breaking news
Khammam District Latest News
-
ఈనెల 16 నుంచి ‘యాత్రాదానం’
● దాతలు కోరుకున్న రోజుల్లో బస్సుల ఏర్పాటు ● ఆర్టీసీ రీజియన్ మేనేజర్ సరిరాం ఖమ్మంమయూరిసెంటర్: ప్రత్యేక రోజుల్లోఅనాథలు, నిరాశ్రయులైన వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు, విహారయాత్రలకు తీసుకెళ్లేలా టీజీఎస్ఆర్టీసీ ‘యాత్రాదానం’ పేరిట కార్యక్రమాన్ని రూపొందించిందని ఖమ్మం రీజియన్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. ఆసక్తి ఉన్న వారు తాము కోరుకున్న రోజుల్లో పర్యటనకు తీసుకెళ్లేలా విరాళం అందజేయొచ్చని తెలిపారు. విరాళం ఆధారంగా ఏసీ, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ప్రెస్ బస్సులు సమకూరుస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు వివరాల కోసం సమీప ఆర్టీసీ డిపోల్లో సంప్రదించాలని ఆర్ఎం సూచించారు.దూరం ఎక్స్ప్రెస్ డీలక్స్ సూపర్లగ్జరీ రాజధాని (కి.మీల్లో.) (రూ.ల్లో) 0–200 26,707 32,587 29,752 43,507 201–300 32,587 32,587 29,752 43,507 301–400 38,782 38,782 35,002 43,507 401–500 44,977 44,977 40,252 50,962 -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి అంతరాలయంలోని మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన వైభవంగా నిర్వహించారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామి వారిని పల్లకీసేవగా చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. నిత్యకల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
జమలాపురంలో ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీవారి పాదంతో పాటు స్వామి మూలవిరాట్కు అర్చకులు పంచామృతంతో అభిషేకాలు చేశారు. అలాగే, స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి నిత్యకల్యాణం జరిపించాక, భక్తుల సమక్షాన పల్లకీ సేవ నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ ఈఓ కొత్తూరి జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సిబ్బంది పాల్గొన్నారు. టెట్ తీర్పుపై ప్రభుత్వం అప్పీల్ చేయాలి ఖమ్మం సహకారనగర్: ఉపాధ్యాయులు సర్వీస్లో కొనసాగాలన్నా, పదోన్నతి పొందాలన్నా టెట్ తప్పక ఉత్తీర్ణత సాధించాలంటూ వెలువడిన కోర్టు తీర్పు సీనియర్ ఉపాధ్యాయులకు అశనిపాతంలా మారిందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మంలో శనివారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ కోర్టు తీర్పు సీనియర్ ఉపాధ్యాయులకు నష్టం కలిగించేలా ఉన్నందున రాష్ట్రప్రభుత్వం తీర్పుపై అప్పీల్ చేసి సీనియర్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. అంతేకాక పదోన్నతుల్లో మిగిలిన ఖాళీ పోస్టులకు అర్హులను ఎంపికచేయాలని, గిరిజన సంక్షేమశాఖ, మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలన్నారు. తొలుత ఇటీవల మరణించిన పూర్వ జిల్లా అధ్యక్షుడు జియావుద్దీన్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. నాయకులు జీవీ.నాగమల్లేశ్వరరావు, బుర్రి వెంకన్న, షమీ, రాందాస్, నర్సయ్య, సురేష్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం మీదుగా మరో ప్రత్యేక రైలు ఖమ్మం రాపర్తినగర్: ఖమ్మం మీదుగా ఇప్పటికే ఉన్న వారాంతపు ప్రత్యేక రైలుకు తోడు మరో రైలును రైల్వే శాఖ ప్రకటించింది. నాందేడ్ – తిరుచానూర్ మధ్య ఈనెల 16, 23, 30వ తేదీల్లో ఈ రైలు ప్రారంభమవుతుందని ఖమ్మం సీసీటీఓ రాజగోపాల్ తెలిపారు. తిరుగుప్రయాణంలో ఈనెల 17, 24, వచ్చేనెల 1వ తేదీన ఉంటుందని వెల్లడించారు. ఈ రైలు తిరుచానూర్ వెళ్లేటప్పడు నిర్ణీత తేదీల్లో అర్ధరాత్రి 1–13 గంటలకు, నాందేడ్ వెళ్లే క్రమంలో తెల్లవారుజామున 3–45 గంటలకు ఖమ్మం చేరుకుంటుందని తెలిపారు. దసరా, దీపావళి పండుగల వేళ స్వస్థలాలకు వెళ్లే వారి కోసం ఈ రైలు నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. టీజీవోస్ రాష్ట అధ్యక్షుడికి సన్మానం ఖమ్మంమయూరిసెంటర్: సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తెలంగాణ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటుకు కృషి చేసిన టీజీఈ జేఏసీ సెక్రటరీ జనరల్, టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావును వసతి గృహ సంక్షేమ అధికారుల ఫోరం బాధ్యులు శనివారం సన్మానించారు. వసతి గృహ సంక్షేమ అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి పాటుపడాలని కోరారు. టీఎన్జీవోస్ నాయకుడు హరికృష్ణ కోణార్, వసతి గృహ సంక్షేమ అధికారుల ఫోరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోటపాటి రుక్మారావు, ఎన్.నాగేశ్వరరావుతో పాటు కె.తిరుపతిరావు, పి.హన్మంతరావు, సీహెచ్.నాగమణి, బి.వసంత, మాధురి, బాలాజీ, నర్సింహారావు, రమాదేవి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. అలాగే, ఇటీవల ఎన్నికై న మున్సిపల్ ఫోరం ల్లా కార్యవర్గ బాధ్యులు ఏలూరి శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఫోరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏ.సుధాకర్, జి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం
ఖమ్మంలీగల్: రాజీ మార్గంలో కేసుల పరిష్కారం ద్వారా ఆరోగ్యకరమై సమాజ నిర్మాణానికి అంతా కలిసి రావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ సూచించారు. ఖమ్మం జిల్లా కోర్టులో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యాన శనివారం జాతీయ లోక్అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ లోక్అదాలత్లో రాజీ పడితే ఇరువర్గాలు గెలిచినట్లేనని తెలిపారు. కుటుంబ వివాదాల కేసుల్లో భార్యాభర్తలు కలిస్తే వారి సంతానంతో పాటు ఇరు కుటుంబాలు సంతోషంగా ఉంటాయన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తొండపు వెంకటేశ్వరరావు మాట్లాడగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యాన కక్షిదారులకు భోజనం, తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. న్యాయమూర్తులు దేవినేని రాంప్రసాదరావు, న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కే.వీ.చంద్రశేఖరరావుతో పాటు ఎం.కల్పన, టి,మురళీమోహన్, కాసరగడ్డ దీప, బి.రజిని, ఏపూరి బిందుప్రియ, వినుకొండ మాధవి, బి.నాగలక్ష్మి, అఖిల, లోక్ అదాలత్ సభ్యులు సంధ్యారాణి, ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రూ.3.15 కోట్ల పరిహారం లోక్అదాలత్లో భాగంగా పలు కేసులను న్యాయమూర్తులు పరిష్కరించారు. మోటార్ వాహన కేసు ను వాది తరపున న్యాయవాది పోట్రు వెంకయ్య చౌదరి, రాయల్ సుందరం బీమా కంపెనీ తరఫున బండారుపల్లి గంగాధర్ వాదించారు. ఈమేరకు కేసు పరిష్కారం కాగా వాదికి రూ.19.50 లక్షల అవార్డు కాపీతో పాటు పూల మొక్కను జిల్లా జడ్జి రాజగోపాల్ అందించారు. అలాగే దంపతులు పెద్దబోయిన మాధవి–లక్ష్మణ్ కేసు ప్రత్యేక కోర్టు న్యాయధికారి బి.నాగలక్ష్మి చొరవతో పరిష్కారమైంది. మొత్తంగా లోక్అదాలత్లో 4,771 కేసులను పరిష్కరించారు. ఇందులో మోటారు వాహన ప్రమాద బీమా కేసులు 80 ఉండగా, బాధితులకు పరిహారంగా రూ.3,16,71,251 ఇవ్వడానికి బీమా కంపెనీలు అంగీకరించాయి. అలాగే, క్రిమినల్, చెక్ బౌన్స్, కుటుంబ తగాదా, సివిల్ ఇతర కేసుల్లో ప్రతివాదులకు రూ.30,17,255 పరిహారం అందింది. -
ఊరూరా వరి !
సత్తుపల్లి సమీపాన సాగవుతున్న వరి పంటసరిపడా వానలు ఈ ఏడాది పంటల సాగుకు వర్షాలు అనుకూలించాయి. సీజన్లో జూన్ మినహా, జూలై, ఆగస్టు నెలల్లో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. జూన్లో 131.2 మి.మీ. వర్షపాతానికి గాను 123.9గా నమోదైతే, జూలైలో 240.9 మి.మీ.కు 281.6, ఆగస్టులో 240మి.మీ.కు గాను 389.7గా నమోదు కావడంతో జలాశయాల్లోకి సమృద్ధిగా నీరు చేరింది. వివిధ పద్ధతుల్లో సాగు వర్షాలు సమృద్ధిగా కురవడంతో రైతులు వరి సాగుకు ప్రాధాన్యత ఇచ్చారు. కూలీల కొరత, ఇతర ఇబ్బంతుల నేపథ్యాన రకరకాల విధానాలు ఎంచుకున్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పొడి దుక్కుల్లోనే వరి విత్తనాలు చల్లగా, కొందరు భూములను దమ్ము చేసి విత్తనాలను ఒకరోజు నానబెట్టి వెదజల్లే పద్ధతిలో సాగు చేశారు. ఇంకొందరు డ్రమ్ సీడర్ విధానం ద్వారా విత్తనాలు నాటారు. మరికొందరు సంప్రదాయ విధానంలో వరి నార్లు పోసి నాట్లు వేశారు. సత్తుపల్లి డివిజన్లో అత్యధికం జిల్లాలోని సత్తుపల్లి వ్యవసాయ డివిజన్లో అత్యధికంగా 1,28,434 ఎకరాల్లో వరి సాగవుతోంది. ఈ డివిజన్లోని కల్లూరు మండలంలో 33,403ఎకరాల్లో పంట సాగు చేశారు. ఆ తర్వాత స్థానంలో పాలేరు(కూసుమంచి) వ్యవసాయ డివిజన్లో 72,259 ఎకరాల్లో సాగవుతోంది. అలాగే, మధిర వ్యవసాయ డివిజన్లో 41,356, వైరా డివిజన్లో 36,281, ఖమ్మం డివిజన్లో 12,530 ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. జిల్లాలో లక్ష్యాన్ని దాటేలా పంట సాగు అన్ని వ్యవసాయ డివిజన్లలో వరి లక్ష్యం మేర సాగవుతోంది. జూలై, ఆగస్టులో కురిసిన వాన సాగుకు అనుకూలించింది. వరిలో కూడా రైతులు సన్నరకాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వం బోనస్ ఇస్తుండటంతో ఈ రకాలే ఎంచుకున్నారు. – ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారిమంచి వర్షాలతో జలాశయాల్లోకి నీరు చేరడం వరి సాగుకు అనుకూలించింది. మొత్తం 20ఎకరాల్లో వెదజల్లే పద్ధతి, డ్రమ్సీడర్, నాట్ల విధానంలో సాగు చేస్తున్నాం. ప్రభుత్వం బోనస్ ఇస్తుండడంతో మొత్తం సన్నరకాలే ఎంచుకున్నాం. – దేవరపల్లి సత్యనారాయణరెడ్డి, కమలాపురం, ముదిగొండ మండలం -
ప్రజల కోసం పోరాడిన సురవరం
● సుధాకర్రెడ్డి మృతి ప్రజాఉద్యమాలకు తీరని లోటు ● సంస్మరణ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేనిఖమ్మంమయూరిసెంటర్: సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజల కోసం పోరాడిన నికార్సయిన కమ్యూనిస్టు సురవరం సుధాకర్రెడ్డి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇటీవల మృతి చెందిన సురవరం సంస్మరణ సభ ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో శనివారం నిర్వహించగా ఆయన చిత్రపటం వద్ద వివిధ పార్టీల నాయకులు నివాళులర్పించారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ అధ్యక్షతన జరిగిన సభలో కూనంనేని మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రజాఉద్యమ గొంతుకగా సురవరం పనిచేశారని, ఆయన మరణం కమ్యూనిస్టు ఉద్యమానికే కాక పేద ప్రజలకు తీరని లోటన్నారు. కాగా, మతం, సైన్స్కు ప్రాంతీయ భేదం లేనట్లే కమ్యూనిజానికి సైతం ప్రాంతీయత లేదన్నారు. కమ్యూనిజం విడిపోయి బలహీనపడినా మళ్లీ ఐక్యతతో బలపడతామని తెలిపారు. అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడమే సుధాకర్రెడ్డి లాంటి అమరులకు ఇచ్చే నివాళి అని చెప్కాపరు. కాగా, వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ ఘట్టాన్ని నేటి తరానికి వివరిస్తూ బలమైన ప్రజాఉద్యమ నిర్మాణాల కోసం డిసెంబర్ 26న ఖమ్మంలో శత వసంత ముగింపు సభ నిర్వహిస్తున్నట్లు కూనంనేని తెలిపారు. ఈ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి పోరాటాలను నడిపిన సురవరం ఎందరికో ఆదర్శంగా నిలిచారని తెలిపారు. గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావుతో పాటు వివిధ పార్టీలు, సంఘాల నాయకులు బాగం హేమంతరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, డాక్టర్ రవీంద్రనాథ్, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, ఆవునూరి మధు, నున్నా నాగేశ్వరరావు, మహ్మద్ మౌలానా, కె.రాంనారాయణ, ఆకుతోట ఆదినారాయణ, జమ్ముల జితేందర్రెడ్డి, స్పర్శ భాస్కర్, రవిమారుత్, పోట్ల మాధవరావు, డాక్టర్ వై.ప్రసాద్, వడ్డె నారాయణరావు, యర్రా బాబు, జానీమియా, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్, క్లెమెంట్, మహ్మద్ సలాం, పోటు కళావతి తదితరులు పాల్గొన్నారు. -
●జోరు వర్షంలోనూ ఆగని దందా
నేలకొండపల్లి: ఇసుక అక్రమంగా తరలిస్తున్న వారు పగలు, రాత్రీ తేడాను పట్టించుకోకపోగా జోరు వర్షాన్ని సైతం లెక్క చేయడం లేదు. నేలకొండపల్లి మండలంలోని రామచంద్రాపురం, పైనంపల్లి ఏటి పరీవాహకం నుంచి పలువురు అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నారు. శనివారం వర్షంతో ఓ పక్క ఏరు ఉధృతంగా ప్రవహిస్తున్నా ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా ఇసుక తవ్వి ట్రాక్టర్లలో తరలించారు. గతంలో ఇదే ఏటిలో ప్రమాదవశాత్తు మునిగిన ఇద్దరు మృతి చెందారు. అయితే, ఇసుక అక్రమ తరలింపు వ్యవహారం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.ప్రమాదకర పరిస్థితుల్లో ఇసుక రవాణా -
జిల్లా అంతటా వర్షం
● కల్లూరు అత్యధికంగా 70 మి.మీ. వర్షపాతం ● పలుచోట్ల ఉధృత ంగా వాగులుఖమ్మంవ్యవసాయం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా శనివారం ఉదయం నుంచే ఆకాశం మేఘావృతంగా ఉండగా, సాయంత్రం 3గంటల తర్వాత వర్షం ప్రారంభమైంది. పలుచోట్ల దాదాపు రెండు గంటల పాటు వర్షం కురిసింది. అత్యధికంగా కల్లూరు మండల కేంద్రంలో 70.3 మి.మీ.ల వర్షపాతం నమోదు కాగా, తిమ్మారావుపేటలో 68.5, మధిరలో 60.8, గంగారంలో 52.8, వేంసూరులో 49, ఎర్రుపాలెంలో 48.8, ముదిగొండలో 45, మధిర ఏఆర్ఎస్లో 42.8, పెద్ద గోపతిలో 41.5, పెనుబల్లిలో 38.3, ఏన్కూరులో 35.8 గేటు కారేపల్లిలో 33.5, గౌరారంలో 32, సత్తుపల్లి ఓసీ వద్ద 30.5, ఖమ్మం ప్రకాష్నగర్లో 29.3, చింతకానిలో 29, సత్తుపల్లి, సదాశివునిపాలెంలో 25, పంగిడిలో 21, ఖమ్మం ఎన్ఎస్పీ గెస్ట్హౌస్ వద్ద 20.3 మి.మీల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువన వర్షాలతో వరద వాగుల్లోకి చేరి ఉధృతంగా ప్రవహించాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత వర్షాలు పంటలకు ప్రయోజనం కలిగిస్తాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరదలో చిక్కుకున్న కూలీలు క్షేమం ఏన్కూరు: ఏన్కూరు మండలం కేసుపల్లి పరిధిలో కొందరు కూలీలు శనివారం వరదలో చిక్కుకున్నారు. పొలాల్లో పని ముగించుకొని సాయంత్రం వస్తుండగా ఏలుగోడు వాగు ప్రవహాంతో చిక్కుకపోయారు. గ్రామస్తులు తాళ్ల సాయంతో రక్షించేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కాసేపటికి వరద తగ్గడంతో కూలీలు వాగు దాటి క్షేమంగా గ్రామానికి చేరారు. -
ఐస్ స్కేటింగ్లో పతకాల పంట
● మోటమర్రి క్రీడాకారిణి నయనశ్రీ ప్రతిభ ● అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్లడానికి ఆర్థిక ఇక్కట్లుబోనకల్: ఐస్ స్కేటింగ్ అంటే ఆమెకు ప్రాణం. దీంతో ఆటపైనే దృష్టి సారించగా.. తల్లిదండ్రులు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నా ప్రోత్సహించడంతో పతకాల మోత మోగిస్తోంది. బోనకల్ మండలం మోటమర్రి గ్రామానికి చెందిన తాళ్లూరి నయనశ్రీ ప్రస్తుతం బెంగళూరులో డిగ్రీ చదువుతోంది. గ్రామానికి చెందిన నారాయణరావు – వీణ దంపతుల ఏకై క కుమార్తె అయిన నయనశ్రీ తొమ్మిదేళ్ల వయస్సు నుంచే హైదరాబాద్ కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో స్కేటింగ్లో శిక్షణ తీసుకుంటోంది. ఇమె ప్రతిభను గుర్తించిన కోచ్ ఐస్ స్కేటింగ్పై దృష్టి సారించాలని సూచించగా.. 2017లో తొలిసారి ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంది. అలాగే, 2018లో సింగపూర్లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో రజిత పతకం సాదించింది. నాటి నుంచి నేటి వరకు జరిగిన అంతర్జాతీయ స్థాయి పోటీల్లో 17 పతకాలు సాధించగా.. జాతీయ స్థాయిలో 23, రాష్ట్రస్థాయిలో 20కి పైగా పతకాలను గెలుచుకుంది. గత నెల డెహ్రాడూన్లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో రెండు రజితం, రెండు కాంస్య పతకాలను సాధించిన ఆమె నవంబర్లో కజకిస్తాన్లో జరిగే జూనియర్ వరల్డ్ కప్ పోటీలకు సిద్ధమవుతుంది. అయితే, శిక్షణ కోసం సౌత్ కొరియా వెళ్లాల్సి ఉండగా.. దాదాపు రూ.10లక్షల మేర నగదు అవసరమతుంది. నయనశ్రీ తల్లిదండ్రులు చిన్నపాటి ఉద్యోగాలు చేస్తుండటంతో వారు భారం మోసే పరిస్థితి లేదు. దీంతో దాతలు, క్రీడాభిమానులు సహరించాలని కోరుతున్నారు. -
ఖమ్మం.. సాహిత్య గుమ్మం
ఖమ్మంగాంధీచౌక్: ఆధునిక సాహిత్యంలో తెలుగు రాష్ట్రాల్లోనే ఖమ్మం కేంద్రంగా నిలుస్తోందని కవి, విమర్శకులు, మహబూబ్నగర్ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి తెలిపారు. ఖమ్మం జెడ్పీ సమావేశ మందిరంలో కవి వంశీకృష్ణ తల్లి తాటికొండల భ్రమరాంబ సాహిత్య పురస్కార ప్రదానోత్సవం శనివారం నిర్వహించారు. ఈ పురస్కారాన్ని నరసింహారెడ్డికి అందజేయగా ఆయన మాట్లాడారు. భక్త రామదాసు, ప్రముఖ భాషావేత్తలు నడియాడిన నేలపై సాహిత్య పురస్కారం అందుకోవడం తనకు ప్రత్యేకమని తెలిపారు. అనంతరం రచయిత్రి, అనువాదకురాలు స్వర్ణ కిలారి, కుటుంబీకులు రాసిన భ్రమరాంబ స్మృతి గీతాల సంపుటి ‘నెనరు–నెమరు’ను ఆవిష్కరించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్, కవి, సంపాదకులు ఆనందాచారి మాట్లాడగా, కేంద్ర సాహిత్య అకాడమీ సలహామండలి సభ్యులు ప్రసేన్తో పాటు మువ్వా జయశ్రీ, వంశీకృష్ణ, సీతారాం, రవిమారుత్, ఇబ్రహీం, నిర్గుణ్, సుభాషిణి, నీలిమ, వీఎస్.రావు తదితరులు పాల్గొన్నారు. ‘నెనరు–నెమరు’ సంపుటి ఆవిష్కరణలో వక్తలు -
జోరు వాన.. పెరిగిన వరద
కల్లూరురూరల్: కల్లూరు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. సుమారు రెండు గంటల పాటు వర్షం ఆగకుండా కురవడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల డ్రెయినేజీలు నిండి ఇళ్లు, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ●తల్లాడ: తల్లాడ మండలంలో శనివారం మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 6గంటల వరకు వర్షం కురిసింది. తల్లాడ పరిసర గ్రామాల్లో రోడ్లపై వరద నీరు చేరింది. తల్లాడలోనూ ప్రధా, అంతర్గత రహదారులు, పలు కార్యాలయాల వద్ద నీరు నిలిచింది. ●మధిర: మధిర మండంలోని పలు మండలాల్లోనూ వర్షం కురిసింది. నిదానపురం, మాటూరుపేటల్లో వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలవడంతో పాటు లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. ●ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండలంలో భారీ వర్షం, ఎగువ నుండి కట్లేరుకు పెరుగుతున్న వరదతో మొలుగుమాడులోని కట్లేరు వాగు పొంగింది. దీంతో ములుగుమాడు–ఇనగాలి మధ్య రాకపోకలు నిలిపివేశారు. కాగా, కట్లేరుకు వరద రావడంతో పరీవాహకంలో వరి పంట నీటమునిగింది. ●ముదిగొండ: ముదిగొండ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. ముదిగొండ ప్రధాన సెంటర్, వల్లభి రోడ్డు, ఎస్బీఐ ఎదుట ఖమ్మం – కోదాడ రహదారిపై వర్షపు నీరు చేరడంతో చెరువును తలపించింది. రోడ్డు లోతట్టుగా ఉండడంతో నీరు నిలిచి వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. -
ఫీజుల కోసం పోరుబాట
● రీయింబర్స్మెంట్ బకాయిలపై విద్యాసంస్థల నిర్ణయం ● రేపటి నుంచి రెండు రోజులు నిరసనలుఖమ్మం సహకారనగర్: పేద, మధ్య తరగతి విద్యార్థుల చదువుకు ఇబ్బంది లేకుండా వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. నాటి నుంచి ఎందరో విద్యార్థులు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఉచితంగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరారు. కానీ కొన్నేళ్లుగా ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో తమపై భారం పడుతోందని కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. మూడేళ్లుగా బకాయిలు విడుదల కాక విద్యాసంస్థల నిర్వహణ ఇబ్బందిగా మారిందని, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేక నిరసనలకు నిర్ణయించామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో డిగ్రీ, ఇంజనీరింగ్, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ కళాశాలలు వంద వరకు ఉండగా, రీయింబర్స్మెంట్ బకాయిలు రాక కళాశాలల నిర్వహణ, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది వేతనాలు, అద్దె చెల్లింపులకు కష్టంగా మారిందని యాజమాన్యాలు చెబతున్నాయి. రౌండ్ టేబుల్ సమావేశంలో కార్యాచరణ ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ, పీజీ, ఫార్మసీ, ఇంజనీరింగ్ విద్యాసంస్థల బాధ్యులు ఖమ్మంలోని ఎస్బీఐటీ కళాశాలలో శనివారం సమావేశమయ్యారు. ఇంజనీరింగ్ విద్యాసంస్థల యాజమాన్యాల అధ్యక్షుడు చలసాని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన యాజమాన్యాలు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై మూడేళ్లుగా ప్రభుత్వ నిర్లక్ష్యంతో కళాశాలలు నడపడం కష్టంగా మారిందన్నారు. ఎస్బీఐటీ చైర్మన్ గుండాల కృష్ణ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలన్నారు. కాగా, తొలిదశలో ఈనెల 15న సోమవారం విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, యాజమాన్యాలతో ఖమ్మం అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన తెలుపుతామని, 16వ తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ కాలేజీల యాజమాన్య బాధ్యులు ఉషాకిరణ్, శ్రీధర్, కాటేపల్లి నవీన్బాబు, సత్యనారాయణ, ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వారం పాటు విమోచన దినోత్సవం
ఖమ్మం మామిళ్లగూడెం: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ ఆధ్వర్యాన రాష్ట్రంలో వారం పాటు నిర్వహించనున్నామని ఆ పార్టీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్రెడ్డి వెల్లడించారు. ఈ వేడుకలకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. ఖమ్మంలో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ నేతలు హాజరు కాకపోవడం గర్హనీయమన్నారు. ఇదే సమయాన ఆ పార్టీ నేత రాహుల్గాంధీ రాజ్యాంగంపై మాట్లాడడం ద్వంద్వ స్వభావానికి నిదర్శనమని తెలిపారు. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా రైతుల సమస్యలపై దృష్టి సారించడం లేదని ఆరోపించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి సరఫరా చేసిన యూరియాను దారి మళ్లింంచడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, ఇందుకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వైఫల్యమే కారణమని తెలిపారు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా 11ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తామని పొంగులేటి వెల్లడించారు. ●తిరుమలాయపాలెం: మండలంలోని సుబ్లేడులో పోరాటయోధుడు సోయబ్ ఉల్లాఖాన్ విగ్రహానికి బీజేపీ నాయకుడు పొంగులేటి సుధాకర్రెడ్డి నివాళులర్పించారు. ఈనెల 17న తెలంగాణ విమోచన దినో త్సవంగా జరపనున్న నేపథ్యాన రాష్ట్రవ్యాప్తంగా పోరాటయోధులను స్మరించుకోనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరా వు, నాయకులు గోలి మధుసూదన్రెడ్డి, నున్నా రవికుమార్, దొంగలసత్యనారాయణ, ఈవీ.రమేష్, జి.వెంక టేశ్వర్లు, సుబ్బారావు, ప్రభాకర్రెడ్డి, గుత్తా వెంకటేశ్వర్లు, సుదర్శన్ మిశ్రా, నల్లగట్టు ప్రవీణ్కుమార్, రవిరాథోడ్, విజయరెడ్డి, రజినీరెడ్డి, నెల్లూరి బెనర్జీ, నగరికంటే వీరభద్రం, మహేష్, ఇందూరి మహేష్, గంట్ల లక్ష్మారెడ్డి, భూక్యా వెంకటేష్, నల్లగట్టు ఉపేందర్, నాగరాజు, లింగరాజు తదితరులు పాల్గొన్నారు.బీజేపీ నాయకుడు పొంగులేటి సుధాకర్రెడ్డి -
సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు
చింతకాని/బోనకల్: నైజాం నిరంకుశ పాలనను అంతమొందించేందుకు సాగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు భాగం హేమంతరావు పిలుపునిచ్చారు. చింతకాని మండలం ప్రొద్దుటూరులో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు తాళ్లపల్లి రాములు, బోనకల్ మండలం గోవిందాపురం(ఎల్)లో అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళులర్పించి మాట్లాడారు. ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటం రాచరికం, నిర్బంధానికి వ్యతిరేకంగా సాగితే బీజేపీ మాత్రం ముస్లిం రాజుపై హిందువులు చేసిన పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. సాయుధ పోరాటంలో నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో అన్ని వర్గాల వారు ప్రాణత్యాగం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డితో పాటు వివిధ పార్టీల నాయకులు ఏపూరి రవీంద్రబాబు, పావులూరి మల్లికార్జున్రావు, దూసరి గోపాలరావు, యంగల ఆనందరావు, అబ్బూరి మహేష్, పదిమెల వెంకటనర్సయ్య, పగిడిపల్లి ఏసు, తాళ్లపల్లి అజయ్, పెంట్యాల చలమయ్య, వేల్పుల కోటయ్య, తుళ్లూరు శ్రీనివాసరావు, తుడుం పాలరావు, పెంట్యాల రామారావు, పాపినేని రంగారావు, పులి యజ్ఞనారాయణ, జక్కుల రామారావు, వల్లంకొండ బ్రహ్మం, కొత్తపల్లి రమేష్, తమ్మారపు లక్ష్మణ్రావు, తమ్మారపు బ్రహ్మయ్య, కొత్తపల్లి కృష్ణ పాల్గొన్నారు. పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి బోనకల్: అకాల వర్షాలతో నష్టపోయిన పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతుసంఘం అధ్యక్షుడు భాగం హేమంతరావు డిమాండ్ చేశారు. బోనకల్ మండలం గోవిందాపురం(ఎల్)లో దెబ్బతిన్న పత్తి పంటలను సీపీఐ జిల్లా కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డితో కలిసి శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. అధిక వర్షాలతో పత్తి దిగుబడి పడిపోయే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం సర్వే చేయించి రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు. నాయకులు, రైతులు జక్కుల రామారావు, యంగల ఆనందరావు, పుచ్చకాయల తిరుపతయ్య, గోళ్ల కనకయ్య, చింతలచెర్వు మదారయ్య పాల్గొన్నారు. -
నిరుపేద విద్యార్థులకు చేయూత
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువుతకు చేయూతనిస్తున్న పరిశ సీతారత్నం చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని కూసుమంచి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వీరభద్రరావు, విశ్రాంత ఏడీ పి.కోటేశ్వరరావు కొనియాడారు. వైరాకు చెందిన బసవోజు మనోజ్, ఖమ్మం వైఎస్సార్ కాలనీకి చెందిన తాటికొండ సోమశేఖర్కు ట్రస్ట్ తరఫున రూ.20వేల చొప్పున చెక్కులను శనివారం ఖమ్మంలో అందజేశారు. ట్రస్ట్ చైర్మన్ పరిశ పుల్లయ్య, మహంకాళి స్వరాజ్యలక్ష్మి, పరిశ లక్ష్మీరాజ్యం, శ్రీనివాసరావు, ఊడుగు వెంకటేశ్వరరావు, సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు. రైతుల ఆవేదనను గుర్తించండిపెనుబల్లి: గ్రీన్ ఫీల్డ్ హైవేపై సర్వీస్ రోడ్డు లేకపోతే రైతులు ఇబ్బంది పడనున్నందున వారి ఆవేదనను అధికారులు గుర్తించాలని కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ పేర్కొ న్నారు. పెనుబల్లి, వేంసూరు మండలాల రైతులు హైవే వెంట చిన్న బ్రిడ్జిలకు బదులు సర్వీస్ రోడ్డు నిర్మించాలనే డిమాండ్తో రెండో రోజైన శనివారం కూడా నిరసన తెలిపారు. ఈమేరకు కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్కు దయానంద్ సమాచారం ఇవ్వగా ఆయన చేరుకుని వివరాలు ఆరాతీశారు. ఈ సందర్భంగా దయానంద్ మాట్లాడుతూ సర్వీస్ రోడ్లు లేకపోతే రైతులు పొలాలకు వెళ్లాలంటే 10కి.మీ. చుట్టూ తిరగాల్సి వస్తుందని తెలిపారు. ఈ విషయమై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. భూనిర్వాసిత రైతులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు, నాయకులు కీసర వెంకటేశ్వరరెడ్డి, చీకటి రామారావు, వి.పవన్, గూడూరు మాధవరెడ్డి, దొంతు మాధవరావు, ఈడా కమలాకర్, పిల్లి నవజీవన్ పాల్గొన్నారు. మధిరలో కోదాడ ఎమ్మెల్యేమధిర: రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సతీమ ణి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి శనివారం మధి ర వచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్యాంప్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు అనిల్కుమార్ నెహ్రూ, కరివేద సుధాకర్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం పద్మావతి డిప్యూటీ సీఎం సతీమణి నందినితో సమావేశమయ్యారు. అలాగే, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోహిందర్ సింగ్ సైతం మల్లు నందినితో సమావేశం కాగా ఆయనను సన్మానించారు. రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి మోతె: టీవీఎస్ ఎక్సెల్పై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో మృతి చెందాడు. సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా మోతె మండలం మామిళ్లగూడెం శివార్లలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెర్వుకు చెందిన గుండమాల వెంకన్న(50) టీవీఎస్ ఎక్సెల్పై మోతె వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా మామిళ్లగూడెం శివారులో వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వెంకన్నను 108లో ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడని ఎస్ఐ అజయ్కుమార్ తెలిపారు. -
ఆదిలోనే హంసపాదు
● వేంసూరు మండలంలో ‘2782’ వరి రకం సాగు ● 90 రోజులకే 40శాతం మేర ఈనిన పంట ● ఫలితంగా దిగుబడిపై రైతుల్లో ఆందోళనవేంసూరు: రాష్ట్రప్రభుత్వం సన్న రకం ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తుండడంతో రైతులు ఈసారి ఎక్కువగా సన్నరకాల సాగుకే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే, కల్తీ విత్తనాలా, ఇంకేదైనా కారణమో తెలియదు కానీ వేంసూరు మండలంలో పలువురు సాగు చేసిన వరి ముందుగానే ఈనింది. దీంతో మిగతా పంట ఈనేలోగా మొదటి గింజలు రాలిపోతే దిగుబడి తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు. దిగుబడి వస్తుందని... వేంసూరు మండల వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్లో 28 వేల ఎకరాల్లో వరి సాగవుతోంది. ఇందులో 27 వేల ఎకరాలు సన్న రకాలే ఉన్నాయి. మండలంలోని కందుకూరు, భరణిపాడు, మర్లపాడు, చౌడవరం, కుంచపర్తి గ్రామాల రైతులు పంట కాలం ఎక్కువైనా దిగుబడి బాగుంటుందనే భావనతో కరీంనగర్ వరణ్ అగ్రిటెక్కు చెందిన బీపీటీ 2782 రకం విత్తనాలు ఎంచుకున్నారు. మండలంలో దాదాపు 3వేల ఎకరాలల్లో ఈ రకాన్ని సాగు చేయగా 150 రోజుల పంట కాలం కలిగిన ఈ రకం 120 రోజుల తర్వాత ఈతకు రావాలి. కానీ 90 రోజులకే 40శాతం మేర పంట ఈనుతుండడంతో రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు సత్తుపల్లి మండలం నారాయణపురం, కందుకూరు డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. దాదాపు బీపీటీ 2782 వరి రకం మొత్తం ముందుగానే ఈనుతుండడంతో ఏం చేయాలో పాలుపోని స్థితి ఎదుర్కొంటున్నారు. దిగుబడిపై ప్రభవం వరి సాగు చేసిన రైతులు ఎకరాకు రూ.30వేల పెట్టుబడి పెట్టారు. అయితే, 2782 రకం వరి 120రోజులకు ఈతకు రావాల్సి ఉండగా వరి 90రోజులకే 40శాతం ఈనుతుండడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. మరో 30రోజుల తర్వాత మిగతా వరి ఈనేలోగా ముందుగా ఈనిన వరి గింజలు రాలిపోతే దిగుబడి తగ్గే అవకాశముందని చెబుతున్నారు. మొత్తంగా ఎకరాకు 20బస్తాల దిగుబడి తగ్గనుండడంతో పెట్టుబడి కూడా రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు విత్తన కంపెనీ యాజమాన్యం, అధికారులు వరి పంటను పరిశీలించి తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 20ఎకరాల్లో బీపీటీ 2782 రకం సాగు చేశా. పంటకాలం కంటే ముందే వరి ఈనడంతో దిగుబడి సగానికి పైగా తగ్గుతుంది. ఎకరాకు 50 బస్తాల దిగుబడి వస్తుందని చెప్పారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేనందున కంపెనీ యాజమాన్యమే న్యాయం చేయాలి. – ఒగ్గు సత్యనారాయణరెడ్డి, రైతు, కందుకూరుఎకరాకు రూ.30వేల చొప్పున పెట్టుబడితో 30ఎకరాల్లో బీపీటీ 2782 రకం సాగు చేశా. ముందుగానే సగం పొలం ఈనుతోంది. వెనుక పంట ఈతకు వచ్చేలోగా ముందు పంట రాలిపోతుంది. దీంతో పెట్టుబడి కూడా వస్తుందో, రాదో తెలియడం లేదు. – గొర్ల రాజశేఖర్రెడ్డి, రైతు, కందుకూరు -
శాశ్వత పరిష్కారం
సత్వర న్యాయం.. ఖమ్మంలీగల్: కోర్టుల్లో కేసుల పరిష్కారంలో జా ప్యాన్ని నివారించేందుకు ప్రత్యామ్నాయంగా నిర్వహిస్తున్న లోక్అదాలత్లు కక్షిదారులకు వరంగా మారాయి. ఈ లోక్అదాలత్ల నిర్వహణతో రాజీపడదగిన అనేక కేసులకు పరిష్కారం లభిస్తోంది. ప్రతీ లోక్అదాలత్లో వేలాది కేసులను పరిష్కరి స్తుండగా కక్షిదారుల సమయం, డబ్బు వృథా అవుతున్నాయి. అంతేకాక కేసులకు శాశ్వత, అంతిమ పరిష్కారం అందుతోంది. అందరికీ న్యాయసాయం కోసం.. ప్రభుత్వం 1987లో న్యాయసేవాధికార చట్టాన్ని ప్రవేశపెట్టింది. డబ్బు ఉన్న వారికే న్యాయం సొంతం అనే అపోహను తొలగించేలా రాజ్యాంగంలోని 39వ అధికరణ ద్వారా పార్లమెంట్ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. పేదలకు న్యాయ సాయం అందించేలా న్యాయ విజ్ఞాన సదస్సులు, కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్లు నిర్వహిస్తున్నారు. ప్రీ లిటిగేషన్ కేసుల్లో ఎక్కువశాతం విచారణకు ముందే లోక్ అదాలత్ల ద్వారా పరిష్కారమవుతున్నాయి. అంతేకాక గ్రామీణ ప్రాంతాల్లో చట్టం, న్యాయంపై అవగాహన లేని వారికి సత్వరన్యాయం అందించడమే లక్ష్యంగా లోక్అదాలత్లు కొనసాగుతున్నాయి. ప్రత్యామ్నాయ పరిష్కారం రాజ్యాంగం కల్పించిన చట్టం, న్యాయాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలకు అందించేందుకు న్యాయసేవా సంస్థలు అవతరించాయి. ‘ప్రత్యామ్నాయ పరిష్కార పద్ధతి’ సూత్రాన్ని అనుసరించి ప్రభుత్వం ప్రజా న్యాయపీఠం(లోక్ అదాలత్) ప్రక్రియను ప్రవేశపెట్టింది. న్యాయసేవాధికార సంస్థల చట్టంలోని 9వ అధికరణ ప్రకారం న్యాయపరమైన సమస్యలను ఉభయులకు నచ్చచెప్పి వారి సమ్మతితో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తారు. ఎవరు కూడా ఆర్థిక కారణాలు, ఇతర అంశాలతో న్యాయాన్ని పొందే అవకాశం కోల్పోకుండా ఉచిత న్యాయసాయం సైతం అందిస్తున్నారు. నేడు జాతీయ లోక్అదాలత్ జిల్లా కోర్టు ఆవరణతో పాటు జిల్లాలోని పలు కోర్టుల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. ఇందులో అత్యధిక కేసులు పరిష్కరించేలా ఇప్పటికే ముందస్తు లోక్ అదాలత్లు నిర్వహించారు. అలాగే పోలీసు అధికారులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, బీమా కంపెనీ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ఎక్కువ కేసులు పరిష్కరించేలా జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్ ప్రత్యేక చొరవ చూపారు. ప్రత్యేక బెంచ్ల ఏర్పాటు జిల్లా కోర్టులో శనివారం లోక్ అదాలత్ నిర్వహణకు ఎనిమిది బెంచ్లు ఏర్పాటు చేశారు. ఆయా బెంచ్లకు మూడు అదనపు జిల్లా జడ్జి రాంప్రసాదరావు, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి టి.మురళీమోహన్, డీఎల్ఎస్ఏ కార్యదర్శి కే.వీ.చంద్రశేఖర్రావు, ప్రి న్సిపల్ జూనియర్ సివిల్జడ్జి కె.దీప, అడిషనల్ జూ నియర్ సివిల్ జడ్జిలు బి.రజిని, వై.బిందుప్రియ, వి.మాధవి, బి.నాగలక్ష్మి నేతృత్వం వహిస్తారు.నిర్వహణ పరిష్కారమైన కేసులు మార్చి 2024 7,665 జూన్ 2024 10,712 డిసెంబర్ 2024 8,519 మార్చి 2025 19,345నేడు జాతీయ లోక్అదాలత్ జిల్లాలోని కోర్టుల్లో శనివారం జరిగే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. రాజీ మార్గమే రాజమార్గంగా భావిస్తే కేసులు పరిష్కరించుకోవచ్చు. ఇరువర్గాలు రాజీపడితే సత్వర న్యాయం అందుతుంది. జిల్లాలో అత్యధిక కేసులు పరిష్కారమయ్యేలా కక్షిదారులు ముందుకు రావాలి. – జి.రాజగోపాల్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి -
రేషన్ షాప్ల్లో డీఎస్ఓ తనిఖీ
ఏన్కూరు: మండలంలోని పలు గ్రామాల్లో రేషన్ షాప్లను డీఎస్ఓ చందన్కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. రాజలింగాల, తిమ్మారావుపేట, శ్రీరాంపురంతండాల్లో షాపుల ద్వారా బియ్యం పంపిణీని పరిశీలించిన ఆయన డీలర్లకు సూచచనలు చేశారు. లబ్ధిదా రులకు సమస్యలు ఎదురైతే హెల్ప్లైన్ నంబర్ 98682 00445కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఆర్ఐ వీరయ్య పాల్గొన్నారు.నేడు సురవరం సంస్మరణ సభ ఖమ్మంమయూరిసెంటర్: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి సంస్మరణ సభ శనివారం ఖమ్మంలో నిర్వహించనున్నారు. సాయంత్రం 5గంటలకు భక్తరామదాసు కళాక్షేత్రంలో సభ మొదలవుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ తెలిపారు. ఈ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ సమితి సభ్యుడు హేమంతరావు తదితరులు పాల్గొంటారని వెల్లడించారు. ఖమ్మం మీదుగా వారాంతపు రైలు ఖమ్మం రాపర్తినగర్: చర్లపల్లి – అనకాపల్లి నడుమ ఈనెల 13నుంచి వారాంతపు రైలు ప్రారంభమవుతుందని అధికారులు వెల్లడించారు. చర్లపల్లిలో ప్రతీ శనివారం రాత్రి 8గంటలకు బయలుదేరే రైలు ఆదివారం తెల్లవారుజామున 4గంటలకు అనకాపల్లికి చేరుతుందని తెలిపారు. ఈ రైలు ఖమ్మంకు రాత్రి 11–11గంటలకు వస్తుందని పేర్కొన్నారు. తిరుగు ప్రయాణంలో అనకాపల్లి–చర్లపల్లి రైలు అర్ధరాత్రి 1–28 గంటలకు ఖమ్మం స్టేషన్కు వస్తుందని అధికారులు తెలిపారు. ఉద్యోగాలకు 18 మంది ఎంపికఖమ్మం రాపర్తినగర్: జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యాన శుక్రవారం నిర్వహించిన జాబ్ మేళాలో 18 మంది ఎంపికయ్యారు. అపోలో ఫార్మసీలో వివిధ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ నిర్వహించగా హాజరైన 35 మందిలో 18 మంది ఎంపిక కాగా నియామకపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన శాఖఅధికారి కొండపల్లి శ్రీరాం, అపోలో ఫార్మసీ ప్రతినిధులు పాల్గొన్నారు. 17న సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో ఈనెల 17న నిర్వహించే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారో త్సవాల ముగింపు సభకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ.బేబీ హాజరుకానున్నారని జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో శుక్రవారం నాయకులు బండి రమేశ్, వై.విక్రమ్తో కలిసి మాట్లాడారు. సభలో బేబీతో పాటు కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర నాయకుడు పోతినేని సుదర్శన్రావు, తదితరులు హాజరవుతారని తెలిపారు. ఈమేరకు సభను విజయవంతం చేయాలని కోరారు. తపాలా బీమాను సద్వినియోగం చేసుకోవాలితిరుమలాయపాలెం: తపాలా శాఖ అందిస్తున్న బీమా పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి సూచించారు. పోస్టల్ బీమా తీసుకుని ఇటీవల ప్రమాదానికి గురైన మండలంలోని తిప్పారెడ్డిగూడెం వాసి వేల్పుల భద్రమ్మకు రూ.1,08,000 చెక్కును శుక్రవారం ఆయన అందజేసి మాట్లాడారు. తక్కువ ప్రీమియంతో పథకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పోస్టల్ శాఖ ఇన్స్పెక్టర్ కాళీ మహేశ్వరి, ఉద్యోగులు రాజేష్, వెంకయ్య, పాండు, సారయ్య పాల్గొన్నారు. భద్రాచలం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలిఖమ్మంమయూరిసెంటర్: భద్రాచలం ఆర్టీసీ డిపోలో పెరిగిన పనిభారం, మస్టర్ల కుదింపునకు వ్యతిరేకంగా ఐదు రోజుల నుంచి అక్కడి ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి ఖమ్మం రీజియన్ ఆర్టీసీ జేఏసీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా శుక్రవారం ఖమ్మంలో పర్సనల్ ఆఫీసర్ సంపత్కుమార్కు వినతిపత్రం అందజేసి సమస్యను పరిష్కరించాలని కోరారు. భద్రాచలం డిపో మేనేజర్ కార్మికులపై భారం మోపుతూ మస్టర్లు కుదిస్తున్నారని తెలిపారు. నాయకులు ఏ.కృష్ణ, వినోదరావు, పి.సుధాకర్, జి.మాధవరావు, పి.రమేష్, బుచ్చిబాబు, బి.హన్మంతరావు, ఆర్.టీ.రావు పాల్గొన్నారు. -
అవసరం మేరకే ఎరువులు వినియోగించాలి
సత్తుపల్లిరూరల్: పంటలకు అవసరం మేరకే నత్రజని ఎరువు వినియోగించాలని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య సూచించారు. సత్తుపల్లి మండలంలోని కిష్టారం, తుంబూరు, గంగారం పీఏసీఎస్ల్లో యూరి యా పంపిణీని శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. పంటలకు కొంత మొత్తంలో నానో యూరియా, నానో డీఏపీలను పిచికారీ చేస్తే ఇక్కట్లు ఉండవని తెలిపారు. జిల్లాలో రైతుల అవసరాల మేరకు ఎరువులు పంపిణీ చేస్తున్నందున ఎక్కడా కొరత లేదని వెల్లడించారు. అనంతరం కిష్టారం, బేతుపల్లిల్లో పంటల నమోదు ప్రక్రియను డీఏఓ తనిఖీ చేశారు. సత్తుపల్లి ఏడీఏ వి.శ్రీనివాసరెడ్డి, ఎస్హెచ్ఓ టి.శ్రీహరి, ఏఓ వై.శ్రీనివాసరావు, ఏఈఓలు డి.నరేష్, టి.సాయివాసంతి, కె.ఆశాజ్యోతి పాల్గొన్నారు. -
హైవేపై సర్వీస్ రోడ్డు కోసం రైతుల ధర్నా
పెనుబల్లి: గ్రీన్ఫీల్డ్ హైవేలో భాగంగా మండలంలోని కొత్తరాయిగూడెం, పాతకారాయిగూడెం వద్ద ఇరువైపులా సర్వీస్ రోడ్డు నిర్మించాలని పెనుబల్లి మండల రైతులు శుక్రవారం ధర్నా చేశారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ హైవేపై చిన్న బ్రిడ్జిల నిర్మాణంతో పొలాలకు యంత్రాలు, వాహనాలను తీసుకెళ్లడం కష్టమవుతుందని వాపోయారు. కాగా, రైతులకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ హైవే అధికారి అమరేందర్తో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు. అలాగే, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని దయానంద్ తెలిపారు. మెరుగైన వైద్యం అందించాలితిరుమలాయపాలెం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేలా ఉద్యోగులు కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి కళావతిబాయి సూచించారు. తిరుమలాయపాలెం సీహెచ్సీ నుంచి విడదీసి పాతర్లపాడులో ఏర్పాటుచేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆమె అదనపు జిల్లా వైద్యాధికారి అరుణతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ, ,ఐపీ రికార్డులు పరిశీలించడంతో మందుల లభ్యత, చికిత్స వివరాలు ఆరాతీసి ఉద్యోగులకు సూచనలు చేశారు. అనంతరం హెపటైటిస్ బీ వ్యాక్సినేషన్ డే సందర్బంగా తిరుమలాయపాలెం ఆస్పత్రి వైద్యులు, సిబ్బందికి డీఎంహెచ్ఓ, డీసీహెచ్ఎస్ రాజశేఖర్గౌడ్ వ్యాక్సిన్లు వేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు కృపాఉషశ్రీ, అమర్సింగ్, బొల్లికొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన వసతిగృహాల్లో
కార్మికుల సమ్మెఖమ్మంమయూరిసెంటర్: గిరిజన సంక్షేమ వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డెయిలీ వేజ్, ఔట్సోర్సింగ్ కార్మికులు సమ్మె బాట పట్టారు. కొద్దినెలలుగా కుక్, కామాటి, వాచ్మన్లకు వేతనాలు రాకపోవడంతో శుక్రవారం విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. జిల్లాలో డెయిలీ వేజ్ వర్కర్లు 77 మంది, ఔట్సోర్సింగ్ వర్కర్లు 45 మంది ఉండగా.. వీరు విధులు బహిష్కరించడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉదయం అల్పాహారం వండి వడ్డించే వారు లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు వార్డెన్లకు సూచించారు. కానీ వార్డెన్లు పట్టనట్లు వ్యవహరించడంతో విద్యార్థులకు టిఫిన్ అందలేదు. రెగ్యులర్ వర్కర్లు ఉన్నచోట్ల నుంచి అవసరమైన వసతిగృహాలకు కొందరిని పంపించారు. ఇంకొన్ని వసతిగృహాల్లో విద్యార్థులతోనే వంట చేయించినట్లు తెలిసింది. వేతనాలు అందలేదని వర్కర్లు విధులు బహిష్కరించారు. ఈ ప్రభావంతో విద్యార్థులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని వార్డెన్లకు సూచించాం. రెగ్యులర్ వర్కర్లు ఉన్న చోటనుంచి అవసరమైన వసతిగృహాలకు పంపించాం. ఎక్కడ కూడా విద్యార్థులు ఇబ్బండి పడకుండా చూస్తున్నాం. – విజయలక్ష్మి, డీడీ, జిల్లా గిరిజనాభివృద్ధి శాఖవసతిగృహాల్లోని ఔట్సోర్సింగ్, డెయిలీ వేజ్ వర్కర్ల సమ్మెకు కార్మిక సంఘాలు మద్దతు తెలి పాయి. ఖమ్మం ఎన్నెస్పీ క్యాంప్లోని బాలికల కళాశాల వసతిగృహం ఎదుట వర్కర్లతోపాటు కార్మిక సంఘాల నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ మాట్లాడుతూ కొద్దినెలలుగా వర్కర్లకు వేతనాలు ఇవ్వకపోడమే కాక పనిభారం మోపారని తెలిపారు. ఇకనైనా పెండింగ్ వేతనాలు చెల్లించి, శ్రమకు తగిన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్యాణం వెంకటేశ్వరరావు, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, డీవైఎఫ్ఐ నాయకులు సింగు నరసింహారావు, సుబాన్, చింతల రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
టీఎన్జీవోస్ మున్సిపల్ ఫోరం కమిటీ ఎన్నిక
ఖమ్మంమయూరిసెంటర్: టీఎన్జీవోస్ అనుబంధ మున్సిపల్ ఫోరం నూతన కమిటీని ఖమ్మంలో శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సత్తుపల్లి, మధిర, వైరా, కల్లూరు, ఏదులాపురం మున్సిపాలిటీలతో పాటు ఖమ్మం కార్పొరేషన్ ఉద్యోగులు పాల్గొనగా.. ఒక్కో సెట్ నామినేషన్లే దాఖలు కావడంతో ఎన్నిక ఏకగ్రీవమైందని ఎన్నికల అధికారి తాళ్లూరి శ్రీకాంత్ ప్రకటించారు. ఫోరం అధ్యక్షుడిగా ఏ.సుధాకర్, అసోసియేటెడ్ అధ్యక్షుడిగా ఈ.ఉదయ్ కుమార్, ఉపాధ్యక్షులుగా ఎం.శ్రీనివాస్, కె.లింగయ్య, జె.నాగరాజు, జె.సుచిత, కార్యదర్శిగా జి.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. అలాగే, సంయుక్త కార్యదర్శులుగా ఎం.సాంబయ్య, సీహెచ్.శ్రీనివాస్, జె.రాంబాయి, ఏ.ప్రేమ్కుమార్రెడ్డి, కోశాధికారిగా బి.నాగేశ్వరరావుతో పాటు ఇతర పదవులకు బి.సుధీర్, కె.శ్రీకాంత్, అవినాష్, కే.హేమనాథ్సాయి, ఎం.ప్రవీణ్ కుమార్, పి.రజిని, కృష్ణకుమారి, కవిత, అనురాధ ఎన్నికయ్యా రు. నూతన కార్యవర్గాన్ని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొణిదెన శ్రీనివాస్ అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కొమరగిరి దుర్గాప్రసాద్, జెడ్.ఎస్.జైపాల్, యర్రా రమేష్, లలితకుమారి, ప్రభాకరాచారి, రుక్మారావు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. -
చేపపిల్లల పంపిణీకి రంగం సిద్ధం
● ముగిసిన టెండర్ల దాఖలు గడువు ఖమ్మంవ్యవసాయం: ఎట్టకేలకు చేపపిల్లల కొనుగోళ్ల టెండర్ల ప్రక్రియ శుక్రవారంతో పూర్తయింది. జిల్లాలో నిర్దేశించిన జలాశయాలకు చేపపిల్లలు సరఫరా చేసేందుకు టెండర్ల దాఖలు గడువు మూడు సార్లు పొడిగించిన అనంతరం ముగిసింది. ఈమేరకు ఏడుగురు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయగా, వీరి ఫామ్స్ను పరిశీలించి ఖరారు చేశాక చేపపిల్లల పంపిణీ మొదలుకా నుంది. ఇప్పటికే అదును దాటుతుండడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతుండగా ఎట్టకేలకు ప్రక్రియలో వేగం పెరగడంతో ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాకు 3.49కోట్ల పిల్లలు జిల్లాలోని 882 రిజర్వాయర్లు, పెద్ద చెరువులు, చిన్న చెరువుల్లో నీటి సామర్ద్యం, విస్తీర్ణం ఆధారంగా చిన్న, పెద్ద చేప పిల్లలు పంపిణీ చేస్తారు. 80–100 మి.మీ.ల సైజు పెద్ద చేపపిల్లలు 2.11 కోట్ల వరకు, 35–40 మి.మీ. ఉండే చిన్నపిల్లలు 1.38 కోట్లు కలిపి 3.49 కోట్ల చేపపిల్లలకు జలాశయాల్లో విడదల చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.4 కోట్లు వెచ్చించనుంది. కాగా, టెండర్లు దాఖలు చేసిన వారి సీడ్ ఫామ్స్ను జిల్లా మత్స్యశాఖ అధికారి నేతృత్వాన బృందం పరిశీలిస్తుంది. ఆతర్వాత అదనపు కలెక్టర్ చైర్మన్గా వ్యవహరించే కమిటీ టెండర్లను పరిశీలించి తక్కువ బిడ్ దాఖలు చేసిన వారిని ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియ త్వరగా పూర్తిచేసి జలాశయాల్లో చేపపిల్లలను వదలాలని మత్స్యశాఖ కసరత్తు చేస్తోంది. రైతువేదికలో జరిగిన ఘటనపై కలెక్టర్ ఆరాకామేపల్లి: కామేపల్లి రైతు వేదికలో గురువారం యూరియా కూపన్ల పంపిణీ సందర్భంగా జరిగి న ఘటనపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆరా తీశా రు. రైతులతో ఏఈఓలు దురుసుగా ప్రవర్తించినట్లు కథనాలు రావడంతో నివేదిక ఇవ్వాలని జిల్లా వ్యవసాయాధికారిని ఆదేశించినట్లు తెలిసింది. కాగా, కూపన్లు పంపిణీ చేస్తుండగా జాస్తిపల్లికి చెందిన రైతు రాయల కృష్ణ తనతో పాటు కామేపల్లి ఏఈఓ శ్రీకన్యను దూషించాడంటూ మద్దులపల్లి ఏఈఓ రవికుమార్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. వివాదాస్పద భూములకు ఫెన్సింగ్ఖమ్మం అర్బన్: రఘునాథపాలెం సమీపాన ఖమ్మం అర్బన్ మండల పరిధి మల్లెమడుగు లో వివాదాస్పద భూములకు పోలీసుల పర్యవేక్షణలో రెవెన్యూ అధికారులు శుక్రవారం ఫెన్సింగ్ వేశారు. ఆర్డీఓ నరసింహారావు, తహసీల్దార్ సైదులు, ఉద్యోగులు భూములకు ఫెన్సింగ్ వేయించి ఎవరూ ప్రవేశించవద్దని సూచిస్తూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. సుమారు 29ఎకరాల భూమికి సంబంధించి కొన్నేళ్లుగా మల్లెమడుగు రైతులు, భూములు కొనుగోలు చేసిన వ్యక్తులు, ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతోంది. భూముల్లోకి ఎవరూ వెళ్లొద్దని కోర్టు ఆదేశాలు ఉన్నా కొందరు సాగు చేయడంతో ఫెన్సింగ్ వేయించామని ఆర్డీఓ, తహసీల్దార్ తెలిపారు. కాగా, భూమి కొనుగోలు చేసినట్లు చెబుతున్న టి.శ్రీనివాసరావు మాట్లాడారు. అధికారులు తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఫెన్సింగ్ వేయడం సరికాదని, ఈ అంశంపై చట్టపరంగా పోరాడుతామని తెలిపారు. -
తీరని యూరియా వెతలు
ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెం సొసైటీ కార్యాలయం వద్ద శుక్రవారం యూరియా కోసం రైతులు సీపీఎం ఆధ్వర్యాన ధర్నా చేశారు. ఈసందర్భంగా సీపీఎం నాయకుడు దివ్వెల వీరయ్య మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం యూరియా సరఫరా చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతోందని, రాష్ట్రప్రభుత్వం తీరు కూడా అలాగే ఉందని ఆరోపించారు. నాయకులు గొల్లపూడి పెద్ద కోటేశ్వరరావు, నల్లమోతు హనుమంతరావు, దివ్వెల వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ●తల్లాడ: తల్లాడ సొసైటీ పరిధి రైతువేదికల్లో శుక్రవారం రైతులకు యూరియా పంపిణీ చేశారు. అన్నారుగూడెం, బిల్లుపాడుల్లో కూపన్ల ఆధారంగా బందోబస్తు నడుమ పంపిణీ చేపట్టారు. ●నేలకొండపల్లి: నేలకొండపల్లి పీఏసీఎస్లో యూరియా పంపిణీకి మూడు రోజుల క్రితం కూపన్లు జారీ చేశారు. వీటి ఆధారంగా ఒక్కో రైతుకు బస్తా చొప్పున యూరియా ఇస్తుండగా కొన్ని కూపన్లపై నంబర్లు డబుల్ రావడంతో వివాదం నెలకొంది. దీనిపై ఓ రైతు నేలపై పడుకుని నిరసన తెలిపారు. అక్కడకు వచ్చిన ఏఓను నిలదీయగా కూపన్లు ఉన్న అందరికీ యూరియా పంపిణీ చేశారు. ●వైరా: గత నెలలో ఆధార్ కార్డు, పట్టాదారు పాస్పుస్తకాలు ఇచ్చినా ఇప్పటికీ యూరియా పంపిణీ చేయలేదని పలువురు రైతులు ఆరోపించారు. ఈ సందర్భంగా శుక్రవారం వైరా తహసీల్దార్, ఏఓ కార్యాలయాల ఎదుట ఆందోళన చేశారు. వైరా రిజర్వాయర్ కింద సాగు చేసిన వరి పంటకు యూరియా లేక ఎదుగుదల లోపిస్తోందని తెలి పారు. అయితే, రెండు రోజుల్లో యూరియా అందించే ఏర్పాట్లు చేస్తామని వైరా ఎస్ఐ పి.రామారావు, ఏఓ మంజుఖాన్ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. రైతు సంఘం నాయకులు బొంతు రాంబాబు, చింతనిప్పు చలపతిరావు, సంక్రాంతి నరసయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి
మధిర: మధిరలో మృత్యుంజయ స్వామి ఆలయ సమీ పాన వైరా నదిలో ఈతకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. ఎర్రుపాలెం మండలం చొప్పకట్లపాలెంకు చెందిన తొర్లికొండ కృష్ణ(45) మధిరలో సెంట్రింగ్ వర్క్ చేస్తాడు. కొద్దిరోజులుగా మధిరచెరువులో ఈత నేర్చుకుంటున్న ఆయన పలువురితో కలిసి వైరా నదికి వెళ్లాడు. అయితే, చెక్డ్యామ్ వద్ద ప్రవాహంలో కృష్ణతో పాటు రామ్ కొట్టుకుపోయారు. ఈక్రమాన కృష్ణను రామ్ బయటకు లాగి వెళ్తుండగా ఒడ్డుకు వచ్చేసరికి కృష్ణ నీటిపై తేలియాడుతూ కనిపించాడు. కాగా, వరద భయంతో గుండె ఆగి మృతి చెందాడని భావిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా.. మధిర టౌన్ ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైతులను రెచ్చగొట్టారంటూ జర్నలిస్టుపై కేసు కొణిజర్ల: ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పాలని రైతులను ప్రేరేపించారంటూ ఓ టీవీ చానల్ (సాక్షి కాదు) రిపోర్టర్పై కొణిజర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 11న కొణిజర్ల సొసైటీ కార్యాలయం వద్ద రైతులు యూరియా కోసం బారులు దీరారు. అక్కడకు వచ్చిన రిపోర్టర్ సాంబశివరావు, తదితరులు యూరియా సరిపోవడం లేదని చెప్పాలంటూ రైతులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేశారని ఎస్సై సూరజ్ తెలిపారు. కొణిజర్లకు చెందిన గంధం నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని వెల్లడించారు. కాగా, జర్నలిస్టులపై అక్రమంగా పెట్టిన కేసు ఎత్తివేయాలని టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి ఆధ్వర్యాన జర్నలిస్టులు అడిషనల్ డీసీపీని ప్రసాదరావుకు వినతిపత్రం అందజేశారు. -
గొంతు నొక్కేయడం కక్షే..
పత్రికా స్వేచ్ఛను హరించేలా ప్రజల పక్షాన పనిచేసే జర్నలిస్టుల గొంతు నొక్కేయడం సరికాదు. ఇది భారత రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే. ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా కేసులు నమోదు చేయడం, అక్కడ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం తగదు. ప్రజల పక్షాన నిలిచే వారిపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలి. – సింగం జనార్దన్, టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్, ఖమ్మం -
పత్రికా స్వేచ్ఛను హరించొద్దు
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే కాక ప్రజలను చైతన్యవంతులను చేసేలా పత్రికలు వ్యవహరిస్తాయి. అలాంటి పత్రికల స్వేచ్ఛను హరించడం సరికాదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరాలన్నా... ప్రజలకు ఏమేం వసతులు కావాలో ప్రభుత్వం దృష్టికి వెళ్లడంలో పత్రికలు కీలకంగా నిలుస్తాయి. కానీ ఏపీలో ప్రజల పక్షాన వార్తలు రాస్తున్న ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్జి, జర్నలిస్టులపై కేసులు పెట్టడం సరికాదు. – ఎస్.విజయ్, టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి -
దాడులు నిలిపేయాలి
సమాజ శ్రేయస్సు, ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసే జర్నలిస్టులు, మీడియా సంస్థలపై దాడులు చేయడం హేయమైన చర్య. ఏపీలో ‘సాక్షి’ పత్రిక ఎడిటర్, జర్నలిస్టులపై అక్కడి ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరించడం సరికాదు. ప్రజాస్వామ్యంలో నాలుగో మూలస్తంభంగా వ్యవహరించే పత్రికా రంగంపై దాడులను నిలిపేయాలి. ‘సాక్షి’ ఎడిటర్, జర్నలిస్టులపై నమోదుచేసిన కేసులను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. – మోదుగు వేలాద్రి, టీజీవోస్ ఖమ్మం జిల్లా కార్యదర్శి -
చకచకా సీఎంఆర్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో 2024–25 యాసంగికి సంబంధించి సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) సేకరణపై పౌర సరఫరాల సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. రేషన్షాప్ల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తుండడంతో గడువులోగా సీఎంఆర్ సేకరించే లక్ష్యంతో అధికార యంత్రాంగం పనిచేస్తోంది. జిల్లాలో యాసంగిలో 3,06,446.600 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పౌర సరఫరాల సంస్థకు చేరాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 2,44,901.277 మెట్రిక్ టన్నులు అందాయి. అంటే 80 శాతం మేర బియ్యం చేరగా, మిగిలిన బియ్యాన్ని ఈ నెలాఖరులోగా సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. మరోపక్క 2024–25 వానాకాలం సీఎంఆర్ సేకరణ కూడా 98శాతం పూర్తయింది. ఇక 2023–24 ఏడాదిలో సీఎంఆర్ ఇవ్వకుండా అవకతవకలకు పాల్పడిన మిల్లర్లలో ఇద్దరికి నోటీసులు ఇవ్వగా.. ఇంకో మిల్లర్పై కేసు పెట్టారు. గడువుతో గడిపేస్తూ.. గత కొన్నేళ్లుగా మిల్లర్ల నుంచి సీఎంఆర్ సేకరణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం పలుమార్లు గడువు పొడిగిస్తున్నా మిల్లర్లు నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. జిల్లాలో ఏటా పౌరసరఫరాల సంస్థ సుమారు 70 మిల్లులకు ధాన్యాన్ని మిల్లింగ్ కోసం ఇస్తోంది. ధాన్యం మర ఆడించాక 67 శాతం బియ్యాన్ని పౌరసరఫరాల సంస్థకు అందించాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా గడువులోగా ఇవ్వకపోవడమే కాక సాకులతో కాలం వెళ్లదీస్తున్నారు. 2023–24 సీజన్ వరకు ఇదే పరిస్థితి కొనసాగడంతో అవసరాలకు బియ్యం కేటాయించడం ఇబ్బందిగా మారింది. యాసంగిలో 80 శాతం 2024–25 ఏడాది వానాకాలంలో 98 శాతం, యాసంగిలో 80 శాతం సీఎంఆర్ సేకరణ పూర్తయింది. యాసంగి సీజన్లో మిల్లర్లకు 4,56,167 మెట్రిక్ టన్నుల ధాన్యం అప్పగిస్తే అందులో 3,06,446.600 మెట్రిక్ టన్నుల బియ్యానికి గాను 2,44,901.277 మెట్రిక్ టన్నులు అందించారు. మిగతా బియ్యాన్ని సైతం ఈనెలాఖరులోగా సేకరించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆ మిల్లర్లపై చర్యలు.. గతంలో చాలా మిల్లులు గడువులోగా సీఎంఆర్ ఇవ్వకుండా అవకతవకలకు పాల్పడ్డాయి. 2023–24లో హైదరాబాద్ నుంచి వచ్చిన టాస్క్ఫోర్స్ బృందాలు తనిఖీలు చేపట్టడంతో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్లుగా తేలింది. దీంతో మిల్లర్లకు జరిమానా విధించినా చెల్లించలేదు. మూడు మిల్లులకు నోటీసులు జారీ చేస్తే రెండు మిల్లుల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. మరో మిల్లుపై ఇప్పటికే కేసు నమోదైంది. అయితే అవకతవకలకు పాల్పడిన మిల్లర్లపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా అలాంటి చర్యలు తీసుకోలేదు.సీఎంఆర్ త్వరగా సేకరించేంలా చర్యలు చేపట్టాం. ఇప్పటికే 80 శాతం మేర సన్నబియ్యం అందింది. ఈనెలాఖరు వరకు గడువు ఉన్నందున మొత్తం సేకరిస్తాం. రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తుండడంతో సరిపడా నిల్వ ఉండేలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీలత, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల సంస్థ 2024–25 రబీ ధాన్యంలో 80 శాతం సేకరణ ఈ ఏడాది ఉగాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. అంతేకాక పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, వసతిగృహాల్లో భోజనానికి సైతం సన్న బియ్యం అందిస్తున్నారు. ఈనేపథ్యాన గడువులోగా సీఎంఆర్ సేకరించేలా అధికారులు దృష్టి సారించారు. ప్రతినెలా రేషన్ షాపులు, ఇతర అవసరాలకు సన్నబియ్యం పంపిణీ చేయాలంటే ముందస్తుగా నిల్వ చేయడం తప్పనిసరి. దీంతో బియ్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టించకుండా గడువులోగా అందించేలా అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇదే సమయాన మిల్లుల్లో ధాన్యం, బియ్యం పక్కదారి పట్టకుండా నిఘా పెట్టారు. -
రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలి
ఖమ్మం సహకారనగర్: అడ్డంకులను అధిగమించి రాజీవ్ స్వగృహ సముదాయాన్ని దక్కించుకోవడంపై ఉద్యోగ సంఘాల నాయకులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అభినందించారు. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలోని రాజీవ్ స్వగృహ సముదాయాన్ని ఉద్యోగుల హౌస్ బిల్డింగ్ సొసైటీ బిడ్లో కై వసం చేసుకోగా, నాయకులు శుక్రవారం కలెక్టర్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రత్యేక ఒరవడి కలిగిన జిల్లా ఉద్యోగులు ప్రాజెక్టును విజయవంతం చేసి ఆదర్శంగా నిలవాలని సూచించారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొనిదెన శ్రీనివాసరావు, టీజీవోస్ జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి, నాయకులు విజయ్, రాంబాబు, జైపాల్, వెంకన్న, దుర్గాప్రసాద్, హరికృష్ణ, కోణార్క్, ప్రభాకరాచారి, రుక్మారావు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం తనిఖీ కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాంను వివిధ పార్టీల నాయకులతో కలిసి కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ భద్రత, అగ్నిమాపక యంత్రాల నిర్వహణపై ఉద్యోగులకు సూచనలు చేశారు. ఉద్యోగులు ఎం.ఏ.రాజు, అన్సారీ పాల్గొన్నారు.ఉద్యోగ సంఘాలతో కలెక్టర్ అనుదీప్ -
శరవేగంగా భూసర్వే
మధిర: మధిర మండలంలోని వంగవీడు సమీపాన వైరా నదిపై నిర్మించే జవహర్ ఎత్తిపోతల పథకానికి అవసరమైన భూసేకరణపై యంత్రాంగం దృష్టి సారించింది. వైరా నదిపై రూ.630 కోట్ల వ్యయంతో ఎత్తిపోతల పథకం నిర్మించి పైప్లైన్ల ద్వారా మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని చివరి ఆయకట్టుకు సాగునీరు అందించేలా ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఈమేరకు అవసరమైన 193.15 ఎకరాల భూసేకరణకు 40 మంది సిబ్బందితో సర్వే చేయిస్తున్నారు. వైరానదిపై చెక్డ్యామ్, ఆ పక్కన పంప్హౌస్ నిర్మించి అక్కడి నుంచి మూడు పైపులైన్ల ద్వారా నీరు ఎత్తిపోస్తారు. భూమి నుంచి ఆరు అడుగుల లోపల పైప్లైన్లు వేసే క్రమాన మధ్యలో బోర్లు ఉన్నా ఇబ్బంది ఎదురుకాకుండా భూసేకరణకు నిర్ణయించారు. అంతేకాక పైప్లైన్ల మరమ్మతులు, నిర్వహణ కోసం ఓ వైపు రోడ్డు నిర్మిస్తారు. ఇప్పటికే పంప్హౌస్ పనులు మొదలుకాగా.. పైప్లైన్, రహదారికి అవసరమైన భూసేకరణకు కసరత్తు మొదలుపెట్టారు. మూడు మార్గాల్లో.. వైరా నదిపై పంప్హౌస్ నుంచి మూడు మార్గాల్లో పైపులైన్లు వేస్తారు. ఇందులో ఒకటి 11.2 కి.మీ. పొడవుతో నిర్మించి నిధానపురం మేజర్ కెనాల్ 38వ కి.మీ. వద్దకు నీరు చేరుస్తారు. ఇక 26 కి.మీ. పొడవైన రెండో పైప్లైన్ ద్వారా జమలాపురం మేజర్ వద్ద ఉన్న కాల్వలోకి నీటిని విడుదల చేస్తారు. అలాగే, మూడో పైప్లైన్ 27 కి.మీ. ఉంటుందని.. దీనిద్వారా మైలవరం మేజర్ కెనాల్లోకి నీటిని డంపింగ్ చేస్తారు. తద్వారా ఏపీ భూభాగం నుంచి సాగునీరు తీసుకోకుండానే జవహర్ ఎత్తిపోతల ద్వారా మధిర, ఎర్రుపాలెం మండలాల పరిధి చివరి ఆయకట్టుకు నీరందిస్తారు. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని సాగర్ జోన్–3 నుంచి జోన్–2లోగా మార్చారు. ఎత్తిపోతల పథకం కూడా పూర్తయితే కు ఇన్నాళ్లు చివరి ఆయకట్టుకు నీరందక నష్టపోయిన రైతులకు మేలు జరగనుంది. మధిర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చొరవతో తమ సాగునీటి కష్టాలు తీరనున్నాయని రైతులు చెబుతున్నారు. భూసేకరణ మధిర, ఎర్రుపాలెం మండలాల పరిధిలో 37వేల ఎకరాలకు సాగునీరు అందించేలా ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నారు. పైప్లైన్ ఏర్పాటుతో పాటు ఇతర పనులకు మొత్తం 193.15 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. మధిర మండలంలో 116.35, ఎర్రుపాలెం మండలంలో 76.20 ఎకరాల భూసేకరణ నిర్ణయించారు. మధిర మండలంలోని వంగవీడులో 19.21, మునగాలలో 20.38, ఆత్కూరులో 16.27, మాటూరులో 25.18, నాగవరప్పాడులో 9.26, సిద్దినేనిగూడెంలో 21.28, ఎర్రుపాలెం మండలంలోని గోసవీడులో 25.37, అయ్యవారిగూడెంలో 12.47, భీమవరంలో 12.31, గుంటుపల్లి గోపవరంలో 3.27, మామునూరులో 25.38 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. -
భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు సరికాదు
ఆంధ్రప్రదేశ్లో పౌరహక్కులు, జర్నలిస్టుల స్వేచ్ఛను హరించేలా తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును పలువురు తప్పుపడుతున్నారు. ‘సాక్షి’ తెలుగు దినపత్రికకు చెందిన పలు ఎడిషన్ కేంద్రాలపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేసి ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ విషయంలో ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయలేదు. ఇక ప్రభుత్వం హామీల అమలులో చేస్తున్న జాప్యంపై ప్రజల పక్షాన వార్తలు ప్రచురిస్తే మాత్రం కేసులు నమోదు చేసి సాక్షి కార్యాలయాలు, జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. తాజాగా ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై కేసులు నమోదు చేసి, రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛను అక్కడి ప్రభుత్వం తమ గుప్పిట్లోకి తీసుకునేలా చేస్తున్న ప్రయత్నాలపై పలువురు మండిపడ్డారు. – ఖమ్మం సహకారనగర్ / ఖమ్మం లీగల్ -
డంపింగ్ యార్డ్కు స్థలం గుర్తించండి
వైరా: వైరా మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్కు అనువైన స్థలాన్ని గుర్తించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ ఆదేశించారు. వైరా మండలం ముసలిమడుగులో స్థలాన్ని అమె తహసీల్దార్ కే.వీ.శ్రీనివాస్తో కలిసి శుక్రవారం పరిశీలించారు. అయితే, ఈ స్థలం దూరంగా ఉన్నందున, కొణిజర్ల, తల్లాడ మండలాల్లో రెండెకరాల స్థలాన్ని ఎంపిక చేయాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ యు.గురులింగం తదితరులు పాల్గొన్నారు. యాత్రాదానానికి విరాళాలు అందించండి ఖమ్మంమయూరిసెంటర్: సామాజిక బాధ్యతలో భాగంగా ఆర్టీసీ ‘యాత్రాదానం’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఖమ్మం రీజియన్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. అనాథలు, నిరాశ్రయులైన వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లడం ఈ కార్యక్రమ ఉద్దేశమని వెల్లడించారు. ఇందులో భాగంగా ఆసక్తి ఉన్న వారు ప్రత్యేక రోజులు, పండుగల సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక నిధికి విరాళం ఇస్తే బస్సులు సమకూరుస్తామని తెలిపారు. ఇందుకోసం వ్యక్తులతో పాటు ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ సంస్థలు, ఎన్ఆర్ఐలు, ఎన్జీవోలు నగదు సమకూర్చవచ్చని పేర్కొన్నారు. నిరుపేదలనే కాక సభ్యులు, బంధువులు, స్నేహితులను కూడా యాత్రకు తీసుకెళ్లవచ్చని, వివరాల కోసం డిపోల్లో లేదా 040–69440000, 040–23450033 నంబర్లలో సంప్రదించాలని ఆర్ఎం సూచించారు. -
అక్రమ కేసులు గర్హనీయం
‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా కేసులు నమోదు చేయడం గర్హనీయం. ప్రభుత్వాలు ఇలా కక్షపూరితంగా వ్యవహరించడం సరైన విధానం అనిపించుకోదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పుడు నియంతృత్వంతో వ్యవహరించడం, పత్రికాస్వేచ్ఛను అణచివేసేలా ప్రభుత్వాలు ప్రయత్నించడం శోచనీయం. మీడియా కార్యాలయాలపై దాడులు, జర్నలిస్టులపై కేసులను ఖండిస్తున్నాం. – కర్లపూడి శ్రీనివాసరావు, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఖమ్మం -
మిర్చి సీజన్ నాటికి నిర్మాణాలు పూర్తి
రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయిఖమ్మంవ్యవసాయం: మిర్చి పంట సీజన్ ప్రారంభయ్యే నాటికి ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మోడల్ మార్కెట్ నిర్మాణాలు పూర్తి చేయాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి ఆదేశించారు. ఖమ్మం మార్కెట్లో రూ. 155.30 కోట్లతో నిర్మాణ పనులను అధికారులతో కలిసి గురువారం ఆమె పరిశీలించారు. మిర్చి క్రయవిక్రయాలకు ఐదు షెడ్లు, రైతుల విశ్రాంతి భవనం, కార్మికులు, దడవాయిల కార్యాలయాలు, శీతల గిడ్డంగి నిర్మాణాలను పరిశీలించి సూచనలు చేశారు. అనంతరం అధికారులతో సమావేశమైన డైరెక్టర్ మాట్లాడుతూ రైతులు, ఉద్యోగులకు తాగునీటి సౌకర్యం కల్పించేలా ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటు, ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణాలు, విద్యుత్ లైట్ల ఏర్పాటు, డ్రెయినేజీ వ్యవస్థపై చర్చించారు. అడిషనల్ డైరెక్టర్ రవికుమార్, వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ వి.శ్రీనివాస్, సూపరింటెండెంట్ ఇంజనీర్ లక్ష్మణ్గౌడ్, మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు. -
సాదాబైనామాకు సై..
తెల్ల కాగితాలపై నమోదైన భూకొనుగోళ్ల ఒప్పందాలు ఇకపై అధికారికం కానున్నాయి. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన 106జీఓతో దరఖాస్తుదారుల ఐదేళ్ల నిరీక్షణకు తెరపడనుంది. జిల్లాలో 2020లో 1,11,443 దరఖాస్తులు అందాయి. నాటి దరఖాస్తుల కటాఫ్ తేదీ ఆధారంగానే పరిశీలించి అధికారికంగా హక్కు కల్పించనున్నారు. భూముల క్రమబద్ధీకరణపై కోర్టు స్టే తొలగిపోవడం, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో దరఖాస్తుదారులకు ఊరట కలిగించినట్లయింది. – సాక్షిప్రతినిధి, ఖమ్మంఐదేళ్లు నిలిచిపోవడంతో.. భూములను రెగ్యులరైజ్ చేయడానికి గత ప్రభుత్వం 2020 అక్టోబర్లో జీఓ 121 జారీ చేయగా రెవెన్యూ యంత్రాంగానికి సాదాబైనామా దరఖాస్తులు వెల్లువలా అందాయి. అయితే, 2020 ఆర్వోఆర్ చట్టంలో క్రమబద్ధీకరణకు సెక్షన్లు లేనందున కోర్టు స్టే విధించింది. అప్పటి నుంచి వేలాదిమంది నిరీక్షిస్తుండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టంలో కూడా అధికంగా సాదాబైనామాల క్రమబద్ధీకరణకే దరఖాస్తులు అందాయి. ఇటీవల స్టే తొలగించడంతోపాటు ప్రభుత్వం 106 జీఓను విడుదల చేయగా దరఖాస్తులకు మోక్షం లభించనుంది. హక్కులు లేక అవస్థ పట్టేదారు పాస్ పుస్తకం ఉన్న భూములకు రుణాలు అందడమే కాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. అలాగే పంటల అమ్మకం, విత్తనాలు, ఎరువుల కొనుగోళ్ల సమయంలోనూ ఒక్కోసారి పట్టాదారు పాస్ పుస్తకాలు కీలకంగా మారుతున్నాయి. కానీ వేలాది మంది రైతులు భూముల క్రయవిక్రయాలను తెల్లకాగితాలపై చేసుకోవడంతో పాస్ పుస్తకాలు లేక, అధికారిక భూహక్కులు దక్కక ప్రభుత్వపరంగా పథకాలకు దూరమవుతున్నారు. ఆ కటాఫే ప్రామాణికం స్టే తొలగించినా.. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు లేక సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఏ ప్రాతిపదికత తీసుకుంటారో స్పష్టత రాలేదు. కానీ బుధవారం జీఓ 106 విడుదల చేసింది. దీని ప్రకారం 2014కు పూర్వం సాదాబైనామాల ద్వారా క్రయవిక్రయాలు చేయడంతోపాటు 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు ప్రభుత్వానికి అందిన దరఖాస్తులను పరిష్కరించనున్నారు. అయితే, గత 12ఏళ్లు భూమి తమ స్వాధీనంలోనే ఉన్నట్లు దరఖాస్తులు ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. రెవెన్యూ సదస్సుల్లోనూ.. ధరణి స్థానంలో ప్రస్తుత ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకురాగా భూసమస్యలపై రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఇందులో మొత్తం 75,004 దరఖాస్తులు అందగా, వీటిలో సాదాబైనామాపైనే 45,254 ఉన్నాయి. వీటిలో 2020లో చేసుకున్న వారిని గుర్తించేలా వడబోయనున్నారు. ప్రభుత్వ జీఓలో 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు చేసుకున్న దరఖాస్తులనే పరిష్కరిస్తామని స్పష్టం చేసింది. సెక్షన్ 6ను అనుసరించి ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు వీలులేదు. అయితే, కటాఫ్ తేదీ తర్వాత సాదాబైనామాపై అందిన దరఖాస్తుల పరిశీలనపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం వెలువరించలేదు.స్టే తొలగింపు, జీఓ జారీతో తప్పిన చిక్కులు సాదాబైనామాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం జీఓ జారీ చేసింది. 2014కి ముందు తెల్ల కాగితాలపై కొనుగోలు చేసిన ఐదెకరాల లోపు కుష్కీ, రెండున్నర ఎకరాల తరి ఉన్న చిన్న, సన్నకారు రైతుల భూములు క్రమబద్ధీకరిస్తాం. మున్సిపల్ ప్రాంతాలు తప్ప మిగతా చోట్ల ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 2020లో దరఖాస్తులు ఇచ్చి.. మరోసారి రెవెన్యూ సదస్సుల్లోనూ ఇచ్చిన వారికి గతంలోనే నోటీసులు ఇచ్చాం. 2020 కటాఫ్ తేదీ ప్రకారమే దరఖాస్తుల పరిశీలన ఉంటుంది. – పి.శ్రీనివాసరెడ్డి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) -
ఎర్రబ్యాడ్జీలతో ఆర్టీసీ ఉద్యోగుల నిరసన
ఖమ్మంమయూరిసెంటర్: భద్రాచలం డిపో కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు తగ్గించిన మస్టర్లను పునరుద్ధరించాలనే డిమాండ్తో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యాన కార్మికులు గురువారం ఎర్రబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. మొదటి షిఫ్ట్లో రీజియన్లోని అన్ని డిపోల్లో ఉద్యోగులు నిరసన తెలిపారు. ఖమ్మం డిపోలో జరిగిన నిరసనలో జేఏసీ నాయకులు పిట్టల సుధాకర్, బూదాటి శ్రీనివాసరెడ్డి, నిమ్మటూరి సత్యం, బత్తినేని హనుమంతరావు, పగిళ్లపల్లి నరసింహారావు, గుగ్గిళ్ల రోశయ్య, బేతంపూడి బుచ్చిబాబు, నర్సింహాచారి, పద్మా, జ్యోతి, సంధ్యారాణి, ఉమారాణి, నాగవీర, భాస్కర్, లాల్బీ పాల్గొన్నారు. ట్రాఫిక్ సీఐ–2గా అప్పలనాయుడు ఖమ్మంక్రైం: ఖమ్మం ట్రాఫిక్ సీఐ–2గా అప్పలనాయుడు నియమితులయ్యారు. ప్రస్తుతం రిజర్వ్ ఇన్స్పెక్టర్గా ఉన్న ఆయనను ట్రాఫిక్ సీఐగా నియమిస్తూ సీపీ సునీల్దత్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ స్థానంలో ఉన్న సాంబశివరావును తిరిగి హెడ్ క్వార్టర్స్కు కేటాయించారు. ఈమేరకు అప్పలనాయుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ‘ఆశా’లకు రూ.18వేల వేతనం చెల్లించాలి ఖమ్మంమయూరిసెంటర్: ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించి వారి సర్వీసును క్రమబద్ధీకరించేలోగా రూ.18వేల వేతనం చెల్లించాలని తెలంగాణ ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి డిమాండ్ చేశారు యూనియన్(సీఐటీయూ) జిల్లా ఏడో మహాసభ జిల్లా అధ్యక్షురాలు జె.మంగమ్మ అధ్యక్షతన గురువారం ఖమ్మంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ఆశాల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు వేతనం పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ నాయకులు తుమ్మ విష్ణువర్ధన్, కళ్యాణం వెంకటేశ్వరరావు, పి. రమ్య, పి.మోహన్రావు, విఠల్, చంద్రశేఖర్, శీలం నర్సింహారావు, జిల్లా ఉపేందర్, నాయకులు నవీన్రెడ్డి, బషీరుద్దీన్, వీరన్న, ఆశావర్కర్ల యూని యన్ నాయకులు జె.మంగమ్మ, బి.అమల పాల్గొన్నారు. బ్యాంక్ అధికారులకు అవగాహన ఖమ్మంమయూరిసెంటర్: స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంక్ లింకేజీ విధానంపై ఉమ్మడి జిల్లాలోని బ్యాంకుల మేనేజర్లకు గురువారం అవగాహన కల్పించారు. ఖమ్మంలోని టీటీడీసీలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల లింకేజీ కార్యకలాపాలు, రుణ పరిమితి, రుణబీమా, ఆర్బీఐ మార్గదర్శకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు కె.శ్రీనివాసరావు, నరసింహస్వామి, బాలస్వామి, డీఆర్డీఓ ఆర్.సన్యాసయ్య, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధికారులు జయశ్రీ, నీలేష్, ఖమ్మం, ఆంజనేయులు, రంగారావు తదితరులు పాల్గొన్నారు. -
అనుమతి లేని మైనింగ్ కట్టడి
బోనకల్: బోనకల్ మండలంలోని లక్ష్మీపురంలో అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు చేపడుతున్నారనే సమాచారంతో మైనింగ్, రెవెన్యూ ఉద్యోగులు గురువారం తనిఖీలు చేపట్టారు. మైనింగ్ ఇన్స్పెక్టర్ పాపగంటి నాగరాజు, ఆర్ఐ మైథిలి పరిశీలించి భూయజమానులతో మాట్లాడారు. అయితే, తవ్వకాలు చేపట్టిన వారికి సంబంధించి జేసీబీలు మరోచోట ఉండడంతో వివరాలు సేకరించారు. ఈమేరకు నోటీసులు జారీ చేయనున్నట్లు ఉద్యోగులు తెలిపారు.‘బీజేపీ, బీఆర్ఎస్ భూస్థాపితం బాధ్యత బీసీలదే’తల్లాడ: రాష్ట్రప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లును ఆమోదించినా కేంద్రప్రభుత్వం జాప్యం చేయడం సరికాదని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణవరపు శ్రీనివాస్ పేర్కొన్నారు. తల్లాడ మండలం బిల్లుపాడులో గురువారం జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీతో పాటు, తమ పాలనలో బీసీలను అణచివేసిన బీఆర్ఎస్ను భూస్థాపితం చేసే బాధ్యత బీసీలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్లో వచ్చే అన్ని ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను ఓడిస్తామని తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూడేపల్లి కృష్ణచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి శివతో పాటు మల్లెల శ్రీనివాస్, మర్రి ప్రసాద్, జొన్నలగడ్డ వె ంకటేశ్వర్రావు, రుద్రాక్ష లక్ష్మణాచారి, నరసింహాచారి, వెంకటేశ్వరరావు, దీవెల వెంకటేశ్వర్లు, వెంకటరామయ్య, వీరభద్రరావు, సతీష్, గడ్డంబాను, కూరపాటి శ్రీనివాస్ పాల్గొన్నారు.14న రాష్ట్రస్థాయి మహిళా వెయిట్ లిఫ్టింగ్ పోటీలుఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఈనెల 14న రాష్ట్రస్థాయి మహిళల వెయిట్ లిఫ్టింగ్ (ఇండియా లీగ్) పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఈ పోటీలు జరుగుతాయని అధ్యక్ష, కార్యదర్శులు శివ గణేష్, డి.వినోద్కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఈ పోటీలకు క్రీడాకారులు హాజరుకానున్నారని వెల్లడించారు.మున్సిపల్ ఉద్యోగుల పేరిట ఫోన్లు● క్యూఆర్ కోడ్ ద్వారా నగదు చెల్లించాలని సూచనసత్తుపల్లి: మీ ట్రేడ్ లైసెన్స్ గడువు ముగిసింది.. రెన్యూవల్ కోసం వాట్సప్లో పంపిన క్యూఆర్ కోడ్ ద్వారా నగదు పంపించండి.. పది నిమిషాల్లో రెన్యూవల్ సర్టిఫికెట్ పంపిస్తాం.. అంటూ సత్తుపల్లిలో పలువురు వ్యాపారులకు అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తున్నారు. సత్తుపల్లికి చెందిన ఎల్.లక్ష్మణ్రావు, జ్యోతి, సుభాష్ తదితరులకు గురువారం ఫోన్ రావడంతో మున్సిపల్ కార్యాలయంలో ఆరా తీయగా తమకేం సంబంధం లేదని చెప్పడంతో అవాక్కయ్యారు. దీంతో మున్సిపల్ కమిషనర్ కె.నర్సింహ స్పందిస్తూ అపరిచితులు ఫోన్ చేసినా, క్యూ ఆర్ కోడ్ పంపినా స్పందించవద్దని సూచించారు. మున్సిపల్ ఉద్యోగులెవరూ ఇలా చేయరని, వ్యాపారులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభవైరా: జైళ్లశాఖలో హెడ్ వార్డర్గా పనిచేస్తున్న వైరా మున్సిపాలిటీ గండగలపాడుకు చెందిన పి.వెంకటరత్నం ఇటీవల నిర్వహించిన జాతీయస్థాయి పెయింటింగ్ పోటీల్లో ప్రతిభ చాటారు. ఈ పోటీల్లో 28 రాష్ట్రాల నుంచి పలువురు పోటీ పడగా, తెలంగాణ తరఫున పాల్గొన్న వెంకటరత్నం ద్వితీయ బహుమతి సాఽధించాడు. ఉద్యోగం సాధించకముందు వైరాలో రత్న ఆర్ట్స్ నిర్వహించిన ఆయన జాతీయ స్థాయిలో సత్తా చాటడంపై పలువురు అభినందించారు. -
ప్రతీ ఒక్కరికి ఆర్థిక భద్రత అవసరం
కూసుమంచి: ప్రస్తుత తరుణాన అందరికీ ఆర్థిక భద్రత అవసరమని, ఇందుకోసం పొదుపు మార్గాన్ని ఎంచుకోవాలని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రాంతీయ మేనేజర్ చిన్మయ్కుమార్ సూచించారు. కూసుమంచి మండలం నేలపట్లలో ఎస్బీఐ ఆధ్వర్యాన గురువారం నిర్వహించిన జన సురక్ష ప్రచార శిబిరం, ఆర్థిక అక్ష్యరాస్యత అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అందరూ బ్యాంకు ఖాతాలు కలిగి ఉండి, డబ్బు పొదుపు చేస్తూ ఆర్థికంగా బలపడాలన్నారు. ఈవిషయంలో అవగాహన కోసం రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇదేసమయాన సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు వివరిస్తున్నామని చెప్పారు. ఎస్బీఐ డీజీఎం కస్తూరి వినోద్కుమార్ మాట్లాడుతూ తమ బ్యాంకు ద్వారా ఆర్థిక సేవలే కాకుండా ప్రజలను అక్ష్యరాస్యులుగా తీర్చిదిద్దడం, పేద పిల్లల చదువుకు తోడ్పాటు కోసం స్కాలర్షిప్ ఇస్తున్నామని తెలిపారు. డీఆర్డీఓ ఏపీడీ జయశ్రీ, ఆర్బీఐ ఎల్డీఓ చేతన్ గోనేకర్, ఎస్బీఐ రీజినల్ మేనేజర్ రాజశేఖర్, కూసుమంచి బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.ఆర్బీఐ ప్రాంతీయ డైరక్టర్ చిన్మయ్కుమార్ -
నిండా ముంచిన కల్తీ విత్తనాలు?
వేంసూరు: కల్తీ విత్తనాల కారణంగా నష్టపోయిన రైతులకు కంపెనీ యాజమాన్యం న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డిమాండ్ చేశారు. వేంసూరు మండలం కందుకూరుకు చెందిన పలువురు రైతులు కరీంనగర్కు చెందిన వరుణ్ కంపెనీ బీపీటీ 2782 రకం వరి విత్తనాలతో 1,500 ఎకరాల్లో పంట సాగు చేశారు. అయితే, 120 రోజుల్లో ఈతకు రావాల్సిన వరి 90 రోజులకే 40 శాతం మేర ఈనడంతో దిగుబడిపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యాన పొలాలను గురువారం మాజీ ఎమ్మెల్యే సండ్ర పరిశీలించి మాట్లాడారు. సన్నరకం వరి ధాన్యానికి ప్రభుత్వం బోనస్ ఇస్తోందని భరణిపాడు, మర్లపాడు, లింగపాలెం, కుంచపర్తి, చౌడవరం గ్రామాల రైతులు వరి సాగు చేశారని తెలిపారు. కానీ విత్తన లోపంతో ఒక కందుకూరులోనే 1,500 ఎకరాల్లో నష్టపోయారని చెప్పారు. అధికారులు, కంపెనీ ప్రతినిధులు పరిశీలించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు గొర్ల ప్రభాకర్రెడ్డి, పాల వెంకటరెడ్డి, పగట్ల వెంకటేశ్వరరావు, జుబ్బూరి నాగరాజు, దొడ్డ వెంకటకృష్ణారెడ్డి, మందపాటి మహేశ్వరరెడ్డి, గొర్ల సత్యనారాయణరెడ్డి, ఎర్ర రమేష్, గండ్ర రామిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే వెంకటవీరయ్య -
ముందు బిల్లులు ఇవ్వండి
● లేకపోతే పనిచేయలేమంటున్న కాంట్రాక్టర్లు ● నోటీసులు ఇచ్చినా కాన రాని ఫలితం ● ఆర్అండ్బీ పరిధిలో రోడ్డు పనులకు అంతరాయంఖమ్మంఅర్బన్: జిల్లాలో రోడ్లు–భవనాల శాఖ పరిధిలో అనేక పనులు నిలిచిపోయాయి. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు చేపట్టడానికి వెనుకంజ వేస్తున్నారు. ఇప్పటికే రెండు, మూడు సార్లు నోటీసులు పంపినా చాలా మంది స్పందించకపోవడం గమనార్హం. అధికారులు తరచుగా నోటీసులు ఇస్తున్నా కాంట్రాక్టర్లు మాత్రం తొలుత బిల్లులు చెల్లించాలని స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో జిల్లాలో కొన్ని రోడ్ల నిర్మాణం ప్రారంభం కాకపోగా.. ఇంకొన్ని పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. యంత్రాలు కూడా తరలింపు ప్రధానంగా ఖమ్మం–ఇల్లెందు రహదారిపై రఘునాథపాలెం నుంచి బూడిదంపాడు వరకు రూ.40 కోట్లతో నాలుగు లేన్ల రహదారి నిర్మాణం ప్రారంభమైంది. అయితే బిల్లులు విడుదల కానందున కాంట్రాక్టర్ పనులు నిలిపివేసి సామగ్రి సైతం తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో ఆ రోడ్డుపై వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలంలో ఈ సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది. ఇల్లెందు–ఖమ్మం రోడ్డుకు సంబంధించి మరమ్మతు పనులు ఆపిన కాంట్రాక్టర్కు ఇప్పటికే మూడుసార్లు నోటీసులు జారీ చేసినా స్పందన రాలేదని సమాచారం. సదరు కాంట్రాక్టర్ ఇప్పటివరకు చేసిన పనులకు సుమారు రూ.10కోట్ల బిల్లు రావా ల్సి ఉండగా, అందులో కొంత మొత్తమైనా ఇవ్వకపోతే పనులు చేసేది లేదని చెప్పినట్లు సమాచారం. మిగతా పనులు కూడా.... జిల్లా వ్యాప్తంగా రహదారుల వార్షిక మరమ్మతులు, గుంతల పూడ్చివేత, రోడ్లకు ఇరువైపులా కంచె చెట్ల తొలగింపు పనుల టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు సైతం ముందుకు రావడం లేదు. గత రెండేళ్ల క్రితం చేసిన పనులకు బిల్లులు ఇప్పటికీ రాలేదని.. మళ్లీ పనులు చేసి అప్పులు కాలేమంటూ కాంట్రాక్టర్లు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో వార్షిక పనులు, చిన్న గుంతలు పూడ్చడం, కంపచెట్లు తొలగింపు తదితర పనులన్నీ నిలిచిపోయాయి. జిల్లాలోని సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో ఏడెనిమిది మండలాల పరిధిలో పనులు పూర్తి కాగా.. మిగిలిన అన్నిచోట్ల కాంట్రాక్టర్లు వెనుకడుగు వేస్తున్నట్లు తెలిసింది. ఏన్కూరు మండల కేంద్రంలో రూ.3 కోట్లతో నిర్మించాల్సిన డ్రెయిన్ల పనులకు గత ఎన్నికల కంటే ముందే టెండర్ అయినా ప్రారంభం కాాలేదు. దీంతో టెండర్ గడువు ముగియడం, నోటీసులకు స్పందన రాకపోవడంతో టెండర్ను రద్దు చేసే దిశగా అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇలా జిల్లా వ్యాప్తంగా నిధులు మంజూరై, టెండర్లు అయిన పనులు నిలిచిపోగా.. రోడ్ల మరమ్మతులు జరగకపోవడంతో వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. -
గుంతలో నగలు.. అవసరమైతే అమ్మకం
ఖమ్మంక్రైం: జైలుకు వెళ్లివచ్చినా తీరు మార్చుకోకుండా రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఓ వ్యక్తి చోరీ సొత్తు గుంతలో దాచి అవసరమైనప్పుడు అమ్ముతూ విలాసవంతమైన జీవనం సాగిస్తున్నాడు. ఈమేరకు నిందితుడిని ఖమ్మం జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేయగా వివరాలను గురువారం వెల్లడించారు. ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెంకు చెందిన ఆటోడ్రైవర్ నాగేల్లి వరకుమార్ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి చోరీల బాట ఎంచుకున్నాడు. రైళ్లల్లో ప్రయాణిస్తూ, ప్లాట్ఫాంపై తిరుగుతూ ఆదమరిచి ఉండే ప్రయాణికుల వద్ద చోరీకి పాల్పడుతున్నాడు. గతంలో ఓసారి జైలుకు వెళ్లి వచ్చినా మార్పు రాలేదు. ఖమ్మం స్టేషన్లో గురువారం జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వరప్రసాద్ను అదుపులోకి తీసుకోగా చోరీల విషయం బయటపడింది. దీంతో ఆయన నుంచి 10గ్రాములు బంగారు నెక్లెస్ స్వాధీనం చేసుకున్నారు. తొలుత చోరీ నగలపై ఆరా తీయగా ఇంట్లో దాచినట్లు వరప్రసాద్ చెప్పినా దొరకలేదు. తిరిగి తోతుగా విచారించడంతో ఇంటి వెనుక గుంతలో పెట్టినట్లు ఒప్పుకున్నాడు. డబ్బు అవసరమైనప్పుడు ఒక్కో ఆభరణం తీసి అమ్ముతున్నట్లు అంగీకరించాడు. ఇప్పటివరకు వరప్రసాద్ చోరీ చేసిన సొత్తు విలువ రూ.8.50లక్షలు ఉంటుందని జీఆర్పీ, ఆర్పీఎఫ్ సీఐలు అంజలి, సురేష్గౌడ్ తెలిపారు. ఈసమావేశంలో ఎస్ఐ సురేష్, హెడ్కానిస్టేబుల్ శ్రీనివాస్ పాల్గొన్నారు.రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్ -
ఆర్టీసీ ఆధ్వర్యాన ‘యాత్రాదానం’
సత్తుపల్లిటౌన్: టీజీ ఆర్టీసీ ఆధ్వర్యాన ‘యాత్రాదానం’ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సత్తుపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ యు.రాజ్యలక్ష్మి తెలిపారు. సత్తుపల్లిలో గురువా రం ఆమె మాట్లాడుతూ సాంస్కృతిక విలువల పరిరక్షణ, సమాజానికి ఇచ్చే మానవత్వపు బహుమతిలో భాగంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలని ఉన్నా స్థోమత లేని అనా థలు, నిరాశ్రయులు, వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను పంపించేలా ఎవరైనా విరాళాలు ఇవ్వొచ్చని తెలిపారు. విరాళాల ఆధారంగా బస్సులు సమకూరుస్తామని వెల్లడించా రు. సత్తుపల్లి డిపో పరిధిలో బుకింక్ కోసం డిపోలో లేదా 99592 25962, 98666 19189 నంబర్లలోసంప్రదించాలని డీఎం సూచించారు. ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి ఖమ్మంక్రైం: జిల్లా కేంద్రంలోని రద్దీ ప్రాంతాలు, కూడళ్లలో ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు కమిషనర్ సునీల్దత్ ఆదేశించారు. ఖమ్మంలోని ట్రాఫిక్ పోలీసుస్టేషన్ను గురువారం తనిఖీ చేసిన ఆయన ఉద్యోగులకు సూచనలు చేశారు. రద్దీ ప్రాంతాలలో అదనంగా సిబ్బందిని నియమించి, వాహనదారులతో అనవసర వివాదాలకు పోకుండా మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని తెలిపారు. అలాగే, బాడీవార్మ్ కెమెరాల ఉపయోగం, సీసీ కెమెరాల ఏర్పాటు, జరిమానా వసూళ్లపై సమీక్షించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్ సమన్వయంతో పార్కింగ్ స్థలాలను గుర్తించాలని సీపీ సూచించారు. ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, సీఐ సత్యనారయణ పాల్గొన్నారు. ఉపాధ్యాయురాలు సునందకు కీర్తి పురస్కారం ఖమ్మం సహకారనగర్/ఖమ్మం మామిళ్లగూడెం: ప్రముఖ రచయిత్రి, ఉత్తమ ఉపాధ్యాయురాలు ఉరిమళ్ల సునందకు 2024 సంవత్సరానికి గాను తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారాన్ని ప్రకటించింది. ఆమె ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్విస్తూనే సాహిత్యంలో రాణిస్తున్నారు. ఎక్కడ పనిచేసాన విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీస్తూ సాహిత్యంలో రాణించేలా ప్రోత్సహిస్తున్నారు. అలాగే, ఏటా తన సోదరి వురిమళ్ల పద్మజ పేరుతో ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందచేస్తున్నారు. కాగా, తెలుగు యూనివర్సిటీ ప్రకటించిన పురస్కారాన్ని త్వరలో సునంద అందుకోనున్నారు. ఈ సందర్భంగా ఆమెను ఉపాధ్యాయులు, కవులు, రచయితలు అభినందించారు. జిల్లాలో పలుచోట్ల వర్షం ఖమ్మంవ్యవసాయం: ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. రెండు రోజులుగా జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నా యి. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు కూడా జిల్లాలోని పలు చోట్ల వర్షం కురిసింది. బుధవారం ఉదయం 8–30నుంచి గురువారం ఉదయం 8–30 గంటల వరకు జిల్లాలో సగటున 22.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. సత్తుపల్లి మండలంలో అత్యధికంగా 68.8 మి.మీ.వర్షపాతం నమోదు కాగా, వేంసూరు మండలంలో 57.2, పెనుబల్లిలో 56.2, కారేపల్లిలో 41.8, తల్లాడలో 40.2, చింతకానిలో 22.4, ముదిగొండలో 21.6, కామేపల్లి, రఘునాథపాలెంలో 20.4 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు 32 నుంచి 38 డిగ్రీల వరకు నమోదు కాగా గురువారం 28 డిగ్రీలకు పడిపోయింది. మరో రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. -
ప్రశ్నించడమే నేరమా?
ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర ఎంతో కీలకం. ప్రభుత్వాలు – ప్రజలకు మధ్య వారధిలా పత్రికలు పని చేస్తుంటాయి. అలాంటి పత్రికల్లో వచ్చే కథనాలను జీర్ణించుకోలేక ఎడిటర్లపై ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేయడం, జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేయడం సరికాదు. తక్షణమే సాక్షి ఎడిటర్ ధనుంజయ్రెడ్డి, జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. – పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు ప్రభుత్వం జర్నలిస్టుల హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తోంది. కక్షగట్టి సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కేసు నమోదు చేయడం అన్యాయం. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన జర్నలిజం, జర్నలిస్టుల హక్కుల రక్షణకు పాలకులు పాటుపడాలి. అంతేతప్ప ప్రభుత్వం – ప్రజలకు వారధిగా ఉంటూ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం సరికాదు. ఇలాంటి ఘటనలను ఫాసిస్టు చర్యగా భావిస్తున్నాం. – ఆకుతోట ఆదినారాయణ, టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్), జిల్లా అధ్యక్షుడుఏపీలో పౌరహక్కులు, జర్నలిస్టుల స్వేచ్ఛపై ఉక్కుపాదం ● అక్కడి ప్రభుత్వ తీరును తప్పుపడుతున్న పలువురుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరహక్కులు, జర్నలిస్టుల స్వేచ్ఛపై అక్కడ టీడీపీ ఆధ్వర్యాన అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. గడిచిన మే నెలలో ‘సాక్షి’ దినపత్రిక విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, మంగళగిరి, రాజమండ్రి, ఏలూరు, శ్రీకాకుళం జిల్లా కార్యాలయాలపై టీడీపీ శ్రేణులు మూకదాడులకు దిగాయి. ఈ విషయంలో దోషులను శిక్షించాలని ‘సాక్షి’ జర్నలిస్టులు పోలీస్స్టేషన్లలో లిఖిత పూర్వక ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయలేదు. ఇదే సమయాన ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యం, మోసాలపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కార్మికులు, మహిళలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల పక్షాన వార్తల రూపంలో ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై కొందరు ఉద్యోగులతో ఫిర్యాదులు ఇప్పిస్తూ తక్షణమే కేసులు నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగానే వివిధ అంశాలపై ప్రతిపక్ష పార్టీల నాయకులు ఏర్పాటుచేసే ప్రెస్ కాన్ఫరెన్స్ల వార్తలు రాసిన ‘సాక్షి’ దినపత్రికతో పాటు ఎడిటర్, ఇతర జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తూ రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛను తమ గుప్పిట్లోకి తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుని దాడులు, కేసులు, పోలీసులతో కార్యాలయాలు, జర్నలిస్టుల ఇళ్లలో తనిఖీల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తోంది. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ, ప్రజల పక్షాన పనిచేసే జర్నలిస్టుల గొంతు నొక్కేస్తున్న ఏపీ ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను పలువురు తప్పుపడుతున్నారు. – ఖమ్మం సహకారనగర్ ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసేలా కుట్ర జరుగుతోంది. జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని అక్కడి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. జర్నలిస్టులను ఏదోలా లోబర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఏపీలో సాక్షిపై, జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి. ఆధారాలు లేకున్నా సాక్షి ఎడిటర్ ధనుంజయ్రెడ్డిపై అక్కడి ప్రభుత్వం కక్ష సాధింపుగా వ్యవహరించడాన్ని మానుకోవాలి. – కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
అటవీ సంపద రక్షణ అందరి బాధ్యత
ఖమ్మంవ్యవసాయం: అటవీ సంపద, అడవుల సంరక్షణను అందరూ బాధ్యతగా స్వీకరిస్తే అటవీ అమరవీరులకు నివాళులర్పించినట్లవుతుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఖమ్మంలోని అటవీ శాఖ కార్యాలయంలో గురువారం జరిగిన అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్సింగ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులుఅర్పించాక కలెక్టర్ మాట్లాడుతూ తాను భద్రాద్రి కలెక్టర్గా ఉన్న సమయాన అటవీ అధికారి శ్రీనివాసరావు మృతి చెందడం కలచివేసిందని తెలిపారు. అటవీ ఉద్యోగులు అడవుల పరిరక్షణకు రాత్రీపగలు పనిచేస్తున్నారని అభినందించారు. అడవుల నరికివేతతో మానవ మనుగడ కష్టమవుతుందనే విషయాన్ని అందరూ గుర్తించి ఉద్యోగులకు అండగా నిలవాలని సూచించారు. డీఎఫ్ఓ సిద్ధార్థ్ మాట్లాడుతూ అటవీ సంరక్షణను బాధ్యతగా కాక ప్రజలు కర్తవ్యంలా భావించాలని తెలిపారు. అనంతరం ఉద్యోగులకు రెయిన్ కోట్లు, స్టిక్ గార్డ్లు పంపిణీ చేయగా కమాండ్ కంట్రోల్ సెంటర్, సీసీ కెమెరా పనితీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, అమరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి ఖమ్మం సహకారనగర్: జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్లో గురువారం ఆయన వివిధ శాఖల ఆధ్వర్యాన జరుగుతున్న పనులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పనులు ఆలస్యమైతే నిర్మాణ వ్యయం పెరుగుతుందనే విషయాన్ని గుర్తించాలని తెలిపారు. జిల్లాకు మంజూరైన అంగన్వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీ భవనాలు, ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణాలపై సూచనలు చేసిన కలెక్టర్.. కొన్ని పనులు ప్రారంభం కాకపోవడానికి కారణాలు తెలుసుకున్నారు. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్, రఘునాథపాలెం మండలంలో చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్, సత్తుపల్లి, మధిర, పాలేరులో వర్కింగ్ ఉమెన్ హాస్టళ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని సూచించారు. ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో పనులు మొదలుకాకపోతే వాటిని రద్దు చేయాలని తెలిపారు. అలాగే, చెక్డ్యాంలు, సీతారామ ఎత్తిపోతల పథకం పనులపై కలెక్టర్ సమీక్షించారు. సీపీఓ ఏ.శ్రీనివాస్, డీఆర్డీఓ సన్యాసయ్య, డీడబ్ల్యూఓ రాంగోపాల్రెడ్డి, ఎస్ఈలు యాకోబు, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్ అనుదీప్ -
గుంతలో పడి వ్యక్తి మృతి
మధిర: రోడ్డు పక్కన ఉన్న లోతైన గుంతలో పడిన ఓ వ్యక్తి మృతి చెందాడు. మధిర హనుమాన్ కాలనీకి చెందిన ఉప్పతల జమలయ్య(45) బోనకల్, ఖమ్మం తదితర ప్రాంతాల్లో ఇనుప బీరువాల తయారీ పనిచేస్తున్నాడు. బుధవారం ఆయన మధిర వడ్డెర కాలనీలో ఫంక్షన్కు హాజరై తిరిగి ఇంటికి వెళ్లలేదు. దీంతో కుటుంబీకులు గాలిస్తుండగా గురువారం ఉదయం గుంతలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఫంక్షన్కు వెళ్లి వస్తున్న క్రమాన మద్యం మత్తులో రోడ్డు పక్కన నీటి గుంతలో పడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. అయితే, సెల్ఫోన్తో పాటు నగదు రోడ్డుపై ఉండడంతో మద్యం మత్తులో పడ్డాడా, ఇతర కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మధిర టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. పేకాటరాయుళ్ల అరెస్ట్ తిరుమలాయపాలెం/రఘునాథపాలెం: తిరుమలాయపాలెం మండలం ఎదుళ్లచెరువులోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో గురువారం టాస్క్ఫోర్స్ ఎస్ఐ రఘు ఆధ్వర్యాన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని రూ.30,520 నగదు, కారు, మూడు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం పోలీస్స్టేషన్లో అప్పగించగా కేసు నమోదు చేశారు. అలాగే, రఘునాథపాలం మండలం కొర్లబోడు తండాలోనూ తనిఖీలు చేపట్టిన టాస్క్ఫోర్స్ పోలీసులు పేకాట ఆడుతున్న ముగ్గురు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారు కాగా, పట్టుబడిన వారి నుంచి రూ.20వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. సాగర్ కెనాల్లో మృతదేహం ఖమ్మంక్రైం: ఖమ్మం వేణుగోపాల్ నగర్ వద్ద సాగర్ కాల్వలో గుర్తుతెలియని వ్యక్తి(40) మృతదేహన్ని గుర్తించారు. తెలుపు, నలుపు అడ్డగీతల టీషర్ట్, కాటన్ ప్యాంట్తో ధరించిన వ్యక్తి మృతదేహం కుళ్లిపోయిందని ఖమ్మం టూ టౌన్ పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మార్చురీకి తరలించినట్లు సీఐ బాలకృష్ణ వెల్లడించారు. -
అటు మూత.. ఇటు వెత
ఖమ్మంలోని కాల్వొడ్డు మున్నేరు పాత వంతెనపై రాకపోకలపై నియంత్రణ విధించారు. ఇక్కడ తీగల వంతెన నిర్మాణ పనులతో ప్రతిరోజు ఉదయం 11నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎలాంటి వాహనాలను అనుమతించబోమని అధికారులు ప్రకటించారు. ఈ సమయాన వాహనాలను కరుణగిరి బ్రిడ్జి మీదుగా మళ్లించారు. ఫలితంగా బ్రిడ్జిపై రద్దీ నెలకొని వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
కాలేజీల్లో వసతుల కల్పన
● ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు రూ.2.96కోట్లు ● అక్టోబర్ 15నాటికి పూర్తిచేసేలా ప్రణాళికఖమ్మంసహకారనగర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వసతుల కల్పన, అవసరమైన మరమ్మతులపై దృష్టి సారించారు. ఈమేరకు జిల్లాలోని 21 కాలేజీలకు గాను 15కళాశాలల్లో కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులు నివేదిక సమర్పించారు. దీంతో ప్రభుత్వం జిల్లాకు రూ.2.96 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో అమ్మ ఆదర్శ కళాశాలల కమిటీల ద్వారా పనులు చేపడుతున్నారు. ‘అమ్మ’ కమిటీల ద్వారా.. ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో చేపట్టిన పనులన్నింటినీ అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యాన చేపట్టారు. కళాశాలల్లోనూ అదే మాదిరి పర్యవేక్షణకు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన విద్యార్థుల తల్లిదండ్రులతో కమిటీలను నియమించారు. ఈ కమిటీల ద్వారా పనుల పర్యవేక్షణ కొనసాగుతోంది. పంచాయతీరాజ్ శాఖ ద్వారా పనులు చేపడుతుండగా, కమిటీలతో పాటు గ్రామీణ ప్రాంత కళాశాలల్లో ఎంపీడీఓలు, పట్టణ ప్రాంతాల్లోనైతే మున్సిపల్ కమిషనర్లు, విజిలెన్స్ ఆఫీసర్లు, రిసోర్స్ పర్సన్లు పర్యవేక్షిస్తున్నారు. కాగా, ఈ పనులన్నీ అక్టోబర్ 15వ తేదీ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. 15 కళాశాలల్లో పనులు.. రూ.2.96 కోట్ల నిధులతో జిల్లాలోని 15 జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పనులు కొనసాగుతున్నాయి. కళాశాలల్లో అవసరమైన చిన్నచిన్న మరమ్మతులతో పాటు టాయిలెట్ల ఏర్పాటు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పన, సైన్స్ ల్యాబ్ల్లో సామగ్రి కొనుగోలు, రంగులు వేయించేందుకు ఈ నిధులు వెచ్చిస్తున్నారు. కాగా, జిల్లాలోని 15 కాలేజీలకు నిధులు మంజూరు కాగా.. అత్యధికంగా కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రూ.30లక్షలు మంజూరయ్యాయి. అలాగే, తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రూ.28.6 లక్షలు, ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు జూనియర్ కాలేజీకి రూ.26 లక్షలు, కారేపల్లి కళాశాలకు రూ.20.5 లక్షలు కేటాయించారు.జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో జరుగుతున్న పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. అన్ని పనులు అక్టోబర్ 15లోగా పూర్తి చేయాలని నిర్ణయించాం. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కాలేజీల్లో అవసరాలను గుర్తించి నిధులు వెచ్చించేలా ప్రణాళిక రూపొందించాం. – రవిబాబు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి -
చరిత్రను వక్రీకరిస్తే జాతి క్షమించదు..
ఖమ్మంమయూరిసెంటర్: చరిత్రను వక్రీకరించాలని ఎవరు యత్నించినా తెలంగాణ జాతి క్షమించదని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని మతపరమైన పోరాటంగా చిత్రీకరించేందుకు బీజేపీ యత్నిస్తోందని.. కానీ స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ పోరాటంలో బీజేపీకి ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను గురువారం ఖమ్మంలో నల్లమల గిరిప్రసాద్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. అనంతరం హేమంతరావు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచచ్చాక నిజాం స్వాతంత్ర రాజుగా ప్రకటించుకుంటే రావి నారాయణరెడ్డి, ముగ్దుం మోహినుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి 1947 సెప్టెంబర్ 11న సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారని తెలిపారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన మహత్తర పోరాటంలో సామాన్యులు సాయుధులై ముందుకు సాగారని, నాలుగున్నర వేల మంది కమ్యూనిస్టు కార్యకర్తలు అమరులయ్యారని చెప్పారు. భూమి, భూక్తి, విముక్తి కోసం సాగిన ఈ పోరాటంలో అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారని తెలిపారు. అయితే, సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలనే విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే వైఖరితో ఉండటం దురదృష్టకరమన్నారు. ఈమేరకు నాటి సాయుధ పోరాట ఘట్టాలను నేటి తరానికి తెలియజేసేలా సీపీఐ ఆధ్వర్యాన వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు బాగం తెలిపారు. తొలుత అంబేడ్కర్ సెంటర్ నుంచి పాత బస్టాండ్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు జమ్ముల జితేందర్రెడ్డి, యర్రా బాబు, ఎస్.కే.జానీమియా, కొండపర్తి గోవిందరావు, కార్పొరేటర్ బీజీ.క్లెమెంట్తో పాటు మహ్మద్ సలాం, పోటు కళావతి, తాటి వెంకటేశ్వరరావు, రావి శివరామకష్ణ. తోట రామాంజనేయులు, మిడికంటి వెంకటరెడ్డి, ఇటికాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.సాయుధ పోరాట వారోత్సవాలను ప్రారంభించిన బాగం -
జీపీఓలు వచ్చేస్తున్నారు..
ఖమ్మం సహకారనగర్: రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయిలో సేవలు అందించేందుకు గ్రామ పాలనా అధికారులు (జీపీఓ) నేటి నుంచి విధుల్లోకి రానున్నారు. రెండు రోజుల క్రితం జీపీఓలకు ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి నియామకపత్రాలు అందించగా.. కలెక్టరేట్లో బుధవారం రాత్రి వరకు కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలోని 21 మండలాల పరిధిలో 380 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. వీటిని 299 క్లస్టర్లుగా విభజించారు. అయితే జీపీఓలు 252 మంది ఉన్నారు. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి 13 మంది జిల్లాకు వస్తుండగా.. సుమారు 10 మంది ఇతర జిల్లాలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 299 క్లస్టర్లకు 252 మంది జీపీఓలు ఉంటుండగా.. 56 మంది జూనియర్ అసిస్టెంట్లను జీపీఓల సేవలకు వినియోగించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. నేడు అందనున్న ఆర్డర్లు.. జీపీఓల కౌన్సెలింగ్ బుధవారం రాత్రి వరకు నిర్వహించగా వారికి గురువారం ఉత్తర్వులు అందించనున్నారు. అయితే గురు, శుక్రవారాల్లో వారు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. పైరవీలకు ఆస్కారం లేకుండా పోస్టింగ్లు పైరవీలకు, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా మెరిట్ పద్ధతిలో గ్రామ పరిపాలనా అధికారులకు కౌన్సిలింగ్ చేపట్టి, పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామ పరిపాలనా అధికారులకు నిర్వహించిన కౌన్సెలింగ్లో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెవెన్యూ వ్యవస్థ పటిష్టానికి ప్రభుత్వం గ్రామ పరిపాలనా అధికారులను నియమించిందన్నారు. జిల్లాలో పరీక్ష ద్వారా 252 మంది అర్హులైన వారికి మెరిట్ ప్రకారం వారి సొంత మండలం మినహాయించి, ఇతర ప్రదేశాల్లో పోస్టింగ్లు ఇస్తున్నామన్నారు. ప్రజావాణిలో, గ్రామాల సందర్శన సందర్భంగా ఎక్కువగా భూ సమస్యలపైనే దరఖాస్తులు వస్తున్నాయని, వీటిని పరిష్కరించే బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. భూ భారతి చట్టం పటిష్ట అమలుకు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎ.పద్మశ్రీ, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు
కల్లూరు: వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హరిత తెలిపారు. వివరాలిలా.. కల్లూరు మున్సిపాలిటీ పరిధి లోని కప్పలబంధం గ్రామానికి చెందిన ఓ మహిళ అదే గ్రామానికి చెందిన కంటిపూడి యోహాన్తో నాలుగేళ్లుగా సహజీవనం చేస్తోంది. కాగా, యోహాన్ ఆమెను తీవ్ర వేధింపులకు గురి చేస్తుండగా.. తట్టుకోలేక గడ్డిమందు తా గింది. ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. దీనిపై మృతురాలి సోదరుడు ఫిర్యాదు చేయగా యోహాన్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
‘ఇందిరమ్మ’లో ముందంజ
ఖమ్మంగాంధీచౌక్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు దశల వారీగా ముందుకు సాగుతున్నాయి. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టిన విషయం విదితమే. ఒక్కో అసెంబ్లీ నియోజక వర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేయగా.. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, తెల్లరేషన్ కార్డు గల వారికి తొలి దశలో కేటాయించారు. ఒంటరి మహిళలు, వితంతువులకు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలో నియోజక వర్గాల వారీగా మొత్తం 16,441 ఇళ్లు మంజూరు కాగా అందులో 13, 242 (81 శాతం) ఇళ్లకు మార్కింగ్ చేయగా, వివిధ దశల్లో నిర్మాణాలు సాగుతున్నాయి. రాష్ట్రంలోనే జిల్లా టాప్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే జిల్లా ముందంజలో ఉంది. జిల్లాలోని ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి అసెంబ్లీ నియోజక వర్గాలతో పాటు, ఇల్లెందు నియోజక వర్గ పరిధిలోని కామేపల్లి మండలం కలుపుకొని మొత్తం 16,441 ఇళ్లు మంజూరు చేశారు. నిర్మాణ పనుల వేగవంతానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోంది. మంజూరైన ఇళ్లలో 13,24 ఇళ్లకు ముగ్గులు పోయగా 7,700 ఇళ్లు బేస్మెంట్ లెవల్ నిర్మాణాలు పూర్తయ్యాయి. 1,922ఇళ్లు గోడల దశకు వచ్చాయి. 881 ఇళ్లు స్లాబ్ లెవల్కు చేరాయి. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గ పరిధిలోని ఖమ్మం రూరల్ మండలంలో నాలుగు ఇళ్లు పూర్తి కాగా, 290 స్లాబ్ లెవల్లో, 638 గోడల లెవల్లో, 1,776 బేస్మెంట్ లెవల్లో ఉన్నాయి. మరో 3,087ఇళ్లు మార్కింగ్ చేసి ఉన్నాయి. ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలో ఒకటి, వైరా నియోజకవర్గం పరిధిలోని ఏన్కూరు మండలంలో మూడు, కొణిజర్లలో ఒకటి, వైరాలో ఒకటి.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 10ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. జిల్లాలో మంజూరైన ఇళ్ల నిర్మాణ పనుల వేగవంతానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ముగ్గు పోసిన వాటిని బేస్మెంట్ స్థాయికి తీసుకొచ్చేందుకు క్షేత్ర స్థాయిలో కృషి జరుగుతోంది. బేస్మెంట్ స్థాయి దాటితే నిర్మాణ పనుల్లో వేగం పెరుగుతుంది. అనతి కాలంలోనే అన్ని ఇళ్లు పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నాం. – బి. శ్రీనివాస్, హౌసింగ్ పీడీ నియోజకవర్గం మంజూరైన ముగ్గు బేస్మెట్ గోడల స్లాబ్ పూర్తయిన ఇళ్లు దశ లెవల్ లెవల్ లెవల్ ఇళ్లు ఖమ్మం 3,285 1,557 724 40 10 01 పాలేరు 3,483 3,087 1,776 638 290 04 మధిర 2,792 2,503 1,637 69 89 –– సత్తుపల్లి 3,426 3,138 1,756 817 337 –– వైరా 2,923 2,529 1,585 302 128 05 కామేపల్లి 532 428 222 56 27 –– మొత్తం 16,441 13,242 7,700 1,922 881 10 -
ఫుడ్ పాయిజన్ అంటూ ప్రచారం
కూసుమంచి: మండలంలోని మల్లేపల్లి ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పాయిజన్ అయిదంటూ సోషల్ మీడియాలో ప్రచారం కాగా అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ప్రచారంతో ఆర్డీఓ నర్సింహారావు, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ రాంచందర్రావు, ఎంఈఓ బీవీ రామాచారి హుటాహుటిన పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. మధ్యాహ్న భోజనంలో వండిన ఆకుకూర పప్పు రుచిలో తేడా ఉండటం, సాంబారు పుల్లగా ఉండటంతో పలువురు స్థానిక విద్యార్థులు ఇళ్లకు వెళ్లి భోజనం చేశారు. కాగా, భోజనం రుచిగా లేకపోవటంతో కొందరు విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్లి భోజనం చేశారని, అంతేగానీ విద్యార్థులు ఎవరూ అస్వస్థతకు గురికాలేదని ఆర్డీఓ తెలిపారు. కోలాహలంగా ‘కేటీపీఎస్’ ఎన్నికలుపాల్వంచ/మణుగూరురూరల్: కేటీపీఎస్, బీటీపీఎస్, వైటీపీఎస్ ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ (పాల్వంచ) ఎన్నికలు బుధవారం కోలాహంగా జరిగాయి. కేటీపీఎస్ కాలనీలోని డీఏవీ పాఠశాలలో పోలింగ్ కేంద్రంలో 2,100 మంది సభ్యులకు 1,728 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మణుగూరులోని బీటీపీఎస్ ఎస్పీఎఫ్ కార్యాలయంలో ఏర్పా టు చేసిన పోలింగ్ కేంద్రంలో 500 మంది ఉద్యోగస్తులకు గాను 450మంది ఓటు వేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వైటీపీఎస్లో 396 మంది ఓటర్లకుగాను 367 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో ఓటర్ల ను ఆకర్షించేలా ఫ్లకార్డులు, కరపత్రాలు, గుర్తులను సూచిస్తూ అభ్యర్థులు సందడి చేశారు. పోటీలో ఉన్న 37 మంది డైరెక్టర్ అభ్యర్థులు పోలింగ్ కేంద్రా ల వద్ద ఉద్యోగులను కలుస్తూ తమకే ఓటు వేయాలని అభ్యర్థించారు. సొసైటీలో మొత్తం 2,996 మంది ఓటర్లు ఉండగా, 2,545మంది ఓటు హక్కు విని యోగించుకున్నారు. మొత్తం84.94శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పోలీస్, ఎస్పీఎఫ్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. గుప్త నిధుల కోసం అన్వేషణ!అశ్వారావుపేట: అశ్వారావుపేటలో కొందరు గుప్త నిధుల కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఇతర ప్రాంతాలకు చెందిన కొందరు పగటి వేళల్లో లాడ్జిల్లో బస చేస్తూ, అర్ధరాత్రి వేళలో తవ్వకాలను జరిపే ప్రాంతాలను అన్వేషించేందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. వీరి తో పాటు గుప్తనిధుల ముఠాఓ కమాండర్ జీప్లో సంచరిస్తున్నట్లు సమాచా రం. మండలంలో పలు గ్రామాల్లో జీప్ తిరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని అశ్వారావుపేట ఎస్ ఐ యయాతి రాజు దృష్టికి తీసుకువెళ్లగా.. రాత్రిళ్లు తిరిగే వాహనాలు, వ్యక్తులపై నిఘాపెడతామన్నారు. గుప్తనిధు లు వంటి ప్రచారాలు నమ్మి మోసపోవద్దని సూచించారు. కొనసాగుతున్న ఆర్టీసీ డ్రైవర్ల నిరసనభద్రాచలంఅర్బన్: భద్రాచలం ఆర్టీసీ డిపోలో టిమ్ డ్రైవర్లు చేపట్టిన నిరసన మూడో రోజు బుధవారం కూడా కొనసాగింది. 42 మంది టిమ్ డ్రైవర్లు విధులు బహిష్కరించి ఆందోళనలో పాల్గొంటున్నారు. దీంతో అధికారులు 10 సర్వీసులను తగ్గించారు. ఫలితంగా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు యూని యన్ల నాయకులు జేఏసీగా ఏర్పడి, టిమ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డీఎం తిరుపతిని కోరారు. లేదంటే సమ్మె ఉధృతం చేస్తామని చెప్పారు. భద్రాచలానికి డిపోనకు చెందిన టిమ్ డ్రైవర్ నాగరాజు పని ఒత్తిడితో అనారోగ్యానికి గురైన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తోటి డ్రైవర్లు తెలిపారు. కాగా భద్రాచలం డిపోలో సేప్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ (ఎస్డీఐ)గా విధులు నిర్వహిస్తున్న పోకల సురేష్ తన పోస్టుకు మంగళవారం రాత్రి రాజీనామా చేశారు. -
పిడుగుపాటుతో రైతుకు గాయాలు
కామేపల్లి: పిడుగుపాటుతో ఓ రైతు తీవ్రంగా గా యపడిన ఘటనమండలంలో బుధవారం చోటు చేసుకుంది. కొమ్మినేపల్లి గ్రామానికి చెందిన గుగులోత్ భావ్సింగ్ మిరప తోటలో పని చేస్తుండగా సాయంత్రం ఆకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలోనే భావ్సింగ్ సమీపంలోనే పిడుగు పడడంతో షాక్ కు గురై కిందపడిపోయాడు. పిడుగు ప్రభావంతో చర్మం కాలిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. పొరుగున ఉన్న రైతులు అతడిని వెంటనే ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. గడ్డిమందు తాగిన వ్యక్తి మృతిఖమ్మంఅర్బన్: గడ్డిమందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనపై బుధవారం ఖమ్మంఅర్బన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. నేలకొండపల్లి మండలం చెరువుమాధారానికి చెందిన కాటం గోపిరెడ్డి(31) హైదరాబాద్లో ప్రైవేట్ఉద్యోగం చేస్తున్నాడు. మూడురోజుల క్రితం ఆయన గడ్డిమందు తాగగా కుటుంబసభ్యులు గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం ఖమ్మంలోని మమతఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవా రం మృతిచెందాడు. మృతుడి తండ్రి వెంట్రామిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ భానుప్రకాశ్ తెలిపారు. కాగా, ఘటన హైదరాబాద్లో జరిగినందును కేసును అక్కడికి బదిలీ చేస్తామని పోలీసులు తెలిపారు. దాడి చేశారని ఫిర్యాదు ఖమ్మంఅర్బన్: చెత్త తరలించే ప్రైవేట్ వాహనంలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు దాడి చేశారని ఓ వ్యక్తి డయల్ –100కు కాల్ చేయడంతోపాటు సీపీకి సైతం బుధవారం ఫిర్యాదు చేశాడు. నగరంలోని శ్రీనగర్కాలనీ రోడ్డు నంబర్–1లో నివాసం ఉండే రంగిశెట్టి నాగేందర్ ఇంటి పక్కన, సమీపంలో కాలనీవాసులు చెత్త వేస్తుంటారు. ఈ క్రమంలో చెత్త సేకరించే ప్రైవేట్ వాహనంలో వచ్చిన వ్యక్తులు వచ్చి తమకు చెత్త వేస్తే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని ఇలా వేస్తున్నారా? అంటూ అసభ్యకరంగా దూషిస్తూ తనపై, తల్లి ప్రమీలపై దాడికి పాల్పడినట్లు నాగేందర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ఇంకుడుగుంతలో పడి చిన్నారి మృతి
సత్తుపల్లిరూరల్: ఇంటి ఆవరణలో ఉన్న ఇంకుడు గుంతలో పడి ఓ చిన్నారి మృతి చెందిన ఘసటన సత్తుపల్లి మండలం సత్యంపేటలో చోటుచేసుకుంది. మండలంలోని రుద్రాక్షపల్లి పంచాయతీ సత్యంపేట గ్రామంలో సోయం శివ, సంధ్యారాణి దంపతుల సంవత్సరం వయసు గల కుమార్తె మోక్షదుర్గ.. మంగళవారం సాయంత్రం ఇంటి ఆవరణలో ఆడుకుంటూ మూతలేని ఇంకుడుగుంతలో పడింది. కుటుంబ సభ్యులు గమనించకపోవడతో కొద్ది సేపటికి చిన్నారి మృతి చెందింది. ఆ తర్వాత చిన్నారి కోసం వెదుకుతుండగా ఇంకుడుగుంతలో మృతదేహం కనిపించింది. కాగా, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్విజయ్కుమార్ బుధవారం సత్యంపేటకు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి చిన్నారి మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కారు పల్టీ ముదిగొండ: ఖమ్మం – కోదాడ నేషనల్ హైవేపై కారు పల్టీ కొట్టగా ఓ యువకుడికి గాయాలైన ఘటన ముది గొండ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. ఖమ్మానికి చెందిన ఆసిఫ్ కారులో కోదాడ నుంచి ఖమ్మం వెళ్తున్నాడు. ముదిగొండ సమీపంలో కారు పల్టీ కొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. డ్రైవింగ్ చేస్తున్న ఆసిఫ్కు స్వల్ప గాయాలయ్యాయి. -
స్థానిక ఎన్నికల్లో కష్టపడాలి
● రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి జిల్లానే కారణం ● ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతంఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన కారణమని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం అన్నారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన దళిత విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు గెలిచేలా తాను అండగా ఉంటానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలోని ప్రతీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డ్ మెంబర్లను గెలిపించుకునే బాధ్యత దళితులపై ఉందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రతీ దళిత బిడ్డకు అనేక అవకాశాలు కల్పిస్తానని చెప్పారు. డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో దళిత విజయోత్సవ సభ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. బీజేపీ దిష్టిబొమ్మ దహనం.. రాయ్బరేలిలో లోక్ సభ పక్షనేత రాహుల్ గాంధీపై బీజేపీ దాడిని ఖండిస్తూ పాత బస్టాండ్ ముందు మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొడ్డు బొందయ్య, రాష్ట్ర కన్వీనర్ దర్జీ చెన్నారావు, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ నాయకులు దాసరి దానియేలు, నాయకులు కొత్తా సీతారాములు, దొబ్బల సౌజన్య, వేజెండ్ల సాయి కుమార్, సయ్యద్ గౌస్, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, మొక్కా శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
‘రేషన్’ సమస్యలుంటే ఫిర్యాదు చేయండి
నేలకొండపల్లి: ఆహార భద్రత కార్డుదారులకు చేరువయ్యేలా కేంద్ర ప్రభుత్వం అన్నా సహాయత కార్యక్రమానిన ప్రవేశపెట్టిందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్కుమార్ తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఆయన రేషన్ దుకాణాలను తనిఖీచేశారు. బియ్యం నాణ్యత ఎలా ఉందని వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు. అన్నా సహాయత కార్యక్రమంపై అవగాహ న సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. రేషన్ కార్డుదారులకు ఏమైనా సమస్యలుంటే ఫిర్యాదు చేసేందుకు హెల్ప్లైన్ డెస్క్ ఏర్పాటు చేశామని తెలిపారు. వాట్సాప్ నంబర్ 98682 00445 లేదా టోల్ఫ్రీ నంబర్ 14457 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ నంబర్లను రేషన్ దుకాణాల వద్ద బోర్డుపై ప్రదర్శించాలని డీలర్లను ఆదేశించారు. అనంతరం నేలకొండపల్లి గురుకుల బాలిక పాఠశాలను తనిఖీ చేశారు. భోజనం నాణ్యత ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ముదిగొండ మండలంలోని శ్రీ సత్యసాయి రైస్మిల్ను సందర్శించారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించిన సీఎంఆర్ను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నాగలక్ష్మి, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.జిల్లా ఫౌరసరఫరా శాఖ అధికారి చందన్కుమార్ -
అనుమానాస్పద స్థితిలో నానమ్మ, మనవరాలు మృతి
● మంచిర్యాలలో ఘటన ● మృతులు ఖమ్మం జిల్లా వాసులుమంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోపాలవాడ రైల్వే ఏ క్యాబిన్ సమీపంలో ఉన్న ఓ ఇంట్లో ఖమ్మం నగరానికి చెందిన బెజ్జాల సత్యవతి(55), ఆమె మనవరాలు గీతశిరీష(4) బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఇదే ఇంట్లో మూడేళ్ల క్రితం సత్యవతి చిన్న కుమారుడు(టాన్స్జెండర్) శిరీష(24) సైతం అనుమానాస్పదంగా మృతిచెందడం అప్పట్లో కలకలం రేపింది. ప్రస్తుతం నానమ్మ, మనవరాలు మృతిచెందడం చర్చనీయాంశంగా మారింది. మంచిర్యాల పోలీసులు తెలిపిన వివరాలిలాల.. ఇంటి అమ్మకానికి తీసుకొచ్చి... ఖమ్మం త్రీటౌన్కు చెందిన బెజ్జాల చంద్రయ్య, సత్యవతి దంపతులకు ఇద్దరు కుమారులు గంగోత్రి, వెంకటేష్ ఉండగా.. చిన్న కుమారుడు వెంకటేష్ ట్రాన్స్జెండర్(శిరీష)గా మారి మంచిర్యాలలో స్థిరపడింది. గోపాలవాడ శివారులో రైల్వే ఏ క్యాబిన్ వద్ద ఓ ఇల్లు నిర్మించుకుని జీవనం సాగించింది. 2022 జనవరి 4న అనుమానాస్పదంగా మృతిచెందింది. అప్పటి నుంచి శిరీష కుటుంబ సభ్యులు తరచూ వచ్చి వెళ్తుండేవారు. ఈ క్రమంలో ఈ నెల 8న గంగోత్రి తన తల్లి సత్యవతి, కూతురు గీతశిరీషతో కలిసి ట్రాన్స్జెండర్ శిరీష ఇల్లు విక్రయించడానికి మంచిర్యాలకు వచ్చారు. 9న తనకు అస్తమా సమస్య వచ్చిందంటూ గంగోత్రి తల్లి సత్యవతి, కూతురు గీతశిరీషను ఇక్కడే వదిలి ఖమ్మం వెళ్లిపోయాడు. బుధవారం ఉదయం తన తల్లి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటూ పక్కింటి వారికి సమాచారం అందించాడు. స్థానికులు వెళ్లి పరిశీలించగా తలుపులు తీయకపోవడంతో డయల్ 100కు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా సత్యవతి, గీతశిరీష విగతజీవులుగా కనిపించారు. ఈ విషయమై మంచిర్యాల పోలీసులు పలుమార్లు గంగోత్రికి సమాచారం ఇచ్చి రావాలని సూచించినా రాకపోవడంతో ఖమ్మం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హత్యా.. ఆత్మహత్యా.. సత్యవతి, గీతశిరీష మరణంపై హత్యా.. ఆత్మహ త్యా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటిని విక్రయించడానికి వచ్చిన ముగ్గురిలో ఇద్దరు ఇక్కడే ఉండడం, ఒక్కరే వెళ్లిపోవడం అనుమానాల కు తావిస్తోంది. ఫుడ్ పాయిజన్ జరిగి ఉంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏం జరిగిందనేది పోస్టుమార్టం నివేదికలో తేలనుంది. -
4,654 ఎకరాల్లో పంటలకు నష్టం
ఖమ్మంవ్యవసాయం : జిల్లాలో ఇటీవల భారీగా కురిసిన వర్షాలతో 3,635 మంది రైతులకు చెందిన 4,654 ఎకరాల్లో వివిధ రకాల పంటలకు నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. ఈ మేరకు బుధవారం రాత్రి వివరాలు వెల్లడించింది. జిల్లాలో వరి, పత్తి, పెసర, ఉద్యాన పంటలు సాగులో ఉన్నప్పటికీ అత్యధికంగా పెసర పంటకు నష్టం వాటిల్లిందని, ఎకరాకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ. 4.65 కోట్లు పరిహారం అందించాలని నివేదికలో పేర్కొంది. పంట నష్టాలకు సంబంధించిన సమగ్ర నివేదికను వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపించారు. ఆగస్టు మూడు, నాలుగు వారాల్లో నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీనికి తోడు ఎగువన కురిసిన వానలతో నదులు, వాగులు, జలాశయాలు ఉప్పొంగాయి. దీంతో వాటి పరీవాహక ప్రాంతాల్లోని పంటలు నీట మునిగాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ ఆరంభం నుంచి క్షేత్ర స్థాయిలో వ్యవసాయ విస్తర్ణాధికారులు పంట నష్టాలపై సమగ్ర సర్వే నిర్వహించి జిల్లా వ్యవసాయ శాఖకు నివేదికలు అందించారు. 10 మండలాల్లో పంటలకు నష్టం భారీ వర్షాలతో చింతకాని, కొణిజర్ల, తల్లాడ, వైరా, కూసుమంచి, కారేపల్లి, కల్లూరు, ఏన్కూరు, రఘునాథపాలెం, బోనకల్ మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ నివేదికల్లో పేర్కొంది. అత్యధికంగా చింతకాని మండలంలో 1,678 మంది రైతులకు చెందిన 2,255 ఎకరాల్లో, కొణిజర్ల మండలంలో 1,079 మంది రైతులకు చెందిన 1,292 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. అధిక విస్తీర్ణంలో పెసరకు.. చేతికందే దశలో ఉన్న పెసర పంటకు అధిక విస్తీర్ణంలో నష్టం వాటిల్లింది. 3,286 మంది రైతులకు చెందిన 4,386 ఎకరాల్లో పెసర పంటకు నష్టం వాటి ల్లగా ఈ పంటకు రూ. 4,38,63,500 పరిహారానికి వ్యవసాయ శాఖ సిఫార్సు చేసింది. వరి 137 ఎకరాల్లో, పత్తి 121, మినుము 3, టమాట 2, చిక్కుడు 1.20, కాకర ఎకరం, మిర్చి 30 గుంటల విస్తీర్ణంలో నష్టపోయినట్లు వెల్లడించిన అధికారులు.. ఎకరాకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ. 4,65,44,000 పరిహారానికి నివేదిక అందించారు. -
ఉప్పొంగిన గంగ!
ఖమ్మం సహకారనగర్: గత రెండళ్లుగా భూగర్భ జలాలు పైకి వస్తున్నాయి. జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో పాటు సరిహద్దు జిల్లాల నుంచి కూడా జలాలు వస్తుండమే దీనికి కారణమని అంటున్నారు. భూగర్భ జలాలు పెరుగుతున్న క్రమంలో కొంత మేర తాగు, సాగునీటి ఇబ్బందులు తప్పే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రతీనెలా కొద్దికొద్దిగా.. జిల్లాలోని 21 మండలాల్లో గత నాలుగు నెలలుగా భూగర్భ జలాలను పోలిస్తే ప్రతీ నెలలోనూ గతం కంటే ఈ సంవత్సరం పైకి చేరుకున్నాయి. 2024 మేలో 7.30 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉండగా.. ఈ ఏడాది 5.89 మీటర్ల లోతులోనే ఉన్నాయి. అంటే సుమారు 1.50 మీటర్ల మేర పైకి చేరాయి. గతేడాది జూన్లో సరాసరి 6.99 మీటర్లు ఉంటే ఈ ఏడాది 5.69 మీటర్లకు చేరాయి. 2024 జూలైలో 4.59 మీటర్ల లోతులో ఉంటే ఈ ఏడాది 3.87 మీటర్ల పైకి చేరాయి. గత ఆగస్టులో 3.10 మీటర్ల లోతులో ఉండగా ఈ ఏడాది ఆగస్టులో 2.72 మీటర్ల లోతులోనే భూగర్భజలాలు అందుతుండడం విశేషం. అన్ని మండలాల్లోనూ ఆశాజనకమే.. జిల్లాలోని ప్రతీ మండలంలో భూగర్భజలాలు పెరిగాయి. గతంలో ఒకటి, రెండు మండలాల్లో ఎక్కువ ఉండగా.. ఈసారి మాత్రం అన్ని మండలాల్లోనూ ఆశాజనకంగానే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న నీటిని పొదుపుగా వాడుకుంటే భవిష్యత్లో నీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఏడాది జూలైలో 3.87 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉండగా.. ఆగస్టులో 2.72 మీటర్లకు చేరాయి. దీంతో ఒక్క నెలలోనే సుమారు 1.15 మీటర్ల లోతు భూగర్భజలాలు పైకి చేరాయి. 2025 – 26 సంవత్సరంలో వర్షపాతం 31 శాతం అధికంగా నమోదైంది. అందుకు అనుగుణంగా భూగర్భజలాలు సరాసరి 1.16 మీటర్లు పెరిగాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటిని పొదుపుగా వాడుకోవాలి. భూగర్భజలాల సుస్థిరతకు ఇంటింటికీ ఇంకుడు గుంతలు, వ్యవసాయ బోరుబావి దగ్గరలో ఫామ్పాండ్ వంటి నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టాలి. – ఎం.రమేష్, జిల్లా భూగర్భజల శాఖాధికారినెల 2024 2025 సరాసరి పెరుగుదల మే 7.30 5.89 1.41 జూన్ 6.99 5.69 1.3 జూలై 4.59 3.87 0.72 ఆగస్టు 3.10 2.72 0.38 -
పరిషత్ లెక్క తేలింది
మండలం మొత్తం పురుషులు మహిళలు ఇతరులు బోనకల్ 36,381 17,611 18,769 01 చింతకాని 41,707 19,987 21,720 0 ఏన్కూరు 27,920 13,390 14,530 0 కల్లూరు 35,530 17,364 18,166 0 కామేపల్లి 35,538 17,436 18,102 0 ఖమ్మంరూరల్ 35,797 17,155 18,640 02 కొణిజర్ల 41,864 20,370 21,493 01 కూసుమంచి 50,149 24,251 25,896 02 మధిర 31,728 15,306 16,419 03 ముదిగొండ 48,554 23,274 25,278 02 నేలకొండపల్లి 49,533 23,691 25,841 01 పెనుబల్లి 43,873 21,342 22,531 0 రఘునాథపాలెం 40,790 19,420 21,366 04 సత్తుపల్లి 36,160 17,424 18,735 01 సింగరేణి 45,411 22,205 23,205 01 తల్లాడ 46,261 22,547 23,713 01 తిరుమలాయపాలెం 50,771 24,557 26,213 01 వేంసూరు 36,992 18,122 18,870 0 వైరా 27,306 13,175 14,130 01 ఎర్రుపాలెం 40,425 19,616 20,808 01 మొత్తం 3,88,243 4,14,425 8,02,690 22జిల్లాలో పరిషత్ ఓటర్లతో పాటు పోలింగ్ స్టేషన్ల లెక్క తేలింది. మొత్తం 8,02,690 మంది ఓటర్లతో పాటు 1,580 పోలింగ్ స్టేషన్లు ఉండగా.. ఈ వివరాలను బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రకటించారు. ఈనెల 2న గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల వివరాలు వెల్లడించగా.. జీపీల్లో 8,02,691 మంది ఓటర్లు, 5,214 పోలింగ్ స్టేషన్లుగా ఖరారయ్యాయి. హైకోర్టు తీర్పును అనుసరించి ఈనెల 30లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత సమస్య నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ఇటు ప్రభుత్వం, అటు ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకోకున్నా అధికారులు మాత్రం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మం -
విద్యుత్ సరఫరా, అంతరాయాలపై సమీక్ష
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో విద్యుత్ సరఫరా, అంతరాయాలపై టీజీఎన్పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ టి.మధుసూదన్, చీఫ్ ఇంజనీర్ (ఆపరేషన్స్) రాజు చౌహాన్ బుధవారం ఖమ్మంలో విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో విద్యుత్ సరఫరాలో తీసుకుంటున్న చర్యలు, అంతరాయాలను అధిగిమిస్తున్న విధానం, ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్ల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. విద్యుత్ ప్రమాదాల నియంత్రణకు చేపట్టే కార్యక్రమాలపై కూడా సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ.. అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ వినియోగదారులకు నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. విద్యుత్ పరికరాల వినియోగంపై సిబ్బందికి అవగాహన కల్పించాలని, ప్రమాదాలను నియంత్రించాలని తెలిపారు. సమావేశంలో ఖమ్మం సర్కిల్ ఎస్ఈ శ్రీనివాసా చారి, ఎస్ఏఓ శ్రీధర్, డివిజనల్ ఇంజనీర్లు బాబూరావు, రామారావు, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, రాములు, భద్రు పవార్, టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
పోరాటస్ఫూర్తికి ప్రతీక.. ఐలమ్మ
ఖమ్మంమయూరిసెంటర్: పోరాట స్ఫూర్తికి ప్రతీకగా వీర వనిత చాకలి ఐలమ్మ నిలుస్తారని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఐలమ్మ మహిళా శక్తికి ప్రతీక అని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చేసి వీర వనితగా చరిత్రలో నిలిచారని కొనియాడారు. అటువంటి వీరవనితను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సంఘ సేవకురాలిగా, భూమి, భుక్తి కోసం, సాయుధ రైతాంగ పోరాటంలో ప్రదర్శించిన పోరాట పటిమ స్ఫూర్తిదాయకం అన్నారు. ఆమె ఆశయాలను నేటి తరం వారు కొనసాగించాలని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమాధికారిణి జి. జ్యోతి, బీసీ సంఘం నాయకులు తుపాకుల ఎలగొండ స్వామి, నారాయణ, శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి, జక్కుల వెంకటరమణ, మిట్టపల్లి శంకర్, గోనెల శివప్రసాద్, గోనెల రవిశంకర్, దాసరి నాగేశ్వరరావు, కె. గోవిందరావు, కె. కొండల రావు తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి -
రేపు జాబ్మేళా
ఖమ్మం రాపర్తినగర్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఈనెల 12న నగరంలోని టేకులపల్లి మోడల్ కెరీర్ సెంటర్లో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి కొండపల్లి శ్రీరామ్ ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీ హైదరాబాద్లో ఫార్మసిస్ట్ పోస్టులు 40, ట్రైనీ ఫార్మసిస్ట్ 20, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ 30, రిటైల్ ట్రైనీ 10 పోస్టులకు ఇంటర్వ్యూలు ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు శుక్రవారం ఉదయం 10 గంటలకు జిరాక్స్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. 2,680 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాలకు పంపిణీ ఖమ్మంవ్యవసాయం: చింతకాని మండలం పందిళ్లపల్లి రైల్వే రేక్ పాయింట్కు బుధవారం ఐపీఎల్ కంపెనీకి చెందిన 2,680 మెట్రిక్ టన్నుల యూరియాను ప్రభుత్వం సరఫరా చేసింది. ఈ ఎరువును ఖమ్మం జిల్లాకు 1,380, భద్రాద్రి జిల్లాకు 800, మహబూబాబాద్ జిల్లాకు 500 మెట్రిక్ టన్నుల చొప్పున పంపిణీ చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా రైతులకు పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వ్యవసాయ శాఖ ద్వారా కూపన్లు జారీ చేసి యూరియా పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేయగా.. పోలీసు పహారాలో అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఖానాపురం చెరువు పరిశీలనఖమ్మంఅర్బన్: నగరంలోని 3, 6 డివిజన్ల మధ్య ఉన్న ఖానాపురం చెరువును జలవనరుల శాఖ అధికారులు బుధవారం సందర్శించారు. చెరువులను అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా ఏయే పనులు చేపట్టాలి, కట్టల పటిష్టత, పూడిక తీత, అలుగుల మరమ్మతులు తదితర అంశాలపై అంచనాలు రూపొదించనున్నట్లు ఆ శాఖ ఎస్ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన వెంట డీఈ ఉదమ్ప్రతాప్, రైతు సంఘం నాయకులు నల్లమల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకుడు మలీదు మనీష్ తదితరులు ఉన్నారు. డెంగీ బాధితులు కోలుకున్నారునేలకొండపల్లి : జిల్లాలో డెంగీ కేసుల బాధితులంతా కోలుకున్నారని, ఎలాంటి ప్రమాదం లేదని డీఎంహెచ్ఓ డాక్టర్ డి.కళావతిబాయి అన్నారు. నేలకొండపల్లి పీహెచ్సీని, చెరువుమాధారం, పైనంపల్లి ఉప కేంద్రాలను బుధవారం ఆమె తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 3.11లక్షల ఇళ్లలో సర్వే నిర్వహించి, 7.45 లక్షల మందికి వైద్య పరీక్షలు చేశామని తెలిపారు. ఇందులో 3,712 మందికి జ్వరాలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. జిల్లాలో 155 డెంగీ కేసులు నమోదు కాగా.. వారంతా రికవరీ అయ్యారని తెలిపారు. చికున్ గున్యా, మలేరియా కేసులు లేవని చెప్పారు. ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. నేలకొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని చెరువుమాధారానికి తరలించే విషయం ప్రస్తుతానికి లేదన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్.ఆర్.శ్రావణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐల బదిలీ ఖమ్మంక్రైం: జిల్లాలో ఇద్దరు ఎస్ఐలను బదిలీచేస్తూ సీపీ సునీల్దత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం టూటౌన్ ఎస్ఐగా పనిచేస్తున్న సంధ్యను ఏన్కూరుకు, అక్కడ పనిచేస్తున్న ఉపతల రఫీని ఖమ్మం వీఆర్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
పనుల్లో జాప్యాన్ని సహించం
● మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాలు వేగవంతం చేయాలి ● కలెక్టర్ అనుదీప్ఖమ్మంఅర్బన్/రఘునాథపాలెం: నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల పనులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ శ్రీజ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, కాంట్రాక్టర్లతో మాట్లాడుతూ.. పనుల్లో జాప్యం తగదని సూచించారు. ప్రారంభానికి ముందే అన్ని సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని, పనుల్లో నిర్లక్ష్యం, నాణ్యత లోపం ఉంటే సహించేది లేదని హెచ్చరించారు. రూ. 200 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల డిజైన్ కూడా మంచి మోడల్గా ఉండాలని, వాస్తును పాటిస్తూ అకరణీయంగా ఉండేలా తీర్చి దిద్దాలని అన్నారు. గురుకుల పాఠశాల నిధులు తన అకౌంట్లో నిల్వ ఉన్నాయని, బిల్లుల జాప్యం పేరుతో పనులు ఆలస్యం చేస్తే సహించేది లేదని అన్నారు. ఎప్పటికప్పుడు బిల్లులు ఇస్తామని, పార్ట్ బిల్లు చేసిన 24 గంటల్లో చెల్లిస్తామని స్పష్టం చేశారు. మౌలిక వసతుల కల్పన, తాగునీరు, డ్రెయినేజీ, విద్యుత్, రహదారుల వంటి పనులు సైతం పూర్తి చేయాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పాఠశాల ప్రారంభించేలా పనులు వేగవంతం చేయాలని సూచించారు. భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వ పరంగా న్యాయం చేస్తామని హమీ ఇచ్చారు. మెడికల్ కళాశాలలో ఇప్పటి వరకు రూ. 45 కోట్ల విలువైన పనులు పూర్తి చేయగా రూ.15 కోట్ల బిల్లులు అందించామని చెప్పారు. కాలేజీలో అంతర్గత రహదారులు, ప్రహరీ, డ్రెయినేజీ వంటి మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఈఈ పవార్, డీఈ లక్ష్మీనాయక్, ఏఈఈ లలిత, ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం తహసీల్దార్లు సైదులు, శ్వేత, ఎంఈఓ రాములు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్ తదితరులు పాల్గొన్నారు. జవాబుదారీతనంతో పనిచేయాలి ఖమ్మం సహకారనగర్ : ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. నగరంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల నిర్వహించిన పైలట్ ప్రజావాణి కార్యక్రమం తరహాలో మధిర నియోజకవర్గం పరిధిలోని 5 మండలాల్లోనూ నిర్వహణకు కార్యాచరణ చేపట్టామని, ఈ కార్యక్రమం అమలులో అధికారులు జవాబుదారీగా ఉండాలని అన్నారు. మండల స్థాయిలోనే ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మాట్లాడుతూ పైలట్ ప్రజావాణి కా ర్యక్రమం కింద మండల కేంద్రంలోని ఐఎఫ్సీ సెంటర్లో సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి రశీదు అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, అధికారులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు కరీనా, శ్రీహర్ష, అఖిల్ సూర్య పాల్గొన్నారు.ఖమ్మంమయూరిసెంటర్: నగరంలో లేఔట్ అనుమతుల జారీ అంశంలో నిబంధనలు పాటించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన లేఔట్ కమిటీ సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్డు నిర్మాణానికి అవసరమైన మేర భూమి లే ఔట్ లో కేటాయించేలా అధికారులు పరిశీలించాలని అన్నారు. నిబంధనలకు లోబడి మాత్రమే అనుమతులు జారీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్డీసీ ఎం. రాజేశ్వరి, సుడా సీపీఓ, పంచాయతీ రాజ్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసా చారి, ఆర్అండ్బీ ఎస్ఈ యాకోబు, ఈఈ తానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆఫీసులకు సౌరవెలుగులు
● భవనాలపై సోలార్ పలకల ఏర్పాటు ● జిల్లాలో 4,700 భవనాల ఎంపిక ● మిగులు విద్యుత్ డిస్కంలకు విక్రయం నేలకొండపల్లి: జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో త్వరలోనే సౌర వెలుగులు నిండనున్నాయి. విద్యుత్ అవసరాలు పెరుగుతుండడంతో బిల్లులు భారం తగ్గించేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పల్లె నుంచి పట్నం వరకు గ్రామపంచాయతీ మొదలు అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సౌర పలకలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో సౌర ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన భవనాలు కలిగిన కార్యాలయాలతో నివేదిక సిద్ధం చేస్తున్నారు. విద్యుత్ బిల్లులు ఆదా... ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్ బిల్లులు రూ.వేలల్లో ఉంటున్నాయి. కొన్ని కార్యాలయాల బిల్లులు చెల్లించకపోవడంతో పేరుకుపోతున్నాయి. ఈనేపథ్యాన ప్రభుత్వ భవనాలపై సౌర ప్లాంట్ల ఏర్పాటుతో కార్యాలయాల అవసరాలకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఎక్కడైనా మిగిలితే డిస్కంలకు విక్రయించడం ద్వారా ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ కార్యాలయాలతోపాటు ఇతర కార్యాలయాలు, అన్ని విద్యాసంస్థల భవనాలపై సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. కాగా, ఇప్పటికే కొన్ని కార్యాలయాల్లో సౌర పలకలు ఉన్నా నిర్వహణ లోపంతో పనిచేయడం లేదని గుర్తించిన అధి కారులు మరమ్మతులకు ప్రతిపాదనలు స్వీకరిస్తున్నారు. 4,700 విద్యుత్ కనెక్షన్లు జిల్లాలో వివిధ శాఖల ప్రభుత్వ కార్యాలయాలకు ప్రస్తుతం 4,700కు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నట్లు గుర్తించారు. ఆయా భవనాలపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటుతో దాదాపు 30 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశముందని అంచనా వేశారు. దీంతో త్వరగా ప్లాంట్లు ఏర్పాటుచేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో నియోజకవర్గానికి ఒక గ్రామాన్ని మోడల్ సోలార్ విలేజ్గా తీర్చిదిద్దేలా పనులు జరుగుతున్నాయి. -
ఆడపడుచులకు బతుకమ్మ కానుక
● ఎస్హెచ్జీల సభ్యులకు రెండేసి చీరలు ● జిల్లాకు 3.35 లక్షలు చీరల కేటాయింపు ● విడతల వారీగా వస్తున్న స్టాక్ ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులకు కానుక అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు ప్రభుత్వం తరఫున చీరలు పంపిణీ చేస్తామని ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యాన సిద్ధమైన చీరలను విడతల వారీగా జిల్లాకు చేరవేస్తున్నారు. బతుకమ్మ వేడుకల ప్రారంభానికి ముందే వీటిని అందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి ఒకటి.. తర్వాత ఇంకొకటి జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యుల కోసం 3,35,878 చీరలు కేటాయించారు. సెర్ప్, మెప్మా పరిధిలోని సంఘాల సభ్యులకు రెండేసి చీరలు పంపిణీ చేస్తారు. బతుకమ్మ పండుగ ప్రారంభానికి ముందు ఒకటి.. వేడుకలు మొదలయ్యాక ఇంకొకటి అందించనున్నట్లు సమాచారం. తొలిదఫా ఇవ్వాల్సిన సుమారు 1.50 లక్షల చీరలు ఇప్పటికే చేరగా, మిగిలినవీ వారం రోజుల్లో వచ్చే అవకాశముంది. జిల్లాలో 20 మండల సమాఖ్యలు, 1,018 గ్రామ సమాఖ్యలు, 26వేల స్వయం సహాయక సంఘాల్లో 2లక్షలకు మందికి పైగా సభ్యులు ఉన్నారు. స్టాక్ పాయింట్లలో నిల్వ జిల్లాకు చేరుకున్న చీరలను అధికారులు స్టాక్ పాయింట్లలో భద్రపరుస్తున్నారు. రఘునాథపాలెం(టేకులపల్లి జిల్లా మహిళా సమాఖ్య ప్రాంగణం), వైరా, మధిర మార్కెట్ల గోదాంలు, సత్తుపల్లి మండల సమాఖ్య కార్యాలయంలో డంప్ చేస్తున్నారు. అలాగే, మెప్మా పరిధిలోని సంఘాల సభ్యుల చీరలను ఆ విభాగం అధికారులకు అప్పగిస్తారు. బతుకమ్మ పండుగను మహిళా సంఘాల సభ్యులు ఉత్సాహంగా జరుపుకునేలా వేడుకలు ప్రారంభమయ్యేలోగానే చీరల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. చీరలను ప్రత్యేక సంచిలో ప్యాక్ చేసి ఇవ్వనున్నారు. ఆ సంచిపై ఇందిరాగాంధీ ఫొటో, ఇందిరా మహిళా శక్తి పేరిట లోగోతో పాటు ‘అక్కాచెల్లెళ్లకు మీ రేవంతన్న కానుక’ అని రాసి ఉంది. అలాగే, సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రుల ఫొటోలు ముద్రించారు.యూనిఫామ్ శారీస్ కింద జిల్లాకు ప్రభుత్వం చీరలు సరఫరా చేస్తుంది. ప్రత్యేక సంచిలో ప్యాక్ చేసి వీటిని మహిళా సంఘాల సభ్యులకు అందజేయనున్నాం. ప్రభుత్వం నుండి మార్గదర్శకాలు, విధివిధానాలు రాగానే పంపిణీపై స్పష్టత వస్తుంది. ఇప్పటి వరకు జిల్లాకు చేరిన చీరలను గోదాముల్లో భద్రపరుస్తున్నాం. – సన్యాసయ్య, డీఆర్డీఓ -
పెన్షనర్ల బకాయిలు విడుదల చేయాలి
ఖమ్మం సహకారనగర్: కొత్త పెన్షన్ విధానం(సీపీఎస్)ను తక్షణమే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం(ఎస్జీపీఏటీ) రాష్ట్ర సంయుక్త అధ్యక్షుడు జి.వీరస్వామి డిమాండ్ చేశారు. సంఘం జిల్లా స్థాయి సమావేశం మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా అధ్యక్షుడు పరిశ పుల్లయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వీరస్వామి మాట్లాడుతూ ఉద్యోగ విరమణ అనంతరం బకాయిలు 15నెలలు గడిచినా రాకపోవడంతో పెన్షనర్లు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇకనైనా బకా యిలు వెంటనే విడుదల చేయాలన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థలు, మార్కెట్ కమిటీల్లో రిటైర్డ్ ఉద్యోగులకు సైతం ట్రెజరీల ద్వారా పెన్షన్ చెల్లించాలని, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారిని నియమించి హైదరాబాద్లో పెన్షనర్ల భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వి.రాంమనోహర్, తుమ్మా వీరయ్య, కె.సుధీర్బాబు, రాయల రవికుమార్, కనపర్తి వెంకటేశ్వర్లు, మేరీ ఏసుపాదం, తాడి అంజలి, పెదమళ్ల సత్యనారాయణ, కొలికొండ శరత్బాబు, ఊడుగు వెంకటేశ్వర్లు, వీరభద్రరావు, లక్ష్మి, సుజాత, అన్నమ్మ, ప్రసాదరావు, గుర్రాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, వ్యవసాయ మార్కెట్లలో పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు మూడు నెలలుగా పెన్షన్ అందడం లేదని జెడ్పీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నాయకుడు వీరస్వామి -
ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యం
ఎర్రుపాలెం: మారుమూల గ్రామాల్లోని ప్రజల అవసరాలు తీరుస్తూ, మౌలిక వసతులు కల్పించి జీవన ప్రమాణాలు పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఎర్రుపాలెం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో భట్టి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాబోయే 50ఏళ్లకు సరిపడా అభివృద్ధి కార్యక్రమాలు చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. తద్వారా రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మధిరను తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈకార్యక్రమాల్లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం సుడిగాలి పర్యటన ఎర్రుపాలెం మండలంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సుడిగాలి పర్యటన చేశారు. మండలంలోని అయ్యవారిగూడెం, ఎర్రుపాలెం, పెద్దగోపవరం, బనిగండ్లపాడు బుచ్చిరెడ్డిపాలెం గ్రామాల్లో రూ.4 కోట్ల ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో నిర్మించే సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. పెద్దగోపవరం, భీమవరంలో రూ.12 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడీ భవనాలకు శంకుస్థాపన చేశారు. బనిగండ్లపాడులో భోజన విరామం అనంతరం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పీఆర్ ఎస్ఈ వెంకటరెడ్డి, డీపీఓ ఆశాలత, ఆర్అండ్బీ ఎస్ఈ యాకూబ్, విద్యుత్ ఎస్ఈ శ్రీనివాసాచారి, తహసీల్దార్ ఉషాశారదతో అభివృధ్ధి, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించారు. ఇక బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలోని ఇనద్రమ్మ చెరువును కలెక్టర్ అనుదీప్, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్లతో కలిసి డిప్యూటీ సీఎం పరిశీలించారు. అక్కడకు వెళ్లే రహదారి ఇటీవల వర్షాలతో బురదమయంగా మారడంతో ట్రాక్టర్పై వెళ్లారు. ఇనద్రమ్మ చెరువును పర్యాటకంగా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆతర్వాత జమలాపురం వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల పోస్టర్లను ఈఓ జగన్మోహన్రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మతో కలిసి భట్టి ఆవిష్కరించారు. ఈకార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మధిర మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు, కాంగ్రెస్ జిల్లా, మండల అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, వేమిరెడ్డి సుధాకర్రెడ్డి, నాయకులు యరమల పూర్ణచంద్రారెడ్డి, అనుమోలు కృష్ణారావు, తల్లపురెడ్డి నాగిరెడ్డి, మల్లెల లక్ష్మణరావు, శీలం వెంకట్రామిరెడ్డి, షేక్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక ఇసుక బజార్లు !
● ఇందిరమ్మ లబ్ధిదారులకు పంపిణీ కోసం ఏర్పాటు ● ఒక్కో ఇంటికి 10 ట్రాక్టర్ల ఇసుక ఇచ్చేలా నిర్ణయం ● టన్ను రూ.1,100 ధరతో విక్రయంఖమ్మంగాంధీచౌక్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం ఇసుక బజార్లు అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇసుక ధరలు ఎక్కువగా ఉండడమే కాక వర్షాకాలం కావటంతో పలు ప్రాంతాల్లో సరిపడా లభించడం లేదు. దీంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సమస్య ఎదురై ఆలస్యమవుతోంది. కొన్నిచోట్ల ధరల కారణంగా లబ్ధిదారులు నిర్మాణాలు నిలిపివేశారు. ఈ నేపథ్యాన ప్రభుత్వం ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఇసుక బజార్ ఏర్పాటుచేయనున్నారు. తొలి బజార్ కూసుమంచిలో... ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుకను టన్ను రూ.1,100 చొప్పున లబ్ధిదారులకు ఇసుక బజార్ల ద్వారా అందిస్తారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి 10 టాక్టర్లు(40 టన్నులు) ఇసుక అందించేలా చర్యలు చేపట్టారు. ఈమేరకు తొలి ఇసుక బజార్ను కూసుమంచిలో మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. కాగా, లబ్ధిదారులు గృహ నిర్మాణ శాఖ ఏఈ నుంచి ఇండెంట్ పొంది తహసీల్దార్కు అందిస్తే వారు కూపన్ల జారీ చేస్తారు. ఈ కూపన్ల ఆధారంగా ఇసుకను తీసుకోవచ్చు. లబ్ధిదారులే ట్రాక్టర్ తెచ్చుకోవాల్సి ఉండగా.. నిర్వాహకులు కాంటా పెట్టి అప్పగిస్తారు. కాగా, నగదు ఆన్లైన్లో చెల్లించేలా ఏర్కాపట్లు చేశారు. నియోజకవర్గాల వారీగా ఏర్పాటు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇసుక బజార్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. జిల్లాలో ఇప్పటికే పాలేరు నియోజకవర్గ బజార్ను కూసుమంచిలో ఏర్పాటుచేశారు. ఇక ఖమ్మం నియోజకవర్గానికి ఎన్ఎస్పీ క్యాంపులో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మధిర, సత్తుపల్లి, వైరా నియోజకవర్గాలతో పాటు ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే కామేపల్లి మండలంలో కూడా ఇసుక బజార్ ఏర్పాటుకు నిర్ణయించారు. వీటిలో గోదావరి ఇసుకను అందుబాటులోకి తీసుకొస్తారు. కాగా, మహిళా సంఘాల సభ్యులు ఇళ్లు నిర్మించుకుంటే టన్ను రూ.1,300 చొప్పున ఇసుక కొనుగోలుకు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. -
అభివృద్ధి, సంక్షేమానికే ప్రాధాన్యత
● ప్రజలు మెచ్చేలా ప్రభుత్వ పాలన ● మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికూసుమంచి: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా తమ ప్రభుత్వ పాలన సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కూసుమంచి మండలం నాయకన్గూడెంలో గ్రామపంచా యతీ భవనాన్ని మంగళవారం ప్రారంభించిన మంత్రి.. కిష్టాపురం, జుజుల్రావుపేటల్లో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యాన బూట్లు, సాక్సుల పంపిణీని ప్రారంభించారు. అనంతరం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కాటమయ్య కిట్లు, క్రైస్తవ మహిళలకు కుట్టుమిషన్లు, లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి మంత్రి పంపిణీ చేశారు. అన్ని హామీలు అమలుచేస్తాం ఎన్నికల వేల ఇచ్చిన హామీలన్నీ అమలుచేసేలా ముందుకెళ్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆర్థిక భారం ఉన్నా దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా పథకాలు అమలుచేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లక్ష్యం కాగా, ఎన్నడూలేని విధంగా 7.5 లక్షల తెల్లరేషన్ కార్డులు జారీ చేశామని తెలిపారు. రానున్న రోజుల్లో పథకాలు మరింత జోరందుకోనున్నందున ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలవాలని మంత్రి కోరారు. యూరియా పంపిణీలో సమస్యలు రావొద్దు పాలేరు నియోజకవర్గంలో యూరియా పంపిణీలో సమస్యలు రాకుండా అధికారులు పర్యవేక్షించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి యూరియా పంపిణీపై సమీక్షించిన ఆయన పీఏసీఎస్ల ద్వారా పంపిణీ వివరాలు తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ఈనెల 3నుంచి ఇప్పటి వరకు 610 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశామని అధికారులు చెప్పగా, భవిష్యత్లో ఇదే కొనసాగించాలని సూచించారు. కాగా, జీపీఓలుగా నియమితులైన పూర్వ వీఆర్ఓలు, వీఆర్ఏలు మంత్రిని కలిసి తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోవడంపై కృతజ్ఞతలు తెలి పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెవెన్యూ శాఖ పేరు నిలబెట్టేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రజలకు నిజాయితీగా, చిత్తశుద్ధితో సేవలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీఓ నరసింహారావు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ నాగేందర్రెడ్డి, హౌజింగ్ పీడీ శ్రీనివాస్, బీసీ సంక్షేమాధికారి జ్యోతి, పాలేరు ప్రత్యేకాధికారి రమేష్, డీఎల్పీఓ రాంబాబు, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ రాంచందర్రావు, సీఐ సంజీవ్, ఏడీఏ సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
ఖమ్మంక్రైం: ఈనెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్దత్ సూచించారు. రాజీమార్గాన్ని రాజ మార్గంగా భావించాలని.. లోక్ అదాలత్లో ఇరువర్గాలు పరస్పర అంగీకారానికి వస్తే సత్వర పరిష్కారం పొందొచ్చని తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్, సివిల్ తగాదా, ఆస్తి విభజన, ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసుల్లో కక్షిదారులు రాజీపడే అవకాశం ఉందని వెల్లడించారు. చిన్న కేసులతో సమయం, డబ్బు వృథా కావడమే తప్ప ఎలాంటి ఫలితం ఉండదని తెలిపారు. ఈమేరకు లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఓ ప్రకటనలో సీపీ విజ్ఞప్తి చేశారు. కాగా, పోలీసు అధికారులు, కోర్టు విధులు నిర్వర్తించే సిబ్బంది రాజీపడదగిన కేసుల్లో ఇరువర్గాలు లోక్అదాలత్కు హాజరయ్యేలా కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచనలు చేశామని తెలిపారు. గిరిజనులకు సంక్షేమ పథకాలు చేరేలా అవగాహన రఘునాథపాలెం: ఆది కర్మయోగి అభియాన్ పథకం ద్వారా అర్హులైన గిరిజనులకు సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు కృషి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయలక్ష్మి సూచించారు. పథకంపై రఘునాథపాలెం మండల పరిషత్ కార్యాలయంలో రెండు రోజుల పాటు ఆశా వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం డీడీ మాట్లాడుతూ పూర్తిగా వెనుకబడిన గిరిజన గ్రామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను 2028 నాటికి చేరవేయడమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఈమేరకు ప్రభుత్వాల ద్వారా అమలయ్యే పథకాల లబ్ధిని గిరిజనులు అందుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు. ఎంపీడీఓ అశోక్కుమార్, ఏఓ నారాయణరెడ్డి, ట్రెయినర్లు బాలు, జ్యోతి, సుజాత తదితరులు పాల్గొన్నారు. నాణ్యతలో రాజీ లేకుండా నిర్మాణాలు ఖమ్మంఅర్బన్: జిల్లాలో జలవనరుల శాఖ పరిధిలో జరుగుతున్న పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా అంచనాల ప్రకారం కొనసాగించాలని క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈ సీ.హెచ్.బుచ్చిరెడ్డి ఆదేశించారు. ఖమ్మంలో మున్నేటి వెంట రిటైనింగ్ వాల్ నిర్మాణం, సీతారామ ప్రాజెక్టు 14, 15వ ప్యాకేజీ పనులతో పాటు వైరా రిజర్వాయర్ పరిధిలోని పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణాల నాణ్యతను తనిఖీ చేసిన సీఈ అవసరమైన మార్పులపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ కంట్రోల్ ఈఈ రమణ, డీఈ చంద్రమోహన్, జలవనరుల శాఖ ఎస్ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు, ఈఈ బాబురావు, డీఈ ఉదయప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరు మండలాల్లో పంట నష్టం గుర్తింపు
ఖమ్మంవ్యవసాయం: ఇటీవల భారీ వర్షాలతో జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని గుర్తించేందుకు వ్యవసాయ శాఖ చేపట్టిన సర్వే కొనసాగుతోంది. గతనెల మూడు, నాలుగో వారాల్లో అల్పపీడనం, నైరుతి రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు కురిశాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాగులు, నదులు, జలాశయాల పరీవాహకం, పల్లపు ప్రాంతాల్లో పంటలు వరద ముంపునకు గురయ్యాయి. ఈమేరకు పంట నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ఏఈఓలతో సర్వే చేయిస్తున్నారు. ఇప్పటివరకు ఆరు మండలాల్లో సర్వే పూర్తి కాగా, మరో మూడు మండలాల్లో కొనసాగుతోందని అధికారులు తెలిపారు. కాగా, ఆరు మండలాల్లో 595 మంది రైతులకు చెందిన 775.37 ఎకరాల్లో పత్తి, వరి, పెసర పంటలకు నష్టం జరిగిందని ఏఓఓలు నివేదిక అందజేశారు. రఘునాథపాలెం మండలంలో 18, కూసుమంచి మండలంలో 197, కల్లూరులో 77.12, తల్లాడ మండలంలో 34, ఏన్కూరు మండలంలో 30.25, కారేపల్లి మండలంలో 108 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్లు నివేదికల్లో పేర్కొన్నారు. ఇక కొణిజర్ల, వైరా, చింతకాని మండలాల్లో సర్వే చివరి దశలో ఉంది. ఈ మండలాల్లో 2,500 ఎకరాలకు పైగా పెసర, వరి, పత్తి పంటలకు నష్టం జరిగినట్లు సమాచారం. మొత్తంగా జిల్లాలో పంట నష్టం వివరాలను ఒకటి, రెండు రోజుల్లో వెల్లడించే అవకాశం ఉంది. మిగతా చోట్ల కొనసాగుతున్న ప్రక్రియ -
ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం: కలెక్టర్
ఖమ్మం సహకారనగర్: ప్రజా చైతన్యమే లక్ష్యంగా మహాకవి కాళోజీ నారాయణరావు రచనలు చేశారని, సాహితీవేత్తగా సమాజానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కాళోజీ జయంతి సందర్భంగా కలెక్టరేట్లో మంగళవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ జీవిత చలనశీలి కాళోజీ అని, తెలంగాణ వైతాళికుడిగా నిలిచారని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి ఏ.పద్మశ్రీ, డీఎంహెచ్ఓ కళావతిబాయి, సీపీఓ ఏ.శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నవీన్బాబు, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘పడిపోతున్న కార్మికుల జీవన ప్రమాణాలు’
ఖమ్మంమయూరిసెంటర్: ప్రధానిగా మోడీ ఇంకొన్నాళ్లు కొనసాగితే కార్మికుల కనీస జీవన ప్రమాణాలు మరింత పడిపోతాయని తెలంగాణ పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్ల (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్) యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మంలో మంగళవారం జరిగిన జిల్లా నాలుగో మహాసభలో ఆయన మా ట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం కార్పొరేట్లకు అప్పగిస్తోందని ఆరోపించారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం పది గంటల పనివిధానం తీసుకురావడం గర్హనీయమని పేర్కొన్నారు. కీలకమైన రవాణా రంగంపై పాలకులు చిన్నచూపు విడనాడకపోతే సమ్మెకు పిలుపునిస్తామని హెచ్చరించారు. కాగా, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆటోడ్రైవర్లకు నెలకు రూ.12 వేలు, డ్రైవర్లకు కనీస వేతనంగా రూ.26 వేలు ఇవ్వాలని శ్రీకాంత్ డిమాండ్ చేశారు.అనంతరం సంఘం నూతన అధ్యక్షుడిగా వై విక్రమ్, కార్యదర్శిగా జిల్లా ఉపేందర్, కోశాధికారిగా ధరావత్ రాందాస్తోపాటు 31 మంది సభ్యులతో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఇంకా ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు టి.విష్ణు, నాయకులు పి.మోహన్రావు, బాబు తదితరులు పాల్గొన్నారు. -
కమ్యూనిజానికి అంతం లేదు..
సూపర్బజార్(కొత్తగూడెం): కమ్యూనిజానికి అంతం లేదని.. కమ్యూనిస్టులు ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం క్లబ్లో మంగళవారం సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి సంస్మరణ సభను పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్పాషా అధ్యక్షతన నిర్వహించారు. సురవరం చిత్రపటానికి ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యతో పాటు పలు పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కూనంనేని మాట్లాడుతూ సురవరం విద్యార్థి దశ నుంచే కమ్యూనిజాన్ని నమ్మి నిరంతర పోరాటాలు చేశారని తెలిపారు. కాగా, 2026 మార్చి వరకు మావోయిస్టులను అంతం చేస్తామన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ప్రకటన సరికాదని, మావోయిస్టు ప్రతి రక్తపు బొట్టు నుంచి తిరిగి ఉద్భవిస్తారని వ్యాఖ్యానించారు. వివిధ పార్టీల నాయకులు బాగం హేమంతరావు, ఆవునూరి మధు, అన్నవరపు సత్యనారాయణ, నాగా సీతారాములు, కంచర్ల చంద్రశేఖర్రావు, కకె.అనంతరాములు, ఎస్.అనుదీప్, పసుపులేటి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. -
రావోజీతండా వాసికి డాక్టరేట్
కారేపల్లి: కారేపల్లి మండలం రావోజీ తండా గ్రామానికి చెందిన గుగులోతు నెహ్రూ ఆచార్య ఎన్ జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధి బాపట్ల వ్యవసాయ కళాశాలలో పీహెచ్డీ పూర్తి చేశారు. వేరుశనగ సాగులో అధిక దిగుబడి, తెగుళ్ల నివారణపై ఆయన సమర్పించిన పరిశోధనా పత్రానికి డాక్టరేట్ ప్రకటించారు. కాగా, నెహ్రూ తల్లిదండ్రులు రాందాస్, భద్రి వ్యవసాయం చేస్తుండగా.. రైతుల కుటుంబాలకు మేలు జరిగేలా మరిన్ని పరిశోధనలు చేయడమే తన లక్ష్యమని తెలిపారు. జాబ్ మేళాలో 15 మంది ఎంపిక ఖమ్మం రాపర్తినగర్: జిల్లా ఉపాధి కల్పన శాఖ మంగళవారం నిర్వహించిన జాబ్మేళాకు 56 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగాల కోసం హాజరైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించగా 15మంది ఎంపికయ్యారు. జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి కొండపల్లి శ్రీరామ్ జాబ్మేళాను పర్యవేక్షించారు. అప్రమత్తతోనే సీజనల్ వ్యాధులు దూరంబోనకల్: ప్రజలు ఇళ్లలోనే కాక పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా సీజనల్ వ్యా ధులు దరిచేరవని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖా ధికారి కళావతిబాయి తెలిపారు. మండలంలోని ముష్టికుంట్ల ఆరోగ్య ఉపకేంద్రాన్ని మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఇటీవల వర్షాలతో ఉపకేంద్రంలో నీరు నిలిచిందని, గ్రామంలోనూ డ్రెయినేజీలు లేక రోడ్లపై మురుగు నీటి ప్రవాహంతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారని ఉద్యోగులు చెప్పారు. ఈమేరకు ఫ్రై డే – డ్రై డే, శానిటేషన్ పనులపై పంచాయతీ కార్యదర్శి సైదులుకు డీఎంహెచ్ఓ సూచనలు చేశారు. అంతేకాక దోమల నివారణ, ఇతర జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. డీపీఓ ఎం.దుర్గ, వైద్యాధికారులు స్రవంతి, ప్రియాంక, ఉద్యోగులు పాల్గొన్నారు. -
రక్షణ.. ఇంకొంత దూరం
ఖమ్మంఅర్బన్: మున్నేటికి ఏటా వస్తున్న వరదతో ఖమ్మం నగరం వైపు కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. గత ఏడాది కనీవిని ఎరుగని రీతిలో నష్టం ఎదురుకావడంతో ఇప్పటికే రూ.690 కోట్ల అంచనాలతో మున్నేటికి ఇరువైపులా 17 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నారు. అయితే, ముంపు సమస్యను మరింత తగ్గించేలా గోడను ధంసలాపురం వరకు ఇరువైపులా మరో 12 కి.మీ. మేర నిర్మించాలని నిర్ణయించారు. ఈమేరకు అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించగా.. నిర్మాణం, భూసేకరణకు రూ.600 కోట్ల వ్యయమవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. పొడిగింపుతో మరింత భరోసా ప్రస్తుతం మున్నేటికి ఇరువైపులా ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల పరిధిలో రిటైనింగ్ వాల్ నిర్మాణం జరుగుతోంది. ఖమ్మం నగరంలో దానవాయిగూడెం నుంచి ప్రకాష్నగర్ వంతెన వరకు నిర్మిస్తుండగా, అక్కడి నుంచి ధంసలాపురం వద్ద నేషనల్ హైవే వంతెన వరకు పొడిగించాలని నిర్ణయించారు. తద్వారా శ్రీనివాస్నగర్, ధంసలాపురం, అగ్రహారం కాలనీ ప్రాంతాలకు సైతం ముంపు నుంచి రక్షణ లభిస్తుంది. గత ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో మున్నేటికి వచ్చిన భారీ వరదతో ధంసలాపురం, అగ్రహారం ప్రాంతాల్లో సుమారు 1,300 పైగా ఇళ్లు నీట మునగగా పేద కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ నేపథ్యాన రిటైనింగ్ వాల్ను పొడిగించడం ద్వారా ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భావిస్తున్నారు.రిటైనింగ్ వాల్ పొడిగింపునకు మంత్రి తుమ్మల ఆదేశించారు. ఈమేరకు క్షేత్రస్థాయిలో మా శాఖ ఉద్యోగులు సర్వే చేశాక అంచనాలతో నివేదిక రూపొందిస్తాం. తద్వారా ఎంత మేర భూమి అవసరం, నిధులు ఎంత కేటాయించాలో స్పష్టత వస్తుంది. – మంగళపుడి వెంకటేశ్వర్లు, జలవనరులశాఖ ఎస్ఈ -
హై సెక్యూరిటీ తప్పనిసరి!
● పాత వాహనాలకు కొత్త నంబర్ ప్లేట్లు ● ఈనెల 30వ తేదీ వరకు గడువు ● అవగాహన కల్పించడంలో అధికారుల వెనుకంజఖమ్మంక్రైం: పాత వాహనాలకు హైసెక్యూరిటీ (రిజిస్ట్రేషన్)నంబర్ ప్లేట్లను తప్పనిసరి చేస్తూ రవాణాశాఖ కొద్ది నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందు తయారైన వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు(హెచ్ఎస్ఆర్పీ) అమర్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఈనెల 30 గడువుగా ప్రకటించినప్పటికీ రవాణాశాఖ ఆధ్వర్యాన వాహనదారులకు అవగాహన కల్పించడంలో చొరవ చూపకపోవడం గమనార్హం. 2019 మార్చి 31కి ముందు.. అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల(హెచ్ఎస్ఆర్పీ) విధానాన్ని 2014 ఏప్రిల్ 18లో అమల్లోకి తీసుకొచ్చారు. ఆపై రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు నంబర్ ప్లేట్లు బిగించే బాధ్యత ఏజెన్సీలకు అప్పగించారు. కానీ 2019నుంచి అక్టోబర్ 19 నుంచి వాహనం కొనుగోలు చేశాక ఏజెన్సీ బాధ్యులు లేదా డీలర్ల వద్ద నంబర్ ప్లేట్లు బిగిస్తున్నారు. అయితే, 2019 మార్చి 31 వరకు(15ఏళ్లు నిండినవి) జిల్లాలో 1,40,589 వాహనాలు రిజిస్ట్రేషన్ అయినట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఇందులో ఖమ్మంలో రవాణా శాఖ యూనిట్ పరిధిలో 1,31,975, సత్తుపల్లిలో 4,783, వైరా రవాణా శాఖ కార్యాలయ పరిధిలో 3,831 వాహనాలు ఉన్నాయి. వీటిలో 1,24,496 ద్విచక్రవాహనాలు, 6,655 మోటారు కార్లు, 3,492 వ్యవసాయ వాహనాలతో ఇతరత్రా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవీ ప్రయోజనాలు వాహనాలకు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ బిగించడం వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ప్లేట్ చివరన ఉండే లేజర్ కోడ్ ద్వారా వాహనదారుడి పేరు, ఇతర వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాక వాహనం ధ్వంసమై నంబర్ ప్లేట్ మాత్రమే మిగిలినా పూర్తి వివరాల గుర్తింపునకు అవకాశముంటుంది. స్పష్టత ఏదీ? పదిహేనేళ్లు దాటిన వాహనాలన్నింటికీ ఈనెల 30వ తేదీలోగాహైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ అమర్చుకోవాలని ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలుస్తోంది. గడువులోగా బిగించుకోకపోతే జరిమానా తప్పదని చెబుతున్నారు. కానీ గడువు సమీపిస్తున్నా రవాణా శాఖ అధికారులు వాహనదారులకు అవగాహన కల్పించడంలో పెద్దగా చొరవ తీసుకోకపోవడం గమనార్హం. ఇదేమిటని ఆరా తీస్తే ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి సరైన ఉత్తర్వులు అందలేదని సెలవిస్తున్నారు. దీంతో హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు బిగించుకోవాలా, తప్పనిసరేం కాదా అన్న విషయమై వాహనదారులకు స్పష్టత రావడం లేదు. -
జీపీఓలతో రెవెన్యూ
జిల్లాలో జీపీఓ(గ్రామ పాలనాధికారులు)ల నియామకంతో గ్రామస్థాయి రెవెన్యూ పాలన కొత్తరూపు సంతరించుకోనుంది. గతంలో వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి.. వారిని వివిధ శాఖల్లో భర్తీ చేశారు. అందులో ఆసక్తి ఉన్న వారిని ప్రస్తుతం జీపీఓలుగా నియమించారు. దీంతో మరోసారి పాత విధులు నిర్వర్తించేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో 380 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. వీటిని 299 క్లస్టర్లుగా విభజించారు. చిన్న క్లస్టర్లు అయితే రెండేసి, పెద్ద క్లస్టర్ అయితే ఒక్కో క్లస్టర్కు ఒక జీపీఓకు పోస్టింగ్ ఇచ్చేలా బుధవారం కలెక్టరేట్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మంకొత్త స్థానాల్లోకి పూర్వ వీఆర్ఓ, వీఆర్ఏలు ● వీరి నియామకంతో గ్రామపాలనకు పూర్వవైభవం ● క్లస్టర్ల వారీగా 252 మందికి నేడు కౌన్సెలింగ్, పోస్టింగ్ అవినీతికి కారణమని.. గ్రామస్థాయిలో సమస్యలు వస్తున్నాయని, రెవెన్యూ శాఖలో అవినీతి కారణంగా ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోందనే కారణంతో 2020లో గత ప్రభుత్వం వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థలను రద్దు చేసింది. ఇక వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయడంతో గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ లేకుండా పోయింది. దీంతో ఏ చిన్నసమస్య వచ్చినా తహసీల్దార్ కార్యాలయాలకే పరిగెత్తాల్సి వచ్చింది. జీపీఓలుగా నియామకం ఐదేళ్లుగా గ్రామస్థాయిలో రెవెన్యూ అధికారులు లేక పనులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలనే సంకల్పంతో జీపీఓ(గ్రామపాలనాధికారులు)ల నియామకానికి నిర్ణయించింది. గతంలో వీఆర్ఓ, వీఆర్ఏలుగా పనిచేసిన వారిలో ఆసక్తి ఉన్న వారికే జీపీఓలుగా అవకాశం కల్పించారు. ఇందుకోసం పరీక్ష నిర్వహించాక నియామకాలు చేపడుతుండడంతో మళ్లీ గ్రామస్థాయిలో రెవెన్యూ సేవలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలో 252 మందికి అవకాశం జిల్లాలోని 21 మండలాల పరిధిలో 380 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటిని 299 క్లస్టర్లుగా విభజించగా 252 మంది జీపీఓలను నియమించారు. ఇటీవల అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి పరీక్షలో ఉత్తీర్ణులైన గ్రామపాలనాధికారులతో సమావేశమై నిర్వర్తించాల్సిన విధులు, ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే ఆప్షన్ ఫారాలు స్వీకరించిన నేపథ్యాన బుధవారం కలెక్టరేట్లో సమావేశ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. స్పౌజ్, పీహెచ్సీ, మెడికల్ సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం పోస్టింగ్ ఇస్తారు. అయితే, 299 క్లస్టర్లకు 252 మంది జీపీఓలే ఉన్నారు. దీంతో రెండేసి చిన్న కస్లర్ల బాధ్యత ఒకరికి అప్పగించనున్నారు. గ్రామస్థాయిలో జీపీఓలదే బాధ్యత గతంలో గ్రామీణ ప్రాంతం నుంచి సీసీఎల్ఏ వరకు రెవెన్యూ వ్యవస్థ పటిష్టంగా ఉండేది. అదేస్థాయిలో మరోసారి రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేసేలా ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో పనిచేసిన వీఆర్ఓలకే ప్రభుత్వం జీపీఓలుగా బాధ్యతలు అప్పగిస్తోంది. వీరి నియామకంతో గ్రామస్థాయిలో భూ సమస్యలకు పరిష్కారం సులువవుతుందని భావిస్తున్నారు. జీపీఓలు భూ రికార్డుల నిర్వహణతోపాటు వివిధ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి ప్రాథమిక నివేదిక ఇస్తారు. ప్రకృతి వైపరీత్యాల సమయాన ప్రభుత్వం తరఫున ప్రజలకు అండగా నిలుస్తారు. ఎన్నికల సందర్భంగా బీఎల్ఓలుగా వ్యవహరిస్తారు. ఓటర్ల జాబితా తయారీలో కీలకంగా పనిచేస్తారు. సంక్షేమ ఫలాలు అమలు చేసేందుకు నివేదికలు అందిస్తారు.గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ లేక పలు సమస్యలు పేరుకుపోయి ఇటు ప్రజలు., అటు అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యార్థుల సర్టిఫికెట్లు మొదలు భూసమస్యల పరిష్కారం వరకు తహసీల్దార్ కార్యాలయాలే దిక్కయ్యాయి. అన్ని సమస్యల పరిష్కారంలో కీలకమైన రెవెన్యూ వ్యవస్థ గ్రామస్థాయిలో నిర్వీర్యం కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. -
డిప్యూటీ సీఎం సమక్షాన కాంగ్రెస్లో చేరిక
బోనకల్: బోనకల్లో బీఆర్ఎస్కు చెందిన 70 కుటుంబాలు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సమక్షాన కాంగ్రెస్లో చేరాయి. హై దరాబాద్లోని గాంధీభవన్లో సోమవారం వీరికి భట్టి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువు రు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో మాజీ సర్పంచ్, సొసైటీ అధ్యక్షు డు చావా వెంకటేశ్వరావుతో పాటు పోటు వెంకటేశ్వర్లు, మందా హైమావతి, మోర్ల మహేశ్వరావు, మంద రమణ, టేకులపల్లి సాంబయ్య, మరీదు నరసింహారావు తదితరులు ఉండగా మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరావు, నా యకులు బందం శ్రీను, పైడిపల్లి కిశోర్, గాలి దుర్గారావు, పిల్లలమర్రి నాగేశ్వరావు, సుబ్బారావు, భద్రూనాయక్ పాల్గొన్నారు.రేపు జాబ్ మేళాఖమ్మం రాపర్తినగర్: రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో నియామకాలకు ఈనెల 10వ తేదీన జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్సనశాఖ అధికారి కొండపల్లి శ్రీరాం తెలిపారు. రిలేషన్ షిప్ మేనేజర్ పోస్టులకు 18–45 ఏళ్ల వయస్సు కలిగిన అర్హులని వెల్లడించారు. అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్లతో ఖమ్మం గాంధీచౌక్లోని రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.నేడు వాహనాల వేలంఖమ్మంక్రైం: వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఆటోలు, ద్విచక్ర వాహనాలను మంగళవారం వేలం వేయనున్నట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. ఖమ్మంలోని ఎకై ్సజ్ స్టేషన్–1 ఆవరణలో ఉదయం 11గంటలకు వేలం మొదలవుతుందని, ఆసక్తి ఉన్న వారు ధరావత్తు రుసుము చెల్లించి పాల్గొనాలని సూచించారు. వాహనం దక్కించుకుంటే మొత్తం సొమ్మును జీఎస్టీతో సహా వెంటనే చెల్లించాల్సి ఉంటుందని, లేనిపక్షంలో ధరావత్తు జప్తు చేస్తామని తెలిపారు.వెయిట్ లిఫ్టింగ్ టోర్నీలో సత్తాఖమ్మం స్పోర్ట్స్/ఖమ్మంఅర్బన్: ఖేలో ఇండి యా లీగ్ పోటీల్లో భాగంగా రాష్ట్రస్థాయిలో జరి గిన మహిళల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఖమ్మంకు చెందిన ఎ.టోనిశ్రీ ప్రథమస్థానంలో నిలిచి బంగారు పతకం దక్కించుకుంది. మహిళల 53 కేజీల కేటగిరీలో పాల్గొన్న ఆమె స్నాచ్లో 53, క్లీన్ అండ్ జర్క్లో 65 కేజీలు కలిపి 118 కేజీల బరువు ఎత్తడంతో ప్రథమస్థానంలో నిలి చింది. ఈ సందర్భంగా జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న టోనిశ్రీని వెయిట్ లిప్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శివగణేష్, డి.వినోద్కుమార్, కార్పొరేటర్ దొంగల సత్యనారాయణతో పాటు బాజిని వీరయ్య, తిరుపతిరావు, వినోద్కుమార్, నాగరాజు, సిద్ధార్థ, ప్రశాంత్, విప్లవ్, ఉదయ్, సుమతి తదితరులు అభినందించారు.పట్టు పురుగుల పెంపకం పరిశీలనఖమ్మంవ్యవసాయం: వైరా మండలం గొల్లపూ డి, రెబ్బవరం గ్రామాల 30 మంది రైతులు విజ్ఞా న యాత్రలో భాగంగా సోమవారం మెదక్ జిల్లా తలకొండపల్లి మండలం కోరింతకుంటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ గ్రామంలో పలువురు రైతుల పట్టు పురుగుల కేంద్రాలను పరిశీలించారు. రేరింగ్ షెడ్, మల్బరీ సాగు, పట్టు పురుగుల పెంపకాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. పట్టు పరిశ్రమ ఉప సంచాలకులు ముత్యాలు, అధికారులు, రైతులు కామేశ్వరరావు, దేవరాజు, ఎం.లాల్, రవీందర్, రమేష్, శంకర్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డెడ్లైన్ పెట్టుకుంటేనే వేగం
● వచ్చే జూన్లోగా రిటైనింగ్ వాల్ పూర్తి ● కేబుల్ బ్రిడ్జి పనులపై ప్రత్యేక దృష్టి ● అధికారులతో సమీక్షించిన మంత్రి తుమ్మల సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రతీ అభివృద్ధి పని పూర్తికి లక్ష్యం నిర్దేశించుకుని వేగం పెంచాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్రెడ్డితో కలసి మున్నేరు రిటైనింగ్ వాల్, కేబుల్ బ్రిడ్జి, ఖిలా రోప్వే పనుల పురోగతిపై సమీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మున్నేటి ముంపు నుంచి రక్షించేలా రూ.690 కోట్లతో ఇరువైపులా 17 కి.మీ. మేర నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ ఇప్పటికే 6.4 కి.మీ. పూర్తయిందని తెలిపారు. ఇంకా అవసరమైన భూసేకరణ చేపట్టి వచ్చే జూన్లోపే నిర్మాణం పూర్తిచేయాలని సూచించారు. చకచకా కేబుల్ బ్రిడ్జి కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని మంత్రి తెలిపారు. రూ.180 కోట్లతో చేపడుతున్న నిర్మాణం 53 శాతం పూర్తయిందని, వచ్చే మే నెలాఖరుకు అందుబాటులోకి రావాలని సూచించారు. అలాగే, ఖమ్మం ఖిలాపైకి రోప్ వే కోసం భూసేకరణ పూర్తికాగా, రూ.29 కోట్లతో చేపట్టే పనులు ప్రారంభించి వచ్చే జూలై నాటికి పూర్తి చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్యకు చెక్ ఖమ్మం నగరం చుట్టూ హైవేల నిర్మాణంతో ట్రాఫిక్ ఇక్కట్లు తీరతాయని మంత్రి తుమ్మల తెలిపారు. ఖమ్మం–దేవరపల్లి జాతీయ రహదారిపై ధంసలాపురం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి, మున్నేటిపై బ్రిడ్జి పనులు జరుగుతున్నాయన్నారు. జనవరిలోగా అందుబాటులోకి వచ్చే ఈ హైవే పైనుంచే కోల్కతా, ఒడిశా, ఏపీలోని సగభాగం ప్రాంతాలకు ఖమ్మం మీదుగానే రాకపోకలు ఉంటాయన్నారు. అంతేకాక ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య ఉండదని చెప్పారు. ఆ తర్వాత అభివృద్ధి పనుల ఫొటో ఎగ్జిబిషన్ను మంత్రి పరిశీలించారు. ఇరిగేషన్, ఆర్అండ్బీ ఎస్ఈలు ఎం.వెంకటేశ్వర్లు, యాకోబ్, ఆర్డీఓ నర్సింహారావు, జిల్లా టూరిజం అధికారి సుమన్ చక్రవర్తితో పాటు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
తీరని యూరియా కష్టాలు
నేలకొండపల్లి/బోనకల్/కూసుమంచి: రోజులు గడుస్తున్నా యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు తీరడం లేదు. నేలకొండపల్లి రైతు వేదిక వద్ద సోమవారం సొసైటీ ఆధ్వర్యాన యూరియా పంపిణీ చేయడంతో రైతులు భారీగా వచ్చారు. పట్టాదారు పాసు పుస్తకాలు జిరాక్స్లను క్యూలో పెట్టగా.. ఏఓ ఎం.రాధ కూపన్లు జారీ మొదలుపెట్టారు. ఇంతలోనే తోపులాట జరగడంతో మహిళా రైతు కె.మల్లమ్మకు ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆపై గ్రామాల వారీగా కౌంటర్లు ఏర్పాటుచేసి, స్టాక్ ఉన్న యూరియాకు తోడు త్వరలో వచ్చే స్టాక్కు కూడా కూపన్లు జారీ చేశారు. ఇక బోనకల్ మండలం మోటమర్రి పీఏసీఎస్లో 230 బస్తాల యూరియా రాగా, 400 మంది రైతులు కేంద్రం తెరవక ముందే చేరుకున్నారు. దీంతో ఒక్కొక్కరికి ఒకే బస్తా ఇచ్చినా చాలా మంది నిరాశగా వెనుదిరిగారు. కాగా, కూసుమంచి మండలంలోని కల్లూరుగూడెం, చేగొమ్మ, జక్కేపల్లి పీఏసీఎస్లతో పాటు 14 సబ్సెంటర్ల ద్వారా యూరియా పంపిణీ చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. ఒక్కో సెంటర్కు 110 బస్తాలే కేటాయించడంతో పెద్దసంఖ్యలో రైతులు చేరుకోగా పట్టాదారు పాసుపుస్తకాల ఆధారంగా పోలీసు బందోబస్తు నడుమ కూపన్లు జారీ చేసి యూరియా పంపిణీ చేశారు. ఈక్రమాన తోపులాట జరిగింది. తహసీల్దార్ రవికుమార్, ఏడీఏ సతీష్, ఎంపీడీఓ రాంచందర్రావు, ఏఓ వాణి తదితరులు పర్యవేక్షించారు. -
తెలంగాణ తెలుగు.. వెలుగు!
● ప్రత్యేక రాష్ట్రంలో భాషకు ప్రాధాన్యత ● ఉమ్మడి జిల్లాలో ప్రత్యేకంగా సమ్మిళిత మాండలికం నేడు తెలంగాణా భాషా దినోత్సవంఖమ్మంగాంధీచౌక్: భాషా చైతన్యాన్ని ప్రోత్సహించడం, పెంపొందించడమే లక్ష్యంగా ప్రాంతాలు, ప్రాంతీయత వారీగా భాషా దినోత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే తెలంగాణ ఏర్పడ్డాక 2014 నుంచి ఏటా తెలంగాణ భాషా దినోత్సవాన్ని సెప్టెంబర్ 9న నిర్వహిస్తున్నారు. ప్రముఖ రచయిత, స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని ఈ తేదీని ఖరారు చేశారు. ఈమేరకు నేడు(మంగళవారం) తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా కథనం. అంతులేని ప్రేమ ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరింనోడే నాకు ఆరాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు. అందుకే ఆయనను తెలంగాణ తొలిపొద్దుగా కీర్తిస్తారు. తెలంగాణ భాషపై అంతులేని ప్రేమ కనబరిచిన ఆయన పండితుల భాషలో కాకుండా సామాన్యుల భాషలోనే రచనలు చేశారు. ఫలితంగా జనం గోడుకు ఆయన కలం గొంతుకగా మారింది. మాండలికాలు వేరు తెలుగు భాష ఒక్కటే అయినా మాండలికాలు అనేకం ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణ భాషలో వ్యత్యాసాలు కనిపిస్తాయి. నిజాం పాలనలో ఉర్దూ కలగలిసిన తెలంగాణ ప్రజల యాసను కొందరు గేలి చేసేవారు. దీన్ని తెలంగాణ సాహితీవేత్తలు తీవ్రంగా విమర్శించగా.. అందులో అగ్రభాగాన కాళోజీ నిలిచారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన తెలుగు భాష, తెలంగాణ యాసపై తనదైన ముద్ర వేశారు. కాగా, తెలుగు భాషలో తెలంగాణ యాస ప్రత్యేకంగా నిలుస్తుండగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక మరింత ప్రాధాన్యత పెరిగింది. ఈ యాసకు ఉన్న ప్రత్యేక శైలితో ప్రాచుర్యం పొందింది. నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమైనా, ప్రత్యేక తెలంగాణ పోరాటమైనా ప్రజలను మేల్కొల్పింది, కదన రంగంలోకి దూకించింది తెలంగాణ భాషే అన్నది సుస్పష్టం. ఇక సినిమాల్లోనూ ఈ యాసకు ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. పలువురు నటులు ఈ యాసలో డైలాగ్లతో సినిమాలను రక్తి కట్టించారు. ఇక్కడ రెండు యాసలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలుగు భాష, యాస సమ్మిళితంగా ఉంటుంది. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దుగా ఉండడంతో రాకపోకలు పెరగడంతో ప్రజల మాటల్లో యాస కలగలిపి కనిపిస్తుంది. ఇదే సమయాన సింగరేణి, తదితర పరిశ్రమల్లో పనిచేసేందుకు ఉత్తర తెలంగాణ వేలాది మంది వచ్చి ఇక్కడ స్థిరపడడంతో తెలంగాణ యాసకు ఏ మాత్రం ప్రాధాన్యత తగ్గలేదు.తెలుగు భాషలో అనేక యాసలు ఉన్నాయి. ఇందులో తెలంగాణ యాసకు ప్రత్యేకత ఉంది. జిల్లా కవి చందాల కేశవదాసు సినిమా పాటల కవిగా నిలిచా రు. హీరాలాల్, దాశరథి సోదరులు, కౌముది, షో యబుల్లాఖాన్. ఎందరో భాషాభ్యున్నతికి కృషి చేశారు.– పొన్నెకంటి స్వప్న, తెలుగు అధ్యాపకురాలు తెలంగాణ భాషా సౌరభం ఉమ్మడి జిల్లాలో వ్యాప్తి చెందింది. రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ యాస, మాండలికంలో పుస్తకాలు వచ్చాయి. పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు పరిచయం చేయడం ఆనందంగా ఉంది. ప్రధానంగా కాళోజీ రచనలు ఆదర్శప్రాయం. – సయ్యద్ షఫీ, తెలుగు ఉపాధ్యాయుడు -
2,250 ఎకరాల్లో బొప్పాయి సాగు
కామేపల్లి: ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 2,250 ఎకరాల్లో బొప్పాయి పంట సాగవుతోందని జిల్లా ఉద్యాన అధికారి మధుసూదన్ తెలిపారు. వైరా డివిజన్ ఉద్యాన అధికారి ఆకుల వేణుతో కలిసి ఆయన సోమవారం మండలంలో పర్యటించారు. తాళ్లగూడెం తదితర గ్రామాల్లో సాగవుతున్న బొప్పాయి పంటను పరిశీలించి చీడపీడల నివారణపై సూచనలు చేశారు. బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా వాసుదేవరావుఖమ్మం మామిళ్లగూడెం: బీజేపీ రాష్ట్ర నూతన కమిటీని సోమవారం ప్రకటించగా ఖమ్మంకు చెందిన నాయకుడు దేవకి వాసుదేవరావుకు స్థానం దక్కింది. ఆయనను రాష్ట్ర కోశాధికారిగా నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తదితరులు వాసుదేవరావును అభినందించారు. -
ఫిర్యాదులు పెండింగ్ ఉండొద్దు
గ్రీవెన్స్ డేలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఖమ్మం సహకారనగర్: ప్రజావాణిలో ప్రజలు ఇచ్చే ఏ ఫిర్యాదును కూడా పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమావేశమై పరిశీలన, పరిష్కారంపై సూచనలు చేశారు. డీఆర్వో పద్మశ్రీ, ఏఓ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పకడ్బందీగా అమలు చేయాలి ఖమ్మంవైద్యవిభాగం: స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన ఏర్పాటైన జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీతో కలెక్టరేట్లో సోమవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 17నుంచి అక్టోబర్ 2వరకు స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్లో భాగంగా మహిళలకు పరిశుభ్రత, పౌష్టికాహారం, ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యాసంస్థల్లోనూ క్యాంపులు నిర్వహించిన అవసరమైన వారికి వైద్య పరీక్షలు చేయాలన్నారు. డీఆర్ఓఏ పద్మశ్రీ, డీఎంహెచ్ఓ కళావతిబాయి తదితరులు పాల్గొన్నారు. -
సబ్సిడీపై వ్యవసాయ యంత్రాల పంపిణీ
ఖమ్మంవ్యవసాయం: ‘సాగు యంత్రాలు అందించండి’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. యంత్ర పరికరాలకు నిధులు మంజూరైనా పథకం అమలులో కాలయాపనతో రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని కథనంలో వెల్లడించగా అధికారులు రంగంలోకి దిగారు. యంత్ర పరికరాల పంపిణీ కోసం కలెక్టర్ అనుమతి తీసుకున్నారు. సన్న, చిన్నకారు ఎస్సీ, ఎస్టీ, ఇతర రైతులకు 50 శాతం, పెద్ద రైతులకు 40 శాతం సబ్సిడీపై యంత్రాలు అందించనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. ఇవీ మార్గదర్శకాలు స్ప్రేయర్లు, రోటోవేటర్లు, పవర్ టిల్లర్లు, గడ్డి కట్టే తదితర యంత్రాలు అందించనుండగా, జిల్లాకు రూ.4,37,97,000 నిధులను ప్రభుత్వం కేటాయించిందని డీఏఓ పేర్కొన్నారు. కలెక్టర్ అనుమతితో నియోజకవర్గాల వారీగా కేటాయించిన బడ్జెట్ ఆధారంగా పనిముట్ల పంపిణీకి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుండగా, రైతులు ఏఈఓలు, ఏఓలను సంప్రదించాలని సూచించారు. పథకం అమలుకు మండల స్థాయిలో ఏర్పాటుచేసిన కమిటీకి కన్వీనర్గా మండల వ్యవసాయాధికారి, సభ్యులుగా తహసీల్దార్, ఎంపీడీఓ వ్యవహరిస్తారని తెలిపారు. ఇక జిల్లా కమిటీ చైర్మన్గా కలెక్టర్, కన్వీనర్గా జిల్లా వ్యవసాయాధికారి, సభ్యులుగా ఆగ్రోస్ రీజినల్ మేనేజర్, డాట్ సైంటిస్ట్, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఉంటారని చెప్పారు. బ్యాటరీ చేతిపంపులపై రూ.వేయి, పవర్ స్ప్రేయర్లకు రూ.10వేలు, రోటోవేటర్కు రూ.50వేలు, విత్తన, ఎరువులు వేసే యంత్రానికి రూ.30వేలు, కల్టివేటర్లు, ఎంబీ ప్లౌ, దమ్ము చక్రాలు, డిస్క్ హరోలకు రూ.30వేలు, బండ్ ఫార్మర్కు రూ.1.50లక్షలు, పవర్ వీడర్, బ్రష్ కట్టర్లకు రూ.35వేలు, పవర్ టిల్లర్కు రూ.లక్ష, మొక్కజొన్న కోత యంత్రాలు, గడ్డికట్టే యంత్రాలకురూ.రూ.లక్ష సబ్సిడీ ఉంటుందని డీఏఓ పుల్లయ్య ఓ ప్రకటనలో తెలిపారు. -
పెద్దాస్పత్రి కిటకిట
ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కిటకిటలాడింది. వరుసగా మూడు రోజుల సెలవులు రావడంతో సోమవారం వివిధ ప్రాంతాల ప్రజలు ఉదయం 8గంటల నుంచే క్యూ కట్టారు. దీంతో ఓపీ వద్ద భారీ క్యూలైన్ ఏర్పడగా చీటీ తీసుకునేందుకు గంటల సమయం పట్టింది. అలాగే, పలు విభాగాలు మధ్యాహ్నం వరకు కిక్కిరిసి కనిపించాయి. ఈక్రమాన కూర్చునే స్థలం లేక వృద్ధులు ఇబ్బంది పడ్డారు. ఇటీవల వర్షాలతో నీరు నిలిచి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతుండడంతో జిల్లా నలుమూలల నుండే కాకుండా చుట్టు పక్కల జిల్లాల జనం సైతం జిల్లా ఆస్పత్రికి వస్తున్నారు. సోమవారం ఒకేరోజు పెద్దాస్పత్రిలో 2,200 – 2,400 మంది వైద్య సేవలు పొందారని అధికారులు తెలిపారు.– ఖమ్మం వైద్యవిభాగం -
పత్తి దిగుమతిపై సుంకం రద్దు సరికాదు..
ఖమ్మంమయూరిసెంటర్: కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతిపై 11 శాతం సుంకాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయని వామపక్ష రైతు సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో వివిధ సంఘాల నాయకులు మలీదు నాగేశ్వరరావు, కొల్లేటి నాగేశ్వరరావు, దొండపాటి రమేష్, మాదినేని రమేష్ మాట్లాడారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఈనెల 10న ఖమ్మంలో రైతాంగ సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈసదస్సులో రైతులు, మేధావులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కాగా, రైతాంగానికి సరిపడా యూరియాను కేంద్రం సరఫరా చేయాలని, రాష్ట్రంలో నష్టపోయిన పంటలపై సర్వే చేయించాలని డిమాండ్ చేశారు. -
రైతులు ఇబ్బంది పడొద్దని అదనపు కౌంటర్లు
కామేపల్లి: రైతులు యూరియా కోసం ఇబ్బంది పడకుండా రైతు వేదికల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య తెలిపారు. కామేపల్లి మండలం పొన్నేకల్ రైతు వేదికలో ఏర్పాటు చేసిన సేల్ కౌంటర్లను సోమవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. అయితే, రైతులు పరిమితి మేరకే యూ రియాను దఫాదఫాలుగా వాడాలని సూచించారు. ఇదే సమయాన నానో యూరియా, నానో డీఏపీపై లాభాలను గ్రహించాలని తెలిపారు. అలాగే, కొండాయిగూడెం సొసైటీలో యూ రియా పంపిణీని ఏడీఏ కొంగర వెంకటేశ్వరరా వు పరిశీలించారు. కొండాయిగూడెం పీఏసీఎస్ చైర్మన్ ధనియాకుల హన్మంతరావు, సీఈఓ దొడ్డా ముత్తయ్య, ఏఓ తారాదేవి, ఏఈఓలు ఉష, శ్రీకన్య, దీపక్రెడ్డి, జగదీశ్వర్, భాస్కర్, రవికుమార్, గాదె నాగయ్య పాల్గొన్నారు. -
కేంద్రం దయ.. మన ప్రాప్తం
సాక్షిప్రతినిది, ఖమ్మం: ఉమ్మడి జిల్లాలో కేంద్రం చేయూతతో జరగాల్సిన పనుల్లో ముందడుగు పడడం లేదు. గత ఏడాది భారీ వరదలతో ఉమ్మడి జిల్లాలో పంటలకు అపార నష్టం వాటిల్లింది. రూ.వందల కోట్ల మేర రైతులు నష్టపోయి ఏడాది దాటినా సర్వేతోనే సరిపెట్టారు తప్ప రూపాయి సాయం కూడా ఇవ్వలేదు. అలాగే కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు, క్రూడ్ పామాయిల్పై సుంకాల తగ్గింపు, ధన ధాన్య యోజనలో భద్రాద్రి జిల్లాకు స్థానం, రఘునాథపాలెం మండలంలో ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటుకు నిధులు, సరిపడా యూరియా కేటాయింపులోనూ రిక్తహస్తమే ఎదురవుతోంది. ఈ అంశాలపై ఇటీవల ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు అందజేశారు. యూరియా మంటలు కేంద్రం నుంచి తగిన రీతిలో యూరియా సరఫరా కాక కొరత ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా పంపిణీ కేంద్రాల వద్ద బారులు దీరిన రైతులే కనిపిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది వానాకాలంలో 54,825 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే 27,865 మెట్రిక్ టన్నులు పంపాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులోనూ 22,653 మెట్రిక్ టన్నులే చేరింది. సెప్టెంబర్కు సంబంధించి 5,212 మెట్రిక్ టన్నుల కోటా రావాలి. భద్రాద్రి జిల్లాకు ఈ నెలలో 10,014 మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా 2,600 మెట్రిక్ టన్నులు చేరడంతో కొరత ఎదురవుతోంది. ఇంకా 6,677 మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంది. ఈ క్రమాన మంత్రి తుమ్మల ఇటీవల కేంద్ర మంత్రులను కలిసి సరిపడా యూరియా కేటాయించాలని, నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం, సల్ఫర్పై ఇచ్చే రాయితీలు పెంచాలని కోరారు. ఎస్టీపీకి నిధులివ్వరూ.. రఘునాథపాలెం బ్లాక్లోని గిరిజన తండాల్లో సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేక వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు రూ.110 కోట్ల అంచనా వ్యయంతో సిమెంట్ కాంక్రీట్ డ్రెయినేజీ నెట్వర్క్ కోసం డీపీఆర్ సిద్ధం చేశారు. వ్యర్థ జలాలను శుద్ధి చేసి మున్నేటికి వదిలేలా ప్రాజెక్టును రూపొందించారు. దీనికి ఆమోదం లభిస్తే రఘునాథపాలెంలోని 37 ఆవాసాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడనున్నందున గ్రామీణ రహదారి కనెక్టివిటీ ప్రోగ్రామ్ కింద కేంద్రం ఆమోదించాలని ప్రతిపాదించారు. ఎయిర్పోర్ట్పై మరోసారి.. కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేశాక ప్రతిపాదిత ప్రాంతం ఆచరణీయం కాదని తేల్చారు. కానీ భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయానికి భక్తులు, కొత్తగూడెంలోని పరిశ్రమలకు వచ్చివెళ్లే వారి కోసం ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు తప్పనిసరి. ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి, మరోసారి అధ్యయనం చేశాకే విమానాశ్రయం ఏర్పాటుకు అడుగులు పడనున్నందున కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. ఆయిల్పామ్ రైతులకు ఎదురుదెబ్బ ఉమ్మడి జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా ఆయిల్పామ్ సాగవుతోంది. ఈ క్రమాన కేంద్రం పామాయిల్పై దిగుమతి సుంకాన్ని 27.5 శాతం నుంచి 16.5 శాతానికి తగ్గించింది. గతంలో దిగుమతి సుంకం దాదాపు 44 శాతం ఉండడంతో రైతులకు గిట్టుబాటు ధర దక్కింది. కానీ ఇప్పుడు సుంకం తగ్గించడంతో రైతులపై ప్రభావం పడనుంది. రైతులను ఆదుకునేలా కేంద్రం స్పందించి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సి ఉంది. భద్రాద్రి జిల్లాకు అర్హత లేదా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని రకాల పంటలు కలిపి 7లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. ఈ జిల్లా అంతా ఏజెన్సీ, దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో వర్షాధారంగానే సాగు చేస్తారు. చెరువులు, ఇతర నీటి వనరుల ఆధారంగా వరి, తరి పంటలను సాగు చేస్తున్నారు. ఈ వానాకాలం భద్రాద్రి జిల్లాలో వరి 1,61,257.24 ఎకరాల్లో, పత్తి 2,21,344.76 ఎకరాల్లో, మొక్కజొన్న 96,842 ఎకరాల్లో, కందులు 1,881ఎకరాల్లో సాగు చేశారు. రైతులకు అండగా నిలిచేలా పంట వైవిధ్యీకరణ, నీటిపారుదల, రైతుల సమిష్టీకరణకు మద్దతు అవసరం. ఇందులో భాగంగా జిల్లాను కేంద్రం అమలుచేస్తున్న ధన ధాన్య కృషి యోజన పథకం కింద చేరిస్తే రైతుల సంక్షేమంతోపాటు స్థానికంగా జీవనోపాధి మెరుగవుతుంది. దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ఈ పథకం అమలు చేస్తున్నందున భద్రాద్రి జిల్లానూ చేర్చాలని వినతులు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో మున్నేరు వరదతో పరీవాహక ప్రాంతాలైన ఖమ్మం నగరం, పాలేరు, మధిర నియోజకవర్గాల్లోని ప్రజలకు అపార నష్టం కలిగింది. అధికారులు చేపట్టిన సర్వేలో దాదాపు రూ.339 కోట్ల మేర నష్టం వాటిల్లిందని నిర్ధారించి కేంద్రానికి నివేదిక సమర్పించారు. ఆ తర్వాత ఢిల్లీ బృందం కూడా తమ పర్యటనలో ఇక్కడి పరిస్థితులు చూసి చలించిపోయారు. సాయం అందేలా సిఫారసు చేస్తామని బాధితులకు హామీ ఇచ్చినప్పటికీ ఏడాది దాటినా ఆ ఊసే లేదు. గతేడాది వరదలపై సర్వేతోనే సరి -
నేడు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండలంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మంగళవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎర్రుపాలెం, పెద్దగోపవరం, బుచ్చిరెడ్డిపాలెం, బనిగండ్లపాడు, అయ్యవారిగూడెంలో నిర్మించే రహదారులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే, బీమవరంలో రూ.12లక్షలతో నిర్మించనున్న అంగన్వాడీ భవన నిర్మాణానికి డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి ఓ ప్రకటనలో కోరారు. నేడు మంత్రి పొంగులేటి పర్యటన ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గంలో మంగళవారం పర్యటించనున్నారు. ఉదయం 10–30 గంటలకు కూసుమంచి మండలం నాయకన్గూడెంలో గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న మంత్రి, ఆతర్వాత నరసింహులగూడెం, కిష్టాపురం గ్రామంలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో గీతకార్మికులకు కాటమయ్య కిట్లు, కూసుమంచి మండల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, పాలేరు నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీలకు కుట్టుమిషన్లు పంపిణీ చేస్తారు. అలాగే, సాయంత్రం జుజ్జులరావుపేట, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి పెద్దతండాలో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశాక ఖమ్మంరూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందచేయనున్నారు. అనంతరం మంత్రి తెల్దారుపల్లిలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఎన్నికల నిర్వహణకు సహకరించండి ఖమ్మం సహకారనగర్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సజావుగా జరిగేలా అందరూ సహకరించాలని జెడ్పీ సీఈఓ దీక్షారైనా సూచించారు. కలెక్టరేట్లో సోమవారం ఆమె వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇటీవల విడుదల చేసిన ఓటర్ల ముసాయిదా జాబితాపై చర్చించి అభ్యంతరాలను స్వీకరించాక సీఈఓ మాట్లాడారు. అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించాక తుదిజాబితా విడుదల చేస్తామని తెలిపారు. చేపి పిల్లల టెండర్ల గడువు మళ్లీ పొడిగింపు ఖమ్మంవ్యవసాయం: చేపపిల్లల పంపిణీకి ఆశించిన స్థాయిలో టెండర్లు రాకపోవడంతో దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోమారు పొడిగించింది. మత్స్యశాఖ ఆధ్వర్యాన ఆగస్టు 8న నోటిఫికేషన్ జారీ చేసి తొలుత సెప్టెంబర్ 1 వరకు గడువు విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 25 టెండర్లే రావడంతో ఈనెల 8వరకు గడువు విధించారు. అయినా ఫలితం లేక 12వ తేదీ వరకు గడువు పొడిగించారు. జిల్లాలో 3.49 కోట్ల చేప పిల్లల పంపిణీకి తొలుత ముగ్గురు, రెండో విడతలో ఇంకో కాంట్రాక్టరు టెండర్లు దాఖలు చేశారని జిల్లా మత్స్యశాఖ అధికారి శివప్రసాద్ తెలిపారు. జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ ఖమ్మంరూరల్: మండలంలోని పోలేపల్లి కేంద్రియ విద్యాలయం విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో సత్తా చాటారు. పంజాబ్, బెంగళూరు, హైదరాబాద్ రీజియన్లలో నిర్వహించిన పోటీల్లో 48మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈసందర్భంగా రెండేసి బంగారు, రజత పతకాలతో పాటు నాలుగు కాంస్య పతకాలు, రూ.44వేల నగదు బహుమతులు సాధించారని ప్రిన్సిపాల్ కవీంద్రరాయ్ తెలిపారు. బోధన ఎలా సాగుతోంది? బోనకల్: మండలంలోని రావినూతల మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను సోమవారం గురుకులాల ఆర్సీఓ రాంబాబు తనిఖీ చేశారు. ఈసందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన ఆయన బోధన, మెనూ అమలుపై ఆరా తీశారు. ఆతర్వాత పాఠశాలలో మౌలిక వసతులు, డైనింగ్ హాల్, సామగ్రిని పరిశీలించి సూచనలు చేశారు. అయితే, తరగతి గదుల కొరత ఉండడమేకాక డైనింగ్ హాల్ సరిపోక ఆరుబయటే భోజనాలు చేయాల్సి వస్తోందని ఆయనకు వివరించారు. దీంతో సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆర్సీఓ తెలిపారు. -
రెక్కీ చేసి.. సొత్తు ఎత్తుకెళ్తూ
ఖమ్మంక్రైం: జిల్లాలో వివిధ ప్రాంతాలతోపాటు ఖమ్మం వన్టౌన్, టూటౌన్, అర్బన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వివరాలను సోమవారం నగర ఏసీపీ రమణమూర్తి వెల్ల డించారు. ఖమ్మం ముస్తఫానగర్లో కారు డ్రైవర్గా పనిచేస్తూ చోరీలకు పాల్పడుతున్న పాతనేరసుప్తడు చల్లా వెంకటేశ్వర్లు, భద్రాచలం శ్రీరామ్నగర్కు చెందిన దేవనబోయిన మహేష్ అలియాస్ బాతు పలు ప్రాంతాల్లో తిరుగుతూ తాళాలు వేసి ఇళ్లను గుర్తించేవారు. ఆపై రాత్రివేళ చోరీ చేసి ఆ డబ్బుతో మూడు ద్విచక్రవాహనాలు కొనుగోలు చేశారు. వీటిపై తిరుగుతూ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారు. ఖమ్మం నగరంతోపాటు, ఖమ్మం రూరల్, బోనకల్, కామేపల్లి, వేంసూరు, ఏన్కూరు, సత్తుపల్లి, కొత్తగూడెం ప్రాంతాల్లో చోరీ చేయగా, చల్లా వెంకటేశ్వర్లుపై గతంలోనే 15చోరీ కేసులు ఉన్నాయి. జైలు నుంచి విడుదలైనా తీరు మారకపోగా బట్టల షాపులో పనిచేసే మహేష్తో కలిసి చోరీలు మొదలుపెట్టాడు. ఖమ్మం నూతన బస్టాండ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్రవాహనం వెళ్తున్న వీరిని అదుపులోకి తీసుకోవడం చోరీల విషయం బయటపడింది. దీంతో నిందితుల నుంచి రూ.13లక్షల విలువైన 127గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండితో పాటు టీవీ, సౌండ్బాక్స్, మూడు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. తప్పుడు సమాచారంతో ఇక్కట్లు సొత్తు పోగొట్టుకోన్న వారిలో కొందరు అబద్ధపు వివరాలతో ఫిర్యాదు చేస్తున్నారని ఏసీపీ రమణమూర్తి తెలిపారు. రెండు తులాల ఆభరణాలు పది తులాలని, రోల్డ్గోల్డ్ నగలు పోతే నిజమైన నగలుగా ఫిర్యాదు చేస్తుండడంతో రికవరీలో ఇబ్బంది అవుతోందని పేర్కొన్నారు. కాగా, చోరీ అయిన సమయాన ఫిర్యాదు చేసేవారు ఇక నుంచి బిల్లులు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఇటీవల జిల్లా కేంద్రంలో అపార్ట్మెంట్లలో చోరీచేసిన మధ్యప్రదేశ్కు చెందిన ధార్ ముఠాను గుర్తించామని, త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని చెప్పారు. కొన్ని అపార్ట్మెంట్లలో వాచ్మెన్లు లేకపోగా, ఉన్నచోట నిద్రిస్తుండడంతో దొంగలకు పని సులువవుతోందని తెలిపారు. ఈ సమావేశంలో సీసీఎస్ ఏసపీ సర్వర్, సీఐలు కరుణాకర్, బాలకృష్ణ, భానుప్రకాష్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగులదే విజయం!
ఖమ్మం సహకారనగర్: ఎన్నో అడ్డంకులు, ఆటంకాలు, బిల్డర్ల నుంచి పోటీని తట్టుకుని రాజీవ్ స్వగృహ సముదాయాన్ని ఉద్యోగులు దక్కించుకున్నారు. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలో రాజీవ్ స్వగృహ పేరిట అపార్ల్మెంట్లు ఏళ్ల క్రితం నిర్మించగా అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఈ బ్లాక్లను ఉన్నవి ఉన్నట్లు విక్రయించేందుకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించగా ఉద్యోగ సంఘాల ఆధ్వర్యాన కొనుగోలుకు సిద్ధమయ్యారు. తద్వారా సొంతింటి కల వేరుతుందని భావించారు. ఇందుకోసం రూ.87.41కోట్లతో బిడ్ దాఖలు చేయగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సహకార గృహ నిర్మాణ సంఘానికి కేటాయించినట్లు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీ.పీ.గౌతమ్ సోమవారం ప్రకటించారు. సుమారు 9.22 ఎకరాల్లో 576 ఫ్లాట్లు ఉండగా, చదరపు అడుగుకు రూ.1,150 చొప్పున ధరతో బిడ్ దాఖలు చేశారు. తొలుత ఈనెల 6వ తేదీన ఉద్యోగ సంఘాల తరఫున రూ.5కోట్ల ధరావతు చెల్లించారు. అదేరోజు ఓ కాంట్రాక్టర్ కూడా దరఖాస్తు చేయడంతో మీమాంస నెలకొంది. కానీ సదరు కాంట్రాక్టర్ వెనక్కి తగ్గడంతో ఉద్యోగ సంఘాలకే దక్కినట్లయింది. ఈమేరకు సోమవారం రాజీవ్ స్వగృహ ప్రాజెక్ట్ సీఈ భాస్కర్రెడ్డి, ఈఈ నరేందర్రెడ్డి ధ్రువపత్రాన్ని ఉద్యోగ సంఘాల సొసైటీ బాధ్యులకు అందజేశారు. వచ్చే నెల 7వ తేదీలోగా రూ.17 కోట్లు చెల్లించాల్సి ఉండగా... మిగతా మొత్తాన్ని విడతల వారీ చెల్లించేలా నిబంధనల్లో పొందుపరిచారు. ఆందోళన నుంచి ఆనందం ఫ్లాట్లు అసంపూర్తిగా ఉండడంతో బిడ్లో గెలుచుకుని పూర్తిచేస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు. ఇందుకోసం నిర్ణీత ధరతో ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా 250మందికి పైగా ముందుకొచ్చారు. ఈమేరకు ప్రైవేట్ అపార్ట్మెంట్లను పోలినట్లు బ్రోచర్లు ముద్రించగా కొత్త రూపులో ఉండడం.. మున్నేటికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణంతో ముంపు సమస్య ఉండదని భావించిన బిల్డర్లు కూడా ఇటుకన్నేశారు. దీంతో రాజీవ్ స్వగృహ సముదాయం దక్కుతుందా, లేదా అని ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. రాష్ట్రస్థాయిలో ఉద్యోగ సంఘాల నాయకులు బిడ్ వేసిన కాంట్రాక్టర్తో చర్చించగా ఆయన ఉపసంహరించుకోవడంతో సముదాయం ఉద్యోగుల వశమైనట్లయింది. దీంతో సోమవారం స్వగృహ వద్ద బాణసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజీవ్ స్వగృహ విషయంలో సహకరించిన వ్యాపారవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సహకారంతోనే రాజీవ్ స్వగృహ దక్కించుకున్నామని.. తద్వారా ఉద్యోగుల సొంతింటి కల నెరవేరుతోందని చెప్పారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు మధ్య తరగతి ఉద్యోగుల సొంత ఇంటి కలలను నెరవేరుస్తుందని తెలిపారు. హౌస్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు కట్టా కిషోర్, ఈట విజయ్కుమార్, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి కొణిదెన శ్రీనివాస్, టీజీవోస్ అధ్యక్ష, కార్యదర్శులు సత్యనారాయణ, వేలాద్రితో పాటు వెంకన్న, జైపాల్, గంగవరపు బాలకృష్ణ, మల్లెల రవీంద్రప్రసాద్, ప్రభాకరాచారి, లలిత కుమారి, మృదుల, ఆంజనేయులు, సుధాకర్, రుక్మారావు తదితరులు పాల్గొన్నారు. పోలెపల్లిలోని 9.22 ఎకరాల్లో ఎనిమిది టవర్లుగా ఈ సముదాయం నిర్మాణాన్ని చేపట్టారు. ఇక్కడ ఎనిమిది బ్లాక్ల్లో తొమ్మిది అంతస్తులుగా 576 ఫ్లాట్లు నిర్మించారు. చదరపు అడుగుకు ప్రభుత్వానికి రూ.1,150 చెల్లించాల్సి ఉండగా, రూ.2,500 చొప్పున తీసుకుని నిర్మాణం పూర్తిచేసి కేటాయిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గెజిటెడ్, నాన్–గెజిటెడ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు వీటిని కేటాయించాలని ప్రతిపాదించారు. అంతేకాక ఈ సముదాయంలో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, వాకింగ్ ట్రాక్, ఓపెన్ ఎయిర్ థియేటర్ నిర్మించేలా డిజైన్లు సిద్ధం చేశారు. -
పర్యాటక ప్రాంతంగా ‘నీలాద్రి’ అభివృద్ధి
సత్తుపల్లిటౌన్: మధ్యప్రదేశ్లోని భీమ్బెక్కా కొండల తరహాలో నీలాద్రి కొండలపై ప్రాచీన కాలం నాటి గుర్తులు ఉన్నందున పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అటవీ, దేవాదాయ శాఖల మంత్రుల దృష్టికి తీసుకెళ్తామని సీసీఎఫ్ డాక్టర్ డి.భీమానాయక్ వెల్లడించారు. ఖమ్మం డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్తో కలిసి నీలాద్రి కొండపై సుమారు 5 కి.మీ. ట్రెక్కింగ్ చేశాక సత్తుపల్లి మండలం కిష్టారం సెక్షన్, చెరుకుపల్లి బీట్ నర్సరీలను పరిశీలించారు. మొక్కల సంరక్షణ, అటవీ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం చంద్రాయపాలెం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అంతేకాక వీఎస్ఎస్ సభ్యులతోనూ సమావేశమైన సీపీఎఫ్ మాట్లాడారు. నీలాద్రి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ఆర్కియాలజీ శాఖ ఆధ్వర్యాన పరిశోధన జరిపించనున్నట్లు చెప్పారు. వన సంరక్షణ సమితి సభ్యులకు అండగా నిలుస్తూ జీవనోపాధికి అవసరమైన ప్రోత్సాహం ఇస్తామని తెలిపారు. ఇదేసమయాన సభ్యులు అటవీ వనరులు, జీవవైవిధ్యం పరిరక్షణకు పాటపడాలని సూచించారు. కాగా, సత్తుపల్లి అర్బన్ పార్క్లో రూ.20లక్షలతో చేపడుతున్న యోగా షెడ్ నిర్మాణ పనులను డీఎఫ్ఓ సిద్ధార్థ్ పరిశీలించారు. సత్తుపల్లి ఎఫ్డీఓ వాడపల్లి మంజుల, రేంజర్ స్నేహలతతో పాటు డీఆర్ఓలు, ఎఫ్ఎస్ఓలు పాల్గొన్నారు.సీసీఎఫ్ భీమానాయక్ -
ఎంతో మేలంట!
ఇంటి పంట..అంగన్వాడీ కేంద్రాల్లోనే కూరగాయల సాగు ● చిన్నారులు, గర్భిణులకు పోషకాహారం అందించేలా చర్యలు ● కిచెన్ గార్డెన్ల ఏర్పాటుకు నిధులు మంజూరు ఖమ్మంమయూరిసెంటర్ : చిన్నారులు, గర్భిణులకు పోషకాహారం అందించడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ కేంద్రాల్లో అందించే ఆహారంలో వినియోగించే ఆకు కూరలు, కూరగాయలు అక్కడే పండించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కిచెన్ గార్డెన్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసింది. తద్వారా అంగన్వాడీలకు వచ్చే చిన్నారులు, బాలింతలకు నాణ్యమైన, పోషకాహారం అందనుంది. రూ.10 వేల చొప్పున విడుదల.. జిల్లాలో ఎంపిక చేసిన 159 అంగన్వాడీ కేంద్రాల్లో కిచెన్ గార్డెన్ల ఏర్పాటుకు రూ.10వేల చొప్పున నిధులు కేటాయించగా ఆవరణల్లో తోటలు, కుండీల్లో కూరగాయలు, ఆకుకూరలు పెంచనున్నారు. బయట మార్కెట్లపై ఆధారపడకుండా, రసాయన ఎరువులు లేకుండా సేంద్రియ కూరగాయలు పండించడం ద్వారా ఆహార నాణ్యత పెరుగుతుందని అధికారులు అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు పౌష్టికాహార లోపం తీవ్ర సమస్యగా మారింది. ఆయా సెంటర్ల ఆవరణల్లో వంకాయ, బెండ, టమాటా, గోంగూర, తోటకూర, పాలకూర వంటివి పెంచుతుండగా పిల్లలకు అవసరమైన విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు అందించి, శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడనున్నాయి. పిల్లలకూ అవగాహన.. కూరగాయలు, ఆకు కూరల తోటల పెంపకంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలది కీలక పాత్ర. తోటల నిర్వహణలో పిల్లలను కూడా భాగస్వామ్యం చేయడం ద్వారా వారికి వ్యవసాయం, పర్యావరణంపై అవగాహన కల్పించొచ్చు. కూరగాయలు ఎలా పండుతాయి, వాటిని ఎలా సంరక్షించాలి అనే విషయాలు నేరుగా అనుభవం ద్వారా తెలుస్తాయి. ఇది ఒక రకంగా ప్రయోగాత్మక విద్యగా కూడా ఉపయోగపడుతుందని అధికారులు అంటున్నారు. నిధుల వినియోగంపై శిక్షణ.. ఒక్కో అంగన్వాడీ సెంటర్కు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 వేల నిధులు ఎలా వినియోగించాలి, ఏ మొక్కలు నాటాలి, తోటను ఎలా నిర్వహించాలి అనే విషయాలపై టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ నిధులతో విత్తనాలు, కుండీలు, మట్టి, ఇతర పనిముట్ల కొనుగోలుకు వినియోగించాల్సి ఉంటుంది. ఐదేళ్ల పాటు కిచెన్ గార్డెన్లను నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే పటిష్ట పర్యవేక్షణ అవసరమని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.నేలకొండపల్లి: కూరగాయలు, ఆకుకూరల పెంపకానికి పక్కా అంగన్వాడీ భవనాలు, సొంత స్థలాలు, నీటి సరఫరా, ప్రహరీ ఉన్న కేంద్రాలను ఎంపిక చేశారు. ప్రతీ కేంద్రానికి టమాటా, బెండకాయ, వంకాయతో పాటు ఆకుకూరల సాగుకు అవసరమైన విత్తన ప్యాకెట్లను కూడా ప్రభుత్వం సరఫరా చేసింది.అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించేందుకే సొంతంగా కూరగాయల సాగు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జిల్లాలో అన్ని సౌకర్యాలు గల 159 కేంద్రాలను ప్రస్తుతానికి ఎంపిక చేశాం. ఆయా సెంటర్లకు విత్తనాలు ఇప్పటికే పంపిణీ చేయగా నిర్వహణ ఖర్చులు కూడా అందిస్తాం. – రామ్గోపాల్రెడ్డి, డీడబ్ల్యూఓ, ఖమ్మం -
మహిళా వికాసం
మహిళలు స్వయం ఉపాధి పొందుతూ సమాజానికి ఆదర్శంగా నిలవాలనేదే లక్ష్యం. ఇప్పటివరకు 12 వేల మందికి పైగా శిక్షణ ఇచ్చాం. ఈ ఏడాది 350 మందికి వివిధ రంగాల్లో శిక్షణ కొనసాగుతోంది. ఉన్నతాధికారుల తోడ్పాటుతో మహిళాభివృద్ధికి కృషి చేస్తున్నాం. – వేల్పుల విజేత, మహిళా ప్రాంగణం మేనేజర్ ఖమ్మంఅర్బన్: మహిళలు ఆర్థికంగా బలపడాలనే లక్ష్యంతో ఖమ్మం నగరంలోని దుర్గాబాయి మహిళా వికాస కేంద్రం(మహిళా ప్రాంగణం) పని చేస్తోంది. ఇక్కడ ఇప్పటివరకు 12 వేల మందికిపైగా మహిళలు వివిధ కోర్సుల్లో శిక్షణ పొంది ఆర్థికాభివృద్ధి సాధించారు. ఇంకా వందలాది మంది శిక్షణ పొందుతూనే ఉన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన కొందరు మహిళలు మరో బ్యాచ్ వారికి ట్రెయినర్లుగా మారే అవకాశం కూడా ఉందని అధికారులు అంటున్నారు. శిక్షణతో పాటు వసతి.. మహిళా ప్రాంగణంలో వ్యవసాయం, టైలరింగ్, కంప్యూటర్లు, బ్యూటీషియన్, డ్రోన్ వినియోగం, నర్సింగ్ వంటి కోర్సుల్లో ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. శిక్షణతో పాటు వసతి, భోజన సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. పంటల సాగులో డ్రోన్ వినియోగంపై శిక్షణ తీసుకోవాలంటే ప్రైవేట్గా అయితే రూ.45వేలు, కంప్యూటర్ కోర్సుకు రూ.20వేలు, నర్సింగ్కు రూ.లక్ష వరకు ఖర్చవుతుండగా ఇక్కడ పూర్తి ఉచితంగా నేర్పిస్తున్నారు. పంటలపై పురుగుమందులు పిచికారీ చేయడంలో డ్రోన్ వినియోగం ప్రస్తుతం కీలకంగా మారింది. ఈ కోర్సులో 45 రోజుల పాటు శిక్షణ ఇస్తుండగా ప్రస్తుతం ఉమ్మడి జిల్లాకు చెందిన 30 మంది ట్రైనింగ్ పొందుతున్నారు. టైలరింగ్లో రెండు నెలల పాటు శిక్షణ ఇస్తుండగా ప్రస్తుతం 30 మంది, రెండు నెలల కంప్యూటర్ కోర్సులో 30 మంది, 45 రోజుల బ్యూటీషియన్ శిక్షణ పొందుతున్న వారు 20 మంది ఉన్నారు. రెండేళ్ల నర్సింగ్ కోర్సులో 40 మంది మహిళలకు శిక్షణ కొనసాగుతోంది. -
కిన్నెరసానిలో పర్యాటక సందడి
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. మండల పరిధిలోని కిన్నెరసానికి ఆదివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులను వీక్షించారు. ప్రకృతి అందాలను ఆస్వాదించారు. 410 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.22,395 ఆదాయం లభించింది. 270 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.16,210 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్ జెన్కో డైరెక్టర్(హైడల్) ఎం.సుజయ్కుమార్, ఏపీ ట్రాన్స్కో రిటైర్డ్ సీఈ ప్రతాప్రెడ్డి, సీలేరు జలవిద్యుత్ కేంద్రం రిటైర్డ్ సీఈ రాంబాబు తదితరులు కిన్నెరసానిని సందర్శించారు. -
రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం
ఖమ్మంమయూరిసెంటర్ : 1975 బ్యాచ్కు చెందిన రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం, స్వర్ణోత్సవాలు ఆదివారం ఖమ్మంలో ఘనంగా నిర్వహించారు. కన్వీనర్ బసవరాజు ఉపేందర్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో రిటైర్డ్ ఉద్యోగులు తమ ఉద్యోగ విరమణ తర్వాత మధుర జ్ఞాపకాలను పంచుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఎర్నేని రామారావు అధ్యక్షతన జరిగిన సభలో పలువురు మాట్లాడుతూ 1975లో నాటి ఖమ్మం కలెక్టర్ స్వర్గీయ పి.వి.ఆర్.కె.ప్రసాద్ ఉద్యోగ నియామక ఉత్తర్వులు మంజూరు చేశారని స్మరించుకున్నారు. 50 ఏళ్ల క్రితం మొదలైన తమ ప్రయాణం.. కేవలం విధులకే పరిమితం కాకుండా, మానవ విలువలు, స్నేహ బంధం, పరస్పర సహకారానికి నిదర్శనంగా నిలిచిందని వెల్లడించారు. ఈ బంధం ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టి.రామరావు, మురళీకృష్ణ, సుధాకర్, సుబ్బయ్య, సైదయ్య, ప్రముఖ గాయకుడు గణపతిరాజు తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లోనే అధికంగా సాగు
● ఆయిల్పామ్ సాగుకు అశ్వారావుపేటనే ఆదిగురువు ● వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అశ్వారావుపేటరూరల్: దేశంలో తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఏపీలోనే అత్యధికంగా ఆయిల్పాం తోటలు సాగు చేస్తున్నారని, ఆ తర్వాత కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో సాగవుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఆయన అశ్వారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీని సందర్శించారు. గెలల నిల్వలు, కన్వేయర్ బెల్ట్, యంత్రాలతోపాటు పవర్ ప్లాంట్ తనిఖీ చేశారు. అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆయిల్పాం తోటల సాగుకు అశ్వారావుపేట మండలం ఆదిగురువని, ఇక్కడ పంట బాగుందంటేనే మిగిలిన ప్రాంతాల్లో విస్తరిస్తోందని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఎకరం విలువ రూ.5 కోట్లపైనే ఉన్నా ఆయిల్పాం తోటలు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. సిద్ధిపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి కాగా ట్రయిల్ రన్ నడుస్తోందని తెలిపారు. వేంసూరు మండలం కల్లూరిగూడెంలో, కొణిజర్లలో పామాయిల్ ఫ్యాక్టరీల నిర్మాణం ఏడాదిలోపు పూర్తవుతుందని అన్నారు. వనపర్తి, బీచ్పల్లిలో కూడా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆయిల్పామ్ గెలల టన్ను ధర రూ.25 వేలకు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రులకు విన్నవించినట్లు తెలిపారు. తొలుత పామాయిల్ తోటలు, ఫ్యాక్టరీ సందర్శనకు వచ్చిన యాద్రాద్రి జిల్లా రైతులు మంత్రిని కలిశారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ఫెడ్ అధికారులు సుధాకర్ రెడ్డి, ఫ్యాక్టరీ మేనేజర్లు నాగబాబు, కల్యాణ్, నాయకులు ఆలపాటి రామచంద్రప్రసాద్, మొగళ్లపు చెన్నకేశవరావు, బండి భాస్కర్, జ్యేష్ట సత్యనారాయణ చౌదరి, ఎస్కే పాషా, పి.జీవన్రావు, రైతులు పాల్గొన్నారు. -
‘జూనియర్’లో జోరు..
● ప్రభుత్వ కళాశాలల్లో పెరిగిన అడ్మిషన్లు ● ఈ ఏడాది ఇంటర్ ప్రథమలో 3,287 మంది.. ● గతేడాది ప్రవేశాలు 2,494 మాత్రమే ● ప్రభుత్వ కాలేజీల్లో సౌకర్యాలపై విస్తృత ప్రచారం ఖమ్మంసహకారనగర్: ఒకప్పుడు ప్రభుత్వ కళాశాలలు అంటే అంతంతమాత్రపు సౌకర్యాలు, అందీఅందని పుస్తకాల వంటి సమస్యలు ఉండేవి. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేర్పించేందుకు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. అయితే సర్కారు కళాశాలల్లో క్రమంగా సౌకర్యాలు పెంచడం, అడ్మిషన్ల పెంపునకు అధ్యాపకులు గ్రామాల్లో తిరుగుతూ తల్లిదండ్రులను ప్రోత్సహించడం వంటి చర్యలతో క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఈ విద్యా సంవత్సర ప్రవేశాల గడువు ఆగస్టు 31తో ముగియగా 3,287 మంది ఇంటర్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు పొందారు. జిల్లాలో 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా.. వీటిలో గతేడాది 2,494 మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరంలో చేరారు. ఈ సంవత్సరం 793 మంది అధికంగా చేరడం విశేషం. సౌకర్యాల పెంపుతోనే.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గతంలో విద్యాబోధనతోనే సరిపుచ్చగా.. ప్రస్తుతం విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, కనీస సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రైవేట్ కాలేజీలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలు ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఎప్సెట్ కోచింగ్ సైతం అందిస్తోంది. ఎక్కడా అధ్యాపకుల కొరత లేకుండా చర్యలు చేపడుతోంది. ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పెంచేందుకు ఫిబ్రవరి, మార్చి నెలల నుంచే అధ్యాపకులు గ్రామాలకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాక ఫలితాలు వెల్లడయ్యాక తాము సాధించిన రిజల్ట్పై కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేశారు. ఎంసెట్ కోచింగ్, విద్యార్థులకు అందించే వ్యక్తిత్వ వికాస తరగతులు తదితర అంశాలను వివరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రవేశాల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. మూడు కాలేజీలు మినహా.. జిల్లాలో 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా అందులో ఒకటి గతేడాది, మరొకటి అంతకుముందు సంవత్సరం ప్రారంభించారు. మొత్తంగా మూడు మినహా మిగతా అన్ని కాలేజీల్లోనూ అడ్మిషన్లు గతం కంటే పెరిగాయి. కూసుమంచిలో గతేడాది ప్రారంభమైన కళాశాలలో 53 మంది ఉండగా.. ఈ ఏడాది 93 మందికి పెరిగారు. వేంసూరు మండలం కందుకూరు కళాశాల రెండేళ్ల క్రితం ప్రారంభం కాగా గతేడాది 13 మంది చేరితే ఈసారి ఆ సంఖ్య 17కు మాత్రమే పెరిగింది. ఇక ఖమ్మంలోని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో గతేడాది 435 మంది విద్యార్థులు చేరగా.. ప్రస్తుతం 419 మందికే పరిమితమైంది. కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ గతేడాది 100 మంది అడ్మిషన్లు పొందగా ప్రస్తుత సంవత్సరంలో 95 మంది మాత్రమే చేరారు. కామేపల్లి కళాశాలలో గతేడాది 35 మంది చేరగా ఈ ఏడాది 26 మంది మాత్రమే ప్రవేశాలు పొందారు.ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పెంపునకు ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు విస్తృత ప్రచారం చేశారు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, ఫలితాలు, ఎప్సెట్ కోచింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు.. ప్రభుత్వ కళాశాలల్లో చేరేలా తల్లిదండ్రులకు విస్తృతంగా అవగాహన కల్పించాం. ఈ అంశాలన్నీ ప్రవేశాల పెంపునకు దోహదపడ్డాయి. – రవిబాబు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి -
23 నుంచి దసరా వేడుకలు
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 23 నుంచి శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆలయ అధికారులు అశ్వయుజ మాసంలో జరిగే ఉత్సవాలు, విజయ దశమి వేడుకల వివరాలను వెల్లడించారు. అక్టోబర్ 2న జరిగే విజయదశమి వేడుకలతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఆలయంలో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 23 నుంచి రోజుకో అలంకరణలో భక్తులకు కనువిందు చేయనున్నారు. అక్టోబర్ 7న శబరి స్మృతియాత్ర నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ దామోదర్రావు, వైదిక కమిటీ సభ్యులు తెలిపారు. తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతీ ఏడాది తొమ్మిది రోజులపాటు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేస్తారు. స్వామివారి సన్నిధిలో తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుతారు. దశమి రోజున భక్తరామదాసు నిర్మించిన దసరా మండపంలో శమీ, ఆయుధ పూజలు, లీలా మహోత్సవం కనుల పండువగా నిర్వహిస్తారు. కాగా ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో 24 నుంచి 2వ తేదీ వరకు శ్రీరామాయణ పారాయణం జరగనుంది. ఇందులో భక్తులను, స్వామి వారి ఆరాధకులను ఈ ఏడాది భాగస్వామ్యం చేయనున్నారు. శ్రీలక్ష్మి అమ్మవారి సన్నిధిలో అభిషేకం, చిత్రకూట మండపంలో సామూహిక శ్రీ రామాయణ పారాయణం, మధ్యాహ్నం శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి సన్నిఽధిలో సామూహిక కుంకుమార్చనలు జరగనున్నాయి. అక్టోబర్ 2న శమీ, ఆయుధ పూజ, శ్రీ లీలా మహోత్సవం నిర్వహించనున్నారు. వచ్చేనెల 7 శబరి స్మృతి యాత్ర AMøtºÆŠæḥ 7Ð]l ™ól©¯]l AÔèæÓ-Ķæ¬f Ð]l*çÜ ´ûÇ~Ð]l$ çÜ…§ýl-Æý‡Â…V> ÔèæºÇ çÜÖ† Ķæ*{™èl¯]l$ fÆý‡-ç³-¯]l$-¯é²Æý‡$. Æ>Ð]l¬yìl Aç³Æý‡ ¿ýæMýS$¢-Æ>Ë$ ÔèæºÇMìS çœÌS, ç³#Úëµ-ÌS-™ø A…fÍ çœ$sìæ…^èl-¯]l$-¯é²Æý‡$. A§ól Æøk¯]l ÐéÎÃMìS fĶæ$…† Ðólyýl-MýS-ÌSMýS$ çܯé²-àË$ ^ólçÜ$¢-¯é²Æý‡$. AMøt-ºÆŠ‡ 20Ð]l ™ól©¯]l ¯]lÆý‡MýS ^èl™èl$-Æý‡ªÕ ©´ë-Ð]lã çÜ…§ýl-Æý‡Â…V> Ð]lÊÌS-Ð]lÊ-Æý‡$¢-ÌSMýS$ ™ðlÌS-ÏÐéÆý‡$-gêÐ]l¬¯]l AÀ-õÙMýS…, ÝëĶæ$…-{™èl… Ð]l$…VýSâýæ Ý벯éË$, C™èlÆý‡ {ç³™ólÅMýS ç³NfË$ °Æý‡Ó-íßæ…^èl-¯]l$-¯é²Æý‡$.తేదీ అలంకారం పారాయణంఈనెల 23న ఆదిలక్ష్మి బాలకాండ 24న సంతాన లక్ష్మి అయోధ్యకాండ 25న గజలక్ష్మి అయోధ్యకాండ 26న ధనలక్ష్మి అరణ్యకాండ 27న ధాన్య లక్ష్మి కిష్కింధకాండ 28న విజయలక్ష్మి సుందరకాండ 29న ఐశ్యర్యలక్ష్మి యుద్ధకాండ 30న వీరలక్ష్మి యుద్ధకాండ అక్టోబర్ 1న మహాలక్ష్మి (నిజరూప) యుద్ధకాండ -
జేఎంఈటీలు మళ్లీ ఉద్యోగంలోకి..
● టర్మినేట్ అయిన 43 మంది పునర్నియామకం ● సింగరేణి చరిత్రలో తొలిసారి అవకాశం సింగరేణి(కొత్తగూడెం): అధికార హోదా (జేఎంఈటీ–జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రెయినీ)లో ఉండి టర్మినేట్ అయిన 43 మంది అధికారులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోనున్నారు. వారు విధులకు సక్రమంగా హాజరుకాకపోవడం, నిర్ణీత గడువులోకి స్టడీ సర్టిఫికెట్లు సమర్పించకపోవడంతోపాటు పలు కారణాలతో టర్మినేట్ అయ్యారు. దీంతో యాజమాన్యం వారికి మరో అవకాశం కల్పించింది. 2023లో గుర్తింపు సంఘంగా ఎన్నికై న ఏఐటీయూసీ జేఎంఈటీల సమస్యను తెలుసుకుంది. అనంతరం యూనియన్ నాయకులు యాజమాన్యం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లడంతో యాజమాన్యం ఈ నెల 6వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వీరంతా సంస్థ ఏర్పాటు చేసిన హైకమిటీ ఎదుట తమ వివరాలు 45 ఏళ్లకు తక్కువ కాకుండా ఉండి, (ఓవర్మెన్ సర్టిఫికెట్, గ్యాస్ టెస్టింగ్, ఫస్డ్ ఎయిడ్ సర్టిపికెట్లు) సమర్పించుకోవాల్సి ఉంది. కమిటీ సూచన మేరకు ఫిట్నెస్ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంది. ప్రాథమిక అపాయింట్మెంట్ జారీ అన్ని పరీక్షలు పూర్తి అయితేనే జేఎంఈటీలకు ప్రాథమిక అపాయింట్మెంట్ను సంస్థ జారీ చేస్తుంది. తిరిగి ఉద్యోగంలో చేరిన జేఎంఈటీలకు గ్రేడ్–సీ, ప్రాథమిక నియామకం అందిస్తారు. తొలి ఏడాదిలో 190 మస్టర్లు తగ్గకుండా చేస్తే పర్మనెంట్ ఉద్యోగం వచ్చినట్లవుతుంది. లదంలే తిరిగి టర్మినేట్ అవుతారు. గతంలో బదిలీ వర్కర్లు, జనరల్ అసిస్టెంట్లు వివిధ కారణాలతో డిస్మిస్ అయితే సంస్థ వారికి ఉద్యోగ అవకాశం కల్పించేది. కానీ, సింగరేణిలో తొలిసారిగా టర్మినేట్ అయిన జేఏంఈటీలకు మరో అవకాశం కల్పించటం వారి అదృష్టం. ఇప్పటికై నా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కష్టపడి పనిచేసి, సంస్థ అభివృద్ధికి కృషి చేయాలి. –ఎన్.బలరాం, సీఎండీ, సింగరేణి -
బాల్బ్యాడ్మింటన్ జిల్లా జట్ల ఎంపిక
బోనకల్: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో సబ్ జూనియర్, జూనియర్ బాల్బ్యాడ్మింటన్ జిల్లా జట్లను ఆదివారం ఎంపిక చేశారు. మొత్తం 80 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొనగా కోచ్ అమిరేశి లింగయ్య, జిల్లా అసోషియేషన్ కార్యదర్శి బొంతు శ్రీనివాసరావు, అధ్యక్షులు వి.సురేశ్కుమార్ క్రీడాకారులను ఎంపిక చేశారు. ఎంపికై నవారు ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే 44వ రాష్ట్రస్థాయి సబ్జూనియర్, జూనియర్ పోటీల్లో ఆడనున్నారు. పోటీలు జనగాం జిల్లాలో జరుగుతాయని తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు సబ్ జూనియర్ బాలుర విభాగంలో జి.సురేశ్, బి.హర్షవర్ధన్, రెహమాన్, కె.వినయ్, మునీరుద్దీన్, ఎస్కే యాకూబ్పాషా, ఎస్కే నజీరుద్దీన్, ఎండీ ఆదాన్షమీ ఉన్నారు. సబ్ జూనియర్ బాలికల విభాగంలో ఎన్.మనీషా, కె.నవ్య, కె.ఆకాంక్ష, ఆర్.సాహితి, కె.అక్షయ, డి.రాజేశ్వరి, ఎస్.మోక్షిత, సీహెచ్ సంగీత, టి.యశ్వంతి, కె.రిషిత, కె.అక్షయ్ ఉన్నారు. జూనియర్ బాలుర జట్టుకు జి.గోపి, యాసర్, ఆదిల్, జ్యోషి, జి.గణేశ్, జయదీప్ మనాస్, సురేశ్, తనుష్, శ్రీహరి, ఎం.రఘురామ్, ఎం.శరణ్, జానకీరామ్ ఎంపికయ్యారు. జూనియర్ బాలికల జట్టుకు జశ్వంతి, ఎ.రష్మీ, కె.మధులత, యూహిత, ఎన్.మనీషా, కె.నవ్య, కె.ఆకాంక్ష, ఆర్.సాహితి, కె.అక్షయ్, వి.రాజేశ్వరి, పి.ఉమామహేశ్వరి, భూలక్ష్మీ తదితరులు ఎంపికయ్యారు. -
బీఆర్ఎస్పై బురదజల్లే ప్రయత్నం..
ఖమ్మవైరారోడ్: కాళేశ్వరం ప్రాజెక్ట్పై కాంగ్రెస్ రాజకీయం చేస్తూ బీఆర్ఎస్పై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తలాపున గోదావరి పారుతున్నప్పటికీ తాగడానికి నీళ్లు లేని దుస్థితి ఉండేదని, కాళేశ్వరం ప్రాజెక్ట్తో నీటి సమస్య తీరిందన్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 281 టీఎంసీల నీటి లభ్యత ఉండటం వల్ల మేడిగడ్డకు ప్రాజెక్ట్ను తరలించారన్నారు. మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వరమే కుంగిందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద 93 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తే మోటార్లు ప్రారంభించి నీటిని ఎత్తిపోయవచ్చని, గతంలో లాగే ఇప్పుడు కూడా అన్నారం, మేడిగడ్డ, సుందిళ్లలో అన్ని గేట్లు ఎత్తేసి అన్ని పంపులను పడావు పడేలా చేశారని తెలిపారు. కాకతీయులు గొలుసుకట్టు చెరువులు నిర్మిస్తే, కేసీఆర్ గొలుసుకట్టు రిజర్వాయర్లు నిర్మించారన్నారు. సమావేశంలో పగడాల నాగరాజు, బిచ్చాల తిరుమల్రావు, డోకుపర్తి సుబ్బారావు, మందడపు శంకర్రావు, పగడాల నరేందర్, కొండల్రావు, మురళీకృష్ణ, రఫీ, గోపి, రాజేశ్, అశోక్సింగ్, షారుక్ అరాఫత్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేశ్రెడ్డి -
వ్యక్తి అదృశ్యం
ఖమ్మంరూరల్: ఓ వ్యక్తి కనిపించకుండా పోయిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని కాచిరాజుగూడెం గ్రామానికి చెందిన జలగం నర్సయ్య (48) గత నెల 28న ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. ఇంట్లో గొడవ పెట్టుకుని, ఖమ్మం వెళ్తున్నానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎక్కడ ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. ఇతను నీలం రంగు చొక్కా, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. వృద్ధుడి ఆత్మహత్యసత్తుపల్లిరూరల్: కలుపుమందు సేవించి ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని సిద్ధారంలో ఆదివారం చోటుచేసుకుంది. సిద్ధారానికి చెందిన మోరంపూడి మాధవరావు (68) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. ఇటీవల హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నా డు. శనివారం రాత్రి ఇంట్లో ఉన్న కలుపుమందు తాగగా కుటుంబ సభ్యు లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య సరోజిని, కుమార్తె సత్యవాణి ఉన్నారు. ఏఎస్ఐ ప్రతాప్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్ను ఢీకొన్న టిప్పర్ఖమ్మంఅర్బన్: నగరంలోని ఇల్లెందు రోడ్డులో ఎన్నెస్పీ కాల్వ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. రఘునాథపాలెం మండలం రాంక్యాతండాకు చెందిన కేలోతు రవి, ఆయన భార్య కమల ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన టిప్పర్ ఢీకొంది. ఈ ఘటనలో రవి గాయపడి చికిత్స పొందుతున్నాడు. కమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ భానుప్రకాశ్ తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదుఖమ్మంఅర్బన్: నిమజ్జన వేడుకల విధుల్లో ఉన్న ఇద్దరు ఎస్ఐలను మద్యం మత్తులో ముగ్గురు యువకులు నెట్టివేసిన ఘటన శనివారం రాత్రి ఖమ్మం నగరంలో చోటుచేసుకుంది. దీంతో ఆ ముగ్గురు యువకులపై ఆదివారం ఖమ్మంఅర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఖానాపురం యూపీహెచ్ కాలనీకి చెందిన కొందరు యువకులు గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఊరేగింపుతో నిమజ్జనానికి బయలుదేరారు. రాత్రి 11.30 గంటల సమయంలో భారీ డీజే పాటలకు డ్యాన్సులు చేస్తూ వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించారు. విధుల్లో ఉన్న ఖమ్మంఅర్బన్ (ఖానాపురంహవేలి) ఎస్ఐ మధుకుమార్ అక్కడికి చేరుకుని డీజే వాహనాన్ని పంపించగా, నిమజ్జన వాహనాన్ని తరలించాలని చెప్పినప్పటికీ వినకుండా మద్యం మత్తులో ఉన్న మహేశ్, మాధవరావు, బాలు ఆయనను నెట్టివేశారు. అక్కడికి చేరుకున్న మరో ఎస్ఐ శ్రావణ్తో కూడా అదే రీతిలో ప్రవర్తించారు. వెంటనే ఎస్ఐలు ఉన్నతాధికారులకు సమాచారం అందించి, విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురిని పోలీస్స్టేషన్కు తరలించి, వారిపై కేసు నమోదు చేశారు. 14 నుంచి సింగరేణి ఆస్పత్రుల్లో కార్పొరేట్ సేవలు సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ నెల 14 నుంచి హైదరాబాద్ కార్పొరేట్ వైద్యులు సింగరేణి ఆస్పత్రులను సందర్శించనున్నారని సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్రాజ్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21న కొత్తగూడెంలోని ఆస్పత్రికి కార్డియాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు రానున్నారని పేర్కొన్నారు. -
మావోయిస్ట్ ఆయుధ తయారీ కేంద్రం గుర్తింపు
చర్ల: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు సంబంధించిన ఆయుధాల తయారీ కేంద్రాన్ని ఆదివారం భద్రతా బలగా లు గుర్తించా యి. వివరాలిలా ఉన్నాయి. బీజాపూర్ జిల్లాలోని ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల గుంజపర్తి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టిన గుంజపర్తి క్యాంపునకు చెందిన భద్రతా బలగాలు సమీప అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు సంబధించిన ఆయు దాల తయారీ కేంద్రాన్ని గుర్తించాయి. ఈ కేంద్రంలో లేత్ మిషిన్, జనరేటర్, వాటర్ పంప్, ఎలక్ట్రిక్ కట్టర్, హైడ్రాలిక్ సిలిండర్, మోటారు విడి భాగాలు, స్టీల్ ప్లేట్లు, ఆయుధాల తయారీకి ఉపయోగించే విడి సామగ్రితో పాటు పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటిని అక్కడే ధ్వంసం చేశారు. -
సాగు యంత్రాలు అందించండి..
ఖమ్మంవ్యవసాయం: పంటల సాగులో రైతులకు ప్రయోజనం కలిగించే విధంగా రూపొందించిన యాంత్రీకరణ పథకం అమలులో కాలయాపన జరుగుతోంది. ఆధునిక యంత్రాలతో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా యాంత్రీకరణ పథకం రూపుదిద్దుకుంది. పంటల సాగులో వినియోగించే యంత్ర పరికరాలను రైతులకు రాయితీలపై అందించటం ఈ పథకం ఉద్దేశం. ఇది అనాదిగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో 2016 – 17 ఆర్థిక సంవత్సరం నుంచి అమలుకు నోచుకోవటం లేదు. మారుతున్న కాలం, ఆధునిక సాంకేతిక విధానాలు అమలులోకి రావటంతో రైతులకు యంత్ర పరికరాల వినియోగంపై ఆసక్తి ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి సబ్సిడీ యంత్రాలు అందకపోవటం వారిని నిరాశకు గురిచేస్తోంది. నిధులు మంజూరైనా నిష్ప్రయోజనం తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించేలా యాంత్రీకరణ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. 9 ఏళ్లుగా అమలుకు నోచుకోని ఈ పథకాన్ని 2025–26లో అమ లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వానాకాలానికి ముందు నుంచే సన్నాహాలు చేసింది. అయితే బడ్జెట్ కేటాయింపులు తక్కువగా ఉండటం, పరికరాల ధర అధికంగా ఉండటంతో కొందిరికే లాభం చేకూరనుండటంతో పథకం అమలులో మార్పులు తీసుకువచ్చారు. ఎక్కువ మందికి ప్రయోజనం కలిగేలా యంత్ర పరికరాలను ఎంపిక చేసి పథకాన్ని అమలు చేయాలనుకోవడంతో జాప్యం అనివార్యమైంది. ఈ పథకం కింద జిల్లాకు రూ. 4,37,97,000లు మంజూరు చేసింది. పరిమిత పరికరాలకు అనుమతి గతంలో యాంత్రీకరణ పథకంలో ఖరీదైన ట్రా క్టర్లు, పంటకోత మిషన్లు, డ్రోన్లతోపాటు నాగళ్లు, పవర్ స్ప్రేయర్లు వంటివి ఇచ్చేవారు. ఈ ఏడాది నిర్దేశించిన పనిముట్లు మాత్రమే ఇవ్వాలని, రూ. 1,000 నుంచి రూ.1.50 లక్షల వరకు సబ్సిడీపై అందించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. బ్యా టరీ స్ప్రేయర్లు రూ.1,000, పవర్ స్ప్రేయర్లు రూ. 10 వేలు, రొటోవేటర్లు రూ.50వేలు, సీడ్కం ఫర్టిలైజర్ డ్రిల్స్ రూ.30వేలు, కేజ్వీల్స్, డిస్క్లకు రూ.20 వేలు, పవర్ వీడర్లకు రూ.75వేలు, బండ్ ఫార్మింగ్ యంత్రాలు రూ.1.50లక్షలు, బ్రష్కట్టర్లు రూ.35 వేలు, పవర్ టిల్లర్లకు రూ.లక్ష, మ్కొజొన్న వలిచే యంత్రాలు, వరిగడ్డి కట్టలు కట్టే యంత్రాలకు రూ.లక్ష చొప్పున రాయితీ కల్పించాలనుకున్నారు. రూ.లక్ష సబ్సిడీ అందించే పరికరాల మంజూరును సహాయ వ్యవసాయ సంచాలకులు చేయనుండగా.. ఆపై సబ్సిడీతో కూడిన పరికరాల మంజూరు అధికారం కలెక్టర్కు కేటాయించారు. సర్వం సిద్ధం.. అయినా జాప్యం యంత్రీకరణ పథకానికి సంబంధించిన ఫైల్ను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. ఇక్కడే కాలయాపన జరుగుతోంది. ఈ దశ దాటితే పథకం కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. జిల్లాలోని వ్యవసాయ డివిజన్ల వారీగా అర్హులైన రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపిక, పరికరాల మంజూరు, వంటి అంశాలు అమలు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం యాంత్రీకరణ పరికరాల పథకాన్ని ప్రకటిస్తే రైతులు వారికి అవసరమైన వ్యవసాయ పరికరాలు, యంత్రాలకు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.యాంత్రీకరణ పథకాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పథకంలో రైతులకు అందించే పరికరాలను గుర్తించాం. ఆయా పరికరాలకు నిర్దేశించిన విధంగా రాయితీలను అందిస్తాం. ఉన్నతాధికారుల అనుమతులతో పథకం అమలుకు చర్యలు తీసుకుంటాం. –ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి -
జెడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు మృతి
తిరుమలాయపాలెం: జెడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు, యూటీఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి, సీపీఎం మండల మాజీ కార్యదర్శి సుబ్లేడు గ్రామానికి చెందిన ఎస్డీ జియాఉద్దీన్ (76) ఆదివారం గుండెపోటుతో మృతిచెందారు. ఖమ్మంలోని ఆయన నివాసంలో పలు పార్టీల నాయకులు నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బెల్లం శ్రీనివాస్, బోడ మంచానాయక్, ఆర్మి రవి, తుళ్లూరు నాగేశ్వరరావు, నర్సయ్య, రమేశ్, స్వామి, బాబూరావు, నిర్మల్రావు, ఉపేందర్రెడ్డి, కృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీయాఉద్దీన్ మృతి తీరని లోటు ఖమ్మంసహకారనగర్: ఉపాధ్యాయ, ప్రజా ఉద్యమ నేత జియాఉద్దీన్ ఆకస్మిక మృతి తీరని లోటనీ టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావా రవి, ఎ.వెంకట్ అన్నారు. నగరంలో ఆదివా రం జరిగిన సంస్మరణ సభలో వారు మాట్లాడారు. జియాఉద్దీన్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా, జిల్లా ప్రజా పరిషత్ కోఆప్షన్ సభ్యుడిగా సేవలందించారని తెలిపారు. కార్యక్రమంలో దుర్గాభవాని, మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు, నున్నా నాగేశ్వరరావు, మచ్చ వెంకటేశ్వర్లు, పొన్నం వెంకటేశ్వరరావు, సోమయ్య విక్రమ్, సాయిబాబు, సరళ, హైమావతి పాల్గొన్నారు. కాగా, జియాఉద్దీన్ మృతి పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. పలు పార్టీల నాయకుల సంతాపం -
శ్రీవారికి అభిషేకం, కల్యాణం
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామున స్వామి మూలవిరాట్తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్ల ను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్యకల్యా ణం, పల్లకీ సేవ నిర్వహించగా పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ఈఓ కొత్తూ రి జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్ప ల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సిబ్బంది పాల్గొన్నారు.వైరా కేవీకేకు పురస్కారాలు వైరా: వైరాలోని కృషివిజ్ఞాన కేంద్రానికి నాలు గు పురస్కారాలు లభించాయి. తమిళనాడులో ని కోయంబత్తూరులో శనివారం అటారి జోన్–10 పరిధి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పాండిచ్చేరి రాష్ట్రాల్లో ఉన్న 72 కేవీకే అధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 2024–25 ఏడాదిలో చేసిన కార్యక్రమాలపై చర్చించారు. వైరా కేవీకే ఆధ్వర్యాన నేరుగా వరి విత్తే పద్ధతిపై అవగాహన, రైతుల డేటా బేస్ నమోదు, శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు గాను నాలుగు అవార్డులు ప్రకటించగా కోఆర్డి నేటర్ డాక్టర్ టి.సుచరితాదేవి అందుకున్నారు. ఆలిండియా సివిల్ సర్వీసెస్ పోటీలకు 173 మంది ఖమ్మంస్పోర్ట్స్: ఆలిండియా సివిల్ సర్వీసెస్ టోర్నీలో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యాన ఎంపిక చేశారు. ఈమేరకు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో శనివారం 15క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించగా 320మంది ఉద్యోగులు హాజరయ్యారు. వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ చూపిన 173మందిని ఎంపిక చేసినట్లు డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి తెలిపారు. వీరు ఈనెల 9, 10వ తేదీల్లో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. ‘పరిషత్’ ఓటర్లు.. 8,02,690మంది ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో ముసాయిదా ఓటర్ల జాబితా ను శనివారం విడుదల చేశారు. ఈ జాబితా ఆధారంగా జిల్లాలో 8,02,690 మంది ఓటర్లు ఉన్నారని జెడ్పీ సీఈఓ దీక్షారైనా తెలిపారు. వీరిలో మహిళలు 4,14,425మంది, పురుషులు 3,88,243మంది, ఇతరులు 22మంది ఉన్నారని వెల్లడించారు. జెడ్పీతో పాటు మండల పరిషత్ కార్యాలయాల్లో జాబితా ప్రదర్శించినట్లు తెలిపారు. ఈనెల 8వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించనుండగా.. 9వ తేదీన పరిష్కరించి 10వ తేదీన ఓటర్లు, పోలింగ్ కేంద్రాల తుది జాబితాను వెల్లడిస్తామని సీఈఓ పేర్కొన్నారు. అంతకుముందు 8వ తేదీన జిల్లా, మండల కేంద్రాల్లో వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ‘స్వగృహ’కు రెండు బిడ్లు దాఖలు ఖమ్మం సహకార నగర్: ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలోని రాజీవ్ స్వగృహలో ఫ్లాట్ల కేటాయింపునకు దరఖాస్తులు ఆహ్వానించగా రెండు బిడ్లు దాఖలయ్యాయి. ఉద్యోగ సంఘాల నుంచి ఒకటి, కాంట్రాక్టర్ నుంచి ఇంకొకటి దాఖలైనట్లు అధికారులు తెలిపారు. రాజీవ్ స్వగృహ 9.22 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, 576 ఫ్లాట్లలో చదరపు అడుగు ధర రూ.1,150గా ధర నిర్ణయించి బిడ్లు ఆహ్వానించారు. శనివారంతో గడువు ముగియగా ఉద్యోగ సంఘాలు, కాంట్రాక్టర్ నుంచి రూ.5కోట్లతో బిడ్లు దాఖలైనట్లు తెలిసింది. కాగా, దరఖాస్తులను అధికారులు సోమవారం పరిశీలించనున్నారు. -
స్వామీ.. సెలవిక !
జిల్లా కేంద్రంలో వాడవాడనా ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలను నవరాత్రుల పూజల అనంతరం శనివారం నిమజ్జనం చేశారు. మున్నేటికి ఇరువైపులా నిమజ్జన ఘాట్లు ఏర్పాటుచేయగా మధ్యాహ్నం తర్వాత శోభాయాత్ర మొదలైంది. గాంధీచౌక్ వద్ద ప్రత్యేక వేదిక నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్దత్, మేయర్ నీరజ, స్తంభాద్రి ఉత్సవ కమిటీల ప్రతినిధులు శోభాయాత్రకు స్వాగతం పలికి పూజలు చేశారు. ఇక మున్నేటి వద్ద నిమజ్జన ఏర్పాట్లను కలెక్టర్, సీపీతో పాటు కేఎంసీ కమిషనర్ అభిషేక్ పర్యవేక్షించారు. పెద్దసంఖ్యలో పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేయగా అర్ధరాత్రి వరకు కొనసాగిన నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025శోభాయాత్రలో డప్పు వాయిస్తున్న మహిళ -
కట్టుదిట్టమైన భద్రత మధ్య నిమజ్జనం
ఖమ్మంక్రైం: జిల్లా కేంద్రంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య వినాయక నిమజ్జనం శనివారం ప్రశాంతంగా కొనసాగింది. పలువురు మండపాల నిర్వాహకులు ఆలస్యంగా బయలుదేరడంతో అర్ధరాత్రి వరకు కూడా నిమజ్జనాలు కొనసాగాయి. 500 మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేయడం, ముందస్తు ప్రణాళికతో ఇక్కట్లు ఎదురుకాలేదు. కలెక్టర్ అనుదీప్, కేఎంసీ కమిషనర్ అగస్త్యతో కలిసి సీపీ సునీల్దత్ ఏర్పాట్లను పరిశీలించారు. సీపీ దంపతులు మట్టి ప్రతిమను నిమజ్జనం చేశారు. అడిషనల్ డీసీపీలు ప్రసాద్రావు, కుమారస్వామి, విజయబాబు, ఏసీపీలు రమణమూర్తి, సాంబరాజు, సుశీల్సింగ్, సీఐ కరుణాకర్ బందోబస్తును పర్యవేక్షించారు. -
లడ్డూలకు భారీ వేలం..
సత్తుపల్లి: స్థానిక జేవీఆర్ పార్కు ఎదురుగా శ్రీ ప్రసన్నగణపతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన మహాగణపతి చేతిలోని లడ్డూను శనివారం వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తుపల్లి మండలం నారాయణపురానికి చెందిన మందపాటి కేశవరెడ్డి రూ.4.05 లక్షలకు లడ్డూ దక్కించుకున్నారు. నిర్వాహకులు కూసంపూడి శ్రీనివాసరావు, గుడిపూడి గాంధీ, దారా ఏకాదశమూర్తి, నాయుడు వెంకటేశ్వరరావు, రాజు పాల్గొన్నారు. అంచనాపురంలో రూ.1.61 లక్షలు కొణిజర్ల: మండలంలోని అంజనాపురం (కొత్తూరు)లో గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లడ్డూ వేలం పాట నిర్వహించారు. రూ.1,61,916తో కన్నేటి గోపాల్రావు, నాగేశ్వరరావు కలిసి దక్కించుకున్నారు. మధిరలో రూ.73వేలు మధిర: మధిరలోని రైల్వే గేట్ సెంటర్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యాన ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాన్ని శనివారం నిమజ్జనం చేశారు. వేలాదిగా భక్తులు పాల్గొనగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నా యి. ఈ సందర్భంగా లడ్డూను రూ.73వేలకు రమేష్రెడ్డి దక్కించుకున్నారు. -
టీచర్ చొరవతోనే కలెక్టర్ అయ్యా...
● గురుపూజోత్సవంలో కలెక్టర్ అనుదీప్ ● జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానంఖమ్మం సహకారనగర్: చిన్నతనంలో తనకు ఇంగ్లిష్ బోధించిన టీచర్ చూపించిన చొరవతోనే తాను కలెక్టర్ స్థాయికి ఎదిగానని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సమాజంలో చాలామంది జీవితాల్లో వెలుగు నింపే అవకాశం ఉపాధ్యాయులకు ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కలెక్టరేట్లో గురుపూజోత్సవంలో భాగంగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పి.శ్రీపాల్రెడ్డి, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి తో కలిసి కలెక్టర్ సన్మానించి మాట్లాడారు. కరోనా సమయాన ఆన్లైన్ బోధనతో పిల్లల విద్యా ప్రమాణాలు సగానికి పైగా పడిపోవడంతో ఉపాధ్యాయుల ప్రాధాన్యత అందరికీ తెలిసిందని చెప్పారు. తరగతి గదుల్లో డిజిటల్ క్లాస్ రూమ్ అదనపు సౌకర్యం మాత్రమేనని.. టీచర్లే కేంద్రంగా బోధన సాగితే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. ఎఫ్ఆర్ఎస్ నమోదులో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉన్నందున, ఇదే స్ఫూర్తిని బోధనలో కొనసాగిస్తే మరిన్ని ఫలితాలు సాధించొచ్చని తెలిపారు. ఎమ్మెల్సీ పి.శ్రీపాల్రెడ్డి మాట్లాడుతూ దశాబ్ద కాలంగా ఉపాధ్యాయులకు సమస్యలు ఉన్నా ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దారని చెప్పారు. అదనపు కలెక్టర్లు శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి మాట్లాడగా జెడ్పీ సీఈఓ దీక్షారైనా, సీఎంఓ ప్రవీణ్కుమార్, ప్లానింగ్ కో ఆర్డినేటర్ రామకృష్ణ, డీసీఈబీ సెక్రటరీ కనపర్తి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఆర్థిక లావాదేవీల్లో వివాదం
ఇల్లెందు/కారేపల్లి: ఆర్థిక లావాదేవీల్లో ఏర్పడిన విబేధాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా.. మృతుడు, ప్రముఖ కాంట్రాక్టర్ గడిపర్తి శ్రీనివాసరావు(53).. ఇల్లెందు మున్సిపల్ మాజీ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు (డీవీ)కు వరుసకు బావమరిది కావడం, ఘటనకు డీవీనే కారణమంటూ ఆయన బంధువులు ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. ఇల్లెందు కాకతీయనగర్కు చెందిన గడపర్తి శ్రీనివాసరావు – డీవీ కలిసి కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం, కాంట్రాక్టు పనులు చేస్తుండగా ఏడాది నుంచి వివాదం మొదలైంది. డీవీ తనకు రూ.కోటిన్నర ఇవ్వాలని శ్రీనివాసరావు చెప్పినట్లు తెలుస్తుండగా, ఇదే విషయమై ఖమ్మంలో శుక్రవారం పెద్దల సమక్షాన పంచాయితీ నిర్వహించినట్లు తెలిసింది. అక్కడ ఆయనను కొందరు దూషించినట్లు సమాచారం. అంతేకాక డీవీ అనుచరుడు దమ్మాలపాటి ప్రసాద్, ఆయన కుటుంబీకులు శ్రీనివాసరావు, ఆయన భార్య విషయంలో అసభ్యంగా మాట్లాడడంతోపాటు బాకీ రూ.కోటిన్నరలో రూ.49లక్షలే ఇవ్వాలని నిర్ణయించినట్లు పలువురితో ఫోన్లో చెప్పుకుని వాపోయినట్లు తెలిసింది. ఆతర్వాత ఏం జరిగిందో కానీ కారులో ఇల్లెందు బయలుదేరిన శ్రీనివాసరావుకు రమ రాత్రి 10 గంటల తర్వాత ఫోన్ చేయగా కారేపల్లి క్రాస్ రోడ్కు వచ్చినట్లు చెప్పిన ఆయన ఆతర్వాత ఇంటికి చేరకపోగా ఫోన్ కూడా తీయలేదు. ఈక్రమంలోనే కుటుంబీకులు వెతుకుతుండగా కారేపల్లి – ఇల్లెందు మండలాల సరిహద్దు మొట్లగూడెంలోని ఆయన తోట వద్ద కారును గుర్తించారు. అందులో పరిశీలించగా కూర్చున్న స్థితిలోనే మృతి చెంది ఉండడం, పక్కనే పురుగుల మందు డబ్బా ఉండడంతో ఆత్మహత్మ చేసుకున్నట్లు గుర్తించారు. డీవీ ఇంటి ఎదుట ఆందోళన శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించగానే కారేపల్లి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని ఇల్లెందు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ ఘటనకు దమ్మాలపాటి వెంకటేశ్వరరావే కారణమంటూ మృతదేహాన్ని ఇల్లెందులోని ఆయన నివాసం వద్దకు తరలించారు. డీవీ ఇంటి ఆవరణలో మృతదేహాన్ని పెట్టి ఆందోళన ఆందోళన నిర్వహించారు. డీవీ వాహనం, ఫర్నీచర్ను సైతం ధ్వంసం చేయగా ఇల్లెందు సీఐ సురేష్, కారేపల్లి ఎస్ఐ బి.గోపి, సిబ్బంది అడ్డుకుని ఆస్పత్రికి తరలించారు. కాగా, శ్రీనివాసరావు ఆత్మహత్యకు దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, కుటుంబసభ్యులు, దమ్మాలపాటి ప్రసాదే కారణమంటూ మృతుడి భార్య రమ ఆరోపించారు. శుక్రవారం ఖమ్మంలో పంచాయితీలో ఉందని సమీప బంధువులు పాకాలపాటి చంద్రయ్య, భారతీరాణి తదితరులతో వెళ్లిన శ్రీనివాసరావు మృతదేహంగా రావడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి.గోపి తెలిపారు. కాగా, ఇల్లెందు ఆస్పత్రిలో శ్రీనివాసరావు మృతదేహాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య సందర్శించి కుటుంబీకులను ఓదార్చారు. అయితే, ఖమ్మంలో శుక్రవారం రోజంతా నగదు విషయమై పంచాయితీ జరిగిందని సమాచారం. ఈక్రమాన తనకు రావాల్సిన రూ.1.50కోట్లకు బదులు రూ.49లక్షలే ఇస్తామనడం, పలువురు దూషించడంతోనే శ్రీనివాసరావుఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. డీవీ భార్య ఫిర్యాదుతో కేసు నమోదుఇల్లెందు: సుమారు 50 మందితో ఇంటికి మీదకు వచ్చి దాడి చేసినవారిపై, అందుకు ప్రోత్సహించిన వారిపై చర్య తీసుకోవాలని కోరుతూ మున్సిపల్ మాజీ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు భార్య బేబి భార్గవి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగిరెడ్డి, జానీపాష ప్రోద్బలంతో మీర్జంబేగ్, గడపర్తి వెంకటేశ్వర్లు, దుద్దుకూరి రోశమ్మ, శృతి, చింతనిప్పు కృష్ణారావు, చింతనిప్పు రాంబాబుతో మరికొందరు తమ ఇంటికి వచ్చి అద్దాలు, తలుపులు ధ్వంసం చేస్తూ భయభ్రాంతులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
●కొణిజర్లలో..
కొణిజర్ల: కొణిజర్ల – తనికెళ్ల బోడియాతండా మధ్య ప్రవహిస్తున్న ఎన్నెస్పీ ప్ర ధాన కాల్వపై బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. బ్రిడ్జికి రెండువైపులా రెయిలింగ్ ధ్వం సం కావడం.. ఈ మా ర్గంలో వందలాది వాహనాల రాకపోకలతో ఎప్పుడు ఏం జరుగుతుందో భయ పడుతున్నారు. సరిగ్గా బ్రిడ్జి వద్దే మూలమలుపు ఉండడం.. అక్కడకు వచ్చే వరకు బ్రిడ్జి ఉన్న ట్లు తెలియకపోవడం ప్రమాదాలకు కారణమవుతోంది. ఏడాది క్రితం వైరాకు చెందిన ఇద్దరు ట్రా క్టర్ డ్రైవర్లు ట్రాక్టర్తో కాల్వలో పడి మృతి చెందినా.. అధికారులు కనీస మరమ్మతులు చేయించలేదు. -
●నగరంలో..
ఖమ్మంఅర్బన్: ఖమ్మం 7, 9, 10వ డివిజన్ల జంక్షన్గా ఉన్న ఇందిరానగర్ –టేకులపల్లి మధ్య ప్రధాన రహదారి ఆనుకొని ఓ వైపు దేవాలయం, మరో వైపు టేకులపల్లి వంతెన, దాని పక్కనే సాగర్ ప్రధాన కాల్వ ఉంటాయి. రోడ్డు వెడల్పుగా లేకపోవడం, కీలక జంక్షన్ కావడంతో విపరీతమైన రద్దీ ఉంటోంది. కాల్వ వైపు ఫెన్సింగ్ తాత్కాలికంగా ఏర్పాటు చేసినా, రక్షణ గోడ లేకపోవడం ప్రమాదాలకు కారణమవుతోంది. అలాగే, రఘునాథ పాలెంమండలంలోని వీ.వీ.పాలెం–చింతగుర్తి రహదారిపై సాగ ర్ కాల్వపై నిర్మించిన పాత వంతెన కూడా శిథిలావస్థలో ఉంది. -
వైరా కారులో వార్!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య పోరు జిల్లా పార్టీకి తలనొప్పులు తెస్తోంది. ఎవరి అనుమతి లేకుండానే నియోజకవర్గంలోని కొణిజర్ల, ఏన్కూరు, జూలూరుపాడు మండలాల కమిటీలను నియమించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలో ఉండగా అటు భద్రాద్రి, ఇటు ఖమ్మం జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకే జూలూరుపాడు కమిటీ ఎన్నిక జరిగిందని అక్కడి నేతలు ప్రకటించారు. కానీ ఎవరి ఆమోదం లేదని, ఇది పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమేనంటూ కమిటీలను రద్దు చేస్తూ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం. బహు నాయకత్వంతో గందరగోళం భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అధికారంలో ఉన్న పదేళ్లు వైరా నియోజకవర్గంలో బహు నాయకత్వం రాజ్యమేలింది. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున బానోతు చంద్రావతి పోటీ చేసి ఓడిపోగా.. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి గెలిచిన బానోతు మదన్లాల్ బీఆర్ఎస్లో చేరారు. ఆపై 2018లో బానోతు మదన్లాల్ ఓడిపోగా, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రాములు నాయక్ బీఆర్ఎస్లోకి వచ్చారు. బీఆర్ఎస్లో మొదటి నుంచి ఉన్న నేతలకు ఆదరణ దక్కకపోగా.. ప్రతీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తుండడంతో నాయకులు పెరిగి పార్టీ కేడర్లో అసంతృప్తికి కారణమైంది. కాగా, బీఆర్ఎస్లో మదన్లాల్ తనకంటూ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాక రాములునాయక్ చేరడంతో రాజకీయాలు మలుపు తిరిగాయి. పార్టీ కేడర్ రెండు వర్గాలుగా విడిపోవడమే కాక మదన్లాల్, రాములునాయక్ అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తూ పార్టీ కార్యక్రమాలను వేర్వేరుగానే నిర్వహించారు. అయినా జిల్లా, రాష్ట్ర నాయకత్వాలు వర్గపోరును ఆపలేకపోయాయి. చివరకు 2023లో పార్టీ తరఫున మదన్లాల్కు టికెట్ ఇచ్చినా విజయం దక్కలేదు. చుక్కాని లేని నావలా.. అధికారంలో ఉండగా బహు నాయకత్వంతో ఇబ్బంది పడిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు.. అధికారం కోల్పోయాక నాయకత్వ సమస్య ఎదుర్కొంటున్నాయి. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిష్టానం మదన్లాల్కు టికెట్ ఇవ్వగా, సిట్టింగ్ ఎమ్మెల్యే రాములునాయక్ను బుజ్జగించినప్పటికీ ఆయన రాజీనామా చేశారు. అయితే, మదన్లాల్కు ఓటమి ఎదురుకావడం, ఆపై ఆయన మృతితో నియోజకవర్గంలో బీఆర్ఎస్కు నాయకత్వం కరువైంది. ప్రతిపక్షంలో ఉండడంతో ఏ ఆందోళన నిర్వహించాలన్నా సమన్వయం చేసే వారు లేకపోగా, మండల కమిటీల నియామకం కూడా కొన్నిచోట్ల జరగలేదు. ఎవరికి వారే.. ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్లో నైరాశ్యం నెలకొని, పార్టీ కేడర్ను పట్టించుకునే నాయకుడు కరువయ్యాడు. ఈక్రమంలోనే మండల కమిటీలు లేకపోగా అటు రాష్ట్ర, ఇటు జిల్లా అధిష్టానం అనుమతి లేకుండానే జూలూరుపాడు, ఏన్కూరు, కొణిజర్ల మండల కమిటీలను నియమించుకోవడం వివాదాస్పదమైంది. జూలూరుపాడులో గత నెల 31న బీఆర్ఎస్ మండల అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భద్రాద్రి, ఖమ్మం జిల్లాల అధ్యక్షులు రేగా కాంతారావు, తాతా మధుసూదన్ అనుమతితో కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పగా, ఆతర్వాత ఏన్కూరు, కొణిజర్ల మండల కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి. ఆ నియామకాలు చెల్లవు మండల కమిటీల నియామకాలు చెల్ల వని తాజాగా బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ ప్రకటించారు. అధిష్టానం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే గ్రామ, మండల, జిల్లా కమిటీల నియామకాలు జరగుతాయని, అప్పటి వరకు చేపట్టే నియామకాలు చెల్లవని పేర్కొన్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది.నియోజకవర్గ బీఆర్ఎస్లో ఎవరి దారి వారిదే -
ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య
కూసుమంచి: మండలంలోని చౌటపల్లికి చెందిన నూకల సాయి కుమార్ (23)ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఆయన శుక్రవారం పురుగులమందు తాగగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఆర్థికసమస్యల కారణంగానే సాయి ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన తండ్రి మల్లయ్య ఇచ్చి న ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రేమ విఫలమైన యువకుడు.. కూసుమంచి: మండలంలోని మునిగేపల్లికి చెందిన తుపాకుల సిద్ధూ (25) శనివారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన కొన్నాళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తుండగా, ఆమె నిరాకరించినట్లు తెలిసింది. దీంతో సిద్ధూ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన తండ్రి హుస్సేన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. కుక్కల దాడిలో లేగదూడ మృతి నేలకొండపల్లి: మండలంలోని చెరువుమాధారంలో కుక్కలుదాడి చేయగా లేగ దూడ మృతి చెందింది.గ్రామానికి చెంది న రైతు తెల్లగొర్ల అనిల్ అప్పుడే పుట్టిన లేగదూడను శనివారం పశువుల కొట్టంలో పడుకోబెట్టాడు. ఈక్రమాన కుక్కల గంపు దాడిచేసి దూడనుఈడ్చుకెళ్లి దాడి చేయడంతో చనిపోయింది. మరికొన్ని పశువుల వెంట పడడంతో స్థానికులు స్పందించగా కుక్కలు పారిపోయాయి. -
గేమ్ చేంజర్గా ఖమ్మం–దేవరపల్లి హైవే
● కొత్త సంవత్సరంకల్లా అందుబాటులోకి రహదారి ● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం అర్బన్: ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే తెలంగాణ నుంచి దక్షిణ భారతదేశానికి మధ్య రవాణా సౌకర్యం మెరుగై గేమ్చేంజర్గా నిలుస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం ధంసలాపురం వద్ద గ్రీన్ఫీల్డ్ హైవే ఆర్ఓబీ, ఎంట్రీ–ఎగ్జిట్ పాయింట్లను కలెక్టర్ అనుదీప్, అధికారులతో కలిసి మంత్రి శనివారం పరిశీలించారు. హైవే నిర్మాణ పనులు వేగంగా చేపడుతూ త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ధంసలాపురం ఆర్ఓబీని నవంబర్ చివరి నాటికి ఓ వైపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కొత్త సంవత్సరంలో హైవే అందుబాటులోకి వస్తే 160 కి.మీ. పొడవైన ఈ రహదారి మీదుగా రాజమండ్రికి గంటన్నరలో చేరుకోవచ్చని తెలిపారు. ఖమ్మం–సత్తుపల్లి మార్గంలో సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేస్తే రైతులకు అనుకూలంగా ఉంటుందని మంత్రి చెప్పారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్కు సూచించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నేషనల్ హైవే పీడీ దివ్య, ఆర్అండ్బీ ఎస్ఈ యాకూబ్, కేఎంసీ కమిషనర్ అభిషేక్, ఆర్డీఓ నర్సింహారావు, ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, కార్పొరేటర్లు వెంకటేశ్వర్లు, ఆళ్ల నిరీషాఅంజిరెడ్డి, కమర్తపు మురళి, సొసైటీల చైర్మన్లు తుపాకుల యలగొండ స్వామి, రావూరి సైదాబాబు, తహసీల్దార్ సైదులు, నాయకులు సాదు రమేష్రెడ్డి, తుంపాల కృష్ణమోహన్, బోడా శ్రావణ్కుమార్, ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
కడదాకా సిద్ధాంతాన్ని వీడని రమేశ్
ఖమ్మంమయూరిసెంటర్: కమ్యూనిస్టు ఉద్యమం, సిద్ధాంతాలు బలహీనపడిన పరిస్థితుల్లో ఉద్యమాన్ని అంటిపెట్టుకుని కడవరకు నిలిచిన నర్రా రమేశ్ చిరస్మరణీయుడని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. అయితే, కమ్యూనిస్టు ఉద్యమం చిగురిస్తున్న సమయంలో ఆయన మృతి బాధాకరమన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో శనివారం మృతి చెందిన మాజీ కౌన్సిలర్, సీపీఎం నాయకుడు నర్రా రమేశ్ (58) సంతాప సభ పార్టీ జిల్లా కార్యాయలంలో నిర్వహించారు. ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించాక తమ్మినేని మాట్లాడుతూ.. కమ్యూనిస్టు, సోషలిస్టు వ్యతిరేకి అయిన ప్రధాని మోదీ ఇప్పుడు చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా ప్రధాని పుతిన్ కలిసి ఫ్రంట్ ఏర్పాటుకు సిద్ధమవడమే కమ్యూనిస్టు ఉద్యమానికి మంచిరోజులు వచ్చాయనేందుకు నిదర్శనమని పేర్కొన్నారు. రమేశ్ మృతి బాధాకరమని, విద్యార్థి, యువజన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ తెలిపారు. కాగా, నర్రా రమేశ్కు భార్య నాగలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉండగా నాగలక్ష్మి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తున్నారు. సంతాప సభలో కార్పొరేటర్లు యర్రా గోపి, యల్లంపల్లి వెంకట్రావు, బి.వెంకట్కుమార్, నాయకులు వై.విక్రమ్, మచ్చా వెంకటేశ్వర్లు, అన్నవరపు కనకయ్య, ఏజే రమేశ్, అన్నవరపు సత్యనారాయణ, పి.రాజారావు, కళ్యాణం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ, నాగరాజు, సీపీఐ, మాస్లైన్, బీఆర్ఎస్ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు శింగు నర్సింహారావు, మువ్వా శ్రీనివాసరావు, సీవై.పుల్లయ్య, ఆవుల అశోక్, డాక్టర్ చీకటి భారవి, పగడాల నాగరాజు, శీలంశెట్టి రమావీరభద్రం, మెంతుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ కౌన్సిలర్ సంతాప సభలో తమ్మినేని వీరభద్రం -
నేటి నుంచి సాగునీటి నిలిపివేత
కల్లూరురూరల్: మధిర బ్రాంచ్ సాగర్ కెనాల్కు ఆదివారం నుంచి 12వ తేదీ వరకు సాగునీరు నిలిపివేయనున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. వారబందీ విధానం అమలు చేస్తున్నందున ఆరు రోజుల పాటు నీటి విడుదల ఉండదని పేర్కొన్నారు. తిరిగి 13 నుంచి 18వ తేదీ వరకు నీరు సరఫరా చేస్తామని, ఈ విషయాన్ని రైతులు గమనించాలని సూచించారు. విద్యుదాఘాతంతో మేకల కాపరి మృతితిరుమలాయపాలెం: మేకలు మేపేందుకు వెళ్లి చెట్టుకొమ్మలు కొడుతున్న క్రమాన విద్యుదాఘాతానికి గురైన కాపరి మృతి చెందాడు. మండలంలోని ఇస్లావత్తండాకు చెందిన ఇస్లావత్ సక్లాల్ (26) వ్యవసాయంతో పాటు మేకలు కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం మేకలతో అడవికి వెళ్లిన ఆయన చెట్ల కొమ్మలు కొట్టి వేస్తుండగా, ఆపైన ఉన్న విద్యుత్ లైన్ తాకడంతో షాక్కు గురై పక్కనే బావిలో పడ్డాడు. కొద్దిసేపటికి గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా మృతదేహాన్ని బయటకు తీయించారు. సక్లాల్కు భార్య సరిత ఉంది. ఆయన తండ్రి నాగులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. యువకుడి మృతదేహం లభ్యంముదిగొండ: వినాయకుడి నిమజ్జనానికి వెళ్లి మండలంలోని మాధాపురం చెరువులో శుక్రవారం గల్లంతైన పడిశాల సైదారావు (24) మృతదేహాన్ని శనివా రం గుర్తించారు. స్థానికులు శుక్రవారం రాత్రి వరకు గాలించినా ఆచూకీ లభించలేదు. శనివా రం ఉదయం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలించగా మృతదేహం లభ్యమైంది. ఘటనపై ముదిగొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీజే సౌండ్కు కుప్పకూలిన మహిళనేలకొండపల్లి: వినాయక నిమజ్జనంలో ఏర్పా టు చేసిన డీజే శబ్దంతో ఓ మహిళ అస్వస్థతకు గురైంది. మండలంలోని మంగాపురంతండా లో శనివారం రాత్రి గణేశ్ శోభాయాత్ర జరుగుతుండగా డీజే పాటలకు అనుగుణంగా భూక్యా పార్వతి నృత్యం చేస్తోంది. ఈ క్రమంలో ఆమె కుప్పకూలగా స్థానికంగా చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. అలాగే, మండల కేంద్రంలో వినాయక శోభాయాత్రలో భాగంగా బాణసంచా కాల్చేక్రమాన ప్రమాదంజరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలు తప్పనిసరి
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లాలో సమగ్ర క్రీడాభివృద్ధి సాధించేలా పీడీలు, పీఈటీ, కోచ్లు శ్రమించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలని తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం ఆయన పీఈటీలు, పీడీలు, కోచ్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల్లో కేవలం చదువుపైనే దృష్టి పెట్టడంతో విద్యార్థులు క్రీడల్లో వెనుకబడుతున్నారని తెలిపారు. శారీరక సామర్ధ్యం, ఏకాగ్రత పెరిగేలా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వారానికి 150 నిమిషాలు శిక్షణ తప్పనిసరి చెప్పారు. ఈ విషయమై రికార్డులు కూడా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పటికే క్రీడా కిట్లు పంపిణీ చేసినందున మైదానాలను చదువును చేయించి శిక్షణ ఇవ్వాలని తెలిపారు. అలాగే, క్లస్టర్, మండల స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహిస్తూ విద్యార్థుల్లో పోటీతత్వం పెంచాలని, నైపుణ్యం కనబరిచే వారికి స్టేడియాల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు పంపాలని సూచించారు. పాఠశాలల్లో తరగతుల వారీగా క్రీడా శిక్షణకు టైంటేబుల్ రూపొందించి, స్పోర్ట్స్ కమిటీలను నియమించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలోడీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
నేడు మంత్రి తుమ్మల పర్యటన
ఖమ్మంఅర్బన్: రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఖమ్మం నగరంతో పాటు రఘునాథపాలెం మండలంలో పర్యటించనున్నారు. ఉదయం ఖమ్మంలోని ధంసలాపురం వద్ద గ్రీన్ఫీల్డ్ హైవే ఎగ్జిట్–ఎంట్రీ పనులు, ఆర్ఓబీ నిర్మాణ పనులను మంత్రి పరిశీలిస్తారు. అలాగే, మధ్యాహ్నం గాంధీచౌక్లో గణేశ్ విగ్రహాల శోభాయాత్రను ప్రారంభి స్తారు. ఇక సోమవారం రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంలో వెటర్నరీ సబ్సెంటర్ భవనం, ప్రహరీ, బీసీ హాస్టల్ భవన నిర్మాణాలతో పాటు మధ్యాహ్నం ఖమ్మం రోటరీనగర్లో రహదారులు, డ్రెయిన్ల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ‘ఆపదమిత్ర’లుగా శిక్షణ ఖమ్మం రాపర్తినగర్: నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, మేరా యువ భారత్ ఆధ్వర్యాన యువతకు ‘ఆపదమిత్ర’లుగా శిక్షణ ఇవ్వనున్నట్లు నెహ్రూ యువక కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ తెలిపారు. వరదలు, భూకంపాలు తదితర విపత్కర పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టే భద్రతా దళాలకు అండగా నిలిచేలా యువతకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఖమ్మంలో వారం పాటు జరిగే శిక్షణలో పాల్గొన్న వారికి ఎమర్జెన్సీ కిట్తో పాటు సర్టిఫికెట్ అందిస్తామని తెలిపారు. జిల్లా వాసులై 18–40 ఏళ్ల వయస్సు కలిగి కనీస విద్యార్హత ఉన్న యువత ఈనెల 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు ఖమ్మం పాత బస్టాండ్ సమీపంలోని మై భారత్ కార్యాలయం(నెహ్రూ యువ కేంద్రం)లో లేదా 99517 45203 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. నిమజ్జన ఘాట్లు పరిశీలించిన అడిషనల్ డీసీపీ ఖమ్మంక్రైం: జిల్లా కేంద్రంలో గణేష్ విగ్రహాల నిమజ్జనం శనివారం జరగనుండగా ఘాట్ల వద్ద ఏర్పాట్లను శుక్రవారం అడిషనల్ డీసీపీ ప్రసాదరావు పరిశీలించారు. కాల్వొడ్డు, ప్రకాశ్ నగర్, ఖమ్మం రూరల్ మండలం పెద్దతండా వైపు మున్నేటి తీరాన నిమజ్జనం ఘాట్లను పరిశీలించిన ఆయన ఏర్పాట్లు, భద్రతపై సూచనలు చేశారు. అలాగే, వాహనాల రాకపోకలకు ఇక్కట్లు ఎదురుకాకుండా బందోబస్తు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. నేడు ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటన ఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు. ఈ జాబితాలను మండల పరిషత్ కార్యాలయాలతో పాటు జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రదర్శిస్తారు. ఈ జాబితా ఆధారంగా జిల్లాలో 8,02,690మంది ఓటర్లు ఉన్నట్లు తెలుస్తుండగా, పోలింగ్ బూత్ల సంఖ్య 1,572 నుంచి 1,580కి పెరగనుంది. ఆతర్వాత అభ్యంతరాలు స్వీకరించి పరిశీలన అనంతరం ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తారు. జాతీయ స్థాయి పోటీలకు ‘కస్తూరి తిలకం’ మధిర: ఏపీలోని తెనాలిలో కళల కాణాచి సంస్థ ఆధ్వర్యాన ఈనెల 27 నుంచి అక్టోబర్ 2 వరకు జాతీయ స్థాయి పద్య నాటక పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు మధిర కళాకారులు రూపొందించిన కస్తూరి తిలకం పద్య నాటకం ఎంపికై ంది. ఈ నాటకాన్ని శారదాప్రసన్న రచించగా, డాక్టర్ సుబ్బరాజు దర్శకత్వంలో ప్రదర్శించనున్నారు. వివిధ పాత్రలను చిలువేరు శాంతయ్య, ఇనుపనూరి వసంత్, నరాల సాంబశివారెడ్డి, రాజేశ్వరరావు, తిరువూరు ప్రసాద్, కోటిరెడ్డి పోషిస్తారు. జిల్లా నుంచి రెండు నాటకాలను పరిశీలించగా కస్తూరి తిలకం ఎంపికై ందని సుమిత్ర యూత్ ప్రధాన కార్యదర్శి సుబ్బరాజు తెలిపారు. -
రోజూ 30లక్షల మందికి ‘మహాలక్ష్మి’
సత్తుపల్లిటౌన్: ఆర్టీసీ బస్సుల్లో ప్రతిరోజూ సుమారు 50లక్షల మంది రాకపోకలు సాగిస్తుండగా, మహాలక్ష్మి పథకం ద్వారా 30లక్షల మందికి పైగా మహిళలు ప్రయాణిస్తున్నారని ఆర్టీసీ కరీంనగర్జోన్ ఈడీ సోలోమన్ తెలిపారు. తద్వారా ఈ పథకం సంస్థకు వరంలా మారిందని వెల్లడించారు. సత్తుపల్లి ఆర్టీసీ డిపోను ఖమ్మం ఆర్ఎం ఏ.సరిరామ్తో కలిసి శుక్రవారం సందర్శించిన ఆయన మాట్లాడారు. ఉద్యోగులు ప్రయాణికులతో గౌరవంగా వ్యవహరిస్తూ వారి మన్ననలు పొందాలని సూచించారు. ప్రజలను సురక్షితంగా, సౌకర్యవంతంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా విధినిర్వహణ ఉండాలని తెలిపారు. కాగా, పురుష ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా బస్సు సర్వీసులు నడిస్తున్నామని చెప్పారు. కాగా, డబుల్ డ్యూటీలు ఎక్కువగా వస్తున్నాయన్న డ్రైవర్లు, కండక్టర్ల విజ్ఞప్తితో కొందరు సిబ్బందిని ఔట్సోర్సింగ్ విధానంలో తీసుకున్నట్లు ఈడీ తెలిపారు. సత్తుపల్లి డిపో ఆదర్శం పరిశుభ్రత, కేఎంపీఎల్, విధి నిర్వహణతో పాటు అన్ని విభాగాల్లో సత్తుపల్లి ఆర్టీసీ డిపో ఆదర్శంగా నిలిచిందని ఈడీ సోలోమన్ తెలిపారు. సమష్టిగా కష్టపడడంతో ఇది సాధ్యమైందని ఉద్యోగులను అభినందించారు. శ్రీరామనవమి సందర్భంగా తలంబ్రాల బుకింగ్లో సత్తుపల్లి డిపో రీజియన్లో ప్రథమస్థానాన నిలవగా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎస్.కే.మునీర్పాషా, సిబ్బంది కిన్నెర ఆనంద్, జైపాల్ను సత్కరించారు. డిప్యూటీ ఆర్ఎం వి.మల్లయ్య, డీఎం యు.రాజ్యలక్ష్మి, అసిస్టెంట్ మేనేజర్ విజయశ్రీ, ఎంఎఫ్ సాహితితోపాటు సూపర్వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ సోలోమన్ -
‘స్వగృహ’ మాకే కావాలి!
ఖమ్మం సహకారనగర్: ఎన్నో ఏళ్ల అనంతరం సొంత ఇంటి కల నెరవేరుతుందనే ఆశతో ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా... వారి ఆశలను అడియాసలు చేసేలా కొందరు వ్యాపారులు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలో ఏళ్ల క్రితం రాజీవ్ స్వగృహ పేరిట నిర్మాణం మొదలుపెట్టిన అపార్ట్మెంట్ల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. ఆతర్వాత ఎవరూ పట్టించుకోలేదు. సుమారు ఏడేళ్లుగా ఉన్నవి ఉన్నట్లుగా తమకు కేటాయిస్తే మిగతా నిర్మాణం చేసుకుంటామని ఉద్యోగ సంఘాల ఆధ్వర్యాన పలు మార్లు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, చివరకు ముఖ్యమంత్రిని సైతం కలిశారు. ఈ వినతిపై ఇటీవలే స్పందన రావడంతో ఒక్కో అడుగు ముందుకు పడుతుండగానే రియల్ ఎస్టేట్ వ్యాపారులు రంగంలోకి దిగడం వారిని ఆందోళనకు గురిచేస్తోందని సమాచారం. హౌసింగ్ పీడీ పరిశీలన రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను ఉద్యోగులకు నిర్ణీత ధరతో కేటాయించేందుకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. దీంతో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యాన సమావేశమై ఫ్లాట్ల ధర చదరపు అడుగుకురూ.1,150గా నిర్ణయించారు. అదే అభివృద్ధి చేశాక రూ.2,500గా ఖరారు చేశారు. అంతేకాక అభివృద్ధి తర్వాత రాజీవ్ స్వగృహ ప్రాంగణం ఎలా మారనుందో బ్రోచర్లు ముద్రించారు. ఈక్రమంలోనే హౌసింగ్ పీడీ వీ.పీ.గౌతమ్ ఇటీవల పరిశీలించి సూచనలు చేశారు. ఆపై కలెక్టర్ అనుదీప్ కూడా సమీక్షించి రాజీవ్ స్వగృహ ప్రాంగణాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలంగాణ ఉద్యోగుల హౌస్ బిల్డింగ్ సొసైటీకి కేటాయిస్తామని ప్రకటించారు. తొలి దఫాగా రూ.5కోట్లు రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కోసం తొలిదశలో ప్రభుత్వానికి రూ.5కోట్లు చెల్లించాల్సి ఉండడంతో నగదు సేకరణలో ఉద్యోగ సంఘాలు నిమగ్నమయ్యాయి. అలాగే, కలెక్టర్ సమీక్ష సందర్భంగా మున్నేటికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నందున వరద నుంచి ఎలాంటి ముప్పు ఉండదని, బఫర్ జోన్ కాకపోవడంతో భవిష్యత్లోనూ ఇబ్బందులు ఉండవని తెలిపారు. దీంతో ఉద్యోగులు ఫ్లాట్లు బుక్ చేసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. అప్పడు వద్దు.. ఇప్పుడు కావాలి గతంలో రెండు సార్లు రాజీవ్ స్వగృహను వేలం వేయగా ఏ ఒక్క వ్యాపారి ముందుకు రాలేదు. కనీసం టెండర్లు కూడా దాఖలు చేయలేదు. కానీ మున్నేటికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మిస్తుండడం, నిర్మాణ ప్రాంతం బఫర్ జోన్ పరిధిలోకి రాదని ఏకంగా కలెక్టర్ ప్రకటించడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ముందుకొస్తున్నట్లు సమాచారం. ఉద్యోగ సంఘాల ఆధ్వర్యాన నిర్మించిన బ్రోచర్లు కూడా ఆకట్టుకునేలా ఉండడంతో వ్యాపారులే సముదాయాన్ని దక్కించుకుని అభివృద్ధి చేశాక అధిక ధరలో అమ్ముకోవాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. అయితే, ఏళ్ల అనంతరం సొంతింటి కల నెరవేరుతుందనే ఆశతో ఉన్న ఉద్యోగులు ఈ ప్రచారంతో ఆందోళన చెందుతుండగా.. ఎవరూ స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. -
ఇకపై పీఏసీఎస్ల ద్వారానే..
● డీలర్ల ద్వారా యూరియా పంపిణీ నిలిపివేత ● రైతుల ఇబ్బందుల నేపథ్యాన ప్రభుత్వ నిర్ణయం ● జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో ఇప్పటికే అమలు ఖమ్మంవ్యవసాయం: యూరియా పంపిణీని పూర్తిగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘా(పీఏసీఎస్)ల ఆధ్వర్యంలోనే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 40 శాతం మేర డీలర్ల ద్వారా, మిగతా పీఏసీఎస్ల ఆధ్వర్యాన పంపిణీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేసే యూరియాకు ఈసారి కొరత ఏర్పడగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈనేపథ్యాన పీఏసీఎస్ల ద్వారా పంపిణీ చేస్తేనే ఎరువులు పక్కదారి పట్టకుండా పారద్శకత ఉంటుందని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, పాలేరు నియోజకవర్గంలో ఇప్పటికే ఈ విధానం అమలవుతుండగా, మిగతా ప్రాంతాల్లోనూ అమలుచేయనున్నారు. డీలర్లకు నిలిపివేత ప్రస్తుతం జిల్లాలోని 500 డీలర్లకు యూరియా సరఫరాను పూర్తిగా నిలిపివేయనున్నారు. ఇకపై పూర్తిగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా పంపిణీ జరుగుతుంది. పీఏసీఎస్లకు దూరంగా ఉన్న గ్రామాల్లో సబ్ సెంటర్లను ఏర్పాటు చేసి యూరియా పంపిణీ చేస్తారు. పాలేరు నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న ఈ విధానాన్ని జిల్లాలోని 76 పీఏసీఎస్ల పరిధిలో అమలుకు నిర్ణయించారు. ఇందుకోసం సహకార సంఘాలకు తోడు మరో 55 సబ్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. మండల వ్యవసాయాధికారి పర్యవేక్షణలో ఏఈఓల ద్వారా కూపన్లు జారీ చేయనుండగా, పీఏసీఎస్ల సీఈఓలు, ఉద్యోగులు యూరియా అందిస్తారు. మరో రెండు వ్యాగన్ల యూరియా జిల్లాలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్కు రెండు రోజుల్లో రెండు వ్యాగన్ల యూరియా రానుందని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలి పారు. ఒక్కో వ్యాగన్లో 2,600 మెట్రిక్ టన్నుల యూరియా ఉంటుందని పేర్కొన్నారు. ఈ యూరి యాను ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు సరఫరా చేస్తామని తెలిపారు. కాగా, శుక్రవారం జిల్లాకు 1,333 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, ఇందులో ఖమ్మం జిల్లాకు 483, భద్రాద్రి జిల్లాకు 500, మహబూబాబాద్ జిల్లాకు 250 మెట్రిక్ టన్నుల చొప్పున కేటాయించామని వెల్లడించారు. -
సీఎం చేతుల మీదుగా అవార్డులు
నేలకొండపల్లి: ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేలా విద్యార్థులు వచ్చివెళ్లేందుకు సొంత ఖర్చులతో ఆటో సమకూర్చడమే కాక ట్యూటర్ నియమించిన నేలకొండపల్లి మండలంలోని ఆరెగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఇన్చార్జ్ ఎంఈఓ బి.చలపతిరావు సేవలకు గుర్తింపు లభించింది. ఆయన కృషిపై ‘బడి బలోపేతానికి బాధ్యతగా..’ శీర్షికన జూలై 6న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ విషయం సీఎం రేవంత్రెడ్డి దృష్టికి వెళ్లడంతో శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో ఆయనను సన్మానించారు. ఈకార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా తదితరులు పాల్గొన్నారు. ●కల్లూరు: కల్లూరు మండలం చెన్నూరు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు దంతాల సుధాకర్ రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కాగా హైదరాబాద్లో అవార్డు అందుకున్నారు. ●మధిర : మధిర మండలం దెందుకూరుకు పగిడిపల్లి నాగచందర్రావు మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. ఆయన రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రిన్సిపాల్గా అవార్డు స్వీకరించారు.జిల్లా నుంచి పలువురు ఉపాధ్యాయులకు అవకాశం -
ఆమోదిస్తే సవరణే...
● మార్కెట్ విలువతో పోలిస్తే భూమి రిజిస్ట్రేషన్ ధరలో హెచ్చుతగ్గులు ● దీన్ని సవరించేలా గత ఏడాది కమిటీల ఏర్పాటు ● ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించిన రిజిస్ట్రేషన్ల శాఖ ● సీఎం సూచనలతో అమలైతే ఉమ్మడి జిల్లాలోనూ ప్రభావంసాక్షిప్రతినిధి, ఖమ్మం: వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువ సవరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గత ఏడాది జూన్లో ధరల సవరణకు ప్రభుత్వం కమిటీలను నియమించింది. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ, రెవెన్యూ అధికారులతో ఏర్పాటైన ఈ కమిటీలు అన్ని జిల్లాలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ భూముల విలువ సవరణకు ఉన్న అవకాశాలపై ప్రభుత్వానికి నివేదించారు. ఆతర్వాత ప్రక్రియ నిలిచిపోయింది. గతనెలలో ఓఆర్ఆర్ లోపల, వెలుపల 20 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ పరిధిలోనే విలువ సవరణ ప్రతిపాదనలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ రూపొందించింది. కానీ రాష్ట్రమంతటా సవరించాలని సీఎం రేవంత్రెడ్డి సూచించడంతో గత ఏడాది పంపిన ప్రతిపాదనల మేరకు పెంచేలా కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. రెండేసి కమిటీలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొన్నేళ్లుగా బహిరంగ మార్కెట్లో భూముల ధరలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ధరలతో పోలిస్తే బహిరంగ మార్కెట్ విలువ నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంది. గతంలో అత్యధిక ధర ఉన్న ప్రాంతాల్లో ప్రస్తుతం మార్కెట్ విలువ స్తబ్దుగా ఉంది. వీటిని సవరించేందుకు గత ఏడాది జూన్లో కమిటీలను ఏర్పాటు చేశారు. గ్రామీణ కమిటీలకు ఆర్డీఓ చైర్మన్గా, తహసీల్దార్, ఎంపీడీఓ, మార్కెట్ వాల్యూ సబ్ రిజిస్ట్రార్లు సభ్యులుగా, స్థానిక సబ్ రిజిస్ట్రార్ను కన్వీనర్గా ఉన్నారు. అర్బన్ కమిటీలకు అదనపు కలెక్టర్(రెవెన్యూ) చైర్మన్గా, జెడ్పీ సీఈఓ, మున్సిపల్ కమిషనర్, సుడా వైస్ చైర్మన్లు సభ్యులుగా, స్థానిక సబ్ రిజిస్ట్రార్ను కన్వీనర్గా నియమించి పరిశీలన చేయించారు. ప్రభుత్వానికి నివేదికలు కమిటీలు పలు ప్రాంతాల్లో ధరల్లో తేడాలను పరిశీలించాయి. ఉమ్మడి జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో భూముల విలువ సవరణ కోసం ప్రతిపాదనలను గత ఏడాది జులైలో ప్రభుత్వానికి పంపారు. ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో ప్రస్తుత మార్కెట్ విలువ, బహిరంగ మార్కెట్ విలువ ఆధారంగా కొన్నిచోట్ల పెంపు, ఇంకొన్ని చోట్ల తగ్గింపునకు ప్రతిపాదించారు. వీటి ప్రకారం ఖమ్మం చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో భూ ధరలు భారీగా పెరిగే అవకాశముంది. కమర్షియల్ ప్రాంతాలను పక్కాగా గుర్తించి ధరలు పెంచేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిపాదనలు సమర్పించారు. పూర్తిస్థాయి పరిశీలన కోసం.. భూముల మార్కెట్ విలువ సవరణపై ప్రభుత్వానికి నివేదిక అందాక ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లతో సమావేశం నిర్వహించారు. ధరల పెంపు మరింత పారదర్శకంగా ఉండాలని, ఎక్కడా వ్యత్యాసాలు ఉండకూడదని ఆదేశించారు. దీంతో ప్రతిపాదనలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కర్ణాటకలో పరిశీలనకు ఓ కమిటీ వెళ్లగా.. అందులో జిల్లా రిజిస్ట్రార్ కూడా ఉన్నారు. ప్రతిపాదనలకే సై... ఉమ్మడి జిల్లాలో భూముల మార్కెట్ విలువ సవరణపై అందిన ప్రతిపాదనలను ఆమోదించే అవకాశముందని తెలుస్తోంది. తద్వారా ఖమ్మం కలెక్టరేట్ ప్రాంతంలోని రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం, చింతకాని మండలం వందనం, కొణిజర్ల మండలం తనికెళ్ల, అమ్మపాలెం రెవెన్యూ పరిధిలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువ భారీగా పెరిగే అవకాశముంది. ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల ప్రభుత్వ, బహిరంగ మార్కెట్ ధర ఆధారంగా అన్నిరకాల భూముల ధరలు 50 శాతం వరకు పెరగొచ్చని భావిస్తున్నారు. కాగా, బహిరంగ మార్కెట్ ధరకు దగ్గరగా ఉన్న చోట్ల మాత్రం యథావిధిగా కొనసాగించాలనే ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది.ఖమ్మం ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధి : నివాస ప్రాంతాల్లో గజం కనీస ధర రూ.2,100 ఉండగా రూ.3వేలకు, గరిష్ట ధరను రూ.26,400 నుంచి రూ.26,500కు పెంచాలని ప్రతిపాదించారు. వాణిజ్య ప్రాంతాల్లో కనీస ధరను రూ.4,800 నుంచి రూ.10 వేలకు, గరిష్ట ధర రూ.44,900నుంచి రూ.45,000కు పెంచేలా ప్రతిపాదనలు సమర్పించారు. అపార్ట్మెంట్లలో చదరపు అడుగు కనీస ధరను రూ.2వేలు యథాతధంగా కొనసాగించాలని, గరిష్ట ధరను రూ.3,500 నుంచి రూ.3,800కు పెంచాలని పేర్కొన్నారు. వ్యవసాయ భూముల ఎకరా కనీస ధరను రూ.6.75లక్షల నుంచి రూ.10 లక్షలకు, గరిష్ట ధరను రూ.2,43,75,000 నుంచి రూ.2.90కోట్లకు పెంచాలని ప్రతిపాదించారు. ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం : నివాస ప్రాంతాల్లో గజం కనీస ధరను రూ.300 నుంచి రూ.500కు, గరష్ట ధరను రూ.4,800 నుంచి రూ.5 వేలకు పెంచాలని ప్రతిపాదించారు. వాణిజ్య ప్రాంతాల్లో కనీస ధర రూ.1,100 నుంచి రూ.2 వేలకు, గరిష్ట ధర రూ.5,800 నుంచి రూ.10 వేలకు పెంచాలని పేర్కొన్నారు. ఆపార్ట్మెంట్లలో కనీస ధర రూ.1,300ను కొనసాగిస్తూ, గరిష్ట ధరను రూ.1,500 నుంచి రూ.2 వేలకు పెంచాలని సూచించారు. వ్యవసాయ భూముల ఎకరా కనీస ధరను రూ.2.25 లక్షల నుంచి రూ.5,లక్షలకు, గరిష్ట ధరను రూ.1,18,58,000 నుంచి రూ.1.30 కోట్లకు పెంచాలని ప్రతిపాదించారు. సత్తుపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం : నివాస ప్రాంతాల్లో గజం కనీస ధర రూ.700 నుంచి రూ.900కు, గరిష్ట ధర రూ.4,100 నుంచి రూ.5 వేలకు పెంచొచ్చని ప్రతిపాదించారు. వాణిజ్య ప్రాంతాల్లో కనీస ధర రూ.4,800 నుంచి రూ.6 వేలకు, గరిష్ట ధర రూ.19,600 నుంచి రూ.25వేల మేర పెంపునకు ప్రతిపాదించారు. అపార్ట్మెంట్లలో కనీసధర రూ.1,300 నుంచి రూ.1,500కు, గరిష్ట ధర రూ.2,500 నుంచి రూ.3వేలకు పెంచేలా పేర్కొన్నారు. వ్యవసాయ భూమి ఎకరా కనీస ధర రూ.3,37,500 నుంచి రూ.4,లక్షలకు, గరిష్ట ధరను రూ.91.48 లక్షల నుంచి రూ.2 కోట్లకు ప్రతిపాదించారు. -
నేచర్ పార్కులో సౌకర్యాలు కల్పిస్తాం
పాల్వంచరూరల్/ఇల్లెందు రూరల్: ఇల్లెందు కోరగుట్ట చుట్టూ అటవీశాఖ తీర్చిదిద్దిన నేచర్ పార్క్లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని పీసీసీఎఫ్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్–హెడ్ ఆఫ్ ఫోర్స్) సువర్ణ అన్నారు. మండలంలోని రొంపేడు అటవీ ప్రాంతంలో ప్లాంటేషన్ను, కోరగుట్ట వద్ద నేచర్ పార్క్ను శుక్రవారం ఆమె సందర్శించారు. కిన్నెరసాని అభయారణ్యం పరిధిలోని రేగళ్ల, ఆళ్లపల్లి, రంగాపురం ఏరియాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో ప్లాంటేషన్లు, నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫలాలనిచ్చే మొక్కలు నాటాలని సూచించారు. పార్క్లో ఏర్పాటు చేసిన వాచ్టవర్ను ప్రారంభించారు. శనివారం కిన్నెరసాని డీర్ పార్కు, జలాశయం మధ్యలోని ఆనంద ద్వీపాన్ని సందర్శించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీఎఫ్ భీమా నాయక్, డీఎఫ్వో కిష్టాగౌడ్, ఎఫ్డీఓలు బాబు, కరుణాకరాచారి, ఎఫ్ఆర్ఓ చలపతిరావు, డీఆర్వోలు వెంకటరావు, వీరబాబు, ఎఫ్బీఓ సుజాత తదితరులు పాల్గొన్నారు.భద్రాద్రి జిల్లాలో పర్యటించిన పీసీసీఎఫ్ సువర్ణ -
నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి
ఖమ్మంక్రైం: జిల్లా కేంద్రంలో ప్రతిష్ఠించిన గణేష్ విగ్రహాలను శనివారం నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం మున్నేటికి ఇరువైపులా పలు చోట్ల ఘాట్లు ఏర్పాటుచేశారు. ఈనేపథ్యాన శోభాయాత్ర, నిమజ్జనం సాఫీగాసాగేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఏర్పాటుచేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్దత్ తెలిపారు. అంతేకాక నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, గణేష్ శోభాయాత్ర నిర్దేశిత రూట్మ్యాప్ ప్రకారమే జరిగేలా చూడాలని సూచించారు. వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, ఆర్అండ్బీ, వైద్య విద్యుత్ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశామని, నిమజ్జనం సకాలంలో జరిగేలా ఉత్సవ కమిటీలు చొరవ తీసుకోవాలని తెలిపారు. అలాగే, శోభాయాత్రలో సౌండ్ సిస్టమ్, డీజేలపై నిషేధం ఉంటుందని, డ్రైవర్లు మద్యం, మత్తు పానీయాలు సేవించొద్దని సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అడిషనల్ డీసీపీ ప్రసాద్రావు ఆధ్వర్యాన 500 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని సీపీ తెలిపారు. ●మామిళ్లగూడెం ఏరియా విగ్రహాలను మయూరి సెంటర్, కిన్నెర, జెడ్పీ సెంటర్, చర్చి కాంపౌండ్ మీదుగా చేర్చాలి. ●ఆర్టీసీ కార్యాలయం, బ్యాంక్ కాలనీ ప్రాంత గణేష్ విగ్రహాల ఊరేగింపు ఎన్టీఆర్ సర్కిల్, ఇల్లెందు క్రాస్, జెడ్పీ సెంటర్, చర్చి కాంపౌండ్ మీదుగా చేరుకోవాలి. ●రోటరీనగర్, ఇందిరానగర్ ప్రాంతం గణేష్ విగ్రహాల ఊరేగింపు మమత క్రాస్, ఇల్లెందు క్రాస్, జెడ్పీ సెంటర్, చర్చి కాంపౌండ్ మీదుగా వెళ్లాలి. ●కస్బాబజార్, కమాన్బజార్ విగ్రహాల ఊరేగింపును చర్చి కాంపౌండ్ మీదుగా కొనసాగించాలి. ●గొల్లగూడెం, శ్రీనగర్ కాలనీ ప్రాంతాల విగ్రహాలను లకారం ట్యాంక్ బండ్ నుంచి, టాటా మోటార్స్, చెరువుబజార్, చర్చి కాంపౌండ్ మీదుగా తీసుకెళ్లాలి. ●శ్రీరామ్హిల్స్, ముస్తఫానగర్ ప్రాంత విగ్రహాలను ముస్తఫానగర్, చర్చి కాంపౌండ్ మీదుగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ●వైరా రోడ్డు ప్రాంతంలోని గణేష్ విగ్రహాల ఊరేగింపు జెడ్పీ సెంటర్, చెరువు బజార్, చర్చి కాంపౌండ్ మీదుగా కొనసాగించాలి. ●సారధినగర్ ప్రాంత విగ్రహాలను గాంధీచౌక్, నాయుడు సిల్క్స్, పీఎస్ఆర్ రోడ్, గుంటు మల్లన్న ఆలయం, ట్రంక్ రోడ్, నయాబజార్ మీదుగా తీసుకెళ్లాలి. రూరల్ మండలం..●నాయుడుపేట, జలగంనగర్, పెద్ద తండా, సాయిప్రభాతనగర్, సాయి గణేష్ నగర్, సూర్య నగర్, కరుణగిరి, రాజీవ్ గృహకల్ప, ఏదులా పురం, ముత్తగూడెం, రెడ్డిపల్లి ప్రాంత విగ్రహాలను నాయుడుపేట వైపు ఏర్పాటు చేసిన మున్నేరు రాంప్ ద్వారా నిమజ్జనం చేయాలి. ●ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి తీర్థాల, మంగళగూడెం, మద్దివారిగూడెం, పోలిశెట్టిగూడెం, గూడూరుపాడు, తనగంపాడు, కస్నాతండా, కాచిరాజుగూడెం, ఎం.వీ.పాలెం, ఆరెకోడు, ఆరెకోడు తండా, వాల్యా తండా, పిట్టలవారిగూడెం, పోలేపల్లి, గోల్లపాడు, పల్లెగూడెం గ్రామాల్లోని విగ్రహాలను తీర్థాల వద్ద మున్నేటి నిమజ్జనం చేయాలి. ●రూట్ నెంబర్ – 1 : మున్నేరు నుంచి పంపింగ్ వెల్ రోడ్డు, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్, హర్కరా బావి సెంటర్, మూడు బొమ్మల సెంటర్ బోస్ బొమ్మ సెంటర్, చర్చి కంపౌండ్ మీదుగా వెళ్లాలి. ●రూట్ నెంబర్ – 2 : మున్నేరు నుంచి పంపింగ్ వెల్ రోడ్డు, త్రీటౌన్ పోలీస్ స్టేషన్, హర్కరా బావి సెంటర్, మూడు బొమ్మల సెంటర్, బోస్ బొమ్మ సెంటర్, చర్చి కాంపౌండ్, జెడ్పీ, ఇల్లెందు క్రాస్, ఎన్టీఆర్ సర్కిల్ లేదా మమత సర్కిల్ మీదుగా వెళ్లాలి. ●రూట్ నెంబర్ – 3 : ప్రకాష్నగర్ మున్నేరు నుంచి సెయింట్ జోసెఫ్ సెంటర్, చర్చి కాంపౌండ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. గణేష్ విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యేంత వరకు ప్రకాశనగర్ బ్రిడ్జి, కాల్వొడ్డు బ్రిడ్జి మీదుగా అన్నిరకాల వాహనాల రాకపోకలపై నిషేధం ఉంటుంది. ఇక రాపర్తినగర్ – కరుణగిరి బ్రిడ్జి మీదుగా సాధారణ వాహనాలనే అనుమతిస్తారు. అలాగే, మయూరి బ్రిడ్జి మీద నుంచి కూడా రాకపోకలు నిలిపేస్తారు. అంతేకాక నిమజ్జనం సమయాన రాపర్తి నగర్, కొత్త బస్టాండ్, ఎన్టీఆర్ సర్కిల్, మమత సర్కిల్ వైపు వెళ్లే వాహనాలు, నెహ్రూ సర్కిల్ నుంచి ఎఫ్సీఐ గోదాంల మీదుగా వాహనాలకు అనుమతి ఉండదు. వాహనదారులు కాల్వొడ్డు, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్, మిర్చి మార్కెట్, చర్చి కాంపౌండ్, చెరువుబజార్, జెడ్పీ, ఇల్లెందు క్రాస్ రోడ్డు మీదుగా వెళ్లాలి. -
రూ.350 కోట్లతో ప్రతిపాదనలు
భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి దేవాదాయ శాఖ రూ.350 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఈ మేరకు ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి, దేవాదాయ శాఖ ఉన్నతాఽధికారులు ప్రాథమిక నమూనా సిద్ధం చేశారు. ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో కలెక్టర్ ఆలయ అధికారులతోపాటు వైదిక కమిటీ సభ్యులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అభ్యంతరాలు, సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. ఆగమశాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి ఉంటుందని, ప్రధాన ఆలయంలో మార్పులు లేకుండా ఇతర అభివృద్ధి పనులు చేపతామని పేర్కొన్నారు. నాలుగు విడతలుగా.. రామాలయం, పరిసర ప్రాంతాల అభివృద్ధి నాలుగు విడతల్లో చేపట్టేలా నూతన నమూనాలో ప్రతిపాదనలు రూపొందించారు. తొలి విడతలో ఆలయ కాంప్లెక్స్ విస్తరణ పూర్తి చేయాలని ప్రతిపాదించారు. మండపాలు, క్యూ హాళ్లు, ప్రసాదం విభాగం, అడ్మినిస్ట్రేషన్ భవనాలు ఉన్నాయి. ఇందుకు రూ. 115 కోట్లు అవసరమని సూచించారు. ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాల అభివృద్ధిని రెండో విడతలో ప్రాధాన్యాంశాలుగా పేర్కొన్నారు. ఇందులో విస్తా కాంప్లెక్స్, అడ్మిన్ బ్లాక్, ఘాట్లు, రహదారులు ఉన్నాయి. ఈ పనులను రూ.35 కోట్లతో ప్రతిపాదించారు. మూడో విడతలో కరకట్టకు దిగువ భాగాన ఉన్న కాపా రామలక్ష్మమ్మ భూమిని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఇది గతంలో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండగా, సుదీర్ఘ కాలం కోర్టులో వాదనల అనంతరం రామాలయ సొంతమైంది. ఇందులో రామాయణ మ్యూజియం, తూము నర్సింహాదాసు ఆడిటోరియం, భక్త రామదాసు ప్లాజా, మల్టీ లెవల్ పార్కులు నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. ఇందుకు రూ.100 కోట్లతో ప్రతిపాదించారు. ఆలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధి పనులకు నాలుగో విడతలో ప్రతిపాదించారు. హోటళ్లు, గిరిజన మ్యూజియం, రామవనం, పట్టణ సుందరీకరణ పనుల చేపట్టేలా పొందుపర్చారు. ఇందుకోసం రూ.100 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. ఇలా మొత్తం రూ.350 కోట్లతో ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీన్ని సర్కారు ఆమోదించి తగిన బడ్జెట్ విడుదల చేయాల్సి ఉంది. వైదిక కమిటీ అసంతృప్తి..? కొత్త మాస్టర్ ప్లాన్పై ఆలయ వైదిక కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి తమను సంప్రదించకుండానే ప్లాన్ రూపొందించటంపై కినుక వహించినట్లు తెలుస్తోంది. గతంలో చినజీయర్ స్వామి సూచనతో ఆనంద సాయి రూపొందించిన ప్లాన్ను వీరు ఆమోదించారు. అయితే ప్రస్తుత ప్లాన్పై వీరు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలం పర్యటన సమయంలో మాత్రం వైదిక కమిటీ సలహాలు, సూచనలను తప్పకుండా తీసుకోవాలని, వారి ఆమోదం తర్వాతే ప్లాన్ను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే వైదిక కమిటీ, పండితులు, దేవాదాయ శాఖ అధికారులు సమష్టిగా ఈ ప్రణాళికను అమోదిస్తేనే ఆలయాభివృద్ధి కల సాకారం కానుంది. లేనిపక్షంలో ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశమే ఉండదు. భద్రాచలం రామాలయ అభివృద్ధికి ప్రణాళిక -
సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన కారు
● రెండు కి.మీ. మేర కొట్టుకుపోయిన వాహనం ● డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తి మృతి ఖమ్మంరూరల్: రూరల్ మండలంలోని గొల్లగూడెం వద్ద సాగర్ కాల్వలోకి ఓ కారు దూసుకెళ్లిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. వరంగల్ వైపు నుండి ఖమ్మం వైపు వస్తున్న కారు అతివేగంగా ఉండడంతో అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ విషయమై యువకులు ఇచ్చిన సమాచారంతో రూరల్ సీఐ ముష్క రాజు సిబ్బందితో చేరుకుని క్రేన్ను రప్పించారు. కాల్వలో ప్రవాహం ఉధృతంగా ఉండడంతో కారు రెండు కి.మీ. మేర కొట్టుకుపోయింది. చివరకు క్రేన్తో కారును బయటకు లాగారు. డోర్లు తెరుచుకోక... కారుడోర్లు లాక్ అయి ఉండగా కాల్వలో పడగానే అందులోని వ్యక్తి బయటపడే అవకాశం లేకపోయిందని తెలుస్తోంది. కారును బయటకు తీసి అద్దాలు పగులగొట్టే లోగా డ్రైవర్ సీటులో కూర్చున్న వ్యక్తి మృతి చెందాడు. కారు నంబర్ ఆధారంగా పెదతండాకు చెందిన మర్లపాటి వెంకటేశ్వర్లు పేరిట రిజిస్ట్రేషన్ అయిందని గుర్తించారు. అయితే, ప్రమాదంలో మృతి చెందింది యాజమానా, మరొకరా అన్న విషయమై ఆరా తీస్తున్నట్లు సీఐ తెలిపారు. తొలుత కారులో పలువురు ఉన్నారని భావించినా తలుపులన్నీ లాక్ అయి ఉండడంతో ఒకరు మాత్రమే వస్తున్నట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో తరలించారు. 20ఏళ ్ల క్రితం ఇక్కడే ప్రమాదం ప్రస్తుతం ప్రమాదం జరిగిన చోటే 20ఏళ ్ల క్రితం ప్రైవేట్ బస్సు కాల్వలోకి దూసుకెళ్లింది. పిండిప్రోలు – ఖమ్మం మధ్య నడిచే బస్సులో ఉన్న 25మంది మృతిచెందిన విషయాన్ని స్థానికులు గుర్తుచేసుకున్నారు. -
ప్రజలు కలిసొస్తేనే పరిశుభ్రత
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో ప్రజలు కూడా కలిసిరావాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఖమ్మం 57వ డివిజన్లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి ఆయన శుక్రవారం పర్యటించారు. రమణగుట్ట, దివ్యాంగుల కాలనీ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీరు, విద్యుత్ సరఫరా, ఖాళీ ప్రాంతాలను పరిశీలించారు. ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోకుండా యాజమాలకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఒకవేళ ఎవరైనా స్పందిచకపోతే కేఎంసీ ఆధ్వర్యాన శుభ్రం చేయించి జరిమానా విధించాలని చెప్పారు. అనంతరం దివ్యాంగుల కాలనీలో శిథిలావస్థకు చేరిన బాలకార్మిక ప్రత్యేక పాఠశాలను పరిశీలించిన కలెక్టర్.. సమీపంలోని ఇంగ్లిష్ మీడియం ప్రాథమిక పాఠశాల భవనాన్ని తొలగించి అక్కడ ఆధునికమైన ప్లే స్కూల్, అంగన్వాడీ కేంద్రం నిర్మాణంపై ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. ఇదేసమయాన విద్యార్థుల బోధనకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. కార్పోరేటర్ రఫీదా బేగం ముస్తఫా, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, తహసీల్దార్ సైదులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
సంత వేలం.. రూ.6.63 లక్షలు
కారేపల్లి: కారేపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యాన ప్రతీ ఆదివారం కొనసాగే సంత నిర్వహణను అప్పగించేందుకు శుక్రవారం వేలం నిర్వహించారు. నార్కట్పల్లికి చెందిన వెంకటేశ్వర్లు, కారేపల్లికి రాము, పండితాపురం గ్రామానికి చెందిన మేకల మహేష్బాబు యాదవ్, రాములు పాల్గొనగా ఏడా ది కాలానికి అత్యధికంగా రూ.6.63లక్షలకు పాడిన మహేష్బాబు దక్కించుకున్నారు. గత ఏడాది రూ.5.30లక్షలు పలకగా ఈసారి రూ.1.33లక్షలు అధికంగా నమోదైంది. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఆలయ ఈఓ నల్లమోతు శేషయ్య ఆధ్వర్యాన వేలం నిర్వహించగా సంతగుడి మాజీ చైర్మన్ అడ్డగోడ ఐలయ్య, సొసైటీ డైరెక్టర్ డేగల ఉపేందర్తో పాటు వాసురెడ్డి సంపత్, మూడ్ మోహన్చౌహన్, జవ్వాజి రంగయ్య పాల్గొన్నారు. కారేపల్లి సంతకు గత ఏడాది కంటే రూ.1.33 లక్షలు అధికం -
●ఉత్తమ అధ్యాపకులుగా ఇద్దరు...
ఖమ్మం సహకారనగర్: ఇంటర్మీడియట్ విద్యాశాఖ పరిధిలో ఉత్తమ అధ్యాపకుల జాబితాలో జిల్లా నుంచి ఇద్దరికి స్థానం దక్కింది. ఖమ్మంలోని ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాల జువాలజీ విభాగాధిపతి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.సునంద, కామర్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్, పీజీ విభాగం కోఆర్డినేటర్ డాక్టర్ డి.శ్రీనివాస్ ఇందులో ఉన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో వీరిద్దరు ఉత్తమ అధ్యాపకులుగా ఎంపికయ్యారు. బోధనలో వినూత్న పద్ధతులు, పరిశోధనా పత్రాల సమర్పణ తదితర అంశాల ఆధారంగా వీరిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా సునంద, శ్రీనివాస్కు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జకీరుల్లా, వైస్ ప్రిన్సిపాళ్లు ఏ.ఎల్.ఎన్.శాస్త్రి, డాక్టర్ సీ.హెచ్.శ్రీనివాస్, అధ్యాపకులు అభినందనలు తెలిపారు. -
డబ్బులు ఇస్తేనే ‘సదరమ్’
దివ్యాంగులకు సదరమ్ సర్టిఫికెట్ల జారీలో కొందరు సిబ్బంది డబ్బు డిమాండ్ చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది.వాతావరణ ం జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచే ఎండ ప్రభావం మొదలవుతుంది. మధ్యాహ్నానికి మరింత పెరిగి సాయంత్రం చల్లబడుతుంది.శుక్రవారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025ఆత్మగౌరవానికి ప్రతీక.. ఎమ్మెల్యేగా ఖద్దరు బట్టల్లో నిత్యం కనిపిస్తున్నా ఏదైనా స్కూల్కు వెళ్లి విద్యార్థులను కలవాల్సి వస్తే మాత్రం కచ్చితంగా పైన కోటు ధరిస్తా. కోటుతో హుందాతనం వచ్చి ఆత్మగౌరవం పెరుగుతుంది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిన్ననాటి నుంచి కష్టాలు అనుభవించినా ఆత్మగౌరవ ప్రతీకగా సూటు ధరించేవారు. ఎన్నో కష్టాలకు ఓర్చి ఈ స్థాయికి చేరిన నేను విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకే ఫుల్సూట్ ధరిస్తుంటా. బియ్యంలో పురుగులు ఏరుకుని.. మాది దమ్మపేట మండలం గండుగులపల్లి. అమ్మానాన్న చుక్కమ్మ – సత్యనారాయణకు నాలుగెకరాల పొలం ఉండేది. అయినా ఆర్థిక ఇబ్బందులు కుటుంబాన్ని వెంటాడేవి. నా చదువంతా ఆశ్రమ పాఠశాలల్లోనే సాగింది. ఐదో తరగతి వరకు అంకంపాలెం, పదో తరగతి వరకు పార్కలగండి ఆశ్రమ స్కూల్, ఇంటర్ కిన్నెరసాని స్పోర్ట్స్ కాలేజీలో చదివా. అప్పుడు ఆశ్రమ పాఠశాలకు సరఫరా చేసే బియ్యంలో పురుగులు ఉండేవి. ప్రతీ ఆదివారం విద్యార్థులందరం పురుగులు ఏరితే ఆ తర్వాత వారం వండిపెట్టేవారు. అలా డిగ్రీ వరకు ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటూ చదువుకుని ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ)గా 2005లో సున్నంబట్టి స్కూల్లో ఉద్యోగం సాధించా. 1998లో ప్రెసిడెంట్ మెడల్.. హైస్కూల్ స్థాయి నుంచి స్కౌట్స్ అండ్ గైడ్స్లో పాల్గొంటుండగా 1998లో ఒడిశాలో జరిగిన అంతర్జాతీయ స్థాయి(వరల్డ్ జంబోరి) పోటీల్లో 48 దేశాలు పోటీపడగా భారత్ నుంచి ఎనిమిది మందిమి ప్రాతినిధ్యం వహించాం. అందులో నాకు ‘ఏ’ గ్రేడ్ రావడంతో అప్పటి ఉపరాష్ట్రపతి కేఆర్.నారాయణ్ చేతుల మీదుగా ప్రెసిడెంట్ మెడల్ అందుకున్నా. అప్పటి నుంచే క్రమశిక్షణ, సమయ పాలన, సామాజిక బాధ్యతలు అలవాటయ్యాయి. ఇంటర్లో రన్నింగ్, జావెలిన్త్రో, హైజంప్ బాగా చేసేవాడిని. మ్యాథ్స్లో ఎమ్మెస్సీ పూర్తి చేసినా లెక్కల టీచర్గా కంటే విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పే పీఈటీగా పనిచేసేందుకే మొగ్గు చూపాను. జీతంలో కొంత.. ఆశ్రమ పాఠశాలలో చదివే పిల్లలు ఓసారి ఇంటికి వెళ్తే మళ్లీ రావడానికి మొండికేస్తారు. అలా బడి మానేసిన విద్యార్థుల ఇళ్లకు సైకిల్పై వెళ్లి అవసరమైతే ఆరోజు అక్కడే ఉండి వారిని తిరిగి తీసుకొచ్చేవాడిని. ఆ పిల్లల కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసి బాధేసేది. అలాంటి పిల్లల కోసం నా జీతంలో కొంత మొత్తం ఖర్చు చేసేవాడిని కూడా. అలా చేర్పించిన పిల్లలు ఇప్పుడు చదువులో రాణిస్తుండటం చూస్తే సంతోషంగా ఉంటుంది. రాజకీయ ప్రస్థానం.. మా మేనమామ ముత్యాలు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేశారు. ఆయన ప్రోద్బలంతో 2014లో టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున అశ్వారావుపేట నుంచి పోటీ చేశా. ఆ సమయాన చుట్టూ కార్యకర్తలే ఉండేవారు. కానీ ఓడిపోయాక కేడర్ సంఖ్య తగ్గుతూ వచ్చింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగం వదులుకున్నానని హేళన చేసేవారు. ఇది చాలదన్నట్టు ఆ ఎన్నికల్లో నాపై నెగ్గిన తాటి వెంకటేశ్వర్లు సైతం బీఆర్ఎస్లో చేరగా 2019 ఎన్నికల్లో టికెట్ ఆయనకే వచ్చింది. ఆ ఎన్నికల్లో గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు కూడా బీఆర్ఎస్లో చేరడంతో పార్టీలో నేను మూడో స్థానానికి పడిపోయి పలకరించేవారు కరువయ్యారు. రూ.5కోట్లు విద్యారంగానికే.. స్కౌట్స్లో పని చేయడం వల్ల చిన్నప్పటి నుంచి అలవడిన క్రమశిక్షణ, సమయపాలన నాకు అండగా నిలిచాయి. కష్టాలు ఎదురైనా నీరుగారిపోకుండా లక్ష్యం వైపు నడిచేలా దోహదం చేశాయి. దీంతో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి అశ్వారావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను. ఒక వ్యక్తి లేదా సమాజం ఎదుగుదలలో విద్య ప్రాముఖ్యత తెలిసిన వాడిని కాబట్టే ఎమ్మెల్యే కోటాలో వచ్చిన రూ.10 కోట్ల నిధుల్లో రూ. 5 కోట్లు విద్య మీదనే ఖర్చు పెట్టాను. ఆశ్రమ పాఠశాలల్లో నాణ్యమైన భోజనం పెడుతున్నారా లేదా అని క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నా. ఇదే సమయాన పిల్లల భవిష్యత్ కోసం పాటుపడాలని ఉపాధ్యాయులకు సూచిస్తుంటా. ఈ ప్రాంతంలో ఉద్యాన పంటలు ఎక్కువ. అందుకే విద్యా పరిమాణాలు ఉద్యాన రైతులకు చేరువ చేసేందుకు హార్టికల్చరల్ యూనివర్సిటీని అశ్వారావుపేటలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నా.ఎమ్మెల్యే సార్!నేడు ఉపాధ్యాయ దినోత్సవంసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పిల్లలకు ఆరంభంలోనే క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్పిస్తే వారి జీవితాల్లో వెలుగు రేఖలు వచ్చి పేదరికం తొలగిపోతుందని అంటున్నారు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. పూర్వాశ్రమంలో ప్రభుత్వ పీఈటీగా పనిచేసిన ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో గళం వినిపిస్తున్నారు. నేడు(శుక్రవారం) జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థిగా, ఉపాధ్యాయుడిగా, ఎమ్మెల్యేగా తన అనుభవాలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆదినారాయణ మాటల్లోనే.. -
బిల్లు తారుమారుపై అధికారుల విచారణ
కామేపల్లి: మండలంలోని రేపల్లెవాడలో ఓ వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి అదే పేరుతో ఉన్న మరో వ్యక్తి ఖాతాలో నగదు జమ కావడంపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ విషయమై గత నెల 30న ‘సాక్షి’లో ‘ఇందిరమ్మ బిల్లు మరొకరి ఖాతాలో!’ శీర్షికన కథనం ప్రచురితమైంది. గ్రామానికి చెందిన తేజావత్ రవికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ ఎమ్మెల్యే చేతుల మీదుగా పత్రం అందజేయగా ఆయన పునాది వరకు నిర్మించాక రూ.లక్ష బిల్లు మంజూరు కావాల్సి ఉంది. కానీ అదే గ్రామంలో తేజావత్ రవి పేరుతో ఉన్న మరో వ్యక్తి ఖాతాలో జమ కావడం.. ఇల్లు తనకే మంజూరైనా పత్రాన్ని మరొకరికి ఇచ్చారని రెండో వ్యక్తి కలెక్టరేట్లో ఫిర్యాదు చేశాడు. ఈమేరకు రేపల్లెవాడలో హౌసింగ్ పీడీ శ్రీనివాస్ పర్యటించారు. పునాది నిర్మించిన వ్యక్తి పేరిట కాక నగదు జమ అయిన రవికే ఇల్లు మంజూరైందని తేల్చారు. కాగా, ఇలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. గ్రామానికే చెందిన గుగులోత్ రాజా ఇంటి మంజూరు పత్రం అందుకుని నిర్మాణం చేపట్టగా గుగులోత్ రాజు పేరుతో ఉన్న మరో వ్యక్తికి ముందుకు రావడంతో బిల్లు నిలిపివేశారు. ఆన్లైన్లో లబ్ధిదారుల వివరాలు నమోదు, మంజూరు పత్రాల పంపిణీలో అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని పలువురు ఆరోపించారు. దీంతో నిర్మాణం చేపట్టిన వారికి మరో విడతలో వారికి అవకాశం కల్పించనున్నట్లు పీడీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవీందర్, ఏఈఉ నాగేందర్, సౌమ్య పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు
ఖమ్మంవైద్యవిభాగం/ఖమ్మం సహకారనగర్: హెచ్ఐవీ, ఎయిడ్స్, టీబీ సంబంధిత అంశాలపై హైదరాబాద్లో ఈనెల 2న యూత్ ఫెస్ట్లో భాగంగా రాష్ట్రస్ధాయి క్విజ్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో ఖమ్మం ఏఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు తృతీయ బహుమతి సాధించారు. జిల్లా స్థాయి లో ప్రథమ స్థానం సాధించిన దేవీశ్రీ ప్రసన్న, సమీర్పాషా రాష్ట్ర స్థాయికి ఎంపిక కాగా, అక్కడ తృతీయ బహుమతి గెలుచుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అడిషనల్ డీఎంహెచ్ఓ పి.వెంకటరమణ, ప్రిన్సిపాల్ ఆర్.గోవిందరావు గురువారం అభినందించారు. అధ్యాపకులు నరేష్, డి.రాణితో పాటు సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫారెస్ట్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యాన అన్నదానం ఖమ్మంవ్యవసాయం: గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్బంగా జిల్లా ఫారెస్ట్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యాన గురువారం ఖమ్మంలోని జిల్లా అటవీ కార్యాలయంలో మహా అన్నదానం నిర్వహించారు. వినాయక ఉత్సవాల్లో పలుచోట్ల అన్నదానం నిర్వహించడమే సాధారణమే అయినా ప్రభుత్వ శాఖ ఆధ్వార్యన ఐక్యతా బావాన్ని పెంచే లక్ష్యంతో నిర్వహించడంపై పలువురు అభినందించారు. ఈసందర్భంగా జిల్లా అటవీ అధికారి స్వయంగా వంటలు చేయగా.. అటవీ డివిజన్ల అధికారులు, రేంజర్లు, వివిధ విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు. విజయ డెయిరీ కాంప్లెక్స్కు టెండర్లు కరువు ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం రోటరీనగర్లో ప్రధాన రహదారి వెంట ఉన్న విజయ డెయిరీ ఆధ్వర్యాన నిర్మించిన 10 దుకాణాల కాంప్లెక్స్లో అద్దెకు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఒక్కో షాప్ అద్దె కనిష్టంగా జీఎస్టీ కాక రూ.25వేలుగా నిర్ణయించి టెండర్లు ఆహ్వానించారు. గతనెల 8న నోటిఫికేషన్ విడుదల చేసి ఈనెల 3వ వరకు సమయం ఇచ్చినా టెండర్లు దాఖలు కాలేదని డిప్యూటీ డైరెక్టర్ కోడిరెక్క రవికుమార్ తెలిపారు. దీంతో అద్దె సవరిస్తూ మరోసారి టెండర్ల స్వీకరణకు కలెక్టర్ అనుమతి కోరనున్నామని వెల్లడించారు. క్రమశిక్షణతో ఉన్నతస్థాయికి చేరాలి కల్లూరు: ప్రతీ విద్యార్థి క్రమశిక్షణను అలవాటు చేసుకుని కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్ తెలిపారు. కల్లూరు గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో గురువారం ఇన్స్పైర్, ఇగ్నైట్ ఆధ్వర్యాన నైపుణ్యాభివృద్ధి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మాట్లాడుతూ అంబేద్కర్, అబ్దుల్కలాం వంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవడమే కాక విద్యాలయాలను ఆలయాలుగా భావిస్తే విజయం సొంతమవుతుందని చెప్పారు. ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి మాట్లాడుతూ కార్పోరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కె.లక్ష్మారెడ్డి, రిసోర్స్ పర్సన్లు రంజిత్, యు.శ్రీరామ్, కళాశాల ప్రిన్సిపాల్ కనకదుర్గ, ఎస్ఐ హరిత, మార్కెట్ చైర్పర్సన్ భాగం నీరజ, తహసీల్దార్ పులి సాంబశివుడు, నాయకులు మట్టా దయానంద్ తదితరులు పాల్గొన్నారు. -
సుంకం రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
ఖమ్మంమయూరిసెంటర్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గి పత్తిపై దిగుమతి సుంకాన్ని రద్దు చేయడం గర్హనీయమని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు బాగం హేమంతరావు ఆరోపించారు. సుంకాన్ని రద్దుచేయడంతో పత్తి ధరలు తగ్గి రైతులు నష్టపోయే ప్రమాదముందని తెలిపారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యాన గురువారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హేమంతరావు మాట్లాడుతూ పత్తి దిగుమతిపై సుంకాన్ని రద్దు చేసిన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 20 లక్షల హెక్టార్లలో రైతులు పత్తి సాగు చేస్తుండగా, ప్రభుత్వ నిర్ణయంతో వీరంతా నష్టపోతారని తెలిపారు. కాగా, 11ఏళ్ల మోడీ పాలనలో వ్యవసాయ రంగంపై వివక్ష తప్ప సానుకూల స్పందన ఏనాడు కనబర్చలేదని ఆరోపించారు. అలాగే, కేంద్రం తీరుతోనే యూరియా కొరత ఏర్పడిందని మండిపడ్డారు. అనంతరం వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి అందించారు. వివిధ పార్టీలు, సంఘాల నాయకులు జమ్ముల జితేందర్రెడ్డి, దొండపాటి రమేష్, కొండపర్తి గోవిందరావు, మాదినేని రమేష్, బొంతు రాంబాబు, మలీదు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.సంయుక్త కిసాన్ మోర్చా ఆందోళనలో బాగం హేమంతరావు -
పెద్దాస్పత్రిలో సేవలకు అంతరాయం
● ఆర్ఓ ప్లాంట్ మరమ్మతుతో నిలిచిన హబ్ సేవలు ● విద్యుత్ లోపంతో సీటీస్కాన్ సేవలకూ విఘాతం ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రిలో సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. వ్యాధి నిర్ధారణలో కీలకమైన తెలంగాణ డయాగ్నస్టిక్, సీటీ స్కాన్ సేవలు నిలిచిపోయాయి. దీంతో రోజూ వేలాదిగా వచ్చే ప్రజల్లో కొందరు వెనుతిరుగుతున్నారు. ఇంకొందరు అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయిస్తున్నారు. శుద్ధి చేసిన నీరు లేక... ఖమ్మం జనరల్ ఆస్పత్రిలోని తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక్కడ 1,520 రకాల పరీక్షలకు అవకాశం ఉండగా, జిల్లా నలుమూలల నుంచి 40సెంటర్ల ద్వారా ఐదు వాహనాల్లో శాంపిళ్లు తీసుకొస్తారు. పరీక్ష చేశాక సంబంధిత వ్యక్తుల ఫోన్కు 24 గంటల్లో నివేదిక పంపిస్తారు. ఆపై వైద్యులకు చూపిస్తే చికిత్స మొదలవుతుంది. ఇటీవల రసాయనాల కొరతతో తరచూ టెస్టులకు ఆటంకం కలుగుతోంది. ఇప్పుడు ఆర్ఓ ప్లాంట్ మర్మమతుకు రావడంతో నిర్వహణ పూర్తిగా నిలిచిపోయింది. డయాగ్నస్టిక్ హబ్లో శుద్ధి చేసిన నీటితో పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతీరోజు 10వేల లీటర్ల నీరు అవసరం కాగా, ఆర్ఓ ప్లాంట్ మూలనపడడంతో పరీక్షలు నిలిచిపోయాయి. సీటీ స్కాన్ సేవలకు బ్రేక్ పెద్దాస్పత్రిలోని ట్రాన్స్ఫార్మర్ నుంచి స్కానింగ్ గదికి విద్యుత్ సరఫరా చేసే వైర్లు తెగిపోవడంతో సీటీ స్కాన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. నాలుగేళ్ల క్రితం స్కానింగ్ మిషన్ను అందుబాటులోకి తీసుకురాగా నిత్యం 25–30 మందికి స్కానింగ్ చేస్తుంటారు. ప్రస్తుతం వైర్లు తెగడంతో బుధవారం నిపుణులను పిలిపించి మరమ్మతు చేయించాక పరీక్షలు మొదలయ్యాయి. కానీ గురువారం ఉదయంకల్లా మళ్లీ స్కానింగ్ మిషన్ ఆన్ కాకపోవటంతో సేవలు పూర్తిగా నిలిపివేశారు. దీంతో పలువురు నిరాశతో వెనుతిరిగిపోవడం కనిపించింది. ఇంకొందరు ఆర్థికంగా భారమైనా ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లకు వెళ్తున్నారు. ఈ విషయమై ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్ను వివరణ కోరగా హైదరాబాద్ నుంచి నిపుణులను పిలిపించి ఆర్ఓ ప్లాంట్ మరమ్మతు చేయిస్తామని తెలిపారు, అప్పటివరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వ్యాఽధి నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక సీటీ స్కాన్ సేవలు కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయని తెలిపారు. -
నిబద్ధతతో పనిచేస్తేనే వ్యవస్థ మనుగడ
● అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ● జీపీఓల నుంచి ఆప్షన్ ఫామ్ల స్వీకరణఖమ్మంసహకారనగర్: ప్రభుత్వఽ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేస్తేనే వ్యవస్థ మనుగడ సాధ్యమవుతుందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇటీవల నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గ్రామ పాలన అధికారులు(జీపీఓ)లుగా ఎంపికై న వారి నుంచి కలెక్టరేట్లో గురువారం సమావేశమైన ఆయన ఆప్షన్ ఫారాలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని 299 క్లస్టర్లలో రెవెన్యూ పరిపాలన పటిష్టతకు గ్రామపాలన అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. పరీక్షలో 253 మంది ఉత్తీర్ణత సాధించగా, వీరిలో 240 మంది స్థానికులు, 13 మంది స్థానికేతరులు ఉన్నారని తెలిపారు. ఈ నియామకంతో మూడేళ్ల తర్వాత వీఆర్ఓలు, వీఆర్ఏలు రెవెన్యూ శాఖలోకి వస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా శిక్షణ కూడా ఇస్తామని అన్నారు. కాగా, శుక్రవారం సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు తీసుకోనుండగా 15 రోజుల్లో విధులలో చేరాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి సూచించారు. జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అనంతరం అదనపు కలెక్టర్, డీఆర్ఓ ఏ.పద్మశ్రీతో కలిసి జీపీఓలు కేక్ కట్ చేశారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు, రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సునీల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ●గ్రామపాలన అధికారులు(జీపీఓ)లుగా శుక్రవా రం నియామకపత్రాలు అందుకోనున్న పూర్వ వీఆర్వోలు ఆప్షన్లు ఇచ్చారు. పెద్దసంఖ్యలో వచ్చిన వీరితో కలెక్టరేట్ సందడిగా కనిపించింది. -
ఒకరి రక్తదానంతో ముగ్గురికి ప్రాణం
ఖమ్మంవైద్యవిభాగం/ఖమ్మం మామిళ్లగూడెం: ఓ వ్యక్తి రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న ముగ్గురి ప్రాణాలను కాపాడొచ్చని డీఎంహెచ్ఓ డాక్టర్ కళావతిబాయి తెలిపారు. ముస్తఫానగర్ పీహచ్సీ వద్ద వికాస తరంగిణి, రెడ్క్రాస్ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని మేయర్ పి.నీరజతో కలిసి డీఎంహెచ్ఓ ప్రారంభించి మాట్లాడారు. అన్నిదానాల్లోకెల్లా రక్తదానం విలువైనదని గుర్తించి ఆరోగ్యవంతులైన వారు ముందుకు రావాలని కోరారు. ముస్తఫానగర్ మెడికల్ ఆఫీసర్ రమేష్, ఉద్యోగులు చామంతి, ప్రసాద్, శైలజ కూడా రక్తదానం చేయగా 38యూనిట్ల రక్తం సేకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. వికాస తరంగిణి చైర్మన్ పోలా శ్రీనివాస్, రెడ్క్రాస్ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రమోహన్, సూర్యప్రకాశ్, ఉద్యోగులు సత్యనారాయణ, ఖాదర్బీ, వీరబాబు, గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ డీఎంల బదిలీ ఖమ్మంమయూరిసెంటర్: ఆర్టీసీలో పలువురు డిపో మేనేజర్లను బదిలీ చేస్తూ యాజమాన్యం గురువారం ఉత్తుర్వులు జారీ చేసింది. జాబితాలో ఖమ్మం రీజియన్లోని ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం మేనేజర్లు ఉన్నారు. ఖమ్మం డిపో మేనేజర్ దినేష్కుమార్ కామారెడ్డి డీఎంగా, మహబూబాబాద్ డిపో మేనేజర్ ఎం.శివప్రసాద్ ఖమ్మం డీఎంగా, సత్తుపల్లి డీఎం యూ.రాజ్యలక్ష్మి కొత్తగూడెం డీఎంగా, నల్లగొండ డిపో సీఐ వి.సునీత పదోన్నతిపై సత్తుపల్లి డీఎంగా బదిలీ అయ్యారు. అలాగే, కొత్తగూడెం డీఎం ఎం.దేవేందర్ గౌడ్ను వనపర్తికి, భద్రాచలం డిపో మేనేజర్ బి.తిరుపతి హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో లా విభాగానికి బదిలీ కాగా, మహబూబ్నగర్ డిపో అసిస్టెంట్ మేనేజర్(మెకానికల్) పి.జంగయ్య పదోన్నతిపై భద్రాచలం డీఎంగా రానున్నారు. కార్యదర్శుల బదిలీలపై స్టే ఖమ్మంవ్యవసాయం: పీఏసీఎస్ల కార్యదర్శుల బదిలీపై హైకోర్టు స్టే ఇచ్చింది. బదిలీలపై పలువురు హైకోర్టును ఆశ్రయించగా ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగించాలని గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా డీసీసీబీల పరిధిలో కార్యదర్శులను బదిలీ చేయగా, ఖమ్మం డీసీసీబీ పరిధిలో 69మందికి స్థానచలనం కల్పించారు. దీనిపై వివిధ జిల్లాల వారితో పాటే ఖమ్మం కార్యదర్శులు 35మంది కోర్టును ఆశ్రయించగా స్టే వచ్చింది. ఫలితంగా మొత్తం ప్రక్రియ ఆగిపోయినట్లేనని భావిస్తున్నారు. ఈ అంశంపై డీసీసీబీ సీఈఓ వెంకట ఆదిత్యను కలిసి బదిలీల్లో మార్పు చేయాలని కోరారు. అయితే, కేసు విరమించుకుంటే పునః పరిశీలనకు అవకాశముందని తెలుస్తోంది. డ్రెయినేజీ నెట్వర్క్కు రూ.110కోట్లు రఘునాథపాలెం: జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న రఘునాథపాలెం మండలంలోని గిరిజన తండాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచేందుకు సమగ్ర సిమెంట్ కాంక్రీట్ డ్రెయినేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించామని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రూ.110 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ రూపొందించినందున నిధులు కేటాయించాలని ఆయన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్కు గురువారం ఢిల్లీలో వినతిపత్రం అందజేశారు. నిధులు కేటాయిస్తే 37 ఆవాసాలు, తండాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడతాయని, మురుగునీరు మున్నేరులో నేరుగా కలవకుండా శుద్ధి కోసం ప్లాంట్ ఏర్పాటుచేయొచ్చని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం ద్వారా నిధులు కేటాయించాలని తుమ్మల ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కమనీయం.. కల్యాణం భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి నిత్యకల్యాణ వేడుక గురువారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం బేడామండపంలో స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణ ధారణ, యోక్తధ్రారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు నిర్వహించారు. -
అంకితభావం.. ఆదర్శం
● విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు ● ప్రభుత్వ పాఠశాలల్లో విలక్షణ పద్ధతుల్లో బోధన, శిక్షణ ● క్రీడల్లోనూ జాతీయస్థాయిలో ప్రతిభ చూపేలా తర్ఫీదు నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంప్రభుత్వ పాఠశాలల్లోని పలువురు ఉపాధ్యాయులు అంకితభావంతో పాఠాలు చెబుతున్నారు. సులభమైన పద్ధతుల్లో బోధన చేపడుతున్నారు. పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభను వెలికితీస్తున్నారు. విద్యార్థుల ఉన్నతికి కృషి చేస్తున్నారు. క్రీడారంగంలోనూ తీర్చిదిద్దుతున్నారు. భావిభారత నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అలాంటి కొందరు గురువులపై ప్రత్యేక కథనం. ●కట్టా.. విద్యాసేవకే జీవితం ఖమ్మం సహకారనగర్: ఒక వ్యక్తి జీవితాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం విద్య మాత్రమేనని విశ్వసిస్తూ తన జీవితాన్ని బోధనకే అంకితం చేసిన ఉపాధ్యాయుడు కట్టా వెంకటేశ్వర్లు. ఇటీవలే ఖమ్మం ఎన్నెస్సీ కాలనీ పాఠశాలలో ఎస్ఏ(బయాలజికల్ సైన్స్)గా బాధ్యతలు స్వీకరించిన ఎక్కడ పనిచేసినా విద్యార్థుల సంఖ్య పెంపు, సౌకర్యాల కల్పన, బోధన సృజనాత్మకతే లక్ష్యంగా ముందుకుసాగుతున్నారు. 1997 జూన్ 30న గోరీలపాడు తండా పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ప్రస్తానం ప్రారంభించిన ఆయన విజయ్రావుతో కలిసి విద్యార్థుల సంఖ్యను 50 నుండి 120కి పెంచారు. ఆ పాఠశాలలో 70కి పైగా నాటిన టేకు మొక్కలు ఇప్పుడు పెద్దవయ్యాయి. ఇక 2004లో ఖమ్మం గుట్టలజార్ పాఠశాలకు వచ్చాక సృజనాత్మకతను జోడించి సైన్స్ మోడళ్ల బోధన ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఆపై 2011 జూన్లో కొత్తగూడెంకు, 2015లో ఖమ్మం సంభానినగర్ పాఠశాలకు బదిలీపై అయిన వెంకటేశ్వర్లు ఆ పాఠశాలలో 95గా విద్యార్థుల సంఖ్యను 150కి చేర్చడంలో కీలకపాత్ర పోషించారు. అప్పుడే టీఎల్ఎంలో బహుమతులు సాధించారు. కాగా, ఆయన పనిచేసిన పాఠశాలల్లో దాతల చేయూతతో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటుచేయగా, 2019లో రూ.1.20లక్షల విలువైన 75 డెస్క్ బెంచీలు సమకూర్చారు. స్వచ్ఛ భారత్ వ్యాసరచన పోటీల్లో విద్యార్థులు రాష్ట్ర స్థాయి అవార్డు గెలుచుకునేలా మార్గనిర్దేశం చేశారు. మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలకు కావాల్సిన సదుపాయాలను సమకూర్చడానికి ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో కృషి చేశారు.●ఖమ్మం ద్రోణాచార్యుడు.. గౌస్ ఖమ్మం స్పోర్ట్స్: అథ్లెటిక్స్లో ఉత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పలువురు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా శిక్షణ ఇస్తున్న ఖమ్మం అథ్లెటిక్స్ అకాడమీ కోచ్ ఎం.డీ.గౌస్ అభినవ ద్రోణాచార్యుడిలా నిలుస్తున్నారు. మూడు దశబ్ధలుగా అథ్లెటిక్స్లో మెరికల్లాంటి క్రీడాకారులను తయారు చేయడంలో ఆయనకు ఆయనే సాటిగా నిలుస్తున్నారు. ఆయన వద్ద శిక్షణ పొందిన పలువురు పోటీల్లో సత్తా చాటడమేకాక ఉన్నత ఉద్యోగాలు సాధించడం విశేషం. ఢిల్లీలో 2010లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో గౌస్ వద్ద శిక్షణ తీసుకున్న అబ్దుల్ ఖురేషి కాంస్య పతకం సాధిచాడు. నాటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో 1993లో ఉద్యోగంలో చేరిన నాటి నుంచి 3వేల మందికిపైగా శిక్షణ ఇవ్వగా.. అందులో పది మంది అంతర్జాతీయస్థాయిలో పదికి పైగా పతకాలు సాధించారు. ఇక జాతీయస్థాయిలో ఏకంగా 400 మంది పతకాలు సొంతం చేసుకోవడం విశేషం. దాదాపు 300 మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఎం.డీ.గౌస్ ప్రతిభకు స్పోర్ట్స్ అథారిటీ ప్రకటించిన ఉత్తమ కోచ్ అవార్డును నాటి గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా అందుకున్నాడు. ఎప్పటికై నా జిల్లా నుంచి ఒలింపిక్ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని చెప్పే గౌస్ కల నెరవేరాలని ఆశిద్దాం.●బోధన, సౌకర్యాల కల్పన.. జ్ఞాని మధిర: జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా 23ఏళ్ల క్రితం ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన బాజోజు జ్ఞానేశ్వరాచారి ఎక్కడ పనిచేసినా బోధనతో సరిపెట్టుకోకుండా ఆ పాఠశాలలో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం మధిర మండలంలోని మడుపల్లి ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న జ్ఞానేశ్వరాచారి గతంలో భీమవరం, మాటూరు తదితర పాఠశాలల్లో విధులు నిర్వర్తించారు. ఆయా పాఠశాలల్లో సరైన తరగతి గదులు లేక విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి సహ ఉపాధ్యాయులు బూసా కోటేశ్వరావు సహకారంతో ఎన్నారైలు, గ్రామస్తులను ఒప్పించి పాఠశాలకు రెండెకరాల స్థలం వచ్చేలా చూశారు. ఆపై అధికారుల సహకారంతో నూతన భవన సముదాయాల నిర్మాణానికి కృషి చేశారు. అంతేకాక కంప్యూటర్ పరిజ్ఞానం ఉండడంతో పాఠశాలల్లో కంప్యూటర్ బోధనకు సహకరిస్తూనే అవసరమైన మరమ్మతులు సొంతంగా చేస్తారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సందర్భంగా రెవెన్యూ ఉద్యోగులకు సాఫ్ట్వేర్పై శిక్షణ ఇస్తూ ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. ఇక నిరుపేద విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల పోటీ పరీక్షల్లో పాల్గొనేలా తర్ఫీదునిస్తారు. తీరిక సమయాన ఇంటి ఆవరణలో సేంద్రియ ఎరువులతో కూరగాయలు సాగు చేసి ఆదర్శంగా నిలుస్తున్న జ్ఞానేశ్వరాచారి.. మధిర ఎంప్లాయీస్ కాలనీలోని కుందా సావిత్రి సేవాసమితి హోమియో హాస్పిటల్లో వలంటీర్గా సేవలందిస్తున్నారు. ఇవికాక సొంతంగాతక్కువ ఖర్చుతో రూపొందించిన వాటర్ ప్యూరిఫయర్ను హోమియో ఆస్పత్రికి అందించారు. పాఠాల బోధనలో వినూత్న విధానాలు అవలంబిస్తూనే సేవా కార్యక్రమాల్లో ముందు నిలిచే ఆయన సతీమణి గురుకుల పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యేలా ప్రోత్సాహించారు. ఇప్పటివరకు అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోకుండా దూరంగా ఉండడం విశేషం. -
డబ్బులిస్తేనే ‘సదరమ్’ సర్టిఫికెట్
● నగదు డిమాండ్ చేస్తున్న పలువురు ● విచారణ కమిటీ వేసిన సూపరింటెండెంట్ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సదరమ్ విభాగంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. దివ్యాంగులకు వైకల్య నిర్ధారణ సర్టిఫికెట్ జారీకి పలువురు డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. అర్హత లేకపోయినా డబ్బు ముట్టజెపితే సదరమ్ సర్టిఫికెట్ చేతులో పెడుతున్నారని, డబ్బులు ఇవ్వకపోతే కొర్రీలతో జాప్యం చేసుప్తన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో సదరమ్ శిబిరాల నిర్వహణ ప్రత్యేక విభాగం ఉండగా ఇందులో డీఆర్డీఏ, ఆస్పత్రి సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. నిర్ణీత తేదీల్లో శిబిరాలు నిర్వహించే క్రమాన ముందు రోజు స్లాట్ బుక్ చేసుకున్న దివ్యాంగుల సెల్కు మెసేజ్ పంపడమే కాక సిబ్బంది ఫోన్ ద్వారా సమాచారం ఇస్తారు. ఆతర్వాత వైద్యులు పరీక్షించి అర్హత ఉన్న వారికి సర్టిఫికెట్ జారీ చేయడం ఆనవాయితీ. ఈక్రమంలో కొందరు సిబ్బంది దివ్యాంగులకు ఫోన్ చేసి సర్టిఫికెట్ జారీ చేసేందుకు కొంత నగదు ఇవ్వాలని సంప్రదిసున్నట్లు ఇటీవల అధికారులకు ఫిర్యాదులు అందాయి. రూ.25వేలు ఇస్తేనే... ఖమ్మం రూరల్ మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డుకు చెందిన ఓ వ్యక్తికి గతంలో సదరమ్ సర్టిఫికెట్ ఉంది. దీని కాలపరిమితి ముగియడంతో రెన్యువల్ కోసం గత నెల 26న క్యాంపునకు హాజరయ్యారు. ఆ శిబిరంలో ఆయన సర్టిఫికెట్ నిరాకరించారు. ఈ సమయాన సదరమ్ విభాగంలోని ఓ ఉద్యోగి ఆయనను ఫోన్లో సంప్రదించి రూ.25వేలు చెల్లిస్తే సర్టిఫికెట్ ఇప్పిస్తానని చెప్పినట్లు సమాచారం. దీంతో సదరు దివ్యాంగుడు ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్కు ఫిర్యాదు చేయగా గురువారం ముగ్గురితో కూడిన కమిటీని విచారణకు నియమించారు. అంతేకాక దివ్యాంగుడిని పిలిపించి తన చాంబర్లో వైకల్య పరీక్షలు నిర్వహించగా సదరమ్ సర్టిఫికెట్కు అర్హత సాధించడం గమనార్హం. దివ్యాంగుల అవసరాన్ని ఆసరా చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బందిపై కఠినంగా వ్యవహరిస్తేనే ఈ దందాకు అడ్డుకట్ట పడుతుందని పలువురు కోరుతున్నారు. -
●పిల్లల ఉన్నతే ‘మోషే’ లక్ష్యం
సత్తుపల్లిటౌన్: ఆదర్శ ఉపాధ్యాయుడు ఎలా ఉండాలంటే మోషే మాదిరి ఉండాలని ముక్తకంఠంతో చెబుతారు సత్తుపల్లి మండలం బుగ్గపాడు పాఠశాల విద్యార్థులు. అంతలా వాళ్ల హృదయాల్లో ఆయన సుస్థిర స్థానాన్ని పొందారు. ఈ ఉపాధ్యాయుడి పూర్తి పేరు కోండ్రు మోషె. గతంలో వేంసూరు తదితర మండలాల్లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించి ప్రస్తుతం బుగ్గపాడు పాఠశాలలో పని చేస్తున్నారు. బోధనలో సులభ పద్ధతులను అనుసరించే ఈయన ఆహార్యం, నడవడికలోనకు విద్యార్థులు ఆదర్శప్రాయంగా నిలిచారు. విద్యార్థులతో కలిసిమెలిసి ఆటలు ఆడతారు. వారితో మమేకమవుతూ ప్రయోగాలు చేయిస్తుంటారు. భోజన సమయంలో విద్యార్థులతోనే భోజనం చేస్తుండడంతో వారి మనస్సుల్లో స్థానం సాధించుకున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పాఠ్యపుస్తకాలు, వర్కుబుక్స్ విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేలా ఉన్నాయని చెప్పే ఆయన.. ఇంకొంత సృజనాత్మకతతో పాఠాలు బోధిస్తుండడం విశేషం. ఉపాధ్యాయుడు సహనం, సహానుభూతి అలవర్చుకుని.. అంకితభావంతో పని చేస్తే సత్ఫలితాలు వస్తాయని.. తరగతి గదిలో అద్భుతాలు సృష్టించవచ్చని మోషే ప్రగాఢంగా నమ్ముతారు. -
ఎనిమిది ‘సోలార్’ గ్రామాల ఎంపిక
నేలకొండపల్లి/ముదిగొండ: జిల్లాలోని ఎనిమిది గ్రామాలను పూర్తిస్థాయి సోలార్ వెలుగులు అందించేందుకు ఎంపిక చేసినట్లు జిల్లా రెడ్కో మేనేజర్ పి.అజయ్కుమార్ తెలిపారు. నేలకొండపల్లి, ముదిగొండలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. జిల్లాలోని తనికెళ్ల, కొణిజర్ల, తల్లాడ, అన్నారుగూడెం, వల్లభి, ముదిగొండ, నేలకొండపల్లి, కందుకూరు గ్రామాలను మోడల్ విలేజ్లుగా ఎంపిక చేయగా, ప్రజలకు సోలార్ ప్లాంట్లతో లాభాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మూడు కిలోవాట్ల ప్లాంట్ ఏర్పాటుచేసుకుంటే రూ.78 వేల సబ్సిడీ అందుతుందని చెప్పారు. ఎక్కువగా ప్లాంట్లు ఏర్పాటయ్యే గ్రామాలకు రూ.కోటి ప్రోత్సాహం జారీ చేస్తారని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు వచ్చే నెల 3వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మేనేజర్ సూచించారు. ఏఈలు కె.రామారావు, ఎం.శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాసరావు, సీహెచ్.రామకృష్ణ, సబ్ ఇంజనీర్ బి.రాంమోషన్, స్థానికులు పాల్గొన్నారు. -
●రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా సుధాకర్
కల్లూరురూరల్: కల్లూరు మండలం చెన్నూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు దంతాల సుధాకర్ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 51మంది ఉపాధ్యాయులను అవార్డులకు ఎంపిక చేయగా జాబితాలో జిల్లా నుంచి సుధాకర్కు మాత్రమే స్థానందక్కింది. చెన్నూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడం కోసం ఆయన స్వయంగా బడిబాట పేరిట బైక్యాత్ర నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ బడిలో సౌకర్యాలను వివరిస్తూ తల్లిదండ్రులను ఒప్పించారు. ఇదే సమయాన బోధనలో నూతన పద్ధతులు పాటించడం, పాఠశాల అభివృద్ధిలో పౌర సమాజాన్ని భాగస్వాములుగా చేయడం, పాఠాలను నాటికల రూపంలోకి మార్చి విద్యార్థులతో ప్రదర్శించడాన్ని సుధాకర్ అలవాటుగా మార్చుకున్నారు. అంతేకాక విద్యాభివృద్ధికి సోషల్మీడియా ద్వారా అవగాహన కల్పిస్తూ సమాజాన్ని జాగృతం చేస్తుండడంతో సుధాకర్ను రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఆయనను ఎంఈఓ పత్తిపాటి నివేదిత, వివిధ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు అభినందించారు.పాఠశాల స్థాయిలో జిల్లా నుంచి ఒక్కరే... -
రాష్ట్రంలోనే మోడల్గా ఇంటిగ్రేటెడ్ పాఠశాల
● లక్ష్మీపురం పాఠశాల పనులు త్వరగా పూర్తి చేయాలి ● పనుల పరిశీలనలో కలెక్టర్ అనుదీప్బోనకల్: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మిస్తుండగా.. రాష్ట్రంలోనే మోడల్గా గుర్తింపు వచ్చేలా లక్ష్మీపురం పాఠశాల నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. బోనకల్ మండలం లక్ష్మీపురంలో 25 ఎకరాల్లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణ పనులను గురువారం ఆయన అదనపు కలెక్టర్ పి.శ్రీజతో కలిసి తనిఖీ చేశారు. మ్యాప్ ఆధారంగా వివరాలు పరిశీలిస్తూ సూచనలు చేశారు. నిర్మాణంలో నాణ్యత పాటిస్తూ వచ్చే విద్యాసంవత్సరం నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ విభాగం అధికారులు జె.బుగ్గయ్య, బి.నాగేశ్వరరావు, సురేష్, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ రమాదేవి, ఎంఈఓ దామాల పుల్లయ్య, కాంట్రాక్టర్ ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పారదర్శకంగా పాడి పశువుల కొనుగోలు మధిర: ఇందిరా మహిళా డెయిరీ లబ్ధిదారులకు పాడి పశువుల కొనుగోలు పారదర్శకంగా జరగాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. మధిర మున్సిపల్ కార్యాలయంలో పాడి పశువుల కొనుగోలుకు ఎంపిక చేసిన అధికారులు, బృందాలతో సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ 20వేల మంది లబ్ధిదారులకు రెండు పశువుల చొప్పున 40వేల పాడి పశువులు కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం ఆరుగురు చొప్పున పది బృందాలను ఏర్పాటుచేసినందున ఈ నెల 6న మొదటి విడతగా వెళ్లాలని తెలిపారు. కొనుగోళ్లు, బీమా, ఇతరత్రా అంశాల్లో లబ్ధిదారుల సూచనలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఎక్కడ పొరపాటు జరిగినా బాధ్యులపై కఠినమైన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. అదనపు కలెక్టర్ శ్రీజ, డీఆర్డీఓ ఎన్.సన్యాసయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నవీన్బాబు, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ విజయలక్ష్మి, తహసీల్దార్ రాంబాబు, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ పాల్గొన్నారు. రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా మార్కెట్ ఖమ్మంవ్యవసాయం: రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా మిర్చి మార్కెట్ నిర్మాణాలు ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. రూ.155.30 కోట్లతో ఖమ్మం మార్కెట్లో జరుగుతున్న మోడల్ మిర్చి మార్కెట్ నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ శ్రీజ, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. షెడ్లు, ఆర్ ఓ ప్లాంట్లు, టాయిలెట్లు, ల్యాబ్ నిర్మాణాలపై ఆరా తీస్తూ తేమ, రంగు పరీక్ష యంత్రాల ఏర్పాటు, డిజిటలైజేషన్పై సూచనలు చేశారు. అలాగే, హెల్త్ సెంటర్, క్యాంటీన్ ఏర్పాటు చేస్తూ రానున్న సీజన్ కల్లా అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్లు యరగర్ల హనుమంతరావు, తల్లాడ రమేష్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి అలీం, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
ఈనెల 10న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.ప్రీతమ్ ఈనెల 10న జిల్లాలో పర్యటించనున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తెలిపారు. ఖమ్మంలోని కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం ఎస్సీ సెల్ కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు బొడ్డు బొందయ్య అధ్యక్షతన నిర్వహించగా దుర్గాప్రసాద్ మాట్లాడారు. దళితులకు సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం చేసిన ఏకై క పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని తెలిపారు. ఈనెల 10న రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, దళిత కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.ప్రీతమ్ జిల్లా పర్యటన సందర్భంగా జరిగే దళిత సదస్సును విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఎస్సీ సెల్ నాయకులు ఆయనను సత్కరించారు. జల్లేపల్లి గణేష్ లడ్డూకు రికార్డు ధర ● రూ.90,116కు దక్కించుకున్న పుసులూరి వేణు తిరుమలాయపాలెం: మండలంలోని జల్లేపల్లిలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిష్ఠించిన వినాయకుడి చేతిలో లడ్డూకు రికార్డు ధర పలికింది. ఈమేరకు గురువారం పది కేజీల లడ్డూ వేలం నిర్వహించగా గ్రామానికి చెందిన పుసులూరి వేణు – అనూష దంపతులు రూ.90,116కు దక్కించకున్నారు. అలాగే, మరో చిన్న లడ్డూను రాచకొండ నగేష్ రూ.17,016కు పాడారు.