Khammam District Latest News
-
చెరువు ఆక్రమణలపై డిజిటల్ సర్వే
నేలకొండపల్లి: మండలంలోని చెరువుమాధారం చెరువు శిఖం కబ్జా అవుతోందన్న ఫిర్యాదుతో అధికారులు రంగంలోకి దిగారు. చెరువు శిఖాన్ని పూర్తిస్థాయిలో సర్వే చేసి హద్దులు నిర్ధారించాలని మత్స్యపారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు ఖాసిం, ఉపాధ్యక్షులు ధీరావత్ రాధాకృష్ణమూర్తి, బలరాం ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. చెరువు విస్తీరణంపై ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు చెబుతున్న లెక్కలకు పొంతన లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కలెక్టర్ సూచనల మేరకు రెవెన్యూ, ఇరిగేషన్, మత్స్య శాఖ అధికారులు శుక్రవారం సంయుక్తంగా సర్వే చేపట్టారు. పడవ ద్వారా చెరువులోకి వెళ్లి డిజిటల్ సర్వే చేశారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ ఏడీ జి.శివప్రసాద్ మాట్లాడుతూ చెరువు శిఖం ఆక్రమణకు గురైనట్లు తేలినా, చేపల కుంటలు నిర్మించినట్లు గుర్తించినా బాధ్యులకు నోటీసులు ఇచ్చి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. కాగా, చికెన్ వ్యర్ధాలను చెరువులో వేసే వారిపైనా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఈ నరేష్, సర్వేయర్ మధుమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
సంక్షోభంలోకి వ్యవసాయ రంగం
ఖమ్మంరూరల్: కార్పొరేట్ శక్తులకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటున్న పాలకులు వ్యవసాయ రంగాన్ని మాత్రం సంక్షోభంలోకి నెడుతున్నారని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు విమర్శించారు. రూరల్ మండలం ఆరేకోడులో శుక్రవారం జరిగిన ఏఐకేఎస్ సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రధాని మోదీ పాత విధానంలోనే ముందుకెళ్తూ కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెడుతున్నారని ఆరోపించారు. ఇకనైనా రైతుల సమస్యలపై స్పందించి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2లక్షల వరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని, రైతుభరోసా నగదు జమ చేయాలని, ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని సమావేశంలో తీర్మానించగా, 21మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. సీపీఐ రాష్ట్ర కంట్రోల కమిషన్ చైర్మన్ ఎండీ.మౌలానాతో పాటు దండి సురేష్, మిడకంటి చినవెంకటరెడ్డి, పగిళ్ల వీరభద్రం, గోవిందరావు, పుచ్చకాయల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులు, అధ్యాపకుల వెంటే ఉంటున్నా..
ఖమ్మం సహకారనగర్/కొత్తగూడెంఅర్బన్: నిరంతరం ఉపాధ్యాయులు, అధ్యాపకుల వెంటే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పాటుపడుతున్నానని వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు. ఖమ్మం, కొత్తగూడెంలోని టీఎస్ యూటీఎఫ్ కార్యాలయాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. 2019లో ఎమ్మెల్సీగా గెలిచాక సీపీఎస్ రద్దు, పెండింగ్ డీఏలు, ఈ–కుబేర్లో పెండింగ్ బిల్లుల విడుదల కోసం ధర్నాల్లో సైతం పాల్గొన్నట్లు చెప్పారు. అలాగే, గురుకులాల ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు, కేజీబీవీ ఉపాధ్యాయులకు వేతనం పెంపు, బదిలీలకు కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్సీగా తనకు కేటాయించిన రూ.9 కోట్ల నిధులను అదనపు తరగతి గదుల నిర్మాణానికి కేటాయించానని వెల్లడించారు. ఈ మేరకు 27న జరగనున్న ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని, తద్వారా మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లింపు, హెల్త్ కార్డులు, పదోన్నతులతో పాటు ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి పాటుపడతానని తెలిపారు. టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విజయ్ మాట్లాడగా యూటీఎఫ్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు, ఏవీ నాగేశ్వరరావు, వెంగళరావుతో పాటు జీవీ నాగమల్లేశ్వరరావు, చావా దుర్గాభవాని, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి -
హమాలీ కార్మికులను ఆదుకోవాలి
ఖమ్మంమయూరిసెంటర్: కేంద్రప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చే విధానాలు మానుకుని బస్తాలు మోసే హమాలీల సంక్షేమంపై దృష్టి సారించాలని టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం, తెలంగాణ ప్రగతిశీల హమాలీ–మిల్లు వర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. యూనియన్ నాలుగో రాష్ట్ర మహాసభలు ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. తొలుత నగరంలో ప్రదర్శన నిర్వహించగా, సమావేశంలో సూర్యం, శ్రీనివాసరావు మాట్లాడారు. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. కార్మికులకు కేంద్ర, రాష్ట్ర పాలకులు ఎలాంటి చట్టబద్దమైన హక్కులు కల్పించకపోవడంతో శ్రమదోపిడీకి గురవుతున్నారని తెలిపారు. ఇకనైనా కార్మికుల సంక్షేమం, హక్కుల కల్పనకు సమగ్ర చట్టాన్ని రూపొందించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పీఎఫ్ అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఈ సభలో టీయూసీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జి.రామయ్య, నాయకులు ఆవుల అశోక్, యాకూబ్షావలీ, ఎస్.కిరణ్ మాట్లాడగా ఏ.వెంకన్న, జక్కుల యాకయ్య, గొల్ల సీతారాములు, ఎం.నరసింహులు, ఎన్.శ్రీనివాసులు, ఏ.అంజనేయులు, కె.లక్ష్మణ్, కె.శ్రీనివాస్, కె.పుల్లారావు, బొమ్మకంటి రమేష్, నవీబాయి, గోపాల్, లూథర్, జగన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం -
పనులు లేక, పస్తులు ఉండలేక..
నేలకొండపల్లి: ఉన్న ఊరిలో పనులు లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఎదురవడంతో తట్టుకోలేక పలువురు వ్యవసాయ కూలీలు వలస బాట పడుతున్నారు. కుటుంబాలతో ఇళ్లకు తాళాలు వేసి పనులు వెతుక్కుంటూ వెళ్లిపోతున్నారు. మండలంలోని బైరవునిపల్లి నుంచి సుమారు పది కుటుంబాలు ఇప్పటికే వలస వెళ్లినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. గ్రామంలో ఉపాధి హమీ పథకం పనులు ప్రారంభించకపోవడం, కొంతకాలం ఇతర ప్రాంతాల్లో మిర్చి ఏరేందుకు వెళ్లినా ఆ పనులూ ముగియడంతో ఇబ్బంది పడుతున్నారు. ఈనేపథ్యాన కూలీలు కుటుంబాలతో సహా హైదరాబాద్, విజయవాడ ఇతరత్రా ప్రాంతాలకు వెళ్లారు. మరికొందరు వెళ్లిపోకముందే అధికారులు స్పందించి స్థానికంగా పనులు కల్పించాలని పలువురు కోరుతున్నారు.వలస బాట పడుతున్న కూలీజనం -
వచ్చేనెల 7న వకుళామాత స్టేడియం ప్రారంభం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో గ్రామానికి చెందిన తుళ్లూరు కోటేశ్వరరావు–నిర్మల సమకూర్చిన నిధులతో వకుళామాత స్టేడియాన్ని నిర్మించారు. శ్రీవారి కల్యాణం నిర్వహణకు నిర్మించిన ఈ స్టేడియాన్ని వచ్చే నెల 7వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రచారా నికి రూపొందించిన పోస్టర్లను శుక్రవారం జమలాపురం ఆలయంలో కోటేశ్వరరావు దంపతులు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి ఆవిష్కరించారు. అర్చకులు రాజీవ్శర్మ, సీనియర్ అసిస్టెంట్ సోమయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిర్ణయంతో ‘రియల్’ రంగానికి జీవం
ఖమ్మంరూరల్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించేలా రాయితీ ప్రకటించడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగానికి ఊపిరిలూదినట్లయిందని రియల్ ఎస్టేట్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. ఈసందర్భంగా ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట క్రాస్లో శుక్రవారం అసోసియేషన్ బాధ్యులు గరికపాటి ఆంజనేయప్రసాద్, తుంపాల కృష్ణమోహపన్ మాట్లాడారు. గత ఎనిమిదేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కావడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. రూ.కోట్ల విలువైన వెంచర్లు చేసినా 2020లో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయొద్దని ఇచ్చిన ఆదేశాలతో ప్లాట్లు అమ్ముకోలేకపోయామని చెప్పారు. ఎల్ఆర్ఎస్ రూపేణా నగదు చెల్లించినా సమస్య పరిష్కారం కాక హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంటే, సుప్రీంకోర్టుకు వెళ్లి అడ్డంకులు సృష్టించారన్నారు. ఈనేపథ్యాన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి రాయితీ ప్రకటించడంతో రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడిన వారికి భరోసా కల్పించినట్లయిందని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలపడంతో చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అసోసియేషన్ నాయకులు కిషోర్, మన్నేటి నాగేశ్వరరావు, షాబాదు మాధవరెడ్డి, ఉప్పుగుండ్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
అథ్లెట్ను అభినందించిన కలెక్టర్
ఖమ్మం స్పోర్ట్స్: ఇటీవల జరిగిన జాతీయస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్, 38వ జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన అథ్లెట్ ఎ.మైథిలిని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ శుక్రవారం అభినందించారు. ఆమె జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ మీట్లో ఒక స్వర్ణం, రెండు రజత పతకాలు, 38వ జాతీయ క్రీడల్లో కాంస్య పతకం సాధించడం జిల్లాకే గర్వకారణమని తెలిపారు. డీవైఎస్ఓ టి.సునీల్కుమార్రెడ్డి, కోచ్లు ఎం.డీ.గౌస్, ఎం.డీ.అక్బర్ అలీ, అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.డీ.షఫీక్ అహ్మద్లు పాల్గొన్నారు. ఎక్స్గ్రేషియా చెక్కులు అందించిన సీపీ ఖమ్మంక్రైం: అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన కొణిజర్ల పోలీస్స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఇ.లోకేశ్తోపాటు ఏఆర్ కానిస్టేబుల్ ఐ.బాలరాజు కుటుంబాలకు మంజూరైన భద్రతా ఎక్స్గ్రేషియా చెక్కులను పోలీసు కమిషనర్ సునీల్దత్ అందజేశారు. రూ.8లక్షల చొప్పున చెక్కులను శుక్రవారం అందించిన ఆయన శాఖాపరంగా ఎలాంటి సహకారం కావాలన్నా అందుబాటులో ఉంటామని భరోసా కల్పించారు. అదనపు డీసీపీ నరేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. సెమీస్ దశకు చేరిన క్రికెట్ టోర్నీ ఖమ్మం స్పోర్ట్స్: రాజీవ్గాంధీ స్మారక క్రికెట్ టోర్నీ సెమీస్ దశకు చేరింది. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతున్న టోర్నీ లో భాగంగా శుక్రవారం క్వార్టర్ ఫైనల్స్ నిర్వహించారు. ఈమేరకు ఖమ్మం అర్బన్, నేలకొండపల్లి, కల్లూరు, మణుగూరు జట్లు ప్రత్యర్థి జట్లపై విజయం సాధించి సెమీస్లోకి ప్రవేశించాయి. తొలుత మ్యాచ్లను డాక్టర్ ప్రవీణ్కుమార్ ప్రారంభించగా టోర్నీ నిర్వాహకులు ఎండీ.మతిన్తో పాటు సిద్ధు, నాగేశ్వరరాజు, జావెద్, ఇబ్రహీం, వెంకటేష్, అంజలి పాల్గొన్నారు. ‘మెటా ప్లస్’ బాధితుల ఆందోళన ఖమ్మంక్రైం: రెట్టింపు డబ్బు అందుతుందని చెప్పి మోసం చేసిన మేటా ప్లస్ సంస్థ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు శుక్రవారం ఖమ్మం వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈమేరకు పలువురు మాట్లాడుతూ నవీన్, నజీర్ మెటా ప్లస్ను దుబాయి కంపెనీగా చెబుతూ పెట్టుబడి పెడితే పది నెలలో రెట్టింపు వస్తుందని ఆశ చూపారని తెలిపారు. అంతేకాక దుబాయి, గోవా పర్యటనకు తీసుకెళ్తామనడంతో భారీగా పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు ముఖం చాటేరని ఆరోపించారు. ఇదేమిటని నవీన్, నజీర్ను అడిగితే రౌడీషీటర్లతో బెదిరిస్తున్నారని తెలిపారు. ఈమేరకు పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరారు. కాగా, ఈ అంశంపై విచారణ చేస్తున్నామని వన్టౌన్ సీఐ ఉదయ్కుమార్ తెలిపారు. క్షుద్రపూజలు చేశారని ఆందోళన వైరా: వైరాలోని ఇందిరమ్మ కాలనీ సమీపాన ఓ రైతు పొలంలో గుర్తుతెలియని వ్యక్తులు చేసిన పూజలు చేసిన ఆనవాళ్లు ఉండడంతో ఆందోళనకు గురయ్యారు. సదరు రైతు పొలంలో వరి నాట్లు వేయిస్తుండగా శుక్రవారం పాలప్యాకెట్లు, నెయ్యి, టార్చ్లైటు, పసుపు, కుంకుమ కనిపించాయి. దీంతో క్షుద్రపూజలు చేశారని పేర్కొంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా, సిబ్బంది చేరుకుని విచారణ చేపట్టారు. వివాహిత ఆత్మహత్య వేంసూరు: మండలంలోని చౌడవరానికి చెందిన వివాహిత వి.జ్యోతి(19) శుక్రవారం ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈమేరకు ఏఎస్సై వెంకటేశ్వరరావు పరిశీలించి కేసు నమోదు చేశారు. అయితే, ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. -
బీజేపీ అభ్యర్థుల విజయం ఖాయం
ఖమ్మం మామిళ్లగూడెం: తెలంగాణలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు ఖాయమని ఆ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ బలపరుస్తున్న టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆయనతో పాటు నాయకులు శుక్రవారం పలువురు ఉపాఽధ్యాయుల నివాసాలకు వెళ్లి ప్రచారం కోరారు. ఈసందర్భంగా సుధాకర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పీఆర్సీ అమలు, డీఏల విడుదలను విస్మరించిందని ఆరోపించారు. ఈమేరకు ఉపాధ్యాయులు బీజేపీ బలపర్చిన సరోత్తంరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. కాగా, సరోత్తంరెడ్డిని గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి తదితరులు ఉపాధ్యాయులను కలిశారు. నాయకులు సన్నె ఉదయ్ప్రతాప్, రమణారెడ్డి, పరిశ రామ్మోహన్, కె.శ్రీనివాసరావు, కరిన హరిప్రసాద్, భూక్య సేవ్యా, నకిరికంటి వీరభద్రం, శీలం పాపారావు, నున్నా రవికుమార్, కోటేశ్వరరావు, అల్లిక అంజయ్య, మందా సరస్వతి, దొడ్డ అరుణ తదితరులు పాల్గొన్నారు. -
అపు‘రూపం’
● ఎక్కడున్నా కవలలకు ప్రత్యేక గుర్తింపు ● ఒకే పోలికలతో పలు సందర్భాల్లో తికమక ● నేడు కవలల దినోత్సవం కవలలు (ట్విన్స్) ఎక్కడున్నా ప్రత్యేకత ఉంటుంది. రూపంలో ఒకేరకంగా ఉండటంతో వారిని ప్రత్యేకంగా చూస్తారు. తల్లిదండ్రులు వారికి ఒకే రకమైన దుస్తులు, వస్తువులు కొనిపెట్టి అపురూపంగా చూసుకుంటారు. ఇష్టాలు, అభిరుచులు ఒకేలా ఉంటే మరికొందరిలో భిన్నంగా ఉంటాయి. బంధువులు, టీచర్లు, ఇరుగుపొరుగు వారు కూడా గుర్తుపట్టలేక తికమకపడుతుంటారు. ప్రపంచంలో మొదటి సారి కవలలు దినోత్సవాన్ని పోలాండ్లో 1976లో నిర్వహించారు. మోజస్, అరన్విల్కార్స్ కవలలు ఒకే వ్యాధితో బాధపడుతూ ఒకే రోజు (ఫిబ్రవరి 22) మరణించారు. దీంతో ఏటా ఫిబ్రవరి 22న ప్రపంచ కవలల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. – కొణిజర్ల/నేలకొండపల్లి -
అతిథిగృహానికి త్వరలోనే పూర్వవైభవం!
కూసుమంచి: మండంలోని నాయకన్గూడెంలో జలవనరుల శాఖ పరిధిలో ఉన్న అతిథిగృహం(ఐబీ గెస్ట్హౌజ్) త్వరలోనే పూర్వవైభవం సంతరించుకోనుంది. సాగర్ కాల్వల తవ్వకం జరిగే రోజుల్లో దీన్ని నిర్మించగా ఆతర్వాత వివిధ సందర్భాల్లో ముఖ్య మంత్రులు జలగం వెంగళరావు, ఎన్టీ రామారావుతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు బస చేశారని స్థానికులు చెబుతున్నారు. అయితే, కొన్నేళ్లుగా నిర్వహణ సరిగ్గా లేక భవనం శిథిలం కాగా, వదిలివేశారు. ఈ విషయాన్ని స్థానిక నాయకులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆదేశాలతో అధికారులు రూ.18లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో భవనం స్లాబ్ను సరిచేయడమే కాక రంగులు వేయించి కొత్త ఫర్నీచర్ సమకూరుస్తారు. తద్వారా ఏళ్ల క్రితం నాటి గెస్ట్హౌస్ మళ్లీ కళకళలాడనుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఫుట్బోర్డ్ నుండి జారిపడిన డ్రైవర్కు గాయాలు
పెనుబల్లి: బస్సు ఫుట్బోర్డుపై నిల్చున్న వ్యక్తి జారి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. కల్లూరు మండలం ముచ్చారానికి చెందిన ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ పసుపులేటి పుల్లారావు శుక్రవారం ఖమ్మం వైపు నుండి సత్తుపల్లి వైపు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నాడు. ఆయన ఫుట్బోర్డుపై నిల్చోగా సత్తుపల్లి రోడ్డులోని సప్తపది ఫంక్షన్హాల్ సమీపానికి వచ్చేసరికి ప్రమాదవశాత్తు జారి కింద పడ్డాడు. దీంతో తీవ్రగాయాలైన పుల్లారావును పెనుబల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యువకుడిపై కత్తితో దాడి చేసిన హిజ్రా ఖమ్మంరూరల్: మండలంలోని పెదతండాలో ఓ యువకుడిపై హిజ్రా కత్తితో దాడికి పాల్పడిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. పెదతండాలోని చికెన్ దుకాణంలో పనిచేస్తున్న యువకుడికి, అదే ప్రాంతానికి చెందిన ఓ హిజ్రాకు మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో ఆ హిజ్రా ఆవేశంతో యువకుడిని విచక్షణారహితంగా పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈమేరకు స్థానికులు ఆయనను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. -
అన్ని వసతులు ఉన్నాయా?
పెనుబల్లి: పెనుబల్లి మండలంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ఈసందర్భంగా ఉప్పలచెలకలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి మెనూ అమలు, బోధన, కరాటే శిక్షణ వివరాలు తెలుసుకున్నారు. కరాటే నేర్చుకోవడం ద్వారా ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం మండలం కేంద్రంలోని ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ యూరియా నిల్వల వివరాలు తెలుసుకున్నారు. అంతేకాక యడ్లబంజర్లో రైతులతో మాట్లాడి సాగు చేస్తున్న పంటలు, ఎరువుల లభ్యతపై ఆమె ఆరాతీశారు. అదనపు కలెక్టర్ వెంట వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కేజీబీవీలో అదనపు కలెక్టర్ తనిఖీ -
చెరువు నీటి విడుదలపై ఫిర్యాదు
కామేపల్లి: మండలంలోని కొండాయిగూడెం పెద్దచెరువు నుంచి గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అనుమతి లేకుండా నీటిని విడుదల చేశారు. ఈవిషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఇరిగేషన్ డీఈఈ శంకర్ తెలిపారు. చెరువు నీటిని అక్రమంగా మోటార్ల ద్వారా తరలించినా, అనుమతి లేకుండా తూము నుంచి విడుదల చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, తూము వద్ద చేపల వలలు ఉండడం, ఆపై నీటిని విడుదల చేయడంతో ఇది మత్స్యకారుల పనేనని ఆయకట్టు రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముందే స్పందిస్తే... కొండాయిగూడెం పెద్ద చెరువు నుంచి కొన్నాళ్లుగా అక్రమంగా నీటిని తరలిస్తున్నారని తెలిసినా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో అక్రమంగా బావులు తవ్వించి మోటార్లు పెట్టి మరీ నీటిని ఎగువన ఉన్న పొలాలకు తరలించడం, చెరువు శిఖంలో పంటలు చేస్తుండడంతో తమకు నష్టం జరుగుతోందని పలువురు తెలిపారు. ఈవిషయమై పరిశీలంచాలని డీఈఈ, ఏఈఈలను ఉన్నతాధికారులు ఆదేశించడం స్పందించకపోవడం సరికాదని చెబుతున్నారు. -
సమస్యలు పరిష్కరించాలని నిరసన
ఖమ్మంగాంధీచౌక్: ఖాళీ పోస్టు ల భర్తీ, తాత్కాలిక ఉద్యోగుల రెగ్యులరైజేషన్, వారానికి ఐదు రోజుల పనిదినాల అమలుతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్తో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూని యన్స్(యూఎఫ్బీయూ) పిలుపు మేరకు బ్యాంకు ఉద్యోగులు శుక్రవారం సాయంత్రం నిరసన తెలిపారు. ఖమ్మంలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఎదుట జరిగిన నిరసనలో పలువురు మాట్లాడుతూ ఈనెల 7నుంచి మొదలైన దశలవారీ ఆందోళనలు సమస్యలు పరిష్కారమయ్యే వరకు కొనసాగుతాయని తెలిపారు. యూనియన్ల ప్రతినిధులు షేక్ ఇబ్రహీం, ఆర్.శివకుమార్, శ్రీనివాస్ నందన్, పి.చిన్నపరెడ్డి, ఆశాజ్యోతి, కృష్ణవేణి, ప్రసాద్, రాంబాబు, తిప్పయి స్వామి తదితరులు పాల్గొన్నారు. శివాలయంలో చోరీ ఖమ్మంఅర్బన్: ఖమ్మం మమత రోడ్డులోని శివాలయంలో చోరీ జరిగింది. రోజులాగే గురువారం రాత్రి తాళం వేసి వెళ్లిన అర్చకులు, సిబ్బంది శుక్రవారం ఉదయం వచ్చేసరికి ఐదు తాళాలు ధ్వంసం చేసి ఉన్నాయి. దీంతో దేవాలయంలో పరిశీలించగా రూ.4లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలతో పాటు హుండీని ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఈ మేరకు ఆలయ ఈఓ ఇచ్చిన సమాచారంతో ఖమ్మం అర్బన్ పోలీసులు చేరుకుని ఆధారాలు సేకరించారు. ఏడుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్ కారేపల్లి: మండలంలోని మాదారంలో పేకాట స్థావరంపై పోలీసులు శుక్రవా రం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడుగురిని అదుపులోకి తీసుకుని ఒక బైక్, ఫోన్లు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ ఎన్.రాజారాం తెలిపారు. కోడిపందేలు ఆడుతున్న ఇద్దరు... కల్లూరు: మండలంలోని పేరువంచ సమీపంలో గ్రీన్ఫీల్డ్ హైవే పక్కన కోడి పందేలు ఆడుతున్న ఇద్దరిని శుక్రవారం అదుపులోకి తీసుకోగా, ఇంకొందరు పరారయ్యారని పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారి నుంచి రెండు కోడి పుంజులు, రూ.1,400 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలుశిక్ష ఖమ్మం లీగల్: తీసుకున్న అప్పు చెల్లించే క్రమాన చెల్లని చెక్కు జారీ చేసిన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఖమ్మం ఆబ్కారీ కోర్టు న్యాయాధికారి రాళ్లబండి శాంతిలత శుక్రవారం తీర్పు చెప్పారు. ఖమ్మం ముస్తఫానగర్కు చెందిన కుతుంబాక ప్రవీణ్కుమార్ రోటరీనగర్కు చెందిన పోలవరపు రమేష్ వద్ద 2016 ఏప్రిల్లో రూ.7లక్షల అప్పు తీసుకున్నాడు. ఈ అప్పులు చెల్లించాలని అడగగా 2017ఆగస్టులో రూ.9లక్షలకు చెక్కు జారీ చేశాడు. అయితే, ఈ చెక్కును బ్యాంకు జమ చేయగా ప్రవీణ్ ఖాతాలో సరిపడా నగదు లేకపోవడంతో తిరస్కరణకు గురైంది. దీంతో రమేష్ తన న్యాయవాది ద్వారా కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. విచారణ అనతరం ప్రవీణ్కు ఏడాది జైలు శిక్షతో పాటు ఫిర్యాదికి రూ.9లక్షలు చెల్లించాలంటూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. అక్క ఇంటికి వచ్చి వెళ్తుండగా అనంతలోకాలకు..లారీ ఢీకొట్టి పైనుంచి వెళ్లడంతో చిధ్రమైన మృతదేహం తల్లాడ: మండలంలోని రంగంబంజర సమీపాన జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రగాయాలతో మృతి చెందాడు. పెనుబల్లి మండలం ముత్తగూడెంకు చెందిన బొగ్గుల నాగిరెడ్డి(55) గ్యాస్సిలిండర్ కోసం టీవీఎస్ ఎక్స్ఎల్పై కల్లూరు వచ్చాడు. సమీపంలోని తల్లాడ మండలం నారాయణపురంలో సోదరి అవులూరి వెంకటరత్తమ్మ ఉంటుండడంతో ఆమె వద్దకు వచ్చి పలకరించాక తిరిగి బయలుదేరాడు. ఈక్రమాన రంగంబంజర వద్ద ఆయనను వెనక నుంచి తల్లాడ వైపు నుంచి కల్లూరు వెళ్తున్న కంటెయినర్ లారీ ఢీకొట్టింది. లారీ నాగిరెడ్డి పైనుంచి వెళ్లడంతో రెండు కాళ్లు తెగిపడి, శరీరం ముక్కలై అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, నాగిరెడ్డికి భార్య, కుమారుడు ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
బోనస్.. మైనసేనా?
పౌర సరఫరాల సంస్థ ఏర్పాటుచేసిన కేంద్రాల్లో సన్నధాన్యం అమ్మిన రైతులు దాదాపు సగం మందికి ఇంకా బోనస్ అందలేదు. ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లు ముగిసినా బోనస్ జమ కాకపోవడంతో ప్రతీరోజు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లాలో 27,26,660 క్వింటాళ్ల సన్న ధాన్యం అమ్మిన 47,494 మంది రైతులకు రూ.136,33,30,000 బోనస్ అందాల్సి ఉంది. ఇందులో పలువురికి రూ.64.42 కోట్ల మేర బకాయి ఉండగా ఎదురుచూపుల్లో గడుపుతున్నారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మంసన్న ధాన్యానికి జై కొట్టి.. ఖరీఫ్ సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురవడం, జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉండడంతో రైతులు వరి సాగు చేపట్టారు. ఇంతలోనే సన్నరకం ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు తోడు రూ.500 బోనస్ ప్రకటించడంతో చాలామంది ఈ రకాలనే ఎంచుకున్నారు. జిల్లాలో 2,81,991 ఎకరాల్లో వరి సాగు చేయగా.. సన్న రకాలే 2,62,230 ఎకరాల్లో సాగయ్యాయి. కేంద్ర ప్రభుత్వం సాధారణ వరి రకాలు క్వింటాకు రూ.2,300, గ్రేడ్–ఏ(సన్న రకం) ధాన్యానికి రూ.2,320గా మద్దతు ప్రకటించింది. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తుందని ప్రకటించడంతో చాలామంది అటే మొగ్గుచూపారు. 344 కేంద్రాల ద్వారా సేకరణ సన్నధాన్యాన్ని ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయిస్తే బోనస్ అందుతుందన్న విస్తృత ప్రచారంతో రైతులు ఆసక్తి కనబరిచారు. డీఆర్డీఏ, పీఏసీఎస్, డీసీఎంఎస్, మెప్మా ద్వారా 344 కేంద్రాలను ఏర్పాటు చేయగా గతనెల 31వ తేదీతో కొనుగోళ్లు ముగిశాయి. ఆతర్వాత వైరా మండలంలోని సిరిపురం, ఉప్పలమడకతోపాటు బోనకల్ మండలంలోని బ్రాహ్మణపల్లి, మోటమర్రి, కలకోటల్లో ఇంకా ధాన్యం మిగలడంతో మళ్లీ కొనుగోళ్లు చేశారు. మొత్తంగా 47,494 మంది రైతుల నుంచి 27,26,660 క్వింటాళ్ల సన్న రకం ధాన్యం సేకరించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మద్దతు ధర సరే బోనస్ ? సన్నధాన్యం అమ్మిన రైతులకు మద్దతు ధరతో పాటే రూ.500 బోనస్ జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ చాలామందికి బోనస్ నగదు జమ కాలేదు. ధాన్యం విక్రయించి నెలలు దాటుతున్నా బోనస్ రాకపోవడంతో అసలు ఇస్తారా, లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలోనే ప్రతీరోజు బ్యాంకుల వెళ్లి ఖాతాల్లో బ్యాలెన్స్ పరిశీలించి వస్తున్నారు. ఎందుకు రాలేదో.. ఏమో సన్నధాన్యం విక్రయించిన రైతులకు విడతల వారీ గా బోనస్ జమ అవుతూ వస్తోంది. మొత్తంగా జిల్లా రైతులకు రూ.136,33,30,000 బోనస్ జమ కావా ల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు రూ.71,90,84,600 మాత్రమే అందాయి. మిగతా రూ.64,42,45,400 నగదు రాకపోవడంతో రైతులు ఎదురుచూస్తున్నారు. బోనస్ నగదు వస్తే యాసంగి పంటల పెట్టుబడికి ఆసరాగా ఉంటుందని రైతులు భావించినా నిరాశే ఎదురవడంతో మళ్లీ అప్పులు చేసి సాగు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.సన్నధాన్యం విక్రయించిన రైతుల ఎదురుచూపులు రూ.500 చెల్లింపు ప్రకటనతో సాగులో ముందడుగు మద్దతు ధర దక్కినా బోనస్ అందక నిర్లిప్తత -
సైలోబంకర్కు పిండప్రదానం
సత్తుపల్లి: సత్తుపల్లిలోని సింగరేణి సైలోబంకర్ నుంచి వెలువడుతున్న దుమ్ముధూళితో శ్వాసకోస వ్యాధుల బారిన పడుతున్నామని, ఇప్పటికే పలువురు మృతి చెందినందున బంకర్ను తొలగించాలనే డిమాండ్తో కిష్టారం అంబేద్కర్నగర్ వాసులు చేపట్టిన నిరసనలు ఉధృతరూపం దాలుస్తున్నాయి. ఈమేరకు 12వ రోజైన శుక్రవారం మృతుల కుటుంబీకులు సైలోబంకర్ చిత్రపటానికి పిండప్రదానం నిర్వహించి వినూత్న నిరసన తెలిపారు. అంతేకాక సైలోబంకర్ నిర్మించినప్పటి నుంచి మృతి చెందిన వారి ఫొటోలను దీక్షా శిబిరం వద్ద ప్రదర్శించగా పలువురు కంటతడి పెట్టుకున్నారు. కాగా, దీక్షలకు బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి సంఘీభావం తెలిపి మాట్లాడారు. ప్రజల ప్రాణాలు కోల్పోతున్నందున తక్షణమే మంత్రులు చొరవ చూపి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సైలో బంకర్ను నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించినట్లు తెలుస్తున్నందున విచారణ జరిపించాలని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. బీజేపీ నాయకులు నంబూరి రామలింగేశ్వరరావు, ఈ.వీ.రమేష్, నన్నే ఉదయ్ప్రతాప్, భాస్కర్ణి వీరంరాజు, సుదర్శన్మిశ్రా, నాయుడు రాఘవరావు, మట్టా ప్రసాద్, పాలకొల్లు శ్రీనివాసరావు, నాగస్వామి, బానోతు విజయ్, నల్లమోతు నాని, మధుసూదన్రావు, రహ్మతుల్లా పాల్గొన్నారు. ఉధృతరూపం దాల్చిన నిరసనలు -
ఇందిరమ్మ లబ్ధిదారులకు తోడ్పాటు
● యంత్రాంగం ద్వారా సంపూర్ణ అవగాహన కల్పించాలి ● కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ఖమ్మంసహకారనగర్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు యంత్రాంగం ప్రతీ దశలో తోడ్పాటునందించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గాల అధికారులు, మండల ప్రత్యేక అధికారులకు ఇచ్చిన శిక్షణలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లతో ప్రజల జీవన విధానంలో మార్పులు వస్తాయని గుర్తించి అర్హులనే ఎంపిక చేయాలని తెలిపారు. గ్రామసభల్లో అందిన దరఖాస్తులను యాప్ ద్వారా మరోసారి పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని చెప్పారు. సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారు, స్థలం, ఇల్లు లేనివారు, ఆర్సీసీ రూఫ్తో ఇల్లు ఉన్న వారిని మూడు కేటగిరీలుగా విభజించాలని, అత్యంత పేదలు, సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అంతేకాక భూమి పూజ మొదలు గృహప్రవేశం వరకు ప్రతీ అడుగులో లబ్ధిదారులకు అండగా నిలిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని కలెక్టర్ తెలిపారు. కాగా, ఇసుక సరఫరాను పర్యవేక్షించాలని, సిమెంట్ తక్కువ ధరకు అందేలా ప్రయత్నాలు చేయాలని చెప్పారు. ఎన్నికల కోడ్ ముగిశాక రెండు వారాల్లో బేస్మెంట్ పూర్తయ్యేలా చూస్తే లబ్ధిదారులకు రూ.లక్ష నగదు అందుతుందని కలెక్టర్ తెలిపారు. ఈసమావేశంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, డీఆర్డీఓ సన్యాసయ్య, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, డీపీఓ ఆశాలత, హౌజింగ్ పీడీ శ్రీనివాసరావు, పీఆర్ ఈఈ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్రెడ్డి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా కలెక్టర్ జిల్లాలో ఏర్పాట్లను వివరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, పోలింగ్ ఉద్యోగులకు శిక్షణ, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాల ముద్రణ, పోస్టల్ బ్యాలెట్ జారీ, కేంద్రాల్లో చేస్తున్న ఏర్పాట్లను వెల్లడించారు. పోలీస్ కమిషనర్ సునీల్దత్, డీఆర్వో ఏ.పద్మశ్రీ, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు స్వామి, డీటీ అన్సారీ తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్ఫెడ్ డివిజన్ అధికారిపై వేటు
సత్తుపల్లి: సత్తుపల్లి డివిజన్ ఆయిల్ఫెడ్ అధికారి బాలకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. ఈమేరకు ఆయిల్ఫెడ్ ఎండీ యాస్మిన్బాషా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలోని రేగళ్లపాడు నర్సరీలో ఆఫ్టైప్(నాటడానికి పనికి రానివి)గా తేలిన 80వేల ఆయిల్పామ్ మొక్కలను అనుమతి లేకుండా ధ్వంసం చేయించినట్లు ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి. ఇందుకోసం వెచ్చించిన నిధులు డ్రా చేసినట్లు తెలుస్తుండగా, ఈనెల 9, 10వ తేదీల్లో ఉద్యానవన శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఈమేరకు వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా బాలకృష్ణను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. కాగా, గతంలోనే నర్సరీ సూపర్వైజర్లు పృధ్వీలాల్, కృష్ణారావును విధుల నుంచి తొలగించిన విషయం విదితమే. -
జియోథర్మల్ విద్యుదుత్పత్తిలో ముందడుగు
● పూర్తిస్థాయి సామర్థ్యంతో ఉత్పత్తి నమోదు ● పగిడేరులో దేశంలోనే మొట్టమొదటి ప్లాంట్ మణుగూరు టౌన్: సింగరేణి సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జియోథర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులో ముందుడుగు పడింది. మండలంలోని పగిడేరులో బోరు నుంచి వస్తున్న వేడినీటితో జియోథర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని కొన్నేళ్ల క్రితం గుర్తించగా 20 కిలోవాట్ల సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేశారు. క్లోజ్డ్ లూప్ బైనరీ ఆర్గానిక్ ర్యాంకిన్ సైకిల్(ఓఆర్సీ) టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్ట్ను సింగరేణి ఆధ్వర్యాన ఢిల్లీలోని శ్రీరాం ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ బాధ్యులు చేపట్టారు. ఈమేరకు రెండు రోజులుగా ఇక్కడ ప్రయోగాత్మకంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా 20 కిలోవాట్ల పూర్తిస్థాయి సామర్థ్యంతో నమోదైంది. ఇది విజయవంతమైన నేపథ్యాన ఇంకొన్ని పరీక్షలు చేసి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దేశంలోనే తొలి కేంద్రం జియోథర్మల్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తికి కేంద్రప్రభుత్వం 1960 నుంచే ‘హాట్ స్ప్రింగ్స్’ కమిటీ ఏర్పాటు చేసి పరిశోధనలు చేయిస్తోంది. ఈక్రమాన 1992లో హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని మణికరణ్ ప్రాంతంలో ఐదు కిలోవాట్ల ప్లాంట్ ఏర్పాటు చేసినా కొండచరియలు విరిగి పడడంతో అది ధ్వంసమైంది. ఆతర్వాత పలు రాష్ట్రాల్లో జియోథర్మల్ కోసం అన్వేషణలు సాగించినా విజయవంతం కాలేదు. చివరకు పగిడేరులో బొగ్గు అన్వేషణకు వేసిన బోర్ నుంచి వేడినీరు ఉబికి వస్తుండడంతో జియోథర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుచేశారు. కాగా, ప్రయోగాత్మకంగా చేపట్టిన ఉత్పత్తి పూర్తిస్థాయిలో నమోదైన నేపథ్యాన దేశంలోనే తొలి ప్లాంట్గా నిలవనుంది. -
శైవక్షేత్రాలకు 75 ఆర్టీసీ బస్సులు
సత్తుపల్లి టౌన్: మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు వెళ్లివచ్చే భక్తుల కోసం ఈనెల 26, 26వ తేదీల్లో 75 ఆర్టీసీ సర్వీసులు నడిపించనున్నట్లు ఖమ్మం రీజినల్ మేనేజర్ ఏ.సరిరామ్ తెలిపారు. సత్తుపల్లి ఆర్టీసీ డిపోను శుక్రవారం ఆయన డిప్యూటీ ఆర్ఎం జీఎన్.పవిత్రతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల శిక్షణ తరగతులను పరిశీలించాక ఆర్ఎం మాట్లాడారు. మహాశివరాత్రి సందర్భంగా సత్తుపల్లి డిపో నుంచి నీలాద్రికి, ఖమ్మం డిపో నుంచి తీర్థాలకు 25 చొప్పున, వైరా నుంచి స్నానాల లక్ష్మీపురానికి పది, భద్రాచలం డిపో నుంచి మోతెగడ్డకు ఐదు, కొత్తగూడెం డిపో నుంచి నీలాద్రి, అన్నపురెడ్డిపల్లి, బెండాలపాడులకు పది ఆర్టీసీ బస్సులు నడిపించనున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సర్వీసుల సంఖ్య పెంచుతామని వెల్లడించారు. అసిస్టెంట్ మేనేజర్ విజయశ్రీ, వీబీఓ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య ఉపకేంద్రంలో ‘ఎన్క్వాస్’ పరిశీలన చింతకాని: మండలంలోని చిన్నమండవలో ఆయుష్మాన్ ఆరోగ్య ఉపకేంద్రాన్ని నేషనల్ క్వాలిటీ అసెస్మెంట్ స్టాండర్డ్(ఎన్క్వాస్) బృందం శుక్రవారం పరిశీలించింది. బృందం సభ్యులైన డాక్టర్ డయాసిస్ సాహు, డాక్టర్ యోగేష్ వర్చువల్గా కేంద్రాన్ని పరిశీలించి ఏడు విభాగాల్లో సేవలపై ఆరా తీశారు. ఇక్కడి నుంచి హాజరైన డీఎంహెచ్ఓ డాక్టర్ కళావతిబాయి, అధికారులు ఆస్పత్రి ద్వారా అందుతున్న సేవలు, మందులు, వ్యాక్సినేషన్ల నిల్వ, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను వివరించారు. ఈకార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ చందూనాయక్తో పాటు ఉద్యోగులు, వైద్యులు రామారావు, ఉపేందర్, క్టర్ ఆల్తాఫ్, సాయికుమార్, అనిల్, సోహెల్, కృష్ణారావు, జ్యోతిరత్న పాల్గొన్నారు. కాగా, మండలంలోని నాగులవంచ, పందిళ్లపల్లి ఆరోగ్య ఉప కేంద్రాలను డీఎంహెచ్ఓ తనిఖీ చేసి సేవలపై ఆరా తీశారు. గురుకులంలో జాయింట్ సెక్రటరీ తనిఖీ కొణిజర్ల: కొణిజర్ల మండలం అమ్మపాలెంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను బీసీ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ ఎం.మద్దిలేటి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను పరిశీలించి శ్రద్ధగా చదివి మెరుగైన మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ఆతర్వాత స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ను పరిశీలించిన ఆయన నిర్వహణపై ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. కాగా, క్రాఫ్ట్ విభాగం విద్యార్థులు రూపొందించిన వస్తువులు చూసి అభినందించారు. ఖమ్మం ఆర్సీఓ రాంబాబు, ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ ఎస్.పద్మజ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గురుకులాల్లో ప్రవేశానికి రేపు పరీక్ష ఖమ్మంమయూరిసెంటర్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ఐదు నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలు కల్పించేందుకు ఆదివారం పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల జోనల్ ఆఫీసర్ కె.స్వరూపరాణి తెలిపారు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుందని వెల్లడించారు. https:// tgswreis.telangana.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్తో నిర్ణీత సమయానికి హాజరుకావాలని, హాల్టికెట్పై తప్పులు ఉంటే ఇన్విజిలేటర్కు చెప్పి తగిన పత్రాలు సమర్పించి సరిచేయించుకోవాలని సూచించారు. కాగా, భద్రాద్రి జోన్లో 25,318 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని ఆమె తెలిపారు. ఇందులో ఖమ్మం జిల్లాలో 6,403 మంది విద్యార్థులకు 13 సెంటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5,090 మందికి 18, మహబూబాబాద్ జిల్లాలో 5,263 మందికి 15, హన్మకొండ జిల్లాలో 4,470 మందికి 16, వరంగల్ జిల్లాలో 4,092 మందికి 10 సెంటర్లు కేటాయించినట్లు జోనల్ ఆఫీసర్ వెల్లడించారు. -
మెరుగైన వైద్యసేవలే లక్ష్యం
ఖమ్మంరూరల్: ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకంతో వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా వైద్యులు, సిబ్బంది విధులు నిర్వర్తించాలని డీఎంహెచ్ఓ కళావతిబాయి సూచించారు. రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెంలోని పీహెచ్సీని గురువారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించాక వారితో సమావేశమయ్యారు. ప్రజలకు అందుబాటులో ఉండడమే కాక మర్యాదపూర్వకంగా మెలగుతూ వైద్యసేవలు అందించాలని సూచించారు. ఏఎన్ఎంలు రక్షేత్రస్థాయిలో సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని, అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్లో భాగంగా 30ఏళ్లు నిండిన ప్రతీఒక్కరికి బీపీ, షుగర్ పరీక్షలు చేయాలని తెలిపారు. డాక్టర్ బాలకృష్ణ, ఉద్యోగులు వెంకటనారాయణ, చంద్రకళ, ఆజాద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
అప్పుడప్పుడే దృష్టి
జిల్లాలోని ఖమ్మం నగర పాలక సంస్థతో పాటు వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీల్లో అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన భవనాలపై, ప్రభుత్వ భూములు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై అధికారులు ఇటీవల దృష్టి సారిస్తున్నారు. వైరాలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను గుర్తించి గత సెప్టెంబర్లో తొలగించారు. ఖమ్మం ఎన్ఎస్టీ రోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ భూమిలో ప్రైవేట్ వ్యక్తి గోడ నిర్మించగా కూల్చివేశారు. ఇంకొన్ని చోట్ల అదనపు నిర్మాణాలను తొలగించారు. అలాగే, అనుమతి లేని నిర్మాణదారులకు నోటీసులు జారీ చేసి జరిమానా విధిస్తున్నారు. అయితే, ఫిర్యాదు అందితేనే అధికారులు రంగంలోకి దిగుతున్నారనే విమర్శలున్నాయి. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలిస్తే అక్రమ కట్టడాలను ముందుగానే అడ్డుకోవచ్చు. కానీ నిర్మాణం చివరి దశలో ఉన్నప్పుడో, పూర్తయ్యాకో నోటీసులు జారీ చేసి జరిమానా విధిస్తున్నారు. ఒక్కోసారి కూల్చివేస్తున్నారు. -
కోయచలకలో అసిస్టెంట్ కలెక్టర్ పర్యటన
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలం కోయచలకలో అసిస్టెంట్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ట పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ వర్గాల వారి ఇళ్లకు వెళ్లి జీవన స్థితిగతులు, పంటల సాగు, ఆర్థిక వనరులపై ఆరా తీశారు. ఉన్నత విద్య పూర్తిచేసిన భువనేశ్వరి తదితరులతో మాట్లాడి భవిష్యత్ ప్రణాళికలు తెలుసుకున్నారు. అనంతరం చెరుకూరి రామారావు సేంద్రియ విధానంలో సాగు చేస్తున్న పంటలను ఆయన పరిశీలించి దిగుబడి, ధరలపై చర్చించారు.వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు రాజ్యలక్ష్మి, ఆదాం, నాగరాజు, లింగరాజు, సీమా, నరేష్, మార్కెట్ డైరెక్టర్ చెరుకూరి సీతారాములు తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన వైద్యసేవలతోనే గుర్తింపు
ఖమ్మంవైద్యవిభాగం: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడం ద్వారా ఆస్పత్రులకు గుర్తింపు లభిస్తుందని పలువురు పేర్కొన్నారు. ఖమ్మం నెహ్రూనగర్లోని అఖిల కంటి ఆస్పత్రి ఏడో వార్షికోత్సవాన్ని గురువారం నిర్వహించగా డాక్టర్ వాసిరెడ్డి రామనాధం ఓపీ చాంబర్ను ప్రారంభించారు. అనంతరం డాక్టర్ అఖిల మాట్లాడుతూ నెలలు నిండకుండా జన్మించిన పిల్లల్లో రెటీనా సంబంధిత సమస్యలు ఎదురైతే వైద్యం అందించడం సంతృప్తిగా ఉందని తెలిపారు. ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ మాధవి, మేనేజింగ్ డైరెక్టర్ కుతుంబాక మధుతో పాటు డాక్టర్ సమత, శ్రీధర్, సతీష్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులపై ప్రత్యేక ‘దృష్టి’
● గతంలోనే కంటి సమస్యలు ఉన్న వారి గుర్తింపు ● 3,557 మందికి నిపుణులతో మరోమారు పరీక్షలు ● అవసరమైన వారికి అద్దాల పంపిణీసత్తుపల్లి టౌన్: తరగతి గదిలో బోర్డు సరిగ్గా కనిపించకపోవడం, పోషకాహార లోపంతో ఎదురవుతున్న కంటి సమస్యలు, కళ్ల మంటలు, తలనొప్పి, ఎక్కువ సేపు చదవలేకపోవడం... వంటి సమస్యలతో పలువురు విద్యార్థులు సతమతమవుతున్నారు. పిల్లలు ఎక్కువసేపు సెల్ఫోన్లు, టీవీ చూస్తుండడంతో ఇలా జరుగుతోందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యాన ప్రభుత్వం రాష్టీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద ఇప్పటికే రెండు విడతలుగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో చదివే 1,11,557 మంది విద్యార్థులకు 12 వైద్య బృందాలతో కొన్నాళ్ల క్రితం కంటి పరీక్షలు చేయించింది. వీరిలో 3,557 మంది విద్యార్థులు దృష్టి లోపంతో బాధపడుతున్నట్లు తేలింది. మూడో విడత నిపుణులతో.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో 5నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు తొలి రెండు దశల్లో పరీక్షలు నిర్వహించారు. ఇందులో దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించిన విద్యార్థులకు ఈనెల 17నుంచి నిపుణులతో పరీక్షలు చేయిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రితో పాటు సత్తుపల్లి, నేలకొండపల్లి ఏరియా ఆస్పత్రుల్లో కంటి వైద్య నిపుణులతో నిర్వహిస్తున్న పరీక్షలు వచ్చేనెల 15వ తేదీ వరకు కొనసాగుతాయి. ఒక్కో ఆస్పత్రిలో రోజుకు 50 నుంచి 100 మంది చొప్పున విద్యార్థులకు పరీక్షలు చేయించేలా కార్యాచరణ రూపొందించారు. ఆపై కంటి శుక్లాలు, కంటి చూపు సమస్యలను నిర్ధారించి దృష్టి లోపం ఉన్న వారికి కంటి అద్దాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, విద్యార్థులను ఆస్పత్రులకు తీసుకొచ్చి, తిరిగి తీసుకెళ్లడానికి ఆర్బీఎస్కే వాహనాలను వినియోగిస్తున్నారు.ప్రాథమిక పరీక్షలు 1.11 లక్షల మందికి.. పరీక్షలు చేసిన వైద్యబృందాలు 12 దృష్టి లోపం ఉన్న విద్యార్థులు 3,557 స్క్రీనింగ్ చేసే ఆస్పత్రులు 03నేరుగా కూడా తీసుకురావొచ్చు రాష్టీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద గుర్తించిన విద్యార్థులకు నిపుణులతో కంటి పరీక్షలు చేయిస్తున్నాం. అయితే, వీరే కాకుండా దృష్టి సమస్యతో బాధపడే విద్యార్థులను తల్లిదండ్రులు నేరుగా స్క్రీనింగ్ పరీక్షలకు ఉపాధ్యాయుల ద్వారా తీసుకురావొచ్చు. విద్యార్థుల్లో దృష్టి సమస్యలను నివారించాలన్నదే ఈ కార్యక్రమ లక్ష్యం. – టి.సీతారాం, డిప్యూటీ డీఎంహెచ్ఓ, సత్తుపల్లి -
22నుంచి ఆల్ఇండియా టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నీ
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఆల్ ఇండియా టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నీ నిర్వహించనున్నట్లు టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చల్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు. చల్లపల్లి రాధమ్మ స్మారకార్థం నిర్వహించే టోర్నీ వివరాలను ఆయనతో పాటు అసోసియేషన్ బాధ్యులు ఎం.వెంకట్, డాక్టర్ కె.అనిల్, కె.సత్యనారాయణ, డీవైఎస్ఓ టి.సునీల్కుమార్రెడ్డి గురువారం వెల్లడించారు. ఈనెల 22నుంచి మార్చి 1వరకు టోర్నీ నిర్వహించనుండగా 145 ఎంట్రీలు అందాయని తెలిపారు. ఆల్ఇండియా టెన్నిస్ అసోసియేషన్కు చెందిన చీఫ్ రిఫరీ ప్రవీణ్ నాయక్ డ్రాలు ఖరారు చేస్తారని చెప్పారు. అలాగే, స్టేడియంలోని మూడు కోర్టుల్లో మ్యాచ్ల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. -
పోక్సో కేసులో ఇద్దరికి జీవిత ఖైదు
ఖమ్మంఅర్బన్: ఇంటి బయట ఆడుకుంటున్న పన్నెండేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరికి జీవితకాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2.10లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువడింది. ఖమ్మం మొదటి అదనపు జిల్లా జడ్జి కె.ఉమాదేవి గురువారం వెల్లడించిన ఈ తీర్పు వివరాలిలా ఉన్నాయి. ఖమ్మంలోని ఓ ప్రాంతానికి చెందిన బాలిక 2021 ఫిబ్రవరి 7న ఇంటి బయట ఆడుకుంటుండగా వచ్చిన ఇద్దరు మాయమాటలతో బలవంతంగా మోటార్ సైకిల్పై తీసుకెళ్లి ఖమ్మం శివారు నిర్మానుష్య ప్రాంతంలో లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆతర్వాత ఇంటికి చేరున్న బాలిక ఇచ్చిన సమాచారంతో ఆమె తల్లిదండ్రులు ఖమ్మం ఖానాపురం హవేలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా ఖమ్మం రమణగుట్టకు చెందిన ఆటోడ్రైవర్ కాలేపల్లి సంపత్, ఖమ్మం మంచికంటినగర్కు చెందిన పెయింటర్ పసువుల నవీన్ను నిందితులుగా గుర్తించి పోక్సో కేసు నమోదు చేశాక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ మేరకు కేసు విచారణలో నేరం రుజువు కాగా సంపత్, నవీన్కు జీవితకాల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని ఖానాపురం హవేలీ సీఐ భానుప్రకాశ్ తెలిపారు. కేసు పకడ్బందీగా వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏ.శంకర్, విచారణలో కీలకంగా వ్యవహరించిన అప్పటి, ప్రస్తుత సీఐలు వెంకన్నబాబు, భానుప్రకాశ్, కానిస్టేబుళ్లు శ్రీనివాసరావు, నాగేశ్వరరావును ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్దత్ అభినందించారు. రూ.2.10 లక్షల చొప్పున జరిమానా -
రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
చింతకాని: మండలంలోని చిన్నమండవ మున్నేరు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు గురువారం సీజ్ చేశారు. పోలీసులు జగన్నాధపురం సమీపాన చేపట్టిన తనిఖీల్లో అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తన్నట్లు గుర్తించారు. దీంతో ట్రాక్టర్లను సీజ్ చేసి బాధ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగుల్మీరా తెలిపారు. చోరీ ఘటనలో నిందితుల ఫొటోలు విడుదల వైరా: వైరాలో ఈనెల 12న ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని బంధించి ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటనలో సీసీ పుటేజీల ద్వారా నిందితుల చిత్రాలు, వారు ఉపయోగించిన కారు ఫొటోను పోలీసులు సేకరించారు. ఈమేరకు ఫొటోల ఆధారంగా నిందితులను ఎవరైనా గుర్తిస్తే తమకు సమాచారం ఏసీపీ రెహమాన్ సూచించారు. నిందితులు నలుగురు తెలుపు రంగు స్విఫ్ట్ డిజైర్ కారులో రాగా, ఒకరు పోలీస్ యూనిఫామ్లో ఉన్నారని తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 87126 59146, 87126 59147, 87126 59148 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. -
కరెంట్ పోయిందా.. మేమొస్తాం..
ఖమ్మంవ్యవసాయం: అత్యవసర పరిస్థితుల్లో సేవలందించేలా జిల్లాకు ఎన్పీడీసీఎల్ ఆరు వాహనాలను కేటాయించింది. ఖమ్మం డివిజన్, వైరా డివిజన్లలో మూడు చొప్పున వీటిని వినియోగించనున్నారు. వేసవిలో ఈదురుగాలులు, ఇతర సమస్యలతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఎదురయ్యే అవకాశముంది. ఈ సమయంలో సమాచారం అందగానే ప్రత్యేక వాహనాల్లో సిబ్బంది వెళ్లి సమస్యలను పరిష్కరించనున్నారు. వేసవిలో నాలుగు నెలల పాటు ఒక్కో వాహనానికి ఆరుగురు సిబ్బందిని కేటాయించి నెలలో 25రోజులకు గాను రోజువారీ వేతనాన్ని ఏజెన్సీ ద్వారా అందిస్తారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, చెడిపోవడం, ఇతర సమస్యలు తలెత్తినా లేదా సరఫరా నిలిచిపోయిన సందర్భాల్లో సిబ్బంది సామగ్రితో సహా వాహనంలో వెళ్లి మరమ్మతు చేశాక సరఫరాను పురుద్ధరిస్తారు. అలాగే, వ్యవసాయ భూముల్లో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినప్పుడు, రైతులే సొంతంగా వాహనాలపై తీసుకురావాల్సి వస్తోంది. ఇకపై అత్యవసర వాహనాల్లో వీటిని తీసుకొచ్చి మరమ్మతుల అనంతరం తీసుకెళ్లి బిగించనున్నారు. 1912కు ఫోన్ చేయండి.. విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన సేవలందించేలా వారి సమస్యలను తెలి పేందుకు 1912 నంబర్ను వినియోగించుకోవాలని ఎస్ఈ ఏ.సురేందర్ ఓ ప్రకటనలో సూ చించారు. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు, లో ఓల్టేజీ, బ్రేక్ డౌన్, ప్రమాదకరంగా ఉన్న స్తంభాలు, విద్యుత్ లైన్ల సమస్యలే కాక బిల్లుల్లో హెచ్చుతగ్గులు, సర్వీసుల్లో పేర్ల మార్పు, నూతన సర్వీసుల మంజూరు వంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు 24గంటల పాటు అందుబాటులో ఉండే ఈ నంబర్కు ఫోన్ చేయొచ్చని తెలిపారు. ఈ నంబర్కు వచ్చే ఫోన్ల ద్వారా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారాన్ని ప్రత్యేక సెల్ పర్యవేక్షిస్తుందని వెల్లడించారు. విద్యుత్ శాఖకు ఆరు వాహనాల కేటాయింపు వేగంగా సమస్యలు పరిష్కరించేలా సిబ్బంది నియామకం -
ఎమ్మెల్సీ పోలింగ్ సజావుగా సాగేలా ఏర్పాట్లు
ఖమ్మంసహకారనగర్: ఖమ్మం – నల్లగొండ – వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈనెల 27న జరగకుండా సాఫీగా ముగిసేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఏ.పద్మశ్రీ సూచించారు. కలెక్టరేట్లో గురువారం సెక్టార్ అధికారులు, ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, ఓపీఓలకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ ఎన్నికల విధులపై సందేహాలు ఉంటే ముందుగానే నివృత్తి చేసుకోవాలని తెలిపారు. గతంలో ఎన్నికల విధులు నిర్వర్తించిన అనుభవం ఉన్నప్పటికీ ఏ మాత్రం ఏమరుపాటుగా ఉండొద్దని చెప్పారు. అనంతరం మాస్టర్ ట్రెయినీలు రాజేశ్వరి, ఎన్.మాధవి బ్యాలెట్ బాక్సుల సీల్, పోలింగ్ బూత్ల్లో ఏర్పాట్లు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ శిక్షణలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు స్వామి, కలెక్టరేట్ ఎన్నికల డీటీ అన్సారీ తదితరులు పాల్గొన్నారు. అడవిలో మంటల నియంత్రణకు సహకరించాలి కారేపల్లి: రానున్న ఎండాకాలంలో అటవీ ప్రాంతాన మంటల చెలరేగే అవకాశమున్నందున నియంత్రణకు రైతులు సహకరించాలని జిల్లా అటవీ శాఖాధికారి(డీఎఫ్ఓ) సిద్ధార్థ్ విక్రమ్సింగ్ సూచించారు. మండలంలోని తవిసిబోడులో గురువారం రైతులతో ఆయన సమావేశమయ్యారు. అటవీ భూముల ఆక్రమణలకు సంబంధించి వివాదాలు, వ్యవసాయ క్షేత్రాలకు రోడ్డు సౌకర్యం, కోతుల బెడద తదితర అంశాలను రైతులు డీఎఫ్ఓ దృష్టికి తీసుకొచ్చారు. ఈసందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ అటవీ, ఆర్ఓఎఫ్ఆర్ భూములకు హద్దులు నిర్ధారిస్తామని చెప్పారు. అలాగే, వన్యప్రాణులు అడవి దాటి రాకుండా పండ్ల మొక్కలు నాటుతామన్నారు. రైతులకు సౌర శక్తితో నడిచే బోర్ మోటార్ల సరఫరాకు ఐటీడీఏ అధికారులతో చర్చిస్తామని తెలిపారు. కాగా, అడవిలో మంటలు చెలరేగినప్పుడు సమాచారం ఇచ్చి అటవీ సంపదను కాపాడడంలో పాలుపంచుకోవాలని ఆయన కోరారు. ఇదేసమయాన స్థానికులు వాస్తవాలను అర్థం చేసుకుని అటవీ సంరక్షణలో భాగస్వామ్యం కావాలని సూచించారు. అటవీ శాఖ అధికారి మంజుల పాల్గొన్నారు. -
హాస్టల్ స్థలాన్ని ఆక్రమిస్తే చర్యలు
కారేపల్లి: కారేపల్లిలో బీసీ బాలుర వసతి గృహం నిర్మాణానికి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించగా, నిధులు కూడా మంజూరయ్యాయి. అయితే, ఈ స్థలంలో ఏర్పాటుచేసిన బోర్డును కొందరు తొలగించ డం, అక్కడ గద్దెల నిర్మించడంతో బీసీ సంక్షేమ శాఖ డివిజనల్ అధికారి ఈదయ్య గురువారం పరిశీలించా రు. స్థల ఆక్రమణకు యత్నిస్తే చర్యలు తీసుకుంటా మని తెలిపారు. ఈవిషయమై తహసీల్దార్ సంపత్కుమార్కు, పోలీసులకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. త్వరలోనే హాస్టల్కు కేటాయించిన స్థలానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయన వెంట మధిర అధికారి డి.నర్సయ్య, హాస్టల్ వార్డెన్ వేణు, సీనియర్ అసిస్టెంట్ భాస్కర్రావు పాల్గొన్నారు. -
విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసు
బోనకల్: మండలంలోని రావినూతలలో బస్ డ్రైవర్, కండక్టర్ విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధుబాబు తెలిపారు. ఈనెల 16న ఖమ్మం డిపో బస్సు బోనకల్ మండలం లక్ష్మీపురం వెళ్లి వస్తుండగా ఓ సైక్లిస్ట్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సైకిల్ దెబ్బతినగా డ్రైవర్ షేక్ మస్తాన్ బాధితుడికి పరిహారంగా రూ.వెయ్యి ఇస్తానని ఒప్పుకున్నాడు. ఇక 18వ తేదీన బస్సులో డ్రైవర్ మస్తానే ఉండగా రావినూతల జీపీ సమీపాన మాజీ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్, షేక్ నాగుల్మీరా అడ్డుకుని ఆయనను కిందకు దించి సైకిల్ విషయమై ప్రశ్నించే క్రమాన అసభ్య పదజాలంతో దూషించారు. కండక్టర్ సంధ్యారాణి సెల్ఫోన్లో వీడియో తీస్తుండగా ఫోన్ లాక్కున్నారు. ఘటనపై కండక్టర్ ఫిర్యాదుతో ఉపేందర్, నాగుల్మీరాపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పోక్సో కేసు నమోదు రఘునాథపాలెం: బాలికను కిడ్నాప్ చేసినట్లు అందిన ఫిర్యాదుతో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు రఘునాథపాలెం సీఐ ఉస్మాన్షరీఫ్ తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు కిడ్నాప్ చేసినట్లు ఆమె కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. దీంతో బాలికను గుర్తించి ఆమె స్టేట్మెంట్ ఆధారంగా కిడ్నాప్ కేసును పోక్సో కేసుగా మార్చినట్లు సీఐ వెల్లడించారు. బెల్ట్షాపు నిర్వాహకుల బైండోవర్ తిరుమలాయపాలెం: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యాన మండలంలోని పలు గ్రామాల్లో బెల్ట్షాపులు నిర్వహిస్తున్న 30మందిని గురువారం ఎకై ్సజ్ పోలీసులు బైండోవర్ చేశారు. ఈమేరకు తహసీల్దార్ పీ.వీ.రామకృష్ణ ఎదుట వారిని హాజరుపర్చగా రూ.2లక్షల పూచీకత్తు తీసుకున్నారు. బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి మద్యం అమ్మితే ఏడాది జైలు లేదా రూ.2లక్షల జరిమానా విధించనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. భర్త చేతిలో భార్య హతం వలస కూలీ కుటుంబంలో విషాదంకారేపల్లి: మధ్యప్రదేశ్ నుంచి మిర్చి కోతలకు వచ్చిన కుటుంబంలో విషాదం నెలకొంది. ఓ కుటుంబంలో జరిగిన ఘర్షణతో భార్య కడుపులో భర్త బలంగా కొట్టగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కారేపల్లి ఎస్సై ఎన్.రాజారాం తెలిపిన వివరాలు... మధ్యప్రదేశ్ రాష్ట్రం దుండూరి జిల్లా గాయత్రి మందిర్ గ్రామానికి చెందిన పలువురు మిర్చి కోతల కోసం వచ్చారు. కారేపల్లి మండలం జైత్రాంతండా శివారులో డేరాలు వేసుకుని ఉంటుండగా, ఇందులోని భార్యాభర్తలు మరవి పింకీ(40), కమలేష్ మధ్య బుధవారం ఉదయం గొడవ జరిగింది. ఈక్రమాన మాటామాటా పెరగడంతో కమలేష్ తన భార్య పింకీ కడుపులో బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు చేరుకుని నిందితుడు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టంఅశ్వారావుపేటరూరల్: ఓ చిన్నారి మృతిపై ఆలస్యంగా అందిన ఫిర్యాదుతో ఖననం చేసిన మృతదేహాన్ని గురువారం వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఎస్సై టి.యయాతి రాజు కథనం ప్రకారం.. మండలంలోని నారాయణపురానికి చెందిన నారదాసు రామకృష్ణ, వరలక్ష్మి దంపతుల నాలుగు నెలల చిన్నారికి ఈనెల 5న అశ్వారావుపేటలోని సబ్ సెంటర్లో టీకా వేయించగా 6న మధ్యాహ్నం మృతి చెందింది. అదేరోజు చిన్నారి మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే, తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నట్లు రామకృష్ణ బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తహసీల్దార్ కృష్ణ ప్రసాద్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేయించినట్లు ఎస్సై తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ అనేనా?!
ఈసారైనామున్సిపాలిటీల్లోనూ ముందుకు పడలే.. ఎల్ఆర్ఎస్ కోసం ఖమ్మం కార్పొరేషన్, మధిర, సత్తుపల్లి, వైరా మున్సిపాలిటీల్లో 51,425 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 8,851 అనుమతి పొందగా.. 339 దరఖాస్తులను తిరస్కరించారు. గతంలోనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నవి 53 ఉండగా, సరైన డాక్యుమెంట్లు లేని కారణంగా 2,035 దరఖాస్తులను పక్కన పెట్టారు. అలాగే, నిషేధిత సర్వేనంబర్లలోనివి 5,946 ఉన్నాయి. కాగా, మూడు దశల్లో భాగంగా ఎల్–1లో 33,302, ఎల్–2లో 259, ఎల్–3 దశకు 51 దరఖాస్తులు చేరాయి. మున్సిపాలిటీల్లో ఫీజు చెల్లింపునకు 8,851 దరఖాస్తులు అనుమతి పొందినా 1,146 దరఖాస్తులకే ఫీజు చెల్లించారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే మున్సిపాలిటీల్లో దరఖాస్తుల పరిశీలన, ఫీజు చెల్లింపు ప్రక్రియ ముందుకు పడడడం లేదని స్పష్టమవుతోంది. సుడా, జీపీల్లో ఎక్కడివి అక్కడే.. దరఖాస్తుల పరిశీలనలో సుడా, గ్రామపంచాయతీలు పూర్తిగా వెనుకబడ్డాయి. సుడా(స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) పరిధిలో 34,391 దరఖాస్తులు వస్తే ఇందులో కేవలం ఏడు మాత్రమే అనుమతి పొందగా.. 853 దరఖాస్తులను నిషేధిత జాబితాలో పెట్టారు. ఇక అనుమతి లభించిన ఏడింట్లో నాలుగింటికే ఫీజు చెల్లింపు పూర్తయింది. గ్రామపంచాయతీల్లో 13,931 దరఖాస్తులు అందగా 58 దరఖాస్తులకు అనుమతి ఇస్తే ఒక దరఖాస్తుకే ఫీజు చెల్లించారు. మరో 571 దరఖాస్తులను నిషేధిత జాబితాలో పెట్టగా, 13,235 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఒక్కో దశ దాటితేనే.. తొలుత సీజీజీ(సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులను పరిశీలిస్తారు. ఆపై మొబైల్ యాప్ ద్వారా క్షేత్రస్థాయిలో రెవెన్యూ గ్రామం లేదా మున్సిపాలిటీలో రెవెన్యూ ఇన్స్పెక్టర్, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్, నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్లతో ఏర్పాటు చేసిన బృందం పరిశీలన చేపట్టాలి. ఈ బృందం జీపీఎస్ ద్వారా సదరు భూమి హద్దులు, ఇతర సమాచారాన్ని యాప్లో అప్లోడ్ చేస్తుంది. అదే సమయాన భూములు నీటి వనరుల బఫర్ జోన్, నాలా, చెరువులు, హెరిటేజ్ భవనాలు, డిఫెన్స్ ల్యాండ్ పరిధిలో లేవని ధ్రువీకరించాలి. ఇదంతా మూడు దశల్లో జరగాల్సి ఉన్నా చాలా సమయం పడుతోంది. ఊరటనిచ్చేలా రాయితీ ఏళ్లుగా పెండింగ్ ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీ దరఖాస్తుదారులకు కలిసొస్తుంది. ఒక ప్లాట్కు సంబంధించి రోడ్లు, పైపులైన్లు, ఇతర సౌకర్యాలు లేకుండా ఏర్పాటుచేసినందుకు ఎల్ఆర్ఎస్ చార్జీలు విధిస్తుంటారు. వీటితోపాటు గ్రీన్ల్యాండ్కు 10 శాతం స్థలాన్ని ఇవ్వనందుకు ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం విలువను లెక్కించి దానిపై 14 శాతం చార్జీ విధిస్తారు. ఈ రెండూ చెల్లిస్తేనే యజమానికి స్థలం రెగ్యులరైజ్ అవుతుంది. మొత్తంగా రాయితీతో దరఖాస్తుదారులకు ముందుకొచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఇదే సమయాన అదనపు సిబ్బందిని కేటాయించాలనే సూచనలు వస్తున్నాయి.ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వివరాలు మున్సిపాలిటీలు దరఖాస్తులు అనుమతి ఫీజు చెల్లింపు ఖమ్మం కార్పొరేషన్ 39,942 3,735 939 మధిర మున్సిపాలిటీ 4,276 1,488 97 సత్తుపల్లి మున్సిపాలిటీ 3,688 2,391 62 వైరా మున్సిపాలిటీ 3,516 1,237 48 సుడా పరిధి 34,391 07 04 గ్రామపంచాయతీలు 13,931 58 01మొత్తం 99,747 8,916 1,151పరిశీలనే అసలు సమస్య ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన యంత్రాంగానికి సవాల్గా మారింది. మున్సిపాలిటీల్లో దరఖాస్తుల పరిశీలన ఒకింత నత్తనడకన సాగుతున్నా.. సుడా, గ్రామపంచాయతీల్లో మాత్రం పూర్తిగా పడకేసింది. సుడాకు క్షేత్రస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొనగా, జీపీల్లో కార్యదర్శులు, ఆ తర్వాత మండల స్థాయిలో జరగాల్సిన పరిశీలన కూడా మందగించింది. ఈసారి ప్రభుత్వం ఫీజులో రాయితీ ప్రకటించి,మార్చి 31వరకు గడువు విధించిన నేపథ్యాన పరిశీలనకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమిస్తేనే ఫలితం ఉంటుందని భావిస్తున్నారు. జిల్లాలో 99,747ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్లో 8,916కే అనుమతి సిబ్బంది కొరతతో ఏళ్లుగా నత్తనడకన పరిశీలన తాజాగా రాయితీ ప్రకటించిన ప్రభుత్వం -
ఇంకెంత మంది చనిపోవాలి ?
సత్తుపల్లిరూరల్: సింగరేణి గనుల వద్ద ఏర్పాటుచేసిన సైలో బంకర్ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో అనారోగ్యం బారిన పడుతున్నందున తొలగించాలనే డిమాండ్తో సత్తుపల్లి మండలం కిష్టారం అంబేద్కర్నగర్ వాసులు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈసందర్భంగా పదో రోజైన గురువారం శ్వాసకోశ వ్యాధులతో మృతి చెందిన వారి ఫొటోలతో కుటుంబీకులు దీక్షలో పాల్గొన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తమ ప్రాణాలకు ముప్పుగా మారిన సైలో బంకర్ను తొలగించాలని డిమాండ్ చేశారు. సింగరేణి అధికారులు స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు.‘సైలో బంకర్’పై కొనసాగుతున్న దీక్షలు -
46 స్కూళ్లకు డెస్క్ టాప్ కంప్యూటర్లు
పాల్వంచరూరల్: పీఎంశ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకం కింద ఎంపికైన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సాంకేతిక విద్య అందనుంది. ఇందుకోసం కంప్యూటర్లను కేటాయించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 46 స్కూళ్లకు డెస్క్ టాప్ కంప్యూటర్లు, ప్రింటర్లు, యూపీఎస్లు మంజూరయ్యాయి. అలాగే, రెండు జిల్లాల్లో ఏడు ఎమ్మార్సీలకు సైతం కంప్యూటర్లు కేటాయించారు. వీటితో విద్యార్థులకు మెరుగైన సాంకేతిక విద్య అందుతుందని అధికారులు భావిస్తున్నారు. కాగా, గతంలోనూ పాఠశాలలకు కంప్యూటర్లు కేటాయించినా శిక్షకులను నియమించకపోవడంతో అవి అటకెక్కాయి. ప్రస్తుతం కూడా బోధకులను కేటాయించకపోతే అదే పరిస్థితి ఎదురవుతుందని పలువురు చెబుతున్నారు.పాఠశాలల వివరాలిలా..పీఎంశ్రీ పథకం ద్వారా భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలంలోని సుదిమళ్ల బాలికల టీడబ్ల్యూఆర్ఈఐఎస్కు పది కంప్యూటర్లు, ఒక ప్రింటర్, రెండు యూపీఎస్లు కేటాయించారు. అలాగే, టేకులపల్లి మండలం కొయ్యగూడెంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల, జూలూరుపాడు మండలం పాపకొల్లులోని జెడ్పీహెచ్ఎస్, అన్నపురెడ్డిపల్లిలోని టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్, చుంచుపల్లి మండలం బాబుక్యాంప్లోని హైస్కూల్, కొత్తగూడెం కూలీలైన్ హైస్కూల్, లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురం జెడ్పీహెచ్ఎస్, పాల్వంచలోని బాలుర టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్, బాలికల జెడ్పీహెచ్ఎస్, బూర్గంపాడు మండలం సారపాకలోని జెడ్పీహెచ్ఎస్, భద్రాచలంలోని కొర్రాజులగుట్ట జెడ్పీహెచ్ఎస్, ములకలపల్లిలోని టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్, దమ్మపేటలోని టీడబ్ల్యూఆర్ఈఐఎస్, పినపాక మండలం అల్చిరెడ్డిపల్లిలోని ఆశ్రమ పాఠశాల, దుమ్ముగూడెం మండలం రేగుబల్లిలోని బాలికల ఆశ్రమ పాఠశాలకు కంప్యూటర్లు, ఇతర సామగ్రి మంజూరయ్యాయి.అలాగే, అశ్వాపురం జెడ్పీహెచ్ఎస్, మణుగూరులోని బాలికల టీటీడబ్ల్యూయూఆర్జేసీ, గుండాల మండలంలోని టీడబ్ల్యూఆర్ఈఐఎస్, సుజాతనగర్లోని జెడ్పీహెచ్ఎస్, దమ్మపేటలోని జెడ్పీహెచ్ఎస్, దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి గిరిజన అశ్రమ పాఠశాలలకు కూడా కేటాయించారు. వీటితో పాటు ఖమ్మం జిల్లాలోని 25 స్కూళ్లకు కంప్యూటర్లు, ప్రింటర్లు, యూపీఎస్లు మంజూరయ్యాయి. ఇవి ప్రస్తుతం మండల వనరుల కేంద్రాలకు చేరగా, అక్కడి నుంచి పాఠశాలలకు చేరవేస్తారు. ఇక భద్రాద్రి జిల్లాలోని అళ్లపల్లి, అన్నపురెడ్డిపల్లి, కరకగూడెం, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, చుంచుపల్లితో పాటు ఖమ్మం జిల్లాలో ఒక ఎమ్మార్సీకి సైతం ఆరేసి కంప్యూటర్లు, ఒక ప్రింటర్, ఒక యూపీఎస్ మంజూరయ్యాయి. -
తహసీల్ ఎదుట వృద్ధురాలి దీక్ష
మధిర: ఇంటి స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని పలుమార్లు తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం ఆరోపిస్తూ ఓ వృద్ధురాలు తహసీల్ ఎదుట గురువారం నిరసన దీక్ష చేపట్టింది. మండలంలోని దెందుకూరుకు చెందిన కనకపూడి కరుణమ్మ ఇంటి స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించుకున్నారని ఇటీవల తహసీల్దార్ రాంబాబుకు ఫిర్యాదు చేసింది. అయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో దీక్షకు దిగినట్లు తెలిపింది. ఆక్రమణకు గురైన తన స్థలాన్ని ఇప్పించాలని లేకపోతే చనిపోవడానికి అనుమతి ఇప్పించాలని కోరింది. ఈ విషయమై తహసీల్దార్ను వివరణ కోరగా కరుణమ్మ ఫిర్యాదుతో సంబంధిత వ్యక్తులకు 15 రోజుల గడువుతో నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఈనెల 22వ తేదీతో గడువు ముగియనుండగా ధ్రువపత్రాలు కలిగిన వారికి స్థలాన్ని అప్పగిస్తామని వెల్లడించారు. -
అనుమతి.. మాకు అవసరం లేదు!
ఖమ్మం ఇందిరానగర్ ప్రాంతంలో ఓ భవన యజమాని సెల్లార్తో పాటు రెండు అంతస్తుల నిర్మాణానికి అనుమతి తీసుకున్నాడు. ఆతర్వాత సెట్ బ్యాక్ కాకుండానే అనుమతికి మించి రెండు ఫ్లోర్లు అదనంగా నిర్మించాడు. స్లాబ్ల నిర్మాణం పూర్తయ్యాక కేఎంసీ అధికారులు పనులను అడ్డుకున్నారు. అదనపు నిర్మాణాలకు అనుమతి తీసుకోవాలని నోటీసులు జారీ చేశారు. ఇలా ఖమ్మంలో మాత్రమే కాదు జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లోనూ పలువురు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు.●కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు ●అనుమతి తీసుకున్నా అంతకు మించి కట్టడాలు ●అయినా చోద్యం చూస్తున్న అధికారులు ●ఫిర్యాదులు అందితే నోటీసులతోనే సరిఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్రంలో ప్రధాన నగరాల తర్వాత అత్యధిక జనాభా నివసించే నగరంగా ఖమ్మం నిలుస్తోంది. విద్య, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం వస్తున్న వారితో జిల్లాలోని ఖమ్మంతో పాటు మధిర, సత్తుపల్లి, వైరా మున్సిపాలిటీల్లోనూ జనాభా.. అందుకు అనుగుణంగా నిర్మాణాల సంఖ్య పెరుగుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఖమ్మం కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో నిబంధనలను బేఖాతరు చేస్తూ చేపడుతున్న నిర్మాణాలతో భవిష్యత్లో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముంది. కొందరు పూర్తిగా అనుమతులు తీసుకోకపోగా.. ఇంకొందరు గ్రౌండ్ ఫ్లోర్ వరకే అనుమతి తీసుకుని ఆపై రెండు, మూడు అంతస్తులు నిర్మిస్తున్నారు. మరికొందరైతే ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి మరీ నిర్మాణాలు చేపడుతుండడం గమనార్హం. విద్యుత్ కనెక్షన్లు, ఇంటి నంబర్లు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడడం లేదు. పాలకులు సీరియస్గా తీసుకున్నా.. అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా వాణిజ్య, నివాస ప్రాంతాల్లో నిర్మాణాల సంఖ్య రెట్టింపు స్థాయికి చేరింది. ఎక్కడ చూసినా మూడు నుండి ఐదు అంతస్తుల భవనాలే కనిపిస్తున్నాయి. ఇక వాణిజ్య ప్రాంతాల్లో భవనాల నిర్మాణాలు అడ్డగోలుగా జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. 168 జీఓ ప్రకారం అనుమతులు తీసుకుని నిర్మాణ పనులు చేపట్టాలని మున్సిపల్ చట్టం చెబుతున్నా యజమానులు పట్టించుకోవడం లేదు. అనుమతి లేకుండా నిర్మించిన భవనాలకు అటు విద్యుత్ అధికారులు కనెక్షన్లు ఇస్తుండగా.. రెవెన్యూ విభాగ అధికారులు నంబర్లను కేటాయిస్తుండడం గమనార్హం. కనిపించడం లేదా? వాణిజ్య, నివాస ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా చేపడుతున్న నిర్మాణాలు, పార్కింగ్ సౌకర్యం కూడా లేదని తెలిసినా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో పరిశీలిస్తే బైపాస్ రోడ్డు, బస్టాండ్లు, పాఠశాలలు, మార్కెట్ల వద్ద ఒకటి, రెండు ఫ్లోర్లకు అనుమతి తీసుకొని, ఆపైన అదనపు నిర్మాణాలు చేపడుతున్నారు. కనీసం పార్కింగ్ సౌకర్యం లేకుండా సెల్లార్లో సైతం నిర్మాణాలు చేపడుతూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. సెట్ బ్యాక్ లేకుండానే.. చాలాచోట్ల కనీసం సెట్బ్యాక్ కూడా లేకుండా నిర్మాణాలు చేపడుతుండడంతో ఆ మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సెట్బ్యాక్ లేకుండా భవనాలు నిర్మిస్తున్నట్లు వందల సంఖ్యలో కేఎంసీ, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేకపోతున్నారు. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో నిబంధనల ప్రకారం రోడ్డు వెడల్పు ఆధారంగా సెట్ బ్యాక్ కావాలి. నలభై అడుగుల లోపు వెడల్పు రోడ్డు పక్కన 240 గజాల స్థలంలో చేపట్టే నిర్మాణాలకు ముందు భాగాన కనీసం ఐదు అడుగులు సెట్బ్యాక్ కింద వదలాలి, ఇక మిగిలిన మూడు వైపులా మూడు అడుగులకు పైగా సెట్ బ్యాక్ వదలాలి. అలాగే, వంద అడుగుల రోడ్డు పక్కన 400 – 500 గజాల్లోపు స్థలంలో నిర్మించే భవనాలైతే ముందు భాగంలో 20 అడుగుల సెట్బ్యాక్ వదలాల్సి ఉన్నా ఎవరూ పాటించడం లేదు. -
ఖమ్మం, కల్లూరు, మణుగూరు జట్ల విజయం
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న రాజీవ్గాంధీ స్మారక క్రికెట్ టోర్నీలో భాగంగా గురువారం నిర్వహించిన మ్యాచ్ల్లో ఖమ్మం అర్బన్, కల్లూరు, మణుగూరు జట్లు ముందంజలో నిలిచాయి. ఖమ్మం అర్బన్ – వైరా జట్ల నడుమ మ్యాచ్లో అర్బన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 112 పరుగులు చేయగా తర్వాత బ్యాటింగ్కు దిగిన వైరా 107 పరుగులే చేయడంతో ఓటమి పాలైంది. కల్లూరు – ముదిగొండ మధ్య మ్యాచ్లో ముదిగొండ జట్టు 77 పరుగులు చేయగా, కల్లూరు జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అలాగే, మూడో మ్యాచ్లో మణుగూరు–సత్తుపల్లి తలపడగా తొలుత బ్యాటింగ్కు దిగిన మణుగూరు జట్టు 113 పరుగులకు ఆలౌట్ అయింది. ఆతర్వాత సత్తుపల్లి 106 పరుగులకే ఆలౌట్ కావడంతో మణుగూరుకు విజయం దక్కింది. ఈమేరకు పోటీలను టోర్నీ ఆర్గనైజర్ ఎం.డీ.మతిన్ తదితరులు పర్యవేక్షించారు. జిల్లా బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపిక ఖమ్మంస్పోర్ట్స్: రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు గాను జిల్లా సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ జట్లను ఎంపిక చేశారు. ఈనెల 20నుంచి వికారాబాద్లో జరగనున్న పోటీల్లో పాల్గొనే జట్ల వివరాలను కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తుంబూరు దయాకర్రెడ్డి, కె.క్రిస్టోఫర్బాబు గురువారం వెల్లడించారు. ఈసమావేశంలో ఎస్.కే.ఇమామ్, ఉమ్మినేని కృష్ణ, ఊటుకూరి రంజిత్, ప్రసాద్, సుధాకర్, శివ పాల్గొనగాక్రీడాకారులకు కిట్లు అందజేశారు. కాగా, బాలురు జట్టుకు ఎం.సాంబశివరావు, బి.శరత్, సీహెచ్.ఆనంద్, జి.సోను, ఏ.నితిన్, యు.వెంకటకృష్ణ, బి.మనోజ్, జి.గణేష్, బి.రాఘవ, జి.హరి, ఎం.శివప్రసాద్, పి.వేణు, డి.అశోక్, బాలికల జట్టుకు బి.హనీ, ఎస్.కే.నాగహసీనా, టి.మేఘన శరణ్య, ఐ.కృష్ణవేణి, ఎస్.కే.రిజ్వానా, వై.నిఖిత, జి.శైలజ, బి.భావన, ఎస్.కే.పర్వీన్, బి.భాను, ఎస్.ప్రవీణ ఎంపికయ్యారని తెలిపారు. నేడు ఉమ్మడి జిల్లాస్థాయి రెజ్లింగ్ పోటీలు కొత్తగూడెంటౌన్: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి రెజ్లింగ్ పోటీలు శుక్రవారం కొత్తగూడెం రామవరంలోని తెలంగాణ క్రీడా మైదానంలో నిర్వహించనున్నట్లు రెజ్లింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.కాశీహుస్సేన్ తెలిపారు. అండర్–10, 12, 14, 17 విభాగాల్లో ఈ పోటీలు జరుగుతాయని వెల్లడించారు. ఆసక్తి కలిగిన బాలబాలికలు వయస్సు ధ్రువీకరణ పత్రం, ఆధార్కార్డుతో రావాలని ఆయన ఓ ప్రకటనలో సూచించారు. ఆలయాల నిర్మాణానికి రూ.2 లక్షల విరాళం కల్లూరురూరల్: కల్లూరు మండలం లక్ష్మీపురం(రాళ్ల బంజరు)లో సంత్ సేవాలాల్, మారెమ్మ ఆలయాల నిర్మాణానికి చిక్కుల అనసూర్య, ఆమె కుటుంబీకులు వెంకట రామారావు, రమేష్, మురళీకృష్ణ, గంధం స్వరాజ్యలక్ష్మి గురువారం రూ.2 లక్షల విరాళం అందజేశారు. అలాగే, గ్రామానికి చెందిన గుగులోతు లక్ష్మి ఆలయ నిర్మాణం కోసం ఒక కుంట స్థలం విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు పసుమర్తి చందర్రావు, గ్రామస్తులు పాల్గొన్నారు. శాశ్వత నిత్యాన్నదానానికి విరాళాలు భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి గురువారం పలువురు భక్తులు విరాళాలు అందచేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వనంవారి కిష్టాపురం వాసి తుపాకుల ఎలగొండ స్వామి – రమాదేవి దంపతులు రూ.లక్ష, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ వాస్తవ్యులు పీ.వీ.కృష్ణమూర్తి – జ్ణానద దంపతులు రూ.1,00,116ను ఆలయ అధికారులకు అందచేసి స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబు, కత్తి శ్రీనివాసులుతో దాతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
ప్రమాదవశాత్తు కాల్వలో పడి హోంగార్డు మృతి
నేలకొండపల్లి: కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన హోంగార్డు ప్రమాదవశాత్తు సాగర్ కాల్వలో పడడంతో మృతి చెందాడు. నేలకొండపల్లి పోలీస్స్టేషన్లో హోంగార్డ్గా పనిచేస్తున్న గంటా నరేష్(37) గురువారం ఉదయం నందిగామ బ్రాంచి కెనాల్ వద్ద కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లాడు. బైక్, దుస్తులు, చెప్పులు, సెల్ఫోన్ కాల్వ కట్టపై ఉంచి దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారడంతో కాల్వలో పడిపోయాడు. అయితే, నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో హైడల్ పవర్ ప్రాజెక్ట్ వరకు కొట్టుకెళ్లిన ఆయన ఊపిరాడక మృతి చెందాడు. ఆతర్వాత లాక్ల వద్ద మృతదేహాన్ని గమనించిన స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు చేరుకుని బయటకుతీయించారు. ఆయనకు భార్య నాగశ్రీతో పాటు ఇద్దరు పిల్లలు ఉండగా, భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కూసుమంచి, ముదిగొండ సీఐలు సంజీవ్, మురళి, ఎస్సైలు సంతోష్, లక్ష్మణ్రావు, నవీన్, రవి, గౌతమ్, హోంగార్డు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివాస్ తదితరులు నరేష్ మృతదేహం వద్ద నివాళులర్పించారు. -
ఇంకొందరికి తోడ్పాటునివ్వాలి
● అటు అందం.. ఇటు సందేశంవాల్ ప్రాజెక్ట్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారుల వెంట గోడలపై అందమైన పెయింటింగ్లు వేయిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలపై వేయిస్తున్న ఈ పెయింటింగ్లు అందంగానే కాక ఆలోచింపచేసేలా ఉంటున్నాయి. మొక్కల ఆవశ్యకత, వనాలు లేకపోతే ఎదురయ్యే అనర్ధాలు, పల్లె వాతావరణం, రైతులతో కూడిన చిత్రాలే కాక సైనికుల చిత్రాలు వేయిస్తున్నారు. అలాగే, స్టేడియం వద్ద గోడలపై ప్రముఖ క్రీడాకారుల చిత్రాలు వేయిస్తూ ఔత్సాహిక క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మంలోని బస్డిపో రోడ్డు, వీడీవోస్ కాలనీ, బ్యాంక్ కాలనీ, పీజీ కళాశాల తదితర ప్రాంతాల్లో ఈ చిత్రాలు ఆ మార్గంలో రాకపోకలు సాగించే వారిని ఆకట్టుకోవడమే కాదు ఆలోచింపచేస్తున్నాయి. – స్టాఫ్ ఫోటోగ్రాఫర్సైనికుల త్యాగాలను వివరిస్తూ..ఖమ్మంసహకారనగర్: విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని ఉన్నతస్థాయికి చేరడం ద్వారా ఇంకొందరి ఎదుగుదలకు తోడ్పాటునివ్వాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఖమ్మంలోని శాంతినగర్ ఏఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించేలా అవసరమైన శిక్షణ, పుస్తకాల కొనుగోలుకు మలబార్ గోల్డ్ చారిటబుల్ సంస్థ బాధ్యులు రూ.3.80 లక్షల చెక్కును కలెక్టర్ చేతుల మీదుగా గురువారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు, గురువులు నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యార్థులు చదువుకుంటూ మంచి స్థాయికి చేరాలని సూచించారు. ప్రధానంగా ఆడపిల్లలు చదువును ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. కాగా, తన భార్య కూడా మలబార్ సంస్థ వ్యవస్థాపకుల స్వస్థలమైన కాలికట్ వాసి అని కలెక్టర్ తెలిపారు. జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు, కళాశాల ప్రిన్సిపాల్ గోవిందరావు, అధ్యాపకులు పవన్, భరత్కుమార్, రాణి, శ్రీనివాస్, కిరణ్, మలబార్ సంస్థ బాధ్యులు విష్ణు, రామారావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ -
మెప్మాలో అడుగడుగునా నిర్లక్ష్యం
● బకాయిలపై సభ్యులకు బ్యాంకర్ల నుండి నోటీసులు ● ఆర్పీ పక్కదారి పట్టించడమే కారణంఖమ్మంమయూరిసెంటర్: మహిళా సంఘాల సభ్యులు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయిస్తోంది. పట్టణాల్లో సంఘాల సభ్యులకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యాన ఈ రుణాలు మంజూరు చేయిస్తుంటారు. ఇదంతా టీఎల్ఎఫ్, సీఓ, ఆర్పీల పర్యవేక్షణలో కొనసాగుతుండగా కొందరు ఆర్పీలు సభ్యుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నగదు స్వాహా చేస్తున్నారు. ఈక్రమంలోనే ఖమ్మం ప్రకాశ్నగర్కు చెందిన ఓ ఆర్పీ.. సభ్యులకు మంజూరైన రుణాన్ని తీసుకుని తిరిగి కట్టకపోవడంతో సభ్యులకు బ్యాంకు నుంచి నోటీసులు అందాయి. వరుస నోటీసులతో... ప్రకాశ్నగర్ ప్రాంతానికి చెందిన ఆరు మహిళా సంఘాలకు 2021–22 ఏడాదిలో రూ.2 కోట్లకు పైగా రుణాలను బ్యాంక్ లింకేజి, సీ్త్రనిధి ద్వారా ఆర్పీ మంజూరు చేయించారు. ఈ సమయాన ఒక సీఓ సంతకం చేసినా మరొకరి సంతకాన్ని ఆర్పీ ఫోర్జరీ చేసినట్లు సమాచారం అంతేకాక 40 మంది సభ్యుల ఖాతాల్లో జమ అయిన కొంత మొత్తాన్ని ఆమె తీసుకున్నట్లు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక సభ్యులు తాము రుణాలు సకాలంలో చెల్లించినా, ఆర్పీ నగదు తరిగి కట్టకపోవడంతో బ్యాంకర్లు నోటీసులు జారీ చేస్తున్నారు. తాజాగా బ్యాంకర్లు ఆర్పీ ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉండడం గమనార్హం. సుమారు రూ.1.50 కోట్ల మేర ఆర్పీ తీసుకున్నట్లు తెలుస్తుండగా, నోటీసులకు స్పందించని కారణంగా సభ్యులతో పాటు ఆర్పీ ఖాతాను ఇప్పటికే బ్లాక్ చేసినట్లు తెలిసింది. ‘వన్ టైం’ కోసం.. ఖమ్మం పరిధిలోని మెప్మా ద్వారా మంజూరు చేయించే రుణాల చెల్లింపులో ఆర్పీలు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. సభ్యులకు మంజూరయ్యే రుణాలు ఆర్పీలు తీసుకుని తామే చెల్లిస్తామని నమ్మబలకడం, ఆ తర్వాత సకాలంలో చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. ఈక్రమంలోనే ఖాతాలను బ్లాక్లో పెడుతున్న బ్యాంకర్లు కొన్నాళ్లకు వన్టైం సెటిల్మెంట్కు అవకాశం ఇస్తున్నారు. దీంతో ఎంతోకొంత చెల్లించి ఆర్పీలు సెటిల్ చేస్తున్నారని సమాచారం. ఇదేమాదిరి ప్రకాశ్నగర్ ప్రాంత ఆర్పీ కూడా వ్యవహరించగా, ఇందులో సీఓల పాత్ర కూడా ఉందని తెలిసింది. ఈఅంశంపై మెప్మా అధికారులను వివరణ కోరగా.. బ్యాంకర్లు రుణాలను సభ్యుల ఖాతాల్లో జమ చేశారని తెలి పారు. అప్పుడు ఒక సీఓ సంతకాన్ని ఆర్పీ ఫోర్జరీ చేసినట్లు తేలగా ఆమెను విధుల నుంచి తొలగించి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
కత్తెర పురుగు నిర్మూలనపై అవగాహన
తల్లాడ: మండలంలోని గోపాలపేటలో పలువురు రైతుల మొక్కజొన్న క్షేత్రాలను తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ మొక్కజొన్న పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్ర వేత్త డి.భద్రునాయక్, సీనియర్ శాస్త్రవేత్త బి.మల్లయ్య బుధవారం పరిశీలించారు. ఈసందర్భంగా పంటను ఆశిస్తున్న కత్తెర పురుగులు, రెక్కల పురుగులను గుర్తించడంతో పాటు సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. లేత మొక్కజొన్నలో ఎకరానికి(30 రోజుల వరకు) 10 – 15 లింగార్షక బుట్టలను అమర్చుకోవాలని, వేప సంబంధిత మందు అజాడి రక్తిన్ (1500 పీపీఎం) 5 మి.లీ.ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. ఏఓ ఎం.డీ.తాజుద్దీన్, ఏఈఓ హసీనాబేగం, రైతులు పాల్గొన్నారు. -
రూ.11.58 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
ఖమ్మంక్రైం: ఖమ్మంలో రైల్వేస్టేషన్ నుంచి ముంబై తరలించడానికి సిద్ధంగా ఉన్న గంజాయిని జీఆర్పీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జీఆర్పీ సీఐ అంజలి, డోర్నకల్ ఎస్ఐ సురేష్ మంగళవారం సాయంత్రం ఖమ్మం స్టేషన్లో తనిఖీ చేస్తుండగా రెండో నంబర్ ప్లాట్ఫాంపై రెండు సూట్కేసులతో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో ఆయన వద్ద సోదా చేయగా రూ.11.58లక్షల విలు వైన 46కేజీల గంజాయి లభ్యమైంది. మహారాష్ట్రలోని పర్బనీ జిల్లాకు కార్మికుడైన ఆయన తేలికగా డబ్బు సంపాదించడానికి ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లాలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి ముంబైలో అమ్మడానికి వెళ్తున్నట్లుగా తేలింది. ఈమేరకు నిందితుడిని బుధవారం రిమాండ్కు తరలించినట్లు సీఐ అంజలి తెలిపారు. తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఆరుతడి పంటలతో నికర ఆదాయం
రఘునాథపాలెం: రైతులు ఆరుతడి పంటలుగా పెసర తదితర పంటలు సాగు చేస్తే మిగతా వాటితో పోలిస్తే నికర ఆదాయం లభిస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి(డీఏఓ) ధనసరి పుల్ల య్య తెలిపారు. రఘునాథపాలెం మండలం మంచుకొండలో పలువురు రైతులు సాగు చేసిన పెసర పంటను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పెసరను మారుక మచ్చల పురుగు ఆశిస్తుండడంతో పూత, పిందె రాలిపోతోందని తెలిపారు. దీని నివారణకు 1500 పీపీఎం వేప నూనె పిచికారీ చేయాలని, పురుగు ఉధృతంగా ఉంటే ప్లాత్రో, అంప్లిగో మందులను వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలని సూచించారు. ఏఓ కర్నాటి ఉమామహేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొక్కల పెంపకంపై నిర్లక్ష్యం వద్దు కామేపల్లి: నర్సరీల్లో మొక్కల సంరక్షణ, పెంపకంపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ హెచ్చరించారు. మండలంలోని ముచ్చర్ల, కొత్తలింగాల, జాస్తిపల్లిలో బుధవారం పర్యటించిన ఆమె ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన నిర్మాణాలను పరిశీలించారు. అలాగే, నర్సరీలను పరిశీలించిన అదనపు కలెక్టర్ ఎండ తీవ్రత కారణంగా మొక్కలు చనిపోకుండా సంరక్షించాలని సూచించారు. ఉపాధి పని ప్రదేశాల్లో కూలీలకు తాగునీరు, నీడ కల్పించాలని తెలిపారు. ఎంపీడీఓ రవీందర్, ఈజీఎస్ ఏపీఓ శ్రీరాణీ, ఈసీ వెంకటేశ్వర్లు, టీఏ భాస్కర్, ఫీల్డ్ అసిసెంట్లు పాల్గొన్నారు. కమనీయం.. రామయ్య నిత్యకల్యాణంభద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గ ర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేనపూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గా వించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. -
కన్నీరు ఇంకిపోతోంది..
జిల్లాలో నాగార్జునసాగర్ ఆయకట్టుతోపాటు నాన్ ఆయకట్టులోనూ బోర్లు, బావులు, చెరువుల కింద సాగు చేసిన వరి, మొక్కజొన్న, ఇతర పంటలు ఎండిపోతున్నాయి. యాసంగిలో అన్నీ కలిపి 2,93,991 ఎకరాల్లో పంటలు సాగు చేయగా ఇందులో వరి, మొక్కజొన్న అత్యధికంగా ఉన్నాయి. నాన్ ఆయకట్టులో బోర్లు, బావుల్లో నీళ్లు ఇంకిపోవడమే కాక చెరువుల్లో నీటి మట్టం తగ్గింది. అలాగే, వారబందీ విధానంతో సాగర్ చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. అటు కాల్వలు, బావులు, బోర్లలోనే కాక కళ్లలోనూ ఇంకిపోయిన నీటితో పంటలను కాపాడుకునేందుకు రైతులు నానాపాట్లు పడుతున్నారు. ఈమేరకు అన్నదాతల ఆవేదన, పంటల పరిస్థితిపై బుధవారం ‘సాక్షి’ చేపట్టిన పరిశీలనలో వెల్లడైన అంశాలతో కథనం... – సాక్షి ప్రతినిధి, ఖమ్మం / నెట్వర్క్ఈ కుటుంబానికి దిక్కెవరు? చింతకాని మండలం లచ్చగూడెంకు చెందిన నెర్సుల ఎల్లయ్య పదిహేనేళ్ల పాటు ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేశాడు. ఇటీవల ఆరోగ్యం సహకరించక గ్రామంలోనే మూడెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. సాగర్ ఆయకట్టు చివరి భూమి కావడం, బావిలోనూ నీళ్లు అడుగంటడంతో నీరు అందించలేని పరిస్థితి ఎదురైంది. ఇప్పటికే రూ.60 వేలు పెట్టుబడి పెట్టిన ఆయన కళ్ల ముందే పంట ఎండిపోతుండడంతో మంగళవారం పొలం వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తమకు దిక్కెవరని రోదిస్తున్న ఆయన భార్య నర్సమ్మ, ఇద్దరు ఆడపిల్లలకు సమాధానం చెప్పేవారు కరువయ్యారు.చివరి ఆయకట్టు చింతసాగర్ ఆయకట్టు 2.54 లక్షల ఎకరాలు కాగా.. కాల్వల ఆధారంగా లిఫ్ట్ ఇరిగేషన్లతో కలిపి 2.79 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఖమ్మం, వైరా, మధిర, పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాలకు సాగర్ జలాలు సరఫరా అవుతుండడంతో వరి, మొక్కజొన్నతోపాటు ఆరుతడి పంటలను సాగు చేశారు. ఇందులో మొక్కజొన్న పంట కంకి దశలో ఉండగా నీటి తడులు ఎక్కువగా అవసరమవుతున్నాయి. కానీ సాగర్ జలాలను వారబందీ విధానంలో గత ఏడాది డిసెంబర్ 15 నుంచి విడుదల చేస్తున్నారు. మొదటి తడి 27 రోజులు ఇచ్చి తొమ్మిది రోజులు నిలిపేశారు. ఆపై రెండో తడి నుంచి తొమ్మిది రోజులు ఆన్, ఆరు రోజులు ఆఫ్ విధానం అమలవుతోంది. ఈ విధానంతో కొన్ని మండలాలకు నీరు అంది.. ఆపై నిలిచిపోవడంతో చివరి ఆయకట్టు రైతులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో వారబందీ విధానం తొలగించి కనీసం రెండు నెలలపాటు సక్రమంగా సరఫరా చేయాలని ఇటీవల బోనకల్ మండల రైతులు కలెక్టర్ను కలిసి అభ్యర్థించారు. అడుగంటిన భూగర్భ జలాలుయాసంగిలో రైతులు సాగర్ జలాలతోపాటు బోర్లు, బావులను నమ్ముకోగా భూగర్భ జలాలు సైతం పడిపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం గత ఏడాది డిసెంబర్లో భూగర్భ జలాలు 3.87 మీటర్ల లోతులో ఉంటే.. ఈ ఏడాది జనవరిలో 4.49 మీటర్ల లోతుకు పడిపోయాయి. ఫిబ్రవరిలో ఎండలు పెరగగా నీటిమట్టం మరింత పడిపోయి బోర్లు, బావుల్లో కూడా నీళ్లు రోజురోజుకూ అడుగంటుతున్నాయి. బోరు బావుల్లో నీరు తగ్గగా పలువురు 5 హెచ్పీ మోటార్లు తీసేసి 3 హెచ్పీ మోటార్లను బిగించి వచ్చే అరకొర నీటిని పంటలకు పెడుతున్నారు. కళ్ల ముందే ఎండుతున్న పంటలుబోనకల్ మండలంలో ఎక్కువగా సాగర్ జలాలపైనే ఆధారపడి రైతులు పంటలు సాగు చేస్తున్నారు. బోనకల్ బ్రాంచ్ కెనాల్(బీబీసీ) పరిధి ఆళ్లపాడు, నారాయణపురం, కలకోట, రాపల్లి, గోవిందపురం, రాయన్నపేట తదితర గ్రామాల్లో ఆరు వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు కాగా వారబందీ విధానంతో చివరి భూములకు నీరందే పరిస్థితి లేదు. కొందరు రైతులు సమీపంలోని చెరువులు, వాగుల నుండి తాత్కాలికంగా నీటిని పెట్టుకుంటున్నారు. అలాంటి వసతి లేనివారు కళ్ల ముందే పంట ఎండిపోతున్నా కన్నీరు పెట్టుకునే పరిస్థితి నెలకొంది. బీబీసీ పరిధిలో 11 మైనర్ కాల్వలు ఉండగా, ఇక్కడి నుంచే ఏపీకి జలాలు వెళ్లాలి. కానీ చింతకాని మండలం, బోనకల్ మండలంలోని కొన్ని గ్రామాలకు నీరు చేరగానే నిలిచిపోతుండడంతో చివరి ఆయకట్టు ఎండిపోతోంది. ఇక తల్లాడ మండలంలోని సిరిపురం మేజర్ పరిధి తెలగవరం, తల్లాడ మైనర్ల కింద ఉన్న ఆయకట్టుకు నీరు అందడం లేదు. పుణ్యపురం మేజర్లోనూ ఇదే పరిస్థితి ఉంది. వైరా మండలం అష్ణగుర్తిలో రాపల్లి మేజర్ కాల్వ పదో కి.మీ. పరిధిలో నీరు అందక మొక్కజొన్న పంట నిలువునా ఎండిపోతోంది. ఏపీ నుంచి నీటి కొనుగోలుమధిర మండలం నిదానపురం మేజర్ కింద ఖమ్మంపాడుకు చెందిన గుమ్మా రవి ఐదెకరాల్లో మిర్చి సాగు చేశాడు. సాగర్ జలాలు అందుతాయని ఆశించి ఎకరాకు రూ.10వేల చొప్పున కౌలు చెల్లించాడు. రెండుసార్లు మాత్రమే సాగర్నీరు అందగా.. ఇప్పుడు తోట ఎండిపోతుండటంతో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం వి.అన్నవరంలోని లిఫ్ట్ నుంచి నీరు కొనుగోలు చేశాడు. ఒక్కో తడికి ఎకరాకు రూ.2వేలు చెల్లిస్తున్నానని రవి తెలిపాడు.జిల్లాలో సాగునీటికి కటకట చివరి ఆయకట్టుకు అందని సాగర్ జలాలు వారబందీ విధానంతో రైతుల ఆందోళన బోర్లు, బావుల్లోనూ అడుగంటుతున్న భూగర్భ జలాలతో పంటల ఎండుముఖంపంట చేతికందేలా లేదు.. ముదిగొండ మండలం గంధసిరికి చెందిన కుక్కల ఫకీరు ఆరెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. మున్నేరు సమీపంలో ఉన్నా బావిలో నీరు లేక ఇబ్బంది పడుతున్నాడు. కౌలు కింద 48 బస్తాలు చెల్లించాల్సి ఉండగా ఇప్పటికే పెట్టుబడిగా రూ.1.20 లక్షలు వెచ్చించాడు. పరిస్థితి ఇలాగే ఉంటే పంట చేతికందడం కష్టమేనని చెబుతున్నాడు. ఎర్రుపాలెం మండలం మూమునూరులో కట్లేరుకు వచ్చే సాగర్ జలాలను నమ్ముకుని వరి, మొక్కజొన్న సాగు చేసినా నీళ్లు అందక పంటలు ఎండుతున్నాయి.వరి వదిలి.. మామిడి సాగు.. తల్లాడ మండలం అంజనాపురానికి చెందిన కొమ్మినేని రాంబాబు మూడేళ్లుగా వరి సాగు చేస్తున్నాడు. అయితే సాగర్ నీరందక నష్టం ఎదురవుతుండడంతో ఈసారి వరి మానేసి రెండెకరాల్లో మామిడి మొక్కలు నాటాడు. మామిడి దిగుబడి మూడేళ్లు దాటితే కానీ రాదు. దీంతో ఆదాయం కోల్పోతున్నా చేసేదేం లేదని చెబుతున్నాడు.మిర్చికి అరకొరగానే.. కామేపల్లి మండలం పండితాపురానికి చెందిన సామినేని వెంకటేశ్వర్లు ఐదెకరాల భూమిలో రెండు బోర్లు వేయించాడు. గతంలో మోటార్ల నుంచి 3 ఇంచుల మేర నీరు రావడంతో యాసంగిలో మిర్చి, పత్తి, మొక్కజొన్న వేశాడు. డిసెంబర్ నుంచి బోర్లలో నీరు తగ్గి కేవలం ఇంచు ధార మాత్రమే వస్తోంది. చేసేదేం లేక రెండున్నర ఎకరాల మొక్కజొన్న చొప్పను గొర్రెల మేతగా రూ.13 వేలకు విక్రయించాడు. పంటసాగుకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టిన ఆయన పరిస్థితి దయనీయంగా మారింది. ఇక బోర్లలో నీరు తగ్గగా 5హెచ్పీ మోటార్లు తీసేసి 3హెచ్పీ మోటార్లు బిగించి వస్తున్న అరకొర నీటిని మిరప పంటకు అందిస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన ధనియాకుల హన్మంతరావు రెండెకరాల్లో మిర్చి సాగు చేశాడు. బోరును నమ్ముకొని సాగు చేస్తే వారం రోజులుగా నీళ్లు ఇంకుతున్నాయి. దీంతో కొత్తగా మూడు బోర్లు వేయిస్తే చుక్కనీరు పడకపోగా రూ.లక్ష వరకు ఖర్చయింది. -
ఏ ఒక్కరూ వడదెబ్బ బారిన పడొద్దు
● జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన ● ప్రభుత్వ కార్యాలయాల్లో చలివేంద్రాల ఏర్పాటు ● టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశంలో కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ఖమ్మంవైద్యవిభాగం: నానాటికీ ఎండలు పెరుగుతుండడం, వడగాలులు మొదలయ్యే అవకాశమున్నందున ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. కలెక్టరేట్లో బుదవారం ఆయన అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి టాస్క్ ఫోర్స్ కమిటీతో సమావేశమయ్యారు. గత ఏడాది జిల్లాలో 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనందున, ఈసారీ అదే పరిస్థితి ఉండొచ్చని చెప్పారు. ఈమేరకు ఎండలో పనిచేసే నిర్మాణ కార్మికులు, కూలీలు, పారిశుద్ధ్య కార్మికుల వివరాలు సేకరించాలని, గత అనుభవాల దృష్ట్యా వ్యవసాయ మార్కెట్లలో టెంట్లు, తాగునీరు సమకూర్చడమే కాక ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. అంతేకాక అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, క్షేత్రస్థాయిలో పర్యటించే ప్రభుత్వ శాఖల సిబ్బంది కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం అవగాహన కల్పించేలా రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అదనపు డీసీపీ నరేష్కుమార్, డీఎంహెచ్ఓ కళావతిబాయి, డీసీహెచ్ఎస్ రాజశేఖర్, డీపీఓ ఆశాలత, డీడబ్ల్యూఓ కె.రాంగోపాల్రెడ్డి, ఎస్సీ డీడీ కె.సత్యనారాయణ, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ కె.వెంకటనారాయణ, వివిధ శాఖల ఉద్యోగులు నర్సింహారావు, ఎల్.రాజేందర్, నూరుద్దీన్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పిల్లల సంరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు ఖమ్మం సహకారనగర్: పిల్లల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల స్థాయిలో తప్పనిసరిగా బాలల సంరక్షణ కమిటీ సమావేశాలు నిర్వహించాలని, పిల్లలపై జరిగే మానసిక, శారీరక దాడుల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులపై వేధింపులు నివారణ కోసం అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయంచాలని చెప్పారు. చివరి ఆయకట్టుకూ సాగునీరు జిల్లాలో చిట్టచివరి ఆయకట్టుకు సైతం సాగునీరు అందేలా కార్యాచరణ అమలుచేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. సాగునీటి సరఫరాపై అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి సమీక్షించిన ఆయన నీటిపారుదల, వ్యవసాయ, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ సమస్యలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి పరిష్కరించాలన్నారు. డీఆర్వో పద్మశ్రీ, జలవనరుల శాఖ ఎస్ఈ ఎం.వెంకటేశ్వర్లు, డీఏఓ పుల్లయ్య, ఆర్డీఓలు నర్సింహారావు, రాజేందర్ పాల్గొన్నారు.చెల్లెమ్మా.. టీ బాగుంది! ఖమ్మంరూరల్: అద్భుతమైన రుచితో టీ చేశారు.. చాలా బాగుంది చెల్లెమ్మా అంటూ కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ సీ్త్ర టీ క్యాంటీన్ నిర్వాహకురాలిని అభినందించారు. కలెక్టర్ చొరవతో ఇందిరా మహిళా శక్తి ద్వారా మంజూరైన రుణాలతో జిల్లాలో 22 సీ్త్ర టీ క్యాంటీన్లు ఏర్పాటయ్యాయి. ఈమేరకు ఖమ్మం రూరల్ మండల పర్యటనకు వెళ్లిన కలెక్టర్ తరుణి హాట్ ఎదుట ఏర్పాటుచేసిన క్యాంటీన్ను పరిశీలించారు. ఈసమయంలో నిర్వాహకురాలు శ్రీరంగం గీత టీ అందించగా రుచి చూసిన కలెక్టర్ బాగుందని ప్రశంసించారు. నాణ్యత పాటిస్తూ ప్రజల్లో నమ్మకం చూరగొనడం ద్వారా వ్యాపారం విస్తరించుకోవాలని సూచించారు. తద్వారా ఖమ్మం బ్రాండ్కు పేరు తీసుకురావాలని ఆయన తెలిపారు. ఇందుకు యంత్రాంగం అండగా ఉంటుందని కలెక్టర్ భరోసా కల్పించారు. అనంతరం ఇందిరమ్మ నమూనా ఇంటి నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలా న్ని కలెక్టర్ పరిశీలించి సూచనలు చేశారు. తహసీల్దార్ పి.రాంప్రసాద్, గృహనిర్మాణ శాఖ ఈఈ శ్రీనివాసరావు, పీఆర్ ఈఈ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మిల్లులు, స్కూళ్లలో డీఎస్ఓ తనిఖీ
ఖమ్మంరూరల్: మండలంలోని పలు రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్కుమార్ బుధవారం తనిఖీ చేశారు. జలగంగనర్తో పాటు ఇంకొన్ని ఉన్నత పాఠశాల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆయన నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన బియ్యం, కూరగాయలు, గుడ్లు అందించాలని తెలిపారు. ఆతర్వాత వరంగల్ క్రాస్లోని రైస్ మిల్లును తనిఖీ చేసిన ఆయన గడువులోగా సీఎంఆర్ అందించాలని ఆదేశించారు. తనిఖీల్లో సివిల్ సప్లయీస్ డీటీ విజయ్బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాస్పత్రిలో సేవలపై ఆరా కల్లూరు: కల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిని మెడికల్ అండ్ హెల్త్ అడిషనల్ డైరెక్టర్, టాస్క్ఫోర్స్ టీమ్ లీడర్ కె.శశిశ్రీ, అసోసియేటెడ్ ప్రొఫెసర్ ఎం.విజయ్కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ద్వారా ప్రజలకు అందుతున్న వైద్యసేవలు, ప్రసవాల సంఖ్య, అందుబాటులో ఉన్న మందులు, వ్యాక్సిన్లపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలందిస్తూనే నిర్దేశిత లక్ష్యాలను నూరు శాతం సాధించాలని, అన్ని వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ టి.సీతారామ్, డీపీఓ దుర్గ, వైద్యాధికారులు, ఉద్యోగులు రమేష్, నవ్యకాంత్, మౌనికాశృతి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంవన్టౌన్: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. తిరుమలాయపాలెం మండలం మహ్మదాపురం, ఖమ్మం, టేకులపల్లిలో పలు కార్యక్రమాలకు ఆయన హాజరవుతారు. ఆతర్వాత ఖమ్మం క్యాంపు కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలను కలవనున్న మంత్రి.. భద్రాద్రి జిల్లా త్రీ ఇంక్లైన్ , లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, గాంధీనగర్, వైరాలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్ట్ర ఉషూ టోర్నీలో పతకం ఖమ్మం స్పోర్ట్స్: ఆదిలాబాద్లో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా ఉషూ టోర్నీలో జిల్లాకు చెందిన పి.పవిత్రాచారి సీనియర్స్ విభాగంలో ప్రథమస్థానం దక్కించుకుంది. ఈమేరకు ఆమె బంగారు పతకం గెలవడమే కాక త్వరలో జరగనున్న జాతీయ స్థాయి ఖేలో ఇండియా పోటీలకు అర్హత సాధించింది. ఆమెను డీవైఎస్ఓ టి.సునీల్కుమార్రెడ్డి, కోచ్ పి.పరిపూర్ణాచారి అభినందించారు. ఆర్టీసీ సమ్మె నాటి కేసు కొట్టివేత ఖమ్మం లీగల్: ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా 2020 ఏడాదిలో నమోదైన ఓ కేసును కొట్టేస్తూ ఖమ్మం ఒకటో అదనపు ప్రథమ శ్రేణి మెజిస్ట్రేట్ బిక్కం రజని బుధవారం తీర్పునిచ్చారు. ఆర్టీసీలో సమ్మె 55రోజుల పాటు సాగగా, మహిళా కండక్టర్ నీరజ ఖమ్మంలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఆమె మృతదేహంతో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలపై కేసు నమోదు చేయగా విచారణ అనంతరం కొట్టివేశారు. కాగా, వివిధ పార్టీల నాయకులు బాగం హేమంతరావు, పోతినేని సుదర్శన్, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మంద వెంకటేశ్వర్లు, చోటా బాబా, తాజుద్దీన్ తదితరులపై అప్పట్లో కేసు నమోదు కాగా, కేసును న్యాయవాదులు ఓరుగంటి శేషగిరిరావు, ఏడునూతల శ్రీనివాసరావు వాదించారు. పేకాటరాయుళ ్ల అరెస్ట్ కల్లూరురూరల్: మండలంలోని బత్తులపల్లి శివారులో కొందరు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు బుధవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పెనుబల్లి మండలం బ్రహ్మాళ్లకుంట, బత్తులపల్లికి చెందిన ఇద్దరు పట్టుబడగా మరికొందరు పారిపోయారు. పట్టుబడిన వారి నుంచి రూ.6,400 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై హరిత తెలిపారు. కోడిపందెం రాయుళ్లు... ఎర్రుపాలెం: మండలంలోని రేమిడిచర్లలో శ్మశానవాటిక సమీపాన కొద్ది రోజులుగా కోడిపందేలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు బుధవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 12 మందిని అరెస్టు చేయగా, ఇంకో ఇద్దరు పరారయ్యారని ఎస్ఐ పి.వెంకటేష్ తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారి నుంచి రూ.7వేల నగదు, ఆరు బైక్లు, రెండు కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ప్రేమించి పెళ్లికి నిరాకరించిన యువకుడిపై కేసు కారేపల్లి: ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఆ తర్వాత ముఖం చాటేసిన యువకుడిపై కారేపల్లి పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. మండలంలోని భాగ్యనగర్ తండాకు చెందిన కిరణ్సాయి ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇటీవల ఆమె పెళ్లి చేసుకోవాలని అడగగా నిరాకరించాడు. అంతేకాక పలువురి స్నేహితులతో కలిసి ఆమె ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. ఈమేరకు బాధితురాలి ఫిర్యాదుతో కిరణ్సాయి, ఆయన స్నేహితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎన్.రాజారాం తెలిపారు. ఆర్మీ జవాన్ అదృశ్యంపై ఫిర్యాదు ఖమ్మంక్రైం: ఆరు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తి తిరిగి రాకపోవడంతో ఎక్కడ వెతికినా ఆచూకీ లేక కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఖమ్మం వన్టౌన్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఖమ్మం సంభానీనగర్కు చెందిన పాటి రాజేష్(37) ఆర్మీలో జవాన్గా పనిచేయగా ఏడాది క్రితం అనారోగ్యానికి గురవడమే కాక మతిస్థిమితం తప్పడంతో ఇంటికి వచ్చేశాడు. గత ఏడాది ఆగస్టు నెల 24న ఇంటి నుంచి వెళ్లిన ఆయన ఎక్కడ వెతికినా ఆచూకీ తెలియరాలేదు. రాజేష్ ఇంటి నుంచి వెళ్లే సమయాన 63785 22492 నంబర్తో కూడిన ఫోన్ ఉందని కుటుంబీకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు వివరాలు తెలిసిన వారు 87125 75779 నంబర్కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ మౌలానా సూచించారు. -
కొనసాగుతున్న రాజీవ్గాంధీ స్మారక క్రికెట్ టోర్నీ
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహిస్తున్న రాజీవ్గాంధీ స్మారక జిల్థాస్థాయి క్రికెట్ టోర్నీ కొనసాగుతుంది. ఈమేరకు బుధవారం కొత్తగూడెం రూరల్ – కిన్నెరసాని పాల్వంచ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కొత్తగూడెం రూరల్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కిన్నెరసాని పాల్వంచ జట్టు నిర్ణీత 16 ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. జట్టులో భైరవ్సర్కార్ 20 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఆతర్వాత బ్యాటింగ్కు దిగిన కొత్తగూడెం రూరల్ జట్టు 14 ఓవర్లలోనే 133 పరుగుల చేయగా విజయం సాధించింది. ఈ జట్టులో అశోక్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 5 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత మ్యాచ్ను డాక్టర్ గ్రీష్మ ప్రారంభించారు. టోర్నీ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం.డీ.మతిన్తో పాటు రాజేష్, భరత్, లింగేష్, రాజారమేష్ పాల్గొన్నారు. -
చెల్లని చెక్కు కేసులో మూడు నెలల జైలుశిక్ష
ఖమ్మం లీగల్: చెల్లని చెక్కు జారీ చేసిన కేసులో ఖమ్మం బీ.కే.బజార్కు చెందిన బిజ్జాల భాస్కర్కు మూడు నెలలు జైలు శిక్ష విధిస్తూ ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయాధికారి కాసరగడ్డ దీప బుధవారం తీర్పు చెప్పారు. బీ.కే.బజార్కు చెందిన ఉల్లి శ్రీనివాసరావు వద్ద భాస్కర్ 2015 సెప్టెంబర్ 30న రూ.లక్ష అప్పుగా తీసుకున్నాడు. ఆతర్వాత అప్పు చెల్లించే క్రమంలో 2018 ఫిబ్రవరి 28న రూ.లక్షకు చెక్కు జారీ చేయగా ఆ చెక్కును ఖాతాలో జమ చేస్తే సరిపడా నగదు లేక గురైంది. దీంతో శ్రీనివాసరావు తన న్యాయవాది ద్వారా నోటీస్ జారీచేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. కేసును విచారించాక భాస్కర్పై నేరం రుజువు కావడంతో మూడు నెలల జైలు శిక్షతో పాటు ఫిర్యాదికి రూ.1.20 లక్షలు చెల్లించాలని న్యాయాధికారి తీర్పు చెప్పారు. వాహనం ఢీకొని వ్యక్తి మృతి సత్తుపల్లిరూరల్: రోడ్డుపక్కగా నడిచి వెళ్తున్న వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో తీవ్రగాయాల పాలై మృతి చెందాడు. మండలంలోని కాకర్లపల్లికి చెందిన నాగళ్ల రామకృష్ణ(38) బుధవారం గ్రామశివారులో నడిచి వెళ్తుండగా వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. కాగా, మోపెడ్ నడుపుతున్న ఇండ్ల వెంకటేశ్వరరావు సైతం గాయపడగా సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. కుక్కల దాడిలో గేదె ... నేలకొండపల్లి: ఓ గేదెను వేటాడిన కుక్కలు తీవ్రంగా గాయపర్చడంతో మృతి చెందింది. నేలకొండపల్లికి చెందిన రైతు డి.ఉపేందర్ బుధవారం పాడి గేదెను మేతకు వదిలాడు. ఒక్కసారిగా అక్కడకు వచ్చిన 20కి పైగా కుక్కలు దాడి చేయడంతో గేదె పరుగులు తీసింది. అయినా కుక్కల గుంపు వెంటాడి దాడి చేయగా తీవ్రగాయాలతో మృతి చెందింది. కళ్ల ముందే రూ.70వేల విలువైన గేదె మృతి చెందడంతో రైతు కన్నీరు మున్నీరయ్యాడు. కాగా, ఉపేందర్కు చెందిన నాలుగు నెలల దూడపై వారం క్రితం కుక్కలు దాడి చేసి చంపేశాయి. ఇకనైనా అధికారులు స్పందించి మండల కేంద్రంలో కుక్కల బెదడను నివారించాలని స్థానికులు కోరుతున్నారు. ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య సత్తుపల్లిరూరల్: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సత్తుపల్లి మండలం గంగారానికి చెందిన ఆటోడ్రైవర్ ఎస్.కే.నజీరుద్దీన్(43) కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. రెండు నెలల క్రితం ఒక కిడ్నీ తొలగించగా మరో కిడ్నీకి కూడా సమస్య ఉందని చెప్పడంతో మనస్తాపానికి గురైన ఆయన బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయాన ఆత్మహత్య చేసుకున్నాడు. నజీరుద్దీన్కు భార్య జీనద్ ఉన్నారు. క్షణికావేశ ంలో మరొకరు.. కారేపల్లి: మద్యానికి బానిసైన వ్యక్తి ఇంట్లో గొడవ పడి క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని పేరుపల్లికి చెందిన పద్దం మాధవరావు(53) రైల్వే కాంట్రాక్టు కూలీ పనులు చేస్తుంటాడు. ఇటీవల మద్యానికి బానిసైన ఆయన బుధవారం కూడా మద్యం తాగి రావడంతో భార్య నాగమణితో గొడవ జరిగింది. దీంతో భార్య ఇంటి నుంచి బయటికి వెళ్లిపోగా ఆయన చీరతో ఉరి వేసుకున్నాడు. కాసేపటికి వచ్చిన నాగమణి కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి చూసేసరికి మాధవరావు మృతి చెందాడు. ఆయనకు భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. 22న బియ్యం వేలం ఖమ్మం సహకారనగర్: వివిధ కేసుల్లో జప్తు చేసిన 771.969మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, ఏన్కూరు, వైరా, మధిర, నేలకొండపల్లి, సత్తుపల్లి, కల్లూరు గోడౌన్లలో నిల్వ చేయగా, వేలం ద్వారా విక్రయించనున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్కుమార్ తెలిపారు. ఈనెల 22న ఉదయం 11గంటలకు కలెక్టరేట్లోని తమ కార్యాలయం వద్ద వేలం ఉంటుందని పేర్కొన్నారు. జీఎస్టీ లైసెన్స్దారులు, డిస్టిలరీలు, బేవరేజెస్ కంపెనీల బాధ్యులు మాత్రమే అర్హులని, ఆసక్తి ఉన్న వారు వారు రూ.50వేల రూపాయల డీడీతో హాజరుకావాలని సూచించారు. -
ఎకరాకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాల్సిందే..
చింతకాని: నాగపూర్ – అమరావతి జాతీయ రహదారి నిర్మాణంతో భూమి కోల్పోతున్న తమకు ఎకరాకు రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. మండలంలోని కొదుమూరులో భూ నిర్వాసిత రైతులతో ఆర్డీఓ నర్సింహారావు బుధవారం సమావేశమయ్యారు. అయితే, ఎకరాకు రూ.25 లక్షలే జమ చేశారని, మార్కెట్ ధర ప్రకారం రూ.50 లక్షలు చెల్లించడంతోపాటు పొలాలకు వెళ్లేందుకు అండర్ పాస్, సర్వీస్ రోడ్డు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే, వ్యవసాయ బావులు, దీర్ఘకాలిక పంటలకు సైతం పరిహారాన్ని అందించాలన్నారు. అప్పటివరకు రహదారి నిర్మాణ పనులు చేయనిచ్చేది లేదని రైతులు స్పష్టం చేయగా, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆర్డీఓ తెలిపారు. తహసీల్దార్ కూరపాటి అనంతరాజుతో పాటు వివిధ సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. -
ఏకగ్రీవంగా హెచ్డబ్ల్యూఓల కార్యవర్గం
ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వ వసతిగృహ సంక్షేమ అధికారుల(హెచ్డబ్ల్యూఓ) సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఖమ్మంలోని టీఎన్జీవోస్ భవన్లో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొణిదెన శ్రీనివాస్, హెచ్బ్ల్యూఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డీ.గౌస్ హష్మీ ఆధ్వర్యాన బుధవారం ఎన్నికలు నిర్వహించారు. ఈసందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడిగా కోటపాటి రుక్మారావు, కార్యదర్శిగా నెల్లూరి నాగేశ్వరరావు, అసోసియేట్ అధ్యక్షులుగా బజ్జురి వెంకటేశ్వరరావు, కోశాధికారిగా కంభం తిరుపతిరావును ప్రకటించారు. అలాగే, ఉపాధ్యక్షులుగా కె.వీరభద్రరావు, ఎస్.వెంకట్రెడ్డి, ఎం.కోమలితో పాటు వివిధ పదవులకు కె.వెంకటేశ్వరరావు, ఆర్.నాగరాజు, పి.మాధురి, సీహెచ్.నాగమణి, జి.వినోద, ఐ.జ్యోత్స్న, టి.స్టాలిన్, జి.వెంకటేశ్వర్లు, ఎం.వెంకటకృష్ణ, పి.కృష్ణకిరణ్, జె.నర్సింహారావు ఎన్నికయ్యారని వెల్లడించారు. ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు గౌస్ హస్మి మాట్లాడుతూ హాస్టళ్లకు బిల్లులు, ఇతర సమస్యలను టీఎన్జీవోస్ సహకారంతో పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఈసమావేశంలో కె.దుర్గాప్రసాద్, తాళ్లూరి శ్రీకాంత్, వై.రమేష్, కరణ్ సింగ్, బి.చంద్రశేఖర్, రాధాకృష్ణ, శ్రీధర్సింగ్, వై.శ్రీనివాసరావు, అస్లాం, ఎన్.విజయ, ఎం.వీరన్న, కృష్ణ, మాధవ్గౌడ్, ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు. -
పాలన మరింత పారదర్శకంగా..
● కేఎంసీ ఉద్యోగుల సమయపాలనపై దృష్టి ● అధికారులు, ఉద్యోగులకు గుర్తింపు కార్డులు కూడా..ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగర పాలక సంస్థ(కేఎంసీ) కార్యాలయంలో పరిపాలన మరింత పారదర్శకంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలకు నాణ్యమైన, సత్వర సేవలు అందించడంపై కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఉద్యోగులు, సిబ్బంది సమయపాలన పాటించేలా పర్యవేక్షించడాన్ని ప్రథమ ప్రాధాన్యత తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఫిర్యాదులు, వినతులు ఇచ్చేందుకు ప్రజలు వస్తుండగా, ఇంకొందరు ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇష్టారాజ్యంగా వచ్చివెళ్తుండడంతో ప్రత్యేక సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎప్పుడొస్తున్నారు ? కేఎంసీ కార్యాలయంలో రెవెన్యూ, ఇంజనీరింగ్, టౌన్ప్లానింగ్, ఎస్టాబ్లిస్మెంట్, అకౌంట్స్, శానిటేషన్ తదితర విభాగాలకు సంబంధించి రెగ్యులర్ ఉద్యోగులు 250 మంది వరకు ఉండగా.. వీరిలో 120 మంది వరకు కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక ఔట్ సోర్సింగ్ విధానంలో పారిశుద్ధ్య కార్మికులు, ఇతర సిబ్బంది 1,100 మందికి గాను 100 మంది వరకు కార్యాలయంలో పనిచేస్తున్నారు. అయితే, ఇందులో ఎవరెవరు, ఎప్పుడెప్పుడు వస్తున్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కార్యాలయంలో విధులు నిర్వర్తించే అందరికీ గుర్తింపు కార్డులు జారీ చేసి, ఆన్లైన్లో హాజరు నమోదుకు కమిషనర్ నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే సెల్ఫోన్ సాయంతో లొకేషన్ ఆధారంగా హాజరు నమోదుకు ఏర్పాట్లు మొదలైనట్లు సమాచారం. భోజనం ఇక్కడే.. కార్యాలయంలో విధులు నిర్వర్తించే ఉద్యోగులంతా కేఎంసీలోనే భోజనం చేయాలని కమిషనర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. భోజనం పేరిట పలువురు బయటకు గంటల తరబడి సమయం వృధా చేస్తున్నట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈమేరకు మధ్యాహ్నం 1–30 నుండి 2గంటల వరకు విరామ సమయంలో కార్యాలయ మూడో అంస్తులోని డైనింగ్ హాల్లో భోజనం చేయాలని సూచించారు. ఇక కార్యాలయానికి ఎవరెవరు, ఏయే పనులపై వస్తున్నారో నమోదుకు కొత్తగా రిసెప్షన్ కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. కార్యాలయ ప్రవేశం వద్దే ఈ కౌంటర్ ఏర్పాటుచేసి ఉద్యోగిని నియమిస్తారు. తద్వారా ఎవరు, ఏ పనిపై వచ్చారో నమోదు చేసుకుని స్లిప్ జారీ చేసి ఆ విభాగంలోకే వెళ్లేలా పర్యవేక్షిస్తారు. -
బియ్యం ఇస్తారా, ఇవ్వరా?
● ఇంకా పలువురికి అందని రేషన్ బియ్యం ● ‘పోర్టబులిటీ’తో డీలర్ల వద్ద కొరత ● నేటితో ముగియనున్న పంపిణీ గడువుఖమ్మం సహకారనగర్/ఖమ్మం అర్బన్: రేషన్కార్డు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ నివసించే చోట బియ్యం తీసుకునేలా కొన్నాళ్ల నుంచి ’వన్ నేషన్.. వన్ రేషన్’ పేరిట పోర్టబులిటీ విధానం అమలవుతోంది. లబ్ధిదారులు నష్టపోవద్దని ఈ విధానాన్ని ప్రవేశపెట్టగా జిల్లా కేంద్రంలోని రేషన్ షాపుల్లో త్వరగా బియ్యం నిల్వలు కరిగిపోతున్నాయి. దీంతో స్థానిక లబ్ధిదారులకు బియ్యం అందక షాపుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ఇలా ప్రతీనెలా జరుగుతున్నా డిమాండ్ ఉన్న షాపులకు అదనంగా బియ్యం కేటాయించాల్సిన అధికారుల నిర్లక్ష్యంతో సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. జిల్లా కేంద్రంలోనే సమస్య జిల్లాలో 748 రేషన్ షాపులు ఉండగా, వీటి పరిధిలో 4,11,566 రేషన్కార్డులు ఉన్నాయి. ఇక 11,29,030మంది లబ్ధిదారులు ఉండగా ప్రతినెల సుమారు 6వేల మెట్రిక్ బియ్యం అవసరమవుతుంది. అయితే, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ ప్రాంతాల వారు నివసిస్తుండగా పోర్టబులిటీ విధానంలో నెల తొలినాళ్లలోనే బియ్యం తీసుకుంటున్నారు. దీంతో స్థానికులు వచ్చేసరికి షాపుల్లో బియ్యం నిల్వలు నిండుకుంటున్నాయి. ఖమ్మం నగరంలో 94 రేషన్ దుకాణాలకు గాను సుమారు 80షాపుల్లో పోర్టబులిటీ ద్వారా బియ్యం తీసుకెళ్తున్నారని అంచనా. తద్వారా ఆయా షాపుల పరిధి లబ్ధిదారులకు నెలనెలా కేటాయించే బియ్యానికి తోడు డీలర్లకు సుమారు 50క్వింటాళ్ల బియ్యం అదనంగా అవసరమవుతున్నట్లు తెలుస్తోంది. అప్రూవ్ అయినా... అదనంగా బియ్యం అవసరమైన డీలర్లు 7, 8వ తేదీకల్లా జిల్లా పౌరసరఫరాల అధికారి(డీఎస్ఓ)కి వినతి ఇవ్వగానే అధికారి అప్రూవ్ చేస్తే గోదాం నుంచి విడుదల చేస్తారు. కానీ గత రెండు నెలలుగా డీలర్లకు సకాలంలో బియ్యం అందక ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈనెల 19వ తేదీ నాటికి కూడా అధికారి అప్రూవ్ చేసినా డీలర్లకు బియ్యం అందకపోవడం గమనార్హం. జిల్లాలోని గోదాంల్లో నిల్వలు లేక ఈ పరిస్థితి నెలకొందని సమాచారం. ఈనెలారంభం నుంచే బియ్యం అరకొరగా సరఫరా అవుతుండడంతో 20వ తేదీ వరకు తీసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. కానీ జిల్లాలోని షాపులకు ఇంకా 350 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా కావాల్సి ఉండడం, 20వ తేదీ గురువారంతో సరఫరా గడువు ముగియనుండడంతో సందిగ్ధత నెలకొంది. అయితే, గతంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు గడువు మరిన్ని రోజులు పెంచినందున ఈసారీ పొడిగించే అవకాశముందని తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో సరఫరా చేస్తాం జిల్లాకు సుమారు 350మెట్రిక్ టన్నుల మేర అదనంగా బియ్యం అవసరముంది. నల్లగొండ జిల్లా నుంచి బియ్యం తెప్పించేందుకు అక్కడి అధికారులతో మాట్లాడాం. రెండు, మూడు రోజుల్లో రేషన్ దుకాణాలకు అందించి లబ్ధిదారులకు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటాం. – జి.శ్రీలత, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల సంస్థ -
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్తాం
సత్తుపల్లి: మండలంలోని సింగరేణికి చెందిన కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ద్వారా వస్తున్న దుమ్ముదూళితో స్థానికులు పడుతున్న ఇబ్బందులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ నాయకులు నంబూరి రామలింగేశ్వరరావు, ఈ.వీ.రమేష్ తెలిపారు. ప్లాంట్ నుంచి వెలువడే కాలుష్యంతో అనారోగ్యం బారిన పడుతున్నామని కిష్టారం అంబేద్కర్నగర్ వాసులు చేపట్టిన రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని బుధవారం వారు సందర్శించారు. అక్కడి నుంచే సింగరేణి సీఎండి బలరాంనాయక్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డితో మాట్లాడి సమస్యను వివరించారు. సీహెచ్పీ ద్వారా వచ్చే దుమ్ముదూళితో కిష్టారం, లంకపల్లి, జలగంనగర్, రేజర్ల, ఎన్టీఆర్నగర్, వెంగళరావునగర్, చౌడవరం వాసులు ఇబ్బంది పడుతున్నందున సింగరేణి అధికారులు స్పందించాలన్నారు. కాగా, సింగరేణి సీఎండీ బలరాం స్పందించి ప్రత్యేక కమిటీ ద్వారా పరిశీలిస్తామని చెప్పినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీరంరాజు, సుదర్శన్ మిశ్రా, మట్టా ప్రసాద్, పాలకొల్లు శ్రీనివాస్, విజయ్, వసంతరావు, రెహమతుల్లా, శేషగిరి, శివ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు
సత్తుపల్లిరూరల్/దమ్మపేట: రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలో బుధవారం జరిగింది. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సత్తుపల్లి మండలం చిన్నపాకలగూడేనికి చెందిన కేతేపల్లి జానకీరాం బైక్పై పట్వారిగూడెం వైపు నుంచి సత్తుపల్లి వైపు వస్తుండగా.. దమ్మపేట మండలం జగ్గారానికి చెందిన మడివి నాగేంద్రబాబు, వగ్గెల లక్ష్మణ్ మరో ద్విచక్రవాహనంపై జగ్గారం వెళ్తున్నారు. మార్గమధ్యలోని గండుగులపల్లిలో వీరి వాహనాలు ఎదురెదురుగా ఢీకొనగా లక్ష్మణ్, జానకీరాం, నాగేంద్రబాబుకు తీవ్రగాయాలు కావడంతో 108లో సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. అయితే, జానకీరాం, లక్ష్మణ్ పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. కాగా, క్షతగాత్రులను 108లో సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చిన సమయాన సిబ్బంది ఒక్కరే ఉండడంతో వారిని లోపలకు తీసుకెళ్లేందుకు 20 నిమిషాలకు పైగా సమయం పట్టింది. అంతసేపు క్షతగాత్రులు అవస్థ పడ్డారు. సిబ్బంది లేక అంబులెన్స్లోనే 20 నిమిషాలు -
కలెక్టర్ పనితీరుపై సీఎస్ అభినందనలు
ఖమ్మం సహకారనగర్: ప్రతీ బుధవారం ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో మధ్యాహ్న భోజన నాణ్యత తనిఖీ, పాఠశాలల్లో కిచెన్ గార్డెన్లు, హాస్టళ్లలో వాటర్ ఫిల్టర్ల ఏర్పాటుతో సత్ఫలితాలు వస్తున్న నేపథ్యాన కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అభినందించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం సీఎస్ తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరా, రైతుభరోసా, రేషన్ కార్డుల దరఖాస్తుల పరిశీలనపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో మధ్యాహ్న భోజనం నాణ్యత పెంపు, కిచెన్ గార్డెన్లు, వాటర్ ఫిల్టర్ల ఏర్పాటుతో వస్తున్న ఫలితాలను కలెక్టర్ వివరించగా ఆమె ప్రశంసించారు. అనంతరం తాగునీరు, రబీ పంటలకు సాగు నీటి సరఫరా, డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా, రేషన్ కార్డుల దరఖాస్తుల ధ్రువీకరణ, రైతు భరోసా పథకాల అమలుపై సూచనలు చేశారు. జిల్లా నుంచి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరాకు ప్రస్తుతం ఇబ్బందులు లేవని, ఖమ్మం నగరంలో వరదల కారణంగా దెబ్బతిన్న పైపులైన్లను సైతం మరమ్మతు చేయించామని తెలిపారు. అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, శ్రీనివాసరెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఈ సురేందర్, డీఏఓ పుల్లయ్య, డీఎస్ఓ చందన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కులగణన శాసీ్త్రయంగా చేపట్టాలి..
● జనాభా పెరుగుతుంటే.. బీసీలు ఎలా తగ్గుతారు? ● 317 జీఓ విషయంలో కేసీఆర్ బాటలోనే రేవంత్రెడ్డి ● బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎంపీ ఈటల రాజేందర్సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రభుత్వానికి చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే కమిషన్ వేసి కులగణన శాసీ్త్రయంగా చేయాలని మల్కాజ్గిరి ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. తమిళనాడు, బిహార్ రాష్ట్రాల్లో చట్టబద్ధమైన కమిటీ వేసి కులగణన చేపట్టారని తెలిపారు. ఖమ్మం – నల్లగొండ – వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పులి సరోత్తంరెడ్డి తరఫున మంగళవారం ఆయన ఖమ్మంలో ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులి సరోత్తమ్రెడ్డి తమ అభ్యర్థి అని, ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఉపాధ్యాయులను కోరారు. అనంతరం ఈటల విలేకరులతో మాట్లాడుతూ.. 2011లో 3.61 కోట్లుగా ఉన్న రాష్ట్ర జనాభా.. ఇప్పుడు 4కోట్లు దాటి ఉంటుందన్నారు. ఓ పక్క జనాభా పెరుగుతుంటే బీసీల జనాభా ఎలా తగ్గుతుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి నిజాయితీ లేకపోవడంతోనే ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. 317 జీఓకు వ్యతిరేకంగా పోరాడాం.. గతంలో కేసీఆర్ తీసుకొచ్చిన 317 జీఓతో టీచర్లు మనోవేదనకు గురయ్యారని, ఈ జీఓ తొలగిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా మోసం చేశారని ఈటల విమర్శించారు. కానీ 317 జీఓకు వ్యతిరేకంగా బీజేపీ కొట్లాడిందన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ వద్దనుకుంటే రాష్ట్రాలు ఆప్షన్ తీసుకోవచ్చని కేంద్రం చెప్పినా కేసీఆర్ తీసేయలేదని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం తన విధానాన్ని ప్రకటించలేదని అన్నారు. ఇక ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్ ఉండగా, పీఆర్సీ అమలుకు నోచుకోలేదన్నారు. అలాగే, ఉద్యోగ విరమణ చేసిన వారికి 15 నెలలుగా బకాయిలు రాని పరిస్థితి ఉందని చెప్పారు. ఈ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ దగా చేశాయని విమర్శించారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్ను గెలిపిస్తే వారు ఒరగబెట్టింది ఏమీ లేదని, అపారమైన అనుభవం కలిగిన సరోత్తమ్రెడ్డిని గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి మండలిలో గళం ఎత్తుతారని ఈటల తెలిపారు. కాగా, ఆరు గ్యారంటీలు, 66 హామీల అమలుకోసం కొట్లాడుతామన్నారు. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా అసైన్డ్ భూములను లాక్కోవడం, హైడ్రా, మూసీ పేరుతో కూల్చివేస్తున్నారే తప్ప హామీల అమలుపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, సుభాష్రెడ్డి, బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణతో పాటుచాడ శ్రీనివాస్, అల్లిక అంజయ్య, దొంగల సత్యనారాయణ, శ్యాంరాథోడ్, చెన్నకేశవరెడ్డి, డాక్టర్ పాపారావు, పుల్లారావు యాదవ్, మంద సరస్వతి తదితరులు పాల్గొన్నారు. -
స్తంభాద్రి గిరిప్రదక్షిణ.. వైభోగం
● దారి పొడవునా స్వామికి భక్తుల నీరాజనం ● ఆపై నక్షత్ర జ్యోతి దర్శనంఖమ్మంగాంధీచౌక్: అరుణాచలం, యాదగిరిగుట్ట మాదిరిగానే ఖమ్మంకు మూలమైన త్రేతాయుగం నాటి స్వయంభూ దివ్య క్షేత్రం శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. స్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతీనెలా గిరి ప్రదక్షిణ నిర్వహించాలని నిర్ణయించగా మంగళవారం వేలాది మంది భక్తుల నడుమ నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్ఛరణల నడుమ స్వామి వారిని సతీసమేతంగా ఆలయం నుంచి పల్లకీపైకి చేర్చి గుట్ట కిందకు తీసుకొచ్చాక భజనలు, కోలాటాల నడుమ గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. వేలాదిగా హాజరైన భక్తులు నృసింహ నామ స్మరణకు తోడు కీర్తనలు ఆలపిస్తూ పాల్గొన్నారు. స్తంభాద్రి ఘాట్ రోడ్డు గేటు వద్ద ప్రారంభమైన ప్రదక్షిణ ఎన్నెస్పీ రోడ్, కవిత డిగ్రీ అండ్ పీజీ కళాశాల, స్తంభాద్రి మండపం, సరిత క్లినిక్, ఎల్ఐసీ కార్యాలయం మీదుగా తిరిగి గేట్ నుంచి ఘాట్ రోడ్ ద్వారా గుట్టపై ఆలయం వద్దకు చేరింది. ఆతర్వాత ఆలయం పక్కన కొండపై నక్షత్ర జ్యోతిని అర్చకులు వెలిగించారు. ప్రతీనెల స్వాతి నక్షత్రం రోజున సాయంత్రం గిరి ప్రదక్షిణ ఉంటుందని ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహన్రావు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ వీరస్వామితో పాటు భక్త మండళ్ల బాధ్యులు, అర్చకులు, స్థానికులు పాల్గొన్నారు. -
ముప్పై దాటితే
జిల్లాలో ముప్పై ఏళ్ల వయస్సు దాటిన వారిలో పలువురు రక్తపోటు, మధుమేహం సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ రెండు వ్యాధులు వారిని ఆస్పత్రుల పాలు చేస్తున్నాయి. ఈనేపథ్యాన నాన్ కమ్యూనికబుల్ డిసీస్(ఎన్సీడీ) పేరుతో ప్రత్యేక కార్యక్రమం అమలుచేస్తూ బీపీ, షుగర్ బాధితులను గుర్తించి వైద్యంతో పాటు మందులు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో చేపట్టిన స్క్రీనింగ్లో 10 శాతం మంది బీపీ, 7.1 శాతం మంది షుగర్తో బాధపడుతున్నట్లు తేలింది. దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సూచనల మేరకు వారు మందులు వాడుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణకు జిల్లాలోని ఎన్సీడీ కార్నర్లు, క్లినిక్ల ద్వారా అందిస్తున్న సేవలు విస్తృతం కావడం, పెద్దసంఖ్యలో పరీక్షలు చేస్తుండడంతో బాధితుల సంఖ్య పెరుగుతుండగా, అదేస్థాయిలో చికిత్స కొనసాగుతోంది. – ఖమ్మంవైద్యవిభాగం -
నేత్రపర్వం.. రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. -
వీ.వీ.పాలెంలో ఐసీఎంఆర్ – ఎన్సీడీ బృందం
రఘునాథపాలెం: మండలంలోని వీ.వీ.పాలెంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను ఢిల్లీ నుండి వచ్చిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ఎన్సీడీ బృందం సభ్యులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించాక కేంద్రం పరిధిలో బీపీ, షుగర్ బాధితులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఎన్సీడీ పోర్టల్లో చేయాల్సిన మార్పులు, చేర్పులను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ బృందం రోహిత్, మాలతి తదితరులు ఉండగా హెల్త్ ఎడ్యుకేటర్ శారద, ఉద్యోగులు మౌనిక, తాల్లూరి శ్రీకాంత్, పద్మ, మేడా పుష్పావతి, పర్వీన్ పాల్గొన్నారు. కూసుమంచి ఫైర్ ఆఫీసర్ సస్పెన్షన్ కూసుమంచి: కూసుమంచి ఫైర్ స్టేషన్ ఆఫీసర్ మోహన్రావును సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్వర్వులు జారీ అయ్యాయి. ఇక్కడి ఫైర్మెన్ నాగేందర్ తనపై ఫైర్ ఆఫీసర్ విధుల విషయంలో కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడడమే కాక దురుసుగా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రాథమిక విచారణ అనంతరం నాగేందర్ను సస్పెండ్ చేశామని జిల్లా ఫైర్ ఆఫీసర్ అజయ్కుమార్ తెలిపారు. అయితే, పూర్తిస్థాయి విచారణ కొనసాగిస్తామని వెల్లడించారు. మిర్చి కొనుగోళ్లు, ధరలపై ఇంటెలిజెన్స్ ఆరా ● రైతులు, మార్కెట్వర్గాలతో మాట్లాడిన అధికారులు ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం మార్కెట్లో మిర్చి క్రయవిక్రయాలు, ధరలపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీశాయి. రాష్ట్రంలో అత్యధికంగా మిర్చి కొనుగోళ్లు ఇక్కడే జరుగుతున్న నేపథ్యాన అధికారులు మంగళవారం మార్కెట్లో పరి శీలించారు. విదేశాల్లో డిమాండ్ కలిగిన ‘తేజా’ రకం మిర్చి క్వింటాకు గత ఏడాది ఖమ్మంలో గరిష్టంగా రూ.23వేల వరకు ధర పలకగా ఈ ఏడాది పతనమైంది. చైనాలో పంట సాగు పెరిగిందని ఎగుమతిదారులు చెబుతున్న నేపథ్యాన ప్రస్తుతం గరిష్టంగా రూ.14 వేలు, మోడల్ ధర 13,300గా నమోదవుతోంది. ఓ వైపు ధర తగ్గడం, మరోవైపు తెగుళ్లతో దిగుబడి పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు నష్టపోతున్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చి బోర్డు ఏర్పాటు చేసి క్వింటాకు రూ.25 వేల ధరతో కొనుగోలు చేయాలని వామపక్షాల పార్టీల అనుబంధ రైతు సంఘాల నాయకులు మంగళవారం మార్కెట్లో ఆందోళన చేపట్టారు. ఈనేపథ్యాన ఇంటెలిజెన్స్ అధికారులు మార్కెట్లో మంగళవారం మిర్చి జెండా పాట, ధర నిర్ణయం, అందుకు ఎంచుకునే ప్రమాణాలపై ఆరా తీయడమే కాక రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత మార్కెట్ అధికారులతో మాట్లాడి ధర పతనంపై చర్చించినట్లు తెలిసింది. పత్తి యార్డు భవనంలోకి డీఎంఓ కార్యాలయం ఖమ్మంవ్యవసాయం: జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి(డీఎంఓ) కార్యాలయాన్ని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పత్తి యార్డులోని ఓ భవనంలోకి మార్చారు. మార్కెట్ ప్రాంగణంలోనే ఏళ్లుగా డీఎంఓ కార్యాలయం కొనసాగుతుండగా ఆ భవనాన్ని మిర్చి యార్డు ఆధునికీకరణ పనుల్లో భాగంగా కూల్చివేశారు. దీంతో కార్యాలయ నిర్వహణకు పత్తి యార్డులో ఖాళీగా ఉన్న క్యాంటిన్ భవనాన్ని కేటాయించారు. ఇందులో మార్కెటింగ్ శాఖ అధికారితో ఇంజనీరింగ్ విభాగం కూడా కొనసాగించాల్సి ఉన్నందున మరో గదిని సైతం అప్పగించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. కాగా, మిర్చి యార్డు నూతన నిర్మాణంతో పాటే జిల్లా మార్కెటింగ్ శాఖ కార్యాలయ భవన నిర్మాణం ఉంటుందని అధికారులు తెలిపారు. ఎస్సారెస్సీ కాల్వ తవ్వకానికి తొలగిన అడ్డంకులు కూసుమంచి: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 54వ ప్యాకేజీలో కాల్వ తవ్వకానికి అవసరమైన 13ఎకరాల భూసేకరణలో ఇబ్బందులతో పనులు నిలిచిపోయిన విషయం విదితమే. కాల్వ తవ్వకపోవడంతో కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్ మండలాల్లోని వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. ఈ విషయాన్ని ఇరిగేషన్ అధికారులు మంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన నిర్వాసిత రైతులను ఒప్పించారు. ఈ మేరకు రూ.2.64 కోట్ల పరిహారం రైతుల ఖాతాల్లో జమ కావడంతో కాలుల్వవ తవ్వకానికి అడ్డంకులు తొలగిపోయినట్లయింది. ఈ పనులు పూర్తయితే మూడు మండలాల్లో అదనంగా 11వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని అధికారులు తెలిపారు. -
ఎలా ‘సాగు’తున్నారు..
కారేపల్లి: ఆధునిక పద్ధతులను పాటిస్తే ఏ పంట ల్లోనైనా దిగుబడులు లాభదాయకంగా ఉంటా యని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. కారేపల్లి మండలం చీమలపాడులో మంగళవారం పర్యటించిన ఆయన రైతు వెంకటేశ్వర్లు సాగు చేస్తున్న ఆయిల్పామ్, శ్రీనివాసరావు సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్తో పాటు పలువురి పంటలను పరిశీలించారు. అనంతరం రైతులతో సమావేశమైన కలెక్టర్ సమస్యలపై ఆరా తీశారు. ప్రధానంగా కోతుల బెడదతో ఇబ్బంది పడుతున్నామని వాపోయిన రైతులు టపాకాయలు పేల్చినా ఫలితం ఉండడం లేదని చెప్పారు. సోలార్ ఫెన్సింగ్ అమర్చుకునేందుకు సహకరించాలని కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ అంశంపై సమీక్షించడంతో పాటు మోటార్లకు సబ్సిడీపై దశల వారీగా సోలార్ ప్యానళ్లు సమకూరుస్తామని తెలిపారు. ఆపై సాగునీటి వనరులు, సాగు చేస్తున్న పంటలు, పెట్టుబడి, దిగుబడిపై ఆరాతీశారు. అయిల్పామ్తో దీర్ఘకాలిక ఆదాయం ఉన్నందున రైతులు ముందుకు రావాలని సూచించారు. డ్రాగన్ ఫ్రూట్ అమ్మకానికి ఏర్పాట్లు డ్రాగన్ఫ్రూట్ సాగు చేస్తున్న రైతులతో మాట్లాడే క్రమాన మార్కెటింగ్ ఇబ్బందిగా ఉందని కలెక్టర్ దృష్టికి పలువురు తీసుకొచ్చారు. అయితే, కార్పొరేట్ షాపింగ్ మాళ్ల బాధ్యులతో సమావేశమై రైతుల నుంచి కొనుగోలు చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే, భూసార పరీక్షలు, సోలార్ ప్యానళ్ల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు, అటవీ నిబంధనలకు అనుగుణంగా గ్రామాల్లో ఉపాధి హామీ ద్వారా మట్టి రోడ్డు నిర్మాణంపై అధికారులకు సూచనలు చేశారు. అలాగే, ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, ఆత్మీయ భరోసా, సన్నధాన్యం అమ్మిన రైతులకు బోనస్, రుణమాఫీపై భరోసా కల్పించారు. ఆతర్వాత గుడితండా వద్ద రైతు బద్దూలాల్ ఇంటిపై ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానళ్లను కలెక్టర్ పరిశీలించారు. జిల్లా వ్యవసాయాశాఖ అధికారి డి.పుల్ల య్య, తహసీల్దార్ సంపత్కుమార్, ఎంపీడీఓ సురేందర్, విద్యుత్ శాఖ ఏడీ ఆనంద్, ఉద్యానవన శాఖ అధికారి వేణు, ఏఓ అశోక్కుమార్, ఉద్యోగులు కె.రామకృష్ణ, జార్జి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఆధునిక పద్ధతులు పాటిస్తేనే లాభదాయకం పంటలను పరిశీలించిన కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ కోతుల బెడదను ఏకరువు పెట్టిన రైతులు -
ఈ వయస్సు వారిలో రక్తపోటు, మధుమేహం
● ఎన్సీడీ ద్వారా స్క్రీనింగ్తో గుర్తింపు, మందుల పంపిణీ ● రేపటి నుంచి మరో దఫా పరీక్షలకు సన్నద్ధంనిర్లక్ష్యంతో పెరుగుతున్న నష్టం చాలా మంది బీపీ, షుగర్ బాధితులు తాము వాటి బారిన పడిన సంగతే గుర్తించడం లేదు. నిర్లక్ష్య ధోరణి కారణంగా రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతోంది. మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, తగిన వ్యాయామం లేకపోవడం, సమయానికి తినకపోవడం వంటి కారణాలతో ఈ పరిస్థితి ఎదురవుతోందని చెబుతున్నారు. జిల్లాలో 30ఏళ్లు పైబడిన వారి జనాభా 7,30,852 మంది ఉండగా వంద శాతం మందికి మూడు విడతల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ జనాభాలో 10శాతం మంది బీపీ, 7.1శాతం మంది షుగర్తో బాధపడుతున్నట్లు తేలింది. వీరిలో బీపీ బాధితులు 63శాతం మంది, మధుమేహ బాధితులు 65శాతం మంది ఎన్సీడీ క్లినిక్ల ద్వారా మందులు వాడుతున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మిగతా వారు ప్రైవేట్ ఆస్పత్రుల్లో మందులు వాడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్సీడీ కార్నర్, క్లినిక్ల్లో సేవలు జిల్లాలో ఎన్సీడీ కార్యక్రమం అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమలు చేస్తున్నారు. పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో ఎన్సీడీ కార్నర్లు ఏర్పాటుచేసి ప్రత్యేకంగా స్టాఫ్నర్స్లను కేటాయించారు. అలాగే, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, మధిర, సత్తుపల్లి, పెనుబల్లి, నేలకొండపల్లి ఏరియా ఆస్పత్రుల్లోనూ ఎన్సీడీ క్లినిక్లు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలకు వచ్చే బీపీ, షుగర్ బాధితులకు నెలకు సరిపడా మందులు ఒకేసారి ఇస్తున్నారు. అంతేకాక ప్రత్యేక ట్రీట్మెంట్ కార్డు జారీ చేసి నెలనెలా మందుల జారీ, వాడకం వివరాలు నమోదు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 35 సెంటర్లలో బీపీ, షుగర్ బాధితులకు ప్రస్తుతం సేవలందుతున్నాయి. రేపటి నుంచి మరో దఫా ఇప్పటికే 30ఏళ్లు దాటిన వారిలో బీపీ, మధుమేహ బాధితులను గుర్తించేలా మూడు విడతల్లో పరీక్షలు నిర్వహించారు. అయితే, బీపీ, షుగర్తో పాటు మూడు రకాల కేన్సర్ల గుర్తింపునకు ఇంకో విడత సర్వే చేపట్టాలని జాతీయ ఆరోగ్య మిషన్ నిర్ణయించింది. ఈ సర్వే 20వ తేదీ గురువారం నుంచి మొదలుకానుంది. మార్చి నెలాఖరు వరకు పరీక్షలు పూర్తిచేసేలా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు.జిల్లాలో ఎన్సీడీ లెక్కలు ఇలా.. 30ఏళ్లు పైబడిన వారి జనాభా 7,30,852 (సుమారు) బీపీ బాధితులు 73,327 షుగర్ బాధితులు 51,851 ఎన్సీడీ క్లినిక్ల ద్వారా మందులు వాడుతున్నది 64శాతం ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నది 36శాతంనాణ్యమైన వైద్యసేవలు దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణలో భాగంగా బాధితులకు ఎన్డీసీ ద్వారా మెరుగైన సేవలందిస్తున్నాం. మధుమేహం, రక్తపోటు బారిన పడకుండా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, ఇప్పటికే బాధితులుగా తేలిన వారు మందులు వాడేలా పర్యవేక్షిస్తున్నాం. దీర్ఘకాలిక వ్యాధులు దరిచేరకుండా ప్రతీఒక్కరు వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన, మితమైన ఆహారాన్ని తీసుకోవాలి. – బి.కళావతిబాయి, డీఎంహెచ్ఓ నియంత్రణే మార్గం రక్తపోటు, మధుమేహం ఒక్కసారి సోకితే నియంత్రణ తప్ప నివారణకు అవకాశం ఉండదు. ఇలాంటి వ్యాధుల కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం కింద నాన్ కమ్యూనికేబుల్ డిసీస్ కార్యక్రమాన్ని 2018 సెప్టెంబర్లో ప్రారంభించింది. 30 ఏళ్లు పైబడి రక్తపోటు, మధుమేహం గురయ్యే వారిని గుర్తించి ముందస్తుగా వారికి వైద్యసేవలు అందించడం.. తద్వారా వారి ఆయుష్షును పొడిగించడం ఈ పథకం లక్ష్యం. జిల్లాలో పలు విడతలుగా సర్వే నిర్వహించి బీపీ, షుగర్ బాధితులను గుర్తించగా సంబంధిత సెంటర్ల ద్వారా మందులు తీసుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. అయితే, మరోమారు స్కీనింగ్ నిర్వహిస్తే ల్లాలో బీపీ, షుగర్ బాధితుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నా. -
26నుంచి రెండు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు
చింతకాని: మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 26నుంచి మండలంలోని నేరడలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలు మూడు రోజుల పాటు జరుగుతాయని నేతాజీ యువజన సంఘం కార్యదర్శి దూసరి గోపాలరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జట్ల బాధ్యులు రూ.500 ఎంట్రీ ఫీజు చెల్లించి ఈనెల 25వ తేదీ లోగా నమోదు చేసుకోవాలని సూచించారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచేవారికి వరుసగా రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30వేలతో పాటు ఎనిమిదో స్థానం వరకు నిలిచే జట్లకు సైతం నగదు బహుమతులు అందజేస్తామని తెలి పారు. వివరాలకు క్రీడాకారులు 70939 00119, 93945 71739, 80084 92173 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. -
అదనపు నిర్మాణాలకు అడ్డుకట్ట
● అనుమతి లేని నిర్మాణదారులకు నోటీసులు ● ఖమ్మంలో పలుచోట్ల పనుల అడ్డగింత, కూల్చివేతఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నానాటికీ స్థిరపడుతున్న జనాభాతో పాటే నగరం విస్తరిస్తోంది. పిల్లల చదువుతో పాటు వ్యాపారం, ఉద్యోగాలు, ఉపాధి కోసం నగరానికి వచ్చే పలువురు సొంతంగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. మరికొందరు అద్దె ఇళ్లలో ఉంటుండగా డిమాండ్ పెరగడంతో యజమానులు అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలకు తెరలేపుతున్నారు. కేఎంసీ కొందరు అనుమతి తీసుకోకపోగా, ఇంకొందరు తీసుకుంటున్నా అనుమతికి మించి నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ విషయమై అందిన ఫిర్యాదులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ సీరియస్గా తీసుకుని అనుమతులు లేని నిర్మాణాలను అడ్డుకోవాలని కేఎంసీ అధికారులకు సూచించారు. దీంతో కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆదేశాలతో టౌన్ ప్లానింగ్ అధికారులు రంగంలోకి దిగారు. పుట్టగొడుగుల్లా.. కేఎంసీలో విలీనమైన పంచాయతీలు, నగర శివారు ప్రాంతాల్లో కొత్తగా నిర్మాణాల సంఖ్య భారీగా ఉంటోంది. అలాగే, పాత భవనాలపై అదనపు నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే, ఇందులో ఎన్నింటికి అనుమతి ఉందో అధికారులకు సైతం పరిస్థితి నెలకొంది. కేఎంసీలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది తక్కువగా ఉండడం, ఉన్న వారికి అదనపు విధులు, ఎల్ఆర్ఎస్ పనులు ఉండడంతో అక్రమ నిర్మాణాలను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఇదే అదునుగా నిర్మాణదారులు యథేచ్ఛగా నిర్మాణాలు పూర్తి చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కూల్చివేతలే.. అనుమతుల లేకుండా నిర్మాణాలు చేపట్టవద్దని అధికా రులు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. కొందరికి నోటీసులను కూడా చేసినా ఫలితం కానరావడం లేదు. దీంతో టౌన్ ప్లానింగ్ అధికారులు అడుగు ముందుకేశారు. ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం టౌన్ ప్లానింగ్ ఏసీపీ వసుంధర నేతృత్వాన తనిఖీలు చేపట్టారు. కొన్నిచోట్ల అనుమతులు చేపడుతున్న నిర్మాణాలను అడ్డుకొని పిల్లర్లు, స్టాబ్లను కూల్చివేశారు. కొత్తగా నిర్మించే భవనాల పిల్లర్లను జేసీబీలతో తొలగించగా.. అపార్ట్మెంట్లు, ఇతర భవనాలపై నిర్మిస్తున్న పెంట్ హౌజ్ల గోడలను కూల్చివేశారు. అలాగే, స్లాబ్ వేసేందుకు సిద్ధంగా ఉన్న సెంట్రిగ్లను సైతం తొలగించారు. కాగా, కేఎంసీ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు అవగాహన కల్పించారు. అలాగే, నిర్మాణ అనుమతుల పత్రాలను పనుల వద్ద ప్రదర్శించాలని సూచించారు. -
వ్యక్తి ఆత్మహత్య
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలం గంగారం పంచాయతీ జలగంనగర్కు చెందిన కంచి రాధాకృష్ణ(30) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గంగారంలోని ఓ హోటల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్న ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయాన ఉరి వేసుకున్నాడు. ఈమేరకు సత్తుపల్లి పోలీసులు వివరాలు సేకరించారు. అయితే, ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియకపోగా ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. కాగా, రాధాకృష్ణకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఆరుగురు వాహన యజమానులపై కేసు చింతకాని: సరుకు రవాణాకు వినియోగించే బోలెరో వాహనాల్లో ప్రయాణికులను తీసుకెళ్తున్న ఆరు వాహనాల యజమానులపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగుల్మీరా తెలిపారు. బోనకల్ నుంచి బోలెరో వాహనాల్లో కూలీలను ఎక్కించుకుని నాగులవంచ వైపు వస్తుండగా పోలీసులు తనిఖీ చేశారు. ఈసందర్భంగా జరిగే ప్రమాదాలపై ప్రయాణికులకు అవగాహన కల్పించి, వాహన యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ముదిగొండ, తల్లాడ జట్ల గెలుపు
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహిస్తున్న రాజీవ్గాంధీ స్మారక క్రికెట్ టోర్నీలో మంగళవారం ముదిగొండ, తల్లాడ జట్లు విజయం సాధించాయి. ముదిగొండ – ఏన్కూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముదిగొండ 15 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. ఈ జట్టులో పవన్ 43 బంతులు ఆడి ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఏన్కూరు జట్టు విజయానికి సరిపడా పరుగులు చేయకపోవడంతో ముదిగొండ జట్టు గెలుపొందింది. అనంతరం తల్లాడ – జూలూరుపాడు మధ్య మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన తల్లాడ జట్టు 16ఓవర్లలో 121 పరుగులు చేసింది. ఆపై జూలూరుపాడు జట్టు 16ఓవర్లలో 100పరుగులే చేయడంతో ఓటమి పాలైంది. మ్యాచ్లను కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తుంబూరు దయాకర్రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.క్రిస్టోఫర్బాబు, డీవైఎస్ఓ టి.సునీల్కుమార్రెడ్డి, టోర్నీ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం.డీ.మతిన్, కోచ్ ఎం.డీ.గౌస్ ప్రారంభించారు. జేవీఆర్ సీహెచ్పీని పరిశీలించిన డైరెక్టర్ సింగరేణి(కొత్తగూడెం): సత్తుపల్లిలోని జేవీఆర్ సీహెచ్పీని సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) పీపీ) కె.వెంకటేశ్వర్లు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బొగ్గు రవాణా, కోల్ రిసీవింగ్ కాంప్లెక్స్ వద్ద అన్లోడింగ్ సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. ఆ తర్వాత కోల్ ఏరియా, డిశ్చార్జి పాయింట్ను కూడా పరిశీలించారు. సీహెచ్పీ నుంచి దుమ్ము వెలువడకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఏరియా జీఎం శాలేంరాజుతో చర్చించారు. కార్యక్రమంలో అధికారులు సూర్యనారాయణ, కోటిరెడ్డి, రామకృష్ణ, ఆర్.ప్రహ్లాద్, నర్సింహారావు, కె.సోమశేఖర్ పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో అటవీ అధికారులు
ఇల్లెందురూరల్ : అటవీ భూముల నుంచి మట్టి తరలించేందుకు రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఎఫ్ఆర్ఓ, ఎఫ్బీఓ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ ఘటన ఇల్లెందు మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలతో పలు గ్రామాల్లో రహదారులు అధ్వానంగా మారాయి. పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందిగా మారడంతో మండలంలోని బోడుతండా, కొమరారం, పోచారం తండా గ్రామాల రైతులు స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య ద్వారా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. దీంతో కలెక్టర్ ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ నుంచి ఒక్కో గ్రామానికి రూ.1.50 లక్షల చొప్పున విడుదల చేశారు. పొలాలకు వెళ్లే రహదారులపై గ్రావెల్ పోసుకోవాలని సూచించారు. దీంతో బోడుతండాకు చెందిన ఓ రైతు ఈ ఏడాది సంక్రాంతి రోజున మట్టి కోసం అటవీ ప్రాంతానికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న కొమురారం ఎఫ్ఆర్ఓ ఉదయ్కిరణ్, ఎఫ్బీఓ హరిలాల్ మట్టి తరలింపును అడ్డుకుని జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. దీంతో రైతు రూ.15వేలు ముట్టజెప్పి జేసీబీని విడిపించుకున్నాడు. ఆపై మొరం తోలకానికి అనుమతి ఇవ్వాలని అటవీ అధికారులను వేడుకోగా రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. చివరకు బతిమిలాడి రూ.20 వేలు చెల్లించి పనులు ప్రారంభించాడు. అయితే పొలాలకు నీరు పెడుతుండడంతో ఆ దారిలో ట్రాక్టర్ వెళ్లేందుకు వీల్లేక కొన్ని రోజులు పనులు నిలిపివేసి, వారం క్రితం మట్టి తోలుకుంటున్నట్టు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. మిగిలిన రూ.30 వేలు ఇస్తేనే మట్టి తీసుకెళ్లాలని వారు ఖరాఖండిగా చెప్పడంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మంగళవారం రూ.30 వేలు తీసుకుని అటవీ రేంజ్ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ ఎఫ్ఆర్ఓ సూచనతో ఎఫ్బీఓకు నగదు ఇస్తుండగా మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
మిర్చిబోర్డు ఏర్పాటు చేయాల్సిందే...
ఖమ్మంవ్యవసాయం: మిర్చి ధర స్థిరీకరణ కోసం ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్తో వామపక్ష పార్టీల అనుబంధ రైతు సంఘాల ఆధ్వర్యాన ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం ధర్నా నిర్వహించారు. నానాటికీ మిర్చి ధర పతనమవుతున్నందున రైతులు నష్టపోకుండా ఇతర పంటల మాదిరి మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేయాలన్నారు. ఈసందర్భంగా సీపీఎం అనుబంధ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, రాష్ట్ర నాయకుడు నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ మిర్చి ధర స్థిరీకరణకు మిర్చిబోర్డు ఆవశ్యమని తెలిపారు. ఈ బోర్డునుఖమ్మంలో ఏర్పాటుచేసిన క్వింటాకు రూ.25 వేలు చెల్లించేలా మార్క్ఫెడ్, నాఫెడ్ల ద్వారా కొనుగోళ్లు చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు, జిల్లాలో ముగ్గురు రాష్ట్రమంత్రులు ఉన్నందున ఈ విషయంలో స్పందించాలన్నారు. అలాగే, సీపీఐ అనుబంధ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యాన కూడా నిరసన తెలపగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు మాట్లాడారు. మిర్చి ధర పతనానికి పాలకులే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. మిర్చిబోర్డు ఏర్పాటుతోనే రైతులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈవిషయంలో స్పందించకపోతే మార్కెట్లోలో లావాదేవీలను స్తంబింపచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో సీపీఎం, సీపీఐ, అనుబంధ సంఘాల నాయకులు యర్రా శ్రీకాంత్, మాదినేని రమేష్, భూక్యా వీరభద్రం, వై.విక్రమ్, యర్రా శ్రీనివాసరావు, యల్లంపల్లి వెంకట్రావు, తాతా భాస్కర్రావు, కొక్కెర పుల్లయ్య, దండి సురేష్, మహ్మద్ మౌలానా, దొండపాటి రమేష్, కొండపర్తి గోవిందరావు, యర్రా బాబు, శింగునర్సింహారావు, పోటు కళావతి, మిడికంటి చిన్న వెంకటరెడ్డితో పాటు మిర్చి తీసుకొస్తున్న రైతులు కూడా పాల్గొన్నారు. కాగా, మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హన్మంతరావు వారితో చర్చించి త్వరలోనే అధికారులు, వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. సీపీఎం, సీపీఐ అనుబంధ సంఘాల ఆధ్వర్యాన ధర్నా క్వింటాకు రూ.25 వేలు చెల్లించాలని డిమాండ్ -
ఈ మూడు వారాలే కీలకం
ఖమ్మంఅర్బన్: రబీ సీజన్లో సాగు చేసిన పంటలకు రానున్న మూడు వారాలు కీలకమని, ఈ సమయాన సాగర్ ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులు, చెరువుల పరిధి ఆయకట్టుకు సక్రమంగా నీరు సరఫరా చేయడంపై దృష్టి సారించాలని జల వనరుల శాఖ ఉన్నతాధికారులు సూచించారు. ఈమేరకు జిల్లా చీఫ్ ఇంజనీర్కు మంగళవారం ఆదేశాలు అందాయి. ఆయకట్టుకు నీరు అందించే విషయంలో ఇంజనీర్లు రానున్న మూడు వారాలు అప్రమత్తంగా వ్యవహరించాలని అందులో సూచించారు. ఎక్కడా నీరు వృధా కాకుండా కాల్వలపై ఈఈలు రాత్రి వేళల్లో పెట్రోలింగ్ చేయాలని సూచించినట్లు తెలిసింది. ఇదే సమయాన వైరా రిజర్వాయర్ కింద స్థిరీకరించిన ఆయకట్టు సుమారు 17,390 ఎకరాలు ఉండగా, రబీ పంటలకు సాగర్ జలాలు అందించేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ఆదేశాలు అందాయి. డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష మధిర నియోజకవర్గంలో జరుగుతున్న పనులపై జలవనరుల శాఖ అధికారులతో హైదరాబాద్లో మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షించారు. ఖమ్మం జలవనరుల శాఖ సీఈ రమేష్, కల్లూరు ఎస్ఈ వాసంతితో పాటు పలువురు ఇంజనీర్లు పాల్గొనగా మండలాలు, ప్రాజెక్టుల వారీగా మంజూరైన నిధులు, ఇప్పటివరకు చేపట్టిన పనులపై సమీక్షించిన ఆయన సూచనలు చేసినట్లు తెలిసింది. సాగునీటి సరఫరాలో అప్రమత్తత తప్పనిసరి -
అర్హత లేదు.. అనుమతులూ లేవు
ఖమ్మంవైద్యవిభాగం: నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఆక్యూ పంక్చర్ ఆస్పత్రిని డీఎంహెచ్ఓ డాక్టర్ కళావతిబాయి సీజ్ చేశారు. ఖమ్మం కమాన్బజార్లోని పెయిన్ రిలీఫ్ ఆక్యూ పంక్చర్ ఆస్పత్రిని డీఎంహెచ్ఓ మంగళవారం తనిఖీ చేశారు. ఆ సమయంలో డాక్టర్గా వ్యవహరిస్తున్న పి.విజయభాస్కర్ లేకపోగా, ఆయనకు అర్హత లేదని, రిజిస్ట్రేషన్ లేకుండానే ఆస్పత్రి నడుపుతున్నట్లు తేలడంతో సీజ్ చేయించచారు. తగిన అర్హతలు లేకుండా వైద్యం చేయడం నేరమని, ఒకవేళ అర్హత ఉన్నా ఆలోపతిక్ చట్టప్రకారం రిజిస్ట్రేషన్ చేయింకున్నాక ప్రాక్టీస్ చేయాలని ఆమె స్పష్టం చేశారు. తనిఖీల్లో డిప్యూటీ డీఎంహెచ్ఓ సైదులు, సీహెచ్ఐ పీఓ చందునాయక్, డెమో సాంబశివరెడ్డి పాల్గొన్నారు.ఆక్యూ పంక్చర్ ఆస్పత్రి సీజ్ -
ఉద్యోగి నుంచి డబ్బు వసూలుకు పన్నాగం
● మహిళలను వేధించిన కేసు నమోదైందని బెదిరింపులు ఖమ్మంఅర్బన్: సైబర్ మోసాలు రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. అలాంటి ఘటనే సోమవారం వెలుగుచూసింది. ఖమ్మం మమత రోడ్డులో నివాసముండే ఓ వ్యక్తి ఖమ్మం రూరల్ మండలంలోని పంచాయతీరాజ్శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు సోమవారం గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ రాగా హిందీ, ఇంగ్లిషు భాషల్లో మాట్లాడిన అవతలి వ్యక్తి బెంగళూరు పోలీసుగా చెప్పుకున్నాడు. సదరు ఉద్యోగి ఫోన్ నుంచి మహిళలకు ఫోన్ చేస్తూ వేధిస్తున్నారని, ఈ విషయమై అందిన ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదైందని చెబుతూ, సెటిల్మెంట్ కోసం డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో కంగారు పడిన సదరు ఉద్యోగి తన మిత్రుడు పోలీసు శాఖలో ఉండడంతో సమాచారం ఇచ్చాడు. అయితే, ఇది సైబర్ నేరగాళ్ల పనేనని పోలీసు ఉద్యోగి చెప్పడంతో తనకు వచ్చిన ఫోన్ నంబర్ వివరాలతో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చెల్లని చెక్కు కేసులో జైలుశిక్ష, జరిమానా ఖమ్మం లీగల్: తీసుకున్న అప్పు చెల్లించే క్రమాన ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో ఖమ్మం బుర్హాన్పురకు చెందిన బ్రహ్మదేవర సోమయ్యకు ఏడాది జైలుశిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ ఖమ్మం ఆబ్కారీ కోర్టు న్యాయమూర్తి రాళ్లబండి శాంతిలత మంగళవారం తీర్పు చెప్పారు. ఖమ్మం కుమ్మరి బజార్కు చెందిన తవిడిశెట్టి యుగంధర్ వద్ద సోమయ్య 2015 ఫిబ్రవరి 15న రూ.10 లక్షల అప్పు తీసుకున్నాడు. ఈ అప్పు చెల్లించే క్రమాన 2017 ఫిబ్రవరి 14న రూ.14.80లక్షలకు చెక్కు జారీ చేశాడు. అయితే, ఆ చెక్కును బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు వెళ్లగా అప్పటికే సోమయ్య ఖాతా మూసివేశాడని తెలియడంతో కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. ఈ కేసు విచారణలో ఆయనపై నేరం రుజువు కాగా ఏడాది జైలు శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. పట్టపగలే చోరీకి యత్నం, బంధించిన స్థానికులు ఖమ్మంఅర్బన్: ఖమ్మం రోటరీనగర్లో ఓ ఇంటి తాళాన్ని రోకలిబండతో పగులగొట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తిని స్థానికులు పోలీసులకు పట్టించారు. మంగళవారం మధ్యాహ్నం సాగర్ ప్రధాన కాల్వ సమీపాన ఒక ఇంటికి తాళం వేసి ఉండగా గుర్తుతెలియని రోకలిబండతో పగులగొట్టేందుకు యత్నిస్తున్నాడు. ఈక్రమంలో శబ్దం విన్న స్థానికులు ఆయనను పట్టుకొని ఖమ్మం అర్బన్ పోలీసులకు అప్పగించారు. కాగా, చోరీకి యత్నించిన వ్యక్తి పాత నేరస్తుడని, గతంలో కొణిజర్ల స్టేషన్లో నమోదైన కేసులో వారెంట్ జారీ అయిందని పోలీసులు తెలిపారు. దీంతో నిందితుడిని కొణిజర్ల పోలీసులకు అప్పగించినట్లు ఖమ్మం అర్బన్ పోలీసులు తెలిపారు. -
కబడ్డీ ఎంపిక పోటీలకు 195మంది హాజరు
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ కబడ్డీ పోటీల్లో పాల్గొనే జిల్లా బాలబాలికల జట్ల ఎంపికకు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన పోటీలకు మంచి స్పందన లభించింది. కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యాన నిర్వహించిన ఈ పోటీలకు బాలురు 120 మంది, బాలికలు 75 మంది హాజరయ్యారు. వీరిని జట్లుగా విభజించి పోటీలు నిర్వహించగా, ప్రతిభ కనబర్చిన వారితో జిల్లా బాలబాలికల జట్లను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి టి.దయాకర్రెడ్డి, కె.క్రిస్టోఫర్బాబు, డీవైఎస్ఓ టి.సునీల్కుమార్రెడ్డితో పాటు సుధాకర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కంటి పరీక్షల శిబిరాన్ని పరిశీలించిన డీఎంహెచ్ఓ
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటుచేసిన ప్రత్యేక శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బి.కళావతిబాయి మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా పలువురికి స్వయంగా పరీక్షలు చేసిన ఆమె వైద్యులతో సమీక్షించారు. కంటి సమస్యలు ఉన్న వారికి రెండో విడత పరీక్షల అనంతరం అవసరమైన విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఎవరికై నా ఆపరేషన్ అవసరమైతే హైదరాబాద్ పంపిస్తామని చెప్పారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి చందునాయక్, డెమో సాంబశివరెడ్డి పాల్గొన్నారు. -
ఎంపీకి రాష్ట్రపతి, ప్రధాని జన్మదిన శుభాకాంక్షలు
ఖమ్మంవన్టౌన్: ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి పుట్టినరోజు బుధవారం జరగనుండగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాజీవితంలో భవిష్యత్లో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ మంగళవారం వారు వేర్వేరుగా సందేశాలు పంపారు. సీఎం, డిప్యూటీ సీఎంను కలిసిన డీసీసీబీ చైర్మన్ మధిర: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు హైదరాబాద్లో మంగళవారం కలిశారు. డీసీసీబీలు, పీఏసీఎస్ల పాలకవర్గాల పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈనేపథ్యాన సీఎం, డిప్యూటీ సీఎంను కలిసిన చైర్మన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్కు డాక్టరేట్ ఖమ్మంసహకారనగర్: ఖమ్మం ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జువాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ బండారు చెంచురత్నయ్యకు డాక్టరేట్ లభించింది. ‘ఆర్సినిక్ ఇండ్యూస్డ్ టాక్సీసిటీ అండ్ ఇట్స్ బయోకెమికల్ ఎఫెక్ట్ ఆన్ ది సెలెక్టెడ్ టిష్యూస్ ఆఫ్ మేల్ ఆల్బినో ర్యాట్’అంశంపై ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్ ఎ.ఉషారాణి పర్యవేక్షణలో సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ ప్రకటించారు. ఈ సందర్భంగా రత్నయ్యను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జకీరుల్లా, అధ్యాపకులు, ఉద్యోగులు ఎస్.కిశోర్, డాక్టర్ సునంద, బి.కవిత తదితరులు అభినందించారు.రాష్ట్రస్థాయి ఉషూ పోటీలకు ఎంపిక ఖమ్మం స్పోర్ట్స్: ఆదిలాబాద్లో ఈనెల 19నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి ఉషూ పోటీలకు జిల్లా నుంచి మగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈమేరకు జిల్లా నుంచి పి.పవిత్రచారి, టి.సాయి భవ్యశ్రీ, హర్షిణి ఎంపిక కాగా, డీవైఎస్ఓ టి.సునీల్కుమార్రెడ్డి, అసోసియేషన్ కార్యదర్శి పి.పరిపూర్ణచారి మంగళవారం అభినందించారు. ఆంగ్లంపై పట్టు సాధించాలి చింతకాని: విద్యార్థులు ఆంగ్ల భాషపై విద్యార్థులు పట్టు సాధించాలని డీఈఓ సోమశేఖరశర్మ సూచించారు. మండలంలోని పందిళ్లపల్లి ఉన్నత పాఠశాలలో ‘వి కెన్ లెర్న్ ఇంగ్లిష్’ కార్యక్రమ అమలును మంగళవారం ఆయన పరిశీ లించి మాట్లాడారు. తప్పులు వచ్చినా నిత్యం తరగతి గదిలో ఆంగ్లంలో మాట్లాడడం ద్వారా ఫలితముంటుందని చెప్పారు. అలాగే, ఉపాధ్యాయులు కూడా ఇంగ్లిష్ పాఠాలు సులువుగా అర్థమయ్యేలా బోధించాలని, విద్యార్థులు తరగతి గదిలో ఆంగ్లంలోనే మాట్లాడేలా ప్రోత్సహించాలని చెప్పారు. ఆతర్వాత పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణ, పరీక్షలకు సన్నద్ధతపై సమీక్షించారు. ఎంఈఓ వీరపనేని శ్రీనివాసరావు, హెచ్ఎం శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి ఖమ్మంరూరల్: మండలంలోని ఏదులాపురం క్రాస్ వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి(42) మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. సదరు వ్యక్తి మంగళవారం రాత్రి రోడ్డు దాటుతుండగా ఖమ్మం – వరంగల్ ప్రధాన రహదారిపై వెళ్తున్న వాహనం బలంగా ఢీకొట్టింది. ఆయన కింద పడిపోయాక తల పైనుంచి వాహనం వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో పోలీసుల సూచనల మేరకు అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఎం.రాజు తెలిపారు. ఆటో బోల్తా, ఇద్దరికి గాయాలు కూసుమంచి: ఖమ్మం–సూర్యాపేట జాతీయ రహదారిపై మంగళవారం టాటా ఏస్ ఆటో బోల్తా పడింది. ఖమ్మం నుండి సూర్యాపేట వైపునకు అలంకరణ సామగ్రితో తీసుకెళ్తున్న ఆటో మండలంలోని హట్యాతండా సమీపానడివైడర్ను ఢీకొట్టి బొల్తా కొట్టింది. ఈఘటనలో డ్రైవర్, మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. -
పీహెచ్సీలో కేంద్ర బృందం తనిఖీ
ముదిగొండ: ముదిగొండ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని వైద్య ఆరోగ్య అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ కె.శశిశ్రీతో పాటు కేంద్రప్రభుత్వ టాస్క్పోర్స్ టీమ్ సభ్యులు మంగళవారం తనిఖీ చేశారు. కేంద్రంలోని రికార్డులను పరిశీలించాక మందుల నిల్వలు, టీకాలపై ఆరాతీశారు. ఆరోగ్యకేంద్రంలోని ఫార్మసీకి సరఫరా అయిన మందులు, పంపిణీపై వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆతర్వాత వైద్యసేవపై ఉద్యోగులకు సూచనలు చేశారు. అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ విజయ్కుమార్, కుత్బుల్లాపూర్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ తిరుపతి, డీపీఓ దుర్గ, వైద్యాదికారి డాక్టర్ అరుణాదేవి, ఉద్యోగులు మోహన్, ఖాదర్బీ, సత్యవతి, రాణి పాల్గొన్నారు. -
ఆర్థోపెడిక్ వైద్యుడికి ఉత్తమ అవార్డు
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆర్థోపెడిక్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న హనుమాన్ ఉత్తమ డాక్టర్ అవార్డు పొందారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో ఈ నెల 13 నుంచి 16 వరకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఆర్థోపెడిక్ సదస్సుకు ఆయన హాజరయ్యారు. రోడ్డు ప్రమాదంలో విరిగిన కాలు ఎముకలకు ఇతర పద్ధతుల్లో రాడ్లు వేసే ఆపరేషన్ల గురించి ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. చీము పట్టినప్పుడు ఎముకలను తీసేయకుండా చేస్తున్న ఇలిజారోవ్ ఆపరేషన్ల గురించి వివరించారు. ఈ ప్రెజెంటేషన్కు గాను ట్రామా విభాగంలో బెస్ట్ డాక్టర్ అవార్డు లభించింది. ఈ సందర్బంగా హనుమాన్ను కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.రాజేశ్వరరావు, సూపరింటెండెంట్ ఎల్. కిరణ్కుమార్ తదితరులు అభినందించారు. -
కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి
● తెలంగాణ కోసం 35 పార్టీలను కేసీఆర్ ఏకం చేశారు ● మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ఖమ్మంమయూరిసెంటర్ : కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఆయన కేక్ కట్ చేయడంతో పాటు మమత ఆస్పత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ సాధనకు 35 పార్టీలను ఏకం చేసి పోరాడిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో గురుకుల పాఠశాలల్లో చేరేందుకు కొన్ని వేల దరఖాస్తులు వచ్చేవని, ఇప్పుడు సరైన సదుపాయాలు లేక దుర్భర పరిస్థితి నెలకొందని ఆరోపించారు. రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో స్ఫూర్తినిచ్చిన తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, నాయకులు ఆర్జేసీ కృష్ణ, టేకులపల్లి సొసైటీ చైర్మన్ బీరెడ్డి నాగచంద్రారెడ్డి, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్కుమార్, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు తాజుద్దీన్, వీరునాయక్, కొల్లు పద్మ, షకీనా పాల్గొన్నారు.