Karnataka News
-
గ్యారెంటీతో విద్యుత్ శాఖకు షాక్
రాయచూరు రూరల్: నగర, గ్రామీణ ప్రాంతాల్లో పంచ గ్యారెంటీల అమలుతో విద్యుత్ శాఖ పరిధిలోని నాలుగు ఎస్కాం సంస్థలకు షాక్ తగిలింది. ప్రభుత్వం అమలు పరిచిన శక్తి పఽథకం తరువాత విద్యుత్ శాఖ నిర్వీర్యం అవుతోంది. మహిళలకు ఉచిత బస్ ప్రయాణంతో ఆర్టీసీ నష్టాల బాటలోకి వెళ్లింది. అదే బాటలోకి ఎస్కాం సంస్థలు పయనిస్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీ అమలుకు మొదట్లో వ్యతిరేకత చెప్పిన నిపుణుల అభిప్రాయాలను సర్కార్ తీవ్రంగా పరిగణించలేదు. బస్ చార్జీలు ఒకటిన్నర శాతం పెంచిన అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్కాంలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఉద్యోగులకు పీఎఫ్, జీపీఎఫ్, ఇంధన వ్యయం, గ్రాచ్యుటీ, వేతన బకాయిలు, ఇతరత్ర కలిపి రూ.2,850 కోట్ల మేర నష్టాల బాటలో సంస్థలున్నాయి. కర్ణాటక విద్యుత్ రెగ్యులేటరీ కమిటీ(కేఈఆర్సీ) నివేదిక మేరకు మూడేళ్ల పాటు వరుసగా 2026లో 67, 2027లో 75, 2028లో 91 పైసల మేర యూనిట్ ధర పెంచాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా 2025లో కేఈఆర్సీ నివేదిక ప్రకారం మెస్కాం, బెస్కాం, హెస్కాం, జెస్కాంలలో 20 శాతం మేర విద్యుత్ చార్జీలు పెంచడానికి అనుమతి కోరారు. 2025 ఏప్రిల్ 1 నుంచి ధరల పెంపుదలను అమలు చేయాలని కేఈఆర్సీ ఇచ్చిన నివేదిక జారీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. చార్జీలు పెంచినా తగ్గని నష్టం విద్యుత్ చార్జీల మోతకు సిద్ధం నష్టాల ఊబిలో ఎస్కాం సంస్థలు -
డాక్టర్ అనన్యరావు మృతదేహం లభ్యం
సాక్షి,బళ్లారి/హొసపేటె: ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న హంపీ అందాలతో పాటు చుట్టుపక్కల తుంగభద్ర నదీ తీర ప్రాంతాలను సందర్శించి రెండు రోజులు సేద తీరుదామని వచ్చిన డాక్టర్ అనన్యరావు కానరాని లోకాలకు చేరింది. హైదరాబాద్కు చెందిన డాక్టర్ అనన్య తన స్నేహితులతో కలిసి కొప్పళ జిల్లా గంగావతి తాలూకా సణాపురం వద్ద తుంగభద్ర నదిలో బుధవారం ఉదయం కొట్టుకుపోయిన సంగతి విదితమే. రెండు రోజులుగా అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, గజ ఈతగాళ్లు 16 గంటల పాటు ముమ్మరంగా గాలించడంతో నదిలో బండరాళ్ల మధ్యలో గురువారం డాక్టర్ అనన్య మృతదేహం లభ్యమైంది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. హైదరాబాద్లోని ఆస్పత్రిలో వైద్యురాలిగా పని చేస్తున్న డాక్టర్ అనన్య సెలవులు రావడంతో సరదాగా హంపీ పరిసరాలను, తుంగభద్ర నది సోయగాలను వీక్షించేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై మునిరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనన్య మృతదేహాన్ని అంబులెన్స్లో హైదరాబాద్ తరలించారు. -
గుండెపోటుతో కార్మికుడి మృతి
● మృతదేహాన్ని లాక్కెళ్లిన కార్మికులు ● సోషల్ మీడియాలో వీడియో వైరల్ ● ఆరుగురు నిందితుల అరెస్ట్ రాయచూరు రూరల్: కలబుర్గి జిల్లా సేడం తాలుకా కోడ్లా శ్రీసిమెంట్ పరిశ్రమలో విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుతో కార్మికుడు మరణించిన ఘటన జరిగింది. మృతుడిని సిమెంట్ పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న బిహార్ వలస కార్మికుడు చందన్ సింగ్(35)గా పోలీసులు గుర్తించారు. విధి నిర్వహణలో గుండెపోటు రావడం, రక్తపోటు(బీపీ) తగ్గడంతో ప్రాణాలు వదిలాడు. అయితే మానవత్వం మరచి మరణించిన సాటి కార్మికుడి మృతదేహాన్ని కార్మికులు లాక్కెళ్లిన ఘటన అందరినీ కలిచి వేసిన విషయంపై బుధవారం సాయంత్రం వీడియో వైరల్ అయింది. ఇందుకు సంబంధించి ఉత్తర భారతదేశానికి చెందిన హైదర్ అలీ, రవిశంకర్, హరిందర్ నిశాద్, అజయ్, రమేష్, చంద్రలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
కవి సర్వజ్ఞ జయంతి
రాయచూరు రూరల్: నగరంలో కవి సర్వజ్ఞ జయంతిని ఆచరించారు. గురువారం అంబేడ్కర్ సర్కిల్లో కవి సర్వజ్ఞ చిత్రపటానికి శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ పూలమాల వేసి పూజలు నిర్వహించారు. అనంతరం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో జిల్లాధికార యంత్రాంగం, జిల్లా పంచాయతీ, నగరసభ, కన్నడ సంస్కృతి శాఖల ఆధ్వర్యంలో త్రిపది జయంతిని ప్రారంభించారు. తహసీల్దార్ సురేష్ వర్మ మాట్లాడుతూ సమాజంలో అట్టడుగున ఉన్న కుమ్మర సమాజం ఆర్థికంగా, సాంఘీకంగా, విద్యాపరంగా అభివృద్ధి సాధించాలన్నారు. కార్యక్రమంలో సమాజం అధ్యక్షుడు సురేంద్రబాబు, నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, ఆంజనేయ, తిమ్మప్ప ఫిరంగిలున్నారు. రేపు రాయచూరు మహోత్సవం రాయచూరు రూరల్: నగరంలో ఈనెల 22న రాయచూరు మహోత్సవం–2025ను నిర్వహిస్తున్నట్లు డాజల్ సూపర్ స్టార్ వీరేంద్ర జాలదార్, విశ్వాస్ జాలదార్ వెల్లడించారు. గురువారం ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 1995 నుంచి ఇంతవరకు నృత్యం, సంగీత, గీతాలాపనలో ఎంతో మంది ప్రతిభావంతులను తెరపైకి తెచ్చామన్నారు. ఆరోజున నగరంలోని మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో రాయచూరు మహోత్సవం కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. శస్త్రచికిత్సతో కుళ్లిన వెన్నెముక తొలగింపు రాయచూరు రూరల్: నగరంలోని బాలంకు ఆస్పత్రిలో కుళ్లిన వెన్నెముకను శస్త్రచికిత్స ద్వారా తొలగించడంలో వైద్యులు సఫలీకృతులయ్యారు. ఓ రోగికి ఇటీవల బాలంకు ఆస్పత్రిలో డాక్టర్ శ్రీధర్రెడ్డి బృందం ఐదు గంటల పాటు శస్త్రచికిత్స చేసి కుళ్లిన వెన్నెముకను తొలగించారు. ఐదు నెలల క్రితం క్షయ వ్యాధి సోకిన వ్యక్తికి నరాలు బలహీనం కావడంతో సీటీ స్కాన్ పరీక్ష జరిపారు. మూడో స్పైనల్ కార్డు కుళ్లిపోయి ఆరోగ్యం క్షీణించడంతో శస్త్రచికిత్స చేసి కుళ్లిన వెన్నెముకను తొలగించి రోగి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ మేలుకుంది, యశ్వంత్, సర్ఫరాజ్లున్నారు. ఎల్ఐసీ ఉద్యోగుల సమ్మె బళ్లారి రూరల్: ఎల్ఐసీ సంస్థలో ఉద్యోగ నియామకాలను చేపట్టాలని ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన గంటపాటు వాకౌట్ సమ్మెలో భాగంగా గురువారం మధ్యాహ్నం బళ్లారి బ్రాంచ్–2లో సమ్మె చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘ కార్యదర్శి సూర్యనారాయణ మాట్లాడారు. ఎల్ఐసీ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో ఇప్పుడు పని చేస్తున్న ఉద్యోగులపై పని భారం పెరిగింది. దీంతో ఒత్తిడికి లోనవుతున్నారు. పాలసీదారులకు ఉత్తమ సేవలు అందించడానికి ఉద్యోగాల భర్తీ అత్యంత ఆవశ్యకమని తెలిపారు. ఇంతటి కఠిన పరిస్థితుల్లో ఎల్ఐసీ యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకోడానికి ముందుకు రాకపోవడంతో అఖిల భారత ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం దేశవ్యాప్తంగా గంట పాటు నిధులు బహిష్కరించి వాకౌట్ సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. యాజమాన్యం స్పందించక పోతే దేశవ్యాప్తంగా ఉగ్రపోరాటానికి పూనుకోనున్నట్లు తెలిపారు. సమ్మెలో అధ్యక్షుడు దత్తాత్రేయ, కోశాధికారి విఘ్నేష్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. విలువైన కెమెరా లెన్స్ చోరీ హొసపేటె: తుంగభద్ర జలాశయం పోటు జలాల ప్రాంతంలోని గుండా అడవి సమీపంలో నిలిపి ఉన్న కారు అద్దాలు పగులగొట్టి ఫ్రీ వెడ్డింగ్ ఫోటో షూట్కు ఉపయోగించే కెమెరా లెన్స్లను దుండగులు చోరీ చేసిన ఘటన గురువారం జరిగింది. రూ.4 లక్షల విలువైన కెనాన్ ఆర్ 5 కెమెరా, లెన్స్ చోరీకి గురయ్యాయి. చోరీకి గురైన కెమెరా, లెన్స్ రాయచూరు జిల్లాలోని మాన్వికి చెందిన ఫోటోగ్రాఫర్ హుమయూన్కు చెందినవని పోలీసులు తెలిపారు. హుమయూన్ ఏపీ–40 ఏఎం–5041 నంబరుగల కారులో కెమెరా, లెన్స్ పెట్టుకొని ఫోటో షూట్ చేస్తున్నాడు. కారు వద్ద ఎవరూ లేకపోవడంతో అద్దాన్ని పగలగొట్టి కెమెరా, లెన్స్ను అపహరించారు. ఘటనపై మరియమ్మనహళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. -
ఆ కేసు త్వరలో సుఖాంతం
హుబ్లీ: సీటీ రవి, లక్ష్మీద హెబ్బాళ్కర్ కేసు త్వరలో పరిష్కారం అవుతుందని విధాన పరిషత్ స్పీకర్ బసవరాజ హొరట్టి తెలిపారు. గురువారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ సీటీ రవి, మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ జగడం వ్యవహారం పరిషత్ విషయ నీతి నిరూపణ సమితికి పంపించాం. ఇంకా అక్కడి నుంచి నివేదిక వివరాలు అందలేదు. వీలైనంత త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అన్ని పార్టీల 8 మంది సభ్యులతో కూడిన సమితి ఏర్పాటైందన్నారు. ఆ సమితి త్వరలోనే సమావేశాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశిస్తున్నానన్నారు. ఏదేమైనా కేసును పరిష్కరించే బాధ్యత తనపై ఉందన్నారు. త్వరలోనే పరిష్కరించే అవకాశం ఉందన్నారు. మార్చిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కేసును సుఖాంతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. కేసుకు సంబంధించి అత్యధికంగా గడువు మేరకు అసెంబ్లీ సమావేశాల నుంచి బహిష్కరించవచ్చన్నారు. కేసుపై మాట్లాడేందుకు ఇటీవల మంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్కు రెండు సార్లు ఫోన్ చేశాను. అయితే ఆమె ఫోన్ రిసీవ్ చేయలేదన్న రుజువులు కూడా ఆయన ఫోన్లో మీడియా ప్రతినిధులకు చూపించారు. కొన్ని సార్లు ఎమోషన్ అయినప్పుడు ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. అసెంబ్లీ అయితే వాటిని అక్కడే పరిష్కరించేవాడిని, ఏదేమైనా కానీ ఈ కేసును ముగించాలి. ఎందుకంటే దీని చరిత్ర అలాగే ఉండిపోతుంది. ఈ కేసు మంచి ముగింపుతో పరిష్కారమవుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
అగ్నిప్రమాదంలో జొన్న పంట దగ్ధం
రాయచూరు రూరల్: జిల్లాలోని మాన్వి తాలూకా కప్పగల్లో బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు జొన్న పంటల రాశులకు నిప్పంటించిన ఘటన చోటు చేసుకుంది. రాజశేఖర్ గౌడ అనే రైతు తన 14 ఎకరాల పొలంలో పండించిన జొన్న పంటను గ్రామంలోని బసవణ్ణ ఆలయం సమీపంలో కుప్పగా వేశారు. అయితే ఎవరో దుండగులు కుప్పలకు నిప్పంటించారు. సమాచారం అందగానే పోలీసులు అగ్నిమాపక దళం సిబ్బందితో వచ్చి మంటలను ఆర్పారు. ప్రమాదంలో దాదాపు రూ.14 లక్షల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. తహసీల్దార్ రాజు ఫిరంగి ఘటన స్థలాన్ని పరిశీలించారు. -
భార్య, ఆమె ప్రియుని నరికివేత
కృష్ణరాజపురం: అనైతిక సంబంధాలు రక్తపాతానికి కారణమవుతున్నాయి. తన భార్యతో అక్రమ సంబందం పెట్టుకున్నాడని ఆమె భర్త కత్తితో ఇద్దరిపై దాడి చేశాడు. ప్రియుడు హతం కాగా, భార్య చావు బతుకుల్లో ఉంది. బెంగళూరు మహాదేవపుర పరిధిలోని కాడుగోడి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. నిందితుడు యల్లప్ప. ఇతని భార్య అరుంధతి. మరో వ్యక్తి కిషోర్. కిషోర్ తన భార్యతో గొడవపడి కొన్నినెలలుగా వేర్వేరుగా ఉంటున్నారు. ఈ సమయంలో అతడు అరుంధతితో అనైతిక సంబంధం పెట్టుకున్నాడు. ఇది చూసి యల్లప్ప సహించలేకపోయాడు. ఇంట్లో ఇద్దరూ కలిసి ఉన్న సమయంలో కత్తితో విరుచుకుపడ్డాడు. కిషోర్ను గొంతు కోశాడు. భార్యను కత్తితో పొడిచి పరారయ్యాడు. స్థానికులు ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా కొంతసేపటికే కిషోర్ చనిపోయాడు. అరుంధతి పరిస్థితి సీరియస్గా ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. ప్రియుడు హతం బెంగళూరులో దారుణం -
వేసవి దాహం తీరేదెట్టా?
శుక్రవారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025బనశంకరి: వేసవికి ఇంకా 9, 10 రోజులు ఉండగానే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 7 గంటల నుంచే చుర్రుమనే ఎండ, వేడిమి చికాకు పెడుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే వేసవి కాలం, పరిష్కార చర్యలపై కసరత్తు చేపట్టింది. ఫిబ్రవరిలో అధిక తాపం ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సాధారణం కంటే 2.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతోంది. అలాగే ముంగారు వానలతో అధిక వర్షాలు కురుస్తాయని రెవెన్యూ శాఖ మంత్రి కృష్ణబైరేగౌడ తెలిపారు. గురువారం వాతావరణం, ప్రకృతి వైపరీత్యాల మంత్రివర్గ ఉపకమిటీ సమావేశం జరిగింది. ఈ ఏడాదిలో వేసవి, తాగునీటి సమస్య, వర్షాలు, వ్యవసాయం, జలాశయాల్లో నీటి మట్టాల గురించి అధికారులతో చర్చించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. 535 టీఎంసీల నీటి నిల్వలు రాష్ట్రంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 14 జలాశయాల్లో ప్రస్తుతం నీటి నిల్వ 535 టీఎంసీలు ఉండగా, ఇది సరాసరి 60 శాతం అని చెప్పారు. గతేడాది ఇదే సమయంలో 332 టీఎంసీలు మాత్రమే ఉండేదని చెప్పారు. కొన్ని జలాశయాల్లో నీటిమట్టం సంతృప్తికరంగా లేదని అన్నారు. చిక్కబళ్లాపుర, చిత్రదుర్గ, తుమకూరు, బెంగళూరునగర, రామనగర జిల్లాల్లో 13 తాలూకాలు పరిదిలో 66 గ్రామాల్లో తాగునీటి కొరత అధికంగా ఉందని అంగీకరించారు. ట్యాంకర్లు, బోర్వెల్స్ ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు. చిక్కబళ్లాపుర, బెంగళూరునగర, కోలారు జిల్లాల్లో 5 నగర, స్థానిక సంస్థల్లో ట్యాంకర్, బోర్లు ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. జిల్లాల కలెక్టర్లు, తహశీల్దార్లకు పీడీ అకౌంట్లలో రూ.488 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సమావేశంలో పలు శాఖల మంత్రులు పాల్గొన్నారు. సర్కారు కసరత్తు డ్యాములలో నీటి మట్టాలపై సమీక్ష తీవ్రంగా ఉన్నచోట ట్యాంకర్ల ద్వారా జలం కార్చిచ్చులు బెంగళూరులో వేడి సెగ మొదలైంది. గిరాకీ పెరగడంతో పెద్దమొత్తంలో కళింగర పండ్ల లోడ్లు వస్తున్నాయి. ఎండల వల్ల పలుచోట్ల కార్చిర్చు రేగుతోంది. గురువారం చిక్కమగళూరు దగ్గర కురువంగిలో అటవీప్రాంతంలో మంటలు వ్యాపించాయి. పెద్దమొత్తంలో గడ్డి, చెట్లు కాలిపోయాయి. -
పౌష్టికాహార అక్రమ నిల్వ.. డీడీ, సీడీపీఓలపై వేటు
హుబ్లీ: అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పంపిణీ చేయాల్సిన పౌష్టికాహార పదార్ధాలను అక్రమంగా గోదాములో నిల్వ చేసిన కేసులో ధార్వాడ జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ హులిగవ్వ కుకునూర, హుబ్లీ సీడీపీఓ ముత్తన్నలను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలను వెల్లడించింది. కేసును తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం శాఖా విచారణలో ఉండగానే ఇద్దరిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి పాల్పడినట్లు తేలడంతో పాటు ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారనే ఆరోపణలతో మహిళా, బాలల కళ్యాణ అభివృద్ధి శాఖా ఉప కార్యదర్శి సీ.బలరామ గురువారం ఈ ఉత్తర్వులను వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రం లబ్ధిదారులకు పౌష్టికాహారాన్ని సమకూర్చడంలో డీడీ, సీడీపీఓ విఫలయ్యారు. కాలానుగుణంగా గోదాముల్లోని నిల్వలను పరిశీలించకుండా విధి నిర్వహణలో విఫలం కావడమేగాకుండా ఆహార పదార్ధాల అక్రమ నిల్వలకు అవకాశం కల్పించారు. ఈ విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలింది. దీంతో లబ్ధిదారులు పౌష్టికాహారం నుంచి వంచితులయ్యే ప్రమాదం ఉన్న కారణాన్ని చూపుతూ ఆదేశాలు వెల్లడించినట్లు ఓ అధికారి తెలిపారు. -
సమస్యల నిలయం
మహిమాన్విత ఆలయం..సాక్షి,బళ్లారి: నిత్యం వేలాది మంది భక్తులతో కిటికిటలాడే మహిమాన్విత పుణ్యక్షేత్రంలో మౌలిక సదుపాయాలతో పాటు స్వచ్ఛత కరువు కావడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తులకు కొంగుబంగారంగా పిలవబడే ఈ క్షేత్రానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. మాఘ మాసంలో ప్రతి ఏటా భక్తుల సందడి పెరిగే ఈ ఆలయం విశిష్టత, చరిత్రను పరిశీలిస్తే... యోగమార్గ శిక్షణ, సన్యాసాశ్రమ ధర్మాచరణ, భక్తిమార్గ పరిరక్షణ అనే మూడు అంశాలు నేపథ్యంగా ఆవిష్కారమైన త్రిమూర్తుల అంశావతార మహాపుణ్యక్షేత్రమైన గాణగాపుర ప్రతి నిత్యం భక్తుల సందడితో విరాజిల్లుతోంది. గురువులకే ఆది గురువైన దత్తాత్రేయుడు దివ్య నిర్గుణపాదుకలను దర్శించుకోవడానికి భక్తుల పరంపరం కొనసాగుతోంది. మహావిష్ణువు దశావతరాల పరంపరలో భాగంగా అత్రి, అనసూయ దంపతులకు మార్గశిర పౌర్ణమి రోజున శ్రీహరి దత్తాత్రేయుడుగా జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా త్రిమూర్తుల అంశావతారమని కూడా పురాణాలు ఘోషిస్తున్నాయి. దత్తాత్రేయ క్షేత్రంలో నిత్యం దిగంబర..దిగంబర.. శ్రీపాదవల్లభ దిగంబర అంటూ భక్తులు వేనోళ్ల కీర్తించుకునే గురుదైవం దత్తాత్రేయుల వారి నిండైన విగ్రహాలు గాణాపురలో వెలసి ఉన్నాయి. కోరిన కోర్కెలు తీర్చే మహిమాన్వితుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురిని ఏకకాలంలో దర్శించుకుంటున్నామా అని భక్తులు పరవశించిపోయే మహాపుణ్యక్షేత్రమిది. దత్తాత్రేయుడి పాదుకలను దర్శించుకోవడానికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి నిత్యం వచ్చే భక్తులతో కిటకిటలాడుతోంది. దివ్యపాదుకలతో పాటు కల్లేశ్వర ఆలయం, సంగమ భీమా దర్శనాలు ఇక్కడి విశేషం. శ్రీదత్త శరణం మమా అంటూ నిత్యం ఇక్కడ స్మరించుకోవడానికి భక్తులు తరలివస్తుంటారు. దత్తక్షేత్రంగా ప్రసిద్ధిపొందిన గాణగాపురలో ఉడిపిలో శ్రీకృష్ణుని దర్శనం మాదిరిగానే దత్తాత్రేయుడు శ్రీగురు పాదుకలను ఒక గవాక్షంలో దర్శనం చేసుకుంటూ భక్తులు పునీతులవుతుంటారు. భీమ, అమర్జా అనే రెండు నదుల సంగమం కూడా ఇక్కడ ఉంది. దత్తాత్రేయుడి రెండో అవతారమైన శ్రీనరసింహస్వామి రూపం అని కూడా భక్తుల నమ్మకం. సంగమ భీమాదర్శనం, ఏకగవాక్షి ద్వారా శ్రీగురు పాదుకలను, శ్రీకల్లేశ్వర, శనిమందిరం, శ్రీఆంజనేయ స్వామి, పంచముఖ గణపతిని, అశ్వర్థ వృక్షాన్ని, నరసింహ సరస్వతి ఆలయం, మేడిచెట్టును దర్శించుకునే శ్రీదత్తాత్రేయ ఆలయం కలబుర్గి జిల్లా అఫ్జల్పుర తాలూకాలోని గాణగాపురలో వెలసి ఉంది. ఆలయ పరిసరాల్లో భక్తుల పాట్లు దత్తాత్రేయ ఆలయ పరిసరాల్లో సమస్యలు తిష్టవేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులు కొలువుదీరారని భక్తులు విశ్వసించే, పురాణాలు ఘోషించే శ్రీదత్తాత్రేయ ఆలయ ముఖ ద్వారం ముందే రోడ్డు గుంతలమయంగా కనిపిస్తోంది. శ్రీకల్లేశ్వర, శనిమందిరానికి వెళ్లే దారి కంకర తేలి గుంతల మయంగా ఉండటంతో రెండు కిలోమీటర్ల దూరం మేర ఆలయం వద్దకు చేరుకునేందుకు నానాయాతన పడుతున్నారు. సంగమ, భీమా నదిలో స్నానాలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని భక్తులు ఎంతో దూరం వచ్చే ఈ క్షేత్రంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో నిత్యం భక్తులు పడుతున్న ఇబ్బందులు వర్ణించలేనివి. గాణగాపుర శ్రీదత్తాత్రేయ ఆలయానికి దేశ నలుమూలల నుంచి వచ్చిన భక్తులకు ఇక్కడ స్వామివారిని దర్శించుకునేందుకు క్షేత్ర పరిసరాల్లో కల్పించాల్సిన రోడ్లు, స్వచ్ఛత తదితర మౌలిక సదుపాయాలపై పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి మహామహిమాన్విత క్షేత్రంలో స్వచ్ఛత, పారిశుధ్యంపై ఆలయ కమిటీ నిర్వాహకులు, పాలకులు దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. దత్తాత్రేయుడు కొలువైన పుణ్యక్షేత్రం గాణగాపుర అస్తవ్యస్తంగా రోడ్లు, లోపించిన పరిశుభ్రత -
రవి– లక్ష్మి కేసులో వాదనలు
శివాజీనగర: గత డిసెంబర్లో బెళగావి సువర్ణసౌధలో బీజేపీ ఎమ్మెల్సీ సీ.టీ.రవి, మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ను అసభ్యంగా దూషించారనే కేసును రద్దు చేయాలని సీటీ రవి హైకోర్టులో గతంలో పిటిషన్ సమర్పించారు. గురువారం విచారణ జరిగింది. అసెంబ్లీలో మాట్లాడిన మాటలపై కేసులు పెట్టలేరు అని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని రవి వకీళ్లు వాదించారు. లక్ష్మీ హెబ్బాళ్కర్ అంటే గౌరవముందని తెలిపారు. కానీ సీటీ రవి సభా వాయిదా పడిన తరువాత మాట్లాడిన మాటలకు రక్షణ లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అభ్యంతరం సమర్పించేందుకు లక్ష్మీ తరఫు న్యాయవాది గడువు కోరారు. జడ్జి విచారణను ఫిబ్రవరి 24కు వాయిదా వేస్తూ, విచారణపై ఉన్న స్టేను పొడిగించారు. కొత్త కారులో కుంభమేళాకు వెళ్తూ.. ● హాసన్వాసి దుర్మరణం యశవంతపుర: కుంభమేళాకు వెళుతుండగా కారు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. హాసన్ జిల్లా శ్రవణ బెళగోళ తాలూకా కుంభేనహళ్లివాసి నితిన్ అలియాస్ యశ్ (32) మృతుడు. ఈ నెల 15న నితిన్ కొత్తకారును కొన్నాడు. 16న కుటుంబంతో కలిసి యూపీలోని కుంభమేళాకు బయల్దేరారు. కాశీలో దర్శనాలు చేసుకుని గురువారం ఉదయం ప్రయాగరాజ్కు వెళుతున్నారు. వారణాసి వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును కంటైనర్ లారీ ఢీకొంది. కారు నుజ్జునుజ్జు కాగా, కారులోని ప్రజ్వల్, హరీశ్, శకుంతల గాయపడ్డారు. నితిన్ చనిపోగా, అతని తల్లి పుష్పలతకు తీవ్ర గాయాలై ప్రాణాపాయంలో ఉంది. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్వగ్రామంలో విషాదం నెలకొంది. రైలు ఢీకొని ముగ్గురు మృతి దొడ్డబళ్లాపురం: అనుమానాస్పద రీతిలో ముగ్గురు యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. వేగంగా వస్తున్న రైలు తగిలి విగతజీవులయ్యారు. ఈ దుర్ఘటన దొడ్డ తాలూకా పరిధిలోని సిద్ధేనాయకనహళ్లి వద్ద చోటుచేసుకుంది. ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చి ఇక్కడ కార్పెంటర్లుగా పని చేసుకుంటూ, ముత్తూరులో అద్దె గదిలో నివసిస్తున్న రాహుల్, లల్లన్, బినీత్ మృతులు. వీరి వయస్సు 25– 30 ఏళ్ల మధ్య ఉంటుంది. బుధవారం రాత్రి కొనఘట్ట గ్రామంలో పని ముగించుకుని ఆటోలో తిరిగి వచ్చారు. సిద్ధేనాయనహళ్లి వద్ద ఆటో దిగి రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తుండగా పుట్టపర్తి–బెంగళూరు మధ్య సంచరించే రైలు వేగంగా వచ్చి ఢీకొంది. రైలుకి దగ్గరగా వెళ్లి సెల్ఫీ తీసుకోవాలనుకున్నారని, ఈ సమయంలో రైలు ఢీకొని దూరంగా ఎగిరిపడ్డారని స్థానికుల సమాచారం. లేదా ఆత్మహత్య చేసుకున్నారా, పట్టాలపై వస్తుంటే రైలు ఢీకొందా అనే అనుమానాలు ఉన్నాయి. యశ్వంతపుర రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కుటుంబీకులకు సమాచారం అందించారు. -
సవతికి చిత్రహింసలు
బాగేపల్లి: నా భర్తకే వల వేస్తావా అని రెండో భార్యను మొదటి భార్య బంధువులు ఫాంహౌస్లో బంధించి చిత్రహింసలకు గురిచేసిన ఘటన గుడిబండ తాలూకా జిగానహళ్లిలో జరిగింది. బెంగుళూరులోని రాజరాజేశ్వరి నగర నివాసి గంగరాజు తన అమ్మమ్మ గారి ఊరైన జిగానహళ్లికి వచ్చివెళ్తుండేవాడు. తన అక్క తరఫు బంధువులైన రాజేశ్వరిని ప్రేమించి పెళ్లాడాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయినా గంగరాజు బెంగళూరుకు చెందిన సంగీత అనే యువతిని కూడా ప్రేమించి మూడు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. సంగీత, గంగరాజు బుధవారం జిగానహళ్లికి వచ్చారు. ఈక్రమంలో మొదటిభార్య బంధువులు సంగీతను ఫాంహౌస్లో బంధించి హింసించారు. పోలీసులు వచ్చి సంగీతను రక్షించి నిందితులను అరెస్టు చేశారు. సంగీత మొహం గుర్తుపట్టలేనంతగా గాయపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
బంగారు గొలుసు కొట్టేయాలని..
శివమొగ్గ: బంగారం రేట్లు ఆకాశాన్ని అంటడంతో దానిపట్ల వ్యామోహం కూడా పెరిగిపోతోంది. దీంతో అడ్డదారులు తొక్కేవారు ఉన్నారు. నగల షాపులో కోనుగోలుదారులుగా వచ్చి బంగారు చైన్ చోరీకి యత్నించి ఇద్దరు మహిళలు దొరికిపోయారు. శివమొగ్గ నగరంలోని గాంధీ బజార్ రోడ్డులో ఈ సంఘటన జరిగింది. వివరాలు..ఈ నెల 18వ తేదీన నగరానికే చెందిన ఇద్దరు మహిళలు మధ్యాహ్నం 2 గంటల సమయంలో హడావుడిగా ఓ నగల అంగడికి వచ్చారు. 15– 20 గ్రాముల బంగారు చైన్లను చూపించాలని యజమాని కిరణ్షా ని అడిగారు. ఆయన ఓ చైన్ని ట్రేలో పెట్టి ఇచ్చాడు. మహిళలు దానిని పరిశీలిస్తున్నట్లు నటిస్తూ తమతో తెచ్చిన గిల్టు చైన్ను ట్రేలో పెట్టి అసలు గొలుసును కొట్టేశారు. షాపు నుంచి గబగబా వెళ్లిపోతుండగా అనుమానంతో పట్టుకుని పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు అసలు చైన్ని యజమానికి ఇప్పించి మహిళలను అరెస్టు చేశారు. -
ఎడమ కాలువకు ఏప్రిల్ వరకు నీరివ్వాలి
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువకు ఏప్రిల్ నెలాఖరు వరకు నీరు వదలాలని కర్ణాటక ప్రాంత రైతు సంఘం డిమాండ్ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు విరుపాక్షిగౌడ మాట్లాడారు. సింధనూరు, మాన్వి, రాయచూరు తాలూకాల్లో ఫిబ్రవరిలో సాగు చేసిన రెండో పంటకు ఏప్రిల్ వరకు నీరు వదలాలని కోరారు. 54వ డిస్ట్రిబ్యూటరీ వద్ద ఆరు అడుగుల మేర గేజ్ కాపాడేలా నీటిపారుదల శాఖ అధికారులకు జిల్లాధికారి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. -
చురుగ్గా హంపీ ఉత్సవ ప్రధాన వేదికల నిర్మాణం
హొసపేటె: ఈసారి హంపీ ఉత్సవ ప్రధాన వేదికల నిర్మాణం ఊపందుకుంది. విజయనగర శిల్ప కళా నమూనాలో హంపీ శ్రీవిరుపాక్షేశ్వర ఆలయంలోని ప్రధాన గోపుర నమూనాను వినియోగించి వేదికను ఆకర్షణీయంగా నిర్మించాలని జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. హంపీ ఉత్సవ ప్రధాన వేదిక నిర్మాణ పనులు చురుకుగా జరుగుతుండటంతో ఈసారి హంపీ ఉత్సవాలు మరింతగా వైభవంగా నిర్వహించేందుకు అడుగులు పడుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన వేదిక ప్రధాన ఆకర్షణ కనుక ఈ వేదికను విరుపాక్షేశ్వర ఆలయం ప్రధాన గోపురం, రాతి రథం, సాసివెకాళు గణపతి, అంజనేయస్వామి ఆలయం, హేమకూట పర్వతాలయం నమూనాలతో నిర్మిస్తుండటం చర్చనీయాశంగా మారింది. ఫిబ్రవరి 28, మార్చి 1, 2 తేదీల్లో ఉత్సవాలు జరుగనున్నాయి. -
కుట్టుమిషన్ల పంపిణీ
హొసపేటె: ఆర్థికంగా వెనుకబడిన మహిళల సాధికారత కోసం హొసపేటె ఇన్నర్ వీల్ క్లబ్ ఎల్లవేళలా ముందుంటుందని, ఇతర క్లబ్లకు ఆదర్శంగా నిలుస్తుందని ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు సుష్మా ప్రసంశించారు. నగరంలోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కుట్టుమిషన్లను పంపిణీ చేసి ఆమె మాట్లాడారు. డబ్బు ఉన్నవాళ్లంతా దాతలు కాదన్నారు. దానం చేసే గుణం ఉన్నవాళ్లకు మాత్రమే దానం గుణం ఉంటుందన్నారు. సమాజ సేవలో తమ వంతు తోడ్పాటును అందించే వారికి మానవత్వం ఉంటుందన్నారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు సునీత, కార్యదర్శి రాజేశ్వరి, డాక్టర్ మహాదేవి తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఎల్లో జోగప్ప నిన్న అరమనె చిత్రం విడుదల
హుబ్లీ: రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి ఎల్లో జోగప్ప నిన్న అరమనె సినిమాను విడుదల చేస్తున్నట్లు ఆ చిత్ర దర్శకుడు హయవదన, నిర్మాత పవన్ సీనికేరి తెలిపారు. వారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ పాండోరస్ బాక్స్ ప్రొడక్షన్స్ అండ్ కృష్ణఛాయ చిత్ర బ్యానర్లో ఈ చిత్రాన్ని బెంగళూరు, మైసూరు, ఉత్తర కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా బాగల్కోటె, విజయపుర, మహారాష్ట్రలోని పండరాపుర, ఆగ్రా, ఢిల్లీ, మనాలి, హిమాచల్ప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాలు, ఉత్తరాఖండ్లో షూటింగ్ చేశామన్నారు. ఫొటోగ్రఫీ నటరాజ మాదాల, శివం సంగీతం అందించిన ఈ చిత్రంలో అంజన్ నాగేంద్ర, సంజనదాస్, శరత్ లోహితాశ్య, స్వాతి, దినేష్ మంగళూరు, దానప్ప ఉమేష్, విఠల పరీట, ఇలా విట్లా నటించారన్నారు. దుకాణాల తొలగింపుపై నిరసన రాయచూరు రూరల్: సింధనూరు–హైదరాబాద్ జాతీయ రహదారిలోని ఫుట్పాత్ దుకాణాలను తొలగించడం తగదని ఏిఐసీసీటీయూ డిమాండ్ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు నాగరాజ్ మాట్లాడారు. సింధనూరు–హైదరాబాద్ జాతీయ రహదారిలో ఫుట్పాత్పై వెలసిన, నిర్మించుకున్న దుకాణాల తొలగింపునకు నగరసభ, సిటీ కార్పొరేషన్ అధికారులు శ్రీకారం చుట్టారన్నారు. వ్యాపారులకు తగిన పరిహారం అందించాలన్నారు. లేకుంటే ప్రైవేట్ బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు తీర్చడానికి ఇబ్బందిగా మారుతుందన్నారు. వీధుల్లో వ్యాపారులు, పుట్పాత్ వ్యాపారులకు పరిహారం, ప్రత్యామ్నాయం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. పేదలకు ఇళ్ల మంజూరుకు వినతి రాయచూరు రూరల్: నగరంలోని మురికివాడల్లో నివాసమున్న పేదలకు ప్రమాణ పత్రాలను ఇచ్చి ఇళ్లను మంజూరు చేయాలని మురికివాడ ప్రాంత క్రియా సేన సమితి అధ్యక్షుడు జనార్దన డిమాండ్ చేశారు. గురువారం జిల్లాధికారి కార్యాలయంలో శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ అధ్యక్షతన వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. కేంద్ర, రారష్ట్ర ప్రభుత్వాలు నగరంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. రూ.6 లక్షల్లో కేవలం స్లం బోర్డు అధికారులు రూ.3 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. సగానికే నిర్మాణాలు చేపట్టి మిగిలిన భాగాన్ని పూర్తి చేయాలంటే ప్రభుత్వం నిధులు విడుదల చేయాలన్నారు. నిధుల దుర్వినియోగం.. ముగ్గురు అధికారుల సస్పెండ్ రాయచూరు రూరల్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(నరేగ) నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఆరోపణలపై జిల్లాలోని లింగసూగూరు తాలూకా వ్యవసాయ శాఖలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేసినట్లు జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారాం పాండే వెల్లడించారు. లింగసూగూరు తాలూకా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగరత్న, అధికారి సిద్దప్ప, సింధనూరు రైతు కేంద్రం అధికారి ఇబ్రహీంలు అవినీతిలో భాగస్వాములయ్యారని వెల్లడైన నివేదిక ఆధారంగా వాస్తవాలను గుర్తించి వారిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. -
చనిపోతూ.. ప్రాణం పోశాడు
యశవంతపుర: రోడ్డు ప్రమాదంలో తలకు గాయాలైన యువకుడు బ్రెయిన్డెడ్ కాగా, కుటుంబీకులు అవయవదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఉడుపి జిల్లా కుందాపురకు చెందిన రాఘవేంద్ర (33) ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చికిత్స పొందుతూ మణిపాల్ ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అవయవాలను దానం చేయాలని, ఇతరుల జీవితానికి సాయం చేయాలని వైద్యులు అభ్యర్థించడంతో కుటుంబ సభ్యులు సమ్మతించారు. రాఘవేంద్ర దేహం నుంచి కళ్లు, కిడ్నీలు, గుండె, చర్మం, ఊపిరితిత్తులు తదితర ముఖ్య అవయవాలను సేకరించి అవసరమైన రోగుల కోసం వెంటనే పంపించారు. ఊపిరితిత్తులు, శ్వాస నాళాలను సికింద్రాబాద్కు తరలించారు. మరణంలోను రాఘవేంద్ర ముగ్గురికి ప్రాణం నిలిపాడు. పేలుళ్లు.. మూగజీవాలకు గాయాలు మైసూరు: మొక్కజొన్న చొప్పలో పెట్టిన మేతను తినబోగా పేలుడు జరగడంతో ఒక గేదెతో పాటు నాలుగు ఆవుల నోళ్లు ఛిద్రమైన ఘటన చామరాజనగర జిల్లా హనూరు తాలూకా భద్రయ్యనహళ్లి గ్రామం వద్ద జరిగింది. గ్రామ శివార్లలో మేత కింద ఎవరో దుండగులు పేలుడు పదార్థాలను దాచి ఉంచారు. దీనిని గ్రహించని మూగ జంతువులు మేత మేయబోగా పెద్ద శబ్ధంలో పేలుళ్లు జరిగాయి. ఉమాశంకర్, దేవరాజు, మల్లశెట్టిలకు చెందిన గేదెతో పాటు నాలుగు ఆవుల ముఖాలు పేలుడుతో తీవ్రంగా గాయపడ్డాయి. రెండు నెలల అవధిలో ఇలాంటి 3–4 సంఘటనలు జరిగాయి. దుండగులను పట్టుకుని శిక్షించాలని పశు పోషకులు డిమాండ్ చేశారు. అన్నీ సెటిల్ చేసే వెళ్లిపోతా దొడ్డబళ్లాపురం: కన్నడ సినిమా డైరెక్టర్ గురుప్రసాద్ గత ఏడాది నవంబర్ 3న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన అప్పుల బాధ భరించలేక చనిపోయాడనేది కూడా తెలిసిందే. ఇప్పుడు ఓ ఆడియో వెలుగు చూసి ఆసక్తి కలిగిస్తోంది. ఆత్మహత్యకు ముందు రెండవ భార్యకు ఫోన్ చేసిన గురుప్రసాద్.. నీకు, కుమార్తెకు అన్నీ సెటిల్ చేసే పోతానని భరోసా ఇచ్చాడు. ఆడియోను స్నేహితుడికి పంపించాడు. ఆయన ఆత్మహత్య సంగతి రెండవ భార్యకు ముందే తెలుసా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కొడవళ్లు, కట్టెలతో బైకర్ల హల్చల్ కృష్ణరాజపురం: బెంగళూరు నగరంలో పోకిరీ బైకర్ల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. కొడవళ్లు, బేస్బాల్ బ్యాట్లు పట్టుకొని బైక్లపై దూసుకెళ్తూ బయాందోళన సృష్టించారు. రామ్మూర్తినగర రింగ్ రోడ్డులో ఈ సంఘటన రిగింది. మారణాయుధాలను పట్టుకుని బైక్ల మీద వెళ్తూ, ఇతర వాహనదారులను భయపెట్టారు. వీలింగ్ కూడా చేశారు. కృష్ణరాజపురంలో ఉన్న వంతెన పైన, రామ్మూర్తినగరలో రింగ్ రోడ్డులో బైకర్ల దురాగతాలు జరుగుతున్నాయి. వేగంగా వెళ్తూ కొడవలితో రోడ్డుపై గీస్తూ నిప్పురవ్వులు వచ్చేలా చేస్తుంటారు. పోలీసులు గస్తీని పెంచి ఆకతాయిలను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఠాణాపై దాడి కేసులో నిందితుడు అరెస్టు మైసూరు: నగరంలోని ఉదయగిరి పోలీసు స్టేషన్ని చుట్టుముట్టి రాళ్ల దాడి చేసిన సంఘటనలో పరారీలో ఉన్న ముఫ్తీ ముష్తాక్ అనే నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మౌల్విగా పనిచేస్తున్నాడని, ఆ రోజు ఓ వర్గం వారిని రెచ్చగొట్టి ఠాణా మీద దాడి చేయించాడని అభియోగాలున్నాయి. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసం కావడమేగాక 14 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. అప్పటినుంచి తప్పించుకు తిరుగుతుండగా సీసీబీ పోలీసులు గాలించి అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. కాగా నిందితులపై చర్యలు తీసుకోవద్దని పోలీసులపై ప్రభుత్వం నుంచి, హోం శాఖ నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉందని స్థానిక ఎమ్మెల్యే శ్రీవత్సకారోపించారు. తాము పోరాటం చేపడతామని హెచ్చరించడంతో నిందితున్ని అరెస్టు చేసిందన్నారు. -
‘బ్రాండ్ బెంగళూరుకు’ దారి.. నమ్మ రోడ్లు
బనశంకరి: బ్రాండ్ బెంగళూరు నినాదంలో భాగంగా బెంగళూరు నగరంలో రోడ్లు ఎక్కువ కాలం మన్నేలా ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని డిప్యూటీసీఎం డీకే.శివకుమార్ అన్నారు. బీబీఎంపీ కేంద్ర కార్యాలయలో గురువారం ఏర్పాటు చేసిన నమ్మరోడ్డు–2025 సెమినార్ను డిప్యూటీ సీఎం ప్రారంభించి మాట్లాడారు. నమ్మరోడ్డు బ్రోచర్ను ఆవిష్కరించారు. ప్రజల సలహాలతో కూడిన బుక్లెట్ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రోడ్లు పక్కన మొక్కలు ఎక్కడ నాటాలి, విద్యుత్ స్తంభాలు, మెయిన్రోడ్లు ఎలా ఉండాలి, ఫుట్పాత్ మార్గాలు ఎలా నిర్మించాలి, ప్రజలు ఎలాంటి నిబంధనలు పాటించాలి, బస్టాండ్ల నిర్మాణం, మెట్రో పిల్లర్లు, సర్కిల్స్ ఆధునీకరణకు బుక్లెట్ ద్వారా సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. ఆ వైర్లను కత్తిరించాలి బయట రోడ్లు, వీధుల్లో వేలాడుతున్న టెలికాం సంస్థల వైర్లను భూగర్భంలో అమర్చాలని సూచించినా సంస్థలు పెడచెవిన పెట్టాయని, వాటిని కత్తిరిస్తే దారికి వస్తారని డీసీఎం తెలిపారు. ప్రతిపౌరుని ఆస్తి రక్షణ కోసం కొత్త చట్టాలను తీసుకువస్తామని ఈనెలాఖరున మీడియా సమావేశం నిర్వహించి బహిర్గతం చేస్తామన్నారు. సొరంగమార్గానికి భూస్వాధీనం, ఆర్థిక, సాంకేతిక అంశాలు సవాలుగా ఉన్నాయన్నారు. నూతన మెట్రోమార్గంలో డబుల్ డెక్కర్ సంచరిస్తుందని తెలిపారు. దాదాపు 1,700 కిలోమీటర్ల మేర రోడ్లను వైట్టాపింగ్ వేస్తున్నామని, రాజకాలువల పక్కన కొత్తరోడ్ల నిర్మాణం, పై వంతెనల నిర్మాణం తదితర ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉన్నాయని తెలిపారు. కన్నడలో బోర్డులు ఉండాల్సిందే ఎవరూ ఉన్నా లేకపోయినా మనరోడ్డు అనే బుక్లెట్ మార్గదర్శనం చేస్తుందని, బుక్లెట్లో ఉండే నిబంధనల ప్రకారమే పనిచేయాలని సూచించామని డీకే.శివకుమార్ తెలిపారు. కొత్త ఆలోచనలు ఇవ్వడానికి విద్యార్థులు, యువకులు ముందుకురావడం సంతోషకరమన్నారు. నామఫలకాల్లో కన్నడ భాష 60 శాతం ఉండాలని, ఇందులో ఎవరైనా తప్పుచేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సదస్సులో బీబీఎంపీ కమిషనర్ తుషార్గిరినాథ్, ప్రత్యేకకమిషర్ అవినాశ్మెనన్ రాజేంద్రన్, బీఎంఆర్డీఏ కార్యదర్శి రాజేంద్రచోళన్, చీఫ్ ఇంజనీర్ ప్రహ్లాద్, డబ్ల్యూఆర్ఐ సీఈఓ మాదవపై, తదితరులు పాల్గొన్నారు. బ్రోచర్ ఆవిష్కరణలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ -
ఇద్దరికి రూ.87 లక్షలు మస్కా
మైసూరు: పర్యాటక రాజధానిలో ఆన్లైన్ మోసాలు దడ పుట్టిస్తున్నాయి. చదువుకున్నవారు ఇట్టే బలవుతున్నారు. సైబర్ మోసగాళ్ల మాటలు నమ్మి అధిక లాభాలకు ఆశ పడిన ఇద్దరు రూ.87 లక్షలను కోల్పోయారు. ఈ స్కాం మైసూరు నగరంలో జరిగింది. మొదటి కేసులో నగరంలోని బోగాది నివాసి, మహిళా టెక్కీకి వంచకులు ఓ వాట్సాప్ మెసేజ్ పంపారు. వంచకుల మాటలను నమ్మిన ఆమె నేవిగేషన్ ఆఫ్ ద కట్టింగ్ ఎడ్జ్ ఆఫ్ స్టాక్ అనే గ్రూప్లో చేరారు. షేరు మార్కెట్ ద్వారా డబ్బు పెట్టుబడి పెడితే లక్షలాది రూపాయలను గడించవచ్చని వంచకులు ఆమెకు ఆశ పుట్టించారు. వారి మాటలను నమ్మిన మహిళ దశల వారీగా రూ.57,81,700 వారు చెప్పిన ఖాతాకు బదిలీ చేసింది. రోజులు గడిచినా ఒక్క రూపాయి కూడా తిరిగి రాలేదు. రిటైర్డు అధికారికి... మరో కేసులో బోగాది టెలికాం బడావణె నివాసి, రిటైర్డ్ అధికారి వాట్సప్ ద్వారా వే టు వెల్త్ అనే గ్రూప్లో చేరారు. తాముచెప్పిన షేర్లు కొంటే ఇబ్బడిముబ్బడిగా లాభం వస్తుందని నకిలీ మెసేజ్లు పంపారు. బాధితుడు ప్రలోభానికి గురై దుండగులు చెప్పిన ఖాతాకు రూ.21.60 లక్షలను బదిలీ చేసి మోసపోయాడు. ఫిర్యాదుల మేరకు సైబర్ క్రైం పోలీసులు కేసులు దర్యాప్తు చేపట్టారు. మైసూరులో సైబర్ మోసాలు -
కవి సర్వజ్ఞ జయంతి
రాయచూరు రూరల్: నగరంలో కవి సర్వజ్ఞ జయంతిని ఆచరించారు. గురువారం అంబేడ్కర్ సర్కిల్లో కవి సర్వజ్ఞ చిత్రపటానికి శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ పూలమాల వేసి పూజలు నిర్వహించారు. అనంతరం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో జిల్లాధికార యంత్రాంగం, జిల్లా పంచాయతీ, నగరసభ, కన్నడ సంస్కృతి శాఖల ఆధ్వర్యంలో త్రిపది జయంతిని ప్రారంభించారు. తహసీల్దార్ సురేష్ వర్మ మాట్లాడుతూ సమాజంలో అట్టడుగున ఉన్న కుమ్మర సమాజం ఆర్థికంగా, సాంఘీకంగా, విద్యాపరంగా అభివృద్ధి సాధించాలన్నారు. కార్యక్రమంలో సమాజం అధ్యక్షుడు సురేంద్రబాబు, నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, ఆంజనేయ, తిమ్మప్ప ఫిరంగిలున్నారు. రేపు రాయచూరు మహోత్సవం రాయచూరు రూరల్: నగరంలో ఈనెల 22న రాయచూరు మహోత్సవం–2025ను నిర్వహిస్తున్నట్లు డాజల్ సూపర్ స్టార్ వీరేంద్ర జాలదార్, విశ్వాస్ జాలదార్ వెల్లడించారు. గురువారం ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 1995 నుంచి ఇంతవరకు నృత్యం, సంగీత, గీతాలాపనలో ఎంతో మంది ప్రతిభావంతులను తెరపైకి తెచ్చామన్నారు. ఆరోజున నగరంలోని మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో రాయచూరు మహోత్సవం కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. శస్త్రచికిత్సతో కుళ్లిన వెన్నెముక తొలగింపు రాయచూరు రూరల్: నగరంలోని బాలంకు ఆస్పత్రిలో కుళ్లిన వెన్నెముకను శస్త్రచికిత్స ద్వారా తొలగించడంలో వైద్యులు సఫలీకృతులయ్యారు. ఓ రోగికి ఇటీవల బాలంకు ఆస్పత్రిలో డాక్టర్ శ్రీధర్రెడ్డి బృందం ఐదు గంటల పాటు శస్త్రచికిత్స చేసి కుళ్లిన వెన్నెముకను తొలగించారు. ఐదు నెలల క్రితం క్షయ వ్యాధి సోకిన వ్యక్తికి నరాలు బలహీనం కావడంతో సీటీ స్కాన్ పరీక్ష జరిపారు. మూడో స్పైనల్ కార్డు కుళ్లిపోయి ఆరోగ్యం క్షీణించడంతో శస్త్రచికిత్స చేసి కుళ్లిన వెన్నెముకను తొలగించి రోగి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ మేలుకుంది, యశ్వంత్, సర్ఫరాజ్లున్నారు. ఎల్ఐసీ ఉద్యోగుల సమ్మె బళ్లారి రూరల్: ఎల్ఐసీ సంస్థలో ఉద్యోగ నియామకాలను చేపట్టాలని ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన గంటపాటు వాకౌట్ సమ్మెలో భాగంగా గురువారం మధ్యాహ్నం బళ్లారి బ్రాంచ్–2లో సమ్మె చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘ కార్యదర్శి సూర్యనారాయణ మాట్లాడారు. ఎల్ఐసీ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో ఇప్పుడు పని చేస్తున్న ఉద్యోగులపై పని భారం పెరిగింది. దీంతో ఒత్తిడికి లోనవుతున్నారు. పాలసీదారులకు ఉత్తమ సేవలు అందించడానికి ఉద్యోగాల భర్తీ అత్యంత ఆవశ్యకమని తెలిపారు. ఇంతటి కఠిన పరిస్థితుల్లో ఎల్ఐసీ యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకోడానికి ముందుకు రాకపోవడంతో అఖిల భారత ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం దేశవ్యాప్తంగా గంట పాటు నిధులు బహిష్కరించి వాకౌట్ సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. యాజమాన్యం స్పందించక పోతే దేశవ్యాప్తంగా ఉగ్రపోరాటానికి పూనుకోనున్నట్లు తెలిపారు. సమ్మెలో అధ్యక్షుడు దత్తాత్రేయ, కోశాధికారి విఘ్నేష్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. విలువైన కెమెరా లెన్స్ చోరీ హొసపేటె: తుంగభద్ర జలాశయం పోటు జలాల ప్రాంతంలోని గుండా అడవి సమీపంలో నిలిపి ఉన్న కారు అద్దాలు పగులగొట్టి ఫ్రీ వెడ్డింగ్ ఫోటో షూట్కు ఉపయోగించే కెమెరా లెన్స్లను దుండగులు చోరీ చేసిన ఘటన గురువారం జరిగింది. రూ.4 లక్షల విలువైన కెనాన్ ఆర్ 5 కెమెరా, లెన్స్ చోరీకి గురయ్యాయి. చోరీకి గురైన కెమెరా, లెన్స్ రాయచూరు జిల్లాలోని మాన్వికి చెందిన ఫోటోగ్రాఫర్ హుమయూన్కు చెందినవని పోలీసులు తెలిపారు. హుమయూన్ ఏపీ–40 ఏఎం–5041 నంబరుగల కారులో కెమెరా, లెన్స్ పెట్టుకొని ఫోటో షూట్ చేస్తున్నాడు. కారు వద్ద ఎవరూ లేకపోవడంతో అద్దాన్ని పగలగొట్టి కెమెరా, లెన్స్ను అపహరించారు. ఘటనపై మరియమ్మనహళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. -
యువ జంట అనుమానాస్పద మృతి
యశవంతపుర: యువతీ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చిక్కమగళూరు తాలూకా దాసరహళ్లివద్ద వెలుగు చూసింది. మృతులను శివమొగ్గ జిల్లా భద్రావతికి చెందిన మధు, మాగడికి చెందిన పూర్ణిమగా గుర్తించారు. పూర్ణిమ శవం కారులో, మధు మృతదేహం కారుకు కొద్ది దూరంలో చెట్టుకు వేలాడుతూ ఉంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో చిక్కమగళూరు రూరల్ పోలీసులు వెళ్లి పరిశీలించారు. పూర్ణిమ గొంతుపై పిసికి చంపిన ఆనవాళ్లు ఉన్నాయి. కాగా మధు బెంగళూరులో కారు డ్రైవర్గా, పూర్ణిమ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పని చేస్తుంది. మధు నాలుగైదు ఏళ్ల నుంచి పూర్ణిమా ఇంటికి సమీపంలో బాడుగ ఇంటిలో ఉంటున్నాడు. పూర్ణిమా కుటుంబంతో విశ్వాసంగా మెలిగేవాడు. ఎనిమిది నెలల క్రితం పూర్ణిమ సోదరి వివాహంలోనూ మధు అన్నీ తానై వ్యవహరించాడు. పూర్ణిమా శివమొగ్గకు వెళ్లిన సమయంలో మధు ఇంటికి వెళ్లింది. బుధవారం సాయంత్రం స్కూల్ ముగించుకొని ఇంటికి బయల్దేరిన పూర్ణిమాను మధు తన కారులో ఎక్కించుకొని చిక్కమగళూరుకు తీసుకెళ్లాడు. అనంతరం ఏం జరిగిందో ఏమో ఇద్దరూ విగతజీవులుగా మారారు. ఫూర్ణిమ మెడలో ఉన్న బంగారు చైన్ మాయమైనట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. వీరు ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా హత్య చేశారా? మధునే ఆమెను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిక్కమగళూరు జిల్లాలో మృతదేహాలు -
సీఎంకు క్లీన్చిట్.. కృష్ణ ధ్వజం
మైసూరు: ముడా స్థలాల కేసులో సీఎం సిద్దరామయ్య కుటుంబానికి లోకాయుక్త నివేదికలో క్లీన్చిట్ ఇవ్వడాన్ని ఫిర్యాదుదారుడు స్నేహమయి కృష్ణ తప్పుపట్టారు. దీనిని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. సాక్ష్యాధారాలు లేని కారణంగా బి–రిపోర్టు సమర్పించినట్లు, దీన్ని న్యాయస్థానంలో ప్రశ్నించుకోవచ్చని లోకాయుక్త తనకు తెలిపినట్లు కృష్ణ చెప్పారు. దర్యాప్తు ఇంకా పెండింగ్లో ఉండగానే బి రిపోర్టు ఇచ్చేందుకు పోలీసులు ఆసక్తి చూపారన్నారు. వారికి సిగ్గు ఉండాలని, వారు ఆత్మసాక్షిని అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. తాను అనేకానేక సాక్ష్యాలను ఇచ్చినట్లు, కోర్టులో వాటిని చూపించి ప్రశ్నిస్తానని చెప్పారు. ప్రజల ఎదుట నిజాలను నిరూపిస్తానని , సీఎంకు శిక్ష పడేలా చేస్తానన్నారు. -
అన్ని చికిత్సల లక్ష్యం ఒక్కటే
హొసపేటె: అల్లోపతి, ఆయుర్వేదం, హోమియోపతి, సిద్ధ యోగా ఇలా అన్ని వైద్య విధానాలు మానవునికి సేవ చేసి రోగాన్ని దూరం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నాయని తాలూకా వైద్యాధికారి డాక్టర్ సి.బసవరాజు తెలిపారు. నగర శివార్లలోని నవ్యసభాభవన్లో ఆయుష్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా హొసపేటె యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం సీఎంఈ సిరీస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన ఆయుర్వేద చికిత్స ప్రాధాన్యతను వివరించారు. టీఎంఏఈ ఆయుర్వేద మహా విద్యాలయ ప్రిన్సిపాల్ డాక్టర్.మనోన్మణి మాట్లాడుతూ వైద్యులు విద్యార్థులు కావాలని, కొత్త విషయాలను నేర్చుకుని అలవర్చుకోవాలని సూచించారు. శివకుమార్ హనసి లాయర్ ఆయుర్వేద ఫార్మసీ ఔషధాలను పరిచయం చేశారు. సేథ్ బేబీ కిరణ్ లైంగిక ఆరోగ్యంలో మనస్సు పాత్ర గురించి మాట్లాడారు. పిల్లల మానసిక వికాసంపై డాక్టర్ నయన కిరణ్ ఉపన్యాసం ఇచ్చారు. డాక్టర్ విజయకుమార్ జేడీ అధ్యక్షత వహించారు. ఏఎఫ్ఐ అధ్యక్షుడు డాక్టర్ బీవీ భట్, కార్యదర్శి డాక్టర్ చేతన సింధు, జిల్లా కార్యదర్శి డాక్టర్ సికందర్ బాషా, డాక్టర్ ప్రసన్న, డాక్టర్ షబ్బీర్, డాక్టర్ శాంతలా, డాక్టర్ అశ్విని పటవారే తదితరులు పాల్గొన్నారు. -
పార్శ్వగూనికి చికిత్స పొందాలి
హొసపేటె: వెన్నెముక వంకరపోయి స్కోలియోసిస్ లక్షణాలను గుర్తిస్తే, వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స పొందాలని జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ శంకర్నాయక్ తెలిపారు. నగరంలోని జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి కార్యాలయ సభాంగణంలో ఏర్పాటు చేసిన వెన్నుపాము గాయాలపై అవగాహన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరి వెన్నెముక సాధారణంగా వక్రతను కలిగి ఉంటుంది. వెనుక నుంచి చూసినప్పుడు వెన్నెముక నిటారుగా కనిపిస్తుంది. అయితే పార్శ్వగూని ఉన్న పిల్లలు, కౌమార దశలో ఉన్నవారు వెన్నెముక అసాధారణ ఎస్, సీ ఆకారపు వక్రతను కలిగి ఉంటారు. వెన్నెముక వ్యాధుల లక్షణాలు, వారికి అవసరమైన సంరక్షణ, వైద్య సలహాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ శిబిరం లక్ష్యం అన్నారు. బెంగళూరులోని భగవాన్ మహావీర్ జైన్ ఆస్పత్రి సహకారంతో, విజయనగర జిల్లాలో వ్యాధులతో బాధపడుతున్న రోగులు ఉచిత చికిత్స పొంది మంచి భవిష్యత్తును పొందాలన్నారు. చికిత్సను ఎటువంటి సమస్యలు లేకుండా విజయవంతంగా నిర్వహిస్తారన్నారు. చాలా మంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నందున ఈ సంస్థ సామాజిక సేవల ద్వారా ఉచిత చికిత్స పొందవచ్చన్నారు. జిల్లా ఆర్సీహెచ్ అధికారి డాక్టర్ జంబయ్య మాట్లాడుతూ జాతీయ బాలల ఆరోగ్య కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 450 మంది పిల్లలకు ఉచిత శస్త్రచికిత్సను విజయవంతంగా అందించామన్నారు. మహావీర్ జైన్ ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
నవలి రిజర్వాయర్ ఏర్పాటుకు చర్యలు
రాయచూరు రూరల్: తుంగభద్ర డ్యాంలో పూడిక అధికంగా పేరుకు పోవడంతో నవలి వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు వెల్లడించారు. బుధవారం నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విషయంపై మార్చిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మూడు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో చర్చించామన్నారు. రిజర్వాయర్ నిర్మాణానికి రూ.15 వేల కోట్లు, భూ స్వాధీనం కోసం రూ.9 వేల కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రంలో భూ గర్భ జలాల పెంపుదలకు ప్రాముఖ్యత ఇచ్చామన్నారు. రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖలో పెండింగ్లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులను చెల్లించామన్నారు. బడ్జెట్లో రూ.13 వేల కోట్ల నిధులు కేటాయించాలని సీఎంను కోరామన్నారు. రాంపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద అదనంగా 10 ఎకరాలు, చిక్కసూగూరు వద్ద 50 ఎకరాల స్థలంలో నూతనంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి సర్వే చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. కృష్ణ, తుంగభద్ర కాలువల నుంచి లింక్ చేసి నీటిని నింపి ప్రజలకు నీటి ఎద్దడి నెలకొనకుండా చూడాలన్నారు. సమావేశంలో నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, సభ్యులు జయన్న, రమేష్, నేతలు శాలం, నరసింహులు, బసవరాజ్, రుద్రప్ప, శాంతప్ప, శివమూర్తి, నిర్మల పాల్గొన్నారు. మార్చిలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రాజెక్టుకు రూ.15 వేల కోట్లు, భూస్వాధీనానికి రూ.9 వేల కోట్లు రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు వెల్లడి -
ముగ్గురు ప్రొఫెసర్లకు డాక్టరేట్
బళ్లారిఅర్బన్: రావ్ బహద్దూర్ వై.మహాబలేశ్వరప్ప ఇంజినీరింగ్ కాలేజీ(ఆర్వైఎంఈసీ)కి చెందిన ముగ్గురు ప్రొఫెసర్లకు బెళగావిలోని విశ్వేశ్వరయ్య సాంకేతిక విశ్వవిద్యాలయం(వీటీయూ) పీహెచ్డీ పట్టాలను ప్రకటించింది. డాక్టర్ ప్రదీప్ బీ.జ్యోతి మార్గదర్శకత్వంలో ఆ కళాశాల ఈఈ లెక్చరర్ డాక్టర్ లింగనగౌడ సమర్పించిన ప్రత్యేక వ్యాసానికి పట్టా దక్కింది. కలబుర్గి పీడీఏసీఈ ప్రొఫెసర్ డాక్టర్ కల్పన వంజఖేడ్ మార్గదర్శకత్వంలో సదరు కళాశాల ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ లెక్చరర్ డాక్టర్ రాఖీపాటిల్ ప్రతిపాదించిన ప్రత్యేక వ్యాసానికి పీహెచ్డీ లభించింది. పీడీఐటీ ప్రిన్సిపాల్ డాక్టర్ యూఎం రోహిత్ మార్గదర్శకత్వంలో బళ్లారి ఆర్వైఎంఈసీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో డాక్టర్ ప్రశాంత్ కేణి ప్రతిపాదించిన ప్రత్యేక వ్యాసానికి పీహెచ్డీ లభించిందని ఆ కళాశాల అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బాలికపై లైంగిక దాడి నిందితుని అరెస్ట్ హుబ్లీ: మైనర్ బాలికపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన కేసులో 49 ఏళ్ల వయస్సుగల వ్యక్తిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టినట్లు హుబ్లీ ధార్వాడ పోలీస్ కమిషనర్ ఎన్.శశికుమార్ తెలిపారు. కేశ్వాపుర పోలీస్ స్టేషన్లో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 18న బాధిత మహిళ హుబ్లీ కేశ్వాపుర పోలీస్ స్టేషన్కు వచ్చి 2023లో తాను మైనర్గా ఉన్నప్పుడు స్థానిక నివాసి తన తల్లిదండ్రుల ప్రాణాలు తీస్తానని బెదిరించి తనను ఇంటికి తీసుకెళ్లి ఒత్తిడి చేసి లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుడు మరికొందరిని కూడా మోసం చేశాడని ఆరోపణలు వచ్చాయని, ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు చేపడతామన్నారు. ఇతడి వల్ల ఎవరైనా మోసపోయి ఉంటే తమకు దగ్గరలోని పోలీసు స్టేషన్కు తెలియజేయాలని ఆయన కోరారు. ఆస్పత్రి పైనుంచి దూకి రోగి ఆత్మహత్య హుబ్లీ: కలబుర్గి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరిన క్షయ రోగి బుధవారం సదరు ఆస్పత్రి రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని స్థానిక జంజం కాలనీ డెక్కన్ కళాశాల సమీప నివాసి సయ్యద్ అజరుద్దీన్ (33)గా గుర్తించారు. కొన్ని రోజుల క్రితం అతడిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. అనారోగ్యంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. కాగా ఆస్పత్రి వైద్యులు, పాలన యంత్రాంగం నిర్లక్ష్యమే ఆత్మహత్యకు కారణం అని మృతుడి భార్య బ్రహ్మపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తి పన్ను చెల్లించి బీ.ఖాతా పొందండి బళ్లారిటౌన్: జిల్లాలోని నగర, స్థానిక సంస్థల వ్యాప్తిలోని ప్రజలు తమ ఆస్తులకు పన్నులు చెల్లించి బీ ఖాతా పొందాలని జిల్లాధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా సూచించారు. ఆ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేస్తూ ప్రభుత్వం, ప్రభుత్వేతర శాఖల మండళ్ల స్థలాలు మినహా అనధికారిక లేఅవుట్లు, ఆర్ఎస్ ప్లాట్లలో తమ సొంత ఆస్తుల స్థలాల్లో అనధికారికంగా నిర్మించుకున్న కట్టడాలు 2024 సెప్టెంబర్ 10లోగా ఖరీదు చేసి రిజిస్టర్ చేసుకున్న ఆస్తులు మహానగర పాలికె, నగరసభ, పురసభ, పట్టణ పంచాయతీల్లో బీ ఖాతా పొందవచ్చన్నారు. ఒక్కసారి మాత్రం మే 10 లోగా అర్జీలు సమర్పించి 2024–25వ సంవత్సరంలో ఆస్తి పన్నును రెండింతలు జరిమానాతో చెల్లించితే పాలికెలో నమూన 2ఏ, ఇతర నగర స్థానిక సంస్థల పరిధిలో నమూన 3ఏ పొందే అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని, మరిన్ని వివరాలకు పాలికె సహాయ వాణి కేంద్రాలను సంప్రదించాలని సూచించారు. వికసిత భారత్ అందరి బాధ్యత కావాలి బళ్లారిఅర్బన్: మనకు దొరికిన పౌరసత్వాన్ని బాధ్యతగా నిర్వహించాలని బెళగావి రాణి చెన్నమ్మ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సీఎం త్యాగరాజ్ తెలిపారు. బుధవారం విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని డాక్టర్ అంబేడ్కర్ సభాభవనంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రిసెర్చ్ సౌత్ రీజినల్ సెంటర్ హైదరాబాద్, వీఎస్కేయూ రాజనీతి శాస్త్ర అధ్యయన విభాగం ఆధ్వర్యంలో వికసిత భారత్– 2047 భారత్లో రాజ్యాంగం, శాసకాంగం, న్యాయాంగంలో సంస్కరణల గురించి రెండు రోజుల జాతీయ సమ్మేళనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వికసిత భారత్ అభివృద్ధి కల అందరి బాధ్యత కావాలన్నారు. పలువురు రాజకీయ మేధావులు సమాజాన్ని అభివృద్ధి వైపునకు నడిపించేందుకు ఎంతో కృషి చేశారన్నారు. మన హక్కులు బాధ్యతల గురించి ప్రశ్నించే మనసత్వం బలపడాలన్నారు. ఏపీలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్రం ప్రాధ్యాపకులు రామరెడ్డి, వీఎస్కేయూ రిజిస్ట్రార్ రుద్రేష్, వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మునిరాజు, ప్రముఖులు డాక్టర్ గౌరి మానిక మానస, సమ్మేళనం నిర్వాహకులు డాక్టర్ విజయ్కుమార్, డాక్టర్ మోహన్ దాస్తో పాటు అన్ని విభాగాల ముఖ్యస్తులు, బోధన, బోధనేతర సిబ్బంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 150 మంది పరిశోధన విద్యార్థులు పాల్గొన్నారు. -
నన్ను టార్గెట్ చేశారు: కుమార
రామనగర జిల్లా బిడది హొబళి కేతగానహళ్ళిలో తమకు చెందిన భూమిని నేను 40 సంవత్సరాల క్రితమే కొనుగోలు చేశాము. గతంలోనే అనేకసార్లు సర్వే, తనిఖీ అన్ని కూడా జరిగాయి. మళ్లీ మంగళవారం నుంచి సర్వే కార్యాన్ని చేపట్టారు. విచారణకు సిద్ధం, ఎలాంటి అక్రమాలు జరగలేదని కేంద్ర మంత్రి హెచ్.డీ.కుమారస్వామి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తనను టార్గెట్ చేసి సర్వే చేయిస్తోంది. సీఎం సిద్దరామయ్య మాదిరిగా నేను ప్రభుత్వ భూమిని దోచుకోలేదని ధ్వజమెత్తారు. 40 సంవత్సరాలు లేని ఫిర్యాదిదారులు నేడు ఎలా ఉద్భవించారన్నారు. సర్వేకు ఇబ్బంది లేదని కలెక్టర్కు చెప్పాను. 1987లో మాజీ ఎమ్మెల్యే సీఎం లింగప్ప, రామచంద్రప్ప అనే వ్యక్తులు అప్పటి ముఖ్యమంత్రి, ప్రధాని, హోం మంత్రికి ఫిర్యాదు చేశారు, అన్నీ చట్ట ప్రకారం కొన్నామని తెలిపాము, అన్ని ఆధారాలు నా వద్ద ఉన్నాయని అన్నారు. ఐఏఎస్లతో సిద్దరామయ్య సిట్ను ఏర్పాటు చేశారన్నారు. భూమి, జలం, భాష కోసం సిద్దరామయ్య ఏనాడూ పోరాడలేదు, డీ.కే.శివకుమార్ సేవలు రాష్ట్రానికి ఏమున్నాయి? ధనం కొల్లగొట్టడమే ఆయన సేవలు అని ఎద్దేవా చేశారు. -
ఫోర్జరీ సంతకాలు, నకిలీ ఉద్యోగాలు
మండ్య: సులభంగా సర్కారీ ఉద్యోగం వస్తుందనుకుంటే ఎంత డబ్బయినా చెల్లించడానికి కొందరు సరే అంటారు. దానినే కొందరు పెట్టుబడిగా మార్చుకుంటారు. సీఎం సిద్ధరామయ్యతో పాటు ప్రభుత్వ అధికారులు సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ఉద్యోగ ఉత్తర్వులు ఇస్తున్న వంచకునిపై మండ్య తూర్పు పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. మండ్య తావరకెరె నివాసి హెచ్సీ వెంకటేశ్ ఘరానా మోసగాడు, బెంగళూరు విధానసౌధలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి పలువురు వద్ద నుంచి సుమారు రూ. 31 లక్షలను దోచుకున్నాడు. విద్యా శాఖ సబ్డైరెక్టర్గా పని ఇప్పిస్తానని ఒకరి వద్ద నుంచి రూ. 12.24 లక్షలను, వాణిజ్య శాఖలో ఉద్యోగమని రూ. 19 లక్షలను స్వాహా చేశాడు. ఇట్టే మోసాలు నేత్రావతికి అనే మహిళ కుమారునికి విద్యా శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.15 లక్షలు ఖర్చవుతుందని చెప్పాడు. ఆమె రూ. 9,24,000 ను ఖాతాకు బదిలీ చేసింది. మరో రూ. 3 లక్షలను ఇప్పించుకున్నాడు. ఆ తర్వాత విద్యా శాఖ సబ్ డైరెక్టర్ ఉద్యోగమని సీఎంతో సహా ఉన్నతాధికారుల ఫోర్జరీ సంతకాలు చేసి ఉత్తుత్తి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశాడు. ఇలా మల్లేశ్ అనే వ్యక్తి నుంచి వాణిజ్య శాఖలో అకౌంటెంట్ ఉద్యోగమని దశల వారీగా రూ. 19 లక్షలను వసూలు చేశాడు. నియామక ఉత్తర్వులు తీసుకుని ఆశగా వెళ్లిన బాధితులను అధికారులు మందలించి పంపారు. దీంతో మోసపోయామంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్షలాది రూపాయల వసూళ్లు మండ్యలో ఘరానా మోసగాడు -
ధవారం రాజకీయాల్లో రెండు ముఖ్య పరిణామాలు జరిగాయి. మైసూరు ప్లాట్ల కేసులో సీఎం సిద్దరామయ్య కుటుంబానికి లోకాయుక్త క్లీన్చిట్ ఇచ్చింది. ఇక హెచ్డీ కుమారస్వామి పరివారానికి చెందిన వందకు పైగా ఎకరాలలో ప్రభుత్వ భూ సర్వే చేపట్టింది. కబ్జా ఆరోపణలే దీనికి కారణం.
భూములు సర్వే చేస్తున్న రెవెన్యూ సిబ్బందిదొడ్డబళ్లాపురం/ శివాజీనగర: కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి, ఆయన బావ, బెంగళూరు రూరల్ బీజేపీ ఎంపీ డా.మంజునాథ్, సమీప బంధువు డీసీ తమ్మణ్ణలకు చెందిన భూములపై సిద్దరామయ్య సర్కారు దృష్టి సారించింది. ఇప్పుడు ఇది తాజా వివాదమైంది. రామనగర వద్ద బిడది సమీపంలో కేతగానహళ్లిలోని కుమారస్వామి, బంధువులకు చెందిన భూములను రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. సర్కారీ భూములను కబ్జా చేశారని ఆరోపణలు రావడంతో, హైకోర్టు ఆదేశాల మేరకే సర్వే చేసినట్టు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో వివిధ శాఖల నుంచి అత్యాధునిక సర్వే పరికరాలతో వచ్చిన అధికారులు మంగళవారం నుంచి సర్వే చేపట్టారు. నివేదికను ప్రభుత్వం రూపొందించిన సిట్ బృందానికి అందజేస్తామని తెలిపారు. ఏమిటీ వ్యవహారం ఇక్కడ సుమారు 110 ఎకరాల పొలాలు కుమారస్వామి, సోదరి, బావ తదితరుల పేర్లతో ఉన్నాయి. ఇందులో 14 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఒకరు సర్కారుకు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టులో కేసు వేశారు. దీంతో సర్కారు సర్వేకు శ్రీకారం చుట్టింది. 40 మంది రెవెన్యూ సిబ్బంది సర్వేలో నిమగ్నమయ్యారు. అవాస్తవం: ఎంపీ భూ కబ్జా ఆరోపణలు, సర్వే వ్యవహారంపై ఎంపీ డా.మంజునాథ్ మండిపడ్డారు. ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. 1996లో తన తండ్రి కేతిగానహళ్లిలో ఖరీదు చేసిన 3.25 ఎకరాల భూమి వారసత్వంగా వచ్చిందన్నారు. ఎన్నికల అఫిడవిట్లో ఈ వివరాలను నమోదు చేశానన్నారు. ఎంపీ అయ్యాక ఒక్క ఎకరా కూడా కొనలేదన్నారు. బు కేంద్ర మంత్రిపై సిద్దు సర్కారు దృష్టి రామనగర వద్ద 110 ఎకరాలలో సర్వే ప్రక్రియ 14 ఎకరాల భూ కబ్జా ఆరోపణలు మండిపడిన కుమార వర్గం -
తుంగభద్రా నదిలో వైద్యురాలి గల్లంతు
సాక్షి,బళ్లారి/హొసపేటె: సరదాగా వీకెండ్ ట్రిప్ కోసం హైదరాబాద్ నుంచి స్నేహితులతో కలిసి వచ్చిన వైద్యురాలు ఈత వచ్చినా తుంగభద్ర నదిలో కొట్టుకుపోయింది. బుధవారం కొప్పళ జిల్లా సణాపురం సమీపంలోని తుంగభద్ర నది పక్కన ఎత్తుగా ఉన్న కొండలు, కింద తుంగభద్ర నది పారే గలగల చప్పుళ్లు సందర్శకులను ఎంతో ఆకట్టుకుంటుంది. వీకెండ్ ట్రిప్ కోసం స్నేహితులతో కలిసి వచ్చిన హైదరాబాద్కు చెందిన వైద్యురాలు అనన్య రావు (27), స్నేహితులు సాత్విక్, హర్షితలతో కలిసి హంపీ టూర్కి వచ్చింది. ఆమె హైదరాబాద్లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తోంది. ముందుగా ఒకసారి కొండ మీద నుంచి తుంగభద్ర నదిలోకి సరదాగా దూకి ఈత కొడుతూ అవతలి గట్టుకు చేరుకుంది. ఒక స్నేహితుడు, స్నేహితురాలు ఇద్దరు నది ఇటు వైపు నుంచి ఆమె దూకడం, ఈత కొట్టడం వంటి దృశ్యాలను సెల్ఫోన్లో వీడియో కూడా తీశారు. ఒకసారి సరదాగా బయటకు రావడంతో మరోసారి కూడా దూకి వస్తానని చెప్పిందో, లేక స్నేహితులే చెప్పారో తెలియదు కాని సదరు వైద్యురాలు అనన్య కొండ మీద నుంచి మళ్లీ దూకింది. క్షణాల్లో కొట్టుకుపోయింది.. అప్పటికే అలసిపోయిన డాక్టర్ అనన్య అవతలి గట్టుకు చేరుకునేందుకు ఈత కొడుతుండగా, క్షణాల్లో కొంత నీటి ప్రవాహం పెరగడంతో ఈత కొట్టలేక ప్రవాహంలో ముందుకు కొట్టుకుపోయింది. పక్కనే స్నేహితులు చూస్తుండగానే రాళ్ల మధ్యలో నీటి ప్రవాహంలోకి కొట్టుకుపోయి కనిపించకుండా పోయింది. దీంతో స్నేహితులు పోలీసులకు, బంధువులకు సమాచారం తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, గజ ఈతగాళ్లు రంగంలోకి దికి నీటిలో కొట్టుకుపోయిన వైద్యురాలి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్థానికులు, అధికారులు, అగ్నిమాపక సిబ్బంది కృషి చేసినా వైద్యురాలి ఆచూకీ దొరకకపోవడంతో మరింత సాంకేతికత, ఈతగాళ్ల సాయంతో శవాన్ని వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనపై కొప్పళ జిల్లా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈత కొట్టాలని బండరాయిపై నుంచి దూకి మిస్సింగ్ వీకెండ్ హంపీ టూర్లో విషాద ఘటన స్వస్థలం హైదరాబాద్ -
అక్రమ స్థలాల క్రమబద్ధీకరణకు బీ.ఖాతా
సాక్షి,బళ్లారి: నగరంలోని ఆర్ఎస్ ఇళ్ల స్థలాలు, ఆ స్థలాల్లో ఇళ్లు ఉన్నవారికి శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త చట్టం తీసుకురావడంతో అక్రమ లేఅవుట్లలో స్థలాలు పొందిన వారు, ఇళ్లు నిర్మించుకున్న వారి ఇబ్బందులు ఇక తొలగినట్లే. ఆయా యజమానులు సరైన నమూనాలో దరఖాస్తులు అందజేస్తే వారం లోపు వారి ఇంటి ముంగిటకే బీ.ఖాతాను అందజేస్తారని, దీంతో సదరు స్థలాల్లో ఉన్న వారికి సర్వహక్కులు వస్తాయని, తిరిగి రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకోవచ్చని నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి సూచించారు. ఆయన బుధవారం నగరంలోని సిటీ కార్పొరేషన్ కార్యాలయంలో బీ.ఖాతాకు సంబంధించిన విధి విధానాలను తెలియజేశారు. 2024 సెప్టెంబర్ 10వ తేదీకి ముందు రిజిస్టేషన్లు చేయించుకున్న ఇంటి స్థలాలకు ఈ విధానాలు వర్తిస్తాయని తెలిపారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వారికి బీ.ఖాతా పొందేందుకు అర్హత ఉండదన్నారు. మూడు నెలల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చు పాలికె పరిధిలో అనధికారికంగా 11,423 ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నారని, 5201 వ్యాపార కేంద్రాలు, 265 పరిశ్రమలు కూడా ఉన్నాయన్నారు. 18,679 ఖాళీ ఇంటి స్థలాలు ఉన్నాయని, మొత్తం 35,568 ఇళ్లస్థలాలు, ఇళ్ల యజమానులు బీ.ఖాతా పొందేందుకు అర్హులు అని సూచించారు. వీరందరూ మూడు నెలల్లోపు సిటీ కార్పొరేషన్ పరిఽధిలో తాము కేటాయించిన వాలంటీర్లతో పాటు కార్పొరేటర్ల ద్వారా బీ.ఖాతా ఎలా తీసుకోవాలో తెలుసుకోవాలన్నారు. దళారులను ఎట్టి పరిస్థితుల్లోను నమ్మకూడదన్నారు. పారదర్శకంగా పేదలకు మేలు చేసేందుకు సీఎం సిద్దరామయ్య ఎంతో మంచి ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత వారంలోపు ఇంటి వద్దకే బీ.ఖాతా వస్తుందన్నారు. బీ.ఖాతా రావడంతో ఇంటి స్థలాలు రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. దీంతో ఆయా ఇంటి స్థలాల యజమానులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ఈసందర్భంగా మేయర్ నందీష్, కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ ఇళ్ల స్థలాలు, ఇళ్లలోని వారికి శుభవార్త కార్పొరేటర్లు, వాలంటీర్ల ద్వారా అప్లై చేసుకోవచ్చు వారం రోజుల్లోపు ఇంటి ముంగిటకే బీ.ఖాతా: ఎమ్మెల్యే భరత్రెడ్డి -
హైకమాండ్ చూస్తోంది: విజయేంద్ర
శివాజీనగర: బీజేపీ రాష్ట్రాధ్యక్షుని ఎంపిక, పునర్ నియామకంపై ఎలాంటి అనుమానం లేదని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర తెలిపారు. బుధవారం మల్లేశ్వరం బీజేపీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల ఎంపిక కావాల్సి ఉంది. త్వరలోనే హైకమాండ్కు జిల్లాధ్యక్షుల జాబితా వెళ్తుంది, పార్టీలోని అంతర్గత సమస్యలను నాయకత్వం దృష్టికి వెళ్లాయి, అవసరమైనవారికి నోటీసులు ఇచ్చారు అని తెలిపారు. కేంద్ర నాయకులు ఈ సమస్యలను పరిష్కరిస్తారన్నారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడానికి అందరితో కలసి వెళ్లేందుకు తాను సిద్ధమన్నారు. బసనగౌడ పాటిల్ యత్నాళ్ వర్గాన్ని రెబెల్ అనరాదు అని కోరారు. -
వడ్డీ వ్యాపారి ఇంట్లో రూ.26 లక్షలు స్వాధీనం
● నగదు జప్తుతో బాధితుని ఆత్మహత్యాయత్నం సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో ఇటీవల మైక్రో ఫైనాన్స్, వడ్డీ వ్యాపారుల వల్ల పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో తనిఖీలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా బుధవారం గదగ్లో సంగమేష్ దొడ్డణ్ణ అనే వ్యక్తి ఇంట్లో పోలీసులు అనుమానం వచ్చి తనిఖీ చేయగా రూ.26 లక్షల నగదు లభించింది. వడ్డీవ్యాపారి ఇంట్లో పోలీసుల తనిఖీలో డబ్బులు పట్టుబడటంతో హైడ్రామా చోటు చేసుకుంది. సదరు వడ్డీ వ్యాపారి తన ఆరోగ్యం కోసం ఆస్పత్రి ఖర్చుల కోసం డబ్బులు తెచ్చుకున్నానని, తనకున్న కాలేయ సమస్యకు రూ.20లక్షలకు పైగా ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో డబ్బులు తీసుకుని వస్తే పోలీసులు పట్టుకుని స్వాధీనం చేసుకోవడంతో తన పరిస్థితి ఏమిటని ఆవేదన చెంది సంగమేష్ ఆత్మహత్యాయత్నం చేయడంతో స్థానికులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించి చికత్స చేయించగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన గదగ్ పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. అక్కడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పీఎంఏవై నిధులు మంజూరు చేయండి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో మురికి వాడల ప్రాంతాల్లో నివాసమున్న వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) పథకంలో మంజూరైన ఇళ్లకు నిధులు మంజూరు చేయాలని అఖిల కర్ణాటక భువనేశ్వరి సేన సమితి అధ్యక్షుడు తమేష్ పేర్కొన్నారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగరంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు పెండింగ్లో ఉన్నాయని ఆరోపించారు. రూ.6 లక్షల్లో కేవలం స్లంబోర్డు అధికారులు రూ.3 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. సగానికే నిర్మాణాలు చేపట్టి మిగిలిన భాగాన్ని పూర్తి చేయాలంటే ప్రభుత్వం నిధులు విడుదల చేయాలన్నారు. -
పెట్టుబడిదారుల సమావేశం విజయవంతం
హుబ్లీ: ప్రగతి పథంలో రాష్ట్రాన్ని నడిపే సదుద్దేశంతో బెంగళూరులో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశం ఇన్వెస్ట్ కర్ణాటక– 2025 పూర్తిగా విజయవంతం అయిందని రాష్ట్ర భారీ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ తెలిపారు. బుధవారం ఆయన విజయపురలో మీడియాతో మాట్లాడారు. ఉత్తర కర్ణాటకలో ముఖ్యంగా పెట్టుబడులు పెట్టడానికి పలువురు పారిశ్రామిక వేత్తలు ముందుకొచ్చారన్నారు. తొలిసారిగా ప్రపంచ దేశాల్లోని 60 మందికి పైగా నిపుణులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారన్నారు. ఈ సమావేశంలో రూ.10.27 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయన్నారు. దీని వల్ల 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయన్నారు. అందులో 75 శాతం బెంగళూరు మినహాయిస్తే, 45 శాతం ఉత్తర కర్ణాటకలోనే పెట్టుబడులు పెడతారన్నారు. కళ్యాణ కర్ణాటక, ముంబై కర్ణాటక పాలిట ఇది ఓ వరం అన్నారు. ప్రపంచంలో మార్పులు జరుగుతున్నాయి. కృత్రిమ మేధ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. మనుషులు చేసే పనిని రోబోట్ లాక్కొందన్నారు. విప్లవాత్మక మార్పులకు అవకాశం గ్రీన్ హైడ్రోజెన్, విండ్ పవర్, సోలార్, అలాగే అణు స్థావరాల ఏర్పాటు ఇలాంటి విప్లమాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బెంగళూరు అర్బన్కు మినహాయింపులు లేవు. బెంగళూరు రూరల్కు ఇన్సెంటివ్ ఇస్తామన్నారు. మిగిలిన జోన్ల వారీగా ఇన్సెంటివ్ ఇప్పటికే ఉందన్నారు. ఇది కాక నంజుండప్ప నివేదిక ప్రకారం వెనుకబడిన తాలూకా ఉంటే 3 శాతం, అత్యంత వెనుకబడిన తాలూకాకు 5 శాతం ఇన్సెంటివ్ ఇవ్వడానికి చర్యలు తీసుకున్నామన్నారు. తొలిసారిగా 19 దేశాలు పాలు పంచుకున్నాయన్నారు. ఈ క్రమంలో విజయపురకు రూ.42 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. 65 శాతం అనగా రూ.34 వేల కోట్ల మేర విజయపురలో పెట్టుబడులు పెడతారన్నారు. 1, 2 ఏళ్లల్లో ఈ ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. లక్ష కోట్ల కనీస పెట్టుబడులు జిల్లాలకు తీసుకురావాలన్నదే తన లక్ష్యం అన్నారు. 15 వేల మందికి ఉద్యోగ కల్పన తన విజయపుర జిల్లాకు చేశానని తనకు నమ్మకం ఉందన్నారు. రూ.42 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం భారీ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ -
నిధులు కేటాయించరూ..
రాయచూరు రూరల్: వ్యవసాయ కూలీలకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని కర్ణాటక ప్రాంత రైతు కూలీ కార్మికుల సంఘం డిమాండ్ చేసింది. బుధవారం దేవదుర్గ తాలూకా శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్ వద్ద ఆందోళన చేపట్టిన జిల్లాధ్యక్షుడు లింగణ్ణ మాట్లాడారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మాదిరిగా వ్యవసాయ కూలీ కార్మికులకు జీవిత భద్రత, ఇళ్ల నిర్మాణాలు, కూలీలకు పర్మినెంట్ పనులు, వ్యవసాయ భూమిని కేటాయించాలన్నారు. ఆహార భద్రత, ఉచిత ఆరోగ్యం, పెన్షన్, పిల్లలకు విద్యారంగ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. 24, 25 తేదీల్లో సదస్సు హుబ్లీ: ధార్వాడలోని డిమ్హాండ్స్, స్టార్టప్ కర్ణాటక, కిడ్స్ సంస్థ, ఐటీ బీటీ విభాగాలు, విజ్ఞాన సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 24, 25 తేదీల్లో సదస్సు ఏర్పాటు చేశారు. డిగ్రీ, పీజీ, పీహెచ్డీ విద్యార్థులు, యువ పారిశ్రామికవేత్తలకు ఈ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో లభ్యత ఉన్న పరిశోధన పథకాలకు ఉన్న ఆర్థిక లభ్యత తదితర అవసరాలు, మార్పులు చేర్పుల గురించి తెలియజేయడమే సదస్సు ప్రధాన ఉద్దేశం. బెంగళూరు కిడ్స్ మేనేజర్ అర్చన సదస్సును ప్రారంభిస్తారు. డిమ్హాండ్స్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ అరుణ్ కుమార్, ఐఐఐటీ ధార్వాడ సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ మహాదేవ ప్రసన్న, డాక్టర్ రాఘవేంద్ర నాయక్తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 150 మంది విద్యార్థులు, బోధన సిబ్బంది పాల్గొంటారు. పేర్ల నమోదు ఉచితం అని, మరిన్ని వివరాలకు 7069084098లకు సంప్రదించాలని నిర్వాహకులు ఓ ప్రకటనలో కోరారు. నిందితుల అరెస్ట్కు వినతి రాయచూరు రూరల్: అనుమానాస్పద రీతిలో ఇద్దరు ఆడపిల్లలపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసి చెరువులో పడేసిన నిందితులను అరెస్ట్ చేయాలని బేడ జంగమ సమాజం డిమాండ్ చేసింది. బుధవారం యాదగిరి జిల్లాధికారి కార్యాలయం వద్ద బేడ జంగమ సమాజం అధ్యక్షుడు మహంతేష్ మాట్లాడారు. యాదగిరి జిల్లా గురుమఠకల్ తాలూకా సైదాపుర నీలహళ్లి చెరువులో అనుమానాస్పదంగా జరిగిన హత్యల్లో ప్రధాన నిందితులపై కేసు నమోదు చేసి సీఐడీకి అప్పగించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. విద్యార్థులతో మురుగు తొలగింపు రాయచూరు రూరల్: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో మురుగు కాలువలను శుభ్రం చేయించిన ఉదంతం వెలుగు చూసింది. యాదగరి జిల్లా వడగేర తాలూకా బి.కదంగేరలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శరణప్ప పాఠశాల విద్యార్థుల నుంచి పాఠశాల ముందున్న మురుగు కాలువల్లో అధికంగా పూడిక పేరుకుంది. మురుగునీరు ముందుకు ప్రవహించకుండా నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతుండడంతో విద్యార్థులు శ్రమదానంతో శుభ్రం చేశారు. దీనిని గమనించిన గ్రామస్తులు ఆందోళన చేపట్టి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శరణప్పను సస్పెండ్ చేయాలని ఒత్తిడి చేశారు. ఛత్రపతి శివాజీ జయంతి రాయచూరు రూరల్: నగరంలో ఛత్రపతి శివాజీ జయంతిని ఆచరించారు. బుధవారం అంబా భవాని ఆలయం వద్ద ఏర్పాటు చేసిన శివాజీ జయంతిని పురస్కరించుకుని చిత్రపటానికి చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు పుష్పాంజలి ఘటించారు. మంత్రి మాట్లాడుతూ శివాజీ మహారాజ్ మార్గదర్శనంలో నడవాలన్నారు. సమాజాభివృద్ధికి విద్య ప్రధానమన్నారు. నగర శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, అమిత్ జగతాప్, రవీంద్ర, శివకుమార్, శాంతప్ప, రమేష్లున్నారు. నకిలీల బెడద అరికట్టండి రాయచూరు రూరల్: రాష్ట్రంలో నకిలీ ప్రమాణ పత్రాల నియంత్రణకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయాలని హైదరాబాద్ కర్ణాటక వాల్మీకి నాయక్ సంఘం కలబుర్గి విభాగపు ప్రధాన కార్యదర్శి రఘువీర్ నాయక్ డిమాండ్ చేశారు. బుధవారం పాత్రికేయుల భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారే కాకుండా ఇతర కులాల వారు కూడా ఎస్టీ జాబితాల నుంచి నకిలీ కుల ప్రమాణ పత్రాలను పొందుతున్నారన్నారు. దీనిపై విచారణకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి లోపదోషాలను సవరించాలని ఆయన ఒత్తిడి చేశారు. -
వేసవి రాకున్నా.. నీరు లేదన్నా
బనశంకరి: రాష్ట్రంలో ఎండాకాలం రావడానికి ముందే నీటి కొరత వచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలుప్రాంతాల్లో ప్రజలు జలం కోసం ఇబ్బందులు పడుతున్నారు. బయలుసీమ తుమకూరు, చిత్రదుర్గ, కోలారు, చిక్కబళ్లాపుర జిల్లాలో పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తగా, ఉత్తరకర్ణాటక ప్రాంతంలోని విజయపుర, బాగల్కోటే, బెళగావి, కలబురిగి, యాదగిరి జిల్లాల్లో మంచినీటితో పాటు వాడుకోవడానికి బోరు నీరు కూడా కరువైంది. భూగర్భ జలాలు అంతే అనేక జలాశయాల్లో నీరు తగ్గిపోయింది. రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటినట్లు సమాచారం. పల్లెల్లో బోర్లలో నీరు తగ్గిపోగా, కొన్ని చోట్లయితే ఎండిపోయాయి. జాతీయ జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ కొళాయి కనెక్షన్ కల్పించారు. కానీ జల వనరులే లేక ఆ కొళాయిల్లో నీళ్లు రావడం లేదు. ఉత్తర కర్ణాటకలో కొన్ని గ్రామాల్లో ఐదారు కిలోమీటర్ల దూరం వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. పశుపక్ష్యాదులు కూడా దాహంతో అల్లాడుతున్నాయి. కార్యాచరణ శూన్యం గత వేసవిలో 1700 కు పైగా గ్రామాల్లో తాగునీటి ఇబ్బంది రాగా, రాష్ట్ర ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసింది. కొన్ని చోట్ల బోర్లకు మరమ్మతులు, కొత్త బోర్లు వేసి అత్యవసర చర్యలు చేపట్టింది. ఈసారి రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళం తలెత్తడంతో చాలామంది మంత్రులు అందులో నిమగ్నమయ్యారు. గ్యారంటీ పథకాల కారణంగా నిధుల కొరత ఏర్పడి సర్కారు దానిపై దృష్టిపెట్టింది. నీటి ఎద్దడి నివారణకు జిల్లా యంత్రాగంలో నిధులు ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంకా వేసవి ప్రారంభం కాకపోవడంతో వ్యక్తిగత అకౌంట్లో ఉన్న నిధులను కలెక్టర్లు వాడుకోలేరని చెబుతున్నారు. గత అనుభవాలను చూసైనా దాహం కేకలు తీవ్రతరం కాకుండా జాగ్రత్త వహించాలి. త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో నీటి కొరత చర్చనీయాంశం కావచ్చు. అప్పుడే పలు జిల్లాల్లో జల సంక్షోభం -
భవనం కట్టాలంటే లంచం ఇవ్వాలి
● కర్ణాటకలో పాలన అస్తవ్యస్తం ● కేంద్ర మంత్రి శోభ నిప్పులు శివాజీనగర: బెంగళూరులో ఒక భవనం నిర్మించాలంటే ఒక్కో అడుగుకు రూ.100 లంచం ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త ట్యాక్స్ వ్యవస్థ నడుస్తోంది అని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగటం లేదు. శాంతిభద్రతలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. పశువుని పొడిచిన వ్యక్తిని మానసిక అస్వస్థుడని అంటున్నారు. పోలీస్ స్టేషన్పై దాడులు చేస్తున్నారు. ఆస్పత్రుల్లో బాలింతలు చనిపోతున్నారు. అన్నింటినీ కేంద్ర ప్రభుత్వమే చేస్తే సిద్దరామయ్య అధికారంలో ఎందుకు ఉండాలని ఆమె ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తొమ్మిది విశ్వవిద్యాలయాలను మూసేస్తున్నారు, పాత విశ్వవిద్యాలయాలకు నిధులు ఇవ్వలేదు, ఇలాగైతే విద్యార్థుల గతేమిటని ఆమె ప్రశ్నించారు. సీఎం సిద్దరామయ్య సిఫార్సు వల్లే బెంగళూరులో నమ్మ మెట్రో టికెట్ చార్జీలు పెరిగాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి వల్ల కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. కారు–లారీ ఢీ.. కుటుంబం బలి బనశంకరి: కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఉత్తర కన్నడ జిల్లా యల్లాపుర తాలూకాలో బుధవారం ఈ దుర్ఘటన జరిగింది. కొప్పళకు చెందిన వెంకటేశ్, భార్య చైత్ర, ఏడేళ్ల కుమారుడు శ్రీహన్, డ్రైవరు శ్రీకాంత్రెడ్డితో కలిసి కారులో బయలుదేరారు. యల్లాపుర తాలూకా అరబైలు వద్ద కారును లారీ డీకొంది. ఈ ప్రమాదంలో దంపతులు, కుమారుడు తీవ్ర గాయాలతో చనిపోయారు, డ్రైవరు శ్రీకాంత్రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. యల్లాపుర పోలీసులు చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. లోయలోకి బస్ పల్టీ.. 25 మందికి గాయాలు బనశంకరి: కేఎస్ ఆర్టీసీ బస్ లోయలోకి పడిన ఘటనలో 25 మంది గాయపడ్డారు. ఈ ఘటన కాగవాడ తాలూకా మైశాళ గ్రామంలో చోటుచేసుకుంది. బుధవారం కాగవాడ మైశాళ గ్రామం మీరజ్ నుంచి విజయపుర కు వెళుతున్న ఆర్టీసీ బస్ అదుపుతప్పి 25 అడుగుల కందకంలోకి పడిపోయింది. బస్సులో 40 మంది ఉండగా, 25 మంది గాయపడ్డారు. బస్సులో చిక్కుకున్న వారిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. మీరజ్ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్పత్రిలో చేరిన కుమార శివాజీనగర: కేంద్ర మంత్రి హెచ్.డీ.కుమారస్వామి అనారోగ్యంతో బాధపడుతూ చైన్నెలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు. కేంద్ర మంత్రి అయిన తరువాత నిరంతరం పర్యటనలలో ఉండడం వల్ల విశ్రాంతి లేక అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. చైన్నె అపోలో ఆసుపత్రిలో చేరారు. చికిత్స ముగిసిన తరువాత బెంగళూరుకు వెనుతిరిగి వస్తారు. అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు అయ్యాయి. -
పార్శ్వగూనికి చికిత్స పొందాలి
హొసపేటె: వెన్నెముక వంకరపోయి స్కోలియోసిస్ లక్షణాలను గుర్తిస్తే, వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స పొందాలని జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ శంకర్నాయక్ తెలిపారు. నగరంలోని జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి కార్యాలయ సభాంగణంలో ఏర్పాటు చేసిన వెన్నుపాము గాయాలపై అవగాహన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరి వెన్నెముక సాధారణంగా వక్రతను కలిగి ఉంటుంది. వెనుక నుంచి చూసినప్పుడు వెన్నెముక నిటారుగా కనిపిస్తుంది. అయితే పార్శ్వగూని ఉన్న పిల్లలు, కౌమార దశలో ఉన్నవారు వెన్నెముక అసాధారణ ఎస్, సీ ఆకారపు వక్రతను కలిగి ఉంటారు. వెన్నెముక వ్యాధుల లక్షణాలు, వారికి అవసరమైన సంరక్షణ, వైద్య సలహాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ శిబిరం లక్ష్యం అన్నారు. బెంగళూరులోని భగవాన్ మహావీర్ జైన్ ఆస్పత్రి సహకారంతో, విజయనగర జిల్లాలో వ్యాధులతో బాధపడుతున్న రోగులు ఉచిత చికిత్స పొంది మంచి భవిష్యత్తును పొందాలన్నారు. చికిత్సను ఎటువంటి సమస్యలు లేకుండా విజయవంతంగా నిర్వహిస్తారన్నారు. చాలా మంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నందున ఈ సంస్థ సామాజిక సేవల ద్వారా ఉచిత చికిత్స పొందవచ్చన్నారు. జిల్లా ఆర్సీహెచ్ అధికారి డాక్టర్ జంబయ్య మాట్లాడుతూ జాతీయ బాలల ఆరోగ్య కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 450 మంది పిల్లలకు ఉచిత శస్త్రచికిత్సను విజయవంతంగా అందించామన్నారు. మహావీర్ జైన్ ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
పశు మహోత్సవం
తుమకూరు: సిద్ధగంగా మఠం వేలాది ఆవులు, ఎద్దులతో కళకళలాడుతోంది. ఇందులో మామూలు నుంచి మేలుజాతి పశువులు రూ.లక్షలు పలుకుతున్నాయి. పది రోజుల్లో సిద్ధగంగ జాతర మహోత్సవం జరగనుంది. ముందస్తుగా పశువుల పరుస నిర్వహించడం ఆనవాయతీ. ఇక్కడ పశుజాతరకు కర్ణాటక మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పశువులు, మూగ జీవాలు తరలివస్తున్నాయి. కొనేందుకు, అమ్మేందుకు వచ్చిన రైతులతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడుతోంది. ప్రతి ఏటా తాము సిద్ధగంగా జాతర పశువుల పరుసకు వస్తున్నట్లు, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారని ఒక రైతు తెలిపారు. ఇప్పటినుంచి పశువుల అమ్మకాలు జోరుగా జరుగుతాయి. -
కుంభమేళాకు వెళ్తూ మహిళ దుర్మరణం
దొడ్డబళ్లాపురం: బెంగళూరు నుంచి ప్రయాగ్రాజ్ కుంభమేళాకు వెళ్తున్న ట్రావెలర్స్ టెంపో వాహనాన్ని లారీ ఢీకొనింది. టెంపోలో ప్రయాణిస్తున్న మహిళ చనిపోయింది. ఈ దుర్ఘటన మధ్యప్రదేశ్ కట్టా అనే ప్రాంతంలో చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన కుటుంబం మంగళవారం ఉదయం టీటీలో కుంభమేళాకు బయలుదేరింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో మార్గమధ్యలో మధ్యప్రదేశ్లోని కట్టా అనే చోట లారీ ఢీకొంది. టెంపో పల్టీలు కొట్టింది, ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందగా మరో 5 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను బెంగళూరుకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పని ఒత్తిడి, నిద్రలేమి.. టెక్కీ ఆత్మహత్య హోసూరు: ప్రైవేట్ కంపెనీలో పనిచేసే టెక్కీ.. ఒత్తిడి కారణంతో నిద్ర లేకపోవడంతో అనారోగ్యానికి గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందినా ఫలితం లేదని బాధపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాయకోట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. వివరాల మేరకు క్రిష్ణగిరి జిల్లా రాయకోట సమీపంలోని ఉడయాండహళ్లి గ్రామానికి చెందిన విజయ్కుమార్ (41), భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బెంగళూరులో నివాసముంటున్నాడు. ఐటి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నిరోజులుగా ఆఫీసులో తీవ్ర పని ఒత్తిడితో నిద్రలేమికి గురయ్యాడు. దీంతో అనారోగ్యానికి గురైన ఇతను పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందినా స్వస్థత కలగలేదు. జీవితంపై విరక్తి చెందిన విజయ్కుమార్ రెండు రోజుల క్రితం స్వగ్రామం రాయకోటకు వచ్చి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. పోలీసులు చేరుకొని ఆస్పత్రికి తరలించారు. జేసీబీకి బాలుడు బలి కృష్ణరాజపురం: ఆటలాడుకుంటున్న రెండేళ్ల బాలునిపై జేసీబీ దూసుకెళ్లడంతో నూరేళ్లు నిండాయి. ఈ దుర్ఘటన శీగేహళ్లి సమీపంలోని కాడుగోడి మెయిన్ రోడ్డులో జరిగింది. కన్నమంగలకు చెందిన పవన్రెడ్డి మృతుడు. మంగళవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఇంటి ముందు ఆటలాడుకుంటూ ఉన్నాడు. ఓ జేసీబీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపుతూ బాలుని మీద నుంచి వెళ్లిపోయాడు. తీవ్ర గాయాలతో పసిబాలుడు క్షణాల్లోనే మరణించాడు. అప్పటివరకు గంతులేస్తూ ఉన్న కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడని తల్లిదండ్రులు ఏకధాటిగా విలపించారు. మహదేవపుర ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చిన్నారి గొంతులో పిప్పరమెంటు దొడ్డబళ్లాపురం: రెండేళ్ల చిన్నారి గొంతులో క్యాండి చిక్కుకుని చావు బతుకుల్లో ఉండగా, వైద్యులు దాన్ని తొలగించి ప్రాణాలు కాపాడారు ఈ సంఘటన మంగళూరులోని కక్కింజెలో చోటుచేసుకుంది. చిన్నారి పిప్పరమెంటు చప్పరిస్తూ ఉండగా గొంతులో ఇరుక్కుపోయింది, ఊపిరాడక విలవిలలాడుతున్న బాలికను తల్లితండ్రులు పరుగున ఆస్పత్రికి తీసుకున్నారు, అప్పటికే చిన్నారి నిస్తేజంగా మారిపోయింది. వైద్యులు వెన్ను, కడుపు భాగంలో ఒత్తిడి తెచ్చి క్యాండీ ని తొలగించారు. దీంతో చిన్నారి ఊపిరి తీసుకోవడంతో ప్రాణం దక్కింది. కూలిన భవనం కృష్ణరాజపురం: బెంగళూరులో భవన ప్రమాదం జరిగింది. రెండంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటన జీవన్ బీమా నగర పోలీసు స్టేషన్ పరిధిలోని తిప్పసంద్రలో బుధవారం సాయంత్రం ఐదు గంటలకు జరిగింది. ఈ భవనం పక్కన మరో కట్టడం కోసం పునాది తవ్వుతుండగా దీంతో అది కాస్తా కూలింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇంట్లో ఉన్న వారిని పోలీసులు, ఫైర్ సిబ్బంది బయటకు పంపించారు. అదృష్టవశాత్తు ఎవరికీ హాని కలగలేదు. -
జిల్లాల్లో పరిశ్రమల స్థాపనకు శ్రీకారం
రాయచూరు రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పరిశ్రమల స్థాపనకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో రాయచూరు, యాదగిరి జిల్లాల్లో పరిశ్రమల స్థాపనకు రంగం సిద్ధమైంది. ఈ జిల్లాల్లో అన్ని విధాలుగా మౌలిక సౌకర్యాలు, వనరులు సమృద్ధిగా ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల జోన్గా ప్రకటించడంతో భవిష్యత్తులో నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి. రాయచూరు జిల్లాలో చిక్కసూగూరు, వడ్లూరు, ఏగనూరు, కుకనూరు వంటి ప్రాంతాల్లో 1744.75 ఎకరాల భూమిని అభివృద్ధి పరచడానికి గెజెట్ నోటిఫికేషన్ వెల్లడించింది. యాదగిరి జిల్లాలో 3284.27 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. పరిశ్రమల కేంద్రంలో రోడ్లు, మురుగు కాలువలు, తాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పిస్తారు. రాయచూరు, యాదగిరి జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు కంపెనీలు ముందుకు వచ్చాయి. బెంగళూరు–ముంబై, చైన్నె –ముంబై, బెంగళూరు–న్యూఢిల్లీ, కన్యాకుమారి–చైన్నె, మైసూరు–వారణాసి రైళ్ల సౌకర్యం, విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు, తుంగభద్ర, కృష్ణా నదులు, హట్టి బంగారు గనుల కంపెనీలు ఉండటంతో పాటు పత్తి, వరి, మిరప ప్రధాన పంటలు పండిస్తారు. -
నీటి పొదుపుపై అవగాహన కల్పించండి
బళ్లారిటౌన్: నైసర్గిక సంపన్మూలమైన నీరు మన అందరికీ అత్యవసరమని, పొదుపుగా నీటి వినియోగంపై అవగాహన కల్పించాలని జిల్లా పంచాయతీ సీఈఓ రాహుల్ శరణప్ప సంకనూరు పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో గ్రామీణ తాగునీరు నైర్మల్య శాఖ, జిల్లా పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టిన జలజీవన్ మిషన్ పథకంపై సదస్సులో పాల్గొని మాట్లాడారు. దేశాభివృద్ధిలో గ్రామాల అభివృద్ధి పాత్ర ప్రముఖమైనదన్నారు. గ్రామ పంచాయతీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమగ్ర గ్రామ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. 24 గంటలు నీరందించే జలజీవన్ మిషన్ పథకం అమలు చేయాలన్నారు. ప్రజలు నీటి వృథా కాకుండా సద్వినియోగం చేసుకోనేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా పలు గ్రామ పంచాయతీ అధ్యక్షులకు ప్రమాణపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో నైర్మల్య శాఖ ఈఈ హెచ్.ఇందూధర్, ఫీడ్బ్యాంక్ ఫౌండేషన్ సీఈఓ అజయ్సిన్హ, అధికారులు తిప్పేస్వామి, నందకుమార్, ఓంకార్, అభిషేక్, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు. -
హోంమంత్రికి హైకమాండ్ పిలుపు
శివాజీనగర: కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు మేరకు హోం మంత్రి జీ.పరమేశ్వర్ మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. పరమేశ్వర్ దళిత ఎమ్మెల్యేలు, మంత్రులను కలుస్తూ సీఎం పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిలుపు రావడం కుతూహలం కలిగిస్తోంది. హుటాహుటిన ఉదయం ఆయన ఢిల్లీకి వెళ్లారు. సిద్దరామయ్యను ముఖ్యమంత్రిగా కొనసాగించాలని, ఒక వ్యక్తికి ఒకే పదవి ప్రకారం కేపీసీసీ అధ్యక్ష పదవిని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నుంచి తొలగించాలని పరమేశ్వర్ కోరుతున్నారు. అలాగే పరమేశ్వర్ చర్యల వల్ల పార్టీ గౌరవానికి భంగం కలుగుతోందని కొందరు హైకమాండ్కి ఫిర్యాదులు చేశారు. వీటన్నింటి గురించి రాహుల్గాంధీ, వేణుగోపాల్, సుర్జేవాలా వంటి నేతలు పరమేశ్వర్తో చర్చిస్తారని తెలిసింది. సహకార మంత్రి కే.ఎన్.రాజణ్ణ సోమవారం కేపీసీసీ అధ్యక్షుడు, డీసీఎం డీ.కే.శివకుమార్పై మండిపడి, ఎవరి నుంచి క్రమశిక్షణ పాఠాన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. శివకుమార్ ఏఐసీసీ పేరును దుర్వినియోగం చేసుకొన్నారని ఆరోపించారు. ఢిల్లీకి వెళ్లిన పరమేశ్వర్కేపీసీసీ స్థానం ఖాళీగా లేదు: జార్జ్ కేపీసీసీ అధ్యక్ష మార్పు నాకు తెలియదు, ఇప్పుడు అధ్యక్షుడు ఉన్నారు కదా. ఆ పదవి ఖాళీగా లేదు అని మంత్రి కే.జే.జార్జ్ అన్నారు. అధ్యక్ష మార్పు గురించి హైకమాండ్ ఏమైనా చెప్పారా అని మీడియాను ప్రశ్నించారు. మంత్రి రాజణ్ణ ఏమేం ఫిర్యాదులు చేశారో తెలియదన్నారు. -
శృతి విషాదం వెనుక..పాత స్మృతులు
దొడ్డబళ్లాపురం: బెంగళూరులోని బాగలగుంటలో భర్త ప్రవర్తన సరిగా లేదనే కోపంతో శృతి (33)అనే మహిళ, కుమార్తె రోహిణి(5)కి ఉరివేసి చంపి, తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో మరో విషయం వెలుగు చూసింది. గతంలో శృతి కుటుంబం ఒక ఇంట్లో అద్దెకు ఉండేవారు. ఆ ఇంటి ఓనర్ భార్య కూడా ఇదే మాదిరిగా డెత్నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఆ సంఘటన శృతి మనసులో నాటుకుపోయిందని బంధువులు తెలిపారు. తనకూ అదే సమస్య ఎదురవడంతో అచ్చం అలాగే డేత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుందన్నారు. శృతి భర్త గోపాలక్రిష్ణను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. -
చెప్పుతో కొట్టుకున్న పీడీఓ
మైసూరు: గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారిణి(పీడీఓ), పంచాయతీ అధ్యక్షుల మధ్య నిధుల విషయంలో గొడవ జరిగి, పీడీఓ చెప్పుతో కొట్టుకున్న ఘటన జిల్లాలోని హుణసూరు తాలూకాలో జరిగింది. వివరాలు.. హనగోడు పీడీఓ డాక్టర్ అనిత కాగా, ప్రభుత్వానికి జమ చేయాల్సిన సొమ్ములో రూ.50 వేల వ్యత్యాసం ఉంది. దీనిపై సిబ్బందికి, ఆమెకు మధ్య గొడవ జరుగుతోంది. మరోవైపు అధ్యక్షుడు చెన్నయ్య, పీడీఓ అనిత మధ్య కొన్ని అంశాలపై వాగ్వాదం జరిగింది. ఆవేశానికి గురైన అనిత చెప్పు తీసుకుని తానే కొట్టుకున్నారు. చెన్నయ్య మాట్లాడుతూ నాలుగు నెలల క్రితం జరిగిన ఘటన ఇది అని, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిందని చెప్పారు. తప్పుడు ఫిర్యాదులు చేస్తే కేసులే: కమిషనర్ యశవంతపుర: ఎవరైనా పోలీసుస్టేషన్కు వెళ్లి తప్పుడు ఫిర్యాదు చేస్తే అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొంటామని బెంగళూరు పోలీసు కమిషనర్ బీ దయానంద్ హెచ్చరించారు. విలేకరులతో మాట్లాడుతూ ఐదేళ్లలో తప్పుడు ఫిర్యాదు చేసిన ఆరు మందిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సంపిగేహళ్లి పోలీసుస్టేషన్ పరిధిలో దాడి జరిగిందని ఓ వ్యక్తి తప్పుడు కేసు పెట్టాడని తెలియడంతో అతనిపైనే చార్జిషీటు దాఖలు చేసినట్లు తెలిపారు. అమృతహళ్లిలో వాహన చోరీ అయ్యిందని తప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తికి కోర్టు రూ. వంద జరిమానా విధించినట్లు తెలిపారు. -
ఆరోగ్యదాయకం.. సూర్య నమస్కారం
చిక్కబళ్లాపురం: చిక్క సమీపంలోని ఆదియోగి పరమేశ్వరుని సన్నిధిలో పతంజలి యోగ సమితి సభ్యులు సూర్య నమస్కారాన్ని ఆచరించారు. నిత్యం 21 రోజులు సూర్య నమస్కారం, యోగా చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని యోగా గురు స్వామి లవణ తెలిపారు. యోగా శిక్షకులు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సూర్య నమస్కారం నాడీమండలాన్ని చైతన్యం చేస్తుందని అన్నారు. ఒత్తిడిని, అనారోగ్యాన్ని దూరం చేసి మనసును ప్రశాంతంగా ఉంచుతుందని తెలిపారు. 50 మందికి పైగా యోగాభ్యాసులు సూర్య నమస్కారం నిర్వహించారు. మందు పార్టీ వికటించి.. ఇద్దరు మృత్యువాత దొడ్డబళ్లాపురం: మద్యం, డ్రగ్స్ పార్టీ చేసుకున్న అసోం వలస కార్మికులు అది వికటించి మృత్యువాత పడ్డారు. బెంగళూరు సూర్యనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ సంఘటనన జరిగింది. అసోంకు చెందిన దివాన్ అఫ్రీద్ అలీ (27), అష్రఫ్ అలీ (34) చనిపోయినవారు. యారండనహళ్లిలో నివసిస్తున్న ఓ అసోంవాసి ఇంట్లో సోమవారం రాత్రి మద్యం విందు చేసుకున్నారు. కొంతసేపటికి ముగ్గురూ అస్వస్థులై పడిపోయారు. తెలిసిన వ్యక్తి ఇంట్లోకి వచ్చి చూడగా ఒకరు మృతిచెంది, మరో ఇద్దరు అపస్మారకంలో పడిఉన్నారు. ఆస్పత్రికి తరలించగా మరో వ్యక్తి మరనించాడు. అతిగా మద్యం తాగి ఏదైనా డ్రగ్స్ను తీసుకోవడం వల్ల ఇలా జరిగిందని వైద్యులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో నిజం తెలుస్తుందని వైద్యులు చెబుతున్నారు. బాధితులు బెంగళూరుకు వలస వచ్చి స్థానిక ఫ్యాక్టరీలో పనిచేసేవారు. సూర్యనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. లా ప్రశ్నాపత్రాల లీకేజీలో ముగ్గురు అరెస్టు దొడ్డబళ్లాపురం: బెంగళూరులోని లా యూనివర్సిటీలో పరీక్షల ప్రశ్నాపత్రాలను లీక్ చేసిన కేసులో సైబర్ క్రైం పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. కోలారులోని బసవశ్రీ లా కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ నాగరాజు, ఈయన కారు డ్రైవర్ కమ్ కాలేజీ విద్యార్థి అయిన జగదీష్, బంగారుపేట లా కాలేజీ విద్యార్థి వరుణ్ కుమార్ పట్టుబడ్డారు. రాష్ట్ర లా యూనివర్సిటీ ద్వారా జనవరి 23న జగరాల్సిన పరీక్షల కాంట్రాక్ట్ లా–1 ప్రశ్నాపత్రం టెలిగ్రాం, వాట్సాప్ గ్రూపుల్లో ముందే వచ్చేశాయి. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. మత్తులో కారు డ్రైవింగ్● ఇద్దరు దుర్మరణం దొడ్డబళ్లాపురం: విద్యార్థులు మద్యం తాగిన మత్తులో కారు నడిపి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెంది మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డ సంఘటన బెంగళూరు బన్నేరుఘట్ట సమీపంలోని రాగిహళ్లి వద్ద చోటుచేసుకుంది. గొట్టగెరె సమీపంలోని ప్రైవేటు కాలేజీలో చదువుతున్న కేరళకు చెందిన సహా హక్ (25), అర్షు (23) మృతులు. దేవనారాయణ, సాహిల్ అనేవారు తీవ్రంగా గాయపడగా, స్థానిక ఆస్పత్రికి తరలించారు. సోమవారం రాత్రి బాగా మద్యం తాగిన విద్యార్థులు కారులో అతివేగంగా వస్తూ రాగిహళ్లి వద్ద చెట్టును ఢీకొన్నారు. బన్నేరుఘట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. లాకర్లో రూ.8 లక్షలకు చెదలు దొడ్డబళ్లాపురం: ఇంట్లో కంటే బ్యాంకు లాకర్లో భద్రంగా ఉంటాయి కదా అని నగదు దాచుకుంటే, చెదలు పట్టిపోయాయి. రూ.8 లక్షలు పనికి రాకుండా అయ్యాయి. ఈ సంఘటన మంగళూరులో చోటుచేసుకుంది. సఫల్ అనే ఖాతాదారు మంగళూరు కోటెకార్లో ఉన్న ఓ ప్రముఖ బ్యాంకులో 6 నెలల క్రితం రూ.8 లక్షల నగదు దాచాడు. డబ్బులు అవసరమై తీసుకోవాలని బ్యాంకుకి వచ్చాడు. బ్యాంకు సిబ్బందితో కలిసి లాకర్ తెరిచి చూస్తే.. నగదు మొత్తం తడిచి, రంగుమారి చెదలు పట్టి పొడి పొడిగా కనిపించింది. అది చూసి సఫల్ లబోదిబోమన్నాడు. లాకర్లలో నగదు దాచరాదని తాము ముందే చెప్పామని సిబ్బంది జారుకున్నారు. దీంతో బాధితుడు బెంగళూరు వచ్చి బ్యాంకు మెయిన్ బ్రాంచ్లో ఫిర్యాదు చేశాడు. -
కుర్చీ కలహం
సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి కుర్చీ కోసం కొన్ని నెలలుగా రాష్ట్ర కాంగ్రెస్లో లోలోపల కుమ్ములాటలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో ఆటుపోట్ల మధ్య, అసాధ్యమనుకున్న సమయంలో 2023 విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారాన్ని సాధించింది. మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కృషి కాదనలేని నిజం. ఆ తర్వాత ఢిల్లీలో రెండురోజుల ఉత్కంఠభరిత చర్చల తరువాత సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పీఠం వరించింది. డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం పదవితో సంతృప్తి చెందాల్సి వచ్చింది. తలా రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవాలనే ఒప్పందం కుదిరిందని అప్పట్లో ప్రచారం సాగింది. అప్పటి నుంచి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాలు నేతలు విడిపోయి అంతర్గతంగా ముఖ్యమంత్రి పదవి కోసం లాబీయింగ్లు, పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఎవరి వర్గానిది పైచేయి ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు తీవ్ర రూపాన్ని దాల్చింది. బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. డీకే శివకుమార్ బలం తగ్గుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సీఎం స్థానంపై గంపెడాశలతో ఉన్న డీకే శివకుమార్ ఆశలపై ఈ వ్యతిరేక వర్గం ఎప్పటికప్పుడు నీళ్లు చదువుతోంది. అధికార పంపిణీ అంశం చర్చకు తెరలేసినప్పుడు డీకే శివకుమార్ తరపున ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే మద్దతుగా మాట్లాడుతున్నారు. అయితే సీఎం సిద్ధరామయ్య తరపున హేమాహేమీ నాయకులు, సీనియర్లు గళమెత్తడం గమనార్హం. 50–50 సూత్రం లేదు, తమ నాయకుడు సిద్ధరామయ్యనే అని, ఐదేళ్లు అయనే సీఎంగా కొనసాగుతారని మంత్రులు రాజణ్ణ, జమీర్ అహ్మద్, మహదేవప్ప వంటివారు మాట్లాడడం డీకే శిబిరానికి మింగుడు పడడం లేదు. మంత్రులు ఎంబీ పాటిల్, సతీశ్ జార్కిహోళి, జి.పరమేశ్వర్ వంటి సీనియర్లు సిద్దుకు మద్దతుగా నిలిచారు. ఒకవేళ సీఎంను మారిస్తే, ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలకు అవకాశం ఇవ్వాలని డీకే శివకుమార్కు చెక్ పెడుతున్నారు. సీఎం సిద్దరామయ్య వర్గం పైచేయి డిప్యూటీ సీఎం డీకే నిరీక్షణ ఫిఫ్టీ– ఫిఫ్టీ సూత్రంపైనే ఆశలు హైకమాండ్పై ఆశలు డీకే శివకుమార్ తరపున మాట్లాడేవారే కరువయ్యారు. మాగడి బాలకృష్ణ వంటి ఒకరిద్దరు నేతలు మినహా మిగిలిన నేతలెవ్వరూ శివకుమార్కు జై కొట్టడం లేదు. కేబినెట్ మొత్తం దాదాపుగా సీఎం సిద్ధరామయ్య పక్షమే.. ఇటీవల మంత్రులు కేఎన్ రాజణ్ణ, సతీశ్లు హైకమాండ్తో చర్చలు జరిపారు. తమ అభిప్రాయాలు, ఆరోపణలను హైకమాండ్ దృష్టికి తీసుకొచ్చారు. కానీ ముడా స్థలాల కేసులో సీఎం సిద్దరామయ్య చిక్కుకోవడంతో బలం తగ్గినట్లయింది. ఇక డీకే హైకమాండ్ మీదనే ఆశలు పెట్టుకుని పావులు కదిలిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు అన్యాయం చేయదని భావిస్తున్నారు. -
హోంమంత్రికి హైకమాండ్ పిలుపు
శివాజీనగర: కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు మేరకు హోం మంత్రి జీ.పరమేశ్వర్ మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. పరమేశ్వర్ దళిత ఎమ్మెల్యేలు, మంత్రులను కలుస్తూ సీఎం పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిలుపు రావడం కుతూహలం కలిగిస్తోంది. హుటాహుటిన ఉదయం ఆయన ఢిల్లీకి వెళ్లారు. సిద్దరామయ్యను ముఖ్యమంత్రిగా కొనసాగించాలని, ఒక వ్యక్తికి ఒకే పదవి ప్రకారం కేపీసీసీ అధ్యక్ష పదవిని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నుంచి తొలగించాలని పరమేశ్వర్ కోరుతున్నారు. అలాగే పరమేశ్వర్ చర్యల వల్ల పార్టీ గౌరవానికి భంగం కలుగుతోందని కొందరు హైకమాండ్కి ఫిర్యాదులు చేశారు. వీటన్నింటి గురించి రాహుల్గాంధీ, వేణుగోపాల్, సుర్జేవాలా వంటి నేతలు పరమేశ్వర్తో చర్చిస్తారని తెలిసింది. సహకార మంత్రి కే.ఎన్.రాజణ్ణ సోమవారం కేపీసీసీ అధ్యక్షుడు, డీసీఎం డీ.కే.శివకుమార్పై మండిపడి, ఎవరి నుంచి క్రమశిక్షణ పాఠాన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. శివకుమార్ ఏఐసీసీ పేరును దుర్వినియోగం చేసుకొన్నారని ఆరోపించారు. ఢిల్లీకి వెళ్లిన పరమేశ్వర్కేపీసీసీ స్థానం ఖాళీగా లేదు: జార్జ్ కేపీసీసీ అధ్యక్ష మార్పు నాకు తెలియదు, ఇప్పుడు అధ్యక్షుడు ఉన్నారు కదా. ఆ పదవి ఖాళీగా లేదు అని మంత్రి కే.జే.జార్జ్ అన్నారు. అధ్యక్ష మార్పు గురించి హైకమాండ్ ఏమైనా చెప్పారా అని మీడియాను ప్రశ్నించారు. మంత్రి రాజణ్ణ ఏమేం ఫిర్యాదులు చేశారో తెలియదన్నారు. -
కిరాతక కొడుకు
కృష్ణరాజపురం: బెంగళూరులో కన్న తండ్రిని తనయుడు హతమార్చిన ఘటన బ్యాడరహళ్లి బాలాజీ లేఅవుట్లో జరిగింది. వివరాలు.. మృతున్ని రిటైర్డ్ బీఎస్ఎఫ్ జవాన్ చెన్నబసవయ్య (54)గా గుర్తించారు. వివరాలు.. అతని కుమారుడు అమిత్ (26) తాగుడుకు బానిసగా మారాడు. నిత్యం పీకలదాకా తాగి వచ్చి మళ్లీ తనకు తాగుడకు డబ్బులివ్వాలని తల్లిదండ్రులను వేధింపులకు గురి చేస్తుండేవాడు. తాగుడుకు డబ్బు లేకుంటే తల్లి బంగారు గాజులు, చెవి కమ్మలు ఇవ్వమని అడిగేవాడు. మంగళసూత్రాన్ని కూడా లాక్కొనేందుకు ప్రయత్నించేవాడు. ఈ విషయం తెలిసి కుమారుడిని తండ్రి తీవ్రంగా మందలించాడు. దీనిని మనసులో పెట్టుకుని కక్ష పెంచుకున్న అమిత్ తండ్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో యథాప్రకారం తాగి వచ్చి తండ్రితో గొడవకు దిగాడు. కోపోద్రేకంలో ఇనుప రాడ్డుతో కొట్టి చాకుతో పొడిచి తండ్రిని చంపాడు. బ్యాడరహళ్లి పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి అమిత్ను అరెస్టు చేశారు. వ్యసనాలకు లోనై.. తండ్రి హత్య -
అక్రమ లేఔట్లపై కొరడా
బనశంకరి: రాష్ట్రంలో అనధికార లేఔట్లు తలెత్తితే అధికారులనే జవాబుదారీ చేసి నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటామని సీఎం సిద్దరామయ్య హెచ్చరించారు. మంగళవారం నివాస కార్యాలయమైన కృష్ణాలో స్థానిక సంస్థల్లో బీ–ఖాతా అందించడం గురించి జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ అధికారులు, కమిషనర్లతో వీడియో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామాలు, నగర, పట్టణ, పాలికె పరిధిలో అనధికార లేఔట్లకు చెక్ పెడతామన్నారు. ఇకపై అక్రమ లేఔట్లకు రాష్ట్రంలో అవకాశం లేదన్నారు. అధికారులు చట్ట ప్రకారం పని చేయాలన్నారు. ఒక వేళ మళ్లీ అక్రమ లేఔట్లు తలెత్తితే అక్కడి అధికారులపై చర్యలు తప్పవని తెలిపారు. ఇప్పటికే అనధికార లేఔట్లలో ఇళ్లు నిర్మించుకున్నవారికి ఇబ్బందులు కలగరాదని ఒకేసారి బీ–ఖాతా అభియాన చేపడుతున్నామన్నారు. 3 నెలలు సమయం ఇస్తున్నామని, అంతలోగా బీ–ఖాతా అభియాన ను పూర్తిచేయాలని ఆదేశించారు. ఎలాంటి గందరగోళానికి ఉండరాదన్నారు. ఈ సమావేశంలో మంత్రులు కృష్ణబైరేగౌడ, ఈశ్వర్ ఖండ్రే, బైరతి సురేశ్, రహీంఖాన్, అధికారులు పాల్గొన్నారు. అధికారులకు సీఎం ఆదేశం సక్రమంగా బి–ఖాతా అభియాన్ -
మనీ ల్యాండరింగ్ పేరుతో కుచ్చుటోపీ
రాయచూరు రూరల్: మనీ ల్యాండరింగ్ పేరుతో రిటైర్డ్ కేబీజీఎన్ఎల్ అధికారికి రూ.10 లక్షల మేర కుచ్చుటోపీ పెట్టిన ఉదంతం యాదగిరి జిల్లాలో చోటు చేసుకుంది. యాదగిరి జిల్లా ఽశహాపుర తాలూకా భీమరాయన గుడి కృష్ణా భాగ్య జల నిగమ ప్రాజెక్టు(కేబీజీఎన్ఎల్)లో విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన అధికారికి ముంబై వ్యక్తులు కుచ్చుటోపీ వేశారు. గతనెల 26న కలబుర్గిలో ఉన్న సమయంలో 7418251915 నంబర్ నుంచి వీడియో కాల్ చేయడం ద్వారా హిందీలో సంభాషణ చేశారు. ముంబై క్రైం బ్రాంచ్ నుంచి అధికారిని మాట్లాడుతున్నట్లు చెప్పి మనీ ల్యాండరింగ్ పేరు మీద మీపై నేరం మోపారని తెలిపారు .మీ బ్యాంక్ ఖాతాలోకి డబ్బుల లావాదేవీల వ్యవహారం జరిగిందంటూ కేసు నమోదు చేశామని చెప్పారు. ఎఫ్ఐఆర్ నంబర్ ఎంహెచ్–5621–2024 అంటూ ప్రధాన ముద్దాయి నరేష్ గోయల్ను అరెస్ట్ చేశామన్నారు. ఇందులో మీరు రెండో ముద్దాయి అంటూ వీడియో కాల్లో మాట్లాడారు. ఆధార్, పాన్ కార్డు, బ్యాంక్ ఖాతా నంబర్ ఇతర వివరాలు పంపాలని ఆదేశించారు. అపరిచితులు ఫిర్యాదు దారుడికి వీడియో కాల్లో ఓ నివాసంలో ఓ న్యాయమూర్తిని సృష్టించి నరేష్ గోయల్ను అరెస్ట్ చేసినట్లు చూపించారు. అన్ని వివరాలు వ్యాట్సప్ ద్వారా పంపాలని కోరారు. నిరాకరిస్తే మిమ్ములను అరెస్ట్ చేస్తామని, దాని బారి నుంచి రక్షణ పొందాలంటే మీ కొడుకుకు తెలియకుండా చూడాలని సూచించారు. వివిధ బ్యాంక్ ఖాతాల నుంచి రూ.10 లక్షలను బదలాయించుకుని వంచించారు. ఈ నెల 10న యాదగిరి సీఈఎన్ పోలీస్ స్టేషన్లో కేసును పోలీసులు నమోదు చేసుకున్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో నయవంచన రిటైర్డ్ అధికారికి రూ,10 లక్షల మోసం యాదగిరి జిల్లాలో ఘటన వెలుగులోకి -
విజయపురలో నాటు పిస్టళ్ల దందా
బనశంకరి: విజయపుర (బిజాపుర) జిల్లాలో గన్ కల్చర్ బయటపడింది. నాటు పిస్తోళ్లు పెట్టుకున్న 10 మంది ఇళ్లలో పోలీసులు దాడి చేసి 10 నాటు పిస్టల్స్, 24 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ లక్ష్మణ నింబరగి మంగళవారం వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఇటీవల విజయపురలో రమేశ్గేము లమాణి ఇతరులు కలిసి సతీశ్ ప్రేమసింగ్ రాథోడ్పై పిస్టల్ తో కాల్పులు జరిపి చాకుతో పొడిచి హత్యచేశారు. ఈకేసులో 6 మందిని అరెస్ట్ చేశామని, నిందితులను విచారించినప్పుడు నాటుపిస్టళ్ల గుట్టు బయటపడిందని తెలిపారు. దీంతో జిల్లాలో వివిధ చోట్ల గాలించి తుపాకులు, తూటాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రకాశమర్కీ, అశోకపరంపాండ్రే, సుజిత సుబాష్ రాథోడ్, సుఖదేవ్ రాథోడ్, ప్రకాశ భీమసింగ్ రాథోడ్, గణేశ్ శివరామశెట్టి, చెన్నప్పమల్లప్ప నాగనూరు, సంతోష్ కిషన్ రాథోడ్, జనార్దన వసంత పవార్ అనేవారి ఇళ్లలో గాలించి తుపాకులను సీజ్చేసి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి నాటు తుపాకులను తెప్పించి విక్రయిస్తున్నట్లు సమాచారం. తుపాకులను కలిగి ఉండడం గొప్పగా భావించి వీటిని చాటుమాటుగా కొంటూ ఉంటారు. 10 తుపాకులు, తూటాలు సీజ్ -
అనాథ బిడ్డకు అమ్మానాన్నగా..
సాక్షి,బళ్లారి: ఎవరి కన్న బిడ్డో చెత్తబుట్టలో పారవేశారు. తల్లి ఒడిలో సేదతీరాల్సిన నవజాత శిశువు చెత్తబుట్ట(కసువు)లో రోదిస్తున్న దృశ్యం కనిపించింది. దీంతో గమనించిన చుట్టు పక్కల ప్రజలు పోలీసులకు తెలియజేయడంతో అనాథ బాల శరణాలయంలో చేర్పించిన ఘటన జరిగింది. నవజాత శిశువు అందులోను దివ్యాంగుడైన రెండున్నరేళ్ల బాలుడు ప్రస్తుతం ఇటలీకి పయనం అవుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. బెళగావి జిల్లాలో రెండున్నరేళ్ల క్రితం చోటు చేసుకున్న ఈ ఘటన అప్పట్లో జిల్లా వాసులను కలిచివేసింది. ఏడు నెలలకే జన్మించిన నవజాత శిశువును ఏ తల్లి కన్నదో తెలియదుకానీ కనికరం లేకుండా ఊరి శివార్లలో చెత్తకుప్పలో పారవేసి తనకేమీ తెలియనట్లు వెళ్లిపోయింది. అయితే ఆ శిశువును గమనించిన వారు పోలీసులకు సమాచారం చేరవేయడంతో బెళగావిలోని స్వామి వివేకానంద సేవా ట్రస్ట్కు చెందిన గంగమ్మ చిక్కంబిమఠ బాలకళ్యాణ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న దివ్యాంగుడు ప్రస్తుతం ఎల్లలు దాటుతున్నాడు. ఆదర్శంగా నిలిచిన వైనం కన్నడ కందమ్మను ఇటలీకి చెందిన బుజార్ డెడె, వైద్యురాలు కోస్టాంజా దంపతులు భారత దేశానికి చెందిన ఈ దివ్యాంగుడిని దత్తత తీసుకొని ఆదర్శంగా నిలిచారు. మంగళవారం బెళగావిలోని గంగమ్మ చిక్కంబిమఠ బాలకళ్యాణ కేంద్రంలో దత్త స్వీకరణ కార్యక్రమం సాదాసీదాగా ముగించారు. ఇటలీలోని ఫ్లారెన్స్ నగరానికి చెందిన కోస్టాంజా, బుజార్ డెడె దంపతులు దివ్యాంగ చిన్నారిని దత్తత స్వీకరణ కార్యక్రమం చట్టబద్ధంగా పూర్తి చేశారు. ఫ్లారెన్స్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఫిజియోథెరపీ వైద్యురాలైన ఈమె తన ఆస్పత్రిలో ఎంతో మందికి సేవ చేస్తోంది. 2015లో దివ్యాంగుడైన బుజార్ను పెళ్లి కూడా చేసుకుంది. స్వతహాగా దివ్యాంగులైన దంపతులు మరొక్క దివ్యాంగుడికి జీవితం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ దిశగా అడుగులు వేస్తూ భారత దేశానికి చెందిన బెళగావిలోని చిన్నారుల అనాథ శరణాలయాన్ని సంప్రదించారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకున్న ఈ దంపతులకు చట్టం ప్రకారం దత్తత స్వీకరణ పూర్తి చేశారు. చట్టప్రకారం దత్తత పూర్తి ఈ సందర్భంగా బెళగావి చిక్కంబిమఠ బాలకళ్యాణ కేంద్రం అధ్యక్షురాలు మనీష బాండనకర్ మాట్లాడుతూ తమ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న ఈ బాలుడు ఏడు నెలలకే జన్మించడంతో పాటు తూకం ఒక కేజీ 300 గ్రాములు మాత్రమే ఉండటంతో ఆరోగ్యంలో చాలా సమస్యలు ఉన్నాయి. అంతేగాకుండా దృష్టి లోపం కూడా ఉండటంతో చెత్తబుట్టలో దొరికిన ఈ బాలుడిని ఎంతో శ్రద్ధతో పెంచామని ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ ఇవ్వడంతో ప్రస్తుతం మాట్లాడుతూ, నడుస్తున్నాడన్నారు. అయితే ఎవరి కన్న బిడ్డో ఈ బాలుడిని, ఎవరి రుణం కోసమో పెంచుకోవాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో చట్ట ప్రకారం సెంట్రల్ అడాప్షన్ డెసోస్ అథారిటీ( ఖరా) నియమానుసారం దత్తత ఇస్తున్నామన్నారు. జిల్లాధికారి సమక్షంలో దత్తత ప్రక్రియ పూర్తయింది. బాలుడికి పాస్పోర్ట్ కూడా సిద్ధం అయింది. ఇక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లి వీసా తీసుకొని ఇటలీ దేశానికి త్వరలో బయలుదేరుతున్నామన్నారు. 120 మంది పిల్లల దత్తత అంతేగాకుండా 2011 నుంచి ఇప్పటి వరకు తమ కేంద్రంలో దాదాపు 120 మంది చిన్నారులను దత్తత ఇచ్చామన్నారు. విదేశాలకు కూడా దాదాపు 15 మందిని అందజేశామని గుర్తు చేశారు. ఇటలీకి కూడా ఈ బాలుడితో కలిపి ఇద్దరిని పంపామన్నారు. తమ దగ్గర ఉన్న చిన్నారుల చిత్రాలను వైబ్సైట్లో అప్లోడ్ చేస్తామని, కావాల్సిన వారు ఆయా దేశాల నుంచి తమను సంప్రదిస్తారన్నారు. వైబ్సైట్ ద్వారా సంప్రదించిన ఈ దంపతులు నేరుగా వచ్చి చట్ట ప్రకారం దత్తత తీసుకున్నారన్నారు. దత్తత తీసుకొన్న ఇటలీ దంపతులు మాట్లాడుతూ భారత దేశ సంస్కృతి, వారసత్వాలు తమకెంతో నచ్చాయన్నారు. దివ్యాంగుడిని దత్తత తీసుకోవాలని సంకల్పం మేరకు తాము ఇక్కడికి వచ్చి దత్తత తీసుకున్నామన్నారు. ఈ బాలుడిని ఎంతో శక్తి వంతుడిగా తయారు చేస్తామన్నారు. తమ దేశానికి పిలుచుకెళ్లి బాలుడిని తమతో పెంచుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. నవజాత శిశువును పెంచిన బెళగావి అనాథాశ్రమం దివ్యాంగుడిని దత్తత తీసుకున్న ఇటలీ దంపతులు చెత్తబుట్టలో దొరికిన శిశువు త్వరలో ఇటలీకి పయనం -
సమగ్రాభివృద్ధికి కంకణం
హొసపేటె: విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకాను కళ్యాణ కర్ణాటక పరిధిలోకి చేర్చడంతో ఆర్టికల్–371(జె) గ్రాంట్తో నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి దోహదపడిందని హరపనహళ్లి ఎమ్మెల్యే ఎంపీ లతా మల్లికార్జున తెలిపారు. హరపనహళ్లి పట్టణంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఈ రంగం సమగ్ర అభివృద్ధికి న్యాయమైన నిధులు అందించడానికి ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోందన్నారు. తన సోదరుడు ఎంపీ రవి దూరదృష్టి వల్ల దావణగెరె జిల్లాలోని హరపనహళ్లిని కళ్యాణ కర్ణాటక పరిధిలోకి చేర్చారన్నారు. కేకేఆర్డీబీ ప్రత్యేక గ్రాంట్ ఆర్టికల్–371(జే) నుంచి రూ.5 కోట్ల వ్యయంతో హరపనహళ్లి డిపోకు 11 కొత్త బస్సులను అందించామన్నారు. ఈ ప్రాంతంలో విద్యార్థుల రవాణా సమస్యను పరిష్కరించడమే బస్సుల కొనుగోలుకు ప్రేరణ అన్నారు. నియోజకవర్గంలోని గ్రామాలకు బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. త్వరలో 6 సిటీ బస్సుల అందజేతకు చర్చలు హరపనహళ్లి పట్టణానికి త్వరలో 6 సిటీ బస్సులను అందించడానికి ఆర్టీసీ అధికారులతో చర్చలు జరిగాయన్నారు. గ్రామీణ రోడ్ల అభివృద్ధి, పాఠశాల భవనాల నిర్మాణంతో సహా రోడ్ల మరమ్మతు పనులను త్వరలో చేపడతామన్నారు. సామాన్య ప్రజల సమస్యలను సున్నితంగా అర్థం చేసుకొని పరిష్కరించే సామర్థ్యం తనకు ఉందన్నారు. హరపనహళ్లి ఎమ్మెల్యే లతా వల్ల రాష్ట్రంలో తొలిసారిగా రూ.5 కోట్లతో 11 కొత్త బస్సులను తాలూకాకు అందించడం అభినందనీయమని కేఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.రాచప్ప తెలిపారు. గ్రాంట్ మంజూరు చేసిన మూడు నెలల్లోనే డిపోకు బస్సులు అందించడంలో ఎమ్మెల్యే ఎంతో కృషి చేశారని తెలిపారు. నగరసభ అధ్యక్షురాలు ఫాతిమా, గ్యారంటీ పథకం జిల్లా అధ్యక్షులు కురి శివమూర్తి, తహసీల్దార్ గిరీష్, ఆర్టీసీ అధికారి తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 11 కొత్త బస్సులను అందించాం ఎమ్మెల్యే ఎంపీ లతా మల్లికార్జున -
అంగన్వాడీ సరుకుల అక్రమ నిల్వ పట్టివేత
హుబ్లీ: గర్భిణులు, బాలింతలతో పాటు అంగన్వాడీ చిన్నారులకు పంపిణీ చేసే పౌష్టికాహార పదార్థాలను అక్రమంగా నిల్వ చేసి రవాణా చేస్తున్న ఆరోపణల కేసులో 18 మంది అంగన్వాడీ కార్యకర్తలతో పాటు 26 మందిని అరెస్ట్ చేశారు. అంతేగాక వాహనాలతో పాటు సదరు ఆహార పదార్థాలను జప్తు చేశారు. ఇద్దరు కీలక నిందితులు పరారయ్యారని, వారి అరెస్ట్ కోసం తీవ్రంగా గాలింపు చేపట్టినట్లు జంట నగరాల పోలీస్ కమిషనర్ ఎన్.శశికుమార్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాకు నిందితుల ఫోటోలతో పాటు వివరాలను వెల్లడించారు. ధార్వాడ తాలూకా నరేంద్ర గ్రామ బొలెరో వాహన యజమాని మంజునాథ్ దేశాయి, డ్రైవర్ లకమాపుర బసవరాజ్ భద్రశెట్టి, గోదాం యజమానికి పాత హుబ్లీ నేకార నగర మహమ్మద్ గౌస్ ఖలిఫా, అద్దెదారుడు గౌతం సింగ్ ఠాగూర్, హుబ్లీ తాలూకా కురిడికేరి మంజునాథ మాదర, కుందగోళ తాలూకా యరగుప్పి ఫక్కీరేష అలగి, కృష్ణ మాదర, రవి హరిజనతో పాటు 18 మంది అంగన్వాడీ కార్యకర్తలను అరెస్ట్ చేశామన్నారు. రూ.4 లక్షల సరుకులు స్వాధీనం నిందితుల నుంచి రూ.4 లక్షల విలువ చేసే 329 బస్తాల్లోని 8 టన్నుల 84 కేజీల ఆహార పదార్థాలైన గోధుమ రవ్వ, మిల్లెట్ లడ్డు, బియ్యం, పాలపొడి, సాంబార్ మసాలా పొడి, బెల్లం, ఉప్మా రవ్వ, చక్కెర, శెనగపప్పుతో పాటు మసాలా పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం పాత గబ్బూరు శివారు గోదాంపై దాడి చేయగా అక్కడ అంగన్వాడీ పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ఉచితంగా పంపిణీ చేసే ఆహార పదార్థాలను అక్రమంగా నిలువ చేసి వాటిని బ్లాక్ మార్కెట్లో విక్రయించే వారు ఈ దందాపై సీ్త్ర శిశు సంక్షేమ శాఖ జిల్లా నిర్వహణాధికారి కసబాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు 18 మంది అంగన్వాడీ కార్యకర్తలతో కలిపి 26 మందిని అరెస్ట్ చేశారు. కేసుపై సమగ్ర దర్యాప్తు పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలు పట్టుబడటంతో ఈ కేసును అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఈ కేసులో పాలు పంచుకున్నవారు ఎవరెవరో ఆరా తీస్తున్నారు. బ్లాక్ మార్కెట్లో వీటిని ఎలా విక్రయించే వారు? దీనికి సంబంధించిన ముఠా ఎంత పెద్దగా వ్యాపించిందో దర్యాప్తులో నిగ్గు తేలుస్తారు. ఇది తీవ్రమైన కేసు అని, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీస్ కమిషనర్ శశికుమార్ వివరించారు. 18 మంది కార్యకర్తలతో పాటు మొత్తం 26 మంది అరెస్ట్ -
రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదు
బళ్లారి రూరల్ : రాష్ట్రంలో విద్యుత్తు కొరత లేదని, వ్యవసాయానికి 7 గంటలు, ఇళ్లకు, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇంధన శాఖ మంత్రి కేజే.జార్జి పేర్కొన్నారు. మంగళవారం దావణగెరె జెడ్పీ సభాంగణంలో అధికారులు, శాసనసభ్యులకు ఏర్పాటు చేసిన ప్రగతి పరిశీలన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకపోయినా కొన్ని సాంకేతిక సమస్యల వల్ల కొన్ని ప్రాంతాల్లో నిర్వహణ కోసం తక్కువ సరఫరా అవుతోందన్నారు. ప్రభుత్వం నిబద్ధతతో సేద్యానికి 7 గంటల విద్యుత్ ఇవ్వాలని కట్టుదిట్టమైన సూచనలు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతినిత్యం 18,500 మెగావ్యాట్ల విద్యుత్ అవసరం ఉందన్నారు. అయితే అంతకంటే 10 శాతం వినియోగం పెరిగిందన్నారు. 3 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని కుసుమ్–సి యోజన ద్వారా ఏడాదిన్నరలో సోలార్ 3 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొన్నట్లు తెలిపారు. లైన్మెన్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం రాష్ట్ర ఇంధన శాఖ ఆధ్వర్యంలో 3000 లైన్మెన్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. అర్జీల పరిశీలన చివరి దశలో ఉంది. ఈ పోస్టుల కోసం లక్ష మంది అర్హత పొందారన్నారు. ఎంపికై న అభ్యర్థులకు శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అత్యంత పారదర్శకంగా రిజర్వేషన్ అనుసరించి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఇంధన శాఖలో ఎటువంటి ఎస్కాంలు నష్టంలో లేవు. ప్రభుత్వం నుంచి చాలావరకు నిధులు రావాల్సి ఉందన్నారు. ప్రభుత్వ గ్యారంటీల్లో గృహజ్యోతి యోజనలో అన్ని వర్గాల వారికి 200 యూనిట్ల వరకు బిల్లు లేదు. ఇందులో ఏడాదిలో ఉపయోగించిన యూనిట్లకు 10 శాతం చేర్చి యూనిట్లను నిర్ణయిస్తారన్నారు. ప్రగతి పరిశీలన సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి వివరించారు. సమావేశంలో ఎమ్మెల్యే కె.ఎస్.బసవంతప్ప, లతా మల్లికార్జ్ను, బి.దేవేంద్రప్ప, కేపీటీసీఎల్ ఎండీ డాక్టర్ ఎన్.శివశంకర్, జెడ్పీ సీఈఓ సురేశ్ బి.హిట్నాళ్, అదనపు జిల్లాధికారి పీ.ఎస్.లోకేశ్, జెస్కాం కమీషనర్ ఇంజినీర్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. సేద్యానికి 7 గంటలు, గృహ, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ జెడ్పీ ప్రగతి పరిశీలన సమావేశంలో ఇంధన శాఖ మంత్రి జార్జి -
అంగన్వాడీ కేంద్రంలో బాలిక మృతి
సాక్షి,బళ్లారి: అంగన్వాడీ కేంద్రంలో ఆటలాడుతూ ఓ చిన్నారి మృతి చెందిన ఘటన కొప్పళ జిల్లా కుష్టిగి తాలూకా బళూటగిలో జరిగింది. గ్రామానికి చెందిన అలియా మహమ్మద్ రియాజ్(5) అనే బాలిక అంగన్వాడీ కేంద్రంలో ఆటలాడుతున్న సమయంలో కుప్పకూలి పోయింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లే లోపు బాలిక మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. బాలిక మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నేడు వెట్టిచాకిరీ నిషేధంపై సదస్సు హుబ్లీ: జిల్లా యంత్రాంగం, జెడ్పీ, జిల్లా న్యాయసేవా ప్రాధికార, వివిధ శాఖల సంస్థల ఆధ్వర్యంలో వెట్టిచాకిరీ నిర్మూలన దినం సందర్భంగా వెట్టిచాకిరీ నిషేధ సదస్సును బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు జెడ్పీ సభాంగణంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని జిల్లా న్యాయసేవా ప్రాధికార సభ్యత్వ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి పరశురామ దొడ్డమని ప్రారంభిస్తారు. కార్యక్రమంలో జిల్లాధికారిణి దివ్య ప్రభు, జెడ్పీ సీఈఓ భునేష్ పాటిల్, పోలీస్ కమిషనర్ శశికుమార్, ఎస్పీ డాక్టర్ గోపాల్ బ్యాకోడ, ఏడీసీ గీతా సీడీ తదితరులు పాల్గొంటారు. ముక్తి అలయన్స్ కర్ణాటక సర్లిన్ య్యాథోని, ధార్వాడ కిడ్స్ సేవా సంస్థ డైరెక్టర్ అశోక్ యరగట్టి మానవ సంపన్మూల వ్యక్తిగా పాల్గొని శిక్షణ ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. పౌష్టికాహార కిట్లలో అక్రమాలు తగదు హుబ్లీ: అంగన్వాడీ పిల్లలకు ఇవ్వాల్సిన పౌష్టికాహారం కిట్లను కాంగ్రెస్ నేత అక్రమంగా నిల్వ చేయడం తగదని, ఈ ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి దీని వెనుక ఉన్న వారిని గుర్తించి దోషులను శిక్షించాలని వీఐకే ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బీజేపీ యువ నేత వెంకటేష్ కాట్వే డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ అంగన్వాడీ చిన్నారుల ఆహార పదార్థాలను నల్లబజారుకు తరలించడం సిగ్గుచేటు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంతరాజ్ నివేదిక అమలుకు డిమాండ్రాయచూరు రూరల్: రాష్ట్రంలో వెనుక బడిన వర్గాలకు రిజర్వేషన్ల పెంపుదల విషయంలో జస్టిస్ కాంతరాజ్ నివేదికను అమలు చేయాలని వెనుక బడిన వర్గాల కమిటీ అధ్యక్షుడు శాంతప్ప పేర్కొన్నారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 2023లో అధికారం చేపడితే కాంతరాజ్ కమిషన్ నివేదికను అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇంతవరకు ఆ దిశగా స్పందించ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేసినా నిధులు మంజూరు చేయడంలో నిర్లక్ష్యం వహించడాన్ని ఖండించారు. స్వసహాయ సంఘాలకు లాభాలు పంపిణీబళ్లారిఅర్బన్: ధర్మస్థల గ్రామీణ అభివృద్ధి పథకం స్వసహాయ సంఘాలకు లాభాల వాటా పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా డైరెక్టర్ రోహితాక్ష ప్రారంభించారు. నగరంలోని గాంధీనగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లాభాల వాటాను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. గ్రామీణ బ్యాంకుల్లో స్వసహాయ సంఘాల సీసీ ఖాతాలను ప్రారంభించి ప్రతివారం చెల్లించిన పొదుపుపై లాభాలను కల్పించే కీలక పాత్ర పోషిస్తున్న శ్రీక్షేత్రధర్మస్థల గ్రామాభివృద్ధి పథకం దేశానికే ఆదర్శం అన్నారు. ఆ మేరకు జిల్లా పరిధిలో మొత్తం 8409 స్వసహాయ సంఘాలకు రూ.12 కోట్ల 36 లక్షల లాభాల వాటా పంపిణీ చేశామన్నారు. బళ్లారి తాలూకా పరిధిలో 1345 సంఘాలకు మొత్తం రూ.2 కోట్ల 8 లక్షల లాభాల వాటా మంజూరైందన్నారు. బళ్లారి నగర జోన్లో 165 సంఘాలకు రూ.31.16 లక్షల లాభాల వాటా పంపిణీ చేశామన్నారు. కర్ణాటక గ్రామీణ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకుల్లో స్వసహాయ సంఘాల సభ్యుల నుంచి మొత్తం రూ.12.81 కోట్లను పొదుపు చేశారన్నారు. బళ్లారి–1, బళ్లారి–2, సిరుగుప్ప, సింధనూరు, కంప్లి, సండూరు ఇలా ఆరు పథకాల కార్యాలయాల పరిధిలో స్వసహాయ సంఘాలకు ఆ బ్యాంకుల ద్వారా అతి తక్కువ 14 శాతం వడ్డీ ధరతో ప్రగతి నిధి రుణాలను ఇచ్చామన్నారు. దీని వల్ల ఆ సంఘా సభ్యులు ఆర్థిక స్వావలంబన సాధించి మెరుగైన జీవితం గడుపుతున్నారన్నారు. ఆ సంఘం ప్రముఖులు వెంకటేష్ పటగార్, సంజీవ్కుమార్, వనిత, దుర్గమ్మ పాల్గొన్నారు. సేంద్రియంపై పరిశోధనలేవీ? రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో విద్యార్థులు సేంద్రియ వ్యవసాయంపై పరిశోధనలు జరపాలని వైస్ చాన్సలర్ హనుమంతప్ప పేర్కొన్నారు. మంగళవారం రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చీ, భూసేన మాదిరి నమూనా సమ్మేళనాన్ని ప్రారంభించి విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నూతన సాంకేతిక రంగాలను అభివృద్ధి పరచుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్న వ్యవసాయ అంశాలను రైతులకు వివరించాలన్నారు. సమావేశంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గురునాథ్, వీరనగౌడ, దేశాయి, ప్రమోద్ కట్టిమని, అధికారులు పాల్గొన్నారు. -
తాగునీటి ఎద్దడి నివారించండి
రాయచూరు రూరల్: నగర వాసులకు వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాంపుర బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను పరిశీలించిన అనంతరం వారు మాట్లాడారు. సగానికి పైగా నగర ప్రజలు తుంగభద్ర కాలువ నీటిపై ఆధారపడ్డారన్నారు. నగరానికి వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు రాంపుర బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద అదనంగా 10 ఎకరాల స్థలంలో నూతనంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి సర్వే చేయాలని ఆదేశించారు. కృష్ణ, తుంగభద్ర కాలువల నుంచి లింక్ చేసి నీటిని నింపాలన్నారు. జిల్లాధికారి నితీష్, కమిషనర్ జుబిన్ మహాపాత్ర, ఏసీ గురుసిద్దయ్య, సభ్యులు జయన్న, రమేష్, నేతలు రవీంద్ర, హరిబాబు, తిమ్మారెడ్డి, నరసింహులు, బసవరాజ్, అమరేగౌడ, శాంతప్ప, యల్లప్ప, మునిస్వామి పాల్గొన్నారు. -
కూలి కార్మికులకు రైతన్న విమాన భాగ్యం
సాక్షి,బళ్లారి: విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా సిరిగినహళ్లిలో ఓ రైతు తన పొలంలో వ్యవసాయ పనులు చేసే మహిళా కూలీ కార్మికులకు విమానంలో ప్రయాణించే భాగ్యాన్ని రైతు కల్పించారు. గ్రామానికి చెందిన విశ్వనాథ్ అనే రైతు తోటలో నిత్యం కూలీ పనులు చేసే మహిళా కూలీలు తమ మనసులోని మాటను పంచుకున్నారు. తమకు విమానంలో ప్రయాణించాలని ఆశగా ఉందని చెప్పుకోవడంతో నిత్యం పొలంలో పనులు చేస్తూ సహాయం అందిస్తున్న కూలీ కార్మికులకు సదరు రైతు శివమొగ్గ నుంచి గోవా వరకు విమానంలో ప్రయాణించేందకు తానే మొత్తం ఖర్చులు భరించి కూలీ కార్మికుల ఆశను నెరవేర్చడంతో మహిళా కూలీ కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్లో మహిళా కూలీకార్మికులు రైతుతో కలిసి తీసుకున్న ఫోటో వైరల్గా మారింది. జిల్లాధికారి కార్యాలయంలో సహాయవాణి ప్రారంభం హుబ్లీ: రాష్ట్రంలో వీఏఓల సమ్మె ఫలితంగా కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల పంపిణీలో జాప్యం జరుగుతోంది. దీంతో విద్యార్థులకు పరీక్షలు, నియామక ఉద్దేశాల కోసం సత్వరంగా ప్రమాణ పత్రాలను పొందే దిశగా స్పందనకు జిల్లాధికారి కార్యాలయంలో సహాయవాణిని ప్రారంభించారు. సదరు ఆదాయ పత్రం తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే విద్యార్థులు, ప్రజలు జిల్లా ఏజేఎస్ కన్వీనర్ను 8277862923, లేదా 08362233880 నెంబరులో సంప్రదిస్తే తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి కుల ఆదాయ ధృవీకరణ పత్రం పంపిణీలో జరిగే జాప్యాన్ని నివారిస్తారని జిల్లాధికారిణి దివ్యప్రభు ఏ ప్రకటనలో తెలిపారు. వీఏఓల సమ్మెకు మద్దతు బళ్లారిటౌన్: రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్లను పరిష్కరించాలని గ్రామ పాలన అధికారులు(వీఏఓలు) చేపడుతున్న సమ్మెకు డాక్టర్ అంబేడ్కర్ సంఘర్షణ సమితి మద్దతు తెలిపింది. మంగళవారం జిల్లాధికారి కార్యాలయం ఎదుట ధర్నాకు కూర్చొన్న ఆందోళన కారుల సమ్మెకు మద్దతు తెలిపి సమితి నేతలు మాట్లాడారు. వీఏఓలు రైతుల సంక్షేమం కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. వారు కోరుతున్న న్యాయసమ్మతమైన డిమాండ్లను కల్పించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. సమితి సంస్థాపక అధ్యక్షుడు మహేష్ కురువళ్లి, ఉపాధ్యక్షుడు కేఎం.మల్లేశ్, వెంకటేష్, పదాధికారులు విశ్వనాథ్, కొర్లగుంది పంపాపతి, చంద్రశేఖర్, హిమంత్రాజ్ తదితరులు పాల్గొన్నారు. జానపద కళలపై అవగాహన అవసరం హుబ్లీ: పిల్లలకు జానపద కళలు, సాహిత్యంపై అవగాహన అవసరమని రాజ్యోత్సవ ప్రశస్తి విజేత ఇమామ్ సాబ్ వల్లప్పనవర తెలిపారు. కర్ణాటక విద్యావర్థక సంఘంలో ప్రజ్వల ఔత్సాహిక కన్నడ, కొంకణి కళా సంఘం ధార్వాడ, కన్నడ సంస్కృతి శాఖ సహకారంతో జానపద సంభ్రమ, షహనాయి వాదన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. జానపద నిపుణులు డాక్టర్ రాము ముళగి మాట్లాడుతూ పాశ్చాత్య సంస్కృతిని అధిగమించి నిలదొక్కుకునే శక్తి జానపద కళకు మాత్రమే ఉందన్నారు. యువతలో జానపదం గురించి అవగాహనకు ప్రయోగాత్మక శిక్షణ చాలా అవసరం అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రకాష్ మల్లిగె వాడ, జానపద విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ షాజహాన ముదకవి, శ్రీధర్ భజంత్రి, రవి కులకర్ణి, స్నేహ మహలే తదితరులు పాల్గొన్నారు. పక్షులకు నీటి తొట్టెల ఏర్పాటు రాయచూరు రూరల్: నగర ప్రాంతాల్లో ప్రాణి పక్షులకు తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలని అస్కిహాళ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయిని విజయలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని వన సిరి ఫౌండేషన్, అస్కిహాళ యూకో క్లబ్ల ఆధ్వర్యంలో అస్కిహాళ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల చుట్టు పక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న చెట్లు, కొండలు, గుట్టల్లో వేసవి కాలంలో నీటి దాహం తీరడానికి నీటి తొట్టెలు ఏర్పాటు చేశారన్నారు. భవిష్యత్లో ఎండవేడిమి నుంచి రక్షణకు ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు చెట్లు పెంచి పరిసరాలను సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో సమితి నేతలు ప్రకాష్ పాటిల్, సునీల్, పాఠశాల ఉపాధ్యాయులున్నారు. -
సిడిబండి రథోత్సవంపై సమీక్ష
బళ్లారిటౌన్: మార్చి 11న జరగనున్న కనకదుర్గమ్మ దేవస్థానం సిడిబండి రథోత్సవాన్ని వైభవంగా జరపాలని సిటీ ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి సూచించారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయం సభాంగణంలో జరిగిన ముందస్తు సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ఉత్సవాలను సంప్రదాయ బద్ధంగా జరుపుకోనేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి లోపదోషాలు లేకుండా చూడాలన్నారు. దీని కోసం గాణిగ సముదాయం సలహాలు పొందాలని దేవస్థానం ఈఓను ఆదేశించారు. ఈ ఉత్సవాలకు సుమారు 4 లక్షల మంది భక్తాదులు రావచ్చని, వీరందరికీ తాగునీరు, వాహనాల పార్కింగ్, విద్యుత్ సదుపాయం, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. తాగునీటి కోసం అన్ని ఏర్పాట్లు జిల్లాధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా మాట్లాడుతూ భక్తాదులు తాగునీటి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అన్నదాసోహ కార్యక్రమానికి ఆహార ధాన్యాలను పరీక్షించాలని ఆరోగ్య అధికారులకు సూచించారు. దేవస్థానం చుట్టు పక్కల ఎప్పటికప్పుడు పరిశుభ్రత కాపాడాలని మహనగర పాలికె అధికారులు సూచించారు. ఇదే దిశలో వివిధ అధికారులకు కూడా వారివారి కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ డాక్టర్ శోభారాణి, పాలికె మేయర్ ముల్లంగి నందీష్, దేవస్థాన ఈఓ హనుమంతప్ప పాల్గొన్నారు. 11న వైభవంగా నిర్వహించండి సిటీ ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి -
ప్రత్యేక గిరిజన హాస్టళ్లు మంజూరు చేయండి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో వెనుక బడిన జిల్లాల్లో గిరిజన పిల్లలకు ప్రత్యేక హాస్టళ్లను మంజూరు చేయాలని గిరిజన వర్గాల కమిటీ అధ్యక్షుడు రాజేంద్ర పేర్కొన్నారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రారష్ట్ర ప్రభుత్వం 2023లో అధికారం చేపట్టిన వెంటనే గిరిజన అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసినా నిధులు కేటాయించక పోవడాన్ని ఖండించారు. అత్యధికంగా కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో రాయచూరు జిల్లాలో అధిక భాగం గిరిజన ప్రజలు నివాసం ఉంటున్నారన్నారు. వారికి మౌలిక సౌకర్యాలు కల్పించడంలో అలసత్వం చూపుతున్నారన్నారు. అంబేడ్కర్ కార్మిక సహాయ హస్త పథకం ద్వారా 20 అసంఘటిత కార్మికులకు పరిహారం అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. -
తుపాకీతో ఆటలు.. బాలుని దుర్మరణం
మండ్య: కోళ్ళ ఫారంలో తుపాకీ పేలి నాలుగేళ్ల బాలుడు చనిపోగా, అతని తల్లి గాయపడింది. జిల్లాలోని నాగమంగళ తాలూకాలోని దూందేమాదనహళ్ళి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ విషాద సంఘటన జరిగింది. నరసింహమూర్తి అనే వ్యక్తి కోళ్ల ఫారం నడుపుతున్నాడు. పశ్చిమ బెంగాల్కు చెందిన కుటుంబం ఇందులో నివసిస్తూ ఫారంలో పని చేస్తోంది. సదరు మహిళ లిపిక, కొడుకు అభిజిత్ (4), మరో బాలుడు సుదీప్ దాస్(15) ఆడుకుంటూ ఉన్నారు. ఫారం యజమానికి చెందిన సింగిల్ బ్యారెల్ తుపాకీతో సుదీప్దాస్ ఆడుకుంటూ ట్రిగ్గర్ నొక్కడంతో తూటా పేలింది. తూటా రవ్వలు ఎదురుగా ఉన్న లిపిక, అభిజిత్కు తగలగా అభిజిత్ తీవ్ర గాయాలై చనిపోయాడు. మహిళను ఆస్పత్రికి తరలించారు. నాగమంగల పోలీసులు పరిశీలించి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు. దొంగనోట్లు మార్చబోయి.. శివాజీనగర: ఇటీవల ఆడుగోడిలోని ఓ షాపులో నకిలీ నోట్ల మార్పిడికి ప్రయత్నించి ముగ్గురు ప శ్చిమ బెంగాల్ కార్మికులు పోలీసుల చేతికి చిక్కారు. నిందితులు సుమన్, గులామ్, మరొకరు కలిసి గౌహతి ఎక్స్ప్రెస్ రైలు ద్వారా బెంగళూరుకు భవన నిర్మాణ పని కోసం వస్తుండగా, రైలు టాయ్లెట్లో నకిలీ నోట్లు ఉన్న బ్యాగ్ దొరికింది. దానిని తమతో పాటు బెంగళూరుకు తీసుకొచ్చారు. తరువాత ఆడుగోడికి చెందిన సురేశ్ అనే వ్యక్తి అంగడికి వెళ్లి రూ.70 వేల నకిలీ నోట్లను ఇచ్చి, కమీషన్ పట్టుకుని, తమ ఖాతాలోకి జమ చేయాలని కోరారు. సురేశ్ నగదును లెక్కించేటపుడు నోట్ల సీరియల్ నంబర్ ఒకటే ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఉప్పందించాడు, నిందితులను ప్రశ్నించగా రైలు– బ్యాగు కథ చెప్పారు. ఇది విశ్వసించని పోలీసులు బెంగాల్కు నిందితులను తీసుకెళ్లి వారి ఇళ్లలో తనిఖీలు చేయాలని నిర్ణయించారు. అన్నదాత శ్రమ ఆహుతి మండ్య: రాగి గడ్డి వాము మంటల్లో చిక్కుకుని రూ.75 వేల విలువ చేసే రాగులు, గడ్డి బూడిదయ్యాయి. నాగమంగల తాలూకాలోని కరడహళ్ళిలో ఈ ప్రమాదం జరిగింది. రైతు రామేగౌడ పొలంలో రాగి పంట పండించాడు. సుమారు ఐదు ట్రాక్టర్ల రాగి పైరును కోసి వాము వేశాడు. ఆదివారం సాయంత్ర మంటలు అంటుకొన్నాయి. రైతులు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. ఫైర్ సిబ్బంది వచ్చి ఆర్పివేసేటప్పటికి బూడిద మిగిలింది. ఎంతో నష్టం జరిగిందని బాధిత రైతు విలపించాడు. పాటిల్ అలకపాన్పు.. ఈసారి మంచి పోస్టు యశవంతపుర: కర్ణాటక ప్రణాళికా విభాగం ఉపాధ్యక్షునిగా ఆళంద కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయనకు మంత్రి హోదా కల్పిస్తూ, వారికి లభించే అన్ని సౌకర్యాలను తక్షణం ఇవ్వాలని ఆ ఆదేశాల్లో సూచించారు. బీఆర్ పాటిల్ సీఎం సిద్దరామయ్య రాజకీయ సలహాదారు పదవిలో ఉండేవారు. మంత్రి పదవి కోరుకున్న ఆయనకు నిరాశే మిగిలింది. దీంతో నియోజకవర్గ అభివృద్ధికి నిధులు రావడం లేదు, అన్నీ గ్యారంటీ పథకాలకే ఖర్చయిపోతున్నాయని ఆరోపించి గత నెలలో సలహాదారు పదవికి రాజీనామా చేశారు. దీంతో సిద్దరామయ్య అయనను బుజ్జగించి ఈ స్థానాన్ని కట్టబెట్టారు. చిన్నారికి ఉరివేసి, తల్లి ఆత్మహత్య దొడ్డబళ్లాపురం: భర్తపై కోపంతో ఓ భార్య చిన్నారి కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరులోని బాగలగుంటలో చోటుచేసుకుంది. శృతి (33), కుమార్తె రోహిణి (5)ని మొదట ఫ్యాన్కు ఉరివేసి హత్య చేసి తరువాత అదే ఫ్యాన్కు తానూ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. శృతి తుమకూరు జిల్లా పావగడ తాలూకా గుండారహళ్లి గ్రామపంచాయతీ అధ్యక్షురాలు కావడం గమనార్హం. ప్రస్తుతం భర్త, ఆడిటర్ గోపాలక్రిష్ణతో కలిసి బాగలగుంటలో నివసిస్తోంది. భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఎంత చెప్పినా తన మాట వినడం లేదని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు శృతి డెత్ నోట్ రాసింది. బాగలగుంట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
భవనం పై నుంచి భార్యను పడేసి హత్య
బొమ్మనహళ్లి: భార్యకు మతిస్థిమితం సరిగా లేదని ఆమెను భవనం పై నుంచి కిందకు పడేసి హత్య చేశాడో కిరాతక భర్త. బెంగళూరు నగర జిల్లాలోని ఆనేకల్ తాలూకాలోని సర్జాపుర వద్ద తిగరచౌడెదేనహళ్ళిలో జరిగింది. మృతురాలు మంజుల (40). భర్త మంజునాథ్ పాల వ్యాపారి. కొంతకాలంగా మంజులకు మానసిక ఆరోగ్యం సరిగా లేదు. దీంతో మంజునాథ్ ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. ఆదివారం రాత్రి భార్యను భుజంపైకి ఎక్కించుకొని నిర్మాణంలో ఉన్న భవనం ఎక్కాడు. రెండవ అంతస్తు పై నుంచి కిందకి పడేశాడు, తీవ్ర గాయాలై ఆర్తనాదాలు చేయగా స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే చనిపోయింది. సర్జాపుర పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి మంజునాథ్ను అరెస్టు చేశారు. హత్య దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. -
నేత్రపర్వంగా అంజన్న రథోత్సవం
హొసపేటె: తాలూకాలోని లోకికెరె గ్రామంలో వెలసిన ఆంజనేయ స్వామి రథోత్సవం ఆదివారం సాయంత్రం వేలాది మంది భక్తుల సమక్షంలో నేత్రపర్వంగా జరిగింది. ఆలయ నుంచి ఉత్సవ మూర్తిని పల్లకీ ద్వారా సకల వాయిద్యాలతో రథంపైకి తీసుకొచ్చి మూడుసార్లు ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఉత్తవమూర్తిని రథంలో ప్రతిష్టించి లాగడంతో తరలివచ్చిన భక్తులు హర్షం వ్యక్తం చేశారు. రథానికి ఉత్తత్తి, అరటిపండ్లు, తరిగిన మిరియాలను భక్తి అంకితం చేశారు. రథాన్ని పాదాల వరకు లాగి తిరిగి మూలస్థానానికి తీసుకొచ్చారు. నందిధ్వజ కుణిత, సామల, హలగె, ఉరుమె తదితర జానపద వాయిద్యాలు రథోత్సవానికి శోభను చేకూర్చాయి. రథోత్సవానికి ముందు ఉదయం గ్రామస్తుల సమక్షంలో ఆలయంలో పూజలు నిర్వహించారు. ఉదయం 11 గంటలకు బసవేశ్వర స్వామి ఉచ్ఛాయం జరిగింది. రథోత్సవంలో తాలూకా చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కానాహొసహళ్లి స్టేషన్ ఎస్ఐ సిద్రామ బిదారాణితో పాటు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
బిదరి కళాకారుడు కన్నుమూత
యశవంతపుర: సీనియర్ బిదరి లోహ కళాకారుడు మహమ్మద్ అబ్దుల్ రౌఫ్ (60) గుండెపోటుతో బీదర్లోని తమ నివాసంలో కన్నుమూశారు. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న గురుకుల యోజనలో భాగంగా వెయ్యి మంది నిరుద్యోగులకు లోహంతో బొమ్మలను తయారు చేయాలో శిక్షణనిచ్చి ఉపాధిని చూపారు. ఆయన లోహంతో కళాకృతులను చేయడంలో సిద్ధహస్తుడు. అప్పటి రాష్ట్రపతులు అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీల నుంచి అవార్డులను అందుకున్నారు. రౌఫ్ చేసిన కళాకృతులను అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఒరాక్ ఒబామాలకు బహుమతిగా అందించారు. -
జూన్, జూలైలో స్థానిక ఎన్నికలు
యశవంతపుర: వచ్చే జూన్, జూలై మాసంలో తాలూకా, జిల్లా పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు లిఖితపూర్వకంగా తెలిపింది. సోమవారం జరిగిన విచారణలో ప్రభుత్వ న్యాయవాది శశికిరణ్ శెట్టి హాజరై మే నెలలో టీపీ, జడ్పీ స్థానాల రిజర్వేషన్లను ప్రకటించి, జూన్, జూలై నెలల్లో ఎన్నికలను నిర్వహిస్తామని తెలిపారు. మూడేళ్ల నుంచి టీపీ, జడ్పీ ఎన్నికలను నిర్వహించలేదు. ఎన్నికల సంఘం న్యాయవాది ఫణీంద్ర.. ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రకటిస్తే ఎన్నికలను జరపడానికి ఈసీ సిద్ధమని తెలిపారు. -
జాగృతితో రోడ్డు ప్రమాదాలకు చెక్
రాయచూరు రూరల్: రోడ్డు ప్రమాదాల నియంత్రణలో ప్రజల పాత్ర ముఖ్యమని ఎస్పీ పుట్టమాదయ్య పేర్కొన్నారు. సోమవారం పాత జిల్లాధికారి కార్యాలయం వద్ద రోడ్డు సురక్షతా సప్తాహ– 2025 కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. వాహనాలను నడిపే ముందు రోడ్లలో ప్రయాణించే సమయంలో సంచార నియమాలను, తగిన జాగ్రత్తలను పాటించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో ప్రచారం చేయడానికి జాగృతి జాతాను నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్టీఓ వినయ్ కాటికోర్, ఏఆర్టీఓ సిబ్బంది శివశంకర్, సిద్దయ్య స్వామి, సుధా పరిమళ, అర్జున్, జీనత్ సాజిద్, హుసేన్, సయ్యద్ సాజిద్లున్నారు. -
నౌకా స్థావరంలో విచారణ
యశవంతపుర: ఉత్తరకన్నడ జిల్లా కార్వార వద్ద గల భారతీయ నౌకాదళ స్థావరం ఐఎన్ఎస్ కదంబలో ఎన్ఐఎ అధికారులు ముగ్గురు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం స్థావరానికి చేరుకొని విచారించారు. 2024 ఆగస్ట్లో ఎన్ఐఎ అధికారులు మొదటిసారి ఇక్కడ విచారణ జరిపారు. ముదగాద వేతన్ తండేల్, తోడూరు సునీల్, అక్షయ్ నాయక్ అనేవారు ఇక్కడ కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరు కార్వార, గోవాకు చెందినవారు. స్థావరానికి సంబంధించిన ఫోటోలు, ముఖ్యమైన సమాచారాన్ని ఇతరులకు చేరవేశారని ఆరోపణలు వచ్చాయి. ఆ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ముగ్గురు నిందితులను విచారించి నోటీసులిచ్చారు. వరుసగా ఏడు కార్లు ఢీ దొడ్డబళ్లాపురం: బెంగళూరు– మంగళూరు రహదారిలో ఆదివారం అర్ధరాత్రి వాహనాలు వరుసగా ఢీకొన్న ప్రమాదంలో 7 కార్లు ధ్వంసమయ్యాయి. చోలగెరె టోల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ కొత్తగా టోల్గేట్ ఏర్పాటు చేయడం వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. వేగంగా వచ్చిన ఒక కారు ముందు ఉన్న కారును ఢీకొనడంతో ఒకదానికొకటి 7 కార్లు గుద్దుకొని ధ్వంసమయ్యాయి. కార్లలోని కొందరికి చిన్న చిన్న గాయాలయ్యాయి. దీంతో ఈ మార్గంలో కాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆలూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈదఫా రూ.8 లక్షల కోట్ల బడ్జెట్! ● మార్చి 7న సమర్పణ: సీఎం శివాజీనగర: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 3వ తేదీ నుంచి ఆరంభం కానున్నాయి. మార్చి 7న సీఎం సిద్దరామయ్య బడ్జెట్ను ప్రకటిస్తారు. సోమవారం విధానసౌధలో విలేకరులతో మాట్లాడిన సిద్దరామయ్య, తొలిరోజున గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడతారని, గవర్నర్ ప్రసంగంపై అసెంబ్లీలో మూడు రోజులు చర్చ జరుగుతుందని తెలిపారు. 7న అసెంబ్లీలో తాను బడ్జెట్ను సమర్పిస్తానని చెప్పారు. ఆర్థిక శాఖను కూడా చూస్తున్న సిద్దరామయ్య బడ్జెట్ను ప్రకటించడం ఇది 16 వ సారి. ఈసారి బడ్జెట్ పరిమాణం రూ. 8 లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపారు. గతంలో ఎప్పుడూ కూడా ఇంత మొత్తంలో బడ్జెట్ లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఐదు గ్యారంటీలు అమలులో ఉన్నాయి. ఇంకా కొత్త సంక్షేమ పథకాలు ప్రకటిస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. రైతులకు పెద్దపీట: సీఎం శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లను నెరవేరుస్తుంది, ఎప్పటికీ రైతులకు అనుకూలంగా ఉంటామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. సోమవారం విధానసౌధలో రైతు సంఘాల ప్రతినిధులు, నాయకులతో రాష్ట్ర బడ్జెట్ ముందస్తు సమావేశం నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ అత్యధిక ఉద్యోగాలు సృష్టి అయ్యేది వ్యవసాయంలోనే. అందుచేత రైతుల డిమాండ్లకు ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. రైతులకు కావాల్సిన సహాయం, కార్యక్రమాల గురించి రైతు నేతలు వినతి పత్రాన్ని సమర్పించారు. మైక్రో ఫైనాన్స్ల బలవంతపు వసూళ్ల వేధింపులను అరికట్టాలన్నారు. మారమ్మదేవికి విశేష పూజలుబొమ్మనహళ్లి: బెంగళూరు బొమ్మనహళ్ళి నియోజకవర్గం హెచ్ఎస్ఆర్ లేఔట్ పరంగిపాళ్యలో గ్రామదేవత మారమ్మదేవికి సోమవారం విశేష పూజలు చేశారు. ఉదయం అభిషేకం, అలంకరణ గావించారు. అమ్మవారికి అక్షింతలతో పాటు పూలతో ముస్తాబు చేశారు. పెద్దసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. -
గురుకుల భవనానికి భూమిపూజ
కోలారు : వృద్ధాప్యంలో తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపరాదని సమాజ సేవకుడు సీఎంఆర్ శ్రీనాథ్ తెలిపారు. వృద్ధులను ఇంట్లోనే పెట్టుకుని పోషించే మనోభావాన్ని పిల్లలు పెంచుకోవాలన్నారు. ఆదివారం తాలూకాలోని నేర్నహళ్లి ద కింగ్ డం ఎడ్యుకేషన్ ట్రస్టు నుంచి నూతనంగా రూ.2.25 కోట్ల వ్యయంలో నిర్మిస్తున్న శ్రీసత్యసాయి బాబా గురుకుల కట్టడ పనులను ప్రారంభించి మాట్లాడారు. అనివార్య కారణాలతో వృద్ధాప్యంలో ఉన్న వారిని వారి కుటుంబ సభ్యులు పోషించడానికి నిరాకరించిన సందర్భాల్లో వృద్ధాశ్రమాలు వారికి ఆసరా ఇచ్చి ప్రశాంత జీవితాన్ని అందిస్తున్నాయన్నారు. నేర్నహళ్లి సమీపంలో కరోనా కష్ట కాలంలో సత్యసాయి వృద్ధాశ్రమం, యోగా, ధ్యాన మందిరం ప్రారంభించి నేడు 50 మందికి పైగా వృద్ధులకు ఆశ్రయం ఇస్తున్న సురేష్కుమార్ కుటుంబం చేస్తున్న సేవలు శ్లాఘనీయమన్నారు. ప్రస్తుతం అనాథ పిల్లల కోసం గురుకులం ప్రారంభిస్తున్నారన్నారు. సత్యసాయి వృద్ధాశ్రమ సంస్థాపకుడు సురేష్కుమార్, జేడీఎస్ నాయకుడు బణకనహళ్లి నటరాజ్, సమృద్ధి సుధాకర్, రామాంజినప్ప పాల్గొన్నారు. -
భూ సమస్యలు తీర్చాలని రైతుల ధర్నా
కోలారు: భూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం పదాధికారులు సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. సంఘం రాష్ట్ర కార్యాధ్యక్షుడు అబ్బణి శివప్ప మాట్లాడుతూ జిల్లాలో రైతులు అంతర్జాలం సాయంతో ఉత్తమ పంటలను పండిస్తున్నారు. ప్రభుత్వ గోమాళం భూములను పలువురు రైతులు సాగు చేసుకుంటూ వాటిని తమ పేరు మీద ఖాతా చేసి ఇవ్వాలని దరఖాస్తు చేసుకుని ఏళ్లు గడిచినా ఇంతవరకు ప్రభుత్వం రైతుల డిమాండ్లను పట్టించుకోవడం లేదన్నారు. భూ మంజూరు సమితి లబ్ధిదారులను ఎంపిక చేసినా అర్జీలను సరిగా పరిశీలించకుండా వాటిని తిరస్కరించడం ఎంతవరకు సమంజసమన్నారు. అర్జీలను తిరస్కరించడానికి తగిన కారణాలు కూడా అధికారులు తెలపడం లేదన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు బేడశెట్టిహళ్లి రమేష్ మాట్లాడుతూ రైతులకు మంజూరు చేసిన భూములను కొలతలు వేయడం ద్వారా పి– నెంబర్లను తొలగించి కొత్త సర్వే నెంబర్లు ఇవ్వాలని, బగర్హుకుం సాగు రైతులకు భూములను ఖాతాలు చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో హసిరు సేన రాష్ట్ర సంచాలకుడు కె.ఆనంద్కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిసనహళ్లి బైచేగౌడ, మహిళా సంచాలకురాలు రాధమ్మ తదితరులు పాల్గొన్నారు. -
పెట్టుబడి.. రూ. 5 కోట్ల బురిడీ
వృద్ధురాలి డిజిటల్ అరెస్టు, రూ. 42 లక్షలకు పైగా లూటీ బనశంకరి: సిలికాన్ సిటీలో సైబర్ నేరాల గురించి పోలీసులు ఎంత జాగృతం చేసినప్పటికీ ప్రజలు మోసపోతూనే ఉన్నారు. దుండగులు సోషల్ మీడియాలో చురుకుగా ఉన్న వారికి గాలంవేసి నగదు దోచేస్తున్నారు. హొసకెరెహళ్లి రంజిత్ అనే వ్యక్తి పెట్టుబడి డబుల్ అని ఆశపడి రూ.5 కోట్లు పోగొట్టుకున్నారు. బ్యాటరాయనపుర రెడ్డి లేఔట్లో అధ్యాపకురాలి నుంచి రూ.7.76 లక్షలు దోచేశారు. మరొక వృద్ధురాలిని డిజిటల్ అరెస్టు చేసి రూ. 43 లక్షల వరకూ టోపీ వేశారు. 1 కోటికి రూ.2 కోట్లు ఇస్తామని హొసకెరెహళ్లి రింగ్రోడ్డు నివాసి రంజిత్ సోషల్ మీడియాలో షేర్మార్కెట్ ఔత్సాహికుల కోసం గాలించాడు, అతడికి ఫైనాన్స్ సర్వీస్ వెబ్సైట్లో మోసగాళ్లున జి.తుషీత్, మంగుకియా, జుహి వీ.పాటిల్, డీ.జడేజా అనేవారు పరిచయమయ్యారు. రంజిత్ను సీ–606 అనే వాట్సాప్ గ్రూప్లో వంచకులు చేర్చారు. గ్రూప్లో జడేజా అనే వ్యక్తి పెట్టుబడి సమాచారం పోస్టు చేసేవాడు. కోటి రూపాయలు పెట్టుబడిపెడితే కొద్దిరోజుల్లో రూ.2 కోట్లు ఇస్తామని ఆశచూపించేవారు. వంచకుల మాటలు నమ్మిన రంజిత్ డిసెంబరు 28 నుంచి ఫిబ్రవరి 8వ తేదీ వరకు తన బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ.5.2 కోట్లు జమచేశాడు. ప్రతిఫలంగా రూ.12.93 కోట్లు ఇస్తామని వంచకులు హామీ ఇచ్చారు. రంజిత్ నగదు వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించగా కొన్ని కోట్ల రూపాయల సేవా పన్ను చెల్లించాలని సూచించారు. ఎంత అభ్యర్థించినా వారు పట్టించుకోలేదు. దీంతో ఇది స్కాం అని గుర్తించి బెంగళూరు దక్షిణ విభాగం సీఈఎన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విచారించిన పోలీసులు బాధితుడు ఏయే ఖాతాలకు నగదు పంపిందీ ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అధ్యాపకురాలికి రూ.7.76 లక్షలు బ్యాటరాయనపుర రెడ్డి లేఔట్లో నివసించే అధ్యాపకురాలు ఎంసీ లక్ష్మీప్రియాకు షేర్లు– పెట్టుబడి పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.7.76 లక్షలు మోసగించారు. ఆమెను స్నేహ అగర్వాల్ అనే యువతి ఓ వాట్సాప్ గ్రూపులో చేర్చింది. తరువాత సిద్దార్థ్ అనే వ్యక్తి ఫోన్ చేసి ఏఐ పాలసీ ఉందని, పెట్టుబడిపెడితే కొద్దిరోజుల్లో రెట్టింపు డబ్బు వస్తుందని నమ్మించాడు. ప్రారంభంలో కొద్దిగా నగదు పెట్టుబడి పెట్టింది, హెచ్ఈం యాప్ ద్వారా లాభం వచ్చినట్లు చూపించారు. వేర్వేరు షేర్లలో నగదు పెట్టుబడి పెట్టాలని చెప్పగా ఆమె జనవరి 24 తేదీ నుంచి ఫిబ్రవరి 7 వరకు ఐఎంపీఎస్ ఆర్టీజీఎస్ , నెఫ్ట్ ద్వారా రూ.7.76 లక్షలు నగదు జమచేసింది. ఆ తరువాత స్పందన లేకపోవడంతో పశ్చిమ విభాగం సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. సిలికాన్ సిటీలో బడా సైబర్ మోసం మరో ఇద్దరు మహిళలకు రూ.50 లక్షకు పైగా టోపీసీబీఐ ముసుగులో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోనికి రూ.42.85 లక్షలు వంచన చేశారు. బాధితురాలు హుడి సర్కిల్ నివాసి కేఎన్.సావిత్రి (77), ఆమెకి దుండగులు కాల్ చేసి మీపై అక్రమ నగదు బదిలీ కేసు నమోదైందని, బ్యాంక్ అకౌంట్ పరిశీలించాలని డిజిటల్ అరెస్టు అని బెదిరించారు. ఆమె ఖాతా వివరాలను చెప్పడంతో రూ.42.85 లక్షలు నగదు లాగేసుకున్నారు. బాధితురాలు వైట్ఫీల్డ్ సైబర్క్రైం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మొదట ఆమెకు ఫోన్ చేసి ట్రాయ్ అధికారినని దుండగుడు చెప్పాడు, మీ పేరుతో అక్రమ మార్కెటింగ్ మెసేజ్లు పలువురికి వెళ్లాయని, ఫిర్యాదులు రాగా ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపాడు. ఈ కేసులో మీకు సహాయం చేస్తానని, ముంబై పోలీసులకు కనెక్షన్ కలుపుతానని చెప్పాడు. తరువాత గుర్తుతెలియని వ్యక్తులు ఆమెకు ఫోన్ చేసి తాము సీబీఐ అధికారులమని, మీ వాంగ్మూలం నమోదు చేయాలని చెప్పారు. ఈ తతంగంతో వృద్ధురాలు హడలిపోయి వారు చెప్పినట్టల్లా చేసింది, చివరకు బ్యాంకు ఖాతాల నుంచి రూ.42.85 లక్షలు దోచుకుని ఫోన్లు బంద్ చేసుకున్నారు. సైబర్ ఠాణా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
మృత్యుశకటమైన లారీ
దొడ్డబళ్లాపురం: లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. దొడ్డ తాలూకా మాకళి వద్ద సోమవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. బెంగళూరు–హిందూపురం రహదారి మార్గంలోని మాకళి వద్ద పెట్రోల్ ట్యాంకర్ లారీ, కారు ఎదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో కారులో ఉన్న బెంగళూరు కోణనకుంటకు చెందిన వసంత్, ఆవలహళ్లికి చెందిన చేతన్ గాయాలతో మరణించారు. కిరణ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గౌరిబిదనూరు నుంచి కారులో వస్తుండగా లారీ మృత్యుశకటంలా ఎదురొచ్చింది. కారు ఒకవైపు నుజ్జునుజ్జయింది. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కారును ఢీ, ఇద్దరు మృతి దొడ్డ వద్ద యాక్సిడెంటు -
హక్కుల రక్షణపై అప్రమత్తంగా ఉండండి
రాయచూరు రూరల్: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల, సాంఘీక సంక్షేమ హాస్టళ్లలో పిల్లల హక్కుల రక్షణ చట్టాన్ని అనుసరించి అధికారులు అప్రమత్తంగా మెలగాలని కర్ణాటక రాష్ట్ర పిల్లల హక్కుల రక్షణ చట్టం కమిషన్ అధ్యక్షుడు కె.నాగనగౌడ సూచనలు జారీ చేశారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాల విద్యార్థులపై లైంగిక దాడులు, రోడ్డు ప్రమాదాలు, వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘటనలపై అధికారులతో చర్చించారు. పిల్లల హక్కుల రక్షణ చట్టం–2016ను అధికారులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఆర్టీఓ అధికారులు వాహనాలను పరిశీలించాలన్నారు. ఆర్టీసీ అధికారులు విద్యార్థులకు, గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ పుట్టమాదయ్య, అదనపు ఎస్పీ హరీష్, డీఎస్పీ సత్యనారాయణ, అమరేష్లున్నారు. -
ప్రధానోపాధ్యాయునికి సన్మానం
హొసపేటె: ఇటీవల రాష్ట్ర స్థాయి గ్రామీణ విద్యారత్న అవార్డు పొందిన జిల్లాలోని హూవినహడగలి తాలూకా లింగనాయకనహళ్లి తండాలోని ప్రభుత్వ జూనియర్ ప్రాథమిక పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు చంద్రానాయక్ను క్షేత్ర విద్యాశాఖాధికారి, పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు సోమవారం ఘనంగా సన్మానించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుల సమావేశానికి విచ్చేసిన బీఈఓ మహేష్ పూజారి ఆయనను సన్మానించారు. ఇదే సమయంలో ఆయన మాట్లాడుతూ విద్యారత్న అవార్డు రావడం మనందరికీ సంతోషకరమైన విషయమన్నారు. ఇదే సందర్భంగా గ్రామ నాయకులు, ఎస్డీఎంసీ అధ్యక్షులు, సభ్యులు, గ్రామ సభ్యులు, పాఠశాల పూర్వ విద్యార్థులను అభినందించారు. జీఆర్.పీటీ సభ్యుడు సోమప్పగౌడ, ఎస్డీఎంసీ అధ్యక్షుడు హాల్యానాయక్, ఉపాధ్యాయుడు వీరేష్, నాయకులు రాజానాయక్, చిన్నప్ప కత్తి, ఆనందనాయక్, వెంకటేష్, తారానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మరణంలోనూ వీడని బంధం
హుబ్లీ: దాంపత్యంలో అన్యోన్యంగా దాదాపు 60 ఏళ్ల పాటు బతుకు నెట్టుకొచ్చిన ఆ వృద్ధ దంపతులు కష్టాలు, కన్నీళ్లలోనే కాదు మరణంలోను ఒకరికొకరు తోడు అంటూ ఇద్దరు ఒకే రోజే పరమపదించారు. ధార్వాడ సమీపంలోని దేవరహుబ్బళ్లి గ్రామానికి చెందిన రైతు దంపతులు ఈశ్వర అరేర (82), ఆయన సతీమణి పారవ్వ అరేర(73) సోమవారం తెల్లవారు జామున తమ నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. నలుగురు కుమార్తెలు, 12 మంది మనవళ్లుతో నిండు సంసారంతో పాటు అపారమైన బంధుమిత్రులను ఈ దంపతులు విడిచి వెళ్లారు. గత కొన్ని నెలల నుంచి పారవ్వ వయో సహజ అనారోగ్య సమస్యలతో బాధపడుతుండేది. ఆదివారం రాత్రి కూడా ఎంచక్కగా ఇద్దరూ కలిసి భోజనం చేసి అందరికీ చెప్పి పడుకున్నారు. అయితే సూర్యదయం తోటే ఇద్దరు మృతి చెందారు. బతుకు సమరంలోనే కాక చావులోనూ ఒక్కటిగా నిలిచిన ఈ దంపతులను చూసి ఆ గ్రామస్తులంతా కన్నీరు మున్నీరయ్యారు. సోమవారం వీరి అంత్యక్రియలు నెరవేర్చారు. తోడునీడగా బతికారు.. చివరికి తోడుగానే ఈ లోకం నుంచి నిష్క్రమించారు.. -
వాహనదారుకు సంకటం
సాక్షి,బళ్లారి: ఎవరూ అడిగే వారు లేకపోతే ఏ రంగంలోనైనా మోసాలు షరా మామూలే. ఇటీవల పెట్రోలు బంకు యజమానులు లేదా పెట్రోలు సరఫరా చేసే కంపెనీలో తెలియదు కాని, పవర్ పెట్రోలు బంకు పేరుతో అధిక ధరలు ప్రకటించి మరీ వినియోగదారుల నుంచి గుంజుతున్నారు. ప్రతి నిత్యం, ప్రతి ఇంటా పెట్రోలు లేకపోతే ఏ పని గడవని నేటి రోజుల్లో పెట్రోలు బంకుల్లో పవర్ పెట్రోలు పేరుతో లీటరుకు రూ.7లకు పైగా పెంచుతూ వినియోగదారులను ముంచుతున్నారు. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న వందలాది పెట్రోలు బంకుల్లో నెలలో కనీసం రెండు రోజులు లేదా మూడు రోజులు పవర్ పెట్రోలు వేస్తున్నట్లు బోర్డులు పెట్టి మరీ వసూలు చేస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వం నిర్ణయించిన లీటరు పెట్రోలు ధర రూ.104 అయితే పవర్ పెట్రోలు వేస్తున్నామని వినియోగదారుల నుంచి ఏకంగా రూ.111లకు పైగా వసూలు చేస్తున్నారు. దీంతో గత్యంతరం లేక ద్విచక్ర వాహనాల్లో వెళ్లేవారు, కార్లలో వెళ్లేవారు పవర్ పెట్రోలు వేయించుకుంటున్నారు. అసలే కొన్ని పెట్రోలు బంకుల్లో ప్రతి లీటరులో కూడా కనీసం 100 ఎంఎల్ తక్కువ వేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం పవర్ పెట్రోలును తెరపైకి తెస్తూ మోసాలు చేస్తున్నారు. ధర ఎడాపెడా పెంచుతున్న ప్రభుత్వాలు ప్రభుత్వాలు జీఎస్టీ పేరుతో విపరీతంగా పెట్రోలు ధరను పెంచుతూ వినియోగదారుల నడ్డి విరుస్తున్నాయి. కర్ణాటకలో రూ.100లు లీటరు పెట్రోలు ధర ఉండగా, ఏడాది క్రితం లీటరకు రూ.4లు పెంచడంతో ప్రభుత్వం నిర్ణయించిన పెట్రోలు ధర లీటరు రూ.104కు చేరుకుంది. పెట్రోలు ధరలు పెంచడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో పెట్రోలు బంకు యజమానులు పవర్ పెట్రోలు వేస్తున్నామని చెబుతూ లీటరుకు రూ.7ల ధరను అధికంగా పెంచడంతో వినియోగదారులు ఎవరికి చెప్పుకోవాలో దిక్కు తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇక బంకు యజమానులు ఆడిందే ఆట పాడిందే పాటగా పెట్రోలు ధరలను ఎడాపెడా పెంచుకుంటూ పెద్ద ఎత్తున, గుట్టు చప్పుడు కాకుండా అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పవర్ పెట్రోలు నిరంతరంగా వేయించుకుంటేనే వాహన ఇంజన్లకు బాగుంటుందని, ఎప్పుడో ఒకసారి వేయించుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదని పెట్రోలు బంకుల్లో పనిచేసే నిపుణులు కూడా చెబుతున్నారు. ఈనేపథ్యంలో ఎవరి స్వప్రయోజనాల కోసం పవర్ పెట్రోలును నెలలో మూడు రోజులు పెట్రోలు బంకులు సరఫరా చేస్తున్నాయని వినియోగదారులు ఽమండిపడుతున్నారు. ఏ పెట్రోలో ఎలా తెలుస్తుంది? పవర్ పెట్రోలు బోర్డులు పెట్టిన వారు అసలు పవర్ పెట్రోలు వేస్తున్నారా లేక మామూలు పెట్రోలు వేస్తున్నారో వినియోగదారులకు ఎలా తెలుస్తుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెలలో మూడు రోజుల పాటు పవర్ పెట్రోలు పేరుతో పెద్ద ఎత్తున వినియోగదారుల జేబులకు చిల్లులు పడేలా చేస్తున్నారని, ఇది పెద్ద ఎత్తున మోసం అంటూ వినియోగదారులు బాహాటంగా పెట్రోలు బంకుల వద్ద గొడవలు పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మీ ఇష్టమైతే వేయించుకోండి, లేకపోతే వెళ్లిపోండి అని కూడా పెట్రోలు వేసే వారు చెబుతుంటారు. దీనికి ఒకటే కారణమని, పెట్రోలు అయిపోయిన తర్వాత వాహనం బంకు వద్దకు వస్తే ఎంత ధర అయినా పెట్రోలు పోసుకుని వెళతారని వారికి తెలుసు కాబట్టి తమ మోసాలను ఎవరూ అడగరని ధీమాతో ధర పెంచేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సంబంధిత అధికారులకు మామూళ్లు ఇస్తూ పవర్ పెట్రోలు పేరుతో వినియోగదారులకు మోసం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు తనిఖీ చేసి వినియోగదారులకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ పెట్రోలు పేరుతో బంకుల్లో మోసాలకు పాల్పడుతున్న వైనం ఎప్పుడో ఒకసారి వేయించుకుంటే వృథా అంటున్న నిపుణులు బంకు యజమానుల తీరుపై వినియోగదారుల మండిపాటు -
ఎలుగుబంటి దాడిలో రైతుకు గాయాలు
హుబ్లీ: పొలానికి వెళ్లిన రైతన్నపై ఎలుగుబంటి దాడికి తీవ్రంగా గాయపడిన ఘటన జిల్లాలోని కలఘటిగి తాలూకా ఇతేనహళ్లి తాండాలో చోటు చేసుకుంది. ఆ తాండ నివాసి మారుతీ రామప్ప రాథోడ(56) ఎలుగుబంటి దాడికి గురైన వ్యక్తి. ఆయన పంటపై దాడి చేస్తున్న కోతులను వెంటపడి తరుముతుండగా ఎలుగుబంటి ఆకస్మికంగా దాడి చేసింది. దీంతో ఆయన తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. తక్షణమే ఆయన్ను కలఘటిగి తాలూకా ఆస్పత్రిలో చేర్పించి ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన చికిత్సకు హుబ్లీ కేఎంసీ ఆస్పత్రికి తరలించారు. అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఇచనహళ్లి గ్రామానికి వెళ్లి పరిశీలించారు. బాధిత రైతుకు అటవీ శాఖ ద్వారా పరిహారం ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అడవి అంచున పొలాలు ఉన్న రైతులు అటవీ జంతువుల రాకపోకలపై జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా సంచరించరాదు. జంతువుల గురించి తెలిసిన వెంటనే అటవీ శాఖ అధికారులకు తెలియజేయాలని ఆ జోన్ అటవీ అధికారి అరుణ్కుమార్ తెలిపారు. వేమన రెడ్డి మండలిని ఏర్పాటు చేయండి రాయచూరు రూరల్: రాష్ట్రంలో వేమన రెడ్డి సమాజం అభివృద్ధికి వేమన రెడ్డి అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసి, బడ్జెట్లో రూ.1000 కోట్ల నిధులు కేటాయించాలని తాలూకా వేమన రెడ్డి సమాజం ఉపాధ్యక్షుడు లక్ష్మీకాంతరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మండలిని ఏర్పాటు చేసి సత్వరం అధ్యక్షుడి నియామకానికి చర్యలు తీసుకోవాలన్నారు. 2014లో సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉండగా మండలిని ఏర్పాటు చేసి నిధులు ప్రకటించారని గుర్తు చేశారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతం వారికి అధ్యక్ష పదవిని కేటాయించాలని ఒత్తిడి చేశారు. పెద్దకర్మకు వచ్చి.. ఇద్దరు మృత్యు ఒడికిహుబ్లీ: అవ్వ పెద్దకర్మ కార్యాన్ని ముగించుకొని తిరిగి వస్తున్న వేళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతి చెందిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. స్థానిక కేశ్వాపుర గాంధీవాడ నివాసి వికాస్ గోన (21), తన అవ్వ పెద్దకర్మ కార్యానికి సుజీత్ మోండ(17)తో కలిసి ద్విచక్రవాహనంలో వెళ్లారు. తిరిగి కార్యం ముగించుకొని వచ్చేటప్పుడు విద్యానగర్ సిరియూరు పార్కు వద్ద రోడ్డుపై ఉన్న మిట్టపై నియంత్రణ కోల్పోయి జంప్ అయి రోడ్డు పక్కన ఉన్న గ్రిల్కు ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడిన వీరిని కేఎంసీ ఆస్పత్రిలో చేర్పించినా ఫలితం దక్కలేదు. ఉత్తర ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. బైక్, బొలెరో ఢీ.. ఇద్దరు మృతి చెళ్లకెరె రూరల్: బైక్, బొలెరో పికప్ వాహనం ఢీకొనడం వల్ల ఇద్దరు స్థలంలోనే మృతి చెందిన ఘటన చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ తాలూకా హాగలకెరె వద్ద ఆదివారం రాత్రి జరిగింది. మృతులను బైక్ నడుపుతున్న శివణ్ణ(53), నాగరాజ్ (45)గా గుర్తించారు. వీరిది చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా వడ్డరహళ్లి. ఘటన స్థలానికి శ్రీరామపుర పోలీస్ స్టేషన్ సబ్ఇన్స్పెక్టర్ మధు, పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. శ్రీరామపుర పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వైభవంగా నీరమాన్వి యల్లమ్మ దేవి రథోత్సవం రాయచూరు రూరల్: మాన్వి తాలూకా నీరమాన్విలో యల్లమ్మ దేవి జాతర వైభవంగా జరిగింది. సోమవారం వేలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం నిర్వహించారు. రాయచూరు, లింగసూగూరు, సింధనూరు, మాన్వి, ఆదోని, కర్నూలు, హైదరాబాద్, బళ్లారి, మహబూబ్నగర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జయదేవకు సన్మానం కోలారు: బంగారుపేటెలో జరిగిన రేణుకా యల్లమ్మ జాతర మహోత్సవంలో కోలారు జిల్లా సవదత్తి రేణుకా యల్లమ్మ బళగ గౌరవ అధ్యక్షుడు కె జయదేవ్ సమాజానికి అందించిన సేవలను గుర్తించి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీ ఎం.మల్లేష్బాబు, బంగారుపేటె ఎమ్మెల్యే ఎస్ఎన్ నారాయణస్వామి, మాజీ ఎంపీ ఎస్.మునిస్వామి, మాజీ ఎమ్మెల్యే బీపీ వెంకటమునియప్ప తదితరులు పాల్గొన్నారు. -
ఫుట్పాత్ దుకాణదారుల ర్యాలీ
రాయచూరు రూరల్: జాతీయ రహదారిలో ఉన్న పుట్పాత్ దుకాణాలను తొలగించడం తగదని వీధి వ్యాపారుల సంఘం డిమాండ్ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో గౌరవాధ్యక్షుడు అమరేష్ మాట్లాడారు. రాయచూరు– హైదరాబాద్ జాతీయ రహదారిలో ఫుట్పాత్లపై వెలసిన, నిర్మించుకున్న దుకాణాల తొలగింపునకు సిటీ కార్పొరేషన్ అధికారులు శ్రీకారం చుట్టారన్నారు. ముందుగా వ్యాపారులకు తగిన పరిహారం అందించాలన్నారు. ప్రైవేట్ బ్యాంకుల్లో తీసుకున్న అప్పులను తీర్చడానికి ఇబ్బందిగా మారిందన్నారు. వీధుల్లో పుట్పాత్ వ్యాపారులకు పరిహారం, ప్రత్యామ్నాయం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. విద్యార్థులకు శాపంగా ఫ్లైయాష్ వాహనాలు రాయచూరు రూరల్: కాడ్లూరు నుంచి విద్యనభ్యసించడానికి శక్తినగర్కు వచ్చే విద్యార్థులకు ఫ్లైయాష్ వాహనాలు శాపంగా పరిణమించిన ఘటన సోమవారం శక్తినగర్ వద్ద చోటు చేసుకుంది. శక్తినగర్, అరషిణిగి, కారేకల్, రంగాపూర్, వడగేర, దేవదుర్గ తదితర చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విద్యార్థులు సంచరించడానికి ఇబ్బందికరంగా మారింది. ఈ ప్రాంతంలో ఫ్లైయాష్ను తరలించే వాహనాలు ఈ దారిలోనే సంచరించడంతో ఇరువైపుల దారి చిన్నదిగా మారి ప్రయాణానికి ఇబ్బందులు కలుగుతున్నాయి. ఫ్లైయాష్ను తరలించే వాహనాలు ఇష్టమొచ్చినట్లు నిలపడంతో పాఠశాల, కళాశాలకు వెళ్లే విద్యార్థులు నడుచుకుంటూ వెళ్లారు. కుంటలతో నీటి ఎద్దడి దూరంరాయచూరు రూరల్: తాలూకాలోని గ్రామాల్లో వేసవిలో నీటి ఎద్దడి నివారణకు నీటి గుంటలే శరణ్యం అవుతున్నాయి. జాతీయ గ్రామీణ ఉద్యోగ ఖాత్రి పథకం(నరేగ)లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామాల్లో వ్యవసాయ నీటి కుంటలు తవ్వారు. దీంతో గ్రామంలో వేసవిలో నరేగ పథకంలో గ్రామీణ కూలీకార్మికుల సంఘం కూలీలకు తాగునీటి ఎద్దడి, పఽశువులకు, పక్షులకు తాగడానికి అవకాశం కలిగింది. కూలీ కార్మికులు చేసిన పనికి సరైన కూలీ డబ్బులు చెల్లించక పోవడాన్ని కూలీలు తప్పుబడుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన దాని కంటే అధిక మొత్తంలో గుంతలను తవ్వారు. నేడు గ్రామాల్లో ఆ కుంటలు అందరినీ ఆకట్టుకున్నాయి. సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి డిమాండ్ రాయచూరు రూరల్: మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో సింథటిక్ ట్రాక్ నిర్మాణం చేపట్టాలని మాజీ శాసన సభ్యుడు, జిల్లా అథ్లెటిక్ సంఘం అధ్యక్షుడు పాపారెడ్డి పేర్కొన్నారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 2001–02లో సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి రూ.2.91 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. అనంతరం ప్రభుత్వం ఆ నిధులను ఉపసంహరించుకున్నారన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు సింథటిక్ నిర్మాణానికి నిధులు విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతకు ఈడీ నోటీసులు? రాయచూరు రూరల్ : కాంగ్రెస్ పార్టీ వెనుక బడిన వర్గాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ.మారెప్పకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు సమా చారం అందింది. బెంగళూరు ఈడీ కార్యాలయం నుంచి చరవాణిలో ఇందుకు సంబంధించి సంభాషణ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత ఏడాది నుంచి బెంగళూరులో సొంత పనులపై ఉంటున్న నేపథ్యంలో అక్రమ ఆస్తులను గడించినట్లు సమాచారం అందుకున్న అధికారులు నోటీసులు పంపించడానికి సమాచారం అడిగినట్లు తెలిసింది.