Khammam District News
-
కొత్త కార్డులు 1,017
ఖమ్మం సహకారనగర్: రాష్ట్రప్రభుత్వం ఇటీవల కొందరికి రేషన్కార్డులు మంజూరు చేయగా ఆయా కార్డుదారులకు వచ్చేనెల నుంచి సన్నబియ్యం అందనున్నాయి. జిల్లాలో కొత్తగా 1,017కార్డులు మంజూరయ్యాయని, వీటిపై 40,519మంది లబ్ధిదారులకు ఆరు కేజీల చొప్పున 2,43.114కేజీల బియ్యం అందించనున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్కుమార్ తెలిపారు. కొత్తవి కలిపి జిల్లాలో కార్డుల సంఖ్య 4,11,990కు, లబ్ధిదారుల సంఖ్య 11,89,685కు చేరనుందని వెల్లడించారు. కార్డుదారులు బయోమెట్రిక్, ఐరిష్ ద్వారా బియ్యం తీసుకోవచ్చని, ఇద్దరు కుటుంబీకులు ఉన్న వారు మాత్రమే ఓటీపీ ద్వారా బియ్యం తీసుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. అలాగే, ఎక్కడైనా బియ్యం తీసుకునేందుకు పోర్టబులిటీ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వచ్చేనెల నుంచి లబ్ధిదారులకు బియ్యం -
సైద్ధాంతిక భావజాలం పెంపొందించాలి
ఖమ్మంమయూరిసెంటర్: ఏ సిద్ధాంతమైనా ఆచరణ నుంచి రావాలని.. ఆచరణ కోసం అధ్యయనం చేయడమే కాక విద్యార్థుల్లో సైద్ధాంతిక భావజాలా న్ని పెంపొందించాలని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న ఎస్ఎఫ్ఐ ఐదో రాష్ట్ర మహాసభల్లో రెండో రోజైన శనివారం నాగేశ్వర్ ప్రారంభోపన్యాసం చేశా రు. ఆలోచనల పోరాటంలో ఎస్ఎఫ్ఐ ముందుండాలని, విద్యార్థుల దైనందిన సమస్యలను ప్రాపంచిక దృక్పథంతో అనుసంధానం చేయాలని సూచించారు. ప్రభుత్వ విద్యా రంగం నాడు బలంగా ఉండేదని.. అదే సామాజిక చైతన్యానికి కారణమై ఉండొచ్చని విశ్లేషించారు. పార్లమెంట్కు కూడా రాజ్యాంగాన్ని మార్చే అర్హత లేదని, లౌకికతత్వం, సామ్యవాదం అనే పదాలను రాజ్యాంగం నుంచి తొలగించాలని హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. నూతన విద్యావిధానం పేరుతో స్కూళ్ల మూత ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ఆదివాసీలు రాష్ట్రంలోని 11జిల్లాల్లో ఉన్నారని మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు తెలిపారు. ఈ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే విద్యాసంస్థలను మూసి వేస్తున్నారని, నూతన విద్యావిధానం పేరుతో ఏడాదికాలంలో 300 స్కూళ్లను మూసివేశారని పేర్కొన్నారు. ఇక 23ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఒక్కరు కూడా తెలుగు వచ్చిన ఉపాధ్యాయులు లేకపోవడం.. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోందని తెలిపారు. అనంతరం ఆహ్వాన సంఘం చైర్మన్ మువ్వా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నూతన విద్యావిధానం పేరుతో కాషాయీకరణ చేస్తూ, చరిత్రను మార్చి వేస్తున్నారని ఆరోపించారు. కాగా, ఎస్ఎఫ్ఐ 5వ రాష్ట్ర మహాసభలకు జిల్లా ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థులు రూ.3.25 లక్షలు విరాళంగా ఇచ్చారు. సభలో సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు, జాతీయ నాయకుడు ఎస్.వీరయ్య, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్, ఏఐడీఎస్ఓ రాష్ట్ర నాయకులు మల్లేశ్, ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వీ.పీ.సాను, ఉపాధ్యక్షుడు ఆదిత్యనారాయణ్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్.మూర్తి, టి.నాగరాజుతో పాటు రవిమారుత్, ఐ.వీ.రమణారావు, కొప్పిశెట్టి సురేశ్, సుధాకర్, ప్రవీణ్, ఎం.సుబ్బారావు, కోట రమేష్, భూక్యా వీరభద్రం, రజిని, మూడు శోభన్నాయక్, కళ్యాణం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తరగతి గది – సమాజాన్ని అనుసంధానం చేయాలి ఎస్ఎఫ్ఐ 5వ రాష్ట్ర మహాసభల్లో వక్తలు -
రెండు బార్లకు 145 దరఖాస్తులు
ఎకై ్సజ్ శాఖకు రూ.1.45కోట్ల ఆదాయం ఖమ్మంక్రైం: జిల్లా కేంద్రంలో లైసెన్స్ రద్దయిన రెండు బార్ల స్థానంలో కొత్తవి ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానించగా శనివారంతో గడువు ముగిసింది. మొత్తంగా 145 దరఖాస్తులు అందగా, వీటి ద్వారా రూ.1.45కోట్ల ఆదాయం సమకూరింది. ఈనెల 1నుంచి 21వ తేదీ వరకు కేవలం రెండు దరఖాస్తులే అందగా, ఆతర్వాత ఏపీతో పాటు తెలంగాణ వ్యాపారులు ముందుకు రావడంతో దరఖాస్తుల సంఖ్య పెరిగింది. ఈనెల 29వ తేదీన డ్రా ద్వారా బార్ల నిర్వహణను అప్పగించనున్నారు. ‘ప్రమాదకరంగా ఉన్మాదం’ ఖమ్మం మయూరిసెంటర్: ఉన్మాదం దేశానికి ప్రమాదకరమే కాక అభివృద్ధి, భవిష్యత్కు గొడ్డలిపెట్టుగా నిలుస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఉన్మాదం, టెరర్రిజానికి మతం ప్రాధాన్యత కాదని అలజడి, ప్రజలను హింసించడమే దాని లక్ష్యమని చెప్పారు. ఖమ్మంకు చెందిన వరద నర్సింహారావు తదితరులు సీపీఐలో చేరిన సందర్భంగా శనివారం ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. ఉన్మాదులకు మతం లేదని పలుమార్లు రుజువైనా, టెరర్రిజం విషయంలో ఒక మతాన్ని బూచిగా చూపడం సరి కాదన్నారు. టెరర్రిస్టు దాడిని అంచనా వేయ డం, అడ్డుకోవడంలో విఫలమై.. ప్రజల ఆలోచనలను మళ్లించేలా మోడీ, అమిత్ ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. సీపీఐ నాయకులు బాగం హేమంతరావు, నాయకులు మల్లేష్, దండి సురేష్, మహ్మద్ మౌలానా, జమ్ముల జితేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గులాబీల్లో సంబురం
బీఆర్ఎస్ రజతోత్సవానికి పార్టీ శ్రేణులు సిద్ధం ● సభ విజయవంతానికి జిల్లాలో విస్తృత ప్రచారం ● శ్రేణుల తరలింపునకు భారీ సంఖ్యలో వాహనాలు ● నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలకు బాధ్యతలు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జిల్లా నుంచి గులాబీదండు కదలుతోంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం జరిగే సభకు జిల్లా నుంచి 50వేల మందిని తరలించేలా పార్టీ నేతలు వెయ్యికి పైగా బస్సులు, కార్లను ఏర్పాటు చేశారు. ఇవేకాక పార్టీ నేతలు, శ్రేణులు సొంత వాహనాల్లోనూ బయలుదేరనున్నారు. సభ విజయవంతానికి ముఖ్యనేతలు కొన్నాళ్లుగా విస్తృత ప్రచారం చేయడమే కాక పార్టీ శ్రేణులు, జనాన్ని తరలించే బాధ్యతలను పలువురికి అప్పగించారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మంజిల్లా వాహనాల పార్కింగ్కు స్థలం ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లే వారికి ఇప్పటికే మార్గాలు సూచించగా.. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటుచేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వెళ్లే వారికి కరుణాపురం నుంచి ఎన్హెచ్ 163 టోల్గేట్ దాటాక పార్కింగ్ కేటాయించారు. ఇల్లెందు, వైరా, ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల నుంచి సభకు వెళ్లే వారు మామునూరు నుంచి నాయుడు పెట్రోల్పంప్, టయోటా షోరూమ్, కడిపికొండ బ్రిడ్జి, మడికొండ, ఎన్హెచ్ 163 బైపాస్, టోల్గేట్, దేవన్నపేట, మడిపల్లి, అనంతసాగర్ మీదుగా కేటాయించిన పార్కింగ్ స్థలానికి చేరాల్సి ఉంటుంది.ఫ్లెక్సీలు, పోస్టర్లు ఆదివారం జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతానికి జిల్లా నేతలు విస్తృత ప్రచారం చేశారు. వాల్ రైటింగ్తో పాటు సమావేశాలు నిర్వహించడమే కాక ఫ్లెక్సీలు, పోస్టర్లతో సభ వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. మాజీమంత్రి పువ్వాడ అజయ్కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తల సమావేశాలు నిర్వహించి సభ విజయవంతంపై దిశానిర్దేశం చేశారు. నాడు ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ.. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా ఆవిర్భవించిన సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. 2023 జనవరి 18న రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంలో కలెక్టరేట్ ప్రారంభం తర్వాత, అక్కడి సమీపంలోనే ఈ సభ నిర్వహించారు. అప్పటి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, పంజాబ్, ఢిల్లీ, కేరళ సీఎంలు భగవంత్సింగ్ మాన్, కేజ్రీవాల్, పినరయ్ విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా తదితరులు పాల్గొన్నారు. భారీగా నిర్వహించిన ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి నేతలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సభలో బీజేపీ విధానాలపై కేసీఆర్ నిప్పులు చెరగగా.. ఎల్కతుర్తి సభలో ఆయన ప్రసంగం ఎలా ఉంటుందోనని రాజకీయ విశ్లేషకులు ఎదురుచూస్తున్నారు.సభను విజయవంతం చేయాలి.. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జిల్లా నుంచి ప్రజలు అధికసంఖ్యలో హాజరై విజయవంతంలో పాలు పంచుకోవాలి. జనం వెళ్లేలా బస్సులు, కార్లు ఏర్పాటుచేశాం. తెలంగాణ సాధన, రాష్ట్రాభివృద్ధి కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్కే సాధ్యమైంది. ఇది రజతోత్సవ సభగానే కాక రాష్ట్ర సాధన తర్వాత ప్రగతి, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశంగా ఉంటుంది. – పువ్వాడ అజయ్కుమార్, మాజీ మంత్రిఖమ్మం సత్తా చాటుదాం.. కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించగా.. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజల ఆగ్రహావేశాలకు గురవుతోంది. ఈ నేపథ్యాన ఎల్కతుర్తి సభకు గులాబీ శ్రేణులు, అభిమానులు, ఉద్యమకారులు, ప్రజలు భారీగా హాజరై కేసీఆర్కు మద్దతు ప్రకటించాలి. ఇక్కడి నుంచి అత్యధికంగా జనం వెళ్లడం ద్వారా జిల్లా సత్తా చాటాలి. – వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు -
కొనుగోళ్లకు కొర్రీలు
పెరిగిన ఖర్చులు.. సన్నధాన్యం పండిస్తే క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో యాసంగిలోనూ పలువురు రైతులు ఆ ధాన్యాన్నే సాగు చేశారు. అయితే చివరిలో వచ్చిన అకాల వర్షాలు వారిని దెబ్బతీశాయి. మొదట పంట బాగానే ఉన్నా.. కోత దశలో వచ్చిన వర్షం నష్టాన్ని చేకూర్చింది. ధాన్యాన్ని టైర్ల మిషన్తో కోస్తే ఎకరానికి రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు ఖర్చవుతుంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలతో టైర్ మిషన్లతో కోయడం కష్టంగా మారడంతో ట్రాక్ మిషన్లను ఉపయోగించాల్సి వచ్చింది. దీంతో ఎకరానికి రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు ఖర్చయింది. దీనికి తోడు కొన్ని కేంద్రాల్లో ధాన్యంపై కప్పుకోవడానికి టార్పాలిన్లు కూడా రైతులే కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇలా రైతులపై అదనపు భారం పడింది. అమ్ముదామంటే అవస్థలు.. జిల్లాలో 351 కొనుగోలు కేంద్రాలు తెరవగా.. 184 కేంద్రాల్లో కొద్దో గొప్పో కొనుగోళ్లు సాగుతున్నాయి. ఆయా కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. క్వింటాకు 3 నుంచి 5 కేజీల తరుగు తీయకపోతే దిగుమతి చేసుకోమంటూ మిల్లర్లు చెబుతున్నారు. ధాన్యం తేమశాతం నిబంధనలకు లోబడే ఉందని, ఇతర ఖర్చులు కూడా తామే భరిస్తున్నామని, మళ్లీ తరుగు ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. తరుగు తీసేందుకు ససేమిరా అంటున్నారు. ఇక లోడింగ్కు లారీలు రాకపోవడంతో ధాన్యం కాంటా వేసేందుకు నిర్వాహకులు ఒప్పుకోవడం లేదు. వెంటనే లోడింగ్, అన్లోడ్ అయితేనే లారీలు పెడతామని సరఫ రాదారులు చెబుతున్నారు. తరుగు తీయకపోవడంతో మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోవడం లేదు. తడుస్తున్న ధాన్యం.. రోజుల తరబడి కేంద్రాల్లో ధాన్యం ఆరబోసి ఉండగా.. ఇటీవల పలుమార్లు అకాల వర్షం కురిసింది. టార్పాలిన్లు వేసినా.. కింద నుంచి నీరు రావడం, కొన్ని కేంద్రాల్లో సరిపడా టార్పాలిన్లు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం తడిసింది. దీంతో చాలామంది రైతులు మళ్లీ కూలీలను పెట్టి తిరగేయించారు. ఇలా తడవడం, తూర్పార పట్టించడం, ఆరబోయడంతోనే సరిపోతుండగా మారుతున్న వాతావరణంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సౌకర్యాలు ఉండడం లేదు. కనీసం రైతులకు తాగునీరు కూడా అందుబాటులో లేదు.ప్రభుత్వ కేంద్రాల్లోనే రైతుల పడిగాపులు క్వింటాకు 5 కేజీల తరుగు తీస్తామంటున్న మిల్లర్లు లారీలు లేకుండా కాంటా వేయలేమంటున్న నిర్వాహకులు అకాల వర్షాలతో తడిసిన ధాన్యం ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్న అన్నదాతలురాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బోనస్ ఆశతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకుందామని వచ్చిన రైతులకు పడిగాపులు తప్పడం లేదు. క్వింటాకు 3 నుంచి 5 కేజీల తరుగు తీస్తామని మిల్లర్లు, లారీలు వస్తేనే కాంటాలు వేస్తామని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, లోడింగ్, అన్లోడింగ్ వెంటనే చేస్తేనే లారీలు పెడతామంటూ సరఫరాదారులు, క్వింటాకు రూ.65 ఇవ్వాలని హమాలీలు పెడుతున్న కొర్రీలతో అన్నదాతలు విలవిల్లాడుతున్నారు. ఈ కష్టాలు చాలవన్నట్టు అకాల వర్షాలతో కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవుతోంది. దీంతో కొందరు రైతులు ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు అమ్మేందుకు ముందుకొస్తున్నారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మంకేంద్రాల వద్ద పడిగాపులు.. రైతులు గత 10, 15 రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. విపరీతమైన ఎండలతో అలసిపోతున్నారు. ఉక్కపోతతో తట్టుకోలేకపోతున్నామని, కాంటాలు వేయడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇక హమాలీలకు క్వింటాకు రూ.65 ముట్టజెప్పాల్సి వస్తోందని, తూర్పార పడితే రూ.200 వరకు ఖర్చవుతోందని చెబుతున్నారు. కొందరు రైతులు వేచి ఉండలేక ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. అయితే వారు క్వింటా రూ.2,100కే అడుగుతున్నా.. ఇతర ఖర్చులు, ఇబ్బందులు ఉండవనే కారణంతో వారికే అమ్ముతున్నామని చెబుతున్నారు.వివరాలు.. జిల్లాలో మొత్తం కొనుగోలు కేంద్రాలు 351 కొనుగోళ్లు సాగుతున్నవి 184 కొనుగోలు చేసిన ధాన్యం 29,695.200 మెట్రిక్ టన్నులు ధాన్యం విక్రయించిన రైతులు 3,578 మిల్లులకు తరలించిన ధాన్యం 29,695.200 మెట్రిక్ టన్నులుఏం చేయాలో అర్థం కావట్లే.. సన్నరకం ధాన్యం అమ్ముకునేందుకు ఐకేపీ కొనుగోలు కేంద్రానికి వారం క్రితం తరలించా. తేమ 16 శాతం ఉంది. సన్నధాన్యం కావడంతో బోనస్ వస్తుందని తెచ్చా. ఇక్కడ టార్పాలిన్లు లేవు. వాతావరణం గంటకో తీరుగా మారుతోంది. ఎప్పుడు వర్షం వస్తుందోనని భయమేస్తోంది. కాంటాలు మాత్రం వేయడం లేదు. ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముదామంటే క్వింటా రూ.1500కే అడుగుతున్నారు. – చిల్లపల్లి లక్ష్మణ, పెనుబల్లి ధాన్యం కొనుగోలు చేయడం లేదు నేను పదెకరాల్లో వరి సాగు చేశా. 500 బస్తాల దిగుబడి వచ్చింది. ధాన్యం అమ్మేందుకు కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే 12 రోజులైనా కొనుగోలు చేయలేదు. ఇప్పటికే వర్షంతో ధాన్యం ఒకసారి తడిస్తే కూలీలను పెట్టి తిరగేయించా. అడిగితే రేపు, మాపు అంటున్నారు. బోనస్ వస్తుందని కేంద్రానికి తీసుకొస్తే ఇలా ఇబ్బంది పెడుతున్నారు. – కొప్పుల శ్రీనివాసరెడ్డి, బీరోలు, తిరుమలాయపాలెం మండలం -
కదం తొక్కిన విద్యార్థులు
ఖమ్మంమయూరిసెంటర్ : ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఖమ్మం వీధుల్లో విద్యార్థులు శుక్రవారం కదం తొక్కుతూ ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని జెడ్పీసెంటర్ వద్ద ప్రముఖ విద్యావేత్త మువ్వా శ్రీనివాసరావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించగా వైరా రోడ్ మీదుగా భక్త రామదాసు కళాక్షేత్రానికి చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. ఎస్ఎఫ్ఐ జెండాలు, భగత్ సింగ్, చేగువేరా ప్లకార్డులు, కోలాటం, డప్పు నృత్యాలతో సాగిన ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం సభ ప్రారంభానికి ముందు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు మూర్తి జెండా ఆవిష్కరించగా.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టారు. ఖమ్మంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు ప్రారంభం నగరంలో భారీ ప్రదర్శన -
తొలిరోజే పుస్తకం.. పాఠం
● జిల్లాకు చేరుతున్న పాఠ్యపుస్తకాలు ● ఇప్పటికే గోదాంలకు చేరిన 2,11,610 పుస్తకాలు ఖమ్మంసహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ముందుచూపుతో వ్యవహరిస్తోంది. ఈ విద్యా సంవత్సరం ముగియకముందే వచ్చే ఏడాదికి (2025–26) అవసరమైన పాఠ్య పుస్తకాలను అందుబాటులో ఉంచుతోంది. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు సిద్ధమవుతోంది. 2025 – 26 విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉండగా తొలిరోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకుంటోంది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ పాఠశాలలు 1,303 ఉండగా వాటిలో 87,809 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారందరికీ అవసరమైన పాఠ్య పుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు చేరుస్తోంది. జిల్లాలోని పాఠశాలల్లో 6,59,570 పాఠ్య పుస్తకాలు అవసరం ఉండగా.. 2,11,610 పాఠ్య పుస్తకాలు ఇప్పటికే వచ్చాయి. మిగతావి త్వరలో రానున్నాయి. అన్నీ రాగానే ఎంఈఓ కార్యాలయాలకు తరలించి, అక్కడి నుంచి పాఠశాలలకు చేరవేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పుస్తకాల్లోకి కొత్త అంశాలు.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర గీతంలో స్వల్ప మార్పులు చేసింది. వీటిపై విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేలా వచ్చే విద్యా సంవత్సరంలో అందించే పాఠ్య పుస్తకాల్లో వీటిని పొందుపరుస్తున్నారు. అలాగే ఈ సారి రాజ్యాంగ పీఠికను సైతం ముద్రించారు. విద్యార్థులకు ఉపయోగపడేలా.. పాఠశాలల పునః ప్రారంభం రోజునే విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా.. ఇది ఎంతగానో ఉపయోగకరమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. గతంలో మన ఊరు మన బడి, మన బస్తీ మన బడి, ఆ తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న క్రమంలో పుస్తకాలు కూడా సకాలంలో అందితే విద్యార్థులు తొలినాళ్ల నుంచే చదువుపై దృష్టి సారించే అవకాశం ఉంది.పుస్తకాలు వస్తున్నాయి జిల్లాకు పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకుంటాం. ప్రారంభం నుంచే పాఠ్య పుస్తకాలు అందించడం ద్వారా పిల్లలకు చదువుపై మరింత శ్రద్ధ పెరిగే అవకాశం ఉంది. – ఈ.సోమశేఖర శర్మ, డీఈఓ -
‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం
ఖమ్మం సహకారనగర్ : విద్యారంగంలో స్ఫూర్తి ఫౌండేషన్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. కామేపల్లికి చెందిన పేద విద్యార్థి తేజవత్ శ్రీనివాస్కు ఫౌండేషన్ అందించిన రూ. 50వేల చెక్కును శుక్రవారం కలెక్టరేట్లో విద్యార్థికి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..కాన్పూర్ ఐఐటీలో శ్రీనివాస్ అడ్మిషన్ పొందగా, ఆర్థిక పరిస్థితి బాగా లేనందున ఆ కోర్సు చదివే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఈ క్రమంలో అతడి తల్లిదండ్రులు ఇటీవల కలెక్టరేట్లో ప్రజావాణిలో అధికారులకు విన్నవించారని, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆ విద్యార్థికి ఆర్థిక సాయం బాధ్యతను విద్యాశాఖ సీఎంఓ రాజశేఖర్కు అప్పగించారని తెలిపారు. దీంతో ఆయన సూచన మేరకు స్ఫూర్తి ఫౌండేషన్ వారు ఐఐటీ చదువుకు అయ్యే ఖర్చంతా భరిస్తామని ముందుకొచ్చారని, ఈ మేరకు సంస్థ అధికార ప్రతినిధి వరక రామారావు తొలివిడతగా రూ. 50 వేల చెక్కు ఇచ్చారని వివరించారు. కార్యక్రమంలో స్ఫూర్తి ఫౌండేషన్ వలంటీర్లు ఉబ్బన బాబురావు, జల్ది రామకృష్ణ, బైర్ల వెంకటేశ్వర్లు, శిరసాని ఇమ్మానుయేల్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ -
ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోండి
● కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో ఐదు డీఏలు పెండింగ్లోనా ? ● టీజీఈజేఏసీ చైర్మన్ జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరిఖమ్మం సహకారనగర్ : కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో ఉద్యోగులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, వారి సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు కోరారు. ఐదు డీఏలు పెండింగ్లో ఉండడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఖమ్మంలోని టీఎన్జీఓస్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన సదస్సులో వారు మాట్లాడారు. 95 శాతం మంది ఉద్యోగులు జీతంపైనే ఆధారపడి ఉంటారని అన్నారు. బకాయి బిల్లులు నెలకు రూ.650 కోట్ల చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. హెల్త్ కార్డులపై పలుమార్లు ఆరోగ్య శాఖ మంత్రిని కలిసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పీఆర్సీ నివేదికను తక్షణమే అమలు చేయాలని, వేతనాల సవరణకు 50 శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న వైద్య బిల్లులను క్లియర్ చేయడంతో పాటు క్యాష్లెస్ హెల్త్కార్డులు అందించాలన్నారు. జీపీఎఫ్ రుణాలను వెంటనే మంజూరు చేయాలని, పెండింగ్ బకాయిల విడుదలతో పాటు సరెండర్ లీవ్లు క్లియర్ చేయాలని కోరు. ఉద్యోగులు బాగుంటేనే ప్రజా సంక్షేమ పథకాలు అమలుచేయడంలో చురుగ్గా పాల్గొంటారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలైనా మంత్రుల పేషీల్లో ఉద్యోగ సంఘ నాయకులను గుర్తించడం లేదని ఆరోపించారు. మే 4న రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ కో చైర్మన్ మన్నెబోయిన తిరుపతి, జిల్లా టీజేఏసీ చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు, కన్వీనర్ కస్తాల సత్యనారాయణ, వివిధ సంఘాల నాయకులు యలమద్ది వెంకటేశ్వర్లు, పారుపల్లి నాగేశ్వరరావు, దేవరకొండ సైదులు, తుంబూరి సునీల్ రెడ్డి, మామునూరి రాజేష్, విజయ్, ఎ.వి నాగేశ్వరరావు, వీరస్వామి, కొణిదెన శ్రీనివాస్, మోదుగు వేలాద్రి, మల్లెల రవీంద్రప్రసాద్, కళ్యాణం కృష్ణయ్య, పరిస పుల్లయ్య, ఎం.సుబ్బయ్య, డాక్టర్ బాబు రత్నాకర్ పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టరేట్ నుంచి టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీ అందరినీ ఆకట్టుకుంది. -
పలువురు న్యాయాధికారుల బదిలీ
ఖమ్మం లీగల్ : జిల్లాలో పలువురు న్యాయాధికారులు బదిలీ అయ్యారు. ఖమ్మం అబ్కారీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాళ్లబండి శాంతిలత వికారాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా, మధిర ఒకటో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయమూర్తి టి.కార్తీక్ రెడ్డి వనపర్తి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ అయ్యారు. సత్తుపల్లి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా హుజూర్నగర్ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా వెళ్లగా, ఆ స్థానంలో మిర్యాలగూడ నుంచి బి. సాయినాగ సుమబాల వస్తున్నారు, మధిర ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి వేముల దీప్తి రానున్నారు. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా జడ్జికి తీర్మాన పత్రాలు..ఇటీవల విజయవాడలో ‘స్వతంత్ర న్యాయవ్యవస్థ–బాధ్యత’ అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆమోదించిన తీర్మానపత్రాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్కు తెలంగాణ రాష్ట్ర న్యాయవా ద పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం అందజేశా రు. పరిషత్ జిల్లా అధ్యక్షుడు హర్కారా శ్రీరాంరా వు, సుగ్గల వెంకటగుప్త, శేషాద్రి శిరోమణి, నరేష్, కిషోర్బాబు, వెంకటరమణ పాల్గొన్నారు.మోడల్ స్కూల్ పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఖమ్మక్రైం: తెలంగాణ మోడల్ స్కూళ్లలో ప్రవేశానికి ఈనెల 27 పరీక్ష జరగనున్న నేపథ్యాన కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమల్లో ఉంటుందని పోలీసు కమిషనర్ సునీల్దత్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపుగా ఉండొద్దని, సమీప ప్రాంతాల్లో సభలు, సమావేశాలు, మైకులు, డీజేలతో ఊరేగింపులకు అనుమతి ఉండదని పేర్కొన్నారు. అంతేకాక సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్షాపులు, స్టేషనరీ షాప్లు మూసివేయాలని తెలిపారు. ఎవరైనా నిబంధనలుఅతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. రైతులు ఇబ్బంది పడకుండా చూడాలి : సీపీనేలకొండపల్లి : ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మిల్లుల వద్ద రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్దత్ సూచించారు.మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీ లించారు. అనంతరం రాజేశ్వరపురంలోని అరుణాచల రైస్మిల్లును తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు, రవాణా, కాంటాలు, బిల్లులు తదిత ర అంశాలపై రైతులతో మాట్లాడారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని మిల్లర్లకు సూచించారు. ఆయన వెంట కూసుమంచి సీఐ సంజీవ్, ఎస్సై సంతోష్ ఉన్నారు. రైతులు నష్టపోకుండా చూస్తాం ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి వేంసూరు: పామాయిల్ సాగులో ఆఫ్ టైప్ మొక్కల నివారణ చర్యలు చేపట్టి రైతులకు నష్టం కలుగకుండా చర్యలు చేపడతామని ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. మండలంలోని వైఎస్బంజర్, ఎర్రగుంటపాడు, చోడవరం గ్రామాల్లో శుక్రవారం ఆయన పామాయిల్ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆఫ్ టైప్ మొక్కలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, పామాయిల్ సాగుపై ఆసక్తి కొల్పోతున్నారని, దీనిపై నివారణ చర్యలు చేపట్టామని తెలిపారు. నర్సరీ నిర్వహణ, మొక్కల పెంపకంపై సరైన చర్యలు చేపట్టకపోవడంతోనే నాణ్యత లేని మొక్కలు వచ్చి ఉంటాయని అన్నారు. లోపాలను అధిగమించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. చీడపీడల బెడద తక్కువగా ఉండడంతో పాటు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొంటుందని, కోతల బెడద ఉండదని, ప్రస్తుత పరిస్థితుల్లో పామాయిల్ సాగే లాభదాయకమని వివరించారు. ఈ పంట సాగులో జిల్లా రైతులు ముందంజలో ఉన్నారని, అడ్వాన్స్డ్ టెక్నాలజీని అనుసరిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో రిటైర్డ్ శాస్త్రవేత్త బీఎన్ రావు, ఆయిల్ఫెడ్ జీఎం సుధాకర్ రెడ్డి, డిప్యూటీ మేనేజర్ ప్రవీణ్ రెడ్డి, అశ్వారావు పేట, అప్పారావుపేట ఫ్యాక్టరీ మేనేజర్లు నాగబాబు, కళ్యాణ్, ఆయిల్ పామ్ రైతు సంఘం నాయకులు ఉమామహేశ్వరెడ్డి, గొర్ల రాంమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహిళ మెడలో గొలుసు చోరీ
వైరా: స్థానిక వాసవీ కల్యాణ మండపం సమీపంలో శుక్రవారం సాయంత్రం ఓ మహిళ మెడలో నుంచి బంగారపు గొలుసును దుండగుడు చోరీ చేశాడు. పోలీసులు, బాధిత మహిళ కథనం ప్రకారం.. వైరాకు చెందిన మిట్టపల్లి వెంకటలక్ష్మి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ద్విచక్రవాహనంపై హెల్మెట్, మాస్క్ ధరించి అతివేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని యువకుడు మహిళ మెడలో నుంచి మూడున్నర తులాల బంగారపు గొలుసును లాక్కొని వెళ్లాడు. మహిళ కేకలు వేయగా స్థానికులు ఘటనా స్థలానికి చేరకుని పోలీసులకు సమాచారం అందించారు. ఏసీపీ రెహమాన్ కల్యాణ మండపంలోని సీసీటీవీ పుటేజీని పరిశీలించారు. ద్విచక్రవాహనానికి నంబర్ ప్లేట్ లేకపోవడం, చెయిన్ స్నాచర్ షార్ట్ మీద ఉన్నట్లు గుర్తించారు. 25 ఏళ్లలోపు వయసు ఉంటుందని అంచనా వేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఖమ్మం వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. -
స్వర్ణ కవచధారణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భూమి రాసిస్తేనే పెళ్లి తాళి కట్టే సమయాన నిలిచిన వివాహం కూసుమంచి: తనకు కట్నంగా ఇస్తానన్న భూమిని బాండ్ పేపర్పై రాసిస్తేనే తాళి కడతానని వరుడు పట్టుబడటంతో పీటలమీద పెళ్లి నిలిచిపోయిన ఘటన మండలంలో చర్చనీయాంశంగా మారింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని రాజుపేట గ్రామానికి చెందిన యువకుడికి వెంకట్రాంపురం గ్రామానికి చెందిన తన బంధువుల యువతితో వివాహం నిశ్చయమైంది. బుధవారం ఏపీలోని ఓ దేవాలయంలో వివాహం జరిపించేందుకు వెళ్లారు. వరుడు తాళికట్టే సమయాన తనకు కట్నంగా ఇస్తానన్న భూమిని ఇప్పుడే బాండ్ పేపర్పై రాసి ఇవ్వాలని, అలా అయితేనే తాళి కడతానని పట్టుబట్టాడు. ఇరు వర్గాల వాగ్వాదం అనంతరం వరుడు కల్యాణ మండపం నుంచి వెళ్లిపోయాడు. దీంతో చేసేదేమీ లేక వధువు తరఫువారు అక్కడి స్థానిక పోలీసులను ఆశ్రయించగా వారి సూచనతో గురువారం కూసుమంచి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఇరువర్గాలను పిలిచి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు కాలేదని ఎస్ఐ నాగరాజు తెలిపారు. -
రిజిస్ట్రేషన్ లేకుండా ఆస్పత్రులు నడపొద్దు
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, రిజిస్ట్రేషన్ లేకుండా నడిపితే చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ బి.కళావతిబాయి హెచ్చరించారు. డీప్యూటీ డీఎంహెచ్ఓ సైదులు, ఎన్వీబీడీసీపీ పీఓ వెంకటరమణతో కలిసి శుక్రవారం సురక్ష ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఓపీ, ఐపీ రిజిస్టర్లు చెక్ చేసి ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. అనంతరం అపరేషన్ థియేటర్, వార్డులను పరిశీలించారు. పేషెంట్లకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో సిబ్బంది వివరాలను ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని ఆదేశించారు. తాను మళ్లీ తనిఖీకి వచ్చేనాటికి అన్ని విభాగాలు, రిజిస్టర్లు, ల్యాబ్ పద్ధతి ప్రకారం ఉంచాలని, లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డెమో సాంబశివారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ పాల్గొన్నారు. -
వేతనం సకాలంలో చెల్లించాల్సిందే..
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాకు వలస వచ్చి పనులు చేసిన కూలీల కష్టార్జితాన్ని సకాలంలో చెల్లించాలని యజమానులకు జిల్లా ఉప కార్మిక కమిషనర్ కె.విజయభాస్కర్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల జిల్లాలోని మధిర మండలం వంగవీడు గ్రామంలో మిర్చి తోటలో పని చేసేందుకు మహారాష్ట్రలోని బల్లార్షా ప్రాంతం నుంచి 10 మంది వలస కూలీలను యజమానులు తీసుకొచ్చారని, కిలో మిర్చికి రూ.30 చెల్లిస్తామని నిర్ణయించారని, మిర్చి కోసినందుకు కూలీ రూ.1,14,210లు కాగా.. యజమాని వలస కూలీలకు రూ.5 వేలు మాత్రమే చెల్లించారని పేర్కొన్నారు. మిగిలిన కూలీ ఇవ్వకపోవడంతో వలస కూలీలు కార్మికశాఖ అధికారులను సంప్రదించారని, అధికారులు ఈ నెల 24న కూలీలకు ఆ కూలీ మొత్తం ఇప్పించి, వారిని జీటీ ఎక్స్ప్రెస్ ద్వారా బల్లార్షాకు సురక్షితంగా పంపించామని విజయ్భాస్కర్రెడ్డి తెలిపారు. ఇసుక డంప్ల సీజ్ తిరుమలాయపాలెం: మండలంలోని బాలాజీనగర్తండా గ్రామ పంచాయతీ పరిధిలోని రమణాతండాలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులను మండల తహసీల్దార్ సుధీర్, పోలీసులు శుక్రవారం సీజ్ చేశారు. మొత్తం 50 ట్రిప్పుల ఇసుక ఉంటుందని వారు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ రంగారెడ్డి ఆర్ఐ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఉషూ జట్ల ఎంపిక ఖమ్మంస్పోర్ట్స్: సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు జరుగనున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ పోటీల్లో జిల్లా జట్లను జిల్లా ఉషూ సంఘం ప్రకటించింది. క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలని డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, ఉషూ కోచ్ పి.పరిపూర్ణాచారి కోరారు. సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలి.. ఖమ్మంసహకారనగర్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చి ప్రభుత్వ ఆధీనంలోనే విద్యారంగం కొనసాగేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి అన్నారు. శుక్రవారం సంఘం కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని నమ్మకం కలిగించేలా ప్రభుత్వ విధానాల్లో మార్పులు తీసుకురావాలని, విద్యారంగంలో ప్రైవేటీకరణను నియంత్రించాలని, ప్రతి గ్రామంలో ఒకటే బడి అదే ప్రభుత్వ బడి ఉండేలా కామన్ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. అనంతరం సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వై.పద్మ, రాష్ట్ర కార్యదర్శి ఎస్.విజయ్, రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి మాట్లాడారు. సమావేశంలో వెంగళరావు, కె.వెంకటేశ్వరరావు, వీరబాబు, ముత్తయ్య, నాగిరెడ్డి, ఉమాదేవి, నాగేశ్వరరావు, యాకూబ్పాషా తదితరులు పాల్గొన్నారు. -
మేమిక ఉండలేం..
● బదిలీల కోసం ఎకై ్సజ్ ఉద్యోగుల ఎదురుచూపులు ● ఆరేళ్లుగా 180 మందికి స్థానచలనం లేదు.. ● దూర ప్రాంతాల ఉద్యోగుల్లో ఆవేదన ఖమ్మంక్రైం: ఉమ్మడి జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎకై ్సజ్ శాఖలో ఆరేళ్లుగా బదిలీలు జరగకపోవటంతో సిబ్బంది ఎప్పుడెప్పుడా అని ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ నెలలో అయిపోతుంది, వచ్చే నెలలో అయిపోతుంది అంటూ కాలం వెళ్లదీస్తున్నారు తప్ప బదిలీల గురించి పట్టించుకోనే పరిస్థితి లేదు. సీఐ మొదలు కానిస్టేబుళ్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం ఎకై ్సజ్ స్టేషన్–1, ఖమ్మం ఎకై ్సజ్స్టేషన్–2, నేలకొండపల్లి, వైరా, మధిర, సత్తుపల్లి, సింగరేణి మొత్తం 7 ఎకై ్సజ్ స్టేషన్లు ఉండగా, భద్రాద్రి కొత్తగూడెంలో కొత్తగూడెం, అశ్వారావుపేట, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం, ఇల్లెందు కలిపి 6 స్టేషన్లు ఉన్నాయి. దీనికితోడు రెండు డీటీఎఫ్ (డిస్ట్రిక్ టాస్క్ఫోర్స్)లు, ఒక ఎన్ఫోర్స్మెంట్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో పనిచేస్తున్న 180 మంది సిబ్బంది ఆరేళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో ఒక సీఐ, ఇద్దరు ఎస్ఐలు ఉండగా 37 మంది హెడ్కానిస్టేబుళ్లు 140 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. ఖమ్మం ఎకై ్సజ్స్టేషన్–2 ఒకప్పుడు బూర్గంపాడు ఎకై ్సజ్ స్టేషన్ కాగా ముంపు మండలాలు అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో కలపటంతో ఆ స్టేషన్ను అక్కడి నుంచి ఖమ్మం తరలించి ఎకై ్సజ్స్టేషన్–2గా మార్చారు. అయితే దాదాపు పదేళ్లు కావొస్తున్నా ఈ స్టేషన్లో 8 మందికి పైగా సిబ్బంది అప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తుండటం గమనార్హం. ఏళ్ల తరబడి అవే స్టేషన్లలో పనిచేస్తుండటంతో సిబ్బందిపై సైతం పలు ఆరోపణలు వస్తున్నాయి. దీనికితోడు ఎంతోకాలంగా ఏజెన్సీ ప్రాంతాలు, దూరప్రాంతాల్లో పనిచేస్తున్న సిబ్బంది సైతం ఈ స్టేషన్లలో ఎంతకాలం పనిచేయాలనే ధోరణితో నిరాశ చెందుతున్నారు. త్వరలోనే పక్రియ..? గతంలో మాదిరిగా ఈసారి బదిలీల ప్రక్రియకు బ్రేక్ పడే అవకాశం లేదని దాదాపు బదిలీలు జరగటం ఖాయమని కొందరు ఎకై ్సజ్ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ చివరి వారం లేదా, మే మొదటివారంలో బదిలీలు జరిగే అవకాశం ఉందని ఎకై ్సజ్ రాష్ట్ర ఉన్నతాధికారి విదేశాల్లో ఉండటంతో ఆయన తిరిగి రాగానే వెంటనే రాష్ట్రవ్యాప్తంగా బదిలీల ప్రక్రియ ఉంటుందని చెబుతున్నారు, వచ్చేనెల వరకు బదిలీ పక్రియ జరిగితే తమ పిల్లల విద్యాభ్యాసానికి ఇబ్బంది ఉండదని ఆలస్యం అయితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని సిబ్బంది చెబుతున్నారు. -
రవాణాశాఖ కార్యాలయంలో ఏసీబీ కలకలం
ఖమ్మంక్రైం: జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ఏసీబీ కలకలం సృష్టించింది. మహబూబాబాద్ ఎంవీఐగా పనిచేస్తూ ఏసీబీకి చిక్కి సస్పెండ్లో ఉన్న గౌస్పాషాకు చెందిన ఖమ్మంలోని ఇంట్లో అధికారులు సోదా చేశారు. రవాణాశాఖ కార్యాలయానికి కూడా వారు వస్తున్నారనే సమాచారం వైరల్ కావటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. గౌస్పాషా గతంలో ఖమ్మంలో ఎంవీఐగా, ఇన్చార్జ్ ఆర్టీఓగా కూడా పనిచేశారు. దీంతో ఆయన పనిచేసిన కాలంలో ఫైళ్లను తనిఖీ చేస్తారని పుకార్లు రావటంతో రవాణాశాఖ కార్యాలయంలో సిబ్బంది బిక్కుబిక్కుమంటూ గడిపారు. కార్యాలయంలో ఏజెంట్లను ఎవరినీ అనుమతించలేదు. చుట్టు పక్కల ఉన్న దుకాణాల షెట్టర్లకు తాళాలు వేసిన ఏజెంట్లు శుక్రవారం కనిపించకుండా పోయారు. వారిని ఆశ్రయించిన వాహనదారులు లైసెన్స్లు, ఆర్సీల కోసం ఏజెంట్లను చెట్ల కింద, ఆ ప్రాంతంలో ఉన్న ఇతర దుకాణాల వద్ద పట్టుకుని తమ పని చేయించుకున్నారు. అయితే, బైపాస్రోడ్డులోని విజయ్నగర్కాలనీలో గౌస్పాషా ఒక గది మాత్రమే అద్దెకు తీసుకున్నారని, అందులో ఎలాంటి ఆధారాలు ఏసీబీకి లభించలేదని తెలిసింది. షెట్టర్లకు తాళాలు వేసి కనిపించకుండా వెళ్లిన ఏజెంట్లు -
రజతోత్సవ సభతో బీఆర్ఎస్ సత్తా చాటుతాం
ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర సాక్షిప్రతినిధి, ఖమ్మం: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభతో పార్టీ సత్తా చాటుతామని, ఈ సభకు హాజరయ్యేందుకు బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ప్రతీ జిల్లా నుంచి 30 వేల మంది రావాలని సూచించగా, ఇప్పటికే 40 వేల మంది సిద్ధమయ్యారని తెలిపారు. ఖమ్మంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ బిడ్డల ఆకాంక్ష మేరకు రాష్ట్ర ఏర్పాటు సాధనే లక్ష్యంగా కేసీఆర్ చూపిన పోరాట పఠిమ మరువరానిదని అన్నారు. అంతేకాక పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అనేక పథకాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. కాగా, గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలు నమ్మి ప్రజలు ఆ పార్టీకి పట్టం కట్టినా.. 16 నెలల పాలనలోనే ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్నారు. ఈ నేపథ్యాన ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించే సభలో భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని వెల్లడించిన మధు, వెంకటవీరయ్య ఎండల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా, ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమవగా.. కాంగ్రెస్ నాయకులే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు నడుపుతూ తప్పుడు పద్ధతుల్లో రాజకీయ ప్రేరేపిత కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్ రెడ్డి, కొండబాల కోటేశ్వరరావు, బానోత్ చంద్రావతి, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణంతో పాటు వరప్రసాద్, కర్నాటి కృష్ణ, మక్బూల్, ఉప్పల వెంకటరమణ, బెల్లం వేణుగోపాల్, భాషబోయిన వీరన్న, వేముల వీరయ్య, తాజుద్దీన్, బిచ్చాల తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత పహెల్గాం మృతులకు సంతాపంగా మౌనం పాటించారు. -
సంక్షేమ గురుకుల విద్యార్థులు భేష్
ఖమ్మంమయూరిసెంటర్: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రభు త్వ సంక్షేమ గురుకులా ల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఎస్సీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో ఇంటర్ ప్రథ మ, ద్వితీయ సంవత్స రం చదివిన పలువురు ప్రైవేట్ విద్యార్థులకు దీటుగా ఫలితాలు సాధించారు. బీసీ గురుకులాలకు సంబంధించి వనంవారి కిష్టాపురం గురుకులం ఎంపీసీ మొదటి సంవత్సరం విద్యార్థి వి.శ్రీచరణ్ 470మార్కులకు 468 మార్కులు సాధించారు. ముదిగొండ మండలం కమలాపురానికి చెందిన ఆయన రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించడం విశేషం. గ్రామానికి చెందిన శ్రీ చరణ్ ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించడం విశేషం. కాగా, వనంవారి కిష్టాపురానికి మంజూరైన ఈ గురుకులం ప్రస్తుతం మధిర మండలం కిష్టాపురంలో కొనసాగుతోంది. ●ఎస్సీ గురుకులాలు : జిల్లాలో 11 ఎస్సీ సంక్షేమ శాఖ గురుకులాలు ఉండగా.. మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, ఓకేషనల్, సీఈసీ, ఎంఈసీలో 956 మందికి గాను 789 మంది(82.53 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో పరీక్షలు రాసిన 975 మంది విద్యార్థులకు గాను 900 మంది(92.31 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ●బీసీ గురుకులాలు : బీసీ గురుకులాలు జిల్లాలో 11 ఉండగా.. మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలకు 646 మంది హాజరుకాగా 488 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీలో 344 మందికి 271 మంది ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో 660 మందికి 590 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీ గ్రూపులో 337 మందికి 312, బైపీసీ గ్రూపులో 182కు 159 మంది, సీఈసీ గ్రూపులో 84కు 68 మంది, హెచ్ఈసీ గ్రూపులో 27 మందికి 21 మంది, ఎంపీహెచ్డబ్ల్యూ గ్రూపులో 30 మందికి 30 మంది ఉత్తీర్ణతతో వంద శాతంగా నమోదైందని వెల్లడించారు. ●మైనారిటీ గురుకులాలు : జిల్లాలో ఏడు మైనార్టీ గురుకులాలు ఉండగా.. మొదటి సంవత్సరంలో 334మంది విద్యార్థులకు 273 మంది(82 శాతం) ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్లో 332 మందికి 284 మంది(86 శాతం) ఉత్తీర్ణులయ్యారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతి
రఘునాథపాలెం: మండలంలోని వీ.వీ.పాలెం గ్రామపంచాయతీ కార్యాలయం ఎదురుగా గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గురువారం గుర్తించారు. గ్రామపంచాయతీ కార్యదర్శి ఇచ్చిన సమాచారంతో రఘునాథపాలెం పోలీసులు చేరుకుని అన్నం ఫౌండేషన్ సభ్యుల చేయూతతో మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని పోలీసులు సూచించారు. చికిత్స పొందుతున్న మహిళ... రఘునాథపాలెం: మండలంలోని రేగులచలకు చెందిన దంతాల జ్యోతి(27) కుటుంబ ఘర్షణలతో బుధవారం పురుగుల మందు తాగగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. ఆమె భర్త మద్యానికి బానిస కావడంతోపాటు కుటుంబ ఘర్షణతో క్షణికావేశానికి గురై పురుగుల మందు తాగింది. ఈమేరకు చికిత్స చేయిస్తుండగా మృతి చెందగా, జ్యోతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. వీఎం బంజర్లో... పెనుబల్లి: మండలంలోని వీఎం బంజర్లో రోడ్డు పక్కన గురువారం అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తిని స్థానికులు పెనుబల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడిని కొత్తకారాయిగూడెంకు చెందిన వడ్రంగి నెల్లూరి బోధనాచారి అలియాస్ చంటి(37)గా గుర్తించారు. వడదెబ్బతో ఆయన మృతి చెంది ఉంటారని భావిస్తుండగా, ఆయనకు భార్య, ఇద్దరు పిల్లులు ఉన్నారు. -
చేప పెరగదు.. కడుపు నిండదు
● కేజీకి మించి బరువు పెరగని జలపుష్పాలు ● ప్రభుత్వ, ప్రైవేట్ సీడ్లు రెండింటి పరిస్థితి అదే... ● నష్టపోతున్నామని మత్స్యకారుల ఆవేదన రోజంతా వేటాడితే ఎనిమిది కేజీలే.. రిజర్వాయర్లో గత 20 ఏళ్లుగా చేపల వేట కొనసాగిస్తున్నా. రోజు మొత్తం షికార్ చేస్తే ఎనిమిది కేజీల చేపలే దొరికాయి. గతంలో రోజు మొత్తం మీద క్వింటాకు పైగా చేపలు లభించేవి. కానీ ఇప్పుడు ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. – షేక్ బాబు , మత్స్యకారుడు వైరా వలలు, తెప్పలకే ఖర్చు చేపల వేట కోసం అవసరమైన వలలు, తెప్పలు కొనుగోలుకు రూ.50 వేల నుంచి రూ.60 వేల ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చు చేసి చేపల వేటకు వెళ్తే రోజు మొత్తం మీద రూ.500 కూడా రాలేదు. మా పరిస్థితి దయనీయంగా మారింది. – షేక్ ఖాదర్, మత్స్యకారుడు, వైరా మత్స్యకారులకు నష్టమే... రూ.10లక్షల విలువైన 14 లక్షల సీడ్ సొంతంగా పోశామని మత్స్యకారులు చెబుతున్నారు. కానీ ఒక్కొక్కరికి పది కేజీల చేపలు కూడా పడడం లేదు. తద్వారా మత్స్యకారులకు నష్టమే. అధికారులు పట్టించుకుంటే న్యాయం జరుగుతుంది. – ఫణితి సురేష్, సొసైటీ సభ్యుడు, వైరా వైరా: జిల్లాలో పేరున్న వైరా రిజర్వాయర్పై ఆధారపడి 1,600 మంది మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. ఈ రిజర్వాయర్లో పెంచే చేపలు రుచిగా ఉంటాయనే నమ్మకంతో జిల్లావ్యాప్తంగా ప్రజలు కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తారు. కానీ ఈసారి చేపల బరువు ఆశించిన స్థాయిలో పెరకగపోవడంతో మత్స్యకారుల్లో నిర్వేదం అలుముకోగా.. కొనుగోలుకు వస్తున్న ప్రజలు నిరాశగా వెనుదిరుగుతున్నారు. రెండు విడతల్లో పిల్లల విడుదల గత ఏడాది అక్టోబర్ 19వ తేదీన 13లక్షల చేప పిల్లలను ప్రభుత్వం తరఫున రిజర్వాయర్లో వదిలారు. ఆతర్వాత మత్స్య సహకార సొసైటీ ద్వారా రూ.10 లక్షలు విలువైన మరో 14 లక్షల చేపపిల్లలను గత ఏడాది డిసెంబర్లో వదిలారు. సహజంగా చేపలు ఇప్పటికే కేజీకి పైగా బరువు పెరగాలి. ఇదే నమ్మకంతో గురువారం నుండి రిజర్వాయర్లో మత్స్యకారులు వేట ఆరంభంగా వారికి నిరాశే ఎదురైంది. ఏ చేప కూడా కేజీ బరువు దాటకపోగా.. పట్టాలు, వదిలేయాలా అన్న మీమాంస ఎదుర్కొన్నారు. రెండు విడతలుగా పోసిన చేప పిల్లలు ఆశించిన స్థాయిలో పెరగకపోవడంతో ఖాళీ వలలతో ఒడ్డుకు చేరారు. ఎందుకు పెరగలేదంటే... వైరా రిజర్వాయర్లో 27లక్షల చేప పిల్లలను వదిలినా అవి నాసిరకం కావడంతోనే ఆశించిన సైజ్కు చేరలేదని మత్స్యకారులు చెబుతున్నారు. బొచ్చ, రవ్వ, మృగాలతో పాటుగా రొయ్యపిల్లలు కూడా విడుదల చేశారు. అయితే, కొందరు గడువు రాకున్నా సన్నకన్నులు కలిగిన వలలతో చేపలు పట్టారనే విమర్శలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి ఎదురైందని అధికారుల వాదనగా ఉంది. ఇరువర్గాల వాదనలు భిన్నంగా ఉన్నా, రిజర్వాయర్లో చేప పిల్లలు వదిలే సమయాన రెండున్నర నుంచి మూడు అంగుళాల సైజులో ఉండగా, ప్రస్తుతం అర కేజీ నుంచి ముప్పావు కేజీ కూడా పెరగకపోవడం గమనార్హం. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఈ పరిస్థితి ఎదురైనందున తమకు న్యాయం చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. -
కేజీబీవీల్లోనూ అత్యుత్తమ మార్కులు
జిల్లాలోని 14 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)ల్లో ఇంటర్ విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణులయ్యారని గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్(జీసీడీఓ) తులసి తెలిపారు. అన్ని కేజీబీవీల్లో ప్రథమ సంవత్సరంలో 709మందికి 557మంది(79శాతం), ద్వితీయ సంవత్సరంలో 661మందికి 584మంది(89శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. కేజీబీవీల్లో బాలికలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మెరుగైన బోధన అందించడంతో ఈ ఫలితాలు వచ్చాయని తెలిపారు. బోనకల్ కేజీబీవీ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు నూరు శాతం ఫలితాలు సాధించారని తెలిపారు. వచ్చే ఏడాది అన్ని కేజీబీవీల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోద య్యేలా కృషిచేస్తామని పేర్కొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయొద్దు..
● అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ● కేంద్రాలను తనిఖీ చేసిన రాష్ట్ర బృందం ఖమ్మం సహకారనగర్: రైతులు తీసుకొచ్చే ధాన్యాన్ని నాణ్యత ఆధారంగా ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. కలెక్టరేట్లోని గురువారం ఆయన రాష్ట్ర బృందం సభ్యులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 29,695 టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, 799మంది రైతులు 6,165 క్వింటాళ్ల సన్నరకం ధాన్యం అమ్మారని తెలిపారు. వీరికి రూ.3,08,25,600 మేర బోనస్ అందిందని చెప్పారు. తొలుత పౌర సరఫరాలశాఖ డిప్యూటీ కమిషనర్ కొండల్రావు, జనరల్ మేనేజర్ నాగేశ్వరరావుతో కూడిన బృందం కూసుమంచి మండలం పాలేరులోని కొనుగోలు కేంద్రాలు, నేలకొండపల్లి మండలంలోని అరుణాచల రైస్ మిల్లును తనిఖీ చేశారు. నాణ్యమైన ధాన్యమే కొనుగోలు చేయాలని, సీరియల్ ఆధారంగా కాంటా వేయించి ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని సూచించారు. ఎండ లేని సమయాల్లోనే కాంటా వేస్తూ, రైతులకు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్కుమార్, డీఎం శ్రీలత తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఎస్ఎఫ్ఐ రాష్ట్రమహాసభలు
తొలిరోజు ప్రదర్శన, బహిరంగ సభ ఖమ్మంమయూరిసెంటర్: విద్యా రంగ సమస్యలపై చర్చించి, పోరాట కార్యాచరణ రూపొందించేందుకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఐదో మహాసభలు వేదికగా నిలవనున్నాయి. ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభా ప్రాంగణంతోపాటు నగరంలోని ప్రధాన కూడళ్లు, రహదారుల వెంట ఎర్రతోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 2002లో ఖమ్మంలో సంఘం రాష్ట్ర మహాసభలు జరగ్గా.. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి ఇప్పుడు నిర్వహిస్తున్నారు. సభల్లో భాగంగా తొలిరోజైన శుక్రవారం జెడ్పీ సెంటర్ నుంచి భక్తరామదాసు కళాక్షేత్రం వరకు భారీ ప్రదర్శన, ఆతర్వాత కళాక్షేత్రంలో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. సభకు రాష్ట్ర నలుమూలల నుంచి 500మంది ప్రతినిధులతో పాటు జిల్లా నాయకులు పాల్గొననున్నారు. కాగా, సభలో ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వీ.పీ.సాను ప్రసంగించనుండగా.. సినీ నటుడు మాదాల రవి, ఎస్ఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షుడు నితీష్ నారాయణ్, ఎమ్మెల్సీ, ప్రజా వాగ్గేయకారుడు గోరెటి వెంకన్న పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. -
అప్పులు ఉన్నా.. అభివృద్ధి బాట పట్టించాం
ఖమ్మంవన్టౌన్: రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ మితిమీరిన అప్పులు చేసినా.. తాము అధికారంలోకి వచ్చాక అన్నీ సరిదిద్దుతూ అభివృద్ధి బాట పట్టిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలోని గురువారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాదిన్నరగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కులగణనతో పేద వర్గాలకు రాజ్యాధికారంలో వాటా లభిస్తుందని చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సన్నబియ్యం పంపిణీ, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నామని తెలిపారు. సీతారామ ప్రాజెక్టుకు అనుమతి లభించిందనున రానున్న రోజుల్లో 7లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి తెలిపారు. త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నందున కార్యకర్తలు సన్నద్ధం కావాలని, ఖమ్మం నియోజకవర్గంలో రూ.2,200 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ప్రజల్లో తీసుకెళ్లాలని సూచించారు. కాగా, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమ నిర్వహణలో రఘునాథపాలెం మండలం వెనుకబడినందున అన్ని జీపీల్లో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఇక క్రమశిక్షణతో మెలగడంతో పాటు మంచి వ్యక్తిత్వం కలిగిన కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఈసమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్తో పాటు బాలసాని లక్ష్మీనారాయణ, కమర్తపు మురళి, సాదు రమేష్రెడ్డి, ఫాతిమా జోహరా, దొబ్బల సౌజన్య, కొత్తా సీతారాములు, కార్పొరేటర్లు, డివిజన్ల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. పార్టీ శ్రేణుల సమావేశంలో మంత్రి తుమ్మల -
జీపీఎస్ సర్వేతో నూతన భూకొలతలు
● లక్షకు పైగా సాదాబైనామా దరఖాస్తులకు పరిష్కారం ● భూ భారతి సదస్సులో కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ నేలకొండపల్లి: ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తీసుకొచ్చిన భూ భారతి చట్టం చట్టంతో భూసంబంధిత సమస్యలన్నీ పరిష్కారమవుతాయని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. భూమి స్వభావం, కొలతలు పక్కాగా తేల్చాల్సి ఉన్నందున జీపీఎస్ సాంకేతికతతో కూడిన యంత్రాలతో సర్వే చేయిస్తామని తెలిపారు. తద్వారా యాజమాన్య హక్కులు నిర్ధారించొచ్చని చెప్పారు. అంతేకాక జిల్లాలో పెండింగ్ ఉన్న లక్షకు పైగా సాదాబైనామా దరఖాస్తులు పరిష్కారం కూడా సాధ్యమవుతుందని తెలిపారు. ఇంకా వారసత్వ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, అప్పీల్ తదితర అవకాశాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. అనంతరం చట్టంలోని పలు అంశాలను వ్యవసాయ రైతు సంక్షేమ సంఘం సభ్యుడు, న్యాయవాది ‘భూమి’ సునీల్ వివరించగా, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ నరసింహారావు, పాలేరు ప్రత్యేకాధికారి రమేష్, ఏడీఏ బి.సరిత, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ ఎం.ఎర్రయ్య, ఏఓ ఎం.రాధ తదితరులు పాల్గొన్నారు. సాగులో కొత్త విధానాలతో అధిక దిగుబడి తల్లాడ: రైతులు కొత్త సాగు విధానాలు అవలంబించేలా అధికారులు అవగాహన కల్పించాలని, తద్వారా అధిక దిగుబడి సాధ్యమవుతుందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. తల్లాడ మండలం కుర్నవల్లిలో గురువారం వైరా కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యాన నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులతో మమేకమై వారికి సాగులో మెళకువలను వివరించాలన్నారు. డీఏఓ డి.పుల్లయ్య మాట్లాడగా, సత్తుపల్లి ఏడీఏ శ్రీనివాసరెడ్డి, అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా.జే.హేమంత్కుమార్, కేవీకే కోఆర్డినేటర్ కె.రవికుమార్, తహసీల్దార్ సురేష్కుమార్, ఏఓ ఎం.డీ.తాజుద్దీన్, ఎంపీడీఓ సురేష్బాబు, ఏపీఎం అశోకారాణి పాల్గొన్నారు. కాగా, పలువురు రైతులు ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని వెల్లడించగా.. గ్రామంలోని కొనుగోలు కేంద్రానికి కలెక్టర్ వెళ్లి పరిశీలించారు. -
ఆఫ్టైప్ మొక్కలపై కదలిక..
● ఆయిల్పామ్ తోటల్లో ఆయిల్ఫెడ్ చైర్మన్ రాఘవరెడ్డి, శాస్త్రవేత్తల పరిశీలన ● పరిహారం రాకున్నా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడిసత్తుపల్లి: ఆయిల్ఫెడ్ నర్సరీల నుంచి ఆఫ్టైప్ మొక్కలు పంపిణీ అయ్యాయని, తద్వారా ఐదేళ్ల వయస్సు కలిగిన మొక్కలు తొలగించాల్సి వస్తోందని రైతులు ఆందోళన చెందుతుండగా.. ఎట్టకేలకు యంత్రాంగం స్పందించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ అశ్వారావుపేట జోన్ ఫార్మర్ సొసైటీ ప్రతినిధులు ఇటీవల ఢిల్లీలో ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్చౌహాన్కు విన్నవించారు. అలాగే, ఎస్టీ కమిషన్ సభ్యుడిని గిరిజన రైతులు కలిశారు. తోటల్లో పరిశీలన రైతుల ఫిర్యాదులతో తెలంగాణ ఆయిల్ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి, శాస్త్రవేత్తలు గురువారం ఉమ్మడి జిల్లాలో పర్యటించారు. రిటైర్డ్ శాస్త్రవేత్త బీఎన్.రావు, అధికారులతో కలిసి సత్తుపల్లి మండలం నారాయణపురంలో జగ్గవరపు దామోదర్రెడ్డి, మోరంపూడి స్వర్ణలత, గౌరిగూడెంలో పాలపాటి శ్రీనివాసరావు తోటలను పరిశీలించారు. ఈసందర్భంగా చైర్మన్ రాఘవరెడ్డి మాట్లాడుతూ సత్తుపల్లి మండలం రేగళ్లపాడు నర్సరీ నుంచి 3లక్షల ఆఫ్టైప్ ఆయిల్పామ్ మొక్కలు పంపిణీ చేశారనే ప్రచారంలో నిజం లేదన్నారు. మొత్తంగా 11కు గాను ఐదు నర్సరీల్లోనే సమస్యలు ఎదురైనట్లు తేలిందని చెప్పారు. నర్సరీ లను ప్రక్షాళన చేస్తే 50శాతం సమస్యలు తీరతాయని చెప్పారు. నాసిరకం మొక్కలు పంపిణీ చేస్తున్నారనే ప్రచారంతో ఆయిల్పామ్ సాగుకు కొత్త రైతులు ముందుకు రావడం లేదన్నారు. ఈనేపథ్యాన స్వ యంగా తోటల పరిశీలనకు వచ్చామని తెలిపారు. కాగా, నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవని వెల్లడించిన చైర్మన్.. ఉద్యోగుల్లో ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే చర్యలు తీసుకుంటా మని స్పష్టం చేశారు. జీఎం సుధాకర్రెడ్డి, డిప్యూటీ మేనేజర్ ప్రవీణ్రెడ్డి, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల ఇన్చార్జ్లు ఆర్.రామకృష్ణ, రాధాకృష్ణ, ఫీల్డ్ ఆఫీసర్లు, రైతు సంఘం ప్రతినిధులు తుంబూరు మహేశ్వరరెడ్డి, చెలికాని సూరిబాబు, చెలికాని వెంకట్రావు, బండి శ్రీనివాసరెడ్డి, చక్రధర్రెడ్డి పాల్గొన్నారు. -
లక్షణంగా ఇందిరమ్మ ఇళ్లు
20 జీపీల్లో తొలివిడతగా 853 గృహాల మంజూరు ● బేస్మెంట్ స్థాయి పూర్తవగానే మొదటి బిల్లు ● లబ్ధిదారుల ఖాతాల్లో రూ.లక్ష చొప్పున జమ ● అవకతవకలు జరగకుండా ఏఐ టెక్నాలజీతో పరిశీలన ఈ మహిళ పేరు బానోతు బుజ్జి. కూసుమంచి మండలం ధర్మతండాకు చెందిన ఈమె కుటుంబం ఇన్నాళ్లు చుట్టూ తడికలు కట్టుకుని రేకుల షెడ్లో ఉంటోంది. తొలి విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో నిర్మాణం బేస్మెంట్ వరకు చేపట్టారు. దీంతో రూ.లక్ష బిల్లు ఖాతాలో జమ అయింది. ‘మేం ఇల్లు కట్టుకునేలా ప్రభుత్వం అండగా నిలవడంతో మా బాధలు తీరనున్నాయి.’ అని బుజ్జి ఆనందంగా వెల్లడించింది.జియో ట్యాగ్ చేస్తూ.. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల మంజూరులో అవకతవకలు జరగకుండా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ఏఐ సాయం తీసుకుంటోంది. జిల్లాలో తొలి విడతగా 854 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు 320 ఇళ్లు బేస్మెంట్ స్థాయికి చేరాయి. అయితే, పునాదుల దశలోనే 561 ఇళ్లకు జియో ట్యాగ్ చేసి యాప్లో ఫొటోలు పొందుపరిచారు. ఇంకా 41 దరఖాస్తులను ఎంపీడీఓలు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంది. ఎల్–1లో 60,747 దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని మూడు కేటగిరీలుగా విభజించారు. సొంత స్థలం ఉండి గుడిసె, రేకులషెడ్, టైల్స్ వేసిన, అద్దె ఇళ్లలో ఉండేవారిని ఎల్–1(లిస్ట్)గా గుర్తించారు. గుడిసెలు, రేకులషెడ్లు, టైల్స్ వేసిన ఇళ్లు, అద్దె ఇళ్లలో ఉంటూ స్థలం కూడా లేని వారిని ఎల్–2 కేటగిరీగా, ఇళ్లు ఉండి.. తల్లిదండ్రుల నుంచి విడిపోయి తమకు ఇళ్లు కావాలని దరఖాస్తు చేసుకున్న సంతానాన్ని ఎల్–3 కేటగిరీలో చేర్చారు. ఎల్–1 జాబితాలో 60,747 దరఖాస్తుల పునఃపరిశీలన కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అర్హుల జాబితాను కలెక్టర్కు పంపిస్తారు. ఆపై ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు, ఇన్చార్జి మంత్రి పరిశీలించి దశల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అక్రమాలకు ఆస్కారం లేకుండా.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు జరగకుండా ప్రభుత్వం ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఈ టెక్నాలజీ ఆధారంగానే బేస్మెంట్ కట్టకుండానే కట్టినట్లు నమోదు చేయగా, భద్రాచలం గ్రామపంచాయతీ పరిధిలో బిల్ కలెక్టర్ను సస్పెండ్ చేశారు. బిల్లు మంజూరుకు సిఫారసు చేసే సమయాన ఏఐ టెక్నాలజీతో ప్రభుత్వం సూపర్ చెకింగ్ చేయిస్తోంది. సదరు ఇళ్లు బేస్మెంట్ లెవెల్ ఫొటోను గృహ నిర్మాణ శాఖ యాప్లో పొందుపరిస్తే పరిశీలించాక బిల్లు మంజూరుచేస్తారు. దీంతో సంబంధిత యంత్రాంగం, ఇన్చార్జి బాధ్యతలు తీసుకున్న ఇతర శాఖల అధికారులు సైతం అవకతవకలు జరగకుండా క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు.జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. మండలానికి ఓ గ్రామాన్ని పైలట్గా ఎంపిక చేసి తొలి విడతగా ఇరవై గ్రామపంచాయతీల్లో 853 మందికి ఇళ్లు మంజూరుచేశారు. ఇందులో బేస్మెంట్ స్థాయికి నిర్మాణం పూర్తిచేసిన వారి ఖాతాల్లో రూ.లక్ష చొప్పున మొదటి బిల్లు జమ చేస్తున్నారు. పైలట్ గ్రామాల్లో నిర్మాణం వేగంగా జరుగుతుండగా.. మిగతా గ్రామాల్లోనూ లబ్ధిదారుల ఎంపికపై అధికారులు దృష్టి సారించారు. సర్వే అనంతరం రెండో విడత అర్హుల జాబితా విడుదల చేస్తారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మంబేస్మెంట్ పూర్తయితే రూ.లక్ష బేస్మెంట్ స్థాయికి చేరిన ఇళ్లకు రూ.లక్ష బిల్లు ఇచ్చేలా ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నాం. ఆపై లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ అవుతోంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం అందిన దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. ఒక్కో గ్రామంలో గెజిటెడ్ అధికారి 200 వరకు దరఖాస్తులను పరిశీలిస్తూ, అర్హులు ఎవరెవరో గుర్తిస్తున్నారు. – భూక్యా శ్రీనివాస్, పీడీ, హౌసింగ్ -
బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తి
ఖమ్మం లీగల్: ఖమ్మం రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తిగా టి.మురళీమోహన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. 2016లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై న ఆయన తొలుత నాగర్కర్నూల్, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా కూకట్పల్లిలోని పదో ఎంఎం కోర్టు, మేడ్చల్లోని 11 ఏఎంఎం కోర్టులో విధులు నిర్వర్తించారు. అనంతరం పదోన్నతిపై 2024లో రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా మేడ్చల్లో విధులు నిర్వర్తిస్తూ బదిలీపై ఖమ్మం వచ్చారు. ఇక్కడ బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా జడ్జి రాజగోపాల్ను మర్యాదపూర్వకంగా కలిశారు.ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేద్దాం ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గుండు లక్ష్మణ్, పులగం దామోదర్రెడ్డి సూచించారు. ఖమ్మంలోని పీఆర్టీయూ భవన్లో సంఘం జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు అధ్యక్షతన గురువారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం హర్షణీయమన్నారు. ఈమేరకు ఉపాధ్యాయులు కూడా తమ వంతు పాత్ర పోషించాలని తెలిపారు. కాగా, సీపీఎస్ రద్దు, పెండింగ్ డీఏలు, పీఆర్సీ మంజూరుకు ఇప్పటికే సీఎంను కలిశామని తెలిపారు. ఈసమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రంగారావుతో పాటు మోత్కూరు మధు, కందులు వెంకటనరసయ్య, విజయ్ అమృత్, ఆర్.బ్రహ్మారెడ్డి, కట్ట శేఖర్, రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పెసలు.. ధర లేక దిగాలు
● ఉమ్మడి జిల్లాలో 10 వేల ఎకరాల్లో పంట సాగు ● ప్రభుత్వ కొనుగోళ్లు లేక వ్యాపారుల ఇష్టారాజ్యం ● క్వింటాకు రూ.2,500 మేర నష్టపోతున్న రైతులు ఖమ్మంవ్యవసాయం: యాసంగిలో రైతులు సాగు చేసిన పెసర పంటకు కనీస మద్దతు ధర కరువైంది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ.8,682గా మద్దతు ధర నిర్ణయించినా ఎక్కడా అది అమలు కావడం లేదు. పెసర పంట ప్రస్తుతం చేతికందుతుండగా, కొందరు రైతులు విక్రయిస్తున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటకు వ్యాపారులు గురువారం గరిష్టంగా రూ.7,050 ధర నిర్ణయించగా, మోడల్ ధర రూ.6,200, కనిష్ట ధర రూ.4 వేలే అందుతోంది. జెండాపాట ధర గరిష్ట ధర ఖరారు చేస్తున్నప్పటికీ.. ఎక్కువ పంటను మోడల్, కనిష్ట ధరలకు కొనుగోలు చేస్తుండడంతో రైతులకు నష్టం ఎదురవుతోంది. దిగుబడి అంతంతే.. ఈ ఏడాది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యాసంగి పంటగా 10 వేల ఎకరాల్లో పెసర సాగు చేశారు. సమృద్ధిగా నీరు ఉండడంతో ఎక్కువ మంది మొక్కజొన్న సాగుకు ప్రాధాన్యత ఇవ్వడంతో గత ఏడాదితో పోలిస్తే ఈ సారి పెసర విస్తీర్ణం తగ్గింది. నీటి తడులు సమృద్ధిగా అందించిన చోట ఎకరాకు 5 – 6 క్వింటాళ్లు, మిగతా ప్రాంతాల్లో 2 – 3 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. దిగుబడి తగ్గిన నేపథ్యాన ధర అయినా మెరుగ్గా ఉంటుందని భావిస్తే పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. డిమాండ్ ఉన్నా తక్కువ ధర పెసల కొనుగోళ్లలో వ్యాపారుల ఇష్టారాజ్యం కొసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం క్వింటా పెసలకు రూ.8,682 మద్దతు ధర నిర్ణయించినా ఆ ధర రైతులకు లభించటం లేదు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఆ ధర దక్కే అవకాశం ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇదే అదనుగా వ్యాపారులే ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు. గ్రామాల్లో పంట నాణ్యత ఆధారంగా క్వింటాకు రూ.4 వేల నుంచి రూ.5,500 వరకు చెల్లిస్తుండగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రూ.700 నుంచి రూ.7,300 వరకు ధర పలుకుతోంది. దిగుబడి తగ్గిన నేపథ్యాన పంటకు డిమాండ్ ఉన్నప్పటికీ వ్యాపారులు సిండికేట్గా ఏర్పడడంతో ఈ పరిస్థితి ఎదురవుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. మార్క్ఫెడ్ కొనుగోళ్లు లేక.. పంట నాణ్యతగా ఉండడం.. డిమాండ్ ఉన్నప్పటికీ వ్యాపారుల తీరుతో క్వింటాకు రూ.2,500 వరకు రైతులు నష్టపోతున్నారు. నాణ్యత లేని పంటకు రూ.3,700కు మించి చెల్లించడంలేదు. పెసల విక్రయాలు ప్రారంభమై, రైతులు దోపిడీకి గురవుతున్నా ప్రభుత్వం దృష్టి సారించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రెండేళ్ల కిందటి వరకు నాఫెడ్ సహకారంతో మార్క్ఫెడ్ పెసలను కొనుగోలు చేయగా.. ప్రస్తుతం అలాంటి ఆలోచన ఏదీ లేనట్లు తెలుస్తుండగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
సుదూరంగానే వంద శాతం..
● ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పెరిగిన ఉత్తీర్ణత ● ఎక్కడా నమోదుకాని శత శాతం ఫలితాలు ● గత ఏడాదితో పోలిస్తే మాత్రం మెరుగు ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం గతంతో పోలిస్తే కాస్త మెరుగపడింది. గతేడాది ప్రథమ సంవత్సరంలో 39.06శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ఈ ఏడాది 48.97శాతానికి, ద్వితీయ సంవత్సరంలో గతేడాది 60.45శాతం ఉంటే, ఈసారి 65.81శాతానికి పెరిగింది. విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు ముందుగా సమకూర్చడం, సరిపడా అధ్యాపకుల నియామకంతో పరిస్థితులో మార్పు వచ్చిందని అధికారులు చెబుతున్నారు. అన్నీ కాదు... జిల్లాలో 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 4,396మంది పరీక్షలు రాయగా 2,499మంది ఉత్తీర్ణత సాధించారు. కొందరు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించడం విశేషం. అయితే, ఏ కాలేజీలో కూడా వంద శాతం ఫలితాలు రాలేదు. ప్రథమ సంవత్సరంలో అత్యధికంగా మధిర మండలం సిరిపురం జూనియర్ కళాశాలలో 32మంది విద్యార్థులు పరీక్ష రాయగా 23మంది(71.88శాతం) ఉత్తీర్ణత సాధించారు. అత్యల్పంగా కామేపల్లి జూనియర్ కళాశాల నుంచి 23మందిలో ఆరుగురే ఉత్తీర్ణులయ్యారు. బనిగండ్లపాడు కాలేజీలో 65.63శాతం, ఖమ్మం ప్రభుత్వ బాలికల కళాశాలలో 60.46, మధిర జూనియర్ కళాశాలలో 59, నేలకొండపల్లి కళాశాలలో 55.56, ఏఎస్ఆర్ శాంతినగర్ జూనియర్ కళాశాలలో 53.29, నాగులవంచ జూనియర్ కళాశాలలో 50శాతం ఫలితాలు సాధించగా... మిగతా కళాశాలలు 50శాతం దాటలేదు. ద్వితీయంలో మెరుగు ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బనిగండ్లపాడు జూనియర్ కళాశాల విద్యార్థులు 89మందికి 78మంది(87.64శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇక కందుకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ముగ్గురికి ముగ్గురు ఫెయిల్ కావడంతో సున్నా శాతంతో ఆఖరున నిలిచింది. కామేపల్లి జూనియర్ కళాశాలలో 38.71, వైరా కళాశాలలో 47.62శాతం, పిండిప్రోలు కళాశాల 48.91శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాలు పెరిగాయి ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాలు గతంతో పోలిస్తే పెరిగాయి. ఏటా ప్రథమ సంవత్సరం కంటే ద్వితీయ సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం పెరుగుతోంది. ఈ ఏడాది మొదటి నుంచే మరింత శ్రద్ధ వహిస్తూ మెరుగైన ఫలితాలు వచ్చేలా కృషి చేస్తాం. – కె.రవిబాబు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి -
పాడి రైతుల సంక్షేమానికి కృషి
● పాల ధర పెంపు, ఎప్పటికప్పుడు చెల్లింపులు ● రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్ అమిత్రెడ్డి ఖమ్మంవ్యవసాయం: పాల ఉత్పత్తిదారుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ(విజయ డెయిరీ) చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి తెలిపారు. ఖమ్మంలో గురువారం రైతులకు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పాల బిల్లుల చెల్లింపులో జాప్యం జరగకుండా ఎప్పటికప్పుడు చెల్లించడమేకాక గేదె పాల ధరను లీటర్కు రూ.5 పెంచామని తెలిపారు. అనంతరం ఇందిరా మహిళా డెయిరీ సభ్యులు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహకారంతో సంఘాలను ఏర్పాటుచేసుకుని, సేకరించిన పాలను విజయ డెయిరీకి పంపిస్తున్నామని తెలిపారు. అనంతరం చైర్మన్ విజయ డెయిరీలోని వివిధ విభాగాలను పరిశీలించి డిప్యూటీ డైరెక్టర్ పి.మోహనమురళితో చర్చించారు. సంస్థ జనరల్ మేనేజర్ మధుసూదన్రావు, అడిషనల్ డీఆర్డీఓ నూరుద్దీన్, పశుగణాభివృద్ధి సంస్థ జిల్లా చైర్మన్ కె.నాగేశ్వరరావు, మేనేజర్ మురళీకృష్ణ, ఉద్యోగులు నాగమణి, హనుమంత్, కృష్ణ, అనితకుమారి, నాగశ్రీ, శ్రీలత, అప్పారావు, వి.మురళీకృష్ణ, భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. కాగా, ఖమ్మం వీడీవోస్ కాలనీలోని సమీకృత మార్కెట్లో ఏర్పాటు చేసిన విజయ డెయిరీ పార్లర్ను చైర్మన్ అమిత్రెడ్డి ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్, పువ్వాళ్ల దర్గా ప్రసాద్, దొబ్బల సౌజన్య, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
వనజీవి ఆశయానికి అనుగుణంగా..
ఖమ్మంరూరల్: ఇటీవల మృతి చెందిన పద్మశ్రీ వనజీవి రామయ్య దశదినకర్మ ఆయన స్వగ్రామమైన రూరల్ మండలం రెడ్డిపల్లిలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారుచేయించిన రామయ్య విగ్రహానికి ఆయన బతికి ఉన్నప్పుడు ధరించినట్లుగా వృక్షో రక్షతి.. రక్షితః అని రాసి ఉన్న బోర్డు అమర్చారు. ఈకార్యక్రమానికి హాజరైన వారికి ఆయన మనవరాలు గౌతమిరమేష్ మూడు వేల జూడ్ బ్యాగ్లు, మొక్కలు అందించారు. తన తాత ఆశయాలను కొనసాగిస్తామని ఆమెతో పాటు కుటుంబీకులు తెలిపారు. కాగా, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తదితరులు రామయ్య చిత్రపటం వద్ద నివాళులర్పించడంతో పాటు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ శ్రీధర్, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు. 3వేల మొక్కలు పంపిణీ చేసిన రామయ్య మనవరాలు -
ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య
కారేపల్లి: వ్యవసాయంలో నష్టాలతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని దుబ్బతండా గ్రామానికి చెందిన లావుడ్యా భద్రు(52) నాలుగెకరాల్లో మిర్చి, పత్తి సాగు చేశాడు. గత మూడేళ్లుగా సరైన దిగుబడి రాకపోగా, పెట్టుబడికి తెచ్చిన అప్పులు రూ.6లక్షలకు చేరాయి. ఈక్రమాన ఓ ఫెర్టిలైజర్ షాపులో గుమస్తాగా పని చేస్తుండగా, ఆర్థిక ఇబ్బందులు తీరకపోవడంతో బుధవారం సాయంత్రం మద్యం సేవించి చేనుకు వెళ్లిన ఆయన అక్కడే పురుగుల మందు తాగాడు. ఆతర్వాత భార్య అచ్చమ్మకు ఫోన్ చేయగా కుటుంబీకులు హుటాహుటీన భద్రును ఖమ్మం ఆస్పత్రికి తరలించగా గురువారం మృతి చెందాడు. ఆయన కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఉరి వేసుకుని వృద్ధుడు.. నేలకొండపల్లి: మండల కేంద్రానికి చెందిన కె.వెంకన్న (58) కుటుంబ తగాదాల కారణంగా గురువారం శివార్లలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్నేహితులు మోసం చేశారని... ఖమ్మంరూరల్: ఓ యువకుడి క్రెడిట్ కార్డు ద్వారా స్నేహితులు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుమలాయపాలెం మండలం రాజారానికి చెందిన మెట్టు కరుణాకర్(29) ప్రైవేట్ ఉద్యోగం పనిచేస్తున్నాడు. ఆయన క్రెడిట్ కార్డు తీసుకున్న స్నేహితులు అప్పులు చేయగా, అవి తీర్చలేక మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. బుధవారం రాత్రి జలగంనగర్లోని అక్క ఇంటికి వచ్చిన ఆయన డాబాపై నిద్రించాడు. ఉదయంకల్లా రాడ్కు ఉరి వేసుకోగా, కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. -
ఆక్రమణలు తొలగింపు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం 43వ డివిజన్లో డ్రెయినేజీల ఆక్రమించి పలు షాపుల యాజమానులు ఏర్పాటుచేసిన ర్యాంపులు, ఇతర నిర్మాణాలను కేఎంసీ అధికారులు గురువారం తొలగించారు. ప్రధాన రహదారికి ఇరువైపులా డబ్బాలు, ఇతర నిర్మాణాలతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో టౌన్ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలను జేసీబీల సహకారంతో కూల్చివేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వసుంధర, ఉద్యోగులు పాల్గొన్నారు. గోవులను తరలిస్తున్న వ్యాన్లు పట్టివేత తల్లాడ: తల్లాడ మీదుగా అక్రమంగా గోవులను తరలిస్తున్న వ్యాన్లను పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ బి.కొండల్రావు ఆధ్వర్యాన వాహనాలు తనిఖీ చేస్తుండగా విజయనగరం నుంచి హైదరాబాద్ వెళ్తున్న రెండు ఐషర్ వ్యాన్లు వచ్చాయి. అందులో పరిశీలించగా గోవులు, ఎద్దులు ఉండడంతో హైదరాబాద్ కబేళాకు తరలిస్తున్నట్లు తేలింది. విజయనగరం మానాపురం నుండి నాయుడు అనే వ్యక్తి వీటిని హైదరాబాద్లో మహ్మద్ రఫీకి విక్రయించేందుకు వెళ్తున్నట్లు గుర్తించిన పోలీసులను పశువులకు పాల్వంచలోని గోశాలకు తరలించారు. అలాగే, నాయుడు, రఫీతో పాటు వ్యాన్ల యజమానులు, డ్రైవర్లు జాలా రాజు, చుట్టూరి శేఖర్గౌడ్, కొల్లి నాగరాజు, బుద్దాల దుర్గాప్రసాద్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఎర్లీబర్డ్కు ఏడు రోజులే..
● పన్ను రాయితీపై మున్సిపాలిటీల్లో ప్రచారం అంతంతే ● కేఎంసీలో రూ.5.16 కోట్లకు చేరిన ఆదాయం ● అన్నిచోట్ల దృష్టి సారిస్తే వసూళ్లు పెరిగే అవకాశంఖమ్మంమయూరిసెంటర్: మున్సిపల్, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు రాయితీ ఇచ్చేలా ప్రభుత్వం ఏటా మాదిరిగానే ఈసారి కూడా ఎర్లీబర్డ్ స్కీమ్ను ప్రకటించింది. ఇందులో భాగంగా ఈనెల 30వ తేదీలోగా ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ అందుతుంది. జిల్లాలో ముందస్తుగా పన్నులు చెల్లించే కొందరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. గత ఏడాది వరకు వంద శాతం పన్ను చెల్లించిన వారిని అర్హులుగా గుర్తించగా... అసెస్మెంట్ల యజమానులు పలువురికి అర్హత ఉన్నా అవగాహన లేక ముందుకు రావడం లేదని తెలుస్తోంది. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో విస్తృత ప్రచారం చేస్తే పన్ను చెల్లించే వారి సంఖ్య పెరగడమే కాక పుర, నగర పాలక సంస్థలకు ముందస్తుగా పన్నుల రూపంలో ఆదాయం సమకూరుతుంది. కార్పొరేషన్లో రూ.5.16 కోట్లు.. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో ఎర్లీబర్డ్ స్కీమ్కు చెల్లింపుదారుల నుంచి సానుకూల స్పందనే వస్తోంది. రెవెన్యూ అధికారులు, సిబ్బందితోపాటు ఉన్నతాధికారులు దృష్టి సారించడంతో బుధవారం నాటికి రూ.5.16 కోట్ల మేర వసూలయ్యాయి. ఈ ఏడాది ఎర్లీబర్డ్ స్కీమ్లో రూ.10 కోట్లు వసూలు చేయాలనేది లక్ష్యం కాగా, యాభై శాతం దాటేశారు. మిగిలిన ఏడు రోజుల్లో మరింత శ్రద్ధ వహించి లక్ష్యాన్ని చేరాలనే భావనతో ఉన్నారు. మున్సిపాలిటీల్లో నామమాత్రంగా.. జిల్లాలో ఖమ్మం కార్పొరేషన్తోపాటు సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీలు ఉన్నాయి. కార్పొరేషన్తో పోలిస్తే మున్సిపాలిటీల్లో ఎర్లీబర్డ్ స్కీమ్పై అధికారులు పెద్దగా ప్రచారం చేస్తున్నట్లు కనిపించడంలేదు. తద్వారా పన్నుల వసూళ్లలో 5 నుంచి 10 శాతం కూడా లక్ష్యాలను చేరలేదు. ఈ పథకం ద్వారా ఎక్కువ మొత్తంలో పన్నులు రాబడితే మిగతా సమయంలో లక్ష్యాల సాధన సులువవుతుంది. అంతేకాక యజమానులు ఏటా క్రమం తప్పకుండా పన్ను చెల్లించేందుకు ముందుకొస్తారు. ఈమేరకు అధికారులు స్పందించి మిగిలిన ఏడు రోజులను సద్వినియోగం చేసుకుంటే మున్సిపాలిటీలకు ఆదాయం పెరగనుంది.కార్పొరేషన్, మున్సిపాలిటీల వారీగా వివరాలు కార్పొరేషన్ / అర్హత కలిగిన ఎర్లీ బర్డ్ లక్ష్యం ఇప్పటివరకు మున్సిపాలిటీ అసెస్మెంట్లు వసూలు ఖమ్మం 5,1770 రూ.10కోట్లు రూ.5.16 కోట్లు సత్తుపల్లి 9,736 రూ.4.61 కోట్లు రూ.51లక్షలు మధిర 8,804 రూ.2.70కోట్లు రూ.25.50లక్షలు వైరా 7,113 రూ.2.73కోట్లు రూ.2లక్షలు -
అండర్ బ్రిడ్జికి నిధులు కేటాయించండి
ఖమ్మంవన్టౌన్: ఖమ్మం ధంసలాపురం వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి, సర్వీస్ రోడ్డుకు సర్వే పూర్తయినందున భూసేకరణ, నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కోరారు. హైదరాబాద్లో బుధవారం ఆయన రైల్వే జనరల్ మేనేజర్ను కలిసి పలు అంశాలపై చర్చించారు. నిధులు లేక బ్రిడ్జి, రోడ్డు నిర్మాణంలో జాప్యం జరుగుతుండగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈమేరకు నిధుల విడుదలపై జీఎం సానుకూలంగా స్పందించగా.. గతంలో రద్దు చేసిన రైళ్లను తిరిగి పునరుద్దరించాలని, డోర్నకల్ – కొత్తగూడెం మార్గంలోని గాంధీనగర్ స్టేషన్లో రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని ఎంపీ కోరారు. 27న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు ఖమ్మంసహకారనగర్: తెలంగాణ మోడల్ స్కూళ్లలో ప్రవేశానికి ఈనెల 27న పరీక్ష నిర్వహిస్తున్నట్లు డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు. ఆదివారం ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరో తరగతి విద్యార్థులకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు , 7నుంచి, 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ఉంటుందని వెల్లడించారు. ప్రశ్నపత్రాల లీకేజీపై వదంతులను ఎవరూ నమ్మొద్దని, అలాంటి సమాచారం ఉంటే అధికారులకు సమాచారం ఇవ్వాలని డీఈఓ సూచించారు. పాఠశాల అవసరాలకు రూ.3.50లక్షల వితరణ సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండల పరిషత్ పాఠశాలలో సౌకర్యాల కల్పన, అవసరాల కోసం సదాశివునిపేటకు చెందిన మందపాటి కరుణాకర్రెడ్డి జ్ఞాపకార్థం ఆయన భార్య విజ యలక్ష్మి బుధవారం రూ.3.50 లక్షలు నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాల పేరిట ఈ నగదును ఫిక్స్ చేసి ఏటా వచ్చే రూ.25వేల వడ్డీని సౌకర్యాల కల్ప నకు వినియోగించుకోవాలని కోరారు. అనంతరం విజయలక్ష్మిని హెచ్ఎం బుచ్చిబాబు సన్మానించగా, విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు, ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ తిరునగరి కుమారి, ఉపాధ్యాయులు సీహెచ్.నిరంజన్, ఎం.విక్రమ్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేటి నుంచి మామిడి మార్కెట్ ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం రోటరీనగర్లోని వీధి వ్యాపారుల ప్రాంగణంలో గురువారం నుంచి మామిడి రైతుబజార్ మొదలవుతుందని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ఎం.వీ.మధుసూదన్ తెలిపారు. రైతులు, వినియోగదారుల ప్రయోజనం కోసం ఈ రైతుబజార్ను ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. సహజసిద్ధమైన పరిస్థితుల్లో పండించి, కార్బైడ్ రహితంగా మాగబెట్టిన మామిడి పండ్లనే మాత్రమే ఇక్కడ విక్రయిస్తారని తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మధసూదన్ సూచించారు. రైతులను ఇబ్బంది పెడితే మిల్లుల సీజ్ కల్లూరు: కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని దిగుమతి చేసుకోకుండా, తాలు, తేమ పేరిట జాప్యం చేస్తే మిల్లులు సీజ్ చేస్తామని పౌర సరఫరాల సంస్థ డీఎం శ్రీలత హెచ్చరించారు. కల్లూరులోని పలు రైస్ మిల్లులను ఆర్డీఓ ఎల్.రాజేందర్, తహసీల్దార్ పులి సాంబశివుడుతో కలిసి బుధవారం ఆమె తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని దించకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారనే ఫిర్యాదులతో తనిఖీ చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ సరిపడా హమాలీలను నియమించుకుని ఎప్పటికప్పుడు ధాన్యం దిగుమతి చేసుకోవాలని స్పష్టం చేశారు. తొలుత మండలంలోని ఆమె పుల్లయ్యబంజర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. -
రెండు బార్లకు పది దరఖాస్తులు
● ఈనెల 26వ తేదీతో ముగియనున్న గడువు ● ఖమ్మం బార్లపై ఏపీ వ్యాపారుల ఆసక్తిఖమ్మంక్రైం: ఖమ్మం ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో మూతపడిన రెండు బార్ల కేటాయింపునకు దరఖాస్తుల స్వీకరణ గడువు ఈనెల 26తో ముగియనుంది. ఖమ్మం బస్ డిపో రోడ్డు, నెహ్రూనగర్లోని రెండు బార్లకు లైసెన్స్ ఫీజు చెల్లించకపోవడంతో ఎనిమి దేళ్ల క్రితం మూతబడ్డాయి. వీటిని కొత్త వారికి అప్పగించేందుకు ఎకై ్సజ్ శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈనెల 1న మొదలైన పక్రియ 26వ తేదీతో ముగియనుండగా, మంగళవారం వరకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. కానీ అనూహ్యంగా బుధవారం మంచి రోజుగా భావిస్తూ పది మంది దరఖాస్తులు సమర్పించారు. మిగిలిన మూడు రోజుల్లో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. అయితే, ఖమ్మం ఏపీకి సరిహద్దుగా ఉండడంతో ఇక్కడి బార్లను దక్కించుకోవడంపై ఆంధ్రా వ్యాపారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఒక బార్ను టెండర్లలో దక్కించుకుని మునుపెన్నడూ లేని విధంగా అత్యాధునిక హంగులతో ఏర్పాటుచేయాలనే భావనతో ఇప్పటికే స్థానిక మద్యం వ్యాపారులతో చర్చించినట్లు సమాచారం. ఈనెల 29వ తేదీన డ్రా ఖమ్మంలో రెండు బార్ల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణకు గడువు 26వ తేదీతో ముగియనుండగా, 29వ తేదీన డ్రా ద్వారా ఖరారు చేస్తామని ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. రూ.లక్ష చలానాతో పాటు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులు స్వీకరిస్తుండగా, డ్రా లో బార్ దక్కకున్నా చలానా నగదు తిరిగి ఇవ్వబోమని వెల్లడించారు. అయితే, దరఖాస్తుల ద్వారా రూ.కోటి మేర ఆదాయం సమకూరే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, ఖమ్మంలో ప్రస్తుతం 30 బార్లు ఉండగా, కొత్తవి ఏర్పాటైతే ఈ సంఖ్య 32కు చేరనుంది. -
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు
తిరుమలాయపాలెం: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. తిరుమలాయపాలెం మండలం హస్నాబాద్లో రూ.1.30 కోట్లతో నిర్మించే సైడ్ డ్రెయిన్ పనులకు బుధవారం శంకుస్థాపన చేసిన ఆయన ఏలువారిగూడెంలో రూ.20లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. భూసమస్యల పరిష్కారానికి తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో పేదల భూములకు భద్రత లభిస్తుందని మంత్రి తెలిపారు. ఇరిగేషన్ అభివృద్ది సంస్థ చైర్మన్ మువ్వా విజయ్బాబు, ఖమ్మం ఆర్డీఓ నర్సింహారావు, ఆర్ అండ్ బీ ఎస్ఈ యుగంధర్, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, డీఎల్పీఓ రాంబాబు, ఎంపీడీఓ సిలార్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి -
సదస్సులకు రండి
సందేహాలా..సాక్షి ప్రతినిధి, ఖమ్మం: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టంపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు జిల్లావ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నారు. గతంలో ఉన్న ధరణి చట్టాన్ని రద్దు చేసిన ప్రభుత్వం కొత్తగా భూ భారతిని ప్రవేశపెట్టిన విషయం విదితమే. తద్వారా పరిష్కారమయ్యే సమస్యలు, దరఖాస్తు విధానాన్ని వివరించేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటుచేస్తున్నారు. రైతుల సందేహాలను నివృత్తి చేయడమే కాక వారి నుంచి దరఖాస్తులే కాక సూచనలను సైతం స్వీకరిస్తున్నారు. జిల్లాలో పైలట్ మండలంగా ఎంపికై న నేలకొండపల్లి మండలంలోని రెవెన్యూ గ్రామాల్లోనే కాక అన్ని మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్న సదస్సులు ఈనెల 30వ తేదీ రకు కొనసాగుతాయి. తొలుత అధికారులకు.. భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై తొలుత అధికారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ తహసీల్దార్లకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చట్టంలోని అంశాలను వివరించారు. ఆ తర్వాత వారు మండల, గ్రామస్థాయి అధికారులకు రికార్డుల్లో తప్పుల సవరణ, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, వారసత్వ భూముల మ్యుటేషన్, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, పట్టాదారు పాసుపుస్తకాలు, అప్పీల్ వ్యవస్థ, రివిజన్ అధికారాలు, తప్పుచేసిన అధికారులపై ఎలాంటి చర్యలు ఉంటాయనే అంశాలపై విశదీకరించారు. సదస్సులపై ప్రత్యేక దృష్టి పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై న నేలకొండపల్లి మండలంలోని రెవెన్యూ గ్రామాలతో పాటు అన్ని మండల కేంద్రాల్లో సదస్సులు కొనసాగుతున్నాయి. ఎంపీడీఓ, ఎంపీఓ, వ్యవసాయ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొని చట్టంలోని అంశాలను వివరిస్తున్నారు. కనీసం 500 మందికి తగ్గకుండా రైతులు పాల్గొనేలా దృష్టి సారించడంతో మంచి స్పందన వస్తోంది. రైతుల సందేహాల నివృత్తికి.. జిల్లా వ్యాప్తంగా రైతులను భూములకు సంబంధించి అనేక సమస్యలు వేధిస్తున్నాయి. కొన్నేళ్లుగా వీటికి పరిష్కారం లభించక వివాదాలు నెలకొంటున్నాయి. గత ప్రభుత్వం అమలుచేసిన ధరణి అన్ని సమస్యలకు పరిష్కారం చూపలేకపోయింది. దీంతో ఈ ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చింది. దీనిపై అవగాహన కల్పిస్తూనే రైతులకు సమాచారం ఇవ్వడం, దరఖాస్తుల స్వీకరణకు తహసీల్దార్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటుచేశారు. ఇక్కడ ఎదురయ్యే సందేహాలు, అందే ప్రతీ దరఖాస్తును రిజిస్టర్లో నమోదు చేస్తున్నారు.భూ భారతి చట్టంపై విస్తృత అవగాహన నేలకొండపల్లి మండలంలోని గ్రామాలతో పాటు మిగతా మండలాల్లోనూ నిర్వహణ రైతులకు సమాచారం ఇచ్చేలా తహసీల్లలో హెల్ప్డెస్క్లుఈనెల 30వరకు సదస్సులు భూ భారతి చట్టంపై అవగాహన కోసం ఈనెల 17న ప్రారంభమైన సదస్సులు 30వ తేదీ వరకు కొనసాగుతాయి. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో సదస్సులు ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే పాలేరు, ఖమ్మం నియోజకవర్గాలతో పాటు, మధిర నియోజకవర్గంలోని పలు మండలాల్లో సదస్సులు పూర్తయ్యాయి. ఈనెల 25న వైరా నియోజకవర్గ పరిధి వైరా మండలం, ఏన్కూరు మండలంలో, 26న కొణిజర్ల, సింగరే ణి, 28న సత్తుపల్లి నియోజకవర్గం సత్తుపల్లి, వేంసూరు, 29న కల్లూరు, పెనుబల్లి, 30న ఉదయం తల్లాడ మండలంలో సదస్సులు జరగనున్నాయి. -
పహల్గాం దాడిపై కన్నెర్ర
ఖమ్మం మామిళ్లగూడెం/ఖమ్మం సహకారనగర్: జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో కాల్పులు జరిపిన ముష్కరుల తీరుపై ప్రజలు, పార్టీలు, సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేయగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎన్.కోటేశ్వరరావు, నాయకులు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, నల్లగట్టు ప్రవీణ్కుమార్, నున్న రవికుమార్, వీరూగౌడ్, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. టీజీఈ జేఏసీ చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు, కన్వీనర్ కస్తాల సత్యనారాయణ ఆధ్వర్యాన టీఎన్జీవోస్ భవన్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శనలో కొణిదెన శ్రీనివాస్, మోదుగు వేలాద్రి తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాదులపై కఠినంగా వ్యవహరించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంజాన్, పి.నాగేశ్వరరావు కోరారు. -
భూ సమస్యలకు సంపూర్ణ పరిష్కారం
మధిర: ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంతో భూసమస్యలన్నింటినీ పరిష్కరించి, భూ యజమానులు, రైతులు సంతోషంగా ఉండేలా యంత్రాంగం కృషి చేస్తోందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. మధిరలో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ భూములలపై నెలకొన్న వివాదా లను పారదర్శకంగా పరిష్కరించేలా భూ భారతి అమలవుతుందని చెప్పారు. భూమి విలువ ఆధారంగా కలెక్టర్, ఆర్డీవో స్థాయిలో సమస్యలు పరిష్కరిస్తామని, రికార్డుల నిర్వహణ మెరుగవుతుందని తెలిపారు. ఈమేరకు సదస్సుల్లో రైతులు పాల్గొని తమ సమస్యలపై దరఖాస్తులు ఇవ్వాలని, సందేహాలు ఉంటే హెల్ప్ డెస్క్లో సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం ఖమ్మం ఆర్డీఓ జి.నర్సింహారావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించి రైతుల సందేహాలను నివృత్తి చేశారు. మధిర తహసీల్దార్ రాంబాబు, మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్, అదనపు డీఆర్డోవో నూరుద్దీన్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బండారు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ●నేలకొండపల్లి: భూ భారతిపై నిర్వహిస్తున్న సదస్సుల్లో భాగంగా వచ్చిన దరఖాస్తులను నేలకొండపల్లి తహసీల్లో కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ పరిశీలించారు. ఎలాంటి సమస్యలపై ఎక్కువ దరఖాస్తులు వచ్చాయో ఆరా తీసిన ఆయన ఉద్యోగులకు సూచనలు చేశారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.రాజేశ్వరి, ఆర్డీఓ నరసింహారావు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, తహసీల్దార్ వి.వెంకటేశ్వర్లు, డీటీ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, హెల్ప్డెస్క్లో అదనపు సిబ్బందిని నియమించి సదస్సులపై విస్తృత ప్రచారం చేయాలని కాంగ్రెస్ నాయకులు జెర్రిపోతుల అంజని, బచ్చలకూరి నాగరాజు, బోయిన వేణు, కడియాల నరేష్ తదితరులు కలెక్టర్ను కోరారు. ●మధిర: మానవ సృష్టి, మనుగడ మహిళలతో సాధ్యమవుతుందనే విషయాన్ని గుర్తించి ఆడబిడ్డలకు మగపిల్లలతో సమానంగా అవకాశాలు కల్పించాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ సూచించారు. మధిర మండలం దెందుకూరులో ఆడపిల్లకు జన్మనిచ్చిన ఎస్.కే.సుహనా – సమీర్ దంపతులను ‘మా పాప.. మా ఇంటి మణిదీపం’లో కలెక్టర్ సన్మానించి మాట్లాడారు. జిల్లా సంక్షేమ అధికారి కె.రాంగోపాల్ రెడ్డి, సీపీఓ ఏ.శ్రీనివాస్, తహసీల్దార్ రాంబాబు, అధికారులు పాల్గొన్నారు.‘భూ భారతి’ సదస్సులో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ -
సెగలు కక్కుతున్న సూరీడు
ఖమ్మంవ్యవసాయం: జిల్లాపై భానుడు తన ప్రభావం చూపుతున్నాడు. బుధవారం గరిష్టంగా 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదు కాగా, మరో మూడు రోజుల పాటు ఎండ తీవ్రత, వేడి గాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే జిల్లాలతో విడుదల చేసిన బులెటిన్లో ఖమ్మం కూడా ఉంది. జిల్లాలో గురు, శుక్ర, శనివారాల్లో ఉష్ణోగ్రతలు 41–44 డ్రిగ్రీల మేర నమోదయ్యే అవకాశం ఉందని వెల్ల డించిన నేపథ్యాన అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దని సూచిస్తున్నారు. పెనుబల్లిలో అత్యధికం జిల్లాలో బుధవారం గరిష్టంగా 43 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రత, వేడిగాలుల కారణంగా ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 9గంటల వరకే ఎండ తీవ్రత మొదలై 11 గంటలకల్లా తీవ్రరూపం దాలుస్తోంది. సాయంత్రం 4గంటల వరకు వేడిగాలుల ప్రభావం ఉంటుండడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. దీంతో మధ్యాహ్నం వేళ జిల్లా అంతటా ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. బుధవారం పెనుబల్లిలో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, నేలకొండపల్లి, ఎర్రుపాలెంలో 42.9, ఖమ్మం ఖానాపురం, సిరిపురంలో 42.8, వైరా, పమ్మిలో 42.7, చింతకానిలో 42.6, కూసుమంచి, రఘునాథపాలెం, బాణాపురంలో 42.5, పల్లెగూడెంలో 42.4, మధిరలో 42.3, సత్తుపల్లి జేవీఆర్ ఓసీలో 42.2, మధిర ఏఆర్ఎస్లో 42.1, రావినూతల, నాగులవంచ 42 ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ బులెటిన్ విడుదల చేసింది. అంతేకాక ఖమ్మం ఎన్నెస్పీ, గంగారం తిరుమలాయపాలెంలో 41.8, సదాశివపాలెం, బచ్చోడులో 41.6, ఖమ్మం కలెక్టరేట్ 41.5, వేంసూరు, ఏన్కూరు, ఖమ్మం ప్రకాష్నగర్లో 41.4, పెద్దగోపతిలో 41.3, కల్లూరు, తల్లాడ, కుర్నవల్లి, కాకరవాయి, వైరా ఏఆర్ఎస్ 41.1, లింగాల 41, ముది గొండ 40, సత్తుపల్లి, మంచుకొండ 40.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా అత్యల్పంగా గుబ్బగుర్తిలో 39.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలో గరిష్టంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత ఈనెల 26వ తేదీ వరకు ఇదే పరిస్థితి హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం -
తాగునీటికి ఇబ్బందులు రావొద్దు
ఖమ్మంమయూరిసెంటర్: వేసవిలో ఎక్కడ కూడా తాగునీటి ఇబ్బందులు ఎదురుకాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం ఆయన వేసవిలో నీటి ఇక్కట్లు, ఇంకుడు గుంతల నిర్మాణంపై అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో సమీక్షించారు. మిషన్ భగీరథ గ్రిడ్, ఇంటింటికి తాగునీటి సరఫరా కోసం చేపట్టిన పనులు, ప్రస్తుతం సరఫరాలో, అవాంతరాలు, పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ఆరా తీశాక కలెక్టర్ మాట్లాడారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడకుండా పూర్తిస్థాయిలో సరఫరా చేయాలని, ఇందుకోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాలని తెలిపారు. అంతేకాక ప్రతీ వాణిజ్య భవనం, గృహాల్లో ఇంకుడుగుంతల తప్పక ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్కుమార్, డీఆర్డీఓ సన్యాసయ్య, మధిర, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్లు సంపత్కుమార్, ఏ.శ్రీనివాసరెడ్డి, కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్ అహ్మద్ షఫీ ఉల్లా పాల్గొన్నారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ -
జిగేల్మనేలా విద్యుత్ వెలుగులు
సబ్స్టేషన్ల ఇంటర్ లింకింగ్, పవర్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు ● చకచకా కొత్త సబ్స్టేషన్లు, కార్యాలయాల నిర్మాణం ● విద్యుత్ శాఖ మంత్రిగా భట్టి ఉండడంతో ప్రతిపాదనలకు మోక్షం మధిర: జిల్లాలోని పలు ప్రాంతాల్లో చాలాచోట్ల చిన్నపాటి వర్షం కురిసినా, గాలిదుమారం మొదలైనా విద్యుత్ సరఫరా నిలిచిపోయేది. ఇలాంటి పరిస్థితి ఎదురైనా సిబ్బంది వెళ్లి మరమ్మతులు చేసి సరఫరా పునరుద్ధరించడానికి సమయం పట్టేది. ఇంకొన్ని చోట్ల లోఓల్టేజీ సమస్య వేధించేది. ఉద్యోగుల కొరత, సరిపడా పరికరాలు లేకపోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించకపోవడంతో ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యేవి. కానీ ఇప్పుడు చాలా మార్పులు జరిగాయి. సబ్ స్టేషన్లలో పవర్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, రెండేసి సబ్స్టేషన్ల నడుమ ప్రత్యామ్నాయ లైన్లు వేయడంతో పాటు సిబ్బందికి కావాల్సిన పరికరాలు, వాహనాలను సమకూర్చడంతో మరమ్మతుల్లో వేగం పెరిగింది. జిల్లాకు చెందిన మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగానే కాక విద్యుత్ శాఖ మంత్రిగా వ్యవహరిస్తుండడంతో కావాల్సిన నిధులు, కొత్త సబ్స్టేషన్లు, కార్యాలయాలకు భవనాలపై ప్రతిపాదనలు వెళ్లిన వెంటనే మంజూరవుతుండడంతో పనుల్లోనూ వేగం పెరిగింది. నూతన విద్యుత్ సబ్స్టేషన్లు ఎర్రుపాలెం మండలంలోని పెద్ద గోపవరం రెవెన్యూ పరిధిలో 132 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటుకు రూ.20 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. అలాగే, మధిర మండలం మాటూరులో నూతనంగా విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరైంది. ఇంకా రాయపట్నం, రేమిడిచర్ల, వైరా టౌన్, రెబ్బవరం, బ్రాహ్మణపల్లి, లక్ష్మీపురం, చిరునోములల్లో విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణానికి రూ.21 కోట్లతో ప్రతిపాదనలు పంపించగా త్వరలోనే మంజూరయ్యే అవకాశముంది. లోడ్ ఆధారంగా.. వైరా డివిజన్లో వైరా, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాలు.. మధిర టౌన్, మధిర రూరల్, ఎర్రుపాలెం, మామునూరు, బోనకల్, వైరా టౌన్, వైరా రూరల్ సెక్షన్లు ఉన్నాయి. ఈ డివిజన్లో రూ.5.50 కోట్లతో 238 నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాట్లు చేస్తుండగా.. మధిర, వైరా మండల కేంద్రాల్లో రూ.65 లక్షలతో విద్యుత్ ఫీడర్లు ఏర్పాటు చేశారు. సాయంత్రం 6నుంచి రాత్రి 10 గంటల మధ్య నమోదయ్యే విద్యుత్ లోడును పరిగణనలోకి తీసుకుని ఓవర్ లోడ్ ఉన్న ప్రాంతాల్లో అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తుండడంతో అంతరాయాలు ఎదురుకావని చెబుతున్నారు. సబ్ స్టేషన్ల అనుసంధానం ఏదైనా ఒక విద్యుత్ సబ్స్టేషన్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఆ సమస్యను పరిష్కరించేంత వరకు ఇబ్బందులు ఉండేది. కానీ రూ.3.66కోట్ల నిధులతో చేపట్టిన ఇంటర్ లింకింగ్ లైన్లతో ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఖమ్మం సమీపాన పెద్దగోపతి 220 కేవీ సబ్స్టేషన్ నుంచి బోనకల్ విద్యుత్ సబ్స్టేషన్కు, బోనకల్ నుంచి సిరిపురానికి, అక్కడ నుంచి మధిర 132 కేవీ సబ్స్టేషన్కు విద్యుత్ సరఫరా అవుతోంది. ఈ సబ్ స్టేషన్లలో రూ.1.90కోట్లతో పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. తద్వారా మధిర సబ్స్టేషన్ నుంచి బోనకల్ ఫీడర్కు సరఫరాలో అంతరాయం ఏర్పడితే పెద్దగోపతి సబ్స్టేషన్ నుంచి జానకీపురం.. ఆపై బోనకల్ సరఫరా చేసే వీలు కలుగుతోంది. కాగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మధిరతో పాటు జిల్లాలోని సమస్యలపై అవగాహన ఉండడంతో ట్రాన్స్ఫార్మర్లు, అవసరమైన చోట్ల స్తంభాల ఏర్పాటు, ప్రమాదకరంగా ఉన్న తీగల తొలగింపు పనులకు నిధులు కేటాయిస్తుండడంతో అధికారులు ప్రత్యేక దృష్టితో పనులు చేపడుతున్నారు.భవన నిర్మాణాలు మధిరలో విద్యుత్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయం 1991లో ఏర్పాటైంది. అప్పటినుంచి అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, రెవెన్యూ కార్యాలయాలు ఇరిగేషన్ శాఖకు సంబంధించి రేకుల షెడ్లలో కొనసాగుతున్నాయి. వర్షం వస్తే లోపలకు నీళ్లు చేరి ఫైళ్ళు తడిచిపోతున్నాయి. ఈమేరకు విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క చొరవతో కార్యాలయ నిర్మాణానికి రూ.45 లక్షలు మంజూరు కాగా పనులు జరుగుతున్నాయి. అలాగే, వైరా డివిజన్, రెవెన్యూ కార్యాలయాల భవన నిర్మాణానికి సైతం రూ.70 లక్షలు మంజూరయ్యాయి. -
జీపీ కార్యదర్శులకు ముగిసిన శిక్షణ
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ఎంసీహెచ్ఆర్డీలో రెండు రోజులుగా గ్రామపంచాయతీ కార్యదర్శులకు ఇస్తున్న శిక్షణ బుధవారం ముగిసింది. పంచాయతీరాజ్ చట్టం, సమాచార హక్కు చట్టంతో పాటు కార్యదర్శుల పాత్రపై శిక్షణ ఇచ్చామని ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఏవీఆర్.కొండల్రావు తెలిపారు. రిసోర్స్పర్సన్స్గా ఎంపీడీఓలు రోజారాణి, వేణుగోపాల్రెడ్డి, శ్రీదేవి, రిటైర్డు ఎంపీడీఓలు అశోక్కుమార్రెడ్డి, మురహరిరావు వ్యవహరించగా, 26మంది కార్యదర్శులు హాజరయ్యారు. పది మందికి పోస్టింగ్ ఖమ్మం సహకారనగర్: స్పౌజ్ కేటగిరీలో భాగంగా ఇటీవల చేపట్టిన బదిలీల్లో జిల్లాకు కొత్తగా 10మంది ఉపాధ్యాయులను కేటాయించారు. వీరికి బుధవారం పోస్టింగ్ ఇచ్చినట్లు డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు. ఏళ్ల తరబడి భార్యాభర్తలు వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తుండగా ఎట్టకేలకు ఒక చోటకు చేరడంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. -
నేడు పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్ అమిత్రెడ్డి రాక
ఖమ్మంవ్యవసాయం: రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నారని విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ పి.మోహనమురళి తెలిపారు. ఖమ్మం రోటరీనగర్లోని డెయిరీలో జరిగే పాల ఉత్పత్తిదారుల సదస్సులో పాల్గొంటారని వెల్లడించారు. పాల ఉత్పత్తిలో మెళకువలు, విక్రయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలే కాక ప్రభుత్వ ప్రోత్సాహకాలను ఈ సందర్భంగా వివరిస్తామని తెలిపారు. తొలుత ఖమ్మం రైతుబజార్, కొణిజర్లలో ఏర్పాటు చేసిన విజయ డెయిరీ పార్లర్లను చైర్మన్ ప్రారంభిస్తారని డీడీ పేర్కొన్నారు. ‘వనజీవి’ కుటుంబానికి మాజీ ఎంపీ చేయూత ఖమ్మం మామిళ్లగూడెం: ఇటీవల మృతి చెందిన పద్మశ్రీ వనజీవి రామయ్య దశదినకర్మ గురువారం జరగనున్న నేపథ్యాన ఆయన కుటుంబానికి మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తన నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఆర్థికసాయం అందజేశారు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లిలోని రామయ్య స్వగృహంలో ఆయన సతీమణి జానకమ్మకు బీఆర్ఎస్ నాయకులు బెల్లం వేణుగోపాల్, కనకమేడల సత్యనారాయణ నగదు అందజేశారు. నాయకులు పేరం వెంకటేశ్వర్లు, గొడ్డేటి మాధవరావు, వాకాదని కోటేశ్వరరావు, పాల్వంచ రాజేష్, బానోత్ కృష్ణ, శీలం రవికుమార్, ఏపూరి తరుణ్, మేకల ఉదయ్కుమార్, ఆలకుంట వెంకటేష్, డి.ఎల్లయ్య, పి.ఎల్లయ్య, డి.బాబు, పి.లక్ష్మయ్య, జి.వెంకటేష్, కళ్లెం సీతయ్య, ఎరపుల రాజా, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. పీసీసీ పరిశీలకుల నియామకం ఖమ్మంవన్టౌన్: రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పరిశీలకులను నియమించింది. జిల్లా పరిశీలకులుగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డితో పాటు అదే జిల్లాకు చెందిన నాయకుడు బత్తిని శ్రీనివాస్ను నియమిస్తూ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ పేరిట బుధవారం ఓ ప్రకటన విడుదలైంది. 25న ఉద్యోగుల బైక్ ర్యాలీ, సదస్సు రఘునాథపాలెం: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, కార్యాచరణపై చర్చించేందుకు ఈనెల 25న ఖమ్మంలో నిర్వహిస్తున్న ర్యాలీ, సదస్సును విజయవంతం చేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు కోరారు. మండలంలోని వేపకుంట్లలో జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యాన శుక్రవారం సాయంత్రం 4గంటలకు కలెక్టరేట్ నుంచి టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్ ర్యాలీగా వెళ్లనుండగా, అక్కడ సదస్సు ఉంటుందని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొని ఐక్యతను చాటాలని కోరారు. ఈ సమావేశంలో సతీష్, సక్రాం, శిరీష, ప్రసాద్, శేషగిరి, పాండురాజు, అరుణ, దాసు, శారద, కృష్ణార్జున్ పాల్గొన్నారు. 25న హ్యాండ్బాల్ ఎంపిక పోటీలు ఖమ్మం స్పోర్ట్స్: సీనియర్స్ మహిళల విభాగంలో రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ జట్టును ఎంపిక చేసేందుకు ఈనెల 25న పోటీలు నిర్వహిస్తున్నట్లు హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి డాక్టర్ సి.రఘునందన్ తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్ కార్డుతో ఉదయం 9గంటలకు రిపోర్ట్ చేయాలని సూచించారు. భరతనాట్యం శిక్షణార్థులకు పరీక్ష ఖమ్మంగాంధీచౌక్: భరతనాట్యంలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఖమ్మం వండర్ కిడ్స్ పాఠశాలలో బుధవారం చంఢీగఢ్ యూనివర్సిటీ ఆధ్వర్యాన పరీక్ష నిర్వహించారు. ప్రకాశం జిల్లాకు చెందిన కళాకారిణి ప్రతిమా సునీల్ పర్యవేక్షణలో పరీక్ష కొనసాగగా, పలువురు అభ్యర్థులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు
ఖమ్మంమయూరిసెంటర్: ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఐదో మహాసభలు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు తెలిపారు. విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఖమ్మం సుందరయ్య భవనంలో బుధవారం ఆయన మాట్లాడుతూ 2002 తర్వాత ఖమ్మంలో రాష్ట్ర మహాసభలు జరుగుతుండగా, తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి ఇక్కడ నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర మహాసభల్లో 33 జిల్లాలు, పదహారు యూనివర్సిటీల నుంచి 600 మంది ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. తొలిరోజైన శుక్రవారం ఉదయం వేలాది మందితో ర్యాలీ నిర్వహించాక భక్తరామదాసు కళాక్షేత్రంలో సభ జరుగుతుందని తెలిపారు. ఈ సభలో ఎస్ఎఫ్ఐ ఆలిండియా అధ్యక్షుడు వీ.పీ.సాను, సినీ నటుడు మాదాల రవి, ఆహ్వాన సంఘం చైర్మన్ మువ్వా శ్రీనివాసరావు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్.మూర్తి పాల్గొంటారన్నారు. విద్యార్థులు, విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు నాగరాజు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్, టి.ప్రవీణ్, నాయకులు దొంతబోయిన వెంకటేష్, వినోద్, లోకేష్, త్రినాథ్, సుశాంత్, జీవన్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి తుమ్మలను కలిసిన జేఏసీ బాధ్యులు
ఖమ్మం సహకారనగర్: తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా బాధ్యులు బుధవారం త్రి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఖమ్మంలో కలిశారు. ఈసందర్భంగా పలు సమస్యలను వివరించి పరిష్కారానికి కృషి చేయాలని వినతిపత్రం అందజేశారు. జేఏసీ జిల్లా చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు, కన్వీనర్ కస్తాల సత్యనారాయణతో పాటు పారుపల్లి నాగేశ్వరావు, ఎస్.విజయ్, నాగేశ్వరరావు, వెంగళరావు, రంజాన్, వెంకటేశ్వర్లు, బిక్కు, సుబ్బయ్య , కొణిదన శ్రీనివాస్, మోదుగు వేలాద్రి, వల్లపు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్దే గెలుపు
కారేపల్లి: రాష్ట్రంలో మరో మూడేళ్ల తర్వాతైనా, ఇంకా ముందైనా ఎన్నికలు వస్తే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పాటవుతుందని ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో బుధవారం సమావేశమైన ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాసమస్యల పరిష్కారం, హామీల అమలు కోసం చేసే పోరాటంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గబోమని తెలిపారు. కాగా, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జిల్లా నుంచి భారీగా పార్టీ శ్రేణులతో వెళ్లనున్నట్లు ఎమ్మెల్సీ పేర్కొన్నారు. అనంతరం వెంకట్యాతండాలో బీఆర్ఎస్ నాయకుడు బానోత్ భాస్కర్ను పరామర్శించారు. నాయకులు ముత్యాల సత్యనారాయణ, రావూరి శ్రీనివాసరావు, ధరావత్ మంగీలాల్, ఆడేపు పుల్లారావు, పిల్లి వెంకటేశ్వర్లు, ముత్యాల వెంకట అప్పారావు, బత్తుల శ్రీనివాసరావు, బానోత్ రాందాస్నాయక్, జూపల్లి రాము పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు -
ఖమ్మం మార్కెట్లో డీడీఎం పరిశీలన
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల కొనుగోళ్లను మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి బుధవారం పరిశీలించారు. మిర్చి జెండా పాట, ధర ఖరారుపై రైతులతో మాట్లాడిన ఆమె సమస్యలపై ఆరా తీశారు. అలాగే, కాంటాల తీరును కూడా తనిఖీ చేశారు. అనంతరం మార్కెట్లో రూ.155.35 కోట్లతో చేపట్టిన మోడల్ మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించారు. అంతేకాక సీసీఐ పత్తి కొనుగోళ్లలో వచ్చిన ఆరోపణలపై అధికారులతో చర్చించినట్లు సమాచారం. తాతాలిక రిజిస్ట్రేషన్ల(టీఆర్)కు సంబంధించి ఎన్ని పుస్తకాలు ముద్రించారు, ఎవరెవరికి జారీ చేశారనే అంశాలు ఆరా తీసినట్లు తెలిసింది. మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎం.ఏ.అలీం, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్కుమార్, గ్రేడ్–2 కార్యదర్శి సృజన్ బాబు, సహాయ కార్యదర్శి వీరాంజనేయులు పాల్గొన్నారు. -
వడదెబ్బతో వృద్ధుడు మృతి
తల్లాడ: మండలంలోని మల్లవరంలో మంగళవారం వడదెబ్బ బారిన పడిన వృద్ధుడు మృతి చెందాడు. దళిత కాలనీకీ చెందిన మేడి ఎర్రముత్తయ్య(76) వైరా రిజర్వాయర్ సమీపంలో ఊట వాగు వద్ద పొలంలో వరి సాగు చేశాడు. ధాన్యం కోతల కోసం పొలానికి వెళ్లి వచ్చిన ఆయన వడదెబ్బ బారిన పడగా ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన పరిస్థితి విషమించటంతో మంగళవారం తెల్ల వారుజామున మృతి చెందాడు. బాజుమల్లాయిగూడెంలో మహిళ... కారేపల్లి: చేను పనులకు వెళ్లిన మహిళ వడదెబ్బ బారిన పడడంతో మృతి చెందింది. మండలంలోని బాజుమల్లాయిగూడెంకు చెందిన అర్వపల్లి దేవేంద్ర(48) రోజు లాగే సోమవారం చేను పనులకు వెళ్లగా ఎండదెబ్బ తాకడంతో వాంతులయ్యాయి. స్థానికంగా వైద్యం చేయిస్తుండడంతో సోమవారం రాత్రి మృతి చెందింది. ఆమెకు భర్త శ్రీను, ఇద్దరు కుమార్తెలు ఉండగా, చిన్నకుమార్తె వివాహం మే 9వ తేదీన జరగాల్సి ఉండగా కుటుంబంలో విషాదం నెలకొంది. డీజే బాక్స్ తలపై పడడంతో మృతి వేంసూరు: రోడ్డు ప్రమాదాలో ఓ యువకుడు మృతి చెందాడు. వేంసూరు మండలంలో కొండెగట్లలో జరిగే వేడుకకు వ్యాన్లో మంగళవారం సత్తుపల్లి మండలం గంగారం నుంచి డీజే బాక్స్తో నిర్వాహకులు బయలుదేరారు.మర్లపాడు శివారు మూలమలుపు వద్ద వ్యాన్ అదుపు తప్పిబోల్తా పడగా, తిరుపతి విజయ్(17) తలపై డీజే బాక్స్ పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందగా, వ్యాన్లో ఉన్న గుంజ అజయ్, బొమ్మర సాయివర్ధన్కు స్వల్ప గాయాలయ్యాయి. కాగా, తిరుపతి విజయ్ పదో తరగతి పరీక్షలు రాయగా, ఉపాధి కోసం డీజే కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈమేరకు ఘటనపై కేసునమోదు చేసినట్లు ఎస్ఐ వీరప్రసాద్ తెలిపారు. -
ఇంటర్లో సత్తా చాటిన విద్యార్థులు
ప్రైవేట్ కళాశాలల విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులురెజొనెన్స్ ప్రభంజనం రెజొనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారని డైరెక్టర్లు ఆర్.వీ.నాగేంద్రకుమార్, కె.శ్రీధర్రావు తెలిపారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో డి.హారిక 466, తిరుపతమ్మ, వి.తన్మయి, టి.సరెగమ, బీవీఎస్.వర్షిత, ఎ.వర్షిణి, ఎం.విగ్నేష్ 466, షేక్ అనీఫా, ఎల్.రామ్మోహన్రెడ్డి, ఎం.మన్వితశ్రీ, ఎం.భవ్య, ఎన్.వివేక్, బి.చరిష్మ 465 మార్కులు, బైపీసీలో 440 మార్కులకు కె.హారిక 436 మార్కులు, జి.నిస్సిడెనీల, కె.అదితి 434, బి.దివ్యశ్రీ 432, సీహెచ్.ధన్యత 430, ఎం.ధరణి 428, షేక్ ఫర్హీన్ 427, శ్రీకళ 425, కె.వర్షిత 422 మార్కులు సాధించారన్నారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో బి.నిహారిక, ఎం.ప్రేమ్సాయి 992, ఎ.లహరి, రోహిణి 991, చరిష్మా, స్వామి సాయి కీర్తన్ 990, బైపీసీలో ఎన్.జాహ్నవి 989 మార్కులు, ఎ.జాహ్నవి 981, డి.ఉషశ్రీ 980, డి.హాసిని 973, సీహెచ్.మణికంఠ 972 మార్కులు సాధించినట్లు తెలిపారు. ప్రిన్సిపాల్, అధ్యాపకులు వి.సతీష్, భాస్కర్రెడ్డి, శాంతి పాల్గొన్నారు.న్యూవిజన్ విజయదుందుభి ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులు విజయ దుందుభి మోగించారని న్యూవిజన్ విద్యాసంస్థల చైర్మన్ సీహెచ్జీకే.ప్రసాద్ తెలిపారు. జూనియర్ ఎంపీసీలో 470 మార్కులకు కె.నేహాశ్రీ 468, ఎస్.సిరిసంజన 467, డి.శ్రీ జయదీప్కుమార్ 467, సీ.హెచ్.ఆదిత్య శ్రీవాత్సవ 467, కె.రూపిక 467, జి.రిషిక్తేజ 467, బి.శ్రీకరణ్ 467, ఎం.డీ.అస్లాం హంజా 467, టి.మన్విత తేజు 467, ఆర్.సిరిచందన 467, ఎం.గీతిక శ్రీ 467మార్కులు, బైపీసీలో 440 మార్కులకు ఎం.డీ.ఇనాస్ 436, టి. గోమతి 435, కె.గుణశేషు 434, బి.శశాంక్ 434 సాధించారన్నారు. అలాగే, ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో వెయ్యి మార్కులకు జి.లలనిక చౌదరి 993, జి.రిషిత 993, సీహెచ్.నిషిత 993, ఈ.వేదసంహిత 993, బైపీసీలో ఆర్.రూపశ్రీ 993, ఆర్.శీతల్ 992, పి.సంహిత 991 మార్కులు సాధించగా.. రాష్ట్రస్థాయి మొదటి 10 ర్యాంకుల్లో తమ విద్యార్థులు నిలిచారని తెలిపారు. అకడమిక్ డైరెక్టర్ సీహెచ్.కార్తీక్, డైరెక్టర్ గోపీచంద్, ప్రిన్సిపాళ్లు బ్రహ్మచారి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
శ్రీచైతన్య.. ప్రతిభ
ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులతో తమ విద్యార్థులు రికార్డు సృష్టించారని శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. సీనియర్ ఎంపీసీలో కె.మణికీర్తన, ఎస్.సాకేత్, కె.సాయి రూప తేజస్విని 994మార్కులు, ఏ.సాయితేజ, వి.భార్గవి, ఈ.కీర్తి, కె.తేజశ్రీ, ఎస్.విన్నెల 993మార్కులు, బైపీసీలో ఎం.డీ.సునైయా తబుస్సమ్, పి.హారిణి 992మార్కులు, ఏ.జ్యోత్స్న, ఎం.మనీషా 991, వై.కావ్య 990, కె.సాయిజశ్వంత్, ఎం.డీ.సిమ్రా, వి.లోరా, వి.ప్రియాంక, కె.కీర్తన, కె.హాసిని 988మార్కులు సాధించారన్నారు. జూనియర్ ఎంపీసీలో టి.నాగతేజ, ఎం.నాగ హాసిని, పి.మోక్షిత, ఎస్.నాగ స్వాతి, జి.భావన, బి.వర్షిత, జీరా మేహాక్ 468మార్కులు, బైపీసీలో కె.జ్యోత్స్న, 438, జి.ధారా హాసిని, బి.శ్వేత, జి. విజయాంజలి, ఎస్.హర్షిత 437, ఎన్.ఆకాంక్ష, బి.అపూర్వ, జి.జాన్ వశిష్ఠ, డి.మాన్వి ఆక్షయ, బి.తేజస్విని, జి.రామతులసి, వి.ప్రసన్న 436మార్కులు సాధించారన్నారు. వివరాలను చైర్మన్, డైరెక్టర్ వెల్లడించగా, అకడమిక్ డైరెక్టర్ సాయి గీతిక, డీజీఎం చేతన్ మాథూర్, ఎగ్జిక్యూటివ్ డీన్ వర్మ, డీన్ కృష్ణ, జీజిఎంలు సిహెచ్.బ్రహ్మం, జి.ప్రకాష్, గోపాలకృష్ణ పాల్గొన్నారు. -
టీబీ బాధితులు పోషకాహారం తీసుకోవాలి
ఖమ్మంవైద్యవిభాగం: టీబీ బాధితులు పోషకాహారం తీసుకుంటూ మందులు సక్రమంగా వాడాలని డీఎంహెచ్ఓ బి.కళావతిబాయి సూచించారు. జిల్లా ఆస్పత్రిలోని క్షయ వ్యాధి నివారణ కేంద్రాన్ని మంగళవారం పరిశీలించిన ఆమె మె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్షయ బాధితుల గుర్తింపు, చికిత్సపై సిబ్బందికి సూచనలు చేశారు. అలాగే, బాధితులకు చికిత్సపై అవగాహన కల్పించారు. అనంతరం వాక్సినేషన్ రికార్డులు తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి వరికూటి సుబ్బారావుతో పలు అంశాలపై సమీక్షించారు. అంతేకాక ప్రధాన ఆస్పత్రి ప్రాంగణంలోని తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్, పీపీ యూనిట్లలో కూడా డీఎంహెచ్ఓ తనిఖీ చేశారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్, పాథాలజిస్ట్ డాక్టర్ సందీప్ తదితరులు పాల్గొన్నారు. కాగా, గొల్లగూడెం అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థుల కంటి పరీక్షల శిబిరాన్ని డీఎంహెచ్ఓ పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది డాక్టర్ రాధాకృష్ణ, అబ్దుల్ అలీం తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఆర్ విద్యార్థుల హవా
ఇంటర్ ఫలితాల్లో ఖమ్మంలోని ఎస్ఆర్ విద్యార్థులు రాష్ట్రస్థాయిలోనే ఉత్తమ మార్కులు సాధించారని విద్యాసంస్థల చైర్మన్ వరధారెడ్డి తెలిపారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో ఇందూరి రశ్మిత 996 మార్కులతో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకు సాధించిందని వెల్లడించారు. అలాగే, ఫస్టియర్ ఎంపీసీలో హాసిని, పశాంతిక రమ్య 468, సాత్విక్, తేజస్విని, రోహిణి, టి.తేజస్విని, ఉజ్వల, ప్రసన్నకుమారి, యామిని, వినిషా, అంకిత, సాయితేజ 467 మార్కులు, బైపీసీలో సాయిలక్ష్మి 435, శ్రావ్య, సుమేరా ముస్కాన్ 434, మేనక, శరణ్య, మేధ 433 మార్కులు సాధించారని తెలిపారు. సెకండియర్ ఎంపీసీలో వెంకటలక్ష్మి తేజస్విని 995, కావ్య 994, శ్రీ వర్షిత, అమూల్య, జశ్విత 993, బైపీసీలో కార్తీక 994 మార్కులు సాధించారని పేర్కొన్నారు. విద్యార్థులను చైర్మన్ వరదారెడ్డితో పాటు డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోష్రెడ్డి, సీఈఓ సురేందర్రెడ్డి, డీజీఎం గోవర్దన్ రెడ్డి, జోనల్ ఇన్చార్జ్ విజయభాస్కర్ రెడ్డి, డీన్ శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాళ్లు అశోక్, శ్రీనివాస్, సుధాకర్, బ్రహ్మం, అధ్యాపకులు అభినందించారు. -
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
ఖమ్మంసహకారనగర్: పేదల సొంతింటి కల నిజం చేసేలా అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదటి విడతలో లబ్ధిధారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం ఆయన సీఎస్ శాంతికుమారి తదితరులతో కలిసి ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతిపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఖమ్మం నుంచి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక, భూ భారతి అవగాహన సదస్సులపై సూచనలు చేశారు. జిల్లా నుంచి కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి సదస్సుల్లో ఇప్పటివరకు 1079 దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. ఆర్డీఓలు నర్సింహారావు, రాజేందర్, హౌసింగ్ పీడీ బి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ను కలిసిన ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే ఖమ్మంమయూరిసెంటర్: కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ను ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం కలెక్టరేట్లో కలిశారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడమే కాక సత్తుపల్లి నియోజకవర్గం ఇందిరమ్మ లబ్ధిదారులు జాబితాలో గృహలక్ష్మి లబ్ధిదారులకు అవకాశం కల్పించాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 1638 సన్నరకం ధాన్యాన్ని కూడా సేకరించాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు కనగాల వెంకటరావు, మోహన్రావు, అశోక్, మల్లిదు వెంకన్న, ఆసిఫ్, పాషా పాల్గొన్నారు. 25న సకల ఉద్యోగుల ర్యాలీ, సదస్సు ఖమ్మంసహకారనగర్: తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యాన ఈనెల 25నసాయంత్రం ఖమ్మం కలెక్టరేట్ నుండి టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు తెలిపారు. ఈమేరకు కరపత్రాలు, పోస్టర్లను యూటీఎఫ్ భవన్లో మంగళవారం ఆవిష్కరించాక మాట్లాడారు. ర్యాలీ అనంతరం టీఎన్జీవోస్ భవన్లో సదస్సు ఉంటుందని, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగమల్లేశ్వరరావు, వెంకన్న, రాంబాబు, ఉద్దండ్ షరీఫ్, సురేష్, నాగేశ్వరరావు, కేశ్యా, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ట్రయల్ రన్ కోసం పాలేరు నీటి విడుదల కూసుమంచి: మండలంలోని పాలేరు రిజర్వాయర్ నుండి ఎడమ కాల్వ ద్వారా మంగళవారం సాయంత్రం నీరు విడుదల చేశారు. పంటల సీజన్ ముగియగా కొద్దిరోజుల క్రితం నీటి సరఫరా పూర్తిగా నిలిపేశారు. అయితే, రఘునాథపాలెం మండలం మంచుకొండ వద్ద నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం ట్రయల్రన్ కోసం తిరిగి నీటిని విడుదల చేశారు. వేయి క్యూసెక్కుల నీటిని 24 గంటల పాటు విడుదల చేశాక నిలిపివేస్తామని అఽధికారులు తెలిపారు. బంక్ల్లో కనీస సౌకర్యాలు తప్పనిసరి నేలకొండపల్లి: పెట్రోల్ బంక్ల్లో వినియోగదారులకు కనీస సౌకర్యాలు కల్పించకపోతే నిర్వాహకులకు చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్కుమార్ తెలిపారు. మండలంలోని తిరుమలాపురంలో పెట్రోల్ బంక్ను మంగళవారం తనిఖీ చేసిన ఆయన రికార్డులను పరిశీలించాక మాట్లాడారు. వినియోగదారులు తమ ఫిర్యాదులను బాక్స్ల్లో వేయాలని తెలిపారు. అనంతరం పలు గ్రామాల్లో రైస్ మిల్లులను తనిఖీ చేసిన డీఎస్ఓ.. రైతులతో మాట్లాడారు. సివిల్ సప్లయీస్ ఆర్ఐ నరేష్ తదితరులు పాల్గొన్నారు. యూడీఐడీకి 72మంది దివ్యాంగుల అర్హత ఖమ్మంవైద్యవిభాగం: దివ్యాంగులకు యూనిక్ డిసేబులిటీ ఐడెంటిటీ కార్డు(యూడీఐడీ)లు జారీ చేసేందుకు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం శిబిరం నిర్వహించారు. స్లాట్ బుక్ చేసుకున్న 253మందిలో 149మంది హాజ రుకాగా, పరీక్షల అనంతరం 72మంది దివ్యాంగులను కార్డులకు అర్హులుగా నిర్ధారించారు. స్తంభం పడి మేకలు మృతి కొణిజర్ల: కొత్తగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ స్తంభం విరిగిపడడంతో రెండు మేకలు మృతి చెందాయి. మండలంలోని పల్లిపాడుకు చెందిన రాయల రుక్మిణి, ఆమె కుమారుడు కలిసి మేకలు మేపుతున్నారు. అదే ప్రాంతంలో 33 కేవీ లైన్ ఏర్పాటులో భాగంగా వేస్తున్న స్తంభాలు ఒకటి కూలి రెండు మేకలపై పడడంతో మృతి చెందాయి. ఘటనపై రుక్మిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా సాయికుమార్
ఎర్రుపాలెం: యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఎర్రుపాలెం మండలం కండ్రికకు చెందిన వేజండ్ల సాయికుమార్ ఎన్నికయ్యారు. ఈమేరకు మంగళవారం ప్రకటన విడుదలైంది. నాలుగు నెలల క్రితం ఆన్లైన్ ద్వారా ఓటింగ్ నిర్వహించగా, సాయికుమార్కు 16వేల మేరకు ఓట్లు పోలయ్యాయి. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, నాయకుల సమన్వయంతో యూత్ కాంగ్రెస్తో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.గ్రానైట్ ఫ్యాక్టరీ కార్మికుడి బలవన్మరణం తిరుమలాయపాలెం: గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఓ కార్మికుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అసోం రాష్ట్రంలోని నాగోల్ జిల్లా లాల్మట్టికి చెందిన రాజుబాసు మాటరి(19) కొక్కిరేణి సమీపాన గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం సెల్ఫోన్లో మాట్లాడుతూ ఫోన్ పగులగొట్టిన ఆయన ఆందోళనకు గురయ్యాడు. ఈక్రమంలోనే ఫ్యాక్టరీ సమీపాన చెట్టుకు సోమవారం రాత్రి ఉరి వేసుకున్నాడు. మంగళవారం ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన సహచర కార్మికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళ అదృశ్యం దమ్మపేట: ఓ మహిళ కనిపించకుండా పోయిన ఘటన మండలంలోని మొద్దులగూడెం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన గొర్రెముచ్చు శిరీష (26).. తన భర్త చనిపోవడంతో మండలంలోని మొద్దులగూడెంలోని పుట్టింట్లో ఉంటోంది. గతేడాది నవంబర్ 16న ఇంటి నుంచి సొంత పని మీద బయటకు వెళ్లిన శిరీష ఇప్పటివరకు తిరిగి రాలేదు. తల్లితండ్రులు పలుచోట్ల వెతకగా ఆచూకీ లభించలేదు. శిరీష తల్లి నిర్మల మంగళవారం ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ సాయికిశోర్రెడ్డి తెలిపారు. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి ఖమ్మం రూరల్: మండలంలోని ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి చిన్న వెంకటగిరి వాసి మంగళవారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పి.వీరబాబు(38) యజమాని సూచనలతో మిర్యాలగూడ వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. దీంతో ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలనే డిమాండ్తో వీరబాబు మృతదేహంతో యజమాని ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఈమేరకు యజమాని మలపూ కృష్ణ ఇంటికి తాళం వేసి వెళ్లిపోగా పోలీసులను ఆశ్రయించారు. రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్ చింతకాని: చింతకాని మండలం రామకృష్ణాపురం బస్టాండ్ వద్ద మంగళవారం చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ముదిగొండ మండలం పెద్దమండవ మున్నేరు నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు తేలడంతో సీజ్ చేశామని ఎస్సై నాగుల్మీరా తెలిపారు. -
కల్లూరు ఇకపై మున్సిపాలిటీ
కల్లూరు: కల్లూరు మేజర్ గ్రామపంచాయతీ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. ఈమేరకు రాష్ట్ర గవర్నర్ ఆమోదంతో మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్లాలో మేజర్ పంచాయతీగా ఉన్న కల్లూరును మున్సిపాలిటీగా మార్చాలని ఏళ్లుగా డిమాండ్ ఉంది. కొన్నాళ్ల క్రితం కల్లూరు పర్యటనకు వచ్చిన రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి ఈ విషయాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి తీసుకెళ్లారు. దీంతో ప్రజలంతా అంగీకరిస్తే మున్సిపల్గా మార్చే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం కల్లూరు మేజర్ పంచాయతీలో కల్లూరు, జీడీబీ పల్లి, ఖాన్ఖాన్పేట, శ్రీరామ్పురం ఉన్నాయి. ఇప్పుడు కప్పలబంధం, పుల్లయ్య బంజర్, తూర్పు లోకవరం, పడమర లోకవరం, కిష్టయ్యబంజర, హనుమాతండా, వాచ్యానాయక్ తండా గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేసేందుకు ఆయా పంచాయతీల్లో చేసిన తీర్మానాలను ప్రభుత్వానికి సమర్పించారు. దీంతో అసెంబ్లీలో ప్రతిపాదించగా, రాష్ట్ర గవర్నర్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే మట్టా రాగమయికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు విడుదల -
ఇంటర్ ఫలితాలు ౖపైపెకి..
గతంతో పోలిస్తే పెరిగిన జిల్లా ఉత్తీర్ణత శాతం●● ప్రథమ సంవత్సరంలో 71.15, సెకండియర్లో 77.69శాతం ఉత్తీర్ణత ● రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన పలువురు ● ఎప్పటిలాగే సత్తా చాటిన బాలికలుఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. ఇంటర్మీడియట్ బోర్డు మంగళవారం ఫలితాలను విడుదల చేయగా.. మొదటి సంవత్సరంలో జిల్లాకు మూడో స్థానం, ద్వితీయ సంవత్సరంలో ఐదో స్థానం లభించింది. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం పెరగడమే కాక జిల్లా విద్యార్థులు పలువురు రాష్ట్రస్థాయిలో ఉత్తమ మార్కులు సాధించడం విశేషం. – ఖమ్మంసహకారనగర్ఫలితాలు ఇలా... ప్రథమ సంవత్సరం పరీక్షలకు హాజరైన 15,584మందిలో 11,088మంది ఉత్తీర్ణత సాధించగా 71.15శాతంగా నమోదైంది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 14,876 మంది పరీక్షలు రాయగా 11,557 మంది ఉత్తీర్ణతతో 77.69 శాతం ఫలితాలు వచ్చాయి. ఒకేషనల్ విభాగం ప్రథమ సంవత్సరంలో 2,253 మందికి 1,388 మంది(61.61 శాతం), ద్వితీయ సంవత్సరంలో 2,043 మందికి 1,439 మంది(70.44శాతం) ఉత్తీర్ణత సాధించారు. గతేడాది ఫస్టియర్ ఫలితాల్లో జిల్లాకు రాష్ట్రస్థాయిలో నాలుగో స్థానం దక్కగా ఈసారి మూడో స్థానానికి ఎగబాకింది. ఇక ద్వితీయ సంవత్సరంలో మాత్రం గత ఏడాది మాదిరిగా ఐదో స్థానమే దక్కింది. బాలికలదే హవా ప్రథమ సంవత్సరం పరీక్షలకు బాలురు 7,851 మంది హాజరుకాగా 5,065 మంది(64.51శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 7,733మందికి గాను 6,023మంది(77.89 శాతం) ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్లో బాలురు 7,346 మందికి 5,297 మంది(72.10శాతం), బాలికలు 7,530మందికి గాను 6,260 మంది(83.13శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెగ్యులర్తో పాటు ఒకేషనల్ విభాగాల్లోనూ బాలికలదే పైచేయిగా నిలిచింది. ప్రైవేట్ కళాశాలల హవా ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రైవేట్ జూనియర్ కళాశాలల విద్యార్థులు సత్తా చాటారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో అత్యధికంగా 994, 992తో పాటు 980కిపైగా మార్కులు పలువురు విద్యార్థులు సాధించారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 468మార్కులు పలువురు విద్యార్థులు సాధించటం విశేషం. బైపీసీ, ఇతర గ్రూపుల్లోనే ఇదే పరిస్థితి కనిపించింది. పెరిగిన ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది మొత్తంగా చూస్తే ఫలితాలు మెరుగయ్యాయనే చెప్పాలి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణత శాతం గతేడాది కంటే ఈ ఏడాది 3 – 8శాతం మేర పెరిగింది. అంతేకాక ఎక్కువ మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు. గతంతో పోలిస్తే ఫలితాలు మెరుగవడంతో రాష్ట్రస్థాయిలో జిల్లాకు గుర్తింపు లభించినట్లయింది. ప్రథమ సంవత్సరం ఫలితాలు సంవత్సరం విద్యార్థులు ఉత్తీర్ణులైన వారు శాతం 2020 15,558 10,383 66 2022 14,274 9,869 69 2023 15,450 10,456 67 2024 16,015 10,224 63.84 2025 15,584 11,088 71.15ద్వితీయ సంవత్సరం ఫలితాలు సంవత్సరం విద్యార్థులు ఉత్తీర్ణులైన వారు శాతం 2020 15,549 10,666 68 2022 14,366 10,297 71 2023 13,339 9,964 74 2024 14,564 10,806 74.20 2025 14,876 11,557 77.69 30లోగా పరీక్ష ఫీజు చెల్లించండి ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఈనెల 30వ తేదీలోగా ఫీజు చెల్లించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె.రవిబాబు సూచించారు. రీ వెరిఫికేషన్ కోసం ప్రతీ పేపర్కు రూ.600, రీ కౌంటింగ్కై తే పేపర్కు రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. tg. cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. మార్కులు తక్కువగా వచ్చిన, ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందకుండా అడ్వాన్స్ సప్లిమెంటరీకి సిద్ధం కావాలని సూచించారు. -
సివిల్స్లో మెరిసిన రత్నాలు
● రూ.32లక్షల వార్షిక వేతనం వదులుకున్న చరణ్ తేజకు 231వ ర్యాంక్ ● 697వ ర్యాంకు సాధించిన గిరిజన యువకుడు నాగరాజు చింతకాని: యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో జిల్లా నుంచి ఇద్దరు యువకులు ర్యాంకులు సాధించారు. చింతకాని మండలం మత్కేపల్లికి చెందిన నర్శింశెట్టి చరణ్ తేజ 231వ ర్యాంక్ సాధించడం విశేషం. గ్రామానికి చెందిన నర్శింశెట్టి హరినాఽథ్బాబు – నాగమణి దంపతుల చిన్న కుమారుడు చరణ్ తేజ 10వ తరగతి వరకు హైదరాబాద్లోని నారాయణ కాన్సెప్ట్ స్కూల్లో, ఇంటర్ శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో పూర్తిచేశాక జేఈఈలో 88వ ర్యాంకు సాధించి ముంబై ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆతర్వాత తొమ్మిది నెలల పాటు రూ.32 లక్షల వార్షిక వేతనంతో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినా సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో ఉద్యోగం మానేశాడు. సొంతంగానే సిద్ధం.. సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేశాక చరణ్తేజ ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే ఆన్లైన్లో అందుబాటులో ఉన్న వనరుల ద్వారా సివిల్స్కు సిద్ధమయ్యాడు. 2022లో తొలిసారి పరీక్ష రాసినా ప్రిలిమ్స్కు అర్హత సాధించకపోగా 2023లో ఇంటర్వ్యూ దశకు చేరాడు. ఇక మూడో ప్రయత్నంలో ఈసారి ఆలిండియా 231వ ర్యాంక్ సాధించడం విశేషం. ఆయన తల్లిదండ్రులు 25ఏళ్ల క్రితమే హైదరాబాద్లో స్థిరపడగా తండ్రి హరినాథ్బాబు ప్రైవేట్ కంపెనీలో మెకానికల్ ఇంజనీర్గా, తల్లి నాగమణి మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. చరణ్ సోదరుడు జైశిక్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నారు. ఈ సందర్భంగా చరణ్తేజతో ‘సాక్షి’ మాట్లాడగా సివిల్స్లో ఆప్షనల్గా గణితం ఎంచుకున్నట్లు వెల్లడించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే సివిల్స్ సాధించానని, ఐఎఫ్ఎస్ ఎంచుకోవాలనే భావనతో ఉన్నట్లు తెలిపాడు. -
హార్వెస్ట్ విజయకేతనం
హార్వెస్ట్ విద్యాసంస్థల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారని కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ పార్వతిరెడ్డిలు తెలిపారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో ఎ.శ్రీకళ 467మార్కులు, ఏ.యామిని, జి.ప్రణతి, ఎం.సిరి శాన్వి, కె.రుచిత 466, జి.కౌసల్య, జి.పూజిత 465, జి.నమీత్, ఓ.అభిరామ చరణ్ 464, సెకండియర్ ఎంపీసీలో సీహెచ్.నిఖిత్, సీహెచ్.నివేదిత, పి.హారిణి 990మార్కులు సాధించారని పేర్కొన్నారు. ఇంకా పి.వెంకటకౌశిక్ 985, సీహెచ్.జీవన తేజశ్రీ, కె.భువన్ 984, ఎన్.జాహ్నవి 981, ఎ.స్రవిష్ట చౌదరి 980మార్కులు సాధించగా పలువురు అభినందించారు. -
వెలాసిటీ.. విజయకేతనం
వెలాసిటీ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించారని చైర్మన్ శెట్టి లక్ష్మణ్రావు, సెక్రటరీ, కరస్పాండెంట్ మల్లోలు రవి, అకడమిక్ డీన్ యాకూబ్ తెలిపారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో బి.శృతి 470కి 468మార్కులు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించగా, ఏ.రూప, పి.ఉభయ్ కృష్ణ 466, ఏ.సింధు 464, ఎస్.కే.పాషా 463మార్కులు సాధించారన్నారు. బైపీసీలో వి.చాందిని 434మార్కులు, సీఈసీలో ఆర్. శిరీష 475మార్కులు సాధించారని వెల్లడించగా.. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు. -
స్టెమ్స్పార్క్.. అత్యుత్తమం
ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని స్టెమ్స్పార్క్ జూనియర్ కళాశాల డైరెక్టర్లు కొండా శ్రీధర్రావు, కృష్ణవేణి తెలిపారు. కళాశాల స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఎంపీసీలో ఎ.హర్షిత 467 మార్కులు, సీహెచ్.హిమజ, పి.నాగసాయి అనిరుధ్ వర్మ 466, జి.గాయత్రి, సిహెచ్.సుషాంక్, వై.శ్రీరామ్ 465, బి.బ్రాహ్మణి 464మార్కులు సాధించగా, మిగతా వారు సైతం 400 నుంచి 450 మార్కులు సాదించారని వెల్లడించారు. విద్యార్థులను డైరెక్టర్లతో పాటు అధ్యాపకులు అభినందించారు. -
సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి సారించామని ఎన్పీడీసీఎల్ ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. శాఖ ఆధ్వర్యాన మంగళవారం నిర్వహించిన ఫోన్ ఇన్లో పలువురు సమస్యలను విన్నవించగా ఆయన మాట్లాడారు. విద్యుత్ అంతరాయాలు, విద్యుత్ బిల్లులు హెచ్చుతగ్గులు, లో ఓల్టోజీ సమస్యల తీవ్రత ఆధారంగా కొన్నింటికి వెంటనే, ఇంకొన్ని రెండు, మూడు రోజుల్లో పరిష్కరిస్తున్నామని తెలిపారు. వినియోగదారులు కంట్రోల్ రూం నంబర్కు 94408 11525 ఫోన్ చేయొచ్చని లేదా 1912, 1800 425 0028 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. డీఈలు నంబూరి రామారావు, సీహెచ్.నాగేశ్వరరావు, ఎల్.రాములు, బి.శ్రీనివాసరావు, చిన బాబూరావు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీధర్ పాల్గొన్నారు. -
వ్యవసాయ కుటుంబం నుంచి 697వ ర్యాంకు
కల్లూరురూరల్: కల్లూరు మండలం వాచ్యానాయక్ తండాకు చెందిన గిరిజన యువకుడు బానోత్ నాగరాజు నాయక్ సివిల్స్ ఫలితాల్లో మెరిశాడు. ఆయన ఆల్ఇండియా స్థాయిలో 697వ ర్యాంక్ సాధించాడు. నాగరాజు నాయక్ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు కల్లూరులో, 6నుంచి 10వ తరగతి వరకు పాలేరులోని నవోదయ విద్యాలయంలో పూర్తిచేశాడు. ఆతర్వాత ఇంటర్మీడియట్ విజయవాడలోని శ్రీ చైతన్య కళాశాల, బీటెక్ హైదరాబాద్లోని వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో పూర్తిచేశాడు. సివిల్స్లో సోషయాలజీ సబ్జెక్ట్ ఆప్షనల్గా తీసుకున్న నాగరాజు ఐదో ప్రయత్నంలో విజయం సాధించాడు. నాగరాజు తండ్రి పంతులు నాయక్ – తల్లి మారోని వ్యవసాయ పనులతో జీవనం సాగిస్తూ ఇద్దరు కుమారులను చదివించారు. ప్రస్తుతం నాగరాజు సివిల్స్ సాధించగా.. ఆయన సోదరుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం సివిల్స్ ప్రిలిమ్స్ దశ దాటిన వారికి ఇచ్చే రూ.లక్ష పారితోషికం అందుకున్న నాగరాజు సివిల్స్కు ఎంపికవడంపై స్థానికులతో పాటు పలువురు అభినందించారు. -
‘భూ భారతి’తో సమస్యలకు చెక్
రఘునాథపాలెం: రాష్ట్రప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో భూసంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. రఘునాథపాలెం రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ, భూమి హద్దుల నిర్దారణ, యాజమాన్య హక్కుల నిర్ణయం సులువవుతుందని చెప్పారు. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం, హక్కుదారులకు పట్టాల మంజూరు, నిషేధిత భూముల పరిశీలన చేపడుతామని తెలిపారు. ఆర్డీఓ జి.నర్సింహారావు, తహసీల్దార్ విల్సన్, ఎంపీడీఓ అశోక్కుమార్, ఏఓ ఉమామహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. కాగా, సర్వే ద్వారా కౌలు రైతులకు రక్షణ చట్టం అమలు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి ఎస్.నవీన్రెడ్డి తదితరులు కలెక్టర్కు విన్నవించారు. ●ముదిగొండ: ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేపడుతూనే కాంటా కాగానే మిల్లులకు తరలించాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ఆదేశించారు. ముదిగొండ మండలం మేడేపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడాక నిర్వాహకులకు సూచనలు చేశారు. తేమ, తరుగు విషయంలో అప్రమత్తంగా ఉండాలని, రైతులకు టార్పాలిన్లు, గన్నీబ్యాగ్లు సమకూర్చాలని చెప్పారు. తొలుత కేంద్రం వద్దకు చేరడానికి కలెక్టర్ బైక్పై వెళ్లారు. తహసీల్దార్ సునీత ఎలిజబెత్ పాల్గొన్నారు. ●ఖమ్మంవ్యవసాయం: మధిర నియోజకవర్గంలో ఏర్పాటుచేస్తున్న ఇందిరా మహిళా డెయిరీ లబ్ధిదారులకు ప్రయోజనం కలిగేలా అధిక పాల దిగుబడి ఇచ్చే గేదెలనే పంపిణీ చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. కలెక్టరేట్లో డెయిరీ, సదరం క్యాంపులు, వితంతు పెన్షన్లపై అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించిన కలెక్టర్ పలు సూచనలు చేశారు. జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్డీఓ సన్యాసయ్య, గిరిజన, బీసీ సంక్షేమ శాఖల బీసీలు విజయలక్ష్మి, జ్యోతి, డీపీఓ ఆశాలత, ఎస్పీ కార్పొరేషన్ ఈడీ నవీన్బాబు, ఆర్డీవో రాజేందర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.అవగాహన సదస్సులో కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ -
కృష్ణవేణి విద్యార్థుల సత్తా
ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని కృష్ణవేణి కళాశాల డైరెక్టర్లు గొల్లపుడి జగదీష్, మాచవరపు కోటేశ్వరరావు, యార్లగడ్డ వెంకటేశ్వరావు తెలిపారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో ఏ.ప్రియాంబిక, ఎస్.సాయి సంజన, వై.స్పూర్తి 993, టి.చందాన 991, ఎస్.సంతోష్రెడ్డి, జూనియర్ ఎంపీసీలో ఆర్.భువన కృతి, బి.పవిత్ర 468, ఈ.హర్షిత్, ఎం.వెంకటేశ్వర్లు, ఎం.సాయి సాత్విక, వి.రాజ్యలక్ష్మీ, ఎస్ఎస్.లక్ష్మి, కె.భరత్కుమార్, డి.భానురమ్య, ఎన్.చందన, వి.గణేష్, సిహెచ్.సౌమ్య శ్రీ, పి.హర్షవర్థన్ 467మార్కులు సాధించారన్నారు. బైపీసీలో జి.ప్రహర్ష, ఎన్.కరుణ శ్రీ 437, సీహెచ్.ఇందిర, కె.అఖిల్ సాయి, ఎం.డీ.ఆయేషా 436, ఎంఈసీలో టి.సహస్ర లీల 491 మార్కులు, సీఈసీ విభాగంలో అత్యధికంగా 483మార్కులు వచ్చాయని తెలిపారు. ప్రిన్సిపాల్ గుర్రం రామచంద్రయ్య, అకడమిక్ డీన్ ఎల్లూరి వంశీకృష్ణ, ఏఓ నిరంజన్కుమార్ పాల్గొన్నారు. -
రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనుల్లో వేగం
ఖమ్మం రాపర్తినగర్: ఖమ్మం రైల్వేస్టేషన్లో అభివృద్ధి, ఆధునికీకరణ పనుల్లో వేగం పెంచి గడువులోగా పూర్తి చేయాలని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ఆదేశించారు. పనులను ముంగళవారం పరిశీ లించిన ఆయన అధికారులతో సమీక్షించారు. మార్చికల్లా పూర్తవుతాయన్న పనులు ఇంకా జరుగుతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.25 కోట్లతో నిర్మిస్తున్న వెయిటింగ్ హాల్, ఎస్కలేటర్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ప్లాట్ ఫామ్పై షెడ్ల పనుల్లో వేగం పెంచి, ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఆతర్వాత ఓ స్టాల్లో టీ తాగిన ఎంపీ ‘చాయ్ అచ్చా హై..’ అని నిర్వాహకులను అభినందించారు. ఖమ్మం కమర్షియల్ ఇన్స్పెక్టర్ జాఫర్, డిప్యూటీ స్టేషన్ మాస్టర్ అనిల్ కుమార్, ఆర్పీఎఫ్ సీఐ సురేష్ గౌడ్, హెల్త్ ఇన్స్పెక్టర్ మోహన్కుమార్, ఎస్ఎస్సీ అధికారి అఖిల్, కాంగ్రెస్ నాయకులు పువ్వాళ్ల దుర్గప్రసాద్, ఎం.డీ.ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.లోక్సభ సభ్యుడు రఘురాంరెడ్డి -
ఆలయాల అప్గ్రేడ్..
● కొన్నింటికి 6బీ నుంచి 6ఏ హోదా ● మరికొన్ని 6బీ జాబితాలోకి.. పాల్వంచరూరల్: ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాలను అప్గ్రేడ్ చేస్తూ దేవాదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. భక్తుల తాకిడితో పాటు అదేస్థాయిలో ఆదాయం సమకూరుతోంది. దీంతో ప్రతీ మూడేళ్లకోసారి ఆలయాల ఆదాయ, వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటున్న దేవాదాయ శాఖ గ్రేడ్ పెంచుతోంది. తద్వారా భక్తులకు ఆలయాల్లో వసతుల కల్పనతో పాటు సిబ్బంది సంఖ్య పెరిగే అవకాశముంటుంది. ఆదాయం ఆధారంగా ఖమ్మం జిల్లాలో ఇప్పటికే ఏడు ఆలయాలకు 6ఏ హోదా ఉండగా కొత్తగా మరో ఆరింటిని 6బీ నుంచి 6ఏకు అప్గ్రేడ్ చేశారు. 6ఏ ఆలయాలు ఇవే.. తాజాగా అప్గ్రేడ్ చేసినవి కలిపితే ఉమ్మడి జిల్లాలో మొత్తం 17ఆలయాలు 6ఏ గ్రేడ్ పరిధిలో ఉన్నాయి. ఇందులో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం, పాల్వంచ మండలంలోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం, అన్నపురెడ్డిపల్లిలోని శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయం, కొత్తగూడెంలోని శ్రీ విఘ్నేశ్వరస్వామి ఆలయంతో పాటు జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి, ఖమ్మంరూరల్ మండలం రెడ్డిపల్లి శ్రీమారెమ్మతల్లి ఆలయం, పెనుబల్లిలోని శ్రీనీలాద్రీశ్వరస్వామి, ఖమ్మంలోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీనర్సింహస్వామి(గుట్ట), కమాన్బజార్ శ్రీ వేంకటేశ్వరస్వామి, కాల్వొడ్డులోని సత్యనారాయణ సహిత వీరాంజయనేయస్వామి, వేంసూరు మండలం కందుకూరు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయా లు ఈ జాబితాలో కొనసాగుతున్నాయి. కొత్తగా ఖమ్మం రూరల్ మండలం తీర్థాల సంగమేశ్వర స్వామి, మధిరలోని మృత్యుంజయస్వామి, ఖమ్మంలోని శ్రీ గుంటుమల్లేశ్వరస్వామి, ఏన్కూరు మండలం గార్లొడ్డు శ్రీలక్ష్మీనర్సింహస్వామి, సింగరేణి మండలం ఉసిరికాయలపల్లిలోని శ్రీ కోటమైసమ్మ తల్లి, ఖమ్మం ఇందిరానగర్ శ్రీ సీతారామచంద్ర స్వామి(పర్ణశాల) ఆలయాలు అప్గ్రేడ్ అయ్యాయి. అలాగే, ముదిగొండ మండలం వల్లాపురం శ్రీ మల్లికార్జునస్వామి, కొణిజర్ల మండలం పల్లిపాడు శ్రీ శంభులింగేశ్వరస్వామి, కూసుమంచి మండలం పెరికసింగారం శ్రీవేణుగోపాల ఆంజనేయస్వామి, ఖమ్మం ఎన్నెస్పీ క్యాంప్ శ్రీ సీతారామాంజనేయ స్వామి, కామేపల్లి మండలం కొత్తలింగాల కోట మైసమ్మ, ఖమ్మం వరదయ్యనగర్లోని మైసమ్మ ఆలయాలు 6బీ హోదా పొందాయి. భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి శ్రీదాసాంజనేయస్వామి, కొత్తగూడెం బాబూక్యాంప్లోని శ్రీసీతారామచంద్రస్వామి, పాపకొల్లు శ్రీఉమాసోమలింగేశ్వరస్వామి, పాల్వంచలోని శ్రీరామాలయం, అన్నపురెడ్డిపల్లిలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయాల కు కూడా 6బీ హోదా కల్పించారు. -
ఫిర్యాదులు పరిష్కరించండి
ఖమ్మం సహకారనగర్: ప్రజలు అందించే ప్రతీ దరఖాస్తును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఏ.పద్మశ్రీ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణిలో ఆమె డీఆర్డీఓ సన్యాస్యతో కలిసి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమై డీఆర్వో.. దరఖాస్తుల పరిశీలన, పరిష్కారంపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. విధుల్లో చేరిన ఆర్టీఓ వెంకటరమణ ఖమ్మంక్రైం: కొంతకాలంగా సెలవులో ఉన్న ఖమ్మం ఎంవీఐ, ఇన్చార్జ్ ఆర్టీఓ వెంకటరమణ సోమవారం విధుల్లో చేరారు. ఇంతకాలం వైరా ఎంవీఐ వరప్రసాద్ ఇన్చార్జ్ ఆర్టీఓగా వ్యవహరించారు. ఈ మేరకు విధుల్లో చేరిన అనంతరం వెంకటరమణ రవాణాశాఖ ఉద్యోగులతో సమావేశమై త్రైమాసిక పన్నుల వసూళ్లు, చెక్పోస్టుల వద్ద తనిఖీలపై సూచనలు చేశారు. అభివృద్ధి పనులు పరిశీలించిన డీఆర్ఎం మధిర: మధిర రైల్వేస్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం భర్తేష్ కుమార్ జైన్ సోమవారం పరిశీలించారు. ఈసందర్భంగా పనుల్లో వేగం పెంచడమే కాక నాణ్యతగా చేపట్టాలని అధికారులకు సూచించారు. కాగా, అఖిలపక్షం నాయకులు సూరంశెట్టి కిషోర్, మందా సైదులు, బెజవాడ రవిబాబు తదితరులు డీఆర్ఎంను కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. మధిరలో రైల్వే అండర్ పాస్ నిర్మించాలని, అప్పటివరకు రైల్వేగేట్ వద్ద రాకపోకలకు అనుమతించడమే కాక గౌతమి, సింహపురి, నవజీవన్ రైళ్ల హాల్టింగ్ ఇప్పించాలని కోరారు. వచ్చేనెలలో ఉపాధ్యాయులకు శిక్షణ? ఖమ్మం సహకారనగర్: ఇటీవల చేపట్టిన వివిధ సర్వేల్లో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు కొందరు పలు అంశాల్లో వెనుకబడినట్లుగా తేలింది. ఈనేపథ్యాన సబ్జెక్టు ఉపాధ్యాయుల్లో నైపుణ్యాలు పెంచేందుకు వేసవి సెలవుల్లో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా 30వ తేదీలోగా రిసోర్స్పర్సన్ల ఎంపిక పూర్తి చేశాక.. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎస్సీఈఆర్టీ)లో శిక్షణ ఇస్తారని సమాచారం. ఆపై వీరి ద్వారా మే నెలలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మార్కెట్ల ద్వారా లక్ష్యానికి మించి ఆదాయం ఏన్కూరు: వరంగల్ రీజియన్ పరిధి వ్యవసాయ మార్కెట్ల ద్వారా లక్ష్యానికి మించి ఆదాయం వస్తోందని మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి తెలిపారు. ఏన్కూరులోని వ్యవసాయ మార్కెట్ను సోమవారం తనిఖీ చేసిన ఆమె మిర్చి కొనుగోళ్లు, జెండా పాట, నాణ్యతపై ఆరా తీశారు. అనంతరం డీడీ మాట్లాడుతూ గత ఏడాది మార్కెట్ల ద్వారా రూ.449 కోట్ల లక్ష్యానికి గాను రూ.458 కోట్ల ఆదాయం నమోదైందని తెలిపారు. మార్కెట్లతో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించడమే కాక పంటలకు మద్దతు ధర లభించేలా ఉద్యోగులు పర్యవేక్షించాలని సూచించారు. మార్కెట్ కార్యదర్శి బజార్, ఉద్యోగులు పాల్గొన్నారు. -
భూసమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
● అందుకోసమే అమల్లోకి భూ భారతి చట్టం ● ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డిఖమ్మంరూరల్: గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి వెబ్సైట్ ద్వారా భూసమస్యలకు పరిష్కారం లభించకపోగా, రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తెలి పారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రస్తుత ప్రభుత్వం అన్ని సమస్యలను పరిష్కరించేలా భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లిలో సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ధరణితో భూ సమస్యలు పరిష్కారం కాకపోగా.. కొత్త చిక్కులు ఎదురయ్యాయన్నారు. ఈనేపథ్యాన సీఎం రేవంత్రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిపుణులతో చర్చించి భూ భారతి చట్టానికి రూపకల్పన చేశారని తెలిపారు. ఇన్చార్జ్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మాట్లాడుతూ మ్యుటేషన్, ఇనాం భూములు, భూ టైటిళ్లకు సంబంధించి ఫిర్యాదులు ఉంటే రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి మాట్లాడగా కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఆర్డీఓ నరసింహారావు, డీఏఓ పుల్లయ్య, ఖమ్మం రూరల్ తహసీల్దార్ రాంప్రసాద్, ఎంపీడీఓ కుమార్, ఏడీఏ సరిత తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి అభివృద్ధికి సహకారం ఖమ్మంవైద్యవిభాగం: పేదలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్న ఖమ్మం జనరల్ ఆస్పత్రి అభివృద్ధి, సౌకర్యాల కల్పనకు సహకరిస్తానని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి ఎంపీ లాడ్స్ నిధులు రూ.8లక్షలతో కేటాయించిన ఎనిమిది ఫ్రీజర్లను అందించడంతో పాటు వైద్యాధికారుల విజ్ఞప్తితో రెండు బోర్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ పాత భవనం మరమ్మతుల కోసం నిధుల కేటాయింపునకు కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్కుమార్, డాక్టర్ బాబు రత్నాకర్, డాక్టర్ బి.కిరణ్, నందగిరి శ్రీనుతో పాటు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు తుంబూరు దయాకర్రెడ్డి, కొప్పుల చంద్రశేఖర్, మిక్కిలినేని నరేందర్, ముస్తఫా, లింగాల రవికుమార్, మియా భాయ్, కాంపాటి వెంకన్న, మజీద్, ఉమ్మినేని కృష్ణ, ఇమామ్ పాల్గొన్నారు. హైవేల నిర్మాణంలో వేగం ఖమ్మంవన్టౌన్: పీఎంజీఎస్వై, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపడుతున్న జాతీయ రహదారులు, వంతెనల నిర్మాణంలో వేగం పెంచాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, నేషనల్ హైవే అధికారులతో సమావేశమై రహదారుల నిర్మాణ పురోగతిపై ఆరా తీశాక సర్వీస్ రోడ్లు, ఇతర అంశాలపై సూచనలు చేశారు. పీఆర్ ఈఈ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆతర్వాత ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ బ్రిడ్జి నుంచి కోదాడ మార్గంలో ధంసలాపురం వరకు, అగ్రహారం రైల్వే వంతెన నిర్మాణ ప్రాంతంలో ఎన్హెచ్ఏఐ పీడీ దివ్యతో కలిసి ఎంపీ పరిశీలించారు. మద్దులపల్లి మార్కెట్ చైర్మన్ హరినాధ్బాబు, నాయకులు కల్లెం వెంకటరెడ్డి, కొప్పుల చంద్రశేఖర్, బ్రహ్మారెడ్డి, తమ్మినేని నవీన్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచానికి నాయకత్వం వహించాలి
మధిర: మధిర నియోజకవర్గంలో వ్యవసాయదారులే ఎక్కువగా ఉన్నందున వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు స్థాపించేలా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేశామని.. తద్వారా నియోజకవర్గానికి మంచి భవిష్యత్ ఉంటుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. నియోజకవర్గ యువతీ, యువకులు ప్రపంచానికి నాయకత్వం వహించేలా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. మధిరలో సోమవారం ఏర్పాటుచేసిన మెగా జాబ్మేళాను భట్టి ప్రారంభించారు. తొలుత వివిధ కంపెనీల స్టాళ్లను పరిశీలించి వివరాలు ఆరా తీశారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ నియోజకవర్గంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యేలా అగ్రికల్చర్ పాలిటెక్నిక్, జనరల్ పాలిటెక్నిక్ కళాశాలు ఉండగా.. ఐటీఐని అడ్వాన్వ్డ్ టెక్నాలజీ సెంటర్గా తీర్చిదిద్దుతున్నామని తెలి పారు. తల్లిదండ్రుల ఆకాంక్షలను యువత గుర్తించి భవిష్యత్ లక్ష్యాలపై దృష్టి సారించాలని సూచించారు. అయితే, జాబ్మేళాలో వచ్చిన ఉద్యోగం చేస్తూనే మెరుగైన లక్ష్యాల సాధనకు కృషి చేయాలని తెలిపారు. ఇన్చార్జ్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మాట్లాడుతూ ఎవరికి వారు నమ్మకంతో ముందుకు సాగితే విజయం సొంతమవుతుందని తెలిపారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం షాలెం రాజు, తహసీల్దార్ రాంబాబు, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 97 కంపెనీలు.. వేలాది మంది యువత మధిరలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో సింగరేణి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ జాబ్ మేళాలో 97 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈమేరకు 5,287 మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 3వేల మందికి పైగా హాజరయ్యారు. ఎస్సెస్సీ మొదలు ఎంటెక్ చదివిన అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు 2,325 మందిని ఎంపిక చేయగా కొందరికి డిప్యూటీ సీఎం నియామక పత్రాలు అందజేశారు. మరికొందరికి హైదరాబాద్లో తుది దశ ఇంటర్వ్యూల అనంతరం నియామకపత్రాలు ఇస్తామని ప్రతినిధులు తెలిపారు. చదువు పూర్తిచేసి ఏళ్ల తరబడి ఇబ్బంది పడుతున్న పలువురికి ఉద్యోగాలు లభించడంతో సంతోషం వ్యక్తం చేశారు. కాగా, మధిరకు చెందిన సముద్రాల ప్రియాంకకు రూ.4 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం రావడం విశేషం. ఊహించని ఉద్యోగమిది... పాలిటెక్నిక్ పూర్తిచేశాను. స్నేహితులతో కలిసి జాబ్మేళాకు హాజరైనా ఉద్యోగం ఊహించలేదు. కానీ ఎంపవర్ సర్వీసెస్లో రూ.3లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగానికి ఎంపిక చేసి నియామకపత్రం ఇచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చొరవతో ఈ ఉద్యోగం దక్కింది. – బి.ఉషారాణి, వంగవీడుఅపాయింట్మెంట్ లెటర్ కూడా.. జీఎన్ఎం చదువుతున్నా. జాబ్ మేళాలో ప్రీమియర్ హెల్త్ కేర్ సొసైటీలో ఉద్యోగానికి ఎంపికయ్యా. నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన నాకు ఉద్యోగం రావడంతో కుటుంబానికి అండగా నిలిచే అవకాశం దక్కింది. ఏటా రూ. 3లక్షల ప్యాకేజీతో లేఖ ఇచ్చారు. – డి.తిరుపతమ్మ, వంగవీడు ఇండస్ట్రియల్ పార్క్తో మధిరకు ఉజ్వల భవిష్యత్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జాబ్మేళాలో 2,325 మంది ఎంపిక -
నీరు పారేదాక పని ఆగొద్దు
ఖమ్మంఅర్బన్: రఘునాథపాలెం మండలంలోని సాగు భూములకు సాగర్ జలాలు అందించాలనే లక్ష్యంతో మంచుకొండ వద్ద ప్రధాన కాల్వపై నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయి. రూ.65 కోట్ల అంచనాలతో నిర్మించే ఈ పథకం పనులు త్వరగా పూర్తిచేసి ట్రయల్ రన్ నిర్వహించాలనే లక్ష్యంతో ఫ్లడ్లైట్ల వెలుతురులో రాత్రింబవళ్లు చేపడుతున్నారు. ఈ సీజన్లోనే మండలంలోని చెరువులకు సాగర్ జలాలు విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించడమే కాక, పనుల్లో వేగం పెరిగేలా తరచూ సమీక్షిస్తున్నారు. అయితే ప్రధాన పైప్లైన్, పంపుహౌస్, ఇతర పనులు చివరి దశకుచేరినా మోటార్లు ఇప్పటికిప్పుడు సమకూర్చడం సాధ్యం కాదని కంపెనీ బాధ్యులు చెప్పినట్లు తెలిసింది. దీంతో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి అదనంగా ఉన్న మోటార్లను రెండు రోజుల క్రితం తెప్పించగా వీటిని బిగించే పనులు సోమవారం మొదలయ్యాయి. ఈనెల 24 లేదా ఆ తర్వాత ఒకటి, రెండు రోజుల్లో సాగర్ జలాల ఎత్తిపోతల ట్రయల్ రన్ చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఇంజనీర్లు చెబుతున్నారు.ఫ్లడ్లైట్ల వెలుగులో మంచుకొండ ‘లిఫ్ట్’ పనులు -
రగ్బీలో రాణిస్తున్న అభినయశ్రీ
● సీనియర్స్ జాతీయస్థాయి జట్టుకు ఎంపిక ● గతంలో కరాటే, వాలీబాల్ పోటీల్లోనూ ప్రతిభ ముదిగొండ: చిన్నతనం నుంచి ఆమెకు క్రీడలపై మక్కువ. ఓ పక్క ఆటల్లో సాధన చేస్తూనే చదువులోనూ ప్రతభ కనబర్చడం అలవాటుగా మార్చుకుంది. మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటుతున్న ఆమె పలువురి మన్ననలు అందుకుంటోంది. ఖమ్మం రోటరీనగర్కు చెందిన చల్లగొండ్ల అభినయశ్రీ ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురం కేజీబీవీలో ఇంటర్ పూర్తి చేసింది. ఆరో తరగతి నుంచి కరాటే నేర్చుకున్న ఆమె జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంది. గోవాలో నేషనల్ యూత్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన జరిగిన పోటీల్లో బంగారు పతకాలు, బ్లాక్ బెల్ట్ సాధించింది. కేజీబీవీ ప్రత్యేకాధికారి ఇందిర, సీఈటీ నిర్మల ప్రోత్సాహంతో వాలీబాల్ పోటీల్లో బంగారు పతకాలు సాధించడం విశేషం. రగ్బీలోనూ ప్రతిభ కరాటే, వాలీబాల్లోనే కాక రగ్బీపైనా అభినయశ్రీ దృష్టి సారించింది. ఈమేరకు జూనియర్స్ విభాగం నుంచి పోటీల్లో పాల్గొని ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత హైదరాబాద్లో గత ఏడాది జరిగిన రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే జట్టుకు ఎంపికై ంది. పుణెలోని బల్లెవాడిలో గత ఏడాది జూలైలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చింది. అలాగే, అసోం రాష్ట్రంలోని గువాహటిలో సీనియర్స్ విభాగంలో జరగనున్న జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఎంపికై న ఆమె పలువురి మన్ననలు అందుకుంటోంది. -
వడదెబ్బతో వ్యక్తి మృతి
మధిర: ఎండవేడి కారణంగా వడదెబ్బకు గురైన ఓ వ్యక్తి మృతి చెందాడు. మండలంంలోని నిదానపురం గ్రామానికి చెందిన మేసిపోగు రత్తయ్య (33) సోమవారం మేకలను మేతకు తీసుకెళ్లాడు. అయితే, ఎండ కారణంగా అస్వస్థతకు గురై పొలం వద్ద పడిపోగా స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆటోలో మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలోగా రత్తయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉండగా, భార్య రమ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు మధిర రూరల్ పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన మరొకరు మృతి నేలకొండపల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స చేయిస్తుండగా మరో వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని బోదులబండ వద్ద గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న హరికిరణ్ (36), రాజ్బహుదూర్ (22), రాంజీలాల్ (23) ఆదివారం రాత్రి బైక్పై వెళ్తుండగా లారీ ఢీకొట్టిన విషయం విదితమే. ఇందులో హరికిరణ్ ఆదివారం రాత్రి మృతి చెందగా, ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాంజీలాల్ సోమవారం మృతి చెందాడు. అలాగే, రాజవ్బహుదూర్ చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. పాముకాటుతో రైతు మృతి తిరుమలాయపాలెం: వరిగడ్డి వామి వేస్తున్న ఓ రైతు పాముకాటుతో మృతి చెందాడు. మండలంలోని కుక్కలతండా గ్రామానికి చెందిన గుగులోత్ కిషన్ (38) సోమవారం ఉదయం వరిగడ్డి కట్టలతో వామి వేస్తున్నాడు. ఈ క్రమాన కాలిపై పాము కాటు వేయగా.. కుటుంబీకులు మరిపెడ బంగ్లాకు, అక్కడి నుంచి ఖమ్మం తరలించగా ఆరోగ్యం విషమించి మృతి చెందాడు. కిషన్కు భార్య సుమలత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
పరిహారం ఇప్పించాలని మొక్కజొన్న రైతుల వినతి
ఖమ్మంవ్యవసాయం: మొక్కజొన్న పంట సాగు చేసిన తాము నష్టపోయినా విత్తన కంపెనీ ప్రతినిధులు పరిహారం చెల్లించడం లేదని జిల్లాలోని పలు మండలాల రైతులు వాపోయారు. ఈ సందర్భంగా వారు సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి వినతిపత్రం అందజేశారు. కొణిజర్ల మండలం రామనర్సయ్యనగర్ గ్రామ రైతులు సాగు చేసిన పంటకు రూ.కోటి మేర నగదు చెల్లించాల్సి ఉందని, వేంసూరు మండలంలో దిగుబడి రానందున పరిహారం ఇప్పించాలని కోరారు. అంతేకాక ప్రైవేట్ సీడ్ కంపెనీలు, దళారులపైనా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. బీకేఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పగడవరపు శ్రీనివాసరావు, తాళ్లూరి శ్రీనివాసరావు, నాయకులు తూము అప్పారావు, కొండపర్తి నరేశ్, రైతులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్యాయత్నం
బోనకల్: నిరుపేద అయిన తనకు అన్ని అర్హతలు ఉన్నా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదనే ఆవేదనతో కాంగ్రెస్ నాయకుడు, మాజీ వైస్ ఎంపీపీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బోనకల్కు చెందిన మాజీ వైస్ ఎంపీపీ గుగులోత్ రమేశ్కు సొంత ఇల్లు కానీ, పొలం కానీ లేవు. ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ప్రకటించగా జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఆదివారం బోనకల్ మీదుగా మధిర వెళ్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కకు వినతిపత్రం అందించగా పరిశీలించి ఇల్లు మంజూరు చేస్తానని ఆయన తెలిపారు. ఇక సోమవారం గ్రామపంచాయతీ కార్యదర్శిని కలిసి జాబితాపై ఆరా తీశాడు. ఆ తర్వాత జీపీ ముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా, స్థానికులు, పోలీసులు, సిబ్బంది ఆయనను అడ్డుకుని నచ్చజెప్పారు. బాధితుడు కాంగ్రెస్ నేత, మాజీ వైస్ ఎపీపీ -
విద్యుత్ సమస్యలపై నేడు ‘ఫోన్ ఇన్’
ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ సంబంధిత సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు మంగళవారం ఫోన్ ఇన్ నిర్వహిస్తున్నట్లు ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. సరఫరాలో అంతరాయాలు, ఓల్టేజీ హెచ్చుతగ్గులు, బిల్లుల సమస్యలపై వినియోగదారులు ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 94408 11525 నంబర్లో సంప్రదించాలని సూచించారు. కోర్టు ముఖ్య పరిపాలనా అధికారి బదిలీ ఖమ్మంలీగల్: జిల్లా కోర్టు ముఖ్య పరిపాలనాధికారి పి.హరికృష్ణ సికింద్రాబాద్ ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ కోర్టుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కరీంనగర్ ఎస్సీ, ఎస్టీ కోర్టులో విధులు నిర్వర్తిస్తున్న సంజయ్ షేట్కర్ను ఖమ్మంకు కేటాయించారు. అలాగే, ఖమ్మం కోర్టులో పనిచేస్తున్న బి.మల్లికార్జునరావు బోధన్ ఐదో అదనపు జిల్లా కోర్టు ముఖ్య పరిపాలనాధికారిగా బదిలీ కాగా.. రంగారెడ్డి జిల్లా ప్రధాన కోర్టులో పనిచేస్తున్న పి.గోపాలకృష్ణను ఈ స్థానంలో నియమించారు. ఆర్పీల నియామకానికి దరఖాస్తులు ఖమ్మంసహకారనగర్: మండల,జిల్లాస్థాయిలో రిసోర్స్ పర్సన్లు (ఆర్పీ)లుగా పనిచేసేందుకు ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ సోమశేఖరశర్మ ఒక ప్రకటనలో సూచించారు. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను ఈ నెల 24వ తేదీలోగా తమ కార్యాలయంలో అందించాలని తెలిపారు. కలెక్టర్ ఆధ్వర్యాన కమిటీ ద్వారా రిసోర్స్ పర్సన్ల ఎంపిక ఉంటుందని వెల్లడించారు. గాంధీపురం రైల్వేగేట్లో సాంకేతిక లోపం కారేపల్లి: మండలంలోని ఖమ్మం – ఇల్లెందు ప్రధాన రహదారిపై గాంధీపురం వద్ద రైల్వేగేట్ సోమవారం సాంకేతిక లోపంతో తెరుచుకోలేదు. దీంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సుమారు గంట పాటు గేట్ మూతపడి ఉండడంతో, ఉద్యోగులు అతి కష్టంపై మరమ్మతులు చేపట్టారు. అయితే, గాంధీపురంతో పాటు, కారేపల్లిలోని ఇల్లెందు రైల్వేగేట్, పేరుపల్లి గేట్ల మీదుగా వాహనాల రద్దీ ఉంటుంది. ఇక్కడ ట్రాక్పై ప్రతీ 20 నిమిషాలకో గూడ్స్ వచ్చి వెళ్తుండడం.. ఆ సమయాన గేట్లు మూసివేయడం.. తరచుగా సాంకేతిక లోపంతో తెరుచుకోక వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి ప్లైఓవర్ లేదా అండర్ బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నారు. 20 రోజులు.. 673 మంది డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన వాహనదారులు ఖమ్మంక్రైం: ఈ నెలలో ఇప్పటివరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 673 మంది పట్టుబడ్డారని పోలీస్ కమిషనర్ సునీల్దత్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న 21 మంది మైనర్లపై కేసులు నమోదు చేశామని వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే వారు ప్రాణాలు కోల్పోవడమే కాక ఇతరులు ప్రమాదాల బారిన పడడానికి కారకులవుతారని తెలిపారు. ఈ మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన పలువురికి న్యాయమూర్తి ఒక రోజు జైలు శిక్ష లేదా జరిమానా విధించినట్లు చెప్పారు. మైనర్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని సీపీ సునీల్దత్ వివరించారు. 25న జిల్లా జైలులో బహిరంగ వేలం ఖమ్మంరూరల్: జిల్లా జైలులో పనికిరాని ఇనుప వస్తువులను విక్రయించేందుకు ఈ నెల 25న బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు జైలు సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వేలం జరుగుతుందని, ఆసక్తి ఉన్న వారు రూ.5 వేల ధరావత్తు చెల్లించి పాల్గొనాలని సూచించారు. వేలంలో సామగ్రి దక్కించుకున్న వారు 18 శాతం జీఎస్టీతో కలిపి నగదు చెల్లించి వస్తువులు తీసుకెళ్లాలని తెలిపారు. వివరాలకు జైలర్లు ఎ.సక్రూనాయక్ (94946 32552), జి.లక్ష్మీనారాయణ(97005 05151)ను సంప్రదించాలని సూపరింటెండెంట్ సూచించారు. -
ఐదు ఎకరాల సుబాబుల్ తోట దగ్ధం
బోనకల్: మండలంలోని రాయన్నపేట శివార్లలో ఐదెకరాల సుబాబుల్ తోట కాలిపోయింది. గ్రామానికి చెందిన బొమ్మినేని హన్మంతరావు సాగుచేస్తున్న సుబాబుల్ తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో మంటలు వ్యాపించాయి. స్థానికులు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోగా, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే రూ.4 లక్షల మేర నష్టం జరిగిందని బాధిత రైతు వెల్లడించాడు. అగ్ని ప్రమాదంలో ఫర్నిచర్.. నేలకొండపల్లి: నేలకొండపల్లికి చెందిన చింతకాయల సురేశ్ ఇంట్లో సోమవారం హీటర్ ఆన్ చేసి స్విచాఫ్ చేయడం మరిచిపోయారు. దీంతో వేడెక్కి మంటలు వ్యాపించగా వాషింగ్ మిషన్, ఫర్నిచర్ కాలిపోయాయి. మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో రూ.1.50 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలిసింది. -
రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలి
కారేపల్లి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వైరా నియోజకవర్గం నుంచి భారీగా శ్రేణులు, ప్రజలు తరలివచ్చేలా నాయకులు చొరవ తీసుకోవాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తాతా మధు పిలుపునిచ్చారు. కారేపల్లి క్రాస్లోని మాజీ వార్డు సభ్యుడు సిద్ధంశెట్టి నాగయ్య నివాసంలో సోమవారం వారు బీఆర్ఎస్ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సభకు పార్టీ శ్రేణులు, ప్రజల తరలింపు, సన్నద్ధతపై సూచనలు చేశారు. సమావేశంలో నాయకులు ముత్యాల సత్యనారాయణ, అడప పుల్లారావు, బానోతు రాందాస్, దాచేపల్లి కృష్ణారెడ్డి, మద్దెబోయిన సత్యనారాయణ, సిద్ధంశెట్టి పెద్దనాగయ్య తదితరులు పాల్గొన్నారు. ఎంపీ రవిచ్రంద, ఎమ్మెల్సీ మధు -
మామిడి.. లేదు రాబడి..
మామిడి రైతులకు దెబ్బ మీద దెబ్బ ● తొలుత తెగుళ్లు.. ఇప్పుడు గాలిదుమారం, అకాల వర్షం ● కోత సమయాన కాయలు నేలరాలడంతో తీవ్ర నష్టం ● నాణ్యత తగ్గి పడిపోతున్న ధర తల్లాడ: ఈ ఏడాది మామిడి రైతులకు దెబ్బ మీద దెబ్బ తగిలింది. కోలుకోలేని నష్టం వాటిల్లింది. సాధారణంగా మేలో చెడు గాలులు, వానలు వస్తాయి. ఈసారి ఏప్రిల్ మొదటి వారం నుంచే అకాల వర్షం, గాలిదుమ్ములు వచ్చాయి. దీంతో మామిడి రైతులు తీవ్రంగా నష్ట పోయారు. కోతకొచ్చిన తరుణంలో అకాల వర్షం, పెను గాలుల కారణంగా మామిడి కాయలు నేల రాలాయి. ఈ నెలలో 3, 13, 15, 20 తేదీల్లో రాత్రి గాలి, వాన రావడంతో మామిడి కాయలు నేలరాలాయి. నాలుగు సార్లు గాలి, వాన రావడంతో కోసేందుకు సిద్ధంగా ఉన్న మామిడి కాయల్లో 30 నుంచి 40 శాతానికి పైగా కాయలు రాలిపోయాయి. గాలిదుమ్ము రాక ముందు టన్ను రూ.40 వేల నుంచి రూ.60 వేలు పలకగా ప్రస్తుతం రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు టన్ను ధర ఉంది. కాయ నాణ్యతను బట్టి ధర మారుతోంది. ఇక్కడి నుంచి మామిడికాయలను ముంబై, నాగ్పూర్, ఢిల్లీ, హైదరాబాద్ మార్కెట్కు తరలిస్తుంటారు. సత్తుపల్లిలో అత్యధికం జిల్లాలో 32 వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగవగా.. సత్తుపల్లి నియోజకవర్గంలోనే 20 వేల ఎకరాల్లో తోటలు ఉంటాయి. నెలలో నాలుగు సార్లు వచ్చిన గాలి, వాన కూడా సత్తుపల్లి నియోజక వర్గంలోని కల్లూరు, పెనుబల్లి, వేంసూరు, తల్లాడ మండలాల్లో ఎక్కువ ప్రభావం చూపటంతో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈనెలలో మామిడి కోతలు ప్రారంభమై మే నెలాఖారుతో ముగుస్తాయి. అంతకుముందు అధిక మంచు వల్ల పూత రాలింది. పూత నిల్వడం కోసం రైతులు ఐదు నుంచి పది సార్లు మందులు స్ప్రే చేశారు. తద్వారా ఎకరానికి రూ.20 వేల మేర పెట్టుబడి అయింది. తర్వాత మంగు తెగులు కారణంగా కొంత నష్టం జరిగింది. కౌలు రైతులకు తీరని నష్టం ఈ ఏడాది కౌలు రైతులకు తీరని నష్టం జరిగింది. ఎకరానికి రూ.20 నుంచి రూ.30 వేల వరకు కౌలుకు తీసుకోగా కాయలు రాలడంతో కోలుకోలేని దెబ్బ తిన్నారు. 5 ఎకరాల మామిడి తోట కౌలుకు తీసుకున్న వారు రూ.లక్షకు పైగా నష్టపోయారు. నష్టపరిహారం చెల్లించాలి గాలి వానతో నష్టపోయిన మామిడి పంట నష్టం అంచనా వేయాలి. నష్ట పోయన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది నష్టం వాటిల్లింది. పలుమార్లు గాలి, వాన రావడంతో పలు రకాల కాయలు నేలరాలాయి. –కోడూరు సత్యనారాయణ, కౌలు రైతు, కిష్టాపురం నష్టం అంచనా వేసి పంపించాం ఈ నెలలోనే మూడు సార్లు గాలి వాన రావడం వల్ల మామిడి పంటకు నష్టం జరిగింది. మామిడి కాయలు నేల రాలడంతో పగిలిపోయి దెబ్బతిన్నాయి. జిల్లాలో 33 శాతానికి పైగా నష్టపోయిన తోటలను ప్రాథమిక అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాం. –మధుసూదన్, జిల్లా ఉధ్యానశాఖాధికారిఅనుకూలించని వాతావరణం ఈ ఏడాది వాతావరణం మామిడికి అనుకూలించలేదు. కోతల ప్రారంభంలోనే గాలి దుమ్ములతో మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. తీవ్ర నష్టం ఏర్పడింది. మార్కెట్లో కూడా టన్ను ధర తగ్గింది. మామిడి రైతులను ఆదుకోవాలి. –తూము శ్రీనివాసరావు, నూతనకల్ -
నేడు, రేపు కార్యదర్శులకు శిక్షణ
ఖమ్మంసహకారనగర్: జిల్లాలో ఎంపిక చేసిన 35 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఈ నెల 22, 23వ తేదీల్లో ఆర్టీఏ చట్టంపై శిక్షణ ఇవ్వనున్నట్లు డీఆర్వో, ఎంసీహెచ్ఆర్డీ ఇన్చార్జ్ మేనేజర్ పద్మశ్రీ తెలిపారు. తొలి విడతగా 35 మందిని ఎంపిక చేశామని పేర్కొన్నారు. ఖమ్మం వీడీవోస్ కాలనీలోని ఎంసీహెచ్ఆర్డీలో శిక్షణ మొదలవుతుందని తెలిపారు. కాగా, మిగతా కార్యదర్శులకు సైతం విడతల వారీగా శిక్షణ ఉంటుందని డీఆర్వో వెల్లడించారు. లైన్ ఇన్స్పెక్టర్కు ప్రమాదం తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం, పిండిప్రోలు సబ్స్టేషన్ల లైన్ ఇన్స్పెక్టర్ గడికొప్పుల రాములు వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈదురుగాలులు, అకాల వర్షంతో ఆదివారం రాత్రి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఎదురవగా, సమస్యను పరిష్కరించేందుకు ఆయన కారులో వెళ్తున్నారు. ఈక్రమాన తిరుమలాయపాలెం వద్ద ప్రధాన రహదారిపై వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు విద్యుత్ స్తంభాలకు ఢీకొని బోల్తా పడింది. రాములు గాయపడగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యుదాఘాతంతో రెండు ఆవులు మృతికామేపల్లి: విద్యుత్ షాక్ కారణంగా రెండు ఆవులు మృత్యువాత పడ్డాయి. మండలంలోని గోవింద్రాలకు చెందిన రైతులు లకావత్ శ్రీను, బానోత్ నాగ తమ పశువులను సోమవారం మేతకు విడిచారు. అయితే, ఆదివారం రాత్రి ఈదురుగాలులతో తెగిపడిన తీగలను తాకిన ఆవులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాయి. ఈ మేరకు అధికారులు తమకు పరిహారం చెల్లించాలని బాధిత రైతులు కోరారు. -
బైక్ల చోరీ.. నంబర్ మార్చి విక్రయం
పెనుబల్లి: జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు చోరీ చేయడమే కాక నంబర్ ప్లేట్లు మార్చి ఇతరులకు అమ్ముతున్నారు. ఇప్పటివరకు 18 బైక్లను చోరీ చేసిన వీరు వీఎం బంజర్ పోలీసులకు పట్టుబడ్డారు. వివరాలను వీఎం బంజర్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కల్లూరు ఏసీపీ కె.రఘు, సత్తుపల్లి రూరల్ సీఐ ఎంఎల్.ముత్తిలింగయ్యగౌడ్, వీఎం బంజర్ ఎస్ఐ కె.వెంకటేశ్ వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట అర్బన్ కాలనీకి చెందిన మక్కెళ్ల నాగరాజు, సత్తుపల్లి మండలం తుంబూరుకు చల్లా శివప్రసాద్ వీఎం బంజర్, సత్తుపల్లి, వేంసూరు, అశ్వారావుపేట, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా పెద్దవేగి స్టేషన్ పరిధిలో రూ.12.45 లక్షల విలువైన 18 ద్విచక్రవాహనాలను చోరీ చేశారు. వీటిలో కొన్నింటి నంబర్ మార్చి పెనుబల్లి మండలం గంగదేవిపాడు, అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురం వాసులకు అమ్మగా, వచ్చిన డబ్బుతో జల్సాలు చేశారు. మిగతా వాహనాలను ఎన్ఎస్పీ కాలువ పక్కన పొదల్లో దాచి అందులో రెండింటిని అమ్మేందుకు వెళ్తుండగా ఆదివారం సాయంత్రం ఖమ్మం వైపు నుంచి వీఎంబంజర్ వైపు వెళ్లే మార్గంలో చేపట్టిన తనిఖీల్లో పట్టుబడ్డారు. ఎలాంటి పత్రాలు లేకపోగా, తడబడుతుండడంతో వాహనాల చాయిస్ నంబర్ ఆధారంగా ప్రశ్నించడంతో చోరీకి పాల్పడినట్లు అంగీకరించారు. దీంతో నాగరాజు, శివప్రసాద్ను అరెస్ట్ చేయడమే కాక వీరి నుంచి వాహనాలు కొనుగోలు చేసిన పెనుబల్లి మండలం గంగదేవిపాడుకు చెందిన ఓర్సు వెంకటనారాయణ, పందేళ్ల సింహాద్రి, తిరుమలకొండ కొండల్రావు, బత్తుల కొండల్రావు, అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురానికి చెందిన డేరంగుల నాగసాయి, ఉప్పతాల సతీశ్, ఉప్పతాల గోపి, ఉప్పతాల రాజుపైనా కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏసీపీ రఘు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐ వెంకటేశ్, కానిస్టేబుళ్లు శ్రీగాద రాజమల్లు, పి.వెంకటేశ్వర్లు, మోహిద్పాషా, బాలకృష్ణ, సురేశ్ను ఏసీపీ అభినందించి నగదు రివార్డులు అందజేశారు. రెండు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్ -
సండే.. ఎండలు మండే
● ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో సతమతం ● ఎండ తీవ్రతకు ఇళ్లకే పరిమితమైన జనం ● పగటి వేళ రోడ్లన్నీ నిర్మానుష్యంఖమ్మంవ్యవసాయం : భానుడు ఉగ్రరూపం దాల్చా డు. నిన్నా మొన్నటి వరకు అకాల వర్షాలతో ఉష్ణోగ్రత కొంతమేర అదుపులోనే ఉన్నా ఆదివారం మాత్రం జిల్లాలో 40 డిగ్రీలకు పైగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా చింతకాని, పమ్మి, బాణాపురంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, అత్యల్పంగా గుబ్బగుర్తి, రావినూతల, నాగులవంచ, సత్తుపల్లిలో 38.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత ప్రారంభమవుతుండగా.. 11 గంటల వరకు తీవ్రత పెరుగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు ఎండ ప్రభావం కొనసాగుతుండగా 6 తర్వాత కొంత మేర చల్లబడుతోంది. జనం సతమతం.. ఓ వైపు ఉష్ణోగ్రతలు, మరోవైపు ఉక్కపోతలతో ప్రజ లు సతమతమవుతున్నారు. ఉష్ణోగ్రతలకు తోడు గాలిలో తేమ లేకపోవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫ్యాన్లు తిరుగుతున్నా ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు ఎండ తీవ్రతతో ప్రజలు ఇళ్లకే పరి మితం అవుతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. వరి, మొక్కజొన్న, మిరప, మామిడి వంటి పంట కోతలకు వెళ్లే కూలీలు ఉదయం 6 గంటలకే పనులకు వెళ్లి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటికి చేరుకుంటున్నారు. కిరాణ, ఇతర దుకాణాలకు కూడా వినియోగదారులు ఉద యం, సాయింత్రం వేళల్లోనే వెళ్తున్నారు. సాయింత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దుకాణాల్లో రద్దీ ఉంటోంది. ఆదివారం 40 డిగ్రీలకు పైగానే.. జిల్లాలో గేటు కారేపల్లి, లింగాల, వైరాలో ఆదివారం 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఎర్రుపాలెంలో 42.6, కూసుమంచి 42.1, మధిర 42.0, పెనుబల్లి, నేలకొండల్లి, మధిర ఏఆర్ఎస్ 41.7, రఘునాథపాలెం 41.6, ఖమ్మం నగరం ఖానాపురంలో 41.4, కలెక్టరేట్, కాకరవాయిలో 41.2, ఖమ్మం ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్, బచ్చోడు, పల్లెగూడెంలో 41.0, తిరుమలాయపాలెం, ముదిగొండలో 40.9, ఖమ్మం ప్రకాష్నగర్లో 40.7, తల్లాడ, కుర్నవల్లిలో 40.6, సత్తుపల్లి జేవీఆర్ ఓసీపీ 1, 2, వేంసూరు, సిరిపురంలో 40.5, మంచుకొండ, పెద్దగోపతిలో 40.2, కల్లూరులో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
● అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం ● రూ.72.33 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన ● వైరా నదిపై ఎత్తిపోతల పథకం ప్రారంభంమధిర: అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, పనులు నాణ్యతగా ఉండేలా దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. మండలంలోని పలు గ్రామాల్లో రూ.72.33 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. తొలుత సిరిపురం గ్రామానికి చేరుకున్న భట్టికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. గ్రామస్తులు, పార్టీ శ్రేణులను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి యోగక్షేమాలు అడుగుతూ ముందుకు సాగిన ఆయన.. రూ.4.71కోట్లతో నిర్మించనున్న చెక్ డ్యామ్ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో రూ.5 కోట్లతో నిర్మించే ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన సముదాయానికి, రూ.11.37 కోట్లతో నిర్మించే ఐటీఐ భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత మహదేవపురం వద్ద వైరా నదిపై రూ.12.13 కోట్లతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. అనంతరం రాయపట్నంలో వైరా రివర్ కుడి కాల్వపై రూ.19.06 కోట్లతో 1,079 ఎకరాలకు సాగునీరు అందించే లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. మధిర నుంచి మొలుగుమాడు ద్వారా నిధానపురం గ్రామం వరకు రూ.25 కోట్లతో విస్తరిస్తున్న ఆర్అండ్బీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత మధిర క్యాంపు కార్యాలయంలో నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. శంకుస్థాపన చేసిన పనులన్నీ నిర్దిష్ట గడువులోగా పూర్తి చేసేలా క్యాలెండర్ ఫిక్స్ చేసుకోవాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ఇన్చార్జ్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, ఖమ్మం ఆర్డీఓ నర్సింహారావు, ఇరిగేషన్ సీఈ ఓ.వి. రమేష్ బాబు, కల్లూరు సర్కిల్ ఎస్ఈ జి.వాసంతి, మధిర డివిజన్ ఈఈ సీహెచ్. రామకృష్ణ, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసాచారి, ఆర్అండ్బీ ఎస్ఈ యుగంధర్, పీఆర్ ఈఈ వెంకట్ రెడ్డి, డీఈఈ వి.నాగబ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
రన్ రాజా.. రన్!
వేలాది మంది క్రీడాకారులకు ఓనమాలు నేర్పడమే కాక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే వేదికగా నిలిచిన ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో అథ్లెటిక్స్ క్రీడాకారుల కోసం సింథటిక్ ట్రాక్ అందుబాటులోకి రానుంది. రూ.6.65 కోట్ల వ్యయంతో ట్రాక్ నిర్మాణ పనులు మొదలయ్యయి. మట్టి ట్రాక్లో శిక్షణ పొందుతూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న క్రీడాకారులకు కొత్త ట్రాక్ అందుబాటులోకి వస్తే అత్యుత్తమ ప్రతిభ చాటే అవకాశముందని చెబుతున్నారు. – ఖమ్మం స్పోర్ట్స్పటేల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ● రూ.6.65కోట్ల నిధులతో పనులు ప్రారంభం ● మూడు నెలల్లో పూర్తిచేసేలా కార్యాచరణ మూడు నెలల్లో అందుబాటులోకి.. పటేల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ నిర్మాణాన్ని మూడు నెలల్లో పూర్తిచేస్తాం. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ రాగానే పనులను అధికారికంగా ప్రారంభి స్తాం. సింథటిక్ అందుబాటులోకి వస్తే అథ్లెట్లకు మెరుగైన శిక్షణ అందుతుంది. – టి.సునీల్రెడ్డి, డీవైఎస్ఓజాతీయస్థాయిలో సత్తా... ఇక్కడ అథ్లెట్లకు సరైన వసతులు లేక జాతీయస్థాయిలో రాణించలేకపోతున్నారు. సింథటిక్ ట్రాక్ అందుబాటులోకి వస్తే ఉత్తమ శిక్షణ అందుతుంది. తద్వారా మన క్రీడాకారులను భారత జట్టులో స్థానం పొందేలా తీర్చిదిద్దుతాం. – ఎం.డీ.గౌస్, అథ్లెటిక్స్ అకాడమీ చీఫ్ కోచ్ఏళ్ల క్రితమే ప్రతిపాదనలు ఖమ్మంలో అథ్లెటిక్స్ అకాడమీ ఏర్పాటై రెండు దశాబ్దాలు గడుస్తుండగా.. స్టేడియంలో ఇన్నాళ్లు సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి అడుగులు పడలేదు. జిల్లా క్రీడాశాఖ అధికారులు, అథ్లెటిక్స్ అసోసియేషన్ బాధ్యులు, కోచ్లు చొరవ చూపినా ఫలితం కానరాలేదు. గత ప్రభుత్వ హయాంలో ట్రాక్ మంజూరు చేసినా నిధులు మాత్రం కేటాయించలేదు. అంతేకా క ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడే సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయాలని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ భావించినా నిధుల లేమి వేధించింది. ఇంతలోనే ట్రాక్ ప్రతిపాదిత స్థలాన్ని క్రికెట్ శిక్షణకు కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. ఇలా రకరకాల అడ్డంకులతో ట్రాక్ నిర్మాణం ఓ అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్న చందంగా మారింది. పట్టుబట్టడంతో... గత రెండేళ్లుగా జిల్లా క్రీడల శాఖ, అథ్లెటిక్స్ అసోసియేషన్ బాధ్యులు, కోచ్లు సింథటిక్ ట్రాక్ కోసం పట్టుబట్టారు. స్టేడియంలో మట్టిట్రాక్పై శిక్షణ పొందిన అబ్దుల్ నజీబ్ఖురేషి, పవన్కుమార్, సుధాకర్ తదితరులు అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటారు. మరి కొందరు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధించారు. ఇక్కడ అకాడమీకి తోడు అనుభవం కలిగిన కోచ్ ఉన్నందున సింథటిక్ ట్రాక్ అందుబాటులోకి వస్తే క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందుతుందనే భావనతో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతిపత్రం ఇవ్వగా, ఆయన ట్రాక్ ఏర్పాటుపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మున్సిపల్ శాఖ అధికారులతో చర్చించి నిధుల కేటాయింపునకు సూచనలు ఇచ్చారు. ఈమేరకు ఏళ్లుగా క్రీడాకారులు ఎదురుచూస్తున్న సింథటిక్ ట్రాక్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఈ ట్రాక్ ను మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకురావా లనే లక్ష్యంతో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. -
రజతోత్సవ సభకు తరలిరావాలి
ఖమ్మంమయూరిసెంటర్ : తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా అని చాటి చెప్పేందుకు ఈ నెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ ఉమ్మడి జిల్లా నేతల సమావేశం నిర్వహించారు. పార్టీ రజతోత్సవ సభల జయప్రదానికి ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్ఎస్ శ్రేణుల తరలింపుపై దిశా నిర్దేశం చేశారు. సభకు వచ్చే వారికి అవసరమైన ఏర్పాట్లు, తాగునీరు, భోజనాల సరఫరాతో పాటు నియోజకవర్గాల వారీగా ఇన్చార్జ్ల నియామకం తదితర అంశాలపై చర్చించారు. రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఈనెల 27న ఉదయం ఉమ్మడి జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో పార్టీ జెండాలు ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లోని పార్టీ దిమ్మెలను ముస్తాబు చేయాలని, లేని చోట నిర్మించాలని సూచించారు. ఉమ్మడి జిల్లా నుంచి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఎల్కతుర్తి సభను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్రెడ్డి, కొండబాల కోటేశ్వరరావు, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, బానోతు హరిప్రియ, బానోత్ మదన్లాల్, బానోతు చంద్రావతి, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు, నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ, దిండిగాల రాజేందర్, ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ముత్యాల వెంకట అప్పారావు తదితరులు పాల్గొన్నారు.ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతల సమావేశంలో ఎమ్మెల్సీ తాతా, వద్దిరాజు, పువ్వాడ -
సన్న బియ్యానికి సై!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసిన సన్నబియ్యం తీసుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి కనబరిచారు. ఈనెల 1 నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభం కాగా.. నిత్యం రేషన్ దుకాణాల వద్ద క్యూ కట్టడం కనిపించింది. జిల్లాలో 748 రేషన్ దుకాణాలు ఉండగా.. 86.27 శాతం మంది ఈనెలలో బియ్యం తీసుకున్నారు. ఆయా షాపులకు చేరిన 7,375 మెట్రిక్ టన్నుల బియ్యంలో 6,276 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ పూర్తయింది. ఇక పోర్టబిలిటీతో కలిపి 90.26 శాతం మేర సన్నబియ్యం పంపిణీ జరిగింది. గతంలో దొడ్డు బియ్యం తీసుకునేందుకు చొరవ చూపని లబ్ధిదారులు.. ఈసారి సన్నబియ్యం రావడంతో అధిక సంఖ్యలో తీసుకున్నారు. దీంతో రేషన్దుకాణాల్లో అమ్మకాలు పెరిగాయి. ప్రస్తుతం షాపుల్లో 10 శాతం నిల్వలు మాత్రమే ఉన్నాయి. దొడ్డు బియ్యం అంతంతే.. ప్రభుత్వం గత నెల వరకు రేషన్ దుకాణాల ద్వారా దొడ్డుబియ్యం పంపిణీ చేసింది. అయితే ఈ బియ్యం తీసుకునేందుకు లబ్ధిదారులు అంతగా ముందుకు రాలేదు. అవి తినేందుకు అనుకూలంగా లేకపోవడంతో తక్కువ మంది మాత్రమే తీసుకెళ్లే వారు. వారిలోనూ కొందరు పిండి పట్టించడం లేదా ఇతరులకు అమ్మడం వంటివి చేసేవారు. కొందరు రేషన్కార్డుదారులైతే ఏళ్ల తరబడి షాపులకు రావడమే మానేశారు. దీంతో పేదల ఆకలి తీర్చాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. బియ్యం నిల్వలు పెరగడంతో అక్రమ రవాణాకు దారితీసేవి. కొందరు లబ్ధిదారులు బియ్యానికి బదులు డీలర్ల వద్ద డబ్బు తీసుకోవడంతో పేదల బియ్యం పక్కదారి పట్టాయి. అనేక చోట్ల ఇతర ప్రాంతాలకు లారీల్లో తరలిస్తుండగా అధికారులు పట్టుకున్న ఘటనలు కోకొల్లలు. మొదటి రోజు నుంచే ఆసక్తి.. ఈనెల 1 నుంచి రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైంది. గతంలో రేషన్ పంపిణీ ప్రారంభమైన కొన్ని రోజుల తర్వాతే లబ్ధిదారులు బియ్యం తీసుకునేవారు. అయితే సన్నబియ్యం ఎలా ఉన్నాయో చూడాలనే ఉద్దేశంతో మొదటి రోజు నుంచే తీసుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపారు. ఆ బియ్యాన్ని వండిన వారు భోజనం బాగుందని చెప్పడంతో మిగిలిన వారు సైతం దుకాణాల బాట పట్టారు. 86 శాతం అమ్మకాలు.. జల్లాలోని 748 రేషన్ దుకాణాల్లో బియ్యం అమ్మకాలు పూర్తయ్యాయి. జిల్లాలో 4,10,988 రేషన్కార్డులు ఉండగా.. 3,54,573 కార్డుల వారు బియ్యం తీసుకున్నారు. మొత్తంగా 86.27 శాతం అంటే 6,276 మెట్రిక్ టన్నుల బియ్యం లబ్ధిదారులకు చేరాయి. ఇక పోర్టబిలిటీతో కలిపి 90.26 శాతం అయింది. గతంలో 70 శాతం వరకు మాత్రమే బియ్యం పంపిణీ జరిగేది. 30 నుంచి 40 శాతం బియ్యం నిల్వలు ఉండేవి. అయితే ఈసారి కేవలం 10 శాతం మాత్రమే నిల్వలు ఉండటం గమనార్హం. ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో 1099.785 మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వ ఉంది. ఇవి కూడా మృతిచెందిన వారు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి సంబంధించనవేనని అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా పట్టణ ప్రాంతాల్లోని రేషన్ దుకాణాల్లో నిల్వలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం దాదాపు అందరూ బియ్యం తీసుకున్నారు. ఈనెల 1 నుంచి రేషన్ దుకాణాల్లో పంపిణీ బియ్యం తీసుకునేందుకు ఆసక్తి చూపిన లబ్ధిదారులు జిల్లాలో 86 శాతం మందికి సరఫరా పోర్టబిలిటీతో కలిపి 90 శాతం వరకు అమ్మకాలు గ్రామాల్లో షాపుల వద్ద క్యూ కడుతున్న కార్డుదారులుఅంతటా సన్నబియ్యమే.. గతేడాది వానాకాలం నుంచి రైతులు సన్నరకం ధాన్యం పండించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సన్న ధాన్యం పండించిన వారికి క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించడంతో అత్యధిక విస్తీర్ణంలో ఈ పంటలు సాగయ్యాయి. దీంతో వసతిగృహాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంతో పాటు రేషన్ దుకాణాల్లోనూ సన్న బియ్యం పంపిణీ చేయడానికి అవకాశం లభించింది. ముందుగానే ఏడాదికి సరిపడా నిల్వలు సేకరించిన ప్రభుత్వం.. రేషన్ దుకాణాల ద్వారా పంపిణీకి రంగం సిద్ధం చేసింది. దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటికీ సన్నబియ్యాన్నే వినియోగిస్తున్నారు. అటు రైతులకు బోనస్తో పాటు ఇటు లబ్ధిదారులకు సన్నబియ్యం అందుతున్నాయి. ప్రస్తుత యాసంగిలోనూ ఎక్కువ మంది రైతులు సన్న ధాన్యాన్నే సాగు చేయగా రేషన్ దుకాణాల్లో ఈ బియ్యం పంపిణీ కొనసాగనుంది. -
పలువురికి కవిత పరామర్శ
ఖమ్మంమయూరిసెంటర్ : రెండు రోజుల ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం ఖమ్మం చేరుకున్నారు. ఆమెకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాత మధుసూదన్ పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. వద్దిరాజు నివాసం నుంచి బయలుదేరి బీఆర్ఎస్ నాయకులు గుండాల కృష్ణ (ఆర్జేసీ) ఇంటికి వెళ్లారు. ఇటీవల అనారోగ్యంతో సర్జరీ అయిన కృష్ణను కవిత పరామర్శించారు. ఆ తర్వాత సీపీఐ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావును పరామర్శించారు. అలాగే నగరంలో జాగృతి నాయకులు గట్టు అరుణ కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరై వధూవరులు సాయి వివేక్–పావనిని ఆశీర్వదించారు. ఆమె వెంట మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు బానోత్ మదన్లాల్, బానోత్ హరిప్రియ, బానోత్ చంద్రావతి, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు తదితరులు ఉన్నారు. -
హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి
ఖమ్మం సహకారనగర్: తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశపరీక్ష హాల్టికెట్లను http:// telanganams.cgg.gov.in వెబ్సైట్ ద్వారా సోమవారం నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ సూచించారు. ఆరో తరగతి విద్యార్థులకు ఈనెల 27న ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, 7–10వ తరగతుల విద్యార్థులకు మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 4గంటల వరకు ప్రవేశ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు ఖమ్మం రాపర్తినగర్: జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలకు ఆసక్తి, అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకొవాలని జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారి ఎన్.మాధవి ఒక ప్రకటనలో సూచించారు. జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసి 21–38 ఏళ్ల వయస్సు ఉండాలని, కనీసం మూడేళ్ల పాటు ఆనుభవం కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. ఈమేరకు దరఖాస్తులను 25వ తేదీలోగా germanytriplewin2025@gmail.com మెయిల్కు పంపించాలని, వివరాలకు 94400 51581, 94400 48500, 94400 52081 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఓపెన్ స్కూల్ పరీక్షలు ప్రారంభంఖమ్మం సహకారనగర్ : తెలంగాణ ఓపెన్ స్కూల్ పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యా యి. తొలిరోజు పదో తరగతి పరీక్షలకు 488 మందికి గాను 420 మంది హాజరు కాగా 68 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్మీడియట్ పరీక్ష కు 646 మందికి గాను 575 మంది హాజరు కాగా, 71మంది గైర్హాజరయ్యారని డీఈఓ సోమశేఖర శర్మ, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా మద్దినేని పాపారావు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని వారు పేర్కొన్నారు. కాగా డీఈఓతో పాటు డీఐఈఓ రవిబాబు, ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. 25న ఉద్యోగుల సదస్సుటీజేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి ఖమ్మం సహకారనగర్ : జిల్లా తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) ఆధ్వర్యంలో ఈనెల 25న ఉద్యోగుల సదస్సు నిర్వహిస్తున్నామని, దాన్ని విజయవంతం చేయాలని టీజేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నగరంలోని టీఎన్జీవోస్ భవన్లో ఆదివారం సదస్సు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు టీఎన్జీఓస్ ఫంక్షన్ హాల్లో సదస్సు ఉంటుందని, 4 గంటలకు కలెక్టరేట్ నుంచి ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సదస్సుకు జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ తదితరులు హాజరవుతారని తెలిపారు కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు, కన్వీనర్ కస్తాల సత్యనారాయణ, నాయకులు యలమద్ది వెంకటేశ్వర్లు, పారుపల్లి నాగేశ్వరరావు, తుంబూరు సునీల్రెడ్డి, విజయ్, వీరస్వామి, కొణిదన శ్రీనివాస్, మోదుగు వేలాద్రి తదితరులు పాల్గొన్నారు. ‘భూ భారతి’పై అవగాహన కల్పించాలి నేలకొండపల్లి : భూ భారతి చట్టంపై ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ (రెవె న్యూ) పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. మండలంలోని రాయగూడెం, బోదులబండ గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన గ్రామ సభలను ఆయనతో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి పరిశీలించారు. రిజిస్టర్ల నమోదును తనిఖీ చేసి, ఏ సమస్యలపై ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయని ఆరా తీశారు. అనంతరం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రైతులకు తమ భూముల విషయంలో జవాబుదారీతనాన్ని పెంచేందుకే ఈ చట్టాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ వి.వెంకటేశ్వర్లు, డిప్యూటీ తహసీల్దార్ ఇమ్రాన్, ఆర్ఐలు ఆలస్యం మధుసూదన్రావు, అల్లం రవి, నాయకులు బోయిన వేణు, సూరేపల్లి రామారావు, తీగ రమణయ్య, పతానాపు నాగయ్య పాల్గొన్నారు. వల్లభిలో చెక్పోస్ట్ తనిఖీ.. ముదిగొండ : మండల పరిదిలోని వల్లభి చెక్ పోస్ట్ను అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదివా రం తనిఖీ చేశారు. తెలంగాణ–ఏపీ సరిహద్దులో చెక్ పోస్టు ఉండగా, రికార్డులు పరిశీలించి, విధుల్లో ఉన్న వారి వివరాలు సేకరించారు. చెక్ పోస్ట్ వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. మార్కెట్ వివరాలు సక్రమంగా రికార్డులో నమోదు చేయాలని, నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఆ చట్టం రాజ్యాంగ వ్యతిరేకం..
ఖమ్మంమామిళ్లగూడెం: వక్ఫ్ సవరణ చట్టం–2025 రాజ్యాంగ వ్యతిరేకమని, దేశంలో మరో విభజనకు బీజేపీ కుట్ర పన్నుతోందని, సంఘటిత ఉద్యమాల ద్వారానే దీనిని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని పలు పార్టీల నాయకులు, ప్రజా సంఘాల బాధ్యులు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా ఖమ్మం యూనిట్ ఆధ్వర్యంలో మహ్మద్ అసద్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించగా జమాతే ఇస్లామి హింద్ నాయకులు మహ్మద్ సాధిక్ మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగమే ఊపిరి అని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, ఈ చట్టాన్ని ఉపసంహరించుకునే వరకు ప్రణాళికాయుతమైన కార్యాచరణ తలపెట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సీపీఐ జాతీయ నాయకులు బాగం హేమంతరావు మాట్లాడుతూ.. ఈ చట్టంతో బీజేపీ మత కలహాలను రెచ్చగొట్టాలని చూస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ జగదీశ్, కాంగ్రెస్ నేత, మస్జిద్ ఏ ఆయేషా (సదర్) ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్ రషీద్, ప్రజాపంథా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు, సీపీఎం రాష్ట్ర నాయకులు ఎం.సుబ్బారావు, తెలంగాణ ఉద్యమకారులు డాక్టర్ కేవీ కృష్ణారావు, పీడీఎస్యూ నాయకులు ఆజాద్, ఖమర్, డాక్టర్ గోపీనాథ్ పాల్గొన్నారు. వక్ఫ్ సవరణ చట్టంతో ముస్లింలకు మేలు ఖమ్మంమామిళ్లగూడెం: వక్ఫ్ సవరణ చట్టం అమలుతో పేద ముస్లింలు, మైనార్టీ మహిళలకు మేలు చేకూరుతుందని, పాత వక్ఫ్ బోర్డు అమలు అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడమేనని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీనివాస్గౌడ్, హైకోర్టు న్యాయవాది, బీజేపీ రాష్ట్ర నాయకులు సుంకర మౌనిక విమర్శించారు. వక్ఫ్ చట్ట సవరణ చట్టం 2025 జన జాగరణ అభియాన్ పేరుతో ఖమ్మంలోని హోటల్ మినార్ గ్రాండ్లో ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో వర్క్షాప్ నిర్వహించారు. తొలుత ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బీజేపీ తమిళనాడు, కర్ణాటక సహ ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్రెడ్డి వక్ఫ్ బోర్డు సవరణ చట్టం వల్ల ముస్లిం మైనార్టీలకు ఒనగూరే ఉపయోగాలు, పకడ్బందీగా అమలు కాకపోతే వచ్చే నష్టాల గురించి ఫోన్ ద్వారా తెలిపారు. నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు ముస్లిం మైనార్టీలను భయాందోళనలకు గురిచేస్తూ దేశాన్ని అగ్నిగుండంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వక్ఫ్ బోర్డు వల్ల ముస్లింలకు అన్యాయం తప్ప ఉపయోగం ఏమాత్రమూ లేదన్నారు. కార్యక్రమంలో నున్నా రవికుమార్, నంబూరి రామలింగేశ్వరరావు, విజయరాజు, ఈవీ రమేశ్, వీరవెల్లి రాజేశ్గుప్తా, కొలిపాక శ్రీదేవి, ఎస్కే యాకూబ్పాషా, పమ్మి అనిత తదితరులు పాల్గొన్నారు. పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు -
విజేతలకు బహుమతుల అందజేత
ఖమ్మంస్పోర్ట్స్: నగరంలోని సర్వజ్ఞ పాఠశాలలో ఉమ్మడి జిల్లాస్థాయి చదరగం పోటీలు ఆదివారం జరిగాయి. బహుమత్రి ప్రదానానికి ముఖ్య అతిథిగా సర్వజ్ఞ స్కూల్ చైర్మన్ నాగేంద్రకుమార్ అంతర్జాతీయ రేటింగ్ క్రీడాకారుడు, నిర్వాహకుడు, సీహెచ్.గోపి, రాష్ట్ర చెస్ అసోసియేషన్ బాధ్యులు జి.జ్యోత్న్స, డి.సాంబశివరావు, రామారావు, ఎస్.అరుణ, సాయికుమార్ హాజరై విజేతలకు బహూమతులు అందజేశారు. అండర్–10 బాలురలో శివనాగసాయి, కె.నీరాజ్, అనురాగ్ ప్రకాష్, బాలికల్లో బ్రిందభావజ్ఞ, చరిత, దుర్గారాయ్, అండర్–13 బాలురలో ప్రతీక్సింగ్, అనిష్ సూర్య, ద్యుమన్, బాలికల్లో యశ్వితసాలిపవార్, కావ్యశ్రీ, లాస్య, అండర్–16 బాలికల్లో ఎం.వర్షిత, ఎస్.కీర్తన, హిమజ విజేతలుగా నిలిచారు. బైక్లను ఢీకొన్న లారీ ఒకరి మృతి.. నేలకొండపల్లి: బైక్ను ఢీకొట్టిన లారీ.. తప్పించుకునే క్రమంలో మరో బైక్ను ఢీకొట్టడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని బోదులబండ అండర్పాస్ వద్ద రాజస్థాన్కు చెందిన, క్వారీలో పనిచేసే కూలీల బైక్ను లారీ ఢీకొట్టింది. అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో లారీని వేగంగా నడుపుతూ డ్రైవర్.. కొద్దిదూరంలో మరోబైక్ను ఢీకొట్టాడు. దీంతో మొదటి బైక్పై వస్తున్న రాజస్తాన్ కూలీల్లో హరికిరణ్ (36) మృతిచెందాడు. అదే ప్రమాదంలో రాజ్బహుదూర్, రాంజీలాల్, మరో బైక్పై వస్తున్న తిరుమలాపురం గ్రామనికి చెందిన భూక్యా వెంకటసాయి తీవ్రంగా గాయపడ్డారు. లారీడ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. లారీడ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. చెన్నారంలో చోరీలు.. నేలకొండపల్లి: మండలంలోని చెన్నారంలో రెండు ఇళ్లలో చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని చెన్నారంలో మూడు రోజుల కిందట కందగట్ల కృష్ణ, బోయినపల్లి వేణు నివాసాల్లో చోరీ జరిగింది. తలుపులు పగలగొట్టి.. బీరువాలో ఉన్న నగదును చోరీ చేశారు. రెండిళ్లలో కలిపి రూ.6 వేల వరకు నగదు చోరీకి గురవగా.. ఆదివారం బాధితులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు మందలించారని యువకుడు ఆత్మహత్య నేలకొండపల్లి: ఖరీదైన మొబైల్ కొన్నందుకు తల్లిదండ్రులు మందలించారని.. ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని శంకరగిరితండాకు చెందిన ధరావత్ రాజు (24) రెండు రోజుల కిందట ఖరీదైన మొబైల్ కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా అంత ఖరీదు పెట్టి ఎందుకు కొనుగోలు చేశావని.. పైగా ఏపని చేయటం లేదని.. తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపం చెందిన రాజు పురుగులమందు తాగగా కుటుంబసభ్యులు ఖమ్మం వైద్యశాలకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధుడు అదృశ్యం చింతకాని: మండలంలోని ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన 64 ఏళ్ల తుడుం బక్కయ్య కనిపించకుండా పోయిన ఘటనపై స్థానిక పోలీస్స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. గత నెల 20వ తేదీన కటింగ్ చేయించుకుంటానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన బక్కయ్య తిరిగి రాలేదు. బక్కయ్య కుమారుడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్ఐ నాగుల్మీరా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. మోటారు చోరీ నేలకొండపల్లి: వ్యవసాయ విద్యుత్ మోటార్లను దుండగులు చోరీ చేశారు. మండలంలోని మోటాపురం గ్రామానికి చెందిన ఏలూరి రవికుమార్కు చెందిన పొలం వద్ద ఉన్న విద్యుత్ మోటార్ను గుర్తు తెలియని దుండగలు చోరీ చేశారు. బాధితుడు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. ఇసుక ట్రాక్టర్ సీజ్ బోనకల్: ఏపీ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను ఎస్ఐ మధుబాబు పట్టుకొని సీజ్ చేశారు. ఏపీలోని లింగాల నుంచి బోనకల్ మండలం ఆళ్లపాడు మీదుగా ట్రాక్టర్లో ఇసుక తరలిస్తుండగా ఎస్ఐ పట్టుకున్నారు. ట్రాక్టర్ను సీజ్ చేసి, పోలీస్ స్టేషన్కు తరలించారు. -
ఎప్సెట్ ఉచిత శిక్షణ
● కోచింగ్ తీసుకుంటున్న 100 మంది విద్యార్థులు ● బాల, బాలికలకు వేర్వేరుగా శిక్షణ ● పర్యవేక్షిస్తున్న అధికార యంత్రాంగం ఖమ్మంసహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లోనూ విద్యను అందించేందుకు కృషి చేస్తున్నది. ఈ క్రమంలో విద్యతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణను సైతం ఉచితంగా అందిస్తోంది. నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బాలురకు, అంబేడ్కర్ గురుకుల కళాశాలలో బాలికలకు ఉచితంగా ఎప్సెట్ కోచింగ్ను అందిస్తున్నారు. 100 మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు. జిల్లాలో 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుండగా.. వీటి పరిధిలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 468 మంది, బైపీసీ 283 మంది విద్యార్థులున్నారు. అందులో ఆసక్తి కలిగిన విద్యార్థులకు ఎప్సెట్ కోచింగ్ ఇస్తున్నారు. వేర్వేరుగా శిక్షణ విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వేసవి కాలం కావడంతో మంచినీటితోపాటు మౌలిక సదుపాయాలు కల్పించారు. విద్యార్థినులకు నగరంలోని అంబేడ్కర్ గురుకుల కళాశాల, బాలురకు నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శిక్షణ ఇస్తుండగా.. వీరంతా ఆయా కళాశాలల పరిధిలోని హాస్టళ్లలో ఉంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు శిక్షణ ఉంటోది. ఆ తర్వాత స్టడీ అవర్స్ ఉంటాయి. శిక్షణలో విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అదనపు కలెక్టర్ పర్యవేక్షణ జిల్లాలో విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తున్న క్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ శ్రీజ ఎప్సెట్ కోచింగ్ కేంద్రాలను సందర్శిస్తూ వారికి సూచనలు చేస్తున్నారు. ఉన్నత విద్య వల్ల కలిగే ప్రయోజనాలు తెలియజేస్తూ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులు, గురుకులాలకు సంబంధించిన అధ్యాపకులు బోధిస్తున్నారు. అలాగే ఒకరిద్దరు ప్రైవేట్ కళాశాలల అధ్యాపకులను కూడా నియమిస్తున్నారు. సద్వినియోగం చేసుకోవాలి.. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ప్రత్యేకంగా ఎప్సెట్ కోచింగ్ ఇస్తున్నాం. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచనలతో ఈ శిక్షణ అందిస్తున్నాం. ఇతర సెంటర్లలో కోచింగ్ తీసుకోలేని విద్యార్థులకు ఇది మంచి అవకాశం. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఈ కోచింగ్ ద్వారా మంచి ర్యాంక్ సాధించి ఇంజనీరింగ్ సీట్లు సాధించాలని ఆకాంక్షిస్తున్నాం. జీవితంలో విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు ఇలాంటి శిక్షణ ఉపయోగపడుతుంది. కె.రవిబాబు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి, ఖమ్మం శిక్షణలో ఎన్నో నేర్చుకుంటున్నాం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఉచిత శిక్షణను ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటం అభినందనీయం. మాకున్న సందేహాలు ఎప్సెట్ కోచింగ్ ద్వారా నివృత్తి చేసుకుంటున్నాం. శిక్షణలో ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. ప్రవేశ పరీక్షలపై ఉన్న భయం తొలగిపోయింది. అధ్యాపకులు సైతం మాకు ఎన్నో అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని, ప్రవేశ పరీక్షల్లో రాణిస్తాం. ఎస్.భానుతేజ, ఎంపీసీ, బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల -
వేసవిలోనూ పోషకాహారం..
● చిన్నారులకు అందించేందుకు సన్నద్ధమవుతున్న అధికారులు ● 15 రోజులు టీచర్లు, మరో 15 రోజులు ఆయాలతో పంపిణీ ● టేక్ హోం రేషన్కు అవకాశమివ్వాలని కోరుతున్న సంఘాలు ఖమ్మంవన్టౌన్: వేసవికాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు నెలన్నర రోజులు సెలవులు ఉండనున్నాయి. కానీ, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పనిచేసే అంగన్వాడీ కేంద్రాలకు మాత్రం చిన్నారులకు పౌష్టికాహారం అందించే విధంగా అంగన్వాడీ కేంద్రాలను ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు తెరిచి ఉంచే విధంగా జిల్లా సంక్షేమశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందుకోసం రానున్న మేతో పాటు జూన్లో పాఠశాలలు తెరిచే వరకు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సగం, సగం రోజులు అంగన్వాడీ కేంద్రాలను తెరిచి పౌష్టికాహారం అందించనున్నారు. అధికారుల ఏర్పాట్లు జిల్లాలో ఉన్న 1,840 అంగన్వాడీ కేంద్రాల్లో 54,712 మంది చిన్నారులు, 12,715 మంది గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. వేసవిలో సైతం చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే రేషన్ను ఆపకుండా ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీచర్లు, ఆయాలు ఉన్న కేంద్రాల్లో చెరి సగం రోజులు చిన్నారులకు ఆహారం అందించేలా ఆదేశాలు జారీ చేశారు. కాగా, వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పాఠశాలల్లాగానే తమకు సెలవులు ఇవ్వాలని పలు అంగన్వాడీ టీచర్ల, ఆయాల సంఘాలు కోరుతున్నాయి. చిన్నారులకు, గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నెలకు సరిపడా టేక్ హోం రేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇంకా నిర్ణయం తీసుకోలేదు.. ప్రతి వేసవిలో లాగానే ఈ వేసవిలో కూడా సగం రోజులు టీచర్లు, సగం రోజులు ఆయాలు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి పౌష్టికాహారం అందించే విధంగా చర్యలు చేపట్టాం. టేక్ హోం రేషన్పై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇవ్వాలని సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా మా శాఖ చర్యలు చేపడుతుంది. కీసర రాంగోపాల్రెడ్డి, ఐసీడీఎస్ పీడీ టేక్హోం రేషన్కు అవకాశమివ్వాలి.. ఈ వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల లాగానే వేసవి సెలవులు మాకు సైతం ఇవ్వాలి. వేసవిలో 40 డిగ్రీలకు పైగా ఎండ తీవ్రత ఉంటుండడంతో ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రానికి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. మా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం టేక్హోం రేషన్ అందించేందుకు అవకాశమివ్వాలి. గత నెలలో ఇదే విషయంపై జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ఖాన్కు సైతం వినతిపత్రం అందించాం. కాటం కోటేశ్వరమ్మ టీచర్, సీఐటీయూ -
జర భద్రం..
● వేసవి సెలవుల్లో తాళం వేసి ఊరెళ్తున్నారా..? ● తప్పక ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే.. ● పోలీస్ గస్తీ ముమ్మరం ఖమ్మంక్రైం: పాఠశాలలు, కళాశాలలు అన్పింటికీ దాదాపుగా నేడో, రేపో వేసవి సెలవులు ప్రకటించనున్నారు. ఇప్పటికే కొన్ని విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. రెండు నెలల పాటు సెలవులు ఉండటంతో ముందుగానే పిల్లలతో కలిసి కుటుంబ సబ్యులందరూ పలు ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రణాళిక వేసుకునే ఉంటారు. దీనికితోడు వివాహాలు కూడా ఉండటంతో బంధువులింటికి వెళ్లేందుకు సిద్ధమయ్యే ఉంటారు. అయితే, దొంగల నుంచి తమ సొత్తును రక్షించుకునేందుకు ఇంటికి తాళం వేసి ఊరెళ్లేవారు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పోలీసులు చెబుతున్నారు. లేదంటే అంతే సంగతులు. తిరిగి వచ్చేసరికి ఖాళీ చేసి పెడతారు దొంగలు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా దొంగల సంచారం ఉండటంతో తాళం వేసి ఊర్లు వెళ్లే వారు ఈ జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందేనని పోలీస్ శాఖ చెబుతోంది. ● ఇంట్లో బంగారు ఆభరణాలు, నగదును బ్యాంక్ లాకర్లో భద్ర పరుచుకోవాలి. లేదంటే తమకు తెలిసిన సురక్షిత ప్రాంతాల్లో దాచుకోవాలి. ● ఇంటి బీరువా తాళాలను తమ వెంట తీసుకొని వెళ్లాలి. విలువైన వస్తువులు, వ్యక్తిగత విషయాలు(తమ వద్ద ఉన్న డబ్బు, నగలు గురించి) ఇతరులతో పంచుకోకూడదు. ● బయట గేట్కు తాళం వేయకుండా లోపలి నుంచి గొళ్లెం పెట్టాలి. ఇంటి లోపల, ముఖ్యంగా వరండాలో లైట్లు వేసి ఉంచాలి. ● అపార్ట్మెంట్లలో సీసీ కెమెరాలు తప్పక ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పటికప్పుడు అవి పనిచేస్తున్నాయో లేదో పరిశీలించాలి. పగలు, రాత్రి సమయాల్లో కూడా వాచ్మెన్లు ఉండేలా చూసుకోవాలి. వృద్ధులు, దివ్యాంగులను ఒంటరిగా ఇళ్లల్లో ఉంచి పోకూడదు. ● ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లే ముందు చుట్టు పక్కల వారికి, స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. ముఖ్యంగా శివారుకాలనీలు, అపార్ట్మెంట్ల పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తుంటే వెంటనే పోలీసులు, లేదా డయల్–100కు సమాచారం ఇవ్వాలి. పోలీస్ పెట్రోలింగ్ పెంచాం వేసవి కాలంలో దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉండటంతో జిల్లావ్యాప్తంగా పోలీస్ పెట్రోలింగ్ విస్తృతంగా పెంచాం. ప్రత్యేక బృందాలతో రాత్రి వేలళ్లో గస్తీ ముమ్మరం చేయాలని జిల్లా పోలీస్ అధికారులను ఇప్పటికే ఆదేశించాం. తాళాలు వేసి ఊర్లకు వెళ్లే ప్రజలు ఇంటి పక్కవారికి లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. విలువైన వస్తువులు, నగదు ఇంట్లో ఉంచి వెళ్లొద్దు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అనుమానంగా ఎవరైనా సంచరిస్తుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఆరుబయట నిద్రించేవారు ఇంటి చుట్టూ తలుపులు వేసుకొని జాగ్రత్తగా ఉండాలి. నగలు ధరించకూడదు. సునీల్దత్, సీపీ, ఖమ్మం -
బస్సులు, రైళ్లలో ప్రయాణించేవారు..
● ప్రయాణికులు తమ విలువైన వస్తువులు డబ్బు, ఫోన్, లాప్టాప్లను తమ ముందు పెట్టుకున్న బ్యాగ్లో లేదా, ఒంటికి దగ్గరగా ఉంచుకోవాలి. ● బ్యాగులు పూర్తిగా మూసి ఉంచాలి. వెనుక జేబుల్లో వస్తువులు పెట్టుకోకూదు. ● బ్యాగులను కాళ్ల దగ్గర లేదా, ఒడిలో ఉంచుకోవాలి. పైన ర్యాక్లపై ఉంచితే వాటిపై నిఘా ఉంచాలి. ● విలువైన వస్తువులున్న బ్యాగులను పైన ఉంచకపోవడం మంచిది. సెల్ఫోన్ లేదా ల్యాప్టాప్ను అవసరం లేకపోతే బయటకు తీయవద్దు. పబ్లిక్ ప్రదేశాలల్లో వాటిని తీసేటస్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాటికి పాస్వర్డ్ వంటి భద్రతా ఫీచర్లు ఉపయోగించుకోవాలి. ● బస్సులు, రైలు ఎక్కేటప్పుడు, దిగేటడప్పుడు తొందరపడకుండా తమ వస్తువులన్నీ సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. -
కళాక్షేత్రం అభివృద్ధికి కృషి
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం సాహిత్య రంగానికి కేంద్రంగా విరాజిల్లుతున్న భక్త రామదాసు కళాక్షేత్రం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. నెల నెలా వెన్నెల 93వ కార్యక్రమం ఆదివారం రాత్రి ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షత్రంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మాట్లాడుతూ.. కనుమరగవుతున్న నాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రతి నెలా కార్యక్రమాలను నిర్వహించటం అభినందయమన్నారు. ఈ సదర్భంగా హైదరాబాద్ కళాబృందం ప్రదిర్శించిన ‘హక్కు’నాటికను ఎంపీ తిలకించారు. అమరజీవి అన్నాబత్తుల రవీంద్రనాథ్ కళా సాంస్కృతిక సంస్థ (ఆర్క్స్) అధ్యక్ష, కార్యదర్శులు మోటమర్రి జగన్మోహన్రావు, ఏఎస్ కుమార్, ఖమ్మం కళాపరిషత్ అధ్యక్షులు నాగబత్తిని రవి, కె.దేవేంద్ర, ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నామా లక్ష్మీనారాయణ, వేముల సదానందం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మెంతుల శ్రీశైలం, మహ్మద్ ముస్తాఫా, రాధాకృష్ణ, జాబిశెట్టి పాపారావు, యాంకర్ రవీందర్, మారుతి కొండల్రావు, వీరబాబు, సాయి, శశి తదితరులు పాల్గొన్నారు. అలరించిన కార్యక్రమాలు 93వ నెల నెలా వెన్నెల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. తొలుత హైదరాబాద్కు చెందిన దాశరథి థియేటర్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం సహకారంతో లఘుచిత్రాలను ప్రదర్శించారు. ఖమ్మం కళాకారుడు నటించిన ‘అమ్ము’, సినీ నటుడు ఎల్బీ శ్రీరాం నటించిన ‘పసుపు కుంకుమ’లఘు చితాల్రను ప్రదర్శించారు. వడ్డే ఆచరణ కూచిపూడి నృత్యం, నామా ప్రణవికసాయి భరతనాట్యం ఆకట్టుకున్నాయి. మొక్కజొన్న పంట దగ్ధం బోనకల్: మండలంలోని ఆళ్లపాడు గ్రామంలో ఆదివారం ప్రమాదవశాత్తు నిప్పంటుకొని రెండు ఎకరాల మొక్కజొన్న పంట దగ్ధమైంది. గ్రామానికి చెందిన మలాది అచ్చయ్య నారాయణపురం మైనర్ కాలువ పరిధిలో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేశాడు. ఇటీవల గాలిదుమారానికి మొక్కజొన్న నేలకొరిగింది. కూలీల కొరత ఉండడంతో మొక్కజొన్న కంకులు ఇరవడం ఆలస్యమైంది. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు పక్క పొలాల్లో నిప్పంటించడంతో మంటలు ఈ పంటకు కూడా అంటుకున్నాయి. పంట అంతా కాలి బూడిదవడంతో రూ.1.50 లక్షలు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. -
నాణ్యమైన డిజిటల్ సేవలు
కామేపల్లి: మహిళా శక్తి మోడల్ సీఎస్సీలు గ్రామీణ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజల కు నాణ్యమైన డిజిటల్ సేవలు అందించేందుకు ఉపయోగపడతాయని డీఐసీఎస్సీ స్టేట్ ప్రాజెక్టు మేనేజర్ బేతోజు హరికృష్ణకుమార్ తెలిపారు. కామేపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో కామేపల్లి, కారేపల్లి, ఏన్కూర్ మండలాల వర్క్షాప్ నిర్వహించారు. ఈసందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ రాజీవ్ యువవికాసం ద్వారా నిరుద్యోగ యువత, గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించేందుకు మోడల్, మహిళా శక్తి మోడల్ సీఎస్సీలు ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. ఎంపీడీఓ రవీందర్, ఎంపీఓ ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీవారికి అభిషేకం.. ఎర్రుపాలెం: జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేకపూజలు జరిగాయి. స్వామి మూలవిరాట్తో పాటు ఆవరణలోని స్వామి వారి పాదాలకు అర్చకులు పంచామృతంతో అభిషేకం చేశారు. ఆతర్వాత స్వామి, అమ్మవార్లను అలంకరించి నిత్యకల్యాణం జరిపించారు. అనంతరం పల్లకీ సేవ చేశారు. ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. -
తక్షణ పరిష్కారానికే భూభారతి
కూసుమంచి/తిరుమలాయపాలెం: రాష్ట్రప్రభుత్వం భూములకు సంబంధించి సమస్యల తక్షణ పరిష్కారానికే భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని ఇన్చార్జ్ కలెక్టర్ డాక్టర్ శ్రీజ తెలిపారు. మండలంలోని పాలేరులో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. కొత్త చట్టంతో పెండింగ్ ఉన్న సమస్యలకు మోక్షం కలగనుండగా, హక్కులు పొందడం, సవరణలకు అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే, భూధార్ కార్డులు జారీ చేయడమే కాక ఉచిత న్యాయసాయం అందిస్తామన్నారు. అలాగే, తిరుమలాయపాలెంలో నిర్వహించిన సదస్సులో కూడా ఇన్చార్జ్ కలెక్టర్ శ్రీజ మాట్లాడారు. భూభారతి చట్టం ద్వారా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, సాదాబైనామాల రిజిస్ట్రేషన్ తీరును వివరించారు. కాగా, సుబ్లేడు గ్రామానికి చెందిన ఎస్.డీ.జియావుద్దీన్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం, భూముల కబ్జాపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఇన్చార్జ్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన ఆమె.. అందరు అధికారులను తప్పుపట్టలేమని అంకితభావంతో పనిచేసే వారు కూడా ఉన్నారని.. కొత్త చట్టం అమలులో అధికారులకు అందరూ సహకరించాలని కోరారు. ఈ సదస్సుల్లో నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేశ్, ఆర్డీఓ నర్సింహారావు, తహసీల్దార్లు కరుణశ్రీ, సుధీర్, ఎంపీడీఓలు వేణుగోపాల్రెడ్డి, సిలార్ సాహెబ్, ఏడీఏ సరిత, ఏఓలు వాణి సీతారాంరెడ్డి, మద్దులపల్లి మార్కెట్ వైస్ చైర్మన్ నరేందర్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ చావా వేణు తదితరులు పాల్గొన్నారు.ఇన్చార్జ్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ -
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
కూసుమంచి: అకాల వర్షాల నేపథ్యాన ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. మండలంలోని పాలేరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం తనిఖీ చేసిన ఆయన వివరాలు ఆరా తీసి మాట్లాడారు. రైతులు ధాన్యం తీసుకురాగానే నాణ్యత ఆధారంగా కాంటా వేయించడమే కాక ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. రైతులు వేచిఉండకుండా మిల్లులకు ఎప్పటికప్పుడు తరలించాలని సూచించారు. అనంతరం కేంద్రంలోని ప్యాడీ క్లీనర్ పనితీరును అదనపు కలెక్టర్ పరిశీలించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్కుమార్, సంస్థ మేనేజర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. -
నేడు, రేపు డిప్యూటీ సీఎం పర్యటన
మధిర: డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆది, సోమవారాల్లో మధిర నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మధిర మండలం సిరిపురంలో రూ.11.37 కోట్లతో నిర్మించే ఐటీఐ భవనం, రూ.4.71 కోట్లతో నిర్మించనున్న చెక్డ్యాం, రూ.5కోట్లతో నిర్మించే ప్రభుత్వ జూని యర్ కళాశాల భవనాలకు ఆదివారం ఉద యం శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, మధ్యాహ్నం రూ.12.14 కోట్లతో నిర్మించిన మహాదేవపురం లిఫ్ట్ను ప్రారంభించాక రూ.19 కోట్లతో నిర్మించే రాయపట్నం ఎత్తిపోతల పథకం, మధిర నుండి నిదానపురం మీదుగా ములుగుమాడు రహదారి పనులకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 6గంటలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమావేశంలో డిప్యూటీ సీఎం పాల్గొంటారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్, మిర్యాల రమణగుప్తా ఒక ప్రకటనలో కోరారు. రేపు మెగా జాబ్మేళా మధిరలోని రెడ్డి గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించే జాబ్మేళాను డిప్యూటీ సీఎం భట్టి ప్రారంభిస్తారు. ఎనభై కంపెనీల బాధ్యులు హాజరుకానుండగా, దాదాపు 5వేల మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా డిప్యూటీ సీఎం సూచనలతో జాబ్మేళా ఏర్పాటుచేస్తున్నారు. ఆదాయ లక్ష్యాలు చేరుకోవాలి ఖమ్మంక్రైం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రవాణా శాఖ అధికారులు లక్ష్యాల మేర పన్నులు రాబట్టాలని శాఖ కమిషనర్ సురేంద్రమోహన్ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శనివారం వీసీ ద్వారా మాట్లాడిన ఆయన వాహనాలు, చెక్పోస్ట్ల ద్వారా పన్నులు వసూలు చేయాలని తెలిపారు. వీసీకి ఖమ్మం ఇన్చార్జ్ డీటీఓ, భద్రాద్రి డీటీఓ వరప్రసాద్, వెంకటరమణ హాజరయ్యారు. విద్యాసంస్థలో రోడ్డు సేఫ్టీ క్లబ్లు జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో రోడ్డు సేఫ్టీ క్లబ్లు ఏర్పాటుచేయాలని రోడ్డు సేఫ్టీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్రిన్ సిద్ధిఖీ సూచించారు. ఖమ్మం రవాణా శాఖ కార్యాలయంలో విద్యాసంస్థల బాధ్యులతో సమావేశమైన ఆమె విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేలా క్లబ్లు ఏర్పాటుచేయాలని తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి డీటీఓలు వరప్రసాద్, వెంకటరమణ ఉద్యోగులు శ్రీనివాస్, స్వర్ణలత, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు వాయిదా కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలా బాద్ జిల్లాల్లో డిగ్రీ కోర్సుల 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్షలు, మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ల పరీక్షలు (బ్యాక్లాగ్) ఈనెల 21నుంచి జరగాల్సి ఉంది. అయితే, వీటిని వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ శనివా రం వెల్లడించారు. ఎక్కువ శాతం ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు సంబంధించి విద్యార్థుల పరీక్ష ఫీజును యూనివర్సిటీకి చెల్లించకపోగా, నామి నల్ రోల్స్ కూడా పంపలేదు. దీంతో పరీక్షలను వాయిదా వేశామని, తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని రాజేందర్ శనివా రం ఓ ప్రకటనలో తెలిపారు. -
తెలంగాణలోనే సన్నబియ్యం
● రేషన్షాపుల్లో ఇస్తున్న ఘనత మనదే.. ● లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన మంత్రి తుమ్మల, అధికారులు రఘునాథపాలెం: రేషన్షాప్ల ద్వారా తెలంగాణలో మాత్రమే పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రఘునాథపాలెం మండలం బూడిదంపాడులో సన్నబియ్యం లబ్ధిదారుడు గుడిబండ్ల రాజారావు ఇంట్లో పోలీసు కమిషనర్ సునీల్దత్, ఇన్చార్జ్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి మంత్రి శనివారం భోజనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో పేదలు సన్నబియ్యం కొనలేక ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు. ప్రస్తుతం రేషన్షాప్ల ద్వారా ఉచితంగా ఇస్తుండడంతో అందరూ సంతృప్తిగా భోజ నం చేస్తున్నారని తెలిపారు. అంతేకాక రేషన్ బియ్యం రీసైక్లింగ్కు అడ్డుకట్ట పడినట్లయిందని వెల్లడించారు. కాగా, సన్నధాన్యానికి మద్దతు ధరకు తోడు రూ.500 బోనస్ ఇస్తుండడంతో సాగు పెరిగిందని తెలిపారు. అంతకుముందు బూడిదంపాడు–పుటానితండా జెడ్పీ రోడ్డు నుంచి వాంకుడోతు తండా రోడ్డు వరకు రూ.2.5 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు, బూడిదంపాడు ఎస్సీ కాలనీలో రూ.80 లక్షలతో నిర్మించే సీసీ రోడ్లు, డ్రెయిన్లు, ఆర్ అండ్ బీ రోడ్డు నుంచి బూడిదంపాడు వరకు రూ.1.5 కోట్లతో నిర్మించే అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. మూడు నెలల్లో రైతుబజార్ మండలంలోని మంచుకొండలో రైతులకు ప్రయోజనం చేకూర్చేలా నిర్మిస్తున్న రైతు బజార్ను మూడు నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సింజెంటా కంపెనీ కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్)గా కేటాయించిన నిధులతో రైతు బజార్, పీహెచ్సీలో అదనపు నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు. మండలంలో పేద, గిరిజన రైతులు పండించిన కూరగాయలను ఇక్కడే విక్రయించుకునేలా రైతుబజార్ అందుబాటులోకి వస్తుందన్నారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, ఆర్ అండ్ బీ ఎస్ఈ యాకూబ్, ఈఈ యుగంధర్, మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, డీఎంహెచ్ఓ కళావతిబాయి, డీఏఓ పుల్లయ్య, విద్యుత్శాఖ డీఈ రామారావు, డీఎల్పీఓ రాంబాబు, సింజెంటా కంపెనీ డైరెక్టర్ వైద్యనాధ్, కేశవులు, జే.వీ.మోహన్రావుతో పాటు తుమ్మలపల్లి నాగేశ్వరరావు, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, పల్లెబోయిన చంద్రం, సాధు రమేష్రెడ్డి, మానుకొండ రాధాకిషోర్, వాంకుడోత్ దీపక్, దిరిశాల వెంకటేశ్వర్లు, తాతా రఘురాం, విజయాబాయి, చోటాబాబా, కొదుమూరి మధు, నల్లమల వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ను కలిసిన పువ్వాడ కుటుంబం
ఖమ్మంమయూరిసెంటర్/ఖమ్మం అర్బన్/రఘునాథపాలెం: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కుటుంబ సమేతంగా శనివారం కలిశారు. పువ్వాడ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి వెంట ఆయన సతీమణి వసంతలక్ష్మి, తనయుడు, కోడలు ఉన్నారు. అలాగే, ఉదయం ఖమ్మంలో తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు సమక్షాన పువ్వాడ అజయ్ కేక్ కట్ చేయగా, బీఆర్ఎస్ శ్రేణులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ ప్రజలనే కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారి సమక్షాన పుట్టినరోజు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. కాగా, పువ్వాడ అజయ్కు బీఆర్ఎస్ నాయకులు గొల్లపూడి హరికృష్ణ, మోరంపూడి సాయికృష్ణ, కార్పొరేటర్ నాగండ్ల కోటేశ్వరరావు ఆధ్వర్యాన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేయించారు. ఇంకా బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజీ ఎమ్మెల్యే మదన్లాల్, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణంతో పాటు నాయకులు, వివిధ సంఘాల బాధ్యులు, ప్రజాప్రతినిధులు గుండాల కృష్ణ, కర్నాటి కృష్ణ, మక్బూల్, వీరూనాయక్, ఖమర్, తాజుద్దీన్, బిచ్చాల తిరుమలరావు, మాటేటి కిరణ్, మున్నా, చంటి, చిన్ని కృష్ణారావు, మెంతుల శ్రీశైలం, బొమ్మ రాజేశ్వరరావు, మల్లాది వాసుదేవరావు, సాంబశివరావు, రామారావు, అప్జల్హాసన్, కొల్లు పద్మ, షకీనా వేడుకల్లో పాల్గొన్నారు. దేవభక్తుని కిషోర్బాబు ఆధ్వర్యాన అన్నదానం నిర్వహించగా, రఘునాథపాలెంలోనూ పువ్వాడ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. -
సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడాలని..
సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడాలనేది లక్ష్యం. జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 666వ ర్యాంక్ రాగా.. చైన్నె, ముంబై ఐఐటీల్లో సీటు సాధించాలనుకుంటున్నా. మా నాన్న మల్లికార్జున్రావు కిరాణం షాపు నిర్వహిస్తుండగా తల్లి గృహిణి. – ఉరుకొండ కుషల్, ఓపెన్ కేటగిరీ 666వ ర్యాంకు ఇంజనీర్ కావాలనుకుంటున్నా.. ఇంజనీర్ కావాలనుకుంటున్నా. మా నాన్న తండ్రి అసిస్టెంట్ ఇంజనీర్ కాగా, తల్లి గృహిణి. తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యం ప్రోత్సాహంతో మంచి ర్యాంకు సాధించాం. ఎస్టీ కేటగిరీలో ఐదు, ఓపెన్ కేటగిరీలో 1,765వ ర్యాంక్ వచ్చింది. – అజ్మీరా రోషిక్ మణిదీప్, ఎస్టీ కేటగిరీలో 5వ ర్యాంక్ ● -
●రెజొనెన్స్కు ర్యాంక్ల పంట
జెఈఈ మెయిన్స్ల్లో తమ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారని రెజొనెన్స్ డైరెక్టర్లు ఆర్.వీ.నాగేంద్రకుమార్, కె.శ్రీధర్రావు తెలిపారు. విద్యార్థులను అభినందించిన వారు మాట్లాడుతూ ఐ.కార్తీకేయ 57వ ర్యాంక్, పి.సాయికిరణ్ 1,060, పి.వంశీ 1,120, ఎం.కృష్ణచైతన్య 1,381, బి.హర్షవర్థన్ 1,386, మణికుమార్ 2,037, భార్గవ్రామ్ 3,012, జి.దివ్యతేజ 5,237, బి.వెంకట కృష్ణప్రసాద్ 7,595, అభినాయక్ 8,836, కె.ధాన్యదీప్ 9,474, డి.అనిల్ 9,799, బి.దివ్యశ్రీ 9,844, డి.విశాల్ 9,988, బి.సాయిచైతన్య 12,480, పి.తరుణ్రెడ్డి 13,089వ ర్యాంక్ సాధించగా, మరో 122మంది సైతం అడ్వాన్స్డ్కు అర్హత సాధించారన్నారు. ప్రిన్సిపాళ్లు సతీష్, భాస్కర్రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
జేఈఈ మెయిన్స్లో ‘ప్రైవేట్’ సత్తా
జిల్లాలోని పలు ప్రైవేట్ జూనియర్ కళాశాలల విద్యార్థులు జేఈఈ మెయిన్స్లో ప్రతిభ కనబరిచారు. ఉత్తమ పర్సంటైల్తో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచి జేఈఈ అడ్వాన్స్డ్కు ఎంపికై న విద్యార్థులను ఆయా కళాశాలల యాజమాన్యాలు అభినందించాయి. – ఖమ్మం సహకారనగర్ఉత్తమ పర్సంటైల్తో అడ్వాన్స్డ్కు అర్హత●ర్యాంకుల్లో అగ్రగామిగా శ్రీచైతన్య శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు జేఈఈ మెయిన్స్లో అగ్రగామి ర్యాంకులు సాధించారని చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. హెచ్.జశ్వంత్రామ్ 27వ ర్యాంక్, ఎల్.ప్రసాద్ 41, ఏ.శృతి 45, వి.కుషాల్ 100, ఐ.అను 133, బి.సిద్ధార్థ్ 258, బి.అఖిల్ 513, పి.సాయికుమార్ 579, జి.రాహుల్ 714, వి.ప్రణతి 816, ఎస్వీ.వీరబ్రహ్మం 833, జి.హరీష్ 841, వై.జగదీష్ 920, ఏ.గోవర్దన్ 1,083, ఎం.ఆకాష్ 1,326, టి.జీవన్ 1,344, ఎల్.తరుణ్ 1,350, డి.అరుణ్ 1,398, బి.వెన్నెల 1,460 ర్యాంక్ సాధించగా వారిని అభినందించారు. అకడమిక్ డైరెక్టర్ బి.సాయిగీతిక, డీజీఎం సీహెచ్.చేతన్ మాధూర్, ఎగ్జిక్యూటివ్ డీన్ ఎన్ఆర్ఎస్డీ.వర్మ, డీన్ జె.కృష్ణ, ఏజీఎంలు సీహెచ్.బ్రహ్మం, జి.ప్రకాష్, గోపాలకృష్ణ, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.●ఎస్ఆర్ విద్యార్థులకు ర్యాంక్లు ఎస్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్లో ఉత్తమ ర్యాంకులు సాధించారని చైర్మన్ వరదారెడ్డి తెలిపారు. తమ విద్యార్థుల్లో వినోద్ 246వ ర్యాంక్, వెంకట్చరణ్ 1,047, ఆకాష్ 1,813, పవన్కుమార్ 1,185, సాయిపవన్ 3,248,అఖిల 3,828, శివసాయి 4,721, సాయిచరణ్ 6,200, భరత్ 6,839, వాసు 6,876, శ్రీలేఖ 7,505, శశాంక్ 8,151, రవితేజ 8,387, తీర్ధన 9,434, నవీన్కుమార్ 9,698, మోహిత్ 9,810, సంతోష్ 9,972 ర్యాంక్ సాధించారన్నారు. విద్యార్థులను చైర్మన్తో డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోష్రెడ్డి, సీఈఓ సురేందర్రెడ్డి. డీజీఎం గోవర్దన్రెడ్డి, జోనల్ ఇన్చార్జ్ విజయభాస్కర్రెడ్డి, డీన్ శ్రీనివాస్రెడ్డి, ప్రిన్సిపాళ్లు అశోక్, శ్రీనివాస్, సుధాకర్, బ్రహ్మం అభినందించారు.●హార్వెస్ట్దే అగ్రస్థానం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులతో అగ్రస్థానంలో నిలిచారని హార్వెస్ట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ ఆర్.పార్వతిరెడ్డి తెలిపారు. విద్యార్థులను అభినందించిన వారు వివరాలు వెల్లడించారు. బి.సాయిచరణ్ 17వ ర్యాంక్, బి.సిద్ధార్థ్ 297. ఎన్.రాఘవేంద్ర నవనీత్ 2,704, డి.శ్రీనివాస్ గౌతమ్రెడ్డి 1,046, ఎం.నాగయశ్వంత్ 1,458వ ర్యాంక్, మరో 28మంది 10వేల లోపు ర్యాంకులు సాధించగా 40శాతం మంది అడ్వాన్స్కు అర్హత సాధించారన్నారు. ఈకార్యక్రమంలో అధ్యాపకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ●న్యూవిజన్ ప్రభంజనం జేఈఈ మెయిన్స్ల్లో తమ విద్యార్థులు జాతీయ స్థాయి ర్యాంకులు సాధించారని న్యూవిజన్ విద్యాసంస్థల చైర్మన్ సీహెచ్జీకే.ప్రసాద్ తెలిపారు. అజ్మీరా రోషిక్ మణిదీప్ 5వ ర్యాంక్, బి.వేణు 74, బి.పీయుష్వర్ధన్ రాథోడ్ 231, బి.చరణ్ 472, స్వర్ణ మనస్విక్ 523, ఆర్.కౌశిక్ 623, సీహెచ్.సాయికృష్ణ 950, జి.చరణ్తేజ్ నాయక్ 1,099, జి.కార్తీక్సాయి 1,209, ఆర్.షణ్ముఖప్రియ 1210, పి.సాంచో 1232, పి.యశస్విని 1,423, సిహెచ్.శ్రీహాస్ 1,562. పి.రోహిత్ 1,698, కె.మధుర హాసిని 1,765, బి.వంశీ 2,157, బి.యశ్వంత్ 2,206, టి.మోహన్రెడ్డి 2,207, బి.శివనాగచైతన్య 2,281, వి.ఆశిష్ 2,489, ఎం.చరణ్వెంకట్ 2,518, బి.సిద్ధార్థ్ 2,660, బృహత్సేన 2,737, బి.వివేక్రామ్ 3,038, ఆర్.గుణదీప్ 3,232, పి.చేతన్చంద్ర 3,455, టి.బ్రహ్మిణి 3,571, సీహెచ్.శ్రీరామ్ 3,685, పి.ఠాగూర్ 3,694, ఏ.సేవానాథ్ 3,909, ఎం.విశ్వక్ 4,724, ఎన్.చరత్బాలనందన్ 4,905 ర్యాంక్ సాధించగా, ఓపెన్ కేటగిరీలో అజ్మీరా రోశిక్ మణిదీప్ 1,765 ర్యాంక్, పేరాల ప్రణవ్ 1,784వ ర్యాంక్లు సాధించారన్నారు. ఈసందర్భంగా విద్యార్థులను చైర్మన్తో పాటు డైరెక్టర్లు సీహెచ్.గోపీచంద్, అకడమిక్ డైరెక్టర్ సీహెచ్.కార్తీక్, ప్రిన్సిపాళ్లు బ్రహ్మచారి, శ్రీనివాసరావు అభినందించారు. -
‘భూ భారతి’తో రెవెన్యూ వ్యవస్థకు కొత్త జీవం
ఖమ్మం సహకారనగర్: రెవెన్యూ చరిత్రలో భూ భారతి చట్టం నూతన అధ్యాయమని పలువురు పేర్కొన్నారు. గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికే ఉపేందర్రావు ఆధ్వర్యాన శనివారం ఖమ్మం డీపీఆరీసీ భవనంలో భూ భారతి చట్టం, జీపీఓల విధులు, బాధ్యతలపై అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సదస్సులో టీజీటీఏ జిల్లా కన్వీనర్ కోటా రవికుమార్తో పాటు ఓ.వెంకటేశ్వరరావు, ఆదిరాజు సీతారామరాజు, గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీనర్సింహులు మాట్లాడారు. రెవెన్యూ వ్యవస్థ బలోపేతం చేసేలా భూ భారతి చట్టాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. గతంలో వీఆర్వోలుగా విధులు నిర్వర్తించిన వారు తిరిగి రెవెన్యూ శాఖలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వీఆర్వోల సంఘం నాయకులు బోళ్ల శ్రీనివాస్, రాఘవేందర్, తాటి ఇందిరమ్మ, కొమరం కృష్ణవేణి, వసంతబాయి, శ్రీవాణి, పద్మ, శ్రీకాంత్, కాక శ్రీను, ఎస్.కే.జానీమియా, ధరావత్ భాస్కర్, వజ్జా రామారావు, కిషోర్, బంక కృష్ణయ్య, వాంకుడోత్ వెంకన్న, మక్కాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు 11నంబర్లతో యూనికోడ్
తిరుమలాయపాలెం: ఆధార్ నంబర్ మాదిరిగానే ప్రతీ రైతుకు 11నంబర్లతో కూడిన యూనికోడ్ కేటాయించేలా కేంద్రప్రభుత్వం చేపడుతున్న రిజిస్ట్రేషన్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ధనసిరి పుల్లయ్య సూచించారు. తిరుమలాయపాలెం రైతు వేదికలో ఫార్మర్ రిజిస్ట్రీపై శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతీ రైతు భూమి వివరాలు నమోదు చేశాక, రెవెన్యూ శాఖ వద్ద వివరాలు, ఆధార్ కార్డు అనుసంధానంతో ఫార్మర్ ఐడీ కేటాయిస్తారని తెలిపారు. ఆపై కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు సులువవుతుందని చెప్పారు. ఇందుకోసం రైతులు పూర్తి వివరాలతో వ్యవసాయ అధికారులను సంప్రదించేలా అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం విధివిధానాలను మాస్టర్ ట్రెయినీ విజయచంద్ర వివరించారు. ఏడీఏ సరిత, ఏఓలు సీతారాంరెడ్డి, వాణి, రాధ, ఉమానగేష్ పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య -
రైతాంగాన్ని ఆదుకోవాలి
ఖమ్మంమయూరిసెంటర్: అకాల వర్షాలతో వేలాది ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం పంటనష్టాన్ని వేయించడమే కాక ఎకరాకు రూ.25వేల పరిహారం ఇవ్వాలని, తడిసిన పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రంగారావు డిమాండ్ చేశారు. నేడు, రేపు ఎమ్మెల్సీ కవిత పర్యటన ఖమ్మంమయూరిసెంటర్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆది, సోమవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఖమ్మంలోని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నివాసానికి చేరుకోనున్న ఆమె బీఆర్ఎస్ నాయకుడు గుండాల కృష్ణను పరామర్శిస్తారు. ఆతర్వాత ఖమ్మం, కల్లూరు మండలం లింగాలలో జరిగే కార్యక్రమాలకు కవిత హాజరవుతారు. సోమవారం భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నాక అక్కడి హరిత హోటల్లో తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. ఇసుకాసురులపై చర్యలు బోనకల్: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ పున్నంచందర్ హెచ్చరించారు. ‘యథేచ్చగా ఇసుక అక్రమ రవాణా’ శీర్షికన ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఇసుక వాహనాల రాకపోకలతో దెబ్బ తిన్న పొలం, రోడ్డును పరిశీలించి బాధిత రైతుతో మాట్లాడారు. ఏపీ నుంచి రాత్రివేళ అక్రమంగా ఇసుక రవాణా జరగకుండా చెక్పోస్టు ఏర్పాటుచేస్తామని తెలిపారు. తహసీల్దార్ వెంట గిర్దావర్ నవీన్కుమార్ పాల్గొన్నారు. పది ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ రద్దు ఖమ్మంవైద్యవిభాగం: తప్పుడు బిల్లులతో ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా లబ్ధి పొందిన ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటున్నట్లు డీఎంహెచ్ఓ బి.కళావతిబాయి ఒక ప్రకటనలో తెలిపారు. చికిత్స చేయించుకోని వారి పేర్లతో నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ నిధులు కాజేసినట్లు తేలడంతో పది ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ రద్దుచేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈమేరకు ఖమ్మంలోని శ్రీ వినాయక హాస్పిటల్, శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, వైష్ణవి హాస్పిటల్, సుజాత హాస్పిటల్, ఆరెంజ్ హాస్పిటల్, న్యూ అమృత హాస్పిటల్, మేఘశ్రీ హాస్పిటల్, జే.ఆర్.ప్రసాద్ హాస్పిటల్, గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని డీఎంహెచ్ఓ తెలిపారు. డెయిరీ లబ్ధిదారులకు వచ్చే నెలలో గేదెలు మధిర: ఇందిరా మహిళా డెయిరీలో సభ్యత్వం తీసుకున్న మహిళలకు వచ్చే నెలలో గేదెలు అందిస్తామని డీఆర్డీఓ సన్యాసయ్య తెలి పారు. మండలంలోని వంగవీడులో మహిళా సంఘాల సభ్యులకు శనివారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సభ్యులు వారికి నచ్చిన చోట గేదెలు కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుందన్నారు. ఐదు మండలాల్లో 4వేల మంది సభ్యత్వాలు తీసుకోగా, ఒక్కొక్కరికి రూ.2 లక్షల విలువైన రెండు పాడిగేదెలు అందజేయనున్నట్లు తెలి పారు. ఇందులో 80శాతం సబ్సిడీ ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో డీపీఎం శ్రీనివాసరావు, ఏపీఎంలు జంగం లక్ష్మణరావు, శ్రీనివాసరావు, మార్కెట్ వైస్ చైర్మన్ అయిలూరి సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. వైకుంఠధామంలో ఆత్మహత్య నేలకొండపల్లి: మండలంలోని నాచేపల్లికి చెందిన భూక్యా మల్సూర్(26) గ్రామ వైకుంఠధామంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన ఆరేళ్ల క్రితం వివాహం జరగగా, రెండేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నాడు. ఈక్రమంలోనే జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఘటనపై మల్సూర్ తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. చోరీ కేసుల్లో పాత నేరస్తుడి అరెస్ట్ ఖమ్మంక్రైం: ఖమ్మం ముస్తఫానగర్, శుక్రవారపుపేటలో కొద్దినెలల క్రితం చోరీలు జరగగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. చోరీ జరి గిన ఇళ్లలో లభించిన వేలిముద్రల ఆధారంగా విచారణ చేపట్టగా, ధంసలాపురం అగ్రహారానికి చెందిన పాత నేరస్తుడు మతిన్ను నిందితుడిగా గుర్తించి శనివారం అరెస్ట్ చేశామని ఖమ్మం వన్టౌన్ సీఐ ఉదయ్కుమార్ తెలిపారు. ఆయన నుంచి మూడు తులాల బంగారం, 300 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఎర్రుపాలెం: మండలంలోని నర్సింహాపురంలో గుర్తు తెలియని వ్యక్తి(40) మృతి చెందాడు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండగా, స్థానికులు ఇచ్చిన సమాచారంతో 108 సిబ్బంది పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. నలుపు రంగు కాటన్ ప్యాంట్ ధరించి చేతికి వాచీ ఉన్న మృతుడి వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని ఎస్ఐ పి.వెంకటేష్ సూచించారు. చికిత్స పొందుతున్న వ్యక్తి.. కూసుమంచి: కూసుమంచిలో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మండలంలోని పోచారానికి చెందిన నందిగాం శ్రీనివాసరెడ్డి(54) బైక్పై కూసుమంచి నుండి ఇంటికి వెళ్తుండగా మరో ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరెడ్డిని హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి.. ఖమ్మంరూరల్: మండలంలోని ఎం.వెంకటాయపాలెంలో శనివారం చేపలు పట్టడానికి వెళ్లిన చెక్కల గురువయ్య(45) ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా సీరోలుకు చెందిన గురవయ్య ఈనెల 15న గ్రానైట్ ఫ్యాక్టరీలో పనికి వచ్చాడు. ఆతర్వాత ఎం.వెంకటాయపాలెం గ్రామస్తులైన తేనె సూరిబాబు, ఎస్.కే.పాషాతో కలిసి గ్రామ చెరువులో బోట్ సాయంతో చేపల వేట కొనసాగించారు. తిరిగి వస్తుండగా బోట్లో కళ్లు తిరగగా గురువయ్య చెరువులో పడడంతో ఆయన సహచరులు బయటకు తీసి ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శనివారం మృతి చెందగా, ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. ట్రాక్టర్ ఢీకొనడంతో వాహనదారుడు..రఘునాథపాలెం: మండలంలోని వేపకుంట్ల వద్ద ట్రాక్టర్ ఢీకొనడంతో ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. ఖమ్మం బాలపేటకు చెందిన ధరావత్ సుధాకర్(39) కొన్నేళ్లుగా కొణిజర్ల మండలం అన్నారంలో నివాసముంటున్నాడు. కూలీ పనుల కోసం బాలపేటకు వాహనంపై వెళ్తుండగా వేపకుంట్ల శివార్లలో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈఘటనలో తీవ్రంగా గాయపడిన సుధాకర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఆయన భార్య సునీత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. బాలుర తల్లిదండ్రులకు జరిమానా ఖమ్మంక్రైం: ఎనిమిది మంది మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడగా, వారి తల్లిదండ్రులకు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ ఖమ్మం నాలుగో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్(స్పెషల్ మొబైల్) బి.నాగలక్ష్మి తీర్పు వెలువరించారు. మైనర్ డ్రైవింగ్ను అరికట్టేందుకు ఇటీవల చేపట్టిన తనిఖీల్లో ఎనిమిది మంది పట్టుబడ్డారని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. వీరి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా జరిమానా విధించారని చెప్పారు. అలాగే, మద్యం తాగి వాహనం నడిపిన మరో వ్యక్తికి రూ.2వేల జరిమానా విధించినట్లు తెలిపారు. పాఠశాలలో కంప్యూటర్, సామగ్రి చోరీ కొణిజర్ల: మండలంలోని పల్లిపాడు ప్రభుత్వ పాఠశాలలో చోరీ జరిగింది. పాఠశాల హెచ్ఎం కోట సుజాత, ఉద్యోగులు శనివారం ఉదయం వచ్చేసరికి కంప్యూటర్ గది తాళం పగలగొట్టి ఉంది. ఈమేరకు రూ.1.83లక్షల విలువైన రెండు కిలోవాట్ల సామర్ధ్యం కలిగిన ఆరు బ్యాటరీలు, కంప్యూటర్, ప్రింటర్తో పాటు మైక్ సెట్ ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. దుండగులు శుక్రవారం రాత్రి చోరీ చేసి ఉంటారని హెచ్ఎం ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్ఐ సూరజ్, సిబ్బంది పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. కుక్కల దాడిలో దుప్పికి గాయాలు సత్తుపల్లిరూరల్: వీధికుక్కల దాడిలో చుక్కల దుప్పి గాయపడింది. సత్తుపల్లి మండలం గౌరిగూడెంలోని ఓ ఆయిల్పామ్ తోటలోకి శనివారం దుప్పి వచ్చింది. దీన్ని గుర్తించిన వీధి కుక్కలు వెంబడించి గాయపర్చడంతో స్థానికులు కుక్కలను తరిమివేశారు. ఆపై అటవీ శాఖ ఎఫ్ఎస్ఓ నర్సింహా, బీట్ ఆఫీసర్ శ్రీనివాసరావుకు దుప్పిని అప్పగించగా వారు ఆస్పత్రిలో దుప్పికి చికిత్స చేయించాక సత్తుపల్లి నీలాద్రి అర్బన్పార్క్లో వదిలివేశారు. -
వర్షం వస్తుంది.. జాగ్రత్త!
● రైతులను అప్రమత్తం చేసేలా సూచనలు ● అందుబాటులోకి ‘వెదర్ యాప్’ఖమ్మం సహకారనగర్: గత వారం, పది రోజు లుగా ఏ రోజు ఎక్కడ గాలిదుమారం వస్తుందో, వర్షం కురుస్తుందో చెప్పలేని పరిస్థితి ఎదురవుతున్నాయి. దీంతో కల్లాల్లో ధాన్యం ఆరబోసిన రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల ధాన్యం తడిసి నష్టం ఎదురవుతోంది. అధికారులు సైతం వర్షసూచనలను రైతులకు చేరవేసే పరిస్థితి లేవు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేలా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏ జిల్లాలో, ఏ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రాంతాన వర్షం కురుస్తుందనే సమాచారాన్ని తెలుసుకునేలా రూపొందించిన వెదర్ యాప్ శుక్రవారం అందుబాటులోకి వచ్చిందని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి(డీఎస్ఓ) చందన్కుమార్ తెలిపారు. నిర్వాహకులకు సమాచారం పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు ప్రతిరోజు ఏ ధాన్యం కొనుగోలు కేంద్రం సమీపాన వర్షం కురిసే అవకాశముందో యాప్ ద్వారా గుర్తిస్తారు. ఈమేరకు సమాచారాన్ని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారికి ఇస్తారు. దీంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకునేలా అప్రమత్తం చేయనున్నారు. జిల్లాలో 345 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరుగుతుండగా, ఎప్పటికప్పుడు అందే సమాచారంతో వీటి పరిధిలోని రైతులకు లబ్ధి జరుగుతుందని డీఎస్ఓ చందన్కుమార్ తెలిపారు. -
నిప్పురవ్వ.. కార్చిచ్చు కాకుండా
● ప్రమాదాల నివారణ, రక్షణపై ప్రజలకు అవగాహన ● కొనసాగుతున్న అగ్నిమాపక వారోత్సవాలు ● రూ.లక్షల్లో డీజిల్ బకాయిలతో ఉద్యోగుల సతమతం సత్తుపల్లిటౌన్: అసలే ఎండాకాలం.. ఆపై వడగాలులు తోడవుతున్నాయి. ఈ నేపథ్యాన అగ్గిరవ్వ రాజుకుంటే చాలు మంటలు చెలరేగే ప్రమాదముంది. ఈనేపథ్యాన అగ్నిప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవడం, ప్రమాదాలు ఎదురైతే రక్షించుకునేలా ఏటా ఏప్రిల్ 14నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక శాఖ వారోత్సవాలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం వారోత్సవాలు కొనసాగుతుండడంతో జిల్లాలో శాఖ అధికారులు మాక్డ్రిల్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. అప్రమత్తత తప్పనిసరి సహజంగా ఎండాకాలంలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈనేపథ్యాన ప్రజలు అప్రమత్తంగా లేకపోతే రూ.లక్షల్లో ఆస్తినష్టం ఎదురవుతుంది. ఊరేగింపులు, వివిధ కార్యక్రమాల సందర్భంగా కాల్చే టపాసులు గడ్డివాములు, ఇళ్లపై పడితే ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆస్తినష్టమే కాదు ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు ఎదురవుతుంది. ఈనేపథ్యాన ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించడం, ప్రమాదాలు ఎదురైనప్పుడు కాపాడుకునేలా అగ్నిమాపక శాఖ అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. ఉమ్మడి జిల్లాలో... ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ఫైర్ స్టేషన్లు ఉన్నాయి. ఖమ్మం, సత్తుపల్లి, మధిర, వైరా, కూసుమంచి, ఇల్లెందు, కొత్తగూడెం, భద్రాచలం, అశ్వారావుపేట, మణుగూరుల్లో ఫైర్ స్టేషన్లు ఉండగా నేలకొండపల్లిలో ఔట్ పోస్టు కొనసాగుతోంది. వీటికి తోడు కల్లూరులో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. గల్లీల్లోకీ వెళ్లేలా.. ఇరుకు గల్లీల్లోకి ఫైరింజన్ వెళ్లలేని పరిస్థితి ఎదురవుతోంది. అలాంటి ప్రాంతాల్లో అగ్నిప్రమాదం జరిగితే మంటలు అదుపు చేసేలా బుల్లెట్ వాహనాలను ప్రభుత్వం సమకూర్చింది. ఇందులో రెండు సిలిండర్లలో 20 లీటర్ల నీరు ఉంటుంది. అలాగే, ఫోమ్ను చల్లడం ద్వారా వంద మీటర్లు వెడల్పులో వ్యాపించిన మంటలను సైతం ఆర్చవచ్చు. ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు అగ్నిప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తపై శాఖల అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. వంటగదిలో డీజిల్, పెట్రోల్, అదనపు గ్యాస్ సిలిండర్ వంటివి ఉంచకపోవడమే మంచిది. అలాగే, దూరప్రాంతాలకు వెళ్లే సమయాన విద్యుత్లైట్లు, మెయిన్ వద్ద సరఫరా నిలిపివేయాలి. ఇంటికి అన్ని వైపుల గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. పూజామందిరం వద్ద దీపం వెలిగించి బయటకు వెళ్లొద్దు. వంట పూర్తికాగానే సిలిండర్ రెగ్యులేటర్ను ఆఫ్ చేయాలి. చిన్నపిల్లలకు అగ్నిపెట్టెలు, లైటర్లు, టపాసులు వంటివి ఇవ్వొద్దు. ఐఎస్ఐ మార్కు ఉన్న ఎలక్ట్రికల్ వస్తువులను మాత్రమే వినియోగించాలి. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగితే ఆర్పడానికి నీరు అందుబాటులో ఉంచుకోవాలి. దుస్తులకు నిప్పు అంటుకుంటే పరిగెత్తకుండా నేలపై దొర్లడం లేదా దుప్పటి చుట్టుకుంటే ఫలితం ఉంటుంది. ఇక భవనాల్లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు అత్యవసర ద్వారాలను గుర్తించి బయటకు వెళ్లాలి. మంటలను ఆర్పే ఉపకరణాలు కనిపిస్తే వినియోగించుకోవాలి. పొగ ముసురుకుంటే ముఖానికి తడివస్త్రం అడ్డుపెట్టుకుని బయటకు రావాలి. జిల్లాలోని అగ్నిమాపక కేంద్రాల సమాచారం అగ్నిమాపక కేంద్రం ఫోన్ నెంబర్ ఖమ్మం 87126 99280 సత్తుపల్లి 87126 99282 మధిర 87126 99284 వైరా 87126 99288 కూసుమంచి 87126 99286 నేలకొండపల్లి 87126 99290వాహనం కదిలేది ఎలా? జిల్లాలో తరచూ ఎక్కడో ఓ చోట అగ్నిప్రమాదం జరుగుతోంది. ఈ సమాచారం అందగానే అగ్నిమాపక శాఖ సిబ్బంది వాహనంతో సహా వెల్లాలి. కానీ నెలల తరబడి డీజిల్ బిల్లులు ప్రభుత్వం నుంచి రాకపోవడం అధికారులకు తలనొప్పిలా మారింది. ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగిందని తెలిస్తే ఉద్యోగులే వాహనంలో డీజిల్ పోయించుకుని వెళ్లాల్సి వస్తోంది. గతేడాది సెప్టెంబర్ నుంచి ఫైర్ స్టేషన్లకు డీజిల్ బిల్లులు నిలిచిపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతోందని ఉద్యోగులు వాపోతున్నారు.నిర్లక్ష్యం వహించొద్దు.. వేసవిలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రమాద తీవ్రత పెరుగుతుంది. ఇళ్లలో వంట చేసే సమయంలో మహిళలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్ వినియోగంలోనూ ఏమరుపాటుగా ఉండొద్దు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. – వై.వెంకటేశ్వరరావు, ఫైర్ ఆఫీసర్, సత్తుపల్లి -
ఎవరి పని వారిదే !
వైరా: వైరా నుంచి సోమవరం వరకు నాలుగు లేన్ల బీటీ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రూ.12 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ రోడ్డు పనులను అధికారులు పర్యవేక్షిస్తున్నారా, లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనే రోడ్డు మధ్యలో మిషన్ భగీరథ పైప్లైన్ ఉండగా.. ఎయిర్వాల్వ్ను అలాగే వదిలేసి పనులు చేపడుతున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయ్యాక మధ్యలో ఉండే ఈ వాల్వ్ ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశముంది. పైప్లైన్ను రోడ్డు పక్కకు పొడిగించి అక్కడ వాల్వ్ ఏర్పాటుచేసే అవకాశం ఉన్నా అటు ఆర్అండ్బీ, ఇటు భగీరథ అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇకపై ప్రతీరోజు పశు వైద్యసేవలు ఎర్రుపాలెం: రైతులు తమ పశువులకు వైద్యం చేయించేలా ప్రభుత్వ వైద్యశాలలను సద్వినియోగం చేసుకోవాలని పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటనారయణ సూచించారు. మండలంలోని లక్ష్మీపురంలోని పశు వైద్యశాల ఎల్ఎస్ఏగా ఎస్.రమేష్ను కేటాయించగా శుక్రవారం ఆయన విధుల్లో చేరారు. ఈసందర్భంగా ఆస్పత్రిని తనిఖీ చేసిన జేడీ మందుల లభ్యతపై ఆరా తీశాక మాట్లాడారు. కొన్నాళ్లుగా ఆస్పత్రికి సిబ్బంది లేరని, ఇకపై పూర్తిస్థాయిలో ప్రతిరోజూ పశువులకు వైద్యం అందుతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో తల్లపురెడ్డి ప్రవల్లిక, తల్లపురెడ్డి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి ద్వారకాపురి కాలనీ శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన నిర్వహించి నలభై రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. స్వామికి పంచామృత అభిషేకం నిర్వహించగా పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ బాధ్యులు ద్రోణంరాజు మల్లికార్జునశర్మ, రాగాల చంద్రారెడ్డి, దురిశెట్టి శ్రీనివాసరావు, నారాయణ, గాదె నాగు, విష్ణు, రమేష్, తిరుపతిరావు పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమిపూజ వైరారూరల్: వైరా మండలం అష్ణగుర్తిలో రామాలయం పక్కన అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠాపనకు శుక్రవారం గ్రామస్తులు భూమి పూజ చేశారు. దాతలు, ఆంజనేయ స్వామి భక్త బృందం బాధ్యులు పాల్గొన్నారు. పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి)ఆలయంలో శు క్ర వారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజు లు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేకం గావించారు. పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం, కుంకుమ పూజలు, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి పాల్గొన్నారు. 22, 25 తేదీల్లో టీబీజీకేఎస్ నిరసనలుసింగరేణి(కొత్తగూడెం): బొగ్గు గనుల వేలం, సింగరేణి ప్రైవేటీకరణ యత్నాలను నిరసిస్తూ ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22న సింగరేణివ్యాప్తంగా గనులు, డిపార్ట్మెంట్ వద్ద, 25న జీఎం కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టి, వినతిపత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు. -
డెయిరీలో పారదర్శకతే కీలకం
మధిర: మధిర నియోజకవర్గంలో ఏర్పాటుచేస్తున్న ఇందిరా కోఆపరేటివ్ డెయిరీని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున.. లబ్ధిదారులకు గేదెల కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా పూర్తిచేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో శుక్రవారం ఆయన ఇందిరా డెయిరీ, చెరువులు, పర్యాటక రంగ అభివృద్ధి పనులతో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ఇందిరా డెయిరీలో గేదెల కొనుగోలు కీలకమైనందున, అదనపు కలెక్టర్, డీఆర్డీఓ పర్యవేక్షణలో పూర్తిచేయాలని తెలిపారు. గేదెలు ఎక్కడ, ఏవి కొనుగోలు చేయాలనేది లబ్ధిదారులకు ఇష్టం మేరకు చేపట్టాలని, ఏ చిన్న పొరపాటు జరిగినా అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. కాగా, 20వేల మంది వాటాదారులు, 40వేల గేదెలతో డెయిరీ ప్రారంభిస్తున్న నేపథ్యంలో గడ్డి పెంపకం, స్థలాల గుర్తింపు, గేదెల బీమా, పాల సేకరణ, మార్కెటింగ్పై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇందుకోసం ముల్క నూరు, విజయ డెయిరీల సందర్శనకు దశలవారీగా తీసుకువెళ్లాలని భట్టి ఆదేశించారు. అలాగే, డెయిరీ కార్యాలయాన్ని ఏర్పాటుచేసి ఉద్యోగులను కేటాయించాలని సూచించారు. కాగా, గేదెలకు ఆరోగ్య పరీక్షలు, చికిత్స కోసంప్రతీ మండలానికి రెండు పశువైద్య అంబులెన్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. చెరువులు, పర్యాటక అభివృద్ధికి కార్యాచరణ మధిర, జమలాపురం చెరువులను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అనుమతులు వచ్చినందున వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని డిప్యూటీ సీఎం నీటిపారుదల, పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ చెరువుల పరిధిలో నిర్మించే కాటేజీలు, మినీ హట్స్తో పాటు బోట్ల డిజైన్లను ఆయన సీఎం పరిశీలించారు. అలాగే, మాటూరు, బయ్యారం, కలకోట, చిరుమర్రి, ముత్తారం, చింతకాని చెరువుల అభివృద్ధిపై కూడా సూచనలు చేశారు. సమావేశంలో డీఆర్డీఓ సన్యాసయ్య, సెర్ప్ ఉద్యోగి సరిత, జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ రమేష్బాబు, ఈఈ రామకృష్ణ, సెర్ప్ డైరెక్టర్ రంజిత తదితరులు పాల్గొన్నారు. ఇందిరా డెయిరీ పర్యవేక్షణ బాధ్యత అదనపు కలెక్టర్కు... ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క -
12
రోజులు..51వేల దరఖాస్తులురాయితీతో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించడానికి విధించిన గడువు ముంచుకొస్తోంది.. కానీ సాంకేతిక సమస్యలు దరఖాస్తుదారులను వేధిస్తున్నాయి. ఎల్ఆర్ఎస్ ఫీజులో ప్రకటించిన 25శాతం రాయితీ 30వ తేదీ వరకు అమలవుతుంది. ఈక్రమాన ఇబ్బందులకు గురిచేసిన ఐజీఆర్ఎస్(ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రీడ్రస్సెల్ సిస్టం) సమస్యకు పరిష్కారం చూపినా.. నిషేధిత జాబితాలో ఉన్న భూములపై స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో మిగిలిన 12రోజుల్లో 51,641 మంది ఫీజు కట్టగలరా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షిప్రతినిధి, ఖమ్మంఒకటి పరిష్కరించినా.. ఎల్ఆర్ఎస్ కింద 2020 ఆగస్టు 26కు ముందు రూ.వెయ్యి కట్టి దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం ఫీజులో రాయితీ కల్పించింది. ఈనెల 30వ తేదీ వరకు చెల్లిస్తే 25శాతం రాయితీ అమలుకానుండగా.. ఆది నుంచి ఈ పథకం నత్తనడకనే కొనసాగుతోంది. ప్రభుత్వ ప్రకటనతో ఉత్సాహంతో కార్యాలయాలకు వచ్చేవారికి తొలినాళ్లలో ఐజీఆర్ఎస్(ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రీడ్రస్సెల్ సిస్టం) సమస్య ఇబ్బంది పెట్టింది. అయితే, ఈ సమస్యను సరిదిద్దేలా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులకే ఆప్షన్ ఇచ్చారు. ఇక దరఖాస్తు చేసుకున్న పలువురి ప్లాట్లు నిషేధిత జాబితాలో ఉండడం.. ఫీజు చెల్లింపునకు 12 రోజులే గడువు ఉండడంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రొహిబిటెడ్ అవస్థలు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు నిషేధిత జాబితా సమస్యగా పరిణమించింది. ప్రభుత్వ, ఇరిగేషన్ స్థలాలకు సంబంధించి సర్వే నంబర్లలో ఉన్న దరఖాస్తులను ఈ జాబితాలో చేర్చగా.. సమీప పట్టా భూములు కొన్నింటిని సైతం అదే జాబితాలో పెట్టారు. గతంలో నాగార్జునసాగర్ కెనాల్ కోసం జిల్లాలో భూసేకరణ జరిగింది. ఓ రైతుకు చెందిన పది ఎకరాల్లో ఒక ఎకరం సేకరిస్తే మిగిలిన భూమి సైతం ప్రభుత్వ భూమిగా నమోదైంది. దీంతో రిజిస్ట్రేషన్ శాఖ ఈ భూములను నిషేధిత జాబితా లో చేర్చడం ప్రస్తుత సమస్యకు కారణమవుతోంది. 6వేలకు పైగానే దరఖాస్తులు ధరణి పోర్టల్ వచ్చినప్పటికీ నుంచి ప్రొహిబిటెడ్ సమస్య వేధిస్తోంది. గతంలో ఈ సమస్యపై కలెక్టర్లు దృష్టి సారించినా పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదు. ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఇదే కారణంగా ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం కార్పొరేషన్, సత్తుపల్లి, మధిర, వైరా, ఏదులాపురం మున్సిపాలిటీల్లో 5,685 దరఖాస్తులు, సుడా పరిధిలో 682దరఖాస్తులు ఈ జాబితాలో ఉన్నాయి. రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిషేధిత జాబితాలో ఉందా, లేదా అన్నది తేల్చాల్సి ఉండగా.. ఇది జరగడానికి ఎన్నాళ్లు పడుతుంది, ఆలోగా రాయితీ గడువు ముగిస్తే పరిస్థితి ఏమిటన్నది తెలియరావడం లేదు.ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపునకు అడ్డంకులు ప్రొహిబిటెడ్ భూములపై ఎటూ తేల్చని ప్రభుత్వం జిల్లాలో ముందుకు సాగని ప్రక్రియ ఐజీఆర్ఎస్ సమస్యకు మాత్రం పరిష్కారం66,637 మందికి సమాచారం.. ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద ఫీజు చెల్లించాలని 66,637 మందికి సమాచారం అందించారు. ఇందులో చాలామంది ముందుకొస్తున్నా రకరకాల కారణాలతో 14,996 మందే ఫీజు చెల్లించారు. ఇంకా 51,641 మంది 12రోజుల్లో ఫీజు చెల్లించడం కష్టమేనని తెలుస్తోంది. ఓ వైపు కొందరు దరఖాస్తుదారుల నిర్లిప్తత, మరోవైపు సాంకేతిక సమస్యలతో ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇక నిషేధిత జాబితాలో 6వేలకు పైగా దరఖాస్తుదారుల భూమి ఉండడంతో ప్రభుత్వమే పరిష్కారంమార్గం చూపాలని వారు కోరుతున్నారు.ఖమ్మం కార్పొరేషన్, మున్సిపాలిటీలు, సుడా పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వివరాలు పేరు దరఖాస్తులు పెండింగ్ ప్రొహిబిటెడ్ ఖమ్మం కార్పొరేషన్ 40,178 8,639 5,216 వైరా మున్సిపాలిటీ 3,531 158 – మధిర 4,290 444 139 ఏదులాపురం 13,536 4,449 259 సత్తుపల్లి 3,690 118 71 సుడా 20,927 4,931 682మొత్తం 86,152 19,739 6,367 -
కుప్పకూలిన రాజు.. కాళ్లు విరిగిన గుర్రం
జిల్లా కేంద్రంలో మురికికూపంగా ఉన్న గోళ్లపాడు చానల్ను రెండేళ్ల క్రితం ఆధునికీకరించారు. అందులో భాగంగానే పలు చోట్ల పార్క్లు ఏర్పాటుచేశారు. వీటిలో సుందరయ్యనగర్ పార్క్లో భారీ పావులతో చెస్బోర్డు సైతం సమకూర్చారు. సాయంత్రం పార్క్కు వచ్చే చిన్నాపెద్ద ఈ చెస్బోర్డు వద్ద సరదాగా ఆడుకోవడంతో పాటు సెల్ఫీలు దిగేవారు. కానీ రానురాను దీన్ని ఎవరూ పట్టించుకోవడంతో నామరూపాలు లేకుండా పోతోంది. ఇప్పటికే రాజు కాయిన్ విరిగి కిందపడిపోగా, గుర్రం, ఏనుగు కాయిన్లు కూడా వాటి రూపాన్ని కోల్పోతున్నాయి. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
సత్వరమే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి
కొణిజర్ల: అకాల వర్షాలతో రైతులు నష్టపోతున్నందున ప్రభుత్వం వెంటనే అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లు మొదలుపెట్టాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు డిమాండ్ చేశారు. కొణిజర్ల మండలంలోని మల్లుపల్లి, తదితర గ్రామాల్లో ఆరబోసిన ధాన్యాన్ని శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. సత్వరమే అన్ని గ్రామాల్లో కేంద్రాలను ప్రారంభించడమే కాక తడిసిన దాన్యాన్ని కూడా మద్దతు ధరతో కొనుగోలు చేయాలన్నారు. అనంతరం రామనర్సయ్యనగర్లో ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ జటపిట రవిని ఎమ్మెల్సీ పరామర్శించారు. అధికార పార్టీ నాయకులకు పోలీసులు వత్తాసు పలికిలా వ్యవహరిస్తే తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. మాజీ సర్పంచ్ కొర్రా కాంతమ్మ, బీఆర్ఎస్ నాయకులు పోట్ల శ్రీనివాసరావు, పోగుల శ్రీనివాసరావు, దొడ్డపిన్ని రామారావు, ముల్యాల నాగేశ్వరరావు, కిలారు మాధవరావు, పాసంగులపాటి శ్రీనివాసరావు, చిరంజీవి, నాగేశ్వరరావు, రాంబాబు, సోందు, రాందాస్, వెంకన్న, నరసింహా రవీంద్ర, రహీం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
అంతా సవ్యంగానే ఉందా?!
● పాఠశాలల స్థితిగతులపై ఏటా యు–డైస్ సర్వే ● ఇందులో వివరాలపై థర్డ్ పార్టీ ద్వారా పరిశీలనఖమ్మంసహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న వసతులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, బోధన ఎలా జరుగుతోంది.. ఇంకా ఏమేం వసతులు కావాలనే సమాచార సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఏటా యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్(యు–డైస్) సర్వే చేయిస్తోంది. ప్రతీ అక్టోబర్, నవంబర్లో సర్వే చేస్తుండగా.. ఇందులో నమోదైన వివరాలను సరిచూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం థర్డ్పార్టీ సర్వేకు నిర్ణయించింది. డైట్ కళాశాల విద్యార్థులతో చేయిస్తున్న ఈ సర్వే 15వ తేదీన మొదలుకాగా 21వ తేదీతో ముగియనుంది. ఉమ్మడి జిల్లాలో డైట్ కళాశాల ఒకటే ఉన్నందున భద్రాచలం ఐటీడీఏలోని బీఈడీ కళాశాల విద్యార్థులను కూడా సర్వేకు వినియోగించుకుంటున్నారు. యు–డైస్ సర్వే ఇలా.. ఏటా కేంద్రం యు–డైస్ సర్వే నిర్వహిస్తుంది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అందుబాటులో ఉన్న వసతులు, సౌకర్యాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఈ వివరాల ఆధారంగా సదుపాయల కల్పనకు కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. కొన్ని తేడాలు.. యు–డైస్ సర్వే ద్వారా పలు స్కూళ్లలో సరైన వసతులు లేవని తేల్చారు. టాయిలెట్లు, డిజిటల్ తరగతి గదులు, తాగునీటి సదుపాయం లేవని గుర్తించారు. కానీ రాష్ట్రప్రభుత్వం మాత్రం విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నా వివరాలు ఇలా నమోదైనందున థర్డ్ పార్టీ సర్వేకు నిర్ణయించినట్లు తెలిసింది. డైట్ విద్యార్థులతో.. జిల్లాలో డైట్ విద్యార్థులతో థర్డ్ పార్టీ సర్వే కొనసాగుతుండగా, డైట్ ప్రిన్సిపాల్ సామినేని సత్యనారాయణ పర్యవేక్షిస్తున్నారు. ప్రతిరోజు ఎంపిక చేసిన పాఠశాలలకు విద్యార్థులు వెళ్లి అక్కడ ఉన్న వసతులను నమోదు చేస్తున్నారు. యు–డైస్లో ఏం నమోదు చేశారు.. వాస్తవ పరిస్థితులు ఏమిటో పరిశీలించి తేడాను నివేదికలో పొందుపరుస్తున్నారు. ఖమ్మం సమీపాన ఓ పాఠశాలలో ర్యాంప్ లేకున్నా ఉన్నట్లు నమోదు చేశారని, మరుగుదొడ్లు ఉన్నా లేనట్లుగా పేర్కొన్నారని గుర్తించినట్లు సమాచారం. అలాగే, చిన్న మరమ్మతులు అవసరమైతే భవనాలు శిథిలావస్థకు చేరాయని యు–డైస్ సర్వేలో పొందుపర్చారని తేల్చినట్లు తెలిసింది. ఈనెల 21వ తేదీ వరకు కొనసాగే థర్డ్ పార్టీ సర్వేతో వాస్తవ పరిస్థితులు వెలుగుచూస్తాయని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది.జిల్లా పాఠశాలలు సర్వే చేస్తున్న విద్యార్థులు ఖమ్మం 1,170 80 మంది భద్రాద్రి కొత్తగూడెం 530 72 మంది సదుపాయాల కల్పనకు దోహదం యు–డైస్ సర్వేలోని అంశాలను పునఃపరిశీలన ద్వారా పాఠశాలల్లో మరిన్ని మౌలిక వసతులు కల్పించే అవకాశం ఉంటుంది. గతంలో జరిగిన తప్పులను సరిచేయడమే కాక భవిష్యత్లో చేయాల్సిన పనులకు మార్గం ఏర్పడుతుంది. రోజువారీగా సర్వేను నిశితంగా పరిశీలిస్తున్నాం. – సామినేని సత్యనారాయణ, డైట్ ప్రిన్సిపాల్ -
ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడు మృతి
బోనకల్: భర్త వదిలేసినా, ఇద్దరు కుమారులు మానసిక వైకల్యంతో బాధపడుతున్నా బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఓ మహిళ కుమారుడిని బావి మింగేసింది. ఆ కుటుంబంతో పాటు, స్థానికంగా విషాదాన్ని నింపిన ఈ ఘటన వివరాలు... జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్కు చెందిన షేక్ రేష్మాకు ఓ కుమార్తెతో పాటు మానసిక దివ్యాంగులైన ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం ఆమెను భర్త వదిలివేసినా అధైర్యపడకుండా పిల్లలతో కలిసి చింతకాని మండలం ప్రొద్దుటూరుకు వచ్చి గుడారం వేసుకుని జీవనం సాగిస్తోంది. పాత రాతెండి సామగ్రి కొనడం, మరమ్మతు పనులతో పొట్ట పోసుకుంటుండగా, శుక్రవారం పెద్దకుమారుడు యాకూబ్(15) బోనకల్ మండలం లక్ష్మీపురం పరిధి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డాడు. దీంతో నీటమునిగిన ఆయన మృతి చెందగా తల్లి సహా కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా, వారి కుటుంబ పరిస్థితి దృష్ట్యా మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు బీఆర్ఎస్ నాయకుడు పెంట్యాల పుల్లయ్య ఆటో సమకూర్చగా, స్థానికులు రూ.20వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈమేరకు ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుబాబు తెలిపారు. బావిలో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి తిరుమలాయపాలెం: కొద్ది రోజులుగా మండలంలోని మేడిదపల్లి ప్రాంతంలో తిరుగుతున్న గుర్తుతెలియని వ్యక్తి(30) వ్యవసాయ బావిలో మృతదేహంగా తేలాడు. పోలీసులు తెలిపిన వివరాలు... మతిస్థిమితం లేని సదరు వ్యక్తి మేడిదపల్లిలో తిరుగుతూ ఎవరైనా భోజనం పెడితే తినేవాడు. ఈక్రమాన మేడిదపల్లి – మేకలతండా మార్గంలో వ్యవసాయ బావిలో ఆయన మృతదేహాన్ని శుక్రవారం గుర్తించారు. ఈమేరకు పోలీసులు చేరుకుని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సాయంతో మృతదేహాన్ని వెలికితీసి మార్చురీకి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 87126 59136, 87126 59137 నంబర్లలో సంప్రదించాలని ఎస్ఐ కూచిపూడి జగదీష్ సూచించారు.బతుకుదెరువుకు వలస వచ్చిన కుటుంబంలో విషాదం -
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
బోనకల్: ఏపీ నుంచి బోనకల్ మండలానికి రాత్రివేళల్లో ఇసుక రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. ఇసుక తరలించే వాహనాల రాకపోకలతో రహదారులపై గుంతలు ఏర్పడుతుండగా, ఇష్టారాజ్యంగా వాహనాలు తీసుకెళ్తుండడంతో పొలాలు కూడా పాడవుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఇటీవల బోనకల్లోని రైతు మరీదు రామారావుకు చెందిన పొలంలో ఇసుక ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో జేసీబీ సాయంతో ఆ ట్రాక్టర్ను తీసే క్రమాన వరిపంట పాడవడంతో నష్టపోయానని తెలిపారు. అంతేకాక పొలాలకు వెళ్లే దారులు కూడా గుంతలమయమవుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని రైతులు కోరుతున్నారు. రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్ చింతకాని మండలం చిన్నమండవ ఏటి నుండి బోనకల్ మండలం రామాపురం గ్రామానికి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. చింతకాని మండలం తిమ్మినేనిపాలెంకు చెందిన పోపూరి శశి, గాదెల సరితకు చెందిన ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నట్లు పోలీసులు శుక్రవారం రాత్రి చేపట్టిన తనిఖీల్లో గుర్తించారు. ఈమేరకు ట్రాక్టర్లను సీజ్ చేసి డ్రైవర్లు వడ్డెపూడి నాగేశ్వరావు, షేక్ కబీతో పాటు యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుబాబు తెలిపారు. రోడ్లు, పంటలు పాడవుతున్నాయని రైతుల ఆవేదన -
10,629 మె.టన్నుల ధాన్యం కొనుగోలు
కూసుమంచి/తిరుమలాయపాలెం: జిల్లాలో ఏర్పాటుచేసిన కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 10,629 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని డీఎస్ఓ చందన్కుమార్ తెలిపారు. కూసుమంచి మండలం పాలేరు, తిరుమలాయపాలెం మండలంలోని బీరోలులో కొనుగోలు కేంద్రాలు, జుజుల్రావుపేట వద్ద కాంటా వేసిన ధాన్యాన్ని ఆయన శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం చేయడమే కాక రైతులకు ఇబ్బంది ఎదురుకాకుండా ఎప్పటికప్పుడు కాంటా వేయించి మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యంలో 8,646.520మెట్రిక్ టన్నులు సన్నధాన్యం, 1,982.240మెట్రిక్ టన్నులు సాధారణ రకాలు ఉన్నాయని చెప్పారు. సన్నధాన్యం అమ్మిన రైతుల్లో ఇప్పటివరకు 115 మందికి రూ.54.32 లక్షల బోనస్ జమ అయిందని తెలిపారు. నేడు అవగాహన సదస్సు ఖమ్మం సహకారనగర్: గ్రామ పాలన ఆఫీసర్లు(జీపీఓ)గా విధులు నిర్వర్తించేందుకు ఆప్షన్ ఇచ్చిన వీఆర్వో, వీఆర్ఏలకు ఆదివారం అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేందర్రావు తెలిపారు. ఖమ్మం డీపీఆర్సీ భవనంలో ఉదయం 10గంటలకు ఉమ్మడి జిల్లా స్థాయి సదస్సు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. గ్రామ పాలన ఆఫీసర్లుగా విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించనున్నందున అందరూ హాజరుకావాలని సూచించారు. రిటైనింగ్ వాల్ భూముల్లో ట్రెంచ్ ఖమ్మంఅర్బన్: మున్నేటికి ఇరువైపులా నిర్మించే రిటైనింగ్ వాల్ సంబంధించి భూసేకరణ చివరిదశకు చేరడంతో హద్దుల ప్రకారం కందకం తవ్వే పనులు శుక్రవారం మొదలుపెట్టారు. ప్రైవేట్ భూముల యజమానుల అంగీకారం మేరకు బుర్హాన్పురం, రామకృష్ణ ఆశ్రమ పరిసరాల్లో జలవనరులశాఖ ఆధ్వర్యాన ట్రెంచ్ పనులు సాగించారు. అయితే, ఆటోనగర్ ప్రాంతాని కి చెందిన కొందరు ప్లాట్ల యజమానులు అక్కడకు చేరుకుని తమకు న్యాయం చేసేవరకు పనులు మొదలు పెట్టవద్దని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సమాచారంతో పోలీసు బందోబస్తు ఏర్పాటుచేయగా తవ్వకం పనులు సాగించారు. -
ప్రణాళికాయుతంగా ఖమ్మం అభివృద్ధి
ఖమ్మంవన్టౌన్: ఖమ్మం నగరంతో పాటు నియోజకవర్గాన్ని ప్రణాళికాయుతంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మం 16వ డివిజన్లో లోటస్ హిల్స్లో రూ.కోటి వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. నగర అభివృద్ధిని క్రమపద్ధతిలో చేయాలని, ఇందుకోసం అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. నీరు పారే మార్గాల్లో అక్రమ నిర్మాణాలు, ప్రార్థనా మందిరాలు నిర్మాణం జరగకుండా ప్రారంభంలోనే అడ్డుకోవాలని తెలిపారు. ఆక్రమణల్లో పేదలు ఉంటే వారికి ఇంటి స్థలం, ఇళ్లు, ప్రభుత్వ పథకాల కింద సాయం అందించాలని సూచించారు. మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం మార్కెట్ చైర్మన్ హన్మంతరావు, ఆర్డీఓ నర్సింహారావు, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, తహసీల్దార్ రవికుమార్, కార్పొరేటర్లు మేడారపు వెంకటేశ్వర్లు, కమర్తపు మురళి, రాపర్తి శరత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 39వ డివిజన్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యాత్రను మంత్రి తుమ్మల ప్రారంభించారు.రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
మూడు, రెండేసి బిన్లతో చెత్త డబ్బాలు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపర్చడంపై అధికారులు దృష్టి సారించారు. వాణిజ్య, నివాస ప్రాంతాల్లో రోజువారీ చెత్త సేకరణ జరుగుతున్నా కొందరు మాత్రం వ్యర్థాలను రోడ్ల వెంట, ఖాళీ స్థలాల్లో వేస్తున్నారు. దీన్ని అరికట్టేలా చెత్త డబ్బాల ఏర్పాటుకు నిర్ణయించారు. కమర్షియల్ ప్రాంతాల్లో మూడు, రెసిడెన్షియల్ ప్రాంతాల్లో రెండు బిన్లతో కూడిన డబ్బాలు ఏర్పాటుచేయనుండగా, ఇప్పటికే నగరానికి చేరుకున్నాయి. వీటి ఏర్పాటుకు పలు ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు. 120 ప్రాంతాల్లో ఏర్పాటు రోడ్ల వెంట, ఖాళీ స్థలాల్లో ఎక్కువగా చెత్త వేస్తున్న ప్రాంతాలను అధికారులు గుర్తించగా.. 120 ప్రాంతాల్లో డబ్బాలు ఏర్పాటు చేయనున్నారు. అరవై ప్రాంతాల్లో మూడు, 60 ప్రాంతాల్లో రెండు బిన్లతో కూడిన ఏర్పాటుచేస్తారు. కమర్షియల్ ప్రాంతాల్లో తడి, పొడి చెత్తతో పాటు హానికరమైన వ్యర్థాలు ఏర్పాటుచేసేందుకు మూడు బిన్లతో కూడిన డబ్బాలు, రెసిడెన్షియల్ ప్రాంతాల్లో తడి, పొడి చెత్త సేకరణకు రెండు బిన్లతో కూడిన డబ్బాలు ఉంటాయి. ఈమేరకు నగరానికి చేరిన డబ్బాలను కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్ అహ్మద్ షఫీ ఉల్లా శుక్రవారం పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. తొలుత 40 ప్రాంతాల్లో, దశల వారీగా మిగిలిన 80 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేయనుండగా, ఇందులోనే చెత్త వేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఏర్పాటు -
‘భూ భారతి’తో భూసమస్యల పరిష్కారం
● బాధితులు దరఖాస్తు చేసుకోవాలి ● రెవెన్యూ సదస్సుల్లో ఇన్చార్జ్ కలెక్టర్ శ్రీజనేలకొండపల్లి: భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని ఇన్చార్జ్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ వెల్లడించారు. నేలకొండపల్లి మండలం చెరువుమాధారం, కొత్తకొత్తూరు, సధాశివాపురం గ్రామాల్లో శుక్రవారం రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించగా ఆమె పరిశీలించారు. దరఖాస్తు విధానం, రిజిస్టర్లో నమోదు, ఇతర వివరాలను హెల్ప్ డెస్క్ల వద్ద పరిశీలించి ఉద్యోగులకు సూచనలు చేశారు. అనంతరం ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ రైతులు గ్రామ సభలను హాజరై భూసమస్యలపై దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. భూములపై హక్కులు కాపాడేలా కొత్త చట్టం అమల్లోకి వచ్చిందని, తద్వారా లావాదేవీలు, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆర్ఓఆర్ తదితర సేవలు సులభతరమవుతాయని చెప్పారు. రికార్డుల్లో తప్పులు సవరణకు అవకాశం కల్పించగా, పెండింగ్ సాదాబైనామా దరఖాస్తులకు సైతం పరిష్కారం లభిస్తుందని తెలిపారు. రైతులకు ఉచిత న్యాయసాయం అందించడమే కాక అప్పీల్కు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. కాగా, చెరువుమాధారంలో 168, సధాశివాపురం లో 48, కొత్తకొత్తూరు సభలో 28 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. పాలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఎం.రాజేశ్వరి, ఆర్డీఓ నర్సింహారావు, నేలకొండపల్లి మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, తహసీల్దార్లు వి.వెంకటేశ్వర్లు, తఫజుల్ హుస్సేన్, డిప్యూటీ తహసీల్దార్ ఇమ్రాన్, ఎంఆర్ఐలు ఆలస్యం మధుసూదన్రావు, బి.రవి, సొసైటీ మాజీ చైర్మన్ ఈవూరి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కంటైనర్, కారు ఢీ..
జూలూరుపాడు: కంటైనర్, కారు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటన తల్లాడ–కొత్తగూడెం ప్రధాన రోడ్డులో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం నుంచి కొత్తగూడెం వైపు వెళ్తున్న కంటైనర్, భద్రాచలం నుంచి ఖమ్మం వెళ్లే కారు జూలూరుపాడు సబ్ మార్కెట్ యార్డు సమీపంలోకి రాగానే ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ప్రధాన రహదారిపై ఏర్పడ్డ పెద్ద పెద్ద గుంతలు కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి ఘటనాస్థలానికి చేరుకుని పోలీస్ సిబ్బందితో పాటు కూలీలతో కలిసి రోడ్డుపై గుంతలను పూడ్చివేయించారు. -
వంట చేస్తుండగా గ్యాస్ లీక్
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి సీఎస్ఐ చర్చి రోడ్డులోని అలవాల ప్రశాంత్ ఇంట్లో శుక్రవారం వంట చేస్తుండగా గ్యాస్ లీక్ అయి మంటలు వ్యాపించాయి. దీంతో కుటుంబీకులు ఆందోళన చెందగా, స్థానికులతో పాటు అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే రూ.50 వేల విలువైన సామగ్రి కాలిపోయింది. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ ఉద్యోగులు గ్యాస్ లీక్ అయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మంటలు ఆర్పడంపై స్థానికులకు అవగాహన కల్పించారు. ట్రాక్టర్ ఫైనాన్స్ బకాయి.. ఆత్మహత్య బోనకల్: మండలంలోని గోవిందాపురం(ఎల్) గ్రామానికి చెందిన వ్యక్తి గడ్డి మందు తాగగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. గ్రామానికి చెందిన ఇసంపల్లి సైదా(30) ట్రాక్టర్ కోసం రుణం తీసుకోగా, కిస్తీలు బకాయి పడ్డాడు. దీంతో కంపెనీ బాధ్యులు ఒత్తిడి చేయడం, చెప్పిన గడువు కూడా ముగియడంతో ఫోన్ స్విచ్చాప్ చేసుకున్నాడు. ఈక్రమాన వారు గ్రామంలోని కొందరికి ఫోన్ చేసి ట్రాక్టర్ తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు. ఈ విషయం సైదాకు తెలియడంతో గురువారం గడ్డి మందు తాగగా కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సైదా మృతి చెందడంతో ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధుబాబు తెలిపారు. అనారోగ్య కారణాలతో మరో వ్యక్తి... చింతకాని: భద్రాద్రి జిల్లా సుజాతనగర్ మండలం నాయకులగూడెంకు చెందిన వడుగు అజయ్కృష్ణ (34) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చింతకాని మండలం చిన్నమండవకు చెందిన లక్ష్మీతిరుపతమ్మను 13ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఆయన ఐదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం చిన్నమండవ వచ్చాడు. ఇక్కడ వెల్డింగ్ పనులతో జీవనం సాగిస్తుండగా మద్యానికి బానిసైన అజయ్కృష్ణ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గురువారం పనుల కోసం నాగులవంచ వెళ్తున్నట్లు చెప్పి అక్కడే పురుగుల మందు తాగాడు. స్థానికుల ద్వారా తెలుసుకున్న కుటుంబీకులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. అజయ్కృష్ణకు భార్య, ఇద్దరు కుమారులు ఉండగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగుల్మీరా తెలిపారు. గంజాయి స్వాధీనం ఖమ్మంక్రైం: ఖమ్మం త్రీటౌన్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు ఓ వ్యక్తి గంజాయితో పట్టుబడ్డాడు. సీఐ రమేష్ వెల్లడించిన వివరాలు.. మధిరకు చెందిన రాజకొండ దుర్గారావు బొక్కలగడ్డ వెంకటేశ్వర్నగర్లో ఉంటూ చిరువ్యాపారం చేస్తున్నాడు. త్వరగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో విజయవాడ నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు. ఈనేపథ్యాన పెట్రోలింగ్ చేస్తున్న ఎస్ఐ రమేష్ ఆయనన తనిఖీ చేయడంతో రూ.20వేల విలువైన 450 గ్రాముల గంజాయి లభించింది. దీంతో నిందితుడు దుర్గారావును అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. -
20న జిల్లాస్థాయి చెస్ టోర్నీ
ఖమ్మంస్పోర్ట్స్: ఈ నెల 20న జిల్లాస్థాయి చెస్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు చెస్ అసోసియేషన్ బాధ్యులు తెలిపారు. ఖమ్మంలోని సర్వజ్ఞ స్కూల్లో అండర్–10, 13, 16 విభాగాల్లో బాలబాలికలకు పోటీలు ఉంటాయని వెల్లడించారు. స్విస్ లీగ్ పద్ధతిలో జరిగే పోటీలకు హాజరుకావాలనుకునే వారు ఆర్గనైజర్ సీహెచ్.గోపి (94401 62749)ని సంప్రదించాలని సూచించారు. జాబ్మేళాలో 17 మంది ఎంపిక ఖమ్మంరాపర్తినగర్: రిలయన్స్ నిప్పాన్ కంపెనీలో ఉద్యోగాలకు గురువారం ఖమ్మంలో నిర్వహించిన జాబ్మేళాకు 48 మంది మహిళా అభ్యర్థులు హాజరయ్యారు. ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం వీరిలో 17 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసినట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్.మాధవి తెలిపారు. ఏఐకేఎస్ జాతీయ కార్యవర్గంలో నలుగురికి స్థానంఖమ్మం మయూరిసెంటర్/పాల్వంచ/చింతకాని: అఖిల భారత కిసాన్ సభ(ఏఐకేఎంఎస్) జాతీయ సమితిలో ఉమ్మడి జిల్లా నుంచి నలుగురికి స్థానం లభించింది. తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నంలో గురువారం ముగిసిన జాతీయ మహాసభల్లో 36 మందితో జాతీయ కార్యవర్గం, 115 మందితో జాతీయ కౌన్సిల్ను ఎన్నుకున్నారు. ఈసందర్భంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన బాగం హేమంతరావు జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అలాగే, భద్రాద్రి జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాథం, చింతకాని మండలం రాఘవాపురానికి చెందిన కొండపర్తి గోవిందరావుతో పాటు మందడపు రాణికి జాతీయ కౌన్సిల్లో సభ్యులుగా స్థానం దక్కింది. నేలకొండపల్లి మండలం ముటాపురానికి చెందని హేమంతరావు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శిగా, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా, సీపీఐ ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పనిచేయడంతో ప్రస్తుతం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కాగా, గోవిందరావు 1991లో సీపీఐలో కొనసాగుతుండగా వివిధ హోదాల్లో పనిచేయడమే కాక రాఘవాపురం సర్పంచ్గా ఏకగ్రీవ ఎన్నికయ్యారు. ఈమేరకు వీరిని పలువురు అభినందించారు. అందుబాటులో తపాలా బీమా పథకాలు కూసుమంచి: పోస్టల్ శాఖ ద్వారా అమలు చేస్తున్న ప్రమాద బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి కోరారు. మండలంలోని రాజుపేటకు చెందిన భూక్యా చిరంజీవి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆయన బీమా చేయించి ఉన్న నేపథ్యాన రూ.10 లక్షల పరిహారం మంజూరైంది. ఈ మేరకు చిరంజీవి కుటుంబానికి బీమా చెక్కు అందజేశాక సూపరింటెండెంట్ మాట్లాడారు. పోస్టల్ శాఖ ద్వారా ఏటా రూ.520 ప్రీమియంతో రూ.10 లక్షలు, రూ.749తో రూ.15 లక్షల బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పోస్టల్ శాఖ ఖమ్మం డివిజన్ ఇన్స్పెపెక్టర్ శ్రీనివాస్, పోస్టల్ పేమెంట్ బ్యాంక్ మేనేజర్ రాజేశ్, మాజీ సర్పంచ్ కందాల సురేందర్రెడ్డితో పాటు జగదీశ్, పెరుగు నాగేశ్వరరావు, లక్ష్మణ్ పాల్గొన్నారు. ఇన్చార్జ్ కలెక్టర్ తనిఖీ ముదిగొండ: స్థానిక ఎంపీడీఓ కార్యాలయాన్ని ఇన్చార్జ్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ గురువారం తనిఖీ చేశారు. రాజీవ్ యువ వికాసం పథకానికి అందిన దరఖాస్తులు, వాటి పరిశీలనపై ఎంపీడీఓ శ్రీధర్స్వామితో సమీక్షించారు. ఏ యూనిట్ కోసం దరఖాస్తు అందిందో నమోదు చేయాలని, రెండింటి కోసం దరఖాస్తు చేస్తే ‘డబుల్’అని రాయాలని సూచించారు. అలాగే, భూభారతి చట్టంపై నిర్వహించే అవగాహన సదస్సు ఏర్పాట్లపై తహసీల్దార్ సునీత ఎలిజబెత్తో చర్చించారు. -
రజతోత్సవ సభకు కదం తొక్కాలి..
తిరుమలాయపాలెం: బీఆర్ఎస్ రజతోత్సవాల సందర్భంగా ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే సభకు పాలేరు నియోజకవర్గం నుంచి పెద్దసంఖ్యలో తరలివెళ్లాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశం గురువారం తిరుమలాయపాలెంలో నిర్వహించగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను విస్మరించడమే కాక ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యాన ప్రజలు బీఆర్ఎస్ హయాంలో జరిగిన మంచిని గుర్తించారని తెలిపారు. రజతోత్సవ సభ తర్వాత బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించనున్నట్లు చెప్పారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ.. తిరుమలాయపాలెం సహా నియోజకవర్గంలో పోలీసులు అత్యుత్సాహంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా తాను ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా ఎవరు వచ్చినా పనులు చేశామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజ్, మరికంటి ధనలక్ష్మితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.సన్నాహక సమావేశంలో ఎంపీ రవిచంద్ర -
పోషకాహారం, చికిత్సతో క్షయకు చెక్
మధిర: క్షయ బాధితులు పోషకాహారం తీసుకుంటూ సరైన చికిత్స చేయించుకుంటే ఆరోగ్యం మెరుగవువుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కళావతిబాయి తెలిపారు. మధిరలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం ఆమె రాజు, కల్యాణి చేయూతతో పౌష్టికాహార కిట్లు అందజేశాక పలు సూచనలు చేశారు. ఆ తర్వాత పీపీ యూనిట్, టీబీ యూనిట్లలో రికార్డులు తనిఖీ చేశారు. వైద్యులు కనకపూడి అనిల్, ప్రేమ్, రామ్మోహన్నాయక్, హర్షిత్, అమినాజ్, పృథ్వీరాజ్నాయక్, ఉద్యోగులు వెంకటేశ్వర్లు, విజయ్కుమార్, లంకా కొండయ్య, సందీప్, శివ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆస్పత్రిలో హీమోఫీలియా వ్యాధిపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో డీఎంహెచ్ఓ కళావతిబాయి మాట్లాడారు. మేనరికం వివాహాలతో పిల్లలకు ఈ వ్యాధి సోకుతుండగా, సమస్యలు గుర్తించిన వారు వైద్యులను సంప్రదించాలని కోరారు. అనంతరం అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. -
ఇద్దరు సైబర్ నేరగాళ్ల అరెస్ట్
ఖమ్మంక్రైం: ఓ వ్యక్తి అకౌంట్ నుంచి నగదు కాజేసిన ఇద్దరు సైబర్ నేరగాళ్లను ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఖమ్మానికి చెందిన ఓ వ్యక్తి ఖాతా నుంచి రూ.11.49 లక్షల నగదు తనకు తెలియకుండానే విత్డ్రా అయ్యాయని మార్చి 22న ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టగా రంగారెడ్డి జిల్లా శంకరపల్లె మండలం కొజ్జగూడెంలో వాటర్ప్లాంట్ నిర్వహిస్తున్న పసులాది మల్లేశ్గౌడ్ ఖాతాలో నగదు జమ అయినట్లు గుర్తించారు. అదే గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గద్దె రాజుతోపాటు మరికొందరితో కలిసి ఈ నేరానికి పాల్పడినట్లు ఒప్పుకోగా, మల్లేశ్, రాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు సైబర్ క్రైమ్ డీఎస్పీ సీహెచ్ఆర్వీ ఫణీందర్ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐలు జి.రంజిత్కుమార్, ఎం.విజయ్కుమార్, కానిస్టేబుళ్లు వై.వీ.కృష్ణారావు, టి.కిషన్రావు, ఎం.నాగేశ్వరరావును సీపీ సునీల్దత్ అభినందించారు. -
గుట్టను మింగేస్తున్నారు..
● సత్తుపల్లిలో జోరుగా మట్టి దందా ● జరిమానాలతో వెనక్కి తగ్గని అక్రమార్కులు సత్తుపల్లి: సత్తుపల్లిలో మట్టి మాఫియా ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. మట్టి విక్రయాలతో రూ.లక్షలు చేతులు మారుతున్నాయంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాక ఎవరైనా ప్రశ్నిస్తే దౌర్జన్యానికి దిగేందుకు వెనుకాడటం లేదని స్థానికులు చెబుతున్నారు. మరోపక్క అధికారులకు సైతం కాసులు కురిపిస్తుండడంతో ఖమ్మం నుంచి టాస్క్ఫోర్స్ ఉద్యోగులు వస్తే తప్ప స్థానిక ఉద్యోగులు తనిఖీల జోలికి వెళ్లడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మండలంలోని బేతుపల్లి సర్వే నంబర్ 133లో భూమిపై వివాదం నడుస్తోంది. ఇక్కడ సుమారు 100 ఎకరాల్లో ఉన్న కోనాయిగూడెం గుట్ట వద్ద పలువురు రాత్రింబవళ్లు జేసీబీలతో తవ్వుతూ వందలాది వాహనాలతో మట్టి తరలిస్తున్నారు. ఎవరైనా అడిగితే మైనింగ్ అనుమతులు ఉన్నాయని దాటవేస్తుండగా, వాహనాల రాకపోకలతో కంటిమీద కునుకు ఉండడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇళ్ల నిర్మాణం, రియల్ ఎస్టేట్ వెంచర్లకు మట్టి అవసరం కావడంతో.. ఇద్దరు, ముగ్గురు చేతుల్లోనే మట్టి మాఫియా ఉండటంతో ఇష్టారాజ్యంగా ధరకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. టిప్పర్ మట్టి ధర గతేడాదితో పోలిస్తే రెండింతలు పెరిగిందని.. ఇదేమని ప్రశ్నిస్తే ఉద్యోగుల చేయి తడపాల్సి వస్తోందని బహిరంగంగానే చెబుతుండడం గమనార్హం. పట్టుబడినా ఆగడం లేదు.. మట్టి అక్రమ తవ్వకాలు చేపడుతున్న వారి జాబితా అధికారుల వద్ద ఉందని సమాచారం. అయినా తనిఖీల మాటెత్తకపోగా, ఎప్పుడైనా పత్రికల్లో కథనాలు వస్తే ఒకటి, రెండు వాహనాలను సీజ్ చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే, వాహనాలను సీజ్ చేసినా దందారాయుళ్లు మాత్రం జరిమానా చెల్లించి మట్టి తవ్వకాలు, తరలింపు చేపడుతుండడం గమనార్హం. అడపాదడపా కాకుండా తరచుగా తనిఖీలు చేపడుతూ మట్టి మాఫియాను కట్టడి చేయాలని పలువురు కోరుతున్నారు. -
రైలు ఢీకొని గుర్తుతెలియని వృద్ధుడు మృతి
ఖమ్మంక్రైం: ఖమ్మం రైల్వే పోలీస్ స్టేషన్ సమీపాన బుధవారం రాత్రి రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధుడు (65) మృతి చెందాడని జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. రాపర్తినగర్ రైల్వే బ్రిడ్జి సమీపాన ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మార్చురీకి తరలించినట్లు వివరించారు. చెల్లని చెక్కు కేసులో ఆరు నెలల జైలుశిక్ష ఖమ్మంలీగల్: చెల్లని చెక్కు జారీ చేసిన కేసులో ఖమ్మం విజయనగర్కాలనీకి చెందిన మురళికి ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కాసరగడ్డ దీప గురువారం తీర్పు చెప్పారు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లికి చెందిన పూసా నరేందర్ వద్ద మురళి 2013 డిసెంబర్లో రూ.7 లక్షల అప్పు తీసుకున్నాడు. ఈ నగదు చెల్లించే క్రమాన 2015 ఫిబ్రవరిలో చెక్కు జారీ చేసినా ఆయన ఖాతాలో నగదు లేకపోవడంతో తిరస్కరణకు గురైంది. దీంతో నరేందర్ లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. ఈ మేరకు విచారణ అనంతరం మురళికి ఆరు నెలల శిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.7 లక్షలు చెల్లంచాలని న్యాయమూర్తి తీర్పుచెప్పారు. పాముకాటుతో వలస కూలీ మృతి రఘునాథపాలెం: రఘునాథపాలెంలో వలస కూలీని పాము కాటు వేయడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఛత్తీస్గఢ్కు చెందిన గిరిసింగ్ – అదిషో దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి రాగా, మండల కేంద్రంలోని ఇటుకల బట్టీలో పనిచేస్తూ ఇక్కడే నివాసముంటున్నారు. మంగళవారం రాత్రి అదిషో (32) మూత్రవిసర్జన కోసం బయటకు వెళ్లివచ్చాక కాలిపై ఏదో కుట్టినట్లు అనిపించిందని భర్తకు చెబుతూ నిద్రించింది. బుధవారం ఉదయం ఆమె అనారోగ్యానికి గురవడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా గురువారం ఉదయం మృతి చెందింది. కాగా, ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్లే స్థోమత లేకపోవడంతో అన్నం సేవా ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు చేయూతతో బల్లేపల్లిలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మరణంలోనూ అన్నదమ్ముల బంధం నేలకొండపల్లి: చిన్నతనం నుంచి కలిసిమెలిసి జీవించిన ఆ అన్నదమ్ముళ్లు ఒకే రోజు మృతి చెందడం కుటుంబంలో విషాదాన్ని నింపింది. నేలకొండపల్లి మండలం రామచంద్రాపురానికి చెందిన షేక్ జానీమియా (90), మదార్సాహెబ్ (85) సోదరులు. వీరిద్దరు కొన్నాళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతుండగా, గురువారం గంటల వ్యవధిలో మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదం అలుముకోగా, కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, గ్రామంలో కబరస్తాన్ సమస్యతో పాటు ఇతర కారణాలతో మదార్సాహెబ్ అంత్యక్రియలు బోదులబండలో, జానీమియా అంత్యక్రియలు చెరువుమాధారంలో పూర్తిచేశారు. -
ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఇంకొకటి..
● ఖమ్మం ఎన్నెస్పీ క్యాంప్లో ఏర్పాటుకు నిర్ణయం ● స్థలాన్వేషణలో నిమగ్నమైన అధికారులు ● త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్న పోలీస్శాఖ ఖమ్మంక్రైం: జిల్లా కేంద్రంలో రోజురోజుకూ వాహనాల సంఖ్య పెరుగుతుండగా ట్రాఫిక్ నియంత్రణ పోలీసులకు భారంగా మారుతోంది. దీంతో ఖమ్మంలో మరో ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదించారు. ఈ మేరకు సుముఖత వ్యక్తం చేసిన రాష్ట్ర పోలీస్ శాఖ త్వరలోనే అనుమతులు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఒక్క స్టేషన్తో ఇక్కట్లు ఖమ్మంలోని కిన్నెర పాయింట్ వద్ద 25 ఏళ్ల కిందట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను నిర్మించారు. అయితే అప్పట్లో ఉన్న వాహనాల సంఖ్యతో పోలిస్తే ఇప్పుడు పది రెట్లు పెరిగింది. దీంతో సరిపడా సిబ్బంది లేక ట్రాఫిక్ నియంత్రణకు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తోడు వీఐపీల రాకపోకల సమయాన మరింత సమస్య ఎదురవుతోంది. ఎన్నెస్పీ క్యాంప్లో మేలు.. జిల్లా అధికారుల ప్రతిపాదన మేరకు రాష్ట్ర పోలీసు శాఖలో రెండో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ముందస్తుగా అధికారులు ఎన్నెస్పీ క్యాంప్లో పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు స్థలాన్వేషణపై దృష్టి సారించారు. సుమారు 500 గజాల నుంచి వెయ్యి గజాల స్థలం కావాల్సి ఉండడంతో గుర్తించగానే ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపించనున్నారు. అలాగే, స్టేషన్ భవన నిర్మాణానికి హౌసింగ్ బోర్డు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే, భవన నిర్మాణం జరిగే వరకు అద్దె భవనంలో ట్రాఫిక్ స్టేషన్–2ను ప్రారంభించే అవకాశముంది. నగరమంతా సెక్టార్లుగా విభజన కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మంజూరైతే నగరాన్ని సెక్టార్లుగా విభజించనున్నారు. తద్వారా ట్రాఫిక్ స్టేషన్–1 పరిధిలోకి వన్టౌన్, త్రీటౌన్తో పాటు కొత్తగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీ వరకు వస్తుందని తెలిసింది. అలాగే, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్–2 కిందకు టూటౌన్, ఖానాపురం హవేలీతో పాటు అన్ని శివారు ప్రాంతాలకు తీసుకొస్తారని సమాచారం. ప్రస్తుత ట్రాఫిక్ స్టేషన్లో 100 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా.. కొత్త స్టేషన్కు సైతం అదేస్థాయిలో సిబ్బందిని కేటాయించే అవకాశముంది. ఇక ఏసీపీ స్థాయి అధికారి రెండు స్టేషన్లకు ఇన్చార్జ్గా వ్యవహరించనున్నారు.స్థలాన్ని పరిశీలిస్తున్నాం.. పోలీస్ కమిషనర్ సునీల్దత్ నేతృత్వాన పంపించిన ప్రతిపాదనలకు సుముఖత వ్యక్తమైంది. దీంతో ఎప్పుడైనా ఉత్తర్వులు వచ్చే అవకాశముండడంతో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని పరిశీలిస్తున్నాం. ప్రస్తుతం ఎన్నెస్పీలో అనువైన స్థలాలను పరిశీలిస్తుండగా త్వరలోనే ఓ కొలిక్కి రానుంది. రెండో ట్రాఫిక్ స్టేషన్ ఏర్పాటైతే నగరంలో ట్రాఫిక్ నియంత్రణ సులువవుతుంది. –శ్రీనివాసులు, ట్రాఫిక్ ఏసీపీ -
హీమోఫిలియాపై విస్తృత అవగాహన
ఖమ్మంవైద్యవిభాగం: హీమోఫిలియా వ్యాధి జన్యుపరంగా వచ్చే రక్తస్రావ రుగ్మత అని.. ఈ వ్యాధి లక్షణాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామని జిల్లా మాస్ మీడియా అధికారి సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం సందర్భంగా గురువారం మామిళ్లగూడెం యూపీహెచ్సీలో ఏర్పాటుటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ వ్యాధి రక్తం గడ్డకట్టే సామర్ధ్యంపై ప్రభావాన్ని చూపుతుందని, తద్వారా గాయమైతే ఎక్కువగా రక్తస్రావం అవుతుందన్నారు. ఇలాంటి పరిస్థితులను గుర్తిస్తే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు. కాగా, వ్యాధి గుర్తింపు, చికిత్సపై వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన తెలిపారు. ఆతర్వాత అవగాహన ర్యాఈ నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కృష్ణచైతన్య, హెల్త్ ఎడుకేటర్ అన్వర్, తదితరులు పాల్గొన్నారు. -
ఆ ఆస్పత్రులు సీజ్ చేయండి
● జిల్లాలోని పది ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని ఆదేశం ● సీఎంఆర్ఎఫ్ గోల్మాల్ తేలడంతో డీహెచ్ ఉత్తర్వులు ఖమ్మంవైద్యవిభాగం: చికిత్స చేయించుకోకున్నా నకిలీ బిల్లులు సృష్టించి ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) నిధులు కాజేసిన వ్యవహారంలో జిల్లాలోని పది ఆస్పత్రులపై ఉన్నతాధికారులు కొరఢా ఝుళిపించారు. ఇప్పటికే అక్రమాలు బయటపడిన పది ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ను వెంటనే రద్దు చేయాలని హెల్త్ డైరెక్టర్ నుండి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఆదేశాలు జారీ అయ్యాయి. ఏమిటీ అక్రమాలు? అనారోగ్యంతో బాధపడుతున్న వారు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటే ప్రజాప్రతినిధుల సిఫారసుతో సీఎంఆర్ఎఫ్ ద్వారా నిధులు విడుదల చేస్తారు. అయితే ఈ నిధులను అక్రమ మార్గంలో కాజేయాలని ఖమ్మంలోని కొందరు ఆస్పత్రుల నిర్వాహకులు ప్రణాళిక వేశారు. ఇందులో భాగంగా చికిత్స చేయించుకోని వారి పేర్లతో నకిలీ మెడికల్ బిల్లులు సృష్టించి సమర్పించగా.. విషయం తెలియని ప్రజాప్రతినిధులు సిఫారసు చేశారు. దీంతో విడుదలైన రూ.లక్షల్లో నగదును ఆస్పత్రుల నిర్వాహకులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై కొద్దినెలల క్రితం సీఎంఓ ద్వారా అందిన ఫిర్యాదుతో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖమ్మంలోని ఆస్పత్రుల్లోనూ హైదరాబాద్ అధికారులు అప్పట్లో విచారణ చేశారు. ఈక్రమాన ఆస్పత్రుల్లో నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ నిధులు కాజేసినట్లు తేలగా హెల్త్ డైరెక్టర్కు నివేదిక అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా ఖమ్మం నెహ్రూ నగర్లోని శ్రీ వినాయక ఆస్పత్రి, గ్లోబల్ ఆస్పత్రి, జేఆర్.ప్రసాద్ ఆస్పత్రి, శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సాయి మల్టీ స్పెషాలిటీ, వైష్ణవి ఆస్పత్రి, సుజాత హాస్పిటల్, ఆరెంజ్ హాస్పిటల్, న్యూ అమృత ఆస్పత్రితో పాటు మేఘాశ్రీ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఆదేశాలు అందాయి. ఔను నిజమే... ఖమ్మంలోని పది ఆస్పత్రల గుర్తింపు రద్దు చేయాలన్న ఆదేశాలపై డీఎంహెచ్ఓ డాక్టర్ కళావతి బాయిని వివరణ కోరగా వాస్తవమేనని ధ్రువీకరించారు. విజిలెన్స్ అధికారుల నివేదిక ప్రకారం హెల్త్ డైరెక్టర్ ఆయా ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ రద్దు చేయాల ని ఆదేశాలు అందాయని తెలిపారు. ఈమేరకు ఆస్పత్రుల యాజమాన్యాలకు ఉత్తర్వుల కాపీలు పంపించి, మూసివేయాలని సూచించినట్లు వెల్లడించారు. -
రైతుల భూములకు భరోసా
● సమస్యల సత్వర పరిష్కారానికే ‘భూ భారతి’ ● అవగాహన సదస్సులో ఇన్చార్జ్ కలెక్టర్ శ్రీజ నేలకొండపల్లి: రైతుల భూముల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి భరోసా కల్పించేందుకే భూ భారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని ఇన్చార్జ్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ తెలిపారు. చట్టంపై అవగాహన కల్పించేందుకు జిల్లావ్యాప్తంగా మండల కేంద్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహించనుండగా.. తొలిరోజు నేలకొండపల్లిలో గురువారం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ ధరణి పోర్టల్లో లేని అనేక అంశాలను కొత్త చట్టంలో చేర్చినందున సమస్యల పరిష్కారం సులువవుతుందని తెలిపారు. ఈ మేరకు రైతులు ఎప్పటిలాగే మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే నిర్దేశిత గడువులోగా పరిష్కరిస్తామని చెప్పారు. ఏటా డిసెంబర్ 31న రికార్డులను అప్డేట్ చేయనుండడంతో బ్యాంకులకు వెళ్లినప్పుడు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన పనిలేకుండా పోర్టల్లోని వివరాల ఆధారంగా రుణాలు మంజూరు చేస్తారని తెలిపారు. ఈ పోర్టల్ అమలులో లోటుపాట్లను గుర్తించేందుకు నేలకొండపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందున అందరూ అవగాహన పెంచుకుని సహకరించాలని సూచించారు. అనంతరం రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి మాట్లాడగా... పలువురు రైతులు సందేహాలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు. జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య, రెవెన్యూ డివిజనల్ అధికారి నరసింహారావు, మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములుతో పాటు శాఖమూరి రమేష్, భద్రయ్య, యడవల్లి సైదులు, బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల అంజిని, కడియాల నరేష్, గుండా బ్రహ్మం, మేకల వెంకటేశ్వర్లు, ఈవూరి శ్రీనివాసరెడ్డి, చిలకబత్తిని వీరబాబు తదితరులు పాల్గొన్నారు. నాచేపల్లిలో 112 దరఖాస్తులు భూ భారతి చట్టం అమలుకు నేలకొండపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నేపథ్యాన రెవెన్యూ గ్రామాల వారీగా సదస్సులు ప్రారంభించారు. తొలిరోజు నాచేపల్లిలోని రైతు వేదికలో ఏర్పాటుచేసిన సదస్సును ఇన్చార్జ్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ప్రారంభించి కొత్త చట్టంతో ప్రయోజనాలను వివరించారు. అనంతరం గ్రామానికి చెందిన రైతులు పలు సమస్యలపై 112 దరఖాస్తులు అందించారు. ఇందులో సాదాబైనామా క్రమబద్ధీకరణ కోసం 36, పట్టా ప్రకారం భూమి తరుగు ఉందని 33 మంది దరఖాస్తు చేయగా, మిగతావి పేరు మార్పిడి, నంబర్లలో తప్పులు, కొత్త పాసుపుస్తకాల కోసం అందాయి. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ రాజేశ్వరి, ఆర్డీఓ నరసింహారావు, తహసీల్దార్ వి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
భూసేకరణలో ముందడుగు
● మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణంలో పురోగతి ● నిర్వాసితులకు భూమికి బదులు భూమి ఇచ్చేలా నిర్ణయం ● 80శాతానికి పైగా నిర్వాసితుల అంగీకారంఖమ్మంఅర్బన్: మున్నేరు నది ముంపు నుంచి పరీవాహక ప్రాంత ప్రజలను రక్షించేందుకు గాను ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే, ఇందుకు అడ్డంకిగా మారిన ప్రైవేట్ భూముల సమస్యకు పరిష్కార మార్గం లభించినట్లు తెలిసింది. ఖమ్మం నియోజకవర్గంతో పాటు పాలేరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలు, కాలనీలు మున్నేటి వరద ప్రవాహంతో ఏటా ముంపునకు గురవుతున్నాయి. దీంతో ఇళ్లు మునిగిపోతుండగా, బాధితులు సర్వం కోల్పోతున్నారు. గత ఏడాది అసాధారణ రీతిలో వరద రావడంతో రూ.కోట్లలో నష్టం నమోదైంది. దీంతో సమస్య శాశ్వత పరిష్కారానికి గాను ప్రభుత్వం మున్నేటికి ఇరువైపులా 16 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి రూ.690 కోట్లు కేటాయించింది. అయితే, ప్రభుత్వ భూమిలో నిర్మాణ పనులు కొద్దినెలలుగా జరుగుతున్నప్పటికీ ప్రైవేట్ స్థలాలు, ఇళ్లు, వ్యవసాయ భూముల విషయమై పరిహారం తేలకపోవడంతో జాప్యం జరిగింది. కాగా, పలుమార్లు మంత్రులు, కలెక్టర్, అదనపు కలెక్టర్, రెవెన్యూ, జలవనరులశాఖ అధికారులు నిర్వాసితులతో చర్చించి వరదతో ఎదురయ్యే నష్టాన్ని వివరించగా.. భూములు ఇచ్చేందుకు వారు అంగీకరించినట్లు సమాచారం. పోలేపల్లి వద్ద లే ఔట్ మున్నేరు పరీవాహకంలో ఇళ్లు, స్థలాలు, పొలాలు ఉన్న వారు తమ భూములను రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అప్పగిస్తే పోలేపల్లిలో డీటీసీ లేఔట్ చేసి స్థలాలు కేటాయించేలా ప్రజాప్రతినిధులు, అధికారులు ఒప్పించినట్లు సమాచారం. ఈమేరకు నిర్వాసితులు 80శాతం మందికి పైగా తమ భూములు, ప్లాట్లు ఇవ్వడానికి అంగీకారపత్రాలు అందజేసినట్లు తెలిసింది. అయితే, ఇంటి స్థలం కోల్పోతే అంతే స్థలాన్ని పోలేపల్లి వద్ద చేసే లే ఔట్లో కేటాయిస్తారు. అలాగే, భూములు కోల్పోతే ఎకరాకు 600 – 750 గజాల స్థలం ఇచ్చేలా నిర్ణయించినట్లు సమాచారం. ఏటా ముంపు భయంతో ఉండేబదులు మున్నేటికి దూరంగా లే ఔట్ చేసే స్థలంలో ఉంటే మంచిదనే భావనతో పరీవాహక ప్రాంత ప్రజలు ముందుకొచ్చినట్లు తెలుస్తుండగా.. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మార్గం సుగమైనట్లేనని భావిస్తున్నారు.మార్కింగ్ కూడా... రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సేకరించాల్సిన భూమిని పలు దఫాలుగా పరిశీలించిన వివిధ శాఖల అధికారులు మార్కింగ్ కూడా చేశారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని మల్లెమడుగు, దానవాయిగూడెం, బురాన్పురం, ఖమ్మం రెవెన్యూ పరిధిలో వ్యవసాయ భూములు, వెంచర్లు, ప్లాట్లు, ఇండ్లు కలిపి మొత్తం సుమారు 67ఎకరాలు సేకరించనున్నట్లు తెలిసింది. ఇందులో 28 ఎకరాల పరిధిలో ప్లాట్లు ఉన్నాయి. ఇక పాలేరు నియోజకవర్గ పరిధి పోలేపల్లి, ఏదులాపురం, రెడ్డిపల్లి, గుదిమళ్ల తదితర ప్రాంతాల్లో సుమారు 74ఎకరాలకు పైగా స్థలాన్ని గుర్తించారు. ఇప్పటికే నిర్వాసితులకు నోటీసులు ఇవ్వడమే కాక వారి నుంచి అంగీకారపత్రాలు సైతం తీసుకుంటున్నారు. ఈమేరకు 80శాతానికి పైగా మంది అంగీకార పత్రాలు అందించినట్లు రెవెన్యూ అధికారుల ద్వారా తెలిసింది. అయితే, బొక్కలగడ్డ, మోతీనగర్ ప్రాంతాల బాధితులు మాత్రం తమ ఇంటి స్థలం కేటాయించడమే కాక ఇళ్లు కట్టించి ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. ఈ విషయంలో ఇంకా స్పష్టత రాకున్నా అత్యధిక శాతం మంది భూములు, స్థలాలు ఇవ్వడానికి అంగీరించిన నేపథ్యాన మున్నేటికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణంలో ఇక్కట్లు తొలగినట్లేనని యంత్రాంగం చెబుతోంది. -
పనులు అంతంత మాత్రమే..
● ‘ఉపాధి’ కల్పనపై దృష్టి సారించని అధికారులు ● గతేడాదితో పోలిస్తే సగం మందికీ దక్కని కూలీ ● జిల్లా నుంచి 53.15 లక్షల పనిదినాలు ప్రతిపాదన.. ● 30.76 లక్షల పనిదినాలకే కేంద్ర లక్ష్యం ఖమ్మంమయూరిసెంటర్: వ్యవసాయ సీజన్ చివరకు చేరడంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర పనులు తగ్గిపోతున్నాయి. ఈనేపథ్యాన కూలీలకు ఉపాధి హామీ పథకం వరంలా అండగా నిలవాలి. తద్వారా కూలీలకు ఉపాధి లభించి ఆర్థికంగా ఆసరా అవుతుంది. ఈక్రమంలోనే జిల్లాలో కొన్నేళ్ల క్రితం వరకు ఉపాధి కూలీలకు వెళ్లే వారి సంఖ్య లక్షల్లోనే ఉండగా.. ఏప్రిల్ నెల మొదటి వారం నుండే జాతరలా పనులు సాగేవి. కానీ ఈ ఏడాది మాత్రం కూలీలకు పనుల కల్పన నామమాత్రంగానే ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఏప్రిల్ సగం మేర గడిచినిపోయినా కనీస పనిదినాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని చెబుతున్నారు. తగ్గిన పనిదినాలు ఏటా ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్య ఆధారంగా అధికారులు ఈ ఏడాది ఎన్ని పనిదినాలు అవసరమో ప్రణాళిక రూపొందిస్తారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జిల్లాలో 53.15లక్షల పనిదినాలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన వాటా ప్రకారం జిల్లాకు 30.76 లక్షల పనిదినాలనే లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం యూనిట్గా పనిదినాల సంఖ్య పెంచితే అదే స్థాయిలో జిల్లాకూ లబ్ధి జరగనుంది. పనుల కల్పనలో అలసత్వం జిల్లాలో కూలీలకు ఉపాధి పనుల కల్పనపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదనే విమర్శలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల అయిన ఏప్రిల్లో పనులకు వచ్చే కూలీల సంఖ్య తక్కువగా ఉండడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. గతేడాది ఏప్రిల్ 11వ తేదీన 40,836 మంది కూలీలకు పని చూపించగా.. ఈ ఏడాది 11న 28,410 మందికే పనులు కల్పించడం గమనార్హం. ఇక గతేడాది ఏప్రిల్ 12న 80,734 మంది హాజరైతే, ఈ ఏప్రిల్ 12న 19,094 మంది మాత్రమే పనులకు హాజరయ్యారు. కాగా, ఏప్రిల్లో 9,96,307 పని దినాలు కల్పించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 1.35 లక్షల పని దినాలు కల్పించడంతో కూలీలకు నష్టం ఎదురవుతోంది. గ్రామాల్లో రోజుకు 60వేల మందికి సరిపడా పనులు ఉన్నా అధికారులు ఆ దిశగా దృష్టి సారించడం లేదని తెలుస్తోంది.జిల్లాలో జాబ్కార్డులు, కూలీల వివరాలు జాబ్ కార్డులు 3.06 లక్షలు కూలీలు 6.43 లక్షలు యాక్టివ్ జాబ్కార్డులు 1.83 లక్షలు యాక్టివ్ కూలీలు 3.08 లక్షలు -
నేడు, రేపు మంత్రి తుమ్మల పర్యటన
ఖమ్మంవన్టౌన్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం సాయంత్రం ఖమ్మం కార్పొరేషన్ పరిధి 16వ డివిజన్లో సీసీ రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. ఇక శనివారం ఉదయం రఘునాథపాలెం మండలం మంచుకొండలో రైతుబజార్ నిర్మాణానికి, ప్రైమరీ హెల్త్ సెంటర్లో మౌలిక వసతుల కల్పనకు శంకుస్థాపన చేయనున్నారు. ఆతర్వాత బూడిదంపాడులో బీటీ రోడ్డు నిర్మాణం, మెయిన్రోడ్డు విస్తరణ, ఎస్సీ కాలనీలో అంతర్గత రోడ్లు, సీసీ డ్రెయిన్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఖమ్మం మార్కెట్కు మూడు రోజుల సెలవులు ఖమ్మంవ్యవసాయం: గుడ్ ఫ్రైడే, వారాంతం నేపథ్యాన శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవులు ప్రకటించారు. ఈమేరకు శుక్రవారం గుడ్ ఫ్రైడే, శని, ఆది వారాంతపు సెలవులు ఉంటాయని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్ తెలిపారు. తిరిగి సోమవారం నుంచి మార్కెట్లో లావాదేవీలు మొదలవుతాయనే విషయాన్ని రైతులు గమనించాలని ఆయన కోరారు. ఏసీ బస్సులను సద్వినియోగం చేసుకోండి సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి నుంచి హైదరాబాద్కు ఆరు రాజధాని ఏసీ బస్సులు నడిపిస్తున్న నేపథ్యాన ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరాం సూచించారు. సత్తుపల్లి ఆర్టీసీ డిపోను గురువారం తనిఖీ చేసిన ఆయన గ్యారేజీ, ఇతర విభాగాల్లో పరిశీలించడమే కాక టైర్ల నాణ్యతపై సూచనలు చేశారు. సత్తుపల్లి నుంచి హైదరాబాద్కు పగలు, రాత్రి మూడు చొప్పున ఆరు ఏసీ బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కాగా, మహిళా సమాఖ్యల ద్వారా ఖమ్మం రీజియన్కు 21 పల్లెవెలుగు బస్సులు వచ్చాయని ఆర్ఎం చెప్పారు. అనంతరం బస్టాండ్ను పరిశీలించే క్రమాన ప్రయాణికులు ఎండలో ఉండడంతో, వారంలోగా అదనపు ప్లాట్ఫామ్ ఏర్పాటుచేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఫోన్లో ఆదేశించారు. ఆతర్వాత బస్టాండ్లో శ్రీసత్యసాయి సేవా సమితి ఆధ్వర్యాన ఉచిత మజ్జిగ పంపిణీని ఆర్ఎం ప్రారంభించారు. డిపో మేనేజర్ యు.రాజ్యలక్ష్మి, సీఐ విజయశ్రీ, ఎంఎఫ్ ఎస్.సాహితి, సూపర్వైజర్లు పాల్గొన్నారు. విత్తనాల కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు ఖమ్మంవ్యవసాయం: రానున్న వానాకాలం సీజన్లో సాగుకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి(డీఏఓ) ధనసరి పుల్లయ్య సూచించారు. ఖమ్మంలో గురువారం నిర్వహించిన విత్తనాలు, ఎరువుల డిస్ట్రిబ్యూటర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది డిమాండ్ ఆధారంగా పత్తి, మిరప, ఇతర వాణిజ్య పంటల విత్తనాలను అందుబాటులో ఉంచాలని, కొరత ఏర్పడకుండా ముందుగానే కంపెనీలతో చర్చించాలని తెలిపారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించాలని యత్నిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఖమ్మం డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు కొంగర వెంకటేశ్వరరావు, ఏడీఏలు శ్రీనివాసరెడ్డి, వాసవీరాణి, సరిత, ఏఓలు కిషోర్బాబు, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. ధాన్యం రైతులకు రూ.3 కోట్ల చెల్లింపులు నేలకొండపల్లి: జిల్లాలో 350 కేంద్రాల నుంచి ఇప్పటి వరకు 6,481 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి కె.చందన్కుమార్ తెలిపారు. మండలంలోని రాజేశ్వరపురం రైస్ మిల్లును గురువారం తనిఖీ చేసిన ఆయన నిల్వలను పరిశీలించాక మాట్లాడారు. ఇప్పటివరకు రూ.15 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయగా, రైతులకు రూ.3కోట్ల మేర నగదు జమ చేశామని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేపడుతూనే ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. మిల్లర్లు ఇబ్బంది పెట్టకుండా పర్యవేక్షిస్తున్నామని, రైతులకు సమస్య ఎదురై తే ఫిర్యాదు చేయాలని సూచించారు. సివిల్ సప్లయీస్ ఆర్ఐ నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
వానాకాలం వచ్చేలోపు మరమ్మతులు
● సాగునీటి కాల్వలు, చెరువుల ఆధునికీకరణపై దృష్టి ● రూ.10 కోట్ల పనులకు ప్రణాళిక ఖమ్మంఅర్బన్: వచ్చే వానాకాలం సీజన్ నాటికి పంటలకు అవాంతరాలు లేకుండా సాగునీరు సరఫరా చేయడంపై జలవనరుల శాఖ అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం పంటలు చివరి దశకు చేరడం, సాగునీటి సరఫరా నిలిపివేసిన నేపథ్యాన కాల్వలు, తూములు, కట్టలను బలపర్చడం తదితర పనులు చేపట్టేలా కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే కొన్ని పనులు గుర్తించగా, వాటికి అంచనాలు రూపొందించి టెండర్లు పూర్తిచేస్తున్నారు. ఈ పనులన్నీ పూర్తయితే వచ్చే వానాకాలం సీజన్లో నీరు సాఫీగా ముందుకు సాగి రైతులకు ఇక్కట్లు ఉండవని భావిస్తున్నారు. ఇదే అదును... ఏటా ఆయకట్టు ఆధారంగా జలవనరుల శాఖ ద్వారా సుమారు రూ.10 కోట్ల విలువైన పనులను చేపడుతారు. పంట విరామం సమయమైన ఏప్రిల్ నుంచి జూలై వరకు పనులు పూర్తిచేసేలా ప్రణాళిక ఉంటుంది. జిల్లాలోని 21 మండలాల పరిధిలో సాగర్ ప్రధాన కాల్వ, మేజర్లు, మైనర్లతో పాటు, చెరువులు, కుంటల పరిధి, ఎత్తిపోతల పథకాల పరిధిలో ఈసారి కూడా అవాంతరాలు ఉన్న చోట్ల సరిదిద్దేలా పనులు చేపడతారు. అయితే, ఈ పనులకు నిర్దేశించిన నిధుల లక్ష్యం దాటితే రాష్ట్ర కమిటీ ద్వారా అదనంగా మంజూరు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరౖకైతే జిల్లాలో సుమారు రూ.10 కోట్ల వ్యయంతో పనులు చేపట్టేలా గుర్తించినట్లు తెలిసింది. సీఈ ద్వారా రూ.5కోట్లు, ఇద్దరు ఎస్ఈల ద్వారా రూ.కోటి చొప్పున, ఆరుగురు ఈఈల పరిధిలో రూ.25 లక్షల చొప్పున పనులు చేయించడమే కాక మిగతా నిధులను 21మంది డీఈల పరిధిలో వెచ్చిస్తారు. ఏమేం పనులు... సాగర్ కాల్వల పరిధిలో కట్టడాల మరమ్మతులు, యూటీలు, ఓటీలు, క్రాస్ రెగ్యులేటర్ల మరమ్మతులు చేయనున్నారు. అలాగే, కాల్వలు, చెరువుల షట్టర్ల మరమ్మతు, కట్టలపై కంపచెట్లు తొలగింపు, పూడికతీత, కట్టలు బలపర్చే పనులు కూడా జాబితాలో ఉన్నాయి. ఇక చెరువుల పరిధిలో పూడికతీత చేపట్టి రైతులు తమ పొలాలకు ఒండ్రుమట్టి తరలింపునకు అనుమతి ఇస్తారు. ఇవేకాక ఎత్తిపోతల పథకాల వద్ద కూడా అవసరమైన మరమ్మతులను గుర్తించి పనులు చేపడుతారు. టెండర్లు కొనసాగుతున్నాయి.. సాగర్ ద్వారా నీటి సరఫరా నిలిచిపోయింది. కాల్వలు, చెరువులు, ఎత్తిపోతల పథకాలకు సంబంధించి ఇప్పటికే సమస్యలు గుర్తించిన చోట మరమ్మతులకు సిద్ధమవుతున్నాం. కొన్ని పనులకు టెండర్ల పక్రియ కొనసాగుతోంది. పనులన్నీ వర్షాకాలం మొదలయ్యేలోగా పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉన్నాం. – ఎం.వెంకటేశ్వర్లు, జలవనరులశాఖ ఎస్ఈ -
భూభారతిపై సంపూర్ణ అవగాహన
ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఖమ్మంసహకారనగర్: రాష్ట్రప్రభుత్వం కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన భూభారతి చట్టంపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని ఇన్చార్జ్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి బుధవారం ఆమె రెవెన్యూ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ భూహక్కుల భద్రత, సమస్యల సత్వర పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ఈ చట్టంపై తహసీల్దార్లు అవగాహన కలిగి ఉండి, మండల, గ్రామ స్థాయి ఉద్యోగులకు వివరిస్తూనే సదస్సుల్లో రైతులకు వివరించాలని చెప్పారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నేలకొండపల్లి మండలంతో పాటు ఇతరమండల కేంద్రాల్లోనూ గురువారం నుంచి అవగాహన సదస్సుల నిర్వహణకు సిద్ధం కావాలని సూచించారు. అలాగే, తహసీల్లో హెల్ప్డెస్క్ ఏర్పాటుచేసి రైతుల సందేహాలను నివృత్తి చేయాలని తెలిపారు. అనంతరం చట్టంలోని పలు అంశాలపై ఆమె పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఏ.పద్మశ్రీ, ఎస్డీసీ ఎం.రాజేశ్వరి, ఆర్డీఓలు నర్సింహారావు, రాజేందర్గౌడ్, కలెక్టరేట్ ఏఓ అరుణ తదితరులు పాల్గొన్నారు. -
వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు
ఏన్కూరు: అడవులను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు(సీసీఎఫ్) బీమానాయక్ అన్నారు. ఇదే సమయాన విద్యుత్ వైర్ల సాయంతో వన్యప్రాణులను వేటాడాలని యత్నించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఏన్కూరులోని వెదురు డిపో వద్ద వేలంపాట కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. అడవులు, వన్యపాణుల పరిరక్షణకు అందరూ పాటుపడుతూ విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. అటవీ సంపద అన్యాక్రాంతం కాకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటుచేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్, ఎఫ్ఆర్ఓ ఉమ, డీఆర్ఓ శ్రీనివాస్, బీట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ‘భక్త రామదాసు’ రెండో మోటార్ సిద్ధం కూసుమంచి: మండలంలోని భక్తరామదాసు ఎత్తిపోతల ప్రాజెక్టులోని రెండు మోటార్లు గత సెప్టెంబర్లో వచ్చిన భారీ వరదలకు నీట మునిగాయి. అందులో ఒక మోటార్కు మరమ్మతులు చేపట్టి యాసంగి సీజన్ పంటలకు సాగునీరు అందించారు. ప్రస్తుతం రెండో మోటార్ మరమ్మతులు కూడా పూర్తవడంతో బుధవారం ట్రయల్రన్ నిర్వహించారు. ఈక్రమాన ఎలాంటి ఇబ్బంది లేకుండా నీరు ఎత్తిపోయడంతో ప్రాజెక్టులోని రెండు మోటార్లు సిద్ధమైనట్లేనని ప్రాజెక్టు డీఈ రమేష్రెడ్డి వెల్లడించారు. కార్మికులకు ‘ఆయుష్మాన్ భారత్’ ఖమ్మంమయూరిసెంటర్: కార్మికులకు సామాజిక భద్రత కల్పించడమే కాక ఆరోగ్య సంరక్షణలో లోపాల సవరణకు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన వర్తింపచేయనున్నట్లు జిల్లా ఉపకార్మిక కమిషనర్ కె.విజయభాస్కర్రెడ్డి తెలిపారు. కార్మికుల వివరాలను ఈ–శ్రామ్ పోర్టల్లో నమోదు చేసి గుర్తింపు కార్డులు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం గురువారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు కొనసాగే ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిల్వల్లో తేడా ఉంటే చర్యలు ఖమ్మంరూరల్: ఎరువుల షాపుల్లో అమ్మకాలు, నిల్వల విషయమై రిజిస్టర్లు నిర్వహించాలని, ఏ మాత్రం తేడా వచ్చినా డీలర్లపై చర్యలు తప్పవని జిల్లా వ్యవసాఽయాదికారి డి.పుల్లయ్య స్పష్టం చేశారు. రూరల్ మండలంలోని తల్లంపాడు, పెదతండాల్లో ఎరువులు, పురుగు మందుల దుకాణాలను బుధవారం తనిఖీ చేసిన ఆయన నిర్వాహకులతో మాట్లాడారు. పీఓఎస్ ద్వారానే అమ్మకాలు చేపడుతూ రిజిస్టర్లలో నమోదు చేయాలని సూచించారు. తొలుత పెదతండాలోని ఎరువులు గోదాంను పరిశీలించిన డీఏఈ.. దిగుమతి, సరఫరా వివరాలు తెలుసుకున్నారు. ఏడీఏ సరిత, మండల ఏఓ ఉమానగేష్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గింది.. నేలకొండపల్లి: యాసంగిలో సాగు చేసిన పంట కోతలు పూర్తవుతుండడంతో వ్యవసాయ అవసరాలకు విద్యుత్ వినియోగం తగ్గిందని ఎస్ఈ శ్రీనివాసాచారి తెలిపారు. నేలకొండపల్లి మండలంలోని కొంగర, ముజ్జుగూడెం, ఆచార్లగూడెం ఫీడర్లకు సంబంధించి కొత్త బ్రేకర్ను బుధవారం ప్రారంభించిన ఆయన మాట్లాడారు. వేసవిలో ఎంత డిమాండ్ ఉన్నప్పటికీ అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. తెలిపారు. అకాల వర్షం, ఈదురుగాలులతో తీగలు తెగిపడే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీఈఈ చింతమళ్ల నాగేశ్వరరావు, ఏడీ వై.రమేష్కుమార్, ఏడీఏ కోక్యానాయక్, ఏఈ కె.రామారావు తదితరులు పాల్గొన్నారు. -
భూభారతి.. రెడీ
● నేటి నుంచి మండల కేంద్రాల్లో అవగాహన ● సదస్సుల నిర్వహణకు షెడ్యూల్ ఖరారుఖమ్మంసహకారనగర్: భూసమస్యల పరిష్కారం, యజమానులకు చట్టబద్ధమైన హక్కులు కల్పించేలా రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా గురువారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు మండల కేంద్రాల్లో సదస్సులు నిర్వహిస్తారు. ఈమేరకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ సదస్సుల్లో చట్టంపై రైతులు, ఇతర వర్గాలకు అవగాహన కల్పించడమే కాక వారి సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇదే సమయాన రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నేలకొండపల్లి మండలంలోని రెవెన్యూ గ్రామాల్లోనూ సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఈ సదస్సులకు ప్రజలు, రైతులు, భూయజమానులు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు హాజరై విజయవంతం చేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఓ ప్రకటనలో కోరారు. నేలకొండపల్లిలో తొలి సదస్సు నేలకొండపల్లి: భూభారతి చట్టం అమలుకు రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నేలకొండపల్లి మండలంలోని గ్రామాల్లో గురువారం నుంచి సదస్సులు మొదలుకానున్నాయి. తొలి సదస్సు గురువారం నేలకొండపల్లిలో నిర్వహించనుండగా వాసవీ భవన్లో ఏర్పాట్లుచేశారు. ఈమేరకు ఏర్పాట్లను తహసీల్థార్ వి.వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ ఎం.యర్రయ్య, ఎంపీఓ శివ తదితరులు పరిశీలించారు. కాగా, సదస్సు విషయమై రైతులు, ప్రజల్లో కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ తంబూరు దయాకర్రెడ్డి ఓ ప్రకటనలో సూచించారు.షెడ్యూల్ ఇలా... మండల కేంద్రాల్లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. నిర్ణీత తేదీల్లో రోజుకు రెండేసి మండలాల్లో ఉదయం, మధ్యాహ్నం సదస్సుల నిర్వహణకు ప్రణాళిక రూపొందించారు. తొలిరోజైన 17వ తేదీ(గురువారం)న నేలకొండపల్లిలో ఉదయం 9గంటలకు సదస్సు మొదలవుతుంది. అలాగే, 19న తిరుమలాయపాలెం, కూసుమంచి, 21న ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బన్, 22న రఘునాథపాలెం, ముదిగొండ, 23న మధిర, ఎర్రుపాలెం, 24న చింతకాని, బోనకల్, 25న వైరా, ఏన్కూరు, 26న కొణిజర్ల, కారేపల్లి, 28న సత్తుపల్లి, వేంసూరు, 29న కల్లూరు, పెనుబల్లి, 30న తల్లాడ, కామేపల్లిల్లో సదస్సులు నిర్వహిస్తారు. -
ఆడపిల్లతోనే ఇంటికి పరిపూర్ణత
రఘునాథపాలెం: ఆడపిల్ల పుట్టడంతో ఇంటికి పరి పూర్ణత వస్తుందనే విషయాన్ని గ్రహించి అమ్మాయిలను భారంగా కాకుండా వరంలా భావించాలని ఇన్చార్జ్ కలెక్టర్ పి.శ్రీజ సూచించారు. రఘునాథపాలెంకు చెందిన వాంకుడోత్ సునీత–నరేష్ దంపతులు ఇటీవల ఆడశిశువుకు జన్మనివ్వగా, ‘మా ఇంటి మణిదీపం’ కార్యక్రమంలో భాగంగా వారిని ఇన్చార్జ్ కలెక్టర్ సన్మానించి శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. జిల్లా సంక్షేమ అధికారి కె.రాంగోపాల్రెడ్డి, జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.మాధవి, ఎంపీడీఓ అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాహక్కుల రక్షణ కమ్యూనిస్టుల బాధ్యత
ఖమ్మంమయూరిసెంటర్: ప్రజాహక్కుల పరిరక్షణను కమ్యూనిస్టులు బాధ్యతగా భావిస్తారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీ.వీ.రాఘవులు తెలిపారు. ఇందులో భాగంగానే ఇటీవల మధురైలో జరిగిన పార్టీ 24వ ఆలిండియా మహాసభల్లో ఆహారం, ఇల్లు, ఉపాధి, విద్య, ఆరోగ్యం, పింఛన్లు దేశంలోని పౌరులందరి హక్కులుగా చేయాలని తీర్మానించినట్లు చెప్పారు. ఈ తీర్మానాల అమలుకు ఉద్యమాలు నిర్వహించాలని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. మధురైలో సభలకు హాజరై గుండెపోటుతో మృతి చెందిన ఖమ్మంకు చెందిన సీపీఎం రాష్ట్ర నాయకుడు యర్రా శ్రీకాంత్ సంస్మరణ సభ ఖమ్మంలో జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సభలో రాఘవులు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లను అమలు చేస్తే కార్మికులు సంక్షేమ ఫలాలు కోల్పోనున్నందున వచ్చేనెల 20న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చామని తెలిపారు. అలాగే, నూతన వక్ఫ్ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతామని చెప్పారు. కాగా, హక్కుల సాధనకు ఉద్యమిస్తూ, ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లడమే శ్రీకాంత్కు నిజమైన నివాళి అని తెలిపారు. కష్టాలొస్తే గుర్తొచ్చేది కమ్యూనిస్టులే.. ప్రజలకు ఏ కష్టం వచ్చినా కమ్యూనిస్టులు అండగా నిలుస్తున్నారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం తెలిపారు. మంత్రి పదవి ఇవ్వకపోతే సంగతి చూస్తామని సీఎంను హెచ్చరించ డం.. అలాంటి వారిపై చర్యలు తప్పవని ముఖ్య మంత్రి చెబుతున్నారంటే పార్టీ శ్రేణులు గీత దాటే పరిస్థితులు వచ్చినట్టేనని చెప్పారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ చేసిన వాగ్దానాలు అమలు కావడం లేదని ఆయన పేర్కొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ అసమానతలు లేని సమాజం కోసం పోరాడాల్సిన దశలో ప్రజా మన్ననలు పొందిన శ్రీకాంత్ దూరం కావడం నష్టదాయకమని తెలిపారు. ఈ సభలో సీపీఎం ఏపీ, తెలంగాణ, ఉమ్మడి జిల్లా నాయకులు ఎస్.వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్రావు, సీహెచ్.బాబూరావు, బండారు రవికుమార్, మచ్చా వెంకటేశ్వర్లు, బుగ్గవీటి సరళ, వై.విక్రమ్, యర్రా శ్రీకాంత్ సతీమణి సుకన్య, కుటుంబీకులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు దండి సురేష్, యర్రా బాబు, రామాంజనేయులు, పునుకొల్లు నీరజ, డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్, గుర్రం ఉమామహేశ్వరరావు, మెంతుల శ్రీశైలం, చిన్ని కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం 24వ మహాసభల తీర్మానాల ఆధారంగా పోరాటాలు యర్రా శ్రీకాంత్ సంస్మరణ సభలో బీ.వీ.రాఘవులు -
ఈదురు గాలులకు నేలవాలిన వరి, మొక్కజొన్న
● వర్షంతో కొట్టుకుపోయిన కల్లాల్లోని మక్కలు, ధాన్యం ● మామిడితోటలపైనా తీవ్ర ప్రభావం ● జిల్లాలో 3,222 ఎకరాల్లో పంట నష్టంపది బస్తాలు రావడమూ కష్టమే.. కొణిజర్ల మండలం పెద్దగోపతికి చెందిన ఈ రైతు పేరు కనమతిరెడ్డి వెంకటరెడ్డి. ఏడెకరాల్లో వరి సాగు చేసిన ఈయన ఎకరాకు 30 బస్తాల దిగుబడి వస్తుందని ఆశించాడు. కానీ భారీ వర్షం, ఈదురు గాలులకు పంట పూర్తిగా నేలవాలింది. కింద పడిన వరి పనలు కుళ్లిపోయే అవకాశముంది. ఉన్న కాసిన్ని పనలు కూడా కోయించి నూర్పిడి చేసే పరిస్థితి లేక ఎకరాకు 10 బస్తాలు కూడా రావడం కష్టమేనని వాపోతున్నాడు.సాయంత్రమైతే చాలు.. ఈనెలారంభం నుంచి వాతావరణంలో మార్పులతో సాయంత్రమైతే చాలు వరుణుడు తన ప్రభావం చూపుతున్నాడు. మంగళవారం కూడా అర్ధరాత్రి 12–30నుంచి 2.30 గంటల వరకు పలుచోట్ల ఈదురుగాలులు, వడగండ్ల వాన కురిసింది. పంట చేతికి అందే సమయంలో కురుస్తున్న వర్షాలతో రైతులకు తీరని నష్టం మిగులుతోంది. ఈ ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలతో జలాశయాల్లోకి నీరు చేరగా రైతులు ఉత్సాహంగా యాసంగి పంటలు సాగు చేశారు. కానీ ఇప్పుడు అకాల వర్షాలతో వారి ఆనందం ఆవిరవుతోంది. నేలవాలిన వరి, మొక్కజొన్న ఈదురుగాలుల కారణంగా వరి, మొక్కజొన్న పంటలు నేలవాలాయి. సాధారణంగా పంట నిలువుగా ఉన్నప్పుడు హార్వెస్టర్లు ద్వారా కోయిస్తారు. కానీ పంట నేలవాలడంతో మిషన్లను ఉపయోగించడం కష్టంగా మారుతుందని, కూలీలైతే అదనంగా చెల్లించాల్సి ఉంటుందని రైతులు వాపోతున్నారు. ఓ వైపు పంట నేలవాలడం, కొంత గింజ రాలిపోవడం కూడా రైతులపై అదనపు భారం పడనుంది. ఆరబెట్టిన ధాన్యం తడిసి.. కల్లాల్లో ఆరబెట్టిన వరి, మొక్కజొన్న పంటలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. కొనుగోళ్లలో జాప్యంతో రహదారుల వెంట, కల్లాల్లో ఆరబోసిన పంట వర్షానికి కొట్టుకుపోగా రైతులు నష్టపోయారు. ప్రభుత్వం ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల కేంద్రాలను ఏర్పాటుచేసినా కాంటా, తరలింపు ఆలస్యమవుతుండడం.. ఇంతలోనే ప్రకృతి వైపరీత్యాలతో రైతులకు అవస్థలు తప్పడం లేదు. 3,222 ఎకరాల్లో నష్టం ఈనెల రెండో వారం వరకు ప్రకృతి వైపరీత్యాలతో వైరా, తల్లాడ, కల్లూరు, మధిర, పెనుబల్లి మండలాల్లో సాగులో ఉన్న పంటలు దెబ్బతిన్నాయి. ఆయా మండలాల్లోని 56 గ్రామాల్లో 1,672 మంది రైతులకు చెందిన 2,947 ఎకరాల్లో వరి, 27 మంది రైతులకు చెందిన 37 ఎకరాల్లో మొక్కజొన్న, 79 మంది రైతులకు చెందిన 226 ఎకరాల్లో మామిడి, నలుగురు రైతులకు చెందిన 12ఎకరాల్లో నువ్వుల పంటకు నష్టం జరిగింది. మొత్తం 1,782 మంది రైతులకు చెందిన 3,222 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కాగా, ప్రకృతి వైపరీత్యాల సమయాన 33శాతం పంట నష్టం జరిగితే పరి హారం అందించాలనే నిబంధనలు ఉన్నాయి. ఇందులో భాగంగా ఎకరాకు రూ.10వేలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినందున, 1,782 మంది రైతులకు పరిహారం అందే అవకాశముంది.నష్టం మిగిల్చిన వాన.. 8లోపలు మండలాల్లో పంట నష్టం వివరాలు (ఎకరాల్లో) మండలం వరి మొక్కజొన్న మామిడి నువ్వులు మొత్తం వైరా 1,437 - 224 - 1,661తల్లాడ 350 30 - - 380కల్లూరు 1,018 06 - - 1,024మధిర - - 2 - 02పెనుబల్లి 142 1 - 12 155 -
జానపదంలోనే మన మూలాలు..
ఖమ్మంసహకారనగర్: సాహిత్య అధ్యయనం, పరిశోధకులతో మానవ జీవితంలోని జీవనాంశాలు అర్థం చేసుకోవచ్చని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి అన్నారు. ఇదే సమయాన మన మూలాలు జానపదంలో ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. జానపద సాహిత్య, విజ్ఞాన పరిశోధక బ్రహ్మ ఆచార్య బిరుదురాజు రామరాజు శతజయంతి సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యాన బుధవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలుగు సాహిత్యంలో విభిన్నమైన సాహిత్యకారుడిగా నిలిచిన బిరుదురాజు స్ఫూర్తిగా విద్యార్థులు సాహిత్యపఠనం, పరిశోధనలపై దృష్టి సారించాలని సూచించారు. విశ్రాంత ఆచార్యులు డాక్టర్ గన్నమరాజు మనోహర్బాబు, వైస్ ప్రిన్సిపాల్ ఏ.ఎల్.ఎన్.శాస్త్రి, తెలుగు విభాగాధిపతి డాక్టర్ పి.రవికుమార్ మాట్లాడారు. ఇంకా ఈ సదస్సులో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బానోత్ రెడ్డి, రవిమారుత్, ప్రసేన్, డాక్టర్ ఎం.సునంద, యాకూబ్, సమతా శ్రీధర్, డాక్టర్ సీతారాం, డాక్టర్ మంథని శంకర్, డాక్టర్ జె.అనురాధ, కపిల భారతి, వాహెద్, కిరణ్, కోటమ్మ, ఎం.వీ.రమణ, కార్తీక్, వై.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి -
రైతుకు చేయూత.. కిసాన్ రిమోట్
●2 కి.మీ. దూరం నుంచే మోటార్ల ఆన్ – ఆఫ్నకు అవకాశం ●ఖమ్మం వాసి శ్రీనివాస్ సృజనకు ప్రశంసలు ఖమ్మంవ్యవసాయం: కృషి, పట్టుదలకు తోడు అవసరమైన వారికి అండగా నిలవాలనే తపన ఉంటే పెద్ద చదువులేమీ అవసరం లేదని వెల్లే శ్రీనివాస్ నిరూపించారు. ఇంటర్లో ఒకేషనల్ కోర్సు పూర్తిచేసిన ఆయన రైతులకు ప్రయోజనం కలిగేలా వ్యవసాయ మోటార్ల ఆన్ – ఆఫ్ రిమోట్ను రూపొందించి పలువురి మన్ననలు అందుకున్నారు. ఖమ్మం మామిళ్లగూడెంలో నివాసముంటున్న శ్రీనివాస్ స్వస్థలం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యారం కాగా, రైతు కుటుంబంలో జన్మించిన ఆయన ఎస్సెస్సీ తర్వాత ఇంటర్లో ఆర్ అండ్ టీవీ ఒకేషనల్ కోర్సు చేశారు. ఆ తర్వాత టీవీ మెకానిజంలో శిక్షణ పొంది ఆ రంగంలో కొనసాగుతూనే వ్యవసాయం చేశాడు. ఈ క్రమంలోనే మోటార్లతో రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన శ్రీనివాస్.. మోటార్ల నిర్వహణకు రిమోట్ రూపొందించారు. రైతు ప్రయోజనాల కోసం.. వ్యవసాయ మోటార్ల ఆన్, ఆఫ్ వ్యవస్థను రెండు కి.మీ. దూరం నుంచే ఆపరేట్ చేసేలా రిమోట్ను శ్రీనివాస్ రూపొందించారు. తద్వారా వర్షం, ఉరుముల సమయాన నేరుగా వెళ్లే బాధ తప్పడంతో ప్రమాదాలు తగ్గనున్నాయి. అంతేకాక ప్రతీసారి పొలం వద్దకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ మేరకు శ్రీనివాస్ రూపొందించిన ‘కిసాన్ రిమోట్’ను 2022లో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి బెస్ట్ ఇన్నోవేటర్గా అవార్డు అందించింది. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఏపీకి చెందిన ఆచార్య ఎంజీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సైతం ఆయనకు గుర్తింపు నిచ్చాయి. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రూ.3 లక్షలు ఆర్థికసాయం అందజేశారు. దీనికి తోడు పల్లె సృజన స్వచ్ఛంద సంస్థ ప్రోత్సహించింది. గత వారం హైదరాబాద్ శంకర్పల్లిలో ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్, పల్లె సృజన, గ్రామ భారతి సంస్థల ఆధ్వర్యాన నిర్వహించిన సమావేశంలో శ్రీనివాస్ను గవర్నర్ జిష్ణుదేవ్వర్మ సన్మానించగా, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ గుజరాత్ విభాగం తరఫున ఆర్థిక సాయం అందజేశారు. 3,500 మంది వినియోగం కిసాన్ రిమోట్ను ప్రస్తుతం 3,500 మంది రైతులు వినియోగించుకుంటున్నారని శ్రీనివాస్ తెలిపారు. ఇందులో తెలంగాణ, ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్ రైతులు ఉన్నారని పేర్కొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల ప్రోత్సాహంతో కిసాన్ రిమోట్లు తయారు చేస్తున్నానని తెలిపారు. -
కమనీయం.. రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏఎస్ఐ కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెక్కు ఖమ్మంక్రైం: ఖమ్మం ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల మృతిచెందిన ఎండీ షౌకత్అలీ కుటుంబానికి భద్రతా ఎక్స్గ్రేషియా ద్వారా రూ.8 లక్షలు మంజూరయ్యాయి. ఈ మేరకు చెక్కును ఆయన కుటుంబీకులకు బుధవారం సీపీ సునీల్దత్ అందజేశారు. కార్యక్రమంలో ఏఓ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. 10 మంది స్పౌజ్ ఉపాధ్యాయుల బదిలీఖమ్మంసహకారనగర్: గత ప్రభుత్వ హయాంలో 317 జీఓ ద్వారా ఉపాధ్యాయ దంపతుల్లో ఒక్కొక్కరు ఒక్కో జిల్లాకు బదిలీ అయ్యారు. దీంతో వీరికి స్పౌజ్ కేటగిరీ ద్వారా బదిలీకి అవకాశం కల్పించగా రాష్ట్రంలో 165మంది ఉపాధ్యాయులను వారి భాగస్వామి పనిచేస్తున్న జి ల్లాలకు కేటాయించారు. ఇందులో పది మంది ఉపాధ్యాయులు ఇతర జిల్లాల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రానుండగా, అంతే సంఖ్య ఉ పాధ్యాయులు ఇతర జిల్లాలకు వెళ్లనున్నారు. బుధవారం ఉత్తర్వులు విడుదల చేయడంపై టీ ఎస్యూటీఎఫ్ బాధ్యులు షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఆయా ఉపాధ్యాయులు ఈనెల 22న ప్రస్తుత స్థానాల నుంచి రిలీవ్ అయి 23న రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలుశిక్ష ఖమ్మంలీగల్: తీసుకున్న అప్పు చెల్లించే క్రమాన చెల్లని చెక్కు జారీ చేసిన వ్యక్తికి ఏడాది జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయాధికారి ఏపూరి బిందుప్రియ బుధవారం తీర్పు చెప్పారు. ఖమ్మం రూరల్ మండలం ముద్దులపల్లికి చెందిన ఎటుకూరి లక్ష్మణ్రావు వద్ద ఖమ్మం గాంధీచౌక్కు చెందిన వ్యాపారి మల్లెల నర్సింహారావు మూడు దఫాలుగా రూ.21 లక్షల అప్పు తీసుకున్నాడు. ఈ క్రమంలో 2021 సెప్టెంబర్లో రూ.5 లక్షల చెక్కు ఇచ్చినా ఖాతాల్లో సరిపడా నగదు లేక చెల్లలేదు. దీంతో లక్ష్మణ్రావు న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. విచారణ అనంతరం నర్సింహారావుకు ఏడాది జైలుశిక్ష విధించడమే కాక రూ.5 లక్షలు చెల్లించాలని తీర్పు వెలువరించారు. మృతి చెందిన రిటైర్డ్ పోలీస్ కుటుంబాలకు చేయూత ఖమ్మంక్రైం: వివిధ కారణాలతో మృతి చెందిన విశ్రాంత పోలీస్ అధికారుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు విశ్రాంత అధికారుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.రాధాకృష్ణమూర్తి, రుద్ర వెంకటనారాయణ బుధవారం తెలిపారు. ఖమ్మంలో బుధవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ చేయూత మే 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ఇందుకోసం ప్రతీ రిటైర్డ్ ఉద్యోగి నెలకు రూ.300 జమ చేసేలా తీర్మానించామని తెలిపారు. ప్రతాప్రెడ్డి, సంజీవరావు, సోమయ్య, నాగేశ్వరరావు, జయాకర్, ఖాసీం, దస్తగిరి, హరిసింగ్, రామచంద్రరాజు, దావీదు, ప్రసాద్ పాల్గొన్నారు. -
మందు.. ‘ఫుల్’ ఆదాయం
● 2023–24తో పోలిస్తే 24–25లో పెరిగిన అమ్మకాలు ● 2024 మే నెలలో రూ.237 కోట్ల మద్యం అమ్మకాలతో రికార్డు ● మొత్తంగా ఆర్థిక సంవత్సరంలో రూ.2,294 కోట్ల సేల్స్ వైరా: మద్యం అమ్మకాలు ఏటేటా పెరుగుతుండగా.. ప్రభుత్వానికి అంతే మొత్తంలో ఆదాయమూ పెరుగుతోంది. తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం (2024–25)లో వైరాలోని ఐఎంఎల్ డిపో ద్వారా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వైన్స్, బార్లకు రూ.2,294 కోట్ల విలువైన మద్యం సరఫరా కావడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలో 210 వైన్స్, మూడు క్లబ్లు, 50 బార్లు ఉన్నాయి. కాగా, 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,281 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగగా, 2024–25కు వచ్చేసరికి అమ్మకాలు మరింత పెరిగాయి. సహజంగా ఏటా వేసవిలో బీర్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇందులో భాగంగానే గత ఏడాది మే నెలలో రూ.237 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందుకు ప్రధాన కారణం ఆ నెలలో శుభకార్యాలు ఉండటం, ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు ఏపీలో ఎన్నికల నేపథ్యాన ఇక్కడి నుంచి మద్యం సరఫరా అయిందని తెలుస్తోంది. ఇక గత ఏడాది సెప్టెంబర్ 30న ఒకేరోజు 45 వేల కేసుల మద్యం, 16,500 కేసుల బీర్లు అమ్ముడవడం.. వీటి విలువ రూ.33 కోట్లు ఉండడం విశేషం. పెరిగిన బీర్ల ధరలు.. తగ్గిన డిమాండ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం బీర్ల ధరలను పెంచడంతో వేసవిలో బీర్ల అమ్మకం ఎలా ఉంటుందోనని మద్యం షాపుల యజమానుల్లో అనుమానం వ్యక్తమవుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి బీర్లకు అంతగా డిమాండ్ లేనట్లు ఎకై ్సజ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. గతంలో స్ట్రాంగ్ బీర్ ధర రూ.160 ఉండగా ఇ ప్పుడు రూ.190కి, లైట్ బీరు రూ.150 నుంచి రూ.180 కి చేరింది. గతంలో రోజుకు 8 వేల నుంచి 10 వేల కేసులు అమ్ముడయ్యే బీర్లు 7 వేల కేసులు దాటడం లేదని చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 12 నుంచి పెరిగిన బీర్ల ధరలు అమల్లోకి రాగా ఈ నెల 11వ తేదీ వరకు రూ.60 కోట్ల విలువైన 2,92,000 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. అయితే, బీర్లకు డిమాండ్ తగ్గినా లిక్కర్ అమ్మకాలు జోరుగా సాగుతుండడంతో ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయం గణనీయంగా నమోదయ్యే అవకాశముందని భావిస్తున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలు నెల విక్రయాలు (రూ.కోట్లలో) 2024 ఏప్రిల్ 181 మే 237 జూన్ 210 జూలై 180 ఆగస్టు 196 సెప్టెంబర్ 184 అక్టోబర్ 152 నవంబర్ 134 డిసెంబర్ 225 2025 జనవరి 201 ఫిబ్రవరి 181 మార్చి 201 మొత్తం రూ.2,294 మూడు నెలల్లో రూ.600 కోట్లు తాగేశారు! ఖమ్మంక్రైం: ఉమ్మడి జిల్లాలోని మద్యం ప్రియులు గడిచిన మూడు నెలల్లో రూ.600 కోట్ల విలువైన మద్యం తాగేశారు! ఇందులో అగ్రస్థానం మద్యందే కాగా.. బీర్లు రెండో స్థానానికి పడిపోయాయి. జనవరి నుంచి మార్చి వరకు పరిశీలిస్తే.. జనవరిలో రూ.201 కోట్ల మద్యం అమ్మకాలు సాగాయి. ఇక ఫిబ్రవరిలో రూ.210 కోట్లు, మార్చిలో రూ.201 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. అయితే, జనవరి, ఫిబ్రవరిలో మద్యం అమ్మకాలు అగ్రస్థానంలో ఉండగా, మార్చికి వచ్చేసరికి ఎండల కారణంగా బీర్ల అమ్మకాలు పైకి చేరాయి. ఇక ఏప్రిల్, మే నెలల్లో ఇదే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. కానీ గత వేసవిలో బీర్ల కొరత ఏర్పడింది. చాలా బ్రాండ్ల బీర్లు లభించక మద్యం ప్రియులు అల్లాడిపోయారు. ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఎకై ్సజ్ శాఖ ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు సమాచారం.