Karnataka News
-
ఎయిమ్స్ ఏర్పాటుకు ఒత్తిడి తెండి
రాయచూరు రూరల్: రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటు విషయంలో రాజకీయాలు చేయకుండా ప్రజాప్రతినిధులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎయిమ్స్ పోరాట సమితి ప్రధాన సంచాలకుడు బసవరాజ్ కళస డిమాండ్ చేశారు. సోమవారం న్యూఢిల్లీలో రైల్వే శాఖ సహాయ శాఖ మంత్రి సోమన్న, వ్యవసాయ శాఖ మంత్రి శోభా కరంద్లాజెలకు వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాయచూరుకు మొండి చెయ్యి చూపారన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ హయాంలో రాయచూరులో ఆందోళన చేపట్టామని గుర్తు చేశారు. -
పరీక్షలకు అభ్యంతరంపై ధర్నా
రాయచూరు రూరల్: రాయచూరు విశ్వవిద్యాలయంలో విద్యార్థులను పరీక్షలకు అనుమతించకుండా అధ్యాపకులు అభ్యంతరం వ్యక్తం చేయడంపై విద్యార్థులు ధర్నాకు దిగారు. సోమవారం వర్సిటీలో జరుగుతున్న ఎంఏ సోషియాలజీ పరీక్ష రాయడానికి హాల్ టికెట్లను ఇవ్వకుండా వేధిస్తుండడంతో విద్యార్థులు పైఅంతస్తులోకి వెళ్లి ఆత్మహతాయత్నం చేస్తుండగా యరగేర పోలీసులు అడ్డుకున్నారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థులను అధ్యాపకులు రాధ, శకుంతల తదితరులు అడ్డుకొని పరీక్షలు రాయడానికి అవకాశం కల్పించకుండా హాల్ టికెట్లు ఇవ్వకుండా వేధించడం, గైర్హాజరైన విద్యార్థులను పిలిచి అపాలజీ లేఖ రాయించుకున్నారన్నారు. అధ్యాపకులు తమపై ద్వేషం పెంచుకున్నారని ఆరుగురు విద్యార్థులు ఆరోపించారు. -
ఎయిమ్స్ ఏర్పాటుకు ఒత్తిడి తెండి
రాయచూరు రూరల్: రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటు విషయంలో రాజకీయాలు చేయకుండా ప్రజాప్రతినిధులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎయిమ్స్ పోరాట సమితి ప్రధాన సంచాలకుడు బసవరాజ్ కళస డిమాండ్ చేశారు. సోమవారం న్యూఢిల్లీలో రైల్వే శాఖ సహాయ శాఖ మంత్రి సోమన్న, వ్యవసాయ శాఖ మంత్రి శోభా కరంద్లాజెలకు వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాయచూరుకు మొండి చెయ్యి చూపారన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ హయాంలో రాయచూరులో ఆందోళన చేపట్టామని గుర్తు చేశారు. -
సర్కారు తీరుపై బీజేపీ శ్రేణుల కన్నెర్ర
సాక్షి, బళ్లారి: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సర్కారు తీరుపై, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీజేపీ నాయకులు ఆందోళన, ర్యాలీలు, సీఎం దిష్టిబొమ్మ దహనాలతో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్కుమార్ నేతృత్వంలో రాయల్ సర్కిల్ వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు మానవహారం నిర్మించారు. సీఎం దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా పోలీసులు, నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తున్నామన్నారు. మైనార్టీలకు సర్కారు 4 శాతం రిజర్వేషన్ కల్పించడంతో పాటు 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం హేయమైన చర్య అన్నారు. ఎస్సీ నిధులను దుర్వినియోగం చేసి పక్కదారి పట్టించి గ్యారెంటీలకు మళ్లించి పేదల సంక్షేమాన్ని కాలరాస్తున్నారన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ అభివృద్ధి పనులను పక్కనపెట్టిన సర్కారుకు ప్రజలే బుద్ధిచెప్పే రోజులు త్వరలో వస్తాయన్నారు. అనంతరం కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టి వినతిపత్రాన్ని సమర్పించారు. నాయకులు కేఎస్.దివాకర్, గురులింగనగౌడ, హనుమంతప్ప, శ్రీధరగడ్డ బసవలింగనగౌడ పాల్గొన్నారు, మైనార్టీలకు కాంట్రాక్ట్ల్లో రిజర్వేషన్ తగదు రాయచూరు రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ మైనార్టీలకు ప్రభుత్వ కాంట్రాక్ట్ పనుల్లో 4 శాతం రిజర్వేషన్ ప్రకటించడం తగదని బీజేపీ ఆరోపించింది. సోమవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఆందోళన చేపట్టిన మాజీ జిల్లాధ్యక్షుడు, శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ మాట్లాడారు. రాజ్యాంగంలో అంబేడ్కర్ ఎక్కడా కుల ప్రాతిపదికన పనుల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని పేర్కొనలేదన్నారు. సర్కార్ తీసుకున్న నిర్ణయం సరైనది కాదన్నారు. అసెంబ్లీలో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పునః సమీక్షించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రూ.39 వేల కోట్లను పంచ గ్యారెంటీలకు మళ్లించడం సరికాదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, ఇతరత్ర అంశాలపై పునః పరిశీలించాలని కోరుతూ అదనపు జిల్లాధికారి శివానందకు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో మాజీ శాసన సభ్యులు గంగాధర నాయక్, శంకరప్ప, మాజీ ఎంపీ బి.వి.నాయక్, నేతలు వీరనగౌడ, రాఘవేంద్ర, శంకర్రెడ్డి, శివ, లలిత, వీరయ్య, నాగరాజ్, నరసింహులు, యల్లప్ప, కరుణాకర్రెడ్డిలున్నారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్పై నిరసనహొసపేటె: 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ కార్యకలాపాల నుంచి ఆరు నెలల పాటు సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ విజయనగర జిల్లా బీజేపీ శాఖ స్పీకర్ ఆదేశాలకు వ్యతిరేకంగా సోమవారం నిరసన చేపట్టింది. పటేల్ నగర్లోని పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేసి స్పీకర్ ఆదేశంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్పీకర్ ఆదేశం ఎమ్మెల్యేల హక్కులను హరించేలా ఉందన్నారు. కనుక స్పీకర్ వెంటనే తన ఉత్తర్వును ఉపసంహరించుకోవాలన్నారు. ప్రభుత్వం తప్పులను బీజేపీ ఎమ్మెల్యేలు ఎత్తి చూపారన్నారు. అనంతరం తహసీల్దార్ శృతికి వినతిపత్రం సమర్పించారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం పోలీసులు, నేతల మధ్య వాగ్వాదం -
మహిళా సాధకులకు ఘన సన్మానం
హుబ్లీ: ఎప్పటికీ మరణం లేని కళలు, సాహిత్యం, సంగీతం, నృత్య కళలు మాత్రమే మనిషి మనస్సును వికసింపజేస్తాయని, ఈక్రమంలో ఫ్రెండ్స్ సోషల్ క్లబ్ సేవలు ప్రశంసనీయమని కర్ణాటక బాల వికాస అకాడమి అధ్యక్షులు సంగమేశ బబలేశ్వర అన్నారు. ఆలూరు వెంకటరావ్ భవన్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళా ప్రతిభోత్సవం, సాధకులకు సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. భారతీయ మాతృమూర్తి తన మొత్తం జీవితాన్ని పిల్లలు, కుటుంబ సభ్యులు, బంధువుల కోసం అంకితం చేసే త్యాగం ప్రపంచంలోని నోబుల్ బహుమతి కన్నా పెద్దదన్నారు. అలాంటి తల్లి స్వరూపమైన మహిళలను మనం విశ్వమహిళా దినోత్సవం సందర్భంగా సన్మానించడం భారతీయ తల్లులకు ఇచ్చే గౌరవం అన్నారు. బీఆర్టీఎస్ ఎండీ సావిత్రి మాట్లాడుతూ భారత రాజ్యాంగం మహిళలకు ఎన్నో అవకాశాలు కల్పించిందన్నారు. మనం నేడు పిల్లలను పోషించడంలో సమాజం తీరు మారాలన్నారు. అనంతరం మహిళా సాధకులను ఘనంగా సన్మానించారు. సీనియర్ నటుడు, డైరెక్టర్ శశిధర్ నరేంద్ర, సవితా అమరశెట్టి, ప్రకాష్ బాళెకాయి, వినోద్ కుసుగల్, డాక్టర్ పూర్ణిమా ముక్కుంది తదితరులు పాల్గొన్నారు. ఘనంగా జగద్గురు చంద్రశేఖర జయంతి హుబ్లీ: నాగశెట్టికొప్పలోని శ్రీశాండిల్య ఆశ్రమంలో సద్గురు చంద్రశేఖర స్వామి 90వ జయంతి ఉత్సవాలు, బగళాంబ మహిళా మండలి 20వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇంచల సాధు సంస్థాన మఠం జగద్గురు డాక్టర్ శివానంద భారతీ సాన్నిధ్యం వహించారు. సవదత్తి తాలూకా హళకట్టి శివానంద మఠం నిజగుణ స్వామి మాట్లాడుతూ అనుపమాచల భక్తి భావన శంభులింగ అనే విషయంపై ప్రవచనం చేశారు. జగాపుర కమ్మలవ్వ హళేమని చంద్రశేఖర్ స్వామి మూర్తికి తులాభారం నెరవేర్చారు. బెనకట్టి మల్లమాంబ భజన మండలి బృందం భజన గీతాలు ఆలపించారు. నాగశెట్టి కొప్ప, బెంగేరి, గోపనకొప్ప తదితర గ్రామస్తులు, ప్రముఖులు పాల్గొన్నారు. 31న చదరంగం పోటీలు హుబ్లీ: విద్యానగర్ రోటరీ భవన్లో ఈ నెల 31న ఉదయం 9.30 గంటలకు జద్గురు స్మార్ట్ అండ్ మ్యూజిక్ అకాడమి, రోటరీ క్లబ్ హుబ్లీ నార్త్ సహకారంతో 17 ఏళ్ల లోపు వయస్సుగల పిల్లలకు చెస్ పోటీలు ఏర్పాటు చేశారు. పోటీలను రామకృష్ణ వివేకానంద ఆశ్రమం తేజసానంద స్వామీజీ ప్రారంభించనున్నారు. పోటీల విజేతలకు నగదు బహుమతులు, ఆకర్షక ట్రోఫిలు, మెడల్స్ ఇవ్వనున్నారు. సంస్థ అధ్యక్షురాలు అర్చన నాయక్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు నాగేష్ రిత్తి తదితరులు పాల్గొననున్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 28 లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, 8431737265 నెంబర్లో సంప్రదించాలని నిర్వాహకులు ఓ ప్రకటనలో కోరారు. పెంచిన వేతనాలు చెల్లించాలిరాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు పెంచిన వేతనాలను త్వరగా చెల్లించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షురాలు ఈరమ్మ మాట్లాడారు. బెంగళూరు ఫ్రీడం పార్కులో గత జనవరి 7 నుంచి నిరవధిక దర్నాకు పూనుకోవడంతో ప్రభుత్వం స్పందించి ఆశా కార్యకర్తలకు రూ.10 వేల గౌరవ వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చిందన్నారు. పెంచిన గౌరవ వేతనాలను ఏప్రిల్ 1 నుంచి అందించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. క్షయపై జాగృతి జాతాకు శ్రీకారంరాయచూరు రూరల్ : సభ్య సమాజంలో క్షయ వ్యాధిగ్రస్తులను ప్రజలు దూరంగా ఉంచుతారని, క్షయ నిర్మూలనకు చర్యలు చేపట్టాలని జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్రబాబు సూచించారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద జాతాకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. 2035 నాటికి దేశంలో క్షయ వ్యాధి పూర్తి నియంత్రణలోకి తేవాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నెరవేర్చాలన్నారు. ప్రపంచంలో ప్రతి మూడు నిమిషాలకు ఒక్కరూ క్షయ వ్యాధి నుంచి మరణిస్తున్నారన్నారు. వ్యాధి సోకిన మరుక్షణమే ఆరు నెలల పాటు చికిత్స పొందాలన్నారు. జాతాథాలో వైద్యాధికారులు గణేష్, షాకీర్, నందిత, ఉద్యోగులు పాలాక్షి, సంధ్య, లక్ష్మి, సరోజ తదితరులున్నారు. సజావుగా గణితం పరీక్షలు కోలారు: జిల్లాలో 65 పరీక్ష కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన గణితం పరీక్షకు 355 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 17,219 మంది విద్యార్థులకు గాను 16,864 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్షలు ఎలాంటి గందరగోళం లేకుండా నిర్వహించినట్లు డీఈఓ కృష్ణమూర్తి తెలిపారు. నగరంలోని పలు పరీక్ష కేంద్రాలను డీఈఓతో పాటు సీఈఓ ప్రవీణ్ బాగేవాడి తదితర అధికారులు తనిఖీ చేశారు. పరీక్షలను సక్రమంగా నిర్వహిస్తుండడంపై సంతృప్తిని వ్యక్తం చేశారు. -
నేతల చిత్తశుద్ధి లోపం.. అభివృద్ధి శూన్యం
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధుల చిత్తశుద్ధి కొరతతో కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో అభివృద్ధి శూన్యమైందని హైదరాబాద్ కర్ణాటక పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజాక్ ఉస్తాద్ విచారం వ్యక్తం చేశారు. సోమవారం తారానాథ్ విద్యా సంస్థ ఆధ్వర్యంలో సోమ సుభద్రమ్మ రామనగౌడ మహిళా కళాశాలలో ఎల్వీడీ కళాశాల పాత విద్యార్థులతో ప్రాంతీయ అసమానతలు– సమస్యలు –సవాళ్లు అనే అంశంపై ఉపన్యసించి మాట్లాడారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతం గత 77 ఏళ్ల నుంచి అభివృద్ధికి నోచుకోలేక పోయిందన్నారు. విద్య, ఆరోగ్యం, మౌలిక సౌకర్యాలు, సార్వజనిక సేవలు, మానవ అభివృద్ధి గణాంకాలతో పోల్చితే ఇక్కడి ప్రజలు ఎన్నుకునే ప్రతినిధులు సమస్యలను వదిలి స్వార్థం వైపు ముందడుగు వేస్తున్నారన్నారు. డాక్టర్ వైజనాథ్ పాటిల్ ఆధ్వర్యంలో ఆర్టికల్–371(జె) 20 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో అమలైందన్నారు. నంజుండప్ప నివేదిక ప్రకారం 114 తాలూకాల్లో 29 తాలూకాలు వెనుకబడినట్లు నివేదిక ఇచ్చినా ఫలితం శూన్యమన్నారు. చెన్నమల్లికార్జున, ప్రిన్సిపాల్ సంజయ్ పవార్, త్రివేణి, ఆంజనేయ, ఓబులేష్లున్నారు. -
స్వాతంత్య్ర యోధులు ఆదర్శప్రాయులు
హొసపేటె: స్వాతంత్య్ర పోరాటంలో గొప్ప విప్లవకారులు, వీర అమరవీరులను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఏఐడీఎస్ఓ కార్యకదర్శి పంపాపతి తెలిపారు. ఆదివారం భగత్సింగ్, సుఖ్దేవ్ నగరలో ఏఐడీఎస్ఓ, ఏఐడీవైఓ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా క్రీడామైదానం, బీసీఎం హాస్టళ్లలో ఏర్పాటు చేసిన భగత్సింగ్ దినోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు. బ్రిటిష్ వారి అణిచివేతకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్య్రం కోసం రాజీ పడకుండా పోరాడి నవ్వుతూ ఉరి కంబాన్ని ఎక్కిన గొప్ప విప్లవకారుడు భగత్సింగ్ అని తెలిపారు. ప్రజలకు స్వేచ్ఛను తెచ్చే విప్లవ సందేశాన్ని విద్యార్థులు, యువత దేశంలోని ప్రతి మూలకు తీసుకెళ్లాలని, దానిని కోట్లాది మంది పీడిత ప్రజలకు తెలియజేయాలన్నారు. పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్యవాద దోపిడీని అంతం చేయడానికి సోషలిస్ట్ విప్లంవం అనివార్యమన్నారు. భగత్సింగ్ తన ప్రాణాలను అర్పించి 94 ఏళ్లు గడిచాయి. ఆయన సోషలిస్ట్ భారతదేశం కల ఇంకా నెరవేరలేదు. ప్రతి రోజూ, మన దేశంలో 7,000 మందికి పైగా పిల్లలు ఆకలితో చనిపోతున్నారన్నారు. విద్య, ఆరోగ్యం వ్యాపారమయం అయ్యాయన్నారు. నిరుద్యోగుల భారీ సైన్యం సృష్టి అవుతోందన్నారు. ప్రతి రోజూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రతి ఐదు నిమిషాలకు ఒక మహిళపై అత్యాచారం జరుగుతోంది. ఒక వైపు ఒక్క పూట భోజనానికి కూడా నోచుకోలేని పేదలున్నారు. మరో వైపు కొంత మంది పెట్టుబడిదారులు మొత్తం దేశంలోని 70 శాతం ఆస్తిని కలిగి ఉన్నారన్నారు. ఇంత తీవ్రమైన ఆర్థిక అసమానత ఉంది. ఈ సమస్యలన్నింటిని తొలగించడానికి, భగత్సింగ్ కలలు కన్న సోషలిస్ట్ భారతదేశ నిర్మాణానికి విద్యార్థులు, యువత ముందుకు వచ్చి భగత్సింగ్ కన్న కలను నిజం చేయాలన్నారు. సంఘం కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
సాంస్కృతిక కార్యక్రమాలతో కళల రక్షణ
హొసపేటె: భాష, సంస్కృతి, కళల రక్షణకు సమాజంలో నిరంతరంగా సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు ఎంతో అవసరమని ఎంపీ ఈ.తుకారాం తెలిపారు. ఆదివారం గౌతమ బుద్ధ ఫంక్షన్ హాల్లో గానగంగా కళాప్రతిష్టాన, కన్నడ, సంస్కృతి శాఖ బెంగళూరు సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంగీత, నృత్య కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కుల సంస్కృతి సాంస్కృతిక కార్యకలాపాల ద్వారా మనుగడ సాగిస్తూ పెరుగుతుందన్నారు. అయితే, నేటి యువతరం సాంస్కృతిక కార్యకలాపాలకు దూరం కావడం విచారకరమన్నారు. కర్ణాటక విద్యావర్థక సంఘానికి చెందిన డాక్టర్ పాటిల్ పుట్టప్ప సభా భవన్లో సమాన కళా అకాడమి, కన్నడ, సంస్కృతి శాఖ సహకారంతో నిర్వహించిన దసరా పండుగ వేడుకల్లో భాగంగా మహిళా సాంస్కృతిక ఉత్సవా ప్రారంభించి ఆయన మాట్లాడారు. నేటి కాలంలో విద్యార్థులు పాశ్చాత్య సంస్కృతికి బానిసలై స్వదేశీ సంస్కృతిని మరిచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ప్రతి పాఠశాలలో సాంస్కృతిక తరగతులు ప్రారంభించడం ఎంతో అవసరమన్నారు. వేదికపై ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకొన్నాయి. హుడా అధ్యక్షులు హెచ్ ఎన్ఎఫ్ ఇమామ్ నియాజీ, గానగంగా కళా ప్రతిష్టాన అధ్యక్షులు యల్లప్ప బండార్, సంగీత కళాకారుడు పండిట్ సదాశివ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
తొట్టెలతో పక్షుల దాహార్తికి చెక్
రాయచూరు రూరల్: నగరాల్లో ప్రాణులకు, పక్షులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని పచ్చని చెట్ల బళగ సంచాలకుడు కృష్ణమూర్తి పేర్కొన్నారు. సోమవారం నగరంలోని కృష్ణగిరి హిల్స్ చుట్టు పక్కల పరిసర ప్రాంతాల్లోని చెట్లు, కొండలు, గుట్టల్లో వేసవిలో దాహార్తి తీర్చడానికి నీటి తొట్టెలు ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్లో ఎండల వారి నుంచి రక్షణకు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు చెట్లు పెంచి పరిసరాలను సంరక్షించాలన్నారు. సమితి నేతలు నూతన్ రాజ్, రామమూర్తిలున్నారు. ట్రక్ టర్మినల్ పనుల పూర్తికి సూచనరాయచూరు రూరల్: నగరంలో ట్రక్ టర్మినల్ పనులు త్వరితిగతిన పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు సూచించారు. సోమవారం యరమరస్ వద్ద 25 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న దేవరాజ అరసు ట్రక్ టర్మినల్ పనులను పరిశీలించి ఉన్నతాధికారులను ఫోన్లో సంప్రదించి మాట్లాడారు. రాయచూరు జిల్లాలో పత్తి, మిరప, వరి తదితర వాణిజ్య పంటలు అధికంగా పండించే రైతుల సరుకులను రవాణా చేసే లారీల నిలుపుదలకు దేవరాజ అరసు ట్రక్ టర్మినల్ను పూర్తి చేయాలని ఒత్తిడి చేశారు. మంత్రి వెంట రుద్రప్ప, శాంతప్ప, శివమూర్తి, జయన్న, లక్ష్మిరెడ్డి, బసవరాజ్, నరసింహులున్నారు. కాగెకెరె వాసులకు ఇళ్ల పట్టాలివ్వరూ రాయచూరు రూరల్: నగరంలోని కాగెకెరె చెరువు ప్రాంతంలో నివాసముంటున్న వారికి ఇళ్ల పట్టాలివ్వాలని నగర బీజేపీ సంచాలకులు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. సిటీ కార్పొరేషన్లో 23వ వార్డు మడ్డిపేట కాగెకెరె చెరువు వద్ద 50 ఏళ్లుగా పేద కూలి కార్మికులు అధికంగా నివసిస్తున్నారన్నారు. అలాంటి 200 కుటుంబాలకు పట్టాలు ఇవ్వాలని, కర్ణాటక మురికి వాడల మండలి నుంచి వంద ఇళ్ల నిర్మాణానికి అవకాశం కల్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. రైల్వే డిమాండ్లు తీర్చాలని వినతి హొసపేటె: ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాల పెరుగుదల కోసం హొసపేటె నుంచి కొట్టూరు మీదుగా మంగళూరుకు ప్రత్యేక రైలు సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని, ప్రయాణికుల సౌకర్యం కోసం హొసపేటె రైల్వే స్టేషన్లో రెండు కొత్త ప్లాట్ఫాంల నిర్మాణం, రైల్వే స్టేషన్ ఆధునీకరణతో సహా పలు డిమాండ్లను తీర్చాలని నైరుతి రైల్వే జనరల్ మేనేజర్ ముకుల్ శరణ్ మాథుర్కు రైల్వే సమితి నేతలు వినతిపత్రాన్ని అందజేశారు. విజయనగర రైల్వే అభివృద్ధి కార్యాచరణ కమిటీ సీనియర్ సభ్యుడు బాబులాల్ జైన్ నేతృత్వంలోని ఆ కమిటీ ఆఫీస్ బేరర్లు ఈ ప్రతిపాదనలను సమర్పించారు. పుక్రాజ్ చోప్రా, ప్రభాకర్, మహేష్ కుడుతిని, రామకృష్ణ, ప్రౌమా మహేశ్వర్, నజీర్ సాబ్, విశ్వనాథ్ కెవటర్, అశోక్ జైన్, జబ్బార్, రాజ్ పురోహిత్, వరుణ్, రంగనాథ, రమేష్ లమాణి తదితరులు పాల్గొన్నారు. విమానయాన సంస్థ సేవలపై హర్షం హుబ్లీ: హుబ్లీ నుంచి మరో విమాన యాన సంస్థ సేవలు ప్రారంభించడంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్జోషి ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. సదరు విమాన సేవలతో రోజు మూడు విమానాలు బెంగళూరు– హుబ్లీల మధ్య సేవలు అందించనున్నాయన్నారు. గతంలో ఇండిగో అధికారులతో చర్చలు జరిపి మధ్యాహ్నం వేళ విమాన సేవ ప్రారంభించాలని సూచించానన్నారు. ఈ సేవ వల్ల హుబ్లీ– ధార్వాడ తదితర చుట్టు పక్కల జిల్లాల నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులకు ఎంతో అనుకూలం అన్నారు. ప్రస్తుతం తాజాగా మరో విమాన సేవ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇండిగో అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. హుబ్లీ నుంచి అహ్మదాబాద్ వరకు నూతన విమాన సేవను ప్రారంభించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
చాలా ఎక్కువగా విద్యుత్ డిమాండ్
శివాజీనగర: రాష్ట్రంలో ఇప్పటి వరకు విద్యుత్ కొరత ఏర్పడలేదు. అయితే వేసవి నేపథ్యంలో మామూలు కంటే విద్యుత్ను అదనంగా ప్రజలు ఉపయోగించారని కేపీటీసీఎల్ ఎండీ కుమార్ పాండే తెలిపారు. సోమవారం నగరంలో బెస్కాం బెళకు భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులకు, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామన్నారు. గత 6 నెలల నుంచి విద్యుత్ వాడకం అధికమైంది. వేసవి కారణాన ఇళ్లు, ఆఫీసులు, పరిశ్రమల్లో ఏసీ వినియోగం పెరిగింది. డిమాండు నేపథ్యంలో పంజాబ్ , యూపీ ద్వారా విద్యుత్ను కొంటున్నట్లు చెప్పారు. ఇంతకు ముందు రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ డిమాండ్ 17,220 మెగావాట్లు ఉండేది, ఈ ఏడాది 18,500 మెగావాట్లకు పెరిగిందని తెలిపారు. ఈసారి విద్యుత్ వాడకం 15 శాతం అధికమైందన్నారు. ఏప్రిల్, మేలో మరింత పెరుగుతుందని తెలిపారు. ఇళ్లు, పరిశ్రమల నుంచి ఎక్కువ ఒత్తిడి ఉందని చెప్పారు. సరఫరా కోసం చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇంధన శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తా మాట్లాడుతూ విద్యుత్ డిమాండ్ చాలా ఉంది, సోలార్ కరెంటు వినియోగం పెరుగుతోంది, ప్రజలు విద్యుత్ను పొదుపుగా వాడాలని సూచించారు. రోజూ వేలాది మెగావాట్ల వినియోగం కొరత లేకుండా చర్యలు: ఇంధనశాఖ -
క్షయపై అవగాహన అవసరం
హొసపేటె: క్షయవ్యాధిపై అవగాహన అవసరమని విజయనగర జిల్లాధికారి ఎంఎస్ దివాకర్ పేర్కొన్నారు. నగరంలోని ఇండోర్ స్టేడియంలో సోమవారం క్షయవ్యాధిపై ఏర్పాటు చేసిన ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. క్షయ మైకోబ్యాక్టోరియం ట్యూబక్యులోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా కలిగే అంటువ్యాధి అన్నారు. శరీరంలోని ఏ అవయవానికై నా ఈ వ్యాధి సోకుతుందన్నారు. ఎక్కువగా ఊపిరితిత్తులకు సంక్రమిస్తుందన్నారు. క్షయ వ్యాధి లక్షణాలు ఉన్న వారు వెంటనే వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స పొందాలన్నారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన వైద్యులను సన్మానించారు. హుడా అధ్యక్షుడు హెచ్ఎన్ఎఫ్ ఇమామ్ నియాజీ, జిల్లా వైద్యాధికారి శంకర్నాయక్, వైద్యులు సోమశేఖర్, వస్త్రద్ తదితరులు పాల్గొన్నారు. -
హనీట్రాప్పై విచారణ చేయాలి
● సుప్రీంకోర్టులో పిటిషన్ బనశంకరి: కర్ణాటకలో భారీ సంచలనం సృష్టించిన మంత్రులు, ఎమ్మెల్యేల హనీట్రాప్ వ్యవహారం మీద విచారణకు ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పిటిషన్ విచారణ కు తీసుకోవడానికి సుప్రీంకోర్టు సమ్మతించింది. ధన్బాద్ నివాసి వినయ్కుమార్సింగ్.. ఈ వ్యాజ్యం వేశారు. కర్ణాటకలో మంత్రి, న్యాయమూర్తితో పాటు పలువురిని హనీట్రాప్ చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై స్వతంత్ర విచారణ కు ఆదేశించాలని పిటిషన్లో విన్నవించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ఖన్నా ధర్మాసనం.. ఒకటి రెండు రోజుల్లో పిటిషన్పై విచారణ జరుపుతామని తెలిపింది.ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వ్యక్తి, న్యాయమూర్తి తో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలను హనీట్రాప్ కు పాల్పడ్డారని మంత్రి ఒకరు ఆరోపించారని పిటిషన్లో ప్రస్తావించారు. మీడియాలో, సోషల్ మీడియాలో చాలా చర్చలు జరుగుతున్నాయి. న్యాయవ్యవస్థ విశ్వాసం కాపాడేదృష్టితో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని అర్జీదారు పేర్కొన్నారు. వల విసిరిందెవరో సస్పెన్స్ -
పొలాల్లో నీటికుంటల తవ్వకాలు
మండ్య: వేసవిలో పంటల రక్షణ కోసం ప్రతి నియోజక వర్గం పరిధిలో నీటికుంటల పథకాన్ని అమలు చేస్తాము, రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఎన్.చలువరాయ స్వామి అన్నారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయంలో వ్యవసాయ శాఖ పథకాలను ప్రారంభించారు. వేసవిలో నీటి కొరత ఉంటుంది, దీని వల్ల పంటలు దెబ్బతినకుండా ప్రతి పొలంలో నీటికుంటను తవ్వుకోవడానికి ప్రభుత్వం రైతులకు సహాయం చేస్తుందని తెలిపారు. 104 తాలూకాలలో పంటలకు నీటి కొరత ఉందని తెలిపారు. అక్కడ ఈ పథకం అమలు చేస్తామని చెప్పారు. అమ్మా.. పాము కాటేసింది ● బాలుడు చెప్పినా నమ్మని తల్లి ● ఆస్పత్రిలో చిన్నారి మృతి మండ్య: బహిర్భూమికి వెళ్లిన బాలున్ని పాము కాటు వేయడంతో చనిపోయిన సంఘటన జిల్లాలోని శ్రీరంగ పట్టణం తాలూకాలోని బాబురాయనకొప్పలు గ్రామంలో జరిగింది. పవిష్ (4) మృతబాలుడు. ఆరేళ్ల కిందట గాయత్రిని తమిళనాడుకు చెందిన రమేష్ కుమార్ ఇచ్చి వివాహం జరిపించారు. గాయత్రి రెండవ కాన్పు కోసం కొడుకుతో కలిసి పుట్టింటికి వచ్చింది. సోమవారం పవిష్ బహిర్భూమి కోసం ఇంటి పక్కన స్థలంలోకి వెళ్లాడు. ఆ సమయంలో ఏదో పాము చిన్నారిని కరిచింది. వెంటనే బాలుడు వచ్చి నన్ను పాము కొరికింది అని తల్లికి చెప్పాడు. కానీ వారు ఊరికే అలా చెబుతున్నాడని పట్టించుకోలేదు. అర్ధగంట తరువాత తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స చేస్తున్న సమయంలో చనిపోయాడు. కనువిందుగా రథోత్సవం చింతామణి: తాలూకాలోని కంగానపల్లి గ్రామంలో వెలసిన పురాతన శ్రీ సీతా రామాంజనేయస్వామి ఆలయ బ్రహ్మ రథోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలకరించిన మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు పండితులు పూజలు నిర్వహించారు. తేరులో ప్రతిష్టించి లాగారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పాల్గొన్నారు. కళా బృందాల ప్రదర్శనలు అలరించాయి. ధైర్యంగా ఎమ్మెల్యేలపై చర్య తీసుకున్నా ● విధాన సభాపతి ఖాదర్ యశవంతపుర: స్పీకర్ స్థానానికి అగౌరవం తెచ్చేలా ప్రవర్తించినందునే 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఆరు నెలల పాటు సస్పెండ్ చేసినట్లు విధానసభ స్పీకర్ యూటీ ఖాదర్ చెప్పారు. సోమవారం దక్షిణ కన్నడ జిల్లా మంగళూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. సభ గౌరవ మర్యాదలను కాపాడాలంటే ఇలాంటి చర్యలు తప్పవన్నారు. సభలో స్పీకర్ శక్తిమంతుడు, గతంలోనే స్పీకర్లు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చర్యలు తీసుకొని ఉంటే ఇలాంటివి మళ్లీ జరిగేవి కాదన్నారు. అప్పటి స్పీకర్లు దైర్యం చేయలేదు. నేను ధైర్యం చేసి 18 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశానని చెప్పారు. దీనిని శిక్షగా పరిగణించాల్సిన అవసరం లేదు. ఉత్తమమైన ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దుకునేందుకు అవకాశం కల్పించానన్నారు. ద్రవ్య వినిమయ బిల్ పాస్ కాకుండా గొడవ చేశారు, ఆ బిల్లు ఆమోదం పొందకుంటే అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావన్నారు. ఇందుకు తాను అవకాశం ఇవ్వలేదని తెలిపారు. పెళ్లాడి.. పోలీస్స్టేషన్కు చిక్కబళ్లాపురం: మతాంతర ప్రేమ పెళ్లి చేసుకున్న యువ జంట భద్రత కావాలని పోలీసులను కోరింది. ఈ ఘటన చిక్క నగరంలో జరిగింది. తాలూకాలోని మైలప్పనహళ్లివాసి హసీనా (23), ఎదురింటిలో ఉండే నాగార్జున (24) రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకొంటున్నారు. పెళ్లి చేసుకుంటామని ఇళ్లలో చెప్పగా వారు తిరస్కరించారు. దీంతో చిక్కకు వచ్చి ఓ గుడిలో తాళి కట్టి పెళ్లి చేసుకుని పోలీసు స్టేషన్కు వచ్చారు. యువతి తల్లిదండ్రులు వచ్చి ఎంత వేడుకొన్నా, హసీనా భర్తతోనే ఉంటాను అని తెగేసి చెప్పింది. ఈ ప్రేమ వివాహం అందరినీ సంభ్రమానికి గురిచేసింది. -
దొడ్డహబ్బ వేడుకలు
మండ్య: మండ్య జిల్లాలోని మళవళ్లి తాలూకాలోని దేవిపుర గ్రామంలో వెలసిన హిరియమ్మ దేవి, దొడ్డహబ్బ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనేశ్వర స్వామి, శ్రీరామాంజనేయ స్వాములకు అభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. స్వాములను అలంకరించి ఊరేగించారు. పెద్దసంఖ్యలో భక్తులు దర్శనాలు చేసుకున్నారు. తల్లీబిడ్డ మృతి, ఆస్పత్రిపై దాడి దొడ్డబళ్లాపురం: కలబుర్గిలోని ప్రైవేటు ఆస్పత్రిలో తల్లీ బిడ్డ మృతిచెందడంతో సిబ్బందే కారణంటూ బంధువులు దాడికి దిగారు. ఎంఎస్కే మిల్ కాలనీలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో సభా పర్వీన్ అనే గర్భిణికి ఆదివారం రాత్రి కాన్పు జరిగింది. కొన్ని గంటల్లోనే తల్లీ బిడ్డ కన్నుమూశారు. దీంతో భర్త, బంధువులు ఆగ్రహం పట్టలేక కిటికీల అద్దాలను పగలగొట్టారు. కుర్చీలు టేబుళ్లను ధ్వంసం చేశారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. వైద్యులు మాట్లాడుతూ గర్భంలోనే శిశువు చనిపోయిందని, లోబీపీ కారణంగా తల్లి కూడా మరణించిందని తెలిపారు. తిరుమలకు పాదయాత్ర బనశంకరి: రాజానుకుంటె చల్లహళ్లి కి చెందిన వెంకన్న భక్తులు తిరుమల వెంకటేశ్వరస్వామి సన్నిధికి పాదయాత్ర చేపట్టారు. ప్రతి ఏడాది మాదిరిగా ఈ దఫా కూడా 14వ సారి పాదయాత్ర చేసి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నట్లు తెలిపారు. 25 మంది పాదయాత్రలో పాల్గొన్నారు. నిత్యం ఉదయం 5 గంటలకు నడక ప్రారంభించి మధ్యలో ఏదైనా ఆలయం వద్ద విశ్రాంతి తీసుకుంటారు. తిరుమలకు చేరడానికి 6 రోజులు పట్టిందని తెలిపారు. మండుటెండను లెక్కచేయకుండా పాదయాత్ర చేశామని, మధ్యలో ప్రజలు ఎంతో సహకారం అందించారని భక్తుడు చేతన్ చెప్పారు. సీతారాముల కళ్యాణం మైసూరు: మైసూరు జిల్లాలోని సాలిగ్రామ తాలూకాలోని చరిత్ర ప్రసిద్ధ చుంచనకట్టె శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ధర్మస్థల ట్రస్టు ద్వారా సీతారాముల వారి కళ్యాణోత్సవం, అఖండ రామకోటి భజన నిర్వహించారు. సోమవారం తెల్లవారుజాము నుంచి మూలవిరాట్కు కొబ్బరినీళ్లు, వివిధ ద్రవ్యాలతో అభి షేకం నిర్వహించారు. వందలాది భక్తుల సమక్షంలో మహామంగళహారతి ఇచ్చి, స్వామివారి కళ్యాణోత్సవాన్ని కనుల పండువగా జరిపారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సిటీ బస్సుల కోసం రిపేరీ వ్యాన్లు బనశంకరి: ఆర్టీసీ బస్సులు సజావుగా నడవడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని రవాణా మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. బెంగళూరులో బీఎంటీసీ బస్సులు రోడ్డుపై మొరాయిస్తే తక్షణం మరమ్మతులు చేయడానికి 5 మొబైల్ రిపేర్ వ్యాన్లను సోమవారం ఆయన ప్రారంభించారు. 6,835 బస్సులు బీఎంటీసీ నగర, ఉపనగరాలలో ప్రతిరోజు సరాసరి 5,875 ట్రిప్పులు సంచరిస్తాయన్నారు. ట్రాఫిక్ రద్దీలో బ్రేక్డౌన్ అవుతున్నాయి, దీంతో బస్ టెర్మినల్స్లో కనీసం ఒక మొబైల్ రిపేర్ వ్యాన్ ఉంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ వాహనంలో హెవీ టూల్బాక్స్లు, బ్యాటరీలు, టైర్లు, హైడ్రాలిక్ జాక్లు, కేబుల్స్, ఇతర మరమ్మత్తు పరికరాలు ఉంటాయని తెలిపారు. క్షయను నిర్మూలిద్దాం తుమకూరు: ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా సోమవారం తుమకూరు జిల్లా పాలనా యంత్రాంగం ద్వారా నగరంలో జన జాగృతి జాతాను నిర్వహించారు. ఎవరూ కూడ క్షయను తెచ్చుకోవద్దని, దానిని పూర్తిగా నిర్మూలించాలని నినాదాలు చేశారు. ప్రజలు, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్ల వర్గీకరణపై మంతనాలు
బనశంకరి: రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ అమలు కోసం సీఎం సిద్దరామయ్య సోమవారం నివాస కార్యాలయం కృష్ణాలో దళిత నేతలు, మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. తరువాత విలేకరులతో మంత్రి హెచ్సీ మహదేవప్ప మాట్లాడుతూ మూడు గంటల పాటు సమావేశం జరిగింది. రిజర్వేషన్ అమలు కమిటీ అధ్యక్షుడు నాగమోహన్దాస్ కూడా పాల్గొన్నారు. రిజర్వేషన్ అమలుపై చర్చించామన్నారు. వారంలోగా నివేదిక అమలు చేస్తారని తెలిపారు. ఉద్యోగుల గురించి అన్ని శాఖలు వివరాలు అందించాయని చెప్పారు. హోంమంత్రి పరమేశ్వర్ మాట్లాడుతూ అంతర్గత రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మేనిఫెస్టోలో చెప్పామన్నారు. నాగమోహన్దాస్ కమిటి అందించే మధ్యంతర నివేదిక పై సీఎంతో చర్చించి త్వరలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతవరకు పోస్టుల భర్తీ, పదోన్నతులను నిలిపివేస్తామన్నారు. సీఎం నివాసంలో భేటీ -
చవగ్గా.. బంగారు ఇటుక మీదే
బనశంకరి: బంగారం రేట్లు అంబరాన్ని అంటడంతో ఆశ కూడా ఎక్కువైంది. దీంతో మోసగాళ్లు ఎక్కువైపోతున్నారు. రాజులు పాలించిన ప్రదేశంలో ఇంటి నిర్మాణానికి పునాది తీస్తుండగా నిధి లభించింది, ఆ బంగారు ఇటుకను అమ్ముతామని మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని నగర సీసీబీ పోలీసులు అరెస్ట్చేశారు. బిహర్ కు చెందిన రబికుల్ఇస్లాం, ఇద్దీశ్ అలీ, అన్వర్హుసేన్ నిందితులు. మోసాల పర్వం ఇలా వీరు బెంగళూరుకు చేరుకుని పునాది తవ్వకంలో బంగారు ఇటుక దొరికిందని చెప్పి ఆశ పుట్టించేవారు. మొదట 10 గ్రాముల అసలైన బంగారం ముక్కను ఇచ్చి నమ్మకం కలిగించేవారు. చాలా తక్కువ రేటుకే బంగారం ఇస్తామని, ఈసారి డబ్బు తీసుకుని రావాలని చెప్పేవారు. ఇలా పలువురు బంగారం వ్యాపారులను సంప్రదించారు. బంగారం తీసుకోవడానికి మేము తెలిపిన స్థలానికి రావాలని తెలిపి పదేపదే లొకేషన్ మార్చేవారు. చివరికి నిర్మానుష్య ప్రదేశానికి వ్యాపారులను తీసుకెళ్లి డబ్బు తీసుకుని నకిలీ బంగారం ఇటుక ఇచ్చి పారిపోయేవారు. పలువురు బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోరమంగలలో మరో వ్యాపారికి టోపీ వేస్తూ దొరికిపోయారు. ముగ్గురిని అరెస్ట్చేసి కేజీ నకిలీ బంగారం, ఒక వాహనం స్వాధీనం చేసుకున్నారు. పలువురికి శఠగోపం బెంగళూరులో బిహార్ ముఠా పట్టివేత -
నీటితొట్టెలో పాముల ఫ్యామిలీ
శివమొగ్గ: ఒక్క పామును చూస్తేనే హడలిపోతారు. ఇంకా ఎక్కువ పాములను చూస్తే ఎవరికై నా వణుకు పుట్టడం ఖాయం. ఇలాంటి ఘటనే శివమొగ్గ నగరంలో జరిగింది. కువెంపు లేఔట్లో ఈశ్వరయ్య అనే వ్యక్తి ఇంటిలో ఉన్న నీటి తొట్టిలో ఓ పాము గుడ్లను పెట్టి పొదిగింది. ఆదివారం తొట్టి బయట ఒక పాముపిల్లను చూసిన కుటుంబ సభ్యులు తొట్టెలో లైటు వేసి చూడగా పుట్టల కొద్దీ పాము పిల్లలు కనిపించడంతో భయపడిపోయారు. వెంటనే స్నేక్ కిరణ్కు సమాచారం ఇచ్చారు. స్నేక్ కిరణ్ అప్పటినుంచి పాము పిల్లలను సేకరించసాగారు. సోమవారం నాటికి 69 పిల్ల పాములను పట్టి బకెట్లో నిల్వ చేశారు. వాటిని తీసుకెళ్లి దూరంగా ఓ చెరువులో వేశారు. కాగా ఈ వీడియోలు వైరల్ అయ్యాయి 69 పిల్ల సర్పాల పట్టివేత -
ఆకస్మిక వర్షం.. బెంగళూరు సతమతం
కొమ్మ పడి చిన్నారి మృతి కమ్మనహళ్లికి చెందిన శక్తి అనే వ్యక్తి మూడేళ్ల కుమార్తె రక్ష తో పులకేశినగరలో బైకులో వెళుతుండగా ఒక్కసారిగా చెట్టు కూలిపోయింది. కొమ్మనేరుగా చిన్నారిపై పడింది. బలమైన గాయం కావడంతో తల నుంచి తీవ్రరక్తస్రావమై అక్కడే చనిపోయింది. బేకరి నుంచి ఇంటికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బీబీఎంపీ అటవీ విభాగం చీఫ్ స్వామి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బనశంకరి: వేసవి వర్షం ఊపేసింది. రాజధాని బెంగళూరు శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు మెరుపులు, పిడుగులు, వడగండ్ల వానతో తల్లడిల్లింది. పలుచోట్ల చెట్లు కొమ్మలు పడిపోయాయి. యలహంక ప్రాంతంలో ఇళ్లలోకి వాననీరు చొరబడగా కోగిలు క్రాస్తో పాటు ఇతర రోడ్లలో నీరు చేరి ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఏడాది మొదటివర్షమే భారీగా కురిసింది. బెంగళూరు ఉత్తర భాగంలో ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత ఏడాదిలో నైరుతి రుతుపవనాల అవధిలో సైతం బెంగళూరు ఉత్తర భాగం, యలహంక, కోగిలు క్రాస్ తదితర ప్రదేశాలు ముంపునకు గురయ్యాయి. శనివారం ఉదయం నుంచి నగరంలో మేఘావృతమై సాయంత్రానికి ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురిసింది. క్రమంగా నగరవ్యాప్తంగా విస్తరించి అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఇళ్లలోకి నీరు యలహంక ఓల్డ్టౌన్ ప్రాంతంలో 15 కు పైగా ఇళ్లలోకి వర్షంనీరు చొరబడింది. ఒక్కసారి నీరు చొరబడటంతో ఇళ్లలో నిత్యావసర వస్తువులు నీటిలో కొట్టుకుపోయాయి. రాజకాలువలో మట్టి నిండిపోవడంతో వర్షపు నీరు సజావుగా ప్రవహించడానికి అవకాశం లేకపోవడంతో ఇళ్లోకి నీరు చొరబడిందని స్దానికులు ఆరోపించారు. జక్కూరులో అత్యధిక వర్షం జక్కూరు, చౌడేశ్వరి నగరలో అత్యధికంగా 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హగదూరు, వీ.నాగేనహళ్లిలో 3.4 సెంటీమీటర్లు, విద్యారణ్యపురలో 3.2, హొరమావు, బిళేకహళ్లిలో తలా 2.1 బసవనపుర 1.9, గరుడాచార్పాళ్య 1.8, బీటీఎంలేఔట్ 1.7, రామమూర్తినగర , కొడిగేహళ్లిలో తలా 1.6, కాడుగోడిలో 1.5 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. విమానాశ్రయంలో ఆటంకం కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కుండపోత వర్షంతో విమానాలకు ఇబ్బందులు తలెత్తాయి. సాయంత్రం నుంచి ల్యాండింగ్కు వీలు కాకపోవడంతో 10 విమానాలను చైన్నెకి మళ్లించారు. వర్షం తగ్గిన తరువాత మళ్లీ పునరుద్ధరించారు. పలు విమానాలు ఆలస్యమై ప్రయాణికులు అసహనం చెందారు. సహాయవాణి 1533 వర్షం పడిన ప్రతిసారి పాలికె సిబ్బంది బయటకు రావాలి, రోడ్లలో నీరు నిలవడం, చెట్లు, కొమ్మలు పడిపోతే తక్షణం తొలగించాలని బీబీఎంపీ కమిషనర్ తుషార్ గిరినాథ్ సూచించారు. ప్రజలకు సమస్య తలెత్తితే బీబీఎంపీ సహాయవాణి 1533 నంబరుకు ఫోన్ చేసి చెప్పాలని తెలిపారు. ఉరుములు మెరుపులు, గాలీవాన కూలిపోయిన చెట్లు పులకేశినగరలో బాలిక దుర్మరణం విమాన ప్రయాణాలకు ఆటంకం కొన్ని ఫ్లైట్లు చైన్నెకి మళ్లింపు వర్షసూచన చిక్కమగళూరు, బెంగళూరు, కోలారు, కొడగు, మండ్య, మైసూరు, చామరాజనగర, బీదర్ జిల్లా, కొడగు పాటు అనేక జిల్లాల్లో శనివారం వర్షం కురిసింది. ఆదివారం నుంచి వేసవి వర్షాలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఒళనాడులో వర్షాలు అధికంగా ఉండవచ్చు. విరిగిన చెట్లు, కొమ్మలు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ రోడ్డు కోగిలు క్రాస్లో ట్రాఫిక్కు తీవ్ర అడ్డంకి ఏర్పడింది. మాన్యతా టెక్ పార్కు వద్ద జలమయం అయ్యింది. బెంగళూరు తూర్పు, ఉత్తర భాగం, మహదేవపుర ప్రదేశాల్లో వర్షం, గాలులకు సుమారు 30 నుంచి 50 చెట్లు, చెట్లుకొమ్మలు కూలిపోయాయి. సదాశివనగర 10వ క్రాస్లో చెట్లు, కొమ్మలు విరిగిపడటంతో కొన్ని కార్లు దెబ్బతిన్నాయి. మేక్రీ సర్కిల్, సంజయనగర, భూపసంద్ర, యలహంక, హెబ్బాళతో పాటు పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసింది. జేసీ రోడ్డులో పెద్ద చెట్టు పడిపోయింది. -
కేజీఎఫ్ వద్ద... వెంటాడి రౌడీ నరికివేత
కెజీఎఫ్: పట్టపగలే రౌడీషీటర్ను హత్య జరిగింది. హతుడు కేజీఎఫ్ నగరంలోని అండర్సన్ పేట పోలీస్ స్టేషన్ పరిధి వాసి. న్యూ మాడల్ నివాసి జయశీలన్ కుమారుడు రౌడీషీటర్ శివకుమార్ (28) హత్యకు గురైన వ్యక్తి. వివరాలు.. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో శివకుమార్ తన స్నేహితురాలితో కలిసి బైక్లో కామసముద్రం వైపు వెళుతున్నాడు. విరూపాక్ష పురం వద్ద వెనుకనుంచి వెంబడించి వచ్చిన నలుగురు దుండగులు మచ్చు కొడవళ్లతో అతన్ని నరికారు. తీవ్రంగా గాయపడిన శివకుమార్ తప్పించుకుని కామసముద్రం అటవీ ప్రదేశం వరకు పరిగెత్తుకు వచ్చి అక్కడే ప్రాణాలు వదిలాడు. అతని స్నేహితురాలు ఫోన్ చేయడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆచూకీ కోసం గాలించారు. చివరికి డ్రోన్ సహాయంతో అన్వేషించి మృతదేహాన్ని కనుగొన్నారు. పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్పీ శాంతరాజు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలన జరిపారు. అండర్సన్ పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పాతకక్షలే కారణమని తెలుస్తోంది. -
ఇక చాలు, తప్పుకొంటున్నా
● పరిషత్ సభాపతి రాజీనామా బనశంకరి: విధాన పరిషత్లో, అసెంబ్లీలో సభ్యుల ప్రవర్తన ఏమాత్రం బాగా లేదు. ఇటువంటి సభకు అధ్యక్షత వహించాలో, లేదో కూడా తెలియడం లేదు అని బీజేపీ ఎమ్మెల్సీ, విధాన పరిషత్ సభాపతి బసవరాజ హొరట్టి ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలలో జరుగుతున్న పరిణామాలు, హనీ ట్రాప్ వ్యవహారంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రవర్తన మీద ఆక్రోశం వ్యక్తం చేస్తూ సభాపతి పదవికి రాజీనామా ప్రకటించారు. లేఖను ఉపసభాపతి ప్రాణేశ్కు పంపించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాజీనామా అమలులోకి వస్తుందని, వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ పదవి నుంచి విముక్తి కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా హుబ్లీలో మీడియాతో బాధగా మాట్లాడారు. అసెంబ్లీలో సభ్యులు దిగజారి ప్రవర్తిస్తున్నారు. సభాపతి మాటలను పట్టించుకోవడం లేదని వాపోయారు. చర్చల్లో విలువలు పడిపోతున్నాయన్నారు. సాధారణ సమయాల్లో కూడా ప్రజాప్రతినిధుల తీరు ఏమాత్రం బాగా లేదని వాపోయారు. నలభై ఏళ్లుగా ఎమ్మెల్సీగా ఉన్నానని, ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని చెప్పారు. రాజీనామా ఆమోదం తరువాత ఏం చేయాలనేది ఆలోచిస్తానని అన్నారు.ఘరానా ఎస్ఐ సస్పెన్షన్ శివాజీనగర: చోరీ కేసుల్లో దొంగల నుంచి రికవరీ చేసిన బంగారాన్ని సొంతానికి వాడుకున్నాడు. ఆ బంగారం ఏమైందని ఉన్నతాధికారులు అడిగినప్పుడు మరో మోసానికి పాల్పడ్డాడు. వరుస వంచనలు బయటపడి సస్పెండ్ అయ్యాడో ఎస్ఐ. బెంగళూరులోని కాటన్పేట ఠాణా ఎస్ఐ సంతోష్ నిర్వాకమిది. వివరాలు.. గతంలో ఓ కేసులో కొంత బంగారాన్ని రికవరీ చేసి స్వాహా చేశాడు. రికవరీ చూపించడానికి మరో నాటకం ఆడాడు. ఓ బంగారు షాపు యజమానిని కలిసి రికవరీ కోసం బంగారం చూపించాలి, ఫోటో తీయించి వెనక్కి ఇస్తాను. నీ వద్ద ఉన్న బంగారు ముద్దను ఇవ్వాలని కోరారు. యజమాని సరేనని 950 గ్రాముల బంగారాన్ని ఎస్ఐకి ఇచ్చారు. ఎస్ఐ ఎన్నిరోజులైనా బంగారాన్ని తిరిగి ఇవ్వకపోవడంతో యజమాని ఒత్తిడి చేశాడు. చివరకు కొన్ని ఖాళీ చెక్కులను ఇచ్చాడు. వ్యాపారి వాటిని బ్యాంకులో వేయగా చెల్లలేదు. నా బంగారం ఇచ్చేయాలని వ్యాపారి గట్టిగా అడిగితే ఎస్ఐ బెదిరింపులకు దిగాడు. చివరకు బాధితుడు డీసీపీకి ఫిర్యాదు చేశాడు. ఏసీపీ ప్రాథమిక విచారణ జరిపి నివేదిక అందజేశారు. బాగోతం నిజమేని తేలడంతో పోలీస్ కమిషనర్ సస్పెన్షన్ ఆదేశాలిచ్చారు. హలసూరు గేట్ ఠాణాలో ఎస్ఐపై కేసు నమోదైంది.రాజణ్ణ ఫిర్యాదు చేయగానే దర్యాప్తు: హోంమంత్రిశివాజీనగర: హనీ ట్రాప్ కేసును తీవ్రంగా తీసుకొన్నాం. మంత్రి రాజణ్ణ ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు చేసి ఉంటే ఎలాంటి విచారణ జరిపించాలో శనివారమే ప్రకటించేవాళ్లమని హోం మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. ఆదివారం బెంగళూరు సదాశివనగర ఇంటి వద్ద విలేకరులతో మాట్లాడిన ఆయన, రాజణ్ణ ఫిర్యాదు చేస్తే ఏ తనిఖీకి ఇవ్వాలనేది సీఎంతో చర్చిస్తాను. ఇంత పెద్ద ఆరోపణ వచ్చింది. తీవ్రంగా తీసుకోవాల్సిందే. బీజేపీవారు సీబీఐ, హైకోర్టు జడ్జిచే విచారణ అడుగుతున్నారు అని చెప్పారు. 48 మంది హనీ ట్రాప్లో పడ్డారా, ఈ సంఖ్య ఎంత అనేది ఊహించేందుకు సాధ్యపడదన్నారు. కాగా, రాజణ్ణ ఇంతవరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు అనేది కుతూహలంగా మారింది. పిల్లల చేత టాయ్లెట్ పనులు ● హెచ్ఎం, టీచర్ సస్పెన్షన్ శివాజీనగర: పిల్లలు పారిశుధ్య కార్మికులయ్యారు. పాఠశాల పిల్లలచే మరుగుదొడ్ల గుంతను శుభ్రం చేయించిన ఇద్దరు ఉపాధ్యాయినులు సస్పెండ్ అయ్యారు. బెంగళూరు దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో బేగూరు ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం సాకమ్మ, పీఈటీ సుమిత్ర ఇటీవల పిల్లల చేత మరుగుదొడ్ల గుంతలను క్లీన్ చేయించిన వీడియోలు వైరల్ అయ్యాయి. చదువుకోవాల్సిన బాలల చేత ఇలాంటి పనులు చేయిస్తారా? అని తల్లిదండ్రులు భగ్గుమన్నారు. బాలల హక్కుల ఉల్లంఘన జరిగిందని ఉన్నతాధికారులు నివేదిక ఇచ్చారు. నిజానికి మరుగుదొడ్లను శుభ్రం చేయడానికి కార్మికులను ఉపయోగించాలి. కానీ ఆ నిధులు రూ. 43 వేలను స్వాహా చేసి ఆ పనిని బాలలకు అప్పగించారని తేలింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ డీడీ కే.బీ.నింగరాజప్ప పై ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. బంగ్లాదేశ్ హిందువులపై హింస ● ఆ దేశంపై ఒత్తిడి తేవాలి ● ఆర్ఎస్ఎస్ నేతల డిమాండ్ బనశంకరి: బంగ్లాదేశ్ హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేసిన ఆర్ఎస్ఎస్.. ఇది మానవహక్కుల ఉల్లంఘన అని స్పష్టం చేసింది. ఈ విషయంలో ప్రపంచ సంస్థలతో కలిసి బంగ్లాదేశ్ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేసింది. బెంగళూరు చన్నేనహళ్లిలో రెండురోజుల సంఘం సమావేశాలు జరిగాయి. సంఘం అగ్రనేతలు, నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. బంగ్లాదేశ్ హిందువులకు ప్రపంచంలోని అన్నిదేశాలు మద్దతుగా నిలవాలన్నారు. బంగ్లాదేశ్లో మతఛాందసవాదులతో హిందూ, ఇతర మైనారిటీ మతస్తులపై మితిమీరిన హింస జరుగుతోందని ఆరోపించారు. 1951లో 22 శాతం ఉన్న హిందువుల జనాభా ప్రస్తుతం 7 .95 శాతానికి క్షీణించిందని తెలిపారు. భారత సరిహద్దుల్లో అస్థిర వాతావరణం కల్పించడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ హిందువుల కోసం కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ వేదికల్లో మాట్లాడి మద్దతు పొందడం ముదావహమని అన్నారు. -
పళ్లు లేవని.. యువకుడు ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: ఓ యాక్సిడెంటు యువకుని ఆత్మహత్యకు కారణమైంది. ప్రమాదంలో 17 పళ్లు ఊడిపోయాయి, సమాజంలో తలెత్తుకుని ఎలా తిరగాలి అనే బాధతో ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన చిక్కమగళూరు జిల్లాలో చోటుచేసుకుంది. కొప్ప తాలూకా సాలుమర గ్రామంలో విఘ్నేష్ (18) అనే యువకుడు స్థానిక ఐటీఐలో ఫస్టియర్ చదివేవాడు. నాలుగేళ్ల క్రితం బైక్ ప్రమాదంలో 17 పళ్లు ఊడిపోయాయి. పళ్లు కట్టించుకోవాలని ఆ రోజు నుంచి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ చాలా ఖర్చు చేశాడు. నీకు పళ్లు లేవని అందరూ ఎగతాళి చేస్తుండడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. ముత్యాలమ్మకు విశేష పూజలు మాలూరు: తాలూకాలోని లక్కూరు గ్రామంలోని పురాతన శ్రీ ముత్యాలమ్మ దేవి దేవాలయంలో ఆదివారం అమ్మవారికి విశేష పూజలను నిర్వహించారు. ప్రధాన అర్చకుడు కోడూరు మదన్ నేతృత్వంలో మూల విగ్రహానికి అభిషేకం, పంచామృత అభిషేకం, వేద, మంత్ర పారాయణం, తదితరాలను చేపట్టారు. లక్కూరు ఫిర్కాతో పాటు తాలూకాలోని పలు గ్రామాల నుంచి భక్తులు వచ్చి దర్శనాలు చేసుకున్నారు. సిద్దు ఇంటికి ఖర్గే ● హనీ ట్రాప్పై చర్చ? శివాజీనగర: రాష్ట్రంలో కొందరు మంత్రులు, నాయకులపై హనీట్రాప్ ప్రయోగం జరుగుతోందనే హంగామా నేపథ్యంలో సీఎం సిద్దరామయ్య, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భేటీ ప్రాముఖ్యం సంతరించుకుంది. ఆదివారం బెంగళూరులోని కావేరి నివాసంలో సీఎం సిద్దరామయ్యను మల్లికార్జున ఖర్గే, మంత్రి ప్రియాంక ఖర్గే వచ్చి కలిశారు. పార్టీ అధ్యక్షుడే సీఎం ఇంటికి రావడం బట్టి విషయం చాలా సీరియస్గా ఉందని తెలుస్తోంది. హనీట్రాప్లో బాధితులు, సూత్రధారులు ఎవరు, ఎందుకు చేశారు, పార్టీ, ప్రభుత్వం ఏమేం చర్యలు తీసుకోవాలనేది చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఇటీవలికాలంలో జరుగుతున్న అనేక పరిణామాల గురించి మాట్లాడుకున్నట్లు సమాచారం. హనీ ట్రాప్ కేసులో తమ పార్టీవారు, ప్రతిపక్ష పార్టీవారు ఎవరు పాల్గొన్నా కూడా వారి మీద చర్యలు తీసుకొంటాం. శాసనసభలో మంత్రే ఈ వ్యవహారం గురించి గళమెత్తినప్పుడు ప్రభుత్వం మౌనంగా ఉండదు. ఈ కేసు గురించి విచారణ చేపడతాం. ప్రతిపక్ష పార్టీల వారు న్యాయ విచారణను కోరారు. అన్నింటి గురించి హోం మంత్రితో సీనియర్ మంత్రులతో చర్చించి, ఈ విధమైన తనిఖీ చేపట్టాలనేది నిర్ధారిస్తామని సిద్దరామయ్య గతంలోనే తెలిపారు. సీఎంను ఎవరో కలిస్తే ఏమిటి? ● డీసీఎం శివకుమార్ రుసరుస శివాజీనగర: ముఖ్యమంత్రిని ఎవరైనా భేటీ చేయవచ్చు. ఆయనను ఎవరు కలిశారనేది నన్నెందుకు అడుగుతున్నారు? అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఆదివారం బెంగళూరు సదాశివనగర ఇంటి వద్ద మాట్లాడిన ఆయన, మంత్రి రాజణ్ణ సీఎంను కలవడంపై విలేకరులు ప్రశ్నించగా ఇలా స్పందించారు. నా శాఖ విషయాల గురించి మాత్రమే నన్ను అడగండి. శాసనసభలో హనీ ట్రాప్ గురించి మాట్లాడినందుకు మంత్రిపై హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసిందా? అన్న ప్రశ్నకు అంతా బోగస్ అన్నారు. దక్షిణాది స్వాభిమానం కోసం పోరాటం శనివారం తమిళనాడు చైన్నెలో జరిగిన సీఎంల సభలో పాల్గొన్నాను, దక్షిణ భారత దేశంలో ఎంపీ నియోజకవర్గాలను తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య చెప్పిన అన్ని విషయాలను సమావేశంలో ప్రస్తావించాను. కర్ణాటకలో 2 సీట్ల తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. దీని వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఇది మా రాష్ట్ర, దక్షిణ భారతదేశ స్వాభిమాన అంశమని తెలిపారు. వివాదంలో దర్శన్ దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయి ఇటీవల బెయిలుపొందిన ప్రముఖ నటుడు దర్శన్ కేరళలో ఆలయాలను దర్శించుకుంటున్నారు. కణ్ణూరు మాడాయికావు శ్రీ భగవతి దేవాలయంలో శత్రుసంహార పూజలు చేయించారు. అంతాబాగానే ఉంది కానీ, ప్రజ్వల్ రై అనే వ్యక్తి దర్శన్ వెంట ఉండడం చర్చనీయాంశమైంది. ప్రజ్వల్ రై 2017లో గ్రామపంచాయతీ సభ్యుడు కరోపాడి హత్య కేసులో ముఖ్య నిందితుడు. ఇప్పుడు దర్శన్ వెంట కనిపించడంతో విమర్శలకు తావిచ్చింది. పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు అలాంటి వ్యక్తితో పనేముందని కొందరు వ్యాఖ్యానించారు. -
ఆకాశ రథాలు.. అంతలోనే పతనం
బొమ్మనహళ్ళి: భక్తులు ఆనందోత్సాహాలతో నిర్వహిస్తున్న ఊరి జాతరలో విషాదం సంభవించింది. ఆకాశాన్నంటే రెండు తేర్లు పెనుగాలులకు కుప్పకూలిపోయాయి. ఈ సంఘటన శనివారం సాయంత్రం బెంగళూరు వద్ద ఆనేకల్ తాలూకాలో ఉన్న చరిత్ర ప్రసిద్ది చెందిన హుస్కూరు మద్దూరమ్మదేవి జాతరలో చోటుచేసుకుంది. ఇద్దరు చనిపోగా, మరికొందరు గాయపడ్డారు. దొడ్డనాగమంగల తేరు.. ఈ ఏడాది మద్దూరమ్మ జాతరకు పరిసర గ్రామాల నుంచి మొత్తం ఆరు తేరులు రావాల్సి ఉంది. తమ ఊరి రథమే బ్రహ్మాండంగా ఉండాలనే తపనతో గ్రామస్తులు పోటీ పడి చాలా ఎత్తుగా తేరును నిర్మిస్తూ ఉంటారు. దీనికోసం లక్షల రూపాయలను వెచ్చిస్తారు. ఇందులో దొడ్డనాగమంగల తేరు 150 అడుగుల ఎత్తు ఉంది. చిక్కనాగమంగళ వద్దకు చేరుకోగానే గాలి దుమారం లేచింది, ఓ వైపు కుప్పకూలిపోయింది. ఇందులో ఎవరికీ ఏమీ కాలేదు. రాయసంద్ర రథంలో విషాదం ఇక రాయసంద్ర నుంచి వస్తున్న 120 అడుగుల రథం కూడా ఇదే మాదిరిగా కుప్పకూలింది. రథం కింద కొందరు చిక్కుకుపోయారు. తమిళనాడులోని హోసూరుకు చెందిన రోహిత్ (26), బెంగళూరు కెంగేరికి చెందిన బాలిక జ్యోతి (14) చనిపోయారు. నలుగురుకి పైగా గాయపడ్డారు. రథం కళ్లముందే కూలిపోవడంతో భక్తుల హాహాకారాలు మిన్నంటాయి. ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. 2024 జాతరలోనూ రాయసంద్ర నుంచి వచ్చిన తేరు పడిపోయింది. భక్తులు, పరిసర గ్రామాలవాసులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఆనేకల్ హుస్కూరమ్మ జాతరలో అపశ్రుతి రెండు తేర్లు కూలి ఇద్దరు దుర్మరణం పలువురికి గాయాలు -
రాయచూరులో అధ్వానంగా పారిశుధ్యం
రాయచూరు రూరల్: రాయచూరు నగరంలో పారిశుధ్యం అధ్వానంగా మారింది. ఎక్కడ చూసినా చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. మురుగు కాలువల్లో పూడిక పేరుకుపోయింది. నీరు ముందుకు సాగడం లేదు. దీంతో దుర్వాసన వెలువడుతోంది. నగరంలోని 35 వార్డుల్లోనూ ఇదే పరిస్థితి ఉందని ప్రజలు వాపోతున్నారు. చెత్తను తరలించేందుకు కొత్తగా ఆరు ట్రాక్టర్లను నగరసభ అధికారులు కొనుగోలు చేశారు. వాటిని దిష్టిబొమ్మల్లా కార్యాలయ ఆవరణలో నిలిపి ఉంచారు తప్పితే చెత్త తరలించడం లేదు. పేరుకు మాత్రమే జిల్లా కేంద్రమని, చిన్న చిన్న పట్టణాల్లో ఉన్న సదుపాయాలు లేవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుధ్యం అధ్వానంగా మారినా అధికారులు, పాలకులు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలున్నాయి. చెత్త కుప్పల్లో పందులు సంచరిస్తుండటంతో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. మరో వైపు పౌర కార్మికుల కొరతతో పనులు జరగడం లేదు. నగరసభ కాంగ్రెస్ ఆధీనంలో ఉండగా నగరానికి బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో ఆ ప్రభావం పారిశుధ్యంపై పడింది. ఇక నగరంలో రోడ్లు అధ్వానంగా మారాయి. ఏ వీధిలో చూసినా గుంతలు దర్శనమిస్తున్నాయి. పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. నేతలు నగర అభివృద్ధిపై దృష్టి సారించకుండా ఆరోపణలు చేసుకుంటున్నారు. పేరుకుపోయిన చెత్తకుప్పలు దుర్వాసన భరించలేకపోతున్న నగరవాసులు వేధిస్తున్న కార్మికుల కొరత -
స్వాతంత్య్ర పోరాట ఫలాలు పేదలకు అందడం లేదు
సాక్షి,బళ్లారి: ఎందరో మహనీయుల ప్రాణత్యాగాలతో దేశానికి స్వాతంత్య్రం లభించి దాదాపు ఎనిమిది దశాబ్దాలు కావస్తున్నా పేదలు ఇంకా దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బళ్లారిలో జరిగిన అఖిల భారత యువజన ఫెడరేషన్ 11వ రాష్ట్ర సమ్మేళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భగత్సింగ్, సుఖదేవ్, రాజ్గురు చిత్ర పటాలకు నివాళులర్పించి మాట్లాడారు. దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీతోపాటు కమ్యూనిస్టులు ఎన్నో ప్రజా ఉద్యమాలు చేశారన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ఉరికంబం ఎక్కిన భగత్సింగ్, సుఖదేవ్, రాజ్గురు అడుగు జాడల్లో మనందరం నడవాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రశేఖర్ అజాద్, అల్లూరి సీతారామరాజు, బాలగంగాధర తిలక్ లాంటి గొప్ప మహానుభావులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి స్వాతంత్య్రం తీసుకువచ్చారన్నారు. అయితే దేశానికి తామే స్వాతంత్య్రం తీసుకువచ్చినట్లు బీజేపీ, ఆర్ఎస్ఎస్లు గొప్పలకు పోతున్నాయన్నారు. బీజేపీ, ఆర్ఎస్ నేతలు కుల, మతాల మధ్య చిచ్చు పెడుతూ పబ్బం గడుకుంటున్నారన్నారు. హామీలు అమలులో చంద్రబాబు విఫలం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఐదు గ్యారెంటీలను అంతో, ఇంతో అమలు చేస్తోందన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను ఏపీ సీఎం చంద్రబాబు అమలు చేయకుండా ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారన్నారు. హామీలు అమలు చేయకపోతే చంద్రబాబును ప్రజలు ఇంటికి పంపడం ఖాయమని అన్నారు. అంతకు ముందు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతపురం సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్,కర్ణాటక సీపీఐ నాయకులు నాగభూషణ, ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు లెనిన్బాబు,గోపాల్ పాల్గొన్నారు. భగత్సింగ్, సుఖదేవ్, రాజ్గురు అడుగుజాడల్లో నడవాలి ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ -
భగత్సింగ్ ఆశయ సాధనకు కృషి
రాయచూరు రూరల్ : ఏఐడీవైఓ, ఏఐడీఎస్ఓ, ఏఐఎమ్ఎస్ఎస్ల ఆధ్వర్యంలో శనివారం భగత్సింగ్ ఆత్మార్పణ దినోత్సవాన్ని నిర్వహించారు. భగత సింగ్ సర్కిల్ వద్ద ఆయన చిత్రపటానికి నాయకులు నివాళులర్పించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో అసువులుబాసిన భగత్సింగ్ నడిచిన బాట అందరికీ ఆదర్శమన్నారు. భగత్సింగ్ ఆశయాలను, ఆదర్శాలను అలవర్చుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులకు చిత్ర లేఖనం పోటీలు నిర్వహించారు. సరోజ, చెన్న బసవ పాల్గొన్నారు. బళ్లారిఅర్బన్: అమరులైన భగత్సింగ్, రాజ్గురు, సుకదేవ్ ఆశయాలను కొనసాగించాలని వక్తలు అన్నారు. బీమ్స్ మైదానం, మున్సిపల్ మైదానం, సొంత లింగన్నపార్క్తో పాటు వివిధ హాస్టల్, గ్రామాలలో ఆదివారం ఏర్పాటు చేసిన భగత్సింగ్ వర్ధంతి కార్యక్రమంలో ఏఐడీఎస్ఓ నేత సుభాష్ పాల్గొని మాట్లాడారు. భగత్సింగ్ స్ఫూర్తితో సామాజిక అసమానతలపై పోరాటం చేయాలన్నారు. ఏఐడీఎస్ఓ నేతలు కే.ఈరణ్ణ, ఎం.శాంతి.ఉమా, నిహారిక, అయిషా, శివు, కంబలి మంజునాథ్, తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ మేళా నిరుద్యోగులకు వరం
హొసపేటె: ఉద్యోగ మేళాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని హుడా అధ్యక్షుడు హెచ్ఎన్ ఇమామ్ సూచించారు. విజయనగరం జిల్లా వాణిజ్య, పరిశ్రమల మండలి, ఐ.క్యూ.ఎ సంయుక్త ఆధ్వర్యంలో విజయనగర కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఉపాధి కోసం తిరుగుతూ అలసిపోయేవారికి ఇలాంటి మేళాలు ఊరట కల్పిస్తాయన్నారు. అదే విధంగా, దేశాన్ని పీడిస్తున్న నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కరం లభిస్తుంది. రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగ మేళాలు నిర్వహించి నిరుద్యోగ యువతకు ప్రయోజనం చేకూర్చాలని ఆయన పిలుపునిచ్చారు. వీరశైవ సంఘం అధ్యక్షులు కణేకల్ మహంతేష్, అరవింద్ పాటిల్, మల్లికార్జున ప్రిన్సిపల్ ప్రభు గౌడ, సంఘం నేతలు అశ్విని కొత్తంబరి, ప్రహ్లాద,, సైయద్ నిజాముద్దీన్, తదితరులు పాల్గొన్నారు. -
చిన్న పరిశ్రమల స్థాపనకు సౌలభ్యాలు
రాయచూరు రూరల్: నగరంలో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకు రావాలని కార్పొరేషన్ కమిషనర్ జుబిన్ మహపాత్రో కోరారు. నగరం లోని ప్రైవేటు హోటల్లో జిల్లా స్థాయి క్లస్టర్ కార్యక్రమాలను ఆయన పార్రంభించి మాట్లాడారు. రాయచూరులో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు బ్యాంకర్లు సహకారం అందించాలన్నారు. పరిశ్రమల స్థాపనకు సౌలభ్యాలు కల్పించడానికి కార్పొరేషన్ అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర చిన్న పరిశ్రమల సంఘం అధ్యక్షుడు రాజగోపాల్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కమల్ కుమార్, ఏజీఎం కుషాల్, రమేష్, సురేష్, జంబన్న పాల్గొన్నారు. -
మెగా వైద్య శిబిరం విజయవంతం
హుబ్లీ: ౖవెద్య శిబిరాలు ప్రజలకు వరమని, వీటిని రోగులు వినియోగించుకోవాలని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దినేష్ గుండూరావ్ సూచించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో బెళగావి జిల్లా సౌదత్తి తాలూకా మైదానంలో ఏర్పాటు చేసిన బృహత్ ఆరోగ్య మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యా, ఆరోగ్య రంగాలకు ప్రభుత్వం ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. సౌదత్తి ప్రాంత ప్రజలకు అనుకూలంగా ఉండాలన్న ఉద్దేశంతో మేళను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ఎంతో దూరం నుంచి వచ్చిౖ వెద్య సేవలు పొందారన్నారు. వైద్య శిబిరం విజయవంతమైందన్నారు. షుగర్, బీపీ బాధితులు జీవనశైలి మార్చుకొని ఆరోగ్యకరమైన జీవనం సాగించాలన్నారు. సౌదత్తిలో రూ.46 కోట్లతో మల్టిస్పెషలిటీ ఆస్పత్రి నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామని వెల్లడించారు. రామదుర్గ, కిత్తూరులో అత్యుధునిక ఆస్పత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు హాజరై రోగులకు వైద్య సేవలు అందించారు. -
ఆక్రమణల తొలగింపునకు చర్యలు
రాయచూరురూరల్: నగరంలో ఆక్రమణల తొలగించేందుకు చర్యలు చేపడుతామని కార్పొరేషన్ కమిషనర్ జుబిన్ మోహోపాత్రే తెలిపారు. శనివారం ఆయన ఎస్పీ పుట్ట మాదయ్యతో కలిసి నగరంలో పర్యటించారు. తీన్ కందిల్, మహవీర్ సర్కిల్, స్టేషన్ రహదారి, అంబేడ్కర్ సర్కిల్, షరాప్ బజార్, ఉస్మానియా మార్కెట్, పటేల్ రహదారి, సిటీ టాకీస్ రోడ్, టిప్పు సుల్తాన్ రహదారి, పబ్లిక్ ఉద్యానవనం ప్రాంతాల్లోని ఆక్రమణలను పరిశీలించారు. రంజాన్, ఉగాది అనంతరం ఆక్రమణలు తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ తెలిపారు. డీఎస్పీ సత్యనారాయణ, సీఐ ఉమేష్ కాంబ్లే పాల్గొన్నారు. అభివృద్ధి పనులు పూర్తి చేయాలిరాయచూరు రూరల్: నగరంలోని ఈద్గా మైదానంలో అభివృద్ధి పనులు త్వరితిగతిన పూర్తి చేయాలని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ అధికారులకు సూచించారు. నగరంలోని యక్లాసపూర రహదారిలో 4 ఏకరాల స్థలంలో నిర్మాణాలు చేపట్టిన పనులను ఆదివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. కొనసాగుతున్న విచారణరాయచూరు రూరల్: గోకాక్ మహాలక్ష్మి సహకార బ్యాంకు లావాదేవీల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై బాగల్ కోటె జిల్లా జమఖండి బబలాది మఠాధిపతి సదాశివ ముత్యాల స్వామిజీని అరెస్ట్ చేసిన ధార్వాడ సీఐడీ అధికారులు విచారణను వేగవంతం చేశారు. స్వామీజీ కుమారుడు, భార్య పేరుపై బ్యాంకు గుమస్తా సాగర్ సబకాళే రూ.80 లక్షలు జమ చేఽశారు. అదేవిధంగా బ్యాంకు పాలకమండలి సభ్యులు కోట్లాది రూపాయలు రుణాలుగా తీసుకున్నట్లు విచారణలో వెలుగు చూసింది. బాగల్ కోటె ఎస్పీ భీమా శంకర్ గుళేద్ మాట్లాడుతూ సీఐడీ అధికారుల విచారణ కొనసాగుతోందన్నారు. ఎయిమ్స్ ఏర్పాటుకు ఒత్తిడి తేవాలిరాయచూరురూరల్: రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎయిమ్స్ పోరాట సమితి ప్రధాన సంచాలకుడు బసవరాజ్ కళస డిమాండ్ చేశారు. అదివారం ఢిల్లీలో మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ, కేంద్ర మంత్రి కుమారస్వామిలను భేటీ చేసి ఎయిమ్స్ ఆవశ్యకతను వివరించారు. సీఎం సిద్దరామయ్య, ప్రధాని మోదీలు ఎయిమ్స్ మంజూరులో రాయచూరు జిల్లా వాసులకు మొండి చేయి చూపారన్నారు. మరోమారు ప్రధాని దృష్టికి తీసుకెళ్లి ఎయిమ్స్ మంజూరు చేయించాలని కోరారు. చిక్క తిరుపతి ఆలయంలో పూజలు మాలూరు: తాలూకాలోని ప్రసిద్ద యాత్రా స్థలమైన చిక్కతిరుపతి గ్రామంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణస్వామి దేవాలయంలో ఆదివారం లోకాయుక్త రిజిస్ట్రార్ అన్నుగౌడ వి పాటిల్ విశేష పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు రవిస్వామి, గోపాలకృష్ణ భరద్వాజ్,, ఎన్ శ్రీధర్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. తరువాత ఆయన కేజీఎఫ్ కోటిలింగ దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. పూజల్లో దేవాలయ ఈఓ టి సెల్వమణి, పేష్కార్ సి చెలువస్వామి దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు. బాలుడిపై లైంగిక వేధింపులుహుబ్లీ: బాలుడిపై లైంగిక వేదింపులకు పాల్పడిన ఘటన పాత హుబ్లీలోని హెగ్గేరిలో ఆదివారం జరిగింది. సిరాజ్ ఉద్దీన్ ఎస్ (58) అనే వ్యక్తి బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి ఉడాయించాడు. బాధితుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పాత హుబ్లీ పోలీసులు సిరాద్ ఉద్దీన్పై కేసునమోదు చేసి కొన్ని గంటల్లోనే అరెస్ట్ చేసి కోర్టులో హజరు పరిచారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కూడేరు: అనంతపురం జిల్లా కూడేరు మండలం అరవకూరు మలుపు సమీపాన అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బళ్లారికి చెందిన లింగన్న, వండ్రప్పలు గాయపడ్డారు. వీరిద్దరూ ద్విచక్ర వాహనంలో అనంతపురం నుంచి సొంతూరికి వెళుతుండగా కుక్క అడ్డు రావడంతో అదుపు తప్పి కింద పడ్డారు. క్షతగాత్రులను కూడేరు ఆస్పత్రికి తరలించారు. -
సమాజానికి కొంత తిరిగి ఇవ్వాలి
హొసపేటె: మనం సంపాదించిన ఆస్తి, హోదా శాశ్వతంగా ఉండదని, కానీ నేర్చుకున్న జ్ఞానం మాత్రమే చివరి వరకు మీతో ఉంటుందని కొట్టూరు సంస్థాన మఠం శ్రీ జగద్గురు కొట్టూరు బసవలింగ స్వామి అభిప్రాయపడ్డారు. నగరంలోని ఉన్న ప్రతిష్టత విజయనగర కళాశాల పాత విద్యార్థులు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గురువందన, స్నేహ సమ్మిళన, ప్రతిభా కనబరిచిన పూర్వ విద్యార్థులకు సన్మానం కార్యక్రమంను స్వామీజీ ప్రారంభించి మాట్లాడారు. జీవితంలో ఒక లక్ష్యం, దిశానిర్దేం, గురువు ఆశీస్సులు ఉంటేనే విద్య ద్వారా సమాజంలో ఉన్నత స్థానాన్ని పొందగలరని అన్నారు. నేడు సమాజంలో మనం మంచి స్థానాన్ని సాధించామంటే, దాని వెనుక ఈ సమాజంలోని ప్రతి ఒక్కరి కృషి ఉంటుందన్నారు. ఈ సమాజం నుంచి మనం పొందిన దానిలో కనీసం కొంతైన సమాజానికి తిరిగి ఇవ్వాలన్నారు. దీని ద్వారా అక్షరాలు నేర్పిన గురువులు, జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీరుతుందన్నారు. ఎమ్మెల్యే గణేష్, అన్నపూర్ణ, పాత విద్యార్థుల సంఘం అధ్యక్షులు పీ ఎన్ శ్రీపాద, వీవీ సంఘం నేతలు కణేకల్ మహంతేష్, ప్రిన్సిపాల్ ప్రభుగౌడ, కళాశాల పాలక మండలి అధ్యక్షుడు మల్లికార్జున మట్రి, ఉపాధ్యక్షుడు గోగ్గచెన్నబసవ గౌడ, పాత విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
నాటక కళను బతికించుకోవాలి
రాయచూరు రూరల్: నాటక రంగానికి ప్రాణం పోయాలని కిల్లేబృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు సూచించారు. నగరంలోని పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో స్ఫూర్తి నాట్య అకాడమీ ఏర్పాటు చేసిన సాంస్కతిక, నృత్య, గాన, సంగీతోత్సవాలను స్వామీజీ ప్రారంభించి మాట్లాడారు. చిన్నప్పటినుంచే కళలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. నాటక రంగాన్ని ఆదరించి భావితరాలకు అందిచాలన్నారు. అనంతరం కళాకారుల ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో చంద్రశేఖర్, రాజా శ్రీనివాస్, సంగమేష్, జంగ్లప్ప గౌడ, పరిమళరెడ్డి, రేఖ, పుష్పావతి, మల్లికార్జున, దండెప్ప పాల్గొన్నారు. ఇద్దరు నర్సింగ్ విద్యార్థుల దుర్మరణం సాక్షి,బళ్లారి: చిత్రదుర్గం నగరంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. యాసిన్(22),అల్తాఫ్(22) అనే నర్సింగ్ విద్యార్థులు బైక్పై వెళ్తుండగా అతివేగంగా వచ్చిన కేఎస్ఆర్టీసీ బస్సు ఢీ కొంది. తీవ్ర గాయాలతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాఫిక్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. దళితుల్లో చైతన్యం నింపిన సిద్దలింగయ్యరాయచూరు రూరల్: రాజ్యాగ నిర్మాత అంబేడ్కర్ బాటలో నడిచిన దివంగత సాహితీవేత్త డాక్టర్ సిద్దలింగయ్య జీవన విధానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కవి బాబు బండారిగల్ అన్నారు. సిద్దలింగయ్య జీవన విధానంపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమన్వయ సమితి ఆదివారం నగరంలోని ఎన్జీఓ సభా భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దళితుల సమస్యలను తన బాధలుగా భావించిన సిద్దలింగయ్య తన సాహిత్యం ద్వారా దళితుల్లో చైతన్యం నింపారన్నారు. ఆయన జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. సమన్యయ సమితి అధ్యక్షుడు జిందప్ప, కార్యదర్శి సంతోస్, ఈరణ్ణ, అణ్ణప్ప మేటి, బషీర్ అహ్మద్ పాల్గొన్నారు. దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.74 లక్షలు బళ్లారిఅర్బన్: బళ్లారి శ్రీ కనకదుర్గమ్మ హుండీని లెక్కించినట్లు ఈఓ హనుమంతప్ప తెలిపారు. గత ఈ ఏడాది అక్టోబర్ 19 నుంచి ఈ నెల 21 వరకు భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.74,21,390 ఆదాయం లభించినట్లు తెలిపారు. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల మధ్య హుండీ లెక్కింపు జరిగిందన్నారు. గతంలో పోల్చుకుంటే ఈ సారి హుండీ ఆదాయం భారీగా పెరిగిందన్నారు. అయ్యప్ప స్వామి సేవా సమాజం జిల్లా శాఖప్రారంబళ్లారిటౌన్: నగరంలోని విద్యానగర్ శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం శ్రీ శబరిమలై అయ్యప్ప సేవా సమాజం జిల్లా శాఖను కమ్మరిచెడు కళ్యాణ స్వామి చేతులు మీదుగా ప్రారంభించారు. జిల్లా శాఖ అధ్యక్షుడిగా రాంబాబు గురుస్వామిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు జయప్రకాష్, ఉపాధ్యక్షుడు సంపత్కుమార్, స్థానిక ఆలయం ట్రస్ట్ అధ్యక్షుడు వై.భాస్కర్, ఉపాధ్యక్షుడు బోయపాటి విష్ణు, గురుస్వాములు సురేష, దత్త, మోహన్, రంగారెడ్డి, బీమ్రెడ్డి, నాగేష్, రామ్రెడ్డి, యోగి, మంజు, చల్లారమేష్, శ్రీనాథ్, సునిల్, ఆనందచౌదరి తదితరులు పాల్గొన్నారు. -
ఒపెక్ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు
రాయచూరురూరల్ : ఒపెక్ ఆస్పత్రిలో రోగులకు ఆధునిక వైద్య సేవలు అందించేలా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ నీతిష్ తెలిపారు. ఒపెక్ అస్పత్రిలో ఏర్పాటు చేసిన డయాలిసిస్ యంత్రాలను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కళ్యాణ కర్ణాటకతోపాటు ఏపీలోని పలు జిల్లాల రోగులకు ఈ ఆస్పత్రిలో వైద్యం అందుతోందన్నారు. గతంలో ఒపెక్లో వైద్య సేవలు అందలేదని రోగులు అసంతృప్తికి గురయ్యే వారన్నారు. ప్రస్తుతం రోగులకు అన్ని సౌలభ్యాలు కల్పించి మెరుగైన వైద్యం అందజేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. క్యాన్సర్, కార్డియాలజీ, పీడియాట్రిక్, ప్లాస్టిక్ సర్జరీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, గ్యాస్టో సర్జికల్, మెడికల్ గ్యాస్ట్రో. పైకో మ్యాక్సిలరీ సర్జరీ సేవలను పునరుద్ధరించినట్లు తెలిపారు. వైద్య సేవలను రోగులు వినియోగించుకోవాలన్నారు. ఆస్పత్రి ప్రత్యేక అధికారి డాక్టర్ రమేష్ సాగర్, డాక్టర్ రమేష్, విజయ శంకర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఎడమ కాలువకు ఏప్రిల్ 10 వరకు నీరు
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూములకు ఏప్రిల్ 10 వరకు నీరందిస్తామని కొప్పళ జిల్లా ఇంచార్జి, కన్నడ సంస్కృతి శాఖ మంత్రి శివరాజ్ తంగడిగి వెల్లడించారు. శుక్రవారం బెంగళూరులోని వికాససౌధలో జరిగిన తుంగభద్ర ఐసీసీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడగారు. తాగు, సాగునీటి వినియోగంలో అదికారులు నియమాలను పాటించి రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాలకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. ప్రస్తుతం జలాశయంలో 18 టీఎంసీల నీరు ఉండగా డెడ్ స్టోరేజీ 2 టీఎంసీలను మినహాయించాలన్నారు. కర్ణాటక రాష్ట్ర వాటా 11 టీఎంసీలు, ఆంధ్రపదేశ్ వాటా 4 టీఎంసీలుగా నిర్ణయించారన్నారు. ఎడమ కాలువలకు ఏప్రిల్ 1 నుంచి 10వ తేదీ వరకు 3000 క్యూసెక్కులు, విజయనగర కాలువకు ఏప్రిల్ 11 నుంచి మే 10 వరకు 150 క్యూసెక్కులు, రాయ బసవణ్ణ కాలువకు ఏప్రిల్ 11 నుంచి మే 10 వరకు 200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తారన్నారు. చెరువులను నీటితో నింపి వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో మంత్రులు జమీర్ అహ్మద్, శరణ ప్రకాష్ పాటిల్, శాసన సభ్యులు హంపనగౌడ బాదర్లి, నాగేంద్ర, గవియప్ప, నాగరాజ్, గణేష్, బసనగౌడ బాదర్లి, బసన గౌడ తుర్విహాళ, వసంత్ కుమారలున్నారు. రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాలకు అధిక ప్రాధాన్యత కొప్పళ జిల్లా ఇంచార్జి, కన్నడ సంస్కృతి శాఖ మంత్రి శివరాజ్ తంగడిగి -
కర్ణాటక బంద్ ప్రభావం పాక్షికం
సాక్షి,బళ్లారి: కేఎస్ఆర్టీసీ బస్సు కండక్టర్పై కొందరు మరాఠ దుండగులు దాడి చేయడాన్ని నిరసిస్తూ కన్నడ పర సంఘాలు కర్ణాటక బంద్కు పిలుపునివ్వడంతో బంద్ పాక్షికంగా జరిగింది. శనివారం కర్ణాటక బంద్కు కన్నడ పర సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో బళ్లారి జిల్లాలో బంద్కు మద్దతు ఇచ్చినప్పటికీ బస్సులు, ఆటోలు యథావిధిగా నడిచాయి. అయితే కర్ణాటక రక్షణ వేదిక(శివరామగౌడ వర్గం) బళ్లారి, విజయనగర జిల్లాల అధ్యక్షుడు రాజశేఖర్ నేతృత్వంలో బంద్కు మద్దతు ప్రకటించారు. రాయల్ సర్కిల్ వద్ద నిరసన వ్యక్తం చేస్తూ జిల్లాధికారి కార్యాలయం వరకు చేరుకుని ఆందోళన చేపట్టి మాట్లాడారు. కన్నడిగులపై మరాఠీయులు చేస్తున్న దాడిని ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పలు సమస్యలపై జిల్లాధికారి కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఉ–కలో ప్రభావం అంతంత మాత్రమే ఉత్తర కర్ణాటక పరిధిలో ధార్వాడ, హావేరి, బాగల్కోటె, గదగ్, కొప్పళ, బీదర్ తదితర జిల్లాల్లో కూడా బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. యథావిధిగా బస్సుల రాకపోకలు జరగడంతో పాటు కన్నడ పర సంఘాల కార్యకర్తలు అక్కడక్కడ పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. బంద్ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా బెళగావి నుంచి మహారాష్ట్రకు బస్సుల రాకపోకలు నిలిపివేశారు. బెళగావిలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.బంద్తో వ్యాపారాలు లేక బెళగావి బోసిపోయింది. చిన్న చిన్న వ్యాపారులు, ముఖ్యంగా పూలు వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. బళ్లారి జిల్లాతో పాటు చిత్రదుర్గ, దావణగెరె తదితర జిల్లాల నుంచి బెళగావికి వెళ్లాల్సిన కేఎస్ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. మొత్తం మీద బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోగా బంద్ ప్రభావం అంతగా లేకపోగా కేవలం బెళగావిలో మాత్రమే బంద్ ప్రభావం కనిపించింది. రాయచూరులో పాక్షిక బంద్ రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలోని వివిధ జిల్లాల్లో పాక్షికంగా, ప్రశాంతంగా జరిగిన బంద్కు అందరి మద్దతు లభించింది. శనివారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద జరిగిన సమావేశంలో కరవే అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్ మాట్లాడారు. కేఎస్ఆర్టీసీ బస్ కండక్టర్పై మరాఠీయులు దాడులు చేయడాన్ని ఖండిస్తూ ఇచ్చిన పిలుపు మేరకు ఈ బంద్ చేపట్టారు. అనంతరం జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. తీన్ కందిల్, షరాఫ్ బజార్, కూరగాయల మార్కెట్, దుకాణాలు, హోటళ్లు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు యథాప్రకారం పని చేశాయి. రవాణ సౌకర్యాలు కొంత మేర స్తంభించాయి. కన్నడ సంఘాల నాయకులు, కార్యకర్తలు నగరంలో కలియ తిరుగుతూ బంద్ చేయించారు. మహారాష్ట్ర సర్కార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. విజయనగరలోనూ బంద్ పాక్షికమే హొసపేటె: బెళగావిలో ఎంఈఎస్ దమనకాండకు నిరసనగా శనివారం చేపట్టిన కర్ణాటక బంద్కు విజయనగరలో అంతగా మద్దతు లభించలేదు. వాటాల్ నాగరాజ్, సారా గోవిందు సహా వివిధ సంఘ సంస్థలు ఇచ్చిన బంద్ పిలుపునకు విజయనగర జిల్లాలో ఏ సంస్థ కూడా మద్దతు ప్రకటించలేదు. ఆర్టీసీ బస్సుల రాకపోకలు, ఆటోలు, కిరాణ సామగ్రితో సహా ప్రజాజీవితం యథావిధిగా ఉంది. పాఠశాలలు, కళాశాలలు, దుకాణాలు కూడా యథావిధిగా పని చేశాయి. విజయనగర జిల్లాలోని హొసపేటె, హగరిబొమ్మనహళ్లి, హూవినహడగలి, కూడ్లిగి, కొట్టూరు, హరపనహళ్లిలలో బంద్కు ఎలాంటి స్పందన లేదు. ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా బంద్ లేదా నిరసనకు పిలుపునివ్వలేదు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు మాత్రమే తీసుకున్నారు. హుబ్లీలో ఆందోళనకారుల బంద్ హుబ్లీ: బెళగావిలో మహారాష్ట్ర ఏకీకరణ సమితి(ఎంఈఎస్) నేతల తీరుపై వివిధ కన్నడ సంఘాల కార్యకర్తలు, ప్రముఖులు తీవ్రంగా మండిపడ్డారు. ఆ సంఘాల ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బంద్లో భాగంగా చెన్నమ్మ సర్కిల్తో పాటు ధార్వాడలోని కోర్టు సర్కిల్, జూబ్లి సర్కిల్ తదితర కూడళ్లలో వివిధ సంఘాల కార్యకర్తలు ఎన్ఈఎస్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆందోళనకారులు మాట్లాడుతూ బెళగావిలో మరాఠీలో మాట్లాడలేదని కండక్టర్పై దాడి చేసిన పర్యవసానంగా తలెత్తిన పరిణామాలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఈఎస్ నేతలు తరచు ఇలాంటి పోకిరీ పనులకు పాల్పడుతుంటారని ధ్వజమెత్తారు. బళ్లారిలో కర్ణాటక రక్షణ వేదిక మద్దతు యథావిధిగా బస్సులు, ఆటోల సంచారం బెళగావి నుంచి మహారాష్ట్రకు బస్సుల రాకపోకల నిలిపివేత వివిధ జిల్లాల నుంచి బెళగావికి బస్సుల రాకపోకలు లేవాయె.! -
బబలాది సదాశివప్ప స్వామీజీ అరెస్ట్
రాయచూరు రూరల్: కాల జ్ఞానం చెప్పడంలో అందె వేసిన చెయ్యి, ఉత్త్తర, కళ్యాణ కర్ణాటకలో ప్రసిద్ది చెందిన బబలాది మఠాధిపతి సదాశివ ముత్యాల స్వామీజీని ధార్వాడ నుంచి వచ్చిన నలుగురు సీఐడీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. బాగల్కోటె జిల్లా జమఖండిలో నూతనంగా నిర్మించుకున్న మఠాధిపతి సదాశివ ముత్యా స్వామీజీకి ఆపద ఎదురైంది. గోకాక్ మహాలక్ష్మి సహకార బ్యాంక్లో లావాదేవీల విషయంలో స్వామీజీ ఖాతాలోకి రూ.60 లక్షల్లో వ్యవహారాలు సాగించారు. స్వామీజీ కుమారుడు, భార్య పేరు మీద సాగర్ సబకాళే వారి ఖాతాలోకి జమ చేఽశారు. గోకాక్ మహాలక్ష్మి సహకార బ్యాంక్లో సాగర్ సబకాళే ప్యూన్గా విధులు నిర్వహిస్తున్నారు. సాగర్ సబకాళేతో పాటు పాలక మండటి సభ్యులు మరి కొంత మంది కలసి బ్యాంక్ నుంచి రూ.కోట్లాది మేర నిధులను వాడుకున్నారు. బ్యాంకులో రూ.76 కోట్ల మేర అప్పులు తీసుకుని తిరిగి చెల్లించక పోవడంతో ఆర్బీఐ అధికారులు నివ్వెర పోయారు. మూడేళ్లుగా బ్యాంక్లో అవ్యవహారాలు మూడేళ్ల ఆడిట్ను పరిశీలించిన ఆర్బీఐ అధికారులు నాటి నుంచి బ్యాంక్లో అవ్యవహారాలు జరిగినట్లు నివేదిక ఇచ్చారు. బ్యాంక్ నిధుల నుంచి గోకాక్, హుబ్లీ, బెళగావిలో స్థలాలు కొనుగోలు చేశారు. దీనిపై కేసు నమోదు చేయడంతో అందరి జాతకాలు బయట పడ్డాయి. రాష్ట్రంలో పేరు గాంచిన పురాతన మఠం విజయపుర జిల్లా బబలాది సదాశివప్ప ముత్యాది ఒకటి కాగా రెండోది మూడు నెలల క్రితం బాగల్కోటె జిల్లా జమఖండిలో నూతనంగా నిర్మించుకున్న మఠాధిపతి సదాశివ ముత్యాది. ఈ స్వామీజీని పోలీసులు అరెస్టు చేశారు. గోకాక్ మహాలక్ష్మి సహకార బ్యాంక్లో రూ.35 వేల కోట్ల టర్నోవర్లో రూ.76 కోట్ల అవినీతికి పాల్పడిన వ్యవహారంలో సీఐడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. 70 శాతం మందికి బ్యాంక్ యజమాని, శాసన సభ్యుడు సతీష్ జార్కిహోళి వినియోగదారులకు తిరిగి డబ్బులను వాపస్ ఇచ్చారు. రూ.76 కోట్ల నిధుల వంచన కేసు సీఐడీ అధికారుల సమగ్ర తనిఖీ సహకార బ్యాంక్లో లావాదేవీలు -
రెండో ఎయిర్పోర్టుకు సర్వే పనులు
● ఏప్రిల్లో బృందం రాకబనశంకరి: బెంగళూరులో మరో విమానాశ్రయం నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై అధ్యయనం కోసం భారతీయ విమానాశ్రయాల ప్రాధికార అధికారులు వస్తున్నారని భారీ పరిశ్రమలశాఖమంత్రి ఎంబీ.పాటిల్ తెలిపారు. శనివారం నగరంలో విలేకరులతో మాట్లాడుతూ ఏప్రిల్ 7 నుంచి 9 మధ్య బెంగళూరులో పర్యటిస్తారు. ఫీజుల ఖర్చుల కోసం ప్రాధికారకు రూ.1.21 కోట్లు చెల్లించామని తెలిపారు. కనకపుర రోడ్డులో రెండు స్థలాలు, నెలమంగల, కుణిగల్ రోడ్డులో ఒక స్దలం గుర్తించామని తెలిపారు. ఈ స్థలాల రెవెన్యూ వివరాలు, పదేళ్ల వాతావరణ నివేదిక, భారతీయ సర్వేశాఖ బ్లూప్రింట్ తదితరాల సమాచారంతో నివేదిక సిద్ధంగా ఉంచామని తెలిపారు. బెంగళూరులో ఉండే కెంపేగౌడ విమానాశ్రయం పై ఒత్తిడి అధికంగా ఉందని, 2033 వరకూ 150 కిలోమీటర్లు పరిధిలో మరో విమానాశ్రయం ఉండరాదని షరతు ఉంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని రెండో విమానాశ్రయం నిర్మాణానికి ఇప్పటి నుంచి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. రైలు కింద పడి యువతి ఆత్మహత్య మండ్య: రైలు కింద పడి యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండ్య నగరంలోని బందిగౌడ లేఔట్వద్ద శనివారం జరిగింది. మండ్యలోని రిజర్వు పోలీసు అన్సర్ బాషా కుమార్తె సుహాన (19) మృతురాలు. ఆమె మైసూరులోని ప్రైవేటు కాలేజీలో బీఏ చదువుతోంది. శుక్రవారం రాత్రి ఇంటి నుంచి స్కూటర్లో బయటకు వెళ్లింది. రైలు పట్టాల వద్దకు వెళుతున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో చిక్కాయి. చాముండి ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. కారణాలు తెలియాల్సి ఉంది. మండ్య రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆకతాయిలపై చర్యకు డిమాండ్
సాక్షి,బళ్లారి: బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు తాగడం నేరమని ఆదేశాలు ఉన్నా కొందరు సిగరెట్లు తాగడం ఫ్యాషన్గా మార్చుకోవడంతో మహిళలు ఉన్న ప్రాంతాల్లో దగ్గరగా వెళ్లి సిగరెట్ తాగుతూ వారి ముఖం మీదకు కొందరు యువకులు పొగ వదలడం కొప్పళ జిల్లా గంగావతిలో కలకలం సృషించింది. అక్కడ వాయువిహారానికి వెళ్లిన మహిళల ముఖాలపైకి కొందరు ఆకతాయిలు సిగరెట్ తాగి పొగ వచ్చేలా చేయడంతో సదరు మహిళలు తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేస్తూ యువకులపై తీవ్రంగా మండిపడ్డారు. దీంతో సిగరెట్ తాగిన యువకులు తమ సిగరెట్ తమ ఇష్టమని, రోడ్లలో సిగరెట్ తాగితే తప్పేముందని బుకాయించడంతో పాటు మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడటంతో మరింత ఆగ్రహానికి గురి చేసింది. దీంతో శుక్రవారం గంగావతిలోని కువెంపు నగర్, జయగనర్, మాళమల్లేశ్వర తదితర కాలనీలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో చేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కాలనీల్లో తాము వాకింగ్ చేస్తున్న సమయంలో సిగరెట్ తాగుతూ తమ మీదకు పొగ వచ్చేలా చేశారని, అడ్డు చెబితే అసభ్యంగా ప్రవర్తించారని మండిపడ్డారు. తమ డబ్బులతో తాము సిగరెట్లు తాగుతున్నామని బుకాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీ కావడంతో పోలీసులు వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు తాగకూడదని, మరొకరికి ఇబ్బంది కలిగించే విధంగా సిగరెట్ తాగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కుల మత తారతమ్యాలు వద్దురాయచూరు రూరల్: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకు పోతున్న నేటి సమాజంలో కుల, మత తారతమ్యాలను వీడాలని సీనియర్ సాహితీవేత్త మూడ్నాకూడు చిన్నస్వామి అభిప్రాయ పడ్డారు. శనివారం కన్నడ భవన ంలో కీర్తన ప్రకాశన అనిల్ పొన్నరాజ్ ఆధ్వర్యంలో తలెమారు అనే కన్నడ పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. శతాబ్దాల తరబడి అణగారిన వర్గాల వ్యక్తులు తమ జీవితాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి పుస్తకంలో నొక్కి వక్కాణించారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న అంటరానితనం నిర్మూలనపై ముమ్మర ప్రచారం అవసరమన్నారు. సమావేశంలో వెంకటేష్ బేవినబెంచి, ఈరణ్ణలున్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలిహుబ్లీ: ప్రస్తుతం మారుతున్న సమాజంలో మహిళలకు లభించిన అన్ని అవకాశాలను సక్రమంగా సద్వినియోగం చేసుకొని ముందంజలో సాగుతూ అన్ని రంగాలలో విశిష్ట సాధన చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలని జిల్లా కౌశల్య అభివృద్ధి అధికారి దేవేంద్ర జబేరి తెలిపారు. జిల్లా కౌసల్య అభివృద్ధి శాఖ అళ్నావర పట్టణ పంచాయతీ దీనదయాళ్ అంత్యోదయ జాతీయ నగర జోవనోపాధి అభియాన్ పథకం ద్వారా స్వచ్ఛంద గ్రూప్ల సహకారంతో అళ్నావర వీరశైవ కళ్యాణమంటపంలో ఏర్పాటు చేసిన రెడీమేడ్ తయారీ ఎగుమతుల యూనిట్ ఆధ్వర్యంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన కుట్టుమిషన్ శిక్షణ ఉద్యోగమేళా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మహిళలకు ఉద్యోగాలు కల్పించే వ్యవస్థ ఏర్పడాలి. ధార్వాడ రాయాపుర వద్ద గార్మెంట్ యూనిట్లో ఈ ప్రాంతం నుంచి సుమారు 300 మంది మహిళలకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. వీటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా స్వావలంబన సాధించాలన్నారు. సాహి ఎగుమతుల అధికారి దేవరెడ్డి హర్లాపుర, పట్టణ పంచాయతీ ముఖ్యాధికారి ప్రకాశ ముగ్ధం, మాజీ అధ్యక్షురాలు సువర్ణ, రేష్మి, రవి మునవళ్లి, సుమా, రవీంద్ర, శ్వేత పాల్గొన్నారు. విద్యాభివృద్ధికి సహకారం అవసరం రాయచూరు రూరల్: గ్రామాల్లో విద్యాభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని బసవ పూర్వ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం శరణ బసవ పాటిల్ పేర్కొన్నారు. శనివారం ఆశాపూర్లో విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దడానికి, విద్యార్థులు ఉన్నత విద్యను పొందడానికి తమ వంతు పాటు పడాలన్నారు. ప్రతి ఒక్కరూ విద్యాభ్యాసంపై శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో అమరేష్ పాటిల్, తిమ్మప్ప, రవిలున్నారు. మహిళల పైకి సిగరెట్ పొగ వదిలిన యువకులు గంగావతిలో నిరసన, పోలీసులకు ఫిర్యాదు -
ఉపకార వేతనాల రద్దు తగదు
బళ్లారిఅర్బన్: పాలక మండలి కోటాలో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉన్నఫళంగా ఉపకార వేతనాలను రద్దు చేయడం తగదని విద్యార్థులు వాపోయారు. ఈ మేరకు జిల్లాధికారికి నగరంలో వినతిపత్రం సమర్పించి సమస్యను పరిష్కరించాలని సీఎంను కోరారు. 2018–19వ సంవత్సరం నుంచి పాలక మండలి కోటాలో ఎంపికై న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలను పంపిణీ చేయక పోవడంతో ఉన్నత విద్యాభ్యాసానికి ఆటంకం కలిగిందన్నారు. దీంతో అర్థంతరంగా చదువుకు దూరం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ప్రభుత్వం సదరు నిధులను ఇతర శాఖలకు మళ్లించడం తగదని ఏకలవ్య సేన జిల్లా శాఖ ఆరోపించింది. ఒక వేళ ఆ విషయంలో తమకు న్యాయం జరగకపోతే తీవ్రమైన పోరాటం చేస్తామని ఆ సంఘం నేతలు హెచ్చరించారు. మేకెదాటు కోసం కరవే పాదయాత్ర బళ్లారిఅర్బన్: రాష్ట్రంలోని తుమకూరు, చిక్కబళ్లాపుర, దొడ్డబళ్లాపుర, కోలారు, బెంగళూరు గ్రామీణ జిల్లాలకు తాగునీరు అందించే ప్రభుత్వ కీలక పథకం మేకెదాటు పథకాన్ని సత్వరం ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రామనగర నుంచి బెంగళూరు విధానసౌధకు నిర్వహించిన పాదయాత్రలో కర్ణాటక రక్షణ వేదిక(కరవే) ప్రవీణ్శెట్టి వర్గం పాదయాత్ర చేపట్టింది. వారికి మద్దతుగా కరవే బళ్లారి జిల్లా శాఖ హులుగప్ప సారథ్యంలో 500 మందికి పైగా కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వెంకటేష్, అసుండి సూరి, కే.ఆనంద్, వీ.వెంకటేష్, చంద్రారెడ్డి, వీరారెడ్డి, హనుమేష్ కే.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం హుబ్లీ: జైన్ అకాడమి 20వ వార్షికోత్సవం సందర్భంగా ఐఏఎస్, కేఏఎస్, గ్రూప్ సీ, ఎస్ఐ, బ్యాంకింగ్, రైల్వే ఉద్యోగాలకు సంబంధించి ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. దీనికి సాధారణ ప్రవేశం కల్పిస్తున్నామని ఆ మేరకు దరఖాస్తులను ఆహ్వానించారు. బెంగళూరు, ధార్వాడ కేంద్రాల్లో ఒక్కో కేంద్రంలో 100 మందికి చొప్పున శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 25 వరకు దరఖాస్తు స్వీకరణకు గడువు ఉంది. మరిన్ని వివరాలకు 7676167901 నంబరులో సంప్రదించాలని ఆ అకాడమి డైరెక్టర్ ఓ ప్రకటనలో కోరారు. బాల కార్మికులకు విముక్తిరాయచూరు రూరల్: జిల్లాలో బాల కార్మికుల నియంత్రణకు శనివారం పోలీస్, కార్మిక శాఖల ఆధ్వర్యంలో అధికారులు దాడి జరిపారు. దేవదుర్గ తాలూకాకు వివిధ ప్రాంతాల నుంచి పత్తి, వరి, ఇతర పంటల కోతకు ఐదు వాహనాల్లో బాల కార్మికులను వ్యవసాయ పనులకు తీసుకెళుతుండగా ఆ వాహనాలను అడ్డుకొని 15 మంది బాలలకు విముక్తి కల్గించారు. దాడిలో బాల కార్మిక శాఖ అధికారి మంజునాథరెడ్డి, అధికారులు రాకేష్, రాజనగౌడ, వెంకటేష్, శివకుమార్లున్నారు. శ్రీశైలం బస్సులు కిటకిటరాయచూరు రూరల్: ఉగాది పండుగ సమీపిస్తున్నందున రాయచూరు నుంచి శ్రీశైలం వెళ్లే బస్సులు కిటకిటలాడుతున్నాయి. సాధారణ రోజుల్లో కన్నా ప్రస్తుతం శ్రీశైలం వెళ్లే భక్తుల సంఖ్య క్రమంగా పెరగడంతో బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణికులు వెంపర్లాడుతున్నారు. ఈనేపథ్యంలో రాయచూరు, మాన్వి, సింధనూరు, దేవదుర్గ, మస్కి, లింగసూగూరు డిపోల నుంచి ప్రతి గంటకు అదనపు బస్సులను నడుతుపున్నా భక్తులు సీట్ల కోసం ఎగబడుతున్నారు. కర్ణాటకలోని బాగల్కోటె, విజయపుర,బ బెళగావి తదితర జిల్లాల నుంచి వెళ్లే భక్త సమూహానికి అనుకూలం కోసం ఏప్రిల్ 1వ తేదీ వరకు 15 రోజుల పాటు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు కళ్యాణ కర్ణాటక ఆర్టీసీ అధికారులు తెలిపారు. -
సైకిల్పై వినూత్నంగా.. ప్రజలకు చేరువగా..
హొసపేటె: తాలూకాలోని మరియమ్మనహళ్లి పట్టణంలో శనివారం విజయనగర జిల్లాధికారి సైకిల్పై పర్యటించి, ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. పట్టణంలోని ప్రాథమిక సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. భక్తుల విరాళాలతో కొత్తగా నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి జంట రథాల పనులను ఆయన పరిశీలించారు. రాబోయే రథోత్సవానికి అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అమృత్ 2.0 ప్రాజెక్ట్ కింద మరియమ్మనహళ్లి పట్టణానికి తుంగభద్ర నది నుంచి నీటిని సరఫరా చేసే పనులను, ప్రెజర్ ఫిల్టర్ అండ్ జాక్వెల్ ప్రాంతాన్ని పరిశీలించారు. రథోత్సవం ప్రారంభానికి ముందు పట్టణంలోని అన్ని ఇళ్లకు నది నీటిని సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో వేడి భోజనం తయారీ, ఆహార నాణ్యతను పరిశీలించారు. విద్యారంగంలో పురోగతి, ప్రాథమిక సౌకర్యాలపై చర్చించారు. అందుబాటులో ఉన్న పత్రాలను తనిఖీ చేసిన తర్వాత నిబంధనల ప్రకారం పౌరులకు ఫారం– 3ని వెంటనే పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆమోదించని లే అవుట్లకు బీ–ఖాతా జారీ చేయడానికి సూచనలు ఇచ్చారు. ఆర్టీసీ బస్టాండ్, ఇతర బహిరంగ స్థలాల్లో ప్రాథమిక సౌకర్యాల గురించి ప్రజల నుంచి సమాచారం అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా అధికారి మనోహర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మరియమ్మనహళ్లిలో పర్యటించిన జిల్లాధికారి నాలుగో శనివారం సెలవు రోజైనా ప్రజల మధ్యనే -
నిరసనలు.. ప్రదర్శనలు
బనశంకరి: కర్ణాటక బంద్కు అన్ని జిల్లాల్లో మిశ్రమ స్పందన లభించింది. బెళగావిలో గొడవలకు దిగుతున్న ఎంఈఎస్ని నిషేధించడం, కళసా బండూరి, మేకెదాటు పథకం, కళ్యాణ కర్ణాటక అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వివిధ డిమాండ్లతో కన్నడ ఒక్కోట అధ్యక్షుడు వాటాళ్ నాగరాజ్ శనివారం రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. నగరంలో ర్యాలీ భగ్నం బెంగళూరులో వాటాళ్ ఆధ్వర్యంలో టౌన్హాల్ నుంచి ఫ్రీడం పార్కు వరకు కన్నడ సంఘాల నేతలు, కార్యకర్తలతో భారీ ఊరేగింపు చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వాటాళ్, సా.రా.గోవిందు, కన్నడసేన కుమార్, ప్రవీణ్శెట్టి, శివరామేగౌడ తో పాటు ఇతర నేతలు , కార్యకర్తలను నిర్బంధించారు. ఆనందరావ్సర్కిల్ వద్ద బీఎంటీసీ, కేఎస్ఆర్టీసీ బస్సులను నేతలు అడ్డుకున్నారు. మామూలుగానే జనజీవితం బంద్ను పట్టించుకోకుండా రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు ఉదయం నుంచి యథావిధిగా సంచరించాయి. బెంగళూరులో సిటీ బస్సులు, మెట్రో రైళ్లు, ఆటోలు మామూలుగా తిరిగాయి. అత్యవసర సేవలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. హోటళ్లు, వ్యాపారాలు సజావుగా సాగాయి. పోలీసులు భారీసంఖ్యలో మోహరించారు. జిల్లాల్లో కన్నడ సంఘాల నాయకులు నిరసనలకు దిగారు. మైసూరులో కేఎస్ ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండుగంటలపాటు బస్సుల సంచారం ఆలస్యమైంది. కేంద్రీయ బస్స్టేషన్ వద్ద కొంచెం గలాటా జరిగింది. ఎక్కడా ఎస్ఎస్ఎల్సీ పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. బెళగావి, ఇతర జిల్లాల్లో వివాదానికి మూల కేంద్రమైన బెళగావిలో బంద్ ప్రభావం కనిపించలేదు. కొందరు కన్నడ సంఘాల నేతలు, కార్యకర్తలు ధర్నాకు దిగితే పోలీసులు అడ్డుకున్నారు. చిక్కోడిలో ఉదయం నుంచి వాహనాలు సంచరించంతో పాటు అంగళ్లు తెరిచారు. చామరాజనగర జిల్లాలో బంద్ కనిపించలేదు. మహారాష్ట్ర సరిహద్దు జిల్లా బీదర్లో యథా ప్రకారం కార్యకలాపాలు జరిగాయి. ఉడుపిలోను స్పందన కానరాలేదు. బంద్కు ఏ పార్టీ కూడా మద్దతు ఇవ్వకపోవడంతో ప్రభావం పడలేదు. అంతంతగానే కన్నడ సంఘాల రాష్ట్ర బంద్ ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు బెంగళూరులో టౌన్హాల్కు రాకుండా కట్టడి యథావిధిగా జనజీవనం హద్దు మీరితే చర్యలు: హోంమంత్రి బంద్లో హద్దులు మీరి ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి పరమేశ్వర్ హెచ్చరించారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన పరమేశ్వర్ గొడవలు లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారని తెలిపారు. చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తే అరెస్ట్ చేయాలని సూచించామని చెప్పారు. -
ఇసుక అక్రమ రవాణాకు కళ్లెం
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో అక్రమ ఇసుక రవాణాకు కళ్లెం పడింది. తుంగభద్ర, కృష్ణా నదీతీరాల్లో ఉన్న ప్రాంతాలలో రోజుకు వందలాది టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్న విషయం తెలుసుకున్న అధికారులు దాడులకు పూనుకున్నారు. జిల్లాలోని మాన్వి, రాయచూరు, దేవదుర్గ తాలుకాలో అక్రమంగా ఇసుక రవాణా అరికట్టే విషయంలో మాన్వి సీఐ కెంచరెడ్డి శుక్రవారం దాడులు జరిపి 18 టిప్పర్లు, హిటాచీలను స్వాధీనం చేసుకున్నారు. స్టాక్ యార్డులకు నది నుంచి ఇసుకను దొంగతనంగా తరలించి నిల్వ చేసుకుంటున్న అంశాన్ని పరిగణలోకి తీసుకొని నదిలో బుల్డోజర్ల ద్వారా గుంతలు పడే విధంగా ఇసుకను తరలిస్తున్నారు. రాయల్టీని రెండింటికి పొంది మిగిలిన వాహనాలకు లేకుండా వందల కొద్ది టన్నులను సరఫరా చేస్తున్నా వాటిని వశ పరుచుకున్నారు. అక్రమంగ ఇసుకను రవాణా చేస్తున్న వాహనాలను అడ్డుకున్న పోలీస్ కానిస్టేబు ల్ౖపై వారం రోజుల క్రితం దాడి జరిగిన ఘటన మాన్విలో చోటు చేసుకుం ది. మాన్వి తాలూకా చీకలపర్వి వద్ద తుంగభద్ర నదీ తీరంలో అక్రమంగ ఇసుకను తరలిస్తుండగా శుక్రవారం సీఐ రెడ్డి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఒకే రోజు 18 టిప్పర్లు స్వాధీనం మాన్వి సీఐ కెంచరెడ్డి మెరుపు దాడి -
బాబూజీ, అంబేడ్కర్ జయంతుల ఆచరణకు నిర్ణయం
హొసపేటె: హరిత విప్లవ పితామహుడు, మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ జయంతిని ఏప్రిల్ 5న నగరంలోని బాబూజీ ప్రతిమకు పూలమాల వేసి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని ఏప్రిల్ 14న ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోందని జిల్లాధికారి ఎంఎస్ దివాకర్ తెలిపారు. గురువారం నగరంలోని జిల్లాధికారి కార్యాలయ సభాంగణంలో సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి ముందస్తు సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండేళ్లుగా జయంతులను సరళంగా జరుపుకుంటున్నామని అన్నారు. ఈసారి జిల్లా యంత్రాంగం వివిధ సంస్థల సహకారంతో ఘనంగా వేడుకలకు సిద్ధమైందన్నారు. ఏప్రిల్ 5న నగరంలోని డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ సర్కిల్లో ప్రతీకాత్మకంగా జయంతిని జరుపుకోవాలని సూచించారు. ఏప్రిల్ 14న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతితో పాటు బాబూజీ జయంతిని జరుపుదాం. నగరంలోని జంబునాథ్ టెంపుల్ రోడ్డులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సర్కిల్ నుంచి జై భీమ్ సర్కిల్ వరకు ఇద్దరు మహానుభావుల చిత్రపటాలతో వివిధ సంగీత వాయిద్యాలు, కళాబృందాల మధ్య భారీ ఊరేగింపు నిర్వహిస్తారన్నారు. జయంతుల సందర్భంగా నగరంలోని ప్రధాన వీధులు, రౌండ్ అబౌట్లు విద్యుత్ దీపాలతో అలంకరించాలి. అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు జయంతిని తప్పనిసరిగా జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు జయంతుల్లో తప్పకుండా పాల్గొనాలన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ హరిబాబు, అదనపు జిల్లాధికారి బాలకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ వివేకానంద తదితరులు పాల్గొన్నారు. -
ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలి
రాయచూరు రూరల్: రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటు విషయంలో రాజకీయాలు చేయకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎయిమ్స్ పోరాట సమితి ప్రధాన సంచాలకుడు బసవరాజ్ కళస డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం న్యూఢిల్లీలో మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేలకు వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ప్రదాన మంత్రి నరేంద్ర మోదీలు మొండి చెయ్యి చూపడాన్ని తప్పుబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్, దేశంలో బీజేపీ సర్కార్లు కలసి రాయచూరులో మహాత్మగాంధీ మైదానంలో 1045వ రోజుకు ఆందోళన చేపట్టిన విషయం గుర్తు చేశారు. రాజకీయ నాయకుల చిత్తశుద్ది లోపంతో పాటు మంజూరుకు అడ్డు తగులుతున్నారని ఆరోపించారు. -
నకిలీ వైద్యుడిపై చర్యలకు డిమాండ్
బళ్లారి అర్బన్: జిల్లాలోని కురుగోడు తాలూకా ఎర్రంగళి గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ యోగానంద బృందం తనపై దాడి చేసిందని, కురుగోడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినా ఇంత వరకు చర్యలు తీసుకోలేదని వ్యతిరేకిస్తూ తక్షణమే అరెస్ట్ చేయాలని కర్ణాటక మానవ హక్కుల కావలు సమితి రాష్ట్ర అధ్యక్షుడు యు.ఉరుకుంద డిమాండ్ చేశారు. శుక్రవారం పత్రికా భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్ఎంపీ డాక్టర్ యోగానంద్ ఎటువంటి బోర్డు లేకుండా ఓ క్లినిక్ ఏర్పాటు చేసుకొని నకిలీ వైద్యం చేస్తూ సొమ్ము చేసుకున్న విషయం తమ దృష్టికి రావడంతో ఆరోగ్య శాఖ అధికారి డీహెచ్ఓ రమేష్బాబుకు మనవి పత్రం అందించినా నిర్లక్ష్యం వ్యవహరించడంతో తాను ఈనెల 9న ఎర్రంగళిలోని క్లినిక్కు వెళ్లి డాక్టర్ యోగనంద్ను ప్రశ్నించగా తమపై 50 నుంచి 100 మందితో దాడికి పాల్పడటంతో తక్షణమే ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్సీ చేయించి కురుగోడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. ఇలాంటి నకిలీ వైద్యుడిని తక్షణమే శిక్షించాలని తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖులు మల్లప్ప ఉప్పార్, హుల్లురు సిద్దేశ్, తదితరులు పాల్గొన్నారు. -
కల్లూరు గుడిలో చోరీ.. పరారీలో నిందితులు
రాయచూరు రూరల్: జిల్లాలో పేరు గాంచిన దైవశక్తిగ ప్రసిద్ధి గాంచిన కల్లూరు మహాలక్ష్మి ఆలయంలో చోరీ జరిగింది. బుధవారం రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. మహాలక్ష్మి ఆలయంలో విగ్రహానికి ఉన్న రూ.25 లక్షల విలువ చేసే బంగారు నగలను దోచుకెళ్లారు. 80 గ్రాముల వేంకటేశ్వర స్వామి కిరీటం, 30 గ్రాముల మహాలక్ష్మి కిరీటం, 140 గ్రాముల పాదాలు, 40 గ్రాముల బిళ్లలు కలిపి మొత్తం 290 గ్రాముల బంగారం చోరీ అయింది. ఈ విషయం తెలుసుకున్న అదనపు ఎస్పీ హరీష్, సిరవార సీఐ శశి కాంత్, ఎస్ఐ అమరే గౌడ ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆలయంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగలను గుర్తించడం సాధ్యం కావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
గంజాయి సేవిస్తున్న వ్యక్తి అరెస్ట్
హుబ్లీ: గంజాయి సేవిస్తున్న ఓ వ్యక్తిని పాత హుబ్లీ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పాతహుబ్లీ బీరబంద వీధి బానతికట్టి సర్కిల్ వద్ద గంజాయి తాగుతూ నిలబడిన ఇమామ్ హుస్సేన్ టపాల్ను అరెస్ట్ చేశారు. పరీక్షించగా గంజాయి తాగినట్లుగా గుర్తించారు. కాగా మరో ఘటనలో ధార్వాడకు కొరియర్ పని మీద వెళ్లిన వ్యక్తి కనిపించకుండా పోయాడు. హుబ్లీ తాలూకా ఉమ్మచిగి గ్రామానికి చెందిన రామ ప్రసాద రామగేరి (34) కనిపించకుండా పోయిన వ్యక్తి. గత సెప్టెంబర్ నుంచి ఇతడు కనిపించకుండా పోయాడని హుబ్లీ గ్రామీణ పోలీసులకు అతని బంధువులు ఫిర్యాదు చేశారు. నేడు ఫ్రీడం పార్కులో ధర్నాకు మాత్రమే నోటీస్ జారీ శివాజీనగర: బెళగావిలో కేఎస్ఆర్టీసీ కండక్టర్పై ఎంఈఎస్ దుండగులు దాడి చేయటాన్ని ఖండిస్తూ శనివారం కన్నడ సంఘాల నుంచి అఖండ కర్ణాటక బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పలు రవాణా సంఘాలు కూడా బంద్కు మద్దతునిచ్చాయి. బెంగళూరులో ఫ్రీడంపార్కులో మాత్రమే ధర్నా చేయాలని రవాణా సంఘాలకు నోటీస్ జారీ చేశారు. రవాణా సంఘాలకు బెంగళూరు కమిషనర్ బీ.దయానంద్ నోటీస్ ఇచ్చారు. శనివారం బెంగళూరులోని ఫ్రీడం పార్కులో మాత్రమే ధర్నా చేయవచ్చు. ఫ్రీడం పార్కు మినహాయించి వేరే చోట ధర్నా చేసేందుకు అవకాశం లేదు. వేరే చోట ధర్నా, ఊరేగింపు చేస్తే చర్యలు తప్పవు, హైకోర్టు ఆదేశాలను అందరూ పాటించాలి. ఫ్రీడం పార్కులో మాత్రమే ధర్నాకు రవాణా సంఘాలకు నోటీస్ ఇచ్చినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. పోలీసుల నుంచి జరిమానా తగదు రాయచూరు రూరల్: నగరంలో పోలీసుల నుంచి జరిమానా వసూలు తగదని బీజేపీ నగర అధ్యక్షుడు ఊట్కూరు రాఘవేంద్ర పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ పుట్టమాదయ్యకు వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. నగరంలో మహాబళేశ్వర, జాకీర్ హుసేన్ సర్కిల్, తీన్కందిల్, గంజి సర్కిల్ వంటి ప్రాంతాల్లో నగరంలో ట్రాఫిక్ పోలీసు వాహనదారుల నుంచి బలవంతంగా జరిమానాలు విధించడాన్ని ఖండించారు. ట్రాఫిక్ నియమాలను, హెల్మెట్లను గురించి వివరించకుండా బలవంతపు వసూళ్లకు తిలోదకాలు పలకాలని అన్నారు. మార్కెట్లో వ్యక్తి మృతిహుబ్లీ: ధార్వాడ మార్కెట్లో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం వెలుగు చూసింది. ఇక్కడి హొసయల్లాపుర నివాసి ఈరణ్ణ పరసప్ప(40)ను మృతుడిగా గుర్తించారు. విపరీతంగా మద్యపానానికి అలవాటు పడిన ఈరణ్ణ మధ్యాహ్నం వేళ మార్కెట్కు వచ్చాడు. ఈ సందర్భంగా గుండెపోటుతో మార్కెట్లోనే కుప్పకూలి ప్రాణాలను వదిలాడు. అయితే అక్కడి స్థానికులు మద్యం మత్తులో కింద పడిపోయాడనుకున్నారు. ఎంతసేపటికీ పైకి లేవక పోవడంతో ఎట్టకేలకు పరీక్షించగా మృతి చెందినట్లుగా ధార్వాడ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. స్నేహితురాలిని కలవటానికి వెళ్లి.. ● పట్టుబడిన యువకుడు యశవంతపుర: తన స్నేహితురాలిని కలవడానికి బుర్కా ధరించి హాస్టల్లోకి వెళ్లిన యువకుడిని పట్టుకున్న ఘటన బెంగళూరు జ్ఞానభారతి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. జ్ఞానభారతి కాలేజీ ఆవరణలో గురువారం రాత్రి 7 గంటలకు బుర్కా ధరించిన యువకుడు తన స్నేహితురాలిని కలవటానికి వెళ్లాడు. తక్షణం విద్యార్థినులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి చేరుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడిని మాలూరుకు చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. విచారణలో తన స్నేహితురాలిని కలవటానికి వచ్చినట్లు పోలీసుల ముందు యువకుడు ఒప్పుకున్నాడు. అంతే కాకుండా రాత్రి సమయంలో అతడు ఉండటానికి అవకాశం ఇవ్వటంతో విద్యార్థినులు ఉంటున్న హాస్టల్కు వెళ్లినట్లు తెలిసింది. ఇలాంటి ఘటనలు జరుగుతుండగా ముందు జాగ్రత్తల్లో భాగంగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. జ్ఞానభారతి పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి ఆత్మహత్య సాక్షి,బళ్లారి: 42 ఏళ్ల వయస్సు కలిగిన ఓ వ్యక్తి 19 ఏళ్ల వయస్సు కలిగిన ఓ యువతిని నిత్యం ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని వేధింపులకు గురి చేయడంతో జీవితంపై విరక్తి చెందిన ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. గదగ్ జిల్లా ముండరిగి తాలూకా విరుపాపుర తాండా నివాసి వందన(19) అనే యువతిని కిరణ్ కంబారి(42) అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని వేధించడంతో మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. యువతి గదగ్ జిల్లా గిమ్స్ కళాశాలలో ప్యారా మెడికల్ విద్యనభ్యసిస్తుండగా కిరణ్ నిత్యం ప్రేమ వేధింపులకు గురి చేయడంతో ఆ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఘటనపై బెటగేరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నీటి గుంటలో పడి విద్యార్థి దుర్మరణం
రాయచూరు రూరల్: నీటి గుంటలో పడి విద్యార్థి దుర్మరణం పాలైన ఘటన దేవదుర్గలో చోటు చేసుకుంది. గురువారం దేవదుర్గ తాలూకా కాకరగల్లో సర్కారీ పాఠశాలకు వెళ్లిన విద్యార్థి మంజునాథ్ కాశీనాథ్(14)గా పోలీసులు గుర్తించారు. పాఠశాలకు వెళ్లిన విద్యార్థి మంజునాథ్ మల విసర్జనం కోసం వెళ్లి నీటిగుంటలో ఈత కోసం దిగాడు. ఎంతకు పైకి రాకపోవడంతో అక్కడే మరణించాడు. కుటుంబ సభ్యులు వెదికినా కనిపించకుండా పోయాడు. కల్మల– దేవదుర్గ రహదారి పనులకు చేపట్టిన నీటి గుంటలో పడి మరణించాడు. విద్యార్థి మంజునాథ్ మరణంపై కుటుంబ సభ్యుల ఆక్రందనలు మిన్నుముట్టాయి. పనులు ముగిసి ఏడాది కావస్తున్నా గుంటలను పూడ్చకుండా వదిలి వేయడంతో వాన నీరు వచ్చి నిలబడ్డ గుంటలో పడి మరణించారు. -
వైటీపీఎస్ కార్మికుల ఆందోళన
రాయచూరు రూరల్: యరమరస్ థర్మల్ విద్యుత్ కేంద్రం(వైటీపీఎస్)లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళన చేపట్టారు. రాయచూరు–హైదరాబాద్ రహదారిపై రాస్తారోకో చేపట్టి మాట్లాడారు. యరమరస్ థర్మల్ విద్యుత్ కేంద్రంలో పని చేసే 1500 మంది కార్మికులకు వేతనాలు పెంచాలని, డీఏపీఎఫ్, జీపీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలని నిరసన ప్రదర్శన చేశారు. కాంట్రాక్టు పొందిన పవర్ మేక్ కంపెనీ యాజమాన్యం కార్మికులను వెట్టి చాకిరీ చేయించుకుంటున్న విషయాన్ని ప్రస్తావించారు. ముస్లింలకు ఇఫ్తార్ విందు బళ్లారిటైన్: జేడీఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ముస్లిం సోదరులకు జిల్లాధ్యక్షుడు మీనళ్లి తాయణ్ణ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బీజేపీ నేత, మాజీ మంత్రి శ్రీరాములు పాల్గొని మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు చేపట్టే ఉపవాస దీక్షలకు జేడీఎస్ పార్టీ ఇప్తార్ విందు చేయించడం శ్లాఘనీయం అన్నారు. నెల రోజులుగా వారు రంజాన్ దీక్షలను నిర్వహిస్తారని, వారు చేపట్టే ఇలాంటి కార్యక్రమాల్లో జేడీఎస్ పార్టీ చూపుతున్న చొరవను కొనియాడారు. దాదాపు 500 మందికి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో స్థానిక నేతలు వండ్రి, మహిళా అధ్యక్షురాలు పుష్ప తదితరులు పాల్గొన్నారు. శిశువుల ఆరోగ్యానికి చుక్కల మందు తప్పనిసరి బళ్లారిటౌన్: 9 నెలల వయస్సు నిండిన పిల్లలకు తట్టు నివారణ చుక్కల మందు తప్పనిసరిగా వేయించాలని జిల్లా ఆర్పీఎస్ అధికారి డాక్టర్ హనుమంతప్ప పేర్కొన్నారు. జిల్లా పాలన, జిల్లా పంచాయతీ, జిల్లా ఆరోగ్య కేంద్ర ఆధ్వర్యంలో గుగ్గరహట్టి కౌల్బజార్, కాకర్లతోట ప్రాంతాల్లో చుక్కల మందు సరఫరా కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. సాధారణంగా ఎండాకాలంలో ఇలాంటి రోగాలు వ్యాప్తి చెందుతాయన్నారు. పిల్లలకు దగ్గు, జ్వరం, ముక్కులో కారడం వంటివి కనిపిస్తే వెంటనే స్థానిక ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని కోరారు. డాక్టర్ కాశి ప్రసాద్, డాక్టర్ శకుత్త షహిమా, ఈశ్వర్ హెచ్.దానప్ప, శాంతమ్మ, మంజుల, నాగలక్ష్మి ఈరయ్య, ముదస్సీర్లున్నారు. సరాబైక్ రెంటల్ ప్రారంభం హుబ్లీ: సిద్ధరూఢ స్వామి రైల్వే స్టేషన్లో సరా బైక్ రెంటల్ ప్రారంభమైందని పర్యాటకులు, స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని స్వర్ణ గ్రూప్ సంస్థ ఎండీ, ప్రవాసాంధ్రుడు డాక్టర్ వీఎస్వీ ప్రసాద్ తెలిపారు. నగరంలో గురువారం నుంచి ప్రారంభమైన సరాబైక్ రెంటల్ షోరూంను ఆయన వీక్షించారు. వివిధ ప్రాంతాల నుంచి హుబ్లీ రైల్వే స్టేషన్కు వచ్చే పర్యాటకులు ఇక ముందు వాహనాల కోసం వేచి చూడక్కరలేదన్నారు. సరాబైక్ రెంటల్ తమకు ఇష్టమైన బైక్ అద్దె రూపంలో తీసుకొని జంట నగరాల్లోని ప్రేక్షణీయ ప్రాంతాలను వీక్షించవచ్చన్నారు. అత్యంత తక్కువ ధరతో బైక్ అద్దెకు ఇస్తున్నారని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దీంతో సమయం ఆదా అవడమే కాకుండా ఎక్కువ దర్శనీయ స్థలాలను వీక్షించవచ్చన్నారు. సరా బైక్ యజమాని రాజ్భట్, పారిశ్రామికవేత్త ప్రశాంత్ శెట్టి తదితర అధికారులు పాల్గొన్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత హుబ్లీ: ధార్వాడ తాలూకా దేవరహుబ్బళ్లిలో రోడ్డు పక్కన నిలిపిన ట్రాక్టర్ ట్రాలీని తీసే విషయంలో గుంపు ఘర్షణ తలెత్తి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గ్రామంలో రోడ్డు పక్కన ట్రాక్టర్ ట్రాలీ నిలిపిన విషయమై శివబసప్ప, నోవాన్ల మధ్య జగడం ప్రారంభమైంది. దీంతో నోవాన్ పారతో శివబసప్పపై దాడి చేశాడు. ఇది గుంపు ఘర్షణకు దారి తీసింది. ఆ గ్రామ పెద్దలు రాజీ చేసినా ఫలితం దక్కలేదు. ఎట్టకేలకు పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనకు సంబంధించి నోవాన్, సమీర్లను అరెస్ట్ చేశారు. గ్రామంలో మతసామరస్యానికి భంగం కలిగించిన నేపథ్యంలో డీఏఆర్ పోలీసు బృందాన్ని గ్రామంలో ఏర్పాటు చేసి బందోబస్తు కల్పించినట్లు కేసు నమోదు చేసుకున్న గ్రామీణ పోలీసులు తెలిపారు. -
తాలూకాలో చిరు జల్లులు
శివమొగ్గ : శివమొగ్గ తాలూకాలో శుక్రవారం సాయంత్రం చల్లటి వర్షం జల్లులు పడ్డాయి. వేసవి సమయం ప్రారంభం అవుతుండటంతో ఒక పక్క ఎండలు మండుతుండగా ప్రజలు ఎండలకు బయటకి రావడానికి కూడా భయపడుతున్న సమయంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి సాయంత్రం సమయంలో జల్లులతో కూడిన వర్షం పడింది. శివమొగ్గ నగరానికి సమీపంలో ఉన్న బసవనగగూరు, సమీనకొప్ప, కేహెచ్బీ కాలనీ, హోసూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు గంట పాటు జల్లులతో కూడిన వర్షం పడింది. అనేక చోట్ల ఎండ లేకుండా మబ్బులు కమ్ముకున్నాయి. దాంతో ఇక్కడి ప్రజలు చల్లటి వాతావరణంలో ఎండ నుంచి కొంత మేరకు ఉపశమనం పొందారు. -
ఎస్ఎస్ఎల్సీ పరీక్షలు ప్రారంభం
సాక్షి,బళ్లారి: ఏడాది పాటు కష్టపడి, ఇష్టపడి చదివిన 10వ తరగతి విద్యార్థులకు ఎస్ఎస్ఎల్సీ బోర్డు పరీక్షలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఎస్ఎస్ఎల్సీ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కావడంతో విద్యార్థులు టెన్షన్..టెన్షన్గా పరీక్ష కేంద్రాలకు తరలివచ్చారు. విద్యార్థులతో పాటు చాలా మంది వారి తల్లిదండ్రులు కూడా తొలి రోజు పరీక్ష కేంద్రాలకు తరలివచ్చి వారి పిల్లలను పరీక్ష కేంద్రాలకు పంపించారు. పరీక్ష ప్రారంభం రోజున ఆయా పరీక్ష కేంద్రాల వద్ద నంబర్లు చూసుకునేందుకు ఇబ్బంది పడ్డారు. ఆయా పాఠశాలల్లో ఓ బోర్డుపై ఉంచిన విద్యార్థుల తరగతి గదులు కేటాయింపునకు సంబంధించిన నంబర్లు చూసుకుని తమ గదులకు తరలి వెళ్లారు. సరిగ్గా 9.30 గంటలకు పరీక్ష కేంద్రాల్లోకి దాదాపుగా విద్యార్థులందరూ చేరుకున్నారు. ఆయా పాఠశాల వద్ద విద్యార్థులను అన్ని విధాలుగా పరిశీలన చేసి గదుల్లోకి పంపించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 23,524 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 64 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. విద్యార్థులు తొలి రోజు కొంత టెన్షన్కు గురై పరీక్షలు రాసినట్లు తెలుస్తోంది. గత రెండేళ్ల నుంచి బళ్లారి జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధించక పోవడంతో ఈసారి మంచి ఫలితాలు సాధిస్తారనే నమ్మకాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కొప్పళలో పుట్టెడు దుఃఖంతో పరీక్షకు విద్యార్థి 10వ తరగతి బోర్డు పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాగా, కొప్పళలో ఓ విద్యార్థి పరీక్ష కేంద్రానికి బాధాతప్త హృదయంతో హాజరై పరీక్ష రాశాడు. వివరాల్లోకి వెళితే.. కొప్పళ జిల్లా గంగావతి తాలూకా కెసరహట్టి గ్రామానికి చెందిన అడివయ్య స్వామి అనే విద్యార్థి స్థానికంగా ఉన్న స్వామి వివేకానంద ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజుల క్రితం అడివయ్య స్వామి అనే విద్యార్థి తల్లి విజయలక్ష్మి(38) ఇంట్లో కాలు జారి పడడంతో తలకు బలమైన గాయమైంది. దీంతో ఆమెను చికిత్స కోసం హుబ్లీ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం ఆమె ఆస్పత్రిలో మృతి చెందింది. మరికొన్ని గంటల్లో విద్యార్థి టెన్త్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా, తల్లి మరణవార్త అందడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అనంతరం కొంతసేపటికి కోలుకున్న ఆ విద్యార్థి ఏం చేయాలో దిక్కుతోచక ఉండిపోయారు. పాఠశాల సిబ్బంది, బంధువులు వచ్చి విద్యార్థి అడివయ్యస్వామిని ఓదార్చారు. అనంతరం బాధను దిగమింగుకుని అందరు విద్యార్థుల మాదిరిగా పరీక్ష కేంద్రానికి వచ్చి పరీక్ష రాయడం విశేషం. ప్రఽశాంతంగా పది పరీక్షలు రాయచూరు రూరల్: జిల్లాలో పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రఽశాంతంగా జరిగాయి. నీరమాన్వి ఉన్నత పాఠశాలలో జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారాం పాండే, విద్యా శాఖాధికారి బడిగేర్, తాలూకా విద్యా శాఖాధికారులు చంద్రశేఖర్, రంగస్వామి పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. జిల్లాలోని ఏడు తాలూకాల్లోని 97 కేంద్రాల్లో 33,906 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. దేవదుర్గ 15 కేంద్రాల్లో 4,660, లింగసూగూరులోని 18 కేంద్రాల్లో 6,746, మాన్విలో 18 కేంద్రాల్లో 6331, రాయచూరు తాలూకాలో 27 కేంద్రాల్లో 9912, సింధనూరు తాలూకాలో 19 కేంద్రాల్లో 6257 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 814 మంది గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి బడిగేర్ తెలిపారు. టెన్షన్, టెన్షన్గా పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులు హాజరు పరీక్ష తొలి రోజున ప్రతి విద్యార్థికి తప్పని ఉత్కంఠ -
నకిలీ కరెన్సీ చలామణి.. ఇద్దరు అరెస్ట్
రాయచూరు రూరల్: నకిలీ కరెన్సీ నోట్ల మార్పిడి వ్యవహారంలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు మార్కెట్ యార్డు స్టేషన్ సీఐ మేకా నాగరాజు వెల్లడించారు. గురువారం రాత్రి హైదరాబాద్ రహదారిలో శమ్స్ బిరియాని హోటల్లో భోజనం చేసి రూ.500 నకిలీ కరెన్సీ నోట్లను ఇచ్చారు. హోటల్ యజమానికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనపరుచుకొని రమేష్, మంజునాథ్లను అరెస్ట్ చేశారు. పిల్లల బ్యాంక్ అని రూ.500 నకిలీ కరెన్సీ నోట్లపై రాయడంతో దొరికి పోయారు.మూడు రోజుల క్రితం రూ.40 లక్షలు మేర నకలీ కరెన్సీ నోట్లు మార్పిడిలో నలుగురిని అరెస్ట్ చేసిన విషయం పాఠకులకు విదితమే. -
కావేరి నది రక్షణకు ప్రత్యేక టీమ్
దొడ్డబళ్లాపురం: కావేరి నది జలాలు కలుషితం కాకుండా మరియు కావేరి నది పరివాహక ప్రాంతాలు ఆక్రమణలకు గురి కాకుండా కాపాడేందుకు ప్రత్యేక టీం ఏర్పాటు చేస్తామని డీసీఎం డీకే శివకుమార్ తెలిపారు. కొడగు జిల్లా శ్రీ భగండేశ్వర ఆలయం, కావేరి, సుజ్యోతి, కన్నికా నదుల త్రివేణి సంగమం, తలకావేరిలో డీసీఎం డీకే శివకుమార్ శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. పవిత్ర తీర్థాన్ని తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కావేరి నది జలాలు,నేల,చరిత్ర,సంస్కృతి సంరక్షణకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని, అందుకు మీడియా వారు సలహాలు ఇచ్చినా స్వీకరిస్తామన్నారు. విశ్వ జల దినోత్సవం నేపథ్యంలో వారం రోజులపాటు జల సంరక్షణ అభియాన్ జరుగుతుందన్నారు. కావేరికి హారతి కార్యక్రం ఉద్దేశం ఇదే అన్నారు. ఎంపీ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సభకు తాను,తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతామని తెలిపారు. -
నేడు రాష్ట్ర బంద్ ఖాయం
శివాజీనగర: కేఎస్ ఆర్టీసీ బస్ కండక్టర్పై మరాఠీలు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఎంఈఎస్ను రాష్ట్రంలో నిషేధించాలని డిమాండ్ చేస్తూ శనివారం కర్ణాటక బంద్కు వాటాళ్ నాగరాజ్ నేతృత్వంలో కన్నడ ఒక్కూట్ బంద్కు పిలుపునిచ్చింది. అయితే బంద్కు ప్రభుత్వం మద్దతు ఇవ్వలేదు. ఓలా, ఉబర్, డ్రైవర్ల నుంచి కొన్ని ఆటో సంఘాలు బంద్కు మద్దతు వ్యక్తం చేశాయి. హోటల్ యజమానుల సంఘం నైతికంగా మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రవీణ్ కుమార్ శెట్టి వర్గం బంద్కు మద్దతు ప్రకటించింది. అత్యవసర సేవలైన పాలు, ఔషధం, దినపత్రిక, కూరగాయల సరఫరా ఎప్పటిలాగే ఉంటాయి. వాటాళ్ నాగరాజ్ శుక్రవారం నగర పోలీస్ కమిషనర్ దయానందను భేటీ చేసి బంద్కు అవకాశం ఇవ్వాలని విన్నవించారు. అయితే సానుకూలన స్పందన రాలేదు. అయినా బంద్ చేసి తీరుతానని వాటాళ్ తెలిపారు. కర్ణాటక బంద్కు చలనచిత్ర వాణజ్యి మండలి మద్దతును ప్రకటించింది. అధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతూ బంద్కు మద్దతు ఉంటుందని, అయితే సినిమా షూటింగ్ యధా ప్రకారంగా జరుగుతాయన్నారు. థియేటర్ల యజమానులు బంద్కు మద్దతు ఇచ్చారు. ఉదయం ప్రదర్శన బంద్ చేస్తామని, మధ్యాహ్నం తరువాత సినిమాల ప్రదర్శన ఉంటుందని తెలిపారు. భారీ భద్రత: బంద్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా శనివారం కర్ణాటక బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పాఠశాల–కాలేజీలకు సెలవు ఇచ్చే విషయం ఎలాంటి తీర్మానం తీసుకోలేదని మంత్రి మధు బంగారప్ప తెలిపారు. రవాణా సదుపాయం లేకపోతే విద్యార్థులకు ఇబ్బంది కలుగుతోంది. హోంశాఖతో చర్చించి తీర్మానం చేస్తామని స్పష్టం చేశారు. స్పష్టం చేసిన కన్నడ సంఘాల ఒక్కూట నేత వాటాళ్ నాగరాజ్ మద్దతు ప్రకటించిన పలు సంఘాలు ప్రభుత్వ అనుమతి నిరాకరణ యథా ప్రకారం ఆర్టీసీ బస్సులు, విమాన, రైలు రాకపోకలు -
తొలి రోజు సజావుగా పది పరీక్షలు
శివాజీనగర: విద్యార్థి జీవిత ప్రధాన ఘట్టాల్లో ఒకటైన ఎస్ఎస్ఎల్సీ వార్షిక పరీక్షలు శుక్రవారం రాజధాని బెంగళూరుతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజునే ప్రథమ భాషా పరీక్ష జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,818 కేంద్రాల్లో విద్యార్థులు సక్రమంగా పరీక్ష రాసేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలను ఆయా జిల్లా యంత్రాం, జిల్లా పంచాయతీ, పాఠశాల విద్యా సాక్షరతా శాఖలు చేపట్టాయి. అన్ని కేంద్రాల బయట విద్యార్థుల హాల్టికెట్ల నంబర్లను ప్రదర్శించారు. విద్యార్థులు కేఎస్ఆర్టీసీ బస్సుల్లో హాల్ టికెట్ చూపించి ఉచితంగా పరీక్ష కేంద్రాలకు చేరారు. 8.96 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. కాపీయింగ్ను నివారించేందుకు ప్రతి గదిలో సీసీటీవీ ఏర్పాటు చేశారు. కేంద్రాల చుట్టూ 200 మీటర్లమేర నిషేధాజ్ఞలు విధించి జిరాక్స్ కేంద్రాలు మూసివేయించారు. అన్ని కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఫెయిల్ అవుతానేమోనని ఆత్మహత్య
యశవంతపుర: 9వ తరగతి ఫెయిల్ అవుతానానే భయంతో విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా డి కారేహళ్లి బోవి కాలనీలో జరిగింది. గ్రామానికి చెందిన వర్షిణి(15) పట్టణంలోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఇటీవల 9 పరీక్షలు ముగిశాయి. పరీక్షలు సరిగ్గా రాయని కారణంగా ఫెయిల్ అవుతాననే భయం పట్టుకుంది.ఈక్రమంలో శొంఠి పంటకు తెచ్చిన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కడూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. అనుమానిత బాంబ్ లభ్యం బనశంకరి: సంపిగేహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న బెళ్లళ్లి అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి ఇంటిలో శుక్రవారం పోలీసులు తనిఖీ చేశారు. బాంబు తరహాలో ఉన్న పేలుడు పదార్థాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ల్యాబ్కు పంపారు. అబ్దుల్ రెహమాన్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. బాంబు తరహా వస్తువు తనకు రోడ్డులో దొరికిందని విచారణలో వెల్లడించాడు. పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరా ధ్వంసం దొడ్డబళ్లాపురం: 10వ తరగతి పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను ధ్వంసం చేసిన సంఘటన దొడ్డ తాలూకా తూబుగెరె గ్రామంలో చోటుచేసుకుంది. తూబుగెరె ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో శుక్రవారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పాఠశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గురువారం రాత్రి దుండగులు ధ్వంసం చేశారు. కలెక్టర్ ఎంబీ బసవరాజు పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు.పరీక్షలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చిన్నారిపై అంగన్వాడీ ఆయా రాక్షసత్వం ● వాత పెట్టి, డైపర్లో కారం పొడి వేసిన వైనం దొడ్డబళ్లాపురం: అల్లరి చేస్తోందని చిన్నారిపై అంగన్వాడీ ఆయా వాత పెట్టి, డైపర్లో కారం పొడి వేసి రాక్షసత్వం ప్రదర్శించిన సంఘటన కనకపుర తాలూకా మహారాజకట్టె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ నివాసులపై రమేశ్, చైత్ర దంపతులు తమ రెండున్నరేళ్ల వయస్సుగల దీక్షిత్ను గ్రామంలోని అంగన్వాడీ స్కూల్కు పంపిస్తున్నారు. అయితే అంగన్వాడీ ఆయా చంద్రమ్మ దీక్షిత్ పదేపదే మూత్ర విసర్జన చేస్తున్నాడని, అల్లరి ఎక్కువ చేస్తున్నాడనే కారణంతో వాత పెట్టి డైపర్లో కారం పొడి పెట్టి అమానుషంగా ప్రవర్తించింది. విషయం తెలిసి చిన్నారి దీక్షిత్ తల్లిదండ్రులు కనకపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రమ్మను విధుల నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండు చేస్తున్నారు. దర్శకుడు రఘు కన్నుమూత యశవంతపుర: కన్నడ సినిమా రంగానికి చెందిన ప్రముఖ దర్శకుడు, రచయిత ఏ.టీ.రఘు(76) గురువారం రాత్రి 9:20 గంటలకు బెంగళూరులో కన్నుమూశారు. నాలుగైదేళ్ల నుంచి రఘు మూత్రపిండాల వైఫల్యం కారణంగా ఇబ్బంది పడుతున్నారు. బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. పార్థవదేహాన్ని ఆర్నగర మఠదహళ్లిలోని స్వగృహంలో ఉంచారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు హెబ్బాళ శ్మశానవాటికలో అంత్యక్రియలను కుటుంబ సభ్యులు పూర్తి చేశారు. దివంగత నటుడు అంబరీశ్ నటించిన మండ్యద గండు సినిమాను రఘు దర్శకత్వం వహించారు. రఘుకు కన్నడ సినిమా రంగంలో మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆయనతో కలిసి 27 సినిమాలు తీయగా కన్నడలో 55 సినిమాలను నిర్మించారు. మండ్యద గండుతో పాటు జైలర్ జగన్నాథ్, బెటెగార, ధర్మదయుద్ధ, న్యాయనీతి ధర్మలాంటి సినిమాను తీశారు. యాసిడ్ దాడికేసులో పదేళ్ల జైలు బొమ్మనహళ్లి : యాసిడ్ దాడికి పాల్పడిన వ్యక్తికి పదేళ్ల జైలు, రూ.10లక్షల జరిమానా విధిస్తూ బెంగళూరు నగర జిల్లా, ఆనేకల్ 3వ ఆదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. బసప్ప అనే వ్యక్తి 2019న డిసెంబర్ 18వ తేదిన ఆనంద్ హెచ్.మేటి ఆనే వ్యక్తి ముఖంపై యాసిడ్తో దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో సర్జాపుర పోలీసులు బసప్పను అరెస్ట్ చేశారు. ఈకేసు శుక్రవారం కోర్టులో విచారణకు వచ్చింది. నిందితుడి నేరం నిరూపితం కావడంతో బసప్పకు పదేళ్ల జైలు, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి సోమశేఖర్ తీర్పు వెలువరించారు. -
ఫిర్యాదు అనంతరం విచారణ
6 నెలల పాటు 18 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెండ్ బనశంకరి: హనీట్రాప్పై శాసనసభ దద్దరిల్లింది. శుక్రవారం శాసనసభ ప్రారంభం కాగానే హానీట్రాప్ అంశంపై విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని పేపర్ ముక్కలు విసిరి గందరగోళం సృష్టించడంతో స్పీకర్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. రాష్ట్ర సహకార శాఖమంత్రి కేఎన్.రాజణ్ణ హనీట్రాప్ కేసును న్యాయ విచారణకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ సభలో ధర్నాకు దిగారు. విపక్షాలైన బీజేపీ, జేడీఎస్ సభ్యుల ధర్నా మధ్య ద్రవ్యవినిమయ బిల్లు ప్రవేశపెట్టడానికి ప్రయత్నించే సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బిల్లు ప్రతులను విసురుతూ స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరుకోగానే మార్షల్స్ లోపలికి వచ్చి విపక్ష సభ్యులను స్పీకర్ పోడియం నుంచి తప్పించి స్పీకర్కు రక్షణగా నిలిచారు. ద్రవ్యబిల్లు పేపర్ల విసిరివేత అంతటితో మిన్నకుండని ప్రతిపక్ష సభ్యులు ద్రవ్యబిల్లు పేపర్లను స్పీకర్ యూటీ.ఖాదర్, సీఎం సిద్దరామయ్యల మీదకు విసిరారు. విపక్ష సభ్యుల తీరుతో కోపోద్రిక్తులైన కాంగ్రెస్ సభ్యులు ముందుకు చేరుకుని ముఖ్యమంత్రి చుట్టూ రక్షణగా నిలబడి విపక్షాలతో వాగ్వివాదానికి దిగారు. ఓ దశలో పరిస్దితి అదుపు తప్పి పరస్పరం చేయి చేసుకునే దాకా వచ్చింది. మార్షల్స్ అధికార, విపక్ష సభ్యులకు గోడగా నిలిచారు. గందరగోళం మధ్య ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలకు వేతనభత్యం పెంచే బిల్లు, బడ్జెట్ ఆమోదం ద్రవ్యవినిమయ బిల్లును సభలో ఆమోదించారు. అనంతరం స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించగా సభ కొద్దిసేపు అదుపులోకి వచ్చింది. స్పీకర్ సభ నుంచి వెళ్లగానే ముఖ్యమంత్రి సిద్దరామయ్య విపక్ష నేతలు, సభ్యులు సభ నుంచి బయటికి వెళ్లారు. న్యాయ విచారణ చేపట్టాలని విపక్షాల ధర్నా అంతకు ముందు సభ ప్రారంభం కాగానే శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఎస్ఎస్ఎల్సీ పరీక్షలు రాసే విద్యార్దులకు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ముఖ్యమంత్రి సిద్దరామయ్య బడ్జెట్పై చర్చకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించగా బీజేపీ సభ్యుడు సునీల్కుమార్ సభలో లేచి నిలబడి మంత్రి కేఎన్.రాజణ్ణ గురువారం హనీట్రాప్ గురించి సభలో ప్రస్తావించారు. ప్రజాప్రతినిదులతో పాటు జడ్జీలు హానీట్రాప్కు గురయ్యారని ఇది, తీవ్రమైన విషయం. రాష్ట్ర ప్రభుత్వం హనీట్రాప్పై హైకోర్టు న్యాయమూర్తితో న్యాయవిచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. హనీట్రాప్కు కులం, పార్టీ ఏదీ లేదన్నారు. అధికారదాహం దీని వెనుక ఉందని మంత్రి రాజణ్ణ బయట మాట్లాడాల్సింది. కానీ సభలో కన్నీరుపెడుతూ భయంతో ఉన్నారని కేంద్ర నేతలు కూడా ఇందులో ఉన్నారని తెలిపారన్నారు. ఈనేపథ్యంలో హనీట్రాప్పై న్యాయవిచారణ చేపట్టాలన్నారు. విపక్షనేత ఆర్.అశోక్ సైతం సునీల్కుమార్ వ్యాఖ్యలకు మద్దతు తెలిపి మంత్రులు అభద్రతాభావంలో ఉన్నారన్నారు. పలువురు హనీట్రాప్ పెద్ద దందాగా మారిందన్నారు. అశోక్ వ్యాఖ్యలపై మంత్రి దినేష్ అభ్యంతరం ముఖ్యమంత్రి పదవి కోసం అన్నింటిని ధ్వంసం చేస్తున్నారంటే అర్థం ఏమిటని అనడంతో మంత్రి దినేశ్ గుండూరావ్ అశోక్ మాటలకు అభ్యంతరం వ్యక్తం చేశారు. అశోక్ ఊహాజనితంగా మాట్లాడుతున్నారని, సీఎం పదవి, హనీట్రాప్కు పాల్పడుతున్నారని అనడం సరికాదన్నారు. తన వ్యాఖ్యలు కొనసాగించిన ఆర్.అశోక్ హనీట్రాప్ తీవ్రమైన విషయం, దీనిపై న్యాయవిచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై మాట్లాడిన సునీల్కుమార్ సభలో మంత్రి ఒకరు హానీట్రాప్ జరిగిందని చెప్పారని, మీ ఇంటెలిజెన్స్ శాఖ ఏమి చేస్తోందో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జోక్యం చేసుకున్న మంత్రి ప్రియాంక్ ఖర్గే సునీల్ కుమార్ వ్యాఖ్యలను ఒప్పుకుంటున్నానని, కానీ మీకు నైతికత ఉండాలని అన్నారు. అధికారం, డబ్బు ఇతర కారణాల కోసం హనీట్రాప్ చేయవచ్చు. ఈ సమయంలో అధికార విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. ఉన్నత స్థాయిలో విచారణ ఈ సమయంలో సిద్దరామయ్య మాట్లాడుతూ గురువారం సభలో నేను లేనన్నారు. హనీట్రాప్ గురించి రాజణ్ణ తెలిపారన్నారు. దీనిపై సభలో హోంమంత్రి సమాధానమిచ్చారని, దీనిపై ఉన్నత స్థాయిలో విచారణ చేపడతామని తెలిపారు. ఎవరినీ కాపాడే ప్రశ్నే లేదన్నారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకున్నప్పటికీ వారికి శిక్ష తప్పదన్నారు. రాజణ్ణ ఎస్సీ సముదాయానికి చెందిన వ్యక్తి, అతను ఎవరి పేరూ చెప్పలేదు. హనీట్రాప్ జరిగిందని చెప్పారు, ఎవరు మాట్లాడినా ఇది తప్పు, సభలో మాట్లాడినప్పుడు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి అందరికీ రక్షణ కల్పించే బాధ్యత తమదన్నారు. సీఎం వ్యాఖ్యలపై సమాధాన పడని ప్రతిపక్షాలు ఉన్నత స్దాయి విచారణ అంటే ఏమిటి మీరే ఇలా మాట్లాడటం సరికాదన్నారు. ఇద్దరు మంత్రులు హనీట్రాప్ గురించి మాట్లాడారని, కేంద్రమంత్రి, న్యాయమూర్తి ఉన్నారని తెలిపారన్నారు. మన పోలీసులు న్యాయమూర్తిని విచారణ చేపట్టడం సాధ్యమా? న్యాయ విచారణ చేపట్టాలని ఆర్.అశోక్ డిమాండ్ చేశారు. విపక్ష సభ్యులు పేపర్లు విసురుతుండగా స్పీకర్కు భద్రతగా మార్షల్స్విపక్ష సభ్యులను బయటకు పంపుతున్న మార్షల్స్ న్యాయ విచారణకు విపక్షాల డిమాండ్ స్పీకర్ పోడియం చుట్టుముట్టిన విపక్షాలు సభలో గందరగోళం సృష్టించిన వైనంహోంమంత్రి పరమేశ్వర్ మాట్లాడుతూ గురువారం రాజణ్ణ ఈ విషయం ప్రస్తావించారని అతను కూడా ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదని, ఫిర్యాదు చేసిన అనంతరం ఉన్నత స్థాయి విచారణ చేస్తామని, అయితే ఏ స్థాయి విచారణ అనేది త్వలో నిర్ణయిస్తామన్నారు. దీనికి సమ్మతించని విపక్షాలు న్యాయవిచారణ చేపట్టాలని పట్టుబడుతూ నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. ఎవరు ఎవరప్పా సీడీ యజమాని, ఎవరు సీడీ ఫ్యాక్టరీ ఓనర్, ఎవరు కాంగ్రెస్ పార్టీ హనీట్రాప్ పార్టీ, ముఖ్యమంత్రి కుర్చీ కోసం హనీట్రాప్, శాంకీ చెరువులో కావేరి హారతి, కాంగ్రెస్ బ్లాక్మెయిల్ అంటూ సభలో నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం తలెత్తింది. ప్రతిపక్షాల ధర్నాతో కోపోద్రిక్తుడైన సిద్దరామయ్య మీకు బడ్జెట్పై సమాధానం అవసరం లేదని, దీంతో ఈ విధంగా చేస్తున్నారని, ప్రజాస్వామ్యంలో మీ ప్రవర్తన సరికాదంటూ బడ్జెట్పై సమాధానం ఇస్తుండగా ప్రతిపక్షాలు ధర్నా కొనసాగిస్తూ నినాదాలు చేశారు. బనశంకరి: హనీట్రాప్పై శుక్రవారం శాసనసభ దద్దరిల్లడంతో బీజేపీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ యూటీ.ఖాదర్ ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామం అనంతరం సభ ప్రారంభం కాగానే బీజేపీ ఎమ్మెల్యేలు కాషాయ శాలువాలు ధరించి హాజరయ్యారు. బీజేపీ ఎమ్మెల్యేలు యథావిధిగా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ధర్నా చేపట్టి నినాదాలు చేశారు. తమ స్థానాల్లోకి వెళ్లి ఆసీనులై సభా కార్యకలాపాలు నిర్వహించడానికి అవకాశం కల్పించాలని స్పీకర్ సభ్యులకు మనవి చేశారు. అయినా వినకపోవడంతో 18 మందిని సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యేలు దొడ్డనగౌడ హెచ్.పాటిల్, డాక్టర్ సీఎన్.అశ్వత్నారాయణ్, ఎస్ఆర్.విశ్వనాథ్, బసవరాజ్ ఎంఆర్.పాటిల్, చెన్నబసప్ప, బీ.సురేశ్గౌడ, ఉమానాథ్ కోట్యాన్, శరణు సలగార్. డాక్టర్ శైలేంద్ర బెల్దాళె, సీకే.రామమూర్తి, యశ్పాల్ సువర్ణ, బీపీ.హరీశ్, డాక్టర్ భరత్శెట్టి, మునిరత్న, బసవరాజ్ ముత్తిమోడ్, ధీరజ్ మునిరాజు, డాక్టర్ చంద్రు లమాణి సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. -
గ్రంథాలయాలు జ్ఞాన భాండాగారాలు
రాయచూరు రూరల్ : గ్రంథాలయాలు జ్ఞాన భాండాగారాల వంటివని కలబుర్గి కేంద్రీయ విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ బట్టా సత్యనారాయణ ప్రారంభించారు. గురువారం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం, కలబుర్గి కేంద్రీయ విద్యాలయం, న్యూఢిల్లీ భారతీయ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరుగనున్న 70వ అంతర్జాతీయ గ్రంథాలయ వార్షికోత్సవాలను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. గ్రంథాలయాల ద్వారా జ్ఞాన సముపార్జనకు అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ హన్మంతప్ప, ఇమాం షా పతక్, శ్రీనివాస్ రావ్, అజయ్ ప్రతాప్ సింగ్, సుయమీంద్ర కులకర్ణి, మోహన్, చౌబే, సిద్ద మల్లయ్య, సురేష్ జంగ్, సభ్యులు బసన గౌడ, మల్లేష్, కట్టిమని, మచేంద్రనాథ్, విదేశీ ప్రతినిధులు ప్రత్యేక అతిథులుగా, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన గ్రంథాలయాల అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు. -
పంటలు వెలవెల.. రైతులు విలవిల
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ చివరి ఆయకట్టు భూములకు నీరందక పోవడంతో రైతులు బిక్కముఖం వేస్తున్నారు. జిల్లాలో లక్షలాది హెక్టార్లలో పంట నష్టం సంభవించే అవకాశాలున్నాయి. నీటి గేజ్ నిర్వహణ, సామర్థ్యాన్ని బట్టి ఆయకట్టు భూములకు నీరందేలా అధికారులు తగిన జాగ్రత్తలు పాటించడం లేదు. గతంలో ముఖ్యమంత్రిగా యడియూరప్ప వెలువరించిన ఆదేశాలను అధికారులు ఉల్లంఘించినందువల్లే నేడు ఆయకట్టు చివరి భూములకు నీరందక పంటలు వాడుముఖం పట్టాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంట నష్టం వివరాలు సింధనూరు, మస్కి, కవితాళ, మాన్వి ప్రాంతాల్లో వరి, పత్తి, మిరప పంటలు అధికంగా పండిస్తున్నారు. సింధనూరు, మస్కి, కవితాళ, మాన్వి ప్రాంతాల్లో దాదాపు 2 లక్షల హెక్టార్లలో వరి పంటను, రాయచూరు, సిరవార తాలూకాలో లక్ష హెక్టార్లలో పత్తి, లక్ష హెక్టార్లలో మిరప పంటలను సాగు చేస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు రోజుకు 3500 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తే పంటలు చేతికొచ్చే అవకాశం ఉంది. కాలువకు నీటి విడుదలలో సామర్థ్యం మేరకు గేజ్ నిర్వహణ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల పంటలు చేతికొచ్చే సమయంలో నీటి లభ్యత కరువైంది. భద్రా జలాఽశయం నుంచి తుంగభద్రకు 6 టీఎంసీల నీటిని విడుదల చేసుకుంటే రైతులు కష్టాల నుండి గట్టెక్కుతారని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. నేడు వికాససౌధలో ఐసీసీ సమావేశం తుంగభద్ర ఎడమ కాలువకు నీటిని విడుదల చేసే అంశంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కాడా అధ్యక్షుడు, కన్నడ సంస్కృతి శాఖ మంత్రి శివరాజ్ తంగడిగి అధ్యక్షతన అధికారులు, ఎమ్మెల్యేలతో వికాససౌధలో శుక్రవారం తుంగభద్ర నీటిపారుదల సలహా సమితి(ఐసీసీ) సమావేశం జరుగనుంది. ఈనేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని అందరి దృష్టి ఆ సమావేశంపై నెలకొంది. ఎడమ కాలువ చివరి ఆయకట్టుకు అందని నీరు సుమారు నాలుగు లక్షల హెక్టార్లలో పంట నష్టం -
నేటి నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం
సాక్షి, బళ్లారి: ప్రతి విద్యార్థి జీవితంలో బంగారు భవిష్యత్తుకు పునాదిగా, ఉన్నత స్థానాలకు, లక్ష్యాలకు చేరుకోవడానికి మొదటి మెట్టు అయిన 10వ తరగతి పరీక్షలు నేడు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 2024–25వ విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికార యంత్రాంగం విద్యార్థులు ఆయా పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బళ్లారి జిల్లాలో గత ఏడాది రాష్ట్రంలోని ఫలితాలను చూస్తే 28వ స్థానానికి పడిపోవడంతో ఈ సారి గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించడానికి విద్యాశాఖ యంత్రాంగం తీవ్ర కసరత్తు చేసిన సంగతి తెలిసిందే. జిల్లాలో బళ్లారి తూర్పు, పశ్చిమ, సండూరు, సిరుగుప్ప వలయాలకు సంబంధించి మొత్తం 23,524 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉన్నారు. పరీక్షల వివరాలివే ఇక పరీక్ష సబ్జెక్టుల విషయానికొస్తే మార్చి 21న ప్రథమ భాష తీసుకున్న విద్యార్థులు మొదటి రోజు ఇంగ్లిష్, కన్నడ, హిందీ, ఉర్దూ, సంస్కృతం పరీక్షలు రాస్తారు. మార్చి 24న గణితం, మార్చి 26న ద్వితీయ భాష ఇంగ్లిష్, కన్నడ, మార్చి 29న సోషల్ సైన్స్, ఏప్రిల్ 2న సైన్స్, 4న తృతీయ భాషగా హిందీ, కన్నడ, ఇంగ్లిష్, ఉర్దూ పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు పరీక్షలు రాయడానికి జిల్లా విద్యాశాఖ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. గత ఏడాది రాష్ట్రంలోని ఫలితాల్లో బళ్లారి జిల్లాకు తక్కువగా రావడంతో జిల్లా విద్యాశాఖ అధికారిణికి ఉన్నతాధికారులు చీవాట్లు పెట్టారు. 2023వ సంవత్సరంలో కూడా బళ్లారి జిల్లా 31వ స్థానానికి పడిపోయిన సంగతి తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా 320 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 23,524 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఆయా కేంద్రాల వద్దకు నిర్ణీత సమయానికన్నా ముందుగా హాజరు కావాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. టెన్షన్కు గురి కావద్దు ఇప్పటికే ప్రీ ఫైనల్లో రెండు, మూడు సార్లు పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎస్ఎస్ఎల్సీ బోర్డు పరీక్షలు నేడు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి విద్యార్థిలో ఉత్కంఠ నెలకొంది. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి టెన్షన్కు గురి కావద్దన్నారు. ప్రతి ఒక్కరూ తమ పాఠశాలల్లో అందజేసిన హాల్ టిక్కెట్లు, పెన్నులు, పరీక్షలను నిర్ణీత సమయాని కంటే ముందే తీసుకొని ఆయా పరీక్ష కేంద్రాల వద్దకు రావాలని సూచించారు. బళ్లారి జిల్లాతో పాటు విజయనగర, కొప్పళ, రాయచూరు, గదగ్, బీదర్, బాగలకోటె, ధార్వాడ తదితర కళ్యాణ కర్ణాటక, ఉత్తర కర్ణాటక పరిధిలోని అన్ని జిల్లాల్లో 10వ తరగతి పరీక్షలు ఏకకాలంలో ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు పరీక్షల సజావుగా నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జిల్లాలో 23,525 మంది విద్యార్థులు హాజరు గత ఏడాది కంటే మెరుగైన ఫలితాల కోసం నిరీక్షణ -
బైక్ని ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి
సాక్షి,బళ్లారి: ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, అతని భార్య గాయపడిన ఘటన గురువారం చిత్రదుర్గ జిల్లా మొళకాల్మూరు తాలూకా జీరహళ్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిలో జరిగింది. ఈ ప్రమాదంలో అనంతపురం జిల్లా డీ.హిరేహాళ్ గ్రామానికి చెందిన భీమణ్ణ(45)పై నుంచి లారీ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. భార్య మీనక్కతో కలిసి ద్విచక్ర వాహనంలో వెళుతున్న సందర్భంలో గుర్తు తెలియని లారీ ఢీకొనగా లారీతో పాటు డ్రైవర్ పరారయ్యాడు. రోడ్డులో భర్త మృతదేహం చెల్లాచెదురుగా పడిపోవడంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపించిన దృశ్యం చూపరులను కలిచివేసింది. క్షణాల్లో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో భీమణ్ణ తల నుజ్జునుజ్జయి రోడ్డుపై మాంసపు ముద్దలా మారిపోయింది. తల, మొండెం దాదాపుగా వేరుగా పడిపోయి, రోడ్డులో రక్తపుటేరు ప్రవహించింది. దీంతో అదే రోడ్డు గుండా వెళుతున్న వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. చిత్రదుర్గ జిల్లా రాంపుర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించిన తర్వాత పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతివేగంతో ద్విచక్ర వాహనంపైకి దూసుకెళ్లిన లారీ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనా స్థలంలో భార్య కన్నీరుమున్నీరు చూపరులను కలచి వేసిన దుర్ఘటన -
దేశంలోనే అత్యంత శ్రీమంతులు
కర్ణాటక శాసనసభ్యులు..బనశంకరి: దేశంలోనే శ్రీమంత ఎమ్మెల్యేల జాబితాను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ (ఏడీఆర్) విడుదలచేసింది. టాప్ 10 ఎమ్మెల్యేలలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ ద్వితీయ స్థానంలో ఉన్నారు. 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 4,092 మంది ఎమ్మెల్యేలు ఆస్తులను అధ్యయనం చేసి ఏడీఆర్ నివేదిక విడుదలచేసింది. కళ్లుచెదిరే ఆస్తులు ● ధనిక ఎమ్మెల్యేలలో కర్ణాటక మొదటి స్థానంలో ఉండడం గమనార్హం. రాష్ట్రంలో 223 ఎమ్మెల్యేలు మొత్తం ఆస్తుల విలువ రూ.14,179 కోట్లు. ● ముంబైలోని బీజేపీ ఎమ్మెల్యే పరాగ్షా రూ.3,383 కోట్ల ఆస్తితో మొదటి స్థానంలో ఉన్నారు. ● రూ.1,413 కోట్ల ఆస్తులతో డీకేశి రెండవ స్థానంలో నిలిచారు. ● గౌరిబిదనూరు స్వతంత్ర ఎమ్మెల్యే కేహెచ్.పుట్టస్వామిగౌడ రూ.1267 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో, 4 వ స్థానంలో గోవిందరాజనగర ఎమ్మెల్యే ప్రియాకృష్ణ ఉన్నారు. ● 10వ స్థానంలో ఉన్న హెబ్బాల ఎమ్మెల్యే బైరతి సురేశ్కు రూ.1,156 కోట్లు ఆస్తులు ఉన్నాయి. దేశంలో అత్యధిక మంది కర్ణాటక నుంచి ఉండడం చర్చనీయాంశమైంది. ఇక్కడి రియల్ ఎస్టేట్, పరిశ్రమలు, ఇతరత్రా రంగాల ద్వారా నేతలు కుబేరులవుతున్నారు. రెండో ప్లేసులో డీకే శివకుమార్ టాప్–10లో బెంగళూరు నేతలు -
శ్మశానం గోడ మరమ్మతు చేయండి
బళ్లారిటౌన్: వాజ్పేయి లే అవుట్ సమీపంలోని శ్మశానం గోడ ఏడాది క్రితం కూలిపోయి స్థానికులకు భయభ్రాంతులు కలిగిస్తున్నందున ఈ గోడను పునర్నిర్మించాలని వాజ్పేయి లే అవుట్తో పాటు దొడ్డబసవేశ్వర లే అవుట్, శివసాయి టౌన్షిప్, స్టాండర్డ్ ఇన్ఫ్రా కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. గోడ పడిన చోట కొత్తగా ఓ ప్రైవేట్ హైస్కూల్ను నిర్మించినందున పాఠశాల గేట్ ముందు ఈ శ్మశానంలోని సమాధులు కనిపిస్తున్నందున విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ శ్మశానం సంగనకల్లు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నందున ఇటు మహానగర పాలికె గాని, అటు సంగనకల్లు గ్రామ పంచాయతీ వారు గానీ పట్టించుకోవడం లేదు. ఈ శ్మశానంలో మృతి చెందిన నగరవాసుల మృతదేహాలకు ఎక్కువగా అంత్యక్రియలు జరుపుతుంటారు. దీంతో గ్రామ పంచాయతీ వారు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇటీవల ముందు భాగంలో మాత్రం ప్లాట్ఫాం నిర్మించి మొక్కలను పెంచేందుకు మహానగర పాలికె ఆసక్తి చూపింది. అయితే ఇటు వైపు ప్రహరీ గోడ కూలిపోయి ఏడాది కావస్తున్నా దానికి మరమ్మతులు చేయకుండా వదిలేశారు. రాత్రి పూట అసలే వీధి లైట్లు లేక గాఢాంధకారం ఉండటంతో ఈ రోడ్డులో సంచరించేందుకు చుట్టుపక్కల ఉన్న వివిధ కాలనీల వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. -
23 నుంచి వీఎంసీఏ వేసవి క్రికెట్ శిబిరం
హుబ్లీ: ఉత్తర కర్ణాటకలో పురాతన, 40 ఏళ్ల అనుభవం గల ధార్వాడలోని వసంత మురుడేశ్వర క్రికెట్ అకాడమి(వీఎంసీఏ) 39వ వార్షిక శిక్షణా శిబిరం ఈ నెల 23 నుంచి మే 18 వరకు జరగనుంది. రంజీ క్రీడాకారులు ఆనంద్ కట్టి, సోమశేఖర్, ఐపీఎల్ క్రీడాకారుడు పవన్ దేశ్పాండే, రాష్ట్ర సీనియర్ మహిళా జట్టు క్రీడాకారిణి అస్మిరాబాను తదితరులు సలహా సూచనలతో పాటు శిక్షణను అందించనున్నారు. సదరు సంస్థ నిర్వహించే 57 రోజుల ఈ శిక్షణా శిబిరంలో 8 నుంచి 20 ఏళ్ల వయస్సు వారికి అవకాశంతో పాటు బాలికలకు ప్రత్యేక రాయితీ ఉంటుంది. పూర్తి వివరాలకు వసంత మురుడేశ్వరను 9448119586 నెంబరులో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు. హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు చెళ్లకెరె రూరల్: నగరంలోని హోటళ్లు, బేకరీలను నగరసభ ఇన్చార్జి అధ్యక్షురాలు సుమా భరమయ్య ఆకస్మికంగా పరిశీలించారు. హోటళ్లలో పరిశుభ్రత కాపాడకపోతే లైసెన్స్లు రద్దు చేస్తామన్నారు. నగరసభ ఆరోగ్య అధికారితో పాటు వివిధ ఉపహార కేంద్రాలను పరిశీలించి వంటగదులను తనిఖీ చేశారు. అక్కడ నెలకొన్న పరిశుభ్రతను చూసి హోటల్ యజమానులపై మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని శుభ్రత కాపాడాలని సూచించారు. ముఖ్యంగా వంటగదిని శుభ్రంగా ఉంచాలని, నాణ్యమైన కూరగాయలను ఉపయోగించి రుచికరంగా ఆహార పదార్థాలను తయారు చేయాలన్నారు. ఫుట్పాత్ క్యాంటీన్ల వారు కూడా శుభ్రతను పాటించాలని, శుచికరంగా వంట పదార్థాలను తయారు చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వేసవిలో హోటళ్లలో రక్షిత మంచినీటిని అందించాలన్నారు. చిత్రదుర్గ బస్టాండ్లోని ప్రజా మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా స్థాయి సమితి అధ్యక్షులు ఎం.మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. డిమాండ్లు తీర్చాలని ఆశాల ధర్నా హుబ్లీ: రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు నెలకు కనీసం రూ.10 వేల వేతనాన్ని అందించాలని, బడ్జెట్లో హామీ ఇచ్చిన మేరకు రూ.1000 వేతనం పెంపు ఆదేశాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐయూటీయూసీ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ధార్వాడ జిల్లాధికారి కార్యాలయం ఎదుట భారీ ఆందోళన చేపట్టారు. ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగాధర బడిగేర మాట్లాడుతూ ఆశా కార్యకర్తల నిరంతర పోరాటానికి స్పందించిన సీఎం ఏప్రిల్ 2025 నుంచి ప్రతి నెల ఆశా కార్యకర్తలకు ప్రోత్సాహధనంతో కలిపి కనిష్టంగా రూ.10 వేలు ప్రతి ఆశా కార్యకర్తకు గౌరవ ధనంగా ఇస్తామని ప్రకటించారు. ఆ హామీ ఇచ్చినట్లుగానే ప్రభుత్వం రాష్ట్ర కార్యకర్తలకు మేలు జరిగేలా సదరు ఆదేశాన్ని అమలు చేసి హామీ నెరవేర్చుకోవాలన్నారు. సంఘం జిల్లాధ్యక్షురాలు భువన బళ్లారి మాట్లాడుతూ గత 12 ఏళ్ల నుంచి నెలకు రూ.6 వేల గౌరవధనంతో శ్రమించే ఆశా కార్యకర్తలను సదరు విధుల నుంచి తొలగించే ఆదేశాలను వెల్లడించడం అందరికీ శరాఘాతం అయిందన్నారు. ఇంతకు ముందు హామీ ఇచ్చినట్లుగానే ఎక్కువ గౌరవ ధనం, డీఏ తదితరాలను అందించి తిరిగి విధులు నిర్వహించడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రముఖురాలు మంజుల, భారతీ శెట్టర్, సరోజ, శోభ యాదవ్, రేణుకా, శారద తదితరులు పాల్గొన్నారు. 26 ఏళ్ల తర్వాత పట్టుబడిన దొంగశ్రీనివాసపురం : పలు చోరీ కేసుల్లో నిందితుడైన దొంగ 26 ఏళ్ల తర్వాత పోలీసులకు పట్టుబడ్డాడు. చింతామణి తాలూకా సిద్దపల్లికి చెందిన అంజి అనే దొంగను శ్రీనివాసపురం పోలీసులు అరెస్టు చేశారు. ఇతనిపై పదికిపైగా చోరీ కేసులు ఉన్నాయి. 26 సంవత్సరాలుగా పరారీలో ఉన్న ఇతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. గురువారం ముళబాగిలు సమీపంలోని నరసింహ తీర్థం వద్ద ఉన్నట్లు అందిన సమాచారంతో పోలీసులు వెళ్లి అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరిచారు. -
తాగునీటి ఇబ్బందులు నివారిస్తాం
రాయచూరు రూరల్: జిల్లాలో తాగునీటికి ఇబ్బందులు నివారిస్తామని జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారాం పాండే పేర్కొన్నారు. ఆయన గురువారం సిరవార తాలూకా గణేకల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను పరిశీలించి మాట్లాడారు. తుంగభద్ర ఎడమ కాలువకు నీరు విడిచినందున పోలీస్ బందోబస్తు మధ్య తాగునీటి చెరువులను నింపాలనీ జిల్లాధికారి సూచించారన్నారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తోడు మరమ్మతు పనుల నిర్మాణానికి పంచాయతీ ఆధ్వర్యంలో పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పక్షుల సంతతి కాపాడుకుందాం రాయచూరు రూరల్: నగర, పట్టణ ప్రాంతాల్లో మూగ జీవాలు, పక్షులకు నీటి సౌకర్యం కల్పించి కాపాడుకుందామని ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత పేర్కొన్నారు. గురువారం నగరంలోని ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో ప్రపంచ పిట్టల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నీటి తొట్టెలను ఏర్పాటు చేసి మాట్లాడారు. చుట్టు పక్కల పరిసర ప్రాంతాల్లోని చెట్లు, కొండలు, గుట్టలు ఉన్న ప్రాంతాల్లో వేసవి కాలంలో నీటి దాహార్తి తీర్చడానికి నీటి తొట్టెలు ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్లో మండుటెండల వేడిమి నుంచి రక్షణ పొందేందుకు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు చెట్లు పెంచి పరిసరాలను సంరక్షించాలన్నారు. సీసీ కెమెరాల నిఘాతో అక్రమాలకు చెక్రాయచూరు రూరల్: నగరంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా నివారించేందుకు తోడు నిఘాకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని ఎస్పీ పుట్టమాదయ్య వెల్లడించారు. బుధవారం రాత్రి నగరంలోని మహాబలేశ్వర, జాకీర్ హుసేన్ సర్కిల్లో అమర్చిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి నుంచి రూ.35 వేలతో వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను అమర్చారన్నారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ సత్యనారాయణ, సదర్ బజార్ సీఐ ఉమేష్ కాంబ్లే, ఎస్ఐ సణ్ణ ఈరణ్ణ, ఏఎస్ఐ శ్రీనివాస్, బసవరాజ్, చాంద్ పాషా, మానవ హక్కుల కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ మోహిధ్లున్నారు. సాగునీటి కోసం రాస్తారోకో రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ, నారాయణపుర కుడి కాలువ ఆయకట్టు చివరి భూములకు ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరందించాలని కర్ణాటక రైతు సంఘం జిల్లాధ్యక్షుడు శివపుత్ర పాటిల్ డిమాండ్ చేశారు. గురువారం జాలహళ్లి వద్ద రహదారిపై రాస్తారోకో చేపట్టి మాట్లాడారు. ఎడమ కాలువకు మార్చి 31 వరకు నీరు వదలడానికి అధికారులు సమావేశంలో తీసుకున్న నిర్ణయంతో చేతికొచ్చిన పంట నోటికి రాకుండా పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి గేజ్ నిర్వహణ, సామర్థ్యాన్ని బట్టి ఆయకట్టు భూములకు నీరందేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నీరు అందించడానికి శాశ్వత పరిష్కారం చేపట్టడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు ముందుకు రావడం లేదని ఆరోపించారు. తుంగభద్ర ఎడమ కాలువ చివరి భూములకు ఏప్రిల్ చివరి వరకు నీరందివ్వాలని కోరుతూ అదనపు జిల్లాధికారి శివానందకు వినతిపత్రం సమర్పించారు. -
పది పరీక్షలకు సన్నద్ధం
శివాజీనగర: విద్యార్థి జీవితానికి దారిదీపంగా పరిగణించే ఎస్ఎస్ఎల్సీ (టెన్త్) పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఇందులో వచ్చే మార్కులే ఉన్నత విద్యకు మెట్లు అవుతాయి. అందుకే టెన్త్ పరీక్షలు అనగానే విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లోనూ టెన్షన్ నెలకొంటుంది. 8.96 లక్షల మంది రాష్ట్రంలో 2,818 కేంద్రాల్లో 8.96 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. గురువారమే ఉపాధ్యాయ సిబ్బంది హాల్స్లో నంబర్లను రాయడం తదితర పనులను పూర్తి చేశారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు కర్ణాటక పాఠశాల పరీక్ష, మూల్యాంకన నిర్ణయ మండలి ద్వారా ఈ పరీక్షలు జరుగుతాయి. పకడ్బందీ చర్యలు రాష్ట్రంలో 15,881 ఉన్నత పాఠశాలల్లో 4.61 లక్షల మంది బాలురు, 4.34 లక్షల మంది బాలికలు పరీక్ష రాయనున్నారు. పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల దూరం నిషేధాజ్ఞలను అమలు చేస్తారు. పరిసరాల్లో జిరాక్స్ సెంటర్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలి. పరీక్షా కేంద్రాల వద్ద ఎవరూ గుంపులుగా ఉండరాదు. అక్రమాలను అరికట్టేందుకు గత సంవత్సరం నుంచి ప్రతి గదిలో సీసీ కెమెరా ఏర్పాటు చేస్తున్నారు. 3 దశల్లో ఈ వెబ్ కాస్టింగ్ను పరిశీలిస్తూ ఉంటారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే తక్షణమే గుర్తించి అదుపులోకి తీసుకుంటారు. పరీక్షా కేంద్రాల్లోకి సిబ్బంది కూడా మొబైల్ఫోన్లను తీసుకెళ్లరాదు. చీఫ్ సూపరింటెండెంట్ కెమెరా లేని సాధారణ మొబైల్ తీసుకెళ్లవచ్చు. సిబ్బంది, విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్లటం నిషిద్ధం. విద్యార్థులు హాల్ టికెట్ను చూపి ఆర్టీసీ, సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి -
22న రాష్ట్ర బంద్ ఖాయం!
శివాజీనగర: బెళగావిలో మరాఠాలచే కన్నడిగ బస్ కండక్టర్పై దాడిని ఖండిస్తూ, మరాఠా సంఘాలను నిషేధించాలని, గ్రేటర్ బెంగళూరు పాలనా బిల్లు ను ఉపసంహరించుకోవాలని, రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలవారు కన్నడిగులపై చేస్తున్న దౌర్జన్యాలను వ్యతిరేకిస్తూ పలు డిమాండ్లతో మార్చి 22న శనివారం కన్నడ సంఘాలు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి. బంద్ను విజయవంతం చేయాలని సంఘాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. సిద్దరామయ్య ప్రభుత్వం నుంచి కూడా కన్నడ సంఘాల బంద్కు మద్దతు ఉందని సమాచారం. మద్దతుపై భిన్నగళాలు 22న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు బంద్ జరుగుతుంది. బంద్కు కొన్ని పాఠశాలలు, కాలేజీలు మద్దతునివ్వడం వివాదానికి కారణమైంది. కొన్ని సంఘాలు మద్దతు ఇవ్వలేదు. ఎస్ఎస్ఎల్సీ పరీక్షలు, వివిధ తరగతుల పరీక్షలు జరుగుతున్నందున విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళనకు కారణమైంది. పరీక్షల సమయంలో బంద్ వద్దు అని కొన్ని సంఘాలు విన్నవించిన కూడా కన్నడ సంఘాల నేతలు వెనుకంజ వేయబోమని చెప్పారు. 22న జరిగే పరీక్షల పరిస్థితి డోలాయమానంలో పడింది. వాటాళ్ నిర్బంధం బంద్ విజయవంతానికి కన్నడ సంఘాల నాయకుడు వాటాళ్ నాగరాజ్ ప్రయత్నిస్తుండగా, పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. గురువారం బెంగళూరులోని మైసూరు బ్యాంక్ సర్కిల్లో ధర్నా, ర్యాలీ చేస్తుండగా నిర్బంధించి మళ్లీ విడుదల చేశారు. బంద్ విజయంతం కావాలని వాటాళ్ డిమాండ్ చేశారు. వెనక్కి తగ్గని కన్నడ సంఘాలు పరీక్షల గురించి విద్యార్థుల్లో గుబులు -
బెంగళూరులో ఇంటికి నిప్పు
సింగపూర్లో ప్రేమాయణం..కృష్ణరాజపురం: ఉన్నత చదువులు చదివి ప్రయోజకుడు అవుతాడు అనుకుంటే తప్పుడు మార్గంలో వెళ్లి చివరకు తల్లిదండ్రులనే సజీవ దహనం చేయాలనుకున్నాడో ప్రబుద్ధుడు. బెంగళూరు కేఆర్ పురం పరిధిలో హిరండహళ్లిలో ఇటీవల గ్రామ పంచాయతీ సభ్యుడు జగన్నాథ్ ఇంటికి నిప్పంటించిన కేసులో మిస్టరీ వీడింది. సొంత కొడుకే సైకోగా మారి వారిని చంపాలని ఈ పనికి పాల్పడినట్లు తెలిసి పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. ఉన్నత విద్య కోసం సింగపూర్కు వెళ్లిన కుమారుడు (24) మలేషియాలో మరో మతానికి చెందిన వివాహిత మహిళతో ప్రేమాయణం సాగించాడు. ఆమె కోసం మతం కూడా మారినట్లు తెలిసింది. చదువుల ఖర్చుల కోసం తండ్రి రూ. 1 కోటి ఇవ్వగా, అందులో రూ. 40 లక్షల వరకూ ఆమెకు తగలేశాడు. ఇవన్నీ ఇంట్లో తెలిస్తే తనను మళ్లీ సింగపూర్కి వెళ్లనివ్వరు, తమ ప్రేమకు కూడా వ్యతిరేకిస్తారు అని అతడు ఆలోచించాడు. దీంతో తల్లిదండ్రులను హత్య చేయాలని కుట్ర పన్నాడు. పెట్రోలు చల్లి నిప్పంటించి.. పథకం ప్రకారం సోమవారం రాత్రి రాంపుర పెట్రోల్ బంకుకు కారులో వెళ్లి ఐదు క్యాన్లలో పెట్రోల్ తెచ్చాడు. అందరూ గాఢనిద్రలో ఉండగా ఒక క్యాన్ పెట్రోల్ను తల్లిదండ్రులు నిద్రించిన గది కిటికీ తెరిచి పోసి నిప్పంటించాడు. మరొక క్యాన్ పెట్రోల్ను ఇంటి కాంపౌండ్ గోడపై పెట్టాడు. నిప్పంటించిన తర్వాత ఇంటిపై ఉన్న మరొక గదిలోకి వెళ్లాడు. ఎగసిపడుతున్న మంటలను చూసి భయపడి వెంటనే కిందకు వచ్చి ఏమీ తెలియనట్లు ఉండిపోయాడు. స్థానికులు, ఫైర్ సిబ్బంది వచ్చాక వారితో కలిసి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడు. ఇంటిలోని సీసీ టీవీ డీవీఆర్ను ముందే తొలగించాడు. పోలీసులు ఆరోజు నుంచి ముమ్మరంగా దర్యాప్తు చేయగా కొడుకు నిర్వాకమని నిర్ధారణ అయ్యింది. నిందితున్ని ఆవలహళ్లి పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుమారుడు ఇతడే తల్లిదండ్రులను చంపాలని కుట్ర చదువుకోవడానికి వెళ్లి తప్పుదారి ఘరానా కొడుకు నిర్వాకం -
మళ్లీ కరెంటు చార్జీల షాక్
శివాజీనగర: ప్రభుత్వం ఎప్పుడు ఏ చార్జీ పెంచుతుందోనని ప్రజలు కలవరపడాల్సి వస్తోంది. గతంలో కరెంటు, బస్సు చార్జీలు, మద్యం ధరలను పెంచింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్యుల జీవితం దినదిన గండంగా తయారైంది. బతుకు బండి భయపెడుతోంది. ఈ పరిస్థితుల్లో కర్ణాటక విద్యుచ్ఛక్తి కమిషన్ (కేఈఆర్సీ) కరెంటు వాడకందార్లకు షాక్ ఇచ్చింది. ప్రతి యూనిట్ పై 36 పైసలు చార్జీలను పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. సవరించిన చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. పెంపు ఎందుకంటే పెంపు వల్ల ప్రతి ఇంటి మీద సుమారు 90 రూపాయల భారం పడనుంది. దీనికి కారణాలు మాత్రం అనూహ్యంగా ఉన్నాయి. విద్యుత్ ప్రసరణ, సరఫరా సంస్థల సిబ్బంది పింఛన్, గ్రాట్యుటీకి ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా మొత్తాన్ని వినియోగదారుల జేబు నుంచి వసూలు చేయడానికి చార్జీలను పెంచడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం కేఈబీని రద్దుచేసి, కేపీటీసీఎల్, 5 ఎస్కాంలను ఏర్పాటు చేసిన సమయంలో ఉద్యోగుల పింఛన్, గ్రాట్యూటీని ప్రభుత్వమే భరిస్తుందని అంగీకరించింది. అయితే 2021 నుంచి ఆ సొమ్మును తాము భరించలేమని, విద్యుత్ వినియోగదారుల నుంచి వసూలు చేయాలని ఆదేశించింది. అప్పట్లో కేఇఆర్సీ ముందు ప్రస్తావించినపుడు సున్నితంగా తిరస్కరించింది. గతేడాది మార్చిలో హైకోర్టులో విచారణకు వచ్చినపుడు వినియోగదారులపై పింఛన్ బదిలీ భారాన్ని మోపడంపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో సర్కారుకు అనుకూలమైంది. చివరకు యూనిట్పై 36 పైసలు పెంచి ఆ డబ్బును పింఛన్లకు చెల్లిస్తారు. ప్రజలపై వేల కోట్ల భారం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2021 నుంచి 2024 వరకు రూ. 4,659 కోట్లను సేకరించాల్సి వచ్చింది. ఈ సొమ్మును ప్రస్తుత సంవత్సరం నుండే 6 కంతులలో వినియోగదారులు ఇవ్వాల్సి ఉంటుంది. యూనిట్పై 36 పైసల పెంపు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి విద్యుత్ ఉద్యోగుల పింఛన్ల సర్దుబాటుకు ప్రజల నుంచి వసూలు రూ. 4600 కోట్లకు పైగా భారం ప్రజలకు ఇబ్బంది లేదు: మంత్రి విద్యుత్ ధర పెంపుతో సామాన్య ప్రజలకు ఇబ్బంది కాదని, గృహజ్యోతి పథకం ద్వారా నష్టం ఏమీ లేదని, పెంపునకు గృహజ్యోతి కారణం కాదని మంత్రి శరణప్రకాశ్ పాటిల్ చెప్పారు. బెంగళూరులో మాట్లాడిన ఆయన, గృహ జ్యోతి పథకం క్రింద 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నాం. 200 యూనిట్ల కంటే అధికంగా వాడేవారికి చార్జీల పెరుగుదల అన్వయిస్తుందని తెలిపారు. చార్జీల పెంపు వల్ల ఇబ్బంది లేదని చెప్పడం విశేషం. ప్రజలకు అవస్థలు: విజయేంద్ర విద్యుత్ చార్జీలను పెంచడంపై బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధానసౌధలో విలేకరులతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం చార్జీల పెంపును అనుసరిస్తోంది, రాష్ట్ర ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. ఒకవైపు ఉచిత విద్యుత్ అని చెబుతున్నారు. మరోవైపు ప్రజా పనుల శాఖలోనే 8 వేల కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు ఉన్నాయి. అసెంబ్లీలో అన్ని విషయాలను చర్చిస్తామని తెలిపారు. -
ఎండల వెంటే ఆరోగ్య సమస్యలు
బనశంకరి: సిలికాన్ సిటీలో మండుటెండలకు నగరవాసులకు కడుపునొప్పి, శరీరంపై గుళ్లలు, జ్వరాలు, అతిసారం లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య 20 శాతం పెరిగింది. వాతావరణశాఖ ప్రకారం నగరంలో సాధారణం కంటే మూడు డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత అధికమైంది. ఈ నెలలో చాలారోజులు గరిష్ట ఉష్ణోగ్రత 34, 35 డిగ్రీలకు చేరింది. వేడిగాలులు వీస్తుండటంతో పిల్లలు అధిక సంఖ్యలో అస్వస్థతకు గురి అవుతున్నారు. ఎర్రటి గుళ్లలు, జ్వరం, శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రులకు వెళ్లడం పెరిగింది. కలుషితనీరు, అపరిశుభ్రమైన ఆహారం భుజించడంతో కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు ఇట్టే సోకుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఆరోగ్యశాఖ విశ్లేషణ ప్రకారం మార్చి మొదటి వారం నుంచి చలిజ్వరం, అతిసారం కేసులు 3 వేల వరకూ వచ్చాయి. మండుటెండలకు గురైతే.. ఉష్ణోగ్రతలు పెరగడంతో జ్వరం, తలనొప్పి, వాపులు, వడదెబ్బ, స్పృహ కోల్పోవడం, ఆయాసం తదితర సమస్యలు నగరవాసుల్లో కనబడుతున్నాయి. విక్టోరియా, జయనగర ప్రభుత్వాసుపత్రి, ఇందిరాగాంధీ చిన్నపిల్లలు ఆసుపత్రి సహా ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే అవుట్ పేషెంట్స్లో 10 శాతం కడుపునొప్పి, విషజ్వరాలు, అతిసారం, శరీరంపై పొక్కులు సమస్యలతో బాధపడేవారు ఉన్నారు. కడుపునొప్పి ఎక్కువమందిలో కనిపిస్తోంది. నేత్ర సమస్యలు అధికం ఎండల వల్ల కంటి సమస్యలు వస్తున్నాయి. కంటిలో నీరు, దురద, కళ్లు ఎర్రబడటం, కంటివాపులతో వైద్యుల వద్దకెళ్తున్నారు.ప్రముఖ కంటి ఆసుపత్రులైన మింటో, నారాయణ నేత్రాలయ, డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి, ఽఽశంకర కంటి ఆసుపత్రి, బెంగళూరు నేత్రాలయలో అవుట్పేషెంట్స్ 10 శాతం పెరిగారు. పిల్లల్లో చికెన్పాక్స్ వైరస్ ఎక్కువగా వస్తోందని రాజాజీనగర ఈఎస్ఐ ఆసుపత్రి చర్మరోగ డాక్టర్ ఎంఎస్ గిరీశ్ తెలిపారు. నేరుగా ఎండలో ఉండరాదు. సూర్యకిరణాలకు గురికాకుండా పిల్లలు, వృద్ధులు జాగ్రత్త పడాలి. స్వచ్ఛమైన నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. పండ్లను ఎక్కువగా ఆరగించాలని ఇందిరాగాంధీ చిన్నపిల్లల ఆరోగ్య సంస్థ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ కేఎస్ తెలిపారు. బెంగళూరువాసుల సతమతం అతిసారం, జ్వరం, కంటి, చర్మ వ్యాధుల తాకిడి -
కుమారస్వామీ జాగ్రత్త
● డీసీఎం శివకుమార్ ధ్వజం దొడ్డబళ్లాపురం: కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య మాటల యుద్ధం పతాకస్థాయికి చేరింది. కుమార ఫాంహౌస్లో కబ్జాల తొలగింపుతో అది ఇంకా తీవ్రమైంది. డీకే శివకుమార్ గురువారం విధానసౌధలో మీడియాతో మాట్లాడుతూ.. కుమారస్వామి మర్యాదగా ఉంటే సరి. లేదంటే మేమేంటో చూపిస్తాం అని హెచ్చరించారు. కుమారస్వామి మైసూరులో నాపై అనేక అసత్య ఆరోపణలు చేశారన్నారు. తనపై, భార్య, చెల్లి, తమ్మునిపై కుమారస్వామి, ఆయన తండ్రి కేసులు పెట్టారన్నారు. తనకూ, బళ్లారికి సంబంధం లేకపోయినా అక్రమ గనుల కేసులు బనాయించారన్నారు. రామనగర పేరు మార్పు తథ్యం రామనగర జిల్లా పేరు మార్చరాదని కుమారస్వామి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అనుమతి రాకుండా చేశారని ఆరోపించారు. అసలు జిల్లా పేరు మార్పుకు కేంద్రం అనుమతి అవసరం లేదన్నారు. రామనగరను బెంగళూరు దక్షిణ జిల్లాగా పేరు మార్చుతామని, అదెలాగో తనకు తెలుసని చెప్పారు. పెన్నార్ నదీ జలాల పంపకాల విషయంలో కర్ణాటకతో చర్చించబోమని తమిళనాడు మంత్రులు దురుద్దేశంతో తెలిపారు, కనుక వారితో కేంద్ర మంత్రులు కూర్చుని చర్చిస్తారన్నారు. తమ ప్రతిపాదనలను చివరి క్షణంలో సమర్పిస్తామన్నారు. ఇద్దరు మంత్రులపై హనీట్రాప్ యత్నం!● విధానసభలో తీవ్ర చర్చ ● విచారణ జరిపిస్తాం: హోంమంత్రి యశవంతపుర: ఇద్దరు మంత్రులను హానీ ట్రాప్ చేయడానికి ప్రయత్నం జరిగిందని ఆరోపణలు వచ్చాయి, వారు ఫిర్యాదు చేస్తే ఉన్నతస్థాయి విచారణ చేయిస్తామని హోంమంత్రి పరమేశ్వర్ గురువారం అసెంబ్లీ సమావేశంలో తెలిపారు. నాలుగైదు రోజుల నుంచి ఓ మంత్రిని హనీ ట్రాప్ చేయడానికి కొందరు యత్నించినట్లు వదంతులు గుప్పుమన్నాయి. మరో మంత్రి సతీశ్ జార్కిహొళికి కూడా ఇదే మాదిరి వల వేయాలని చూశారని ప్రచారం సాగుతోంది. బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ యత్నాళ్ మాట్లాడుతూ తుమకూరుకు చెందిన మంత్రిని హనీ ట్రాప్ చేయాలనుకున్నారని చెప్పారు. దీనిపై మంత్రి కేఎన్ రాజణ్ణ స్పందిస్తూ తుమకూరు జిల్లా నుంచి తాను, హోంమంత్రి మాత్రమే ఉన్నాం. అనవసరమైన ఆరోపణలు చేయడం మంచిదికాదని అసెంబ్లీలో తెలిపారు. ఫిర్యాదు చేస్తాను. దీని వెనుక ఎవరున్నారో విచారణ చేయాలని రాజణ్ణ అన్నారు. దర్యాప్తు చేయిస్తామని హోంమంత్రి తెలిపారు. రైతులపై ఏనుగు దాడి మైసూరు: ట్రాక్టర్తో పొలం దున్నుతున్న రైతులపై అడవి ఏనుగు దాడి చేసి ఇద్దరు రైతులను గాయపరిచిన ఘటన జిల్లాలోని సరగూరు తాలూకా హలసూరు గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన పరశివనాయక (32), అతని పినతండ్రి శివణ్ణ (62) అనే ఇద్దరు, ఓ రైతు పొలం దున్నే పనిలో ఉన్నారు. సమీపంలోని నుగు అడవి నుంచి ఏనుగు పరుగున వచ్చి దాడికి దిగింది. ట్రాక్టర్పై ఉన్న పరశివ నాయక్కు, శివణ్ణకు గాయాలయ్యాయి. గ్రామస్తులు చేరుకుని వారిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. నుగు అటవీ అధికారులు లక్ష్మణ్, కాళప్ప, అక్షయ్ కుమార్, అభిలాష్ తదితరులు ఘటనాస్థలిని పరిశీలించి, ఆపై బాధితులను పరామర్శించారు. మహాబలేశ్వర తేరు మైసూరు: చాముండిబెట్టలో గురువారం మహాబలేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా సాగింది. ఉదయం 7.10 నుంచి 7.35 గంటల వరకు ఉన్న శుభలగ్నంలో రథోత్సవం జరిగింది. అంతకు ముందు మహాబలేశ్వర స్వామి దేవస్థానంలో కుమార్ దీక్షిత్ నేతృత్వంలో పంచామృత అభిషేకం, రుద్రాభిషేకాలు నిర్వహించారు. మహాబలేశ్వర స్వామి ఉత్సవ మూర్తిని తెచ్చి రథంలో కూర్చోబెట్టి మహామంగళ హారతిని నెరవేర్చారు. భక్తులు హరహర మహాదేవ అంటూ మహాబలేశ్వరునికి నినాదాలు చేస్తూ తేరును లాగారు. ప్యాలెస్, పోలీస్ బ్యాండ్లతో ఊరేగింపు జరిగింది. మైసూరు రాజవంశీకుడు, ఎంపీ యదువీర కృష్ణదత్త చామరాజ ఒడెయర్ మహాబలేశ్వరున్ని, చాముండేశ్వరి దర్శనం చేసుకున్నారు. -
రామనగర.. బెంగళూరు దక్షిణ కాలేదు!
దొడ్డబళ్లాపురం: నదులు, పర్వతాలతో ప్రకృతి అందాలకు నెలవు రామనగర జిల్లా. ఆ జిల్లాను బెంగళూరు దక్షిణ జిల్లాగా పేరు మార్చాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తహతహలాడుతున్నారు. కానీ ఈ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. రామనగరను బెంగళూరులో విలీనం చేయాలనే శివకుమార్ ఆశలపై నీళ్లు చల్లింది. ఈ విషయంలో రెండు నెలల క్రితమే కేంద్ర హోం వ్యవహారాల శాఖ.. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. బెంగళూరు దక్షిణ జిల్లాగా పేరు మార్పు గురించి స్థానిక ప్రజలలో వ్యతిరేకత ఉందని పేర్కొంది. ఆ వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్టు తెలిపింది. కేంద్రం అనుమతి తప్పనిసరి కాదు: మంత్రి కేంద్రం తిరస్కృతి నిజమేనని రెవెన్యూ మంత్రి క్రిష్ణభైరేగౌడ తెలిపారు. క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని కేంద్రానికి పంపించామన్నారు. జిల్లా పేరు మార్చాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి అయితే కాదని ఆయన అన్నారు. స్థానికులు, స్థానిక ఎమ్మెల్యేల వినతి మేరకు 2024లో క్యాబినెట్ జిల్లా పేరు మార్పుకు ఆమోదించినట్లు తెలిపారు. ఈ డిమాండు మొదట చేసింది డీకే శివకుమార్ అన్నారు. అభివృద్ధి దృష్టితో ఆయన ఈ ప్రస్తావన తీసుకువచ్చారన్నారు. రామనగర జిల్లాకు బెంగళూరు దక్షిణ జిల్లాగా పేరు మారిస్తే అభివృద్ధితో పాటు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు. పేరు మార్పును కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామితో పాటు బీజేపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. చివరకు ప్రతిపక్షాల పంతమే గెలిచింది. పేరు మార్పునకు కేంద్ర హోంశాఖ తిరస్కృతి రాష్ట్ర సర్కారుకు లేఖ -
అంగన్వాడీల ధర్నా
బనశంకరి: 2025– 26 బడ్జెట్లో గౌరవ వేతనాన్ని అత్తెసరే పెంచారని అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ఫ్రీడం పార్కులో ధర్నా చేశారు. ఏఐటీయుసీ తదితర కార్మిక సంఘాలు మద్దతు పలికాయి. ఈ బడ్జెట్లో కార్యకర్తకు రూ. 1000, ఆయాకు రూ.750 మాత్రమే పెంచారని చెప్పారు. మంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్ అక్కడికి వచ్చి వారితో చర్చలు జరిపారు, మీ డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కుక్కను తప్పించబోయి బ్యాంకు మేనేజర్ బలి మైసూరు: రోడ్డు మీద కారుకు అడ్డుగా వచ్చిన కుక్క ను కాపాడబోయి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మైసూరు జనతా నగర నివాసి, ఎస్ బ్యాంకు మేనేజర్ లోహిత్ (39) పని నిమిత్తం కారులో బోగాది వద్దనున్న గ్రామానికి వెళ్లాడు. తిరిగి మైసూరుకు పయనమయ్యాడు. ఈ సమయంలో కుమారబీడు సమీపంలో రోడ్డుపై ఒక కుక్క హఠాత్తుగా అడ్డు వచ్చింది. కుక్కను ఢీ కొట్టకుండా తప్పించేందుకు యత్నించి కారును ఎడమ వైపునకు తిప్పాడు. ఈ సమయంలో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టింది. దీంతో లోహిత్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని సోదరుడు వచ్చి లోహిత్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. స్థానిక పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. సిద్దరామయ్యది తుగ్లక్ దర్బార్● ముస్లిం రిజర్వేషన్లను ఒప్పుకోం: విజయేంద్ర శివాజీనగర: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును మంగళవారం శాసనసభలో దొంగిలించి, దాచిపెట్టి, ప్రవేశపెట్టిందని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, ఎమ్మెల్యే బీ.వై.విజయేంద్ర ఆరోపించారు. ముస్లింలకు ప్రభుత్వ పనుల్లో 4 శాతం రిజర్వేషన్ను ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తామని తెలిపారు. బుధవారం విధానసౌధ ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాల కళ్లుకప్పి సభలో బిల్లును ప్రవేశపెట్టారు. సిద్దరామయ్య ప్రభుత్వ తుగ్లక్ దర్బార్ను బీజేపీ వ్యతిరేకిస్తుందని ప్రకటించారు. సభలోను, బయట రిజర్వేషన్లను మేం వ్యతిరేకిస్తున్నాం. అవసరమైతే హైకోర్టులో కేసు వేస్తామని తెలిపారు. కాంగ్రెస్ దుష్టపరిపాలనకు పరిమితి లేకుండా పోయింది. కాంగ్రెస్వారు మైనారిటీల మెప్పు కోసం సిద్ధమయ్యారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత పరిపాలించిన కాలంలో అల్పసంఖ్యాకులను ఎందుకు అభివృద్ధి చేయలేదని ధ్వజమెత్తారు. తాము ముస్లింకు వ్యతిరేకులు కాదన్నారు. ఎయిర్పోర్టులో 3 కేజీల కొకై న్ సీజ్ బనశంకరి: బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ దొరికాయి. ఆఫ్రికాలోని ఘనా దేశానికి చెందిన జెన్నిఫర్ అబ్బే అనే మహిళను బుధవారం అరెస్ట్ చేసి 3.2 కేజీల కొకై న్ ను స్వాధీనం చేసుకున్నారు. ఖతార్లోని దోహ నుంచి విమానంలో ఆమె వచ్చింది. అనుమానంతో డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకుని తనిఖీలు చేపట్టగా కొకైన్ లభించింది. ఇది విలువ మార్కెట్లో రూ.38 కోట్లు చేస్తుందని డీఆర్ఐ అధికారులు తెలిపారు. అరెస్టు చేసి విచారణ చేపట్టారు. రూ.100 కోట్ల బీడీఏ భూ స్కాం బనశంకరి: వంద కోట్ల రూపాయలకు పైగా విలువచేసే బెంగళూరు అభివృద్ధి ప్రాధికార (బీడీఏ) స్థలాన్ని కొందరు అవినీతి అధికారులు, ప్రముఖ బిల్డర్ పేరుతో రిజిస్ట్రేషన్ చేశారని బీజేపీ నేత ఎన్ఆర్.రమేశ్ చెప్పారు. బెంగళూరు జయనగర మొదటిబ్లాక్లోని సిద్దాపుర గ్రామ సర్వే నంబరు 27,3లో 30 గుంటలు (ముక్కాలు ఎకరా) బీడీఏకి చెందినదే. కానీ బీడీఏ అధికారులు కుమ్మకై ్క అశోక్ దారివాల్ అనే ప్రముఖ బిల్డర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ భూమి విలువ వంద కోట్ల రూపాయలని చెప్పారు. తక్షణం భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, అతనికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ మంత్రి కృష్ణబైరేగౌడ, బీడీఏ కమిషనర్ జైరామ్ను డిమాండ్ చేశారు. దసరా ఏనుగు రోహిత్ పరారీ ● బండీపుర అడవిలో ఘటన మైసూరు: చామరాజనగర జిల్లా గుండ్లుపేటె తాలూకా బండీపుర పులి అభయారణ్యంలో పెంపుడు ఏనుగు రోహిత్ రెచ్చిపోయి మావటీలపైనే దాడి చేసింది. జాతీయ రహదారిలో దూకుడుగా ప్రవర్తించడంతో వాహన చోదకులు భయభ్రాంతులకు గురయ్యారు. బుధవారం ఏనుగును నడిపిస్తూ వెళ్తుండగా గట్టిగా ఘీంకరిస్తూ మావటీలు పార్థసారధి, వెంకటేష్లపై దాడి జరిపి గాయపరిచింది. దారిలో వెళ్తున్న వాహనదారుల మీదకు దూసుకెళ్లింది. దానిని ఆపేవారు ఎవరూ లేకపోవడంతో అడవిలోకి పారిపోయింది. గతంలో ఈ ఏనుగును మైసూరు ఉత్సవాల కోసం తీసుకొచ్చారు. కాగా, రోహిత్ కోసం గాలిస్తున్నామని, మదం వచ్చి అలా ప్రవర్తించిందని బండీపుర ఏసీఎఫ్ నవీన్కుమార్ అన్నారు. గతంలో ఈ ఏనుగు రాంపుర శిబిరంలో ఉండేది. అయితే ప్రత్యేక శిక్షణ కోసమని బండీపుర శిబిరానికి తీసుకొచ్చారు. -
రన్యరావు బెయిలు అర్జీ వాయిదా
బనశంకరి: బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్టులో 14 కేజీలకు పైగా బంగారాన్ని తరలిస్తూ పట్టుబడిన నటి రన్య రావు బెయిలుపై ఉత్కంఠ కొనసాగుతోంది. 3వ తేదీన ఆమె అరెస్టు కాగా డీఆర్ఐ విచారణ తరువాత పరప్పన అగ్రహార జైలులో రిమాండులో ఉంద.ఇ రన్య బెయిల్ పిటిషన్పై బుధవారం ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. డీఆర్ఐ వకీలు అభ్యంతరాలు తెలియజేయడానికి సమయం కావాలని మనవిచేశారు. కోర్టు అనుమతి ఇస్తూ 21 తేదీకి విచారణను వాయిదా వేసింది. తరుణ్రాజు బెయిలుకు నో రన్యరావు బంగారం స్మగ్లింగ్ కేసులో పట్టుబడిన రెండో నిందితుడు, పారిశ్రామికవేత్త తరుణ్రాజు బెయిల్ పిటిషన్ను ఆర్థిక నేరాల ప్రత్యేకకోర్టు కొట్టివేసింది. రన్యను విచారించిన తరువాత డీఆర్ఐ.. తరుణ్రాజును అరెస్టు చేసింది. ఆహారం సురక్షితమేనా? ● బెంగళూరులో అధికారుల తనిఖీలు యశవంతపుర: బెంగళూరులో వివిధ ఆహార షాపుల్లో ఆహారశాఖ అధికారులు దాడులు చేశారు. వాటిలో అమ్ముతున్న అహార పదార్థాల నాణ్యతలను పరిశీలించారు. మల్లేశ్వరంలోని వివిధ మార్ట్లలో ఫుడ్ షాపుల్లో సోదాలు చేశారు. అవధి ముగిసిన ఆహార పదార్థాలను సీజ్ చేశారు. వంట నూనె అంగళ్ళలో తనిఖీలు చేశారు. ఓ షాపులో కోడిగుడ్డును పగలకొట్టి చూడగా నాణ్యత లేదని వెల్లడైంది. గడువు మీరిన సాస్, ఊరగాయ, స్వీట్ ప్యాకెట్, పరోటా, సమోసా, పన్నీరు, చాక్లెట్లు ఉండడంతో నిర్వాహకులకు నోటీసులిచ్చారు. కొన్ని బేకరీలలో కేక్లు, ఇతర ఉత్పత్తులను తనిఖీలు చేశారు. ఆరోగ్యానికి హానికరంగా ఉండే రంగులను వాడారా అనేది పరిశీలన చేశారు. ఈ విషయంలో అమ్మాస్ బేకరీకి నోటీసులిచ్చారు. ఉత్తర కర్ణాటక వంటకాలను అమ్మే షాపులలోనూ సోదాలు కొనసాగాయి. పలు షాపుల నుంచి ఆహార శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపుతున్నట్లు అధికారులు తెలిపారు. నివేదిక వచ్చిన తరువాత తినడానికి మంచిదో, చెడ్డతో తెలుస్తుందని చెప్పారు. ఆర్టీసీ బస్సు దగ్ధం దొడ్డబళ్లాపురం: వెళుతున్న బస్సులో మంటలు చెలరేగి కాలిపోయిన సంఘటన బీదర్ జిల్లా ఔరాద్ తాలూకా కప్పికేరి క్రాస్లో చోటుచేసుకుంది. ఔరాద్ డిపోకు చెందిన బస్సు బీదర్ నుంచి ఔరాద్కు వెళ్తోంది. దారిలో ఓచోట బస్సు ఇంజిన్లో నుంచి హఠాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్, కండక్టర్ బస్సులోని ప్రయాణికులను కిందకు దించేశారు. బస్సు నుంచి దట్టమైన పొగ ఆవహించింది. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు. ప్రమాదాన్ని చూసి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. గూడ్స్ వ్యాన్ బీభత్సం ● ఇద్దరు దుర్మరణం కృష్ణరాజపురం: బెంగళూరు గ్రామీణ జిల్లాలోని హొసకోటె తాలూకా జడిగేనహళ్లి వద్ద నూతన చైన్నె ఎక్స్ప్రెస్ హైవేలో రోడ్డు ప్రమాదం జరిగింది. గూడ్స్ వ్యాన్, ద్విచక్రవాహనాన్ని ఢీకొని ఈడ్చుకుని వెళ్లడంతో ఇద్దరు బలయ్యారు. హొసకోటెకు చెందిన ఖాదర్ మొహిద్దీన్ (45), రాజా(42)లు స్థానికంగా చిన్న వ్యాపారం చేసుకునేవారు. పనిమీద టీవీఎస్ మోపెడ్పై వెళ్తుండగా వేగంగా దూసుకొచ్చిన గూడ్స్ వ్యాన్ వారిని ఢీకొని కొంతదూరం ఈడ్చుకుపోయింది. దీంతో ఖాదర్, రాజాల శరీరాలు ఛిద్రమయ్యాయి. హైవేలో దూరదూరంగా పడిపోయాయి. స్థలానికి హొసకోటె పోలీసులు చేరుకుని పరిశీలించారు. గూడ్స్ వ్యాన్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిసింది. -
పుష్ప పల్లకీలో గోవిందుడు
కెజీఎఫ్: కోలారు జిల్లా కేజీఎఫ్ పట్టణంలోని ఇతిహాస ప్రసిద్ధ శ్రీ ప్రసన్న లక్ష్మీ వెంకటరమణస్వామి దేవాలయ 90వ సంవత్సర పుష్పపల్లకీ మహోత్సవం బుధవారం కనులపండువగా జరిగింది. మొదలియార్ సముదాయికుల ఆధ్వర్యంలో వేడుక సాగింది. నగర వీధుల గుండా 15 గంటల పాటు పుష్ప పల్లకీ ఊరేగింపు సాగింది. పల్లకీ వాహనాన్ని మల్లెలు, కనకాంబరాలు తదితర పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. 5 నుంచి 6 టన్నుల పూలను ఉపయోగించారు. భక్తుల గోవిందనామ స్మరణ మధ్యన ఊరేగింపు సాగింది. పొరుగున ఉన్న ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. కేజీఎఫ్లో సంభ్రమం -
ఖాళీగా ఇందిరా క్యాంటీన్
● ఆరా తీసిన ఉప లోకాయుక్త శివమొగ్గ: శివమొగ్గ నగరంలో బుధవారం ఉదయం ఉప లోకాయుక్త జస్టిస్ కేఎన్ ఫణీంద్ర పలు చోట్ల ఆకస్మిక తనిఖీలు చేశారు. అక్కడక్కడ నెలకొన్న అవ్యవస్థను చూసి అధికారులపై మండిపడ్డారు. అలసత్వం ఇలాగే కొనసాగితే మీపై కేసులు పెడతానని హెచ్చరించారు. మహాత్మాగాంధీ పార్కులో నిర్లక్ష్యం మేట వేసిందని, తక్షణం ప్రజలకు మౌలిక వసతులను కల్పించాలని పాలికె కమిషనర్కు సూచించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి లోకాయుక్త డీఎస్పీ పార్కును పరిశీలిస్తారని, పురోగతి లేకపోతే కమిషనర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లపై కేసులు పెడతామని చెప్పారు. బీహెచ్ రోడ్డులోని ఇందిరా క్యాంటీన్కు వెళ్లారు. చవక ధరలకు టిఫిన్లు, భోజనాలు అందించే అక్కడ జనం లేకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. ఆహార నాణ్యత బాగుందా లేదా అని ఓ వినియోగదారును ఆరా తీశారు. రాజేంద్రనగర బడావణె గుండా పారుతున్న తుంగా కాలువ మురుగుతో నిండి ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తనిఖీలతో అధికారుల్లో వణుకు పుట్టించాయి. -
ఉచితాలు వనితలకేనా..
కృష్ణప్ప మాట్లాడుతూ, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు నెలకు 2 వేలు, తిరిగేందుకు బస్సు ఫ్రీ ఇచ్చింది. ఇస్తున్నది ఖజానా సొమ్మే కదా? మహిళలకు సంతోషం కలిగించినట్లుగానే, పురుషులకు కూడా వారానికి రెండు మద్యం బాటిళ్లను ఉచితంగా ఇవ్వండి, సొసైటీల ద్వారా పంపిణీ చేయాలి అని డిమాండ్ చేశారు. అంతేకాకుండగా రాష్ట్ర ప్రభుత్వం ఎకై ్సజ్ శాఖకు మద్యం అమ్మకాల లక్ష్యాన్ని పెంచి, ఎకై ్సజ్ ఆదాయాన్ని ఏడాదికి రూ. 40 వేల కోట్లకు పెంచాలనడం పాపపు పని కాదా? అని ప్రశ్నించారు. మహిళలకు ఉచితంగా ఇచ్చి, పురుషుల నుంచి లాక్కోవటం తప్పు కాదా? సంపూర్ణ మద్య నిషేధం అమలు ఎందుకు సాధ్యపడదు? అని తీవ్రంగా వాద–ప్రతివాదనలు జరిగాయి. -
గంధాభిషేక జాతరకు శ్రీకారం
హుబ్లీ: జిల్లాలోని నవలగుంద తాలూకా యమనూరు గ్రామంలో రాజా బాగసావర సాంగదేవ జాతర గంధాభిషేకం సందర్భంగా మహారాష్ట్రకు చెందిన సాధువులు ఆలయం నుంచి ప్రదర్శన ద్వారా బెన్నిహళ్ల వాగుకు వెళ్లి పూజలు జరిపి అక్కడి నుంచి నీటిని తెచ్చి దీపాన్ని వెలిగించారు. గంధాభిషేకం జాతరకు నవలగుంద ఎమ్మెల్యే ఎన్హెచ్ కోనరెడ్డి శ్రీకారం చుట్టారు. బెన్నిహళ్ల వాగుకు మెట్ల నిర్మాణంతో పాటు తొలిదశలో రూ.12 కోట్ల వ్యయంతో అభివృద్ధి పరచడానికి ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. టీపీ ఈఓ, యమనూరు పీడీఓ భాగ్యశ్రీ జాగీర్దార్, సీఐ రవి, ఎస్ఐ జనార్ధన్, ఆలయ పెద్దలు వినోద్రావ్ బర్గే, దత్తాజిరావ్ బర్గే, సురేష్రావ్ బర్గే తదితరులు పాల్గొన్నారు. ఈ జాతర హిందు, ముస్లిం సామరస్యానికి ప్రతీకగా ప్రతి ఏటా భారీ సంఖ్యలో భక్తుల సమక్షంలో జరుగుతోంది. వివిధ చోట్ల నుంచి పాదయాత్ర ద్వారా వచ్చే భక్తులు బెన్నిహళ్ల జలాశయంలో స్నానం చేస్తే పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. -
అగ్నిప్రమాదంలో దుకాణం బుగ్గి
హొసపేటె: గంగావతిలో బుధవారం ఉదయం అక్కడి కొప్పళ రోడ్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక వాణిజ్య దుకాణంలో మంటలు చెలరేగి దాదాపు రూ.కోటిన్నర విలువైన వస్తువులు దగ్ధమయ్యాయి. కొప్పళ రోడ్డులోని సీబీఎస్ సర్కిల్ సమీపంలోని పాత పాన్ షాపు సమీపంలో ఈ సంఘటన జరిగింది. దాదాపీర్కు చెందిన దుకాణంలో రైతులకు కొత్త జనరేటర్లు, వ్యవసాయ యంత్రాలు, ఇతర ఉపయోగకరమైన పరికరాలను విక్రయిస్తారు. అమ్మకాలు, మరమ్మతు(అమ్మకాలు, సేవ)ల కోసం ఉంచిన ఈ దుకాణంలో అమ్మకానికి కొత్త జనరేటర్లు ఉన్నాయి. అరగంట తర్వాత యజమానికి సమాచారం అందింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా తలెత్తిన మంటలతో దుకాణం నుంచి పొగలు వస్తున్నట్లు గమనించిన స్థానికులు వెంటనే యజమానికి తెలిపారు. దాదాపీర్ స్థలానికి చేరుకునే సమయానికి దుకాణంలోని చాలా వస్తువులు మంటల్లో కాలి పోయాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. దుకాణంలోని కొత్త పరికరాలు, రైతులు మరమ్మతు కోసం ఇచ్చిన వ్యవసాయ పనిముట్లు చాలా వరకు కాలిపోయాయి. ఘటనపై అక్కడి టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
రేపటి నుంచి టెన్త్ వార్షిక పరీక్షలు
హొసపేటె: విజయనగర జిల్లాలో పారదర్శకంగా టెన్త్ పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లాధికారి ఎంఎస్ దివాకర్ తెలిపారు. బుధవారం నగరంలోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్న ఎస్ఎస్ఎల్సీ వార్షిక పరీక్షల్లో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా గట్టి పోలీసు భద్రత కల్పించామన్నారు. నియమాలను పాటిస్తూ పరీక్షలను క్రమశిక్షణతో నిర్వహించాలని అధికారులను ఆదేశించామన్నారు. జిల్లాలో మొత్తం 71 పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక సౌకర్యాలు కల్పించామన్నారు. ఈ సారి వార్షిక పరీక్షకు 21,429 మంది కొత్త విద్యార్థులు, 1,271 మంది రిపీటర్లు, ప్రైవేట్ అభ్యర్థులతో సహా మొత్తం 22,700 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావడాన్ని నిషేధించినట్లు తెలిపారు. డీడీపీఐ కార్యాలయ అధికారి హులిబండి, బీఈఓ చెన్నబసప్ప తదితరులు పాల్గొన్నారు. -
కారు, బైక్ ఢీ.. ఇద్దరు మృతి
సాక్షి,బళ్లారి: యాదగిరి జిల్లాలో కారు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మంగళవారం రాత్రి యాదగిరి జిల్లా సురపుర తాలూకా చామనాళ్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంలో వెళుతుండగా ఎదురుగా కారు అతి వేగంగా రాగా ముఖాముఖి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడి పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై సురపుర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మాకు ప్రాణ రక్షణ కల్పించండి రాయచూరు రూరల్: మాజీ నగరసభ సభ్యుడి నుంచి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని దాడికి గురైన కుటుంబం జిల్లా ఎస్పీకి మొర పెట్టుకుంది. మంగళవారం రాత్రి దేవినగర్లో పునీత్ రాజ్కుమార్ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమాలను వాట్సప్లో అప్లోడ్ చేయడాన్ని తొలగించాలని మహేష్ అనే యువకుడికి 28వ వార్డు మాజీ కౌన్సిలర్ తిమ్మారెడ్డి, భార్య కవిత, కొడుకు సంతోష్లు మహేష్ ఇంటికెళ్లి దాడి చేశారు. ఈ విషయంపై బుధవారం బాధితుడు ఎస్పీ పుట్టమాదయ్యకు ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్లో ఇస్పేట్ జూదం ● ఐదుగురు రక్షక భటుల సస్పెండ్ రాయచూరు రూరల్: సమాజంలో అనైతిక కార్యకలాపాలు, మట్కా, జూదం వంటి వాటిని అణగదొక్కాల్సిన రక్షక భటులే పోలీస్ స్టేషన్లో ఇస్పేట్ జూదం ఆడిన ఘటన కలబుర్గి జిల్లాలో చోటు చేసుకుంది. కలబుర్గి జిల్లా చిత్తాపుర తాలూకా వాడి పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ మహ్మద్ మియా, హెడ్ కానిస్టేబుళ్లు నాగరాజ్, సాయిబణ్ణ, ఇమామ్, పోలీస్ కానిస్టేబుల్ నాగభూషణ్లు రాత్రి వేళ స్టేషన్లో పేకాట ఆడుతూ కూర్చున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. కలబుర్గి జిల్లా ఎస్పీ శ్రీనివాసులు వాడి పోలీస్ స్టేషన్ ఎస్ఐ తిరుమలేష్కు నోటీసులు జారీ చేశారు. బుధవారం ఎస్పీ శ్రీనివాసులు, ఏఎస్ఐ మహ్మద్ మియా, హెడ్ కానిస్టేబుళ్లు నాగరాజ్, సాయిబణ్ణ, ఇమామ్, పోలీస్ కానిస్టేబుల్ నాగభూషణ్లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
శ్రీశైలానికి భక్తుల పాదయాత్రలు షురూ
రాయచూరు రూరల్: ఉగాది పండుగ సందర్భంగా శ్రీశైలం వెళ్లే కర్ణాటక భక్తుల పాదయాత్రలు ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి బాగల్కోటె, విజయపుర, జమఖండి, గదగ్, ధార్వాడ, హునగుంద, ఇలకల్ ప్రాంతాలకు చెందిన భక్త సమూహం వివిధ మార్గాల్లో మార్చి 18 నుంచి ఏప్రిల్ 1 వరకు 15 రోజుల పాటు ఏ రహదారిలో చూసినా మల్లయ్య భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు పాదయాత్రలకు అంకురార్పణ గావించారు. మల్లయ్య విగ్రహాన్ని మోసుకొని కాలి నడకలు, కొంత మంది యువకులు కాళ్లకు కర్రలు కట్టుకొని నడవడం వంటి దృశ్యాలు కనిపించాయి. బాగల్కోటె నుంచి శ్రీశైలానికి సుమారు 650 కిమీల పాదయాత్ర చేపట్టి ప్రతి రోజు తెల్లవారు జామున 3 గంటలకు ప్రారంభమైన పాదయ్రాతలు ఉదయం 11 గంటలకు, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కొనసాగిస్తారు. -
విశాఖపట్నం రైళ్లను రాయచూరు వరకు పొడిగించరూ
రాయచూరు రూరల్: విశాఖపట్నం నుంచి విజయవాడ, హైదరాబాద్ మీదుగా మహబూబ్నగర్ వరకు నడుస్తున్న రైళ్లను రాయచూరు వరకు పొడిగించాలని జిల్లా కమ్మ వారి సంఘం డిమాండ్ చేసింది. బుధవారం నగరంలోని రైల్వే స్టేషన్లో దక్షిణ మధ్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్కు కమ్మ వారి సంఘం అధ్యక్షుడు బి.ప్రసాద్ వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. రాయచూరు జిల్లాలో కృష్ణా, గోదావరి జిల్లాలకు చెందిన ప్రవాసాంధ్రులు అధికంగా నివసిస్తున్నందున ఆ ప్రయాణికుల సౌకర్యార్థం రైళ్లను పొడిగించాలని కోరారు. మంత్రాలయం–మచిలీపట్నం, మంత్రాలయం–కాకినాడ రైళ్లను కూడా రాయచూరు వరకు పొడిగించాలన్నారు. పెండింగ్లో ఉన్న సింధనూరు–రాయచూరు, గదగ్–వాడి రైల్వే లైన్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని విన్నవించారు. రాయచూరు నుంచి గూడ్స్షెడ్ను యరమరస్కు తరలించాలన్నారు. యశవంతపూర్ రైలును రాయచూరు మీదుగా నడపాలని, బెళగావి–మంగళూరు ఎక్స్ప్రెస్ రైళ్ల సేవలను పునఃప్రారంభించాలని కోరారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు, బసవరాజ్, హేమంత్, బాబూరావ్లున్నారు. -
వేసవి ఎండల్లో తస్మాత్ జాగ్రత్త.!
హొసపేటె: మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున, ప్రతి ఒక్కరూ ప్రతి 20 నిమిషాలకు ఒకసారి నీరు తాగడం అలవాటు చేసుకోవాలని జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్.ఎల్ఆర్ శంకరనాయక్ సూచించారు. మంగళవారం నగరంలోని మాతా శిశు ఆస్పత్రి ఆవరణలో జిల్లా ఆరోగ్య శాఖ, స్నేహ బళగ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. అధిక వేసవి ఉష్ణోగ్రతల కారణంగా ప్రతి ఒక్కరూ నిర్జలీకరణ సమస్యను ఎదుర్కొంటారన్నారు. వేసవిలో దాహం వేయక పోయినా, ప్రజలు తరచుగా నీరు లేదా పండ్ల రసాలు తాగడం అలవాటు చేసుకోవాలన్నారు. ఇది వేసవిలో చెమట పట్టినంత మంచిది. వీలైనంత ఎక్కువ సహజ రసాలను తాగాలన్నారు. పుచ్చకాయ, నారింజ, ద్రాక్ష, పైనాపిల్, దోసకాయ, కొబ్బరి నీళ్లు, ఇంట్లో తయారు చేసిన నిమ్మరసం, మజ్జిగ, ఉప్పుతో ఆస్వాదించడం ఉత్తమం అన్నారు. ముఖ్యంగా ఎండ కారణంగా డీహైడ్రేషన్కు గురైన రోగుల కోసం ప్రభుత్వ ఉప జిల్లా ఆస్పత్రిలో ఐదు ప్రత్యేక ఎయిర్ కండిషన్డ్ పడకలను రిజర్వ్ చేశారన్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కూడా ఈ వ్యవస్థ అమలులో ఉంటుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆర్సీహెచ్ అధికారి డాక్టర్ జంబయ్య నాయక్, అంటు వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ సతీష్ చంద్ర, జిల్లా కుష్టు వ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్.రాధిక, తాలూకా ఆరోగ్య అధికారి డాక్టర్ బసవరాజ్, ఆరోగ్య పరిరక్షణ కమిటీ సభ్యులు యోగలక్ష్మి, వెంకటేష్, గుండి రాఘవేంద్ర, హనుమంతరెడ్డి, ఫాతిమాబీ, జిల్లా ఆరోగ్య విద్య అధికారి ఎంపీ దొడ్డమని తదితరులు పాల్గొన్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను విస్మరించవద్దు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి నీరు తాగాలి చలివేంద్రం ప్రారంభించిన డీహెచ్ఓ తదితరులు -
ఎయిమ్స్ ఏర్పాటుపై రాజకీయం తగదు
రాయచూరు రూరల్: రాయచూరులో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) ఏర్పాటు విషయంలో రాజకీయాలు చేయడం తగదని ఎయిమ్స్ పోరాట సమితి సంచాలకుడు అశోక్ కుమార్ జైన్ పేర్కొన్నారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొండి చెయ్యి చూపడాన్ని తప్పుబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్, దేశంలో బీజేపీ సర్కార్లు కలిసి రాయచూరులో మహాత్మ గాంధీ మైదానంలో చేపట్టిన ఆందోళన 1042 రోజుకు చేరిందన్నారు. రాజకీయ నాయకుల చిత్తశుద్ధి లోపంతో పాటు మంజూరుకు అడ్డు తగులుతున్నారని ఆరోపించారు. తేనెటీగల దాడిలో ఒకరు మృతి● మరొకరి పరిస్థితి విషమం హుబ్లీ: ఫోటో తీసుకుంటుండగా తేనెటీగలు దాడి చేయడంతో ఓ యువకుడు మృతి చెందాడు. హుబ్లీ నుంచి గోకర్ణకు వెళుతున్న నలుగురు మిత్రులు అంకోలా తాలూకా హొసకంబి వంతెన వద్ద తమ కారును నిలిపి ఫోటో తీసుకోవడానికి ప్రయత్నించారు. ఆసమయంలో ఆకస్మికంగా తేనెటీగలు దాడి చేశాయి. ఒక కి.మీ. దూరం వరకు పరుగెత్తినా తేనెటీగలు వెంటాడాయి. ఈక్రమంలో దూరంలో ఉన్న కారును తెచ్చి చికిత్స కోసం ఆస్పత్రికి వెతుక్కుంటూ ఎలాగోలా ఆ రాత్రి వేళ ప్రైవేట్ ఆస్పత్రికి చేరారు. ఇంతలో వారిలో ఒకరు హుబ్లీకి చెందిన ఆదర్శ్ కళసూర మృతి చెందాడు. మిగిలిన ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం కుమటా ఆస్పత్రికి తరలించారు. గోకర్ణ సీఐ శ్రీధర్, ఎస్ఐ ఖాదర్ బాషా తమ సిబ్బందితో కలిసి ఆస్పత్రికి వెళ్లి తేనెటీగల దాడి బాధితులను పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం రాయచూరు రూరల్: నగరంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడిని రైల్వే స్టేషన్ రోడ్డులో ద్విచక్రవాహనం మీద వెళుతున్న ఉత్తర ప్రదేశ్కు చెందిన సురేష్ కుమార్(30)గా పోలీసులు గుర్తించారు. స్టేషన్ నుంచి అంబేడ్కర్ సర్కిల్కు వెళుతున్న సురేష్ కుమార్ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించినట్లు సీఐ మేకా నాగరాజ్ వెల్లడించారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించి లారీ డ్రైవర్ను అరెస్ట్ చేశామన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. 24న అప్రెంటిస్షిప్ పోస్టులకు ఇంటర్వ్యూలు హుబ్లీ: ధార్వాడ టాటా మోటర్స్ కంపెనీ ఆధ్వర్యంలో 2025లో పీయూసీ, ఆర్ట్స్, కామర్స్ పరీక్షలు రాసిన విద్యార్థులకు విద్యాగిరి జనతా విద్యా సమితి ఉత్సవ సభాభవనంలో ఈ నెల 24న ఉదయం 9.30 గంటలకు అప్రెంటిస్షిప్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. 16 నుంచి 20 ఏళ్ల వయస్సు ఉన్న 10 తరగతిలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 60 శాతం మార్కులతో పాటు గణితం, సైన్స్లలో 70 శాతం మార్కులు సాధించి ఉండాలి. అప్రెంటిస్షిప్ శిక్షణ రెండేళ్ల పాటు ఉంటుంది. ఎంపికై న అభ్యర్థులకు యూనిఫాంతో పాటు ప్రతి నెల రూ.13 వేలు స్కాలర్షిప్ అందజేస్తారు. బస్సు వసతి కూడా ఉంటుంది. ఆసక్తి గల విద్యార్థులు 7022402503 నెంబరులో సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు ఓ ప్రకటనలో కోరారు. ఏబీసీడీ వర్గీకరణకు డిమాండ్రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసి నెలలు గడిచినా ప్రభుత్వం స్పందించలేదని సాంఘీక న్యాయ ఎస్సీ ఐక్య పోరాట సమితి సంచాలకుడు రవీంద్రనాథ్ పట్టి ఆరోపించారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 30 ఏళ్ల నుంచి మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలంటూ ఆందోళనలు చేపట్టినా, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్కు వర్గీకరణ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినా మౌనం వహించడాన్ని ఖండించారు. ప్రభుత్వం నాగమోహన్ దాస్ నివేదికను తొక్కి పెట్టిందన్నారు. కుల వర్గీకరణపై మంత్రి మహదేవప్ప చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. -
వైభవంగా జయంతుల ఆచరణకు తీర్మానం
బళ్లారిటౌన్: మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్రాం, భారతరత్న, రాజ్యాంగ శిల్పి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని వైభవంగా జరుపుకోవాలని జిల్లాధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పంచాయతీ నూతన సభాంగణంలో ఏర్పాటు చేసిన ముందస్తు ఏర్పాట్ల సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. ఏప్రిల్ 5న బాబూ జగ్జీవన్రాం జయంతిని, 14న బీఆర్ అంబేడ్కర్ జయంతి ఆచరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. గత రెండేళ్లుగా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఉన్నందున మహానీయుల జయంతులను సరళంగా ఆచరించారన్నారు. అయితే ఈసారి వైభవంగా జరుపుకోవాలన్నారు. బాబూ జగ్జీవన్ రాం చర్మ పారిశ్రామిక అభివృద్ధి మండలి అధ్యక్షుడు ముండ్రగి నాగరాజ్ మాట్లాడుతూ తామందరం ఐక్యతతో జయంతులను విజయవంతం చేయాలని సూచించారు. జెడ్పీ సీఈఓ మహమ్మద్ హ్యారీస్ సుమైర్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మల్లికార్జున, ఎస్పీ శోభారాణి తదితరులు పాల్గొన్నారు. -
అధికారం కాదు, చేసిన మంచే శాశ్వతం
హొసపేటె: పట్టణంలోని చంద్రశేఖర్ ఆజాద్ థియేటర్లో సన్యాసి సేవాలాల్ స్వామీజీ 286వ పరమపూజ్య సర్దార్ సేవాలాల్ స్వామీజీ, శివప్రకాష్ మహారాజ్ స్వామీజీ, తిప్పేస్వామి మహారాజ్ స్వామీజీల సమక్షంలో జరిగిన సేవాలాల్ జయంతిని ఎమ్మెల్యే డాక్టర్ ఎన్టీ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలు, అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. తాలూకా ప్రజలకు సేవ చేయడమే ధ్యేయం అని, చేసిన మంచే శాశ్వతంగా మిగిలిపోతుందని అన్నారు. తాలూకాలోని బంజారా సమాజంలోని పేద పిల్లలు చదువుకు దూరం కాకూడదని ప్రభుత్వం బండెబసాపుర తండా, అప్పేనహళ్లి తండాల్లో నిర్మించతలపెట్టిన హైస్కూల్, హెల్త్ సెంటర్ ఏర్పాటుపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. మౌలిక సదుపాయాల కొరత గురించి తెలుసుకున్నాను. త్వరలో సొసైటీకి కమ్యూనిటీ హాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి బీ.శ్రీరాములు, పార్టీ నేతలు కుడిచి రాజీవ్, అనంతనాయక్, పీఏపీఎం అధ్యక్షుడు కావలి శివప్ప నాయక, డీఎస్పీ మల్లేశప్ప దొడ్డమని, ఎన్టీ తమ్మణ్ణ, ఎం.వాసుదేవనాయుడు, శ్రీకంఠపుర వెంకటేష్ నాయక్, శిరహట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
హుబ్లీ–తిరుపతి రైలు పునః ప్రారంభం
హొసపేటె: మహా కుంభమేళా అనంతరం హుబ్లీ–తిరుపతి రైలు (నెంబర్: 57401/57402)ను మూడు నెలల తర్వాత మార్చి 17 నుంచి పునః ప్రారంభించడం సంతోషకరమని విజయనగర రైల్వే అభివృద్ధి కార్యాచరణ సమితి అధ్యక్షుడు వై.యమునేష్, కార్యదర్శి కే.మహేష్ పేర్కొన్నారు. వారు విలేకరులతో మాట్లాడుతూ బెళగావి–హైదరాబాద్– మణుగూరు రైలు (నెంబర్: 07335/07336)ను కూడా సత్వరం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. హుబ్లీ–తిరుపతి రైలు హుబ్లీ నుంచి బయలుదేరి ఉదయం 6 గంటలకు గదగ్ మీదుగా హొసపేటెకు ఉదయం 9 గంటలకు చేరుకుంటుందన్నారు. ఆపై బళ్లారి, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, కడప మీదుగా రాత్రికి తిరుపతికి చేరుతుందన్నారు. తిరుపతి నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి సాయంత్రం 5:20 గంటలకు హొసపేటెకు చేరుకుని రాత్రి 9:30 గంటలకు హుబ్లీకి చేరుకుంటుందన్నారు. ఈ రైలు ప్రయాణికులకు హొసపేటె నుంచి హుబ్లీకి రూ.35, హొసపేటె నుంచి బళ్లారికి రూ.20, గుంతకల్కి రూ.35, తిరుపతికి రూ.85 చొప్పున అతి తక్కువ ఛార్జీల సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం రైళ్ల రాకపోకలు, ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు సకాలంలో అందేలా రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలని సమితి సభ్యులు కోరారు. -
నగరాభివృద్ధి ప్రతిపాదనలకు ఆమోదం
రాయచూరు రూరల్: రాయచూరు సిటీ కార్పొరేషన్ పరిధిలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని మహాత్మ గాంధీ వికాస పథకం కింద నగరాభివృద్ధికి రూ.200 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలకు సామాన్య సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించారు. మంగళవారం కార్పొరేషన్ భవనంలో మేయర్ నరసమ్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సామాన్య సమావేశంలో విపక్ష సభ్యులు మాట్లాడారు. నగరంలో శాశ్వత పనులకు నిధుల వినియోగానికి అవకాశం ఉందని కమిషనర్ జుబీన్ మహాపాత్రో సమావేశంలో సభ్యుల దృష్టికి తెచ్చారు. నగరంలో ప్రధాన రోడ్లు, ఉద్యానవనాలు, పైపులైన్లు, ఇతర ప్రధాన పనులకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వార్డులకు రూ.48 కోట్ల నిధులు కేటాయించామన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు, సర్కిల్ అభివృద్ధి వంటి వాటికి ప్రాధాన్యత ఉందన్నారు. నగరంలో పారిశుధ్యం, మురుగు కాలువల శుభ్రం, ఇతర పనులను చేయడానికి బీజేపీ కార్పొరేటర్లు నాగరాజ్, శరణ బసవ శశిరాజ్కు మద్దతు పలికారు. తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చర్యలు చేపట్టాలన్నారు. సభ్యుల పదవీ కాలం ముగుస్తున్నా వాటిపై మౌనం వహించడం తగదన్నారు. సభ్యులను దూరం పెట్టి ప్రతి పాదనలు సిద్ధం చేయడం సబబా అని కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. సమావేశంలో ఉప మేయర్ సాజిద్ సమీర్, సభ్యులు జయన్న, పవన్, రత్న ప్రశాంతి, లక్ష్మి, సరోజమ్మ, జిందప్ప నాగరాజ్లున్నారు. సభ్యులను దూరం పెట్టి ప్రతిపాదనలా? కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం వాడీవేడిగా కార్పొరేషన్ సామాన్య సమావేశం -
వాణిజ్య నగరిలో రంగపంచమి జోరు
హుబ్లీ: డీజే శబ్దాల హోరు మధ్య రైన్ డ్యాన్స్తో హోలీ రంగపంచమి వేడుకలను జంట నగరాల ప్రజలు ముఖ్యంగా యువత, చిన్నారులు ఘనంగా జరుపుకున్నారు. పోలీస్ కమిషనర్ శశికుమార్ గత రెండు రోజుల నుంచి పంచమి నేపథ్యంలో భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేసిన క్రమంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. బిన్నాళ క్రాస్ శక్తినగర్లోని మైత్రి మద్య వ్యసనపరుల పునర్వసతి కేంద్రం ఉద్యోగులు ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగరాజ్, సీనియర్ ఉద్యోగి హుస్సేన్సాబ్, మంజునాథ, ఇతర సిబ్బంది హోలీ ఆచరించారు. సుయతీంద్ర తీర్థుల పుణ్యారాధన రాయచూరు రూరల్: మంత్రాలయంలో గురు రాఘవేంద్రుల పూర్వ పీఠాధిపతి సుయతీంద్ర తీర్థుల పుణ్యారాధన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో మూల విరాట్్కు పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగల్ ప్రత్యేక పూజలు చేశారు. సుయతీంద్ర తీర్థుల 12వ వర్ధంతి స్మరణోత్సవ వేడుకల్లో వందలాది భక్తుల సమక్షంలో వెండి రథోత్సవం జరిపారు. జోడు రథం నిర్మాణానికి విరాళం హొసపేటె: మత సామరస్యానికి నిదర్శనంగా తాలూకాలోని మరియమ్మనహళ్లి పట్టణంలోని ఆరాధ్య దైవం లక్ష్మీ నారాయణ స్వామి, ఆంజనేయ స్వామి జంట రథాల నిర్మాణానికి పట్టణంలోని ముస్లిం సంఘం మంగళవారం విరాళం అందించింది. ఉభయ స్వామి వారి రథాల నిర్మాణానికి ఆలయ అభివృద్ధి కమిటీకి రూ.2,80,150 విరాళంగా అందించి ఇక్కడి ముస్లిం సమాజం కూడా చిత్తశుద్ధి చూపింది. రథాలు శిథిలావస్థకు చేరుకోవడంతో ఆలయ అభివృద్ధి కమిటీ జోడు రథాల నిర్మాణం, ఆలయ పునరుద్ధరణ చేపట్టడంతో భక్తుల నుంచి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో స్నేహానికి, ప్రేమకు, సామరస్యానికి ప్రతీకగా ముస్లిం సమాజం చేయి చేయి కలిపింది. ఈ సందర్భంగా సంఘం నాయకులు ఎన్ఎస్ బుడేన్ సాబ్, ఆలయ అభివృద్ధి కమిటీ చిద్రీష్టేష్, గోవింద పరశురామ, జి.సత్యనారాయణశెట్టి, విశ్వనాథ్, రెడ్డి మాబుసాబ్, ఖాజా మోదీన్, హొన్నూరలీ, ఐ.పరమేశ్వరప్ప పాల్గొన్నారు. వచనకారుల సేవలు అపారం బళ్లారిఅర్బన్: భావైక్యతకు కన్నడ తత్వ వచనకారుల సేవలు అపారం అని ప్రముఖ లెక్చరర్ బకాడే పంపాపతి తెలిపారు. జిల్లా కన్నడ సాహిత్య పరిషత్, బళ్లారి రాయల్ విద్యా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివంగత సంగనకల్లు శాంతమ్మ ట్రస్ట్, కప్పగల్ నబీసాబ్, హొన్నూరమ్మ స్మారక కార్యక్రమాల్లో ఆయన శిషునాళ షరీఫ్ తత్వ పదాల్లోని భావైక్యత గురించి ప్రత్యేకంగా ప్రసంగించారు. తత్వ పదకారుల భావైక్యత ఆశయాలు నేటి కాలానికి చాలా అవసరం అన్నారు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఫర్జానాబేగం మాట్లాడుతూ తమ విద్యా సంస్థ అకడమిక్ కార్యక్రమాలతో పాటు విద్యార్థుల మనోవికాసానికి అవసరమైన నైతిక జీవితపు బోధన ఇస్తామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన భావగీతాలు, వ్యాసరచన పోటీల విజేతలకు అతిథులు బహుమతులను ప్రదానం చేశారు. ప్రముఖ లెక్చరర్ మల్లికార్జున ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ప్రముఖులు హుస్సేన్సాబ్, రాజశేఖర్, సిద్మల్ మంజునాథ్, కాశీనాథ్, ఉమాదేవి, చంద్రశేఖర్ ఆచారి, మంజునాథ్ గోవిందవాడ, దాతలు కప్పగల్ రసూల్ సాబ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆఫీసుకు బాంబు బెదిరింపు ●● ఓ యువకుడు అరెస్ట్ సాక్షి, బళ్లారి: బళ్లారి నగర ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి కార్యాలయంలో బాంబు పెట్టినట్లు బెదిరింపు కాల్ రావడం కలకలం సృష్టించింది. నగరంలోని రూపనగుడి రోడ్డులో నివాసం ఉంటున్న సంతోష్ అనే యువకుడు సిటీ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి కార్యాలయంలో బాంబు ఉంచినట్లు సోమవారం రాత్రి వాట్సాప్ గ్రూప్లో పోస్టును ఎమ్మెల్యే మొబైల్కు చేరవేశాడు. దీంతో ఎమ్మెల్యే తక్షణం నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్కు బాంబు బెదిరింపు కాల్పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి వాట్సాప్ గ్రూప్లో బాంబు బెదిరింపు చేసిన యువకుడిని అరెస్ట్ చేశారు. తాగిన మైకంలో ఎమ్మెల్యే వాట్సాప్ గ్రూప్నకు బాంబు బెదిరింపు చేసినట్లు పోలీస్ విచారణలో తేలింది. అయితే ఈ ఘటనను పోలీసులు సీరియస్గా తీసుకొని యువకుడిని మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. -
యువతకు స్పూర్తి పునీత్
బళ్లారిఅర్బన్: పునీత్ రాజ్కుమార్ చిరుప్రాయంలోనే తన ప్రతిభా పాటవాలతో అపూర్వ ప్రజాదరణ సాధించి నిరాశ్రయులకు, నిరుపేదలకు అనన్యమైన సేవలు అందించి అప్పుగా కీర్తి గడించారని కర్ణాటక రక్షణ వేదిక శివరామేగౌడ వర్గం అధ్యక్షుడు రాజశేఖర్ తెలిపారు. పార్వతినగర్లోని కరవే కార్యాలయంలో పునీత్రాజ్కుమార్ జయంతిని స్ఫూర్తిదినంగా పాటించామన్నారు. పేదలపై పునీత్కు అపారమైన గౌరవం ఉండేదన్నారు. కుడిచేతితో చేసిన సహాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదనే గుణాన్ని అలవరుచుకున్న గొప్ప మానవతావాది పునీత్ రాజ్కుమార్ అని కొనియాడారు. పునీత్ సమాజ సేవ యువతకు స్పూర్తి అన్నారు. ఆయన పరోపకార గుణాన్ని ప్రతి యువకుడు తమ జీవితంలో ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రముఖులు డేవిడ్, భరమరెడ్డి, రసూల్, ప్రకాష్, బసనగౌడ, రైతు నేత సిద్దిగేరి గోవిందప్ప, హగరి ప్రభాకర్, అనిల్కుమార్ పాల్గొన్నారు. లారీ ఢీకొని బైక్ చోదకుని మృతి హుబ్లీ: బైక్, లారీల మధ్య హొయ్సళ నగర్ బ్రిడ్జి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. సుభాష్చంద్ర కోరే (56) మృతుడు. హుబ్లీ నుంచి ధార్వాడకు వెళుతున్న వేళ వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన బైక్ చోదకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలానికి ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన వెళ్లి వెంబడించి తేగూరు వద్ద డ్రైవర్ను అదుపులోకి తీసుకొని లారీని స్వాధీనం చేసుకున్నారు. -
పచ్చదనం పెంపొందించాలి
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులు పచ్చని చెట్లకు ప్రాధాన్యత కేటాయించి పరిసరాలను సంరక్షించాలని మర్చేడ్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీరేంద్ర పాటిల్ పేర్కొన్నారు. మంగళవారం తాలూకాలోని మర్చేడ్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమంలో వనసిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేసి మాట్లాడారు. భవిష్యత్తులో ఎండ నుంచి రక్షణ పొందడానికి ప్రతి ఇంటి ముందు చెట్లు పెంచి పరిసరాలను సంరక్షించాలన్నారు. ఫౌండేషన్ అధ్యక్షుడు ప్రకాష్, సురేష్, ముక్త, వీణ, రాధిక, జగదీశ్, మహబూబ్ అలీలున్నారు. సమాజంలో సీ్త్రలకూ సమాన హక్కులు రాయచూరు రూరల్: సదృఢ సమాజ నిర్మాణానికి పురుషులతో పాటు సీ్త్రలు కూడా సమానమని డయట్ కళాశాల ప్రిన్సిపాల్ ఇందిర పేర్కొన్నారు. సోమవారం కన్నడ భవనంలో సేవా జన శిక్షణ సంస్థాన, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ ప్రైజెస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సమావేశాన్ని జ్యోతి వెలిగించి మాట్లాడారు. మహిళలు విద్యా, సామాజిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు వీలుందన్నారు. సమావేశంలో సేవా జనశిక్షణ సంస్థాన అధికారి సదానంద ప్రభు, లావణ్య, జిల్లా జైలర్ అనితా హిరేమని, హుడేద్, శోభ, ఉమణ్ణ నాయక్, లక్ష్మిదేవి, కమలాక్షి, సతీష్ కుమార్లున్నారు. ప్రాథమిక విద్యే గట్టి పునాది రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో ప్రాథమిక స్థాయిలో నేర్చుకునే విద్య విద్యార్థులకు గట్టి పునాది వంటిదని జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారాం పాండే పేర్కొన్నారు. పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ, అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన చర్చాగోష్టిని జ్యోతి వెలిగించి మాట్లాడారు. పిల్లలు విద్యతో పాటు కళా, సాహిత్య, క్రీడా రంగాల్లో రాణించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. భవ్య భారత నిర్మాతలుగా రూపొందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. విద్యా శాఖాధికారులు బడిగేర, ఇందిర, శివమ్మ, గురురాజ్, ఆనంద్లున్నారు. అక్రమ కట్టడ నిర్మాణం తగదు రాయచూరు రూరల్: నగరంలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి కట్టడాల నిర్మాణాలు చేయడం తగదని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వెనుక బడిన వర్గాల ఉపాధ్యక్షుడు తలెకాయ మారెప్ప ఆరోపించారు. మంగళవారం జవహర్ నగర్ తోట బావి వద్ద అక్రమంగా షెడ్లను నిర్మించడానికి తీసుకున్న చర్యలను ఖండించారు. ఆ ప్రాంతంలో ఎలాంటి కట్టడాలు చేయరాదంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసిన కార్పొరేషన్ అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి నిర్మాణాలకు అవకాశం కల్పించడాన్ని తప్పుబట్టారు. కట్టడాల నిర్మాణాలను నిలుపుదల చేయించాలని ఒత్తిడి చేశారు. బాల కార్మికత నిర్మూలిద్దాం రాయచూరు రూరల్: సదృఢ సమాజ నిర్మాణానికి బాల కార్మికత నిర్మూలనకు పాలకుల సహకారం అవసరమని జిల్లా అదనపు జడ్జి, న్యాయ సేవా ప్రాధికార సభ్యుడు హెచ్.స్వాతిక్ పేర్కొన్నారు. సోమవారం దేవినగర్లో న్యాయ సేవా ప్రాధికార, కార్మిక శాఖ, ఎస్సీ, ఎస్టీ, సాంఘీక సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. పిల్లలు విద్యతో పాటు హక్కులు, విధులు, సమానత్వం, సామాజిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు. బాల కార్మిక శాఖాధికారులు ఆరతి, మంజునాథ్ రెడ్డి, శివప్ప, రుక్మిణి బాయి, అబ్దుల్ ఘనీలున్నారు. -
పుచ్చకాయల సాగు.. లాభాలు బాగు
హుబ్లీ: అన్నదాతలు కొత్త కొత్త ఆవిష్కారాలతో సరికొత్త రీతిలో పంటలను సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో ధార్వాడ తాలూకాలో ఓ రైతన్న పచ్చ పుచ్చకాయల సాగు చేసి లాభాలు సాధించారు. తాలూకాలోని కురుబగట్టి గ్రామానికి చెందిన మైలారప్ప గుడ్డప్పనవర అనే యువ రైతన్న పచ్చరంగు పుచ్చకాయలు పండించి 4 నుంచి 5 కేజీల తూకం ఉన్న పుచ్చకాయను జిల్లాధికారిణి దివ్యప్రభు ఎదుట ప్రదర్శించారు. క్షేత్రోత్సవంలో భాగంగా ఉద్యానవన శాఖ అధికారులు సదరు పొలంలో జిల్లాధికారి దివ్యప్రభు తదితర అధికారులతో ఈ పంట తీరును వీక్షించారు. ఓ ఎకరా పొలంలో పచ్చరంగు పుచ్చకాయతో పాటు ఎరుపు రంగు పుచ్చకాయలను కూడా సాగు చేశారు. ఆ మేరకు రూ.లక్ష చొప్పున ఎకరాకు ఖర్చు పెట్టి సుమారు రూ.3.50 లక్షల ఆదాయం గడించినట్లుగా ఆ రైతు మైలారప్ప గుడ్డప్పనవర తెలిపారు. పొలాన్ని పరిశీలించిన అధికారులు కురుబగట్టి మినహా ధార్వాడ తాలూకాలోని బాడ గ్రామ రైతు కల్లనగౌడ పాటిల్ కూడా పచ్చరంగు పుచ్చకాయ సాగు చేశారు. రైతుల ఈ వినూత్న సాగుకు జిల్లాధికారిణి దివ్యప్రభు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ వారిద్దరిని మనస్ఫూర్తిగా అభినందించారు. కురుబగట్టి మైలారప్ప పొలాన్ని పరిశీలించిన డీసీ పచ్చ రంగు పుచ్చకాయలను చూసి ఆశ్చర్యంతో పండు రుచిని కూడా చవి చూశారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త జాతి పండు సాగుకు ఉద్యానవన శాఖ సబ్సిడీ ఇస్తుందని, రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా ఒక ఎకరంలో పచ్చరంగు పుచ్చకాయలను సుమారు 10 నుంచి 15 టన్నుల వరకు దిగుబడి సాధించారు. ప్రస్తుతం ఈ పండుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కేజీకి సుమారు రూ.30 ధర పలుకుతోంది. కాగా ఈ పండు అత్యంత రుచికరంగాను, మధురంగా కూడా ఉంటోందని రైతులు తెలిపారు. పచ్చ పుచ్చ సాగుతో యువ రైతుల లాభాల బాట శభాష్ అని అభినందించిన జిల్లాధికారిణి దివ్యప్రభు -
ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వట్లేదు
శివాజీనగర: అధికారులు మమ్మల్ని గౌరవించడం లేదు, దూషిస్తున్నారు, తోసేస్తున్నారు అని పలువురు ఎమ్మెల్యేలు చట్టసభలో వాపోయారు. విధానసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కాగె, బీజేపీ ఎమ్మెల్యే బపవరాజ మత్తిమోడ్లు తమకు జరిగిన పరాభవంపై గోడు వెళ్లబోసుకోగా, సభాహక్కుల కమిటీ విచారణ జరపాలని సభాధ్యక్షుడు యూటీ ఖాదర్ ఆదేశించారు. జ్ఞానం లేదని దూషించారు: రాజు కాగె పార్టీలకతీతంగా అనేకమంది ఎమ్మెల్యేలు స్పందిస్తూ అటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముందుగా రాజు కాగె తనకు జరిగిన ఉదంతాన్ని వివరించారు. ఫిబ్రవరి 11న ప్రజా లెక్కపత్రాల కమిటీ భేటీ ముగిసిన తరువాత రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి రాజేంద్రకుమార్ కటారియా వద్దకు వెళ్లాను, నా నియోజకవర్గంలో ఓ భవనం నిర్మాణం పనుల గురించి ప్రస్తావిచాను. కటారియా స్పందిస్తూ జిల్లాధికారులకు జ్ఞానం లేదు, మీకు జ్ఞానం లేదని అవమానంగా మాట్లాడారు, నా మాటకు విలువ ఇవ్వలేదు. దురుసుతనంతో మాట్లాడారు. 25 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను. ఇంత దురుసుగా ఏ అధికారీ మాట్లాడలేదు. సర్వాఽధికార ధోరణి సరికాదు, ప్రజల పని చేయడమే అధికారి పని. ప్రజా ప్రతినిధినిని అవమానించిన అధికారికి శిక్షపడాలి. ఆయనను బదిలీ చేయాలని 60 మంది ఎమ్మెల్యేలతో సంతకం చేసి ఫిర్యాదు చేశానని చెప్పారు. జేడీఎస్ ఎమ్మెల్యే ఎం.టీ.కృష్ణప్ప మాట్లాడుతూ, రాజు ఒక్కరికే కాదు, సభలో 224 మంది ఎమ్మెల్యేలకు జరిగిన అవమానమిది. కటారియాపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా లెక్కపత్రాల కమిటీ అధ్యక్షుడైన ఎమ్మెల్యే సీసీ పాటిల్ మాట్లాడుతూ, రాజు కాగెతో కటారియా సభ్యత లేకుండా చెడు ప్రవర్తన కనబరిచారు. ఆయన మీద చర్యలు తీసుకోవాలన్నారు. పిలిపించి మాట్లాడుతా: మంత్రి అసెంబ్లీ, న్యాయశాఖ మంత్రి హెచ్కే పాటిల్ మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులు, రెవెన్యూ మంత్రి, కమిటీ అధ్యక్షులను నా కార్యాలయానికి పిలిపించి తగిన నిర్ణయం తీసుకొంటామని చెప్పారు. ఆ అధికారులకు చీవాట్లు పెట్టాలని అశోక్ కోరగా, పలువురు సభ్యులు మద్దతు పలికారు. ఎదమీద చేయి పెట్టి తోసేశారు అధికారులపై అసెంబ్లీలో ఇద్దరు సభ్యుల ఆరోపణలు పార్టీలకు అతీతంగా మద్దతు చర్యలు తీసుకోవాలని డిమాండ్ గౌరవం ఇవ్వాలి: సభాపతి సభాపతి ఖాదర్ మాట్లాడుతూ ఎమ్మెల్యేలు తమకు జరిగిన అవమానం గురించి సభలో తెలిపారు. జీతం, భత్యకంటే గౌరవం కావాలనేది ప్రజలు ఆకాంక్షిస్తారు. మాటల్లో సభ్యత లేకపోతే అధికారి ప్రవర్తనను సహించం. ప్రజా ప్రతినిధులకు గౌరవం ఇవ్వాలి. ఇది సభకు చేసిన పరాభవం. దీనిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలి, అవకాశం ఇవ్వకూడదు అని ఘాటుగా స్పందించారు. మరో ఎమ్మెల్యే బసవరాజ్ మత్తిమోడ్ మాట్లాడుతూ తమ నియోజకవర్గ పరిధిలో పురసభ ఎన్నికల సమయంలో అదనపు ఎస్పీ మహేశ్ మోఘణ్ణవర్ నన్ను తోసివేశారు. ఇద్దరు సభ్యులను కిడ్నాప్ చేసేందుకు సహకరించారు. ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వలేదు, నా ఎదపై చేయి వేసి త్రోశారు, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ జోక్యం చేసుకుని, అధికార పార్టీవారికి ఒక దెబ్బ తగిలితే, ప్రతిపక్షం వారికి రెండు దెబ్బలు తగిలాయి. అధికారులు గౌరవం ఇవ్వడం లేదంటే అసెంబ్లీ కమిటీని బంద్ చేయండి. అధికారులే రాష్ట్ర భారం తీసుకోమనండి, మేము ఎందుకు అసెంబ్లీకి రావాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ మాట్లాడుతూ బెళగావిలో లింగాయిత సమావేశం జరిగేటపుడు ఏడీజీపీ చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తించారు. అటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ అధికారులను బదిలీ చేయాలని కొందరు ఎమ్మెల్యేలు గళమెత్తారు. -
కార్కళలో రవిశాస్త్రి పూజలు
యశవంతపుర: భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ఉడుపి జిల్లా కార్కళ తాలూకా బైలూరు ఎర్లపాడి కార్వలు విష్ణుమూర్తి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. నాగపూజలు చేశారు. రవిశాస్త్రి పూర్వీకులు కార్వలుకు చెందినవారుగా చెప్పుకొంటారు. 50 ఏళ్లు క్రితం వారు ముంబయికి వెళ్లిపోయారు. 2007 నుంచి ఏటా రవిశాస్త్రి ఎర్లపాడు విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించి నాగదర్శనం చేసుకుంటూ ఉన్నారు. పంచామృత అభిషేకం, ఎళనీరు అభిషేకం తదితరాలు నిర్వహించారు. పెన్నా వివాదంపై ఢిల్లీకి వెళ్తా: డీసీఎం శివాజీనగర: పెన్నార్ నదీ జలాలు, కోలారు భాగం నుంచి తమిళనాడుకు ప్రవహిస్తున్న నీటి వివాదం గురించి కేంద్ర జలశక్తి మంత్రితో చర్చించేందుకు ఢిల్లీకి వెళుతున్నట్లు డీసీఎం డీకే శివకుమార్ తెలిపారు. మంగళవారం బెంగళూరులో మాట్లాడుతూ పెన్నార్ నది గురించి రెండు రాష్ట్రాల ప్రతినిధులు మాట్లాడి పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. వీలైతే ఇతర శాఖల మంత్రులు, అటవీ శాఖ మంత్రిని కలుస్తానని తెలిపారు. కాగా, నగరంలో విద్యుత్ స్తంభం పడి ఇద్దరు మహిళలు చనిపోయిన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలను తీసుకోవాలని అన్నారు. బస్సులో మాంగళ్యం చోరీ మైసూరు: బస్సు ఎక్కేటప్పుడు జరిగిన తోపులాటలో ఓ మహిళ మెడలోని రూ.2.20 లక్షల విలువ చేసే 35 గ్రాముల మంగళసూత్రం చోరీకి గురైన ఘటన నగరంలో జరిగింది. వినాయకనగర నివాసి భాగ్య బాధితురాలు. నగరంలోని హూటగళ్లిలోని గార్మెంట్స్ ఫ్యాక్టరీలో టైలర్గా పని చేస్తోన్న ఆమె ఈనెల 15న పని ముగించుకుని లింగదేవరకొప్పలు సమీపంలోని బస్టాండుకు వచ్చింది. మైసూరు సిటీ బస్టాండుకు వెళ్లేందుకు కేఎస్ఆర్టీసీ బస్సులో ఎక్కింది. ఆ సమయంలో ఎవరో దుండగులు ఆమె మెడలోని బంగారు గొలుసును చోరీ చేశారు. కొంతసేపటికి మాంగళ్యం చోరీకి గురైనట్లు తెలుసుకుంది. జయలక్ష్మిపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మంగళూరు డ్రగ్స్ కేసులో ముమ్మర దర్యాప్తుబనశంకరి: రాష్ట్రంలో అతిపెద్ద డ్రగ్స్ కేసును మంగళూరు సీసీబీ పోలీసులు కూపీ లాగుతున్నారు. ఆదివారం దక్షిణాఫ్రికాకు చెందిన ఇద్దరు మహిళలను అరెస్టు చేసి రూ.75 కోట్ల విలువచేసే 37.5 కిలోల బరువు గల ఎండీఎంఏ డ్రగ్స్ను స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. నిందితులు బాంబ ఫెండా, అజిగైల్ ఆడోనిస్లను 7 రోజుల పాటు కస్టడీకి తీసుకుని తీవ్ర విచారణ చేపట్టారు. ఢిల్లీలో ఓ పారిశ్రామికవాడలో డ్రగ్స్ను తయారుచేస్తున్నట్లు మహిళలు తెలిపాఉ. ఫార్మా ఫ్యాక్టరీ ముసుగులో మత్తు పదార్థాలను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలియడంతో అక్కడికి పోలీసుల బృందాలు వెళ్లాయి. అలాగే బెంగళూరుకు చేరుకుని సమాచారం సేకరిస్తున్నారు. రాష్ట్ర సర్కారు కక్ష సాధిస్తోంది: కుమారస్వామిదొడ్డబళ్లాపురం: రాష్ట్ర ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, న్యాయ పోరాటంలో ఈ కుట్రలను తిప్పి కొడతానని కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి అన్నారు. మంగళవారం బెంగళూరులో నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన కేతిగానహళ్లిలో తాను కష్టపడి సంపాదించుకున్న భూమిలో వ్యవసాయం చేస్తున్నానని, 40 ఏళ్ల క్రితం ఆ భూములు తాను కొన్నానని చెప్పారు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన తాను ఒక్క అవినీతి, అక్రమం చేయలేదన్నారు. ఆక్రమణలు తొలగించాలంటే ఎవరికై నా 15 రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని అయితే తనకు ఎటువంటి నోటీసు ఇవ్వలేదన్నారు. దేశంలో ఇలాంటి కేసుకు సిట్ ఏర్పాటు చేయడం మొదటిసారి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాను న్యాయ పోరాటం చేస్తానన్నారు. కట్నపిశాచికి బలి యశవంతపుర: కట్నం కోసం భార్యను పొట్టనబెట్టుకున్నాడో కిరాతక భర్త. దావణగెరె జిల్లా హరిహర తాలూకా హరళహళ్లి గ్రామంలో జరిగింది. నేత్రావతి (26)ని ఆమె భర్త దేవేంద్రప్ప చీరతో గొంతుకు బిగించి హత్య చేశాడు. 7 ఏళ్లు క్రితం పెళ్లి సమయంలో దేవేంద్రప్పకు 10 తులాల బంగారంతో పాటు లక్ష రూపాయిల నగదు కట్నంగా ఇచ్చారు. మరింత డబ్బు తీసుకురావాలని నేత్రావతిని భర్త వేధించేవాడు. దీంతో సోమవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగి హత్య చోటుచేసుకుంది. అల్లునిపై నేత్రావతి తల్లిదండ్రులు హరిహర రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవేంద్రప్పను అరెస్టు చేశారు. -
శాంతిభద్రతలు అసలున్నాయా?
శివాజీనగర: రాష్ట్రంలో శాంతిభద్రతలు అస్తవ్యస్తంగా ఉన్నాయి, రాష్ట్రంలో చెప్పేవారు లేరు, అడిగేవారు లేరు. గూండా రాష్ట్రంగా మారింది అని మంగళవారం అసెంబ్లీ విధానసభలో ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలతో సర్కారుపై ధ్వజమెత్తారు. బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ శాంతిభద్రతల మీద వాయిదా తీర్మానంలో ప్రసంగించారు. బిడది వద్ద టొయోటా కంపెనీలో గోడపై పాకిస్తాన్ అనుకూల నినాదాలు, కన్నడిగులకు వ్యతిరేకంగా అసభ్యకరమైన పదజాలంతో రాశారన్నారు. ఇది ప్రతి ఒక్కరూ తల దించుకునే విషయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, శాంతిభద్రతలకు గురించి పట్టింపు లేనట్లుంది, హోంశాఖను జిల్లా ఇన్చార్జి మంత్రి చూస్తున్నారని పరోక్షంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను విమర్శించారు. బిడది ఘటనలో దుండగులను సీసీ కెమెరాలు తనిఖీ చేసి తక్షణమే పట్టుకోవాల్సింది. అయినా కూడా ప్రభుత్వం మౌనంగా ఉందని ధ్వజమెత్తారు. హోలీ పండుగ సమయంలో రాణి బెన్నూరులో లవ్ జిహాద్ సంఘటన జరిగిందని ఆరోపించారు. స్వాతి అనే నర్సును తీసుకెళ్లిన నయాజ్ అనే వ్యక్తి ఆమె మెడకు టవల్తో బిగించి హత్య చేసి మృతదేహాన్ని తుంగా నదిలోకి పారవేశారు. మూడు రోజుల తరువాత ఆమె మృతదేహం బయటపడింది. మరణోత్తర పరీక్షలో హత్య అని తెలిసింది. అయితే పోలీసులు ఆమె తల్లికి చెప్పకుండా శవాన్ని కాల్చివేశారు అని దుయ్యబట్టారు. గతంలో కలబుర్గిలో విద్యార్థిని నేహా హత్యకు గురైనపుడు పోలీసులు జాగ్రత్త తీసుకుని ఉంటే ఇటువంటి ఘటనలు మళ్లీ జరిగేవి కావన్నారు. హంపీలో పర్యాటకులు వెళ్లిపోతున్నారు విదేశీయులు కర్ణాటకను మెచ్చుకొంటున్నారని ప్రభుత్వం చెబుతోంది, అలాంటి విదేశీయులపైనే హంపీలో మూకుమ్మడి అత్యాచారం జరిగిందని బీజేపీ ఎమ్మెల్యేలు కేకలు వేశారు. అశోక్ స్పందిస్తూ అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాత పొందిన హంపిలోనే ఇలా జరిగితే ఎలా? 60 శాతం ఇజ్రాయెల్ పర్యాటకులు ఇక్కడికి వస్తారు. ఇజ్రాయెల్ మహిళపై అత్యాచారం జరిగిన తరువాత పర్యాటకులు హంపిలో హోం స్టేలను ఖాళీ చేస్తున్నారు. హంపికి చెడ్డపేరు వచ్చింది. ప్రభుత్వం హోం స్టేలకు రిజిస్ట్రేషన్ సంఖ్యను జారీ చేస్తామంటోంది. శాంతిభద్రతలు అధ్వాన్నస్థితికి చేరుకొంటుంటే, ముఖ్యమంత్రి ఏదో చెబుతూ దారి తప్పిస్తున్నారని ఆరోపించారు. బెంగళూరుకు ఎవరో ప్రముఖులు వస్తే గ్యారెంటీ పథకాలను పొగిడేందుకు వచ్చారని ముఖ్యమంత్రి చెప్పడం సరికాదని హేళన చేశారు. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వ గౌరవం పోతోంది. అయినా కూడా మౌనంగా ఉంది. బంగారం స్మగ్లింగ్లో మంత్రుల పేరు వచ్చినా కూడా కదలిక లేదు. దీనిపై విస్తృతంగా చర్చ జరగాలి అని పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. పాకిస్తాన్కు మద్దతు రాతలు, అత్యాచారాలపై చర్యలేవీ? నేరాలతో రాష్ట్రం అతలాకుతలం విధానసభలో బీజేపీ సభ్యుల ధ్వజం -
జేసీబీ, కరెంటు స్తంభం.. తీశాయి ప్రాణం
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో అనూహ్యంగా జరిగిన ఓ ప్రమాదంలో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. విద్యుత్ స్తంభం విరిగిపడడంతో తీవ్ర గాయాలైన చనిపోయిన ఘటన బయప్పనహళ్లి ఠాణా పరిధిలోని సుద్దుగుంటెపాళ్యలో చోటుచేసుకుంది. వివరాలు.. సుమతి (35), సోని (36) అనే ఇద్దరు మహిళలు సోమవారం సాయంత్రం ట్యూషన్ నుంచి తమ పిల్లలను తీసుకొస్తున్నారు. సుమతి తమిళనాడువాసి, సోని బిహార్వాసి, ఉపాధి కోసం కుటుంబాలతో వలస వచ్చి జీవిస్తున్నారు. రోడ్డు మరమ్మత్తులు చేస్తున్న ఓ జేసీబీ వాహనం అనుకోకుండా విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. దీంతో ఆ స్తంభం విరిగి రోడ్డు పక్కన పక్కనే నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలపై పడింది. సుమతి, సోని గాయాలతో మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలకు కూడా గాయాలయ్యాయి. స్తంభం పడిపోయి గాయాలైన మహిళల వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. అధికారులు, జేసీబీ డ్రైవర్ నిర్లక్ష్యమే.. పోలీసులు జేసీబీ డ్రైవర్ రాజుపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మహిళలకు తలా ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లుల మరణంతో భర్తలు, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. రోడ్డు పనులు చేసేటప్పుడు అధికారులు రక్షణ చర్యలు తీసుకోవాల్సిందని, అదేమీ లేకుండా చేయడంతో అమాయకులు బలయ్యారని కొందరు ఆరోపించారు. పని చేసేచోట బారికేడ్లు ఉంచి ప్రజలను రాకుండా చూడాల్సిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జేసీబీ డ్రైవర్ హెడ్ఫోన్లు పెట్టుకుని నిర్లక్ష్యంగా నడిపాడని, కొందరు కేకలు వేస్తున్నా పట్టించుకోలేదని తెలిపారు. ఇద్దరు మహిళల దుర్మరణం బెంగళూరులో విషాద ఘటన -
రమణీయం హంసవాహనం
బొమ్మనహళ్ళి: బెంగళూరు బొమ్మనహళ్ళిలో అగరలో వెలసిన శ్రీనివాసుని ఆలయం బ్రహ్మ రథోత్సవం వేడుకలలో భాగంగా ఆదివారం రాత్రి హంస వాహన సేవ రమణీయంగా సాగింది. స్థానిక యాదవ కుల పెద్దలు స్వామివారికి పూజలు నిర్వహించారు. హంసవాహనంపై స్వామివారిని ఆసీనుల్ని చేసి పురవీధుల్లో ఊరేగించారు. అంతకుముందు అర్చకులు చంద్రమౌళి ఆధ్వర్యంలో కలశ పూజలు, యజ్ఞ హోమాలను నిర్వహించారు. బార్ ఉద్యోగిపై కాంగ్రెస్ నేత దాడి యశవంతపుర: రాత్రి సమయంలో మద్యం అమ్మలేదనే కోపంతో బార్ క్యాషియర్పై దాడి చేసిన ఘటన చిక్కమగళూరు జిల్లా కొప్పలో జరిగింది. కొప్ప బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయానంద అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో స్నేహితుడు కాశ్విక్తో కలిసి బార్ వద్దకు వెళ్లాడు. మద్యం బాటిళ్లు ఇవ్వాలని క్యాషియర్ను డిమాండ్ చేశారు. ఇప్పుడు అమ్మకూడదని అతడు చెప్పాడు. దీంతో సోమవారం ఉదయం వెళ్లి క్యాషియర్ను చితకబాదాడు. సీసీ కెమెరాలలో ఈ వైనం రికార్డయింది. క్యాషియర్ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మంకీ ఫివర్తో మహిళ మృతి దొడ్డబళ్లాపురం: చిక్కమగళూరు జిల్లా మంకీ ఫివర్ వ్యాపిస్తోంది. జిల్లాలోని ఎన్ఆర్ పుర తాలూకా కట్టినమనె గ్రామం నివాసి 65 ఏళ్ల మహిళ బలైంది. ఈమె మేల్పాల్ గ్రామంలోని ఒక కాఫీ తోటలో పని చేస్తోంది. కొన్నిరోజుల క్రితం ఈమెకు కోతి జ్వరం సోకింది. కొప్ప ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండేది. అయితే ఆరోగ్యం విషమించి చనిపోయింది. ఈ ఏడాదిలో మొదటి మంకీ ఫివర్ మృతిగా నమోదయ్యింది. జిల్లాలో ఇంకా 50 మంది ఈ వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. 27న బీబీఎంపీ బడ్జెట్ బనశంకరి: గత ఐదేళ్లుగా కార్పొరేషన్కు ఎన్నికలు జరగక, ప్రజాప్రతినిధులు లేని బీబీఎంపీలో ఈ నెల 27 తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇటీవల సీఎం సిద్దరామయ్య రాష్ట్ర బడ్జెట్లో బీబీఎంపీకి రూ.7 వేల కోట్లు నిధులు ప్రకటించారు. పాలికె బడ్జెట్ సుమారు రూ.15 వేల కోట్లతో ఉండవచ్చని అంచనా. పాలికె ఆర్థిక శాఖ ప్రత్యేక కమిషనర్ హరీశ్కుమార్ 2025–26 బడ్జెట్ను ప్రకటిస్తారు. ఇందుకు నగరాభివృద్ధి మంత్రి, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ ఆమోదించారని బీబీఎంపీ కమిషనర్ తుషార్ గిరినాథ్ తెలిపారు. ఈసారి రోడ్లు, మంచినీరు, ముంపు నివారణ వంటి మౌలిక సౌకర్యాలకు పెద్దపీట వేస్తారని తెలిసింది. మైసూరు మహిళకు రూ.72 లక్షల టోపీ మైసూరు: షేరు మార్కెట్లో తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ చూపించి మహిళ నుంచి రూ. 72.60 లక్షలను కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. ఈ తరహా నేరాలు తరచూ జరిగే మైసూరులోనే ఈ మోసం కూడా చోటుచేసుకుంది. వివరాలు.. మైసూరు నగరంలోని గోకులంలో ఉంటున్న మహిళకు ఫేస్బుక్లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే దండి లాభాలు వస్తాయని ఆమెను నమ్మించాడు. ఓ యాప్ను ఆమెకు పంపించాడు సరేనని ఆమె మొదటిసారి ఆ యాప్ ద్వారా కొంత నగదు పంపింది. కొన్నిరోజుల్లోనే రెట్టింపు లాభం వచ్చినట్లు చూపించారు. ఆపై ఆమె రూ. 72.60 లక్షలను పెట్టుబడి పెట్టింది. తరువాత అవతల వ్యక్తి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో మునిగిపోయినట్లు గ్రహించి సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. అమెరికాలో రామనగర విద్యార్థి మృతి దొడ్డబళ్లాపురం: ఉన్నత చదువుల కోసం వెళ్లిన రామనగర యువకుడు అమెరికాలో మృతిచెందిన సంఘటన వెలుగు చూసింది. రామనగర పట్టణ పరిధిలోని రాఘవేంద్రస్వామి కాలనీ నివాసి అనంతక్రిష్ణ కుమారుడు శుభాంగ్ (27), 10 నెలల క్రితం ఎంఎస్ చదవడానికి అమెరికాకు వెళ్లాడు. ఓ కాలేజీలో చదువుకుంటున్నారు. రాత్రి భోజనం తిని పడుకున్న శుభాంగ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తోటి విద్యార్థులు ఆస్పత్రికి తరలించగా చికిత్స ఫలించక మరణించాడని కుటుంబానికి సమాచారం వచ్చింది. దీంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. త్వరగా మృతదేహాన్ని తెప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. -
కారు నిలిపితే, చక్రాలు ఔట్
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో కొన్ని ప్రాంతాల్లో కార్ల యజమానులకు కంటిమీద కునుకు కరువైంది. అందుకు కారణం.. తెల్లారితే కారులో ఏ పార్టులు ఉంటాయో ఏ పార్టులు ఉండవో అనే దిగులు, అసలు కారు ఉంటుందా ఉండదా అనే భయం పట్టుకుంది. మొన్నటి వరకూ వాహనాల్లో పెట్రోలు, డీజిలు మాత్రమే తస్కరిస్తున్న దుండగులు ఇప్పుడు స్పేర్ పార్ట్స్ విప్పుకుని పరారవుతున్నారు. గాంధీనగర్లో ఒక హోటల్ వద్ద నిలిపిన కారుకు ఉన్న నాలుగు చక్రాలను దుండగులు విప్పుకెళ్లారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. హుబ్లికి చెందిన గోవిందగౌడ అనే వ్యాపారి కార్యం నిమిత్తం శనివారం బెంగళూరు వచ్చి రాత్రి గాంధీనగర్లో ఒక హోటల్లో బస చేశాడు. హోటల్ ముందు కారును నిలిపాడు. ఉదయం లేచి చూసేసరికి కారుకి ఉన్న నాలుగు చక్రాలు మాయమయ్యాయి. సీసీ చిత్రాలలో దొంగల పని బయటపడింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బెంగళూరులో దొంగల గోల -
గవర్నర్ కన్నడలో మాట్లాడాలి
మండ్య: గత మూడేళ్ల నుంచి అసెంబ్లీలో గవర్నర్ హిందీలో మాట్లాడుతున్నా ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక్కరు కూడా ప్రశ్నించడంలేదని కన్నడ సంఘాల నాయకుడు వాటాల్ నాగరాజు ఆరోపించారు. సోమవారం కన్నడ ఒక్కోట ఆధ్వర్యంలో మండ్య నగరంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. వాటాల్ మాట్లాడుతూ కన్నడనాడులో ఉన్న బెళగావిలో మేయర్గా మరాఠి వ్యక్తిని ఎన్నిక చేశారు, అక్కడ కన్నడ నాయకులే లేరా? అని మండిపడ్డారు. కన్నడ నాడులో మరాఠీల పెత్తనం ఏమిటని, ఇక్కడ మరాఠీలు వచ్చి అధికారం చలాయిస్తుంటే కన్నడిగులు ఏమి చేస్తున్నారని విచారం వ్యక్తంచేశారు. ఇకపై అసెంబ్లీలో గవర్నర్ కన్నడలోనే ప్రసంగించాలని డిమాండ్ చేశారు. -
ఆర్థిక వ్యవస్థ దివాలా తీయలేదు
శివాజీనగర: పంచ గ్యారెంటీ పథకాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమీ దివాలా తీయలేదు. పైగా గ్యారంటీలను బీజేపీ కూడా కాపీ కొట్టింది. రాష్ట్రంలో నిధుల కొరతకు బీజేపీ కారణం. పన్నుల వాటాల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపించారు. సోమవారం అసెంబ్లీలో విధానసభలో గ్యారంటీలు, ఆర్థిక వ్యవస్థ తదితరాల గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. గ్యారెంటీ పథకాలను గట్టిగా సమర్థించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి అనుకూలంగా ఉంది. అభివృద్ధి పథకాలను నిలిపివేయలేదు. ఆర్థికంగా దివాలా తీయలేదు, ఆర్థిక స్థితి పటిష్టంగా ఉందని చెప్పారు. గ్యారెంటీ పథకాలు వాస్తవ రూపం దాల్చడంతో గవర్నర్ గెహ్లాట్ కూడా మెచ్చుకొన్నారు. పేదల ఆత్మవిశ్వాసం పెరిగింది అని అన్నారు. గ్యారెంటీ పథకాల అమలు వల్ల ప్రభుత్వం దివాలా తీస్తుందని ప్రధాని మోదీతో పాటుగా బీజేపీ నాయకులు ప్రచారం చేశారు. లోక్సభ ఎన్నికల్లో మోదీ కీ గ్యారెంటీ అని కాషాయపార్టీ వారు తమ పథకాలను కాపీ చేశారని కరపత్రాలను చూపిస్తూ హేళన చేశారు. గ్యారెంటీలను మేధావులు, మీడియా, ప్రజలు, విద్యావేత్తలు ప్రశంసించారన్నారు. కేంద్రం నుండి నీటిపారుదల అభివృద్దికి రూ. 10 వేల కోట్లు వచ్చాయని బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ అబద్ధాలు చెప్పారన్నారు. 50 సంవత్సరాలకు వడ్డీ రహితంగా ప్రత్యేక సహాయం చేసిందన్నారు. గ్యారంటీలకు రూ.76 వేల కోట్లు ఖర్చు సర్కారు ఏర్పడినప్పటి నుంచి గ్యారెంటీల కోసం ఫిబ్రవరి వరకు సుమారు రూ. 76 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం తెలిపారు. గ్యారెంటీలు బాగున్నాయని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని భారతీయ ప్రజా పరిపాలనా సంస్థ నివేదిక ఇచ్చిందన్నారు. గ్యారెంటీ పథకాలు ప్రజోపయోగం కాకపోతే బీజేపీ పాలించే రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేస్తున్నారో చెప్పాలన్నారు. పెరుగులో రాళ్లు వెతికే పని చేయకండి అని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ ఒక్కసారి కూడా పూర్తి మెజారిటీతో అధికారంలో రాలేదు. ఆపరేషన్ కమలంతో గద్దెనెక్కిందని సీఎం విమర్శించారు. మీలాగా ఆర్థిక ధనవంతులకు తాము అనుకూలం కాదన్నారు. ప్రధాని మోదీ ఇప్పటివరకు వితంతు, వృద్ధాప్య పింఛన్ను ఒక్క రూపాయి కూడా పెంచలేదని ఆరోపించారు. కరిమణి పదంపై గొడవ గ్యారెంటీ పథకాల వల్ల పేదలకు లబ్ధి అసెంబ్లీలో సీఎం సిద్దరామయ్య కేంద్రం అన్యాయం చేస్తోందని ధ్వజం ప్రతిపక్షాలు కరిమణి అనడంపై రుసరుసబీజేపీ పక్ష నేత ఆర్.అశోక్, ఎమ్మెల్యే సునీల్కుమార్లు కరిమణి పదాన్ని వాడి కొన్ని విమర్శలు చేయగా, ఇటువంటి మాటలను తాను ఊహించలేదని సీఎం దుయ్యబట్టారు. ఆర్.అశోక్ స్పందిస్తూ ప్రతిరోజు పత్రికల్లో మంత్రులు, ముఖ్యమంత్రి మార్పు, డిన్నర్ పార్టీలు, ఢిల్లీ భేటీలపై వార్తలు వస్తున్నాయి. అధికార పంపకపు మాటలు వినిపిస్తున్నాయి. మీరొకటి, డీకే శివకుమార్ ఒకటి మాట్లాడుతున్నారు. కరిమణి యజమాని ఎవరని మేం అడుగుతున్నాం. బలమైన నాయకత్వం ఉండాలని ఈ విధంగా చెప్పాం. మీకు వద్దనుకుంటే సరే అని అన్నారు. సిద్దరామయ్య మాట్లాడుతూ మీ పార్టీలో విభేదాలు లేవా అని అన్నారు. ఏది ఒప్పో అంతిమంగా ప్రజలు తీర్మానం చేస్తారని చెప్పారు. -
ఫైనాన్స్కు చిరువ్యాపారి బలి
గౌరిబిదనూరు: మైక్రో ఫైనాన్స్ వేధింపులను తట్టుకోలేక ఓ చిరు వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. తాలూకాలోని కాదలవేని పంచాయతీ మరళూరు ఎం.జాలహళ్ళి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. వివరాలు.. మంజునాథ్ (34) ఇంటి అవసరాలు, వ్యాపారం కోసమని ప్రైవేట్ ఫైనాన్స్ల వద్ద రూ. 6 లక్షల వరకూ అప్పులు చేశాడని భార్య సవిత తెలిపారు. తోపుడు బండిపై ఎగ్రైస్, కబాబ్ వ్యాపారం చేసేవారమన్నారు. కంతులు సక్రమంగా చెల్లిస్తున్నట్లు ఆమె చెప్పింది. ఈ నెల 9న ఎన్టి ఫైనాన్స్కు వాయిదా కట్టలేకపోయినట్లు తెలిపింది. దీంతో సిబ్బంది తమ బండి వద్దకు వచ్చి గొడవ చేశారు. నా భర్త ఇంటికి వెళ్ళి డబ్బు తీసుకువస్తానని చెప్పి దారిలో చింతచెట్టుకు ఉరి వేసుకున్నాడని విలపించింది. రూరల్ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. -
అప్పు జ్ఞాపకాలతో పునీతం
యశవంతపుర: ప్రముఖ కన్నడ దివంగత హీరో పునీత్ రాజ్కుమార్ 50వ జన్మదినాన్ని అభిమానులు, ప్రజలు బాధాతప్త హృదయాలతో జరుపుకొన్నారు. ఆయన నటనా వైదుష్యాన్ని, సామాజిక సేవలను స్మరించుకున్నారు. బెంగళూరులో కంఠీరవ స్టూడియోలో పునీత్ సమాధిని తెల్లవారుజామునే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అభిమానులు ఆదివారం అర్ధరాత్రి నుంచే అక్కడకు చేరుకుని కేక్ను కత్తిరించి నివాళులు అర్పించారు. సోమవారం ఉదయం పునీత్ భార్య అశ్విని, పిల్లలు ధృతి, వందిత, సోదరులు రాఘవేంద్ర, శివ రాజ్కుమార్ దంపతులు, వారి పిల్లలు తరలివచ్చారు. పునీత్ సమాధికి పుష్పాంజలి ఘటించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిమంది అభిమానులు, యువత తరలివచ్చి అప్పును గుర్తుచేసుకున్నారు. కొందరు బాధను తట్టుకోలేక కన్నీరు కార్చారు. ఈ సందర్భంగా అభిమానులకు పానకం, మజ్జిగ పంపిణీతో పాటు అన్నదానం నిర్వహించారు. ఓ అభిమాని అప్పు దీక్షను స్వీకరించినట్లు తెలిపారు. చన్నరాయపట్టణ నుంచి వచ్చినట్లు చెప్పాడు. శికారిపుర లో శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలోని శికారిపుర పట్టణంలో పునీత్ జయంతి వేడుకలను అభిమానులు ఆచరించారు. బృహత్ చిత్రపటానికి పూలదండలు వేసి పూజలు నిర్వహించారు. ప్రజలకు మొక్కలను అందజేశారు. అటవీ అధికారులు హిరేమఠ, రవీంద్ర, రేవణ్ణసిద్దయ్య పాల్గొన్నారు. ఘనంగా పునీత్ జయంతి కంఠీరవ స్టూడియోలో సమాధికి కుటుంబసభ్యుల పూజలు -
మొబైల్ అతివాడకంతో వినికిడి సమస్యలు
బళ్లారి రూరల్ : అతిగా మొబైల్లో వీడియోలు, పాటలు వినడం వల్ల చెవికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయని బళ్లారి ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఉపసభాపతి డాక్టర్ ఎస్.జే.వీ.మహిపాల్ తెలిపారు. బళ్లారి ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ, సరళాదేవి డిగ్రీ కళాశాల, ఒరెవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన ఉచిత చెవి పరీక్ష శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం అందరూ మొబైల్లో ఎక్కువగా వీడియోలు చూడటం, ఇయర్ ఫోన్లో పాటలు వినటం వల్ల చెవికి సంబందించిన సమస్యలు వస్తున్నాయన్నారు. మొబైల్ను మితంగా వాడితే పలు సమస్యలు తగ్గుతాయన్నారు. సరళాదేవి కళాశాల ప్రిన్స్పాల్ జీ.ప్రహ్లాద్ చౌదరి మాట్లాడుతూ రెడ్క్రాస్ సంస్థ ఈ శిబిరాన్ని కళాశాలలో ఏర్పాటు చేయడం ఆనందదాయకమన్నారు. శిబిరంలో సుమారు 100 మంది విద్యార్థులకు చెవి పరీక్షలు నిర్వహించారు. బళ్లారి ఇండియన్ రెడ్క్రాస్ కార్యదర్శి ఎం.ఏ.షకీబ్, కో–ఆర్డినేటర్ బి.దేవణ్ణ, బ్లడ్ డొనేషన్ కమిటీ ఎం.ఎన్.నిసార్ అహమద్, ఒరెవా సంస్థ ప్రముఖురాలు బీకే జయశ్రీ, సభ్యురాలు పల్లవి పాల్గొన్నారు. -
త్రిశూలం మారణాయుధం కాదు
బళ్లారిఅర్బన్: త్రిశూలం మారణాయుధం కాదు, యువతుల ఆత్మరక్షణ ఆయుధం అని శ్రీరామసేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ పేర్కొన్నారు. స్థానిక అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 త్రిశూల దీక్ష కార్యక్రమాలను జరిపామన్నారు. ఐదు అంగుళాల త్రిశూలం శివుడి చేతిలోని వస్తువు అని, అది మారణాయుధం కాదని అన్నారు. త్రిశూలాన్ని హిందూ యువతులు ఆత్మరక్షణకు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. హిందూ ధర్మానికి 16 వేల సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉందన్నారు. ఇస్లాం ధర్మానికి 15 వందల సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. ఏది మొదలన్నది మీరే ఆలోచించి ఇస్లాం ధర్మ, అలాల్కట్, లవ్ జిహాద్ ఆచరణల ద్వారా హిందూ మతంపై ఒత్తిడి తేవడం ఎట్టి పరిస్థితిలోను సహించబోమన్నారు. దేశంలో సకాలంలో జరగని న్యాయం వల్ల ఎక్కువగా సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ద్రోహులు, ఉగ్రవాదులు చెలరేగి పోతున్నారన్నారు. చట్టానికి, రాజ్యాంగానికి భయపడటం లేదు. ఇందిరా గాంధీ కేసులో న్యాయం ఆలస్యం ఇందిరా గాంధీ హత్య జరిగాక సుమారు 40 ఏళ్ల వరకు సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు తీరుతో న్యాయం ఆలస్యం అయిందని ఆయన న్యాయాంగం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. భారతీయ సంప్రదాయంలో ఎన్నో విశిష్టమైన ఆచారాలలో కుంకుమ ధరించడం, పూలు పెట్టుకోవడం వంటి వాటిని కూడా కొన్ని విద్యా సంస్థలు అడ్డుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మహిళలు గాజుల ధారణ, కుంకుమ పెట్టుకోవడానికి వెనుకంజ వేస్తున్నారని వాపోయారు. హిందూ యువతులు వారి తల్లిదండ్రులు హిందూ ధర్మాన్ని పాటించడం ద్వారా భారతీయ సంస్కృతిని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సర్కారు ముస్లింల ఓటు బ్యాంక్ కోసం ప్రతి విషయంలోను వారికి రిజర్వేషన్లు కల్పించి కుహనా రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ఈ విషయమై కోర్టులో కేసులు నడుస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో శ్యాంసుందర్, సుగుణ సునంద హిరేమఠ, జనతా హోటల్ గురురాజ్, తదితరులు పాల్గొన్నారు. యువతుల ఆత్మరక్షణ ఆయుధం శ్రీరామసేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ -
ఎడమ కాలువకు ఏప్రిల్ వరకు నీరివ్వాలి
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూములకు ఏప్రిల్ నెలాఖరు వరకు నీరందించాలని కర్ణాటక ప్రాంత రైతు సంఘం అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ డిమాండ్ చేశారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎడమ కాలువకు మార్చి 31 వరకు నీరు వదలడానికి అధికారులు సమావేశంలో తీసుకున్న నిర్ణయంతో చేతికొచ్చిన పంట నోటికి రాకుండా పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. నీటి గేజ్ నిర్వహణ, సామర్థ్యాన్ని బట్టి ఆయకట్టు భూములకు నీరందేలా అధికారులు జాగ్రత్తలు పాటించాలన్నారు. నీరు అందించడానికి శాశ్వత పరిష్కారం చేపట్టడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు ముందుకు రావడం లేదని ఆరోపించారు. నీటి విడుదలకు అవకాశం ఉన్నా అధికారులు తమ ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటున్నారన్నారు. తుంగభద్ర డ్యాంలో 56.132 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ఔట్ ఫ్లో 11,396 క్యూసెక్కులు కాగా ఎడమ కాలువకు రోజు 3800 క్యూసెక్కుల నీరు విడుదల అవుతున్నాయన్నారు. ఏప్రిల్లో దాదాపు లక్ష హెక్టార్లలో వరి కోతకు రానున్నందున పంటకు ఏప్రిల్ వరకు నీటిని విడుదల చేస్తే పంట దక్కుతుందన్నారు. పై భాగంలో 1000 అక్రమ పైపు లైన్లు వేసుకున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే గంగాధర నాయక్, రాఘవేంద్ర కుష్టిగి, జంబన్న, శరణప్ప గౌడ, నాగన గౌడ, బసవరాజ్, లింగప్పలున్నారు. -
గంజి కేంద్రాలు ప్రారంభం
రాయచూరు రూరల్: యాదగిరిలో గంజి కేంద్రాల ఏర్పాటు హర్షనీయమని నగరసభ అధ్యక్షురాలు లలిత అనాపుర పేర్కొన్నారు. సోమవారం నగరంలోని మాతా మాణికేశ్వరి సంస్థ ఆధ్వర్యంలో అంబిగర చౌడయ్య సర్కిల్, హొన్నయ్య తాత ఆలయం వద్ద గంజి కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. ఈ కేంద్రాలతో వేసవిలో ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ప్రజల ఆకలి తీరుతుందన్నారు. నకిలీ నోట్ల మార్పిడి.. నలుగురు అరెస్ట్ రాయచూరు రూరల్: నకిలీ కరెన్సీ నోట్ల మార్పిడి వ్యవహారంలో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పశ్చిమ పోలీస్ స్టేషన్ సీఐ మేకా నాగరాజ్ వెల్లడించారు. సోమవారం ఆశాపూర్ రహదారిలో దాడి జరిపి సద్దాం నివాసంలో రూ.500 నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనపరుచుకొన్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ట్రాన్స్పోర్టులో డ్రైవర్, క్లీనర్లుగా పని చేస్తున్న మరిలింగ, సద్దాం, సిద్దలింగప్ప, రవిలను అరెస్ట్ చేసి వారి నుంచి పూర్తి సమాచారం సేకరించామన్నారు. -
సణాపుర కేసు తర్వాత ఖాకీలు అలర్ట్
● నాలుగు వైపులా సీసీ కెమెరాలు ఏర్పాటు హొసపేటె: సణాపుర ప్రాంతంలోని హోమ్స్టే వద్ద ఇటీవల విదేశీ పర్యాటకురాలిపై అత్యాచారం, హత్య జరిగిన సంఘటనతో పోలీసులు అప్రమత్తమై తగిన భద్రత, రక్షణ చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే విదేశీయులు వెళ్లే మార్గంలో నాలుగు వైపులా చెక్పోస్టులు నిర్మించిన పోలీసు శాఖ ప్రస్తుతం ఆయా ప్రధాన బ్లాక్లకు నాలుగు వైపులా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంతో విదేశీయులతో పాటు పర్యాటకులకు తగిన రక్షణ కల్పించేందుకు అనుకూలం కానుంది. నిందితుల కదలికలపై నిఘా పెట్టి అక్రమాలకు తావు లేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితమే గంగావతి రూరల్ పోలీస్ స్టేషన్లో పీఐగా విధులు నిర్వహిస్తున్న రంగప్ప దొడ్డ ఆనెగొందిలో విదేశీయులు, పర్యాటకులను రక్షించడాన్ని సవాల్గా తీసుకున్నారు. కొప్పళ, విజయనగర జిల్లాల సరిహద్దుల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీలైనంత వరకు చెక్పోస్టు సమీపంలో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు కొప్పళ జిల్లా పోలీస్ యంత్రాంగం నడుం బిగించింది. సమీపంలో మాజీ ఎంపీ హెచ్జీ.రాములుకు చెందిన కిష్కింధ రిసార్ట్తో అనుసంధానించే క్రాస్ సమీపంలో కూడా సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. -
బాధ్యతల స్వీకారం
రాయచూరు రూరల్: జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా వీరనగౌడ పాటిల్ పదవీ బాధ్యతలు చేపట్టారు. సోమవారం బీజేపీ కార్యాలయంలో రాయచూరు శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ అధ్యక్ష బాధ్యతలను వీరనగౌడ పాటిల్కు కట్టబెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంచాలకుడు బసవరాజ్ ముత్తిమోడ మాట్లాడుతూ త్వరలో జరగనున్న జెడ్పీ, టీపీ, నగరసభ ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసి అభ్యర్థుల విజయానికి సహకరించి కార్యకర్తలను సమాయత్తం చేయాలన్నారు. సమావేశంలో అధ్యక్షురాలు లలిత, మాజీ ఎంపీ బీవీ నాయక్, శాసన సభ్యుడు వజ్జల్ మానప్ప, మాజీ శాసన సభ్యులు పాపారెడ్డి, గంగాధర నాయక్, బసనగౌడ, ప్రతాప్ పాటిల్, అమర్నాథ్ పాటిల్, నేతలు శంకర గౌడ, యల్లప్పలున్నారు. ప్రభుత్వ ఉద్యోగి దుర్మరణం రాయచూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి దుర్మరణం పాలైన ఘటన నగర శివార్లలో జరిగింది. తాలూకాలోని బాయిదొడ్డి ప్రభుత్వ పాఠశాలలో ప్యూవన్గా విధులు నిర్వహిస్తున్న సంతోష్(35) సోమవారం రాయచూరు నుంచి ద్విచక్రవాహనంపై వెళుతున్న సమయంలో ఎదురుగా వస్తున్న బొలెరోను ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించారు. మార్కెట్ యార్డు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పంచనామా కోసం రిమ్స్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. చెట్టుకు కారు ఢీ.. ముగ్గురి మృతి ●● విజయపుర జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సాక్షి,బళ్లారి: విజయపుర జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం విజయపుర తాలూకా ఉన్నాళ గ్రామానికి చెందిన బీరప్ప(30), హనుమంతు (25), యమునప్ప(28) అనే ముగ్గురితో పాటు మరో ఇద్దరు కారులో బయల్దేరారు. విజయపుర సమీపంలో చెట్టుకు కారు ఢీకొంది. దీంతో ఘటన స్థలంలోనే బీరప్ప, హనుమంతు, యమునప్ప అనే వ్యక్తులు మృతి చెందారు. ఉమేష్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై విజయపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ సభ్యుడు అరెస్టు చెళ్లకెరె రూరల్: లైంగిక దౌర్జన్యం, కులదూషణ ఫిర్యాదుపై జీపీ సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన చిత్రదుర్గలో జరిగింది. చిత్రదుర్గ తాలూకా సిరిగెరె గ్రామ పంచాయతీ సభ్యుడు దేవరాజ్ పోలీసు కస్టడీలో ఉన్నారు. ఇతను కులదూషణ చేస్తున్నాడని గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు, పీడీఓలను లైంగికంగా హింసించాడని పంచాయతీ క్లర్క్ జయరాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. అభివృద్ధి పనులకు భూమిపూజ హొసపేటె: టీబీ డ్యాం పీఎల్సీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి అమృత నగరోత్తాన– 4 పథకం కింద మంజూరైన వివిధ అభివృద్ధి పనులకు సోమవారం ఎమ్మెల్యే గవియప్ప భూమిపూజను నెరవేర్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సుమారు రూ.32.35 లక్షల ఖర్చుతో బిల్డింగ్ పునరుద్ధరణ, టాయిలెట్ బ్లాక్ నిర్మాణం తదితర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. గుత్తేదారులు అభివృద్ధి పనులను నాణ్యతగా చేపట్టాలన్నారు. నగరసభ అధ్యక్షుడు రూపేష్కుమార్, ఉపాధ్యక్షుడు రమేష్ గుప్తా, హుడా అధ్యక్షుడు హెచ్ఎన్ఎఫ్ ఇమామ్, నగరసభ సభ్యులు జీఎస్ హనుమంతప్ప(బుజ్జి), సర్వనన్న, బీఈఓ చెన్నబసప్ప, హెచ్ఎం శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులు నిర్మల, హేమలత, రవి, మంజుల, శారద, విద్యార్థులు పాల్గొన్నారు. -
మాన్వి ఎస్ఐని బదిలీ చేయాలి
రాయచూరు రూరల్: పంచాయతీ అభివృద్ధి పనులపై సమాచారం అడిగిన కర్ణాటక రాష్ట్ర పార్టీ కార్యకర్తలపై మాన్వి ఎస్ఐ సన్న ఈరణ్ణ నాయక్ కులం పేరుతో బెదిరిస్తున్నారని, అలాంటి అధికారిని బదిలీ చేయాలని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు మంజునాథ్ డిమాండ్ చేశారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది క్రితం అరోలి పంచాయతీలో మౌలిక సౌకర్యాలు కల్పించడంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు సమాధానం చెప్పక పోవడంతో మాన్వి తాలూకా పంచాయతీ కార్యాలయంలో అధికారిని కలవడానికి వారం రోజుల క్రితం వెళ్లగా పంచాయతీ అధ్యక్షుడు రామస్వామి, సభ్యులు, తమ కార్యకర్తలపై దాడులు చేశారన్నారు. కేసు నమోదు చేయకుండా మూడు రోజుల పాటు వేచి ఉండి రాజీ సంధానం కోసం ఠాణాకు పిలిచి, రాజీ కాకపోతే మీపై ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని బెదిరించారన్నారు. పార్టీ కార్యకర్తలపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలన్నారు. కులం పేరుతో బెదిరిస్తున్న ఎస్ఐని బదిలీ చేయాలన్నారు. విలేకరుల సమావేశంలో రాఘవేంద్ర, ఆశా, వీరేష్లున్నారు. ఎడమ కాలువలో పడి కూలి కార్మికుడు మృతి రాయచూరు రూరల్: పని కోసం వెళుతూండగా కూలి కార్మికుడు కాలు జారి కాలువలోకి పడి దుర్మరణం పాలైన ఘటన కొప్పళ జిల్లాలో జరిగింది. ఆదివారం కొప్పళ జిల్లా కనకగిరి తాలూకా చిక్కడంకనకల్లో బసవేశ్వర క్యాంపునకు చెందిన హనుమంతప్ప (40) అనే కూలి కార్మికుడు నరేగ పథకంలో పూడికతీత పనులకు వెళుతున్న సమయంలో కాలు జారి ఎడమ కాలువలో పడి ఈత రాక మరణించినట్లు పోలీసులు తెలిపారు. అగ్నిమాపక దళంతో పాటు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీసి పంచనామా కోసం కొప్పళ ఆస్పత్రికి తరలించారు. కార్మికుల సమస్యలపై ధర్నా రాయచూరు రూరల్: వివిధ రంగాల్లో పని చేసే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్కార్లు స్పందించాలని టీయూసీఐ డిమాండ్ చేసింది. సోమవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ధర్నాలో అధ్యక్షుడు అమరేష్ మాట్లాడారు. సర్కార్ తీసుకుంటున్న నిర్ణయం వల్ల కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో విధులు నిర్వహించే వారికి సమాన వేతనాలు, పీఎఫ్, జీపీఎఫ్, గ్రాచ్యూటీ సౌకర్యాలు కల్పించాలని కోరారు. కనీస వేతనాలు చెల్లించాలని, 8 గంటల పని, కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేసి పర్మినెంట్ చేయాలన్నారు. ప్రత్యేక హిందూ దేశం అవసరం లేదని, మనమంతా భారతీయులమని అన్నారు. ఏప్రిల్ 10 నుంచి ఆత్మసంస్కార శిబిరం హుబ్లీ: ధార్వాడ గిరినగర వద్ద ఉన్న పరమాత్మ మహాసంస్థాన మఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 10 నుంచి మే 20 వరకు స్కూల్ విద్యార్థులకు ఆత్మసంస్కార అనే వేసవి శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో గురువులను, పెద్దలను గౌవించడం ఎలా? మొబైల్ అతి వినియోగం నుంచి రక్షించుకోవడం ధ్యానం, యోగం, ప్రాణాయామం, పూజలు, ప్రార్థనలు, చిత్రలేఖనం, సంగీతం, నాటకాలు, నాయకత్వ లక్షణాల గురించి వివిధ కళల్లో శిక్షణ ఇస్తారు. 6 నుంచి 14 ఏళ్ల వయస్సు ఉన్న విద్యార్థులు శిబిరంలో పాల్గొనవచ్చు. ప్రత్యేకించి సైనికులు, మాజీ సైనికుల పిల్లలకు ఈ శిబిరంలో ఉచిత ప్రవేశం ఉంటుంది. మిగిలిన వారికి అతి తక్కువ ఫీజు నిర్ణయించారు. ఆసక్తి గల వారు 9886314809 నంబరులో సంప్రదించాలని ఆ సంస్థ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. -
మిరప ధర ఘనం.. దిగుబడి పతనం
రాయచూరు రూరల్: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న సామెత చందంగా గ్రామీణ ప్రాంతాల్లో సరైన వర్షాలు లేకపోవడంతో మిరప దిగుబడి తగ్గి రైతుల ముఖాల్లో కళ లేదు. కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని రాయచూరు, యాదగిరి, కొప్పళ, బీదర్, కలబుర్గి జిల్లాలు రబీ సీజన్లో చెదురు మదురు జల్లులతో తడిశాయి. రాయచూరు, కొప్పళ జిల్లాల్లో తుంగభద్ర నది, రాయచూరు, యాదగిరి, కలబుర్గి జిల్లాల్లో కృష్ణా నదులు ఉన్నా నీరు అందక రైతుల భూముల్లో వేసుకున్న మిరప పంట ఆశించిన మేర దిగుబడి రాలేదు. పొలంలో బోరుబావుల కింద పంటలు పండించాలంటే విద్యుత్ కోతలు అధికమయ్యాయి. రాయచూరు జిల్లాలో తుంగభద్ర, కృష్ణా నదులున్నా వ్యవసాయ పనులు లభించక దేశాటన తప్పడం లేదు. రైతులు జిల్లాలో 50 వేల ఎకరాల్లో మిరప, 86 వేల ఎకరాల్లో కంది పంటలు సాగు చేశారు. కాలువలకు నీరందక, భూములు బీళ్లుగా మారాయి. తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూములకు నీరందక మిరప పంట చేతికి అందదనే ఆందోళనతో నీటిని కడవలతో మోసి పోశారు. బ్యాడిగి రకం మిరప క్వింటాల్కు రూ.14 వేలు ధర, గుంటూరు మిరప క్వింటాల్ ధర రూ.12,675, ఇతర రకాలు క్వింటాల్కు రూ.8 వేలతో మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయి. రైతులకు శాపంగా ప్రకృతి వైపరీత్యాలు దిక్కుతోచని స్థితిలో కళ్యాణ కర్ణాటక జిల్లాల అన్నదాతలు -
అందరి గుండెల్లో పునీత్కు సుస్థిర స్థానం
బళ్లారిఅర్బన్: చిరుప్రాయంలోనే వెండితెరపై ఒక వెలుగు వెలిగి ఆకస్మికంగా గుండెపోటుతో మూడేళ్ల క్రితం దివంగతులైన చందనసీమ నక్షత్రం పునీత్రాజ్కుమార్ సమాజ సేవ, కళా సేవలను మెచ్చుకొని తాను వారి అభిమాని అయినట్లు అప్పు హోటల్ యజమాని విరుపాక్ష బండిమోట్ తెలిపారు. బెంగళూరు రోడ్డులో రంగమందిరం ఎదురుగా ఉన్న అప్పు హోటల్లో పునీత్ రాజ్కుమార్ 50వ జయంతి వేడుక సందర్భంగా రక్తదానం, అన్నదాన కార్యక్రమాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పునీత్ మరణించి మూడేళ్లు గడిచినా తమ అమోఘమైన నటన, అద్భుతమైన సమాజ సేవతో అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఆయన పేరు చిరస్మరణీయంగా ఉండాలన్న ఉద్దేశంతో అప్పు హోటల్ను ప్రారంభించానన్నారు. తమ హోటల్కు వచ్చే పేదలకు, నిరాశ్రయులకు ఉచిత భోజనం, నిరంతర తాగునీటి సరఫరా సేవలు చేపట్టానన్నారు. చిన్నవయస్సులోనే పెద్దగా రాణించి కన్నడిగుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న పునీత్ రాజ్కుమార్ సేవాపథంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. గోపాల్, గౌరీష్, మనోజ్, పవన్, తిప్పేస్వామి, ఉపేంద్ర, ప్రవీణ్, రామకృష్ణ, ప్రకాష్, హనుమంతప్ప తదితర అప్పు అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు. పునీత్ సమాజ సేవ ఆదర్శప్రాయం రాయచూరు రూరల్: సమాజ సేవకు నటుడు పునీత్ రాజ్కుమార్ ఆదర్శంగా నిలవడం అభినందనీయమని స్పూర్తి డాక్టర్ పునీత్ రాజ్కుమార్ సంఘం జిల్లాధ్యక్షుడు సాదిక్ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని నిరాశ్రిత కేంద్రంలో సినీనటుడు పునీత్ రాజ్కుమార్ జయంతి సందర్భంగా పునీత్ చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం ప్రారంభించి మాట్లాడారు. ఆరోగ్య, వైద్య, అత్యవసర, అనాథ పిల్లలకు సేవలు ఇతరత్రాలను ఎవరికీ తెలియకుండా చేశారని గుర్తు చేశారు. -
నవబృందావనంలో ప్రత్యేక పూజలు
హొసపేటె: తాలూకాలోని ఆనెగుంది సమీపంలోని తుంగభద్ర నది మధ్యలో ఉన్న చారిత్రాత్మక, ధార్మిక ప్రఖ్యాతి గాంచిన నవబృందావన కొండ వద్ద మధ్వ సంప్రదాయానికి చెందిన యతివర్య సుధీంద్ర తీర్థం పుచ్చుకుని విశేష పూజలు చేశారు. మంత్రాలయ రాఘవేంద్ర మఠం పీఠాధిపతి సుబుధేంద్ర, పాదరాజర మఠ పీఠాధిపతి సుజయనిధి తీర్థుల సమక్షంలో వివిధ ధార్మిక కార్యక్రమాలు, ఉపన్యాసాలు జరిగాయి. బృందావనానికి నిర్మల్య విసర్జన, పంచామృత అభిషేకం, విశేష పుష్పాలంకరణ, అష్టోత్తర పారాయణ నిర్వహించారు. ఈ సందర్భంగా గురురాజ ఆచార్, అనంత, గుంజళ్లి మురళి, ప్రకాష్ కరణం, గోపి, శామ, ప్రవీణ్ ఆచార్, వి.కులకర్ణి, ఆనెగుంది అర్చకుడు విజయేంద్ర చల్లర్, శ్రీనివాసాచార్యులు, మేనేజింగ్ డైరెక్టర్ సుమంత కులకర్ణి తదితరులు పాల్గొన్నారు. -
మెట్రో ఉద్యోగాలలో మొండిచేయి!
శివాజీనగర: బెంగళూరు మెట్రో రైల్ సంస్థ తరచూ వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇటీవల టికెట్ ధరలను పెంచి జనం జేబుకి కత్తెర వేసిందని ఆగ్రహం నెలకొంది. ఇంతలో స్థానికులకు మెట్రోలో ఉద్యోగాలు రాకుండా కట్టడి చేస్తోందని ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే బెంగళూరులో ఇతర భాషలవారి హవాతో కన్నడిగులకు ఉద్యోగాలు చేయి తప్పుతున్నాయని అసంతృప్తితో ఉన్నారు. నమ్మ మెట్రో కూడా నియామకాల్లో స్థానికులను నిర్లక్ష్యం చేస్తోందని సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బెంగళూరు మెట్రో ట్రైన్ ఆపరేటర్ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. బీఎంఆర్సీఎల్ హెచ్ఆర్ విభాగంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఉన్నాయి. కన్నడ తెలియని ఇతర భాషలవారికి ఉద్యోగాలు ఇచ్చే కుట్ర జరిగిందని బీఎంఆర్సీఎల్ ఉద్యోగుల సంఘం ఆరోపించింది. అందరూ కన్నడగులు చేరితే యూనియన్ ఏర్పాటు చేసుకుంటారు, తమ మాటను వినరనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపించారు. తక్షణమే ఈ నియామకాలను నిలుపుదల చేసి, కన్నడిగులకు మాత్రమే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అన్యాయాన్ని సహించం: కరవే ఈ వివాదంపై కర్ణాటక రక్షణ వేదిక రాష్ట్రాధ్యక్షుడు టీఏ నారాయణగౌడ స్పందించారు. బెంగళూరు నమ్మ మెట్రోలో ఇతర భాషలవారికి ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధమైందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కన్నడిగులకు ఉద్యోగాలలో అన్యాయం జరుగుతోంది. నమ్మ మెట్రో విడుదల చేసిన ఉద్యోగ ప్రకటనను రద్దు చేసి కన్నడిగులు మాత్రం ఎంపికయ్యే నోటిఫికేషన్ను విడుదల చేయకపోతే తీవ్ర పోరాటం చేపడుతామన్నారు. కన్నడిగులతో వ్యతిరేకతను పెంచుకుంటే బెంగళూరులో మెట్రో రైలు సంచరించటం కష్టమవుతుందని అన్నారు. ఈ వివాదంపై మెట్రో సంస్థ ఇంకా స్పందించలేదు. నోటిఫికేషన్ తీరుపై కన్నడిగుల ఆగ్రహం -
ప్రమాదంలో పచ్చని కనుమలు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక పశ్చిమ ప్రాంతంలో విస్తారమైన లోయలు, అడవులతో కూడిన కొండ ప్రాంతాలు ప్రకృతి సంపదకు నిలువెత్తు దర్పణం. రాష్ట్రానికి ఎంతో ఆహ్లాదం, ఆదాయం అందించే పశ్చిమ ఘాట్లు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. విచ్చలవిడిగా పర్యాటక రంగం, ఆ పేరుతో జరుగుతున్న పనుల కారణంగా పశ్చిమ కనుమలు ప్రమాదంలో చిక్కుకున్నాయి. రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగాలు ప్రస్తుతం ఈ మేరకు పశ్చిమ ఘాట్ల కనుమరుగుపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించాయి. రానున్న రోజుల్లో ముప్పు ఇంకా పెరుగుతుందని హెచ్చరించాయి. 19 ఏళ్లలో 1403 ప్రమాదాలు పశ్చిమ ఘాట్లలో గడిచిన 19 ఏళ్లలో 1,403 ప్రకృతి విపత్తులు జరిగాయి. 1,403 సార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. 98 మంది మరణించారు. అభివృద్ధి పేరిట అశాసీ్త్రయంగా అడవులను నరికి ఆక్రమించడం, రోడ్ల విస్తరణ కోసం చెట్లను కొట్టివేయడం, కొండలను, మట్టిని తరలించడం వల్ల ప్రకృతి ఆగ్రహిస్తోంది. ఇంకా అనేక రకాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇలా మానవ నిర్మిత తప్పిదాల కారణంగా ఘాట్లు బలహీనమవుతున్నాయి. దీంతో ఓ మోస్తరు వర్షాలు, కుండపోత వానలకు అతలాకుతలమవుతోంది. తరచూ కొండ చరియలు విరిగిపడుతున్నాయి. భూమి కుంగిపోతోంది. పశ్చిమ కనుమల్లోని 8 జిల్లాల పరిధిలోని 31,231 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో భూమి ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో ఉందని నివేదికలో పేర్కొన్నారు. కొందరు ఆక్రమణదారులు తమ స్వార్థం కోసం అడవులను నాశనం చేస్తూ ఆక్రమించుకుంటున్నారు. వేలాది ఎకరాల్లో అటవీ భూమి కబ్జాలకు గురవుతోంది. భారీగా రోడ్ల నిర్మాణం, జలాశయాలు, ఆనకట్టలను నిర్మించడం ఇక్కడి పర్యావరణానికి సరిపోవడం లేదు. విచ్చలవిడి నిర్మాణాలు, అడవుల నరికివేతలు.. పశ్చిమ ఘాట్లకు తీవ్ర ముప్పు సర్కారుకు వివిధ శాఖల నివేదిక నివారణ చర్యలకు సూచన విరుగుతోన్న కొండచరియలు కొడగు జిల్లాలో మొత్తం 96 శాతం భూభాగం కొండచరియలు విరిగిపడే ప్రమాదకర స్థితి ఉందని నివేదిక తెలిపింది. దక్షిణ కన్నడ జిల్లాలో 94.9 శాతం, ఉత్తర కన్నడ జిల్లాలో 81.3 శాతం మేర భూభాగం తీవ్ర అపాయంలో ఉందని హెచ్చరించింది. ఉత్తర కన్నడ జిల్లాలో అత్యధికంగా 609 సార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. చిక్కమగళూరులో 260, కొడుగులో 188, దక్షిణ కన్నడలో 166 సార్లు కొండ చరియలు కూలిపోయాయి గడిచిన ఏడాది కాలంలో కొడగు, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ జిల్లాల్లో జరిగిన కొండచరియల ప్రమాదాల్లో మొత్తం 98 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పశ్చిమ కనుమల పరిరక్షణకు గట్టి చర్యలు తీసుకోవాలి. ఆక్రమణలకు పాల్పడుతున్న వారిని గుర్తించి శిక్షించాలని ఇక్కడి స్థానికులు కోరుతున్నారు. పర్యాటకంతో పాటు అశాసీ్త్రయంగా జరుగుతున్న అభివృద్ధిని కట్టడి చేయాలని డిమాండ్లు ఉన్నాయి. -
విందు భోజనం.. కలుషితం
మండ్య: హోలీ పండుగ రోజున అనాథాశ్రమంలో భోజనం చేసిన బాలలు అస్వస్థత పాలయ్యారు. వారిలో ఒకరు చనిపోగా, మరో 27 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లాలోని మళవళ్లి తాలూకాలోని కాగేపుర గ్రామంలో ఉన్న గోకుల అనాథాశ్రమంలో శనివారం ఓ వ్యాపారి విందు భోజనం సమకూర్చారు. తిన్న తరువాత బాలలకు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. వెంటనే వైద్యులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి చికిత్స చేశారు. మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అందులో మేఘాలయాకు చెందిన 6వ తరగతి విద్యార్థి అయిన కేర్లాంగ్ (13) పరిస్థితి విషమించి కిందపడిపోయాడు. పరీక్షించిన వైద్యులు అతడు మరణించాడని తెలిపారు. మొత్తం 27 మంది అనారోగ్యానికి గురయ్యార. ఇతర రాష్ట్రాలకు చెందిన బాలలు ఉన్నారు. ఇద్దరు మాత్రమే కన్నడిగులని తెలిసింది. బాధితులు మళవళ్లి తాలూకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలుని మృతదేహాన్ని మండ్య మిమ్స్కు తరలించారు. కలెక్టరు కుమార్, ఎస్పీ మల్లికార్జున బాలదండి ఆస్పత్రికి వచ్చి పరిశీలించారు. భోజనం కలుషితం కావడం వల్లే ఇలా జరిగిందని సమాచారం. 27 మంది బాలలకు అస్వస్థత ఒకరు మృత్యువాత అనాథాశ్రమంలో ఘటన -
ఫిర్యాదులు తీసుకుని చర్యలు చేపట్టాలి
వృద్ధ తల్లిదండ్రులను వదిలేస్తున్నారునేటి రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఎక్కడా కనిపించడం లేదు. కొడుకులు పెళ్లిళ్లు కాగానే వేరు కాపురాలు పెడుతున్నారు. తమ పిల్లలు, కుటుంబమే చాలని, వృద్ధ తల్లిదండ్రులను పోషించడం చాదస్తంగా భావించే సంతానానికీ కొదవ లేదు. ఎల్లకాలం తల్లిదండ్రులను పోషించలేమని, తమకూ కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని సమర్థించుకుంటారు. వారు ఎంత కష్టపడి తమను పోషించి ప్రయోజకులను చేశారనేది మర్చిపోతారు. కన్నవారి నుంచి ఆస్తులను తీసుకుని, వారిని అనాథాశ్రమంలో వదిలేసేవారు కొందరైతే, అది కూడా తమకు భారమేనని భావించి బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో విడిచి వచ్చేవారు మరికొందరు. బెళగావి జిల్లాలో బిమ్స్ ఆస్పత్రిలో వృద్ధ తల్లిదండ్రులు వదిలేయడం బాగా పెరిగింది. ● సంతానం నిర్దాక్షిణ్యం ● బెళగావిలో మరీ అధికం ● వైద్యవిద్యాశాఖ మంత్రి ఆగ్రహం ● ఆస్తుల బదిలీని రద్దు చేయాలని ఆదేశంశివాజీనగర: కన్నడనాట ఇటీవల వృద్ధులైన తల్లిదండ్రులను ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో విడిచి వెళుతున్న సంఘటనలు ఎక్కువయ్యాయి. పిల్లలు ఆస్తిని రాయించుకొని తల్లిదండ్రులను చికిత్స నెపంతో ఆసుపత్రుల్లో వదిలేస్తున్నారని వైద్య విద్యాశాఖ మంత్రి శరణు ప్రకాశ్ పాటిల్ అన్నారు. దీనిని అరికట్టేందుకు అలాంటి సంతానానికి ఆస్తుల బదిలీని రద్దు చేయాలని సూచించారు. ఆదివారం ఆయన బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. నేటి డిజిటల్ యుగంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులనే అనాథలుగా చేస్తున్న మోసపూరితమైన వ్యవహారాలు అధికమయ్యాయి. ఇటువంటి అమానవీయ కార్యకలాపాలకు బ్రేక్ వేసేందుకు వైద్యవిద్యా శాఖ సిద్ధమైందని తెలిపారు. ఆస్పత్రుల్లోనే ఎందుకు? బెళగావి వైద్య విజ్ఞాన సంస్థ (బీఐఎంఎస్) ఆస్పత్రిలో 150 మందికి పైగా వయో వృద్ధ తల్లిదండ్రులను పిల్లలు విడిచిపెట్టి వెళ్లిన కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇతర వైద్య సంస్థల్లో ఇటువంటి 100కు పైగా ఘటనలు జరిగాయి. ఇది చాలా బాధాకరం. అటువంటి సంతానానికి ఇచ్చిన వీలునామాలు, ఆస్తుల బదిలీని రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇటువంటి ఘటనల గురించి తెలిస్తే వైద్య విద్యా శాఖ డైరెక్టర్ (డీఎంఈ) తక్షణమే సహాయక జిల్లాధికారి (ఏసీ)కి ఫిర్యాదు చేయాలన్నారు. పిల్లలు కన్నవారిని చూసుకోవటానికి సాధ్యపడక వదిలేస్తారు. కొందరు ఆర్థిక ఇబ్బందుల వల్ల విడిచిపెట్టారు. కొందరైతే ఆస్తులను తమ పేర్లకు మార్చుకొని ఆ తరువాత చికిత్స నెపంతో ఆసుపత్రిలో చేర్చి వెళ్లిపోయారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో భోజనం, వసతి ఉచితంగా లభిస్తుందని తెలియడమే కారణం అని తెలిపారు. ఇటువంటి వృద్ధులను బెళగావి చుట్టుపక్కల గల 70 వృద్ధాశ్రమాల్లో ఆశ్రయం కల్పించారు. అయితే ఇప్పటికీ చాలా మంది ఆసుపత్రుల్లోనే ఉన్నారు.వయో వృద్ధుల నిర్వహణ, సంక్షేమ చట్టం– 2007 కింద బాధితుల నుంచి ఫిర్యాదులను తీసుకుని చర్యలను చేపట్టాలని అసిస్టెంట్ కమిషనర్, ఇతర వైద్యాధికారులు ఇందులో చొరవ చూపాలని మంత్రి సూచించారు. ఈ చట్టం గురించి అనేక మందికి తెలియదు. పిల్లలు గాని, ఆప్త బంధువులు వృద్ధులకు ఆర్థిక, వైద్య సదుపాయాలు కల్పించాలనే నియమముంది. అలా చేయని పక్షంలో తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిపాస్తులను రద్దు చేసే చట్టబద్దమైన హక్కు కలిగి ఉంటారని మంత్రి తెలిపారు. సెక్షన్ 23 ప్రకారం పిల్లలు ఆస్తిని వంశపారంపర్యంగా పొందిన తరువాత తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినట్లయితే ఆస్తి రద్దుకు, తామే మళ్లీ పొందేందుకు చట్టంలో ఆనుమతి ఉందని తెలిపారు. -
నేత్రపర్వంగా ఇస్కాన్ శోభాయాత్ర
బళ్లారిఅర్బన్: కప్పగల్ రోడ్డులోని రాధాకృష్ణ మందిరం ఆధ్వర్యంలో నగరంలో ఆదివారం సాయంత్రం శోభ యాత్రను ఘనంగా నిర్వహించారు. ముందుగా మందిరంలో రాధాగోవింద మూర్తులకు విశేష పూజలు నెరవేర్చారు. మహా ప్రసాదం వినియోగం తదితరాలతో పాటు ప్రవచన కార్యక్రమాలు అలరించాయి. సాయంకాలం రాధాగోవిందుల చిత్రపటాలతో శోభాయాత్ర నిర్వహించారు. కప్పగల్ రోడ్డు, దుర్గమ్మ గుడి వద్ద, లోవంతెన, రాయల్ సర్కిల్, బీడీఏఏ గ్రౌండ్, బెంగళూరు రోడ్డు, మోతీ సర్కిల్, పాత డీసీ కార్యాలయం రైల్వే స్టేషన్ రోడ్డు వరకు శోభయాత్రను నిర్వహించారు. కార్యక్రమంలో ఇస్కాన్ ఆలయ ప్రధాన నిర్వహకులతో పాటు విద్యార్థుల బృందాలు, తదితరులు పాల్గొన్నారు. -
కళాభిమానుల మనసు దోచిన చిత్ర సంత
రాయచూరు రూరల్: కుంచెకారుల నుంచి జాలువారిన చిత్రలేఖనాలు నగరవాసులను అబ్బురపరిచాయి. సమాజంలోని పలు అంశాలను ఇతివృత్తాలుగా చేసుకొని కళాకారులు గీసిన చిత్రాలతో నగరంలోని సిద్దరామ జంబల దిన్ని రంగ మందిరం వద్ద శంకర గౌడ బెట్టదూరు వేదిక ఆధ్వర్యంలో కళా సంకుల సంస్థ అధ్యక్షురాలు రేఖ, మారుతి ఏర్పాటు చేసిన చిత్ర సంతే కార్యక్రమం నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది. కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గోవా, తెలాంగణ నుంచి వచ్చిన కళాకారులు గీసిన చిత్రాలను ప్రదర్వించారు. కళాభిమానలు పెద్ద సంఖ్యలో వచ్చిపెయింటింగ్స్ను వీక్షించారు. అంతకుముందు చిత్ర సంతెను ప్రారంభించిన వ్యవసాయ వర్సిటీ వైస్చాన్సలర్ హన్మంతప్ప, రాయచూరు ఎంపీ కుమార్ నాయక్లు మాట్లాడుతూ చిత్రకళను ప్రోత్సహించాలన్నారు. అంతరించి పోతును కళలకు జీవం పోసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. రాయచూరులో శంకరగౌడ బెట్టదూరు పేరుపై అర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్నేత రవి తెలిపారు. అనంతరం డాక్టర్ ప్రాణేష్ను సత్కరించారు. ఎమ్మెల్సీ వసంత్ కుమార్, వెంకటేష్, విన బెంచి, పట్టేద్, రవి, శాలం, నరసింహు లు, చేతన్, వీరేష్, ఈరణ్ణ పాల్గొన్నారు. -
కొడుకు బాగు కోసం తండ్రి అప్పుల పాలు
రాయచూరు రూరల్: కుమారుడు బాగుండాలని తండ్రి ఎక్కడ చూసినా అప్పులు చేశాడు. ఆ డబ్బుతోనే కుమారుడు చదివి ఉద్యోగం సాధించాడు. తనకు అండగా ఉంటాడులే అనుకుంటున్న సమయంలో తనయుడు తన దారి తాను చూసుకున్నాడు. మరో వైపు అప్పులు కట్లలేక తండ్రి వీధిన పడ్డాడు. ఈ విషాద ఘటన విజయపుర అలకుంటకాలనీలో జరిగింది. ఇక్కడ నివాసం ఉంటున్న వీరభద్ర, భాగ్యమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు బసవరాజు చదువు కోసం వీరభద్ర కొన్ని ఫైనాన్స్ సంస్థల్లో రూ.5లక్షల వరకు అప్పులు చేశాడు. ఆ డబ్బుతో విద్యను అభ్యసించిన బసవరాజుకు ఉద్యోగం లభించింది. అయితే భార్య చెప్పుడు మాటలు విని వేరు కాపురం పెట్టాడు. మరో వైపు తండ్రిపై అప్పుల భారం పడింది. అప్పులకు నెలకు వడ్డీ రూ.14 వేలు చెల్లించాల్సి వచ్చింది. కుమారుడు పైసా కూడా ఇవ్వలేదు. బాకీ చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సంస్థలు కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చి వీరభద్ర ఇంటిని సీజ్ చేశారు. దీంతో దంపతులు వీధిన పడ్డారు. చిన్నకుమారుడు మద్యానికి బానిసయ్యాడు. దీంతో వారిని పట్టించుకునేవారే కరవయ్యారు. తమ బాధ ఎవరికి చెప్పుకోలేక ఆ దంపతులు మౌనంగా రోదిస్తున్నారు. ఉద్యోగం వచ్చాక పోషకులను విస్మరించిన తనయుడు ఇంటిని వేలం వేసిన ఫైనాన్స్ సంస్థలు రోడ్డు పాలైన దంపతులు అలాంటి కుమారులకు ఆస్తులు దక్కరాదు :మంత్రి శరణు ప్రకాశ్ పాటిల్ తల్లిదండ్రులను విస్మరిస్తే వారికి ఆస్తులు దక్కకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి శరణుప్రకాస్ పాటిల్ అన్నారు. అదివారం ఆయన కలబుర్గిలో విలేకరులతో మాట్లాడారు. కొడుకు బాగా వృద్ధిలోకి రావాలని తండ్రి రూ.5 లక్షలు అప్పు చేసి చదివిస్తే ఉద్యోగం రాగానే తల్లిదండ్రులను విస్మరించిన ఉదంతం విజయపుర అలకుంట కాలనీలో చోటు చేసుకుందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వృద్ధులను విస్మరించే వారికి ఆస్తులు దక్కకుండా చేయాలన్నారు. బెళగావి మెడికల్ ఆస్పత్రిలో 150 మంది కి పైబడి సీనియర్ సిటిజన్లు తమ కుటుంబాలకు దూరంగా ఉన్నారని, ఇది బాధాకరమన్నారు. -
శిల్పనగరిలో రంగుల పండుగ
హొసపేటె: ప్రపంచ ప్రసిద్ద పర్యాటక కేంద్రంగా భాసిలుతున్న హంపీలళో హోలీ సంబరాలు కొనసాగుతున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులు పరస్పరం రంగులు చల్లూకొని సందడి చేస్తున్నారు. హంపీ విరూపాక్ష దేవాలయం ముందు ఉన్న రథ వీధుల్లో హోలీ పండుగను దేశ విదేశాల పర్యాటకులు ఐక్యతతో నిర్వహించారు. సాక్షి,బళ్లారి: ఆదివారం సెలవు రోజు కావడంతో బళ్లారి నగరంలో చిన్నారులు, విద్యార్థులు హోలీ సంబరాల్లో మునిగిపోయారు. వివిధ కాలనీల్లో రంగులు చల్లుకుని నృత్యాలుచేస్తూ సందడిగా గడిపారు. -
వైభవంగా శ్రీ గురుతిప్పేరుద్రస్వామి రథోత్సవం
చెళ్లకెర రూరల్: చిత్రదుర్గ జిల్లా చెళ్లకెర తాలూకా నాయకనహట్టిలో మహనీయుడు కాయకయోగి శ్రీ గురుతిప్పేరుద్రస్వామి రథోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. తొలుత ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తిని రథంలో కొలువు దీర్చారు. అనంతరం అశేష భక్త జనుల జయజయధ్వానాల మధ్య రథోత్సవం సాగింది. భక్తులు రథంపైకి అరటి పండ్లు, మెరియాలు వేసి మొక్కుబడులను తీర్చుకున్నారు. దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యజ్ఞగుండంలోకి భక్తులు వట్టి కొబ్బరి వేసి భక్తిని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి కూడా భక్తులు హాజరయ్యారు. సంఘ సంస్థలు భక్తులకు పానకం, మజ్జిగ, తాగునీరు అందజేశారు. స్వామి వారి ముక్తి బావుటను బెంగళూరుకు చెందిన వాణిజ్య వేత తేజస్వి ఆరాధ్య రూ.63 లక్షలకు వేలంలో దక్కించుకుని భక్తిని చాటుకున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి బీ.సుధాకర్, మాజీ మంత్రి బీ.శ్రీరాములు, ఎమ్మెల్యే రఘుమూర్తి, జిల్లాధికారి టి.వెంకటేష్, తహసీల్దార్ రేహల్ పాషా అనేక మంది అధికారులు పాల్గొన్నారు. -
అప్పుడే భానుడి భగభగలు
సాక్షి,బళ్లారి: బిసలు బళ్లారిగా ఖ్యాతి పొందిన బళ్లారి జిల్లాలో వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 9 నుంచే భానుడు మండుతున్నాడు. మధ్యాహ్నం సమయానికి వడగాలులు వీస్తున్నాయి. దీంతో జనం బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. మున్ముందు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. మార్చిలోనే ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటుందోనని జనం ఆందోళన చెందుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని, మధ్యాహ్నం వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రాకూడదని వైద్యులు సూచిస్తున్నారు. పాఠశాలు, కళాశాలు కూడా యధావిధిగా నడుపుతుండటంతో విద్యార్థులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. బయటకు వెళ్లే సమయంలో గొడుగు, టోపీ, లేదా టవాల్ ధరించాలని సూచిస్తున్నారు. పుచ్చకాయలకు డిమాండ్ ఎండలతో ఉపశమనం కోసం ప్రజలు చల్లనీ పానీయాలు, పుచ్చకాయలను ఆశ్రయిస్తున్నారు. ఇంటినుంచి బయటకు వచ్చిన సమమయంలో కొబ్బరి బొండాలను తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. దీంతో నగరంలో ఎటు చూసినా పుచ్చకాయల విక్రయాలు జోరందుకున్నాయి. రాయల్ సర్కిల్ నుంచి సంగం సర్కిల్, ఎంజీ పెట్రోల్బంక్, ఎస్పీ సర్కిల్ తదితర ప్రముఖ రోడ్లలో పుచ్చకాయలు వ్యాపారాలు జోరందుకుంటున్నాయి. ఒక్కో కొబ్బరి బొండం ధర రూ.60తో విక్రయిస్తున్నారు. మట్టికుండల కొనుగోలుకు ఆసక్తి ఎండకు వెళ్లి వచ్చిన వారు మట్టికుండలోని ఒక గ్లాసుడు నీటిని తాగితే చెప్పలేనంత ఊరట లభిస్తుంది. అందుకే వేసవిలో ప్రతి ఇంటిలోనూ మట్టికుండకు చోటు దక్కుతుంది. ఈక్రమంలో మట్టికుండల విక్రయాలు జోరందుకున్నాయి. బళ్లారిలో పెరుగుతున్న ఎండల తీవ్రత 40 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు చల్లటి పానీయాలను ఆశ్రయిస్తున్న జనం కొబ్బరి బొండాలకు డిమాండ్ -
చిక్కసూగూరు వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్
రాయచూరు రూరల్: జిల్లాలో పురాతన చెరువుల సంరక్షణకు అధికారులు చర్యలు చేపట్టాలని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ ఆదేశించారు. నగరంలోని గొల్లకుంట చెరువును ఆదివరం ఆయన పరిశీలించి మాట్లాడారు. నగరంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులకు మహర్ధశ కల్పించడానికి బడ్జెట్లో నిదులు కేటాయించినట్లు తెలిపారు. రాంపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద అదనంగా 10 ఏకరాలు, చిక్క సూగురు వద్ద 50 ఏకరాల విస్తీర్ణంలో కొత్తగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణాలకు సర్వేలు చేయాలని అదేశించామన్నారు. రాయచూరు విజ్ఞాన కేంద్రంలో ఉప కేంద్రాల నిర్మాణాలకు ప్రతి పాదనలు సిద్దం చేయాలని కలెక్టర్ నితీష్కు మంత్రి సూచించారు. ఎంపీ కుమార నాయక్ పాల్గొన్నారు. నగర అభివృద్ధికి సహకరించండి రాయచూరు రూరల్: నగర అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని ఎమ్మెల్సీ వసంత్ కుమార్ అన్నారు. నగరంలోని 21వ వార్డు ప్రధాన రహదారిలో రూ.2.5 కోట్లతో సీసీ రోడ్డు, తాగునీటి ట్యాంకు నిర్మాణ పనులకు ఆదివారం ఆయన భూమి పూజ చేసి మాట్లాడారు. భవిష్యత్తులో నగరాన్ని సుందరంగా తీర్చి దిద్దడానికి చర్యలు తీసుకుంటామన్నారు. నగరసభ సభ్యుడు నాగరాజ్, నేతలు ఖరీమ్, అస్లాం పాషా, పరుశు రామ్, నాగిరెడ్డి, రజాక్ ఉస్తాద్ పాల్గొన్నారు. రుణ కంతులు చెల్లించాలని వేధింపులు మైక్రో ఫైనాస్ సిబ్బందిపై కేసు నమోదు హుబ్లీ: అప్పులు తీర్చాలని అసభ్యంగా నిందించి వేధించిన సూక్ష్మరుణ సంస్థ ప్రతినిధులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ధార్వాడ తాలూకా చిక్కమల్లిగవాడ గ్రామంలో పలువురు మహిళలు సూక్ష్మరుణ సంస్థలో రుణాలు తీసుకున్నారు. కంతులు తీర్చడానికి గడువు కావలని విజ్ఞప్తి చేశారు. అయితే సిబ్బంది వెళ్లి మహిళలను వేధించారు. బాధితులు సహయవాణికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై జిల్లాధికారి దివ్య ప్రభు స్పందించారు. సదరు ఫైనాన్స్ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధితురాలు నీలవ్వ మాట్లాడుతూ మేము కష్టాన్ని నమ్ముకొని జీవనంసాగిస్తున్నామని, పనికి వెళ్లిన చోట్లకు ఫైనాన్స్ సిబ్బంది వచ్చి నిందిస్తున్నారని వాపోయింది. గుజరీ దగ్ధంహొసపేటె: విజయనగర జిల్లా హడగలిలో గుజరి దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగి లక్షల రూపాయల విలువైన వస్తువులు దగ్ధమయ్యాయి. మటన్ మార్కట్ సమీపంలోని గుజరీలో ఆదివారం చిన్నపాటి మంటలు చెలరేగాయి. వెంటనే కార్మికులు బయటకు పరుగులు తీశారు. మంటలు వ్యాపించి వస్తు సామగ్రి కాలి బూడిదైంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. హడగలి సీఐ దీపక్ భూసారెడ్డి కేసు దర్యాప్తు చేపట్టారు. దొంగల అరెస్ట్, ధాన్యం స్వాధీనం హుబ్లీ: రైతులు ఆరుగాలం శ్రమించి పండించి పొలాల్లో నిల్వ చేసిన ధాన్యాన్ని చోరీ చేసిన ఐదుమంది నిందితులు పట్టుబడ్డారు. దుర్గప్ప, గంగాధర, మహంతేష, అమిత్, అభిషేక్ నరేగల్ అనే నిందితులను హావేరి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులనుంచి 10.27 లక్షల విలువైన 54 క్వింటాళ్ల జొన్నలు, 21 క్వింటాళ్ల మొక్కజొన్న, 30 క్వింటాళ్ల సావె, 5 క్వింటాళ్ల శెనగ, రెండు క్వింటాళ్ల గోధుములు, బోలెరో వాహనం, బైక్ను జప్తు చేశారు. నిందితులను విచారణ చేపట్టగా శిగ్గావి, బంకపూర, హులగూరు, హవేరి గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన 9 చోరి కేసులు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు. -
వ్యాపార వాణిజ్యోద్యమ అభివృద్ధికి ఒప్పందం
బళ్లారిఅర్బన్: వాణిజ్య పరిశ్రమల అభివృద్ధి సాధనకు పరస్పరం సహకారం అందించుకోవడానికి జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ మైసూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థతో సంయుక్త ఒప్పందాన్ని చేసుకున్నారు. బళ్లారి జిల్లాలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు యశ్వంత్రాజ్ నాగిరెడ్డి మైసూరు జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కేవీ.లింగరాజ మైసూరులో జరిగిన సంయుక్త సమవేశంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. యశ్వంత్రాజ్ నాగిరెడ్డి మాట్లాడుతూ జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కేవలం వ్యాపారాలు, వాణిజ్యానికే పరిమితం కాకుండా యువశక్తికి చక్కటి భవిత రూపొందించడానికి స్కిల్స్ డెవలప్మెంట్, అన్నదాతలకు ఉచితంగా భోజనం, క్లినిక్, విశ్రాంతిధామం వంటి ప్రజాకర్షక సేవా పథకాలను అమలు చేస్తోందన్నారు. ఈ పథకాలకు సమాజంలోని అన్ని వర్గాల నుంచి విశేషమైన ఆదరణతో పాటు అభినందనలు లభించాయన్నారు. ఉభయ జిల్లాలు కలిసి కట్టుగా పని చేయడం ద్వారా సేవా రంగంలో కొత్త అవకాశాలకు దారి ఏర్పడిందన్నారు. మైసూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కేవీ.లింగరాజ మాట్లాడుతూ ఈ ఒప్పందాల వల్ల ఉభయ జిల్లాల పారిశ్రామిక రంగంలో కొత్తదనానికి చోటు లభించిందన్నారు. బళ్లారిలో రైతన్నల భోజన పథకంతో స్పూర్తి పొంది రూ.10లకే మైసూరులో కూడా ఏపీఎంసీకి వచ్చే రైతులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించామన్నారు. బళ్లారి సంస్థ అనేక విషయాల్లో రాష్ట్రానికే ఆదర్శప్రాయం అయిందన్నారు. మైసూరు హోటల్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఆ జిల్లా డైరెక్టర్ నారాయణ గౌడ మాట్లాడుతూ రైతన్నల కోసం చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. వేలాది మందికి ఉపాధి లభించిందని, ఇది మైసూరు పర్యాటక కేంద్రానికి దక్కిన అవకాశం అన్నారు. ప్రముఖులు డాక్టర్ మర్చేడ్ మల్లికార్జున గౌడ, అశోక్, శివాజీ రావు, ఆనంద్, అవ్వారు మంజునాథ, దొడ్డనగౌడ, సొంతా గిరిధర్, సురేష్బాబు, రామచంద్ర, సుధాకర్ శెట్టితో పాటు ఉభయ జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, పదాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. -
ఏప్రిల్ 6 వరకు సాగు నీరు
రాయచూరు రూరల్: నారాయణపుర కుడి కాలువ ఆయకట్టు చివరి భూములకు ఏప్రిల్ 6 వరకు సాగు నీరందించాలని అప్పర్ కృష్ణా ప్రాజెక్టు నీటిపారుదల సలహా సమితి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఏపీఎంసీ శాఖ మంత్రి ఆర్.బి.తిమ్మాపుర ప్రకటించారు. బెంగళూరులోని వికాససౌధలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 23 తర్వాత నీటి విడుదల నిలిపివేతను రద్దు చేసి మరో రెండు వారాల పాటు నీటి విడుదలకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. కర్ణాటక రైతు సంఘం జిల్లాధ్యక్షుడు శివపుత్ర పాటిల్ ఆందోళన చేపట్టిన నేపథ్యంలో కాలువకు నీటి విడుదలను పొడిగించినట్లు తెలిపారు. వేర్వేరు చోట్ల ఇద్దరు దుర్మరణం రాయచూరు రూరల్: జిల్లాలో వేర్వేరు చోట్ల హోలీ ఆడి స్నానం కోసం వెళ్లట్లిద్దరు వ్యక్తులు దుర్మరణం పాలైన ఘటనలు రాయచూరు జిల్లాలో జరిగాయి. శనివారం రాయచూరు తాలూకా గిల్లేసూగూరు వద్ద ఆర్డీఎస్ కాలువలో స్నానం చేయడానికి యరగేరకు చెందిన వ్యాపారి మహదేవ్(30) వచ్చాడు. కాలువలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో కాలు జారి పడిపోయాడు. ఈత రాకపోవడంతో కొట్టుకుపోయి మరణించాడు. అగ్నిమాపకదళం, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గాలించి మృతదేహాన్ని వెలికితీసి శవ పరీక్ష కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సుల్తాన్పురలో.. హోలీ సందర్భంగా రంగులు చల్లుకుని స్నానం చేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి నీటి కుంటలోకి జారి పడి దుర్మరణం పాలైన ఘటన శుక్రవారం రాయచూరు తాలూకా సుల్తాన్పురలో జరిగింది. మృతుడిని గ్రామంలోని నీటి కుంట వద్ద స్నానం చేయడానికి వెళ్లిన జాగీర్ వెంకటాపూర్కు చెందిన సోమనగౌడ(45)గా పోలీసులు గుర్తించారు. అగ్నిమాపక దళం, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. శ్రీశైలం భక్తులకు అన్నదానంరాయచూరు రూరల్: శ్రీశైల మల్లికార్జునుని దర్శనం కోసం పాదయాత్ర ద్వారా వెళ్లే ఉత్తర కర్ణాటక భక్తులకు ప్రవాసాంధ్రుడు బి.వెంకటరెడ్డి (బీవీఆర్) ట్రస్టుచే అన్నదానం, ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. బాగల్కోటె సంగం క్రాస్ వద్ద ఆంధ్రప్రదేశ్కు చెందిన పారిశ్రామికవేత్త గత రెండు దశాబ్దాలుగా ఈ సేవలు చేస్తున్నారు. మానవత్వంతో భక్తులకు భోజనం, టిఫిన్, టీ, తలపాగా పంపిణీ, పండ్లు, శాలువా, మజ్జిగ, బిస్కట్లు, మసాల వడ, మిరప బజ్జీలు, లడ్డూ, కారా, బోండాలను పంపిణీ చేశారు. మరో వైపు వైద్య సేవలను, పురుషులు, సీ్త్రలకు విశ్రాంతి, స్నానపు గదులు ఏర్పాటు చేశారు. రేణుకాచార్య జయంతిరాయచూరు రూరల్ : బాళెహొన్నూరు రంభాపురి పీఠంలో రేణుకాచార్య జయంతి, యుగమానోత్సవాలు నిర్వహించారు. మఠం నుంచి హోలీ పండుగ సందర్భంగా వివిధ రకాల వేష భూషణలతో ఊరేగింపు జరిపారు. వసంతోత్సవం, వీరభద్రేశ్వర రథోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా శాంతమల్ల శివాచార్యలున్నారు. రేణుకా స్వామి నందీశ్వరుడి పాత్రలో భక్తులను ఆకట్టుకున్నారు. మహిళా కార్మికుల ధర్నా రాయచూరు రూరల్: మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాలు స్పందించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. శనివారం తహసీల్దార్ కార్యాలయం వద్ద అధ్యక్షుడు శరణ బసవ మాట్లాడారు. సర్కార్ తీసుకుంటున్న నిర్ణయం వల్ల మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధ్వర్యంలో విధులు నిర్వహించే వారికి సమాన వేతనాలు, పీఎఫ్, జీపీఎఫ్, గ్రాచ్యూటీ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. -
కారుపై పడిన కాంక్రీటు మిక్సర్
యశవంతపుర: భూమి మీద నూకలు మిగిలి ఉంటే ఎంత పెద్ద దుర్ఘటన జరిగినా ఇట్టే బయటపడవచ్చు. లేదంటే చిన్న సైకిల్ తగిలినా హరీమనాల్సిందేనని పెద్దలు చెబుతుంటారు. అదే మాదిరిగా జరిగిందీ సంఘటన. రోడ్డుపై నిలిచి కారుపై భారీ పరిమాణంలో ఉన్న కాంక్రీటు మిక్సర్ లారీ పడిపోయింది. కారు తుక్కు తుక్కయినా అందులోని ఇద్దరు బతికి బయటపడ్డారు. బెళగావి వద్ద పూణె– బెంగళూరు హైవేలో సర్వీసు రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. ఏమైందంటే.. వివరాలు.. ధార్వాడకు చెందిన పరప్ప బాళికాయి, నింగప్ప కొప్ప కారులో బెళగావికి వెళుతూ ఏదో కారణంతో కారును నిలిపారు. వెనుక వస్తున్న కాంక్రీటు మిక్సర్ లారీ అదుపుతప్పి కారుపై పడింది. కారు తుక్కుతుక్కయింది. బెళగావి ఎపిఎంసీ పోలీసులు క్రేన్ సాయంతో పోలీసులు, ఫైర్సిబ్బంది వచ్చి మొదట లారీని పక్కకు తీశారు. తరువాత కారులో ఇద్దరికి తీవ్ర గాయాలై ఉంటాయని, లేదా చనిపోయి ఉండవచ్చని భావించారు. కారు డోర్లను ఊడదీసి ఇద్దరినీ బయటకు తీయగా చిన్న చిన్న గాయాలు తప్ప ఏమీ కాకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. గాయపడిన వీరిని, లారీ డ్రైవర్ని బెళగావి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు తుక్కు, ఇద్దరు సురక్షితం బెళగావి వద్ద అనూహ్య ఘటన -
పట్టపగలే యువకుడి హత్య
రాయచూరు రూరల్: నగరంలోని బంగికుంటలో పట్టపగలే ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. మృతుడిని బబుల్(35) గా పోలీసులు గుర్తించారు. నగరంలోని ఏ1 ట్రేడర్స్లో విధులు నిర్వహిస్త్న్ను బబుల్ తెలంగాణలోని గద్వాల తాలూకా గట్టు మాచర్లలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడని భావించిన ప్రత్యర్థులు చాకుతో పొడిచి హత్య చేసి పారిపోయినట్లు డీఎస్పీ సత్యనారాయణ వెల్లడించారు. సదర్ బజార్ పోలీస్ స్టేషన్ సీఐ ఉమేష్ నారాయణ కాంబ్లే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. -
కుక్కేలో ప్రభుదేవా పూజలు
యశవంతపుర: ప్రముఖ నటుడు, డ్యాన్స్మాస్టర్ ప్రభుదేవా కుటుంబసమేతంగా కుక్కే సుబ్రమణ్యస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. స్వామివారికి మహాభిషేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు, అధికారులు వారికి తగిన ఏర్పాట్లు చేశారు. సైబర్ భద్రతకు ప్రత్యేక సంస్థ ●● హోంమంత్రి వెల్లడి బనశంకరి: సైబర్నేరాల నియంత్రణ కోసం ప్రత్యేక సంస్థను స్థాపించడానికి ప్రయత్నిస్తామని హోం శాఖ మంత్రి డాక్టర్ పరమేశ్వర్ తెలిపారు. శనివారం నగరంలోని ఓ హోటల్లో సీఐడీ డి కోడ్– 2025 పేరుతో సైబర్ సదస్సును ఆయన ప్రారంభించారు. టెక్నాలజీ పెరుగుతోంటే, భద్రతా సవాళ్లు కూడా ఉద్భవిస్తున్నాయని, వాటిని ఎదుర్కొనే వృత్తి నైపుణ్యాలను పోలీసులు అలవరచుకోవాలన్నారు. కర్ణాటక ఐటీ రంగంతో పాటు, సైబర్ నేరాల నియంత్రణలో ముందంజలో ఉందన్నారు. ఇందుకోసం పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 45 వేలమందికి సైబర్ నేరాల కట్టడి గురించి శిక్షణ ఇచ్చామని, న్యాయశాఖ సిబ్బందికి కూడా శిక్షణ ఇస్తామన్నారు. విద్యారంగంలో యూనివర్శిటీలలో సైబర్ సురక్షత పట్ల పాఠ్యాంశాలు బోధిస్తామని తెలిపారు. ప్రభుత్వం 54 సైబర్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసిందన్నారు. అహ్మదాబాద్ కేంద్రీయ సైబర్ యూనివర్శిటీని సందర్శించామని, ఇంతకంటే ఉన్నత సంస్థను స్థాపించి సైబర్ నేరాల అడ్డుకట్టకు జాగృతి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు ఐటీ సంస్థల ముఖ్యులు పాల్గొని ప్రసంగించారు. బెంగళూరుకు డిప్యూటీ స్పీకర్ తరలింపు శివాజీనగర: ప్రమాదానికి గురై దావణగెర ఎస్ఎస్ హైటెక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డిప్యూటీ స్పీకర్ రుద్రప్ప లమాణిని మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు, కుటుంబ సభ్యులు ఏమీ చెప్పకపోవడంతో నియోజకవర్గ ప్రజలు, అభిమానులు ఆదుర్దాలో ఉన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ సమావేశాలు చూసుకుని బెంగళూరు నుంచి హావేరికి వెళ్తున్నారు. చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకా జేజే హళ్లి వద్ద హైవే పక్కన కొబ్బరినీరు తాగేందుకు కారు దిగి రాగానే ఓ బైకిస్టు వేగంగా వచ్చి ఢీకొన్నాడు. కిందపడిన రుద్రప్ప లమాణికి తలకు, నోటి దగ్గర బలమైన గాయాలయ్యాయి. ఆయనకు హిరియూరులో చికిత్స చేసి అంబులెన్స్ ద్వారా దావణగెర ఎస్ఎస్ హైటెక్ ఆసుపత్రిలో చేర్చారు. శనివారం ఉదయం బెంగళూరుకు తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యసేవలు అందిస్తున్నారు. బెంగళూరులో చెత్త పన్ను దొడ్డబళ్లాపురం: బెంగళూరువాసులపై బీబీఎంపీ మరో భారం మోపనుంది. ఇకపై చెత్తపై సర్వీస్ చార్జ్ వసూలు చేయాలని పాలికె నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ సర్వీస్ చార్జ్ వసూలు ఉంటుందని కమిషనర్ తుషార్ గిరినాథ్ తెలిపారు. ఇది పన్ను కాదని, సర్వీస్ చార్జ్ మాత్రమేనని అన్నారు. ఆస్తి పన్నుతో కలిసి ఏడాదిలో రెండుసార్లు చెత్త సుంకాన్ని చెల్లించవచ్చన్నారు. విద్యుత్ బిల్ మాదిరిగా ప్రతి నెలా వసూలు చేయడం వీలుకాదని, అందువల్ల ఇలా నిర్ణయించామని చెప్పారు. -
బీజేపీ నేత, ఎస్ఐ బాహాబాహీ
తుమకూరు: తుమకూరు జిల్లాలోని మధుగిరి బీజేపీ అధ్యక్షుడు హనుమంతేగౌడ, ఎస్ఐ గాదిలింగప్ప ముష్టియుద్ధానికి దిగారు. నేనేం తక్కువ కాదని ఒకరికొకరు తోసుకుని కొట్టుకోవడంతో జనం ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చిత్రదుర్గం నగరంలోని ఐశ్వర్య హోటల్ ముందు జరిగింది. వివరాలు.. హనుమంతేగౌడ, మరికొందరితో కలిసి చిత్రదుర్గానికి వెళ్లాడు. భోజనం చేద్దామని హోటల్లోకి వెళ్తుండగా ఎస్ఐ గాదిలింగప్ప తనిఖీలకు వచ్చాడు. అర్ధరాత్రి సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారని ఎస్ఐ ప్రశ్నించాడు. భోజనం చేయడానికి వచ్చామని హనుమంతేగౌడ అన్నారు. వెంటనే ఇంటికి వెళ్లిపోవాలని ఎస్ఐ కాస్త గట్టిగా సూచించారు. మాకే బెదిరిస్తావా అని మద్యం మత్తులో ఉన్న హనుమంతేగౌడ ప్రశ్నించాడు. దీంతో ఎస్ఐ ఆయనను కొట్టాడు. నన్నే కొడతావా అని అతనిని కొట్టాడు. ఇద్దరూ దూషించుకుంటూ రచ్చ చేశారు. ఎస్ఐ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు హనుమంతేగౌడ మీద కేసు నమోదు చేశారు. బీజేపీ నాయకులు కలిసి ఎస్ఐపైన జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. చిత్రదుర్గ జిల్లా బీజేపీ ఎంపీ గోవింద కారజోళ, ఎమ్మెల్సీ చిదానంద గౌడ, కే.ఎస్.నవీన్గౌడ, తిప్పారెడ్డిలు ఎస్పీని కలిశారు. కాగా గొడవ వీడియోలు వ్యాప్తి చెందాయి. చిత్రదుర్గంలో సంఘటన ఎస్పీకి నాయకుల ఫిర్యాదు -
ఆరోగ్యమే మహాభాగ్యం
బళ్లారిటౌన్: ప్రతినిత్యం ఒత్తిడితో పని చేసే మీడియా ప్రతినిధులతో పాటు ప్రతి ఒక్కరికీ ఆరోగ్యమే మహా భాగ్యమని జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ అధికారి డాక్టర్ యల్లా రమేష్ బాబు పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో జాతీయ ఆరోగ్య అభియానలో భాగంగా డీహెచ్ఓ కార్యాలయంలో శనివారం మీడియా ప్రతినిధులకు ఏర్పాటు చేసిన పరిచయ జాగృతి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. త్వరలో మీడియా ప్రతినిధులకే ప్రత్యేక ఉచిత ఆరోగ్య పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఆరోగ్య శాఖ, మీడియా సమాజంతో సంధానానికి వంతెనలని, ఆరోగ్య వ్యవస్థ ఉన్నతీకరణకు మీడియా చేతులు కలపాలన్నారు. బళ్లారి జిల్లా ఆరోగ్య వ్యవస్థ విషయంలో రాష్ట్ర స్థాయిలో ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయన్నారు. అయితే గత నవంబర్ నెలలో జరిగిన బాలింత మృతి వల్ల కొంత దుష్పరిణామం ఎదురైనందున జిల్లా ఆస్పత్రికి రోగులు రావడం తగ్గుముఖం పట్టిందన్నారు. మీడియా, ప్రజల్లో దీనిపై అవగాహన కల్పించి మంచి కథనాలు రాసినందున మళ్లీ పుంజుకుందన్నారు. జిల్లా సర్జన్ ఎన్.బసరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లా ఆస్పత్రి ఒక కార్పొరేట్ ఆస్పత్రిని తలపిస్తోందన్నారు. ఆస్పత్రిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆరోగ్య సేవలు అందుతున్నాయన్నారు. సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ను కూడా త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో విమ్స్ ఆస్పత్రిలో మహిళల కాన్పులు జరిగేవన్నారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో మెరుగైన సేవలతో కాన్పులు చేపట్టేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా ఆర్సీహెచ్ అధికారి హనుమంతప్ప సర్వేక్షణ అధికారి మరియం బీ, డాక్టర్ పూర్ణిమ కట్టిమని, డాక్టర్ వీరేంద్ర కుమార్, డాక్టర్ ఆర్.అబ్దుల్లా, రోహన్ వనకుంది, ఈశ్వర్ దానప్ప తదితరులు పాల్గొన్నారు. -
అంతులేని నిరీక్షణ
కిడ్నీ దాతల కోసంబనశంకరి: నేటి ఆధునిక యుగంలో మారిన జీవనశైలి, అధికంగా జంక్ ఫుడ్ తినడంతో పెచ్చుమీరుతున్న ఆరోగ్య సమస్యల్లో కిడ్నీ సమస్య ఒకటి. కిడ్నీ సమస్య బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కిడ్నీ జబ్బులత బాధపడుతూ ఆ అవయవ మార్పిడి కోసం 4,892 మంది వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో రోగుల నుంచి డిమాండ్ అధికంగా ఉంది. మూత్రవిసర్జన సమస్య, అధికంగా మూత్రవిసర్జనకు వెళ్లడం, కిడ్నీలో రాళ్లు, కిడ్నీ క్యాన్సర్, కిడ్నీల్లో నీటి బుడగలో పాటు అనేక కిడ్నీ జబ్బులు ప్రబలుతున్నాయి. గతంలో 60–70 ఏళ్లకు పైబడిన వారిలో కనబడేవి ఇలాంటి సమస్యలు. ప్రస్తుతం పిల్లలతో పాటు తక్కువ వయస్సు వారిలో కూడా రావడం ఆందోళన కలిగిస్తుంది. కానీ కారణాలు వేర్వేరు. ప్రారంభంలో సమస్య గుర్తించి చికిత్స తీసుకుంటే కిడ్నీ వైఫల్యం బారి నుంచి బయటపడవచ్చు. కానీ సరైన సమయంలో గుర్తించకపోతే నిత్యం డయాలసిస్, కిడ్నీ తొలగింపు అనివార్యం. మూత్రపిండాలు సక్రమంగా పని చేస్తున్నాయా? లేదా? ముందుగా కనిపెట్టాలి. మూత్రపిండాల ఆరోగ్యం కాపాడాలి అనే నినాదంతో ఈ ఏడాది ప్రపంచ కిడ్నీ దినోత్సవం నిర్వహిస్తున్నారు. మూత్రపిండాల రోగం బారిన పడిన వెంటనే చికిత్స తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ దృష్టిలో రోగులకు ఔషధాలు అందించే వైద్యులు సైతం జాగ్రత్త వహించాలి. కిడ్నీ ఆరోగ్యానికి సమస్యగా మారకుండా సరైన మోతాదులో ఔషధాలు అందించాలి. అదేవిధంగా రోగులు సైతం వైద్యుల సలహాలు తీసుకోకుండా నొప్పి నివారణతో పాటు ఎలాంటి ఔషధాలు, మాత్రలు సేవించరాదని జాగృతి కల్పించడం ప్రపంచ కిడ్నీ దినోత్సవం ఉద్దేశం. రోగ లక్షణాలు... ఆయాసం అధికంగా ఉండటం, కాళ్లలో వాపు, నడవడం సాధ్యం కాకపోవడం, వాంతులు, మూత్రవిసర్జన మార్పులు, నొప్పి, మంటతో కూడిన మూత్రం, జ్వరం వచ్చినప్పుడే నడుము నొప్పి, కళ్లు ఉబ్బడం, మూత్రం రంగు మారడం, నురగ, రక్తస్రావం, సమస్య తీవ్రంగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, బరువు తగ్గడం, చేతులు, కాళ్లు, శరీరంపై దురదలు కిడ్నీ జబ్బుల్లో కనిపించే ప్రధాన లక్షణాలు. మూత్రపిండాల నిర్వహణ ఎలా..? ప్రతి మనిషికి రెండు మూత్రపిండాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన ఒక మూత్రపిండం ఉన్నప్పటికీ ఉత్తమ జీవితం గడపవచ్చు. మూత్రపిండాలు శరీరంలో రక్తం శుభ్రం చేయడం, శరీరంలో పేరుకుపోయిన చెత్తను మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. విటమిన్ డీ ఉత్పత్తి చేసి ఎముకలకు శక్తినిస్తుంది. ఎర్ర రక్తకణాలను అభివృద్ధి చేసి శరీరంలో రక్తప్రసరణను పెంచుతుంది. రెమిన్ అనే అంశం బీపీ, నీరు, లవణాలు, ఆమ్లం అంశాలను నియంత్రిస్తుంది. రోగం తీవ్ర దశలోకి చేరుకునే వరకు ప్రజలు ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తారు. అది మూత్రపిండాల సమస్యకు దారి తీస్తుంది. దీంతో కేసులు పెరుగుతున్నాయి. దీనిపై ప్రజల్లో జాగృతి అవసరం. కిడ్నీ ఆరోగ్య పరీక్షలు, రోగ లక్షణాల గురించి అవగాహన కల్పించాలని నెఫ్రో యూరాలజీ సంస్థ డైరెక్టర్ అధ్యాపకుడు డాక్టర్ శివలింగయ్య తెలిపారు. తరచూ పరీక్షలు ముఖ్యం మూత్రంలో ప్రొటీన్, ఆల్బుమిన్ అంశాలు ఎంత ప్రమాణంలో బయటికి వెళుతుంది అనేది పరీక్ష చేయించాలి. దీంతో పాటు మధుమేహం, బీపీ పరీక్షలు చేయాలి. పరిమితంగా వ్యాయామం, సమయానికి సరైన తాజా ఆహారం తినడం, నిద్ర, భోజనంలో అధికంగా ఉప్పు వాడరాదు, అధికంగా నీరు తాగడం, గర్భిణులు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. మన మూత్రపిండాలు సక్రమంగా ఉన్నాయా? అనే నినాదంతో 2006లో ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ(ఐఎస్ఎన్) ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కిడ్నీ ఫౌండేషన్ సంయుక్త ఆద్వర్యంలో మొదటిసారిగా ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం నిర్వహించింది. కిడ్నీ ఆరోగ్యం, సంబంధిత సమస్యల గురించి ప్రజలకు సమాచారం అందించడానికి 66 దేశాల్లో ప్రపంచ కిడ్నీ దినోత్సవం నిర్వహిస్తోంది. ప్రస్తుతం 80కి పైగా దేశాల్లో ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం నిర్వహించి కిడ్నీ ఆరోగ్యం గురించి జాగృతం చేస్తోంది. -
మరణంలోనూ జీవనదానం
శివమొగ్గ: బ్రెయిన్డెడ్ అయిన ఓ వ్యక్తి అవయవాలను దానం చేయడం ద్వారా మృతుని కుటుంబం పుట్టెడు దుఃఖంలోనూ మానవత చాటిన ఘటన శివమొగ్గ నగరంలో జరిగింది. వివరాలు.. కృషినగర 1వ క్రాస్ నివాసి ఎస్సీ రమేష్ (57) అనే వ్యక్తి ఈనెల 10న సాయంత్రం ఆకస్మికంగా స్పృహ తప్పి పడిపోయారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా మెదడులో రక్తస్రావం జరిగి బ్రెయిన్డెడ్ అని డాక్టర్లు నిర్థారించారు. వైద్యుల అభ్యర్థన మేరకు ఆయన భార్య సవిత, కుమారుడు నిశ్చిత్, కుటుంబ సభ్యులు అవయవాల దానానికి అంగీకరించారు. ఆయన దేహం నుంచి గుండె, మూత్రపిండాలు సహా పలు ముఖ్య భాగాలను సేకరించి అవసరమైన రోగుల కోసం ఆగమేఘాల్లో తరలించారు. సోలార్ రమేష్గా శివమొగ్గలో పేరొందిన రమేష్ చనిపోతూ పలువురికి సాయం చేశారని బంధుమిత్రులు నివాళులు అర్పించారు. -
బాలికా విద్యపై అవగాహనకు బైక్ ర్యాలీ
బళ్లారి అర్బన్: ఆడ పిల్లలను బాగా చదివించాలని జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కేహెచ్ విజయ్కుమార్ సూచించారు. భేటీ బచావో, భేటీ పడావో పథకం 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మహిళలు, బాలల రక్షణ, భద్రత, సాధికారతపై జాగృతి కల్పించడానికి వివిధ శాఖల ఆధ్వర్యంలో కొత్త జిల్లాధికారి కార్యాలయ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో ఆడపిల్లల పాత్ర చాలా కీలకం అన్నారు. ప్రతి ఆడ పిల్లను బాగా చదివించాలని సూచించారు. ఆడపిల్లలపై పక్షపాత ధోరణి ఇకపై విడిచి పెట్టాలన్నారు. ఈ విషయంలో ప్రజలు సానుకూలంగా తమ మనసత్వాలను మార్చుకోవాలన్నారు. ముఖ్యంగా సమాజంలో ఎక్కువగా జరుగుతున్న బాల్య వివాహాలను నివారించి ఆడపిల్లలను రక్షించడం ఈ కార్యక్రమ ఉద్దేశం అన్నారు. మహిళా, శిశు భ్రూణ హత్యలు చట్ట వ్యతిరేకం అన్నారు. సీ్త్ర సమాజం కన్ను ఆడపిల్లలను చదివించేలా ప్రోత్సాహం అందించడానికి వివిధ పథకాలను వినియోగించుకోవాలన్నారు. వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఎటువంటి పక్షపాతం లేకుండా వారు నిర్భయంగా బతికే, చదివే హక్కు ఉందన్నారు. ఏ ఆడపిల్ల పాఠశాలకు దూరంగా ఉండరాదన్నారు. ముఖ్యంగా క్షీణిస్తున్న ఆడపిల్లల లింగనిష్పత్తి మెరుగుదలకు ప్రజల్లో జాగృతి కల్పించాలన్నారు. ఈ సందర్భంగా ఆ శాఖల అధికారులు జలాలప్ప ఏకే, రామకృష్ణ, ఏలే నాగప్ప, టీపీ ఈఓతో పాటు సహాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా సదరు బైక్ ర్యాలీ నగరంలోని ప్రముఖ వీధుల గుండా సాగి జెడ్పీ కార్యాలయం వరకు కొనసాగి ముగిసింది. ఆడ పిల్లలను బాగా చదివించాలి సీ్త్ర శిశు సంక్షేమ శాఖ డీడీ విజయ్కుమార్ -
అక్రమ మట్టి తవ్వకాలపై తనిఖీ
హొసపేటె: తాలూకాలోని కల్లహళ్లి రాజాపుర వ్యవసాయ భూమిలో అక్రమంగా మట్టి రవాణా జరుగుతున్నా ఎటువంటి చర్యలు తీసుకోని రెవెన్యూ, గనులు, భూగర్భ శాస్త్ర శాఖ అధికారులకు ఉప లోకాయుక్త బీ.వీరప్ప తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. శనివారం ఆయన సంక్లాపూర్ సమీపంలోని మున్సిపల్ ఘన వ్యర్థాల డంప్ యార్డును సందర్శించి, కల్లహళ్లి రాజాపూర్లోని పట్టా ల్యాండ్ సర్వే నెంబర్–144లోని వాలినాయక్కు చెందిన 4.81 సెంట్ల భూమిలో పది అడుగులకు పైగా లోతున మట్టిని తవ్వి తరలించారని, దీని వల్ల భవిష్యత్తులో సాగు చేయడం అసాధ్యంగా మారిందని ఏకరువు పెట్టారు. అక్రమంగా మట్టిని తొలగిస్తున్నారని తెలుసుకున్న తర్వాత, గనులు, భూగర్భ శాస్త్ర శాఖ డిప్యూటీ డైరెక్టర్ కీర్తికుమార్, భూవిజ్ఞాన శాస్త్ర కిరణ్ రెండు రోజులుగా ఆ స్థలంలో ఉన్న జేసీబీతో సహా ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదని తేలింది. గత 6 నెలలుగా మట్టి తవ్వకం గురించి రెవెన్యూ ఇన్స్పెక్టర్, తహసీల్దార్కు నివేదించామని గ్రామ నిర్వాహకుడు ప్రతాప్ సమాధానమివ్వగా, ఆ స్థలంలో ఉన్న తహసీల్దార్కు ఆ విషయం తెలియకపోవడంపై ఉపలోకాయుక్త ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సబ్ జైలు ఆకస్మిక సందర్శన హొసపేటెలోని సబ్ జైలును శనివారం ఉప లోకాయుక్త బీ.వీరప్ప ఆకస్మికంగా సందర్శించారు. సబ్జైలు కమిషనర్ను జైలులో విచారణలో ఉన్న ఖైదీలకు అందిస్తున్న ఆహారం, తాగునీరు, వారి తరపున వాదించడానికి నియమితులైన న్యాయవాదుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు విచారణలో ఉన్న ఖైదీలు తాము న్యాయవాదులను నియమించుకోలేదని చెప్పగా, ప్రభుత్వ న్యాయవాదులను నియమించాలని జైలు అధికారులను ఆదేశించారు. ఘన వ్యర్థాల డంప్యార్డ్ పరిశీలన నగరంలో సంక్లాపుర సమీపంలో 55 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మున్సిపల్ ఘన వ్యర్థాల డంప్యార్డును శనివారం ఉప లోకాయుక్త సందర్శించారు. హొసపేటె నగరం నుంచి ప్రతి రోజూ ఉత్పత్తయ్యే 130 టన్నుల ఘన వ్యర్థాలను ఈ యూనిట్లో సేకరించి, ఆకుపచ్చ వ్యర్థాలు, పొడి చెత్తగా వేరు చేసి, కంపోస్ట్గా ఎలా ప్రాసెస్ చేస్తారో పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మనోహర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ భూమిలోని మట్టి రవాణా పట్టని అధికారులు అలసత్వ అధికారులపై ఉపలోకాయుక్త వీరప్ప మండిపాటు -
వైభవంగా అమరేశ్వర జాతర
రథోత్సవంలో పాల్గొన్న భక్తులు రాయచూరు రూరల్: జిల్లాలోని లింగసూగూరు తాలూకా గురుగుంట అమరేశ్వర జాతర ఉత్సవాలు వైభవంగా జరిగాయి. శుక్రవారం ఆలయం వద్ద దేవస్థాన సమితి అధ్యక్షుడు రాజా సోమనాథ్ నాయక్ పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించారు. వందలాది మంది భక్తుల సమక్షంలో రథాన్ని లాగారు. మాజీ లోక్సభభ సభ్యుడు రాజా అమరేశ్వర నాయక్, మాజీ ఎమ్మెల్యేలు హొలగేరి, అమరేగౌడ బయ్యపూర్ తదితరులతో పాటు రాయచూరు, లింగసూగూరు, సింధనూరు, మాన్వి, కలబుర్గి, యాదగిరి, సురపుర, శహాపుర, కొప్పళ, గంగావతి తదితర చోట్ల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ఎత్తు పెంపునకు మహారాష్ట్ర మోకాలడ్డు?
రాయచూరు రూరల్: తుంగభద్ర డ్యాంలో పూడిక అధికంగా పేరుకు పోవడంతో నవలి వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏర్పాటు, మహదాయి పథకం నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇలా ఉండగా ఉత్తర కర్ణాటక రైతులకు మరొక షాక్ తగలనుంది. కృష్ణా నది ఆయకట్టులోని రైతులకు పెద్ద ఎదురు దెబ్బ తగలనుంది. ఆల్మట్టి డ్యాం నిర్మాణం విషయంలో రైతులకు పరిహారం అందించడంలో ముఖ్యమంత్రి నిధులు కేటాయించలేక పోయారు. మూడో విడత పనులు చేపట్టడానికి నిధుల కొరత ఏర్పడనుంది. విజయపుర జిల్లా బసవన బాగేవాడి వద్ద ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచాలని ప్రభుత్వానికి నివేదిక అందింది. బాగల్కోటె, విజయపుర జిల్లాల్లో ముంపునకు గురవుతున్న 20 గ్రామాల ప్రజల పునర్వసతికి లక్ష ఎకరాల భూమి కావాల్సి ఉంది. భూస్వాధీనం ఇతర పనులకు రూ.87,818 కోట్ల మేర ఖర్చు కానున్నట్లు కృష్ణా భాగ్య జల నిగమ మండలి సర్కార్కు ప్రతిపాదనలు సమర్పించింది. 15 ఏళ్లుగా కాలయాపన 2010 డిసెంబర్లో కృష్ణా ట్రిబ్యునల్–2 తీర్పు ఆధారంగా 524.256 మీటర్లకు ఎత్తును పెంచి నీటిని వాడుకోవడానికి అవకాశం కల్పించింది. 15 ఏళ్లు కావస్తున్నా నీటి వినియోగంలో కర్ణాటక ఇంకా వెనుకంజలో ఉంది. ఈ విషయంలో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడానికి కర్ణాటక పావులు కదుపుతున్నట్లు గమనించిన మహారాష్ట్ర సర్కార్ అనవసరంగా వ్యతిరేకతను తెలుపుతోంది. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచితే కర్ణాటకలోని అథణి తాలూకాలో పలు గ్రామాలు ముంపునకు గురవుతాయి తప్ప మహారాష్ట్రకు ఎలాంటి నష్టం లేకపోయినా కావాలనే నీటి పోరు పెట్టుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచితే మహారాష్ట్రలోని సాంగ్లీ, కోల్హాపూర్ జిల్లాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని వాదిస్తోంది. ప్రారంభం కాని చర్చల ప్రక్రియ ఈ విషయంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ నుంచి నివేదికలను కోరింది. నవలి వద్ద సమాంతర జలాశయం నిర్మాణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మూడు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో చర్చల ప్రక్రియ నేటికీ ప్రారంభం కావడం లేదు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.15,000 కోట్లు, భూస్వాధీనం కోసం రూ.9 వేల కోట్ల నిధులు కేటాయించారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడానికి మహారాష్ట్ర అడ్డు తగులుతున్నట్లు సమాచారం. నవలి వద్ద సమాంతర జలాశయం నిర్మాణ విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సమన్వయం కదురడం లేదు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కర్ణాటక రైతులకు లాభం కంటే నష్టాలే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆల్మట్టి డ్యాం(ఫైల్) ఉత్తర కర్ణాటకలో ఆల్మట్టి ఆయకట్టు రైతులకు మరొక షాక్ మూడు రాష్ట్రాల నుంచి కర్ణాటకకు ఎదురు దెబ్బ నవలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం హుళక్కేనా? కొలిక్కి రాని మూడు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల సమావేశం -
కుటుంబాలు బజారుపాలు
దొడ్డబళ్లాపురం: భవన యజమాని బ్యాంకులో తీసుకున్న అప్పు తీర్చకపోవడంతో బ్యాంకు సిబ్బంది ఆ భవనాన్ని సీజ్ చేశారు. దీంతో అందులో బాడుగకు ఉంటున్న 30 కుటుంబాలు వీధినపడ్డ సంఘటన దొడ్డ తాలూకా బాశెట్టిహళ్లిలో చోటుచేసుకుంది. జవుళి బిల్డింగ్ యజమాని బ్యాంకులో కుదువపెట్టి రూ.3 కోట్లు అప్పు తీసుకున్నాడు. అయితే సకాలంలో కంతులు కట్టకపోవడంతో శనివారంనాడు ఆ భవనానికి తాళాలు వేసి జప్తు చేశారు. అందులో 30 కుటుంబాలు నివసిస్తుండగా వారందరినీ బయటకు గెంటేశారు. వీరంతా అక్కడి గార్మెంట్స్లలో పనిచేసే కూలీ కార్మికులు. పిల్లాపాపలతో ఇబ్బందులు పడ్డారు. -
జిల్లా బీజేపీ అధ్యక్షుల నియామకం
రాయచూరు రూరల్: జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా వీరనగౌడ పాటిల్ను నియమించారు. ఈమేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర శుక్రవారం ఒక ప్రకటన వెలువరించారు. రాయచూరు ఎమ్మెల్యేగా ఉన్న శివరాజ్ పాటిల్ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి వీరనగౌడ పాటిల్కు పీఠాన్ని కట్టబెట్టారు. ఇక యాదగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా అమీన్ రెడ్డి, బీదర్ జిల్లా అధ్యక్షుడిగా సోమనాథ పాటిల్, కలబుర్గి జిల్లా అధ్యక్షుడిగా చంద్రకాంత్ పాటిల్, కొప్పళ్ జిల్లా అధ్యక్షుడిగా నవీన్ గుళగణ్ణనవర్, బాగల్కోట జిల్లా అధ్యక్షుడిగా శాంతనగౌడ పాటిల్, విజయపుర జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఆర్.ఎస్.పాటిల్లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. త్వరలో జరగనున్న జెడ్పీ, టీపీ, నగరసభ ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేసి కార్యకర్తలను సమాయత్తం చేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. తల్లి వెంటే జైలుకు పసిబిడ్డబళ్లారిఅర్బన్: ప్రసవించిన 14 రోజులకే అనివార్య కారణాలతో రూ.60 వేలకు విక్రయమైన ఏడాది వయస్సు ఉన్న పసిబిడ్డ ప్రస్తుతం తల్లితో పాటు జైలు చేరిన విషాద ఘటన నగరంలో వెలుగు చూసింది. గౌతం నగర్ నివాసి యల్లమ్మ (27) గత ఏడాది ఫిబ్రవరిలో బీఎంసీఆర్సీలో పసిబిడ్డకు జన్మనిచ్చింది. ఈమె భర్త చనిపోయాడు. తనకు ఆ బిడ్డ వద్దని రూపనగుడి రోడ్డు నివాసి నవీన్కుమార్ (49)కు రూ.60 వేలకు పసిబిడ్డను విక్రయించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న బాలల రక్షణ శాఖ సహాయవాణికి గత ఆగస్ట్ 5న సమాచారం రావడంతో వారు బళ్లారి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి పసిబిడ్డను ఆంధ్రప్రదేశ్లోని ఆలూరు నుంచి తీసుకొచ్చారు. బిడ్డను కొనుగోలు చేసిన నవీన్కుమార్, విక్రయించిన బిడ్డ తల్లి యల్లమ్మను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ బిడ్డను బళ్లారి జైల్లో ఉన్న సొంత తల్లి వద్దకే చేర్చారు. ఈ కేసులో విక్రయించిన, కొనుగోలు చేసిన వారికి 10 ఏళ్ల శిక్ష ఉంటుంది. కోర్టులో నేరం రుజువైతే తల్లితో పాటు బిడ్డ కూడా శిక్ష అనుభవించాలా? లేక బాలల రక్షణ శాఖలోని అమ్మ ఒడి ఆశ్రమంలో ఉంటుందా? అనే సందేహం తలెత్తుతోంది. కాగా తల్లి వద్దు అనుకున్న బిడ్డను సంతానం లేని దంపతులు గత ఏడాది నుంచి పెంచి పోషించి తల్లి ప్రేమకు నోచుకొనేలా చేసిన ఆ తల్లిదండ్రులకే దత్తత ఇస్తే బాగుంటుందని సమాజ శ్రేయోభిలాషులు అభిప్రాయపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందే రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందే అని కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు కోడిహళ్లి చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. శనివారం ఏపీఎంసీ సభా భవనంలో నవ కర్ణాటక నిర్మాణ ఆందోళన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘాలు పోరాటంలో ఏకతాటిపై ముందుకు సాగాలన్నారు. బసవాది శరణులు చూపిన బాటలో మనం పయనించాలన్నారు. రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం ప్రజలను గ్యారెంటీల పేరుతో మోసం చేస్తున్నాయన్నారు. ఆర్పీఐ అధ్యక్షుడు మోహన్ రాజ్, పుట్టరాజ్, హనుమంతప్ప, బసవరాజ్, నరసప్ప, ఈరణ్ణ, రాజు పట్టి, అయ్యప్ప, లక్ష్మీ, దేవకి, శ్రీకాంత్లున్నారు. మా కుటుంబానికి న్యాయం చేయండి ●వయోవృద్ధుని వేడుకోలు బళ్లారిఅర్బన్: తమపై కుటుంబ సభ్యులతో పాటు ఇతరులు అన్యాయంగా నడుచుకుంటూ, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతూ మానసికంగా వేధిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని వయోవృద్ధుడు వీ.ఈరణ్ణ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పత్రికా భవనంలో మీడియా సమావేశంలో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. కట్టడ నిర్మాణ కార్మికుడిగా సొంత సంపాదనతో దేవినగర్లో 5 ఇళ్లు నిర్మించుకున్నానన్నారు. చాగనూరులో 4 ఎకరాల పొలం తీసుకున్నానన్నారు. తనకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలున్నారన్నారు. అయితే ఆస్తుల పంపకం విషయంలో పిల్లల నిర్లక్ష్యం వల్ల తాను ప్రస్తుతం కోట ప్రాంతంలో కార్పొరేషన్ నిర్వహిస్తున్న నిరాశ్రితుల కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నానన్నారు. ముందుగా అందరూ ఒకే కుటుంబ సభ్యులుగా ఉన్నప్పుడు చిన్నగా ప్రారంభమైన కుటుంబ కలహాలు అనంతరం కుమారులు పురుషోత్తం, వాసులకు పెళ్లి అయిన తర్వాత ఆస్తుల కోసం పరస్పర దాడులతో పాటు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించేలా చేసిందన్నారు. గత మూడేళ్ల నుంచి అన్నదమ్ములు, సోదరీమణులు రెండు వర్గాలుగా ఏర్పడి పరస్పరం కొట్లాడుకుంటూ తనకు తీరని ఆవేదన కల్గించి వీధి పాలు చేశారని ఆయన వాపోయారు. అందరూ ఒక్కటై ఆస్తి కోసం ఇంటి నుంచి బయటకు వేశారన్నారు. తాను కష్టపడి నిర్మించుకున్న ఇంట్లో ఉండటానికి తక్షణమే పోలీస్ ఉన్నతాధికారులు సహాయం చేసి తనకు న్యాయం జరిగేలా చూడాలని ఈరణ్ణ జిల్లా ఎస్పీ శోభారాణికి విజ్ఞప్తి చేశారు. -
క్యాన్సర్ రెఫరల్ విభాగం మంజూరు
రాయచూరు రూరల్: రాయచూరుకు రూ.52 కోట్లతో కిద్వాయ్ క్యాన్సర్ రెఫరల్ విభాగాన్ని మంజూరు చేశామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావ్ పేర్కొన్నారు. శనివారం మాన్వి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మేళాను ప్రారంభించి ఆయన మాట్లాడారు. జిల్లాధికార యంత్రాంగం, జిల్లా పంచాయతీ, జిల్లా ఆరోగ్య శాఖ, రిమ్స్, ఇతర సంఘ సంస్థల ఆధ్వర్యంలో జరిగిన మేళాకు శ్రీకారం చుట్టి ప్రసంగించారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో అధిక శాతం గర్భకోశ క్యాన్సర్ కనపడుతోందన్నారు. స్తన క్యాన్సర్ మాదిరిగా గర్భ కోశ క్యాన్సర్ను గుర్తించడం కష్టమన్నారు. గర్భ కోశ క్యాన్సర్ వ్యాధి నివారణకు 16 ఏళ్ల లోపు బాలికలకు టీకాలు వేయడానికి కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమన్నారు. ఆస్పత్రుల అభివృద్ధికి రూ.400 కోట్ల నిధులు కేటాయించామన్నారు. రాయచూరుకు ఎయిమ్స్ మంజూరు విషయంలో పార్లమెంట్ సభ్యులు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. కాగా శిబిరంలో మానసిక, కిడ్నీ, ఎముకలు, నేత్ర, గుండెపోటు, చర్మవ్యాధి, శ్వాసకోశ, క్యాన్సర్ వంటి వ్యాధులకు ఉచితంగా వైద్య సదుపాయాలు కల్పించారు. కార్యక్రమంలో మంత్రి బోసురాజు, శాసన సభ్యుడు హంపయ్య నాయక్, లోక్సభ సభ్యుడు కుమార నాయక్, జిల్లాధికారి నితీష్, జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారాం పాండే, అసిస్టెంట్ కమిషనర్ గజానన, జిల్లా ఆరోగ్య వైద్యాధికారులు సురేంద్ర బాబు, నందిత, శరణ బసవ, 200 మంది సీనియర్ వైద్యులు పాల్గొన్నారు. -
పుట్టినరోజు ఊటీకి వెళ్లాలని..
మండ్య: బైకిస్టు వేగంగా వెళ్తూ చెట్టును డీకొనడంతో దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండ్య నగరంలోని మైషుగర్ స్కూల్ ముందు శనివారం ఉదయం జరిగింది. మృతుడు తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలోని దిన్నపల్లికి ఎం.అరుణ్ కుమార్ (27) కాగా, బైక్ వెనుక కూర్చున్న జయవేలు తీవ్రంగా గాయపడ్డాడు. అరుణ్కుమార్ పుట్టినరోజును జరుపుకోవాలని హోసూరు నుంచి ఊటీకి మిత్రునితో కలిసి బైక్లో బయల్దేరాడు. వేగంగా వెళ్తూ అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొనడంతో అరుణ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ధాటికి చెట్టు కూడా విరిగిపోవడం గమనార్హం. స్థానికులు చేరుకుని జయవేలును ఆస్పత్రికి తరలించారు. మండ్య ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. -
రంగు రంగులు.. ఉత్సాహం పొంగులు
● రాష్ట్రమంతటా హోలీ సంబరాలు బనశంకరి: సిలికాన్ సిటీతో పాటు రాష్ట్రం నలుమూలలా హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి. శనివారం వేసవి ఎండలను సైతం లెక్కచేయకుండా పిల్లలు, యువతీ యువకులు, కుటుంబ సభ్యులు రంగు నీళ్లు చల్లుకుని, రంగులు అద్దుకుని చిందులు వేశారు. కొన్నిచోట్ల వీధుల్లో నృత్యాలు చేస్తూ, డీజీ చప్పుళ్ల మధ్య ఆనందోత్సవాలలో మునిగిపోయారు. బెంగళూరు నగరవ్యాప్తంగా అపార్టుమెంట్లు, వసతి సముదాయాలు, ఇళ్లు, పాఠశాల కాలేజీ, హోటళ్లు, మైదానాల్లో హోలీని కేరింతలతో సంతోషంగా చేసుకున్నారు. వివిధ లేఔట్లలో కులమత భేదాలతో సంబంధం లేకుండా ఆచరించారు. రోడ్లు రంగులతో కళకళలాడాయి. చిన్నపిల్లలు పిచికారితో పెద్దలపై రంగులు చల్లారు. నగరంలోని ఉత్తర కర్ణాటక ప్రజలు కామ దహనం చేసి రంగోళి ఆడారు. కొన్నిచోట్ల విదేశీ టూరిస్టులు రంగుల పండుగలో పాల్గొన్నారు. ప్రైవేటు కంపెనీల ఆఫీసుల్లో సంబరాలు జోరుగా జరిగాయి. యువకులు గుంపులుగా ద్విచక్రవాహనాల్లో తిరుగుతూ రంగులు చల్లుకున్నారు. డీజే డ్యాన్సుల సంబరం మిన్నంటింది. మరోవైపు హుబ్లి– ధార్వాడ, బెళగావి సహా ఉత్తర కర్ణాటక నగరాలలో స్థానిక సంఘాల ఆధ్వర్యంలో సామూహిక హోలీ వేడుకల వైభవం చెప్పనలవి కాదు. ధార్వాడలో వేలాది మంది ఒకచోట చేరి రంగుల వర్షంలో తడిసిపోయారు. -
ఉసురుతీసిన విద్యుత్ షాక్
శివమొగ్గ: ఇంట్లో నీటి ట్యాంక్ నింపాలని మోటార్ స్విచ్ ఆన్ చేయబోయిన యువతి కరెంటు షాక్ కొట్టి మరణించింది. ఈ దుర్ఘటన శుక్రవారం రాత్రి జిల్లాలోని హొళెహొన్నూరు సమీపంలోని ఎమ్మెహట్టి గ్రామంలో జరిగింది. మృతురాలు నిసర్గ (18). ఆమె హొళెహొన్నూరులోని ప్రభుత్వ కాలేజీలో పీయూసీ చదివేది. షాక్తో యువతి అక్కడికక్కడే మరణించినట్లు స్థానికులు తెలిపారు. అప్పటివరకూ కళ్లముందున్న కూతురు క్షణాల్లో విగతజీవి కావడంతో తల్లిదండ్రులు బోరుమన్నారు. నిసర్గ (ఫైల్) -
రెప్పపాటులో రూ.7 లక్షలు చోరీ
రాయచూరు రూరల్: దొంగలు రెప్పపాటులో రూ.7 లక్షలు చోరీ చేసిన ఘటన శుక్రవారం రాయచూరు జిల్లాలోని దేవదుర్గ తాలూకా గబ్బూరు గ్రామంలో జరిగింది. రైతు శ్రీనివాసరావు బ్యాంక్లో డబ్బులు విత్ డ్రా చేసి బ్యాగులో పెట్టుకొని పండ్లు కొనుగోలు చేయడానికి వెళ్లారు. పసిగట్టిన దుండగులు ద్విచక్ర వాహనంలో ఉన్న నగదును చోరీ చేసుకొని పరారయ్యారు. పక్కనే ఉన్న సీసీ కెమెరాల్లో దుండగులు పరారైన దృశ్యాలు నమోదయ్యాయి. గబ్బూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వైద్యుల పదవీ విరమణ వయస్సు పెంపునకు ప్రతిపాదనలు రాయచూరు రూరల్: రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 65 సంవత్సరాలకు పెంపుపై ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు రాయచూరు జిల్లా ఇంచార్జి మంత్రి, వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం బెంగళూరులో జయదేవ హృద్రోగ ఆస్పత్రిలో వైద్యులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీనియర్ వైద్యులను గుర్తించి వారి సేవలను మరింతగా వినియోగించుకోవడానికి ముఖ్యమంత్రితో చర్చించి సంజీవిని పథకం కింద వైద్యులను భర్తీ చేస్తామన్నారు. జయదేవ్ ఆస్పత్రిలో రోబోటిక్ ఆపరేషన్లు చేయడానికి నిధులు కేటాయించి, చిన్నారుల గుండె ఆపరేషన్లకు ఐదు చోట్ల ఆపరేషన్ థియేటర్లను, పరిశోధన కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. రేపు జగ్గలిగి పండుగ హుబ్లీ: భారతీయ సంప్రదాయపు ప్రధాన పండుగ హోలీ సందర్భంగా హుబ్బళ్లి జగ్గలిగి పండుగ– 2025ను మూరుసావిర మఠం మైదానంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మహేష్ టెంగినకాయి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా జగ్గలిగి పండుగను నిర్వహిస్తున్నామన్నారు. అన్ని సమాజాల వారు దీనికి సహకారం అందిస్తున్నారన్నారు. మూరుసావిర మఠాధిపతి గురుసిద్ద రాజయోగీంద్ర స్వామీజీతో పాటు పలువురు మఠాధిపతులు ఈ కార్యక్రమానికి సాన్నిధ్యం వహిస్తారన్నారు. 350 జగ్గలిగి బృందాలు, వివిధ చర్మ వాయిద్య నాదాలతో పాటు డోలు, కీలుబొమ్మలతో 45 మంది కళాకారుల బృందం, మహిళలు శోభయాత్రలో పాల్గొంటారన్నారు. ప్రదర్శన మూరుసావిర మఠం నుంచి బండారి రోడ్డు తుళజా భవాని సర్కిల్, కొత్త మేదార ఓణి, శివాజీ చౌక్, దుర్గద బైలు, బెళగావి గల్లి, పెండార గల్లి, దాజిబానపేట మార్గం మీదుగా తిరిగి మూరు సావిర మఠానికి చేరుకుంటుందన్నారు. మూరు సావిర మఠాధిపతి మాట్లాడుతూ పౌరాణిక విషయాలను గుర్తు చేసే సమగ్ర, దేశ శ్రేష్టమైన పండుగ ఇదన్నారు. చర్మ వాయిద్యాలతో వెలువడే సంగీత ప్రదర్శనే ఈ పండుగ ఉద్దేశం అన్నారు. జానపద కళలను ప్రోత్సహించే సదుద్దేశంతో జగ్గలిగి పండుగను అందరూ ప్రోత్సహించాలన్నారు. మేయర్ రామన్న బడిగేర, ప్రముఖులు అశోక్ కాట్వే, లింగరాజ పాటిల్, రాజు కాళె, మంజునాథ, జగదీశ్, రవినాయక పాల్గొన్నారు. సీ్త్రలకూ సమాన హక్కులు రాయచూరు రూరల్: సదృఢ సమాజ నిర్మాణానికి పురుషులతో పాటు సీ్త్రలు కూడా సమానమని జిల్లా అదనపు జడ్జి, న్యాయ సేవా ప్రాధికార సభ్యుడు హెచ్.స్వాతిక్ పేర్కొన్నారు. శుక్రవారం ఉప్పారవాడి వేంకటేశ్వర ఆలయంలో న్యాయ సేవా ప్రాధికార, ఎస్సీఏబీ లా కళాశాల, మహిళా శిశు కళ్యాణ శక్తి క్లబ్, ఉప్పార మహిళా ఘటక ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జ్యోతి వెలిగించి మాట్లాడారు. మహిళల హక్కులు, విధులు, సమానత్వం, విద్యా, సామాజిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు వీలవుతుందన్నారు. కార్యక్రమంలో న్యాయ సేవా ప్రాధికార కార్యదర్శి మృత్యుంజయ, కళాశాల ప్రిన్సిపాల్ పద్మజ, అధ్యాపకురాలు ఉమ, ఉప్పార మహిళా ఘటక అధ్యక్షురాలు మాలతిలున్నారు. -
నేత్రపర్వం.. దొడ్డబసవేశ్వర రథోత్సవం
బళ్లారి అర్బన్: జిల్లాలోని కురుగోడు తాలూకాలో పురాతనమైన, చారిత్రాత్మక దొడ్డ బసవేశ్వర స్వామి మహారథోత్సవం శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు భక్తుల సమక్షంలో కన్నుల పండువగా జరిగింది. కోరిన వారి కోర్కెలు తీర్చే కొంగుబంగారం దొడ్డ బసవేశ్వర స్వామి అన్న ప్రగాఢ నమ్మకం మేరకు ఆనవాయితీగా భక్తులు దర్శించుకుంటున్నారు. ఆలయంలోని దొడ్డబసవేశ్వర స్వామి 14 అడుగుల ఎత్తైన నంది విగ్రహానికి అభిషేకం, అలంకరణ, ధార్మిక పూజలను నిర్వహించారు. 60 అడుగుల ఎత్తైన రాజగోపురానికి ఉత్తరం వైపు ఉన్న మరో గోపురానికి విద్యుత్ అలంకరణలతో ఆకట్టుకొనేలా ఏర్పాట్లు చేశారు. కురుగోడు చుట్టు పక్కల 30 గ్రామాల నుంచి లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. జిల్లాతో పాటు రాష్ట్రంలోని భక్తాదులు బసవేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మహారథాన్ని ఆలయం వద్ద నుంచి బళ్లారి రోడ్డు వైపు ఎదురు బసవణ్ణ వరకు భక్తులు లాగి తిరిగి యథాస్థానానికి చేర్చారు. మహారథోత్సవంలో కంప్లి ఎమ్మెల్యే గణేష్, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ జాతర మహోత్సవంతో వారం రోజుల పాటు కురుగోడు పట్టణంలో భక్తుల సందడి నెలకొంటుంది. -
ఉప లోకాయుక్త ఆకస్మిక తనిఖీ
హొసపేటె: ఉప లోకాయుక్త బీ.వీరప్ప శుక్రవారం నగరంలో వివిధ కార్యాలయాలను ఆకస్మికంగా సందర్శించి సౌకర్యాలను పరిశీలించారు. అక్రమ కార్యకలాపాల నేపథ్యంలో ఉప లోకాయుక్త పర్యటన జరిగింది. ఉప లోకాయుక్త నగరంలోని వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. అదే విధంగా కౌంటర్లో రోగులకు అందిస్తున్న మందులను పరిశీలించారు. ఆస్పత్రి పాలనా విభాగం, అంబులెన్స్ వాహన డ్రైవర్లు తమ వేతనాలకు మించి అధికంగా ఫోన్పే వాడటంపై మండిపడ్డారు. ఈ విషయంపై డాటాను అందించాలని సూచించారు. అనంతరం నగరసభ కార్యాలయాన్ని సందర్శించి హాజరును పరిశీలించారు. నగర నడిబొట్టున ఉన్న ఉప కాలువను పరిశీలించి ఇది ఉప కాలువా? లేక మరుగుదొడ్డా? అని అధికారి మనోహర్ను క్లాస్ పీకారు. కాలువలోకి మరుగుదొడ్డి నీరు ప్రవహిస్తుండటాన్ని చూసి మండిపడ్డారు. కాలువలోకి మరుగుదొడ్డి నీరు ప్రవహించకుండా వెంటనే చర్యలు చేపట్టాలని నగరసభ అధికారులకు సూచించారు. తహసీల్దార్ కార్యాలయం, మహిళా శిశు అభివృద్ధి కార్యాలయం, ఆర్టీఓ, హుడా, మైనింగ్ అండ్ జూవాలజీ, కార్మిక తదితర కార్యాలయాలతో పాటు విద్యార్థుల హాస్టళ్లను ఉదయం నుంచి సాయంత్రం వరకు క్షుణ్ణంగా పరిశీలించారు. ఏపీఎంసీ మార్కెట్ పరిశీలన నగరంలోని ఏపీఎంసీ మార్కెట్ను ఉపలోకాయుక్త బీ.వీరప్ప శుక్రవారం ఉదయం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రైతులకు పరిశుభ్రత, తాగునీరుతో పాటు విశ్రాంతి తీసుకోవడానికి సరైన వ్యవస్థ లేదన్నారు. సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఏపీఎంసీ కార్యదర్శి సిద్దయ్య స్వామిని ఆదేశించారు. ఓ దళారీ దుకాణంలో తూకంలో అధికంగా రెండు కిలోలు ఉన్న విషయాన్ని గ్రహించి వెంటనే దుకాణ యజమానికి క్లాస్ తీసుకొన్నారు. ప్రజలను ఇలా మోసం చేస్తున్నా అధికారులు కళ్లు మూసుకొని కూర్చొన్నారా? అని ప్రశ్నించారు. సంబంధిత అధికారికి నోటీసులు అందజేశారు. ఉపలోకాయుక్తకు 183 ప్రజాఫిర్యాదులు నగరంలోని సహకార సంక్షేమ మందిరంలో ఉప లోకాయుక్త పర్యటన మొదటి రోజున జరిగిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో మొత్తం 183 ఫిర్యాదులు వచ్చాయని ఉప లోకాయుక్త బీ.వీరప్ప తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి అత్యధికంగా జెడ్పీకి 60 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఆ తర్వాత రెవెన్యూ శాఖకు 40, మున్సిపల్ కౌన్సిల్, మున్సిపాలిటీ, పట్టణ పంచాయతీకి 41, జెస్కాం శాఖకు 6, గ్రామీణ తాగునీటి సరఫరాకు 5, ఆరోగ్య శాఖకు 3, కేఎస్ఆర్టీసీ 2, కార్మిక శాఖకు 3, పోలీస్ శాఖకు 3, విద్యా శాఖకు 4, మహిళ శిశు సంక్షేమ శాఖకు 2, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు 2, సర్వే శాఖకు 2 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిలో పీడబ్ల్యూడీ, ఆర్టీసీ, వాణిజ్య పన్నుల శాఖ, మొరార్జీ దేశాయి స్కూల్, హౌసింగ్ బోర్డు, అర్బన్ డ్రైనేజీ, ఎకై ్సజ్ శాఖలకు ఒక్కొక్క దరఖాస్తు అందిందన్నారు. ఉప లోకాయుక్త తనిఖీ తర్వాత 10 కేసులు అక్కడికక్కడే పరిష్కరించారు. కేవలం ఒక నెలలోనే దాదాపు 40 కేసులను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కేఎస్ఆర్టీసీ నుంచి అమరావతి నగరానికి బస్సు కనెక్టివిటీని త్వరగా అందించాలన్నారు. నగరంలోని మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ దగ్గర గుట్కా, పొగాకు, మద్యం, మాంసం అమ్మకాలు జరగకుండా చూసుకోవాలని డీహెచ్ఓ డాక్టర్ శంకర్ నాయక్ మున్సిపల్ కమిషనర్ మనోహర్కు ఆదేశించారు. -
‘నేతలు కార్పొరేట్ సంస్థల బానిసలు’
బళ్లారి అర్బన్: దేశంలో రైతులు, కార్మికులు తదితర వర్గాల ప్రజలు ఎంతో కష్టంతో కనీస వసతులతో జీవిస్తుండగా, రైతులు సాగు కోసం పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని కర్ణాటక దళిత సంఘర్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ ఎన్. మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. బీడీఏఏ మీటింగ్ హాల్లో శుక్రవారం జనతా ప్రణాళిక అనే వినూత్న కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయం కడు భారంగా మారడంతో అప్పులు పాలైన అన్నదాతలు వాటిని తీర్చే దారి లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రైతన్నల రుణాలను రద్దు చేయని పాలకులు కార్పొరేట్ సంస్థల లక్షల కొద్ది రుణాలను రద్దు చేస్తున్నారని, దీన్ని గమనిస్తే ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థల ఆధిపత్యంలో ఊడిగం చేస్తూ వారికి కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. గత 9 ఏళ్ల నుంచి సుమారు రూ.16 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందంటూ ఆ సర్కారు తీరును ఎండగట్టారు. రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు కోడిహళ్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆందోళనకారులు సమస్యలతో పాటు వాటి పరిష్కారాలపై కూడా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రాజకీయ నాయకులకు సమస్య పరిష్కారం తెలిసినా కూడా దాని పరిష్కారానికి కృషి చేయరని, ఎందుకంటే సమస్య పరిష్కారం అయితే ప్రజలు తమ వద్దకు రాకుండా పోతారని నేతలకు బాగా తెలుసన్నారు. ఇలాంటి రాజకీయ నాయకులు, పార్టీలకు ప్రత్యామ్నాయంగా తృతీయ శక్తిని ఏర్పాటు చేసే గురుతర బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ ఏర్పాటు అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సాహితీవేత్త ఎన్డీ వెంకమ్మ, న్యాయవాది, జిల్లాధ్యక్షుడు మునిస్వామి, ప్రముఖులు శ్రీనివాస్ బండారి, మల్లికార్జున, ఎన్కే.గంగాధర, బైలూరు మల్లికార్జున, రైతు సంఘం జిల్లాధ్యక్షుడు వివి గౌడ, తదితరులు పాల్గొన్నారు. -
రమణీయంగా తేరు ఉత్సవాలు
దొడ్డబళ్లాపురం: దొడ్డబళ్లాపురం తాలూకాలో పలు చోట్ల రథోత్సవాలు ఘనంగా జరిగాయి. తూబుగెరెలోని పురాతన ప్రసిద్ధ శ్రీ ప్రసన్న లక్ష్మీ వేంకటరమణస్వామి రథోత్సవం శుక్రవారం అభిజిత్ లగ్నంలో వైభవంగా జరిగింది. అంతకుముందు మూలవిరాట్కు విశేష పూజలు నిర్వహించారు. తాలూకా నుండే కాకుండా చిక్కబళ్లాపురం, కోలారు, బెంగళూరు జిల్లాల నుంచి వందలాదిగా భక్తులు తరలివచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఇదే తాలూకాలోని కామేనహళ్లిలో వెలసిన గుట్టె లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం కూడా శుక్రవారం ఎంతో ఘనంగా జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. దాతలు భక్తులకు పానకం, మజ్జిగ పంపిణీ చేశారు. -
అంబరం.. హోలీ సంబరం
సాక్షి,బళ్లారి: మన సంస్కృతి వారసత్వాలకు ప్రతీకగా నిలుస్తోన్న ఎన్నో పండుగల్లో హోలీ కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతి ఏటా ఫాల్గుణ మాస పౌర్ణమి రోజున జరుపుకునే హోలీ పండుగను ఈ ఏడాది కూడా సంప్రదాయబద్ధంగా తమ తమ ఇళ్లలో పౌర్ణమి పూజలు నిర్వహించుకున్నారు. శుక్రవారం హోలీ పండుగ నేపథ్యంలో నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా రంగులు చల్లుకుని ఆనందోత్సాహాలతో హోలీ పండుగను ఆచరించుకున్నారు. నగరంలో యువత కేరింతలు కొడుతూ రంగులు చల్లుకుని ఒకరికొకరు హ్యాపీ హోలీ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంబరాలు చేసుకున్నారు. యువత, పెద్దలు అనే తేడా లేకుండా రంగులు చల్లుకుని హోలీ పండుగ గొప్పదనాన్ని తెలియజేస్తూ పండగను ఆచరించారు. రంగులు చల్లుకుని హోలీ సంబరాలు నిర్వహించిన తరుణంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో పలు ప్రముఖ కాలనీల్లో పోలీసులు బందోబస్తు నిర్వహించి హోలీ పండగ చేసుకుని, రంగులు చల్లుకునే వ్యక్తులపై నిఘా ఉంచారు. హోలీ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్లలో మహిళా పోలీసులతో పాటు బందోబస్తు ఏర్పాటు చేసి, శాంతియుతంగా పండుగను జరుపుకునేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నారు. సంతోషంగా రంగుల హోలీ ఆడిన ప్రజలు రాయచూరు రూరల్ : జిల్లాలో రంగుల హోలీ కేళి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకున్నారు. నగరంలోని బెస్తవారపేట ఉప్పార సమాజం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కామదహనం చేశారు. ప్రజలు హోలీ పాటలు పాడుతూ రంగులు చల్లుకుంటుండటం కన్పించింది. భంగికుంటలో కుండ బద్దలు కొట్టారు. హోలీ సందర్భంగా రాయచూరులో పోలీసులు హైఅలర్ట్తో రంజాన్ రెండో శుక్రవారం హోలీ పండుగ రావడంతో సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. అదనపు జిల్లా ఎస్పీ హరీష్ పర్యవేక్షణ జరిపారు. విజయనగరలో ఘనంగా హోలీ హొసపేటె: హోలీ పండుగ సంబరాలను శుక్రవారం నగర ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకొన్నారు. నగరంలోని అమరావతి, పటేల్నగర్, బసవేశ్వర కాలనీ, రాజీవ్ నగర్, చిత్తవాడిగి, నెహ్రు కాలనీ, రాణిపేట, మృత్యుంజయ నగర్, చలువాది నగర్, టీబీ డ్యాం తదితర ప్రాంతాల్లో యువతీ యువకులు, విద్యార్థులు, పెద్దలు, పిల్లలు ఒకరిపై మరొకరు రంగులు చల్లుకొన్నారు. సంస్కృతి వారసత్వాలకు ప్రతీకగా రంగుల కేళి ఆనందోత్సాహాలతో పిల్లలు, పెద్దలు, మహిళలు కేరింతలు -
ఐదుగురు పీఎఫ్ఐ కార్యకర్తల అరెస్ట్
యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా మంగళూరు సీసీబీ పోలీసులు దాడి చేసి కేరళకు చెందిన నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కార్యకర్తలు ఐదుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మూడు పిస్తోళ్లతో ఆరు తూటాలు, 12 కేజీల గంజాయి, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు మంగళూరు నగర పోలీసు కమిషనర్ అనుపమ్ అగర్వాల్ తెలిపారు. కేరళలోని కాసరగోడు భీమనడి గ్రామం కున్నంక్కె వెస్ట్కు చెందిన నౌఫల్(38), సుంకదకట్టెకు చెందిన మన్సూర్(36), మంగల్పాడి పంచాయతీ నివాసి అబ్దుల్ లతీఫ్(29), కాసరగోడు జిల్లా మోర్నానకు చెందిన మహమ్మద్ అస్గర్(27), మహమ్మద్ సాలి(31)లను అరెస్ట్ చేసినట్లు వివరించారు. అనుమానాస్పదంగా తిరుగుతుండగా.. ఈ నెల 12న మంగళూరు సమీపంలోని నాటికల్లో స్కార్పియోలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా నౌఫల్, మన్సూర్లను అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో నటోరియస్ క్రిమినల్స్ అబ్దుల్, లతీఫ్లను అర్కళ వద్ద అరెస్ట్ చేశారు. వీరు కేరళ నుంచి ఆక్రమంగా మంగళూరుకు గంజాయిని సరఫరా చేస్తున్నట్లు విచారణలో బయట పడింది. తలపాడి దేవిపురం వద్ద గంజాయి అమ్ముతుండగా మహమ్మద్ అస్గర్, మహమ్మద్ సాలిలను అరెస్ట్ చేశారు. మూడు పిస్తోళ్లు, ఆరు తూటాలు జప్తు 12 కేజీల గంజాయి, మూడు కార్లు స్వాధీనం -
కల్తీ కల్లు సరఫరా.. ఇద్దరు నిందితుల అరెస్ట్
రాయచూరు రూరల్: కల్తీ కల్లు సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎకై ్సజ్ శాఖాధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం నగరంలోని రైల్వేస్టేషన్ వద్ద ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఇందిరా నగర్కు చెందిన ఖాజా, మంగళవారపేటకు చెందిన కరియప్పల నుంచి 30 లీటర్ల కల్తీ కల్లును స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తహసీల్దార్ సస్పెండ్కు డిమాండ్ రాయచూరు రూరల్: లింగసూగూరు తహసీల్దార్ శంశాలంను సస్పెండ్ చేయాలని దళిత సంఘర్ష సమితి సంచాలకుడు ప్రభులింగ డిమాండ్ చేశారు. శుక్రవారం లింగసూగూరు ఏసీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి మాట్లాడారు. కచేరిలో రూ.2 కోట్ల గోల్మాల్ విషయంలో తహసీల్దార్–2 వెంకటేష్ను సస్పెండ్ చేశారన్నారు. ప్రధానంగా శంశాలంను సస్పెండ్ చేసి పూర్వాపరాలపై దర్యాప్తు చేయాలన్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించి నిధులను స్వార్థానికి వాడుకున్న తహసీల్దార్పై విచారణ జరపాలన్నారు. దేవదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలోని అర్చకులకు చెల్లించాల్సిన డబ్బులు, ప్రకృతి వైపరీత్య పరిహార నిధులను నకిలీ బిల్లులు సృష్టించి రూ.1.87 కోట్ల మేర ఇతర ఖాతాల్లోకి జమ చేసుకున్న అంశంపై విచారణలో వెల్లడైందన్నారు. తహసీల్దార్ను సస్పెండ్ చేయాలని కోరుతూ ఏసీ బసవణ్ణప్పకు వినతిపత్రం అందించారు. బావిలో పడి వ్యక్తి మృతి రాయచూరు రూరల్: నీరు తెచ్చేందుకు బావి దగ్గరకు వెళ్లిన ఓ కూలీ కార్మికుడు అందులో పడి మృతి చెందాడు. బీదర్ జిల్లా హులసూరు తాలూకా మదనాళ గ్రామానికి చెందిన సతీష్(40) అనే వ్యక్తి పొలం పనులు చేసుకుంటూ పక్కనే ఉన్న బావిలో మంచి నీరు తెచ్చేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి పడి ఈత రాకపోవడంతో మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై హులసూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో మార్చి 21 నుంచి పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు విద్యాశాఖాధికారి రంగస్వామి శెట్టి వెల్లడించారు. శుక్రవారం తాలూకా విద్యా శాఖాధికారి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ఏడు తాలూకాల్లో మొత్తం 97 కేంద్రాల్లో 33,906 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతారన్నారు. దేవదుర్గ తాలూకాలోని 15 కేంద్రాల్లో 4,660, లింగసూగూరు తాలూకాలోని 18 కేంద్రాల్లో 6,746, మాన్వి తాలూకాలోని 18 కేంద్రాల్లో 6,331, రాయచూరు తాలూకాలోని 27 కేంద్రాల్లో 9,912, సింధనూరు తాలూకాలోని 19 కేంద్రాల్లో 6,257 మంది విద్యార్థులున్నారని వివరించారు. యోగి నారాయణ ఆదర్శాలు అనుసరణీయం బళ్లారిటౌన్: ప్రపంచానికే ఉత్తమ సందేశాన్ని చాటిన యోగి నారాయణ యతీంద్ర ఆదర్శాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అలవరుచుకొని సన్మార్గంలో పయనించాలని పాలికె మేయర్ ముల్లంగి నందీష్ పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, కన్నడ సంస్కృతి శాఖ, పాలికె ఆధ్వర్యంలో నగరంలోని వడ్డరబండ బలిజ భవనంలో ఏర్పాటు చేసిన యోగినారాయణ యతీంద్ర కై వార తాత జయంతిని ప్రారంభించి మాట్లాడారు. దీన, దళిత, శోషిత వర్గాల అభివృద్ధికి కుల, మత, గోత్ర, వర్ణ బేధాలు లేకుండా శ్రమించారన్నారు. సత్యం విద్యా సంస్థ లెక్చరర్ ఆలం బాషా తదితరులు మాట్లాడారు. బలిజ సంఘం జిల్లాధ్యక్షుడు ఎస్ మురళీ కృష్ణ, కన్నడ సంస్కృతి శాఖ ఏడీ నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.