాన్ని సమర్పించారు. ఆటో యూనియన్లకు కమ్మరచేడు కళ్యాణ స్వామీజీ కూడా మద్దతు తెలిపారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాల ఆన్లైన్ ట్యాక్సీ సేవల వల్ల తాము జీవనోపాధి కోల్పోతున్నామన్నారు. తాము రోడ్డు ట్యాక్స్ తదితరాలను ప్రభుత్వానికి చెల్లించి పని చేసుకుంటుంటే తక్కువ నగదుతో ద్విచక్ర వాహనాల్లో కొందరు వ్యాపారాలు చేసుకుంటున్నారని వాపోయారు. ఇప్పటికే ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మహిళలకు ఏర్పాటు చేయడం వల్ల ఎంతో నష్టపోతున్నామన్నారు. ద్విచక్ర వాహనాలు మొబైల్ యాప్లతో పని చేస్తుండటం వల్ల మరింత నష్టాన్ని చవిచూస్తున్నామన్నారు. సుజయ్, హుండేకర్ రాకేష్, ఇమామ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఆటో యూనియన్ల నాయకుల ఆందోళన -
భార్యపై జవాన్ కాల్పులు
యశవంతపుర: జవాన్ ఒకరు భార్యపై కాల్పులు జరిపిన ఘటన కొడగులో జరిగింది. పొన్నంపేట తాలూకా హుదికేరి దగ్గర కొణగేరిలో దీపికా దేచమ్మ (32)పై ఆమె భర్త కరియప్ప తుపాకీతో కాల్పులు జరిపాడు. తీవ్రగాయాలైన దీపిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపి కరియప్ప పరారయ్యాడు. కరియప్ప ఆర్మీలో జవాన్గా పనిచేస్తున్నాడు. కొన్నిరోజులుగా ఇంటి వద్దే ఉంటున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం ఆక్రోశంతో కరియప్ప తుపాకీతో భార్యను కాల్చి పారిపోయాడు. రక్తపుమడుగులో ఉన్న ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. అన్నదమ్ముల్ని మింగిన బావి మైసూరు: బావిలోకి పడిపోయి ఇద్దరు చిన్నారులు చనిపోయారు. ఈ దుర్ఘటన చామరాజనగర జిల్లా హనూరు తాలూకా కురుబరదొడ్డి గ్రామంలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. హనూరు పట్టణం ఆర్ఎస్ దొడ్డి లేఔట్కిచెందిన కుమారస్వామి అనే వ్యక్తి కొడుకులు యోగేశ్ (9), సంజయ్ (7) మరణించారు. వారి తండ్రి ఓ బట్టల షాపులో పనిచేసేవారు. దసరా పండుగ సెలవులు కావడంతో పిల్లలు హనూరు పట్టణం ఆర్ఎస్ దొడ్డిలోని తమ అమ్మమ్మ ఇంటికి వచ్చారు. గ్రామంలో నూతనంగా తవ్వించిన బావి వద్ద ఆడుకుంటుండగా అదుపుతప్పి అందులో పడ్డారు. కొంతసేపటికి చూసుకున్న స్థానికులు పిల్లల మృతదేహాలను వెలికితీశారు.చంద్రఘంటగా చాముండి తుమకూరు: దసరా వేడుకల సందర్భంగా నగరంలోని ప్రభుత్వ పీయూ కాలేజీ మైదానంలో ప్రతిష్టించిన శ్రీ చాముండేశ్వరి దేవీ దర్శనం పొంది ఆ తల్లి కృపకు పాత్రులవ్వాలని జిల్లాధికారి శుభకల్యాణ్ అన్నారు. భర్త, పిల్లలతో కలిసి ఆమె చంద్రఘంట (మీనాక్షి) అలంకారంలో ఉన్న శ్రీ చాముండేశ్వరీ దేవిని దర్శించుకుని పూజలు చేశారు. తుమకూరు దసరా ఉత్సవాలకు వచ్చేందుకు ప్రతి తాలూకా నుంచి 250 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నగరంలో విద్యుత్ దీపాలంకరణ వీక్షణకు ఉచితంగా డబుల్ డెక్కర్ బస్సును నడుపుతున్నట్లు చెప్పారు. పరారీలో తిమరోడి యశవంతపుర: అక్రమంగా ఇంటిలో తుపాకులు పెట్టుకున్న కేసులో ధర్మస్థల దుష్ప్రచారం నిందితుడు, సామాజిక కార్యకర్త మహేశ్శెట్టి తిమరోడి విచారణకు ముఖం చాటేశాడు. పైగా అరెస్టు చేస్తారనుకుని పరారీలో ఉన్నాడు. ఫోన్ స్విచాఫ్ అయ్యింది. స్థానిక కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఇంటికి తాళం వేసి 10 రోజులవుతుంది. పోలీసులు జిల్లా బహిష్కరణ నోటీసులు ఇవ్వడానికి వెళ్లగా కనిపించలేదని తెలిపారు. బెళ్తంగడి పోలీసులు గాలిస్తున్నారు. -
సిటీబస్టాండు ముందు ప్రయాణికుల పాట్లు
బళ్లారి రూరల్: అసలే దసరా నవరాత్రి పర్వదినాలు. నిత్యం రద్దీతో పాటు ఆలయాలను సందర్శించే భక్తులు అధికంగా ఉంటారు. ఈ నేపథ్యంలో రాయల్ సర్కిల్ నుంచి రైల్వే అండర్ బ్రిడ్జ్ వరకు రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులు చేపట్టి తవ్వడంతో వాహనదారులు, ప్రయాణికులు, భక్తులకు అష్టకష్టాలు తప్పటం లేదు. పైగా ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు రోడ్డుపైనే ఆపడంతో మరింత ఇబ్బందిగా మారింది. వాహనదారులు ఇటు రాయల్ సర్కిల్, అటు దుర్గమ్మగుడికి వెళ్లాలంటూ ట్రాఫిక్ పద్మవ్యూహం చేధించాల్సిన పరిస్థితి నెలకొంది. డ్రైనేజీ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు సంచారాన్ని సుగమం చేయాలని నగర వాసులు కోరుతున్నారు. రాయల్ సర్కిల్కు, దుర్గమ్మ గుడికి వెళ్ల్లాంటే ట్రాఫిక్ పద్మవ్యూహమే ఇరువైపులా డ్రైనేజీ కాలువ కోసం గాడి తవ్వడంతో తప్పని తిప్పలు -
ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
సీతారామ ఆశ్రమంలో అమ్మ వారికి అలంకరణ హవంబావి ఆశ్రమంలో అమ్మవారికి అలంకరణ హరిజనవాడలోని కంచు మారెమ్మ అమ్మవారు హొసపేటెలో హులిగమ్మ దేవికి ప్రత్యేక అలంకరణ పూజల్లో పాల్గొన్న రాయచూరు గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్బళ్లారిఅర్బన్: విజయదశమి సందర్భంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 3వ రోజు బుధవారం నగరంలోని అమ్మవారి ఆలయాల్లో వివిధ రూపాల్లో అలంకరణ పూజలను నిర్వహించారు. బళ్లారి నగర ఆరాధ్య దైవమైన కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారికి వెండి ఆభరణాల అలంకరణ, ధార్మిక పూజలను నిర్వహించారు. పటేల్ నగర్లో చిన్నదుర్గమ్మ ఆలయంలో, హవంబావి సీతారామ ఆశ్రమంలో, బెంగళూరు రోడ్డు కన్యకా పరమేశ్వరి ఆలయంలో, నగరేశ్వరి ఆలయంలో, బెంకి మారెమ్మ ఆలయంలో, మిల్లర్పేట్ మల్నాడు దుర్గమ్మ ఆలయంలో, చిన్న మార్కెట్ శాంభవి దేవి ఆలయంలో, ఫైర్ ఆఫీస్ ఆదిశక్తి ఆలయంలో, సిరుగుప్ప రోడ్డు తుళజా భవాని ఆలయం తదితర అమ్మవారి ఆలయాల్లో నవరాత్రి అలంకరణ పూజలను జరిపారు. ఆలయాలకు 11 రోజుల పాటు విద్యుత్ దీపాలతో అలంకరణలు, హోమ పూజలు నిర్వహించారు. అన్నపూర్ణేశ్వరీ పాహిమాంబళ్లారి రూరల్ : దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నగరంలోని విద్యానగర్ ఆంజనేయస్వామి ఆలయంలో అన్నపూర్ణేశ్వరి మాతకు భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా అన్నపూర్ణేశ్వరి మాతను పూలతో అలంకరించారు. అమ్మవారికి పుష్పార్చన, కుంకుమార్చన, విశేష పూజలు జరిపారు. అమ్మవారి పూజల్లో మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ పూజల్లో ఆలయ ప్రముఖులు, స్థానికులు పాల్గొన్నారు. రాయచూరులో.. రాయచూరు రూరల్ : జిల్లాలో బుధవారం శరన్నవరాత్రి ఉత్సవాలు జరిగాయి. నగరంలోని కిల్లే బృహన్మఠంలో అంబా భవానికి పూజలు జరిపారు. కందగడ్డ మారెమ్మ దేవి, కోటలో కాళికాదేవి ఆలయంలో దేవి, కంచు మారెమ్మ, నగరేశ్వర ఆలయంలో కన్యకా పరమేశ్వరిని, మమదాపురలో మారికాంబ దేవిని ప్రత్యేకంగా అలంకరించారు. నగరంలోని ఉప్పారవాడి లక్ష్మీ వేంకటేశ్వర ఆలయంలో ఆదిశేష వాహనంలో స్వామి వారిని, నగరేశ్వరాలయంలో కన్యకా పరమేశ్వరిని ఊరేగించారు. యాదగిరి నగరసభ అధ్యక్షురాలు లలిత అనపురే, గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ మమదాపురలో మారికాంబ ఆలయంలో దేవికి ప్రత్యేక పూజలు జరిపారు. శాంతమల్ల శివాచార్య తాయమ్మ దేవికి పూజలు చేశారు. హొసపేటెలో.. హొసపేటె: శరన్నవరాత్రుల సందర్భంగా మూడవ రోజు బుధవారం నగరంలోని వివిధ వార్డుల్లో వెలసిన అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిట లాడాయి. ఉదయం ఆలయాల్లో అమ్మవారికి విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విధంగా ఉత్తర కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన కొప్పళ జిల్లా హులిగి సమీపంలోని హులిగమ్మ దేవి ఆలయంలో అమ్మవారికి పూలమాలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన, మంగళహారతి తదితర పూజలు చేశారు. భక్తులు ఆలయాలకు వెళ్లి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా మహిళలు నీలిరంగు చీరకట్టులో ప్రదర్శన ఇచ్చారు. భక్తిశ్రద్ధలతో ఆలయాల్లో పూజలు విశేష అలంకరణల్లో అమ్మవార్లు -
కుండపోత వర్షం.. లోతట్టు జలమయం
వాననీటిలోనే వెళుతున్న లారీదుకాణాల్లోకి చేరిన వాన నీరు రాయచూరు రూరల్: రాయచూరు, యాదగిరి, బీదర్ జిల్లాల్లో కురిసిన వర్షాలకు రాష్ట్ర రహదారులు చెరువులుగా మారాయి. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు రెండు అడుగుల మేర నీరు పారాయి. అధికారులు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు శాసీ్త్రయంగా రహదారుల నిర్మాణం చేపట్టడంతో వర్షపు నీరు రోడ్లపై ప్రవహించి వాహన రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి. సింధనూరు–కుష్టిగి ప్రధాన రహదారి జలమయం కావడంతో కాయగూరల దుకాణాలలో వాన నీరు చేరాయి. బీదర్లో నిరంతరం కురుస్తున్న వానలకు చుళికి వాగులో నీరు వరదలా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. హులసూరు, బసవ కళ్యాణ మీదుగా మహారాష్ట్రకు వెళ్లే రహదారి బంద్ అయింది. కలబుర్గి జిల్లా దేవల గాణగాపురలో భీమా నది ఉప్పొంగి ప్రవహించడంతో అఫ్జల్పుర తాలూకా మణ్ణూరుకు చెందిన బాగేష్(20) అనే యువకుడు కాలు జారి పడి కొట్టుకు పోయి శవమై తేలినట్లు పోలీసులు తెలిపారు. -
ఆయుర్వేదంపై అవగాహన అవసరం
హొసపేటె: ఆయుర్వేదం అనేది భారతీయ వైద్య విధానం. ఆయుర్వేదం గురించి అవగాహన కల్పించడమే ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకోవడం ఉద్దేశ్యం అని గ్యారంటీ హామీ పథకాల అమలు సమితి జిల్లా అధ్యక్షుడు కురి శివమూర్తి అన్నారు. బుధవారం నగరంలోని రోటరీ క్లబ్ హాల్లో జరిగిన 10వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ధన్వంతరి జయంతిని జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా జరుపుకుంటారన్నారు. ధన్వంతరి ఆచార్యను ఆయుర్వేద పితామహుడు అంటారన్నారు. ఇది చాలా పురాతనమైన వైద్య విధానం, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆయుర్వేదం ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. కోవిడ్ సమయంలో ఆయుర్వేద విధానాన్ని అనుసరించడం ద్వారా చాలా మంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకున్నారన్నారు. కనీసం 100 రకాల వ్యాధులకు చికిత్స, నివారణకు ఆయుర్వేదం ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. తక్కువ ఖర్చుతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆయుర్వేదాన్ని ఉపయోగించవచ్చు. శాశ్వత ఆరోగ్య పరిష్కారాలు అందుబాటులో ఉంటాయి. జిల్లా కేంద్రంలో జరిగే ఆయుర్వేద దినోత్సవ వేడుకల మాదిరిగా అన్ని తాలూకా స్థాయిల్లో, గ్రామ పరిధిలో ఆయుర్వేద ప్రాముఖ్యత గురించి సాధారణ ప్రజలకు అవగాహన కల్పించడానికి ఒక ప్రచారాన్ని నిర్వహించాలని అన్నారు. ఈ సందర్భంగా వైద్యులు మునివాసురెడ్డి, కేదార్ దండిన్, బీవీ భట్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ కులాలను ఎస్టీ జాబితాలోకి చేర్చవద్దు
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలను పక్కన బెట్టి కులమతాల మధ్య ఏదో రకంగా వైషమ్యాలు ఏర్పరచడంతో పాటు బలిష్టమైన కులాలను ఎస్టీ జాబితాలోకి చేర్చేందుకు ప్రయత్నిస్తుండటం బాధాకరం అని రాష్ట్ర ప్రభుత్వ తీరును ఖండిస్తూ గురువారం నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నట్లు రాష్ట్ర వాల్మీకి ఐక్య వేదిక అధ్యక్షుడు జోళదరాశి తిమ్మప్ప పేర్కొన్నారు. బుధవారం ఆయన నగరంలోని పత్రికా భవనంలో విలేకరులతో మాట్లాడారు. విద్యా పరంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలపడిన కురుబ, ఇతర సమాజాలను ఎస్టీ జాబితాలోకి చేరుస్తుండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గురువారం ప్రభుత్వ తీరును ఖండిస్తూ వాల్మీకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నామన్నారు. వాల్మీకి గురుపీఠం స్వామీజీ ఆశీస్సులతో అన్ని జిల్లా, తాలూకా కేంద్రాల్లో ఆందోళన నిర్వహిస్తామన్నారు. అనంతరం స్వామీజీ సమక్షంలో వాల్మీకి సమాజానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు తదితరులతో ప్రత్యేకంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటామన్నారు. ఈ రిజర్వేషన్ అమలు జరిగితే వాల్మీకులకు ఎంతో నష్టం జరుగుతుందన్నారు. సీఎం సిద్దరామయ్య హిట్లర్ తరహాలో పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సమాజ ప్రముఖులు జనార్ధన, జయరాం, రుద్రప్ప తదితరులు పాల్గొన్నారు. నేడు బళ్లారిలో పెద్ద ఎత్తున ఆందోళన వాల్మీకి నాయక ఐక్య వేదిక రాష్ట్యాధ్యక్షుడు తిమ్మప్ప -
అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
రాయచూరు రూరల్: జిల్లాలోని సింధనూరు తాలూకాలో అక్రమంగా లారీలో తరలిస్తున్న బియ్యం బస్తాలను సోమవారం రాత్రి పట్టుకున్నారు. ఆహార పౌర సరఫరాల శాఖ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో శ్రీపురం జంక్షన్ వద్ద 300 క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తున్న లారీని అధికారులు జప్తు చేశారు. పట్టుబడిన బియ్యం విలువ సుమారు రూ.6.60 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన సతీష్ ఆదోని, లారీ డ్రైవర్ మహ్మద్ అఫ్తాబ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు గ్రామీణ ప్రాంతాల్లో కేజీ బియ్యాన్ని రూ.15 చొప్పున కొనుగోలు చేసి అక్రమంగా మిల్లింగ్కు తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు అధికారులు దాడి జరిపి స్వాధీనం చేసుకున్నారు. ఆరోగ్య శిబిరాల లబ్ధి పొందండిహొసపేటె: ఇంట్లో తయారు చేసిన ఆహారం తినడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుందని ఇన్నర్ వీల్ అధ్యక్షురాలు నైమిషా తెలిపారు. నగరంలో ఉచిత ఆరోగ్య తనిఖీ, రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ వ్యాధుల నుంచి విముక్తి పొందాలంటే ఇంట్లో తయారు చేసిన ఆహారం తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆయుర్వేద వైద్య అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కేహెచ్.గురుబసవరాజ్, ఆయుష్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కేదారేశ్వర్ దండిన్, వైద్యాధికారులు మునివాసుదేవరెడ్డి, ప్రసాద్బాబు, శైలేంద్ర ప్రతాప్సింగ్, రాధా గురుబసవరాజ్, చేతన్, సికందర్, హాలమ్మ, చంద్రశేఖర్ శెట్టి, బళగానూరు మంజునాథ్, సరస్వతి కోటె, హేమలత, రూప్సింగ్ రాథోడ్, శివశరణయ్య, ఆర్తి హిరేమట్, అశోక్, మంజునాథ్ హనసి, యశ్వరాజ్నాథ్ హన్సీ, రోటరీ బ్లడ్ బ్యాంక్, ఆయుష్ సిబ్బంది పాల్గొన్నారు. ఘనంగా మహా శరణి సత్యక్క జయంతిసిరుగుప్ప: నగరంలో మంగళవారం నగరసభ పౌర కార్మికుల సంఘం ఆధ్వర్యంలో మహా శరణి సత్యక్క చిత్రపటానికి పూజలు చేసి, ప్రముఖ వీధుల గుండా ఊరేగింపు నిర్వహించి ఘనంగా జయంతిని ఆచరించారు. ఈ సందర్భంగా సంఘం పదాధికారులు, పౌరకార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఇంటి వైద్యంతో ఆరోగ్యంరాయచూరు రూరల్: మనిషికి వస్తున్న వ్యాధుల అడ్డుకట్టకు తోడు ఆరోగ్యానికి ఇంటి వైద్యం ప్రధానమని నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ అన్నారు. మంగళవారం ఆయుష్ ఆరోగ్య శాఖ కార్యాలయంలో 10వ ఆయుర్వేద దినోత్సవం, ధన్వంతరి జయంతిని ఆమె పూలమాల వేసి ప్రారంభించి మాట్లాడారు. ఆయుర్వేద వైద్యం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు లేదన్నారు. ఇంటిలో లభించే వంటింటి వస్తువులు మన ఆరోగ్యాన్ని రక్షిస్తాయన్నారు. జిల్లా ఆయుర్వేద అధికారి శంకర్గౌడ, జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్రబాబు, చంద్రశేఖర్, ప్రతిమ, నిర్మల హుల్లూరు, దుర్గేష్, ఆయుర్వేద వైద్యులు పాల్గొన్నారు. లడ్డూ ప్రసాదం పంపిణీ ప్రారంభం కోలారు: నగర దేవత కోలారమ్మ ఆలయంలో లడ్డూ ప్రసాదం పంపిణీని జిల్లా కలెక్టర్ ఎం.ఆర్.రవి మంగళవారం ప్రారంభించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో కోలారమ్మకు విశేష పూజలు నిర్వహిస్తున్నారన్నారు. అందులో భాగంగా భక్తులకు లడ్డూ ప్రసాదం పంపిణీని ప్రారంభించినట్లు తెలిపారు. నగరంలోని పురాతన సోమేశ్వర ఆలయం, సీతి భైరవేశ్వర స్వామి ఆలయాల్లోనూ భక్తులకు లడ్డూ ప్రసాదం అందిస్తున్నట్లు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఎలుగుబంటి మృతి
హుబ్లీ: జిల్లాలోని కలఘటిగి తాలూకా కల్లాకుండి గ్రామం దగ్గర రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆడ ఎలుగుబంటి మృతి చెందింది. అడవి అంచున ఉన్న కలఘటిగి– హళియాళ రోడ్డులో ఉదయం వేళలో ఏదో వాహనం ఢీకొనడంతో ఎలుగుబంటి చనిపోయిందని ఆ స్థలాన్ని పరిశీలించిన జోన్ అటవీ శాఖ అధికారి అరుణ్కుమార్, పశువైద్యాధికారి దేవేంద్రప్ప లమాణి తెలిపారు. పోస్టుమార్టం చేయగా, దాని వయస్సు సుమారు 8 ఏళ్లు ఉంటుందని గుర్తించారు. ప్రమాదం వల్లే చనిపోయిందని జోన్ అటవీ శాఖ అధికారి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. గరగలో కర్ఫ్యూ ఆదేశాలు మరో ఘటనలో ధార్వాడ గరగలో గత రెండు రోజుల నుంచి విధించిన కర్ఫ్యూ ఆదేశాలు బుధవారం సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉంటాయి. గరగలోని దుర్గమ్మదేవి మూర్తి ప్రతిష్టాపన సందర్భంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఎటువంటి ప్రదర్శనలు, కార్యక్రమాలను జరపరాదని తహసీల్దార్ డాక్టర్ బీహెచ్ హుగార్ ఆదేశాలను ఇచ్చినట్లు తెలిపారు. ఇన్స్టాలో అశ్లీల పోస్టులుహుబ్లీ: అశ్లీల వీడియోలు తీసి మహిళలను వేధిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తి యువతుల పేరున నకిలీ ఇన్స్టా ఖాతాలను తెరిచి అశ్లీల ఫోటోలతో పాటు వీడియోలను పోస్టు చేసేవాడు. దీనిపై కొందరు బాధిత యువతులు ఫిర్యాదు చేయడంతో నగరానికి చెందిన మంజునాథ హుటవలేపై కేసు నమోదు అయింది. నగరంలో 6 మంది యువతుల పేరిట నకిలీ ఇన్స్టా ఖాతాలు తెరిచి అశ్లీల ఫోటోలు, వీడియోలను పోస్టు చేసి వికృతానందం పొందేవాడు. ఫ్లైయాష్ను రైళ్ల ద్వారా రవాణా చేయాలిరాయచూరు రూరల్: యరమరస్ ఽథర్మల్ విద్యుత్ కేంద్రం(వైటీపీఎస్) నుంచి విడుదలవుతున్న ఫ్లైయాష్ను రైలు వ్యాగన్ల ద్వారా రవాణా చేయాలని దళిత సేనా సమితి డిమాండ్ చేసింది. మంగళవారం వైటీపీఎస్ యూనిట్ల కేంద్ర కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకురాలు విజయ్ రాణి మాట్లాడారు. ఫ్లైయాష్ను ట్యాంకర్ లారీలతో రవాణా చేయకుండా దానిని రైలు వ్యాగన్ల ద్వారా రవాణా చేయడానికి చర్యలు చేపట్టాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. పౌరకార్మికుల సేవలు అనన్యంహొసపేటె: నగరంలో పౌరకార్మికులు చేస్తున్న సేవలు మరువలేనివని ఎమ్మెల్యే గవియప్ప తెలిపారు. మంగళవారం నగరసభ కార్యాలయ ఆవరణలో రాష్ట్ర పౌర ఉద్యోగుల సంఘం, నగరసభ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌరకార్మికుల దినోత్సవాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పౌరకార్మికులకు ఎలాంటి కుల మతాలు లేవన్నారు. నగర స్వచ్ఛతపై పౌర కార్మికులు దృష్టి పెట్టడం అభినందనీయమన్నారు. పౌరకార్మికులకు తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. వాటిని పౌరకార్మికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పౌరకార్మికులకు తమ ప్రభుత్వం తరపున స్థలాలను అందించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం నగరంలో జరుగుతున్న కులగణన సమీక్షకు నగర ప్రజలు సహకరించాలన్నారు. అనంతరం రిటైర్డ్ పౌరకార్మికులు, ఉత్తమ సేవలు అందించిన కార్మికులను సన్మానించి గౌరవించారు. ఈ సందర్భంగా జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి, ఎస్పీ జాహ్నవి, నగరసభ అధ్యక్షులు రూపేష్ కుమార్, ఉపాధ్యక్షులు రమేష్ గుప్తా, హుడా అధ్యక్షుడు హెచ్ఎన్.ఇమామ్, స్థాయి సమితి అధ్యక్షులు కిరణ్, నగరసభ కమిషనర్ ఎర్రగుడి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. యత్నాళ్పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి కోలారు : బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే బసవ నగౌడ యత్నాళ్ దళిత మహిళలను అవహేళన చేశారని, ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కర్ణాటక దళిత సంఘర్ష సమితి మహిళా సభ్యులు డిమాండ్ చేశారు. నగరంలోని ఆ సమితి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. దళిత మహిళలు చాముండేశ్వరి దేవికి పూలమాల వేయరాదని ప్రచారం చేస్తున్నారన్నారు. బసవనగౌడ యత్నాళ్పై కేసు నమోదు చేయాలని, లేని పక్షంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈసందర్భంగా జిల్లా సమితి సంచాలకురాలు లక్ష్మి, తాలూకా సంచాలకురాలు బేతమంగల పద్మ తదితరులు పాల్గొన్నారు. -
ఎడతెరిపి లేని వర్షాలు
రాయచూరు రూరల్: కల్యాణ కర్ణాటక జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షం కురిసింది. కల్యాణ కర్ణాటకలోని బీదర్, కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ జిల్లాల్లో భారీ వర్షాలకు అక్కడక్కడా సుమారు 100 ఇళ్లు కూలిపోయాయి. ఎక్కడ పడితే అక్కడ చెట్లు నేలకొరిగాయి. దేవదుర్గ బస్టాండ్లో నీరు నిలవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. సేడం తాలూకా మళఖేడా జయతీర్థ ఆలయంలోకి నీరు చేరాయి. యాదగిరి తాలూకా దోరణహళ్లి వంతెన తెగడంతో యాదగిరి, రాయచూరు మధ్య రాకపోకలు స్తంభించాయి. కాగిణా నదిలో నీరు అధికంగా ప్రవహించడంతో పగలపూర్ వంతెన పూర్తిగా నీట మునిగింది. వందలాది ఎకరాల్లో పెసలు, మినుములు, కంది, పత్తి పంటల్లోకి నీరు చేరాయి. వరద పరిస్థితులను గురుమఠకల్ శాసన సభ్యుడు శరణేగౌడ పరిశీలించారు. ద్విచక్ర వాహనంపై తిరిగి రైతుల పరిిస్థితులను అర్థం చేసుకొని ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. కల్యాణ కర్ణాటకలో కుండపోత నీట మునిగిన పంట పొలాలు -
విదేశీ భాషల్లో నర్సింగ్ విద్యార్థులకు శిక్షణ
బళ్లారిఅర్బన్: జిందాల్ సంస్థ ఆవరణలోని నర్సింగ్ కళాశాల విద్యార్థులకు భవిష్యత్తులో విదేశాల్లో ఉద్యోగాలు చేసుకునేందుకు వీలుగా జర్మన్, ఇంగ్లిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడేందుకు వివిధ శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ప్రారంభించి జిందాల్ సంస్థ సీనియర్ ఉపాధ్యక్షుడు సునీల్ రాల్ఫ్ మాట్లాడుతూ వైద్య రంగంలో రాణించాలనుకొనే వారు మంచి సమాచార వారధులుగా ఎదిగేందుకు వివిధ భాషలు నేర్చుకోవడం అత్యవసరం అన్నారు. రకరకాల రోగులతో మాట్లాడేందుకు ఈ భాషలు నేర్చుకోవడం వల్ల ముఖ్యంగా ఆయా రోగుల మాతృభాషల్లో మాట్లాడితే వారికెంతో సంతృప్తి కలుగుతుందన్నారు. అందుకే నర్సు ఉద్యోగాలకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉండటం వల్ల జర్మన్, ఇంగ్లిష్ భాష నేర్చుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయన్నారు. ఆ భాషలను నేర్పించడానికి చార్కోస్ సంస్థ, ఇన్నోవేషన్ అన్ లిమిటెడ్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామన్నారు. పెద్దన్న బీదల, మహేష్ శెట్టి, సన్ని ఈయప్పన్, డాక్టర్ మంజునాథ్, రాగిణి, జిందాల్ నర్సింగ్ కళాశాల ప్రాధ్యాపకులు రాజేశ్వరి, శివరాజ్తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. -
ఎలుగుబంటి దాడితో మొక్కజొన్న పంట ధ్వంసం
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని నాగరహుణసె గ్రామానికి చెందిన రైతు గౌడ్రు మంజన్న పొలంపై సోమవారం రాత్రి ఎలుగుబంటి దాడి చేసి, ఎకరానికి పైగా మొక్కజొన్న పంటను నాశనం చేసింది. గుడేకోటె చుట్టుపక్కల చాలా ఎలుగుబంట్లు ఉన్నాయి. అడవి జంతువుల వల్ల రైతులకు జరిగిన నష్టం రైతులను ఇబ్బందుల్లో పడేస్తోంది. సుమారు నాలుగు ఎకరాల మొక్కజొన్న పంటకు నష్టం ఎదురైందని రైతు మంజన్న విలపిస్తున్నాడు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో చాలా మంది రైతులు ఇదే పరిస్థితిలో ఉన్నారు. భారీ వర్షాలు, కరువు కారణంగా నష్టపోయే రైతులు కూడా అడవి జంతువుల వల్ల కలిగే నష్టాన్ని తీవ్రంగా పరిగణించాలి. అడవి జంతువుల దాడిని అటవీ శాఖ అధికారులు వెంటనే అరికట్టాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ సారి జిల్లాలో మంచి వర్షాలు కురిశాయి, పంటలు సమృద్ధిగా పండాయి. కొన్నిరోజుల్లో వాటిని కోయడానికి రైతులు వేచి ఉన్నారు. రాత్రిపూట ఎలుగుబంట్ల దాడుల కారణంగా రైతులు కంటి మీద కునుకు కోల్పోతున్నారు. పండించిన పంటలను కాపాడుకోవడానికి వారు రాత్రిపూట మొత్తం పొలాల్లోనే బస చేయాల్సి వస్తోంది. వారు చేతిలో కర్రలు, బ్యాటరీలతో పొలాల చుట్టూ కాపలాగా నిలబడాల్సి వస్తుంది. అందువల్ల పంటలను కాపాడటానికి రైతులు వివిధ కసరత్తులు చేస్తున్నారు. ఎలుగుబంట్ల దాడులతో దెబ్బతిన్న పొలాలకు పరిహారం చెల్లించాలి. ఎలుగుబంట్ల దాడులను నివారించడానికి, రైతుల ప్రయోజనాలను కాపాడటానికి అటవీ శాఖ చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. -
సమయాన్ని వృథా చేసుకోవద్దు
సాక్షి బళ్లారి: పీయూసీ అనంతరం ఇంజినీరింగ్లో, ఏదైనా డిగ్రీని అభ్యసించే విద్యార్థులు సమయాన్ని వృథా చేసుకోకుండా ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు కష్టపడి చదవడం కంటే ఇష్టపడి చదువుతూ ఉత్తమ భవిష్యత్తును రూపొందించుకోవాలని రావ్బహుదూర్ మహాబలేశ్వరప్ప ఇంజినీరింగ్(ఆర్వైఎంఈసీ) కళాశాల చైర్మన్ జానెకుంటె బసవరాజు పేర్కొన్నారు. సోమవారం నగరంలోని ఆర్వైఎంఈసీలో ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఏడాది ఇంజినీరింగ్ కళాశాలల్లో అడుగుపెట్టిన విద్యార్థులకు సీనియర్ విద్యార్థులతో పాటు కళాశాల యాజమాన్యం, సిబ్బంది ఘన స్వాగతం పలికి విద్యార్థులకు హితోపదేశం చేశారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఇంజినీరింగ్లో చేరాం, తమకు అన్నీ సమకూరతాయని అనుకుంటే పొరపాటేనన్నారు. ఈ నాలుగేళ్ల పాటు ఆయా రంగాల్లో రాణించేందుకు సాంకేతికతతో కూడిన నైపుణ్యాన్ని అలవర్చుకొని చక్కటి భవిష్యత్తుకు మంచి నడత, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఇంజినీరింగ్ పూర్తి చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ పిల్లలను చదివిస్తుంటారన్నారు. కుటుంబ పరిస్థితులను గుర్తెరిగి అనుకున్న లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రిన్సిపాల్ హనుమంతరెడ్డి, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ భవిష్యత్తును రూపుదిద్దుకోండి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చండి విద్యార్థులకు ఆర్వైఎంఈసీ చైర్మన్ జానెకుంటె బసవరాజు పిలుపు -
ఢిల్లీలోనూ గుంతల రోడ్లు ఉన్నాయి
శివాజీనగర: సిలికాన్ సిటీలో గుంతల రోడ్ల రభస తీవ్రరూపం దాలుస్తోంది. విమర్శలు జాతీయస్థాయికి ఎగబాకాయి. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బెంగళూరులో ఇంటి వద్ద మీడియాతో మాట్లాడుతూ బెంగళూరులో గుంతల రోడ్లను బాగు చేస్తున్నాం, ప్రతిరోజు సుమారు 1000 గుంతలను మూసివేసే పని జీబీఏ అధికారులు చేస్తున్నారు, దీనిని ఐటీ కంపెనీలు తెలుసుకోవాలి అని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా గుంతల రోడ్లు ఉన్నాయి. దేశంలో అన్నిచోట్ల ఉన్న సమస్య ఇది. అలాగని ఊరుకోకుండా పని చేస్తున్నాం. దీనినే పెద్ద విషయంగా చూపి రచ్చ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి ముందు రోడ్డులో ఎన్ని గోతులు ఉన్నాయనేది చూడాలన్నారు. ఇది కర్ణాటక రాష్ట్ర సమస్య మాత్రమే కాదు, గతంలో బీజేపీవారు అధికారంలో ఉన్నపుడు సక్రమంగా రోడ్లు వేసి ఉంటే నేడు ఈ సమస్య ఉండేది కాదు. ఎన్నికలు వస్తున్నాయని ఆరోపణ చేస్తున్నారు అని మండిపడ్డారు. సిటీలో ఐదు కార్పొరేషన్లలో ఒక్కొక్క పాలికెలో 200 గుంతల చొప్పున మూసివేస్తున్నాం. నేను ఒక రోజు ఢిల్లీలో తిరిగాను, ప్రధాని ఇంటికి వెళ్లే దారితో పాటుగా అనేక రోడ్లలో గుంతలు ఉన్నాయి, ఈ విషయాన్ని మీడియావారు పరిశీలించి ప్రచురించాలి. దేశవ్యాప్తంగా గుంతలు రోడ్లు ఉంటే, కర్ణాటకనే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు అని వాపోయారు. విప్రో క్యాంపస్ నుంచి వాహనాలకు దారివ్వాలి శివాజీనగర: బెంగళూరులో ఔటర్ రింగ్ రోడ్డులో సంచార రద్దీని తగ్గించడానికి వీలుగా విప్రో కంపెనీ క్యాంపస్ ద్వారా పరిమిత వాహన సంచారానికి అవకాశం ఇవ్వాలని సీఎం సిద్దరామయ్య విప్రో అధినేత అజీం ప్రేమ్జీకి విన్నవించారు. ఈ మేరకు 19వ తేదీన రాసిన లేఖ మంగళవారం విడుదలైంది. దీని వల్ల 30 శాతం రద్దీ తగ్గుతుందని సమాచారం. క్యాంపస్ ద్వారా వాహన సంచారానికి అనుమతిస్తే అందుకు తగిన పరిహారాన్ని ఆ సంస్థకు చెల్లించనున్నట్లు సమాచారం. నగరంలో ఐటీ సంస్థలకు ప్రధాన కారిడార్ అయిన ఔటర్ రింగ్ రోడ్డులో విపరీతంగా ట్రాఫిక్ ఉంటోంది. ఈ ప్రాంతంలో సువిశాలమైన విప్రో ఆఫీసు ఉంది. దీని ద్వారా వెళ్లే ఓ రోడ్డును వాడుకోవాలని సర్కారు యోచిస్తోంది. కొన్నివారాలుగా బెంగళూరు ట్రాఫిక్ సమస్య మీద తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విప్రో మీద సిద్దు దృష్టి సారించారు. ఇందుకు విప్రో నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదని సమాచారం. ప్రధాని ఇంటి వద్ద కూడా గోతులు అందరూ బెంగళూరునే హేళన చేస్తున్నారు డీసీఎం శివకుమార్ ఆగ్రహం -
రూ.200 మల్టీప్లెక్స్ టికెట్కు బ్రేక్
శివాజీనగర: బెంగళూరుతో పాటు రాష్ట్రంలో మల్టీప్లెక్స్ సినిమా హాళ్లలో ఏకరూపంగా ఉండేలా టికెట్లను రూ.200కు విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశించడం తెలిసిందే. దీని వల్ల సినీప్రియులకు ఊరట దక్కింది, తక్కువ ధరలోనే సినిమా చూసే అవకాశం చిక్కింది. అయితే పలు సినీ నిర్మాణ, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు దీనిపై న్యాయ పోరాటానికి దిగి తమ పంతాన్ని నెగ్గించుకున్నాయి. ఆ సంస్థలు పిటిషన్లు వేయడంతో, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మీద హైకోర్టు మంగళవారం స్టే ఇచ్చింది. దీంతో సినిమా టికెట్ల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురు అయ్యింది. మల్టీప్లెక్స్ అసోసియేషన్, ఇతర సంస్థలు సమర్పించిన పిటిషన్ మేరకు న్యాయమూర్తి రవి వీ హొస్మని మధ్యంతర స్టే ని జారీచేశారు. పిటిషన్లను విచారణ జరిపి స్టే ఇస్తూ, ఇది తుది తీర్పు వరకే అమలులో ఉంటుందని పేర్కొన్నారు. సర్కారు నిర్ణయంపై హైకోర్టుకు పలు సంస్థలు స్టే ఇచ్చిన న్యాయస్థానం ప్రభుత్వానికి ఎదురుదెబ్బ అప్పటి నుంచి అయిష్టంగానే కర్ణాటక సినిమాల నియంత్రణ సవరణ నియమాలు– 2025 కింద అన్ని రకాల సినిమా థియేటర్లలో టికెట్ ధర రూ.200 మించరాదని సర్కారు కొన్ని వారాల కిందట ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో థియేటర్ల యాజమాన్యాలు అయిష్టంగానే ధరలను తగ్గించి అమ్ముతున్నాయి. దీని వల్ల తమకు గిట్టుబాటు కావడం లేదని మాట్లాడుకుని హైకోర్టులో సవాల్ చేశాయి. ప్రభుత్వ నిర్ణయం ఏకపక్షం, చట్ట వ్యతిరేకం, వివేచనారహితమైదని పేర్కొన్నాయి. ప్రభుత్వం 2017లో కూడా ఇదే మాదిరి ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను హైకోర్టు రద్దు చేసిన తరువాత ఉపసంహరించుకుందని పిటిషన్దారుల లాయర్లు వాదించారు. ప్రభుత్వ హఠాత్ చర్య చలనచిత్ర నిర్మాతలను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ప్రధాన సినిమాల విడుదలకు ముందుగా టికెట్ ధరల పెంపు కోరతారన్నారు. సర్కారుకు వాణిజ్య మండలి అండ అయితే కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి తరఫున న్యాయవాది సర్కారుకు మద్దతుగా వాదనలు వినిపించారు. ప్రభుత్వ తీర్మానానికి మద్దతుగా మండలి తరఫున మధ్యంతర పిటిషన్ సమర్పించారు, మండలి విన్నపం మేరకు సర్కారు టికెట్ ధరలను సవరించిందని పేర్కొన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్తో పాటుగా పొరుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్లలో ఒకే ధర విధానం అమలులో ఉందని, దానినే ఇక్కడ కూడా పాటించినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు సిద్దరామయ్య సర్కారు ఏ నిర్ణయం తీసుకొంటుందనే కుతూహలం నెలకొంది. -
సముద్రంలో బెంగళూరు బాలుడు గల్లంతు
యశవంతపుర: దసరా సెలవులని కుటుంబంతో విహారయాత్రకు వెళ్లిన బాలుడు సముద్రం పాలయ్యాడు. కార్వార వద్ద మురుడేశ్వర బీచ్లో గల్లంతయ్యాడు. వివరాలు.. బెంగళూరు బిదరహళ్లికి చెందిన కృతిక్రెడ్డి (8)తో తల్లిదండ్రులు కె.రవిరెడ్డి, వసంత మురుడేశ్వరకు వెళ్లారు. సోమవారం ఉదయం దర్శనం తరువాత సముద్ర తీరంలో నీటిలోకి దిగారు. ఆటలాడుతుండగా ఒక్కసారిగా భారీ అల వచ్చి కృతిక్రెడ్డిని లాక్కొని వెళ్లింది. రక్షించడానికి తల్లి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. నీటిలో మునిగిపోతున్న తల్లిని అక్కడి లైఫ్ గార్డ్ కాపాడారు. కృతిక్ కోసం గాలింపు సాగుతోంది. అస్వస్థత పాలైన వసంతను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దుర్ఘటనతో కుటుంబీకుల విచారానికి అంతులేదు. బావిలో పడ్డ చిరుత దొడ్డబళ్లాపురం: ప్రమాదవశాత్తు బావిలో పడ్డ చిరుతను అటవీశాఖ సిబ్బంది రక్షించిన సంఘటన మాగడి తాలూకా హాలశెట్టిహళ్లి గ్రామంలో జరిగింది. ఆహారం వెతుక్కుంటూ గ్రామం వైపు వచ్చిన చిరుత రైతు రేవన్నకు చెందిన తోటలోని బావిలోకి పడిపోయింది. చిరుత అరుపులు విన్న రైతులు వచ్చి చూసి హడలిపోయారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు చేరుకుని చిరుతను బంధించి, బన్నేరుఘట్ట జూ పార్క్కు తరలించారు. పులి దాడిలో వృద్ధుడు బలి మైసూరు: పులి దాడిలో ఆదివాసి వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. జిల్లాలోని హెచ్.డి. కోటె తాలూకాలోని బండీపుర అభయారణ్యంలోని మాళదహాడిలో జరిగింది. హాడి గ్రామానికి చెందిన కెంచ (67) అనే గిరిజన వృద్ధుడు సోమవారం మధ్యాహ్నం పొలంలో పనిచేసుకుంటూ ఉన్నాడు. అడవిలోని నుంచి పులి వచ్చి అతనిని లాక్కునిపోయింది. రాత్రయినా భర్త ఇంటికి రాకపోవడంతో కెంచ భార్య మంగళవారం ఉదయాన్నే పొలానికి వచ్చి చూడగా కనిపించలేదు. అటవీ అధికారులకు ఫిర్యాదు చేయగావారు వచ్చి అడవిలో గాలించి, అతడు పులి దాడిలో చనిపోయినట్లు తెలిపారు. కెంచ మృతదేహాన్ని వెతికి భార్యకు అప్పగించారు. రూ.15 లక్షల పరిహారాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అనిల్ చిక్కమాదు అటవీ అధికారులతో, కుటుంబీకులతో చర్చించారు. ఎడమ కాలికి బదులు కుడికాలికి ఆపరేషన్యశవంతపుర: వైద్యుని నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణానికి వచ్చింది. ఎడమకాలుకు బదులుగా కుడికాలుకు శస్త్రచికిత్స చేసిన ఘటన హాసన్ జిల్లా ఆస్పత్రిలో జరిగింది. వివరాలు.. జ్యోతి అనే మహిళ చిక్కమగళూరు జిల్లా బూచనహళ్లివాసి. రెండున్నర ఏళ్లు క్రితం రోడ్డు ప్రమాదంలో జ్యోతి ఎడమకాలు గాయపడి నడవలేకుండా ఉంటే వైద్యులు ఆపరేషన్ చేసి రాడ్ వేశారు. ఇటీవల ఆమెకు ఆ కాలిలో నొప్పి వస్తోంది. దీంతో హాసన్ హిమ్స్ ఆస్పత్రిలో చేరగా డాక్టర్ సంతోష్ పరీక్షలు చేసి రాడ్ను తీసివేయాలని తెలిపారు. సోమవారం ఎడమకాలుకు బదులుగా కుడి కాలిని కోసి రాడ్ కోసం వెతికారు. తప్పు చేశానని గ్రహించి మళ్లీ ఎడమకాలికి ఆపరేషన్ చేసి రాడ్ను తొలగించారు. డా.సంతోష్ నిర్వాకంపై బాధితురాలి బంధువులు మండిపడ్డారు. ఏమాత్రం స్పృహ లేకుండా ఇష్టానుసారం రోగు లకు వైద్యం చేస్తారా? అని జనం ప్రశ్నించారు. చెరుకు తోటలో గంజాయి పంట దొడ్డబళ్లాపురం: చెరుకు పంట మధ్యలో గుట్టుగా గంజాయి సాగు చేస్తున్న రైతు బండారం బట్టబయలైంది. బెళగావి జిల్లా రాయభాగ తాలూకా నిడగుంది గ్రామం నివాసి సింగాడి మాళప్ప హిరేకోడి ఒక ఎకరా చెరుకు పంట మధ్యలో గుట్టుగా గంజాయిని పండిస్తున్నాడు. ఇది తెలుసుకున్న పోలీసులు దాడులు చేశారు. చెట్లను పీకి తూకం వేయగా 441 కేజీలుగా తేలింది. జిల్లా చరిత్రలోనే ఇంత పెద్ద ప్రమాణంలో గంజాయి దొరకడం ఇదే మొదటిసారి అని పోలీసులు తెలిపారు. దీని విలువ రూ.22 లక్షలుగా అంచనా వేశారు. ఇప్పటివరకు గంజాయిని ఎక్కడెక్కడికి సరఫరా చేశాడు, ఈ దందాలో ఎంతమంది ఉన్నారు అనేది విచారణ చేపట్టారు. -
దంపతుల నిర్లక్ష్యం.. ముగ్గురు శిశువుల మరణం
బొమ్మనహళ్లి: ఎంతోమంది దంపతులు పిల్లలు లేక బాధపడుతుంటే, మరికొందరు పుట్టిన శిశువులను కాపాడుకోలేకపోతున్నారు. నిర్లక్ష్యం, ఆర్థిక ఇబ్బందుల కారణంతో గర్భిణి ఆస్పత్రికి వెళ్ళి సక్రమంగా వైద్య పరీక్షలు చేయించుకోవడం, ఔషధాలను వాడకపోవడం ముగ్గురి ప్రాణాలను తీసింది. ఆ గర్భిణికి ఏకంగా ముగ్గురు శిశువులు జన్మించగా, అనారోగ్యంతో పురిట్లోనే చనిపోయిన సంఘటన బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ తాలూకాలోని బన్నేరుఘట్ట వద్దనున్న గొళ్ళహళ్లిలో జరిగింది. ఆస్పత్రికి వెళ్లలేదు, మందులు వాడలేదు వివరాలు.. మంజుళ, ఆనంద్ కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమించుకొని ఇంటి నుంచి పారిపోయి పెళ్ళి చేసుకున్నారు. తరువాత తమ బంధువుల ఇంట్లో సంసారం పెట్టారు. అక్కడ గొడవ పడి మరో బాడుగ ఇంటికి మారారు. ఆనంద్ గార పనిచేసేవాడు. మంజుళ ఏప్రిల్లో గర్భం దాల్చింది, ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి తల్లి కార్డును తీసుకుంది. అయితే తరచుగా ఆస్పత్రికి వెళ్లడం, స్కానింగ్ చేయించుకోవడం మానేసింది. గర్భిణులు తీసుకోవాల్సిన పోషకాహారం, ఔషధాలను కూడా వాడడం లేదు. రెండురోజుల కిందట ఆమెకు పుకిటినొప్పులు రాగా స్థానికంగా ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు వైద్యులు సిజేరియన్ చేయగా ముగ్గురు పిల్లలు జన్మించారు. పుట్టిన కొన్ని నిమిషాల్లోనే వారు ఊపిరి వదిలారు. తల్లికి చికిత్స కోసం ఆనేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. ఒక్కసారి కూడా ఆస్పత్రికి వెళ్లకపోవడం, మందులు వాడకపోవడం వల్ల శిశువులు బలహీనంగా పుట్టారని వైద్యులు తెలిపారు. ఒకే కాన్పులో ప్రసవం, కొంతసేపటికే మృతి బెంగళూరు వద్ద విషాదం -
శత రుద్ర హోమం
బనశంకరి: సిలికాన్ సిటీలో బనశంకరీదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంగళవారం అమ్మవారిని శ్రీ బ్రహ్మచారిణి రూపంలో అలంకరించారు. పురోహితులు యాగశాలలో శతరుద్రాభిషేక రుద్రహోమం చేపట్టి మధ్యాహ్నం 1 గంటకు పూర్ణాహుతి గావించారు. పరమశివుని రూపాన్ని రంగవల్లిగా తీర్చిదిద్దారు. పెద్దఎత్తున భక్తులు విచ్చేసి దర్శనం చేసుకున్నారు. చాముండి ఆలయంలో సంప్రోక్షణ మైసూరు: నాడ హబ్బ వేళ విషాద ఘటన జరిగింది. చాముండికొండపైన సోమవారం ఘనంగా చాముండేశ్వరి అమ్మవారి సన్నిధిలో దసరా వేడుకలు ప్రారంభం కావడం తెలిసిందే. అయితే ఆలయ అర్చకుల్లో ఒకరైన వి.రాజు (51) రాత్రి గుండెపోటుతో మరణించారు. దాంతో మంగళవారం ఆలయ దర్శనానికి భక్తులను అనుమతించలేదు. మధ్యాహ్నం నుంచి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి అర్చకులు మాత్రమే పూజలు నిర్వహించారు. -
శాంతికి భంగం.. తిమరోడికి బహిష్కారం
శివాజీనగర: ధర్మస్థలపై దుష్ప్రచారం కేసుతో పాటు అనేక నేరారోపణలు ఉన్న సామాజిక కార్యకర్త మహేశ్శెట్టి తిమరోడిని దక్షిణ కన్నడ జిల్లా నుంచి బహిష్కరణకు జిల్లాధికారులు ఆదేశించారు. శాంతిభద్రతలను కాపాడే దృష్టితో ఆయనను ఓ సంవత్సరం పాటు జిల్లా నుంచి వెలి వేసినట్లు దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు విభాగపు అసిస్టెంట్ కమిషనర్ స్టెల్లా వర్గీస్ ఉత్తర్వుల్ని జారీచేశారు. రాయచూరు జిల్లాలోని మాన్వి తాలూకాలో ఉండాలని కూడా ఆదేశాలిచ్చారు. తిమరోడి ధర్మస్థల సమీపంలోని ఉజిరెలో నివాసం ఉంటున్నారు. అశాంతిని సృష్టిస్తున్నాడు తిమరోడి మీద 32కు పైగా కేసులు ఉన్నాయి. చట్ట ఉల్లంఘన, అశాంతి, అస్థిరత సృష్టి కార్యకలాపాల్లో పాల్గొంటున్నందున ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ధర్మస్థల కేసులో ముసుగు మనిషి చిన్నయ్యకు ఆశ్రయమిచ్చిన ఆరోపణ ఉంది. హత్యాచారానికి గురైన సౌజన్య కేసులో పోరాటాల్లో పాల్గొంటున్నారు. ధర్మస్థల కేసు విచారణ ధర్మస్థలలో మృతదేహాలను పూడ్చిపెట్టారనే కేసులో పలువురు సాక్షులను బెళ్తంగడి జెఎంఎఫ్సీ న్యాయస్థానంలో మంగళవారం పోలీసులు హాజరుపరిచారు. ముసుగుమనిషి చిన్నయ్యను కూడా కోర్టుకు తీసుకువచ్చారు. మొదట్లో చూపించిన తల పుర్రెను ఎక్కడి నుంచి తెచ్చావని చిన్నయ్యను సిట్ అధికారులు విచారించగా చెప్పడం లేదని తెలిపారు. ధర్మస్థల కేసులో సామాజిక కార్యకర్తకు దక్షిణ కన్నడ నుంచి వెలి -
ఫిరంగుల ఎదుట నిర్భయంగా..
మైసూరు: మైసూరు దసరా వేడుకలలో దసరా రోజున జరిగే జంబూసవారీ బృహత్ వేడుకకు రంగం సిద్ధమవుతోంది. ఆ రోజున ఫిరంగులు పేల్చే సన్నాహాలు ఊపందుకున్నాయి. కెప్టెన్ అభిమన్యు ఆధ్వర్యంలో ఏనుగుల బృందానికి మంగళవారం ముమ్మరంగా తాలీము నిర్వహించారు. 14 గజరాజులు, 30 గుర్రాలను నిలిపి వాటి ముందు వరుసగా ఫిరంగులను పేల్చారు. ఆ భారీ శబ్ధాలకు అలవాటు పడడంతో అవి బెదరకుండా నిలబడ్డాయి. చెవులు చిల్లులు పడే శబ్ధాలు, పెద్దగా పొగ మంటలు వస్తున్నా కూడా ఏనుగులు, అశ్వాలు ఒక్క అడుగు వెనక్కు ముందుకు వేయలేదు. దసరా జంబూసవారీకి తాము సిద్ధంగా ఉన్నామని గరాజులు, అశ్వాలు సంకేతమిచ్చాయి. ఇక ఫిరంగుల తాలీము ముగిసినట్లు అధికారులు తెలిపారు. మహిళా దసరా షురూ మహిళలు స్వాభిమానం, సమృద్ధి, సహనం, శక్తికి ప్రతీక, ఈ శక్తికి ప్రతిరూపమే దసరా పండుగ అని మహిళా శిశు సంక్షేమ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ అన్నారు. మంగళవారం ఆమె మైసూరు జేకే మైదానంలో మహిళా దసరా సంబరాలను ప్రారంభించి మాట్లాడారు. నవ దుర్గలను పూజించడం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసే చాముండేశ్వరి దేవిని ఆరాధించడమే విజయదశమి అన్నారు. మైసూరు వర్సిటీలో లక్ష గొంతులతో నాడ గీత ఆలాపన అట్టహాసంగా జరిగింది. శ్రీరంగపట్టణంలో 25న జంబూసవారీ మండ్య జిల్లా శ్రీరంగపట్టణంలో సంప్రదాయ దసరా వేడుకలు జరుగుతున్నాయి. అక్కడ ఈ నెల 25వ తేదీన జంబూసవారీ ఊరేగింపు జరుగుతుంది. ఇందుకోసం మైసూరు గజదళం నుంచి మహేంద్ర, కావేరి, లక్ష్మి అనే ఏనుగులను 24న శ్రీరంగపట్టణానికి పంపుతారు. వేడుకలు ముగిసిన తరువాత తిరిగి తీసుకువస్తారని డిసిఎఫ్ ప్రభుగౌడ తెలిపారు. తాలీములో గజరాజులు పేలుళ్లకు బెదరని గజాలు, అశ్వాలు జంబూసవారీకి సిద్ధమని సూచన -
తుమకూరు దసరాలో హెలీరైడ్
తుమకూరు: తుమకూరులో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. సందర్శకులు హెలికాప్టర్లో విహారం చేయవచ్చు. విశ్వవిద్యాలయం ఆవరణలో హెలీ రైడ్కు హోం మంత్రి జీ.పరమేశ్వర్ దంపతులు శ్రీకారం చుట్టారు. వారే తొలుత హెలికాప్టర్లో నగర విహారం చేశారు. జిల్లాధికారిణి శుభ కల్యాణ్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పెద్దలకు అయితే రూ.3,900, పిల్లలకు రూ.3,500 రుసుమును చెల్లించి హెలికాప్టర్లో నగరం చుట్టూ సంచరించి కొత్త అనుభవాన్ని పొందవచ్చు. 15 నిమిషాల పాటు గగనయాత్ర సాగుతుంది. కాలువలోకి దూకిన ప్రేమజంట● యువతి మృతి శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలో ప్రేమజంట విషాదానికి గురైంది. భద్రావతి హొసమనె పోలీసు స్టేషన్ పరిధిలో అదృశ్యమైన ఓ 19 ఏళ్ల యువతి ఎరెహళ్లి వద్ద భద్రా కుడి గట్టు కాలువలో శవమై తేలింది. వివరాలు.. భద్రావతి తాలూకా ఎరెహళ్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బోవి కాలనీవాసులు స్వాతి, సూర్య ప్రేమించుకున్నారు. పెద్దలు మందలించినా వెనకడుగు వేయలేదు. ఇద్దరికీ పెళ్లి చేద్దామని పెద్దలు తీర్మానించారు. అయితే వెంటనే పెళ్లి చేయాలని, వచ్చే ఏడాది వరకు ఆగేది లేదని ప్రియుడు సూర్య పట్టుబట్టాడు. ఈనెల 21న సూర్య, స్వాతి ఉక్కుంద వంతెన వద్ద భద్రా కుడి గట్టు కాలువ వద్దకు చేరుకున్నారు. గొడవ జరగడంతో, ఇద్దరూ పురుగుల మందును తాగి కాలువలోకి దూకారు. అయితే సూర్య కాలువలోని చెట్ల కొమ్మలను పట్టుకొని ఎలానో బయటకు వచ్చాడు. ప్రస్తుతం శివమొగ్గలోని మెగ్గాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చివరకు స్వాతి మృతదేహం మంగళవారం లభ్యమైంది. తల్లిదండ్రులు హొసమనె పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. ఇద్దరు సీఐల సస్పెండ్● లంచాలు, అలసత్వం ఆరోపణలు శివాజీనగర: లంచాలు తీసుకోవడం, విధుల్లో నిర్లక్ష్యం ఆరోపణలతో ఇద్దరు ఇన్సపెక్టర్లు, ముగ్గురు పోలీసులను బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ సస్పెండ్ చేశారు. కోరమంగల సీఐ రామరెడ్డి, హలసూరు గేట్ సీఐ హనుమంత భజంత్రి, ఓ ఏఎస్ఐ, ఇద్దరు పోలీసులపై వేటు పడింది. సీఐ భజంత్రి, సిబ్బంది ఓ బంగారు వ్యాపారి నుండి రూ.10 లక్షల వసూలుకు ప్రయత్నించారు. ఇది సీసీ కెమెరాలలో రికార్డయింది. అలాగే పబ్, బార్, రెస్టారెంట్లు అవధికి మించి తెరిచి ఉంచారని రామరెడ్డిని తప్పించారు. కమిషనర్ ఇటీవల రాత్రివేళ ఎం.జీ.రోడ్డు, చర్చీ స్ట్రీట్, కోరమంగల, మెజిస్టిక్ కేఎస్ఆర్టీసీ బస్టాండ్, సఖి వన్ స్టాప్ సెంటర్ తదితర ప్రాంతాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ సమయంలో అర్ధరాత్రి దాటినా కొన్ని బార్లు పబ్లు పనిచేస్తూనే ఉన్నాయి. దీంతో చర్యలు చేపట్టారు. నగరంలో ఇటీవలి రోజుల్లో బంగారు చోరీలు, దోపిడీలు అధికమవుతున్న నేపథ్యంలో కమిషనర్ రాత్రివేళ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. -
శక్తిదేవతకు అక్షరాంజలి
మైసూరు: చాముండేశ్వరి అమ్మవారికి అగ్రపూజలు జరిపి మైసూరు దసరా ఉత్సవాలకు ప్రముఖ రచయిత్రి, కన్నడిగురాలు బాను ముష్తాక్ నాంది పలికారు. సోమవారం ఉదయం 10 గంటల తరువాత మైసూరు చాముండి గిరులపై ఆడంబరంగా ఈ వేడుక సాగింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. మొదట బాను ముష్తాక్, సీఎం సిద్దు చాముండేశ్వరి ఆలయంలో అమ్మవారి మూలవిరాట్ను దర్శించుకున్నారు. శక్తి దేవతకు సంప్రదాయ రీతిలో బాను ముష్తాక్ పూజలు చేశారు. ఉదయాన్నే ఐరావత బస్సులో బాను ముష్తాక్, ఆమె కుటుంబ సభ్యులు చాముండి కొండకు చేరుకున్నారు. సీఎం, మంత్రులు కలిసి మహిష విగ్రహం వద్ద వారికి స్వాగతించారు. తరువాత చాముండేశ్వరి ఆలయంలో గర్భగుడికి వెళ్లారు. జానపద కళా బృందాల స్వాగత నృత్యాలు అబ్బురపరిచాయి. అమ్మవారికి మంగళహారతి తరువాత అర్చకులు ఇచ్చిన పూలహారం, చీరను బాను ముష్తాక్ స్వీకరించారు. ఈ సమయంలో ఆమె కళ్లలో ఆనంద భాష్పాలు వచ్చాయి. చాముండేశ్వరి మాతను అతి దగ్గరగా వీక్షిస్తూ ప్రార్థన చేశారు. ఈ నేల పరంపర సర్వజన శాంతి తోట అని, అందువల్ల అస్త్రాలు ద్వారా కాదు, అక్షరాల ద్వారా జీవితాన్ని గెలవాలని, ఎలాంటివారు అయినా ప్రేమతో జీవితాన్ని జయించవచ్చని బాను ముష్తాక్ అన్నారు. ప్రారంభోత్సవ వేదికపై జ్యోతి వెలిగించి 415వ మైసూరు దసరా ఉత్సవాలను ఆమె ప్రారంభించి ప్రసంగించారు. మైసూరు దసరా అంటే పండుగ మాత్రమే కాదని, ఇది కన్నడనేల సంస్కృతి అని వర్ణించారు. ఉత్సవం కనుక అందరినీ ఒక్కచోటికి తీసుకెళ్లే వేదిక అన్నారు. దసరా శాంతి పండుగ అని, సౌహార్ధ మేళా అని మన అందరి చెవుల్లో ప్రతిధ్వనించాలని ఆమె పేర్కొన్నారు. ఇది సర్వజనాలకు శాంతి తోటగా తెలిపారు. మైసూరు మహారాజుల సంస్కృతి, వారు కన్నడనాడు కోసం చేసిన కృషి, వారి అంతరాంతరాలలో ఉన్న హృదయస్పందన ఈ మైసూరు దసరా అని కొనియాడారు. సంస్కృతి అంటే భిన్నత్వం ఏకత్వం కావడమని, వాటి సుగంధాలను మహారాజులు అయిన జయచామరాజేంద్ర ఒడెయార్ నమ్మి ముస్లింలను భద్రతా సిబ్బందిగా నియమించుకున్నారని, ఇది మాకు చాలా గొప్ప విషయమని చరిత్రను ప్రస్తావించారు. ఇక దిగువన మైసూరు నగరంలో పలు వేదికలలో కళా సాంస్కృతి సంబరాలు మిన్నంటాయి. ప్యాలెస్ ముందు ప్రముఖంగా కళా ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా అన్నిచోట్లా భారీ బందోబస్తు నిర్వహించారు. రాష్ట్రమంతటా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. బెళగావి నగరంలో దుర్గా దౌడ్ వేడుకలు నేత్రపర్వంగా సాగాయి. చిన్నారిని దుర్గాదేవి అవతారంగా భావించి మహిళలు పూజలు చేశారు. చిక్కమగళూరులో దుర్గాదేవి విగ్రహాల ఊరేగింపు జరిపారు. మైసూరు చాముండి కొండపై అమ్మవారి ఆలయంలో బాను ముష్తాక్ చాముండేశ్వరి ఆలయం వద్ద స్వాగత సంబరాలు రచయిత్రి బాను ముష్తాక్చే మైసూరు దసరా ఉత్సవాలకు నాంది చాముండేశ్వరి అమ్మవారికి విశేష పూజలు పాల్గొన్న సీఎం సిద్దు, మంత్రులు మైసూరులో వేడుకల కోలాహలం అస్త్రాలు కాదు, అక్షరాల ద్వారా గెలవాలి: బాను ముష్తాక్ అమ్మ సన్నిధిలో ఆనంద భాష్పాలు రాష్ట్రంలో సంబరాలు -
రియల్ ఎస్టేట్ యజమానిపై దాడి
● బళగానూరు జీపీ అధ్యక్షుడిపై కేసు రాయచూరు రూరల్: జిల్లాలోని సింధనూరు తాలూకాకు చెందిన రియల్ ఎస్టేట్ యజమాని ఖాజాసాబ్పై బళగానూరు జీపీ అధ్యక్షుడు శివకుమార్ నాయక దాడి చేశాడు. నూతనంగా కాలనీ నిర్మాణం చేపట్టడానికి ఫారం నంబర్–3ను అధికారి సత్యనారాయణ కులకర్ణి నుంచి ఖాజాసాబ్ తీసుకునేందుకు ఇంజినీర్ మీనాక్షమ్మ వద్దకు వెళ్లి మాట్లాడుతుండగా అధ్యక్షుడు శివ కుమార్ నాయక ఉన్నఫళంగా వచ్చి రూ.5 లక్షలు లంచం ఇవ్వాలని, లేని పక్షంలో ఫారం ఇవ్వడం కుదరదని చెప్పడంతో ఇద్దరి మద్య వాగ్వాదం జరిగింది. అధ్యక్షుడు శివ కుమార్ నాయక్, సోదరుడు మూకప్ప దుర్భాషలాడి దాడి చేశారు. ఈ ఘటనపై బళగానూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చెట్లు మనిషి ఆరోగ్యానికి ప్రాణాధారం రాయచూరు రూరల్: చెట్లు మనిషి ఆరోగ్యానికి ఆక్సిజన్ వంటివని నగరసభ సభ్యుడు జయన్న పేర్కొన్నారు. సోమవారం పవన్ కాలనీలో మొక్కలు నాటి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ అధిక శాతం చెట్ల కింద కూర్చొని సేద తీరుతారన్నారు. చెట్ల నుంచి వచ్చే గాలిని పీల్చుతుంటారన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి ముందు చెట్లు పెంచి పర్యావరణాన్ని సంరక్షించాలన్నారు. జయ ప్రకాష్ పాటిల్, బసవరాజ్ పాటిల్, సకలేస్ పాటిల్, అమరేష్, హన్మంత రాయ, మహంతేష్, విశ్వనాథ్ పాల్గొన్నారు. యువత వ్యవసాయంపై దృష్టి పెట్టాలి రాయచూరు రూరల్: రాష్ట్ర యువతీ యువకులు వ్యవసాయంపై దృష్టి పెట్టాలని సినీ తార, సీఎంఆర్ రాయబారి సప్తమిగౌడ అభిప్రాయ పడ్డారు. సోమవారం సీఎంఆర్ దుకాణాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. నేటి ఆధునిక సమాజంలో యువతీ యువకులు చెడు అలవాట్లకు గురై జీవితాలను చెడగొట్టుకుంటున్నారన్నారు. మరో వైపు కుటుంబంలో మహిళల నుంచి వస్తున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని భారతీయ సనాతన సంస్కృతి, ఆచార విచారాలు సంప్రదాయాలు కనుమరుగు కాకుండా కాపాడుకోవచ్చన్నారు. ఇటీవల తిరిగి పూర్వ వైభవం సంతరించుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో 40 శాఖలను ప్రారంభించారన్నారు. అంబేడ్కర్ విగ్రహ నిర్మాణాలు పూర్తి చేయరూ.. రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం రూ.12 లక్షలతో చేపట్టిన అంబేడ్కర్ విగ్రహ నిర్మాణాలు సత్వరం పూర్తి చేయాలని దేవదుర్గ సమాజ సేవకుడు అళ్లప్ప డిమాండ్ చేశారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2023లో నిర్మాణానికి శ్రీకారం చుట్టినా నేటికీ పనులు పూర్తి చేయకుండా అధికారులు నిరక్ష్యం వహిస్తున్నట్లు తెలిపారు. శాసన సభ్యురాలు కరెమ్మ ఈ విషయంలో ఏనాడూ అధికారులతో చర్చించలేదన్నారు. నగరసభ అధికారి హంపయ్య, ఇంజినీర్లు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ పనులు పెండింగ్లో ఉంచారన్నారు. పనులు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లేఖ రాయనున్నట్లు తెలిపారు. అంగన్వాడీలకు వెట్టి చాకిరీ వద్దు రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలను వెట్టి చాకిరీ నుంచి తొలగించాలని అంగన్వాడీ కార్యకర్తల సంఘం డిమాండ్ చేసింది. సోమవారం మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షురాలు పద్మ మాట్లాడారు. కేంద్రాల్లో విధులు నిర్వహించే కార్యకర్తలకు కేటాయించిన ముఖ గుర్తింపు పద్ధతి(ఎఫ్ఆర్ఎస్)ని తొలగించాలని, ఎఫ్ఆర్ఎస్ను అమలు చేయడం వల్ల అంగన్వాడీ కార్యకర్తలు పలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకున్న, జారీ చేసిన ఎఫ్ఆర్ఎస్ను రద్దు చేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. -
రాజకీయ కుట్రల వల్లే సర్వే గందరగోళం
బళ్లారిటౌన్: సిద్దరామయ్య ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సోమవారం నుంచి ప్రారంభించిన కులగణన ఆర్థిక సామాజిక స్థితిగతుల సర్వేపై రాష్ట్ర సఫాయి కర్మచారి అభివృద్ధి మండలి మాజీ అధ్యక్షుడు హెచ్.హనుమంతప్ప విమర్శలు గుప్పించారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ సిద్దరామయ్య వైఖరిపై తనదైన శైలిలో విరుచుకు పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర పోరాటం జరిగాక బీసీ కమిషన్ అధ్యక్షుడు 33 హిందూ కులాలను క్రైస్తవ కులాల జాబితా నుంచి సమీక్షకు వాడే యాప్లో హైడ్ చేసినట్లుగా తెలిపారన్నారు. ఈ విధంగా అధికారికంగా తొలగించకుండా మిగిలిన కులాలన్నీ ఎస్సీ కావడం ఆందోళనకర పరిణామం అన్నారు. ఈ విషయంలో సదరు కమిషన్ తీరు సమంజసం కాదన్నారు. ఎస్సీ క్రైస్తవ కులాలను ప్రభుత్వం తక్షణమే స్వస్తి చెప్పాలి లేకుంటే అన్ని జిల్లాల్లో దళితులు వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తారని హెచ్చరించారు. తక్షణమే ఆ కమిషన్ స్పష్టీకరణ ఇవ్వాలన్నారు. అధికార ప్రకటనలో ఎస్టీ కులాల క్రైస్తవ ట్యాగ్ తొలగించాలని ఆయన కమిషన్ను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రముఖులు నరసింహ బాబు, సోమశేఖర్, తిప్పమ్మ, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. -
జీఎస్టీ తగ్గింపుపై సంబరాలు
సాక్షి బళ్లారి: దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సరుకు సేవా పన్ను(జీఎస్టీ)ని తగ్గించడంపై నగరంలో సంబరాలు మిన్నంటాయి. సోమవారం జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ర్యాలీ చేపట్టి కేంద్ర ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని హర్షం వ్యక్తం చేస్తూ బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకొన్నారు. నగరంలో పలు ప్రధాన వీధుల గుండా ర్యాలీని చేపట్టిన అనంతరం నగర మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్రెడ్డి మాట్లాడుతూ ప్రధాని తీసుకొన్న నిర్ణయంతో దేశంలో పలు వర్గాలకు మేలు చేకూరుతోందన్నారు. 99 శాతం మేర నిత్యవసరాల ధరలు తగ్గుతాయన్నారు. నవరాత్రి పర్వదిన శుభవేళలో దేశ ప్రజలకు ప్రధాని ఈ కానుకను అందించారన్నారు. కారు కొనుగోలుదారులకు ఏకంగా రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు జీఎస్టీ తగ్గిందన్నారు. అన్ని వర్గాలకు మేలు చేకూర్చే నిర్ణయాన్ని తీసుకోవడంపై ప్రజలు హర్షిస్తున్నారన్నారు. విపక్షాలు అడగకపోయినా, ప్రజలకు భారంగా ఉందని గ్రహించి జీఎస్టీని తగ్గించడం హర్షణీయమన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్ కుమార్ మోకా, నగర బీజేపీ అధ్యక్షుడు వెంకటరమణ, బీజేపీ ప్రముఖులు గురులింగనగౌడ, హనుమంతప్ప, తిమ్మారెడ్డి, హుండేకర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నిర్ణయం.. ప్రజలకు వరం సిరుగుప్ప: అప్పటి మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ అవధిలో అమలు చేయాలని అనుకొన్న సరుకు సేవా పన్నును 2014లో అమలు చేసి భారత ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఘనత నరేంద్ర మోదీదని, ఇప్పుడు సామాన్య ప్రజలకు ఇంకా అందుబాటులో ఉండాలనే దృష్టితో జీఎస్టీని పలు నిత్యావసర వస్తువులపై తగ్గించి ఎంతో మేలు చేశారని మాజీ ఎమ్మెల్యే ఎం.ఎస్.సోమలింగప్ప ప్రధానిని ప్రశంసించారు. ఆయన నగరంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సామాన్య ప్రజలు ఉపయోగించే నిత్యావసర వస్తువులపై జీఎస్టీని తగ్గించి దసరా పండుగకు కానుకగా ఇచ్చారన్నారు. ప్రపంచ దేశాల్లో భారత్ను నాలుగో ఆర్థిక దేశంగా తీర్చిదిద్దిన ఘనత ప్రధానికే దక్కిందన్నారు. తాలూకాలో అన్ని శాఖల్లో పాలన శూన్యమైందన్నారు. ముఖ్యంగా నీటిపారుదల శాఖ ఆఫీసు ఎక్కడ ఉందో తెలియడం లేదన్నారు. ఇక నగరసభ డ్రైనేజ్ వ్యవస్తగా మారిందన్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పని తీరు చెప్పనలవి కాదన్నారు. పార్టీ నాయకుడు చాగి సుబ్బయ్య శెట్టి, తాలూకా అధ్యక్షుడు మల్లికార్జున స్వామి కుంటనాళ్, బీజేపీ మారెప్ప, ఎం.ఆర్.గౌడ, వీరనగౌడ, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జీఎస్టీ తగ్గింపుపై హర్షాతిరేకాలు రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రజల కష్టాలను అర్థం చేసుకొని జీఎస్టీని తగ్గించిందని శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ హర్షం వ్యక్తం చేశారు. సోమవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందన్నారు. అనంతరం మిఠాయిలు పంచి ఆనందోత్సవం జరిపారు. మాజీ విధాన పరిషత్ సభ్యుడు శంకరప్ప, శరణమ్మ, ఆంజనేయ, కొట్రేష్, రాఘవేంద్ర, బండేష్, వీరనగౌడ, నాగరాజ్, శ్రీనివాస్, రామచంద్ర, రవీంద్ర జాలదార్, నరసింహులు, రమానంద, విజయ రాజేశ్వరి, సుమా, సంగీత పాల్గొన్నారు. బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకొని కేరింతలు జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తల ర్యాలీ -
కుస్తీ సమరం భళా
మైసూరు: మైసూరు నగరంలోని వస్తు ప్రదర్శన ప్రాధికార ఆవరణలో దసరా కుస్తీ పోటీలను సీఎం సిద్దరామయ్య ప్రారంభించారు. ఆ వెంటనే పహిల్వాన్లు రంగంలోకి దిగారు. ప్రత్యర్థిని మట్టి కరిపించి గెలుపు కోసం పోరాడారు. సిద్దరామయ్య కూర్చుని పోటీని వీక్షించారు. చప్పట్లు కొడుతూ వారిని ప్రోత్సహించారు. మైసూరు వికాస్, దావణగెరె కిరణ్ల మధ్య అర్ధగంట సేపు కుస్తీ రంజుగా సాగింది. చివరకు మైసూరు వికాస్ గెలిచాడు. ఇక మహిళల కుస్తీ పోటీలో బెంగళూరు పుష్ప, బెళగావి నందిని తలపడ్డారు. అయితే 70 సెకెండ్లలోనే నందిని పుష్పను ఓడించింది. అలాగే అథణి సురేష్ లంకోటి, దావణగెరె హనుమంతి విఠల బేవినమర మధ్య పోటీ చాలాసేపు కొనసాగింది. బేలూరు నిర్మానుష్యంయశవంతపుర: హాసన్ జిల్లా బేలూరు పట్టణంలో సిద్ది వినాయక ఆలయంలో గణేశ మూలవిరాట్టుకు ఓ మహిళ చెప్పుల హారం వేసి అవమానించడాన్ని ఖండిస్తూ సోమవారం హిందూ సంఘాలు, ప్రజలు బేలూరు బంద్ను నిర్వహించారు. లీలమ్మ అనే మహిళ ఈ అకృత్యానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఆమెకు మతిస్థిమితం లేదని చెబుతున్నారని, ఆమె వెనుక ఎవరున్నారో విచారణ చేయాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బంద్ విజయవంతమైంది. వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులను మూసివేశారు. సిలికాన్ సిటీలో ఘోరం.. నడిరోడ్డుపై భార్య హత్యయశవంతపుర: పట్టపగలే వ్యక్తి ఒకరు మహిళను 11 సార్లు కత్తితో పొడిచి చంపాడు. రేఖా అనే మహిళపై భర్త లోకేశ్ ఈ దాడికి పాల్పడ్డాడు. వివరాలు.. రేఖా తుమకూరు జిల్లా శిరా తాలూకావాసి, నాలుగు నెలల నుంచి బెంగళూరులో సుంకదకట్టలో నివాసం ఉంటుంది. ఆమె లోకేశ్ అనే వ్యక్తిని రెండవ పెళ్లి చేసుకుంది. కొంతకాలంగా అనుమానంతో భార్యను వేధిస్తున్నాడు. ఆమె సోమవారం ఉదయం సుంకదకట్ట వద్ద బస్సు కోసం ఎదురు చూస్తుండగా లోకేశ్ ఆమెతో గొడవ పడ్డారు. తన జేబులోంచి కత్తిని తీసి ఎడాపెడా పొడిచాడు. రేఖా రక్తపుమడుగులో కూలిపోయింది. కొనప్రాణాలతో ఉన్న ఆమెను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. భక్తి సంగీత కచేరీచింతామణి: తాలూకాలోని కై వార యోగినారేయణ మఠంలో నవరాత్రి ఉత్సవాలు ఆరంభమయ్యాయి. నాదసుధారస వేదికలో మైసూరు విద్వాన్ సుమంత్ మాళవి బృందం ఫిడేలు సంగీత కచేరీ వీనులవిందుగా సాగింది. భక్తి కీర్తనలను ఫిడేలుపై ఒలికించారు. మఠం సంకీర్తన సంచాలకులు బాలకృష్ణ భాగవతార్ మాట్లాడుతూ సంగీతం, విజ్ఞానం, ఒకే నాణేనికి రెండు ముఖాలని అన్నారు. సంగీతాన్ని నేర్చుకొంటే బుద్ధి వికసిస్తుందని అన్నారు. ధర్మాధికారి డా.జయరాం. మంజునాథ్, విభాకరరెడ్డి, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. చిన్నయ్య ఖాతాలకు డబ్బులు బనశంకరి: ధర్మస్థల మీద దుష్ప్రచారం సాగించిన కేసు దర్యాప్తు వేగవంతం చేసిన సిట్ అధికారులు ముసుగుమనిషి చిన్నయ్య అకౌంట్కు నగదు జమచేసిన వారికి నోటీస్జారీ విచారణకు హాజరుకావాలని తెలిపారు. చిన్నయ్య, అతని భార్య అకౌంట్కు నగదు జమచేసిన పలువురికి నోటీసులు జారీ చేశారు. బ్యాంకు ద్వారా, ఆన్లైన్లో రూ.3 లక్షల నగదును చిన్నయ్యకు పంపించినట్లు కనుగొన్నారు. ఎందుకు డబ్బులు పంపించారో తెలుసుకోనున్నారు. -
వైభవం.. శరన్నవరాత్రి ఉత్సవం
అలంకరణలో నాగర యల్లమ్మ దేవిబాలమారెమ్మ దేవికి అలంకరణఅలంకరణలో తుళజా భవాని అమ్మవారురాయచూరు రూరల్: జిల్లాలో సోమవారం శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని కిల్లే బృహన్మఠంలో వెండి అంభా భవాని ప్రతిమకు ప్రత్యేక పూజలు జరిపారు. కందగడ్డ మారెమ్మ దేవాలయంలో దేవిని ప్రత్యేకంగా తీర్చి దిద్దారు. కోటలోని కాళికా దేవి ఆలయం, తిమ్మాపూర్పేట బాల మారెమ్మ ఆలయం, మావినకెరె చెరువు వద్ద అంబాదేవి ఆలయంలో తుళజా భవాని దేవిని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. తాలూకాలోని దేవసూగూరు వద్ద నాగర యల్లమ్మకు ప్రత్యేక పూజలు జరిపారు. మహిళలు బన్ని(జమ్మి) చెట్టుకు పూజలు చేశారు. మఠం నుంచి బంగికుంట వరకు దేవిని ఊరేగించారు. శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, రేణుకా స్వామి, శోభా, శ్యాం, యల్లప్ప, హరీష్ పాల్గొన్నారు. జమ్మి చెట్టుకు విశేష పూజలు హొసపేటె: నగరంలో అమరావతి ఐబీ సమీపంలో వెలసిన జమ్మి చెట్టుకు కాలనీ మహిళలు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా నవరాత్రుల సందర్భంగా జమ్మి చెట్టుకు ఉదయం అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం అన్నదానం జరిపారు. మహిళలు సాంప్రదాయక దుస్తులను ధరించి జమ్మి చెట్టుకు పూజలు చేశారు. అంతటా అమ్మ వారి వైభోగమే హుబ్లీ: §ólÒ ÔèæÆý‡-¯]l²Ð]l-Æ>-{™èl$Ë$ hÌêÏ ÐéÅç³¢…V>, f…r ¯]lVýS-Æ>ÌZÏ MýS*yé ÝùÐ]l$ÐéÆý‡… ÐólMýS$Ð]l gêÐ]l¬ ¯]l$…^ól {´ëÆý‡…¿ýæ… AĶæ*ÅÆ‡$$. Ð]l¬QÅ…V> hÌêÏÌZ° ÑÑ«§ýl ™éË*M>ÌZÏ ÐðlÌS-íܯ]l AÐ]l$ÃÐéÇ BÌS-Ķæ*-ÌS™ø ´ër$ çßæ$½ÏÌZ° ™èl$âýægê ¿ýæÐé-°, §ýl$Æý‡Y-§ýlO»ñæË$, ¯]lÐ]l-¯]l-VýSÆŠ‡ ç³…^é„ýSÇ M>ÌS-±ÌZϰ M>ã-M>-Ð]l$-uý‡…, ѧéÅ-¯]l-VýSÆŠ‡ çÜÒ$-ç³…ÌZ° ™èl$âýæ-gê ¿ýæÐé° BÌS-Ķæ*ÌS™ø ´ër$ Ñ$Wͯ]l AÐ]l$Ã-Ðé-Ç, ÐéçÜÒ MýS¯]lÅM> ç³Æý‡-Ðól$ÔèæÓÇ ™èl¨™èlÆý‡ BÌS-Ķæ*ÌZÏ A™èlÅ…™èl OÐðl¿ýæ-Ð]l…V> §ólÑ ÔèæÆý‡¯]l²Ð]l Æ>{† Ðólyýl$MýS-ÌS¯]l$ ¿ýæMýS$¢Ë$ {ç³™ólÅ-MìS…_ Ð]l$íßæâê ¿ýæMýS$¢Ë$ ™ðlÌSÏ-ÐéÆý‡$ gêÐ]l¬¯ól Ý벯]lÐ]l*-^èl-Ç…_ ç³Ñ-{™èl-OÐðl$¯]l Ð]l$¯]l-çÜ$™ø ™èlÐ]l$ í³ÌêÏ ´ëç³-ÌS™ø BÌS-Ķæ*-°MìS ÐðlãÏ AÐ]l$Ã-Ðé-ǰ §ýlÇØ…-^èl$-MýS$…r$-¯é²Æý‡$. Ð]l¬QÅ…V> fÑ$à ^ðlr$t E¯]l² BÌSĶæ*Ë$ C™èlÆý‡ ^ørÏ Ð]l$íßæâê ¿ýæMýS$¢Ë$ ™èlÐ]l$ í³ÌêÏ ´ëç³ÌS™ø AÐ]l$ÃÐé-ǰ MöË$-çÜ$¢-¯é²Æý‡$. M>ã, ÝëÆ>, {†ç³#Æý‡ çÜ$…§ýl-Ç, ¿¶æ$Ð]l-¯ól-ÔèæÓ-Ç, «§ýl*Ð]l$-Ð]l-†, ºVýS-âêÐ]l¬-ü, Ð]l*™èl…-W, MýSÐ]l$ÌS CÌê ÔèæMìS¢ §ólÐ]l™èlÌS BÆ>«§ýl-¯]l¯]l$ B«§éņÃMýS Ýë«§ýl-MýS$Ë$ ™èlÐ]l$ ç³Nf-ÌS¯]l$ ¯ðlÆý‡-ÐólÇa MøÆð‡P-ÌS¯]l$ íܧýl®… ^ólçÜ$-MýS$…-r$-¯é²Æý‡° ¿êÆý‡-¡-Ķæ¬ÌZÏ A™èlÅ-«¨MýS$Ë$ ÑÔèæÓ-íÜ-Ýë¢Æý‡$. Ððl¬™é¢-°MìS 9 ÆøkÌS §ólÒ ¯]lÐ]lÆ>{† Ðólyýl$-MýSË$ ÝùÐ]l$ÐéÆý‡… ¯]l$…_ A…™èl-sê ¿ýæMýS$¢ÌS çÜ…§ýlyìl ¯ðlÌS-Mö…¨. MýSÌS-çœ$sìæW ÌS„ýSçీ Ðól…MýS-sôæ-ÔèæÓÆý‡ §ólÐ]l-Ýë¦-¯]l…, º$yýlVóSÇ §éÅÐ]l-Ð]l$Ã-§ól-Ñ, «§éÆ>Óyýl Ðól…MýS-sôæÔèæÓÆý‡ ÝëÓÑ$ §ólÐ]lÝ릯]l… ™èl¨-™èlÆý‡ ^ørÏ ¿ýæMýS$¢ÌS çÜ…§ýlyìl MýS°-í³Ýù¢…-¨. }íܧéª-Æý‡*Éýl Ð]l$uý‡…ÌZ ÝùÐ]l$ÐéÆý‡… ÝëĶæ$…{™èl… 4 VýS…rÌS ¯]l$…_ §ólÒ ç³#Æ>׿ ç³uý‡¯é-°MìS }M>Æý‡… ^èl$sêtÆý‡$. D ç³#Æ>׿ ç³uý‡¯]l… AMøt-ºÆŠ‡ 2¯]l Ñf-Ķæ$-§ýlÔèæÑ$ Ð]lÆý‡MýS$ Mö¯]l-ÝëVýS-¯]l$…-¨. MýSVýS-§éâýæ íܧéª-{ÔèæÐ]l$…ÌZ VýS$Æý‡$-Ò-Æý‡¿ýæ{§ýl ÝëÓÑ$ ç³#Æ>׿ {ç³Ð]l-^èl¯]l… ^ólÔ>Æý‡$. Ñf-Ķæ$§ýl-ÔèæÑ$ ç³Nf-ÌS™ø M>Æý‡Å-{MýS-Ð]l*-°MìS Ð]l$…VýSâýæ… ç³Ë$-MýS$-™éÐ]l$° Ð]l$uý‡… Ðól$¯ól-fÆŠ‡ ™ðlÍ-´ëÆý‡$.రాయచూరులో బన్ని చెట్టుకు పూజలు చేస్తున్న మహిళలు, శాంభవి దేవికి పూజల్లో పాల్గొన్న భక్తులు ఆలయాల్లో ప్రత్యేక అలంకరణలు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం -
విశ్వరూప రంగోళి
మైసూరు: ౖమెసూరు నగరంలోని హుణసూరు రోడ్డులో ములకనాడు సభా భవనంలో కళాకారిణి నేహా రూపొందిన విశ్వరూప మహావిష్ణు రూపం రంగోళి కనువిందు చేస్తోంది. అనేక రంగులతో 15 అడగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో ఈ రంగోళిని వేశారు. మేలుకోటెలో నవరాత్రి వేడుకలు ●మహాలక్ష్మికి బంగారు పల్లకీ సేవ మండ్య: మండ్య జిల్లాలోని మేలుకోటెలో వెలసిన చరిత్ర ప్రసిద్ధ చెలువనారాయణ స్వామివారి ఆలయంలో మహాలక్ష్మి కళ్యాణ నాయకి అమ్మవారికి శరన్నవరాత్రి వేడుకలను ప్రారంభించారు. తొలిరోజు బంగారం శేషవాహనోత్సవం కనులపండువగా జరిగింది. అక్టోబర్ 1వ తేది వరకు నిత్యం మహాలక్ష్మికి పల్లకీ ఉత్సవం జరిపి శేష వాహనోత్సవం నిర్వహిస్తారు. చెలువ నారాయణ స్వామివారికి ప్రత్యేక అలంకారం, పూజలు చేశారు. పెద్దసంఖ్యలో భక్తులు దర్శనం చేసుకున్నారు. -
అతిథి ఉపన్యాసకులను నియమించండి
బళ్లారిఅర్బన్: అతిథి ఉపన్యాసకుల(గెస్ట్ లెక్చరర్ల) నియామకాలను వెంటనే చేపట్టాలని సదరు సంఘం రాష్ట్ర గౌరవ జిల్లాధ్యక్షుడు టి.దుర్గప్ప తెలిపారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 432 ప్రభుత్వ ప్రథమ గ్రేడ్ కళాశాలలు ఉండగా వీటిలో శాశ్వత లెక్చరర్లు 3000, గెస్ట్ లెక్చరర్లు సుమారు 10,500 మంది ఉన్నారన్నారు. వీరిలో యూజీసీ అర్హత పొందిన వారు 5000, అలాగే అర్హత లేని వారు 6000 మంది అన్నారు. రాష్ట్రంలో యూజీసీ, అన్ యూజీసీ అంటూ విభజించు పాలించు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కళాశాల విద్యా శాఖ అనుసరిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం జాప్య విధానానికి, నిర్లక్ష్య ధోరణి వల్ల అతిథి ఉపన్యాసకులు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ కుటుంబ సభ్యులకు న్యాయం చేయలేక పోతున్నారన్నారు. రెండు నెలలుగా అందని గౌరవధనం రెండు నెలలుగా అతిథి ఉపన్యాసకులకు గౌరవధనం చెల్లించలేదని ఆయన వాపోయారు. ఇంటి అద్దె పిల్లల స్కూల్ ఫీజులు, కిరాణా సరుకులు, వృద్ధులైన తల్లిదండ్రులకు తగిన చికిత్సలు చేయించలేక పోవడంతో పాటు ఔషధాలను కూడా సమకూర్చలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సరళాదేవి కళాశాలలో బైపాస్ హార్ట్ సర్జరీ చేయించుకున్న సీనియర్ అతిథి ఉపన్యాసకులు డాక్టర్ కే.బసప్పకు నెలకు ఔషధాల ఖర్చు సుమారు రూ.8 వేలు అవుతోందన్నారు. బసప్పలానే ఎంతో మంది లెక్చరర్లు తీరని అనారోగ్య, ఆర్థిక బాధలతో పడరాని పాట్లు పడుతూ తమ కుటుంబాలను భారంగా నెట్టుకొస్తున్నారని ఆయన తమ తోటి లెక్చరర్ల జీవిత చేదు అనుభవాలను సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ హనుమేశ, డాక్టర్ కే.బసప్ప, డాక్టర్ నాగప్ప తదితరులు పాల్గొన్నారు. -
వీరశైవ లింగాయతగా రాయించాలి
బళ్లారిఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కీలకంగా సోమవారం నుంచి ప్రారంభించిన కులగణన ఆర్థిక సామాజిక స్థితిగతుల సర్వే అధ్యయనంలో మతం కాలంలో హిందూ, కులం కాలంలో వీరశైవ లింగాయతగా నమోదు చేయించాలని సమాజ ప్రముఖుడు కేఎం మహేశ్వర స్వామి తెలిపారు. ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి కానీ సిద్దరామయ్యకు గాని మతం గురించి తెలుసుకొనే అధికారం లేదు. మతం గురించి కేంద్ర ప్రభుత్వానికే గుర్తించే అధికారం ఉంది. కొందరు వీరశైవగా నమోదు చేస్తే, మరి కొందరు లింగాయతగా నమోదు చేయడం వల్ల పరిగణలోకి తీసుకోవడం కుదరదు. అందువల్ల సమాజ బాంధవులందరూ వీరశైవ లింగాయతగా రాయించాలని కోరారు. షడక్షర స్వామి, ప్రభుస్వామి, పురుషోత్తం గౌడ, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. -
ఖ్వాజా వెడ్స్ గాయత్రి
హుబ్లీ: జిల్లాలో మతాంతర ప్రేమపెళ్లి గొడవ వీధికెక్కింది. ఖ్వాజా మహ్మద్ బందెనవాజ్ శిరహట్టి అలియాస్ ముకుళప్ప.. గాయత్రి యల్లప్ప జాలిహాళ అనే హిందూ యువతి ప్రేమించి జూన్ మొదట్లో పెళ్లి చేసుకున్నారు. ఖ్వాజాకు ప్రముఖ యూట్యూబర్గా పేరుంది. ఇది లవ్ జిహాద్ అని, గాయత్రిని మోసపుచ్చి పెళ్లి చేసుకున్నాడని ఆమె తల్లిదండ్రులు, హిందూ సంఘాల నేతల ఆరోపిస్తున్నారు. ఇది లవ్ జిహాదేనని ధార్వాడ రూరల్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఉత్తర కన్నడ జిల్లాలో తప్పుడుపత్రాలను సమర్పించి రిజిస్టర్ పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు. దీంతో పోలీసులు కొత్త జంటను పిలిపించి వివరణ తీసుకున్నారు. ఇష్టపడే పెళ్లాడినట్లు గాయత్రి చెప్పడంతో పంపించేశారు. నా కూతురికి మాయమాటలు చెప్పాడు గాయత్రి తల్లి శివక్క.. తన కుమార్తెకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. తమ కుమార్తెను అప్పగించాలని పోలీసులను, మీడియాను ఆశ్రయించింది. ఈ తరుణంలో గాయత్రి ఓ వీడియోను విడుదల చేసింది, మా ప్రేమ సంగతి తల్లికి తెలుసు, లవ్ జిహాద్ అన్నది పచ్చి అబద్ధం, నేను సొంత నిర్ణయంతోనే అతడిని పెళ్లి చేసుకున్నాను, నా పెళ్లికి ఆమె ఒప్పుకుంది అని పేర్కొంది. ఈ పెళ్లి రగడ జిల్లాలో చర్చనీయాంశమైంది. ధార్వాడలో మతాంతర పెళ్లి రగడ కూతురిని అప్పగించాలని తల్లి వినతి -
ఆలయంలోకి దళితులకు ప్రవేశం లేదా?
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ అంటరానితనం కనిపిస్తున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఆలయంలోకి దళితుల ప్రవేశం నిషిద్ధమా? అనే మీమాంస రాయచూరు తాలూకా ఆత్కూరులోని అంబా భవాని ఆలయం వద్ద చోటు చేసుకుంది. దేవీ శరన్నవ రాత్రుల సందర్భంగా ఓ సమాజ యువకులు అమ్మవారి ఆలయంలో దర్శనానికి, మాల వేసుకోవడానికి వెళ్లగా ఆలయ పూజారి వారిని బయటే నిలిపి వారికి కండువా ఇచ్చి, కుంకుమ దిద్దడంపై ఆగ్రహం వ్యక్తమైంది. ఈ విషయంపై వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు విచారణకు నడుం బిగించారు. ఇరు వర్గాల మధ్య రాజీ ప్రక్రియ కోసం పోలీసులు శాంతి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. -
కులగణన సర్వే కిట్ల పంపిణీ
రాయచూరు రూరల్: రాష్ట్రంలో సోమవారం నుంచి వెనుక బడిన వర్గాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న కులగణన నమోదు సర్వేకు అందరూ సహకరించాలని తహసీల్దార్ సురేష్ వర్మ విన్నవించారు. పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో సర్వే చేయనున్న అధికారులకు కిట్లను అందించి మాట్లాడారు. సర్వేలో విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు గ్రామీణ ప్రాంతాల ప్రజలు విద్య, ఉద్యోగ, ఇతర కుల వృత్తుల ఆధారంగా నమోదుకు సమీక్షలు జరుపుతున్నట్లు తెలిపారు. మరో వైపు కులగణన సర్వేకు వెళ్లవలసిన ఉపాధ్యాయినులు వారికి అందించిన కిట్లను సీఎంఆర్ దుకాణం ప్రారంభానికొచ్చిన సినీ నటి సప్తమిగౌడ రావడంతో ఆమెను చూడటానికి వచ్చారు. తాలూకా విద్యాశాఖాధికారి ఈరణ్ణ, ఉప తహసీల్దార్ పరశురామ్లున్నారు. సిద్దారూఢ మఠానికి రూ.28.57 లక్షల కానుకలు హుబ్లీ: లక్షలాది మంది భక్తుల ఆరాధ్య దైవం సిద్దారూఢ మఠం సన్నిధిలో ఈ సారి రూ.28.57 లక్షల ఆదాయం లభించింది. ఆ మేరకు స్వామి వారి హుండీలను ఎస్బీఐ సిద్దారూఢ నగర శాఖ మేనేజర్, సిబ్బంది, భక్తుల సమక్షంలో ఆదివారం తెరిచి లెక్కించారు. లెక్కింపులో రూ.28.57 లక్షల కానుకలు హుండీల్లో లభించాయి. రూ.20 వేల విలువ చేసే బంగారు ఆభరణాలను భక్తులు సమర్పించారు. ఆగస్టు 20వ తేదీ నుంచి ఈ నెల 17వ తేదీ వరకు 27 రోజులకు గాను పైమొత్తంలో ఆదాయం లభించిందని మఠం మేనేజర్ ఈశ్వర్ తుప్పద ఓ ప్రకటనలో తెలిపారు. ఆభరణాల చోరుని అరెస్ట్ బళ్లారిటౌన్: గాంధీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఇంటిలో దోపిడీకి పాల్పడిన దొంగను అరెస్ట్ చేసి అతడి నుంచి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రైల్వే స్టేషన్ వద్ద ఉన్న రెండు ఇళ్లల్లో మార్చి, ఏప్రిల్ నెలల్లో చోరీలు జరిగినట్లు కేసులు దాఖలు చేసుకున్న పోలీసులు తెలిపారు. ఆదివారం రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా జాడలదిన్ని గ్రామానికి చెందిన నాగరాజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, నిందితుడి నుంచి 74 గ్రాముల బంగారు ఆభరణాలు, నగదు కలిపి రూ.7 లక్షల వరకు సొత్తు స్వాధీనపరచుకున్నట్లు తెలిపారు. అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం రాయచూరు రూరల్: గ్రామాల్లో అభివృద్ధికి ప్రామాణికంగా ప్రయత్నిస్తామని, ప్రజల సహకారం అవసరమని గ్రామీణ శాసన సభ్యుడు బసవనగౌడ దద్దల్ పేర్కొన్నారు. సోమవారం దేవసూగూరులో 451 అడుగుల వీరభద్రేశ్వర స్వామి, ఆంజనేయ స్వామిల విగ్రహ నిర్మాణాలకు, వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి మాట్లాడారు. భవిష్యత్తులో గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దడానికి మరింతగా పాటు పడుతానని అన్నారు. -
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
బొమ్మనహళ్లి: దసరా పర్వదినాల నేపథ్యంలో కర్ణాటక తెలంగాణ కల్చలర్ అసోయేషన్ (కేటీసీఎ) ఆధ్వర్యంలో బెంగళూరు నగరంలోని సీవి.రామన్ నగరలో డీఆర్డీఓ కమ్యూనిటీ హాల్లో బతుకమ్మ సంబరాలు ఆనందోత్సాహాలతో జరిగాయి. ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రారంభమైన వేడుకలకు బెంగళూరు నలుమూలల నుంచి తెలంగాణ మహిళలు తరలివచ్చారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలను జరుపుకొన్నారు. వివిధ రకాల పూలతో ఇంపుగా బతుకమ్మలను సిద్ధం చేసి ఇళ్ల నుంచి తీసుకువచ్చారు. మహిళలు, చిన్నారులు రంగురంగుల పట్టువస్త్రాలను ధరించి వచ్చారు. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. చన్నీటి జలకాలు ఉయ్యాలో.. ముత్యమంత పసుపు ఉయ్యాలో అని రాగయుక్తంగా పాటలు పాడుతూ లయబద్ధంగా నృత్యమాడారు. సొంతూళ్లకు వెళ్లలేకపోయినా ఇక్కడే బతుకమ్మ సంబరాలను జరుపుకొని ఆ లోటును తీర్చుకున్నట్లు పలువురు మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. సిలికాన్ సిటీలో తెలంగాణ మహిళల సంప్రదాయ వైభవం -
కన్నపేగు ఎంత కఠినం?
సాక్షి, బళ్లారి: మొదటి కాన్పు, రెండవ కాన్పులో ఆడపిల్లలే పుట్టారు, మూడవ కాన్పులో మగపిల్లవాడు పుడతాడని భావించిన తల్లి ఆడపిల్ల పుట్టిందని పేగుబంధాన్ని తెంచుకుని, ఆ బిడ్డను తుంగభద్ర కాలువలోకి విసిరేసింది. బళ్లారి జిల్లాలోని సండూరు తాలూకా తోరణగల్లులో ప్రియాంక దేవి అనే కఠినాత్మురాలు ఈ ఘోరానికి ఒడిగట్టింది. ఆమె భర్త సనోజ్కుమార్ జిందాల్లో ఉద్యోగి, బిహార్ కి చెందిన ఈ దంపతులు తోరణగల్లులో ఉంటున్నారు. రెండు నెలల కిందట ఆమెకు ఆడపిల్ల పుట్టింది. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆనాటి నుంచి కోపంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో శనివారం వేకువన పసిపానను నీటి కాలువలోకి పడేసింది. ఏమీ తెలియనట్లు తోరణగల్లు పోలీస్టేషన్లో బిడ్డ కనిపించడంలేదని విలపిస్తూ నటించింది. పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా తల్లి కాలువ వద్దకు తీసుకెళ్తున్న దృశ్యం కనిపించింది. కసాయి తల్లిని గట్టిగా ప్రశ్నించగా నేరం ఒప్పుకుంది. ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపారు. సోమవారం ఉదయం శిశువు శవం దొరికింది. పసిబిడ్డను కాలువలోకి విసిరేసింది మూడోసారి ఆడపిల్ల పుట్టిందని ఓ తల్లి దురాగతం -
అవాంతరాల నడుమ కులగణన
శివాజీనగర: పలు వివాదాల మధ్యలో కర్ణాటకవ్యాప్తంగా సోమవారం నుంచి సామాజిక విద్యా ఆర్థిక సమీక్ష (కుల గణన)కు ఆదిలోనే హంసపాదులు ఎదురయ్యాయి. శివమొగ్గలో నమోదు కిట్ల కోసం ఉపాధ్యాయులు బీఈఓ ఆఫీసుకు వచ్చినా సమయానికి అందజేయలేదు. శిక్షణ అరకొరగా ఇచ్చారని ఉపాధ్యాయులు ఆరోపించారు. మొబైల్ యాప్ ఓపెన్ కావడం లేదని పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు వచ్చాయి. తాము ఎక్కడికి వెళ్లి సర్వే చేయాలనేది ఆదేశాలు రాలేదని మరికొందరు వాపోయారు. సమస్య ఉండొచ్చు: మంత్రి మధు శివమొగ్గ బీఇఓ కార్యాలయానికి వచ్చిన విద్యా మంత్రి మధు బంగారప్ప ఉపాధ్యాయులతో మాట్లాడి కిట్లను అందజేశారు. కుల గణన గురించి వివాదాలు ముగిశాయి, టెక్నికల్ సమస్య ఉంటే యాప్ ఓపెన్ కాదు, బళ్లారిలో కూడా యాప్ని ఓపెన్ చేయగా ఎరర్ అని వచ్చింది యాప్ ప్రారంభానికి అధికారులు కాచుకొని కూర్చొన్నారు. యాప్ ఓపెన్ కావడంతో గణన మొదలైంది. హావేరిలో కూడా టెక్నికల్ సమస్య ఎదురైంది. ఇళ్లకు అతికించిన యూహెచ్ఐడీ నంబర్ను మొబైల్ యాప్తో స్కాన్ చేస్తే ఎర్రర్ అని వచ్చిందని చెప్పారు. ఇలాంటి అవాంతరాలతో ఉపాధ్యాయులు, జనం అవస్థలు పడ్డారు. చిత్రదుర్గలో కూడా చిత్రదుర్గలో మంత్రి డీ సుధాకర్ సమీక్షను ప్రారంభించారు. అయితే యాప్లో సాంకేతిక సమస్యలు వచ్చాయి. హుబ్లీలో కూడా కొన్ని టెక్నికల్ సమస్యలు ఎదురయ్యాయి. ఉపాధ్యాయులకు ఏరియాల కేటాయింపులో గందరగోళం నెలకొంది. ఎవరు ఏ ప్రాంతానికి వెళ్లాలో చెప్పేవారు కరువయ్యారు. గదగ్లో 6,509 మంది సిబ్బంది సమీక్షలో పాల్గొన్నారు. బ్యాగ్, గణన కిట్, ఐడీ కార్డు, క్యాప్లు అందజేశారు. తొందరపాటు వద్దు: కులసంఘాలు కుల గణన తొందరపాటుతో చేస్తున్నారు, కొంతకాలం వాయిదా వేయాలి. 15 రోజుల్లో మొత్తం గణన జరిపేందుకు సాధ్యపడదు. లేదా గడువును పొడిగించాలని ఒక్కలిగ, లింగాయత్లు డిమాండ్ చేశారు. సోమవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆ వర్గాల నాయకులు కలిశారు. 3 నెలల పాటు వాయిదా వేయాలని విన్నవించారు. పలుచోట్ల యాప్ ఎర్రర్ సిబ్బందికి దిశా నిర్దేశం కరువు -
హోసూరు బస్టాండ్లో సమస్యల మోత
హుబ్లీ: జంట నగరాల ప్రజలతో పాటు రాష్ట్రంలోనే పేరు మోసిన ధార్వాడ జిల్లా రవాణా శాఖ జిల్లా కేంద్రంలో ధార్వాడతో పాటు హుబ్లీలో మూడు ప్రధాన బస్టాండ్లు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. ప్రధానంగా గోకుల్ రోడ్డు బస్టాండ్ ద్వారా అంతర్జాతీయ, రాష్ట్ర ప్రయాణికులకు సేవలు అందుతున్నాయి. ఇక తాతల కాలం నాటి చెన్నమ్మ సర్కిల్లోని పాత బస్టాండ్ పునర్నిర్మాణానికి నోచుకొని ప్రయాణికులకు తగిన సేవలు అందిస్తోంది. హోసూరు ప్రాంతీయ బస్టాండ్లో తాగునీటి కోసం కొన్ని ప్లాట్ఫారాల్లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత కేంద్ర మంత్రి ప్రహ్లాద్జోషి కార్పొరేట్, సామాజిక బాధ్యత తదితర నిధుల ద్వారా హోసూరు బస్టాండ్ కింద భాగంలో ఒక రూపాయి కాయిన్తో ఒక లీటర్ తాగునీరు వచ్చేలా ఏర్పాటు చేశారు. అయితే చిన్న ఒక్క రూపాయి కాయిన్ తప్పకుండా తీసుకురావాల్సిందే. రూపాయి కాయిన్ వేస్తేనే నీరు ఇక్కడ ఎందుకంటే ఆ చిన్న రూపాయి కాయిన్ వేస్తేనే నీరు లభిస్తాయి. లేకపోతే బాటిల్ నీరుకు రూ.10–20 ఖర్చు పెట్టక తప్పడం లేదు. ఇక బీజాపూర్ ప్రాంగణానికి వస్తే ఇక్కడ ఫిల్టర్ నిర్మాణం ఏర్పాటు అయి తాగునీటి సరఫరా కొన్నాళ్ల పాటు అందుబాటులో ఉండగా ఇటీవల కొన్ని నెలల పాటు ఈ ఫిల్టర్ యంత్రాలు పని చేయడం లేదు. దీంతో ఇక్కడ తాగునీరు బంద్ అయింది. డబ్బులు లేని పేద వారు ఒక్క రూపాయి కాయిన్ పట్టుకొని అల్లంత దూరంలోని మరో ప్లాట్ఫాంలోకి వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. అలాగే ఇక్కడ సబ్ వే నిర్మాణం, అండర్ గ్రౌండ్ పాస్, పైవంతెన పాస్ సేవలు బాగున్నాయి. ఇక్కడ పరిశీలిస్తే ఓ మరుగుదొడ్డి బంద్ అయినట్లుగా కనిపిస్తోంది. పక్కన ఉన్న దుకాణం నిర్వాహకులను విచారిస్తే ఇది చాలా ఏళ్ల నుంచి బంద్ అయింది. ఇది నిరుపయోగంగా మూలన పడిందన్నారు. వృద్ధులకు తప్పని తిప్పలు ఇక ఇక్కడ మూత్రవిసర్జన, ఉచితంగా మరుగుదొడ్డికి రూ.5 చెల్లించడం కాస్త ప్రయాణికులకు ఊరటనిచ్చే విషయం. అయితే కింది భాగంలోని ప్లాట్ఫాంలో బస్సులను చేరుకోవాలంటే మెట్లు దిగక తప్పని పరిస్థితి నెలకొంది. దిగేటప్పుడు వృద్ధులు, ఇతర అనారోగ్య ఇబ్బందులు ఉన్న వారు చాలా తిప్పలు పడక తప్పడం లేదు. మొత్తానికి అటు అంతర్రాష్ట్ర, ఇటు వివిధ జిల్లాలకు, బీఆర్టీఎస్ చిగరి బస్సుల రవాణాకు ఈ బస్టాండ్ ద్వారానే ప్రయాణికులకు అందుబాటులో ఉండటం విశేషం. వీలైనంత త్వరగా మరమ్మతుకు గురైన బీజాపూర్ ప్లాట్ఫాం సమీపంలోని తాగునీటి ఫిల్టర్ యూనిట్ను తక్షణమే బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సంబంధిత అధికారులతో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రి సంతోష్ లాడ్, కేంద్ర మంత్రి, ఈ ప్రాంత ఎంపీ ప్రహ్లాద్జోషి, ఇతర సంబంధిత ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. పని చేయని ఫిల్టర్ యూనిట్లు నిరుపయోగంగా మరుగుదొడ్డి -
ఏ కులమో చెప్పాలంతే..
శివాజీనగర: పలు సముదాయాల వ్యతిరేకత, సొంత మంత్రుల అసంతృప్తుల మధ్య నేడు సోమవారం నుంచి రాష్ట్రంలో మరో దఫా సామాజిక, విద్యా, ఆర్థిక సమీక్ష (కుల గణన) ఆరంభం కానున్నది. రాష్ట్ర వెనుకబడిన వర్గాల శాశ్వత కమిషన్ రాష్ట్రంలో 7 కోట్ల మంది వివరాలను గణన సిబ్బంది నమోదు చేస్తారు. అక్టోబరు 7 వరకు ఈ సర్వే కొనసాగుతుంది. సర్వే కోసం 1.75 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను నియమించారు. ప్రతి ఇంటిలోనివారిని 60 ప్రశ్నలను అడిగి, ఆ సమాచారాన్ని ఫారంలో నమోదు చేయాలి. రాష్ట్రంలో కులగణను చేయడం ఇది రెండవసారి. కొన్నినెలల కిందట వెలువరించిన కులగణనపై ప్రముఖ కుల సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో సిద్దరామయ్య సర్కారు మళ్లీ ఇప్పుడు సర్వేకు శ్రీకారం చుట్టింది. ప్రతి ఇంటికీ వెళ్లాలి ఏ ఇంటినీ వదలకుండా గణనను పూర్తి చేయాలని సర్కారు పట్టుదలతో ఉంది. ఈ బృహత్ కార్యంలో మీటర్ రీడర్ల సహకారం తీసుకుంటోంది. వారి సహాయంతో టీచర్లు ప్రతి ఇంటికీ వెళతారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరి కులం, వివరాలను ప్రత్యేక కాలమ్స్లో రాయాలి. సర్వే చేసే ఇంటికి జియో ట్యాగ్ స్టిక్కర్లను అతికించి నంబరును కేటాయిస్తారు. క్రైస్తవ కులాల నమోదు వివాదం రేకెత్తిస్తోంది. లింగాయత క్రిస్టియన్, ఒక్కలిగ క్రిస్టియన్, ఫలానా క్రిస్టియన్.. ఇలా గతంలో ఏ కులానికి చెందినవారో దానికి నమోదు చేయాలి. మతమార్పిడి చేసుకున్నా కూడా హిందూ మూల కులాన్ని చేర్చాలనడం రభస సృష్టిస్తోంది. సామాజిక స్థాయి నిర్ధారణకే ఆదివారం బెంగళూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడిన రాష్ట్ర వెనుకబడిన వర్గాల కమిషన్ అధ్యక్షుడు మధుసూదన్ నాయక్.. 1,561 కులాల్లో 33 కులాలను విడిచిపెట్టినట్లు తెలిపారు. గతంలో కాంతరాజు కమిషన్ సమీక్షలో ఉన్న సమాచారం కాలంలను ఉపయోగించుకొని సర్వే చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమాచారాన్ని సముదాయాల ఆర్థిక, సామాజిక పరిస్థితిని తెలుసుకోవడానికే తప్ప మరో ఉద్దేశం కోసం ఉపయోగించటం లేదన్నారు. ఆధార్కార్డు తప్పనిసరి, ప్రతి ఒక్కరు ఆధార్ నంబరును చూపాలన్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, మార్కుల జాబితా వంటి ఆధారాలను చూపించాలని తెలిపారు. బెంగళూరులో ఆలస్యం రాజధాని బెంగళూరులో మాత్రం రెండు మూడురోజుల తరువాత నుంచే సర్వే మొదలవుతుంది. ఉపాధ్యాయులకు శిక్షణ ఒక వారం ఆలస్యం, గ్రేటర్ బెంగళూరు వ్యవహారాలు ఇందుకు కారణమని సమాచారం. సర్వేకు నగరంలో అదనపు సిబ్బందిని నియమించినట్లు మధుసూదన్ నాయక్ తెలిపారు. నేటి నుంచి మళ్లీ సామాజిక సమీక్ష బెంగళూరులో 2, 3 రోజులు ఆలస్యం 60 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలి 1.75 లక్షల మంది ఉపాధ్యాయుల ఏర్పాటు వారికి మీటర్ రీడర్ల సహకారం -
పెద్దల ఆత్మశాంతికి..
బనశంకరి: మహాలయ అమావాస్య సందర్భంగా ఆదివారం ఐటీ నగరిలోని బళేపేటే సర్కిల్లోని పురాతన కాశీ విశ్వనాథ దేవస్థానం రోడ్డులో నగర ప్రజలు మహాలయ అమావాస్య పూజలు, పిండ ప్రదానం చేశారు. నగరం నలుమూలల నుంచి తరలివచ్చారు. తమ తమ పెద్దల ఆత్మశాంతికి విశేష కర్మకాండలను జరిపించారు. ఆలయం కిక్కిరిసిపోయింది. స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. విచారణకు తిమరోడి గైర్హాజరు యశవంతపుర: ఇంటిలో అక్రమంగా తుపాకీని ఉంచుకున్న ధర్మస్థల దుష్ప్రచారం కేసు నిందితుడు మహేశ్ శెట్టి తిమరోడి ఆదివారం బెళ్తంగడి పోలీసుల ముందు విచారణకు రాలేదు. దీనితో మళ్లీ పోలీసులు అతని ఇంటికి నోటీసును అంటించారు. పోలీసులు అరెస్ట్ చేసిన మొదటి ముద్దాయి చిన్నయ్యను విచారించి, ఉజిరెలోని తిమరోడి ఇంటిలో సోదాలు చేయగా రెండు తుపాకులు లభించాయి. దీంతో అతనిపై ఆయుధాల కేసును నమోదు చేసి విచారణకు రావాలని ఆదేశించినా ముఖం చాటేశాడు. -
జై దుర్గా నమోస్తుతే
మాలూరు: మహాలయ అమావాస్య కావడంతో తాలూకాలోని లక్కూరు గ్రామంలోని చెరువు కట్టపై వెలసిన పురాతన శ్రీదుర్గాదేవి ఆలయంలో ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారిని మల్లెలతో సుందరంగా అలంకరించారు. అర్చకులు వేణుగోపాలస్వామి పూజలు జరిగాయి. పంచామృత అభిషేకం, వేదమంత్ర పారాయణం, మహామంగళారతి గావించారు. పెద్దసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కుల సర్వే అవసరం: మంత్రిశివాజీనగర: కులగణనలో ఉపాధ్యాయులు బాగా పనిచేస్తున్నారు, బీజేపీ వివాదాలను సృష్టించే పని చేయరాదని విద్యా మంత్రి మధు బంగారప్ప అన్నారు. ఆదివారం బెంగళూరులో మాట్లాడిన ఆయన, కుల సమీక్ష చేయడం అవసరం, వివిధ సముదాయాల ఆర్థిక, సామాజిక పరిస్థితిని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఉపాధ్యాయులు తప్ప పర్యాయ వ్యవస్థ లేదు. దసరా సెలవులలోనే సర్వేను చేపట్టామని అన్నారు. బీజేపీ హయాంలో ఉపాధ్యాయులతో పనులు చేయించలేదా? అని అన్నారు. కులసమీక్ష అర్థవంతంగా, తప్పనిసరిగా కావాలి, ప్రజలు కూడా ఇందుకు సహకరించాలన్నారు. దసరా సెలవును పొడిగించే యోచన లేదన్నారు. అమ్మవారికి బలి పూజలుమండ్య: మండ్య తాలూకాలోని సాతనూరు గ్రామంలో ఘనంగా మసణమ్మ దేవి జాతరను నిర్వహించారు. ఆదివారం అమావాస్య కావడంతో వేలాది మంది భక్తులు కోళ్లు, పొట్టేళ్లు, మేకలతో వచ్చి వాటిని అమ్మవారి ఆలయం ముందు బలి ఇచ్చి పూజలు చేశారు. తరువాత మాంసంతో విందు చేసుకున్నారు. బంధుమిత్రులకు, భక్తులకు భోజనాలు వడ్డించారు. ఈ ఆచారం తరతరాలుగా సాగుతోంది. గ్రామంలో మసణమ్మదేవి పాత గుడి, కొత్త గుడి ఆని రెండు ఆలయాలు ఉన్నాయి. కొత్త గుడిలో రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ అమ్మవారిని ఊరేగించారు. పాత గుడిలో ప్రాణుల బలి సాగింది. దసరా ఛాయాచిత్ర ప్రదర్శన మైసూరు: ఆదివారం మైసూరు నగరంలో ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కళా మందిరంలో నాడ హబ్బ దసరా మహోత్సవాల సందర్భంగా దసరా ఛాయాచిత్ర ప్రదర్శనను మంత్రి హెచ్సీ మహాదేవప్ప ప్రారంభించారు. ఎమ్మెల్యే తన్వీర్ సేట్, ఎమ్మెల్సీ కే.శివకుమార్, జిల్లాధికారి జి.లక్ష్మికాంత్రెడ్డి, పోలీసు కమిషనర్ సీమా లాట్కర్ పాల్గొన్నారు. చెట్టుకు కారు ఢీ, ఇద్దరు మృతిగౌరిబిదనూరు: కారు డ్రైవరు అదుపు తప్పి చెట్టుకు ఢీకొన్న దుర్ఘటనలో కారు నుజ్జు నుజ్జు కాగా, సుదర్ళన్ (45), మహమ్మద్ రజాక్ (29) అనే ఇద్దరు చనిపోయారు. రాజు (48), ఆదిల్ (22) అనేవారికి గాయాలయ్యాయి. వీరందరూ బెంగళూరు కెంపాపుర కాలనీకు చెందినవారు. శనివారం పనిమీద గౌరిబిదనూరుకు వచ్చి ఆదివారం సాయంకాలం తిరిగి బెంగుళూరుకు వెళుతూ ఉండగా, తిప్పగానహళ్ళి వద్ద కారు చెట్టును ఢీకొట్టింది. నుజ్జు కాగా విడదీయడానికి జేసీబీని రప్పించారు. క్షతగాత్రులను బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. మంచేనహళ్ళి పోలీసులు కేసు నమోదు చేశారు. -
సెల్ఫీ తీసుకుంటూ లోయలోకి..
యశవంతపుర: మొబైల్ఫోన్ చేతిలో ఉంటే ఫోటోలు, సె ల్ఫీలు తీసుకుంటూనే ఉంటారు. దాని వల్ల కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అదే మాదిరిగా చిక్కమగళూరు జిల్లా కెమ్మణ్ణగుండిలో వ్యూ పాయింట్ వద్ద భార్యతో కలిసి సెల్పీ తీసుకుంటూ లోయలోకి పడిపోయాడో ఉపాధ్యాయుడు. ఈ ఘటన శనివారం జరిగింది. మొబైల్ జారిపడిందని.. వివరాలు.. శివమొగ్గ జిల్లా శికారిపురకు చెందిన ప్రభుత్వ టీచర్ సంతోష్, చిక్కమగళూరు జిల్లా తరీకెరె తాలూకా లక్ష్మీసాగర ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. భార్య శ్వేతతో కలిసి కెమ్మణ్ణగుండి టూర్కి వెళ్లారు. అక్కడ కొండ శిఖరం వద్ద ఇద్దరూ మొబైల్తో సెల్ఫీ తీసుకుంటున్నారు. మొబైల్ చేజారటంతో సంతోష్ కంగారుపడ్డాడు, దీంతో అతడు జారి వందల అడుగుల లోయలోకి పడిపోయాడు. తలకు బండరాయి తగిలి బలమైన గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. కాగా, వీరిద్దరికీ ఐదేళ్ల క్రితం పెళ్లయింది. దసరా సెలవులు రావడంతో విహారయాత్రకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. పోలీసులు, ఫైర్ సిబ్బంది లోయలోకి దిగి మృతదేహాన్ని తీసుకొచ్చారు. కళ్లముందే భర్త మరణంతో భార్య కన్నీరుమున్నీరైంది. భార్య కళ్లముందే భర్త మృతి -
బొజ్జ గణపతికి ఘోర అపచారం
బనశంకరి: తొలి పూజలు అందుకునే విఘ్న నాయకునికి ఘోర అపచారం జరిగింది. భక్తజనం కన్నీటి పర్యంతమయ్యేలా విఘ్నేశ్వరుని మూలవిరాట్టుమీద చెప్పలహారాన్ని వేశారు. ఈ దురాగతం హాసన్ జిల్లాలో చోటుచేసుకుంది. బేలూరు పట్టణం నడిబొడ్డున గల శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానంలో జరిగిన అపచారంపై భక్తులు, హిందూ సంఘాలు తీవ్ర ఆవేదనను వ్యక్తంచేస్తున్నారు. ముసుగు మహిళ అకృత్యం వివరాలు.. ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో కొందరు భక్తులు దేవుని దర్శనానికి వచ్చారు. గణపతి మూర్తి మీద రెండు చెప్పులను దారంతో కట్టి వేసి ఉండడాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు. వెంటనే విగ్రహం నుంచి తీసి వేశారు. ఈ వార్త కార్చిచ్చులా జిల్లా అంతటా వ్యాపించడంతో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దుండగులను తక్షణం అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. దేవున్ని అవమానించినవారిని అరెస్టు చేసి శిక్షించాలని పట్టుబట్టారు. పోలీసులు ఆలయ సీసీ కెమెరాల చిత్రాలను పరిశీలించగా ముసుగు వేసుకుని ఓ మహిళ లోపలికి వెళ్లి వస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆమె ఈ అపచారానికి పాల్పడినట్లు అనుమానాలున్నాయి. జిల్లా ఎస్పీ మహమ్మద్ సుజీత ఆలయానికి వచ్చి తనిఖీ చేశారు. అనుమానితురాలి అరెస్టుకు పలు బృందాలను చుట్టుపక్కల జిల్లాలకు పంపించారు. సదరు మహిళ చిక్కమగళూరు బస్టాండులో కనిపించినట్లు సమాచారం వచ్చింది. ఇలాంటి దుశ్చర్యలు తగదు మతకలహాలను సృష్టించడానికి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, సాయంత్రంలోగా అరెస్ట్ చేయకపోతే సోమవారం బేలూరు బంద్ కు పిలుపునిస్తామని హిందూ సంఘాల నేతలు, భక్తులు హెచ్చరించారు. బేలూరు ను సందర్శించిన ఎమ్మెల్సీ సీటీ.రవి పదేపదే హిందువుల భావనలకు భంగం కలిగించే పనులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎవరు తప్పుచేసినా కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే హెచ్కే.సురేశ్ మాట్లాడుతూ ఆ మహిళను అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని, లేని పక్షంలో తీవ్రపోరాటం చేస్తామని హెచ్చరించారు. మూల విరాట్టుకు చెప్పుల దండ హాసన్ జిల్లా బేలూరు వినాయక ఆలయంలో దుస్సంఘటన భగ్గుమన్న భక్తులు, హిందూ సంఘాలు అనుమానిత మహిళ అరెస్టు చిక్కమగళూరులో మహిళ అరెస్టు ఈ అకృత్యానికి పాల్పడిన మహిళను చిక్కమగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. ఆమె చిక్కమగళూరులోని దాసరహళ్లి నివాసిగా కనిపెట్టారు. స్థానిక పోలీసులు సీసీ కెమెరాల చిత్రాల ఆధారంగా గుర్తించి ఇంటికి వెళ్లి పట్టుకున్నారు. ఆమెను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. -
లోకాయుక్త వలలో పంచాయతీ టైపిస్ట్
హుబ్లీ: భవన నిర్మాణ అనుమతులకు లంచం తీసుకుంటూ పంచాయతీ టైపిస్ట్ లోకాయుక్త వలకు చిక్కుకున్నాడు. ఈ ఘటన జిల్లాలోని అల్నావరలో చోటు చేసుకుంది. సంతోష్ పూజార్ అనే వ్యక్తి భవన నిర్మాణం కోసం ఆ తాలూకా పట్టణ పంచాయతీలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అనుమతులు కావాలంటే లంచం ఇవ్వాలని టైపిస్టు దిపక్ కిత్తూర డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు లోకాయుక్తకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుదారుడి నుంచి టైపిస్టు రూ.12 వేలు లంచం తీసుకుంటున్న సమయంలో లోకాయుక్త డీఎస్పీ వెంకనగౌడ పాటిల్ నేతృత్వంలోని బృందం దాడి చేసింది. దిపక్ కిత్తూరను అరెస్ట్ చేశారు.ఆయుర్వేద సమ్మేళనానికి డాక్టర్ ప్రశాంతహుబ్లీ: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈనెల 27, 28 తేదీల్లో జరగనున్న జాగృతిక ఆయుర్వేద మహాసమ్మేళనంలో హెగ్గేరిలోని ప్రముఖ ఆయుర్వేద కళాశాల ఆస్పత్రి ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రశాంత ప్రధాన ఉపన్యాసకులుగా పాల్గొననున్నారు. మర్మ చికిత్సలపై చర్చ గోష్టి, నాడి పరీక్షపై ఈ సదస్సులో ఆయన ప్రసంగిస్తారని వైద్య సిబ్బంది ఓ ప్రకటనలో తెలిపారు. నేటి నుంచి వైద్య శిబిరం ఆస్పత్రిలో భుజం నొప్పులకు సంబంధించి కాయచికిత్స విభాగం ద్వారా ఈనెల 22 నుంచి 27 వరకు వైద్య చికిత్స శిబిరం నిర్వహించనున్నారు. భుజం, గొంతు నొప్పి అలాగే చేతులను పైకి ఎత్తడానికి ఇబ్బందులు పడుతున్న వ్యక్తులకు ప్రత్యేక చికిత్స చేస్తామని కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంత ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలకు 8073990924 నంబర్కు సంప్రదించాలని పేర్కొన్నారు. నియామకంహొసపేటె: కొప్పళ నగరంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఎస్సీ యూనిట్ విభాగం నాయకుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ షెడ్యూల్డ్ కుల విభాగం జిల్లా ఉపాధ్యక్షుడిగా పరశురాం కెరెహళ్లి నియమితులయ్యారు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షుడు అమరేగౌడ బయ్యపుర, ఎస్సీ యూనిట్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ధర్మసేన్ ఆదేశాలతో నియామక ఉత్తర్వులు అందజేశారు. ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణానికి హాని హొసపేటె: ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణానికి హాని జరుగుతుందని స్నేహ యువ బలగం సభ్యులు సూచించారు. ఆదివారం పాపినాయకనహళ్లి దాల్మియా కాలనీలో ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి జరిగే నష్టాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి దుకాణాన్ని సందర్శించి, దుకాణ యజమానులు, వినియోగదారులకు ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే దుష్పలితాలు, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాల ప్రాముఖ్యతను వివరించారు. ప్లాస్టిక్ వదిలి పర్యావరణాన్ని కాపాడుకుందాం.. పచ్చదనం కోసం ముందుకు సాగుదాం, ప్లాస్టిక్ వదిలివేద్దాం, అందరికి ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిద్దామని నినాదాలు చేశారు. స్నేహ యువ బలగలోని 30 మంది సభ్యులు ఉత్సాహంగా అవగాహన ప్రచారంలో పాల్గొన్నారు. విజ్ఞాన శాస్త్రంపై విద్యార్థులకు అవగాహన రాయచూరు రూరల్: స్థానిక విజ్ఞాన కేంద్రంలో ఆదివారం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు క్రై సంస్థ, ఓరెకల్ ఆధ్వర్యంలో విజ్ఞాన శాస్త్రంపై అవగాహన కల్పించారు. ఆకాశం, గ్రహాలు, భూమి చలనాలు, గ్రహాల ఆవిర్భావంపై అజిత్ వివరించారు. కేంద్రంలో మానవుడి శరీరంలోని అవయవాలపై పరిచయం, వైజ్ఞానికంగా మానవుడి దేహంలో జరిగే హర్మోన్ మార్పులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అనిల్ కుమార్, హఫీజుల్లా తదితరులు పాల్గొన్నారు. -
కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు
బళ్లారి టౌన్: ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇటీవల జాతి సమీక్ష పేరుతో కులాల్లో చిచ్చు పెట్టే కుతంత్రాలు చేస్తున్నారని బీజేపీ నేత, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని వాజ్పేయి లేఅవుట్లోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మిషనరీల ఒత్తిడితో ఈ జాతి సమీక్ష కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ సమీక్షకు సంబంధించిన 1,400 జాతుల పట్టికను వెల్లడించిందని.. అయితే ఈ పట్టిలో అనాధికృత క్రైస్తవ జాతులను చేర్పించిందన్నారు. సమాజంలో వివిధ జాతుల్లో చిచ్చు పెట్టే ధోరణిని ముఖ్యమంత్రి మానుకోవాలని హితవు పలికారు. ఈనెల 22 నుంచి చేపడుతున్న దోషపూరిత జాతుల పట్టికలను సరి చేయాలన్నారు. 12 శతాబ్దంలో బసవన్న మానవ కులమంతా ఒకటి కావాలని కనకదాసులు కూడా కొట్లడుకోరాదని వారి వచనాల్లో చెప్పారన్నారు. బసవన్న సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నడుచుకుంటుందని దుయ్యబట్టారు. జిల్లాలో తాను మంత్రిగా ఉన్నప్పుడు చాగనూరు వద్ద అంతర్జాతీయ విమాన నిర్మాణానికి ఆనాడు భూములను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలోనే విమానాశ్రయం నిర్మించడం మంచిదని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లాధ్యక్షుడు అనిల్ కుమార్, నేతలు కేఎస్ దివాకర్, గుర్రం వెంకటరమణ, కేఏ రామలింగప్ప, గురులింగన గౌడ, రామచంద్రప్ప పాల్గొన్నారు. -
‘జిల్లా ఇన్చార్జ్ మంత్రిని దూషించడం తగదు’
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా ఇన్చార్జ్ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ను మాజీ నగర సభ అధ్యక్షుడు సుఖాణి దూషించడం తగదని కాంగ్రెస్ పార్టీ వెనుకబడిన వర్గాల ఉపాధ్యక్షుడు టి.మారెప్ప హితవు పలికారు. ఇటీవల జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ను పొగడి.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ను దూషించి మెప్పు పొందడం తగదన్నారు. జిల్లాకు అన్ని ఆరోగ్య సౌలభ్యాలు కల్పించిన మంత్రిని దూషించారని మండిపడ్డారు. మంటలకు దుస్తుల దుకాణం ఆహుతికోలారు: అగ్ని ప్రమాదంలో బట్టల దుకాణం ఆహుతైన ఘటన నగరంలో చోటు చేసుకుంది. ఎంజీ రోడ్డులో ఓ వ్యక్తి బట్టల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఉన్నఫళంగా మంటలు చెలరేగడంతో సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అనంతరం మంటలు ఎగసి పడి భారీ ఎత్తున వస్త్రాలు, ఇతర ఫర్నీచర్, కంప్యూటర్ యూపీసీఎస్ తదితర సామగ్రి కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు. రూ.25 లక్షల నష్టం జరిగినట్లు యజమాని చెబుతున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. -
త్వరితగతిన పనులు పూర్తి చేయాలి
రాయచూరు రూరల్: యరమరాస్ విమానాశ్రయం పనులపై రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. శనివారం సాయంత్రం విమానాశ్రయం వద్ద జరుగుతున్న పనులను పరీశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. రన్ వే, సీఆర్ఏఫ్, ఏటీసీ భవనాలు, మాస్టర్ప్లాన్ను కాల పరిమితిలోపు పూర్తి చేయాలన్నారు. యరమరాస్ వద్ద పేదలకు పంపిణీ చేయడానికి నిర్మించిన 2,419 ఇళ్లను పరిశీలించారు. 322 ఎకరాల ప్రాంతంలో నాలుగు కి.మీ దూరం రక్షణ గోడల నిర్మాణ పనుల వివరాలపై ఆరా తీశారు. పనులు నాణ్యతగా చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు జుబీన్ మోహపాత్రో, ఏసీ గజానన, వెంకటేష్, భాళప్ప తదితరులు పాల్గొన్నారు. -
కన్నడ భాషకు ప్రోత్సాహం ఇవ్వాలి
రాయచూరు రూరల్: కన్నడ భాషకు ప్రోత్సాహమివ్వాలని మైసూరు జిల్లా మాజీ జిల్లాధికారి సోమశేఖర్ కోరారు. ఆదివారం పండిత సిద్ధరామ జంబలదిన్ని రంగ మందిరంలో బెళుకు ప్రతిష్టాన సాంస్కతిక వేదిక ఆధ్వర్యంలో సేవలకు జాతీయస్థాయి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటికి తెలుగు, కన్నడ కలిపి మాట్లడటం జరుగుతోందన్నారు. భవిష్యత్తులో కన్నడ భాషకు అధిక ప్రాదాన్యత కల్పించాలన్నారు. ఇతర భాషలు కన్నడ భాషకు గొడ్డలిపెట్టుగా మారాయన్నారు. అన్య భాషలను కూడా గౌరవించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ పుట్ట మాదయ్య, క్రిష్ణ, నరసింహులు వడవాటి, సురేంద్ర బాబు, చెన్న బసవ, విజయ్ జాగటగల్, బెళుకు సంస్థ అధ్యక్షుడు అణ్ణప్ప మేటి పాల్గొన్నారు. -
అసమానతలకు చరమగీతం పాడదాం
బళ్లారి అర్బన్: శ్రమిక వర్గాలు సంపద యజమానులుగా ఎదిగితేనే సమాజంలో అసమానతలకు చరమగీతం పలకవచ్చని ఎస్యూసీఐ కమ్యూనిస్ట్ పోలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ కె.రాధకృష్ణ తెలిపారు. విద్యా, సంస్కృతి, మానవత, పరిరక్షణ నినాదంతో స్థానిక బలిజ భవన్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కార్యకర్తల అధ్యాయన శిబిరంలో రెండు రోజు సమాజ పరివర్థన యళ్లి విద్యార్థుల యాత్ర గురించి మాట్లాడారు. పీడిత, తాడిత పెట్టుబడి దారి వ్యవస్థలో కుల, మత, భాష, జాతి, విభజనల ద్వారా ప్రజల్లో అనైక్యత సృష్టించారన్నారు. సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న ఆకలి, పేదరికం, నిరుద్యోగం, విద్య, వ్యాపారంగా మారిన సామాజిక సమస్యలు కేవలం ఓ మతం, కులానికి పరిమితం కాలేదు. అన్ని కులాల మతాల నిరుపేదలు ఈ సమస్యల వలయంలో చిక్కుకున్నారని తెలిపారు. పీడిత తాడిత వ్యవస్థను అంతం చేసి సమాజ వాదాన్ని నెలకొల్పినప్పుడే అసమానతలకు చరమగీతం పలకవచ్చన్నారు. అన్ని సమస్యలకు పరిష్కరం చూపవచ్చని వెల్లడించారు. కార్యక్రమంలో ఆ సంస్థ ప్రముఖులు కళ్యాణ కుమార్ అశ్విన్, అజయ్ కామత్, అభయ దివాకర, తదితరులు పాల్గొన్నారు. -
వేధిస్తున్న వీధి పశువుల బెడద
సాక్షి, బళ్లారి: నగరంలో మూగ జీవాల సంచారం అధికమైంది. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ తిష్ట వేస్తున్నాయి. కొందరు పశువుల యజమానులు వాటిని తమ ఇంటి వద్ద ఉంచుకోకపోవడంతో పాటు వాటికి గడ్డి, మేత వేయకుండా రోడ్లపైకి వదిలేస్తున్నారు. సాధారణంగా పల్లెటూర్లలో అయితే పలాన పశువు పలాన వ్యక్తికి చెందినదని గుర్తు పట్టేందుకు వీలవుతుంది. పల్లెటూర్లలో వీధి పశువులు తిరిగితే లేదా ఎవరైనా ఇతర రైతుల పొలాల్లోకి వెళితే వాటిని పట్టుకుని సంబంధిత పశువుల యజమాని ఇంటికి వెళ్లి మందలిస్తారు. మళ్లీ పొలాల్లోకి వస్తే జాగ్రత్త సుమా అని హెచ్చరించి వస్తుండటంతో పల్లెటూర్లలో వీధి పశువుల బెడద నియంత్రణలో ఉంటుంది. అయితే పెద్ద పెద్ద నగరాల్లో రోడ్ల మీదకు వచ్చే పశువులు ఎవరివన్నది ఎవరికీ తెలియడం లేదు. దీంతో పాటు మహానగర పాలికె అధికారులు, పాలకులు కూడా వీధి పశువులను కట్టడి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఏటేటా రోడ్లలో పదుల సంఖ్యలో కాదు వందల సంఖ్యలో పెరిగిపోతున్నాయి. రోడ్లపైనే సంచారం నగరంలోని 39 వార్డులతో పాటు ప్రధాన రహదారుల్లో కూడా నిత్యం వీధి పశువులు రోడ్లలో సంచరిస్తూ అక్కడే పడుకోవడం చేస్తుంటాయి. వీధి పశువులకు బజారులో హోటల్ యజమానులు పడేసే మిగిలి పోయిన ఆహారం, కుళ్లిన కూరగాయలు, పేపర్లు, ఇంకా నగరంలోని పశువులపై ఉన్న భక్తితో వారు తమ ఇంటి వద్దకు వస్తే బియ్యం లేదా సద్ది అన్నం, ఇతరత్ర వాటిని ఆహారంగా ఇవ్వడంతో వాటిని తింటూ జీవిస్తున్నాయి. వీటికి యజమానులు ఎవరో ఎవరికీ తెలియదు. కొన్ని పశువులు ఆయా ఇంటి యజమానుల దగ్గరకు వెళ్లి అలా వచ్చి రోడ్లపై సంచరిస్తుంటాయి. కొందరు పశువుల యజమానులు వీధుల్లోకి తమ పశువులను వదిలి ఎవరికీ తెలియకుండా వాటిపై ఒక కన్ను పెడుతూ నిత్యం పర్యవేక్షణ చేసుకుంటూ వాటిని వీధుల్లోనే పెరిగే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు. పెద్దవి అయిన తర్వాత వాటిని కసాయిఖానాకు అమ్మేసేవారు కూడా కొందరున్నారు. ఏది ఏమైనా ఇంటి వద్ద పశువులను పెంచితే వాటికి ఆహారం(గడ్డి, మేత) అందించేందుకు కష్టమవుతోందని సులభంగా పశువులు పెరిగే విధంగా వీధుల్లోకి వదిలి యజమానులు పెంచుకుంటుండటంతో నగర ప్రజలకు శాపంగా మారింది. పశువులపై దూసుకెళ్తున్న వాహనాలు రోడ్లలో పశువులు విచ్చల విడిగా తిరుగుతుండటంతో ఒక్కొక్కసారి అదుపు తప్పిన వాహనాలు పశువుల పైకి దూసుకెళ్లడంతో మూగ జీవాలు కాళ్లు విరిగిపోయి అవి రక్తం కారుస్తూ చేసే రోదనలు చూడటం ఎవరి తరం కాకున్న సందర్భాలు కోకొల్లలు. ఓ వైపు రోడ్లలో పశువులపైకి వాహనాలు దూసుకెళ్లి అవి ప్రమాదాలకు గురవుతుంటే మరో సందర్భంలో పశువులు వాహనాలకు అడ్డంగా రావడంతో నియంత్రణ తప్పి ద్విచక్రవాహనదారులు ఎన్నో సార్లు కిందపడి ప్రమాదాలకు గురవుతున్నారు. వీధి పశువుల యజమానులు స్వార్థంతో, నిర్లక్ష్యంతో పశువులను వీధుల్లోకి వదలడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీధి పశువుల యజమానులు నిర్లక్ష్యం ఓ వైపు ఉంటే నగరంలో వీధి పశువులను రోడ్లపై తిరిగినప్పుడు వాటికి అడ్డుకట్ట వేయాల్సిన మహానగర పాలికె అధికారులు, పాలకులు మరింత నిర్లక్ష్యంగా, అలసత్వంగా, బాధ్యతారహితంగా పని చేస్తుండటంతో మూగ పశువులు ప్రమాదాలకు గురవుతున్నాయి. పాదచారులు, ద్విచక్ర వాహనాల్లో వెళ్లే వారికి, ఇతర వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. కూరగాయల మార్కెట్లో సంచరిస్తున్న పశువులురోడ్లపై పోట్లాడుతున్న వీధి పశువులు ఏళ్ల తరబడి సమస్యను పట్టించుకోని పాలకులు పశువుల అడ్డంగా రావడంతో చోటుచేసుకుంటున్న ప్రమాదాలుఏటేటా పెరుగుతున్న పశువుల సంఖ్య ఏటేటా రోడ్లలో వీధి పశువుల సంఖ్య పెరిగిపోతోంది. నగర ప్రధాన రహదారులు వీధి పశువులకు అడ్డాగా మారిపోతున్నాయి. యజమానుల ఇంటి వద్ద ఉండాల్సిన పశువులకు వీధులు, రోడ్లే వాటికి పశువుల పాకగా మారాయి. దీంతో నగర వాసులకు రోజు రోజుకు ఇబ్బందిగా పరిణమిస్తోంది. మహానగర పాలికె కమిషనర్, సంబంధిత అధికారులు, పాలకులు, చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో పాటు వీధి పశువులను ఒక చోట చేర్చి యజమానులు రాకపోతే ఆయా వీధి పశువులను గోశాలలకు తరలిస్తామని హెచ్చరికలు జారీ చేయకపోవడంతో వీధి పశువుల సమస్య జటిలమవుతోందని సామాజిక కార్యకర్త వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాము మహానగర పాలికె అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన తూతూ మంత్రంగా పట్టించుకుంటున్నారే కానీ పూర్తి స్థాయిలో కట్టదిట్టమైన చర్యలు చేపట్టి వీధి పశువులను రోడ్లలో తిరగకుండా చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆయుర్వేద చికిత్సతో ఉత్తమ ఫలితాలు
హొసపేటె: శారీరక, మానసిక సమస్యలు లేకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని నిర్మించుకోవడానికి ఆయుర్వేద మూలికలు, మందులు ఉత్తమమైనవని ఆయుష్ శాఖ వైద్యాధికారి డాక్టర్ మునివాసుదేవ రెడ్డి తెలిపారు. శనివారం నగరంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, జిల్లా ఆయుష్ విభాగం, ఆయుష్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా యూనిట్, పతంజలి యోగా ఇనిస్టిట్యూట్, టీఎంఏఈ నర్సింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఆయుర్వేద నడక జాతా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పురాతన చికిత్సకు చాలా ప్రముఖ్యత ఉందని తెలిపారు. ఆయుర్వేదం లక్షణాలను అణిచివేయడమే కాకుండా, సమస్య మూల కారణాన్ని గుర్తించి చికిత్స చేయడానికి తగిన వైద్య పద్ధతి ఆయుర్వేదం అని వెల్లడించారు. ఆయుర్వేదంలో శరీరంలోని అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కారం ఉందన్నారు. వ్యక్తి శరీర స్వభావం (దోషాలు) భిన్నంగా ఉంటుంది. ఆయుర్వేదం వ్యక్తి స్వభావాన్ని బట్టి ఆరోగ్య సమస్యలకు పరిష్కారాన్ని అందించగలదన్నారు. కార్యక్రమంలో వైద్యులు గురుబసవ రాజ్, బీవీ భట్ కేదార్ దండిన్, రూప్ సింగ్ పాల్గొన్నారు. -
నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు
బళ్లారి టౌన్: నగరంలోని పటేల్ నగర్లో ఉన్న సన్న దుర్గమ్మ దేవాలయంలో సోమవారం నుంచి 9 రోజుల పాటు 10వ వార్షిక దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు మీనాళ్లి తాయణ్ణ పేర్కొన్నారు. ఆదివారం ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవాల్లో భాగంగా నిత్యం హోమాలు, అమ్మవారికి విశేష అలంకరణలు, మహిళలకు ఒడి నింపే కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సారి మొత్తం 3000 మంది దాకా మహిళలకు ఒడి నింపే కార్యక్రమం ఉంటుందన్నారు. రోజూ సాయంత్రం లలిత సాహస్త్ర నామం, ఉదయం పూట పిల్లలకు సరస్వతీ దేవి పూజలు, రాత్రి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. 30వ తేదీన చండీయాగం, మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ, 2వ తేదీ చివరి రోజున సాయంత్రం అమ్మవారిని పల్లకీలో ఊరేగించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు స్థానికుల నుంచి ఆర్థిక సహాయం లభించిందని గుర్తు చేశారు. సమావేశంలో అర్చకులు సంతోష్ స్వామి నేతలు ఎర్రిస్వామి, కృష్ణ , వెంకటేష్, హనుమంత, సునిల్, ప్రదీప్, రమేష్, విజయ్ కుమార్, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు. -
యరగేర మాజీ అధ్యక్షుడికి డాక్టరేట్
రాయచూరు రూరల్: రాయచూరు తాలుకా యరగేర గ్రామ పంచాయతీ మాజీ అధ్యక్షుడు నిజాముద్దీన్కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. శనివారం రాత్రి న్యూఢిల్లీలోని అమెరికా విజ్డం పీస్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ల ప్రదానోత్సవం నిర్వహించారు. సమాజ సేవకు గాను అమెరికా విజ్డం పీస్ యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు డాక్టర్ కృష్ణమూర్తి చేతుల మీదుగా నిజాముద్దీన్ డాక్టరేట్ అందుకున్నారు. కార్యక్రమంలో బసవరాజ్, లక్ష్మీపతి, విద్యానంద రెడ్డి, మారుతి, జగదీష్ రెడ్డి, మహ్మద్ రఫీ, అజీముద్దీన్, ఉమర్ సాబ్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా మహాలయ అమవాస్య పూజలురాయచూరు రూరల్: జిల్లాలో ఆదివారం మహాలయ అమవాస్య పూజలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. నగరంలోని కిల్లే బృహన్మఠంలో గురు పాదేశ్వరుడి ప్రతిమకు శాంత మల్ల శివాచార్యలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు పాదేశ్వరుడి విగ్రహాన్ని పూలతో అలంకరించారు. సోమవారం నుంచి శరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా విశేష పూజలు చేస్తామని తెలిపారు. ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలిరాయచూరు రూరల్: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు బాటలు వేయాలని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం పండిత సిద్ధరామజం బలదిన్ని రంగ మందిరంలో ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహించారు. ఉపాధ్యాయులు పిల్లల సంక్షేమ కోసం పాటుపడాలన్నారు. ప్రతిభకు తార్కాణంగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని సూచించారు. నాణ్యమైన విద్యాబోధన అందించాలని తెలిపారు. కార్యక్రమంలో కిల్లే బ్రహన్మఠాధిపతి శాంత మల్ల శివాచార్యులు, నగర సభ అధ్యక్షురాలు నరసమ్మ, సుఖాణి, రాజా శ్రీనివాస తదితరులు పాల్గొన్నారు. పరామర్శ రాయచూరు రూరల్: విష ద్రావకం సేవించి ముగ్గురు యువతులు అత్మహత్యాయత్నం చేశారు. వీరిలో దేవదుర్గ తాలుకాకు చెందిన కె.ఇరబగేర రేణుకమ్మ మృతి చెందింది. మిగతా ఇద్దరు సునీత, ముదుకమ్మ చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం దేవదుర్గ శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్ బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. సర్కార్ నుంచి సాయంఅందేలా చూస్తామని హమీ ఇచ్చారు. కుల గణనలో నాయక అని రాయించాలిబళ్లారి అర్బన్: సోమవారం నుంచి ప్రారంభం కానున్న కులగణన సర్వేలో వాల్మీకి కులస్తులందరూ మతం కాలంలో హిందువు అలాగే కులం కాలంలో నాయక అని రాయించాలని జిల్లా వాల్మీకి నాయకర విద్యాభివృద్ధి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.జయరాం పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన సంఘం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాజనహళ్లి మన కులగురువు సూచన మేరకు మన వాల్మీకి నాయక కులబాంధువులు ఆర్థిక విద్య, సామాజికంగా అభ్యన్నతి సాధించడానికి దోహదపడేలా సదరు కుల గణన సర్వేలో నాయక అని రాయించాలని కోరారు. వాల్మీకులకు ఎటువంటి అన్యాయం జరిగినా అందరూ కలిసికట్టుగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆ సంఘం ప్రముఖులు గౌరయ్య, రుద్రప్ప, జి.రుద్రప్ప, గోపాల్, గుజ్జల గాదిలింగప్ప, కాయిపల్లే బసవరాజ్ పాల్గొన్నారు. -
ప్రేమజంట పెళ్లి.. వధువుపై కేసు
దొడ్డబళ్లాపురం: యువకున్ని వివాహం చేసుకున్న యువతిపై కేసు నమోదు చేసిన సంఘటన మాగడి తాలూకా కుదూరులో జరిగింది. వివరాలు.. సౌమ్య (19), వసంత్(19) అనే యువతీ యువకులు ప్రేమించుకున్నారు. సౌమ్య తరఫు పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. అయినా కూడా జూలై 11న ఇద్దరూ మాగడిలోని ఒక గుడిలో వివాహం చేసుకున్నారు. చట్ట ప్రకారం వధువుకి 18 ఏళ్లు, వరునికి 21 ఏళ్లు నిండాలి.అయితే ఇక్కడ పెళ్లికొడుకు వయసు 19 ఏళ్లే కావడంతో అతని కుటుంబీకులు సౌమ్యపై కుదూరు పోలీస్స్టేషన్లో బాల్య వివాహం చట్టం కింద ఫిర్యాదుచేయగా కేసు నమోదయింది. కాలేజీ గొడవలపై సీరియస్బనశంకరి: కాలేజీల్లో ఏర్పాటుచేసే కార్యక్రమాలకు ముందుగా పోలీసులకు సమాచారం అందించాలని యాజమాన్యాలకు సూచించినట్లు బెంగళూరు పోలీస్కమిషనర్ సీమంత్కుమార్సింగ్ తెలిపారు. శనివారం నగరంలో విలేకరులతో మాట్లాడుతూ.... ఆవలహళ్లిలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఓనం వేడుకల్లో విద్యార్థులు రోడ్ల మీద పడి దాడులు చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించామన్నారు. ఓ నర్సింగ్ కాలేజీలో జూనియర్లు తమకు సమాచారం ఇవ్వకుండా ఓణం చేయడాన్ని సీనియర్ విద్యార్థులు వ్యతిరేకించారు. ఇరువర్గాల బయటకు వచ్చి కొట్టుకున్నారు. సుమారు 40 మంది ఈ రగడలో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ గొడవలో 8 మంది కాలేజీ సిబ్బందిని నిర్బంధించామన్నారు. ఇకపై కాలేజీల్లో ఏర్పాటుచేసే కార్యక్రమాలు గురించి ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కొత్త హెలికాప్టర్ను కొన్న మంత్రిదొడ్డబళ్లాపురం: బెళగావి జిల్లాకు చెందిన మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త సతీష్ జార్కిహొళి కొత్త హెలికాప్టర్ను కొన్నట్లు తెలిసింది. సొంతంగా పర్యటనల కోసం కొన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా త్వరగా ప్రయాణాలకు హెలికాప్టర్ అయితే బాగుంటుందని అనుకున్నారు. అగస్టా కంపెనీ హెలికాప్టర్ను బెంగళూరు జక్కూరు ఏరోడ్రోమ్లో బిగిస్తున్నారు, దీనిని జర్మనీ నుంచి తెప్పించారు, ఆ పనులను ఆయన పరిశీలించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కొత్త చాపర్ ఎగరడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఆధునిక సౌకర్యాలు, సాంకేతికతతో కూడినది, డబుల్ ఇంజిన్లు ఉంటాయి. ఇద్దరు పైలట్లు ఇందులో ఉంటారు అని తెలిపారు. దీని విలువ రూ.20కోట్లు గా తెలిసింది. కోర్టు ఆవరణలో భార్యకు కత్తిపోట్లుదొడ్డబళ్లాపురం: కోర్టు ఆవరణలోనే ఓ కసాయి భర్త, భార్యపై కత్తితో దాడి చేసిన సంఘటన దావణగెరెలో జరిగింది. పట్టణ నివాసులపైన ప్రవీణ్,పవిత్ర దంపతుల మధ్య విబేధాలు రావడంతో పవిత్ర విడాకుల కోసం కోర్టుకెక్కింది. శనివారంనాడు కేసు ఉండడంతో ఇద్దరూ దావణగెరె ఫ్యామిలీ కోర్టుకు వచ్చారు. పవిత్ర ను చూడగానే ప్రవీణ్ కత్తితో ఆమైపె దాడి చేశాడు. పలుచోట్ల కత్తి గాయాలయ్యాయి. తరువాత తానూ కత్తితో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. రక్త గాయాలతో ఉన్న ఇద్దరినీ పోలీసులు దావణగెరె జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
అమ్మా.. అమానుషం
తుమకూరు, పావగడ: ఎంత కష్టం వచ్చిందో కానీ.. ముద్దులొలికే పసిపిల్లలను తల్లి తన చేతులతో చంపి, తనువు చాలించింది. భర్త, అత్త వేధింపులను తట్టుకోలేక ఈ ఘాతుకానికి పాల్పడిన హృదయ విదారక దుర్ఘటన తుమకూరు జిల్లాలోని పావగడ తాలూకాలోని కడపలకెరె గ్రామంలో శనివారం మధ్యాహ్నం జరిగింది. సరిత (25), కుమారుడు పుష్విక్ (4), కూతురు యుక్తి (2) మృతులు. ఏం జరిగిందంటే.. వివరాలు.. కడపలకెరె గ్రామానికి చెందిన సరితకు స్థానికుడు సంతోష్తో ఆరేళ్ల కిందట పెద్దలు పెళ్లి చేశారు. భర్త ప్యాసింజర్ ఆటోను నడుపుతుండగా, సరిత గృహిణి. ఆమె అత్త అంజమ్మ పట్టణం లో వ్యవసాయ పరిశోధన కార్యాలయంలో డీ గ్రూప్ ఉద్యోగి గా పని చేస్తోంది. భర్త, అత్త కలిసి సరితను సూటిపోటి మాటలతో వేధించేవారని సమాచారం. దీంతో జీవితంపై విరక్తి చెందిన సరిత ఇంటిలో ఎవరూ లేని సమయంలో.. కొడుకును కత్తితో గొంతుకోసి హతమార్చింది. తరువాత కూతురికి ఉరివేసి చంపి, ఆపై తాను ఉరికి వేలాడింది. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మధుగిరి పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ ఘోరంతో గ్రామంలో విషాదం అలముకొంది. పిల్లలను చంపి.. తల్లి ఆత్మహత్య తుమకూరు జిల్లాలో ఘోరం -
ఒక్క కాన్పులో ముగ్గురు శిశువులు
యశవంతపుర: ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మినిచ్చిన అనూహ్య సంఘటన హాసన్ జిల్లా హొళెనరసీపుర తాలూకా కాడనూరు గ్రామంలో జరిగింది. వివరాలు.. ఓ గర్భిణి (29) ప్రసవానికి సమయం రావడంతో స్థానిక హిమ్స్ ఆస్పత్రిలో చేరారు. గైనకాలజిస్టు డాక్టర్ న్యాన్సి పౌల్ మార్గదర్శనంలో వైద్య సిబ్బంది సిజేరియన్ ప్రసవం చేశారు. ముగ్గురు పిల్లలు పుట్టారు. మొదట జన్మించిన మగశిశువు 2.1 కేజీలు, తరువాత పుట్టిన ఆడ శిశువు 1.9 కేజీలు, మరో ఆడపాప 1.8 కేజీలున్నట్లు వైద్యులు తెలిపారు. ఆమెకు ఇదే మొదటి కాన్పు అని, ఒకే ప్రసవంలో ముగ్గురు జన్మించటం అపురూపమని తెలిపారు. తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. -
రౌడీలకు కునుకు కరువు
బనశంకరి: బెంగళూరు నగరవ్యాప్తంగా రౌడీల ఇళ్లు, బార్– రెస్టారెంట్లు, వైన్ షాపుల వద్ద పోలీసులు దాడులు నిర్వహించారు. శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి శనివారం తెల్లవారుజామువరకు రౌడీల అడ్డాలపై తనిఖీలు సాగించారు. రాజధానిలో నేర కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే దిశగా1500 మంది రౌడీల ఇళ్లకు వెళ్లి వారు ఆ సమయంలో ఉన్నారా , లేదా అని చూడడంతో పాటు ఇళ్లలో సోదాలు చేశారు. ఈ సందర్భంగా మారణాయుధాలు, మత్తు పదార్థాలు వంటిని కనిపించడంతో మొత్తం 134 కేసులు నమోదు చేశారు. ఎక్కడెక్కడ ఎంతమంది.. ఈశాన్య విభాగంలో నగర పోలీసులు 169 మంది రౌడీల ఇళ్లకు వెళ్లారు. ఉత్తర విభాగంలో 179, తూర్పు లో 247, పశ్చిమలో 222 , ఎలక్ట్రానిక్ సిటీలో 100 , ఆగ్నేయ లో 120, కేంద్ర లో 20, వాయువ్యలో 102, వైట్ఫీల్డ్లో 140 మంది రౌడీల ఇళ్లు, స్థావరాల మీద దాడులు నిర్వహించారు. ఆకస్మాత్తుగా పోలీసులు రావడంతో రౌడీలకు కునుకు కరువైంది. ఇళ్లలో లేనివారితో ఫోన్లో మాట్లాడారు. ఎక్కడికి, ఎందుకు వెళ్లారు అని విచారించి హెచ్చరించారు. రౌడీషీటర్లు చేస్తున్న వృత్తి, ఆదాయ వివరాలను సేకరించారు. నేరాల్లో పాల్గొనరాదని హెచ్చరించారు. తరచూ రౌడీల ఇళ్లలో సోదాలు చేస్తామని తెలిపారు. రాత్రివేళ ఇళ్లలో పోలీసుల ఆకస్మిక సోదాలు 1,500 మంది నేరగాళ్లకు హెచ్చరికలు -
మహిళలకు సైబర్ నేరగాళ్ల వల
హుబ్లీ: హుబ్లీ– ధార్వాడ జంట నగరాలపై సైబర్ నేరగాళ్లు కన్నేశారు. తరచూ అమాయకులను పల్టీ కొట్టించి లక్షల రూపాయలను దండుకుంటున్నారు. అదే మాదిరిగా ఆన్లైన్లో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు తీసుకోవచ్చునని ఇద్దరు మహిళల నుంచి రూ.88.83 లక్షలను దోచేశారు. భాగ్యశ్రీకి రూ.62 లక్షలు.. వివరాలు.. భాగ్యశ్రీ అనే మహిళకు వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపించారు. సరేనని ఆమె సంప్రదించింది. ది రాయల్ మిట్ ఇన్వెస్ట్మెంట్ పేరున టెలిగ్రాం గ్రూప్లో ఆమెను చేర్చారు. తమకు పెద్దమొత్తంలో లాభాలు వచ్చాయంటూ గ్రూప్లో చాలామంది మెసేజ్లు పెట్టేవారు. దీంతో భాగ్యశ్రీ కూడా మోసగాళ్ల సూచన మేరకు ఆమె బ్యాంక్ ఖాతాల నుంచి రూ.62.03 లక్షలను వారికి పంపించింది. అయితే రోజులు గడుస్తున్నా ఎలాంటి లాభం రాలేదు. డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా ఆమె నంబర్ను బ్లాక్ చేశారు. దీంతో బాధితురాలు నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బ్యాంకు ఉద్యోగినికి.. మరో ఘటనలోనూ షేర్ల ట్రేడింగ్ పేరున బ్యాంక్ మహిళా ఉద్యోగికి రూ.26.80 లక్షలు వంచించారు. స్థానికురాలు మారియా.. ఫేస్బుక్ చూస్తుండగా ట్రేడింగ్ చేసి ఎక్కువ డబ్బులు గడించవచ్చునన్న లింక్పై క్లిక్ చేశారు. దీంతో ఆమె మొబైల్ ఫోన్ నంబర్ క్షణాల్లోనే వంచకుల గ్రూప్లో చేరిపోయింది. ఆమెకు నకిలీ ట్రేడింగ్ యాప్ను పంపించింది, రూ. 26 లక్షలకు పైగా డబ్బులు బదలాయించుకున్నారు. చివరకు ఆమె సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరికి రూ.88 లక్షలు బురిడీ హుబ్లీ– ధార్వాడలో ఆన్లైన్ మోసాలు -
జనగణన సర్వేకు ప్రజలు సహకరించాలి
హొసపేటె: జనాభా గణన సర్వేకు ప్రజలు అన్ని విధాలుగా సహకరించాలని ఎమ్మెల్యే గవియప్ప తెలిపారు. శనివారం స్థానిక రోటరీ క్లబ్లో కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ 2025 సామాజిక విద్య, ఆర్థిక జనాభా గణన సర్వే చర్చా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సర్వే సమీక్ష ఈ నెల 22 నుంచి వచ్చే నెల 7 వరకు జరుగుతుందని తెలిపారు. జనాభా గణన సర్వేను నగర ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ, కేపీసీసీ ఉపాధ్యక్షుడు ఎంసీ వేణుగోపాల్, మున్సిపల్ అధ్యక్షుడు రూపేష్ కుమార్, వివిధ సమాజ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. జంట హత్యల కేసులో నిందితుడికి ఖైదు హొసపేటె: జిల్లాలోని కూడ్లిగి తాలూకా దొడ్డగొల్లరహట్టికి చెందిన మహాలింగ అనే వ్యక్తికి జంట హత్యల కేసులో జీవిత ఖైదు, రూ.40 వేల జరిమానా జిల్లా సెషన్స్ కోర్టు విధించింది. కేసు పూర్వాపరాలు.. 2019 నవంబర్ 4న గజాపుర సమీపంలోని చిరబి అటవీ ప్రాంతంలో తన భార్య సుజాత, మంజునాథ్ల మధ్య అనైతిక సంబంధం ఉందని అనుమానించిన మహాలింగ వారిద్దరినీ రాయితో కొట్టి చంపాడు. నిందితుడు దోషిగా తేలిన తర్వాత హొసపేటెలోని మూడవ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి డీపీ కుమారస్వామి జీవిత ఖైదుతో పాటు జరిమానాను కూడా విధించారు. రూ.40,000 మంజునాథ్, సుజాత వారసులకు పరిహారంగా అందించాలని ఆదేశించారు. కూడ్లిగి పోలీసు స్టేషన్ సిబ్బంది సాక్షులను సకాలంలో హాజరుపరిచి, సహకరించారని, ప్రభుత్వం తరపున ప్రాసిక్యూటర్గా వ్యవహరించిన టీ.అంబన్న సమర్థంగా కేసు వాదించారని తెలిపారు. మందుల వాడకంపై జాగృతి ర్యాలీ బళ్లారి రూరల్: ఫార్మకోవిజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా శనివారం బీఎంసీఆర్సీ ఔషధశాస్త్ర(ఫార్మకాలజీ) విభాగం మందుల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలను వెంటనే వైద్యులకు తెలిపాలని జాగృతి ర్యాలీని నిర్వహించారు. ఫార్మకాలజీ హెచ్ఓడీ డాక్టర్ వై.విశ్వనాథ్ మాట్లాడుతూ మందులు వాడినప్పుడు కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి వైద్యులు రోగులకు తెలియజేయాలి. గడువు ముగిసిన, నకిలీ మందుల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఫార్మకాలజీ విభాగం నుంచి క్యాజువాలిటీ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో బీఎంసీఆర్సీ డీన్ డాక్టర్ గంగాధరగౌడ, ప్రిన్స్పాల్ డాక్టర్ మంజునాథ్, ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ చిదంబరమూర్తి, ఫార్మకాలజీ విభాగ వైద్యులు డాక్టర్ మురుగేశ్, డాక్టర్ విశ్వనాథ్, డాక్టర్ శకుంతల, వైద్య, నర్సింగ్ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. నియామకం రాయచూరు రూరల్: కాంగ్రెస్ పార్టీ రాయచూరు జిల్లా ప్రచార సమితి ప్రధాన కార్యదర్శిగా బూడిదపాడు శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ కేపీసీసీ ప్రచార సమితి అధ్యక్షుడు వినయ్ కుమార్ సొరకె శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ సిఫార్సు మేరకు, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసి ప్రభుత్వం అమలు చేసిన పంచ గ్యారెంటీ పథకాల గురించి వివరించాలన్నారు. రోటోవేటర్ తగిలి రైతు మృతి హుబ్లీ: ధార్వాడ జిల్లా హుబ్లీ తాలూకా బ్యాహట్టి గ్రామం వద్ద పొలంలో పనుల్లో నిమగ్నమైన ట్రాక్టర్ రోటోవేటర్ నుంచి గాయపడిన వ్యక్తి మృతి చెందాడు. శివప్ప నవలూరు (47) మృతుడు. సదరు యంత్రానికి కుడి కాలు చిక్కుకోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం హుబ్లీకి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా మరో ఘటనలో రూ.4.87 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. నగరంలోని సుల్తాన్ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ అంగడిలో ఓ మహిళ బుర్కా ధరించి వచ్చి రూ.4.87 లక్షల విలువ చేసే ఆభరణాలను చోరీ చేసిన ఘటనపై హుబ్లీ టౌన్ పోలీసులు కేసు దాఖలు చేసుకున్నారు. బంగారు గాజులు కొనే నెపంతో అంగడికి వచ్చిన ఆ కిలాడి మహిళ అంగడి గుమాస్తా దృష్టిని మళ్లించి 40.47 గ్రాముల బంగారు గాజులు చోరీ చేసి పరారైనట్లు ఆ అంగడి మేనేజర్ లియాకత్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యా రంగానికి పెద్దపీట రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో విద్యా రంగానికి ప్రాధాన్యత కల్పించాలని జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం రాయచూరు తాలూకా మన్సలాపుర పంచాయితీని సందర్శించారు. వ్యవసాయ కూలీ కార్మికుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన కూసిన కనసు పథకాన్ని పరిశీలించారు. పిల్లల హాజరు శాతం మరింత పెంచాలన్నారు. తాలూకాలోని వివిధ తాగునీటి పథకాలను పరిశీలించారు. అక్క కెఫెను కూడా పర్యవేక్షించారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా
హొసపేటె: సీనియర్ సిటిజన్ల క్రమశిక్షణ, జీవనశైలి, జీవితానుభవం యువతకు ఆదర్శప్రాయమని అదనపు జిల్లాధికారి ఈ.బాలకృష్ణప్ప తెలిపారు. ప్రపంచ సీనియర్ సిటిజన్ల దినోత్సవం సందర్భంగా శనివారం నగరంలోని స్టేడియంలో నిర్వహించిన సీనియర్ సిటిజన్ల కోసం క్రీడా, సాంస్కృతిక పోటీలను ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. భవిష్యత్తు జీవితానికి పునాది వేసిన ఇంటి పెద్దలు, వృద్ధుల సంరక్షణ కోసం ప్రభుత్వం అనేక పథకాలను అందించిందన్నారు. మంచి వాతావరణాన్ని అందించడానికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం సీనియర్ సిటిజన్ల దినోత్సవాన్ని జరుపుకుంటోందన్నారు. సీనియర్ సిటిజన్లు క్రీడా సమావేశాల్లో పాల్గొనడం వల్ల వారి జీవిత ఉత్సాహం పెరుగుతుంది. ప్రతి సీనియర్ సిటిజన్ వయస్సు శరీరానికి మాత్రమే కాదు, మనసుకు కూడా అని భావించి క్రీడల్లో చురుకుగా పాల్గొనాలన్నారు. అనంతరం పరుగు పందెం, బంతి విసరడం తదితర పోటీలను నిర్వహించారు. హుడా అధ్యక్షుడు ఇమామ్ నియాజీ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్లకు క్రీడా పోటీలు -
కృష్ణా ట్రైబ్యునల్ తీర్పును వెల్లడించాలి
రాయచూరు రూరల్: ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడానికి కృష్ణా ప్రాధికార తీర్పును సత్వరం కేంద్ర ప్రభుత్వం వెల్లడించాలని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజు పేర్కొన్నారు. శనివారం చిన్న నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం సుప్రీం కోర్టు నుంచి ఆదేశాలు జారీ చేసి ఏడాది కావస్తున్నా వాటిని అమలు పరచడంలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద జోషి, సోమణ్ణ, కుమారస్వామి, శోభా కరంద్లాజెలు ముందుకు రావాలన్నారు. లేని తరుణంలో మంత్రి పదవులకు రాజీనామాలు చేయాలన్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్ల వరకు పెంచడం, భూస్వాధీన ప్రక్రియ కూడా చేయడానికి కృష్ణా ప్రాధికార తీర్పును వెల్లడించాలన్నారు. రాష్ట్రంలో 22 నుంచి వెనుక బడిన వర్గాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న కులాల నమోదు సర్వేకు అందరు సహకరించాలని, విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు గ్రామీణ ప్రాంతాల ప్రజలు విద్య ఉద్యోగ ఇతర కుల వృత్తుల ఆధారంగా నమోదుకు సమీక్ష జరిపితే దానిని బీజేపీ కుల రాజ కీయం చేయడాన్ని మంత్రి ఖండించారు. కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి కుల సర్వేకు అందరూ సహకరించాలి -
చదువుల తల్లికి మణిహారం
బళ్లారి రూరల్: బళ్లారి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (బీఐటీఎం) కళాశాలకు చెందిన బీఈ(ఈఈఈ) విభాగానికి చెందిన విద్యార్థిని ఆలియా సమా రాష్ట్రంలోనే అత్యధికంగా 73 క్రెడిట్లు సాధించి, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సాధించినట్లు ఆ కళాశాల కార్యదర్శి, ట్రస్ట్ సభ్యుడు వై.జె.పృథ్వీరాజ్ భూపాల్ తెలిపారు. శనివారం నగరంలోని కిష్కింధ విశ్వవిద్యాలయ కార్యదర్శి చాంబర్లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2024–25వ విద్యా సంవత్సరంలో బీఈ(ఈఈఈ) హానర్స్ డిగ్రీలో ఆలియా సమా అత్యధికంగా 73క్రెడిట్లను సాధించి రాష్ట్రంలోనే ప్రథమంగా నిలిచింది. ఈ ఆరుదైన ఘనతకు గాను ఇండియా బుక్ ఆఫ్ రెకార్డ్స్ లో చోటు దక్కినట్లు తెలిపారు. బీఈ హానర్స్ డిగ్రీలో 160 క్రెడిట్లు ఉంటాయి. ఇందులో 18 క్రెడిట్లను సాధించాల్సి ఉంటుంది. ఏకంగా 73 క్రెడిట్లతో రికార్డు కాని కుమారి ఆలియా సమా ఏకంగా 73 క్రెడిట్లను సాధించి, అప్పటివరకు రాష్ట్రంలో ఉన్న 39 క్రెడిట్ల రికార్డ్ను బద్దలు కొట్టి ఇండియా బుక్ఆఫ్స్ రికార్డ్స్ను సాధించిందని తెలిపారు. అంతేకాకుండా ఈఈఈలో మొదటిర్యాంకు సాధించి ఆ బ్యాచ్కు టాపర్గా నిలిచినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆలియా సమా జర్మనీలోని సీమన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపారు. కళాశాలకు చెందిన 18 మందిలో 11 మంది హానర్స్ డిగ్రీ సాధించినట్లు తెలిపారు. ఈ ఏడాది 581 మంది విద్యార్థులు డిగ్రీలు సాధించి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొంది రూ.40 లక్షల ప్యాకేజీని తీసుకొంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలియా సమాను సన్మానించి పతకాన్ని, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్ అందజేశారు. కళాశాల ప్రిన్స్పాల్ యడవళ్లి బసవరాజ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానికల్ హెచ్ఓడీ శరణరెడ్డి, ఆలియా తండ్రి షకీబ్ పాల్గొన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థిని ఆలియా సమా రాష్ట్రంలోనే అత్యధికంగా 73 క్రెడిట్ల సాధన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సాధించిన వైనం -
విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి
బళ్లారిఅర్బన్: విద్యార్థులు తమ విద్యార్థి జీవితంలో సమయాన్ని చక్కగా చదివేందుకు ఉపయోగించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవ ప్రాధికార సభ్యత్వ కార్యదర్శి రాజేష్ నింగప్ప సూచించారు. ఆయన నగరంలోని ఇండో అమెరికన్ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గురువులను గౌరవించాలన్నారు. తల్లిదండ్రులు మీపై ఎనలేని నమ్మకాన్ని పెట్టుకుని ఉంటారన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా వారు మిమ్మల్ని బాగా చదివిస్తారు. ఎప్పుడూ తల్లిదండ్రులకు బాధ కలిగేలా ప్రవర్తించరాదన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిలోను దివ్యనుభూతిని కల్గించాయి. ఎస్బీఐ అధికారిణి గుల్జార్ బేగం, కళాశాల చైర్మన్ టీహెచ్ నాయుడు, కళాశాల అధ్యాపకులు, ప్రిన్సిపాల్ షేక్ సలీం బాషా, డిప్యూటీ ప్రిన్సిపల్ సుధీర్కుమార్, కేపీ కళాశాల హెచ్ఓడీ రాజేష్, రాజా, ఉదయ్ భాస్కర్, లెక్చరర్లు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆధునిక వైద్యాన్ని అనుసరించాలి
బళ్లారి రూరల్: అధునాతన వైద్య పద్ధతులను తెలుసుకొంటూ ఉత్తమ వైద్యులుగా ఎదగాలని బెంగళూరు ప్రభుత్వ దంత వైద్య కళాశాల అండ్ రీసెర్చ్ సెంటర్(జీడీసీఆర్సీ) డీన్ డాక్టర్ గిరీష్ గిరద్ది తెలిపారు. శనివారం బీఎంసీఆర్సీ ఆవరణలోని జీడీసీఆర్సీ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వైద్య రంగం బాధ్యతాయుతమైందన్నారు. నేడు ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. వైద్యులు ఎప్పటికప్పుడు పరిజ్ఞానాన్ని పెంచుకొంటూ ఉత్తమ వైద్యులుగా రాణించాలన్నారు. ప్రస్తుతం మెడికో లీగల్ కేసులు అధికమైన నేపథ్యంలో వైద్యులకు రోగికి సరైన వైద్యం అందించాలన్నారు. యువవైద్యులకు పట్టాలను ప్రదానం చేశారు. బీఎంసీఆర్సీ డీన్ డాక్టర్ గంగాధరగౌడ, ప్రిన్స్పాల్ డాక్టర్ మంజునాథ్, ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ చిదంబర మూర్తి, జీడీసీఆర్సీ ప్రిన్స్పాల్ డాక్టర్ భారతి, డాక్టర్ శ్రీనివాసమూర్తి, సీఏఓ మహేష్గౌడ, వైద్యులు, జూనియర్ వైద్యులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
హొసపేటె: కొట్టూరు రోడ్డులోని జెస్కాం కార్యాలయం సమీపంలోని టీ దుకాణం వద్ద నీటి మోటారును ఆపరేట్ చేయబోయిన వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. టీ షాప్ యజమాని జంపన్న పట్టణ పంచాయతీకి చెందిన నీటి పంపుసెట్ను నడపడానికి వెళ్లాడు. అయితే వైర్పై ఉన్న ఇన్సులేటర్ తెగిపోయి పెట్టెకు విద్యుత్ కనెక్షన్ ఉంది. వర్షం పడి నేల తడిగా ఉండటంతో మోటారు ఆన్ చేయడానికి వెళ్లినప్పుడు జంపన్న విద్యుత్ షాక్కు గురయ్యాడు. వెంటనే పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించాడు. కూడ్లిగి పీఎస్లో కేసు నమోదైంది. పేదలకు భూమి, ఇళ్లు కేటాయించాలి రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో అధికంగా నివసిస్తున్న పేదలకు భూమి, ఇళ్లు కేటాయించాలని దళిత సంఘర్షణ సమితి అధ్యక్షుడు హనుమంతప్ప కాకరగల్ డిమాండ్ చేశారు. శనివారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ ఆధీనంలో సాగు చేస్తున్న భూములు సన్నకారు రైతులకు అవకాశమున్నా అధికారులు రైతులపై కేసు నమోదు చేస్తుండడాన్ని తప్పుబట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు భూమి, ఇళ్ల పట్టాలను అందించాలని కోరుతూ ఏసీ గజాననకు వినతిపత్రం సమర్పించారు. నమో మారథాన్ హొసపేటె: ప్రధాని నరేంద్ర మోదీ 75వ జయంతి వేడుకలో భాగంగా శనివారం బీజేపీ హొసపేటె మండల శాఖ ఆధ్వర్యంలో నమో మారథాన్ను నిర్వహించారు. రాష్ట్ర ఓబీసీ మోర్ఛా ఉపాధ్యక్షుడు అయ్యాళి తిమ్మప్ప, మండల అధ్యక్షుడు శంకర్ మేటి, ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి మధుర చెన్నశాస్త్రి, నటరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కేఎం రాఘవేంద్ర, జిల్లా యువమోర్ఛా అధ్యక్షుడు కిచిడి కొట్రేశ్, నగర విభాగం అధ్యక్షుడు రేవణ సిద్దప్ప, పతంజలి యోగా సమితి రాజీవ్ కిరణ్, విజయకిరణ్, రాజేష్, భాజపా నాయకులు భోజరాజు, ఉమాదేవి, పూర్ణిమ, రేణుకమ్మ, రేణుక, రవి, లలిత పాల్గొన్నారు. ఉజ్వల భవిష్యత్తుకు ఉపాధ్యాయులే పునాది రాయచూరు రూరల్: పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు పునాది కావాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు పేర్కొన్నారు. శనివారం మాన్వి లయోలా పాఠశాలలో ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన పురస్కార సమావేశంలో మాట్లాడారు. విధులు నిర్వహించే ఉపాధ్యాయులు, పిల్లల సంక్షేమం కోసం పాటు పడాలన్నారు. ప్రతిభకు తార్కాణంగా తమ భవిష్యత్తును రూపొందించుకోవాలని పిలుపు ఇచ్చారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. శాసన సభ్యుడు హంపయ్య నాయక్, బీఈఓ చంద్రశేఖర్, సురేష్, హంపణ్ణ, సంగమేష్, మహేష్, శివణ్ణలున్నారు. అంగన్వాడీ పిల్లలకు పౌష్టికాహారం అవసరం రాయచూరు రూరల్: అంగన్వాడీ కేంద్రాల్లో అపౌష్టికతతో కూడిన పిల్లలకు పౌష్టికాహార పదార్ధాలను పంపిణీ చేయాలని తాలూకా శిశు అభివృద్ధి యోజనాధికారిణి వనజాక్షి పేర్కొన్నారు. శనివారం యాదగిరి జిల్లా గురుమఠకల్ తాలూకా కొంకల్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి మాతృ వందనను జ్యోతి వెలిగించి మాట్లాడారు. వ్యవసాయ వర్సిటీ విద్యార్థులు, కార్యకర్తలు, కళాశాల ప్రిన్సిపాల్ మల్లన్న, గణాంక అధికారి యూసఫ్, ఉషా, ఆనంద్, నింగప్ప, భగవంతరెడ్డి, సాబయ్య, మారెప్ప పాల్గొన్నారు. పేదల సమస్యలు తీరుస్తా హొసపేటె: కూడ్లిగి ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.టీ.శ్రీనివాస్ శనివారం గండబొమ్మనహళ్లి చెరువు వద్ద పూర్తయిన పనులను పరిశీలించారు. చెరువు సమీపంలో నివసిస్తున్న ప్రతి ఇంటిని, ప్రజలను స్వయంగా సందర్శించి, అనేక సంవత్సరాలుగా వారిని వేధిస్తున్న సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. ప్రభుత్వ గ్రాంట్లు తీసుకు రావడం ద్వారా శాశ్వత పరిష్కారంగా ఈ చెరువు అంచున కొత్త గ్రామాన్ని నిర్మించడానికి మీ అందరి సహకారంతో కృషి చేస్తామన్నారు. ప్రజలందరూ సహకరించాలని ఆయన అన్నారు. సమస్యను తాత్కాలికంగా పరిష్కరించడానికి మేం పనులు ప్రారంభిస్తామన్నారు. ఇక్కడ ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కనీస సౌకర్యాలను ఆయన పరిశీలించారు. ఏఈ మంజునాథ్, జీపీ అధ్యక్షురాలు రత్నమ్మ హొన్నప్ప, పీడీఓ టీఎం.మంజునాథ్, ఉపాధ్యక్షుడు ఆర్.బసవరాజ్, జీపీ సభ్యులు చెన్నప్ప, గోవింద, సిద్దన్న పాల్గొన్నారు. -
వాల్మీకుల సమావేశం బహిష్కరణ
హొసపేటె: కురుబ సమాజ సోదరులను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ చర్యను ఖండిస్తూ జిల్లాధికారి కార్యాలయ హాలులో ఏర్పాటు చేసిన మహర్షి వాల్మీకి నాయక సమావేశాన్ని ఆ సమాజ బాంధవులు బహిష్కరించారు. అక్టోబర్ 7న జరగనున్న మహర్షి వాల్మీకి జయంతి వేడుకల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం జిల్లాధికారి కార్యాలయ హాలులో జిల్లాధికారిణి కవితా మన్నికేరి అధ్యక్షతన ముందస్తు జయంతి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం ప్రారంభంలో మాట్లాడుతూ గురువారం దావణగెరెలో రాజనహళ్లిలోని వాల్మీకి గురుపీఠంలో డాక్టర్ ప్రసన్నానందపురి స్వామీజీ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి వాల్మీకి సమాజ సమావేశంలో కురుబ, ఇతర వర్గాలను ఎస్టీ జాబితాలో చేర్చాలనే ప్రభుత్వ చర్యను తీవ్రంగా వ్యతిరేకించినట్లు తాలూకా వాల్మీకి నాయక సమాజ అధ్యక్షుడు గోసల భరమప్ప అన్నారు. రాష్ట్ర స్థాయి సమావేశం నిర్ణయం ప్రకారం వాల్మీకి సమాజం సెప్టెంబర్ 25న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పిస్తుందన్నారు. తాలూకా వాల్మీకి సమాఖ్య ప్రధాన కారదర్శి దేవరమణి శ్రీనివాస్, నాయకులు డాక్టర్ పన్నంగధర్, కిషోర్ కుమార్, కిచిడి శ్రీనివాస్, దురుగప్ప పూజారి, గుజ్జల చంద్రశేఖర్, బిసాటి తాయప్ప నాయక, బండే శ్రీనివాస్, ఎస్ఎస్ సంఘం నాయకులు గుజ్జల శ్రీనాథ్, కన్ని శ్రీకాంత, జంబానల్లి వసంత్, జంబానల్లి సత్యనారాయణ, కటిగి రామకృష్ణ, నాణికేరి వెంకోబ తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణ కర్ణాటకలో కుండపోత
గ్రామంలోకి ప్రవేశించిన నీరు పొంగి ప్రవహిస్తున్న వాగురాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో శుక్రవారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. ఎక్కడ చూసినా రహదారులు బురద గుంటలుగా మారాయి. ఉదయం ఎండలు వేడిని పుట్టించాయి. మహారాష్ట్రలోని మూడు జలాశయాల నుంచి 1.5 లక్షల క్యూసెక్కులకు పైగా నీటి విడుదలతో భీమా నదికి వరద పోటెత్తింది. కలబుర్గి జిల్లా అప్జల్పుర తాలూకా దేవల గాణగాపుర– ఘత్తరిగి వంతెనలు నీట మునిగాయి. మణ్ణూరు యల్లమ్మ దేవాలయం, శేషగిరి, మణ్ణూరు, కుడగనూరు, శివూర్, ఉడచణ, బోసగ, దుద్దణిగి, మంగళూరు, హిరియాళలలో పెసర పంట నీటి పాలైంది. చిత్తాపుర తాలూకాలో భీమా నది పొంగి ప్రవహిస్తోంది. గ్రామాలోకి నీరు చొరబడ్డాయి. కలబుర్గి దక్షిణ నియోజకవర్గంలో బిద్దాపూర్ కాలనీలో 40 ఇళ్లు జలావృతమయ్యాయి. బొమ్మనాళ వంతెన కోసుకు పోయింది. రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకాలో చిత్తాపుర, జాగీర్ నందిహాళ, ఆనెహొసూరు మధ్య వంతెన వరద నీటిలో మునగడంతో 16 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. ప్రజలు నీటిలోనే తాడు సహాయంతో దాటుతూ సంచరిస్తున్నారు. కలబుర్గి జిల్లా చించోళిలో ముల్లామారి పథకం కింద నాగరాళ జలాశయం నుంచి నీరు వదలడంతో వరద నీరు పోటెత్తుతోంది. ముదగల్లో వాన నీటితో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. జలమయమైన కాలనీలు, ఇళ్లు ఉప్పొంగిన నదులు, వాగులు -
నగర స్వచ్ఛతకు చేతులు కలుపుదాం
సాక్షి బళ్లారి: నగర స్వచ్ఛతకు ప్రతి ఒక్కరూ చేయి చేయి కలుపుదామని నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్రెడ్డి పేర్కొన్నారు. ఆయన శనివారం స్వచ్ఛభారత్ అభియాన్లో భాగంగా నగర మండల బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని 36వ వార్డులోని హవంబావి వద్ద ఆంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో, ఆలయం లోపల స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. పెద్ద సంఖ్యలో చీపురు పట్టుకొని చెత్తను ఊడుస్తూ శుభ్రం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికీ చెత్త సేకరణకు వచ్చే వాహనాల్లోనే చెత్తను పారవేయాలని సూచించారు. కార్యక్రమంలో నగర బీజేపీ అధ్యక్షుడు, మాజీ మేయర్ గుర్రం వెంకటరమణ, కార్పొరేటర్ కల్పన వెంకటరామిరెడ్డి, మాజీ మేయర్ మారుతీ ప్రసాద్, బీజేపీ ప్రముఖులు హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు. గాంధీజీ, మోదీ కలలను సాకారం చేద్దాం నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్రెడ్డి -
రాజధానిలో 5వేల రోడ్ల గుంతలు పెండింగ్: డీసీఎం
శివాజీనగర: బెంగళూరులో 7 వేలకు పైగా రోడ్డు గుంతలను ఇప్పటికే మూసివేయించాం, మరో 5 వేల వరకు గుంతలు పెండింగ్లో ఉన్నాయి, ఎందుకు అనేది పోలీస్ కమిషనర్ ద్వారా నివేదిక కోరాం, ప్రజలు ఎక్కడైనా రోడ్డు గుంతలు కనిపిస్తే నా దృష్టికి తీసుకురావచ్చు అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. శనివారం సదాశివనగర నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు.గుంతల రోడ్ల సమస్య పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని, యుద్ధప్రాతిపదికన పని జరుగుతోంది, రాజకీయం చేసేవారు చేయనీ అన్నారు. అధిక వర్షాల వల్ల గుంతల సమస్య వచ్చిందన్నారు. ప్రతి బీజేపీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి రూ.25 కోట్లు నిధులు ఇచ్చాం, వారు ఆ నిధులతో ఎందుకు రోడ్డు గుంతలను బాగుచేయలేదు, ధర్నాలు ఎందుకు చేస్తున్నారు అని మండిపడ్డారు. -
బెంగళూరు వర్సిటీలో కీచకపర్వం
శివాజీనగర: చదువుల తల్లి నిలయమైన బెంగళూరు విశ్వవిద్యాలయంలో కొందరు ప్రొఫెసర్లు కీచకులుగా మారినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. ఓ అతిథి అధ్యాపకురాలు (గెస్ట్ లెక్చరర్)ని వేధించినట్లు ఆమె జ్ఞానభారతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో స్వరూపకుమార్, రామాంజినేయులతో పాటుగా ఐదుమంది ప్రొఫెసర్ల మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇదే సమయంలో సదరు నిందితుల పలు వీడియోలు వైరల్ అయ్యాయి. విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి బదులుగా మద్యం సేవించి మత్తులై ఇష్టానుసారంగా ప్రవర్తించారు. కై పులో చిందులు వేశారు. ఇక రామాంజనేయులు అయితే బట్టలు విప్పి విశ్వవిద్యాలయ ఆవరణంలో డ్యాన్స్ చేశాడు. ఇతని మీద వరుసగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ అంధ విద్యార్థినికి పరీక్షల్లో మార్కులు వేయాలంటే డబ్బు డిమాండ్ పెట్టాడని సమాచారం. ఓ జయంతి వేడుకలో మద్యం తాగి మరో అమ్మాయిని ఎత్తుకుని నృత్యాలు చేశాడని సమాచారం. ఆ వీడియో సైతం వైరల్ అయింది. సమాజం పట్ల బాధ్యతగా ప్రవర్తించాల్సిన అధ్యాపకులు, ప్రొఫెసర్లు నిర్లజ్జగా నడుచుకున్న సంఘటనలపై ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఓసారి జ్ఞానభారతి ఆవరణంలో ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. చోరీ, పోట్లాటల కేసులు కూడా ఇక్కడ జరిగాయి. ప్రొఫెసర్లపై గెస్ట్ లెక్చరర్ ఫిర్యాదు -
భద్రావతిలో చెడ్డీ గ్యాంగ్ సంచారం
శివమొగ్గ: ఇటీవల శివమొగ్గలోని విద్యానగర పరిసర ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ దోపిడీ దొంగలు సంచరించారు. ఇంతలోనే భద్రావతి నగరంలోని సిద్దారూడనగర చుట్టుపక్కల ప్రాంతాల్లో రెక్కీలు జరిపారు. ఈ నెల 19న అర్ధరాత్రి 1 నుంచి 3 గంటల మధ్య ఈ దొంగలు ముఖానికి మంకీ క్యాప్లు, బట్టలు చుట్టుకుని, రాడ్లు, కత్తులు పట్టుకుని పలు ఇళ్ల ఆవరణలో కలియతిరిగారు. ఆరేడు మంది దొంగలు ఉన్నారు. సదరు దృశ్యాలు ఇళ్ల సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లైట్లు వేయగానే పరార్ డాక్టర్ అశ్వత్థ నారాయణ అనే వ్యక్తి ఇంటి కాంపౌండ్ను దూకి చొరబడిన దుండగులు దోచుకోవడానికి వీలవుతుందా అని తనిఖీ చేశారు. ఇంటివారు మేల్కొని లైట్లు వేశారు. దీంతో దొంగలు జారుకున్నారు. ఇదే సమయంలో సదరు బడావణెలో పాత టౌన్ బీట్ పోలీసు సిబ్బంది జైనుల్లా, మంజునాథ్లు బైక్లో అక్కడకు వచ్చారు. వారిని చూసిన దొంగలు భద్రా నది గుండా తప్పించుకుని పరారయ్యారు. ఎస్ఐ సునీల్, ఏఎస్ఐ కుబేరప్ప తమ సిబ్బందితో స్థలానికి చేరుకుని దుండగుల ఆచూకీ కోసం గాలించినా జాడ లేదు. నగరంలో గస్తీని పెంచినట్లు తెలిపారు. చీకటి పడగానే దొంగల భయం ఏర్పడుతోంది. ఇళ్లలో రెక్కీలు, పోలీసుల గాలింపు -
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
దొడ్డబళ్లాపురం: గదగ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొని ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు సహా ముగ్గురు మృతి చెందారు. ఈఘటన శుక్రవారం గదగ్ తాలూకా హర్లాపుర సమీపంలో 67వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. మృతులను అర్జున్(29), వీరేశ్ ఉప్పార(31), రవి నల్లూర(43)గా గుర్తించారు. వీరు ముగ్గురూ కారులో వెళ్తుండగా హర్లాపుర వద్దకు రాగానే వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొని తరువాత పక్క రోడ్డుపైకి దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొంది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జయింది. స్థానికులు, పోలీసులు వచ్చి అందులోని వారిని బయటకు తీయగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారణ అయ్యింది. అర్జున్, వీరేశ్కి ఇటీవలనే వివాహం నిశ్చయమైంది. వీరేశ్ కొప్పళ జిల్లా పోలీస్ వైర్లెస్ విభాగంలో విధులు నిర్వహిస్తుండగా, అర్జున్ హావేరి జిల్లా పోలీస్ వైర్లెస్ విభాగంలో పని చేస్తున్నాడు. మూడేళ్లుగా పోలీస్ శాఖలో పని చేస్తున్నారు. గదగ్ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గదగ్ జిల్లాలో ఘటన మృతుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు -
సహకార సంఘాలు రైతుల పరపతి పెంచాలి
మాలూరు: సహకార సంఘాలు రాజకీయాలకు దూరంగా ఉంటూ అన్నదాతలకు అండగా నిలవాలని ఎమ్మెల్యే కేవై నంజేగౌడ అన్నారు. నగరంలోని తిరుమల కళ్యాణ మంటపంలో తాలూకా ప్రాథమిక సహకార వ్యవసాయ సహకార, గ్రామీణ అభివృద్ధి బ్యాంకు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన 2024–25 సంవత్సర సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కోలారు చిక్కబళ్లాపురం జిల్లాల పైకి పీల్డీ బ్యాంకు రైతులకు అధిక రుణాలు ఇవ్వడం, 82 శాతం రికవరీ చేయడం గొప్ప విషయమన్నారు. సహకార సంస్థలు రైతుల పరంగా పనిచేయాలన్నారు. సహకార సంస్థల ద్వారానే రైతుల అభివృద్ధి సాధ్యమన్నారు. రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి బ్యాంకు విశ్వాసం పొందాలన్నారు. బ్యాంకు అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వెంకటేశప్ప, డైరెక్టర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
24/7 నీటి సరఫరా పథకం అమలులో జాప్యం
హుబ్లీ: హుబ్లీ, ధార్వాడ నగర పాలక సంస్థ అన్ని వార్డుల్లో 24/7 నీటి సరఫరా పథకం విస్తరించే ప్రణాళిక అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. నాలుగున్నర ఏళ్ల నుంచి నత్తనడకన పనులు జరుగుతున్నాయి. పథకంలో భాగంగా సవదత్తి జాక్వెల్ నుంచి అమ్మిన బావి వరకు 29.51 కిలోమీటర్ల కచ్చనీటి ముఖ్య ట్యాంక్ అమర్చారు. 43 ఎంఎల్డీ సామర్థ్యం కొత్త నీరు సంస్కరణ యూనిట్ రచనాత్మక పనులు ముగిశాయి. యంత్రోపకరణాలు అమర్చే ఎలక్ట్రో మెకానిక్ పనులు పెండింగ్లో ఉన్నాయి. పథకం ప్రారంభమై దశల వారీగా అమలు అవుతుండటంతో తొలి దశలో జంట నగరాల్లోని 11 వార్డులకు రోజు 24 గంటల నీటి సరఫరా చేస్తున్నారు. గత ఆగస్టు వరకు వివరాలను పరిశీలిస్తే ఇంటి కనెక్షన్లు ఇవ్వడానికి జంట నగరాల్లో 1,688 కిలో మీటర్ల పంపిణీ నెట్వర్క్కు గాను ఇప్పటి వరకు కేవలం 867 కిలోమీటర్ల మార్గంలో ఇళ్లకు కొళాయిలను ఏర్పాటు చేశారు. దీంతో ఇంటింటికీ నిరంతర నీటి సరఫరా చేయడం పెద్ద సవాల్గా మారింది. ప్రాజెక్ట్ అమలులో జాప్యానికి ఇది ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ విషయమై ఈ పథకం అమలు యూనిట్ ఎస్ఈ కవిత మాట్లాడారు. రోడ్లు పీడబ్ల్యూడీ జాతీయ హైవే, పాలికె తదితర వివిధ సంస్థ పరిధిలో రావడంతో పైపులైన్ వేయడానికి రోడ్లను ధ్వంసం చేయాల్సి వస్తోందన్నారు. ఇందుకు అనుమతి పొందేందుకు సమయం పడుతుందని పేర్కొన్నారు. 6 రోజుల నుంచి 8 రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా చేసే స్థలాలను కలిగిన మధ్యంతర వార్డుల్లో మేము అనుకున్న ప్రణాళిక మేరకు అవాంతరాలు లేకుండా పనులు జరిగితే అక్టోబర్ చివరి కల్లా 5 రోజులకు ఒకసారి నీటి సరఫరా చేయవచ్చన్నారు. ఇటీవల రాయపురలో నీటి ట్యాంక్ అమర్చడానికి రైతులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో నిర్మాణ పనుల్లో జాప్యం జరిగింది. ఈ సమస్యను ప్రస్తుతం పరిష్కరించామన్నారు. ఎలక్ట్రో మెకానిక్ పనులు అలాగే ట్యాంకులకు కనెక్ట్ చేసే ప్రక్రియ అక్టోబర్ చివరి కల్లా పూర్తయితే జంట నగరాల్లోని అన్ని మధ్యంతర వార్డులకు 5 రోజులకు ఒకసారి నీటి సరఫరా చేయవచ్చని వెల్లడించారు. -
అటవీశాఖలో పెచ్చుమీరిన అక్రమాలు
కోలారు: సామాజిక అటవీ ఉపవిభాగంలో అవినీతి అక్రమాలు జరిగాయని, వాటిపై దర్యాప్తు చేయించాలని దళిత సంఘర్ష సమితి కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం అటవీ సంరక్షణాధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సమితి సంచాలకుడు మేడిహాళ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి అక్రమాలు పెచ్చుమీరిపోతున్నాయన్నారు. అటవీశాఖ కార్యాలయంలో అటవీ సంరక్షణాధికారి ధనలక్ష్మి సర్వాధికార ధోరణిని అనుసరిస్తున్నారని ఆరోపించారు. 2019 నుంచి 2023 వరకు శ్రీనివాససపురం తాలూకా మాస్తేనహళ్లి గ్రామ పంచాయతీ వ్యాప్తిలో మొక్కలు నాటిన పనుల్లో, ఉపాధిహామీ పనుల్లో అక్రమాలు జరిగాయన్నారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సమితి సంచాలకుడు వేమగల్ రమేష్, మేడిహాళ భైరప్ప, మాస్తేనహళ్లి కృష్ణప్ప పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల చేతుల్లోనే పిల్లల భవిష్యత్తు
హొసపేటె: పాఠశాలల అభివృద్ధితో సహా అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని హోస్పేట్ ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప తెలిపారు. శుక్రవారం నగరంలోని సాయిలీల కళ్యాణ మందిరంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హోస్పేట్ ప్రాంతంలో 2 సంవత్సరాల కాలంలో 90 పాఠశాల గదులు నిర్మించామని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న 350 తరగతి గదులను పునరుద్ధరించామని వెల్లడించారు. విద్యా పురోగతికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడిందన్నారు. అథ్లెట్లకు శిక్షణ, వసతి, టాయిలెట్ సౌకర్యాలు అందించడానికి నగరంలోని జిల్లా స్టేడియం సమీపంలో రూ.5 కోట్ల వ్యయంతో ఒక క్రీడా పాఠశాలను నిర్మిస్తారని తెలిపారు. జిల్లా స్టేడియం అభివృద్ధికి రూ.5 కోట్ల గ్రాంట్ ఇవ్వబడిందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని అన్ని పాఠశాలల క్రీడా మైదానాలను అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 117 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులు, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులతో సహా పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులను సత్కరించారు. కార్యక్రమంలో హోస్పేట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ హెచ్ఎన్ఎఫ్ నియాజీ, గ్యారంటీ ఇంప్లిమెంటేషన్ చైర్మన్ కే.శివమూర్తి, పాఠశాల విద్యాశాఖ డైట్ డిప్యూటీ డైరెక్టర్ జేఎం తిప్పేస్వామి, డీడీపీఐ వెంకటేష్ రామచంద్రప్ప, బీఈఓ శేఖరప్ప హొరపేట, ఉపాధ్యాయ సంఘాల నేతలు వివిధ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
వర్షాకాలం.. ఇళ్లకు ప్రమాదం
సాక్షి బెంగళూరు: రోజంతా కష్టపడి ఇంటికి వచ్చి కాస్తా సేద తీరితే ఆ తృప్తే వేరు.. బయట ఎన్ని పనులున్నా, ఎక్కడున్నా చివరికి ఇంటికి చేరితే ఎంతో నెమ్మది, ఆహ్లాదంగా ఉంటుంది. అలాంటి ఇల్లు అకాల వర్షాలకో, వరదలకో నేలకొరిగిపోతే సగటు మనిషి జీవితం కూలిపోయినట్లుగానే అనిపిస్తుంది.. ఇలా 2019–2020 నుంచి రాష్ట్రంలో అతివృష్టి, వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఇప్పటికీ సరైన నివాసం లేకపోవడం గమనార్హం. ఇలా రాష్ట్రంలో అతివృష్టి కారణంగా ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాల సంఖ్య సుమారు 3 లక్షలకు పైగానే ఉంది. వీరందరికి ఇప్పటివరకు సరైన పరిహారం, ఉండేందుకు నివాసం కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయి. పరిహారం సరిగా అందక.... అత్యధిక వర్షాలు, నది ప్రవాహాలతో పాటు స్థానికంగా వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో ప్రతి ఏటా ఆయా గ్రామాలు, పట్టణాల్లో ఇళ్లకు నష్టం చేకూరుతోంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం ప్రకటిస్తున్నా, కొన్ని కారణాలతో సకాలంలో పరిహారం లభించక బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం ఇచ్చి పరిహారం ఇల్లు నిర్మించేందుకు సరిపోవడం లేదని కన్నీరు పెడుతున్నారు. 2019–2020 నుంచి 2024–2025 వరకు రాష్ట్రంలో ఇలా 2.86 లక్షల ఇళ్లకు అతివృష్టి, వరదలు, నదీ ప్రవాహాల కారణంగా నష్టం వాటిల్లింది. ఈ ఏడాది కురుస్తున్న వర్షాలకు మరిన్నీ ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. అతివృష్టి నష్టాన్ని నివారించేందుకు రాష్ట్రంలో 2019లో ‘వరద బాధితుల పునర్వసతి పథకాన్ని’ రూపొందించారు. ఈ పథకం కింద ఎన్డీఆర్ఎఫ్ కింద ఆర్థిక సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిహారం అందిస్తోంది. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పూర్తి ఇల్లు నాశనం అయితే రూ. 5 లక్షల పరిహారం ఇచ్చారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ పరిహారం రూ. 1.20 లక్షలతో పాటు వసతి యోజన కింద ఒక ఇల్లు నిర్మాణం కూడా చేస్తున్నారు. ఐదేళ్లలో అతివృష్టి కారణంగా ఇళ్లకు నష్టం రాష్ట్రంలో మూడు లక్షలు దాటిన వరద బాధితులు జీపీఎస్ పూర్తి కాక అవస్థలు బాధితులకు పరిహారాన్ని ఇల్లు నిర్మాణ దశ ఆధారంగా జీపీఎస్ చేసి పంపిణీ చేస్తున్నారు. నిర్మాణ దశ సమయంలో సరిగ్గా జీపీఎస్ అవ్వని కారణంగా ప్రస్తుతం పరిహారం అందడం లేదని గ్రామ పంచాయతీ సిబ్బంది, బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఇళ్లు సగం వరకు నష్టపోవడంతో అలాంటి బాధితులకు రూ. 50 వేలు, పూర్తిగా నాశనం అయితే రూ. 1.20 లక్షలు ఇస్తున్నారు. దీనికితోడు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ పరిహారం ద్వారా పునాదులు నిర్మించడం కూడా వీలుపడడం లేదు. కొన్ని చోట్ల పరిహారం సరిగ్గా అందకపోవడంతో సగంలోనే ఇంటి నిర్మాణాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం మూడు దశల్లో ఇంటికి కలిగిన నష్టాన్ని లెక్కిస్తున్నారు. 75 శాతం కంటే ఎక్కువగా ఇంటికి హాని కలిగితే పూర్తి నష్టంగా, 25 శాతం నుంచి 75 శాతం హాని కలిగితే ఒకరకమైన నష్టంగా, 15 శాతం నుంచి 25 శాతం నష్టం వాటిల్లితే అల్ప నష్టంగా పరిగణిస్తున్నారు. ఇలా ప్రస్తుతం మూడు లక్షలకు పైగా ఇళ్లకు హాని కలిగినట్లు అంచనా వేశారు. -
అంతులేని అభిమానం
సాక్షి బళ్లారి: ఓ మహిళ సీఎం సిద్ధరామయ్య ఫొటోను ఇంటి వాకిలిపై చిత్రీకరించుకుని అభిమానం చాటుకుంది. సాధారణంగా ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం, పింఛన్, వివిధ పథకాల ద్వారా వచ్చే నగదును అవసరాలకు వాడుకుంటారు. అయితే ఉమ్మడి బళ్లారి జిల్లాలోని కూడ్లిగీ తాలూకా కెంచమనహళ్లి గ్రామానికి చెందిన మల్లేశప్ప తిప్పేస్వామి భార్య పార్వతమ్మ గత 15 నెలలుగా ప్రభుత్వం నుంచి గృహలక్ష్మి పథకం ద్వారా వచ్చిన డబ్బును ఖర్చు చేయకుండా రూ.30 వేలు పోగు చేసింది. నూతన గృహానికి ఏర్పాటు చేసిన తలుపుపై (వాకిలి) సీఎం సిద్ధరామయ్య ఫొటో వేయించుకుంది. సీఎం సిద్ధరామయ్య ఫొటోను దేవుడి ఫొటో తరహాలో చెక్కించామని పార్వతమ్మ తెలిపింది. మామూలుగా ఇంటి ప్రధాన ద్వారాలకు తమ ఇష్ట దేవుడు, ఇంటి దేవుడు భావ చిత్రాలను చెక్కించుకోవడం ఆనవాయితీ. సంప్రదాయానికి భిన్నంగా తమ అభిమాన నాయకుడి ఫొటోను చెక్కించుకోవడం విశేషం. గృహలక్ష్మి నిధులతో ఇంటి వాకిలిపై సీఎం సిద్ధరామయ్య ఫొటో వేయించుకున్న మహిళ -
వ్యక్తి ద్వేషానికి యువతి బలి
దొడ్డబళ్లాపురం: వ్యక్తిపై ద్వేషంతో అతని కుమార్తెను హతమార్చిన కిరాతకుడి ఉదంతం కలబుర్గి జిల్లా సేడం తాలూకా మళఖేడ గ్రామంలో చోటు చేసుకుంది. ఇదే గ్రామ నివాసి భాగ్యశ్రీ హత్యకు గురైన యువతి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ఈనెల 11న భాగ్యశ్రీ రోజులానే రాత్రి 8 గంటల సమయంలో తన అక్కతో కలిసి బయటకు వాకింగ్కు వచ్చింది. ఆ సమయంలో ఆమె అక్క కాస్త దూరంలోని కిరాణా కొట్టుకు వెళ్లి అవసరమైన వస్తువులు తీసుకుని వచ్చేలోపు భాగ్యశ్రీ కనబడకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు మిస్సింగ్ కంప్లెయింట్ ఇచ్చారు. అయితే శుక్రవారం ఉదయం భాగ్యశ్రీ మృతదేహం గ్రామ శివారులోని సిమెంటు ఫ్యాక్టరీ పక్కన నాలాలో లభించింది. మృతదేహం దాదాపు కుళ్లిపోయింది. నెల రోజుల క్రితం సిమెంటు ఫ్యాక్టరీలో పని చేస్తున్న వినోద్ అనే వ్యక్తి తన ఉద్యోగం పర్మినెంటు కాలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకు కారణం ఫ్యాక్టరీలో యూనియన్ లీడర్గా ఉన్న భాగ్యశ్రీ తండ్రి చెన్నబసయ్య అని నమ్మిన వినోద్ తమ్ముడు మంజునాథ్ వినోద్ మృతికి చెన్నబసయ్య కారణమని భావించి అతడిపై కక్ష పెంచుకున్నాడు. ప్రతీకారంగా అతడి కుటుంబ సభ్యుల్లో ఒకరిని హత్య చేస్తానని గ్రామస్తులందరి ముందు ప్రతిన బూనాడు. అన్నట్టుగానే భాగ్యశ్రీని కిడ్నాప్ చేసి హత్య చేశాడని పోలీసుల విచారణలో తేలింది. మిస్సింగ్ కేసు నమోదవగానే మంజునాథ్పై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహం లభించడంతో పోలీసులు మంజునాథ్ను అరెస్టు చేశారు. మరో నెల రోజుల తర్వాత భాగ్యశ్రీ ఇంజినీరింగ్ కళాశాలలో చేరాల్సి ఉంది. అయితే దుండగుడి ప్రతీకారానికి బలైంది. కిడ్నాప్ చేసి హత్య చేసిన కిరాతకుడు -
ఆరోగ్యంపై మహిళలు శ్రద్ధ వహించాలి
హొసపేటె: ఆరోగ్యంపై మహిళలు శ్రద్ధ వహించాలని వైద్యురాలు దివ్యశ్రీ సూచించారు. శుక్రవారం తాలూకాలోని గదిగనూర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ నారి సశక్త పరివార్ అభియాన్లో భాగంగా ఆరోగ్యకరమైన మహిళలు, బలమైన కుటుంబాలు అనే ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆర్యోగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల మహిళలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆరోగ్య సేవలను సక్రమంగా పొందేందుకు ప్రచారం ద్వారా అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. మహిళలు చెవి, కన్ను, ముక్కు, గొంతు, రక్తపోటు, క్యాన్సర్–నోరు, రొమ్ము, గర్భాశయ పరీక్ష, టీకా సేవలు, రక్తహీనత స్థాయి, క్షయ తదితర వ్యాధులకు వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు. ఆరోగ్యకరమైన సీ్త్ర తన మొత్తం కుటుంబం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి స్వస్థ్ నారి, సశక్తి పరివార్ అభియాన్ ప్రారంభించబడిందన్నారు. ఆరోగ్య విద్య అధికారి ఎంపీ దొడ్డమణి మాట్లాడుతూ.. మాతృ వందన యోజన రిజిస్ట్రేషన్, అవయవ దాన రిజిస్ట్రేషన్, రక్తదాన శిబిరాలు, బుతు పరిశుభ్రత, పోషకాహారంపై అవగాహన తదితర సేవలను పొందేందుకు వీలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ సేవలను పొందడానికి ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం లేదా అంగన్వాడీలను సంప్రదించాలని సూచించారు. -
మలెమహదేశ్వర హుండీ ఆదాయం రూ.1.70 కోట్లు
మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకా శ్రీక్షేత్రం మలెమహదేశ్వర బెట్టలో కొలువైన మహదేశ్వర స్వామిపై కాసుల వర్షం కురిసింది. శుక్రవారం స్వామివారి హుండీలను లెక్కించగా 29 రోజులకు సంబంధించి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.1.70 కోట్ల నగదు, 30 గ్రాముల బంగారం, 1,100 గ్రాముల వెండి లభించింది. మలెమహదేశ్వర స్వామి బెట్ట బస్టాండు వద్ద ఉన్న వాణిజ్య భవనంలో సాలూరు బృహన్మఠం అధ్యక్షుడు శ్రీశాంతమల్లికార్జున స్వామీజీ, ప్రాధికార కార్యదర్శి రఘు సమక్షంలో హుండీలు లెక్కించారు. కోరిక తీర్చలేదని యువతిపై కత్తితో దాడి దొడ్డబళ్లాపురం: కో లివింగ్ పీజీలో సెక్స్కి ఒప్పుకోలేదని యువతిపై వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన బెంగళూరు వైట్ఫీల్డ్లో చోటు చేసుకుంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్న బాబు అనే వ్యక్తి యువతిపై కత్తితో దాడి చేసిన నిందితుడు. ఇతడికి వివాహం అవడంతోపాటు ఒక బిడ్డ కూడా ఉంది. అయితే వైట్ఫీల్డ్లో పీజీలో ఉన్నాడు. ఇటీవల ఒక యువతి అదే పీజీలో చేరింది. ఆమెతో పరిచయం పెంచుకుని ఫోన్ నంబర్ తీసుకుని తరచూ కాల్ చేసేవాడు. గత మూడు రోజులుగా ఆమెను సెక్స్ కోసం వేధించడం ప్రారంభించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ప్రైవేటు ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడు. రూ.70 వేలు నగదు ఇవ్వాలని డిమాండు చేశాడు. ఆమె మొబైల్ బలవంతంగా లాక్కొని రూ.14 వేలు తన అక్కౌంట్కి వేసుకున్నాడు. ఈక్రమంలో గురువారం మరోసారి సెక్స్ కోసం ఒత్తిడి చేయగా, ఆమె సమ్మతించకపోవడంతో కత్తితో పొడిచాడు. ఘటనపై వైట్ఫీల్డ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. దర్శన్ కేసు విచారణ వాయిదా యశవంతపుర: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడు దర్శన్ చార్జిషీట్పై విచారణను ఈనెల 25వ తేదీకి వాయిదా వేస్తూ బెంగళూరు 57వ సీసీహెచ్ కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఇద్దరు నిందితులు గైర్హాజరు కావటంతో కేసు విచారణను వాయిదా వేసింది. పవిత్రగౌడ, దర్శన్లను కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. పవిత్రగౌడపై ఉన్న ఆరోపణలపై చార్జిషీట్ను దాఖలు చేయాలని ఆమె తరపున న్యాయవాది వాదించారు. అయితే నిందితులు కార్తీక్, కేశవమూర్తి గైర్హాజరు కావటంతో కోర్టు విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. దర్శన్కు జైల్లో సరైన సౌకర్యాలు కల్పించలేదని ఆయన తరపున న్యాయవాది వేసిన పిటిషన్పై జైలు అధికారులకు నోటీసులివ్వగా మ్యాన్యువల్ ప్రకారమే సౌకర్యాలు కల్పించినట్లు జైలు అధికారులు కోర్టుకు నివేదించారు. రేణుకాస్వామి హత్య కేసులో హైకోర్టు ఇచ్చిన బెయిల్ను సుప్రీం కోర్టు ఆగస్ట్ 14వ తేదీన రద్దు చేయటంతో 7 మంది నిందితులు మళ్లీ జైలుకు వెళ్లిన సంగతి విదితమే. కులగణన వాయిదా వేయలేదు బనశంకరి: కులగణనను వాయిదా వేయలేదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరోసారి స్పష్టం చేశారు. శుక్రవారం బెంగళూరులో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ సంస్థ శాశ్వత వెనుకబడిన వర్గాల కమిషన్ అందరి అభిప్రాయం తీసుకుని తీర్మానం చేసిందన్నారు. కులగణనను ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. కేబినెట్లో మంత్రుల అసంతృప్తిపై స్పందించిన సీఎం.. బీజేపీ వారు రాజకీయం చేస్తున్నారన్నారు. మేము కూడా రాజకీయంగా ఎదుర్కోవాలన్నారు. ఈ విషయాన్ని ఖండించాలని మంత్రులకు తెలిపామన్నారు. గురువారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో కులగణనతో ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తరాదన్నారు. కొత్త కులాలను చేర్చడంతో గందరగోళం ఏర్పడుతోందన్నారు. దీనిని సరిదిద్దకుండా కులగణన వద్దు అని, సామాజిక విద్యా సమీక్ష అని ప్రజలకు తెలపడం సాధ్యమౌతుందా? అని ప్రశ్నించారు. కులగణన వాయిదాకు డీకే.శివకుమార్తో పాటు 20 మంది మంత్రులు ఆమోదం తెలిపారన్నారు. -
అక్టోబర్ 7న వాల్మీకి జయంతి
హొసపేటె: నగరంలోని బళ్లారి రోడ్డులోని పుణ్యానందపురి కళ్యాణ మంటపంలో అక్టోబర్ 7న మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిలాఅధికారి కవిత తెలిపారు. జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి ఏర్పాట్లపై ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యాసాధన, సామాజిక సేవ, ఉన్నత విద్యలో అత్యున్నత విజయాలు సాధించిన వాల్మీకి సమాజానికి చెందిన విద్యార్థులను సత్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్ఎస్ఎల్సీ, పీయూసీ, గ్రాడ్యుయేషన్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ఇవ్వాలని తెలిపారు. వాల్మీకి మహాసభ తాలూకా అధ్యక్షుడు గోసాల భరమప్ప మాట్లాడుతూ.. వాల్మీకి గురుపీఠం స్వామిజీ, వివిధ ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఒక సమావేశం నిర్వహించి వాల్మీకి జయంతి వేడుకలపై చర్చించామన్నారు. రాష్ట్రంలో వాల్మీకి సమాజం 45 లక్షల జనాభా ఉందన్నారు. ప్రభుత్వం అందించిన 7 శాతం రిజర్వేషన్ ఇప్పటికే ఉపయోగించబడుతోందని తెలిపారు. కానీ ఇతర వర్గాలను అందులో చేర్చి మన హక్కులను ఉల్లంఘించే కుట్ర జరుగుతోందన్నారు. జిల్లా పరిపాలనకు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలనే లక్ష్యంతో వాల్మీకి సమాజం నాయకులందరూ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎస్.జాహ్నవి, అదనపు డిప్యూటీ కమిషనర్ పి.వివేకానంద, జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ అధికారి కే.రవి కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ వైఏ.కాలే, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. వాల్మీకి జయంతి ఘనంగా నిర్వహిద్దాం బళ్లారి రూరల్: దావణగెరె నగరంలో అక్టోబర్ 7న వాల్మీకి జయంతిని వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు దావణగెరె అదనపు జిల్లా అధికారి శీలవంత శివకుమార్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం డీసీ కార్యాలయ సభా ప్రాంగణంలో సంసిద్ధత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలోని హొండిద సర్కిల్లోని రాజవీర మదకరి నాయక విగ్రహానికి పుష్పార్చన చేసిన అనంతరం వాల్మీకి చిత్రపటం ఊరేగింపు ప్రారంభం అవుతుందన్నారు. ఎంసీసీ బ్లాక్లోని గుండి మహదేవప్ప కళ్యాణ మండపంలో సభ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్టీ సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడు నాగరాజ్, దూడా కమిషన్ హలిమని తిమ్మణ్ణ కన్నడ సంస్కృతి శాఖ సహ సంచాలకుడు రవిచంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
మురుగు కాలువలు నిర్మించాలి
రాయచూరు రూరల్: నగర వార్డు పరిధిలోని వివిధ కాలనీల్లో మురుగు కాలువలు నిర్మించాలని మాజీ నగర సభ సభ్యుడు శంశాలం డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన వివిధ కాలనీల్లో పర్యటించారు. రహదారిపై మురుగు ప్రవహించడంతో అసహనం వ్యక్తం చేశారు. అపరిశుభ్రత నెలకొనడంతో అంటు వ్యాధులు సోకే ప్రమాదం ఉందని తెలిపారు. అధికారులు అప్రమత్తమై పరిశుభ్రత చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం స్పందించి త్వరితగతిన మురుగు కాలువల నిర్మాణాలు చేపట్టాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ముందుకు రావాలని సూచించారు. మానవ హక్కుల ఉల్లంఘన సరికాదురాయచూరు రూరల్: భారత ప్రభుత్వం పాలస్తీనాలో శాంతి స్థాపనకు కృషి చేయాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం పాత జిల్లా అధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ అధ్యక్షుడు అణ్ణప్ప మాట్లాడారు. ఇజ్రాయెల్ దేశం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడటం దుర్మార్గం అని మండిపడ్డారు. పాలస్తీనా ప్రజలపై నిరంతరం దాడులు చేస్తోందని తెలిపారు. ఆకలిని యుద్ధంగా మార్చిందన్నారు. ఉగ్రవాదం, మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఆరోపించారు. దేశాలను ఆక్రమించుకునే పద్ధతికి స్వస్తి పలకాలన్నారు. పరిసరాల శుభ్రతతో ఆరోగ్యం ● కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి హుబ్లీ: 2026 మార్చిలోపు క్షయ రహిత దేశంగా తీర్చిదిద్దుకుందాం. ముఖ్యంగా ధార్వాడ జిల్లాలో ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పిలుపునిచ్చారు. శుక్రవారం కలఘటికి తాలూకా ఆస్పత్రి ఆవరణలో స్వస్థ నారి సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. మొక్కకు నీరు పోసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. మనం నివసించే లేఅవుట్లు విద్యా సంస్థలు, పార్కులను శుభ్రంగా పెట్టుకోవాలన్నారు. నశముక్త అభియాన ద్వారా జాగృతి కల్పిస్తామని వెల్లడించారు. కార్పొరేట్ సంస్థల సామాజిక నిధుల ద్వారా పాఠశాలల్లో కట్టడాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. 35 వేల డెస్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అలాగే సుమారు 800 పాఠశాలలకు రంగులు వేయించినట్లు గుర్తు చేశారు. స్వస్థ నారి సశక్త పరివార్ అభియాన్లో భాగంగా బీపీ, షుగర్, నీటి క్యాన్సర్, గర్భశయ క్యాన్సర్, అలాగే రక్తహీనతతో పాటు వివిధ రోగాలకు వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. 2047 కల్లా భారత దేశం వికసిత భారత్గా తీర్చిదిద్దబడుతుందన్నారు. దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ చేతులు కలపాలని సూచించారు. జిల్లాలోని వివిధ క్షేత్రాల సాధకులు, పౌర కార్మికులను సన్మానించారు. వృద్ధులు, దివ్యాంగులకు ఉచితంగా సాధన పరికరాలు పంపిణీ చేశారు. ప్రధాని మోదీ వర్చువల్గా కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లాధికారి దివ్యప్రభు, ఎస్పీ గుంజన్ ఆర్య, డీహెచ్ఓ డాక్టర్.వనకేరి, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ డీడీ డాక్టర్ కుకనూర, ప్రముఖులు నాగరాజ్ శబ్బి, నింగప్ప సుతగట్టితో పాటు వివిధ శాఖల అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు, స్థానికులు పాల్గొన్నారు. తెగుళ్లపై అప్రమత్తత అవసరం బళ్లారి రూరల్: జిల్లాలో వివిధ తాలూకాల్లో సల్ఫర్ కొరతతో కంది పంటకు సోకిన వ్యాధిని సులభంగా అరికట్టవచ్చని హగిరి ఐసీఏఆర్ వ్యవసాయ విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పి.పాలయ్య తెలిపారు. గురువారం తాలూకాలోని కగ్గల్లు గ్రామ రైతు సుముద్ర రాజు సాగు చేసిన కంది పంటను పరిశీలించారు. కంది పంటకు సల్ఫర్ కొరత వల్ల ఏర్పడే వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సల్ఫర్ కొరతో మొక్క మొదలు భాగం సన్నగిల్లి మొత్తం వ్యాపిస్తుందని తెలిపారు. ఇందువల్ల పంట దిగుబడి తగ్గి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. ఈ వ్యాధిని నివారించడానికి ప్రతి ఎకరాకు 20 కిలోల అమ్మోనియం సల్ఫేట్ లేదా 10 కిలోల పొటాషియం సల్ఫేట్ లేదా 50 కిలోల సూపర్ పాస్ఫేట్ చల్లాలన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ ఎస్.రవి, డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నాడ హబ్బ వేడుకలకు రాచనగరి ముస్తాబు
మైసూరు : మరో మూడు రోజుల్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన నాడ హబ్బ మైసూరు దసరా వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో మైసూరు నగరం మొత్తం విద్యుత్ కాంతుల వెలుగులో దసరా వేడుకలకు ముస్తాబవుతోంది. మైసూరు దసరా ఏర్పాట్లు మొత్తం ఇప్పటికే పూర్తి కావస్తుండడంతో పాటు అన్ని రకాల కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. సెస్క్ ఆధ్వర్యంలో మైసూరు నగరంలో సుమారు 135 కి.మీ.వ్యాప్తిలో రోడ్లకు సుమారు 118 సర్కిళ్లలో విద్యుత్ దీపాల అలంకరణ చేశారు. వాటితోపాటు ప్రముఖ రోడ్లు, సర్కిళ్లలో ఆకర్షణీయమైన చిత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మైసూరు నగరంలో ఉన్న ప్రముఖ రోడ్లు, నగర సమీపంలో ఉన్న ప్రముఖ రహదారులను దీపాలంకరణ చేయడానికి ట్రయల్ రన్ చేస్తున్నారు. దీపాలంకరణ కోసం సుమారు 300 కిలో వ్యాట్ల 2,57,520 యూనిట్ల విద్యుత్ను వినియోగిస్తున్నారు. మైసూరు నగరంలోని హార్డింజ్ సర్కిల్, కేఆర్ సర్కిల్, చామరాజ సర్కిల్లో ఉన్న గోపురాలకు రంగులు వేశారు. అక్కడ ఉన్న విగ్రహాలను కూడా శుభ్రం చేశారు. జంబూసవారీ ఊరేగింపు వెళ్లే మార్గంలో ఉన్న అన్ని పుట్పాత్లు, రోడ్లు అభివృద్ధి చేయడం ద్వారా దసరా జంబూసవారీ వెళ్లే మార్గంలో మైసూరు ప్యాలెస్ చుట్టు కూడా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. సుమారు రూ.114.66 లక్షల వ్యయంతో ఈ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. దివంగత దేవరాజ అరసు రోడ్డు జేఎల్బీ రోడ్డు, కేఆర్ సర్కిళ్లలో త్రీడీ పెయింటింగ్తో పాటు ఇతర ప్రాంతాల్లోను ఏర్పాటు చేస్తున్నారు.