Khammam District News
-
సన్నాల సంబురం
● రేషన్షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ ● పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు ● సత్తుపల్లి నియోజకవర్గంలో ఒకే మండలంలో ప్రారంభంఖమ్మంసహకారనగర్: రేషన్షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ మంగళవారం ప్రారంభమైంది. ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్న ప్రభుత్వ హామీ మేరకు రెండు, మూడు రోజులుగా షాపులకు చేరవేస్తున్నారు. ఈక్రమాన మంగళవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు బియ్యం పంపిణీని ప్రారంభించారు. ఏన్కూరు మండలం తిమ్మారావుపేట, సింగరేణి మండలం భాగ్యనగర్ తండాల్లో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, అలాగే పెనుబల్లి మండలం ముత్తగూడెంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి లాంఛనంగా ప్రారంభించగా.. ఖమ్మం అర్బన్ మండలం చర్చి కాంపౌండ్లోని షాప్లో మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చందన్కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డీటీ విజయ్కుమార్, ఆర్ఐ వహీద్ తదితరులు పాల్గొన్నారు. మధిర, పాలేరు నియోజకవర్గాల్లోని మండలాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. సత్తుపల్లిలో మాత్రం పెనుబల్లి మండలంలోనే ప్రారంభమైంది. మిగతా మండలాల్లో బుధవారం నుంచి పంపిణీ చేయాలని డీలర్లకు అధికారులు సూచించినట్లు తెలుస్తుండగా.. విషయం తెలియని లబ్ధిదారులు షాప్ల చుట్టూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రదక్షిణలు చేశారు. షాపుల్లో డీఎస్ఓ తనిఖీ ఖమ్మంరూరల్: సన్నబియ్యం పంపిణీని ఖమ్మం రూరల్ మండలంలోని పలు షాపుల్లో డీఎస్ఓ చందన్కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. పెదతండాలోని రేషన్ షాప్ తనిఖీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్నబియ్యాన్ని లబ్ధిదారులు విని యోగించుకోవాలని సూచించారు. డీలర్లు సకాలంలో షాపులు తెరవాలని తెలిపారు. కాగా, గతంలో మాదిరిగానే జిల్లాలోని ఏ షాప్లోనైనా పోర్టబిలిటీ విధానంలో బియ్యం తీసుకోవచ్చని డీఎస్ఓ వెల్లడించారు. మహిళల్లో ఆనందం నేలకొండపల్లి: రేషన్షాప్ల ద్వారా మంగళవారం నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తారనే సమాచారంతో లబ్ధిదారులు ఉదయాన్నే షాపుల వద్దకు చేరుకున్నారు. వీరిలో మహిళలే ఎక్కువగా ఉండగా బియ్యం తీసుకున్నాక నాణ్యతను పరిశీలించడం కనిపించింది. అంతేకాక పలువురు తమ ఇళ్లలో అప్పటికప్పుడు కొద్దిపాటి బియ్యంతో అన్నం వండి ఎలా అయిందోనని పరిశీలించడమేకాక ఇరుగుపొరుగు వారితో చర్చించారు. ఇన్నాళ్లు రేషన్షాపుల్లో దొడ్డుబియ్యం ఇస్తుండగా లబ్ధిదారులు ఎక్కువ మంది ఆసక్తి కనబర్చలేదు. ఇప్పుడు సన్న బియ్యం పంపిణీ మొదలవడంతో అందరూ తీసుకునే అవకాశముందని డీలర్లు భావిస్తున్నారు.మాలాంటి వారికి మేలు సన్నబియ్యం తీసుకోవడం ఆనందంగా అనిపించింది. రేషన్ షాపుల్లో సన్నాలు అందిస్తూ పేదలకు ప్రభుత్వం చాలా మేలు చేస్తోంది. ఇంట్లో సన్నబియ్యం ఉంటే మాలాంటి కుటుంబాలకు ఎంతో ధైర్యం. – కణతాల లీల, కోరట్లగూడెం ఇకపై రేషన్ బియ్యమే.. ఇప్పటివరకు దొడ్డు బియ్యం కావడంతో చాలా మంది షాప్ల్లో తీసుకోకపోయేవారు. ప్రస్తుతం సన్నబియ్యం కావడంతో అందరూ రేషన్ బియ్యమే తింటారు. ఈ పథకంతో పేదలకు ఎంతో మేలు జరగనుంది. – బచ్చలకూరి వెంకట్రావమ్మ, నేలకొండపల్లి చాలా ఆనందంగా ఉంది... రేషన్షాప్లో ప్రతీనెలా దొడ్డు బియ్యం వచ్చేవి. అవి బాగుండక ఎక్కువ ధర పెట్టి సన్నబియ్యం కొనేవాళ్లం. ఇప్పుడు సన్నబియ్యం ఇస్తుండడంతో మా బాధలు తప్పడం ఆనందంగా అనిపిస్తోంది. – మార్తి సౌవిత్రి, కోరట్లగూడెం -
నేడు ‘జై బాపు.. జై భీం.. జై సంవిధాన్ యాత్ర’
ఖమ్మం వన్టౌన్: ఖమ్మంలో బుధవారం నిర్వహించనున్న ‘జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్’ యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల పార్టీ శ్రేణులకు పిలునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. బుధవారం ఉదయం 9గంటలకు ఖమ్మం 18వ డివిజన్ శ్రీరాంహిల్స్ నుంచి మొదలయ్యే యాత్రలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఈసందర్భంగా అంబేద్కర్, మహాత్మాగాంధీతో పాటు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఈసమావేశంలో మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్లు కమర్తపు మురళి, మండడపు లక్ష్మి మనోహర్, పాకాలపాటి విజయ, నిర్మల శేషగిరి, ఆళ్ల నిరీష అంజిరెడ్డి, చామకూరి వెంకటనారాయణ, అలియా తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణం బేఫికర్
ట్రామా కేర్ఖమ్మంవైద్యవిభాగం: ఉమ్మడి ఖమ్మం జిల్లా మీదుగా వందలాది కి.మీ. మేర జాతీయ రహదారులు వెళ్తున్నాయి. త్వరలోనే ఖమ్మం–దేవరపల్లి హైవే కూడా అందుబాటులోకి రానుంది. అయితే, నాణ్య మైన రహదారులు ఉండడంతో వాహనాలు రయ్రయ్ మంటూ సాగుతుండగా ప్రమాదాలు సైతం అదే స్థాయిలో జరుగుతున్నాయి. దీంతో జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు అత్యవసరంగా చికిత్స అందించేలా ట్రామాకేర్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి సెంటర్లు ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు లేకపోగా.. క్షతగాత్రుల చికిత్సకు ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పెద్దదిక్కుగా నిలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెంలో కూడా అత్యవసర చికిత్స అందక బాధితులను ఖమ్మంకే తరలిస్తున్నారు. ఇక్క డా పరిస్థితి చక్కబడకపోతే హైదరాబాద్ పంపిస్తండడం.. ఇంతలోనే విలువైన సమయం గడిచిపోయి బాధితుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. 35 కి.మీ.కు ఒకటి.. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా.. మృతుల కుటుంబాలకు తీరని వేదన మిగులుతోంది. ఏదైనా రహదారిపై ప్రమా దం జరిగినప్పుడు తొలి అర గంట, గంటలో సరైన చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. దీనిని వైద్యులు గోల్డెన్ అవర్గా పరిగణిస్తారు. ఈనేపథ్యాన క్షతగాత్రులకు సత్వరమే వైద్యం అందేలా రాష్ట్ర వ్యాప్తంగా 90 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 35 కి.మీ. దూరానికి ఒకటి ఏర్పాటుచేయనుండగా.. భద్రాచలం, మణుగూరు, కొత్తగూడెం, సత్తుపల్లి, తల్లాడ, మధిర, పాలేరు వంటి ప్రాంతాల్లో జాతీయ రహదారులు వెళ్తుండడంతో ఉమ్మడి జిల్లాలో రెండు నుంచి మూడు సెంటర్లు ఏర్పాటవుతాయని భావిస్తున్నారు. ఈ సెంటర్ల నిర్వహణ బాధ్యతలను వైద్య విధాన పరిషత్, వైద్య ఆరోగ్య శాఖ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగాలకు అప్పగించే అవకాశం ఉంది.ఆరు నెలల్లో క్రిటికల్ కేర్ యూనిట్ పెద్దాస్పత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ భవనం ఆరు నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి మెరుగైన చికిత్స అందించొచ్చు. ఇక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర, జాతీయ రహదారులపై 90 ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఈ జాబితాలో ఉమ్మడి జిల్లాకు స్థానం దక్కనున్నట్లు తెలుస్తున్నా.. ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం. అయితే, వీటికన్నా ముందే పెద్దాస్పత్రిలో క్రిటికల్ కేర్ అందుబాటులోకి వస్తుంది. – ఎస్.రాజేశ్వరరావు, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్హైవేలపై సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం క్షతగాత్రులకు సత్వరమే వైద్యం అందించే ప్రయత్నం తద్వారా మృతుల సంఖ్య తగ్గించొచ్చని భావన అంతకుముందే అందుబాటులోకి రానున్న క్రిటికల్ కేర్ యూనిట్ జిల్లాలో ప్రమాదాల వివరాలు... ఏడాది ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు 2024 785 281 629మంది 2025 50 33 100పెద్దాస్పత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ క్షతగాత్రులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ట్రామాకేర్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఏళ్లుగా ప్రతిపాధనలు పంపిస్తున్నా ఫలితం కానరాలేదు. తాజాగా ప్రభుత్వం ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడమే కాక ఎక్కడెక్కడ ఏర్పాటుచేయాలనే అంశంపై అధికారులు దృష్టి సారించారు. ఈ కసరత్తు పూర్తయి నిర్మాణాలు చేపట్టేలోగా ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ అందుబాటులోకి రానుంది. తద్వారా ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి మెరుగైన చికిత్స అందుతుంది. ఖమ్మం ఆస్పత్రి ఆవరణలో క్రిటికల్ కేర్ యూనిట్ను గత ప్రభుత్వం మంజూరు చేయగా, కేంద్రప్రభుత్వం భవన నిర్మాణానికి రూ.21 కోట్లు కేటాయించింది. టీఎస్ఎమ్ఎస్ఐడీసీ ఆధ్వర్యాన జీ ప్లస్ 3 భవన నిర్మాణాన్ని ఆరు నెలల క్రితం ప్రారంభించడంతో మరో నెలల్లో పూర్తయ్యే అవకాశముంది. క్రిటికల్ కేర్ యూనిట్ అందుబాటులోకి వస్తే ట్రామా కేర్ భవనాలు ఏర్పాటయ్యేవరకు జిల్లాలో ప్రమాద బాధితులకు అత్యవసర చికిత్స అందుతుంది. -
బాధ్యతలు స్వీకరించిన బార్ అసోసియేషన్
ఖమ్మం లీగల్: ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం మంగళవారం బాధ్యతలు స్వీకరించింది. అధ్యక్షుడిగా తొండపు వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షురాలిగా మోత్కూరి విజయశాంత, కార్యదర్శిగా గద్దల దిలీప్కుమార్, సంయుక్త కార్యదర్శిగా ఎం.నవీన్ కుమార్తో పాటు ఎస్. రాంబాబు, కే.వీ.వీ.లక్ష్మి, పి.నర్సింహారావు, పి.ఇందిర ప్రమాణం చేశారు. అనంతరం అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వరరావు, దిలీప్కుమార్ మాట్లాడుతూ కోర్టు ప్రాంగణంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాక, న్యాయవాద సంక్షేమం, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, బార్ – బెంచ్ మధ్య మంచి సంబంధాలు కొనసాగిస్తామని వెల్లడించారు. హెచ్సీయూ భూముల స్వాధీనం నిలిపివేయాలి ఖమ్మంమయూరిసెంటర్: దశాబ్దాలుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆధీనంలో ఉన్న భూముల స్వాధీనాన్ని నిలిపివేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అనేక రకాల వృక్షాలు, జంతువులతో పర్యావరణానికి నిలయంగా ఉన్న 400 ఎకరాల భూములను అమ్మేలా రాష్ట్రప్రభుత్వం స్వాధీనానికి యత్నించడం సరికాదని పేర్కొన్నారు. అంతేకాక భూములు కాపాడేందుకు నిరసన తెలుపుతున్న విద్యార్థులపై దౌర్జన్యం చేయడం, లాఠీచార్జ్ చేసి కేసులు పెట్టడం నిరంకుశత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. భూములను యూనివర్సిటీ ఆధీనంలో ఉంచడమే కాక అక్రమ అరెస్టులు ఆపాలని రంగారావు డిమాండ్ చేశారు. బాస్కెట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా విజయ్సారధి ఖమ్మం స్పోర్ట్స్: బాస్కెట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఏసీపీ విజయ్ సారధికి కార్యవర్గంలో స్థానం దక్కింది. హైదరాబాద్లో మంగళవారం జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోగా ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జాతీయస్థాయిలో గుర్తింపు కలిగిన క్రీడాకారుడైన ఆయన పోలీస్ శాఖలో ఏసీపీగా కొనసాగుతున్నారు. ఇసుక లారీలు సీజ్ తల్లాడ: అనుమతి లేకుండా ఏపీలోని నంది గామ నుంచి తల్లాడ మండలం మిట్టపల్లి వైపు ఇసుక తీసుకొస్తున్న రెండు లారీలను పోలీసులు సీజ్ చేశారు. సోమవారం అర్ధరాత్రి సీజ్ చేయగా, మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై కొండల్రావు తెలిపారు. చోరీ కేసుల్లో ఒకరి అరెస్ట్ఖమ్మంక్రైం: జల్సాలకు అలవాటు పడి ఇళ్లలో, బైక్లు చోరీ చేస్తున్న వ్యక్తిని ఖమ్మం వన్టౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సీఐ ఉదయ్కుమార్ కథనం ప్రకారం.. భద్రాచలానికి చెందిన కోడి శేఖర్ అలియాస్ జంపన్న మరో వ్యక్తితో కలిసి చోరీలకు పాల్పడుతున్నాడు. దీంతో నిఘా పెట్టిన పోలీసులకు పంచాక్షరి కాలనీలో ఉన్నట్లు సమాచారం అందగా శేఖర్ను అరెస్ట్ చేసి నాలుగు బైకులు, 10 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని, మరో నిందితుడు పారిపోయాడని సీఐ తెలిపారు. కీలకంగా వ్యవహరించిన కానిస్టేబు ళ్లు హరికృష్ణ, బోరయ్యను సీపీ సునీల్దత్, ఏసీపీ రమణమూర్తి అభినందించారు. కానిస్టేబుల్ ఆత్మహత్య ఖమ్మంక్రైం: మూడు రోజులుగా సెలవులో ఉన్న ఓ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్ప డ్డాడు. ఖమ్మంలో మంగళవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు... నేలకొండపల్లిలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న బండి కృష్ణ(38) మూడు రోజు లుగా సెలవులో ఉన్నాడు. ఖమ్మం ముస్తఫానగర్లోని ఇంటి నుంచి మంగళవారం సాయంత్రం బయటకు వెళ్లిన తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఎక్కడ వెతికినా ఆచూకీ లేక సెల్ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆరా తీస్తూ పిల్లిగుట్టల వద్దకు వెళ్లారు. అప్పటికే ఆయన గూడ్స్ రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని రైల్వే పోలీసులు వెల్లడించారు. దీంతో అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సాయంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, కూసుమంచి సీఐ సంజీవ్, నేలకొండపల్లి ఎస్ఐ సంతోష్ మృతదేహాన్ని సందర్శించగా, కృష్ణ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. -
భూసమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి
● గ్రామ పాలన అధికారులు, భూభారతి చట్టంతో పరిష్కారం ● రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ఖమ్మంమయూరిసెంటర్: గ్రామాల్లో రైతులు, ప్రజలు భూసమస్యల పరిష్కారం కోసం ఎవరి వద్దకు వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొన్నందున ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి వెల్లడించారు. ఖమ్మంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న భూభారతి చట్టంతో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఈక్రమంలోనే 10,954 గ్రామ పాలన అధికారుల(జీపీఓ) పోస్టులు మంజూరు చేసిందని తెలిపారు. అంతేకాక పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలను తిరిగి మాతృసంస్థలోకి తీసుకురావడానికి సీఎం రేవంత్రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. అలాగే, తొలిసారి 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టుల మంజూరు, తహసీల్దార్లు, ఆర్డీఓలు, అదనపు కలెక్టర్లు కోల్పోయిన అధికా రాలు భూభారతి చట్టంతో పునరుద్ధరణ జరిగా యని తెలిపారు. గతంలో జీఓ 317తో దంపతులైన ఉద్యోగులు చిన్నాభిన్నం కాగా, జేఏసీ ఉద్యమ ఫలితంగా స్పౌజ్, మెడికల్, తదితర కోణాల్లో బదిలీలను చేపట్టిందని చెప్పారు. గ్రామ పాలన అధికారుల రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేంద్ర రావు మాట్లాడుతూ గత చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వీఆర్వోలు, వీఆర్ఏలను అన్యాయంగా అర్ధరాత్రి లాటరీ పద్ధతిలో వివిధ శాఖలకు కేటాయించిన గత ప్రభుత్వం ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జేఏసీ సారధ్యాన వీఆర్వోలకు పూర్వవైభవం వచ్చిందని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉద్యోగులు, సంఘాల నాయకులు డీఎస్.వెంకన్న, మంగీలాల్, బుచ్చయ్య, కోట రవికుమార్, పాక రమేష్, పూల్సింగ్ చౌహన్, శ్రీనివాస్, శంకర్రావు, ప్రేమ్కుమార్, వజ్జ రామారావు, వాంకుడోత్ వెంకన్న, పాండునాయక్, సలీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ●రిటైర్డ్ ఆర్డీఓ పొట్టపెంజర రాజారావు ఇటీవల మృతి చెందగా ఆయన చిత్రపటం వద్ద లచ్చిరెడ్డి నివాళులర్పించారు. అలాగే, ఆయన కుటుంబీకులను పరామర్శించాక మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగిగా నిజాయితీగా సేవలందించడమేకాక రెవెన్యూ పత్రిక నిర్వహించడంలో రాజారావు కీలకంగా వ్యవహరించారని కొనియాడారు. -
● చిన్నారి సహా పది మందికి గాయాలు
ఆర్టీసీ బస్సు – లారీ ఢీ వైరా: ఆర్టీసీ బస్సు – లారీ ఢీకొన్న ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. వైరాలోని రింగ్ రోడ్డు సెంటర్లో మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఖమ్మం నుంచి మణుగూరుకు వెళ్తోంది. వైరా బస్టాండ్లో నుండి రింగ్ రోడ్డులోకి తిరుగుతున్న సమయాన తల్లాడ వైపు నుండి ఖమ్మం వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో గుండాల మండలం వేపలగడ్డకు చెందిన వరమ్మ, ఆమె కోడలు భారతి, మనవడు మూడేళ్ల దేవిక్కు తీవ్ర గాయాలయ్యాయి. దేవిక్కు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఖమ్మం ఆస్పత్రికి వెళ్లివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరికి వైరాలో చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. ఇక కొత్తగూడెం చెందిన రియాజ్, రుద్రంపూర్కు చెందిన ప్రేమ్, పాల్వంచకు చెందిన శ్రావ్యకు, తల్లాడకు చెందిన జనార్దన్, భవాని, మోక్షిత్కు స్వల్పగాయాలు కావడంతో స్థానికులు బయటకు తీసి చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం మణుగూరు డిపో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని.. ఖమ్మం నుంచే వేగంగా, నిర్లక్ష్యంగా నడిపాడని ప్రయాణికులు, స్థానికులు వెల్ల డించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
రాజీవ్ యువవికాసం దరఖాస్తు గడువు పొడిగింపు
కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ఖమ్మంసహకారనగర్: యువతకు స్వయం ఉపాధి కల్పించేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు గడువును ఈనెల 14 వరకు పొడిగించిందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ యువతకు సంబంధిత కార్పొరేషన్ల ద్వారా 100 శాతం సబ్సిడీపై రూ.50 వేల యూనిట్, 90 శాతం సబ్సిడీపై రూ.లక్ష యూనిట్, 80 శాతం సబ్సిడీతో రూ.2 లక్షల యూనిట్, 70 శాతం సబ్సిడీతో రూ.4 లక్షల విలువైన ఏర్పాటుకు ఈ పథకం ద్వారా చేయూత అందుతుందని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోనైతే వార్షిక ఆదాయ పరిమితి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షల లోపు ఆదాయం కలిగిన వారు అర్హులని, తెల్ల రేషన్ కార్డులో దరఖాస్తుదారుల పేరు లేకపోతే ఆదాయ సర్టిఫికెట్ సమర్పించొచ్చని తెలిపారు. వ్యవసాయేతర పథకాలకు 21 – 55ఏళ్లు, వ్యవసాయ అనుబంధ రంగాల యూనిట్లకు 60ఏళ్ల వయస్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ చెప్పారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 14లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఎంపికై న వారికి యూనిట్ గ్రౌండింగ్, నిర్వహణలో శిక్షణ కూడా కలెక్టర్ ఓ ప్రకటనలో వివరించారు. నేటి నుంచి జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు ఖమ్మంసహకారనగర్: దేశవ్యాప్తంగా ఎన్టీఏ ఆధ్వర్యాన నిర్వహించే జేఈఈ మెయిన్స్, బీఆర్క్ రెండో విడత పరీక్షలకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈమేరకు బొమ్మ ఇంజనీరింగ్ కళాశాల, శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాల, ఎస్బీఐటీ, విజయ ఇంజనీరింగ్ కళాశాలల్లో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పరీక్షల జిల్లా కోఆర్డినేటర్ పార్వతీరెడ్డి వెల్లడించారు. కాగా, 2, 3, 4, 7, 8, 9తేదీల్లో జేఈఈ మెయిన్స్, బీఆర్క్ రెండో విడత పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఉదయం 9నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 6గంటల వరకు రెండు షిఫ్ట్లుగా పరీక్షలు ఉంటాయని, ఉదయం 8–30కు, మధ్యాహ్నం 2–30గంటలకు కేంద్రాలు మూసివేస్తామని వెల్లడించారు. విద్యార్థులు సాధారణ దుస్తులు ధరించాలని రావాలని సూచించిన ఆమె, కేంద్రాల్లో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయడమే కాక పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం మూడో రోజుకు చేరాయి. ఈసందర్భంగా స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించిన అర్చకులు మండపారాధన, మన్యు సూక్త హోమంతో పాటు సామూహిక సౌభాగ్యలక్ష్మి వ్రతం జరిపించారు. ఆతర్వాత ఉత్సవ మూర్తులను అశ్వవాహనంపై గిరి ప్రదక్షణ చేయించాక భక్తులకు అన్నదానం ఏర్పాటుచేశారు. ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ఆలయ పర్యవేక్షకులు కె.విజయకుమారి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉప ప్రధాన అర్చకులు ఉప్పల మురళీమోహన్శర్మ, అర్చకులు రాజీవ్శర్మ తదితరులు పాల్గొన్నారు. ‘రాజీవ్ యువవికాసం’ను సద్వినియోగం చేసుకోవాలి మధిర: అర్హులైన యువతీ, యువకులు స్వయం సమృద్ధి కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. మధిర మండలం దెందుకూరులో మంగళవారం పర్యటించిన ఆమె పథకానికి దరఖాస్తు చేసుకున్న వారితో మాట్లాడారు. దరఖాస్తు గడువును ఈనెల14 వరకు పొడిగించినందున, అర్హులైన నిరుద్యోగ యువత ముందుకు రావాలని తెలిపారు. తెల్ల రేషన్కార్డు లేకపోతే ఆదాయ ధ్రువీకరణ పత్రం ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఎంపికై న వారికి యూనిట్ ఎంపిక, వ్యాపార నిర్వహణలో శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఇన్చార్జ్ ఈడీ నవీన్బాబు తదితరులు పాల్గొన్నారు. -
సబ్స్టేషన్లలో కెపాసిటర్ బ్యాంక్లు
● తద్వారా ఓల్టేజీ హెచ్చుతగ్గులకు బ్రేక్ ● విద్యుత్ పరికరాల మన్నికకు దోహదంఖమ్మంవ్యవసాయం: ఎండలు ముదురుతుండడంతో విద్యుత్ వినియోగం నానాటికీ పెరుగుతోంది. ఈనేపథ్యాన నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం సబ్ స్టేషన్లు, ఫీడర్లలో కెపాసిటర్ బ్యాంక్లు ఏర్పాటు చేస్తున్నారు. ఓల్టేజీ హెచ్చతగ్గులను నియంత్రించి నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ఈ కెపాసిటర్ బ్యాంకులు దోహదపడతాయని చెబుతున్నారు. ఈమేరకు అవసరమైన ప్రాంతాల్లో వీటిని అమర్చడంపై ఎన్పీడీసీఎల్ అధికారులు దృష్టి సారించారు. కెపాసిటర్ బ్యాంక్లు, కెపాసిటర్లు ఎన్పీడీసీఎల్ ఖమ్మం సర్కిల్ పరిధిలో విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్ల సామర్ధ్యం ఆధారంగా కెపాసిటర్ బ్యాంక్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు 33/11 కేవీ సబ్స్టేషన్ల వద్ద 124 కెపాసిటర్ బ్యాంక్లు, విద్యుత్ లైన్లలో 60 కెపాసిటర్లను అమర్చారు. ఇవేకాక 11 కేవీ లైన్లలోనూ కెపాసిటర్ల ఏర్పాటుపై దృష్టి సారించారు. కాగా, కెపాసిటర్ బ్యాంక్ల ఏర్పాటుతో సబ్ స్టేషన్లు, లైన్ల నుంచి సరఫరాలో ఓవర్ లోడ్ సమస్య ఎదురుకాదని ఎదురుచెబుతున్నారు. పరికరాలకు నష్టం ఉండదు... కెపాసిటర్ బ్యాంక్ల ఏర్పాటు ద్వారా విద్యుత్ పరికరాల మన్నికకు దోహదపడుతుంది. వీటి ద్వారా సరఫరాలో లోపాలు, ఓల్టేజీ హెచ్చుతగ్గులను నియంత్రించే వీలు ఉండడంతో వ్యవసాయ పంపుసెట్లు, పారిశ్రామిక ఫీడర్లలో మోటార్లు కాలిపోయే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. అలాగే, సాంకేతిక నష్టాలు సైతం తగ్గుతాయని చెబుతున్నారు. ఈనేపథ్యాన పరిశ్రమల్లోనూ కెపాసిటర్ బ్యాంకుల ఏర్పాటుకు ఎన్పీడీసీఎల్ ప్రోత్సహిస్తోంది.కెపాసిటర్ బ్యాంక్ల ఏర్పాటుకు ప్రాధాన్యత నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం కెపాసిటర్ బ్యాంకుల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నాం. జిల్లాలో ఈ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. కెపాసిటర్ బ్యాంకుల ఏర్పాటు వినియోగదారులకు ప్రయోజనమే కాక కెపాసిటర్ల ద్వారా విద్యుత్ ఓల్టోజీ హెచ్చతగ్గులను నియంత్రించవచ్చు. – ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ -
ఆస్తిపన్ను వసూళ్లలో సత్తుపల్లి భేష్
● ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో ముందంజ ● ఆ తర్వాత స్థానంలో ఇల్లెందు ● కేవలం 52శాతంతో జాబితాలో చివరన వైరా సత్తుపల్లిటౌన్: 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను వసూళ్ల గడువు సోమవారంతో ముగిసింది. ఈనేపథ్యాన ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో పరిశీలిస్తే సత్తుపల్లి ముందంజలో నిలిచింది. చివరిరోజు వరకు మున్సిపాలిటీ మేనేజర్ సహా రెవెన్యూ యంత్రాంగమంతా పన్ను వసూళ్లలో నిమగ్నం కావడం.. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఆరు రోజుల ముందు ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ పథకం ద్వారా పన్ను వడ్డీపై 90 శాతం రాయితీని ప్రకటించడంతో బకాయిదారులకు మెరుగైన వసూళ్లు నమోదయ్యాయి. అంతేకాక ఆస్తి పన్ను చెల్లించకుండా మొండికేసిన వారికి జప్తు నోటీసులు జారీ చేయడం.. నల్లా కనెక్షన్లు తొలగిస్తామన్న హెచ్చరికలతో చాలా మంది మొండి బకాయిదారులు సైతం పన్ను చెల్లించారు. వసూళ్లు ఇలా... ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో పరిశీలిస్తే సత్తుపల్లిలో రూ.4.91 కోట్లకు రూ.4.26 కోట్లు, వైరాలో రూ.4.06 కోట్లకు రూ.2.13 కోట్లు, మధిరలో రూ.2.56 కోట్లకు రూ.1.96 కోట్లు వసూలైంది. కొత్తగూడెం మున్సిపాలిటీలో రూ.7.93 కోట్లకు రూ.5.86 కోట్లు, మణుగూరులో రూ.2.42 కోట్లకు రూ.1.50 కోట్లు, పాల్వంచలో రూ.6.29 కోట్లకు రూ.4.13 కోట్లు, ఇల్లెందులో రూ.2.67 కోట్ల పన్ను డిమాండ్కు గాను రూ.2.20 కోట్లు ఆస్తి పన్ను వసూలు చేయగలిగారు. గత ఏడాదితో పోలిస్తే మెరుగు సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో 85 శాతం పన్నులు వసూలయ్యాయి. అయితే, 2024–25లో 86.76 శాతం వసూలవడంతో గత ఏడాది కంటే మెరుగైంది. పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని చేరుకునేలా నెల ముందు నుంచే స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ కె.నర్సింహ రోజువారి సమీక్షలు చేస్తూ.. మొండిబకాయిదారులతో మాట్లాడడంతో సత్ఫలితాలు వచ్చాయి. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో 86.76 శాతంతో సత్తుపల్లి ముందంజలో నిలువగా.. వైరా మున్సిపాలిటీలో కేవలం 52.46 శాతమే వసూలు కాగా చివరి స్థానంలో నిలిచింది.పన్నులు వసూలు చేస్తున్న కమిషనర్, ఉద్యోగులు (ఫైల్) ముందస్తు ప్రణాళికతో... ఆస్తిపన్ను వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ చేపట్టడంతో పాటు లక్ష్యసాధనకు సమష్టిగా శ్రమిం చాం. ఫిబ్రవరి నుంచి ఇంటింటికీ మా సిబ్బంది వెళ్లి పన్నులు చెల్లించాలని అవగాహన కల్పించాం. తొమ్మిది బృందాలతో ప్రతిరోజు సమీక్షలు చేస్తూ పన్నుల వసూళ్లను వేగవంతం చేశాం. వచ్చే ఏడాది నూరు శాతం పన్నుల వసూళ్లకు ఇప్పటి నుంచే ప్రణాళికాయుతంగా ముందుకు సాగుతాం. – కె.నర్సింహ, కమిషనర్, సత్తుపల్లి -
తల్లిదండ్రులే స్ఫూర్తిప్రదాతలు
మధిర: మధిర మండలంలోని చిన్న గ్రామం నాగవరప్పాడు. ఆ గ్రామంలో రైతు కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరులు తల్లిదండ్రులే స్ఫూర్తిగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఇంకొందరికి ఆదర్శంగా నిలిచారు. నాగవరప్పాడుకు చెందిన భీమనబోయిన వెంకట నరసయ్య – రాధ దంపతులకు ఇద్దరు కుమారులు. వెంకటనరసయ్య మూడు దశాబ్దాల క్రితం హోంగార్డ్గా పనిచేస్తూ భార్యతో కలిసి పొలం పనులు చూసుకునేవాడు. వ్యవసాయంపై దృష్టి పెట్టలేక హోంగార్డు ఉద్యోగం మానేశారు. అయితే, ఎస్ఐ తదితర అధికారులకు అందే విలువ, గౌరవ మర్యాదలను చూసిన ఆయన తన కుమారులిద్దరు పోలీస్ ఉద్యోగాలకు ఎంపియ్యేలా స్ఫూర్తిగా నింపారు. దీంతో పెద్ద కుమారుడు గోపీకృష్ణ 2015లో బీటెక్ పూర్తి చేసి 2017లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. ఇక చిన్న కుమారుడు మనోహర్ గోపి 10వ తరగతి వరకు గోసవీడు ప్రగతి స్కూల్లో, ఇంటర్ విజయవాడ శ్రీ చైతన్యలో, బీటెక్లో జేఎన్టీయూలో పూర్తిచేశాక కొన్నాళ్లు ప్రైవేట్ ఉద్యోగం చేశాడు. తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చేలా ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమై తొలిప్రయత్నంలోనే ఏఎంవీఐగా, ఏపీలో నాన్ లోకల్ కోటా కింద ఎస్సైగా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలు సాధించడమే కాక గ్రూప్–4లో రాష్ట్రస్థాయి 84, ఖమ్మం జిల్లాలో రెండో ర్యాంక్ సాధించారు. ఆపై పాలిటెక్నిక్ లెక్చరర్గానూ ఉద్యోగం సాధించిన మనోహర్ గోపి ఇటీవల మధిర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విధుల్లో చేరాడు. తల్లిదండ్రులే రోల్ మోడల్.. వెంకట నరసయ్య హోంగార్డ్ ఉద్యోగం చేస్తూనే పొలం పనులకు వెళ్లడం, తల్లి రాధ ఆయనకు సహకరిస్తుండడం.. రోజంతా తల్లిదండ్రులకు కష్టపడుతుండడాన్ని చిన్నతనం నుంచే కళ్లారా చూశామని గోపీకృష్ణ, మనోహర్ గోపి తెలిపారు. అంతేకాక మంచిగా చదివి పెద్ద ఉద్యోగాలు సాధించాలని తల్లిదండ్రులు నింపిన స్ఫూర్తితో కష్టపడడంతోనే ఫలితం వచ్చిందని వెల్లడించారు. ఇక తాత భీమనబోయిన పెద్ద నారాయణ సైతం ఇతరులను ఇబ్బంది పెట్టకుండా కష్టాన్ని నమ్ముకుని పట్టుదలతో పనిచేసే తత్వాన్ని నేర్పించారని గుర్తుచేసుకున్నారు.ప్రభుత్వ కొలువుల్లో ఇద్దరు కుమారులు -
టోల్గేట్ చార్జీల సవరణ
కూసుమంచి: ఎన్హెచ్ఏఐ(జాతీయ రహదారుల ప్రాధికారిత సంస్థ) ఆధీనంలోని టోల్గేట్ల ఫీజులను సోమవారం అర్ధరాత్రి నుండి సవరించారు. ఇందులో భాగంగా ఖమ్మం–సూర్యాపేట జాతీయ రహదారిపై నాయకన్గూడెం సమీపాన ఉన్న సింగరేణిపల్లి టోల్ గేట్ ఫీజులు కూడా స్వల్పంగా పెరిగాయి.పెరిగిన ఫీజుల వివరాలు వాహనం సింగిల్ జర్నీ రెండు వైపులా పాత ఫీజు పెంచిన ఫీజు పాత ఫీజు పెంచిన ఫీజు కారు, జీపు, వ్యాన్, ఎల్ఎంవీ వాహనాలు రూ.120 రూ.125 రూ.180 రూ.185 ఎల్సీవీ, మినీ బస్సులు రూ.195 రూ.200 రూ.290 రూ.300 బస్సు, ట్రక్కులు రూ.405 రూ.420 రూ.610 రూ.630ఇవేకాక హెవీ వాహనాలు, డిస్ట్రిక్ కమర్షియల్ వాహనాలు, నాన్ ఫాస్టాగ్ వాహనాలకు సైతం గతంలో ఉన్న ఫీజును వాహనాల ఆధారంగా రూ.60వరకు పెంచారు.స్వల్పంగా పెరిగిన ఫీజులు -
భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలి
● ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టండి ● అధికారులకు దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశం భద్రాచలం: భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యా ణం, పట్టాభిషేక మహోత్సవాలకు వచ్చే భక్తులు ఎండల కారణంగా ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ అధి కారులకు సూచించారు. మిథిలా స్టేడియం, ఆల య పరిసరాలను మంగళవారం ఆయన పరిశీలించారు. సెక్టార్ల విభజన, సీఎం, వీవీఐపీ, ఇతర సెక్టార్లలో ఏర్పాట్ల గురించి అధికారులు మ్యాప్ ద్వారా వివరించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ఎండల నేపథ్యంలో భక్తులు ఇబ్బంది పడకుండా తాగునీరు, మజ్జిగ, గాలి వీచేలా ఏర్పాట్లు చేయడంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. భక్తులు కల్యాణంతో పాటు ఆ తర్వాత మూలమూర్తులను దర్శించుకునేలా చూడాలని, భక్తులందరికీ తలంబ్రాలు, ప్రసాదం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈకార్యక్రమంలో ఐటీడీఏ పీఓ బి.రాహుల్, ఏఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్, దేవస్థానం ఈఓ రమాదేవి, ఈఈ రవీందర్, ఆర్డీఓ దామోదర్రావు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి విజయంతో పాదయాత్ర
ఖమ్మంసహకారనగర్/కొణిజర్ల/వైరా: పీఆర్టీయూ టీఎస్ నుంచి ఎమ్మెల్సీగా బరిలోకి దిగిన పింగిలి శ్రీపాల్రెడ్డి విజయం సాధించిన నేపథ్యాన యూనియన్ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు నేతృత్వాన మంగళవారం ఖమ్మం ఇందిరానగర్లోని వినాయక స్వామి దేవాలయం నుండి 23మందితో కొణిజర్ల మీదుగా 25 కి.మీ. పాదయాత్ర చేపట్టి వైరాలోని పాత శివాలయానికి చేరుకున్నారు. ఈసందర్భంగా వైరాలోని పాత శివాలయం, రిజర్వాయర్ సమీపంలోని దాసాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శ్రీపాల్రెడ్డి విజయానికి గుర్తుగా పాదయాత్ర చేపట్టామని తెలిపారు. ఆయన ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటూ ఉపాధ్యాయులు, విద్యారంగం సమస్యల పరిష్కారానికి పాటుపడతారని చెప్పారు. ఈ యాత్రలో పీఆర్టీయూ జిల్లా, మండలాల బాధ్యులు వెలిశెట్టి నరసింహారావు, గోవర్ధనరెడ్డి, డి.సత్యనారాయణ, జాన్, రామచంద్రయ్య, రమేష్, హరిబాబు, శ్రీనివాసరావు, సరిత, రూప, సునీత, సతీష్, వెంకటరమణ, విజయ్ అమృతకుమార్, రత్నకుమార్, సీతారామయ్య, కుసుమ నాగేశ్వరరావు, కె.రాము, పాటి వెంకటేశ్వర్లు, టి.వెంకన్న, కె.గోపాలరావు, గార్లపాటి రామారావు, కే.వీ.నాయుడు, తాత రాఘవయ్య, పి.వెంకట్రెడ్డి, ప్రభాకర్, అనంతోజు పుల్లయ్యచారి, భిక్షం, రమేష్ పాల్గొనగా.. కాంగ్రెస్ నాయకులు సూరంపల్లి రామారావు, నెల్లూరి రమేష్, చల్లగుండ్ల సురేష్ స్వాగతం పలికారు. -
జేవీఆర్ ఓసీ.. లక్ష్యసాధనలో మేటి
సత్తుపల్లిరూరల్: సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా 114 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడమే కాక 112.5 లక్షల టన్నుల రవాణాతో జేవీఆర్ ఓసీ మేటిగా నిలిచిందని పీఓ ప్రహ్లాద్ తెలిపారు. ఉత్పత్తి, రవాణాలో రికార్డు సృష్టించిన నేపథ్యాన పీఓతో పాటు మేనేజర్ రాజేశ్వరరావును ఐఎన్టీయూసీ నాయకులు భాస్కర్ నాగప్రకాష్, రామారావు మంగళవారం సన్మానించారు. అనంతరం వారు కాలనీలో కమ్యూనిటీ హాల్, వాకింగ్ ట్రాక్, ఆర్వో ప్లాంట్, సింగరేణి సూపర్ బజార్, పార్కు, ఓపెన్ జిమ్ ఏర్పాటు ఆవశ్యకతను వివరించగా పీఓ ప్రహ్లాద్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో కోటి, ఐ.వీ.రెడ్డి, సురేష్, పొట్టి కిరణ్, సుదర్శన్, తిరుమలరావు, రాజేందర్, రాంచందర్, లాలు, మురలి, కిషన్రావు, లింగమూర్తి, చంద్రశేఖర్, సందీప్, శ్రీనివాస్, కనకరావు, రమేష్, మాలోతు అశోక్ పాల్గొన్నారు. విద్యార్థి చదువులకు రూ.65,500 ఆర్థికసాయం కల్లూరు: కల్లూరుకు చెందిన నిరుపేద విద్యార్థి చింతకాయల నరసింహారావు వరంగల్లో బీఎస్సీ నర్సింగ్ చదువుతుండగా, ఫీజు, హాస్టల్ ఇతర ఖర్చులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈవిషయాన్ని స్ఫూర్తి ఫౌండేషన్ ప్రతినిధి వరకా రామారావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఫౌండేషన్ చైర్మన్ శ్రీవ్యాల్తో మాట్లాడగా రూ.65,500 చెక్కును మంగళవారం నరసింహారావు తల్లి సీతమ్మకు అందజేశారు. వలంటీర్లు ఉబ్బన బాబూరావు, జల్దా రామకృష్ణ, సిరసాని రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
●దారి చూపిన దేవత.. అమ్మ
సత్తుపల్లి: తండ్రి చిన్నతనంలోనే కన్నుమూశాడు.. అప్పటి నుంచి అన్నీ తానై పెంచిన తల్లి ప్రజలకు సేవ చేసే ఉద్యోగం సాధించాలని చెబుతుండేది. ఆమె కోరిక మేరకు కష్టపడి చదివిన యువకుడు గ్రూప్–1 ర్యాంకు సాధించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని తాటి సుబ్బన్నగూడెంకు చెందిన తాటి రామచంద్రరావుకు భార్య సుదర్శనమ్మతో పాటు కుమారులు ప్రమోద్సాయి, ప్రదీప్చంద్ర ఉన్నారు. పిల్లల చిన్నవయస్సులోనే రామచంద్రరావు మృతి చెందగా తల్లి అన్నీ తానై పెంచి పెద్దచేసింది. ప్రస్తుతం ఆమె సత్తుపల్లి మండలం కాకర్లపల్లి హైస్కూల్లో సోషల్ టీచర్గా విధులు నిర్వర్తిస్తోంది. ప్రమోద్ సత్తుపల్లిలోని వీ.వీ.విద్యాలయంలో 10వ తరగతి పూర్తిచేశాక ఇంటర్ అనంతరం హైదరాబాద్లోని వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. అయితే, సివిల్ సర్వెంట్గా ఉద్యోగం సాధించాలని, తద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కుతుందన్న తల్లి సూచనలతో ప్రమోద్ సివిల్స్కు సిద్ధమయ్యాడు. ప్రమాదంలో తీవ్రగాయాలు సివిల్స్కు సిద్ధమయ్యే క్రమాన ప్రమోద్సాయి ఢిల్లీలోని వాజిరం కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటుండగా 2019లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగాగ గాయపడ్డాడు. దీంతో ఆరేళ్ల సమయాన్ని చికిత్స కారణంగా కోల్పోయినా ఆయన ఆత్మవిశ్వా సం చెక్కుచెదరలేదు. తల్లి ప్రోత్సాహంతో ఎలాంటి శిక్షణ తీసుకోకుండా ఇంటి వద్దే సిద్ధమైన ఆయన గ్రూప్–1లో రాష్ట్ర స్థాయిలో 317, ఎస్టీ కేటగిరీ జోన్–1లో 10వ ర్యాంక్ సాధించడం విశేషం. తద్వారా తల్లి కోరికను నెరవేర్చారనని ప్రమోద్ తన ఆనందాన్ని పంచుకున్నాడు.గ్రూప్–1 సాధించి తల్లి కోరిక నెరవేర్చిన యువకుడు -
జమలాపురంలో ధ్వజారోహణం
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి బ్రహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, శ్రీవారి పాదానికి పంచామృతంతో అభిషేకం చేశారు. ఆతర్వాత ధ్వజారోహణం చేయడమే కాక రుద్రహోమం నిర్వహించిన అర్చకులు శ్రీవారు, అమ్మవార్లను గజవాహనంపై గిరి ప్రదక్షిణ చేయించారు. ఆలయ ఈఓ జగన్మోహన్రావు, ప్రధాన అర్చకుడు శ్రీనివాసశర్మ, సూపరింటెడెంట్ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. రామదాసు మందిరంలో చైన్నె భక్తుల కచేరీ నేలకొండపల్లి: భక్త రామదాసు జన్మస్థలమైన నేలకొండపల్లిలోని రామదాసు ధ్యాన మందిరంలో చైన్నెకి చెందిన భక్తులు కచేరీ నిర్వహించారు. దేశంలోని అన్ని రామదాసు మందిరాలను సందర్శించి కచేరీలు చేస్తున్న 15మంది బృందం సోమవారం నేలకొండపల్లికి చేరింది. ఈ సందర్భంగా రామదాసు వాడిన బావితో పాటు ఆడిటోరియంలోని పరిశీలించాక ఆయన విగ్రహం వద్ద పూజలు చేశారు. ఆతర్వాత మందిరంలో రామదాసు కీర్తనలతో కచేరీ నిర్వహించగా పలువురు స్థానికులు సైతం పాల్గొన్నారు. మందిరం పూజారి సౌమిత్రి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్అండ్బీ ఎస్ఈగా యుగంధర్ ఖమ్మంఅర్బన్: ఆర్అండ్బీ ఖమ్మం సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్ఈ)గా వి.యుగంధర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇన్చార్జ్ ఎస్ఈగా ఉన్న హేమలత ఉద్యోగ విరమణ చేశారు. దీంతో ఖమ్మం ఈఈ యుగంధర్కు ఎస్ఈగా అదనపు బాధ్యతలు అప్పగించడంతో విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ఇంజనీర్లు, కార్యాలయ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు శుభాకాంక్షలు తెలిపారు. -
ఉత్పత్తిలో సింహభాగం సత్తుపల్లిదే..
సత్తుపల్లి: బొగ్గు ఉత్పత్తి, రవాణాలో సింగరేణి వ్యాప్తంగా సత్తుపల్లి సింహభాగాన నిలుస్తోందని సంస్థ సీఎండీ బలరాంనాయక్ వెల్లడించారు. ఇందుకు శ్రమించిన కార్మికులు మొదలు అధికారుల వరకు అభినందనీయులని తెలిపారు. సత్తుపల్లి మండలం జేవీఆర్ ఓసీ ఆవరణలో సోమవారం రాత్రి ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది సత్తుపల్లి ఓసీల ద్వారా గతేడాది కంటే 6లక్షల టన్నులు అధికంగా 144.55 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగిందని, 162.23 లక్షల టన్నులు రవాణా చేశామని తెలిపారు. మార్చి 28వ తేదీన 80,931లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తితో రికార్డు సృష్టించడం విశేషమన్నారు. కాగా, సత్తుపల్లి జీఎం కార్యాలయాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని సీఎండీ వెల్లడించారు. గ్లోబల్గా సంస్థగా... కొత్తగూడెం వీకే ఓసీ, ఇల్లెందు రొంపెడు ఓసీలకు అనుమతులు వచ్చాయని వెల్లడించిన సీఎండీ... త్వరలోనే ఆయా గనుల్లో ఉత్పత్తి మొదలుపెడతామని తెలిపారు. ఒడిశా రాష్ట్రంలో పది మిలియన్ టన్నుల ఉత్పత్తికి ఒప్పందం కుదిరిందని చెప్పారు. రాజస్తాన్లో 3,100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నామని, ఆస్ట్రేలియాలోనూ బొగ్గు ఉత్పత్తికి ప్రణాళికలు ఉన్నందున సింగరేణి గ్లోబల్గా సంస్థగా అవతరిస్తుందని తెలిపారు. అలాగే, బొగ్గు నాణ్యత విషయంలో గతంలో ఫిర్యాదులు వచ్చేవని.. ఇప్పుడు అవి తగ్గాయని వివరించారు. సీఎండీని కలిసిన సైలోబంకర్ బాధితులు కిష్టారం అంబేద్కర్ కాలనీకి చెందిన సైలో బంకర్ బాధితులు సింగరేణి సీఎండీ బలరాంనాయక్ను కలిసి వారి సమస్యలు వివరించారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే ద్వారా మంత్రుల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని..త్వరలో ఒక పరిష్కారం చూపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సింగరేణి డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, జీఎం షాలెంరాజు, పీఓలు ప్రహ్లాద్, నర్సింహారావు, ఏసీపీ ఎ.రఘు, అధికారులు పాల్గొన్నారు. గత ఏడాదితో కంటే మెరుగైన ఉత్పత్తి, రవాణా సీఎండీ బలరాంనాయక్ -
భక్తిశ్రద్ధలతో రంజాన్
నెల పాటు ఉపవాస దీక్ష ఆచరించిన ముస్లింలు సోమవారం రంజాన్(ఈద్ ఉల్ ఫితర్) పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయాన్నే సమీపంలోని ఈద్గాలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మతపెద్దలు ప్రవక్త బోధనలు వినిపించడమే కాక సాటి మానవులకు సాయపడేలా ప్రవక్త బాటను అనుసరించాలని సూచించారు. అనంతరం ముస్లింలు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఆతర్వాత కులమతాలకతీతంగా స్నేహితులను ఇళ్లకు ఆహ్వానించి విందు ఇచ్చారు. మధిరలోని పలువురు ముస్లింల ఇళ్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లి శుభాకాంక్షలు తెలపగా.. ఖమ్మంలోని గొల్లగూడెం ఈద్గాలో జరిగిన ప్రార్థనలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. – ఫొటోలు 9లో...ఈద్గాల్లో సామూహికంగా ప్రత్యేక ప్రార్థనలు ● ప్రవక్త బోధనలు వినిపించిన మతపెద్దలు -
ఖమ్మం–కోదాడ పాత రోడ్డుకు మహర్దశ
● జాతీయ రహదారుల అథారిటీ నుంచి నిధులు ● 18 కి.మీ. మేర రహదారికి రూ.20 కోట్లువేసవిభత్యానికి రాంరాం.. వేసవిలో ఎండల తీవ్రత ఉన్నా పనులకు వచ్చే వారిని ప్రోత్సహించేలా కూలీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేసవిభత్యం చెల్లించడం ఆనవాయితీ. కానీ గత ఏడాది వేసవిభత్యం ప్రకటించకపోగా, ఈసారి కూడా అలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో అసలు వేసవిభత్యం ఉంటుందా, తొలగించారా అన్న మీమాంస నెలకొంది. కాగా, కూలీలకు తాగునీరు సమకూర్చేందుకు మాత్రం గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేయనుంది. ఒక్కో కూలీకి రూ.2.50 చొప్పున జీపీలకు కేంద్రం నిధులు విడుదల చేస్తుండగా, ఆ నిధులతో పని ప్రదేశాల్లో నీటి వసతి కల్పించాల్సి ఉంటుంది.నేలకొండపల్లి: జాతీయ రహదారి అందుబాటులోకి వచ్చాక పట్టించుకునే వారెవరూ లేక పాత రోడ్డు పరిస్థితి అధ్వానంగా మారింది. గుంతలు తేలిన ఈ రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారిన నేపథ్యాన ఎట్టకేలకు జాతీయ రహదారుల అథారిటీ నుంచి ఖమ్మం–కోదాడ రహదారి అభివృద్ధికి రూ.20కోట్ల నిధులు మంజూరవడంతో త్వరలోనే కొత్తరూపు సంతరించుకోనుంది. 365(ఏ) నంబర్తో ఖమ్మం–కోదాడ మధ్య జాతీయ రహదారి నిర్మాణం పూర్తయింది. అంతకుముందు ఖమ్మం నుంచి ముదిగొండ – నేలకొండపల్లి – పైనంపల్లి మీదుగా రాకపోకలు సాగేవి. హైవే నిర్మాణం జరిగిన నాలుగేళ్ల పాటు అంతకుముందు వేలాదిగా వాహనాలు ఇదే రోడ్డుపై వచ్చివెళ్లడంతో గుంతలమయమై అధ్వానంగా మారింది. ప్రస్తుతం కొత్త హైవేపై భారీ వాహనాల రాకపోకలు సాగుతున్నా, పలు గ్రామాల ప్రజలకు పాత రహదారే ప్రత్యామ్నాయంగా ఉంది. కానీ తారు లేచిపోయి గుంతలు తేలడంతో ఈ రోడ్డుపై ప్రయాణిస్తున్న వారి వాహనాలు దెబ్బతినడమే కాక ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. అప్పుడప్పుడు మరమ్మతులు చేస్తున్నా శాశ్వత పనులు చేపట్టకపోగా.. చివరకు జాతీయ రహదారుల అథారిటీ నిధులు మంజూరు చేశారు. ఆర్అండ్బీ ద్వారా పనులు ఖమ్మం – కోదాడ మార్గంలోని పాత రహదారిపై కొత్తగా బీటీ వేసేందుకు రూ.20కోట్లు మంజూరు చేశారు. ఖమ్మం నుంచి కోదాడ వరకు 18 కి.మీ. మేర ఈ రోడ్డును అభివృద్ధి చేస్తారు. ఖమ్మం, ముదిగొండ బైపాస్, నేలకొండపల్లి, పైనంపల్లి మీదుగా కోదాడ వరకు చేపట్టే పనులకు గాను జాతీయ రహదారుల అథారిటీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో నిధులు జమ చేశారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆర్అండ్బీ శాఖ ద్వారా చేపట్టే పనులు త్వరలోనే మొదలుకానున్నాయి.నిధులు విడుదల అయ్యాయి.. జాతీయ రహదారి అథారిటీ నుంచి పాత రోడ్డు అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. బైపాస్లు కలుపుతూ 18 కి.మీ. మేర రహదారి అభివృద్ధికి రూ.20 కోట్లు కేటాయించారు. ఈ పనులను త్వరలోనే ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యాన చేపడతారు. – దివ్య, పీడీ, నేషనల్ హైవేస్ -
సన్నబియ్యం.. సిద్ధం
ఓ రేషన్ షాప్ వద్ద ఏర్పాటుచేసిన బోర్డుచింతకాని మండలం నామవరంలోని రేషన్షాప్లో స్టాక్ను పరిశీలిస్తున్న డీసీఎస్ఓ చందన్కుమార్, ఉద్యోగులుఖమ్మంసహకారనగర్: రేషన్షాప్ల ద్వారా కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఉగాది నుంచి సన్నబియ్యం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో బియ్యం పంపిణీని ఇటీవల సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఇక జిల్లాలోని షాపుల్లో మంగళవారం నుంచి బియ్యం పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఫలితంగా దొడ్డుబియ్యం తినలేక రేషన్కార్డులు ఉన్నా షాపులకు వెళ్లని పలువురు ఇకపై ముందుకొచ్చే అవకాశముందని భావిస్తు న్నారు. జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు సన్నబియ్యం పంపిణీని ప్రారంభించే అవకాశముంది. షాపులకు స్టాక్ జిల్లాలోని అన్ని రేషన్ షాప్ల ద్వారా నేటి నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి దుకాణాల కు బియ్యం సరఫరా చేశారు. ఇన్నాళ్లు దొడ్డు బియ్యం ఇస్తుండడం, గత రెండు, మూడు నెలలు గా సక్రమంగా సరఫరా కాకపోవడంతో ఇక్కట్లు ఎదురయ్యాయి. ప్రస్తుతం సన్నబియ్యం పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండడంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా లబ్ధిదారులకు అందనున్నాయి. ఈ బియ్యం ఎలా? జిల్లాలోని అన్ని షాప్ల లబ్ధిదారులకు నెలనెలా 7,375.868 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. అయితే, గత నెల షాప్లకు చేరవేసిన దొడ్డు బియ్యం నిల్వలు కొన్ని చోట్ల స్టాక్ ఉన్నాయి. సన్నబియ్యం పంపిణీ చేసే క్రమాన జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి, ఉద్యోగులు షాపుల్లోని నిల్వ లను పరిశీలించి రిజిస్టర్లలో నమోదు చేశాక పక్కన పెట్టించారు. ఈమేరకు దాదాపు 10వేల క్వింటాళ్ల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ బియ్యం ఏం చేయాలనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదని అధికారులు చెబుతున్నారు.అన్ని షాపుల ద్వారా పంపిణీ జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయనున్నాం. ఇప్పటికే షాప్లకు స్టాక్ చేరవేశాం. ఎక్కడా ఇబ్బంది ఎదురుకాకుండా పంపిణీ చేయాలని సూచించాం. దొడ్డుబియ్యం నిల్వలపై ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాల్సి ఉంది. – కె.చందన్కుమార్, డీసీఎస్ఓఆహారభద్రత కార్డులు 3,83,717మొత్తం రేషన్కార్డులు 4,10,988రేషన్ దుకాణాలు 748లబ్ధిదారులు 11,48,031బియ్యం కేటాయింపు 7,375.868 మెట్రిక్ టన్నులుజిల్లాలో రేషన్ వ్యవస్థ వివరాలుఅంత్యోదయ 27,268అన్నపూర్ణ 03నేటి నుంచి రేషన్షాపుల్లో పంపిణీ జిల్లాలో 11.48లక్షల మంది లబ్ధిదారులు షాపుల్లో స్టాక్ ఉన్న దొడ్డుబియ్యంపై సందిగ్ధత -
పెంచలేదని అనకుండా..
● ఉపాధి కూలీలకు రోజువారీ వేతనం రూ.7 పెంపు ● ఉత్తర్వులు విడుదల చేసిన కేంద్రం ● వేసవిభత్యం ఊసే ఎత్తని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలుఖమ్మంమయూరిసెంటర్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు ఈసారి నామమాత్రంగానే వేతనం పెరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది చాలా తక్కువ కావడం గమనార్హం. ఇప్పటి వరకు ఒక్కో కూలీకి రూ.300 చెల్లిస్తుండగా.. ఈసారి మరో రూ.7పెంచుతూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మంగళవారం నుంచి కూలీలకు రూ.307 చెల్లించనున్నారు. అతి తక్కువగా వేతనం పెంచడంపై కూలీల్లో నిరాశ అలుముకుంది. నాలుగో వంతు ఏటా ఉపాధి కూలీల వేతనాన్ని రూ.15నుంచి రూ.25మేర పెంచుతున్నారు. దీంతో ప్రస్తుతం కూలీలకు రూ.300 అందుతుండగా ఈసారి అతి తక్కువగా రూ.7మాత్రమే పెంచడం గమనార్హం. 2024–25 ఏడాదికి రూ.28 పెంచిన కేంద్రం.. 2025–26కు అందులో నాలుగో వంతు మాత్రమే పెంచడంతో కూలీలు పనులపై విముఖత చూపే అవకాశం కనిపిస్తోంది. 58.28 లక్షల పనిదినాలు పూర్తి 2024–25 ఏడాదిలో 62.17 లక్షల పనిదినాలకు గాను 58.28 లక్షలు మాత్రమే పూర్తయ్యాయి. ఇందులో 1,419 కుటుంబాలు వంద రోజుల పనిదినాలు పూర్తి చేశాయి. ఈ పనుల కోసం రూ.204.99 కోట్లు వెచ్చించగా.. అందులో రూ.127.39 కోట్లు కూలీలకు వేతనంగా, రూ.67.27 కోట్లు సామగ్రి కోసం ఖర్చు చేశారు. మరో రూ.10 కోట్లు కార్యకలాపాలు, ఉద్యోగుల వేతనాలు, కార్యాలయాల నిర్వహణకు వెచ్చించారు. ఈసారి 54 లక్షల పనిదినాలే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు దొరకని వేసవి సమయంలో ఉపాధి హామీ పనులకు వెళ్లడానికి కూలీలు ఆసక్తి కనబరుస్తారు. జిల్లాలోని చాలా మండలాల్లో కూలీల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఈనేపథ్యాన ఉపాధి హామీ పనిదినాల లక్ష్యాలను కేంద్రమే నేరుగా పర్యవేక్షిస్తోంది. ఉపాధి పథకం పనులకు వచ్చే కూలీల సంఖ్య ఆధారంగా గ్రామం, బ్లాక్(మండలం), జిల్లాకు పనిదినాల లక్ష్యాలను నిర్దేశిస్తుంది. ఈమేరకు జిల్లా నుంచి 2025–26 ఆర్ధిక సంవత్సరంలో 54,33,704 పనిదినాలు కల్పించేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపించారు. తాజాగా ముగిసిన ఏడాదిలో నిర్దేశిత లక్ష్యాన్ని చేరకపోవడంతోనే ఈసారి పనిదినాల సంఖ్య తగ్గించినట్లు తెలుస్తోంది. అయితే, ప్రతిపాదనల ఆధారంగా నెలవారీ లక్ష్యాలను కేంద్రప్రభుత్వం ప్రకటించనుండగా.. అందుకు అనుగుణంగా జిల్లాలో కూలీలకు పనులు కల్పిస్తారు.జిల్లాలో ‘ఉపాధి’ వివరాలు జాబ్కార్డులు 3.06 లక్షలు కూలీల సంఖ్య 6.43 లక్షలు యాక్టివ్ జాబ్కార్డులు 1.83 లక్షలు యాక్టివ్ కూలీలు 3.08 లక్షలు -
ప్రార్థనలకు రాజకీయ నాయకులు వద్దు..
● మాజీ మంత్రి పాల్గొనడంపై ముస్లింల అభ్యంతరం ● కాంగ్రెస్ నేతల ఉపన్యాసాలకూ అడ్డుఖమ్మం అర్బన్: రంజాన్ సందర్భంగా ఖమ్మం గొల్లగూడెం ఈద్గా వద్ద సోమవారం పెద్దసంఖ్యలో ముస్లింలు ప్రార్థనలు చేశారు. అయితే, ప్రార్థనలో ముస్లింలతో పాటు మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పాల్గొనడంపై పలువురు అభ్యంతరం తెలిపారు. ప్రార్థనలో హిందువులు పాల్గొనవద్దని, పక్కన ఏర్పాటుచేసిన టెంట్ కింద కూర్చుని ప్రార్థన ముగిశాక శుభాకాంక్షలు తెలపాలని అన్నారు. దీంతో పువ్వాడ సమీపంలోని టెంట్ వద్దకు చేరుకుని, ఆతర్వాత ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపి వెళ్లిపోయారు. కాగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రార్థన ముగిశాక ఈద్గాకు వచ్చి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, అక్కడ మిగిలి ఉన్న వారిని ఉద్దేశించి తుమ్మల సమక్షాన ముస్లిం నాయకులు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించే ప్రయత్నం చేయబోగా పలువురు అడ్డుచెప్పారు. పవిత్రమైన రంజాన్ పండుగ ప్రార్థనలో రాజకీయ ప్రసంగాలు చేయొద్దని సూచించారు. -
వ్యవసాయ శాఖకు కొత్త ఫోన్ నంబర్లు
జిల్లావ్యాప్తంగా వ్యవసాయ శాఖ అధికారుల ఫోన్ నంబర్లు మారాయి. జిల్లా వ్యవసాయాధికారి మొదలు కార్యాలయంలో పనిచేసే అధికారులు, ఏడీఏలు, ఏఓలకు కొత్త నంబర్లు కేటాయించారు. ఎయిర్టెల్ నంబర్లను వ్యవసాయ శాఖ కేటాయించగా, ఇకపై ఇదే నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు. – ఖమ్మంవ్యవసాయండీఏఓ మొదలు ఏఓల వరకు కేటాయింపుహోదా ఫోన్ నంబర్ జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం జిల్లా వ్యవసాయాధికారి 89777 47500 ఏడీఏ, టెక్నికల్ 89777 47501 ఏడీఏ, టెక్నికల్ 89777 47502 పరిపాలనా అధికారి 89777 47503 ఏఓ, టెక్నికల్ 89777 47396 ఏఓ, టెక్నికల్ 89777 47397 ఏఓ, టెక్నికల్ 89777 47398 ఏఓ, టెక్నికల్ 89777 47399 రైతు శిక్షణా కేంద్రం(ఎఫ్టీసీ) డిప్యూటీ డైరెక్టర్ 89777 46566 ఏడీఏ 89777 46572 వ్యవసాయాధికారి 89777 48420 వ్యవసాయాధికారి 89777 48442 వ్యవసాయాధికారి 89777 48443 వ్యవసాయాధికారి 89777 48612 బీసీ ల్యాబ్ ఏడీఏ 89777 46573 వ్యవసాయాధికారి 89777 48677 వ్యవసాయాధికారి 89777 48679 భూసార పరీక్షా కేంద్రం (ఎస్టీఎల్) ఏడీఏ 89777 47389 వ్యవసాయాధికారి 89777 47390 వ్యవసాయాధికారి 89777 47391 వ్యవసాయాధికారి 89777 47394 వ్యవసాయాధికారి 89777 47395 ఖమ్మం డివిజన్ఏడీఏ 89777 46617 ఏఓ (టెక్నికల్) 89777 46621 ఏఓ, ఖమ్మం అర్బన్ 89777 46618 ఏఓ, రఘునాథపాలెం 89777 46619 హోదా ఫోన్ నంబర్ఏఓ. కామేపల్లి 89777 46620 కూసుమంచి డివిజన్ఏడీఏ 89777 47212 ఏఓ (టెక్నికల్) 89777 47220 ఏఓ, నేలకొండపల్లి 89777 47216 ఏఓ, కూసుమంచి 89777 47217 ఏఓ, ఖమ్మం రూరల్ 89777 47218 ఏఓ, తిరుమలాయపాలెం 89777 47219 మధిర డివిజన్ఏడీఏ 89777 46574 ఏఓ (టెక్నికల్) 89777 48680 ఏఓ, మధిర 89777 46575 ఏఓ, బోనకల్ 89777 46576 ఏఓ, చింతకాని 89777 46578 ఏఓ, ముదిగొండ 89777 46579 ఏఓ, ఎర్రుపాలెం 89777 46580 వైరా డివిజన్ఏడీఏ 89777 48708 ఏఓ, వైరా 89777 48709 ఏఓ, కొణిజర్ల 89777 48710 ఏఓ, ఏన్కూరు 89777 46597 ఏఓ, కారేపల్లి 89777 46598 సత్తుపల్లి డివిజన్ఏడీఏ 89777 48722 ఏఓ (టెక్నికల్) 89777 46623 ఏఓ (భూసార పరీక్షలు) 89777 47510 ఏఓ, సత్తుపల్లి 89777 48723 ఏఓ, వేంసూరు 89777 48724 ఏఓ, పెనుబల్లి 89777 48725 ఏఓ, కల్లూరు 89777 48728 ఏఓ, తల్లాడ 89777 48729 -
కేఎంసీకి కాసుల పంట!
● ఆర్థిక సంవత్సరం చివరి రోజు రూ.3.62 కోట్ల ఆస్తిపన్ను వసూలు ● మొత్తంగా రూ.33.65 కోట్ల ఆదాయంఖమ్మంమయూరిసెంటర్: 2024–25 ఆర్థిక సంవత్సరం సోమవారంతో ముగియగా ఆస్తి పన్నుల వసూళ్లలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్కు కాసుల పంట పండింది. గడిచిన (2023–24) ఆర్థిక సంవత్సరంంలో రూ.30.80 కోట్లు ఆస్తిపన్నుల ద్వారా రాబట్టగా.. ఈసారి సోమవారం రాత్రి 9గంటల వరకు రూ.33.65 కోట్లు వసూలవడం విశేషం. ఆర్థిక సంవత్సరం చివరి రోజైన సోమవారం ఏకంగా రూ.3.62 కోట్లు వసూలయ్యాయని అధికారులు వెల్లడించారు. ఉగాది, రంజాన్ సెలవులు ఉన్నా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేసి మరీ పన్నుల వసూళ్లలో నిమగ్నం కావడంతో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి రూ.2.85 కోట్లు అదనంగా వసూలు చేయగలిగారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో కేఎంసీకి వివిధ రూపాల్లో రూ.38.72 కోట్ల ఆదాయం సమకూరింది.2024–25లో వివిధ మార్గాల ద్వారా కేఎంసీకి వచ్చిన ఆదాయం సేవలు ఆదాయం (రూ.ల్లో) సెల్ఫ్ అసెస్మెంట్ 91,48,306 మ్యుటేషన్ 5,39,801 ఆస్తి పన్ను 33,65,86,199 పంపు పన్ను 2,86,84,079 ట్రేడ్ లైసెన్సు 1,18,11,219 ఖాళీ స్థలంపై పన్ను 4,77,010 -
రంజాన్ వేళ విషాదం
● చెరువులో మునిగి తండ్రీకుమారుడి మృతి ● తండ్రిని రక్షించే క్రమాన కుమారుడు కూడా కన్నుమూత బోనకల్: ముస్లింలంతా రంజాన్ పండుగను ఘనంగా జరుపుకుంటుండగా ఆ కుటుంబంలో మాత్రం విషాదం నెలకొంది. చెరువులోకి దిగిన తండ్రిని కాపాడే యత్నంలో కుమారుడు కూడా గుంతలో చిక్కుకుని మృతి చెందిన ఘటన బోనకల్ మండలం ఆళ్లపాడు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు.... ఆళ్లపాడుకు చెందిన పఠాన్ యూసుఫ్ ఖాన్(72)కు మతిస్థిమితం సక్రమంగా ఉండడంలేదు. సోమవారం ఉదయం వారి ఇంటి ఎదురుగా ఉన్న చెరువులోకి ఓ గేదె వెళ్లడాన్ని చూసిన ఆయన సైతం దిగాడు. ఈ విషయాన్ని గమనించిన యూసుఫ్ పెద్ద కుమారుడు కరీముల్లా(45) తండ్రిని బయటకు తీసుకురావడానికి చెరువులోకి దిగాడు. అయితే, ఆయనకు ఈత రాకపోవడంతో ఇద్దరూ చెరువులో గత ఏడాది మట్టి తవ్వకాలతో ఏర్పడిన గుంతల్లో చిక్కుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామస్తులు వారిని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోగా నీట మునిగి మృతి చెందారు. దీంతో పండుగ వేళ నెలకొన్న విషాదంతో వారి కుటుంబీకుల రోదనలు గ్రామస్తులను కంటతడి పెట్టించాయి. యూసఫ్ ఖాన్కు భార్య, ముగ్గురు కుమారుల ఉండగా, కరీముల్లాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, ఆళ్లపాడు చెరువులో గతంలోనూ ముగ్గురు మృతి చెందగా, ప్రస్తుత ఘటనతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధుబాబు తెలిపారు. -
డీసీసీబీ మాజీ చైర్మన్ వాహనానికి ప్రమాదం
ఖమ్మంఅర్బన్: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణంకు ప్రమాదం తప్పింది. సోమవారం ఆయన ఖమ్మం నుండి సత్తుపల్లికి కారులో వెళ్తుండగా వీ.వీ.పాలెం వద్ద ఖమ్మం– వైరా ప్రధాన రోడ్డులో గేదె అడ్డుగా వచ్చింది. ఆ గేదెను తప్పించే క్రమాన దాన్ని ఢీకొట్టగా వాహనం ముందు భాగంలో దెబ్బతిన్నప్పటికీ అందులో ఉన్న నాగభూషణం, కారులో ఉన్న లింగయ్య సురక్షితంగా బయటపడ్డారు. వీరి వాహనం ఢీకొన్న గేదె మృతి చెందింది. ఈమేరకు నాగభూషణంను మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో పాటు పగడాల నాగరాజు, బచ్చు విజయ్కుమార్ తదితరులు పరామర్శించగా మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రమాదంపై ఫోన్లో ఆరా తీశారు. 250 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం కామేపల్లి: అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై సాయికుమార్ తెలిపి న వివరాలు... మండలంలోని పండితాపురానికి చెందిన ఓ వ్యాపారి శనివారం రాత్రి లారీలో బియ్యాన్ని లోడ్ చేసి తరలించేందుకు సిద్ధమవుతున్నాడనే సమాచారంతో తనిఖీలు చేపట్టారు. ఈమేరకు 250క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకోగా, వాహనంతో సహా సివిల్ సప్లయీ అధికారులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. -
వేమన శతకంపై విద్యార్థుల అవధానం
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థులు అవుల పోతురాజు, కడమంచి వంశీ వేమన శతకంపై అష్టావధానం చేసి ప్రశంసలు అందుకున్నారు. స్థానిక శ్రీజ్ఞానసరస్వతీదేవి ఆలయంలో ఈ అవధానం నిర్వహించగా.. ఎనిమిది అంశాల్లో పృచ్ఛకులు అడిగిన సమస్యలకు శతక పద్యాల ఆధారంగా సమాధానాలు చెప్పి మెప్పించారు. ఉపాధ్యాయులు రజినీదేవి, రమాదేవి ఆధ్వర్యాన ఈ అవధాన ప్రదర్శన ఏర్పాటుచేశారు. అనంతరం విద్యార్థులతో పాటు పలువురు కవులను ఆలయ కమిటీ నిర్వాహకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొడిమెల అప్పారావు, ఎస్.ఎల్.నర్సింహారావు, మాదిరాజు పుల్లారావు, శర్మ, మల్లికార్జున్రావు, రమణమూర్తి, సాయిరాం, శేషాచార్యులు, రామప్ప, మాదిరాజు మాలతి, శేషగిరిరావు, గీతాకుమారి, బి.మధుసూదన్రాజు, రమణారావు పాల్గొన్నారు. -
గ్రూప్–1లో రాష్ట్రస్థాయి 63వ ర్యాంకు
కాకరవాయి వాసి వంశీ ప్రతిభ తిరుమలాయపాలెం: మండలంలోని కాకరవా యికి చెందిన కొత్తపల్లి ఖుషిల్వంశీ గ్రూప్–1 ఫలితాల్లో సత్తా చాటా డు. గ్రామంలోని కొత్తపల్లి శివకుమార్ – రేణుక కుమారుడైన వంశీ 496 మార్కులతో జనరల్ కేటగిరీలో 63, రిజర్వేషన్ కేటగిరీలో రాష్ట్రస్థాయి మూడో ర్యాంకు సాధించాడు. దీంతో డిప్యూటీ కలెక్టర్ లేదా డీఎస్పీ ఉద్యోగం వస్తుందని ఆశిస్తున్నాడు. గతంలో ఆయన ఎస్సై ఉద్యోగానికి ఎంపికవడమే కాక ఇన్కం టాక్స్ అసిస్టెంట్, సెంట్రల్ పోలీస్ అసిస్టెంట్ కమాండో(డీఎస్పీ), మిలిటరీ ఆఫీసర్గానూ ఉద్యోగాలు సాధించాడు. కాగా, వంశీ 6నుంచి 10వ తరగతి వరకు ఖమ్మం శ్రీచైతన్య పాఠశాలలో, ఇంటర్ హైదరాబాద్ శ్రీ గాయత్రి కళాశాలలో పూర్తిచేశాక సివిల్స్ సాధనే లక్ష్యంగా డిగ్రీ హైదరాబాద్ శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీలో, పీజీ ఢిల్లీ జేఎన్యూలో పూర్తిచేశాడు. కాగా, వంశీ తండ్రి శివకుమార్ సూర్యాపేట జిల్లా మాస్లైన్ జిల్లా కార్యదర్శిగా, తల్లి రేణుక పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొనసాగుతున్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి పాటుపడుతున్న తల్లిదండ్రుల మాదిరే ప్రజలకు సేవ చేయడం తన లక్ష్యమని ఖుషీల్ వంశీ వెల్లడించాడు. సింధు.. 176వ ర్యాంకునేలకొండపల్లి: మండలంలోని మండ్రాజుపల్లికి చెందిన నెల్లూరి సింధు గ్రూప్–1 ఫలితాల్లో ప్రతిభ కనబరిచింది. ఆమె మల్టీజోన్ మహిళా కోటాలో 64వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 176వ ర్యాంకు సాధించింది. అయితే, 2016లోనే గ్రూప్–2లో ప్రతిభ కనబరిచి ఎంపీఓగా, గ్రూప్–3 ద్వారా సీనియర్ అకౌంటెంట్ ఉద్యోగాలు సాధించిన సింధు ప్రస్తుతం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో వార్డు ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి గ్రూప్స్ సిద్ధమయ్యాయని, రోజుకు 15గంటల పాటు చదవడంతో మంచి ఫలితం వచ్చిందని.. ఇందులో భర్త, కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిదని వెల్లడించింది. వ్యవసాయ కుటుంబం.. 48వ ర్యాంక్ఖమ్మం సహకారనగర్: ఖమ్మం రాపర్తినగర్లో నివాసముంటున్న గండ్ర నవీన్రెడ్డి గ్రూప్–1 ఫలితాల్లో 502మార్కులతో రాష్ట్రస్థాయి 42వ ర్యాంక్ సాధించాడు. ముదిగొండ మండలం మాధాపురానికి చెందిన గండ్ర మల్లికార్జున్రెడ్డి – లక్ష్మి వ్యవసాయ కుటుంబం కాగా కొన్నాళ్ల నుంచి ఖమ్మంలో ఉంటున్నారు. వీరి కుమారుడు నవీన్ సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో ఓసారి ఇంటర్వ్యూకు సైతం హాజరయ్యాడు. ఇంతలోనే గ్రూప్–1 నోటిఫికేషన్ రావడంతో పరీక్ష రాయగా 48వ ర్యాంక్ వచ్చింది. ఎప్పటికై నా సివిల్స్ సాధించి పేదవర్గాలకు సేవ చేయాలనేదే తన లక్ష్యమని నవీన్ వెల్లడించాడు. కాగా, ప్రస్తుతం వచ్చిన ర్యాంక్ ఆధారంగా డీఎస్పీ లేదా ఆర్డీఓ ఉద్యోగం వచ్చే అవకాశముందని తెలిపాడు. అర్చక, ఉద్యోగుల డైరీ ఆవిష్కరణ ఖమ్మంగాంధీచౌక్: దేవాదాయ శాఖ పరిధిలోని అర్చకుల, ఉద్యోగ డైరీని సోమవారం ఖమ్మం కమాన్బజార్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అర్చక, ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేందరశర్మ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 16,062 ఆలయాల్లో పనిచేస్తున్న అర్చక, ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి నివేదిక అందించామని తెలిపారు. దీంతో ఐటీ మంత్రి శ్రీధర్బాబుతో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. కాగా, అర్చక, ఉద్యోగులు ఐక్యమత్యంతో ఉంటూ ఆలయాల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీఎస్.శ్రీనివాసాచారి, అర్చకులు శేషభట్టర్ రఘునాథాచార్యులు, కాండూరి మధుసూదనాచార్యులు, వేణుగోపాలాచార్యులు, శేషభట్టార్ వెంకటాచార్యులు, ఉద్యోగులు కొండకింది వేణుగోపాలాచార్యులు, దయాకర్, బురాన్ తదితరులు పాల్గొన్నారు. జమిలి ఎన్నికలతో మేలు ఏన్కూరు: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం ద్వారా పాలన కుంటుపడకపోగా నిధులు ఆదా అవుతాయని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరు రమేష్ అన్నారు. ఏన్కూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ విధానాన్ని 32పార్టీలు సమర్థిస్తే కాంగ్రెస్ సహా ఇంకొన్ని పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో ఈ విధానం వల్ల జరిగే మేలును ప్రజలకు వివరించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈసమావేశంలో నాయకులు నల్లమోతు రమేష్, నరుకుళ్ల వెంకటేశ్వర్లు, మాళ్ల అంజి, చింతలబోయిన వెంకటేశ్వర్లు, మల్లెం రవి పాల్గొన్నారు. -
ప్రారంభమైన శ్రీ కోటమైసమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు
కారేపల్లి: కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లిలో కొలువుదీరిన శ్రీ కోటమైసమ్మ తల్లి ఆలయంలో బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. బుధవారం జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఈఓ వేణుగోపాలాచార్యులు, పర్సా ట్రస్ట్ చైర్మన్ పర్సా పట్టాభిరామారావు నేతృత్వాన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కొత్తలంక కై లాశశర్మ, వేద పండితులు కొనమంచలి ఫణికుమార్ శర్మ తొలిరోజు మృత్యుంజయ అమృత పాశుపతం హోమం నిర్వహించగా భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అలాగే, ఇల్లెందు మార్గదర్శి స్కూల్ ప్రతినిధులు అర్వపల్లి రాధాకృష్ణ, వేణుగోపాల్ గుప్తా సహకారంతో ఏర్పాటుచేసిన అన్నదానాన్ని దేవాదాయ, ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్ ఎం.వీరస్వామి ప్రారంభించారు. ఆలయ ఉద్యోగులు పగడాల మోహన్కృష్ణ, పర్సా లలిత్సాయి తదితరులు పాల్గొన్నారు. -
యాప్లోనే హోరాహోరీ
● ఐపీఎల్ వేళ ఆన్లైన్లో పందేల జోరు ● ప్రతీ బంతి, ఓవర్... వికెట్పై బెట్టింగ్ ● పాల్గొంటున్న వారిలో యువతే ఎక్కువ... ఖమ్మం స్పోర్ట్స్: ప్రతీ బాల్.. వికెట్.. ఓవర్ ఇలా చెబుతూ పోతే బెట్టింగ్రాయుళ్లకు దేన్నీ వదలడం లేదు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 18వ సీజన్ కొనసాగుతుండడంతో పందేలు జోరందుకున్నాయి. అయితే, ఈ బెట్టింగ్లో యువత ఎక్కువగా పాల్గొంటూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ఐపీఎల్ మ్యాచ్ మొదలైందంటే చాలు బుకీలు యాప్ల ద్వారా యువతను ఆకర్షిస్తున్నారు. దీంతో అవగాహన లేకున్నా కొందరు వివరాలు తెలుసుకుని మరీ బెట్టింగ్కు పాల్పడుతున్నట్లు తెలిసింది. బెట్టింగ్కు ప్రత్యేకంగా యాప్లు ఉండగా.. వీటి వివరాలను యువతకు వివరిస్తూ బుకీలు పందేనికి ప్రోత్సహిస్తున్నారు. రూ.100తో ప్రారంభమయ్యే ఈ బెట్టింగ్తో రూ.వేలల్లో సులువుగా సంపాదించచ్చని ప్రచారం చేస్తుండగా.. సంపాదన మాటేమో కానీ ఎక్కువ మంది రూ.వేలల్లో పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు ఖమ్మం కేంద్రంగా యువకులు ఈ బెట్టింగ్కు పాల్పడగా, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు సోకడంతో బుకీల ఫోన్ నంబర్లు సేకరించి మరీ యాప్ల ద్వారా పందేనికి సిద్ధమవున్నారు. ముందుగానే అకౌంట్ లింక్.. బుకీల చెప్పిన యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక పందేం కాసే వ ఆరు తమ బ్యాంక్ అకౌంట్ నంబర్ , ఐఎఫ్ఎస్సీ కోడ్ తదితర వివరాలు నమోదు చేసుకోవాలని చెబుతున్నట్లు తెలిసింది. ఆపై పరుగు, వికెట్, ఫోర్, సిక్స్లకు ఎంత అని నిర్ణయించి పందేనికి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. అంతేకాక ప్రతీ బెట్టింగ్కు కోడ్ ఇస్తూ నమ్మకం ఉంటేనే ఆ కోడ్ నమోదు చేయాలని, తద్వారా నష్టపోయే అవకాశం లేదని నమ్మబలుకుతున్నట్లు తెలిసింది. దీంతో యువకులు ఎవరికి వారు నమ్మకంగా బెట్టింగ్ కాస్తూ నష్టపోతున్నట్లు సమాచారం. బార్లలో జోరుగా బెట్టింగ్ ఖమ్మంలోని త్రీ టౌన్, టూ టౌన్, వన్న్ టౌన్న్ ప్రాంతాల బార్లలో బెట్టింగ్ జోరుగా కొనసాగుతుందని చెబుతున్నారు. యాప్ల ద్వారా కొందరు.. నేరుగా కొందరు పందేలు కాస్తున్నట్లు సమాచారం. కాగా, ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా బెట్టింగ్కు పాల్పడుతున్న యువకులు డబ్బుల కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. రకరకాల కారణాలు చెబుతూ డబ్బులు అడుగుతుండడంతో.. ఐపీఎల్ ఎప్పుడు ముగుస్తుందా అని తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. క్రికెటే కాదు మరిన్ని... బెట్టింగ్ యాప్లు ఇన్నాళ్లు క్రికెట్కే పరిమితం అయ్యాయని భావిస్తుండగా.. ఇంకొన్ని ఆటల్లోనూ ఈ సంస్కృతి మొదలైందని చెబుతున్నారు. ఫుట్బాల్, టెన్నిస్, కబడ్డీ, గుర్రపు పందేలనైనా బెట్టింగ్ యాప్లు పని చేస్తున్నాయని సమాచారం. ఎవరికి ఏ క్రీడపై ఆసక్తి ఉందో కనుక్కుని మరీ బుకీలు ఈ యాప్లను విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు తెలిసింది. బెట్టింగ్ ఇలా... బుకీలు చెప్పేవే కాక మరికొన్ని యాప్ల ద్వారా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంటుంది. అంతేకాక స్క్రీన్పై కింద భాగంలో బెట్టింగ్ వివరాలను బుకీలు జోడిస్తుంటారు. దీంతో టాస్ ఎవరు గెలుస్తారు.. ఆటగాళ్ల వ్యక్తిగత స్కోర్, వచ్చే బంతికి ఎన్ని పరుగులు వస్తాయి, ఫలానా బౌలర్ ఈ ఓవర్లో వికెట్ తీస్తాడా, మొత్తంగా ఎవరు గెలుస్తారు ఇలా ప్రతీ అంశానికి బెట్టింగ్ కాస్తుండడంతో నమ్మకంగా ముందుకొస్తున్న యువత చివరకు నష్టపోతున్నారు. -
వాల్యూయేషన్ కేంద్రంలో పరిశీలన
ఖమ్మం సహకారనగర్: ఇంటర్మీడియట్ జవాబుపత్రాల మూల్యాంకనం కోసం ఖమ్మం నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వాల్యూయేషన్ సెంటర్ కొనసాగుతోంది. ఈమేరకు కేంద్రాన్ని ఇంటర్మీడియట్ బోర్డుకు చెందిన పరిశీలకుడు సీహెచ్.యాదగిరి సోమవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన అధ్యాపకులకు పలు సూచనలు చేయగా, డీఐఈఓ రవిబాబు, అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లు పాల్గొన్నారు. కాగా, స్పాట్ విధులు నిర్వర్తిస్తున్న అధ్యాపకులకు రెమ్యూనరేషన్ చెల్లించాలని యాదిగిరికి వినతిపత్రం అందించినట్లు తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ సంఘాల బాధ్యులు కె.సురేష్, గుమ్మడి మల్లయ్య, వినోద్బాబు, విజయ్, కిషోర్బాబు వినతిపత్రం అందజేశారు. -
●కానిస్టేబుల్గా చేస్తూనే..
కల్లూరురూరల్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్–1 ఫలితాల్లో కల్లూరు మండలంలోని పేరువంచ గ్రామానికి చెందిన మందాల సుజాత రాష్ట్రస్థాయిలో 27వ ర్యాంక్, ఎస్సీ రిజర్వేషన్ కేటగిరిలో 11వ ర్యాంక్ సాధించింది. సుజాత ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తోంది. గ్రూప్–1 కోసం కొంతకాలంగా సెలవుపెట్టి హైదరాబాద్లో కోచింగ్ తీసుకొని పరీక్ష రాసింది. రాష్ట్రస్థాయిలో గ్రూప్–1 ఫలితాల్లో 27వ ర్యాంకు సాధించినందుకు గాను సుజాతను పలువురు అభినందించారు. -
గాలిలో ప్రాణాలు...
రవాణా వాహనాల్లో ప్రయాణికుల తరలింపు ● అదనపు లోడ్కు తోడు డ్రైవర్ల మితిమీరిన వేగం ● వ్యాన్లు, ట్రాక్టర్లలో సామర్థ్యానికి మించి తీసుకెళ్తుండడంతో ప్రమాదాలు ● కూలీకి వెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్న పేదలు ● కొద్దిరోజుల క్రితం బోనకల్ మండలంలో మహిళా కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తా పడగా ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో మరికొందరు గాయపడ్డారు. ● గత గురువారం ఖమ్మం రూరల్ మండలంలోనూ వాహనం బోల్తా కొట్టగా కూలీలకు గాయాలయ్యాయి. ● ఏన్కూరు మండలం నుంచి గత శుక్రవారం మహిళా కూలీలను తరలిస్తున్న ట్రాలీ ఆటో బోల్తా పడింది. దీంతో పలువురు మహిళలు గాయపడ్డారు. ఖమ్మం క్రైం: రెక్కాడితే గాని డోక్కాడని కుటుంబాలు వారివి. ఇంటోభార్య, భర్త పనిచేస్తేగాని నోట్లోకి అన్నం వెళ్లలేని పరిస్దితి. అందుకోసం చద్దిమూట కట్టుకోని కూలీ పనులకు భర్త ఒక దిక్కు, భార్య ఓ దిక్కు వెళ్లుతుంటారు. ఈకూలీపనులకు వెళ్లి వచ్చే వరకు తమ ప్రాణాలకు గ్యారెంటీ లేకున్నా ఆవిషయం తెలిసికూడా ఇంట్లో పోయ్యి వెలగటం కోసం, తమ బిడ్డల కనీస అవసరాలను తీర్చడం కోసం దూరప్రాంతాలకు వాహనాలలో ప్రయాణం చేసి మరి మిరపతోటలకు వెళ్లుతున్నారు. ఈక్రమంలో తమను తీసుకోని వెళ్లే వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్య డ్రైవింగ్కు బలవుతున్నారు. ఇటీవల కాలంలో మిరపతోటలకు వెళ్లే కూలీల వాహనాలు తరుచుగా ప్రమాదాలకు గురి అవుతున్నాయి. 10మందికి 30మందికి పైగా... వేసవి కాలంలో మిరపతోటలో కూలీ పనిచేయడానికి ఎక్కువమంది కూలీలు అవసరం అవుతారు. దీంతో మిర్చితోట యజమానులు తమ ప్రాంతానికి చెందిన ట్రాలీలు, టాటా ఏస్ల డ్రైవర్లతో కూలీలను తీసుకొచ్చి, మళ్లీ వారిని దింపి వచ్చేదానికి కాంట్రాక్ట్ పద్ధతిపై ఒప్పందం చేసుకోంటారు. దీంతో ట్రాలీలు, టాటాఎస్లు నడిపే డ్రైవర్లు కూలీలు ఎక్కువగా నివసించే ప్రాంతాలు, గ్రామాల దగ్గరనుంచి, పట్టణాలు, చివరకు నగరాల నుంచి కూడా కూలీలను తీసుకోనివెళ్లుతుంటారు, వీరిలో అత్యధికంగా మహిళ కూలీలు ఉంటారు. వాస్తవానికి వారి వాహనాలలో 10నుంచి 12మంది మాత్రమే పట్టే ఖాళీగా ఉంటుంది. అయితే వీరు డిజిల్, పెట్రోల్తోపాటు ట్రిప్పులు తిరగటానికి ఇష్టంలేక డబ్బులకు కక్కుర్తిపడి ఒకేసారి 30మందికిపైగా కూలీలను కిక్కిరిసే విధంగా ఎక్కించి తీసుకెళ్లి, పని ముగిశాక మరలా అదే మాదిరిగా తీసుకొస్తున్నారు. మితీమిరిన వేగం, అధిక ఓవర్ లోడ్ కూలీలను తీసుకోని వచ్చే వాహనాల డ్రైవర్లు ఇష్టారాజ్యంగా రోడ్లపై వాహనాలను నడుపుతున్నారు. సెల్ఫోన్ మాట్లాడుతూ , వాహనంలో పెద్దగా స్పీకర్లు పెడుతూ మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతుండటంతో వాహనాలు అధికలోడ్తో ఉండటంతో అదుపు తప్పి క్రింద పడిపోతున్నాయి. దీంతో ట్రాలీలో కూర్చోటానికి స్దలం లేక నిలబడే ఉండే కూలీలు క్రిందపడిపోయి కొంతమంది మత్యువాత పడిపోతుండగా మరికొంతమంది క్షతగాత్రులు అవుతున్నారు. నిరుపేద కుటంబానికి చెందిన వీరి కుటుంబాలు ఈఘటనలతో నిరాశ్రయులుగా మిగిలిపోతున్నారు. పట్టించుకోని రవాణాశాఖ, పోలీస్శాఖ రోడ్లపై ఓవర్లోడ్తో కూలీలను తీసుకోని వెళ్లేవాహనాల గురించి రవాణాశాఖ, పోలీస్ శాఖలు పట్టించుకోకపోవడంతో వారు తమ ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతూ కూలీల ప్రాణాలు గాలిలో పెట్టి నడుపుతున్నారు, వెంటనే పోలీస్, రవాణాశాఖ పట్టించుకోని ఓవర్లోడ్తో తీసుకొని వెళ్లుతున్న వాహనాలపై కొరడా ఝుళిపించి జరిమానా విధించి వాటిని సీజ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం.... ఆటోలు, ట్రాలీలు, టాటా ఏస్ల్లో సామర్థ్యానికి మించి కూలీలను తీసుకెళ్లవద్దని డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నాం. దీన్ని అరికకట్టేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. ఓవర్లోడ్తో వెళ్లినట్లు తేలితే భారీ జరిమానా విధించడమే కాక వాహనాలు సీజ్ చేస్తాం. ఇప్పటికే పలు వాహనదారులకు జరిమానా విధించాం. –వరప్రసాద్, ఇన్చార్జ్ ఆర్టీఓ -
పాస్టర్ మృతికి నిరసనగా ర్యాలీ
ఖమ్మంగాంధీచౌక్: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై క్రైస్తవుల ఫెలోషిప్ల ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మం నగరంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ప్రవీణ్ మృతిపై అనుమానాలున్నాయని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోంహత్రుంలు, పోలీస్ శాఖ అధికారులు ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ జరిపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల ప్రతినిధులు జకర్యా హన్మంతరావు, చల్లగుండ్ల రమేశ్బాబు, ఆనంద్, విజయ్కుమార్, డేవిడ్, శేఖర్బాబు, తిమోతి, వేముల సత్యం, నెలాల బాలస్వామి, కృష్ణమోహన్, సంజీవరావు, పీటర్, చిన్న డేవిడ్, రవికిరణ్, జ్యోతి సుశీల, సేవకులు సైమన్, రాము, అభిషేక్, అశోక్ యోహాను, కిశోర్, పాల్, మోషే, సామేల్, నెహేమ్యా, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ ● ఒకరికి గాయాలు సత్తుపల్లిరూరల్: ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొనడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన సత్తుపల్లి మండలం గంగారంలో ఆదివారం చోటుచేసుకుంది. గంగారానికి చెందిన కోటయ్య టీవీఎస్ ఎక్స్ఎల్పై వెళ్తుండగా అశ్వారావుపేట నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ట్రాలీ లారీ ఢీకొట్టింది. కోటయ్య కాలుకు తీవ్ర గాయాలు కావడంతో 108 ద్వారా సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బైక్ ఢీకొని వ్యక్తికి గాయాలు నేలకొండపల్లి: వాకింగ్కు వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని యువకులు బైక్తో ఢీకొట్టడంతో ఓ వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంబడించగా వారు పరారయ్యారు. మండల కేంద్రానికి చెందిన ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి డి.రామారావు ఆదివారం వాకింగ్కు వెళ్లి తిరిగి వస్తుండగా కూసుమంచి – నేలకొండపల్లి రహదారిపై గుర్తు తెలియని యువకులు బైక్పై వస్తూ.. అక్కడ ఆరబెట్టిన మొక్కజొన్నల మీదుగా వెళ్లి బైక్ అదుపుతప్పి వెనుక నుంచి వచ్చి రామారావును ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. కాగా, యువకులను స్థానికులు, పోలీసులు వెంబడించినా ఆచూకీ లభించలేదు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం పెనుబల్లి: మండలంలోని పాతకారాయిగూడెం ఎన్ఎస్పీ కాల్వలో గుర్తు తెలియని మృతదేహం ఆదివారం లభ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం.. పాతకారాయిగూడెం ఎన్ఎస్పీ కాల్వలో గుర్తు తెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా.. కుడి చేతిపై ఆంజనేయ స్వామి పచ్చబొట్టు ఉన్నట్టుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ చేయనున్నామని పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో కండక్టర్ మృతి పెనుబల్లి: సత్తుపల్లి మండలంలోని కొత్తలంకపల్లి శివారులో రోడ్డుపై ఆగి ఉన్న లారీ ట్యాంకర్ను ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. కల్లూరుకు చెందిన వన్నపురపు సీతారాంప్రసాద్ (45) సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున విధులు పూర్తయిన సొంత ఊరికి వెళ్లడానికి, వైజాగ్ నుంచి ఖమ్మం వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు ఎక్కాడు. ఈ క్రమంలో బస్సు కొత్తలంకపల్లి శివారుకు చేరుకోగా, జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్యాంకర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ఎడమ పక్కన భాగం అంతా ధ్వంసం కాగా కండక్టర్ సీతారాంప్రసాద్తో పాటు మగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 దారా పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కండక్టర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉదయ్ను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించగా మరో ఇద్దరిని సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్యతో పాటుగా కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాల్సిన కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు. -
గ్రూప్–1 ఫలితాల్లో ప్రతిభ
ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో జిల్లా వాసులు సత్తాచాటారు. తాము ఎంచుకున్న లక్ష్యాన్ని ఎన్నో కష్ట, నష్టాలకోర్చి చేరుకున్నారు. పుస్తకాలతో గంటల తరబడి కుస్తీపడుతూ.. ఏమాత్రం సమయం వృథా చేయకుండా చదివి అనుకున్నది సాధించారు. ప్రస్తుత యువతకు ఎంతో స్ఫూర్తిగా నిలిచారు. ●ఐఏఎస్ కావడమే లక్ష్యం వైరా: సివిల్స్లో ర్యాంకు సాధించి ఐఏఎస్ కావడమే లక్ష్యమని చెబుతున్న వైరాకు చెందిన యువతికి గ్రూప్–1 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 129వ ర్యాంకు వచ్చింది. మల్టీజోన్–1లో 49వ ర్యాంకు సాధంచిన సంగెపు లక్ష్మీసాహితి తండ్రి వెంకటేశ్వరరావు ఎల్ఐసీలో బీమా ఏజెంట్గా పనిచేస్తున్నారు. తల్లి కవిత గృహిణి. ఆమె 1 నుంచి 7వ తరగతి వరకు వైరా మధు విద్యాలయం, 8 నుంచి 10 వరకు ఖమ్మం రెజొనెన్స్ పాఠశాల, ఇంటర్ శ్రీచైతన్య కళాశాలలో చదివి డిగ్రీ హైదరాబాద్ నారాయణ కళాశాలలో చదివింది. పీజీ హైదరాబాద్ రామిరెడ్డి కళాశాలలో పూర్తిచేసింది. శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. 2021లో యూపీఎస్సీ పరీక్షకు హాజరైంది. ‘రెండు సార్లు సివిల్స్ రాశాను. రెండోసారి రెండు మార్కులలో ర్యాంకు కోల్పోయాను. ఎప్పటికై నా సివిల్స్ సాధించడమే లక్ష్యం’ అని లక్ష్మీసాహితి వివరించింది. -
●వరుస విజయాల రత్నేశ్వరనాయుడు
కామేపల్లి: గోవింద్రాల బంజరకు చెందిన గంగారపు సత్యనారయణ – జ్యోతిర్మయి దంపతుల చిన్నకుమారుడు రత్నేశ్వరనాయుడు గ్రూప్1లో రాష్ట్రస్థాయిలో 277వ ర్యాంక్, జోనల్స్థాయిలో 120వ ర్యాంక్ సాధించాడు. ఇటీవల విడుదలైన తెలంగాణ గ్రూప్స్ ఫలితాల్లో గ్రూప్–1, 2, 3, 4 ఫలితాల్లో సత్తాచాటాడు. తమ తండ్రి స్థాపించిన పాఠశాలలోనే తన సోదరుడు సాయికృష్ణమనాయుడుతో కలిసి రత్నేశ్వరనాయుడు 1 నుంచి 7వ తరగతి వరకు చదివాడు. ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో 10వ తరగతి వరకు చదివారు. ఇంటర్ సి.వి.రామన్, డిగ్రీ శ్రీచైతన్య హైదరాబాద్లో చదివాడు. ప్రసుత్తం రత్నేశ్వరనాయుడు ఖమ్మంలోని కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. కోర్టులో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చినా వెళ్లలేదు. -
●తల్లి కష్టంతో..
ఖమ్మంమయూరిసెంటర్: చిన్ననాటి నుంచి తనను చదివించేందుకు తన తల్లి పడిన కష్టాన్ని ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ ఖమ్మం నగరం ఖానాపురానికి చెందిన ఎం.మురళి గ్రూప్–1 ఫలితాల్లో మెరిశాడు. రాష్ట్రస్థాయి 83వ ర్యాంకు, బీసీ–ఏ కేటగిరిలో 2వర్యాంక్, జోనల్స్థాయిలో 47వ ర్యాంకు సాధించాడు. మురళి ఇప్పటికే ఖమ్మం నగర పాలక సంస్థలో జూనియర్ అకౌంటెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇప్పటి వరకు మురళి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. 2018లో టీఎస్ఎస్పీ కానిస్టేబుల్, 2020లో సివిల్ కానిస్టేబుల్, 2024లో జూనియర్ అకౌంటెంట్ (గ్రూప్–4) సాధించడంతోపాటు తాజాగా గ్రూప్–1 ఫలితాల్లో 489.5 మార్కులు సాధించాడు.మురళి తండ్రి లక్ష్మీనారాయణ 1998లో చనిపోగా.. తల్లి కళావతి కేఎంసీలో ఔట్సోర్సింగ్ విధానంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తూ చదివించుకుంది. 2020లో తల్లి కళావతికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఇంటి వద్దే ఉంచి ఆమె ఆలనాపాలనా మురళి చూస్తున్నాడు. -
అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం
● దీపారాధన చేసి తాళం వేసి వెళ్లిన యజమానులు ● మంటలు వ్యాపించి ఫ్లాట్ పూర్తిగా దగ్ధం ఖమ్మంక్రైం: నగరంలోని ఓ అపార్ట్మెంట్లో మంటలు చెలరేగి ఫ్లాట్ పూర్తిగా కాలిపోగా పైఅంతస్తు, పక్క ఫ్లాట్కు స్వల్పంగా నష్టం వాటిల్లింది. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తతో భారీ ప్రాణ నష్టం తప్పింది. వివరాలిలా ఉన్నాయి.. బుర్హాన్పురంలోని రవీంద్రనాథ్ ఠాగూర్నగర్లో ఇటీవల పిన్ని టవర్స్ నిర్మించారు. వీటిలో కొన్ని ఫ్లాట్లను కొనుగోలు చేసినవారు నివాసం ఉంటున్నారు. 301 ఫ్లాట్ కొనుగోలు చేసిన సత్తిరెడ్డి ఇంకా గృహప్రవేశం చేయలేదు. కాగా, సత్తిరెడ్డి కుటుంబ సభ్యులు ఆదివారం పండుగ కావటంతో దేవుడి గదిలో దీపం వెలిగించి, పూజ చేసి తాళం వేసి ప్రస్తుతం ఉన్న ఇంటికి వెళ్లిపోయారని స్థానికులు తెలిపారు. వారు వెళ్లిన కొద్దిసేపటి తర్వాత కిటికీలో నుంచి పొగలు రావడాన్ని ఎదురు ఫ్లాట్ వారు గమనించి, కిటికిలో నుంచి చూశారు. వారు అరుస్తూ మంటలను ఆర్పేందుకు తమ ఇంట్లో నీళ్లను పోశారు. అయినా కూడా మంటలు అదుపులోకి రాలేదు. చివరకు వారు నివసిస్తున్న ఫ్లాట్కు సంబంధించిన అద్దాలు సైతం మంటల తాకిడికి పగిలిపోయాయి. దీంతో వారు ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకొని వాచ్మెన్కు సమాచారం అందించగా.. అతను వచ్చి చూడగా అప్పటికే మంటలు పైఅంతస్తులోకి వ్యాపిస్తున్నాయి. అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా వారు వచ్చారు. తప్పిన ప్రాణనష్టం.. ఘటనా స్థలానికి చేరుకొన్న ఫైర్ సిబ్బంది అపార్ట్మెంట్లో ముందుగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అందరినీ కిందకు వెళ్లాలని ఆదేశించారు. మెట్ల మార్గం ద్వారా పైకి చేరుకొని మంటలను ఆర్పుకుంటూ ఆరు కుటుంబాల వారిని క్షేమంగా కిందకు తీసుకొచ్చారు. ఒక ఫైరింజన్ సరిపోకపోవడంతో మరో ఫైరింజన్ను రప్పించారు. మహబూబాద్ జిల్లా అగ్నిమాపక శాఖాధికారి శ్రీనాథ్ రెస్క్యూ సిబ్బందిని పైకి తీసుకెళ్లి.. ఆయనే స్వయంగా మంటలను ఆర్పివేశారు. రెండు గంటలపాటు శ్రమించి, మంటలను అదుపులోకి తీసుకురావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనతో అపార్ట్మెంట్వాసులు భయాందోళనకు గురయ్యారు. గంటలోనే అంతా జరిగిపోయిందని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. ఇదిలా ఉండగా తాము దీపం వెలిగించలేదని షార్ట్ సర్క్యూట్ ద్వారా అగ్ని ప్రమాదం సంభవించి ఉండవచ్చని సత్తిరెడ్డి తెలిపారు. ఘటనా స్థలాన్ని జిల్లా అగ్నిమాపక శాఖాధికారి అజయ్ సందర్శించారు. ఖమ్మం ఫైర్ అధికారి బాలకృష్ణ, సిబ్బంది భాస్కర్రావు, కిరణ్కుమార్, రాంబాబు, నరసింహారావు, విజయ్కుమార్, టూటౌన్ పోలీసులు మంటలన ఆర్పడంతో సఫలీకృతమయ్యారు. కాగా, సుమారు రూ.50 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. -
ఒకే వేదికపై రంజాన్, ఉగాది వేడుకలు
మధిర: ఒకే వేదికపై కులమతాలకు అతీతంగా ఉగాది, రంజాన్ పండుగలను ఘనంగా జరుపుకున్న ఘటన మధిర పట్టణంలోని టీచర్స్కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. టీచర్స్కాలనీలోని కులమతాలకు అతీతంగా హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కలిసి అన్ని పండుగలను ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆదివారం ఉగాది పండుగ రావడం మరుసటి రోజు రంజాన్ పండుగ రావడంతో రెండు పండుగలను కలిపి ఒకే వేదికపై చేసుకోవాలని కాలనీవాసులు నిర్ణయించుకున్నారు. ఈ కాలనీలో ఒక వేదికను ఏర్పాటు చేసి ఉగాది పండుగకు సంబంధించిన పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడిని అందరికీ అందజేశారు. అనంతరం రంజాన్ పండుగను పురస్కరించుకొని సేమియా పంపిణీ చేశారు. ఆయా పండుగల విశిష్టతను కాలనీ పెద్దలు వివరించారు. కార్యక్రమంలో దేవరకొండ లక్ష్మణ్ బాబు, వెలగపూడి హనుమంతరావు, యరమల వెంకటేశ్వరరెడ్డి, వైవి పున్నారెడ్డి, సాంబయ్య, చీకటి నాగేశ్వరరావు, ముస్లిం పెద్దలు షేక్ నాగుల్ మీరా, షేక్ ఇబ్రహీం, ఎండి రఫీ, కాలనీ పెద్దలు పోతురాజు కృష్ణయ్య, తోట నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
ధర స్థిరీకరణకు కేంద్రంపై ఒత్తిడి తెస్తాం
● వచ్చే ఉగాది నాటికి కల్లూరుగూడెం పామాయిల్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తాం ● లాభాలు ఎక్కువగా వచ్చే ఆయిల్పామ్పై రైతులు దృష్టి పెట్టాలి ● ఫ్యాక్టరీ శంకుస్థాపనలో మంత్రి తుమ్మల నాగేశ ్వరరావువేంసూరు: పామాయిల్ ధర స్థిరంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని కల్లూరుగూడెంలో నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీ పనులకు ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, ఎండీ యాస్మిన్, స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఉగాది నాటికి పనులు పూర్తి చేసి ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని తెలిపారు. ప్రతీ పనికి ఆటంకం కలిగించాలని కొందరు చూస్తుంటారని, పనులు ఆగితే రాక్షసానందం పొందుతారని, సీతారామ కాల్వ తవ్వాలంటే రైతులను ప్రోత్సహించి స్టే తెప్పించారని విమర్శించారు. కొందరు బ్రోకర్లు నకిలీ మొక్కలు తెచ్చి.. ఇప్పుడు ఆయిల్ఫెడ్ను బదనాం చేయాలని చూస్తున్నారని అన్నారు. ఆయిల్ఫెడ్ నుంచి వచ్చే మొక్కల్లో కల్తీవి ఉండవని, విదేశాల నుంచి రావడంతో ఒకటో, రెండో ఉండవచ్చు తప్ప.. మొత్తంగా నకిలీవి ఉండే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సత్తుపల్లి ప్రాంతానికి జూన్లోగా గోదావరి జలాలు తీసుకొస్తామని, నాగార్జున సాగర్ నిండకున్నా గోదావరి నీటితో ఈ ప్రాంత చెరువులు నింపుతామని భరోసా ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాలకు గోదావరి జలాలు అందించి పది లక్షల ఎకరాలకు రెండు పంటలకూ సాగు నీరు అందిస్తామని ప్రకటించారు. ఆగస్టు 15 నాటికి జాతీయ రహదారి పనులు పూర్తవుతాయని, ఖమ్మం నుంచి 33 నిమిషాల్లో సత్తుపల్లికి వచ్చేలా కల్లూరు, వేంసూరులో ఎగ్జిట్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఆయిల్ పామ్కు గిట్టుబాటు ధర రూ.21 వేలు దాటేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పామాయిల్ ఫ్యాక్టరీలు నిర్మిస్తామని తెలిపారు. వేంసూరు అభివృద్ధికి కృషి.. ఎమ్మెల్యే మట్టా రాగమయి మాట్లాడుతూ.. ఎన్నికల హామీ మేరకు మంత్రి తుమ్మల వేంసూరు మండల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణంతో మరింతగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఆయిల్ఫెడ్ ఎండీ యాస్మిన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 65వేల మంది రైతులు పామాయిల్ సాగు చేస్తున్నారని, వారిని ఒప్పించి 2.50లక్షల ఎకరాల్లో అయిల్ పామ్ సాగయ్యేలా చర్యలు చేపట్టామని తెలిపారు. జిల్లాలో 30 వేల ఎకరాల్లో పంట సాగవుతోందని, ఏడాదికి 60 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని చెప్పారు. పామాయిల్ పంట కొనుగోలు చేశాక రైతుల ఖాతాల్లో మూడు రోజుల్లోనే డబ్బు జమయ్యేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్బాబు, నాయకులు మట్టా దయానంద్ విజయ్ కుమార్, తుమ్మల యుగంధర్, బొబ్బరపూడి రాఘవరావు, నరేంద్ర, పుచ్చాకాయల సోమిరెడ్డి, కాసరి చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
సంవత్సరాదికి ఘనంగా స్వాగతం
ఖమ్మంగాంధీచౌక్ : విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగకు జిల్లా వాసులు ఘనంగా స్వాగతం పలికారు. తెల్లవారుజామునే ఆలయాలకు వెళ్లి ఇష్టదైవాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం పంచాంగ శ్రవణం కార్యక్రమానికి హాజరయ్యారు. ఇళ్లకు మామిడాకు తోరణాలు కట్టి, షడ్రుచుల ఉగాది పచ్చడి తయారు చేసి స్వీకరించారు. రైతులు పశువులకు రంగులు చల్లి పూజలు చేశారు. జిల్లాలోని ప్రముఖ దేవాలయాలైన జమలాపురం, జీళ్లచెరువు గార్లొడ్డు ఆలయాలతో పాటు ఖమ్మంలోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి, శ్రీ బ్రమరాంభ సమేత శ్రీ గుంటు మల్లేశ్వర స్వామి, కమాన్ బజార్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి, కాల్వొడ్డులోని శ్రీ సత్యనారాయణ సహిత వీరాంజనేయ స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. జిల్లా వ్యాప్తంగా విశ్వావసు నామ ఉగాది సందడి -
ప్రజారంజక పాలన అందిస్తున్నాం
● ప్రజలకు సంక్షేమ ఫలాలు దక్కుతున్నాయి ● డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఎర్రుపాలెం: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రజా పాలన ఫలాలు దక్కేలా జన రంజక పాలన అందిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మండలంలోని కాచారం, కొత్త గోపవరం గ్రామాల్లో ఆదివారం రాత్రి ఆయన పర్యటించారు. రైతులు, మహిళలు, చిన్నారులు ఇలా అన్ని వర్గాల వారినీ ఆప్యాయంగా పలకరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయని చెప్పారు. కాచారంలో విద్యుత్ సరఫరా ఎలా ఉంది.. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడగగా.. గ్రామంలో 200 వరకు కుటుంబాలు ఉన్నాయని, గత ప్రభుత్వం కంటే ఇప్పుడు విద్యుత్ సరఫరా చాలా నాణ్యతగా వస్తోందని స్థానికులు చెప్పారు. రైతు భరోసాపై ఆరా తీయగా నాలుగైదు ఎకరాలకు వరకు డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పడ్డాయని తెలిపారు. గ్రామానికి రేషన్ దుకాణం, ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరగా, భట్టి సానుకూలంగా స్పందించారు. అనంతరం కాచారం గ్రామ శివాలయంలో పూజలు చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరావు, డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, పీసీసీ సభ్యుడు శీలం ప్రతాపరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్రెడ్డి, మధిర ఏఎంసీ చైర్మన్ బండారు నర్సింహారావు, మాజీ చైర్మన్ చావా రామకృష్ణ, నాయకులు బొగ్గుల గోవర్దన్రెడ్డి, అనుమోలు కృష్ణారావు, మల్లెల లక్ష్మణరావు, గంటా తిరుపతమ్మ, శీలం శ్రీనివాసరెడ్డి, తల్లపురెడ్డి నాగిరెడ్డి, దేవరకొండ రాజీవ్గాంధీ, గుడేటి బాబురావు, పిల్లి బోస్ పాల్గొన్నారు. -
నేడు ఈదుల్ ఫితర్
సత్తుపల్లి: ‘అల్లాహు అక్బర్.. అల్లాహు అక్బర్..’ అంటూ నెల రోజులుగా ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లింలు సోమవారం అత్యంత పవిత్రంగా, భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగను జరుపుకోనున్నారు. ఈదుల్ ఫితర్ సందర్భంగా పరస్పరం ‘ఈద్ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. షవ్వాల్ చాంద్(నెలవంక) ఆదివారం రాత్రి చూడగానే ఈదుల్ ఫితర్(రంజాన్) పండుగ ఏర్పాట్లలో ముస్లింలు నిమగ్నమయ్యారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లింల సందడితో పండుగ శోభ సంతరించుకుంది. జిల్లాలోని ఈద్గాలన్నింటినీ ముస్తాబు చేశారు. నెల రోజుల కఠిన ఉపవాస దీక్ష.. 30 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లింలు రంజాన్ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. తప్పనిసరిగా తెల్లవారుజామున ‘ఫజర్’ నమాజ్ ఆచరించి ఈదుల్ ఫితర్ నమాజ్ చదవాల్సి ఉంటుంది. నమాజ్కు వెళ్లే ముందు పవిత్రంగా(గుసూల్) తల స్నానం చేసి కొత్త దుస్తులు ధరించి, అత్తరు పూసుకుంటారు. తప్పని సరిగా సేమియా(ఏదైనా తీపి పదార్థం) తిని వజూ చేసుకుని నమాజ్ కోసం ఈద్గాలకు వెళ్తారు. విధిగా ఫిత్రా దానం.. ఫిత్రాల పేరుతో ఈ పండుగను ‘ఈదుల్ ఫితర్’గా పిలుస్తుంటారు. ఆర్థికంగా ఉన్నవారు ఫిత్రా (దానం) తప్పనిసరిగా చెల్లించి ఈదుల్ ఫితర్ నమాజ్ చదవాలి. పండుగ రోజు పుట్టిన బిడ్డకు కూడా ఫిత్రా దానం ఇవ్వాల్సి ఉంటుంది. బహిరంగ మార్కెట్లో రెండున్నర కిలోల గోధుమల ధర ఎంత ఉంటుందో అంత ఫిత్రా చెల్లించాలి. ప్రస్తుతం ఒక్కొక్కరికి రూ.80చొప్పున ప్రతి ఒక్కరు ఫిత్రా చెల్లించాలని ముస్లిం మతపెద్దలు నిర్ణయించారు. అయితే అంతకంటే ఎక్కువ కూడా ఇవ్వవచ్చు. ఫిత్రా దానంతో పేదలు కూడా సంతోషంగా పండుగ జరుపుకునే అవకాశం ఉంటుంది.రంజాన్ వేడుకలకు ముస్తాబైన మసీదులు, ఈద్గాలు -
ముస్లింలకు పొంగులేటి శుభాకాంక్షలు
ఖమ్మంవన్టౌన్/ఖమ్మం మామిళ్లగూడెం: జిల్లాలోని ముస్లింలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నెల రోజుల పాటు ఎంతో నిష్ఠతో ఉపవాసం ఉండి పవిత్రంగా జరుపుకునే పండుగ ఈద్ అని పేర్కొన్నారు. సహనం, త్యాగం, జాలి, దయ, సేవాగుణాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలంటూ దిశా నిర్దేశం చేసిన మాసం రంజాన్ అని తెలిపారు. పండుగను సంబురంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. కాగా, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కూడా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ మరో ప్రకటన విడుదల చేశారు. మే డే పురస్కారాలకు నామినేషన్ల ఆహ్వానం ఖమ్మంమయూరిసెంటర్: మే డే సందర్భంగా ఇచ్చే శ్రమ శక్తి, పారిశ్రామిక ఉత్తమ యాజమాన్య పురస్కారాల కోసం ఏప్రిల్ 10వ తేదీలోగా నామినేషన్ ఫారాలు సమర్పించాలని ఉప కార్మిక కమిషనర్ కె.విజయభాస్కర్రెడ్డి సూచించారు. కార్మికుల సంక్షేమం కోసం విశిష్ట సేవలు అందించిన కార్మికులు, ట్రేడ్ యూనియన్ల నాయకులకు శ్రమ శక్తి పురస్కారాలు, ట్రేడ్ యూనియన్లు, కార్మికులతో సఖ్యతగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రగతికి సహకరించిన మధ్య, పెద్ద తరహా పారిశ్రామిక యాజమాన్యాలకు ఉత్తమ యాజమాన్య పురస్కారాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని ట్రేడ్ యూనియన్ల నాయకులు, కార్మికులు, యాజమాన్యాలు ఖమ్మం ఉప కార్మిక కమిషనర్ కార్యాలయంలో నామినేషన్ ఫారాలు తీసుకుని పూర్తిచేశాక 10వ తేదీ లోపు సమర్పించాలని సూచించారు. బీసీ అభ్యర్థులకు ఉచిత బ్యాంకింగ్ శిక్షణ ఖమ్మం రాపర్తినగర్: హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యాన బీసీ ఆభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారి ఎన్.మాధవి తెలిపారు. నెల పాటు రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ ఇప్పించడమే కాక ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న బీసీ అభ్యర్థులు ఏప్రిల్ 8లోగా దరఖాస్తు చేసుకుంటే 12న ఆన్లైన్ ట్రైనింగ్ టెస్ట్ నిర్వహించి ప్రతిభ ఆధారంగా 30 మందిని ఎంపిక చేస్తామని తెలిపారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లోనైతే రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లోనైతే రూ.2 లక్షలలోపు ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. వివరాల కోసం www.tgbcstudycircle.cgg.gov.in వెబ్సైట్లో సంప్రదించాలని సూచించారు. గురుకులాల్లో బ్యాక్లాగ్ సీట్ల ప్రవేశానికి 20న పరీక్ష ఖమ్మంసహకారనగర్: మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి ఏప్రిల్ 20న పరీక్ష నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఉమ్మడి జిల్లా బీసీ గురుకుల విద్యాసంస్థల ప్రాంతీయ సమన్వయ అధికారి సీహెచ్.రాంబాబు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 24 బీసీ గురుకుల పాఠశాలలు ఉండగా, అందులో 6వ తరగతికి బాలికలకు 249, బాలురకు 249 సీట్లు, 7వ తరగతిలో బాలికలకు 170, బాలురకు 177, 8వ తరగతిలో బాలికలకు 97, బాలురకు 124, 9వ తరగతిలో బాలికలకు 139, బాలురకు 184 సీట్లు ఉన్నాయని వెల్లడించారు. ఆసక్తి కలిగిన బాలబాలికలు రూ.150 రుసుముతో ఈనెల 31వ తేదీ(సోమవారం)లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉషూలో అన్నాచెల్లెలికి పతకాలుఖమ్మం స్పోర్ట్స్ : జాతీయస్థాయి ఫెడరేషన్ కప్ ఉషూ టోర్నీలో ఖమ్మం నగరానికి చెందిన అన్నాచెల్లెలుకు పతకాలు లభించాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాస్పూర్లో ఈనెల 24 నుంచి 28 వరకు జరిగిన పోటీల్లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించి పతకాలు దక్కించుకోవడం విశేషం. ఈ పోటీల్లో పి.పవి త్రాచారికి నాన్క్వాన్, ట్రెడిషనల్ సింగిల్ వెపన్లో కాంస్య పతకం లభించగా, పి.సత్యజిత్చారికి తైజిక్వాన్లో కాంస్య పతకం దక్కింది. జాతీయస్థాయిలో వీరు ప్రతిభ కనబర్చగా డీవైఎస్ఓ టి.సునీల్కుమార్రెడ్డి, కోచ్ పి.పరిపూర్ణాచారి అభినందించారు. -
●ఉద్యోగం చేస్తూనే..
ఖమ్మంక్రైం: ఖమ్మం ఏఎంవీఐగా పనిచేస్తున్న వెల్ది గోపీకృష్ణ గ్రూప్–1 ఫలితాల్లో సత్తాచాటాడు. జనరల్ కేటగిరిలో స్టేట్లో 70 ర్యాంక్, జోనల్లో 38 ర్యాంక్ సాధించారు. ఇటీవల రవాణాశాఖలో ఏఎంవీఐగా చేరిన గోపీకృష్ణ హనుమకొండ జిల్లాకు చెందినవారు. ఆయన గ్రూప్–1 పరీక్ష రాసే సమయంలో తండ్రి నాగేశ్వరరావు హఠాన్మరణం పొందారు. అయినా కష్టపడి చదివి గ్రూప్–1 ఫలితాల్లో ర్యాంక్ సాధించాడు. గోపీకృష్ణ ఇప్పటివరకు 10 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఆయన్ను జిల్లా ఇన్చార్జ్ రవాణాశాఖాధికారి వెంకటరమణ, ఎంవీఐ వరప్రసాద్, ఏఎంవీఐ స్వర్ణలత, ఇతర సిబ్బంది అభినందించారు. -
జమలాపురంలో బ్రహ్మోత్సవాలు షురూ..
ఎర్రుపాలెం: తెలంగాణా తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారికి అర్చకులు సుప్రభాత సేవ నిర్వహించి పంచామృతంతో అభిషేకం చేశారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని, శ్రీఅలివేలు మంగ, శ్రీ పద్మావతి అమ్మవార్లను నూతన వస్త్రాలతో సుందరంగా అలంకరించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారికి వేపపువ్వు ప్రసాదం నివేదించారు. ఆలయ ప్రాంగణంలోని పుష్కరణి నుంచి ఈఓ కె.జగన్మోహన్రావు, ప్రధానార్చకులు ఉప్పల శ్రీనివాస శర్మ తదితరులు మేళతాళాలతో తీర్థపు బిందె తీసుకొచ్చారు. తొలుత విఘ్నేశ్వర పూజ చేసి పుణ్యావాచనం, అనుష్టానాలు, రుత్విక్కరణ తదితర పూజలు చేశారు. విశ్వావసు నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని అర్చకులు, వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు. అంతకుముందు శ్రీవారి నిత్య కల్యాణం నిర్వహించగా భక్తులు కనులపండువగా తిలకించారు. బ్రహ్మోత్సవాల తొలిరోజు, ఉగాదిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు అర్చకులు వేపపువ్వు ప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో వ్యవస్థాపక ధర్మకర్తలు ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, కృష్ణమోహన్శర్మ, వకుళామాత స్టేడియం నిర్మాణ దాత తుళ్లూరు కోటేశ్వరరావు, ఆలయ సూపరింటెండెంట్ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు -
●గ్రూప్–1 ఫలితాల్లో సత్తా
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలోని బూడిదంపాడుకు చెందిన తుమ్మలపల్లి సంజయ్ గ్రూప్–1 ఫలితాల్లో 469 మార్కులు సాధించి ఈడబ్ల్యూఎస్ విభాగంలో రాష్ట్రస్థాయిలో 10వ ర్యాంక్, జనరల్ విభాగంలో 249 ర్యాంక్ సాధించాడు. సంజయ్ తల్లితండ్రులు నర్సింహారావు, ఉమ బూడిదంపాడు గ్రామ సెంటర్లో హోటల్ నడుపుతున్నారు. సంజయ్ 1 నుంచి 5 వరకు బల్లేపల్లిలోని ఎస్ఎఫ్ఎస్లో, 10వ తరగతి వరకు ఖమ్మంలోని గీతమ్స్లో, ఇంటర్, డిగ్రీ, గ్రూప్స్ పరీక్షల కోసం నారాయణ ఐఏఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకున్నట్లు సంజయ్ తండ్రి తెలిపారు. సంజయ్ను పలువురు అభినందిస్తున్నారు. -
మక్క రైతులకు భరోసా
● మార్క్ఫెడ్ ద్వారా పంట కొనుగోళ్లకు రంగం సిద్ధం ● ఉమ్మడి జిల్లాలో 55 కేంద్రాలకు పైగా ఏర్పాటు ● ఈ వారంలోనే పీఏసీఎస్లు, డీసీఎంఎస్ల ద్వారా కొనుగోళ్లు ఖమ్మం వ్యవసాయం: యాసంగిలో సాగు చేసిన మొక్కజొన్న పంట చేతికందుతోంది. మక్కలకు ప్రైవేటు మార్కెట్లో కనీస మద్దతు ధర లభించడం లేదు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మక్కలు క్వింటాకు రూ.2,225 ధర ప్రకటించగా, వ్యాపారులు రూ.2వేల నుంచి రూ.2,100 మించి చెల్లించడం లేదు. దీంతో పంట కొనుగోలుకు ప్రభుత్వం రంగంలోకి దిగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పంట సాగు చేసే ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరతో మక్కలు కొనుగోలు చేయాలని మార్క్ఫెడ్ను ప్రభుత్వం ఆదేశించగా.. రాష్ట్రంలో పంట సాగు ఆధారంగా 320 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించింది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ కొనుగోళ్లు మొదలుకానున్నాయి. 1.30లక్షలకు పైగా ఎకరాల్లో సాగు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా మొక్కజొన్న విస్తారంగా సాగు చేశారు. ఖమ్మం జిల్లాలో 1,14,901 ఎకరాల్లో, భద్రాద్రి జిల్లాలో 16,938 ఎకరాల్లో పంట సాగైంది. ఎకరాకు 35 క్వింటాళ్ల చొప్పున రెండు జిల్లాల్లో దాదాపు 5.50 లక్షల క్వింటాళ్ల మక్కలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యాన 55కు పైగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు మార్క్ఫెడ్ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో ఖమ్మం జిల్లాలో 44, భద్రాద్రి జిల్లాలో 11 నుంచి 15 కేంద్రాలు ఏర్పాటుకానున్నాయి. పీఏసీఎస్, డీసీఎంఎస్కు బాధ్యతలు ఉమ్మడి జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్), జిల్లా కో–ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్)ల ద్వారా మక్కలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఖమ్మం జిల్లాలో పీఏసీఎస్ల ద్వారా 38 కేంద్రాలు, డీసీఎంఎస్ల ద్వారా ఆరు కేంద్రాల ఏర్పాటుకు కార్యాచరణ చేస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో పీఏసీఎస్ల ద్వారా 11 నుంచి 15 కేంద్రాల ఏర్పాటు చేస్తారు. వారం రోజుల్లో కొనుగోళ్లు.. పంట కోతలు, నూర్పిళ్లు ప్రారంభం కావడంతో ఏప్రిల్ మొదటి వారం నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మార్క్ఫెడ్ నిర్ణయించింది. రవాణా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిన మార్క్ఫెడ్.. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించింది. ఇప్పటికే పీఏసీఎస్లు, డీసీఎంఎస్లకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై జిల్లా యంత్రాంగం దిశానిర్దేశం చేసింది.ఎక్కడెక్కడ.. ఖమ్మం జిల్లాలో పీఏసీఎస్ల ద్వారా బ్రాహ్మణపల్లి, మోటమర్రి, కలకోట, లక్ష్మీపురం, రావినూతల, ముష్టికుంట్ల, చొప్పకట్లపాలెం, రామాపురం, పెద్దబీరవెల్లి, నారాయణపురం, బోనకల్, చిరునోముల, నాగులవంచ, పాతర్లపాడు, పొద్దుటూరు, పందిళ్లపల్లి, కొణిజర్ల, పెద్దమునగాల, పల్లిపాడు, రాజేశ్వరపురం, ముజ్జుగూడెం, మర్లపాడు, కందుకూరు, భరణిపాడు, మోటాపురం, జీళ్లచెరువు, ముదిగొండ, వనంవారి కిష్టాపురం, పెద్దమండవ, మేడేపల్లి, వీ.వీ.పాలెం, అల్లీపురం, తల్లాడ, మాధారం, కొండకొడిమ, సోమవరం, హస్నగుర్తి, కేశవాపురంలో కేంద్రాలు ఏర్పాటవుతాయి. డీసీఎంఎస్ ద్వారా రాయిగూడెం, అనాసాగరం, గువ్వలగూడెం, పెద్దగోపతి, తుమ్మలపల్లి, కొండాపురం, పమ్మి, లచ్చగూడెం గ్రామాల్లో కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. భద్రాద్రి జిల్లాలో పీఏసీఎస్ల ద్వారా టేకులపల్లి, ఆళ్లపల్లి గుండాల, మర్కోడు, శెట్టిపల్లి, కొత్తగూడెం, చల్లసముద్రం, కొమరారం, ఇల్లెందు, దమ్మపేట, అశ్వారావుపేటలో కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. అవసరమైతే మరో నాలుగు నుంచి ఐదు కేంద్రాల ఏర్పాటుకు కూడా ఈ జిల్లాలో అవకాశం ఉంది. మక్కల కొనుగోళ్లకు సమగ్ర చర్యలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మక్కల కొనుగోళ్లకు సమగ్ర చర్యలు చేపట్టాం. పంట సాగు చేసిన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. పీఏసీఎస్లు, డీసీఎంఎస్ సంస్థల ద్వారా పంట కొనుగోలుకు కార్యాచరణ చేశాం. నాణ్యతా ప్రమాణాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన రూ. 2,225 మద్దతు ధరతో పంట కొనుగోలు చేస్తాం. ఏప్రిల్ మొదటి వారం నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. – సుునీత, మేనేజర్ మార్క్ఫెడ్, ఉమ్మడి ఖమ్మం జిల్లా -
సేవా లోపంపై వినియోగదారుల ఫోరం తీర్పు
ఖమ్మంలీగల్: అపార్ట్మెంట్లో ఫ్లాట్ విషయమై ఒప్పందాన్ని విస్మరించడంతో తీసుకున్న డబ్బును వడ్డీతో సహా చెల్లించడమే కాక నష్టపరిహారం కూడా ఇవ్వాలని ఖమ్మం వినియోగదారుల ఫోరం సభ్యురాలు ఎ.మాధవీలత శనివారం తీర్పు చెప్పారు. భద్రాద్రి జిల్లా పాల్వంచకు చెందిన గుగులోత్ రాంచందర్, గుగులోత్ లక్ష్మి 2016 డిసెంబర్లో ఖమ్మం వెలుగుమట్ల సమీపాన జీఆర్ఆర్ శ్రీనివాస వశిష్ఠ బ్లాక్లో ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు జీఆర్ఆర్ రియాలిటిస్ మేనేజింగ్ పార్టనర్ గుర్రం ప్రకాష్తో ఒప్పందం కుర్చుకుని రూ.16 లక్షలు చెల్లించారు. కానీ గడువులోగా ఫ్లాట్ ఇవ్వకపోవడమే కాక ఎన్నిసార్లు అడిగినా స్పందించకపోవడంతో రాంచందర్, లక్ష్మి న్యాయవాది ద్వారా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. దీంతో వివరాలు పరిశీలించాక రూ.16 లక్షలను ఏడు శాతం వడ్డీతో చెల్లించాలని, నష్టపరిహారంగా రూ.3 లక్షలు, ఖర్చుల కింద రూ.10 వేలు ఇవ్వాలని తీర్పు చెప్పారు. కారు షోరూం యాజమాన్యానికి.. కారు మరమ్మతు చేయించినా మొరాయిస్తుండడంతో షోరూం బాధ్యులు స్పందించలేదని వినియోగదారుల ఫోరంను ఆశ్రయించగా పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పారు. ఖమ్మం ధంసలాపురానికి చెందిన బండారు రమ్య కియా సోనెట్ కారును ఖమ్మం కియా షోరూంలో కొనుగోలు చేయగా, కొన్నాళ్లకు ప్రమాదం జరిగింది. ఈ మేరకు షోరూంలో రూ.1,97,157 వెచ్చించి మరమ్మతు చేయించినా తరచుగా సమస్య వస్తోంది. దీంతో న్యాయవాది ద్వారా ఖమ్మం వినియోగదారుల ఫోరమ్ను ఆశ్రయించడంతో ఫోరమ్ ఇన్చార్జ్ చైర్మన్ లలిత వాదనలు విన్నాక కొత్త సామగ్రితో కారు మరమ్మతు చేసి ఇవ్వాలని తీర్పు చెప్పారు. అంతేకాక రూ.30 వేల పరిహారం, ఖర్చుల కింద రూ.10 వేలను ఫిర్యాదికి అందించాలని విజయవాడలోని సింహ మోటార్స్ బాధ్యులను తీర్పులో ఆదేశించారు. -
క్రోధి గతించి.. విశ్వావసు ఏతెంచె..
ఆమని రావాలి.. తెలుగు వారి తెలుగు తీయదనము ఉగాది పచ్చడి కమ్మదనము తెలుగు వారి కొత్త సంవత్సరం సంస్కతి సంప్రదాయాల కొనసాగింపు పిల్లలు కొత్త బట్టలతో కేరింతలు బంధువుల రాకతో ఇళ్లన్నీ కొత్త పలకరింపులు అందరి జీవితాల్లో ఆమని రావాలి ఇళ్లన్నీ ధాన్యపురాశులతో నిండాలి పెద్దల పూజలు పంచాగ శ్రవణం మాలోని మా శత్రువులను జయించుకొని జగమంతా వసుదైక కుటుంబంలా ఉండాలని జనుల్లో సంతోషం వెల్లివిరియాలని ఈ ఉగాది అందరిలో కొత్త కాంతులు నింపాలని జీవితమంటే చేదు కారం పులుపు తీపి ఒగరులతో కూడినదే ఈ ఉగాది తేవాలి ఉషస్సులను ఈ ఉగాది పోగొట్టాలి అందరి తమస్సులను –వేము రాములు, తెలుగు ఉపాధ్యాయుడు, మహదేవపురం హైస్కూల్ తెలుగు సంవత్సరాది.. ఉగాది తరలివచ్చింది. క్రోధి నామ సంవత్సరం కాలగర్భంలో కలిసిపోగా.. చైత్ర మాసపు వసంత సొబగులతో విశ్వావసు కదలివచ్చింది. సమస్త జనుల్లో నూతన ఆశలను రేకెత్తిస్తూ ఏతెంచింది. గత కాలపు కష్టనష్టాలు, అవమానాలు, అనుమానాలకు సెలవిచ్చి మధుర స్మృతులను నెమరువేసుకుంటూ కొత్త ఏడాదిలో ఆత్మీయ అనురాగాలతో ప్రశాంత పూల పరిమళాలు వెదజల్లుతూ ముందుకు సాగుదాం. నేడు ఏరువాక సాగే రైతుల లోగిళ్లు సిరి సంపదలతో తులతూగాలని ఆశిద్దాం. పండుగ ప్రాశస్త్యం, షడ్రుచుల విశిష్ఠతను ఆవిష్కరించిన సమసమాజ స్వాప్నికులు.. మన కవుల కృతులను ఆలకిద్దాం. – సాక్షి నెట్వర్క్ఉగాదిజం.. షడృచుల సంవత్సరాది, మన ఉగాది.. కాదది హిందూ మాత్రపు పర్వదినం సర్వ మానవాళికి మార్గదర్శనం.. భారతీయ సంస్కతిని ప్రతిబింబించే ఓ జీవన విధానం.. ఉగాది పచ్చడిలా కలిసి బతకమని చాటి చెప్పిన భారతావని ‘భాయి’చారాలు. బాహ్యం కాదు ఆత్మ సౌందర్యం చూడమని సృష్టి చెప్పే ప్రవచనాలు.. కుల మతాలు ఎన్నున్నా, వర్ణ గోత్రాలెన్నున్నా.. ఉగాది పచ్చడిలా అంతా కలిసిపోయి ఒదిగి పొవాలని.. ఐకమత్య భారతావనై వెలుగొందాలని చాటుతోంది ఉగాది.. –ఎం.డీ.మొహియుద్దీన్, శ్రీనగర్కాలనీ, ఖమ్మం ● -
ఒకేచోట ఆ మూడు చెట్లు!
ఖమ్మంగాంధీచౌక్: ఉగాది పచ్చడి తయారీలో వినియోగించే ముడిపదార్థాలను ఇచ్చే మూడు రకాల చెట్లు ఒకే చోట ఉండడం విశేషం. ఖమ్మం శ్రీనివాసనగర్ టీచర్స్కాలనీకి వెళ్లే మార్గంలో ఉన్న రైస్ మిల్లు ఆవరణలో మామిడి, వేప, చింత చెట్లతో పాటు కొబ్బరి చెట్టు కూడా ఉంది. షడ్రుచుల్లో వగరు రుచి కోసం మామిడి, పులుపు కోసం చింతపండు, వేపను చేదు కోసం ఉపయోగిస్తారు. ఈ మూడు చెట్లుమిల్లు ఆవరణలో ఉండగా.. ఏటా ఉగాదికి మిల్లులోని హమాలీలేకాక స్థానికులు మామిడి కాయలు, చింతకాయలు, వేప పూత కోసుకునే అవకాశం లభిస్తోంది. -
టెల్గూ న్యూ ఇయర్..
గూడు లేని గండుకోయిల దాగేందుకు గున్నమావి గుబురులు కానరాక తినేందుకు ఎర్రెర్రని చిగురులు లేక అంతరంగాన సమస్యల సుడిగండాల సుళ్లు తిరుగుతున్నా అరంగుళం మందాన వేసుకున్న మేకప్తో కప్పిపుచ్చుతున్న అతివలా గొంతెత్తి కూస్తోంది కుహూ కుహూ మంటూ తీయగా ఏ.ఐ. కోయిల అవతారమెత్తి! వాట్సాప్ సందేశాల వెల్లువలో మునుగుతూ సంప్రదాయమంతా అంతర్జాల చిత్రాల్లో తప్ప ప్రత్యక్షంగా కాంచలేక చిత్తరువులైన జనులు విశ్వాసం కోల్పోయి వసిస్తున్నా నూతన పదం ఆకర్షణకు లోనై ఆశను శ్వాసిస్తూ విశ్వావసు నామ సంవత్సరాదికి స్వాగతం పలుకుతూ! –దీకొండ చంద్రకళ, చర్చికాంపౌండ్, ఖమ్మం -
ఫెయిల్ అవుతాననే భయంతో ఆత్మహత్య
సత్తుపల్లిటౌన్: పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం సత్తుపల్లిలో చోటుచేసుకుంది. పట్టణంలోని మసీద్రోడ్డుకు చెందిన షేక్ అలీబాబా అలియాస్బన్ను (24) ఇటీవల డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు రాశాడు. ఫెయిల్ అవుతాననే భయంతో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకున్నాడు. స్థానికులు గమనించి అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి భాషావలీ అనారోగ్యంతో నాలుగేళ్ల కిందట మృతి చెందాడు. సోదరుడు భాషా ఎలక్ట్రీషియన్గా పనిచేస్తుండగా తల్లి హసీన కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కాగా, మృతుడి స్వగ్రామం ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం గొల్లపూడి కావటంతో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అక్కడికి తరలించారు. సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉరి వేసుకుని బీటెక్ విద్యార్థిని... తిరుమలాయపాలెం: ప్రమాదంలో గాయపడిన బీటెక్ విద్యార్థిని చికిత్స అనంతరం కూడా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మంరూరల్ మండలం మంగళగూడెంనకు చెందిన బాతుల ఉపేందర్ – ఉమ దంపతుల కుమార్తె ఉదీప (20) ఖమ్మంలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఆరు నెలల కిందట కళాశాలలో కింద పడిన ఆమె తలకు బలమైన గాయం కాగా, హైదరాబాద్లో చికిత్స అనంతరం ఇంటికి తీసుకొచ్చారు. అయితే, మందులు వాడుతున్నా ఏమి గుర్తురాక ఇబ్బంది పడుతున్న ఆమె మానసికంగా వేదన చెందుతోంది. మూడు రోజుల కిందట తిరుమలాయపాలెంలో ఉండే మావయ్య మండల భిక్షం ఇంటికి వచ్చిన ఉదీప శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయాన ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కె.జగదీశ్ తెలిపారు. ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి కొణిజర్ల: ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కొణిజర్ల ఎస్ఐ గుగులోత్ సూరజ్ తెలిపిన వివరాలు.. మండలంలోని పల్లిపాడుకు చెందిన కార్పెంటర్ నంచర్ల శివయ్యచారి (58) శనివారం తన ద్విచక్రవాహనంపై పాల కోసం వెళ్తూ పల్లిపాడు సెంటర్లో రోడ్డు దాటుతుండగా కొత్తగూడెం నుంచి మియాపూర్ వెళ్తున్న రాజధాని బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో శివయ్య బైక్ పైనుంచి ఎగిరి రోడ్డుపై పడగా తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. కుమారుడు పరబ్రహ్మాచారి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. కాగా, గతంలో శివయ్యచారి తమ్ముడు కూడా ఇదేవిధంగా ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందాడు. చిన్నారులపై కుక్క దాడి నేలకొండపల్లి: మండలంలోని రాయగూడెంలో ఇద్దరు చిన్నారులపై శనివారం కుక్క దాడి చేయగా తీవ్రగాయాలయ్యాయి. గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారులు జాహ్నవి, వేదాన్ష ఆడుకుంటుండగా ఓ కుక్క వెంట పడి దాడి చేసింది. దీంతో స్థానికులు కుక్కను తరిమివేయగా అప్పటికే చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో నేలకొండపల్లిలో చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. -
అభివృద్ధిలో జిల్లాకు తిరుగులేదు..
ఖమ్మంగాంధీచౌక్: విశ్వవసు నామ సంవత్సరంలో రాష్ట్రంలోనే జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని పంచాంగకర్త ఇంగువ రాజేశ్వరశర్మ స్పష్టం చేశారు. 25 ఏళ్లుగా పంచాగం రాయడంతో పాటు ఉగాది రోజున పంచాంగ పఠనం చేసే ఆయన బోనకల్ మండలం రావినూతల వాసి. అంతేకాక పంచామృత ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం అర్చకులుగా కొనసాగుతున్న ఆయన వద్ద పలువురు పలువురు ప్రముఖులు తమ రాశి ఆధారంగా మంచీచెడు చెప్పించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా ఫలితాలను వివరించారు. ‘జిల్లా సర్వతో ముఖాభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. సరిపడా వర్షాలు కురుస్తాయి. జిల్లాలో నదీ జలాలు సమృద్ధిగా ఉండి పంటలు ఆశించిన స్థాయిలో పండుతాయి. మిర్చి ధర క్రమంగా పెరిగే అవకాశముంది. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు కలిసొస్తుంది. జిల్లాలో రాజకీయ నాయకుల ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు మంచి కాలం గోచరిస్తోంది. 3, 4వ తరగతుల ఉద్యోగులకు బాగుంటుంది. అయితే, వ్యాపార రంగం కొంత మేర ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. వ్యవసాయ పారిశ్రామిక రంగాలు బాగుంటాయి. ఇంజనీరింగ్, సైన్స్ రంగాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతాయి’ అని ఆయన వెల్లడించారు. 15 ఏళ్లుగా ఉగాది పచ్చడి పంపిణీ సత్తుపల్లిటౌన్: తెలుగు వారి లోగిళ్లలో ఉగాదికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగ సందర్భంగా అందరి ఇళ్లలో పచ్చడి చేసుకుని స్వీకరిస్తారు. అయితే, ఇళ్లలో చేసుకోలేని వారు, ప్రయాణంలో ఉన్న వారి కోసం సత్తుపల్లికి చెందిన మానుకోట (మాధురి) మధు పదిహేనేళ్లుగా పచ్చడి పంపిణీ చేస్తున్నారు. షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి పంపిణీ చేయడాన్ని సంతోషంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. పంచాంగ కర్త ఇంగువ రాజేశ్వరశర్మ 25 ఏళ్లుగా పంచాంగం రాయడమే కాక పఠనం -
వీకే –7 ఓసీకి ఈసీ అనుమతి
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని వీకే –7 ఓపెన్ కాస్ట్ గనికి ఎట్టకేలకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్(ఈసీ) అనుమతులు లభించాయి. దీంతో మరో రెండు నెలల్లో ఇక్కడ ఓబీ (ఓవర్ బర్డెన్) పనులు ప్రారంభం కానున్నాయి. ఈ పనులు పూర్తయితే 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో కొత్తగూడెం ఏరియా నుంచి సుమారు 5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అదనంగా వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసీ అనుమతుల కోసం దాదాపు మూడేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. లక్ష్య సాధనకు మార్గం.. సింగరేణి సంస్థ ప్రతీ ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశిస్తుంది. అయితే వీకే –7 ఓసీకి ఈసీ అనుమతులు లభించడంతో 2025 – 26 ఆర్థిక సంవత్సర లక్ష్యాల సాధన కొంత సులువు కానుందని అధికారులు భావిస్తున్నారు. త్వరలో ఆఫ్ లోడింగ్, ఓసీలో హాల్రోడ్లు, మెటీరియల్ సరఫరా తదితర పనులు పూర్తి చేసుకుంటే రానున్న ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత వార్షిక లక్ష్యం 76 మిలియన్ టన్నులు చేరుకునేందుకు మార్గం సుగమం కానుంది. దీంతో పాటు ఒడిశాలోని నైనీబ్లాక్లో కనీసం ఆరు మిలియన్ టన్నులు తోడయితే 11 మిలియన్ టన్నుల ఉత్పత్తి అదనంగా వచ్చే అవకాశం ఉంది. ఎట్టకేలకు ఫారెస్ట్ క్లియరెన్స్.. సుమారు 1,114 హెక్టార్ల విస్తీర్ణంలో దాదాపు 190 మిలియన్ టన్నుల నిక్షేపాలు ఉన్నట్లు ఎక్స్ప్లోరేషన్ అధికారుల అంచనా. దాదాపు 35 సంవత్సరాల జీవితకాలం ఉన్న వీకే –7 ఓసీలో 1000 మందికి ఉపాధి కలగనుంది. అయితే ఈ గనికి 773 హెక్టార్లలో అటవీ భూములు అవసరం అవుతాయి. ప్రస్తుతం సింగరేణి ఆధీనంలో 341 హెక్టార్ల స్థలం ఉండగా.. అది కూడా వివిధ కాలనీల రూపంలో ఉందని అధికారులు చెబుతున్నారు. నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందజేస్తారని తెలుస్తోంది. ప్రైవేట్ భూ యజమానుల సమస్య పరిష్కారం అయినప్పటికీ, అటవీ భూముల సమస్య జఠిలంగా మారింది. ఈ నేపథ్యంలో అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా, వేరేచోట భూమి ఇచ్చినా ఆ శాఖ అధికారులు అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు రాకముందే టండర్ ఖరారు.. వీకె–7 ఓసీకి గతేడాది అనుమతులు వస్తాయని భావించిన యాజమాన్యం రెండు సంవత్సరాల క్రితమే ఓబీ టెండర్ను ఖరారు చేసుకుంది. మూడేళ్ల క్రితం ఓసీకి అనుమతులు వస్తాయని, పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేసి, టెండర్లను కూడా ఖరారు చేయడంతో సదరు కాంట్రాక్టర్లు కంపెనీపై ఒత్తిడి పెంచుతున్నారు. అనుమతులు రాకముందే టెండర్లు ఎలా కట్టబెట్టారని, మూడేళ్ల పాటు తామేం చేయాలని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. రెండు నెలల్లో ప్రారంభం కానున్న ఓబీ పనులు అనుమతి రావడం హర్షణీయం వీకె–7 భూగర్భ గని మూడబడడంతో గత మూడేళ్లుగా ఏరియాలో ఉత్పత్తి కొంత తగ్గింది. జీకే ఓసీలో నిక్షేపాలు అడుగంటగా ఈ లోటును జేవీఆర్ ఓసీ పూడ్చుతున్నప్పటికీ.. ఈ రెండు గనుల్లో సుమారు 1,400 మంది కార్మికుల సర్దుబాటు కష్టమైంది. ఇప్పుడు వీకే ఓసీ స్టేజ్–1కు అనుమతి రావడం హర్షణీయం. రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా స్పందిస్తే ఇంత జాప్యం అయ్యేది కాదు. – ఎం. శాలెంరాజు, కొత్తగూడెం ఏరియా జీఎం -
నువ్వు వస్తున్నావు సరే..
మానవీయ విలువలు మృగ్యమవుతున్నవి విశ్వావసు ఉగాదికి భారమైన హృదయంతో స్వాగతం పలకాల్సి వస్తున్నది. స్వార్థపరుల అంతులేని ఆశకు కుచించుకు పోతున్న అరణ్యాలు. కనుమరుగవుతున్న పచ్చదనం.. వెదజల్లుతున్న కాలుష్యం ఇవ్వన్నీ సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. విశ్వావసూ నువ్వువస్తున్నావు సరే! రేపటి పౌరుల భవిష్యత్ను గమనిస్తున్నావా? విశ్వావసూ.. విపరీతాల మధ్య నువ్వొస్తున్నావు! మార్గ దర్శనం చేస్తావని, ఆశావహ దృక్పథంతో ఎదురుచూస్తున్నా! –బొల్లేపల్లి మధుసూదన్రాజు, సత్తుపల్లి -
జమలాపురంలో ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామి మూలవిరాట్తో పాటు శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆతర్వాత స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్యకల్యాణం జరిపించడంతో పాటు పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన పల్లకీసేవ చేశారు. ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, సూపరింటెండెంట్ విజయకుమారి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ తదితరులు పాల్గొన్నారు. -
తీపి.. చేదు సమ్మిళితం !
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎన్నికల ముందు ఇచ్చి హామీ మేరకు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అయితే, ఈ పథకాలతో జిల్లాలో లబ్ధి పొందిన వారు ఆనందంగా ఉండగా... దరఖాస్తు చేసుకున్నా పథకాలు అందని వారు నిరీక్షిస్తున్నారు. రైతుభరోసా, రుణమాఫీ, రేషన్కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు పొందిన వారంతా విశ్వావసు నామ సంవత్సరంలోకి ఆనందంగా అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మిగతా వారు మాత్రం ఉగాది పండుగ రోజు పచ్చడి రుచి మాదిరిగానే పథకాలు అందుతాయన్న ఆశల తీపి.. ఎప్పుడు అందుతాయో తెలియని వగరు రుచి ఎదుర్కోనున్నారు. కానీ ఇది చేదుగా మాత్రం మారొద్దని వారి ఆకాంక్షగా చెబుతున్నారు. సొంత ఇంటిలో చేరాలని.. ప్రభుత్వం పథకాలకు సంబంధించి నిరుపేదలు ఇందిరమ్మ ఇళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో 850 మంది లబ్ధిదారులను ప్రకటించగా.. ఇందులో 500 మందికి గ్రౌండింగ్ పూర్తయింది. దీంతో వీరంతా విశ్వావసు నామ సంవత్సరంలో సొంత గూటికి చేరుకుని తీపి వేడుక జరుపుకోనున్నారు. మరో 350 మందికి ఆర్థిక, ఇతర కారణాలతో ఆలస్యం అవుతుండగా కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల కోసం 3,40,923 మంది దరఖాస్తు చేసుకోగా 60,747 మంది అర్హులను గుర్తించారు. గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా మరో 4,536 మంది అర్హులుగా తేలారు. వీరంతా అద్దె ఇళ్లు, గుడిసెల్లో గడుపుతున్న చేదు జీవనం నుంచి తీపి జ్ఞాపకంగా సొంతింట్లోకి అడుగు పెట్టాలని కోరుకుంటున్నారు. రైతులకు కలిసి వచ్చేనా.. జిల్లాలో రైతు భరోసా కింద 3,51,592 మంది అన్నదాతలకు ఎకరానికి రూ.6వేల చొప్పున రూ.371.06 కోట్లు రావాల్సి ఉంది. ఇప్పటివరకు 2,65,392 మంది రైతుల ఖాతాల్లో రూ.215.78 కోట్లు జమ అయ్యాయి. అందరికీ సోమవారం లోగా అందుతాయని మంత్రి తుమ్మల ప్రకటించినా ఖాతాలో జమ అయితేనే తమకు తీపి కబురు చెప్పినట్లని వారు భావిస్తున్నారు. ఇక జిల్లాలో 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వరకు 3,73,157 మంది రైతులు బ్యాంకుల ద్వారా రూ.4,307.58 కోట్ల రుణాలు తీసుకున్నారు. మూడు విడతలుగా చేస్తే 1,15,627 మందికి రూ.770.95 కోట్లే మాఫీ అయ్యాయి. దీంతో మిగతా వారి గొంతులో చేదు గుళికలు కరిగిపోవడం లేదు. అంతేకాక గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మిర్చి ధర గణనీయంగా పడిపోయింది. ఈ ఏడాది రూ.14 వేల లోపే ధర వస్తుండడంతో రైతుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. రేషన్కార్డులు వస్తేనే.. జిల్లాలో రేషన్కార్డుల కోసం వేలాది మంది ఎదురుచూస్తున్నారు. గత కొన్నేళ్లుగా కార్డుల జారీ లేకపోవడంతో కొన్ని సంక్షేమ పథకాలు అందడం లేదు. ఈ ఏడాది జనవరి 26న కొత్తగా 484రేషన్కార్డులు మంజూరు చేయగా, వీటి ద్వారా 862 మందికి బియ్యం అందుతోంది. అయితే, గ్రామసభల ద్వారా 66,115, మీ సేవ కేంద్రాల ద్వారా అందిన 6,966 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఏప్రిల్ 1నుంచి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయనుండడంతో దరఖాస్తుదారులంతా తమకు కొత్త సంవత్సరంలో కార్డులు అందాలని ఆశిస్తున్నారు. అందరికీ సంక్షేమ పథకాలు అందక అర్హత ఉన్న వారి ఎదురుచూపులు ఈ ఏడాది సొంతింటి కల నెరవేరుతుందని ఆశలు రుణమాఫీ కాక.. మిర్చి ధర తగ్గడంతో రైతుల్లో నిరాశ అందరి ఆశలను ‘విశ్వావసు’ తీర్చాలని ఆకాంక్షరాజీవ్ యువవికాసం కోసం.. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పేరిట కొత్త పథకాన్ని ప్రకటించింది. యువత సొంత వ్యాపారాలు, స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు రుణ సాయం అందనుంది. బీసీ, ఎస్సీ, మైనార్టీ, క్రిస్టియన్, గిరిజనులకు ఈ పథకం ద్వారా లబ్ధి జరగనుండగా, ఇప్పటివరకు బీసీ యువత నుంచి 8,720, ఎస్సీల నుంచి 5,741, మైనార్టీల నుంచి 1,102, క్రిస్టియన్ల నుంచి 19, గిరిజనుల నుంచి 3వేల దరఖాస్తులు అందాయి. వీరి అర్హతల ఆధారంగా సబ్సిడీ రుణం జూన్, జూలైలో మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా.. తమ జీవితం ‘విశ్వావసు’ నామ సంవత్సరంలో కొత్త మలుపు తిరగనుందని ఆకాంక్షిస్తున్నారు. -
ఉగాది ప్రేమికుడు.. దినేశ్
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంరూరల్ మండలం పెదతండాకు చెందిన చింతల దినేశ్కు మొక్కలు పెంపకం ఇష్టం. ఇంటి ఆవరణలో రకరకాల మొక్కలు, పూలు, పండ్ల మొక్కల చెట్లు పెంచుతుంటారు. మామిడి చెట్టు, వేప చెట్టు నాటగా.. ఇంటి పక్కన ఖాళీ స్థలంలో ఉన్న చింత చెట్టును సైతం సంరక్షిస్తున్నారు. దీంతో ఏటా ఉగాది పండుగ సందర్భంగా కాలనీవాసులు, స్నేహితులు దినేశ్ ఇంటికి క్యూ కడతారు. మామిడి కాయలు, వేప పూతతో పాటు చింత పండును కవర్లలో పెట్టి ఇంటికి వచ్చిన వారందరికీ ఇవ్వడాన్ని దినేశ్ ఆనవాయితీగా మార్చుకున్నాడు. -
దుకాణాలకు చేరుతున్న సన్నబియ్యం
● ప్రతీ షాప్నకు 50 క్వింటాళ్లు తగ్గకుండా సరఫరా ● ఏప్రిల్ 1నుంచి పంపిణీకి ఏర్పాట్లు నేలకొండపల్లి: రేషన్షాప్ల ద్వారా వచ్చేనెల 1వ తేదీ నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకాన్ని సీఎం రేవంత్రెడ్డి హుజూర్నగర్ నియోజకవర్గంలో ఆదివారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇక జిల్లాలో కూడా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈమేరకు పౌరసరఫరాల శాఖ గోదాంల నుంచి మండల స్థాయి స్టాక్ పాయింట్లకు బియ్యం చేరవేస్తున్నారు. ఆపై రేషన్షాపులకు పంపిస్తున్నారు. అయితే, గడువు తక్కువగా ఉండడంతో ప్రతీ షాప్నకు కనీసం 50క్వింటాళ్లకు తగ్గకుండా సన్న బియ్యం చేరవేస్తుండగా, పెద్ద గ్రామాల్లోనైతే కావాల్సిన బియ్యంలో 80–90 శాతం మేర సన్నబియ్యమే పంపిస్తున్నారు. సరఫరా చేసేది ఎలా? ఇన్నాళ్లు లావు రకాల బియ్యం సరఫరా చేస్తుండడంతో రేషన్ లబ్ధిదారులు చాలా మంది తీసుకోవడం లేదు. కానీ సన్నబియ్యం పంపిణీ మొదలైతే అందరూ ముందుకొచ్చే అవకాశముంది. అయితే, ప్రభుత్వం ఏప్రిల్ నెలకు కావాల్సిన మొత్తం బియ్యం సన్నరకాలు పంపడం లేదు. దీంతో లబ్ధిదారులకు తామేం సమాధానం చెప్పాలని డీలర్లు ప్రశ్నిస్తున్నారు. ఒకటి, రెండురోజుల్లోనే సన్నం బియ్యం స్టాక్ అయిపోయి, ఆతర్వాత దొడ్డు బియ్యం ఇస్తే కార్డుదారులు తిరగబడే ప్రమాదముందని వాపోతున్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తొలి విడత ఇచ్చిన సన్నబియ్యం ఖాళీ కాకముందే మరోదఫా పంపిణీ చేయాలని అధికారులను కోరుతున్నారు. -
ఇక సాఫీగా వేతనాల చెల్లింపు
● పెద్దాస్పత్రిలో కార్మికుల సమస్యకు పరిష్కారం ● కాంట్రాక్టర్కు పెండింగ్ బిల్లులు చెల్లించాలని హైకోర్టు ఆదేశం ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కార్మికుల వేతనాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. పెండింగ్ బిల్లులు చెల్లించడమే కాక బెడ్ల సంఖ్య పెంచాలని కోరుతూ కాంట్రాక్టర్ హైకోర్టులో కేసు దాఖలు చేయగా, విచారణ అనంతరం ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. పడకలు తగ్గడంతో... పెద్దాస్పత్రిలోని వివిధ విభాగాల్లో 259 మంది కార్మికులు పనిచేస్తుండగా.. నిర్వహణ బాధ్యతలను చైతన్యజ్యోతి వెల్ఫేర్ సొసైటీకి అప్పగించారు. ప్రభుత్వం నుంచి సంస్థకు, వారి ద్వారా సెక్యూరిటీ, శానిటేషన్, పేషంట్ కేర్ కార్మికులకు వేతనాలు చెల్లిస్తారు. అయితే నెలనెలా సక్రమంగా జీతాలు రాక కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. వీరికి నెలకు రూ.14,500 మంజూరు చేస్తుండగా కటింగ్ పోను రూ.13వేలు ఖాతాలో జమ చేస్తారు. ఆస్పత్రి వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్నప్పుడు 575 పడకలకు అనుమతి ఉండేది. ఆ సామర్ధ్యం మేర రూ.50,88,239 చెల్లించేవారు. అయితే 2023 నవంబర్ నుండి పెద్దాస్పత్రి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్(డీఎంఈ) పరిధిలోకి వెళ్లాక 430 పడకలే పరిగణనలోకి తీసుకుంటూ చెల్లిస్తున్నారు. దీంతో కాంట్రాక్టర్కు రూ.35.40లక్షలే వస్తుండగా, గతంతో పోలిస్తే రూ.15,48,239 తగ్గడంతో కార్మికులకు వేతనాల చెల్లింపులో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. నెలల పాటు ఎదురుచూడడం, ఆందోళన చేసినప్పుడు ఒక నెల వేతనం ఇవ్వడం పరిపాటిగా మారింది. దీంతో కాంట్రాక్టర్ హైకోర్టును ఆశ్రయించగా, తీర్పు ద్వారా సమస్యకు పరిష్కారం లభించింది. ఇకపై ప్రతీనెల కాంట్రాక్టర్కు పూర్తిస్థాయిలో చెల్లించడమేకాక 2023 నవంబర్ నుండి ఉన్న బకాయిలు కూడా విడుదల చేయనున్నారు. కోర్టు తీర్పు ఆధారంగా రూ.2,63,20,063ను కాంట్రాక్టర్కు చెల్లించాలని ఉత్తర్వులు సైతం విడుదలయ్యాయి. -
విశ్వావసు... విశ్వశ్రేయస్సు
ఎన్ని ఉగాదలు పయనించాయో.. ఎన్ని చైత్ర ఉషస్సులు మారాయో కోయిల స్వరమై.. జీవనసరాగమై విశ్వావసునామమై చైత్రుడితెచ్చే షడ్రసోపేతమైన రసానందంకోసం ఎదురుచూస్తుంది మానవాళి క్షతగాత్రమైన పుడమిని ఓదార్చడానికి.. ఆత్మవిశ్వాసంతో.. రేపటి బాల భానుడు.. ఉషాకిరణాలతో.. విశ్వావసుడై.. నిండైన వసంతం తోడుగా.. విశ్వశ్రేయసుగా వస్తున్నాడు.. ఉగాది సాక్షిగా –ఎం.వీ.రమణ, తెలుగు అధ్యాపకులు, ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాల, ఖమ్మం -
భద్రాద్రి అభివృద్ధికి రూ.34 కోట్లు
● కొత్తగూడెంలో త్వరలోనే ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ● ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ముఖ్యమంత్రికి ప్రేమ ● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుసాక్షిప్రతినిధి, ఖమ్మం: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఉమ్మడి జిల్లాపై అపారమైన ప్రేమ ఉందని.. అందుకే అడిగిందే తడవుగా ఇక్కడి ప్రజల ప్రయోజనాల కోసం నిధులు మంజూరు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. కలెక్టరేట్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బడ్జెట్తో పాటు ఈ బడ్జెట్లో ఉమ్మడి జిల్లా వరప్రదాయిని అయిన సీతారామ ప్రాజెక్టుకు నిధులు కేటాయించడంతో పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కొత్త ఆయకట్టుతోపాటు ఎన్నెస్పీ ఆయకట్టు స్థిరీకరణ కూడా ఈ ప్రాజెక్టుతో సాధ్యమైందని, వచ్చే జూన్ నాటికి సత్తుపల్లి ప్రాంతంలో మరో 80వేల ఎకరాలకు గోదావరి జలాలు అందుతాయని చెప్పారు. అలాగే, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి కోసం కేటాయించిన రూ.34కోట్లతో భూసేకరణ, ఇతర పనులు చేపట్టనున్నామన్నారు. అంతేకాక దేశంలో ఎక్కడా లేని విధంగా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కూడా సీఎం చొరవతో కొత్తగూడెంలో ఏర్పాటుకానుందని, కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ కూడా ఏర్పాటైతే భద్రాద్రి ప్రాంతమంతా అభివృద్ధి జరుగుతుందని తుమ్మల అన్నారు. పాండురంగాపురం, విష్ణుపురం రైల్వేలైన్ ద్వారా సారపాక వరకు 16 కి.మీ. కనెక్టివిటీ ఇస్తే భద్రాచలానికి భక్తుల ప్రయాణం సులువు అవుతుందని వెల్లడించారు. ధంసలాపురం వద్ద ఫ్లై ఓవర్ పూర్తిచేసి ఖమ్మం–రాజమండ్రి జాతీయ రహదారిపై రవాణాను సుగమం చేసేందుకు వచ్చే ఆగస్ట్ 15 నాటికి పనులు పూర్తయ్యేలా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కాగా, ఆయిల్పామ్ గెలల టన్ను ధర రూ.21 వేలకు చేరాలని అధికారులకు సూచించామని, ఉగాది సందర్భంగా వేంసూరు మండలం కల్లూరుగూడెంలో పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే, నేలకొండపల్లి పాత రోడ్డుకు సంబంధించి జాతీయ రహదారుల అథారిటీ నుంచి రూ.20 కోట్లు మంజూరు చేయించామని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ నర్సింహారావు పాల్గొన్నారు. -
చదువుతోనే ఉన్నత స్థానాలకు ఎదగొచ్చు...
కూసుమంచి: ప్రస్తుత సమాజంలో చదువుకు ఎంతో ప్రాధాన్యత ఉందని.. వ్యక్తులు ఉన్నత స్థాయికి ఎదగాలన్నా, సమాజానికి ఉపయోగపడాలన్నా చదువే కీలకంగా నిలుస్తుందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. మండలంలోని పాలేరులో జవహర్ నవోదయ విద్యాలయ వార్షికోత్సవం శుక్రవారం నిర్వహించగా విద్యాలయ చైర్మన్ అయిన కలెక్టర్ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. మానవాళి జీవన ప్రమాణాలు పెరగాలన్నా, అస్థిత్వాన్ని కోల్పోకుండా ఉండాలన్నా చదువు తప్పని సరన్నారు. ప్రస్తుత తరానికి ప్రభుత్వాలు అనేక అవకాశాలు కల్పిస్తున్నందున శ్రద్ధగా చదువుకుని విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. అలాగే, ఏ స్థాయికి చేరినా తల్లిదండ్రులు, గురువులను మరిచిపోవద్దని తెలిపారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. విద్యాలయ ప్రిన్సిపాల్ కె.శ్రీనివాసులు, వైస్ ప్రిన్సిపాల్ వెంకటరమణ, పేరెంట్, టీచర్స్ కమిటీ సభ్యులు రవీందర్రెడ్డి, లక్ష్మణ్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నవ సమాజ నిర్మాతలు మీరే.. ఖమ్మం సహకారనగర్: అధ్యాపకులు కేవలం విద్యార్థులకు పాఠాలు బోధించడమే కాక వారి వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచి నవ సమాజ నిర్మాతలుగా నిలవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. జిల్లాలో ఇటీవల జూనియర్ అధ్యాపకులుగా విధుల్లో చేరిన 58మంది కలెక్టర్ను శుక్రవారం కలిశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమమైన అధ్యాపకులుగా రాణిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దాలని తెలిపారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె.రవిబాబు, సీపీఎస్ ఈయూ జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ తదితరులు పాల్గొన్నారు. ‘నవోదయ’ వార్షికోత్సవంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ -
ట్రాక్టర్ బోల్తా, పలువురికి గాయాలు
ఏన్కూరు: మండలంలోని నెమలిపురి సమీపాన శుక్రవారం ట్రాక్టర్ బోల్తా పడగా పలువురు కూలీలకు గాయాలయ్యాయి. మిర్చి తోటల్లో పనికి మూలపోచారం నుండి నెమలిపురి వైపు మహిళా కూలీలు ట్రాక్టర్లో బయలుదేరారు. ఈక్రమాన వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో 20మంది కూలీలు గాయపడగా, వారిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. వైన్స్ షాపులో చోరీ కొణిజర్ల: కొణిజర్లలోని శ్రీ లక్ష్మీనరసింహా వైన్ షాపులో గుర్తు తెలియని వ్యక్తులు గురువారం అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం షాప్ తెరవడానికి వచ్చిన సిబ్బంది రేకులు తొలగించి ఉండడం, సమీపాన చేన్లలో మద్యం బాటిళ్లు కనిపించడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈ మేరకు వైన్ షాప్ యజమాని చేరుకుని ఎంత మేర స్టాక్ అయిందో సాయంత్రం వరకు లెక్కలు వేస్తున్నారు. అయితే, యజమాని నుంచి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ జి.సూరజ్ తెలిపారు. -
వేమన శతకం.. ద్వాదశ పృచ్ఛక అవధానం
సత్తుపల్లిటౌన్: చదివేది ఏడో తరగతి.. తెలుగు మాతృభాష కూడా కాదు.. కానీ ఆ విద్యార్థిని వేమన శతకంపై ద్వాదశ పృచ్ఛక అవధానంలో సత్తా చాటింది. సత్తుపల్లిలోని జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో రానున్న ఉగాదిని పురస్కరించుకుని గార్లపాటి, బొల్లేపల్లి ట్రస్ట్ ఆధ్వర్యాన శుక్రవారం నిర్వహించిన ఈ అవధానంలో డీఈఓ సోమశేఖరశర్మ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వశాంతి పాఠశాల ఏడో తరగతి విద్యార్థిని మహ్మద్ అఫ్రియా పాల్గొని వేమన శతకంపై 12 మంది పృచ్ఛకులతో నిర్వహించిన ద్వాదశ ఫృచ్చక అవధానంలో ప్రతిభ కనబరిచింది. డీఈఓతో పాటు కళాశాలకు చెందిన విద్యార్థులు, అతిథులు పృచ్ఛకులుగా శతకంపై వివిధ అంశాల్లో ప్రశ్నలు సంధించగా.. తడుముకోకుండా సమాధానాలు ఇచ్చింది. ఈ సందర్భంగా అఫ్రియాను సత్కరించారు. అలాగే, ప్రభుత్వ బాలుర పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు వంశీ, పోతురాజు వేమన శతకంపై అవధానం చేస్తున్న విషయాన్ని డీఈఓకు వెల్లడించగా అభినందించారు. కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ వై.మహేష్, బొల్లేపల్లి, గార్లపాటి ట్రస్ట్ నిర్వాహకులు బి.మధుసూదన్ రాజు, జి.రామకృష్ణ, ఎంఈఓలు నక్కా రాజేశ్వరరావు, సత్యనారాయణ, అధ్యాపకులు పూర్ణచంద్రరావు, మాధవి, బాలిక తల్లిదండ్రులు ఉస్మాన్, రాబియా, హెచ్ఎం యాకోబు, శేషగిరిరావు, మాలతి, ఆర్.శ్రీను పాల్గొన్నారు. ప్రతిభ చాటిన విద్యార్థిని మహ్మద్ అఫ్రియా -
బిహార్ కూలీ ఆత్మహత్య
పెనుబల్లి: రైస్ మిల్లులో పనిచేస్తున్న కూలీ ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని అడవిమల్లేలలో శ్రీసాయి లక్ష్మీశ్రీనివాస్ బాయిల్డ్ రైస్ మిల్లులో బిహార్కు చెందిన కూలీలు పనిచేస్తుండగా రామ్కుమార్(21) గురువారంనుంచి కానరాకపోవడంతో కోదాడలోని ఆయన అన్న వద్దకు వెళ్లి ఉంటాడని సహచరులు భావించారు. ఈమేరకు శుక్రవారం ఉదయం ఆయన సోదరుడికి ఫోన్ చేయగా తన వద్దకు రాలేదని చెప్పడంతో మిల్లు చుట్టుపక్కల వెతుకుతుండగా మామిడి తోటలో చెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడు. ఈమేరక వీఎం బంజర్ ఎస్ఐ కె.వెంకటేష్ చేరుకుని మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. -
రేషన్ బియ్యం చోరీ.. ఆపై అమ్మకం
కల్లూరురూరల్: గ్రామాల్లో రేషన్ బియ్యం సేకరించి ఎక్కువ ధరకు అమ్ముతుంటే వచ్చే డబ్బు సరిపోవడం లేదని, ఏకంగా బియ్యాన్ని చోరీ చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమేరకు కల్లూరులో శుక్రవారం ఏసీపీ ఏ.రఘు వివరాలు వెల్లడించారు. వైరా మండలం గోవిందపురానికి చెందిన ఓర్సు హన్మంతరావు, ఓర్సు కృష్ణ(దొర) కొన్నేళ్లుగా రేషన్ బియ్యాన్ని కొన్నాళ్లుగా అక్రమంగా కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. అయితే, ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించేందుకు బియ్యం చోరీ చేయాలని నిర్ణయించుకుని వైరా మండలం కలకొడిమకు చెందిన నల్ల బోతుల ఉదయ్, వెలిశాల చందు, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నెమలికి చెందిన అశోక్ లేలాండ్ డ్రైవర్లు గరిడేపల్లి జగదీష్, సాయితో జత కట్టారు. ఈమేరకు హన్మంతు, కృష్ణ చిన్నకోరుకొండిలోని రేషన్ షాపు చోరీకి అనువుగా ఉంటుందని గుర్తించారు. ఈసందర్భంగా ఉదయ్, చందు, జగదీష్లు దాచారం నుంచి కూలీలను రప్పించి 16న అర్ధరాత్రి షాప్ తాళాలు పగులగొట్టి 150 బస్తాల రేషన్ బియ్యం(90 క్వింటాళ్లు)ను రెండు వ్యాన్లలో తీసుకెళ్లారు. ఆపై కేజీ రూ.20 చొప్పున విక్రయించగా మిగిలిన 35 క్వింటాళ్ల బియ్యాన్ని కూరాకుల మురళి ఇంట్లో నిల్వ చేశారు. ఈ విషయమై అందిన సమాచారంతో శుక్రవారం నెమలిలో మురళి ఇంటి వద్ద ఆయనతో పాటు హన్మంతు, జగదీష్, ఉదయ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈసందర్భంగా రూ.30వేల నగదు, అశోక్ లేలాండ్ వాహనం, 110 ఖాళీ సంచులను స్వాధీనం చేసుకుని ఓర్సు దొర, చందు, బియ్యం కొనుగోలు చేసిన ఖాతారెడ్డి, నర్సింహారావు కోసం గాలిస్తున్నామని ఏసీపీ తెలిపారు. కాగా, కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తిలింగయ్య, ఎస్సై హరిత, సిబ్బందికి ఏసీపీ రివార్డులు అందజేశారు. 180 బస్తాల రేషన్ బియ్యం చోరీ కేసులో నిందితుల అరెస్ట్ -
ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం కోసమే సమ్మె
ఖమ్మంమయూరిసెంటర్: ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా సమ్మెకు సిద్ధమవుతున్నట్లు ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు వెల్లడించారు. సంస్థ పరిధిలోని కార్మికుల సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం ఆలోచన చేయకపోవడం, హామీల అమలులోనూ విఫలమైందని ఆరోపించారు. ఈమేరకు జేఏసీ ఖమ్మం రీజియన్ కమిటీ సమావేశం ఖమ్మంలోని గిరిప్రసాద్ భవన్లో శుక్రవారం నిర్వహించారు. అనంతరం జేఏసీ చైర్మన్ వెంకన్న మాట్లాడుతూ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు చెల్లిస్తామన్నా హామీ నెరవేరలేదన్నారు. అంతేకాక ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతూ సంస్థ ప్రైవేటీకరణకు యత్నిస్తున్నారని ఆరోపించారు. సీసీఎస్ బకాయిలు రూ.900 కోట్లు, పీఎఫ్ బకాయిలు రూ.1,250 కోట్లతో పాటు పెండింగ్ ఉన్న డీఏలను విడుదల చేయడమే కాక ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఏప్రిల్ 1న డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో కార్మికుల సమక్షంలోనే సమ్మె తేదీని ప్రకటిస్తామన్నారు. ఈసమావేశంలో జేఏసీ నాయకులు కే.ఎస్.పాల్, యాదయ్య, సుద్దాల సురేష్, పాటి అప్పారావు, నామ వీరభద్రం, పిల్లి రమేష్, జీ.ఎస్.రావు, యాదగిరి, జి.నారాయణ, ఎల్ఆర్కే.రావు, అరుణ, వై.నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ అభివృద్ధి పనులపై కార్యాచరణ
ఖమ్మంవ్యవసాయం: రానున్న వానాకాలం, యాసంగి పంటల సీజన్లలో విద్యుత్ వినియోగం అంచనా, నిర్వహించాల్సిన పనులపై టీజీ ఎన్పీడీసీఎల్, ట్రాన్స్కో ఉమ్మడి జిల్లా అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఖమ్మంలోని ఎన్పీడీసీఎల్ సర్కిల్ కార్యాలయంలో రెండు సంస్థల ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలస్థాయి అధికారుల సమన్వయ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా రానున్న పంట సీజన్లలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా నాణ్యమైన, మెరుగైన సరఫరా చేయడంపై చర్చించారు. 220/132 సబ్స్టేషన్లలో చేపట్టాల్సిన పనులు, అందుకు కావాల్సిన నిధులపై ప్రతిపాదనలు రూపొందించారు. వానాకాలం పంటల సీజన్ నాటికి నూతన విద్యుత్ లైన్ల ఏర్పాటు, ప్రస్తుతం జరుగుతున్న పనులను పూర్తి చేయడంపై దృష్టి సారించాలని నిర్ణయించారు. అలాగే, విద్యుత్ వినియోగం ఆధారంగా అవసరమైన చోట్ల నూతన సబ్స్టేషన్ల ఏర్పాటుపైనా చర్చించారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా ట్రాన్స్కో ఎస్ఈ బి.శ్రీనివాస్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఎన్పీడీసీఎల్ ఎస్ఈలు ఇనుగుర్తి శ్రీనివాసాచారి, జి.మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ను కలిసిన మిషన్ భగీరథ ఎస్ఈ
ఖమ్మంవన్టౌన్: మిషన్ భగీరథ ఉమ్మడి జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ)గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గడ్డం శేఖర్రెడ్డి శుక్రవారం ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రానున్న వేసవిలో నీటి ఎద్దడి ఎదురుకాకుండా తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. కార్యక్రమంలో ఈఈ పుష్పలత పాల్గొన్నారు. 3నుంచి తెలుగు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు కూసుమంచి: రానున్న శ్రీరామనవమి పండుగ సందర్భంగా కూసుమంచి మండలంలోని జీళ్లచెరువు లో ఏప్రిల్ 3నుంచి 5వ తేదీ వరకు పొంగులేటి యువసేన ఆధ్వర్యాన తెలుగు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల కరపత్రాలను కూసుమంచిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కార్యాలయ ఇన్చార్జి భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. ఈకార్యక్రమంలో రామాలయ చైర్మన్ ముద్రబోయిన నాగలక్ష్మి, మార్కెట్ డైరక్టర్ మెక్కా ఉపేందర్తో పాటు మాదాసు ఉసేందర్, చాట్ల పరశురాం, అయితగాని నాగేశ్వరరావు, రంగయ్య, రాంగోపాల్, లక్ష్మయ్య, రవి, శ్రీను, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. అధ్యాపకుడికి డాక్టరేట్ కొణిజర్ల: కొణిజర్ల మండలం విజయ ఇంజనీరింగ్ కళాశాల ఎంబీఏ విభాగం అధ్యాపకుడు పెంటేల ఫరీద్ మస్తాన్(బాబా)కు ద్రవిడియన్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ లభించింది. యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ గోపీ పర్యవేక్షణలో ఆయన ‘ఇంపాక్ట్ ఆఫ్ టెక్నాలజీ ఆన్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇన్ ది సెలక్టెడ్ బ్యాంక్స్ ఇన్ తెలంగాణ స్టేట్’ అంశంపై సమర్పించిన పరిశోధనా గ్రంథానికి గాను డాక్టరేట్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఫరీద్ బాబాను శుక్రవారం కళాశాల చైర్మన్ పారుపల్లి ఉషాకిరణ్కుమార్, వైస్ చైర్మన్ పారుపల్లి విజయలక్ష్మి, ప్రిన్సిపాల్ డాక్టర్ వి.చిన్నయ్య, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆయేషా తరుణమ్, అధ్యాపకులు అభినందించారు. సపోర్ట్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తులు ఖమ్మంవైద్యవిభాగం: జాతీయ ఆరోగ్య మిషన్ విభాగంలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన మూడు సపోర్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్ఓ కళావతిబాయి తెలిపారు. బీటెక్, ఎంసీఏ పూర్తిచేసి, నాలుగేళ్ల అనుభవం కలిగిన జోన్ –4లోని బీసీ–ఏ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. అలాగే, ఒక సైకియాట్రిస్ట్ పోస్టు కూడా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ పోస్టుకు మల్టీ జోన్–1 పరిధి వారై 18నుంచి 44 ఏళ్ల వయస్సు కలిగి సైకియాట్రీ ఎండీ, తత్సమానమైన డిగ్రీ పూర్తి చేసి రెండేళ్ల అనుభవం ఉండాలని పేర్కొన్నారు. ఏప్రిల్ 2నుంచి 4వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో పూర్తి చేసి, విద్యార్హతలు, ఇతర సర్టిఫికెట్ల జిరాక్స్లు జత చేసి తమ కార్యాలయంలో అందించాలని డీఎంహెచ్ఓ సూచించారు. నీలాద్రి ఆలయ ఈఓగా రజినీకుమారి పెనుబల్లి: పెనుబల్లి మండలం నీలాద్రీశ్వర స్వామి ఆలయ ఈఓగా రజినీకుమారి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఈఓగా ఉన్న పాకాల వెంకటరమణను అన్నపురెడ్డిపల్లి ఆలయానికి బదిలీ చేశారు. దీంతో పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయ ఈఓగా ఉన్న రజినీకుమారికి నీలాద్రి ఆలయ పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఆమె విధుల్లో చేరారు. కాగా, గతంలోనూ ఆమె పదేళ్ల పాటు నీలాద్రి ఆలయ ఈఓగా బాధ్యతలు నిర్వర్తించారు. -
సాగర్ కాల్వలో మునిగి బాలుడు మృతి
కొణిజర్ల: సరదాగా ఈతకు వెళ్లిన బాలుడు సాగర్ కెనాల్లో మునిగి కన్నుమూశాడు. కొణిజర్ల ఎస్ఐ గుగులోత్ సూరజ్ తెలిపిన వివరాలు... మండలంలోని తనికెళ్లకు చెందిన బత్తుల కనకారావు కుమారుడు సాయి(15) స్థాఽనిక జెడ్పీహెచ్ఎస్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఒక పూట బడికి వెళ్లొచ్చిన ఆయన మరో ఇద్దరు స్నేహితులతో కలిసి గ్రామ సమీపాన బోనకల్ బ్రాంచి కెనాల్లో ఈతకు వెళ్లాడు. అయితే, కాల్వలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో మునిగిపోగా, ఆయన స్నేహితులు వచ్చి కాలనీ వాసులకు తెలిపారు. దీంతో పోలీసులు, గజ ఈతగాళ్లు కాల్వలో గాలించగా సాయి మృతదేహం లభ్యమైంది. అయితే, సాయి మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆయన తండ్రి ఇచ్చిన ఫిర్యాదు చేయగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కాగా, ఒక్కగానొక్క కుమారుడి మృతితో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.ఈతకు వెళ్లిన సమయంలో ప్రమాదం -
హామీలు అమలుచేయకపోతే మంత్రుల ఇళ్లు ముట్టడి
ఖమ్మం మామిళ్లగూడెం: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేయని పక్షంలో మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి హెచ్చరించారు. రైతాంగం సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట బీజేపీ ఆధ్వర్యాన నిర్వహించిన ‘రైతు సత్యాగ్రహ దీక్ష‘లో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు చెప్పినట్లుగా రుణమాఫీ సంపూర్ణంగా అమలుచేయకపోవడంతో రైతులు నష్టపోయారని తెలిపారు. అంతేకాక పెట్టుబడి సాయం, ధాన్యం కొనుగోళ్లలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఇక ధరణి పోర్టల్ సమస్యలపైనా స్పందించడం లేదన్నారు. ఈ దీక్షలో బీజేపీ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు, బైరెడ్డి ప్రభాకర్రెడ్డితో పాటు నాయకులు నున్నా రవికుమార్, శ్యామ్ రాథోడ్, చావా కిరణ్, చిలుకూరి రమేష్, ఏనుగుల వెంకటరెడ్డి, సీతారాంనాయక్, చిందల శ్రీనివాసరావు, జంపన్న సీతారామరాజు, ఓలా రాజు, బిక్షపతి, బాలు నాయక్, శ్రీనివాసరెడ్డి, పసుమర్తి సతీష్, భూక్య వెంకన్న, ఎల్లారావు గౌడ్, నరికుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి -
రైల్వేలైన్ల అలైన్మెంట్ మార్చండి
ఖమ్మంవన్టౌన్: డోర్నకల్–మిర్యాలగూడ, డోర్నకల్–గద్వాల రైల్వేలైన్ల అలైన్మెంట్ మార్చాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రఘురాంరెడ్డి కోరారు. ఈసందర్భంగా శుక్రవారం ఆయన ఢిల్లీలో రైల్వే బోర్డు చైర్మన్ సతీష్కుమార్ను కలిశారు. ప్రతిపాదిత అలైన్మెంట్ జరిగే నష్టం, చేయాల్సిన మార్పులను వివరించారు. ఈ అంశాలపై బోర్డు చైర్మన్ సానుకూలంగా స్పందించి, సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారని ఎంపీ ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘యువ వికాసం’కు 5లోగా దరఖాస్తులు ఖమ్మం సహకారనగర్: రాజీవ్ యువవికాసం పథకానికి షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువత వచ్చేనెల 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. షెడ్యూల్డ్ కులాల్లోని నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలతో ఆర్థిక పురోగతి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని వెల్లడించారు. ఈమేరకు ఆసక్తి ఉన్న ఎస్సీ నిరుద్యోగ యువత https://tgobmmsnew.cgg.gov.in వెబ్సైట్ ద్వారా 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకుని దరఖాస్తు ప్రతికి అవసరమైన పత్రాలు జతపరిచి గ్రామీణ ప్రాంతాల వారైతే మండల ప్రజాపాలన సేవా కేంద్రాల్లో, పట్టణ ప్రాంతాల అభ్యర్థులు మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. మైనార్టీ అభ్యర్థులు... ఖమ్మంమయూరిసెంటర్: రాజీవ్ యువ వికాసం పథకం కోసం ముస్లిం, క్రైస్తవ, సిక్, బౌద్ధులు, జైనులు, పార్సీలకు చెందిన మైనారిటీ నిరుద్యోగ యువత వచ్చేనెల 5లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి డాక్టర్ బి.పురంధర్ ఒక ప్రకటనలో సూచించారు. పూర్తి వివరాల కోసం 97040 03002లో సంప్రదించాలని తెలిపారు. 31లోగా జీఎస్టీ చెల్లిస్తే జరిమానా, వడ్డీ మాఫీ 2017 నుంచి 2020 వరకు బకాయిలకు వర్తింపు ఖమ్మంగాంధీచౌక్: జీఎస్టీ(వస్తు సేవా పన్ను) ప్రారంభమైన తొలి మూడేళ్లకు సంబంధించి విధించిన జరిమానా, వడ్డీ రాయితీకి మినహాయింపు ఇస్తూ సంస్థ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీఎస్టీ ఏర్పాటైన తొలి మూడేళ్లలో సాంకేతిక కారణాలతో పన్నుల్లో వ్యత్యాసాలు చోటు చేసుకున్నాయి. దీన్ని సవరించాలని చెల్లింపుదారులు విజ్ఞప్తి చేయగా జరిమానా, వడ్డీ మినహాయింపునిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు 2017 నుంచి 2020 వరకు నిర్దేశిత పన్నులను ఈనెల 31లోగా చెల్లిస్తే జరిమానా, వడ్డీ మాఫీ చేస్తామని, అప్పీలేట్ అథారిటి లేదా కోర్టును ఆశ్రయించిన వారికి సైతం ఈ ఉత్తర్వులు వర్తిసాయంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అవకాశాన్ని చెల్లింపుదారులు సద్వినియోగం చేసుకోవాలని సెంట్రల్ జీఎస్టీ, కస్టమ్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సందీప్ ప్రకాష్, స్టేట్ జీఎస్టీ కమిషనర్ హరిత ఓ ప్రకటనలో సూచించారు. మాడ వీధుల విస్తరణకు లైన్ క్లియర్నిర్వాసితులకు చెక్కుల పంపిణీ భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి మార్గం సుగమమైంది. విస్తరణ పనులకు అధికారులు రెండెకరాల స్థలం సేకరించారు. ఈమేరకు సీఎం రేవంత్రెడ్డి తొలి విడతగా రూ. 60 కోట్లను ప్రకటించి, రూ. 35 కోట్లు విడుదల చేశారు. దీంతో భూ, ఇళ్ల నిర్వాసితులకు శుక్రవారం నష్టపరిహారం అందజేశారు. ఆర్డీఓ దామోదర్రావు తన కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేశారు. 17 కుటుంబాలకు రూ. 10.82 కోట్లను అందించారు. మిగతావారికి శనివారం చెక్కులు ఇస్తామని, మొత్తంగా 40 కుటుంబాలకు రూ.34.45 కోట్లు అందజేయాల్సి ఉందని వెల్లడించారు. కాగా ఏప్రిల్ 6న ఆలయ అభివృద్ధి, మాడ వీధుల విస్తరణకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. -
ఇఫ్తార్ విందులో మంత్రి తుమ్మల
ఖమ్మంవన్టౌన్: రంజాన్ మాసం ందర్భంగా ప్రభుత్వం తరఫున ఖమ్మంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజలు అభివృద్ధి చెందేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రంజాన్ పండుగను ముస్లింలు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముజమ్మిల్ఖాన్తో పాటు నాయకులు మహమ్మద్ ముస్తఫా, ఆశ్రిఫ్, చోటేబాబా, రషీద్, సాధు రమేష్రెడ్డి, ముజాహిద్ హుస్సేన్, ముక్తార్పాషా తదితరులు పాల్గొన్నారు. -
ముహూర్తం ఖరారు
● రేపు కల్లూరుగూడెంలో పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన ● హాజరుకానున్న మంత్రి తుమ్మల ● ఉమ్మడి జిల్లాలో మూడో ఫ్యాక్టరీతో రైతులకు మేలు వేంసూరు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడో పామాయిల్ ఫ్యాక్టరీకి ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. వేంసూరు మండలం కల్లూరుగూడెంలో గత ప్రభుత్వ హయాంలో ఫ్యాక్టరీ కోసం 42ఎకరాల స్థలం సేకరించగా.. ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యాన మూడేళ్ల క్రితం ఫెన్సింగ్ కూడా ఏర్పాటుచేశారు. కానీ రకరకాల కారణాలతో ఫ్యాక్టరీ ఏర్పాటులో జాప్యం జరిగింది. ఆపై కాంగ్రెస్ అధికారంలోకి రావడం, వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల బాధ్యతలు స్వీకరించడంతో ప్రత్యేక దృష్టి సారించారు. ఈనేపథ్యాన ఉగాది సందర్భంగా ఆదివారం ఫ్యాక్టరీ నిర్మాణానికి ఆయనతో పాటు సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి చేతుల మీదుగా శంకుస్థాపనకు నిర్ణయించారు. ఈమేరకు శుక్రవారం సాయంత్రం ముహూర్తాన్ని నిర్ణయించారు. రూ.70కోట్ల వ్యయంతో... ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం రెండు పామాయిల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అశ్వారావుపేటలోని ఫ్యాక్టరీ 30 టన్నులు, అప్పారావుపేటలో 90 టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో కొనసాగుతున్నాయి. అయితే, ఉమ్మడి జిల్లాలో ఏటేటా ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెరుగుతుండడం.. సత్తుపల్లి నియోజకవర్గంలో ఇది ఎక్కువగా ఉండడంతో ఈ నియోజకవర్గంలో ఇంకో ఫ్యాక్టరీ ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందుకోసం వేంసూరు మండలం కల్లూరుగూడెంలో మూడేళ్ల క్రితం 42 ఎకరాల భూమి సేకరించగా.. అక్కడ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈమేరకు రూ.70 కోట్లు వెచ్చించనుండగా, ఇందులో రూ.52కోట్లు యంత్రాలకు, రూ.18 కోట్లు నిర్మాణాలకు కేటాయిస్తారు. ఈ ఫ్యాక్టరీలో ఆధునిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాలు ఏర్పాటుచేస్తారని.. తద్వారా గంటకు 15 టన్నుల గెలలను క్రషింగ్ చేయొచ్చని చెబుతున్నారు. వేగంగా రోడ్డు నిర్మాణ పనులు కల్లురుగూడెం ప్రధాన రహదారి నుంచి ఫ్యాక్టరీ ప్రతిపాదిత స్థలం వరకు వరకు 60 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మిస్తున్నారు. ఇందుకోసం ఐదుగురు రైతుల నుంచి 6.10 ఎకరాల భూమిని సేకరించిరూ.33లక్షల చొప్పున పరిహారం చెల్లించారు. పెరిగిన ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం వేంసూరు మండలంలో గతంలో దాదాపు 25వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉండేవి. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, ఇతర కారణాలతో రైతులు మామిడి సాగుపై ఆసక్తి కోల్పోతున్నారు. ఇదే సమయాన ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించగా.. ప్రస్తుతం మండలంలో 6,550 ఎకరాల్లో 1,619 మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. ఇక జిల్లాలో ఈ పంట సాగు వ్యాప్తంగా 35వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగువుతోంది. జిల్లాలో వెయ్యికి పైగా ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతున్న మండలాలు మండలం సాగు విస్తీర్ణం (ఎకరాల్లో) సత్తుపల్లి 10,087.21 వేంసూరు 6,550 పెనుబల్లి 3,178.96 కొణిజర్ల 2,246.35 ఏన్కురు 1,995.13 తిరుమలాయపాలెం 1,850.68 ఎర్రుపాలెం 1,550.23 కల్లూరు 1,351.42 ఖమ్మం రూరల్ 1,059.02 మాకొద్దు ఈ పామాయిల్ ఫ్యాక్టరీ కల్లూరుగూడెంలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మించవద్దని పలువురు స్థానికులు శుక్రవారం సమావేశమై చేశారు. సామూహిక పట్టా భూమి 42 ఎకరాల్లో ఫ్యాక్టరీ నిర్మాణం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పంచాయితీ కార్యదర్శకి వినతిపత్రం అందించారు. ఇప్పటికే సివిల్ సప్లయీస్ గోదాంకు ఏడెకరాల భూమి ఇస్తే పురుగులతో ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. ఇప్పుడు సామూహిక పట్టా స్థలంలో ఫ్యాక్టరీ నిర్మిస్తే కాలుష్యం పెరగడమే కాక గ్రామ అవసరాలకు సెంటు భూమి కూడా ఉండదని తెలిపారు. ఈ విషయమై 2022లో హైకోర్టును ఆశ్రయించగా విచారణలో ఉందని, మానవ హక్కుల సంఘాన్ని సైతం ఆశ్రయించామని వెల్లడించారు. అపోహలు నమ్మొద్దు ఫ్యాక్టరీ నిర్మాణంతో కల్లూరుగూడెంలో కాలుష్యంగా పెరుగుతుందనే అపోహలను గ్రామస్తులు నమ్మవద్దని కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ ఓ ప్రకటనలో సూచించారు. మలేషియా, థాయిలాంగ్ ఇండోనేషియా తదితర దేశాల్లో అధ్యయనం చేశాక కాలుష్య రహితమైన అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే అదనపు నీటిని సైతం ఫిల్టర్ చేశాకే బయటకు వదులుతారని పేర్కొన్నారు. కాగా, ఫ్యాక్టరీ నిర్మాణంతో గ్రామంలోని 250మందికి ఉపాధి లభిస్తుందని, మండల అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. -
ఆలంబనే అండగా అద్భుతం
● ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులకు పదిరోజుల శిక్షణ ● పెట్రోల్ వాహనాన్ని ఎలక్ట్రిక్గా మార్చడం, సర్వీసింగ్లో నైపుణ్యం ● ప్రైవేట్ సంస్థ సహకారంతో ప్రతిభఖమ్మం సహకారనగర్: ఆలోచనలు బాగుంటే ఆవిష్కరణలు మరింత అద్భుతంగా వస్తాయి. కాస్త సహకారం తోడైతే చాలు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులు సైతం సత్తా చాటుతారని మరోసారి నిరూపితమైంది. ఖమ్మం టేకులపల్లిలోని ప్రభుత్వ ఐటీఐలో కళాశాలలో హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డీస్ సంస్థ, సెంటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్(సీఎస్డీ) కలిపి ‘ఎలక్ట్రికల్ వెహికిల్ సర్వీస్ టెక్నీషియన్’ అంశంపై పది రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. నలభై మంది శిక్షణ పొందగా.. వారి ఆలోచనతో పెట్రోల్తో నడిచే ద్విచక్ర వాహనాన్ని ఎలక్ట్రిక్ వాహనంగా మార్చడం విశేషం. శిక్షణ ఇలా డాక్టర్ రెడ్డీస్ సంస్థ సెంటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్(సీఎస్డీ) సంస్థ నేతృత్వాన ఐటీఐ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు అనుమతితో ఈ శిక్షణ మొదలైంది. ఈమేరకు శిక్షణకు కావాల్సిన వాహనం, టూల్స్, పరికరాలను సమకూర్చి తరగతి గదులను కేటాయించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 10వ తరగతి చదవడమే కాక ఐటీఐ ఉత్తీర్ణులైన 40మంది నిరుపేదలను గుర్తించారు. వీరికి మధ్యాహ్న భోజనం, వసతి సదుపాయంతో శిక్షణ ఇవ్వగా... పెట్రోల్తో నడిచే స్కూటీని ఎలక్ట్రికల్ స్కూటీగా మార్చడం విశేషం. టెస్ట్ డ్రైవ్లోనూ విజయవంతమైందని వెల్లడించారు. ఇక శిక్షణ అనంతరం చివరి రోజు అభ్యర్థులకు పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్లు అందజేశారు. తద్వారా భవిష్యత్లో ఎలక్ట్రిక్ వాహనాలు పెరగనున్నందున టెక్నీషి యన్లుగా వీరికి ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. -
మీ ‘ప్రస్థానం’ వివరించండి...
● రిటైర్డ్ అయిన, కానున్న ఉద్యోగులతో కలెక్టర్ ముఖాముఖి ● ప్రస్తుత ఉద్యోగులకు సూచనలు ఇచ్చేలా ప్రత్యేక కార్యక్రమంఖమ్మం సహకారనగర్: నిత్యం అధికారులు, సిబ్బందితో పాటు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలతో ఖమ్మం కలెక్టరేట్ సందడిగా ఉంటుంది. కానీ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం వివిధ శాఖల ఉద్యోగులంతా చేరారు. ప్రతీనెలా మాదిరిగానే ఈనెల 31న ఉద్యోగ విరమణ చేయనున్న ఉద్యోగులు, వారి కుటుంబాలతో సహా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సన్మానిస్తారనే సమాచారం ఇవ్వగా వారంతా వచ్చారు. కానీ ఎప్పటిలా కాకుండా ఈసారి వినూత్నంగా ‘ప్రస్థానం’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించిన కలెక్టర్.. రిటైర్డ్ ఉద్యోగులతో ముఖాముఖిగా మాట్లాడారు. వారి ఉద్యోగ ప్రస్థానం, ఎక్కడెక్కడ పనిచేశారు.. విధినిర్వహణలో ఎదురైన అంశాలను ఆరాతీస్తూ ప్రస్తుత ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఈమేరకు సమావేశ మందిరంలో ఉద్యోగిని కూర్చోబెట్టి ఎదురుగా కలెక్టర్ కూర్చుని ఇంటర్వ్యూ మాదిరి కొనసాగించారు. తొలుత గత నెలలో రిటైర్ అయి కలెక్టరేట్లో ఔట్సోర్సింగ్పై విధులు నిర్వర్తిస్తున్న లక్ష్మ ణ్రావుతో ఆయన మాట్లాడారు. ఉద్యోగంలో చేరిన సమయాన పరిస్థితులు, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఉమ్మడి జిల్లాగా భద్రాచలం వరదల సమయాన ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఆరా తీస్తూ వారి అనుభవాలు, నాడు – నేడు కుటుంబ పరిస్థితులను తెలుసుకున్నారు. రిటైర్కానున్నది వీరే.. ఈనెల 31న జిల్లాలోని వివిధ శాఖల ఉద్యోగులు ఆరుగురు రిటైర్ కానున్నారు. ఇందులో ఎం.మల్లికార్జునరావు(ఫార్మసిస్ట్, కొణిజర్ల), డి.బాలాజీ (సర్వే ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ ఇన్స్పెక్టర్), ఎం. బాలహేమలత(ఆర్అండ్బీ ఈఈ), పి.రామకృష్ణ(తిరుమలాయపాలెం తహసీల్దార్), ఎన్.సత్యవతి (డీఆర్డీఓ ఈఓ), సీహెచ్.రాధ(ఖమ్మం ఎస్సీ బాలికల హాస్టల్ కుక్) ఉన్నారు. వీరిని కుటుంబీకులతో సహా కలెక్టర్ సన్మానించారు. అలాగే, ఉద్యోగం రాక ముందు ఏం చేశారు, ఉద్యోగం ఎలా వచ్చింది.. ఎక్కడెక్క పనిచేశారు.. ఆ సమయంలో ఘనతలను తెలుసుకున్న ఆయన ప్రస్తుత ఉద్యోగులకు అవసరమైన సూచనలు ఇవ్వాలని సూచించారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీజ, డీఆర్వో ఏ.పద్మశ్రీ, కలెక్టరేట్ ఏఓ అరుణ తదితరులు పాల్గొన్నారు. -
జమలాపురం ఆలయం ముస్తాబు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 30వ తేదీ నుంచి శ్రీవారి వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు ఆలయ గోపురాలకు రంగులు వేయించగా, ప్రాంగణంలో రంగవల్లులు తీర్చిదిద్దుతున్నారు. అలాగే, ఆలయానికి లైట్లు అమర్చడంతో కొత్త వెలుగులు సంతరించుకున్నాయి. కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజైన ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీవారికి పంచామృతంతో అభిషేకం, పంచాంగ శ్రవణం, వేప పూవు ప్రసాదం నివేదన, సాయంత్రం 5–04 పుష్కరణి నుండి యాగశాలలోకి తీర్థపు బిందె తీసుకొస్తారు. ఇక 31న ధ్వజారోహణం, రుద్రహోమం, వచ్చే నెల 1న సౌభాగ్యలక్ష్మి వ్రతం, 2న అష్టోత్తర కలశాభిషేకం, 3న స్వామి, అమ్మవార్లను అలంకరించి, ఎదుర్కోలు ఉత్సవం, 4న వకుళా మాత స్టేడియంలో కల్యాణ మహోత్సవం, అదే రోజు సాయంత్రం తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఈమేరకు కల్యాణానికి ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారు. ఇక 5న పుష్పయాగం, 6న శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవం, 7న మహా పూర్ణాహుతి, శ్రీవారి చక్రస్నానంతో ఉత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాలకు ఏపీ, తెలంగాణ నుండి పెద్దసంఖ్యలో హాజరయ్యే భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఈఓ కె.జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి తెలిపారు.రేపటి నుండి వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు -
పేదరికమే అర్హత
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘జిల్లాలో పైలట్గా గుర్తించిన 21 గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని జనవరి 26న ప్రారంభించాం. ఆయా గ్రామాల్లో 850 మంది లబ్ధిదారుల ఇళ్లు గ్రౌండింగ్ చేస్తుండగా, మున్సిపాలిటీలు, మిగతా గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కారమయ్యేలా ప్రచారం చేస్తున్నాం. ధాన్యం కొనుగోళ్లు, రేషన్షాపుల ద్వారా సన్న బియ్యం సరఫరాకు సిద్ధమయ్యాం. వేసవిలో తాగునీటి సరఫరాలో అవాంతరాలు ఎదురుకాకుండా ప్రణాళికలు రూపొందించాం’ అని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వెల్లడించారు. జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై శుక్రవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు వివరాలు వెల్లడించారు. ఏ పథకం అమలు చేసినా అంతిమంగా పేదరికమే అర్హతగా లబ్ధిదారుల గుర్తింపు ఉంటుందని కలెక్టర్ పేర్కొనగా, ఇంటర్వ్యూలో వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే... ఇందిరమ్మ లబ్ధిదారులకు రుణాలు.. అవసరమైతే అద్దె కూడా..పాత లబ్ధిదారులకూ అవకాశం.. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గతంలో సగం నిర్మించి, బేస్మెంట్ అయినవి ఉన్నాయి. 800మంది వరకు ఉండగా.. వీరికి ఈసారి పథకం వర్తింపజేయవచ్చా, చేస్తే నగదు మంజూరవుతుందా లేదా అని పరిశీలించి అమలుకు కృషి చేస్తాం. ఏప్రిల్ మొదటి వారంలోగా ఇది పూర్తిచేసేలా 18 గ్రామాలకు ఇప్పటికే పరిశీలించాం. తాపీ మేసీ్త్రలకు శిక్షణ పూర్తికాగా, రూ.5లక్షల్లోనే నిర్మించుకునేలా లబ్ధిదారులను ప్రతీ సోమవారం మోడల్ హౌస్కు వద్దకు తీసుకెళ్లాలని పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి సూచించాం. ఎల్ఆర్ఎస్పై విస్తృత ప్రచారం ఎల్ఆర్ఎస్కు సంబంధించి 92వేల దరఖాస్తుల్లో మూడు నెలల కింద 10వేలు, ప్రస్తుతం 36వేల దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. కానీ 3వేల మందే ఫీజు చెల్లించారు. ప్రస్తుతం స్పందన పెరుగుతోంది. ఎల్ఆర్ఎస్ వల్ల లాభాలను స్థల యజమానులకు వివరిస్తున్నాం. జల్లెడ పట్టాకే బస్తాల్లోకి ధాన్యం ధాన్యం కొనుగోలు కేంద్రాలు జిల్లాలో 345 ఏర్పాటు చేస్తుండగా.. గతంలో ఐకేపీ ద్వారా 60 ఉంటే 147కు పెంచాం. ఈసారి 200కు చేరుస్తుండడంతో మహిళా సంఘాల సభ్యులకు కమీషన్ వస్తుంది. ఏ ప్రాంత రైతులు అక్కడే ధాన్యం అమ్ముకునేలా పరిశీలించాలని అధికారులకు సూచించాం. రైతు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఏఈఓ పరిశీలించాక సాగు విస్తీర్ణం, దిగుబడి అంశాలను రిజిస్టర్లో నమోదు చేస్తారు. జల్లెడ పట్టాకే బస్తాల్లో నింపాలని చెబుతుండడంతో మిల్లర్లు ఒక్క కిలో కూడా కోత విధించే అవకాశం ఉండదు. కొనుగోళ్ల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తే నగదు చెల్లింపుల్లోవేగం పెరుగుతుందని సూచించాం. సమృద్ధిగా తాగునీరు ఈ వేసవిలో తాగునీటి సరఫరాలలో ఇబ్బంది రాకుండా మూడు నెలల క్రితమే ప్రణాళిక సిద్ధం చేశాం. గత ఏడాది ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కొరత ఎదురైనా ఈసారి పాలేరులో సరిపోయేంత నీటి నిల్వలు కొనసాగిస్తున్నాం. ఐదు రోజుల క్రితం ఈ అంశంపై చర్చించాం. గతంలో ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల దగ్గర నాలుగైదు గ్రామాలకు ఇబ్బంది వచ్చింది. కట్టలేరు వద్ద మరమ్మతుల సమయంలో పైపులైన్లు దెబ్బతిన్నాయి. ఈసారి అలా జరగకుండా చూస్తున్నాం. ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉంటే ట్యాంకర్లు సమకూర్చుకోవాలని సిబ్బందికి సూచించాం. ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు రేషన్ దుకాణాల ద్వారా పంపిణీకి సన్న బియ్యం రెడీ వేసవిలో తాగునీటి సమస్య రాకుండా ప్రణాళిక కలెక్టర్ ముజమ్మిల్ఖాన్సరిపడా సన్నబియ్యం జిల్లాలో సన్న బియ్యం నిల్వలు సరిపడా ఉన్నాయి. అంతకుముందు లక్ష మెట్రిక్ టన్నులు ఉంటే.. పోయిన సీజన్లో 2లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించాం. ఇందులో 1.7 లక్షల మెట్రిక్ టన్నులు సన్న బియ్యమే. ఈసారి కూడా 80 శాతం సన్న బియ్యం వస్తాయి. దీంతో వచ్చేనెల 1నుంచి రేషన్ షాప్ల ద్వారా సన్న బియ్యం పంపిణీకి అవాంతరాలు ఎదురుకావు.అద్దె కట్టలేకపోతే మేం కడతాం.. తొలిదశగా 21 జీపీల్లో 850 మంది ఇందిరమ్మ లబ్ధిదారులు ఉండగా.. 500కు పైగా ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయి. బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తయితే రూ.లక్ష బిల్లు అందుతుంది. కానీ సరిపడా నగదు లేక 367 మంది ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించాం. వీరిలో 290 మందికి మహిళా సంఘాల ద్వారా రూ.లక్ష చొప్పున రుణం ఇప్పించాం. ఇక ఒంటరి మహిళలు ఉన్న జాగాలోనే ఇల్లు కట్టుకోవాల్సి ఉండడం.. అందుకోసం ప్రస్తుత నివాసాన్ని కూల్చి రావడంతో అదే గ్రామంలో అద్దెకు ఉండాలని చెబుతు న్నాం. అద్దె కట్టుకోలేని స్థితి ఉంటే మేమే కడతాం. ఇక ఇంటి నిర్మాణ పనుల పర్యవేక్షణను కార్యదర్శికి అప్పగిస్తాం. -
‘బడ్జెట్’లో తీపి కబుర్లు
● కొత్తగూడెంలో యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కు గ్రీన్ సిగ్నల్ ● కొత్తగూడెం కార్పొరేషన్, కల్లూరు మున్సిపాలిటీల బిల్లు ఆమోదం ● భద్రాద్రికి నిధుల విడుదల, ఇల్లెందుకు దక్కిన సీతారామ హామీ ● బడ్జెట్ సమావేశాల్లో ఉమ్మడి జిల్లాకు తాయిలాలు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాల విభజనకు ముందు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి పది జిల్లాల్లో మెదక్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలను మినహాయిస్తే ప్రతీ జిల్లాలో ఒక యూనివర్సిటీ స్థాపన జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీ మంజూరు చేయాలనే డిమాండ్ రాష్ట్ర విభజన ముందు నుంచి వినిపిస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో గిరిజన యూనివర్సిటీని ఈ జిల్లాలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినా అది ములుగు జిల్లాకు తరలిపోయింది. దీంతో కొత్తగూడెంలో ఉన్న ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని మైనింగ్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేయాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఈ డిమాండ్ నాయకులు, ప్రజల నోళ్లలో నానుతుండగానే జేఎన్టీయూ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగంలో పలు ఇంజనీరింగ్ కాలేజీలు తెలంగాణలో వచ్చాయి. దీంతో మైనింగ్ వర్సిటీ డిమాండ్ సైతం ప్రాభవం కోల్పోయింది. అయితే ఈ కాలేజీని ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేయాలంటూ సీఎం రేవంత్రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేయడంతో మరోసారి యూనివర్సిటీ అంశం తెర మీదకు వచ్చింది. సీఎం రేవంత్రెడ్డి హామీ కొత్తగూడెంలో ఉన్న ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, త్వరలోనే ఇందుకు సంబంధించిన పనులు జరుగుతాయంటూ శాసన మండలిలో బుధవారం సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీ రావడం ఖాయమైంది. సింగరేణి బొగ్గు గనులను దృష్టిలో ఉంచుకుని ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న మైనింగ్ విభాగాన్ని 1978లో కొత్తగూడెం తరలించారు. ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీకి అనుబంధంగా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్గా మార్చారు. గడిచిన నాలుగు దశాబ్దాలుగా వేలాది మంది ఇంజనీర్లు ఈ కాలేజీ నుంచి బయటకు వచ్చి దేశ మైనింగ్ అవసరాలకు ఉపయోగపడ్డారు. నిధుల కొరత, పర్యవేక్షణ లేమి, అధ్యాపకులు రాకపోవడం, ల్యాబుల ఆధునికీకరణ ఆగిపోవడంతో కొన్నేళ్లుగా ఈ కాలేజీ ప్రాభవాన్ని కోల్పోతోంది. ప్రస్తుతం యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించడంతో మరోసారి ఈ కాలేజీకి గత వైభవం రానుందనే నమ్మకం కలిగింది. సుమారు 400లకు పైగా ఎకరాల్లో కళాశాల క్యాంపస్ విస్తరించి ఉంది. ఈ కాలేజీ భూముల్లోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జిల్లా అధికారుల సమీకృత కార్యాలయాల భవనం(కలెక్టరేట్) నిర్మించారు. నిధుల విడుదల దక్షిణ అయోధ్యగా పేరున్న భద్రాచల పట్టణంలో మౌలిక సదుపాయల కొరత తీవ్రంగా ఉంది. తెలంగాణ వచ్చాక భద్రాచలం అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తామంటూ అప్పటి సర్కారు ప్రకటన చేసింది. అయితే ఇది ఒక పట్టాన అమలుకు నోచుకోలేదు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధాన ఆలయం చుట్టూ మాడ వీధుల విస్తరణ ఇతర అభివృద్ధి పనుల కోసం కేటాయించిన రూ.60 కోట్లలో రూ.34 కోట్లు విడుదల అయ్యాయి. ఇక పర్యాటక శాఖపై జరిగిన చర్చలో కిన్నెరసాని, కనకగిరి గుట్టలు, భద్రాచలం దగ్గర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు సీఎం రేవంత్రెడ్డిని కలిసేందుకు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య చేసిన ప్రయత్నాలు విఫలం కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై అసెంబ్లీలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో ప్రస్తావించారు. దీంతో గుమ్మడికి సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఇల్లెందు–సీతారామ అంశంపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేషన్ బిల్లు ఆమోదం కొత్తగూడెం – పాల్వంచ – సుజాతనగర్లను ఒక్కటిగా చేస్తూ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు గత జనవరి 4న రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తదుపరి కార్యాచరణలో భాగంగా ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో కొత్తగూడెం కార్పొరేషన్ బిల్లును మార్చి 18న అసెంబ్లీలో ప్రవేశపెట్టగా ఆ తర్వాత జరిగిన చర్చలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆమోదం పొందింది. మరోవైపు ఇదే బడ్జెట్లో నగరాభివృద్ధి పద్దు కింద కొత్తగూడెం కార్పొరేషన్కు ప్రత్యేక నిధులు కేటాయించారు. మరోవైపు కల్లూరుకు మున్సిపాలిటీ హోదా దక్కింది. -
రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ‘బాగం’ఎన్నిక
ఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడిగా మరలా బాగం హేమంతరావు ఎన్నికయ్యారు. నిజామాబాద్లో ఈ నెల 25, 26, 27 తేదీల్లో జరిగిన రాష్ట్ర మహాసభల్లో ఆయనను రెండోసారి ఎన్నుకున్నారు. నేలకొండపల్లి మండలం ముటాపురం గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించిన హేమంతరావు విద్యార్థి, యువజన ఉద్యమాలలో చురుకై న పాత్ర పోషించారు. విద్యార్థి సంఘం (ఏఐఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడిగా, కార్యదర్శిగా, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన సుదీర్ఘ కాలం సీపీఐ ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా, ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా, జాతీయ సమితి సభ్యులుగా పనిచేస్తున్నారు. గురువారం ఆయన ఎన్నికపై పలువురు హర్షం వ్యక్తం చేస్తూ, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హేమంతరావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం పక్షాన రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతామన్నారు. బాగంతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు దొండపాటి రమేష్, మిడికంటి వెంకటరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపర్తి గోవిందరావు ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక పట్ల పలువురు అభినందనలు తెలిపారు. -
ఆరుతడి పంటలతో అధిక ఆదాయం
చింతకాని : వరికి బదులు ఆరుతడి పంటలు సాగుచేస్తే అధిక ఆదాయాన్ని పొందవచ్చని రాజేంద్రనగర్ సమగ్ర వ్యవసాయ పద్ధతుల విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్ ప్రగతి కుమారి అన్నారు. మండలంలోని బస్వాపురం రైతు వేదికలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, మధిర వ్యవసాయ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఆరుతడి పంటల సాగుపై రైతులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోని 75 జిల్లాల్లో ఆరుతడి పంటల సాగును పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టినట్లు తెలిపారు. చింతకాని మండలం రామకృష్ణాపురం, బస్వాపురం, రాఘవాపురం గ్రామాలకు చెందిన 109 మంది రైతులను ఎంపిక చేసి వరికి బదులుగా ఆరుతడి పంటలైన మొక్కజొన్న, పెసర, మినుము పంటలను సాగు చేయించామని తెలిపారు. జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేస్తే ఎకరానికి వరి కంటే రూ.29 వేలు నికర ఆదాయం రావడమే కాక 47 శాతం నీటి వినియోగం తగ్గుతుందని తెలిపారు. అలాగే పెసర, మినుము పంటలు సాగుచేసినా అదనంగా ఆదాయం పొందవచ్చని వివరించారు. కార్యక్రమంలో మధిర వ్యవసాయ శాస్త్రవేత్తలు రుక్మిణీదేవి, నాగస్వాతి, భరత్, ఏడీఏ విజయ్ చంద్ర, మండల వ్యవసాయాధికారి మానస, వ్యవసాయ విస్తర్ణాధికారి ఆయేషా తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన పదార్థాలే విక్రయించాలి
ఖమ్మంవ్యవసాయం : వినియోగదారులకు నాణ్యమైన పాలు, పదార్థాలే విక్రయించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ప్రణాళికతో వ్యాపారాలను విస్తరించాలని సూచించారు. ఖమ్మం నగరంలోని బుర్హాన్పురంలో ఏర్పాటు చేసిన విజయ డెయిరీ పార్లర్ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మధిరలో ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటు చేశామని, విజయ డైరీతో సమన్వయం చేసుకుంటూ పాడి రైతుల నుంచి పాలు సేకరించి సరఫరా చేస్తున్నామని తెలిపారు. డెయిరీ పార్లర్ నిర్వాహకులకు అవసరమైన శిక్షణ ఇస్తామన్నారు. మిల్క్ షేక్, పాలు, పండ్ల రసాలు వంటివి కూడా విక్రయించి వ్యాపారాన్ని విస్తరించుకోవాలన్నారు. కార్యక్రమంలో విజయ డెయిరీ డీడీ మోహన్ మురళీ, డిస్ట్రిబ్యూటర్లు నరేష్, జగదీష్, పార్లర్ నిర్వాహకులు మదార్ పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల సేవలు ప్రశంసనీయం ఖమ్మంమయూరిసెంటర్: ప్రజల జీవన వ్యవస్థ సజావుగా సాగేలా కృషి చేస్తున్న ఆర్టీసీ కార్మికుల సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ఖమ్మం బస్ డిపో సిబ్బందికి గురువారంఆయన వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ కార్మికుల కృషి ఫలితంగా మెరుగైన రవాణా సేవలు అందుతున్నాయని అన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు చాలా కష్టపడి పని చేస్తున్నారని, వేసవికాలంలో వారికి ఉపయోగపడేలా 650 వాటర్ బాటిళ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కార్మికుల సమస్యలను డిపో మేనేజర్ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఆర్థిక పరమైన ప్రణాళికలపై లీడ్ బ్యాంక్ మేనేజర్తో శిక్షణ ఇప్పిస్తామని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ మేనేజర్ మల్లయ్య, డిపో మేనేజర్ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాలను పెంచాం.. ఖమ్మంసహకారనగర్: జిల్లాలో గతంలో 37 ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఉండగా ప్రస్తుత యాసంగి సీజన్లో 137కు పెంచామని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. సెర్ప్ సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు తీసుకుంటున్న చర్యలు, యాసంగిలో ఏర్పాటు చేయనున్న కొనుగోలు కేంద్రాలపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ.. 2022–23 సంవత్సరానికి సంబంధించిన కమీషన్ పౌర సరఫరాల శాఖ వద్ద పెండింగ్లో ఉందన్నారు. గన్నీ బ్యాగులు రీకన్సిలేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు. దివ్యాంగుల నిర్ధారణకు ఆస్పత్రుల్లో అవసరమైన పరికరాల ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. సమావేశంలో డీఆర్డీఓ సన్యాసయ్య, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ జి. శ్రీలత, డీఈఓ సోమశేఖర శర్మ, గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విజయ డెయిరీ పార్లర్ ప్రారంభోత్సవంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ -
కన్నీటి వేదన..
● విషాదంగా మారిన భవనం కూలిన ఘటన ● భవన నిర్మాణ కార్మికుడు కామేశ్వరరావు మృతి ● మరో కార్మికుడు ఉపేందర్ ఆచూకీ కోసం సహాయక చర్యలుభద్రాచలం అర్బన్: భవన నిర్మాణ కార్మికుల కుటుంబ సభ్యుల రోదనలు, బంధువుల ఆందోళనలతో భద్రాచలంలో విషాదం నెలకొంది. మరో వైపు రెస్క్యూ బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మండుటెండల్లో కూడా ఉన్నతాధికారుల పర్యవేక్షణలతో శిథిలాల తొలగింపు పనులు సాగుతున్నాయి. భద్రాచలంలో ఐదు అంతస్తుల భవనం కూప్పకూలిన ఘటనలో బుధవారం అర్ధరాత్రి శిథిలాల కింద చల్లా కామేశ్వరరావును గుర్తించి బయటకు తీశారు. 12 గంటల పాటు మృత్యువుతో పోరాడి ఆస్పత్రికి తరలించిన కాసేటికే మృతి చెందాడు. బుధవా రం అర్ధరాత్రి 1.47 గంటలకు ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ 2.20 గంటలకు మృతి చెందాడు. మరో కార్మికుడు పడిసాల ఉపేందర్ ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కుటుంబీకులు, బంధువుల ఆందోళన ఉపేందర్ ఆచూకీ గురువారం మధ్యాహ్నం వరకు లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఉపేందర్ ఆచూకీ గుర్తించడంలో అధికారులు విఫలయ్యారని ఆరోపించారు. భవన ప్రమాద ఘటనలో ఉన్నతాధికారులకు భాగస్వామ్యం ఉందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సంఘటనా స్థలంలో ఉద్రిక్తత నెలకొంది. బాధిత కుటుంబానికి రూ. కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ దుర్ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంతకుముందు బ్రిడ్జి సెంటర్ వద్ద కూడా ఆందోళన చేపట్టారు. సీఐ బి.రమేష్, ట్రాఫిక్ ఎస్ఐ మధు నచ్చజెప్పి శాంతింపజేశారు. కాగా సంఘటనా స్థలం వద్ద ఉపేందర్ భార్య రమాదేవి, కుమారుడు జశ్వంత్, కుమార్తె నందుశ్రీ రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది. దుర్వాసన వచ్చిన వైపుగా.. శిథిలాలను తొలగించే క్రమంలో ఇంటి యజమాని శ్రీపతి శ్రీనివాస్ లాకర్ బయట పడగా, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుండగా గురువా రం రాత్రి 7 గంటల సమయంలో భవన ప్రవేశ ద్వారం వైపు దుర్వాసన రావడంతో ఆ దిశగా శిథిలాల తొలగింపు పనులు సాగుతున్నాయి. కామేశ్వరరావు మృతితో విషాద ఛాయలు ప్రమాద ఘటనలో చల్లా కామేశ్వరరావు మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు అవివాహుతుడు. ఏడాది క్రితం తండ్రి మృతి చెందడంతో తల్లి రేవతి తానే సాకుతున్నాడు. ఇద్దరు అక్కలు ఉన్నారు. కాగా కామేశ్వరరావు మృతి చెందడంతో తల్లి ఒంటరిగా మారింది. -
జిల్లాలోని 344 కేంద్రాల ఏర్పాటుకు కార్యాచరణ
● ఈనెల 1నుంచి కేంద్రాల ప్రారంభం ● 25.84 లక్షల క్వింటాళ్ల సేకరణ అంచనా ● సన్నధాన్యానికి ఈసారి కూడా బోనస్ సన్న రకానికి ప్రాధాన్యత వచ్చే నెల 1నుంచి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేయనుంది. ఇందుకోసం వానాకాలం సీజన్లో సన్న ధాన్యాన్ని సేకరించి మిల్లులకు అప్పగించాక సీఎంఆర్గా తీసుకున్నారు. ఇక యాసంగి సీజన్లోనే సన్న ధాన్యం కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అందుకోసమే జిల్లాలో 344 కొనుగోలు కేంద్రాలు తెరవనుండగా, ఇందులో సన్న రకం ధాన్యానికి 282, దొడ్డు రకాల కోసం 62 కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నారు. కాగా, జిల్లాలో సన్న, దొడ్డు రకం కలిపి 25,84,928 క్వింటాళ్ల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో సన్న రకాలు 18,53,370 క్వింటాళ్లు, దొడ్డు రకం 7,31,558 క్వింటాళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. జిల్లాలోని 2,10,830 ఎకరాల్లో వరి సాగు కాగా, ఇందులో సన్న రకం 1,29,064 ఎకరాలు, దొడ్డు రకం ధాన్యం 81,766 ఎకరాల్లో సాగైంది. క్వింటాకు రూ.500 బోనస్ గ్రేడ్–ఏ రకం క్వింటాకు రూ.2,320, సాధారణ రకాలకు రూ.2,300గా ధర నిర్ణయించారు. సన్న రకంలో 33రకాలను గుర్తించగా.. గత సీజన్ మాదిరే క్వింటాకు రూ.500 బోనస్ చెలిస్తారు. అయితే, మట్టి, రాళ్లు, పెళ్లలు, చెత్త, తాలు ఒక శాతం లోపే ఉండాలి. పూర్తిగా తయారు కాని, కుంచించుకుపోయిన ధాన్యం మూడు శాతం, పాడైన, రంగుమారి మొలకెత్తిన, పురుగు తిన్న ధాన్యం ఐదు శాతం, పక్వానికి రానిది ఒక శాతం, కల్తీ తక్కువ రకం ఆరు శాతం లోపు ఉంటేనే సేకరిస్తారు. తేమ 17 శాతంలోపు ఉంటేనే ధాన్యానికి మద్దతు ధర లభిస్తుందని అధికారులు అవగాహన కల్పించనున్నారు. వేర్వేరు ట్యాగ్లు డీఆర్డీఏ, పీఏసీఎస్, డీసీఎంఎస్, మెప్మా ఆధ్వర్యాన 344 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తారు. సన్న, దొడ్డు ధాన్యం సేకరణకు వేర్వేరు కేంద్రాలు ఏర్పాటుచేయనున్న అధికారులు ప్యాకింగ్లోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనున్నారు. సన్న ధాన్యం బస్తాలను ఎరుపు రంగు దారంతో, దొడ్డు ధాన్యం బస్తాలను గ్రీన్ కలర్ దారంతో సీల్ చేయిస్తారు. తద్వారా సులువుగా గుర్తుపట్టొచ్చని చెబుతున్నారు. కేంద్రాల్లో సౌకర్యాలు ఎండల నేపథ్యాన కొనుగోలు కేంద్రాల్లో చలివేంద్రం ఏర్పాటు చేయడమేకాక ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నారు. టెంట్లు, కుర్చీలు సమకూర్చి విద్యుత్ సౌకర్యం సమకూర్చుకోవాలని నిర్వాహకులకు సూచించారు. అలాగే, గన్నీబ్యాగ్లు, ఇతర సామగ్రి వివరాలతో స్టాక్బోర్డు నిర్వహించాలని తెలిపారు. ధాన్యం అమ్మి రైతుల భూవివరాలు, ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, సెల్ఫోన్ నంబర్ను ఓపీఎంఎస్ సాఫ్ట్వేర్లో నమోదు చేయాల్సి ఉంటుంది.క్వింటాకు కనీస మద్దతు ధర (రూ.) 2,320 2,300సాధారణ రకం(గ్రేడ్–ఏ) రకంకేంద్రాల ఏర్పాటుకు సిద్ధం జిల్లాలో వచ్చేనెల 1నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నాం. అయితే, నేలకొండపల్లి, కూసుమంచి, తల్లాడ, సత్తుపల్లి మండలాల్లో ఇప్పటికే కోతలు మొదలైనందున అక్కడ ముందుగానే కొనుగోలు కేంద్రాలు తెరవనున్నాం. అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు టార్పాలిన్లు, తేమ పరిశీలించే యంత్రాలు అందుబాటులో ఉంచాలని సూచించాం. – శ్రీలత, మేనేజర్, జిల్లా పౌరసరఫరాల సంస్థ -
జేఏసీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
ఖమ్మం సహకారనగర్ : నగరంలోని టీఎన్జీవోస్ కార్యాలయంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించగా, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసం ఆధ్యాత్మికతకు, స్వీయ క్రమశిక్షణకు ఉత్తమ సమయమని అన్నారు. దానధర్మాలతో పేదలను ఆదుకునేందుకే ఈ పండుగ జరుపుకుంటారని చెప్పారు. కార్యక్రమంలో టీజేఏసీ జిల్లా చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు, కో కన్వీనర్ కస్తాల సత్యనారాయణ, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు యలమద్ది వెంకటేశ్వర్లు, పారుపల్లి నాగేశ్వరరావు, కొణిదన శ్రీనివాస్, మోదుగు వేలాద్రి, చంద్రకంటి శశిధర్, చర్ల శ్రీనివాసరావు, వాసిరెడ్డి శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, కృష్ణార్జున్రావు పాల్గొన్నారు. -
● పచాస్ సాల్ కే బాద్ !
పెనుబల్లి : యాభై సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనంతో కలుసుకున్నారు పదో తరగతిలో కలిసి చదువుకున్న స్నేహితులు. వీఎం బంజర జెడ్పీ హైస్కూల్లో 1974 – 75 సంవత్సరంలో ఎస్సెస్సీ చదివిన స్నేహితులు అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తుమ్మలపల్లి గ్రామంలో ఏరా కమలాకర్ ఇంటి వద్ద ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో కలిసిన వారి వయస్సు సుమారు 65 ఏళ్లు కాగా నాయకులుగా, అధికారులుగా, అధ్యాపకులుగా, వ్యాపారస్తులుగా కొనసాగుతున్న వారంతా స్నేహితులను చూడగానే పిల్లల్లా మారిపోయారు. ఈ కార్యక్రమంలో ఈడ కమలాకర్, కనగాల వెంకటరావు, దొంతుబోయిన నరసింహారావు, కనకాల సాంబశివరావు, ఎడ్ల వెంకటేశ్వరావు, నాగుబండి వెంకటేశ్వరరావు, మోటపోతుల వెంకటేశ్వరరావు, హైమావతి తదితరులు పాల్గొన్నారు. -
నేడు, రేపు మంత్రి తుమ్మల పర్యటన
ఖమ్మంవన్టౌన్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లాలో శుక్ర, శనివారాల్లో పర్యటించనున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నగరంలోని సీక్వెల్ వద్ద నిర్వహించే ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు వైరారోడ్, 42వ డివిజన్లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. శనివారం ఉదయం 9 గంటలకు 18వ డివిజన్ శ్రీరామ్హిల్స్లో బీటీ రోడ్డు నిర్మాణానికి, సాయంత్రం 4.30 గంటలకు రఘునాథపాలెం మండలం వీవీ పాలెం నుంచి ఇల్లెందు రోడ్డులో ఎన్నెస్పీ కెనాల్ వద్ద బీటీ రోడ్డు నిర్మాణానికి, అంతర్గత సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 6 గంటలకు తల్లాడ మండలం బిల్లుపాడులో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. పడిపోతున్న నీటి మట్టం11.8 అడుగులకు చేరిన వైరా రిజర్వాయర్ వైరా: వైరా రిజర్వాయర్ నుంచి తాగు, సాగు అవసరాలకు నీరు విడుదల చేస్తుండడంతో నీటి మట్టం వేగంగా తగ్గుతోంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 18.3 అడుగులు కాగా ప్రస్తుతం 11.8 అడుగులకు చేరుకుంది. ఎండల తీవ్రత నేపథ్యంలో రోజుకు 33 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతుండగా.. రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వల ద్వారా 12 క్యూసెక్కుల నీటిని పంటలకు విడుదల చేస్తున్నారు. మరో 37 క్యూసెక్కుల నీటిని మిషన్ భగీరథ పథకానికి వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో నీటి పారుదల శాఖ అధికారులు రిర్వాయర్లో నీటి లభ్యతపై ప్రభుత్వానికి నివేదిక అందించారు. సాగర్ ప్రధాన కాల్వ నుంచి వైరా రిజర్వాయర్కు నీటిని మళ్లిస్తే వేసవి నుంచి గట్టెక్కే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆలోచించి రిజర్వాయర్కు సాగర్ జలాలు మళ్లించాలని పలువురు కోరుతున్నారు. ఖమ్మం మార్కెట్కు వరుస సెలవులుఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు వరుసగా నాలుగు రోజులు సెలవులు ప్రకటించారు. ఈనెల 29న అమావాస్య, 30న ఆదివారంతో పాటు ఉగాది, 31న రంజాన్, ఏప్రిల్ 1న రంజాన్ పండుగ తెల్లవారి కూడా సెలవు ఇస్తున్నట్లు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీ బుధవారం నుంచి పంట ఉత్పత్తుల క్రయ, విక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. ముగిసిన ‘బార్’ ఎన్నికలుఖమ్మంలీగల్ : ఖమ్మం బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం ముగిశాయి. కొంతకాలంగా హోరాహోరీ ప్రచారం సాగించిన ఈ ఎన్నికల్లో మొత్తం 816 ఓట్లకు గాను 719 ఓట్లు పోలయ్యాయి. ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, న్యాయవాదులు ఉత్సాహంగా వచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ‘బార్’ అధ్యక్షుడిగా తొండపు వెంకటేశ్వరరావు తన సమీప అభ్యర్థి వెంకటేశ్వర గుప్తాపై 168 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఉపాధ్యక్ష పదవికి విజయశాంత సమీప ప్రత్యర్థి ఎస్కే జానీపై 5 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా గద్దల దిలీప్ తెల్లాకుల రమేష్ బాబుపై 39 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. గ్రంథాలయ కార్యదర్శిగా సింగారపు రాంబాబు, క్రీడా కార్యదర్శిగా కేవీపీ లక్ష్మి విజయం సాధించారు. జాయింట్ సెక్రటరీ, కోశాధికారి, మహిళా ప్రతినిధి పదవులు గతంలోనే ఏకగ్రీవమయ్యాయి. కాగా, గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల అధికారి ధ్రువీకరణ పత్రాలు అందించారు. ముగిసిన శిక్షణఖమ్మం సహకారనగర్ : నగరంలోని ప్రభుత్వ ఐటీఐలో డాక్టర్ రెడ్డీస్ సంస్థ(సీఎస్డీ) సెంటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సంస్థతో అనుసంధానంగా ఎలక్ట్రికల్ వెహికిల్ సర్వీస్ టెక్నీషియన్ అనే అంశంపై పది రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా సంస్థ బాధ్యులు భవ్య, దివ్వెల వెంకటేశ్వరరావు, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించటంతో పాటు వారి భవిష్యత్ మార్చేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందించారు. -
టీజీఈజేఏసీ జిల్లా కో–చైర్మన్గా కృష్ణార్జునరావు
చింతకాని: తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీజీఈజేఏసీ) జిల్లా కో–చైర్మన్గా మండల పరిధిలోని నాగులవంచ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడు ఐ.కృష్ణార్జునరావు ఎన్నికయ్యారు. ఖమ్మంలో బుధవారం జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఆయన ఎన్నిక పట్ల తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్–475 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్, రాష్ట్ర మహిళా కార్యదర్శులు రజియా సుల్తానా, షాహీనా బేగం, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుమ్మడి మల్లయ్య, కొండా వినోద్బాబు, రాష్ట్ర కౌన్సిలర్లు కంచర్ల శ్రీకాంత్, సత్యనారాయణ, నర్సింహారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ మురళీకృష్ణ, కోశాధికారి భాస్కర్ హర్షం వ్యక్తం చేశారు. -
రైతులకు నష్టం కలిగే పనులు చేయొద్దు
ఖమ్మంక్రైం: రైతులకు నష్టం కలిగే పనులు చేయొద్దని జిల్లా రవాణాశాఖాధికారి వెంకటరమణ హార్వెస్ట్ యంత్రాలు (వరికోత మిషన్లు) యజమానులకు సూచించారు. కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ఆదేశాల మేరకు గురువారం ఆయన జిల్లా రవాణాశాఖా కార్యాలయంలో సమావేఽశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరికోసే సమయాన తాలు వడ్లను మంచి వడ్లలో కలపొద్దని, ఇష్టానుసారంగా కిరాయి వసూలు చేయొద్దని, సకాలంలో కోతలు పూర్తి చేయాలన్నారు. రైతులకు నష్టం కలిగించేలా ప్రవర్తిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో ఏఎంవీఐ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు కృషి వైరా: బాలల హక్కుల పరిరక్షణకు అధికారులు కృషి చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్, మండల ప్రత్యేకాఽధికారి కస్తాల సత్యనారాయణ అన్నారు. గురువారం స్థాఽనిక మండల పరిషత్ కార్యాలయంలో బాలల సంరక్షణ సేవలపై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐసీడీఎస్ సిబ్బంది నిత్యం గ్రామాల్లో ప్రజలతో మమేకమై బాల్య వివాహాలు జరగకుండా చూడాలని, చిన్నారులకు పౌష్టికాహారం అందేలా కృషి చేయాలని, చిన్న పిల్ల లను పనిలో పెట్టుకునే వారికి కౌన్సెలింగ్ ఇచ్చి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కేవీ శ్రీనివాస్, ఎంపీడీఓ సరస్వతి, ఎంఈఓ వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఉపకార వేతనాలకు మే 31 గడువు ఖమ్మంమయూరిసెంటర్: పోస్ట్మెట్రిక్ ఉపకార వేతనాల కోసం 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీలతో పాటు దివ్యాంగుల విద్యార్థులు ఈ–పాస్ వెబ్సైట్లో నమోదుకు మే 31 వరకు గడువు పొడిగించినట్లు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకుడు కస్తాల సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగి తమ బ్యాంక్ అకౌంట్ను సంబంధిత బ్యాంక్లో ఆధార్ సీడింగ్ చేసుకోవాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీ ప్రిన్సిపాళ్లు డిజిటల్ కీని సంబంధిత ప్రిన్సిపాల్ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. కాలేజీ ఈ–పాస్ లాగిన్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, విద్యార్థులు ఉపకార వేతనాల దరఖాస్తులను ధ్రువీకరించిన తర్వాత డిజిటల్ సిగ్నేచర్ ద్వారా మాత్రమే ఈ–పాస్ లాగిల్లో జిల్లా అధికారికి ఫార్వర్డ్ చేయాలని సూచించారు. విద్యా వాతావరణం మెరుగుకు కృషి నేలకొండపల్లి: విద్యా వాతావరణం మెరుగుపర్చడం కోసం తమ సంస్థ కృషి చేస్తుందని కోరమండల్ మన గ్రోమోర్ సంస్థ వరంగల్ డీజీఎం సానికొమ్ము శ్రీనివాసరెడ్డి అన్నారు. సంస్థ ఆధ్వర్యాన మండలంలోని రాజేశ్వరపుం ప్రభుత్వ పాఠశాలకు రూ.3 లక్షల సాయంతో బెంచీలను అందించారు. గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండి సమాజానికి గొప్ప మార్గదర్శకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. సంస్థ తరఫున విద్యాభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎం.యర్రయ్య, మండల విద్యాశాఖాధికారి బి.చలపతిరావు, మండల వ్యవసాయాధికారి ఎం.రాధ, సంస్థ ప్రతినిధులు మంజు, ప్రదీప్కుమార్, రాజేష్, రెహమాన్, వీరమల్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో చోరీ మధిర: మండలంలోని సిరిపురం గ్రామంలో ఉన్న శ్రీ నరేంద్ర స్వామి వారి ఆలయంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆలయంలోని అమ్మవారి వెండి కిరీటం, హుండీలో ఉన్న రూ.20వేల నగదును అపహరించారు. అంతేకాక సీసీ కెమెరాలకు సంబంధించిన హార్డ్ డిస్క్ను సైతం తీసుకెళ్లారు. ఆలయ పూజారి రామకృష్ణ గురువారం ఉదయం ఆలయానికి వెళ్లగా ఆలయ తలుపు తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించి ఆలయ మేనేజర్ రామకోటేశ్వరరావుకు, రూరల్ ఎస్సై లక్ష్మీభార్గవికి సమాచారం అందించారు. ఘటనాస్థలాన్ని మధిర సీఐ మధు, ఖమ్మం నుంచి క్లూజ్ టీం వచ్చి వేలిముద్రలను సేకరించారు. రూ. 42వేలు విలువచేసే సొత్తును అపహరించినట్లు గుర్తించారు. ఆలయ మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
రుణమాఫీ చేయలేదని రైతు వినూత్న నిరసన
ఖమ్మంరూరల్ : తాను తీసుకున్న పంట రుణం మాఫీ కాలేదంటూ ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామానికి చెందిన భూక్యా నాగేశ్వరరావు మిరప కల్లంలో కూర్చుని, మిర్చి దండ మెడలో వేసుకుని గురువారం వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. రూ.2లక్షల లోపు రుణం మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, అంతకంటే ఎక్కువ ఉన్న మొత్తాన్ని తాను బ్యాంకులో జమ చేసినా.. నేటికీ మాఫీ కాలేదని వాపోయాడు. రూ. లక్షల్లో పెట్టుబడి పెట్టి మిర్చి సాగు చేస్తే ఇప్పుడు పంటకు గిట్టుబాబు ధర రావడం లేదని, ఆ అప్పు ఎలా తీర్చాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తక్షణమే రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని కోరాడు. -
‘ఓపెన్’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
ఖమ్మంసహకారనగర్: తెలంగాణ ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ థియరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం అదనపు కలెక్టర్, కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ చాంబర్లో ‘ఓపెన్’పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యాన ఏప్రిల్ 20 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహిస్తుండగా.. జిల్లాలో 655 మంది పదో తరగతి అభ్యర్థులకు గాను నాలుగు పరీక్షా కేంద్రాలు, 898 మంది ఇంటర్ అభ్యర్థులకు మరో నాలుగు పరీక్షా కేంద్రాలను నగరంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల పర్యవేక్షణకు ఎనిమిది సిట్టింగ్ స్క్వాడ్, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశామన్నారు. సెల్ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదన్నారు. పరీక్షలకు సంబంధించిన సమాధాన పత్రాలు పోస్టల్ శాఖ ద్వారా డీఆర్డీసీ సెంటర్కు పంపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులంతా సమన్వయంతో పని చేసి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కళావతి బాయి, ఓపెన్ స్కూల్ జిల్లా కన్వీనర్ పాపారావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్ల స్థలాల ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి
నేలకొండపల్లి: రామోజీ ఫిల్మ్సిటీలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను ఆక్రమించిన యాజమాన్యానికిప్రభుత్వం వత్తాసు పలకడాన్ని నిరసిస్తూ గురువారం సీపీఎం ఆధ్వర్యాన మండల కేంద్రంలో ప్రభుత్వదిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కే.వీ.రెడ్డి మాట్లాడుతూ.. పేదల ఇళ్ల స్థలాలను పేదలకు ఇచ్చి, యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పేదల పక్షానా మాట్లాడిన రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీని అక్రమ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. హామీలు అమలు చేయకుండా పేదలకు పంచిన స్థలాలను పెద్దలకు దారాదత్తం చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఏటుకూరి రామారావు, గుడవర్తి నాగేశ్వరరావు, పెద్దిరాజు నర్సయ్య, సామాల మల్లిఖార్జున్రావు, మారుతి కొండలు, కట్టెకోల వెంకటేశ్వర్లు, దండా సూర్యనారాయణ, పి.బాబు తదితరులు పాల్గొన్నారు. -
భవనాలు భద్రమేనా..?
● అడ్డగోలుగా బహుళ అంతస్తుల నిర్మాణాలు ● శిథిలావస్థ భవనాల తొలగింపుపై మీనమేషాలు ● ప్రమాదాలు జరిగినప్పుడే హడావుడి ● ఆ తర్వాత పట్టించుకోని అధికార యంత్రాంగం ఖమ్మంమయూరిసెంటర్: నిబంధనలు పాటించని బహుళ అంతస్తుల నిర్మాణాలు, శిథిలావస్థకు చేరిన భవనాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. నగరంతోపాటు జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా భవనాలను నిర్మిస్తున్నారు. అంతేకాక ఎప్పుడు కూలుతాయో తెలియని భవనాలు అనేకం ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తున్నా.. వీటిపై చర్యలు మాత్రం ఉండడం లేదు. జరగరాని ఘోరం జరిగినప్పుడు మాత్రం అధికార యంత్రాంగం స్పందించి నోటీసులు ఇవ్వడం, ఎక్కడెక్కడ ఇటువంటి భవనాలు ఉన్నాయో లెక్కలు తీస్తున్నాయి. ఆ తర్వాత పరిస్థితి యథావిధిగానే ఉంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం కుప్పకూలడంతో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాలపై చర్చ మొదలైంది. అడ్డగోలుగా నిర్మాణాలు.. జిల్లాలో ప్రధానంగా ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలో భవన నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఖమ్మం నగరంతో పాటు నగరానికి ఆనుకుని ఉన్న ఖమ్మంరూరల్ మండలంలో కూడా బహుళ అంతస్తుల నిర్మాణాలు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. అయితే ఆయా భవనాల నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయా..? లేవా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకటి, రెండు అంతస్తులకు అనుమతులు తీసుకుంటున్న యజమానులు నాలుగు నుంచి ఐదు అంతస్తులను నిర్మిస్తున్నారు. ఇక బిల్డర్లు ఏ మేరకు నాణ్యత పాటిస్తున్నారనేది కూడా తెలియని పరిస్థితి నెలకొంది. లాభాల కోసం భవనాలను నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇటీవల ఖమ్మం నగరంలోని ఇందిరానగర్ ప్రాంతంలో జీ ప్లస్ 1కు అనుమతి తీసుకుని.. 5 అంతస్తులకు స్లాబ్ వేశారు. దీనికి ఎలాంటి సెట్బ్యాక్ కూడా లేదు. అధికారుల పరిశీలనలో ఈ భవనాన్ని గుర్తించి పెనాల్టీ విధించడంతో పాటు పైన రెండు అంతస్తులను నిర్మించకుండా అడ్డుకున్నారు. ఇలాంటివి పదుల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. 106 భవనాలకు నోటీసులు.. 2020లో అధికారులు నగరంలో 106 శిథిలావస్థ భవనాలను గుర్తించి నోటీసులు జారీ చేశారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలున్నాయి. నాటి నుంచి ఇప్పటి వరకు 102 భవనాలను తొలగించినట్లు అధికారులు లెక్కలు చూపిస్తుండగా.. మరో నాలుగు భవనాలు అలాగే ఉన్నాయి. పూర్తిగా శిథిలమైన భవనాలను తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలున్నాయి. నగరంలోని శుక్రవారపేట, నిజాంపేట, త్రీటౌన్ ప్రాంతం, మామిళ్లగూడెం ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న భవనాలు ఇంకా ఉంటాయని, వీటిని అధికారులు గుర్తించడం లేదనే విమర్శలున్నాయి. ఆయా ప్రాంతాలతో పాటు నగరంలో అనేక చోట్ల పాత భవనాలపై కొత్త నిర్మాణాలు చేపడుతున్నారు. పాత భవనాల పరిస్థితి ఏంటనేది కూడా తెలుసుకోకుండా అధికారులు వాటిపై మరో నిర్మాణానికి ఎలా అనుమతులు ఇస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అధికారులు కూడా అనుమతులు ఇచ్చేటప్పుడు స్థలాలను పరిశీలించడం లేదని, ఉన్న భవనాల పరిస్థితిని కూడా అంచనాలు వేయడం లేదని విమర్శలు చేస్తున్నారు. నగరంలోని నిజాంపేట ప్రాంతంలో ఎండోమెంట్కు సంబంధించిన ఓ భవనం శిథిలావస్థకు చేరింది. దీనిని తొలగించాలని 2020లో అధికారులు నోటీసులు జారీ చేశారు. పలుమార్లు భవనంను తొలగించేందుకు కేఎంసీ అధికారులు అక్కడికి వెళ్లినా పలు కారణాలతో భవనాన్ని తొలగించకుండా వెనుదిరిగారు. ఎండోమెంట్ అధికారులు కూడా తొలగింపునకు పలు కారణాలు చూపి అడ్డుపడినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ భవనం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి ఉంది. దీనికి ఎదురుగానే స్థానికులు టిఫిన్ సెంటర్ పెట్టుకున్నారు. చిన్నపిల్లలు కూడా చుట్టుపక్కల ఆటలు ఆడుతూ ఉంటారు. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
జలవనరుల శాఖ పనుల పరిశీలన
ఖమ్మంఅర్బన్: జిల్లాలో జలవనరులశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులను క్వాలిటీ కంట్రోల్ విభాగం ఎస్ఈ బుచ్చిరెడ్డి, ఈఈ వెంకటరమణరావు, డీఈ చంద్రమోహన్ గురువారం పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటిస్తున్నారా అని ఆరా తీశారు. మున్నేరుపై నిర్మిస్తున్న రీటైనింగ్ వాల్స్, తిరుమలాయపాలెం మండలంలో కొనసాగుతున్న సీతారామప్రాజెక్ట్ అండర్ టన్నెల్ పనులు, రఘునాథపాలెం మండలంలోని మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో జలవనరుల శాఖ ఎస్ఈ మంగళపుడి వెంకటేశ్వర్లు, ఈఈ అనన్య, డీఈలు జాన్బీ, ఝాన్సీ పాల్గొన్నారు. పంటలు నమోదు చేసుకోవాలికారేపల్లి: రైతులు విధిగా పంట నమోదు చేయించుకోవాలని డీఏఓ పుల్లయ్య సూచించారు. గురువారం కారేపల్లి సొసైటీ ఎరువుల గోడౌన్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంటలు నమోదు చేస్తేనే ప్రభుత్వ రంగ సంస్థలకు విక్రయించే అవకాశం ఉంటుందన్నారు. పంటల విస్తరణను అనుసరించి ప్రభుత్వం వ్యవసాయ ప్రణాళికను తయారు చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఏఓ బి.అశోక్కుమార్, ఏఈఓ బి. నరేష్, కార్యదర్శి బొల్లు హన్మంతరావు, గోడౌన్ ఇన్చార్జి ముండ్ల సురేష్ పాల్గొన్నారు. ‘ఉపాధి’ పనుల అక్రమాలు బట్టబయలు తిరుమలాయపాలెం: మండల పరిధిలోని 2023– 24 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన ఉపాధి హామీ పనులలో పలు అవినీతి అక్రమాలు వెలుగుచూశాయి. గురువారం తిరుమలాయపాలెం ఎంపీడీఓ కార్యాలయంలో 16వ విడత ఓపెన్ఫోరమ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడీ చుంచు శ్రీనివాస్ ఎంపీడీఓ సిలార్సాహెబ్ ఆధ్వర్యాన నిర్వహించిన సామాజిక తనిఖీలో పలు అక్రమాలు వెలుగుచూశాయి. మొక్కలు లేకుండానే నిధుల డ్రాతో పాటు తప్పుడు మస్టర్లు, ఎర్రగడ్డలో తీర్మానాలు లేకుండా పనుల ఎంపిక తదితర అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా ఈజీఎస్ సిబ్బందికి రూ.52వేల జరిమానా విధించగా రూ.3.24లక్షలు రికవరీ చేసేందుకు అధికారులు నిర్ణయించారు. వీటిలో ఈజీఎస్ రూ.1.19లక్షలు కాగా మిగిలినవి ఆర్అండ్బీ, పంచాయతీరాజ్్ శాఖలలో అక్రమాలు జరిగినట్లు వెల్లడైంది. ఈ కార్యక్రమంలో డీవీఓ సక్రియనాయక్, డీసీ వీరయ్య, అసిస్టెంట్ డీవీఓ పవన్, ఏపీఓ శ్రీదేవి, రమేష్ బాబు, ఎస్ఆర్పీ చారి, పంచాయతీరాజ్ జేఈ ప్రపుల్కుమార్, ఏపీఓ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిసత్తుపల్లి టౌన్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన సత్తుపల్లి మండలం కాకర్లపల్లి లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామానికి చెందిన మట్ట వెంకటేశ్వరరావు (35) ద్విచక్ర వాహనంపై సత్తుపల్లిలోని ఒక షాపింగ్ మాల్లో పనిచేస్తున్న తన భార్యను తీసుకెళ్లేందుకు వస్తున్నాడు. ఈ క్రమంలో కాకర్లపల్లి శివారులోని పాత ఎన్టీఆర్ కాలువ వంతెన సమీపంలో ఓ పానీపూరి బండిని ఢీ కొన్నాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇతడు పెయింటర్ గా పనిచేస్తున్నాడు. మృతునికి భార్య భవాని, ఒక కుమార్తె ఉన్నారు. కూసుమంచి మండలంలో మరొకరు.. కూసుమంచి: ఖమ్మం–సూర్యాపేట జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం తురకగూడెం గ్రామానికి చెందిన షేక్ జాన్పాషా(40)తన బైక్పై ఖమ్మం నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో జుజుల్రావుపేట గ్రామ సమీపాన అతడి బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్సై నాగరాజు మృతదేహాన్ని పోస్ట్మార్టానికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ములుగు జిల్లా మత్స్యకారులకు శిక్షణ
కూసుమంచి: మండలంలోని పాలేరు పీ.వీ.నర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రంలో ములుగు జిల్లాకు చెందిన షెడ్యూల్డ్ తెగల మత్స్యకారుల మూడో బ్యాచ్ శిక్షణ బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్ చేపల పెంపకంలో పద్ధతులు, సంరక్షణపై అవగాహన కల్పించారు. మత్స్యకారులు మూడు రోజుల పాటు కొనసాగే శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని సూచించారు. అనంతరం క్షేత్రస్థాయి సందర్శనలో భాగంగా ఫిషరీస్ కేంద్రాలను సందర్శించి వివిధ రకాల చేపలు, రొయ్యల పెంపకం, వ్యాధుల నివారణ, దాణా తయారీ విధానాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త రవీందర్ తదితరులు పాల్గొన్నారు. చేగొమ్మ నర్సరీలో 3న మామిడికాయల వేలం కూసుమంచి: మండలంలోని చేగొమ్మ ప్రభుత్వ ఉద్యాన నర్సరీలో 500 చెట్ల మామిడి కాయల విక్రయానికి వచ్చేనెల 3వ తేదీన బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఉద్యానవన శాఖ అధికారి అపర్ణ తెలిపారు. వేలంలో పాల్గొనే వారు రూ.5వేల నగదు డిపాజిట్ చెల్లించాలని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు వివరాల కోసం 89777 14104 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ‘పాలకుల తీరుతోనే రైతుల ఆత్మహత్యలు’ ఖమ్మంమయూరిసెంటర్: పాలకుల విధానాల ఫలితంగానే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాదిరాజు రమేష్ పేర్కొన్నారు. ఖమ్మంలోని బోడేపూడి విజ్ఞానకేంద్రంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశానికి వెన్నెముక అయిన రైతులు ఇప్పుడు దివాలా స్థితికి చేరారని.. కేంద్ర, రాష్ట్ర పాలకులు సరైన సహకారం అందించకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురవుతుందని చెప్పారు. సరళీకృత విధానాల్లో భాగంగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించడమే కాక సబ్సిడీలు తగ్గించారని, కనీస మద్దతు ధర ప్రకటించడం లేదని తెలిపారు. ఇకనైనా స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలుచేసి ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు వై.శ్రీనివాసరావు, ఎం.సుబ్బారావు, ఎస్.కే.అఫ్జల్మియా, జి.రామారావు, వాసిరెడ్డి వీరభద్రం, టి.వెంకట్రావు, నెల్లూరు వీరబాబు, టి.శివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఇన్చార్జ్తో జిల్లా నేతల భేటీ ఖమ్మంవన్టౌన్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్తో బుధవారం జిల్లా, ఖమ్మం నగర నాయకులు ఢిల్లీలో భేటీ అయ్యారు. అక్కడి యువజన కాంగ్రెస్లో కార్యాలయంలో ఆమెను కలిసిన వారు నామినేటెడ్ పదవుల్లో పార్టీ కోసం ఏళ్లుగా కష్టపడుతున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మహ్మద్ జావీద్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో శిక్షణకు డైట్ ప్రిన్సిపాల్ ఖమ్మంసహకారనగర్: ఢిల్లీలో నీతి ఆయోగ్ ద్వారా ఏర్పాటు చేసిన వర్క్షాపు, శిక్షణకు రాష్ట్రంలోని ముగ్గురు డైట్ కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆహ్వానించారు. ఇందులో ఖమ్మం డైట్ కళాశాల ప్రిన్సిపాల్ సామినేని సత్యనారాయణకు అవకాశం దక్కింది. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఢిల్లీలో ‘నేషనల్ వర్క్షాపు ఆన్ టీచర్ ఎడ్యుకేషన్’అనే అంశంపై జరిగిన శిక్షణకు హాజరయ్యారు. నిలిచిన డిజిటల్ పేమెంట్లు ఖమ్మంగాంధీచౌక్: ప్రస్తుతం నగదు చెల్లింపుల కు అందరూ డిజిటల్ విధానాన్ని ఉపయోగించుకుంటుండగా.. బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి ఆ సేవలు నిలిచిపోయాయి. సర్వర్ పనిచేయకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైనట్లు తెలుస్తోంది. దీంతో ఫోన్ పే, గుగుల్ పే వంటి యాప్లు పనిచేయక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లోనే కాక వినియోగదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. రీచార్జ్, బిల్లుల చెల్లింపు వంటిని నిలిచిపోయాయి. అయితే, రాత్రి 9 గంటల సమయాన సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయని బ్యాంకుల ప్రతినిధులు తెలిపారు. కేసు నమోదు ఖమ్మంరూరల్: మండలంలోని జలగంనగర్కు చెందిన షేక్ బషీర్పై అదే గ్రామానికి చెందిన ముగ్గురు దాడి చేయగా హత్యాయత్నం కేసు నమోదైంది. గ్రామానికి చెందిన బషీర్ కుమారుడైన హుస్సేన్ స్థానిక మసీదు నిర్వహణపై తరచుగా ప్రశ్నిస్తున్నాడు. దీనిని మనసులో పెట్టుకుని ఈనెల 23న హుస్సేన్ను స్థానికుడైన షేక్ మోసీన్ఖాన్ కొట్టాడు. అంతేకాక బషీర్, హుస్సేన్ ఈ నెల 25న నమాజ్కు వెళ్తుండగా మోసీన్ఖాన్, ఇమ్రాన్, రిజ్వాన్ దాడి చేయగా బషీర్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. -
విద్యార్థులకు చేయూత అభినందనీయం
ఖమ్మంగాంధీచౌక్: పేద విద్యార్థులు చదువుకు ఇబ్బంది పడకుండా అండగా నిలవడం అభినందనీయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ తెలిపారు. ఖమ్మం గుట్టలబజార్లోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవాలయంలో బుధశారం ఏర్పాటు చేసిన సమావేశంలో కాళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యాన పలువురు విద్యార్థుల చదువుకు అవసరమైన రూ.2.50 లక్షలను చెక్కుల రూపంలో అందజేశారు. జిల్లా జడ్జి మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు చేతనైనంత మేర ఇతరులకు సాయం చేయాలని సూచించారు. కాళ్ల ఫౌండేషన్ చైర్మన్ కాళ్ల పాపారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, చిన్ని కృష్ణారావు, కల్వకుంట్ల గోపాల్రావు, తేరాల ప్రవీణ్కుమార్, భాస్కర్రావు, కృష్ణమోహన్, శ్రీనివాసరావు, బద్రినారాయణ, భగీరథ్, మాధవ్, హైమావతి తదితరులు పాల్గొన్నారు. -
నేడు బార్ అసోసియేషన్ ఎన్నికలు
ఖమ్మంలీగల్: ఖమ్మం బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు గురువారం పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 816 మంది న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందుకోసం జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ హాల్లో పోలింగ్కు ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, ఆ వెంటనే ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా, ఓటర్లు తమ గుర్తింపు కార్డుతో హాజరుకావాలని సూచించారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అధ్యక్ష పదవికి సుగ్గల వెంకటేశ్వరరావుగుప్తా, తొండపు వెంకటేశ్వరరావు, అయ్యదేవర విజయరాఘవ నడుమ త్రిముఖ పోటీ నెలకొంది. ఇక ఉపాధ్యక్ష పదవికి ఎస్కే జానీమియా, మల్లెం రవిప్రసాద్, మోతుకూరి విజయశాంతి, ప్రధాన కార్యదర్శి పదవికి గద్దల దిలీప్కుమార్, తెల్లాకుల రమేశ్బాబు, గ్రంథాలయ కార్యదర్శి పదవికి దేవరకొండ కల్యాణి, సింగారపు రాంబాబు, క్రీడా కార్యదర్శి పదవికి కేవీవీ లక్ష్మి, ధరావత్ రాందాస్నాయక్ పోటీపడుతున్నారు. ఓసీ, సీహెచ్పీల్లో సింగరేణి డైరెక్టర్ తనిఖీ సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలం కిష్టారంలోని ఓసీ, జేవీఆర్ సీహెచ్పీలను సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్టు, ప్లానింగ్) కొప్పుల వెంకటేశ్వర్లు బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓసీల్లో పని స్థలాలను పరిశీలించిన ఆయన బ్లాస్టింగ్ సమయాన దుమ్ము, ధూళి అరికట్టే చర్యలపై ఆరా తీశారు. అనంతరం సీహెచ్పీ, సైలో బంకర్ చుట్టూ బ్యారియర్ ఎత్తు పెంచాలని, మొక్కలు నాటాలని సూచించారు. ఆ తర్వాత జీఎం కార్యాలయంలో కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ షాలెంరాజు తదితరులతో సమావేశమై వివిధ అంశాలపై డైరెక్టర్ సమీక్షించారు. పీఓలు ఎం.నర్సింహారావు, ప్రహ్లాద్, సీహెచ్పీ ఇన్చార్జ్ సోమశేఖర్, వివిధ విభాగాల అధికారులు కోటిరెడ్డి, సత్యనారాయణ, రామకృష్ణ, గోపీకిషోర్, బాబు, డి.శ్రీనివాస్, విజయ్సందీప్ అధికారులు పాల్గొన్నారు. ఓసీలో అత్యధిక ఉత్పత్తి సత్తుపల్లి మండలం కిష్టారం ఓసీలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ నెల 24న 12,814,660 టన్నుల బొగ్గు ఉత్పత్తితో రికార్డు నమోదైందని పీఓ ఎం.వీ.నర్సింహారావు తెలిపారు.బుధవారం జీఎం షాలెంరాజు అత్యధిక బొగ్గు ఉత్పత్తి సాధించడానికి కారకులైన ఉద్యోగులు, కార్మికులను అభినందించారు. కిష్టారం పీఓ నర్సింహారావు, మేనేజర్ రామకృష్ణ, ఇంజనీర్ మాధవరావు, రక్షణ అధికారి గోపికిషోర్తో పాటు భరణి, ఆఫ్రోజ్, సందీప్ ఉద్యోగులు పాల్గొన్నారు. కొత్త పార్ట్ ఇవ్వండి లేదా పరిహారం చెల్లించండి ఖమ్మంలీగల్: సాగులో ఉపయోగానికి కొనుగోలు చేసిన పరికరం పనిచేయక నష్టపోయినట్లు ఓ రైతు ఖమ్మంలోని జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించగా.. కొత్తది ఇవ్వాలని, లేనిపక్షంలో పరిహారం చెల్లించాలంటూ ఫోరమ్ మెంబర్లు వి.మాధవీలత, వి.లలిత బుధవారం తీర్పు వెలువరించారు. తల్లాడ మండలం పాత మిట్టపల్లికి చెందిన రైతు మువ్వా కృష్ణార్జునరావు పొలానికి పురుగుల మందు పిచికారీ కోసం ట్రాక్టర్కు బిగించేలా 2024 జులై 1న 500 లీటర్ల ట్యాంక్ను రూ.70 వేలకు కొనుగోలు చేశాడు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి తిలక్నగర్లోని సిగ్నటరీ ఎస్ఎన్కే కంపెనీ డీలర్ వద్ద దీన్ని కొనుగోలు చేయగా, సరిగా పనిచేయకపోవడంతో కంపెనీ బాధ్యులను సంప్రదిస్తే మరమ్మతు చేయించారు. అయినా ఫలితం లేక తాను నష్టపోయాయనని న్యాయవాదులు మువ్వా నాగేశ్వరరావు, తెల్లాకుల రమేశ్బాబు ద్వారా రైతు ఖమ్మం వినియోగదారుల ఫోరంలో కేసు దాఖలు చేశాడు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం రైతుకు కొత్త ట్యాంక్ ఇవ్వాలని, లేనిపక్షంలో దాని ఖరీదు రూ.70 వేలను ఏడు శాతం వడ్డీతో సహా చెల్లించడమే కాక ఖర్చుల కింద రూ.10 వేలు, నష్టపరిహారం రూ.10 వేలు చెల్లించాలని తీర్పు ఇచ్చారు. రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్ చింతకాని: మండలంలోని చిన్నమండవ మున్నేరు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు బుధవారం సీజ్ చేశారు. జగన్నాథపురం సమీపాన చేపట్టిన తనిఖీల్లో ఎలాంటి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేశామని ఎస్ఐ నాగుల్మీరా తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
ఉన్నత స్థాయికి చేరడమే లక్ష్యం కావాలి..
కొణిజర్ల: ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడమే లక్ష్యంగా అహర్నిశలు శ్రమించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. మండలంలోని తనికెళ్లలోని గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యాన బుధవారం జాబ్మేళా నిర్వహించగా.. కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా బలోపేతంగా లేకపోవడమే వివక్షకు కారణమని గుర్తించిన ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించిందన్నారు. ఆడపిల్ల పుట్టడం అదృష్టమని చాటేందుకు జిల్లాలో ‘మా పాప – మా ఇంటి మణిదీపం’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. కాగా, ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో చదివే బాలికలు బాధ్యతగా వ్యవహరించాలని, అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థాయికి చేరాలన్నారు. కాగా, తాను ఈ స్థాయికి చేరడానికి అమ్మమ్మ కారణం కాగా.. తన భార్య కూడా ఢిల్లీలో ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తోందని తెలిపారు. ఎన్నికల సమయాన మహిళా అధికారులకు విధులు అప్పగిస్తే రూ.4 కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారం జప్తు చేశారని గుర్తు చేశారు. తొలుత కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ గురుకుల నిర్వహణ, అభివృద్ధి పనులపై ప్రిన్సిపాల్తో చర్చించడమే కాక జాబ్మేళాకు వచ్చిన కంపెనీలు, ఉపాధి అవకాశాలపై ఆరా తీశారు. కాగా, జాబ్మేళాలో 15 కంపెనీల బాధ్యులు ఇంటర్వ్యూలు నిర్వహించగా 431 మంది ఎంపికయ్యారు. జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి ఎన్.మాధవి, ప్రిన్సిపాల్ డాక్టర్ రజిత, వైస్ ప్రిన్సిపాల్ ఎం.నవ్య, వివిధ కంపెనీల ప్రతినిధులు, కోఆర్డినేటర్లు ఐశ్వర్య, రాణి, కె.రజిని, రాజేశ్వరి పాల్గొన్నారు. మహిళా మార్ట్ ప్రత్యేకంగా ఉండాలి.. ఖమ్మంమయూరిసెంటర్: సాధారణ మాల్స్ మాదిరి కాకుండా మహిళా మార్ట్ను ప్రత్యేకంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఖమ్మంలోని సీక్వెల్ రోడ్డులో ఏర్పాటవుతున్న మహిళా మార్ట్ పనులను అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజతో కలిసి ఆయన పరిశీలించి సూచనలు చేశారు. ఈ మార్ట్లో స్వశక్తి మహిళా సంఘాల సభ్యులు తయారుచేసే వస్తువులను విక్రయించనుండగా.. వాటి తయారీ, మహిళా సంఘం సభ్యుల వివరాలతో డాక్యుమెంటరీ ప్రదర్శించాలని తెలిపారు. అలాగే, జిల్లా ఖ్యాతిని చాటేలా లోగో రూపొందించాలని చెప్పారు. డీఆర్డీఓ సన్యాసయ్య, అడిషనల్ డీఆర్డీఓ నూరుద్దీన్, పీఆర్ ఈఈ వెంకట్రెడ్డి పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్పై దృష్టి ఖమ్మంగాంధీచౌక్: వివిధ మండలాల్లో పైలట్గా ఎంపిక చేసిన గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యేలా దృష్టి సారించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. కలెక్టరేట్లో బుధవారం ఆయన అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ, డీఆర్ఓ పద్మశ్రీ, జెడ్పీసీఈఓ దీక్షరైనా, డీఆర్డీఓ సన్యాసయ్య, హౌసింగ్, పీఆర్ ఈఈలు బి.శ్రీనివాస్, వెంకటరెడ్డి, డీపీఓ ఆశాలతతో కలిసి పలు అంశాలపై సమీక్షించారు. పైలట్ గ్రామాల్లో 850 ఇళ్లు మంజూరు చేయగా.. పెట్టుబడి లేని వారి కుటుంబాల్లో మహిళలు స్వయం సహాయక సభ్యులుగా ఉండడంతో 369 మందికి రుణం అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. వారికి త్వరగా రుణం మంజూరు చేసి ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా చూడాలని చెప్పారు. అలాగే, మోడల్ ఇళ్ల నిర్మాణం ఆరు చోట్ల పురోగతిలో లేనందున రెండు వారాల గడువు ఇవ్వాలని, అయినా పని కాకపోతే కాంట్రాక్టర్ను మార్చాలని సూచించారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడమే కీలకం ఆడపిల్ల గర్వకారణమని చెప్పడానికే ప్రత్యేక కార్యక్రమం తనికెళ్ల మహిళా డిగ్రీ కళాశాల జాబ్మేళాలో కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ -
●శిథిలాల కింద మైనింగ్ (రాత్రి 8–50 గంటల నుంచి)
ఆరు వేల టన్నుల బరువైన కాంక్రీట్ శిథిలాలను తొలగించేందుకు చాలా సమయం పడుతుందని నిపుణులు తెలిపారు. దీంతో శిథిలాల తొలగింపు నిర్ణయాన్ని పక్కన పెట్టి, భవనం కింద నుంచి తవ్వుతూ లోపలికి వెళ్లి గ్రౌండ్ ఫ్లోర్ వరకు చేరాలని నిర్ణయించారు. బొగ్గు గనుల్లో నేలను తవ్వుతూ భూగర్భంలోకి వెళ్లినట్టుగా ఆరువేల టన్నుల బరువైన శిథిలాల కింద నేలను తవ్వడం మొదలెట్టారు. ఇలా తవ్వుకుంటూ(ఎలుక బొరియ చేసినట్టుగా) బాధితుడు కామేశ్వరరావు ఉన్న ప్రదేశం కిందకు చేరుకోవాలని, ఆ తర్వాత బాధితుడికి ఇబ్బంది లేకుండా పైన ఉన్న బరువులు పడకుండా రక్షించాలని నిర్ణయించారు. మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్న ఇంకో బాధితుడు ఉపేందర్ ఉనికిని గుర్తించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. -
అమ్మాయి పుట్టడం.. అదృష్టం
● అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ ● జిల్లాలో ‘మా పాప – మా ఇంటి మణిదీపం’ ప్రారంభంకామేపల్లి: ఆడపిల్ల పుట్టడాన్ని అదృష్టంగా భావించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను అభినందించేలా కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘మా పాప – మా ఇంటి మణిదీపం’ పేరిట ఈ కార్యక్రమం ద్వారా అమ్మాయి పుట్టిన దంపతులను జిల్లా యంత్రాంగం తరఫున సన్మానించడంతో స్వీట్ బాక్స్, ప్రశంసాపత్రం ఇవ్వాలని సూచించారు. ఆడపిల్ల జన్మోతవ వేడుకల పేరిట రూపొందించిన ఈ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించగా కామేపల్లి మండలం జాస్తిపల్లిలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. గ్రామానికి చెందిన శివరాత్రి నాగమణి–సాయిరాం దంపతులకు ఇటీవల ఆడపిల్ల జన్మించగా వారిని సన్మానించి స్వీట్లు అందజేశాక ఆమె మాట్లాడారు. కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్న ఆడపిల్లను భారంగా భావించొద్దని, మగపిల్లలతో సమాన అవకాశాలు కల్పించాలని సూచించారు. మండల ప్రత్యేకాధికారి మధుసూదన్రావు, తహసీల్దార్ సుధాకర్, ఎంపీడీఓ రవీందర్, ఐసీడీఎస్ సీడీపీఓ దయామణి, సూపర్వైజర్ కృష్ణకుమారి పాల్గొన్నారు. ●కారేపల్లి: విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తూ వారికి క్రమశిక్షణ నేర్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని అదనపు కలెక్టర్ శ్రీజ అన్నారు. కారేపల్లి మండలం రేలకాయలపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన ఆమె తరగతి గదులు, వంటశాలను పరిశీలించి సౌకర్యాలపై విద్యార్థులతో మాట్లాడారు. పలువురు విద్యార్థుల దుస్తులు, కటింగ్, వ్యక్తిగత పరిశుభ్రతపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తూ హెచ్ఎం, ఉపాధ్యాయులు, వార్డెన్లను మందలించారు. ఎంపీఓ రవీంద్రప్రసాద్ పాల్గొన్నారు. ●ఎర్రుపాలెం: మండలంలోని చొప్పకట్లపాలెం, బనిగండ్లపాడు, ఎర్రుపాలెంల్లో జెడ్పీ సీఈఓ దీక్షారైనా పర్యటించారు. చొప్పకట్లపాలెంలో ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సన్మానించి మాట్లాడారు. ఆతర్వాత బనిగండ్లపాడు పీహెచ్సీని తనిఖీ చేయగా, మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్, గురుకులంలో పదో తరగతి పరీక్ష కేంద్రం, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఐసీడీఎస్ సీడీపీఓ కృష్ణశ్రీ, ఎంపీడీఓ సురేందర్, ఎంఈఓ బి.మురళీమోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
●బాధితుడి గుర్తింపు (సాయంత్రం 6–15నుంచి రాత్రి 6–57గంటల వరకు)
తొలి ప్రయత్నం విఫలం కావడంతో నేరుగా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్లేలా క్రేన్ల సాయంతో శిథిలాలను తొలగిండం మొదలెట్టారు. అడ్డుగా వచ్చిన బీమ్లను కట్టర్ల సాయంతో కత్తిరించారు. దీంతో ఫస్ట్ ఫ్లోర్ లోపలి భాగం కొంత మేర కనిపించింది. ఆ ప్రాంతంలో ఒక చిన్న వెలుతురు కనిపించడంతో తీక్షణంగా పరీక్షించగా అది మొబైల్ ఫోన్గా తేలింది. ఆ మొబైల్ ఫోన్ లంచ్ బాక్స్ సంచిలో ఉన్నట్టు గుర్తించారు. లోపల ఎవరైనా ఉన్నారా అని రెస్క్యూ టీమ్ సభ్యులు పదే పదే అడగగా శిథిలాల కింద చిక్కుకున్న కామేశ్వరరావు నుంచి బదులు వచ్చింది. -
●ఆది నుంచీ అనుమానాస్పదమే
భద్రాచలం: భద్రాచలానికి శ్రీనివాసం శ్రీరామ స్వాతి – శ్రీపతి దంపతులు పదేళ్ల క్రితం వచ్చారు. అప్పటి నుంచి పలు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీపతి తెలుపు, కాషాయ వస్త్రాలు ధరించి, గుబురు గడ్డంతో స్వామిజీలా కనిపించేవారు. ఆ తర్వాత పాత భవనాన్ని కొనుగోలు చేసి అక్కడే ఆలయ నిర్మాణం ప్రారంభించారు. అది పూర్తికాక ముందే జీ ప్లస్ 5 భవన నిర్మాణం మొదలుపెట్టారు. ఆధ్యాత్మిక ముసుగులో అక్రమ కట్టడాలేమిటని ప్రశ్నించిన స్థానికులతో పలుమార్లు తగదా పడ్డారు. భవన నిర్మాణ పనులపై అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజన సంఘాల నేతలతోనూ గొడవ పెట్టుకున్నారు. భవనం కూలిపోయిన తర్వాత ఈ దంపతుల విషయమై స్థానికులను వాకబు చేయగా ఎవరూ పూర్తి వివరాలు చెప్పలేకపోయారు. అయితే, శ్రీపతిని బుధవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నా స్పష్టత రాలేదు. -
ఆ‘పన్ను’హస్తం లేక..
● గ్రంథాలయ పన్నుల చెల్లింపుల్లో నిర్లక్ష్యం ● ప్రభుత్వ సంస్థల నుంచి రూ.10 కోట్ల మేర బకాయిలు ● ఫలితంగా అభివృద్ధికి నోచుకోని విజ్ఞాన బాండాగారాలు ఖమ్మంగాంధీచౌక్: ప్రజలు పన్నులు చెల్లిస్తున్నా.. ఆ పన్నుల్లో గ్రంథాలయాల వాటా జమ చేయడంలో ప్రభుత్వ శాఖలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. దీంతో విజ్ఞాన బాండాగారాలుగా, నిరుద్యోగ యువతీ, యువకులకు అండగా నిలిచే గ్రంథాలయాల అభివృద్ధి కుంటుపడుతోంది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు వసూలు చేసే పన్నుల్లో 8 శాతం గ్రంథాలయాల వాటాగా జమ చేయాలి. ఈ నిధులను ఎప్పటికప్పుడు చెల్లించాల్సి ఉన్నా అలా జరగడం లేదు. దీంతో ఏళ్లుగా రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి.. గ్రంథాలయాలకు ప్రభుత్వ సంస్థల నుంచి దాదాపు రూ.10 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వ సంస్థల నుంచి పెద్ద ఎత్తున పన్ను బకాయిలు పేరుకుపోయాయి. జిల్లాలోని గ్రామ పంచాయతీల ద్వారా వసూలైన పన్నుల నుంచి రావల్సిన బకాయి రూ.3 కోట్లు జిల్లా పంచాయతీ శాఖ చెల్లించాల్సి ఉంది. ఖమ్మం కార్పొరేషన్ నుంచి దాదాపు రూ.5 కోట్లు, సత్తుపల్లి, వైరా, మధిర మున్సిపాలిటీల నుంచి దాదాపు రూ.2 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వ సంస్థల అధికార యంత్రాంగం గ్రంథాలయాల పన్ను వాటా చెల్లించేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ ఆయా సంస్థల పాలకవర్గాలు మోకాలడ్డుతున్నాయి. ఇటీవల ఖమ్మం కార్పొరేషన్ నుంచి రూ.2 కోట్ల మేరకు గ్రంథాలయ సంస్థకు చెల్లించేందుకు ఓ ఉన్నతాధికారి ప్రయత్నించినా పాలకవర్గం తిరస్కరించినట్లు సమాచారం. వైరా మున్సిపాలిటీ మాత్రం బకాయిల్లో రూ.10 లక్షలు చెల్లించింది. ఇక సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీల నుంచి కూడా బకాయిలు రావాల్సి ఉంది. జిల్లా గ్రంథాలయ సంస్థకు ప్రస్తుతం కమిటీ లేకపోవటంతో అదనపు కలెక్టర్ శ్రీజ పర్సన్ ఇన్చార్జ్గా వ్యవహరిస్తూ బకాయిల వసూళ్లపై దృష్టి సారించారు. బకాయి ఉన్న ప్రభుత్వ సంస్థలను గ్రంథాలయానికి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.నిధులు లేక.. గ్రంథాలయాలకు స్థానిక సంస్థల నుంచి పన్నుల రూపంలో నిధులు సమకూరుతాయి. ఆ నిధుల చెల్లింపు లేకపోవటంతో జిల్లాలో గ్రంథాలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. జిల్లాలో జిల్లా కేంద్ర గ్రంథాలయం, 22 శాఖా గ్రంథాలయాలు, రెండు గ్రామ గ్రంథాలయాలు నిర్వహణలో ఉన్నాయి. జిల్లా కేంద్ర గ్రంథాలయం పాత భవనం శిథిలమై 2024 జనవరి 13న కూలిపోయింది. దీంతో జిల్లా గ్రంథాలయ సంస్థకు కార్యాలయ, పరిపాలన భవనమే లేకుండా పోయింది. తాత్కాలికంగా ఖమ్మం పాత మున్సిపాలిటీ భవనంలో నిర్వహిస్తున్నారు. ఇక నేలకొండపల్లిలో నూతన భవన నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఇక ఎక్కడా కూడా గ్రంథాలయాల అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహణలో లేవు. పుస్తకాల సమస్య తీవ్రంగా ఉంది. పోటీ పరీక్షలకు సంబంధించి తాజా పుస్తకాలు లేవు. నిరుద్యోగులు, విద్యార్థులు వివిధ రకాల పుస్తకాలు, పోటీ పరీక్షల పుస్తకాల కోసం గ్రంథాలయాల అధికారులను అభ్యర్థిస్తున్నా వారు సైతం నిధుల కొరతతో ఏమీ చేయలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ సంస్థలు బకాయిలు చెల్లిస్తే గ్రంథాలయాల అభివృద్ధికి, నిర్మాణాలకు, పాఠకులు కోరుకునే, నిరుద్యోగులు, విద్యార్థులకు ప్రయోజనం కలిగించే పుస్తకాలను అందుబాటులో ఉంచే అవకాశం ఉంటుంది. ఈ విషయమై అధికారులను ఆరా తీయగా.. పన్ను బకాయిలు రావాల్సి ఉందని, అవి జమఅయితే సంస్థ అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. -
విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి చదవాలి
ఎర్రుపాలెం: చిన్నతనం నుంచే విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని కష్టపడి చదివితే ఉన్నత స్థానాలకు చేరొచ్చని డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు. ఎర్రుపాలెంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని బుధవారం తనిఖీ చేసిన ఆయన పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ఇప్పటివరకు పరీక్షలు ఎలా రాశారని ఆరా తీసిన ఆయన చదువులో రాణిస్తున్న ఆడపిల్లలు మరింత శ్రద్ధ వహించాలని సూచించారు. ఆ తర్వాత పాఠశాల రికార్డులను పరిశీలించిన డీఈఓ, మెనూ అమలు, మరమ్మతుల వివరాలు తెలుసుకున్నారు. సూపరింటెండెంట్ కె.సరిత, ఎంఈఓ బి మురళీమోహన్రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
డిప్యూటీ సీఎంకు బ్రహోత్సవాల ఆహ్వానం
ఎర్రుపాలెం/ముదిగొండ: ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 30వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదలుకానున్నాయి. ఈ మేరకు బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని కోరుతూ బుధవారం హైదరాబాద్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈసందర్భంగా చిత్రపటం, ప్రసాదాలు అందజేసి ఏర్పాట్లను వివరించారు. ఆలయ ఈఓ కె.జగన్మోహన్రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు వంశీ, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, ముదిగొండ మండలం ముత్తారంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి హాజరుకావాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు హైదరాబాద్లో ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈమేరకు ఉత్సవాల పోస్టర్లను డిప్యూటీ సీఎం ఆవిష్కరించగా.. ఆలయ ఈఓ సమత, ప్రధాన అర్చకులు బొర్రా వాసుదేవాచార్యులు, శ్రీనివాసాచార్యులు, ఆలయ కమిటీ చైర్మన్ తుళ్లూరి జీవన్, సభ్యులు తిరపయ్య, వీరభద్రం, బుచ్చయ్య, నాయకులు అజయ్ పాల్గొన్నారు. వచ్చేనెల 7నుంచి ఎస్సెస్సీ మూల్యాంకనం ఖమ్మం సహకారనగర్: పదో తరగతి వార్షిక పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం వచ్చేనెల 7వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ఈమేరకు ఖమ్మంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో వాల్యూయేషన్ క్యాంప్ ఏర్పాటుకు నిర్ణయించారు. ఇప్పటివరకు పూర్తయిన పరీక్షల జవాబుపత్రాలు వివిధ జిల్లాల నుంచి బుధవారం ఇక్కడకు చేరగా స్ట్రాంగ్ రూమ్ల్లో భద్రపరిచారు. ప్రశాంతంగా ఎస్సెస్సీ పరీక్షలు పరిశీలించిన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఖమ్మం సహకారనగర్: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ వెల్లడించారు. ఖమ్మం రిక్కాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రాన్ని బుధవారం పరిశీలించిన ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని, ఎండ తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు చల్లని తాగునీరు సమకూరుస్తున్నామని తెలిపారు. చీఫ్ సూపరింటెండెంట్ కె.శేఖర్రావు, డిపార్ట్మెంటల్ అధికారి ఎన్.శ్రీనివాసచారి, సిట్టింగ్ స్క్వాడ్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, బుధవారం జరిగిన గణితం పరీక్షకు జిల్లాలో 16,417మంది విద్యార్థులకు గాను 16,388మంది హాజరు కాగా 29మంది గైర్హాజరయ్యారని డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు. సాగుకు నీటి కొరత ఉండదు.. తిరుమలాయపాలెం: జిల్లాలో సాగు అవసరాలకు మరో ఇరవై రోజుల వరకు నీటి కొరత ఉండదని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య తెలిపారు. మండలంలోని దమ్మాయిగూడెం, ఏలువారిగూడెం, బీరోలు, బచ్చోడు తదితర గ్రామాల్లో బుధవారం ఆయన వరి పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పంటల స్థితిగతులు, నీటి లభ్యతపై ఆరా తీసిన ఆయన నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. తద్వారా వేసవిలో తాగునీటికి ఇబ్బందులు ఉండవని చెప్పారు. కాగా, ఏప్రిల్ 1నుంచి జిల్లాలోని అన్ని మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని తెలిపారు. కూసుమంచి ఏడీఏ బి.సరిత, ఏఓ సీతారాంరెడ్డి, ఏఈఓ లంక రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
టీజేఏసీ జిల్లా చైర్మన్గా శ్రీనివాసరావు
ఖమ్మం సహకారనగర్: తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీజేఏసీ) జిల్లా కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. ఖమ్మంలోని టీఎన్జీవోస్ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్గా గుంటుపల్లి శ్రీనివాసరావు, కోకన్వీనర్గా టీజీవోస్ జిల్లా అధ్యక్షుడు కస్తాల సత్యనారాయణ ఎన్నికయ్యారు. అలాగే, కోచైర్మన్లుగా పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు, యూటీఎఫ్ కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తుంబూరు సునీల్రెడ్డి, పీఆర్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎం.రాజేష్తో పాటు కొణిదన శ్రీనివాస్, మల్లెల రవీంద్రప్రసాద్, చంద్రకంటి శశిధర్, చర్ల శ్రీనివాసరావు, బాబురత్నాకర్, పుల్లయ్య, వరప్రసాద్, సైదులు, బిక్కును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్, కోకన్వీనర్ మాట్లాడుతూ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఏప్రిల్ 1నుంచి ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పించడంతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జేఏసీ ఆధ్వర్యాన చేపట్టే కార్యక్రమాలకు అన్నివిభాగాల ఉద్యోగులు మద్దతు ఇవ్వాలని కోరారు. -
రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం
ఖమ్మంవ్యవసాయం: రైతుభరోసా పథకం ద్వారా పంటల పెట్టుబడికి రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నగదు జమ చేస్తోంది. జిల్లాలోని 59,061 మంది రైతుల ఖాతాల్లో మంగళవారం రూ.60.87 కోట్లు జమ అయ్యాయని అధికారులు వెల్లడించారు. ఐదెకరాల మేర సాగు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో నగదు జమ ప్రక్రియ కొనసాగుతోందని సమాచా రం. జిల్లాలో రైతు భరోసా పథకానికి 3,51,592 మంది రైతులను అర్హులుగా గుర్తించగా. ఎకరాకు రూ.6వేల చొప్పున రూ.371.06 కోట్లు జమ కావాల్సి ఉంది. ఇప్పటివరకు 2,65,392మంది రైతులకు రూ.215.78 కోట్లు అందాయి. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. తొలుత ఎంపిక చేసిన గ్రామాల్లో అందరు రైతులకు నగదు జమ చేయగా.. మిగిలిన గ్రామాల్లో ఎకరం భూమి మొదలు నగదు జమ చేస్తోంది. ఫిబ్రవరి 13వ తేదీవరకు మూడెకరాల లోపు భూమి కలిగిన రైతులకు పెట్టుబడి సాయం అందింది. ఆతర్వాత నిలిచిపోవటంతో రైతుల్లో సందేహాలు మొదలయ్యాయి. ఇంతలోనే ఐదెకరాల వరకు సాగు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుండగా.. ఈనెలాఖరు నాటికి అర్హులైన రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అవుతుందని చెబుతున్నారు. జిల్లాలో ఇంకా 86 వేల మంది రైతులకు వారికి ఉన్న భూమి ఆధారంగా రూ.156 కోట్ల సాయం అందాల్సి ఉంది. మరో 59 వేల మందికి రూ.60.87 కోట్లు జమ -
ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగేలా ఏర్పాట్లు
● సన్నరకం ధాన్యాన్ని అధికారులు ధ్రువీకరించాలి ● అధికారులతో సమీక్షలో కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ఖమ్మం సహకారనగర్: యాసంగి ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో మంగళవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్లో ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా పూర్తిచేసినట్లుగానే రబీలోనూ చేపట్టాలని తెలిపారు. సన్న, దొడ్డు రకం ధాన్యం కొనుగోళ్లకు వేర్వేరు కేంద్రాలను ఏర్పాటుచేసి అవసరమైన సామగ్రి సమకూర్చుకోవాలని సూచించారు. ఎండల కారణంగా సిబ్బంది, రైతులకు వడదెబ్బ తగిలితే ప్రాథమిక చికిత్సకు ఏర్పాట్లు చేయాలన్నారు. కేంద్రాల ఇన్చార్జిలకు నూతన సిమ్ కార్డులు అందించి ఎప్పటికప్పుడు వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తూ రైతులకు 48 గంటల వ్యవధిలో నగదు జమ చేయించాలని సూచించారు. ఇక సన్న రకం ధాన్యాన్ని అధికారులు పక్కాగా ధ్రువీకరించాలని, రైస్ మిల్లుకు వెళ్లాక తాలు పేరిట కోత విధించకుండా చూడాలని తెలిపారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, డీసీఓ చందన్కుమార్, డీఎం శ్రీలత, డీఆర్డీఓ సన్యాసయ్య, డీఏఓ డి.పుల్లయ్య, మార్కెటింగ్ అధికారి ఎం.ఏ.అలీం, జిల్లా సహకార అధికారి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయంలో వసతుల కల్పనకు కృషి ఖమ్మంగాంధీచౌక్: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో అవసరమైన వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని కలెక్టర్ ముజమ్మల్ ఖాన్ తెలిపారు. ఖమ్మంలోని కేంద్ర గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన ఆయన వాటర్ ప్లాంట్, టాయిలెట్లను పరిశీలించాక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్దులతో మాట్లాడారు. అవసరమైన పుస్తకాలు లేకపోతే జాబితా సమర్పించాలని నిర్వాహకులకు సూచించారు. అలాగే, ఈ– లైబ్రరీ ఏర్పాటుచేయాలని తెలిపారు. లైబ్రరీ కార్యదర్శి అర్జున్, లైబ్రేరియన్లు కె.రవిబాబు, బి.బాబూరావు, విజయ్భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
నిందితులకు శిక్ష ఖరారయ్యేలా దర్యాప్తు
● ప్రతీ పోలీస్స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్ ● నేర సమీక్ష సమావేశంలో సీపీ సునీల్దత్ఖమ్మంక్రైం: నేరం చేసిన వారెవరు శిక్ష నుంచి తప్పించుకోలేరనే రీతిలో దర్యాప్తు చేయడమే కాకుండా పకడ్బందీ ఆధారాలతో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని పోలీసు కమిషనర్ సునీల్దత్ ఆదేశించారు. ఖమ్మంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం నిర్వహించిన నేరసమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇటీవల పలు కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడేలా చార్జిషీట్లు దాఖలు చేసిన అధికారులను అభినందించారు. అనంతరం స్టేషన్ల వారీగా నమోదైన కేసులు, దర్యాప్తు స్థితిగతులపై ఆరా తీశాక పలు సూచనలు చేశారు. అక్రమాలపై నిఘా కీలకమైన కేసుల్లో దర్యాప్తు మొదలు చార్జిషీట్ దాఖలు వరకు ప్రణాళికాయుతంగా వ్యవహరించాలని సీపీ సూచించారు. ప్రతీ పోలీస్స్టేషన్ పరిధిలో విధిగా విజుబుల్ పోలీసింగ్ అమలుచేస్తూ నేరాలను నియంత్రించాలన్నారు. గంజాయితో పాటు ఇసుక అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని స్పష్టం చేశారు. అలాగే, పోక్సో, అట్రాసిటీ కేసుల దర్యాప్తుల్లో మరింత నాణ్యత పాటించాలని, ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యాన బెట్టింగ్, నిర్మానుష్య ప్రాంతాల్లో అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షించాలని తెలిపారు. అంతేకాక అన్ని స్టేషన్ల పరిధిలో ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహించాలని సీపీ సూచించారు. ఈసమావేశంలో అడిషనల్ డీసీపీ నరేష్కుమార్, ట్రెయినీ ఐపీఎస్ సాయిరుత్విక్, ఏసీపీలు రమణమూర్తి, తిరుపతిరెడ్డి, రెహమాన్, రఘు, వెంకటేష్, సాంబరాజు, రవి, సర్వర్, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
నిందితులకు శిక్ష ఖరారయ్యేలా దర్యాప్తు
● ప్రతీ పోలీస్స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్ ● నేర సమీక్ష సమావేశంలో సీపీ సునీల్దత్ఖమ్మంక్రైం: నేరం చేసిన వారెవరు శిక్ష నుంచి తప్పించుకోలేరనే రీతిలో దర్యాప్తు చేయడమే కాకుండా పకడ్బందీ ఆధారాలతో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని పోలీసు కమిషనర్ సునీల్దత్ ఆదేశించారు. ఖమ్మంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం నిర్వహించిన నేరసమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇటీవల పలు కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడేలా చార్జిషీట్లు దాఖలు చేసిన అధికారులను అభినందించారు. అనంతరం స్టేషన్ల వారీగా నమోదైన కేసులు, దర్యాప్తు స్థితిగతులపై ఆరా తీశాక పలు సూచనలు చేశారు. అక్రమాలపై నిఘా కీలకమైన కేసుల్లో దర్యాప్తు మొదలు చార్జిషీట్ దాఖలు వరకు ప్రణాళికాయుతంగా వ్యవహరించాలని సీపీ సూచించారు. ప్రతీ పోలీస్స్టేషన్ పరిధిలో విధిగా విజుబుల్ పోలీసింగ్ అమలుచేస్తూ నేరాలను నియంత్రించాలన్నారు. గంజాయితో పాటు ఇసుక అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని స్పష్టం చేశారు. అలాగే, పోక్సో, అట్రాసిటీ కేసుల దర్యాప్తుల్లో మరింత నాణ్యత పాటించాలని, ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యాన బెట్టింగ్, నిర్మానుష్య ప్రాంతాల్లో అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షించాలని తెలిపారు. అంతేకాక అన్ని స్టేషన్ల పరిధిలో ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహించాలని సీపీ సూచించారు. ఈసమావేశంలో అడిషనల్ డీసీపీ నరేష్కుమార్, ట్రెయినీ ఐపీఎస్ సాయిరుత్విక్, ఏసీపీలు రమణమూర్తి, తిరుపతిరెడ్డి, రెహమాన్, రఘు, వెంకటేష్, సాంబరాజు, రవి, సర్వర్, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
అసిస్టెంట్ ప్రొఫెసర్కు డాక్టరేట్
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల జువాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ బూర్గుల కవితకు కాకతీయ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ప్రకటించారు. కేయూ జువాలజీ విభాగం ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి పర్యవేక్షణలో ఆమె సమర్పించిన పరిశోధనా సిద్ధాంత గ్రంథానికి డాక్టరేట్ లభించింది. ఈ సందర్భంగా కవితను మంగళవారం కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జాకీరుల్లా, జువాలజీ విభాగాధిపతి డాక్టర్ సునందతో పాటు అధ్యాపకులు అభినందించారు. మత్స్యకారులకు కొనసాగుతున్న శిక్షణ కూసుమంచి: మండలంలోని పాలేరు శ్రీ పీ.వీ.నర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రంలో ఖమ్మం జిల్లాకు చెందిన షెడ్యూల్డ్ కులాల మత్స్యకారులకు ఇస్తున్న శిక్షణ మంగళవారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా గడ్డిపల్లి కేవీకే సీనియర్ శాస్త్రవేత్త బి.లవకుమార్ పాల్గొని జలాశయాల్లో పెంచే వివిధ రకాల చేపపిల్లల విత్తనాల ఎంపికపై అవగాహన కల్పించారు. తెలంగాణను ఆక్వా హబ్గా మార్చేందుకు మత్స్యకారులు అధునాతన విధానాలు పాటగించాలని తెలిపారు. అనంతరం కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్, శాస్త్రవేత్తలు శాంతన్న, రవీందర్ మాట్లాడగా వివిధ రకాల వలల తయారీపై శిక్షణ ఇచ్చారు. మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో కాంస్యపతకం ఖమ్మం స్పోర్ట్స్: గోవాలో ఇటీవల జరిగిన జాతీయస్థాయి మాస్టర్స్ బ్యాడ్మింటన్ పోటీల్లో ఖమ్మంకు చెందిన రిటైర్డ్ ఇన్స్పెక్టర్ కె.నర్సయ్య బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్నారు. గోవాలో ఈనెల 16నుంచి 23వ తేదీ వరకు పోటీలు జరగగా పతకం సాధించిన ఆయన జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ జట్టులో స్థానం దక్కించుకుని థాయ్లాండ్లో జరిగే అంతర్జాతీయ టోర్నీకి ఎంపికయ్యారు. ఈసందర్భంగా 75ఏళ్ల వయస్సులో ప్రతిభ చూపిన నర్సయ్యను బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంటా వెంకట్రావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కర్నాటి వీరభద్రం, వి.చంద్రశేఖర్తో పాటు జట్ల శ్రీను, సుదర్శన్రావు, పి.రవిమారుత్, కమర్తపు మురళి, సత్యనారాయణ, బాలసాని ఆనంద్, పి.యుగంధర్, ఆర్.శ్రీనివాస్రెడ్డి అభినందించారు. ప్రభుత్వాస్పత్రిలో ‘కాయకల్ప’ బృందం పెనుబల్లి: పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రిని కాయకల్ప బృందం మంగళవారం తనిఖీ చేసింది. ఈసందర్భంగా ఆస్పత్రి ఆవరణలో పరిశుభ్రత, వైద్యసేవలు, రికార్డుల నిర్వహణ, ఫార్మసీలో మందు లభ్యత వివరాలు ఆరా తీశారు. అలాగే, చికిత్స కోసం వచ్చిన వారితో మాట్లాడుతూ వైద్యసేవలు ఎలా అందుతున్నాయో తెలసుకున్నారు. ఈ బృందంలో డాక్టర్ ఎస్. సోమరాజు, సిబ్బంది పి.రేవతి, బి.రజిని, కె.ప్రమీల ఉన్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్ కిరణ్కుమార్ తెలిపారు. జీప్ను తగలబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలం బేతుపల్లిలో ఓ ఇంటి ముందు పార్కు చేసిన జీప్ను గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి పెట్రోల్ పోసి దహనం చేశారు. గ్రామంలో చాంద్పాషా ఇంటి ముందు నిలిపిన జీప్పై అర్ధరాత్రి వేళ కారులో వచ్చిన కొందరు వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించగా మంటలు వ్యాపించాయి. స్థానికులు గుర్తించి వచ్చేలోగా దుండగులు పారిపోయారు. ఈ ఘటనలో జీప్ పూర్తిగా కాలిపోగా, చాంద్పాషా మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరా ధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహంచారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. -
ఇకపై కల్లూరు మున్సిపాలిటీ!
● శాసనసభ సమావేశాల్లో ఆమోదం ● మండలిలో ఆమోదించాక గవర్నర్ సంతకమే తరువాయి.. ● 23,484 మంది జనాభాతో ఏర్పాటు కల్లూరు: కల్లూరును మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయాలని కోరుతున్న ప్రజల కల ఎట్టకేలకు సాకారమైంది. అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం కల్లూరు మున్సిపాలిటీకి సంబంధించి ముసాయిదాను మంత్రి శ్రీధర్బాబు ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో శాసన మండలిలోనూ ఆమోదించాక గవర్నర్ సంతకం పెడితే కల్లూరు మేజర్ గ్రామపంచాయతీ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ కానుంది. ఇదే జరిగితే జిల్లాలో ఐదో మున్సిపాలిటీఏర్పాటవుతుంది. ఖమ్మం కార్పొరేషన్కు తోడు మధిర, వైరా, సత్తుపల్లి మున్సిపాలిటీలు ఉండగా ఇటీవలే ఏదులాపురం మున్సిపాలిటీ ఏర్పాటైన విషయం విదితమే. డిసెంబర్లో మంత్రి హామీ గత ఏడాది డిసెంబర్ 21న మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ మోడల్ ఇంటి శంకుస్థాపనకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మాట్లాడుతూ కల్లూరు ప్రజల చిరకాల కోరిక అయిన మున్సిపాలిటీ అంశాన్ని ప్రస్తావించగా.. త్వరలోనే కల సాకారమవుతుందని హామీ ఇచ్చారు. ఆతర్వాతఈ ఏడాది జనవరి 3వ తేదీన పంచాయతీ ఈఓ నందిశెట్టి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన గ్రామసభలో మెజారిటీ ప్రజలు మున్సిపాలిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. దీంతో అసెంబ్లీలో ముసాయిదా ప్రవేశపెట్టగా ఆమోదం లభించింది. ఆ గ్రామాలు మళ్లీ... పరిపాలనా సౌలభ్యం కోసం 2018లో కల్లూరు, ఖాన్ఖాన్పేట, శ్రీరామపురం, జీడీబీపల్లి మినహా కప్పలబంధం, తూర్పు లోకవరం, పడమర లోకవరం, కిష్టయ్యబంజర్, పుల్లయ్యబంజర, హనుమా తండా గ్రామాలను విడదీసి కొత్త పంచాయతీలుగా ఏర్పాటుచేశారు. కల్లూరు, శ్రీరామపురం, ఖాన్ఖాన్పేట, జీడీబీపల్లి గ్రామాల్లో 18,170 మంది జనాభా ఉండగా, సుమారు 13,500 మంది ఓటర్లు ఉంటారు. అయితే, మున్సిపాలిటీ ఏర్పాటుకు కనీసం 20 వేల మంది జనాభా అవసరం కావడంతో పూర్వం విడిపోయిన ఆరు గ్రామాలే కాక వాచ్యా నాయక్ తండాను కూడా కలపనున్నాయి. దీంతో 23,484 మంది జనాభాతో కల్లూరు మున్సిపాలిటీగా అవతరించనుంది. ఈ మేరకు ఆయా గ్రామాల్లో తీర్మానాలు చేసి ఇప్పటికే కలెక్టర్కు నివేదికలు పంపించారు. కలెక్టరేట్కు నివేదిక మున్సిపాలిటీగా మారనున్న నేపథ్యాన కల్లూరు పంచాయతీలో గ్రామసభ నిర్వహించగా మెజారిటీ గ్రామస్తులు ఆమోదం తెలిపారు. అంతేకాక విలీనం కానున్న గ్రామాల్లోనూ సభలు నిర్వహించి కలెక్టరేట్కు నివేదిక పంపించాం. – ఎన్.నాగేశ్వరరావు, ఈఓ -
పెద్దాస్పత్రిలో పనిచేయని ఏసీలు
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలోని పలు విభాగాల్లో ఏసీలు సక్రమంగా పనిచేయడం లేదు. ఇందులో చాలావరకు పాతవి కావడంతో మొరాయిస్తుండగా, ఎన్నిసార్లు మరమ్మతు చేయించినా అదే పరిస్థితి పునరావృతమవుతోంది. జనరల్ ఆస్పత్రితో పాటు మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో కలిపి 120 వరకు ఏసీలు ఉండగా అందులో సుమారు 100 మేర పనిచేయడం లేదు. ప్రస్తుతం మధ్యాహ్న సమయంలో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో చికిత్స కోసం వచ్చిన వారు ఇబ్బంది పడుతున్నారు. గర్భిణులు, చిన్నారుల వార్డుల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంటోంది. చివరకు మిల్క్ బ్యాంక్లోనూ అన్ని ఏసీలు పనిచేయని కారణంగా సేవలో ప్రభావం పడుతోందని సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ ఆస్పత్రికి కొత్త ఏసీలు కేటాయించాలని పలువురు కోరుతున్నారు.పలు విభాగాల్లో ఇదే పరిస్థితి -
కేఎంసీ బడ్జెట్.. రూ.188.31కోట్లు
● సొంత నిధులతో పాటు ప్రభుత్వ నిధులపై ఆశలు ● అన్ని డివిజన్లలో రీ–అసెస్మెంట్ సర్వేకు నిర్ణయం ● కౌన్సిల్ భేటీలో పాల్గొన్న మేయర్ నీరజ, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ● సమస్యలపై కార్పొరేటర్లు.. ప్రొటోకాల్పై ఎమ్మెల్సీ మధు ప్రస్తావన ఖమ్మంమయూరిసెంటర్: రానున్న ఆర్థిక సంవత్సరానికి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం భారీ బడ్జెట్ రూపొందించింది. రూ.188.31 కోట్లతో రూపొందించిన బడ్జెట్పై చర్చ, ఆమోదానికి ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో మేయర్ పునుకొల్లు నీరజ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ పాల్గొనగా... 2025–2026 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు, ఆదాయం, వ్యయం వివరా లే కాక 2024–2025 సవరించిన బడ్జెట్ను అకౌంట్స్ అధికారి శివలింగం ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఆదాయానికి తోడు సొంతనిధులు కలిపి భారీ బడ్జెట్ సమర్పించినట్లు పాలకవర్గం వెల్లడించింది. ప్రాథమిక లెక్కలపై లోతుగా చర్చ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ బడ్జెట్ ప్రాథమిక లెక్కలపై లోతుగా చర్చించినట్లు తెలిపారు. ఆస్తిపన్ను వసూలు లక్ష్యాలను చేరుకోవడమే కాక ఆస్తి పన్ను, ఇతర పన్నుల రీఅసెస్మెంట్తో ఆదాయ మార్గాలు పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అర్బన్కు ప్రత్యేకంగా ఇద్దరు తహసీల్దార్లు, ముగ్గురు సర్వేయర్ల కేటాయింపునకు నెలలోగా ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తుందని తెలిపారు. అలాగే, దూరదృష్టితో మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామని వెల్లడించారు. విలీన పంచాయతీలపై దృష్టి.. మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ విలీన పంచాయతీల అభివృద్ధిపైనే ప్రత్యేక దృష్టి సారించాలన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనలతో బడ్జెట్ కేటాయించామని తెలిపారు. రోడ్లు, డ్రెయినేజీలు లేనిచోటే నిర్మాణాలు జరుగుతాయన్నారు. వచ్చే నెల మొదటి వారం మరోసారి కౌన్సిల్ సమావేశం నిర్వహించి కార్పొరేటర్ల నుండి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని తెలిపారు. ఆదాయం పెంపుపై దృష్టి.. కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ కార్పొరేషన్ ఆదాయం పెంచాలనే లక్ష్యంతో 43వ డివిజన్లో పన్నుల రీఅసెస్మెంట్ చేయగా రూ.60లక్షల మేర ఆదాయం పెరిగిందని తెలిపారు. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం అన్ని డివిజన్లలో ఈ ప్రక్రియ చేపడుతామని వెల్లడించారు. నగరంలో 7వేల వాణిజ్య సంస్థలే రిజిస్టర్ కాగా.. క్షేత్రస్థాయిలో ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉందన్నారు. ఈమేరకు వ్యాపారులంతా ట్రేడ్ లైసెన్స్ తీసుకునేలా సర్వే చేస్తామని తెలిపారు. అలాగే, కేఎంసీని ఐదు జోన్లుగా విభజించే ప్రణాళికను వచ్చే కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెడతామని వెల్లడించారు. ప్రొటోకాల్ రగడ కేఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభానికి ముందు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాలకు హాజరవుతున్నానని తెలిపినా అధికారులు సీటు కేటాయించలేదని మండిపడ్డారు. అయితే ఎమ్మెల్సీకి ప్రత్యేక సీటు కేటాయించి నేమ్ బోర్డు ఏర్పాటుచేసినా.. తొలుత వచ్చిన కార్పొరేటర్లు ఆ బోర్డును పక్కన పెట్టడం ఈ వివాదానికి కారణమైంది. ●కార్పొరేటర్ కమర్తపు మురళి మాట్లాడుతూ గ్రౌండ్ ఫ్లోర్కు అనుమతి తీసుకొని మూడు, నాలుగు ఫ్లోర్లు నిర్మిస్తున్న వారిని గుర్తించి ఆస్తి పన్ను వసూలు చేయాలని సూచించారు. అద్దెల కింద ఆదాయం పెంచడంపై దృష్టి సారించాలని, అనుమతులు లేకుండా ఇళ్లను గుర్తించి పన్నులు విధించాలని తెలిపారు. ●పలువురు కార్మికులను ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా గుర్తించాలని కార్పొరేటర్ బీ.జీ.క్లెమెంట్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లు కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని తెలిపారు. తన డివిజన్లో పలు రోడ్ల విస్తరణ, అభివృద్ధి ఆవశ్యతను వివరించారు. ●కార్పొరేటర్ నాగండ్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ కేటాయించిన బడ్జెట్ఖర్చు చేయనందున ఆ నిధులు ఏమి చేస్తున్నారో చెప్పాలన్నారు. అంతేకాక విలీన గ్రామాలకు మరిన్ని నిధులు కేటాయించి రహదారులు, డ్రెయినేజీలు, ఇతర అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు.ఆదాయం ఇలా.. కోట్లు (రూ.ల్లో)ఇంటి పన్నులు 33.92స్టాంప్ డ్యూటీ 13.00అద్దెల ద్వారా 4.43 పారిశుద్ధ్య విభాగం 3.61ప్రణాళిక విభాగం 36.10ఇంజనీరింగ్ విభాగం 11.76డిపాజిట్లు 6.76ప్రణాళికేతర నిధులు 61.05ప్రణాళిక నిధులు 14.75ఇతర నిధులు 2.92 -
‘బార్’ ఎన్నికలకు ఊపందుకున్న ప్రచారం
ఖమ్మం లీగల్: ఖమ్మం బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం జరగనుండా ప్రచారం ఉధృతంగా సాగుతోంది. బరిలో నిలిచిన అభ్యర్థులు తమ విజయాన్ని కాంక్షిస్తూ న్యాయవాదులను వ్యక్తిగతంగా కలవడమే వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపిస్తున్నారు. ఇంకొందరు సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో యువ, మహిళా న్యాయవాదుల ఓట్లు కీలకం కానున్నట్లు తెలుస్తోంది. బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఎస్.వెంకటగుప్తా, తొండపు వెంకటేశ్వరరావు, విజయ రాఘవ, ఉపాధ్యక్ష పదవికి ఎస్.కే.జానీమియా, విజయశాంత, రవిప్రసాద్, ప్రధాన కార్యదర్శి పదవికి గద్దల దిలీప్, తెల్లాకుల రమేష్బాబు, క్రీడా కార్యదర్శి పదవికి కే.వీ.వీ.లక్ష్మి, రాందాస్నాయక్, గ్రంథాలయ కార్యదర్శిగా కళ్యాణి, రాంబాబు పోటీ పడుతున్నారు. ఇక సంయుక్త కార్యదర్శి, కోశాధికారిగా మేకల నవీన్, నరసింహారావు, మహిళా ప్రతినిధిగా ఇందిర ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా, ఎన్నికల గడువు సమీపిస్తుండడంతో అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. మొత్తం 816 మంది న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకోనుండగా విజయం వరిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. -
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన బోధన
చింతకాని/వైరా రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడమే కాక నాణ్యమైన బోధన అందిస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖర్మ శర్మ తెలిపారు. చింతకాని మండలంలోని మత్కేపల్లి ఉన్నత పాఠశాలలో చదువుతున్న 10మంది విద్యార్థులకు వైరా మండలం అష్ణగుర్తికి చెందిన సువిధ వికాస్ ట్రస్ట్ సమకూర్చిన సైకిళ్లను మంగళవారం ఆయన అందజేసి మాట్లాడారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో పాటు దాతల చేయూతను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థానాలకు చేరాలని సూచించారు. అలాగే, వైరా మండలం రెబ్బవరం జెడ్పీహెచ్ఎస్కు చెందిన ఏడుగురికి సువిధ ట్రస్ట్ బాధ్యులు సైకిళ్లు అందించారు. ఈకార్యక్రమాల్లో ఎంఈఓలు వీరపనేని శ్రీనివాసరావు, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, అమ్మ ఆదర్శ పాఠశాలల చైర్మన్లు బొల్లికొండ మంగమ్మ, ఆకుల లలిత, ఇన్చార్జ్ హెచ్ఎంలు అనిత, గంగవరపు వెంకట్రావు, ఉపాధ్యాయులు గండేపల్లి శ్రీనివాసరావు, ఉమామహేశ్వరరావు, సురేష్, నాగమణి, హసీనా, సమ్మయ్య, దొడ్డా వరప్రసాద్, జీ.వీ.సూర్యప్రకాష్, ట్రస్ట్ బాధ్యులు అమరనేని మన్మధరావు, వేంసాని వెంకట్ పాల్గొన్నారు. -
సికిల్సెల్ బాధితులకు యూడీఐడీ కార్డులు
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో సికిల్సెల్తో బాధపడుతున్న వారి వివరాలు సేకరించి దివ్యాంగులుగా సర్టిఫికెట్లు(యూడీఐడీ కార్డులు)జారీ అయ్యేలా చేడాలని డీఎంహెచ్ఓ కళావతిబాయి సూచించారు. జిల్లా ప్రధాన ఆస్పత్రి, పీహెచ్సీలు, యూపీహెచ్సీల వైద్యులు, లాబ్ టెక్నీషియన్లు, ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ఉపాధ్యాయులకు మంగళవారం ఖమ్మంలో సికిల్సెల్ అనీమియాపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ సికిల్ సెల్ అనీమియా వారసత్వంగా వచ్చే జన్యుపరమైన రక్త రుగ్మత అని తెలిపారు. ఇప్పటివరకు 87,448 మంది గిరిజనులకు పరీక్షలు చేయగా వ్యాధి ఉన్న వారిని గుర్తించి చికిత్స అందిస్తున్నామన్నారు. వీరికి సదరమ్ సర్టిఫికెట్(యూనిక్ డిజేబిలిటీ ఐడెంటీ కార్డ్) జారీ చేయనున్నట్లుతెలిపారు. అనంతరం సికిల్సెల్ నోడల్ ఆఫీసర్ వెంకటరమణ,అదనపు డీఎంహెచ్ఓ సైదులు, ప్రోగ్రాం అధికారులు చందునాయక్, రామారావు మాట్లాడగా స్టేట్ సికిల్ సెల్ ట్రెయినర్లు మధువరన్, గణేష్నాయక్ సర్వే చేయాల్సి తీరు, వ్యాధి లక్షణాలను వివరించారు. వివిధ విభాగాల ఉద్యోగులు ఎస్.సుబ్రహ్మణ్యం, సాంబశివరెడ్డి పాల్గొన్నారు. ఖమ్మంలో తెరుచుకున్న మధ్య గేట్ ఖమ్మం రాపర్తినగర్: మూడో రైల్వే లైన్ పనుల కారణంగా నెలల తరబడి మూసి ఉంటున్న ఖమ్మంలోని రైల్వే మధ్య గేట్ ఎట్టకేలకు తెరుచుకుంది. నెలలుగా గేట్ మూసి ఉండడంతో జిల్లా కేంద్రంలో ప్రధానమైన గాంధీచౌక్, కమాన్ బజార్ మధ్య వ్యాపార లావాదేవీలు మందగించాయి. అలాగే, ప్రజల రాకపోకలకు ఇక్కట్లు ఎదురయ్యాయి. దీంతో సమస్యను ఎంపీ రవిచంద్ర ఇటీవల రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు. గేట్ తెరిపించడమే కాక శాశ్వత పరిష్కారానికి బ్రిడ్జి నిర్మించాలని కోరారు. దీంతో అండర్ పాస్ మంజూరుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సూచించిన మంత్రి.. ఆలోగా గేటు తెరవాలని ఆదేశించారు. దీంతో గేట్ తెరిచి మంగళవారం నుంచి రాకపోకలకు అనుమతించడంతో వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఎల్ఆర్ఎస్.. అన్నా చిక్కులే
సాంకేతిక సమస్యలతో దరఖాస్తుదారుల సతమతం ● మున్సిపల్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు ● 31వ తేదీతో ముగియనున్న ఫీజు గడువునాటి దరఖాస్తులకే.. ఎల్ఆర్ఎస్ ఫీజుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన రాయితీ గడువు ముంచుకొస్తోంది. రాయితీని సద్వినియోగం చేసుకునేందుకు 2020 ఆగస్ట్ 26కు ముందు రూ.వెయ్యి కట్టిన వారు ఫీజు చెల్లించేందుకు కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. ఒకేసారి దరఖాస్తుదారుల సంఖ్య పెరగడంతో సర్వర్లు కూడా మొరాయిస్తున్నాయి. దరఖాస్తుల స్థితిని తెలుసుకునేందుకు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. జిల్లావ్యాప్తంగా 99,913 దరఖాస్తులు ఉండగా.. 61,343దరఖాస్తులు ఫీజు చెల్లింపునకు అర్హత సాధించాయి. ఇందులో 5,731 మంది దరఖాస్తుదారులే ఫీజు చెల్లించారు. ఐజీఆర్ఎస్ అయోమయం ఫీజు చెల్లించాలని మెసేజ్లు రాకపోవడంతో పలువురు కార్యాలయాలకు వచ్చి ఆరా తీస్తున్నారు. వీరి దరఖాస్తు నంబర్ల ఆధారంగా ఆన్లైన్లో పరిశీలిస్తే ‘ఐజీఆర్ఎస్’(ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రెవెన్యూ అండ్ స్టాంప్స్) అనే మెసేజ్ చూపిస్తోంది. ఇదేమిటంటే.. ఐజీఆర్ఎస్లో ఉన్న దరఖాస్తులకు ఫీజు చెల్లించాలనే మెసేజ్ రాదని.. ప్రభుత్వమే ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే, మరోవైపు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి స్థల వాల్యుయేషన్ సర్టిఫికెట్ తీసుకొచ్చి అటాచ్ చేస్తే ఎంత ఫీజు చెల్లించాలనే మెసేజ్ రావొచ్చని పేర్కొంటున్నారు. అన్నీ ఉన్నా ఆ జాబితాలో.. ప్రభుత్వ స్థలాలు, ఇరిగేషన్ స్థలాలకు సంబంధించిన సర్వే నంబర్లలో ఉన్న దరఖాస్తులను ప్రభుత్వం ప్రొహిబిటెడ్(నిషేధిత జాబితా) కింద చేర్చింది. వీటిని రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్ప్లానింగ్ అధికారులు పరిశీలిస్తే ప్రొహిబిటెడ్ వర్తిస్తుందా, లేదా అన్నది తేలనుంది. ఈ దరఖాస్తులను పరిశీలించాలంటే ఇంకొంత సమయం పడుతుంది. క్షేత్ర స్థాయిలో సిబ్బంది కొరతతో ఈ ప్రక్రియ ఆలస్యమవుతోందని సమాచారం. అన్ని పత్రాలతో ఎల్ఆర్ఎస్కి దరఖాస్తు చేసుకున్నా తమది నిషేధిత జాబితాలో ఎందుకు పడిందని కొందరు హెల్ప్డెస్క్ల వద్ద సిబ్బందిని నిలదీస్తున్నారు. నత్తనడకనే చెల్లింపులు ఖమ్మం కార్పొరేషన్తోపాటు సత్తుపల్లి, మధిర,వైరా, ఏదులాపురం మున్సిపాలిటీల్లో ఫీజు చెల్లింపునకు 30,813 దరఖాస్తులు అర్హత సాధించాయి. ఇందులో 4,163 మందే రూ.22.42కోట్ల మేర ఫీజు చెల్లించగా, 2,416 మందికి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఇక సుడా పరిధిలో 19,070 దరఖాస్తులు అర్హత సాధిస్తే రూ.3.85కోట్ల ఫీజు చెల్లించిన 1,357 మందిలో 80 దరఖాస్తులకు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి రూ.3.85 కోట్లు చెల్లించారు. ఇక జిల్లాలోని గ్రామపంచాయతీల్లో ఫీజు చెల్లించేందుకు 11,460 దరఖాస్తులు అర్హత సాధించగా.. 211 మంది మాత్రమే ఫీజు చెల్లించారు. అంతా సాఫీగా ఉన్న దరఖాస్తులకు ఫీజు చెల్లింపు ప్రక్రియ నత్తనడకన కొనసాగుతుండడం గమనార్హం.ఎల్ఆర్ఎస్(లే ఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) చిక్కులమయంగా మారింది. ఫీజు చెల్లిస్తే ప్రక్రియ పూర్తవుతుందని భావించిన దరఖాస్తుదారులను సాంకేతిక సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. సాంకేతిక లోపాలతో సర్వర్లు మొరాయిస్తుండగా.. ఫీజు గడువు ఈనెల 31తో ముగియనుండడం వారి ఆందోళనకు కారణమవుతోంది. కొందరికి ఫీజు చెల్లించాలనే సమాచారం రాకపోవడంతో కార్యాలయాలకు వెళ్లి ఆరా తీస్తే ఐజీఆర్ఎస్ అని వస్తోంది. ఇంకొందరి స్థలాలు నిషేధిత జాబితాలో కనిపిస్తున్నాయి. ఈ సమస్యల పరిష్కారం ఎలాగో తెలియక అధికారులు.. ఎప్పుడు మెసేజ్ వస్తుందోనని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మరికొద్ది రోజులు గడువు పెంచితే తప్ప జిల్లాలో ఉన్న దరఖాస్తులకు మోక్షం లభించే అవకాశం లేదని చెబుతున్నారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మంఐజీఆర్ఎస్ అని వస్తోంది.. ఖమ్మం ఇల్లెందు రోడ్డులో ఎస్ఎఫ్ఎస్ స్కూల్ పక్కన ఉన్న స్థలానికి ఎల్ఆర్ఎస్ కోసం 2020లో దరఖాస్తు చేశా. నగదు చెల్లిద్దామని చూస్తే ఐజీఆర్ఎస్ అని వస్తోంది. కార్పొరేషన్ ఽఅధికారులను అడిగితే ఏం చేయలేమంటున్నారు. దరఖాస్తు చేసుకునే సమయాన అన్ని పత్రాలు సమర్పించా. ప్రతిరోజు మెసేజ్ వస్తుందేమోనని ఎదురుచూస్తున్నా. – గోపినేని శ్రీధర్రావు, బుర్హాన్పురం, ఖమ్మంఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలు ప్రాంతం దరఖాస్తులు పెండింగ్ ప్రొహిబిటెడ్ ఖమ్మం కార్పొరేషన్ 39,999 16,388 5,550 వైరా మున్సిపాలిటీ 3,524 751 – మధిర 4,280 147 146 ఏదులాపురం 13,496 10,002 269 సత్తుపల్లి 3,688 88 77 సుడా 20,759 2,145 740 జీపీలు 14,167 2,208 696మొత్తం 99,913 31,729 7,478 -
ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగేలా ఏర్పాట్లు
● సన్నరకం ధాన్యాన్ని అధికారులు ధ్రువీకరించాలి ● అధికారులతో సమీక్షలో కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ఖమ్మం సహకారనగర్: యాసంగి ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో మంగళవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్లో ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా పూర్తిచేసినట్లుగానే రబీలోనూ చేపట్టాలని తెలిపారు. సన్న, దొడ్డు రకం ధాన్యం కొనుగోళ్లకు వేర్వేరు కేంద్రాలను ఏర్పాటుచేసి అవసరమైన సామగ్రి సమకూర్చుకోవాలని సూచించారు. ఎండల కారణంగా సిబ్బంది, రైతులకు వడదెబ్బ తగిలితే ప్రాథమిక చికిత్సకు ఏర్పాట్లు చేయాలన్నారు. కేంద్రాల ఇన్చార్జిలకు నూతన సిమ్ కార్డులు అందించి ఎప్పటికప్పుడు వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తూ రైతులకు 48 గంటల వ్యవధిలో నగదు జమ చేయించాలని సూచించారు. ఇక సన్న రకం ధాన్యాన్ని అధికారులు పక్కాగా ధ్రువీకరించాలని, రైస్ మిల్లుకు వెళ్లాక తాలు పేరిట కోత విధించకుండా చూడాలని తెలిపారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, డీసీఓ చందన్కుమార్, డీఎం శ్రీలత, డీఆర్డీఓ సన్యాసయ్య, డీఏఓ డి.పుల్లయ్య, మార్కెటింగ్ అధికారి ఎం.ఏ.అలీం, జిల్లా సహకార అధికారి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయంలో వసతుల కల్పనకు కృషి ఖమ్మంగాంధీచౌక్: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో అవసరమైన వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని కలెక్టర్ ముజమ్మల్ ఖాన్ తెలిపారు. ఖమ్మంలోని కేంద్ర గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన ఆయన వాటర్ ప్లాంట్, టాయిలెట్లను పరిశీలించాక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్దులతో మాట్లాడారు. అవసరమైన పుస్తకాలు లేకపోతే జాబితా సమర్పించాలని నిర్వాహకులకు సూచించారు. అలాగే, ఈ– లైబ్రరీ ఏర్పాటుచేయాలని తెలిపారు. లైబ్రరీ కార్యదర్శి అర్జున్, లైబ్రేరియన్లు కె.రవిబాబు, బి.బాబూరావు, విజయ్భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
280 జీపీల్లో నూరు శాతం పన్నుల వసూలు
నేలకొండపల్లి: జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో వంద శాతం పన్నుల వసూలు లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) పి.ఆశాలత తెలిపారు. నేలకొండపల్లి గ్రామపంచాయతీ కార్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేసిన ఆమె రికార్డులను పరిశీలించాక మాట్లాడారు. జిల్లాలోని 579 జీపీల్లో రూ.15.80 కోట్ల పన్నుల డిమాండ్ ఉండగా.. రూ.14 కోట్లకు పైగా(89శాతం) వసూలయ్యాయని తెలిపారు. మొత్తంగా 280 జీపీల్లో నూరు శాతం పన్నులు వసూలవడంతో ఈనెలాఖరు నాటికి వంద శాతం లక్ష్యం సాధిస్తామని చెప్పారు. అవసరమైతే ప్రభుత్వ భవనాలకు నోటీసులు అందించి వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాగా, తాగునీటికి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాలని, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా కంచెలు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. తొలుత డీపీఓ కార్యాలయంలో ఈఓ చాంబర్కు రాగా, కుర్చీలకు దుమ్ము పట్టి ఉండడంతో కార్యాలయ నిర్వహణ ఇలాగేనా అంటూ అసహనం వ్యక్తం చేస్తూ శుభ్రం చేయించారు. ఎంపీఓ సీ.హెచ్.శివ, పంచాయతీరాజ్ డీఈఈ వంశీ తదితరులు పాల్గొన్నారు. -
‘నవోదయ’ ఫలితాలు విడుదల
కూసుమంచి: నవోదయ విద్యాలయాల్లో ఆరు, తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు ఇటీవల నిర్వహించిన అర్హత పరీక్ష ఫలితాలు వెల్లడయ్యా యి. ఈమేరకు ఫలితాలను విద్యాలయ సమితి మంగళవారం తన వెబ్సైట్లో పొందుపర్చింది. దీంతో పరీక్ష రాసిన విద్యార్థులు తమ రోల్ నంబర్ల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. అయితే, తమకు విద్యాలయ సమితి నుండి ఇంకా జాబితా అందలేదని, వచ్చాక అర్హత సాధించిన వారి రోల్ నంబర్లు ప్రకటిస్తామని పాలేరు విద్యాలయ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. ‘కారుణ్య’ ఉద్యోగులకు విధులపై అవగాహన ఖమ్మంవన్టౌన్: కారుణ్య నియామకాల ద్వారా జిల్లా నుంచి 27మందికి అవకాశం దక్కగా ఇటీవల హైదరాబాద్లో ఉత్తర్వులు అందుకున్నారు. ఈమేరకు జూనియర్ సహాయకులుగా నియమితైలన వారికి జెడ్పీ హాల్లో మంగళవారం విధినిర్వహణపై అవగాహన కల్పించారు. జెడ్పీ సీఈఓ దీక్షారైనా పాల్గొని విధులు, సర్వీస్ అంశాలను వివరించారు. డిప్యూటీ సీఈఓ నాగపద్మజ, మినిస్టీరియల్ ఉద్యోగ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మామునూరు రాజేష్, గుప్తా, జెడ్పీ ఉద్యోగులు రమణశేఖర్, రమణ, బండి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రూ.30.30లక్షలకు పిండిప్రోలు సంత వేలం తిరుమలాయపాలెం: మండలంలోని పిండిప్రోలులో ప్రతీ శనివారం నిర్వహించే వారంతపు సంత ఈసారి రికార్డు ధర పలికింది. ఎంపీడీఓ సిలార్సాహెబ్ ఆధ్వర్యాన మంగళవారం నిర్వహించిన వేలంలో రూ.50వేల చొప్పున డిపాజిట్ చెల్లించిన 90మందికి పైగా పాల్గొన్నారు. 2024–25లో రూ.14లక్షలు పలకగా.. ఈసారి వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన అప్పాల సుదర్శన్ రూ.30.30లక్షలకు దక్కించుకోవడం విశేషం. దీంతో రూ.16లక్షలకు పైగా ధర పెరిగినట్లయింది. ఏపీడీ నూరుద్దీన్, పిండిప్రోలు, తిరుమలాయపాలెం, బచ్చోడు పంచాయతీ కార్యదర్శులు రాము, సుజాత, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. పంటల్లో సస్యరక్షణ చర్యలే కీలకం వైరా: ఏ పంట సాగు చేసినా వాటిని ఆశించే తెగుళ్లను గుర్తించడం.. వీటిని నిర్మూలించే చర్యలే కీలకంగా నిలుస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. వైరా కృషి విజ్ఞాన కేంద్రంలోని రైతు శిక్షణా కేంద్రంలో నిర్వహిస్తున్న ఉత్తర తెలంగాణ వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా సంఘం సమావేశాలు మంగళవారం రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆపత్కాల పంటల ప్రణాళికలు – అనుసరించాల్సిన వ్యూహాలను సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్జీ.మహదేవప్ప వివరించారు. అనంతరం సంయుక్త వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణ, చీడపీడల గుర్తింపు.. ఆపై శాస్త్రవేత్తల సలహాతో నిర్మూలించడం వంటి అంశాలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకుడు డాక్టర్ ఎం.బలరామ్ వివరించారు. ఆపై జిల్లా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు వివిధ పంటల సాగుపై చర్చించి చేయాల్సిన పరిశోధనలను నిర్ణయించారు. మిర్చి రైతులను ఆదుకోవాలి ఖమ్మంవన్టౌన్: మిర్చి సాగు చేస్తున్న రైతులకు మద్దతు ధర దక్కేలా కేంద్రం చొరవ చూపాలని ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి కోరారు. ఈసందర్భంగా ఆయన లోక్సభలో మంగళవారం మాట్లాడారు. తెలంగాణలో అత్యధికంగా ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో మిరప పంట సాగవుతోందని తెలిపారు. ఈనేపథ్యాన రైతుల సమస్యలను పరిగణనలోకి తీసుకుని, వాటిని పరిష్కరించడం ద్వారా అండగా నిలవాలని ఎంపీ కోరారు. -
మూడు యూనిట్లు.. 257దరఖాస్తులు
బోనకల్: దివ్యాంగుల స్వయం ఉపాధి పథకాల కోసం మండలానికి కొద్దిసంఖ్యలో యూనిట్లు కేటాయించగా పెద్దసంఖ్యలో దరఖాస్తులు రావడంతో ఎంపిక ప్రక్రియ క్లిష్టంగా మారింది. ఈక్రమంలోనే బోనకల్ మండలానికి రూ.50వేల విలువైన మూడు యూనిట్లు కేటాయిస్తే ఆన్లైన్లో 257మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం జరిగిన సమావేశంలో ఎంపీడీఓ రమాదేవి, ఐసీడీఎస్ సీడీపీఓ బాల త్రిపురసుందరి ఆధ్వర్యాన డ్రా ద్వారా ముగ్గురిని ఎంపిక చేశారు. ఈనేపథ్యాన మిగతా వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న సమయాన అందరికీ రుణాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ముగ్గురినే ఎంపిక చేయడం సరికాదని మండిపడ్డారు. దీంతో ఖమ్మం – బోనకల్ రహదారిపై బైఠాయించగా సీపీఎం నాయకులు కిలారు సురేష్, తెల్లాకుల శ్రీను, గుగులోతు నరేష్ తదితరులు సంఘీబావం తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. నేలకొండపల్లిలో ఒకటే... నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలంలో దివ్యాంగుల కోసం ఒకటే యూనిట్ కేటాయించగా 180 మంది దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం నిర్వహించిన డ్రాకు 124 మంది హాజరయ్యారు. వీరిలో లాటరీ ద్వారా ముగ్గురిని ఎంపిక చేసి ఖరారు చేసేందుకు జిల్లా యంత్రాంతానికి పంపినట్లు అధికారులు తెలిపారు. సీడీపీఓ కవిత, ఎంపీడీఓ ఎం.యర్రయ్య, ఎంపీఓ శివ, సూపర్వైజర్ లక్ష్మీకుమారి తదితరులు పాల్గొన్నారు.అందరికీ రుణాలు ఇవ్వాలని దివ్యాంగుల నిరసన -
మూడు రోజుల క్రితం ఆత్మహత్య..
నేలకొండపల్లి: ఓ వ్యక్తి మూడు రోజుల క్రితం బలవన్మరణానికి పాల్పడగా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో దుర్వాసన ద్వారా సోమవారం స్థానికులు గుర్తించారు. నేలకొండపల్లి మండలం నాచేపల్లికి చెందిన డి.హరీశ్(32) మూడు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయాన ఉరి వేసుకున్నాడు. అప్పటి నుంచి ఎవరూ రాకపోవడంతో విషయం బయటపడలేదు. అయితే, సోమవారం సాయంత్రం ఆ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు అనుమానంతో కిటికీలో నుంచి చూడగా హరీశ్ వేలాడుతూ కనిపించాడు. కాగా, ఆయన తల్లితో కలిసి ఉంటుండగా, కొద్దిరోజుల క్రితం తల్లి ఊరికి వెళ్లినట్లు సమాచారం. అయితే, ఆయన ఆత్మహత్య కారణాలు తెలియాల్సి ఉంది. కుటుంబ కలహాలతో వివాహిత.. వేంసూరు: కుటుంబ కలహాల కారణంగా వేంసూరుకు చెందిన గంటనల వరలక్ష్మి(35) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఘటనపై వరలక్ష్మి తండ్రి రంగారావు ఫిర్యాదుతో పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. మున్నేటిలో ఈతకు వెళ్లిన యువకుడు మృతి ఖమ్మంరూరల్: ఖమ్మం బాలాజీనగర్కు చెందిన సయ్యద్ మౌలానా అలియాస్ అఫ్రోజ్(21) రాజీవ్ గృహకల్ప వద్ద మున్నేటికి వెళ్లగా ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. పలువురు స్నేహితులతో కలిసి ఆయన సోమవారం సరదాగా వెళ్లాడు. అయితే, మౌలానాకు ఈత రాకపోవడంతో నీటిలోకి దిగగానే మునిగిపోసాగాడు. ఆయన వెంట ఉన్న వారికి కూడా ఈత రాక రక్షించే అవకాశం లేకపోవడంతో మృతి చెందాడు. ఏసీ మెకానిక్గా పనిచేస్తున్న మౌలానా కుటుంబానికి చేదోడుగా ఉంటున్నాడు. ఈమేరకు సమాచారం అందుకున్న సీఐ ముష్క రాజు, పోలీసులు చేరుకుని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మృతదేహాన్ని బయటకు తీయించి ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐదుగురిపై పోక్సో కేసు ఎర్రుపాలెం: మండలంలోని భీమవరం హరిజనవాడ పంచాయతీకి చెందిన బాలికను(17)ను ప్రేమ పేరిట మాయమాటలతో నమ్మించి గర్భవతిని చేసి వ్యక్తితో పాటు పలువురిపై పోక్సో కేసు నమోదైంది. ప్రధాన నిందితుడైన ముల్లంగి జమలయ్యతో పాటు ఆయన తల్లిదండ్రులు ముసలయ్య – మరియమ్మ, బాలికను అబార్షన్ను ప్రేరేపించిన ఆర్ఎంపీ నరేందర్, గర్భ విచ్ఛిత్తికి ప్రయత్నించిన నర్సు భవానీపై పోక్సో కేసు నమోదు చేశామని ఎస్సై పి.వెంకటేశ్ తెలిపారు. కూలీల ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్ 14మందికి తృటిలో తప్పిన ప్రమాదం ఖమ్మంరూరల్: మండలంలోని ఆరేకోడు వద్ద కూలీలు వెళ్తున్న ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. ముత్తగూడెంకు చెందిన 14మంది కూలీలు చింతపల్లిలో మిర్చి ఏరడానికి ఆటోలో వెళ్లారు. పని ముగిశాక తిరిగి ఆటోలోనే వస్తుండగా ఆరేకోడు వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలోని పుల్లమ్మకు కాలు విరగగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే, ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈమేరకు స్థానికులు చేరుకుని క్షతగాత్రులను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. జేసీబీని సీజ్ చేసిన అధికారులుదమ్మపేట : అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలకు పాల్ప డుతున్న జేసీబీ యంత్రాన్ని రెవెన్యూ అధికారులు సోమవారం సీజ్ చేశారు. దమ్మపేట మండలంలోని గట్టుగూడెం గ్రామశివా రులో అనుమతులు లేకుండా జేసీబీ యంత్రంతో మట్టి తవ్వి, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారనే సమాచారం రెవెన్యూ అధికారులకు అందింది. దీంతో రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని తహసీల్దార్ కార్యాలయానికి తరలించి, సీజ్ చేశామని ఇన్చార్జ్ తహసీల్దార్ కె.వాణి తెలిపారు. -
రైతుకు లాభాలు పెంచడమే లక్ష్యం
● అధికారుల అవగాహనతో ఫలితాలు ● వ్యవసాయ విస్తరణ సలహా సంఘం సమావేశంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వైరా: పంటల సాగునే నమ్ముకున్న రైతులు లాభాలు ఆర్జించడమే ధ్యేయంగా అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో సోమవారం నిర్వహించిన మధ్య తెలంగాణ(ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మెదక్) మండల వ్యవసాయ పరిశోధనా విస్తరణ సలహా సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 15, 20ఏళ్లుగా రైతుల ఆదాయం గణనీయంగా తగ్గుతోందన్నారు. గతంలో వరిపై ఎకరాకు రూ.40వేల ఆదాయం వస్తే ఇప్పుడు రూ.20వేలు కూడా రావడం లేదన్నారు. దీనికి తోడు వాతావరణ మార్పులతోనూ వారు నష్టపోతున్నారన్నారు. ఈమేరకు కేవలం వరి, తదితర పంటలపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించేలా అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. ఆయిల్పామ్, కూరగాయలు, డ్రాగన్ ప్రూట్ తదితర పంటలు సాగు చేయడం, ఆధునిక విధానాలు పాటించడంపై ఎప్పటికప్పుడు వివరించాలని సూచించారు. ఇందుకోసం జిల్లాలోని ప్రతీ గ్రామం, మండలం, డివిజన్ స్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకుడు డాక్టర్ బలరామ్, విస్తరణ సంచాలకుడు డాక్టర్ ఎం.యాదాద్రి, మధ్య తెలంగాణ రీజియన్ సహాయ పరిశోధనా సంచాలకుడు డాక్టర్ ఆర్.ఉమారెడ్డి, డీడీఏ సింగారెడ్డి, కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ మాలతి, మధిర వ్యవసాయ పరిఽశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రుక్మిణీదేవి మాట్లాడారు. వ్యవసాయ విశ్వ విద్యాలయం డైరెక్టర్లు, వివిధ విభాగాల శాస్త్రవేత్తలు, ఉమ్మడి ఖమ్మం, మెదక్, వరంగల్ జిల్లాల వ్యవసాయ అనుబంధ ఽశాఖల అధికారులు, ఆర్ఈఏసీ సభ్యుడు రాణాప్రతాప్, ఆదర్శ రైతులు పాల్గొన్నారు. కాలానికి అనువైన పంటలతో మేలు రైతులు ఎప్పటికప్పుడు కాలానికి అనుగుణంగా పంటలు సాగు చేసుకోవాలని.. తద్వారా నష్టం లేకుండా అధిక దిగుబడులు సాధించొచ్చని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకుడు డాక్టర్ ఎం.బలరామ్ తెలిపారు. వ్యవసాయ పరిశోధనా విస్తరణ సలహా సంఘం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తొలుత రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన ఆయన వారి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం బలరామ్ మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులు, మార్కెట్లో డిమాండ్ను తెలుసుకుంటూ పంటల సాగులో మెళకువలు పాటిస్తే ఫలితం ఉంటుందని తెలిపారు. -
మందు కలిసిన నీళ్లు తాగడంతో 22గొర్రెలు మృతి
రఘునాథపాలెం: దాహార్తి అలమటిస్తున్న మూగజీవాలు పురుగుల మందు కలిపిన నీళ్లు తాగగా మృత్యువాత పడ్డాయి. బాధితులు, గ్రామస్తులు కథనం ప్రకా రం.. మండలంలోని కోయచలకకు చెందిన బొరిగర్ల లింగయ్య, బాబుకు చెందిన గొర్రెల మందను రోజులాగే మేతకు తీసుకెళ్లారు. ఒక రైతు మిర్చి తోటలో పిచికారీకి నీళ్లలో పురుగుల మందు కలిసి సిద్ధం చేయగా.. గొర్రెలు ఆ నీళ్లు తాగాయి. దీంతో గొర్రెలు వరుసగా కింద పడిపోతుండడంతో కాపరులు వెంటనే పశు వైద్యుడికి సమాచారం ఇస్తుండగానే 20గొర్రెలు, రెండు పోతులు ప్రాణం విడిచాయి. మిగిలిన వాటికి వైద్యం అందిస్తుండగా ఎన్ని కోలుకుంటాయో తెలియడం లేదు. సుమారు రూ.3.25లక్షలకు పైగా విలువైన గొర్రెలు చనిపోయినందున తమను ప్రభుత్వం ఆదుకోవాలని యజమానులు కోరారు. కాగా, బాధితులను మాజీ సర్పంచ్లు మాధంశెట్టి హరిప్రసాద్, రాంప్రసాద్, చెరుకూరి పూర్ణ, చెరుకూరి భిక్షమయ్య, నున్నా వెంకటేశ్వర్లు, తోట వెంకట్ తదితరులు పరామర్శించారు. -
వేటకు అమర్చిన తీగలు తాకి మృతి
ఏన్కూరు: అటవీ జంతువులను వేటాడేందుకు వెళ్లిన యువకుడు విద్యుదాఘాతంలో మృతి చెందిన ఘటన ఏన్కూరు మండలం నెమలిపురి సమీపాన ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కారేపల్లి మండలం చీమలపాడుకు చెందిన మేకల కరుణాకర్(18) వద్దకు అదే గ్రామానికి చెందిన జక్కుల రాములు, జక్కుల ప్రవీణ్ సాయంత్రం వచ్చి వేటకు తీసుకెళ్లారు. అయితే, రాత్రి 9–30 గంటలకు జక్కుల రాములు, జక్కుల ప్రవీణ్ కలిసి కరుణాకర్ ఇంటికి వచ్చి ఆయన విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు కుటుంబీకులకు తెలిపారు. దీంతో ఘటనాస్థలికి వెళ్లి చూడగా కరుణాకర్ మృతదేహం, సమీపాన విద్యుత్ తీగలు కనిపించాయి. అయితే, వీరు వేట కోసం అమర్చిన విద్యుత్ తీగలు తాకడంతో మృతి చెందాడా, అప్పటికే ఇతరులు అమర్చిన తీగలతో ప్రమాదం జరిగిందా అనేది తెలియరాలేదు. ఘటనపై కరుణాకర్ తండ్రి కోటయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రఫీ తెలిపారు. -
దైవదర్శనానికి వెళ్లొస్తుండగా ప్రమాదం
● చెట్టును కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి ● పావు గంటలో ఇంటికి చేరతారనగా ఘటన ఖమ్మంరూరల్: ఆ ముగ్గురూ స్నేహితులు. ఒకే రంగంలో కొనసాగుతుండడంతో ఎక్కడికై నా కలిసి వెళ్లడం ఆనవాయితీ. ఈ క్రమాన శ్రీశైలంలో దర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. అయితే, యాత్ర ఆసాంతం సాఫీగా జరిగి ఇంకో పావుగంటలో ఇంటికి చేరతామనగా ఈ ప్రమాదం జరగడంతో రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. జేసీబీల వ్యాపారం... ఖమ్మం నగరం దానవాయిగూడెంకు చెందిన పల్లపు రాము(46), కేతం కృష్ణమూర్తి(47), బండారి సురేష్ స్నేహితులు. వీరు ముగ్గురు జేసీబీల వ్యాపారంలో కొనసాగుతున్నారు. శ్రీశైలంలో స్వామి దర్శనానికి వెళ్లాలని నిర్ణయించుకున్న వీరు ఈనెల 22న కారులో బయలుదేరారు. అక్కడ దైవదర్శనం అనంతరం ఆదివారం తిరుగుముఖం పట్టారు. ఈ మేరకు ఆదివారం అర్ధరాత్రి ఇంకో పావు గంట అయితే ఇంటికి చేరతామనగా ఆటోనగర్ సమీపాన ఎదురుగా వస్తున్న ఇంకో వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో వీరి కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొంది. ఈ సమయాన కారును సురేష్ నడుపుతున్నాడు. ఈ ప్రమాదంలో రాము తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే, తీవ్రంగా గాయపడిన కృష్ణమూర్తిని స్థానికులు 108లో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా సోమవారం ఉదయం కన్నుమూశాడు. ఇక సురేష్కు కూడా గాయాలు కాగా చికిత్స అందిస్తున్నారు. అయితే, కారు అతివేగంతో వెళ్తుండడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనపై రాము భార్య రేణుక ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. -
ఆ స్థలం అనువుగా లేదు...
● ఖమ్మంలో ‘యంగ్ ఇండియా స్కూల్’ నిర్మాణంపై మల్లగుల్లాలు ● గతంలోనే శంకుస్థాపన చేసినా మొదలుకాని పనులు ● ప్రత్యామ్నాయ స్థలం కోసం అధికారుల అన్వేషణ రఘునాథపాలెం: ఖమ్మం నియోజకవర్గంలో మంజూరైన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రతీ నియోజకవర్గానికి ఒక స్కూల్ను మంజూరు చేయగా ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి రఘునాథపాలెం మండలంలోని జింకలతండా క్రాస్ సమీపాన సర్వే నంబర్ 20లో ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఈమేరకు అక్టోబర్ 11న మంత్రులు శంకుస్థాపన కూడా చేశారు. అయితే, ఇటీవల ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన ఇంజనీరింగ్ అధికారులు ఇక్కడి భూమి భవన నిర్మాణానికి అనువుగా లేదని, గుంతలు, గుట్టలతో నిండి ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతాయని నివేదిక సమర్పించారు. ప్రత్యామ్నాయ భూమిని కేటాయిస్తేనే పనులు మొదలుపెడతామని స్పష్టం చేయడంతో అధికారులు అనువైన స్థలం కోసం అన్వేషణ మొదలుపెట్టారు. కాగా, స్కూల్కు తొలుత కేటాయించిన భూమిలో గుట్ట ఉండడంతో అక్కడ గ్రావెల్ కోసం తవ్వకాలు జరిగాయి. అయితే, తవ్వకాలు సమాంతరంగా కాక ఇష్టారాజ్యంగా చేపట్టడంతో కొన్నిచోట్ల పెద్ద గుంతలు, మరికొంత భాగం గుట్టలు, బండరాళ్లతో మిగిలిపోయింది. ఈనేపథ్యాన స్కూల్ భవన నిర్మాణానికి అనువుగా లేదని తేల్చడంతో ప్రత్యామ్నాయంగా 25నుంచి 30 ఎకరాల ప్రభుత్వ భూమి ఎక్కడ ఉందోనని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కలెక్టర్ పరిశీలన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి అనువైన భూమి కోసం అన్వేషణ మొదలుపెట్టిన అధికారులు పలుచోట్ల భూములను గుర్తించినట్లు తెలిసింది. ఈమేరకు కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, ఆర్డీఓ జి.నర్సింహారావు, తహసీల్దార్ విల్సన్బెన్నీ సోమవారం పరిశీలించారు. శివాయిగూడెం వద్ద సర్వే నంబర్ 266, రఘునాథపాలెం బైపాస్లో మెడికల్ కాలేజీకి కేటాయించిన భూమికి సమీపంలో స్థలాలను పరిశీలించి వివరాలు ఆరా తీశారు. రెసిడెన్షియల్ స్కూల్కు ఎక్కడ భూమి ఖరారు చేస్తారో త్వరలోనే తేలే అవకాశముంది. -
గోదావరి జలాలేవి?
వైరాకు గోదావరి రానట్లేనా? ● లింక్ కెనాల్ పూర్తయినా రిజర్వాయర్కు చేరని నీరు ● ఎన్నెస్పీ కాల్వలోకి చేరాక ఇతర ప్రాంతాలకు మళ్లింపు ● వేసవి నేపథ్యాన రిజర్వాయర్లో తగ్గుతున్న నీటిమట్టంవైరా: గోదావరి జలాలు తమ ప్రాంతానికి వస్తాయని.. సాగర్ ప్రాజెక్టు ద్వారా నీరు రాకున్నా ఇక్కట్లు ఉండబోవని వైరా ప్రాంత రైతులు కలలు కన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యం కాని ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూపుదాల్చడంతో ఆరు నెలల్లోనే నీరు అందుతుందని.. తద్వారా యాసంగిలో సాగునీటికే కాక వేసవిలో తాగునీటికి ఢోకా ఉండదని భావించారు. అయితే, ఏన్కూరు లింక్ కెనాల్ నిర్మాణం పూర్తయినా వైరా రిజర్వాయర్కు నీరు చేరకపోగా ఇతర ప్రాంతాలకు మళ్లించడంతో వారి ఆశలు నెరవేరేదెన్నడో తెలియరావడం లేదు. గత ఏడాది శంకుస్థాపన.. సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాల్వ నుంచి ఏన్కూరు సమీపాన ఎన్నెస్పీ కెనాల్లోకి గోదావరి నీరు చేర్చేందుకు గాను రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణానికి సంకల్పించారు. ఈమేరకు గత ఏడాది మార్చి 13న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ కెనాల్ నిర్మాణం ఇటీవల పూర్తవడంతో ఈనెల 5వ తేదీన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గోదావరి జలాలను విడుదల చేశారు. ఎస్కేప్ లాక్లు మూసివేస్తేనే... ఏన్కూరు లింక్ కెనాల్ నిర్మాణం పూర్తవడంతో ఈనెల 5న సీతారామ ప్రాజెక్టు నుంచి కెనాల్లోకి గోదావరి జలాలను మంత్రి తుమ్మల విడుదల చేశారు. ఈ నీరు సాఫీగా ముందుకు సాగి ఎన్నెస్పీ కెనాల్లోకి చేరింది. ఆపై నీరు వైరా రిజర్వాయర్లోకి చేరాలి. అలా జరగకపోగా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు మండలాలకు మళ్లాయి. ఏన్కూరు సమీపాన ఎన్నెస్పీ కెనాల్ నుంచి 13 కి.మీ. మేర జలాలు ప్రవహించి తిమ్మరావుపేట ఎస్కేప్ లాక్ల ద్వారా వైరా రిజర్వాయర్లోకి చేరాల్సి ఉంటుంది. ఇందుకోసం అధికారులు ముందుగానే లాక్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే, లాక్లు వేయకపోగా.. నీటి ఉధృతి లేకపోవడంతో వెనక్కి రాలేదు. కాగా, 600 క్యూసెక్కుల నీరే కెనాల్లో ప్రవహిస్తోందని, ఇది 800 క్యూసెక్కులకు చేరితేనే నిమ్మవాగు ద్వారా వైరా రిజర్వాయర్కు గోదావరి జలాలు వస్తాయిని అధికారులు చెబుతున్నారు. దీంతో ఇది ఎప్పుడు జరుగుతుందనే ప్రశ్న రైతులను వేధిస్తోంది. ఎండలు పెరుగుతుండడంతో రిజర్వాయర్లో నీరు అడుగంటుతుండగా, సాగర్ జలాలను వారబందీ విధానంలో విడుదల చేస్తున్నారు. కనీసం గోదావరి నీరయినా వస్తుందని తద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు, 16మండలాలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఉండబోవని భావిస్తే అందుకు విరుద్ధమైన పరిస్థితులు నెలకొనడం గమనార్హం.ఏడాదిగా చూస్తున్నాం.. గోదావరి జలాలు వైరా రిజర్వాయర్లోకి వస్తాయని ఏడాదిగా చెబుతున్నారు. ఇటీవల నీరు విడుదల చేయగానే రిజర్వాయర్లోకి చేరతాయని అందరం అనుకున్నాం. కానీ ఇప్పటికీ ఆ నీరు రాలేదు. పంటల చివరి దశలో ఇబ్బంది ఉండదని భావిస్తే ఆ పరిస్థితి కానరావడం లేదు. – వి.కృష్ణారెడ్డి, రైతు, గరికపాడు రెండు పంటలు పండుతాయని వైరా రిజర్వాయర్లోకి గోదావరి జలాలు చేరితే రెండు పంటలు పండుతాయని ఎదురుచూశాం. అయితే, ప్రభుత్వం మారినా వైరా రిజర్వాయర్లోకి గోదావరి జలాలు రాలేదు. పంపులు ఆన్ చేశారని చెప్పినా మా వైపు నీరు రాకపోగా.. కారణాలు ఎవరూ చెప్పడం లేదు. – జె వెంకటరమణ, రైతు, దాచాపురంత్వరలోనే గోదావరి నీళ్లు.. వైరా రిజర్వాయర్లోకి గోదావరి నీళ్లు తప్పక చేరతాయి. రైతులెవరూ ఆందోళన చెందొద్దు. ఈ విషయంలో పూర్తి బాధ్యత నేనే తీసుకుంటా. అతి త్వరలోనే రిజర్వాయర్లోకి గోదావరి జలాలు చేరడం ఖాయం. – మాలోత్ రాందాస్ నాయక్, ఎమ్మెల్యే, వైరా -
తెలుగు అధ్యాపకుడికి డాక్టరేట్
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకుడు పగిడిపల్లి వెంకటేశ్వర్లుకు డాక్టరేట్ లభించింది. కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం ప్రొఫెసర్ పంతంగి వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఆయన ‘డాక్టర్ సీతారాం సాహిత్యం – ఒక అధ్యయనం’ అంశంపై పరిశోధనాత్మక గ్రంధాన్ని సమర్పించగా కేయూ నుంచి డాక్టరేట్ ప్రకటించారు. ఈసందర్భంగా వెంకటేశ్వర్లును కళాశాల ప్రిన్సిపాల్ జకీరుల్లా , అధ్యాపకులు, జాషువా సాహిత్య వేదిక అధ్యక్షుడు మువ్వా శ్రీనివాసరావు తదితరులు సోమవారం అభినందించారు. రేపు జాబ్ మేళా ఖమ్మం రాపర్తినగర్: కొణిజర్ల మండలం తనికెళ్లలోని తెలంగాణ గిరిజన రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ గురుకుల కళాశాల(లక్ష్య ఇంజనీరింగ్ కాలేజీ)లో బుధవారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి ఎన్.మాధవి తెలిపారు. హైదరాబాద్, విజయవాడ పరిధిలో విధులు నిర్వర్తించాల్సి ఉండగా, డిగ్రీ పాసై 18–30 ఏళ్ల వయస్సు కలిగిన మహిళలు అర్హులని పేర్కొన్నారు. ఈమేరకు విద్యార్హతల సర్టిఫికెట్లు, ఇతర ధ్రువీకరణ పత్రాల జిరాక్స్లతో బుధవారం ఉదయం 10గంటలకు మొదలయ్యే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. మొరాయించిన సర్వర్లు.. ఖమ్మంమయూరిసెంటర్: ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో వస్తున్న తరుణంలో సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఈక్రమంలోనే సోమవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సర్వర్లు నిలిచిపోవడంతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వివరాలు ఓపెన్ కాలేదు. దీంతో ఫీజు చెల్లించేందుకు కేఎంసీ కార్యాలయానికి వచ్చిన వారు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ఫీజు రాయితీ గడువు ఇంకో వారంలో ముగియనుండగా పలువురు ఉదయమే కౌంటర్ల వద్దకు వచ్చారు. అయితే, ఉదయమంతా సర్వర్లు మొరాయించగా.. మధ్యాహ్నం తర్వాత పని చేశారని ఉద్యోగులు తెలిపారు. వాటర్ బాటిళ్లు ఏమయ్యాయి? కలెక్టరేట్లో 150కిపైగా సీసాలు మాయం ఖమ్మం సహకారనగర్: కలెక్టరేట్లో నిర్వహించే సమావేశాలకు హాజరయ్యే అధికారులు, ఉద్యోగులకు తాగునీరు సమకూర్చేందుకు గాను గతంలో విధులు నిర్వర్తించిన కలెక్టర్ వీ.పీ.గౌతమ్ సుమారు 200 వాటర్ బాటిళ్లు కొనుగోలు చేయించారు. అందరూ మిషన్ భగీరథ నీటినే తాగాలనే ఉద్దేశంతో వీటిని సమకూర్చారు. అయితే, అప్పుడొకటి.. ఇప్పుడొకటి అన్నట్లు బాటిళ్లు మాయమవుతుండగా ప్రస్తుతం 50కూడా లేవని సమాచారం. ప్రస్తుత కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ కలెక్టరేట్ను ప్లాస్టిక్ ఫ్రీగా మార్చాలనే లక్ష్యంతో శాఖల వారీగా ఎన్ని స్టీళ్లు బాటిళ్లు కావాలో నివేదిక ఇవ్వాలని సూచించారు. దీంతో గతంలో కొనుగోలు చేసిన బాటిళ్లపై అధికారులు ఆరా తీయగా 200కు గాను 150మేర కనిపించడం లేదని తేల్చినట్లు సమాచారం. దీంతో ఈ బాటిళ్లు ఎవరు తీసుకెళ్లారు, ఎలా మాయమయ్యాయనే అంశంపై కలెక్టరేట్లో చర్చ జరుగుతోంది సింగరేణి విద్యార్థినుల ప్రతిభసింగరేణి(కొత్తగూడెం): ఈ నెల 19న ఖమ్మంలోని కవితా మోమెరియల్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ ఫెిస్టివల్లో కొత్తగూడెం సింగరేణి మహిళా కళాశాల విద్యార్థినులు ప్రతిభ చూపారు. ఫెస్టివల్కు మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి 108 మంది హాజరుకాగా, ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10 మందికి ఎంపిక చేసి బహుమతులు అందించారు. సింగరేణి కళాశాల విద్యార్థినులు కె.వెన్నెల, ఎండీ ఆయేషా మూడో, నాలుగో స్థానా ల్లో నిలవగా సోమవారం ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ గుండా శ్రీనివాస్, కరస్పాండెంట్ కే.సునీల్కుమార్, ప్రిన్సిపాల్ చింతల శారద తదితరులు అభినందించారు. -
ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించండి
ఖమ్మం సహకారనగర్: ప్రజలు అందిస్తున్న ప్రతీ ఫిర్యాదును పరిశీలించడమే కాక సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. ప్రజావాణి(గీవెన్స్ డే)లో భాగంగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ఆయన అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి దరఖాస్తులు, వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తుల పరిశీలన, పరిష్కారంలో జాప్యం జరగదొద్దని సూచించారు. ఒకవేళ ఏదైనా దరఖాస్తును తిరస్కరిస్తే అందుకు కారణాలను తెలియచేయాలని చెప్పారు. ఈకార్యక్రమంలో డీఆర్వో పద్మశ్రీ, డీఆర్డీఓ సన్యాసయ్యతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.గ్రీవెన్స్ డేలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ -
మూడో లైన్ పనుల తనిఖీ
ఖమ్మం రాపర్తినగర్/చింతకాని: ఖమ్మం– పందిళ్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య జరుగుతున్న మూడో లైన్ నిర్మాణ పనులను అధికారులు సోమవారం పరిశీలించారు. దక్షిణ మధ్య రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవి, డీఆర్ఎం భర్తేష్కుమార్ జైన్ తనిఖీల్లో పాల్గొనగా.. ఇప్పటివరకు పూర్తయిన లైన్పై రైలు నడిపించారు. మరోమారు పూర్తిస్థాయిలో సేఫ్టీ రన్ చేపట్టాక రైళ్లు నడపడానికి అనుమతిస్తామని అధికారులు తెలి పారు. ఖమ్మం స్టేషన్ మాస్టర్ ప్రసాద్, అధికారులు శ్రీకాంత్రెడ్డి, సంజీవ్ యాదవ్, సునీల్కుమార్ వర్మ, సత్యప్రకాష్, సురంజన్రెడ్డి, శ్రీనివాసరావు, గుడేషర్ తదితరులు పాల్గొన్నారు. ఈమేరకు పందిళ్లపల్లి స్టేషన్లో అధికారులు మొక్కలు నాటారు. ●చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లి స్టేషన్లో గూడ్స్ రైళ్ల ద్వారా సరుకుల దిగుమతికి రేక్ పాయింట్ ఏర్పాటు చేస్తున్నందున స్థానికులకే హమాలీలుగా అవకాశం కల్పించాలని పలువురు కోరారు. ఈ సందర్భంగా అధికారులకు హమాలీ వర్కర్ల యూనియన్ బాధ్యులు వినతిపత్రం అందజేశారు. ఖమ్మంలోని రేక్ పాయింట్లో హమాలీలుగా పనిచేసిన వారితో పాటు పందిళ్లపల్లి, రామకృష్ణాపురం, గాంధీనగర్కాలనీ, అనంతసాగర్, కొదుమూరు, లచ్చగూడెం వాసులకు సైతం అవకాశం కల్పించాలని కోరారు. -
క్షయరహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం..
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాను క్షయరహితంగా తీర్చిదిద్దే ప్రయత్నాలకు అందరూ సహకరించాలని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ వరికూటి సుబ్బారావు సూచించారు. జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా సోమవారం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ఆవరణలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రెండు వారాలకు మించి దగ్గు ఉన్నా, రాత్రి పూట చమటలు పట్టినా, ఆకలి మందగించినా క్షయ వ్యాధి లక్షణాలుగా భావిస్తూ సమీప ఆరోగ్య కేంద్రంలో తెమడ పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. ఒకవేళ టీబీ నిర్ధారణ అయితే ఉచితంగా మందులను ఇంటికి పంపిస్తామని, పోషకాహారం నిమిత్తం నెలకు రూ.వెయ్యి చొప్పున అకౌంట్లో జమ అవుతాయని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో 35 జీపీలను క్షయ రహితంగా ప్రకటించగా... డీఎంహెచ్ఓ డాక్టర్ కళావతిబాయి, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత మాట్లాడారు. అనంతరం వివిధ పోటీల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన సంజన(సత్తుపల్లి), ఏంజెల్(ఖమ్మం)కు బహుమతులు, టీబీ వ్యాధి నిర్మూలనకు కృషి చేసిన ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, హెల్త్ సూపర్వైజర్లకు అవార్డులు అందజేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.రాజేశ్వరరావు, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎల్. కిరణ్కుమార్, వైద్యులు బాబురత్నాకర్, కిరణ్కుమార్, రామారావు, వెంకటరమణ, మోహన్రావు, తదితరలు పాల్గొన్నారు.డీటీసీఓ డాక్టర్ సుబ్బారావు -
ఇందిరమ్మకు అడుగులు
●ఇళ్ల నిర్మాణాలు పరిశీలన తిరుమలాయపాలెం: మండలంలో పైలట్ గ్రామంగా ఎంపికై న ఏలువారిగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని జెడ్పీ సీఈఓ దీక్షారైనా సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ఎంపీడీఓ సిలార్సాహెబ్కు సూచించారు. ఆతర్వాత తిరుమలాయపాలెం, పిండిప్రోలులో ఎస్సెస్సీ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం పటిష్టంగా అమలుచేసేలా అడుగులు పడుతున్నాయి. గత జనవరి 26న గ్రామసభలు నిర్వహించిన 20గ్రామపంచాయతీల్లో పలువురికి ఇళ్లు మంజూరు చేశారు. అందులో కొన్ని బేస్మెంట్ స్థాయికి చేరగా.. మిగిలిన పంచాయతీల్లో లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. మరోవైపు ఖమ్మం కార్పొరేషన్, సత్తుపల్లి, వైరా, మధిర మున్సిపాలిటీల్లో ఎల్–1జాబితాపై రీ వెరిఫికేషన్ కొనసాగుతోంది. ఇందులో అర్హులను గుర్తించి కలెక్టర్కు పంపించాక ఎంపిక పూర్తి చేయనున్నారు. 850 ఇళ్లు మంజూరు.. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంక్షేమ పథకాలను ఈ ఏడాది జనవరి 26న ప్రారంభించింది. అందులో భాగంగా అదేరోజు గ్రామసభల్లో లబ్ధిదారుల జాబితాలు ప్రకటించారు. జిల్లాలోని 20 గ్రామపంచాయతీలకు సంబంధించి ఎంపీడీఓలు 1,017 మందిని ఇందిరమ్మ ఇళ్లకు అర్హులుగా తేల్చగా, అందులో 962 దరఖాస్తులను కలెక్టర్ ఆమోదించారు. ఆపై 112 దరఖాస్తులను తొలగించి చివరగా 850 మందిని ఎంపిక చేశారు. ఇందులో 470 ఇళ్లకు సంబంధించి జియో ట్యాగ్ చేయగా, మరో 49 ఇళ్లు పునాదిదశలో ఉన్నాయి. ఇంకో 44 దరఖాస్తులను ఎంపీడీఓలు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంది. మోడల్హౌస్ల నిర్మాణం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అవగాహన కల్పించేలా మోడల్హౌస్ల నిర్మాణాన్ని చేపట్టింది. ప్రభుత్వం మంజూరు చేసే రూ.5లక్షలతో ఇంటి నిర్మాణం ఎలా చేపట్టవచ్చో తెలియచేయడమే వీటి లక్ష్యం. పాలేరు నియోజకవర్గం కూసుమంచిలో మోడల్హౌస్ నిర్మాణం పూర్తి కాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఇక్కడ 400 చదరపు అడుగుల స్థలంలో హాల్, కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్తో ఇల్లు నిర్మించారు. ఇంటిలోపల గదులు, వరండాల్లో టైల్స్ వేయడమే కాక డాబా మెట్ల కింద టాయిలెట్ నిర్మించారు. ఇంట్లో విద్యుత్ సౌకర్యం కల్పించడంతోపాటు ఫ్యాన్లు, ఇంటికి రంగులు అన్నింటినీ రూ.5లక్షల్లోనే పూర్తి చేశారు. మూడు కేటగిరీలుగా ఇళ్లు.. ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని మూడు కేటగిరీలుగా విభజించారు. సొంత జాగా ఉండి గుడిసె, రేకులషెడ్, టైల్స్ వేసిన, అద్దె ఇళ్లలో ఉండేవారిని ఎల్–1(లిస్ట్)గా గుర్తించారు. అదే గుడిసె, రేకులషెడ్, టైల్స్ వేసిన ఇళ్లు, అద్దె ఇళ్లలో ఉంటూ స్థలం కూడా లేని వారిని ఎల్–2కేటగిరీగా, ఇళ్లు ఉండి.. తల్లిదండ్రుల నుంచి విడిపోయిన తమకు ఇళ్లు కావాలని దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్–3 కేటగిరీగా విభజించారు. ఈ కేటగిరీల వారీగా వివిధ దశల్లో ఇళ్ల మంజూరు జరగనుంది. అయితే, ఎల్–1 జాబితాలో వారికే మంజూరులో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. జాబితాల రీ వెరిఫికేషన్ ఖమ్మం కార్పొరేషన్తోపాటు సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీల్లో ఎల్–1 కేటగిరీలో లబ్ధిదారులు 60,747 మంది దరఖాస్తులను పునః పరిశీలన చేస్తున్నారు. ఈ ప్రక్రియ అటు జీపీలు, ఇటు కేఎంసీ, మున్సిపాలిటీల్లోనూ కొనసాగుతోంది. ఇక్కడ కూడా కేటగిరీల వారీగానే లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. రీ వెరిఫికేషన్ తర్వాత అర్హుల జాబితాను కలెక్టర్కు పంపిస్తారు. ఆపై ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు, ఇన్చార్జి మంత్రి పరిశీలించి.. దశల వారీగా ఇళ్లు మంజూరు చేయనున్నారు. పైలట్గా 20 జీపీల్లో 850 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఆ గ్రామాల్లో నిర్మాణాలు ప్రారంభం మిగతా ప్రాంతాల్లో ఎల్–1 జాబితా పునఃపరిశీలన దశల వారీగా త్వరలోనే ఇళ్ల నిర్మాణానికి గ్రీన్సిగ్నల్అర్హుల జాబితా సిద్ధం చేస్తున్నాం.. ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితా సిద్ధం చేస్తున్నాం. ప్రస్తుతం రీవెరిఫికేషన్ కొనసాగుతోంది. జీపీలు, మున్సిపాలిటీల్లో వచ్చిన దరఖాస్తులను యంత్రాంగం పరిశీలించాక ఎందరు లబ్ధిదారులో తేలుతుంది. ఆపై జాబితాను కలెక్టర్కు అప్పగిస్తే ఎంపిక పూర్తవుతుంది. జిల్లాలో మొదటి విడతగా జనవరి 26న మంజూరు చేసిన 850 ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. – భూక్యా శ్రీనివాస్, పీడీ, గృహ నిర్మాణ శాఖ -
ప్రైవేట్ ఆస్పత్రుల వివరాలు సమర్పించండి
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల యజమాన్యాలు నిబంధనలు అమలుపై వివరాలు అందజేయాలని డీఎంహెచ్ఓ కళావతిబాయి, డిప్యూటీ డీఎంహెచ్ఓ సైదులు ఆదేశించారు. ఆస్పత్రుల్లో లిఫ్ట్ల పనితీరు, వాటి కొనుగోలు బిల్లులు, నిర్వహణ సమాచారంతో పాటు అగ్నిమాపక శాఖ నిబంధనల అమలుపై వివరాలు సమర్పించాలని సూచించారు. ఇటీవల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో లిఫ్ట్ తీగ తెగి మహిళ మృతి చెందిన నేపథ్యాన వైద్య, ఆరోగ్య శాఖ దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఈ వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. పెద్దాస్పత్రి మార్చురీకి అదనంగా ఫ్రీజర్లు ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని మార్చురీకి నాలుగు కొత్త ఫ్రీజర్లు చేరాయి. ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తన నిధుల నుంచి వీటిని కేటాయించారు. మార్చురీలో ప్రస్తుతం ఉన్న ఫ్రీజర్లు నాలుగు తరచూ మొరాయిస్తుండటంతో మృతదేహాల భద్రత కష్టమవుతోంది. పలుమార్లు మార్చురీ నుండి దుర్గంధం వెదజల్లుతోంది. ఇటీవల పెద్దాస్పత్రికి ఎంపీ వచ్చినప్పుడు ప్రీజర్ల పరిస్ధితిని అధికారులు వివరించగా సోమవారం నాలుగు ఫ్రీజర్లను పంపించారు. ఖేలో ఇండియా పోటీల్లో కాంస్యం ఖమ్మం స్పోర్ట్స్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాస్పూర్లో జరుగుతున్న ఖేలో ఇండియా జాతీయస్థాయి సీనియర్ మహిళల ఉషూ టోర్నీలో ఖమ్మంకు చెందిన పి.పవిత్రాచారి కాంస్య పతకం సాధించింది. ఈనెల 20నుంచి 23వ తేదీ వరకు కొనసాగిన టోర్నీలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆమె, నుదిటిపై గాయమైనా పట్టు వదలకుండా నాన్దావో ఈవెంట్లో ప్రతిభ కనబర్చింది. కాగా, ఖేలో ఇండియా పోటీలో వరుసగా మూడేళ్ల నుంచి పవిత్ర పతకం సాధిస్తుండడం విశేషం. ఈసందర్భంగా ఆమెతో పాటు కోచ్ పరిపూర్ణాచారిని డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి తదితరులు అభినందించారు. ప్రశాంతంగా ఎస్సెస్సీ పరీక్షలు ఖమ్మం సహకారనగర్: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈమేరకు సోమవారం 97 పరీక్ష కేంద్రాల్లో 16,376 మందికి గాను 16,344మంది హాజరు కాగా 32మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు. అదనపు కలెక్టర్ శ్రీజ ఒక కేంద్రం, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ రెండు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 38 కేంద్రాలను తనిఖీ చేయగా తాను ఆరు కేంద్రాల్లో పరిశీలించానని వెల్లడించారు. ●నేలకొండపల్లి: మండలంలోని చెరువుమాధారం, సింగారెడ్డిపాలెంలో పదో తరగతి పరీక్షల కేంద్రాలను డీఈఓ సోమవారం తనిఖీ చేసి మాట్లాడారు. ఎక్కడ పొరపాట్లు జరగకుండా నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించేలా డీఓలు, సీఎస్లకు సూచనలు చేస్తున్నట్లు తెలి పారు. ఎంఈఓ బి.చలపతిరావు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో తల్లి, తనయుడు మృతి
● బైక్ను ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం ● మృతులు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వాసులు దమ్మపేట: గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిన ఘటనలో తల్లి, తనయుడు మృత్యు ఒడిలోకి చేరుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గాంధీనగరం గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన అరిసెపల్లి కృష్ణ(45), తల్లి సరస్వతి(65)తో కలసి ద్విచక్రవాహనంపై అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో గాంధీనగర్ గ్రామ సమీపంలో గుర్తు తెలియని వారిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తల్లీ, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్లో ఆశ్వారావుపేటకు తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు. -
కళాకారులను ఆదుకోవాలి
మధిర: కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం కోరారు. మధిర బంజారా కాలనీ శ్రీవెంకటేశ్వరస్వామి కల్యాణ మండపంలో ఆదివారం మాటూరుపేట శ్రీ సీతారామాంజనేయ కళాపరిషత్ అధ్యక్షుడు గడ్డం సుబ్బారావు ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఏకపాత్రాభినయం, పౌరాణిక నాటికల సన్నివేశ పోటీల్లో వారు మాట్లాడారు. మధిర ప్రాంతానికి చెందిన పలువురు కళాకారులు జాతీయస్థాయిలో అవార్డులు సాధించి మధిరకు దేశ వ్యాప్తంగా పేరు ప్రతిష్టలు తెచ్చారని అన్నారు. అలాంటి కళాకారులను ఆదుకోవాలని, అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వాలని కోరారు. అనంతరం కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముందుగా బళ్లారి రాఘవ కళాపరిషత్ అధ్యక్షుడు బొబ్బిళ్లపాటి శ్రీకృష్ణ సాయి జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో రంగస్థల కళాకారుల సమాఖ్య అధ్యక్షుడు పుతుంబాక శ్రీకృష్ణ ప్రసాద్, సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, నాయకులు మల్లాది హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
తహసీల్దార్ పేరుతో బ్యాంక్ రుణానికి దరఖాస్తు
కూసుమంచి: తన పేరు జంగం బాలరాజు అని, తాను కూసుమంచి తహసీల్దార్గా పనిచేస్తున్నానంటూ నకిలీ గుర్తింపు కార్డుతో బ్యాంకు లోన్కు దరఖాస్తు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జంగం బాలరాజు అనే పేరుతో ఓ వ్యకి హైదరాబాద్లోని జూబ్లిపుర ఎస్బీఐ బ్రాంచ్లో వ్యక్తిగత రుణం కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్నాడు. అక్కడి అధికారులు నిర్ధారణ నిమిత్తం కూసుమంచి బ్యాంకుకు అతడి వివరాలు పంపించారు. దీంతో కూసుమంచి బ్యాంకు మేనేజర్ తహసీల్దార్ కార్యాలయంలో ఆరా తీయగా ప్రస్తుతం కరుణశ్రీ తహసీల్దార్గా ఉన్నారని, గతంలో కూడా బాలరాజు పేరుతో ఎవరూ పని చేయలేదని తేలింది. దీంతో నకిలీ అధికారిగా గుర్తించి అక్కడి అఽధికారులకు సమాచారం అందించడంతో వారు విచారణ చేపట్టారు. కాగా బాలరాజు పేరుతో తహసీల్దార్గా నమ్మించేందుకు జిల్లా కలెక్టర్ జారీ చేసినట్లుగా కలెక్టర్ ముద్రలు, ఫోర్జరీ సంతకంతో నకిలీ గుర్తింపుకార్డు సృష్టించి లోన్ పొందేందుకు ప్రయత్నించాడు. గుర్తింపు కార్డులో తన తండ్రి పేరు చంద్రమౌళి అని, కూసుమంచిలో నివాసం ఉంటున్నట్లు ఇంటి నంబర్ 7–24 అని పేర్కొన్నాడు. ఏకంగా తహసీల్దార్ నంటూ బ్యాంకును బురిడీ కొట్టించేందుకు బాలరాజు ప్రయత్నించడంతో అధికారులు అప్రమత్తమై విచారణ చేపట్టారు.నకిలీ అధికారిగా గుర్తించిన బ్యాంకర్లు -
లిఫ్ట్ ప్రమాద ఘటనపై విచారణ
ఖమ్మంవైద్యవిభాగం : నగరంలోని ప్రసూన ఆస్పత్రిలో లిఫ్ట్ ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటనపై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ఆదివారం విచారణ చేపట్టారు. ఆ ఆస్పత్రిలో అపరేషన్ అనంతరం సరోజని(62) అనే మహిళను అపరేషన్ థియేటర్ నుంచి లిఫ్ట్ ద్వారా తరలించే క్రమంలో స్ట్రెచర్ పైనే ప్రాణాలు విడిచిన విషయం విదితమే. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ నిమిత్తం డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సైదులు విచారణ నిర్వహించారు. ప్రమాదానికి గల కారణాలపై సిబ్బందితో ఆరా తీశారు. సాంకేతిక లోపంతో లిఫ్ట్ అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు డాక్టర్ సైదులు తెలిపారు. ఈ విషయమై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి నివేదించనున్నట్లు వివరించారు. ఆస్పత్రిలో లిఫ్ట్ స్థితిగతులు, కంపెనీ వివరాలు, ఎన్ని సంవత్సరాలుగా వాడుతున్నారు, ఇంతకుముందు ఏవైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాలపై నివేదిక సమర్పించాలని ఆస్పత్రి యాజమాన్యానికి నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. పూర్తి నివేదిక వచ్చాక యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఆశ్రమ హాస్టల్లో అగ్ని ప్రమాదం
ములకలపల్లి: మండల పరిధిలోని కమలాపురం ఆశ్రమ హాస్టల్లో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులోని ఓ గదిలో మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్సర్క్యూట్తో ప్రమాదం జరిగినట్లు సమాచారం. గదిలో ఉన్న పాత పరుపులు, క్రీడా వస్తువులు దగ్ధమయ్యాయి. స్థానికులతో సమాచారంతో కొత్తగూడెం నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఆదివారం కావడంతో విద్యార్థులందరూ హాస్టల్లోనే ఉన్నారు. అయితే ప్రమాద సమయంలో గ్రౌండ్ఫ్లోర్లో స్టడీ అవర్స్లో ఉండటంతో పెనుప్రమాదం తప్పింది. కాగా రూ. 30 వేల నష్టం జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రమాదా ఘటనపై ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆరా తీశారు. -
విద్యారంగాన్ని బలోపేతం చేయాలి
ఖమ్మం సహకారనగర్ : రాష్ట్రంలో ప్రభుత్వం విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చావా దుర్గాభవాని కోరారు. నగరంలోని సంఘం కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పూర్వ ప్రాథమిక పాఠశాలల వల్ల బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆర్థిక సౌలభ్యం కలుగుతుందని, పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి రెండో వేతన సవరణ సంఘం రిపోర్టును తెప్పించి 2023 జూలై నుంచి నూతన పీఆర్సీ అమలు చేయాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు, నాయకులు వల్లకొండ రాంబాబు, జి.వి. నాగమల్లేశ్వరరావు, బుర్రి వెంకన్న, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుర్గాభవాని -
పర్యావరణ పరిరక్షణకు..
● విద్యార్థుల్లో అవగాహన పెంచేలా విస్తృత కార్యక్రమాలు ● యూత్ అండ్ ఎకో క్లబ్ల ఏర్పాటు ● పీఎస్లకు రూ.3వేలు, హైస్కూళ్లకు రూ.5వేలు విడుదలఖమ్మం సహకారనగర్ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చదువుతో పాటు పర్యావరణ పరిరక్షణపై తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే వివిధ కార్యక్రమాలు కొనసాగుతుండగా.. ఇటీవల పాఠశాల స్థాయిలో ‘యూత్ అండ్ ఎకో క్లబ్’ పేరుతో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లాలో 1,148 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా సుమారు 84 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాల స్థాయిలో పర్యావరణ హిత కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థులను చైతన్యవంతులను చేసేందుకు ఒక్కో హైస్కూల్కు రూ.5వేలు, ప్రాథమిక పాఠశాలలకు రూ.3 వేల చొప్పున మొత్తం 42.36 లక్షల నిధులను ఇటీవల ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. నిధుల వినియోగం ఇలా.. పాఠశాలలకు విడుదల చేసిన నిధులతో కిచెన్ గార్డెన్ల సంరక్షణ, వినాయక చవితి సందర్భంగా మట్టి ప్రతిమల తయారీ, ఓజోన్ డే, ఎర్త్ డే, వాటర్ డే తదితర కార్యక్రమాలు చేపట్టాలి. ఆయా అంశాలపై కాంప్లెక్స్ స్థాయిలో పోటీలు నిర్వహించాలి. అలాగే పెద్ద ప్లాస్టిక్ టబ్బులు(40లీటర్లు) 2, మల్టీ పర్పస్ ప్లాస్టిక్ ట్రేలు 2, అలంకరణ మొక్కలు పెంచేందుకు 8 రౌండ్ ప్లాస్టిక్ తొట్లు, విత్తనాలు మొలకెత్తేందుకు ఒక ట్రే కొనుగోలు చేయాలి. పీడీలకు పూర్తయిన శిక్షణ యూత్ అండ్ ఎకో క్లబ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లాకు చెందిన 20 మంది ఫిజికల్ డైరెక్టర్లు(పీడీ)లకు ఇటీవల హైదరాబాద్లో శిక్షణ ఇచ్చారు. వారంతా ఆయా పాఠశాలల్లో పర్యావరణ హితమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కిచెన్ గార్డెన్ల పెంపకం, విద్యార్థులకు మొక్కలపై ఆసక్తి పెంచేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహిస్తూ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు.జిల్లాలోని పాఠశాలలకు విడుదలైన నిధులు.. (రూ.లలో) మొత్తం ఒక్కో పాఠశాలకు మొత్తం స్కూళ్లు విడుదలైన నిధులుప్రాథమిక పాఠశాలలు 752 3,000 22,56,000 ప్రాథమికోన్నత పాఠశాలలు 187 5,000 9,35,000 హైస్కూళ్లు 194 5,000 9,70,000 కేజీబీవీలు 14 5,000 70,000 అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ 01 5,000 5000పర్యావరణంపై అవగాహన కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో యూత్ అండ్ ఎకో క్లబ్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీని ద్వారా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలుగుతుంది. అలాగే విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు కూడా అందిస్తోంది. ఇప్పటికే పాఠశాలల్లో కిచెన్ గార్డెన్లు నిర్వహిస్తున్న క్రమంలో మరింత ఉపయోగం కలుగనుంది. – ఈ.సోమశేఖర శర్మ, డీఈఓ -
వర్షాకాలంలోగా పనులు పూర్తి చేయాలి
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన రోడ్ల అభివృద్ధి పనులు వర్షాకాలం లోగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలపాడులో రూ.2.50 కోట్లు, వెంకటగిరిలో రూ.2.40 కోట్లు, గుదిమళ్లలో రూ.1.95 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల అవసరాల మేరకు ఇంకా ఏమైనా రోడ్లు నిర్మించాల్సి ఉంటే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం గుదిమళ్లలోని తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఎస్ఈ హేమలత, ఆర్డీఓ నర్సింహారావు, పంచాయతీరాజ్ ఈఈ వెంకటరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎ. శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ పి.రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం -
జాతీయ ఉషూ టోర్నీకి నలుగురి ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్ : జాతీయస్థాయి సీనియర్ ఉషూ టోర్నీకి జిల్లా నుంచి నలుగురు ఎంపికయ్యారు. బిలాస్పూర్లో జరుగనున్న ఫెడరేషన్ కప్ పోటీల్లో వీరి రాష్ట్ర జట్టు తరఫున ఆడనున్నారు. ఎంపికై న వారిలో పి.పవిత్రాచారి, పి.సత్యజిత్చారి, బి.హర్షవర్దన్, ఎస్. ఉదయ్కిరణ్ ఉన్నారు. జిల్లా నుంచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, కోచ్ పి.పరిపూర్ణాచారి హర్షం వ్యక్తం చేశారు. టీడీసీఏ క్రికెట్ జట్టుకు..తెలంగాణ జిల్లా క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే టోర్నీకి జిల్లా నుంచి నలుగురు ఎంపికయ్యారు. హైదరాబాద్లో ఈనెల 24 నుంచి 31 వరకు జరుగనున్న ఈ టోర్నీలో ఉమ్మడి జిల్లాకు చెందిన క్రికెటర్లు పాల్గొనున్నారు. ఎంపికై న వారిలో గోవర్దన్, సాయి సాకేత్, ప్రియాంష్రెడ్డి, చందు ఉన్నారు. ఎంపికై న వారిని సీపీ సునీల్దత్, డీవైఎస్ఓ సునీల్రెడ్డి, టీడీసీఏ కోఅర్డినేటర్ ఎం.డి.మతిన్, కోచ్ సంపత్, నిరంజన్, నాగేశ్వరరావు, ఇమ్రాన్, శ్రీనివాస్, రాంబాబు అభినందించారు. కాలినడకన ద్వారకా తిరుమలకుసత్తుపల్లిరూరల్: మండల పరిధిలోని గంగారం గ్రామానికి చెందిన 16 మంది ఆదివారం స్థానిక శ్రీ ఆంజనేయస్వామి ఆలయం నుంచి కాలినడకన ద్వారకా తిరుమలకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంతరాలు రాకుండా చూడాలని స్వామివారిని వేడుకున్నారు. పాదయాత్రగా వెళ్లినవారిలో మధుబాబు యూత్ సభ్యులు కోలగట్ల చెన్నకేశ్వరరావు, ముత్తా అబ్బులురావు, తిరుమలశెట్టి సాయి, వనపర్తి మోహన్రావు, మలిశెట్టి రాంబాబు, పాకిన వెంకటకృష్ణ, చిన్న వెంకటేశ్వరరావు, అరిగే భీమాచారి, జల్లిపల్లి వాసుదేవరావు తదితరులు ఉన్నారు. భువనగిరికి బ్రాహ్మణ సమాఖ్య ప్రతినిధులు ఖమ్మంగాంధీచౌక్: తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య(టీబీఎస్ఎస్ఎస్) నూతన కమిటీ ఎన్నిక ఆదివారం యాదాద్రి జిల్లా భువనగిరి సమీపంలో గల స్వర్ణగిరి ఆలయంలో జరగగా, జిల్లా సంఘం ప్రతినిధులు హాజరయ్యారు. ఎన్నికల కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సురావజ్జల వాసుశర్మ, యువజన అధ్యక్షుడు సరస్వతిభట్ల శ్రీధర్ శర్మ, రాష్ట్ర రీజనల్ కో–ఆర్డినేటర్ తాటికొండాల సీతారామశాస్త్రి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆమంచి సురేష్ శర్మ, ప్రతినిధులు జిలుగుల సతీష్ శర్మ, సన్నిధానం జగన్నాధం, రమామనోహర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా రామయ్య నిత్యకల్యాణంభద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి నిత్యకల్యాణ వేడుక ఆదివారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన, తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివా రిని మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. -
పెరిగిన విద్యుత్ వినియోగం
● నిత్యం 2 మిలియన్ యూనిట్ల మేర అదనంగా వాడకం ● అధిక ఉష్ణోగ్రతలు, యాసంగి పంటల సాగే కారణం జిల్లాలో విద్యుత్ కనెక్షన్ల వివరాలు గృహ కనెక్షన్లు 4,92,745 వ్యవసాయ కనెక్షన్లు 1,18,267 పరిశ్రమలు 65,822 ఇతరాలు 12,839 మొత్తం 6,89,673 ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో విద్యుత్ వినియోగం పెరిగింది. అధిక ఉష్ణోగ్రతలతో గృహ వినియోగం బాగా పెరగడమే దీనికి ప్రధాన కారణం. దీనికి తోడు ఈ ఏడాది కురిసిన వర్షాలతో జలాశయాలు, భూగర్బంలో నీరు సమృద్ధిగా ఉండడంతో జిల్లా వ్యాప్తంగా యాసంగి పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. మరోవైపు గ్రానైట్, ఇతర పరిశ్రమలు కూడా ఉండడంతో విద్యుత్ వినియోగం సాధారణానికి మించింది. జిల్లాలో ఉన్న విద్యుత్ కనెక్షన్లు, వినియోగం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని టీజీ ఎన్పీడీసీఎల్ జిల్లాకు నిత్యం 6.96 మిలియన్ యూనిట్ల విద్యుత్ కోటాను నిర్దేశించింది. ఫిబ్రవరి మూడో వారం వరకు జిల్లాలో దాదాపు కోటా మేరకు విద్యుత్ వినియోగం జరగగా నాలుగో వారం నుంచి ఇప్పటివరకు కేటాయంచిన యూనిట్లకు మించి విద్యుత్ అవసరమవుతోంది. నిత్యం 2 మిలియన్ యూనిట్ల వరకు అదనం.. ఖమ్మం ఎన్పీడీసీఎల్ సర్కిల్ పరిధిలో మార్చి నెల ఆరంభం నుంచి నిత్యం సంస్థ నిర్దేశించిన కేటాయింపులకు మించి 2 మిలియన్ల విద్యుత్ విద్యుత్ వినియోగం జరుగుతోంది. జిల్లాకు రోజుకు విద్యుత్ కోటా 6.96 మిలియన్ యూనిట్లు కాగా, 8.70 నుంచి 9.09 మిలియన్ యూనిట్ల వరకు వినియోగిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, యాసంగి పంటలు.. మార్చి ఆరంభం నుంచి 35 – 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలుచోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఫ్యాన్లు, ఏసీల వాడకంతో ప్రధానంగా గృహ వినియోగం గణనీయంగా పెరిగింది. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు గృహ వినియోగం అధికంగా ఉంటుందని విద్యుత్ శాఖ అంచనా వేసింది. పగటి వేళల్లో కూడా గృహ విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. దీనికి తోడు జిల్లాలో నీటి వనరుల ఆధారంగా యాసంగి పంటలను సాగు చేశారు. నాగార్జున సాగర్ ఆయకట్టు భూముల్లో వరి, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నారు. జిల్లా మొత్తంలో 2 లక్షల ఎకరాల్లో వరి, 1.30 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నారు. సాగర్ కాల్వల నుంచి వానబందీ పద్ధతిలో నీరు విడుదల చేస్తుండగా రైతులు తమ భూముల్లో బోర్లు వేసుకొని భూగర్భ జలాలను కూడా వినియోగించుకుంటున్నారు. మార్చిలో పంటలు చివరి దశలో ఉండడంతో నీటి వినియోగం అధికంగా ఉంటుంది. దీంతో వ్యవసాయ విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. దీనికి తోడు జిల్లాలో విద్యుత్ కనెక్షన్ల సంఖ్య కూడా పెరిగింది. ఈ ప్రభావం కూడా విద్యుత్ వినియోగం పెరగడానికి కారణమని చెప్పవచ్చు. మార్చిలో కోటాకు మించి 2 మిలియన్ యూనిట్లకు పైగా వినియోగించిన రోజులిలా..తేదీ అదనపు వినియోగం మార్చి 2న 2.07 4న 2.13 7న 2.06 9న 2.02 12న 2.26 13న 2.16 15న 2.09 16న 2.22 17న 2.04 18న 2.10 19న 2.05 21న 2.03 -
రేపు కేఎంసీ బడ్జెట్ సమావేశం
ఖమ్మంమయూరిసెంటర్ : ఖమ్మం నగరం విస్తరిస్తుండడంతో అభివృద్ధి, ఆదాయం పెరుగుతోంది. కేఎంసీకి వచ్చే ఆదాయం, అయ్యే ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. రాబోయే 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి కార్పొరేషన్ అధికారులు రూపొందించిన అంచనా బడ్జెట్ ఈ విషయాన్ని తెలియజేస్తోంది. 2023 – 24లో రూ.67.08 కోట్లు ఉన్న బడ్జెట్ 2024 – 25లో రూ.80.67 కోట్లుగా అంచనా వేశారు. అయితే ఆ ఏడాదికి సంబంధించి రివైజ్డ్ బడ్జెట్ రూ.90.82 కోట్లుగా చూపిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సర ఆదాయం, ఖర్చులను లెక్కలు కట్టి 2025 – 26 ఆర్థిక సంవత్సర అంచనా బడ్జెట్ను రూ.102.82 కోట్లుగా రూపొందించారు. మంగళవారం జరిగే కేఎంసీ కౌన్సిల్ సమావేశంలో దీన్ని ప్రతిపాదించనున్నారు. ఆదాయం ఇలా.. 2025–26 ఆర్థిక సంవత్సరంలో కేఎంసీకి వచ్చే ఆదాయ వివరాలపై ఓ అంచనా వేశారు. ఆస్తి పన్నుల ద్వారా రూ.33.92 కోట్లు, స్టాంప్ డ్యూటీ ద్వారా రూ.13 కోట్లు, కేఎంసీ భవనాల అద్దెల ద్వారా రూ.4.43 కోట్లు, ప్రజారోగ్యం/పారిశుద్ధ్యం ద్వారా రూ.3.61 కోట్లు, టౌన్ ప్లానింగ్ ద్వారా రూ.36.10 కోట్లు, ఇంజనీరింగ్ విభాగం ద్వారా రూ.11.76 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఇక డిపాజిట్లు, అడ్వాన్సులు, రుణాల ద్వారా మరో రూ.6.76 కోట్లు ఆదాయం వస్తుందని లెక్కలు వేశారు. ఖర్చులు ఇలా.. రాబోయే ఆర్థిక సంవత్సరంలో కేఎంసీ ఖర్చులపైనా అధికారులు అంచనాలు వేశారు. ప్రధానంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలకు రూ.30.70 కోట్లు, పారిశుద్ధ్యానికి రూ.11.16 కోట్లు, విద్యుత్ చార్జీలు రూ.10.90 కోట్లు, రుణాల చెల్లింపు రూ.2.01 కోట్లు, గ్రీన్ బడ్జెట్ రూ.10.28 కోట్లు, ఇంజనీరింగ్ విభాగం నిర్వహణకు రూ.7.77 కోట్లు, సాధారణ పరిపాలన వ్యయం రూ.5.83 కోట్లు, టౌన్ప్లానింగ్ విభాగం వ్యయం రూ.52 లక్షలు, విలీన గ్రామాలకు రూ.7.88 కోట్ల కేటాయింపు, పబ్లిక్ ఎమిటేషన్ వ్యయం రూ.79 లక్షలు, వార్డు బడ్జెట్ రూ.14.97 కోట్లు, డిపాజిట్లు, అడ్వాన్సులు, రుణాలు రూ.6.76 కోట్లుగా లెక్కలు వేశారు. కార్పొరేటర్లకు బడ్జెట్ కాపీలు.. ఈనెల 25న ఖమ్మం నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆదేశాలతో ఇప్పటికే బడ్జెట్ అంచనాను రూపొందించిన అధికారులు సంబంధిత కాపీలను కార్పొరేటర్లకు అందజేశారు. ఈనెల 25న కార్పొరేటర్లు బడ్జెట్ సమావేశాలకు రావాలని ఆహ్వాన పత్రం అందించడంతో పాటు బడ్జెట్ కాపీని అందజేశారు. అధికారులు రూపొందించిన బడ్జెట్పై కార్పొరేటర్లు ముందుగానే అవగాహన పొందేందుకు ఈ కాపీలను అందించినట్లు తెలిసింది.2025–26 సంవత్సరానికి రూ.102.71 కోట్ల ఆదాయం అంచనా -
సమయం ఆసన్నం
వచ్చేనెల 1 నుంచి రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ ● జిల్లాలో 4,11,428 రేషన్కార్డులు.. 11.21 లక్షల మంది లబ్ధిదారులు ● గోదాముల్లో 85,735.446 మెట్రిక్ టన్నుల బియ్యం సిద్ధం ● జిల్లాలో ఏడాదికి సరిపడా నిల్వలుసన్నధాన్యం సాగుపై దృష్టి.. ఈ ఏడాది వానాకాలం సీజన్లో సన్న ధాన్యం సాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే ప్రణాళిక రూపొందించింది. సన్న రకం ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించింది. దీంతో రైతులు ఎక్కువగా ఈ ధాన్యం సాగువైపే మొగ్గు చూపారు. జిల్లాలో మొత్తం 2,81,991 ఎకరాల్లో వరి సాగు చేయగా.. అందులో 2,62,230 ఎకరాల్లో సన్న రకం ధాన్యమే పండించారు. 19,761 ఎకరాల్లో దొడ్డు రకాలు సాగయ్యాయి. పౌర సరఫరాల సంస్థ 344 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 47,494 మంది రైతుల నుంచి సన్న ధాన్యాన్ని సేకరించింది. దొడ్డు వడ్లను కూడా కొనుగోలు చేసిన అధికారులు.. ఈ రెండు రకాలను వేర్వేరుగా నిల్వ చేశారు. సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్ కోసం మిల్లర్లకు అందజేశారు. మిల్లింగ్కు 2.81 లక్షల మెట్రిక్ టన్నులు.. జిల్లాలో 2,81,440 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కోసం మిల్లర్లకు అందించింది. ఈ ధాన్యానికి సంబంధించి 1,88,574.680 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. కాగా రేషన్ దుకాణాలకు అందించే సన్న బియ్యానికి సంబంధించి 2,52,563 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్లకు చేరింది. వారి నుంచి సీఎంఆర్ కింద 1,69,217.21 మెట్రిక్ టన్నుల బియ్యం చేరాల్సి ఉండగా ఇప్పటి వరకు 85,735.446 మెట్రిక్ టన్నుల బియ్యం పౌర సరఫరాల సంస్థకు చేరాయి. ఇంకా 83,481.764 మెట్రిక్ టన్నుల ధాన్యం రావాల్సి ఉంది. వచ్చిన సన్న బియ్యాన్ని జిల్లాలోని తొమ్మిది గోదాముల్లో నిల్వ చేశారు. ఈ ఏడాది ఢోకా లేనట్టే.. రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు ఈ ఏడాది సన్న బియ్యం పుష్కలంగా అందుబాటులో ఉండనున్నాయి. జిల్లాలో 4,11,428 కార్డులు ఉండగా.. 11,21,049 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి నెలకు మొత్తం 7,230.750 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం అవసరం. ఏడాదికి మొత్తం 86,769 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతాయి. అయితే ఇప్పటి వరకు సీఎంఆర్ కింద 85,735.446 మెట్రిక్ టన్నుల బియ్యం పౌర సరఫరాల సంస్థకు చేరగా, గోదాముల్లో నిల్వ చేశారు. అక్కడి నుంచి ప్రతినెలా మండల స్టాక్ పాయింట్లకు చేరుతాయి. ఇప్పటికే ఏడాదికి సరపడా సన్న బియ్యం స్టాక్ ఉన్నాయి. మిల్లర్ల నుంచి ఇంకా 83,481.764 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. ఈ మొత్తం కూడా పౌరసరఫరాల సంస్థకు చేరితే.. ఏడాదికి సరిపడా రేషన్ దుకాణాలకు అందుబాటులో ఉంటాయి.