breaking news
Kavin
-
ఓటీటీలోకి ఫాంటసీ రొమాంటిక్ కామెడీ సినిమా
తెలుగులో కమర్షియల్ సినిమాలు ఎక్కువ. తమిళ, మలయాళంలో మాత్రం చాలావరకు డిఫరెంట్ కాన్సెప్ట్ కథలతో మూవీస్ తీస్తుంటారు. దీంతో వీటిని మన ఆడియెన్స్ కూడా ఎంకరేజ్ చేస్తుంటారు. అలా ఇప్పుడు ఓ తమిళ ఫాంటసీ రొమాంటిక్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ముద్దు బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా సంగతేంటి? ఎందులోకి రానుందనే చూద్దాం.'పాపా', 'బ్లడీ బెగ్గర్' లాంటి డబ్బింగ్ మూవీస్తో తెలుగులోనూ కాస్త గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో కవిన్. ఇతడి లేటెస్ట్ సినిమా 'కిస్'. ప్రీతి ఆస్రానీ హీరోయిన్. సెప్టెంబరు 19న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తమిళంలో మాత్రం దీన్ని విడుదల చేశారు. ఇప్పుడు ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్పై క్లారిటీ ఇచ్చేశారు. నవంబర్ 7 నుంచి జీ5లో అందుబాటులోకి రానుందని పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: నటిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ చిన్న కూతురు)'కిస్' విషయానికొస్తే.. చిన్నప్పుడే తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో.. నెల్సన్(కవిన్) తల్లి దగ్గర పెరుగుతాడు. ప్రేమ, రొమాన్స్ లాంటివి ఇతడికి అస్సలు తెలీదు. ఓ రోజు అనుకోకుండా నెల్సన్ చేతికి ఓ పుస్తకం వస్తుంది. దీని ద్వారా అద్భుతమైన పవర్ వస్తుంది. ఎవరైనా ఇతడి ముందు ముద్దు పెట్టుకుంటూ కనిపిస్తే వాళ్ల భవిష్యత్ ఏంటనేది ఇతడికి తెలిసిపోతుంది. అదే టైంలో తనకు బుక్ ఇచ్చిన సారా(ప్రీతి ఆస్రానీ) భవిష్యత్ ఏంటో నెల్సన్కి తెలుస్తుంది. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ప్రస్తుతానికి తమిళ వెర్షన్ మాత్రమే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నప్పటికీ.. త్వరలో తెలుగు డబ్బింగ్ కూడా తీసుకొచ్చే అవకాశముంది. రొమాంటిక్ జానర్ మూవీస్ అంటే ఇష్టముంటే దీనిపై ఓ లుక్కేయండి. ఇకపోతే ఈ వారం ఓటీటీల్లోకి ఇడ్లీ కొట్టు, లోక ఛాప్టర్ 1, కాంతార ఛాప్టర్ 1 సినిమాలు వచ్చాయి. వీటితో పాటు డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు అనే తెలుగు సిరీస్ ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి. ఇవి కాకుండా తలవర అనే మలయాళ మూవీ కూడా బాగుంది. (ఇదీ చదవండి: బుల్లితెర నటి చెల్లితో ఆర్జే సూర్య ఎంగేజ్మెంట్) -
డాడా హీరో కొత్త మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?
డాడా చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు హీరో కెవిన్ (Kavin). అయితే ఆ తర్వాత నటించిన బ్లడీ బెగ్గర్, ఇటీవల విడుదలైన కిస్ చిత్రాలు ఈయన్ని పూర్తిగా నిరాశపరిచాయి. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మాస్క్. ఆండ్రియా హీరోయిన్గా నటించారు. అంతేకాకుండా ఈమె చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం కావడం విశేషం. ఇందులో మరో హీరోయిన్గా రుహాని శర్మ కూడా నటించారు. చార్లీ, రమేష్ తిలక్, కల్లూరి విను, అర్చన చాందోక్ తదితరులు ముఖ్యపాత్రులు పోషించారు. దర్శకుడు వెట్రిమారన్ మెంటార్గా వ్యవహరిస్తున్న ఈ మూవీ ద్వారా విక్రమన్ అశోక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని, ఆర్డీ రాజశేఖర్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ 21వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్ర పోస్టర్ ఇటీవల దీపావళి సందర్భంగా విడుదల చేయగా మంచి స్పందన తెచ్చుకుంది. ఈ చిత్ర ఓటీటీ హక్కులను జీ 5 సంస్థ, ఆడియో హక్కులను టి సిరీస్ సంస్థ పొందినట్లు చెప్పారు. ఇది పూర్తిగా చెన్నై నేపథ్యంలో సాగే డార్క్ కామెడీ కథాచిత్రంగా ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Kavin M (@kavin.0431) చదవండి: కొద్దిరోజులుగా మాస్క్తోనే రష్మిక.. కారణం ఇదేనా..?


