Khammam District Latest News
-
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు
ఆర్టీసీ ఈడీ సొలొమన్ ఖమ్మంమయూరిసెంటర్: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కరీంనగర్ జోన్ ఈడీ సొలొమన్ ఆదేశించారు. ఖమ్మంలోని రీజియన్ మేనేజర్ కార్యాలయం, పాత, కొత్త బస్టాండ్లను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, కార్గో పాయింట్, డిస్పెన్సరీలో పరిశీలించాక రీజినల్ మేనేజర్ సరిరామ్తో కలిసి అధికారులతో సమావేశమయ్యారు. బస్సు సర్వీసుల నిర్వహణలో నిర్లక్ష్యం చేయొద్దని, ప్రయాణికుల డిమాండ్ ఆధారంగా కొత్త రూట్లను గుర్తించాలని సూచించారు. ఖమ్మం డిపో మేనేజర్ దినేష్కుమార్, అసిస్టెంట్ మేనేజర్ రామయ్య, సూపర్వైజర్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ● మధిర: ఆర్టీసీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ఈడీ సాలొమాన్ సూచించారు. మధిర డిపోను తనిఖీ చేసిన ఆయన సర్వీసుల నిర్వహణ, తదితర అంశాలపై ఉద్యోగులకు సూచనలు చేశారు. ఖమ్మం ఆర్ఎం సరిరామ్, మధిర డీఎం శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ కార్యదర్శిగా ప్రవీణ్కుమార్ కొనసాగింపు ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి(ఆన్ డ్యూటీ)గా విధుల్లో ఉన్న పి.ప్రవీణ్కుమార్కు మరో ఏడాది పాటు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. పటాన్చెరువు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి అయిన ప్రవీణ్ను గత ఏడాది జనవరిలో ఖమ్మంకు కేటాయించారు. మరోమారు ఏడాది పొడించడంతో 2026 ఏప్రిల్ వరకు ఆయన ఇక్కడే విదులు నిర్వర్తించనున్నారు. గ్రేడ్–2 కార్యదర్శులకు పదోన్నతులు రాష్ట్రంలో నలుగురు కార్యదర్శులకు గ్రేడ్–2 నుంచి గ్రేడ్–1గా పదోన్నతి కల్పించారు. ఇందులో భాగంగా సత్తుపల్లి మార్కెట్లో పనిచేస్తున్న జి.సత్యనారాయణకు పదోన్నతి కల్పించి కల్లూరుకు, ఖమ్మం మార్కెట్ నుంచి వి.సృజన్బాబుకు పదోన్నతి కల్పించి లక్సెట్పేట మార్కెట్కు బదిలీ చేశారు. అయితే, ఖమ్మం మార్కెట్ గ్రేడ్–2 కార్యదర్శిగా మాత్రం ఎవరినీ నియమించలేదు. క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభం ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్లో క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన శిక్షణ శిబిరాన్ని మంగళవారం ప్రారంభించారు. శిబిరాన్ని క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సీహెచ్.వెంకట్ ప్రారంభించి మాట్లాడుతూ ఔత్సాహికులకు మెరుగైన శిక్షణ ఇచ్చి హెచ్సీఏ టోర్నీలో ఆడేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈకార్యక్రమంలో కన్వీనర్ ఎం.డీ.మాసూద్తో పాటు ఫారూఖ్, తురాబ్ అలీ తదితరులు పాల్గొన్నారు. హైడల్ ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఈ కూసుమంచి: మండలంలోని పాలేరులో మినీ హైడల్ ప్రాజెక్టు(జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం)లో మరమ్మతు పనులను జెన్కో సీఈ(సివిల్) నారాయణ మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా పురోగతిపై ఆరా తీసిన ఆయన, వర్షాకాలంలోగా పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే, గత ఏడాది సెప్టెంబర్లో వచ్చిన భారీ వరదలతో ప్రాజెక్టుకు నీరు సరఫరా చేసే కాల్వ కట్ట తెగిన నేపథ్యాన, అక్కడ చేపడుతున్న మరమ్మతులను కూడా సీఈ పరిశీలించారు. ఎస్ఈ దేశ్యా, డీఈ సింహాచలం పాల్గొన్నారు. వడదెబ్బతో ఇద్దరు మృతిమఽధిర/చింతకాని: మధిర మండలం నిదానపురానికి చెందిన కనపర్తి దానయ్య(49) వడదెబ్బకు గురై మంగళవారం మృతి చెందాడు. ఎండల కారణంగా అస్వస్థతకు గురైన ఆయనను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని కుటుంబీకులు తెలిపారు. దానయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే, చింతకాని మండలం నాగులవంచలో ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లిన గొడ్డుగొర్ల కేజీరాణి(55) వడదెబ్బకు గురై మంగళవారం మృతి చెందింది. గత శనివారం పనికి వెళ్లిన ఆమె ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురికాగా ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు
తల్లాడ: రైతులకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. తల్లాడ మండలం కుర్నవల్లిలో మంగళవారం ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించాక ఎంపీడీఓ కార్యాలయంలో మిల్లర్లతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 351 కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 1.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇందులో హనుమకొండకు జిల్లాకు 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించగా, ఆ జిల్లాకు ఇంకా 30వేల మెట్రిక్ టన్నులతో పాటు వరంగల్కు 20 వేల మెట్రిక్ టన్నులు తరలిస్తామని చెప్పారు. అయితే, కొనుగోలు కేంద్రాల్లో కాంటా కాగానే మిల్లులకు తరలించేలా లారీలు సమకూరుస్తున్నందున వేగం పెంచాలని సూచించారు. కాగా, కుర్నవల్లిలో 1638 రకం ధాన్యం 30 వేల బస్తాలు ఉన్నందన మిల్లు యజమానులు దిగుమతి చేసుకోవాలని తెలిపారు. ఎవరైనా తేమ, తాలు పేరుతో తరుగు తీస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్షానికి ధాన్యం తడవకుండా 13 వేల టార్పాలిన్లు సరఫరా చేశామని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ చందన్కుమార్, డీఎం గంటా శ్రీలత, ఆర్డీఓ రాజేందర్ గౌడ్, తహసీల్ధార్ సురేష్కుమార్, ఆర్ఐలు కిరణ్, మొయినుద్దీన్ పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి -
ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ
● 36 తులాల బంగారంతో పాటు వెండి, నగదు అపహరణ ● రెక్కీ చేసి మరీ చోరీకి పాల్పడిన నిందితులు? ఖమ్మంఅర్బన్: ఖమ్మం ఆరో డివిజన్లోని న్యూ ఖానాపురంలో భారీ చోరీ కలకలం రేపింది. తిరుమలలో దైవదర్శనానికి వెళ్లిన ఉపాధ్యాయుడి ఇంటిని లక్ష్యంగా ఎంచుకున్న దుండగులు చోరీకి పాల్పడ్డారు. కామేపల్లి మండలం పాతలింగాల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బానోతు శోభన్ – వనిత దంపతులు న్యూఖానాపురంలో నివసిస్తుండగా కుటుంబంతో కలిసి సోమవారం రాత్రి రైలులో తిరుపతి బయలుదేరారు. ఇదే సమయాన స్కూటీపై వచ్చిన దుండగులు, ఎవరూ లేరని నిర్ధారించుకున్నట్లు తెలిసింది. ఆపై రెండు గడ్డపారలతో తాళం పగలగొట్టి లోనకు ప్రవేశించారు. అనంతరం బీరువా, లాకర్లను బద్దలుకొట్టి అందులో దాచిన 36 తులాల బంగారం, 30తులాల వెండి ఆభరణాలు, రూ.12వేల నగదు ఎత్తుకెళ్లారు. ఈ విషయం మంగళవారం ఉదయం బయటపడడంతో ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాష్ క్లూస్టీమ్తో చేరుకుని ఆధారాలు సేకరించారు. 45నిమిషాల పాటు ఇంట్లోనే.. మంగళవారం తెల్లవారుజామున 3గంటల సమయాన ముసుగులు ధరించిన దుండగులు ఉపాధ్యాయుడు శోభన్ ఇంట్లోకి ప్రవేశించి సుమారు 45నిమిషాల పాటు ఉన్నారు,. వీరి కదలికలన్నీ సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. కాగా, చోరీ తర్వాత బయటకు వస్తుండగా, అప్పుడే వాకింగ్కు వెళ్తున్న స్థానికుడైన కృష్ణారావుకు అనుమానం వచ్చి శోభన్కు ఫోన్లో సమాచారం ఇచ్చాడు. దీంతో ఆయన తమ బంధువులను పంపించగా చోరీ విషయం బయటపడింది. కాగా, శోభన్ ఇంట్లోనే కాక అదే భవనంలో కింద అద్దెకు ఉండే వారి ఇంటి కూడా తాళం పగలగొట్టినట్లు సీసీ కెమెరాల పుటేజీ ద్వారా గుర్తించారు. ఈమేరకు తిరుమల ప్రయాణం రద్దు చేసుకున్న ఉపాధ్యాయ దంపతులు ఖమ్మం చేరుకుని పోలీసులను అశ్రయించారు. కాగా, ఖమ్మం స్టేషన్కు వెళ్లే సమయంలో ఆన్లైన్ సర్వీస్ ద్వారా ఆటో బుక్ చేసుకోగా, ఆటో డ్రైవర్ పైనా అనుమానంతో పోలీసులు ఆరా తీస్తున్నారు. -
సీబీఎస్ఈ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ
‘హార్వెస్’ విద్యార్థుల విజయకేతనంఖమ్మం సహకారనగర్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) పదో తరగతి, 12వ తరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారని హార్వెస్ట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ పార్వతిరెడ్డి తెలిపారు. పదో తరగతి పరీక్షలకు 250మంది హాజరుకాగా 100శాతం ఉత్తీర్ణత నమోదైందని వెల్లడించారు. ఇందులో 500మార్కులకు కె.రిషిత్ 492మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, ఎస్.తేజస్వి 489, బి.హిమవర్షిణి 487, ఎం.ధన్విత 485, బి.చందనప్రియ 483, ఎస్.కే.షాజియా ఇరం 483, పి.ధీరజ్ 481, బి.సహస్ర, పి.భువన్ 480మార్కులు సాధించారని తెలిపారు. అలాగే, 12వ తరగతి ఫలితాల్లో 500కు ఎన్.రాఘవేంద్ర నవనీత్ 487 మార్కులతో అగ్రస్థానాన నిలిచాడని కరస్పాండెంట్, పార్వతిరెడ్డి తెలిపారు. అంతేకాక రేపల్లి శ్రీష 484, బి.సాయిచరణ్ 482, ఎం.నాగయశ్వంత్ 482, బి.సిద్ధార్థ్ 482, ఎన్.సీ.హెచ్.జస్వంత్ సాయి 478, బి.సంజయ్ 477, జి.రాణి ఉమాఅలేఖ్య 475, డి.శ్రీనివాస గౌతమ్రెడ్డి 472, కె.రోహిత 471, టీ.డీ.వీ.ఎస్.ఎస్.నైమాంజలి 470, బి.భార్గవి 470మార్కులు సాధించారన్నారు. కాగా, 12వ తరగతి పరీక్షకు 185 మంది హాజరవగా 100శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను కరస్పాండెంట్ రవిమారుత్, ప్రిన్సిపాల్ పార్వతిరెడ్డితో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. -
శ్రీచైతన్య ప్రభంజనం
సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యధిక మార్కులతో ప్రభంజనం సృష్టించారని శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. ఖమ్మం మమత రోడ్డులోని శ్రీచైతన్య ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ పాఠశాల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించగా వారిని అభినందించి మాట్లాడారు. కాసిన జస్వంత్ 500 మార్కులకు 489 మార్కులు, కవితాచౌదరి 485, యశస్విత 484, సూర్యతేజ 483, సంహితరెడ్డి 480 మార్కులు సాధించగా, వంద శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. ఈకార్యక్రమంలో ఏజీఎం చేతన్మాధూర్, కోఆర్డినేటర్ కృష్ణారావు, ప్రిన్సిపాళ్లు నాగప్రవీణ, టీ.ఎల్.ఎన్.శర్మ, సురేష్, డీన్ లక్ష్మీ నర్సింహ, ఇన్చార్జ్లు రాము, నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
మామిడి పచ్చడికి ధరల సెగ
పచ్చడి పెట్టేందుకు జంకుతున్న సామాన్యులు ● తెగుళ్లు, అకాల వర్షాలతో దిగుబడి తగ్గి.. పెరిగిన కాయల ధరలు ● నూనె, కారం, ఇతర దినుసులదీ అదే పరిస్థితి మధిర: మాంసాహార ప్రియుల్లో సైతం కొందరు మామిడికాయ పచ్చడితోనే భోజనం ప్రారంభిస్తారు. ఇక శాకాహారులైతే తప్పక పచ్చడి ఉండాల్సిందే. వీరే కాక సన్న, చిన్న కారు రైతులు, వ్యవసాయ కూలీలు, ఇతర పనులకు ఉదయాన్నే వెళ్లే వారు, కూరలు వండలేని వారికి ఈ పచ్చడే కడుపు నింపుతుంది. దీంతో ఏటా మాదిరి ఈసారి కూడా పచ్చడి పెట్టడానికి సిద్ధమవుతున్న ప్రజలకు ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ఆది నుంచి అవాంతరాలే... ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల్లో మామిడి చెట్లకు పూత, పిందె సక్రమంగా రాలేదు. అంతేకాక వచ్చిన పూత కూడా చలికాలంలో మంచు కారణంగా తెగళ్లతో రాలిపోయింది. ఆపై అరకొరగా మిగిలిన పూత పిందగా మారగానే ఇటీవల అకాల వర్షాలకు మరో దెబ్బపడినట్లయింది. ఇలా రకరకాల కారణాలతో ఈ ఏడాది మామిడి దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో సీజన్లో రోడ్ల వెంట, మార్కెట్లలో విరివిగా లభించే పచ్చడి మామిడికాయలు ఈసారి పెద్దగా అందుబాటులోకి రాలేదు. ప్రధానంగా పచ్చడి తయారీకి ఉపయోగించే చిన్న రసాలు, పెద్ద రసాలు, నాటు, జలాలు, తెల్ల గులాబీ వంటి రకాల కొరతతో డిమాండ్ నెలకొంది. ఏపీ నుంచి తీసుకొచ్చి... మార్కెట్లో చిన్న రసాలు రూ.30, తెల్ల గులాబీ, జలాలు వంటి రకాలు రూ.50 చొప్పు ధర పలుకుతున్నాయి. ఇక్కడ పెద్దగా దిగుబడి లేకపోవడంతో, జిల్లాకు సరిహద్దుగా ఉన్న ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం, తిరువూరు, విస్సన్నపేట, ఏ కొండూరు, నూజివీడు తదితర మండలాల నుంచి వ్యాపారులు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. గతంలో ఒక్కో చిన్న రసం చెట్టుకు సుమారు వెయ్యి మామిడికాయలు కాసేవని.. ఈసారి తెగుళ్లు, అకాల వర్షాలతో ఆ పరిస్థితి లేదని చెబుతున్నారు. ఇక కొన్ని మామిడికాయలకు మంగు రావడంతో పచ్చడి తయారీకి పనికి రావని కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా మిగిలిన కాయలకు డిమాండ్తో పాటు ధర పెరుగుతోంది. అదే బాటలో దినుసులు ఏడాది పాటు మామిడి పచ్చడి నిల్వ ఉండాలంటే నాణ్యమైన కాయలు ఎంచుకోవడమే కాక మేలు రకం దినుసులు ఎంచుకుంటారు. అయితే, ఈసారి సామగ్రి ధరలు కూడా మండిపోతున్నాయి. దీంతో పచ్చడి పెట్టకముందే మంట పుడుతుందని సామాన్యులు వాపోతున్నారు. చట్నీ పెట్టేందుకు కావాల్సిన నూనె, కారం, ఉప్పు, ఎల్లిపాయలు, ఆవాలు, మెంతుల ధరలు పెరిగాయి. పలు రకాల మిర్చి ధర తక్కువగా ఉన్నా పచ్చడి పెట్టే లావు రకాల మిర్చి ఎక్కువగానే ఉంది. ఈ మిర్చి కేజీ రూ.300 నుంచి రూ.600 వరకు పలుకుతుండగా.. కారం పట్టించడానికి కేజీకి రూ.40 వెచ్చించాల్సి వస్తోంది. మహిళలు బిజీబిజీ.. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బంధువులు, మిత్రులు ఒక చోటకు చేరి జాడీల కొద్ది పచ్చడి పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఇంకొందరు తమ బంధువులు, స్నేహితులు, ఇతర ప్రాంతాల్లో ఉండే పిల్ల లకు పంపించేందుకు మామిడికాయ పచ్చడి తయారుచేస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా కారం మిల్లుల్లో రద్దీ ఉంటుండగా, పచ్చడి తయారీతో పలువురి ఇళ్లు కళకళలాడుతున్నాయి. పచ్చడి దినుసుల ధరలు సామగ్రి ధర (కేజీకి రూ.ల్లో) కారం 300 – 600 ఎల్లిపాయలు 200 శనగ నూనె 170 ఆవాలు 170 మెంతులు 180 నువ్వుల నూనె 410 అయినా తప్పడం లేదు.. ఏటా పచ్చడి పెట్టడం తప్పనిసరి. కూర చేయలేని రోజు, కూరగాయల ధరలు పెరిగినప్పుడు పచ్చడి తీసుకుని కూలీ పనులకు వెళ్తాం. ఈసారి పచ్చడికి ఉపయోగించే వస్తువుల ధరలు పెరిగినా తప్పడం లేదు. – కృష్ణవేణి, కూలీ, మధిర పిల్లలకు పంపించేందుకు... అమెరికా, హైదరాబాద్, ఖమ్మంలో ఉంటున్న పిల్లలకు ఏటా పచ్చడి పంపిస్తాం. కూరగాయలతో తినలేనప్పుడు పచ్చడి ఉయోగపడుతుంది. అందుకే ఏటా అందరికీ కలిపి మామిడికాయ పచ్చడి పెడతాం. – రమావత్ మారోనిబాయి, మధిర -
విద్యార్థులకు మెరుగైన బోధనే లక్ష్యం
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన బోధన చేసేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఉపాధ్యాయులకు మూడు విడతలుగా ఇవ్వనున్న శిక్షణ మంగళవారం ఖమ్మంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల పిల్లలే ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నందున వారిని ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలన్నారు. తాను ఏడో తరగతి చదువుతున్నప్పుడు ఉపాధ్యాయులు విజయలక్ష్మి తీసుకున్న శ్రద్ధతో ఈ స్థాయికి ఎదిగానని గుర్తు చేసుకున్నారు. అలాగే, భవిత సెంటర్లలో అవసరమైన పరికరాలు సమకూరుస్తూ, దివ్యాంగ విద్యార్థులకు వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డీఈఓ ఎస్.సత్యనారాయణ, సీఎంఓ రాజశేఖర్, ఏఎంఓ రవికుమార్, ఎంఐఎస్ రామకృష్ణ, హార్వెస్ట్ కరస్పాండెంట్ రవిమారుత్, ప్రిన్సిపాల్ పార్వతిరెడ్డి పాల్గొన్నారు. జూలై 15 తర్వాత పాడి పశువుల కొనుగోలు ఇందిరా మహిళా డెయిరీ పథకం ద్వారా జూలై 15 తర్వాత లబ్ధిదారులకు పాడి పశువులు కొనుగోలు చేసేలా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. డెయిరీ నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించిన ఆయన మాట్లాడుతూ జూలై 15నుంచి జనవరి వరకు 5వేల పాడి పశువుల యూనిట్లు గ్రౌండింగ్ చేయాలన్నారు. ఈ క్రమంలో పశువుల ఆరోగ్యం, ఇతర అంశాలపై జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. డీఆర్డీఓ సన్యాసయ్య, బీసీ, ఎస్సీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు జి.జ్యోతి, నవీన్బాబు, డాక్టర్ పురంధర్, విజయలక్ష్మి పాల్గొన్నారు. మహిళా మార్ట్ నిర్వహణపై శిక్షణ ● ఖమ్మంమయూరిసెంటర్: మహిళా మార్ట్ను లాభాల బాటలో నడిపేలా మహిళా సంఘాల సభ్యులకు ఇప్పటికే శిక్షణ ఇప్పించామని కలెక్టర్ ముజమ్మిల్ తెలిపారు. ఖమ్మం సీక్వెల్ రోడ్డులో సిద్ధమవుతున్న మార్ట్ను పరిశీలించిన ఆయన మాట్లాడారు. సామగ్రి నిర్వహణ, భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డీఆర్డీఓ ఆర్.సన్యాసయ్య, పీఆర్ ఈఈ వెంకట్రెడ్డి పాల్గొన్నారు. దివ్యాంగులలో ఆత్మస్థైర్యాన్ని నింపాలి ఉపాధ్యాయుల శిక్షణలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ -
ఎల్డబ్ల్యూఈ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత
● ఉమ్మడి జిల్లాలో మూడు పార్క్ల అభివృద్ధి ● అటవీ శాఖ అధికారులతో భేటీలో మంత్రి తుమ్మల ఖమ్మంవన్టౌన్: ఉమ్మడి జిల్లాలోని అటవీ ప్రాంతంలో రోడ్ల నిర్మాణం, పార్క్ల అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ సునీత, పీసీసీఎఫ్ సువర్ణతో హైదరాబాద్లో మంగళవారం సమావేశమైన ఆయన పలు సూచనలు చేశారు. ఇప్పటికే ఎల్డబ్ల్యూఈ నిధులతో అటవీ ప్రాంతంలో రహదారుల నిర్మాణానికి అనుమతి జారీ చేయాలని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను కోరినట్లు తెలిపారు. ఇందులో భాగంగా అడవులను సంరక్షిస్తూనే ఉమ్మడి జిల్లాలో ఆరు రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పడమటి నర్సాపురం – అన్నారుపాడు, పాత అంజనాపురం – బేతంపూడి, కొమ్ముగూడెం – రాఘవాపురం, హేమచంద్రాపురం – జూబ్లీపురం గుట్ట, వెంకటాతండా – కుంట్ల, కొత్తపల్లి – ఏపీ సరిహద్దు వరకు రహదారులు నిర్మించాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే, ఖమ్మంలోని వెలుగుమట్ల అర్బన్ పార్క్, సత్తుపల్లి, తల్లాడ మండలం కనిగిరి హిల్స్ ఎకో టూరిజం, కొత్తగూడెంలో ఎకోపార్క్ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఇవికాక ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు ఆదాయం పెంచేలా ఉపాధి శిక్షణ ఇవ్వడంతో పరికరాలు సమకూర్చాలని, పోడు భూముల్లో వెదురుసాగుకు శ్రీకారం చుట్టాలని మంత్రి తెలిపారు. తద్వారా వారికి మెరుగైన ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వైరారూరల్: అభివృద్ధి పనులు త్వరగా పూర్తయ్యేలా అదనపు సిబ్బంది, యంత్రాలను సమకూర్చుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. వైరా మండలంలోని భట్టి స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో మంగళవారం ఆయన పర్యటించారు. ఈసందర్భంగా వైరా నదికి కరకట్ట, చెక్ డ్యామ్, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో చేపడుతున్న పనులను పరిశీలించి ఉద్యోగులకు సూచనలు చేశారు. ఎమ్మెల్యే రాందాస్నాయక్, కాంగ్రెస్ జిల్లా, మండల అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, శీలం వెంకటనర్సిరెడ్డి, నాయకులు దొడ్డా పుల్లయ్య, మల్లు రామకృష్ణ, పమ్మి అశోక్, వడ్డె నారాయణరావు తదితరులున్నారు. యంగ్ ఇండియా స్కూల్ స్థలానికి హద్దులు బోనకల్: బోనకల్ మండలంలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలకు సంబంధించి స్థలం ఖరారైంది. ఈమేరకు 25ఎకరాల స్థలాన్ని గుర్తించగా సర్వే అనంతరం మంగళవారం జిల్లా సర్వేయర్ వెంకటరావు హద్దులు నిర్ధారించారు. తహసీల్దార్ పూనం చందర్, సర్వేయర్ కృష్ణయ్యతో కలిసి హద్దు రాళ్లు పాతారు. అయితే, పాఠశాల అవసరాలకు మరో ఐదెకరాల భూమి కూడా సేకరించనున్నట్లు తహసీల్దార్ చందర్ తెలిపారు. -
పాస్బుక్ కలిగిన రైతులందరికీ రిజిస్ట్రేషన్
కొణిజర్ల: పట్టాదారు పాస్బుక్ కలిగిన ప్రతీ రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, తద్వారా కేంద్రప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. మండలంలోని తనికెళ్ల రైతు వేదికలో రైతుల రిజిస్ట్రేషన్ను మంగళవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. రైతులు పాస్పుస్తకం, ఆధార్ కార్డు, ఆధార్కు అనుసంధానమైన నంబర్ కలిగిన ఫోన్తో ఏఈఓలను సంప్రదించాలని తెలిపారు. కాగా, దుక్కులు దున్నడానికి ఇదే అనువైన సమయమని, తద్వారా వర్షాలు కురవగానే భూమి గుల్లబారి విత్తనాలు నాటొచ్చని వెల్లడించారు. వైరా ఏడీఏ టి కరుణశ్రీ, ఏఓ బాలాజీ, ఏఈఓ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. -
అదుపు తప్పిన కారు.. ఒకరికి గాయాలు
నేలకొండపల్లి: ఓ కారు అదుపు తప్పి చెట్లలోకి దూసుకెళ్లగా తృటిలో ప్రమాదం తప్పింది. మండలంలోని అమ్మగూడెం మీదుగా వెళ్తున్న కారు సోమవారం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ముదిగొండ మండలం మాధాపురానికి చెందిన నాగిరెడ్డి నేలకొండపల్లి వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు దెబ్బతినగా నాగిరెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. వడదెబ్బతో కూలీ మృతి పెనుబల్లి: వడదెబ్బ బారిన పడిన వృద్ధుడు మృతి చెందాడు. పెనుబల్లి ఎస్సీ కాలనీకి చెందిన దండు స్వామి(60) రోజు మాదిరిగానే సోమవారం కూలీ పనికి వెళ్లాడు. సాయంత్రం ముత్యాలమ్మ గుడివైపు నడిచి వెళ్తుండగా వడదెబ్బతో అపస్మారక స్థితికి చేరాడు. దీంతో స్థానికులు ఆయనను పెనుబల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. ప్రేమ చూపడం లేదని మహిళ ఆత్మహత్య పెనుబల్లి: ఇంట్లో ఎవరూ తనతో ప్రేమగా ఉండడం లేదని మనస్తాపానికి గురైన మహిళ బలవన్మరణానికి పాల్పడింది. పెనుబల్లి బీసీ కాలనీకి చెందిన తోట అంజమ్మ(40) తనతో కుమారులు, కుటుంబీకులు ప్రేమగా ఉండటం లేదంటూ.. వారిని బెదిరించే క్రమంలో 20 బీపీ మాత్రలు మింగింది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకపోగా, ఆలస్యంగా గమనించిన కుటుంబీకులు పెనుబల్లి ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుండి ఖమ్మం ప్రభుత్వ ఆస్పకి తరలించగా అంజమ్మ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మానసిక స్థితి సరిగ్గా లేక... ఖమ్మంక్రైం: మానసికస్థితి సరిగ్గా లేని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మంలోని బోనకల్ క్రాస్ రోడ్డు ప్రాంతానికి చెందిన యనగండ్ల శ్యామ్కుమార్(21) సోమవారం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయన కుటుంబీకుల ఫిర్యాదుతో ఖమ్మం వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
బాల్బ్యాడ్మింటన్కు కేరాఫ్గా..
● బోనకల్లో ఏటా వేసవిలో క్రీడా శిక్షణ శిబిరం ● 22 ఏళ్లుగా కోచ్ లింగయ్య ఆధ్వర్యాన నిర్వహణ ● జాతీయ, అంతర్జాతీయ పోటీలకు ఎంపికై న బాల్బ్యాడ్మింటన్ క్రీడాకారులు బోనకల్: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో 22 ఏళ్లుగా వేసవిలో బాల్బ్యాడ్మింటన్ శిక్షణా శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా ఎందరో క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటారు. శిబిరాల నిర్వహణ, కఠోర శిక్షణలో కోచ్ అమిరేశి లింగయ్య కీలకంగా నిలుస్తూ క్రీడాకారులకు చేయూతనిస్తున్నారు. తొలుత యూత్ ద్వారా.. 1997లో బోనకల్లో శాంతి స్నేహా యూత్ను నెలకొల్పిన లింగయ్య బాల్బ్యాడ్మింటన్ క్రీడకు జీవం పోశాడు. కనుమరుగవుతున్న సంప్రదాయ క్రీడ అయిన బాల్బ్యాడ్మింటన్కు ఎలాంటి లాభాపేక్ష లేకుండా సుమారు 200 మంది క్రీడాకారులకు శిక్ష ణ ఇచ్చి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీలకు సన్నద్ధం చేశాడు. తద్వారా బాల్బ్యాడ్మింటన్ క్రీడకు కేరాఫ్గా బోనకల్ నిలుస్తోంది. దాతల సహాయ సహకారాలతో అనేకమంది క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఇదే గ్రామంలో ఏటా పాఠశాల విద్యార్థులను సబ్జూనియర్, జూనియర్, సీనియర్ గ్రూప్లుగా విభజించి శిక్షణ ఇస్తున్నాడు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా మంచి ప్రావీణ్యత సంపాదించి ఉన్నత చదువులు చదివి స్సోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందడం విశేషం. ప్రస్తుతం 40 మంది.. ఈ ఏడాది 40 మంది క్రీడాకారులతో వేసవి శిక్షణా శిబిరం ప్రారంభమైంది. నెలపాటు ఈ శిక్షణా శిబి రం నిర్వహించనుండగా.. ఉదయం, సాయంత్రం వేళల్లో క్రీడాకారులకు ఆటలో మెళకువలు నేర్పుతూ నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నారు. బోనకల్లో రెండు గురుకుల పాఠశాలలు, కస్తూర్బాగాంధీ పాఠ శాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్న త పాఠశాలలో విద్యార్థులు అధికంగా ఉండడంతో వేసవి శిక్షణా శిబిరం క్రీడాకారుల తో కళకళలాడుతోంది. అలాగే, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీలకు ఎంపికై న క్రీడాకారులు కూడా ఈ శిక్షణా శిబిరంలోనే తర్ఫీదు పొందడం విశేషం. -
పర్యాటక ప్రాంతాలుగా అడవుల అభివృద్ధి
● ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ● నీలాద్రి అర్బన్పార్క్లో అభివృద్ధి పనులు ప్రారంభం సత్తుపల్లి: ఉమ్మడి జిల్లాలో అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉన్నందున పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయడంపై అధికారులు దృష్టి సారించాలని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సూచించారు. సత్తుపల్లిలోని నీలాద్రి అర్బన్పార్క్లో ఫెడల్ బోటింగ్, లైబ్రరీ, ఆర్వో ప్లాంట్, ఎన్ఐఎఫ్ మిషన్, వీఎస్ఎస్ సభ్యులకు ఉపాధి యంత్రాలను సోమవారం ఆయన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆదిలాబాద్ సమీపంలోని తిప్పేశ్వరం అటవీ పార్క్ మాదిరి సత్తుపల్లి అర్బన్ పార్క్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చర్చించారని తెలిపారు. అలాగే, 14 వేల హెక్టార్లలో ఉన్న కనిగిరి గుట్టలను ఎకో టూరిజంలో భాగంగా అభివృద్ధి చేస్తే పర్యాటకుల రాక పెరుగుతుందని, ఆపై గిరిజనులకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. కాగా, అటవీశాఖ వీఎస్ఎస్ సభ్యులకు ఉపాధి యంత్రాలను అందించడం అభినందనీయమన్నారు. ఇదే తరహాలో రాజీవ్ యువశక్తి పథకం ద్వారా యంత్రాల పంపిణీ, మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ ఇస్తే ఫలితం ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ అడవిపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం ఆనందదాయకమన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఛీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డి.బీమానాయక్, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్, ఎఫ్డీఓ వాడపల్లి మంజుల, మున్సిపల్ కమిషనర్ కు.నర్సింహ, రేంజర్ ఉమ, నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, దోమ ఆనంద్, గాదె చెన్నారావు, తోట సుజలరాణి, కమల్పాషా, దొడ్డా శ్రీనివాసరావు, వందనపు సత్యనారాయణ, మెప్మా టీఎంసీ సుజాత, దీపక్ రామాయణ్ తదితరులు పాల్గొన్నారు. -
రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఎర్రుపాలెం: వేగంగా వెళ్తున్న రైలు నుండి జారిపడిన గుర్తు తెలియని వ్యక్తి(45) మృతి చెందాడు. ఖమ్మం జీఆర్పీఎస్ఐ బి.రాణాప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం నుండి విజయవాడ వైపు వెళ్తున్న రైలు నుండి సదరు వ్యక్తి జారిపడగా తీవ్రగాయాలత మృతి చెందాడు. ఆయన వద్ద ఖమ్మం – విజయవాడ టికెట్ తప్ప ఇతర ఆధారాలు లభించలేదు. నలుపు, తెలుపు గళ్ల షర్ట్, బ్లాక్ పాయింట్ ధరించిన వ్యక్తి మృతదేహాన్ని మధిర ప్రభుత్వాస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 87126 58589, 98481 14202 నంబర్లలో సంప్రదించాలని ఎస్ఐ సూచించారు. రెండు కేజీల గంజాయి స్వాధీనం● ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కారేపల్లి: గంజాయితో వెళ్తున్న ఇద్దరిని కారేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రెండు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పోలీసులు వెల్లడించిన వివరాలు... ఇల్లెందుకు చెందిన వలిపెద్ది రాజ్కమల్, కొత్తగూడెంలోని చుంచుపల్లికి చెందిన కుంజా దిలీప్ చెరో కేజీ గంజాయి సంచులతో ఖమ్మం వెళ్లేందుకు సోమవారం కారేపల్లి వద్ద వేచి ఉన్నారు. ఈక్రమంలో సింగరేణి సీఐ తిరుపతిరెడ్డి, ఎస్ఐ ఎన్.రాజారాం ఆ మార్గంలో వెళ్తుండగా పోలీసులను చూసిన రాజ్కమల్, దిలీప్ పరుగు పెట్టారు. దీంతో వెంబడించి పట్టుకోగా, రెండు కేజీల గంజాయి లభించింది. ఇల్లెందుకు చెందిన రాజ్కమల్ 2017లో సోలార్ ప్లాంట్ వద్ద జరిగిన ఓ హత్య కేసులో నిందితుడు కాగా, బెయిల్పై వచ్చాక కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడంతో అరెస్టు వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం దిలీప్తో కలిసి ఆయన గంజాయి తీసుకెళ్తూ పట్టుబడ్డాడు. -
రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండలంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బుధవారం పర్యటించనున్నారు. మండల కేంద్రంలో రూ.22 కోట్లతో నిర్మించే 50 పడకల ఆస్పత్రి భవనం, రూ.2.62కోట్లతో కండ్రిక – పెద్ద గోపవరం బీటీ రోడ్డు పనులు, రూ.5.74 కోట్లతో నిర్మించే బనిగండ్లపాడు – బంజర బీటీ రోడ్డు నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. పంటల సాగులో మెళకువలపై అవగాహన వైరారూరల్: ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో భాగంగామండలంలోని ఖానాపురం రైతు వేదికలో సోమవారం అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈసందర్బంగా వైరా కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ కె.రవికుమార్ మాట్లాడుతు యూరియా వాడకం తగ్గింపు, తద్వారానేల ఆరోగ్య పరిరక్షణపై వివరించారు. అనంతరం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ వి.చైతన్య, వైరా ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ వివిధ అంశాలపై మాట్లాడారు.ఏఓ మయాన్ మంజుఖాన్, తల్లాడ వెటర్నరీ వైద్యులు అనాస్, విత్తన అభివృద్ధి అధికారి అక్షిత, ఏఈఓలు సపావత్ సైదులు, ఆలూరి వాసంతి, వెంపటి కీర్తి, మేడా రాజేష్, పరిటాల వెంకటనర్సయ్యతో పాటు నల్లమల వెంకటేశ్వరరావు, షేక్ రఫీ, షేక్ లాల్ మహ్మద్, తుమ్మల రాణాప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. యూరియా వాడకాన్ని తగ్గించాలి మధిర: రైతులు పంటల్లో యూరియా వాడకాన్ని తగ్గించాలని మధిర వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త రుక్మిణిదేవి సూచించారు. మండలంలోని దెందుకూరు రైతువేదికలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ సదస్సు సోమవారం నిర్వహించగా ఆమె మాట్లాడారు. యూరియా వాడకాన్ని తగ్గిస్తే ఖర్చు కూడా తగ్గుతుందని తెలిపారు. అంతేకాక మేలైన విత్తనాల ఎంపిక, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించి, రైతుల సందేహాలను నివృత్తి చేశారు. మధిర ఏడీఏ విజయ్ చంద్ర, ఏఓ సాయిదీక్షిత్, ఏఈఓ ప్రవల్లిక, రైతులు పాల్గొన్నారు. పురాతన కాలం నాటి రాతిస్తంభం నేలకొండపల్లి: నేలకొండపల్లిలోని బౌద్ధస్థూపానికి సమీప పొలంలో కాకతీయుల కాలం నాటిదిగా పలకల రాతి స్తంభాన్ని గుర్తించారు. ఈ అంశంపై తెలంగాణ చరిత్ర బృందం కోకన్వీనర్ కట్టా శ్రీనివాస్, పసుమర్తి శ్రీనివాస్ సోమవారం వివరాలు వెల్లడించారు. భూమిపై రెండు అడుగుల ఎత్తు, అడుగున్నర వెడల్పు, ఎనిమిది అంగుళాల మందంతో ఉన్న రాతి ఫలకం బయటపడిందని తెలిపారు. దీనిపై డమరుకం, త్రిశూలంతో పాటు సూర్యచంద్రుల చిహ్నాలు ఉన్నాయని పేర్కొన్నారు. భూమి నుంచి పూర్తిగా వెలికితీసి పరిశీలిస్తే మరిన్ని ఆధారాలు లభించవచ్చని చెబుతున్నారు. సింగరేణి క్రికెట్ టోర్నీ విజేత బెల్లంపల్లి సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెంలోని జయశంకర్ గ్రౌండ్లో మూడు రోజులపాటు జరిగిన సింగరేణి ఎగ్జిక్యూటివ్ క్రికెట్ టోర్నీలో బెల్లంపల్లి రీజియన్ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో కొత్తగూడెం జట్టుపై విజయం సాధించింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ (ఈ అండ్ ఎం) సత్యనారాయణరావు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. మహిళా విభాగంలో కొత్తగూడెం జట్టు విజేతగా నిలవగా, బెల్లంపల్లి టీమ్ రన్నర్గా నిలిచింది. ఈ కార్యక్రమంలో జీఎంలు ఎం.శాలేంరాజు, మనోహర్తోపాటు కోటిరెడ్డి, పాలడుగు శ్రీనివాస్ పాల్గొన్నారు. సమ్మెకు జాతీయ సంఘాల మద్దతు సింగరేణి(కొత్తగూడెం): ఈ నెల 20న జరిగే సమ్మెకు అన్ని జాతీయ కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్నాయని అఖిల పక్షం నాయకులు వెల్లడించారు. కొత్తగూడెం రుద్రంపూర్లోని ఏఐటీయూసీ కార్యాలయంలో సోమవారం జరిగినఅఖిలపక్ష సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. అన్ని సంఘాల మద్దతుతో సమ్మెను విజయవంతం చేస్తామని తెలిపారు. ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్, సీఐటీయూ, ఇఫ్టూ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
అందుబాటులోకి పచ్చిరొట్ట విత్తనాలు
● ఉమ్మడి జిల్లాలో 4,422 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం ● 50 శాతం మేర సబ్సిడీతో విక్రయం ● పీఏసీఎస్లు, ఆగ్రో రైతుసేవా కేంద్రాల ద్వారా అమ్మకానికి ఏర్పాట్లుఖమ్మంవ్యవసాయం: వానాకాలం సీజన్ సమీపిస్తున్న వేళ ప్రభుత్వం పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఖమ్మం ప్రాంతీయ కార్యాలయం నుంచి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు విత్తనాల పంపిణీ ప్రారంభమైంది. అక్కడక్కడా కురుస్తున్న వర్షాలతో రైతులు దుక్కులు చేస్తున్నారు. ఈ నేపథ్యాన భూసారం పెంపునకు పంటల సాగుకు ముందు పచ్చిరొట్ట విత్తనాలు చల్లి ఆపై కలియదున్నడం ఆనవాయితీ. ఈక్రమంలోనే వ్యవసాయ శాఖ జీలుగు, పిల్లి పెసర, జనుము తదితర పచ్చిరొట్ట పైర్ల పెంకానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకు అనుగుణంగా విత్తనాభివృద్ది సంస్థ విత్తనాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. వ్యవసాయ శాఖ ఇండెంట్ ఆధారంగా.. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల వ్యవసాయ శాఖ నుంచి అందిన ఇండెంట్ ఆధారంగా పచ్చిరొట్ట విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ సమకూరుస్తోంది. ఖమ్మం జిల్లాలో జీలుగు 14వేల క్వింటాళ్లు, జనుము 1,500 క్వింటాళ్లు, పిల్లిపెసర 150 క్వింటాళ్లు, భద్రాద్రి జిల్లాలో జీలుగు 5వేల క్వింటాళ్లు, జనుము 400 క్వింటాళ్లు, పిల్లి పెసర 50 క్వింటాళ్లకు కావాలని నివేదిక ఇచ్చారు. ఇందులో ఇప్పటివరకు జీలుగు 3,252 క్వింటాళ్లు, జనుము 1,170 క్వింటాళ్లు కలిపి 4,422 క్వింటాళ్ల విత్తనాలు తెప్పించారు. సబ్సిడీతో విక్రయాలు సహజసిద్ధమైన ఎరువు లభించేలా పచ్చిరొట్ట పంటల సాగును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. విత్తనాలపై 50 శాతం సబ్సిడీపై రైతులకు అందిస్తోంది. కిలో రూ.142.75 ధర ఉన్న జీలుగు విత్తనాలను రూ.71.25కు, రూ.125.50 ధర ఉన్న జనుము విత్తనాలను రూ.62.75కు, రూ.205.50 ధర ఉన్న పిల్లి పెసర విత్తనాలను రూ.102.50కు విక్రయిస్తారు. ఖమ్మం జిల్లాలోని 75 పీఏసీఎస్లు, 13 ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, రెండు టీజీఎస్డీఎల్, ఒక ట్రేడర్తో పాటు భద్రాద్రి జిల్లాలో 20 పీఏసీఎస్లు, ఏడు ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, ఒక ట్రేడర్ ద్వారా విత్తనాలను విక్రయానికి ఏర్పాట్లు చేశారు. విత్తనాల బ్యాగ్ పరిమాణం, ధరలు విత్తనంబ్యాగ్ (కిలోల్లో) ధర (రూ.ల్లో) జీలుగు 30 2,137.50 జనుము 40 2,510.00 పిల్లి పెసర 20 2,055.00 విత్తనాలు సిద్ధం.. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో వ్యవసాయ శాఖ ఇచ్చిన ఇండెంట్ ఆధారంగా పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులోకి తెప్పిస్తున్నాం. ఇప్పటికే చేరకున్న జీలుగు, జనుము విత్తనాలను నిర్దేశిత కేంద్రాలకు పంపించాం. 50 శాతం సబ్సిడీపై విక్రయించేలా పర్యవేక్షించనున్నాం. – ఎన్ బిక్షం, విత్తనాభివృద్ధి సంస్థ ప్రాంతీయ మేనేజర్, ఉమ్మడి ఖమ్మం జిల్లా -
ఆర్టీసీ అభివృద్ధికి ప్రణాళికలు
ఇల్లెందు/చుంచుపల్లి: ప్రయాణికుల సహకారం, ఉద్యోగులు, సిబ్బంది సమష్టి కృషితో ఆర్టీసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని సంస్థ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలోమన్ తెలిపారు. ఇల్లెందు, కొత్తగూడెం బస్టాండ్లు, డిపోలను సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈడీ డిపోల్లో బస్సుల నిర్వహణ, సిబ్బంది పనితీరుపై ఆరా తీశాక మాట్లాడారు. ప్రయాణికుల అవసరాలు తీర్చడమే సంస్థ కర్తవ్యమని, అందులో భాగంగా ప్రతీ మారుమూల ప్రాంతానికి బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. డిమాండ్ మేరకు కొత్త రూట్లను ఎంపిక చేసి, ఆదాయం పెంచుకోవాలని ఉద్యోగులకు సూచించారు. బస్టాండ్లలో తాగునీరు, పారిశుద్ధ్యం వంటి చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఇల్లెందు డిపోలో 25 బస్సులు ఉన్నాయని, నిత్యం 9,500 కిలోమీటర్లు ప్రయాణించడం ద్వారా రూ.5 లక్షల వరకు ఆదాయం సమకూరుతోందని అధికారులు ఆయనకు వివరించారు. కాగా, ఇల్లెందు బస్ స్టేషన్లో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు షాపులను తొలగించాల్సి వస్తోందని, వ్యాపారులకు ఇచ్చిన గడువు ముగిసినందున మిగిలిన షాపులను తామే కూల్చివేస్తామని ఈడీ ప్రకటించారు. అలాగే, ఇల్లెందు ఆర్టీసీ డిపోలో డీజిల్ బంక్ ఏర్పాటుచేసే వరకు బస్సులకు ఇంధనం సమకూర్చేలా ఏర్పాటుచేసిన మినీ డీజిల్ మినీ ట్యాంక్ను ఆయన పరిశీలించి నిర్వహణపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఖమ్మం రీజియన్ మేనేజర్ సరిరామ్, డీఎం దేవేందర్గౌడ్, డిప్యూటీ ఆర్ఎం మల్లయ్య పాల్గొన్నారు. కరీంనగర్ జోన్ ఈడీ సోలోమన్ -
బౌద్ధక్షేత్రం అభివృద్ధిపై దృష్టి సారించాలి
నేలకొండపల్లి: దక్షిణ భారతదేశంలో కెల్లా అతి పెద్దదైన నేలకొండపల్లిలోని బౌద్ధక్షేత్రం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడం సరి కాదని సమతా సైనిక్తల్ దక్షిణ భారతదేశ అధ్యక్షుడు రేజర్ల రాజేష్ పేర్కొన్నారు. బౌద్ధక్షేత్రం వద్ద సోమవారం బుద్ధ జయంతి ఉత్సవలు నిర్వహించగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం నాగార్జునసాగర్ను అభివృద్ధి చేసిన విధంగా నేలకొండపల్లి క్షేత్రంపైనా దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఏడాది బుద్ధ జయంతి ఉత్సవాలను లక్షలాది మందితో ఇక్కడ నిర్వహించి, సీఎం రేవంత్రెడ్డిని అహ్వనిస్తామని తెలిపారు. కాగా, బుద్ధుడి మార్గాన్ని భవిష్యత్ తరాల వారికి అందించే బాధ్యత అందరూ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మూఢనమ్మకాల నిర్మూలన సంస్థ వ్యవస్థాపకుడు బైరి నరేష్, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పగిడికత్తుల ఈదయ్య, పెద్దపాక వెంకటి,రాజేశ్వరరావు, రవి, సంపత్, బాబు, రామారావు తదితరులు పాల్గొన్నారు.సమతా సైనిక్ దక్షిణ భారత అధ్యక్షుడు రాజేష్ -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ఐటీడీఏ పీఓ రాహుల్ భద్రాచలంటౌన్: అర్హులైన గిరిజనులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేస్తారని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో ఆయన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ పోడు, వ్యక్తిగత భూములకు పట్టాలు, రైతుభరోసా, స్వయం ఉపాధి పథకాలకు రుణాలు, దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స కోసం ఆర్థిక సాయం తదితర అవసరాల కోసం గిరిజనులు దరఖాస్తులు ఇచ్చారని తెలిపారు. వీటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. గిరిజన దర్బార్లో వచ్చిన అర్జీలన్నీ ఆన్లైన్లో ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేసి, అర్హులకు విడతల వారీగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి చర్యలు చేపడతామని తెలిపారు. ఏపీఓ డేవిడ్ రాజ్, డీడీ మణెమ్మ, ఈఈ చంద్రశేఖర్, వివిధ విభాగాల అధికారులు అరుణకుమారి, రవీంద్రనాథ్, భాస్కరన్, వేణు, లక్ష్మీనారాయణ, ఉదయ్, నరేష్, ఆదినారాయణ, నారాయణరావు, హరికృష్ణ, లింగా నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
రిటైనింగ్ వాల్తో శాశ్వత రక్షణ
ఖమ్మం అర్బన్/ఖమ్మం రూరల్: మున్నేరు నదీ పరీవాహక ప్రాంత ప్రజలు వరదలతో ఇబ్బంది పడకుండా శాశ్వత పరిష్కారానికి రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అధికారులతో కలిసి సోమవారం ఆయన నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. గత ఏడాది సెప్టెంబర్లో వచ్చిన వరదతో మున్నేరు పరీవాహక ప్రాంతంలో వేలాది కుటుంబాలు ఇబ్బంది పడ్డాయని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఇరువైపులా 17 కి.మీ. పొడవుతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఇందుకోసం రూ.676 కోట్లు కేటాయించగా, ఇప్పటివరకు4,155 మీటర్ల ఎర్త్వర్క్, 3,495 మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. కాగా, నిర్మాణంలో భూమి కోల్పోయే నిర్వాసితుల కోసం రివర్ ఫ్రంట్లోనే పోలేపల్లి వద్ద కాలనీ ఏర్పాటుచేసి ఇంటి స్థలాలు కేటాయిస్తామని మంత్రి ప్రకటించారు. అనంతరం జలగం నగర్, నాయుడుపేట వద్ద తీగల వంతెన నిర్మాణ పనులను మంత్రి పొంగులేటి పరిశీలించి నాణ్యతపై సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, ఇరిగేషన్, ఆర్అండ్బీ ఎస్ఈలు ఎం.వెంకటేశ్వర్లు, యాకూబ్, ఆర్డీఓ జి.నర్సింహారావు, వివిధ శాఖల అధికారులు యుగంధర్, వాణిశ్రీ, రంజిత్కుమార్, రమేష్రెడ్డి, పి.రాంప్రసాద్, అశోక్నాయక్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ – బీఆర్ఎస్ది ఉమ్మడి నాటకం.. ప్రజలను మభ్యపెట్టేందుకు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఉమ్మడిగా నాటకానికి తెర లేపారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అప్పులపై ఓ పార్టీ నేతలు రాసిన స్క్రిప్ట్ను ఇంకో పార్టీ నేతలు బయటకు చెబుతున్నారని అన్నారు. రిటైనింగ్ వాల్ పనులను పరిశీలించాక ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంపై రూ.8.19 లక్షల కోట్ల అప్పు ఉందనే విషయాన్ని అసెంబ్లీలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారని గుర్తుచేశారు. ఇదే విషయాన్ని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలకు వివరించారని తెలిపారు. కానీ ప్రతిపక్షాలు హద్దు మీరి విమర్శలు చేయడం దురదృష్టకరమని మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని, 90 శాతం పనులు చేశామని చెబుతూ, ఇంకా 40 శాతం మిగిలాయని వెల్లడించడం గర్హనీయమని పేర్కొన్నారు. నిర్వాసితుల కోసం ‘రివర్ ఫ్రంట్’ కాలనీ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి మసీదుల అభివృద్ధికి నిధులు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మసీదుల అభివృద్ధి, మరమ్మతుల కోసం రూ.లక్ష చొప్పున 18 మసీదులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందజేశారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్తో కలిసి చెక్కులు అందజేశాక మంత్రి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి డాక్టర్ బి.పురంధర్తో పాటు యాకూబ్పాషా, సైదులు తదితరులు పాల్గొన్నారు. -
వాహనం కదలదు.. కల్తీ ఆగదు...
● రోడ్డెక్కని ఆహార తనిఖీ వాహనం ● అయినా ల్యాబ్ టెక్నీషియన్, డ్రైవర్కు వేతనాలు ● జిల్లాలో కల్తీ ఆహారంపై కొరవడుతున్న నియంత్రణఖమ్మంమయూరిసెంటర్: ఆహారంలో నాణ్యత పరిశీలన, అక్కడికక్కడే తనిఖీలు చేపట్టేందుకు వినియోగించాల్సిన టెస్టింగ్ ల్యాబ్ వాహనం ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలోని చెత్త వాహనాల పార్కింగ్ స్థలానికే పరిమితమైంది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో తనిఖీలు, కల్తీ ఆహారంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1.50 కోట్లతో ఈ వాహనాన్ని కేటాయించింది. ఖమ్మం కేంద్రంగా జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో దీన్ని వినియోగించాల్సి ఉండగా, నెలల తరబడి బయటకు తీయడం లేదు. అంతేకాక డ్రైవర్, టెక్నీషియన్కు నెలనెలా వేతనాలు ఇస్తుండడం గమనార్హం. అప్పుడప్పుడు.. గుర్తొచ్చినప్పుడే కల్తీ ఆహారం, కల్తీ పదార్థాలకు అడ్డుకట్ట వేసేలా కేంద్ర ప్రభుత్వం మైక్రో బయాలజీ ల్యాబ్ యూనిట్ కలిగిన స్పాట్ కల్తీ టెస్టింగ్ మొబైల్ వాహనాన్ని జిల్లాకు కేటాయించింది. 2022 జూలైలో ఈ వాహనం చేరుకోగా, ఇప్పటి వరకు అధికారులు సక్రమంగా వినియోగించలేదు. ఏటా ఒకసారి, లేదా అధికారులకు గుర్తుకొచ్చినప్పుడు బయటకు తీసి అదే రోజు మూలన పెడుతున్నారు. ఈ వాహనానికి కేటాయించిన డ్రైవర్, ల్యాబ్ టెక్నీషియన్కు మాత్రం నెలనెలా ప్రభుత్వం నుంచి వేతనాలు ఇస్తూ, వాహనం డ్రైవర్ను ఓ అధికారి తన సొంత వాహనానికి ఉపయోగించుకుంటున్నట్లు తెలిసింది. కల్తీని కనిపెట్టేలా.. కల్తీ ఆహారంపై ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు అందినప్పుడు అధికారులు మైక్రో బయాలజీ ల్యాబ్ యూనిట్ కలిగిన వాహనం ద్వారా క్షేత్రస్థాయికి చేరుకోవాలి. అక్కడికక్కడే అనుమానిత ఆహార పదార్థాలను తనిఖీ చేసి కల్తీని నిర్ధారించాల్సి ఉంటుంది. అంతేకాక ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించేలా ఇందులోని ప్రొజెక్టర్లు, పిక్చర్ వాల్స్ వినియోగించాలి. వీటికి తోడు వ్యాపారులకు రిజిస్ట్రేషన్, లైసెన్స్ మంజూరుకు కూడా అవకాశముంది. ఈ వాహనంలో జనరేటర్తో పాటు సేకరించిన శాంపిళ్లు చెడిపోకుండా ఆధునిక పరికరాలు, ఏసీలు ఏర్పాటు చేసినా కొన్ని పరికరాలు పని చేయడంలేదని తెలిసింది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఈ వాహనాన్ని వినియోగించాల్సి ఉన్నా కనీసం ఖమ్మంలో ఫిర్యాదులు అందినప్పుడు కూడా పరీక్షలు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అవగాహన శూన్యం జిల్లాలో ఆహార కల్తీపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు కల్తీ ఆహారాన్ని పరీక్షించడంపై అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదు. అడపా దడపా హోటళ్లు, దుకాణాల్లో తనిఖీ చేస్తున్నా అవగాహన కల్పించడంలో మాత్రం పూర్తిగా విఫలమైనట్లు పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో కల్తీ ఆహారం వెలుగులోకి వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలనే అంశంపై ప్రజలకు తెలిచడం లేదు. ఈ విషయమై జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ను వివరణ కోరగా.. వాహనాన్ని తిప్పుతున్నామని, టెక్నీషియన్, డ్రైవర్లకు నెలనెలా వేతనాలు ఇస్తున్నామని చెప్పడం గమనార్హం. -
క్రీడలతో ఏకాగ్రత, శారీరక అభివృద్ధి
కొణిజర్ల: విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని, తద్వారా ఏకాగ్రత పెరగడమే కాక శారీరక అభివృద్ధి సాధ్యమవుతుందని డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి తెలిపారు. కొణిజర్ల మండలం తనికెళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణా శిబిరాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్రీడా సామగ్రి పంపిణీ చేసిన డీవైఎస్ఓ మాట్లాడారు. క్రీడలతో ఆరోగ్యకరమైన జీవన శైలి ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీలు శ్రీనివాస్, రంజాన్, ఉపాధ్యాయులు భాస్కర్రావు, గోపాలరావు, అచ్యుతరావు, రాంబాబు, లాలయ్య తదితరులు పాల్గొన్నారు. -
నిప్పుల కుంపటిలా జిల్లా..
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యప్రతాపంతో జనం విలవిల్లాడుతున్నారు. దాదాపు జిల్లా అంతటా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో మధ్యాహ్నం వేళ రహదారులు బోసిపోతున్నాయి. ఉదయం నుంచే ఎండ ప్రభావం మొదలై మధ్యాహ్నానికి తీవ్రరూపం దాలుస్తుండగా, సాయంత్రం దాటినా వేడి తగ్గడం లేదు. సోమవారం అత్యధికంగా వైరా(ఏఆర్ఎస్) వద్ద 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, పమ్మిలో 42.8, వైరా, ఉర్నవల్లి, తల్లాడలో 42.6, బాణాపురంలో 42.5, ఖమ్మం ఖానాపురంలో 42.3, ఎర్రు పాలెం, గౌరారం, చింతకానిలో 42.2, పెద్దగోపతి, నేలకొండపల్లిలో 42.1డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కల్లూరు, పెనుబల్లిలో 41.9, గంగారం, కొణిజర్లలో 41.8, పల్లెగూడెంలో 41.6, మధిర 41.4, ఖమ్మం ప్రకాష్నగర్, ఏన్కూరు, గుబ్బగుర్తిలో 41.3, బచ్చోడు 41.2, ఖమ్మం ఎన్ఎస్టీ గెస్ట్హౌస్, రఘునాథపాలెంలో 41.1, తిమ్మారావుపేట, కూసుమంచి, మంచుకొండలో 41, వేంసూరులో 40.9, గేటు కారేపల్లి, లింగాలలో 40.7, సత్తుపల్లి, ముదిగొండలలో 40.6, సిరిపురం, సత్తుపల్లి ఓసీల వద్ద 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు నివేదిక విడుదల చేశారు. మంగళవారం కూడా ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని తెలిపారు. వైరాలో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత -
నేత్రపర్వంగా నృసింహుడి కల్యాణం
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలోని స్వయంభూ శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం (గుట్ట)లో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు మొదలుకాగా, స్వామి మూలవిరాట్కు 108 కలశాలతో అభిషేకం చేశారు. ఆతర్వాత స్వామిని అలంకరించి, తలంబ్రాలు కలిపారు. అనంతరం మధ్యాహ్నం సుదర్శన యాగం నిర్వహించారు. సాయంత్రం ముత్యాల తలంబ్రాల ఊరేగింపు, ఎదుర్కోలు ఉత్సవం తర్వాత రాత్రి 7గంటలకు అర్చకులు కల్యాణ క్రతువు జరిపించారు. ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహనరావు, భక్తులు పాల్గొన్నారు. -
ప్రణాళికాయుతంగా భూసేకరణ
కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ఖమ్మం సహకారనగర్: సీతారామ ఎత్తిపోతల పథకం, మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణం తదితర పనులకు ప్రణాళికాయుతంగా భూసేకరణ చేపట్టాలని, తద్వారా అభివృద్ధి పనుల్లో వేగం పెరుగుతుందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం ఆయన జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్సింగ్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి భూసేకరణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీతారామ ఎత్తిపోతల పథకానికి అటవీ భూమి ఎంత సేకరించాలో నివేదిక ఇస్తే ప్రత్యామ్నాయ భూముల్లో అటవీ పెంపకానికి చర్యలు తీసుకుంటామన్నారు. భూముల సర్వేను ఆధునిక యంత్రాలతో చేపట్టేలా నివేదిక ఇవ్వాలని సూచించారు. అలాగే, మున్నేటికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం, నిర్వాసితుల కోసం లేఔట్ కాలనీకి ఏర్పాటుకు భూమి సేకరించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఫిర్యాదులు పెండింగ్ ఉండొద్దు ప్రజలు ఇచ్చే ప్రతీ ఫిర్యాదు, వినతిపత్రాన్ని పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఆయన పరిష్కారంపై అధికారులకు సూచనలు చేశారు. భూసమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుంచి అందిన భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. పైలట్ మండలాలుగా ఎంపికై న మండలాలకు సంబంధించి జిల్లాల కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భూ సమస్యలపై అందిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని, ఏదైనా దరఖాస్తు తిరస్కరిస్తే అందుకు కారణాలు తెలియజేయాలన్నారు. జిల్లా నుంచి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి వీసీలో పాల్గొనగా కలెక్టర్ మాట్లాడుతూ నేలకొండపల్లి మండలంలో 3,224 దరఖాస్తులు రాగా, వీటి పరిశీలన కొనసాగుతోందని తెలిపారు. వారం నుంచి పది రోజుల్లో పరిష్కరిస్తామని వెల్లడించారు. ఈసమావేశాల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.రాజేశ్వరి, డీఆర్వో పద్మశ్రీ, డీఆర్డీఓ సన్యాసయ్య, ఆర్డీఓలు జి.నర్సింహారావు, ఎల్.రాజేందర్గౌడ్, ఇరిగేషన్ ఎస్ఈ ఎం.వెంకటేశ్వర్లు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన, తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేనపూజ, పుణ్యావాచనం జరిపించాక స్వామి వారికి కంకణఽ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కమనీయం.. నృసింహ కల్యాణంశ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ యోగానంద లక్ష్మీనృసింహ స్వామి వారి తిరు కల్యాణ వేడుక వైశాఖ పౌర్ణమి సందర్భంగా సోమవారం కమనీయంగా జరిగింది. మొదట విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించిన అర్చకులు.. వేద మంత్రాల నడుమ కల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. -
నర్సుల సేవలు వెలకట్టలేనివి..
ఖమ్మంవైద్యవిభాగం: ఆస్పత్రుల్లో నర్సుల సేవలు వెలకట్టలేనివని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.రాజేశ్వరరావు అన్నారు. ప్రపంచ నర్సింగ్ దినోత్సవాన్ని ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సోమవారం నిర్వహించారు. ఈసందర్భంగా మెడికల్ సూపరింటెండెంట్ ఎల్.కిరణ్కుమార్, ఆర్ఎంఓలు రాంబాబు, రాథోడ్ వినాయక్తో కలిసి ప్రిన్సిపాల్ కేక్ కట్ చేసి మాట్లాడారు. వ్యాధులతో బాధపడే వారికి స్వస్థత చేకూర్చడంలో వైద్యులతో సమానంగా నర్సులు విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. నర్సింగ్ సూపరింటెండెంట్లు శాంతకుమారి, ఇందిరమ్మతో పాటు రత్నకుమారి, జి.లక్ష్మి, ఎమేలియా మేరి, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. గిరిజన కళాశాలల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ గురుకుల జూని యర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పీఓ బి.రాహుల్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని కళాశాల్లో సీటభర్తీ కోసం ఈనెల 15న బాలికలకు, 16న బాలురకు స్పాట్ కౌన్సెలింగ్ ఉంటుందని వెల్లడించారు. నిర్ణీత తేదీల్లో భద్రాచలంలోని గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఉదయం 9గంటలకు మొదలయ్యే కౌన్సెలింగ్కు 2024–25లో పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. వివరాలకు 94909 57271, 94909 57270 నంబర్లలో సంప్రదించాలని పీఓ తెలిపారు. ఆన్లైన్లో వివరాలు తప్పనిసరి ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫార్మసీ అధికారులు పూర్తి వివరాలతో రికార్డులు నిర్వహించాలని డీఎంహెచ్ఓ కళావతిబాయి ఆదేశించారు. ఆస్పత్రులు, సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఫార్మసీ ఆఫీసర్లకు కలెక్టరేట్లో సోమవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ కుటుంబ నియంత్రణకు పంపిణీ చేసే మందులు, అవసరమైన స్టాక్ వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. అలాగే, అర్హులైన దంపతులకు కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈకార్యక్రమంలో స్టాటిస్టికల్ ఆఫీసర్ నవీన్, డెమో సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు 25 శాతం రాయితీతో ఈనెల 31వరకు అవకాశం ఖమ్మంమయూరిసెంటర్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఫీజు చెల్లించే గడువును ప్రభుత్వం ఈనెల 31వ తేదీ వరకు పొడిగించింది. ఫీజు చెల్లింపులో 25 శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం రెండు నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ గడువు ఈనెల 3తో ముగియగా.. మరోసారి పెంచుతూ ప్రభుత్వ కార్యదర్శి కె.ఇలంబర్తి పేరిట సోమవారం ప్రకటన విడుదలైంది. దీంతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు 25శాతం రాయితీ పొందేందుకు మరో అవకాశం లభించింది. తద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మున్సిపాలిటీల నుండి ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పౌర రక్షణ వలంటీర్లుగా నమోదు చేసుకోవాలి ఖమ్మం రాపర్తినగర్: భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన పౌర రక్షణ వలంటీర్లుగా నమోదుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నందున యువత సద్వినియోగం చేసుకోవాలని నెహ్రూ యువక కేంద్రం ఖమ్మం డిప్యూటీ డైరెక్టర్ సీహెచ్.అన్వేష్ సూచించారు. అత్యవసర పరిస్థితులు, సంక్షోభ సమయాల్లో కీలకపాత్ర పోషించే అవకాశమున్నందున యువత ముందుకు రావాలని సూచించారు. ప్రథమ చికిత్స, అత్యవసర సంరక్షణ, ట్రాఫిక్ నిర్వహణ, విపత్తు ప్రతిస్పందన, పునరావాస ప్రయత్నాల్లో తోడ్పాటులో యువతకు అవకాశం ఇవ్వున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వివరాల కోసం htpps// mybharat. gov. in లేదా 94913 83832 నంబర్లో సంప్రదించాలని డీడీ ఓ ప్రకటనలో సూచించారు. -
‘ఉద్దీపకం’తో సత్ఫలితాలు
● గతేడాది 3,4,5 తరగతుల విద్యార్థులకు పంపిణీ ● రానున్న ఏడాది 1, 2వ తరగతుల్లో అమలుకు ప్రణాళికలు ● ప్రాఽథమిక విద్య పటిష్టతపై పీఓ దృష్టిభద్రాచలం: భద్రాచలం ఐటీడీఏ పరిఽధిలో ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో, వసతి గృహాల్లో ప్రాథమిక విద్య పటిష్టతకు పీఓ చేపట్టిన ప్రయోగం ఫలించింది. గణితం, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో గిరిజన విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు ఉద్దీపకం అభ్యాసన పుస్తకాలు అందించారు. మెరుగైన ఫలితాలు కనిపించడంతో ఈయేడాది మిగతా తరగతులకు కూడా అందించాలని భావిస్తున్నారు. విద్యార్థుల్లో వెనుకబాటును గుర్తించి.. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో విద్యపై అవగాహన ఉన్న బి.రాహుల్ ఐటీడీఏ పీఓగా బాధ్యతలు చేపట్టాక ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలను సందర్శించారు. గిరిజన విద్యార్థులతో మమేకమై వారి ప్రతిభా పాటవాలను పరిశీలించారు. ప్రాథమిక విద్యలో వారి వెనుకబాటుతనాన్ని గుర్తించారు. గణితం, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో కనీస పరిజ్ఞానం లేకపోవడంతో ప్రాథమిక విద్య పటిష్టతకు చర్యలు చేపట్టారు. పునాది బలపడేలా ‘ఉద్దీపకం’ ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థుల సామర్థ్యాలు బలంగా ఉండేందుకు ఉద్దీపకం పేరిట ప్రత్యేక అభ్యాసన పుస్తకాలను తీసుకొచ్చారు. ఇందుకోసం పీఎంఆర్సీ ఆధ్వర్యంలో నిపుణులైన ఉపాధ్యాయులతో ప్రత్యేక పుస్తకాలను సిద్ధం చేయించారు. తొలి విడతగా 3, 4, 5వ తరగతుల విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. గణితంలో కూడిక, తీసివేత, భాగహారం, హెచ్చివేతల ఆవశ్యకత, వాటిని సులువుగా వినియోగించటం, లెక్కల ప్రశ్నలను సులువుగా సాధించడం, ఉన్నత విద్యకు ప్రాథమిక స్థాయిలో గణితం పునాది, నిత్య జీవితంలో లెక్కలను వినియోగించడం వంటి అంశాలపై వర్క్షీట్లతో బుక్లను సిద్ధం చేయించారు. ఇంగ్లిష్లో గ్రామర్పై పట్టు, సులువుగా వాక్యాల కూర్పు, పద వినియోగం పెంపు, రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ పెంచే విధంగా రూపొందించారు. ఇంగ్లిష్ నిర్భయంగా మాట్లాడేలా అవసరమైన ప్రాఽథమిక పరిజ్ఞానాన్ని ఈ వర్క్షీట్లలో పొందుపర్చారు. సత్ఫలితాలతో 1,2 తరగతులకు అమలు 2024లో పాఠశాలల ప్రారంభం సమయానికి వర్క్బుక్లను సిద్ధం చేయించి 3,4,5 తరగతుల విద్యార్థులకు అందించారు. ఆశ్రమ పాఠశాలలను సందర్శిస్తూ బోధనా తీరును పర్యవేక్షించారు. ఉద్దీపక పుస్తకాలతో సత్ఫలితాలు వచ్చాయి. దీంతో ఈ ఏడాది 1, 2వ తరగతులకు కూడా ఉద్దీపనం పుస్తకాలు ఇవ్వాలని భావిస్తున్నారు. సబ్జెక్టు టీచర్లు, ప్రధానోపాధ్యాయులతో సమీక్షించి వర్క్షీట్లు సిద్ధం చేయాలని సూచించారు. తుది పరిశీలన అనంతరం ఆమోదించి పుస్తకాల రూపంలోకి తీసుకురానున్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేసి పాఠశాలల పునః ప్రారంభం సమయంలోనే పుస్తకాలు అందించాలనే కృతనిశ్చయంతో ఐటీడీఏ అధికారులు దృష్టి సారించారు. -
●‘న్యూవిజన్’కు ర్యాంకులు..
ఖమ్మం సహకారనగర్: న్యూవిజన్ విద్యాసంస్థల చైర్మన్ సీహెచ్జీకే ప్రసాద్ మాట్లాడుతూ.. ర్యాంక్లు సాధించిన తమ విద్యార్థులు పి.సంహిత 102వ, ఎం.ఆకాంక్ష 109, ఆర్.శీతల్ 110, పి.ప్రణవ్ 168, ఆర్.షణ్ముఖ ప్రియ 171, డి.అనన్య 210, ఎ.రోషిక్ మణిదీపక్ 311, ఎం.రోహన్ శ్రీహరి 456, జి.కార్తీక్ సాయి 492, ఎం.వైష్ణవి 525, ఎన్.స్రవంత్ 534, పి.భవిష్య 583, పి.రోహిత్ 586, మిన్హాజ్ ఆరా 719, కె.జశ్వంత్ రామ్ 755, ఎన్.భార్గవ్ సాయి 844, ఎస్.మనస్వీక్ 1046, సీహెచ్.సాయికృష్ణ 1076, ఆర్.గుణదీప్ 1185, కె.మధురహాసిని 1230, బి.పియూష్ వర్థన్రాథోడ్ 1270, ఆర్.కౌశిక్ 1340, జి.లలనిక చౌదరి 1383, డి.నర్సింహాలక్ష్మి శ్రీనివాస్ 1430, ఈ.వేదసంహిత 1461, ఎం.విశ్వక్ 1514, షేక్.అంజుమ్ 1622, డి.ప్రణీత 1751, జి.అనుప్రియ 1756, సీహెచ్.శ్రీహాస్ 1757, ఎం.చరణ్వెంకట్ 1840, వి.విజయకాంత్ 1849, ఐ.శ్రీహిత 1860 ర్యాంక్లు సాధించారన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గోపిచంద్, అకడమిక్ డైరెక్టర్ సీహెచ్.కార్తీక్, ప్రిన్సిపాళ్లు బ్రహ్మచారి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా నృసింహ జయంతి
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వార్షిక పంచాహ్నిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో స్వాతి నక్షత్రం సందర్భంగా ఆదివారం స్వామివారి జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈఓ కొత్తూరు జగన్మోహన్ రావు పర్యవేక్షణలో తెల్లవారుజామున 5:30 గంటల నుంచే అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సంప్రదాయయుతంగా సుదర్శన యాగం చేశారు. నయనానందకరంగా గిరి ప్రదక్షిణ.. భక్తజన సందోహం నడుమ ఖమ్మం నడిబొడ్డున ఉన్న స్తంభాద్రి గుట్ట చుట్టూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఉత్సవ విగ్రహాలతో నిర్వహించిన గిరి ప్రదక్షిణ నయనానందకరంగా సాగింది. పండితుల మంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ స్వామివారిని పల్లకీలో ఊరేగిస్తూ గిరి ప్రదక్షణ చేశారు. అనంతరం గుట్టపై ఆలయం పక్కన నక్షత్ర జ్యోతి(దివ్యజ్యోతి)ని అర్చకులు వెలిగించగా దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆ సమయాన భక్తుల నృసింహ నామ స్మరణలతో ఆ ప్రాంతం మార్మోగింది. జయజయధ్వానాల నడుమ స్వామివారి గిరి ప్రదక్షిణ నక్షత్ర జ్యోతి దర్శనానికి పోటెత్తిన భక్తులు -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
తిరుమలాయపాలెం/ఖమ్మంవన్టౌన్ : రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో సోమవారం పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు తిరుమలాయపాలెం మండలం కొక్కిరేణిలో సీసీ రోడ్లు, ఆదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తారు. 11 గంటలకు ఎర్రగడ్డ, 11.30 గంటలకు మేడిదపల్లిలో సీసీ రోడ్ల నిర్మాణానికి, మధ్యాహ్నం 12 గంటలకు గోపాయిగూడెంలో ఆదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 1.30 గంటలకు కూసుమంచి క్యాంపు ఆఫీస్ నుంచి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు నల్లగొండ జిల్లాకు వెళతారు. రేపు పాలిసెట్ఖమ్మం సహకారనగర్: పాలిటెక్నిక్ ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ – 2025 ఈనెల 13న జరగనుందని పాలిసెట్ కో ఆర్డినేటర్, ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ మహ్మద్ జాకిరుల్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష ఉంటుందని, ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాలలో 800 మంది, ఎస్బీఐటీలో 500, కవితా మెమోరియల్ డిగ్రీ కళాశాలలో 500, దరిపల్లి అనంతరాములు ఇంజనీరింగ్ కళాశాలలో 500, డీఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో 504 మంది విద్యార్థులు హాజరు కానున్నారని వివరించారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. ఎండల తీవ్రత దృష్ట్యా దూర ప్రాంత విద్యార్థులు ఉదయం 9 గంటల వరకు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. హాల్ టికెట్, ఆధార్ కార్డుతో పాటు, హెచ్బీ పెన్సిల్, బ్లూ/బ్లాక్ పెన్ తీసుకురావాలని తెలిపారు. పెరిగిన ఉష్ణోగ్రతలుఖమ్మంవ్యవసాయం: గత వారం ఉపరితల ద్రోణి కారణంగా తగ్గిన ఉష్ణోగ్రతలు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతూ 11 గంటల వరకు తీవ్రరూపం దాల్చుతోంది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉంటున్నాయి. పలు రంగాల్లో పనిచేస్తున్న వారు ఉదయం 7 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 12 గంటల వరకే ముగిస్తుండగా కొందరు ఉదయం, సాయింత్రం వేళల్లో పనులు చేస్తున్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఆదివారం 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బాణాపురంలో 42.8 డిగ్రీలు, పమ్మిలో 42.7, పెనుబల్లిలో 42.6, కూసుమంచిలో 42.4, చింతకానిలో 42.1, నేలకొండపల్లిలో 42, గౌరారం, వైరా ఏఆర్ఎస్లో 41.7, తల్లాడ, గేటు కారేపల్లి, తిరుమలాయపాలెం, వైరా, కుర్నవల్లి, లింగాలలో 41.4, కల్లూరు 41.3, ఖమ్మం ప్రకాశ్నగర్, ముదిగొండలో 40.9, ఎర్రుపాలెం, పల్లెగూడెంలో 40.8, ఖమ్మం ఖానాపురం, వేంసూరులో 40.6, రఘునాథపాలెంలో 40.5, కాకరవాయి, కొణిజర్లలో 40.2, బచ్చోడులో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, అత్యల్పంగా సత్తుపల్లిలో 38.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలు, ఉక్కపోతకు తోడు అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నేత్రపర్వంగా రామయ్య కల్యాణంభద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి నిత్య కల్యాణ వేడుక ఆదివారం నేత్ర పర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన, తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. నిత్యకల్యాణ వేడుకలోనూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కిన్నెరసానిలో పర్యాటకుల సందడి పాల్వంచరూరల్: కిన్నెరసానిలో పర్యాటకులు సందడి చేశారు. మండల పరిధిలోని కిన్నెరసానికి ఆదివారం పలు ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివచ్చారు. డ్యామ్పైనుంచి జలాశయాన్ని, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. 406 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖ రూ.22,885 ఆదాయం లభించింది. -
ర్యాంకర్ల భవిష్యత్ ప్రణాళికలు..
ఐఐటీలో చదవాలని ఉంది.. హార్వెస్ట్ కాలేజీలో చదివిన నేను ఎప్సెట్లో 77వ ర్యాంక్ సాధించాను. ఐఐటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని ఉంది. తల్లిదండ్రుల తోడ్పాటుతో పాటు పాఠశాల యాజమాన్యం సలహాలు, ప్రత్యేక శిక్షణతో ఈ విజయం సాధించగలిగాను. నాన్న అనిల్కుమార్ కిరాణ షాపు వ్యాపారి, తల్లి కల్యాణి గ్రహణిగా ఉన్నారు. – సాయిచరణ్, హార్వెస్ట్ విద్యార్థిసాఫ్ట్వేర్ కంపెనీ నెలకొల్పాలని.. ఎప్సెట్ ఫలితాల్లో నా తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యం ప్రోత్సాహంతోనే రాష్ట్రస్థాయిలో 28వ ర్యాంక్ సాధించగలిగాను. ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ చదివి సాఫ్ట్వేర్ కంపెనీ నెలకొల్పాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాను. మాది వైరా. నాన్న మల్లిఖార్జున్రావు వస్త్ర వ్యాపారం చేస్తుండగా.. అమ్మ గృహిణిగా ఉన్నారు. – వి.కుషాల్, శ్రీచైతన్య విద్యార్థిని -
●‘రెజొనెన్స్’ విజయభేరి..
ఖమ్మం సహకారనగర్: రెజొనెన్స్ కళాశాలల డైరెక్టర్లు ఆర్వీ నాగేంద్రకుమార్, కె.శ్రీధర్రావు మాట్లాడుతూ.. విజయభేరి మోగించిన తమ విద్యార్థులు ఎ.జాహ్నవి 961వ ర్యాంక్, పి.బింధు 1364, బి.హాన్సిక 1842, కె.జశ్వంత్ 2135, ఎం.సుమంత్ 2615, ఎ.నంద 3016, ఎం.ప్రేమ్సాయి 4500, డి.హాన్సిక 5005, బి.ఈశ్వర్వెంకట్ 5034, బి.మాధవి 5855, ఐ.మణిదీప్ 6632, బి.ప్రసాద్ 7851, బి.భగత్ 8185, డి.ఉషశ్రీ 8268, జె.స్వాతి 8328వ ర్యాంక్లు సాధించారన్నారు. ప్రిన్సిపాళ్లు సతీష్, భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. -
ఏజేఆర్ ఆటోమోటివ్స్ షోరూం ప్రారంభం
కరీంనగర్: కరీంనగర్ నగరంలోని విట్స్ కళాశాల ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన బుల్ కన్స్ట్రక్షన్స్ ఎక్విప్మెంట్ ఏజేఆర్ ఆటోమోటివ్స్ షోరూంను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, బుల్ మిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సౌత్ జోన్ హెడ్ వి.సోమసుందరం, స్టేట్హెడ్ ఎన్.సురేశ్ బాబు, షోరూం డీలర్ అంబటి జోజిరెడ్డి ఆదివారం ప్రారంభించారు. బుల్ కంపెనీకి సంబంధించి ఒక స్టాండర్డ్ పోర్ట్, స్టాండర్డ్ క్వాలిటీ, మంచి పెర్ఫార్మెన్స్ ఉంటుందన్నారు. బుల్ కన్స్ట్రక్షన్స్ ఎక్విప్మెంట్ ద్వారా గంటకు లీటర్ డీజిల్ ఆదా చేయడం జరుగుతుందన్నారు. సర్వీస్ విషయంలోనూ 100శాతం క్వాలిటీ అందిస్తామని తెలిపారు. కాంట్రాక్టర్ జగ్గారెడ్డి, ఫాదర్ సంతోష్ పాల్గొన్నారు. -
నల్లచట్టాలతో రైతులకు నష్టం
కొణిజర్ల : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్లచట్టాలతో రైతులు నష్టపోతున్నారని, వీటిని నిరసనగా రైతులతో పాటు కార్మికులు కూడా ఉద్యమిస్తున్నారని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. ఇటీవల భారత్ – పాకిస్తాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో చర్చల ద్వారా సమస్య పరిష్కరించాలని కమ్యూనిస్టులు సూచిస్తే దేశ ద్రోహులుగా చిత్రకరించేందుకు కొందరు ప్రయత్నించారని ఆరోపించారు. మండలంలోని లాలాపురంలో సీపీఎం నాయకుడు సంక్రాంతి మధుసూదనరావు సంస్మరణ సభ ఆదివారం నిర్వహించగా రాఘవులు మాట్లాడారు. యుద్ధంతో తీవ్ర నష్టాలు ఉంటాయని, రెండు దేశాల మధ్య సయోధ్యతో యుద్ధాన్ని నివారించొచ్చని కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలోని పార్టీలన్నీ చెప్పాయన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ కమ్యూనిస్టులు లేకపోతే దేశానికి భవిష్యత్ ఉండదనే చర్చ జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెబుతన్న ముఖ్యమంత్రే రూ.వేలకోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు నిర్వహించడం అవసరమా అని ప్రశ్నించారు. నాగర్ కర్నూల్ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ తాను కాంగ్రెస్ వాదినైనా మధుసూదనరావు ఆలోచనా విధానాన్ని అవలంబించేవాడినని తెలిపారు. కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్, సీపీఎం నాయకులు పోతినేని సుదర్శన్, సాయిబాబా, నున్నా నాగేశ్వరరావు, భూక్యా వీరభద్రం, బుగ్గవీటి సరళ, మాచర్ల భారతి తదితరులు పాల్గొన్నారు. సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు రాఘవులు -
రేపటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ
● జిల్లాలో మూడు విడతలుగా శిబిరాలుఖమ్మంసహకారనగర్: జిల్లాలోని ఉపాధ్యాయులకు మూడు విడతలుగా వేసవి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు డీఈఓ సామినేని సత్యనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలి విడత శిక్షణ మంగళవారం నుంచి ఈనెల 17 వరకు, రెండో విడత 20 నుంచి, మూడో విడత 27 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఎస్ఏ ఇంగ్లిష్ టీచర్లు 326 మంది, గణితం 453, సోషల్ ఉపాధ్యాయులు 436 మంది, మండల రిసోర్స్ పర్సన్లు 168 మంది, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ఐఆర్పీలు 62 మందికి ఖమ్మంలోని హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. కాగా, కోర్సుల కో ఆర్డినేటర్లు, రిసోర్స్ పర్సన్లతో సోమవారం సంసిద్ధత సమావేశం ఏర్పాట్లు చేశామని తెలిపారు. శిక్షణ తరగతులకు ఎంపికై న ఉపాధ్యాయులంతా ఉదయం 9.30 గంటల లోపు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ద్వారా జియోట్యా గ్డ్ హాజరు నమోదు చేయాల్సి ఉంటుందని వివరించారు. వర్కింగ్ లంచ్, టిఫిన్, టీ శిక్షణ కేంద్రంలోనే అందజేస్తారని తెలిపారు. శిక్షణ పూర్తిచేసిన ఉపాధ్యాయులు ఆన్లైన్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకుని సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బోధించనున్న అంశాలివే.. ఐదు రోజుల శిక్షణ తరగతుల్లో కంటెంట్ ఎన్రిచ్మెంట్, డిజిటల్ ఎడ్యుకేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లైఫ్ స్కిల్స్, లెర్నింగ్ ఔట్కమ్స్ వంటి అంశాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. అరుణాచలంలో భద్రాద్రి జిల్లా యువకుడు మృతి● గిరిప్రదక్షిణ, దర్శనానంతరం గుండెపోటుజూలూరుపాడు: జూలూరుపాడుకు చెందిన యువకుడు తమిళనాడులోని అరుణాచలం క్షేత్రంలో గుండెపోటుతో ఆదివారం మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని పాపకొల్లు శ్రీ ఉమాసోమలింగేశ్వరస్వామి ఆలయ ప్రధానార్చకుడు తెలికిచెర్ల మధుకుమార్ శర్మ కుమారుడు రాకేష్ శర్మ(33) హైదరాబాద్లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు. ఈనెల 9న తల్లి భవానితో కలిసి అరుణాచలం పుణ్యక్షేత్రానికి వెళ్లారు. ఆదివారం అక్కడ గిరి ప్రదక్షిణ చేసి, స్వామివారి దర్శనానంతరం తిరిగి అద్దెకు తీసుకున్న రూమ్కు వెళ్లే క్రమంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఆనంద శ్వేత, మూడేళ్ల కూతురు, ఆరు నెలల కుమారుడు ఉన్నారు. కుమారుడికి ఇటీవలే పాపకొల్లు ఆలయంలో అన్నప్రాసన వేడుక నిర్వహించాక, భార్య.. పిల్లలను తీసుకుని పుట్టింటికి కాకినాడ వెళ్లింది. రాకేశ్ తల్లితో కలిసి దైవ దర్శనానికి వెళ్లగా, అక్కడే తుదిశ్వాస విడిచాడు. కుమారుడి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు మధుకుమార్ శర్మ అరుణాచలం బయలుదేరారు. సోమవారం సాయంత్రానికి జూలూరుపాడు చేరుకోనున్నారు. కాగా, మాతృ దినోత్సవం రోజునే పుత్రుడికి కోల్పోయిన తల్లి భవానీ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అతడి మృతితో జూలూరుపాడు, పాపకొల్లు గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. భార్య మరణాన్ని తట్టుకోలే ని భర్త.. కామేపల్లి: మండలంలోని ఊట్కూర్ గ్రామానికి చెందిన తాళ్లూరి చిన్న వెంకటరత్నమ్మ(75) రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె మృతిని తట్టుకోలేక మనోవేదనకు గురైన ఆమె భర్త తాళ్లూరి సత్యమయ్య(85) ఆదివారం మృతి చెందాడు. రెండు రోజుల వ్యవధిలోనే వృద్ధ దంపతులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతదేహం గుర్తింపు ఖమ్మంక్రైం: నగరంలోని వన్టౌన్ పరిధిలో ఈ నెల 3న పురుగు మందు తాగి మృతిచెందిన ఓ వ్యక్తిని వన్టౌన్ పోలీసులు గుర్తించారు. సీఐ కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. తల్లాడ వెంకటగిరికి చెందిన ప్రభాకర్ మద్యానికి బానిసై అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో మనస్తాపం చెంది ఈనెల 2న పాత బస్టాండ్ సమీపాన పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లగా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. అయితే మృతుడి చిత్రాన్ని సామాజిక మాద్యమాల్లో చూసిన కుటుంబసభ్యులు ఆదివారం గుర్తించి పోలీసులను ఆశ్రయించగా.. కొడుకు వినోద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ఎప్సెట్ ఫలితాల్లో ప్రైవేట్ హవా..
●‘శ్రీచైతన్య’ ప్రభంజనం.. ఖమ్మం సహకారనగర్: శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో ప్రభంజనం సృష్టించిన తమ విద్యార్థులు వి.కుషాల్ 28వ ర్యాంక్, వై.నిషాంత్ 61, డి.దుర్గాగుజిరి 222, ఎ.సాయితేజ 253, కె.విశావని వాగ్ధేవి 301, బి.రిషిత 321, ఆర్.జోష్ణవ్కుమార్ 334, కె.సాయిదివ్య వర్షిత 423, జి.సాయి ప్రణవి 491, కె.హాసిని 575, వి.ప్రణతి, కె.తేజశ్విని 653, బి.ఈశ్వర్ గుప్తా 855, యు.వశిష్ట 908, బి.మనిశేషు 968, డి.శ్రీలేఖ 1195, పి.స్మైలిక రెడ్డి 1262, కె.నిషాంత్ రెడ్డి 1394, ఎల్.మనోహర్ 1422, జి.అలేఖ్య 1482వ ర్యాంక్లు సాధించారన్నారు. కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ బి.సాయిగీతిక, డీజీఎం సీహెచ్.చేతన్ మాదూర్, ఎగ్జిక్యూటివ్ డీన్ ఎన్ఆర్ఎస్డీ వర్మ, డీఎన్ జె.కృష్ణ, ఏజీఎంలు సీహెచ్.బ్రహ్మం, ప్రకాష్, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ ప్రభుత్వం అగ్రికల్చర్, ఇంజనీరింగ్ విభాగాల్లో ఆదివారం విడుదల చేసిన ఎప్సెట్ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులతో ప్రతిభ కనబర్చినట్లు ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు పేర్కొన్నాయి. ఈమేరకు ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ●‘హార్వెస్ట్’ హవా.. ఖమ్మం సహకారనగర్: హార్వెస్ట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ పార్వతిరెడ్డిలు మాట్లాడుతూ అగ్రశ్రేణి ర్యాంకులు సాధించిన తమ కళాశాల విద్యార్థులు బి.సాయిచరణ్ 77వ ర్యాంక్, బి.సిద్ధార్థ్ 193, ఎన్.రాఘవేంద్ర నవనీత్ 265, డి.శ్రీనివాస్ గౌతమ్రెడ్డి 336, ఎం.నాగయశ్వంత్ 448, ఆర్.వెంకటసాయివర్షిత్ 724, ఎన్సీహెచ్ యశ్వంత్ సాయి 958, జి.రాణి ఉమాఅలేఖ్య 120, టీడీవీఎస్ఎస్ నయమంజలి 161, బి.భార్గవి 202, ఎండీ అనిష ముస్కాన్ 232, సరోజ్ రాజ్ పురోహిత్ 384వ ర్యాంక్ సాధించారన్నారు. -
ఉద్యమకారులు అధైర్యపడొద్దు
ఖమ్మం మామిళ్లగూడెం : జిల్లాలోని తెలంగాణ ఉద్యమకారులు ఎవరూ అధైర్యపడొద్దని టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. నగరంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం నిర్వహించిన పార్టీ సదస్సులో ఆయన మాట్లాడారు. కేసీఆర్ చెప్పిన మోసపూరిత మాటల వల్లే నేడు ఆయన ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చిందన్నారు. కొట్లాడి సాధించిన రాష్ట్రంలో అసలైన ఉద్యమకారులను నేడు వెనక్కు నెట్టేశారని విమర్శించారు. ఎంతోమంది విద్యార్థులు, ప్రజల ఆత్మబలిదానాలతో సాధించిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే పెత్తనం చేసిందని అన్నారు. తనకు ప్రస్తుత ప్రభుత్వంలో అయినా కాస్త గుర్తింపు రావడంతో ఉద్యమకారుల పక్షాన శాసనమండలిలో మాట్లాడగలుతున్నామని చెప్పారు. ప్రతీ ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని హామీ దక్కిందన్నారు. సదస్సులో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావు, పల్లె వినయ్కుమార్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె.వి. కృష్ణారావు, నాయకులు పసుపులేటి నరసయ్య, మహబూబ్ బాషా, ప్రసాద్, అక్బర్, డేవిడ్, సయ్యద్ సలీంపాషా తదితరులు పాల్గొన్నారు. కాగా, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడిగా మధిర నియోజకవర్గానికి చెందిన షేక్ సర్దార్ హుస్సేన్ను నియమిస్తున్నట్లు కోదండరామ్ ప్రకటించారు. మీటర్ రీడింగ్ కార్మికుల వినతి.. రాష్ట్ర విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులు కోదండరామ్ను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో సుమారు 2వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని, విద్యుత్ సంస్థకు ఆదాయం సమకూరుస్తున్న తమకు సరైన న్యాయం జరగడం లేదని ఆయన దృష్టికి తెచ్చారు. పీస్రేట్ పద్ధతి కాకుండా నెలవారీ వేతనం ఇవ్వాల ని, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించేలా చూడాలని కోరారు. నాయకులు వేమూరి వీరయ్య, నాగేశ్వరావు, అనిల్, మల్లేశ్వరరావు, వంశీ, నాగార్జు న, బాలు, నరేష్, నవీన్, మధు పాల్గొన్నారు. టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరామ్ -
భూ సమస్యల పరిష్కారానికే ‘భూ భారతి’
బోనకల్: భూ సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని గోవిందాపురం(ఎల్), కలకోట గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ఆయన మాట్లాడారు. భూములపై రైతులకు జవాబుదారీతనాన్ని పెంచేందుకు ఈ చట్టం ఉపకరిస్తుందన్నారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, నిషేధిత భూములు, ఆర్ఓఆర్లో మార్పులు, చేర్పులు వంటి సేవలను భూభారతి చట్టంలో పొందుపర్చారని వివరించారు. హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం ఉంటుందని, పెండింగ్ సాదాబైనామా దరఖాస్తులు పరిష్కారం అవుతాయని తెలిపారు. భూమి హక్కులు ఎలా సంక్రమించినా మ్యుటేషన్ చేసి రికార్డుల్లో నమోదు చేయొచ్చని చెప్పారు. రైతులు తమకు న్యాయం జరగలేదని భావిస్తే రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఉంటుందని, మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చినా వాటిని తొలగించే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రభుత్వ, భూదాన్, అసైన్డ్, ఎండోమెంట్, వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే రద్దుచేసే అధికారం ఉంటుందని అన్నారు. కాగా, భూ సమస్యల పరిష్కారానికి కలకోటలో 125, గోవిందాపురంలో 69 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో తహసీల్దార్ పున్నం చందర్, ఇన్చార్జ్ తహసీల్దార్ రాంబాబు, ఆర్ఐలు నవీన్, మైథిలీ తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి -
వృద్ధులపైకి దూసుకెళ్లిన కారు..
సత్తుపల్లిరూరల్: ఇంటి ముందు కూర్చున్న వృద్ధులపైకి ఓ కారు దూసుకెళ్లడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ఆదివారం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్లోని చింతలపూడి మండలం లింగగూడెంకు చెందిన నవవధువులు భద్రాద్రి రాములోరిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో బుగ్గపాడులో ఇంటి ముందు కూర్చున్న తాటి వీరమ్మ, గడ్డం చిన్నప్ప వృద్ధులను కారు అదుపు తప్పి ఢీ కొట్టింది. ఇరువురికి తీవ్ర గాయాలు కాగా వారిని 108లో సత్తుపల్లికి తరలించారు. కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్యమధిర: కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం మాటూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మానుకొండ తిరుపతమ్మ (30) సుమారు పదేళ్ల క్రితం ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన స్కూల్ వ్యాన్ డ్రైవర్ శ్రీనివాసరావును కులాంతర వివాహం చేసుకుంది. వారికి ఒక కుమార్తె ఉంది. ఇటీవల భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో వారం రోజుల క్రితం తిరుపతమ్మ పుట్టింటికి వెళ్లగా.. పెద్ద మనుషుల సమక్షంలో ఆదివారం మాట్లాడుకునేందుకు భర్త, ఆయన తరఫు బంధువులు వస్తున్నారే విషయం తెలసుకున్న ఆమె మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై మధిర రూరల్ ఎస్సై లక్ష్మీభార్గవి కేసు నమోదు చేసి మధిర ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. వడదెబ్బతో వ్యక్తి మృతికారేపల్లి: కారేపల్లి భారత్నగర్ కాలనీకి చెందిన వేమూరి వెంకన్న(53) వడదెబ్బతో మృతి చెందాడు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన ఆదివారం ఎండ తీవ్రత తట్టుకోలేక వడదెబ్బతో మృత్యువాత పడ్డాడు. కాగా, మృతుడు సింగరేణి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏగా విధులు నిర్వర్తించాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమారై ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో ఐదు పశువులు.. ముదిగొండ: ఖమ్మం–కోదాడ జాతీయ రహదారిపై ముదిగొండ, వెంకటాపురం గ్రామాల సమీపాన గుర్తు తెలియని వాహనాలు ఢీకొని ఆదివారం నాలుగు గేదెలు, ఒక దూడ మృతి చెందగా.. మరో గేదెకు గాయాలయ్యాయి. ఇవి ముదిగొండ, వెంకటాపురం గ్రామాలకు చెందిన రైతులు వినోద్బాబు, ఉపేందర్కు చెందిన గేదెలు కాగా గాయపడిన గేదెకు స్థానిక పశువైద్యసిబ్బంది వైద్య చికిత్స నిర్వహించారు. -
●‘కృష్ణవేణి’ విజయఢంకా..
ఖమ్మం సహకారనగర్: కృష్ణవేణి కళాశాల డైరెక్టర్లు గొల్లపుడి జగదీష్, మాచవరపు కోటేశ్వరరావు, యార్లగడ్డ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. విజయఢంకా మోగించిన తమ విద్యార్థులు వై.గీతికాశ్రీ 297వ ర్యాంక్, పి.మణిచంద్రసాయి 558, టి.కోమలి 969, పి.సిరి మహాలక్ష్మి 974, కె.మహేష్బాబు 1899, బి.జ్యోత్స్న 2317, పి.భార్గవి 2387, ఎస్కె.అబ్దుల్ సమద్ 2548, కె.వైష్ణవి 3019, పి.యశస్వీ 3182, ఎస్కె.ఇర్ఫాన్ 3291, ఆర్.సీతారామకృష్ణ 4828, కె.హాసిని 4890, టి.దినేష్ 4924, కె.నవ్యశ్రీ 5411, కె.భావన 5439, డి.స్వప్నిక 5524, కె.కరుణశ్రీ 5556, కె.గ్యాన మహేశ్వర్ 5722, ఎస్.సాయి సంజన 6442, ఈ.సుహాస్ 6564, ఎ.సాయినిత్విక 6611, ఎస్కె.బుశ్ర 7053, మహాతేజ 7353, జి.పాల్ జాషువా 7728, పి.నిఖిలేష్ 7800, జి.ద్రోణితశ్రీ 8075, జి.రక్షిత 8175, ఎల్.నాగలక్ష్మి 8360, ఎండీ సామియాసామర్ 8538, ఎన్.వివేక్ 8779, బి.రోహిత్గని 8945, జి.అఖిల 8979, ఎ..భరత్ 9163, టి.కృష్ణవేణి 9514, జి.ప్రవీణ 9519, సృష్టి సాహు 9563, అనుమల భరత్ 9617, కె.మౌనిక 9714, ప్రశాంత్ 9718, రోహిత్ 9843వ ర్యాంక్ సాధించారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రామచంద్రయ్య, అకడమిక్ డీన్ ఏలూరి వంశీకృష్ణ, ఏఓ నిరంజన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఏటీసీ.. అంతా రెడీ!
త్వరలో అందుబాటులోకి నూతన భవనం ● ఇప్పటికే అడ్వాన్స్ కోర్సుల పరికరాలు సిద్ధం ● కొత్తగా ఆరు కోర్సుల్లో బోధనకు అవకాశంఖమ్మంసహకారనగర్: విద్యార్థులకు మరింత ఉపయుక్తమైన కోర్సులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన కొన్ని ఐటీఐల్లో ఏటీసీ (అడ్వాన్స్డ్ ట్రైనింగ్ కోర్సు)లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా టేకులపల్లి ఐటీఐలో ఏటీసీ ఏర్పాటుతోపాటు నూతన భవనాన్ని మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా.. కొత్తగా ప్రవేశపెడుతున్న కోర్సులకు సంబంధించిన పరికరాలు అమరుస్తున్నారు. 2024 – 25 విద్యా సంవత్సరంలో కళాశాల భవన నిర్మాణానికి రూ.4.77కోట్లు కేటాయించారు. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఐఐసీ)ద్వారా పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. అడ్వాన్స్ కోర్సుల కోసం.. రాష్ట్రంలో మొత్తం 65 ప్రభుత్వ ఐటీఐలు ఉండగా.. వాటిని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టుగా తొలిదశలో హైదరాబాద్లోని మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐ, నిజామాబాద్ ప్రభుత్వ ఐటీఐ, ఖమ్మం జిల్లాలోని టేకులపల్లి ప్రభుత్వ ఐటీఐలను అప్గ్రేడ్ చేసింది. ఈ కోర్సులు ప్రవేశపెట్టడంతో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగు కానున్నాయి. గతంలో 8 కోర్సులు ఉండగా.. ఏటీసీ ద్వారా కొత్తగా ఆరు కోర్సులు వచ్చాయి. ఈ కోర్సుల ద్వారా విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కొత్త కోర్సులకు రంగం సిద్ధం.. నూతనంగా ఏర్పాటు చేసిన ఏటీసీలో మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోనబోటిక్స్ అండ్ డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్, ఆర్టిజన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్, బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైయర్ (మెకానికల్), అడ్వాన్స్డ్ సీఎస్సీ మిషనింగ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికిల్ కోర్సులు ప్రవేశపెట్టారు. ఈ కోర్సులను నేర్చుకోవడం ద్వారా విద్యార్థులు స్వయం ఉపాధి పొందే అవకాశాలు ఉంటాయి. ఈ కోర్సులకు సంబంధించిన ప్రాక్టికల్స్ కోసం అవసరమైన పరికరాలను భవనంలో అమరుస్తున్నారు. దాదాపు ఏడు మిషనరీలను ఇక్కడ అమర్చారు. వీటి ద్వారా విద్యార్థులకు మరింత నాణ్యమైన బోధన అందనుంది. ఇదిలా ఉండగా ఈ నెలాఖరు వరకు భవనం పనులు పూర్తి చేసి ప్రారంభించనున్నారు. ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అండ్ సిములేటర్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అండ్ ఆటోమేషన్లో ఇండస్ట్రియల్ ఆటోమేషన్, సిములేటర్ తీరును వివరిస్తారు. పీఎల్సీ ప్రోగ్రామింగ్పై అవగాహన కల్పిస్తారు. పవర్ప్లాంట్ ఆపరేషన్ కంట్రోలింగ్, క్వాలిటీ, ప్రాసెస్ కంట్రోల్, న్యూమాటిక్స్, హైడ్రాలిక్స్, మెషిన్ ఆపరేషన్ కంట్రోలర్పైనా వివరిస్తారు. ఇండస్ట్రియల్ రోబోటిక్స్లో అడ్వాన్స్ వెల్డింగ్, టిగ్ వెల్డింగ్, మిగ్ వెల్డింగ్, ఏఆర్సీ, గ్యాస్ వెల్డింగ్తో పాటు రోబోలను వాడుకుని వస్తువులను షిఫ్ట్ చేయడం వంటివి నేర్పిస్తారు. మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికిల్.. ఎలక్ట్రిక్ వెహికిల్ మెకానిజమ్ నేర్పిస్తారు. బ్యాటరీ నిర్వహణ, ట్రబుల్ షూటింగ్, వెహికిల్ సర్వీసింగ్, అసెంబుల్ ఎలక్ట్రిక్ వెహికిల్ కాంపోనెంట్స్, ఎలక్ట్రిక్ వెహికిల్ రిపేరింగ్పై శిక్షణ ఇస్తారు.సీఎన్సీ, వీఎంసీ మిషన్ మొదటగా సీఎన్సీ, వీఎంసీ మిషన్ ఏర్పాటు చేశారు. ఈ మిషన్పై గౌర్ కటింగ్, నట్, బోల్ట్ తయారీ, మెటల్ కటింగ్, ట్రిమ్మింగ్, టర్నింగ్, ఫేసింగ్, క్రాఫ్ట్, హస్తకళలు, శిల్పం, నమూనా, సీఏడీ సాఫ్ట్వేర్ డిజైనింగ్ తదితర వాటిని నేర్పిస్తారు.ఉద్యోగావకాశాలు సులువు రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐ కళాశాలలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేయటం ద్వారా ఆరు కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త కోర్సుల ద్వారా నూతన టెక్నాలజీతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సులభంగా లభించనున్నాయి. కోర్సులు, ట్రైనింగ్ పూర్తయిన వారికి టాటా గ్రూప్ వారే వారి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. దీని ద్వారా అనేక మంది విద్యార్థులకు ఉపాధి లభిస్తుంది. – ఎ.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్, ఐటీఐ, ఖమ్మం -
వేసవిలో పక్షులకు నీరందించాలి
ఖమ్మంవన్టౌన్ : వేసవి కాలంలో పక్షులకు నీరందించేందుకు జిల్లా అటవీ శాఖ వినూత్న ప్రయత్నం చేస్తోంది. ‘ఏ బౌల్ ఆఫ్ వాటర్.. సేవ్ వింగ్స్’ నినాదంతో పాటు సేవ్ ఫారెస్ట్–సేవ్ నేషన్, సేవ్ వాటర్–సేవ్ ప్లాంట్ వంటి పర్యావరణ సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆదివారం ఖమ్మం లకారం ట్యాంక్బండ్ నుంచి వెలుగు మట్ల అర్బన్ పార్కు వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సీపీ సునీల్దత్, డీఎఫ్ఓ సిద్దార్థ్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ.. వేసవిలో పక్షుల దాహార్తి తీర్చేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. కాగా, ర్యాలీలో పాల్గొన్న సైకిల్ రైడర్లు.. పక్షులకు నీరందించే మట్టిగిన్నెలు కొనుగోలు చేసి అటవీ శాఖ సిబ్బందికి అందజేశారు. అంతేకాక ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన వన విజ్ఞాన్ సమ్మర్ క్యాంప్లో మొక్కల పెంపకం, ట్రెక్కింగ్, పర్యావరణ అవగాహన, సైక్లింగ్, యోగా తదితర కార్యక్రమాలు నిర్వహించారు. హాజరైన విద్యార్థులకు సీపీ,, డీఎఫ్ఓ, ఇతర సిబ్బంది ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో ఎఫ్డీఓ మంజుల, ఎఫ్ఆర్ఓ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.సీపీ సునీల్దత్, డీఎఫ్ఓ సిద్దార్థ్ విక్రమ్ సింగ్ -
సంపద పేదలకు పంచితే అన్యాయమా?
మూడు రోజుల్లో మస్తానికుంటకు నీరుజిల్లా పెద్దాస్పత్రిపై ‘రెడ్బ్యాండ్’ ఖమ్మంవైద్యవిభాగం: భారత్ – పాకిస్తాన్ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యాన ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల భవనాల టాప్పై రెడ్బ్యాండ్ గుర్తు వేయిస్తోంది. ఇందులో భాగంగానే ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి స్లాబ్పైనా పెద్దసైజ్లో తెలుపు రంగు, ఆపై ఎరుపు రంగుతో క్రాస్ గుర్తు వేయించారు. ఈ గుర్తు వేయించడం ద్వారా యుద్ధ సమయాన విమానాలు, హెలికాప్టర్ల నుండి చూసినా కనిపిస్తుందని, ఈ గుర్తు ఉన్నవి ఆస్పత్రులుగా గుర్తించి శత్రుదేశాలు జెనీవా ఒప్పందం ప్రకారం దాడి చేయవని అధికారులు తెలిపారు.రఘునాథపాలెం: మండలంలోని సాగర్ ప్రధాన కాల్వపై నిర్మించిన మంచుకొండ ఎత్తిపోతల పథకం ద్వారా మూడు రోజుల్లో మసానికుంటకు నీరు విడుదల చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రఘునాథపాలెం మండలం గడ్డికుంట తండా వద్ద గ్రావిటీ–5 కాల్వ, బావోజీతండా వద్ద ఉన్న రేగులకుంట చెరువును శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. మంచుకొండ ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్లో భాగంగా చెరువులకు నీరు విడుదల చేస్తున్నామని తెలిపారు. తద్వారా రేగులకుంట చెరువు నిండి అలుగు పారుతూ నల్లకుంట చెరువు, మల్లెపల్లికి చేరుతోందని చెప్పారు. మస్తానీకుంట, మంచుకొండకు కూడా మూడు రోజుల్లో నీరు చేరేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. రూ.66.33 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 2,400 ఎకరాల ఆయకట్టుకు సాగర్ జలాలు అందుతాయని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, ఆర్డీఓ జి.నర్సింహారావు, ఇరిగేషన్ ఈఈ అనన్య, డీఈ ఝాన్సీ, ఏడీఏ వెంకటేశ్వరరావు, సొసైటీ అధ్యక్షుడు తాతా రఘురాం, ఆత్మ చైర్మన్ దిరిశాల చిన్న వెంకటేశ్వర్లుతో పాటు మానుకొండ రాధాకిషోర్, వాంకుడోత్ దీపక్, దేవ్సింగ్, నగేష్, రామ్మూర్తినాయక్, తదితరులు పాల్గొన్నారు. కాగా, అలుగుబారుతున్న రేగులకుంట చెరువు వద్ద మంత్రి పూజలు చేశారు.ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన మంత్రి -
●35 ఏళ్లు వచ్చినా పసిపాపలా..
సింగరేణి(కొత్తగూడెం): 35 ఏళ్లు వచ్చిన బిడ్డను పసిపాపలా సాకుతోంది. దివ్యాంగురాలైన కూతురిని అన్నీ తానై పోషించుకుంటోంది. కొత్తగూడెం మధురబస్తీలో రైల్వే రిటైర్డ్ ఉద్యోగి పిండి జయరామ్, రాజమణెమ్మలకు నలుగురు కూతుళ్లు. ఇద్దరు సంపూర్ణ ఆర్యోగంతో జన్మించగా వారికి వివాహాలు చేశారు. మరో ఇద్దరు దివ్యాంగులు కిరణ్మయి, ప్రణతి. వ్యక్తిగత పనులు కూడా చేసుకోలేరు. వాష్రూమ్కు వెళ్లాలన్నా తల్లితోడు అవసరం. ఇద్దరిని తల్లి రాజమణెమ్మ కంటికి రెప్పలా కాపాడింది. 2017లో కిరణ్మయి మృతి చెందింది. ప్రణతికి ప్రస్తుతం 35 ఏళ్లు. దివ్యాంగురాలు కావడంతో తల్లే అన్ని పనులు చేస్తోంది. -
గురునానక్ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య
తల్లాడ: రెక్కాడితే గానీ డొక్క నిండని కుటుంబం.. దంపతులిద్దరూ బ్యాంకులో పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ ఇద్దరు కుమార్తెలను కష్టపడి చదివిస్తున్నారు. ఇంతలోనే ఆ తల్లిదండ్రులు పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది. తల్లాడ మండలం కుర్నవల్లికి చెందిన అయిలూరి శేషిరెడ్డి – కృష్ణకుమారి దంపతుల చిన్న కుమార్తె భావన (22) రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ యూనివర్సిటీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఆమె శనివారం ఉదయం కళాశాల హాస్టల్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు కారణాలు తెలియరావాల్సి ఉండగా, విషయం తెలియగానే స్థానికంగా విషాదం నెలకొంది. కాగా, భావన 1 నుంచి పదో తరగతి వరకు కల్లూరు ప్రతిభ స్కూల్లో, ఇంటర్ ఖమ్మం శ్రీ చైతన్య కళాశాలలో ఉత్తమ మార్కులతో పూర్తిచేసింది. గురునానక్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతుండగా, మొదటి రెండేళ్లు మంచి మార్కులే సాధించింది. ఇంతలోనే ఆమె ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. ఈ విషయం తెలియగానే ఆమె తల్లిదండ్రుల కన్నీరుమున్నీరయ్యారు. ఎలుకల మందు తాగి వ్యక్తి.. ఖమ్మంరూరల్: మండలంలోని ముత్తగూడెంనకు చెందిన చెరుకుపల్లి నాగేశ్వరరావు (41) ఎలుకల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బాధ తట్టుకోలేక ఈనెల 9న ఇంట్లో ఎవరూ లేని సమయాన ఎలుకల మందు తాగాడు. అనంతరం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శనివారం మృతి చెందగా, నాగేశ్వరరావు సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. కుర్నవల్లి గ్రామంలో విషాదం -
●సైనికుడి తల్లిగా గర్విస్తున్నా..
కారేపల్లి: దేశం కోసం, ఇక్కడి ప్రజల కోసం పాక్తో జరుగుతున్న యుద్ధంలో పాల్గొంటున్న తన కుమారుడిని చూస్తే గర్వంగా ఉందని కారేపల్లికి చెందిన ఎస్.కే.నూర్జహాన్ వెల్లడించింది. నూర్జహాన్, మునీరుద్దీన్ కుమారుడైన యాకూబ్పాషా 2016లో సైన్యంలో చేరాడు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్లోని లడక్లోనే విధులు నిర్వర్తిస్తున్నాడు. యుద్ధం నేపథ్యాన ఎప్పుడేం జరుగుతుందోననే ఆందోన ఉన్నప్పటికీ.. తన కుమారుడు దేశం తరఫున పోరాడుతున్న గర్వం ఉందని నూర్జహాన్ తెలిపారు. క్షేమ సమాచారం తెలుసుకుంటున్నట్లు వెల్లడించింది. -
నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం
● భారత సైన్యంలో ఉమ్మడి జిల్లా యువత ● కాల్పులు ఆగినా ఎప్పుడేం జరుగుతుందోనని తల్లడిల్లుతున్న కన్నపేగు ● మరోపక్క దేశ సేవలో తమ బిడ్డలు తరిస్తున్నారని సంతోషం ●పుత్రోత్సాహం ఇల్లెందురూరల్: ఇల్లెందు మండలం పోలారానికి చెందిన వల్లోజు లక్ష్మీనారాయణ ఆరేళ్ల క్రితం బీఎస్ఎఫ్ జవాన్గా ఎంపికయ్యాడు. ప్రత్యేక పరిస్థితుల్లో కొంతకాలంగా ఛత్తీస్గఢ్లో విధులు నిర్వర్తిస్తుండగా.. పాకిస్తాన్తో యుద్ధం మొదలుకాగానే మళ్లీ సరిహద్దులకు చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన తల్లి సమ్మక్క స్పందిస్తూ.. పాకిస్తాన్తో యుద్ధ పరిస్థితులను ఎప్పటికప్పుడు టీవీలో చూస్తున్నానని తెలిపింది. దేశ రక్షణ విధుల్లో కుమారుడు ఉండడం తనలో పుత్రోత్సాహాన్ని నింపిందని, ఇది ఆనందంగానే కాక తమ కుటుంబమంతటికీ గర్వంగా ఉందని తెలిపింది. -
శ్రీవారికి ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామున స్వామి మూలవిరాట్తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం జరిపించారు. ఆతర్వాత శ్రీవారు, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి తెలంగాణ, ఏపీ నుంచి వేలాదిగా హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం నిర్వహించారు. అనంతరం శ్రీవారికి పల్లకీ సేవ జరిగింది. ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు రాజీవ్శర్మ, మురళీమోహన్శర్మ, ఉద్యోగులు పాల్గొన్నారు. స్తంభాద్రి ఆలయంలో సుదర్శన యాగం ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం(గుట్ట)లో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ సుదర్శన యాగం నిర్వహించారు. ఉదయం ప్రాత:కాలార్చన, పానకాభిషేకం, విశేష పూజలు, బాలభోగ నివేదన అనంతరం పండితులు ప్రత్యేకంగా రుణ విమోచన యోగంగా సంప్రదాయ పద్ధతుల్లో యాగం ప్రారంభించారు. ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహన్రావు పర్యవేక్షణలో పూజలు జరుగుతుండగా, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా, లక్ష్మీనర్సింహస్వామి జన్మనక్షత్రం సందర్భంగా ఆదివారం సాయంత్రం గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నట్లు ఈఓ తెలిపారు. కొండపై ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవమూర్తులను బయటకు తీసుకొచ్చి, కొండ చుట్టూ మాడవీధుల్లో గిరి ప్రదక్షిణం చేస్తారని, ఆతర్వాత కొండపై అర్చకులు నక్షత్ర జ్యోతిని వెలిగించనున్నారని ఈఓ వెల్లడించారు. -
● రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు ● దొరల పాలన కోసం దోపిడీదారులు ఏకమవుతున్నారు... ● డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
అశ్వారావుపేట : రాష్ట్రంలో సంపద సృష్టించి పేదల కు పంచడం అన్యాయమా అని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రశ్నించారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో రూ.40 కోట్లతో నిర్మించనున్న ఆరు విద్యుత్ సబ్స్టేషన్ పనులకు శనివారం స్థానిక పామాయిల్ ఫ్యాక్టరీ ఆవరణలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ‘దొరల పాలన కోసం దోపిడీదారులు ఏకమవుతున్నారు.. తస్మాత్ జాగ్రత్త..’ అంటూ హెచ్చరించారు. ప్రజల వద్ద డబ్బు లాగి దోపిడీ చేసేందుకు తాము అధికారంలోకి రాలేదని, రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వెల్లడించారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రజలను జలగల్లా పీల్చేసిందని, కేసీఆర్ అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో సభలు నిర్వహిస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. గడిచిన పదేళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారా.. అని ప్రశ్నించారు. కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లు గోదావరిలో పోశారని ఆరోపించారు. రూ.7లక్షల కోట్ల అప్పు తమ ప్రభుత్వంపై వేసినా, సంక్షేమ పథకాల అమలులో వెనుకడుగు వేయడం లేదన్నారు. గిరిజనుల వ్యవసాయం కోసం రూ.12,500 కోట్లతో ఇందిర జల వికాస్ పథకం ప్రవేశపెడుతున్నామని, ఈనెల 18న నాగర్కర్నూల్ జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి ప్రారంభిస్తారని, అదేరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుందని తెలిపారు. ఈ పథకంలో గిరిజన రైతులకు సోలార్, డ్రిప్, ఉద్యాన మొక్కలు ఉచితంగా అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. పేదల కళ్లలో ఆనందం చూడడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ప్రతీ తండా, గ్రామానికీ నాణ్యమైన విద్యుత్ అందించామని, ఇప్పుడు మరింత మెరుగైన సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే, మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, ఐటీడీఏ పరిఽధిలో కోటాకు మించి ఇస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ఎమెల్యేలు ఆది నారాయణ, తెల్లం వెంకట్రావు, రాందాస్ నాయక్, ఐడీసీ, గిడ్డంగుల సంస్థ చైర్మన్లు మువ్వా విజ య్బాబు, రాయల నాగేశ్వరరా వు, భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఎస్పీ రోహిత్రాజ్, ఐటీడీఏ పీఓ రాహుల్ పాల్గొన్నారు. -
●అమ్మ ప్రోత్సాహంతో జేఎల్గా..
కరకగూడెం: భర్త చనిపోయినా మనోధైర్యం కోల్పోకుండా ఓ మహిళ తన కూతురిని ఉన్నత శిఖరాలకు చేర్చింది. అమ్మ కష్టం వృథా కాకుండా కూతురు నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన మలకం వెంకన్న – సరోజన దంపతులకు రెండో సంతానం రమాదేవి. రమాదేవి ఒకటో తరగతి నుంచి బీఈడీ వరకు గురుకుల విద్యాసంస్థలో చదువుకుంది. కేయూలో ఎమ్మెస్సీ మ్యాథ్స్, ఎంఏ ఆంగ్లం పూర్తి చేసింది. ఇంటర్లో ఉన్నప్పుడు తండ్రి చనిపోయా డు. అప్పటి నుంచి తల్లి ప్రోత్సాహంతో చదువులో ముందుకు సాగింది. గు రుకుల ఉద్యోగాల్లో జేఎల్ ఇంగ్లిష్, పీజీ టీ ఇంగ్లిష్, టీజీటీ ఇంగ్లిష్, టీజీటీ మ్యాథమెటిక్స్ ఉద్యోగాలకు ఎంపికై పలువురికి అదర్శంగా నిలిచింది. -
బామ్మకు వందేళ్ల జన్మదిన వేడుక
చింతకాని: సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించాలని పిల్లలను పెద్దలు ఆశీర్వదిస్తుంటారు. కానీ, మారుతున్న వాతావరణం, ఆహార అలవాట్లతో చాలా మందికి అది సాధ్యం కావడంలేదు. అయితే, వందేళ్లు వచ్చినా ఆరోగ్యంగా నాలుగు తరాల కుటుంబీకులతో జీవిస్తున్న ఓ బామ్మ తన శత పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకుంది. చింతకాని మండలం లచ్చగూడెంనకు చెందిన యలమద్ది సీతమ్మ వందో వేడుకలను ఆమె కుటుంబీకులు శనివారం నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆమె ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలతో పాటు మనవలు, మనవరాళ్లు పాల్గొన్నారు. కాగా, సీతమ్మ ఇప్పటికీ ఎవరిపై ఆధారపడకుండా సొంతంగా పనులు చేసుకుంటోందని తెలిపారు. ఎండు గంజాయి పట్టివేతఖమ్మంక్రైం: నగరంలోని కొత్త బస్టాండ్ సమీపంలో శనివారం 3.5 కేజీల ఎండు గంజాయిని ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. శివకుమార్, బబ్లు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ నుంచి హైదరాబాద్కు 3.5 కేజీల గంజాయిని తరలిస్తుండగా.. నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి గంజాయిని, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వైరాలో దొంగల హల్చల్ వైరా: వైరాలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ సృష్టించారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వైరాలోని ఖమ్మం – సత్తుపల్లి జాతీయ రహదారి పక్కన మూడు దుకాణాలు, గాంధీచౌక్లోని రెండు సెల్ఫోన్ దుకాణాలతో పాటు ఓ బియ్యం దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. సెల్ఫోన్ దుకాణాల్లో 20 సెల్ఫోన్లు, బియ్యం దుకాణంలో రూ.5 వేల నగదు, సాయి ధనలక్ష్మి కిరాణంలో రూ.15 వేల నగదు ఎత్తుకెళ్లగా, మరో దుకాణం షట్టర్ పగలగొట్టారు. ఒకే రోజు ఆరు దుకాణాల్లో చోరీలు జరగడంతో స్థానిక వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫెన్సింగ్ రాళ్ల ధ్వంసంపై కేసుచింతకాని: రఘునాథపాలెం మండలం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన కుతుంబాక గోపిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగుల్మీరా తెలిపారు. ఖమ్మం కవిరాజ్నగర్కు చెందిన ఉయ్యాల సత్యంకు చింతకాని మండలం వందనం రెవెన్యూలో 5.14 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి చుట్టూ ఈ నెల 1వ తేదీన రాళ్లతో ఫెన్సింగ్ వేయగా, గోపి ధ్వంసం చేశాడు. ఘటనపై సత్యం శనివారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చీటింగ్ కేసు నమోదుదమ్మపేట: అధికారుల సంతకాల ఫోర్జరీతో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి అక్రమంగా భూబదిలీ చేయించుకున్న ఘటనలో ఓ మహిళపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. మండలంలోని మందలపల్లికి చెందిన తూముల ఈశ్వరమ్మ అదే గ్రామానికి చెందిన సాయిల వీరవెంకయ్య బతికుండగానే మృతి చెందినట్టుగా నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించింది. ఇందుకోసం అధికారుల సంతకాలను ఫోర్జరీ చేయించింది. వీర వెంకయ్య కుటుంబంలో తాను కూడా ఓ కుటుంబ సభ్యురాలిగా మరో నకిలీ ధ్రువీకరణ పత్రం సృష్టించింది. ఈ ఫోర్జరీ పత్రాలను దమ్మపేట తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించి వీర వెంకయ్య పేరు మీద ఉన్న రెండు ఎకరాల 21 కుంటల భూమిని వారసత్వం ద్వారా గతేడాది మే 22న తన పేరున పట్టా చేయించుకుంది. బాధిత రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై సాయి కిషోర్ రెడ్డి తెలిపారు. -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంవన్టౌన్/నేలకొండపల్లి/తల్లాడ: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. నేలకొండపల్లి మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం కార్పొరేషన్, తల్లాడ మండలాల్లో జరిగే పలు కార్యక్రమాలకు హాజరవుతారు. ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి పర్యటించనున్న మంత్రి తల్లాడ పర్యటనలో భాగంగా పినపాకలో రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే, మిట్టపల్లిలో గ్యాస్ లీకేజీతో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగే కార్యక్రమాల్లోనూ మంత్రి పాల్గొననున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణానికి పాటుపడదాం ఖమ్మంమామిళ్లగూడెం: జిల్లాలో భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణానికి కార్యకర్తలు సైనికుల్లా కృషి చేయాలని పార్టీ జిల్లా సంఘటన సంరచన ప్రభారీ పొనుగోడు పాపారావు పిలుపునిచ్చారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో శనివారం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీజేపీ నేతృత్వాన కొనసాగుతున్న ఫ్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తోందని తెలిపారు. దేశ భద్రత, పౌరుల రక్షణే ధ్యేయంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టిందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీని ఆదర్శంగా తీసుకుని పార్టీ పటిష్టతకు కార్యకర్తలు కృషి చేయాలని, తద్వారా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. సమావేశంలో నాయకులు ఈవీ రమేశ్, సన్నే ఉదయ్ప్రతాప్, అల్లిక అంజయ్య తదితరులు పాల్గొన్నారు. వన విజ్ఞాన్ క్యాంప్లో బాలికలుఖమ్మంఅర్బన్: వేసవి సెలవుల నేపథ్యాన అటవీ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మంలోని వెలుగుమట్ల అర్బన్ పార్క్లో 6 – 15 ఏళ్ల బాలబాలికల కోసం ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్సింగ్ నేతృత్వాన కొనసాగుతున్న ఈ శిబిరాన్ని బాలల సదనం బాలికలు సందర్శించారు. ఈ సందర్భంగా పార్క్లోని వృక్షాలు, పక్షులపై అవగాహన కల్పించగా.. మొక్కల పెంపకం, కొబ్బరిబొండాల్లో తులసి మొక్కలు పెంచే విధానాన్ని సిబ్బంది వివరించారు. మొదటి విడత శిబిరం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ఉచితంగా నిర్వహించగా, వచ్చే వారం మొదలయ్యే శిబిరానికి పిల్లలు ముందుగా నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఎఫ్డీఓ మంజుల, ఎఫ్ఆర్ఓ జి.నాగేశ్వరరావు, ఎఫ్ఎస్ఓ రమేశ్, ఎఫ్బీఓలు జ్యోతి, నాగమణి, కవిత, ఖాజాబీ, ఎఫ్ఎస్ఓ కవిత పాల్గొన్నారు. మంటలు అంటుకుని వృద్ధురాలు మృతి సత్తుపల్లి: వరిగడ్డికి అంటుకున్న మంటలు ఎగిసిపడి ఓ వృద్ధురాలికి అంటుకుని మృతి చెందింది. మండలంలోని తుంబూరు గ్రామానికి చెందిన ఓరుగంటి నాగేశ్వరమ్మ(74) తన వరిపొలంలో శనివారం గడ్డి తొలగించినిప్పుపెట్టింది. అంతలోనే ఎండ తీవ్రతతోఆమె అస్వస్థతకు గురై పడిపోయింది. దీతో మంటలు ఎగిసిపడుతూ వచ్చి నాగేశ్వరమ్మకు అంటుకొని కాలిపోతుండగా గుర్తించిన సమీప రైతులు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. అంతా చేరుకుని మంటలుఆర్పేలోగా ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. -
●కష్టాలను ఎదురొడ్డి.. పిల్లలను తీర్చిదిద్ది..
బోనకల్: మండలంలోని ముష్టికుంట్లకు చెందిన చిట్టా అరుణకు ఇద్దరు కుమార్తెలు. 2006లో భర్త సీతారామిరెడ్డి మృతి చెందాడు. కూలి పనులు చేస్తూ జీవనం పోరాటం ప్రారంభించింది. ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి పూర్తి చేసింది. 2011లో కస్తూర్బాగాంధీ పాఠశాలలో ఔట్సోర్సింగ్ విధానంలో నైట్ వాచ్వుమన్గా చేరింది. జీతం సరిపోక రాత్రి నైట్ వాచ్వుమెన్గా పనిచేస్తూ ఉదయం కూలి పనులకు వెళ్లింది. తల్లి కష్టాన్ని గమనించిన పిల్లలు గ్రీష్మా, సుష్మా ఉన్నత చదువులు పూర్తి చేశారు. గ్రీష్మా ఫిషరీస్ డిపార్ట్మెంట్లో, సుష్మా ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తోంది. భర్త చనిపోయినా అధైర్య పడకుండా ఇద్దరు కూతుళ్లను ఉన్నత చదువులు చదివించి అరుణ పలువురికి ఆదర్శంగా నిలిచింది. -
●అమ్మ లాంటి దేశరక్షణలో..
తిరుమలాయపాలెం: మండలంలోని రమణతండాకు చెందిన రమావత్ రామచంద్రు – రాజమ్మ కుమారుడైన మూర్తిలాల్ పదిహేనేళ్లుగా భారత సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. సైన్యంలో చేరేటప్పుడు తల్లిదండ్రులు ఆందోళనకు గురైనా తల్లి లాంటి దేశ రక్షణ విధులకు వెళ్తున్నానని చెప్పడంతో అంగీకరించారు. ఈ సందర్భంగా రాజమ్మ మాట్లాడుతూ తన కుమారుడు తరచుగా ఫోన్ చేసి మాట్లాడతాడని తెలిపింది. ప్రస్తుతం విశాఖపట్నంలో విధులు నిర్వర్తిస్తున్నా యుద్ధం నేపథ్యాన ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలనే సమాచారం వచ్చిందని చెప్పాడని పేర్కొన్నారు. -
●అటు భయం.. ఇటు గర్వం
సూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెంలోని రామవరానికి చెందిన దాచేపల్లి ఖాదర్రాజు –యజ్ఞకుమారి కుమారుడైన ఉదయ్కుమార్ జమ్మూలో మేజర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. జవాన్గా చేరి మేజర్ స్థాయికి ఎదిగారు. ఆయన భార్య లక్ష్మీసత్య, ఏడాది కుమార్తె కూడా జమ్మూలోనే ఉండగా, వారి నివాసాని కి సమీపంలో బాంబులు పడ్డాయని సమాచారం ఇచ్చారు. ఉదయ్ తల్లి యజ్ఞకుమారి మాట్లాడుతూ ఇప్పుడు భయంగా ఉన్నా.. దేశ రక్షణలో కుమారుడు భాగస్వామ్యమైనందుకు గర్వంగా ఉందని తెలిపారు. దేశం కోసం దేనికై నా సిద్ధమేనని చెబుతాడని వెల్లడించారు. -
స్క్రాప్ దుకాణాల్లో మున్సిపాలిటీ సామగ్రి
వైరా: మున్సిపాలిటీ కార్యాలయ తాత్కాలిక సిబ్బంది కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మున్సిపాలిటీలో పాడైన సామగ్రి పాత ఇనప సామాన్ల దుకాణంలో కనిపిస్తుండడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. రెండు రోజుల కిందట పాత పంచాయతీ కార్యాలయంలో ఉన్న టన్నుల కొద్ది స్క్రాప్ను ఎవరి అనుమతులు లేకుండా మసీద్ కాంప్లెక్స్లోని ఓ పాత ఇనుప సామగ్రి దుకాణానికి తరలించినట్లు తెలిసింది. పాడైన ఫాగింగ్ మిషన్లు, పాత ఇనుప సామగ్రి, ప్లాస్టిక్ పైపులను టెండర్ ద్వారా విక్రయించాల్సి ఉంటుంది. కానీ, అలాంటిదేమీ లేకుండా విక్రయించినట్లు సమాచారం. మున్సిపల్ పాలకవర్గం లేకపోవడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ చింతా వేణును వివరణ కోసం యత్నించగా ఆయన స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తున్నందున, ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
కర్ణాటకలో సత్తా చాటిన ఖమ్మం విద్యార్థిని
ఖమ్మంసహకారనగర్: కర్ణాటక రాష్ట్రం బెల్గాం నగరంలోని ఏ.ఎం.షేక్ హోమియోపతిక్ మెడికల్ కాలేజీలో ఖమ్మం నగరానికి చెందిన తుమ్మలపల్లి చరిత అత్యధిక మార్కులతో బీహెచ్ఎంఎస్ పూర్తిచేసింది. యూనివర్సిటీ టాపర్గా నిలిచిన ఆమె బంగారు పతకం సాధించడమే కాక ప్రతిష్టాత్మక డాక్టర్ బత్రాస్ స్కాలర్షిప్నకు ఎంపికై ందని కుటుంబీకులు తెలిపారు. తాజాగా జరిగిన గ్రాడ్యుయేషన్ డేలో రాజీవ్గాంధీ హెల్త్ యూనివర్సిటీ హోమి యోపతి డీన్ డాక్టర్ సహిదా ఎ.శిరసాంగి చేతుల మీదుగా పట్టా, బంగారు పతకం అందుకుందని వెల్లడించారు. తెలంగాణ వసతి గృహ సంక్షేమ అధికారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు రామారావు చిన్న కుమార్తె అయిన చరిత బీహెచ్ఎంఎస్లో చేరిన కొన్నాళ్లకే రామారావు మృతి చెందారు. అయినా బాధ దిగమింగుకుని నాలుగేళ్ల కోర్సులో ఏటా మొదటి ర్యాంకు సాధిస్తూ చివరికి బంగారు పతకం సాధించడంపై పలువురు అభినందించారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్ డేకు హాజరైన చరిత తల్లి విజయలక్ష్మి, కుటుంబీకులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, తన తండ్రి రామారావు కోరిక మేరకు పేద ప్రజలకు వైద్య సేవలందిస్తానని చరిత వెల్లడించింది. బీహెచ్ఎంఎస్లో టాపర్గా బంగారు పతకం -
●ధైర్యంగా పంపించా...
కూసుమంచి: కూసుమంచి మండలం గోరీలపాడు తండాకు చెందిన బానోతు దస్మి ఇద్దరు కుమారులు భాస్కర్, ప్రసాద్ సైన్యంలో పని చేస్తున్నారు. భాస్కర్ కేరళలో, ప్రసాద్ చైన్నెలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల దస్మీకి ఆరోగ్యం బాగా లేకపోతే భాస్కర్ స్వస్థలానికి వచ్చాడు. ఇంతలో ఫోన్ రాగానే.. భాస్కర్ బయలుదేరాడు. ‘నాకు ఆరోగ్యం బాగా లేకున్నా.. దేశసేవ కోసం వెళ్లాల్సి రావడంతో భాస్కర్ను ధైర్యంగా పంపించా’ అని దస్మీ వెల్లడించింది. కొడుకు దేశం పోరాడుతుంటే, తండా వాళ్లంతా తనకు అండగా ఉన్నారని దస్మీ వెల్లడించింది. -
ఆపరేషన్ సిందూర్కు కేఎంసీ మద్దతు
దేశ రక్షణనిధికి విరాళంగా నెల వేతనంఖమ్మంమయూరిసెంటర్: భారత ఆర్మీ తలపెట్టిన ఆపరేషన్ సిందూర్కు ఖమ్మం కార్పొరేషన్ పాలకవర్గం మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా మేయర్ పునుకొల్లు నీరజ ఆధ్వర్యాన కార్పొరేటర్లు, అధికారులు, ఉద్యోగులు శనివారం ప్రదర్శన నిర్వహించారు. కేఎంసీ కార్యాలయం నుండి ఆర్టీఓ ఆఫీస్ సిగ్నల్ వరకు ప్రదర్శనగా వెళ్లి మానవహారంగా ఏర్పడి సైన్యానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో పాక్ దాడులను భారత సైనం తిప్పికొడుతూ ప్రజల రక్షణకు పాటుపడుతున్నందున ప్రతిఒక్కరు సంఘీభావం తెలపాలని కోరారు. కాగా, దేశ రక్షణనిధికి తనతో పాటు కార్పొరేటర్ల నెల వేతనం రూ.4లక్షల మేర విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ మేయర్ ఫాతిమ జోహరా, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, బీ.జీ.క్లెమెంట్, రాపర్తి శరత్, దండ జ్యోతిరెడ్డి, గజ్జల లక్ష్మీవెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
ఇటు తల్లిప్రేమ
అటు దేశ భ క్తి..భారత్ – పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత అందరికీ ఆందోళన కలిగించింది. యుద్ధం ఎన్నాళ్లు కొనసాగుతుందోనన్న ఆదుర్దా సామాన్యుల్లో ఉండగా, సరిహద్దు వద్ద సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్న వారి కుటుంబాలను ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆవేదన వెంటాడింది. రెండు దేశాల అంగీకారంతో శనివారం సాయంత్రం కాల్పుల విరమణ ప్రకటించినా, మళ్లీ ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న భయం సైనికుల కుటుంబాలను వీడడం లేదు. ఈనేపథ్యాన నేడు(ఆదివారం) అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్న వారి తల్లులను పలకరించగా ఓ పక్క భయం.. ఇంకోవైపు ఆనందంవ్యక్తపరిచారు. తమ బిడ్డలు దేశసేవలో తరిస్తున్నారని సంతోషంగా ఉన్నా, యుద్ధం కారణంగా ఏం జరుగుతుందోననే ఆందోళన కూడా వారిలో కనిపించింది. అయితే, కన్నపేగుకు మించి తమ బిడ్డలు భారతమాత సేవలో ఉన్నారనే వారు హర్షం వ్యక్తం చేయడం విశేషం. -
ఖమ్మంలో ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర మహాసభలు
ఖమ్మం మయూరిసెంటర్: ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్క ర్స్ ఫెడరేషన్(ఎస్డబ్ల్యూఎఫ్) రాష్ట్ర నాలుగో మహా సభలను ఖమ్మంలో నిర్వహించాలని నిర్ణయించి నట్లు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తెలిపారు. ఖమ్మంలోని మంచికంటి భవన్లో గుండు మాధవరావు అధ్యక్షతన శుక్రవా రం జరిగిన మహాసభల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమాల ఖిల్లా అయిన ఖమ్మంలో ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ మహాసభల నిర్వహణకు నిర్ణయించడం అభినందనీయమన్నారు. ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రాల శ్రీని వాసరావు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులందరూ సభల జయప్రదానికి సహకరించాలని కోరారు. అనంతరం సభల ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడిగా కళ్యాణం వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా పిట్టల సుధాకర్, కోశాధికారిగా గుగ్గిళ్ల రోశయ్యను రీజియన్ కార్యదర్శి పిట్టల సుధాకర్ ప్రతిపాదించగా ఆమోదించారు. ఈ సమావేశంలో సీఐటీయూ, ఎస్డబ్ల్యూఎఫ్ తదితర సంఘాల నాయకులు తుమ్మ విష్ణువర్ధన్, అల్లంశెట్టి వెంకటేశ్వర్లు, వై.విక్రం, పిట్టల రవి, కుడుదుల వెంకన్న, తోకల బాబు, పగిళ్లపల్లి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
‘సీతారామ’తో జిల్లా సస్యశ్యామలం
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లిటౌన్: గోదావరి జలాల ఆధారంగా నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలమవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. సత్తుపల్లి మండలం యాతాలకుంటలో సీతారామ ప్రాజెక్ట్ ట్రంక్ టన్నెల్ పనులను శుక్రవారం ఆయన ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు ముజమ్మిల్ఖాన్, జితేష్ వి.పాటిల్, సత్తుపల్లి, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు డాక్టర్ మట్టా రాగమయి, జారె ఆదినారాయణతో కలిసి పరిశీలించారు. సీతారామ మెయిన్ కెనాల్, మూడు పంప్హౌస్లను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించుకున్నామని తెలిపారు. రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా వచ్చే వర్షాకాలానికి వైరా ప్రాజెక్టు, పినపాక నియోజకవర్గంలోని తుమ్మలపల్లి వద్ద మారేడుపాక ఎత్తిపోతల పథకం, కొత్తగూడెం నియోజకవర్గంలో సింగభూపాలెం ద్వారా నీరు వదలాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. నాలుగు నెలల్లో ట్రంక్ నిర్మాణం సత్తుపల్లి ట్రంక్ టన్నెల్లో మిగిలిన 1.2 కి.మీ. పనులు నాలుగు నెలల్లో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. తద్వారా సత్తుపల్లి, పినపాక, మధిర, వైరా, అశ్వారావుపేట నియోజకవర్గాలకు సాగునీరు అందించవచ్చని, వైరా రిజర్వాయర్ కింద లక్షా 30వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందన్నారు. అప్పుడు సాగర్ జలాలు రాకున్నా ఇబ్బంది ఉండదని తెలిపారు. సీతారామ ప్రధాన కాల్వలో సిల్ట్ తొలగిస్తే బేతుపల్లి, వైరా ప్రాజెక్టులోకి సాఫీగా నీరు చేరుతుందన్నారు. కాగా, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డితో ఫోన్లో మాట్లాడిన మంత్రి విద్యు త్ సంబంధిత సమస్యల పరిష్కారానికి సూచనలు చేశారు. జల వనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ ఎ.శ్రీనివాసరెడ్డి, ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, ట్రాన్స్కో ఎస్ఈ శ్రీనివాసాచారి, ఎస్డీసీ రాజేశ్వరి, ఆర్డీఓ రాజేందర్గౌడ్, ఏడీఏ శ్రీనివాసరెడ్డి, నాయకులు మట్టా దయానంద్, దోమా ఆనంద్, సుజలరాణి, దూదిపాల రాంబాబు పాల్గొన్నారు. -
మా లక్ష్యం.. ఒకే ఎన్నిక
ఖమ్మం మామిళ్లగూడెం: దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరగాలనేదే తమ పార్టీ విధానమని మెదక్ పార్లమెంటు సభ్యుడు మాధవనేని రఘునందన్రావు తెలిపారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే వ్యయం తగ్గుతుందని, ఆ నిధులతో సంక్షేమ పథకాల అమలుకు అవకాశముంటుందని చెప్పారు. ఖమ్మంలో శుక్రవారం ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ అంశంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటుచేసిన సదస్సులో రఘునందన్రావు ముఖ్యఅతిథిగా మాట్లాడారు. అంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో నిజం లేదన్నారు. వామపక్షాలకు ప్రజలు ఇప్పటికే మంగళం పాడారని, అందుకే తెలంగాణలో ఒక సీటుకు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఇక సరైన మార్గంలో బీజేపీ మాత్రమే పయనిస్తున్నందున, రాబోయే రోజుల్లో తెలంగాణలో తమ పార్టీ జెండా ఎగరడం ఖాయమని తెలిపారు. కాగా, పాకిస్తాన్పై పోరులో భారత ప్రభుత్వానికి మద్ధతు ఇస్తున్నట్లు చెప్పిన సీఎం రేవంత్రెడ్డి.. రాష్ట్రంలోని మదర్సాల్లో తలదాచుకున్న పాక్ మద్దతుదారులు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వలసవాదులను రాష్ట్ర పొలిమేరలు దాటించాలని సూచించారు. ఇద్దరు మహిళా అధికారుల నేతృత్వాన ఆపరేషన్ సిందూర్ను ద్వారా తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను నిర్మూలించడం ద్వారా భారత సైన్యం సత్తా అందరికీ తెలిసిపోయిందని రఘునందన్రావు పేర్కొన్నారు. ఈసమావేశంలో నాయకులు దేవకి వాసుదేవరావు, సన్నే ఉదయ్ప్రతాప్, దొంగల సత్యనారాయణ, డాక్టర్ శీలం పాపారావు, డాక్టర్ గోంగూర వెంకటేశ్వరావు, మేకల నాగేందర్, ఆర్వీఎస్.యాదవ్, పుల్లారావు యాదవ్, తక్కెళ్లపల్లి నరేందర్రావు, నున్న రవికుమార్, పెరుమాళ్లపల్లి విజయరాజు, మందా సరస్వతి తదితరులు పాల్గొన్నారు. వారిని పొలిమేరలు దాటిస్తేనే సీఎం మాటలపై నమ్మకం మెదక్ ఎంపీ రఘునందనరావు -
లాభాల బాటలో రైతన్న
● సంప్రదాయ పంటలకు బదులు అరటి, జామ తోటలు ● సేంద్రియ విధానంలో సాగు, తోటల వద్దే అమ్మకం ● మిగతా పంటలతో పోలిస్తే లాభాలపై భరోసా ముదిగొండ: ఈ రైతులు కూడా అందరిలాగే వరి, మిర్చి, పత్తి పంటలను ఏళ్ల తరబడి సాగు చేశారు. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితులు, తెగుళ్లు వారిని వెంటాడాయి. ఫలితంగా ఏళ్లు గడుస్తున్న కొద్ది పెట్టుబడి పెరుగుతుందే తప్ప లాభాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఏం చేయాలా అని ఆలోచిస్తున్న ఆ రైతులకు పండ్ల తోటలు కళ్ల ముందు కనిపించాయి. రసాయన ఎరువులు వాడకం తగ్గించి సేంద్రియ విధానంలో పంటల సాగు ఆరంభించిన వారు ఇప్పుడు అధిక దిగుబడి సాధిస్తున్నారు. రసాయన ఎరువులు వాడకపోవడంతో పండ్లు రుచికరంగా ఉండగా.. వ్యాపారులే తోటల వద్దకు కొనుగోలు చేస్తుండడంతో రవాణా ఖర్చులు తగ్గి లాభాలు లాభాలు ఆర్జిస్తున్నారు. ముదిగొండ మండలం మేడేపల్లిలో పలువురు రైతులు ఈ బాటలో పయనిస్తుండగా ఆ గ్రామ రైతులే కాక చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా వీరిని అనుసరించేందుకు సిద్ధమవుతున్నారు. జామ.. తైవాన్ పింక్ ముదిగొండ మండలం మేడేపల్లికి చెందిన సామినేని రమేష్ ఏడాదిన్నర క్రితం ఏపీలోని జంగారెడ్డిగూడెం వద్ద నర్సరీలో 19వేల తైవాన్ పింక్ జామ మొక్కలు తీసుకొచ్చాడు. ఒక్కో మొక్కకు రూ.15 వెచ్చించగా.. ఎకరానికి 1,300 చొప్పున 20ఎకరాల్లో సాగు చేశాడు. డ్రిప్ ఇరిగేషన్, పైపులు, బావి, ఫెన్సింగ్, కూలీలు, మొక్కలు కలిపి రూ.20లక్షల మేర పెట్టుబడి అయింది. డ్రిప్ ఇరిగేషన్ విధానం కావడంతో నీరు, ఎరువులు మొక్కకు నేరుగా అందించడం సాధ్యమవుతోంది. మొక్కలు నాటాక ఎనిమిదో నెల నుంచి జామ దిగుబడి మొదలైంది. మొదటి కాపు 75టన్నులు రాగా.. కిలో రూ.25నుంచి రూ,30 వరకు తోట దగ్గరే విక్రయించానని రమేష్ తెలిపారు. ఇక వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ప్రత్యేక యంత్రాన్ని అమర్చడంతో ముందు జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యమవుతుందని వెల్లడించారు. ఈ యంత్రానికి రూ.50వేలు వెచ్చించినట్లు తెలిపారు. కాయలకు మచ్చలు రాకుండా, చీడపీడలు ఆశించకుండా కవర్లు తొడగడం... సేంద్రియ విధానం కావడంతో కాయలు రుచిగా ఉండి వ్యాపారులు నేరుగా తోట వద్దకు కొనుగోలు చేస్తున్నారని వెల్లడించారు. ఫలితంగా తనకు రవాణా ఖర్చులు తగ్గాయని తెలిపారు. అటు అరటి.. ఇటు జామ మేడిపల్లి గ్రామానికే చెందిన మేడిశెట్టి నరసింహారావు అరటి సాగు చేస్తున్నారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజోలులో ఒక్కో మొక్క(దుంప) రూ.10 చొప్పున తీసుకొచ్చి ఎకరానికి వెయ్యి మొక్కలు నాటారు. ఎకరాకు రూ.30 వేలు ఖర్చు కాగా.. కర్పూర రకం మొక్కలు కావడంతో నాటిన 11నెలలకు దిగుబడి వచ్చింది. టన్ను రూ.14వేల నుంచి రూ.20వేలు వరకు తోట దగ్గరే అమ్ముతున్న ఆయన ఎకరాకు రూ.లక్ష మేర లాభం వస్తోందని తెలిపారు. దీనికి తోడు అంతర పంటగా జామ కూడా సాగు చేస్తుండగా అదనపు ఆదాయం లభిస్తోందని వెల్లడించారు. -
మధిర పోలీసుస్టేషన్ అప్గ్రేడ్
మధిర: ఇన్నాళ్లు ఎస్సై స్టేషన్ హౌస్ ఆఫీసర్గా కొనసాగుతున్న మధిర పట్టణ పోలీసుస్టేషన్ను అప్గ్రేడ్ చేశారు. ఇందులో భాగంగా పోలీసుస్టేషన్కు సీఐ స్థాయి అధికారిని ఎస్హెచ్ఓగా నియమించారు. ఈమేరకు ఎస్హెచ్ఓగా డి.రమేష్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. దీంతో ప్రస్తుతం ఇక్కడ సీఐగా ఉన్న డి.మధు మధిర రూరల్, ఎర్రుపాలెం, బోనకల్ పోలీస్ స్టేషన్లకు సర్కిల్ ఇన్స్పెక్టర్గా వ్యవహరించనున్నారు. త్వరలోనే సబ్డివిజన్ మధిర సర్కిల్ను త్వరలోనే సబ్ డివిజన్గా మార్చనున్నట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుగా ఉండడంతో శాంతిభద్రతల దృష్ట్యా ప్రత్యేక సబ్ డివిజన్ ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన చాన్నాళ్లుగా ఉంది. ప్రస్తుతం టౌన్ పీఎస్ ఎస్హెచ్ఓగా సీఐను నియమించారు. దీంతో మధిర కేంద్రంగా ఇద్దరు సీఐలు విధులు నిర్వర్తించనున్నారు. ఇక మధిర పోలీస్ సర్కిల్ పరిధిని త్వరలోనే సబ్ డివిజన్ స్థాయికి అప్గ్రేడ్ చేయనున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. ఎస్హెచ్ఓ స్థాయికి చేరిన టౌన్ పీఎస్ -
కదం తొక్కిన జర్నలిస్టులు
ఖమ్మంమయూరిసెంటర్: ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో ఏపీ ప్రభుత్వం పోలీసులతో దాడి చేయించడాన్ని జర్నలిస్టు సంఘాల నాయకులు ముక్తకంఠంతో ఖండించారు. ఎలాంటి నోటీసులు లేకుండానే విజయవాడలోని ఎడిటర్ ఇంట్లోకి ప్రవేశించడం ద్వారా ఏపీ ప్రభుత్వం జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తోందని ఆరోపించారు. ఈమేరకు శుక్రవారం జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యాన ఖమ్మంలో జెడ్పీ కార్యాలయం నుంచి డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. జర్నలిజంపై ముప్పేట దాడి టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన జర్నలిస్టు వ్యవస్థపై తెలుగు రాష్ట్రాల్లో దాడి జరుగుతోందన్నారు. పాలకులు వారికి అనుకూలంగా మాత్రమే వార్తలు రాయాలని కోరుకుంటుండడంతో ఈ పరిస్థితి ఎదురవుతోందని తెలిపారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లోకి పోలీసులు అక్రమంగా జొరబడడం గర్హనీయమన్నారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మీడియా స్వేచ్ఛను ప్రభుత్వాలు హరిస్తున్నాయన్నారు. ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు పెరగడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై జరిగిన దాడికి ఏపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విజయవాడలోని సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిపై ఏపీ పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పాలకులు ప్రజామన్ననలు చూరగొనేలా పాలించాలే తప్ప వారికి వ్యతిరేక వార్తలు రాశారని జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేయడం అత్యంత హేయనీయమని తెలిపారు. పత్రికా, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా ఇలాంటి దాడులు చేయడాన్ని తమ యూనియన్ ఖండిస్తోందన్నారు. టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి, బాధ్యులు గుద్దేటి రమేష్, కొరకొప్పుల రాంబాబు, యలమంద జగదీష్, టీఎస్ చక్రవర్తి, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) నగర అధ్యక్ష, కార్యదర్శులు మైసా పాపారావు, చెరుకుపల్లి శ్రీనివాస్, బాధ్యులు మొయినుద్దీన్, శివానంద, టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు సయ్యద్ ఖదీర్, దువ్వా సాగర్, ఆవుల శ్రీనివాస్, కూరాకుల గోపి, వేగినాటి మాధవరావు, మహిళా ప్రతినిధులు మధుశ్రీ, వంగూరి ఈశ్వరి, జర్నలిస్టులు మారెడ్డి నాగేందర్రెడ్డి, పి.సత్యనారాయణ, ‘సాక్షి’ బ్రాంచ్ మేనేజర్ మోహన్కృష్ణ, టీవీ ప్రతినిధి పి.మహేందర్కుమార్, ఏసీఎం శ్రీనివాస్, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ నిరసనకు ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఇటికాల రామకృష్ణ, వంగూరి వెంకటేష్ తదితరులు సంఘీభావం తెలిపారు. ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో సోదాలపై నిరసన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అక్కడి పోలీసుల తీరుపై ఆగ్రహం -
రండి.. డిగ్రీలో చేరండి
‘దోస్త్’ రిజిస్ట్రేషన్లు ప్రారంభం ● ఈనెల 21వరకు మొదటి విడత.. ● ఆతర్వాత మరో రెండు విడతలు కూడా.. ● ఉమ్మడి జిల్లాలోని 11 ప్రభుత్వ కాలేజీల్లో 5,820 సీట్లుఖమ్మంసహకారనగర్: ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడిసిన్ కోర్సుల్లో విద్యార్థులు ఆ వైపు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. అయితే, కాలం మారుతున్నా వన్నె తగ్గని డిగ్రీ కోర్సుల్లోనూ చేరేందుకు ఇంకొందరు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. దీంతో ప్రభుత్వం ఏటా మాదిరిగానే డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దోస్త్(డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) ద్వారా రిజిస్ట్రేషన్ల షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పటికే మొదటి విడతల షెడ్యూల్ అమల్లో ఉన్న నేపథ్యాన ఉమ్మడి జిల్లాలో డిగ్రీ కళాశాలలు, సీట్లు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ వివరాలపై కథనం 2వ తేదీన నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం షెడ్యుల్ను ఈనెల 2వ తేదీన విడుదల చేసింది. ఈనెల 3వ తేదీ నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు మొదలుకాగా, డిగ్రీ బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీసీఏ, బీబీఎం తదితర కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. విద్యార్థులు నేరుగా దోస్త్ వెబ్సైట్లోనే కాక మీ సేవ, దోస్త్ యాప్, ఆన్లైన్ సర్వీసెస్లోనూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మూడు విడతలుగా కొనసాగే ప్రవేశాల ప్రక్రియ కోసం విద్యార్థులు తమకు ఇష్టమైన కళాశాల, కోర్సును ఎంచుకోవాల్సి ఉంటుంది. ఖమ్మం జిల్లాలో ఐదు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలే కాక పలు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు కూడా ఉన్నాయి. మూడు విడతల్లో ఇలా... ●‘దోస్త్’మొదటి విడత రిజిస్ట్రేషన్ ఈనెల 3వ తేదీన మొదలుకాగా, 21వ తేదీ వరకు రూ.200 రుసుంతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈనెల 10నుంచి 22వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశముండగా, 29వ తేదీన మొదటి విడత సీట్లు కేటాయిస్తారు. ఆయా విద్యార్థులు ఈనెల 30నుంచి జూన్ 6తేదీ వరకు కళాశాలల్లో రిపోర్టింగ్ చేసి నిర్దేశిత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ● రెండో విడత రిజిస్ట్రేషన్కు రూ.400 ఫీజు చెల్లించాలి. ఈనెల 30నుంచి జూన్ 8వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉండగా, ఈనెల 30నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకుంటే అదే నెల 13న సీట్లు కేటాయిస్తారు. ఈ విడతలో సీట్లు దక్కిన విద్యార్థులు వచ్చే నెల 13 నుంచి 18వ తేదీ వరకు ఫీజు చెల్లించాలి. ● మూడో విడత రిజిస్ట్రేషన్లోనూ రూ.400 ఫీజుతో వచ్చే నెల 23న ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేరోజు నుంచి వచ్చేనెల 28వ తేదీ వరకు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. కాగా, 1, 2, 3 విడతల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులంతా జూన్ 24 నుంచి 28వ తేదీల్లో ఆయా కళాశాలల్లో జరిగే ఓరిఝెంటేషన్ కార్యక్రమాల్లో పాల్గొని, 30న ప్రారంభమయ్యే తరగతులకు హాజరుకావాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్కు ఏమేం కావాలి? ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ సమయాన ఇంటర్ ద్వితీయ సంవత్సరం హాల్టికెట్ నంబర్, ఆధార్కార్డు జిరాక్స్, ఆధార్ కార్డుకు లింక్ అయిన ఫోన్ నంబర్, ఎస్సెస్సీ, ఇంటర్ మెమోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు 6నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, ఇంటర్ టీసీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పాస్పోర్టు సైజ్ ఫొటో కూడా సమర్పించాలి.ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, సీట్ల సంఖ్య కళాశాల సీట్లు ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్, ఖమ్మం 1,560 ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఖమ్మం 480 ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మధిర 300 ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నేలకొండపల్లి 300 జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, సత్తుపల్లి 480 శ్రీరామచంద్ర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, కొత్తగూడెం 360 ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాల్వంచ 660 ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భద్రాచలం 780 ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇల్లెందు 300 ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మణుగూరు 360 ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అశ్వారావుపేట 240సద్వినియోగం చేసుకోవాలి డిగ్రీలో ప్రవేశాల కోసం విద్యార్థులు ‘దోస్త్’వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మూడు విడతలుగా అవకాశం ఉంటుంది. ఆన్లైన్లోనే నచ్చిన కాలేజీ, కోర్సును ఎంచుకోవచ్చు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – ఎం.డీ.సలీంపాషా, దోస్త్ కో ఆర్డినేటర్, ఖమ్మం -
అభివృద్ధి మంత్రం
మున్నేరు తీరం..●రవాణా ఇక్కట్లు తీర్చేలా.. మున్నేటిపై పాత వంతెన శిథిలావస్థకు చేరడంతో అనుబంధంగా రవాణాకు ఇబ్బంది ఎదురుకాకుండా తీగల(కేబుల్) వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.180 కోట్లు కేటాయించింది. ఖమ్మం నుంచి రాకపోకలు సాగించే వాహనదారులకు ట్రాఫిక్ ఇక్కట్లు తీర్చేలా ఈ నిర్మాణం చేపట్టారు. మొత్తం 14 పిల్లర్లతో నిర్మించనున్న ఈ వంతెనలో భాగంగా మున్నేరు మధ్యలో నాలుగు ప్రధాన పిల్లర్ల పనులు చివరి దశకు చేరాయి. రెండేళ్లలో బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేయాలనేది లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. తద్వారా ప్రధాన రహదారిపై ట్రాఫిక్ భారం తగ్గడమేకాక జిల్లా వాసులను ఆకట్టుకునేలా కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తుంది.ప్రకాష్నగర్ వద్ద మరమ్మతులు ప్రకాష్నగర్ వద్ద ఉన్న హై లెవెల్ వంతెన గత ఏడాది వచ్చిన వరదతో దెబ్బతిన్న విషయం విదితమే. దీంతో బ్రిడ్జి మీదుగా రాకపోకలు నిలిపివేసిన అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. దాదాపు రూ.కోటి వ్యయంతో చేపట్టిన పనులు పూర్తవడంతో అవసరమైన అప్రోచ్ రోడ్లు కూడా నిర్మించడంతో సాఫీగా రాకపోకలు సాగుతున్నాయి. పర్యాటక అభివృద్ధికి కార్యాచరణ తీగల వంతెనతో పాటు రిటైనింగ్వాల్ నిర్మాణంతో పూర్తయితే అటు రవాణా ఇక్కట్లు, ఇటు ముంపు సమస్య తీరిపోతుంది. ఆపై మున్నేరు పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బ్రిడ్జి, రిటైనింగ్ వాల్ వెంట వాకింగ్ ట్రాక్ల నిర్మాణం, లైట్ల ఏర్పాటు తదితర పనులకు కార్యాచరణ సిద్ధమైనట్లు సమాచారం. ఇవన్నీ కార్యరూపం దాలిస్తే నగరవాసులకు కొత్త అందాలు అందుబాటులో వస్తాయని చెప్పొచ్చు.●రిటైనింగ్ వాల్తో భద్రత ఏటా వర్షాకాలంలో వస్తోందంటే మున్నేటి పరీవాహకంలోని ఖమ్మం అర్బన్, రూరల్ మండలాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతుంటారు. ఎప్పుడు వరద ముంచెత్తుతుందోనన్న భయం వారిని వెంటాడుతుంటుంది. దీన్ని అరికట్టేలా రెండు వైపులా మొత్తం 17 కి.మీ. మేర రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చేపట్టారు. రూ.690 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ నిర్మాణం ప్రభుత్వ భూముల్లో చకచకా సాగుతోంది. ప్రైవేట్ భూములు సేకరించాల్సిన చోట జాప్యం జరిగినా, ఇప్పుడు ఆ సమస్యలు కూడా ఓ కొలిక్కి వచ్చాయని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.పరీవాహకంలో రూ.వందల కోట్లతో పనులు చకచకా సాగుతున్న తీగల బ్రిడ్జి, రిటైనింగ్ వాల్ నిర్మాణం తద్వారా ముంపు, ట్రాఫిక్ సమస్యలకు చెక్ ఆ తర్వాత పర్యాటక సొబగులు కూడా.. -
మీ భూమిలో సారం ఎంత?
● మట్టి నమూనాలతో భూసార పరీక్షలు ● తగిన జాగ్రత్తలతో కచ్చితమైన ఫలితాలు ● రైతులకు వైరా కేవీకే కోర్డినేటర్, శాస్త్రవేత్తల సలహాలువైరా: నేలల్లో సహజంంగా ఉండే పోషక పదార్థాలకు తోడు రైతులు అదనంగా వేసే సేంద్రియ, రసాయన ఎరువులు పంట దిగుబడి పెరిగేందుకు దోహదం చేస్తాయి. అయితే, ఏ నేలలో ఎంత మోతాదులో సారం ఉంది, అక్కడ ఏయే పంటలు సాగు చేయొచ్చు, సాగు సమయాన ఏ మేర ఎరువులు ఉపయోగించాలో తెలియాలంటే మట్టి నమూనాల పరీక్షలు చేయించడం తప్పనిసరి. ఈ పరీక్షల ద్వారా వచ్చే ఫలితాల ఆధారంగా సరిపడా మాత్రమే ఎరువులు వాడితే రైతులకు భారం తగ్గడమే కాక నేల తల్లిని కాపాడుకున్నట్లవుతుంది. ఈనేపథ్యాన మట్టి పరీక్షల కోసం నమూనాల సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలపై వైరా కృషి విజ్ఞాన కేంద్రం కోర్డినేటర్ కె.రవికుమార్, శాస్త్రవేత్తలు ఫణిశ్రీ, చైతన్య రైతులకు ఇచ్చిన సూచనలు ఇలా ఉన్నాయి. ప్రయోజనాలు పొలంలో ముఖ్య పోషక పదార్థాలైన నత్రజని, భాస్వరం, పోటాష్ ఏ మోతాదులో ఉన్నాయో పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే, సూక్ష్మపోషక పదార్థాలైన జింక్, మెగ్నిషియం వంటివి ఏ మోతాదులో ఉన్నాయో తెలుసుకుని లోపాలు ఉంటే సరిదిద్దడానికి అవకాశం ఏర్పడుతుంది. సాగుకు అనువుగా లేని ఆమ్లా భూములు, చౌడు భూములను గుర్తించవచ్చు. పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులను సరిపడా మోతాదులో వాడడం వల్ల రైతులకు వ్యయం తగ్గుతుంది. మెళకువలు తప్పనిసరి మట్టి ఆరబెట్టడానికి రసాయన, సేంద్రియ ఎరువుల సంచులను వాడొద్దు. చెట్ల కింద ఉన్న పొలం భాగం నుంచి మట్టి తీయొద్దు. ఎరువు కుప్పలు వేసిన చోట, ఎప్పుడు నీరు నిలిచే పల్లపు ప్రాంతంలోని మట్టి కూడా పనికిరాదు. పొలంలో అక్కడక్కడ చౌడు ఉన్నట్లు అనుమానిస్తే ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా నమునాలు సేకరించాలి. తీసి వేరుగా చౌడు లక్షణాల పరీక్ష కోసం పంపాలి. -
మార్పు పేరిట అందమైన వల
● నెత్తిపై నీళ్లు చల్లుకోవడం తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదు ● బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సత్తుపల్లి/తల్లాడ: సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు జిల్లాను సస్యశ్యామలం చేసేలా సీతారామ ప్రాజెక్టును నిర్మిస్తే.. కాంగ్రెస్ నేతలు నీరు విడుదల చేసి నెత్తిన చల్లుకున్నారే తప్ప చేసిందేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మార్పు పేరిట ఆ పార్టీ ప్రజలపై అందమైన వల విసిరిందన్నారు. తల్లాడ మండలం మిట్టపల్లిలో శుక్రవారం డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాయల శేషగిరిరావు కాంస్య విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి కేటీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు. తొలుత పహల్గాం మృతులు, పాకిస్తాన్తో యుద్ధంలో అమరులైన సైనికులకు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేయకపోగా, రైతులకు బోనస్, భరోసా లేదు, రుణమాఫీ అంతంతే అమలుచేస్తున్నారని విమర్శించారు. జిల్లా నుంచి డిప్యూటీ సీఎం, వ్యవసాయశాఖ మంత్రి, నంబర్–2గా చెప్పుకునే మంత్రి ఉన్నా ఒరిగిందేమీ లేదని తెలిపారు. భద్రాచలంలో ఉపఎన్నిక ఖాయం బాండ్లు రాసిస్తాం, అఫిడవిట్ ఇస్తాం, కేసీఆర్ కంటే ఎక్కువే చేస్తామని ఎన్నికల వేళ భట్టి విక్రమార్క, చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు. ఎలా చేస్తారని ప్రశ్నిస్తే వారి పార్టీకి 125 ఏళ్ల చరిత్ర ఉన్నందున సంపద సృష్టిస్తాం, వంద రోజుల్లో హామీలు అమలుచేస్తామన్న మాటలు ఏమయ్యాయని నిలదీశారు. ఇక రేవంత్రెడ్డి రైతుబంధు మూడు పంటలకు ఇవ్వాలని చెప్పి ఇప్పుడు ఒక పంటకు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. భద్రాచలం అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఖాయమని, ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ శ్రేణులంతా అక్కడకు వెళ్లి పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు గెలిచేలా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ డీసీఎంఎస్ చైర్మన్ పదవి నుంచి రాయల శేషగిరిరావును అవమానకర రీతిలో దించేశారన్నారు. ఆయన అనునిత్యం రైతుల సమస్యలపై ఉద్యమించారని, ధాన్యం కొనుగోళ్లల్లో జాప్యమైతే అప్పటి మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేవారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాయలను ఇబ్బంది పెట్టినా, నమ్మిన సిద్ధాంతాన్ని చివరి వరకు వీడలేదని తెలిపారు. తొలుత తల్లాడ మండలం రేజర్ల నుంచి మిట్టపల్లి వరకు ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్రెడ్డి, రేగా కాంతారావు, బానోతు మదన్లాల్, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, బానోతు హరిప్రియ, తాటి వెంకటేశ్వర్లు, కొండబాల కోటేశ్వరరావుతో పాటు లింగాల కమల్రాజు, కూరాకుల నాగభూషణం, దిండిగాల రాజేందర్, దొడ్డా శ్రీనివాసరావు, రెడ్డెం వీరమోహన్రెడ్డి, డి.వెంకటలాల్, దిరిశాల దాసురావు తదితరులు పాల్గొన్నారు. -
‘సిందూర్’ విజయవంతం కావాలని పూజలు
ఎర్రుపాలెం/కూసుమంచి: పాకిస్తాన్లో ఉగ్రవాదులను తుదముట్టించేలా భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాంతి హోమం చేసిన అర్చకులు, భారత సైన్యానికి మేలు జరగా లని, వారి కుటుంబాలకు మనోధైర్యం కల్పించాలని పూజలు జరిపించారు. ఆలయ ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస్శర్మ, మధిర మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్రెడ్డి, నాయకులు తల్లపురెడ్డి నాగిరెడ్డి, శీలం శ్రీనివాసరెడ్డి, గుడేటి బాబురావు, శ్రీనివాసరావు, ఎన్.రామారావు పాల్గొన్నారు. అలాగే, కూసుమంచిలోని శివాలయంలోకూడా పూజలు చేయగా, ఈఓ శ్రీకాంత్, భక్తులు పాల్గొన్నారు. లైసెన్స్డ్ సర్వేయర్లుగా శిక్షణకు దరఖాస్తులు ఖమ్మంసహకారనగర్: లైసెన్స్డ్ సర్వేయర్లుగా శిక్షణ కోసం ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యాన శిక్షణ ఇవ్వనుండగా, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మీ సేవా కేంద్రాల్లో రూ.100 చెల్లించి ఈనెల 17లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇంటర్మీడియట్లో గణితం సబ్జెక్టుగా 60శాతం మార్కులు సాధించిన వారు, ఐటీఐ డ్రాఫ్ట్మెన్(సివిల్), డిప్లొమా(సివిల్), బీటెక్(సివిల్) లేదా సమానమైన విద్యార్హత ఉన్న వారు అర్హులని వెల్లడించారు. ఎంపికై న అభ్యర్థుల్లో ఓసీలైతే 50రోజుల శిక్షణకు రూ.10వేలు, బీసీలు రూ.5వేలు, ఎస్సీ, ఎస్టీలు రూ.2,500 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. వివరాలకు 83748 79945, 97054 39983, 96769 64860 నంబర్లలో సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. 31వరకు ఓపెన్ వర్సిటీ ఫీజు గడువు ఖమ్మంసహకారనగర్: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఏ, బీకాం, బీఎస్సీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్షలకు అభ్యర్థులు ఈనెల 31లోగా ఫీజు చెల్లించాలని ఖమ్మం రీజినల్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ బి.వీరన్న సూచించారు. వివరాలు, ఫీజు చెల్లింపు కోసం www.braouonline.ac.in వెబ్సైట్లో పరిశీలించాలని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. వైద్యసేవల్లో నిర్లక్ష్యం వద్దు ● కల్లూరు ఆస్పత్రిలో కలెక్టర్ తనిఖీ కల్లూరు: ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకంగా వచ్చే పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలే తప్ప నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ఆదేశించారు. కల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా డాక్టర్ వినీత్ పలువురికి చికిత్స చేస్తుండగా పరిశీలించారు. అనంతరం ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్తో మాట్లాడి పరీక్షలు, మందుల లభ్యతపై ఆరాతీశారు. మందులు సరి పడా సిద్ధంగా ఉంచుకోవాలని, ఏవైనా తక్కువగా ఉంటే ముందుగానే తెప్పించుకోవాలని సూచించారు. తహసీల్ధార్ పులి సాంబశివుడు, వైద్యాధికారి నవ్యకాంత్, ఉద్యోగులు ఎం.లలిత, జె.మాధవి, అనూష, అక్తర్, మధు, బి.కృష్ణవేణి పాల్గొన్నారు. ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు పెనుబల్లి: రైతులకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ అధికారులను ఆదేశించారు. పెనుబల్లి మండలం మండాలపాడులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన రికార్డులు పరిశీలించారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం, రవాణాపై ఆరా తీశాక కలెక్టర్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ధాన్యాన్ని కాంటా వేయించి మిల్లులకు తరలించాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య, తహసీల్దార్ గంటా ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
రక్షణపై మాక్డ్రిల్తో అవగాహన
ఖమ్మంమయూరిసెంటర్: యుద్ధం వస్తే పౌరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు మాజీ సైనికులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఖమ్మం ఎన్నెస్పీ హైస్కూల్ సమీపంలోని ఖాళీ స్థలంలో మాజీ సైనిక ఉద్యోగులు, ఇండియన్ వెటర్న్ ఆర్గనైజేషన్ అధికార ప్రతినిధి ఎస్.ఎం.అరుణ్ పర్యవేక్షణలో ఈ డ్రిల్ జరిగింది. భవనాలపై బాంబులు పడినప్పుడు మంటల నుంచి బయటపడడాన్ని అరుణ్ ప్రత్యక్షంగా వివరించారు. అలాగే, గాయపడిన వారికి ప్రథమ చికిత్స, రాత్రి వేళ ఉనికి తెలియకుండా లైట్లు ఆర్పడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఎస్సీసీ సుబేదార్ మేజర్ బహుదూర్, జిల్లా ఫైర్ ఆఫీసర్ అజయ్కుమార్, ఆర్పీఎఫ్ సీఐ, మాజీ సైనిక ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో పాటు వెంకటేష్, నాళ్ల భానుచందర్ తదితరులు పాల్గొన్నారు. శిక్షణ తరగతులు ఒకపూటే నిర్వహించాలి బోనకల్: ప్రభుత్వం ఈనెల 13వ తేదీ నుండి ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనుండగా, ఎండల తీవ్రత దృష్ట్యా ఒక పూటే నిర్వహించాలని టీఎస్యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరావు డిమాండ్ చేశారు. బోనకల్లో శుక్రవారం జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ శిక్షణను జిల్లా కేంద్రంలో కాకుండా డివిజన్ కేంద్రాల్లో నిర్వహించాలన్నారు. అలాగే, పాఠశాలలు తెరిచేనాటికి సరిపడా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం సమకూర్చాలని, ఉపాధ్యాయులకు పెండింగ్ బిల్లులు, డీఏ, పీఆర్సీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు వల్లంకొండ రాంబాబు, గుగులోతు రామకృష్ణ, రమేష్, సూర్య, తులసీదాస్, ఉద్దండ్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలిబోనకల్/ఎర్రుపాలెం: ఇప్పటికే జాప్యమైనందున ఇకనైనా ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. బోనకల్ మండలం జానకీపురం, ఎర్రుపాలెం మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఇటీవల ఉద్యోగులపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. అలాగే, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీ పేరిట కాలయాపన చేయొద్దని సూచించారు. 317 జీఓ ద్వారా ఉపాధ్యాయులకు జరిగిన నష్టాన్ని సవరించడమే కాక ఉపాధ్యాయ శిక్షణ జిల్లా కేంద్రంగా కాకుండా మండలాల్లో ఏర్పాటు చేయాలన్నారు. కాగా, బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొ ని విద్యార్థుల సంఖ్య పెంపునకు పాటుపడాలని సూచించారు.ఈసమావేశాల్లో పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రంగారావు, మండలాల బాధ్యులు రామ్మోహన్రావు, రవికిరణ్, రవికుమార్, కొండల్రావు, బి.మదనమోహన్రెడ్డి, మారపాక బాబురావు, శెట్టిపల్లి సంగిరెడ్డి, రవికిరణ్, కొండలరావు, సత్యనారాయణరెడ్డి, ఎస్.కే.రమేష్, గోపీకృష్ణ, రేణుక, అప్పిరెడ్డి, సాంబయ్య, లింగయ్య, కృష్ణవేణి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. దరఖాస్తుల పరిశీలనలో వేగం ఏన్కూరు: రాజీవ్ యువవికాసం పథకానికి అందిన దరఖాస్తుల పరిశీలన త్వరగా పూర్తిచేసి సంబంధిత కార్పొరేషన్లకు పంపించాలని జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగపద్మజ సూచించారు. ఏన్కూరు మండల పరిషత్ కార్యాలయాన్ని శుక్రవారం తనిఖీ చేసిన ఆమె దరఖాస్తుల పరిశీలనపై ఆరా తీశారు. త్వరగా ప్రక్రియను పూర్తి చేసి అర్హుల జాబితాను కార్పొరేషన్లకు పంపిస్తే లబ్ధిదారుల ప్రకటన సులవవుతుందని తెలిపారు. ఎంపీడీఓ జీవీఎస్.నారాయణ, సూపరింటెండెంట్ తుమ్మలపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అదుపు తప్పి వాగులో పడిన లారీ ఏన్కూరు: ఇసుక తీసుకెళ్తున్న లారీ అదుపు తప్పి వాగులో బోల్తాపడింది. భద్రాచలం నుండి ఇసుకతో లారీ ఏన్కూరు మండలం జన్నారం మీదుగా ఖమ్మం వెళ్తోంది. ఈక్రమాన గురువారం అర్ధరాత్రి జన్నారం సమీపంలో అదుపు తప్పి వాగులో బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యా యి. అయితే, వంతెనకు ఇరువైపులా రక్షణ గోడలు లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. -
ముందస్తు..అంతంతే
● మున్సిపాలిటీల్లో ఎర్లీబర్డ్కు నామమాత్ర స్పందన ● రూ.64.08 కోట్ల డిమాండ్లో రూ.6.19 కోట్లే వసూలు ● ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో సత్తుపల్లిలో అత్యధికంకేఎంసీకి రూ.10.73 కోట్లు ! ఖమ్మంమయూరిసెంటర్: ఎర్లీ బర్డ్ స్కీం ద్వారా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్కు భారీగా ఆదాయం సమకూరింది. ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఐదు శాతం రాయితీతో ఈ పథకాన్ని ప్రకటించడమే కాక పొడిగించిన గడువు బుధవారంతో ముగిసింది. ఈమేరకు కేఎంసీకి రూ.10.73 కోట్లు ఆదాయం నమోదైంది. ఏప్రిల్ 30వ తేదీ వరకు రూ.10.13 కోట్లు రాగా.. ఈనెల 1నుంచి 7వ తేదీ వరకు రూ.60 లక్షలు ఆదాయం రావడం విశేషం. అయితే, గురువారం కూడా పన్నులు చెల్లించేందుకు పలువురు కార్యాలయానికి రాగా సైట్ నిలిచిపోయిందని చెప్పడంతో వెనుదిరిగారు. సత్తుపల్లిటౌన్: మున్సిపాలిటీల్లో ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే అత్యధికంగా ఆస్తి పన్ను రాబట్టేలా రాష్ట్రప్రభుత్వం ఏటా మాదిరిగా ఐదు శాతం రాయితీతో ఈసారి కూడా ఎర్లీ బర్డ్ స్కీంను ప్రకటించింది. కానీ రాష్ట్ర పురపాలక శాఖ ప్రవేశపెట్టిన ఈ పథకానికి ఈసారి స్పందన అంతంత మాత్రంగానే లభించింది. ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రచార బోర్డులు ఏర్పాటు చేసి ప్రచారం చేయగా.. పలువురు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పన్నులు చెల్లించారు. కానీ గతంతో పోలిస్తే ఈసారి ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక,. విచారణలో బిల్కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు నిమగ్నమవడంతో ఎర్లీబర్డ్పై విస్తృతంగా అవగాహన కల్పించలేకపోయారు. దీంతో పన్నుల వసూళ్లపై ప్రభావం చూపింది. సద్వినియోగం చేసుకున్నారు.. 2025–26 ఆర్ధిక సంవత్సరానికి ఆస్తిపన్ను మొత్తం ఒకేసారి చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ఇవ్వడం ఎర్లీబర్డ్ పథకం ఉద్దేశం. ఏటా ఈ పథకం ద్వారా ఎక్కువ మొత్తం పన్ను రాబట్టేలా మున్సిపల్ పాలకవర్గాలు, అధికారులు కృషి చేస్తారు. కానీ ఈసారి పాలకవర్గాలు లేకపోగా.. అధికారులు ఇతర పని ఒత్తిడిలో పెద్దగా దృష్టి సారించలేదు. ఫలితంగా వసూళ్లలో వెనుకంజ వేసినట్లయింది. ఈసారి ఏప్రిల్ 30వ వరకు ఉన్న గడువును ఈనెల 7వ తేదీ వరకు పొడిగించినా ఆశించిన స్థాయిలో పన్నులు వసూలవకపోవడం గమనార్హం. కొంచెం ఆశ.. ఇంకొంచెం నిరాశ ఎర్లీబర్డ్ పథకంలో ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఇల్లెందు(శాతంలో) అగ్రస్థానాన నిలిచింది. ఇక్కడ అత్యధికంగా 1,384 మంది రూ.56 లక్షలు చెల్లించారు. మొత్తం రూ.2.23 కోట్ల ఆస్తి పన్ను డిమాండ్లో 25.11 శాతం వసూలైంది. ఇక సత్తుపల్లి 25.04 శాతం(రూ.1.42కోట్లు)తో ద్వితీయ స్థానాన నిలిచింది. మణుగూరులో 18.30శాతం, మధిరలో 15.85 శాతం, కొత్తగూడెంలో 10.88 శా తం, వైరాలో 10.15శాతం, పాల్వంచలో 3.92 శాతం మాత్రమే పన్ను వసూళ్లు నమోదయ్యాయి.మున్సిపాలిటీ పన్ను డిమాండ్ చెల్లించిన వసూలైన శాతం యజమానులు పన్నులు ఇల్లెందు రూ.2.23కోట్లు 1,384 రూ.56 లక్షలు 25.11 సత్తుపల్లి రూ.5.67 కోట్లు 2,080 రూ.1.42కోట్లు 25.04 మణుగూరు రూ.2.35కోట్లు 1,244 రూ.43లక్షలు 18.30 మధిర రూ.4.01 కోట్లు 1,720 రూ.65 లక్షలు 15.85 కొత్తగూడెం రూ.12.87కోట్లు 3,026 రూ.1.40కోట్లు 10.88 వైరా రూ.4.53కోట్లు 828 రూ.46 లక్షలు 10.15 పాల్వంచ రూ.32.42కోట్లు 3,153 రూ.1.27కోట్లు 3.92 -
మానవ వనరుల అభివృద్ధే లక్ష్యం
కరువు తీర్చిన ‘రామదాసు’ భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా విడుదలైన నీటితో మండు వేసవిలోనూ పలు చెరువులు కళకళలాడుతున్నాయి.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ● వైద్య, ఆరోగ్య శాఖకు రూ.11,482 కోట్ల నిధులు ● రఘునాథపాలెంలో మెడికల్ కాలేజీ నిర్మాణాలకు శంకుస్థాపన ● పాల్గొన్న మంత్రులు దామోదర రాజనర్సింహ, తుమ్మల, పొంగులేటివాతావరణ ం జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం చిరుజల్లులు కురిసే అవకాశముంది. మిగతా చోట్ల సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.10లోశుక్రవారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2025●ప్రభుత్వ ఆస్పత్రులకు బ్రాండ్! ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో వైద్య, ఆరోగ్య రంగంలో చేయాల్సిన పనులకు సంబంధించి ప్రతిపాదనలు సమర్పించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. వైద్యారోగ్య శాఖపై మంత్రులు సి. దామోదర రాజ నర్సింహ, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి కలెక్టరేట్లో సమీక్షించారు. తొలుత జిల్లా పరిస్థితులను కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించేలా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ అవసరమైన చోట పీహెచ్సీలు, సబ్ సెంటర్లు, బస్తీ దవాఖానాల ఏర్పాటు, కొత్త భవనాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని తెలిపారు. మెడికల్ కాలేజీలో సీట్ల సంఖ్య 100 నుంచి 150 వరకు పెంచాలని, పెద్దాస్పత్రిని 600 పడకలకు విస్తరించాలని సూచించారు. అలాగే, ప్రభుత్వ ఆస్పత్రులకు బ్రాండింగ్ కల్పించేలా హెల్ప్ డెస్క్, రిసెప్షన్, ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పారు. అనంతరం వైద్య కళాశాల విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పలు ప్రతిపాదనలు సమర్పించారు.ఖమ్మం అర్బన్: మానవ వనరుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ, పకడ్బందీ చర్యలు చేపడుతోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. రఘునాథపాలెంలో రూ.130 కోట్లతో నిర్మించే ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవన సముదాయానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి.దామోదర రాజనర్సింహ, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి అవసరమైన భూమి, నిధులు సమకూర్చడంలో మంత్రులు కీలక పాత్ర పోషించారన్నారు. గత ప్రభుత్వం ఏటా సగటున వైద్య రంగానికి రూ.5,959 కోట్లు వెచ్చిస్తే, తాము ఒక్క ఏడాదిలోనే రూ.11,482 కోట్లు కేటాయించామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. అంతేకాక అంతర్జాతీయ ప్రమాణాలతో 58 యంగ్ ఇండియా సమీకృత గురుకులాలను రూ.11,600 కోట్లతో నిర్మిస్తున్నామని తెలిపారు. అలాగే, 57 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్న భట్టి, మరో 30 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని సూచించారు. ఏదేమైనా ఉద్యోగులను తాము కాపాడుకుంటామని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగులకు ఏనాడు 15వ తేదీ లోపు జీతాలు ఇవ్వలేదని తెలిపారు. వైద్య రంగానికి ప్రాధాన్యత ప్రభుత్వం వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఖమ్మం మెడికల్ కళాశాలలో సీట్లు 150కి పెంచుతామని, జిల్లాలో 6–7 ప్రైమరీ హెల్త్ సెంటర్ల మంజూరుతో పాటు ఆర్గాన్ రిట్రైవల్ సెంటర్ కేటాయించనున్నామని చెప్పారు. వందనం, కొదుమూరు ప్రాంతంలో నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. అలాగే, ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుతో మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వైద్య కళాశాల శంకుస్థాపన ఆలస్యమైనా కార్యరూపం దాల్చడం ఆనందంగా ఉందని చెప్పారు. రైతులకు భూమి పట్టాల పంపిణీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి బల్లేపల్లి వద్ద సేకరించిన భూముల్లో అసైన్డ్ భూములు కూడా ఉన్నాయి. ఈనేపథ్యాన శంకుస్థాపన సభావేదికపైనే ఆయా రైతులకు నివాస స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. ఒక్కో రైతుకు ఎకరాకు 300గజాల చొప్పున 28మందిలో ఐదుగురికి మంత్రులు పట్టాలు అందజేశారు. మిగతా వారికి త్వరలో ఇవ్వనున్నట్లు తెలి పారు. కాగా, సీతారామలింక్ కెనాల్ నిర్మాణం పూర్తయినందున తమ వద్ద సేకరించిన భూములకు పరిహారం చెల్లించాలని నిర్వాసితులు కోరారు. రైతు లు బి.నర్సింహారావు, జి.సురేష్, కృష్ణ, శోభన్ తది తరులు మంత్రులకు వినతిపత్రం అందజేశారు.●పేదలకు మెరుగైన వైద్యం ఖమ్మంవైద్యవిభాగం: ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకంగా వచ్చే పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. భట్టితో పాటు మంత్రులు సి.దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరా వు జిల్లా పెద్దాస్పత్రిని తనిఖీ చేయగా పలు విభాగాల్లో పరిశీలించి చికిత్స పొందుతున్న వారి తో మాట్లాడారు. వైద్య సేవలెలా ఉన్నాయి, మందులు ఇస్తున్నారా అని ఆరా తీశారు. అనంతరం వైద్యులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా, సీపీ సునీల్దత్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, వైద్యారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ నరేంద్ర కుమార్, టీజీఎంఐడీసీ ఎండీ ఫణీందర్రెడ్డి, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, డీఆర్వో ఏ.పద్మశ్రీ, సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, రాందాస్నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, హస్తకళ ల సంస్థ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయు డు సత్యనారాయణ, మేయర్ పి.నీరజ, డీసీసీబీ చైర్మన్ వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజేశ్వరరావు, డీఎంహెచ్ఓ బి.కళావతిబాయి, ఆర్డీఓలు నర్సింహారావు, రాజేందర్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ కిరణ్కుమార్, డీసీహెచ్ఎస్ రాజశేఖర్, ఆర్అండ్బీ అధికారి యాకూబ్తో పాటు ఫాతిమా జోహారా, లకావత్ సైదులు, కమర్తపు మురళి, రావూరి సైదబాబు, బాలసాని లక్ష్మీనారాయణ, మానుకొండ రాధాకిషోర్, తుళ్లూరు బ్రహ్మయ్య, సాధు రమేష్రెడ్డి, మలీదు వెంకటేశ్వర్లు, భూక్యా బాషా, తాతా రఘురాం తదితరులు పాల్గొన్నారు.న్యూస్రీల్ -
వీడని వర్షం, ఈదురుగాలులు
● జిల్లాలో పగలంతా ఎండ, సాయంత్రానికి మార్పు ● ధాన్యం కాపాడుకునేందుకు రైతల అవస్థలు ఖమ్మంవ్యవసాయం: జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉపరితల ద్రోణి కారణంగా కొద్ది రోజులుగా వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. పగలు ఎండ తీవ్రత ఉంటుండగా.. సాయంత్రానికి 30 – 40 కి.మీ. మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వడగండ్లతో కూడిన వర్షం కురుస్తోంది. గురువారం సాయంత్రం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ వర్షం కారణంగా వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం అత్యధికంగా నేలకొండపల్లిలో 41.2, బాణాపురంలో 41, పమ్మిలో 40.9, చింతకానిలో 40.7, కాకరవాయి, బచ్చోడులలో 40.5, రఘునాథపాలెంలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక సాయంత్రం 7గంటల సమయానికి సత్తుపల్లి ఓసీ వద్ద 16, వైరా ఏఆర్ఎస్ వద్ద 14.8, ఏన్కూరులో 14, తిమ్మారావుపేటలో 12.8, బచ్చోడులో 9.8, మధిరలో 8.5, గుబ్బగుర్తిలో 4.5, మధిర ఏఆర్ఎస్ వద్ద 3.8, గేటు కారేపల్లి వద్ద 3.3, కాకరవాయిలో 3 మి.మీ. వర్షపాతం నమోదైంది. కాగా, ఈదురుగాలులు, అకాల వర్షాలతో యాసంగి పంటలు సాగు చేసిన రైతులు ఇబ్బంది పడుతున్నారు. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం, మక్కలు, మిర్చిని కాపాడుకునేందుకు అవస్థ పడుతుండగా.. కోత దశలో మామిడి పంట నేలరాలుతుండగా ఆవేదన చెందుతున్నారు. ఇక ఈదురుగాలులు ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ●ఏన్కూరు: మండలంలో గురువారం సాయంత్రం భారీవర్షం కురిసింది, గాలిదుమారం, ఉరుములు, మెరుపులతో భారీవర్షంతో ధాన్యం కప్పిన పరదాలు ఎగిరిపోయాయి. గాలివాన భీభత్సంతో అక్కడక్కడా చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. ●తల్లాడ: తల్లాడ మండలంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసింది. గన్నీ సంచులు, లారీల కొరతతో కొనుగోళ్లు ఆలస్యమవుతుండగా, వర్షంతో నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు. ●ఎర్రుపాలెం: మండల వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, గాలిదుమారంతో కూడిన వర్షం కురిసింది. జమలాపురం వెళ్లే రహదారి, మండల కేంద్రంలోని బైపాస్ ,మీనవోలు – మధిర రోడ్డులో చెట్లు విరిగి రహదారికి అడ్డంగా పడగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే, మామిడితోటల్లో కాయలు నేలరాలగా, గంటల కొద్దీ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
ఉమ్మడి జిల్లాస్థాయి చెస్ జట్ల ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు గాను ఉమ్మడి జిల్లా స్థాయి బాలబాలికల చెస్ జట్లను ఎంపిక చేశారు. చెస్ అసోసియేషన్ ఆధ్వర్యాన బుధవారం ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో అండర్–7, 9, 11 కేటగిరీల్లో ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా ప్రతిభ చాటిన వారితో జిల్లా జట్లు ఎంపిక చేశామని చెస్ అసోసియేషన్ బాధ్యులు తెలిపారు. ఉమ్మడి జిల్లా అండర్–7 బాలబాలికల జట్లకు ప్రీతమ్, జుహిత్, ఆరాధ్య, శ్రియశ్రీ, అండర్–9 విభాగంలో నిఖిల్, విహాన్, కృతిప్రీతిక, హరిప్రియశ్రీ, అండర్–11 విభాగంలో అక్షయ్కుమార్, సీహెచ్.గౌతమ్కృష్ణ, హిమశ్రీనిక, రీతూశ్రీ ఎంపికయ్యారు. ఈ పోటీలను అసోసియేషన్ బాధ్యులు సీహెచ్.గోపీకృష్ణ, సాంబశివరావు, రామారావు, అరుణ, స్వాతి, భిస్వజిత్, కృష్ణ, జ్యోత్స్న పర్యవేక్షించారు. నేడు జిల్లాకు మాజీ మంత్రి కేటీఆర్ తల్లాడ: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు శుక్రవారం తల్లాడ మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 11–30 గంటలకు తల్లాడ మండలం రేజర్లకు హెలీకాప్టర్లో రానున్న ఆయన అక్కడి నుంచి రోడ్డుమార్గంలో మిట్టపల్లికి చేరుకుని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాయల శేషగిరిరావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆతర్వాత అక్కడే జరిగే సభలో మాట్లాడాక తిరిగి రోడ్డు మార్గంలో రేజర్లకు, హెలీకాప్టర్లో హైదరాబాద్ బయలుదేరతారు. కాగా, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పర్యవేక్షణలో విగ్రహావిష్కరణ, సభ ఏర్పాట్లు పూర్తిచేశారు. సభకు వచ్చే వారు ఎండ కారణంగా ఇబ్బంది పడకుండా షామి యానాలు, కూలర్లు అమరుస్తున్నారు. ఇక విగ్రహావిష్కరణ సందర్భంగా హాజరయ్యే వారికి శేషగిరిరావు కుటుంబీకులు అన్నదానానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మేలైన విత్తనాల ఎంపికతో మంచి దిగుబడి చింతకాని: రైతులు పంటల సాగు సమయాన శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు పాటిస్తే మేలైన దిగుబడులు సాధించొచ్చని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. చింతకానిలోని రైతువేదికలో గురువారం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’లో భాగంగా నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడం, మేలురకపు విత్తనాలను ఎంపికతో మంచి ఫలితాలు వస్తాయన్నారు. అలాగే, విత్తనాలు, ఎరువుల రశీదులను పంట పూర్తయ్యే వరకు భద్రపరచుకోవాలని, ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించాలని సూచించారు. వైరా కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ ఎరువులను అవసరం మేరకు వాడుతూ నేల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని తెలిపారు. శాస్త్రవేత్తలు డాక్టర్ చైతన్య, ఫణిశ్రీ, ఆయిల్ఫెడ్ జిల్లా మేనేజర్ రామకృష్ణ, ఏడీఏ విజయ్చంద్ర, ఉద్యాన అధికారి విష్ణు, ఏఓ మానస, పశువైద్యాధికారి రాంజీ పాల్గొన్నారు. వైరా ఏసీపీగా సారంగపాణి వైరా: వైరా ఏసీపీ ఎం. ఏ.రెహమాన్ను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఆయన స్థానంలో హైదరాబాద్ పోలీస్ అకాడమీలో పనిచేస్తున్న ఎస్.సారంగపాణిని నియమించారు. సుమారు మూడేళ్ల పాటు ఇక్కడ విధులు నిర్వర్తించిన రెహమాన్ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయన మరో నాలుగు నెలల్లో ఉద్యోగ విరమణ చేయనుండగా, బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ●ఖమ్మం క్రైం: ఖమ్మం సీసీఆర్బీ ఏసీపీ పి.రవీందర్రెడ్డిని వరంగల్ జిల్లా నర్సంపేట ఏసీపీగా బదిలీ చేశారు. అయితే, ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. -
భద్రతకు సవాల్గా మారిన ఉగ్రవాదం
రఘునాథపాలెం: ఉగ్రవాదం దేశ భద్రతకు పెను సవాల్గా మారిన నేపథ్యాన.. అది ఏ రూపంలో ఉన్నా తుద ముట్టించాల్సిందేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత కమ్యూనిస్టు పార్టీ అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా కవ్వింపు చర్యలకు పాల్పడడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. సీపీఐ శత వసంతాల సందర్భంగా రఘునాథపాలెం మండలం ఈర్లపుడిలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించగా, ఆతర్వాత జరిగిన సభలో కూనంనేని మాట్లాడారు. దేశంలో నానాటికీ సంపన్నుల సంఖ్య పెరుగుతుండగా, బడుగు ప్రజల ఆర్థిక పరిస్థితి దిగజారుగుతోందని తెలిపారు. కనీస జీవనాధారం లేని కుటుంబాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. మతం పేరుతో కర్మ సిద్ధాంతాన్ని ప్రోత్సహించడాన్ని ఆయన తప్పుపట్టారు. కాగా, ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దాన్ని ప్రభావితం చేస్తోందని తెలిపారు. ఇక స్వాతంత్య్ర సమరం, సాయుధ తెలంగాణ పోరాటంలోనూ కీలకపాత్ర పోషించిన సీపీఐ ద్వారా ప్రజలకు హక్కులు లభించాయని, ఈ స్ఫూర్తితో ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా పోరాడుతామని కూనంనేని వెల్లడించారు. ఈ సభలో సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, నాయకులు దండి సురేష్, మహ్మద్ మౌలానా, జమ్ముల జితేందర్రెడ్డి, ఎస్.కే.జానీమియా, శింగు నర్సింహారావు, శాఖమూరిశ్రీనివాసరావు, తాటి వెంకటేశ్వర్లు, అజ్మీరా రామ్మూర్తి, పగడాల మల్లేష్, నాయకులు వరద నర్సింహారావు, బాగం ప్రసాద్, వెంకయ్య, బానోత్ రవి, నాగేశ్వరరావు పాల్గొన్నారు. కాగా, రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న 1,654 మంది అతిథి అధ్యాపకులను కొనసాగించచడంతో పాటు పెండింగ్ వేతనాలు ఇప్పించేలా కృషి చేయాలని అతిథి అధ్యాపకురాలు సాదిన్ని రజిని తదితరులు కూనంనేనికి వినతిపత్రం అందజేశారు.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని -
రిటైర్డ్ ఎంఈఓకు పలువురి నివాళి
తల్లాడ: తల్లాడకు చెందిన రిటైర్డ్ ఎంఈఓ బాజోజు శేషభూషణం సేవలు మరువలేనివని పలువురు కొనియాడారు. ఇటీవల మృతి చెందిన శేషభూషణం సంతాప సభ గురువారం నిర్వహించగా సీనియర్ పాత్రికేయులు కొండుభట్ల రామచంద్రమూర్తి నివాళులర్పించి మాట్లాడారు. తల్లాడ జెడ్పీహెచ్ఎస్లో శేషభూణంతో కలిసి తాను పదో తరగతి వరకు చదివానని, ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విద్యారంగానికి సేవ చేశారని తెలిపారు. అలాగే, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కళ్యాణం కృష్ణయ్య తదితరులు మాట్లాడగా.. చల్లా కృష్ణారావు, డాక్టర్ వేమిశెట్టి ఉపేందర్రావు, గుంటుపల్లి సత్యం, కోటమర్తి రాధాకృష్ణమూర్తి, సుబ్బ య్య, శరత్బాబు, సూరిబాబు, రామకృష్ణ, లక్ష్మ య్య, తిరుపతిరెడ్డి, శ్రీనివాసరావు, రఘుపతిరెడ్డి, ముత్యాలు, నర్సయ్య, లక్ష్మయ్య పాల్గొన్నారు. జాబ్మేళాలో 25మంది ఎంపికఖమ్మం రాపర్తినగర్: జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యాన ఖమ్మం టేకులపల్లిలోని ఐటీఐలో గురువారం జాబ్మేళా నిర్వహించారు. ఎంఆర్ఎఫ్ కంపెనీలో ఉద్యోగాలకు నిర్వహించిన ఈ మేళాకు 48 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వివిధ పరీక్షల అనంతరం 25మంది ఉద్యోగా లకు ఎంపిక చేసి నియామకపత్రాలు అందజేశారు. జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్. మాధవి, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
కరువు తీర్చిన ‘రామదాసు’
● మండు వేసవిలోనూ చెరువుల జలకళ ● పాలేరు జలాలతో తాగు, సాగునీటి కష్టాలకు చెక్తిరుమలాయపాలెం: వేసవి వచ్చిందంటే తాగునీటితో పాటు వర్షాలు కురిసే వరకు సాగునీటికి జిల్లాలోని తిరుమలాయపాలెం మండల ప్రజలు, రైతులు కష్టాలు ఎదుర్కొనేవారు. కానీ ఈసారి ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు, బావులు మండు వేసవిలోనూ నిండా నీటితో కళకళలాడుతున్నాయి. భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా పాలేరు రిజర్వాయర్ నుంచి అధికారులు ముందస్తుగా మండలంలోని అన్ని చెరువులకు నీరు నింపడంతో కష్టాలు తీరినట్లయింది. ఐదు దఫాలుగా విడుదల మండలంలో యాసంగి పంటలు సాగు చేసే రైతులు సాగునీటికి ఇబ్బండి పడకుండా రాష్ట్ర మత్రిపొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో అధికారులు ఐదుసార్లు భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా పాలేరు నీరు విడుదలచేశారు.దీంతో చెరువులు నిండగా.. సాగు పనులు పూర్తయ్యాక మే నెలలోనూ కళకళలాడుతున్నాయి. మండలంలోని బచ్చోడు, సుబ్లేడు,ఎదుళ్లచెరువు, పిండిప్రోలు, కొక్కిరేణిబీరోలు, పాతర్లపాడు తదితర గ్రామాల చెరువులు నిండుకుండల్లా మారాయి. దీంతో వేసవిలోతాగునీటికి, వచ్చే ఖరీఫ్లో సాగునీటి కష్టాలుతీరినట్లేనని ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదికాక చెరువుల్లో నీరు సమృద్ధిగా ఉడడంతో చేపల పెంపకానికి కూడా ఇబ్బందులుఉండవని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఖరీఫ్ సీజన్లో వర్షాలువచ్చేవరకు సాఫీగా పంటలు సాగు చేసుకోవచ్చనిఅన్నదాతలు చెబుతున్నారు.అందరికీ ఉపయోగమే.... భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా మండలంలోని అన్ని చెరువులను నింపారు. దీంతో ఎండాకాలంలోనూ చెరువులు, కుంటలు కళకళలాడుతున్నాయి. సాగు, తాగునీటికి ఇబ్బందులు తీరినట్లే. అలాగే, బావులు, బోర్లలో కూడా నీటిమట్టం పెరిగింది. అంతేకాక చేపల పెంపకానికి సమస్యలు ఉండవు. –పి.వెంకటనర్సయ్య, మత్స్యకారుడు, ఎదుళ్లచెరువు -
పగటి పూట మూడు ఏసీ బస్సులు
సత్తుపల్లిటౌన్: వేసవి దృష్ట్యా సత్తుపల్లి నుంచి హైదరాబాద్కు పగటి పూట మూడు రాజధాని ఏసీ బస్సులు నడిపిస్తున్నామని ఆర్టీసీ ఖమ్మం డిప్యూటీ రీజనల్ మేనేజర్ మల్లయ్య తెలిపా రు. ఈ బస్సులను ప్రయాణికులు సద్విని యో గం చేసుకోవాలని సూచించారు. సత్తుపల్లి బస్టాండ్ను సందర్శించిన ఆయన డిపోలో రికార్డుల తనిఖీ అనంతరం మాట్లాడారు. ప్రయాణికుల కోసం అన్ని బస్టాండ్లలో చల్లని తాగునీరు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. అలాగే, పాల్వంచ, కొత్తగూడెం, అన్నపురెడ్డిపల్లి ప్రయాణికుల కోసం సత్తుపల్లి బస్టాండ్లో అదనపు ప్లాట్ఫాంపై షెడ్ ఏర్పా టు చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ యు.రాజ్యలక్ష్మి, మెకానికల్ ఇంజనీర్ ఎస్.సాహితీ, అసిస్టెంట్ మేనేజర్ విజయశ్రీ, ఉద్యోగులు పాల్గొన్నారు. చెల్లని చెక్కు కేసులో ఆరు నెలల జైలుశిక్షఖమ్మం లీగల్: అప్పు తీసుకున్న వ్యక్తి జారీ చేసిన చెక్కు చెల్లకపోవడంతో ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం రెండో అదనపు ప్రధమ శ్రేణి కోర్టు న్యాయాధికారి ఏపూరి బిందుప్రియ గురువారం తీర్పు చెప్పారు. ఖమ్మం రోటరీనగర్కు చెందిన ధనావత్ గోవింద్ వద్ద శ్రీనగర్ కాలనీకి చెందిన నెల్లూరు సతీష్ రెండు సార్లు రూ.లక్ష చొప్పున 2018లో అప్పు తీసుకున్నాడు. ఈ అప్పు చెల్లించే క్రమాన 2019 సెప్టెంబర్ 24న రూ.2 లక్షలకు చెక్కు జారీ చేశాడు. అయితే, సతీష్ ఖాతాలో సరిపడా నగదు లేక చెక్కు తిరస్కరణకు గురైంది. దీంతో గోవింద్ తన తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. విచారణ అనంతరం సతీష్కు ఆరు నెలల జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.2లక్షలు చెల్లించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
ప్రేమ విఫలమైందని యువతి ఆత్మహత్య
సత్తుపల్లిటౌన్: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించటంతో మనస్తాపానికి గురైన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. పెనుబల్లి మండలం బ్రహ్మాళ్లకుంట గ్రామానికి చెందిన భూక్యా కల్యాణి(22) సత్తుపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వర్తిస్తోంది. కొంత కాలంగా పెనుబల్లి మండలానికి చెందిన యువకుడిని ప్రేమిస్తుండగా, ఇటీవల ఆయన పెళ్లికి నిరాకరించాడని తెలిసింది. దీంతో సత్తుపల్లిలోని మసీద్ రోడ్డులో అద్దెకు ఉంటున్న ఇంట్లో బుధవారం రాత్రి చీరతో ఉరి వేసుకు ని ఆత్మహత్యకు పాల్పడింది. ఈమేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై కవిత తెలిపారు.చికిత్స పొందుతున్న యువకుడు మృతివైరారూరల్: మద్యానికి బానిసైన ఓ యువకుడు పురుగుల మందు తాగగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని గన్నవరానికి చెందిన శీలం ఉపేందర్రెడ్డి(31) మద్యానికి బానిస కాగా తల్లిదండ్రులు మందలించారు. దీంతో 2వ తేదీన పురుగుల మందు తాగిన ఆయన ఖమ్మం ఆస్పత్రికి తరలింగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన తండ్రి వెంకటేశ్వరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వంశీకృష్ణ భాగ్యరాజ్ తెలిపారు. వీ.వీ.పాలెంలో వృద్ధుడు... రఘునాథపాలెం: మండలంలోని వీ.వీ.పాలెంకు చెందిన చీటి కోటయ్య(79) అనారోగ్యంతో బాధపడుతూ గడ్డి మందు తాగగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చికిత్స చేయించుకున్నా ఫలితం లేక మనస్థాపంతో బుధవారం గడ్డి మందు తాగాడు. ఈ విషయం గమనించిన బంధువులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కోటయ్య కుమారుడు మల్లయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. ఆటో బోల్తా, కూలీలకు గాయాలుకూసుమంచి: కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. కూసుమంచిలోని గంగాదేవి గుడి సమీపాన గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని తురకగూడెం గ్రామానికి చెందిన కూలీలు ట్రాలీ ఆటోలో మిర్చి ఏరేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా గంగాదేవి ఆలయ సమీపంలోకి రాగానే అటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఎనిమిది కూలీలకు గాయాలు కాగా, ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. అయితే, అక్కడ సరైన చికిత్స అందక ఇబ్బందులు ఎదురయ్యాయని క్షతగాత్రులు వాపోయారు. లారీని ఢీకొని యువతికి..వైరా: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువతి ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం పాతమున్సిపాలిటీ కార్యాలయంలోని లైబ్రరీ లో కాంట్రాక్ట్ లైబ్రేరియన్గా పనిచేస్తున్న అడపా భవాని వైరా మండలం గన్నవరంలో జరిగే స్నేహితురాలి వివాహానికి గురువారం ద్విచక్ర వాహనంపై వెళ్తోంది. వైరా బాలాజీనగర్ పాత శివాలయం సమీపాన ఆగిఉన్న లారీని వెన క నుంచి ఢీకొనడంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యా యి. స్థానికులు 108కు సమాచారం ఇచ్చినా అందుబాటులోకి రాకపోవడంతో అటుగా వస్తు న్న వైరా ఆర్ఐ ప్రసాద్, తదితరులు భవానీని తన కారులో వైరా పీహెచ్సీకి, అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. అయితే, భవానీ ద్విచక్ర వాహనం కొనుగోలుచేసి మూడు రోజులే అయినట్లు తెలుస్తుండగా ఇంతలోనే ప్రమాదం జరగడం గమనార్హం. -
ప్రభుత్వ బడుల్లో వేసవి శిబిరాలు
● ఈనెల 10నుంచి 46స్కూళ్లలో నిర్వహణ ● 4,600మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా కార్యాచరణనేలకొండపల్లి: రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 10 నుంచి 24వ తేదీ వరకు వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యాన ఈ శిబిరాల నిర్వహణకు ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులో దాగి ఉన్న నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. 46 ఉన్నత పాఠశాలలో... జిల్లాలోని 46 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉద యం 8నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శిబిరాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఒక్కో పాఠశాలలో కనీసం వంద మంది చొప్పున 4,600 మంది విద్యార్ధులకు శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. ఒక్కో కేంద్రంలో నలుగురు శిక్షకుల సాయంతో కనీసం నాలుగు అంశాల్లో తర్ఫీదు ఇవ్వాల్సి ఉంటుంది. కాగా, శిక్షణ సమయాన విద్యార్థులకు స్నాక్స్ ఇవ్వనుండగా, శిక్షకులకు గౌరవ వేతనం అందిస్తారు. ప్రవేశాలు ఇలా.... శిబిరాల్లో ప్రవేశానికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కు తొలి ప్రాధాన్యత ఇస్తారు. మొదటి రోజు ఆధార్కా ర్డు, పాఠశాల వివరాలతో హాజరైతే ప్రవేశం కల్పిస్తా రు. ఆసక్తి కలిగిన విద్యార్థులు వచ్చేలా ఉపాధ్యాయులు ఇప్పటికే సమాచారం సమాచారం ఇస్తున్నారు. అంశాలు ఇవే... మండల కేంద్రాలో వనరులు, శిక్షకులు సహా ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని శిక్షణ అంశాలను ఎంపిక చేశారు. చదరంగం, క్యారమ్స్, స్కి ప్పింగ్, వైకుంఠపాళి తదితర ఆటలే కాక, డ్రాయింగ్, పెయింటింగ్, సాధన కాగితాలతో బొమ్మలు తయారు చేయడంపై శిక్షణ ఉంటుంది. అంతేకాక చిన్నచిన్న సైన్స్ ప్రయోగాలు, కర్రసాము, యోగా, నృత్యం, సంగీతం, స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్ బేసిక్స్ నేర్పిస్తారు. సద్వినియోగం చేసుకోవాలి.. తొలిసారిగా గ్రామీణ విద్యార్థులకు ఉపయోగపడేలా మండల కేంద్రాల్లో వేసవి శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలి. తద్వారా ఆసక్తి ఉన్న అంశాల్లో నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు. – సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖాధికారి -
వేలంపాటలో రూ.5.21లక్షల ఆదాయం
కారేపల్లి: మండలంలోని ఉసిరికాయలపల్లి శ్రీ కోటమైసమ్మతల్లి ఆలయంలో వివిధ పనులకు గురువారం వేలం నిర్వహించారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ అనిల్కుమార్ ఆధ్వర్యాన దుకాణాల సముదాయం కేటాయింపు, కొబ్బరి చిప్పలు పోగు చేసుకోవడం, టెంట్ సామగ్రి అద్దెకు ఇచ్చేందుకు వేలం నిర్వహించగా, కొబ్బరి చిప్పలు పోగు చేసుకునే హక్కు గుగులోతు నవీన్ రూ.15,500తో దక్కించుకున్నారు. అలాగే, షాపులు ఒక్కొక్కటి గత ఏడాది రూ.28,800కి ఇవ్వగా, ఈసారి రూ.31,800 ధర పలికాయి. తద్వారా ఆరు షాపుల ద్వారా రూ.1,90,800, టెంట్ సామగ్రి సరఫరాను గుగులోతు దస్రు రూ.3.15లక్షలతో దక్కించుకున్నాడు. మొత్తంగా రూ.5,21,300 ఆదాయం నమోదైందని ఈఓ వేణుగోపాలాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పగడాల మోహన్కృష్ణ, సత్యం తదితరులు పాల్గొన్నారు. -
మార్క్సిజంతోనే సమస్యల పరిష్కారం
రాఘవయ్య సంస్మరణ సభలో తమ్మినేని వీరభద్రంఖమ్మంసహకారనగర్: ప్రపంచంలోని సమస్త మానవాళి సమస్యలకు పరిష్కారం మార్క్సిజమేనని, ఆ మార్క్సిజాన్ని నమ్ముకుని రావిళ్ల రాఘవయ్య తుదికంటా పోరాడారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఖమ్మం శ్రీనివాసనగర్లో బుధవారం జరిగిన యూటీఎఫ్ వ్యవస్థాపకులు, జిల్లా పూర్వ అధ్యక్షుడు రాఘవయ్య సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. ఉన్నత ఆదర్శాలను జీవితాంతం కొనసాగించిన రాఘవయ్యను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ రంజాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుర్గాభవానితో పాటు పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు, ఎర్రా శ్రీనివాసరావు, పారుపల్లి నాగేశ్వరరావు, రాంబాబు, బి.రాందాస్, ఎం.నర్సయ్య, పి.సురేశ్, వలీ, యలమద్ది వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ లబ్ధిదారులకు సరుకుల పంపిణీ
నేలకొండపల్లి: ఎండల తీవ్రత నేపథ్యాన అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించారు. గతంలోనూ సెలవులు ప్రకటించినప్పటికీ నెలలో వంతుల వారీగా టీచర్, ఆయా విధులు నిర్వర్తిస్తూ లబ్ధిదారులకు పోషకాహారం వండి వడ్డించేవారు. ఈసారి అందుకు భిన్నంగా నెలకు సరిపడా సరుకులు పంపిణీ(టేక్ హోం రేషన్) చేయాలని ప్రభు త్వం ఆదేశించింది. దీంతో చిన్నారులకు కోడిగుడ్లు, బాలామృతం, బాలింతలు, గర్భిణులకు బియ్యం, పప్పు, నూనెతో పాటు పాలు, గుడ్లు అందిస్తున్నా రు. జిల్లాలోని ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,840 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధి లో ఆరునెలల నుంచి ఆరేళ్ల వరకు పిల్లలు 54,712 మంది, గర్భిణులు, బాలింతలు 12,715 మంది ఉండగా, సూపర్వైజర్ల పర్యవేక్షణలో సరు కులు అందిస్తున్నామని జిల్లా సంక్షేమాధికారి రాంగోపాల్రెడ్డి తెలిపారు. -
సర్టికల్ స్ట్రైక్స్ అవసరం
మిలిటెంట్ గ్రూపులన్నీ మన సైనికులు, పౌరులపై దాడులకు దిగుతున్నాయి. ఇలాంటి సమయాల్లో సర్జికల్ స్ట్రైక్ అవసరం. అయితే, ఆపరేషన్ సింధూర్తో పాక్కు ఆందోళన ఎదురవుతుంది. అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకొచ్చి పాక్ను దెబ్బతీయాలి. – మెహబూబ్ సుబాని, ఖమ్మంసైన్యంతో కలిసేందుకు రెడీ భారత్ యుద్ధం చేయాల్సి వచ్చి, మాజీ సైనికులను ఆహ్వానిస్తే పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా. ప్రస్తుతం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాక్కు గుణపాఠం. అమాయకులను బలిగొంటున్న ఉగ్రవాదులను అణచివేయాల్సిన అవసరముంది. – కరివేద రాజేష్, ఖమ్మంఇదే సరైన సమాధానం ఉగ్రవాదులను అడ్డు పెట్టుకుని కవ్వింపు చర్యలకు దిగుతున్న పాక్కు ఇది సరైన సమాధా నం. ఆ దేశానికి పాఠం చెప్పేలా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గొప్పది. ఆర్మీ నుండి బయటకొచ్చి ఎనిమిదేళ్లయినా మళ్లీ ఆదేశాలు వస్తే వెంటనే వెళ్తా. – బోయపాటి రామకృష్ణ, ఖమ్మం -
ఉగ్రవాదాన్ని తుదముట్టించాల్సిందే
ఖమ్మంమయూరిసెంటర్: పహెల్గాం దాడి తర్వాత దేశంలో యుద్ధ వాతావరణం నెలకొందని, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని తుదముట్టించాల్సిందేనని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు స్పష్టం చేశారు. ఖమ్మంలో బుధవారం జరిగిన సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పహెల్గాం ఘటన తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంటోందని తెలిపారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. అదే సమయాన ఉద్రిక్తతను మనోన్మాదులు అవకాశంగా తీసుకోకుండా చూడాలని కోరారు. కాగా, ప్రధాని మోదీ పేదలు, వ్యవసాయ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి సంపన్న వర్గాలపై దృష్టి సారించారని ఆరోపించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో జాప్యాన్ని నివారించాలని డిమాండ్ చేశారు. అలాగే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం వ్యాఖ్యలు చర్చనీయాంశం కాగా, భవిష్యత్లో ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని హేమంతరావు పేర్కొన్నారు. సీపీఐ శత వసంతాల ముగింపు సభ ఖమ్మంలో జరగనుండగా, ఆలోపే మండల, జిల్లా మహాసభలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో నాయకులు దండి సురేశ్, మహ్మద్ మౌలానా, బెజవాడ రవి తదితరులు పాల్గొన్నారు. సీపీఐ జాతీయ సమితి సభ్యుడు హేమంతరావు -
మా ధాన్యం ఎప్పుడు కాంటా వేస్తారు?
తల్లాడ: తల్లాడ మండలం కుర్నవల్లి పరిసర గ్రామాల్లోని నెల రోజులుగా కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. కుర్నవల్లిలోని కేంద్రానికి 120 లారీల మేర ధాన్యం తీసుకురాగా.. కాంటాలో జాప్యంతో ఇంకా 80 లారీల ధాన్యం మిగిలిపోయింది. ఇంతలోనే అకాల వర్షాలతో రైతులు పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నా.. గన్నీ సంచులు, లారీలు లేవని అధికారులు తాత్సారం చేస్తున్నారు. దీంతో రైతులు బుధవారం మధ్యాహ్నం మండుటెండలో తల్లాడ చేరుకుని ప్రధాన రహదారిపై ట్రాక్టర్లు అడ్డుగా పెట్టి రాస్తారోకోకు దిగారు. ఈమేరకు అటు కల్లూరు, ఇటు వైరా రోడ్లలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ట్రెయినీ ఎస్ఐ వెంకటేశ్, సిబ్బంది చేరుకుని వారికి నచ్చచెప్పినా తహసీల్దార్ వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పే వరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. ఈక్రమాన బలవంతంగా రైతులను లేపే ప్రయత్నం చేయగా ఇరువర్గాల వాగ్వాదంతో ఉద్రిక్తత నెలకొంది. ఇంతలోనే తహసీల్ధార్ సురేష్కుమార్ చేరుకుని పౌర సరఫరాల సంస్థ డీఎం శ్రీలత, ఆర్డీఓ రాజేందర్గౌడ్తో ఫోన్లో మాట్లాడారు. ఒకటి, రెండు రోజుల్లో 40లారీలు, సరిపడా గన్నీ సంచులు పంపిస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, రైతులు శీలం సత్యనారాయణరెడ్డి, కళ్యాణపు కృష్ణయ్య, కట్టా దర్గయ్య, షేక్ మస్తాన్, చల్లా నాగేశ్వర్రావు, ఎస్.వీ.రాఘవులు, కట్టా కృష్ణారావు, చలపతిరెడ్డి, మాధవరావు, లక్ష్మారెడ్డి, బద్దం నాగిరెడ్డి, అయిలూరి సత్యనారాయణరెడ్డి, వరకిషోర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.తల్లాడలో రైతుల రాస్తారోకో -
మేము సైతం..
భ రతమాత సేవలో..ఖమ్మంమయూరిసెంటర్: భరతమాతకు సేవచేసే అవకాశం వస్తే కదనరంగంలోకి దూకేందుకు ఎల్లవేళలా సిద్దంగా ఉంటామని మాజీ సైనికులు స్పష్టం చేశారు. దేశ రక్షణతో పాటు శత్రుమూకలకు బుద్ధి చెప్పేందుకు తమను పిలిస్తే గొప్పగా భావిస్తామని తెలిపారు. పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద శిబిరా లపై భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో దాడులు చేయడంపై మాజీ సైనికులు హర్షం వ్యక్తం చేశారు. ఏళ్లుగా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతున్నా భారత్ సంయమనం పాటించిందని.. ఇప్పు డు అమాయకులను కాల్చిచంపడంతో ‘ఆపరేషన్’కు దిగడం సరైన చర్య అని అభిప్రాయపడ్డారు. ఇదికాక యుద్ధం చేయాల్సి వచ్చినా భారత సైన్యం సిద్ధంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యాన జిల్లాలోని మాజీ సైనికులను పలకరించగా తమ అభిప్రాయాలు వెల్లడించారు.● యుద్ధం వస్తే పాల్గొనేందుకు సిద్ధం ఎప్పుడు పిలుపు వచ్చినా వెళ్తామంటున్న మాజీ సైనికులు ‘ఆపరేషన్ సిందూర్’పై జిల్లా వాసుల్లో హర్షాతిరేకాలు -
శత్రుదేశాలకు ఇది హెచ్చరిక..
మహిళల నుదుటి సింధూరం ఆరకముందే పాక్లోని ఉగ్రశిబిరాలను నిర్మూలించడం మామూలు విషయం కాదు. ఇది శతృదేశాలకు హెచ్చరిక. నేను సరిహద్దులో ఏడేళ్లు విధులు నిర్వర్తించా. మళ్లీ యుద్ధం వచ్చి నన్ను పిలిస్తే గర్వంగా భావిస్తా. – బెందు వీరబాబు, బాణాపురంఇది భారత విజయం పాక్లోని తీవ్రవాద స్థావరాలపై మన సైన్యం దాడి చేయడం గొప్ప విజయం. సామాన్యులను హతమార్చిన తీవ్రవాదులకు ఇది గుణపాఠం. పాకిస్తాన్ లేదా తీవ్రవాదులు భారత్వైపు చూస్తే మన సైన్యం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది. – కంచర్ల ప్రసాద్, గొల్లెనపాడుముల్లును ముల్లుతోనే తీసినట్లు.. పహల్గామ్లో ప్రాణాలు కోల్పోయిన అమాయక కుటుంబాలకు ఆపరేషన్ సిందూర్తో ఊరట లభించింది. ముల్లును ముల్లుతోనే తీసినట్లు పాక్ తీవ్రవాదులకు మన సైన్యం గట్టి జవాబు ఇచ్చింది. దేశంమొత్తం సైన్యానికి అండగా నిలవాల్సిన సమయం ఇది. – అమరనేని మురళి, గొల్లెనపాడు -
మిర్చి ధర పతనం
● రూ.10 వేలకు పడిపోయిన మోడల్ ధర ● గరిష్ట ధర రూ.13 వేలు దాటుతున్నా కొందరికే.. ● నాణ్యత పేరిట తగ్గిస్తున్న వ్యాపారులు ఖమ్మంవ్యవసాయం: మిర్చి ధర రోజురోజుకూ మరింతగా పతనమవుతోంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గత వారం వరకు మిర్చి జెండాపాట ధర రూ.13,500 పలకగా, కొద్ది రోజులుగా రూ.13 వేల నుంచి రూ.12,850 మధ్య కొనసాగుతోంది. ఇక రూ.12 వేల వరకు పలికిన మోడల్ ధర కొద్ది రోజులుగా రూ.10 వేలు దాటడం లేదు. మార్కెట్లో వ్యాపారులు అధికంగా మోడల్ ధరతోనే కొనుగోలు చేస్తారు. కనిష్ట ధరలు మరింత దయనీయంగా ఉన్నాయి. ఇది రూ.5,800కు మించి దాటకపోవడం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే దయనీయం మిర్చి ధర గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బాగా తగ్గింది. గత ఏడాది సీజన్లో క్వింటా మిర్చి రూ.20 వేల వరకు పలకగా.. ఈ ఏడాది సీజన్ ఆరంభం నుంచే ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. తొలినాళ్లలో రూ.15,500 వరకు ధర పలకగా, క్రమక్రమంగా పతనమవుతోంది. మార్చి నుంచి మరింత పతనం దిశగా కొనసాగుతోంది. ఖమ్మం మార్కెట్లో తేజా రకం మిర్చి కొనుగోళ్లకు పేరు ఉండగా.. ఇక్కడి వ్యాపారులు చైనా, తదితర దేశాలకు ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం మార్కెట్కు 40 నుంచి 50 వేల బస్తాల మిర్చి వస్తోంది. మోడల్ ధరకే అధిక కొనుగోళ్లు మార్కెట్లో జెండా పాట విధానం ద్వారా మిర్చికి ధర ఖరారు చేస్తారు. పంటకు డిమాండ్, నాణ్యతా ప్రమా ణాల పేరిట వ్యాపారులు మోడల్ ధరతోనే అధికంగా కొనుగోలు చేస్తున్నారు. జెండాపాట ధర తో పోలిస్తే దాదాపు రూ.3వేలు తగ్గిస్తుండగా.. రూ. 10 వేలు అంతకన్నా తక్కువ ధరతోనే కొనుగోలు చేస్తుండడంతో రైతులకు నష్టం ఎదురవుతోంది. చైనా నుంచి డిమాండ్ లేకనే.. తేజా రకం మిర్చి ధర చైనాలో ఉన్న డిమాండ్పై ఆధారపడి ఉంటుంది. ఆ దేశం నుంచి ఆర్డర్ల ఆధారంగా ఎగుమతిదారులు ఇక్కడ ధర నిర్ణయిస్తారు. కానీ, ఈ ఏడాది చైనా నుంచి ఆశించిన స్థాయిలో ఆర్డర్లు లేక తేజామిర్చికి డిమాండ్ పడిపోయింది. అంతేకాక ఇప్పు డు చివరి కోతలు కావడంతో నాణ్యత లేకపోవడం ఇంకో కారణంగా చెబుతున్నారు. కానీ, దీన్ని సాకుగా చూపుతూ పంట నాణ్యతగా ఉన్నా వ్యాపా రులు ధరలో మరింతగా కోత పెడుతున్నారు. ఈ మేరకు ధర గిట్టుబాటు కాకపోవడంతో పలువురు రైతులు నాణ్యమైన పంటను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేస్తున్నారు. ఈ ఏడాది సీజన్లో ఖమ్మం మార్కెట్లో మిర్చి ధరలు తేదీ గరిష్ట ధర మోడల్ ధర (రూ.ల్లో) (రూ.ల్లో) నవంబర్ 6 18,000 17,500 డిసెంబర్ 9 16,500 16,000 జనవరి 17 15,500 15,000 ఫిబ్రవరి 2 14,200 13,700 మార్చి 18 13,700 12,000 ఏప్రిల్ 2 13,300 12,000 ఏప్రిల్ 15 13,500 11,000 ఏప్రిల్ 29 13,400 10,500 ఏప్రిల్ 30 12,850 10,000 మే 7 13,350 10,000 -
ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడులు అభినందనీయం
ఖమ్మంమయూరిసెంటర్: పాకిస్తాన్లోని ఉగ్రశిబిరాలపై భారత్ జరిపిన వైమానిక దాడి అభినందనీయమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. ఖమ్మంలోని పార్టీజిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి మాట్లాడారు. దశాబ్దాలుగా పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుండగా, కొన్ని దేశాలు సహకరిస్తున్నాయని తెలిపారు. ఉగ్రవాదం లేని ప్రపంచమే బీఆర్ఎస్ విధానం అయినందున భారత సైన్యం చేపట్టిన చర్యలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. భవిష్యత్లోనూ సైన్యానికి తమ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని తెలిపారు. కాగా, ఈనెల 9న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తల్లాడలో జరిగే రాయల శేషగిరిరావు విగ్రహావిష్కరణకు హాజరవుతున్నారని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బానోతు చంద్రావతి, కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణంతో పాటు ఖమర్, బెల్లం వేణుగోపాల్, నాగరాజు, భాషబోయిన వీరన్న, ఉప్పల వెంకటరమణ, బిచ్చల తిరుమల్రావు, బొమ్మెర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ -
ఇదే మెడికల్ కాలేజీ !
ఖమ్మంఅర్బన్: రఘునాథపాలెం బైపాస్లోని బల్లేపల్లి వద్ద ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవన నిర్మాణాలకు గురువారం శంకుస్థాపన చేయనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొననుండగా.. శంకుస్థాపన తర్వాత సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈమేరకు కార్పొరేట్ తరహాలో నిర్మించే భవనం నమూనాను విడుదల చేశారు. కాగా, సభ ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవా రం సాయంత్రం పరిశీలించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ యాకూబ్, ఈఈ యుగంధర్ పాల్గొన్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఖమ్మంవైద్యవిభాగం: ప్రభుత్వ మెడికల్ శంకుస్థాపనకు హాజరవుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా పెద్దాస్పత్రిని కూడా తనిఖీ చేయనున్నారు. ఆతర్వాత కలెక్టరేట్లో వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షిస్తారు. ఈ సందర్భంగా పెద్దాస్పత్రిలో ఏర్పాట్లను కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఆదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి బుధవారం పరిశీలించారు. ఆస్పత్రి పరిసరాలను శుభ్రం చేయించడమే కాక శాఖకు సంబంధించి నివేదికలు సిద్ధం చేయాలని అధికారులు, వైద్యులకు సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్కుమార్, ఈఈ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. -
పహ ల్గాం బాధితుల కెరటమే ‘సిందూర్’
వైరా: పహ ల్గాం ఉగ్ర దాడిలో సర్వం కోల్పోయిన ఆడపడుచుల కన్నీటి నుంచి రాలిపడిన కెరటమే ‘ఆపరేషన్ సిందూర్’అని మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నాయకుడు పొంగులేటి సుధాకర్రెడ్డి అన్నారు. పాకిస్తాన్ టెర్రరిస్టు స్థావరాలపై దాడి విజయవంతమైన నేపథ్యాన బుధవారం వైరాలోని సాయిబాబా దేవాలయంలో సైనికులకు మనోధైర్యం కలిగించాలని యాగం చేశారు. అనంతరం ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశాక బీజేపీ మండల అధ్యక్షుడు మనుబోలు వెంకటకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన కులగణన అవగాహన సదస్సులో మాట్లాడారు. దేశ ప్రజల జోలికొస్తే ఎంతటి చర్యలకై నా వెనకాడేది లేదని ప్రధాని మోదీ నిరూపించారని తెలిపారు. మోదీ స్ఫూర్తిగా తీసుకుని బీజేపీ శ్రేణులు దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, నాయకులు సన్నె ఉదయ్ప్రతాప్, నున్నా రవి, మందడపు సుబ్బారావు, అల్లిక అంజయ్య, దొడ్డా అరుణ, పమ్మి అనిత, వీరవెల్లి రాజేశ్గుప్త, నల్లగట్ల ప్రవీణ్, రవి రాథోడ్, పాల్గొన్నారు.బీజేపీ నాయకుడు పొంగులేటి సుధాకర్రెడ్డి -
నెమళ్ల కోసం మందు పెట్టిన దుండగులు
ఖమ్మంరూరల్: మండలంలోని చింతపల్లిలో పొలాల వద్ద నెమళ్ల కోసం గుర్తుతెలియని వ్యక్తులు మందు పెట్టగా, ఆ మందు తినడంతో నాలుగు ఆవులు మృతి చెందాయి. గ్రామానికి చెందిన కొందరు రైతులు తమ ఆవులను మేత కోసం విడిచి పెట్టారు. ఆ ప్రాంతంలో నెమళ్లు తిరుగుతున్నాయనే సమాచారంతో దుండగులు అక్కడ ఉన్న గడ్డిపై మందు చల్లారు. అదే ప్రాంతానికి వెళ్లిన నాలుగు పశువులు గడ్డి మేయడంతో మృతి చెందాయి. ఈ విషయమై వెటర్నరీ వైద్యుడు హరీశ్ను వివరణ కోరగా విషపూరితమైన గడ్డి తినడంతోనే ఆవులు మృతి చెందాయని తెలిపారు. అలాగే, రైతులు వేసవిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కువ మోతాదులో అన్నం, వడ్లు, బియ్యం, మొక్కజొన్న పెడితే అరగక పొట్ట ఉబ్బి పశువులు మృతి చెందే అవకాశం ఉందని తెలిపారు. విత్తన ఏజెంట్ మోసం చేశాడని రైతుల ఆగ్రహం కొణిజర్ల: పంటకు మంచి ధర చెల్లిస్తామని చెప్పి, ఇప్పుడు ముఖం చాటేసిన కంపెనీ ప్రతినిధులు, ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరారు. ఈ సందర్భంగా బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాక వారు వివరాలు వెల్లడించారు. కొణిజర్ల మండలం తీగలబంజరకు చెందిన ఓ వ్యక్తి రెండు కంపెనీలకు చెందిన ఆడ, మగ రకం మొక్కజొన్న విత్తనాలను కొణిజర్ల, వైరా, కారేపల్లి, జూలూరుపాడు మండలాల్లో పలు గ్రామాల రైతులకు ఇచ్చాడు. కానీ, సరైన దిగుబడి రాకపోవడంతో ఆందోళన చేయగా పరిహారం ఇప్పిస్తానని కాగితాలు రాసి ఇచ్చాడు. ఆ తర్వాత కంపెనీకి మక్కలు తరలించినా రైతులకు డబ్బులు ఇవ్వకకపోగా ఏజెంట్ కానరావడం లేదు. దీంతో మంగళవారం అర్ధఽరాత్రి ఆయన ఇంటికి వచ్చినట్లు తెలుసుకుని లాలాపురం వాసులు ఆందోళన చేయగా పోలీసులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు బుధవారం పలువురు రైతులు బుధవారం పోలీస్స్టేషన్కు వచ్చి తమకు డబ్బులు ఇప్పించాలని ఎస్ఐ జి.సూరజ్ను కోరారు. కంపెనీ ప్రతినిధులను గురువారం పిలిపించాక చర్యలు తీసుకుంటానని తెలిపారు. అయితే, సదరు ఏజెంట్ ముందుగానే డబ్బు తీసుకున్నాడని కంపెనీ ప్రతినిధులు చెబుతుండగా, తనకు రూ.25 లక్షలు కంపెనీ నుంచి రావాలని ఏజెంట్ చెప్పినట్లు సమాచారం. 12.9 కేజీల ఎండు గంజాయి స్వాధీనం ఖమ్మంరూరల్: మండలంలోని రెడ్డిపల్లిలో డంపింగ్యార్డు పక్కన గుర్తు తెలియని వ్యక్తులు దాచిన 12.9 కేజీల ఎండు గంజాయిని ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని ఎవరు దాచారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే అంశంపై విచారణ చేస్తున్న ట్లు సీఐ సీహెచ్.శ్రీనివాస్ తెలిపారు. కాగా, ఈ గంజాయి విలువ రూ.2 లక్షలు ఉంటుందని వెల్లడించారు. తనిఖీల్లో ఉద్యోగులు బాలు, విజయ్కుమార్, సుధీర్, హరీశ్, హన్మంతరావు, వెంకట్, స్వరూప తదితరులు పాల్గొన్నారు.నాలుగు ఆవులు మృతి -
తలసేమియా పిల్లలకు అండగా ఉంటాం..
ఖమ్మంవైద్యంవిభాగం: తలసేమియాతో బాధపడుతున్న పిల్లలకు తల్లిదండ్రులతోపాటు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నందున తల్లిదండ్రులు ఆవేదన చెందొద్దని డీఎంహెచ్ఓ కళావతిబాయి సూచించారు. సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యాన ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని ఖమ్మంలోని ఐఎంఏ హాల్లో బుధవారం నిర్వహించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. జిల్లాలో తలసేమియా బాధిత చిన్నారుల గుర్తింపునకు సర్వే జరుగుతోందని, పాజిటివ్గా తేలిన వారికి చికిత్స అందిస్తామని తెలిపారు. అయితే, తలసేమియా నిర్మూలన, పిల్లల కోసం రక్తదానం చేసేందుకు అందరూ ముందుకు రావాలని సూచించారు. ఏఆర్ ఏసీపీ ఎన్.నర్సయ్య మాట్లాడుతూ.. తలసేమియా చిన్నారులకు సేవ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఒలీవ్ క్రిప్టో సిస్టమ్స్ సీఈఓ జి.భారవి మాట్లాడుతూ.. తలసేమియా చిన్నారులకు అండగా నిలిచేలా సంకల్ప సంస్థ కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతానని తెలిపారు. ఈ మేరకు జేఈఈ మెయిన్స్ ఎస్టీ కేటగిరీలో ఆల్ ఇండియా 21వ ర్యాంక్ సాధించిన తలసేమియా చిన్నారి అర్జున్, పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను సత్కరించారు. సంస్థ బాధ్యురాలు ప్రొద్దుటూరి అనిత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తలసేమియా ప్రోగ్రాం ఆఫీసర్ వెంటరమణ, వైద్యులు డి.నారాయణమూర్తి, జంగాల సునీల్కుమార్, కొల్లి అనుదీప్, సాయిభార్గవ్, జాబిశెట్టి రేణుక, లక్ష్మీదీపతో పాటుపోలా శ్రీనివాస్, శాంతి, పులిపాటి ప్రసాద్, పావని, కస్తూరి, పి.రవిచంద్ర, పి.ఉదయ్భాస్కర్, పి.వంశీకిరిటి, పి.ప్రియ, ఎన్.ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ కళావతిబాయి, ఏసీపీ నర్సయ్య -
టీపీసీసీ లీగల్ సెల్లో జిల్లా న్యాయవాది
ఖమ్మంలీగల్/ఎర్రుపాలెం: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ హ్యూమన్ రైట్స్, ఆర్టీఐ కన్వీనర్గా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడుకు చెందిన న్యాయవాది కోన చంద్రశేఖర్గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రశేఖర్గుప్తా గతంలో ఖమ్మం బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ రఘురాంరెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయస్థాయి పోటీలకు పందిళ్లపల్లి విద్యార్థినిచింతకాని: మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో ఈ నెల 9వ తేదీ నుంచి జరగనున్న 51వ జాతీయస్థాయి జూనియర్ కబడ్డీ పోటీల్లో చింతకాని మండలం పందిళ్లపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని కేతవరపు దీక్షిత పాల్గొననుంది. తెలంగాణ రాష్ట్ర బాలికల జట్టుకు ఆమె ఎంపికై ందని పాఠశాల హెచ్ఎం ఎన్.శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా దీక్షితను హెచ్ఎంతో పాటు పీడీ కృష్ణారావు, ఉపాధ్యాయులు అభినందించారు. మానవత్వం చాటుకున్న యువకులుతల్లాడ: మండలంలోని మిట్టపల్లిలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో నలుగురు మృతి చెందగా, ఇంకో ఇద్దరు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈమేరకు మిసైల్ మ్యాన్ హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ ఆధ్వర్యాన సేకరించిన రూ.లక్ష ఆర్థిక సాయాన్ని బుధవారం అందించారు. ప్రమాద బాధితుడు గుత్తికొండ వినోద్ను పరామర్శించి ఆయన భార్య రేవతికి నగదు అందజేశారు. సంస్థ బాధ్యులు వడ్డాణపు నరేశ్, పొన్న శ్రీకాంత్, చిట్టెం బ్రహ్మం, అజయ్, మారేశ్, పెంట్సాహెబ్, బాలు పాల్గొన్నారు. యూటీ పనులు ప్రారంభంకూసుమంచి: గతేడాది వచ్చిన వరదలతో పాలేరు రిజర్వాయర్ ఔట్ఫ్లో కాల్వ (ఎడమ కాల్వ) కట్టకు మత్స్య పరిశోధనా కేంద్రం సమీపాన యూటీ (అండర్ టన్నెల్) వద్ద భారీ గండి పడింది. అప్పట్లో గండిని తాత్కాలికంగా పూడ్చివేసిన అధికారులు, ప్రస్తుతం కొత్తగా యూటీ నిర్మాణ పనులు మొదలుపెట్టారు. రూ.10 కోట్ల వ్యయంతో చేపడుతున్న పనులను బుధవారం జల వనరుల శాఖ ఎస్ఈ మంగళంపూడి వెంకటేశ్వర్లు పరిశీలించారు. కాల్వ ద్వారా ఖమ్మం నగరానికి విడతల వారీగా తాగునీరు సరఫరా చేయనుండగా ప్రస్తుత పనులతో ఏమైనా అవాంతరాలు ఎదురవుతాయా అని కేఎంసీ ఇంజనీర్ రంజిత్తో ఎస్ఈ చర్చించారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా నీటి సరఫరా జరిగేందుకు చేపట్టాల్సిన ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని నిర్ణయించారు. జల వనరుల శాఖ ఈఈ అనన్య, డీఈఈ అనన్య, డీఈఈలు మాధవి, మధు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు పరిశీలన
తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం మండలంలోని దమ్మాయిగూడెం, ఎదుళ్లచెరువు, సుబ్లేడుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యవసాయాధికారి ధనసిరి పుల్లయ్య బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం తేమశాతం, కాంటా, రవాణాపై ఆరా తీశారు. నిర్దేశిత తేమ నమోదు కాగానే కాంటా వేసి కేటాయించిన మిల్లులకు తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. అకాల వర్షాల నేపథ్యాన రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని డీఏఓ సూచించారు. ఏఓ సీతారాంరెడ్డి, పీఏసీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. విద్యుత్ అభివృద్ధి పనులపై సమీక్ష ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో విద్యుత్ సంబంధిత అభివృద్ధి పనులపై ఆ శాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్షించారు. ఎన్పీడీసీఎల్ ఖమ్మం ఎస్ఈ ఈ.శ్రీనివాసాచారి, నోడల్ అధికారి నాగప్రసాద్ పర్యవేక్షణలో వీసీ నిర్వహించగా, వేసవి డిమాండ్కు అనుగుణంగా అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, 33 కేవీ ఇంటర్ లింకింగ్ పనులు, విద్యుత్ భద్రతా వారోత్సవాలు, 33 కేవీ, 11 కేవీ లైన్ల నిర్వహణపై చర్చించారు. ఈ సమావేశంలో వివిధ విభాగాల డీఈలు బాబురావు, భద్రుపవర్, నంబూరి రామారావు, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, రాములు, హీరాలాల్, ఏడీఈలు పాల్గొన్నారు. ఏఎంబీఐఎస్పై పోలీసులకు శిక్షణ ఖమ్మంక్రైం: ఆటోమేటెడ్ మల్టీ మోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్(ఏఎంబీఐఎస్)పై పోలీసు ఉద్యోగులకు ఖమ్మంలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా క్లూస్టీమ్ ఇన్స్పెక్టర్ నరేష్ మాట్లాడుతూ నేరం జరిగిన ప్రదేశం నుంచి నుండి నిందితుల వేలిముద్రలు తదితర ఆధారాల సేకరణ, ఐరిస్ స్కాన్ డేటా ఆధారంగా నిందితుల గుర్తింపునకు ఏఎంబీఐఎస్ ఉపయోగపడుతుందని ఎలిపారు. కొత్త క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ అమల్లో భాగంగా ఈ వ్యవస్థను అప్గ్రేడ్ చేశారని చెప్పారు. నేరం జరిగిన ప్రదేశంలో వేలిముద్రల ఆధారంగా నేరస్తుల గుర్తింపు నూరు శాతం కచ్చితత్వంతో ఉంటుందని వెల్లడించారు. వెదురు ఉత్పత్తుల ప్రదర్శన సత్తుపల్లిటౌన్: తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పడి పదేళ్లు అవుతున్న సందర్భంగా సత్తుపల్లి వెదురు డిపోలో బుధవారం దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెదురు విత్తనాలు, ఉత్పత్తులను ప్రదర్శించారు. అనంతరం 33లాట్ల వెదురు వేలం వేయగా, రూ.15.64 లక్షల ఆదాయం నమోదైంది. సత్తుపల్లి, పాల్వంచ డివిజనల్ మేనేజర్లు గణేష్, కవిత, డాక్టర్ శ్రీనివాస్, రేంజర్లు నాగరాజు, చంద్రకళ, బ్రహ్మచారి, గోపిప్రసాద్, సిద్ధార్థకుమార్ తదితరులు పాల్గొన్నారు. 10లోపు దరఖాస్తు చేసుకోండి ఖమ్మం సహకారనగర్: త్వరలో ఏర్పాటయ్యే ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ సెంటర్ల(ఈడీసీ) లో పని చేసేందుకు ఆసక్తి ఉన్న ఈనెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఎంఎస్ఎంఈల పనితీరులో వేగం పెంచేలా జిల్లా పరిశ్రమల కేంద్రం వద్ద ఈడీసీలు ఏర్పాటుచేయనున్నట్లు తెలి పారు. చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల మార్కెట్ పెంపు, రుణాల సమీకరణ, అభివృద్ధికి ఇవి తోడ్పాటునిస్తాయని, ఇందులో మేనేజ ర్, అసిస్టెంట్ మేనేజర్ను నియమించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి, అర్హతలు ఉన్నవారు 10వ తేదీలోగా దరఖాస్తులను సమర్పించాలని, వివరాలకు www.nimsme.gov.in వెబ్సైట్లో లేదా కలెక్టరేట్లోని పరిశ్రమల శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. -
కష్టపడే వారికే పార్టీ పదవులు
● కాంగ్రెస్ మహా వృక్షం.. అందరికీ నీడనిస్తుంది ● మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికూసుమంచి: ‘కాంగ్రెస్ పార్టీ అనేది వటవృక్షం.. ఈ పార్టీకి ఎత్తుపల్లాలు, విజయాలు సహజమే.. అయినా కాంగ్రెస్ ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది’ అని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపన చేసిన మంత్రి, ఆతర్వాత జరిగిన కాంగ్రెస్ పాలేరు నియోజకవర్గ సంస్థాగత సన్నాహక సమావేశంలో మాట్లాడారు. వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఎందరికో పదవులు కట్టబెట్టడమే కాక త్యాగాలు, సంస్కరణలతో ప్రజలతో మమేకమైన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీలు చేపిన త్యాగమేంటో ప్రజలకు తెలుసునన్నారు. కాగా, ఇప్పటి వరకు పార్టీలో పనిచేస్తున్న వారు కొత్త తరానికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరైతే పార్టీ కోసం కష్టపడతారో వారికే సంస్థాగత పదవులు వస్తాయని తెలిపారు. పార్టీ సంస్థాగత జిల్లా ఇన్చార్జి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ గతంలో మాదిరి కాకుండా పార్టీని కిందిస్థాయి నుండి బలోపేతం చేసేలా దృష్టి సారించామని, మండలం నుండి గ్రామ స్థాయి వరకు అధ్యక్ష పదవులకు ఐదుగురి పేర్లతో జాబితా తయారు చేస్తామని తెలిపారు. కాగా, బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడమే కాక ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈసమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మార్కెట్ చైర్మన్ వి.సీతారాములు, ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, పార్టీ నాయకులు బాలసాని లక్ష్మీనారాయణ, బత్తిన శ్రీనివాస్, స్వర్ణకుమారి, రామసహాయం వెంకటరెడ్డి, బోడ మంగీలాల్, బెల్లం శ్రీనివాస్, ఎం.గురవయ్య, కల్లెం వెంకటరెడ్డి, జెర్రిపోతలు అంజని తదితరులు పాల్గొన్నారు. పేదల ముఖాల్లో చిరునవ్వే లక్ష్యం ఖమ్మంరూరల్: పేదల ముఖాల్లో చిరునవ్వు నింపడమే లక్ష్యంగా ప్రభుత్వ పాలన కొనసాగుతోందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో రహదారులు, డ్రెయిన్ల పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో పొంగులేటి మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చాకే అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో జరుగుతున్నాయని తెలిపారు. తరతరాలుగా అనుభవిస్తున్న భూములపై రక్షణ కోసం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ఈకార్యక్రమాల్లో జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్కుమార్, ఆర్డీఓ నర్సింహారావు, ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వర్లు, తతహసీల్దార్ పి.రాంప్రసాద్, ఎంపీడీఓ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అక్షరాస్యత పెంపునకు ప్రణాళిక
● విద్యార్థుల సంఖ్య పెంచేలా ‘బడి బాట’ ● అదనపు కలెక్టర్ శ్రీజ ఖమ్మం సహకారనగర్: జిల్లాలో అక్షరాస్యత శాతం పెంచేలా ప్రణాళికాయుతంగా వ్యవహరించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం ఆమె పాఠశాల విద్య, వయోజన విద్యపై జరిగిన సమీక్షలో మాట్లాడారు. నిరక్షరాస్యతను రూపుమాపేలా ప్రతీఒక్కరికి చదవడం, రాయడం నేర్పేందుకు కేంద్ర ప్రభుత్వం ‘న్యూ ఇండియా లిటీరసి ప్రోగ్రాం’ను ప్రవేశపెట్టిందని తెలిపారు. జిల్లాలో 50వేల మంది నిరక్షరాస్యులు ఉండగా, వలంటీర్లను గుర్తించి ఒక్కొక్కరితో ఐదుగురికి చదువు నేర్పించాలని సూచించారు. ఇదే సమయాన మహిళా సంఘాల సభ్యులు, పంచా యతీ కార్యదర్శులతో నిరక్షరాస్యుల గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మేరకే ఉపాధ్యాయులు ఉండేలా చూస్తూ, అనవసర డిప్యూటేషన్లు రద్దుచేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. నిర్ణీత కేడర్ కంటే అధికంగా ఉపాధ్యాయులు ఉంటే హెచ్ఎంలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా యూనిఫాం సిద్ధం చేయాలని, ప్రవేశాల పెంపే లక్ష్యంగా బడి బాట పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. పాఠశాలలో అవసరమైన క్రీడా సామగ్రి సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, హెచ్ఎంలు పాల్గొన్నారు. -
పలువురు సీఐల బదిలీ
ముగ్గురు ఐజీ కార్యాలయానికి అటాచ్ ఖమ్మంక్రైం: జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ ఐజీ చంద్రశేఖర్రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం త్రీటౌన్ సీఐగా పనిచేస్తున్న దోమల రమేష్ను ఖమ్మం టాస్క్ఫోర్స్ సీఐగా, ట్రాఫిక్ సీఐ మోహన్బాబును ఖమ్మం త్రీటౌన్ సీఐగా, ఖమ్మం వన్టౌన్ సీఐ ఉదయ్కుమార్ను ఖమ్మం సీసీఎస్కు బదిలీ చేశారు. అలాగే, వెయిటింగ్లో ఉన్న తాటిపాముల కరుణాకర్ను ఖమ్మం వన్టౌన్ సీఐగా కేటాయించారు. టాస్క్ఫోర్స్ సీఐలు రామకృష్ణ, తిరుపతి, సీసీఎస్ సీఐ బాలాజీని ఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఖమ్మం ట్రాఫిక్ సీఐ–1గా మాత్రం ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. నాణ్యమైన విత్తనాలే అందించాలి కూసుమంచి: వర్షాకాలం సీజన్ సమీపిస్తున్నందున డీలర్లు నాణ్యమైన విత్తనాలు సమకూర్చుకుని రైతులకు సరఫరా చేయాలని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య సూచించారు. మండలంలోని కూసుమంచి, పాలేరు, నాయకన్గూడెంల్లోని ఎరువులు, విత్తనాల దుకాణాలను మంగళవారం తనిఖీ చేసిన ఆయన డీలర్లకు సూచనలు చేశారు. రికార్డుల్లో వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని తెలిపారు. ఎవరైనా అనుమతి లేని విక్రయాలు చేపట్టినా, రైతులకు పూర్తి వివరాలతో రశీదులు ఇవ్వకపోయినా చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో ఏఓ వాణి పాల్గొన్నారు. సదరమ్ క్యాంప్నకు 233 మంది ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం నిర్వహించిన సదరమ్ క్యాంప్నకు 233మంది దివ్యాంగులు హాజరయ్యారు. మొత్తం 325 మంది స్లాట్ బుక్ చేసుకోగా 233 మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. సదరమ్ సర్టిఫికెట్ల స్థానంలో యూడీఐడీ కార్డులు జారీ చేస్తుండగా, దివ్యాంగులకు వైకల్య పరీక్షలు నిర్వహించి వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ మేరకు అర్హత సాధించిన వారి చిరునామాకు నేరుగా కార్డులు అందుతాయని అధికారులు తెలిపారు. భూగర్భ కేబుల్తో విద్యుత్ సరఫరా మధిర: మధిరలో భూగర్భ కేబుల్ ద్వారా విద్యుత్ సరఫరా చేయడంపై అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా మంగళవారం విద్యుత్, ఆర్అండ్ బీ, మున్సిపల్ అధికారులు పట్టణంలో పలు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయంలో సమావేశం కాగా, ఖమ్మం ఎస్ఈ శ్రీనివాసచారి మాట్లాడారు. ఆత్కూరు క్రాస్ నుంచి మధిరలోని నందిగామ బైపాస్, ఆర్వీ కాంప్లెక్స్ నుంచి బస్టాండ్ వరకు భూగర్భ కేబుల్తో అంతరాయాలు లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ఏజెన్సీ ద్వారా సిద్ధమవుతున్న డీపీఆర్ను ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులకు సమర్పిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ డీఈలు బండి శ్రీనివాసరావు, హీరాలాల్, ఆర్అండ్బీ డీఈ శంకర్రావు, మున్సిపల్ డీఈ నరేష్రెడ్డి, వివిద శాఖల ఉద్యోగులు అనురాధ, నాగమల్లేశ్వరరావు, అనిల్కుమార్, కన్సల్టెన్సీ ప్రతినిధి భరత్భూషణ్ పాల్గొన్నారు. నాణ్యమైన ధాన్యానికి మద్దతు ధర కల్లూరు: ధాన్యం సరైన తేమ శాతం వచ్చేవరకు ఆరబోసి, తాలు లేకుండా తీసుకొస్తే మద్దతు ధర లభిస్తుందని జిల్లా పౌరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత తెలిపారు. కల్లూరు మండలం పుల్లయ్యబంజర్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీఆర్డీఏ పీడీ సన్యాసయ్య, ఆర్డీఓ ఎల్.రాజేందర్, డీపీఎం దర్గయ్యతో కలిసి మంగళవారం ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా కొనుగోళ్లలో జాప్యంతో ఇబ్బంది ఎదురవుతోందని, మిల్లర్లు తరుగు పేరుతో కోత విధిస్తున్నారని రైతులు వాపోయారు. ఈమేరకు డీఎం మాట్లాడుతూ సరిపడా గన్నీ బస్తాలు, లారీలు సమకూరుస్తామని తెలిపారు. మార్కెట్ చైర్మన్ భాగం నీరజ తదితరులు పాల్గొన్నారు. -
35 ఎకరాలు.. రూ.130కోట్లు
● రేపు మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన ● పాల్గొననున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహఖమ్మంఅర్బన్: ఖమ్మంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అత్యాధునిక వసతులతో కూడిన భవనాలు అందుబాటులోకి రానున్నాయి. మెడికల్ కాలేజీని ప్రస్తుతం పాత కలెక్టరేట్లో నిర్వహిస్తున్నారు. అయితే, అన్ని సౌకర్యాలతో కూడిన భవనాలు ఉండాలనే భావనతో రఘునాథపాలెం మండలం బాలపేట సమీపాన బైపాస్ పక్కన 35 ఎకరాల ప్రభుత్వ భూములను కేటాయించారు. ఈ భూముల్లో నిర్మాణాలకు 8వ తేదీ గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లాకు చెందిన మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాన భవనం, హాస్టళ్లు బాలపేట సమీపాన కేటాయించిన 35 ఎకరాల్లో భవన నిర్మాణాలకు రూ.130కోట్లు కేటాయించారు. ఈ నిధులతో 3.81లక్షల చదరపు అడుగుల్లో కాలేజీ ప్రధాన భవనం నిర్మిస్తారు. అలాగే, 88 చదరపు అడుగుల్లో బాలికల హాస్టల్, 62వేల చదరపు అడుగుల్లో బాలుర హాస్టల్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే భూమి చదును చేయగా, సుమారు రూ.15 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని ఇంజనీరింగ్ శాఖ అధికారులు తెలి పారు. కాగా, గురువారం జరిగే శంకుస్థాపనకు మంత్రులు హాజరుకానుండగా కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ పరిశీలించి ఏర్పాట్లపై ఆర్ అండ్ బీ ఎస్ఈ యాకూబ్, ఈఈ యుగంధర్కు సూచనలు చేశారు. -
9న మిట్టపల్లికి కేటీఆర్ రాక
తల్లాడ: తల్లాడ మండలం మిట్టపల్లిలో తల్లాడ తొలి ఎంపీపీ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ దివంగత రాయల శేషగిరిరావు విగ్రహాన్ని ఈనెల 9న ఆవిష్కరించనుండగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు తెలిపారు. మండలంలోని మిట్టపల్లిలో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయ న మాట్లాడారు. ఉదయం 10–30 గంటలకు రాయ ల విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించాక ఇక్కడ ఏర్పాటుచేసే సభలో ప్రసంగిస్తారని తెలిపారు. ఈమేరకు సత్తుపల్లి నియోజకవర్గంతో పాటు సమీపంలోని నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేయనున్న ట్లు వెల్లడించారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో గాయపడిన అంజనాపురానికి చెందిన కేతినేని సందీప్ను ఎమ్మెల్సీ తదితరులు పరామర్శించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కొండబాల కోటేశ్వర్రావు, మాజీ ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, బీఆర్ఎస్ నాయకులు రెడ్డెం వీరమోహన్రెడ్డి, తాళ్లూరి జీవన్, దిరిశాల దాసురావు, మువ్వా మురళి, కట్టా అజయ్కుమార్, డి. వెంకట్లాల్, రుద్రాక్ష బ్రహ్మం, ఇంజం కృష్ణార్జున్రావు, పోతురాజు వెంకటయ్య, రాయల రఘునందన్, రేవంత్, నాయుడు శ్రీనివాసరావు, శెట్టిపల్లి లక్ష్మణ్రావు పాల్గొన్నారు.రాయల విగ్రహావిష్కరణ, బహిరంగ సభ -
హౌసింగ్ శాఖకు 14 మంది ఏఈలు
ఖమ్మంగాంధీచౌక్: గృహ నిర్మాణ శాఖలో 14 మంది అసిస్టెంట్ ఇంజనీర్ల(ఏఈ)ను ఔట్ సోర్సింగ్విధానంలో నియమిస్తూ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాక వారికి పోస్టింగ్ ఇవ్వడంతో కేటాయించిన మండలాల్లో బాధ్యతలు స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యాన, గృహ నిర్మాణ శాఖను బలోపేతం చేయడంకోసం ఈ నియామకాలు చేపట్టారు. కాగా, జిల్లాలో నియమితులైన ఏఈల వివరాలు మండలాల వారీ గా ఇలా ఉన్నాయి. కామేపల్లి మండలానికి డి.నగేష్, నేలకొండపల్లికి వి.లింగా, రఘునాథపాలెంకు జి.పుష్ప, చింతకానికి టి.సుప్రియ, తల్లాడకు షేక్ అస్మా, ఏన్కూరుకు బి.స్నేహ, కల్లూరుకు ఎస్.సాయిపవన్, వేంసూరుకు ఎం. శ్రీనివాస్, ముదిగొండకు బి.సతీష్, ఎర్రుపాలెంకుపి.గోపి,సత్తుపల్లికి వి.పవన్కల్యాణ్, పెనుబల్లికి వై.కమల్ప్రసాద్, కూసుమంచికి ఏ.రవి, తిరుమలాయపాలెంకు మిథున్కుమార్ను కేటాయించారు. ఉపాధి హామీ సిబ్బందికి ఊరటమూడు నెలలు వేతనాలు విడుదల చుంచుపల్లి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మూడు నెలల వేతనాలను మంగళవారం విడుదల చేసింది. ఏప్రిల్కు సంబంధించిన వేతనాన్ని మాత్రం పెండింగ్లో ఉంచింది. ఉపాధి హామీ పథకం అమలులో ఏపీఓలు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరికి కొంతకాలంగా సకాలంలో వేతనాలు అందడం లేదు. నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడంతో నిరసనలతో పాటు ఇటీవల పెన్డౌన్ నిర్వహించారు. వీరి సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఎట్టకేలకు జనవరి, ఫిబ్రవరి, మార్చి వేతనాలను విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో ఉపాధి హామీ పథకంలో 839 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వేతనాలు జమ కావడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. సహకార ఆడిట్పై శిక్షణఖమ్మంవ్యవసాయం: ఖమ్మంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) ప్రధాన కార్యాలయంలో మంగళవారం సహకార శాఖ అసిస్టెంట్ రిజి స్టార్లు, సీనియర్ ఇన్స్పెక్టర్లు, జూనియర్ ఇన్స్పెక్టర్లకు సహకారఆడిట్పై శిక్షణ ఇచ్చారు. ఈసందర్భం గా జిల్లా సహకార అధికారి జి.గంగాధర్, డీసీసీబీ సీఈఓ ఎన్.వెంకట్ ఆదిత్య పలు అంశాలపై అవగాహన కల్పించారు. డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావుతో పాటు అధికారులు మురళీధర్రావు, సీహెచ్.రవికుమార్, కె.సందీప్, ఎస్కే.మౌలానా, పీఏసీఎస్ల కార్యదర్శులు పాల్గొన్నారు. డీఈఐఈడీ, డీపీఎస్ఈలో ప్రవేశాలుఖమ్మం సహకారనగర్: డీఈఐఈడీ(డిప్లొమా ఇన్ ఎలి మెంటరీఎడ్యుకేషన్), డీపీఎస్ఈ(డిప్లొమా ఇన్ప్రీ స్కూ ల్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో డీఈఈసీఈటీ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నట్లు డీఈఓ, డైట్ ప్రి న్సి పాల్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. ఈ పరీక్ష ఆన్లైన్ విధానంలో ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న ఉమ్మడి జిల్లాలోని అభ్యర్థులు ఈనెల 15వ తేదీవరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
మార్కెట్లో వెలవెల.. రోడ్డంతా కళకళ
కార్బైడ్ రహితంగా పండించిన మామిడి పండ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఖమ్మం రోటరీనగర్లోని వీధివ్యాపారుల కేంద్రంలో ప్రత్యేక మార్కెట్ ఏర్పాటుచేశారు. పడావు పడి ఉన్న ప్రాంగణానికి రంగులు వేసి తీర్చిదిద్దారు. తొలిరోజు ఇక్కడ 10 – 15 మంది వ్యాపారులు మామిడి పండ్లు విక్రయించారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య ఒకటి, రెండు దాటకపోగా.. జనాలు రాకపోవడమే కారణమని వ్యాపారులు చెబుతున్నారు. మరోపక్క రహదారుల వెంట మామిడిపండ్ల విక్రయాలతో ట్రాఫిక్కు అంతరాయం ఎప్పటిలాగే కొనసాగుతోంది. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
గంజాయి రవాణాపై ఉక్కుపాదం
వైరా: జిల్లా మీదుగా గంజాయి రవాణాను పూర్తిగా నియంత్రించడంపై దృష్టి సారించామని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జి.జనార్దన్రెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగానే విస్తృత తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. మంగళవారం వైరా వచ్చిన ఆయన ఎకై ్సజ్ కార్యాలయంలో మాట్లాడారు. ఏపీ, ఒడిశా నుంచి ఖమ్మం మీదుగా హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో వైరాలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. బస్టాండ్తో పాటుగా ఇతర ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగిస్తున్నామని చెప్పారు. కాగా, వైరా ఎకై ్సజ్ కార్యాలయాన్ని పాత జీపీ కార్యాలయం, ఎన్నెస్పీ భవనాల్లోకి మార్చే ప్రతిపాదన ఉందని డీసీ తెలిపారు. జిల్లా ఎకై ్సజ్ అధికారి జి.నాగేందర్రెడ్డి, సీఐ మమత, ఎస్సైఐలు రతన్ప్రసాదరెడ్డి, సాయిరాం పాల్గొన్నారు. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్రెడ్డి -
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
● రాజీవ్ యువ వికాసంలో 1:2 నిష్పత్తిలో జాబితా ● కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ఖమ్మంమయూరిసెంటర్: రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం ఆయన అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షించారు. ప్రతీ మండలంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలద్వారా వచ్చి న దరఖాస్తులపై ఆరా తీశాక ఆయన మాట్లాడుతూ పరిశీలన 90 శాతం పూర్తయిందని, తుది జాబి తాపై తయారీపై దృష్టి సారించాలని తెలిపా రు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూనిట్ల లక్ష్యం మేరకు 1:2 నిష్పత్తిలో జాబితా సిద్ధం చేయాలని తెలిపారు. దివ్యాంగులు, మహిళలు, అతి పేదలకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని కలెక్టర్ సూచించారు. నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ఖమ్మంగాంధీచౌక్: అర్హులైన వారికి నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం ఆయన అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి ఇళ్ల పురోగతి, లబ్ధిదారుల ఎంపికపై అధికా రులతో సమీక్షించారు. పైలట్ గ్రామాల్లో 878 ఇందిరమ్మ ఇళ్లకు గాను 370 మందికి మొదటి విడత రూ.లక్ష నిధులు వచ్చాయన్నారు. మిగతాచోట్ల పనుల్లో వేగం పెరిగేలా పర్యవేక్షిస్తూ, ఇతర ప్రాంతాల్లో లబ్ధిదారుల ఎంపికపై సూచనలు చేశారు. మండల కేంద్రాల్లో నిర్మించిన మోడల్ ఇళ్ల వద్దకు మేసీ్త్రలను తీసుకెళ్లి తక్కువ ఖర్చుతో ఇళ్లు నిర్మించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాకు 14,763 ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తే, 10,921 దరఖాస్తుల ఆధారంగా 9,150 మందిక అర్హులుగా గుర్తించినందున మరోమారు పరిశీలించాలని ఆదేశించారు. ఈసమావేశాల్లో జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్డీఓ సన్యాసయ్య, డీఈఓ సత్యనారాయణ, కల్లూరు ఆర్డీఓ రాజేందర్, హౌసింగ్ ఈఈ బి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చివరి గింజ వరకు కొనుగోళ్లు ఖమ్మంరూరల్: రైతులు యాసంగిలో సాగు చేసిన ధాన్యంలో చివరి గింజ వరకు నాణ్యత ఆధారంగా కొనుగోలు చేస్తామని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలి పారు. ఖమ్మం రూరల్ మండలం గుదిమళ్లలోని కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన రైతులతో మాట్లాడారు. సరైన తేమ శాతం రాగానే కాంటా వేసి మిల్లులకు తరలించాలని, ఎక్కడా తరుగు తీయకుండా పర్యవేక్షించాలని ఉద్యోగులకు సూచించారు. కాల వర్షాల నేపథ్యాన కొనుగోళ్లలో వేగం పెంచి అదనంగా హమాలీలు, వాహనాలను సమకూర్చుకోవాలని తెలిపారు. మామిడి మార్కెట్లో పరిశీలన ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం రోటరీనగర్లోని వీధి వ్యాపారుల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రైతు మామిడి మార్కెట్ను కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పరి శీలించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా సహజసిద్ధంగా పండించిన పండ్లే విక్రయించేందుకు ఈ మా ర్కెట్ ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ఎం. వీ.మధుసూదన్, ఉద్యాన అధికారి అనితశ్రీ పాల్గొన్నారు. -
మురుగు.. కనుమరుగు
● మధిరలో రూ.128 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ ● 2,655 మ్యాన్హోల్స్.. 99.56 కి.మీ. పైపులైన్ ● ఏడాదిన్నరలో పూర్తిచేసేలా కార్యాచరణమధిర: మధిర మున్సిపాలిటీ కొత్తరూపు సంతరించుకోనుంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచనలతో మధిరలో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్ఐడీసీ) ద్వారా రూ.128 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో దాదాపు 99.56 కి.మీ. మేర అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మించనున్నారు. పైపులైన్ విధానంలో నిర్మించే ఈ ప్రాజెక్టు పూర్తయితే మధిరలో డ్రెయినేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. 6,638 నివాస గృహాలు మధిర మున్సిపాలిటీ పరిధిలో 6,638 గృహాలు ఉన్నాయి. వీటి ద్వారా వెలువడేతున్న మురుగునీరు డ్రెయినేజీల ద్వారా ముందుకు సాగుతోంది. అయితే, అడ్డంకులు, అసంపూర్తి నిర్మాణాలతో నీరు నిలిచి, చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతుండడమే కాక దోమల వృద్ధికి కారణమవుతోంది. చిన్నపాటి వర్షం వర్షం వచ్చినా నీరంతా రోడ్లపై చేరుతోంది. ఈ సమస్య పరిష్కారం కోసం అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 2,655 మ్యాన్హోల్స్ ఏర్పాటుచేసి, 99.56 కి.మీ. నిడివితో పైపులైన్ నిర్మిస్తారు. ఇళ్లలో నుంచి నీటిని మ్యాన్హోల్స్లోకి.. అక్కడి నుంచి సబ్ లైన్స్, ఆపై ట్రంక్ మెయిన్ ద్వారా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(మురికినీటి శుద్ధి కేంద్రం)కు పంపుతారు. నాలుగు ఎస్టీపీలు.. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణంలో భాగంగా మధిరను నాలుగు జోన్లుగా విభజించారు. పట్టణాన్ని మొదటి జోన్గా, మడుపల్లిని రెండో జోన్గా, అంబారుపేట, ఇల్లెందులపాడులో 3, 4వ జోన్లు నిర్ధారించారు. ఆయా జోన్లలోని లోతట్టు ప్రాంతాల్లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు(ఎస్టీపీ) నిర్మించి అక్కడికి మురుగునీటిని మళ్లిస్తారు. అక్కడ నీటిని శుద్ధి చేసి వ్యవసాయ అవసరాలతో పాటు పార్క్లు, డివైడర్లు,, రోడ్ల పక్కన పెంచుతున్న మొక్కలకు వినియోగిస్తారు. ప్రస్తుతం ఇళ్లలో నుంచి వెలువడుతున్న మురుగునీరు నేరుగా వైరా నదిలో కలిసి కలుషితమవుతోంది. యూజీడీ పనులు పూర్తయితే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఈ పనులను ఒప్పందం ప్రకారం రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉండగా.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఏడాదిన్నరలోనే పూర్తిచేయాలని సూచించారు. పనులు పూర్తయ్యాక ఐదేళ్లపాటు నిర్మాణ కంపెనీయే నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది. వర్షపు నీటికి ఎస్డబ్ల్యూడీ మురుగునీరు ముందుకు సాగేలా అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మిస్తుండగా వర్షపునీటిని తరలించేందుకు స్టార్మ్ వాటర్ డ్రెయిన్(ఎస్డబ్ల్యూడీ) సిస్టమ్ నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.75 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. ఎస్డబ్ల్యూడీ కోసం 29.93 కి.మీ. మేర డ్రెయిన్లు నిర్మించాల్సి ఉంది. ఈ పనులూ పూర్తయితే వర్షపునీరు ఓపెన్ డ్రెయినేజీ సిస్టమ్ ద్వారా నేరుగా వెళ్లి వైరా నదిలో కలుస్తుంది.మధిరలో నిర్మించే ఎస్టీపీలు, నీటిశుద్ధి సామర్ధ్యం జోన్ శుద్ధి చేసే సామర్థ్యం 1 50 లక్షల లీటర్లు 2 9 లక్షల లీటర్లు 3 4 లక్షల లీటర్లు 4 5 లక్షల లీటర్లునాణ్యత ప్రమాణాలతో పనులు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆదేశాలతో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ పనులను నాణ్యతతో పూర్తి చేస్తాం. వృథా నీటిని శుద్ధి చేయడంతో ఇతర అవసరాలకు ఉపయోగపడతాయి. అంతేకాక పట్టణంలో దుర్వాసన, దోమల వృద్ధి సమస్యలు తగ్గిపోతాయి. – నరేష్రెడ్డి, డీఈ, మధిర మున్సిపాలిటీరూ.కోట్ల నిధులతో అభివృద్ధి మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చొరవతో రూ.కోట్లలో నిధులు మంజూరవుతున్నాయి. అలాగే, పనుల నాణ్యతపై తరచుగా పర్యవేక్షిస్తున్నారు. యూడీజీ నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా అందరూ సహకరించాలి. – మల్లాది వాసు, మాజీ కౌన్సిలర్సమస్యలకు శాశ్వత పరిష్కారం మధిరలో ఓపెన్ డ్రెయినేజీ వ్యవస్థ కారణంగా మురుగునీరు నిలిచి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. దుర్వాసన, దోమలతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. యూడీజీ నిర్మాణంతో సమస్యలు పరిష్కారమై పట్టణం పరిశుభ్రంగా మారుతుంది. – కోనా ధనికుమార్, మాజీ కౌన్సిలర్ -
గాలివాన బీభత్సం
జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం గాలి, వాన బీభత్సం సృష్టించింది. పగలంతా ఎండ తీవ్రత ఉండగా, సాయంత్రం 4–30 గంటల నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలోనే కాక కొణిజర్ల, వైరా, తల్లాడ, మధిర మండలాల్లోని పలు ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనిపించగా.. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్ల కొమ్మలు రహదారులు, విద్యుత్ లైన్లపై విరిగిపడ్డాయి. ఈ కారణంగా అటు రాకపోకలు, ఇటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అంతేకాక పలుచోట్ల కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం రాశులు తడిచిపోయాయి. – ఖమ్మం వ్యవసాయం● గంట పాటు జిల్లాలో ఆగమాగం ● రోడ్లపై విరిగిపడిన చెట్లతో ఆగిన రాకపోకలు ● కల్లాల్లో తడిసి ముద్దయిన ధాన్యం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఈదురుగాలుల కారణంగా ఖమ్మం నగరంతో పాటు వైరా, కొణిజర్ల, మధిర, ఖమ్మం రూరల్ మండలం, తిరుమలాయపాలెం, కామేపల్లి, కారేపల్లి, రఘునాథపాలెం, పెనుబల్లి, ఏన్కూరు తదితర ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి తీగలపై పడడంతో సాయంత్రం 5 గంటల నుంచి సరఫరా నిలిచిపోయింది. ఖానాపురం, టేకులపల్లి, జిల్లా ఆస్పత్రి, మంచుకొండ, ఇల్లెందు క్రాస్, ప్రకాష్నగర్ సబ్ స్టేషన్ల పరిధిలో ఫీడర్లు దెబ్బతిన్నాయి. ప్రకాష్నగర్లో ఓ గోదాం రేకులు లేచిపోయి 11 కేవీ విద్యుత్ లైన్పై పడటంతో సమీప ప్రాంతాల్లో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈమేరకు విద్యుత్ శాఖ ఉద్యోగులు పునరుద్ధరణ పనులు చేపడుతూనే ఇంటర్ లికింగ్ విధానం అమల్లో ఉన్న ప్రాంతాల్లో ఇతర సబ్స్టేషన్ల నుంచి సరఫరా ఇచ్చారు. అయినా ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో రాత్రి పొద్దుపోయే వరకు కూడా విద్యుత్ సరఫరా జరగలేదు. కూలిన చెట్లు, ఎగిరిపోయిన పైకప్పులు ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. రహదారుల వెంట చెట్లు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే, పలుచోట్ల హోర్డింగ్లు విరిగి పడగా, ఫ్లెక్సీలు తెగిపోవడంతో పాటు ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. ఇక వర్షం మొదలుకాగానే కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పరుగులు పెట్టారు. అప్పటికే పలుచోట్ల ధాన్యం తడవగా, మిగిలిన ధాన్యం పట్టాలు కప్పి రక్షించుకున్నారు. అన్నదాతపై పగ రైతులపై ఈ ఏడాది ప్రకృతి పగబట్టినట్లుగానే పరిస్థితులు నెలకొన్నాయి. కొద్దిరోజులుగా ఈదురుగాలులు, అకాల వర్షాలతో యాసంగి పంటలకు నష్టం జరుగుతోంది. వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతినడమే కాక ఈదురుగాలులకు మామిడి, బొప్పాయి తోటలు ధ్వంసమవుతున్నాయి. ఇటీవల జిల్లాలో దాదాపు 1,776 రైతులకు చెందిన 3212 ఎకరాల్లో వరి, మొక్కజొన్నతో పాటు మరో 200 ఎకరాల్లో మామిడి, బొప్పాయి పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు.మరికొన్ని ఫొటోలు – 9లోపగలంతా ఎండ, సాయంత్రం వాన జిల్లాలో మంగళశారం సాయంత్రం వరకు ఎండ దంచికొట్టగా ఆతర్వాత వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చాయి. ముదిగొండ మండలం పమ్మిలో అత్యధికంగా 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, పెనుబల్లిలో 40.8, బాణాపురంలో 40.7, బచ్చోడు, నేలకొండపల్లిలో 40.4, చింతకానిలో 40.3, ఖమ్మం ఖానాపురం, ఎరర్రుపాలెంలో 39.7, వైరా ఏఆర్ఎస్, మధిరలలో 39.6, కాకరవాయిలో 39.5, పల్లెగూడెం, మధిర ఏఆర్ఎస్లో 39.4, కర్నులు, కుర్నవల్లి, వైరా, తల్లాడలో 39.3, వేంసూరులో 39.2, సిరిపురంలో 39.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక సాయంత్రం తిరుమలాయపాలెం మండలం బచ్చోడులో 30.3 మి.మీ.ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలో 26, ఖమ్మం ఖానాపురంలో 11.8, గుబ్బగుర్తిలో 11.3, కాకరవాయిలో 8.5, వైరాలో 5.5, తిమ్మారావుపేటలో 5 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
రోడ్డుప్రమాదంలో యువకుడు మృతి
తల్లాడ: మండలంలోని రెడ్డిగూడెం స్టేజీ వద్ద మంగళవారం ఆటోను ఎదురుగా వచ్చినలారీ ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఖమ్మం ఇందిరమ్మ కాలనీకీ చెందిన ఆళ్లకుంట నవీన్(20) ఆటోలో తల్లాడ మండలం గాంధీనగర్ తండాకు వచ్చి మామిడికాయలు కొన్నాక తిరిగి ఆటోలో బయలుదేరాడు. ఈక్రమాన రెడ్డిగూడెం స్టేజీ వద్ద ఖమ్మం నుంచి ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న నవీన్ లారీ టైరు కింద పడగా తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే, ఆటోలో ఉన్న నవీన్ చెల్లెలు ఆళ్లకుటం అజితకు గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బి.కొండల్రావు తెలిపారు. అడవి గేదెల దాడిలో ఇద్దరికి గాయాలుసత్తుపల్లిరూరల్: రహదారిపై వెళ్తున్న ఆటోకు అడ్డుగా వచ్చిన అడవి గేదెలు దాడి చేయటంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం పెనగడప నుంచి పలువురు కూలీలు మంగళవారం సత్తుపల్లికి బయలుదేరారు. ఈ ఆటో యాతాలకుంట వద్ద రోడ్డు దాటుతుండగా, పక్క నుంచి అడవి గేదెలు దూసుకొచ్చి ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ఉన్న పల్లపు రాజు, బోసు ఓదేలుకు గేదెల కొమ్ములు తాకడంతో తీవ్ర గాయాలు కాగా సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎలుగుబంటి దాడిలో వ్యక్తి మృతిఏన్కూరు: పశువులను మేతకు తీసుకెళ్లిన వ్యక్తిపై ఎలుగుబండి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు... ఏన్కూరు మండలం కొత్త మేడేపల్లికి చెందిన మడకం సోమార్(40) సోమవారం ఉదయం పశువులు, మేకలను తీసుకుని తన ఇద్దరు కుమార్తెలతో సహా సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. అక్కడ ఆయనపై ఎలుగుబంటి దాడి చేసినట్లు తెలుస్తుండగా, ఆయన కుమార్తెలు మధ్యాహ్నం 3గంటలకు గ్రామానికి వచ్చి తల్లికి చెప్పారు. దీంతో గ్రామస్తులతో కలిసి ఘటనాస్థలికి వెళ్లి సోమార్ను కొత్తగూడెం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. ఘటనపై ఆయన భార్య కుమారి ఫిర్యాదుతో మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రఫీ తెలిపారు. లారీ డ్రైవర్కు మూడేళ్ల జైలుశిక్ష సత్తుపల్లి టౌన్: మద్యం సేవించి లారీ నడిపి తండ్రీకుమారుల మృతికి కారణమైన డ్రైవర్కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సత్తుపల్లి సీనియర్ సివిల్ జడ్జి షేక్ మీరా ఖాసీం సాహెబ్ మంగళవారం తీర్పు వెలువరించారు. గత ఏడాది జూన్ 3వ తేదీన కిష్టారం గ్రామానికి చెందిన పిల్లి పేరయ్య(55), ఆయన కుమారుడు అశోక్కుమార్(35) సత్తుపల్లి నుంచి కిష్టారం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఇదే సమయాన హైదరాబాద్ నుంచి వైజాగ్కు వెళ్తున్న లారీ వీరిని ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై సీఐ టి.కిరణ్ కేసు నమోదు చేసి ఒడిశాకు చెందిన లారీ డ్రైవర్ హర్షిత్ రాయ్పై చార్జీషీట్ దాఖలు చేశారు. విచారణలో ఆయనపై నేరం రుజువు కావడంతో జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరపున పీపీ అబ్దుల్ బాషా వాదించగా పోలీసు కానిస్టేబుల్ శ్రావణ్రెడ్డి, హోంగార్డు ప్రవీణ్ సహకరించారు. చెల్లని చెక్కు కేసులో ఆరు నెలల జైలుశిక్ష ఖమ్మం లీగల్: అప్పు చెల్లించే క్రమాన ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో నిందితుడికి ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయాధికారి ఏపూరి బిందుప్రియ మంగళవారం తీర్పు చెప్పారు. ఖమ్మం శ్రీనగర్ కాలనీకి చెందిన ఎస్.రామయ్య వద్ద బైపాస్ రోడ్డుకు చెందిన డి.శ్రీనివాసరావు 2017 మే నెలలో రూ.5లక్షల అప్పు తీసుకున్నాడు. ఈ అప్పు చెల్లించే క్రమాన 2019 జూన్లో రూ.7.50లక్షలకు చెక్కు జారీ చేశాడు. అయితే, శ్రీనివాసరావు ఖాతాలో సరిపడా నగదు లేక చెక్కు తిరస్కరణకు గురైంది. దీంతో రామయ్య తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేట్ దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో శ్రీనివాసరావుకు జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.7.50లక్షలు చెల్లించాలని జడ్జి తీర్పు చెప్పారు. -
అగ్నికి ఆహుతైన మొక్కజొన్న, ధాన్యం
చింతకాని: మండలంలోని నర్సింహాపురం, రామకృష్ణాపురం, ప్రొద్దుటూరు గ్రామాల్లో మంగళవారం వే ర్వేరుగా జరిగిన అగ్నిప్రమాదాల్లో మొక్కజొన్న, ధా న్యం కాలి బూడిదయ్యాయి. మొక్కజొన్న చెత్తకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం.. అదే సమయాన భారీగా వీచిన ఈదురుగాలులతో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. నర్సింహాపురంలో జరిగిన ప్రమాదంలో కల్లాల్లో ఇద్దరు ఆరబోసిన సుమారు 300 క్వింటాళ్ల మొక్కజొన్న కంకులు పూర్తిగా కాలిపోయాయి. మంటలు గ్రామానికి సైతం వ్యాపించగా ద్విచక్ర వా హనంతో పాటు వరిగడ్డి వామి, రోటోవేటర్ దగ్ధమయ్యాయి. అలాగే, రామకృష్ణాపురంలోనూ ఈదురుగాలులకు మంటలు వ్యాపించి మామిడి చెట్లు, వ్యవసాయ విద్యుత్ మోటార్లు, గడ్డివాములు కాలిపోయా యి. గ్రామంలోకి మంటలురాకుండా గ్రామస్తులు మో టార్ల సాయంతో నీళ్లు చల్లినా అదుపులోకి రాలేదు. దీంతో అగ్నిమాపక శాఖ ఉద్యోగులకు సమాచారం ఇవ్వగా ఫైర్ ఆఫీసర్ బాలకృష్ణ, అగ్నిమాపక సిబ్బంది నాగేశ్వరరావు, నర్సింహారావు, గోపీకృష్ణ, రాంబాబు, మంద వీరస్వామి, నరేష్ చేరుకుని సుమారు రెండు గంటలపాటు శ్రమించిమంటలను అదుపుచేశారు. ఈ సమయాన గ్రామమంతా పొగతో నిండిపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇక ప్రొద్దుటూరులో సైతం మొక్కజొన్న కంకితో పాటు కల్లాల్లో ఆరబోసిన ధాన్యం మంటలకు దగ్ధమైంది. నర్సింహాపురంలో సుమారు రూ.7.30 లక్షలు, ప్రొద్దుటూరులో రూ.లక్ష, రామకృష్ణాపురంలో రూ.2 లక్షల విలువైన పంటలకు నష్టం జరిగినట్లు బాధిత రైతులు తెలిపారు.మూడు గ్రామాల్లో రూ.10లక్షలకు పైగా నష్టం -
ఉద్యోగి కుటుంబానికి భద్రతా ఎక్స్గ్రేషియా చెక్కు
ఖమ్మంక్రైం: పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సెక్షన్ సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల మృతి చెందిన ఎం.డీ.హనీఫ్ కుటుంబానికి భద్రతా ఎక్స్గ్రేషియా మంజూరైంది. ఈమేరకు రూ.14,98,610 చెక్కును మంగళవారం ఆయన కుటుంబీకులకు పోలీస్ కమిషనర్ సునీల్దత్ అందజేసి మాట్లాడారు. శాఖాపరంగా ఎలాంటి సహకారమైన అందిస్తామని తెలిపారు. జేవీఆర్ ఓసీలో పరిశీలనసత్తుపల్లిరూరల్: మండలంలోని జేవీఆర్ ఓసీని సింగరేణి కొత్తగూడెం ఏరియా సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ అభిలాష్ మంగళవారం తనిఖీ చేశారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆయన పని ప్రదేశాలు, కార్యాలయాలను పరిశీలించి భద్రతపై ఆరా తీశారు. సింగరేణి ఆస్తుల పరిరక్షణలో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, తొలి సారి ఓసీకి వచ్చిన అభిలాష్కు సెక్యూరిటీ సిబ్బంది స్వాగతం పలికి సన్మానించారు. ఉద్యోగులు బందెల విజయేందర్, మల్లేష్, రవీందర్రెడ్డి, ఎం.జోసెఫ్, కేఎస్వీవీ.సత్యనారాయణ, ఎస్.కే.సుభానీ, మోతుకూరి రవి తదితరులు పాల్గొన్నారు. రేపు ఉమ్మడి జిల్లాస్థాయి చెస్ ఎంపికలు ఖమ్మంస్పోర్ట్స్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ నెల 8న ఉమ్మడి జిల్లాస్థాయి చెస్ క్రీడాకారుల ఎంపిక ఉంటుందని ఆర్గనైజర్ సీహెచ్.గోపి తెలిపారు. చెస్ అసోసియేషన్ ఆధ్వర్యాన అండర్ – 7, 9, 11 విభాగాల్లో బాలబాలిలకు వేర్వేరుగా పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. క్రీడాకారులు వివరాలకు 94401 62749 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఈనెల 10నుంచి గార్లఒడ్డులో బ్రహ్మోత్సవాలుఏన్కూరు: మండలంలోని గార్లఒడ్డు శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో ఈనెల 10వ తేదీ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ వెంకటదుర్గాప్రసాద్ తెలిపారు. మొదటిరోజైన 10వ తేదీన సుప్రభాతసేవ, యాగశాల ప్రవేశం, 11న స్వామి జయంతి సందర్భంగా 108 కలశాలతో అభిషేకం, 12న శ్రీవిష్ణు సహస్రనామస్రోత్ర పారాయణం, స్వా మివారి ఎదుర్కోలు, కల్యాణం, 13న స్వామి వారి ఊరేగింపు, 14న మహా పూర్ణాహుతి తదితర పూజలు ఉంటాయని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈఓ కోరారు. కామర్స్ అధ్యాపకుడికి డాక్టరేట్ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళా శాల కామర్స్ అధ్యాపకు డు జల్లా రాంప్రసాద్కు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ లభించింది. ఆయన ‘ఇంపాక్ట్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ ఇంటర్వెన్షన్ ఆన్ సోషియో ఎకనామిక్ కండీషన్స్ ఆఫ్ బెని ఫీషియరీస్ – ఏ స్టడీ ఆఫ్ ఖమ్మం డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్’ అంశంపై ఓయూ కామర్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి.సంధ్యారాణి పర్యవేక్షణలో పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథం సమర్పించగా డాక్టరేట్ ప్రకటించారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ను మంగళవారం కళా శాల ప్రిన్సిపాల్ డాక్టర్ మొహ్మద్ జాకిరుల్లా, అధ్యాపకులు డాక్టర్ సర్వేశ్వరరావు, శాస్త్రి, బానోత్ రెడ్డి, సత్యవతి, సునంద తదితరులు అభినందించారు. -
ప్రతీ రైతుకు గుర్తింపు
● 11 అంకెలతో ‘ఫార్మర్ ఐడీ’ కేటాయింపు ● రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన వ్యవసాయ శాఖ ● భూమి, పంటల వివరాలు నమోదు చేస్తున్న ఏఈఓలుఖమ్మంవ్యవసాయం: వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం రూపొందించిన ‘ఫార్మర్ ఐడీ’ ప్రాజెక్టుకు జిల్లాలో సోమవారం శ్రీకారం చుట్టారు. ఈ ప్రక్రియలో ప్రతీ రైతుకు 11 అంకెలతో కూడిన గుర్తింపు నంబర్ కేటాయిస్తారు. రైతులకు ఉన్న భూమి రకం, విస్తీర్ణం, సర్వేనంబర్, పట్టాదార్ పాస్ పుస్తకం నంబర్, పంటల సాగు వివరాలు, వ్యక్తిగత వివరాలను నమోదు చేయనుండగా.. ఇప్పటికే వ్యవసాయ విస్తరణాధికారుల(ఏఈఓ)కు శిక్షణ ఇచ్చారు. దీంతో వారు క్లస్టర్ల వారీగా వివరాల నమోదును ప్రారంభించారు. ఫార్మర్ ఐడీని ఆధార్ కార్డుతో లింక్ చేయనుండగా.. ఒక క్లిక్తో సమస్త సమాచారం అందుబాటులోకి వస్తుంది. కేంద్ర పథకాల కోసమే.. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల అమలు కోసం ఫార్మర్ ఐడీని రూపొందించారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన, సాయిల్ హెల్త్ కార్డు, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, భారత ఆహార భద్రత మిషన్, రాష్ట్రీయ కృషి వికాస యోజన వంటి పథకాల అమలులో ఈ నంబర్ కీలకం కానుంది. కేంద్ర పథకాలను పారదర్శకంగా అర్హుల దరిచేర్చడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు అమలు చేస్తున్నారు. ప్రతీసారి రైతు భూమి పత్రాలన్నీ తీసుకెళ్లే అవసరం లేకుండా ఈ నంబర్తో అధికారులు తెలుసుకునే వీలవుతుంది. అయితే, రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, రైతు బీమా తదితర పథకాలకు దీంతో సంబంధం ఉండదని అధికారులు చెబుతున్నారు. నెల పాటు రిజిస్ట్రేషన్లు ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నెల పాటు జరుగుతుంది. సోమవారం మొదలుకాగా, జూన్ 5వ తేదీ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నా రు. జిల్లాలోని 129 క్లస్టర్లలో ఏఈఓలు ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. అయితే, ఏఈఓలు వచ్చినప్పుడు అందుబాటులో లేని రైతులు ఆధార్, పట్టాదార్ పాస్ పుస్తకం వంటి వివరాలతో సమీపంలోని మీ సేవా కేంద్రంలోనూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జిల్లాలో 3.51 లక్షల మంది రైతుల ఫార్మర్ ఐడీ జారీ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న ఒక్కరోజు వ్యవధిలోనే ఓటీపీ విధానం ద్వారా ఫార్మర్ ఐడీ వస్తుంది. గుర్తింపు తప్పనిసరి కేంద్రప్రభుత్వ పథకాలు పొందేందుకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి. రైతులు స్వచ్ఛందంగా ఏఈఓలను సంప్రదించి పట్టాదారు పాస్ పుస్తకంతదితర వివరాలు అందిస్తే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఏఈఓల ద్వారా లేదా సమీపంలోని మీ సేవా కేంద్రాల్లోనూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. – ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారిరైతులందరికీ నంబర్ రఘునాథపాలెం: కేంద్రప్రభుత్వం చేపట్టిన ’ఫార్మర్ ఐడీ’ ప్రాజెక్టులో భాగంగా ప్రతీ రైతుకు 11 అంకెలతో కూడిన ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించనున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి.పుల్లయ్య తెలిపారు. రఘునాథపాలెం మండలం వీ.వీ.పాలెంలో రైతుల వివరాల నమోదును సోమవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీఏఓ పరిశీలించారు. ఏఈఓ బాలాబత్తుల శిరణ్మయి, రైతులు పాల్గొన్నారు. -
నేడు వాహనాల వేలంపాట
ఖమ్మంక్రైం: ఖమ్మం, సత్తుపల్లి ఎకై ్సజ్ స్టేషన్ల పరిధిలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు రవాణా చేస్తుండగా స్వాధీనం చేసుకున్న వాహనాలను మంగళవారం వేలం వేయనున్నట్లు ఖమ్మం ఎకై ్సజ్ స్టేషన్–1 సీఐ కృష్ణ తెలిపారు. మొత్తం 18వాహనాలను వేలం వేయనుండగా, ఆసక్తి ఉన్న వారు ఈఎండీ చెల్లించి పాల్గొనాలని సూచించారు. వాహనం పొందిన వారు జీఎస్టీతో సహా నిర్దేశిత ధర చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. సీఎంఆర్ఎఫ్తో నిరుపేదలకు ఊరట ఖమ్మంవన్టౌన్: అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకోలేని పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం(సీఎంఆర్ఎఫ్) ద్వారా ఊరట లభిస్తోందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా ఖమ్మం రూరల్, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో 113 మందికి మంజూరైన రూ.40లక్షల విలువైన చెక్కులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో సోమవారం అందజేశారు. ఈసందర్భంగా నాయకులు తుంబూరు దయాకర్రెడ్డి, మద్దినేని స్వర్ణకుమారి మాట్లాడుతూ మంత్రి పొంగులేటి సిఫారసుతో చెక్కులు మంజూరయ్యాయని తెలిపారు. నాయకులు సురేష్, రామయ్య తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగం పేరుతో మోసంమహిళపై కేసు నమోదు కూసుమంచి: ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.3.29 లక్షలు కాజేసిన మహిళపై సోమవా రం కూసుమంచి పోలీసులు కేసునమోదు చేశా రు. కూసుమంచికి చెందిన దామళ్ల రామచంద్రయ్యను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రొంపేడుకు చెందిన గుదిబండ్ల ఆదిలక్ష్మి పరిచయం చేసుకుంది. రామచంద్రయ్య కుమార్తెకు ప్రభు త్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఆయన నుంచి విడతల వారీగా రూ.3.29లక్షలు తీసుకు ని ముఖం చాటేసింది. దీంతో మోసపోయినట్లు గుర్తించిన ఆయన చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. కానిస్టేబుల్కు రియల్ హీరో అవార్డుసత్తుపల్లి: సత్తుపల్లి పోలీసుస్టేషన్లోని ఐడీ పార్టీ కానిస్టేబుల్ ఎం.నరేష్కు ‘రియల్ హీరో’ అవార్డు లభించింది. ఓ టీవీ చానల్ ఆధ్వర్యాన ప్రకటించిన అవార్డుకు ఆయన ఎంపిక కాగా, హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చే తుల మీదుగా సోమవారం అందుకున్నారు. మార్చి 10వ తేదీన సత్తుపల్లిలో ఓ దొంగను పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్ నరేష్ను తొ మ్మిది చోట్ల కత్తితో పొడిచినా వెనక్కి తగ్గకుండా నిందితుడిని బంధించారు. దీంతో ఆయనను ‘రియల్ హీరో’ అవార్డు అందించగా, ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ జితేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోడుభూములకు సాగునీటి సదుపాయం రెడ్కో మేనేజర్ అజయ్కమార్ చండ్రుగొండ: గిరిజనుల పోడు భూములకు సాగునీటి సదుపాయం కల్పిస్తామని, ఇందుకోసం చండ్రుగొండ మండలంలోని బెండాలపాడు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేశామని రాష్ట్ర ఇంధన వనరుల పునురుద్ధరణీయ సంస్థ(రెడ్కో) ఉమ్మడి జిల్లా మేనేజర్ అజయ్కుమార్ తెలిపారు. ఇందిర జల వికాసం పథకం ద్వారా పట్టాలు పొందిన వారి పోడు భూముల్లో వేయనున్న బోరుబావులకు సోమవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ ఒక్కో బోరుకు సోలార్ ప్లాంట్తోపాటు ఐటీడీఏ ద్వారా రూ.5లక్షలు అందించనున్నట్లు తెలిపా రు. కార్యక్రమంలో నాయకులు భోజ్యానాయక్, బొర్రా సురేష్, ఫజల్ పాల్గొన్నారు. -
ఈనెల 21 వరకు ‘దోస్త్’ రిజిస్ట్రేషన్లు
ఖమ్మం సహకారనగర్: డిగ్రీలో ప్రవేశాలకు ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్)’ తొలిదశ షెడూ్య్ల్ విడుదలైందని ఖమ్మంలోని ఎస్ఆర్ బీజీఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జాకీరుల్లా తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన కళాశాలలో ప్రచార పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. ఈనెల 21 వరకు తొలి విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుండగా, 10నుంచి 22 తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వొచ్చని తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం హాల్ టికెట్, ఆధార్ కార్డు జిరాక్స్, ఆధార్ కార్డుకు లింక్ అయిన ఫోన్ నంబర్, ఎస్సెస్సీ, ఇంటర్ మెమోలు, 6–10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్ల జిరాక్సులు, ఇంటర్ టీసీ, రెండు ఫొటోలతో రిజిష్ట్రేషన్ చేసుకోవచ్చని వెల్ల డించారు. ఇందుకోసం తమ కళాశాలలోని సహాయ కేంద్రంతో పాటు 98498 41555, 96188 96949 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాళ్లు ఏ.ఎల్.ఎన్ శాస్త్రి, బానోత్ రెడ్డి, దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ సలీం పాషా, వివిధ విభాగాల బాధ్యులు సునంద, డాక్టర్ రమాసత్యవతి, ఈ.వేలాద్రి తదితరులు పాల్గొన్నారు. -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంవన్టౌన్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు కూసుమంచి మండలం నేలపట్ల, మల్లేపల్లి, జక్కేపల్లి ఎస్సీకాలనీ, పాలేరులలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్ధాపన చేస్తారు. మధ్యాహ్నం 12గంటలకు ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగే నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ సమావేశంలో పాల్గొంటారు. ఆతర్వాత సాయంత్రం 4గంటలకు ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు, పెద్దతండా, గొల్లపాడు, కరుణగిరిలో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి, మెయిన్ రోడ్డుపై ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు, మారెమ్మ ఆలయం – కేంద్రియ విద్యాలయం రోడ్డుపై వీధి దీపాల ఏర్పాటుకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ‘భూ భారతి’ సదస్సులు సద్వినియోగం చేసుకోండి బోనకల్: భూసమస్యల పరిష్కారానికి రాష్ట్రప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూ భారతిపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. జిల్లాలో రెండో విడతగా బోనకల్ మండలాన్ని ఎంపిక చేయగా, తొలిరోజు మండలంలోని గార్లపాడులో సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ జి.నరసింహారావు మాట్లాడుతూ భూభారతి చట్టంపై అవగాహన కల్పిస్తూ దరఖాస్తుల స్వీకరణకు సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా, గ్రామంలో భూసమస్యలకు సంబంధించి 67 దరఖాస్తులు అందగా, కేటగిరీల వారీగా పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు. తహసీల్ధార్ పున్నంచందర్, ఆర్ఐలు నవీన్, మైథిలి, ఆత్మ కమిటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరావు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రారంభమైన స్పాట్ వాల్యూయేషన్ ఖమ్మం సహకారనగర్: ఓపెన్ స్కూల్ పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం సోమవారం ప్రారంభమైంది. ఖమ్మంలోని రోటరీనగర్ పాఠశాలలో ఏర్పాటుచేసిన క్యాంప్నకు డీఈఓ సామినేని సత్యనారాయణ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవా రం క్యాంప్ను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం మొదలుకాగా, ఇంటర్ మూల్యాంకనం ఈనెల 8న ప్రారంభమవుతుందని తెలిపారు. జిల్లాకు 18,999 ఇంటర్మీడియట్ జవాబుపత్రాలు, 11,118 పదో తరగతి జవాబు పత్రాలు వచ్చాయని చెప్పారు. ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు పాల్గొన్నారు. ముత్తంగి అలంకరణలో భద్రాద్రి రామయ్య భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారు సోమవారం ముత్తంగి అలంకరణలో దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. స్వామికి కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. -
కేఎంసీకి మూడో స్థానం
25 శాతం ఫీజు రాయితీతో ఎల్ఆర్ఎస్ పన్ను చెల్లింపుల్లో ఖమ్మం కార్పొరేషన్ రాష్ట్రంలో మూడో స్థానాన నిలిచింది. మొదటి స్థానంలో గ్రేటర్ వరంగల్, రెండో స్థానంలో పెద్ద అంబర్పేట ఉన్నాయి. కేఎంసీ పరిధిలో 40,181 దరఖాస్తులు రాగా.. 29,322 మందికి ఫీజు చెల్లించాలని సమాచారం ఇచ్చారు. ఇందులో 11,999 మంది ఫీజు చెల్లించగా, కేఎంసీకి రూ.54.58 కోట్ల ఆదాయం సమకూరింది. జిల్లాలో వచ్చిన ఆదాయం సగానికి పైగా కేఎంసీ నుంచే నమోదు కావడం విశేషం. రాయితీ సమాచారం యాజమానులకు చేరవేయడం, గడువులోగా ఫీజు చెల్లించేలా అధికారులు పర్యవేక్షించడంతో ఫలితం దక్కిందని భావిస్తున్నారు. ఇక సుడా పరిధిలో 19,245 మందికి సమాచారం ఇవ్వగా, 5,825 మంది రూ.15.38 కోట్ల మేర చెల్లించారు. -
హైకోర్టు న్యాయమూర్తి మృతికి సంతాపం
ఖమ్మం లీగల్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఎం.జీ.ప్రియదర్శిని మృతిపై ఖమ్మం బార్ అసోసియేషన్ బాధ్యులు సంతాపం ప్రకటించారు. ఈమేర కు సోమవారం బార్ అసోసియేషన్ హాల్లో ఆమె చిత్రపటానికి నివా ళులర్పించాక అసోసియేషన్ అధ్యక్షుడు తొండపు వెంకటేశ్వరరావు, తదితరులు మాట్లాడారు. ప్రియదర్శిని మృతి న్యాయ రంగానికి తీరని లోటని, ఆమె ఖమ్మం జిల్లా కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తిగా ఎనలేని సేవలందించారని గుర్తుచేశారు. కాగా, జడ్జి మృతికి మృతికి సంతాపసూచకంగా న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ఈకార్యక్రమంలో విజయశాంత, ఇందిర, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, జడ్జి ప్రియదర్శిని మృతిపై న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రత్నాకరం శ్రీనివాసరావు, శ్రీనివాసరెడ్డితో పాటు ఎస్.కే.నాగుల్ షరీఫ్, జిల్లా కోర్టు నాజర్ కె.శ్యామ్ తదితరులు కూడా సంతాపం తెలిపారు. వడదెబ్బతో కార్మికుడు మృతి ఖమ్మంఅర్బన్: ఖమ్మం కై కొండాయిగూడెంకు చెందిన బోల్లపు శ్రీనివాసరెడ్డి(47) వడదెబ్బకు గురై సోమవారం మృతి చెందారు. బల్లెపల్లి వద్ద ఓ ప్రైవేట్ పరిశ్రమలో రోజువారీ కూలిగా పనిచేస్తున్న ఆయన ఎండవేడితో ఇటీవల అపస్మారక స్థితికి చేరాడు. దీంతో సహచర కార్మికులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా, సోమవారం ఉదయం మృతి చెందాడు. ఆయనకు తల్లిదండ్రులు ఉన్నారు. కాగా, మృతుడి కుటుంబానికి ప్రభుత్వం పరిహారం చెల్లించాలని సీపీఎం నాయకుడు దొంగల తిరుపతిరావు డిమాండ్ చేశారు. రైలు ఢీకొని వృద్ధురాలు..బోనకల్: మండలంలోని గోవిందాపురం(ఏ) గ్రామానికి చెందిన షేక్ నన్నేబీ(75) రైలు ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందింది. ఆమె సోమవారం గ్రామంలోని ట్రాక్ దాటే సమయాన వేగంగా వస్తున్న రైలును గమనించలేదు. దీంతో రైలు ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందింది. నన్నేబీ మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మార్చురీకి తరలించినట్లు జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్ బోనకల్: అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను మండలంలోని గార్లపాడు వద్ద సీజ్ చేసినట్లుగా ఎస్ఐ పొదిలి వెంకన్న తెలిపారు. బ్రాహ్మణపల్లి, మోటమర్రి గ్రామాల్లోని ఇసుక ర్యాంప్ల నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను తనిఖీ చేయగా రెండింటికి అనుమతి లేదని తేలినట్లు చెప్పారు. ఈమేరకు వాహనాలను సీజ్ చేసి యజమానులైన మల్లెల వీరభద్రం, గోపిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పేకాటరాయుళ్ల అరెస్ట్ వేంసూరు: మండలంలోని కుంచపర్తిలో పేకాట స్థావరంపై పోలీసులు సోమవారం దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని రూ.9,500 నగదు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. షార్ట్సర్క్యూట్తో ఫొటోస్టూడియో దగ్ధం కారేపల్లి: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కారేపల్లిలోని ఓ ఫొటోస్టూడియో దగ్ధమైంది. కారేపల్లి బస్టాండ్ సెంటర్లోని డాక్టర్ రాఘవులు కాంప్లెక్స్లో సూర్యతండాకు చెందిన ధరావత్ రాంచంద్ స్టూడియో నిర్వహిస్తున్నాడు. ఆదివారం అర్ధరాత్రి స్టూడియో నుంచి పొగలు వస్తుండడంతో పెట్రోలింగ్ కానిస్టేబుల్ సీతారాములు గమనించి ఫైర్ స్టేషన్తో పాటు నిర్వాహకుడికి ఫోన్లో సమాచారం ఇచ్చాడు. కాగా, మంటలు ఎగిసిపడుతుండడంతో ఆ ప్రాంతమంతా పొగ కమ్ముకపోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఇంతలోనే అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఈ ఘటనలో స్టూడియోలోని కెమెరాలు, జిరాక్స్ మిషన్, కంప్యూటర్లు పాటు పరీచర్కాలిపోవడంతో సుమారు రూ.10లక్షల మేర నష్టం వాటిల్లిందని నిర్వాహకుడు రాంచంద్ వెల్లడించాడు. ఆర్ఐ నర్సింహారావు సోమవారంఉదయం పంచనామా చేయగా, ఘటనపై బాధితుడు రాంచంద్ కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
శాస్త్రవేత్తల సూచనలతో అధిక దిగుబడి
● విత్తన ఎంపిక, సస్యరక్షణ చర్యల్లో అప్రమత్తత ● ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’లో కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ మంత్రుల పర్యటనకు ఏర్పాట్లు ఖమ్మంఅర్బన్: త్వరలో జరగనున్న మెడికల్ కాలేజీ భవనాల శంకుస్థాపనకు పలువురు మంత్రులు హాజరుకానున్నందున, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ఆదేశించారు. రఘునాథపాలెం వద్ద మెడికల్ కాలేజీకి కేటాయించిన భూములను పరిశీలించి శంకుస్థాపన ఏర్పాట్లపై సూచనలు చేశారు. మంత్రులు తమ పర్యటనలో భాగంగా శంకుస్థాపన చేయడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శిస్తారని, కలెక్టరేట్లో సమీక్షించనున్నందున వివరాలతో అధికారులు సిద్ధం కావాలన్నారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, ఆర్అండ్బీ ఎస్ఈ, ఈఈ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.రఘునాథపాలెం: రైతులు పంటల సాగులో శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తే మేలైన దిగుబడి సాధ్యమవుతుందని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. వానాకాలం పంటల సాగుపై అవగాహన కల్పించేలా ‘రైతు ముంగిట శాస్త్రవేత్తలు’ పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈసందర్భంగా రఘునాథపాలెం మండలం రాంక్యాతండా రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల గుర్తింపు, మేలైన విత్తనాల ఎంపిక, సస్యరక్షణ చర్యల్లో అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని తెలిపారు. అంతేకాక పంట మార్పిడి, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి దనసరి పుల్లయ్య మాట్లాడుతూ విత్తనాలు, పురుగు మందుల రశీదులు పంట పూర్తయ్యేలా భద్రం చేయాలని సూచించారు. వైరా కేవీకే కోఆర్డినేటర్ రవికుమార్ మాట్లాడుతూ యూరియా వాడకం, నేల ఆరోగ్యం పరిరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. రఘునాథపాలెం, మంచుకొండ సొసైటీల అధ్యక్షులు తాతా రఘురాం, మందడపు సుధాకర్, ఖమ్మం డివిజన్ ఆత్మ చైర్మన్ దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, ఏడీఏ కొంగర వెంకటేశ్వరరావు మాట్లాడగా ఎంపీడీఓ అశోక్ కుమార్, మండల వ్యవసాయ అధికారి ఉమామహేశ్వర్రెడ్డి, ఉద్యానవనాధికారి నగేష్, ఏఈఓలు ప్రతిభ, వేదవ్యాస్, శివ, వెంకటేష్, శిరణ్మయి, పంచాయతీ సెక్రటరీ లాలయ్యతో పాటు నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కొత్త పంటల సాగులో ప్రతిభ కనబరుస్తున్న పలువురు రైతులను కలెక్టర్ సన్మానించారు. జీవితంలో గొప్పగా ఎదగాలి ఖమ్మంవన్టౌన్: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవడమే కాక వాటి సాధనకు కృషి చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ సూచించారు. జిల్లా కేంద్రంలోని బాలల సదనాన్ని సందర్శించిన ఆయన పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన వారిని అభినందించారు. అందుబాటులో ఉన్న అవకాశాలను సమర్ధవంతంగా వినియోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. అనంతరం బాలల సదనంలో ఆధునికీకరణ పనులపై అధికారులకు సూచనలు చేశారు. జిల్లా సంక్షేమాధికారి కీసర రాంగోపాల్రెడ్డి, ఉద్యోగులు కృష్ణలాల్, విద్యాచందన పాల్గొన్నారు. -
ఎఫ్పీఓలుగా సొసైటీలు
● జిల్లాలో నాలుగు పీఏసీఎస్లకు అవకాశం ● రూ.15 లక్షల చొప్పున నిధులతో విస్తరించనున్న సహకార సేవలు నేలకొండపల్లి: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్)లను రైతు ఉత్పత్తిదారుల సంస్థలు(ఎఫ్పీఓ)గా అప్గ్రేడ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో తొలి విడత నాలుగు సొసైటీలకు అవకాశం దక్కింది. ఈమేరకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(ఎన్సీడీసీ)తో అవగాహన మేరకు సహకార శాఖ ప్రక్రియ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నాలుగు సొసైటీలను అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 76 సంఘాల్లో కార్యకలాపాలు జిల్లాలో 76 పీఏసీఎస్లు ఉండగా, ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు, వాహన, పంట రుణాల పంపిణీ తదితర సేవలందిస్తున్నాయి. ఇందులో మెరుగైన లావాదేవీలు జరుగుతున్న నాలుగు సొసైటీలను తొలి దశలో ఎఫ్పీఓలుగా మార్చారు. ఇందులో బోదులబండ (నేలకొండపలి), కారేపల్లి, ఏదులాపురం, గంగదేవిపాడు పీఏసీఎస్లను ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లుగా అప్గ్రేడ్ చేశారు. ఇంకొన్నింటిని రెండో విడతలో ఎఫ్పీఓలుగా మార్చే అవకాశముంది. తద్వారా సహకార ఫలాలు మరింతగా విస్తరించనున్నాయి. నిధులు ఇలా..... రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం పీఏసీఎస్లను ఎఫ్పీఓలుగా మార్చి కార్యకలాపాలు విస్తరించనుంది. సాగులో నూతనంగా వస్తున్న సాంకేతికతను సన్న, చిన్న కారు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చి వారి ఆదాయం పెంచాలనే లక్ష్యంతో ఈ పథకం అమలు చేస్తోంది. ఎఫ్పీఓల్లో సభ్యులకు రూ.15 లక్షల చొప్పున మ్యాచింగ్ గ్రాంట్ కేటాయిస్తారు. అలాగే, ఎఫ్పీఓల పూర్తి స్థాయి కార్యకలాపాల కోసం మూడేళ్ల పాటు మరి కొంత నిధులు విడుదల చేస్తారు. ఉద్యోగుల వేతనాలు సైతం ఈ నిధుల నుంచి తీసుకునే అవకాశముండగా, కంప్యూటర్, ఇతరత్రా అవసరాలకు కూడా వాడుకోవచ్చు. నిధులకు ప్రతిపాదనలు జిల్లాలో నాలుగు పీఏసీఎస్లను ఎఫ్పీఓలుగా ఎంపిక చేశారు. ఈ సొసైటీల్లో ఇప్పటికే ఖాతాలు కూడా ప్రారంభమయ్యాయి. నిధులు మంజూరు కోసం ప్రతిపాదనలు పంపించాం. తద్వారా వ్యాపార సంస్థలుగా ఆవిర్భవించినట్లవుతుంది. త్వరలోనే రైతులను ఐక్యం చేసి కార్యకలాపాలు మొదలుపెట్టేలా ప్రణాళిక రూపొందించాం. – గంగాధర్, జిల్లా సహకార శాఖ అధికారి -
రోడ్డెక్కిన అన్నదాతలు
కొణిజర్ల: ధాన్యాన్ని ఫలానా మిల్లుకు తీసుకెళ్లాలని సూచించి, ఆతర్వాత మరో మిల్లుకు తరలించాలని చెప్పడంతో సివిల్ సప్లయీస్ అధికారుల తీరుపై ఆగ్రహిస్తూ రైతులు రాస్తారోకో చేపట్టారు. కొణిజర్ల మండలంలోని పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మండల కేంద్రంలోని శ్రీ శ్రీనివాస మిల్లుకు తరలిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం శనివారం ట్రాక్టర్లలో రైతులు వెళ్లగా అక్కడే నిలిపేశారు. తీరా సోమవారం మధ్యాహ్నం డీఎస్ఓ చందన్కుమార్ వచ్చి మిల్లు కోటా పూర్తయిందని వైరాలోని మిల్లుతో పాటు హనుమకొండ జిల్లా కేంద్రానికి తరలించాలని సూచించారు. అయితే, మూడు రోజుల పాటు వేచి ఉన్నాక ఇతర చోట్లకు వెళ్లాలనడంతో రైతులు వైరా – సత్తుపల్లి జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. వీరికి సీపీఎం, మాస్లైన్ నాయకులు బొంతు రాంబాబు, సీ.వై.పుల్లయ్య, కంకణాల అర్జునరావు మద్దతు తెలపగా, ఆందోళనతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో ఎస్ఐ జి.సూరజ్, తహసీల్దార్ రాము, ఆర్ఐలు రమేష్, అశోక్ చేరుకుని రైతులతో మాట్లాడారు. ప్రస్తుతం మిల్లు వద్ద ట్రాక్టర్ల నుంచి ధాన్యం దిగుమతి చేయించాలని, ఆతర్వాత ఇతర చోట్లకు పంపాలని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. తరుగు తీస్తున్నారని... కల్లూరు: ధాన్యం తరుగు పేరిట మిల్లర్లు వ్యవహరిస్తున్న తీరుపై కల్లూరులో రైతులు రాస్తారోకోకు దిగారు. పుల్లయ్యబంజర్కు చెందిన రైతులు ఐకేపీ కేంద్రానికి ధాన్యం తీసుకురాగా, మిల్లర్లు క్వింటాకు రెండు కేజీల తరుగు తీస్తామని చెప్పారు. దీనికి రైతులు అంగీకరించినా చివరకు 4–5 కేజీల తరుగు తీస్తుండడంతో తహసీల్లో వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లారు. అక్కడ తహసీల్దార్ లేకపోవడంతో ఆందోళనకు దిగారు. దీంతో వాహనాలు నిలిచిపోగా ఎస్ఐ డి.హరిత నచ్చచెప్పాక ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. రైతు బొల్లం నాగరాజు 700 టిక్కీల ధాన్యం తీసుకొస్తే 21 టిక్కీలు కోత పెట్టారని ఆరోపించారు. రైతులు కిష్టంశెట్టి నరసింహారావు, శివలీల కృష్ణ, పసుపులేటి సుబ్బారావు, వంగల శ్రీను, కిష్టంశెట్టి దుర్గ, పెద్దబోయిన వెంకి, మధ్యబోయిన వెంకటేశ్వరరావు, బొల్లం నాగరాజు, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.మిల్లుల కేటాయింపులో కొర్రీలపై ఆగ్రహం -
అప్రమత్తంగా లేకపోతే ముప్పే
● గ్యాస్తో జాగ్రత్తలు తప్పనిసరి ● వణికిస్తున్న గ్యాస్ సంబంధిత ప్రమాదాలు ● మిట్టపల్లి ఘటనలో నాలుగుకు చేరిన మృతుల సంఖ్యసత్తుపల్లిటౌన్: జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న వంటింటి గ్యాస్ ప్రమాదాలు ప్రజలను వణికిస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ లీకేజీతో ఈ ప్రమాదాలు జరుగుతుండగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రాణాల మీదకు వస్తుండడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారులు సూచిస్తున్నారు. అయితే, గృహ వినియోగదారులకు స్టౌ, రెగ్యులేటర్ తదితర అంశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్యాస్ కంపెనీలు కూడా అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు. జిల్లాలో జరిగిన ప్రమాదాల్లో కొన్ని.. ● సత్తుపల్లిలోని హనుమాన్నగర్కు చెందిన అడపా శ్రీరాంమూర్తి – కుమారి దంపతులు 2023లో జరిగిన గ్యాస్ లీకేజీ ప్రమాదంలో మరణించారు. ● ఎన్టీఆర్నగర్లోని తడికమళ్ల ప్రకాశరావు నివానంలో గ్యాస్ లీకేజీతో మంటలు వ్యాపించగా ఆస్తినష్టం సంభవించింది. ● ద్వారకాపురి కాలనీలోని వెంకటేశ్వరరావు నివాసంలో ఆరుబయట వంట చేస్తుండగా గ్యాస్లీక్ కావటంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సుమారు 1.50లక్షల ఆస్తి నష్టం జరిగింది. ● సత్తుపల్లి చర్చి రోడ్డులోని బాబీ నివాసంలో వంట చేస్తుండగా గ్యాస్పైప్ లీక్ అయి మంటలు అంటుకున్నాయి. ● తల్లాడ మండలం మిట్టపల్లిలో ఇటీవల గ్యాస్ లీక్ అయి మంటలు వ్యాపించిన ఘటనలో ముగ్గురు పిల్లలు సహా ఓ వృద్ధురాలు మృతి చెందారు. లీకేజీలను గుర్తించడం.. ● గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్, బుష్ వద్ద శబ్దం వచ్చినా.. వదులుగా తిరుగుతున్నా నిర్లక్ష్యం చేయొద్దు. ● సిలిండర్ ఇచ్చినప్పుడే గ్యాస్ బాయ్తో పరిశీలన చేయించాలి. బరువు, లీకేజీ, సీల్ సరిగా, ఉందా లేదా చూడాలి. ● సిలిండర్ను స్టౌవ్ను కలిపే ట్యూబ్ను నిశితంగా గమనించాలి. వేడివల్ల ట్యూబ్ సాగే గుణం కోల్పోయి పెలుసుబారి పగుళ్లు ఏర్పడతాయి. ● పైప్నకు గుండుసూది మొనంత రంధ్రం ఏర్పడినా గంటకు కిలోన్నర గ్యాస్ లీక్ అవుతుంది.సిలిండర్ ఖాళీ కాగానే మూత పెట్టాలి.లేకుంటే దుమ్ముదూళి లోపలకు చేరుతుంది. ఈ జాగ్రత్తలు కూడా... గ్యాస్ సిలిండర్ ఎప్పుడూ వెలుతురు ఉన్న ప్రదేశలో నిలువుగానే పెట్టాలి. మండే పదార్థాలకుదూరంగా ఉంచాలి. సిలిండర్ను పడుకోబెడితేలీక్ ఏర్పడే అవకాశముంటుంది. స్టౌను సిలిండర్ కంటే ఒక అడుగు ఎత్తులో ఉంచాలి. అలాకాకుండా స్టౌనునేలపై ఉంచి వంట చేయడం ప్రమాదకరం.ఏమాత్రం గ్యాస్ వాసన వచ్చినా తలుపులు, కిటికీలు తెరిచి రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. అవగాహన అవసరం గ్యాస్ వినియోగంపై అవగాహన కలిగి ఉండడమే కాక జాగ్రత్తలు పాటించాలి. వంట పూర్తికాగానే రెగ్యులేటర్ బంద్ చేయాలి. ఊరు వెళ్లే సమయాన రెగ్యులేటర్ తొలగించి సిలిండర్కు మూత తొడగాలి. గ్యాస్ లీక్ అవుతున్నట్లు గుర్తిస్తే లైట్లు వేయొదు. అగ్గిపెట్టె వెలిగించవద్దు. ఒకవేళ మంటలు అంటుకుంటే తడి గోనె సంచి లేదా తడి కాటన్ దుప్పటి సిలిండర్పై వేయాలి. – వై.వెంకటేశ్వరరావు, ఫైర్ ఆఫీసర్, సత్తుపల్లిమృత్యువుతో పోరాడినా దక్కని ఫలితంతల్లాడ: గ్యాస్ సిలిండర్ లీకేజీ అయిన ఘటనలో గాయపడిన బాలిక సోమవా రం మృతి చెందింది. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. తల్లాడ మండలం పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్ ఇంట్లో గతనెల 28న సిలిండర్ మారుస్తుండగా మంటలు చెలరేగిన విషయం విదితమే. ప్రమాదంలో వినోద్తో పాటు ఆయన కవల కుమారులు తరుణ్, వరుణ్, నాయనమ్మ సుశీల, ఆయన చెల్లెలి కుమార్తెలు గుంటు ప్రిన్సీ, లింసీ గాయపడ్డారు. రెండు రోజుల వ్యవధిలో తరుణ్, వరుణ్, సుశీల మృతి చెందగా.. ప్రిన్సీ, లింసీ హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో ప్రిన్సీ(9) వారం పాటు మృత్యువుతో పోరాడి మృతి చెందింది. సత్తుపల్లి మండలం రామానగర్కు చెందిన ఆమె పాఠశాలకు వేసవి సెలవులు ఇవ్వడంతో మేనమామ వినోద్ ఇంటికి వచ్చింది. ప్రమాదంలో నలుగురి మృతితో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొనగా, ప్రిన్సీ సోదరి లింసీ హైదరాబాద్, వినోద్ ఇంటి వద్దే చికిత్స పొందుతున్నాడు. కాగా, బాలిక మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి తరలిస్తామని తల్లాడ ఎస్ఐ బి.కొండల్రావు తెలిపారు. -
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ప్రజాపాలన
నేలకొండపల్లి: బీఆర్ఎస్ హయాంలో పదేళ్ల పాటు అసమర్ధ పాలన కొనసాగితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని రాష్డ్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తెలిపారు. మండలంలోని కోరట్లగూడెంలో కాంగ్రెస్ సేవాదళ్ నియోజకవర్గ కన్వీనర్ బచ్చలకూరి నాగరాజు నివాసంలో పలువురు నాయకులతో కలిసి సోమవారం సన్నబియ్యంతో భోజనం చేశారు. అలాగే, నాగేశ్వరరా వు జన్మదిన వేడుకల సందర్భంగా కట్ చేసిన ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, కేంద్రం సహకరించుకునా కాంగ్రెస్ ఎన్నికల వేళ ఇచ్చిన హమీలన్నీ అమలు చేస్తుందని తెలిపారు. గత పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, ఇప్పుడు కొత్త కార్డులు మంజూరు చేస్తూనే సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అనంతరం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణలను పార్టీశ్రేణులు తిప్పికొట్టాలని కోరారు. మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, నాయకులు శాఖమూరి రమేష్, కొడాలి గోవిందరావు, జెర్రిపోతుల అంజిని, యడవల్లి నాగరాజు, హన్మంతరావు, జెర్రిపోతుల సత్యనారాయణ, మార్తి కోటి, గట్టిగుండ్ల విజయ్, కడియాల నరేష్, కణతాల లీలావతి తదితరులు పాల్గొన్నారు. -
విలువైన సొత్తు.. చోరీకి అదును
● ఖమ్మం కేబుల్ బ్రిడ్జి సామగ్రిపై దొంగల కన్ను ● ఇటీవల అడ్డొచ్చిన సెక్యూరిటీ గార్డుపై దాడిఖమ్మంక్రైం: ఖమ్మంలోని కాల్వొడ్డులో మున్నేటిపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందుకోసం నిర్మాణ సంస్థ సమకూర్చుకున్న సామగ్రిపై దొంగల కన్ను పడింది. ఈ ప్రాంతంలో విలువైన సామగ్రి తరచుగా చోరీ అవుతుండడంతో నిర్మాణ సంస్థ ప్రతినిధులు, సెక్యూరిటీ సిబ్బందికి తలనొప్పిగా మారింది. వర్షాలు వస్తే మున్నేటిలో వరద పెరిగి నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడుతుందనే భావనతో ఇటీవల భారీగా సామగ్రిని సమకూర్చుకుని పనుల్లో వేగం పెంచారు. ఈ ప్రాంతంలో పలువురు సెక్యూరిటీ గార్డులను నియమించినా, వారి కళ్లుగప్పుతున్న కొందరు చోరీ చేస్తున్నారు. అయితే, ఇక్కడ సామగ్రి చోరీపై ఖమ్మం త్రీటౌన్, రూరల్ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు సైతం చేశారు. దీంతో అనుమానితులను పట్టుకుని విచారించగా సమీప ప్రాంతానికి చెందిన అకతాయిలుగా గుర్తించినట్లు సమాచారం. అయితే, కేసు నమోదు చేయకుండా వారి తరఫున కొందరు ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తుండడంతో చోరీలు సర్వసాధారణమయ్యాయి. సెక్యూరిటీ గార్డ్పై కత్తులతో దాడి... ఇదిలా ఉండగా గతవారం చోరీ వచ్చిన కొందరు వ్యక్తులు అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డుపై కత్తులతో దాడి చేశారు. నిర్మాణ ప్రాంతం నుంచి విలువైన సామగ్రిని ఎత్తుకెళ్తుండగా బిహార్కు చెందిన సెక్యూరిటీ గార్డు అశుతోష్కుమార్ రాయ్ అడ్డుకున్నాడు. దీంతో ఆయనపై కత్తులతో దాడి చేసిన వారు, తమ వెంట పడకుండా తొడపై తీవ్రగాయం చేశారు. ఈ సమయాన అశుతోష్ కేకలు వేయగా మిగతా సిబ్బంది వచ్చే సరికి పారిపోయారు. దీంతో క్షతగాత్రుడిని సూపర్వైజర్ కోటి జిల్లా ఆస్పత్రిలో చేర్పించడమే కాక త్రీటౌన్పోలీస్స్టేషన్లో ఫిర్యా దు చేశారు. ఓపక్క వర్షాలు వచ్చేలోగా ఎక్కువ శా తం పనులు పూర్తిచేయాలనే లక్ష్యంతో నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉండగా.. వరుస చోరీలతో ఎటూ పాలుపోలేని పరిస్థితి ఎదురవుతోందని వాపోతున్నారు. -
డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా జహంగీర్ అలీ
ఖమ్మం సహకారనగర్: తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎం.డీ.జహంగీర్ అలీ ఎన్నికయ్యారు. ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికలకు ఎన్నికల అధికారిగా అసిస్టెంట్ రిజి స్ట్రార్ హిలావత్ అంజియా వ్యవహరించారు. నల్ల గొండ జిల్లాకు చెందిన ఎం.డీ. జహంగీర్ అలీ, సంగారెడ్డి జిల్లాకు చెందిన మల్లేష్ గౌడ్, ఖమ్మం నుంచి కె.వెంకటేశ్వర్లు అధ్యక్ష స్థానానికి నామినేషనన్లు దాఖలు చేశారు. చివరకు వెంకటేశ్వర్లు, మల్లేష్ నామినేషన్లు ఉపసంహరించుకోగా... జహంగీర్ అలీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవమైనట్లు ప్రకటిచారు. కాగా, సోమవారం ఖమ్మంలోని డ్రైవర్లసంఘం భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘాన్ని బలోపేతం చేయడంతో పాటు సంఘంలో గతంలో జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయిలో విచారణ జరపనున్నట్లు తెలిపారు. ఇంకా ఈసమావేశంలో ఎం.డీ.సలీం, దాసరి వేణు, లింగంపల్లి గగన్న, జి.నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
పెద్దాస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి ఆస్పత్రికి వచ్చిన ఆయన వివిధ విభాగాలను పరిశీలించి వాహనాల పార్కింగ్, ఆస్పత్రి ప్రధాన గేట్ బయట రద్దీ నియంత్రణపై చర్చించారు. అనంతరం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ఆస్పత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా అన్ని రకాల చర్యలు చేపట్టాలని సూచించారు. మంత్రుల పర్యటన నాటికి ఆస్పత్రిలో కావాల్సిన వైద్య పరికరాలు, సౌకర్యాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆతర్వాత పార్కింగ్, పారిశుద్ధ్య నిర్వహణ, సూచిక బోర్డుల ఏర్పాటు, మరమ్మతులపై సూచనలు చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎల్.కిరణ్కుమార్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.రాజేశ్వరరావు, కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్ షఫీఉల్లా, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదులు పెండింగ్లో ఉండొద్దు..
ఖమ్మం సహకారనగర్: ప్రజలు అందిస్తున్న ప్రతీ ఫిర్యాదును పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో ఆయన వినతిపత్రాలు, ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం వివి ధ శాఖల అధికారులతో సమావేశమై ఫిర్యాదుల పరిశీలన, పరిష్కారంపై సూచనలు చేశారు. డీఆ ర్వో పద్మశ్రీ, డీఆర్డీఓ సన్యాసయ్య తదితరులు పాల్గొన్నారు. వలసదారులను పంపించేయాలని వినతి ఖమ్మం మామిళ్లగూడెం: జిల్లాలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశస్తులను గుర్తించి వారి దేశాలకు పంపించాలని బీజేపీ నాయకులు కోరారు. ఈమేరకు అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, పోలీస్ కమిషనర్ సునీల్దత్కు వినతిపత్రాలు అందజేశారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల వలసదారులను వారి దేశాలకు పంపించాలన్న ఆదేశాల మేరకు జిల్లాలో తనిఖీలు చేయాలని కోరారు. నాయకులు సన్నె ఉదయ్ప్రతాప్, ఈ.వీ.రమేష్, డాక్టర్ శీలం పాపారావు, గెంటేల విద్యాసాగర్, నున్నా రవికుమార్, మార్తి వీరభద్రప్రసాద్, అల్లిక అంజయ్య తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి -
తగ్గిన ఉష్ణోగ్రతలు
ఖమ్మంవ్యవసాయం: రెండు రోజులుగా ఈదురుగాలులతో పాటు వర్షం కురవడంతో జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. దీంతో వాతావరణం చల్లబడింది. ఈనెల 6, 7 తేదీల వరకు ఇలాగే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శనివారం ఎర్రుపాలెంలో గరిష్ట ఉష్ణోగ్రత 42.5 డిగ్రీలు, అత్యల్పంగా ఏన్కూరు మండలం తిమ్మారావుపేటలో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదివారం నాగులవంచలో గరిష్టంగా 37.3 డిగ్రీలు, రావినూతలలో 37.3, వైరా ఏఆర్ఎస్ 36.8, కుర్నవల్లి, వైరా, తల్లాడలో 36.5, ఏన్కూరులో 35.9, కూసుమంచి 35.7, లింగాల, గేటు కారేపల్లిలో 35.6, బచ్చోడులో 35.4, పల్లెగూడంలో 35.3, కాకరవాయిలో 35.2, పమ్మిలో 35.1, తిమ్మారావుపేట, రఘునాథపాలెంలో 34.9, బాణాపురం, పెనుబల్లిలో 34.8, పంగిడిలో 34.6, నేలకొండపల్లిలో 34.5, ఖమ్మం ఖానాపురం, ప్రకాశ్నగర్, తిరుమలాయపాలెం, చింతకానిలో 34.2, ఖమ్మం ఎన్ఎస్టీ గెస్ట్హౌస్ వద్ద 34.1, పెద్దగోపతిలో 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, అకాల వర్షాలతో వరి, మొక్కజొన్న, మామిడి, బొప్పాయి, కూరగాయల పంటలు దెబ్బతింటుండగా రైతులు ఆందోళన చెందుతున్నారు. -
తేమ శాతం రాగానే కొనుగోలు చేయాలి
వైరా: కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యంలో తేమ శాతం సరిపడా రాగానే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. మండలంలోని స్నానాల లక్ష్మీపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, వైరాలో ఏఎంసీ, ఎంఎల్ఎస్ పాయింట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యంలో తేమ శాతాన్ని ఎప్పటికప్పడు పరిశీలించాలని చెప్పారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి ఆవసరమైన వాహనాలు సంఖ్య పెంచాలన్నారు. మిల్లులు, కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీల కొరత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డబ్బు చెల్లించేలా చూడాలని ఆదేశించారు. ధాన్యం తరలింపు వేగవంతంఖమ్మం సహకారనగర్ : జిల్లాలోని వివిధ మండలాల్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తక్షణమే తరలిస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్కుమార్ తెలిపారు. నేలకొండపల్లి, ముదిగొండ, కూసుమంచి, కొణిజర్ల, సత్తుపల్లి, వైరా, తల్లాడ తదితర ప్రాంతాల నుంచి లారీల ద్వారా హన్మకొండ జిల్లా పంపించామని వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు 1.11లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, 21వేల మెట్రిక్ టన్నులు హన్మకొండ జిల్లాలోని మిల్లులకు తరలించామని తెలిపారు. వర్షాలు కురుస్తున్నందున కొనుగోలు కేంద్రాల ఇన్చార్జ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నెట్బాల్ జిల్లా జట్ల ఎంపికఖమ్మం స్పోర్ట్స్ : జిల్లా నెట్బాల్ అసోసియేషన్ ఆధ్వార్యాన ఆదివారం ఖమ్మం రూరల్ మండలం పెద్ద వెంకటగిరి జెడ్పీ హైస్కూల్లో ఉమ్మడి జిల్లా స్థాయి నెట్బాల్ బాలబాలికల సబ్ జూనియర్ జట్లను ఎంపిక చేశారు. జిల్లా వ్యాప్తంగా 30మంది బాలురు, 28మంది బాలికలు ఎంపికలకు హాజరయ్యారు. జిల్లా జట్టుకు ఎంపికై న వారు ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు జనగామలో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూని యర్ నెట్బాల్ చాంపియన్షిప్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. బాలబాలికల జట్టుకు 24 మంది చొప్పున ఎంపిక చేశామని వెల్లడించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎ.నాగేశ్వరరావు, స్కూల్ చైర్ పర్సన్ శ్రీదేవి, జిల్లా నెట్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు దీప్తి, కార్యదర్శి ఎన్.ఫణికుమార్, పీడీ పి.వి.వెంకటరమణ పాల్గొన్నారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి ఖమ్మంమయూరిసెంటర్ : ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని, మావోయిస్టుల పేరున ఆదివాసీలపై జరుపుతున్న దాడులను ఆపాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక సుందరయ్య భవనంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది కాలంగా మావోయిస్టులను అంతం చేస్తామంటున్న కేంద్రం.. వివిధ ఆపరేషన్ల పేరుతో ఆదివాసీలపై దాడులు చేస్తోందని విమర్శించారు. శాంతి చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టుల నుంచి రెండుసార్లు ప్రతిపాదనలు వచ్చినా పట్టించుకోకుండా అణచివేత చర్యలకు పాల్పడటం దారుణమని అన్నారు. మేధావులు, పౌరహక్కుల నేతలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తామని చెప్పినా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం సరైంది కాదన్నారు. అడవుల్లో ఉన్న సహజ వనరులు, విలువైన ఖనిజాలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే ఆపరేషన్ కగార్ను ఎంచుకుందని ఆరోపించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నాయకులు బి.రమేష్, మాదినేని రమేష్, ఎం.సుబ్బారావు, మెరుగు సత్యనారాయణ, షేక్ బషీరుద్దీన్, పిన్నింటి రమ్య పాల్గొన్నారు. -
కాల్వలు అధ్వానం..
ఎన్నెస్పీ కాల్వలు పదేళ్లుగా మరమ్మతులకు నోచుకోక అధ్వానంగా తయారయ్యాయి. పూడికతో నీటి సరఫరా సాగడం లేదు. ● జిల్లాలో 6 కేంద్రాలు, 2,739 మంది విద్యార్థులు ● ఉదయం 11 గంటలకే పరీక్ష కేంద్రాల వద్దకు.. ● చివరి నిమిషంలో కొందరి ఉరుకులు.. పరుగులు వాతావరణ ం జిల్లాలో సోమవారం సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కొన్నిచోట్ల ఆకాశం మేఘావృతమై ఉంటుంది. చిరు జల్లులు పడే అవకాశం ఉంది.సోమవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 202510లోపరీక్ష బాగా రాశాను నగరంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో పరీక్ష రాశాను. మొత్తం 720 మార్కులకు గాను మంచి మార్కులు వస్తాయనే నమ్మకం ఉంది. బోటనీ, జువాలజీ బాగా రాశాను. ఫిజిక్స్ సబ్జెక్ట్ రాసేందుకు సమయం సరిపోలేదు. ప్రశ్నలు ఇన్ డైరెక్ట్ మెథడ్తో రావడంతో పాటు ప్రశ్నాపత్రం లెంథీగా(పెద్దగా) వచ్చింది. దీంతో ఆలోచించి పరీక్ష రాయాల్సి వచ్చింది. – ఆదిబా ఫర్జీన్, విద్యార్థిని ప్రశ్నపత్రం కఠినంగా ఉంది నీట్లో కొన్ని సబ్జెక్ట్లు కఠినంగా వచ్చాయి. బోటనీ సులభంగా ఉండగా జువాలజీ పర్వాలేదు. ఫిజిక్స్ కఠినంగా వచ్చింది. దీంతో పాటు ప్రశ్నలు పెద్దగా ఉండడంతో ఎక్కువ సమయం పట్టింది. కెమిస్ట్రీ కూడా కొంత కఠినంగానే ఉంది. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పరీక్ష ప్రశాంతంగా రాశా. మంచి మార్కులు వస్తాయనే నమ్మకం ఉంది. – కొల్ల సాయిజశ్వంత్ ఖమ్మం సహకారనగర్ : 2025 – 26 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ(ఎన్టీఏ) ఆదివారం నిర్వహించిన నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్) జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం నగరంలో ఆరు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 2,739 మంది విద్యార్థులకు గాను 2,671 మంది హాజరయ్యారు. 68 మంది గైర్హాజరయ్యారు. ఈ పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. పరీక్ష కేంద్రాల్లోకి ఉదయం 11 గంటల నుంచే అనుమతిస్తామని అధికారులు ముందుగానే ప్రకటించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు 10.30 గంటల నుంచే కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులను కేంద్రాల్లోకి పంపించే సమయంలో పోలీస్ సిబ్బంది, ఇతరులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నగరంలో అడిషనల్ డీసీపీ, ఇతర పోలీసులతో పాటు, పలు శాఖల సిబ్బంది విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచనలు, సలహాలు అందించారు. ఉరుకులు.. పరుగులు మధ్యాహ్నం 1.30 గంటల వరకే పరీక్షకు అనుమతిస్తామని అధికారులు ముందుగానే ప్రకటించినా, హాల్ టికెట్లపై నిబంధనలు పొందుపర్చినా ఒకరిద్దరు విద్యార్థులు చివరి క్షణంలో ఉరుకులు, పరుగులతో హాజరయ్యారు. నగరంలోని ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల, యూనివర్సిటీ పీజీ కళాశాల పరీక్ష కేంద్రాలు పక్కపక్కనే ఉండడంతో కొందరు అటువారు ఇటు, ఇటువారు అటు రావడంతో అధికారులు ఆయా కేంద్రాలకు వెళ్లేలా సూచనలు చేశారు. ఇక ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రానికి ఓ విద్యార్థిని 4 నిమిషాలు ఆలస్యంగా రావడంతో అధికారులు వెనక్కు పంపించారు. ఇతర కేంద్రాల వద్ద కూడా ఆలస్యంగా వచ్చిన వారికి అనుమతించలేదు. పరీక్ష రాసిన తల్లీకూతుళ్లు.. ఖమ్మం నగరానికి చెందిన తల్లీ కూతుళ్లు నీట్కు దరఖాస్తు చేసుకున్నారు. తల్లి బి.సరితకు సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, కూతురు బి.కావేరికి ఖమ్మం ఎన్నెస్సీ కాలనీ ప్రభుత్వ పాఠశాల కేంద్రాల్లో పరీక్ష రాశారు. పిల్లలతో పరీక్ష కేంద్రానికి ఎమ్మెల్యే.. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి ఇద్దరు పిల్లలు నీట్ రాయగా వారిని ఆమె కేంద్రాల వద్దకు తీసుకెళ్లారు. ఒకరికి ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల పరీక్షా కేంద్రం కాగా.. మరొకరికి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కేటాయించారు.ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులున్యూస్రీల్ -
పైలెట్.. సక్సెస్
ఇలా పరిశీలన.. రెవెన్యూ రికార్డులతో పాటు క్షేత్ర స్థాయి తనిఖీతో దరఖాస్తులను ధ్రువీకరించడానికి తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్ లేదా గిర్దావర్, సర్వేయర్, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ నేతత్వంలో బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి బృందానికి నాలుగు రెవెన్యూ గ్రామాలను కేటాయించారు. ఖమ్మం ఆర్డీఓ జారీ చేసిన నోటీసులను దరఖాస్తుదారులకు అందజేయడంతోపాటు ఎవరైనా అభ్యంతరం తెలియజేయదలిస్తే ఏడు రోజుల్లోపు నేలకొండపల్లిలోని తహసీల్దార్ కార్యాలయంలో డాక్యుమెంటరీ ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు గ్రామ పంచాయతీలు, ఎంపీడీఓ, తహసీల్దార్, వ్యవసాయ కార్యాలయాలతో పాటు పోలీస్ స్టేషన్ నోటీసు బోర్డుల్లో ప్రదర్శించారు.సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో పైలెట్ మండలంగా ఎంపికై న నేలకొండపల్లిలో భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం విజయవంతమైంది. 14 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలన్నీ ఒక దగ్గరకు చేర్చారు. 11 రకాల భూ సమస్యలపై ఈ సదస్సుల్లో రెవెన్యూ అధికారులకు 3,224 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ యంత్రాంగం ఆరు బృందాలుగా.. ఒక్కో బృందం నాలుగు రెవెన్యూ గ్రామాల్లో ఈనెల 15 వరకు దరఖాస్తులను పరిశీలన పూర్తి చేయాలి. ఆ తర్వాత తహసీల్దార్ నుంచి ఆర్డీఓకు క్లియరెన్స్ వస్తుంది. ఆ తర్వాత ఆర్డీఓ ప్రొసీడింగ్స్ ఇస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత దరఖాస్తుదారు ఇప్పటికే పాస్ బుక్ కలిగి ఉంటే అది నవీనీకరిస్తారు. లేదంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేస్తారు. సదస్సులతో అవగాహన.. భూ భారతి అమలుకు రాష్ట్రంలో పైలెట్గా నాలుగు మండలాలను తీసుకోగా ఇందులో నేలకొండపల్లి కూడా ఉంది. ఈ పథకం అమలుకు ముందు అందరికీ అవగాహన కల్పించేలా ప్రభుత్వం సదస్సులకు శ్రీకారం చుట్టింది. ఈ మండలంలో గతనెల 17 నుంచి 30 వరకు 23 రెవెన్యూ గ్రామాల్లోని 32 గ్రామ పంచాయతీల్లో సదస్సులు నిర్వహించారు. తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్, ఆర్ఐ, సర్వేయర్, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొని భూభారతి చట్టం విధి విధానాలు, పనితీరును వివరించారు. దండిగా దరఖాస్తులు.. ఈ సదస్సులతో పాటు ప్రత్యేకంగా తహసీల్దార్ కార్యాలయంలో హెల్ప్డెస్క్ పెట్టారు. రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు ఇవ్వలేని వారు ఈ హెల్ప్డెస్క్లో అందజేశారు. సదస్సుల్లో 2,690 దరఖాస్తులు రాగా హెల్ప్డెస్క్కు 534 అందాయి. సాదాబైనామాకే ఎక్కువ.. 11 రకాలకు సంబంధించిన భూ సమస్యలపై 3,224 దరఖాస్తులు రాగా, ఇందులో అత్యధికంగా సాదాబైనామా కింద క్రమబద్ధీకరణకు 1,264 అర్జీలు (40 శాతం) రావడం గమనార్హం. అయితే సీసీఎల్ఏ అందించిన డేటా ప్రకారం మండలంలో సాదాబైనామా క్రమబద్ధీకరణకు 3,417 దరఖాస్తులు ఉన్నాయి. ప్రస్తుతం భూభారతి చట్టంలో సాదాబైనామా క్రమబద్ధీకరణకు సంబంధించి 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు అందినవి మినహా.. ఇతర దరఖాస్తులను ప్రాసెస్ చేయానికి ఎటువంటి నిబంధన లేదు. దీంతో మిగిలిన దరఖాస్తులను పక్కన పెట్టారు. ప్రభుత్వ అనుమతితో సీసీఎల్ఏ జారీ చేయబోయే నోటిఫికేషన్ అందిన తర్వాత ఈ దరఖాస్తులను ప్రాసెస్ చేసేందుకు డాక్యుమెంటరీ ఆధారాలను సమర్పించమని దరఖాస్తుదారులను కోరనున్నారు. ఈనెల 15లోగా తనిఖీలు పూర్తి.. బృందాలు క్షేత్రస్థాయి తనిఖీ ప్రక్రియను ఈనెల 15లోగా పూర్తి చేస్తాయి. ఇందుకోసం షెడ్యూల్ రూపొందించుకుని గ్రామాలను సందర్శిస్తున్నాయి. వీటిపై ఏమైనా అభ్యంతరాలు వ్యక్తమై.. తదుపరి విచారణ అవసరమైతే ఈనెల 16 నుంచి 22 వరకు మరోసారి గ్రామాలను సందర్శిస్తాయి. ఆ తర్వాత ఖమ్మం ఆర్డీఓ, నేలకొండపల్లి తహసీల్దార్ అందించిన లాగిన్లో చేసిన సిఫార్సుల ఆధారంగా ఈనెల 25 నుంచి 30 వరకు ఆమోదించబడిన దరఖాస్తుదారుల ఈకేవైసీని పొందడం ద్వారా ప్రొసీడింగ్లు జారీ చేస్తారు. దీని ప్రకారం దరఖాస్తుదారుడు ఇప్పటికే పాస్ పుస్తకం కలిగి ఉంటే దాకాన్ని ఆధునికీకరిస్తారు. లేదంటే కొత్త పాస్బుక్ జారీ చేస్తారు.నేలకొండపల్లిలో విజయవంతమైన భూ భారతి 14 రోజులు 32 పంచాయతీల్లో రెవెన్యూ సదస్సులు 11 రకాల భూ సమస్యలపై 3,224 దరఖాస్తులు అత్యధికంగా సాదాబైనామా క్రమబద్ధీకరణకు 1,264.. -
వసతుల కల్పనకు కృషి
● రూ.128 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం ● భూమి పూజ చేసి పనులు ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టిమధిర: మధిర పట్టణ ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. స్థానిక సుందరయ్య నగర్లో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ పనులకు ఆదివారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మధిరలో అండర్ డ్రెయినేజీ ఏర్పాటు చేయాలనే ప్రజల చిరకాల కోరిక నెరవేర్చడానికి రూ.128 కోట్లు మంజూరు చేయించినట్లు వెల్లడించారు. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిధులు సమకూరుస్తున్నట్లు తెలిపారు. యూజీడీలో భాగంగా 99.56 కిలో మీటర్ల మేర సీనరేజ్ పైప్లైన్, 6,638 గృహాలకు కనెక్షన్, నాలుగు సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. పాత డంపింగ్ యార్డ్ వద్ద రాయపట్నం రోడ్డులో 5 ఎంఎల్డీ ఎస్టీపీ, మడుపల్లిలో 0.9 ఎంఎల్డీ ఎస్టీపీ, మధిర లేక్ వద్ద అంబారుపేటలో 0.4 ఎంఎల్డీ ఎస్టీపీ, ఇల్లందులపాడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద 0.5 ఎంఎల్డీ ఎస్టీపీ నిర్మించనున్నట్లు వివరించారు. మధిరలో మేజర్ స్టార్మ్ వాటర్ డ్రైన్, ఆర్సీసీ రిటైనింగ్ వాల్, ఓసీఈఎంఎస్ పరికరాల అమరిక పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఐదేళ్ల పాటు నిర్మాణ సంస్థే నిర్వహణ బాధ్యతలు చూడాల్సి ఉంటుందన్నారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులను ఆదేశించారు. మధిర పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేలా అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టామని, గ్రామీణ ప్రాంతాల్లోనూ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, తహసీల్దార్ రాళ్లబండి రాంబాబు, మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్, వెంకటరమణ గుప్తా తదితరులు పాల్గొన్నారు.ఆలయ అభివృద్ధి పనుల పరిశీలనవైరా: వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివారం పర్యటించారు. తన స్వగ్రామమైన లక్ష్మీపురంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో చేపట్టిన స్నానాల ఘాట్, గదులు, ప్రహరీ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆలయ సమీపంలో వైరా నదిపై నిర్మించనున్న రిటైనింగ్ వాల్, చెక్డ్యామ్, ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్దేశిత గడువు లోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుక రావాలని అధికారులకు సూచించారు. -
సెడార్ వ్యాలీ పాఠశాలలో వైమానిక శిక్షణ
రఘునాథపాలెం: మండలంలోని వీవీపాలెంలో ఉన్న సెడార్ వ్యాలీ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఆదివారం స్పేస్ జెన్ సంస్థతో కలిసి వైమానిక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. హార్వెస్ట్ విద్యాసంస్థలకు చెందిన సుమారు 100 మంది విద్యార్థులు ఈ శిక్షణలో పాల్గొన్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. కాక్పిట్, సిమ్యులేటర్ ద్వారా విద్యార్థులు విమానం టేకాఫ్, లాండింగ్, ఫ్లయింగ్ విభాగాల్లో శిక్షణ పొందారు. శిక్షణ అనంతరం విద్యార్థులకు కరస్పాండెంట్ రవిమారుత్, అకడమిక్ అడ్వయిజర్లు పార్వతీరెడ్డి, ఉదయశ్రీ ధ్రువపత్రాలు అందించారు. ప్రజా సమస్యలను పార్లమెంట్లో వినిపిస్తున్నా.. ఎంపీ రామసహాయం రంఘురాంరెడ్డి ఖమ్మంవన్టౌన్: తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజా సమస్యలను పార్లమెంట్లో వినిపిస్తూ, వాటి పరిష్కారం దిశగా పనిచేస్తున్నానని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమది తొలి నుంచి ప్రజలతో ముడిపడిన జీవితమని, మున్నేరు వరదలప్పుడు సైతం అనేక కాలనీల్లో సహాయక చర్యల్లో పాల్గొని, నిత్యావసరాలు పంపిణీ చేశానన్నారు. జిల్లా అభివృద్ధే లక్ష్యంగా జాతీయ రహదారులు, సర్వీస్రోడ్లు, అండర్పాస్ల రూపకల్పనకు కృషిచేశానని, కొత్తగూడెం ఎయిర్పోర్ట్ అంశాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, తాను తిరిగి ఫైల్ తెరిపించి విమానయాన శాఖ అధికారులను సర్వేకు పిలిచానని పేర్కొన్నారు. పాలేరులో ప్రత్యామ్నాయ రైల్వే రూట్, పులిగుండాల ఎకో టూరిజం పార్క్, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యలపై తాను గళం విప్పానని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ఆందోళన కూసుమంచి: అకాల వర్షాలు వస్తున్నందున ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, కాంటాలు వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం పాలేరులో రైతులు ఖమ్మం – సూర్యాపేట రహదారిపై రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడారు. ఎస్ఐ నాగరాజు అప్పటికప్పుడు జాతీయ రహదారిపై వెళ్తున్న లారీలను ఆపి కొనుగోలు కేంద్రానికి తరలించారు. గన్నీ బ్యాగులను కూడా తీసుకొచ్చి కాంటాలు వేయటంతో పాటు ధాన్యాన్ని లారీల్లో తరలించటంతో రైతులు ఆందోళన విరమించారు. డివైడర్ను ఢీకొట్టి రోడ్డుపై పడిన లారీ రఘునాథపాలెం: ఖమ్మం నుంచి రాజమండ్రికి వెళ్తున్న లారీ ఆదివారం ఉదయం మండలంలోని వీవీపాలెం సమీపంలో డివైడర్ను ఢీకొట్టి రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిసింది. రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ ఘటనా ప్రాంతానికి చేరుకుని లారీని పక్కకు తరలించి, ట్రాఫిక్ను పునరుద్ధరించారు. కేసు నమోదు బోనకల్: ప్రభుత్వ పాఠశాలలో జూదం ఆడుతున్న వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పొదిలి వెంకన్న తెలిపారు. మండలంలోని ఆళ్లపాడు పాఠశాలలో కొన్ని రోజులుగా కొందరు జూదం ఆడుతున్నట్లు సమాచారం అందగా ఎస్ఐ అక్కడికి చేరుకుని, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2,700 స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కిన్నెరసానిలో జలవిహారంపాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్పైనుంచి జలాశయాన్ని, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. రిజర్వాయర్లో జలవిహారం చేశారు. 535 మంది పర్యాటకులు కిన్నెరసానిలో ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖ రూ.29,600 ఆదాయం లభించగా, 200 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.10,400 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
ఆర్టీసీ బస్సు, కారు ఢీ
చింతకాని: మండలంలోని తిరుమలాపురం క్రాస్ రోడ్డు సమీపంలో ఆదివారం రాత్రి ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో మధిర పట్టణానికి చెందిన పసుపులేటి వెంకటసాయి అలియాస్ బ్రహ్మయ్య (28) మృతి చెందగా వేపూరి శబరీశ్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. బోనకల్ వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు, ఖమ్మం నుంచి బోనకల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు తిరుమలాపురం క్రాస్ రోడ్డు సమీపంలోకి రాగానే ఢీకొన్నాయి. కారు డ్రైవింగ్ చేస్తున్న బ్రహ్మయ్య అక్కడికక్కడే మృతి చెందగా, కారులో ఉన్న శబరీశ్కు గాయాలయ్యాయి. ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను పునరుద్ధరించారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాన్ని స్థానికుల సాయంతో బయటకు తీసి, ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కారు నడుపుతున్న సమయంలో బ్రహ్మయ్య మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. మృతుడి స్వగ్రామం ఎర్రుపాలెం మండలం మొలుగుమాడు కాగా, తల్లిదండ్రులు మధిరలో నివాసం ఉంటున్నారు. బ్రహ్మయ్య, శబరీశ్ ఎర్రవరంలోని ఆలయ దర్శనానికి వెళ్లి ఖమ్మం వస్తుండగా ప్రమాదం జరిగింది. కాగా, బస్సు పక్కకు దూసుకుపోయి రాయికి గుద్దుకుని ఆగింది. ఆ పక్కనే వ్యవసాయ బావి ఉంది. బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నారు. రాయికి తగలకపోతే బస్సు బావిలో పడేదని ప్రయాణికులు తెలిపారు. ఒకరు మృతి -
బాలికపై లైంగికదాడికి యత్నం..!
మధిర: పట్టణంలోని స్టేషన్రోడ్లో బాలికపై సమీప బంధువు శనివారం రాత్రి లైంగికదాడికి యత్నించినట్లు సమాచారం. స్థానిక శ్రీకల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఉంటున్న ఓ మహిళ పలు ఇళ్లలో పనిచేస్తూ కుమార్తెను చదివిస్తోంది. కుమారుడు కూలి పనులకు వెళ్తుంటాడు. కుమారుడికి కిడ్నీలో స్టోన్ ఉండగా చికిత్స కోసం శనివారం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. బాలిక ఇంట్లో ఉండగా తన చిన్నమ్మ భర్త (బాబాయి) శనివారం రాత్రి ఇంటికి వచ్చి చేతులు, కాళ్లు తాళ్లతో కట్టి.. నోట్లో గుడ్డలు కుక్కి లైంగికదాడికి యత్నించినట్లు సమాచారం. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు రాగా సదరు వ్యక్తి పరారయ్యాడు. ఆదివారం బాలిక తల్లి మధిర టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి మధిర: దెందుకూరు రైల్వే ఓవర్ బ్రిడ్జిపై శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన మట్టగుంజ సతీశ్ (23) మధిర పట్టణంలోని ఫర్నిచర్ దుకాణంలో పనిచేస్తున్నాడు. ద్విచక్ర వాహనంపై మధిర నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా రైల్వే ఓవర్ బ్రిడ్జిపై ఎదురుగా వచ్చిన టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. సతీశ్ అక్కడికక్కడే మృతి చెందగా.. సమాచారం అందుకున్న ఆర్కే ఫౌండేషన్ అధ్యక్షులు దోర్నాల రామకృష్ణ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రూరల్ ఎస్ఐ లక్ష్మీభార్గవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఏన్కూరు: బైక్ను వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో వివాహిత మృతిచెందగా.. ఆమె భర్త, కుమార్తె పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రామతండాకు చెందిన సొడియం బ్రహ్మ ఆయన భార్య సంధ్య, కూతురు అమృత కలిసి ద్విచక్రవాహనంపై ఏన్కూరు ప్రధాన సెంటర్కు రాగానే మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. స్థానికులు 108 ద్వారా ముగ్గురిని ఆస్పత్రికి తరలిస్తుండగా సంధ్య (38) మృతి చెందింది. భర్త, కూతురు పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఘటనా స్థలానికి ఎస్ఐ రఫీ చేరకుని, కేసు నమోదు చేశారు. భార్య మృతి.. భర్త, కుమార్తె పరిస్థితి విషమం -
గంజాయి ముఠా అరెస్ట్
మధిర: ఒడిశా రాష్ట్రం నుంచి మధిరకు గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాను మధిర టౌన్ ఎస్హెచ్ఓ, ట్రైనీ ఐపీఎస్ కొట్టే రిత్విక్స్వాయి అదుపులోకి తీసుకున్నారు. వివరాలను ఆదివారం టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన వెల్లడించారు. ఈ నెల 2న ఆత్కూర్ క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీస్ వాహనాన్ని చూసి ద్విచక్ర వాహనంపై బ్యాగులతో వస్తున్న ఇద్దరు వ్యక్తులు పారిపోయేందుకు యత్నించారు. వారిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా బ్యాగుల్లో సుమారు రూ.2 లక్షల విలువ చేసే 4 కేజీల గంజాయి దొరికింది. ఒడిశా రాష్ట్రంలోని పుష్పలంక ప్రాంతవాసి హంటర్ మధు నుంచి మధిర పట్టణానికి చెందిన మర్రి సుజిత్, తమ్మిశెట్టి ఏసుబాబు గంజాయి కొనుగోలు చేసి, ఇక్కడికి తీసుకొచ్చి 9 మందికి విక్రయించారని, వారు చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి పట్టణంలోని యువతకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. వీరు ఇన్స్ట్రాగామ్ యాప్ ద్వారా మాట్లాడుకుంటూ గంజాయి రవాణా చేస్తున్నారని, మొత్తం 12 మందిపై కేసు నమోదు చేశామని రిత్విక్సాయి వెల్లడించారు. మర్రి సుజిత్, తమ్మిశెట్టి ఏసుబాబును రిమాండ్కు తరలించామని, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశామని వివరించారు. ఇసుక తరలిస్తున్న వాహనాలు సీజ్ ఏపీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 3 టిప్పర్లు, ఎస్కార్ట్గా వస్తున్న మరో 3 వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు మధిర ఎస్హెచ్ఓ, ట్రైనీ ఐపీఎస్ కొట్టే రిత్విక్స్వాయి తెలిపారు. ఆదివారం టౌన్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 2న అర్ధరాత్రి ఏపీలోని నందిగామ మీదుగా తెలంగాణకు అనుమతులు లేకుండా వస్తున్న 3 ఇసుక టిప్పర్లు, వాటికి ఎస్కార్ట్గా వస్తున్న 3 వాహనాలను రాయపట్నం సమీపంలో పట్టుకున్నారు. వాహనాల యజమాని, ఒక కాంట్రాక్టర్, 9 మందిపై కేసు నమోదు చేసి 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అదనపు ఎస్ఐ చంద్రశేఖర్రావు పాల్గొన్నారు. -
కాల్వలు అధ్వానం..
తల్లాడ: 1977లో నిర్మించిన నాగార్జున సాగర్ (ఎన్నెస్పీ) కాల్వలు పదేళ్లుగా మరమ్మతులకు నోచుకోక అధ్వానంగా తయారయ్యాయి. మేజర్, మైనర్ కాల్వల్లో గుర్రపు డెక్క, చెత్త చెదారం, పూడిక పేరుకుపోయి పిచ్చి మొక్కలు, కంప చెట్లు దట్టంగా పెరగి సాగునీటి సరఫరాకు అడ్డుపడుతున్నాయి. మేజర్ కాల్వలపై ఆధారపడి మండలంలోని సిరిపురం, రామచంద్రాపురం, గూడూరు–1, 2, పుణ్యపురం, బస్వాపురం గ్రామాల్లో పంటలు పండిస్తున్నారు. వీటి కింద పలు మైనర్లు, సబ్ మైనర్లు కూడా ఉన్నాయి. కానీ, ఈసారి చివరి భూముల రైతులకు తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. వారు రేయింబవళ్లు, కాల్వల వెంట తిరిగి నీరు పెట్టుకోవాల్సి వచ్చింది. అందుకు కారణం పదేళ్లుగా సాగర్ కాల్వలకు శాశ్వత మరమ్మతులు చేయకపోవటమే. కాల్వల్లో గుర్రపు డెక్క వ్యాపించింది. పూడిక పేరుకుంది. రెండు పక్కలా పిచ్చి మొక్కలు దట్టంగా మొలిచాయి. సిబ్బంది కొరత.. పర్యవేక్షణ లోపం ఎన్నెస్పీ సిబ్బంది కొరత, పర్యవేక్షణ లోపంతో కాల్వల నిండా పిచ్చి మొక్కలు పెరిగి, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. వేసవిలో లష్కర్లు కాల్వల్లో పిచ్చి మొక్కలు తొలగించాల్సి ఉన్నా.. ఆ సిబ్బంది కొరతతో మొక్కలు బాగా పెరిగాయి. అవి ఇలాగే ఉంటే ఖరీఫ్ సీజన్లోనూ నీరందటం కష్టమేనని రైతులు వాపోతున్నారు. బలహీనంగా డ్రాప్లు మేజర్, మైనర్ కాల్వలకు చెందిన డ్రాపులు, యూటీలు పలుచోట్ల కూలగా ఇప్పటికీ మరమ్మతులు చేయలేదు. కాల్వ కట్టలు బలహీనంగా మారాయి. పలుచోట్ల కోతకు గురై ఎక్కడ గండి పడుతుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. కొలబద్ధలు నామరూపాల్లేకుండా పోయాయి. ఇప్పుడే అనుకూలం ఏటా ఖరీఫ్కు ముందే కాల్వల్లో గుర్రపు డెక్క, పిచ్చి మొక్కలను తొలగించాలి. పేరుకుపోయిన పూడికను తీయాలి. నిధులే లేక పదేళ్లుగా కాల్వలకు మరమ్మతులు జరగకపోవడంతో 150 క్యూసెక్కుల నీటిని సరఫరా చేయాల్సిన మేజర్లలో 100 క్యూసెక్కులలోపు విడుదల చేస్తున్నారు. ఏటా చివరి ఆయకట్టు రైతులు కాల్వల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కాల్వల మరమ్మతులకు ఈ రెండునెలలే అనుకూలం.ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? గుర్రపు డెక్క, పిచ్చి మొక్కలతో కమ్మేసిన సాగర్ కాల్వలు పదేళ్లుగా కరువైన మరమ్మతులు ఫలితంగా చివరి భూములకు అందని సాగర్ నీరు ఈ వేసవిలోనైనా మరమ్మతులు చేస్తే ఉపయోగం తల్లాడ మండలంలో ఎన్నెస్పీ కాల్వల వివరాలు ఆయకట్టు 21 వేల ఎకరాలు గ్రామాలు 41 మేజర్ కాల్వలు 06 మైనర్లు 34 సిరిపురం మేజర్ 18.587 కి.మీ. రామచంద్రాపురం 7.625 కి.మీ. గూడూరు–1 2.400 కి.మీ. గూడూరు–2 3.600 కి.మీ. పుణ్యపురం 6.307 కి.మీ. బస్వాపురం 4.840 కి.మీ. -
ఖమ్మం మహిళ హైదరాబాద్లో మృతి
ఖమ్మంక్రైం: వరుసకు వదిన అయిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి తన భార్యను కొట్టి చంపినట్లు సమాచారం. ఈ ఘటన హైదరాబాద్లో జరగగా.. మృతురాలిది ఖమ్మం. వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన సాహితి (30)కి ఖమ్మం పట్టణానికి చెందిన రేగుల అనిల్తో కొన్నేళ్ల కిందట వివాహమైంది. అనిల్ హైదరాబాద్లోని పోలీస్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తుండటంతో దంపతులు అక్కడే ఉంటున్నారు. కాగా, అనిల్ వరుసకు వదిన అయిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. పద్ధతి మార్చుకోవాలని పెద్దల సమక్షంలో హెచ్చరించినా మార్పు రాలేదు. శనివారం రాత్రి సాహితిని విపరీతంగా కొట్టడంతో ఆమె మృతిచెందగా గుండెపోటుతో మృతిచెందినట్లు చిత్రీకరించేందుకు అనిల్ యత్నించాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. మృతురాలి శరీరంపై కూడా గాయాలున్నాయని, హైదరాబాద్ నుంచి మృతదేహన్ని తీసుకొచ్చి ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. సీఐ బాలకృష్ణ వారితో మాట్లాడి అనిల్పై ఫిర్యాదు చేయాలని, పోస్టుమార్టంలో హత్య అని తేలితే కేసు నమోదు చేస్తామని, సర్దిచెప్పగా మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. టూటౌన్ పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. అనిల్ పరారీలో ఉన్నాడు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. భర్తే కొట్టి చంపాడని అనుమానాలు -
నవ్వుదాం.. నవ్విద్దాం...
● మానసిక స్థితిని మెరుగుపరిచే ఔషధం నవ్వు ● ఐక్యతను ప్రోత్సహించే సాధనం కూడా.. ● జిల్లా నుంచి కమెడియన్లుగా రాణిస్తున్న పలువురు నేడు ప్రపంచ నవ్వుల దినోత్సవం ఖమ్మంగాంధీచౌక్: నవ్వడం ఒక యోగం.. నవ్వకపోవడం రోగం అనేది నానుడి. అందుకే నవ్వు, నవ్వించు.. ఆరోగ్యంగా జీవించు అని పెద్దలు చెబుతుంటారు. ఈ కోవలోకి వచ్చేలా నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ అంటూ రచయితలు సినీ గేయాలు రూపొందించారు. నవ్వుకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి హాస్య ప్రియుల కోరిక మేరకు అంతర్జాతీయ నవ్వుల యోగా ఉద్యమ మార్గదర్శి డాక్టర్ మదన్ కటారియా 1998లో ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని ప్రకటించారు. అప్పటి ఏటా నుంచి మే మొదటి ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యాన జిల్లా నుంచి హాస్యనటులుగా, స్టాండప్ కమెడియన్లుగా రాణిస్తున్న వారిపై కథనం అందె వేసిన హాస్య కళాకారులు ఖమ్మంకు కళల గుమ్మంగా పేరు. ఈక్రమాన ఇక్కడ హాస్య కళాకారులు కూడా ఉన్నారు. సినీ చరిత్రలో గొప్ప హాస్య నటుడుగా పేరొందిన బాబూమోహన్ స్వస్థలం జిల్లాలోని బీరోలు. మరో హాస్య నటుడు యరమల శ్రీనివాసరెడ్డిది సైతం కల్లూరు మండలం చినకోరుకొండి. వీరిద్దరు చలన చిత్ర పరిశ్రమలో హాస్య నటుడుగా పేరు సాధించారు. వీరేకాక మరికొందరు హాస్యనటులు జిల్లా నుంచి రాణిస్తుండగా స్టాండప్ కమెడియన్లుగానూ పలువురు నవ్వులు పండిస్తున్నారు. స్టాండప్ కమెడియన్.. గుణకర్ ఖమ్మంకు చెందిన మొగిలి గుణకర్ స్టాండప్ కమెడియన్గా గుర్తింపు పొందారు. నేటి తరం వారిని ఆకట్టుకనేలా ప్రదర్శనలు ఇవ్వడం ఆయన ప్రత్యేకత. వైరా మండలం తాటిపూడికి చెందిన ఈయన అసలు పేరు ఏరుమొగిలి వెంకటేశ్వర్లు కాగా.. సినిమాలపై ఆసక్తితో కమెడియన్గానే కాక యాంకర్గా, పేరడీ సింగర్గా పేరు సాధించారు. మందుబాబుల తీరుపై ఆయన పాడే పాటలు ఆకట్టుకుంటాయి. బీఏ, బీఈడీ చదివిన గుణకర్ 25ఏళ్లలో 4వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్రెడ్డి, సినీ నటుడు బ్రహ్మానందం తదితరుల చేతుల మీదుగా సన్మానం అందుకున్నారు. నవ్వుల భద్రం ముదిగొండ మండలం వెంకటాపురానికి చెందిన బంక భద్రం తన ప్రదర్శనలతో నవ్వుల భద్రంగా స్థిరపడ్డారు. మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ను ప్రారంభించి.. ఓ చానెల్ నిర్వహించిన షోలో రూ.2 లక్షల నగదు బహుమతి గెలుచుకున్నారు. ఎస్వీ.కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘మస్త్’ సినిమాలో కామెడీ కింగ్ బ్రహ్మానందం అసిస్టెంట్గా నటించిన భద్రం.. బ్రహ్మానందంపైనే సైటెర్లు వేసే పాత్రతో అందరినీ అలరించారు. హాస్యరస చక్రవర్తి ఈశ్వర్ ఖమ్మంకు చెందిన ఈశ్వర్ బహుదూర్ ఇరిగేషన్ శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూనే.. కమెడియన్గానూ రాణిస్తున్నారు. పలు చానళ్లు నిర్వహించే కామెడీ షోల్లో తరచుగా కనిపించే ఈశ్వర్ హాస్య రస చక్రవర్తి బిరుదును సొంతం చేసుకున్నారు. సినీ నటుడిగా రాణిస్తున్న ఆయనకు మూఖాభినయం, పేరడీ పాటల్లో మంచి పేరు ఉంది.నవ్వుదాం హాయిగా.. నవ్వు మనిషికి ఆరోగ్యానిస్తుంది. మానవ మస్తిష్కంలో సంతోషాన్ని నింపేలా నాలుగు ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా గుండెల నిండా హాయిగా నవ్వొచ్చు. నవ్వడం తప్పేం కాదని గుర్తించి హాయిగా నవ్వుతూ ఇతరులతోనూ పంచుకోవాలి. – తాళ్లూరి లక్ష్మి, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, ఖమ్మం నవ్వు సాధనతో ఉపయోగాలు.. నవ్వును వ్యాయామంగా సాధన చేస్తే శారీరక, మానసిక ఆనందం, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అన్నివర్గాల వారు ఒత్తిడి తగ్గింపునకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. రోజూ 10 – 15 నిమిషాలు నవ్వు సాధన చేస్తే ఫలితముంటుంది. – మరికంటి వెంకట్, ట్రెయినర్, ఖమ్మం -
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు
● మెరుగైన సాగు పద్ధతులపై అన్నదాతలకు అవగాహన ● రేపటి నుంచి జూన్ 13 వరకు 30 సదస్సులకు షెడ్యూల్ ● ఆరు అంశాలపై సలహాలు, సూచనలుమధిర/వైరా/ఖమ్మంవ్యవసాయం: వానాకాలం సాగుకు రైతులను సమాయత్తం చేసేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. మెరుగైన సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 5 నుంచి జూన్ 13వ తేదీ వరకు ‘రైతు ముగింట్లో శాస్త్రవేత్తలు’పేరిట ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రణాళిక రూపొందించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రం, మధిరలోని వ్యవసాయ పరిశోధన స్థానం సంయుక్త ఆధ్వార్యన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారుల సమన్వయంతో వానాకాలం పంటల సాగులో పాటించాల్సిన విధానాలపై అవగాహన కల్పించనున్నారు. వారానికి రెండు రోజుల చొప్పున ఆరు వారాల పాటు జిల్లాలోని రైతు వేదికల్లో ఈ కార్యక్రమాన్నినిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సదస్సుల్లో శాస్త్రవేత్తలతో పాటు ఇద్దరు వ్యవసాయ కళాశాల విద్యార్థులు సైతం పాల్గొంటారు. ఏమేం అంశాలంటే.. రైతు ముగింట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా ఆరు అంశాలపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యూరియా వాడకాన్ని తద్వారా సాగు ఖర్చు తగ్గించడం, రసాయనాలను అవసరం మేరకే వినియోగిస్తూ నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడడం, రైతులు విత్తనాలు కొన్నప్పుడు రశీదు భద్రపరచుకోవడం, వివిధ పంటల్లో సాగునీటి ఆదా – భావితరాలకు అందించడం, పంట మార్పిడితో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం, చెట్లు పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడడంపై అవగాహన కల్పిస్తారు. ఆదాయం పెంపే లక్ష్యం వ్యవసాయ, అనుబంధ రంగాల ద్వారా రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వనరుల ఆధారంగా పంటల సాగు, లాభదాయకమైన పంటల ఎంపిక, మెరుగైన యాజమాన్య పద్ధతులతో అధికోత్పత్తి సాధించడంపై అవగాహన కల్పిస్తారు. వ్యవసాయానికే పరిమితం కాకుండా అనుబంధ రంగాలపై దృష్టి సారించేలా చైతన్యం కల్పించనున్నారు. రైతుల ముంగిట్లోకి శాస్త్రవేత్తలను తీసుకెళ్లడం ద్వారా అవగాహన కల్పించడం సులువవుతుందని భావిస్తున్నారు. సదస్సుల షెడ్యూల్ ఖరారు ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’పేరిట సదస్సులు సోమవారం నుంచి నిర్వహించనుండగా షెడ్యూల్ను అధికారులు ఖరారు చేశారు. మొత్తంగా 40 రోజుల వ్యవధిలో జిల్లాలోని 21 మండలాల్లో 30 రైతు వేదికల్లో సదస్సులు నిర్వహిస్తామని జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య వెల్లడించారు. తొలిరోజైన ఈ నెల 5న సోమవారం ఖమ్మంపాడు, రాంక్యాతండాలో, 8న చింతకాని, 12న దెందుకూరు, ఖానాపురం, 13న మాటూరు, 14న గంగారం, 15న పాతలింగాల, 19న నాచారం, 20న మల్లవరం, 21న మడుపల్లి, 22న వేంసూరు, బీరోలు, పమ్మిలో సదస్సులు జరుగుతాయని తెలిపారు. అలాగే, 26న కుర్నవల్లి, 27న మీనవోలు, 28న రాయపట్నం, కొత్తూరు, 29న ముచ్చవరం, వెంకటాపురం (వేంసూరు), జూన్ 2న మధిర, తనికెళ్ల, 3న బనిగండ్లపాడు, 4న కాకర్లపల్లి, 5న కేజీ మల్లెల, 9న గోళ్లపాడు, 10న సిరిపురం, 11న సదాశివునిపాలెం, 12న అడసర్లపాడు, 13న బుచ్చిరెడ్డిపాలెంలో సదస్సులు నిర్వహిస్తామని వెల్లడించారు.రైతులకు ప్రయోజనం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’కార్యక్రమం అన్నదాతలకు ఎంతో ప్రయోజనకరమైనది. వానాకాలం సాగు దృష్ట్యా ఈ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. సాగు సంబంధిత అన్ని అంశాలపై అవగాహన కల్పించి, నిపుణులతో సూచనలు ఇప్పిస్తాం. –డాక్టర్ కె.రవికుమార్, కేవీకే ప్రోగ్రాం కో–ఆర్డినేటర్, వైరా -
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ముదిగొండ: ముదిగొండ మండలంలో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. తొలుత వల్లభిలో మాజీ ఎంపీటీసీ బిచ్చాల బిక్షం కుమార్తె వివాహానికి హాజరైన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం బాణాపురంలో రూ.67లక్షలతో నిర్మించే బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశాక కంఠమహేశ్వరస్వామి ఆలయ ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం ముదిగొండలో 50పడకల ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేసి ఇందిరా డెయిరీ పాలశీతలీకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. అంతేకాక 27 గ్రామాల్లో అంతర్గత రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ముదిగొండకు వచ్చిన డిప్యూటీ సీఎంకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈకార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ బి శ్రీనివాస్రెడ్డి, మండల ప్రత్యేకాధికారి విజయలక్ష్మి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీఎంహెచ్ఓ, డాక్టర్ కళావతిబాయి, ఆస్పత్రుల సమన్వయకర్త రాజశేఖర్గౌడ్, వైద్యాధికారి అరుణాదేవి, సొసైటీ డైరెక్టర్ వనం ప్రదీప్త చక్రవర్తి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రమేష్బాబుతో పాటు మందరపు నాగేశ్వరరావు, పసుపులేటి దేవేంద్రం, వల్లూరి భద్రారెడ్డి, మట్టా బాబురాంరెడ్డి, కందిమళ్ల వీరబాబు, ఎండీ అజ్గర్, కోలేటి నాగేశ్వరరావు, ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆందోళన బాటలో ఉపాధి ఉద్యోగులు
● నాలుగు నెలలుగా జీతాలు అందక అవస్థలు ● వేతనాల కోసం పెన్డౌన్తో నిరసన ఖమ్మంమయూరిసెంటర్: గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి హామీ పథకం పనుల కల్పనలో కీలకంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది వేతనాలు రాక ఆందోళన చెందుతున్నారు. మూడు నుంచి నాలుగు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయని వారిలో ఆవేదన నెలకొంది. ఏడాదికాలంగా వేతనాల మంజూరులో ప్రభుత్వం తమను ఇబ్బందులకు గురిచేస్తోందని, మూడు, నాలుగు నెలలకోసారి జీతాలు విడుదల చేయడంతో విధులు నిర్వర్తించలేకపోతున్నామని వాపోతున్నారు. తాజాగా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జిల్లాలో ఉపాధి హామీ పథకం ఉద్యోగులు, సిబ్బంది నిరసనలకు దిగారు. ఇప్పటికే వేతనాలు ఇప్పించాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేయగా.. శుక్రవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అంతేకాక రెండు రోజుల నుంచి పెన్డౌన్ కార్యక్రమం చేపట్టారు. వేతనాలతోపాటు డిమాండ్లూ పరిష్కరించాలి వేతనాల కోసం ఆందోళన బాట పట్టిన ఉపాధి హామీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణను చేపడుతున్నారు. ఉద్యోగులు, సిబ్బందికి మూడునెలలు, ఫీల్డ్ అసిస్టెంట్లకు నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని, వాటిని వెంటనే మంజూరు చేయడంతోపాటు పేస్కేల్ను స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. వేతనాల సమస్య పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వీటిని పరిష్కరించే వరకు తమ నిరసనలను కొనసాగిస్తామని ఉద్యోగులు పేర్కొంటున్నారు. సిబ్బంది పెన్డౌన్.. జిల్లాలో ఉపాధి హామీ ఉద్యోగులు, సిబ్బంది పెన్డౌన్ చేపట్టారు. వేతనాలు చెల్లించే వరకు తాము విధులు నిర్వర్తించబోమని అధికారులకు తేల్చిచెప్పారు. జేఏసీ పిలుపు మేరకు జిల్లాలో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని వెల్లడించారు. రెండు రోజుల నుంచి జిల్లాలో ఉపాధి హామీ ఉద్యో గులు, సిబ్బంది పెన్డౌన్ చేపట్టడంతో గ్రామాల్లో జరుగుతున్న పనుల పర్యవేక్షణ, కూలీల హాజరు నమోదు పూర్తిస్థాయిలో జరగడం లేదు. దీంతో పని ప్రదేశాల్లో కూలీల హాజరుతోపాటు పనుల కొలతలను నమోదు చేసే ఫీల్డ్ అసిస్టెంట్లు విధులకు దూరంగా ఉండటంతో పంచాయతీ కార్యదర్శులు, మండల అధికారులపై భారం పడుతోంది. కూలీల ను పనులకు తీసుకురావడంలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఉపాధి సిబ్బంది విధులు నిర్వహిస్తేనే కూలీలకు పని సక్రమంగా దొరుకుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.జిల్లాలో వేతనాలు రాని సిబ్బంది సీఓలు, ఏపీఓలు, ఈసీలు : 100 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు : 345 మంది -
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
ఖమ్మంమామిళ్లగూడెం: ఇటీవల అకాల వర్షాలతో వరి ధాన్యం నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం సరైన సమయానికి కాంటా వేయకపోవడం, కాంటా వేసినా మిల్లులకు తరలించకపోవడంతోనే కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిచి ముద్దయిందని తెలిపారు. అంతేకాక టార్పాలిన్లు సమకూర్చకపోవడంతో మరింత నష్టపోయారని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కార్మిక సంఘాలతో చర్చలు జరపాలి ఖమ్మంమామిళ్లగూడెం: ఆర్టీసీలో సమ్మె ప్రకటన చేసిన నేపథ్యాన కార్మిక సంఘాలతో ప్రభుత్వం, యాజమాన్యం చర్చలు జరపాలని ఆర్టీసీ ఎస్డబ్లు్ఎఫ్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి గడ్డం లింగమూర్తి, ఉపాధ్యక్షుడు ఎర్రంశెట్టి వెంకటేశ్వర్లు కోరారు. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి సమ్మె విషయమై స్పందించినందున, వెంటనే చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలన్నారు. వేతన సవరణలో లోపాలు, ఎరియర్స్ చెల్లింపు, మరో రెండు వేతన సవరణలు, ఉద్యోగ భద్రత, అధికారుల వేధింపులపై చర్యలు జరపాలని వారు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. డ్వాక్రా మహిళల సొమ్ము సొంత ఖాతాలోకి... కారేపల్లి: కారేపల్లిలోని ఓ సీఎస్పీ నిర్వాహకులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన వృద్ధులే లక్ష్యంగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కారేపల్లి మండలం భాగ్యనగర్కు చెందిన భద్రకాళి స్వయం సహాయక సంఘం సభ్యురాలు తమ సంఘం ఖాతాలో 2023 మార్చి 18న రూ.25 వేలు జమ చేసేందుకు స్టేషన్రోడ్డులోని ఓ సీఎస్పీ సెంటర్లో సంప్రదించింది. దీంతో నిర్వాహకులు డబ్బు తీసుకుని చేతిరాతతో రశీదు ఇచ్చారు. ఆపై సభ్యులు తమ రికార్డుల్లో అప్పు రూ.25 వేలు జమ అయిందని రాశారు. కానీ ఇటీవల బ్యాంకుకు వెళ్తే రూ.25 వేల బకాయి తేలడంతో సీఎస్పీ నిర్వాహకురాలిని నిలదీస్తే రూ.5 వేలు మాత్రమే జమ చేసినట్లు గుర్తించారు. ఇటీవల గట్టిగా ప్రశ్నించడంతో మొత్తం డబ్బు జమ చేయగా, అందుకు సంబంధించి వడ్డీ మాత్రం సభ్యులే చెల్లించి కారేపల్లి ఎస్బీఐ మేనేజర్కు ఫిర్యాదు చేశారు. పంచాయితీకి వెళ్లిన గ్రామపెద్దపై దాడి చింతకాని: మామిడికాయలు కొనేందుకు వెళ్లిన దంపతులు ఘర్షణ పడగా.. చర్చించేందుకు వెళ్లిన పెద్దమనిషిపై భర్త దాడి చేసిన ఘటన ఇది. మండలంలోని నేరడ శివారు మామిడితోటలో కాయల కోసం గ్రామానికి చెందిన మేడ వెంకటయ్య – సరళ దంపతులు వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరగడంతో వెంకటయ్య తన భార్యను కర్రతో కొట్టాడు. దీంతో ఆమె పెద్దమనిషిగా ఉన్న కొణిజర్ల మండలం పెద్దగోపతికి చెందిన స్వర్ణ సుబ్బారావుకు ఫోన్లో చెప్పడంతో ఆయన తోట వద్దకు వచ్చాడు. ఈ క్రమాన సుబ్బారావును వెంకటయ్య దూషిస్తూ కర్రతో కొట్టడంతో ఆయన తల, చేతులకు గాయాలయ్యాయి. ఘటనపై సుబ్బారావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగుల్మీరా తెలిపారు. జిల్లా వాసి కర్ణాటకలో మృతి సత్తుపల్లిరూరల్: మండలంలోని కాకర్లపల్లికి చెందిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ పరిమి శ్రీనివాసరావు – శ్రీలత కుమారుడు పరిమి హేమంత్ (24) కర్ణాటక రాష్ట్రంలో మృతి చెందాడు. అక్కడి చిందాసి మండలంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఫీల్డ్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన శుక్రవారం సాయంత్రం విధులు ముగించుకుని బైక్పై వస్తుండగా ఎదురుగా కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందాడనే సమాచారంతో ఆయన తల్లిదండ్రులు కుప్పకూలారు. బంధువులు మృతదేహాన్ని తీసుకురావడానికి చిందాసి వెళ్లారు. మైనర్ డ్రైవర్ల తల్లిదండ్రులకు జరిమానా ఖమ్మంక్రైం: ఏడుగురు మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులకు రూ.వేయి జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించిందని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. ఇటీవల ఖమ్మంలో చేపట్టిన తనిఖీల్లో వాహనాలు నడుపుతూ ఏడుగురు మైనర్లు పట్టుబడగా, వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చామని పేర్కొన్నారు. ఈ మేరకు వారికి జరిమానా విధిస్తూ ఖమ్మం నాలుగో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ (స్పెషల్ మొబైల్) కోర్టు న్యాయమూర్తి బి.నాగలక్ష్మి శనివారం తీర్పు చెప్పారన్నారు. అలాగే, మద్యం తాగి వాహనం నడిపిన మరో వ్యక్తికి రూ.2,500 జరిమానా విధించారని ఏసీపీ శ్రీనివాసులు వివరించారు. -
జూనియర్ సివిల్ జడ్జిగా చరణ్తేజ
ఖమ్మం లీగల్: ఖమ్మంకు చెందిన న్యాయవాది కోటి రామకృష్ణ కుమారుడు చరణ్తేజ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. పదో తరగతి వరకు ఖమ్మంలోని న్యూ ఎరా స్కూల్లో, ఇంటర్ శ్రీ చైతన్య కాలేజీలో పూర్తిచేసిన ఆయన హైదరాబాద్లోని పెండేకంటి లా కాలేజీ న్యాయవాద విద్య చదివారు. ఇటీవల వెల్లడైన ఫలితాల్లో ఆయన జడ్జిగా ఎంపిక కాగా, శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ను కలవగా చరణ్తేజను సన్మానించారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు టి.వెంకటేశ్వరరావు, జి.దిలీప్కుమార్ తదితరులు ఆయనను అభినందించారు.జమలాపురంలో ప్రత్యేక పూజలు ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి మూలవిరాట్తో పాటు ఆలయంలో శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం చేశారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి నిత్యకల్యాణం జరిపించగా తెలంగాణ, ఏపీలోని వివిధ ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు. అనంతరం శ్రీవారి పల్లకీ సేవ నిర్వహించారు. ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. శాంతినిలయంలో సీడబ్ల్యూసీ చైర్పర్సన్ బోనకల్: మండల కేంద్రంలో మానసిక దివ్యాంగులకు ఆశ్రయం ఇస్తున్న శాంతి నిలయాన్ని శనివారం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(సీడబ్యూసీ) చైర్పర్సన్ భారతీరాణి సందర్శించారు. పిల్లల ఆరోగ్యం, వారికి అందిస్తున్న సౌకర్యాలపై నిర్వాహకురాలు ఆల్పీతో ఆరాతీయడమే కాక రికార్డులు పరిశీలించారు. పిల్లలందరికీ ఆధార్కార్డులు ఉన్నందున సదరం సర్టిఫికెట్లు ఇప్పించాలని నిర్వాహకులు కోరారు. కుర్నవల్లి సొసైటీ సీఈఓపై వేటు రైస్మిల్లు షెడ్డు కూలిన ఘటనతో చర్యలు తల్లాడ: తల్లాడ మండలంలోని కుర్నవల్లి సొసైటీ సీఈఓ వగ్గు నరసింహారెడ్డిని సస్పెండ్ చేస్తూ జిల్లా సహకార శాఖాదికారి బి.గంగాధర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సొసైటీ ఆధ్వర్యాన రూ.92 లక్షలతో రైస్ మిల్లు నిర్మించారు. ఇందులో షెడ్డుకు రూ.52లక్షలు వెచ్చించగా.. గత నెలాఖరులో వచ్చిన గాలిదుమారానికి మిల్లు మొత్తం కూలిపోయింది. దీంతో నిర్మాణంలో అవకతవకలు జరిగాయని కుర్నవల్లికి చెందిన అన్నెం కోటారెడ్డి, తదితరులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో క్వాలిటీ కంట్రోల్ అధికారులు విచారణ చేపట్టి అక్రమాలు నిజమేనని తేల్చినట్లు సమాచారం. ఈమేరకు సీఈఓ నరసింహారెడ్డిని సస్పెండ్ చేస్తూ డీసీఓ ఉత్తర్వులు జారీ చేయగా, మరికొందరిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. నేడు నెట్బాల్ ఎంపిక పోటీలు ఖమ్మంస్పోర్ట్స్: రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా సబ్ జూనియర్ నెట్బాల్ బాలబాలికల జట్ల ఎంపికకు ఆదివారం పోటీలు నిర్వహిస్తున్నట్లు నెట్బాల్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షురాలు దీప్తి తెలిపారు. ఖమ్మంరూరల్ మండలం పెద్ద వెంకటగిరిలో జరిగే పోటీలకు ఆధార్ కార్డు, వయసు ధ్రువీకరణ పత్రంతో రావాలని సూచించారు. వివరాలకు 91338 94967నంబర్లో సంప్రదించాలని తెలిపారు. -
నిర్ణీత సమయంలో అభివృద్ధి పనులు
● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ● మున్నేటి రిటైనింగ్ వాల్ సహా పలు పనులపై సమీక్షఖమ్మంసహకారనగర్: జిల్లా కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా అవసరమైన భూసేకరణపై అధికారులు దృష్టి సారించాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కలెక్టరేట్లో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్తో కలిసి శనివారం ఆయన ధాన్యం కొనుగోళ్లు, మున్నేటికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం, జాతీయ రహదారుల పురోగతి, వెలుగుమట్ల అర్బన్ పార్క్, పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఏడాది భారీ వరదలు వచ్చిన నేపథ్యాన నిపుణుల కమిటీ సూచనలతో రిటైనింగ్ వాల్ డిజైన్లో మార్పులు చేశామని.. ఇందుకు అనుగుణంగా నాణ్యతతో సకాలంలో పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. 3.50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా 8.5 కిలోమీటర్ల మేర రెండు వైపులా రిటైనింగ్ వాల్ పూర్తి చేయాలన్నారు. అక్కడి నిర్వాసితులకు ఎన్నెస్పీ భూములను అభివృద్ధి చేసి ఇస్తామని చర్చలు జరపాలని తెలిపారు. అలాగే, సాగర్లో తెగిపోయిన యూటీ పునర్నిర్మించాలని, మంచుకొండ ఎత్తిపోతల పథకం వద్ద హెడ్ రెగ్యులేటర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. అలాగే, ఖమ్మంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ఆక్రమణల తొలగింపు, ఎస్టీపీల నిర్మాణంపై మంత్రి సూచనలు చేశారు. కాగా, కొనుగోలు కేంద్రాల నుంచి ఎప్పటికప్పుడు మిల్లులకు ధాన్యం తరలించాలని మంత్రి సూచించారు. లారీల కొరతతో ధాన్యం పేరుకుపోయి అకాల వర్షాలతో రైతులకు నష్టం జరుగుతున్నందున తరలింపులో వేగం పెంచాలన్నారు. అలాగే, జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మాణాలు, ప్రధాన ఆస్పత్రికి ప్రతిపాదనలపై సమీక్షించారు. లక్ష్యం మేర పనులు జరగాలి ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి మాట్లాడుతూ రిటైనింగ్ వాల్ నిర్మాణంల రోజువారీ లక్ష్యాన్ని ఎంచుకుంటే ఫలితాలు వస్తాయని తెలిపారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అవసరమైన పట్టా భూముల సేకరణకు రైతులతో చర్చిస్తున్నామని చెప్పారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మాట్లాడుతూ రూ.29 కోట్లతో ఖమ్మం ఖిలాపైకి రోప్ వే ప్రతిపాదించగా, కేఎంసీ నుంచి రూ.3 కోట్ల నిధులు వచ్చాయని తెలిపారు. అలాగే, మట్టి నమూనా పరీక్షలు చేయించామని చెప్పారు. డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్ మాట్లాడుతూ వెలుగుమట్ల అర్బన్ పార్క్లో రూ.3 కోట్ల తో బటర్ ఫ్లై పార్క్, చిల్డ్రన్స్ పార్క్, ఫౌంటెన్లు,, బోటింగ్ పనులు ఈ నెలాఖరుకు పూర్తవుతాయని తెలిపారు. హరిత నిధి ద్వారా వచ్చిన రూ.1.28 కోట్లతో 110 హెక్టార్ల మేర ఫెన్సింగ్ వేస్తున్నామన్నారు. ఇంకా ఈ సమావేశంలో ఇరిగేషన్, మునిసిపల్, టూరిజం, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సివిల్ సప్లయీస్ అధికారులు పాల్గొన్నారు. -
మామిడి సస్యరక్షణ చర్యలపై అవగాహన
ఎర్రుపాలెం: మామిడి తోటలు కోత దశలో ఉన్నందున రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని మధిర వ్యవసాయ పరిశోధన ప్రధాన శాస్త్రవేత్త రుక్మిణి సూచించారు. ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెంలోని రైతు వేదికలో శనివారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సు లో ఆమె మాట్లాడారు. మామిడిలో కోతలతో పాటు ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలను వివరించారు. అలాగే, పంట అవశేషాలను కాల్చడం వల్ల ఎదురయ్యే నష్టాలపై అవగాహన కల్పించారు. ఆ తర్వాత రైతులకు ఉద్యాన దర్శిని పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు భరత్, నాగస్వాతి, ఎ.విజయ్కృష్ణ, ఏఓ బి.సా యిశివ, ఉద్యాన అధికారి విష్ణు, ఏఈఓలు కృష్ణకుమారి, దుర్గాప్రసన్న పాల్గొన్నారు. పాలేరులో వ్యాపించిన మంటలు కూసుమంచి: మండలంలోని పాలేరు నుంచి మరిపెడ బంగ్లా వెళ్లే రహదారి పక్కన శనివారం రాత్రి మంటలు వ్యాపించాయి. రోడ్డు సమీపాన చెత్తకు నిప్పంటుకోవడం, ఆ పక్కనే ఉన్నవరి కొయ్యలకు తాకడంతో మంటలు ఉధృతమయ్యాయి. దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని మంటలను అదుపుచేశారు. సమయానికి సిబ్బంది రాకపోతే పెనుప్రమాదం జరిగేదని స్థానికులు తెలిపారు. -
జల్సాలకు అలవాటు పడి చోరీలు
సత్తుపల్లి: చెడు వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని సత్తుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సత్తుపల్లి పట్టణ సీఐ టి.కిరణ్ శనివారం వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ఏపీలోని విజయవాడ సమీపాన పాయకాపురానికి చెందిన దేవరకొండ రాంబాబు లారీక్లీనర్ కాగా పనిచేస్తూ మద్యం, పేకాట, వ్యభిచారానికి బానిసై చోరీలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో పోలీసులకు చిక్కిన ఆయన 1989 నుంచి ఆరేళ్ల జైలు శిక్ష అనుభవించగా పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన బొమ్మల విజయ్ పరిచయం అయ్యాడు. అనంతరం వీరిద్దరు ఖమ్మం జిల్లా పరిధిలో పలుచోట్ల చోరీలు చేశారు. ఖమ్మంరూరల్, కల్లూరు, కామేపల్లి పోలీస్స్టేషన్లలో ఒక్కొక్కటి, మధిర పోలీస్స్టేషన్లో మూడు, సత్తుపల్లి పోలీస్స్టేషన్లో రెండు కేసులు నమోదు కాగా, చోరీ సొత్తును చిలకలూరిపేటకు చెందిన కొలిశెట్టి నాగరాజుకు అమ్మి ఆ సొమ్ముతో జల్సాలు చేసేవారు. ఈ క్రమంలో పక్కా సమాచారంతో రాంబాబు, విజయ్ను అరెస్ట్ చేశామని సీఐ కిరణ్ తెలిపారు. సమావేశంలో ఎస్ఐ వీరేందర్, సిబ్బంది పాల్గొన్నారు.ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు -
తలసేమియాను తరిమేద్దాం..
ఖమ్మంవైద్యవిభాగం: తలసేమియా వ్యాధి చిన్నారుల పాలిట శాపంగా మారకుండా తరిమికొట్టేలా అందరూ కృషి చేయాలని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి సూచించారు. ఖమ్మంలోని ఐఎంఏ హాల్లో తలసేమియా సికిల్సెల్ సొసైటీ ఆధ్వర్యాన శనివారం నిర్వహించిన తలసేమియా దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ఈ వ్యాధి నిర్మూలనకు ప్రజల్లో అవగాహన కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్రమైన విధానాన్ని తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. కాగా, సొసైటీ ద్వారా చేస్తున్న సేవలను తన వంతుగా చేయూతనిస్తానని తెలిపారు. సొసైటీ వైస్ ప్రెసిడెంట్ కొత్తపల్లి రత్నావళి మాట్లాడుతూ మహిళలు గర్భవతిగా ఉన్నప్పుడే పరీక్షల ద్వారా వ్యాధిని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. సొసైటీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కూరపాటి ప్రదీప్కుమార్ మాట్లాడుతూ పిల్లలకు బంగారు భవిష్యత్ ఇచ్చేలా ఎక్కువమంది రక్తదానం చేయాలని సూచించారు. అనంతరం తలసేమియా బాధితులు చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకోగా, డాక్టర్ యలమంచిలి నాగమణి, డాక్టర్ ఖలీగ్, ఐఎంఏ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కంభంపాటి నారాయణరావు, కెజగదీష్బాబు, శివరతన్ అగర్వాల్, కిరణ్, రక్తదాతలు మిరియాల జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి -
కులగణనకు బీజాలు వేసింది మేమే..
● కేంద్రం దేశవ్యాప్తంగా చేపట్టడం మా ప్రభుత్వ విజయం ● రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కఖమ్మంవన్టౌన్/ఖమ్మం సహకారనగర్: రాష్ట్రంలో కులగణన చేటప్టడం ద్వారా దేశానికే తమ ప్రభుత్వం రోల్మోడల్గా నిలిచిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. తమ ఒత్తిడి ఫలితంగానే కేంద్రం తలొగ్గి దేశవ్యాప్తంగా కులగణనకు నిర్ణయించిందని తెలిపారు. ఖమ్మంకు శనివారం వచ్చిన ఆయనకు బీసీ కుల సంఘాల, ఉద్యోగ సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్గాంధీ ఆదేశాలతో రాష్ట్రంలో కులగణన సర్వే చేపట్టి, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామన్నారు. గుజరాత్లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలోనూ తెలంగాణ మాదిరి దేశమంతటా కులగణన సర్వే చేయాలని తీర్మానం చేసి పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు గళమెత్తారని తెలిపారు. ఫలితంగా కేంద్రం దిగొచ్చి కులగణన చేస్తామని ప్రకటించిందని చెప్పారు. కులగణన సర్వేలో కులాల వివరాలే కాకుండా ప్రజల సామాజిక, రాజకీయ, ఆర్థిక, జీవన ప్రమాణాలను సైతం తీసుకున్నామని... తద్వారా రాష్ట ప్రభుత్వం తీసుకునే విధానపరమైన ఈ అంశాలు ఉపయోగపడతాయని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఉద్యోగులకు అండగా ప్రభుత్వం అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు తమకు వెన్నుదన్నుగా నిలిచారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గత పాలకులు చేసిన తప్పిదాలతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైనందున, దాన్ని సవరించే క్రమంలో సమస్యల పరిష్కారానికి జాప్యం జరుగుతోందని చెప్పారు. అయినా పెండింగ్ సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తున్నామని, ఉద్యోగులెవరూ అధైర్యపడి పక్కదారులు పట్టి ఇబ్బందులకు గురి కావొద్దని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ సైదులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కుల సంఘాల నాయకులు గండు యాదగిరి, మన్సూర్, పోతగాని వెంకన్న, బెజ్జంకి ప్రభాకరాచారి, ఎర్రమళ్ల శ్రీనివాస్, చంద్రశేఖర్గౌడ్, బచ్చల పద్మాచారి, సున్నం రమేష్, పాపారావు, నవీన శ్రీనివాస్, వెంకన్నయాదవ్, రవీంద్రప్రసాద్, వెంకట రామకృష్ణ, జయపాల్, ఎర్రా రమేష్, మల్లెల రవీంద్రప్రసాద్, జడ్.ఎస్.జయపాల్ విజయకుమార్, సగుర్తి ప్రకాష్రావు, ఎర్ర రమేష్, పర్వతపు శ్రీనివాస్, రవికుమార్, కె.రుక్మారావు, ఎస్.లలితకుమారి తదితరులు పాల్గొన్నారు.