Karnataka News
-
డబ్బులివ్వకపోతే.. దాడులే
జుడిషియల్ కస్టడీ శివాజీనగర: డబ్బులు ఇవ్వాల్సిందే, లేదంటే రేపే మీ ఇంటిపై దాడి జరుగుతుంది, సంపాదించినదంతా సీజ్ అవుతుంది అని బెదిరించి పబ్బం గడుపుకొన్నాడో కిలాడీ. అధికారం అండతో కంచే.. చేను మేసింది. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి లక్షల రూపాయల వసూళ్లకు పాల్పడుతున్నాడని లోకాయుక్తచే అరెస్టయిన ఆ శాఖ రిటైర్డ్ పోలీస్ హెడ్ కాన్స్టేబుల్ నింగప్ప విచారణలో సంచలనమైన సమాచారం లభించినట్లు వెల్లడైంది. ఎకై ్సజ్, బీబీఎంపీ, బీడీఏ, ఆర్టీఓ శాఖల ద్వారా నెలకు లక్షలాది రూపాయలను వసూలు చేసినట్లు, అతని వద్ద ఉన్న ఓ డైరీలో అన్నీ వివరంగా రాసుకొన్నట్లు తెలిసింది. డబ్బు ఇచ్చిన అధికారులకు కూడా విచారించబోతున్నారు. 50 మందికి పైనే బాధితులు లోకాయుక్త దాడులు చేస్తామని హెచ్చరిస్తూ ప్రభుత్వ అధికారుల నుంచి చాలాకాలంగా వసూళ్ల దందా సాగిస్తున్నాడు. చివరకు ఎలాగో బయటకు పొక్కడంతో లోకాయుక్త అధికారులు నింగప్పని అరెస్టు చేశారు. లోకాయుక్త ఎస్పీ వంశీకృష్ణ, బృందం నింగప్పని విచారిస్తోంది. అతని మొబైల్ఫోన్ని స్వాధీనం చేసుకొని తనిఖీ చేయగా ఎకై ్సజ్, బీబీఎంపీ, బీడీఏ, ఆర్టీఓ శాఖ అధికారుల ఫోన్ కాల్స్, వాట్సాప్ చాట్లు లభించాయి. ఏ అధికారి నుంచి నిందితుడు ఎంతెంత డబ్బు వసూలు చేసింది డైరీలో రాసుకొన్నాడు. ఆ డబ్బును ఉన్నతాధికారులకు పంపిణీ చేసేవాడు. ఆడిటర్ మాదిరిగా దీనంతటినీ ఓ పుస్తకంలో నమోదు చేసేవాడు. వసూళ్ల డబ్బును బిట్ కాయిన్, ఆస్తుల కొనుగోలు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టినట్లు నోరు విప్పాడు. ఇప్పటి వరకు 50 మందికి పైగా అధికారులను బెదిరించి డబ్బు గుంజాడని చెప్పాడు. నిందితుని బ్యాంకు అకౌంట్లు, ఆన్లైన్ చెల్లింపుల మీద తనిఖీ సాగుతోంది. ఇచ్చినవారికి గుండె దడ బెదిరింపులకు భయపడి నింగప్పకు డబ్బులు ఇస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల చిట్టా సేకరించిన లోకాయుక్త అధికారులు త్వరలో నోటీస్ జారీచేసి విచారించడానికి సిద్ధమయ్యారు. డబ్బు ఇచ్చినట్లు రుజువైతే కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ అధికారుల నుంచి భారీగా వసూళ్లు రిటైర్డు పోలీసు నింగప్ప కేసులో సంచలనాలు వసూళ్ల సొమ్ము అధికారులకు పంపిణీ లోకాయుక్త చేతిలో మొబైల్ఫోన్, పద్దుల చిట్టా లోకాయుక్త అధికారుల ఆధీనంలో ఉన్న నిందితుడు నింగప్పను జూన్ 30 వరకు జుడిషియల్ కస్డడీకి ఆదేశించారు. పోలీస్ కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు. నిందితున్ని మరిన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని లోకాయుక్త న్యాయవాది కోరారు. ఇందుకు నిందితుని వకీలు అభ్యంతరం తెలిపారు. చివరకు జుడిషియల్ కస్టడీకి ఆదేశించడంతో జైలుకు తరలించారు. -
వాల్మీకి నిధులతోనే కాంగ్రెస్ గెలుపు
సాక్షి బళ్లారి: గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు వాల్మీకి అభివృద్ధి నిగమ నిధులను ఖర్చు చేసి గెలుపొందారని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్థన్రెడ్డి ఆరోపించారు. ఆయన మంగళవారం కొప్పళ జిల్లా గంగావతి నియోజకవర్గ పరిధిలోని అంజనాద్రిలో శ్రీఆంజనేయస్వామిని దర్శనం చేసుకొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. జైలు నుంచి విడుదలైన తర్వాత సతీమణి లక్ష్మిఅరుణతో కలిసి అంజనాద్రి కొండను దర్శించుకున్న ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.నా తర్వాత ఆయన మాట్లాడుతూ రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు వాల్మీకి అభివృద్ధి నిగమ నిధుల స్వాహాలో కీలక పాత్రను పోషించారన్నారు. బళ్లారి జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఇందులో పాలు పంచుకున్నారన్నారు. ఆరోపణలపై దర్యాప్తు ఆ ఎన్నికల్లో నిధులను ఖర్చుచేసి లోక్సభ సభ్యుడు తుకారాంను గెలిపించారనే ఆరోపణలు ఉండటంతో ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందన్నారు. ఈడీ అధికారులు సరైన సమాచారంతోనే తనిఖీ చేసి ఉంటారన్నారు. ఈడీ అధికారులు సమాచారం లేకుండా సోదాలు చేయబోరన్నారు. ఈ విషయాలు వారే బహిర్గతం చేస్తారన్నారు. ఒక నెల రోజుల పాటు తాను జైల్లో ఉన్నానన్నారు. తన రాజకీయ ప్రత్యర్థులు సంతోషంగా ఉన్న సమయంలో భగవంతున్ని కృపా కటాక్షాలతో తనకు బెయిల్ దొరికిందన్నారు. గంగావతి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి అవకాశం దొరికిందన్నారు. జైలు నుంచి విడుదల అయినా ఆయనకు అభిమానులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నన్ను ఇరికించడానికి నాడు కుట్ర హొసపేటె: తాను అక్రమ మైనింగ్ చేశానని పేర్కొంటూ సీఎం సిద్దరామయ్య నాడు పాదయాత్ర చేశారు. కానీ వాస్తవానికి అక్రమ మైనింగ్ జరగలేదని న్యాయమూర్తులే తేల్చి చెప్పారు. తనను లక్ష్యంగా చేసుకొని నిందితుడిగా చేయడానికి నాడు కుట్ర జరిగిందని ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు బంగారు హనుమంతు తండ్రి మరణించిన నేపథ్యంలో అతని నివాసంలో తన భార్యతో కలిసి అతని కుటుంబానికి సంతాపం తెలిపిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను నిర్దోషిగా విడుదలవుతానని, తనకు చట్టంపై నమ్మకం ఉందన్నారు. కూడ్లిగి నియోజకవర్గంతో శ్రీరాములు నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు రాష్ట్ర నాయకులు ఎక్కడి నుంచైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చన్నారు. బీజేపీ హైకమాండ్ ఎవరికి టికెట్లు ఇచ్చినా వారి గెలుపు కోసం అందరూ పని చేయక తప్పదన్నారు. బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బంగారు హనుమంతు, హురుళిహాళ్ రేవణ్ణ, వసంత్ కుమార్, సూర్య పాపన్న, మారేష్, లోకన్న, ఎన్.అజేయ, గురికార రాఘవేంద్ర, గుడేకోటె బేకరీ సురేష్, మహేష్, కోనహళ్లి శంభునాథ్, బోరువెల్ మంజన్న, సచిన్ కుమార్ పాల్గొన్నారు. గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్రెడ్డి ఆరోపణ -
పాఠశాల పైకప్పు కూలి బాలుడికి గాయాలు
బళ్లారిఅర్బన్: తాలూకాలోని సిరవార గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఓ గది పైకప్పు కూలడంతో బాలుడి తలకు తీవ్రంగా గాయాలైన ఘటన మంగళవారం జరిగింది. మూడో తరగతి విద్యార్థి సోమలింగప్ప గాయపడ్డాడు. ఈ పాఠశాలలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మొత్తం 800 విద్యార్థులు దాఖలయ్యారు. కొత్తవి 10, అలాగే పాతవి 9 గదులతో కలిపి పాఠశాలలో 19 గదులు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న ఎడతెగని వానలతో నాలుగు గదులు పూర్తిగా శిథిలం అయ్యాయి. దీంతో ఎల్కేజీ, యూకేజీ, 1 నుంచి 3వ తరగతి వరకు తరగతుల విద్యార్థులకు పాఠాలను పాఠశాల ఆవరణలోని చెట్ల కిందే బోధిస్తున్నారు. సోమలింగప్ప అనే విద్యార్థి శిథిలం అయిన గదిలోకి ఉదయం ప్రవేశించిన వేళ పైకప్పు కూలి తలకు గాయాలయ్యాయి. 2009లో పాత 9 గదులను నిర్మించినట్లు అధికారి తెలిపారు. కాగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప సోమవారం పాఠశాలలో అన్ని సమస్యలను పరిశీలించి విద్యార్థులతో మధ్యాహ్న భోజనం చేసి అధికారులతో చర్చలు కూడా జరిపారు. అయినా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాల గదుల దుస్థితి గురించి అధికారులు మంత్రికి సక్రమంగా వాస్తవాలను వెల్లడించలేదని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. -
రాఘవుని సన్నిధిలో కేంద్ర మంత్రి
రాయచూరు రూరల్: మంత్రాలయ మఠంలో కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం రాత్రి మంత్రాలయ రాఘవేంద్ర స్వాముల మఠంలో పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ మంత్రికి శాలువా కప్పి సన్మానించారు. సాయంత్రం రాయల సేవలో పునీతులై రథోత్సవం నిర్వహించారు. మారణకాండ నిలిపేయాలి రాయచూరు రూరల్: గాజాలో ఇజ్రాయిల్ చేస్తున్న మారణకాండను వెంటనే నిలిపి వేయాలని ఒత్తిడి చేస్తూ సీపీఐ(ఎంఎల్), ఎస్యూసీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మంగళవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద అధ్యక్షుడు వీరేష్ మాట్లాడారు. పాలస్తీనా దేశఽ ప్రజలకు భారత్ సౌహార్దతను ప్రకటించాలన్నారు. ఈ విషయంలో భారతదేశం విధివిధానాల్లో మార్పు చేసుకొని జాతీయ సౌహార్దతా దినోత్సవంగా ప్రకటించాలన్నారు. ఈ సందర్భంగా వరలక్ష్మి, శరణ బసవ, అయ్యాళప్ప, బసవలింగప్ప, వీరేష్లున్నారు. -
కాటేసిన పాముతోనే ఆస్పత్రికి రైతు
హుబ్లీ: పొలంలో సాగు పనులు చేసుకుంటున్న సందర్భంగా రైతుకు పాము కాటు వేసింది. దీంతో ఆ రైతు సదరు పామును పట్టుకొని నేరుగా ఆస్పత్రికి వచ్చిన అరుదైన ఘటన బెళగావి బిమ్స్ ఆస్పత్రిలో మంగళవారం చోటు చేసుకుంది. బెళగావి తాలూకా అంబేవాడి గ్రామం వదద పొలంలో పని చేస్తున్న యల్లప్పను పాము కాటు వేసింది. కట్ల పాము అనే విషకారి పాము కాటు వేసిన నేపథ్యంలో సదరు పామును ప్లాస్టిక్ డబ్బాలో బంధించి దానితో పాటు బిమ్స్ ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందాడు. పామును పట్టుకొని రావడంతో బెళగావి జిల్లా ఆస్పత్రిలో రోగులు కాసేపు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై బెళగావి గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థులు సమాజ సేవకు ముందడుగు వేయాలిరాయచూరు రూరల్: విద్యార్థులు చదివిన విద్యకు సమాజంలో గౌరవ ప్రదంగా సేవలు అందించాలని హైదరాబాద్ ఐఐఐటీ డైరెక్టర్ డాక్టర్ హరీష్ కుమార్ పరదాన్ పేర్కొన్నారు. యరమరస్ హైదరాబాద్ కర్ణాటక విద్యా సంస్థ ఎం.విశ్వేశ్వరయ్య ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ విద్య ముగించిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసి ప్రసంగించారు. వివిధ కోర్సుల్లో పట్టాలు పొందిన ప్రతి ఒక్కరు జవాబుదారితో చదివిన విద్య సార్థకం కావాలంటే మంచి సేవలు అందించడానికి ముందడుగు వేయాలన్నారు. విద్యార్థుల్లో ఉన్న సృజనశీలత, ప్రతిభను వెలికి తీసి ప్రజలు గుర్తుంచుకొనేలా జీవితాలను రూపొందించుకోవాలన్నారు. సభ్యులు నిశాంత్, అనిల్ కుమార్, కిరణ్, ప్రిన్సిపాల్ బసవరాజ్, అశ్విన్, విజయేంద్ర, సంగమేష్, వర్మ, స్నేహ, శ్రుతి పాటిల్లున్నారు. శాంతిదూత అల్లమ ప్రభురాయచూరు రూరల్: సమాజంలో శాంతి, ధర్మం, న్యాయం వంటి అంశాలను చాటడంలో మహాజ్ఞాని అల్లమ ప్రభువు అని శరణ బసవ అప్ప పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని వీరశైవ కళ్యాణ మంటపంలో ఏర్పాటు చేసిన మహాజ్ఞాని అల్లమ ప్రభు జీవిత చరిత్రను గురించి జరిగిన సమావేశంలో భక్తులనుద్దేశించి మాట్లాడారు. నిరాకారమైన రూపం, వర్ణం లేని శివశక్తి నుంచి ఉదయించిన ఆత్మ గుహేశ్వర ద్వారా పరమాత్ముడు అనే విషయాన్ని వివరించారు. మానవుడి జీవితం దుఖంతో కూడిందన్నారు. ఎవరు చేసిన కర్మ ఫలం వారు అనుభవించక తప్పదన్నారు. వీరశైవ లింగాయత సమాజం అధ్యక్షుడు శరణ భూపాల నాడగౌడ, విరుపనగౌడ, వీరనగౌడ, పాటిల్, శరణగౌడ, బసవరాజ్లున్నారు. విద్యుత్ కోతలు నివారించండి రాయచూరు రూరల్: నగరంలో విద్యుత్ కోతల నివారణకు చర్యలు చేపట్టాలని కరవే డిమాండ్ చేసింది. మంగళవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు ఖలీల్ పాషా మాట్లాడారు. రాయచూరులో ఆర్టీపీఎస్, వైటీపీఎస్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలున్నా తరచుగా విద్యుత్ కోత అధికంగా విధిస్తున్నారన్నారు. దీంతో 43 మురికి వాడల ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారని, కోతల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. పెంచిన వేతనాలు చెల్లించాలి రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు పెంచిన వేతనాలను త్వరగా చెల్లించాలని అంగన్వాడీ కార్యకర్తల సంఘం అధ్యక్షురాలు వరలక్ష్మి డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్యకర్తలను పర్మినెంట్ చేయాలని గుజరాత్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. రూ.12 వేల గౌరవ వేతనాన్ని చెల్లిస్తామని అక్కడి ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. పెంచిన గౌరవ వేతనాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలయ్యేలా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను జారీ చేసి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ.26 వేలు వేతనమివ్వాలని, పదవీ విరమణ అనంతరం రూ.10 వేలు పింఛన్ చెల్లించాలన్నారు. -
టూరిస్టుల కారు నుజ్జు
యశవంతపుర: చిక్కమగళూరు జిల్లా కల్లత్తగిరి ఫాల్స్ చూడడానికి వెళ్లిన పర్యాటకుల కారుపై చెట్టు కూలింది. కారు నుజ్జునుజ్జుకాగా, అందులో ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పింది. కారును రోడ్డు పక్కలో వదిలి ఫాల్స్ను చూస్తుండగా చెట్టు కూలింది. కారులో తాము లేకపోవడంతో హమ్మయ్య అనుకున్నారు. లింగదహళ్లి పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. శాకంబరీ దేవి దర్శనం బనశంకరి: బనశంకరిదేవి సన్నిధిలో వెలసిన శాకంబరీ దేవి కూరగాయల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. మంగళవారం వేకువజామున సుప్రభాత సేవ తరువాత అర్చకులు ఏ.చంద్రమోహన్ ఆధ్వర్యంలో శాకంబరీదేవి మూలవిరాట్కు అభిషేకం, అర్చన చేపట్టి వివిధ రకాల కూరగాయలతో సుందరంగా అలంకరించారు. పెద్దసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. డీకే సురేశ్కు ఈడీ పిలుపు శివాజీనగర: ఐశ్వర్య గౌడ అనే కిలాడీ మహిళ బంగారు వ్యాపారి నుంచి రూ.9.82 కోట్ల నగలు కొట్టేసిన కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ డీ.కే.సురేశ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పిలుపు అందింది. జూన్ 19న బెంగళూరులో ఈడీ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని తెలిపింది. జూన్ 23 అయితే హాజరవుతానని ఈడీకి చెప్పానని సురేశ్ తెలిపారు. తాను సురేశ్ సోదరినంటూ అనేకమంది నగల వ్యాపారుల నుంచి కోట్లాది రూపాయల నగలను కొట్టేసిన కేసుల్లో ఐశ్వర్యగౌడ నిందితురాలు, ఆమె ఇళ్లలో ఈడీ సోదాలు చేసి అరెస్టు కూడా చేసింది. ఇప్పుడు సురేశ్కు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. విదేశీయుల నిర్బంధం దొడ్డబళ్లాపురం: బెంగళూరులో అక్రమంగా నివసిస్తున్న 11మంది విదేశీయులను సీసీబీ పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. డీజే హళ్లి పీఎస్ పరిధిలో తలదాచుకున్న ఇద్దరిని పట్టుకున్నారు, వీరిలో ఒకరిపై డీజే హళ్లి పోలీస్స్టేషన్ ధ్వంసం కేసుతోపాటు నాలుగు కేసులు ఉండడం గమనార్హం. మరొకరిపై ఓ కేసు ఉంది. వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో తలదాచుకున్న ముగ్గురు విదేశీయులను పట్టుకుని విచారణ చేపట్టారు. మరో నలుగురు ఎటువంటి పత్రాలు చూపించని కారణంగా వారిని నిర్బంధ కేంద్రానికి తరలించారు. వీసా గడువు ముగిసినా ఉంటున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. థగ్ లైఫ్ను అడ్డుకోవద్దు ● సుప్రీం ఆదేశం శివాజీనగర: ఎట్టకేలకు కర్ణాటకలో తమిళ డబ్ సినిమా థగ్ లైఫ్కు ఊరట దక్కింది. ఈ సినిమాను కర్ణాటకలో ప్రదర్శించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో నటుడు కమల్హాసన్ బృందానికి ఉపశమనం దక్కింది. సినిమా ఇష్టం లేకపోతే చూడకండి. అయితే విడుదలను అడ్డుకోవటం సరికాదు అని కోర్టు పేర్కొంది. కన్నడ భాషను కించపరిచేలా కమల్ మాట్లాడారని ఈ చిత్రం రాష్ట్రంలో విడుదల కాకుండా కన్నడ, ప్రజా సంఘాలు అడ్డుకోవడం తెలిసిందే. క్షమాపణ చెప్పడానికి కమల్ తిరస్కరించడంతో విడుదల కాలేదు. హైకోర్టులో కూడా ఆయనకు చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో సుప్రీంను ఆశ్రయించగా ఉపశమనం లభించింది. సినిమా సజావుగా ఆడడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సుప్రీం సూచించింది. -
కలుషిత నీరు తాగి 20 మందికి అస్వస్థత
హొసపేటె: జిల్లాలోని హూవినహడగలి తాలూకా మాన్యర మసలవాడ గ్రామంలో కలుషిత నీరు తాగి 20 మందికి పైగా వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వడ్డర కాలనీలో 13 మంది, కురబగేరి కాలనీలో 7 మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. పవిత్ర, కెంచమ్మ, నింగరాజ అనే రోగులు హూవినహడగలిలోని అనన్య ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, రాధికను దావణగెరెలోని బాపూజీ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. మిగతా వారిలో శారద, అనలమ్మ హరపనహళ్లిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు వివిధ చోట్ల చికిత్స పొందుతున్నారు. గ్రామంలో 3000 మంది జనాభా ఉండగా మొత్తం గ్రామానికి ఒకే ఒక రక్షిత తాగునీటి యూనిట్ ఉంది. ఇప్పటికీ బోరుబావి నీరే ఆధారం మిగిలిన ఇళ్లకు నీటిని గ్రామ పరిధిలోని 5 గొట్టపు బావుల నుంచి ఇళ్లకు సరఫరా చేస్తారు. వడ్డరగేరి, కురబగేరి ప్రజలు ఇప్పటికీ గొట్టపు బావి నీటిని తాగుతున్నారు. బోరుబావి నీరు తాగడం వల్ల చేతులు, కాళ్లు నొప్పులు వస్తున్నాయన్నారు. పైగా గొట్టపు బావి పైప్లైన్ లీక్ అవుతూ సమీపంలోని గుంత నుంచి కలుషిత నీరు గొట్టపు బావిలోకి ప్రవహిస్తోంది. ఆ కలుషిత నీటిని తాగిన తర్వాత ప్రజలు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గొట్టపు బావి చుట్టూ ముళ్ల కంచె పెరిగి దాని పక్కనే ఒక పెద్ద గొయ్యి ఉంది. అక్కడ వర్షపు నీరు నిలుస్తోంది. ఈ గుంత నుంచి కలుషితమైన నీరు గొట్టపు బావిలోకి చేరుతోంది. బోరుబావి చుట్టు ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయించాలనే అవగాహన పీడీఓకు లేకపోయిందని గ్రామస్తులు వాపోయారు. వాంతులు విరేచనాలతో ఆస్పత్రిలో చేరిక -
ప్రకృతే మన సంపద
శివాజీనగర: రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో పర్యావరణ, వాతావరణ వైపరీత్య జాగృతి క్లబ్లను తప్పకుండా నియమించాలని ఆదేశించినట్లు డీసీఎం డీకే శివకుమార్ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినాన్ని పురస్కరించుకొని మంగళవారం విధానసౌధ ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి పాఠశాలలో కనీసం 25 మంది విద్యార్థులతో కూడిన జాగృతి క్లబ్లను ఏర్పాటు చేయాలి. ప్రకృతిని కాపాడుకోవడానికి విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి బడి ద్వారా మొక్కలను పెంచాలన్నారు. కర్ణాటక పెద్ద ఆస్తి మన ప్రకృతే అన్నారు. ప్లాస్టిక్ సమస్యను నిర్మూలించాలని సూచించారు. ఢిల్లీ, అహ్మదాబాద్లో ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలు ఉంటే, బెంగళూరులో 22–23 డిగ్రీలేనని ,ఈ వాతావరణం మన కర్ణాటక, బెంగళూరు ఆస్తి అని తెలిపారు. సైకిల్ నుంచి పడిపోయిన డీసీఎం ఈ సందర్భంగా మన నడక స్వచ్ఛ పర్యావరణం వైపు అనే జాతా జరిగింది. సౌధ తూర్పు ద్వారం నుంచి వివిధ కూడళ్ల కూడా నడక సాగించారు. డీసీఎం శివకుమార్ సైకిల్ తొక్కుతూ సౌధ మెట్ల వద్దకు వచ్చి ఆగే సమయంలో పట్టుతప్పి పడిపోయారు. కొన్నిక్షణాలు ఆయన అయోమయానికి లోనైనట్లు కనిపించారు. అయితే ఎలాంటి హాని కలగలేదు. సిబ్బంది ఆయన లేవడానికి సాయం చేశారు. ఈ వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. ప్రతి పాఠశాలలో జాగృతి డిప్యూటీ సీఎం శివకుమార్ -
వేధిస్తోన్న ఉపాధ్యాయుల కొరత
సాక్షి, బళ్లారి: వేసవి సెలవులు రెండు నెలలు ముగిశాయి. పాఠశాలలు ప్రారంభమై 15 రోజులు అయింది. ప్రతి ఏటా ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థులకు అరకొర బోధనే సాగుతోంది. 10వ తరగతి పరీక్షల్లో ప్రతి ఏటా జిల్లాలో ఉత్తీర్ణత శాతం ఓ వైపు తగ్గిపోతుంది. ఈ ఏడాది కూడా జిల్లా వ్యాప్తంగా 10వ తరగతిలో 40 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ కావడం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యా బోధనకు అద్దం పడుతుంది. జిల్లా వ్యాప్తంగా 720 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలల్లో దాదాపు 1900, ప్రాథమికోన్నత పాఠశాలల్లో దాదాపు 500 మంది ఉపాధ్యాయుల కొరత ఉన్నట్లు అధికారులు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఇంగ్లిష్, సైన్స్ ఉపాధ్యాయుల కొరత మరింత వేధిస్తోంది. ప్రతి ఏటా అతిథి ఉపాధ్యాయులతో అష్టకష్టాలతో విద్యాబోధన నెట్టుకొస్తుండటంతో విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల బోధన అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. జిల్లాలోని 5 తాలూకాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులు దాదాపు 2,90,000 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. సమస్యను పట్టించుకోని అధికారులు ఈ నేపథ్యంలో విద్యార్థుల కొరత వేధిస్తుండటంతో ఉపాధ్యాయులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. మంచి విద్యా బోధన, పాఠశాలల్లో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఫలితాలు మెరుగు పరచాలని, పెంచాలని పాలకులు, అధికారులు చెబుతున్నారే కానీ కనీసం ఉపాధ్యాయులను నియమించక పోతే ఫలితాలు ఎలా మెరుగు పరచాలన్నది వారికే తెలియాలి. 5వ తరగతి నుంచి ఆయా పాఠశాలల విద్యార్థులకు ఉపాధ్యాయుల కొరత తీవ్రం కావడం వల్ల విద్యార్థులకు ఇంగ్లిష్, సైన్స్, లెక్కలు సబ్జెక్ట్లలో పట్టు లేకుండా పోతుంది. పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను అశ్రయిస్తే అక్కడ సరైన విద్యాబోధన లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు చదువు కోల్పోతున్నారు. జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఉపాధ్యాయుల కొరత కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య విద్యార్థులకు దక్కడం లేదన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఉపాధ్యాయుల కొరత, బదిలీల సమస్య కూడా వేధిస్తోంది. సౌకర్యాల లేమితో ఫలితాలెలా సాధ్యం? 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించేందుకు మౌలిక సదుపాయాలు కల్పించక పోతే ఎలా సాధించగలమని పేరు చెప్పని ఉన్నతాధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల నియామకం చేపట్టడంలో అధికారులు, పాలకులు సరైన చర్యలు చేపట్టడం లేదు. ప్రతిఏటా మాదిరిగానే ఈ సారి కూడా ఉపాధ్యాయుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఉపాధ్యాయుల కొరత ఉందని ప్రభుత్వానికి నివేదికలు పంపినా పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ఉత్తీర్ణత శాతం పెంచాలని ఒత్తిడి చేస్తున్నారే కానీ అందుకు తగినట్లు ఉపాధ్యాయుల కొరత తీర్చడంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎందుకు చొరవ తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో ఏటేటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. అష్టకష్టాలతో ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించి కొందరు తల్లిదండ్రులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా తక్షణం ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీర్చాలని విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఏటా క్షీణిస్తున్న 10వ తరగతి ఉత్తీర్ణత శాతం జిల్లా వ్యాప్తంగా 2400 మంది టీచర్ల లోటు -
విద్యుదాఘాతానికి బలి
హొసపేటె: కొండనాయకనహళ్లిలోని మాగాణి పొలంలో మేస్తున్న గేదె, దూడలపై విద్యుత్ తీగ తెగి పడటంతో విద్యుత్ షాక్కు గురై పొలంలోనే అవి చనిపోయిన సంఘటన గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గ్రామంలో నివసించే గూగి ప్రకాష్ అనే రైతుకు చెందిన విలువైన గేదె, దూడ మృత్యువాత పడ్డాయి. దీంతో పాలు అమ్మడం ద్వారా జీవనోపాధి పొందే రైతు తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. బాధిత గేదెల యజమానికి వెంటనే పరిహారం అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరిస్తాం రాయచూరు రూరల్: వినియోగదారుల సమస్యలపై స్పందిస్తామని వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు మాలతి పాటిల్ పేర్కొన్నారు. మంగళవారం యాదగిరి జిల్లా కోర్టులో అధికార బాధ్యతలు స్వీకరించి ఆయన మాట్లాడారు. ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు చేపడతామన్నారు. వినియోగదారుల సంఘం సభ్యుడు ప్రభాకర్ పాటిల్, శరణే గౌడ, వినయ్ కులకర్ణిలున్నారు. ఎరువులు, విత్తనాల కొరత రానీయొద్దురాయచూరు రూరల్: తాలూకాలో ఖరీఫ్ పంటలు సాగు చేసే రైతులకు ఎరువులు, విత్తనాల కొరత రాకుండా చూడాలని బీదర్ గ్రామీణ శాసన సభ్యుడు బండెప్ప కాశంపూర్ సూచించారు. మంగళవారం బీదర్ తాలూకా కమఠాణా రైతు కేంద్రం వద్ద ఆందోళన చేపట్టిన రైతులనుద్దేశించి ఆయన మాట్లాడారు. కాగా వరి 308 క్వింటాళ్లలో 228 క్వింటాళ్లు, కందులు 195.6 క్వింటాళ్లలో 162.05 క్వింటాళ్లు, పెసలు 1.45 క్వింటాళ్లలో 1.15 క్వింటాళ్లు, సజ్జలు 2.1 క్వింటాళ్లలో 1.89 క్వింటాళ్లు, ఎరువులు 13,939 మెట్రిక్ టన్నుల్లో 20,179 మెట్రిక్ టన్నులు నిల్వ ఉంచామని అధికారులు వివరించారు. పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీ రాయచూరు రూరల్: పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని పిల్లల రక్షణ హక్కుల కమిషన్ అధ్యక్షుడు నాగణ్ణగౌడ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం అధ్యక్షుడు ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి మాట్లాడారు. ఆంగ్ల బాష సర్కారీ పాఠశాలను పరిశీలించి వసూలు చేస్తున్న ఫీజులు, డొనేషన్ల గురించి ఆరా తీశారు. విద్యార్థులు సహాయవాణి 1098, పోలీస్ సహాయవాణి 112 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. హాస్టల్ విద్యార్థులకు మంచి అహారాన్ని అందించాలని సూచించారు. పాఠశాల ఆవరణను శుభ్రంగా ఉంచేలా చూడాలని బీఈఓ ఈరణ్ణను ఆదేశించారు. రిమ్స్ ఆస్పత్రిని సందర్శించి రోగుల నుంచి వివరాలు సేకరించారు. ఆయన వెంట అధికారులు అమరేష్, హనుమేష్, రాఘవేంద్రలున్నారు. అల్లరితో విసిగి బిడ్డకు వాతలు.. తల్లి అరెస్ట్హుబ్లీ: సొంత బిడ్డ చేయరాని అల్లరి పని చేశాడంటూ ఆ తల్లి కన్న బిడ్డను ఇనుప కడ్డీతో చేతులు, కాళ్లు, మెడ భాగంలో వాతలు పెట్టిన ఘటన హుబ్లీలో చోటు చేసుకుంది. ఆ మేరకు వాతలు పెట్టిన ఆరోపణలపై అనుషా ఉలిమర అరెస్ట్ అయిన మహిళ. సోమవారం పాత హుబ్లీలోని టిప్పునగర్ 4వ క్రాస్లో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం నిందితురాలు తన బిడ్డ ప్రవర్తనతో కోపగించుకొని క్రూరమైన శిక్ష విధించినట్లు సమాచారం. అనుషా తన బిడ్డ చేతులు, కాళ్లు, మెడపై ఇనుపకడ్డీతో తీవ్రంగా వాతలు పెట్టి గాయపరిచింది. పాత హుబ్లీ పోలీసులు ఘటన స్థలానికి వచ్చి సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. వాతలు తిన్న బాధతో బిడ్డ అరుపులు ఇరుగు పొరుగు వారికి వినిపించడంతో వారందరూ పరుగున వచ్చి బాలుడిని రక్షించారు. ఈ దారుణ కృత్యంపై స్థానికులు తక్షణమే పోలీసులకు సమాచారం ఇచ్చారు. -
హిందువుల ఆశీర్వాదంతోనే నేను క్షేమం
హుబ్లీ: హిందువుల ఆశీర్వాదంతోనే తాను సురక్షితంగా ఉన్నానని అంతర్జాతీయ హిందూ పరిషత్ సంస్థాపక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా అన్నారు. హుబ్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో జరిగిన విషయాలను ప్రస్తుతం ప్రస్తావించడం సరికాదు. కాంగ్రెస్ హయాంలో ఎటువంటి సమస్య జరగలేదన్నారు. రామమందిర నిర్మాణం చేయడమే తమ ఉద్దేశం. ఆ కార్యం ప్రస్తుతం ముగిసింది. నేడు కోట్లాది మంది హిందువులకు సాయపడే పని ప్రారంభించాలి. హిందూ హెల్ప్లైన్ ప్రారంభించాను. హిందువులు ఎవరూ ఆకలితో అలమటించరాదు. అందుకోసం పేద హిందువులకు ఉచిత ఆహార ధాన్యాలు అందిస్తున్నాం. అలాగే ఉచిత ఆరోగ్య సేవలు కూడా అందిస్తున్నాం అన్నారు. హిందూ పార్టీ ప్రారంభించే ఉద్దేశం లేదు హిందూ పార్టీ ప్రారంభించే ఉద్దేశం లేదు. భారతే ఓ హిందూ దేశం. దీన్ని హిందూ దేశంగా తీర్చిదిద్దే అవసరం లేదు. 1947 నుంచి భారత్ దూసుకెళుతోంది. అనేక రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించింది. భారత్ గొప్ప దేశంగా నిలిచింది. దీన్ని రాజకీయ పార్టీలతో గొప్ప దేశంగా చేయడం సరికాదన్నారు. మేము పేరు కోసం ఆందోళన చేయడం లేదు. రామ మందిరం కోసమే చేశాం. అది విజయవంతం అయింది. హిందువులపై నకిలీ కేసులు పెట్టరాదు. పెడితే మేం పోరాటం చేస్తాం. దేశంలో అనేక చోట్ల హిందువులపై దాడులు జరుగుతున్నాయి. దీంతో హిందువుల రక్షణ కోసం పోరాడతాం. దేశంలో హిందువులు సురక్షితంగా ఉండాలని ఆయన తెలిపారు. సిందూర్ త్వరగా ముగుస్తుందనుకోలేదు ఆపరేషన్ సింధూర్ను ఇంత త్వరగా ముగిస్తారని ఎవరూ అనుకోలేదు. ఆ దేశంపై మరింతగా దాడులు చేయాల్సింది. పాకిస్తాన్లోకి దూసుకెళ్లి దాడి చేయడం మంచిదే. మరిన్ని దాడులు చేసి ఉంటే ప్రజలు సంతోషించే వారు. దేశంలో సంతానోత్పత్తి తగ్గుముఖం పట్టింది. హిందువుల సంతానోత్పత్తి 1.7 శాతంగా ఉంది. ఇది యావత్ దేశానికి మంచి పరిణామం కాదు. ప్రతి హిందువు ముగ్గురు పిల్లలను కంటే హిందువు బాగుంటాడని తన ఉద్దేశం అని ఆయన వెల్లడించారు. -
భద్ర ఎడమ కాలువకు నీరు లేనట్టే
శివమొగ్గ: భద్ర జయాశయం ఎడమగట్టు కాలువలో కొత్త గేటు ఏర్పాటు పనులు జరుగుతున్నందున ఈ సీజన్లో ఎడమగట్టు కాలువలోకి నీటి విడుదల సాధ్యం కాదని భద్ర ప్రాజెక్ట్ నీటిపారుదల సలహా కమిటీ తెలిపింది. గేటు ఏర్పాటుకు దాదాపు ఒకటిన్నర నెలలు పడుతుంది. భద్ర డ్యాం ఎడమగట్టు కాలువ పరిధిలోకి వచ్చే రైతులు వరి వంటి నీటి ఆధారిత పంటలను పండించకూడదని మంగళవారం ఉత్తర్వుల్లో ప్రకటించారు. పంటలు నష్టపోతే తమ బాధ్యత కాదని నీటిపారుదల అధికారులు తెలిపారు. రైతులందరూ సహకరించాలని కోరారు. గేటు మరమ్మతులను వేసవిలోనే పూర్తి చేయవచ్చు కదా, విలువైన పంట కాలాన్ని నష్టపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? అని అధికారుల తీరుపై రైతులు మండిపడ్డారు. -
తప్పు చేశారు.. తప్పుకోండి
శివాజీనగర: బెంగళూరులోని చిన్నస్వామి క్రీడా మైదానంలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి రాజీనామా చేయాలంటూ బీజేపీ నేతలు, కార్యకర్తలు మంగళవారం ధర్నా నిర్వహించారు. బెంగళూరులోని ఫ్రీడం పార్కులో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, బీజేపీ పక్ష నేత అశోక్ల నేతృత్వంలో జరిగిన ధర్నాలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు, పెద్దసంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. ఆర్సీబీ జట్టు విజయోత్సవాలలో చిన్నస్వామి క్రీడామైదానం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది అమాయకులు బలయ్యారు, వీరి మరణానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. నైతిక బాధ్యత వహించి సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీ.కే.శివకుమార్, హోం మంత్రి జీ.పరమేశ్వర్ పదవుల నుంచి తప్పుకోవాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. విజయేంద్ర, మాట్లాడుతూ విజయోత్సవంలో సీఎం, డీసీఎం సొంత ప్రతిష్ట పెంచుకోవడానికి పోటీ పడి అంతమంది చనిపోవడానికి కారణమయ్యారని ఆరోపించారు. ఇటువంటి మొండి సీఎం, డీసీఎంను తాను ఎక్కడా చూడలేదు. ప్రభుత్వమే 11 మందిని హత్య చేసింది. కాబట్టి రాజీనామా చేయాలని, లేదంటే వారి ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. కప్ గెచిలింది ఆర్సీబీనా, ప్రభుత్వమా అన్నది తెలియటం లేదు. గవర్నర్ను ముఖ్యమంత్రే కార్యక్రమానికి పిలిచారు. ఇదొక వినాశకర సర్కారని అశోక్ ధ్వజమెత్తారు. తెలంగాణలో తొక్కిసలాట జరిగితే ప్రముఖ నటుడు అల్లు అర్జున్ను జైలుకు పంపించారు, ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా, సిగ్గుండాలి.. అని దుయ్యబట్టారు. అక్టోబర్కల్లా ఈ ప్రభుత్వం పతనమవుతుందన్నారు. వ్యంగ్య నాటకం ఈ సందర్భంగా కార్యకర్తలు వ్యంగ్య నాటకాలను ప్రదర్శించారు. ఆర్సీబీ కప్ నాదంటే నాదని లాక్కోవడానికి సిద్దు, శివకుమార్ వేషధారులు ప్రయత్నించడం అందరికీ నవ్వులు పంచింది. తరువాత ఫ్రీడం పార్కు నుంచి సీఎం ఇల్లు ముట్టడికి బయలుదేరిన నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. వ్యాన్లోకి ఎక్కించి తరలించారు. కాంగ్రెస్ సర్కారుపై బీజేపీ నేతల ధ్వజం తొక్కిసలాట ఘటనను నిరసిస్తూ బృహత్ ధర్నా శివాజీనగర: చిన్నస్వామి క్రీడా మైదానం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రాజీనామా కోరే నైతిక హక్కు బీజేపీ నాయకులకు లేదని సీఎం సిద్దరామయ్య అన్నారు. మంగళవారం బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో పర్యావరణ దినాచరణలో ఆయన పాల్గొని విలేకరులతో మాట్లాడారు. యూపీ కుంభమేళలో తొక్కిసలాట అయింది. ఇటీవల అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలో వంతెన కూలిపోయి పలువురు చనిపోయారు. బిహార్లో వంతెన ప్రారంభానికి ముందుగానే కూలిపోయి 140 మంది మృతిచెందారు. గోద్రాలో దుర్ఘటన జరిగింది, రైలు ప్రమాదాలు జరిగి చనిపోతున్నారు, వీటికి ఎవరు బాధ్యులు, వీరంతా రాజీనామా చేశారా అని ధ్వజమెత్తారు. బీజేపీవారు తొక్కిసలాట ఘటనను రాజకీయం చేస్తున్నారు. వీరికి నైతిక హక్కు లేదని మండిపడ్డారు. పోలీస్ ఉన్నతాధికారులను సస్పెండ్ చేశాం, ఉన్నత విచారణ జరిపిస్తున్నాం, ఇది కనిపించదా అని ప్రశ్నించారు. ఆ దుర్ఘటనలు జరిగితే రాజీనామా చేశారా? సీఎం సిద్దు ప్రశ్న -
పాఠ్యాంశాల్లో నైతిక విద్య బోధించాలి
హుబ్లీ: ఉత్తమ వ్యక్తి నిర్వహణతో పాటు ఉత్తమ పౌరులను తీర్చిదిద్దే దిశలో ప్రస్తుతం పాఠశాల పాఠ్యాంశాల్లో నైతిక విద్య, విలువలతో కూడిన బోధన చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని విధాన పరిషత్ స్పీకర్ బసవరాజ్ హొరట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఆయన ప్రాథమిక విద్యా శాఖ మంత్రి మధు బంగారప్పకు లేఖ రాశారు. ప్రస్తుతం అన్యాయాలు, అసహనం, దురాచారాలు తదితర అంశాలు కనిపిస్తున్నాయి. దీనికి విద్యా బోధనలో విలువలపై శిక్షణ కొరతే ముఖ్య కారణం అన్నారు. పిల్లలు మంచి ఆచారాలు, ఉత్తమ సంస్కారాన్ని పొందాలంటే విలువలతో కూడిన విద్యా బోధన అవసరం అన్నారు. తాము చదువుకువే రోజుల్లో పాఠశాలతో పాటు నీతి కథలు బోధించే వారు. దీంతో పిల్లలు ప్రామాణికత, సమగ్రత, సానుభూతి, దయ, న్యాయసమ్మతం, సహనం, క్రమశిక్షణ, కఠోర కృషి, ఉదారత్వంతో బాధ్యతలను నెరవేర్చడం అలవాటు చేసుకొని సాత్విక, ఆదర్శ జీవితాన్ని గడిపామన్నారు. అలాంటి గుణాలు నేడు కనిపించడం లేదన్నారు. విలువలతో కూడిన విద్యా బోధన కొరత, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ప్రధాన కారణం అని తెలిపారు. చిన్నారుల సర్వతోముఖాభివృద్ధే దేశ భవితకు పునాది అన్నారు. నేటి పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు, బాలల హక్కుల రక్షణ, పిల్లలు వ్యసనాలు లేని జీవితాన్ని గడిపేందుకు పలు నిర్ణయాలను తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. -
నాణ్యమైన విద్యా బోధనకు పెద్ద పీట
బళ్లారిఅర్బన్: రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో నాణ్యతతో కూడిన బోధన ద్వారా విద్యార్థుల్లో చదువుపై ఆశక్తి పెంచేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ మంత్రి ఎస్.మధు బంగారప్ప తెలిపారు. సోమవారం బీపీఎస్ఈ మీటింగ్ హాల్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో నాణ్యతా ప్రమాణాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యాశాఖ అధికారులు, సిబ్బందికి గురుతరమైన బాధ్యత అప్పగించామన్నారు. పాఠశాల వేళలు మినహాయించి సాయంత్రం కూడా విద్యార్థులకు ప్రత్యేక తరగతులతో అభ్యాసం చేయడానికి మార్గదర్శనం చేస్తున్నామన్నారు. పరీక్షల పవిత్రత కాపాడటానికి పరీక్ష కేంద్రాల్లో సీసీ టీవీ కేంద్రాలు, వెబ్ కాస్టింగ్ చేపట్టామన్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మూడు సార్లు పరీక్షలు రాసే అవకాశం కల్పించామన్నారు. అప్పటికీ ఉత్తీర్ణులు కాకపోతే అలాంటి విద్యార్థులకు పాఠశాలల్లో పునర్ ప్రవేశానికి అవకాశం కల్పించామన్నారు. ఇలాంటి వారికి కూడా అందరితో పాటు దుస్తులు, పుస్తకాలు, షూ తదితర సౌకర్యాలను కల్పిస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రెండో విడత పరీక్షలు పూర్తయ్యాయన్నారు. వీటిలో ఫెయిల్ అయిన వారికి మార్కులు శాతం పెంచుకోవడానికి గాను మొత్తం 84 వేల మంది అనగా 98.25 ఉత్తీర్ణులయ్యారని మంత్రి వివరించారు. అలాగే అన్ని పాఠశాలల్లో ముఖాన్ని గుర్తిస్తు హాజరు కావడం తప్పనిసరి చేశామన్నారు. ఈ విషయంలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరీక్షించి చూశామన్నారు. అజీమ్ ప్రేమ్జీ ఇన్ఫోసిస్ తదితర సంస్థల కేఎస్ఆర్ నిధులను వినియోగించుకొని విద్యార్థుల ఆరోగ్యం, పౌష్ఠికాహారం నాణ్యతతో కూడిన బోధనకు సంబంధించి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారు కూడా సదరు పాఠశాలకు ఏమైనా సేవలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. 13 వేల మంది ఉపాధ్యాయ నియామక ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. దీనికి సీఎం అనుమతిని ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బసవరాజ్ హొరట్టి, బీపీఎస్సీ విద్యా సంస్థల అధ్యక్షుడు మహిపాల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మంత్రి తనిఖీబళ్లారిఅర్బన్: విద్యార్థులు రోజు పాఠశాలకు రావాలి, ఏ కారణంతోను స్కూల్కు గైర్హాజరు కారాదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప సూచించారు. స్థానిక పటేల్ నగర్ లేఅవుట్ ప్రభుత్వ ఆదర్శ సీనియర్ ప్రాథమిక పాఠశాలను ఆయన అకస్మికంగా సందర్శించి 7వ తరగతి విద్యార్థులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఇంట్లో స్కూల్కు వెళ్లడానికి అభ్యంతరం పెడితే తాను తప్పకుండా స్కూల్కు వెళతానని చెప్పాలని విద్యార్థులకు హితవు చెప్పారు. పాఠశాలలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆరోగ్యంగా ఉండాలి. చక్కగా చదువుకొని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పీఠిక సారాంశాన్ని 5వ తరగతి విద్యార్థిని రితిక సమగ్రంగా వివరించారు. అంతేగాక మంత్రి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం సేవించారు. అన్నం, సాంబారు, ఊరగాయ, ఉడికిన గుడ్డును అందరికీ వడ్డించి ఆయన తిన్నారు. అలాగే వివిధ గదులను పరిశీలించారు. భోజనం ఎలా ఉంది? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. జెడ్పీ సీఈఓ మహమ్మద్ హ్యారీస్ సుమేరా, డాక్టర్ ఆకాశ్ శంకర్, డీడీపీఐ ఉమాదేవి, వేదావతి, ఆ పాఠశాల హెచ్ఎం జయశ్రీ, బీఈఓ తదితరులతో పాటు ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మంత్రి మధు బంగారప్ప -
ఎయిమ్స్ కోసం పోరాటానికి మద్దతు
రాయచూరు రూరల్: రాయచూరుకు ఎయిమ్స్ మంజూరు చేయాలని చేస్తున్న పోరాటానికి తన మద్దతు ఉందని, అయితే ఎవరి ప్రభావంతోనూ ఎయిమ్స్ మంజూరు కాదని కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. సోమవారం రాయచూరులో తనను కలిసిన విలేఖర్లతో మాట్లాడారు. ఎయిమ్స్ ఏర్పాటు విషయంలో ఒక కమిటీని రూపొందిస్తుందన్నారు. కమిటీ అధ్యయనం చేసి మౌలిక సౌకర్యాలపై కూడా అవగాహన చేసిన తరువాత మంజూరుకు అవకాశం ఉంటుందన్నారు. గతంలో కాంగ్రెస్, జేడీఎస్ సర్కార్లో రాష్ట్రం నుంచి మూడు జిల్లాల పేర్లను కేంద్రానికి పంపి రాయచూరుకు ఎయిమ్స్ రాకుండా అడ్డుకున్న విషయాన్ని జోషి ప్రస్తావించారు. కేంద్రంలోని బీజేపీ సర్కా ర్ 11 ఏళ్ల పాలనలో ఆర్థికంగా అభివృద్ధిని సాధించి ప్రపంచంలోనే నాలుగో దేశంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో పంచ గ్యారెంటీల పేరుతో 48 వస్తువులపై పన్నులు పెంచారని ఆరోపించారు. -
కేబినెట్ విస్తరణ బాధ్యత అధిష్టానానిదే
రాయచూరు రూరల్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పార్టీ అధిష్టానం చూసుకుంటుందని ప్రజా పనుల శాఖ మంత్రి సతీష్ జార్కిహోళి తెలిపారు. సోమవారం రాయచూరులో విలేఖర్లతో ఆయన మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి హైకమాండ్తో చర్చించారో లేదో తనకు తెలియదన్నారు. ఉన్న శాసన సభ్యుల స్థానాలను భద్రపర చుకోవాలే తప్ప అధికారం శాశ్వతం కాదని అన్నారు. ప్రభుత్వంలో హెచ్చుతగ్గులు సహజమన్నారు. బీజేపీ హయాంలో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ఆ పదవిలో గట్టిగా ఉన్నారన్నారు. మంత్రుల శాఖల్లో మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయన్నారు. విధాన పరిషత్ స్థానాలకు నామినేట్ చేసిన పేర్లలో ఎలాంటి మార్పులు ఉండవన్నారు. విధాన పరిషత్ సభ్యులకు మంత్రి పదవులు కేటాయించే అధికారం అధిష్టానానికి సంబంధించిన విషయం అన్నారు. కులగణన సమీక్షకు రూ.కోట్లాది వ్యయం అవుతుందన్న ప్రతిపక్ష నేతలకు కోవిడ్ సమయంలో రూ.3 వేల కోట్ల నష్టం జరిగిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. బీజేపీ నేతలకు మరో మూడేళ్ల పాటు తమపై బురద చల్లడం తప్ప వేరే పని లేదని ఎద్దేవా చేశారు. -
వాణిజ్య నగరి.. తగ్గని నేరాల అల్లరి
హుబ్లీ: చోటా ముంబైగా ప్రసిద్ధి చెందిన హుబ్లీ నగరంతో పాటు ధార్వాడ జిల్లా నేరాల్లో కుఖ్యాతిని గడించింది. దీనికి నిదర్శనంగా ఈ ఏడాది నాలుగు నెలల్లో 15 హత్యలు, 83 హత్యాయత్న కేసులు నమోదు కావడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. జంట నగరాల్లో హత్యాయత్నాలు, దాడులు, దోపిడీల కేసులు రోజూ ఏదో ఒక చోట జరుగుతుండటంతో స్థానికులు ఆవేదన చెందుతున్నారు. 2024తో పోల్చితే క్రైం రేట్ కొద్ది మేర తగ్గడం ఊరటనిచ్చే విషయమే. అయితే ఏదో ఒక కారణంతో పోకిరీలు, గల్లీ రౌడీల ఆగడాలు, ఘర్షణలు మాత్రం నమోదు అవుతూనే ఉన్నాయి. హుబ్లీ ధార్వాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 22 పోలీస్ స్టేషన్లు, అలాగే జిల్లా ఎస్పీ కార్యాలయం పరిధిలో 14 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఉత్తర కర్ణాటక కేంద్ర బిందువైన హుబ్లీలో గంజాయి, సైబర్, వడ్డీల దందా, చోరీలు, రౌడీ కార్యకలాపాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. నేరాలకు కళ్లెం పడేనా? అయితే ఈ ఏడాది నేరాల చిట్టా కాస్త గమనిస్తే కొంత ఉపశమనం చెందవచ్చు. చోరీలు, దాడులు, హత్యాయత్నాలు జరుగుతుండటంపై నేర కార్యకలాపాలకు కళ్లెం వేయాలని పోలీస్ శాఖ వైపు ప్రజలు చూస్తున్నారు. 2025 ఏప్రిల్ నెలాఖరు వరకు హుబ్లీలో 3 హత్యలు, 72 హత్యాయత్నాలు, అలాగే ధార్వాడ జిల్లాలో 12 హత్యలు, 11 హత్యాయత్నాలు చోటు చేసుకున్నాయి. 2024లో మొత్తానికి హుబ్లీలో 22 హత్యలు, 85 హత్యాయత్నం కేసులు, అలాగే జిల్లాలో 19 హత్యలు, 25 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కల మేరకు హత్యలను నివారించే దిశలో పోలీస్ శాఖ సమర్థవంతంగా పని చేయాల్సి ఉంది. అయితే నాలుగు నెలల్లోనే 83 హత్యాయత్నం కేసులు నమోదు కావడంతో ప్రజలు భయపడుతున్నారు. ఇక ఏడాది ప్రారంభంలో చోరీలు, కుటుంబ కలహాలు, కక్షలు కార్పణ్యాలు, ఆర్థిక సంబంధిత గొడవలకు సంబంధించిన కేసులు కూడా జిల్లాలో జరిగాయి. నేరాల చిట్టా పరిశీలిస్తే.. హుబ్లీలో 2025 ఏప్రిల్ చివరికి 6 హత్యాచారాలు, 4 దోపిడీలు, నాలుగు చోరీలు, 44 చిన్నాచితక దొంగతనాలు, 160 జూదాలు, 9 పోక్సో కేసులు దాఖలు అయ్యాయి. ఇక జిల్లా పరిస్థితికి వస్తే ఒక దోపిడీ, రాబరీ, 33 చోరీలు, 59 జూదాలు, అలాగే 8 పోక్సో కేసులు దాఖలు అయ్యాయి. 2024లో కమిషనరేట్ పరిధిలో 22 హత్యలు, 85 హత్యాయత్నాలు, 20 హత్యాచారాలు, 28 రాబరీ, 221 చోరీలు, 86 జూదాలు, 247 సైబర్, అలాగే 65 పోక్సో కేసులు నమోదు అయ్యాయి. జిల్లా ఎస్పీ పరిధిలో 19 హత్యలు, 25 హత్యాయత్నాలు, 9 రాబరీ, 104 చోరీలు, 214 జూదాలు, 46 పోక్సో కేసులు దాఖలు అయ్యాయి. ముఖ్యంగా గల్లీ రౌడీలు పోకిరీల ఆగడాలపై పోలీస్ శాఖ ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ సంఘ విద్రోహ శక్తుల ఆటలు కట్టించడం మాత్రం సాధ్యం కావడం లేదు. నాలుగు నెలల్లో 15 హత్యలు, 83 హత్యాయత్నం కేసులు భయాందోళనలో హుబ్లీ ధార్వాడ జంట నగరాల ప్రజలు -
అధికారుల నిర్లక్ష్యంపై ఎంపీ మండిపాటు
రాయచూరు రూరల్: లోక్సభ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పథకాల పురోగతిపై జరిగిన సమావేశంలో లోక్సభ సభ్యుడు కుమార నాయక్ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. సోమవారం జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దిశ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఎరువులు, క్రిమి సంహారక మందుల కొరత రాకుండా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా రైతులకు 2.29 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. జాతీయ రహదారి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అధికారులు, కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులను నాణ్యతగా చేపట్టాలని ఆదేశించారు. వానాకాలం కావడంతో డెంగీ, మలేరియా వంటి వ్యాధుల నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో మంత్రి బోసురాజు, లోక్సభ సభ్యుడు కుమార నాయక్, గ్రామీణ శాసన సభ్యుడు బసన గౌడ దద్దల్, శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, హంపయ్యనాయక్, హంపన గౌడ బాదర్లి, బసన గౌడ, కరెమ్మ నాయక్, ఎమ్మెల్సీ వసంత కుమార్, జిల్లాధికారి నితీష్, జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారాం పాండేలున్నారు. -
లబ్ధిదారులతో బీజేపీ నేతల సమావేశం
బళ్లారిఅర్బన్: స్థానిక 21వ వార్డు బసవేశ్వర నగర్లో బీజేపీ ప్రధాని మోదీ 11 సంవత్సరాల పాలనకు సంబంధించి మహాశక్తి కేంద్రం, అలాగే శక్తి కేంద్రాల కీలక సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్రెడ్డి సారథ్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గత 11 ఏళ్లుగా మోదీ పాలనలో పేదలకు అట్టడుగు, మధ్య తరగతి వర్గాలకు చేపట్టిన వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి వివరించారు. కార్పొరేటర్లు శ్రీనివాస్ మోత్కూర్, సురేఖ మల్లనగౌడ, వేమన్న, కేదార్నాథ్ స్వామి, రాధ, రత్నమ్మ, అనురాధ తదితర ప్రముఖులు, ఆ వార్డు కార్యకర్తలు పాల్గొన్నారు. -
జోరుగా వర్షాలు.. పొంగిన నదులు
రాయచూరు రూరల్: పశ్చిమ కనుమల్లో భారీగా వర్షాలు పడుతుండడంతో కృష్ణా పరివాహక ప్రాంత నదుల్లో నీటి ప్రవాహం పెరుగుతోంది. ఉత్తర కర్ణాటక, కళ్యాణ కర్ణాటక జిల్లాల్లో ఆదివారం రాత్రి, సోమవారం కొన్ని గంటల పాటు భారీగా వానలు కురిశాయి. ఎగువన మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో భారీగా వానలు పడుతుండటంతో కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. మరోవైపు ధార్వాడ, గదగ్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురవడంతో వాగుల్లో వరద నీటి ఉధృతి పెరిగింది. ఫలితంగా కుడచి హంచినాళ వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. ప్రజలు చేయి చేయి పట్టుకుని వాగులో నడుచుకుంటూ దాటారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లలేక పోయారు. రాయచూరులో.. నగరంలో సోమవారం ఓ మోస్తరు వర్షం కురిిసింది. ఎక్కడ చూసినా రోడ్లు బురదగుంటలుగా మారాయి. హైదరాబాద్ రోడ్డు, ఏపీఎంసీ, మున్నూరు వాడి, గాంధీ చౌక్, మహావీర చౌక్, ఆర్టీఓ సర్కిల్, కూరగాయల మార్కెట్లో వర్షపు నీరు చొరబడ్డాయి. ప్రధాన రహదారుల్లో వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారింది. క్రమంగా పెరుగుతున్న వరద వాహన రాకపోకలకు ఆటంకం -
సమాజ సేవకునికి సత్కారం
రాయచూరు రూరల్: ఉత్తమ పౌరుడిగా మెలుగుతూ మారుతి అందిస్తున్న సమాజ సేవకు వయస్సు ఆటంకం కాదని సమాజ సేవకుడు ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి జిల్లాలోని సిరవారలో మారుతి బడిగేరకు జరిగిన అభినందన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. పుట్టిన గ్రామానికి మారుతి చేస్తున్న సేవలు మరువరానివన్నారు. ప్రజలను పలకరించి వారి సమస్యలపై స్పందించి న్యాయం చేయడంలో ముందుంటారన్నారు. కార్యక్రమంలో అస్లాంపాషా, రేణుక, బ్రిజేష్ పాటిల్, ఉమాపతి, శ్రీనివాస్, ినింబయ్య, శివరాజ్, పరశఽురామ, అబ్రహం, అమరేగౌడ, శాంత, సంతోషిలున్నారు. ఎన్ఆర్బీసీ పనుల్లో నాణ్యత డొల్ల రాయచూరు రూరల్: నారాయణపుర కుడిగట్టు కాలువ(ఎన్ఆర్బీసీ) మరమ్మతు పనుల్లో నాణ్యత లేకుండా నాసిరకంగా పనులు చేపడుతున్నారు. లింగసూగూరు, దేవదుర్గ తాలూకాల్లో ఎన్ఆర్బీసీ పనుల్లో పూర్తి స్థాయిలో నాణ్యత కొరవడింది. కాలువ మరమ్మతు పనుల్లో కింది భాగంలో నామమాత్రంగా కాంట్రాక్టర్లు పనులు చేసి చేతులు దులుపుకున్నారు. గురువారం కర్ణాటక ప్రాంత రైతు సంఘం నేతలు బసవరాజ్ పనులు జరుగుతున్న కాలువలను పరిశీలించారు. లింగసూగూరులో 4 కి.మీ. పనులకు రూ.2.75 కోట్లు, దేవదుర్గలో 4 కి.మీ పనులకు రూ.2.75 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులు నాసిరకంగా ఉన్నాయని ఆరోపించారు. ఈనేపఽథ్యంలో రైతులు కాలువ కింది భాగంలో చేతులతో పెకలించగానే పెచ్చు ఊడి పైకి వచ్చిందన్నారు. సంబంధిత శాఖ ఇంజినీర్లను పిలిచి పనుల తీరుపై ఆరా తీశారు. నాసిరకంగా పనులు చేపట్టి కాంట్రాక్టర్లు చేతులు దులుపుకొని తప్పించు కోవడం తగదన్నారు. అలాంటి కాంట్రాక్టర్లపై చర్యలు చేపట్టాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. అభివృద్ధి పనుల ప్రగతిపై సమీక్షరాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో రైలు మార్గ నిర్మాణాలపై జరిగిన సమావేశంలో పెండింగ్లో ఉన్న కల్మల–సింధనూరు రైలు మార్గ నిర్మాణంపై రాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి సతీష్ జార్కిహోళి అధ్యక్షతన చర్చ జరిపారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయంలో ఎమ్మెల్యేలు, అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అధికారులు, కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులను నాణ్యతగా చేపట్టాలని ఆదేశించారు. కల్మల– సింధనూరు చతుష్పథ రహదారి పనులు మందకొడిగా సాగుతున్న అంశంపై సమీక్షించారు. 77 కి.మీ.లకు రూ.1700 కోట్లు వ్యయం చేస్తున్నారన్నారు. సమావేశంలో మంత్రి బోసురాజు, లోక్సభ సభ్యుడు కుమార నాయక్, గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్, శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, హంపయ్య నాయక్, హంపనగౌడ బాదర్లి, బసనగౌడ, కరెమ్మ నాయక్, ఎమ్మెల్సీ వసంత కుమార్, జిల్లాధికారి నితీష్, జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారకాం పాండేలున్నారు. కాంగ్రెస్ కచేరీలుగా పోలీస్ స్టేషన్లురాయచూరు రూరల్: రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా పోలీస్ స్టేషన్లు మారాయని యాదగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు బసవరాజ్ ఆరోపించారు. సోమవారం నగరంలోని సుభాష్ చంద్ర బోస్ సర్కిల్ వద్ద ఆందోళన చేపట్టి మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు నశించాయన్నారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి పరమేశ్వర్ను కీలుబొమ్మగా ముఖ్యమంత్రి సిద్దరామయ్య చేశారన్నారు. పాకిస్తాన్, నాసిర్ సాబ్ జిందాబాద్ అన్న వారిని సమర్ధించడాన్ని తప్పుబట్టారు. చిన్నస్వామి క్రీడా మైదానంలో ఆర్సీబీ విజయోత్సవంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అసువులు బాసారని గుర్తు చేశారు. ప్రజలకు సుపరిపాలన అందించకుండా నిరంకుశ పద్ధతిలో పాలన సాగిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా మహేష్గౌడ, బసవరాజ్, నాగరత్నలున్నారు. -
హెల్మెట్ తప్పనిసరి ఆదేశాలు వద్దు
బళ్లారిఅర్బన్: నగరంలో అధిక ఉష్ణోగ్రత తాకిడితో ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించి సంచరించడం చాలా కష్టం అవుతుందని, ఒక వేళ హెల్మెట్ తీసి తిరిగి ధరిస్తే వెంట్రుకలు రాలిపోవడంతో చర్మ రోగాల బారిన పడి అనేక అనారోగ్య సమస్యలకు స్థానికులు బాధితులు అవుతున్నారు. అందువల్ల తక్షణమే హెల్మెట్ తప్పనిసరి ఆదేశం రద్దు చేయాలని కన్నడనాడు రైతు సంఘం రాష్ట్రాధ్యక్షుడు మెణసిన ఈశ్వరప్ప డిమాండ్ చేశారు. సోమవారం ఈ మేరకు ఆయన జిల్లాధికారి కార్యాలయంలో అధికారికి వినతిపత్రం అందజేశారు. అంతకు ముందు ఆందోళన చేపట్టి ప్రదర్శనగా జిల్లాధికారి కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం వల్ల చిన్న చితకా దొంగతనాలు జరుగుతాయని ఆయన వాపోయారు. హెల్మెట్ కన్నా ముందు గుంతలమయం అయిన రోడ్లను, ముఖ్యంగా వర్షాలతో లోయలను తలపిస్తున్న గుంతలను తక్షణమే మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను నివారించాలన్నారు. కేవలం హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల నియంత్రణ సాధ్యం కాదు. రోడ్లు కూడా తగిన రీతిలో మరమ్మతులు చేపట్టడం కూడా చాలా అవసరం అన్నారు. ఈ విషయంలో ఇప్పటికే పాలికె కమిషనర్కు విజ్ఞప్తి చేసినా గుంతలు, లోయలమయమైన రోడ్ల మరమ్మతులు మాత్రం ఇంత వరకు చేపట్టలేదన్నారు. ఈ సందర్భంగా ఆ సంఘం నేతలు రాజశేఖర్ గౌడ, రుద్రయ్యస్వామి, విశ్వనాథ్ గౌడ, ప్రదీప్, మంజునాథ్, ప్రహ్లాద్, ప్రసాద్, శ్రీనివాస్రెడ్డి, గోవిందప్ప, నాగరాజ్ పాల్గొన్నారు. ముందుగా రోడ్లలో గుంతలను పూడ్చాలి -
సద్గుణాలను అలవర్చుకోవాలి
రాయచూరురూరల్: ప్రతి ఒక్కరూ సద్గుణాలను అలవర్చుకొని ఇతరులకు మర్గదర్శనం కావాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు సయ్యద్ షా అలీ అల్ హుసేనీ పిలుపునిచ్చారు. శనివారం రాత్రి నగరంలోని వాల్కట్ మైదానంలో మైనార్టీ ముస్లింల నుంచి ఆయన సన్మానం స్వీకరించి మాట్లాడారు. అధర్మాలకు తావు ఇవ్వరాదన్నారు. సేవతోనే ఉత్తమ జీవితం గడపాలన్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుతానన్నారు. మంత్రి భోసురాజ్, ఎంపీ కుమారనాయక్, ఎమ్మెల్సీ వసంత్ కుమార్, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్తో పాటు వివిధ ప్రాంతాల నుంచి మత గురువులు పాల్గొన్నారు. చోరీ సొత్తు స్వాధీనం హుబ్లీ: నగరంలోని వివిధ చోట్ల జరిగిన చోరీలను పోలీసుల ఛేదించారు. రూ.6 లక్షల విలువైన 8 బైక్లు, 20 గ్రాముల బంగారు చైన్, మరణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ చిక్కమఠ సారథ్యంలో పాత హుబ్లీ సీఐ ఎంఎస్ సింధూర, బీఎన్ సతాన్న, పీఎస్ విశ్వనాథ ఆధ్వర్యంలో పోలీసులు ఈ కేసులను ఛేదించారు. తల్వార్తో రీల్స్... నలుగురి అరెస్ట్ హుబ్లీ: బహిరంగ స్థలాల్లో తల్వార్ పట్టుకొని రీల్స్ చేస్తున్న నలుగురు పట్టుబడ్డారు. గోపాల, హనుమంత, ఆరీఫ్, నియాకత్ అనేవారిని పాత హుబ్లీ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పాత హుబ్లీ కొత్త ఆనంద నగర సమీపంలోని మసీదు వద్ద ఇటీవల ఆ నలుగురు కత్తి పట్టుకొని రీల్స్ చేశారు. పోలీసులు స్పందించి భారత ఆయుధాల చట్టం పరిధిలో నిందితులను అరెస్ట్ చేశారు. కారు, ఖాళీ సిలిండర్ల లారీ ఢీ● ఏడీసీకి తప్పిన ముప్పు హుబ్లీ: ఏడీసీ కారు– ఖాళీ సిలిండర్ల లారీ ఢీకొన్న ఘటన తాలూకాలోని తాలూకాలోని హెబసూరు గ్రామం వద్ద ఆదివారం జరిగింది. వివరాలు... ప్రమాదం నుంచి ఏడీసీ తృటిలో బయట పడ్డారు. జిల్లా ఇన్చార్జి మంత్రి సంతోష్లాడ్ నవళగుంద హుబ్లీ తాలూకాల్లోని వరద బాధిత ప్రాంతాలు పర్యటిస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల గురించి మంత్రికి వివరాలు అందజేయడానికి జిల్లా అదనపు జిల్లాధికారి గీత కారులో బయల్దేరారు. హెబసూరు వద్దకు రాగానే ఖాళీ సిలిండర్ల లారీ ఎదురైంది. పరస్పరం ఢీకొనగా రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. ఏడీసీ ఎలాంటి గాయాలు లేకుండా ప్రమాదం నుంచి బయటపడ్డారు. గూడ్స్ వాహనంలో ఖాళీ సిలెండర్లు కావడంతో ప్రమాదం తప్పిందని హుబ్లీ గ్రామీణ పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. ఇద్దరు దొంగల అరెస్ట్ రాయచూరు రూరల్: నగరంలోని కిరాణా దుకాణాల్లో చోరీకి పాల్పడుతున్న దొంగలు పట్టుబడ్డారు. నగరంలోని షియాతలాబ్కు చెందిన సోహెల్(22), జలాల్ నగర్ సద్దామ్(21)ను నేతాజీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు నగరంలోని బసవన బావి సర్కిల్లో కిరాణ కొట్టులో రూ.30 వేల నగద దొంగలించారరని ఎస్ఐ లక్ష్మి తెలిపారు. చక్కెర బస్తాల లారీ బోల్తాహొసపేటె: లారీ బోల్తా పడి చక్కెర నేలపాలైంది. ఈఘటన విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని అమలాపూర్ గ్రామం వద్ద జరిగింది. జాతీయ రహదారి–50పై చక్కెర లోడ్తో వెళ్తున్న లారీ అదుపు తప్పి రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది. దీంతో మిగిలిన వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కూడ్లిగి పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది వచ్చి క్రేన్ ద్వారా లారీని, బస్తాలను పక్కకు తొలగించారు. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. నకిలీ నోట్ల మార్పిడి శివమొగ్గ: శివమొగ్గలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న కేసులో భద్రావతి న్యూ టౌన్ పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. భద్రావతిలోని బండరహళ్లి ఎదురుగా ఉన్న నాగమలే నివాసి అయిన రంగేగౌడ (57) నిందితుడు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్నాడు. అతని నుంచి 13 నకిలీ రూ. 500 నోట్లు, రూ.200, రూ. 100, రూ. 50 నోట్లను సీజ్ చేశారు. నకిలీ నోట్లను మార్పిడి చేసినట్లు అంగీకరించాడు. విచారణలో భద్రావతి డీఎస్పీ నాగరాజ్, ఇన్స్పెక్టర్ మంజునాథ్ పాల్గొన్నారు. -
మలెనాడులో జోరుగా వానలు
యశవంతపుర: చిక్కమగళూరు మలెనాడు ప్రాంతంలో వానలు జోరుగా కురుస్తున్నాయి. శృంగేరి సమీపంలోని నెమ్మార్ వద్ద జాతీయ రహదారిపై మట్టి చరియలు విరిగి పడ్డాయి. కళస, కుదురేముఖ్, కొప్ప, శృంగేరి, బాళెహెన్నూరు, కొట్టిగెహర, అల్దూరు, ఎన్ఆర్పుర, ముళ్లయ్యనగరి, కెమ్మణ్ణగుండి ప్రాంతాలలో మూడు రోజుల నుంచి భారీగా వానలు పడుతున్నాయి. ఆదివారం ఉదయం చిక్కమగళూరు పట్టణంలో ఓ మోస్తారు వాన కురుసింది. శృంగేరి సమీపంలోని సుంకద మక్కి–నెమ్మారు సమీపంలో విపరీతమైన వానలతో హైవేపై మట్టి చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఎస్కే బార్డర్, కార్కళ మార్గంలో రాకపోకలను అంతరాయం ఏర్పడింది. హైవే ప్రాధికారం. అగ్నిమాపక, పోలీసులు సిబ్బంది మట్టి చరియలను తోలగించే పనులు చేపట్టారు. కారు పల్టీ భారీ గాలి, వానలతో దత్తపీఠ మార్గం చంద్రద్రోణ పర్వతం కవికల్ గండి వద్ద రోడ్డు మలుపులో కారు పల్టీ కొట్టింది. ఎదురుగా వస్తున్న కారుకు సైడ్ ఇవ్వబోయి కారు రాతిపై ఎక్కి పల్టీ కొట్టింది. దీంతో ముళ్లయ్యనగరి మార్గంలో గంటల కొద్ది ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. కారులో ఐదు మంది స్వల్ప గాయాలతో బయట పడ్డారు. చిక్కమగళూరు గ్రామాంతర పోలీసులు ఘటన స్థలంను పరిశీలించారు. మలుపుల వద్ద వాహనాలని నెమ్మదిగా నడపాలని పోలీసులు పర్యటకులకు సూచించారు. రెండు కార్లు ఢీ శృంగేరి తాలూకా నెమ్మారు గ్రామం వద్ద భారీగా మట్టి చరియలు విరిగి పడ్డాయి. శృంగేరి–మంగళూరు మార్గంలో వాహనాల రాకపోకలను పూర్తిగా బంద్ చేశారు. పోలీసులు, గ్రామస్తులు కలిసి కూలిన మట్టిని తోలగిస్తున్నారు. కూలిన ఇంటిగోడ దక్షిణకన్నడ జిల్లా వ్యాప్తంగా భారీ వానలు కురుస్తున్నాయి. మంగళూరు పట్టణంలో కంకనాడిలోని ప్రైవేట్ ఆస్పత్రి గోడ కూలింది. ఆ ఇంటి పక్కన కాలినడకన వెళ్తున్న వారు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. విరిగి పడుతున్న కొండచరియలు రాకపోకలకు అంతరాయం -
గేట్లు పడితే అంతే సంగతులు
సాక్షి బళ్లారి: బళ్లారి నగరంలో రోజు రోజుకు ట్రాఫిక్ సమస్య జటిలమవుతోంది. మోతీ సర్కిల్, రాయల్సర్కిల్, బెంగళూరు రోడ్లలో ట్రాఫిక్ సమస్య ఒకలా ఉంటే గుగ్గరహట్టి రైల్వే గేటు ట్రాఫిక్ సమస్య నగరవాసులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ రైల్వే లైన్లో రోజూ పదుల సంఖ్యలో రైళ్లు ప్రయాణిస్తుంటాయి. దీంతో తరచూ గేట్లు వేస్తుంటారు. ఫలితంగా అటూ ఇటూ కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ఇక్కడ నాలుగు ప్రధాన రోడ్ల నుంచి వాహనాలు వచ్చి గేటు వద్ద ఆగిపోతుంటాయి. గుగ్గరహట్టి నుంచి వచ్చే వాహనాలు – హొన్నహళ్లి, కాకర్లతోట నుంచి వచ్చే వాహనాలు, బెంగళూరు నుంచి బళ్లారి వైపు వచ్చే వాహనాలు, బళ్లారి నుంచి బెంగళూరు వైపు వెళ్లె వాహనాలు గుగ్గరహట్టి రైల్వే గేటు వద్ద ఒకే సారి వచ్చినప్పుడు ట్రాఫిక్ స్తంభిస్తుంది. ఈ రోడ్డు చిన్నదిగా ఉండటం కూడా ట్రాఫిక్ సమస్యకు కారణమవుతోంది. గుగ్గరహట్టి రైల్వే వంతెన నిర్మిస్తే ట్రాఫిక్ సమస్య నివారణ జరుగుతోందని స్థానికులు అంటున్నారు. అయితే ఇక్కడ వంతెన నిర్మాణం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. రోడ్డు వెడల్పు పనులు చేపట్టడంలో అధికారులు, పాలకులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. రైల్వేగేటు పడినప్పుడు స్కూల్ బస్సులు ట్రాఫిక్లో ఇరుక్కుపోతుంటాయి. దీంతో విద్యార్థులు సకాంలో పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారు. అంబులెన్స్ల్లో బెంగళూరుకు రోగులను తీసుకొని వెళ్లెటప్పుడు సమయం వృథా అవుతోంది. రోగులను నిర్ణీత సమయంలో ఆస్పత్రులకు తీసుకెళ్లేందుకు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, పాలకులు ట్రాఫిక్ సమస్యపై దృష్టిపెట్టాలని నగరవాసులు కోరుతున్నారు. గుగ్గరహట్టి రైల్వేగేట్తో ట్రాఫిక్ సమస్య గంటల తరబడి నిలిచిపోతున్న వాహనాలు ట్రాఫిక్లో ఇరుక్కుపోతున్న స్కూల్ బస్సుల, అంబులెన్స్లు -
బెణ్ణెహళ్ల, తుప్పరి హళ్ల వరద నివారణకు డీపీఆర్
హుబ్లీ: బెణ్ణెహళ్ల, తుప్పరి హళ్ల వాగుల వరద ముప్పును తప్పించేందుకు రూ.200 కోట్లతో పనులు చేసేందుకు రూ.16 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేసినట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి సంతోష్లాడ్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా వరదల్లో గల్లంతై మృతి చెందిన పాత హుబ్లీ నివాసి హుస్సేన్ సాబ్, కుటుంబ సభ్యులను ఓదార్చిన మంత్రి లాడ్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ రెండు వాగుల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వాగులకు డిసెట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించామన్నారు. అక్కడి నుంచి అనుమతి వచ్చాక పనులు ప్రారంభిస్తామన్నారు. నవళగుంద నియోజక వర్గంలో వరద బాధిత ప్రాంతాలలో పర్యాటించానన్నారు. బెణ్ణెహళ్ల, తుప్పరిహళ్ల వరద ప్రవాహం పెరిగిందని ప్రజలు తగినంత జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. బీఎంఎం ఉక్కు కర్మాగారం దాతృత్వం హొసపేటె: బీఎంఎం ఉక్కు కర్మాగారం దాతృత్వం చాటింది. నగరంలోని 60 పడకల మాతా శిశు ఆస్పత్రికి సీఎస్ఆర్ నిధుల కింద రూ.4.5 కోట్లతో రెండు ఐసీయూ గదులు నిర్మింపజేసింది. అంబులెన్స్లు, రెండు వైకుంఠ రథ్ అంబులెన్స్లను విరాళంగా ఇచ్చింది. లాండ్రీ, విశ్రాంతి గదిని అందించింది. ఎంపీ తుకారాం, ఎమ్మెల్యే గవియప్ప, కంపెనీ జనరల్ మేనేజర్ గణేష్ హెగ్డే అంబులెన్స్, విశ్రాంతి గదిని ప్రారంభించారు. రక్తదాన శిబిరం హొసపేటె: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా, నేషనల్ బ్లడ్ డొనేషన్ సెంటర్లో రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించింది. అనేక మంది సభ్యులు, సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సేవకులు ఈ శిబిరంలో ఎంతో ఉత్సాహంతో పాల్గొని రక్తదానం చేశారు. మరొకరి ప్రాణాలను కాపాడే గొప్ప లక్ష్యానికి మద్దతు ఇచ్చారు. బిల్లావాస్ ఖతార్ సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి పూజా వ్యాస రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. బిల్లావాస్ ఖతార్ అపర్ణ, శరత్తదితదితరులు పాల్గొన్నారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం రాయచూరు రూరల్ : యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని జిల్లా ఎస్పీ పుట్టమాదయ్య అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ మైదానంలో ఆదివారం యోగా శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో రోజురోజుకు కొత్త రకం వ్యాధులు సంక్రమిస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో యోగాను ఆచరిస్తే వ్యాధులకు దూరంగా ఉండవచ్చన్నారు. రోజూ క్రమం తప్పకుండా యోగా చేయాలన్నారు. అదేవిధంగా పరిసరాలను పరిరక్షించేందుకు మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆయుష్ అధికారి శంకనర గౌడ, డాక్టర్.తిమ్మప్ప, పూజా, నవీన్ పాల్గొన్నారు. విమాన ప్రమాద మృతులకు నివాళిరాయచూరు రూరల్: అహ్మదాబాద్ విమానాశ్రయంలో జరిగిన ప్ర మాదంలో అసువులుబాసిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. శనివారం రాత్రి మస్కిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా మాజీ మహిళా అధ్యక్షురాలు నాగవేణి పాటిల్ ఆధ్వర్యంలో సంతాప సభ ఏర్పాటు చేశారు. కొవ్వొత్తులు వెలిగించి మృతులకు నివాళులర్పించారు. షూటింగ్లో అగ్ని ప్రమాదం యశవంతపుర: బెంగళూరు నగరంలో జరుగుతున్న ఫినిక్స్ సినిమా షూటింగ్లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. యాక్షన్ దృశ్యాలు చిత్రీకరిస్తుండగా నిప్పు రవ్వలు చెలరేగి నటుడు భాస్కర్శెట్టి కాలిపై పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. తాను క్షేమంగా ఉన్నట్లు నటుడు భాస్కర్శెట్టి తెలిపారు. -
సమాజానికి నిస్వార్థంగా సేవలు అందించాలి
రాయచూరు రూరల్ : ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకొని సమాజానికి నిస్వార్థంగా సేవలు అందించాలని రాష్ట్ర చిన్నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ పిలుపునిచ్చారు. నగరంలోని పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందరంలో లో మడివాళ సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రతిభాపురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మాడివాళ సముదాయం విద్యతోపాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. తమ పిల్లలను ఉత్తమ విద్యావంతులను చేయాలన్నారు. అనంతరం టెన్త్, ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభాపురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో శాంతమల్ల శివాచార్యులు, అభినవ రాచోటి శివాచార్యలు, ఎంపీ కుమారనాయక్, నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, మాజీ ఎమ్మెల్సీ శంకరప్ప, రవీంద్ర జాలదార్, శాంతప్ప, శివమూర్తి, చంద్రశేఖర్, జయన్న, అమరేగౌడ, మంజుల పాల్గొన్నారు. -
స్కౌట్స్ అండ్ గైడ్స్తో క్రమశిక్షణ
రాయచూరురూరల్: స్కౌట్స్ అండ్ గైడ్స్తో క్రమశిక్షణతోపాటు దేశభక్తి అలవడుతుందని చిన్న నీటి పారుదల శాఖమంత్రి భోసురాజ్ అన్నారు. నగరంలోని ఆ సంస్థ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. స్కౌట్స్ విద్యార్థులకు యూనిఫాం ఉచితంగా అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో స్కౌట్స్ అండ్ గైడ్స్ భవన నిర్మాణాలకు నిధులు విడుదల జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. మాజీ మంత్రి, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అధ్యక్షుడు పి.జి.అర్ సింధ్యా, ఎంపీ కుమార నాయక్, బసవరాజ్ బోరెడ్డి, పరుశురామ, మల్లేశ్వరి పాల్గొన్నారు. -
టవర్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతు ఆత్మహత్యాయత్నం
హొసపేటె: పొలంలో బలవంతంగా కేపీటీసీఎల్ టవర్ ఏర్పాటు చేస్తున్నారని రైతు పురుగుల మందు తాగాడు. ఈఘటన విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా మచ్చి హళ్లి గ్రామంలో ఆదివారం జరిగింది. కేపీటీసీఎల్ సంస్థ 220 కేవీ విద్యుత్ లైన్ల ఏర్పాటు పనులను కాంట్రాక్టు ఇచ్చింది. అందులో భాగంగా పొలంలో లైట్ స్తంభం ఏర్పాటు చేస్తుండగా తన పొలంలో టవర్లు వద్దని వీజీ నాయక్ అనే రైతు కాంట్రాక్టర్లను, అధికారులను కోరాడు. దీంతో వాగ్వాదం జరిగింది. కాంట్రాక్టర్ హరపనహళ్లి పోలీసులను పిలిపించి పనులు చేపట్టారు. దీంతో వీజీనాయక్ పొలంలోనే పురుగులు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. రైతులు అతన్ని హుటాహుటిన దావణెగెర ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. -
క్రీడలతో మానసిక ఉల్లాసం
రాయచూరు రూరల్ : క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పంచుతామని జిల్లా ఎస్పీ పుట్ట మాదయ్య పేర్కొన్నారు. జిల్లా పోలీస్ క్రీడా మైదానంలో రాష్ట్ర కార్య నిర్వాహక పాత్రికేయుల సంఘం, అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన సౌహార్ధ క్రికెట్ టోర్నీని ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. నిత్యం ఒత్తిడితో విధులు నిర్వహించే పాత్రికేయులు, అధికారులకు ఇలాంటి క్రీడలు ఎంతో మనశ్శాంతిని ఇస్తాయన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పాత్రికేయుల సంఘం అధ్యక్షుడు గురునాథ్, కార్యదర్శి పాషా, శివమూర్తి శివప్ప, మల్లికార్జున, సిద్దు బిరదార్, బీమేష్ పాల్గొన్నారు. -
ప్రియురాలిని చంపి పాతిపెట్టాడు
రాయచూరు రూరల్: ప్రేమించిన పాపానికి అమ్మాయిని ఆరు నెలల క్రితం హత్య చేసి పాతిపెట్టాడో కిరాతకుడు. ఈ ఘోరం గదగ్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. గదగ్ తాలూకా నారాయణపుర గ్రామంలో మధుశ్రీ (21) అనే యువతిని సతీష్ హిరేమఠ (22) అనే యువకుడు ప్రేమించాడు. ప్రేమ పేరుతో షికార్లకు తీసుకెళ్లాడు. ఐదేళ్ల నుంచి ఈ ప్రేమాయణం సాగుతోంది. ఇది నచ్చని అమ్మాయి తల్లిదండ్రులు హిరేమఠతో తిరగడం మానుకోవాలని ఆమెను హెచ్చరించి గదగ్లోని బంధువుల ఇంట్లో ఉంచారు. గత ఏడాది డిసెంబర్ 16 న గదగ్ నుంచి మధుశ్రీ వెళ్లిపోయింది. ఈ ఏడాది జనవరి 12న బెటగేరి పోలీస్ స్టేషన్లో కనబడుట లేదనే తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సతీష్ హిరేమఠ్పై అనుమానంతో పోలీసుల విచారణ జరిపారు. పెళ్లి చేసుకోమనడంతో.. ఇద్దరూ బైక్లో వెళ్తున్నట్లు గదగ్లో కొన్ని సీసీ కెమెరాలలో రికార్డు అయ్యింది. గట్టిగా విచారించగా నిజం కక్కాడు. పెళ్లి చేసుకోవాలని మధుశ్రీ ఒత్తిడి చేసింది, తనకు పెళ్లి ఇష్టం లేదని, అందుకే ఊరి బయటకు తీసుకెళ్లి గొంతు పిసికి చంపి, వాగులో మృతదేహాన్ని పాతిపెట్టినట్లు తెలిపాడు. గదగ్ యస్ఐ మారుతి, పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి చూడగా యువతి అస్తిపంజరం కనిపించింది. ప్రేమోన్మాది చేతిలో బలయ్యావా తల్లీ అని తల్లిదండ్రులు విలపించారు. ఉన్మాద ప్రేమికుని దాష్టీకం గదగ్ వద్ద దారుణం -
బనశంకరీ మాతకు విశేష పూజలు
బనశంకరి: భక్తుల కల్పవల్లి బనశంకరీదేవి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. ఆదివారం వేకువజామున సుప్రభాతసేవ తరువాత అర్చకులు ఏ.చంద్రమోహన్ అమ్మవారి మూలవిరాట్ కు ప్రత్యేక అభి షేకం, అర్చన చేపట్టి విశేషంగా పూల అలంకరణచేసి పూజలు నిర్వహించారు. పెద్దఎత్తున భక్తులు విచ్చేసి నిమ్మకాయల ప్రమిదలతో దీపారాధన చేశారు. నాకు ఆయుష్షు ఉంది ● కేంద్ర మంత్రి కుమారస్వామి శివాజీనగర: నేను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జేడీఎస్ నేత, కేంద్ర భారీ పరిశ్రమల, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డీ.కుమారస్వామి అన్నారు. రాష్ట్రంలో మునుముందు జేడీఎస్–బీజేపీ సంకీర్ణం అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఆదివారం పార్టీ ఆఫీసు జేపీ భవన్లో మిస్డ్ కాల్ సభ్యత్వ నమోదు అభియానను అట్టహాసంగా ప్రారంభించి మాట్లాడారు. నాకు మూడుసార్లు గుండె శస్త్ర చికిత్స, రెండుసార్లు గుండెపోటు వచ్చింది, భగవంతుడు ఆయుష్షు ఇచ్చాడు. ప్రజల కోసమే బ్రతికానని చెప్పారు. బీజేపీతో వెళదాం, తప్పు చేయడం మంచిది కాదు. మునుముందు ఏమి జరుగుతోందో భగవంతునికే తెలుసన్నారు. బీజేపీ–జేడీఎస్ సంకీర్ణంలో గందరగోళం లేదన్నారు. కళ్యాణ కర్ణాటకను అభివృద్ధి చేయండి అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంటున్నారు, ఆయన ఎన్నో ఏళ్లు అధికారంలో ఉన్నారు, అప్పుడేం చేశారు అని విమర్శించారు. రైలు కింద తల పెట్టి.. మండ్య: వెళుతున్న రైలుకింద తల పెట్టి యువకుడు ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణ పశ్చిమ వాహిని వద్దనున్న రైల్వే స్టేషన్ దగ్గర జరిగింది. మృతుడు శ్రీరంగ పట్టణం తాలూకాలోని అరెకెరె గ్రామానికి చెందిన ఆకాశ్ (23) అని తెలిసింది. ఆకాశ్ మైసూరులో అద్దె గదిలో ఉంటూ ఓ మాల్లో పనిచేసేవాడు. రెండు రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. రైల్వే పట్టాలపై తల, మొండెం వేరు వేరైన స్థితిలో కనిపించాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని అనుమానాలున్నాయి. -
లాల్బాగ్.. నో షూటింగ్
బనశంకరి: అంతటా పచ్చని చెట్లు, పొదలతో ఉద్యాన నగరికి తనమానికమైన లాల్బాగ్ ఉద్యానవనంలో వివిధ సందర్భాల పేరుతో జంటలతో జోరుగా ఫోటో షూట్లు జరుగుతుంటాయి. యువత రీల్స్, వీడియోలతో నానా రచ్చ చేస్తుంటారు. ఇక పసికందులు, చిన్నారులతోనూ ఫోటోషూట్లు ఉంటాయి. ఇకముందు ఇవన్నీ కుదరకపోవచ్చు. ఉద్యానంలో ఈ తరహా షూటింగ్లకు అడ్డకట్ట వేయడానికి ఉద్యానవనశాఖ సిద్ధమైంది. గత కొద్దిరోజుల క్రితం కబ్బన్పార్కులో రీల్స్, సినిమా, బుల్లితెర, ప్రీ, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ తో పాటు ఇతరత్రా చిత్రీకరణలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఇదే మాదిరిగా లాల్బాగ్లోనూ అమలు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదన అందజేయనున్నట్లు ఉద్యానవనశాఖ అధికారులు తెలిపారు. ప్రశాంతత ముఖ్యం లాల్బాగ్ ఉద్యానవనంలో అందమైన తోటలు, మొక్కలు, చెట్లు పూర్తి సంరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది జీవ వైవిధ్యంతో కూడిన నిలయం కావడంతో ప్రాణులు పక్షులు స్వేచ్ఛగా నివసించడానికి తావుండాలి. ఉద్యానవనంలో సందర్శకులకు ప్రశాంతత లభించేలా చిత్రీకరణలను బంద్ చేయాలని ఉద్యానవనశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎం.జగదీశ్ తెలిపారు. షూట్లతో సమస్యల గోల లాల్బాగ్లో చెట్లు, పొదల్లో తేనెతుట్టెలు చాలా ఉన్నాయి. అక్కడ ఫోటోలు తీసే సమయంలో సందడికి అవి హైరానా పడవచ్చు. ఫ్లాష్ లైట్లతో ఇబ్బంది కలిగి జనం దాడిచేసే అవకాశం ఉంది. గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయి కూడా. ప్రీ, పోస్ట్ వెడ్డింగ్ షూటింగ్స్ సమయంలో సార్వజనిక స్థలం అనేది మరచిపోయి అర్ధనగ్నంగా సంచరిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించారని గతంలో ఆరోపణలున్నాయి. పార్కుకు అనేక వయసులవారు వస్తుంటారు. అలాంటి వారికి అవస్థలు కలిగించరాదని నిర్ణయించారు. మొక్కలు, చెట్లపై కూర్చుని ఫోటో, వీడియో తీయడంతో చెట్లు దెబ్బతింటాయి. ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ఫొటోషూట్ల నిషేధానికి ప్రయత్నాలు సందర్శకుల ఉల్లాసానికి ప్రాధాన్యం నిపుణుల కమిటీ తీర్మానం ప్రముఖ పరిసరవాది డాక్టర్ యల్లప్పరెడ్డి అధ్యక్షతన పరిసరవాదులు, ఉద్యానవనశాఖ శాస్త్రవేత్తలతో కూడిన సలహా సమితి ఈ విషయంపై చర్చించింది. ఫోటోషూట్లకు అనుమతి ఇవ్వాల్సిన ప్రదేశాలు, ఇవ్వకూడనివి, నిషేధించాల్సిన కార్యకలాపాలు తదితరాల గురించి చర్చించారు. మరోసారి భేటీ అయిన నిబంధనల జాబితా రూపొందిస్తారు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేస్తామని జగదీశ్ తెలిపారు. -
నేరగాళ్లపై పేలిన గన్
యశవంతపుర: వృద్ధురాలిపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడిన పాత నేరగాన్ని ఉత్తరకన్నడ జిల్లా దాండేలి పోలీసులు కాల్పులుజరిపి అరెస్ట్ చేశారు. ఈ నెల 12న స్థానిక అటవీ ప్రాంతంలో వృద్దురాలిపై అత్యాచారం, దోపిడి జరిగింది. శనివారం రాత్రి దాండేలి గ్రామీణ పోలీసుస్టేషన్ పరిధిలోని కుళగి అటవీ ప్రాంతంలో నిందితుడు సైరోజ్ యాసీన్ యరగట్టి (23) ఉన్నట్లు తెలిసి వెళ్లారు. పట్టుకోవడానికి యత్నించగా రాళ్లు విసిరి, చాకుతో దాడి చేసి పారిపోవడానికి యత్నించాడు. దీంతో ఎస్ఐ కిరణ్ పాటిల్ నిందితుని కాలి మీద కాల్చడంతో పడిపోయాడు. నిందితుని దాడిలో ఎస్ఐ కిరణ్ పాటిల్, సిబ్బంది కృష్ణప్ప బెళ్లవరి, ఇమ్రాన్ కంబారకు గాయాలు కాగా దాండేలి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. నిందితునికి చికిత్స అందిస్తున్నారు. బెంగళూరులో హత్య కేసులో.. బెంగళూరులోను హత్య కేసు నిందితులపై పోలీసులు ఆదివారం కాల్పులు జరిపారు. ఆర్ఆర్ నగర షణ్ముగ దేవస్థానం వద్ద హత్య కేసు నిందితులపై తూటలు పేల్చి పట్టుకున్నారు. దీపు (28), అరుణ్(27)లు దాక్కుని ఉండగా పోలీసులు అరెస్టు చేయబోయారు. దీంతో కత్తులతో దాడి చేయగా ఫైరింగ్ జరిగింది. నిందితులు శుక్రవారమే జైలు నుంచి బెయిల్పై విడుదలై బయటకు వచ్చారు. విజయ్ అనే వ్యక్తిని మాట్లాడాలని పిలిచి దారుణంగా హత్య చేసి పరారయ్యారు. కాల్పుల్లో నిందితులు గాయపడ్డారు. వారి దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలు తగిలాయి. ఉత్తర కన్నడ, బెంగళూరులో ఘటనలు నిందితులకు, పోలీసులకు గాయాలు -
కోటె యల్లమ్మ వైభవం
మాలూరు: తాలూకాలోని లక్కూరు గ్రామంలో ఉన్న కోటె యల్లమ్మ దేవాలయంలో ఆదివారం అమ్మవారికి విశేష పూజలను నిర్వహించారు. అర్చకులు సోమప్ప నేతృత్వంలో అర్చన కై ంకర్యాలు జరిగాయి. సుప్రభాత సేవ, మహా మంగళారతి, తీర్థ ప్రసాద వినియోగం గావించారు. దేవికి పంచలోహ ప్రభావళిని అలవర్చి అలంకరణ చేశారు. లక్కూరు గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు.కంతు కట్టలేదని ఇంటికి తాళం● మైక్రోఫైనాన్స్ ఆగడందొడ్డబళ్లాపురం: మైక్రో ఫైనాన్స్ ఆగడాలకు కళ్లెం వేసేలా సర్కారు చట్టం తీసుకొచ్చినా మార్పు కనిపించడం లేదు. బెంగళూరు రూరల్లో దేవనహళ్లి తాలూకా విజయపుర పట్టణంలో మైక్రో ఫైనాన్స్ సిబ్బంది బరితెగించారు. కంతు కట్టలేదనే కారణంతో ఇంట్లోని కుటుంబ సభ్యులను బయటకు పంపించి ఇంటికి తాళం వేశారు. మునిరాజు కుటుంబం వీధినపడింది. మునిరాజు 2021లో ఎస్బీఎస్పి మైక్రో ఫైనాన్స్ నుంచి రూ.21 లక్షల అప్పు తీసుకున్నాడు. అప్పటి నుంచి కంతు కడుతూ వచ్చాడు. ఈ జనవరి నుంచి ఇప్పటివరకూ 5 కంతులు కట్టలేకపోయాడు. దీంతో ఫైనాన్స్ సిబ్బంది వచ్చి గొడవకు దిగారు. ఇంట్లోంచి కుటుంబాన్ని పంపించి తాళం వేసారు. ఇంట్లోని వస్తువులు కూడా తీసుకోనివ్వలేదు. ఇద్దరు కూతుళ్లు, భార్యతో మునిరాజు వీధిన పడ్డాడు.నీలకంఠేశ్వర రథోత్సవంతుమకూరు: తుమకూరు నగరంలోని హోరపేటె మెయిన్రోడ్డులో వెలసిన చరిత్ర ప్రసిద్ధ శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి 106వ వార్షిక జాతర మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. కురిహినశెట్టి సముదాయికులు సహా పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తేరులో శ్రీ నీలకంఠుశ్వర స్వామివారిని ప్రతిష్టించి ఊరేగించారు. పట్టణ వీధుల్లో ఘనంగా తేరు వేడుక సాగింది. నగర ఎమ్మెల్యే జీబీ జ్యోతిగణేష్ పాల్గొని పూజలు నిర్వహించారు.హనుమాన్ పల్లకీ సేవమైసూరు: జిల్లాలోని హుణసూరులో హనుమంతోత్సవ సమితి, అంజనాద్రి ట్రస్టు ఆధ్వర్యంలో హనుమాన్ పల్లకీ సేవను నిర్వహించారు. మైసూరు రోడ్డులో ఉన్న ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ప్రతి నెలా పున్నమి వేడుకల సందర్భంగా ఆదివారం ఆలయంలో వివిధ రకాల పూజలు, అభిషేకం నిర్వహించారు. భక్తులు హనుమాన్ చాలీసా పఠనం చేశారు. 25వ పున్నమి వేడుక సందర్భంగా హనుమాన్ని పల్లకీలో ఆసీనుల్ని చేసి ఊరేగించారు.దత్తపీఠానికి గిన్నిస్ రికార్డు● బోన్సాయ్ వన ఘనతమైసూరు: ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న మైసూరులోని దత్తపీఠం గిన్నిస్బుక్ రికార్డును సొంతం చేసుకుంది. బోన్సాయ్ చెట్ల సేకరణలో రికార్డు సృష్టించినట్లు గణపతి సచ్చిదానంద స్వామి తెలిపారు. ఆశ్రమంలో బోన్సాయ్ వనాన్ని 2006లో స్వామి ప్రారంభించారు. వేలాదిగా అపురూపమైన బోన్సాయ్ చెట్లు ఇందులో ఉన్నాయి. దేశ విదేశాల నుంచి వాటిని తీసుకొచ్చారు. తరచూ బోన్సాయ్ ప్రదర్శనలు కూడా జరుగుతుంటాయి. ప్రస్తుతం 10,836 బోన్సాయ్ చెట్లు ఉన్నాయి. పూణెలో ఓ వనంలో 3,333 బోన్సాయ్ చెట్లున్నాయి. ఆ రికార్డును ఆశ్రమం అధిగమించింది. ఆదివారం గిన్నిస్బుక్ ప్రతినిధి రికార్డును స్వామికి అందజేశారు. -
రక్తదానం ప్రాణదానంతో సమానం
బళ్లారి రూరల్ : ఒకరి రక్తదానం నలుగురికి ప్రాణదానంతో సమానమని బీఎంసీఆర్సీ డీన్ డాక్టర్ గంగాధరగౌడ తెలిపారు. అఖిల భారత శస్త్రవైద్యుల సంఘం బళ్లారి శాఖ, బీఎంసీఆర్సీ బ్లడ్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం బీఎంసీఆర్సీ సభాభవనంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. యువత రక్తదానంపై అవగాహన పెంచుకొని రక్తదానం చేయాలన్నారు. ప్రమాదాల్లో గాయపడిన బాధితులు, ఆసుపత్రికి వచ్చే మహిళలకు, రోగులకు దాతలు ఇచ్చే రక్తం ప్రాణాలను కాపాడుతుందన్నారు. శిబిరంలో 130 మంది బీఎంసీఆర్సీ వైద్యులు, జూనియర్ వైద్యులు రక్తదానం చేశారు. శస్త్రచికిత్స వైద్యులు డాక్టర్ విద్యాధర కిన్నాళ్, డాక్టర్ శేఖప్ప, డాక్టర్ గురుబసవనగౌడ, డాక్టర్ మహేష్ దేశాయ్, డాక్టర్ రవి, బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జ్ డాక్టర్ బిందు, వైద్యులు, జూనియర్ వైద్యులు పాల్గొన్నారు. రక్తదానంపై జనజాగృతి జాతా రాయచూరు రూరల్: రక్తదానంపై జన జాగృతి జాతాకు రిమ్స్ అధికారి విజయ శంకర్ శ్రీకారం చుట్టారు. శనివారం ఆరోగ్యాధికారి కార్యాలయం వద్ద రక్తదానంపై జాతాను ప్రారంభించి ఆయన మాట్లాడారు. రక్తదానం చేయడం వల్ల కలిగే లాభాలపై ఇంటింటికెళ్లి గ్రామీణ ప్రజలకు వివరించాలన్నారు. యువత రక్తం దానం చేసినా ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఎలాంటి ఫలాపేక్ష లేకుండా రక్తదానం చేయాలన్నారు. జాతాలో ఇంచార్జి జిల్లా ఆరోగ్య శాఖాధికారి గణేష్, వైద్యులు శాకీర్, ప్రజ్వల, బసయ్య, సంధ్య, సరోజ, శ్రీనివాస్ రాయచూర్కర్లున్నారు. కాగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో రోటరీ క్లబ్, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఎస్పీ పుట్టమాదయ్య, రోటరీ క్లబ్ సంచాలకులు గిరీష్, త్రివిక్రం జోషి, శరణ బసవ తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవాదులకు బార్ పరీక్షలు రద్దు చేయాలి
రాయచూరు రూరల్: దేశంలో న్యాయవాదులకు బార్ పరీక్షలను రద్దు చేయాలని అఖిల భారత న్యాయవాదుల సమాఖ్య డిమాండ్ చేసింది. శనివారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు శశిధర్ కెల్లూరు మాట్లాడారు. న్యాయవాదులు, లా విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ న్యాయవాదులకు గౌరవం ఇవ్వడం లేదన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టంలోని లోపాలను సవరించాలన్నారు. జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.20 వేల సహాయ ధనం ఇవ్వాలన్నారు. సంఘానికి రూ.10 లక్షల నిధులు కేటాయించాలన్నారు. న్యాయవాదులకు ఆరోగ్య బీమా పాలసీ చేయించాలని కోరుతూ జిల్లాధికారి నితీష్కి వినతిపత్రం సమర్పించారు. -
నిర్బంధ విద్య ప్రతి బిడ్డ హక్కు
హొసపేటె: ఉచిత, నిర్బంధ విద్య ప్రతి బిడ్డ హక్కు, దానిని ప్రతి బిడ్డకు అందించడం ప్రతి పౌరుడి ప్రాథమిక విధి అని హొసపేటె తాలూకా విద్యా శాఖ అధికారి శేఖరప్ప హొరపేటె అన్నారు. నగరంలోని చిత్తవాడిగిలోని ప్రభుత్వ పీయూ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. 14 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను పనిలో పెట్టుకోవడం శిక్షార్హమైన నేరం అన్నారు. ప్రభుత్వాలు మాత్రమే బాల కార్మికులను పూర్తిగా నిర్మూలించలేవు. ప్రజలు, సంఘ సంస్థల సహకారం చాలా అవసరమని ఆయన అన్నారు. పౌర సమాజం నుంచి బాల కార్మిక వ్యవస్థను, బాల కార్మికులను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. కార్మిక అధికారి సూర్యప్ప దొంబరమత్తూరు, న్యాయవాది శ్వేతాంబరి, ప్రభుత్వ పీయూ కళాశాల ప్రిన్సిపాల్ నాగరాజ్ హవల్దార్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీకాంత్, ప్రముఖులు రుద్రప్ప అక్కి, లింగరాజ్, ఈశ్వర్, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. పైవంతెన నిర్మాణానికి ఈద్గా కాంపౌండ్ తొలగింపు హుబ్లీ: నగరంలోని నిర్మాణ దశలో ఉన్న ఫ్లైఓవర్ నిర్మాణం కోసం చెన్నమ్మ సర్కిల్ దగ్గర ఈద్గా మైదానం ఆవరణ గోడలో చాలా భాగాన్ని తొలగిస్తున్నారు. స్వాధీన ప్రక్రియ పనులు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. మైదానం మధ్య భాగంలోని ఈద్గా కట్టడం రక్షణకు అడ్డు గోడ సమీపంలో సుమారు 10–20 మీటర్ల షెడ్డు మాదిరిగా సీట్లను అమర్చారు. చెన్నమ్మ సర్కిల్ నుంచి కోర్టు సర్కిల్కు వెళ్లే మార్గంలో ఇనుప కడ్డీలతో గోడను గ్యాస్ కట్టర్తో కట్ చేసి తొలగించారు. జాతీయ రహదారి ప్రాధికార, సదరు నిర్మాణ పనుల కాంట్రాక్ట్ పొందిన అధికారులు పోలీసు భద్రతతో ఈ పనులను ప్రారంభించారు. ప్రతిష్టమైన పోలీసు భద్రత కొనసాగుతోంది. సదరు గోడ తొలగింపునకు అనుమతి, అలాగే భద్రత ఇవ్వాలని సదరు ప్రాధికార అధికారులు కార్పొరేషన్కు, పోలీసు శాఖకు 2024 జూలై 23న లేఖ రాసి తెలియజేసిన సంగతి తెలిసిందే. పథకం ప్రకారం చెన్నమ్మ సర్కిల్ నుంచి కోర్టు సర్కిల్ వైపు, అలాగే చెన్నమ్మ సర్కిల్ నుంచి సంగొళ్లి రాయణ్ణ వరకు వెళ్లే ఈద్గా మైదానం చుట్టుపక్కల భాగం తొలగించనున్నారు. ఫ్లై ఓవర్కు కామతోటలు ఎదురుగా భారీగా పిల్లర్లు, సంగొళ్లి రాయణ్ణ సర్కిల్లో ఐ మార్ట్ స్తంభం వద్ద ఒక పిల్లరు నిర్మాణం కానుంది. అలాగే ఈ పనులకు ఉప నగర పోలీస్టేషన్ కట్టడం 20 శాతం మేర తొలగించనున్నారు. అంబేడ్కర్ సేవలు విశిష్టం రాయచూరు రూరల్: అంబేడ్కర్ ఆర్థిక శాస్త్రవేత్త అని, సాంఘీక న్యాయంతో పాటు దేశానికి ఆర్థిక రంగంలో విశిష్ట సేవలు అందించారని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు అన్నారు. శనివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారతీయ కరెన్సీ సమస్యలు– పరిష్కారంపై చర్చాగోష్టిని ప్రారంభించి మాట్లాడారు. ఈ విషయంలో విద్యార్థులకు ఆర్థిక రంగం, రూపాయి విలువ గురించి వివరించాలన్నారు. దేశఽ ఆర్థిక పరిస్థితి బలోపేతానికి మత వ్యవస్థ్ద కంటకంగా మారిందని అభిప్రాయ పడ్డారు. కార్యక్రమంలో లోక్సభ సభ్యుడు కుమార నాయక్, కళాశాల ప్రిన్సిపాల్ యంకణ్ణ, కృష్ణంరాజు, ప్రకాష్, కమల్ కుమార్, కృష్ణ, లలిత, ప్రాణేష్, మహంతేష్, శోభ, శివరాజప్ప, సావిత్రిలున్నారు. ఆస్తినంతా ప్రియురాలికి ఇచ్చాడు క్రిష్ణగిరి: వారం రోజుల క్రితం జిల్లా కేంద్రం క్రిష్ణగిరి సమీపంలో నిద్రిస్తున్న భర్తపై పెట్రోలు పోసి నిప్పంటించి హత్య చేసిన కేసులో భార్య కారణాలను వెల్లడించింది. తిమ్మాపురం గ్రామానికి చెందిన కూలికార్మికుడు రంగస్వామి (47) నిద్రపోతుండగా భార్య కవిత (44) పెట్రోలు పోసి తగలబెట్టడంతో చనిపోయాడు. పోలీసులు ఆమెను అరెస్టు చేసి విచారించారు. తమకు పెళ్లి జరిగి 22 ఏళ్లు అయ్యిందని, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారని, తమకు ఆస్తి, డబ్బు, నగలు అన్నీ ఉన్నాయని, కుటుంబంతో బాగానే ఉన్నామని తెలిపింది. అయితే భర్త కూలి పని చేసే చోట మరో మహిళ మంజులతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిపింది. ఇంట్లో ఉన్న నగలు మంజులకు అందజేశాడు. ఆస్తిని విక్రయించి ఆమెకు ముట్టజెప్పాడని తెలిపింది. రోజూ తాగి వచ్చి అందంగా లేవని నన్ను దూషించేవాడని, దీంతో హత్య చేశానని చెప్పింది. కాగా తండ్రి మరణించి, తల్లి జైలుకెళ్లి ముగ్గురు పిల్లలు బోరుమని విలపించారు. -
ఉప్పొంగిన రాయరకెరె ●
● నీటి మునిగిన పంటలు హొసపేటె: ఉదయం కురిసిన ఏకధాటి వర్షానికి నగర శివారులో ఉన్న రాయరకెరె చెరువు పూర్తిగా నిండటంతో చుట్టుపక్కల ఉన్న చెరుకు, అరటి పంటల్లోకి వర్షం నీరు చేరడంతో పంటలు దెబ్బ తిన్నాయి. నగరంలో గత వారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో అనేక ప్రాంతాల్లో రైతులు పండించిన అరటి, చెరుకు పంటలకు నష్టం వాటిల్లింది. పంట పొలాల్లోకి నీరు చేరడంతో రైతులు పొలాల్లో పనులు చేసుకునేందుకు వీలు లేకుండా పోయింది. మరో రెండు మూడు రోజుల వరకు యథావిధిగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. పిడుగుపాటుకు యువకుడు మృతి రాయచూరు రూరల్: పిడుగుపాటుకు ఓ యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం యాదగిరి జిల్లాలో చోటు చేసుకుంది. సురపుర తాలూకా పేట అమ్మాపూర్లో మారెప్ప(21) అనే యువకుడు పొలంలో గొర్రెలు కాస్తుండగా పిడుగు పడడంతో మరణించాడు. యువకుడి మృతితో కుటుంబ సభ్యుల ఆక్రందనలు మిన్నంటాయి. సురపుర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కలుషిత నీరు తాగి 20 మందికి అస్వస్థత రాయచూరు రూరల్: కలుషిత నీరు తాగి 20 మంది అస్వస్థతకు గురైన ఘటన జిల్లాలోని సింధనూరు తాలూకాలో చోటు చేసుకుంది. శనివారం భూతలదిన్ని క్యాంప్లో గ్రామ పంచాయతీ అధికారులు కలుషిత నీటిని సరఫరా చేయడంతో వాటిని తాగిన ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రిలో చేర్పించడంతో చికిత్స పొందుతున్నారు. తాలూకా ఆరోగ్య అధికారి అయ్యనగౌడ గ్రామంలో మకాం వేసి బాధితులకు చికిత్స అందిస్తున్నారు. గ్రామ పంచాయతీ పాలక మండలి గత ఏడాది నుంచి నీటి ట్యాంక్ను శుభ్రం చేయకుండా యథాప్రకారం నీటిని వదలడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామస్తులంతా ఏకమై గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. హాస్టల్లో నాసిరకం ఆహారంపై తనిఖీ హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని చిక్కజోగిహళ్లిలోని పీఎంశ్రీ జవవర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థులకు నాసిరకం ఆహారం వడ్డిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ తనిఖీ చేసి అక్కడి సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ శాఖ, పాఠశాల నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే కార్యక్రమం తర్వాత విద్యార్థుల హాస్టల్ వంటగది, భోజనశాలకు వెళ్లి విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. వంటగదిని శుభ్రంగా పెట్టుకోవాలని సూచించారు. విద్యార్థుల కోసం తయారు చేసిన వెజ్ పలావ్లో ఒక్క కూరగాయ కూడా లేదు. బియ్యం కూడా నాసిరకంగా ఉన్నాయి. చపాతీ పిండి తయారీ యంత్రం కూడా తుప్పు పట్టి ఉంది. గమనించిన ఎమ్మెల్యే చాలా జాగ్రత్తగా పని చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని హాస్టల్ సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్లకు సూచించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కోలారు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణించిన ఘటన శుక్రవారం రాత్రి ముళబాగిలు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ముళబాగిలు తాలూకా చిక్కనదొడ్డి గ్రామానికి చెందిన వేణుగోపాల్(52) వివాహ కార్యక్రమాల్లో పూల అలంకరణ చేసేవాడు. ఈయన ముళబాగిలులో పని ముగించుకొని గ్రామానికి బైక్లో వస్తుండగా కారు ఢీకొని మరణించాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ముళబాగిలు నగర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ప్రైవేట్కు దీటుగా సర్కారు బడి
రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో విద్యారంగంలో ప్రైవేట్ పాఠశాలల కన్నా తామేమీ తక్కువ కాదంటూ సర్కారు బడులు అక్కడక్కడా పోటీ పడుతున్నాయి. కళ్యాణ కర్ణాటకలో కాన్వెంట్ బడిని పోలిన రీతిలో బీదర్ జిల్లాలో 60 ఏళ్ల పాఠశాల ప్రైవేట్ పాఠశాలను మరిపిస్తోంది. ఉపాధ్యాయులు, అధికారులు తలుచుకుంటే మార్గాలెన్నో ఉంటాయి అనే విధంగా పాఠశాలను రూపాంతరం చేసి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాల వైపు మళ్లించడానికి ఉపాధ్యాయుల శ్రమ మరువరానిదని చెప్పవచ్చు. బీదర్ జిల్లా ఔరాద్ తాలూకా బోరళలో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను కాన్వెంట్ స్థాయికి చేర్చారు. 1 నుంచి 7వ తరగతి వరకు 116 మంది విద్యార్థులకు గుణాత్మక విద్యనందించాలనే తపనతో పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయుడు సతీష్ నడుం బిగించారు. పాఠశాల పాత విద్యార్థులు, గ్రామ పంచాయతీ సభ్యులు, గ్రామస్తులతో చర్చించి నిధులు సేకరించి సర్వాంగ సుందరంగా ఆధునికీకరణ చేశారు. ఉపాధ్యాయుల పాత్ర కీలకం ఏడు మంది ఉపాధ్యాయులు శ్రమ వహించి పాఠశాలను అభివృద్ధి పరిచి నల్లబోర్డు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నారు. శాసన సభ్యుడు ప్రభు చౌహాన్ సహకారంతో కేకేఆర్డీబీ ద్వారా రూ.80 లక్షల నిధులు మంజూరు చేయించుకొని ఐదు పాఠశాల గదులను నిర్మించుకొని గదులకు కావాల్సిన సామగ్రిని ఏర్పాటు చేసుకున్నారు. పాఠశాల రక్షణ గోడ నిర్మాణాలకు గ్రామ పంచాయతీ సహకారం అందించింది. పాత విద్యార్థుల నుంచి రూ.1.12 లక్షల నిధులను సేకరించారు. పాఠశాలకు రంగు రంగుల పెంయింటింగ్లతో అలంకరించారు. పాఠశాలలో సీసీ టీవీ కెమెరాలు, తాగునీరు, ఇన్వర్టర్, బెంచీలు, కుర్చీలు, టేబుల్ ఇతర సౌకర్యాలు కల్పించారు. గోడలపై రూ.1.50 లక్షలతో పెయింటింగ్ వేసి పిల్లలను పాఠశాల వైపు దృష్టి మళ్లించడానికి ఉపాధ్యాయుల కృషి మరువరానిది. ఇంటింటికీ వెళ్లి పిల్లలను పాఠశాలకు పంపాలని పెద్దలను కోరారు. బీదర్ జిల్లాలో మోడల్ పాఠశాలగా నిలిచిన వైనం కాన్వెంట్గా రూపాంతరం చెందిన 60 ఏళ్ల స్కూల్ -
కేకేఆర్డీబీకి రూ.5 వేల కోట్ల కేటాయింపు
రాయచూరు రూరల్: కల్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి(కేకేఆర్డీబీ)కి సర్కార్ రూ.5000 కోట్లు కేటాయించిందని, ఆరు జిల్లాల్లో అభివృద్ధి పనులకు జూలై 15 లోపు శాసన సభ్యుల నుంచి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. శనివారం యాదగిరిలో కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి సమావేశం అనంతరం అధ్యక్షుడు అజయ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. అభివృద్ధి పనులు ఆరు జిల్లాల్లో కుంటుపడ్డాయన్నారు. కేకేఆర్డీబీ పరిధిలోని కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బళ్లారి, బీదర్ జిల్లాల్లో అభివృద్ధి పనులకు మొత్తం రూ.14,228 కోట్లలో రూ.10,342 కోట్లు వ్యయం కాగా మిగిలిన రూ.2885 కోట్ల నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, పాఠశాల భవనాలు, తాగు నీటిి నిర్వహణ, విద్యుత్ దీపాల అమరిక, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. క–క అభివృద్ధికి సర్కార్ కంకణం కల్యాణ కర్ణాటక(క–క) అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ నిబద్ధతతో పని చేస్తుందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ వెల్లడించారు. శనివారం యాదగిరి క్రీడా మైదానంలో జరిగిన ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రూ.440 కోట్లతో ఆరోగ్య ఆవిష్కార పథకానికి శ్రీకారం చుట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. అధికారం అశాశ్వతం, సాధనలు శాశ్వతమన్నారు. కర్ణాటకలో ప్రజలు 140 మంది శాసన సభ్యులను అందించారన్నారు. అందువల్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మంత్రులు శరణ ప్రకాష్ పాటిల్, దినేష్ గుండూరావు, బోసురాజు, శరణ బసప్ప దర్శనాపూర్, సుధాకర్, రహీంఖాన్, ఈశ్వర్ ఖండ్రే, హెచ్కే పాటిల్, ఎంపీలు కుమార నాయక్, నాసిర్ హుసేన్, రాధాకృష్ణ, చెన్నారెడ్డి పాటిల్లున్నారు. అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి అధికారులకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచన -
పలువురు కాంగ్రెస్లో చేరిక
బళ్లారిఅర్బన్: నగర ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి సారథ్యంలో శనివారం పలువురు కాంగ్రెస్లో చేరారు. 14వ వార్డు యువ ప్రముఖుడు భవాని ప్రసాద్, ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ పార్టీలో అయినా కొత్తగా కార్యకర్తలు చేరడం సహజమేనని, వీరి చేరిక వల్ల పార్టీకి బలం చేకూరుతుందన్నారు. కాంగ్రెస్ అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేసే పార్టీ అన్నారు. నగరాభివృద్ధే తన కల అని, కార్యకర్తలందరినీ ఈ విషయంలో కలుపుకొని పోయి నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. కార్పొరేటర్లు మించు శీన, ప్రభంజన్కుమార్, జబ్బార్, మేయర్ నాగమ్మ, ఎం.సుబ్బరాయుడు, హొన్నప్ప, హగరి గోవింద, రమేష్, ఉపేంద్ర, 12వ వార్డు దోణప్ప, బసవరాజ్, అనిల్, రజత్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులకు శ్రీకారం నగరంలోని హవంబావిలోని పలు ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ప్రారంభించారు. ముఖ్యంగా 34వ వార్డు విద్యానగర రాఘవ ఫోర్ట్ అపార్ట్మెంట్ వెనుకభాగం, 6వ క్రాస్ లింక్ రోడ్ల అభివృద్ధికి వివిధ నిధుల ద్వారా రూ.కోటి వ్యయంతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. మాజీ మేయర్ రాజేశ్వరి, ఆ పార్టీ ప్రముఖులు విష్ణు బోయపాటి, యోగానందరెడ్డి, నాని, అనూప్, మంజు, హర్ష, బీఆర్ఎల్ శీన, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
శిశువును అపహరించి.. తన బిడ్డేనని నాటకం
దొడ్డబళ్లాపురం: బాగలకోట జిల్లా ఆస్పత్రిలో నవజాత శిశువు కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. రామదుర్గ తాలూకా ఖానపేట నివాసి సాక్షి యాదవాద (24) అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. ఆమె ఆస్పత్రి సిబ్బందికి తెలియకుండా కాన్పుల వార్డులోకి వెళ్లి బెడ్ మీద పడుకుంది. తనకు కాన్పు అయ్యిందని అందరితో అబద్ధం చెప్పింది. శనివారం తెల్లవారుజామున లేచి వేరే మహిళకు పుట్టిన బిడ్డను తీసుకుని తాను నర్స్నని చెప్పుకుని, చెకప్ చేయాలని తీసుకెళ్లి తన పక్కన పడుకోబెట్టుకుంది. బిడ్డను పోగొట్టుకున్న మహిళ లబోదిబోమంటూ సిబ్బందికి చెప్పింది. వారు అంతటా వెదికారు, చివరకు అనుమానం రావడంతో నిందితురాలిని ప్రశ్నించారు. అయితే ఆమె తనకు పుట్టిన బిడ్డ అంటూ వాదించింది. దీంతో వైద్య సిబ్బంది పోలీసుల సాయంతో ఆమెకు వైద్య పరీక్షలు చేయగా ఆమెకు అసలు ప్రసవం కాలేదని తేల్చారు. వెంటనే నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. 2024లో కూడా ఆమె ఓ శిశువును కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించినట్టు తెలిసింది.నవంబర్లో సీఎం మార్పు ● ఎమ్మెల్సీ విశ్వనాథ్ మైసూరు: వచ్చే నవంబర్ నెలలో సీఎం మార్పు తథ్యమని, సిద్దరామయ్య స్థానంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లేదా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె వీరిద్దరిలో ఒకరు నూతన సీఎం కావడం ఖాయమని సీనియర్ బీజేపీ ఎమ్మెల్సీ హెచ్.విశ్వనాథ్ జోస్యం చెప్పారు. ఆయన శనివారం నగరంలో జలదర్శిని అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. నవంబర్లో కాంగ్రెస్ హైకమాండ్ సిద్దరామయ్యను తప్పించడం ఖచ్చితమంటూ పై విధంగా విశ్లేషించారు. సిద్దరామయ్య గతంలో సీఎంగా ఉన్నప్పుడు పదేళ్ల క్రితమే కులాల వారీగా జనగణన చేయించారన్నారు. సుమారు లక్షన్నర మంది ఉపాధ్యాయులు రెండేళ్ల పాటు లెక్కింపు నిర్వహించారన్నారు. అందుకోసం రూ.170 కోట్లకు పైగా నిధులు ఖర్చయ్యాయన్నారు. అప్పటి నుంచి గణన నివేదికను బహిర్గతం చేయకుండా అటక ఎక్కించారన్నారు. తాజాగా హైకమాండ్కు భయపడి మళ్లీ కులాల వారీ జనగణన చేయిస్తామని సీఎం చెబుతున్నారని, ఇది ఎలా సాధ్యం అని ఆయన ప్రశ్నించారు. కులగణన చేయడానికి ఉపాధ్యాయులు కావాలి. అయితే ఇప్పుడిప్పుడే పాఠశాలలు ప్రారంభమైనందున ఉపాధ్యాయులు అందుబాటులో ఉండరని అన్నారు. -
కోస్తా తీర ప్రాంతాల్లో కుండపోత
శివాజీనగర: నైరుతీ రుతు పవనాలు జోరు మీదున్నాయి. మలెనాడు, కరావళి, ఉత్తర కర్ణాటక కొన్ని భాగాల్లో వానలు కురుస్తున్నాయి. దక్షిణ ఒళనాడులో కొన్ని చోట్లలో భారీ వర్షం కురిసింది. మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. చిక్కమగళూరు, శివమొగ్గ, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడుపి, కొడుగు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఎక్కడెక్కడ ఆరెంజ్ అలర్ట్? ● హావేరి, బెళగావి, ధారవాడ, హాసన్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా, అధికారులు, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడమైనది. ● వారం నుంచి రాష్ట్రంలో ఖరీఫ్ వర్షాలు చురుకుగా ఉన్నాయి. బెంగళూరు ప్రాంతీయ కేంద్ర సమాచారం ప్రకారం మంగళూరులో 9 సెం.మీ., ఉడుపిలో 8 సెం.మీ., ఉప్పినంగడి, గేరుసొప్ప, భట్కళ, పణంబూరు, బసవన బాగేవాడి, బెళ్లంగడిలలో 7 సెం.మీ. చొప్పున కుండపోత వానలు కురిశాయి. సిద్దాపుర, కుందాపుర, గోకర్ణ, పుత్తురులలో 6 సెం.మీ.చొప్పున, మూడుబిద్రి, కార్కళలో 5 సెం.మీ. చొప్పున వర్షం పడింది. ● దక్షిణ కర్ణాటక, ఉత్తర కర్ణాటక, కళ్యాణ కర్ణాటక భాగంలో సాధారణ వర్షం కురిసింది. ఆకాశం మబ్బులు కమ్మింది. ● బెంగళూరు చుట్టుపక్కల జిల్లాల్లో ఆకాశం మేఘావృతమైంది. పగటి వెలుతురు తగ్గి, అప్పుడప్పుడు చల్లని బలమైన గాలులు వీస్తున్నాయి. బెంగళూరు పరిసరాల్లో సాధారణ వర్షం కురిసే అవకాశముంది. రేవు నగరం అతలాకుతలం మంగళూరులో ముంపు సమస్య ఏర్పడింది. పగలూ రాత్రి ఏకధాటి వానతో శనివారం పలు ప్రాంతాలలో ఇళ్లలోకి వాననీరు చేరింది. కోడియాలగుట్టులో అనేకమంది నివాసితులను సహాయక సిబ్బంది రబ్బరు పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అత్తావరలో ఓ చోట డ్రైనేజీ కాలువ కింద మట్టి కొట్టుకుపోయి కాలువ ధ్వంసమైంది. కొడగు జిల్లాల్లో నదులకు ప్రవాహం అధికమైంది. హారంగి డ్యాం నుంచి 4 గేట్లను ఎత్తి 4 వేల క్యూసెక్కులను విడుదల చేశారు. ఉత్తర కన్నడ జిల్లాలో సిర్సి రోడ్డులో దేవిమనె ఘాట్ వద్ద కొండచరియలు కూలిపోయి రవాణాకు ఆటంకం ఏర్పడింది. మంగళూరులో పలు ప్రాంతాల జలమయం బెంగళూరుకూ వర్షసూచన -
శారీరకంగా, మానసికంగా హానికరం
యూట్యూబ్, వాట్సాప్ ఎఫెక్టు ● అధ్యయనం ప్రకారం 12 నుంచి 14 ఏళ్ల లోపు 97 శాతం పిల్లలు యూట్యూబ్లో మునిగి తేలుతున్నారు. ● 92 శాతం పిల్లలు వాట్సాప్, 73 శాతం మంది పిల్లలు సెర్చ్ ఇంజన్ వినియోగిస్తున్నాని తెలిసింది. ● 15 నుంచి 18 వయసున్న పిల్లలు 25 శాతం మంది ప్రతిరోజూ సుమారు సగటున ఒక గంటకు మించి మొబైల్తో గడుపుతున్నారు. ● 15 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లల్లో 16 శాతం మంది అపరిచిత వ్యక్తులతో స్నేహం చేయడానికి వెనుకాడడం లేదు. అందులో 10 శాతం మంది పిల్లలు ఆన్లైన్లో పరిచయమైనవారిని కలుసుకుంటున్నారు. ● 7 శాతం పిల్లలు ఆన్లైన్లో తమ వ్యక్తిగత సమాచారం , 2 శాతం పిల్లలు వ్యక్తిగత వీడియోలు, 8 శాతం మంది వ్యక్తిగత ఫోటోలను పంపి ఇబ్బందులో పడుతున్నారు.● రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్, చైల్డ్ ఫండ్ ఇండియా సంస్థ సంయుక్తంగా సర్వేని నిర్వహించాయి. ఇందులో అన్నీ ప్రతికూల అంశాలే వచ్చాయి.● బెంగళూరు, బెళగావి, చిక్కమగళూరు, చామరాజనగర, రాయచూరు జిల్లాల్లో ఈ సర్వే చేపట్టారు. 8 నుంచి 18 ఏళ్ల లోపు 900 మంది పిల్లలపై ఈ అధ్యయనం చేశారు.● ఆన్లైన్ వినియోగం, మొబైల్ అడిక్షన్ వల్ల పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం బాగా దెబ్బతింటోందని, వారి మీద వ్యతిరేక ప్రభావం చూపుతోందని నివేదిక తెలిపింది. ● 8–18 ఏళ్ల వయసున్న బాలబాలికల్లో 87 శాతం మంది మొబైల్ఫోన్ను, ఇంటర్నెట్ను వాడుతున్నారు.● 15 నుంచి 18 ఏళ్ల చిన్నారుల్లో 99 శాతం బాలురు, 100 శాతం బాలికలు మొబైల్కు పూర్తిగా అలవాటు పడినట్లు, మొబైల్ లేకపోతే రగడ చేసే స్థితికి చేరుకున్నట్లు సర్వే హెచ్చరించింది. సాక్షి, బెంగళూరు: స్మార్ట్ ఫోన్ అనే జాఢ్యానికి చిన్నా పెద్దా వయోభేదం లేదు. అందరూ దాని ఉచ్చులో చిక్కి విలవిలలాడుతున్నవారే. ప్రమాదకర వీడియో గేమ్స్, రీల్స్, చాటింగ్లతో చాలా మంది విలువైన సమయాన్ని, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాయి. బెట్టింగ్, లోన్ యాప్లతో ఆర్థికంగా నష్టపోయి తనువు చాలిస్తున్నారు. కర్ణాటకలో చాలా మంది పిల్లలు గంటల తరబడి మొబైల్ఫోన్ను చూస్తూ సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మారుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చరవాణులు కాస్తా చిన్నారులకు చెర వాణిలుగా మారిపోతున్నాయి. బాల బాలికలు ఇద్దరికీ అడిక్షన్ రాష్ట్రంలో 15 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లల్లో 99 శాతం మంది బాలురు, 100 శాతం బాలికలు మొబైల్ వినియోగం లేదా మొబైల్ అడిక్షన్కు లోనయి ఉన్నారు. ఆన్లైన్ లేదా మొబైల్ వినియోగం రాష్ట్ర బాలబాలికలపై చెడు ప్రభావం చూపుతోంది. ఈ చేదు విషయాలు రాష్ట్ర బాలల హక్కుల సంరక్షణ కమిషన్ చేపట్టిన అధ్యయనంలో తేలాయి. బాలలు, ముఖ్యంగా టీనేజీ కుర్రకారు మొబైల్కు బానిసలుగా మారుతున్నారు. వికాససౌధలో జరిగిన కార్యక్రమంలో విధాన పరిషత్ చైర్మన్ బసవరాజు హోరట్టి ఈ నివేదికను విడుదల చేశారు. గ్రామీణం, నగరం రెండు ప్రాంతాల్లోని పిల్లలపై ఈ అధ్యయనం జరిగింది. అందులో 97 శాతం మంది గ్రామీణ ప్రాంత పిల్లలు మొబైల్, ల్యాప్టాప్ను వినియోగిస్తే, నగరంలో 93 శాతం మంది పిల్లలు రెండింటినీ వాడుతున్నారు. మొత్తానికి పిల్లల్లో 8 నుంచి 11 ఏళ్ల వయసున్ను వారు 96 శాతం మంది, 15–18 ఏళ్ల లోపు పిల్లల్లో 71 శాతం మంది మొబైల్, ల్యాప్ట్యాప్ వినియోగం ఉన్నట్లు తెలిసింది. ఆన్లైన్లో లైంగిక వేధింపులు ఆన్లైన్ లైంగిక వేధింపుల ప్రమాదం అధికమైంది. ఈ అధ్యయనంలో పిల్లల తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా సేకరించారు. అందులో 903 మంది తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు. వారిలో 42 శాతం మంది తమ పిల్లలు ఆన్లైన్ లైంగిక వీడియోలను చూస్తున్నట్లు, లేదా లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిపారు. 43 శాతం మంది పిల్లలు ఆన్లైన్ బెదిరింపులకు లోనయ్యారు. 30 శాతం మంది చిన్నారులు లైంగిక వస్తువుల వినియోగం వంటి ఘటనలు ఎదుర్కొన్నట్లు తెలిసింది. దీనిని 46 శాతం కేసుల్లో పిల్లలు తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు, మిగిలిన 27 శాతం తల్లిదండ్రులు పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలపై నిఘా వహించి కనుగొన్నారని, అలాగే 18 శాతం మంది తల్లిదండ్రులు పిల్లల అసహజ ప్రవర్తన ద్వారా, 9 శాతం మంది ఇతరులు తెలియజేయడం వల్ల తెలుసుకున్నట్లు ఈ అధ్యయనంలో తెలిసింది. పిల్లలపై ఆన్లైన్ లైంగిక దాడి గురించి తెలిసిన తర్వాత 50 శాతం మంది తల్లిదండ్రులు బాలబాలికల సామాజిక మాధ్యమాల ఖాతాలను రద్దు చేశారు. 46 శాతం మంది తల్లిదండ్రులు లైంగిక దాడికి యత్నించిన వారి ఖాతాలను బ్లాక్ చేశారు. మొబైల్ఫోన్ రెండోకోణాన్ని ఈ సర్వే బయటపెట్టింది. రాష్ట్రంలో పిల్లల్లో అధిక స్మార్ట్ఫోన్ వాడకం అపరిచితుల చేతిలో ఆన్లైన్ వేధింపులు అనేక విపరిణామాలకు ఆజ్యం రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సర్వేలో నిజాలు అడిక్షన్ అయిన 99 శాతం మంది -
కృష్ణమ్మ పరవళ్లు
● ఆల్మట్టి డ్యాం నుంచి 52 వేల క్యూసెక్కుల విడుదల రాయచూరు రూరల్: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి డ్యాం నుంచి ముందు జాగ్రత్తగా కృష్ణా నదిలోకి 52 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. నారాయణపూర్ డ్యాంకు ఆ నీరు చేరుతోంది. శనివారం యాదగిరి జిల్లా హుణసిగి తాలూకాలోని నారాయణపూర్ డ్యాంకు ఉధృతి పెరగడంతో 14 గేట్ల నుంచి 52 వేల క్యూసెక్కులను వదిలారు. విజయపుర, బాగలకోటె, యాదగిరి, రాయచూరు జిల్లాల అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నది దిగువన గ్రామాలకు ముంపు అపాయం నెలకొంది. టర్ఫ్ క్లబ్లో రూ.2.5 కోట్ల స్కాం బనశంకరి: బెంగళూరు టర్ఫ్ క్లబ్లో భారీ కుంభకోణం జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. క్లబ్కు కావలసిన ఎరువులు, గుర్రాల దాణా కొనుగోలులో సిబ్బంది రూ.2.5 కోట్లు అక్రమాలకు పాల్పడ్డారు. క్లబ్ ఉద్యోగి శ్రీనివాస్ వీటి కొనుగోలు టెండర్లు చూసుకునేవాడు. 2024లో ఆర్థిక వ్యవహారాల మీద ఉన్నతాధికారులకు అనుమానం రావడంతో ఆడిటింగ్ చేయించగా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు రూ.2.5 కోట్లను అతడు స్వాహా చేసినట్లు గుర్తించారు. హైగ్రౌండ్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు. గిరిజా కళ్యాణోత్సవం కోలారు: తాలూకాలోని లక్కూరు గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణస్వామి దేవాలయంలో స్వామివారికి గిరిజా కళ్యాణోత్సవం శనివారం కనులపండువగా నిర్వహించారు. అర్చకులు సురేష్ చైతన్య నేతృత్వంలో తెల్లవారుజాము నుంచే స్వామివారికి పంచామృత అభిషేకం, అలంకారం, వేదమంత్ర పారాయణం తదితరాలను చేపట్టారు. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు, శ్రీ సోమేశ్వరస్వామి, శ్రీ ఆంజనేయస్వామి, నవగ్రహాలకు విశేష పూల అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. ఆపై ఉత్సవ విగ్రహాలకు నేత్రపర్వంగా గిరిజా కళ్యాణోత్సవాన్ని సాగించారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆగుంబె ఘాట్లో ట్రాఫిక్ ఆంక్షలు శివమొగ్గ: వర్షాకాలంలో కొండ ప్రాంతాలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున జిల్లాలో ఆగుంబె ఘాట్లో హైవేలో వాహనాల రాకపోకలు పరిమితం చేశారు. వర్షాకాలంలో ఆగుంబె ఘాట్ రోడ్లు కూలడం, మట్టి చరియలు పడిపోవడం సాధారణం. దీంతో శివమొగ్గ, ఉడుపి అధికారులు ఈ నెల 15 నుంచి సెప్టెంబరు ఆఖరు వరకు వాహనాల రాకపోకలు పరిమితం చేసినట్లు తెలిపారు. తేలికపాటి వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. ఉడుపి, తీర్థహళ్లి మధ్య ప్రయాణించే వాహనాలు ఉడుపి, కుందాపుర, సిద్దాపుర, మాస్తికట్టే, ,తీర్థహళ్ళి మీదుగా ప్రత్యామ్నాయ మార్గంలో నడపాలని ప్రకటించారు. -
భక్తిశ్రద్ధలతో శ్రీనివాస మండల పూజ
మాలూరు : పట్టణంలోని శ్రీధర్మరాయ స్వామి ఆలయ సమీపంలో నిర్మించిన శ్రీనివాస దేవర 6.5 అడుగుల ఎత్తైన నూతన బింబ ప్రతిష్టాపన, కుంభాభిషేకం, 48వ సంవత్సర మండల పూజా కార్యక్రమాన్ని శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీనివాస ఆలయ ఛారిటబుల్ ట్రస్టు భైరాగి మఠం ఆధ్వర్యంలో 6.5 అడుగుల ఎత్తు కలిగిన శ్రీనివాస మూర్తిని ప్రతిష్టించి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్ నేతృత్వంలో గోపూజ, యాగశాల ప్రవేశం, స్వస్తివచనం, అంకురార్పణ, శ్రీమహాగణపతి పూజ తదితరాలను నిర్వహించారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. -
25 నుంచి కాలువలకు నీరు వదలండి
బళ్లారిటౌన్: తుంగభద్ర డ్యాంలో ప్రస్తుతం 25 టీఎంసీల నీరు నిల్వ చేరినందున ఈ నెల 25వ తేదీ నుంచి కాలువలకు నీరు వదలాలని తుంగభద్ర రైతు సంఘం నాయకుడు కరూరు మాధవరెడ్డి సూచించారు. ఆయన శుక్రవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది మిరప పంట పండినా, ధర లేక రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నారన్నారు. ఈసారి 80 టీఎంసీలు మాత్రమే డ్యాంలో నీటిని నిల్వ ఉంచుతామని, ఒక పంటకు మాత్రమే నీరు వదులుతామని బోర్డు అధికారులు వెల్లడించినందున ప్రస్తుతం ఉన్న నీటిని తొలుత మిరప పంట వేసుకునేందుకు వదలాలన్నారు. ఈ విషయంపై తాము జిల్లా ఇన్ఛార్జి మంత్రి, బోర్డు అధికారులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు వినతిపత్రాలు పంపుతామన్నారు. త్వరలో తుంగభద్ర ఐసీసీ సమావేశం జరిపి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. గత ఏడాది ఆగస్టు 11న డ్యాంలోని 19వ నంబరు క్రస్ట్గేటు కొట్టుకుపోయి చాలా నీరు వృథా అయినా అప్పుడు దేవుడి దయవల్ల మళ్లీ వర్షాలు కురవడంతో రెండో పంట పండించుకునేందుకు వీలైందన్నారు. మిగిలిన గేట్లు కూడా అధ్వానంగా ఉన్నందున వచ్చే వేసవి సీజన్లో పూర్తిగా మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. ఈసారి పత్తి, మిరప పంటకు నీటి అవసరం ఉన్నందున ముందస్తుగానే నీరు వదలాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా ద్రౌపదమ్మ దేవి కరగ ఉత్సవం
కోలారు : ప్రతియేటా నిర్వహించే విధంగా ముళబాగిలు తాలూకా నంగలిలో ఉన్న ద్రౌపదమ్మ దేవి ఆలయంలో కరగ ఉత్సవాన్ని ఈ యేడాది కూడా అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో గణపతి పూజ, ధ్వజారోహణం, కల్యాణోత్సవం, హసికరగ, ఒనకె కరగ తదితర పూజలు నిర్వహించారు. కరగను చూడడానికి చుట్టు పక్కల గ్రామాల నుంచే కాకుండా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని పలమనేరు తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. గురువారం రాత్రి గంగమ్మ, కోదండ రామస్వామి, చౌడేశ్వరి, నాగదేవత, గణపతి తదితర దేవుళ్ల పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ధర్మదర్శి తాండ్రాయప్ప కోదండ, గ్రామ పంచాయతీ అధ్యక్షుడు ఎన్ శ్రీధర్ తదితరులు కరగ ఉత్సవంలో పాల్గొన్నారు. -
శాసీ్త్రయ సాగుపై ఆసక్తి అవసరం
బళ్లారిటౌన: రైతులు మట్టి సారవంతం ఆధారంగా శాసీ్త్రయ పంటల సాగు పద్ధతిని అనుసరించి ఎక్కువ దిగుబడి సాధించాలని జిల్లాధికారి ప్రశాంత్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు. శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో రైతుల మేళాను ప్రారంభించి మాట్లాడారు. నేటి ఆధునిక యుగంలో అధిక దిగుబడులు వచ్చే పంటలను సాగు చేయాలని సూచించారు. జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు యశ్వంత్రాజ్ నాగిరెడ్డి మాట్లాడుతూ రైతులు దేశానికి వెన్నెముక అని, ప్రతి ఒక్కరూ రైతులను గౌరవించాలన్నారు. తమ సంస్థ రైతు సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. వ్యవసాయ శాఖ జేడీ సోమసుందర్, ఉద్యానవన శాఖ డీడీ సంతోష్, జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రముఖులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీకి అమాత్య పదవి వద్దు రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న ప్రచారం నేపథ్యంలో రాయచూరు ఎమ్మెల్సీ వసంత్ కుమార్కు అమాత్య పదవిని కేటాయించ వద్దని హైకోర్టు న్యాయవాది నరసప్ప సూచించారు. శుక్రవారం పాత్రికేయుల భనవంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ మాదిగ సముదాయం వారు కాదు, క్రైస్తవ మతానికి చెందిన వారని, వారి తల్లి మేరీ అని తెలిపారు. ఎమ్మెల్సీ క్రిష్టియన్ను వివాహం చేసుకున్న దాఖలాలను ప్రదర్శించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆయనకు మద్దతు ఇవ్వకుండా మాదిగ సముదాయానికి చెందిన వారికి మంత్రి పదవిని కేటాయించాలన్నారు. క్రిస్టియ్న్ మతాన్ని స్వీకరించిన వసంత్ కుమార్కు మంత్రి వర్గంలో చోటు ఇవ్వరాదని అన్నారు. నేడు వక్ఫ్ బోర్డు అధ్యక్షుడికి సన్మానం రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో నూతనంగా నియమితులైన వక్ఫ్ బోర్డు అధ్యక్షుడికి మైనార్టీలతో సన్మానం చేయనున్నట్లు మైనార్టీ సెల్ సంచాలకుడు శాలం వెల్లడించారు. శుక్రవారం పాత్రికేయుల భనవంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం రాత్రి రాయచూరులోని మహిళా సమాజ్లో రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు సయ్యద్ షా అలీ అల్ హుసేనీకి అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమానికి క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజరుద్దీన్తో పాటు వివిధ ప్రాంతాల నుంచి ధర్మ గురువులు హాజరవుతారన్నారు. కార్యక్రమంలో మంత్రులు శరణ ప్రకాష్ పాటిల్, బోసురాజు, ఎంపీ కుమార నాయక్, ఎమ్మెల్యేలు హంపయ్య నాయక్, బసనగౌడ, హంపన గౌడ, బసనగౌడ, శరణే గౌడ, చంద్రశేఖర్, ఎమ్మెల్సీ వసంత్ కుమార్ పాల్గొంటారన్నారు. అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం బళ్లారి అర్బన్: ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి శుక్రవారం హవంబావి తదితర చోట్ల వివిధ అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. 36వ వార్డు పరిధిలోని హవంబావి గోవిందయ్య ఇంటి నుంచి రామనగర్ 3వ క్రాస్ వరకు రూ.71.75 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణాలకు భూమిపూజను నెరవేర్చారు. తిప్పయ్య ఇంటి వద్ద నుంచి వెంకట్రావ్ ఇంటి వరకు, హనుమయ్య ఇంటి నుంచి మెయిన్ రోడ్డు వరకు, రమేష్ ఇంటి నుంచి ఓబణ్ణ ఇంటి వరకు, మారెన్న ఇంటి నుంచి ఆంటీ హోటల్ వరకు రూ.1.72 కోట్ల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కేకేఆర్డీబీ నిధులతో రూ.3.29 కోట్ల వ్యయంతో రెండు, మూడవ క్రాస్ రోడ్లను కలిపే రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజను నిర్వహించారు. ఈసందర్భంగా కార్పొరేటర్ మించు శ్రీనివాసులు, ఆ వార్డు ప్రముఖులు లోకేష్, బత్రీ వాసు, మంగళ రామాంజనేయ, యశోద, హగరి గోవిందు, హొన్నప్ప, బీఆర్ఎల్ శీన, భాస్కర్రావు, ఉమామహేశ్వర్రావు, చంద్రశేఖర్, చిరంజీవి, రావి రమేష్, సుబ్బారావు, జానకీరాం, గంగాధర్, పిచ్చేశ్వర్రావు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
పాలికె షాపింగ్ కాంప్లెక్స్ కూల్చకూడదు
సాక్షి,బళ్లారి: మహానగర పాలికె ఆదేశాలు, ప్రభుత్వం నుంచి నోటీసులు లేకుండా పాలికెకు చెందిన వాణిజ్య కాంప్లెక్స్లో వివిధ రకాల వ్యాపారాలు చేసుకుంటూ జీవించే వారిని ఖాళీ చేయించి కాంప్లెక్స్ కూల్చివేతకు కుట్ర పన్నుతున్నారని, కొందరు కాంగ్రెస్ గూండాలు రాత్రివేళలో వచ్చి షట్టర్లను పీకేసి, వ్యాపారులకు అన్యాయం చేస్తున్నారని మండిపడుతూ బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం నగరంలోని రాయల్ సర్కిల్ సమీపంలోని నటరాజ్ థియేటర్ ఎదురుగా మాజీ మంత్రి శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరి ధర్నా, ఆందోళన చేపట్టారు. నటరాజ్ టాకీస్ ఎదురుగా 40కి పైగా ఉన్న స్టాల్స్లో చిన్న చిన్న వ్యాపారాలు, అంగళ్లు, హోటళ్లు పెట్టుకుని ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది కుటుంబాలు జీవిస్తున్నారన్నారు. ఉన్నఫళంగా కాంప్లెక్స్లో జీవిస్తున్న వారిని ఖాళీ చేయించి కూల్చివేతకు కుట్ర పన్నారని నేతలు మండిపడ్డారు. నోటీసులు ఇవ్వకుండా షట్టర్ల తొలగింపా? దాదాపు 40 ఏళ్లకు పైగా పాలికెకు బాడుగలు చెల్లించి, వారి వ్యాపారాలు చేసుకుంటున్నారన్నారు. అయితే వారిని ఖాళీ చేయించాలనే ఉద్దేశ్యంతో కొందరు కాంగ్రెస్ గూండాలు రాత్రిళ్లు షట్టర్లను తీసుకెళ్లారని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదన్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారో బయట పడాలన్నారు. పాలికె నుంచి నోటీసులు ఇవ్వకుండా ఎందుకు ఖాళీ చేయిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా రాలేదని, దీంతో బాధితులు తమ వద్ద గోడు వినిపించడంతో తాము ఆందోళన చేస్తున్నామన్నారు. బాధితుల తరఫున పోరాటం చేస్తామని, ఎట్టి పరస్థితుల్లోను పాలికె నుంచి లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. వందలాది కుటుంబాలు జీవనోపాధి కోల్పోతారన్నారు. ఒకరిద్దరి లాభం కోసం పేదల పొట్టకొట్టడం సరి కాదని అన్నారు. మాకు జీవనోపాధి పోతుంది: బాధితులు కాంప్లెక్స్లో బాడుగకు ఉంటూ వ్యాపారం చేసే వారు మాట్లాడుతూ తాము ఉగ్గాని, మిర్చి వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నామన్నారు. ఈ కాంప్లెక్స్ నుంచి ఖాళీ చేయిస్తే తమకు జీవనోపాధి ఉండదని, నోటీసులు ఇవ్వకుండా ఖాళీ చేయించాలని కొందరు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పుల అంగళ్లు, హోటల్, సెల్ఫోన్ల దుకాణ వ్యాపారులు, వివిధ రకాల అంగళ్లు పెట్టుకుని జీవించే వారందరూ కూడా ముక్తకంఠంతో కాంప్లెక్స్ భనవం కూల్చివేయడం తగదన్నారు. తమకు నోటీసులు, ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వాపోయారు. నటరాజ్ థియేటర్ ముందు ఉన్న కాంప్లెక్స్ భనవం కూల్చివేత చేపడతారనే విషయం తెలియగానే నగరంలో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి బాధితులకు అండగా నిలిచారు. మాజీ మేయర్, పాలికె ప్రతిపక్ష నేత ఇబ్రహీంబాబు, కార్పొరేటర్లు కోనంకి తిలక్, మోత్కూరు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి ఆదేశాలు లేకుండా కూల్చితే పేదలకు అన్యాయం మొండిగా కూల్చివేతకు దిగితే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం మాజీ మంత్రి శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే సోమశేఖరరెడ్డి -
మోదీ పాలన ప్రతి ఒక్కరికీ తెలియాలి
సాక్షి,బళ్లారి: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్ధవంతమైన, అభివృద్ధి, సంక్షేమ పాలన అందించారని, దేశ భద్రత, రక్షణ, ఉగ్రవాద నిర్మూలన చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఆయన శుక్రవారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ముందుగా గుజరాత్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గుజరాత్ విమాన ప్రమాదం తమను ఎంతో కలిచివేసిందన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు తీసుకున్న తర్వాత పేదల సంక్షేమానికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. కేంద్ర పథకాలతో రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. పార్టీలకతీతంగా దేశాభివృద్ధి కోసం మోదీ చేస్తున్న కృషిని పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో విధాన పరిషత్ సభ్యుడు వై.ఎం.సతీష్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్ కుమార్ మోకా, కార్పొరేటర్ మోత్కూరు శ్రీనివాసరెడ్డి, బీజేపీ నాయకుడు రామలింగప్ప, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటింటికీ సమర్ధ పాలనను తీసుకెళ్లండి పార్టీ నాయకులు, కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి సూచన -
పెళ్లి చేసుకోకుంటే ఫొటోలు వైరల్ చేస్తా ●
● యువతికి వివాహితుని బెదిరింపులు హుబ్లీ: ఓ యువతిని తనను పెళ్లి చేసుకోకుంటే నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాను, అలాగే వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ ఓ వివాహితుడు బెదిరించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వివరాలు.. బీదర్కు చెందిన లోకేష్పై బాధిత యువతి ఫిర్యాదు చేసింది. 2023లో పరిచయమైన వీరిద్దరి మధ్య స్నేహం కుదిరి ప్రేమ అంకురించింది. ఆ సమయంలో పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించాడు. అయితే సదరు వ్యక్తి పూర్వపరాలు తెలుసుకున్న తర్వాత అతడికి పెళ్లి అయినట్లు తెలుసుకుని, ఈ విషయాన్ని నిలదీయగా, ఏమైనా కాని నిన్ను కూడా పెళ్లి చేసుకుంటానని, లేకుంటే నీతో ఉన్న ఫోటోలు బహిరంగ పరుస్తానని, అలాగే రూ.50 లక్షలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. చికిత్స పొందుతూ వృద్ధుని మృతి హుబ్లీ: మంటూరు బండివాడ క్రాస్ వద్ద గూడ్స్ వాహనం డోర్ తగిలిన ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స ఫలించక స్థానిక కేఎంసీ ఆస్పత్రిలో మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది. ఈయన నడుచుకుంటూ రోడ్డుపై వెళుతుండగా, సదరు గూడ్స్ వాహనం డోర్ ఉన్నఫళంగా ఖాజాసాబ్ హుస్సేన్సాబ్(63)కు తగలడంతో గాయపడ్డాడు. ఆయనను ఆస్పత్రికి తరలించగా, సదరు వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 21న యోగా డే ఘనంగా జరపండి బళ్లారిటౌన్: నగరంలో ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరపాలని జిల్లాధికారి ప్రశాంత్ కుమార్ మిశ్రా అధికారులకు సూచించారు. శుక్రవారం తన కార్యాలయంలో జరిగిన ముందస్తు సమీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమ నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. శెట్రు గురుశాంతప్ప పీయూ కళాశాల మైదానంలో యోగా దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుతం వర్షాకాలం అయినందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆరోజు ఉదయం 7 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. ఈసందర్భంగా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నిధుల దుర్వినియోగంపై పీడీఓ సస్పెండ్ రాయచూరు రూరల్: పంచాయతీ నిధులను దుర్వినియోగ పరిచిన గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి(పీడీఓ)ని సస్పెండ్ చేస్తూ జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారాం పాండే ఆదేశాలు జారీ చేశారు. లింగసూగూరు తాలూకా కోఠా పంచాయతీలో విధి నిర్వహణలో లోపం, రూ.26 లక్షల నిధుల వినియోగంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రుజువు కావడంతో పీడీఓ గంగమ్మను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. మఠాలు ఏకం కావాలి ●● రాజీ ప్రక్రియతో సమస్యను పరిష్కరించుకోవాలి ● మంత్రాలయ పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు రాయచూరు రూరల్: మంత్రాలయం మఠం, ఉత్తరాది మఠం రాజీ కావాలని తమిళనాడు హైకోర్టు ఆదేశించిందని మంత్రాలయం రాఘవేంద్ర స్వాముల మఠంలో పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ తెలిపారు. ఆయన గురువారం రాత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో సమాజం కోసం రెండు మఠాలు ఏకం కావాలన్నారు. రెండు మఠాల మధ్య ఉన్న తేడాను గురించి సామరస్యంగా, సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని న్యాయమూర్తులు ఆదేశించారన్నారు. -
పారిశ్రామికీకరణతో హైరానా
రాయచూరు రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ కర్ణాటక జిల్లాల్లో భారీ పరిశ్రమల స్థాపనకు శ్రీకారం చుట్టింది. ఈనేపథ్యంలో ఒక వైపు పరిశ్రమల స్థాపనకు వ్యతిరేకం అవుతున్న తరుణంలో ప్రజలు వివిధ రకాలైన వింత రోగాల బారిన పడే అవకాశముందని సీనియర్ వైద్యులు అంటున్నారు. అణు విద్యుత్ స్థావరాల ఏర్పాటు, 50 కంపెనీల ఏర్పాటుతో ప్రజలు గుండెపోటు, సిలికోసిన్ వ్యాధులతో బాధపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. యువత సిలికోసిన్ వ్యాధులతో మరణిస్తున్న విషయం బహిరంగమైంది. కొప్పళలో 47, బళ్లారిలో 68, కలబుర్గిలో 50 పరిశ్రమలు, రాయచూరులో ఉష్ణ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో దాదాపు 3360 మెగావ్యాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లున్నాయి. రాయచూరు, యాదగిరి, బళ్లారి, కొప్పళ, విజయనగర జిల్లాల్లో పరిశ్రమల స్థాపనకు అన్ని విధాలైన మౌలిక సౌకర్యాలు, వనరులు సమృద్ధిగా ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు మెండుగా ఉపాధి పరిశ్రమల జోన్గా ప్రకటించడంతో భవిష్యత్తులో నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి. రాయచూరు జిల్లాలో 1744.75, యాదగిరి జిల్లాలో 3284.27 ఎకరాల భూమి, కొప్పళ జిల్లాలో 1600 ఎకరాలు, విజయనగర జిల్లాలో 1000 ఎకరాల భూములున్నాయి. పరిశ్రమల కేంద్రంలో రహదారి, మురుగు కాలువలు, తాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పిస్తారు. పరిశ్రమల ఏర్పాటు విషయంలో కంపెనీలు ముందుకు వచ్చాయి. బెంగళూరు– ముంబై, చైన్నె–ముంబై, బెంగళూరు–న్యూఢిల్లీ, కన్యాకుమారి–చైన్నె, మైసూరు–వారణాసి రైళ్ల సౌకర్యం, విద్యుత్ ఉత్పత్తి చేసే యూనిట్లు, తుంగభద్ర, కృష్ణా నదులు, హట్టి బంగారు గనుల కంపెనీలు, పత్తి, వరి, మిరప ప్రధాన పంటలు పండిప్తారు. దక్షిణ, ఉత్తర కర్ణాటక ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఇలాంటి పరిశ్రమల ఏర్పాటు విషయంలో ససేమిరా అనడంతో కళ్యాణ కర్ణాటక జిల్లాల్లో పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తోంది. కళ్యాణ కర్ణాటకలో కర్మాగారాల స్థాపనకు సర్కారు శ్రీకారం కొప్పళలో 47, బళ్లారిలో 68, కలబుర్గిలో 50 భారీ పరిశ్రమలు గుండెపోటు, సిలికోసిన్ వ్యాధులతో ప్రజలకు తప్పని పాట్లు పరిశ్రమల ఏర్పాటుతో ప్రాణహాని కళ్యాణ కర్ణాటక జిల్లాల్లో పరిశ్రమల స్థాపనకు సర్కార్ శ్రీకారం చుట్టడాన్ని హైదరాబాద్ కర్ణాటక జనాందోళన సమితి అధ్యక్షుడు రాఘవేంద్ర కుష్టిగి ఖండించారు. భారీ పరిశ్రమల ఏర్పాటు వల్ల ప్రాణహాని సంభవించే అవకాశాలున్నాయి. – రాఘవేంద్ర కుష్టిగి, ఆందోళన కారుడు భవిష్యత్తులో నీటి ఎద్దడి తప్పదు: కళ్యాణ కర్ణాటక జిల్లాల్లో పరిశ్రమల స్థాపన జరిగితే భవిష్యత్తులో తాగు, సాగునీటి ఎద్దడి తప్పదని రైతు సంఘం అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ ఆరోపించారు. పరిశ్రమలు నడవడానికి నీరు ప్రధానమని, కంపెనీలు అధిక మొత్తంలో ఆ నీటి వినియోగంతో తుంగభద్ర ఎడమ కాలువ, కుడి కాలువ, విజయనగర కాలువల చివరి భూములకు నీరందవన్నారు. – చామరస మాలిపాటిల్, రైతు సంఘం అధ్యక్షుడు -
కేఆర్ఎస్ డ్యాంకు భద్రత కరువు
మండ్య: జిల్లాలోని కృష్ణరాజసాగర(కేఆర్ఎస్) డ్యాం దక్షిణ ద్వారం జలాశయం లోపలకు గుర్తు తెలియని ఇద్దరు యువకులు చొరబడి అక్కడ కటడం వద్ద వీడియోను తీసుకొని సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో జలాశయానికి భద్రత సరిగా లేదని స్తానిక ప్రజలు మండిపడుతున్నారు. కేఆర్ఎస్ జలాశయం భద్రత కోసం కర్ణాటక పారిశ్రామిక పోలీసు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. 60 మంది సిబ్బంది 24 గంటల పాటు విధులు నిర్వహిస్తారు. అయినా గుర్తు తెలియని యువకులు పోలీసుల కళ్లు గప్పి దక్షిణ ద్వారం ద్వారా జలాశయంలోకి వెళ్లి సెల్ఫీ వీడియో తీసుకున్నారు. కేఎస్ఐఎస్ఎఫ్ సహాయక కమాండెంట్ ప్రమోద్ మాట్లాడుతూ స్థానిక ప్రజల నుంచి తమకు సమాచారం వచ్చిందన్నారు. ఇద్దరు గుర్తు తెలియని యువకులు కేఆర్ఎస్లోనికి వెళ్లి వీడియో తీసినట్లు గుర్తించామన్నారు. వారితోపాటు మరో యవకుడు ఉన్నాడని తెలిపారు. త్వరలోనే ఐడీ ఆధారంగా వారిని పట్టుకుంటామని అన్నారు. జలాశయంలోకి చొరబడిన యువకులు సోషల్ మీడియాలో వీడియో వైరల్ -
గృహబంధనం నుంచి తల్లీ బిడ్డకు రక్షణ
కోలారు: ఇటుకల ఫ్యాక్టరీలో గృహబంధనంలో ఉన్న తల్లీబిడ్డను తహసీల్దార్ రక్షించిన ఘటన శుక్రవారం ముళబాగిలులో చోటు చేసుకుంది. చిక్కబళ్లాపుర జిల్లా గౌరిబిదనూరు తాలూకా పొమ్మశెట్టిహళ్లికి చెందిన ప్రశాంత్, వినుత దంపతులు హనుమనహళ్లి సర్కిల్ వద్ద ఉన్న సద్దాం హుస్సేన్ అనే వ్యక్తికి చెందిన మూన్లైట్ ఇటుకల ఫ్యాక్టరీలో పని చేస్తుండేవారు. భర్త ప్రశాంత్ భార్య వినుత, నాలుగేళ్ల బిడ్డను అక్కడే వదిలి పరారైనట్లు తెలిసింది. గత కొన్నాళ్లుగా వీరిని ఇటుకల ఫ్యాక్టరీ యజమాని సద్దాం హుస్సేన్ గృహ బంధనంలో ఉంచినట్లు తెలిసింది. తహసీల్దార్ గీత మాట్లాడుతూ ఇటుకల ఫ్యాక్టరీలో గృహబంధనంలో ఉన్నట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో జిల్లా జాగృతి సమితి సభ్యులతో కలిసి స్థలానికి వెళ్లి తల్లీబిడ్డను రక్షించామని తెలిపారు. కేబినెట్ విస్తరణ ఆలోచన లేదు ● కులగణన సమీక్షకు అనుమతి ● ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినందున మంత్రివర్గ విస్తరణ చేసే ఆలోచన లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. కలబుర్గిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి పదవుల కోసం శాసన సభ్యులు ఎవరూ ఢిల్లీకి రాకూడదన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్లకు వివరించామన్నారు. రాష్ట్రంలో కులగణన సమీక్షకు ప్రభుత్వానికి అనుమతి ఇచ్చామన్నారు. శాసీ్త్రయంగా కులగణన నిర్వహించాలన్నారు. నలుగురు నూతన ఎమ్మెల్సీల ఎంపిక జాబితాను పెండింగ్లో ఉంచామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్లపై కేంద్రం ఈడీ అధికారులతో ఉద్దేశపూర్వకంగా దాడులను చేయిస్తోందని ఆరోపించారు. బెంగళూరు చిన్నస్వామి క్రీడా మైదానం వద్ద జరిగిన తొక్కిసలాటపై బీజేపీ జాతీయ స్థాయిలో దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. బైక్, ట్యాక్సీలకు హైకోర్టు షాక్ ● మధ్యంతర ఆదేశాలు ఇవ్వడానికి నిరాకరణ బనశంకరి: ఓలా, ఉబర్, ర్యాపిడో బైక్, ట్యాక్సీలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. బైకు ట్యాక్సీల సంచారానికి సంబంధించి మధ్యంతర ఆదేశాలు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. శుక్రవారం పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు విచారణను 24వ తేదీకి వాయిదా వేసింది. బైకు ట్యాక్సీల పర్మిట్ నిబంధనలు రూపొందించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని ప్రభుత్వం తరపు న్యాయవాది శశికిరణ్ శెట్టి తెలిపారు. అంతేగాక 8 రాష్ట్రాల్లో మాత్రమే బైకు ట్యాక్సీలకు పర్మిట్ ఇచ్చారని, కర్ణాటకతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో అనుమతి ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం బైకు ట్యాక్సీలకు అనుమతి ఇవ్వలేదన్నారు. నాలుగేళ్ల నుంచి మధ్యంతర ఆదేశాలపై బైకు ట్యాక్సీలు నడుస్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా బైకు ట్యాక్సీలకు మధ్యంతర ఆదేశాలు ఇవ్వడానికి నిరాకరించిందని వాదనలు వినిపించారు. పిటిషన్ విచారణ చేపట్టిన హైకోర్టు అప్పీల్ పిటిషన్పై 24 తేదీన తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. -
పన్నుల్లో రాష్ట్ర వాటా పెంచాలని సీఎం ప్రతిపాదన
బనశంకరి: న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య 16వ ఆర్థిక కమిషన్కు పలు ప్రతిపాదనలు, సిఫార్సులను అందజేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో సిద్దరామయ్య 16వ ఆర్థిక కమిషన్ అధ్యక్షుడు డాక్టర్ అరవింద్ పనగారి, కమిషన్ గౌరవ సభ్యులతో సమావేశమై కేంద్రం నుంచి రాష్ట్రాలకు పన్నుల పంపకాలు, ఆర్థిక విషయాల గురించి రాష్ట్ర ఆశయాలు, నిరీక్షణలు, ప్రతిపాదనలను తెలియజేసి సిద్దరామయ్య మాట్లాడారు. భారత ఆర్థికతలో కర్ణాటక ప్రముఖ పాత్ర ఉందని తెలిపారు. రాష్ట్రంలో దేశం మొత్తం జీడీపీకి సుమారు 7 శాతం ఉందని, జీఎస్టీ సేకరణలో రెండో స్థానంలో ఉందన్నారు. అంతేగాక నిధుల కేటాయింపులో తీవ్ర అసమానత గురించి ఆర్థిక కమిషన్కు వివరించారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో ప్రతి రూపాయికి ప్రతిగా రాష్ట్రానికి కేవలం 15 పైసలు మాత్రమే అందుతుంది. 15వ ఆర్థిక కమిషన్ కర్ణాటక పన్నుల వాటాను 4.713 శాతం నుంచి 3.647 శాతానికి తగ్గించడంతో 15 ఆర్థిక కమిషన్ అవధిలో రూ.80,000 కోట్లు నష్టపోయిందని తెలిపారు. రాష్ట్రానికి వాటాల కేటాయింపులో తలెత్తిన అసమానతలు సరిదిద్దాలని 16వ ఆర్థిక కమిషన్కు మనవిపత్రం అందజేశామన్నారు. అంతేగాక కొన్ని ప్రతిపాదనలు కూడా అందజేశామని తెలిపారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య పంపకాల్లో కనీసం 50 శాతానికి పెంచాలని, సెస్సులు, సర్చార్జ్లను 5 శాతానికి పరిమితం చేయాలని ప్రస్తావించింది. కేంద్రం పన్నుయేతర ఆదాయం రాష్ట్రాలకు పంపకాల్లో వాటాలను సవరించాలని సిఫార్సు చేసింది. రాష్ట్రాల మధ్య పంపకాలకు సంబంధించి ప్రతి రాష్ట్రం అందించే సేవల్లో సుమారు 60 శాతం తమ వద్ద పెట్టుకొని, 40 శాతం మిగిలిన రాష్ట్రాలకు కేటాయించాలని సూచించింది. కర్ణాటక ఆర్థికతలో బెంగళూరు ప్రముఖ పాత్రను పరిగణించి మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులు ఇవ్వాలని కోరారు. -
కరావళిలో వరుణ ప్రతాపం
యశవంతపుర: కరావళిలోని బెళగావి జిల్లా వ్యాప్తంగా భారీ వానలు పడుతున్నాయి. అనేక చోట్ల అంతరాయాలు కలిగాయి, ఇంటి గోడ కూలి వృద్ధుడు మృతి చెందగా, నిండుగా ప్రవహిస్తున్న కాలువ నీటిలో ఆటో కొట్టుకుపోయిన ఘటనలో వ్యక్తిని గ్రామస్థులు రక్షించారు. బెళగావి జిల్లా గోకాక్ తాలూకా చిక్కనంది గ్రామంలో మట్టిగోడ కూలి ఫకీరప్ప లక్ష్మణ హావేరి(65) మృతి చెందారు. మట్టిలో చిక్కుకున్న ఫకీరప్పను గ్రామస్థులు బయటకు తీశారు. అయితే అప్పటికే ఊపిరాడక ఆయన మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోకాక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గోకాక్ గ్రామీణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. ఆటోడ్రైవర్ రక్షణ యరగట్టి తాలూకా చిక్కబూదనూరు గ్రామ సమీపంలో గురువారం రాత్రి నిండుగా ప్రవహిస్తున్న కాలువలో ఆటోను దాటించే ప్రయత్నంలో నీటి ప్రవాహానికి ఆటోతో పాటు డ్రైవర్ కొట్టుకుపోయారు. అయితే గమనించిన స్థానికులు తక్షణమే తాడు సాయంతో డ్రైవర్ను రక్షించారు. మురగోడు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భారీ వర్షాలు బెళగావి జిల్లా బైలహొంగల, సవదత్తి, గోకాక్ తాలూకాల్లో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీగా వర్షం కురిసింది. వానలతో కుంటలు నిండి చెరువుల్లోకి నీరు చేరాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచి సమస్యలు ఎదురయ్యాయి. భారీ వానలతో బైలహొంగల పట్టణంలోని ఒక క్లినిక్లోకి నీరు చొరబడ్డాయి. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేని కారణంగా పట్టణంలోని అనేక ఇళ్లలోకి నీరు చేరాయి. కార్వారలోనూ.. రెండు రోజుల నుంచి ఉత్తర కన్నడ జిల్లా కార్వారలో భారీగా వానలు పడుతున్నాయి. జాతీయ రహదారి–66లో మట్టి చరియలు విరిగి పడ్డాయి. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కారవార నగర టన్నెల్ భాగం, బిణగా మార్గంలో మూడు చోట్ల మట్టి రోడ్డుపై కూలింది. గోవా–కారవార–మంగళూరు మార్గంలో వాహనాల సంచారానికి ఆంక్షలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 19 మార్గాల్లో జిల్లా యంత్రాంగం వాహనాల రాకపోకలపై నిర్భంధం విధించింది. ఉత్తర కన్నడ జిల్లాలో ముంగారు వానలు భారీగా పడుతుండటంతో జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించారు. బెళగావి, కార్వార జిల్లాల్లో భారీ వానలు గోకాక్ తాలూకాలో గోడ కూలి వృద్ధుడి మృతి -
చెరువులో శవమై తేలిన విద్యార్థిని
దొడ్డబళ్లాపురం: పారామెడికల్ విద్యార్థిని చెరువులో శవమై తేలిన ఘటన చెన్నపట్టణ తాలూకా సింగరాజిపుర వద్ద చోటుచేసుకుంది. మద్దూరు తాలూకా అంబరహళ్లి గ్రామానికి చెందిన మహాలక్ష్మి(20) రామనగర ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ కాలేజీలో చదువుతోంది. గురువారం మధ్యాహ్నం నుంచి కనబడకుండా పోయింది. శుక్రవారం ఉదయం చెరువు గట్టుపై విద్యార్థిని ఐడీ కార్డు, బ్యాగ్ లభించాయి. పోలీసులు, అగ్నిమాపకదళం సిబ్బంది గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. ఆత్మహత్య చేసుకుందా? ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందిందా? అనే విషయం తెలియాల్సి ఉంది. అక్కూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. థగ్ లైఫ్ ప్రదర్శనపై 20న విచారణయశవంతపుర: బహుభాషా నటుడు కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమా ప్రదర్శనకు భద్రత కల్పించాలని కోరుతూ సినిమా నిర్మాణ సంస్థ రాజ్కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు. నటుడు కమల్హాసన్ తమిళ భాష నుంచి కన్నడ పుట్టినట్లు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో కన్నడ నాట థగ్ లైఫ్ సినిమా ప్రదర్శనకు భద్రత కల్పించాలని పిటిషన్ను దాఖలు చేసింది. పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి ఎం.నాగప్రసన్న మధ్యంతర పిటిషన్పై అభ్యంతరాలు దాఖలు చేయాలని కన్నడ సాహిత్య పరిషత్కు సూచిస్తూ విచారణను వాయిదా వేశారు. గురువారం కోర్టు ప్రారంభం కాగానే కసాప తరపున న్యాయవాది తన వాదనలను వినిపించారు. కమలహాసన్ ఇప్పటి వరకు క్షమాపణలు చెప్పలేదా? అని జడ్జి ప్రశ్నించగా దీనికి న్యాయవాది లేదని బదులిచ్చారు. సుప్రీంకోర్టు నోటీసులు థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో విడుదల చేయకుండా నిషేధించడాన్ని సవాల్ చేస్తూ చలనచిత్ర ప్రదర్శనకు అవకాశం కల్పించాలని కోరుతూ మహేశ్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కర్ణాటక ప్రభుత్వానికి, కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలికి శుక్రవారం సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. క్రిమినల్ కేసును రద్దు చేయలేం ● తేల్చి చెప్పిన కర్ణాటక హైకోర్టుయశవంతపుర: వివాహమైన తరువాత కూడా అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ, భరతనాట్య కళాకారిణి అయిన భార్యను వేధిస్తున్న భర్తపై క్రిమినల్ కేసును రద్దు చేయడానికి సాధ్యం కాదని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. వివరాలు..2022లో స్నేహితుడి ద్వారా పరిచయమైన వ్యక్తితో 2023 ఆగస్ట్లో ఆమెకు వివాహమైంది. ఏడాది కాలంలోనే దంపతుల మధ్య సంబంధం తెగిపోయింది. రాజీ ప్రయత్నాలు చేశారు. పెళ్లి అవ్వగానే భరతనాట్యం చేయవద్దని అత్తమామలు షరతు పెట్టారు. భర్త వేధింపులు తట్టుకోలేక మహిళ దూరంగా ఉంటోంది. చిత్రహింసలకు సంబంధించి వివాహిత ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై దాఖలైన క్రిమినల్ కేసును కొట్టి వేయాలని భర్త హైకోర్టుకు వెళ్లారు. ఈ కేసును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న విచారించారు. భార్యాభర్తల మధ్య వాట్సప్ సందేశాలను జడ్జి విని ఆశ్చర్యానికి గురయ్యారు. అశ్లీలమైన సందేశాలను చదవటానికి కూడా ఇబ్బందిగా ఉంటుందని జడ్జి నాగప్రసన్న పేర్కొన్నారు. అస్వభావిక లైంగిక క్రియకు భర్త డిమాండ్ చేయడమేగాకుండా భార్యకు పెట్టిన చిత్రహింస, చేసిన దాడిపై ఇచ్చిన డాక్టర్ సర్టిఫికెట్ను జడ్జి పరిశీలించారు. భర్త ద్వారా ఏడాది పాటు జరిగిన చిత్రహింసను జడ్జి ఆలకించి భార్యపై మానసిక, శారీరక హింసకు పాల్పడినందున ఈ కేసును ఇంకా విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. పిటిషనర్ కోరిన ప్రకారం కేసును రద్దు చేయడానికి వీలు కాదని తేల్చారు. కేసు తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేశారు. -
కన్నుల పండువగా కారుపౌర్ణమి
బళ్లారిటౌన్: తాలూకాలోని కొళగల్లు గ్రామంలో సంస్కృతీ వారసత్వాలకు ప్రతీకగా నిర్వహించే కారు పౌర్ణమి వేడుకలను బుధవారం రాత్రి కన్నుల పండువగా నిర్వహించారు. ప్రతి ఏటా సంప్రదాయబద్ధంగా గ్రామంలో వైభవంగా కారుపౌర్ణమి వేడుకలను నిర్వహించేవారు. గ్రామంలో రెండు వర్గాల మధ్య గతంలో ఘర్షణలు జరగడంతో ఏడాదిగా నిలిచిపోయిన వేడుకలను జిల్లా పోలీసు ఉన్నతాధికారుల జోక్యంతో గ్రామంలో శాంతిసభలు నిర్వహించి, భారీ పోలీసు బందోబస్తు మధ్య ఘనంగా జరిపారు. దాదాపు 250 మంది పోలీసులు, ఉన్నతాధికారులు పాల్గొని గ్రామంలో పోలీసు పరేడ్ చేశారు. ఈ క్రమంలో జిల్లాతో పాటు వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి ఈ వేడుకలను చూసి తరించారు. ఈసారి అందరి సహకారంతో అత్యంత ఘనంగా నిర్వహించడంతో గ్రామస్తుల్లో సంతోషం నెలకొంది. సప్త భజనలు, సంప్రదాయబద్ధంగా పూజలు ఏరువాక పౌర్ణమి సందర్భంగా వారం రోజులుగా లక్ష్మీ నరసింహ ఆలయం వద్ద సప్తభజనలను నిర్వహించారు. ప్రతి రోజు ఒక వర్గానికి చెందిన వారు భజనల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముగింపు రోజు పౌర్ణమి రాత్రి 21 ఎద్దులతో శివరామ అవధూత చిత్ర పటాన్ని ఊరేగిస్తారు. ఊరేగింపులో భజన, కోలాట, తోలుబొమ్మలాట బృందాలు, అనేక సాంస్కృతిక నృత్యాలు చేపడుతారు. ఈసారి ఎలాంటి లోటు లేకుండా ఈ పండుగను నిర్వహించారు. ఇందులో తొలి వరుసలో కట్టిన ఎద్దుకు ప్రాధాన్యత కల్పించి, ఒక వర్గానికి చెందిన ఎద్దును ముందు కట్టేందుకు నిర్వహించడం సంప్రదాయంగా చేశారు. అదే విధంగా పౌర్ణమి రోజున ఊరువాకిలి వద్ద ఎద్దుల పరుగు పందేలు నిర్వహించి గెలుపొందిన ఎద్దును పౌర్ణమి రోజు ఊరేగించారు. ప్రధాన వీధుల్లో గెలుపొందిన ఎద్దును ఊరేగించడం అందరినీ ఆకట్టుకుంది. ఏడాదిగా నిలిచిన వేడుకలు పోలీసు భద్రత మధ్య పండుగ శోభాయమానంగా ఊరేగింపు -
ఎడతెగని వానలు.. కష్టాల్లో ప్రజలు
హుబ్లీ: ధార్వాడ జిల్లాలో ఎడతెగని వానలతో జంట నగరాలతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బుధవారం రాత్రి జంట నగరాలతో పాటు జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. దీంతో రాత్రి 9 గంటల నుంచే హుబ్లీ హొసూరు నుంచి ఉణకల్లు చెరువు వరకు మోకాలి లోతున నీటి ప్రవాహంతో రాకపోకలు స్తంభించి పోయాయి. ముఖ్యంగా వాహనదారులతో పాటు ఆ ప్రాంతంలోని భూగర్భ దుకాణాల యజమానులు పడరాని పాట్లు పడ్డారు. నవలగుంద తాలూకా యమనూరు గ్రామ శివారులో ఓ తోట ఇంట్లో కుటుంబ సభ్యులు జల సంద్రంలో చిక్కుకున్నారు. బెణ్ణిహళ్ల వాగుకు వరద పోటెత్తడంతో ఇద్దరు పిల్లలు గల ఆ దంపతులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఎట్టకేలకు క్షేమంగా బయట పడ్డారు. బెణ్ణిహళ్ల నీరు హుబ్లీ తాలూకా ఇంగళహళ్లి గ్రామంలోకి వరదలా వచ్చింది. ఫలితంగా ఆ గ్రామానికి రోడ్డు సంధానం పూర్తిగా జలమయమైంది. పొలాల్లో వరద నీరు నిండిపోయింది. యమనూరు గ్రామంలో కూడా వరద నీటితో అక్కడి నివాసులు ఎన్నో ఇక్కట్లు పడ్డారు. పోటెత్తిన బెణ్ణిహళ్ల వాగు బెణ్ణిహళ్ల వాగు పరిధిలో వరద నీరు ఉన్నఫళంగా పెరిగిపోయింది. ధార్వాడ గ్రామీణతో పాటు హుబ్లీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ వానలు పడటంతో వాగులు, వంకలు, కుంటలు, చెరువులు అన్ని వర్షపు నీటితో నిండిపోయాయి. ధార్వాడ కసబాపేటె పోలీస్టేషన్ పరిధిలోని బెళగలి రోడ్డు పక్కన డ్రైనేజీ నీటిలో ఓ వ్యక్తి అదుపు తప్పి కొట్టుకుపోయాడు. అలాగే హుబ్లీ నేకార నగర్ ప్రాంతంలో కూడా బైక్ మీద వెళ్తున్న వ్యక్తి వరద నీటిలో పడి గల్లంతయ్యాడు. వీరి వివరాలు తెలియాల్సి ఉంది. ఉణకల్లు చెరువు నీటితో నిండిపోయింది. దీంతో చెరువు చుట్టుపక్కల వరద నీరు పోటెత్తింది. దీంతో అక్కడి నివాసులు నరకయాతన పడ్డారు. రెడ్ అలర్ట్ ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుంచే నిరంతరంగా వాహనాలతో అప్రమత్తత ప్రకటించారు. భద్రత దృష్ట్యా జిల్లాలోని అన్ని అంగన్వాడీ, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, పీయూసీ, డిగ్రీ కళాశాలలకు గురువారం సెలవును ప్రకటిస్తూ జిల్లాధికారిణి దివ్యప్రభు ఆదేశాలిచ్చారు. భారీ వర్షం.. రాకపోకలకు అంతరాయం రాయచూరు రూరల్: జిల్లాలో గురువారం భారీ వర్షం కురిసింది. ఎక్కడ చూసిన రోడ్లు బురదగుంటలుగా మారాయి. మూడు గంటల పాటు కురిసిన వానలకు మస్కి వద్ద చిక్క ఉద్బాళ వంతెనపై ట్రాక్టర్ ప్రయాణిస్తుండగా వరద ఉధృతి పెరిగింది. మాన్వి సమీపంలో వంతెనలో ఆర్టీసీ బస్సు దిగబడింది. రాయచూరు నుంచి దూర ప్రాంతా లకు వెళ్లే ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురయ్యారు. మూడు గంటల పాటు రాకపోకలు స్తంభించాయి. జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం నిండిపోయిన ఉణకల్లు చెరువు -
మౌలిక సౌకర్యాల కల్పనకు సూచన
రాయచూరు రూరల్: జిల్లా పరిశ్రమల కేంద్రంలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని విధాన పరిషత్ సభ్యుడు, ప్రభుత్వ హామీల అమలు సమితి అధ్యక్షుడు టీ.ఏ.శరవణ సూచించారు. నగరంలోని పరిశ్రమల కేంద్రంలో పర్యటించి అక్కడ సమస్యలపై సుదీర్ఘంగా గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్తో చర్చించారు. 15 రోజుల్లో పెండింగ్లోని సమస్యలను ఇంజినీర్లు, అధికారులు కలిసి పరిష్కరించాలన్నారు. 150కి పైగా పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. తాగునీటి సరఫరా, విద్యుత్ దీపాల అమరిక, మురుగు కాలువల నిర్మాణం చేపట్టాలన్నారు. రూ.120 కోట్లతో చేపట్టిన పరిశ్రమల కేంద్రం నిర్వీర్యమైందన్నారు. రసాయనిక పరిశ్రమల నుంచి విడుదల చేస్తున్న కలుషిత నీటి వల్ల ప్రజలకు రోగాలు వ్యాపిస్తున్నాయన్నారు. ఎమ్మెల్సీ వసంత కుమార్, జిల్లాధికారి నితీష్, సభ్యురాలు మహాలక్ష్మి పాల్గొన్నారు. నిరంతర పరిశోధనలు అవసరం ● బాగల్కోటె స్నాతకోత్సవంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ రాయచూరు రూరల్: నేటి అదునిక యుగంలో విద్యార్థులు ఉద్యోగాల కోసం కాకుండా ఇతర దేశాలతో పోటీ పడే విధంగా ఉద్యాన పంటల సాగుపై లోతైన పరిశోధనలు జరపాలని రాష్ట్ర గవర్నర్, చాన్సలర్ థావర్చంద్ గెహ్లాట్ పిలుపు ఇచ్చారు. బాగల్కోటె ఉద్యాన విశ్వవిద్యాలయం 14వ స్నాతకోత్సవాన్ని ఆయన ప్రారంభించి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. 25 ఏళ్ల నాటికి అమెరికా కంటే భారత్ పూలు, ఔషధాల ఉత్పత్తిలో ముందంజలో ఉండాలన్నారు. ఉద్యాన పంటల సాగు రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకొని అమెరికాను అధిగమించాలన్నారు. నేడు విద్యా రంగం కేవలం ఉద్యోగం కోసమే కాకుండా స్వయం ఉపాధికి తోడు నలుగురికి ఉపయోగ పడేలా జీవితాన్ని రూపొందించుకోని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు. ముఖ్య అతిథి హైదరాబాద్ అంతర్జాతీయ పంటల పరిశోధన సంస్థ డైరెక్టర్ హిమాంశు పాఠక్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను రైతులకు వివరించాలన్నారు. బీదర్ తోటల పెంపకంలో కళాశాల విద్యార్థిని సహనా పాటిల్కు 17, భీమవ్వకు 16 బంగారు పతకాలను అందించారు. సహనా పాటిల్ విజయనగర జిల్లా హూవిన హడగలి తాలూకా హొళలు గ్రామంలో టైలర్ కుమార్తె కాగా స్వర్ణ పతకాలు సాధించింది. భీమవ్వ కొప్పళ జిల్లా తళబాళ రైతు కుమార్తె కావడం అభినందనీయం అన్నారు. సమావేశంలో విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ విష్ణువర్దన్, రిజిస్ట్రార్ మహదేవ హెగ్డే, శాసన సభ్యుడు భీమసేన చిమ్మనకట్టి, హన్మంత నిరాణి, అరుణ, అధికారులున్నారు. -
అమోఘం.. ముంగారు కళా వైభవం
రాయచూరు రూరల్: మున్నూరు కాపు సమాజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముంగారు ఉత్సవాల్లో భాగంగా కళా వైభవం ప్రజలను ఆకట్టుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పంజాబ్ల నుంచి వచ్చిన కళా బృందాలు ప్రదర్శనలు చేశాయి. మున్నూరు కాపు సమాజం కుల దేవత మాతా మహాలక్ష్మి దేవిని, కాశీ జ్ఞాన సింహాసనాధీశ్వర పీఠాధిపతి జగద్గురు డాక్టర్ మల్లికార్జున విశ్వారాధ్య శివాచార్య భగవత్పాదులను ఊరేగించారు. తోలుబొమ్మలాట నృత్యం, మహిళలతో డోలు కుణిత, డప్పు వాయిస్తున్న కళాకారులు ఊరేగింపులో పాల్గొన్నారు. ఆకట్టుకున్న రాతి దూలం లాగే పోటీలు ముంగారు ఉత్సవాలు రైతులను సంబర పరిచి వారిలో ఉత్సాహాన్ని నింపుతాయని మాజీ శాసన సభ్యుడు పాపారెడ్డి అన్నారు. గురువారం ఏపీఎంసీ ఆవరణలో మున్నూరు కాపు సమాజం ముంగారు ఉత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎద్దులకు రెండున్నర టన్నుల బరువైన రాతి దూలం లాగే పోటీలను మహిళలతో కలిసి ప్రారంభించి ఆయన మాట్లాడారు. మున్నూరు కాపు ససమాజం ఐకమత్యంతో పోటీలు నిర్వహించడం హర్షణీయం అన్నారు. రైతుల జీవనాడి బసవణ్ణకు పూజలు చేయడం, ఊరేగించడం ఆనవాయితీ అన్నారు. మున్నూరు కాపు సమాజం అధ్యక్షుడు నరసారెడ్డి, తిమ్మారెడ్డి, శేఖర్రెడ్డి, శ్రీనివాసరెడ్డిలున్నారు. కళా బృందాల ప్రదర్శనలు అదుర్స్ ఊరేగింపులో పాల్గొన్న జగద్గురువులు -
సకాలంలో చికిత్సతో ప్రాణరక్షణ సాధ్యం
బళ్లారి రూరల్: ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు సోషల్ మీడియా కోసం ఫొటోలు తీయడానికి ప్రాధాన్యత ఇవ్వకుండా బాధితున్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చని సర్జన్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా కర్ణాటక శాఖ అధ్యక్షుడు డాక్టర్ శేఖప్ప మాళగిమని తెలిపారు. శస్త్రచికిత్స వైద్యుల వారోత్సవంలో భాగంగా గురువారం బీఎంసీఆర్సీ క్యాజువాలిటీ విభాగం ముందు ఏర్పాటు చేసిన జాగృతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గతంలో ఎక్కడైనా ప్రమాదం జరిగితే వెంటనే బాధితుల్ని ఆసుపత్రికి తరలించడానికి సాయపడేవారు. కాని నేడు మొబైల్లో ఫొటోలు తీస్తున్నారు. యూట్యూబ్ చానెల్స్ అయితే అప్డేటింగ్, లైక్ల కోసం సాయం చేయడం పక్కన పెట్టి లైవ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారన్నారు. ప్రమాద బాధితుడికి సరైన సమయానికి వైద్యం అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చన్నారు. అంబులెన్స్లకు దారి ఇవ్వడం సామాజిక సేవగా భావించాలన్నారు. ఇలాంటి సందేశాన్ని వైద్యవిద్యార్థులు నాటక రూపంలో ప్రజలకు విశదపరిచారు. కార్యక్రమంలో ప్రముఖ శస్త్రవైద్యులు డాక్టర్ వై.గురుబసవనగౌడ, డాక్టర్ మహేశ్ దేశాయి, డాక్టర్ రామరాజు, డాక్టర్ గడ్డి దివాకర్, డాక్టర్ రాజశేఖరగౌడ, డాక్టర్ విశ్వనాథ్, వైద్యవిద్యార్థులు పాల్గొన్నారు. -
పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరం
సాక్షి,బళ్లారి: ప్రతి ఒక్కరు తమ పిల్లలను చదివించాలని, బాలకార్మికులను పనిలో చేర్పించి వారిచే సంపాదన చేయించరాదని, చదువుతోనే అభివృద్ధి సాధ్యమని జిల్లా న్యాయమూర్తి రాజేష్ హొసమనె పేర్కొన్నారు. ఆయన గురువారం ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దేశంలో బాలకార్మిక పద్ధతికి ప్రత్యేక చట్టాలు చేసినా నేటికీ పేదరికం తాండవిస్తోందన్నారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల కోట్లాది మంది బాలకార్మికులుగా పని చేస్తుండటం శోచనీయం అన్నారు. భావిభారత పౌరులుగా ఎదగాల్సిన చిన్నారులతో పనులు చేయించుకోవడం నేరం అన్నారు. చదువు ద్వారానే అభివృద్ధి సాధ్యమన్నారు. చదువుకునే వయస్సులో పనులు చేయించకూడదన్నారు. బాలకార్మిక పద్ధతిని రూపుమాపేందుకు కేవలం ప్రభుత్వాలు ఒకటే కృషి చేస్తే చాలదన్నారు. అధికారులు, బాలల తల్లిదండ్రుల సహకారం పూర్తిగా అవసరం అన్నారు. 14 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారులకు ఉచితంగా విద్యనందించడానికి చట్టాలు ఉన్నాయన్నారు. వారిని తప్పకుండా బడికి పంపాలన్నారు. అంతకు ముందు విద్యార్థులతో జాతా నిర్వహించారు. అదనపు జిల్లాధికారి మహమ్మద్ జుబేర్, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. బాల కార్మికత నిర్మూలనపై జాగృతి జాతా రాయచూరు రూరల్: జిల్లాలో బాల కార్మికుల నియంత్రణకు బాల కార్మిక శాఖాధికారులు ముందుండాలని న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా ప్రాధికార కార్యదర్శి సాత్విక్ పేర్కొన్నారు. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద బాల కార్మిక నియంత్రణపై జాతాను ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో బాలలపై అధికంగా పని ఒత్తిడి పడుతోందన్నారు. దాని నివారణకు ప్రతి ఒక్కరూ శ్రమించాలన్నారు. జాతాలో పిల్లల సంరక్షణ మండలి జిల్లాధ్యక్షురాలు మంగళ, కమిషనర్ సిద్దలింగయ్య, బీఈఓ ఈరణ్ణ, బాల కార్మిక అధికారి హారతి, కార్మిక శాఖాధికారులు మంజునాథ్ రెడ్డి, అమరేష్లున్నారు. విద్యాభ్యాసం చిన్నారుల హక్కు న్యాయమూర్తి రాజేష్ హొసమనె -
సర్కారు రెండేళ్ల పాలనపై ప్రజలకు వివరించాలి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజలకు వివరించాలని లోక్సభ సభ్యుడు కుమార నాయక్ పేర్కొన్నారు. గురువారం నగర బస్టాండ్లో ఏర్పాటు చేసిన రెండేళ్ల పాలన సాధనలపై చిత్ర ప్రదర్శనను ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏడు కోట్ల మంది జీవితాలను మెరుగు పరచడానికి పంచ గ్యారెంటీలను అమలు చేసిందన్నారు. రెండేళ్లలో వ్యవసాయం, ఆరోగ్యం, మౌలిక సౌకర్యాలు, వసతి, అన్నదాతల్లో మందహాసం వంటి అంశాలపై సమాచారాన్ని ప్రజలకు తెలియ చేయడం కోసం ప్రచారం చేపట్టాలన్నారు. ఏపీఎంసీ అధ్యక్షుడు జయంతరావ్ పతంగి, ఆర్టీసీ అధికారి చంద్రశేఖర్, వార్త శాఖాధికారులు గవి సిద్దప్ప హొసమని, ప్రకాష్, లింగరాజ్, రమేష్, వెంకటేష్లున్నారు. రచయితలకు అవార్డుల ప్రదానం రాయచూరు రూరల్: జిల్లాలోని సిరవారలో రచయితలకు చుక్కి ప్రతిష్టాన అవార్డులు అందజేశారు. ఉమాపతి చుక్కి 49వ పుణ్యారాధన సందర్భంగా రచయితలు శాశ్వతయ్య స్వామి ముక్కుంద మఠ, సర్వమంగళ సక్రి, బాబు భండారిగల్లకు అవార్డులు అందించారు. కార్యక్రమంలో బెళగావి నగనూరు గురు బసవ మఠాధిపతి బసవ గీతా, నవల్కల్ అభినవ సోమనాథ శివాచార్య స్వామీజీ, చుక్కి ప్రతిష్టాన అధ్యక్షులు శివానంద, సభ్యులు శివకుమార్, మల్లికార్జున, పరమేశ్వర సాలిమట్, గిరిజా శంకర్లున్నారు. కక్ష సాధింపుతోనే ఈడీ దాడులు సాక్షి,బళ్లారి: నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి ఇల్లు, లోక్సభ సభ్యుడు తుకారాం, ఎమ్మెల్యేలు గణేష్, శ్రీనివాస్, నాగేంద్ర ఆప్తసహాయకుడు గోవర్దనరెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ సోదాలు చేయడం ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపుతోనే జరిగాయని, వీరందరూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కావడంతో బీజేపీ పెద్దలు తమ ప్రజాప్రతినిధులను ఈడీతో భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు నాసిర్ హుస్సేన్ పేర్కొన్నారు. ఆయన గురువారం నగరంలోని ఓ హోటల్లో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ సర్కారు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలపైనే టార్గెట్ చేసి దాడులు చేయించిందన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలను వాడుకుని తమ నేతలపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఈసందర్భంగా మేయర్ నందీష్, డీసీసీ అధ్యక్షులు అల్లం ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అధిక ఫీజుల వసూలు తగదు రాయచూరు రూరల్: ప్రైవేట్ పాఠశాలల్లో 2025–26వ విద్యా సంవత్సరంలో అధికంగా డొనేషన్లు, ఫీజులు వసూలు చేయడం తగదని దళిత విద్యార్థి పరిషత్ జిల్లా సంచాలకుడు మౌనేష్ పేర్కొన్నారు. గురువారం పాత్రికేయల భనవంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మధ్య తరగతి పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదవాలంటే రూ.లక్షల్లో డొనేషన్లు, వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నా జిల్లా, తాలూకా విద్యా శాఖాధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడాన్ని ఖండించారు. అధిక ఫీజులు వసూలు చేయరాదంటూ అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి రితీక్ కుమార్, కమిషనర్ కావేరిలకు లేఖలు రాసినట్లు తెలిపారు. బాలికపై లైంగిక దాడిహోసూరు: ఇంటి ముందు ఆటలాడుకొంటున్న బాలికను నిర్మానుష్య స్థలానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన కామాంధున్ని సింగారపేట పోలీసులు అరెస్ట్ చేశారు. క్రిష్ణగిరి జిల్లా సింగారపేట తీర్థగిరి ప్రాంతానికి చెందిన పదేళ్ల బాలిక అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. బుధవారం సాయంత్రం ఇంటి ముందు ఆటలాడుకొంటున్న బాలికను సింగారపేటకు చెందిన శరవణ్ చాక్లెట్ ఇస్తానని తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. బాలిక ఏడుస్తూ ఇంటికి చేరుకొని తల్లిదండ్రులతో మొరపెట్టుకొంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సింగారపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితున్ని అరెస్ట్ చేశారు. -
కొడుక్కి కత్తిపోట్లు, తల్లికి గుండెపోటు
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం తాలూకా పెరేసంద్ర పోలీస్ పరిధిలోని కోరరేనహళ్లి గ్రామంలో భూ వివాదంలో శివణ్ణ అనే వ్యక్తి నవీన్ను కత్తితో పొడిచాడు. ఈ రభసలో నవీన్ తల్లి మరణించింది. బుధవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. నవీన్ పాల డెయిరీకి పాలను తీసుకొని వెళుతున్న సమయంలో శివణ్ణ వెనుక నుంచి వచ్చి దాడి చేశాడు. నవీన్ గాయపడి పారిపోయి ఇంటిలో దాక్కొన్నాడు, అతని తల్లి యశోదమ్మ (58) కొడుకును కాపాడబోగా, ఆమె చిన్న కత్తిగాయమైంది. వెంటనే గుండెపోటుతో కుప్పకూలిపోయింది. గ్రామస్తులు ఇద్దరినీ చిక్కబళ్లాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా యశోదమ్మ మరణించింది. నవీన్కు ప్రథమ చికిత్స చేసి బెంగళూరుకు తరలించారు. నిందితుడు శివణ్ణ తప్పించుకొని పారిపోయాడు. పెరేసంద్ర పోలీసులు గాలిస్తున్నారు. గ్రామంలో గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాటైంది. ఆస్పత్రిలో మరణించిన మహిళ చిక్కబళ్లాపుర వద్ద విషాదం -
పసిమొగ్గలపై పైశాచికం
సాక్షి, బెంగళూరు: అభంశుభం తెలియని చిన్నారి బాలికల మీద కామాంధులు కన్నేస్తారు. అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వేధిస్తారు. వారూ వీరని ఇందుకు తేడా లేదు. ఇలా బాలికలకు భద్రత కరువవుతోంది. రాష్ట్రంలో పోక్సో కేసులు ఏటేటా పెరగడమే దీనికి నిదర్శనం. ఈ ఏడాది ఏప్రిల్ నెల వరకు ప్రతి రోజూ సగటున పది కేసులు నమోదయ్యాయి. లైంగికపరమైన నేరాల నుంచి పిల్లల రక్షించేందుకు, కామాంధులకు కఠిన శిక్షలు పడేందుకు గతంలో కేంద్రం పోక్సో చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ కామాంధులకు అడ్డుకట్ట పడుతోందా అన్నదే ప్రశ్న. 2021 నుంచి ఈ ఏప్రిల్ వరకు సుమారు 15,409 కేసులు కర్ణాటకలో నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతోంది. 2021లో 2,882 కేసులు వచ్చాయి. ఈ నాలుగేళ్లలో ఆ సంఖ్య 38.89 శాతం మేర పెరగడం గమనార్హం. కేసులు పెద్దసంఖ్యలో ఉంటే, శిక్షలు మాత్రం తక్కువగా ఉండడం నిందితులకు కలిసి వస్తోంది. బెంగళూరులో ఏదీ భద్రత? 2024 నుంచి 2025 ఏప్రిల్ వరకు బెంగళూరులో అత్యధికంగా 1,386 కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత మైసూరు 442, చిక్కబళ్లాపురలో 410, తుమకూరులో 362, శివమొగ్గలో 456, బెళగావిలో 335, మండ్యలో 311, హాసన్లో 322 కేసులతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఉత్తర కర్ణాటకలోని కొన్ని జిల్లాల్లో కేసుల సంఖ్య 100కు సమీపంలో ఉంది. దక్షిణ కర్ణాటక జిల్లాల్లో 150కి పైగా కేసులు నమోదు అవుతున్నట్లు పోలీసు గణాంకాలు చెబుతున్నాయి. శిక్షలు మాత్రం స్వల్పమే ఏటా కేసుల పెరుగుదల బాలికల భద్రతను సందేహాస్పదం చేస్తోంది. చిన్నారి బాలలపై కామాంధుల వేధింపుల పెరుగుదలకు ఇది అద్దం పడుతోంది. శిక్షలు మాత్రం ఆశించిన మేర ఖరారు కావడం లేదు. గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో 7,954 కేసుల్లో 130ల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి. అబద్ధపు కేసులు, ఇంకా పోలీసుల విచారణలో అలసత్వం, సాక్ష్యాల కొరత, చార్జ్షీట్లో లోపాల కారణంగా సుమారు 1,682 కేసుల్లో నిందితులు బయటకు వచ్చారు. మిగిలిన కేసులు న్యాయస్థానాల్లో విచారణ దశలో ఉన్నాయి. తెలిసివారే కీచకులు ప్రేమ పేరుతో బాలికలపై లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసుల దర్యాప్తుల్లో తేలింది. నిందితుల్లో ఎక్కువగా ఇరుగుపొరుగు వారు, పరిచయస్తులే ఉంటున్నారని పోలీసులు తెలిపారు. 100 కేసుల్లో సుమారు 80 శాతం కేసులు ఇదే తరహాలో ఉంటున్నాయని చెబుతున్నారు. కొన్ని కేసుల్లో నిందితులు పలుకుబడి ఉన్నవారు కావడం మూలాన బాధితులు పోరాడలేకపోతున్నారు. దీనివల్ల కూడా కేసులు తేలికగా వీగిపోతున్నాయి. అనేక వేధింపుల సంఘటనల్లో బాలికల తల్లిదండ్రులు భయపడి ఫిర్యాదు కూడా చేయరు. రక్షణ లేని చిన్నారి బాలలు రాష్ట్రంలో రోజుకు పది పోక్సో కేసులు నాలుగేళ్లలో 15,409 ఘటనల నమోదు -
లోకాయుక్తలో వసూల్ రాజాలు
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో అవినీతికి, లంచాలకు పాల్పడే అధికారులను గుర్తించి పట్టుకోవాల్సిన లోకాయుక్త అధికారులు.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వారే అక్రమాలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. కొందరు అధికారులు పలు శాఖల నుంచి పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్పడినట్లు బయటకు రావడం తీవ్ర సంచలనం కలిగిస్తోంది. రాష్ట్రంలో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఇద్దరు ఐపీఎస్ అధికారులు దళారులను పెట్టుకుని, ప్రభుత్వ అధికారులను బెదిరించేవారు. మీపై ఫిర్యాదులు వచ్చాయని, ఇళ్లపై దాడి చేస్తామని బెదిరించి అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలోని అధికారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. దళారీ నింగప్ప అరెస్టు ఇలా వసూలు చేసిన కోట్ల రూపాయలను బిట్ కాయిన్లో పెట్టుబడి పెట్టినట్టు సమాచారం. ఆ ఇద్దరు అధికారులపై సాక్ష్యాధారాలు లభించాయి. నింగప్ప అనే వ్యక్తిని లోకాయుక్త అధికారులు ట్రాప్ చేశారు. నింగప్ప ఇద్దరు అక్రమార్కుల సూచనల ప్రకారం ఎకై ్సజ్ డిపార్ట్మెంట్ అధికారుల వద్ద భారీగా డబ్బులు గుంజేవాడు. లోకాయుక్త ఎస్పీ శ్రీనాథ్ జోషితో నింగప్ప రోజూ టచ్లో ఉన్నట్టు ఆరోపణలొచ్చాయి. కోట్ల రూపాయలు వసూలు చేసి శ్రీనాథ్కు ఇస్తే, అందులో కొంత వాటా అతనికి దక్కేది. గుట్టు కాస్త రట్టు కావడంతో శ్రీనాథ్ జోషిని ఉన్నతాధికారులు ఇటీవల బదిలీ చేశారు. అక్రమ వసూళ్లకు సంబంధించి త్వరలో మరిన్ని నగ్న సత్యాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇద్దరు ఐపీఎస్లపై ఆరోపణలు పలు శాఖల అధికారుల నుంచి భారీగా ముడుపులు? -
ఎంతమంది బాలలు గాయపడ్డారు?
దొడ్డబళ్లాపురం/ బనశంకరి: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో చనిపోయిన, గాయపడిన బాలల వివరాలను అందించాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ గురువారం నోటీస్ జారీచేసింది. ఆర్సీబీ విజయోత్సవాల సమయంలో స్టేడియంలో చాలామంది పిల్లలు ఇబ్బందులకు గురైనట్లు తెలిసింది. సుమోటో గా కేసు నమోదు చేసిన బాలల హక్కుల కమిషన్ దీనిపై సమగ్ర సమాచారం అందించాలని నగర పోలీసులకు నోటీస్ జారీచేసింది. ఆ రోజు పెద్దఎత్తున పిల్లలు ఉండటంతో చాలామంది గాయపడినట్లు సమాచారం. హక్కుల కమిషన్కు లేఖ తొక్కిసలాటలో మృతిచెందిన, గాయపడిన కుటుంబాలకు న్యాయం చేయాలని బీజేపీ పక్ష నేత ఆర్ అశోక్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు లేఖ రాశారు. రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగింది, చిన్నస్వామి స్టేడియంలోకి 35 వేలమంది మాత్రమే వెళ్లవచ్చు. అయితే ఉచిత పాస్,అసత్య ప్రకటనల వల్ల లక్షలాదిగా జనం వచ్చారు. పోలీసులు, భద్రతా వ్యవస్థ కొరవడి దారుణం జరిగిందని ఆరోపించారు. ఆర్సీబీ ప్రతినిధులకు బెయిలు ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసలెకి హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. తొక్కిసలాట ఘటనలో పోలీసులు నిఖిల్ సోసలెను అరెస్టు చేశారు. ఈయనతో పాటు అరైస్టెన ఆర్సీబీకి చెందిన సునీల్ మ్యాథ్యూ, కిరణ్ కుమార్, శమంత్ మావినకెరెకు కూడా బెయిలు మంజూరు చేసింది. తొక్కిసలాట ఘటనపై బాలల కమిషన్ నోటీసులు -
చాముండేశ్వరి దర్శనానికి రూ.2 వేల టికెట్
మైసూరు: ఆషాడ మాసంలో నాడశక్తి దేవత చాముండేశ్వరి దేవి దర్శనానికి దే విదేశాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తారు. ఆ సమయంలో నేరుగా చాముండేశ్వరి దర్శనం త్వరగా కావాలని కోరుకునేవారికి రూ.2 వేల టికెట్ను కల్పించారు. గురువారం నగరంలోని జడ్పీలో ఆషాడ శుక్రవారం, చాముండేశ్వరి అమ్మవారి వేడుకల పూర్వ సిద్ధతా సమావేశం జరిగింది. ఆషాడ మాసంలో ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో తోపులాటను అరికట్టేందుకు, నేరుగా దర్శనం పొందగోరే వారి కోసం రూ.2 వేల టికెట్ తీసుకురావాలని, ఈ టికెట్దారులకు కుంకుమ, అమ్మవారి ఫోటోతో ఓ కానుక పెట్టెను కూడా ఇస్తామని మంత్రి హెచ్సీ మహదేవప్ప తెలిపారు. ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ, ఎమ్మెల్సీ యతీంద్ర, జిల్లాధికారి జీ.లక్ష్మీకాంతరెడ్డి, పోలీస్ కమిషనర్ సీమా లాట్కర్ పాల్గొన్నారు. -
కాంతార చిత్రనటుడు మృతి
శివమొగ్గ: హిట్ సినిమా కాంతార రెండవ భాగం పలు కారణాలతో వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే ఆ చిత్రంలో నటిస్తున్న హాస్య కళాకారుడు రాకేష్ పూజారి ఓ పెళ్లి వేడుకలో గుండెపోటుతో మరణించడం తెలిసిందే. తాజాగా ఆ చిత్ర నటుల్లో ఒకరు, కేరళ త్రిసూర్కు చెందిన మిమిక్రీ కళాకారుడు వీకే విజు గుండెపోటుతో కన్నుమూశారు. కాంతార రెండవభాగం చిత్రం షూటింగ్ తీర్థహళ్లి తాలూకా చుట్టుపక్కల జరుగుతోంది. ఆగుంబె సమీపంలోని యడూరులో ఉన్న హోం స్టేలో ఇటీవల చిత్రం యూనిట్ బస చేసింది. వారితో పాటు ఉన్న వీకే విజుకు బుధవారం రాత్రి ఎదలో నొప్పి వచ్చిందని చెప్పడంతో వెంటనే అతనిని తీర్థహళ్లిలోని ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో మరణించినట్లు తెలిసింది. మృతదేహాన్ని తీర్థహళ్లిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రపరిచారు. ఆ చిత్ర కథానాయకుడు రిషబ్ శెట్టి దర్శకత్వంలో షూటింగ్ ప్రారంభమైన తర్వాత ఏదో ఒక ఆటంకం జరుగుతూనే ఉంది. -
రాజధాని రోడ్ల సొగసు చూడతరమా?
బనశంకరి: ఐటీ బీటీ, సిలికాన్ సిటీగా ఖ్యాతి ఘడించిన బెంగళూరులో రహదారులు అద్దం మెరిసిపోతాయేమో అనుకుంటారు. ఆ స్థాయిలో లేకున్నా ప్రయాణానికి చక్కగా ఉంటాయని ఆశిస్తారు. కానీ వాస్తవం వేరుగా ఉంటుంది. ఎటుచూసినా గుంతలు తేలిన రోడ్లను చూస్తే ఎవరికై నా బాధ కలుగుతుంది. ఇలాంటి రోడ్లపై ఎలా ప్రయాణించాలని మథనపడతారు. వర్షాలు ఎక్కువైన తరువాత రోడ్ల గుంతలు కూడా పెరిగి నిత్యం ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వేసవిలో మరమ్మతులను పట్టించుకోక సమస్య పతాకస్థాయికి చేరిందని విమర్శలున్నాయి. రాజధానిలో అన్ని ప్రాంతాల్లో గుంతల రోడ్లు వాహనదారులకు ప్రాణసంకటంగా మారాయి. వానాకాలంలో సమస్య రోడ్ల గుంతలు వర్షాకాలంలో మరింత సమస్యగా మారతాయి. గుంతల్లో నీరు నిలిచి ఎక్కడ గొయ్యి ఉందో కనిపించక వాహనదారులు ప్రయాణిస్తూ కింద పడి గాయపడడం జరుగుతోంది. సీఎం సిద్దరామయ్య , డిప్యూటీసీఎం డీకే.శివకుమార్ 2024 సెప్టెంబరులో నగర పర్యటన చేసినప్పుడు గుంతల రోడ్లు అనేవి లేకుండా చూడాలని బీబీఎంపీ అధికారులను ఆదేశించారు. కొన్నిరోజులు హడావుడి చేసి తరువాత పట్టించుకోలేదు. బెంగళూరు నగరంలోని అన్ని వలయాల్లో వేలాది గుంతలు ఉన్నాయని పాలికె ఇంజనీర్లు తెలిపారు. 2024 సెప్టెంబరులో 16 వేల గుంతలను పూడ్చామని చెప్పారు. నిత్యం రోడ్ల మీద గుంతలు ఏర్పడుతుంటాయని అప్పటి బీబీఎంపీ కమిషనర్, ప్రస్తుత పాలికె పాలనాధికారి తుషార్ గిరినాథ్ చెప్పారు. కానీ గత ఆరునెలలుగా సమస్యను పట్టించుకోవడం లేదు. పూడ్చివేత చేపట్టాం: కమిషనర్ ప్రధాన రోడ్లు, మెయిన్ రోడ్లలో గోతుల్ని పూడుస్తున్నామని, యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని బీబీఎంపీ కమిషనర్ మహేశ్వర్రావ్ తెలిపారు. టెండర్లు కూడా ఆహ్వానించామని, కొద్దిరోజుల్లో గుంతలను పూడ్చడం పూర్తిచేస్తామన్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో వర్షం విరామం ఇచ్చిన సమయంలో పనులు చేపడతామన్నారు. హాట్ మిక్స్, కోల్డ్ మిక్స్ను సిద్ధం చేసుకోవాలని కాంట్రాక్టర్లకు సూచించామన్నారు. అత్యవసర సమయంలో వెట్మిక్స్ వేసి పూడ్చుతున్నట్లు చెప్పారు. ప్రధాన రోడ్లలో 647 గుంతలు ఉన్నాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారని, వీటితో పాటు రస్తగమన యాప్కు, పాలికె సహాయవాణికి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా గుంతలను 10 రోజుల్లో పూడ్చివేస్తామని చెప్పారు. గుంతలు ఏర్పడడం, పూడ్చడం నిరంతరం జరిగే పని అని రోడ్లు– సౌకర్యాల ఇంజినీర్ లోకేశ్ తెలిపారు. గుంతల దారులతో ప్రజల సతమతం వర్షాకాలంలో ప్రమాదాలకు పిలుపులు -
దేశానికి వెన్నెముక రైతన్న
రాయచూరు రూరల్: రైతులు దేశానికి వెన్నెముక లాంటివారని, పల్లె సీమలే పట్టుకొమ్మలని, ముంగారు ఉత్సవాలు సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణలో ప్రధానమని సుత్తూరు వీర సింహాసన మహా సంస్థాన పీఠాధిపతి శివరాత్రి దేశీకేంద్ర మహాస్వామీజీ, కాశీ జ్ఞాన సింహాసనాధీశ్వర పీఠాధిపతి జగద్గురు డాక్టర్ మల్లికార్జున విశ్వారాధ్య శివాచార్య భగవత్పాదులు పేర్కొన్నారు. బుధవారం నగరంలోని ఏపీఎంసీ ఆవరణలో మున్నూరు కాపు సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముంగారు ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఎద్దులకు రెండు టన్నుల రాతి దూలం లాగే పోటీలను ప్రారంభించి వారు మాట్లాడారు. రైతులకు మొదటి పండుగ ఏరువాక పున్నమి ఖరీఫ్ సీజన్లో రైతులు పొలంలో విత్తనాలు చల్లుకొని పంటలు బాగా పండాలని కోరుకుంటూ బసవణ్ణకు పూజలు చేయడం, వాటిని ఊరేగించడం ఆనవాయితీ అన్నారు. రైతులకు మొదటి పండుగ ఏరువాక పున్నమి అని, ఖరీఫ్ సీజన్లో రైతులు పొలాలను పదును చేసుకుంటారన్నారు. పోటీల్లో పది జతల ఎద్దులు పాల్గొన్నాయి. కార్యక్రమంలో వీరభద్ర శివాచార్య, అభినవ రాచోటి, శంభు సోమనాథ, బూది బసవ శివాచార్య, సిద్దలింగ శివాచార్య, మాజీ శాసన సభ్యులు పాపారెడ్డి, శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, మున్నూరు కాపు సమాజం అధ్యక్షుడు నరసారెడ్డి, శేఖర్ రెడ్డి, క్రీడా సహాయ కార్యదర్శి పుండ్ల రాజేంద్రరెడ్డి, శ్రీనివాస రెడ్డి, అమరేష్, కేశవరెడ్డిలున్నారు. ఉత్సవాలతో సంస్కృతి రక్షణ శివరాత్రి దేశీకేంద్ర మహాస్వామీజీ -
జూలై నుంచి స్కౌట్స్ గైడ్స్ పరీక్ష శిబిరాలు
హొసపేటె: తృతీయ సోపాన, తృతీయ చరణ్, సువర్ణ పంఖ్, నిపుణ తదితర స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రత్యేక పరీక్ష శిబిరాలు జూలై 3 నుంచి 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా సంస్థ కార్యదర్శి పీ.మంజునాథప్ప తెలిపారు. నగరంలోని జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రణాళిక కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాలూకా, జిల్లా స్థాయిలో జరిగే పరీక్ష శిబిరాల్లో అన్ని స్కౌట్స్ గైడ్స్ చురుకుగా పాల్గొనాలన్నారు. ఇప్పటికే బ్యాడ్జ్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. జిల్లా, తాలూకా స్థాయిలో జరిగే పరీక్షలకు పూర్తి జ్ఞానం ఉండేలా సంబంధిత కమిటీ నియమించిన ఎగ్జామినర్ల నుంచి ప్రావీణ్యత పతక ధృవీకరణ పత్రంతో పాటు జిల్లా పతకాలను పొందేలా పిల్లలను ప్రోత్సహించాలన్నారు. అదే సమయంలో రాష్ట్ర సంస్థ స్థానిక సంస్థలకు ఇచ్చే గ్రాంట్లకు సంబంధించిన ఖాతాలను వెంటనే జిల్లా సంస్థకు అందజేశారు. 2024–25వ సంవత్సరంలో గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీల నుంచి సేకరించిన సహకార సమాచారం వార్షిక నివేదిక, వేసవి శిబిరంలో పిల్లల జాబితా, రాష్ట్ర అవార్డుకు దరఖాస్తు చేసుకున్న పిల్లల జాబితా, మూడవ దశకు అర్హులైన స్కౌట్ల జాబితాతో సహా సమావేశానికి సమర్పించారు. సమావేశంలో ప్రణాళికా సంఘం సభ్యులు మంగళగౌరి, జీఎం రాజశేఖర్, షెరీనా, గీతాంజలి గౌడ, శ్రీనివాస్, జోషి, నాగభూషణ్, స్థానిక సంస్థల కార్యదర్శులు తిండప్ప, మాదేష్, ఎల్.మూర్తి, బన్నిగౌడ, తిప్పేస్వామి, దౌలానాయక్, కుమారస్వామి, జిల్లా ఆర్గనైజర్ జీబీసీ పాటిల్ పాల్గొన్నారు. -
తడిసి ముద్దయిన రాయల నగరి
హొసపేటె: అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. గత వారం నుంచి భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం ఏకధాటిగా భారీగా వర్షం కురిసింది. కొన్ని చోట్ల రోడ్లపైకి నీరు పొంగి ప్రవహించింది. నగరంలోని జెస్కాం కార్యాలయం ముందు వర్షానికి రహదారి బురదమయంగా మారడంతో ఉద్యోగులు, విద్యుత్ బిల్ కట్టేవారు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. మరికొన్ని రోజుల పాటు వర్గాల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షంతో రోడ్లు జలమయం -
ఆ రోజు ఏం జరిగింది?
బనశంకరి: ఈ నెలారంభంలో ఆర్సీబీ జట్టు సంబరాల సమయంలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద సంభవించిన తొక్కిసలాట దుర్ఘటనలో బెంగళూరు నగర జిల్లా కలెక్టర్ జగదీశ్ మెజస్టీరియల్ విచారణ కొనసాగుతోంది. బుధవారం 14 మంది క్షతగాత్రుల వాంగ్మూలం నమోదు చేశారు. తొక్కిసలాటలో 11 మంది చనిపోగా, 50 మందికి పైగా గాయపడడం తెలిసిందే. కలెక్టర్ పిలుపుతో కేజీ రోడ్డులోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పలువురు బాధితులు గాయాలతోనే వచ్చారు. ఆ రోజు ఏం జరిగింది అని ఒక్కొక్కరి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. స్టేడియం అంటే భయం మోనీశ్ అనే క్షతగాత్రుడు మాట్లాడుతూ.. కలెక్టర్ నోటీస్ ఇవ్వడంతో వచ్చానని, ఘటన గురించి ప్రశ్నలు అడగడంతో సమాధానం ఇచ్చానని తెలిపారు. దుర్ఘటనకు ఆర్సీబీ మేనేజ్మెంట్, రాష్ట్ర ప్రభుత్వం తప్పు ఉందని, ఒకేసారి రెండుచోట్ల కార్యక్రమం ఏర్పాటు చేయకుండా ఉండాల్సిందన్నారు. రెండురోజులు తరువాత వేడుకలు జరపాల్సిందన్నారు. విధానసౌధ వద్ద ఎక్కువమంది పోలీసులు ఉండగా, స్టేడియం వద్ద తక్కువ సంఖ్యలో నియమించారు. ఇకపై స్టేడియంలో మ్యాచ్ చూడాలంటే భయం వేస్తుందని వాపోయాడు. ముందుగా టికెట్లు ఇచ్చినట్లయితే ఈ దుర్ఘటన జరిగేది కాదని అన్నారు. మరోవైపు నూతన పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ చిన్నస్వామి స్టేడియాన్ని పరిశీలించారు. తొక్కిసలాటలు జరిగిన గేట్ల వద్దకు వెళ్లి సమాచారం సేకరించారు. తొక్కిసలాట క్షతగాత్రుల విచారణ -
అప్పుడు మోదీ రాజీనామా చేశారా: సీఎం సిద్దు
గౌరిబిదనూరు: బీజేపీ నాయకులకు అసత్య ప్రచారాలు చేయడం, రాజీనామాలు కోరడమే పని అని సీఎం సిద్దరామయ్య హేళన చేశారు. బుధవారం హనుమేనహళ్ళిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. విధానసౌధ ముందు ఆర్సీబీ విజయోత్సవానికి గవర్నర్ గెహ్లాట్ తమకు తాము రావడం అసత్యమని, నేను కార్యక్రమానికి వస్తూ ఉన్నాను, మీరు రావాల్సిందిగా నేను కోరగా గవర్నరు వచ్చారని తెలిపారు. కుంభమేళాలో 40–50 మంది చనిపోతే అక్కడి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజీనామాను బీజేపీ నేతలు ఎందుకు అడగలేదన్నారు. వంతెన ప్రారంభించిన రోజే కూలిపోయి 140 మంది మరణిస్తే ఎందుకు రాజీనామా చేయలేదన్నారు. గుజరాత్లో గోద్రా హత్యాకాండలో ఎంతమంది చనిపోయారు?, అప్పుడు సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ రాజీనామా చేశారా?, ఆక్సిజన్ అందక కరోనా రోగులు చనిపోతే బసవరాజ బొమ్మై రాజీనామా చేశారా అని విలేకరులను ప్రశ్నించారు. యడ్డి ఇంట పెళ్లి సందడి శివమొగ్గ: జిల్లాలోని శికారిపురలో బుధవారం సాయంత్రం బీజేపీ మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు, ఎంపీ బీవై రాఘవేంద్ర కుమారుడైన సుభాష్, శ్రవణ వివాహ రిసెప్షన్ అట్టహాసంగా జరిగింది. యడ్డి ప్రత్యర్థి కేఎస్ ఈశ్వరప్ప పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. యడియూరప్ప, పరివారం ఆయనను ఆత్మీయంగా పలకరించారు. ఈ పెళ్లికి ఈశ్వరప్ప వస్తారో రారో అంటూ అనే ఊహాగానాలు తొలగిపోయాయి. -
హైకోర్టు జడ్జి ప్రమాణం
శివాజీనగర: కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ పెరుగు శ్రీ సుధ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం రాజభవన్లో సభా మందిరంలో జరిగిన గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో సీఎం సిద్దరామయ్య హాజరై న్యాయమూర్తికి శుభాకాంక్షలు తెలిపారు. తల్లీ బిడ్డ ఆత్మహత్య● భర్త వేధింపులే కారణం మైసూరు: తల్లీబిడ్డలు ఉరివేసుకున్న స్థితిలో శవమై తేలారు. ఈ విషాద ఘటన జిల్లాలోని నంజనగూడు తాలూకా హుల్లహళ్లి పోలీసు స్టేషన్ పరిధిలోని కొత్తనహళ్లి గ్రామంలో జరిగింది. తల్లి మహదేవమ్మ (38), కుమార్తె సుప్రియ (20) ఉరి వేలాడుతూ కనిపించారు. వీరిద్దరి మృతికి భర్తే కారణమని గ్రామస్తులు ఆరోపించారు. భర్త జయరాం పరారీలో ఉన్నాడు. ఈ దంపతులకు సుప్రియ ఒక్కతే కూతురు. జయరాం తరచూ పుట్టించి నుంచి డబ్బులు తేవాలని భార్యను వేధించి గొడవ పడేవాడు. అతని ప్రవర్తనతో కూతురు కూడా విసిగిపోయింది. మహదేవమ్మ పలు మార్లు హుల్లహళ్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. పోలీసులు కూడా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. ఈ సమస్యలతో విసిగిపోయిన తల్లీ కూతురు ఉరి వేసుకున్నారని తెలిపారు. సైబర్ నిందితుడు మామూలోడు కాదు బనశంకరి: డిజిటల్ అరెస్ట్ పేరుతో ఇంజనీర్ నుంచి రూ.4.79 కోట్లు దోచే సిన కేసులో అరైస్టెన ఈశ్వర్సింగ్ తెలంగాణ రాష్ట్రంలో ఓ పెద్ద ప్రజాప్రతినిధి బంధువు అని ఆగ్నేయ విభాగం సైబర్ పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఈశ్వర్సింగ్ గతంలో హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి యత్నించాడు. క్యాసినో జూదానికి బానిసై రూ.25 లక్షలు పోగొట్టుకున్నాడు. పెద్దలు బుద్ధిమాటలు చెప్పినప్పటికీ క్యాసినో జూదాలను వీడకుండా మూడేళ్లలో శ్రీలంక కు 33 సార్లు వెళ్లి లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నట్లు సమాచారం. బెంగళూరులో బాధితుడు మంజునాథను పలు రకాలుగా బెదిరించి డిజిటల్ అరెస్టు చేసి రూ.4.79 కోట్ల నగదును ఖాతాల నుంచి మళ్లించి తన డ్రైవరు అకౌంట్కు జమ చేసుకున్నాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టి హైదరాబాద్ విమానాశ్రయంలో ఈశ్వర్సింగ్ ను, డ్రైవరును అరెస్ట్చేశారు. మిగిలిన కిలాడీల కోసం ఢిల్లీ, విశాఖపట్టణం, చైన్నెతో పాటు వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్నారు. బాధితుని నుంచి ఆస్తి పత్రాల్ని కూడా వంచకులు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. -
పాడ్ ట్యాక్సీ ఈసారైనా..?
సాక్షి బెంగళూరు: సిలికాన్ నగరంలో గమ్యం చేర్చడానికి బీఎంటీసీ బస్సులు, మెట్రో రైళ్లు ఉన్నాయి. ఇక ప్రైవేటుగా ఆటోలు, క్యాబ్లు సరేసరి. ఎన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ బెంగళూరు ట్రాఫిక్ మాత్రం పరిష్కారం కావడం లేదు. వాహన రద్దీని ఛేదించుకుని వెళ్లడం కష్టమైన పనే. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు చేస్తున్న మరో ప్రత్యామ్నాయ ఉపాయం.. పాడ్ ట్యాక్సీ లేదా ఎయిర్పాడ్ వ్యవస్థ. పలు యూరప్ సహా అభివృద్ధి చెందిన దేశాలలో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఏమిటీ ఎయిర్ పాడ్ ట్యాక్సీ? పాడ్ విధానం అనేది కారు సైజులో ఉంటే ఎలక్ట్రిక్ వాహనం.. ఇందులో డ్రైవర్ ఉండడు. నిర్ణీత ఎత్తులో ట్రాక్ మీద లేదా విద్యుత్ కేబుళ్లకు వేలాడుతూ వాహనం నడుస్తుంది. ట్యాక్సీ మాదిరిగానే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బుక్ చేసుకుని ప్రయాణించవచ్చు. రోడ్లు– ట్రాఫిక్ బెడద ఉండదు కాబట్టి సజావుగా వెళ్లిపోతుంది. ఒకేసారి 5 నుంచి 6 మంది ఒకేసారి ప్రయాణించవచ్చు. బెంగళూరులో ఉన్న వంతెనలు, మెట్రో రైలు వంతెనల కింద తీగలను, స్టేషన్లను ఏర్పాటు చేస్తే సరి. కొత్తగా భారీ నిర్మాణాల అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. కేంద్రం ఏం చెప్పింది ఈ పాడ్ ట్యాక్సీ సేవల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయనుంది. దేశంలోని బెంగళూరుతో పాటు వివిధ పెద్ద నగరాల్లో ఈ సేవలను తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. గాలిలో సంచరించే పాడ్ సిస్టమ్, చార్జింగ్ ఎలక్ట్రిక్ వాహనాలు త్వరలో భారత నగరాలకు రానున్నట్లు ప్రకటించారు. తొలుత ప్రయోగాత్మకంగా ఢిల్లీలోని ధౌలా కువాన్ నుంచి మనస్సర్కు పాడ్ ట్యాక్సీలను నడపనున్నట్లు ఆయన తెలిపారు. బెంగళూరులో ఈ సేవలపై అధ్యయనం చేస్తున్నట్లు గడ్కరీ పేర్కొన్నారు. వర్షాకాలంలో ట్రాఫిక్ రద్ధీ విపరీతంగా ఉంటుందని, పరిష్కారానికి ఈ కొత్త ప్రాజెక్టును అమలు చేయాలని చూస్తున్నట్లు తెలిపారు. కేంద్రం ప్రకటనతో బెంగళూరువాసుల ఆశలు ట్రాఫిక్ సమస్య లేని రవాణా వసతి 2017లోనే ప్రయత్నాలు ఈ పాడ్ ట్యాక్సీ సేవలను తీసుకొచ్చేందుకు బెంగళూరు నగరంలో 2017లోనే ప్రయత్నాలు జరిగాయి. అప్పటి బీబీఎంపీ కమిషనర్ ఎన్.మంజునాథ్ ప్రసాద్ పాడ్ ట్యాక్సీ పథకానికి టెండర్లు కూడా పిలిచారు. ఐఐఎస్సీ కూడా కొన్ని సిఫార్సులు చేసింది. అయితే పలు కారణాల వల్ల ప్రాజెక్టు ఆదిలోనే ఆగిపోయింది. ఇప్పటికై నా అమలైతే రవాణా రంగంలో మరో సౌలభ్యం లభిస్తుంది. -
ఈడీ మెరుపు దాడి
సాక్షి, బళ్లారి: కర్ణాటక మహిర్షి వాల్మీకి గిరిజన అభివృద్ధి మండలి కోట్లాది రూపాయల కుంభకోణంలో ఈడీ మరోసారి రంగంలోకి దిగింది. బళ్లారి ఎంపీ తుకారాంను బుధవారం ఉదయం ఆకస్మికంగా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని తీవ్ర విచారణ చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈడీ అధికారులు 8 బృందాలగా ఏర్పడి ఉమ్మడి బళ్లారి జిల్లాల పరిధిలో కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లు, ఆఫీసుల్లో ముమ్మరంగా సోదాలు సాగించారు. బళ్లారి నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డికి ఇంట్లోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. బళ్లారి నెహ్రు కాలనీలోని ఆయన నివాసంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు గాలింపు జరిగింది. అనేక పత్రాలు, కంప్యూటర్లు ఇతరత్రా సామగ్రిని స్వాధీనం చేసుకుని శోధించారు. ఎమ్మెల్యే భరత్రెడ్డి అక్కడే ఉన్నారు. ఈడీ అధికారులు ఇంటి గేట్లు, తలుపులు వేసి పకడ్బందీగా సోదాలు చేయడం గమనార్హం. ఎవరినీ లోపలికి రానివ్వలేదు. ల్యాప్టాప్లు స్వాధీనం సండూరులో ఎంపీ తుకారాం ఇల్లు, ఆఫీసులో ఏకకాలంలో సోదాలు చేశారు. ఆయనను అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. కూడ్లిగి ఎమ్మెల్యే శ్రీనివాస్ ఇంటికి రెండు కార్లలో ఈడీ అధికారులు, పోలీసులు, మహిళా పోలీసులు వచ్చి గాలింపు ప్రారంభించారు. అందరి ఇళ్లలో సోదాలు చేసి పలు రికార్డులు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. బళ్లారి రూరల్ ఎమ్మెల్యే నాగేంద్ర ఆప్త సహాయకుడు గోవర్దన్రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. దాడులపై ఆగ్రహం ఈడీ దాడులను కాంగ్రెస్ నాయకులు ఖండించారు. రాజకీయ కక్ష సాధింపుతో ఈడీని ప్రయోగించారని ఆరోపించారు. పలువురు కార్పొరేటర్లు ఎమ్మెల్యే ఇంటివద్దకు వచ్చారు. బీజేపీ దుష్ట రాజకీయాలు చేస్తోందన్నారు. ఏటా ఒకసారి ఈడీతో దాడులు చేయిస్తున్నారని, బీజేపీ నాయకుల ఇళ్లలో ఎందుకు సోదాలు చేయరని ప్రశ్నించారు. ఈడీ ఆకస్మిక దాడులు అధికార పార్టీలో గుబులు పుట్టించాయి. ఎప్పుడు తమ ఇంటి తలుపు తడతారో అనే ఆందోళన పలువురు ప్రజాప్రతినిధుల్లో నెలకొంది. హఠాత్తుగా ఎమ్మెల్యే ఇంటిపై.. హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్టి శ్రీనివాస్ ఇంటిలో ఈడీ సోదాలు జిల్లాలో చర్చనీయాంశమయ్యాయి. కూడ్లిగి తాలూకాలోని నరసింహ గిరిలోని శ్రీనివాస్ నివాసంలో ఈడీ దాడులు జరిగాయి. ముఖ్యమైన పత్రాల కోసం వెతికినట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు వాల్మీకి మండలి స్కాంలో ఎంతోమంది పేర్లు వచ్చాయి కానీ, శ్రీనివాస్ను ఎక్కడా ప్రస్తావించలేదు. శ్రీనివాస్ బెంగళూరులో ఉన్నారని, దాడుల గురించి తెలిసి బయల్దేరారని సమాచారం. బళ్లారి ఎంపీ, ఎమ్మెల్యే, కూడ్లిగి ఎమ్మెల్యే ఇళ్లపై ఈడీ దాడులు మాజీ మంత్రి నాగేంద్ర పీఏ ఇంటిలోనూ సోదాలు వాల్మీకి మండలి నిధుల స్కాంలో మరోసారి పంజా కాంగ్రెస్ వర్గాల్లో గుబులు మాజీ మంత్రి శ్రీరాములు నైతికత ఉంటే తప్పుకోండిశివాజీనగర: మహర్షి వాల్మీకి అభివృద్ధి మండలి సొమ్మును స్వాహాచేసిన బళ్లారి ఎంపీ వీవీ తుకారాం, ఎమ్మెల్యేలకు నైతిక బాధ్యత ఉంటే పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని బీజేపీ మాజీ మంత్రి బి.శ్రీరాములు డిమాండ్ చేశారు. బుధవారం విలేకరులతో మాట్లాడిన ఆయన, ఎస్టీల సంక్షేమం కోసం రిజర్వు చేసిన సొమ్మును ఎంపీ తుకారాం, ఎమ్మెల్యేలైన బీ.నాగేంద్ర, జే.ఎన్.గణేశ్, నారా భరత్రెడ్డి, శ్రీనివాసమూర్తి దోచుకొన్నది ఈడీ ఆధారాలతో రుజువైంది. వీరు ఏ నైతికతతో అధికారంలో కొనసాగుతారని మండిపడ్డారు. రాజీనామా చేయాలి, లేదా ఓటర్లకు డబ్బు పంపిణీ చేసిన ఆరోపణతో ఎన్నికల కమిషన్ వీరి సభ్యత్వాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మేం స్వచ్ఛమైనవారని వీరు చాలా మాట్లాడుతున్నారు అని కొన్ని సామెతలతో ఎద్దేవా చేశారు. సండూరు ఉప ఎన్నికల్లో నన్ను అంతం చేయాలనే కుట్రతో వాల్మీకి అభివృద్ధి మండలి సొమ్మును ఖర్చు చేశారన్నారు. గాలి జనార్ధనరెడ్డికి బెయిల్ రావడం గురించి ప్రస్తావించగా, దీని గురించి పూర్తిగా తెలుసుకొని మాట్లాడుతానన్నారు. కుల గణనకు సిద్దు సర్కారు కోట్లాది రూపాయల ఖర్చు చేశారని, మళ్లీ సర్వే చేస్తామని ఇప్పుడు చెబుతున్నారని ఆరోపించారు. -
లక్ష్మీనరసింహ జయంతి పూజలు
మైసూరు: నగరంలోని కాళిదాస రోడ్డులోని యదుగిరి యతిరాజ శాఖా మఠపు శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో సౌరమాన శ్రీలక్ష్మీ నరసింహ జయంతి, విశేష స్వాతిపూజ నిర్వహించారు. ఉదయం నుంచే స్వామి వారికి ప్రత్యేక అభిషేకం, అలంకారం, మహా మంగళ హారతి, శాత్తుమొరై తదితర క్రతువులను నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ పూజా కై ంకర్యంలో ఎమ్మెల్యే టీఎస్ శ్రీవత్స పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థానం సీఈఓ కేఆర్ యోగనరసింహన్, పురోహితుడు వీరరాఘవన్ ఉన్నారు.సీఎం మార్పు ఉండదు ● మంత్రి మహదేవప్ప మైసూరు: సీఎం కుర్చీ గట్టిగా ఉంది, దానిపై కూర్చొన్నవారు కూడా చాలా గట్టిగా ఉన్నారు. అందువల్ల సీఎం మార్పు ఊహాగానమేనని సీఎం ఆప్తుడు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్సీ మహదేవప్ప అన్నారు. బుధవారం మైసూరు జడ్పీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నవంబర్లో సీఎం మార్పు అనేది ఊహాగానమేనని, ఐదేళ్ల పాటు సిద్దరామయ్యే ముఖ్యమంత్రిగా కొనసాగుతారన్నారు. బళ్లారిలో కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ దాడి పై స్పందిస్తూ దర్యాప్తు సంస్థలకు దాడి జరిపేందుకు రాజ్యాంగంలో అవకాశం ఉందన్నారు. ఈడీకి ఫిర్యాదు వెళ్లి ఉంటుందని, అందుకే దాడి జరిగి ఉంటుందన్నారు. గత సంవత్సరం మైసూరు దసరా ఖర్చుల వివరాలను జిల్లా అధికారులు సమర్పించలేదని, వెంటనే అందజేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించానని చెప్పారు. మంత్రివర్గ విస్తరణ అనేది హైకమాండ్ చూస్తుందన్నారు.కై వారంలో పౌర్ణమి పూజలు చింతామణి: తాలూకాలోని కైవార సద్గురు యోగి నారేయణస్వామి మఠంలో జేష్టమాస పౌర్ణమి సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలను నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత అమర నారేయణస్వామి, సద్గురు తాతయ్య ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపి తేరులో ఊరేగించారు. నాద సుధారస వేదికపైన గాయకుల సంకీర్తనలు భక్తులను అలరించాయి. -
అక్కమహాదేవి వర్సిటీ మాయాజాలం
రాయచూరు రూరల్ : ఉత్తర కర్ణాటకలో పేరొందిన అక్కమహాదేవి మహిళా విశ్వవిద్యాలయం పరిధిలో మూతపడిన కళాశాలకు పరీక్ష కేంద్రం మంజూరైంది. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ విశ్వవిద్యాలయం విషయంలో రాష్ట్ర సర్కార్, రిజిస్ట్రార్ చంద్రశేఖర్ కుట్రలు అధికమయ్యాయి. విద్యార్థుల ప్రవేశాలు లేకుండా రెండేళ్లుగా మూతబడ్డ కళాశాలకు పరీక్ష కేంద్రం మంజూరు చేసిన విషయం బట్టబయలైంది. అక్కమహాదేవి మహిళా విశ్వ విద్యాలయం పరిధిలో 2024–25వ సంవత్సరంలో 119 మహిళా కళాశాలలున్నాయి. బుధవారం నుంచి డిగ్రీలో 2, 4, 6వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల సమయంలో ఇన్విజిలేటర్ల నియామకాల్లో రిజిస్ట్రార్ చంద్రశేఖరయ్య తనకు అనుకూలమైన వారిని నియమించుకున్నారు. 119 మంది కళాశాలల్లో మూతబడ్డ దేవదుర్గ, యాదగిరి కళాశాలలకు ఇన్విజిలేటర్లను నియమించారు. 15 రోజుల పాటు పరీక్షలు జరుగుతాయి. యాదగిరిలో టీఎస్ఎం డిగ్రీ మహిళా కళాశాల మూతబడి రెండేళ్లయింది. దేవదుర్గలో జే.జే.డిగ్రీ మహిళా కళాశాలలో విద్యార్థినులు తక్కువగా ఉన్నందున కళాశాలకు రిజిస్ట్రార్ చంద్రశేఖరయ్య ప్రశ్న పత్రాలు, జవాబు పత్రాలు, స్క్వాడ్లు, ఇన్విజిలేటర్లను నియమించారు. రిజిస్ట్రార్పై చర్యలు తీసుకుంటాం: శాంతాదేవి అక్క మహాదేవి మహిళా విశ్వ విద్యాలయం పరిధిలో మూతబడ్డ కళాశాలకు పరీక్ష కేంద్రాల మంజూరు విషయంలో రిజిస్ట్రార్ చంద్రశేఖరయ్యపై చర్యలు తీసుకుంటామని అక్క మహాదేవి మహిళా విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ శాంతాదేవి వివరించారు. పరీక్ష కేంద్రాలను కేటాయించిన అంశం తన దృష్టికి వచ్చిందని, కళాశాలలు మూతబడ్డ విషయంపై సమగ్ర విచారణ చేస్తామన్నారు. మూతబడ్డ కళాశాలకు పరీక్ష కేంద్రం మంజూరా? యాదగిరిలో రెండేళ్ల క్రితం టీఎస్ఎం డిగ్రీ మహిళా కళాశాలను మూసి వేశామని, విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లు చేరకపోవడంతో మూసివేశామని శాసన సభ్యుడు చెన్నారెడ్డి పాటిల్ తన్నూర తెలిపారు. మూతబడ్డ కళాశాలకు పరీక్ష కేంద్రం మంజూరైందని తెలిసి ఆశ్చర్యానికి గురయ్యామన్నారు. మూతబడ్డ కళాశాలకు పరీక్ష కేంద్రం మంజూరు విజయపురలోని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ లీల -
సీఎం, డీసీఎంలపై చర్యలేవీ?
హుబ్లీ: సీఎం, డీసీఎంలపై చర్యలు తీసుకోకుండా ఉదాసీనత చూపిన కాంగ్రెస్ హైకమాండ్పై మాజీ సీఎం, బెళగావి ఎంపీ జగదీశ్ శెట్టర్ మండిపడ్డారు. ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. వీరిద్దరిపై చర్యలు తీసుకొనే సత్తా హైకమాండ్కు లేదన్నారు. వారిని మొక్కుబడిగా ఢిల్లీకి పిలిపించి వారిని తిరిగి పంపించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం, డీసీఎంలను ఏటీఎంల మాదిరిగా వాడుకుంటోందన్నారు. వీరిద్దరి నుంచి సొమ్ములు వసూలు చేసుకొని పంపిస్తున్నారని ధ్వజమెత్తారు. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగి 3 గంటలైనా ప్రభుత్వం దృష్టికి తేలేదన్నారు. అధికారులపై సీఎంకు ఎంత మేర అదుపు ఉందో దీనిని బట్టే అర్థమవుతోందన్నారు. మొత్తానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, లేదో తెలియడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. బస్టాండ్కు వీల్ చైర్ల వితరణ హొసపేటె: ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ విజయనగర జిల్లా శాఖ ద్వారా బస్టాండ్కు వీల్ చైర్లు, ప్రథమ చికిత్స కిట్లు, మాస్క్లను విరాళంగా ఇచ్చారు. బుధవారం బస్టాండ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో రెడ్క్రాస్ సంస్థ చైర్మన్ రవిశంకర్ మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనేక ప్రజా సేవ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా సామాజిక దృక్పథంతో పని చేస్తోందన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్, ఆరోగ్య పరీక్షలు, రక్తదాన శిబిరాలను విజయవంతంగా నిర్వహిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాల ద్వారా సమాజానికి సేవ చేస్తుందని హామీ ఇచ్చారు. బస్టాండ్కు వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులకు వీల్ చైర్లు ఎంతో ఉపయోగపడతాయని రెడ్ క్రాస్ సొసైటీని కళ్యాణ కర్ణాటక ఆర్టీసీ డివిజనల్ కంట్రోలర్ తిమ్మారెడ్డి అభినందించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖ ప్రకాష్, రాష్ట్ర శాఖ సభ్యురాలు అన్నపూర్ణ సదాశివ, అబ్దుల్ రెహ్మాన్, యమున, అశ్విని, సిబ్బంది పాల్గొన్నారు. స్క్యాన్ కోడ్తో ప్రజా సమస్యలకు చెక్ రాయచూరు రూరల్: స్క్యాన్ కోడ్తో జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం సాధ్యమని ఎస్పీ పుట్టమాదయ్య తెలిపారు. మంగళవారం సదర్ బజార్ పోలీస్ స్టేషన్ కార్యాలయం వద్ద స్క్యాన్ కోడ్ను ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా స్క్యాన్ కోడ్ను రూపొందించామన్నారు. కుటుంబ కలహాలు, నాగరికులు, వృద్ధులు, మహిళలు, యువకులు స్క్యాన్ కోడ్లో సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం కల్పించామన్నారు. డీఎస్పీ శాంతవీర, సీఐ ఉమేష్ కాంబ్లే, ఇతర పోలీస్ అధికారులున్నారు. రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి హుబ్లీ: జిల్లాలోని అణ్ణిగేరి సమీపంలోని ఇంగళహళ్లి క్రాస్ రోడ్డు పక్కన నిలిపిన లారీని కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో దంపతులు మరణించిన ఘటన జరిగింది. అణ్ణిగేరి నివాసి జలీల్ అహ్మద్ తన భార్య షబానా బేగం(35)తో కలిసి వ్యక్తిగత పని మీద హుబ్లీ వెళ్లారు. తిరిగి హుబ్లీ నుంచి అణ్ణిగేరికి కారులో వెళుతున్న వేళ ఈ ప్రమాదం జరిగింది. దీంతో నిండు గర్భిణి అయిన షబానా అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన జలీల్ అహ్మద్(40) చికిత్స పొందుతూ కేఎంసీ ఆస్పత్రిలో మృతి చెందాడు. కాగా ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా ఈ వీరిద్దరి మృతదేహాలను ఊళ్లోకి తేవడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ప్రమాదంపై హుబ్లీ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సస్పెన్షన్ను విరమించుకోవాలి రాయచూరు రూరల్: రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కరవే డిమాండ్ చేసింది. బుధవారం సిరవార తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు రాఘవేంద్ర మాట్లాడారు. ఈ నెల 8న బెంగళూరు చిన్నస్వామి క్రీడా మైదానంలో జరిగిన ఆర్సీబీ విజయోత్సవ వేడుకలో తొక్కిసలాటకు పోలీస్ కమిషనర్ దయానందను బాధ్యుడంటూ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని తప్పుబట్టారు. ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ఆదేశాలను ఉపసంహరించుకోవాలంటూ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు తహస్లీదార్ ద్వారా వినతిపత్రం సమర్పించారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
బళ్లారి రూరల్ : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత కావాలని బీఎంసీఆర్సీ డీన్ డాక్టర్ గంగాధరగౌడ తెలిపారు. బుధవారం బీఎంసీఆర్సీ ఆవరణలో అఖిల భారత శస్త్రవైద్యుల వారోత్సవం, మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కాలుష్యం విపరీతంగా పెరుగుతున్న నేటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిరక్షించుకొనే బాధ్యతను స్వీకరించాలన్నారు. పర్యావరణ పరిరక్షణపై విస్తృతంగా జాగృతి కార్యక్రమాలను చేపట్టాలన్నారు. కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. ఏఎస్ఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ గడ్డి దివాకర్, కోశాధికారి డాక్టర్ వై.గురుబసవనగౌడ, బళ్లారి శాఖ అధ్యక్షుడు డాక్టర్ శేఖప్ప మాళగిమని, ప్రముఖ శస్త్రవైద్యులు డాక్టర్ అరుణ్ ఎస్.కె, డాక్టర్ అరుణ కామినేని, డాక్టర్ కాసా సోమశేఖర్, డాక్టర్ సోమేశ్వర గడ్డి, డాక్టర్ అరవింద్ పాటిల్, బీఎంసీఆర్సీ సూపరింటెండెంట్ డాక్టర్ ఇందుమతి, జూనియర్ వైద్యులు పాల్గొన్నారు. -
కార్మికుల భద్రత ప్రధానం
రాయచూరు రూరల్: జిల్లాలోని హట్టి బంగారు గనుల కంపెనీలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల భద్రత సంస్థకు ప్రధానమని విధాన పరిషత్ సభ్యుడు, ప్రభుత్వ హామీల అమలు సమితి అధ్యక్షుడు టీఏ.శరవణ పేర్కొన్నారు. బుధవారం హట్టి బంగారు గనుల కంపెనీలో పర్యటించి అక్కడ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. అక్కడ జరుగుతున్న బంగారు నిక్షేపాల తవ్వకం గురించి తెలుసుకున్నారు. ఏటా 1600 కేజీల బంగారాన్ని ఉత్పత్తి చేసే కంపెనీలో కార్మికులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. ఆస్పత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఆయన వెంట శాసన సభ్యులు నిరాణి, హన్మంతప్ప రుద్రప్ప, ప్రతాప్ సింహ నాయక్, అరుణ్, నవీన్, మంజునాథ్, తిప్పణప్ప కమకనూరు, మహాలక్ష్మి, డీసీ నితీష్, అధికారిణి శిల్ప, రామప్ప, ఇతర పోలీస్ అధికారులున్నారు. -
ఉన్నత విద్యకు పెద్ద పీట వేయాలి
రాయచూరు రూరల్: విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విధాన పరిషత్ సభ్యుడు వసంత్ కుమార్, శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ పేర్కొన్నారు. బుధవారం ప్రైవేట్ భవనంలో అంజుమన్ ఇ రజా ఆధ్వర్యంలో మైనార్టీ సమాజానికి చెందిన ప్రతిభావంత విద్యార్థులకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను సన్మానించి మాట్లాడారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. నేడు విద్యా రంగానికి ఉన్న ప్రాధాన్యత ఏ రంగానికీ లేదన్నారు. సమాజానికి ఉత్తమ సేవలందించిన దస్తగిరిని అభినందించారు. కార్యక్రమంలో సమాజం అధ్యక్షుడు రజాక్ ఉస్తాద్, సయ్యద్ తారిక్ హసన్, నూర్ మహ్మద్, అస్లాం పాషా, ఇక్బాల్, అబ్దుల్ కరీం, ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున గౌడ, ఉపాధ్యక్షుడు బషీరుద్దీన్, అక్బర్ తదితరులున్నారు. వైభవంగా పల్లకీ సేవ రాయచూరు రూరల్: నగరంలో ఏరువాక పున్నమి సందర్భంగా ఆలయాలకు భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. బుధవారం నగరంలో కందగడ్డ మారెమ్మ ఆలయం వద్ద భక్తుల రద్దీ కనిపించింది. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి గొర్రెలు, మేకపోతులను బలి ఇవ్వడానికి తీసుకొచ్చారు. కుంభ కలశాలతో ముత్తైదువులు పల్లకీ సేవ ఊరేగింపులో పాల్గొని దీపాలను వెలిగించారు. జింకలను వేటాడి.. చర్మాన్ని వలిచి ● పరారైన దుండగులు హుబ్లీ: జిల్లాలోని కుందగోళ తాలూకా గురివినహళ్లి గ్రామం అడవయ్య కుబిహాళ వద్ద పొలంలో మంగళవారం రాత్రి దుండగులు రెండు జింకలను వేటాడి చర్మం వలుచుకొని పరారయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఇది జింకల చర్మం కోసమే చేసిన అకృత్యం అని తేల్చారు. ఈ ప్రాంతంలో చిరుతలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని, వాటిని రక్షించాలని, అడవి జంతువుల నుంచి పంటల రక్షణకు అటవీ శాఖ చర్యలు తీసుకోవాలని గురివినహళ్లి గ్రామ పంచాయతీ అధ్యక్షుడు మంజునాథ విజ్ఞప్తి చేశారు. కాగా ఈ ఘటనపై ఆర్ఎఫ్ఓతో మాట్లాడానని, ఘటనను పరిశీలించి కేసు దాఖలు చేయాలని కుందగోళ తహసీల్దార్ మావర్కర్ తెలిపారు. కొండచిలువ పట్టివేత అలాగే మరో ఘటనలో చెరుకు తోటలో 12 అడుగుల కొండ చిలువను అటవీ సిబ్బంది పట్టుకున్నారు. ధార్వాడ తాలూకా బణదూరు సమీపంలోని హళియాళ మార్గంలో చెరుకు తోటలో ఓ పెద్ద కొండ చిలువను పట్టుకున్నారు. ఈ కొండ చిలువను చూసిన రైతు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అటవీ సిబ్బంది, ఉరగ సంరక్షకుడు సోమశేఖర్ కార్యాచరణ చేపట్టి కొండ చిలువను పట్టి అడవిలోకి వదిలారు. కొండ చిలువ అడవి నుంచి పొలం వైపునకు వచ్చింది. సుమారు 30 కేజీల బరువు, 12 అడుగుల పొడవు ఉన్న దీన్ని ఓ సంచిలో నింపుకొని అడవిలోకి తీసుకెళ్లి వదిలి వేసినట్లు డీఆర్ఎఫ్ఓ యూసుఫ్ బండారి ఓ ప్రకటనలో తెలిపారు. మానవుడు ధర్మమార్గంలో పయనించాలి రాయచూరు రూరల్: మానవుడు అరిషడ్ వర్గాలను త్యజించి ధర్మ మార్గంలో ప్రయాణించాలని ఆచార్య భగవంత 1008 పార్శ్వ చంద్రజీ పేర్కొన్నారు. రాయచూరుకు చెందిన పారిశ్రామికవేత్త దిలీప్ కుమార్ దోఖాకు సన్యాసాశ్రమ దీక్షను ఇచ్చి బోధనలు చేశారు. మానవుడి జీవితం కామ, క్రోధ, మోహ, లోభ, మధ, మాత్సర్యాల నుంచి విముక్తి పొందాలన్నారు. సమాజంలో ధర్మ సందేశాలను చాటి ప్రజల్లో హిందూ ధర్మ రక్షణకు నడుం బిగించాలన్నారు. లౌకిక సౌఖ్య సుఖ భోగాలను త్యజించాలన్నారు. కార్యక్రమంలో వర్దమాన స్థానికవాసి జైన్ శ్రావక సంఘ్ పరిత్యాగి డాక్టర్ శ్రుత నిధిజి, అధ్యక్షుడు శాంతిలాల్, విశ్వ కుమార్, ప్రసన్న చంద్, నరేంద్ర, గౌతం జియా, అశోక్ కుమార్ జైన్లున్నారు. -
కోట్ల ఆస్తిని త్యజించి.. సన్యాస దీక్ష స్వీకరించి
● నగరంలో పారిశ్రామికవేత్త భారీ ఊరేగింపు రాయచూరు రూరల్: కోట్లకు పడగలెత్తి యావదాస్తిని వదిలి ఓ పారిశ్రామికవేత్త సన్యాసాశ్రమం తీసుకొని దీక్షకు పూనుకున్న ఘటన కల్యాణ కర్ణాటకలోని రాయచూరులో చోటు చేసుకుంది. ఇటీవల యాదగిరిలో 26 ఏళ్ల నిఖిత అనే యువతి దీక్ష స్వీకరించి రెండు నెలలు గడవకముందే తాజాగా రాయచూరు చెందిన దిలీప్ కుమార్ దోఖా(58) కూడా భార్య లీలాబాయి, ముగ్గురు కుమార్తెలను వదిలి సన్యాస దీక్ష పొందారు. 12 ఏళ్ల పాటు అమెరికాలో మందుల ఉత్పత్తి వ్యాపారాలు చేశారు. బెంగళూరులో భారీగా ఆస్తులు సంపాందించారు. 14 ఏళ్ల ప్రాయంలోనే లౌకిక సౌఖ్య సుఖ భోగాలను వీడడానికి నిశ్చయించుకున్న తరుణంలో పెద్దలు అంగీకరించక పోవడంతో నాడు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. మంగళవారం వివిధ ప్రాంతాల్లో దోఖాను పెద్ద ఎత్తున ఊరేగించారు. ఈ సందర్భంగా వర్ధమాన స్థానిక నివాసి, జైన్ సేవక సంఘ్ పరిత్యాగి డాక్టర్ శ్రుత నిధిజీ, అధ్యక్షుడు శాంతిలాల్, విశ్వ కుమార్, ప్రసన్న చంద్, నరేంద్ర, గౌతం జియా, అశోక్ కుమార్ జైన్లున్నారు. -
మోదీ పాలన సువర్ణాధ్యాయం
సాక్షి,బళ్లారి: 2014లో భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నరేంద్ర మోదీ వరుసగా మూడుసార్లు దేశ ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత 11 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నారని, ఈ 11 ఏళ్ల మోదీ పాలన దేశంలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని మాజీ మంత్రి శ్రీరాములు పేర్కొన్నారు. ఆయన మంగళవారం నగరంలోని మోకా రోడ్డులోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అత్యంత మంచి పాలన మోదీ అందించారన్నారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలిస్తున్నారని కొనియాడారు. నెహ్రు, ఇందిరాగాంధీ ఇద్దరూ కుటుంబ పాలన సాగించారని ఆరోపించారు. ఆర్టికల్–370 రద్దు చారిత్రాత్మకం ప్రధాని మోదీ పాలనలో జమ్ముకశ్మీర్లో ఆర్టికల్– 370ను రద్దు చారిత్రాత్మకం. ఉగ్రవాదం అణిచివేత, పేదరిక నిర్మూలన, జాతీయ రహదారులు, ప్రాజెక్టుల నిర్మాణం ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సువర్ణయుగంగా పాలన సాగిస్తున్నారన్నారు. 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనకు, బీజేపీ అఽధికారంలో ఉన్న 11 ఏళ్ల పాలనకు ఎంతో తేడా ఉందని కొనియాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు గాలి సోమశేఖరరెడ్డి, సోమలింగప్ప, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్ కుమార్ మోకా, బీజేపీ నాయకులు గుత్తిగనూరు విరుపాక్షిగౌడ, కే.ఎస్.దివాకర్, హనుమంతప్ప, కార్పొరేటర్ మోత్కూరు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెహ్రు, ఇందిరలది కుటుంబ పాలన దేశాభివృద్ధిలో మోదీ పాత్ర కీలకం కూకటివేళ్లతో ఉగ్రవాద నిర్మూలన మాజీ మంత్రి శ్రీరాములు వెల్లడి -
గ్రామీణ సంస్కృతికి ప్రతిబింబం.. ముంగారు ఉత్సవం
రాయచూరు రూరల్: గ్రామీణ సంస్కృతిని మరిపించే విధంగా ముంగారు ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, నగర శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని ఏపీఎంసీ ఆవరణలో మున్నూరు కాపు సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముంగారు ఉత్సవాల్లో భాగంగా కర్ణాటక ఎద్దులకు నిర్వహించిన ఒకటిన్నర టన్నుల రాతి దూలం లాగే పోటీలను ప్రారంభించి మాట్లాడారు. మాజీ శాసన సభ్యుడు, మున్నూరు కాపు సమాజం అధ్యక్షుడు పాపారెడ్డి ఆధ్వర్యంలో ఏరువాక పున్నమి సందర్భంగా జరిగే పోటీలు ప్రజలకు కనువిందు చేయడం హర్షనీయమన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గద్వాల సంస్థానాధిపతి, జీవీకే అధిపతి కృష్ణ రామ్ భూపాల్ మాట్లాడుతూ మూడు రాష్ట్రాలకు గర్వకారణం ముంగారు మున్నూరు కాపు సంబరాలన్నారు. రైతులకు మొదటి పండుగ ఏరువాక పున్నమి ఖరీఫ్ సీజన్లో రైతులు పొలాలను పదును చేసుకుంటారన్నారు. కాగా ముంగారు ఉత్సవాలపై సాక్షి దినపత్రికలో ప్రచురించిన కథనాల ప్రతులను మంత్రి బోసురాజు, మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో అభినవ రాచోటి శివాచార్య, శాసన సభ్యులు బసన గౌడ, ఎమ్మెల్సీ వసంత కుమార్, నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, ఉపాధ్యక్షుడు సమీర్, ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున గౌడ, కాపు నేతలు నరసారెడ్డి, తిమ్మారెడ్డి, శేఖర్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, క్రీడా సహాయ కార్యదర్శి పుల్లా రాజేంద్రరెడ్డి, వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఉత్సవాల్లో పాల్గొన్న అతిథుల అభివర్ణన రాతి దూలం లాగుడు పోటీలు అదుర్స్ -
నేత్ర చికిత్సశిబిరాలు పేదలకు వరం
సాక్షి,బళ్లారి: నేత్ర చికిత్స శిబిరాలు పేదలకు వరం అని పలువురు వక్తలు కొనియాడారు. మంగళవారం కౌల్బజార్లో కార్పొరేటర్ గోవిందరాజులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నేత్ర ఛికిత్స శిబిరంలో పాల్గొని వారు మాట్లాడారు. మాజీ మంత్రి శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, విధాన పరిషత్ సభ్యుడు వై.ఎం.సతీష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. గత తొమ్మిదేళ్లుగా వరుసగా ఉచిత నేత్ర చికిత్స శిబిరాలు నిర్వహించడం హర్షణీయమన్నారు. అన్ని అవయవాల్లోకి నేత్రాలు ఎంతో ముఖ్యమన్నారు. కళ్లను కాపాడుకునేందుకు, కంటిపరీక్షలు ఎప్పటికప్పుడు చేయించుకునేందుకు ప్రయత్నించాలన్నారు. కార్పొరేటర్ గోవిందరాజులు సొంత ఖర్చులతో ఉచిత నేత్ర పరీక్షలు, ఆపరేషన్లు చేయిస్తున్నారని కొనియాడారు. దాదాపు 600 మందికి పరీక్షలు చేయగా, వీరిలో దాదాపు 120 మందికి పైగా కంటి ఆపరేషన్లు చేయడానికి వైద్యులు సూచించడంతో స్థానిక కంటి వైద్యనిపుణులు డాక్టర్ విజయ్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించిన వారికి కంటి ఆపరేషన్లు చేస్తున్నారు. కమ్మరచేడు కళ్యాణస్వామి, బళ్లారి ధర్మగురువు బిషప్, కార్పొరేటర్లు కే.ఎస్. అశోక్, మోత్కూరు శ్రీనివాసరెడ్డి, ఇబ్రహీంబాబు తదితరులు పాల్గొన్నారు. -
వరుణ ప్రతాపం
రాయచూరు రూరల్: రాయచూరు, కలబుర్గి, బెళగావి జిల్లాల్లో సోమవారం రాత్రి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిిసింది. ఎక్కడ చూసినా వంతెనలు, రహదారులు జలమయమై బురద గుంటలుగా మారాయి. రాయచూరు జిల్లా మస్కి తాలూకా జిన్నాపురలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు జలమయం అయ్యాయి. పాఠశాలకు వెళ్లాలంటే మైదానం ఈత కొలనుగా మారింది. కలబుర్గి, బెళగావి జిల్లాలో కూడా వర్షాలు జోరుగా పడ్డాయి. చిక్కోడి తాలూకా చించోళి, కుడచి వంతెన పూర్తిగా జలమయం కావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సవదత్తి తాలూకాలో వర్షం కురవడంతో గ్రామాలు జలమయమై వాగులో బర్రెలు, వాహనాలు నీటిలోనే సంచరించాయి. రాయచూరు, కలబుర్గి, బెళగావి జిల్లాల్లో వర్షం మస్కిలో పాఠశాల మైదానం బురదమయం, ఆవరణలో నిలిచిన నీరు -
మదన్.. కామరాజు
యశవంతపుర/శివాజీనగర: మహిళ కనిపిస్తే చాలు అతడు రెచ్చిపోతాడు, అసభ్యంగా ప్రవర్తిస్తాడు. అటువంటి కాముకున్ని బెంగళూరు పులకేశినగర పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మదన్ (37) ను విచారిస్తున్నారు. అతడు టెక్కీ కావడం గమనార్హం. ఇటీవల ఒంటరిగా వెళుతున్న మహిళకు బలవంతంగా ముద్దు పెట్టాడు, ఆమె దూషించగా ఎవరికై నా చెప్పుకో, ఏమి చేయలేరంటూ దౌర్జన్యం చేశాడు. నగరంలోని వివిధ ఉద్యావనాలు, రోడ్లు, మైదానం తదితరాల్లో వాకింగ్ చేసే మహిళలు, యువతులను మదన్ ఇలా వేధించినట్లు విచారణలో తెలిసింది. ఫుడ్ స్టాల్ ముందున్న యువతికి ముద్దు పెట్టాడు, అదే ప్రాంతంలో వాకింగ్ చేస్తున్న మహిళను కౌగిలించుకొని ముద్దు పెట్టి పరారయ్యాడు. బాధితులు ఫిర్యాదు చేయడంతో పులకేశినగర పోలీసులు తీవ్రంగా గాలించగా, బాణసవాడిలో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. ఐటీ సంస్థలో పని చేస్తున్న మదన్ కొన్ని రోజుల క్రితం పని వదిలేసి అశ్లీల వీడియోలు చూడటం ప్రారంభించి ఇలాంటి చేష్టలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళలు కనిపిస్తే అల్లరి చేష్టలు -
ఎల్ఎల్సీ గట్టుపై రోడ్డు మరమ్మతులు పూర్తి
హొసపేటె: తాలూకాలోని నాగేనహళ్లి గ్రామంలో భారీ వర్షాల కారణంగా ఎల్ఎల్సీ(పవర్కెనాల్) గట్టు కొట్టుకు పోయిన విషయంపై సాక్షి దినపత్రికలో వార్త వెలువడిన విషయం తెలిసిందే. దీంతో తుంగభద్ర మండలి అధికారులు అప్రమత్తమై రోడ్డు మరమ్మతులను ప్రారంభించి ఎల్ఎల్సీ కాలువ గట్టును మరమ్మతు చేశారు. ప్రస్తుతం ఆ రోడ్డుపై ఉన్న పెద్ద గుంటను తొలగించి ప్రజలు సజావుగా ప్రయాణించడానికి వీలు కల్పించారు. కారులో మహిళ హత్య ●● మృతురాలు విజయపుర వాసి రాయచూరు రూరల్: కారులో విజయపుర నివాసి మహిళను హత్య చేసిన తర్వాత దహనం చేసిన ఘటన కలబుర్గి జిల్లాలో చోటు చేసుకుంది. విజయపుర జిల్లా ిసింధగి తాలూకా గణియార తాండాకు దేవిబాయి లాల్ సింగ్ జాధవ్(42)ను సోమల్ పవార్(53), హము(50) హత్య చేసి కారులో చిత్తాపుర తాలూకా లాడ్లాపుర జాతీయ రహదారి బైపాస్ వద్ద ఆమెను కాల్చి బూడిద చేశారని వాడి పోలీసులు తెలిపారు. పదేళ్ల కిందట దేవిబాయి భర్త మరణించడంతో సోమల్ పవార్తో సహజీవనం చేసి వివాహం చేసుకుంది. అయితే మొదటి భర్త ద్వారా పుట్టిన కుమార్తె పెళ్లి విషయంలో గొడవ పడేవారు. తమ సంబంధీకులకు ఇచ్చి పెళ్లి చేయాలని ఇరువురి మధ్య వాదనలు జరిగేవని తెలిపారు. కూతురిని బస్ ఎక్కించడానికి కారులో సోమల్ పవార్, హము తల్లీకూతుళ్లిద్దరినీ తీసుకెళ్లారు. బస్టాప్లో కూతురిని బస్సు ఎక్కించిన తర్వాత అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లి కలబుర్గి జిల్లాలోకి ప్రవేశించి ఈ కృత్యానికి పాల్పడ్డారని, నిందితులను అరెస్ట్ చేశామని ఎస్పీ అడ్డూరి శ్రీనివాసులు తెలిపారు. చెరువులో పడి ఒకరి మృతి హుబ్లీ: ధార్వాడ జిల్లా కలఘటిగి తాలూకా గంభ్యాపుర గ్రామం వద్ద నీరసాగర చెరువు సమీపంలో సెల్ఫీ ఫోటో తీసుకోడానికి వెళ్లిన వేళ కాలు జారి చెరువులో పడి ఓ యువకుడు నీటిలో పడి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. హుబ్లీ సోనియాగాంధీ నగర నివాసి అజర్ అహ్మద్(26) మృతుడు. ఈ యువకుడు స్నేహితులతో కలిసి నీరసాగర చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో సెల్ఫీ ఫోటో తీసుకుంటూ కాలు జారి చెరువులో పడిపోయాడు. అజర్ అహ్మద్కు ఈత రాక పోవడంతో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడని కలఘటిగి ఎస్ఐ కరివీరప్పనవర తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని వెలికి తీసి కేసు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. లారీ ఢీకొని బైక్ చోదకుని మృతి హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకాలోని ఉప్పినాయకనహళ్లి సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద లారీ అదుపు తప్పి బైక్ను ఢీకొనడంతో బైక్ చోదకుడు మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. పట్టణంలోని రామనగర నివాసి అవినాష్ (25) హొసపేటెలో తన మెడికల్ రెప్ విధులు ముగించుకుని హగరిబొమ్మనహళ్లికి తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలో లారీ బలంగా ఢీ కొట్టింది. తీవ్ర రక్తస్రావంతో అవినాష్ అక్కడికక్కడే రక్తపు మడుగులో మృతి చెందాడు. ఈ ఘటనపై హగరిబొమ్మనహళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పరికరాల పంపిణీ బళ్లారిటౌన్: దివ్యాంగులను, వృద్ధులను గౌరవించి వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని జిల్లా గ్యారెంటీ పథకాల అమలు ప్రాధికార అధ్యక్షుడు కేఈ చిదానందప్ప పేర్కొన్నారు. మంగళవారం జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో దివ్యాంగులకు ఉచిత పరికరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. పుట్టరాజ గవాయి, గురు పంచాక్షరి గవాయి దివ్యాంగుల సంక్షేమానికి పెద్ద పీట వేశారని గుర్తు చేశారు. సమాజంలో వీరిని ఎప్పుడూ చిన్న చూపు చూడరాదన్నారు. వారికి మన వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ డీడీ విజయ్కుమార్, గాంధీనగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ రవిచంద్ర, అధికారులు గోవిందప్ప, మెహబూబ్, గురురాజ్, ఆదర్శసింగ్, ప్రభురాజు పాల్గొన్నారు. -
వీధి కుక్కల స్వైర విహారం
● ఐదుగురికి తీవ్ర గాయాలు రాయచూరు రూరల్: వీధి కుక్కలు స్వైర విహారం చేయడంతో ఐదుగురు తీవ్ర గాయాల పాలైన ఘటన నగరంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. అంద్రూన్ కిల్లా, బైరూన్ కిల్లా, గంగా నివాస్ వద్ద వీధి కుక్కలు పిల్లలను వెంటబడి కరిచాయి. వీధుల్లో ఆడుతున్న సమయంలో ఐదారు కుక్కలు పోట్లాడుకుంటూ వచ్చి కరవడంతో పిల్లలు మహ్మద్ అయూబ్(10), సిరాజ్ జాఫ్రి(8), ఖహరిఉన్నీసా(12), సయ్యద్ పర్వేజ్(12), కదీర్ సాబ్(14)లు గాయపడ్డారు. గాయపడ్డ పిల్లలను చికిత్స నిమిత్తం రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్) కళాశాల ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. -
రూ.150 కోట్ల భూమి కబ్జా
బనశంకరి: కోట్లాది రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమి భూకబ్జాదారుల పాలైందని బీజేపీ నేత ఎన్ఆర్ రమేశ్ బెంగళూరు నగర జిల్లా కలెక్టర్ జగదీశ్కు ఫిర్యాదు చేశారు. రమేశ్ మాట్లాడుతూ.. దక్షిణ తాలూకా ఉత్తరహళ్లి హోబళి, తలఘట్టపుర గ్రామ సర్వే నంబరు– 30లో 11.16 ఎకరాలు బండ ప్రదేశం కాగా, పూర్తిగా ప్రభుత్వ ఆస్తి. సదరు ఆస్తి విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.150 కోట్ల కు పైగా ఉంటుంది. ఓ బడా భూకబ్జాదారు దక్షిణ తాలూకా తహశీల్దార్ కార్యాలయ సిబ్బందికి భారీగా లంచాలు ఇచ్చి ఆ ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడని ఆరోపించారు. సదరు భూమిని కాపాడుకోవలసిన బాధ్యత ఉందని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆక్రమణకు సహకరించిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
గాయపడిన మహిళ మృతి
బొమ్మనహాళ్: ఓ ప్రైవేట్ బస్సు, బైక్ని ఢీకొన్న ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న ఓ మహిళ మంగళవారం మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 5వ తేదీన మండలంలోని ఉద్దేహాళ్ గ్రామానికి చెందిన దేవరాజు, దేవమ్మ వీరి కుమారుడు నాగేంద్ర (7)లు ద్విచక్ర వాహనంలో బళ్లారి వైపు వెళ్తుండగా (కేఏ–16 బీ–4796) నంబరు గల ఓ ప్రైవేట్ బస్సు బళ్లారి నుంచి కళ్యాణదుర్గానికి వస్తూ నేమకల్లు క్రాస్ వద్ద ఢీకొట్టింది. నాగేంద్రకు కాలు విరిగింది. దేవమ్మ (40) కు తీవ్ర గాయాలు కాగా బళ్లారి విమ్స్కు తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించి చనిపోయింది. దేవమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు బళ్లారి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గుండెపోటుతో కార్మికుడు మృతి హొసపేటె: విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకాలోని అరెమాజిగెరె గ్రామంలో మంగళవారం ఉదయం నరేగ పనికి వెళ్తుండగా సాధారణ కార్మికుడు అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కుప్పకూలి మరణించాడు. మృతుడిని కార్మికుడు డీ.భరమప్ప(65)గా గుర్తించారు. కే.కల్లహళ్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అరెమాజిగెరె గ్రామంలో వాగులో ఉపాధి హామీ పథకం కింద మట్టి తొలగింపు పనులు చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. తాలూకా పంచాయతీ ఈఓ చంద్రశేఖర్, గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు నేత్రావతి విరుపాక్షప్ప, నీలగుంద కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అర్పిత, పీడీఓ ఆనంద నాయక్, ఇంజినీర్ హరీష్ సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతుడి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. కొండచిలువ పట్టివేత హొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె తాలూకా కమలాపుర పట్టణంలోని ఒకటో వార్డు జైభీమ్ నగర్లో సోమవారం రాత్రి కొండ చిలువ కనిపించింది. వర్షం కురిసిన సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో కాని ఒక కొండచిలువ ఇళ్లలోకి ప్రవేశించింది. రాత్రి వేళ కొండ చిలువను చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే వారు సరీసృపాల రక్షకుడు శ్రీనివాస్కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న శ్రీనివాస్ కొండచిలువను ప్రాణాలతో పట్టుకుని సురక్షిత అటవీ ప్రదేశానికి తరలించి వదిలేశాడు. గాలి లక్ష్మీ అరుణ పుట్టిన రోజున అన్నదానం బళ్లారిటౌన్: నగరంలోని జనజాగృతి సంఘం వివిధ ఆటో డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి సతీమణి లక్ష్మీ అరుణ జన్మదినం సందర్భంగా జిల్లా ఆస్పత్రిలో అన్నదానం, గర్భిణులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేపట్టారు. కార్యక్రమానికి నాయకత్వం వహించిన హుండేకర్ రాజేష్ మాట్లాడుతూ లక్ష్మీ అరుణకు అందరి సహకారం, ఆశీస్సులు కావాలని కోరారు. ఈ సందర్భంగా నేతలు స్వామి నాయక్, గాదిలింగ, చంద్ర, దుర్గప్ప, మిథున్, నాగరాజు, రాజు, వీరేష్, బాషా, మాబాష, ఫైజాన్, ఉమర్, వెంకటేష్, మూర్తి తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులకు బాలుడి అప్పగింత హుబ్లీ: తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన మూడేళ్ల బాలుడిని పోలీసులు, ప్రజల సహకారంతో తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు. స్థానిక దుర్గదబైలు మార్కెట్కు దావణగెరె నుంచి తల్లిదండ్రులతో కలిసి వచ్చిన బాలుడు తప్పిపోయాడు. సదరు బాలుడిని గమనించిన స్థానికులు బాలుడిని హుబ్లీ టౌన్ పోలీసులకు అప్పగించారు. తక్షణమే అప్రమత్తమైన ఆ స్టేషన్ సిబ్బంది శంక్రమ్మ, ఏసుదాసు బాలుడి తల్లిదండ్రులను కనుగొని బాలుడిని తిరిగి అప్పచెప్పారు. పోలీసుల చొరవను స్థానికులు అభినందించారు. -
డిజిటల్ అరెస్టు.. రూ.4.79 కోట్ల వసూలు
● ఇద్దరు సైబర్ నేరగాళ్ల అరెస్టు దొడ్డబళ్లాపురం: డిజిటల్ అరెస్టు పేరుతో రిటైర్డ్ ఇంజినీర్ను బెదిరించి రూ.4.79 కోట్లు వసూలు చేసిన సంఘటన బెంగళూరులో వెలుగు చూసింది. మంజునాథ్ మోసపోయిన బాధితుడు. ఈశ్వర్ సింగ్, నారాయణ్ అరైస్టెన నిందితులు. వివరాలు.. మంజునాథ్ నైజీరియాలో ఇంజినీర్గా పని చేసి రిటైరయ్యి బెంగళూరులో నివసిస్తున్నాడు. నిందితులు ఉత్తరాది రాష్ట్రాలవారు. ఇటీవల మంజునాథ్కు కాల్ చేసిన దుండగులు క్రెడిట్ కార్డ్ ఓవర్ డ్యూ అయ్యిందని, మీ ఖాతా నుంచి మనీ ల్యాండరింగ్ జరిగిందని, సీబీఐ వారు మీపై కేసు నమోదు చేసారని బెదిరించారు. నకిలీ అరెస్టు వారెంట్ను కూడా పంపించారు. త్వరలో తీహార్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. బెదిరిపోయిన మంజునాథ్ వారు అడిగినట్టుగా పలు విడతలుగా రూ.4.79 కోట్లు ఆన్లైన్ ద్వారా పంపించాడు. మోసపోయినట్టు ఆలస్యంగా తెలుసుకున్న మంజునాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్క్రైం పోలీసులు గాలింపు జరిపి నిందితులను అరెస్టు చేశారు. దుండగులు ఈ డబ్బుతో శ్రీలంక వెళ్లి క్యాసినో ఆడి జల్సాలు చేసినట్లు తేలింది. దీంతో నిందితుల నుంచి పోయిన నగదును రాబట్టడం పోలీసులకు సవాలుగా మారింది. ఈ ముఠా వెనుక సూత్రధారులు ఉన్నారని, వారిని అరెస్టు చేయాల్సి ఉందని సమాచారం. -
ఊపిరి తీసిన కరెంటు స్తంభం
బనశంకరి: విద్యుత్శాఖ నిర్లక్ష్యానికి మరో ప్రాణం బలైంది. ఆడుకుంటున్న బాలిక విద్యుత్ షాక్తో మరణించిన ఘటన నగర శివార్లలో సూర్యనగర పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఆనేకల్ తాలూకా నారాయణఘట్ట గ్రామానికి చెందిన తనిష్కా (11), పాఠశాలకు సెలవు కావడంతో ఇంటి వద్ద ఆడుకుంటోంది. కరెంటు స్తంభాన్ని ముట్టుకున్న సమయంలో షాక్కు గురైంది. గాయపడిన బాలిక ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. బెస్కాం అధికారుల నిర్లక్ష్యమే కారణమని బాలిక తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
సీఎం పిలిస్తేనే గవర్నర్ వెళ్లారు
శివాజీనగర/ బనశంకరి: దేశవాప్తంగా భారీ సంచలనం సృష్టించిన బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవంలో చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మరో విషయం బయటపడింది. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆర్సీబీ ఆటగాళ్లను అభినందనకు రాజ్భవన్కు ఆహ్వానించాలని యోచించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం విధానసౌధలోనే జరపాలని తెలియజేసినట్లు వెలుగులోకి వచ్చింది. విధానసౌధ కార్యక్రమంలో పాల్గొనేందుకు గవర్నర్ను సీఎం సిద్దరామయ్య అధికారికంగా ఆహ్వానించారని రాజ్భవన్ వర్గాలు ప్రకటించాయి. ఇది సిద్దరామయ్యకు ఇబ్బందిగా మారింది. గవర్నర్ను నేను ఆహ్వానించలేదు, రాష్ట్ర క్రికెట్ సంస్థ పిలిచింది అని సీఎం సిద్దరామయ్య గతంలో తెలిపారు. ప్రధాన కార్యదర్శి నన్ను అడిగిన తరువాత పోలీసులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు ఆమోదించారు. నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. ఆ తరువాత కేఎస్సీఏ కోశాధికారి, కార్యదర్శి తనను పాల్గొనాలని ఆహ్వానించారు అని సిద్దరామయ్య చెప్పారు. ఇందులో నాకేం తెలియదు అని అర్థం వచ్చేలా సీఎం మాట్లాడారు. విధానసౌధ ముందు సంబరాలను జరిపేందుకు ఆదేశించలేదని సీఎం చెప్పుకొన్నారు. ఇప్పుడు రాజ్భవన్ వర్గాల సమాచారం ఇందుకు భిన్నంగా ఉంది. సీఎం స్వయంగా పిలవడంతోనే గవర్నర్ విచ్చేశారని పేర్కొన్నాయి. అరెస్టులపై విచారణ వాయిదా తొక్కిసలాట విషాదంలో ఆర్సీబీ మార్కెటింగ్ చీఫ్ నిఖిల్ సొసాలే అరెస్ట్పై దాఖలైన పిటిషన్ను హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. నిఖిల్ సొసాలే, సునీల్ మ్యాథ్యూ, కిరణ్కుమార్, శమంత్ మావినకెరె తదితరులు వేసిన పిటిషన్ ను న్యాయమూర్తి ఎం.విష్ణుకుమార్ విచారించారు. తమవారిని అరెస్టు చేయడం అక్రమమని, విడుదల చేయాలని వకీళ్లు వాదించారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించడానికి సమయం కోరడంతో విచారణను బుధవారానికి వాయిదావేశారు. రాజ్భవన్ ముట్టడికి యత్నం తొక్కిసలాటను నిరసిస్తూ కన్నడ పోరాట నేత వాటాళ్ నాగరాజ్ చలో రాజ్భవన్ చేపట్టారు. జెండాలు పట్టుకుని రాజ్భవన్వైపు వెళ్తుండగా మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. వాటాళ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ సంస్థ తదితర క్రికెట్ సంస్థలన్నీ మృతుల కుటుంబాలకు భారీగా పరిహారం ఇవ్వాలని కోరారు. క్రీడా మైదానం వద్ద అమాయకుల మరణానికి కారణం ఎవరు?. ఇది న్యాయమా? తప్పు చేసినవారు ఎవరైనా గాని అపరాధి స్థానంలో నిలవాలన్నారు. అలాగే తొక్కిసలాట మీద సీబీఐతో విచారణ జరిపించాలని ఆర్పీఐ పార్టీ నేతలు స్వతంత్ర పార్కు వద్ద ధర్నా చేశారు. ఆర్సీబీ విజయోత్సవాలకు హాజరుపై రాజ్భవన్ వెల్లడి తాను ఆహ్వానించలేదని గతంలో చెప్పిన సీఎం సిద్దరామయ్య హైకోర్టుకు అందని నివేదిక బనశంకరి: తొక్కిసలాట దుర్ఘటనపై మీడియా వార్తలు, ప్రజల ఫిర్యాదుల ఆధారంగా హైకోర్టు సుమోటో గా కేసు నమోదు చేయడం తెలిసిందే. న్యాయమూర్తులు వీ.కామేశ్వరరావ్, సీఎం.జోషి తో కూడిన పీఠం మంగళవారం విచారణ చేపట్టింది. ఘటనపై పూర్తి నివేదిక అందించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఇదివరకే సూచించింది. కానీ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ఇంకా నివేదిక ఎందుకు రాలేదని జడ్జిలు ప్రశ్నించారు. అడ్వొకేట్ జనరల్ శశికిరణ్శెట్టి సమాధానమిస్తూ మెజస్టీరియల్ విచారణ, న్యాయ విచారణ జరుగుతోందని, ఒక నెల సమయం ఇవ్వాలని మనవిచేశారు. అయితే జూన్ 12 లోగా నివేదిక అందించాలని జడ్జిలు ఆదేశించారు. -
గూడ్స్ వ్యాన్ బీభత్సం
యశవంతపుర: అతివేగంగా గూడ్స్ వ్యాన్ రెండు కార్లు, బైకును డీకొట్టింది, ఈ దుర్ఘటనలో ఓ మహిళ మరణించింది. బెంగళూరు అశోక్నగర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. హళేగుడ్డదగళ్లికి చెందిన అంజలి (36) మృతి చెందగా ఆమె భర్త విజయకుమార్ (40) గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం సాయంత్రం 6:30 గంటలకు హనీజ్ అనే వ్యక్తి గూడ్స్ వ్యాన్లో కాడుగోడి వైపు వెళుతున్నాడు. ఎంజీ రోడ్డు కావేరి ఎంపోరియం జంక్షన్ వైపు నుంచి వెళుతున్న కారును మేయోహాల్ జంక్షన్ వద్ద నిలిపారు. ఆ సమయంలో వేగంగా వెళుతున్న గూడ్స్ వ్యాన్ ఈ కారును, మరో కారును, అలాగే బైక్ను ఢీకొట్టింది. బైక్పై వెళుతున్న అంజలి రోడ్డుపై పడిపోగా ఆమైపె నుంచి వ్యాన్ దూసుకెళ్లింది. తలకు బలమైన గాయాలు కావడంతో ఆమె అక్కడే చనిపోయింది. భర్త కూడా గాయపడ్డాడు. చివరకు వ్యాన్ ఓ కరెంటు స్తంభాన్ని ఢీకొని నిలిచిపోయింది. వెంటనే డ్రైవర్ హనీజ్ పరారయ్యాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. వ్యాన్ ధాటికి కార్లు కూడా ధ్వంసమయ్యాయి. మహిళ మృతి, భర్తకు గాయాలు -
తుంగభద్ర డ్యాం కళకళ
సాక్షి, బళ్లారి: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తాగు, సాగు నీరందించే తుంగభద్ర జలాశయంలో రోజు రోజుకు నీటిమట్టం పెరుగుతోంది. ఎగువన పశ్చిమ కనుమలు, శివమొగ్గ జిల్లాల్లో జోరుగా వర్షాలు రావడంతో డ్యాంకు నీటి ప్రవాహం పెరిగింది. జలాశయం సామర్థ్యం వంద టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 25 టీఎంసీలకు చేరినట్లు డ్యాం అధికారులు తెలిపారు. రాబోయే వారం రోజుల్లో మరో 15 టీఎంసీలు నీరు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. గేట్లు భద్రమేనా? గత ఏడాది డ్యాం 19వ గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో తాత్కాలిక మరమ్మతులు చేసి నీటిని కాపాడారు. డ్యాంలోని 33 గేట్లు పూర్తిగా పాతబడ్డాయి, కొత్త గేట్లు అమర్చాలని నిపుణులు అనేకసార్లు స్పష్టంచేశారు. గేట్లను మార్చడం ఇప్పట్లో జరిగేలా లేదని, డ్యాం పూర్తిగా నిండితే పరిస్థితి ఏమిటని రైతుసంఘాల నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. జూన్ ఆఖరుకల్లా 50 టీఎంసీలు చేరే అవకాశముంది. రైతులు పొలం పనులు ప్రారంభించారు, కాలువలకు వెంటనే నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఖరీఫ్ పంట త్వరగా పూర్తయితే తదుపరి రబీ పంటలు కూడా పండించుకోవడం సులభమవుతుందని చెబుతున్నారు. జలాశయంలో నీటిమట్టం ఎగువన వర్షాలతో నీటి రాక 25 టీఎంసీలకు చేరిన నీటిమట్టం నీటి విడుదలకు రైతుల డిమాండ్లు గేట్ల భద్రతపై కలవరం -
అలా జరిగిపోయింది.. మా తప్పేమీ లేదు
శివాజీనగర: బెంగళూరులోని చిన్నస్వామి క్రీడా మైదానం వద్ద ఆర్సీబీ విజయోత్సవంలో ఘోరమైన తొక్కిసలాట ఘటన జరగడంపై కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహంగా ఉంది. ప్రభుత్వానికి, పార్టీ గౌరవానికి హాని జరిగిందని కినుక వహించింది. ఈ నేపథ్యంలో పెద్దల పిలుపులతో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మంగళవారం ఢిల్లీలో పార్టీ అగ్రనేత రాహుల్గాంధీని కలిసి కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. హైకమాండ్కు నివేదిక రాహుల్గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులను ఇరువురూ కలిశారు. రాష్ట్రంలో ఇటీవల నెలకొన్న పరిణామాలపై, అందులోనూ చిన్నస్వామి క్రీడా మైదానం వద్ద తొక్కిసలాట ఘటనపై నివేదికను అందజేశారు. ఈ దుర్ఘటనలో ప్రభుత్వం తప్పు లేదని సంజాయిషీ ఇచ్చినట్లు తెలిసింది. విజయోత్సవాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు, కేఎస్సీఏ ద్వారానే ఈ దోషం జరిగింది. విధానసౌధ ముందు నిర్వహించిన సన్మానోత్సవంలో ఎలాంటి లోపాలు జరగలేదు. చిన్నస్వామి క్రీడా మైదానంలో జరిగిన తొక్కిసలాటలో ప్రభుత్వం తప్పులేదని చెప్పినట్లు తెలిసింది. రాహుల్ ఆగ్రహం తొక్కిసలాటను ప్రతిపక్ష పార్టీలు రాజకీయంగా ఉపయోగించుకొంటున్నాయి. ఇది పార్టీకి అవమానమని రాహుల్గాంధీ కోపంగానే మాట్లాడారని తెలిసింది. పోలీసు అధికారులు సక్రమంగా ఏర్పాట్లు చేయలేదు. అందుచేతనే అధికారులపై చర్యలు తీసుకొన్నామని సీఎం తెలిపారు. మునుముందు ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకొంటామని రాహుల్కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. జాగ్రత్తగా ఉండాలని, ప్రతిపక్షాలకు అస్త్రం ఇవ్వరాదని హైకమాండ్ సూచించినట్లు తెలిసింది. ఖర్గేతో పాటు పార్టీ నేతలు వేణుగోపాల్, రణదీప్సింగ్ సుర్జేవాలతో భేటీలు జరిపారు. తొక్కిసలాట దుర్ఘటనపై రాహుల్గాంధీకి సీఎం, డిప్యూటీ సీఎం వివరణ! ఢిల్లీలో పార్టీ పెద్దలతో భేటీలు మంత్రుల మార్పునకు పచ్చజెండా? క్యాబినెట్ ప్రక్షాళన గురించి చర్చ రాష్ట్రంలో మంత్రిమండలిలో మార్పుల గురించి ఢిల్లీ టూర్లో చర్చ జరిగినట్లు తెలిసింది. ఇటీవల జరిగిన అపశృతులకు కొందరి అసమర్థతే కారణం, సక్రమంగా పని చేయని 7– 8 మంది మంత్రులను తొలగించి కొత్తవారిని కేబినెట్లోకి చేర్చుకోవాలని చర్చకు వచ్చిందని, మంత్రుల మార్పులకు రాహుల్గాంధీ ఆదేశించినట్లు సమాచారం. ఇందుకు సీఎం సిద్దరామయ్య ఆమోదించినట్లు తెలిసింది. వీలైనంత త్వరగా కేబినెట్ ప్రక్షాళన చేయాలని రాహుల్గాంధీ సూచించారు. దీంతో సీఎం, డీసీఎం ఢిల్లీ నుంచి రాగానే మంత్రుల మార్పుల చేర్పులపై కసరత్తు ప్రారంభిస్తారు. అలాగే కేపీసీసీ అధ్యక్షుని మార్పుపై కూడా చర్చలు జరిగాయి. డిప్యూటీ సీఎం డీకే శివకుమారే ఈ పదవిలో ఉండడం తెలిసిందే. ఇక 4 ఎమ్మెల్సీ పదవుల నామినేట్కు గవర్నర్ నుంచి అభ్యంతరాలు రాగా, ఏం చేయాలని అధిష్టానంతో మాట్లాడారని సమాచారం. -
పడకేసిన పారిశుధ్యం
రాయచూరు రూరల్: పేరుకు మాత్రమే జిల్లా కేంద్రం. అభివృద్ధిలో మాత్రం పూర్తిగా వెనుకబాటు. నగరంలో పారిశుధ్యం, రోడ్ల పరిస్థితి పల్లెల్లో మాదిరిగా అగమ్యగోచరం. ఇరు పార్టీల నేత పంతాల మధ్య నగరం అధ్వానంగా మారింది. నగరసభ అధికారం జిల్లాధికారి ఆధీనంలో ఉంది. ఏ ప్రాంతంలో చూసినా చెత్తకుప్పలు పేరుకు పోయి, మురుగు కాలువలు చిత్తు కాగితాలతో నిండాయి. రహదారుల పరిస్థితి దుర్భరంగా ఉంది. నగరంలోని 35 వార్డుల్లో పారిశుధ్యం, రోడ్ల పరిస్థితిని గురించి పట్టించుకొనే వారు లేరు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సభ్యులు ఒకరి మీద మరొకరు బురద చల్లుకుంటూ విమర్శలు చేసుకోవడమే తప్ప చేసిందేమీ లేదు. రహదారుల మరమ్మతులో నగరసభ, శాసన సభ్యుల మధ్య అవగాహన లేకపోవడంతో నగరంలో పేదల బతుకు నిత్యం నరకప్రాయమైంది. -
ముంచెత్తిన వర్షం
రాయచూరు రూరల్: జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిిసింది. ఎక్కడ చూసినా రహదారులు జలమయమై బురద గుంటలుగా మారాయి. హైదరాబాద్ రహదారి, ఏపీఎంసీ, మున్నూరు వాడి, గాంధీ చౌక్, మహావీర్ చౌక్, ఆర్టీఓ సర్కిల్, కూరగాయల మార్కెట్లోకి వర్షపు నీరు చొరబడ్డాయి. ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. పత్తేపూర్ వాగు పొంగి ప్రవహించడంతో ఆ మార్గంలోని తాత్కాలిక వంతెన కొట్టుకుపోయి ఇతర గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మాన్వి తాలూకాలో రైతులు పొలాల్లో వేసిన పత్తి విత్తనాలు మొలవడంతో వర్షపు నీటిలో పంటలు మునిగిపోయాయి. రహదారులు జలమయం లోతట్టులోకి చేరిన నీరు -
జోరుగా ఖరీఫ్ సాగు పనులు
హుబ్లీ: తొలకరి ముందస్తు వానలతో ధార్వాడ జిల్లాలో రైతన్నలు సాగు పనుల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ముందస్తు వానలు తెచ్చిన సంబరంతో పంట దిగుబడులపై కూడా కొండంత ఆశతో అన్నదాతలు నాగళ్లు పట్టి చలో బసవణ్ణ అంటూ ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు. జిల్లాలో మార్చి నుంచి మే చివరి వరకు 113.3 మిల్లీ మీటర్ల తొలకరి ఖరీఫ్ వానలు కురుస్తాయని ఆశించగా రెట్టింపు వానలు ఇదే సమయంలో పడ్డాయి. సగటున 221.4 మిల్లీ మీటర్ల వర్షాలతో భూమి పదునుకు అవకాశం లభించింది. అదే విధంగా ఈ సారి సకాలంలో ఖరీఫ్ సీజన్ వానలు రాష్ట్రంలో ప్రవేశించడంతో అన్నదాతల్లో ఈసారి ఆశలు రెట్టింపు అయ్యాయి. దీంతో సాగుకు కావాల్సిన విత్తనాలు, ఎరువుల కొనుగోలులో జోరుగా రైతన్నలు మునిగిపోయారు. రైతుల డిమాండ్కు అనుకూలంగా రాయితీలతో రసాయనిక ఎరువుల పంపిణీతో వ్యవసాయ శాఖ సహకారం అందిస్తోంది. భారీగా ఎరువుల డిమాండ్ యూరియా, డీఏపీ, పొటాష్, కాంపెక్స్, ఎస్ఎస్బీతో పాటు జిల్లాకు 49,471.08 మెట్రిక్ టన్నుల రసాయనిక ఎరువుల డిమాండ్ ఉందని అంచనా. డీఏపీ ఎరువుల కొరత కొద్ది మేర ఉన్నా ఇతర సమస్యలు కనిపించడం లేదు. ప్రత్యామ్నాయ సంయుక్త రసాయనిక ఎరువుల వాడకంపై వ్యవసాయ శాఖ రైతులకు సలహాలు ఇచ్చింది. అదే విధంగా సోయాబీన్, ఉద్దు(మినుము)లతో పాటు వివిధ పంటల విత్తనాలను రాయితీ ధరలతో పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికి 70 శాతం పైగా రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేశారు. మొత్తం 47.51 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం చేసుకున్నామని జిల్లా వ్యవసాయ శాఖ జేడీ మంజునాథ అంతర్ వల్లి తెలిపారు. జిల్లాలో ఏ పంట ఎంత ప్రమాణంలో సాగు చేస్తారో అన్న దానిపై వ్యవసాయ శాఖ ఓ అంచనాకు వచ్చింది. ఈ మేరకు 2,81,595 హెక్టార్లలో పంటలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో పెసలు అత్యధికం అని చెబుతున్నారు. పంటల సాగు విస్తీర్ణ లక్ష్యమిదే.. ధార్వాడ తాలూకాలో రైతులు సోయాబీన్, ఉద్దుల పంటల సాగుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ మేరకు పెసల పంటల 84,665 హెక్లార్లు, మొక్కజొన్న 60 వేల హెక్టార్లు, పత్తి 52 వేల హెక్టార్లు, సోయాబీన్ 34,600 హెక్టార్లు, వేరుశెనగ 20,740 హెక్టార్లు, వరిని 11 వేల హెక్టార్లలో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. జూన్ 10–12వ తేదీ వరకు మధ్య వేగపు గాలులతో చాలా వరకు పొడి వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ధార్వాడ పశ్చిమ భాగంలో చిరుజల్లు కురవచ్చు. దీంతో మెట్ట సాగుకు భూమిని సిద్దం చేసుకొని ఉంటే మట్టితో తేమ శాతం ధృవీకరించుకొని సాగు చేయాలి. భూమి పదును లేకపోతే కలప తీసి వేత తర్వాత విత్తనం చేయాలనుకుంటే కొంత సమయం వాయిదా చేయడం మేలు. సోయాబీన్ పంటను మట్టిలో తగినంత తేమ ఉంటే మాత్రమే సాగు చేయాలని ధార్వాడ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర అనగౌడర తెలిపారు. ఈ సందర్భంగా ఆ శాఖ జేడీ మంజునాథ, జిల్లాలో సాగు లక్ష్యం, ఎరువుల డిమాండ్, అలాగే వర్షపాత వివరాలను కూడా ఆయన సమగ్రంగా వివరించారు. ఆశించిన స్థాయికి మించి కురిసిన వర్షాలు చురుకుగా విత్తనం నాటే ప్రక్రియలో రైతులు -
మాతంగ పర్వతంలో పర్యాటకుడు క్షేమం
●రక్షించిన పోలీసులు, అగ్నిమాపక దళం హొసపేటె: ప్రపంచ ప్రఖ్యాత హంపీలోని మాతంగ పర్వతంలోని గుహలోకి జారిపడిన పర్యాటకుడిని పోలీసులు, అగ్నిమాపక దళం రక్షించాయి. మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన పర్వ అసత్(18)ను జారిపడిన యువకుడిగా గుర్తించారు. గత మూడు, నాలుగు రోజులుగా హంపీ పర్యటనలో ఉన్న ఆ యుకుడు ఆదివారం మధ్యాహ్నం హంపీలోని మాతంగ పర్వతాన్ని అధిరోహించాడు. పర్వతం మధ్యలోకి చూస్తుండగా అతను జారి పడిన ప్రదేశం నుంచి 15–20 అడుగుల లోతులో ఉన్న రాళ్ల మధ్య ఉన్న గుహలో చిక్కుకుపోయాడు. యువకుడు రాయిపైకి ఎక్కలేక సహాయం కోసం 112కు కాల్ చేశాడు. హంపీ టూరిస్ట్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందింది. ఎస్ఐ సుబ్రమణ్యం నేతృత్వంలోని పోలీసులు, అగ్నిమాపక దళం తాళ్లతో సంఘటన స్థలానికి చేరుకొని సురక్షితమైన రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. పర్యాటకుడు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. -
ఇంటి పైకప్పు కూలి మహిళ మృతి
హుబ్లీ: నిరంతర వర్షాలతో ఇంటి పైకప్పు కూలి ఓ మహిళ మృతి చెందిన ఘటన ఆదివారం అర్ధరాత్రి విజయపుర జిల్లా తికోటా తాలూకా బాబానగర్లో జరిగింది. పైకప్పు కూలడంతో ఇంట్లో నిద్ర పోతున్న సంగీత(30) అనే మహిళ మృత్యువాత పడింది. వర్షానికి ఇల్లు కారడంతో తక్షణమే ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఆమె భర్త, పిల్లలు అదృష్టవశాత్తు బయటపడ్డారని, ఘటనపై కేసు దర్యాప్తు చేపట్టినట్లు తికోటా పోలీసులు తెలిపారు. పిడుగుపాటుకు రైతు మృతిహొసపేటె: జిల్లాలోని హగరిబొమ్మనహళ్లి తాలూకా దశమాపుర గ్రామంలో పిడుగుపాటుకు గురై ఓ రైతు మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. మృతుడిని కే.చంద్రు(28) అనే రైతుగా గుర్తించారు. పొలంలో పని చేస్తుండగా చంద్రు మరణించగా, హగరిబొమ్మనహళ్లి రెవెన్యూ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. హగరిబొమ్మనహళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. 11న అవార్డుల ప్రదానోత్సవంరాయచూరు రూరల్: జిల్లాలోని సిరవారలో ఈనెల11న చుక్కి ఫౌండేషన్ అవార్డుల ప్రదానోత్సవం ఏర్పాటు చేసినట్లు చుక్కి ఫౌండేషన్ అధ్యక్షుడు శివానంద తెలిపారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమాపతి చుక్కి 49వ వర్ధంతి సందర్భంగా ఉత్తమ రచయితలను ఎంపిక చేసి వారిని సన్మానిస్తున్నట్లు తెలిపారు. సభ్యులు శివకుమార్, మల్లికార్జున, పరమేశ్వర సాలిమఠలున్నారు. రైల్వే భద్రతపై రాష్ట్ర స్థాయి సమావేశంహుబ్లీ: రోజు నాలుగు కోట్లకు పైగా ప్రయాణికులను మోసుకెళ్లే రైలు రవాణా సురక్షత విస్తరణకు కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక ప్రాధ్యానతతో పాటు ప్రైవేటీకరణ ప్రక్రియను కట్టడి చేయాలని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు డాక్టర్ కే.హేమలత సూచించారు. జేసీ నగర్ అక్కన బళగలో సదరు సంఘం రాష్ట్ర కమిటీ చేపట్టిన రైల్వే సురక్షత రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. రైళ్ల సంచారం ప్రమాద రహితంగా, అలాగే సామాన్య ప్రజలు అనుకూలంగా ఉండాలన్నారు. ఈ విషయంలో శాశ్వత సిబ్బంది నియామకం, మౌలిక సదుపాయాలతో రైలు పట్టాలు, స్టేషన్లను ఆధునికీకరణ చేపట్టాలన్నారు. ముఖ్యంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతో పాటు 10 డిమాండ్లను ఈ సందర్భంగా ప్రతిపాదించారు. రైల్వే ప్రైవేటీకరణ పరిణామాల గురించి ప్రచార ఆందోళన జూలై, ఆగస్టుల్లో రైల్వే విభాగ స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. సామాన్య ప్రజల సంతకాల సేకరణతో ప్రధానికి వినతిపత్రం సమర్పించడం, ఆగస్టు 1, 3వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టి ప్రధానికి వినతిపత్రం సమర్పిస్తామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శి మీనాక్షి, కాంతరాజు, మంజునాథ్, సునంద చిగరి తదితరులు పాల్గొన్నారు. పేదలకు హోమియో వైద్య శిబిరం హుబ్లీ: సుత్తూరులోని శ్రీసత్యసాయి హోమియోపతిక్ వైద్య కళాశాల, ఆస్పత్రి, డాక్టర్ శరణప్ప కోటగి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏడాదంతా పేదలకు ఉచిత ఆరోగ్య వైద్య చికిత్స శిబిరం చేపట్టారు. ప్రతి ఒక్కరికీ ఉచిత ఆరోగ్య సేవలు అందించే దిశలో శ్రీబసవేశ్వర రూరల్ ఎడ్యుకేషనల్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ట్రస్ట్ ద్వారా ఆస్పత్రిలో బయట రోగులకు, అలాగే లోపల రోగులకు ఈ సౌకర్యాలు లభిస్తాయి. నిపుణులైన వైద్యులు రక్త, బీపీ, చక్కెర, మూత్రం, ఎక్స్రే, స్క్యానింగ్ తదితర పరీక్షలను నిర్వహిస్తారు. అలర్జీ, దగ్గు, జలుబు, జ్వరం, పచ్చకామెర్లు తదితరాలతో పాటు మోకాళ్లు, కీళ్ల నొప్పులకు పేదలకు రాయితీ ధరలతో ఔషధాలు అందజేస్తామని ట్రస్ట్ అధ్యక్షుడు శరణప్ప కోటగి ఓ ప్రకటనలో కోరారు. ఆసక్తిగల వారు 8970731422, 9448128062లో సంప్రదించి ఉచిత వైద్య చికిత్సలు పొందాలని ఆయన సూచించారు. -
పాఠశాలలకు పుస్తకాల పంపిణీ
హొసపేటె: జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పాఠశాలలు ప్రారంభం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పాఠశాలలకు పుస్తకాల పంపిణీపై దృష్టి పెట్టింది. సోమవారం నగరంలోని జిల్లా విద్యా శాఖ కార్యాలయం వద్ద ఉన్న ప్రభుత్వ పీవీబీఎస్ పాఠశాలలో ఆయా పాఠశాలలకు సంబంధించిన పుస్తకాలను విద్యాశాఖ అధికారి రాజు దగ్గర ఉండి ఆయా పాఠశాల హెచ్ఎంలకు అందజేశారు. ప్రైమరీ నుంచి హైస్కూల్ స్థాయి వరకు ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఇండెంట్ ప్రకారం అందజేశారు. ఇప్పటికే 92 శాతానికి పైగా పాఠశాలలకు పుస్తకాలను పంపిణీ పూర్తయినట్లు ఆయన తెలిపారు. బస్సు సౌకర్య లేమి.. విద్యార్థులకు తప్పని నడక రాయచూరు రూరల్: జిల్లాలో పాఠశాలలు ప్రారంభమై 10 రోజులు గడిచినా గ్రామీణ ప్రాంతాల నుంచి నగర ప్రాంతాల్లో విద్యనభ్యసించడానికి రవాణ సౌకర్యం కొరత అధికమైంది. మస్కి తాలూకా కవితాళ మండల కేంద్రానికి చేరడానికి విద్యార్థులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాలూకాలోని నెలకోళ, కాచాపుర, యాతగల్లకు చెందిన 80 మంది విద్యార్థులు అమీన్ గడ, హట్టి, నీలగల్, లింగసూగూరులకు వెళ్లాలంటే 7 కిలోమీటర్ల దూరం కాలి నడకన ప్రయాణం చేస్తున్నారు. శాసన సభ్యులు బసన గౌడ, మానప్ప వజ్జల్, హంపయ్య నాయక్లు ఈ సమస్యపై మౌనం వహిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. 11 మంది మృతికి సర్కారుదే బాధ్యత హొసపేటె: బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించిన ఘటనకు రాష్ట్రప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఈ భయంకరమైన విషాదానికి వ్యతిరేకంగా విజయనగరం జిల్లా హొసపేటె తాలూకాలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద బీజేపీ నిరసన తెలిపింది. విజయోత్సవాన్ని జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక నిర్ణయంతో సరైన ఏర్పాట్లు లేక తొక్కిసలాట జరిగి అమాయకులు మృత్యువాత పడ్డారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే.శివకుమార్, హోం మంత్రి పరమేశ్వర నైతిక బాధ్యత వహించి తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. తమ తప్పులను దాచుకోడానికి అధికారులను బాధ్యులను చేశారని బీజేపీ నేతలు రూపేష్, అశోక జీరిగె ఆరోపించారు. ప్రభుత్వమే జొన్నలు కొనుగోలు చేయాలిరాయచూరు రూరల్: రైతులు ఖరీఫ్ సీజన్లో పండించిన జొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు సంఘం అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ డిమాండ్ చేశారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు ఉన్నఫళంగా కొనుగోలు కేంద్రాలను మూసివేసి జొన్నల కొనుగోళ్లను నిరాకరించడాన్ని తప్పుబట్టారు. రైతులు మార్కెట్కు తెచ్చిన జొన్నలు కొనుగోలు చేయాలని కేంద్రం వద్ద విన్నవించుకున్నా అధికారులు బేఖాతరు చేశారన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు రావడం లేదని ఆరోపించారు. ఈనెల 13న వ్యవసాయ వర్సిటీలో రైతు సంఘం నేత చెన్నబసప్ప బెట్టదూరు అధ్యయన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. సస్పెన్షన్పై నిరసన బళ్లారి అర్బన్: బెంగళూరు పోలీస్ కమిషనర్ బీ.దయానందను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడం సరికాదు, తక్షణమే పునర్ నియామకం చేపట్టాలని వాల్మీకి ప్రముఖులు డిమాండ్ చేశారు. సోమవారం కర్ణాటక పీడిత తాడిత వర్గాల మహా ఒక్కూట బళ్లారి శాఖ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఉత్తమ అధికారిగా పేరుగాంచిన దయానందను ఆర్సీబీ విజయోత్సవాల వేళ జరిగిన దురంతానికి బాధ్యున్ని చేసి సస్పెండ్ చేయడం తగదన్నారు. వీకే బసప్ప, మానయ్య, విజయ్ శివశంకర్, కే.హనుమంతప్ప, ఇమామ్ గోడేకర తదితరులు పాల్గొన్నారు. -
నైతికత ఉంటే రాజీనామా చేయండి
హుబ్లీ: ఆర్సీబీ జట్టు విజయోత్సవం చేయరాదని పోలీస్ శాఖ సూచించినా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి క్రెడిట్ కొట్టేయాలనే దుగ్ధతో కార్యక్రమాన్ని నిర్వహించి 11 మంది అమాయకుల మృతికి కారకులైన వారిద్దరూ నైతికత ఉంటే తక్షణమే రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సవాల్ చేశారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటలిజెన్స్ శాఖ ఏం చేస్తోంది? అని ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఈ విషయంలో కూడా కావాల్సిన అధికారులకు అన్నం, ఇష్టం లేని అధికారులకు సున్నంలా వ్యవహరించారు. సీఎం సిద్దరామయ్య తక్షణమే ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్తో రాజీనామా తీసుకోవాలన్నారు. మీ సెల్ఫీ క్రెడిట్కు 11 మంది బలి అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్ఘటనపై సీఎం, డీసీఎంలకు కేంద్ర మంత్రి సవాల్ -
ఎద్దుల పండుగకు వేళాయె
రాయచూరు రూరల్: నగరంలో మంగళవారం నుంచి మున్నూరు కాపు సమాజం ఆధ్వర్యంలో ముంగారు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు ఎద్దుల పండుగ జరుపుకుంటారు. మాజీ ఎమ్మెల్యే, మున్నూరు కాపు సమాజం అధ్యక్షుడు ఏ.పాపారెడ్డి ఆధ్వర్యంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి ఎద్దులు రానున్నాయి. ఏరువాక పున్నమి సందర్భంగా ఏపీఎంసీ ఆవరణలో రాతి దూలం లాగే పోటీలు ఏర్పాటు చేస్తున్నారు. రాయచూరు ఏపీఎంసీ మైదానంలో జరిగే ఉత్సవాలను గద్వాల సంస్థానాధిపతి, జీవీకే అధిపతి కృష్ణ రామ్ భూపాల్ ప్రారంభిస్తారని మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి తెలిపారు. నేటి నుంచి మూడు రోజులు ఎద్దుల పండుగ గద్వాల సంస్థానాధిపతి కృష్ణ రామ్ భూపాల్ ఉత్సవాలకు రాక -
ముంగారు సాంస్కృతిక ఉత్సవాలు షురూ
రాయచూరు రూరల్: నగరంలో జరగనున్న ముంగారు సాంస్కృతిక ఉత్సవాలకు రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు శ్రీకారం చుట్టారు. ఆదివారం రాత్రి ఈశ్వర ఆలయం వద్ద మున్నూరు కాపు సమాజం చేపట్టిన నృత్యం, వివిధ కళాకారులతో నృత్యప్రదర్శనలు జరిగాయి. మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్తాన్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలతో పాటు హైదరాబాద్, ముంబైల నుంచి వచ్చిన కళాబృందాలు ప్రదర్శనలు చేశారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సమాజం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి, నరసారెడ్డి, శ్రీనివాసరెడ్డి, శేఖర్రెడ్డి, అమరేష్, చంద్రశేఖర్, శివ బసప్ప మాలిపాటిల్, కృష్ణమూర్తిలున్నారు. డోలు వాయించి ప్రారంభించిన మంత్రి ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు -
వర్సిటీల విలీనానికి సర్కార్ ముందడుగు
రాయచూరు రూరల్: రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలను విలీనం చేయడానికి సర్కార్ ముందడుగు వేస్తోంది. ప్రాంతీయ అసమానతలను నివారించేందుకు తోడు డాక్టర్ నంజుండప్ప నివేదిక ఆధారంగా ప్రారంభమైన విశ్వవిద్యాలయాలను తొలగించడానికి సర్కారు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. అందులో భాగంగా కళ్యాణ కర్ణాటక భాగంలో రాయచూరు వ్యవసాయ విశ్వ విద్యాలయం, బీదర్ పశు సంవర్ధక, పశు వైద్య, మత్స్య శాఖ విజ్ఞాన విశ్వ విద్యాలయాలను నెలకొల్పింది. 20 ఏళ్ల క్రితం ప్రారంభమైన విశ్వ విద్యాలయాల విలీన ప్రక్రియకు పావులు కదుపుతోంది. రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని బాగల్కోటె ఉద్యానవన విశ్వ విద్యాలయంలో విలీనానికి, బీదర్ పశు సంవర్దక, పశు వైద్య, మత్స్య శాఖ విజ్ఞాన విశ్వ విద్యాలయాన్ని బెంగళూరు వర్సిటీలో విలీనం చేయడానికి శ్రీకారం చుట్టనున్నారు. 2005లో ప్రారంభమైన విశ్వవిద్యాలయాల్లో ఉన్నత చదువులు లభిస్తున్నాయి. గత 20 ఏళ్లలో రెండు వర్సిటీల్లో 20 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసించి ప్రభుత్వ కొలువుల్లో చేరారు. విద్యార్థులకు ఇబ్బందులు బీదర్ వర్సిటీలో ముథోళ్ కుక్కల పెంపకం, పరిశోధన కేంద్రం, విజయపురలో మత్య్సశాఖ శాఖను ప్రారంభించారు. పశువులకు టీకాలు, ఇతర నూతన పరిశోధనలు జరిపారు. రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వరి, శనగ, కంది, జొన్న, రాగి, పత్తి, కొర్రలు, మిల్లెట్ వంటి వాటికి ఉత్తేజం కల్పించిన వాటిని ఇతర విశ్వవిద్యాలయాల్లోకి విలీనం చేయడం వల్ల కళ్యాణ కర్ణాటక భాగానికి రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందనే అంశంపై చర్చ జరుగుతోంది. బీదర్, రాయచూరు వర్సిటీలను విలీనం చేస్తే కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని కలబుర్గి, బీదర్, రాయచూరు, విజయపుర, యాదగిరి, కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాల విద్యార్థులకు పలు ఇబ్బందులు ఎదురవుతాయనే విషయాన్ని విద్యావేత్తలు, రైతులు పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర సర్కార్ నూతనంగా ఓ కమిటీని నియమించి విశ్వవిద్యాలయాల నుంచి వస్తున్న లావాదేవీలను గురించి అంచనా వేసి నివేదిక సమర్పించాలని కమిటీకి సిఫార్సు చేయడంతో వారం రోజుల క్రితం కమిటీ అధ్యయనం చేసి సర్కార్కు నివేదికను అందించింది. -
అమ్మవారికి వేరుశెనగల అలంకారం
బనశంకరి: భక్తుల కొంగుబంగారమైన బనశంకరీ దేవి వేరుశెనగ గింజల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. సోమవారం వేకువజామున అర్చకులు ఏ.చంద్రమోహన్ ప్రత్యేక అర్చన, అభిషేకం గావించి వేరుశెనగలతో విశేషంగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని నిమ్మకాయల ప్రమిదలతో దీపారాధన చేశారు. సస్పెన్షన్పై క్యాట్కు ఐపీఎస్ బనశంకరి: చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట దుర్ఘటనలో నగర పశ్చిమ అదనపు పోలీస్ కమిషనర్ వికాస్కుమార్ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం తెలిసిందే. ఆయన ఈ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ పాలనా ట్రైబ్యునల్– క్యాట్లో పిటిషన్ వేశారు. తన సస్పెన్షన్ అక్రమమని, దీనిని కొట్టివేయాలని కోరారు. హైకోర్టులో ఆర్సీబీ పిటిషన్ తొక్కిసలాట ఘటనలో తమపై నమోదైన క్రిమినల్ కేసు రద్దుచేయాలని ఆర్సీబీ జట్టు నిర్వాహకులు సోమవారం హైకోర్టులో పిటిషన్ వేశారు. డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ కూడా కేసు దాఖలు చేసింది. తమను కావాలనే ఇరికించారని, పరిమితమైన పాస్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ప్రకటించామని తెలిపారు. మధ్యాహ్నం 1:45 గంటలకు తెరవాల్సిన స్టేడియం గేట్లను మధ్యాహ్నం 3 గంటలకు తెరిచారు. దీంతో రద్దీ పెరిగిపోయిందని ఆరోపించారు. సిద్దు, శివకు హైకమాండ్ పిలుపు శివాజీనగర: చిన్నస్వామి స్టేడియం దుర్ఘటన జరిగి సిద్దరామయ్య సర్కారు మీద విమర్శలు వస్తుండడంతో కాంగ్రెస్ హైకమాండ్ కొన్ని చర్యలను తీసుకునే అవకాశముంది. సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్కు హైకమాండ్ పిలుపునిచ్చింది. వారు ఢిల్లీకి వెళ్లనున్నారు. డీకే ఇప్పటికే చేరుకోగా, సీఎం మంగళవారం వెళతారు. తొక్కిసలాట ఘటన పరిణామాలపై మల్లికార్జున ఖర్గే, రాహుల్గాంధీ తదితర నాయకులు వివరణ కోరనున్నారని తెలిసింది. ప్రభుత్వంలో కొన్ని మార్పులు జరిగినా ఆశ్చర్యం లేదని సమాచారం. డివైడర్కు కారు ఢీ.. ఇద్దరు మృతి మాలూరు: చైన్నె– బెంగుళూరు రహదారిలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని ఇద్దరు మరణించారు. కారులో ప్రయాణిస్తున్న పొగాకు వ్యాపారులు అశోక్ (28), మోహన్లాల్ (32) మృతులు. వీరు మూలతః రాజస్థాన్కు చెందిన వారు. దేవనగొంది సమీపంలో ఉన్న దేవలాపుర గ్రామంలో పొగాకు దుకాణం నడిపేవారు. తమ కారులో పొగాకు ప్యాకెట్లు నింపుకొని చైన్నె – బెంగుళూరు రహదారిలో వెళ్తున్నారు. ఎడిగినబెలె గ్రామ సమీపం వద్ద రోడ్డు డివైడర్ను ఢీకొని కారు తుక్కుతుక్కయింది. ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మాలూరు పోలీసులు చేరుకుని కారు శిథిలాలను పక్కకు తొలగించి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. -
మోదీ సర్కారుకు సున్నా మార్కులే
శివాజీనగర: కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సున్నా మార్కులు ఇస్తానని ముఖ్యమంత్రి సిద్దరామయ్య చెప్పారు. మోదీ సర్కారు 11 సంవత్సరాలను పూర్తి చేసుకోవడంపై ఆయన సోమవారం మైసూరులో స్పందిస్తూ మోదీ జీవిస్తున్నదే ప్రచారం ద్వారా, ఆయన చేసిన ప్రముఖ భరోసాలలో ఏదీ కూడా నెరవేర్చలేదు. అందుచేత మోదీ ప్రభుత్వానికి జీరో మార్కులు ఇస్తానన్నారు. ప్రధాని పరిపాలనలో అబద్ధాల కు అధిక ప్రచారం లభిస్తోందని ఆరోపించారు. గ్యారెంటీ పథకాలు కాపీ తమ గ్యారెంటీ పథకాలను అమలు చేయ సాధ్యం కాదు, రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీస్తుందని మోదీ ప్రచారం చేశారు, ఆ తరువాత అవే గ్యారెంటీ పథకాలను కాపీ చేశారని ధ్వజమెత్తారు. గ్యారెంటీ పథకాలను విమర్శిస్తున్న మోదీ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, డిల్లీలో వాటిని కాపీ చేసి అమల్లోకి తెచ్చారని ఆరోపించారు. నోట్ల రద్దు వల్ల ఎవరికి అనుకూలమైంది. అచ్చే దిన్ వచ్చిందా, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలను ఇస్తానన్నారు, ఇచ్చారా, రైతుల సమస్యలను పరిష్కరించారా అని ప్రశ్నించారు. 11 సంవత్సరాల పరిపాలనలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని తెలిసి కూడా రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద అప ప్రచారం చేస్తున్నారని సిద్దరామయ్య దుయ్యబట్టారు. రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.5 వేల కోట్లు ఇస్తామని చెప్పారు గానీ ఇవ్వలేదు. రావాల్సిన నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. వాగ్దానాలను నెరవేర్చలేదు నిధుల్లో అన్యాయం: సీఎం సిద్దు -
బంగారం దొరికేనా?
సాక్షి, బెంగళూరు: కన్నడనాట ఎక్కడెక్కడ బంగారు నిక్షేపాలు ఉన్నాయో తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నడుంబిగించింది. అన్వేషణ బృందాలు గాలించి నివేదికలను అందిస్తాయి. బంగారం ఉత్పత్తిలో దేశంలోనే కర్ణాటకకు ప్రత్యేక స్థానం ఉంది. రాయచూరు జిల్లాలో హట్టిలో బంగారం మైనింగ్ జరుగుతోంది. పసిడి మైనింగ్కు కేరాఫ్ అడ్రస్గా ఉన్న కోలారు జిల్లా కేజీఎఫ్లో చాలా ఏళ్ల క్రితమే బంద్ అయ్యింది. ఈ క్రమంలో కర్ణాటకలో గణనీయంగా ఉన్నట్లు బంగారం నిక్షేపాలపై కేంద్రానికి పలు నివేదికలు, లేఖలు అందడంతో దృష్టి సారించింది. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో బంగారం నిల్వల కోసం అన్వేషణ ప్రారంభించింది. పలు మైనింగ్ సంస్థలు కర్ణాటకలో అన్వేషణలు సాగిస్తున్నాయి. అతి త్వరలో నివేదికను రూపొందించి పంపుతాయి. ఎంత బంగారం నిక్షేపాలు ఉన్నాయి, మైనింగ్ జరపడం లాభసాటా, కాదా? అనే అనేక విషయాలను పొందుపరుస్తాయి. నివేదికలను బట్టి 2016–2017 ఆర్థిక ఏడాది నుంచి 2024–2025 వరకు రాష్ట్రంలోని 34 ప్రాంతాల్లో ఖనిజాన్వేషణకు ఎన్ఎంఈటీ (నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్టు)కు అనుమతి లభించింది. 34 చోట్లకు గాను 23 చోట్ల పూర్తి చేసింది. మిగిలిన 11 ప్రాంతాల్లో అనుమతి లభించలేదు. ఇటీవల గుర్తించిన ప్రాంతాల్లో అదనపు ఖనిజాల కోసం వెతుకులాట జరుగుతోంది. తొలి నివేదికలో ఖనిజాల లభ్యతపై సమాచారం ఇవ్వనుంది. ఆ తర్వాత రెండో నివేదికలో ఏ ప్రాంతంలో అత్యధిక బంగారం లభ్యత ఉందనే విషయంపై సమాచారం ఇవ్వనుంది. వాటి ఆధారంగా గనుల తవ్వకాల గురించి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. బంగారం ఆచూకీ లభిస్తే మైనింగ్ రంగానికి ఊతం కర్ణాటకలో పసిడి నిక్షేపాల అన్వేషణ కేంద్రం ఆదేశాలతో పలు కంపెనీల సర్వేలు షురూ ఎక్కడెక్కడ ఏ ఖనిజాల అన్వేషణ ప్రాంతం ఖనిజాలు.. మండ్య (యడియూరు) బంగారం, తామ్రం, అల్యుమినియం, బేస్ మెటల్, చిక్కమగళూరు (కళశాపుర) బంగారం హాసన్ (రామపుర, గొల్లరహట్టి) ఎన్–క్రోమైట్, ప్లాటినం వర్గ లోహాలు బళ్లారి (సిరిగెరె) బంగారం హావేరి (నాగవంద్, కాకోళ్) బంగారం దావణగెరె (కుదురెకొండ, హల్లవనగళ్లి) బంగారంనేడు బంగారం ధర ఆకాశాన్ని అంటుతోంది. గ్రాము బంగారం కొనడం పేదలకు కలగా మారింది. మధ్య తరగతికి భారమైంది. ఈ నేపథ్యంలో బంగారం గనులను కనుక్కోవడం అంటే నిధిని పొందినట్లే. అందుకే ప్రభుత్వాలు బంగారు గనుల కోసం శోధన చేపట్టాయి. -
4 ఎమ్మెల్సీ సీట్లపై సందిగ్ధం
శివాజీనగర: సిద్దరామయ్య సర్కారు, రాజ్భవన్ మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎలాగంటే రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో సేవలందించినవారిని ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలనుకుంది. రమేశ్బాబు, ఆరళి కృష్ణ, డీజీ సాగర్, మాజీ పాత్రికేయుడు దినేశ్ అమిన్ మట్టును విధాన పరిషత్కు నామినేట్ చేస్తున్నట్లు ఫైల్ను గవర్నర్ గెహ్లాట్ ఆమోదం కోసం రాజ్భవన్కు పంపింది. ఇది గత వారం జరిగింది. వివాదం ఎందుకు ఇందులో రమేశ్బాబు కాంగ్రెస్ నాయకుడు. కృష్ణ, డీ.జీ.సాగర్ కూడా కాంగ్రెస్ క్రియాశీల కార్యకర్తలు, పాత్రికేయుడు దినేశ్ గతంలో ముఖ్యమంత్రి మీడియా సలహాదారుగా పనిచేశారు. ఇలా అందరు ఏదో ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి సన్నిహిత వర్గంలోనివారే. కళలు, సంస్కృతి, సేవా రంగాలతో సంబంధం ఉందా, వీరిని ఎగువసభకు నామినేట్ చేయాలా అనే ప్రశ్నను గవర్నర్ లేవనెత్తారు. న్యాయ నిపుణులతో చర్చించిన తరువాతనే ఆమోదం పై నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు తెలిసింది. దీంతో ఫైలు పెండింగ్లో ఉంది. రాజకీయ నేపథ్యం ఉన్నవారిని మేధావుల సభ అని పిలిచే ఎగువసభకు నామినేట్ చేయవచ్చా అని గవర్నర్ అసంతృప్తిని వ్యక్తంచేసినట్లు తెలిసింది. సర్కారు పంపిన ఫైల్.. రాజ్భవన్లో పెండింగ్ -
నేనేం పారిపోను: హోంమంత్రి
శివాజీనగర: స్టేడియ వద్ద తొక్కిసలాట కేసులో 11 మంది మరణించారు. ఇటువంటి సమయంలో పిరికివానిలా పరుగెత్తి వెళ్లిపోను అని హోం మంత్రి జీ.పరమేశ్వర్ అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడిన ఆయన, నాకు హోం శాఖ అవసరం లేదని ఎవరితో చెప్పలేదు. నా భార్యతో కూడా చర్చించలేదు. నా గురించి తప్పుడు వార్తలను ప్రకటించి వ్యక్తిత్వాన్ని హత్య చేయవద్దని అన్నారు. ఇటువంటి వార్తలను ఎవరు సృష్టిస్తున్నారో అని వాపోయారు. తొక్కిసలాట ఘటన బాధ కలిగించింది. ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంది. శాఖ మార్చాలని సీఎంను కోరలేదు అన్నారు. మంగళూరులోని హిందూ కార్యకర్త సుహాస్శెట్టి హత్య కేసును ఎన్ఐఏకు అప్పగించారు, మేం కూడా తగిన నిర్ణయం తీసుకుంటాం, ప్రభుత్వం పంపిన నలుగురు ఎమ్మెల్సీల జాబితాను గవర్నర్ నిలిపివేయడం తనకు తెలియదన్నారు.ఘరానా దొంగకు సంకెళ్లు మైసూరు: జిల్లాలోని టి. నరసిపుర టౌన్ పరిధిలోని దొంగతనాలు చేస్తున్న దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. మైసూరు సిటీకి చెందిన సయ్యద్ సల్దానా అలియాస్ కబూతర్ (35)ను అరెస్ట్ చేశారు. ఇటీవల టి.నరసిపురలో ఒక మెడికల్ స్టోర్లో డబ్బు ఎత్తుకెళ్లాడు. తలకాడ్లో రెండు, బన్నూరులో రెండు, హెచ్డి కోటేలో ఒకటి, మైసూరు నగరంలో ఒకటి ఇలా పలు ప్రాంతాలలో చోరీలకు పాల్పడి, అరెస్టు కావడం, బయటకు వచ్చి మళ్లీ దొంగతనాలు చేయడం వృత్తిగా మార్చుకున్నాడు. మొత్తం 18 కేసులు నమోదయ్యాయి. నిందితుని నుంచి కొత్త అపాచీ బైక్, రూ. 40 వేల నగదు, మూడు మొబైల్ఫోన్లు స్వాధీనం చేసుకొన్నారు. మరో నిందితుడు నయాజ్ కోసం గాలిస్తున్నట్లు సీఐ ధనంజయ్, ఎస్ఐ జగదీష్ తెలిపారు. ఆలయాలలో ప్లాస్టిక్ నిషేధం ● మంత్రి రామలింగారెడ్డి దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో ఉన్న దేవాదాయశాఖ పరిధిలోని అన్ని దేవాలయాల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లతో పాటు అన్ని రకాల ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధిస్తున్నట్లు దేవాదాయశాఖ మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. వికాససౌధలో శాఖ ప్రగతి పరిశీలనా సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు 15 నుంచి ఈ నిబంధనలు అమలవుతాయన్నారు. ఇంకా 2 నెలల సమయం ఉన్నందున అందరూ అనుసరించాలని కోరారు. దేవాదాయశాఖ పరిధిలోని దేవాలయాల సంఖ్య, వాటి ఆస్తులు తదితర అంశాలపై పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దేవాలయాల్లో పూజారులకు డీబీటీ ద్వారా తస్తీక్ అందిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ధార్మిక పరిషత్లను ఏర్పాటు చేయాలన్నారు. తిరుపతి, తుళజాపుర, పండరీపుర తదితర పుణ్యక్షేత్రాల్లో వసతి భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. హులిగమ్మ, మలె మహదేశ్వర, ఘాటి సుబ్రమణ్య, రేణుకా యల్లమ్మ, చాముండేశ్వరి దేవాలయాల సమగ్ర అభివృద్ధి ప్రాధికార మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వంతెన మీద నుంచి దూకి ఆత్మహత్య దొడ్డబళ్లాపురం: ఎంత కష్టం వచ్చిందో గానీ.. ఫ్లై ఓవర్ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు కొడిగేహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హెబ్బాళ నివాసి మునిరాజు (22) ఓ ప్రైవేటు కంపెనీలో పని చేసేవాడు. ఆదివారం అర్ధరాత్రి జక్కూరు ఫ్లై ఓవర్ ఎక్కి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలిసిరాలేదు. కొడిగేహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.పాము కాటుతో బాలిక బలిదొడ్డబళ్లాపురం: పాము కాటు వేయడంతో బాలిక మృతిచెందిన సంఘటన దావణగెరె జిల్లా జగళూరు తాలూకా గడిమాకుంటె గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామ నివాసి మలియప్ప కుమార్తె మాలిని (13) మృతురాలు. తల్లిదండ్రులతో కలిసి మాలిని పొలం పనులకు వెళ్లిన సమయంలో పాము కాటు వేసింది. ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆస్పత్రికి బైక్పై తరలిస్తుండగా దారి మధ్యలో చనిపోయింది. మృతురాలు దావణగెరెలోని ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదివేది. ఎమ్మెల్యే దేవేంద్రప్ప మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. -
బెంగళూరులో తిరిగొచ్చిన వాన
సాక్షి, బెంగళూరు: రుతు పవనాల ప్రభావంతో బెంగళూరు నగర వ్యాప్తంగా సోమవారం సాయంత్రం నుంచి వర్షాలు మొదలయ్యాయి. నగరంలోని 181 వార్డుల్లో సాధారణ వర్షపాతం నమోదయింది. జోరు గాలులతో కూడిన వర్షం కురిసింది. బెంగళూరు రాజరాజేశ్వరి నగర పరిధిలోని వివిధ వార్డుల్లో మధ్యాహ్నం నుంచి వాన ప్రారంభమైంది. వానతో వాహనదారులు రోడ్లపై తడిసిపోయారు. సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వారు ఇబ్బందులు పడ్డారు. వీధి వ్యాపారులకు, వాహనాలకు, జనసంచారానికి ఆటంకమైంది. రోడ్లపై వర్షపు నీరు , డ్రైనేజీ నీరు పొంగి ప్రవహించింది. నగరంలో కొన్నిచోట్లు చెట్లు పడిపోయాయి. వాన రభసకు నాగరహళ్లి– సుమనహళ్లి రోడ్డులో లారీ పల్టీ కొట్టింది. డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఎండల నుంచి ఉపశమనం కొన్ని రోజులుగా బెంగళూరులో ఎండలు కాస్తున్నాయి. ఉక్కపోతతో నగవాసులు ఇబ్బందులు పడ్డారు. గత వారం ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల సెల్సియస్ నుంచి 32 డిగ్రీలకు పెరిగాయి. వానలతో చల్లదనం వచ్చింది. ఈ నెల 11 వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపారు. రాజధానిలో గరిష్టంగా 110 మి.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. చలి వాతావరణం ఏర్పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశముందని పలు జిల్లాల్లో ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించారు. గంటకు 50–60 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జోరుగా గాలివాన -
తొట్టెలో ముంచి.. కూతురి హత్య
యశవంతపుర: తల్లి అంటే పిల్లలను గుండెల్లో పెట్టుకుని కాపాడుతుందని అనుకుంటారు. కొందరు తల్లుల వైఖరి ఇందుకు విరుద్ధంగా ఉంటోంది. తొట్టెలో ముంచి ఆరేళ్ల కూతుర్ని హత్య చేసిన ఘటన హాసన్ జిల్లా చన్నరాయపట్టణ తాలూకా జిన్నేనహళ్లి కొప్పలు గ్రామంలో జరిగింది. తల్లి శ్వేత (36), కూతురు సాన్వి (6)ని తమ పొలంలో తొట్టెలో ముంచి ప్రాణాలు తీసింది. వివరాలు.. ఏడేళ్ల క్రితం రఘు అనే రైతుతో శ్వేతకు పెళ్లయింది. రెండేళ్లకే గొడవలు ప్రారంభమయ్యాయి. నాలుగేళ్ల నుంచి భర్తకు దూరంగా ఉంటోంది. అనేకసార్లు బంధువులు రాజీ ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. శ్వేత విడాకులకు కోర్టులో పిటిషన్ వేసింది.బెంగళూరు నుంచి తీసుకొచ్చిసాన్విని బెంగళూరులో రఘు తల్లిదండ్రులు చూసుకొంటున్నారు. రెండు రోజుల క్రితం బెంగళూరు నుంచి సాన్విని శ్వేత తీసుకొచ్చింది. ఆదివారం ఉదయం ఊరిబయటకు బాలికను పిలుచుకుని వెళ్లింది. అయితే పొలానికి వెళ్లి అక్కడ నీటిలో ముంచి హత్యకు యత్నించింది. బాలిక కేకలు వేయటంతో చుట్టుపక్కల రైతులు గమనించి బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా బాలిక చనిపోయింది. ఎందుకు ఇలా చేశామంటూ స్థానికులు ప్రశ్నించగా ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకొంటున్నట్లు తల్లి చెప్పింది. రఘు వచ్చి హిరిసావె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం వద్ద ఇరు కుటుంబల మధ్య గొడవలు జరిగాయి. శ్వేతపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. -
స్నేహితుడి చేతిలో వ్యక్తి హత్య
రాయచూరు రూరల్: చిన్ననాటి స్నేహితుడిని పొలానికి తీసుకెళ్లి హతమార్చిన ఉదంతం లింగసూగురు తాలూకా యరగుంటలో చోటు చేసుకుంది. జిల్లా ఎస్పీ పుట్టమాదయ్య తెలిపిన మేరకు వివరాలు.. గ్రామానికి చెందిన శరణే గౌడ, బసన గౌడ(43)లు చిన్ననాటి స్నేహితులు. ఏ కారణం చేతనో శనివారం బసనగౌడను పొలానికి తీసుకెళ్లి హత్య చేశాడు. రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న బసనగౌడను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు డాగ్స్క్వాడ్ సహాయంతో నిందితుడిని గుర్తుంచి అరెస్ట్ చేశారు. బైక్ను ట్రాక్టర్ ఢీ, ముగ్గురికి గాయాలుబొమ్మనహాళ్: మండలంలోని ఎల్బీ నగర్ గ్రామం వద్ద ట్రాక్టర్ ఢీకొని ముగ్గురికి గాయాలైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. బళ్లారికి చెందిన బాషా అనే వ్యక్తి ద్విచక్ర వాహనంలో భార్య, కూతురితో కలిసి కణేకల్లుకు వస్తున్నాడు. యర్రగుంట గ్రామానికి చెందిన ట్రాక్టర్ రాళ్లు లోడుతో యర్రగుంట వైపు వస్తూ వెనుక వైపు నుంచి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనం కింద పడిపోగా బాషా కుటుంబీకులు తీవ్రంగా గాయపడ్డారు. స్ధానికులు వెంటనే ప్రైవేట్ అంబులెన్సులో బళ్లారిలోని విమ్స్కు తరలించారు. బొమ్మనహాళ్ పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకొని పరిశీలించారు. హవేరి జిల్లాలో రెచ్చిపోయిన మృగాళ్లు● బాలికపై వరుసగా లైంగిక దాడులు ● నలుగురి అరెస్ట్ హుబ్లీ: హావేరి జిల్లాలో మృగాళ్లు రెచ్చిపోయారు. సిగ్గావి తాలూకా ముగళిగట్టి గ్రామంలో బాలికపై వరుస దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఆ గ్రామానికి చెందిన గొణిరుద్ర సిగ్గట్టి ప్రేమపేరుతో బాలికను మభ్య పెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన హేమంత కబసూర, మంజునాథ్లు బాలిను బెదిరించి అడవి ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం బయటకు పొక్కడంతో పెద్దలు లక్ష్మణ, మారుతీలు రాజీ పంచాయితీ చేసేందుకు బాలిక తండ్రిపై ఒత్తిడి చేశారు. అయితే బాలిక తల్లి ససేమిరా అంది. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ లింగరాజ నేతృత్వంలోని పోలీసులు గాలింపు చేపట్టి గొణిరుద్ర సిగ్గట్టి, మంజనాథ, లక్ష్మణ, మారుతీలను అరెస్ట్ చేశారు. హేమంత్ కబసూరు పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 11న జైన సాధు, సాద్విక్ శిబిరలు రాయచూరురూరల్: జైన ధర్మం ప్రచారంలో భాగంగా ఈనెల 11న నగరంలో జైన్ సాదు, సాద్విక్ దీక్ష శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆ ధర్మానికి చెందిన డాక్టర్ శుత నిధిజి తెలిపారు. అదివారం వర్దమాన స్థానకవాసి జైన్ శ్రావక సంఘ్ భవనంలో మాట్లాడుతూ అచార్య భగవంత 1008 పార్వ్శ చంద్రా ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయని, ఈ సందర్భంగా దిలిప్కుమార్ దోఖాకు జైన దీక్ష ఇవ్వనున్నట్లు తెలిపారు. శాంతిలాల్, విశ్వ కుమార్, ప్రసన్న చంద్, నరేంద్ర, గౌతంఘియా, అశోక్ కుమార్జైన్ పాల్గొన్నారు. ఆవుల బెడద అరికట్టండి హొసపేటె: నగరంలో ఆవుల బెడద తీవ్రంగా మారింది. మందలుగా సంచరిస్తూ వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. రోడ్లకు అడ్డంగా పడుకుంటున్నాయి. వాటిని దాటుకొని వెళ్లేందుకు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆవుల వల్ల ప్రమాదాలు జరిగి ద్విచక్రవాహనదారులు గాయపడిన ఘటనలు అనేకం ఉన్నాయి. వీధి పశువుల బెడద నివారణకు సంబంధించి గతంలో జిల్లా కలెక్టర్ ఎస్ఎస్ దివాకర్, నగరసభ అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే మళ్లీ ఆవుల బెడద మొదలైంది. నగరసభ అధికారులు స్పందించి పశువులు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. -
భారీ వర్షానికి కొట్టుకుపోయిన వంతెన
రాయచూరురూరల్: జిల్లాలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. రెండు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి గ్రామీణ ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. వంకలు, వాగులు పొంగి ప్రవహించాయి. వరద నీటి ఉధృతికి తాలుకాలోని పత్తేపూర్లో పాత వంతెన కొట్టుకుపోయింది. వరద నీటిలో టిప్పర్ చిక్కుకుపోయింది. డ్రైవర్ ప్రాణాలతో బయట పడ్డాడు. కాగా పాత వంతెన పక్కనే కొత్తగా వంతెన నిర్మిస్తున్నారు. పనులు మందకొడిగా సాగుతుండటంతో ప్రజలు పాత వంతెనపైనే రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం అంది కూడా కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
సేలం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
హొసపేటె: తమిళనాడులోని సేలం జిల్లా వలపడిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విజయనగర జిల్లా వాసులు నలుగురు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు గాయపడ్డారు. విజయనగర జిల్లా హగరిబోమ్మనహళ్లికి చెందిన పటేల్ ఎలక్ట్రికల్, జగదాంబ బట్టల దుకాణాల యజమానులు తమిళనాడులోని ఈరోడ్లో బంధువుల గృహ ప్రవేశానికి శుక్రవారం కారులో బయల్దేరారు. శనివారం సాయంత్రం వీరు ప్రయాణిస్తున్న కారు వలపడి వద్ద డివైడర్ను ఢీకొంది. ప్రమాదంలో రాణారామ్ పటేల్(52), జోగిరామ్(62), అతని భార్య తోగి దేవి(55), హోస్పేట్కు చెందిన బంధువు ఒకరు సంఘటనా స్థలంలోనే మరణించారు. రాణా పటేల్, అతని భార్య టోపి దేవితో సహా మరో ముగ్గురు ఆస్పత్రి గాయపడగా ఆస్పత్రికి తరలించారు. ఈఘటనతో పట్టణంలోని వ్యాపారులు దిగ్భ్రాంతి చెందారు. నలుగురు విజయనగర జిల్లావాసుల మృతి -
కంపచెట్లు వేసి నిరసన
రాయచూరు రూరల్: నెలల తరబడి కష్టించినా బిల్లులు అందకపోవడంతో ఉపాధి కూలీల్లో ఆగ్రహం పెల్లుబుకింది. దీంతో కంపచెట్లను గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన శనివారం సుంకేశ్వర గ్రామంలో జరిగింది. కూలీలు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద కాలువల్లో రెండు నెలల క్రితం పూడిక తీసిన పనులు చేపట్టామన్నారు. అయితే నెలల తరబడి బిల్లులు చెల్లించలేదన్నారు. దీంతో తమ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. బిల్లులు చెల్లించాలని పలుమార్లు పంచాయతీ అధికారులకు విన్నవించినా స్పందించలేదన్నారు. విసుగు చెంది కార్యాలయానికి కంపచెట్లు వేసినట్లు తెలిపారు. -
దశభుజ గణపతికి విశేష పూజలు
రాయదుర్గం టౌన్: రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూరు వీధిలో వెలసిన శ్రీదశభుజ మహాగణపతి ఆలయంలో ఆదివారం విశేష పూజలు జరిగాయి. ప్రతి ఆదివారం స్వామి వారికి అభి షేకం, పూజలు నిర్వహిస్తారు. ఏకదంతుని దర్శనం కోసం స్థానిక భక్తులే కాక బళ్లారి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. కారు, బైక్ ఢీ.. ఇద్దరి మృతి రాయచూరురూరల్: కారు, బైక్ ఢీకొని ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన యరగేర వద్ద అదివారం జరిగింది. కెరె బూదురు నివాసులుఉరుకుంద ఈరణ్ణ(42), లక్ష్మన్(40)లు బైక్పై రాయచూరు నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా యరగెరె వద్దకు రాగానే మంత్రాలయం నుంచి రాయచూరు వైపు వెళ్తున్న కారు ఎదురైంది. పరస్పరం రెండు వాహనాలు ఢీకొనడంతో ఈరణ్ణ, లక్ష్మణ్లు మృతి చెందారు. పోలీసులు మృతదేహాలను రాయచూరు సర్వజనాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. గ్రామాల అభివృద్ధే ధ్యేయం హొసపేటె: గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు హరపనహళ్లి ఎమ్మెల్యే ఎంపీ లత తెలిపారు. విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా అడవిమల్లపుర గ్రామంలో సీసీ రోడ్డు పనులకు ఆదివారం ఎమ్మెల్యే భూమిపూజ చేసి మాట్లాడారు. రెండేళ్లలో రూ.500 కోట్లతో హరపనహళ్లి యోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. నరేగాలోనే రూ. 110 కోట్ల పనులు జరిగాయన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజనిప్ప మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ఎంపీ రవీంద్ర కృషి కారణంగా తాలూకాను సెక్షన్ 371 జే కిందకు తీసుకువచ్చినప్పటి నుంచి వందల కోట్ల గ్రాంట్ అందుతోందని అన్నారు. బీజేపీ కాలంలో వచ్చిన గ్రాంట్ ఎక్కడికి వెళుతుందో తనకు తెలియదని అన్నారు. పార్టీ నేతలు కుబేరప్ప మైదురు రామప్ప తదితరులు పాల్గొన్నారు. ఎయిమ్స్ మంజూరుకు కృషి రాయచూరురూరల్: రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టేలా చూస్తామని జాతీయ స్వాభిమాని పరిషత్ అధ్యక్షుడు బసవరాజ పాటిల్ తెలిపారు. నగరంలోని మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో అందోళన చేపట్టిన సమితి అధ్యక్షుడు బసవరాజ కళసకు ఆయన మద్దతు పలికారు. అనంతరం మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించి రాయచూరుకు ఎయిమ్స్ మంజూరు చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అశోక్ కుమార్జైన్, అమరేగౌడ, సులోచన, తిమ్మా రెడ్డి, మహేంద్ర సింగ్, వీరభద్రయ్య, గురురాజ్, జగదీశ్, వెంకటేశ్, నరసయ్య, మహవీర్, రమేష్ పాల్గొన్నారు. మున్నూరు కాపు సమాజ సేవలు ప్రశంసనీయం రాయచూరురూరల్: జిల్లాలో మున్నూరు కాపు సమాజం చేపట్టిన సమాజ సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ అన్నారు. మూన్నూరు కాపు సమాజం సాంస్కతిక ఉత్సవాల్లో భాగంగా వివిధ రంగాల్లో సేవలందంచిన ఆ సమాజ సేవకులను నగరంలోని వీరాంజనేయ స్వామి ఆలయంలో శనివారం సన్మానించారు. 25 ఏళ్లుగా ముంగారు ఉత్సవాలు నిర్వహిస్తుండటం అభినందనీయమన్నారు. వీరభద్ర శివాచార్యులు, అభినవ రాచోటి శివాచార్యులు, శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, మూన్నూరు కాపు సమాజం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి, నరసా రెడ్డి, శ్రీనివాస రెడ్డి, శంకర్ రెడ్డి, క్రిష్టమూర్తి పాల్గొన్నారు. -
నేరేడు పండ్లు వచ్చేశాయ్
సాక్షి,బళ్లారి: అనేక ఔషధ గుణాలున్న అల్లనేరేడు పండ్లు మార్కెట్లోకి వచ్చేసాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ పండ్లు కాస్తంతా వగరు, తీయగా ఉంటూ నల్లగా నిగనిగ మెరుస్తుంటాయి. చిరు వ్యాపారులు తోపుడు బండ్లలో అల్లనేరేడు పండ్లను ఉంచి విక్రయిస్తున్నారు. సీజన్లో వచ్చేఈ పండ్లను కొన్ని రోజులైనా తినాలని వైద్యులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంపొందించే ఈ పండ్లు ముఖ్యంగా షుగర్వ్యాధిగ్రస్తులకు రామభాణంలో పనిచేస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఏటా జూన్లో.. ఏటా జూన్ ప్రారంభం నుంచి అన్ని ప్రాంతాల్లో కాసరకాయలు, నేరేడికాయలు పండుతాయి. కాసర కాయలుభూమిపైన మొక్కల్లో విరివిగా కాస్తే, నేరేడు కాయలు చెట్లపైభాగంలో కాస్తుంటాయి. ఈ రెండు చక్కెర వ్యాధికి ఎంతో మేలు చేస్తాయి. ప్రస్తుతం వారం రోజులుగా బళ్లారి నగరంలో ఏ వీధుల్లో చూసినా ఈ రెండు కాయలు దర్శనం ఇస్తుండాయి. కాసరకాయల పొలాల్లో గట్టు మీద కాయడంతో వ్యవసాయకూలీలు కోసుకుని వచ్చి రోడ్లులో పెద్ద ఎత్తున అమ్మకాలు సాగిస్తున్నారు. కేజీ కాసర కాయ రూ.150 నుంచి రూ.200 వరకు విక్రయిస్తున్నారు. దాసరనాగేనళ్లిలో కాసర కాయలు విస్తారంగా పండుతున్నాయి. ఈ సీజన్ ముగిసిన తర్వాత నేరేడు, కాసర కాయలు మరో ఏడాది పాటు కనబడే అవకాశాలు తక్కువ. ముఖ్యంగా ఈరెండు కాయలకు ఎలాంటి క్రిమి సంహారక, రసాయన ఎరువులు కూడా వినియోగించరు. సహజంగా పండే ఇలాంటి పండ్లను తినడం వల్ల ఎన్నో పోషకాలుతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ప్రొటీన్, కాల్షియం, కార్బొహైడ్రట్లు, ఐరన్, మెగ్నీషియం, పాస్పరస్, పొటాషియం, సోడియం, విటమిన్ సి. థయామిన్, విటమిన్ బీ 6 ఈ పండ్లలో లభిస్తాయి. షుగర్ను అదుపు చేయడంతోపాటు గుండెకు మేలు చేస్తాయి. స్ట్రోక్ రాకుండా, అధిక రక్తపోటు నివారణకు అల్లనేరేడు పండ్లు దోహదం చేస్తాయి. శ్వాసనాళాలు, ఊపరితిత్తులను శుభ్రం చేస్తుంది. అంతేకాదు చర్మం మిలమిల మెరిసేందుకు ఈ పండ్లు ఉపకరిస్తాయి. మార్కెట్లలో విరివిగా విక్రయాలు పండ్లలో అనేక ఔషధ గుణాలు చక్కెరవ్యాధి నియంత్రణకు రామబాణం -
మెట్రో రైలు టికెట్లకు, కాలుష్యానికి లింక్
బనశంకరి: రాజధానిలో నమ్మ మెట్రో రైలు టికెట్ ధరల పెంపు వల్ల ప్రయాణికుల సంఖ్య కొంచెం తగ్గుముఖం పట్టింది. దీని వల్ల నగరంలో వాయు కాలుష్యం పెరిగినట్లు నిర్ధారణ కావడం విశేషం. మెట్రో రైలు టికెట్లకు, కాలుష్యానికి సంబంధం ఏమిటని ఆశ్చర్యపోవచ్చు. జాతీయ వాయు నాణ్యత పర్యవేక్షణా కేంద్రం నివేదికలో ఇదే వెలుగుచూసింది. భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్సీ) సుస్థిర రవాణా రంగంలో అధ్యాపకుడైన ఆశిశ్ వర్మ నేతృత్వంలోని బృందం అధ్యయనం చేసింది. డబుల్ డెక్కర్ రహదారుల్లో కాలుష్యం పెరిగినట్లు తేలింది. అలాగే మెట్రోరైలు టికెట్ ధర పెంపు వల్ల జనం మళ్లీ కార్లు, బైక్లు, ట్యాక్సీలలో ప్రయాణం చేయసాగారు, ఇలా వాహనాల సంఖ్య పెరిగింది. మెట్రోలో 5 శాతం ప్రయాణికులు తగ్గితే అదే శాతం ప్రయాణికులు ఇతర వాహనాలను ఆశ్రయించారు. ఇది వాయు కాలుష్యానికి, కొంత ట్రాఫిక్ సమస్యకు కారణమైందని ఐఐఎస్సీ నిపుణులు పేర్కొన్నారు. కాలుష్య ప్రమాణాల్లో మార్పు టికెట్ల పెంపునకు ముందు, తరువాత జయనగర 5 వ బ్లాక్లో కాలుష్యనియంత్రణ మండలి పర్యవేక్షణ కేంద్రంలో వాయు నాణ్యతను లెక్కించారు. జనవరి 27న ఉదయం 75 ఏక్యూఐ, సాయంత్రం 71 ఏక్యూఐ, ఫిబ్రవరి 3 తేదీ ఉదయం 71 ఏక్యూఐ, సాయంత్రం 77 ఏక్యూఐ ఉంది. టికెట్లు పెరిగిన తరువాత ఉదయం 117 ఏక్యూఐ, సాయంత్రం 114 ఏక్యూఐ నమోదైంది. టికెట్ల రేట్లు పెరగ్గానే వాయు మాలిన్యం అధికం ప్రజలు కార్లు, బైక్లలో ప్రయాణాలే కారణం ఐఐఎస్సీ అధ్యయనంలో వెల్లడి సౌకర్యాల కల్పన ముఖ్యం మెట్రో టికెట్ ధరల పెంపు వల్ల ప్రత్యేకంగా తక్కువ, మధ్య తరగతి కుటుంబాలకు ఇబ్బందిగా ఉంది. టికెట్ రేట్ల పెంపు నష్టాన్ని ప్రభుత్వాలు తెలుసుకోవాలి. లేని పక్షంలో సామాజికంగా, ఆర్థికంగా, ప్రకృతిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆశిశ్వర్మ తెలిపారు. సొరంగ మార్గాలు, డబుల్ డెక్కర్ రోడ్లలో కాలుష్యం ఎక్కువైంది. ప్రజారవాణా వ్యవస్థలను ఉపయోగించడం పెరగాలి. పనికిరాని పథకాలకు కోట్లాది రూపాయలు వ్యయం చేసే బదులు బస్సులు, మెట్రో రైలు వ్యవస్థలను విస్తరించడం ఉత్తమం. ప్రజల ఆరోగ్యం కోసమైనా నగరంలో సౌకర్యాలను రూపొందించాలని సలహా ఇచ్చారు. -
ఆస్తమా మందు.. మనకే ముందు
● కొప్పళ వద్ద కూటగానహళ్లిలో జనజాతర రాయచూరు రూరల్: ఆస్తమా, ఉబ్బసం సమస్యలకు హైదరాబాద్లో చేపమందు ఇస్తారన్నది తెలిసిందే. మృగశిర కార్తె మొదలు కాగానే మందు పంపిణీ ఆరంభిస్తారు. ఇదే మాదిరిగా కొప్పళ జిల్లాలో ఓ గ్రామంలో ఆస్తమాకు ఆయుర్వేద మందును పంపిణీ చేస్తారు. ఇందుకోసం అనేక రాష్ట్రాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. ఆదివారం కూటగానహళ్లి బృహత్ జాతరను తలపించింది. పేదలు, ధనవంతులు అనే తేడా లేకుండా మందు కోసం వచ్చారు. గ్రామంలోని పాఠశాలలో కులకర్ణి కుటుంబం ఈ మందును పంపిణీ చేస్తోంది. మృగశిర కార్తెలో చంద్రుడు, నక్షత్ర గమనాన్ని అంచనా వేసి మందును పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ ఆయుర్వేద మందు ఆస్తమా, ఉబ్బసంతో పాటు శ్వాసకోశ వ్యాధులకు రామబాణమని చెప్పారు. ఎండల వేడిమి ఉన్నప్పటికీ ప్రజలు గొడుగులు పట్టుకుని మందు కోసం నిరీక్షించారు. -
విషాద సూచిక.. ఆకస్మిక వేడుక!
రమణీయం.. నృత్య నివేదనం ఆ చావులకు సీఎం కారణం ● కేంద్రమంత్రి సోమన్న విమర్శలు మైసూరు: చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగి 11 మంది అమాయక ప్రజలు చనిపోవడానికి ముఖ్య కారణం ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఆయన పదవికి రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి వి.సోమన్న అన్నారు. ఆదివారం మైసూరులో మీడియాతో మాట్లాడుతూ సిద్దరామయ్య నుంచి ఇలాంటి పరిపాలన వస్తుందని తాము అసలు ఊహించలేదని హేళన చేశారు. మీలో మీకు ఏమైనా గొడవలు ఉంటే పార్టీ పెద్దలతో కూర్చుని మాట్లాడుకోవాలి తప్ప ఇలా విజయోత్సవాల పేరుతో ప్రజల ప్రాణాలను తీయడం సరికాదని అన్నారు. అంతమంది మరణాలకు బాధ్యత ఎవరు తీసుకుంటారని ధ్వజమెత్తారు. సీఎం సిద్దరామయ్య వీరి చావులకు కారణమని అన్నారు. తొక్కిసలాటపై స్వామీజీల ఫిర్యాదు శివాజీనగర: ఆర్సీబీ ఐపీఎల్ విజయోత్సవంలో చిన్నస్వామి మైదానం వద్ద సంభవించిన తొక్కిసలాట మీద రాష్ట్ర ప్రభుత్వ విరుద్ధంగా కొందరు స్వామీజీలు ఫిర్యాదు చేశారు. కల్బుర్గి నారాయణగురు శక్తి పీఠపు ప్రణవానంద స్వామి, కుంబార మహా సంస్థాన పీఠపు బసవమూర్తి కుంబార గుండయ్య స్వామి, చలవాది పీఠపు బసవనాగి దేవశ్రీతో పాటుగా ఇతర స్వామీజీల బృందం కబ్బన్ పార్కు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆర్సీబీ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కి కూడా ఫిర్యాదు చేయనున్నారు. నైతిక బాధ్యత వహించి సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీ.కే.శివకుమార్, హోం మంత్రి జీ.పరమేశ్వర్ రాజీనామా చేయాలని స్వామీజీలు కోరారు. ఆర్సీబీ మీద ఇతర దేశాలవారు పెట్టుబడులు పెట్టారు, అందుచేత ఈడీ తనిఖీ చేయాలన్నారు. హక్కుల కమిషన్ నివేదిక తొక్కిసలాట మీద 3 సుమోటో, 2 ప్రత్యేక కేసులు నమోదు చేసుకొన్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్.. ప్రభుత్వానికి మధ్యంతర నివేదికను సమర్పించింది. ప్రజాస్వామ్యంలో మానవులకు మౌలిక సదుపాయాలను, భద్రత కల్పించటం అత్యంత ప్రధానమైనదని పేర్కొంది. ఘటనాస్థలాలను పరిశీలించి, గాయపడినవారిని కలిసి, వైద్యులతో మాట్లాడి నివేదికను రూపొందించారు. మద్యం మత్తులో కింద పడి.. శివాజీనగర: ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి ఇంటి పై నుంచి పడి మరణించాడు, ఈ ఘటన శనివారం రాత్రి నగరంలోని జ్ఞానభారతి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మల్లత్తహళ్ళి కదంబ లేఔట్కు చెందిన నివాసి మంజునాథ్ (36) రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో రెండతస్తుల తన ఇంటి టెర్రెస్పై మద్యం తాగుతూ కూర్చొన్నారు. ఆ సమయంలో నడవబోయి అదుపు తప్పి కిందకు పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దారిలో చనిపోయాడు. జ్ఞానభారతి పోలీసులు కేసు నమోదు చేశారు. అవయవ దానంతో ఐదుగురికి సాయం బనశంకరి: బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తి అవయవ దానంతో ఐదుమంది ప్రాణాలు దక్కాయి. అతని దేహం నుంచి మూత్రపిండాలు, కళ్లు, గుండె తదితర ముఖ్యమైన అవయవాలను సేకరించి అవసరమైన వారి కోసం వాయుసేన విమానంలో పలు నగరాలకు పంపించింది. సదరు రోగి నుంచి ఎయిర్ఫోర్స్ కమాండ్ ఆసుపత్రిలో అవయవాలను సేకరించి ఐదుమంది రోగులకు అమర్చడానికి పంపించారు. అవయవదానం చేసిన వ్యక్తి వివరాలను వెల్లడించలేదు. పరిహారం అందజేత తుమకూరు: బెంగళూరులో స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన జిల్లాలోని కుణిగల్ తాలూకా అమృతూరుకు చెందిన మనోజ్కుమార్ కుటుంబానికి పరిహారం అందింది. తుమకూరు నగరంలోని జిల్లాధికారి కార్యాలయంలో మనోజ్కుమార్ తండ్రి దేవరాజ్కు రూ. 25 లక్షల చెక్ను కలెక్టర్ శుభ కళ్యాణ్ అందజేశారు. ఆటోడ్రైవర్పై టెక్కీ కత్తితో దాడి బనశంకరి: మద్యం సేవించి గొడవచేస్తున్న టెక్కీ, ఆటోడ్రైవరుపై చాకుతో పొడిచాడు. ఈ ఘటన నగరంలో గోవిందపుర పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. కమ్మనహళ్లి నివాసి ఆటోడ్రైవరు రామ్కుమార్ బాధితుడు. టెక్కీ విష్ణు మద్యం మత్తులో హెణ్ణూరు జంక్షన్లో రభస చేస్తున్నాడు. అక్కడికి వచ్చిన హోయ్సళ పోలీసులు అతడిని నిర్బంధించడానికి ప్రయత్నించారు. ఆటోడ్రైవరు రామ్కుమార్ కూడా టెక్కీని పట్టుకోవడానికి యత్నించాడు. విష్ణు చాకుతీసి రామ్కుమార్ పొట్టపై పొడిచి పారిపోతూ కిందపడి గాయపడ్డాడు. కత్తిపోట్లకు గురైన రామ్కుమార్ గోవిందపుర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గాయపడిన ఇద్దరిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. బనశంకరి: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవం సమయంలో చిన్నస్వామి స్టేడియం వద్ద సంభవించిన తొక్కిసలాట ఘటనకు ఎవరు బాధ్యులు అనేది తీవ్ర చర్చలకు దారితీసింది. 11 మంది చనిపోయి, 50 మందికి పైగా గాయపడ్డారు. పోలీస్ కమిషనర్ సహా పలువురు పోలీసులను సిద్దరామయ్య సర్కారు సస్పెండ్ చేయడం తెలిసిందే. ఈ దుర్ఘటనలో రోజురోజుకు కొత్త సంగతులు బయటకు వస్తున్నాయి. అసలు విధానసౌధ ముందు విజయోత్సవం నిర్వహిస్తే భద్రత కల్పించడం కష్టమవుతేందని ఆ ప్రాంత డీసీపీ పరిపాలనా శాఖ ఉన్నతాధికారులకు లేఖరాసి హెచ్చరించినట్లు వెలుగులోకి వచ్చింది. వేలాదిమంది వచ్చే అవకాశం ఉంది. బందోబస్త్ చేయడం సమస్య అవుతుంది. కొంచెం సమయం తీసుకుని భద్రత మధ్య విజయోత్సవం చేయడం మంచిదని విధానసౌధ డీసీపీ కరిబసవనగౌడ, డీపీఏఆర్ కార్యదర్శి సత్యవతి కి లేఖ రాసినట్లు వెల్లడైంది. జూన్ 4వ తేదీ ఆర్సీబీ విజయోత్సవం జరుపుతారని తెలిసి డీసీపీ వెంటనే నిర్వహించకూడదని లేఖలో పేర్కొన్నారు. ఘటనాస్థలం సమస్యాత్మకమని, అక్కడ సీసీ కెమెరాలు కూడా లేవని పలు అంశాలను లేఖలో ప్రస్తావించారు. కానీ ఆ వేడుక నిర్వహణను చూస్తున్న సిబ్బంది, పాలనాయంత్రాంగం శాఖ కార్యదర్శి జి.సత్యవతి.. గ్రీన్సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. మ్యాచ్ ముగిసిన 24 గంటలకంటే తక్కువ అవధిలోనే వేడుకలు చేయరాదు, రద్దీ నిర్వహణ కష్టసాధ్యమని లేఖలో తెలిపారు. ఈ లేఖ అప్పటి పోలీస్ కమిషనర్ బీ.దయానంద్, ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి శాలిని రజనీశ్కు కూడా చేరిందని సమాచారం. లేఖ వ్యవహారం గురించి సీఎం సిద్దరామయ్య ఇంకా స్పందించలేదు. ప్రతిపక్షాలకు లేఖాస్త్రంగా మారింది. అయితే విధానసౌధ ముందు కార్యక్రమం ఎలాగో ముగిసింది, విషాదం చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగింది. ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి శివాజీనగర: ఆర్సీబీ విజయోత్సవంలో తొక్కిసలాట జరిగినందుకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హోం మంత్రి జీ.పరమేశ్వర్ రాజీనామా చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు ఆదివారం విధానసౌధ ఆవరణలో గాంధీ విగ్రహం ముందు బైఠాయించారు. తొక్కిసలాట మరణాలకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత. నైతిక బాధ్యత వహించి వారు పదవుల నుంచి తప్పుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర, బీజేపీ పక్ష నేత అశోక్ డిమాండ్చేశారు. రాజీనామా చేసేవరకు తమ పోరాటం ఆగదని నినాదాలు చేశారు. ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలి. సీఎం, డీసీఎం రాజీనామా ఇవ్వాలని ప్లకార్డులు ప్రదర్శించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. నేడు గవర్నర్కు ఫిర్యాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించాలని గవర్నర్కు సోమవారం విన్నవిస్తామని అశోక్ తెలిపారు. ఈ ప్రభుత్వాన్ని తొలగిస్తేనే మృతుల ఆత్మలకు శాంతి లభిస్తుందని, గవర్నర్ను భేటీ చేసి సర్కారు బర్తరఫ్కు డిమాండ్ చేస్తామన్నారు. విధానసౌధ వద్ద కార్యక్రమం ఏర్పాటు చేస్తే భద్రత కల్పించటం కష్టమని డీసీపీ లేఖ రాశారు, అయినా కూడా కార్యక్రమం చేశారు. ఎవరిని మెప్పించేందుకు నిర్వహించారు? అని ధ్వజమెత్తారు. డీకే శివకుమార్ చిన్నస్వామి క్రీడా మైదానంలో జరిగిన కార్యక్రమానికి వెళ్లారు, అక్కడ రూ.1 కోటి విలువచేసే బాణసంచాను పేల్చారు, మీ అందరికీ మానవత్వం ఉందా అని దుయ్యబట్టారు. పోలీసులు జనం మరణాల గురించి చెప్పలేదని సీఎం చెబుతున్నారు. మీ అధికారులు మట్టిని తింటున్నారా, టీవీల్లో క్షణ క్షణం వార్తలు వస్తున్నాయి కదా అని ఎద్దేవా చేశారు. తొక్కిసలాట మృతుల కుటుంబాల కోసం బీజేపీ ఎమ్మెల్యేలు ఒక నెల జీతం విరాళం ఇవ్వనున్నట్లు ఆర్.అశోక్ తెలిపారు. మృతుల కుటుంబాల ఇళ్లకు వెళ్లి పరిహారాన్ని అందజేసి పరామర్శిస్తామని చెప్పారు. హుటాహుటిన సీఎం ఇంటికి డీసీఎం, హోంమంత్రి బనశంకరి: సీఎం సిద్దరామయ్య నుంచి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హోం మంత్రి పరమేశ్వర్ కు అత్యవసర పిలుపు రావడం కుతూహలం రేపుతోంది. వారు ఆదివారం అన్ని కార్యక్రమాలు రద్దుచేసుకుని బెంగళూరులో సీఎం నివాసానికి చేరుకున్నారు. కనకపురలో ఉన్న శివకుమార్, తుమకూరులో ఉన్న పరమేశ్వర్ హుటాహుటిన వచ్చారు. స్టేడియంలో తొక్కిసలాట ఘటన గురించి చర్చించడానికేనని తెలిసింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి శాలిని రజనీశ్ కూడా పాల్గొన్నారు. మెట్రో పిల్లర్కు సిటీ బస్ ఢీ ● ప్రయాణికుడు మృతి యశవంతపుర: బీఎంటీసీ బస్సు మెట్రో పిల్లర్ను ఢీకొన్న ఘటనలో 12 మంది గాయపడగా వీరిలో ఒకరు మృతి చెందారు. బిడదికి చెందిన జయరామ్ (57) మృతుడు. శుక్రవారం రాత్రి 8:30 గంటల సమయంలో కెంగేరి మైలసంద్ర వద్ద బస్సు 607వ మెట్రో పిల్లర్ను అదుపుతప్పి ఢీకొంది. స్టీరింగ్ కట్ కావడమే కారణమని తెలిసింది. బస్సు ముందుభాగం నుజ్జయింది. డ్రైవర్, కండక్టర్తో పాటు 12 మంది గాయపడ్డారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి జయరాం చనిపోయాడు. బీఎంటీసీ బస్సు ఢీకొని బైకిస్టు.. బీఎంటీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో బైకిస్టు మరణించిన ఘటన బెంగళూరు హెబ్బాళ వద్ద ఆదివారం జరిగింది. బస్సు చక్రాలు వెళ్లడంతో బైకిస్టు తల నుజ్జునుజ్జుయింది. హెబ్బాళ కళ్యాణనగర వద్ద బైకిస్టు భార్య పిల్లలతో కలిసి వెళుతుండగా వేగంగా వచ్చిన బీఎంటీసీ బస్సు వారిపై దూసుకెళ్లింది. భార్య పిల్లలకు గాయాలయ్యాయి. హెబ్బాళ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. చెరువుపాలైన యువకులు మండ్య: మండ్య జిల్లాలోని కేఎం దొడ్డి దగ్గర హెబ్బాలలో ఈతకు వెళ్ళిన ఇద్దరు యవకులు నీట మునిగి మరణించారు. ఆలభుజనహళ్ళి గ్రామానికి చెందిన సిద్దరాజు కుమారుడు చేతన్ (16), స్వామి కుమారుడు దర్శన్ (19), ఆదివారం కావడంతో చెరువులో ఈతకు వెళ్లారు. సరిగా ఈత రాకున్నా ముందుకు వెళ్లారు, లోతైన చోట మునిగిపోవడంతో ప్రాణాలు పోయాయి. మిగతా మిత్రులు బయటకు వచ్చి కేకలు వేశారు. చుట్టుపక్కల వారు వచ్చేసరికి ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. కుటుంబసభ్యులు పరుగున వచ్చి కన్నీరుమున్నీరు అయ్యారు. మృతదేహాలను బయటికి తీసి ఎలాంటి కేసు వద్దని ఇళ్లకు తీసుకెళ్లారు. దావణగెరెలో పేలుడు శబ్ధం దొడ్డబళ్లాపురం: దావణగెరె పట్టణంలో శనివారం అర్ధరాత్రి భారీ పేలుడు శబ్దం వినిపించడంతో జనం బెంబేలెత్తిపోయారు. ఇళ్లల్లోంచి బయటకు వచ్చి ఏమైందోనని దిక్కులు చూశారు. పేలుడు ఎక్కడ జరిగిందీ అనేది తెలియలేదు. జగళూరు పట్టణంలో 50 ఏళ్ల తరువాత రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. విస్తరణకు అడ్డుగా చాలా చోట్ల పెద్దపెద్ద బండరాళ్లు ఉన్నాయి.బహుశా వాటిని పేల్చేందుకు డైనమైట్లు పెట్టారనే అనుమానాలు కలుగుతున్నాయి. న్యూస్రీల్ ఆర్సీబీ విజయోత్సవానికి భద్రత కష్టం ఉన్నతాధికారులకు లేఖ రాసిన డీసీపీ కానీ సంబరాలకు గ్రీన్ సిగ్నల్ సీఎం, డీసీఎం, హోంమంత్రి తప్పుకోవాలి విధానసౌధ ఆవరణలో బీజేపీ ధర్నా -
క్రికెట్ సంఘం పెద్దల రాజీనామాలు
బనశంకరి: రాజధానిలో ఆర్సీబీ విజయోత్సవాలలో చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట పై సీఐడీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. శనివారం స్టేడియంలో దుర్ఘటన జరిగిన స్థలాలను పరిశీలించారు. ఆర్సీబీ, కేఎస్సీఏ, డీఎన్ఏ కంపెనీల ప్రతినిధులను విచారణ చేపట్టారు. ఈ ఘోర దుర్ఘటనలో 11 మంది చనిపోగా, 60 మందికి పైగా గాయపడడం, దేశమంతటా విమర్శలు చెలరేగడం తెలిసిందే. సీఐడీ ఎస్పీ శుభన్వితా నేతృత్వంలో డీఎస్పీలు పురుషోత్తమ్, గౌతమ్, అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు. విచారించాల్సిన వ్యక్తుల జాబితాను రూపొందించే పనిలో ఉన్నారు. ఇప్పటికే అరైస్టెన ఆర్సీబీ ప్రాంచైజీ మార్కెటింగ్ విభాగం చీఫ్ నిఖిల్ సొసాలే, ఆ వేడుక నిర్వహణ బాధ్యత తీసుకున్న డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రతినిధులు సునీల్ మ్యాథ్యూ, కిరణ్, సుమంత్లను రిమాండ్ కు తరలించారు. బక్రీద్ సందర్భంగా శనివారం, ఆదివారం సెలవు కావడంతో సోమవారం నిందితులను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తారు. ఆర్సీబీపై మరో ఎఫ్ఐఆర్ చిన్నస్వామి స్టేడియం దుర్ఘటనలో కబ్బన్పార్కు పోలీస్స్టేషన్లో ఆర్సీబీ, కేఎస్సీఏ, డీఎన్ఏ కంపెనీ పై మూడో ఎఫ్ఐఆర్ నమోదైంది. గాయపడిన బీకాం విద్యార్థి సీ.వేణు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. ఆర్సీబీ ఫ్రీ టికెట్ ప్రకటనను చూసి స్టేడియానికి వెళ్లానని, గేట్ నంబరు 6 వద్ద తొక్కిసలాట ఏర్పడింది. నా కుడికాలిపై బ్యారికేడ్ పడటంతో గాయపడి బౌరింగ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నానని ఫిర్యాదులో తెలిపాడు. రోలన్ గోమస్ అనే ఓ బాధితుడు శుక్రవారం సాయంత్రం కబ్బన్పార్కు ఠాణాలో ఫిర్యాదు చేయగా, పై మూడు సంస్థలపై కేసు దాఖలైంది. సోషల్ మీడియాలో ఆర్సీబీ పోస్ట్ను చూసి స్నేహితులతో సంబరాలు వీక్షించడానికి స్టేడియానికి వెళ్లాను, 7వ గేటు వద్ద తొక్కిసలాట ఏర్పడి గాయపడ్డానని రోలన్గోమస్ పేర్కొన్నాడు. పరిహారం రూ.25 లక్షలకు పెంపు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం గతంలో రూ.10 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించింది. శనివారం ఆ మొత్తాన్ని రూ. 25 లక్షలకు పెంచింది. విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. క్షతగాత్రులకు నోటీసులు సీఐడీ టీం ముమ్మర విచారణ ఆర్సీబీ మీద మరొకరు ఫిర్యాదు మరోవైపు బెంగళూరు నగర జిల్లా కలెక్టర్ జగదీశ్ మెజస్టీరియల్ దర్యాప్తు ముమ్మరం చేశారు. గాయపడి బౌరింగ్, ఫోర్టీస్, మణిపాల్, వైదేహి ఆసుపత్రుల్లో ఎంతమంది చికిత్స పొందుతున్నారు, చికిత్స తీసుకుని ఇంటికెళ్లారు, దుర్ఘటనకు కారణాలు ఏమిటి అనేదానిపై సమాచారం సేకరించారు. 25 మందికి పైగా క్షతగాత్రులకు వాంగ్మూలం ఇవ్వలని నోటీస్ ఇచ్చారు. జూన్ 11వ తేదీన విచారణకు హాజరుకావాలని తెలిపారు. ఇప్పటివరకు 65 మంది గాయపడి చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. 5 మందికి ఇంకా చికిత్స కొనసాగుతోంది. ప్రమాదానికి కారణం ఏమిటి, సమస్య ఎలా తలెత్తింది అనే దానిపై వివరాలను సేకరిస్తారు. మెజస్టీరియల్ విచారణను 15 రోజుల్లోగా పూర్తిచేసి నివేదిక అందించాలి. బనశంకరి: చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనకు బాధ్యత వహిస్తూ కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్సీఏ) కార్యదర్శి ఏ.శంకర్, కోశాధికారి ఈఎస్ జైరామ్ పదవులకు రాజీనామా చేశారు. ఘటనలో తమ పాత్ర పరిమితమైనప్పటికీ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు కేఎస్సీఏ అధ్యక్షుడు రఘురామ్భట్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు ఆర్సీబీ జట్టు పాలకమండలిలోని నలుగురు అధికారులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. కేఎస్సీఏ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని సీఎం సిద్దరామయ్య సూచించారు. విధానసౌధ ముందు ఆర్సీబీ జట్టుకు సన్మానోత్సవం జరిగింది. తరువాత చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, కేఎస్సీఏ సన్మానోత్సవం చేపట్టాయి. కానీ లక్షలాది మంది స్టేడియంలోకి చొరబడటంతో తొక్కిసలాటలు జరిగి ప్రాణనష్టం సంభవించింది. కున్హా కమిటీకి ఆదేశం తొక్కిసలాట ఘటనలో హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి మైకేల్ కున్హా కమిటీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. విచారణకు ప్రాధాన్యత ఇచ్చి నెలలోగా పూర్తి చేసి నివేదిక అందించాలని తెలిపింది. చామరాజనగర ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ సమయంలో ఆక్సిజన్ కొరతతో జరిగిన మరణాల మీద కున్హా కమిటీ విచారణ సాగిస్తోంది. దీనిని పూర్తిచేసి నివేదిక ఇవ్వడానికి ఆగస్టు చివరివరకు గడువును పొడిగించింది. దీంతో కున్హాపై రెండు బాధ్యతలు పడ్డాయి. -
భక్తిశ్రద్ధలతో బక్రీద్ పండుగ
సాక్షి, బెంగళూరు: త్యాగ బలిదానాలకు సంకేతమైన బక్రీద్ పండుగను రాష్ట్రమంతటా ఘనంగా ఆచరించారు. బెంగళూరు, బళ్లారి, మైసూరు, కలబుర్గి, మంగళూరు సహా పల్లె పట్టణం అనే తేడా లేకుండా అంతటా ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఆచరించారు. శనివారం ఉదయం నుంచి మసీదుల్లో, ఈద్గా మైదానాలలో అశేష సంఖ్యలో సామూహికంగా ప్రార్థనలు చేశారు. ధర్మగురువులు బక్రీద్ పండుగ ఆచరణ, దయ, దానధర్మాల గురించి సందేశమించ్చారు. సమాజంలో ప్రతిఒక్కరూ సోదరభావంతో మెలగాలని పిలుపునిచ్చారు. ప్రార్థన అనంతరం ముస్లిం సోదరులంతా పరస్పరం ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ప్రార్థనల్లో చిన్నపిల్లలు కూడా పాల్గొన్నారు. మైదానాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటైంది. ఉద్రిక్తతలు నెలకొన్న మంగళూరు, ఉడుపి జిల్లాలో కూడా ప్రశాంతంగా పండుగను ఆచరించారు. వేడుకలకు సీఎం దూరం చిన్నస్వామి మైదానంలో తొక్కిసలాట ఘటనతో సీఎం సిద్ధరామయ్య ఈసారి బక్రీద్ వేడుకలకు హాజరుకాలేదు. సాధారణంగా ఏటా ఆయన బెంగళూరు చామరాజపేట ఈద్గా మైదానంలో జరిగే సామూహిక ప్రార్థనల్లో పాల్గొనడం పరిపాటిగా వస్తోంది. మంత్రి జమీర్ అహ్మద్ ఆహ్వానం పలికినప్పటికీ , సీఎం సమ్మతించలేదని తెలిసింది. తుమకూరులో తుమకూరు: ముస్లింల పవిత్ర పండుగలలో ఒకటి, అమరవీరుల త్యాగాలను స్మరించుకొనే బక్రీద్ ను నగరంతో పాటు జిల్లా అంతటా భక్తితో ఆచరించారు. ముస్లిం సోదరులు ఉదయమే నూతన వస్త్రాలను ధరించి తాలూకా కేంద్రాల్లోని ఈద్గా మైదానాల్లో ప్రార్థనలు నిర్వహించారు. తుమకూరులో కురిగల్లు రోడ్డులోని ఈద్గా గ్రౌండ్లో ప్రార్థనలు చేసి శుభాకంక్షలు తెలుపుకొన్నారు. పలు పార్టీల ప్రముఖులు చేరి శుభాకాంక్షలు తెలిపారు. అంతటా సామూహిక ప్రార్థనలు -
థగ్ లైఫ్కు రూ.35 కోట్ల నష్టం?
● కన్నడనాట సినిమా ఆడని వైనం ● కమల్– కన్నడ వివాద ఫలితం సాక్షి, బెంగళూరు: తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందనే ఒకే ఒక్క మాటతో ప్రముఖ నటుడు కమల్హాసన్ పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. తన మాటలపై క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించడంతో మరింతగా కన్నడిగుల ఆగ్రహానికి గురయ్యారు. దీని ఫలితం కమల్ హాసన్ నటించి, నిర్మించిన థగ్ లైఫ్ సినిమా మీద పడింది. ఆ సినిమా కర్ణాటకలో విడుదల కాలేదు. దీనివల్ల సుమారు రూ. 35–40 కోట్ల మేర ఆదాయం కోల్పోయినట్లు తెలిసింది. 7 శాతం రాబడి పోయినట్లే సినీ నిర్మాత, పంపిణీదారుడు జి.ధనంజయన్ లెక్కల ప్రకారం కర్ణాటకలో థగ్లైఫ్ సినిమా విడుదలకు అవకాశం లేకపోవడంతో సుమారు రూ. 35–40 కోట్ల ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందని అన్నారు. ఇందులో నిర్మాత షేర్ రూ. 12–15 కోట్ల పైమాటేనని ఆయన తెలిపారు. ఇతర పరభాషా చిత్రాలు కన్నడనాట భారీ వసూళ్లను రాబట్టాయి. కమల్ హాసన్ థగ్లైఫ్ సినిమాకు కర్ణాటకలో మంచి డిమాండ్ ఏర్పడింది. మణిరత్నం–కమల్ హాసన్ కాంబినేషన్ కాబట్టి ఆసక్తి నెలకొంది. అలా మంచి ఓపెనింగ్స్ వచ్చేవని ఆయన తెలిపారు. మొత్తం సినిమా ఆదాయంలో 7 శాతాన్ని కన్నడ వివాదం వల్ల నష్టపోవాల్సి వచ్చింది. అంతా సిద్ధమైన సమయంలో.. వాస్తవానికి కర్ణాటకలో థగ్లైఫ్ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఈ సినిమాను కర్ణాటకలో పంపిణీదారుడు వెంకటేశ్ సుమారు రూ. 8.10 కోట్లు పెట్టి కొనుగోలు చేశాడు. 200 థియేటర్లలో సినిమా విడుదల కావాల్సి ఉంది. విడుదలకు నాలుగైదు రోజుల ముందు కమల్హాసన్ చేసిన ప్రకటన పరిణామాలను మార్చేసింది. సినిమా తొలిరోజు సుమారు రూ. 4 నుంచి రూ 5 కోట్ల మేర, రెండోరోజు రూ. 1.5 కోట్ల నుంచి రూ. 2 కోట్ల మేర ఆదాయం దూరమైనట్లు అంచనాలున్నాయి -
పన్ను కట్టని క్రికెట్ సంఘం?
బనశంకరి: తొక్కిసలాట తరువాత అధికారుల దృష్టి చిన్నస్వామి మైదానం మీద పడింది. గత కొన్నేళ్లుగా ప్రకటనల ట్యాక్స్ చెల్లించని కేఎస్సీఏ కు బీబీఎంపీ నోటీస్ జారీ చేసింది. స్టేడియం లోపల బయట ప్రకటనల్ని ప్రదర్శిస్తే చట్టప్రకారం బీబీఎంపీకి పన్ను చెల్లించాలి. అనేక ఏళ్లుగా స్టేడియంలో ప్రకటన బోర్డులను నిర్వహిస్తున్నారు. సుంకం చెల్లించాలని పాలికె అడిగితే స్పందన రావడం లేదు. క్రికెట్ సంఘం ధోరణితో బీబీఎంపీకి కోట్లాది రూపాయల నష్టం ఏర్పడింది. తాజా పరిణామాల మధ్య పాలికె అధికారులు పెండింగ్ పన్నులను చెల్లించాలని నోటీస్ పంపారు. నకిలీ బాంబు కాల్.. పీజీ మెడికో అరెస్టు దొడ్డబళ్లాపురం: మంగళూరులోని కణచూరు ఆస్పత్రికి జూన్ 4న బాంబు బెదిరింపు కాల్ వచ్చిన సంగతి తెలిసిందే. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు కణచూరు మెడికల్ కాలేజీ పీజీ ఆస్పత్రి విద్యార్థిని డా.చలసాని మోనిక చౌదరి ని అరెస్టు చేశారు. జూన్ 4న ఉదయం 8:45 సమయంలో కణచూరు ఆస్పత్రిలో బాంబు ఉందని, 11 గంటలకు పేలుతుందని, ఆస్పత్రి మొత్తం ఖాళీ చేయాలని తనకు ఎవరో 5 సార్లు కాల్ చేశారని సదరు విద్యార్థిని మోనిక అధ్యాపకులకు చెప్పింది. దీంతో సుమారు 30 మంది పోలీసులు, బాంబ్ స్క్వాడ్తో ఆస్పత్రి మొత్తం తనిఖీ చేశారు. ఎక్కడా బాంబు లేదు. మోనికనే ఈ నాటకం ఆడినట్టు పోలీసులు కనుగొన్నారు. శనివారం అరెస్టు చేసి ఆమెను విచారించగా ఆ రోజు జరిగే సెమినార్కు హాజరు కాకూడదనుకుంది, దీనిని రద్దు చేయించాలని ఈ నాటకం ఆడినట్టు ఒప్పుకుంది. -
ఠాణా వద్దే భార్య నరికివేత
మైసూరు: చామరాజనగర పట్టణ పోలీసు స్టేషన్ వద్ద భార్యను కొడవలితో నరికి చంపిన కిరాతక భర్త గి రీష్ను పట్టణ స్టేషన్ పోలీసులు శుక్రవారం బంధించారు. సోమవారపేటె స్టేషన్ మఠం వద్ద ఉండగా పట్టుకుని జిల్లాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. తరువాత హత్యాస్థలానికి తీసుకెళ్లి స్థల మహజరు జరిపారు. కేసు గురించి అతని నుంచి సమాచారం సేకరించి జిల్లా జైలుకు తరలించారు. ఆమెకు భద్రత కల్పించి ఉంటే పట్టణ పోలీసు స్టేషన్ సమీపంలో గిరీష్ తన భార్య విద్య ను బుధవారం మధ్యాహ్నం ఇష్టానుసారంగా వేటకొడవలితో నరికి చంపి పరారు కావడం తెలిసిందే. ఠాణా దగ్గరే మహిళ హత్యకు గురికావడంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అతని వేధింపులను తట్టుకోలేక ఆమె కోయంబత్తూరులో తలదాచుకుంది. గిరీష్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలించి తీసుకొచ్చారు. మళ్లీ సతాయించడంతో బాధితురాలు పోలీసులకు మొరపెట్టుకోగా ఆమెను ఆశ్రయ కేంద్రంలో ఉంచారు. అక్కడకు కూడా వెళ్లి సైకో భర్త గొడవపడేవాడు, ఆమె ఫోన్ని కూడా లాక్కున్నాడు. దీంతో ఆ రోజు ఠాణాలో ఫిర్యాదు చేసి ఆశ్రయ కేంద్రానికి ఒంటరిగా వెళ్తుండగా కిరాతకుడు నరికి పరారయ్యారు. ఆమెను ఆశ్రయ కేంద్రానికి సురక్షితంగా పంపించాల్సిన బాధ్యత పోలీసులదే. ఓ పోలీసును తోడుగా పంపాలి. కానీ పోలీసులు నిర్లక్ష్యం చేయడం వల్లే ఆమె హత్యకు గురైందని ప్రజలు ఆరోపించారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉండగా అనాథలయ్యారు. కిరాతక భర్త అరెస్టు -
మామ చేతిలో అల్లుడు హతం
● శివమొగ్గ జిల్లాలో ఘటన శివమొగ్గ: మద్యం మత్తులో మామ, అల్లుడు గొడవపడి అల్లుని హత్యకు దారితీసింది. శివమొగ్గ జిల్లాలోని సొరభ తాలూకాలోని ఆనవట్టి దగ్గర జరిగింది. వివరాలు.. అల్లుడు రవీంద్ర (26), మామ ఉమేష్ (45) 5వ తేదీన మద్యం తాగి, హోటల్కు భోజనానికి వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య ఏదో విషయమై గొడవ జరిగింది. ఆగ్రహం పట్టలేని మామ హోటల్లో ఉన్న కత్తెరను తీసుకొని అల్లుని ఎదలో పొడిచాడు. అల్లుడు విలవిలలాడుతుండగా మామ పరారయ్యాడు. స్థానికులు రవీంద్రను సొరభ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం శివమొగ్గ నగరంలోని మెగ్గాన్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి శనివారం చనిపోయాడు. నిందితున్ని అరెస్టు చేసినట్లు సమాచారం. సీఎం, డీసీఎం, హోం మంత్రిదే బాధ్యత ● పోలీసులపై సస్పెన్షన్ సరికాదు ● రిటైర్డు ఐపీఎస్ భాస్కరరావు మైసూరు: ఆర్సీబీ విజయోత్సవంలో తొక్కిసలాట కారణంతో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు అధికారులను సస్పెండ్ చేయడం యావత్ పోలీసు శాఖను నిర్వీర్యం చేసినట్లయిందని రిటైర్డ్ ఐపీఎస్, బీజేపీ నేత భాస్కరరావు ఆరోపించారు. శనివారం ఆయన మైసూరులో విలేకరులతో మాట్లాడారు. ఈ దురంతానికి సీఎం, డీసీఎం, హోం మంత్రి నేరుగా బాధ్యులని, అందువల్ల ఆ ముగ్గురు వెంటనే పదవులకు రాజీనామా చేయాలని అన్నారు. ఈ ముగ్గురి చేతులకు 11 మంది రక్తపు మరకలు అంటాయన్నారు. ఐపీఎల్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఆర్సీబీ జట్టు గెలవడం ఒక పెద్ద శాపమని, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి హడావుడిగా కార్యక్రమం ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ఆర్సీబీ జట్టులో ఉన్నది ఇద్దరు కన్నడిగ ఆటగాళ్లు మాత్రమే, అయినా కన్నడిగుల భావోద్వేగాలు ఆ జట్టుపై అధికంగా ఉన్నాయని చెప్పారు. విజయోత్సవంలో కనీసం వంద అంబులెన్స్లు, స్ట్రెచర్లు, తాళ్లు, రద్దీ నియంత్రణ వస్తుసామగ్రి సిద్ధంగా పెట్టుకోవాల్సిందన్నారు. సస్పెన్షన్ ద్వారా పోలీసుల నైతిక స్థైర్యాన్ని సీఎం సిద్దరామయ్య కుంగదీశారన్నారు. ఐపీఎల్ వంటి ప్రైవేటు కార్యక్రమానికి డీసీఎం శివకుమార్ వెళ్లడమేంటి, కప్కు ముద్దు పెట్టడమేంటి అని హేళన చేశారు. కృతికకు దక్కని ఊరటదొడ్డబళ్లాపురం: బెంగళూరులో రిటైర్డ్ డీజీపీ ఓంప్రకాశ్ హత్య కేసులో ముందస్తు బెయిలు కోరిన కుమార్తె పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. హత్య కేసులో కుమార్తె కృతిక మీద కేసు నమోదైంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిలువ్వాలని ఆమె బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేసింది. కోర్టు విచారించి కొట్టివేసింది. దీంతో కృతిక అరెస్టు తప్పదని తెలుస్తోంది. ఏప్రిల్ 20న ఓంప్రకాశ్ను ఆయన భార్య పల్లవి దారుణంగా హత్య చేయడం తెలిసిందే. ఆమె రిమాండులో ఉంది. -
మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలి
రాయచూరు రూరల్: రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో మొక్కల పెంపకానికి ప్రాధాన్యత కేటాయించి పర్యావరణాన్ని సంరక్షించాలని వైస్ చాన్సలర్ హన్మంతప్ప పేర్కొన్నారు. ఆయన శనివారం వర్సిటీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. భవిష్యత్తులో అధిక ఉష్ణోగ్రతల నుంచి రక్షణకు ప్రతి ఒక్క విశ్వవిద్యాలయాల్లో, ఇళ్ల ముందు మొక్కలు పెంచేలా విద్యార్థులు చైతన్యం తేవాలన్నారు. సీఎం, డీసీఎం, హోం మంత్రి రాజీనామా చేయాలి రాయచూరు రూరల్: ఆర్సీబీ విజయోత్సవ వేడుకలో 11 మంది మృతికి కారకులైన రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయాలని బీజేపీ జిల్లాధ్యక్షుడు వీరనగౌడ డిమాండ్ చేశారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర్ తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. సస్పెన్షన్ సరికాదు హొసపేటె: బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ సస్పెన్షన్ సరికాదని, వెంటనే వెనక్కు తీసుకోవాలని హొసపేటె వాల్మీకి నాయక సామాజికులు డిమాండ్ చేశారు. శనివారం నగరంలో నిరసన తెలిపారు. సస్పెన్షన్ను వాపసు తీసుకోవాలని, లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని అసిస్టెంట్ కమిషనర్ వివేక్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తాయప్ప, శ్రీనివాస్, జంబయ్య నాయక్ పాల్గొన్నారు. రాయచూరులో భారీ వర్షం రాయచూరు రూరల్: నగరంలో శనివారం భారీ వర్షం కురిసింది. ఎక్కడ చూసిన రోడ్లు బురదగుంటలుగా మారాయి. గంట పాటు కురిసిన వానకు రంగమందిరం వెనుక, జహీరాబాద్ కాలనీలో పెద్ద చెట్లు కూలిపోవడంతో విద్యుత్ కోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూరగాయల మార్కెట్ బురదమయంగా మారడంతో పాటు నీరు చేరడంతో కాయగూరలు తడిసి పోయాయి. పండిట్ తారానాథ్ జయంతిరాయచూరు రూరల్: నగరంలో పండిట్ తారానాథ్ 134వ జయంతిని ఆచరించారు. శుక్రవారం హందర్ద్ హైస్కూలులో తారానాథ్ చిత్రపటానికి పాఠశాల పాలక మండలి అధ్యక్షుడు శరత్ కళస పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తారానాథ్ విద్యా రంగాభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు. సభ్యులు పురుషోత్తం ఇన్నాణి, అంబాపతి పాటిల్, శ్రీనివాస్, రాఘవేంద్ర తదితరులున్నారు. 11న తుంగభద్ర నీటి విడుదలపై సమీక్షహొసపేటె: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మూడు రాష్ట్రాల వరప్రదాయిని తుంగభద్ర డ్యాం కింద ప్రధాన ఎగువ కాలువ( టీబీ హెచ్ఎల్సీ) అంచనా నీటి కేటాయింపులపై కీలక టీబీ బోర్డు తొలి నీటి సమీక్ష సమావేశం ఈ నెల 11న జరగనుంది. ఈ విషయానికి సంబంధించి ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సంబంధిత ఎస్ఈలకు ఇప్పటికే తగిన సమాచారం పంపించారు. ఇందులో భాగంగా అనంతపురం హెచ్ఎల్సీ ఎస్ఈకు కబురు పంపారు. 11వ తేదీన వెబ్ ద్వారా నీటి సమీక్ష జరగనుంది. ప్రస్తుత 2025–26 వ సంవత్సరానికి సంబంధించి తుంగభద్ర జలాశయానికి ఎన్ని టీఎంసీల నీరు లభ్యం అవుతాయన్న దానిపై అంచనా వేస్తారు. అంచనాల ప్రకారం మండలి అధికారులు నీటి కేటాయింపులు చేస్తారు. బోర్డు కార్యదర్శి, వెబ్ ద్వారా జలాశయం పరిధిలో ఉన్న అన్ని ప్రాజెక్టుల ఎస్ఈలతో కలిసి చర్చిస్తారు. ఈ దఫా కురిసే వానలను పరిగణనలోకి తీసుకుని అంచనాలను తయారు చేస్తారు. అదే విధంగా ప్రధాన కాలువలకు ఎప్పుడు నీరు విడుదల చేస్తారన్న దానిపై కూడా కీలక నిర్ణయాన్ని తీసుకొంటారు. -
కొళాయిల్లో ఒండునీరు.. జనం బేజారు
రాయచూరు రూరల్: నగరంలోని పలు కాలనీలకు నగరసభ అధికారులు, జలమండలి సిబ్బంది కొళాయిల ద్వారా ఒండునీటిని సరఫరా చేశారు. శనివారం మంగళవారపేటె, జహీరాబాద్, జీడితోట, నవాబ్గడ్డ, వాసవినగర్ ప్రాంతాల్లో కృష్ణా నది నుంచి సేకరించిన నీటిని శుద్ధీకరించకుండా సరఫరా చేశారు. కొళాయిల్లో ఒండునీరు, వాన నీరు కలిసి రాగా నురుగతో కూడిన నీరు సరఫరా అయ్యాయి. బేజారు పడిన ప్రజలు గత్యంతరం లేక ఆ నీటినే పట్టుకున్నారు. రాంపూర్ జలాశయం నుంచి నీరు వదలడంతో కొళాయిల్లో ఒండు నీరు రావడం కనిపించింది. ప్రజలు నగరసభ, జలమండలి అధికారుల పనితీరు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంపై రగిలిపోయారు. -
ఖరీఫ్ సాగు పనులు షురూ
రాయచూరు రూరల్: జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో తమ తమ పొలాల్లో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. ఖరీఫ్లో ముందుగానే వానలు కురిసాయి. రైతులు కూడా విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసుకున్నారు. ఈ ఏడాది 3.44 లక్షల హెక్టార్లలో విత్తనాలు వేయడానికి రంగం సిద్ధమైంది. 84 వేల హెక్టార్లు నీటిపారుదల భూములు కాగా మిగిలిన భూముల్లో ఏకదళ, ద్విదళ ధాన్య, వాణిజ్య పంటలు పండించడానికి అవకాశం ఉంది. జిల్లాలో 1.71 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉండగా, కేఎస్ఎంఎఫ్లో 7,393 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ దుకాణాల్లో 738.10 మెట్రిక్ టన్నుల అవసరం ఉంది. 90 వేల మెట్రిక్ టన్నుల ఎరువుల కొరత ఉంది. ఖరీఫ్కు సరిపడా ఎరువులు నిల్వ ఉన్నాయని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ దేవిక వెల్లడించారు. జిల్లాలోని 35 రైతు కేంద్రాల్లో రైతులకు ఎరువులు, క్రిమిసంహారక మందులు నిల్వ ఉన్నాయని తెలిపారు. రైతులు దీనిని సద్వినియోగపరుచుకోవాలని కేంద్రం ప్రత్యేక అధికారి నాగిరెడ్డి పేర్కొన్నారు. విత్తనాలు, ఎరువుల కొరత లేదు వ్యవసాయ శాఖ జేడీ దేవిక వెల్లడి -
ఆలయాల్లో గాలి సతీమణి పూజలు
సాక్షి,బళ్లారి: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్రెడ్డి సతీమణి లక్ష్మీ అరుణ గత నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలో వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తూ టెంపుల్ రన్ చేస్తున్నారు. జనార్ధన్రెడ్డిని మైనింగ్ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించి ఏడేళ్ల జైలు శిక్ష విధించి చంచలగూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను మరో కేసులో విచారణ కోసం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జనార్ధన్రెడ్డి తరపున న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. ఈనేపథ్యంలో తన భర్తకు మంచి జరగాలని ఆమె రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో పూజలు, హోమాలు చేయిస్తున్నారు. ఆంజనేయ స్వామి జన్మస్థలం అయిన అంజనాద్రిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పట్టాభిరామ ఆలయంలో పూజలు చేసి అనంతరం ఉడిపి శ్రీకృష్ణుడిని దర్శనం చేసుకొని అక్కడి స్వామిజీ ఆశీస్సులు పొందారు. అనంతరం కొల్లూరు మూకాంబిక ఆలయంలో పూజలు, హోమాలతో పాటు శత్రు నివారణ సంకష్ట పూజలను కూడా నిర్వహించారు. అక్కడి నుంచి బ్రహ్మలింగేశ్వర ఆలయంలో పూజలు చేశారు. అనంతరం అసోం రాష్ట్రంలో ప్రముఖ దేవాలయం అయిన కామాక్షి దేవిని దర్శించుకున్నారు. ఈమె గత వారం రోజులుగా పలు ఆలయాల్లో పూజలు చేస్తుండటం విశేషం. -
అతిథిలా నటించి దోచుకెళ్లాడు..!
● కళ్యాణ మంటపంలో దొంగ చేతివాటం హుబ్లీ: కళ్యాణ మంటపంలోకి అతిథిలా వచ్చి అక్కడ ఉన్న విలువైన వస్తువులను చోరీ చేసి పరారైన వ్యక్తిపై గోకుల్ రోడ్డు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇక్కడ దొంగలా వచ్చిన వ్యక్తి ఎవరన్నది తెలియరాలేదు. అయితే అతడు గోకుల్ రోడ్డు కళ్యాణ మంటపానికి అతిథిగా వచ్చి మంటపంలోని విలువైన వస్తువులను దోచుకొని పరారయ్యాడు. ఈ దొంగ చేతివాటం ప్రదర్శించిన దృశ్యాలు కళ్యాణ మంటపంలోని సీసీ కెమెరాలో నమోదయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులకు పెళ్లి నిర్వాహకులు, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు దాఖలు చేసుకున్న గోకుల్ రోడ్డు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా ఇక్కడి మంటూరు రోడ్డు అరళికట్టి కాలనీలో జరిగిన మట్టి దిబ్బ కూలిన కేసులో కాంట్రాక్టరు, సహ కాంట్రాక్టరు నిర్లక్ష్యం కారణంగా, బాధ్యత లేకుండా సదరు పనులు చేపట్టడంతో మృతి చెందిన కార్మికుడు చేతన్ యాదవ్ సోదరుడు హుబ్లీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కాంట్రాక్టర్ అంజాద్ గిరణితో పాటు మరో సహ కాంట్రాక్టర్పై కేసులు నమోదు చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో తారు రోడ్డు నిర్మాణం ●జాతీయ స్థాయిలో నగర పాలికెకు ప్రశంసలు హుబ్లీ: తారు రోడ్డు నిర్మాణంలో నిషేధిత ప్లాస్టిక్ వ్యర్థ ఉత్పత్తులను వినియోగిస్తూ హుబ్లీ ధార్వాడ నగర పాలక సంస్థ చేపట్టిన వినూత్న ప్రక్రియకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. పర్యావరణ దినం సందర్భంగా ఢిల్లీలోని భారత్ మంటపంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణంలో మార్పుల శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాలికె చేపట్టిన ఈ వినూత్న ప్రక్రియ అందరి దృష్టిని ఆకర్షించింది. గట్టిదనంతో కూడి సుస్థిరమైన రోడ్డు నిర్మాణంలో నిషేధిత ప్లాస్టిక్ వాడకంపై వీడియోను టీపీటీ ద్వారా ప్రదర్శించారు. దీంతో సదరు కార్యక్రమ ఆవరణలో పాలికెకు ఓ అంగడి సముదాయాన్ని కేటాయించారు. అక్కడ ప్రజలకు ప్రయోగాత్మకంగా రోడ్డు నిర్మాణంలో నిషేధిత ప్లాస్టిక్ వాడకం విధానాన్ని వివరించారు. దీంతో అక్కడ వీక్షించిన ప్రముఖులు పాలికె ఈ కొత్త ప్రయోగానికి అభినందనలు తెలియజేఃశారు. ప్లాస్టిక్ లేని జంట నగరాలు అనే లక్ష్యంగా పాలికె చేస్తున్న కృషిని దేశ రాజధానిలో గుర్తించారు. ఈ సందర్భంగా పాలికె మేయర్ రామప్ప బడిగేర్, కమిషనర్ డాక్టర్ రుద్రేష్ గాళి, అడిషనల్ కమిషనర్ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పాలికె ఈ విప్లవాత్మక కృషిపై స్థానిక మీడియాలో బాగా ప్రచారం లభించడంతో ఢిల్లీలో ఈ ఘనత సాధించినట్లు స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. నా తమ్ముడికి న్యాయం చేయండి హుబ్లీ: ధార్వాడ జిల్లాలోని హెబ్బళ్లి జెడ్పీ సభ్యుడు యోగీష్ గౌడ హత్య కేసులో సాక్షులు నిజం చెప్పడం ద్వారా తన తమ్ముడికి న్యాయం దొరికేలా చేయాలని హతుడి సోదరుడు గురునాథగౌడ విజ్ఞప్తి చేశారు. స్థానిక మీడియాతో ఆయన శనివారం మాట్లాడారు. ధార్వాడ గ్రామీణ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ దాఖలు చేసిన రిట్ను సుప్రీంకోర్టు స్వీకరించింది. ఆ మేరకు బెయిల్ రద్దు అయింది. సాక్షులపై ఒత్తిళ్లు పెంచారు. పోలీస్ అధికారులు కూడా ఒత్తిళ్లకు గురయ్యారు. సీబీఐ నివేదిక తర్వాత ఈ కేసు విషయంలో సాక్షుల నాశనానికి ప్రయత్నించారని సమర్పించిన రిట్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి తాజాగా ఆదేశాలను వెల్లడించిందన్నారు. ఈ హత్యోదంతంపై నిరంతరం పోరాడుతున్న బసవరాజ్ కొరవర మాట్లాడుతూ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి తమ పలుకుబడిని ఉపయోగించి సాక్షులపై ఒత్తిళ్లు తేవడం కోర్టు గమనించి సీబీఐ సమర్పించిన రిట్ను స్వీకరించిందన్నారు. సాక్షులపై ఒత్తిళ్లు చేసిన నేపథ్యంలో ఆయన బెయిల్ రద్దు అయిందని, ఆ మేరకు ఆయన లొంగుబాటుకు సుప్రీంకోర్టు 7 రోజుల గడువును ఇచ్చిందన్నారు. సత్యానికి గెలుపు, విజయం లభించింది. యోగీష్ గౌడ హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం, సాక్షులపై ప్రభావం చూపించడం సరికాదు. సాక్షులు స్వేచ్ఛగా నిజాలు వెల్లడించాలన్నదే సుప్రీంకోర్టు ఆశయం అన్నారు. పర్యావరణంపై ప్రజలను జాగృతి చేయాలి కోలారు : పరిసరాల నాశనం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలను జాగృతం చేయాలని సమాజ సేవకుడు సీఎంఆర్ శ్రీనాథ్ అన్నారు. నగరంలోని స్కౌట్స్ అండ్ గైడ్స్, వంశోధయ ఆస్పత్రి, కోలారు రోటరీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన విశ్వ పరిసర దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రోడ్లు తదితర అభివృద్ధి పనుల పేరుతో వృక్షాలను తొలగిస్తున్నారని, దీని వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందన్నారు. దీనిని గుర్తించి ప్రతి ఒక్కరు మొక్కలను విరివిగా పెంచి పోషించాలన్నారు. అనంతరం పరిసర దినోత్సవంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కమిషనర్ కేవీ శంకరప్ప, రోటరీ నందిని అధ్యక్షుడు వీ బాబు, సురేష్బాబు, ఉమాదేవి, దంత వైద్యురాలు పంకజ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
కాలువలకు సత్వరం నీరు అందించండి
హొసపేటె: తుంగభద్ర జలాశయంలో 25 టీఎంసీల నీరు నిల్వ ఉన్న వెంటనే ఆయకట్టు కాలువలకు నీటిని విడుదల చేస్తే, రైతులకు మేలు జరగడంతో పాటు జలాశయం భద్రతకు కూడా మేలు అని తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు దరూరు పురుషోత్తం గౌడ అన్నారు. ఇప్పటికే జలాశయంలో 22 టీఎంసీల నీరు నిల్వ అవుతున్నాయి. ఎగువన మంచి వర్షాలు కురుస్తున్నందున జలాశయానికి నీరు పుష్కలంగా అందుతోంది. ఈనేపథ్యంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జలవనరుల మంత్రులు, కార్యదర్శులతో సమావేశమై వచ్చే ఏడాది మార్చి వరకు రైతులకు 2 పంటలకు నీరు ఇవ్వాలని, తరువాత ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కొత్త గేట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఒక పిటిషన్ సమర్పించారు. వారు త్వరగా నిర్ణయం తీసుకోకపోతే 3 రాష్ట్రాల రైతుల తరఫున నిరసన చేపడతామని హెచ్చరించారు. గత సంవత్సరం వచ్చిన వరదలకు జలాశయపు 19వ గేటు కొట్టుకుపోయినప్పడు వచ్చే ఏడాది జలాశయం 33 గేట్లను కొత్తగా తయారు చేసి బిగించాలని ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరలేదని తుంగభద్ర రైతు సంఘం ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో సంబంధిత అధికారులకు సంఘం ఒక అభ్యర్థనను సమర్పించింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేదు. టెండర్ మంజూరు చేసినా వచ్చే ఏడాది మార్చి నాటికి కొత్త గేట్లు తయారు చేసి బిగించడానికి సౌకర్యంగా ఉంటుందని తెలిపారు.తుంగభద్ర జలాశయం గేట్లు మంచి నాణ్యతతో లేనందున, ఈ సంవత్సరం జలాశయంలో 80 శాతం మేర నీరు మాత్రమే నిల్వ చేసేందుకు వీలు ఉంటుందని సమాచారం. కొంచెగేరి దొడ్డమల్లప్ప, దరూరు ఎం.వీరభద్ర నాయక్, ఎం.రామాంజిని నాయక్, కురుబర గాదిలింగమూర్తి, అంగడి రాజాగౌడ, బసవనగౌడ, రైతు సంఘం బాధ్యులు హాజరై వినతిపత్రం సమర్పించారు. -
పోలీసు అధికారులపై చర్య మంచిదే
హుబ్లీ: ఆర్సీబీ విజయోత్సవ వేళ జరిగిన తొక్కిసలాటలో 11 మంది అమాయకుల మృతి దురుదృష్టకరం అని, విధి నిర్వహణలో లోపానికి పాల్పడిన బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం మంచి నిర్ణయమే అని విధాన పరిషత్ స్పీకర్ బసవరాజ్ హొరట్టి తెలిపారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ విషాద ఘటన నేపథ్యంలో పోలీస్ కమిషనర్తో పాటు పలువురికి వ్యతిరేకంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. తన 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవిత అనుభవంలో ఇలాంటి దురంతం చూడలేదన్నారు. అలాగే పోలీస్ కమిషనర్ వంటి ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడం ఇదే తొలిసారిగా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ప్రశంసనీయం అన్నారు. అర్ధరాత్రి ఈ నిర్ణయం తీసుకొని కార్యక్రమం నిర్వహించడానికి ప్రయత్నించడం వల్లే ఈ దురంతం జరిగిందన్నారు. తగినంత గడువు తీసుకొని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సిందన్నారు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన దేశానికి తప్పుడు సందేశాన్ని ఇచ్చిందన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో మరింతగా దృష్టి సారించాల్సిందన్నారు. అంతేగాక సంబంధించిన వారితో మాట్లాడి అవకాశం ఇవ్వాల్సింది. ప్రభుత్వంలో క్రికెట్ మండలి తప్పు కూడా ఉంది. ఈ ఘటన నేపథ్యంలో క్రికెట్ మండలికి వ్యతిరేకంగా పలు కేసులు పెట్టాలి. మొత్తం దేశంలో క్రికెట్పై అతి పిచ్చి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. -
త్యాగానికి ప్రతీక బక్రీద్
సాక్షి,బళ్లారి: త్యాగ, బలిదానాలకు ప్రతీకగా నిలిచిన బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శనివారం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో చేరి ఈద్గాల్లో సామూహిక ప్రార్థనలు చేశారు. రంజాన్ పండుగ తర్వాత గొప్పగా జరుపుకునే పండుగల్లో ఒక్కటైన బక్రీద్ పండుగకు ముస్లిం సోదరులకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ నేపథ్యంలో పండుగ రోజున ఈద్గా, మసీదుల్లో సామూహిక ప్రార్థనలు చేసుకొని పొట్టేళ్లు బలి ఇచ్చి అందరికీ మంచి జరగాలని భక్తిశ్రద్ధలతో పండుగను ఆచరించారు. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఆయా మసీదులు, ఈద్గాల్లో ప్రార్థనలు చేసి భక్తిని చాటుకున్నారు. కొత్త బట్టలు ధరించి ఉత్సాహంగా బక్రీద్ను ఆచరించారు. అనంతరం కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పండుగ భోజనాలను ఆరగించారు. ఎంపీ, ఎమ్మెల్యే శుభాకాంక్షలు రాజ్యసభ సభ్యుడు నాసీర్ హుస్సేన్, నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి తదితరులు ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం ధర్మ గురువు సమక్షంలో ఈద్గాల్లో భక్తిశ్రద్ధలతో సామూహిక ప్రార్థనలు చేయడంతో ఈద్గాలు, మసీదులు ముస్లిం సోదరులతో కిటకిటలాడాయి. పెద్ద సంఖ్యలో జనం చేరి సామూహిక ప్రార్థనలు చేయడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరులు ఒకరినొకరు అలింగనం చేసుకొని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకొని సంతోషంగా పండుగను ఆచరించారు. ప్రశాంతంగా బక్రీద్ పండుగ రాయచూరు రూరల్: నగరంలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ప్రశాంతంగా జరుపుకున్నారు. శనివారం ఈద్గా మైదానం, ఏక్ మినార్ మసీదులో ముస్లిం సోదరులు మసీదు నిర్వాహకులు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. చిన్నారులు ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం కనిపించింది. ఉత్సాహంగా బక్రీద్ ఆచరణ హొసపేటె: త్యాగ బలిదానాలకు ప్రతీక అయిన బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు శనివారం ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. నగరంలోని ఈద్గా మైదానంలో ఉదయం సామూహిక ప్రార్థనలు చేసి ముస్లిం సోదరులు, పిల్లలు ఒకరినొకరు కౌగలించుకుని ఈద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తర్వాత ప్రతి ఇంట్లో దేవుడి పేరు మీద గొర్రెలను బలి ఇచ్చారు. బక్రీద్ పండుగ ఆచారం ప్రకారం మాంసంలో కొంత భాగాన్ని బంధువులకు, మరి కొంత భాగాన్ని పేదలకు దానం చేశారు. మరికొందరు మాంసాన్ని వండి పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ అబూబక్కర్, ఫిరోజ్ఖాన్, అన్వర్ బాషా, ఇమామ్ నియాజీ, వందలాది మంది సోదరులు పాల్గొన్నారు. ఈద్గాల్లో సామూహికంగా ప్రార్థనలు వాడవాడలా భక్తిశ్రద్ధలతో పండుగ -
ఆ తొక్కిసలాట సర్కారు వైఫల్యమే
సాక్షి,బళ్లారి: ఐపీఎల్ టోర్నీ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించిన అనంతరం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన విజయోత్సవం సందర్భంగా ప్రభుత్వ వైఫల్యంతో అక్కడ జరిగిన తొక్కిసలాట తదితర పరిణామాలతో 11 మంది మృతి చెందడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరి ప్రభుత్వ తీరును దుమ్మెత్తిపోస్తూ నిరసన తెలిపారు. రాయల్ సర్కిల్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేయడంతో పాటు సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ దిష్టిబొమ్మలు దహనం చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్కుమార్ మోకా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రచారం కోసం పాకులాడిందన్నారు. లక్షలాది మంది అభిమానులు చేరుతారని తెలిసి కూడా అక్కడ తగిన భద్రత ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించిందన్నారు. తొక్కిసలాట ఘటనను తాము రాజకీయం చేస్తున్నామని కాంగ్రెస్ ఆరోపించడం శోచనీయం అన్నారు. 11 మంది అమాయకులు మృతి చెందితే వారి తరఫున పోరాటం చేయకూడదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ భద్రతా లోపం వల్ల తొక్కిసలాట జరిగిందని మండిపడ్డారు. ఈ ఘటనకు పోలీసు అధికారులను సస్పెండ్ చేయడంతో సరిపోదని, పాలకులు బాధ్యత వహించాలన్నారు. ఆందోళనలో బీజేపీ నాయకులు రామలింగప్ప, కార్పొరేటర్లు కోనంకి తిలక్, శ్రీనివాస్ మోత్కూరు, హనుమంతప్ప, గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. సీఎం, డీసీఎం దిష్టిబొమ్మలు దహనం చేసిన బీజేపీ నగరంలో భారీ ఎత్తున ఆందోళన చేపట్టిన వైనం -
బైక్ ప్రయాణికులకు హెల్మెట్ రక్ష
సాక్షి,బళ్లారి: ద్విచక్ర వాహనాల్లో వెళ్లే వారికి శ్రీరామ రక్షగా హెల్మెట్ పని చేస్తుందని జిల్లా ఎస్పీ శోభారాణి పేర్కొన్నారు. ఆమె శుక్రవారం నగరంలోని తన కార్యాలయంలో హెల్మెట్ వాడకంపై ఏర్పాటు చేసిన జాగృతి సమావేశంలో విలేకరులతో మాట్లాడారు. హెల్మెట్ ధరించక పోవడంతో ఎన్నో అనర్థాలు జరుగుతాయన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ లేకపోతే ప్రాణాపాయం సంభవిస్తుందన్నారు. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ద్విచక్ర వాహనాల్లో వెళ్లేవారందరూ హెల్మెట్ ధరించాలన్నారు. శుక్రవారం నుంచి హెల్మెట్ ధరించకపోతే రూ.500లు జరిమానా వేస్తామన్నారు. అయితే పోలీసులకు దొరికితే రూ.500లు కట్టి వెళ్లవచ్చులే అని నిర్లక్ష్యంగా ఉండకూడదన్నారు. హెల్మెట్ వాడకం మీ ప్రాణ రక్షణ కోసమేనన్నారు. పాఠశాల, కళాశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు, లెక్చరర్లతో పాటు అక్కడ చదువుకునే విద్యార్థులు ద్విచక్ర వాహనాల్లో వెళితే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఆయా పాఠశాల, కళాశాలల యజమాన్యాలు ఈ విషయంపై విద్యార్థులు, సిబ్బందికి జాగృతి కల్పించాలన్నారు. యాజమాన్యాలూ బాధ్యులే ఒకవేళ విద్యార్థులు కూడా హెల్మెట్ ధరించకపోతే జరిమానాతో పాటు ఆయా కళాశాల, పాఠశాలల యాజమాన్యాలను కూడా బాధ్యులను చేస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కూడా కచితంగా కేసులు నమోదు చేస్తామన్నారు. మద్యం సేవించిన తర్వాత ఎట్టి పరిస్థితితుల్లోను వాహనాలు నడపకూడదన్నారు. హెల్మెట్పై గతంలో కూడా ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహించారన్నారు. ప్రస్తుతం తూతూమంత్రంగా నియమాలు జారీ చేస్తున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా అలాంటిది ఏమీ లేదన్నారు. కచ్చితంగా ఇప్పటి నుంచి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలు రక్షిస్తామన్నారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా హెల్మెట్పై వెనక్కు తగ్గేది లేదన్నారు. అనంతరం ఆమె పలువురు పోలీసు అధికారులతో కలిసి శ్రీకనక దుర్గమ్మ ఆలయం పక్కనే రోడ్డులో ప్రజలకు హెల్మెట్ వాడకంపై అవగాహన కలిగిస్తూ ద్విచక్ర వాహనాల్లో వెళ్లేవారికి హెల్మెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ రవికుమార్, డీఎస్పీ నందారెడ్డి, ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయ్యనగౌడ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. పోలీసుల కోసం కాదు, మీ ప్రాణ రక్షణకే తప్పకుండా ధరించాలి: ఎస్పీ శోభారాణి -
వాడకాన్ని ఆపుదాం.. ప్లాస్టిక్ను అంతం చేద్దాం
హొసపేటె: ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ రహిత జీవనశైలి అలవర్చుకుంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని అర్థవంతంగా జరుపుకుంటామని అదనపు జిల్లాధికారి బాలకృష్ణప్ప అన్నారు. నగరంలోని విజయనగర కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ సంవత్సరం ప్రభుత్వం పర్యావరణ దినోత్సవ వేడుకల కోసం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయండి అనే నినాదాన్ని విడుదల చేసిందన్నారు. కాలుష్య నియంత్రణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు. అవగాహన కల్పించడానికి ప్రజలు, సంఘసంస్థలు ప్రభుత్వంతో చేతులు కలపాలన్నారు. కూరగాయలు, పాలు, కిరాణా సామగ్రిని కొనడానికి ప్లాస్టిక్ వాడకాన్ని ఆపి వేద్దాం. ఇళ్లలో తడి, పొడి చెత్తను వేరు వేసి చెత్త వాహనాలకు ఇద్దాం. మీ చిన్న చర్యలు పర్యావరణానికి మేలు చేస్తాయి. ప్లాస్టిక్ వాడకాన్ని విడిచిపెట్టి కాలుష్యాన్ని అంతం చేయడానికి మనమందరం ఒక తీర్మానం చేద్దాం అని ఆయన అన్నారు. ముందుగా తొక్కిసలాటలో మరణించిన వారి ఆత్మకు నివాళులర్పిస్తూ మౌన జాగరణ పాటించారు. నగరంలోని విజయనగర కళాశాల నుంచి డాక్టర్ పునీత్రాజ్కుమార్ సర్కిల్ వరకు వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పర్యావరణ అవగాహన గురించి నినాదాలు చేస్తూ ఊరేగించారు. పర్యావరణ, వన్యప్రాణి నిపుణుడు డాక్టర్ అబ్దుల్ సమద్ కొట్టూర్, పర్యావరణ అధికారి హెచ్ఎం మీనాక్షి, సీనియర్ పర్యావరణ అధికారి బీఎస్ మురళీధర్, విజయనగర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం ప్రభుగవాడ, పర్యావరణ వేత్త రవికుమార్, కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయ సిబ్బంది మంజునాథ్, శేఖరప్ప పాల్గొన్నారు. -
అలరించిన ముగ్గుల పోటీలు
రాయచూరు రూరల్: జిల్లా సాహిత్య లోకానికి మున్నూరు కాపు సమాజం మద్దతు ఇవ్వడం అభినందనీయమని సీనియర్ కవి భగత్రాజ్ నిజాంకారి పేర్కొన్నారు. గురువారం నగరంలోని వీరాంజనేయ ఆలయంలో ఏర్పాటు చేసిన అఖిల భారత ముంగారు మున్నూరు కాపు సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా జరిగిన కవిగోష్టిని ప్రారంభించి ఆయన మాట్లాడారు. నాడు శ్రీకృష్ణ దేవరాయల వంశస్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలను మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి చేపట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. 25 ఏళ్ల పాటు ముంగారు ఉత్సవాలను చేపట్టిన విషయాన్ని ప్రస్తావించారు. శుక్రవారం మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. వృషభం, మాతా లక్ష్మీదేవి, రైతులు, వెంకటేశ్వరుడు, పల్లె వాతావరణం ఉట్టి పడేలా ముగ్గులు వేశారు. మున్నూరు కాపు సమాజం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి, నరసారెడ్డి, శ్రీనివాసరెడ్డి, శంకర్రెడ్డి, వెంకటేష్, కృష్ణమూర్తిలున్నారు. -
శివమొగ్గలో కాల్పుల మోత
● అంతర్ రాష్ట్ర దోపిడీ దొంగపై పోలీసు కాల్పులు శివమొగ్గ: అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న అంతర్రాష్ట్ర దోపిడీ దొంగపై పోలీసులు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. ఈఘటన శుక్రవారం వేకువజామున శివమొగ్గ నగరంలో జరిగింది. బెంగళూరులోని కల్కెరెకు చెందిన మంజునాథ్ అలియాస్ మంజు(42)పై రౌడీషీట్ నమోదైంది. ఇతనిపై 72కుపైగా కేసులు ఉన్నాయి. అనేక దోపిడీ ఘటనల్లో ఇతను భాగస్వామి. చాలా రోజులుగా పోలీసుల కళ్లుగప్పి సంచరిస్తున్నాడు. శివమొగ్గ నగరానికి వచ్చినట్లు పక్కా సమాచారంతో శివమొగ్గ నగరంలోని జయనగర పోలీసులు అప్రమత్తం అయ్యారు. సీఐ సిద్దెగౌడ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం వేకువజామున వేట మొదలు పెట్టారు. నిందితుడు ఉన్న చోటకు చేరుకున్నారు. లొంగిపోవాలని మంజుకు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ద్యామప్ప అనే కానిస్టేబుల్పై మంజు మారణాయుధంతో దాడి చేశాడు. దీంతో ఆత్మరక్షణ కోసం సీఐ సిద్దేగౌడ సర్వీస్ రివాల్వర్తో గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా మంజు ఎదురుదాడికి యత్నించడంతో మళ్లీ కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ మంజు కాలిలోకి దూసుకెళ్లడంతో కుప్పకూలాడు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని మెగ్గాన్ ఆస్పత్రికి తరలించారు. నేడు బ్లాక్ డే దొడ్డబళ్లాపురం: చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనకు సంబంధించి కన్నడ భాషా ఉద్యమనేత వాటాళ్ నాగరాజు ఆధ్వర్యంలో శనివారం బ్లాక్ డే గా ఆచరించనున్నారు. శనివారం మధ్యాహ్నం 12–30 గంటలకు బెంగళూరు మైసూరు బ్యాంక్ సర్కిల్లో బ్లాక్ డే ఆచరించనున్నట్టు ఆయన ప్రకటించారు. 11మంది మృతికి కారణం ఎవరని వాటాళ్ ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలను రాజకీయాలకు, రాజకీయ అవసరాలకు అతీతంగా ఆలోచించాలని ఆయన అన్నారు. ఆర్సీబీ విజయోత్సవాన్ని ఆచరించాలని ఎవరు నిర్ణయించారన్నారు. తొక్కిసలాట మృతునికి అశ్రునయనాలతో అంత్యక్రియలు మండ్య : చిన్నస్వామి క్రికెట్ స్టేడియం వద్ద జరగిన ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన మండ్య జిల్లాలోని కేఆర్పేటె తాలూకాలోని రాయసముద్ర గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు చంద్ర కుమారుడు పూర్ణచంద్ర అంత్యక్రియలు శుక్రవారం ఆయన స్వగ్రామం రాయసముద్రలో బంధువుల కన్నీటి మధ్య జరిగాయి. రాయసముద్రతోపాటు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి పూర్ణచంద్రకు కడసారి వీడ్కోలు పలికారు. ఎమ్మెల్యే హెచ్.టి.మంజు, ఆర్టీఓ మల్లికార్జున, తహసీల్దార్ ఎస్యూ ఆశోక్, విద్యాశాఖాధికారి తిమ్మేగౌడ వచ్చి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పూర్ణచంద్ర మృతి బాధాకరమన్నారు. -
నీటిలో శవాలై తేలిన తల్లీబిడ్డలు
చిక్కబళ్లాపురం: అదృశ్యమైన తల్లీ, ఆమె ఇద్దరు బిడ్డలు నీటిలో శవాలై తేలారు. ఈఘటన చిక్కబళ్లాపురం తాలూకా బాదగానహళ్లి గ్రామంలో జరిగింది. గ్రామంలో జయణ్ణ, లావణ్య(30) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి నిహారిక(12), నేహా(9) అనే బిడ్డలు ఉన్నారు. ఏ కారణం చేతనో గురువారం సాయంత్రం నుంచి వీరు అదృశ్యం అయ్యారు. కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో గాలించినా వారి జాడ లేదు. శుక్రవారం గ్రామ శివార్లలోని బావిలో ముగ్గురూ శవాలై తేలారు. స్థానికులు గమనించి ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, కుటుంబ సభ్యులు వచ్చి పరిశీలించారు. మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. వీరిది ఆత్మహత్య? లేక ఇతర కారణాలు ఉన్నాయా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది.