breaking news
Khammam District News
-
గిరిజన విద్యార్థులకు బీఏఎస్ స్కూళ్లలో ప్రవేశాలు
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలోని అర్హులైన గిరిజన విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కీం(బీఏఎస్) అమలవుతున్న పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిరిజన అభివృద్ధి శాఖ డీడీ విజయలక్ష్మి తెలిపారు. ఈ పథకం ద్వారా 3, 5, 8వ తరగతుల్లో మిగిలిన సీట్లు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు మూడో తరగతిలో తొమ్మిది సీట్లు, ఐదో తరగతిలో నాలుగు సీట్లు, ఎనిమిదో తరగతిలో మూడు సీట్ల భర్తీకి కోయ, ఎరుకల, గోండు, నాయకపోడు, లంబాడీ తెగలకు రిజర్వ్ చేసినట్లు తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు జూలై 6వ తేదీ లోపు కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో అందజేస్తే, 7వ తేదీన భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తామని వెల్లడించారు. సీఎం సభ విజయవంతానికి ఇన్చార్జ్ల నియామకం ఖమ్మంమయూరిసెంటర్: చింతకాని మండలంలో ఈనెల 30న జరిగే రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొననుండగా, కాంగ్రెస్ శ్రేణులు, రైతులు, పథకాల లబ్ధిదారులు పాల్గొని జయప్రదం చేయాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ కోరారు. సభ జయప్రదానికి గాను నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్చార్జ్లు నియమించినట్లు తెలిపారు. ఖమ్మంకు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పాలేరుకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని బేబీ స్వర్ణకుమారి, వైరాకు ఎమ్మెల్యే మాలోత్ రాందాస్నాయక్, సత్తుపల్లికి నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ను ఇన్చార్జ్గా నియమించామని వెల్లడించారు. వైటీపీఎస్ ప్రైవేటీకరణకు నిరసన ఖమ్మం వ్యవసాయం: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లోని పలు విభాగాలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయంపై ఖమ్మం విద్యుత్ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఖమ్మం పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యాన బుధవారం భోజన విరామ సమయంలో సర్కిల్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద ఇంజనీర్లు, అధికారులు, ఉద్యోగులు, కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ వైటీపీఎస్లో విభాగాల ప్రైవేటీకరణ కారణంగా ఉద్యోగుల భద్రత, సేవలపై ప్రభావం పడుతుందన్నారు. ఈమేరకు ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 1104, 327 యూనియన్లతో పాటు వివిధ సంఘాల నాయకులు టి.శేషగిరిరావు, సీతారాంగోపాల్, ఎం.ప్రసాద్, విక్రమ్, రామకృష్ణ, సతీష్, కిరణ్, ఖాదర్బాబా, లక్ష్మీప్రియ, భవాని, శ్రీధర్, సురేష్, రవికుమార్, ఉపేందర్, మానస, రజిని, కిరీటి, వివేక్, శివరామకృష్ణారెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ సెమిస్టర్ల పరీక్షల ఫలితాలు విడుదలవర్సిటీకి ఫీజు చెల్లించని కళాశాలల ఫలితాలకు బ్రేక్కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఏప్రిల్–మే నెలల్లో నిర్వహించిన డిగ్రీ ఐదు, ఆరో సెమిస్టర్ల పరీక్ష ఫలితాలను బుధవారం విడుదల చేశారు. వైస్ చాన్స్లర్ కె.ప్రతాప్రెడ్డి ఫలితాలను విడుదల చేయగా, పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ వివరాలు వెల్లడించారు. ఐదో సెమిస్టర్ పరీక్షలకు 12,726 మంది హాజరుకాగా 5,260మంది(41.33శాతం), ఆరో సెమిస్టర్ పరీక్షలకు హాజరైన 33,205 మందిలో 16,119 మంది(48.54శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. డిగ్రీ పరీక్ష ఫలితాలను కేయూ వెబ్సైట్లో చూసుకోవచ్చని వివరించారు. కాగా, విద్యార్థులు రీవాల్యుయేషన్ కోసం 15రోజుల్లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఇక సుమారు 40 కళాశాలల యాజమాన్యాలు యూనివర్సిటీకి వివిధ రకాల ఫీజులు చెల్లించకపోవడం, ఆయా కళాశాలల్లోని విద్యార్థుల ఫలితాలను వెల్లడించలేదు. దీంతో వెబ్సైట్లో చూసుకున్న విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. ఈ అంశంపై యాజమాన్యాలు సంప్రదించగా, ఫీజు బకాయిల వివరాలు వెల్లడించడంతో సాయంత్రం వరకు 10 కళాశాలల బాధ్యులు చెల్లించారు. దీంతో ఆయా కళాశాలల విద్యార్థుల ఫలితాలను వెబ్సైట్లో పొందుపర్చినట్లు పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ తెలిపారు. -
కేసీఆర్ మళ్లీ వస్తేనే ‘సీతారామ’
● ముగ్గురు మంత్రులు ఉన్నా జిల్లాకు ప్రయోజనం లేదు ● బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎస్ఐఆర్ శిక్షణలో మాజీ మంత్రి కేటీఆర్సాక్షిప్రతినిధి, ఖమ్మం/సత్తుపల్లి: ‘ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చే ఎన్నికల్లో పదికి పది సీట్లు గెలుచుకుంటాం.. తద్వారా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే ఖమ్మం జిల్లాకు న్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా దుర్మార్గమైన పాలన పోవాలి.. కేసీఆర్ పాలన రావాలి అని జనం కోరుకుంటున్నారు.’ అని మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. సత్తుపల్లిలో బుధవారం బీఆర్ఎస్ కార్యకర్తలకు ‘ఎస్ఐఆర్’పై నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే రెండుమెడికల్ కాలేజీలు వచ్చాయని తెలిపారు. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కల్లూరు, సత్తుపల్లిల్లో స్వల్ప తేడాతో ఓడిపోయామని పేర్కొన్నారు. షాపుల్లో యూరియా స్టాక్ లేకపోగా, యాప్ పెట్టారని ఎద్దేవా చేశారు. సీతారామ ప్రాజెక్టును ప్రారంభించాం.. కేసీఆర్ హయాంలోనే సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు నీరు అందించే బృహత్తర కార్యక్రమం చేపట్టామని కేటీఆర్ వెల్లడించారు. రూ.10 వేల కోట్లతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టుకు రూ.8వేల కోట్లు తాము ఖర్చు చేస్తే, 2024 ఆగస్ట్ 15న మంత్రి తుమ్మలతోపాటు ఇతర మంత్రులు వెళ్లి నీళ్లు చల్లుకున్నారన్నారని తెలిపారు. మళ్లీ కేసీఆర్ వచ్చాకే ఈ ప్రాజెక్టును ప్రారంభించడం ఖాయమని, తద్వారా సత్తుపల్లిలో 90 వేల ఎకరాల స్థిరీకరణ జరుగతుందని పేర్కొన్నారు. జిల్లాకు ఒనగూరిందేమిటి..? గత ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ గెలిచి, ఆ పార్టీ ప్రభుత్వమే ఏర్పడి రెండున్నరేళ్లు అయినా జిల్లాకు చేసిందేమిటని ప్రజలు ఆలోచించాలని సూచించారు. జిల్లా మంత్రులకు ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖ, రెవెన్యూ శాఖ ఇలా కీలకమైన శాఖలు ఉన్నా ప్రజలకు ఏం ఒనగూరిందో ఆలోచన చేయాలన్నారు. రుణమాఫీ 40 పైసలే జరగగా, ఇంకా 60 పైసలు కాలేదన్నారు. ఇది మోసం కాదా అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లు అద్భుతంగా చేస్తామని ప్రభుత్వం చెబితే.. రైతులు మాత్రం కొనుగోలు కేంద్రాల వద్ద 30,40 రోజులు పడిగాపులు కాశారని, కనీసం సంచులు ఇచ్చే దిక్కు కూడా లేదని పేర్కొన్నారు. పేదల కడుపు కొట్టారు.. ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి చేసిన ఒక్క మంచి పని లేదని కేటీఆర్ తెలిపారు. ఖమ్మం వెలుగుమట్లలో పేదల ఇళ్లను నేలమట్టం చేశారని పేర్కొన్నారు. మంత్రుల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డుగా ఉన్నాయని, అందమైన విల్లాలకు అడ్డొస్తున్నాయని వేయి ఇళ్లు తొలగించి పేదల కడుపు కొట్టారని విమర్శించారు. మరోపక్క బుగ్గపాడులో దోపిడీ జరుగుతుండగా, రైతులకు రైతుబంధు రాకపోగా, యూరియా దొరకడం లేదని, అర్హులకు పింఛన్లు రావడం లేదని తెలిపారు. అభయహస్తం అంటూ చెప్పిన కథలు నమ్మి కాంగ్రెస్ను గెలిపించినందుకు ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ కేసీఆర్ హయాంలోనే ఉమ్మడి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని తెలిపారు. జిల్లాను సస్యశ్యామలం చేసేలా సీతారామ ప్రాజెక్టు చేపడితే, ఈ ప్రభుత్వం వచ్చాక పనులు ఎక్కడికక్కడే ఉన్నాయన్నారు. కేసీఆర్ రుణం తీర్చుకోవడానికి వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పదికి పది సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంటామని తెలిపా ఈ సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ కురాకుల నాగభూషణం, నాయకులు ఏనుగుల రాకేష్రెడ్డి, దిండిగాల రాజేందర్, బొమ్మెర రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకు రుణాలతో ఆర్థికాభివృద్ధి
● లక్ష్యం మేర రుణాల పంపిణీ జరగాలి ● వార్షిక రుణ ప్రణాళిక విడుదల చేసిన అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డిఖమ్మంగాంధీచౌక్: బ్యాంకు రుణాల పంపిణీ లబ్ధిదారుల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి అన్నారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన జిల్లా సంప్రదింపుల కమిటీ(డీసీసీ), జిల్లా స్థాయి సమీక్ష కమిటీ(డీఎల్ఆర్సీ) సమావేశంలో ఆయన 2026–27 సంవత్సరం వార్షిక రుణ ప్రణాళిక విడుదల చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 2025–26లో నిర్దేశించుకున్న రూ.11,635.78 కోట్ల లక్ష్యానికి గాను రూ.12,551.44 కోట్లు అందించడం(107.87 శాతం)పై బ్యాంకర్లను అభినందించారు. వ్యవసాయ రుణాల పంపిణీలో బ్యాంకులు ముందంజలో ఉన్నాయని, ఈ రంగంలో రూ.8,378.18 కోట్లకు గాను రూ.9,841.64 కోట్లు అందించి 117.47 శాతంగా నమోదు చేశారని తెలి పారు. ఇక వ్యవసాయ టర్మ్ లోన్ల పంపిణీలో 134.82 శాతం, గృహ రుణాల్లో 238శాతం, ఎంఎస్ఎంఈ రంగంలో 77.25 శాతం నమోదైందన్నారు. అయితే, విద్యారుణాల విషయంలో రూ.96.98 కోట్ల లక్ష్యానికి రూ.28 కోట్లే పంపిణీ చేయడంపై కారణాలు ఆరా తీశారు. విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించి ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలను చేరాలని సూచించారు. ఆతర్వాత ముద్ర, ప్రధానమంత్రి ఉపాధి కల్పన, ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమల అభివృద్ధి పథకం, విశ్వకర్మ పథకం, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలపై సమీక్షించారు. అలాగే, 1,036 సంఘాలకు సంబంధించిన రూ.25.56 కోట్ల ఎన్పీఏలు ఆరు నెలలకు పైగా పెండింగ్ ఉన్నందున ప్రత్యేక దృష్టి సారించాలని బ్యాంకర్లకు అదనపు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఆర్బీఐ లీడ్ డిస్టిక్ర్ట్ ఆఫీసర్ యశ్వంత్ సాయి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ప్రవీణ్, ఎస్సీ, గిరిజన అభివృద్ధి శాఖల అధికారులు మహమ్మద్ ముజాహిద్, విజయలక్ష్మి, ఖమ్మం ఎల్డీఎం రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సాగర్ కాల్వకు గండి కొట్టిన రైతు
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి గుదిమళ్ల రెవెన్యూలోని సాగర్ కాల్వకు ఓ రైతు గండి కొట్టాడు. దీంతో పక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు. గుదిమళ్లకు చెందిన ఇద్దరు రైతులు తమ పొలాలకు వెళ్లే బాట విషయమై గొడవ పడ్డారు. దీంతో ఒకరి కాల్వకు అవతలి వైపు ఉండగా, అటు వెళ్లకుండా ఇంకో రైతు తన పొలం పక్కనే కాల్వ పక్కగా గండి కొట్టాడు. ఫలితంగా ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలే కాక రైతులు పొలాలకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై గ్రామపెద్దలు రంగంలోకి దిగి రైతులకు నచ్చచెబుతున్నట్లు తెలిసింది. కాగా, ఎన్నెస్పీ ఏఈ సీతారాంప్రసాద్ను వివరణ కోరగా, పంట కాల్వకు, పక్కనే దారికి గండి పెట్టిన విషయం తమ దృష్టికి రాగానే పరిశీలించానని తెలిపారు. మూడు రోజుల్లోగా బాధ్యులే గండి పూడ్చకపోగా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
అంగన్వాడీల్లో హడావుడి!
● పదోన్నతులు, బదిలీలకు ముగిసిన దరఖాస్తుల స్వీకరణ ● ఇది పూర్తయ్యాక ఖాళీల భర్తీ కూడా.. ● త్వరలోనే నోటిఫికేషన్ విడుదలకు కసరత్తుఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, హెల్పర్లు సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు, బదిలీల ప్రక్రియ తుది దశకు చేరింది. అంగన్వాడీ హెల్పర్లు(ఆయా)గా పనిచేస్తూ అర్హత కలిగిన వారికి టీచర్లుగా పదోన్నతి కల్పించడమే కాక బదిలీల కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా పూర్తిచేశాక, మిగిలిన ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్ల డించాయి. పరిశీలన పూర్తి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పదోన్నతి, బదిలీలకు సంబంధించి ఈనెల 10నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. గడువు ముగిసిన నేపథ్యాన దరఖాస్తులన్నీ క్రోడీకరించి, అర్హుల జాబితా సిద్ధం చేశారు. రోస్టర్ పాయింట్ల ఆధారంగా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడంపై దృష్టి సారించారు. పీజీలు చేసిన వారూ రేసులో..! ఒకప్పుడు అంగన్వాడీ పోస్టులకు కనీస అర్హత పదో తరగతిగా ఉండేది. కానీ ప్రస్తుతం ఇంటర్మీడియట్ విద్యార్హత ఉండగా, ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న హెల్పర్లు కూడా టీచర్లుగా పదోన్నతికి అర్హత సాధించారు. అయితే, ఇంటర్ పూర్తయిన వారే కాక ఇంకా ఉన్నత చదువులు చదివిన వారు సైతం హెల్పర్లుగా పనిచేస్తుండడం విశేషం. ఈనేపథ్యాన పీజీ పూర్తి చేసిన వారు, 10 – 18 ఏళ్ల అనుభవం కలిగిన వారూ పదోన్నతి రేసులో ఉన్నారు. ఆ తర్వాత నోటిఫికేషన్ జిల్లాలో ప్రస్తుతం బదిలీల ద్వారా ఐదుగురు టీచర్లు, ఐదుగురు హెల్పర్లకు స్థానం కలుగుతుంది. అలాగే, 21 మంది హెల్పర్లు, టీచర్లుగా పదోన్నతి పొందే అవకాశముంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక జిల్లాలోని కేంద్రాల వారీగాపై ఖాళీలపై స్పష్టత రానుంది. తద్వారా రోస్టర్ ఖాళీల వివరాలను కలెక్టర్, అదనపు కలెక్టర్ ఆమోదంతో ప్రకటించి, రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ప్రాజెక్ట్ టీచర్ హెల్పర్ కల్లూరు 28 121 కామేపల్లి 17 127 ఖమ్మం రూరల్ 24 132 ఖమ్మం అర్బన్ 10 43 మధిర 35 98 సత్తుపల్లి 24 44 తిరుమలాయపాలెం 05 105జిల్లాలో సీఎం పర్యటన, ఎస్ఐఆర్ తదితర కారణాలతో ఉన్నతాధికారులు వరుస సమీక్షలతో బిజీగా ఉంటున్నారు. దీంతో అంగన్వాడీల పదోన్నతులు, బదిలీల ఫైల్ కదలికలో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లోనే ఈ ఫైల్కు ఆమోదం లభిస్తుందని చెబుతున్నారు. ఆపై కలెక్టర్, అదనపు కలెక్టర్ సూచనల మేరకు అధికారులు ప్రక్రియ నిర్వహణకు సిద్ధమవుతున్నారు. -
జూలై నాటికి ఆయిల్పామ్ ఫ్యాక్టరీ పూర్తి
కొణిజర్ల: కొణిజర్ల మండలం అంజనాపురంలో గోద్రెజ్ కంపెనీ ఆధ్వర్యాన నిర్మిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనుల్లో వేగం పెంచి జూలై నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. ఫ్యాక్టరీ పనులను బుధవారం ఆయన అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించాక మాట్లాడారు. అంజనాపురంలో ఫ్యాక్టరీ మొదలైతే ఆయిల్పామ్ సాగు చేస్తున్న రైతులకు దూరాభారం తగ్గుతుందని తెలిపారు. తహసీల్దార్ ఎన్.అరుణ, ఎంపీడీఓ ఆర్.ఉపేంద్రయ్య, ఆర్ఐ నరేష్, సర్పంచ్ ఏ.కమలమ్మ, గోద్రెజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
రూ. 20 కోట్లు మంజూరు చేయండి
మంత్రి దామోదర రాజనర్సింహకు పీఓ విన్నపం భద్రాచలంటౌన్: భద్రాచలం ఏజెన్సీ పరిధిలో డాక్టర్ల కొరత తీర్చడానికి, పీహెచ్సీల నిర్మాణం, వైద్య పరికరాలు, మౌలిక వసతుల అభివృద్ధికి సుమారు రూ.20 కోట్ల నిధులు అవసరమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహల్ వివరించారు. బుధవారం హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ భవనంలో వర్క్షాప్ నిర్వహించగా, పీఓ హాజరైన మాట్లాడారు. భద్రగిరి మార్ట్ పనితీరును వివరించగా మంత్రి ప్రశంసించారు. అనంతరం మంత్రికి గిరిజన మహిళలు తయారు చేసిన మిల్లెట్ ఉత్పత్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి సర్వేశ్వరరావు, ఏపీఓ డేవిడ్రాజ్, ఏడీఎంహెచ్ఓ సైదులు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణంపై విచారణఅశ్వారావుపేటరూరల్: మండలంలోని తోగ్గూడెం గ్రామంలో నిర్మిస్తున్న ఓ ఆలయ నిర్మాణంపై గ్రామానికి చెందిన కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో ఆ శాఖ ఉన్నతాధికారులు విచారణాధికారిగా కొత్తగూడెం డివిజన్ దేవాదాయ శాఖ ఇన్స్సెక్టర్ కావూరి ఆనంద్ను నియమించారు. గురువారం ఆయన గ్రామంలో ఆలయ నిర్మాణంపై విచారణ చేపట్టారు. కాగా, ఇరువర్గాల నుంచి వివరాలు సేకరించామని, నివేదిక ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు. -
నేటి నుంచి సర్
ఖమ్మం సహకారనగర్: జిల్లా ప్రజలకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)పై విస్తృత అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ దివాకర టీ.ఎస్. తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం ఆయన అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి వివరాలు వెల్లడించారు. జిలాల్లో ‘సర్’కు సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేయగా, గురువారం నుంచి బీఎల్ఓలు ఇంటింటి సర్వే చేపడుతారని తెలిపారు. వీరి వెంట పార్టీలు నియమించిన బీఎల్ఏలు కూడా వెళ్తూ ఎన్యుమరేషన్ ఫారాలు నింపడంలో ఓటర్లకు సహకరిస్తారని చెప్పారు. బీఎల్ఓలకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు జారీ చేయగా, బీఎల్ఏలు తమ పార్టీ జారీ చేసిన గుర్తింపు కార్డులతో రావాలని సూచించారు. విదేశాలు, ఇతర నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు, సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్న ఓటర్లు ఆన్లైన్ ద్వారా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించవచ్చని, లేదంటే వారి కుటుంబీకులు కూడా ఇవ్వొచ్చని తెలిపారు. వీడియోలు, కరపత్రాలతో అవగాహన ఎన్యుమరేషన్ ఫారాలు నింపే విధానంపై ట్యుటోరియల్ వీడియోలు సిద్ధం చేశామని, ఫారాలతో పాటు కరపత్రాలు కూడా ఇస్తామని కలెక్టర్ తెలిపారు. మ్యాపింగ్ పూర్తయిన వారు కూడా తప్పనిసరి ఎన్యుమరేషన్ ఫారం సమర్పించాలన్నారు. 2002 ఎస్ఐఆర్ జాబితాలో దేశంలో ఎక్కడ ఓటు నమోదైనా, ఆ వివరాలను ప్రస్తుతం ఉపయోగించవచ్చన్నారు. ముఖ్యంగా వివాహం అనంతరం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న మహిళలకు ఇది ఉపయోగకరమని తెలిపారు. రెండేసి చోట్ల ఓటు ఉన్న వారి గుర్తింపు నిరంతరం జరుగుతుందని, ఒకే పేరు, ఇంటిపేరు, తండ్రి పేరు వంటి వివరాలతో ఉన్న ఎంట్రీలను ఈఆర్ఓ నెట్ ద్వారా గుర్తించి, బీఎల్వోలు క్షేత్రస్థాయిలో విచారణ అనంతరం చర్యలు తీసుకుంటారని చెప్పారు. మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లు, తొలగించనుండగా, అర్హులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్డీఓ శ్రీనివాస్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ అన్సారీ పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఓటర్ల జాబితా ప్రక్షాళనలో అత్యంత కీలకమైన ఇంటింట ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ గురువారం మొదలుకానుంది. ఎస్ఐఆర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)లో భాగంగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) ప్రతీ ఇంటికి వెళ్లి ఓటర్ల గణన చేపడుతారు. ఇప్పటికే బీఎల్ఓలు 2002 ఓటర్ల జాబితాతో 2025 ఓటర్ల జాబితాను సరిపోల్చి మ్యాపింగ్ చేశారు. జిల్లాలో దాదాపు 77 శాతం పైగా ఓటర్ల మ్యాపింగ్ పూర్తికాగా, వీరు తమ ఇంటికి వచ్చే బీఎల్ఓలకు ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి అందించాల్సి ఉంటుంది. మ్యాప్ కాని వారు ఎన్యుమరేషన్ ఫామ్తోపాటు 11 ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాలి. గురువారం నుంచి వచ్చేనెల 24 వరకు జరిగే ఈ కార్యక్రమ నిర్వహణకు యంత్రాంగం సిద్ధమైంది. మ్యాపింగ్లో తేడాలు జిల్లాలో ఓటర్ల డేటా మ్యాపింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటివరకు 9,65,407 మంది ఓటర్ల(77.62 శాతం) వివరాలు మ్యాపింగ్ కాగా, ఇంకా 2,78,374 మంది మిగిలిపోయారు. అలాగే, 1,81,805 మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నియోజకవర్గాల వారీగా ఖమ్మంలో అత్యధికంగా 49,510 ఓటర్ల పేర్లలో తేడాలు ఉన్నాయి. ఆ తర్వాత పాలేరులో 41,206మంది, మధిరలో 32,762మంది, సత్తుపల్లిలో 30,085 మంది ఓటర్లు, వైరాలో 28,242 మంది ఓటర్ల పేర్లలో వ్యత్యాసాలు ఉండగా.. వీటిని సరిచేస్తూ వివరాలను నూరు శాతం పక్కాగా నమోదుకు ఇంటింటి సర్వే ఉపయోగపడనుంది. ప్రతీ ఓటరుకూ రెండేసి పత్రాలు ఓటర్లకు ఇచ్చేందుకు గాను బీఎల్ఓలకు 24,87,562 ఎన్యుమరేషన్ ఫారాలను అందజేశారు. నియోజకవర్గాల వారీగా ఓటర్ల సంఖ్యకు రెట్టింపు స్థాయిలో ఈ ఫారాలు పంపిణీ చేస్తారు. బీఎల్ఓలు ప్రతీ ఇంటికి వెళ్లి తాళం వేసి ఉంటే కనీసం మూడు సార్లు సందర్శించాల్సి ఉంటుంది. ఓటరుకు ఎన్యుమరేషన్ పత్రాలు రెండు ప్రతులు అందజేస్తారు. ఓటరు అందులో వివరాలను నింపాక సంతకం చేస్తే, బీఎల్ఓ ఒకటి తీసుకుని, రెండో ప్రతిని రశీదు సహా ఓటరుకు అందజేస్తారు. ఇక ఆన్లైన్ ద్వారా voters.eci.gov.in పోర్టల్లో ఓటీపీ ఽధ్రువీకరణ ప్రక్రియ కూడా పూర్తి చేసే వెసలబాటు ఉంది. పార్టీలకూ భాగస్వామ్యం ఓటర్ల నమోదు, సవరణలో తప్పులు జరగకుండా, పారదర్శకత పెంచేందుకు రాజకీయ పార్టీలకు కూడా ఎన్నికల సంఘం భాగస్వామ్యం కల్పించింది. ‘సర్’ పర్యవేక్షణకు రాజకీయ పార్టీలు బీఎల్ఏ (బూత్ లెవెల్ ఏజెంట్లు)లను నియమించే వెసులుబాటు కల్పించారు. దీంతో జిల్లాలోని 1,460 పోలింగ్ కేంద్రాల పరిధిలో వివిధ పార్టీల తరఫున మొత్తం 4,720 మంది బీఎల్ఏలను నియమించారు. వీరిలో అత్యధికంగా కాంగ్రెస్ తరఫున 1,431 మంది, బీఆర్ఎస్ తరఫున 1,449 మంది ఉన్నారు. ఇక బీజేపీ తరఫున 1,188 మంది, సీపీఎం తరఫున 652 మందిని నియమించారు. ఈ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో బీఎల్ఓల చేపట్టే ఓటర్ల గుర్తింపు ప్రక్రియను పరిశీలిస్తూ, ఓటర్లకు కావాల్సిన సలహాలు ఇస్తారు. జూలె 31న ముసాయిదా జాబితా ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తారు. అందులో పేరు లేకున్నా, ఇతర అభ్యంతరాలపై ఆగస్టు 30వరకు దరఖాస్తులు స్వీకరించి, వీటిని సెప్టెంబర్ 28 నాటికి పరిష్కరిస్తారు. ఆపై అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురిస్తారు. అయితే, ఎన్యుమరేషన్ ఫారం సమర్పించని వారి పేర్లు ముసాయిదా ఓటరు జాబితాలో ఉండవని అధికారులు వెల్లడించారు.ఓటర్ల ఇంటింటికీ వెళ్లనున్న బీఎల్ఓలు నియోజకవర్గం మొత్తం ఓటర్లు మ్యాపింగ్ శాతం అన్ మ్యాపింగ్ ఖమ్మం 3,28,203 1,78,323 54.33 1,49,880 పాలేరు 2,45,885 2,08,393 84.75 37,492 మధిర 2,26,126 1,95,593 86.5 30,533 వైరా 1,96,475 1,64,345 83.65 32,130 సత్తుపల్లి 2,47,092 2,18,753 88.53 28,339 మొత్తం 12,43,781 9,65,407 77.62 2,78,374జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేలా అధికారులు సిద్ధమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 29 మంది ఏఈఆర్ఓలు, 30 మంది జిల్లా /అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్లు, 153 మంది సూపర్ వైజర్లు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటారు. వీరి సమన్వయంతో 1,460 మంది బూత్ స్థాయి అధికారులు సర్వే చేపడుతారు. జిల్లాలోని మొత్తం 1,460 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్న 822 ప్రాంతాలలో ఇంటింటి సర్వే సాగనుంది. -
కోలాహలంగా గిరి ప్రదక్షిణ
ఖమ్మంగాంధీచౌక్: భక్తజన సందోహం నడుమ నృసింహుడి గిరి ప్రదక్షణ వైభవంగా సాగింది. స్వామి జన్మ నక్షత్రం(స్వాతి నక్షత్రం) సందర్భంగా బుధవారం ఖమ్మంలోని స్తంభాద్రి గుట్ట చుట్టూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు నేత్రపర్వంగా నిర్వహించారు. తొలుత ఉత్సవ విగ్రహాలను పల్లకీలో గుట్ట పైనుంచి కిందకు తీసుకొచ్చి పురవీధుల్లో ఊరేగిస్తూ గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం స్వామిని తిరిగి ఆలయానికి చేర్చాక, రాతి కొండపై నక్షత్ర జ్యోతి(దివ్యజ్యోతి)ని పండితులు వెలిగించారు. ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహన్రావు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అర్చకులు, ఉద్యోగులతో పాటు పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బీఏఎస్ను సద్వినియోగం చేసుకోవాలి విద్యార్థుల ఎంపికలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఖమ్మంమయూరిసెంటర్: దళిత పేద విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కీం(బీఏఎస్)ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. బీఏఎస్ పథకం ద్వారా విద్యార్థుల ఎంపిక కోసం కలెక్టరేట్లో బుధవారం లాటరీ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ బీఏఎస్ పథకం ద్వారా పేద విద్యార్థులు కార్పొరేట్, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య అందుతోందని తెలిపారు. ఎస్సీ డీడీ జి.జ్యోతి మాట్లాడుతూ కలెక్టర్ చొరవతో ఈ ఏడాది జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు బీఏఎస్ పథకం ద్వారా విద్యార్థులకు సీట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చాయని తెలిపారు. ఈవిద్యా సంవత్సరం 1వ తరగతిలో ప్రవేశానికి 255 మంది దరఖాస్తుదారుల్లో 128 మందిని, ఐదో తరగతిలో ప్రవేశాలకు 163మంది దరఖాస్తు చేసుకోగా లాటరీ ద్వారా 131 మందిని ఎంపిక చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నాలుగు ఇసుక ట్రాక్టర్ల సీజ్ తిరుమలాయపాలెం: మండలంలోని ముజాహిదిపురం పరిధి పాలేరు ఏటి నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను బుధవారం పోలీసులు సీజ చేశారు. అలాగే, ట్రాక్టర్ల యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జగదీష్ తెలిపారు. గంజాయి స్వాధీనంచుంచుపల్లి: మండలంలోని రామాంజనేయ కాలనీ సమీప చెరువు కట్ట ప్రాంతంలో 108 గ్రాముల గంజాయి, ఐదుగురు వ్యక్తులను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తనిఖీలు నిర్వహించగా, రామాంజనేయ కాలనీకి చెందిన మబ్బు అవినాష్, దొమ్మేటి మధు, కె.సాయిగణేష్, ఖాజా పాషా, రామవరం నాగయ్యగడ్డకు చెందిన భూపతి ఉదయ్ కిరణ్ గంజాయి సేవించేందుకు సిద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. వీరి నుంచి రూ.5,800 విలువ చేసే గంజాయి చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. కడుపునొప్పితో చిన్నారి మృతిపాల్వంచరూరల్: కడుపునొప్పితో ఓ చిన్నారి బుధవారం మృతి చెందాడు. ఒడిశా నుంచి వల స వచ్చిన బాగు రాజేష్, సుమిత్ర మండల పరిధిలోని తోగ్గూడెం క్వారీల్లో పని చేస్తున్నారు. వీరి కుమారుడు ఒకటో తరగతి చదివే రుతిక్ కుమార్(6) మంగళవారం నుంచి తీవ్రంగా కడుపునొప్పితో బాధపడుతుండగా ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఫలితం లేక వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. -
టీపీఎస్లకు ఎస్!
ఖమ్మం సహకారనగర్: రాష్ట్రప్రభుత్వం విద్యావ్యవస్థల్లో తీసుకొస్తున్న మార్పుల్లో భాగంగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల(టీపీఎస్) ఏర్పాటుకు నిర్ణయించింది. ఇందులో నర్సరీ నుంచి ఇంటర్ వరకు బోధించనుండగా, ఉమ్మడి జిల్లాలో వచ్చే సంవత్సరం నాలుగు టీపీఎస్ల ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో టీపీఎస్ల ఏర్పాటుకు సరిపడా స్థలం, భవనాలు ఉన్న నాలుగు పాఠశాలలను ఇప్పటికే గుర్తించగా, పాఠశాలల విస్తీర్ణం, తరగతి గదులు, ఏ మండలం, ఏ నియోజకవర్గం పరిధిలో ఉందనే వివరాలో జిల్లా విద్యాశాఖ రూపొందించిన నివేదికలను కలెక్టర్లు ప్రభుత్వానికి పంపించారు. ఈ నివేదికల ఆధారంగా పరిశీలించడమే కాక ఇంకా ఏమైనా వసతులు కల్పించాలన్న అన్న అంశాన్ని తేల్చేందుకు డ్రోన్ కెమెరా ద్వారా వీడియోలు చిత్రీకరిస్తున్నారు. ఈమేరకుక్షేత్రస్థాయి పరిశీలన కోసం ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారిగా విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ పి.మదన్మోహన్ను నియమించారు. దీంతో ఆయన రెండు రోజుల నుంచి ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తున్నారు. నివేదికల ఆధారంగా పరిశీలన టీపీఎస్ల ఏర్పాటుకు మధిర మండలం మహదేవపురం, ఖమ్మంలోని నయాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కూసుమంచి హైస్కూల్తో పాటు భద్రాద్రి జిల్లాలోని చుంచుపల్లి హైస్కూల్ను ఎంపిక చేశారు. ఆయా పాఠశాలలకు సంబంధించి పూర్తి వివరాలతో ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా జేడీ మదన్మోహన్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి ప్రత్యేక ఫార్మాట్లోని వివరాలను సరిపోల్చుకుంటున్నారు. ఈ పరిశీలనలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు కూడా పాల్గొంటూ, ఇంకా ఏమేం నిర్మాణాలు చేపట్టాలి, అందుకు ఎంత సమయం పడుతుందో కూడా అంచనా వేస్తున్నారు. ఈమేరకు కూసుమంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరిశీలించగా, బుధవారం అధికారులు ఖమ్మంలోని నయబజార్ ప్రభుత్వ హైస్కూల్ను పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ ఆవరణలోని ప్రీ ప్రైమరీ పాఠశాల, ప్రైమరీ పాఠశాల, హైస్కూల్ స్కూల్, భవిత కేంద్రాన్ని సందర్శించడమే కాక విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న విద్యార్థులు, గదులు, టీపీఎస్ మొదలైతే పెరిగే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కావాల్సిన వసతులపై చర్చించారు. ఖమ్మం నయాబజార్ ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాల సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. ఇందులోని హైస్కూల్లో 260, ప్రైమరీ స్కూల్లో 160, భవిత కేంద్రంలో 24మంది, జూనియర్ కళాశాలలో 450మంది వరకు విద్యనభ్యసిస్తున్నారు. ఈక్రమాన విభాగాల వారీగా ఎన్ని భవనాలు, గదులు ఉన్నాయి, ఎంత ఫర్నీచర్ ఉంది.. ఇంకా ఏమేం కావాలో అధికారులు వివరాలు నమోదు చేసుకున్నారు. మొత్తంగా సుమారు రూ.16.05కోట్ల నిధులతో టీపీఎస్ ఏర్పాటుకు కావాల్సిన సౌకర్యాలు సమకూర్చనున్నట్లు తెలిసింది. ఈ పరిశీలనలో జేడీ మదన్మోహన్ వెంట డీఈఓ కార్యాలయం ఏడీ చావా శ్రీనివాసరావు, ఈడబ్ల్యూఐడీసీ(ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ఈఈ బుగ్గయ్య, ఏఈ సురేందర్రెడ్డి, ఖమ్మం అర్బన్ ఎంఈఓ శైలజాలక్ష్మి, పాఠశాల హెచ్ఎం ఉషారాణి, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు కార్యాచరణ -
అక్రమంగా ఏపీ నుంచి ఇసుక రవాణా
రఘునాథపాలెం: ఆంధ్రప్రదేశ్ నుంచి ఖమ్మం వైపు అనుమతి లేకుండా తరలిస్తున్న 112 టన్నుల ఇసుకను రఘునాథపాలెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక ఇసుక రవాణాకు ఉపయోగించిన మూడు లారీలు, ఎస్కార్ట్గా వినియోగించిన కారును స్వాధీనం చేసుకోవడంతో పాటు ముఠా సభ్యులపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం వివరాలు వెల్లడించారు. మండలంలో సోమవారం చేపట్టిన తనిఖీల్లో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారుపేట రీచ్ నుంచి అనుమతి లేకుండా మూడు లారీల్లో ఇసుకను ఖమ్మం తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈమేరకు నందిగామ, అన్నసాగర్ ప్రాంతాలకు చెందిన పాములపాటి గోపాలకృష్ణ, ఉమ్మినేని గోపి, బండ్ల కృష్ణ, దాసరి రామకృష్ణ, బండ్ల రామకృష్ణతో పాటు లారీ డ్రైవర్లు, యజమానులపై కేసులు నమోదు చేయడమే కాక మూడు లారీలు, కారు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఈ ముఠా సభ్యులు ఏపీలో తక్కువ ధరకు ఇసుక కొనుగోలు చేసి, ఖమ్మం సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అధిక ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. నిందితుల్లో పాములపాటి గోపాలకృష్ణపై తెలంగాణ, ఏపీలో ఇప్పటికే 12 కేసులు ఉండగా, పలు కేసుల్లో శిక్ష అనుభవించినా తీరు మారలేదని తెలిపారు. అలాగే దాసరి కృష్ణపైనా కేసులు ఉన్నాయని సీఐ వెల్లడించారు.మూడు లారీలు, ఎస్కార్ట్ కారు స్వాధీనం -
ఎంపీగా రెండేళ్ల పదవీకాలం పూర్తి
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం లోక్సభ సభ్యుడిగా రామసహాయం రఘురాంరెడ్డి పదవీకాలం గురువారంతో రెండేళ్లు పూర్తవుతోంది. గడిచిన 24నెలల కాలంలో జరిగిన ఏడు పార్లమెంట్ సమావేశాల్లోనూ పాల్గొన్న ఎంపీ రికార్డు స్థాయిలో 78.5 శాతం హాజరు నమోదు చేసుకున్నారు. అంతేకాక నియోజకవర్గానికి సంబంధించి 130 ప్రశ్నలను సభ దృష్టికి తీసుకెళ్లారు. పాల్వంచ థర్మల్ పవర్ స్టేషన్ పునరుద్ధరణకు ఆర్థిక సాయం, పోలవరం ముంపు బాధితులకు న్యాయం, ఉభయ జిల్లాల్లో మిర్చి రైతుల సమస్యలే కాక చారిత్రక నేలకొండపల్లి బౌద్ధ క్షేత్రాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే తదితర అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఎంపీ లాడ్స్ కింద రూ.9.42 కోట్లు, ఉపాధి హామీ పథకం ద్వారా రూ.18 కోట్లు, ఎస్డీఎఫ్ కింద రూ.4 కోట్ల నిధులను నియోజకవర్గంలో సీసీ రోడ్లు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, చేతిపంపుల ఏర్పాటు తదితర 176 పనులను మంజూరు చేశారు. అలాగే, ఖానా పురం వద్ద రూ.3.47 కోట్లతో కొత్త వంతెన నిర్మాణానికి చొరవ చూపారు. పేదలకు వైద్య సాయం అందేలా సీఎంఆర్ఎఫ్ద్వారా 1,864 మందికి రూ. 5,65,81,500 విలువైన సాయం మంజూరు చేయించారు. ఇక అత్యవసర చికిత్సల కోసం 41 మందికి రూ.79.80లక్షల ఎల్ఓసీలను కేటాయించారు.పలు అంశాలు పార్లమెంట్లో ప్రస్తావించిన రఘురాంరెడ్డి -
సభకు భారీగా జన సమీకరణ
చింతకాని: చింతకాని మండలం జగన్నాఽఽథపురం క్రాస్ రోడ్డు వద్ద ఈనెల 30న జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రైతుభరోసా నిధులు విడుదల చేస్తారని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. ఈమేరకు సభ విజయవంతానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. జగన్నాఽథపురంలో బుధవారం ఆయన సభ ఏర్పాట్లపై అధికారులు, నాయకులతో సమీక్షించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మధిర నియోజకవర్గంలో నిర్వహిస్తున్న మొదటి సీఎం సభ ఇదే అయినందున, భారీగా జనసమీకరణపై కాంగ్రెస్ శ్రేణులు దృష్టి సారించాలన్నారు. రైతులు, ప్రజలకు ఇబ్బంది రాకుండా వాహనాల పార్కింగ్ తదితర ఏర్పాట్లలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం అధికారులకు సైతం డిప్యూటీ సీఎం పలు సూచనలు చేశారు. కలెక్టర్ దివాకర టీ.ఎస్., తహసీల్దార్ బాబ్జీప్రసాద్, ఎంపీడీఓ చుంచు శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మోడల్గా మధిర నియోజకవర్గం బోనకల్: మధిర నియోజకవర్గాన్ని మోడల్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. బోనకల్ మండలంలో రూ.21.98కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే బీటీ, సీసీ రహదారుల నిర్మాణ పనులకు ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. మండలంలోని చిరునోముల–వత్సవాయి మధ్య రూ.3.20కోట్లు, ముష్టికుంట్ల–గార్లపాడు మధ్య రూ.5.50కోట్లు, ఎస్సీ కాలనీలో అంతర్గత రోడ్లు రూ.73లక్షలతో, బోనకల్ ఆర్అండ్బీ రోడ్డు నుండి చిరునోముల వరకు రూ.3.30 కోట్లు, ముష్టికుంట్ల నుంచి సీతంపేట మధ్య రూ.4.50కోట్లు, ముష్టికుంట్ల–నాగులవంచ–చొప్పకట్లపాలెం రోడ్డు రూ.4.75 కోట్లతో చేపట్టనుండగా శంకుస్థాపన చేశాక భట్టి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల మధ్య అనుసంధానం, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేలా రహదారులు నిర్మిస్తున్నామని తెలిపారు. కాగా, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, విద్యుత్ లైన్ల కోసం పలువురు భట్టికి వినతిపత్రాలు అందజేశారు. అలాగే, పల్లె దవాఖానా శిథిలావస్థకు చేరడంతో జీపీ కార్యాలయంలో వైద్యసేవలు అందిస్తున్నామని వైద్యాధికారి ప్రియాంక ఆయన దృష్టికి తీసుకెళ్లగా సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీ.ఎస్., ఆర్డీఓ శ్రీనివాస్, ఎంపీడీఓ రమాదేవి, తహసీల్దార్ సుధాకర్, మధిర మార్కెట్ చైర్మన్ బండారు నరసింహారావు, సర్పంచ్లు అనుమోలు చంద్రకళ, పిల్లలమర్రి నాగేశ్వరావు, ఇరిగేషన్ డీఈ తమ్మారపు వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ డీఈ వై.పీ.రాజు, నాయకులు బంధం నాగేశ్వరావు, పైడిపల్లి కిశోర్, బంధం శ్రీనివాసరావు, బోయినపల్లి వెంకటేశ్వర్లు, అమిరేశి సీతయ్య, షాజహాన్, ముస్తఫా, నవీన్, చాంద్ పాషా, తదితరులు పాల్గొన్నారు. -
విజయ డెయిరీపై నీలినీడలు
ఖమ్మం వ్యవసాయం: ఖమ్మంలోని తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య(విజయ డెయిరీ) మనుగడపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. డెయిరీ ఆవరణలోని పాలు, పెరుగు ప్యాకెట్ల తయారీ విభాగాన్ని నిలిపివేసే దిశగా అడుగులు పడుతున్నాయి. వరంగల్ యూనిట్ నుంచి పాల ప్యాకెట్లను ఉమ్మడి జిల్లాకు సరఫరా చేయాలని ఆదేశాలు అందినట్లు తెలిసింది. ఇక్కడ అన్ని వసతులు, మిషనరీ ఉన్నా ప్యాకింగ్ నిలిపివేసి, వరంగల్ నుంచి సరఫరాకు నిర్ణయించడంతో ఖమ్మం డెయిరీ నిర్వహణ ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. నిత్యం ప్యాకింగ్, విద్యాసంస్థలకు సరఫరా ఖమ్మం విజయ డెయిరీలో నిత్యం 10 – 12 వేల పాలు, పెరుగు ప్యాకెట్లను తయారు చేసే మిషనరీ ఉంది. ఉమ్మడి జిల్లాలో సేకరించే పాలతో ప్యాకెట్లు చేసి ప్రభుత్వ హాస్టళ్లు, విద్యాసంస్థలకు సరఫరా చేస్తున్నారు. అయితే, ఉన్నతాధికారులు ఇటీవల నిర్వహించిన సమావేశంలో వరంగల్ యూనిట్ నుంచి పాల ప్యాకెట్లను ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని హాస్టళ్లకు సరఫరా చేయాలని ఖమ్మం అధికారులను ఆదేశించారు. అంతేకాక ఇక్కడి కాంట్రాక్టర్కే ఆ బాధ్యతలు అప్పగించాలని సూచించగా, సదరు కాంట్రాక్టర్ సమ్మతించలేదు. దీంతో మరో కాంట్రాక్టర్ ఎంపికకు సైతం వెనకాడొద్దని చెప్పినట్లు తెలిసింది. ఇదే జరిగితే ఖమ్మం ప్యాకింగ్ సెక్షన్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఏమిటో తెలియరావడం లేదు. 50ఏళ్ల క్రితం పదెకరాల్లో ఏర్పాటు ఉమ్మడి జిల్లాలో వనరులు ఉండటంతో 50 ఏళ్ల క్రితం ఇక్కడ పరిశ్రమ నెలకొల్పారు. పాల శీతలీకరణ, పాలు, పెరుగు ప్యాకెట్లను తయారీ, నిల్వ కోసం ఖమ్మం రోటరీనగర్లో ప్రధాన రహదారి వెంట పదెకరాల స్థలంలో ఈ పరిశ్రమ ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ స్థలం విలువే రూ. వందల కోట్లలో ఉంటుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు సూర్యాపేట జిల్లా నుంచి దాదాపు 12 వేల మంది రైతులు సీజన్లో 25వేల లీటర్ల పాలు సరఫరా చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని హాస్టళ్లు, ప్రభుత్వ సంస్థలకు సరఫరా చేయడమే కాక విక్రయించాక మిగిలిన పాలను హైదరాబాద్ ప్రధాన కేంద్రానికి తరలిస్తారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం పాడి పరిశ్రమ అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన సమీక్షలో పరిశ్రమ ఆధునీకరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాక పాల సేకరణ పెరిగేలా పాడి గేదెల కొనుగోలుకు రైతులకు రుణాలు ఇచ్చేలా బ్యాంకర్లతో మాట్లాడాలని సూచించారు. దీంతో కలెక్టర్ పర్యవేక్షణలో రూ. 2.35 కోట్లతో అభివృద్ధికి నివేదిక సిద్ధం చేశారు. ఇంతలోనే ప్యాకింగ్ సెక్షన్ను నిలిపివేసేందుకు చర్యలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. యూనిట్ను మరో ప్రాంతానికి తరలించి అధునాతన సాంకేతికతతో నిర్మిస్తారా.. లేక సిక్ ఇండస్ట్రీగా పరిగణించి మూసేస్తారా అన్న చర్చ మొదలైంది. -
క్షమించు.. అని వేడుకుంటున్నా దాడి
ఖమ్మంక్రైం: ‘అమ్మా పెద్దవాడిని. రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నా.. మీరు టికెట్ తీసుకోకపోవడంతో చెకింగ్ ఉందనే ఆందోళనలో గట్టిగా మందలించాను.. నన్ను క్షమించు’ అని బతిమిలాడినా వినకుండా ఓ ప్రయాణికురాలు, ఆమె బంధువులు ఖమ్మం బస్టాండ్లో కండక్టర్పై దాడి చేసిన ఘటన ఇది. ఖమ్మం డిపోకు చెందిన కండక్టర్ తాళ్లూరి అంజయ్య మంగళవారం విధుల్లో భాగంగా హైదరాబాద్ నుంచి వస్తూ సూర్యాపేటలో పలువురు ఎక్కాక తిరిగి బయలుదేరాడు. అయితే, లెక్క చూసుకోగా సయ్యద్ తైసీన్ టికెట్ తీసుకోలేదని గుర్తించాడు. ఈమేరకు టికెట్ తీసుకోకపోతే చెకింగ్ ఉద్యోగులు వస్తే తన ఉద్యోగం పోతుందంటూ ఆయన ‘దొంగలా దాక్కున్నావు, టికెట్ తీసుకుంటే ఏమిటి’ అన్నాడు. ఆ తర్వాత ఆమె బాధపడడం చూసిన ఆయన ‘అమ్మా ఆందోళనలో అన్నాను. క్షమించు’ అని కోరాడు. అయితే, ఆమె విషయాన్ని తన బంధువులకు ఫోన్లో చెప్పగా బస్సు ఖమ్మం నూతన బస్టాండ్కు వచ్చేసరికి చేరుకున్న పలువురు కండక్టర్ అంజయ్యపై దాడి చేశారు. సెక్యూరిటీ సిబ్బంది, ఔట్ పోస్ట్ పోలీసులు అడ్డుకున్నా వినకపోగా, అంజయ్య బ్రతిమాలుతున్నా దాడి కొనసాగించారు. దీంతో ఆయనను జిల్లా ఆస్పత్రికి తరలించగా డిపో మేనేజర్ శివప్రసాద్, ఉద్యోగులు పరామర్శించారు. కాగా, దాడికి పాల్పడిన తౌఫియా, సద్దాం, జానీ, బాషా తదితరులపై కేసు నమోదు చేసినట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు. ఖమ్మంలో కండక్టర్పై దాడి చేసిన పలువురు -
కట్టించేది కాదు.. కూల్చే ప్రభుత్వమిది..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘రాష్ట్రంలో ఉన్నది ఇళ్లు కట్టించే ప్రభుత్వం కాదు.. కూల్చే ప్రభుత్వం. హైదరాబాద్లో హైడ్రా పేరుతో కూలగొడుతున్నారు.. ఖమ్మంలో జేసీబీలు పెట్టి మొన్న వెలుగుమట్లలో, నేడు రఘునాథపాలెంలో కూలగొట్టే కార్యక్రమం చేపట్టారు. ఏ ప్రభుత్వమైనా పేదలకు ఇళ్లు కట్టిస్తుంది. కానీ ఇందిరమ్మ రాజ్యమని చెబుతూ ప్రస్తుత పాలకులు నికృష్ట రాజ్యం చేస్తున్నారు’ అని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు వెళ్తున్న ఆయనను మంగళవారం ఖమ్మంలో రఘునాథపాలెంలోని 218 సర్వేనంబర్లో పట్టాలు కలిగిన పలువురు కలిశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ మంత్రులు అండగా నిలుస్తారని పేదలు భావిస్తే, వారే భక్షకులుగా మారడంతో ఇబ్బంది ఎదురైందన్నారు. వెలుగుమట్లలో పేదల ఇళ్లు కూల్చిన ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పరువుపోయిందన్నారు. అయినా ప్రభుత్వం తీరు మారకపోగా, ఇప్పుడు రఘునాథపాలెంలో కూల్చివేతలకు దిగుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బాజాప్తాగా ప్లాట్ నంబర్తో సహా పట్టాలు ఇస్తే, ఇప్పుడు ఇళ్లు తొలగిస్తామనడం బాధాకరమన్నారు. మరోచోట స్థలం ఇస్తామని పేదల అభిప్రాయం తీసుకుని అదీ చేయలేదని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో పిల్లల చదువుల ఫీజ్ రీయింబర్స్మెంట్ ఏడాదికి ఒకేసారి ఇస్తే ఇప్పుడు ఆ ఊసే లేక యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జర్నలిస్టులకు కేసీఆర్ ఇళ్ల స్థలాలు కేటాయించారని, వాటిని కూడా ఈ ప్రభుత్వం పెండింగ్ పెట్టిందన్నారు. కేబినెట్లో ఆమోదించి స్థలాన్ని కేటాయిస్తూ జీఓ జారీ చేయడమే కాక లే ఔట్ సిద్ధమైన భూమిని జర్నలిస్టులకు అప్పగించకుండా ఎందుకు ఆపుతున్నారో చెప్పాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. పేదల పక్షాన న్యాయపోరాటం తొలుత రఘునాథపాలెంలోని 218 సర్వేనంబర్ పేదల సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రఘునాథపాలెం మండలం 218 సర్వేనంబర్లో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో స్థలాలు ఇస్తే, బీఆర్ఎస్ హయాంలో పట్టాలు కూడా ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు మంత్రులుగా తుమ్మల, పొంగులేటి సమక్షంలోనే ఆ పట్టాల పంపిణీ జరిగిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఖమ్మం నియోజకవర్గంలో నిర్మాణాలు చేయకపోగా, కూల్చివేతలే ఎక్కువగా జరిగాయన్నారు. ఈవిషయంలో పేదల తరఫున న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, తక్కెళ్లపల్లి రవీందర్రావు, జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు, నాయకులు ఏనుగుల రాకేష్రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, పగడాల నాగరాజు, శీలంశెట్టి వీరభద్రం, షేక్ షకీనా తదితరులు పాల్గొన్నారు. -
నివేదికల రూపంలో విజయాలు
● రోడ్డు ప్రమాదాల తగ్గుదలపై విశ్లేశించాలి ● జిల్లా ప్రత్యేక అధికారి అనుదీప్ దురిశెట్టిఖమ్మం సహకారనగర్: ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో నమోదైన విజయాలను నివేదికలుగా రూపొందించాలని జిల్లా ప్రత్యేక అధికారి, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి, గనుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టర్ దివాకర టీ.ఎస్.తో కలిసి సోమవారం ఆయన కలెక్టరేట్లో జిల్లా అధికారులతో 99 రోజుల ప్రణాళికపై సమీక్షించారు. ఈ సందర్భంగా అనుదీప్ మాట్లాడుతూ అధికారులు వారి పరిధిలో సాధించిన ఫలితాలు, ప్రజలకు కలిగిన ప్రయోజనాలతో నివేదికలు సిద్ధం చేయాలన్నారు. అలాగే, పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో అందిన దరఖాస్తులు, పరిష్కరించిన సమస్యలపైనా వివరాలు సమర్పించాలని సూచించారు. ఇక అవగాహన సదస్సుల ద్వారా ప్రమాదాలు తగ్గినందున గత ఏడాది గణాంకాలతో పోల్చి చూపించాలని తెలిపారు. ఆతర్వాత గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీ, ఉచిత ఇసుక సరఫరా, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ వ్యవసాయ, విద్యా వారోత్సవాలతో పాటు ఇతర కార్యక్రమాల అమలును వివరించారు. ఈసమావేశంలో ట్రైనీ కలెక్టర్ పారస్ కుమార్, సీపీఓ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వెలుగుమట్ల పేదల సొంతింటి కల సాకారం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ లబ్ధిదారులు సొంతింటి కలను సాకారం చేసుకోవాలని కలెక్టర్ దివాకర సూచించారు. ఖమ్మం వెలుగుమట్ల ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి ఆయన పరిశీలించారు. నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా లబ్ధిదారులకు సహకరించాలని హౌసింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే, లబ్ధిదారులతో మాట్లాడిన కలెక్టర్..కాలనీకి ప్రధాన రహదారి, నీటి వసతి, విద్యుత్ స్తంభాలు ఏర్పాటుచేశామని తెలిపారు. హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, విద్యుత్ ఎస్ఈ శ్రీనివాసచారి, ఈఈ జగ్గారావు తదితరులు పాల్గొన్నారు. -
రైతు ఆశీర్వాద సభను జయప్రదం చేయండి
● డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ ఖమ్మంమయూరిసెంటర్/కామేపల్లి: చింతకాని మండలంలో ఈనెల 30న జరిగే రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొననుండగా, సభ జయప్రదానికి కాంగ్రెస్ శ్రేణులు పాటుపడాలని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ కోరారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ చింతకాని మండలంలో జరిగే సభావేదికగా రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలకు రైతుభరోసా నిధులు సీఎం విడుదల చేస్తారని తెలిపారు. ఈమేరకు రైతులు, జన సమీకరణకు నియోజకవర్గాలు, మండలాల వారీగా ఇన్చార్జిలను నియమిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, సుడా చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్తో పాటు బాలసాని లక్ష్మీనారాయణ, కొండబాల కోటేశ్వరరావు, సయ్య ద్ గౌస్, మొక్కా శేఖర్గౌడ్, పుచ్చకాయల వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. కాగా, కామేపల్లి మండలం కొత్తలింగాలలో ఏర్పాటుచేసిన సన్నాహక సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ రైతు ఆశీర్వాద సభకు కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, ఇట్టా శ్రీనివాస్, ధరావత్ అనురాధ, బానోత్ దీనూనాయక్ పాల్గొన్నారు. టీజీఐఐసీ వివరణతో మరిన్ని సందేహాలు! ● బీజేపీ నాయకుడు సుధాకర్రెడ్డి ఖమ్మంమామిళ్లగూడెం: సత్తుపల్లి మండలం బుగ్గపాడు మెగా ఫుడ్పార్కుకు సంబంధించి భూకేటాయింపుల్లో ఆరోపణలు వస్తుండగా, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ) ఇచ్చిన వివరణ మరిన్ని ప్రశ్నలకు తావిచ్చిందని బీజేపీ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల కోఇన్చార్జి పొంగులేటి సుధాకర్రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో రైతులు అధికంగా పండించే పత్తి, మిరప తదితర పంటల ఆధారిత పరిశ్రమల స్థాపనపై దృష్టి సారించకపోగా, లభ్యత తక్కువగా ఉన్న రొయ్యల పరిశ్రమను నెలకొల్పడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. సదరు సంస్థ ఎప్పుడు ఏర్పడిందో ఎవరికీ అవసరం లేదని తెలిపారు. కానీ ఎప్పుడు దరఖాస్తు చేసింది, భూమి ఎప్పుడు కేటాయించారు, ఆర్థిక, సాంకేతిక పరిశీలన ఎలా జరిగిందనే అంశాలపై కచ్చితమైన వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. జిల్లా యువత, రైతుల అభివృద్ధికి సంబంధించిన ఈ అంశంపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని సుధాకర్రెడ్డి ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. రైతు వేదికల్లో విత్తన విక్రయాలు ● నానో యూరియా, డీఏపీ కూడా... ఖమ్మంవ్యవసాయం: జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో మంగళవారం విత్తన విక్రయాలు మొదలయ్యాయి. వానాకాలం సీజన్ ప్రారంభమైన వేళ ప్రభుత్వం సూచించిన సన్న వరి, అపరాల విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 122 రైతు వేదికల్లో మంగళవారం రైతుమేళాలు ప్రారంభించారు. తొలిరోజు బీపీటీ– 5204 వరి రకం 59.4 క్వింటాళ్లు, ఆర్ఎన్ఆర్–15048 రకం 0.5 క్వింటాళ్లు, హెచ్ఎంటీ సోనా 17.4 క్వింటాళ్లు, జైశ్రీరాం రకం 0.5 క్వింటళ్లు, కేఎన్ఎం–7715 విత్తనాలు 2.5 క్వింటళ్లు, కేఎన్ఎం–1638 రకం 8.45 క్వింటాళ్ల విత్తనాలు అమ్ముడయ్యాయని అధికారులు తెలిపారు. ఇక చాలామంది రైతులు డబ్ల్యూజీఎల్–44(సిద్ది) రకం కోసం వచ్చినా అవి అందుబాటులో లేక నిరాశగా వెనుదిరిగారు. అంతేకాక కంది విత్తనాలు 8.89 క్వింటాళ్లు, పెసర 17.44 క్వింటాళ్లు అమ్ముడయ్యాయి. ఇక రైతు వేదికల్లో నానో యూరియా, డీఏపీ కూడా అమ్ముతుండగా మొదటి రోజు మంచి స్పందన లభించిందని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. బోధన, మెనూ అమలుపై దృష్టి ఎర్రుపాలెం: విద్యార్థినులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఇప్పటి నుంచే దృష్టి సారించాలని జీసీడీఓ రూబీ పంకజం సూచించారు. ఎర్రుపాలెంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేసిన ఆమె ఆవరణతో పాటు తరగతి, వసతిగదుల్లో పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం జీసీడీఓ మాట్లాడుతూ బోధనపై దృష్టి సారించడమే కాక మెనూ ప్రకారం విద్యార్థినులకు భోజనం సమకూర్చాలని సూచించారు. పాఠశాల సూపరింటెండెంట్ కె.సరిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
గిరిజన గ్రామాలకు రూ.110 కోట్లు ఇవ్వండి
రఘునాథపాలెం: ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ పరిధి రఘునాథపాలెం మండలంలో గిరిజన గ్రామపంచాయతీల్లో అభివృద్ధి పనులకు రూ.110 కోట్ల నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మంగళవారం ఆయన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్కు ప్రతిపాదనలు అందజేశారు. మండలంలోని 37 జీపీలకు గాను 28 ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల పరిధిలో ఉండగా, సరైన వరద కాల్వలు, డ్రెయినేజీలు లేక పారిశుద్ధ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఈమేరకు వరద నీటి కాలువలు, సమగ్ర డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటుకు డీపీఆర్ సిద్ధం చేసినందున రూ.110 కోట్లు మంజూరు చేయాలని కోరారు.కేంద్రమంత్రి చౌహాన్కు మంత్రి తుమ్మల వినతి -
దేశ సమగ్రతకు కృషిచేసిన ముఖర్జీ
ఖమ్మం మామిళ్లగూడెం: దేశ సమైక్యత, సమగ్రత కోసం రాజీలేని పోరాటం చేసిన డాక్టర్ శ్యామ్ప్రసాద్ ముఖర్జీ సేవలు మరువలేనివని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తెలిపారు. ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ‘బలిదాన్ దివస్’ను మంగళవారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ్ప్రసాద్ ముఖర్జీ చిత్రపటం వద్ద నివాళులర్పించాక కోటేశ్వరరావు మాట్లాడారు. ఈకార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వర్లు, నాయకులు వక్కలంక సుబ్రహ్మణ్యం, మందడపు సుబ్బారావు, మేకల నాగేందర్, రవిరాథోడ్, నరుకుల వెంకటేశ్వరరావు, భద్రం, బోయినపల్లి సురేష్, గుత్తా వంశీ, రుద్రగాని మాధవ్, మధు, వీరభద్రం పాల్గొన్నారు. ఆస్పత్రి నిర్మాణంలో నాణ్యత లోపం వైరా: వైరాలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు విమర్శించారు. ఆస్పత్రి పనులను మంగళవారం నాయకులతో కలిసి పరిశీలించిన ఆయన మాట్లాడారు. 2023లో ప్రారంభించిన నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తికాలేదని పేర్కొన్నారు. నాయకులు రవి రాథోడ్, బండారు నరేశ్బాబు, సరుకుల వెంకటేశ్వర్లు, వెంకీ యాదవ్, మనుబోలు వెంకటకృష్ణ, చింతనిప్పు రామారావు పాల్గొన్నారు. -
క్యూఆర్ కోడ్ ధరలపై కలెక్టర్ ఆరా
ఖమ్మంక్రైం: వాహనాలకు స్టిక్కర్లు అంటించడంతో పాటు క్యూఆర్ కోడ్ ఏర్పాటుకు ఇష్టారాజ్యంగా ధరలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై కలెక్టర్ దివాకర టీ.ఆస్. ఆరా తీశారు. ఈవిషయమై ‘సాక్షి’లో మంగళవారం ‘క్యూఆర్ కోడ్ పేరుతో దోపిడీ’ శీర్షిక కథనం ప్రచురితమైంది. రవాణా శాఖ కార్యాలయానికి ఫిట్నెస్ సర్టిఫికెట్ వచ్చే వాహనాలకు స్టిక్కర్లు, క్యూఆర్ కోడ్ పేరుతో ఇష్టమున్నట్లు వసూలు చేస్తున్నారని తెలియడంతో కలెక్టర్ దివాకర స్పందించి ఇన్చార్జ్ ఆర్టీఓ శ్రీనివాస్ ద్వారా వివరాలు ఆరా తీశారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీ బాధ్యులకు పని అప్పగించినట్లు తెలియగా, సమస్యను రాష్ట్ర కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. -
మహిళలకు సముచిత స్థానం
ఖమ్మంమయూరిసెంటర్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలకు సముచిత స్థానం కల్పించడమే కాకుండా.. అర్హులందరికీ విప్లవాత్మక సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ ప్రగతిని మహిళా కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటా వివరించాలని పిలుపునిచ్చారు. ఖమ్మంలో సోమవారం జరిగిన మహిళా కాంగ్రెస్ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పాలకుల పదేళ్ల పాలనలో పేదలు ఇళ్ల కోసం ఎదురుచూసి అలసిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల సాయం చేస్తోందని, తొలి దశలో 4.50 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. ప్రజాసంక్షేమానికి కృషి ఐదేళ్లలో మహిళా సంఘాల సభ్యులకు రూ.లక్ష కోట్ల రుణాలు ఇవ్వడమే లక్ష్యం కాగా, తొలి రెండున్నరేళ్లలో రూ.67 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశామని భట్టి వెల్లడించారు. అలాగే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో పాటు స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయించి మహిళలనే యజమానులను చేసిన ఘనత ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పార్టీ కోసం కష్టపడిన మహిళా నాయకులకు సముచిత గౌరవం, పదవులు దక్కేలా చూసే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్తో పాటు తాను తీసుకుంటానని తెలిపారు. ఈ నేపథ్యాన పార్టీ బలోపేతానికి మహిళా నాయకులు నడుం బిగించడమే కాక ఓటరు జాబితా సవరణపై దృష్టి సారించాలని సూచించారు. దివంగత ముఖమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి హయాంలో మహిళలకు పెద్దపీట వేశారని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ గుర్తుచేశారు. ఆ సమయాన చట్టసభల్లోనే కాక రాజకీయంగా పదవులు కల్పించారని తెలిపారు. వైఎస్సార్ మరణం తర్వాత మళ్లీఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మహిళలను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. రాబోయే కాలంలో ఏర్పాటు చేసే కమిటీల్లోనూ మహిళలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్, కార్పొరేషన్ల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యం, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఏదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ పోకబత్తిని అనిత, మాజీ మేయర్, డిప్యూటీ మేయర్లు పునుకొల్లు నీరజ, ఫాతిమా జోహరా తదితరులు పాల్గొన్నారు. కాగా, తొలుత ఎర్రబెల్లి స్వర్ణను డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ తదితరులు సన్మానించారు. -
పీఆర్సీ అమలు చేయాలి
బోనకల్: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులతో పాటు పెన్షనర్లు ఎదురుచూస్తున్నందున ప్రభుత్వం వెంటనే పీఆర్సీ నివేదిక తెప్పించుకుని అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో సంఘం సభ్యత్వ నమోదును సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పీఆర్సీ కమిటీ కాలపరిమితి పూర్తయినందున ప్రభుత్వం స్పందించాలన్నారు. అంతేకాక హెల్త్కార్డుల విధివిధానాలు ఖరారు చేయడంతో పాటు పాఠశాలల కుదింపు ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, 2024 మార్చి నుంచి రిటైర్ అయిన 15 వేల మంది ఉద్యోగులతో పాటు సీపీఎస్ ఉపాధ్యాయుల డీఏ బకాయిలు విడుదల చేసి, సీపీఎస్ను రద్దు చేయాలని కోరారు. యంగ్ ఇండియా, టీపీఎస్ పేరుతో పాఠశాలలు కాకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉన్న పాఠశాలలల బలోపేతంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన సూచించారు. సమావేశంలో నాయకులు గుగులోతు రామకృష్ణ, సద్దాబాబు, లక్ష్మణ్రావు, గోపాల్రావు, నర్సింహారావు, నిర్మల, సౌభాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
యూరియా ఇవ్వలేని ప్రభుత్వమిది..
వైరా/మధిర: రైతులకు యూరియా ఇవ్వలేని స్థితిలో రాష్ట్రంలో పాలన కొనసాగుతుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. యూరియా, విత్తనాల కొనుగోళ్లతో పాటు పంట ఉత్పత్తుల అమ్మకానికి రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతులు అరిగోస పెడుతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియ(ఎస్ఐఆర్)పై శ్రేణులకు అవగాహన కల్పించేందుకు వైరా, మధిరలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశాల్లో పువ్వాడ, రవిచంద్రతో పాటు ఎమ్మెల్సీలు తాతా మధు, తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. హామీల అమలులో విఫలం అధికారంలోకి రాకముందు లెక్కకు మించి హామీలు ఇచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వాటిని అమలుచేయకుండా మాయమాటలతో కాలం వెళ్లదీస్తున్నారని అజయ్కుమార్, వద్దిరాజు విమర్శించారు. రైతులకు సకాలంలో యూరియా కూడా ఇవ్వలేకపోగా, యాప్ను ప్రవేశపెట్టడం సరికాదన్నారు. అంతేకాక రైతు రుణమాఫీ, భరోసా అమలులోనూ రాష్ట్రప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మధిర నియోజకవర్గంలో 100 శాతం రుణమాఫీ జరిగిన గ్రామం చూపించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు సవాల్ విసిరారు. కాగా, వైరా మున్సిపల్ చైర్పర్సన్ భర్త బీఆర్ఎస్ శ్రేణుల విషయంలో నోరుజారితే సహించేది లేదని పేర్కొన్నారు. అలాగే, బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించాలని చూస్తున్న ఎమ్మెల్యే తీరు మార్చుకోవాలని సూచించారు. ఇక సమగ్ర ఓటరు సవరణ పేరుతో రాష్ట్రంలో ఓట్లు తొలగించి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. కానీ రాష్ట్రమంతటా కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నందున, ఏ ఒక్కరి ఓటు పోకుండా బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈసమావేశాల్లో జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు, నాయకులు గుండాల కృష్ణ, వనమా విశ్వేశ్వరరావు, కట్టా కృష్ణార్జునరావు, లకావత్ గిరిబాబు, బాణోత్ మనీషా లక్ష్మి, బానోత్ బాలాజీ, బాణాల వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణ, బొమ్మర్తి రామ్మూర్తి, షేక్ లాల్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రారంభమైన ఎప్సెట్ కౌన్సెలింగ్
ఖమ్మం సహకారనగర్: ఎప్సెట్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించేందుకు కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభమైంది. ఖమ్మంలోని ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాలలో సెంటర్ ఏర్పాటుచేయగా తొలిరోజు స్లాట్ బుక్ చేసుకున్న 650 మంది విద్యార్థుల్లో 620 మంది హాజరయ్యారు. ఇందులో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు సమీపంలోని సూర్యాపేట, మహబూబాబాద్, నల్లగొండ తదితర జిల్లాల విద్యార్థులు ఉన్నారు. వీరి సర్టిఫికెట్లను ఉద్యోగులు పరిశీలించాక, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జాకీరుల్లా ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కాగా, కౌన్సెలింగ్ను డాక్టర్ చందా సుధాకర్ తదితరులు పర్యవేక్షించారు. -
క్యూఆర్ కోడ్ పేరుతో దోపిడీ
● రవాణా శాఖ కార్యాలయ ఆవరణలోనే రెట్టింపు వసూళ్లు ● వాహనదారులపై మోయలేని భారం ఖమ్మంక్రైం: వాహనాలకు రెట్రో రిఫ్లెక్టివ్, క్యూఆర్ కోడ్ ఏర్పాటు పేరుతో దోపిడీ చేస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. మూడు నెలల క్రితమే అన్ని వాహనాలకు చుట్టూ స్టిక్కర్ వేయించడమే కాక వివరాలతో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయించుకోవాలని రవాణా శాఖ ఆదేశించింది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా వాహనదారుల ఆందోళనతో అమలును నిలిపివేసింది. మళ్లీ గుట్టుచప్పుడు కాకుండా మూడు రోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని ప్రారంభించారు. దీంతో స్టిక్కర్లు వేయడం, క్యూఆర్ కోడ్ ఏర్పాటుచేసే బాధ్యత దక్కించుకున్న ప్రైవేట్ ఏజెన్సీల వారు నిలువు దోపిడీ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అన్నింటికీ తప్పనిసరి అన్ని వాహనాలకు క్యూఆర్ కోడ్ను తప్పనిసరి చేశారు. దీంతో ఫిట్నెస్ సర్టిఫికెట్ రవాణా శాఖ కార్యాలయానికి వచ్చే వాహనాలకు రిఫ్లెక్టివ్ టేప్తో పాటు క్యూఆర్ కోడ్ వేస్తున్నారు. ఇవిలేకుండా వాహనాలను రవాణా శాఖ అధికారులు సీజ్ చేస్తారనే బెదిరింపులతో వాహనదారులు సరే అంటున్నారు. కానీ, రెట్టింపు రేట్లు వసూలు చేస్తుండడంపై వారిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో ఒక బస్సుకు అక్కడక్కడా కలిపి మొత్తం ఆరు మీటర్ల టేప్ వేస్తే సరిపోయేది. దీనికి రూ.600వరకు ఖర్చయ్యేది. కానీ ఇప్పుడు బస్సు చుట్టూ టేప్ వేయడమే కాక క్యూఆర్ కోడ్కు కలిపి రూ.15 వేల మేర వసూలు చేస్తుండడం వాహనదారుల ఆవేదనకు కారణమవుతోంది. వాస్తవానికి క్యూఆర్ కోడ్ నిబంధన మోటారు వాహన చట్టంలో ఎక్కడా లేదని, అయినా ఇతర రాష్ట్రాల కంపెనీలకు లాభం జరిగేలా రవాణా శాఖ ప్రయత్నిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. వీటి బాధ్యతలు అప్పగించేందుకు బిడ్డింగ్ ద్వారా ఐదు కంపెనీలను ఎంపిక చేయగా ఒక కంపెనీ టేపులనే విక్రయిస్తుండడం గమనార్హం. రాత్రి వేళ రోడ్లపై నిలిపే వాహనాలు కనిపించేలా నాలుగు వైపులా అక్కడక్కడా టేపు అతికిస్తే సరిపోతుంది. కానీ వాహనం చుట్టూ అతికించాలనే నిబంధనతో 20 మీటర్లకుపైగా అవరమవుతోంది. క్యూఆర్ కోడ్, రెట్రో రిఫ్లెక్టివ్ పేరుతో దండుకుంటున్నారు. ఫిట్నెస్ చేయడానికి ఇవి తప్పనిసరి అని చెబుతూ ఎక్కడా లేనంత బిల్లు వేశారు. ఇదేమిటని ఆరా తీస్తే రవాణాశాఖ సిబ్బందినే అడగాలని ఏజెన్సీ బాధ్యులు దబాయించారు. ఇక్కడ వేస్తున్న స్టిక్కర్ కూడా నాణ్యతగా లేదు. రవాణాశాఖ అప్పగించిన కంపెనీవాళ్లే దీనిని చేస్తున్నారు. –రంగయ్య, లారీ డ్రైవర్ క్యూఆర్ కోడ్, స్టిక్కర్లు వేసేందుకు రాష్ట్రమంతా ఐదు కంపెనీలకు అనుమతి ఉంది. ఇక ధరలను కూడా రవాణా శాఖ స్పష్టంగా నిర్దేశించింది. దీంతో జిల్లా కార్యాలయ ఉద్యోగులకు సంబంధం ఉండదు. నిర్దేశిత ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారని ఫిర్యాదు అందితే పరిశీలిస్తాం. –శ్రీనివాసరావు, ఇన్చార్జ్ ఆర్టీఓ వాహనం పాత టేపు ధర కొత్త టేపు ధర (మీటర్లలో) (రూ.ల్లో) (మీటర్లలో) (రూ.ల్లో) బస్సు 6 600 20 15,000 లారీ 6 600 20 12,500 గూడ్స్ వెహికిల్ 5 500 12 8,500 మ్యాక్సీ క్యాబ్స్ 3 300 5 – 8 2,700 ఆటో 1 100 1 150 -
రైతు మేళా, సీఎం సభకు ఏర్పాట్లు
ఖమ్మం సహకారనగర్: ఈనెల 28, 29వ తేదీల్లో నిర్వహించే రైతు మేళా, 30వ తేదీన చింతకాని మండలంలో సీఎం రేవంత్రెడ్డి హాజరయ్యే సభకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ఆయన పోలీస్ కమిషనర్ సునీల్దత్తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. సీఎం హాజరయ్యే సభ కోసం 25ఎకరాల స్థలాన్ని ఎంపిక చేయగా, ఇందులోని 20 ఎకరాల్లో సభ నిర్వహణకు కేటాయించినట్లు తెలిపారు. మిగతా ఐదెకరాల్లో వ్యవసాయ సంబంధిత శాఖల ద్వారా 150 స్టాళ్లు ఏర్పాటుచేయాలని సూచించారు. ఇక సభా ప్రాంగణంలో ఏర్పాట్లు, పార్కింగ్, రూట్ మ్యాప్లు సిద్ధం చేయడంపై దృష్టి సారించాలని తెలిపారు. సీపీ సునీల్దత్ మాట్లాడుతూ గుర్తించిన స్థలాన్ని సిద్ధం చేయడమే కాక, రెండు హెలిప్యాడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమగ్ర నివేదికలతో సిద్ధంగా ఉండాలి ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ పేరిట 99 రోజుల పాటు చేపట్టిన కార్యక్రమాలపై సమగ్ర నివేదికలతో జిల్లా అధికారులు సమీక్షకు సిద్ధం కావాలని కలెక్టర్ దివాకర సూచించారు. ఈ కార్యక్రమంలో చేపట్టిన పనులు, సాధించిన పురోగతిపై మంగళవారం ప్రత్యేక అధికారితో సమీక్ష ఉంటుందని తెలిపారు. ఈమేరకు వివరాలు, ఫొటోలతో నివేదిక సిద్ధం చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుందనాన్రు. ఈసమావేశంలో సీపీఓ శ్రీనివాస్, డీఆర్డీఓ శ్రీరామ్, సంక్షేమ శాఖల అధికారులు జ్యోతి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
గాలివాన బీభత్సం
ఏన్కూరు: మండలంలో సోమవారం మధ్యాహ్నం గాలివాన బీభత్సం సృష్టించింది. మండలంలోని తూతూకలింగన్నపేట, ఏన్కూరు, భగవాన్నాయక్తండా, అక్కినపురంతండా, హిమామ్నగర్, రేపల్లెవాడలో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. అలాగే, పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు నేలకొరిగాయి. భగవాన్నాయక్ తండా, అక్కినపురం తండాల్లో ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడగా, ఓ చెట్టు లారీపై పడింది. తృటిలో ప్రమాదం తప్పింది. దీంతో ఏన్కూరు నుంచి జూలూరుపాడు మండలం వినోభానగర్ వరకు రెండు వైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. జేసీబీ సాయంతో చెట్లను తొలగించి పోలీసులు రాకపోకలను పునరుద్ధరించారు. కాగా, 30 స్తంభాలు, ఎనిమిది ట్రాన్స్ఫార్మర్లు నేలకొరగడంతో విద్యుత్శాఖకు సుమారు రూ.10 లక్షల నష్టం వాటిల్లిందని అంచనా. ఇక భగవాన్నాయక్ తండాలో జర్పుల సూర్య ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. చెట్లు విరిగిపడడంతో ట్రాఫిక్కు అంతరాయం -
వ్యభిచారగృహం తొలగించాలన్నందుకు దాడి
పెనుబల్లి/సత్తుపల్లిటౌన్: గ్రామంలో వ్యభిచార గృహం నిర్వహించొద్దని సూచించిన ఇద్దరిపై నిర్వాహకులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన సత్తుపల్లి మండలం కిష్టారం శివారులో ఆదివారం రాత్రి జరిగింది. ఏపీలోని తిరువూరు మండలానికి చెందిన దంపతులు సత్తుపల్లి మండలం కిష్టారం సమీపాన ఉంటూ వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. తద్వారా గ్రామానికి చెడ్డపేరు వస్తోందని కిష్టారం ఎస్సీకాలనీకి చెందిన కొందరు శనివారం నిర్వాహకులతో మాట్లాడి వ్యభిచార గృహాన్ని మూసివేసి ఇతర పనిచేసుకోవాలని, లేకపోతే గ్రామస్తుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. మళ్లీ ఆదివారం రాత్రి మారోజు నాగేశ్వరరావు, నక్కా వెంకటేశ్వరరావు వెళ్లేసరికి సదరు దంపతుల తీరు మారకపోవడంతో ప్రశ్నిస్తుండగా తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో దంపతులు కొబ్బరిబొండాలు నరికే కత్తులతో నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావుపై దాడి చేయగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు 108లో వారిని సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఘటన జరిగిన వెంటనే నిందితులైన దంపతులు పరారు కాగా, వ్యభిచార గృహంలో ఉన్న కొత్తగూడెంకు చెందిన యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై సత్తుపల్లి ఎస్ఐ వీరప్రసాద్ కేసు నమోదు చేయగా, చికిత్స పొందుతున్న నాగేశ్వరరావును కాంగ్రెస్ నాయకుడు మట్టా దయానంద్ తదితరులు సోమవారం పరామర్శించారు. ఇద్దరికి తీవ్ర గాయాలు -
కృష్ణమ్మ కరుణిస్తుందా?!
వైరా: జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టుల్లో కీలకమైన వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో ఈ ఏడాది వరి సాగుపై అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నెస్పీ ద్వారా వచ్చే కృష్ణా జలాల ఆధారంగా ఈ ప్రాజెక్టును నిర్మించారు. అయితే, ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదురవుతాయని చెబుతున్నారు. జిల్లాలో కూడా వర్షాలు లేక నీరు చేరకపోగా.. సాగర్ నుంచి కూడా వస్తాయో, లేదో తెలియక వరి సాగుకు నీటి విడుదలపై స్పష్టత రావడం లేదు. దీంతో రైతులు వరి నారుమళ్ల పరిస్థితి తెలియక ఎదురుచూస్తున్నారు. గత ఏడాది ఈ పాటికే.. వైరా రిజర్వాయర్ పూర్థిస్థాయి సామర్థ్యం 18.3 అడుగులుగా ఉంటుంది. ఈ స్థాయిలో నీరు చేరితే 2.5 నుంచి 3 టీఎంసీలుగా పరిగణిస్తారు. గత ఏడాది జూన్ 15 నాటికే రిజర్వాయర్ 18 అడుగులకు చేరింది. కానీ ప్రస్తుతం వర్షాలు లేకపోగా, 13.8 అడుగుల మేర మాత్రమే నీరు ఉంది. అంటే 1.5 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో ప్రథమ ప్రాధాన్యత తాగునీటి అవసరాలకేనని అధికారులు చెబుతుండడంతో సాగు అవసరాలకు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అంతేకాక వ్యవసాయ శాఖ అధికారులు సైతం సాగుపై అవగాహన సదస్సులు, ఖరీఫ్ ప్రణాళికపై ముందస్తు సమావేశాలు నిర్వహించకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అయినా రైతులు మాత్రం వరి సాగుపై ఆశతో జిలుగులు, జనుము విత్తనాలు నాటారు. 3 టీఎంసీలు ఉంటేనే.. వైరా రిజర్వాయర్ కింద ఏటా ఖరీఫ్లో సుమారు 25 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. నారుమళ్లకు నీరు విడుదల చేయాలంటే 0.08 టీఎంసీలు అవసరం. అయితే, రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్థ్యమైన 18.3 అడుగుల మేర నిండితేనే నారుమళ్లకు సిద్ధం కావాలని జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్లో 13.8 అడుగుల నీరే ఉండగా, జిల్లాలోని 11 మండలాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా రోజుకు కోటి లీటర్లకు పైగా నీటిని తాగు అవసరాలకు విడుదల చేస్తున్నారు. ఇక ఉష్ణోగ్రతల కారణంగా ఆవిరి రూపంలో మరికొంత వృథా అవుతోంది. ఫలితంగా రిజర్వాయర్లోకి గరిష్ట స్థాయిలో నీరు చేరితే తప్ప సాగు అవసరాలకు విడుదల చేసే పరిస్థితి కానరావడం లేదు. కొనసాగుతున్న ఆధునికీకరణ పనులు రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వ పరిధిలో ప్రస్తుతం రూ.40 కోట్ల వ్యయంతో కల్వర్టులు, గైడ్ వాల్వ్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. కుడి కాల్వ పరిధిలో కోస్తాల, కొండికొడిమ, ఎడమ కాలువ పరిధిలో విప్పలమడక నుంచి గైడ్ వాల్వ్ పనులు చేపడుతున్నారు. ఈసారి వర్షాలు కూడా లేకపోవడంతో మరో నెల పాటు పనులు కొనసాగుతాయి. వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో రైతులెవరూ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. రిజర్వాయర్లో వరి సాగుకు సరిపడా నీరు లేదు. అందుకే వరి పంట కాకుండా అపరాలు తదితర పంటలపై దృష్టి సారిస్తేనే మంచిది. – టి.కరుణశ్రీ, ఏడీఏ, వైరా రిజర్వాయర్ ఆయకట్టులో వరి సాగుకు ప్రస్తుతం ఉన్న నీరు సరిపోదు. ఉన్న నీటిని తాగు అవసరాలకే వినియోగిస్తాం. సాగర్ నీరు విడుదలై రిజర్వాయర్ నిండితేనే నారుమళ్లకు విడుదల చేస్తాం. ఈ విషయాన్ని గుర్తించి రైతులు తొందరపడవద్దు. – శ్రీనివాస్, నీటిపారుదల శాఖ, డీఈ వైరా రిజర్వాయర్లోకి సాగర్ జలాలు ఈ ఏడాది వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం సాగర్లో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేక దిగువ ప్రాంతాల్లోకి విడుదలపై స్పష్టత రావడం లేదు. మరోవైపు వైరా ఆయకట్టు ప్రాంతంలో ఆశించిన స్థాయిలో వర్షపాతం కూడా నమోదు కాలేదు. ఇక గోదావరి జలాలను రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్లోకి మళ్లిస్తే రైతులకు ఊరటగా ఉండేది. కానీ పనులు పూర్తికానందున ఆ పరిస్థితి కూడా లేదు. వైరా రిజర్వాయర్ ఆయకట్టులో సాగుపై నీలినీడలు -
ఆరు బయట నిద్ర.. ఇంట్లో చోరీ
కారేపల్లి: ఓ కుటుంబం ఉక్కపోత తట్టుకోలేక ఆరుబయట నిద్రిస్తుండగా, వెనక నుంచి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. కారేపల్లి బస్టాండ్ సెంటర్, డీసీసీ బ్యాంకు వెనకబజార్లో నివాసం ఉండే కేతిమాల సురేశ్ కుటుంబీకులు ఆదివారం రాత్రి ఆరుబయట నిద్రించారు. ఈ క్రమాన దుండగులు అర్ధరాత్రి సమయాన డీసీసీ బ్యాంకు వెనక గోడ దూకి, ఆపై సురేశ్ ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాపై ఉన్న తాళాలతో తెరిచి ఐదు తులాల బంగారు ఆభరణాలు, రెండు జతల వెండి పట్టీలు, పూజ గదిలోని కొంత నగదు చోరీ చేశారు. మొత్తంగా రూ.8 లక్షల విలువైన సొత్తు చోరీకి గురైందని కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారేపల్లి ఎస్ఐ బి.గోపి క్లూస్ టీంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. మూడు ఇసుక లారీలు సీజ్ రఘునాథపాలెం: అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తున్న మూడు లారీలను సీజ్ చేసినట్లు రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ నుంచి రఘునాథపాలెం మండలం కంకర మిల్లుల వద్దకు లారీల్లో ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో సోమవారం తనిఖీలు చేపట్టామని వెల్లడించారు. ఈ క్రమాన రెండు లారీల డ్రైవర్లు పరారు కాగా, ఇంకో లారీ డ్రైవర్, క్లీనర్తో పాటు వాహనాలకు పైలట్గా వచ్చిన కారులోని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కాగా, సీజ్ చేసిన మూడు లారీల్లో 106 టన్నుల ఇసుక ఉందని పేర్కొన్నారు. -
పర్యవేక్షణ శూన్యం
లక్ష్యం ఘనం..ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు, గురుకులాల్లో చదువుతున్న పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన వసతులు అందుతున్నాయా, లేదా అని పరిశీలించేందుకు జిల్లా యంత్రాంగం ప్రవేశపెట్టిన స్పెషల్ ఆఫీసర్ల (ప్రత్యేక అధికారులు) వ్యవస్థ క్రమంగా గాడి తప్పుతోంది. ప్రారంభంలో కాస్త హడావుడి కనిపించినా.. కాలక్రమేణా ఇదంతా కాగితాలకే పరిమితమవుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు వచ్చి విద్యార్థులతో కలిసి భోజనం చేయడమే కాక గదులు, ఆవరణలో పరిశీలించి ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం ఇది ‘ఫొటోల’ముచ్చటగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో వసతిగృహాలు, గురుకులాల్లో తనిఖీకి ప్రత్యేక అధికారులను మరోసారి నియమించడం గమనార్హం. ప్రారంభంలో జోరు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, అందుతున్న భోజనం, వసతి సదుపాయాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులతో తనిఖీ చేయిస్తున్నారు. వ్యవస్థ ప్రారంభమైన మొదటి రెండు, మూడు నెలల పాటు ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో గట్టిగానే నివేదికలు ఇచ్చారు. వీటిపై అదనపు కలెక్టర్ ఆధ్వర్యాన సమీక్షలు కూడా జరిగాయి. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వార్డెన్లు, సిబ్బందిపై చర్యలు తీసుకోవడంతో వసతిగృహాల నిర్వహణలో కొంత మార్పు కనిపించింది. అయితే, ఆ తర్వాత సమీక్షలు మందగించడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ప్రత్యేక అధికారులు ఇస్తున్న నివేదికలు జిల్లా కార్యాలయాల్లో పేరుకుపోతుండగా, క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం లేదని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. అదనపు బాధ్యతలతో నామమాత్రం స్పెషల్ ఆఫీసర్లుగా నియమితులైన అధికారులు ఇప్పటికే తమసొంత శాఖల బాధ్యతల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు. దీనికితోడు గురుకులాలు, హాస్టళ్ల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించడంతో వారు సమగ్రంగా తనిఖీ చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. వెళ్లామా, హాజరు రిజిస్టర్ చూశామా, విద్యార్థులతో కూర్చుని భోజనం చేశామా అన్న చందంగా తనిఖీలు సాగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయాన ప్రతీ సంక్షేమ శాఖలో జిల్లా, డివిజనల్ స్థాయి అధికారులు ఉన్నా వారు బాధ్యతగా పనిచేయకపోవడంతోనే ఇతర శాఖల నుంచి ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు తెలుస్తోంది. అయితే, ఉన్న వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి, ఇతర శాఖల అధికారులతో పర్యవేక్షణ ఎందుకనే ప్రశ్నలు వస్తున్నాయి. నివేదికలు ఉన్నా.. చర్యలేవి? ఏడాది కాలంగా హాస్టళ్లు, వసతిగృహాల్లో తాగునీటి సరఫరా, మరుగుదొడ్ల నిర్వహణ, విద్యుత్ సమస్యలు, భవనాల మరమ్మతులపై ప్రత్యేక అధికారులు పలుమార్లు నివేదికలు సమర్పించారు. కానీ, వాటిపై ఉన్నతాధికారుల నుంచి స్పందన లేదు. చిన్నచిన్న మరమ్మతులకు కూడా నిధులు మంజూరు కాక సమస్యలు అలాగే ఉండిపోయాయి. ‘మేము నివేదికలు ఇవ్వడం.. వారు ఫైళ్లలో పెట్టడం తప్ప లాభం ఏముంది?’అని కొందరు అధికారులు సైతం పెదవి విరుస్తున్నారని సమాచారం. ప్రత్యేక అధికారులు ఇకనైనా ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా గురుకులాలు, వసతిగృహాలను తనిఖీ చేసి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడితేనే సమస్యలు బయటపడే అవకాశముంది. అంతేకాక తనిఖీల నివేదికల ఫొటోలు, వీడియోలను జియో ట్యాగింగ్తో కూడిన యాప్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేస్తే ఉన్నతాధికారుల పర్యవేక్షణకు వీలవుతుంది. అంతేకాక కలెక్టర్, అదనపు కలెక్టర్ స్థాయి అధికారులు ప్రతీనెల నివేదికలపై సమీక్షించి తప్పులు జరిగిన బాధ్యులపై చర్యలు తీసుకుంటే లక్ష్యం నెరవేరడమే కాక విద్యార్థులకు మేలు జరుగుతుంది. అలాగే, వసతిగృహాల్లో చిన్నచిన్న మరమ్మతులకు అత్యవసర నిధులు కేటాయించాలన్న సూచనలు కూడా వస్తున్నాయి. స్పెషల్ ఆఫీసర్లు చాలా సందర్భాల్లో తాము ఏ హాస్టల్లో తనిఖీకి వెళ్తున్నది అక్కడి ఉద్యోగులకు ముందుగానే సమాచారం ఇస్తున్నట్లు తెలిసింది. దీంతో అక్కడి ఉద్యోగులు అప్రమత్తమై ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్నిచోట్ల రికార్డుల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యను సరిచేసేందుకు స్థానిక విద్యార్థులను తీసుకొచ్చి కూర్చోబెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాక తనిఖీ జరిగే రోజే మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం వడ్డించి అంతా సవ్యంగానే ఉందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని వసతిగృహాలు, గురుకులాల్లో ఈ తీరు అధికంగా ఉందనే చర్చ జరుగుతోంది. గురుకులాలు, హాస్టళ్లలో తనిఖీలు అంతంతే -
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
ఖమ్మంసహకారనగర్: పెన్షనర్ల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి మేరి ఏసుపాదం, జిల్లా అధ్యక్షుడు పరిశ పుల్లయ్య డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలపడమే కాక ఏఓ కారుమంచి శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. పెన్షనర్లకు తక్షణమే నగదు రహిత వైద్యం అమలయ్యేలా హెల్త్ కార్డులు అందించాలని, పెండింగ్లో ఉన్న ఐదు డీఏలు మంజూరు చేయడమే కాక సత్వరమే పీఆర్సీ ప్రకటించి అమలు చేయాలని కోరారు. అలాగే, పెన్షనర్ల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు రాయల రవికుమార్, కనపర్తి వెంకటేశ్వర్లు, పెదమళ్ల సత్యనారాయణ, కొలికొండ శరత్బాబు, ఊడుగు వెంకటేశ్వర్లు, జల్లా వెంకటేశ్వర్లు, మహిళా కార్యదర్శి తాడి అంజలి, మనోహర్రాజు తదితరులు పాల్గొన్నారు. -
అగ్నివీర్కు ఖమ్మం అకాడమీ అథ్లెట్లు
ఖమ్మం స్పోర్ట్స్: సైన్యంలో ప్రవేశాలకు నిర్వహించిన అగ్నివీర్ ఎంపికల్లో ఖమ్మం అథ్లెటిక్స్ అకాడమీ క్రీడాకారులు ఇద్దరు ఎంపికయ్యారు. ఇక్కడ పరుగు పందెంలో శిక్షణ పొందుతున్న ఎస్.గోపీచంద్, బి.వీరభద్రం పలు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధించారు. ఇటీవల జరిగిన అగ్నివీర్ ఎంపికల్లో ప్రతిభ చాటి జనరల్ డ్యూటీ(జీడీ)కి ఎంపికయ్యారు. ఖమ్మంలోని కేఎంసీడీసీలో ఎస్.గోపీచంద్ ఇటీవలే డిగ్రీ పూర్తిచేయగా, బి.వీరభద్రం తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. కాగా, గోపీచందర్ తండ్రి గత నెలలో మృతి చెందినా, ఆ బాధను దిగమింగుకుని ఎంపిక ప్రక్రియలో పాల్గొని ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా క్రీడాకారులను డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, అకాడమీ చీఫ్ కోచ్ ఎం.డీ.గౌస్ తదితరులు అభినందించారు. తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలికొణిజర్ల: స్పెషల్ డ్రైవ్ ద్వారా వాహన తనిఖీలు ముమ్మరం చేయాలని పోలీసు కమిషనర్ సునీల్దత్ ఆదేశించారు. కొణిజర్ల పోలీస్స్టేషన్ను సోమవారం తనిఖీ చేసిన ఆయన ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారితో మాట్లాడారు. ఈక్రమాన పోలీసు సిబ్బంది పనితీరుపై ఆరాతీశారు. అనంతరం సీపీ స్టేషన్లో రికార్డులు, కేసులు, విచారణపై సమీక్షించారు. కేసుల విచారణలో వేగం పెంచి పూర్తి సాక్షాలతో కోర్టులో చార్జీషీట్లు దాఖలు చేయాలని సూచించారు. అంతేకాక సీసీ కెమెరాల ఆవశ్యకతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. ఎస్ఐ సూరజ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నేటి నుంచి విత్తన మేళా విత్తనాలు, ఎరువుల విక్రయానికి ఏర్పాట్లు ఖమ్మంవ్యవసాయం: జిల్లాలోని రైతు వేదికల్లో మంగళవారం నుంచి వారం పాటు వ్యవసాయ శాఖ ఆధ్వర్యాన విత్తన మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి(డీఏఓ) ధనసరి పుల్లయ్య తెలిపారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యాన రైతులకు 122 రైతు వేదికల్లో నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. వరిలో సన్న రకాలైన బీపీటీ–5204, ఆర్ఎన్ఆర్–15048, డబ్ల్యూజీఎల్–44, కేఎన్ఎం–1638, కేఎన్ఎం–7715, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరాం విత్తనాలే కాక పెసర, కంది, మినుము వంటి అపరాల విత్తనాలు, పచ్చిరొట్ట విత్తనాలు అమ్మకానికి ఉంటాయని తెలిపారు. అలాగే, యూరియాకు ప్రత్యామ్నాయమైన నానో యూరియా, నానో డీఏపీకి కూ డా అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఇవికాక 38రైతు వేదికల్లో ప్రత్యేకంగా యూరి యా విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీఏఓ తెలిపారు. రైతులు యూరియా బుక్ చేసుకొని కొనుగోలు చేయవచ్చని వివరించారు. బీసీ, ఈబీసీ విద్యార్థులకు ప్రీ–మెట్రిక్ స్కాలర్షిప్లుఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న అర్హులైన బీసీ, ఈ బీసీ విద్యార్థుల నుంచి ప్రీ–మెట్రిక్ ఉపకార వేతనాల(ఫ్రెష్, రెన్యూవల్) కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జి.జ్యోతి తెలిపారు. అర్హులైన విద్యార్థులకు ఏటా రూ.4వేల చొప్పు న ఉపకారవేతనాలు మంజూరవుతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులైతే కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లోనైతే రూ.2 లక్షల లోపు ఉన్న వారు అర్హులని తెలిపారు. ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్ కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పాస్పోర్ట్ ఫొటో, బ్యాంక్ ఖాతా జిరాక్స్ సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. దరఖాస్తు కోసం గూగుల్ ప్లే స్టోర్ నుండి NSP OTR App డౌన్లోడ్ చేసుకుని, ఆధార్ నంబర్, ఫేస్ ఐడీ ద్వారా 14అంకెల ఓటీఆర్ నంబర్ తీసుకోవా లని సూచించారు. ఆతర్వాత మీసేవా కేంద్రంలో ఈ–పాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకొని, బయోమెట్రిక్ ధ్రువీకరణ పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం హెచ్ఎంలు దరఖాస్తులను పరిశీలించి, తమ కార్యాలయానికి ఆన్లైన్లో పంపించడమే కాక సంతకంతో కూడిన దరఖాస్తులు, ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని సూచించారు. -
ఫుడ్పార్కులో భూ కేటాయింపులపై నిగ్గుతేల్చాలి
సత్తుపల్లిటౌన్: మండలంలోని బుగ్గపాడు ఫుడ్పార్కులో భూ కేటాయింపులపై విమర్శలు వస్తున్నందున, ప్రభుత్వం నిగ్గు తేల్చాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నంబూరి రామలింగేశ్వరరావు డిమాండ్ చేశారు. సత్తుపల్లిలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. తక్కువ ధరకే కేటాయించిన భూములు పరిశ్రమలు నిర్మించడానికా.. రియల్ఎస్టేట్ దందా కోసమా అన్న అనుమానాలు వస్తున్నాయని తెలిపారు. అయితే, కేటాయింపులపై సమాధానం చెప్పాల్సిన మంత్రులు, ఎమ్మెల్యే వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదన్నారు. భూకేటాయింపులపై బీజేపీ నాయకుడు పొంగులేటి సుధాకర్రెడ్డి కేంద్ర ఆహారభద్రత మంత్రికి నివేదిక ఇచ్చి సెంట్రల్ విజిలెన్స్ విచారణ కోరతారని తెలిపారు. కాగా, దేశంలో మోదీ అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తవగా, తెలంగాణ అభివృద్ధికి రూ.11 లక్షల కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ పథకాలతో రూపొందించిన పుస్తకాలను రామలింగేశ్వరరావు విడుదల చేశారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘవరావు, మండల, పట్టణ అధ్యక్షులు సాలి శివకృష్ణ, శివ, ప్రభాకర్రెడ్డి, నాయకులు నాగులు, సుబ్బారావు, బాలకృష్ణారెడ్డి, వెంకటరెడ్డి, కృష్ణయ్య పాల్గొన్నారు. -
సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్గా సలీం పాషా
ఖమ్మంలీగల్: మధిర స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్గా సయ్యద్ సలీం పాషా నియమితులయ్యారు. ఆయన గతంలో ఖమ్మం జిల్లా స్పెషల్ జ్యుడీడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్గా పనిచేశారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే ఖమ్మం స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ ఎకై ్సజ్గా కె.విజయలక్ష్మి నియమితులయ్యారు. రేపు జాబ్ మేళా ఖమ్మంరాపర్తినగర్: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 24వ తేదీన జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్.మాధవి తెలిపారు. శేషసాయి ఎంటర్ప్రైజెస్లో 35 ఖాళీల భర్తీకి కంపెనీ బాధ్యులు ఇంటర్వ్యూ నిర్వహిస్తారని వెల్లడించారు. ఎస్సెస్సీ మొదలు డిగ్రీ వరకు విద్యార్హత ఉన్న వారు బుధవారం ఖమ్మం టీటీడీసీ భవన్లో జరిగే జాబ్మేళాకు హాజరుకావాలని, వివరాలకు 90308 02174 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. రేపు బీఏఎస్ లక్కీ డ్రా ఖమ్మంమయూరిసెంటర్: ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన కొనసాగుతున్న బీఏఎస్ పథకానికి సంబంధించి విద్యార్థుల ఎంపిక కోసం ఈ నెల 24న లక్కీ డ్రా ఏర్పాటు చేశామని ఎస్సీ డీడీ జి.జ్యోతి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి ఒకటో తరగతి ప్రవేశానికి, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఐదో తరగతి విద్యార్థుల ఎంపికకు లాటరీ తీస్తామని వెల్లడించారు. కలెక్టరేట్లో బుధవారం జరిగే కార్యక్రమానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరు కావాలని సూచించారు. గ్రామాల్లో పశువుల అపహరణ ఏజెంట్లను నియమించుకుంటున్న నిందితులు? ఖమ్మంరూరల్: మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న పశువుల చోరీలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గోళ్లపాడు, పోలేపల్లి, తీర్థాల తదితర ప్రాంతాల రైతులకు చెందిన సుమారు 50 పశువులు ఇటీవల చోరీ అయినట్లు తెలిసింది. వేసవి కావడంతో పశువులను రైతులు మేత కోసం అడవిలో, చేల వద్దకు వదులుతుంటారు. ఇదే అదునుగా భావించిన దొంగల ముఠా పశువులను చోరీ చేసి ఇతర ప్రాంతాలకు తరలించి అమ్ముకుంటున్నట్లు తెలిసింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గ్రామానికి ఒకరిద్దరు ఏజెంట్లను నియమించుకుని పశువులు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాక అపహరించి వాహనాల్లో హైదరాబాద్ తరలిస్తున్నట్లు సమాచారం. అక్కడ పశువుల మాంసం అమ్మే వ్యాపారులకు అమ్ముకుంటున్నారని తెలిసింది. వారం క్రితం దొంగలు నాలుగు పశువులను అపహరించి తీసుకెళ్తుండగా తీర్థాల వద్ద రైతులు అడ్డగించడంతో వారిని బుకాయించి జారుకున్నట్లు తెలిసింది. కాగా, గోళ్లపాడు రైతు మద్ది గంగిరెడ్డికి చెందిన చెందిన రూ.1.20 లక్షల విలువైన ఆవు గత నెలలో తప్పిపోవడంతో రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అలాగే మరికొందరు రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతో పోలీసులు విచారణ చేస్తున్నారని తెలిసింది. విద్యుదాఘాతంతో గేదె మృతి నేలకొండపల్లి: విద్యుత్ ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా ఇటీవల మూగజీవాల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. మండలంలోని అప్పలనరసింహాపురంలో సోమవారం ఈదురుగాలులకు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఈ క్రమాన గ్రామవాసి ఎనికె నరసింహారావుకు చెందిన గేదెలు మేతకు వెళ్లగా ఒకటి విద్యుత్ తీగలను తాకడంతో షాక్కు గురై మృతి చెందింది. సమీపంలో ఉన్న పెంపకందారులు, రైతులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రూ.1.50 లక్షల విలువైన గేదె మృతితో నష్టపోయిన తనకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని నరసింహారావు కోరారు. -
నేటి ప్రజావాణి రద్దు
ఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనెల 30న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యాన ఏర్పాట్లపై సమీక్షించేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సోమవారం రానున్నారని కలెక్టర్ దివాకర టీ.ఎస్. తెలిపారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్లో జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు వెల్లడించారు. డిప్యూటీ సీఎం సమీక్షలో పాల్గొనడంతో పాటు ఇతర ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నమైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించి ప్రజలు కలెక్టరెట్కు రావొద్దని కలెక్టర్ ఓ ప్రకటనలో సూచించారు. కామన్ స్కూల్ విద్యావిధానమే మేలు ఖమ్మం సహకారనగర్: రాష్ట్రంలో రకరకాల పాఠశాలలు స్థాపించడం కాకుండా ఒకే విద్యావిధానం అమలు చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విజయ్ కోరారు. ఖమ్మంలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 27వేల పాఠశాలలు కాకుండా 4వేల పాఠశాలలే చాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పడం గర్హనీయమని పేర్కొన్నారు. ఇకనైనా 15 వేలమంది రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయుల బకాయిలు విడుదల చేయడమే కాక ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, సీపీఎస్ ఉపాధ్యాయుల డీఏఈ బకాయిలు విడుదల చేయాలని కోరారు. అనంతరం పి.నాగిరెడ్డి, టీపీటీఎఫ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి వి.మనోహర్రాజు మాట్లాడగా, జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న గంధసిరి మల్లయ్యను అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ తీర్మానించారు. ప్రధాన కార్యదర్శి టి.వెంగళరావు, నాయకులు శ్యాంసుందర్, వీరబాబు, వెంకటేశ్వరరావు, ఉమాదేవి, నాగేశ్వరరావు, యాకూబ్ పాషా, కోటేశ్వరరావు పాల్గొన్నారు. అలాగే, జిల్లా సైన్స్ అధికారిగా పనిచేసిన జగదీశ్వర్ మృతికి సంతాపం తెలిపారు. ఐదు పోస్టాఫీసులు విలీనం ఖమ్మంగాంధీచౌక్: ఆదాయానికి మించి నిర్వహణ వ్యయం జరుగుతున్న పోస్టాఫీసుల విలీనానికి అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఖమ్మం తపాలా డివిజన్ పరిధిలో ఐదు పోస్టాఫీసులను విలీనం చేశారు. ఈ జాబితాలో ఖమ్మం నగరంలో నాలుగు, కొత్తగూడెం టౌన్లో ఒక సబ్ పోస్టాఫీస్ ఉంది. ఖమ్మంలోని ట్రంక్ రోడ్, డాబాలబజార్ పోస్టాఫీసులను గాంధీచౌక్ పోస్టాఫీసులో, చర్చి రోడ్ పోస్టాఫీస్ను రిక్కాబజార్ (పాత బస్టాండ్ ఎదురుగా), ఎన్నెస్పీ క్యాంపు పోస్టాఫీస్ను ఖమ్మం హెడ్ పోస్టాఫీస్లలో విలీనం చేశారు. ఇక కొత్తగూడెం భజనమందిర్ ఏరియా పోస్టాఫీస్ను హెడ్ పోస్టాఫీస్లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇవికాక ఇంకొన్ని సబ్ పోస్టాఫీసులను సైతం విలీనం చేసే అవకాశముందని సమాచారం. -
ఇక సాగునీటి పరుగులు..
తల్లాడ: నాలుగు దశాబ్దాలుగా తాత్కాలిక మరమ్మతులతోనే కాలం వెళ్లదీసిన నాగార్జునసాగర్ పరిధి సిరిపురం మేజర్ కాల్వ ఆధునికీకరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఎన్నెస్పీ ఎడమ కాలువ పరిధిలో కల్లూరు డివిజన్లోనే మేజర్ కాల్వ ఇదే అయినా నిర్వహణ లోపంతో ఇబ్బందు లు ఎదురవుతున్నాయి. కాల్వ కట్టలు బలహీనంగా ఉండి, కనీసం 120 క్యూసెక్కుల నీరు విడుదల చేసి నా సాఫీగా సాగడం లేదు. దీంతో రూ.72 కోట్ల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం 170 క్యూసెక్కుల నీరు విడుదల చేసినా ఇబ్బంది రాకుండా పనులు చేయిస్తోంది. ఈ పనులు పూర్తయితే ఏన్కూరు మెయిన్ బ్రాంచ్ కెనాల్ నుంచి ప్రారంభమయ్యే సిరిపురం మేజర్ కాల్వ వైరా మండలం సిరిపురం వరకు కొత్త రూపు దాల్చనుంది. చకచకా పనులు సిరిపురం మేజర్ కాల్వలో మూడు నెలల నుంచి ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. ఏన్కూరు రెగ్యులేటరీ వద్ద నుంచి గోదావరి జలాలు వైరా రిజర్వాయర్లోకి చేరడానికి కూడా వీలుండేలా ఆధునికీకరణ పనులు చేస్తున్నారు. కాల్వ ఎత్తు పెంచడంతో పాటు పూడిక తీయిస్తూ వెడల్పు చేస్తున్నారు. అంతేకాక కాల్వకు రెండు వైపులా సిమెంట్ లైనింగ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కాల్వ వెడల్పు, కట్టల బలోపేతం పనులు పూర్తికాగా, లైనింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఏన్కూరు రెగ్యులేటరీ నుంచి వైరా రిజర్వాయర్ వరకు ఏన్కూరు మెయిన్ బ్రాంచ్ కెనాల్ వద్ద రెగ్యులేటరీ నుంచి సిరిపురం మేజర్ కాల్వ ప్రారంభమై 18 కి.మీ. పొడవు ఉంటుంది. ఈ మేజర్ పరిధిలో ప్రస్తుతం 11 వేల ఎకరాల మేర ఆయకట్టు ఉంది. కాల్వ ఆధునికీకరణ అనంతరం ఆయకట్టు పెరిగే అవశాశం ఉంది. చివరి భూములకు నీరందడమే కాక అదనంగా కనీసం 20 శాతం భూములకు నీరు చేరుతుందని భావిస్తున్నారు. కాగా, ఈ మేజర్ కాల్వ పరిధిలో గోపాలపేట, అన్నారుగూడెం, మల్లారం, తల్లాడ 1, 2, తెలగవరం, కొడవటిమెట్ట, పినపాక, సిరిపురం మైనర్ కాల్వలు ఉన్నాయి. ఈ కాల్వ ఆధునికీకరణ పనులు పూర్తయితే చివరి భూముల రైతుల కష్టాలు తీరనున్నాయి. కాల్వ పరిధిలోని చివరి భూములైన సిరిపురం, పినపాక గ్రామాల రైతులకు ఏనాడు నీరు సాఫీగా అందిన దాఖలాలు లేవు. ఇప్పుడు కాల్వ ఎత్తు పెంచి, కట్టలు పటిష్టం చేస్తున్నందున సామర్థ్యం మేర నీటి విడుదలకు అవకాశం ఏర్పడుతుంది. తద్వారా ఆయకట్టు అంతటికీ నీరు అందుతుంది. ఇన్నాళ్లు 170 క్యూసెక్కుల నీటికి బదులు కాల్వ కట్టల పరిస్థితి కారణంగా 120 క్యూసెక్కులే విడుదల చేస్తుండటంతో చివరి ఆయకట్టుకు నీరందక రైతులు పంటలను నష్టపోయారు. ఈ మేరకు 1981లో కాల్వలు నిర్మించినప్పటికీ ఏటా తాత్కాలిక మరమ్మతులతో కాలం వెళ్లదీశారు. ఇప్పుడు గోదావరి జలాలను వైరా రిజర్వాయర్లోకి చేర్చడం, మధిర, ఎర్రుపాలెంతో పాటు వైరా, తల్లాడ, ఏన్కూరు మండలాల రైతులకు సాగునీటి సరఫరా కోసం మేజర్ కాల్వ ఆధునికీకరణ పనులు చేపడుతుండడం విశేషం. ఎన్నెస్పీ కాల్వ ద్వారా సాగునీరు అందక ఏటా ఇబ్బంది పడేవాళ్లం. రేయింబవళ్లు కాల్వ వెంట తిరిగినా పంటలకు నీరందలేదు. పూడిక పేరుకుపోతే మేమే సొంత ఖర్చులతో తీయించాం. ఇప్పుడు కాల్వ పనులు జరుగుతుండడంతో కష్టాలు తీరతాయి. –బొడ్డు మల్లయ్య, రైతు, తల్లాడ సిరిపురం మేజర్ ఆధునికీకరణ పనులతో ఆయకట్టు పరిధి రైతుల కష్టాలు తీరనున్నాయి. ఇన్నాళ్లు ఖరీఫ్, రబీలో సాగు నీటి ఇబ్బంది వచ్చేది. కాల్వల చుట్టూ తిరిగేవాళ్లం. ఇప్పుడు చేపట్టిన పనులు పూర్తయితే రెండు పంటలు సమృద్ధిగా పండుతాయి. –మొక్కా వెంకటేశ్వర్లు, రైతు, తల్లాడ -
శివాలయంలో తవ్వకాల కలకలం
వేంసూరు: మండలంలోని కుంచపర్తి గ్రామంలోని శివాలయం ప్రాంగణంలో నాలుగు రోజులుగా జరుగుతున్న తవ్వకాలు కలకలం రేపాయి. గ్రామంలోని బాలాజీ త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామి దేవాలయం వెనకాల తవ్వకాలు చేపట్టడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు ఆలయ ప్రాంగణంలో తనిఖీ చేపట్టి తవ్వకాలు జరుపుతున్న 11 మంది కూలీలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు విచారించగా ఆలయంలో గత 18 ఏళ్లుగా పూజారిగా పనిచేస్తున్న భరద్వాజానంద ఆధ్వర్యాన తవ్వకాలు జరిగాయని తేలినట్లు సమాచారం. గ్రామ శ్రేయస్సు కోసం 18 అడుగుల గొయ్యి తీయించి శ్రీచక్రం, కొన్ని యంత్రాలను ప్రతిష్ఠించేందుకు తవ్వకాలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. పగలు మాత్రమే తవ్వకాలు చేపట్టామని, పనిచేసిన కూలీలు రాత్రి ఇక్కడే నిద్రిస్తున్నారని తెలిపారు. అయితే, గ్రామస్తులు మాత్రం బయటి నుంచి కూలీలను రప్పించి, స్థానికులకు సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి వేళ తవ్వకాలు చేయిస్తున్నారని ఆరోపించారు. గుప్త నిధుల అన్వేషణ కోసమే తవ్వకాలు చేపడుతున్నారనే అనుమానాలు ఉన్నందున పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టాలని కోరారు. తలోమాట చెబుతున్న పూజారి, గ్రామస్తులు -
సందేహాలా?!
ఖమ్మం మయూరిసెంటర్: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘ఎస్ఐఆర్’(సర్ – స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) జిల్లాలో కొనసాగుతోంది. 2002, ప్రస్తుత ఓటరు జాబితా ఆధారంగా మ్యాపింగ్ చేపడుతున్నారు. ఈనెల 25వ తేదీ నుంచి ఇంటింటి సర్వే మొదలుకానుంది. ఓటు హక్కు భద్రంగా ఉండాలంటే మ్యాపింగ్ తప్పనిసరి కావడంతో వివాహిత మహిళలు, కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువతను సందేహాలు వెంటాడుతున్నాయి. ఈమేరకు అనుసంధానానికి సంబంధించిన వివరాలు... -
కాస్త వాన.. ఆపై ఎండ..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వేసవి పోయింది.. వానాకాలం వచ్చింది. నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో జిల్లాకు విస్తరించకున్నా ఇన్నాళ్లు నిప్పులు గక్కిన భానుడు కాస్త చల్లబడ్డాడు. పలు మండలాల్లో భారీ, మరికొన్ని మండలాల్లో తేలికపాటి వర్షాలతో రైతులు పత్తి, మిర్చి వంటి పంటల సాగుకు సై అంటున్నారు. ఈ నెల 1 నుంచి 20 వరకు జిల్లా సగటు వర్షపాతాన్ని పరిశీలిస్తే ఎక్కువగానే నమోదైంది. కానీ భిన్న వాతావరణం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 38 – 40 డిగ్రీలకు పైగా నమోదవుతుండడంతో నాటిన విత్తు మొలకెత్తుతుందా, లేదా అన్న బెంగ పట్టుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో విత్తనాలు మొలకెత్తినా, పంట దిగుబడిపై ప్రభావం పడొద్దంటే వచ్చే నెల వర్షాలే కీలకంగా మారనున్నాయి. సాధారణం కన్నా అధికమే.. ఏటా జూన్లో నైరుతి రుతుపవనాల ఆగమనంతో వర్షాలు మొదలువుతాయి. ఆ వెంటనే రైతులు దుక్కులు దున్ని పంటల సాగు చేపడతారు. ఈసారి జూన్ మూడో వారం దాటుతున్నా ఎండల ప్రభావం తగ్గలేదు. అయితే, ఈ నెల 20వ తేదీ వరకు సగటు సాధారణ వర్షపాతం 8.3 సెం.మీ.కు గాను 10.3 సెం.మీ.గా నమోదైంది. గత ఏడాది జూన్లో మాత్రం ఇది 12.3 సెం.మీ.గా ఉంది. ఈసారి అప్పుడప్పుడు కురుస్తున్న వర్షం సాగుకు ఏమాత్రం అనుకూలంగా లేకున్నా.. రైతులు భవిష్యత్పై ఆశతో పత్తి, మిర్చి విత్తనాలు నాటే ప్రయత్నం చేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా పలుచోట్ల విత్తనాలు మొలకెత్తక రెండోసారి కూడా నాటుతున్నారు. 13 మండలాల్లో జోరు జిల్లాలోని 21 మండలాలకు గాను 13 మండలాల్లో ఈ నెల 20వ తేదీ నాటికి అధిక వర్షపాతం నమోదు కావడం విశేషం. అత్యధికంగా కల్లూరులో సాధారణ వర్షపాతం 8.5 సెం.మీ.కు గాను 19.4 సెం.మీ.గా నమోదైంది. ఏన్కూరులో 7.4, నేలకొండపల్లిలో 6.8, చింతకానిలో 6.3, తల్లాడలో 5.4 సె.మీ. వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా పడింది. ఇక సింగరేణి మండలంలో మాత్రం 8.8 సెం.మీ.కు గాను కేవలం 2.9 సెం.మీ., కామేపల్లి మండలంలో 8.7 సెం.మీ.కు గాను 6.6 సెం.మీ.గా నమోదైంది. ఆశలు చిగురించాలని.. ఏటా జూన్లో వర్షాలు కురవడం ప్రారంభమై జూలై వచ్చేసరికి జోరందుకుంటాయి. అయితే ఈనెల వేడి, ఉక్క వాతావరణం కారణంగా ఇప్పుడు కురుస్తున్న వర్షాలు సాగుకు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో పంటల సాగు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఎల్నినో ప్రభావం కూడా తీవ్రంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. మరోపక్క ఏటా మాదిరిగానే ఈ జూలైలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో రైతులు కూడా వచ్చేనెలపైనే ఆశలు పెట్టుకున్నారు. వర్షాలు ఆశించిన స్థాయిలో కురిస్తే పత్తి, మిర్చి పంటలతోపాటు వరి సాగు కూడా ఉపందుకోనుంది. ఆ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎలా ఉన్నా.. పంటల సాగు ముందుకు సాగాలంటే జూలై నెలనే కీలకం కానుంది.ఈనెల ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువగానే నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు సాగుకు అనుకూలంగా లేవు. మృగశిర కార్తె ముగింపునకు వచ్చినా 40 డిగ్రీలకు తక్కువ కాకుండానే ఉష్ణోగ్రత నమోదవుతోంది. తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతుండగా, భూమిలో వేడి తగ్గలేదు. వర్షాకాలంలో ముసురు పడితేనే భూమి చల్లబడే అవకాశముంది. ఆ పరిస్థితి లేక కురిసిన కొద్దిపాటి వర్షం కూడా ఆవిరైపోతోంది. దీంతో రైతులు దుక్కులు దున్ని భారీ వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. -
సంస్కృతికి ప్రతిరూపం యోగా
ఖమ్మం స్పోర్ట్స్: సంస్కృతికి ప్రతిరూపంగా నిలిచే యోగాను వారసత్వంగా చేసుకుని అంతా అనుసరించాల్సిన అవసరముందని కలెక్టర్ దివాకర టీ.ఎస్. తెలిపారు. యోగా దినోత్సవాన్ని ఆదివారం ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో హాజరైన యువతీ, యువకులు, కోచ్లతో కలిసి కలెక్టర్ యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గించేందుకు యోగా దోహదపడుతుందన్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని అందరూ రోజులో కొంత సమయం కేటాయించాలని సూచించారు. ప్రధానంగా యువత, విద్యార్థులు దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని తెలిపారు. డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో యోగాపై అవగాహన కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. జిల్లా ఆయుష్ శాఖ అధికారి కనకమహాలక్ష్మి, డాక్టర్ పద్మావతి, అనంత ప్రసాద్, వంజకుల లక్ష్మీనారాయణ, ఉమా మహేశ్వరరావు, భవాని, డీఎస్ఏ మేనేజర్ ఉదయ్కుమార్, కోచ్ ఎం.డీ.గౌస్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ దివాకర టీ.ఎస్. -
మంత్రి తుమ్మలపై చేసేవన్నీ తప్పుడు ఆరోపణలే..
సత్తుపల్లి: మండలంలోని బుగ్గపాడు ఫుడ్పార్క్ భూకేటాయింపుల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలేనని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పేర్కొన్నారు. ఈ ఆరోపణలు రుజువు చేయకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని సవాల్ చేశారు. సత్తుపల్లిలో ఆదివారం ఆమె మాట్లాడుతూ.. ధైర్యం ఉంటే చర్చకు రావాలే తప్ప మంత్రి తుమ్మలపై తప్పుడు విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. చుట్టపు చూపుగా సత్తుపల్లికి వచ్చే సండ్ర పదేళ్లు ఒక్క పరిశ్రమను తీసుకురాకపోగా, కిష్టారంలో సైలోబంకర్ నిర్మించి అక్కడి ప్రజల ఉసురు తీస్తున్నారని ఆరోపించారు. ఆయిల్పామ్ రిఫైనరీ ఫ్యాక్టరీని బీఆర్ఎస్ నేతలు మంజూరు చేయించినా, తాము సీఎంను ఒప్పించి ఇంతకంటే తక్కువ ధరకు భూములు ఇప్పిస్తామని తెలిపారు. కాగా, కొందరు యూట్యూబ్, సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా పోస్టులు పెడుతున్నారని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రాగమయి హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ ఎండీ రెహానాబేగం, నాయకులు బొంతు సుమలత, మట్టా దయానంద్, చల్లగుళ్ల నర్సింహారావు, తోట సుజలరాణి, ఎం.డీ.కమల్పాషా, హకీంపాషా, నారాయణవరపు శ్రీనివాసరావు, జొన్నలగడ్డ శ్రీనివాసరావు, ఈశ్వర్, పింగళి సామేలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ -
వాతావరణ ం
జిల్లాలో సోమవారం ఎండ ప్రభావంతక్కువగానే ఉంటుంది. మధ్యాహ్నం ఎండ పెరిగినా సాయంత్రం తర్వాత చల్లబడుతుంది.●కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత రంగ సంస్థలు జారీ చేసిన గుర్తింపు కార్డు / పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ●01–07–87 కన్నా ముందు ప్రభుత్వం, స్థానిక సంస్థలు, బ్యాంక్లు, పోస్టాఫీస్, ఎల్ఐసీ/ పీఎస్యూల ద్వారా జారీ చేసిన గుర్తింపు కార్డు / సర్టిఫికెట్ ●అధీకృత అధికారి లేదా యంత్రాంగం జారీ చేసిన పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రం ●పాస్పోర్ట్ ●గుర్తింపు పొందిన బోర్డులు / యూనివర్సిటీలు జారీ చేసిన మెట్రిక్యులేషన్ / విద్యార్హత సర్టిఫికెట్ ●శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం ●అటవీ హక్కుల పత్రం ●అధీకృత అధికారి జారీ చేసిన ఓబీసీ, ఎస్సీ,ఎస్టీ ఏదైనా కుల ధ్రువీకరణ పత్రం ●నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ – ఎన్ఆర్సీ (అందుబాటులో ఉన్న చోట) ●రాష్ట్రం లేదా స్థానిక అధికారులు తయారు చేసిన ఫ్యామిలీ రిజిస్టర్ ●ప్రభుత్వం జారీ చేసిన ఇల్లు లేదా భూమి కేటాయింపు పత్రం ●1987 జూలై 1 కన్నా ముందు పుట్టిన వారైతే ఓటరుకు సంబంధించి ఒక డాక్యుమెంట్, 1987 జూలై 2 నుంచి 2004 డిసెంబర్ 2 మధ్య జన్మించిన వారు ఓటరు డ్యాకుమెంట్తోపాటు అమ్మానాన్నల్లో ఒకరి డాక్యుమెంట్, 2004 డిసెంబర్ 2వ తేదీ తర్వాత జన్మించిన ఉంటే ఓటరు డాక్యుమెంట్తోపాటు అమ్మానాన్నల ఇద్దరి డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి. -
పేద కుటుంబానికి నెరవేరిన సొంతింటి కల
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మంకు చెందిన నిరుపేద కుటుంబానికి సొంతిల్లు లేదని తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచనలతో 24 గంటల్లోగా డబుల్ బెడ్రూమ్ ఇంటిని కేటాయించామని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మంకు చెందిన తురక దేవీప్రసన్న ఏఎస్ఆర్ ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ బైపీసీ చదువుతూ ప్రథమ సంవత్సరంలో 434 మార్కులు సాధించడమే కాక జాతీయస్థాయి రెడ్ రిబ్బన్ క్విజ్ పోటీల్లో ప్రథమస్థానాన నిలిచింది. దీంతో హైదరాబాద్లో శుక్రవారం గవర్నర్ శివప్రతాప్ శుక్లా సమక్షంలో సీఎం ఆమెకు రూ.50వేల నగదు, జ్ఞాపిక అందజేశారు. ఈక్రమాన కుటుంబ పరిస్థితిపై ఆరా తీయగా తండ్రి లేడని, తల్లి జ్యోతి కష్టాలు పడి చదివిస్తుండగా ఇల్లు లేదని వెల్లడించింది. దీంతో డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ దివాకర టీ.ఎస్.ను సీఎం ఆదేశించారు. ఈమేరకు ఖమ్మం వైఎస్ఆర్.నగర్లో డబుల్ బెడ్రూమ్ సముదాయంలోని ఇంటిని కేటాయిస్తూ ఖమ్మం అర్బన్ తహసీల్దార్ జయచందర్ శనివారం దేవీప్రసన్న కుటుంబానికి శనివారం పత్రాలు అందజేశారని కలెక్టర్ తెలిపారు. సమస్యకు సత్వర పరిష్కారం చూపిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రి తుమ్మలతో పాటు యంత్రాంగానికి దేవీప్రసన్న కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ దివాకర టీ.ఎస్. -
ప్రకటనలకే ఉచిత ప్రయాణం
‘నీట్’అభ్యర్థులకు నిరాశ ఖమ్మంమయూరిసెంటర్: జిలాల్లో ఆదివారం జరిగిన నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని అధికారులు ప్రకటించారు. అయితే, సమన్వయ లోపమో, సమాచారం లేదో తెలియదు కానీ కొందరుడ్రైవర్ల తీరుతో విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. నీట్ రాసిన విద్యార్థులు కొందరు ఖమ్మం కొత్త బస్టాండ్లో సత్తుపల్లి వెళ్లే డీలక్స్ బస్సు ఎక్కారు. అయితే విద్యార్థుల వద్ద హాల్టికెట్లను చూసిన డ్రైవర్ అవి జిరాక్స్ కాపీలని చెబుతూ దిగాలని సూచించాడు. అవి ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్నవని చెప్పినా వినకుండా విద్యార్థులను బలవంతంగా దింపినట్లు తెలిసింది. ఈ విషయంపై సత్తుపల్లి డిపో మేనేజర్కు ఫిర్యాదు చేయగా, ఆయన సూచనలతో కంట్రోలర్లను కలిసినా డ్రైవర్ వినకపోవడంతో విద్యార్థులు మరో బస్సులో చార్జీ చెల్లించి ప్రయాణించినట్లు సమాచారం. ఈ మేరకు సత్తుపల్లి డిపో మేనేజర్ లక్ష్మీనారాయణను వివరణ కోరగా.. విద్యార్థులు తనకు ఫోన్ చేయగా, కంట్రోలర్ను కలవమని చెప్పానని.. ఆ తర్వాత ఎవరు ఫోన్ చేయలేదని తెలిపారు. దంత వైద్యులకు అవార్డుఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం గట్టయ్య సెంటర్ వీడీఓస్ కాలనీలోని శ్రీ శ్రీనివాసం డెంటల్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ మొరిశెట్టి ప్రదీప్ కుమార్, డాక్టర్ ఎం.ప్రియాంకలకు ‘‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ అడ్వాన్స్డ్ డెంటిస్ట్రీ’’ అవార్డు లభించింది. హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో టైమ్స్ నౌ నెట్వర్క్ నిర్వహించిన ఇండియన్ హెల్త్ సమ్మిట్–2026 లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వారిని పలువురు అభినందించారు. గంజాయి స్వాధీనం భద్రాచలంఅర్బన్: రెండు వేర్వేరు ఘటనల్లో ద్విచక్రవాహనాలపై తరలిస్తున్న 9.7 కేజీల గంజాయిని పట్టణంలోని కూనవరం రోడ్డులో ఆదివారం ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ శ్రీహరిరావు కూనవరం రోడ్డులో వాహనాలు తనిఖీ చేపట్టారు. నంబర్ ప్లేట్ లేకుండా వస్తున్న స్కూటీ నీ ఆపి తనిఖీ చేయగా వారి వద్ద 5.2 కేజీల గంజా యి దొరికింది. తరలిస్తున్న వారు హైదరాబాద్కు చెందిన మహమ్మద్ ఖాన్, షేక్ షోయబ్గా తేలింది. మరో ఘటనలో స్కూటీపై వస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి తనిఖీ చేయగా వారి వద్ద 4.5 కేజీల గంజాయి లభించింది. తరలిస్తున్న వారు మోహిత్కుమార్, ఆనంద్ మిశ్రాగా తేలింది. ఆనంద్ మిశ్రా పరారీలో ఉన్నాడని, పట్టుబడిన వారంతా హైదరాబాద్కు చెందిన వారు కాగా, గంజాయిని ఒడిశా రాష్ట్రం కలిమెల, మోటు నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా దొరికారని, మొత్తం 9.7 కేజీల గంజాయి, రెండు స్కూటీలు, రెండు మొబైళ్లను సీజ్ చేశామని, గంజాయి విలువ రూ.6.60 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. ఆటో, ద్విచక్రవాహనం ఢీ..అశ్వారావుపేటరూరల్: ఆటో, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురుగాయపడ్డారు. స్థానికు లు, బంధువుల కథనం ప్రకారం.. మండలంలోని నారంవారిగూడేనికి చెందిన భోగి నాగేశ్వరరావు (38), ఆయన భార్య వెంకటలక్ష్మి, బావమరిది మనుగొండ శ్రీను, ఆయన ఆరేళ్ల కూతురు పూరి కలిసి ద్విచక్రవాహనంపై ఆదివారం దమ్మపేట మండలం రంగువారిగూడెంలోని శ్రీముత్యాలమ్మ తల్లి ఆలయానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో మండలంలోని నారంవారిగూడెంకాలనీ వద్ద ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. శ్రీను కాలు, చేయి విరిగగా చిన్నారి పూరి కాలు విరిగింది. వెంకటలక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. -
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
తిరుమలాయపాలెం: మండలంలోని బచ్చోడులో ఈ నెల 19న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికి త్స పొందుతూ మృతి చెందాడు. కూసుమంచి మండలం గైగొల్లపల్లికి చెందిన కుమ్మరికుంట్ల పుల్లయ్య (48) విద్యుత్ మోటార్లు రిపేర్లు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన 19వ తేదీన మరిపెడ బంగ్లా నుంచి ఇంటికి వెళ్తుండగా బచ్చోడు సెంటర్లో ఎదురుగా వచ్చిన బొలేరో వాహనం ఢీకొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన పుల్లయ్యకు ఖమ్మంలో చికిత్స చేయిస్తుండగా పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందాడు. ఆయనకు భార్య రమాదేవి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదుతో తిరుమలాయపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. రైలులో గుర్తుతెలియని వృద్ధుడు.. ఖమ్మంక్రైం: కోణార్క్ ఎక్స్ప్రెస్లో ఆదివారం గుర్తుతెలియని వృద్ధుడి (85) మృతదేహన్ని జీఆర్పీ సిబ్బంది గుర్తించారు. దివ్యాంగుల బోగీలో ప్రయాణిస్తున్న సదరు వ్యక్తి మృతి చెందినట్లు ప్రయాణికులు ఇచ్చిన సమాచారంతో ఖమ్మంలో మృతదేహాన్ని జీఆర్పీ సిబ్బంది కిందకు దింపారు. అనంతరం అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మార్చురీకి తరలించారు. కాగా, మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో రైళ్లలో భిక్షాటన చేస్తుంటాడని భావిస్తున్నారు. ఇద్దరు డీలర్ల అరెస్ట్రికార్డులకు మించి బియ్యం ఉండడంతో కేసు కల్లూరురూరల్: ప్రభుత్వం చౌకదుకాణాల ద్వారా సరఫరా చేసే సన్నబియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న డీలర్లు రాయల నాగేశ్వరరావు, మెరుగు వేలాద్రిని అరెస్ట్ చేసి శనివారం రిమాండ్కు తరలించినట్లు కల్లూరు ఎస్ఐ హరిత తెలిపారు. ఏప్రిల్ 24, 25వ తేదీల్లో పౌర సరఫరాల శాఖ అధికారులు కల్లూరు మండలంలోని పేరువంచ, ఖాన్ఖాన్పేట రేషన్ దుకాణాల్లో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పేరువంచ దుకాణంలో స్టాక్ రిజిస్టర్తో పోలిస్తే రూ.71,715 విలువైన 12.50 క్వింటాళ్ల బియ్యం అదనంగా ఉండడం, ఖాన్ఖాన్పేట దుకాణంలో రూ.3,67,545 విలువైన 64.01 క్వింటాళ్ల బియ్యం అదనంగా ఉన్నాయని గుర్తించారు. పౌరసరఫరాల శాఖ అధికారి వేము నరేశ్ ఫిర్యాదుతో డీలర్లు నాగేశ్వరరావు, వేలాద్రిని అరెస్ట్ చేసి సత్తుపల్లి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి జూలై 23వ తేదీ వరకు రిమాండ్ విధించారని ఎస్ఐ హరిత వివరించారు. అక్రమంగా టిప్పర్ సీజ్ కల్లూరురూరల్: అనుమతి లేకుండా ఏపీలోని కృష్ణా జిల్లా నుంచి ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ను పోలీసులు ఆదివారం సీజ్ చేశారు. ఏపీలో టన్ను రూ.600 చొప్పున ఇసుక కొనుగోలు చేసి తెలంగాణలో రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు అమ్మొచ్చనే భావనతో పలువురు తరలిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు కల్లూరు మండలం పెద్ద కోరుకొండికి ఇసుక తీసుకొచ్చిన టిప్పర్కు అనుమతి లేదని తేలడంతో టిప్పర్ సహా 25 టన్నుల ఇసుక సీజ్ చేయడమే కాక డ్రైవర్ నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ హరిత తెలిపారు. -
వివాహిత మహిళలు
ప్రస్తుత అనుసంధానం 2002 నాటి ఓటర్ల జాబితా ఆధారంగానే సాగుతోంది. అందువల్ల ఆ ఏడాది తర్వాత వివాహమైన మహిళల పేర్లు అత్తగారి ఊరిలో అప్పటి జాబితాలో ఉండే అవకాశం లేదు. ●మొదట మీ పుట్టింటికి సంబంధించిన నాటి ఓటర్ల జాబితా పరిశీలించాలి. ప్రతీ బీఎల్ఓ, అంగన్వాడీ టీచర్ల వద్ద జాబితాలు ఉన్నందున వారిని సంప్రదిస్తే వివరాలు సేకరించవచ్చు. అందులో మీ తల్లి లేదా తండ్రి పేరు పక్కన ఉన్న క్రమసంఖ్య రాసుకోవాలి. ఆ సంఖ్య తీసుకొచ్చి మీ అత్తింటి ఊరి బూత్ స్థాయి అధికారికి సమర్పించాలి. తద్వారా మిమ్మల్ని ప్రస్తుత ఓటర్ల జాబితాతో అనుసంధానం చేస్తారు. -
విద్యుదాఘాతంతో కార్మికుడికి తీవ్రగాయాలు
రఘునాధపాలెం: మండలంలోని కొర్లబోడుతండా గ్రామపంచాయతీలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. వీధిదీపాల మరమ్మతులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్మికుడు విద్యుదాఘాతానికి గురై స్తంభం పైనుంచి కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. గ్రామపంచాయతీలో భూక్య భీమా పంచాయతీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా ఆదివారం గ్రామంలోని వీధిదీపాల మరమ్మతుల కోసం విద్యుత్ సరఫరాను నిలిపివేసి స్తంభాలెక్కి పనులు చేపట్టాడు. నాలుగు స్తంభాలపై మరమ్మతులు పూర్తి చేసిన అనంతరం ఐదో స్తంభం ఎక్కి పనిచేస్తున్న సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో భీమా షాక్కు గురై పైనుంచి కిందపడ్డాడు. అక్కడే ఉన్న చంటి అనే యువకుడు సీపీఆర్ చేసి, స్థానికుల సాయంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరమ్మతుల కోసం విద్యుత్ సరఫరాను నిలిపివేసిన తర్వాత కూడా మళ్లీ విద్యుత్ సరఫరా కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎవరైనా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారా? లేక సాంకేతిక లోపం వల్ల విద్యుత్ ప్రవహించిందా? అన్నది విచారణలో తేలాల్సి ఉంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భీమాను గ్రామ సర్పంచ్ చిన్నయ్యనాయక్, పంచాయతీ కార్యదర్శి రూపాదేవి, పంచాయతీ కార్మికుల సంఘం (ఏఐటీయూసీ) జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల మల్లయ్య, మండల నాయకులు పరామర్శించారు. వైద్యులను అడిగి భీమా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. భీమా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు వారు చెప్పారు. -
అన్నింటికీ రైతు ‘వేదిక’ !
ఖమ్మంవ్యవసాయం: క్లస్టర్ల వారీగా నిర్మించిన రైతు వేదికలు వ్యవసాయ సమాచారం, సేవలకు కేంద్ర బిందువులుగా మారనున్నాయి. ఐదు వేల ఎకరాలను ఒక క్లస్టర్గా విభజించి ఒక్కో క్లస్టర్కు వ్యవసాయ విస్తరాణధికారి(ఏఈఓ)ని నియమించడమే కాక రైతు వేదికలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రతీ మండలంలో మూడు, నాలుగు గ్రామాలకు రైతు వేదికలు ఉన్నాయి. ఇన్నాళ్లు వీటిలో సమావేశాలు నిర్వహిస్తూ రైతులకు సబ్సిడీ పథకాలు, అర్హతలు, దరఖాస్తు చేసుకునే విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాక రైతు భరోసా స్థితి, బీమా పథకాలు, వాతావరణం, మార్కెట్ ధరల సమాచారం కూడా లభిస్తోంది. ఈ సేవలను మరింత విస్తృతం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సలహాలు ఇక్కడి నుంచే.. ప్రభుత్వం రైతులకు అందించే రైతు భరోసా, రైతు బీమా, సబ్సిడీపై యంత్ర పరికరాల పంపిణీ తది తర పథకాల అమలును ఇక్కడి నుంచే నిర్వహిస్తారు. ఇక పంటల సాగులో మెళకువలపై సలహా లు, వాతావరణ సూచనలను కూడా ఇదే వేదికల్లో సదస్సుల ద్వారా అందిస్తారు. మార్కెటింగ్ సౌకర్యం.. రైతులు పండించిన పంటలను ప్రభుత్వ మద్దతు ధరతో విక్రయించుకునేందుకు కూడా ఈ వేదికల ద్వారా అవకాశం కల్పిస్తారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి, మార్క్ఫెడ్ ద్వారా అపరాలు, మొక్కజొన్న వంటి పంటల కొనుగోళ్లు ఇక్కడి నుంచే చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఏజెన్సీలు రైతు వేదికల్లో పంటలను కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాల్సి ఉంటుంది. దీంతో దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట పడే అవకాశముంది. రెవెన్యూ, పోలీసు సేవలు వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు ఎక్కువగా జరిగే గ్రామాల్లో కేంద్ర బిందువులుగా రైతు వేదికలు నిలుస్తున్నాయి. ఈ నేపథ్యాన రెవెన్యూ, పోలీసు శాఖల సేవలు కూడా ఇక్కడే లభించేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఆయా శాఖల సిబ్బందిని వేదికల వద్ద అందుబాటులో ఉంచేలా చర్యలు చేపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 196.. ఉమ్మడి జిల్లాలో 196 రైతు వేదికలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 129, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 67 వేదికలు కొనసాగుతున్నాయి. వీటిలో ఏఈఓలను నియమించి రైతులకు సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 5.50 లక్షల మంది రైతులు సుమారు 11 లక్షల ఎకరాల్లో పలు రకాల పంటలను సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యాన రైతు వేదికల ద్వారా సేవలు విస్తృతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రైతులు అక్రమార్కుల బారిన పడకుండా అవసరమైన, సిఫారసు చేసిన విత్తనాలు, ఎరువులను రైతు వేదికల్లో అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే పలు వరి రకాల విత్తన మినీ కిట్లను ఇక్కడి నుంచే అందిస్తున్నారు. అలాగే, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ రూపొందించే విత్తనాలను సహకార సంఘాల ద్వారా సబ్సిడీపై విక్రయిస్తుండగా, ఆయా సంఘాలు రైతు వేదికల ద్వారా అమ్మేలా శ్రీకారం చుట్టనున్నారు. ఇవికాక ఎరువుల విక్రయానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. గత సీజన్లో అమలుచేసిన ఈ విధానంతో సత్ఫలితాలు రాగా కొనసాగింపునకు ప్రభుత్వం నిర్ణయించింది. రైతు వేదికల ద్వారా వ్యవసాయంపై సలహాలు ఇవ్వడమే కాక ఇతర సేవలను కూడా ఇక్కడి నుంచే అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సీజన్లకు అనుగుణంగా వేదికల ద్వారా అవసరమైన విత్తనాలు, ఎరువుల సరఫరా జరుగుతోంది. అంతేకాక పంట కొనుగోళ్లకు కూడా ఇవి వేదికలుగా నిలవనున్నాయి. –ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి, ఖమ్మం -
పకడ్బందీగా ‘నీట్’
● కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు ● ఉదయం 11గంటల నుంచే విద్యార్థులకు ప్రవేశం ● జిల్లాలో 88.45 శాతం హాజరు నమోదు ఖమ్మం సహకారనగర్: వైద్య విద్య(యూజీ) కాలేజీల్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన నీట్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. గతంలో పరీక్ష ఓసారి నిర్వహించి అవకతవకల కారణంగా రద్దు చేసిన విషయం విదితమే. దీంతో ఈసారి ఎలాంటి లోటుపాట్లు ఎదురుకాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఈమేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ద్వారా నిర్వహించిన పరీక్షకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఖమ్మంలో ఏడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా... దరఖాస్తు చేసుకున్న 2,771మంది విద్యార్థులకు గాను 2,451మంది(88.45శాతం) హాజరయ్యారని అధికారులు తెలిపారు. 11గంటల నుంచే అనుమతి నీట్ మధ్యాహ్నం 2గంటల నుంచి 5–15గంటల వరకు నిర్వహించారు. అయితే, ఉదయం 11గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పడంతో చాలామంది ఆ సమయానికి కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల పత్రాలను పరిశీలిస్తూ, నిశితంగా తనిఖీ చేస్తూ లోనకు అనుమతించారు. అంతేకాక కేంద్రానికి వంద మీటర్ల దూరం వరకు ఎవరు ఉండకుండా పకడందీ చర్యలు చేపట్టారు. మార్పు రావట్లే... ఈసారి పరీక్షకు హాజరైన వారంతా రెండో సారి రాసిన విద్యార్థులే అయినా చాలామంది అధికారుల సూచనలు పట్టించుకోనట్లు కనిపించింది. కొందరు ఫొటోలు తీసుకురాకపోగా కేంద్రాల వద్ద నుంచి పరుగులు తీశారు. ఇంకొందరు చున్నీలు, హ్యాండ్బ్యాగ్లు, వాటర్ బాటిళ్లు, చెవి దిద్దులు, ఇతర ఆభరణాలతో వచ్చారు. దీంతో అవి తీసేయించాక లోనకు అనుమతించారు. -
నీట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
● ఖమ్మంలో ఏడు పరీక్ష కేంద్రాలు ● మూడు గంటల ముందు నుంచే అనుమతిఖమ్మంసహకారనగర్: వైద్య విద్య(యూజీ)లో ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ‘నీట్’ ఆదివారం జరగనుంది. గతంలోనూ పరీక్ష నిర్వహించినా పేపర్ లీకేజీ అయినట్లు బయటపడడంతో రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తున్నారు. ఈమేరకు ఖమ్మం నగర పరిధిలో ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 2,771 మంది విద్యార్థులు రాయనున్నారు. ఇందులో బాలురు 733 మంది, బాలికలు 2,038 మంది ఉన్నారు. 11 గంటల నుంచే అనుమతి పరీక్ష మధ్యాహ్నం 2నుంచి నుంచి 5–15గంటల వరకు జరగనుంది. గతంలో 5గంటల వరకే పరీక్ష నిర్వహించినా, ఈసారి పదిహేను నిమిషాల సమయం పెంచారు. ఇక విద్యార్థులను కేంద్రాల్లోకి 11గంటల నుంచే అనుమతిస్తారు. మధ్యాహ్నం 1–30 గంటల వరకే అనుమతి ఉంటుందని, ఆతర్వాత అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఈమేరకు విద్యార్థులు సమయానికి చేరుకోవాలని సూచించారు. అలాగే, గతంలో మాదిరిగానే జ్యూయెలరీ, ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదని, మెటల్ బటన్లు, హుక్లు ఉన్న దుస్తులు వేసుకురావొద్దని, పాదాలను పూర్తిగా మూసివేసే బూట్లు వంటివికాకుండా స్లిప్పర్లు మాత్రమే ధరించాలని అధికారులు సూచించారు. అలాగే, విద్యార్థులు నీట్ హాల్టికెట్, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, ఒక పోస్ట్ కార్డ్ సైజ్ ఫొటో, గుర్తింపు కార్డు తీసుకుకురావాలని తెలిపారు. కేంద్ర బలగాలతో బందోబస్తు నీట్ కేంద్రాల వద్ద విస్తృత బందోబస్తు భద్రత కల్పించనున్నారు. ఇప్పటికే ఓసారి పరీక్ష రద్దయిన దృష్ట్యా ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈమేరకు కేంద్రాల వద్ద సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్స్తో బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. అలాగే, ప్రశ్నపత్రాలు తీసుకురావడం, పరీక్ష పూర్తయ్యాక తీసుకెళ్లే వాహనాలకు కూడా కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తారు. కాగా, పలు పరీక్ష కేంద్రాలను ఖమ్మం వన్ టౌన్, టూ టౌన్ ఇన్స్పెక్టర్లు కరుణాకర్, బాలకృష్ణ శనివారం పరిశీలించి సీసీ కెమెరాలు, ఇతర ఏర్పాట్లపై ఆరా తీశారు. కేంద్రాల సమీపాన ఆంక్షలు అమల్లో ఉంటాయని, పరిసరాలలోని ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీ దుకాణాలు ముసివేయాలని సూచించారు. నీట్ పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. పరీక్ష సమయం గతం కన్నా 15నిముషాలు అదనంగా ఉంటుంది. అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1–30గంటల వరకు అనుమతిస్తాం. ఈ విషయాన్ని గుర్తించి సకాలంలో క్షకేంద్రాలకు చేరుకోవాలి. – నరేంద్రకుమార్, పరీక్షల సిటీ కన్వీనర్ -
ఈనెల 28 నుంచి రైతు మేళా
ఖమ్మం సహకారనగర్: మధిర నియోజకవర్గం చింతకాని మండలంలో ఈనెల 28, 29, 30వ తేదీల్లో రైతు మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ దివాకర టీ.ఎస్. తెలిపారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈనెల 28నుంచి 30వ తేదీ వరకు రైతుమేళా నిర్వహించనుండగా, చివరిరోజు జరిగే సభలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఈమేరకు రైతు మేళాలో 150 స్టాళ్ల ఏర్పాటు, రైతుల సమీకరణపై దృష్ట్టి సారించాలని సూచించారు. అలాగే, ఇతర జిల్లాల నుంచి వచ్చే శాస్త్రవేత్తలకు బస, రవాణా సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో డీఆర్డీఓ శ్రీరామ్, జిల్లా వ్యవసాయ, పశుసంవర్థక, ఉద్యాన, మత్స్యశాఖల అధికారులు డి.పుల్లయ్య, డాక్టర్ పురంధర్, మధుసూదన్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.30న సభకు హాజరుకానున్న సీఎం -
ఉచిత బస్సు ప్రయాణం
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఈసారి ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. ఇందుకు సంబంధించి ఆర్టీసీ అధికారులు రూట్ మ్యాప్ ప్రకటించారు. ఖమ్మం నగర పరిధిలో ఏడు కేంద్రాలు ఉండగా... కాల్వొడ్డు, పాత బస్టాండ్, జెడ్పీ సెంటర్, ఇల్లెందు క్రాస్ రోడ్డు, తెలంగాణ తల్లి విగ్రహం మీదుగా కొత్త బస్టాండ్ వరకు నడిచే లోకల్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఇవేకాక నీట్ హాల్టికెట్ ఉన్న విద్యార్థులకు ఏసీ బస్సులు మినహా అన్ని బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నాగరాజు
ఖమ్మం లీగల్: ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఎం.నాగరాజు నియమితులయ్యారు. ఇక్కడ జిల్లా జడ్జిగా ఉన్న రాజగోపాల్ ఇటీవలే బదిలీ అయ్యారు. ఈ స్థానంలో వికారాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న నాగరాజును నియమించారు. అలాగే, ఖమ్మం ఒకటో అదనపు జిల్లా న్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావును వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేశారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ నుంచి శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామున గర్భగుడిలోని స్వామి మూలవిరాట్తో పాటు ఆలయ ఆవరణలోని స్వామి వారి పాదాలకు అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, పల్లకీ సేవ చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ ఈఓ కె.జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి ఎప్సెట్ కౌన్సెలింగ్ ఖమ్మం సహకారనగర్: ఇంజనీరింగ్ కళాశాలల ప్రవేశాలకు నిర్వహించిన ఎప్సెట్లో అర్హత సాధించిన విద్యార్థులకు మొదటి విడత కౌన్సిలింగ్ ఈనెల 22నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జాకీరుల్లా తెలిపారు. ఖమ్మంలోని కళాశాల ఆడిటోరియంలో ఉదయం 9నుండి సాయంత్రం 6గంటల వరకు జరిగే ధ్రువపత్రాల పరిశీలనకు విద్యార్థులు స్లాట్ ఆధారంగా హాజరుకావాలని సూచించారు. ఈమేరకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ పత్రాలు, స్లాట్ బుకింగ్ ఫారం, ఎప్సెట్ హాల్ టికెట్, ర్యాంకు కార్డ్, పదో తరగతి, ఇంటర్ మెమోలు, ఇంటర్ టీసీ, 4వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, కుల, ఆధాయ ధ్రువపత్రాలతో పాటు ఆధార్ కార్డు తీసుకురావాలని తెలిపారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు ఖమ్మం సహకారనగర్: అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాక ప్రజలు సంప్రదించేందుకు కలెక్టరేట్లో కంట్రో ల్ రూమ్ను ప్రారంభించినట్లు జిల్లా రెవెన్యూ అధికారి సీ.హెచ్.రాంమూర్తి తెలిపారు. ఈమేరకు శనివారం కంట్రోల్ రూమ్ను ప్రారంభించాక ఆయన మాట్లాడారు. ఈ కంట్రోల్ రూమ్లో 24గంటల పాటు మూడు షిఫ్టుల్లో ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. భారీ వర్షాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర అత్యవసర పరిస్థితుల సమాచారాన్ని ప్రజలు చేరవేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1077 లేదా 90632 11298 నంబర్కు ఫోన్ చేయొచ్చని పేర్కొన్నారు. అంతేకాక నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలపైనా రైతులు ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. మధిర మినీ స్టేడియానికి రూ.5.50 కోట్లు ఖమ్మం స్పోర్ట్స్: మధిరలోని మినీ స్టేడియంలో సౌకర్యాల కల్పనకు రూ.5.50 కోట్ల నిధులు మంజారయ్యాయి. ఇప్పటికే ప్రారంభమైన ఈ స్టేడియంలో ఇండోర్ క్రీడాంశాల శిక్షణకే అవకాశం ఉండగా, ఇతర క్రీడాకారులకు ఉపయోగపడడం లేదు. దీంతో క్రీడాభిమానుల విజ్ఞప్తితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.5.50 కోట్లు మంజూరు చేశారు. స్టేడియం కోసం కేటాయించిన 6.93 ఎకరాల స్థలంలో ఈ నిధులతో మరిన్ని క్రీడాంశాల శిక్షణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు అందాయి. ఈమేరకు ఆరు లేన్ల అథ్లెటిక్స్ ట్రాక్, క్రికెట్ నెట్లు, రెండు వాలీబాల్ కోర్టులు, ఖో–ఖో, కబడ్డీ కోర్టులు, ఫుట్బాల్ ఫీల్డ్, క్రీడాకారుల డార్మెటరీ, ఓపెన్ జిమ్తో పాటు బాత్రూంల నిర్మాణం చేపడతారు. తద్వారా భవిష్యత్లో మధిర వేదికగా రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడా పోటీల నిర్వహణకు వీలవుతుందని భావిస్తున్నారు. -
యోగా.. ఆదరణ బాగా
ఖమ్మంస్పోర్ట్స్/సత్తుపల్లిటౌన్: యోగా.. ప్రస్తుతం అందరూ ఆచరించాలనుకుంటున్న ప్రత్యేక ప్రక్రియ. ప్రస్తుతం ఒత్తిడితో కూడుకున్న జీవనం.. ఇంటా, బయట అనేక సమస్యలతో సతమతం.. ఎన్నో సమస్యలకు యోగాతో చెక్ పెట్టవచ్చని, మానసికంగా ప్రశాంతంగా ఉండవచ్చనే ఆలోచనతో ఎక్కువ మంది యోగా బాటపడుతున్నారు. ఇంటికి ఒకరు యోగా కేంద్రానికి వెళ్తున్నారంటే ఎంతటి ప్రాధాన్యత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇబ్బడిముబ్బడిగా యోగా కేంద్రాలు ఎర్పడటంతో ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్లయింది. యోగా క్రియల వల్ల మానవుని శరీరంలోని ప్రతి అవయవం చక్కగా పనిచేస్తుందని, ప్రతి అవయవానికి రక్త ప్రసరణ జరుగుతుందని, దీంతో ఎలాంటి వ్యాధులు రాకుండా కాపడుతుందని అందరూ విశ్వసిస్తున్నారు. యోగా ద్వారా ఇప్పటికే జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటినవారున్నారు. జిల్లా కేంద్రంలో ఒకే పతంజలి యోగా కేంద్రం ఉండేది. ప్రస్తుతం ప్రతి వీధి, మండల కేంద్రాల్లో యోగా కేంద్రాలు వెలిశాయి. ఆన్లైన్లోనూ.. యోగా, ధ్యాన శిక్షణ తరగతులు ఆన్లైన్లోనూ అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా మహిళలు ఈ యోగా తరగతుల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. శిక్షణ శిబిరాలకు వెళ్లలేని వారు ఇళ్లల్లోనే నిత్యం సాధన చేస్తూ ప్రయోజనాలు పొందుతున్నారు. నిత్యం యోగా అభ్యాసం వల్ల మనిషికి ఆరోగ్యం, శక్తి, తేజస్సు, చురుకుదనం లభిస్తుందని కోచ్లు చెబుతున్నారు. అంతేకాక ప్రస్తుత విద్యావిధానంలో విద్యార్థులు ఒత్తిడిని దూరం చేసేందుకు యోగా సాధన ఉపయోగపడుతోంది. కాగా, సత్తుపల్లిలో శ్రీరామకృష్ణ యోగా సమితి, శ్రీరామచంద్ర మిషన్, పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ, బ్రహ్మకుమారీస్ సంస్థలు దశాబ్దాలుగా యోగా, ధ్యానంపై ఉచిత శిక్షణ ఇస్తున్నారు.నేడు యోగా దినోత్సవం -
గాలివాన బీభత్సం
పెనుబల్లి: మండలవ్యాప్తంగా శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గాలుల ధాటికి ఏళ్లనాటి వృక్షాలు సైతం నేలకొరిగాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పెనుబల్లి, కుప్పెనకుంట్ల, ముత్తగూడెం గ్రామాలతోపాటు పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. కుప్పెనకుంట్లలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పడిపోయింది. విద్యుత్ శాఖాధికారులు కొన్ని ప్రాంతాల్లో సరఫరాను పునరుద్ధరించారు. శనివారం విరిగిపోయిన స్తంభాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేశారు. ఆలయ ప్రతిష్ఠాపనకు రూ.లక్ష విరాళం తల్లాడ: మండలంలోని గొల్లగూడెంలో నూతనంగా నిర్మించిన అభయాంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ఠాపనకు గ్రామ సర్పంచ్ కోడూరి ఉమాదేవి – వీరకృష్ణ రూ.లక్ష విరాళం ప్రకటించారు. ఈ మేరకు నగదును శనివారం ఆయన ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ఇస్నేపల్లి లక్ష్మణ్, విలాసాగరం శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, గుండ్ల వెంకటేశ్వర్లు, బీరెడ్డి మల్లారెడ్డి, బొడ్డు కృష్ణ, గుండ్ల జోగారావు, తిరుపతిరావు పాల్గొన్నారు. లైన్మెన్పై ఫిర్యాదులు, విచారణ తల్లాడ: మండలంలోని కుర్నవల్లి సబ్స్టేషన్ లైన్మెన్ యాకూబ్ అవినీతికి పాల్పడుతున్నాడని మద్దునూరుకు చెందిన రైతు అనుమోలు రామారావు ఇటీవల ఎన్పీడీసీఎల్ డైరెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం విజిలెన్స్ ఎస్ఐ లవన్కుమార్ మద్దునూరు, రంగాపురంల్లో వివరాలు సేకరించి రైతులతో మాట్లాడారు. ఈ మేరకు నివేదికను ఉన్నతాధికారులకు ఇస్తామని తెలిపారు. రెండేళ్ల తర్వాత తెరుచుకున్న బండిపాడు పాఠశాల కామేపల్లి: మండలంలోని రుక్కీతండా పంచాయతీ పరిధి బండిపాడు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు లేక కొన్నేళ్లుగా మూతపడింది. ఇటీవల సర్పంచ్ రమాదేవి, ఎంఈఓ వెంకట్ ఆధ్వర్యంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు పి.జ్యోతి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత యూనిఫామ్, భోజనం, అల్పాహారం, పుస్తకాలు అందుతాయని తల్లిండ్రులకు అవగాహన కల్పించారు. దీంతో 10 మంది విద్యార్థులను చేర్పించగా రెండేళ్లుగా మూతపడిన బండిపాడు బడి తెరుచుకుంది. ఈ మేరకు పిల్లలకు తొలిరోజు పుస్తకాలు అందజేసి పాఠాలు ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పిట్ల రాములు, కార్యదర్శి ఎండీ ఫజల్, సీఆర్టీ ఎల్.చందూలాల్, వార్డు సభ్యులు గుగులోతు మంగ్యా, జి.కిషన్, గ్రామస్తులు జె.వెంకట్రామ్, లాల్సింగ్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలి కారేపల్లి: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి టి.రాంబాబు సూచించారు. కారేపల్లిలోని కేజీబీవీని శనివారం తనిఖీ చేసిన ఆయన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, కేజీబీవీ లోతట్టు ప్రాంతంలో ఉండడం, పక్కనే మద్దులవాగు ప్రవాహం ఆవరణలోకి చేరే అవకాశం ఉండడంతో ఎత్తుగా మొరం పోయించాలని ఇన్చార్జ్ ఎంపీడీఓ మల్లెల రవీంద్రప్రసాద్కు సూచించారు. అనంతరం మోడల్ స్కూల్, కారేపల్లి హైస్కూళ్లను పరిశీలించిన డీపీఓ ప్రధానోపాధ్యాయులకు సూచనలు చేశారు. ఆ తర్వాత కారేపల్లిలోని ఓ కాలనీలో ఇటీవల మహిళకు డెంగీ పాజిటివ్గా నిర్ధారణ కావడంతో కాలనీలో పారిశుద్ధ్య పనులను కూడా పరిశీలించి స్థానికులకు అవగాహన కల్పించారు. ఎంఈఓ దుగ్గిరాల జయరాజు, సర్పంచ్ మేదరి టోనీవీరప్రతాప్, గ్రామ కార్యదర్శి నెహ్రూ తదితరులు పాల్గొన్నారు. -
ఈనెల 24న సత్తుపల్లికి కేటీఆర్
● ఎస్ఐఆర్, పార్టీ సభ్యత్వ నమోదు శిక్షణకు హాజరు ● వెల్లడించిన ఎమ్మెల్సీ మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర సాక్షిప్రతినిధి, ఖమ్మం: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్), బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుపై ఈ నెల 24న సత్తుపల్లిలో నిర్వహించే శిక్షణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు హాజరు కానున్నారని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వెల్లడించారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో శనివారం వారు మాట్లాడారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా వ్యవసాయం, సాగునీటి రంగాలకు పెద్దపీట వేసి రైతులను రాజులుగా చేస్తే.. నేటి సీఎం రేవంత్రెడ్డి రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్సీ మధు ఆరోపించారు. నాడు భక్తరామదాసు ప్రాజెక్టును పూర్తి చేయించి పాలేరు నియోజకవర్గానికి నీరు అందించగా, సీతారామ ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేయించారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏమీ చేయకపోగా, తాను రైతునని గొప్పలు చెప్పుకునే వ్యవసాయ శాఖ మంత్రికి రైతుల బాధలు పట్టడం లేదని తెలిపారు. ముగ్గురు మంత్రులున్నా కూడా ఉమ్మడి జిల్లాకు ఒరిగింది ఏమీ లేకపోగా, నాడు కేసీఆర్ హయాంలో చేసిన పనులన్నింటినీ ఆగమాగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే వెంకట వీరయ్య మాట్లాడుతూ.. సత్తుపల్లిలో ఈనెల 24న ఉదయం 10.30 గంటలకు మొదలయ్యే సమావేశంలో కేటీఆర్ పాల్గొంటారని, పార్టీ నుంచి ఆహ్వానం అందిన వారే హాజరుకావాలని సూచించారు. సమావేశంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, నాయకులు గుండాల కృష్ణ, పగడాల నాగరాజు, బొమ్మెర రామ్మూర్తి, ఉన్నం బ్రహ్మయ్య, బెల్లం వేణు పాల్గొన్నారు. -
సగం ఓట్లు కూడా మ్యాపింగ్ కాలేదు..
● ‘సర్’పై శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి ● మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంసహకారనగర్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై కాంగ్రెస్ శ్రేణులు, బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఏ) అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మంలో శనివారం నిర్వహించిన బీఎల్ఏల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో సుమారు 3.26 లక్షల ఓట్లు ఉంటే, అందులో సగం కూడా మ్యాపింగ్ పూర్తికాలేదని పేర్కొన్నారు. ఇటీవల బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఓట్ల మ్యాపింగ్ సక్రమంగా జరగక అక్కడి కొన్ని పార్టీలు రాజకీయంగా నష్టపోయినట్లు తెలిసిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 50 శాతం ఓట్లు కూడా మ్యాపింగ్ కాకపోవడం ఆందోళన కలిగించే అంశమని తెలిపారు. ఈ మేరకు ఇంటింటి పరిశీలన సందర్భంగా బీఎల్ఏలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తక్కువ ఓట్లతోనే గెలిచాం.. అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఎక్కువ శాతం ఓట్లతో గెలవలేదని, కేవలం మూడు శాతం ఓట్ల తేడాతోనే విజయం సాధించామని తుమ్మల వెల్లడించారు. సర్ నిర్వహణతో దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ఓ రాష్ట్రంలో సుమారు 90 లక్షల ఓట్లు తొలగించగా, అప్పీల్ చేసుకునేందుకు కేవలం 30 లక్షల మందికే అవకాశం కల్పించారని చెప్పారు. ఈ మేరకు ఓటర్ల జాబితా సక్రమంగా పరిశీలించకపోతే ఎన్నికల ఫలితాలు తారుమారు కావడమే కాక రాజకీయ సమీకరణాలపై ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని రాజకీయాల్లో కొనసాగాలంటే ఓటర్ల జాబితాపై పూర్తిస్థాయి పట్టు సాధించి, అర్హుల పేర్లు తొలగించకుండా చూడాలని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు నెల పాటు కష్టపడి ఓటర్ల జాబితా పరిశీలనలో నిమగ్నమైతే ఆశించిన పదవులు, ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. సమావేశంలో కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్షులు నూతి సత్యనారాయణ, నాగండ్ల దీపక్చౌదరి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, సుడా, మార్కెట్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, యరగర్ల హన్మంతరావుతో పాటు బాలసాని లక్ష్మీనారాయణ, పునుకొల్లు నీరజ, మానుకొండ రాధాకిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
రాజీతో ఉత్తమ పరిష్కారం
● జిల్లా ఇన్చార్జ్ జడ్జి మహేష్నాథ్ ● లోక్ అదాలత్లో 4,963 కేసుల పరిష్కారంఖమ్మంలీగల్: కక్షిదారులు రాజీ పడడం ద్వారా ఉత్తమ పరిష్కారం లభిస్తుందని జిల్లా ఇన్చార్జ్ ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ జీవీ.మహేష్నాథ్ తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ఖమ్మం జిల్లా కోర్టు ఆవరణలో తొమ్మిది బెంచ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ కేసులను పలువురు కక్షిదారులు పరస్పర రాజీ ద్వారా పరిష్కరించుకున్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తి మహేష్నాథ్ మాట్లాడుతూ.. రాజీ పడి కేసులు పరిష్కరించుకోవడం ద్వారా ఇరువర్గాలకు సమన్యాయం జరుగుతుందే తప్ప ఎవరూ ఓడిపోయినట్లు కాదన్నారు. తద్వారా సమయం ఆదా అవుతుందని తెలిపారు. అనంతరం కేసులు పరిష్కరించుకున్న కక్షిదారులకు పర్యావరణ పరిరణక్షలో భాగంగా మొక్కలు పంపిణీ చేశారు. జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి పి.దేవీమానస లోక్ అదాలత్ నిర్వహణను పర్యవేక్షించగా, పలు న్యాయస్థానాల న్యాయాధికారులు, న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులు పాల్గొన్నారు. రూ.3 కోట్లకు పైగా పరిహారం జాతీయ లోక్ అదాలత్లో భాగంగా జిల్లా కోర్టుతో పాటు ఇతర కోర్టుల్లో అత్యధిక కేసుల పరిష్కారం కోసం కొద్దిరోజులుగా కక్షిదారులకు అవగాహన కల్పించారు. ఈక్రమాన శనివారం 4,963 కేసులు పరిష్కారయ్యాయి. ఇందులో సివిల్ కేసులు 16, క్రిమినల్ కేసులు 745, చెక్కు కేసులు 186, కుటుంబ తగాదా కేసులు 14 ఉన్నాయి. అలాగే, 42 మోటార్ ప్రమాద కేసులను పరిష్కరించగా ప్రమాద బాధితులకు రూ.1,98,21,325 పరిహారం లభించింది. అంతేకాక ఎస్టీసీ ఎన్ఐ యాక్ట్ కేసులు 1,534 పరిష్కరించి ఫిర్యాదుదారులకు రూ.4,61,859 పరిహారంతో పాటు 14,586 ప్రీలిటిగేషన్ కేసులు పరిష్కారం కాగా బాధితులకు పరిహారంగా రూ.98,48,710 లభించింది. -
ప్రతిభకు పురస్కారం..
ఖమ్మంమయూరిసెంటర్: జాతీయస్థాయి రెడ్రిబ్బన్ క్విజ్ పోటీల్లో ప్రథమ స్థానం సాధించి ఖమ్మం కీర్తిని చాటిన 30వ డివిజన్కు చెందిన తురక దేవిశ్రీప్రసన్నకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఇటీవల గవర్నర్ సమక్షాన సీఎం రేవంత్రెడ్డి ఆమెకు జ్ఞాపిక, రూ.50 వేల నగదు పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా ప్రసన్న తల్లి లక్ష్మిని కుటుంబ పరిస్థితులపై వాకబు చేశారు. అయితే, తండ్రి లేని బిడ్డను రెక్కల కష్టంతో చదివిస్తున్నానని, ఉండడానికి ఇల్లు కూడా లేదని తెలుసుకున్న సీఎం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆదేశించారు. దీంతో మంత్రి తుమ్మల శనివారం అధికారులతో చర్చించి వైఎస్సార్నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇంటిని లక్ష్మికి మంజూరు చేయించారు. ఈ మేరకు కేటాయించిన ఇంట్లో మంజూరు పత్రాన్ని కాంగ్రెస్ ఖమ్మం నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్చౌదరి ఆమెకు అందజేశారు. నాయకులు కోసూరు ప్రసాద్, బాణాల లక్ష్మణ్, నరాల నరేశ్, మోహన్నాయుడు, తోల రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.సీఎం ఆదేశాలతో నిరుపేద విద్యార్థిని కుటుంబానికి ఇల్లు -
ప్రత్యామ్నాయ పంటలపై విస్తృత అవగాహన
కూసుమంచి: జలవనరుల శాఖ ఉద్యోగులు రైతులకు అందుబాటులో ఉంటూ వారికి సేవలు అందించాలని సీఈ మంగళంపూడి వెంకటేశ్వర్లు సూచించారు. మండలంలోని పాలేరు రిజర్వాయర్ను శనివారం పరిశీలించిన ఆయన నీటి నిల్వలను పరిశీలించాక ఉద్యోగులతో మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా విస్తృత అవగాహన కల్పించాలన్నారు. అంతేకాక నీటి వృథాను అరికడుతూ చివరి భూములకు సైతం సాగునీరు అందించడంపై దృష్టి సారించాలని తెలిపారు. ఇటీవల విధుల్లో చేరిన నూతన సిబ్బందికి వేతనాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అనంతరం ఫాలింగ్ గేట్ల నిర్వహణపై సీఈ సూచనలు చేశారు. -
కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా బోధన
బోనకల్: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ ఉద్దేశంతోనే బలమైన పునాదుల కోసం ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభిస్తున్నట్లు ఇన్చార్జ్ డీఈఓ సదానందం తెలిపారు. బోనకల్ మండలం కలకోట పాఠశాలలో ప్రీ ప్రైమరీ విభాగాన్ని శనివారం ప్రారంభించిన ఆయన విద్యార్థులకు కిట్లు అందజేశాక మాట్లాడారు. ప్రీ ప్రైమరీ విద్యావిధానం గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు గొప్ప అవకాశమని తెలిపారు. ఈ మేరకు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. సర్పంచ్ పైడిపల్లి అనిత, ఏఎంఓ ప్రభాకర్రావు, ఎంఈఓ దామాల పుల్లయ్య, హెచ్ఎం సునీల్కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం చింతకాని: యోగా సాధన ద్వారా ఆరోగ్యం సొంతమవుతుందని ఇన్చార్జ్ డీఈఓ సదానందం పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చింతకాని మండలం పందిళ్లపల్లి పాఠశాలలో ఆయన విద్యార్థులతో కలిసి యోగా చేశాక మాట్లాడారు. ప్రతిరోజు యోగా చేస్తే ఆరోగ్యంగా ఉండడమే కాక మానసిక ప్రశాంతత కలుగుతుందని తెలిపారు. సర్పంచ్ వత్సవాయి పద్మ, ఏఎంఓ ప్రభాకర్రెడ్డి, హెచ్ఎం దొండపాటి శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఇన్చార్జ్ డీఈఓ సదానందం -
నీట్ పేపర్ లీకేజీ బాధ్యత కేంద్రానిదే..
ఖమ్మంమయూరిసెంటర్: నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ డిమాండ్ చేశారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్షలాది మంది విద్యార్థులను ఆవేదనకు గురిచేసిన కేంద్రానికి వ్యతిరేకంగా ‘స్టూడెంట్ వాయిస్’పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య మాట్లాడుతూ.. సోమవారం సాయంత్రం ఖమ్మం సప్తపది ఫంక్షన్ హాల్లో జరిగే ‘మహిళా భేటీ’లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, సుడా చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు గజ్జెల్లి వెంకన్న, కొత్తా సీతారాములు, సయ్యద్ గౌస్, పుచ్చకాయల వీరభద్రం, బొడ్డు బొందయ్య, జెర్రిపోతుల అంజనీకుమార్, బానోత్ వినోద, రేఖా భార్గవి, సుకన్య పాల్గొన్నారు.డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ -
●‘ఆమె’కు మాట సాయమట!
వైరా మున్సిపాలిటీకి ఇటీవల కొత్త పాలకవర్గం కొలువుదీరగా.. శుక్రవారం కౌన్సిల్ రెండో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 2, 4, 13వ మహిళా కౌన్సిలర్ల భర్తలు కూడా సమావేశానికి హాజరై వెనుకాల కూర్చున్నారు. ఓ పక్క చర్చ జరుగుతుండగా వీరు కౌన్సిలర్లకు ఫోన్లో ఏమేం మాట్లాడాలో సూచనలు ఇవ్వడం కనిపించింది. కౌన్సిలర్లే కాదు ఏకంగా చైర్పర్సన్ భర్త కూడా మిగతా కౌన్సిలర్ల భర్తలతో పాటు కూర్చుని సమావేశాన్ని పర్యవేక్షించడం చర్చకు దారి తీసింది. ఇదిలా ఉండగా సమావేశాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులను మాత్రం బయటకు వెళ్లాలని కమిషనర్ ఆదేశించడం కొసమెరుపు ! – వైరా -
ఎస్ఐఆర్పై ప్రత్యేక దృష్టి
ఖమ్మం సహకారనగర్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)పై ప్రత్యేక దృష్టి సారిస్తూ పొరపాట్లకు తావు లేకుండా విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ ఈనెల 25నుంచి జూలై 24వ తేదీ వరకు బూత్ స్థాయి అధికారులు ప్రతీ ఇంటికి ఎన్యూమరేషన్ ఫారాలు అందించి, పూర్తిచేశాక సేకరించాలని తెలిపారు. జిల్లా నుంచి వీసీలో పాల్గొన్న కలెక్టర్ దివాకర టీ.ఎస్. మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించగా, ఉద్యోగులకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సదానందం, ఖమ్మం ఆర్డీఓ శ్రీనివాస్, ఎన్నికల విభాగం ఉద్యోగులు ఎం.ఏ.రాజు, అన్సారీ పాల్గొన్నారు. ఓటర్లు సహకరించాలి అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు అందరూ సహకరించాలని కలెక్టర్ దివాకర సూచించారు. రఘునాథపాలెంలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ మ్యాపింగ్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్లతో మాట్లాడి సమస్యలు తెలుకున్నారు. అనంతరం ప్రతీ ఓటరు వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి మ్యాపింగ్ వేగంగా పూర్తిచేయాలని ఉద్యోగులకు సూచించారు. తహసీల్దార్ శ్వేత, సర్పంచ్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి -
‘చేయూత’కు ఈ–కేవైసీ!
● 1.45 లక్షల మంది లబ్ధిదారుల ఎఫ్ఆర్ఎస్ పూర్తి ● ఇంకా పెండింగ్లో 28,867 మంది పెన్షనర్లు ● ఐరిష్ నమోదు కాకపోతే వేలిముద్రల సేకరణ ● వారంలోగా పూర్తిచేసేలా కార్యాచరణఖమ్మంమయూరిసెంటర్: ఆసరా (చేయూత) పెన్షన్ల పంపిణీని మరింత పారదర్శకంగా అమలుచేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ఫేషియల్ రికగ్నజేషన్ సిస్టమ్(ఎఫ్ఆర్ఎస్) అమలు కొనసాగుతోంది. అర్హులైన వారికి పింఛన్ అందిస్తూ, అనర్హులు, మృతుల పేర్లను జాబితా తొలగించాలనే లక్ష్యంతో అధికారులు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తున్నారు. ఈనెల 15 నాటికే ప్రక్రియను ముగించాల్సి ఉన్నా.. సాంకేతిక కారణాలు, ఎఫ్ఆర్ఎస్లో లబ్ధిదారుల ఐరిస్ నమోదు కాకపోవడంతో వంటి కారణాలతో జాప్యం జరిగింది. ఈ నేపథ్యాన వారం రోజుల్లో పూర్తి చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. 82శాతం పూర్తి జిల్లాలో 1,76,477 మంది వివిధ రకాల పింఛన్లు తీసుకుంటున్నారు. అందులో ఇప్పటివరకు 1,45,195 మంది(సుమారు 82 శాతానికి పైగా) లబ్ధిదారుల ఎఫ్ఆర్ఎస్ గుర్తింపు పూర్తయింది. మిగిలిన 28,867 మంది గుర్తింపు చేపట్టాల్సి ఉంది. అధికారులు, పంచాయతీ కార్యాలయాల సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది క్షేత్రస్థాయిలో వీరి వివరాలు సేకరిస్తున్నారు. కాగా, పలువురి విషయంలో సాంకేతిక కారణాలు, ఇతర అంశాల ఆధారంగా అధికారులు రిమార్క్ నమోదు చేశారు. త్వరలోనే నూరు శాతం మొత్తం ప్రక్రియలో ఇంకా 571 ఆధార్ సంబంధిత అంశాలు పెండింగ్ ఉన్నాయి. మొత్తంగా మిగిలిన 28,867 మందికి కూడా వీలైనంత త్వరగా ఈ–కేవైసీ లేదా ఎఫ్ఆర్ఎస్ పూర్తి చేయాలని యంత్రాంగం భావిస్తోంది. అర్హులైన లబ్ధిదారులెవరూ నష్టపోవద్దనే ఉద్దేశంతో మంచానికే పరిమితమైన వారి వద్దకు సిబ్బందే స్వయంగా వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. అనర్హుల తొలగింపు, నిజమైన పేదలకు న్యాయం జరగడానికి ఈ ప్రక్రియ దోహదపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.ఎఫ్ఆర్ఎస్లో ముఖ గుర్తింపునకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లాలో 1.45 లక్షల మంది లబ్ధిదారులను ముఖ గుర్తింపు ద్వారా జీవించి ఉన్నట్లు తేల్చారు. మరో 28,867 మంది లైవ్ అథంటికేషన్ తీసుకునేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఆధార్ ఆధారంగా వేలిముద్రలు సేకరించి వివరాలు ఖరారు చేసుకుంటారు. ఇందుకోసం ఇప్పటికే జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు మండలాలకు బయోమెట్రిక్ మిషన్లను సరఫరా చేశారు. గ్రామాల్లో లబ్ధిదారుల వద్దకు పంచాయతీ సిబ్బంది వెళ్లి వారి వేలిముద్రలను నమోదు చేస్తారు. -
మరమ్మతులెప్పుడో..?
‘కిన్నెరసాని’కి● ప్రాజెక్ట్ గేట్లు లీకై వర్షాకాలంలో వృథాగా పోతున్న నీరు ● దశాబ్దకాలంగా మరమ్మతులు నిర్వహించని కేటీపీఎస్ అధికారులు ● రెండేళ్ల క్రితం నిధులు విడుదల.. ముందుకురాని కాంట్రాక్టర్లు ● చిన్న సమస్యేనని నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదానికి దారితీసే అవకాశంపాల్వంచరూరల్: కిన్నెరసాని ప్రాజెక్ట్ గేట్లు మరమ్మతులకు నోచుకోవడంలేదు. నిధులు మంజూరై రెండేళ్లయినా, నాలుగు సార్లు టెండర్లు పిలిచినా ఫలితం కానరావడంలేదు. మరోవైపు వానాకాలం వచ్చేసింది. ప్రాజెక్ట్ గేట్ల వద్ద లీకేజీ కారణంగా ఏటా వర్షాకాలంలో జలాశయం నుంచి నీరు వృథాగా పోతోంది. మూడేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. చిన్న సమస్యే అని నిర్లక్ష్యం వహిస్తే పెను ప్రమాదానికి దారితీసే అవకాశం లేకపోలేదని రైతులు, సమీప గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. కేటీపీఎస్ అధికారులు జాప్యం వీడకపోతే పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రాజెక్ట్ పిల్లర్లు, గేట్ల రబ్బర్ సీల్స్ లీకవుతున్నా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. పదేళ్లుగా మరమ్మతులు లేవ్.. ప్రాజెక్ట్ గేట్లకు నాలుగైదేళ్లకోసారి మరమ్మతులు నిర్వహించాల్సి ఉంది. కానీ పదేళ్లు గడిచినా రిపేరు చేయలేదు. దీంతో గేట్ల మద్య లీకులు ఏర్పడి నీరు బయటకు వృథాగా పోతోంది. రిజర్వాయర్లోని నీటిమట్టం 393 అడుగులు ఉంటేనే మరమ్మతులు సాధ్యమని, అంతకంటే ఎక్కువ ఉంటే పనులు చేపట్టలేమని అధికారులు చెబుతున్నారు. లీకేజీ ప్రమాదమేమి కాదని కేటీపీఎస్(జెన్కో) అధికారులు అంటున్నారు. రిజర్వాయర్లో నీటిమట్టం 400 అడుగులకు పెరిగినప్పుడు మాత్రమే లీకేజీతో నీరు బయటకు పోతోందని చెబుతున్నారు. ప్రాజెక్ట్ గరిష్టస్థాయి నీటిమట్టం 407 అడుగులు కిన్నెరసాని రిజర్వాయర్పై 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యంతో 13 క్రస్ట్ గేట్లతో 1962 ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. 1972లో పూర్తిచేశారు. తొలుత ఇరిగేషన్శాఖ పర్యవేక్షించగా, 1998 ఏప్రిల్ 1 నుంచి జెన్కోకు అప్పగించారు. 2014లో రూ.60 లక్షలతో ప్రాజెక్ట్ 13 క్రస్ట్ గేట్లకు రూఫ్వే, సాకెట్లను మార్చారు. దీంతో ఇవి మరో పదేళ్ల వరకు మార్చాల్సిన పనిలేదు. కానీ 1, 4, 13వ నంబర్ గేట్ల మధ్య పిల్లర్లకు బీటలువారాయి. పిల్లర్ల మధ్య నీటి చెమ్మ అధికంగా కన్పిస్తోంది. పారిశ్రామిక, సాగు, తాగునీటి అవసరాలకు... కిన్నెరసాని జలాశయం నుంచి కేటీపీఎస్ విద్యుత్ ఉత్పత్తికి, ఎన్ఎండీసీ, నవభారత్, కర్మాగారాలకు నీరు సరఫరా చేస్తున్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో తాగునీరు. పాల్వంచ మండలంలో 3 వేలు, బూర్గంపాడు మండలంలో 7 వేల ఎకరాలకు సాగునీరు కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మరమ్మతులు చేపట్టకపోతే పారిశ్రామిక, సాగు, తాగునీటి అవసరాలకు కూడా సమస్య ఏర్పడే అవకాశం ఉంది. రూ.1.90 కోట్లు మంజూరు కిన్నెరసాని జలాశయం కరకట్ట పటిష్టతకు టీజీ జెన్ యాజమాన్యం రెండేళ్ల క్రితం రూ.1.90 కోట్లు మంజూరుచేసింది. వీటి వినియోగానికి పుణే నుంచి సెంట్రల్ వాటర్ పవర్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్కు చెందిన బృందం అధ్యయనం చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ప్రాజెక్ట్ పరిశీలనకు రాలదు. పిల్లర్ల మరమ్మతులు, ఇతర పనులకు ఏడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వ పథకం డ్రిప్ ఇరిగేషన్ కింద రూ.2 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు పంపారు. కానీ ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదు.కిన్నెరసాని ప్రాజెక్ట్ గేట్ల సీల్స్ లీకవడంతో నీళ్లు స్వల్పంగా బయటకు వస్తున్నాయి. మరమ్మతుల విషయమై జెన్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. నిధులు కూడా మంజూరయ్యాయి. జెన్కో యాజమాన్యం నాలుగుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందురావడంలేదు. జలాశయంలో ఇప్పుడు నీళ్లు అధికంగా ఉన్నందున్న టెండర్ల ప్రక్రియ పూర్తయినా మరమ్మతులు నిర్వహించడం సాధ్యంకాదు. – ప్రభాకర్రావు, కేటీపీఎస్ 5వదశ సీఈ -
ప్రైవేటీకరణ ప్రతిపాదన విరమించుకోవాలి
పాల్వంచ: యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లోని ఏహెచ్పీ, సీహెచ్పీ విభాగాలను ప్రైవేటీకరించాలన్న ప్రతిపాదనలను విరమించుకోవాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పాల్వంచ కేటీపీఎస్లోని 5, 6, 7వ దశల్లో వేర్వేరుగా శుక్రవారం భోజన విరామ సమయాన నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కార్యక్రమాల్లో నాయకులు మాట్లాడుతూ వైటీపీఎస్ ప్లాంట్లో రూ.255 కోట్లకు టెండర్లు పిలవడం వల్ల జెన్కో ఉద్యోగుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఇకనైనా ప్రైవేటీకరణ యత్నాలు విరమించుకుని, టెండర్లు నిలిపివేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ఉమామహేశ్వరరావు, యాస్మిన్, భాగ్యరాజ్, శ్రీనివాసరావు, శ్రీపాల్, ప్రభాకర్, బ్రహ్మాజీ, మహేశ్, రఘువీర్, రాధాకృష్ణ, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఐఐటీ ప్రొఫెసర్ పేరిట రూ.10 లక్షలు టోకరా
ఖమ్మంక్రైం: మనుగడలో లేని సంస్థ పేరిట నకిలీ పత్రాలు సృష్టించి, విద్యార్థులకు శిక్షణ ఇస్తామంటూ నమ్మబలికి ఖమ్మంలోని ఓ ప్రముఖ విద్యాసంస్థ నుంచి రూ.10 లక్షలు తీసుకుని ముఖం చాటేసిన వ్యక్తిని సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాకు చెందిన ఓ ప్రముఖ విద్యాసంస్థ బాధ్యులను వాట్సప్ ద్వారా ఓ వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. హైదరాబాద్ ఐఐటీలో తాను ప్రొఫెసర్గా పనిచేస్తున్నానని, విద్యార్థులకు శిక్షణ ఇస్తానని నమ్మించా డు. అంతేకాక నకిలీ పత్రాలు, నకిలీ ఎంఓయూ లను ఆన్లైన్లో పంపించి రూ.10 లక్షలు తీసుకున్నాడు. అయితే, సదరు వ్యక్తి ప్రొఫెసర్ కాదని, తమను మోసం చేశాడని తెలుసుకున్న విద్యాసంస్థ బాధ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో నగదు జమ అయిన వ్యక్తిని డి.రవికిరణ్గా గుర్తించి హైదరాబాద్లో అరెస్ట్ చేశామని ఖమ్మం సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. కేసు విచారణలో ముఖ్య పాత్ర పోషించిన డీఎస్పీ ఫణీందర్, సీఐ భూక్యా రవికుమార్, ఎస్ఐలు రంజిత్, విజయకుమార్, కానిస్టేబుల్ కృష్ణారావు, నాగేశ్వరరావును సీపీ సునీల్దత్ అభినందించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు -
ఆదర్శం.. ఆ ఉపాధ్యాయుడు..
ముదిగొండ: మాటలు చెప్పడం కాకుండా ఆచరణలో చూపించిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆదర్శంగా నిలిచాడు. ముదిగొండ మండలం యడవల్లికి చెందిన బాల నర్సింహారావు స్వగ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సొంత గ్రామంలోని బడి అభివృద్ధి చెందేలా పలువురు విద్యార్థులను చేర్పించారు. అంతేకాక కుమార్తె, ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న బాల హరిణిని కూడా తాను పనిచేస్తున్న పాఠశాలలో చేర్పించగా, హెచ్ఎం నాగలక్ష్మి, తదితరులు అభినందించారు. సర్పంచ్, వార్డు సభ్యురాలు కూడా.. నేలకొండపల్లి: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ప్రచారం చేసే ప్రజాప్రతినిధులు తమ పిల్లలను కూడా చేర్పించారు. మండలంలోని నాచేపల్లి సర్పంచ్ భూక్యా మౌనిక కుమారుడు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు. అయితే, బడిబాట ప్రచారంలో పాల్గొన్న ఆమె తన కుమారుడిని కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. అంతేకాక వార్డు సభ్యురాలు కూరపాటి మాధవి కుమారుడు, కుమార్తెను సైతం పాఠశాలలో చేర్పించి తాము చెబుతున్న ఆదర్శాలను ఆచరణలో చాటిచెప్పారు. ఈ సందర్భంగా సర్పంచ్, వార్డు సభ్యులను ఎంఈఓ బి.చలపతిరావు, హెచ్ఎం కోటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి బాబూరావు, ఉపాధ్యాయులు ఎం.వీరబాబు, చిన్నా తదితరులు అభినందించారు.ప్రభుత్వ పాఠశాలలో కుమార్తెకు అడ్మిషన్ -
ఉద్యాన పథకాలకు చేయూత
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఉద్యాన పథకాల అమలుకు ప్రభుత్వం రూ.66 కోట్లు కేటాయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలకు ఈ నిధులను వినియోగించాలని రాష్ట్ర ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ సంచాలకులు ఆదేశించారు. ఈ మేరకు జిల్లాకు మంజూరైన పథకాలు, నిధుల వివరాలను జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి ఎం.వీ.మధుసూదన్ వెల్లడించారు. ●తెలంగాణ స్టేట్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ (టీజీఎంఐపీ) ఈ ఏడాది మొదటి దశలో ఈ పథకం కింద 15,310 ఎకరాల లక్ష్యంగా రూ.2701.57 లక్షలు కేటాయించారు. ఆయిల్ పామ్, ఇతర ఉద్యాన పంటల్లో నీటి సౌకర్యం కోసం స్ప్రింకర్లు, రెయిన్ గన్స్ ఏర్పాటుకు ఈ నిధులు కేటాయిస్తూ, రాయితీ అమలు చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం, చిన్న, సన్న, బీసీ రైతులకు 80, ఇతర రైతులకు 70 శాతం సబ్సిడీ కల్పించారు. స్ప్రింక్లర్లకు ప్రతీ రైతుకు 65 శాతం సబ్సిడీ వర్తింపజేస్తారు. కాగా, ఈ ఏడాది నుంచి ‘ఆటోమేషన్ ద్వారా డ్రిప్‘ప్రవేశపెట్టారు. సెన్సార్లు, కంట్రోలర్లు, వాల్వ్ల సాయంతో మొబైల్ యాప్ ద్వారా రైతు ఎక్కడి నుంచైనా నీటి విడుడులకు అవకాశం ఉంటుంది. ●నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ పామ్ (ఎన్ఎంఈఓ – ఓపీ) ఈ పథకం కింద జిల్లాలో 14,500 ఎకరాల ఆయిల్ పామ్ సాగును విస్తరించేందుకు రూ. 3,217.93 లక్షలు కేటాయించారు. టీజీ ఆయిల్ ఫెడ్, గోద్రెజ్ అగ్రోవెట్ లిమిటెడ్ సంస్థల ద్వారా పంట సాగు విస్తరిస్తారు. ఈ పథకం ద్వారా ఎకరాకు రూ.50,918 చొప్పున నాలుగేళ్ల వ్యవధిలో ఇస్తారు. నారు, నిర్వహణ, అంతర పంటలు, మైక్రో ఇరిగేషన్ ఖర్చులు కూడా ఇందులో ఉన్నాయి. ●సమగ్ర ఉద్యాన మిషన్ (ఎంఐడీహెచ్) మామిడి, జామ, నిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, అరటి వంటి ఉద్యాన పంటల సాగు, మల్చింగ్, యాంత్రీకరణ పరికరాల కోసం పలు ఉద్యాన పథకాలు అమలు చేస్తారు. ఈ పథకాల అమలుకు ఈ ఏడాదికి రూ. 598.54 లక్షలు కేటాయించారు. ●పీఎం – రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (పీఎంఆర్కేవీవై) ఈ పథకాన్ని ప్రధానంగా కూరగాయల సాగుకు వినియోగిస్తున్నారు. ఈ పథకానికి ప్రభుత్వం రూ.15లక్షలు కేటాయించింది. తీగజాతి కూరగాయల సాగు కోసం శాశ్వత పందిళ్ల నిర్మాణానికి యూనిట్కు రూ.50 వేల సబ్సిడీతో 30 యూనిట్ల లక్ష్యంగా నిర్ణయించారు. ●స్టేట్ బ్యాంబూ మిషన్ (ఎస్బీఎం) ప్రైవేట్ రంగంలో హై డెన్సిటీ వెదురు సాగు కోసం ఈ ఏడాది 65 ఎకరాలను లక్ష్యంగా నిర్దేశించారు. ఈ పథకం కింద రూ.9.36 లక్షలను కేటాయించారు. వెదురు రైతులకు సబ్సిడీ, సాంకేతిక మద్దతు అందిస్తారు. ●పట్టు పరిశ్రమ మల్బరీ సాగు విస్తరణ, రీయరింగ్ షెడ్ల నిర్మాణం, షూట్ ఫీడింగ్ స్టాండ్లు ఏర్పాటుకు మొత్తం 100 ఎకరాలను లక్ష్యంగా నిర్దేశించారు. ఈ పథకం అమలుకు ప్రభుత్వం ప్రస్తుత సంవత్సరానికి రూ. 112.23 లక్షలను మంజూరు చేసింది. పట్టు రైతులకు ఇది అదనపు ఆదాయ మార్గం అవుతుంది. ప్రభుత్వం నిధులు కేటాయించిన పథకాలను లబ్ధిదారుల గుర్తింపు, అమలు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన రైతులు తమ దరఖాస్తులను ఉద్యాన అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. తద్వారా అర్హుల ఎంపిక జరుగుతుంది. ఆసక్తి ఉన్న రైతులు మండలాల వారీగా పూర్తి వివరాలతో అధికారులను సంప్రదించి దరఖాస్తులు ఇవ్వొచ్చు. –ఎంవీ మధుసూదన్, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారిమండలాలు అధికారి సెల్ నంబర్ కూసుమంచి, ఖమ్మంరూరల్, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి 89777 14104 ముదిగొండ, చింతకాని, బోనకల్, మధిర, ఎరుపాలెం 89777 14113 వైరా, కొణిజర్ల, కామేపల్లి, సింగరేణి, ఏన్కూరు 89777 14105 ఖమ్మంఅర్బన్, రఘునాథపాలెం, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి 89777 14103 సత్తుపల్లి, వేంసూరు 89777 14114 -
దెందుకూరులో రైల్వే హద్దులపై సర్వే
మధిర: మండలంలోని దెందుకూరు రెవెన్యూ పరిధిలో రైల్వే లైన్ సమీపాన రైతుల భూముల్లో శుక్రవారం రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. రైల్వే అధికారులు తమ పొలాల్లోకి వచ్చి అక్రమంగా హద్దు రాళ్లు పాతుతున్నారని రైతులు ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కూడా రైల్వే కాంట్రాక్టర్లు హద్దు రాళ్లు పాతే ప్రయత్నం చేయడంతో వారు అడ్డుకున్నారు. రైల్వే, రెవెన్యూ శాఖల సంయుక్త ఆధ్వర్యాన సర్వే చేసి తమ భూముల్లో ఏర్పా టు చేసిన హద్దు రాళ్లను తొలగించడమే కాక 1965లో సేకరించిన భూములు మినహా మిగిలినవి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల సర్వేయర్ ఉషారాణి ఆధ్వర్యాన శుక్రవారం సర్వే చేశారు. అయితే, ఇటీవల సికింద్రాబాద్ డివిజన్ నుంచి విజయవాడ డివిజన్కు పరిపాలనా మార్పు జరగడంతో రైల్వే అధికారులు సర్వేకు హాజరుకాలేదు. త్వరలోనే మొత్తం సర్వే నంబర్లలో సర్వే చేయన్నుట్లు అధికారులు రైతులకు వివరించారు. రైతులు చుంచు విజయ్కుమార్, గుర్రం వెంకట్రావు, అద్దంకి భాస్కరరావు, ఐతం కృష్ణ, కోట శ్రీనివాసరావు, అద్దంకి వెంకట్రావు, ఊట్ల శంకర్ రావు, యడ్లపల్లి వెంకటేశ్వరరావు, యడ్లపల్లి రామా రావు, ఊట్ల రఘు, చావా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
గడువులోగా నిర్మాణాలు పూర్తి
ఖమ్మంరూరల్: అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో రూ.108 కోట్లతో నిర్మిస్తున్న జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టళ్ల భవనాలు, ప్రధాన భవనం, అకడమిక్ బ్లాక్ నిర్మాణాల పురోగతిపై ఆరా తీశాక అదనంగా కార్మికులను నియమించి పనులు పూర్తి చేయాలని సూచించారు. ఆతర్వాత పొన్నేకల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను కూడా కలెక్టర్ పరిశీలించి సూచనలు చేశారు. విద్యాశాఖ ఇంజనీరింగ్ అధికారి బుగ్గయ్య, తహసీల్దార్ ఎం.వినయేందర్రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
విద్యతో పాటు క్రీడలకు ప్రాముఖ్యత
కల్లూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తోందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి తెలిపారు. కల్లూరులోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో సౌకర్యాల కల్పన, అభివృద్ధి పనులను శుక్రవారం ఆయన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ప్రతీ నియోజకవర్గానికి రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇదేసమయాన క్రీడాకారులను ప్రోత్సహించేలా స్టేడియంలు, ఇతర వసతులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. తొలుత కల్లూరులోని ఏరియా ఆస్పత్రికి సందర్శించి కావాల్సిన సౌకర్యాలపై ఎంపీ, ఎమ్మెల్యే ఆరా తీశారు. కాగా, కల్లూరు స్టేడియంలో స్విమ్మింగ్పూల్, వాకింగ్ ట్రాక్ మంజూరు చేయాలని క్రీడాకారులు ఎంపీకి వినతిపత్రం అందజేశారు. డీవైఎస్ఓ సునీల్రెడ్డి, మార్కెట్ చైర్మన్ బాగం నీరజాదేవి, తహసీల్దార్ బ్రహ్మేశ్వరరావు, ఎంపీడీఓ చంద్రశేఖర్, మున్సిపల్ వైస్ చైర్మన్ కోటేశ్వరి, కమిషనర్ సాయికృష్ణారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ శేఖర్, ఎంఈఓ పి.నివేదిత, కాంగ్రెస్ నాయకులు పోట్రు అర్జున్రావు, పసుమర్తి చందర్రావు, ఎస్.కే.ఉస్మాన్, పెద్దబోయిన శ్రీనివాసరావు పాల్గొన్నారు.ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి -
కారేపల్లిలో డెంగీ కేసు నమోదు
కారేపల్లి: కారేపల్లికి చెందిన ఒకరికి డెంగీ నిర్ధారణ అయింది. మండల కేంద్రంలోని ఓ కాలనీకి చెందిన మహిళ మణుగూరులో బంధువుల ఇంటికి వెళ్లి జ్వరంతో బాధపడుతూ వారం క్రితం వచ్చింది. ఆమె ఈనెల 16న కారేపల్లి పీహెచ్సీలో పరీక్ష చేయించుకోగా డెంగీ పాజిటివ్గా నిర్ధారణ అయింది. తహసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు, ఇన్చార్జి ఎంపీడీఓ మల్లేల రవీంద్రప్రసాద్, వైద్యాధికారి బి.సురేశ్, సర్పంచ్ మేదరి టోనీవీరప్రతాప్, గ్రామ కార్యదర్శి నెహ్రూ, జీపీఓ బంఫర్ తదితరులు కాలనీకి చేరుకుని వివరాలు ఆరా తీశారు. అంతేకాక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. అందరూ ఇళ్లలోనే కాక పరిసరాల పరిశభ్రత పాటించాలని, తద్వారా సీజనల్ వ్యాధులు దరిచేరవని తెలిపారు. -
సమయపాలన తప్పనిసరి
తిరుమలాయపాలెం: వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, అలాకాకుండా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ దివాకర టీ.ఎస్. హెచ్చరించారు. తిరుమలాయపాలెం సీహెచ్సీలో ఇటీవల ఓ వృద్ధుడికి చేసిన చికిత్స వికటించిందని కుటుంబీకులు ఫిర్యాదు చేయగా, వైద్యులు సమయపాలన పాటించడం లేదని ఈనెల 17న ‘సాక్షి’తో ‘తీరు మారదా..’శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో ఆస్పత్రిని శుక్రవారం తనిఖీ చేసిన ఆయన క్యాజువాలిటీ, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ వార్డ్, ల్యాబ్, ఆపరేషన్ థియేటర్ను పరిశీలించడమే కాక మందుల నిల్వలపై ఆరా తీశారు. అలాగే, చికిత్స కోసం వచ్చిన వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలిన గాయాలతో చికిత్స కోసం వచ్చిన ఒంటరి మహిళ జయమ్మ తనను ఆదుకోవాలని కోరగా పెన్షన్, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఎంపీడీఓ సిలార్ సాహెబ్ను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలు పెంచడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, మండల కేంద్రంలో రూ.26 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల ఆస్పత్రి పనులను పరిశీలించి నాణ్యతపై సూచనలు చేశారు. డీసీహెచ్ఎస్ రాజశేఖర్గౌడ్, ఆస్పత్రి సూపరింటెండెంట్ కృపా ఉషశ్రీ, టీఎస్ఎంఐడీసీ ఈఈ ఉమామహేశ్వరరావు, తహసీల్దార్ విల్సన్, సర్పంచ్ సుజాత, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం కాకరవాయిలో జరుగుతున్న సమగ్ర భూసర్వే ఆన్లైన్, ఎస్ఐఆర్పై తహసీల్దార్ విల్సన్, డీటీ సుధీర్తో కలిసి కలెక్టర్ దివాకర సమీక్షించారు. తిరుమలాయపాలెం సీహెచ్సీలో కలెక్టర్ దివాకర -
పగలంతా తోటల్లో మకాం!
● అర్ధరాత్రి తర్వాత చోరీలకు స్కెచ్ ● సోనోవిజన్లో దొంగతనం బిహార్ ముఠా పనే?ఖమ్మంక్రైం: పోలీసులకు అనుమానం రాకుండా, ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా ఖమ్మంలోని సోనోవిజన్ షోరూంలో చోరీకి పాల్పడింది బీహార్ ముఠా అని గుర్తించినట్లు సమాచారం. ఈనెల 11వ తేదీ తెల్లవారుజామున ఖమ్మం జిల్లా కేంద్రంలోని సోనోవిజన్ షోరూమ్లో రూ.66లక్షల విలువైన సెల్ఫోన్లు, ఇతర సామగ్రిని చోరీ చేసిన నిందితులు కారులో పరారైన విషయం విదితమే. ఈ మేరకు బృందాలుగా విడిపోయి వెతుకుతున్న పోలీసులు పలు కీలక అంశాలను గుర్తించినట్లు తెలిసింది. ఒక తోటకు ఒకేసారి బిహార్ నుంచి వచ్చిన ముఠా సభ్యులు లాడ్జీలు, హోటళ్లలో ఉండకుండా తోటలను ఎంచుకున్న సమాచారం. ఈ మేరకు జిల్లాకు సరిహద్దుగా ఉన్న ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలోని మామిడి తోటలను గుర్తించి పగలంతా అక్కడే గడిపేవారని సమాచారం. ఒకరిద్దరు మాత్రమే బయటకు వెళ్లి ఎక్కడ చోరీ చేయాలో రెక్కీ నిర్వహించేవారని తెలిసింది. అయితే, ఓ రోజుకు వెళ్లిన తోటకు మరో రోజు వెళ్లకుండా ఇంకో అడ్డా ఎంచుకునేవారని సమాచారం. ఈ క్రమాన తోటల్లో కాపలా ఉండేవారిని మచ్చిక చేసుకుని, పని కోసం వచ్చిన తమకు లాడ్జీల్లో ఉండే స్థోమత లేదని నమ్మబలికేవారని తెలిసింది. అంతేకాక ఏదైనా అవసరాలకు డిజిటల్ పేమెంట్ల ద్వారా కాకుండా నగదు రూపంలో చెల్లించేవారని సమాచారం. తొలుత విజయవాడ సోనోవిజన్ షోరూంలో చోరీకి యత్నించినా సాధ్యం కాక, ఖమ్మంలోని సోనోవిజన్ షోరూం వద్ద సెక్యూరిటీ గార్డులు లేరని నిర్ధారించుకుని రంగంలోకి దిగినట్లు పోలీసులు గుర్తించారని తెలిసింది. అలాగే, ఖమ్మం వచ్చే సమయంలోనూ టోల్ గేట్ మార్గాలు కాకుండా లింక్ రహదారులను ఎంచుకుని ఏపీ నుంచి వత్సవాయి, బోనకల్ మీదుగా వచ్చినట్లు సమాచారం.ఖమ్మం జిల్లా కేంద్రం నడిబొడ్డున భారీ జరగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగింది. ఈమేరకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసు అధికారులు విచారణ కోసంప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ఈ బృందాలు తమ విచారణలో సోనోవిజన్ షోరూంలో చోరీ చేసింది బిహార్ ముఠాగా గుర్తించినట్లు తెలిసింది. సీసీ పుటేజీల్లోని వారి ముఖాల ద్వారా కూడా ప్రాథమికంగా అంచనాకు రావడంతో నిందితులను పట్టుకునేందుకు ఓ పోలీసు బృందం బీహార్ వెళ్లినట్లు సమాచారం. కాగా, చోరీకి పాల్పడింది బిహార్ ముఠాయేనన్న అనుమానంతో ‘సాక్షి’లోనూ కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. -
అర్చక, ఉద్యోగులకు మరింత సాయం
● గ్రాట్యూటీ, గృహ నిర్మాణ రుణాల శ్లాబ్లు పెంపు ● ఉపనయనం, వివాహసాయం, విద్యారుణాలు కూడా.. ఖమ్మంగాంధీచౌక్: దేవాదాయ శాఖ పరిధిలోని అర్చకులు, ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఫండ్ ట్రస్ట్ బోర్డు ద్వారా అందించే అన్ని రకాల సాయాలను పెంచుతూ కమిషనర్ ఎం.హన్మంతరావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాక రిటైర్మెంట్, మరణాంతర గ్రాట్యుటీలో కొత్త స్లాబ్లు ప్రవేశపెట్టారు. ఆలయ ఉద్యోగులు మొదలు అసిస్టెంట్ కమిషనర్ వరకు నూతన శ్లాబ్లు వర్తించనున్నాయి. ఉమ్మడి జిల్లాలో 280 మంది.. దేవాదాయ శాఖ పెంచిన సంక్షేమ సౌకర్యాలు ఉమ్మ డి జిల్లాలోని 86 ఆలయాల్లో పనిచేస్తున్న 280 మంది అర్చక, ఉద్యోగులకు వర్తిస్తాయి. ఇందులో ఉద్యోగు లు 175 మంది, అర్చకులు 105 మంది ఉన్నారు. ఈ మేరకు అర్చక, ఉద్యోగులు ఆయా పథకాల కోసం అసిస్టెంట్ కమిషనర్కు దరఖాస్తు చేసుకోవచ్చు.దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని అర్చక, ఉద్యోగుల సంక్షేమ పథకాల స్లాబ్లను ప్రభుత్వం సవరించింది. కొత్త స్లాబ్ల ప్రకారం మరింత మెరుగైన ప్రయోజనాలు అందుతాయి. అవసరమైన వారు దరఖాస్తులను ఖమ్మంలోని మా కార్యాలయంలో అందజేయాలి. –మేకల వీరస్వామి, అసిస్టెంట్ కమిషనర్, ఉమ్మడి జిల్లా -
పశువుల దొంగలు అరెస్ట్
తల్లాడ: మండలంలోని మల్లవరంలో పశువులను చోరీ చేస్తూ విక్రయిస్తున్న ముఠాను శనివారం తల్లాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ ఎన్.వెంకటకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మల్లవరం గ్రామ రైతులు పశువుల చోరీపై ఇటీవల ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఆ గ్రామానికే చెందిన కటికి శ్రీకాంత్, చౌడా పవన్, దడిపల్లి కాళేశ్వర్రావు చెడు వ్యసనాలకు బానిసై గేదెలను దొంగిలించి కొత్తగూడెం వ్యాపారికి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసి మధిర కోర్టు ఆదేశాలతో రిమాండ్కు తరలించామని, కేసులో విచారణ ఇంకా కొనసాగుతోందని ఎస్ఐ వెల్లడించారు. ఆర్టీసీ బస్సు, లారీ ఢీపలువురికి గాయాలు భద్రాచలంటౌన్: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శుక్రవారం పల్లెవెలుగు బస్సు, లారీ ఢీకొన్నాయి. లారీడ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిన ఈ ప్రమా దంలో బస్సులోని పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయి గంటపాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నాణ్యమైన వైద్యసేవలు అందించాలి
మధిర: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. మధిరలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రితో పాటు మహాప్రస్థానం, అండర్ డ్రెయినేజీ నిర్మాణ పనులను శుక్రవారం ఆమె పరిశీలించారు. తొలుత వంద పడకల ఆస్పత్రిలో తనిఖీ చేసిన అదనపు కలెక్టర్.. అందుతున్న వైద్యం, ఇతర వివరాలు ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. అనంతరం మహాప్రస్థానం, అండర్ డ్రెయినేజీ పనుల పురోగతిని పరిశీలించి నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ సామినేని సుజాత, కమిషనర్ సామ్యూల్ ఇజ్రాయిల్ బెనటిక్ పాల్, వైస్ చైర్మన్ కోనా ధనికుమార్, కౌన్సిలర్ ములకలపల్లి వినయ్కుమార్, ఉద్యోగులు పాల్గొన్నారు. ‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి ఖమ్మం సహకారనగర్: వైద్య విద్య కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘నీట్’ ఈనెల 21వ తేదీన జరగనుండగా, ఏర్పాట్లు పూర్తిచేశామని పరీక్షల సిటీ కోఆర్డినేటర్ నరేంద్రకుమార్ తెలిపారు. ఖమ్మం నగర పరిధిలో ఏడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 2,771మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని వెల్లడించారు. ఇందులో బాలికలు 2,038, బాలురు 733మంది ఉన్నారని తెలిపారు. కాగా, పరీక్ష ఆదివారం మధ్యాహ్నం 2నుంచి 5–15గంటల వరకు జరగనుండగా, అభ్యర్థులను ఉదయం 11నుంచి 1–30గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. నేడు జాతీయ లోక్ అదాలత్ ఖమ్మం లీగల్: జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి దేవీమానస తెలిపారు. ఖమ్మంలోని న్యాయ సేవాసదన్లో లోక్ అదాలత్ను జిల్లా ఇన్చార్జ్ ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ జీ.వీ.మహేష్ నాథ్ ప్రారంభిస్తారని వెల్లడించారు. కేసుల సత్వర పరిష్కారానికి వివిధ బెంచ్లను ఏర్పాటు చేయగా, కక్షిదారులు సకాలంలో హాజరు కావాలని సూచించారు. రాజీ పడదగిన సివిల్, క్రిమినల్, మోటారు ప్రమాద, చెక్ కేసులతో పాటు ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించుకునే అవకాశముందని న్యాయమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. స్వర్ణ కవచాలతో రామయ్య దర్శనంభద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణకవచాలంకరణతో దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: పాల్వంచ సమీపాన శ్రీ కనకదుర్గ (పెద్దమ్మతల్లి) అమ్మవారి ఆలయంలో శుక్రవారం అర్చకులు పంచామృతాభిషేకం నిర్వహించారు. అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేకం పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
1,650 సైలెన్సర్లు ధ్వంసం
ఖమ్మంక్రైం: రూ.లక్షలు వెచ్చించి బుల్లెట్ వాహనాలు కొనుగోలు చేస్తున్న కొందరు యువకులు, కంపెనీతో వచ్చిన సైలెన్సర్ తొలగించి పెద్ద శబ్దాలు వచ్చేవి అమరుస్తున్నారు. ఆపై రహదారులపై తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే సమాచారంతో ట్రాఫిక్ పోలీసులు కొద్దిరోజులుగా తనిఖీ చేపట్టి అలాంటి సైలెన్సర్లను తొలగించారు. ఇలా తొలగించిన 1,650 సెలెన్సర్లను సీపీ సునీల్దత్ ఆదేశాలతో శుక్రవారం హెడ్క్వార్టర్స్లో రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేయించారు. ఇలాంటి సెలెన్సర్ల శబ్దాలతో వృద్ధులు, గుండె జబ్బులు ఉన్నవారు ఇబ్బంది పడుతున్నందున తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రైవేట్ ల్యాబ్ల్లో తనిఖీవైరా: ౖవెరాలోని పలు ప్రైవేట్ ల్యాబ్లను శుక్రవారం డీఎంహెచ్ఓ రామారావు ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిచాలని, ధరల పట్టిక ప్రదర్శించాలని నిర్వాహకులకు సూచించారు. అలాగే, అర్హత కలిగిన సిబ్బందినే నియమించుకోవా లని తెలిపారు. ప్రతీ ల్యాబ్ నిర్వహణకు అను మతి లేకపోతే సీజ్ చేస్తామని వెల్లడించారు. తనిఖీల్లో మెడికల్ ఆఫీసర్ శ్రీహర్ష, ఉద్యోగులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.30లోగా జాబితాలు అందజేయాలి ఖమ్మంస్పోర్ట్స్: ఉమ్మడి జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ఎన్నికలు త్వరలో నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి జి.బాలసైదులు తెలిపారు. ఈ మేరకు మండలస్థాయిలో క్లబ్ల నిర్వాహకులు ఈ నెల 30వ తేదీలోగా జాబితాలు అందజేయాలని సూచించారు. తద్వారా వారు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. సదరమ్ పేరిట మోసం ఖమ్మంక్రైం: మానసిక దివ్యాంగుడికి సదరమ్ సర్టిఫికెట్ ఇప్పిస్తానని ఖమ్మం జనరల్ ఆస్పత్రి సెక్యూరిటీ గార్డు డబ్బు తీసుకుని మోసం చేయగా, శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఖమ్మం టూటౌన్ సీఐ బాలకృష్ణ తెలిపారు. మానసిక దివ్యాంగుడైన సాయికుమార్ చారికి ఇటీవల సదరం క్యాంప్ వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నరసింహారావు పరిచయయ్యాడు. సదరం సర్టిఫికెట్ ఇప్పిస్తానని రూ.20 వేలు అడగగా చారి తొలుత రూ.7 వేలు చెల్లించాడు. మిగతా డబ్బులు కూడా ఇవ్వాలని వేధిస్తుండడంతో సాయికుమార్ ఆస్పత్రి సూపరింటెండెంట్ నరేందర్కు, ఆయన సూచనలతో పోలీసులకు ఫిర్యాదు చేయగా నరసింహారావుపై కేసు నమోదు చేశారు. 28 టన్నుల రేషన్ బియ్యం పట్టివేతబూర్గంపాడు: ఆంధ్రప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్కు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని శుక్రవారం ఉదయం బూర్గంపాడులో పోలీసులు పట్టుకున్నా రు. ఎస్ఐ ప్రసాద్ వివరాలు వెల్లడించారు. ఏపీ లోని జగ్గయ్యపేట నుంచి ఛత్తీస్గఢ్కు తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని బూర్గంపాడు మార్కెట్యార్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు పట్టుకున్నారు. లారీలో 28 టన్నుల రేషన్ బియ్యం ఉండటంతో సీజ్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. తరలిస్తున్న మల్కన్గిరికి చెందిన లారీ ఓనర్ నవీన్కుమార్ బాత్ర, లారీడ్రైవర్ బికాస్ ఆచార్యను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. బియ్యం సరఫరా చేసిన శ్రీరంగం సత్యనారాయణపై కూడా కేసు నమోదు చేశామని, అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడని ఎస్ఐ ప్రసాద్ వివరించారు. -
చికిత్స పొందుతున్న యువకుడు మృతి
రఘునాథపాలెం: మండలంలోని కోయచలకకు చెందిన కొమ్మినబోయిన హరికృష్ణ (26) నాలుగు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాలుగు రోజుల క్రితం ఆయన తన కుమార్తెలకు జ్యూస్ తీసుకొచ్చేందుకు రఘునాథపాలెం వెళ్లాడు. తిరిగి వచ్చే క్రమాన ఓ పాఠశాల ఎదురు రోడ్డుపై పడగా, అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన వాహనం ఢీకొట్టింది. ఈ మేరకు హరికృష్ణకు ఖమ్మంలో చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించగా శుక్రవారం పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఆయనకు భార్యతో పాటు నాలుగేళ్ల లోపు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, బయటకు తీవ్రగాయాలు కాకున్నా అంతర్గత గాయాలతో హరికృష్ణ కోమాలోకి వెళ్లగా బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందినట్లు తెలిసింది. అక్రమ వడ్డీ వ్యాపారం గుట్టురట్టుఖమ్మంఅర్బన్: అధిక వడ్డీకి అప్పులు ఇస్తూ జనాన్ని మోసం చేస్తున్న ముఠాను గుర్తించి, ఒకరిని అరెస్ట్ చేసినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ తెలిపా రు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు ఖమ్మం వాసిరెడ్డి కళ్యాణ మండపం ఎదురుగా గల్లీ బజార్ ప్రాంతంలోని ఓ ఇంట్లో తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామానికి చెందిన కలెక్షన్ ఏజెంట్ కర్రి మణికంటరెడ్డి పట్టుబడ్డాడు. ఆయనను విచారించగా పలు ప్రాంతాల్లో పేదలకు అధిక వడ్డీకి సబ్బల్ల సత్యనారాయణరెడ్డి, కర్రి భామిరెడ్డి, సతి వంశీకృష్ణరెడ్డి అప్పులు ఇస్తుండగా తాను వసూలు చేస్తున్నానని బయటపెట్టాడు. దీంతో నిందితుడి నుంచి భూమారెడ్డి పేరుతో ఉన్న రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ప్రజలు అధిక వడ్డీకి రుణాలు తీసుకుని మోసపోవద్దని ఏసీపీ రమణమూర్తి ఓ ప్రకటనలో సూచించారు. సిలిండర్లు, మద్యం బాటిళ్లు స్వాధీనంసత్తుపల్లి: అనుమతి లేకుండా ఇంట్లో పెద్దసంఖ్యలో నిల్వ చేసిన గ్యాస్ సిలిండర్లు, మద్యం బాటిళ్లను సత్తుపల్లి పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని బుగ్గపాడుకు చెందిన ధూబికుంట్ల వీర రాఘవులు ఇంట్లో ఆయన సోదరి కిరాణం షాపు నడిపిస్తుండగా ఆదాయం సరిపోక ఇతర మార్గాలపై దృష్టి సారించినట్లు తెలిసింది. ఈ క్రమాన ఇటీవల గ్యాస్ సిలిండర్లకు డిమాండ్ పెరగడంతో బయట నుంచి తీసుకొచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. అంతేకాక మద్యం బాటిళ్లుకూడా విక్రయిస్తున్నారనే సమాచారంతో తనిఖీ చేయగా, 20 సిలిండర్లు, 750 మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. దీంతో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ శ్రీహరి తెలిపారు. -
విద్యార్థులకు మేలు చేసేలా సంస్కరణలు ఉండాలి
ఎర్రుపాలెం: పేద విద్యార్థులకు మేలు చేసేలా విద్యా వ్యవస్థలో సంస్కరణలు ఉండాలని పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రంగారావు పేర్కొన్నారు. సంఘం సభ్యత్వ నమోదులో భాగంగా మండలంలోని బనిగండ్లపాడు, మామునూరు, భీమవరం, రామన్నపాలెం, ఇనగాలి, మీనవోలు పాఠశాలల్లో శుక్రవారం నిర్వహించిన ఉపాధ్యాయుల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ఉండాలని, ఇందుకోసం మేధావులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల నాయకుల అభిప్రాయాలు స్వీకరించాలని సూచించారు. అంతేకాక సీపీఎస్ రద్దు, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పింఛన్ అమలుపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీఆర్టీయూ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొగ్గుల మదన్మోహన్రెడ్డి, మారపాక బాబూరావు, నాయకులు జంగా గురునాథరెడ్డి, ఆర్.బ్రహ్మారెడ్డి, శెట్టిపల్లి సంగిరెడ్డి, వెల్లంకి నాగరాజు, చిన్నప్ప, రాఘవరావు, వెంకటరమణ, నరసింహారావు, గోపిరెడ్డి, మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు. -
ముందే సర్దేశారా..
జిల్లా మార్కెట్లోకి నకిలీ విత్తనాలు? ● విస్తృత తనిఖీలతోపాటు నిఘా పటిష్టం చేసిన టాస్క్ఫోర్స్ ● అయినా వెలుగుచూస్తున్న నకిలీ, అనుమతి లేని విత్తనాలు ● అమాయక రైతులే లక్ష్యంగా అక్రమార్కుల దందాసాక్షి ప్రతినిధి, ఖమ్మం: వానాకాలం సాగు సీజన్ మొదలవుతున్న వేళ నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వచ్చేశాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలే ఎల్నినో ప్రభావంతో సేద్యంపై ఈసారి అయోమయం నెలకొంది. అయితే, గత కొన్నేళ్ల మాదిరిగా ఈసారి కూడా నకిలీ విత్తనాల జోరు రైతులను ఇబ్బందులు పెడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ పక్క వ్యవసాయ, పోలీసు శాఖలతో కూడిన టాస్క్ఫోర్స్ బృందాలు విత్తన దుకాణాల్లో ముమ్మర తనిఖీలు చేస్తుండమే కాక పటిష్ట నిఘా ఏర్పాటు చేశాయి. అయితే, అక్రమార్కులు ముందుగానే జిల్లాలోని పలు గ్రామీణ ప్రాంతాలకు నకిలీ విత్తనాలను చేర్చారనే ప్రచారం జరుగుతోంది. ముమ్మరంగా తనిఖీలు జిల్లాలో పత్తి, మిర్చి సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈమేరకు ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా వ్యవసాయ, పోలీస్ శాఖలు విత్తన దుకాణాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నాయి. మండల కేంద్రాల్లో షాపుల్లో తనిఖీ చేయడమే కాక నకిలీ విత్తనాలు అమ్మితే తీసుకునే చర్యలపై వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాక రైతులు కూడా గ్రామాలకు వచ్చే వారి నుంచి కాకుండా డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. అయినా ఆగడం లేదు... అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలు ఆగడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం పత్తి, మిర్చి విత్తనాల కొనుగోలుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇదే అదనుగా కొందరు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లు తెలిసింది. తక్కువ ధరకే వస్తాయని, అధిక దిగుబడులు ఖాయమని నమ్మించి ఆకర్షణీయమైన ప్యాకెట్లలో కొందరు, లూజ్ విత్తనాలను ఇంకొందరు అమ్ముతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల కొన్నిచోట్ల నకిలీ విత్తనాలను విక్రయిస్తున్న వ్యక్తులను టాస్క్ఫోర్స్ బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. తాజాగా గురువారం కూడా కామేపల్లి మండలం మద్దులపల్లిలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ఏటూరుకు చెందిన ఉప్పుటూరి వెంకటప్పారావు, మద్దులపల్లికి చెందిన జాలె శ్రీనుయాదవ్ అనుమతి లేని మిరప విత్తనాలు అమ్ముతూ పట్టుబడ్డారు. అప్రమత్తతే ఆయుధం నకిలీ విత్తనాల బారిన పడకుండా ఉండేందుకు రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు ఆలస్యమవుతున్నాయి. పదును రాకముందే విత్తనాలు నాటి, ఆతర్వాత వర్షాలు కురవకపోతే భూమిలోనే చనిపోయే ప్రమాదం ఉంది. ఇక నకిలీ విత్తనాలు నాటితే వర్షాలు కురిసినా ఫలితం ఉండదు. వీటిని పరిగణనలోకి తీసుకుని రైతులు విత్తనాల ఎంపిక, కొనుగోలులో అప్రమత్తంగా ఉండకపోతే ఇబ్బందులు తప్పవని అధికారులు చెబుతున్నారు. పాకెట్ల సీల్ పరిశీలించడంతో పాటు కంపెనీ పేరు, చిరునామా, లాట్ నెంబర్, మొలక శాతం, గడువు తేదీతో కూడిన బిల్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాకాకుండా తక్కువ ధరకు వస్తున్నాయని, తెలిసిన వారు చెప్పారని విత్తనాలను కొనుగోలు చేయకపోవడమే మంచిదని చెబుతున్నారు.ఏపీకి సరిహద్దుగా జిల్లాలోని పలు ప్రాంతాలు ఉండడంతో అక్కడి నుంచే నకిలీ విత్తనాలు దిగుమతి అవుతున్నాయని తెలుస్తోంది. గతంలోనూ ఆంధ్రాలో తయారు చేసిన విత్తనాలను వైరా తదితర ప్రాంతాల్లో ఏజెంట్ల ద్వారా విక్రయించిన వారు పట్టుబడ్డారు. ఇప్పుడు అదే తరహాలో దళారులు, ఏజెంట్లను నియమించుకుని వారి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులే లక్ష్యంగా విక్రయిస్తున్నట్లు సమాచారం. అంతేకాక అనుమానం రాకుండా ఉండేందుకు ప్రముఖ కంపెనీలను పోలిన పేర్లు, లోగోలతో ప్యాకెట్లు ముద్రించి అంటగడుతున్నట్లు తెలిసింది. -
ఆశయం ‘ఆవిరి’ అయిపోయింది!
● గిరిజన వసతిగృహాల్లో మూలనపడిన ‘స్టీమ్ కుకింగ్’ వ్యవస్థ ● నిర్వహణ లేక, గ్యాస్ మంట సరిపోక పక్కకు.. ● వంద లోపు విద్యార్థులు ఉంటే కష్టమంటున్న సిబ్బంది ఖమ్మంమయూరిసెంటర్: గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు తక్కువ సమయాన, నాణ్యమైన భోజనం అందించేందుకు 2016లో సరఫరా చేసిన ఆవిరి వంట పాత్రలు (స్టీమ్ కుకింగ్ సిస్టమ్స్) ఖమ్మం జిల్లాలో పూర్తిగా మూలనపడ్డాయి. అప్పట్లో రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ఆధునిక వంట సామాగ్రి ప్రస్తుతం వంటగదుల మూలన మగ్గుతోంది. ఇందుకు అధికారుల నిర్లక్ష్యంతో పాటు అనాలోచిత నిర్ణయాలు, సాంకేతిక లోపాలు కూడా ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. నిర్వహణ లేక.. ప్రభుత్వ వసతిగృహాల్లో ఏర్పాటు చేసే ఆర్వో వాటర్ ప్లాంట్లకు ఆరు నెలలకోసారి అవసరమైన నిర్వహణ, మరమ్మతు చేయిస్తారు. కానీ రూ.లక్షల విలువైన స్టీమ్ కుకింగ్ పాత్రలకు అధికారులు ఎలాంటి నిర్వహణ చేపట్టలేదు. దీంతో పైపులైన్లు లీకై నా, చిన్నపాటి సాంకేతిక లోపాలు తలెత్తినా స్థానికంగా మరమ్మతు చేయించే వారు కరువయ్యాడు. ప్రారంభంలో కొన్ని రోజులు వాడినా.. ఆ తర్వాత చిన్న మరమ్మతులను సాకుగా చూపిస్తూ పక్కన పడేశారు. మంట సరిపోవడం లేదని... ఆవిరి యంత్రాల పనితీరుపై వసతిగృహ సంక్షేమ అధికారులు, వంట సిబ్బంది చెబుతున్న అంశాలు విస్తుగొలుపుతున్నాయి. ఈ పాత్రల ద్వారా అన్నం, పప్పు ఉడకాలంటే గ్యాస్ స్టౌలతో వచ్చే మంట ఏ మాత్రం సరిపోవడం లేదని, కట్టెల మొద్దులు పెట్టి భారీగా మంట వేస్తేనే ఇవి ఆవిరిని అందుకోగలవని చెబుతుండడం గమనార్హం. కానీ కాలుష్య నియంత్రణలో భాగంగా వసతిగృహాల్లో కట్టెల వాడకాన్ని నిషేధించారు. ఇక గ్యాస్ సిలిండర్ల మంట సరిపోవడం లేదని ఆధునిక పాత్రలను పక్కన పెట్టడం విమర్శలకు తావిస్తోంది. విద్యార్థుల సంఖ్య తగ్గిందంటూ.. ఈ ఆవిరి పాత్రల వ్యవస్థను అప్పట్లో 250 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న పెద్ద హాస్టళ్లలో సమకూర్చారు. కానీ కాలక్రమేణా జిల్లాలోని గిరిజన హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని చెబుతున్నారు. ఖమ్మం నగరంలో తప్ప జిల్లాలో ఎక్కడా 150 మందికి మించి సంఖ్య లేకపోవడంతో ఈ పాత్రల వంట చేయలేమని చేతులెత్తేశారు. తక్కువ మందికి ఈ భారీ ఆవిరి పాత్రల్లో వండటం సాధ్యం కాక పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా జిల్లా కేంద్రంలో 200 – 300 మంది విద్యార్థులు ఉన్న వసతిగృహాల్లోనూ పక్కన పడవేయడంతో తుప్పుపట్టి నిరుపయోగంగా మారాయి. -
అథ్లెట్లను అభినందించిన కలెక్టర్
ఖమ్మంస్పోర్ట్స్: హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 11, 12వ తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ అథ్లెటిక్స్ మీట్లో జిల్లా క్రీడాకారులు 14 పతకాలు సాధించారు. ఇందులో ఆరు బంగారు, ఐదు రజత, మూడు కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ సందర్భంగా క్రీడాకారులు కె.మస్తాన్, డి.వివేక్చంద్ర, జి.వెంకట్సాయి, ఎస్కే మజీద్, బి.ప్రసన్న, బి.లోకేశ్, ఎండీ.అబ్దుల్ రజాక్, బి.బన్సీలాల్, ఎ.మైథిలి, బి.బిందు, దేవిప్రసాద్ను కలెక్టర్ దివాకర శుక్రవారం అభినందించారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, అథ్లెటిక్స్ అకాడమీ చీఫ్ కోచ్ ఎండీ.గౌస్ తదితరులు పాల్గొన్నారు. డిజిటల్ లెర్నింగ్ తరగతులు ప్రారంభం సత్తుపల్లిటౌన్: సత్తుపల్లిలోని జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజుల పాటు జరిగే ‘అన్న అక్క’ మెంటార్షిప్ డిజిటల్ లెర్నింగ్ శిక్షణా తరగతులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.గోపి ఆధ్వర్యాన శిక్షణ ఏర్పాటు చేయగా, కొత్తగూడెం పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు హరిత పలు అంశాలపై అవగాహన కల్పించారు. వైస్ ప్రిన్సిపాల్ పీర్ సాహెబ్, నోడల్ టీచర్లు వీరారెడ్డి, సుభాషిణి, చెన్నారావు, విద్యార్థులు పాల్గొన్నారు. అత్యాధునిక విధానాల్లో వైద్యం ఖమ్మం మామిళ్లగూడెం: శ్వాసకోశ లేదా గుండె వైఫల్యంతో బాధపడుతున్న వారికి సోమాజిగూడ యశోద ఆస్పత్రుల్లో అత్యాధునిక విధానాల్లో చికిత్స చేస్తున్నట్లు క్రిటికల్ కేర్ సీనియర్ డాక్టర్ వై.సూర్య ప్రకాష్ తెలిపారు. ఖమ్మంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ఎక్స్ట్రా కార్పొరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ఎక్మో) ద్వారా చికిత్స చేశామని చెప్పారు. సాధారణ చికిత్స సరిపోని పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేందుకు ఎక్మో కీలకంగా నిలుస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో శ్రీధర్రావు, పరమేశ్, నాగార్జున, బాలకృష్ణ పాల్గొన్నారు. ‘సింగరేణి కార్మికులారా జాగ్రత్త’ రుద్రంపూర్: గతంలో సింగరేణి నిధులు దోపిడీ చేసిన వారే మళ్లీ ఇతర రూపాల్లో వస్తున్నందున కార్మికులు అప్రమత్తంగా ఉండాలని బీఎంఎస్ జాతీయ నాయకుడు పి.మాధవనాయక్ సూచించారు. కొత్తగూడెంలోని కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి నియామకాల్లో అక్రమాలకు పాల్పడి గనులు దక్కకుండా అడ్డుపడ్డ వారు మళ్లీ మాయమాటలతో వస్తున్నందున కార్మికులు జాగ్రత్త వహించాలని కోరారు. కాగా, 11వ వేజ్బోర్డ్ కాలపరిమితి ముగియనున్నందున 12వ వేజ్బోర్డ్ జేబీసీసీ కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. నాయకులు మోహన్, శ్రీనివాస్, అశోక్, బాలకృష్ణ, నరేష్, ఉదయ్, చంద్రశేఖర్, భీమా, వడ్డీకాసు, ఆత్రేయ, సుధాకర్, రాజేష్, చందర్, రాజమౌళి, నాగేశ్వరరావు, శేఖర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాతల అన్వేషణ!
శుక్రవారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2026అన్ని పోలింగ్ బూత్ల్లో బీఎల్ఓలు ఏన్కూరు: ప్రత్యేక ఓటరు సవరణ(ఎస్ఐఆర్)లో భాగంగా ప్రతీ పోలీంగ్ బూత్ వద్ద బీఎల్ఓలు అందుబాటులో ఉండాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. ఏన్కూరు రైతువేదికలో సర్పంచ్లు, బీఎల్ఓ, బీఎల్ఏలకు గురువారం ఏర్పాటుచేసిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల 25వ తేదీ నుంచి ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి మ్యాపింగ్ కాని వారి నుంచి ధ్రువపత్రాలు సేకరించాలని తెలిపారు. అంతేకాక మృతి చెందిన వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాలు నమోదు చేయాలని పేర్కొన్నారు. ఇందుకోసం సర్పంచ్లు, పార్టీల బీఎల్ఏలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సీహెచ్.శేషగిరిరావు, ఎంపీడీఓ పల్లి భాగ్యశ్రీ పాల్గొన్నారు. కాగా, మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థుల కోసం వసతిగృహం ఏర్పాటుచేసినా మరమ్మతులు, సౌకర్యాల కల్పన పూర్తికాలేదని ప్రిన్సిపాల్ ఎం.సింహాచలం, అధ్యాపకులు సాంబశివరావు, కృష్ణార్జునరావు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సంబంధిత అధికారులతో మాట్లాడతానని ఆమె తెలిపారు.సిఫారసు చేసిన విత్తనాలు అందుబాటులో ఉంచాలి ఖమ్మంవ్యవసాయం: రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన వరి సన్న రకాల విత్తనాలను అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయాధికారి(డీఏఓ) డీలర్లకు సూచించారు. ఖమ్మంలో పలు దుకాణాల్లో టాస్క్ఫోర్స్ బృందాలు తనిఖీ చేశాయి. ఈ సందర్బంగా వరి, పత్తి విత్తన నిల్వలు, రికార్డులను పరిశీలించాక డీఏఓ మాట్లాడారు. ప్రభుత్వం సిఫారసు చేస్తున్న బీపీటీ–5204, ఆర్ఎన్ఆర్–15048, డబ్ల్యూజీఎల్–44, జై శ్రీరాం, కూనారం సన్నాలు 1638 వంటి రకాలను అందుబాటులో ఉంచాలన్నారు. కాగా, రైతులు కూడా అరకొర వర్షాలకు కాకుండా సరైన పదును వచ్చాకే విత్తనాలు నాటాలని సూచించారు. ఖమ్మం అర్బన్ ఏఓ బి.కిషోర్బాబు, ఖమ్మం త్రీటౌన్ ఎస్సై సురేష్ పాల్గొన్నారు. అలాగే, ప్రభుత్వం వరిలో ఆరు సన్న రకాల సాగుపై నిర్ణయం తీసుకున్న నేపథ్యాన డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులతో డీఏఓ సమావేశమై సూచనలు చేశారు. ఏడీఏ వాసవీరాణి, ఏఓ కిషోర్బాబు, డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులు ఆర్.మనోహర్రావు, పుల్లఖండం నాగేందర్, ప్రభాకర్చౌదరి, ఎం. పురుషోత్తం, కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు. చింతకానిలో అత్యధిక వర్షపాతం ఖమ్మంవ్యవసాయం: జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈమేరకు చింతకాని మండలంలో అత్యధికంగా 8.64 సెం.మీల వర్షపాతం నమోదైంది. అలాగే, ముదిగొండ మండలంలో 4.94, బోనకల్ మండలంలో 3.82, ఖమ్మం రూరల్ మండలంలో 2.88, కల్లూరు మండలంలో 2.04, ఖమ్మం అర్బన్ మండలంలో 1.64, వైరా మండలంలో 1.42, నేలకొండపల్లి మండలంలో 1.36, తిరుమలాయపాలెం, కొణిజర్ల మండలాల్లో 1.34, పెనుబల్లి మండలంలో 1.02 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, తల్లాడ, మధిర, ఏన్కూరు, కామేపల్లి, రఘునాథపాలెం మండలాల్లోనూ వర్షప్రభావం కనిపించింది. మరో పక్క కారేపల్లి, సత్తుపల్లి, వేంసూరు, ఎర్రుపాలెం మండలాల్లో మాత్రం వర్షం జాడ లేకపోవడంతో ప్రజలు, రైతులు ఎదురుచూస్తున్నారు. ‘నీట్’ కేంద్రాల వద్ద బందోబస్తు ఖమ్మంక్రైం: ఈనెల 21న ‘నీట్’ జరిగే కేంద్రాల వద్ద మధ్యాహ్నం 12నుంచి రాత్రి 7–15 గంటల వరకు ఆంక్షలు, బందోబస్తు అమల్లో ఉంటాయని పోలీసు కమిషనర్ సునీల్దత్ తెలిపారు. ఈనేపథ్యాన కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపుగా ఉండొద్దని సూచించారు. అలాగే, సభలు, ర్యాలీలు, డీజేలతో ఉరేగింపులు, ధర్నాలకు అనుమతి ఉండదని తెలిపారు. అంతేకాక పరిసరాల్లోని ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని స్పష్టం చేశారు. కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటుచేయడంతో పాటు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూస్తామని తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సీపీ ఓ ప్రకటనలో హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన సన్న వరి విత్తనాలు లభించడం లేదు. మేం బీపీటీ–5204 రకమే ఏటా సాగు చేస్తాం. ఈ ఏడాది మరో రకం వేద్దామని నిర్ణయించా. సిద్ది, కూనారం రకాల కోసం వెళ్తే లేవంటున్నారు. ఇంకొందరు ధర పెంచారు. ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తుందని చూస్తున్నాం. – నాగండ్ల వెంకటేశ్వర్లు, ఎదళ్లచెరువుప్రభుత్వ ప్రకటన నేపథ్యాన సన్న రకాల లభ్యతపై ఆరా తీస్తున్నాం. కంపెనీల డీలర్లతో సమావేశమై అవసరాల మేరకు విత్తనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశిస్తున్నాం. రైతులకు కావాల్సిన మేర విత్తనాలు అందుబాటులో తీసుకొస్తాం. ఎవరైనా ధరలు పెంచితే చర్యలు తప్పవు. – ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారిఖమ్మంవ్యవసాయం: ప్రభుత్వం ప్రస్తుత వానాకాలంలో ఏడు వరి సన్న రకాలకు బోనస్ ప్రకటించింది. ఈ రకాలు సాగుచేస్తే క్వింటాకు ప్రభుత్వ మద్దతు ధర రూ.2,461తో పాటు రూ. 500 బోనస్ కూడా ఈ రకాలకే పరిమితం చేసింది. జిల్లాలో ఏటా వరి ప్రధాన పంటగా కొనసాగుతోంది. ఈ సీజన్లోనూ 3,20,301 ఎకరాల్లో రైతులు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఎకరానికి 25 కిలోల చొప్పున 8వేల టన్నుల వరకు విత్తనాలు అవసరమవుతాయి. కొందరు రైతులు గత సీజన్లో తాము పండించిన పంట నుంచే విత్తనాలు వినియోగించుకుంటారు. మిగతా వారు ప్రభుత్వం ప్రకటించిన రకాల కొనుగోలుకు విత్తనాభివృద్ది సంస్థతో పాటు ప్రైవేట్ డీలర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే, ఆయా రకాలు సరిపడా లభ్యత లేక ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. తెగుళ్లు, కాలపరిమితి ఆధారంగా.. ప్రభుత్వం ప్రకటించిన వరి విత్తనాల్లో తమ భూములకు అనువైనవి ఎంపిక చేసుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. అంతేకాక తెగుళ్లను తట్టుకునే రకాలు, నీటి వనరుల ఆధారంగా కాల పరిమితిని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. అయితే, సన్న రకం అనగానే తొలుత బీపీటీ– 5204 గుర్తుకొస్తుంది. ఈ రకాన్ని రైతులు అనేక ఏళ్లుగా సాగు చేస్తున్నారు. ఇటీవల మరికొన్ని రకాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అన్నీ అరకొరగానే... ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల వద్ద లభ్యత తక్కువగా ఉన్న వరి సన్న రకాల విత్తనాలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రభుత్వం ప్రకటించిన ఏడు రకాలకు గాను జిల్లాలో బీపీటీ–5204 రకం విత్తనాలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. హెచ్ఎంటీ సోనా, ఆర్ఎన్ఆర్–15048, జై శ్రీరాం, కేఎన్ఎం–1638 రకాలు అరకొరగా లభిస్తున్నాయి. ఇక డబ్ల్యూజీఎల్–44(సిద్ది), కేఎన్ఎం–7715 రకాల లభ్యత లేదు. ఇదే అదునుగా... ప్రభుత్వం ప్రకటించిన సన్న వరి రకాల్లో లభ్యత తక్కువగా ఉండి, డిమాండ్ ఉన్న వాటి ధరలకు రెక్కలొచ్చాయి. డిమాండ్ దృష్ట్యా ప్రైవేట్ మార్కెట్లో డీలర్లు విత్తనాల ధర పెంచి విక్రయిస్తున్నారు. సాధారణంగా వరి సన్న రకాల 25 కిలోల విత్తన సంచి ధర రూ.1,020 నుంచి రూ.1,030 వరకు ఉంటుంది. ప్రస్తుతం లభ్యత తక్కువగా ఉన్న రకాలను వ్యాపారులు రూ.1,200 నుంచి రూ.1,300 వరకు విక్రయిస్తున్నారు. ఇంకొందరు మరింత డిమాండ్ పెరుగుతుందని, ఇంకా ధర పెంచొచ్చనే భావనలో బ్లాక్ చేస్తున్నట్లు సమాచారం. ఈక్రమాన రైతులు మాత్రం దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. బాల పురస్కార్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం ఖమ్మంమయూరిసెంటర్: ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం అర్హులైన బాలబాలికలు, స్వచ్ఛంద సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ఏ.ప్రమీల తెలిపారు. నూతన ఆవిష్కరణలు, అసాధారణ ప్రతిభ, క్రీడలు, కళలు, సాహిత్యం, సామాజిక సేవ, ధైర్యసాహసాలు రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులు అందజేస్తారని పేర్కొన్నారు. ఈ ఏడాది జూలై 31నాటికి 5నుంచి 18ఏళ్ల లోపు వయస్సు కలిగిన బాలబాలికలు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపారు. అలాగే, ఏడేళ్ల పైబడి బాలబాలికల సంక్షేమం, ప్రగతి కోసం కృషి చేస్తూ, వారి జీవితాల్లో మార్పు తీసుకువచ్చిన సంస్థలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు https:// awards.gov.in వెబ్సైట్ ద్వారా జూలై 31లోగా దరఖాస్తు చేసుకుని, ఆ కాపీలను కలెక్టరేట్లోని తమ కారాలయంలో అందజేయాలని డీడబ్ల్యూఓ ఓ ప్రకటనలో సూచించారు.నేలకొండపల్లి: రాష్ట్రంలో రూ.750 కోట్ల నిధులతో నూతనంగా గోదాంల నిర్మాణాలు చేపడుతున్నామని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తెలిపారు. నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్లో గోదాంలను తనిఖీ చేసిన ఆయన రికార్డుల ఆధారంగా స్టాక్ను పరిశీలించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 50 కేంద్రాల్లో 7.50 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన గోదాంలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. మరో 25 కేంద్రాల్లో 2.50.లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన గోదాంలకు ప్రతిపాదించినట్లు చెప్పారు. అలాగే, హైదరాబాద్లో ప్రముఖ ఈ–కామర్స్ కంపెనీల కోసం రూ.70 కోట్లతో 23 ఎకరాల్లో గోదాంలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని వెంకటాయపాలెంలో మిర్చి కోల్డ్ స్టోరేజీ నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని వెల్లడించారు. గోదాంలు అందుబాటులోకి వస్తే రైతులు పండించిన పంటల నిల్వ లకు ఇబ్బంది ఉండదని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో జరిగిన రైతు అవగాహన సదస్సులో నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పథకాలు అమలుచేస్తోందని చెప్పారు. అయితే, రైతులు సంప్రదాయ పంటలకు బదులు పంట మార్పిడితో ప్రయోజనాలు పొందాలని సూచించారు. సదస్సులో డీఏఓ డి.పుల్లయ్య, ఆత్మ పీడీ బి.సరిత, ఏడీఏ సతీష్ ప్రతినిధులు పాల్గొన్నారు. ●బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరు హాస్యాస్పదంగా ఉందని రాయల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధిని ఓర్వలేక మంత్రులు మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. అభివృద్ధిని గుర్తించకుండా తప్పుడు ఆరోపణలు చేస్తే గుణపాఠం చెబుతామని పేర్కొన్నారు. మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, నాయకులు శాఖమూరి రమేష్, బచ్చలకూరి నాగరాజు, కొడాలి గోవిందరావు, జెర్రిపోతుల అంజిని, నల్లాని మల్లికార్జున్రావు, బొందయ్య, భద్రయ్య, కడియాల నరేష్ పాల్గొన్నారు.గోదాంలో బియ్యాన్ని పరిశీలిస్తున్న చైర్మన్ నాగేశ్వరరావుబీపీటీ – 5204 (సాంబమసూరి) ఆర్ఎన్ఆర్ – 15048 హెచ్ఎంటీ సోనా జై శ్రీరాం కేఎన్ఎం–1638 (కూనారం సన్నాలు) డబ్ల్యూజీఎల్–44 (సిద్ది) కేఎన్ఎం–7715 (కొత్త సన్నరకం)ఏడు రకాల వరికి బోనస్ ప్రకటించిన ప్రభుత్వం -
అన్నం ఫౌండేషన్లో ఆధార్ నమోదు
ఖమ్మంసహకారనగర్: నిరాశ్రయులు, అనాథలు, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆశ్రయం కల్పిస్తున్న ఖమ్మంలోని అన్నం సేవా ఫౌండేషన్లో గురువారం ప్రత్యేక ఆధార్ నమోదు శిబిరం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి పి.దేవీమానస ఇటీవల ఫౌండేషన్ను పరిశీలించిన సందర్భంగా ఆశ్రయం పొందుతున్న పలువురికి గుర్తింపు పత్రాలు లేకపోవడం వల్ల సంక్షేమ సేవలు, ఇతర ప్రయోజనాలు అందడం లేదని గుర్తించారు. అంతేకాక మానసిక స్థితి సరిగ్గా లేని వారి గుర్తింపు కష్టమవుతోందని భావించారు. ఈమేరకు జిల్లా యంత్రాంగం సహకారంతో ప్రత్యేక ఆధార్ శిబిరం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పి.దేవీమానస మాట్లాడుతూ గుర్తింపు పత్రం అనేది సంక్షేమ సేవలు, న్యాయ పరిరక్షణలో కీలకంగా నిలుస్తుందని తెలిపారు. ఆధార్ నమోదు పూర్తయ్యాక సేవలు, సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
అసలేం జరుగుతోంది..?
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి కొత్త ప్రణాళికను ప్రభుత్వం బయటకు వెల్లడించడటం లేదు. కేవలం ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ఆర్కిటెక్ట్, ఇతర ఉన్నతాధికారులకు తప్ప భక్తులకు ప్లాన్ గురించి తెలియదు. ఈ ఏడాది మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభానికి ముందు చేపట్టిన అభివృద్ధి పనులపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. కాళేశ్వరం ఆలయానికి సైతం ఇదే రీతిన మాస్టర్ ప్లాన్ను ప్రకటించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించింది. ఏళ్ల తర్వాత ఆమోదించిన భద్రాచలం మాస్టర్ ప్లాన్ను మాత్రం బహిర్గతం చేయడంలేదు. ఎట్టకేలకు మూడు విడతల్లో రూ. 351 కోట్లతో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినా.. కేవలం పగలు, రాత్రి వేళల్లో అభివృద్ధి అనంతరం ఆలయ నమూనాల విడుదల తప్ప ఎలాంటి అభివృద్ధి పనులు చేపడతారో ఇంతవరకు భక్తులకు, ప్రజలకు తెలియదు. నూతన ఆలయాలు, ఇతర వసతుల కల్పనపై స్పష్టత లేదు. అసలేమి పనులు చేపట్టనున్నారో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొంది. మూడు నెలలైనా ముందుకు సాగని పనులు రామాలయ అభివృద్ధి బాలరిష్టాలను దాటి ముందుకెళ్లలేకపోతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అదిగో..ఇదిగో రూ. 100 కోట్ల అభివృద్ధి అంటూ పదేళ్లపాటు కాలయాపన చేసింది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లు జాప్యం చేసింది. గత మార్చి చివరలో రూ.351 కోట్లతో ఆలయ అభివృద్ధి ప్రణాళిక ప్రకటించింది. మే 1 నాటికి టెండర్ పూర్తి చేయాలని, శిథిలాలు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలలు గడిచినా టెండర్ ఖరారు చేయలేదు. భవనాల శిథిలాల తొలగింపు పూర్తి కాలేదు. వర్షాకాలం వచ్చేసింది. దీంతో మరో మూడు నెలలు పనులు చేపట్టే పరిస్థితి ఉండదు. అప్పటికే ఆరు నెలలు ముగిసిపోనుండగా, అనంతరం మరో ఆరు నెలలకు గోదావరి పుష్కరాలు వస్తాయి. మధ్యలో ముక్కోటి ఏకాదశి, శ్రీరామనవమి వేడుకలు జరగనున్నాయి. వీటిన్నంటి మధ్య అధికారులు అభివృద్ధి పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికై నా ప్రభుత్వం భద్రాచలం రామాలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్పై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని, పనులను త్వరగా పూర్తయ్యేలా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని భక్తులు కోరుతున్నారు. మాస్టర్ప్లాన్లో లెక్కా పత్రం లేకుండా మార్పులు జరుగుతున్నాయి. తొలి ఫేస్లో గోదావరి ఒడ్డున రూ.75కోట్లతో గోదావరి ఘాట్లు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్కు సుదర్శన చక్ర స్నాన తీర్థంగా పేరు పెట్టారు. ఆ తర్వాత మంత్రుల సలహాలు, సూచనలతో పూర్తిగా సుదర్శన చక్రం నిర్మాణామే తొలగించారు. తొలుత రూ.75 కోట్లను ప్రకటించగా, అనంతరం రూ.46 కోట్లకు కుదించారు. తొలత ప్రతిపాదించిన ప్లాన్లోని టాయిలెట్ బ్లాక్, కల్యాణ కట్ట, పిండ ప్రధాన మండపాన్ని పూర్తిగా తొలగించారు. ఇక్కడి రూ.29 కోట్లను ఆలయ కాంప్లెక్స్ విస్తరణ పనులకు మళ్లించారు. దీంతో ప్రభుత్వం ప్రకటించిన ప్లాన్లో మార్పులు చోటుచేసుకున్నాయి. మాస్టర్ప్లాన్ను బయటకు వెల్లడించని రాష్ట్ర ప్రభుత్వం -
రెక్కీ నిర్వహించి.. రూ.లక్ష కొట్టేశారు..
నేలకొండపల్లి: వ్యవసాయ పనుల నిమిత్తం బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్న ఓ రైతును వెంబడించిన దుండగులు ఆయన నుంచి రూ.లక్ష నగదు తస్కరించారు. నేలకొండపల్లి మండలం బైరవునిపల్లికి చెందిన కాసాని తిరపయ్య వ్యవసాయం పెట్టుబడుల కోసం ఓ బ్యాంక్లో బంగారం తాకట్టు పెట్టి ఇటీవల రూ.లక్ష రుణం తీసుకున్నారు. విత్తనాల కొనుగోలుకు గురువారం రూ.లక్ష డ్రా చేయగా, ఆయనను వెన్నంటి గమనిస్తున్న దుండగులు కిరాణం షాప్ వద్ద రైతు నగదు ఉన్న సంచిని మోపెడ్కు తగిలించి వెళ్లడంతో కొట్టేశారు. తిరిగి వచ్చే సరికి రైతు బ్యాగ్ లేదని గుర్తించి బోరున విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సమీపంలోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.కిరాణం షాప్ వద్ద రైతు నుంచి బ్యాగ్ చోరీ -
సొరంగం పనులు మళ్లీ మొదలు..
‘సీతారామ’ కాల్వకు మోక్షం ● నెలల తర్వాత తవ్వకం ప్రారంభం ● ఏకకాలంలో నీటి తొలగింపు, సొరంగం తవ్వకంతిరుమలాయపాలెం: సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా తిరుమలాయపాలెం మండలంలోని దమ్మాయిగూడెం నుంచి పోచారం వరకు ఎనిమిది కి.మీ. మేర చేపట్టాల్సిన సొరంగ మార్గం పనులు మళ్లీ మొదలయ్యాయి. గతంలో 4.1 కి.మీ. సొరంగ మార్గం తవ్వాక గత ఏడాది కురిసిన భారీ వర్షాలు, భూగర్భ జలాలు ఉబికిరావడంతో దమ్మాయిగూడెంలో వద్ద టన్నెల్ మొత్తం నీటితో నిండిపోయింది. ఈ విషయం తెలుసుకున్న అప్పటి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గత ఏడాది అక్టోబర్లో దమ్మాయిగూడెం వద్ద టన్నెల్ను పరిశీలించారు. అయితే, ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టు నిర్మాణ సంస్థ కొద్దినెలలుగా పనులను నిలిపివేసింది. మళ్లీ ఇప్పుడు రూ.32కోట్ల నిధులు విడుదల చేయడంతో కూసుమంచి మండలం పోచారం వైపు నుంచి సొరంగం తొలిచే పనులు మొదలుపెట్టారు. టన్నెల్లోని బండరాళ్లను బ్లాస్ట్ చేసేందుకు భారీ యంత్రాన్ని సమకూర్చుకున్నారు. ఇదే సమయాన టన్నెల్లో నిలిచిన నీటిని బయటకు పంపేందుకు భారీ మోటార్లు కూడా ఏర్పాటుచేశారు. ఇప్పటికే 4.1 కి.మీ. మేర సొరంగ మార్గం పూర్తి కాగా ఇంకా 3.9 కి.మీ. మేర నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తిచేయనున్నట్లు జల వనరుల శాఖ డీఈ బాణాల రమేష్రెడ్డి తెలిపారు. -
విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్పై సమీక్ష
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యాన ఓటర్లలో అపోహలు తొలగించడంతో పాటు విస్తృత అవగాహన కల్పించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఈమేరకు జిల్లావ్యాప్తంగా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేయడమే కాక కరపత్రాలను పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి సామగ్రి కలెక్టరేట్కు చేరగా, మండలాలకు తరలించేందుకు సిద్ధమవుతున్నారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్ఖమ్మంవ్యవసాయం: ప్రైవేట్ విద్యాసంస్థల ప్రాంగణాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ అంశంపై గురువారం ఖమ్మం ఎస్ఈ శ్రీనివాసాచారి సమీక్షించారు. ఈమేరకు ఖమ్మంలో అధికారులతో సమావేశమైన ఆయన ప్రభుత్వ విద్యాసంస్థలు కొనసాగుతున్న భవనాల సర్వీసులను గుర్తించి నివేదిక ఇవ్వాలని సూచించారు. తద్వారా ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి ముజాహిద్, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. విద్యుత్ లైన్ల పునరుద్ధరణ ఈదురుగాలులు, అకాల వర్షంతో దెబ్బతిన్న విద్యుత్ లైన్లను మరమ్మతు చేసి సరఫరా పునరుద్ధరించినట్లు ఎస్ఐ శ్రీనివాసాచారి తెలిపారు. కలెక్టర్ దివాకర ఆదేశాలతో పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టామని పేర్కొన్నారు. ఇంకొన్ని చోట్ల ప్రత్యామ్నాయ లైన్ల ద్వారా సరఫరా చేసినట్లు వెల్లడించారు. -
విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా..
● కిన్నెరసాని పర్యాటక కేంద్రాన్ని తీర్చిదిద్దుతాం ● ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్వంచరూరల్: విదేశీ పర్యాటకులు వచ్చేలా కిన్నెరసానిని తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పాల్వంచ మండలం కిన్నెరసానిలో వైల్డ్లైఫ్ శాఖ బయోసాట్ నిధులు రూ.45 లక్షలతో కొనుగోలు చేసిన జంగల్ సఫారీ టూర్ మూడు వాహనాలను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైదరాబాద్లోని గుర్రంగూడ నుంచి వర్చవల్గా ప్రారంభించారు. అనంతరం భద్రాద్రి కలెక్టర్ అంకిత్, డీఎఫ్ఓ కృష్ణగౌడ్లతో కలిసి ఎమ్మెల్యే కూనంనేని పచ్చజెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. డీర్ పార్కు వద్ద మొక్కలను నాటి బటర్ ఫ్లై పార్కు, ఫీడ్ స్టోరేజీ భవనం, సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సఫారీ రైడ్, బటర్ ఫ్లై పార్కు, ట్రెక్కింగ్ అందుబాటులోకి రావడంతో కిన్నెరసానికి వచ్చే పర్యాటకులు సరికొత్త అనుభూతిని పొందుతారని అన్నారు. కొత్తగూడెం క్రాస్ రోడ్డులోని హరిత హోటల్ను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. లక్నవరం తరహాలో కిన్నెరసానిలో కూడా తీగల వంతెన ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. మొక్కలు నాటి సంరక్షించాలి మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ అంకిత్ అన్నా రు. వనమహోత్సవంలో భాగంగా కిన్నెరసాని డీర్ పార్కులో ఆయన మొక్క నాటి మాట్లాడారు. పర్యావరణ సమత్యులతను కాపాడాలంటే విరివిగా మొక్కలను నాటాలన్నారు. అనంతరం కలెక్టర్ పర్యావరణ కేంద్ర భవనాన్ని, బటర్ఫ్లై పార్కును కలెక్టర్ అంకిత్ సందర్శించారు. జంతువులను బొమ్మలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు కృష్ణాగౌడ్, విద్యాచందన, దారా ప్రసాద్, బి.బాబు, కిషన్, కొత్తగూడెం మేయర్ ఎం.గణేష్, కిన్నెరసాని సర్పంచ్ వజ్జ రామకృష్ణ, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్పాషా, వీసంశెట్టి పూర్ణచందర్రావు, ఉప్పుశెట్టి రాహుల్, డి.సుధాకర్, అన్నారపు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
పరిశుభ్రమైన, నాణ్యమైన భోజనం అందజేయాలి
రఘునాథపాలెం: విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో సిద్ధం చేసిన నాణ్యమైన భోజనమే అందించాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి మహమ్మద్ ముజాహిద్ ఆదేశించారు. రఘునాథపాలెంలోని పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్లో గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం తయారీని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశాక మాట్లాడారు. భోజన పథకం నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని సూచించారు. ప్రధానోపాధ్యాయుడు ఎం.వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం ఖమ్మంమయూరిసెంటర్: మాదకద్రవ్యాల రహిత సమాజంతో పాటు బాలికలకు సురక్షితమైన సమాజాన్ని అందించేలా ప్రతీఒక్కరు బాధ్యతగా కృషి చేయాలని జిల్లా సంక్షేమ అధికారి ఏ.ప్రమీల సూచించారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గురువారం ఖమ్మం రైల్వేస్టేషన్, ఎన్నెస్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీడబ్ల్యూఓ ప్రమీల మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, లేనిపక్షంలో అనేక ఇబ్బందులు వస్తాయని తెలిపారు. అత్యవసర సాయం కోసం 1098(చైల్డ్ హెల్ప్లైన్), 181(మహిళా హెల్ప్లైన్), 112(ఎమర్జెన్సీ రెస్పాన్స్), 1930(సైబర్ క్రైమ్), 14567(దివ్యాంగుల హెల్ప్లైన్), 14446(నషా ముక్త్ భారత్ హెల్ప్లైన్) నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైల్వే స్టేషన్ మేనేజర్ రాజేంద్ర ప్రసాద్, ఆర్పీఎఫ్ సీఐ సురేష్గౌడ్, ప్రధానోపాధ్యాయురాలు దుర్గాభవాని, వివిధ విభాగాల ఉద్యోగులు ఎస్.డీ.సమ్రీన్, శ్రీనివాస్, జీ.ఎస్.ప్రమీల, మానసం, వేణుగోపాల్, బిందుప్రసాద్, సునీల్ పాల్గొన్నారు. ఖమ్మంలో ధర్మపురి మున్సిపల్ బృందం పర్యటన స్వీపర్ విధుల నుంచి దివ్యాంగురాలి తొలగింపు వేంసూరు: కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేక ఐదేళ్ల నుంచి పాఠశాల స్వీపర్గా పనిచేస్తున్న దివ్యాగుంరాలిని ఈ ఏడాది తొలగించారు. మండలంలోని శంభునిగూడెంకు చెందిన బధిరురాలైన పెద్దలంక శారద స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో ఐదేళ్ల నుంచి స్వీపర్గా పనిచేస్తూ కుటుంబానికి బాసటగా నిలుస్తోంది. అయితే, ఈసారి ఆమెను విధుల్లోకి తీసుకోకుండా మరొకరిని నియమించారు. తమ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కల్లూరు సబ్ కలెక్టర్, విద్యాశాఖ అధికారులు స్పందించి శారదను తిరిగి పనిలోకి తీసుకోవాలని ఆమె తల్లి వెంకటనర్సమ్మ గురువారం కోరారు. -
మరింత వేగంగా భూసేకరణ
ఖమ్మంసహకారనగర్: జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులకు భూసేకరణలో వేగం పెంచాలని ఆర్అండ్ఆర్, ఇరిగేషన్ భూసేకరణ కమిషనర్ కె.శివకుమార్ సూచించారు. కలెక్టరేట్లో గురువారం ఆయన కలెక్టర్ దివాకర టీ.ఎస్.తో కలిసి జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిపై సమీక్షించారు. సీతారామ ఎత్తిపోతల పథకం, మున్నేరు–పాలేరు లింక్ కాలువతో పాటు ఉమ్మడి జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు భూసేకరణ, అటవీ అనుమతులు, పరిహారం చెల్లింపులు, పెండింగ్ కేసులపై చర్చించాక శివకుమార్ మాట్లాడుతూ రైతులకు న్యాయమైన పరిహారం అందేలా పర్యవేక్షిస్తూ జాప్యం జరగకుండా చూడాలని సూచించారు. అలాగే, ఇతర సమస్యలను రెవెన్యూ, నీటిపారుదల శాఖల మధ్య సమన్వయంతో పరిష్కరించుకోవాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, సీతారామ 14, 15, 16వ ప్యాకేజీల భూసేకరణ వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఇరిగేషన్ సీఈలు ఎం.వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్, ఎస్డీసీ సదానందం తదితరులు పాల్గొన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అనుమతి ఇవ్వొద్దు లేఔట్లకు అనుమతులు జారీ చేసే సమయాన ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్), బఫర్ జోన్లో ఉందా అనేది సమగ్రంగా పరిశీలించాలని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి లేఔట్ కమిటీ సమావేశంలో కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెండింగ్లో దరఖాస్తులపై రెవెన్యూ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో చర్చించాక మాట్లాడారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వొద్దని స్పష్టం చేశారు. ట్రైనీ కలెక్టర్ పారస్ కుమార్, ఎస్డీసీ సదానందం, ఇరిగేషన్ సీఈ ఎం.వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బీ, పీఆర్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈలు యాకోబు, వెంకట్రెడ్డి, శ్రీనివాసాచారి, సుడా సీపీఓ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత ఖమ్మంవ్యవసాయం: పర్యావరణ పరిరక్షణను అందరూ బాధ్యతగా భావిస్తూ మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. వన మహోత్సవంలో భాగంగా గురువారం ఆయన అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, జిల్లా అటవీ అధికారి అనూజ్ అగర్వాల్తో కలిసి కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటాక మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ, హరితాభివృద్ధి లక్ష్యంగా నిర్వహిస్తున్న వనమహోత్సవంలో అందరూ పాలుపంచుకోవాలని తెలిపారు. తొలుత సీఎం రేవంత్రెడ్డి రంగారెడ్డి జిల్లా గుర్రంగుడ నుంచి వర్చువల్గా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అరణ్య పార్క్లను ప్రారంభించగా ప్రత్యక్ష ప్రసారాన్ని అధికారులు వీక్షించారు. డీఆర్డీఓ కె.శ్రీరామ్, డీవైఎస్ఓ సునీల్రెడ్డి, ఆర్టీఓ సభ్యుడు జి.వెంకన్నతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్ -
అనుమతి లేని మిర్చి విత్తనాలు స్వాధీనం
కామేపల్లి: అనుమతి లేకుండా మిరప విత్తన ప్యాకెట్లను గ్రామాల్లో విక్రయిస్తుండగా వ్యవసాయ, పోలీసు ఉద్యోగులు సంయుక్త తనిఖీల్లో గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు గ్రామానికి చెందిన ఉప్పుటూరి వెంకటప్పారావు కామేపల్లి మండలం మద్దులపల్లికి చెందిన జాలే శ్రీనుయాదవ్ కలిసి గ్రామంలో మిర్చి విత్తన ప్యాకెట్లను అధిక ధరకు విక్రయిస్తున్నారని సమాచారం అందింది. దీంతో గ్రామానికి చేరుకున్న అధికారులు విత్తన ప్యాకెట్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. కాగా, జాలె శ్రీను తనకు విత్తన దుకాణం ఉందని, అధిక ధరకు విత్తనాలు విక్రయించి డబ్బు సంపాదించొచ్చని చెప్పడంతో బిల్లులు లేకుండా అమ్ముతున్నానని వెంకటప్పారావు విచారణలో అంగీకరించాడు. కాగా, ఏఓ తారాదేవి ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు చేయగా, వీరి నుంచి స్వాధీనం చేసుకున్న విత్తనాల విలువ రూ.60,276 ఉంటుందని వెల్లడించారు.ఏపీ నుంచి తీసుకొచ్చి అమ్ముతున్న వ్యాపారి -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్
ఏన్కూరు: రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఏన్కూ రు కేంద్రంగా రెండు, మూడేళ్ల నుంచి నకిలీ, నిషేధిత పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారనే సమాచారంతో ‘సాక్షి’లో బుధవారం ‘జోరుగా నకిలీ విత్తనాల విక్రయం?’శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన వ్యవసాయ, పోలీసు అధికారులు తనిఖీలు చేపట్టారు. గత ఏడాది మండలంలో నకిలీ విత్తనాలు లభ్యమైన వారి ఇళ్లలో తనిఖీ చేసి ప్రస్తుత కదలికలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్ఐ నారబోయిన సంధ్య, వ్యవసాయాధి కారి నర్సింహారావు మాట్లాడుతూ.. నకిలీ విత్తనాల విక్రయ సమాచారం ఎవరికై నా తెలిస్తే తమకు తెలపాలని సూచించారు. వ్యాపారులు కూడా ప్రభు త్వం ఆమోదించిన కంపెనీల విత్తనాలే విక్రయించాలని తెలిపారు. -
యాక్షన్ ప్లాన్ సిద్ధం
ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూసేందుకు నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(ఎన్పీడీసీఎల్) ప్రత్యేకంగా ‘హైపర్’ యాక్షన్ ప్లాన్ను రూపొందించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరణను వేగంగా చేపట్టడం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు. – ఖమ్మంవ్యవసాయం● భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యాన అప్రమత్తంగా ఎన్పీడీసీఎల్ ● అంతరాయాలు లేని విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు ఆరు అంచెల వ్యూహం విద్యుత్ స్తంభించిన వెంటనే సత్వర పునరుద్ధరణ కోసం ఆరు అంచెల విధానం రూపొందించారు. ప్రధాన కార్యాలయంలోని 24 గంటల కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తూ సిబ్బందికి బాధ్యతలు కేటాయిస్తారు. ప్రధాన ప్రాంతాల్లో అప్పటికే సిద్ధంగా ఉన్న సిబ్బంది మరమ్మతు సామగ్రితో అంతరాయం ఎదురైన ప్రాంతానికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తారు. తద్వారా త్వరగా విద్యుత్ పునరుద్ధరణ జరుగుతుంది. ముందే గుర్తింపు ఎస్సీఏడీఏ, జీఐఎస్, ఓఎంఎస్ వంటి డేటా వ్యవస్థలను కృత్రిమ మేధస్సుతో అనుసంధానించారు. దీంతో ఫీడర్లలో వచ్చే సాంకేతిక లోపాలను 7 – 21 రోజుల ముందే గుర్తించవచ్చు. వాతావరణం ఆధారంగా విద్యుత్ డిమాండ్ను అంచనా వేసి సరఫరా నిర్వహిస్తారు. అంతేకాక అటవీ ప్రాంతాలు, ఇరుకై న ప్రదేశాల్లో లైన్ల పర్యవేక్షణకు డ్రోన్లను వినియోగించనున్నారు. ఎమర్జెన్సీ వాహనాలు విద్యుత్ అత్యవసర పునరుద్ధరణ కోసం జీపీఆర్ఎస్ బృందాల వాహనాలు అందుబాటులో ఉంచారు. వీటిలో మరమ్మతులకు కావాల్సిన అన్ని పరికరాలు ఉంటాయి. జీపీఆర్ఎస్ ట్రాకింగ్తో కంట్రోల్ రూమ్ నుంచి వాహన స్థానాన్ని గుర్తించిసిబ్బందిని త్వరగా పంపించి పనులు చేపడుతారు. ‘హైపర్’ యాక్షన్ ప్లాన్తో వర్షాకాలంలో విద్యుత్ అంతరాయాలు గణనీయంగా తగ్గే అవకాశముంది. తద్వారా నియోగదారులకు నిరంతర విద్యుత్ అందుతుంది. ఈ యాక్షన్ ప్లాన్ను జిల్లాలో అమలుకు చర్యలు తీసుకుంటున్నాం. –ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎస్ఈ, ఖమ్మం -
మళ్లీ వచ్చేది కేసీఆరే..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/ఖమ్మంరూరల్: ‘కేసీఆర్ నాయకత్వంలో ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. పుష్కర కాలం తర్వాత ఇవాళ ఖమ్మం నుంచి కరీంనగర్ దాకా ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఎవరిని కదిలించినా ఎట్లుండే తెలంగాణ .. ఎట్టయిపోయిందనే మాటే వినబడుతుంది. మళ్లీ కేసీఆర్ రావాలి అనే మాట జనంలో నుంచి వస్తోంది. కాంగ్రెస్ పాలనలో ఒకటి, రెండు కాదు అనేక అరాచకాలు జరుగుతున్నాయి. అందుకే కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడుతూ మళ్లీ వచ్చేది కేసీఆరే.’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులకు ‘ఎస్ఐఆర్’పై ఖమ్మం రూరల్ మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం ఏర్పాటుచేసిన శిక్షణలో ఆయన మాట్లాడారు. రైతులకు అండగా ఉన్నాం.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడే ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందిందని కేటీఆర్ తెలిపారు. తిరుమలాయపాలెంలోని బీడు భూములకు నీళ్లు ఇచ్చేందుకు భక్తరామదాసు ప్రాజెక్టును తొమ్మిది నెలల్లో పూర్తిచేయగా, సీతారామ ప్రాజెక్టు కూడా 80 శాతం పూర్తి చేశామని చెప్పారు. ఉమ్మడి జిల్లాకు రెండు మెడికల్ కాలేజీలు, రెండు నర్సింగ్ కాలేజీలు మంజూరు చేశామన్నారు. కానీ కాంగ్రెస్ వచ్చిన రెండున్నర ఏళ్లలో నాలుగున్నర లక్షల కోట్ల అప్పు చేయగా.. రాష్ట్రానికి, ఉమ్మడి జిల్లాకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాలలు, కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు.. ఇలా చెప్పుకుంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సంక్షేమం, అభివృద్ధి ప్రతీ ప్రాంతానికి చేరాయన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నీ ఆగిపోగా, ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ముగ్గురు మంత్రులు చేసిందేమీ లేదు.. ముగ్గురు మంత్రులు ఉమ్మడి జిల్లా నుంచి ఉన్నా ఇక్కడ వారు చేసిందేమీ లేదని పేర్కొన్నారు. ఎవరికి వారు వారి శాఖలను గాలికొదిలేసి కమీషన్లు, అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వీరు ముగ్గురు మొనగాళ్లు కాదని, మోసగాళ్లు కావడంతో ఉమ్మడి జిల్లా నలిగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. పాలేరు, మిగతా నియోజకవర్గాల్లో వస్తున్న స్పందన చూసి దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలని వాళ్లకు అర్థమై ఇష్టారీతిన దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. దండుపాళ్యం బ్యాచ్కు నాయకుడు రేవంత్రెడ్డి అయితే, ఇక్కడ ఆయన ముగ్గురు అనుచరులు తిష్టవేశారని తెలిపారు. రైతుబంధు, రైతు బీమా రాక, యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నా మంత్రులకు పట్టడం లేదని పేర్కొన్నారు. -
గాలివానకు కూలిన చెట్ల కొమ్మలు
తల్లాడ: మండలంలో బుధవారం సాయంత్రం వచ్చిన గాలి వానకు చెట్ల కొమ్మలు విరిగి రోడ్డుపై పడటంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. మండలంలోని నరసింహారావుపేట – గార్లొడ్డు గ్రామాల మధ్య రెండు చోట్ల భారీ వృక్షాలకు చెందిన కొమ్మలు విరిగి రోడ్డుపై పడ్డాయి. అలాగే, రంగంబంజర వద్ద జాతీయ రహదారిపై చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. దీంతో ట్రాఫిక్కు అంతరాయం కల్గింది. రంగంబంజరలో ధర్మసోత్ దశరథ్నాయక్, ఈలప్రోలు భాస్కర్రావు, మడిపల్లి బాస్కర్రావు రోడ్డుకు అడ్డంగా పడిన చెట్ల కొమ్మలను తొలగించారు. నరసింహారావుపేట వద్ద విరిగిన కొమ్మలను జేసీబీ సాయంతో తొలగించారు. గాలి వానకు మండలంలోని పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడటంతో పాటు రేకులు కూడా ఎగిరిపోయాయి. కొత్తగూడెం, సత్తుపల్లి రహదారుల్లో ట్రాఫిక్కు అంతరాయం -
జిల్లా జడ్జి రాజగోపాల్ బదిలీ
ఖమ్మంలీగల్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ బదిలీ అయ్యారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నుంచి బుధవారం ఉత్తర్వు లు జారీ అయ్యాయి. ఆయనను హైదరాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్)గా బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత తప్పనిసరి నేలకొండపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి, మండల ప్రత్యేకాధికారి కె.రవిబాబు హెచ్చరించారు. మండలంలోని గువ్వలగూడెం ప్రభుత్వ పాఠశాలను బుధవారం తనిఖీ చేసిన ఆయన విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. నాణ్యత, మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఐఈఓ మాట్లాడుతూ వంట గదులు, పాత్రల శుభ్రత విషయంలో జాగ్రత్త వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎం.యర్రయ్య, ఎంఈఓ బి.చలపతిరావు, సర్పంచ్ రావెళ్ల జ్యోతి తదితరులు పాల్గొన్నారు. మెరుగైన వైద్యసేవలే లక్ష్యం నేలకొండపల్లి: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యమని జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ కె.రాజశేఖర్ గౌడ్ తెలిపారు. మండల కేంద్రంలోని సీహెచ్సీని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ సేవలు, మందుల నిల్వల రికార్డులు తనిఖీ చేశాక వైద్యులు, ఉద్యోగులతో సమావేశమయ్యారు. అందరూ సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం అందించాలని సూచించారు. సీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మంగళ, ఉద్యోగులు పాల్గొన్నారు. పదేళ్ల తర్వాత తెరుచుకున్న పాఠశాల ! పెనుబల్లి: గత పదేళ్ల క్రితం మూతపడిన ప్రభుత్వ పాఠశాల మళ్లీ ఈ ఏడాది తెరుచుకుని విద్యార్థులతో కళకళలాడుతోంది. మండలంలోని గంగదేవిపాడు గ్రామపంచాయతీ పరిధి చీన్యాతండాలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను దశాబ్ద కాలం క్రితం మూసివేశారు. దీంతో స్థానికులు కొందరు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు, ఇంకొందరు దూర ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారు. మరికొందరు ఏకంగా పిల్లలను బడి మాన్పించారు. దీంతో సర్పంచ్ మాలోతు రాధాకృష్ణ, ఉపసర్పంచ్ నాగులు, ఎంఈఓ కావేటి మోహన్ ఈసారి ఎలాగైన పాఠశాల తెరిపించాలనే లక్ష్యంతో తల్లిదండ్రులకు అవగాహన కల్పించగా పది మంది పిల్లలను చేర్పించేందుకు ముందుకొచ్చారు. ఈమేరకు బుధవారం పాఠశాలను తెరిచారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాధాకృష్ణ, ఎంఈఓ మోహన్లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యతో పాటుపుస్తకాలు, యూని ఫామ్, అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వైద్య శాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఖమ్మం వైద్యవిభాగం: జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న మూడు ల్యాబ్ టెక్నీషియన్, ఒక ల్యాబ్ సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు డీఎంహెచ్ఓ రామారావు తెలిపారు. కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనుండగా, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు ఇంటర్మీడియట్తో పాటు డీఎంఎల్టీ ఉత్తీర్ణత సాధించి ఉండాలని పేర్కొన్నారు. అలాగే, సూపర్వైజర్ పోస్టుకు మెడికల్ లేబరేటరీలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 22 తేదీలోగా డీఎంహెచ్ఓ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. -
సన్నాల సాగు.. బాగు
● వినియోగంతో పాటే పెరుగుతున్న డిమాండ్ ● మద్దతు ధర, బోనస్తో రైతులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ● ప్రభుత్వ సంస్థల ద్వారా విత్తన విక్రయాలుఖమ్మంవ్యవసాయం: వరిలో సన్న రకాలకు మంచి డిమాండ్ ఉంది. స్థానికంగానే కాక జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా ఈ రకాల వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యాన ప్రభుత్వం కూడా రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తూ ఈ రకాల ధాన్యం సాగుకు రైతులను ప్రోత్సహిస్తోంది. అలాగే, రైతులకు మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తున్నారు. ఈమేరకు అన్నదాతలు సన్నాలు సాగు చేసి లాభాలు పొందాలని వైరా కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) శాస్త్రవేత్త డాక్టర్ చైతన్య సూచిస్తున్నారు. కాగా, కేవీకే ద్వారా బీపీటీ–5204, డబ్ల్యూజీఎల్–44, డబ్ల్యూజీఎల్–962 రకాలు విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. అంతేకాక తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ కూడా పలు రకాల వరి విత్తనాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. రకాల వారీగా వివరాలు.. నేలల రకాలు, వనరుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది రకాల సన్న వరి వంగడాలను ఎంపిక చేసింది. ఇందులో ఆరు వరి వంగడాలు రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందినవి. ఆయా విత్తనాల వివరాలిలా ఉన్నాయి. ●ఆర్ఎన్ఆర్–15048: ఈ రకం పంట కాలం వానాకాలంలోనైతే 125 రోజులు, యాసంగిలో 135 రోజులుగా ఉంది. ఎకరాకు 26 – 28 క్వింటాళ్ల దిగబడి వస్తుంది. అగ్గి తెగులను తట్టుకుంటుంది. మొగి పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ●జేజీఎల్–1798: ఈ రకం పంట కాలం వానాకాలంలో 125 రోజులు, యాసంగిలో 140 రోజులుగా నమోదైంది. ఇది కూడా ఎకరాకు 26 – 28 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. ఉల్లికోడును పూర్తిగా తట్టుకుంటుంది. అంతేకాక అగ్గి తెగులు, పాము పొడ తెగులును కొంతమేర తట్టుకుంటుంది. ●కేఎన్ఎం–1638: ఈ రకం పంట కాలం వానాకాలంలో 125, యాసంగిలో 135 రోజులుగా ఉంటుంది. ఇది ఎకరాకు 30 – 34 క్వింటాళ్ల దిగబడి ఇస్తుంది. ఉల్లికోడును తట్టుకునే ఈ రకానికి ఉంటుంది. ●డబ్ల్యూజీఎల్–962: ఈ రకం వానాకాలంలో 120 – 125 రోజులు, యాసంగిలో 130 – 135 రోజులుగా పంట కాలం నమోదైంది. ఎకరాకు 25 – 27 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అగ్గితెగులును కొంతమేర తట్టుకునే గుణం ఉంటుంది. ●బీపీటీ–5204: ఈ రకం వరి పంట కాలం 135 – 150 రోజులు. ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. దీన్ని సాంబమసూరి లేదా సోనామసూరి అని పిలుస్తారు. ఈ పైరుకు ఉల్లికోడు ఆశించే అవకాశం ఉంటుంది. ●డబ్ల్యూజీఎల్–44: ఇది వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ద్వారా అభివృద్ధి చేసిన రకం. దీని పంట కాలం 140 – 145 రోజులు. ఎకరాకు 28 – 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సిద్ధి రకం కూడా పిలిచే ఇది వానాకాలం సాగుకు అనుకూలమైనది. ఈ రకం వరికి సుడిదోమ, అగ్గి తెగులు,కాండం తొలిచే పురుగు ఆశించే అవకాశం ఉంటుంది. -
21న కాంగ్రెస్ ‘నారీ భేటీ’
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మంలోని సప్తపది ఫంక్షన్హాల్లో ఈ నెల 21న నిర్వహించే నారీ భేటీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్, కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య పిలుపునిచ్చారు. ఈ మేరకు ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం వారు పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 21న మధ్యాహ్నం 2 గంటలకు మొదలయ్యే నారీ భేటీ సమావేశానికి మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు హాజరుకానున్న నేపథ్యాన జిల్లాలోని మహిళా కార్యకర్త లు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు దామా స్వరూప, బలుసు లక్ష్మి, ఊరుకొండ చంద్రిక, రేఖా భార్గవి, గోవిందమ్మ, మంగ, బొడ్డు బొందయ్య, కిలారు అనిల్కుమార్, కొట్టే రాజశేఖర్, మద్దినేని రమేశ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టితల్లాడ: గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజల ఆరోగ్యంపై ఉద్యోగులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి టి. రాంబాబు సూచించారు. తల్లాడ మండలం కుర్నవల్లికి చెందిన జోజి జ్వరంతో బాధపడుతూ మృతి చెందగా బుధవారం గ్రామంలో పారిశుద్ధ్య పనులను చేపట్టారు. ఈ సందర్భంగా డీపీఓ పరిశీలించి మాట్లాడుతూ వర్షాకాలంలో స్థానికులు ఇళ్లలోనే కాకుండా పరిసరాల పరిశుభ్రత పాటిస్తే సీజనల్ వ్యాధులు దరి చేరవని తెలిపారు. అలాగే, గ్రామంలో మండల వైద్యాధికారి ప్రత్యూష ఆధ్వర్యాన వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇంటింటా జ్వర సర్వే చేపట్టగా రెండు జ్వరం కేసులు నమోదయ్యా యి. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీధర్రాజు, సర్పంచ్ ఎక్కిరాల శేషమ్మ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ నోడల్ ఆఫీసర్గా ఆదర్శ్కుమార్ ఖమ్మంస్పోర్ట్స్: హైదరాబాద్లో ఏర్పాటు చేసే స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రచారం కోసం జిల్లా నోడల్ ఆఫీసర్గా కె.ఆదర్శ్కుమార్ను నియమించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి బుధవారం ఉత్తర్వులు విడుదలయ్యా యి. జిల్లాలోని ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి స్పోర్ట్స్ యూనివర్సిటీలో చేర్పించేలా పర్యవేక్షించేందుకు నోడల్ అధికారిని నియమించారు. ఈ సందర్భంగా ఆదర్శ్కుమార్ను పలు క్రీడా సంఘాల బాధ్యులు అభినందించారు. నేడు సర్టిఫికెట్ల పరిశీలనఖమ్మంసహకారనగర్: ప్రభుత్వ, ప్రైవేట్ డీఈడీ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్), డీఎల్ ఈడీ (డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశానికి రెండో విడత సర్టిఫికెట్ల పరిశీలన గురువారం ఖమ్మం డైట్లో నిర్వహిస్తున్నట్లు కన్వీనర్, ప్రిన్సిపాల్ బాలమురళి తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం deecet. cdse. telangana ద్వారా ఈ నెల 19, 20వ తేదీల్లో అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. ఆపై ఆప్షన్ల సవరణకు ఈ నెల 21వ తేదీన అవకాశం ఉండగా, సీట్ల కేటాయింపు 25న జరుగుతుందని తెలిపారు. ఆయా అభ్యర్థులు 25 నుంచి 27వ తేదీలోగా ట్యూషన్ ఫీజు చెల్లించి కేటాయించిన కళాశాలలో రిపోర్టు చేయాలని పేర్కొన్నారు. కాగా, మొదటి విడతలో సీటు పొందిన అభ్యర్థులు కూడా స్లైడింగ్ ఆప్షన్ ద్వారా ఇతర కళాశాలలకు మారే అవకాశం ఉందని ఆయన వివరించారు. ఖబరస్థాన్లో భారీ శబ్దంతో పిడుగు ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి వరంగల్ క్రాస్లోని ఖబరస్థాన్లో బుధవారం రాత్రి భారీ శబ్దంతో పిడుగు పడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమవగానే కొద్దిసేపటికే పిడుగు పడడంతో సమీపంలోని నివాసితులు ఆందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. కాగా, పిడుగుపాటుకు ఖబరస్థాన్లోని కొబ్బరి చెట్లకు మంటలు అంటుకుని కాలిపోయాయి. -
రైలుకింద పడి వ్యక్తి మృతి
బోనకల్: రైలుకింద పడి గుర్తు తెలియని వ్యక్తి (30) మృతిచెందాడు. బోనకల్ – మోటమర్రి రైల్వేస్టేషన్ల మధ్య బుధవారం సదరు వ్యక్తి రైలు నుంచి జారిపడడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో పోస్ట్మార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపారు. కుళ్లిపోయిన స్థితిలో పూజారి మృతదేహంనెల క్రితం అదృశ్యమైన పోలంపల్లి వాసి కారేపల్లి: నెల రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం గట్టుమల్ల అటవీ ప్రాంతంలో బుధవారం మృతదేహంగా కనిపించాడు. కారేపల్లి మండలం పోలంపల్లికి చెందిన మూతి వీరభద్రం (45) వీరభద్రస్వామి ఆలయంలో పూజారిగా కొనసాగుతున్నాడు. నెల క్రితం ఇంటి నుంచి వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు ఆరా తీస్తున్నారు. ఇంతలోనే గట్టుమల్ల అటవీప్రాంతంలో కుళ్లిపోయిన స్థితిలో వీరభద్రం మృతదేహం కనిపించింది. ఘటనా స్థలంలో లభించిన ఆధార్ కార్డు, సెల్ఫోన్ ఆధారంగా మృతుడిని గుర్తించిన అక్కడి పోలీసులు కుటుంబీకులతో పాటు సర్పంచ్కు సమాచారం అందించారు. అవివాహితుడైన వీరభద్రం మృతిపై అనుమానాలు వ్యక్తమవుతుండగా, ఆయన ఎలా మృతి చెందాడనేది గుర్తించేందుకు విచారణ చేపడుతున్నటుపోలీసులు తెలిపారు. వడదెబ్బతో వ్యక్తి మృతినేలకొండపల్లి: మండలంలోని చెన్నారం గ్రామంలో వడదెబ్బకు గురై బుధవారం వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన నాగయ్య (40) ఎండ తీవ్రత తట్టుకోలేక అస్వస్థతకు గురై మృతిచెందాడు. బైక్ అదుపుతప్పడంతో ఒకరు.. మధిర: మధిరలోని ట్యాంక్బండ్పై బుధవారం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమీప బంధువులైన అంబారుపేటకు చెందిన జక్కంపూడి ఉపేందర్ (38), వినుకొండ గోపి మధిర నుంచి ద్విచక్ర వాహనంపై అంబారుపేట వైపు వెళ్తున్నారు. ఈక్రమాన వీరి బైక్ ట్యాంక్బండ్పై అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఘటనలో తీవ్రగాయాలతో ఉపేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. చేపల వ్యాపారం చేసే ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, తీవ్ర గాయాలైన గోపిని ఖమ్మం తరలించారు. మధిర టౌన్ పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. -
వైద్యులు కావలెను..
ఖమ్మంవైద్యవిభాగం: రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి అనుసంధానంగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసింది. ఈ క్రమాన సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో ఆస్పత్రితో పాటు కళాశాల భవనాలు, హాస్టళ్లు అందుబాటులోకి వచ్చాయి. బోధన, బోధనేతర సిబ్బందిని కూడా నియమించి కళాశాలను మూడేళ్ల క్రితం ప్రారంభించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. బోధన, వైద్య సేవలకు అవసరమైన వైద్యులను మాత్రం పూర్తి స్థాయిలో భర్తీ చేయలేదు. దీంతో ఆ ప్రభావం చికిత్స కోసం వచ్చే వారితో పాటు విద్యార్థులపై పడుతోంది. వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్నప్పటి కంటే డీఎంఈ పరిధిలోకి వచ్చాక పరిస్థితులు భిన్నంగా మారడం.. చాలా విభాగాల్లో సరిపడా వైద్యులు లేక ఇబ్బంది ఎదురవుతోంది. 115 మందికి 48 మందే.. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రస్తుతం మూడో ఏడాది విద్యార్థులకు బోధన జరుగుతోంది. అలాగే సెప్టెంబర్లో నాలుగో బ్యాచ్ రానుంది. కళాశాలలో 100 సీట్లకు అనుమతి ఉండగా, ఈ ఏడాది 25 పీజీ సీట్లకు అనుమతులు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. కానీ, వీరికి బోధించడానికి అవసరమైన వైద్యులను సరిపోను భర్తీ చేయలేదు. కళాశాల, ఆస్పత్రిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు 115కి గాను 48 మంది వైద్యులే విధులు నిర్వహిస్తున్నారు. అలాగే, సీనియర్ రెసిడెంట్లు 70 పోస్టులకు 42 మందే ఉన్నారు. ఇందులో కొన్ని రెగ్యులర్ పోస్టులు లేకపోవడంతో కాంట్రాక్టు విధానంలో వైద్యులను భర్తీ చేస్తున్నా.. అనుభవ లేమి కారణంగా ఓపీ, ఇన్పేషంట్లకు వైద్యసేవలు సక్రమంగా అందకపోగా శస్త్రచికిత్స నిర్వహణపై ప్రభావం పడుతోంది. అంతేకాక విద్యార్థులకు బోధన విషయంలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సదరమ్ శిబిరాలపైనా ప్రభావం ఖాళీల భర్తీ జరగకపోగా.. ఇటీవల సాధారణ బధిలీల్లో కొందరు వైద్యులకు స్థానచలనం కలిగింది. దీంతో కీలకమైన సదరమ్ శిబిరాల నిర్వహణకు ఇబ్బంది ఏర్పడుతోంది. పెద్దాస్పత్రిలో ప్రతీ వారం రెండు శిబిరాలు నిర్వహిస్తున్నారు. స్లాట్ బుక్ చేసుకున్న దివ్యాంగులకు వైకల్య పరీక్షలు నిర్వహించి అర్హులైతే సర్టిఫికెట్ జారీ చేయాలి. కానీ, ఈ శిబిరాల నిర్వహణలో కీలకమైన ఆర్థోపెడిక్, ఈఎన్ టీ, కంటి, మానసిక వైద్యుల కొరత ఏర్పడింది. ఇటీవల సాధారణ బదిలీల్లో భాగంగా కంటి విభా గం హెచ్ఓడీ రామూనాయక్, మరో ఫ్రొఫెసర్కు స్థానచలనం కలిగింది. ఈ స్థానంలో ఎవరినీ నియమించకపోవడంతో రెటీనా శస్త్రచికిత్సలు నిలిచిపో యాయి. అలాగే, సదరమ్ శిబిరాల్లో కంటి వైకల్య పరీక్షలు నిర్వహించటానికి ఇబ్బంది అవుతోంది. ఇంకా, ఈఎన్టీ, ఆర్థోపెడిక్, మానసిక వైద్యుల కొరత మూలంగా బోధన, వైద్య సేవలు, సదరమ్ శిబిరాల నిర్వహణకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. మరోపక్క రేడియాలజీ పోస్టులు భర్తీ జరగక ఎక్స్రే, అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్ సేవలపై ప్రభావం పడుతోంది. చాలా విభాగాల్లో ప్రస్తుతం సీనియర్ రెసిడెంట్ల (ఎస్ఆర్)తో కాలం నెట్టుకొస్తున్నారు.ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిజనరల్ ఆస్పత్రిలో ప్రధానంగా ఆర్థోపెడిక్ సేవలు కీలకం. శరీరంలోని ఎముకలు విరిగి, ఇతర సమస్యలతో పలువురు వస్తుంటారు. ఓపీ, ఐపీతో పాటు మేజర్, మైనర్ సర్జరీలు, విద్యార్థుల బోధనకు ఆర్థోపెడిక్ వైద్యుల సేవలు కీలకం. కానీ, ఈ విభాగంలో ఒక ప్రొఫెసర్ ఉండగా, ఒక అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టు ఖాళీగా ఉంది. అలాగే 10 మంది వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవసరమైతే కేవలం ఇద్దరే విధులు నిర్వర్తిస్తున్నారు. జనరల్ మెడిసిన్లో ఒక అసోసియేట్, రెండు అసిస్టెంట్ పోస్టులు, చర్మ, మానసిక విభాగాల్లో ఒక్కో పోస్టు ఖాళీగా ఉన్నాయి. జనరల్ సర్జరీ విభాగంలో మూడు అసిస్టెంట్, ఒక అసోసియేట్, ఈఎన్టీలో అసిస్టెంట్, అసోసియేట్ పోస్టులు ఒక్కొక్కటి భర్తీ చేయాల్సి ఉంది. గైనిక్ విభాగంలో ఏడు అసిస్టెంట్, ఒక అసోసియేట్ పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఆప్తమాలజీ ఒక ప్రొఫెసర్, రెండు అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రేడియాలజీలో మూడు, డెంటల్లో రెండు, అనాటమీ విభాగంలో రెండు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.హోదా మంజూరు భర్తీ ఖాళీలు ప్రొఫెసర్ 27 15 12 అసోసియేట్ 30 08 22 అసిస్టెంట్ 58 25 33 సీనియర్ రెసిడెంట్ 70 42 28 మొత్తం 185 90 95 -
అధునాతన పద్ధతుల్లో చేపల పెంపకం
కూసుమంచి: మత్స్యకారులు, మత్స్య రైతులు ఆధునిక పద్ధతుల్లో చేపల పెంపకం చేపట్టడం ద్వారా అధిక ఉత్పత్తి సాధ్యమవుతుందని నాబార్డు డీడీఎం సుజిత్కుమార్ తెలిపారు. పాలేరులోని మత్స్య పరిశోధనా కేంద్రంలో ‘బయోప్లాక్ విధానంలో చేపల పెంపకం’అంశంపై ఇస్తున్న శిక్షణ బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా హాజరైన మత్స్య రైతులకు సర్టిఫికెట్లు అందజేశాక డీడీఎం మాట్లాడుతూ.. డిమాండ్కు తగ్గట్టు చేపల ఉత్పత్తి జరగాలంటే నూతన విధానాలు ఎంచుకోవాలని సూచించారు. ఇందుకోసం శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అలాగే, మత్స్యకారుల కోసం నాబార్డు అందిస్తున్న పథకాలను వివరించారు. కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్, శాస్త్రవేత్తలు శాంతన్న, రవీందర్, దివ్య, చొప్పరి రాంచంద్రం, అనిల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిన్నమండవలో పేలుడు పదార్థాలు స్వాధీనం చింతకాని: మండలంలోని చిన్నమండవ సమీపాన నిషేధిత పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మార్గంలో కొందరు పేలుడు పదార్థాలు తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా కొణిజర్ల మండలం గుబ్బగుర్తికి చెందిన ఆళ్లకుంట నరసింహారావు, తిరుమలాయపురం మండలం బీరోలుకు చెందిన వల్లపు లక్ష్మణ్ పట్టుబడగా వారి నుంచి 67 జిలిటెన్ స్టిక్లు, ఆరు ఎలక్ట్రికల్ డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకునిట్రాక్టర్ మిషన్ యజమాని కంది మల్లయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నరేశ్ తెలిపారు. -
భారీ వర్షంలోనూ ఇబ్బంది రావొద్దు
ఖమ్మంక్రైం: రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసినా ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్దత్ ఆదేశించారు. వర్షాకాలం సన్నద్ధత, నకిలీ విత్తనాల కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఖమ్మం నుంచి ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని వర్షపు నీరు భారీగా చేరే చెరువులు, కుంటలే కాక దెబ్బతిన్న వంతెనలు, చప్టాలను గుర్తించాలన్నారు. తద్వారా వరద ఉధృతి వస్తే ముందస్తు చర్యలు చేపట్టే అవకాశముంటుందని తెలిపారు. అలాగే, వర్షం వచ్చినప్పుడే రహదారులపై నీరు నిలిచి ట్రాఫిక్ జామ్ కాకుండా మున్సిపల్, ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. కాగా, వ్యవసాయ సీజన్లో రైతులు నకిలీ విత్తనాలతో మోసపోకుండా విస్తృత తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. తక్కువ ధరకు విత్తనాలు ఇస్తామని గ్రామాలకు వచ్చే ముఠాలపై నిఘా పెట్టాలని సీపీ తెలిపారు. 20న జాతీయ లోక్అదాలత్ ఈ నెల 20వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సీపీ సునీల్దత్ ఓ ప్రకటనలో కోరారు. ఆర్థిక భారం తగ్గించుకోవడమేకాక సమయం వృథా కాకుండా కేసులను ఇరువర్గాల రాజీతో పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్లో సివిల్ తగాదాలు, ఆస్తి విభజన కేసులు, వైవాహిక జీవితం, కుటుంబ సమస్యలకు సంబంఽధించిన కేసులు, డ్రంకెన్ డ్రైవ్, మోటారు వాహనాల చట్టం ఉల్లంఘన, చెక్ బౌన్స్, బ్యాంక్ రికవరీ, విద్యుత్ చౌర్యం కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు.అధికారుల సమీక్షలో సీపీ సునీల్దత్ -
తొందరపడి విత్తనాలు నాటొద్దు
కారేపల్లి: సరైన వర్షపాతం నమోదు కాకముందే రైతులు తొందరపడి పత్తి విత్తనాలు నాటి నష్టపోవద్దని జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. కారేపల్లి మండలంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యూరియా సేల్ పాయింట్లను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విత్తన ప్యాకెట్లు, రిజిస్టర్లు, వ్యాపారుల లైసెన్సులను పరిశీలించి సూచనలు చేశారు. అనంతరం కారేపల్లి సొసైటీలో రైతులతో సమావేశమైన డీఏఓ మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకోవాలని తెలిపారు. అంతేకాక నానో యూరియా, నానో డీఏపీ వినియోగిస్తే మంచిదని చెప్పారు. అలాగే, యాప్ ద్వారానే యూరియా బుక్ చేసుకోవాలని తెలిపారు. కాగా, పత్తి విత్తనాలు నాటడానికి వచ్చే 15వ తేదీ వరకు సమయం ఉన్నందున తొందరపడొద్దని సూచించారు. కార్యక్రమంలో వైరా ఏడీఓ తుమ్మలపల్లి కరుణశ్రీ, ఏఓ అనిల్, ఏఈఓలు నరేశ్, మహేశ్, మున్నీ, సొసైటీ కార్యదర్శి బొల్లు హన్మంతరావు, ఆత్మ కమిటీ డైరెక్టర్ భూక్యా పద్మ తదితరులు పాల్గొన్నారు. -
ఈనెల 26న జిల్లాకు సీఎం ?
చింతకాని: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈనెల 26న జిల్లా పర్యటనకు వచ్చే అవకాశముందని సమాచారం. ఈమేరకు చింతకాని మండలంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని, రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రైతుభరోసా నిధులు విడుదల చేస్తారని తెలిసింది. ఈ విషయమై అందిన సమాచారంతో సభ నిర్వహణకు అనువైన స్థలం ఎంపిక చేసేందుకు అధికారులు, నాయకులు కసరత్తు మొదలుపెట్టారు. మండలంలోని లచ్చగూడెం, జగన్నాథపురం, రామకృష్ణాపురం గ్రామాల్లో బుధవారం వారు పరిశీలించారు. సభావేదిక నిర్మాణం, ఇతర అవసరాలకు సరి పడా స్థలాలపై ఆరా తీశారు. మత్కేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వర్లు, తహసీల్థార్ బాబ్జీప్రసాద్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎస్ఐ నరేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కన్నెబోయిన గోపి, నాయకులు పాల్గొన్నారు. -
మోదీ సారథ్యాన అన్నిరంగాల్లో అభివృద్ధి
ఖమ్మంమామిళ్లగూడెం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యాన పన్నెండేళ్లలో దేశం గతంలో లేనివిధంగా అభివృద్ధిలో దూసుకెళ్తోందని బీజేపీ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల కోఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి తెలిపారు. ఖమ్మం రైల్వేస్టేషన్లో 12 ఏళ్లలో అమలైన పథకాల ఫొటో ఎగ్జిబిషన్ను ఏర్పాటుచేయగా, బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం రూ.లక్షల కోట్లు నిధులు కేటాయించిందని తెలిపారు. అయితే గత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతితో భ్రష్టు పట్టించిందని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు, ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తోందన్నారు. అంతేకాక వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. హైవేపై ఎగ్జిట్ మంజూరు చేయించా.. వేంసూరు: ఖమ్మం – దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే మార్గంలో వేంసూరు వద్ద ఎగ్జిట్ తాను ప్రత్యేక చొరవతో మంజూరు చేయించాలని బీజేపీ నాయకుడు పొంగులేటి సుధాకర్రెడ్డి తెలిపారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించి 12ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేంసూరు ఎగ్జిట్ వద్ద స్థానిక నాయకులతో కలిసి ఆయన 12 మొక్కలు నాటి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రూ.4 వేల కోట్లతో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మిస్తే కాంగ్రెస్ నేతలు వారి ఘనతగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు, నాయకులు నంబూరి రామలింగేశ్వరరావు, నాయకులు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, రుద్ర ప్రదీప్, మేకల నాగేందర్, నున్నా రవి, సరస్వతి, అనిత, నకిరకంటి వీరభద్రం, శ్యామ్రాథోడ్, లక్ష్మీనారాయణ, రవిగౌడ్, భాస్కర్ణి వీరంరాజు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ సుధాకర్రెడ్డి -
చిక్కటి అడవిలో చక్కటి ప్రయాణం
● నేటి నుంచి కిన్నెరసానిలో సఫారీ టూర్ ● వర్చువల్గా ప్రారంభించనున్న సీఎం రేవంత్రెడ్డి పాల్వంచరూరల్: జూపార్క్లో బోన్ల నడుమ జంతువులు, గూళ్లలోని పిచుకలను చూడాల్సిన పనిలేదు. దట్టమైన అడవిలో పచ్చని అందాలను ఆస్వాదిస్తూ పక్షుల కిలకిలారావాలు వింటూ చెంగుచెంగున ఎగిరే జింకలను చూస్తూ ముందుకు సాగే అవకాశం అందుబాటులోకి వస్తోంది. పాల్వంచ మండలం కిన్నెరసాని వన్యప్రాణి విభాగం (వైల్డ్లైఫ్) ఆధ్వర్యాన జంగిల్ సఫారీ టూర్ గురువారం మొదలుకానుంది. ఈ మేరకు మూడు సఫారీ వాహనాలు ఇప్పటికే చేరుకోగా, ఈ టూర్ను సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్ నుంచి వర్చువల్గా ప్రారంభిస్తారని పాల్వంచ డివిజన్ వైల్డ్లైఫ్ ఎఫ్డీఓ బి.బాబు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్రాజ్, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, డీఎఫ్ఓ జి.కృష్ణగౌడ్ పాల్గొంటారని వెల్లడించారు. పది కి.మీ. ప్రయాణం కిన్నెరసాని డీర్ పార్కు నుంచి వాచ్ టవర్ వరకు, అక్కడ నుంచి మొండికట్ట బేస్ క్యాంప్ హరిణి వరకు సఫారీ వాహనాల ద్వారా సఫారీ కొనసాగుతుంది. ఇప్పటికే మూడు వాహనాలు సిద్ధం చేయగా, వాచ్టవర్ వరకు ఒకరికి రూ.100, మొండికట్ట హరిణి వరకై తే రూ.200గా టికెట్ ధర నిర్ణయించారు. ఈ టూర్ ద్వారా పర్యాటకులు చుక్కల జింకలు, అడవి దున్నలు, సాంబార్లను చూడొచ్చు. అంతేకాక గైడ్లతో కలిసి అడవిలో ట్రెక్కింగ్ చేసే అవకాశం కూడా కల్పించనున్నారు. -
రూ.42,048 స్వాహా చేసిన సైబర్ నేరగాళ్లు
నేలకొండపల్లి: ఆన్లైన్ గేమ్ ఆడితే అత్యధిక లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తి ఖాతా నుంచి రూ.42 వేలకు పైగా స్వాహా చేశారు. మండలంలోని గువ్వలగూడెంనకు చెందిన ఓ వ్యక్తికి గతనెల 23న ఇన్స్ట్రాగామ్లో గుర్తు తెలియని వ్యక్తులు పరిచయమయ్యారు. ఆన్లైన్ గేమ్లతో ఎక్కువగా డబ్బు వస్తుందని చెప్పడమే కాక, ఆట రాకున్నా తామే ఆడి డబ్బులు వచ్చేలా చూస్తామని నమ్మబలికారు. దీంతో గువ్వలగూడెం వాసి 12 పర్యాయాల్లో వారు చెప్పిన ఖాతాలకు రూ.42,048 నగదు పంపించాడు. ఆ తర్వాత లాభాల మాటేమో కానీ అసలు కూడా రాకపోవడంతో నిలదీయగా ముఖం చాటేశారు. దీంతో మోసపోయాయని గ్రహించిన వ్యక్తి సైబర్ క్రైమ్ నంబర్ 1930కు సమాచారం ఇవ్వడమే కాక బుధవారం స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలుశిక్ష ఖమ్మంలీగల్: అప్పు చెల్లించే క్రమాన ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగికి ఏడాది జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయాధికారి కాకుమాని జ్యోతిర్మయి బుధవారం తీర్పు చెప్పారు. ఖమ్మం రాపర్తినగర్కు చెందిన పున్నా వెంకటేశ్వర్లు వద్ద పుట్టబంతి సత్యవతి 2018 సెప్టెంబర్లో రూ.6 లక్షల అప్పు తీసుకుంది. ఆ తర్వాత 2021 ఏప్రిల్లో రూ.ఆరు లక్షలకు చెక్కు ఇచ్చినా ఆమె ఖాతాలో సరిపడా నగదు లేక తిరస్కరణకు గురైంది. దీంతో వెంకటేశ్వర్లు తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. ఈ మేరకు విచారణ అనంతరం సత్యవతికి ఏడాది జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.7 లక్షలు చెల్లించాలని న్యాయాధికారి తీర్పు చెప్పారు. -
యూరియా బుకింగ్ ప్రారంభం
ఖమ్మంవ్యవసాయం: ఉమ్మడి జిల్లాలో బుధవారం నుంచి ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ ప్రారంభమైంది. వానాకాలం పంటల సాగుకు అవసరమైన యూరియాను రైతులకు ఈ యాప్ ద్వారా అందించనున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై అందించే ఇచ్చే యూరియా వినియోగం పెరగడం, ఇదే సమయాన కొరత ఏర్పడడంతో గత సీజన్లో రైతులు ఇబ్బంది పడ్డారు. ఈనేపథ్యాన ఎరువు పక్కదారి పట్టకుండా యాప్ను గత యాసంగి సీజన్ నుంచి అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 2.80 లక్షల బస్తాలు, భద్రాద్రి జిల్లాలో 1.07 లక్షల బస్తాల యూరియా అందుబాటులో ఉంది. ఈ యూరియా కోసం సెల్ఫోన్ల ద్వారా లేక ఏఈఓల ద్వారా బుక్ చేసుకుంటే ఒక్కో రైతుకు రెండేసి బస్తాలు సరఫరా చేయనున్నారు.ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున సరఫరా -
గడువులోగా దరఖాస్తుల పరిష్కారం
ఖమ్మం అర్బన్: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే యువతను ప్రోత్సహించేలా టీజీ–ఐపాస్ ద్వారా అందిన దరఖాస్తులను నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన టీజీ–ఐపాస్ కమిటీ సమావేశంలో అనుమతులు, టీ–ప్రైడ్ అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 12 ఎస్సీ, 13 ఎస్టీ యూనిట్లకు రూ.1.35కోట్లకు పైగా పెట్టుబడి సబ్సిడీ మంజూరైందని తెలిపారు. అలాగే, పావలా వడ్డీ కింద ఒక ఎస్టీ యూనిట్కు రూ.46,374 సబ్సిడీ అందించామన్నారు. ఈసమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం ప్రవీణ్కుమార్, లీడ్ బ్యాంకు మేనేజర్ రవిప్రసాద్, ఆర్టీఓ శ్రీనివాసరావు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు ముజాహిద్, విజయలక్ష్మి, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసాచారి, జిల్లా ఉపాధికల్పన అధికారి మాధవి, పరిశ్రమల శాఖ ఏడీ నకుల్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్ఏటీఎస్ను సద్వినియోగం చేసుకోవాలి నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్(ఎన్ఏటీఎస్ 2.0)ను యువత సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ దివాకర సూచించారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్లో పాలిటెక్నిక్, డిగ్రీ విద్యార్థులు, సంస్థలు భాగస్వాములు కావాలన్నారు. ఎన్ఏటీఎస్ పోర్టల్ ద్వారా సంస్థలు ఖాళీలను ప్రకటిస్తున్నందున ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వంద శాతం ఓటరు మ్యాపింగ్ జిల్లాలో ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ వంద శాతం చేపట్టాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. కలెక్టరేట్ వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియ ఈనెల 25నుంచి మొదలుకానున్నందున పార్టీల నాయకులు పోలింగ్ కేంద్రాలకు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని తెలిపారు. వీరు బూత్ స్థాయి అధికారులతో ఇంటింటి ఎన్యుమరేషన్లో పాల్గొనాలని సూచించారు. ఓటరు మ్యాపింగ్ కాని వారు 11 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా ఒకటి అందించేలా ముందస్తు అవగాహన కల్పించాలని తెలిపారు. మ్యాపింగ్ అయిన వారు మాత్రం ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈసమావేశంలో కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ట్రెయినీ కలెక్టర్ పారస్ కుమార్, ఆర్డీఓ శ్రీనివాస్, ఎస్డీసీ సదానందం, ఉద్యోగులు ఎం.ఏ.రాజు, అన్సారీ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ దివాకర టీ.ఎస్. -
19 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలి
ఖమ్మంమయూరిసెంటర్: రాబోయే నోటిఫికేషన్లో కేవలం 5 వేల పోలీస్ ఉద్యోగాలే కాకుండా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 19 వేల పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగ హక్కుల రాష్ట్ర అధ్యక్షుడు పాలకూరి అశోక్ కోరారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన పలువురు అభ్యర్థులతో కలిసి కలెక్టర్ దివాకర టీ.ఎస్, సీపీ సునీత్దత్కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం అశోక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 19 వేల పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని డీజీపీ ప్రకటించగా, ప్రభుత్వం కేవలం 5 వేల ఉద్యోగాల భర్తీకే సిద్ధం కావడం సరికాదన్నారు. నాలుగేళ్లుగా నోటిఫికేషన్లు లేక పలువురి వయోపరిమితి దాటే పరిస్థితి ఉన్నందున మొత్తం పోస్టులు భర్తీ చేయడమే కాక కానిస్టేబుల్ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 36 ఏళ్లకు, ఎస్ఐ అభ్యర్థుల వయోపరిమితిని 38 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే, లాంగ్ జంప్ పరిమితిని 3.8 మీటర్లకు తగ్గించాలన్నారు. అంతేకాక గ్రూప్–1, 2, 3 ఉద్యోగాలను వేగంగా భర్తీ చేయడంతో పాటు డీఎస్సీ ద్వారా 25 వేల టీచర్ పోస్టులు, విద్యుత్ రంగంలో ఖాళీగా ఉన్న 5 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గుడిగండ్ల వెంకటేశ్, కృష్ణ, అశోక్, భీమారావు, గోపాల్, బదిసా, సంపత్, రమేశ్, నవీన్, లోకేశ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్, సీపీలకు నిరుద్యోగ హక్కుల వేదిక వినతి -
కొనసాగిన భానుడి ప్రతాపం
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో మంగళవారం ఎండ ప్రభావం కొనసాగింది. జిల్లాలో సగటున 39.4 నుంచి 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. గరిష్టంగా బచ్చోడులో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, చింతకానిలో 42.7, గుబ్బగుర్తిలో 42.6, కలెక్టరేట్ వద్ద 42.5, పమ్మి, తిమ్మారావుపేట, కాకరవాయిలో 42.2, ముదిగొండ, బాణాపురం, ఎర్రుపాలెంలో 41.9, పెద్దగోపతి, పల్లెగూడెంలో 41.8, నాగులవంచ, లింగాల, సిరిపురం, ఖమ్మం ఎన్నెస్పీ గెస్ట్హౌస్ వద్ద 41.6, వైరా, తల్లాడలో 41.5, ఖానాపురంలో 41.4, ప్రకాష్నగర్, నేలకొండపలి, కొణిజర్ల్ల, పంగిడిలో 41.3, కుర్నవల్లి, సత్తుపల్లిలో 41.2, ఏన్కూరు, మధిరలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. జూన్ మూడో వారం వచ్చినా ఎండలు తగ్గకపోగా, వర్షాల జాడ లేకపోవడంతో జనం ఎదురుచూస్తున్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు
● వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి ● కలెక్టర్ దివాకర టీ.ఎస్.వైరా: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ నమ్మకంతో వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. వైరాలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని మంగళవారం తనిఖీ చేసిన ఆయన క్యాజువాలిటీ, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ వార్డు, ఓపీ రూమ్, ల్యాబ్లను పరిశీలించడంతో పాటు చికిత్స కోసం వచ్చిన వారితో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. అలాగే, మందుల నిల్వలు, వైద్యుల హాజరును పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టడమే కాక మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఆతర్వాత 100 పడకల ఏరియా అస్పత్రి నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖరగౌడ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సౌకర్యాల కల్పనలో రాజీ పడొద్దు కారేపల్లి: మండలంలోని విశ్వనాథపల్లి జెడ్పీహెచ్ఎస్ను కలెక్టర్ దివాకర మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు సమకూర్చడమేకాక బోధన, అల్పాహారం, మధ్యాహ్న భోజన అమలులో రాజీ పడొద్దని ఉపాధ్యాయులకు సూచించారు. తహసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు, ఇన్చార్జి ఎంపీడీఓ మల్లెల రవీంద్రప్రసాద్, ఎంఈఓ దుగ్గిరాల జయరాజు, సర్పంచ్ ఇస్లావత్ రాజు, ఉపాధ్యాయుడు రాంకోటి పాల్గొన్నారు. -
రామయ్యా.. ఏమిటిలా?!
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనుల వ్యవహారం అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతోంది. ఆలయ అభివృద్ధి మొదటి దశ పనులకు ఇప్పటికే రెండు మార్లు టెండర్లు ఆహ్వానించినా ఓ కొలిక్కి రాలేదు. తొలిసారి ఒక్క బిడ్ కూడా దాఖలు కాకపోవడంతో రెండోమారు పిలిచారు. ఈసారి ఒకే బిడ్ దాఖలవడంతో వ్యవహారం ఆర్అండ్బీ శాఖ చీఫ్ ఇంజనీర్ కార్యాలయానికి చేరింది. ఉన్నతాధికారులు దీన్ని ఆమోదిస్తారా లేక ఒక్కటే నమోదైనందున మూడోసారి టెండర్లను ఆహ్వానిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఆమోదమా.. ఆపేస్తారా ? ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆలయ అభివృద్ధికి సుమారు రూ.351 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. తొలి విడత రూ.200 కోట్ల పనులకు ఒకే బిడ్ నమోదవడం గమనార్హం. రాష్ట్రంలో పేరున్న నిర్మాణ కంపెనీలు ముందుకు రాకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఒకే కంపెనీ ముందుకు రావడంతో అంతర్గతంగా ఏం జరుగుతుందోనన్న చర్చ మొదలైంది. అయితే, ఈ టెండర్లోనూప్రైస్ బిడ్ను తెరిచాక ఆమోదిస్తారా, లేక అంచనాలకు తగినట్లుగా లేకపోతే తిరిగి టెండర్లు ఆహ్వానిస్తారా అన్నది తేలాల్సి ఉంది. తిరిగి టెండర్లు ఆహ్వానిస్తే మరో నెల సమయం పడుతుంది. కానీ ప్రభుత్వం మే 1 నాటికి పనులను ప్రారంభించాలని సూచించింది. ఈ పనుల పూర్తికి 30 నెలలు గడువుగా పేర్కొన్నా పుష్కరాల ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని ఆదేశించారు. కానీ ఇప్పటివరకు టెండర్ల వ్యవహారమే కొలిక్కి రాకపోవడంతో పరిస్థితి ఏమిటన్నది ఎటూ తేలడం లేదు. రూ.200 కోట్ల పనులు భద్రగిరిని వీడని కష్టాలు రెండోసారి నిర్వహించిన టెండర్లలో టెక్నికల్ బిడ్ తెరిచాం. ఒకే నిర్మాణ కంపెనీ టెండర్ దాఖలు చేసింది. దీన్ని మా శాఖ ఎగ్జిక్యూటివ్ చీఫ్ ఆఫీస్కు పంపించాం. అక్కడ ఉన్నతాధికారులు పరిశీలించి, ఫైనాన్షియల్ బిడ్ తెరిచాక తుది నిర్ణయం తీసుకుంటారు. –లాల్సింగ్, ఎస్ఈ, ఆర్అండ్బీ శాఖ -
జేవీఆర్ ఓసీలో రక్షణ ఏర్పాట్లు పరిశీలన
సత్తుపల్లిరూరల్: సింగరేణి సత్తుపల్లి ఏరియాలోని గనుల్లో భద్రత, కార్మికుల ఆరోగ్య ప్రమాణాల పరిశీలనకు డీఎంఎస్ డాక్టర్ ఐ.సత్యనారాయణ మంగళవారం పర్యటించారు. కొత్తగూడెం రీజియన్ జీఎం (సేఫ్టీ) కృష్ణగోపాల్ తివారీతో కలిసి ఆయన జేవీఆర్ఓసీలో తనిఖీ చేశారు. బొగ్గు ఉత్పత్తి ప్రాంతాల్లో సేఫ్టీ మాక్ డ్రిల్ నిర్వహించారు. అలాగే, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై ఉద్యోగులు, కార్మికులకు అవగాహన కల్పించారు. బొగ్గు ఉత్పత్తితో పాటు కార్మికుల రక్షణ, ఆరోగ్యం సింగరేణికి ముఖ్యమని ఈ సందర్భంగా డీఎంఎస్ పేర్కొన్నారు. అనంతరం డీఎంఎస్ను ఏరియా అధికారులు సన్మానించారు. కార్యక్రమంలో పీఓలు ఎన్వీఆర్ ప్రహ్లాద్, సునీల్వర్మ, పలు విభాగాల అధికారులు బొల్లం శ్రీనివాస్, కె.సోమశేఖర్, బి.శ్రీనివాసరావు, జీవీ రావు, బి.రాజేశ్వరరావు, బి.రామకృష్ణ, జి.కల్యాణ్రామ్, గోవింద్, కావ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
భరోసా దర్బార్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాదర్బార్ ప్రజాసమస్యల పరిష్కారానికి వేదికగా మారింది. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా ఈ కార్యక్రమాల్లో ప్రజల సమస్యలను నేరుగా వినడంతోపాటు పరిష్కారంపై అధికారులకు సూచనలు చేశారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా పాలేరు నియోజకవర్గాన్ని 14 క్లస్టర్లుగా విభజించి ఈ కార్యక్రమాలు నిర్వహించగా, అందిన దరఖాస్తుల పరిశీలన, పరిష్కారానికి క్లస్టర్కు ముగ్గురు చొప్పున అధికారులను ప్రత్యేకంగా నియమించారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజాదర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ 25న నేలకొండపల్లి మండలం రాయగూడెం, తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామాల్లో ఈ కార్యక్రమం మొదలైంది. నియోజకవర్గంలోని 14 క్లస్టర్లలో రెండు నెలల్లో ఈ కార్యక్రమం ముగియగా, చివరి ప్రజాదర్బార్ ఈ నెల 8న ఏదులాపురం మున్సిపాలిటీలో జరిగింది. ఈ సందర్భంగా ప్రతీ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొని సుమారు 45 వేల మంది సమస్యలను తెలుసుకున్నారు. చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా.. మిగిలినవి తీవ్రత ఆధారంగా నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా లక్ష్యాన్ని నిర్దేశించారు. రెవెన్యూ సమస్యలపై కసరత్తు ఇందిరమ్మ ఇళ్లతోపాటు రెవెన్యూ సమస్యల పరిష్కారంపైనా అధికారులు దృష్టి పెట్టారు. రెవెన్యూ అంశాలపై అందిన 4 వేల దరఖాస్తుల్లో భూభారతి, సాదాబైనామాలకు సంబంధించినవి ఉన్నాయి. పీఓటీ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ – అసైన్డ్ భూముల బదిలీల నిషేధ చట్టం)పై 800 దరఖాస్తులు అందాయి. ఆర్ఎస్ఆర్ (రీ సర్వే సెటిల్మెంట్ రిజిస్టర్) ఎక్స్టెంట్లో సమస్యల వల్ల భూవిస్తీర్ణం భూభారతిలో నమోదు కావడం లేదు. దీని పరిష్కారానికి క్షేత్రస్థాయిలో భూముల రీ సర్వే కోసం ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాకు 70 గ్రామాలను ఎంపిక చేసి డిజిటల్ భూ సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో 3,500 ఎకరాల్లో రీ సర్వే పూర్తి చేయగా.. మిగతా చోట్ల కూడా నిర్వహించి భూసమస్యలకు పరిష్కారం చూపిస్తారు.పాలేరు నియోజకవర్గంలోని 14 క్లస్టర్లలో నిర్వహణ ప్రజాదర్బార్లో ప్రజలు 25 వేల దరఖాస్తులను అందజేశారు. ఇందులో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 9,731 ఉండగా, పెన్షన్ల కోసం 4,700 మంది, భూ సమస్యలపై 4 వేల మంది, గృహజ్యోతి పథకం కోసం 900 మంది, ఉపాధి హామీ జాబ్కార్డుల కోసం 600 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటితో పాటు మిగతా అన్ని దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. నెలరోజుల్లో పాలేరు నియోజకవర్గ పరిధిలో భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం దృష్టి సారించింది. వచ్చిన దరఖాస్తుల్లో అర్హులను గుర్తిస్తూ, సంబంధిత పథకాలు ఎప్పుడు మొదలైతే అప్పుడు దరఖాస్తు దారులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. -
వీధి వ్యాపారులకు ‘స్వనిధి’
31వేల మందికి పైగా గుర్తింపు జిల్లాలోని పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మెప్మా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం 31,666 మంది వీధి వ్యాపారులను గుర్తించి ఆన్లైన్లో నమోదు చేశారు. వీరిలో 31,207 మందికి గుర్తింపు కార్డులు, 24,959 మందికి వెండింగ్ సర్టిఫికెట్లు సైతం అందజేశారు. అత్యధికంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 23,993 మంది వ్యాపారులు నమోదయ్యారు. చకచకా మంజూరు చిరు వ్యాపారులకు పెట్టుబడి సాయం అందించి వారి ఆర్థికాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా మూడు విడతల్లో ఇప్పటివరకు మొత్తం రూ.70.01 కోట్ల రుణాలు అందించారు. మొదటి విడతలో రూ.15వేల చొప్పున 22,449 మంది వ్యాపారులకు రుణాలు మంజూరు కాగా, అందులో 22,301 మందికి రూ.23.06 కోట్లు పంపిణీ చేశారు. ఖమ్మంలో అత్యధికంగా 16,596 మందికి, సత్తుపల్లిలో 2,013 మందికి మొదటి విడత సాయం అందింది. రెండో విడతలో రూ.25వేల చొప్పున(మొదటి విడత రుణం సకాలంలో చెల్లించిన వారికి) జిల్లాలో 11,535 మందికి రుణాలు మంజూరయ్యాయి. ఇందులో 11,434 మంది లబ్ధిదారులకు రూ.24.02 కోట్ల రుణాలను బ్యాంకులు అందించాయి. ఇక మూడో విడతలో రూ.50వేలు చొప్పున (రెండో విడత రుణం సకాలంలో చెల్లించిన వారికి) 4,350 మందికి మంజూరు చేయగా, 4,263 మంది వ్యాపారులకు రూ.22.93 కోట్ల మేర ఆర్థికసాయం లభించింది. సత్తుపల్లి, వైరా భేష్.. వీధి వ్యాపారులను ఉమ్మడి గ్రూపులు(సీఐటీ గ్రూపులు)గా ఏర్పాటు చేయడంలో జిల్లా ముందంజలో నిలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 284 గ్రూపులను ఏర్పాటు చేయాలనే లక్ష్యంలో ఇప్పటివరకు 220 గ్రూపులు ఏర్పాటయ్యాయి. ఇందులో సత్తుపల్లి మున్సిపాలిటీ 22 గ్రూపుల లక్ష్యానికి వంద శాతంతో జిల్లాలో అగ్రస్థానాన నిలవగా, వైరా మున్సిపాలిటీ కూడా 21 గ్రూపులకు 20 గ్రూపులను ఏర్పాటు చేసి 95.24శాతానికి చేరింది. ఇక ఖమ్మం కార్పొరేషన్లో 218 గ్రూపుల లక్ష్యానికి గాను 158 గ్రూపులు ఏర్పాటయ్యాయి. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలోని ఆరు పట్టణ ప్రాంతాల్లో పీఎం స్వనిధి కింద కొత్తగా లక్ష్యాలను నిర్దేశించారు. మొదటి విడత : ఈ ఏడాది మరో 4,465 మంది వీధి వ్యాపారులకు మొదటి విడత రుణం అందించాలి. ఇందులో ఖమ్మం కార్పొరేషన్లో 2,867, ఏదులాపురంలో 704 మందిని లక్ష్యంగా నిర్దేశించారు. మిగతా లక్ష్యంలో ఇతర మున్సిపాలిటీల నుంచి ఎంపిక చేయా ల్సి ఉంటుంది. రెండు, మూడో విడత : రెండో విడత కింద 2,004 మందికి, మూడో విడత కింద 553 మందికి రుణాలు ఇప్పించాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా రుణాలు కరోనా కష్టాల నుంచి కోలుకుని స్వయం ఉపాధితో ముందడుగు వేస్తున్న వీధి వ్యాపారులకు కేంద్రప్రభుత్వ పీఎం స్వనిధి(ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి) పథకం కొండంత అండగా నిలుస్తోంది. జిల్లాలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) పరిధిలో ఈ పథకం విజయవంతంగా కొనసాగుతోంది. ఖమ్మం కార్పొరేషన్తో పాటు మధిర, సత్తుపల్లి, వైరా, ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీల్లో వీధి వ్యాపారులను గుర్తించి, గుర్తింపు కార్డులు జారీచేయడమే కాక వ్యాపార విస్తరణకు బ్యాంకుల నుంచి విడతల వారీగా రుణాలు ఇస్తున్నారు. మొదటి విడతగా రూ.15వేలు అందించి, అది సకాలంలో చెల్లిస్తే రెండో విడతగా రూ.24వేలు, అది చెల్లించాక మూడో విడతగా రూ.50వేల మేర రుణం మంజూరు చేస్తారు. తద్వారా వ్యాపారాల విస్తరణ, ఆర్థికాభివృద్ధికి దోహదపడనుంది. – ఖమ్మంమయూరిసెంటర్ -
నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
ప్రజాదర్బార్లో వచ్చిన దరఖాస్తుల్లో తక్షణం పరిష్కరించే స్థితిలో ఉన్న వాటికి వెంటనే మోక్షం లభిస్తోంది. నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరులో ఓవర్లోడ్ కారణంగా లోవోల్టేజీ సమస్య ఎదురవుతోంది. దీనిపై బోడులబండలో నిర్వహించిన ప్రజాదర్బార్లో సర్పంచ్ కళావతి, ఉపసర్పంచ్ వల్లాల రాధాకృష్ణ మంత్రి పొంగులేటికి దరఖాస్తు ఇచ్చారు. దీంతో ఆయన ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని ఆదేశించగా.. విద్యుత్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన ట్రాన్స్ఫార్మర్ అమర్చారు. దీంతో గ్రామంలో దాదాపు 200 గృహాలకు అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా అందుతుండగా గ్రామస్తులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. -
అత్యున్నత ప్రమాణాలతో పోలీసింగ్
ఖమ్మంక్రైం: మారుతున్న పరిస్థితులు, కొత్త సవాళ్లకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలతో పోలీసింగ్పై దృష్టి సారించాలని పోలీసు కమిషనర్ సునీల్దత్ సూచించారు. ఖమ్మం రూరల్ డివిజన్ పోలీస్ అధికారులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ స్టేషన్ హౌస్ ఆఫీసర్ క్షేత్రస్థాయిలో పర్యటించాలని, తద్వారా నేరాల కట్టడి సాధ్యమవుతుందని తెలిపారు. అంతేకాక యువత భవిష్యత్ను నాశనం చేస్తున్న గంజాయి, ఇతర మత్తుపదార్థాల రవాణా, అమ్మకాలతో పాటు సైబర్ నేరాలను అడ్డుకునేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విద్యాసంస్థల్లో విస్తృత అవగాహన కల్పించడం ద్వారా ఇది సాధ్యమవుతుందని తెలిపారు. కాగా, రైతులు నకిలీ విత్తనాల బారినపడి నష్టపోకుండా వ్యవసాయ, రెవెన్యూ శాఖలతో సంయుక్తంగా తనిఖీలు ముమ్మరం చేయాలని చెప్పారు. అంతేకాక ఏపీ నుంచి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పాటు రోడ్డు ప్రమాదాల కట్టడిపై దృష్టి సారించాలని సీపీ తెలిపారు. ఈసమావేశంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏపీపీ తిరుపతిరెడ్డి, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.పోలీసు కమిషనర్ సునీల్దత్ -
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్ ఖమ్మంలీగల్: ఈనెల 20న నిర్వహించే జాతీయ లోక్అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ సూచించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.దేవివీమానస ఆధ్వర్యాన మంగళవారం బ్యాంకర్లు, చిట్ఫండ్ ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాజడ్జి మాట్లాడుతూ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కరించడమే లక్ష్యంగా కక్షిదారులు ముందుకు రావాలని తెలిపారు. లోక్ అదాలత్లో రాజీ కుదిరే కేసులపై అప్పీల్కు వెళ్లే అవకాశం ఉండదని వెల్లడించారు. ఈసమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వై.రమేష్, బార్ కౌన్సిల్ మెంబర్ ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.రేపు బీఏఎస్ విద్యార్థుల ఎంపిక ఖమ్మంమయూరిసెంటర్: షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా నిర్వహిస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల(బీఏఎస్) పథకానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఎంపిక ఈనెల 18న నిర్వహించనున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డీడీ జి.జ్యోతి తెలిపారు. ఉదయం 11గంటలకు 1వ తరగతి(డే స్కాలర్), మధ్యాహ్నం రెండు గంటలకు 5వ తరగతి (రెసిడెన్షియల్) విద్యార్థుల ఎంపికకు లాటరీ ఉంటుందని వెల్లడించారు. కలెక్టరేట్లో జరిగే కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరు కావాలని సూచించారు. క్యాంపెయిన్ను విజయవంతం చేయాలి ఖమ్మం వైద్యవిభాగం: ‘స్టాప్ డయోరియా’ పేరిట చేపట్టే క్యాంపెయిన్ను విజయవంతం చేయాలని డీఎంహెచ్ఓ రామారావు సూచించారు. ఖమ్మంలో మంగళవారం నిర్వహించిన ఆశ నోడల్ ఆఫీసర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆశా కార్యకర్తలందరూ చురుగ్గా పాల్గొంటూ గ్రామాలు, వార్డుల్లో పారిశుద్ధ్యం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఓఆర్ఎస్ ద్రావణం వినియోగం, జింక్ మాత్రల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అలగే, ఈనెల 28, 29, 30వ తేదీల్లో పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 0–5 ఏళ్ల వయస్సు గల ప్రతీ చిన్నారికి చుక్కల మందు వేయాలని సూచించారు. అంతేకాక వచ్చేనెల 13న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంలో పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు అందేలా శ్రద్ధ వహించాలని తెలిపారు. అనంతరం శ్రీనివాస్ నగర్ యూపీహెచ్సీని డీఎంహెచ్ఓ తనిఖీ చేసి ఆరోగ్య సేవలపై సమీక్షించారు. ఇన్చార్జి డీఈఓగా సదానందం ఖమ్మం సహకారనగర్: జిల్లా విద్యాశాఖాధికారి చైతన్యజైనీ 60రోజుల పాటు సెలవులో వెళ్లడంతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఎల్ఏ) జి.సదానందంకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు కలెక్టర్ దివాకర టీ.ఎస్. మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు చైతన్యజైనీ విధుల్లో చేరేవరకు సదానందం పూర్తి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.52.95లక్షలు ఎర్రుపాలెం: జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించారు. ఈమేరకు 92 రోజులకు గాను రూ.52,95,430 ఆదాయం నమోదైందని ఈఓ జగన్మోహన్రావు తెలిపారు. లెక్కింపులో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప ప్రధాన అర్చకులు ఉప్పల మురళీమోహన్శర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్తో పాటు శ్రీసత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. -
సరిహద్దు భూవివాదాల పరిష్కారంపై దృష్టి
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో అటవీ – రెవెన్యూ భూముల సరిహద్దు వివాదాల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్తో కలిసి మంగళవారం ఆయన కలెక్టరేట్లో అధికారులతో సమావేశమయ్యారు. రెవెన్యూ, అటవీ భూమి సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని తెలిపారు. జాయింట్ సర్వే సమయాన సమావేశమై ప్రణాళిక రూపొందించుకుంటే ఫలితం ఉంటుందని చెప్పారు. ఆతర్వాత ఆర్ఎఫ్ఆర్ పట్టా భూముల్లో సమస్యలు, బోర్ల మంజూరు, అటవీ భూముల ఆక్రమణల కట్టడిపై సమీక్షించారు. కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ట్రెయినీ కలెక్టర్ పారస్ కుమార్, డీఆర్వో సీహెచ్.రామ్మూర్తి, ఆర్డీఓ శ్రీనివాస్, ఎఫ్ఆర్ఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
ఈ నెల 26 నుంచి పశువులకు టీకాలు
ఏన్కూరు: పశువుల్లో ముద్దచర్మ వ్యాధి నివారణ కోసం ఈ నెల 26 నుంచి జూలై 8వ తేదీ వరకు టీకాలు వేయనున్నట్లు జిల్లా పశువైద్యాధికారి పురంధర్ తెలిపారు. ఏన్కూరులో మంగళవారం నిర్వహించిన పశు వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. గురక, జబ్బవ్యాధి నివారణ వ్యా క్సినేషన్ ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ మేరకు రైతు తమ పశువులకు వ్యాక్సిన్లు వేయించాలని సూచించారు. మండల పశువైద్యాధికారి ఉపేందర్, ఉద్యోగులు సుధాకర్, నర్సింహారావు పాల్గొన్నారు. ఓటర్ల మ్యాపింగ్ త్వరగా పూర్తి చేయాలికారేపల్లి: 2002 జాబితాతో ప్రస్తుత ఓటర్ల జాబితా మ్యాపింగ్ త్వరగా పూర్తి చేయడమే కాక ఈనెల 25వ తేదీ నుంచి ఇంటింటి సర్వేకు ఉద్యోగులు సిద్ధం కావాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కారేపల్లిలో మంగళవారం బీఎల్ఓలతో పాటు పార్టీల బీఎల్ఏలు, సర్పంచ్లతో ఎస్ఐఆర్(ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ)పై అవగాహన, శిక్షణ శిబిరం ఏర్పాటుచేశారు. తొలుత ఉద్యోగులతో సమావేశమైన అదనపు కలెక్టర్ ఇప్పటి వరకు పూర్తయిన మ్యాపింగ్పై ఆరా తీశాక మిగతా వారిని విభాగాల వారీగా విభజించిఇంటింటికి సర్వే సమయాన ఎన్యుమరేషన్ ఫామ్లు సేకరించాలని ఆదేశించారు. ఈవిషయంలో పార్టీల బీఎల్ఏలు, సర్పంచ్లు ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. సింగరేణి తహసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు, ఇన్చార్జి ఎంపీడీఓ మల్లేల రవీంద్రప్రసాద్, సర్పంచ్లు మేదరి టోనీవీరప్రతాప్, భూక్యా రంజిత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. బీఎల్ఓలు సర్పంచ్లతో సమావేశంలో అదనపు కలెక్టర్ -
లారీ క్యాబిన్లో డ్రైవర్ మృతి
పెనుబల్లి: అస్వస్థతకు గురైన లారీడ్రైవర్ ఎల్లయ్య (65) క్యాబిన్లోనే మృతి చెందిన ఘట న మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రీన్ ఫీల్డ్ హైవేపై లారీ నడుపుతున్న డ్రైవర్ ఎల్లయ్య మండలంలోని ముత్తగూడెం వద్దకు చేరుకోగానే అస్వస్థతకు గురై పక్కకు నిలిపాడు. ఆపై పరిస్థితి విషమించడంతో ఆయన క్యాబిన్లోనే మృతిచెందాడు. కాగా, ఆయన వద్ద ఆధారాలను పరిశీలించి మృతుడు సిద్దిపేట జిల్లా గణేశ్నగర్ వాసిగా గుర్తించినట్లు వీఎం బంజర్ పోలీసులు తెలిపారు. డెంగీతో ఒకరు.. తల్లాడ: మండలంలోని కుర్నవల్లికి చెందిన ఓ వ్యక్తి (45) డెంగీతో బాధపడుతూ మంగళవారం మృతి చెందాడు. కొంతకాలంగా లివర్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయనను గత నెల 18న ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ నెల 1వ తేదీన ఆయనకు డెంగీ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆపై పరిస్థితి విషమించి మృతి చెందాడు. సమాచారం తెలియడంతో మండల వైద్యాధికారి ప్రత్యూష, ఎంపీడీఓ శ్రీధర్రాజు కుర్నవల్లి గ్రామాన్ని సందర్శించి శానిటేషన్ చేయించడంతో పాటు ఇంటింటా ఫీవర్ సర్వే చేపట్టారు. -
వడదెబ్బతో ఇద్దరు మృతి
పెనుబల్లి/బూర్గంపాడు: ఉమ్మడి జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు మంగళవారం వడదెబ్బతో మృతి చెందారు. సత్తుపల్లి మండలం యా తాలకుంటకు చెందిన నేరెళ్ల వెంకటేశ్వరరావు (55) పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజరలోని తన చెల్లిలి ఇంటికి వచ్చి అక్కడి నుంచి చౌడవరంలోని కూతురి ఇంటికి వెళ్లాడు. అక్కడకు వెళ్లగానే వాంతులు చేసుకుంటూ అపస్మారక స్థితికి చేరగా కుటుంబ సభ్యులు పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే సరికే వెంకటేశ్వరరావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎండలో తిరగడం వల్ల వడదెబ్బతో మృతి చెందినట్లు భావిస్తున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అలాగే, బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెంకు చెందిన కొప్పుల శ్రీను (50) వడదెబ్బ తో మృతి చెందాడు. కొంతకాలంగా కుటుంబంతో విభేదించి భిక్షాటన చేసి జీవిస్తున్న ఆయన మంగళవారం గ్రామంలోని కొర్రాజుల గుడి వద్ద నిద్రించాడు. రెండు రోజులుగా ఎండల తీవ్రతతో వడదెబ్బకు గురైన ఆయన నిద్రలోనే ప్రాణాలు వదిలాడు. -
బీఏఎస్ విద్యార్థుల్లో ఆందోళన
ఖమ్మంమయూరిసెంటర్: బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల (బీఏఎస్) పథకం ద్వారా జిల్లాలోని పలు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కొత్త విద్యాసంవత్సరం మొదలై రెండు రోజులైనా అనుమతించకపోవడం ఇందుకు కారణమైంది. పథకం ఈ విద్యా సంవత్సరం లేదనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలని ఓ పాఠశాల యాజమాన్యం ఏకంగా వాట్సప్ ద్వారా మెసేజ్ పంపించడం గమనార్హం. ఏటా ఇలానే వేధిస్తున్నందున ప్రభుత్వం స్పందించి పిల్లల భవిష్యత్ను కాపాడాలని కోరుతున్నారు. ఈ విషయమై ఎస్సీ డీడీ జి.జ్యోతిని వివరణ కోరగా.. బీఏఎస్ పథకం కొనసాగుతున్న పాఠశాలల యాజమాన్యాలతో ఇప్పటికే సమావేశమై పిల్లలకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తే పాఠశాల గుర్తింపు రద్దుకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిపారు. మరోమారు పరిశీలించి విద్యార్థులకు ఇబ్బంది రాకుండా చూస్తామని వెల్లడించారు. కొనసాగిన బస్సుల తనిఖీలు ఖమ్మంక్రైం: ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోని ప్రైవేట్ పాఠశాలల బస్సుల గుర్తింపునకు రవాణా శాఖ అధికారులు రెండో రోజైన మంగళవారం కూడా తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా తిరుగుతున్న మూడు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రెండు బస్సులను గుర్తించి కేసు నమోదు చేశా మని జిల్లా ఇన్చార్జ్ రవాణాశాఖాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఇకనైనా పాఠశాలల యాజమాన్యాలు అన్ని బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలని, లేనిపక్షంలో సీజ్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేయాలి కూసుమంచి: రైతుల వివరాల నమోదుకు చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీని నూరుశాతం పూర్తి చేయా లని జిల్లా వ్యవసాయశాఖ అధికారి డి.పుల్లయ్య సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రీ, యాప్ తదితర అంశాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉన్నతాధికారులు మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు ఆయన కూసుమంచిలోని రైతువేదిక నుంచి హాజరయ్యారు. అనంతరం శాఖ అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. ఫార్మర్ రిజిస్ట్రీపై దృష్టి సారించడమే కాక రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ఆ తర్వాత పాలేరులోని ఎరువుల దుకాణాలను డీఏఓ తనిఖీ చేశారు. ఆత్మ పీడీ సరిత, కూసుమంచి ఏడీఏ సతీశ్, ఏఓ వాణి, ఏఈఓలు పాల్గొన్నారు. యువకుడిపై పోక్సో కేసు ఖమ్మంక్రైం: బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఓ యువకుడిపై ఖమ్మం త్రీటౌన్ పోలీసులు మంగళవారం పోక్సో కేసు నమోదు చేశారు. ఖమ్మం పంపింగ్ వెల్ రోడ్ ప్రాంతానికి చెందిన డిగ్రీ చదివే యువకుడు అదే ప్రాంతానికి చెందిన బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమె కుటుంబీకుల ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో చోరీకి యత్నం ఖమ్మంక్రైం: ఖమ్మంలోని డీమార్ట్ సమీపాన ముగ్గురు వ్యక్తులు మంగళవారం ఓ ఇంట్లో చోరీకి యత్నించారు. ఇద్దరు మహిళలతో పాటు మరో వ్యక్తి గడ్డ పారతో ఇంటి గొడను పగులకొడుతుండగా ఆ మార్గంలో వెళ్తున్న ఆటోడ్రైవర్, ఆయన స్నేహితుడు అడ్డుకోబోగా వారిపై దాడికి యత్నించారు. దీంతో వారు కేకలు వేయడంతో స్థానికులు చేరుకోగా ఓ మహిళ పట్టుబడగా త్రీటౌన్ పోలీసులకు అప్పగించారు. -
తీరు మారదా ?!
తిరుమలాయపాలెం: పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి కొందరు వైద్యులు, సిబ్బంది తూట్లు పొడుస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆస్పత్రుల్లో సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తిరుమలాయపాలెం సీహెచ్సీ ఆస్పత్రి ఆవరణలోనే ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదేశించినా పరిస్థితి మార్పు రాకపోవడం విమర్శలకు తావిస్తోంది. సీహెచ్సీలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఓపీ సేవలు అందించాల్సిన వైద్యుల కుర్చీలు ఖాళీగా కనిపించాయి. ఈ ఆస్పత్రిలో ఇటీవల ఓ వృద్ధుడికి చికిత్స సందర్భంగా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో విచారణ జరుగుతోంది. అయినా మంగళవారం ఆర్ఎంఓ వైదేహితో పాటు ఆరుగురు డాక్టర్లు మాత్రమే హాజరయ్యారు. ఇందులో ప్రసూతి వైద్యురాలు ప్రసన్నజ్యోతి, అనస్తీషియన్ ప్రదీప్రెడ్డి ఇద్దరు మహిళలకు ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేసి మధ్యాహ్నం వెళ్లిపోయారు. ఇక ఇన్చార్జ్ సూపరింటెండెంట్ బొల్లికొండ శ్రీనివాసరావు 11.30 గంటలకే వెళ్లిపోగా మరో వైద్యుడు లవన్కుమార్ మాత్రమే ఉన్నారు. ఆస్పత్రిలో 20 మందికి పైగా ఇన్ పేషంట్లు, కుటుంబ నియంత్రణ చేయించుకున్న మహిళలు ఇద్దరు ఉండగా.. అత్యవసర పరిస్థితి ఎదురైతే ఎవరు వైద్యం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు ఆస్పత్రిలో ఉండాల్సి ఉన్నా అలా జరగకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. సీహెచ్సీలో అందుబాటులో లేని వైద్యులు ఆస్పత్రిలో వైద్యులు సమయపాలన పాటించకపోతే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఆస్పత్రిలో జరిగిన ఘటనపై విచారణ జరుగుతోంది. మరోమారు పరిశీలించి విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహించినట్లు తేలితే చర్యలు తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చూస్తాం. –రాజశేఖర్గౌడ్, డీసీహెచ్ఎస్ -
జోరుగా నకిలీ విత్తనాల విక్రయం?
ఏన్కూరు: ఏన్కూరు కేంద్రంగా నకిలీ పత్తి విత్తనాల విక్రయం జోరుగా సాగుతోందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన హెచ్టీ బీసీ–3 విత్తనాలను కొందరు విక్రయిస్తున్నట్లు సమాచారం. రాత్రి వేళ గుడ్డ సంచుల్లో విత్తనాలను తీసుకొచ్చిన అక్రమార్కులకు గిరిజనులఅమాయకత్వమే ఆసరా అవుతోంది. ఈ విత్తనాలు వారికి అంటగడుతూ సొమ్మ చేసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాక నిషేధించిన కలుపు మందు గ్లైసిన్ కూడా విక్రయిస్తున్నారని ప్రచారం సాగుతోంది. అయితే, అడపాదడపా అధికారులు కేసులు నమోదు చేస్తున్నా అక్రమార్కుల తీరు మారడం లేదు. గత ఏడాది కేసులు మండలంలోని రేపల్లెవాడ, ఏన్కూరు గ్రామాల్లో గత ఏడాది నకిలీ విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రా నుంచి ఇక్కడికి తీసుకువచ్చి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను పట్టుకొని రూ.14 లక్షల విలువైన 560 కేజీల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఉమ్మడి జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉండే ఏన్కూరు, కామేపల్లి, కారేపల్లి, జూలూరుపాడు మండలాల్లో నకిలీ పత్తి విత్తనాల విక్రయం జోరుగా సాగుతోందని సమా చారం. ఒకరి నుంచి ఇంకొకరికి సమాచారం చేరవేస్తూ విత్తనాలు ఇస్తున్నారని తెలిసింది. ప్రజల ఆరోగ్యానికి ముప్పు.. హెచ్టీ బీటీ–3 విత్తనాల సాగుతో ప్రజలకేగాక ఇతర ప్రాణులు, పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. ఈ విత్తనాల సాగుతో కలుపు బెడద లేకు న్నా అనేక నష్టాలు ఎదురవుతాయని చెబుతున్నా రు. మరోపక్క కొన్నిచోట్ల కలుపు నివారణకు నిషేధిత గ్లైసిన్ మందు పిచికారీ చేస్తుండడం, ఈ భూముల్లో పంట అవశేషాలను పశువులు, మేకలు తింటే అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోతాయి. వీటి ఉత్పత్తి, అమ్మకాలపై నిషేధం ఉన్నా అక్రమార్కులు దొడ్డిదారిన తీసుకొచ్చి గిరిజన రైతులకు అంటగడుతున్నారని సమాచారం. మండలంలో మూడేళ్లుగా ననిలీ విత్తనాల దందా సాగుతున్నా వ్యవసాయ, పోలీసు శాఖలు పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. టాస్క్ఫోర్స్ బృందాలు లైసెన్సు కలిగిన విత్తన దుకాణాల్లో తనిఖీ చేస్తూ, గ్రామాల్లో లూజ్గా జరుగుతున్న అమ్మకాలపై దృష్టి పెట్టడంలేదని చెబుతున్నారు. ఇకనైనా గ్రామాల్లో సైతం విస్తృత తనిఖీలు చేయడమే కాక నిషేధిత విత్తనాల సాగుతో ఎదురయ్యే అనర్థాలపై రైతులకు అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు. -
కాలగర్భంలోకి డీసీఎంఎస్!
ఖమ్మంవ్యవసాయం: జిల్లా కో–ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)లకు ప్రభుత్వం చరమగీతం పాడుతోంది. రాష్ట్రంలోని పూర్వ తొమ్మిది జిల్లాల్లో ఉన్న డీసీఎంఎస్లు రైతులకు సేవలందిస్తున్నాయి. ప్రస్తుతం వీటిని మార్క్ఫెడ్లో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఖమ్మం డీసీఎంఎస్ కూడా కాలగర్భంలో కలిసిపోనుంది. 60 ఏళ్ల క్రితం రైతులు, పలు వర్గాల ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం సహకార వ్యవస్థలు, చట్టాలను రూపొందించింది. గ్రామీణస్థాయిలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్) ఏర్పాటు చేసి, వీటికి ప్రయోజనం చేకూర్చడం, ఆర్థికంగా చేయూత నిచ్చేలా జిల్లాస్థాయిలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ), జిల్లా కో–ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్)లను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థలకు పాలకవర్గాలను నియమిస్తుండగా, డీసీఎంఎస్ ద్వారా రైతులు పండించిన పంటల కొనుగోళ్లు, ఎరువులు, క్రిమిసంహారక మందులే కాక విత్తనాల విక్రయాలు చేపడుతున్నారు. 1963లో ప్రారంభం ఉమ్మడి జిల్లా కో–ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీకి 63 ఏళ్ల చరిత్ర ఉంది. 1963లో ఈ డీసీఎంఎస్ రిజిస్ట్రేషన్ కాగా, కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఎరువులు, క్రిమి సంహా రక మందులు, విత్తనాల అమ్మకం, పంటల కొనుగోళ్లతో బలమైన ఆర్థిక పునాదులు పడ్డాయి. ఇది జిల్లాస్థాయిలో పాలకవర్గం కలిగి రైతు సహకార సంఘాలు, ఇతర సహకార సంఘాల ప్రయోజనాల కోసం పనిచేస్తోంది. గోదాములు, షాపింగ్ కాంప్లెక్స్లు డీసీఎంఎస్ పరిధిలో రూ.40 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. ఖమ్మంలోని వెంకటగిరి గేటు వద్ద 5.12 ఎకరాల విస్తీర్ణంలో వేయి మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన రెండు గోదాములు, 500 మెట్రిక్ టన్నుల రెండు గోదాములు ఉన్నాయి. ఇవికాక కొత్తగూడెంలో వేయి, 500 మెట్రిక్ టన్నుల గోదాములు రెండు, భద్రాచలంలో 1,500, 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన రెండు గోదాములు ఉన్నాయి. ఇక ఖమ్మంలో 32 షాపులతో కూడిన కాంప్లెక్స్ ఉంది. అలాగే, ఖమ్మం వ్యవ సాయ మార్కెట్ వద్ద 1.20 ఎకరాలు, మధిరలో 333 గజాల స్థలం ఉంది. ఈ మొత్తం ఆస్తుల విలువ రూ.40కోట్ల వరకు ఉంటుంది. అలాగే, దుకాణ సముదాయాలు, గోదాముల నుంచి అద్దె రూపంలో నెలవారీ ఆదాయం సమకూరుతోంది. ఈ క్రమాన డీసీఎంఎస్ రూ.15 లక్షలకు పైగా లాభాల్లో కొనసాగుతుండగా, సొసైటీని మార్క్ఫెడ్ లో విలీనం చేస్తే ఆస్తులన్నీ బదలాయించే అవకాశముంది. అయితే, డీసీఎంఎస్ పరిధిలో కొనసాగుతున్న 70మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని మార్క్ఫెడ్లోకి తీసుకుంటారా, లేదా అన్నది తేలాల్సి ఉంది. డీసీఎంఎస్లను మార్క్ఫెడ్లో విలీనం చేసే అంశం రాజకీయ పార్టీల నాయకులు, రైతుల్లో చర్చ జరుగుతోంది. ఆరు దశాబ్దాలుగా రైతులు, పలు వర్గాలకు సేవలందిస్తున్న డీసీఎంఎస్లను తొలగించటం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రూ.వందల కోట్ల విలువైన ఆస్తులు, భూములు కలిగిన డీసీఎంఎస్ను తొలగించడం కన్నా బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తే రైతులు, ప్రజలకు మరింత ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు. -
లేబర్కోడ్ల రద్దుకు ఉద్యమించాలి
ఖమ్మం మామిళ్లగూడెం: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై దేశ వ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి శింగు నర్సింహారావు తెలిపారు. సోమవారం ఖమ్మం గిరిప్రసాద్ భవన్లో రావి శివరామకృష్ణ అధ్యక్షతన జరిగిన జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నూతన లేబర్ కోడ్ల ఆధారంగా యాజమాన్యాలు కార్మికులపై పనిభారం ఎనిమిది గంటల నుంచి 12 గంటలకు పెంచారన్నారు. సంఘం హక్కును, సమ్మె హక్కును నిరాకరించి, కనీస వేతనాలు, అదనపు పనికి అదనపు వేతనం చెల్లించడం లేదన్నారు. పెరుగుతున్న ధరలతో పెరగని వేతనాలతో కార్మికుల జీవితాలు దుర్బరమవుతున్నాయన్నారు. కార్మికుల సంఖ్యను తగ్గించి పని భారాన్ని పెంచుతున్నారన్నారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు, జిల్లా నాయకులు సిహెచ్ సీతామహాలక్ష్మి, పిల్లి రమేష్ పాల్గొన్నారు. నేలకొండపల్లి: అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ ఎవరైనా పట్టుకుంటారనే భయంతో వేగంగా వెళ్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఏపీ నుంచి ప్రతీరోజు భారీగా ఇసుక తరలిస్తుండగా, నేలకొండపల్లి మండలం నుంచి వివిధ ప్రాంతాలకు తరలిస్తుంటారు. ఈక్రమాన సోమవారం కూడా నాలుగు ట్రాక్టర్లలో ఇసుక తీసుకొస్తుండగా మంగాపురంతండా గ్రామంలోకి రాగానే డ్రైవర్లు వేగం పెంచారు. ఇందులో ఓ ట్రాక్టర్ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టగా స్తంభం విరిగి తీగలు వేలాడాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు సరఫరా నిలిపివేయిండంతో ప్రమాదం తప్పింది. ఆపై ట్రాక్టర్లను అడ్డుకోగా డ్రైవర్లు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. కాగా, ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని అధికారులకు సమాచారం ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఖమ్మం సహకారనగర్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న టీజీఈ హైట్స్ (తెలంగాణ ఉద్యోగుల, పెన్షనర్ల హౌస్ బిల్డింగ్ కోఆపరేటివ్ సొసైటీ) ఆవరణలో సబ్స్టేషన్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టర్ దివాకర టీ.ఎస్.కు టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాస్, హౌస్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు కొండపల్లి శేషుప్రసాద్, డాక్టర్ పి.విజయ్కుమార్ వినతిపత్రం అందజేసి మాట్లాడారు. టీజీఈ హైట్స్లో 576 మంది ఉద్యోగుల గృహ నిర్మాణ పనులు జరుగుతున్నందున సమీపంలో ఎకరం స్థలాన్ని సబ్స్టేషన్కు కేటాయించాలని కోరారు. టీఎన్జీవో జిల్లా కోశాధికారి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఖమ్మంమయూరిసెంటర్: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎలాంటి మధ్యవర్తులు లేకుండా, వందశాతం పారదర్శకంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేస్తున్నామని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన 46 మంది లబ్ధిదారులకు రూ.16,64,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. పట్టణ ప్రాంతాల్లో ‘ఉపాధి’ కల్పించాలని.. ఖమ్మం మామిళ్లగూడెం: పట్టణ ప్రాంతాల్లో మహాత్మాగాంధీ ఉపాధి పనులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు వై.విక్రం ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సమస్యలపై కేఎంసీ కార్యాలయంలో కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. డివిజన్ కార్యదర్శి నాగేశ్వరరావు, రత్తమ్మ, వెంకన్న, పాపారావు, సైదులు, నరేష్, హిమం, సుదర్శన్, జనా ర్ధన్, పెంటయ్య, భద్రం రెడ్డి, మధు, ఉన్నారు. బస్సులు ఆపాలని.. ఖమ్మంఅర్బన్: ఖమ్మం నగరంలోని గోపాలపురం వద్ద ఆర్టీసీ బస్సులను ఆపాలని కోరుతూ గ్రామస్తులు సోమవారం ఆర్టీసీ అధికారులకు బీఆర్ఎస్ నాయకుడు భూక్యా అశోక్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. గతంలో గోపాలపురంలో అన్ని బస్సులు ఆగేవని, కొంతకాలంగా బస్సులు అక్కడ ఆగకుండా నేరుగా వెళ్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలని.. రఘునాథపాలెం: జీపీ కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాలను వెంటనే అమలు చేసి, వేతనాలను పెంచాలని కోరుతూ తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ) నాయకులు సోమవారం ఎంపీడీవో అశోక్కు వినతిపత్రం అందజేశారు. జిల్లా కార్యదర్శి జి.రామయ్య, మండల కార్యదర్శి రవి, ప్రసాద్, శ్రీనివాస్, మల్లుసూర్, రమేష్, సైదులు ఉన్నారు. తీవ్ర సంక్షోభంలో వ్యవసాయ రంగం తిరుమలాయపాలెం: దేశంలో రైతుల పరిస్థితి దీనంగా ఉందని, దీనంతటికీ పాలకులు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలే కారణమని అఖిలభారత రైతుకూలీ సంఘం రాష్ట్ర నాయకులు మందుల రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ మేరకు సోమవారం మండలంలోని బచ్చోడులో నిర్వహించిన ఏఐకేఎంఎస్ 7వ మండల మహాసభలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా మండల నూతన ధ్యక్ష కార్యదర్శులుగా గొర్రెపాటి వీరస్వామి, అచ్చ ఉప్పలయ్యతో పాటు మరో పదకొండు మందితో కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ప్రకాష్ జిల్లా సహాయ కార్యదర్శి పి.నాగయ్య, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్, ఆడెపు నగేష్, పట్టాభి, బ్రహ్మచారి, వెంకటేశ్వర్లు, మల్సూరు, మల్లయ్య, శ్రీను ఉన్నారు. భవనం పైనుంచి పడి చిన్నారి మృతి ఖమ్మంఅర్బన్: ఖమ్మం 11వ డివిజన్ పరిధిలో భవనంపై ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు కింద పడగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. వరదయ్యనగర్లోని కమతం అపార్ట్మెంట్ పెంట్హౌస్లో విద్యుత్ సబ్స్టేషన్ ఆపరేటర్ ఏపూరి అనిల్కుమార్ కుటుంబంతో నివసిస్తున్నారు. ఆయన కుమారుడు ఉద్భవ్(5) ఆదివారం సాయంత్రం ఐదో అంతస్తులో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. దీంతో తీవ్రగాయాలైన ఆయనకు చికిత్స చేయిస్తుండడంతో పరిస్థితి విషమించి మృతి చెందగా, తండ్రి అనిల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ తెలిపారు. -
ఘనంగా భట్టి జన్మదిన వేడుకలు
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా కార్యాలయం సంజీవరెడ్డి భవన్లో డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. 300 మంది దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బానోత్ బాలాజీ నాయక్, మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రబ్బానీ, జిల్లా ఆర్టీఏ మెంబర్ గజ్జెల్లి వెంకన్న, అనుబంధ సంఘాల అధ్యక్షుడు దొబ్బల సౌజన్య, సయ్యద్ గౌస్, వేజండ్ల సాయి కుమార్, మొక్క శేఖర్ గౌడ్, బొడ్డు బొందయ్య, పుచ్చకాయల వీరభద్రం, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, డీసీసీ ప్రధాన కార్యదర్శులు కిలారు అనిల్ కుమార్, పట్టాభి, వెంకటరెడ్డి, మాజీ కార్పొరేటర్లు వెంకటేశ్వరరావు, బాలగంగాధర్ తిలక్, బచ్చలికూర నాగరాజు, అంజనీ కుమార్ పాల్గొన్నారు. నేలకొండపల్లి: మండల కేంద్రంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి జెర్రిపోతుల అంజిని ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు.కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు, కార్యదర్శి రేగూరి వాసవి, దోసపాటి శేఖర్, వంగవీటి నాగేశ్వరరావు, జెర్రిపోతుల సత్యనారాయణ, కడియాల నరేష్, గండు సైదులు, పసుపులేటి ఉపేందర్, చెరుకు రంగయ్య, రాయపూడి రోహిత్, పెద్ధపాక ముత్తయ్య,సైదా, లాల్, పాషా, సందీఫ్, బచ్చలకూరి నాగేశ్వరరావు ఉన్నారు. తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం సీహెచ్సీకి తీసుకొచ్చిన వృద్ధుడికి నిర్లక్ష్యంగా చికిత్స చేయడంతో యూరిన్ బ్లాడర్ దెబ్బతిని తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని అందిన ఫిర్యాదుతో విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఆస్పత్రిలో డీసీహెచ్ఓ డాక్టర్ రాజశేఖర్గౌడ్ విచారించారు. తాజాగా సోమవారం కల్లూరి ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ రమేష్ సోమవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా తూమాటి కాంతయ్యకు వైద్యం చేసిన డాక్టర్ ప్రవీణ్కుమార్, సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. అయితే, కాంతయ్య కుటుంబీకులకు కూడా సమాచారం ఇచ్చినా విచారణకు హాజరుకాలేదని తెలిపారు. నేలకొండపల్లి: క్రికెట్ బంతి తీసేందుకు వెళ్లిన సమయాన ప్రహరీ కూలడంతో ఓ విద్యార్థి తీవ్రంగాగాయపడ్డాడు. మండలంలోని రాజేశ్వరపురానికి చెందిన బత్తిని వరుణ్ స్థానిక మిల్లు సమీపాన సోమవారం మరికొందరితో క్రికెట్ ఆడుతున్నారు. ఈ సమయంలో బాల్ దూరంగా ప్రహరీ అవతల పడడంతో తీసుకొచ్చేందుకు ముగ్గురు వెళ్లారు. ఇందులో వరుణ్ గోడ పైనుంచి వంగి బాల్ను తీసే క్రమాన అది కూలడంతో ఆయన ఓ చెవి తెగిపోవడంతో పాటు కింద వరుస పళ్లు ఊడిపోయాయి. అంతేకాక కాళ్లు విరగగా 108 సిబ్బంది నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. ఖమ్మంమయూరిసెంటర్: నగరంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో సహకరించాలని కేఎంసీ కమిషనర్, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అభిషేక్ అగస్త్య అన్నారు. ఈ మేరకు సోమవారం ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 16 నుంచి 20 వరకు బూత్ లెవల్ ఆఫీసర్లు, ఏజెంట్లు, సంబంధిత ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. కామేపల్లి: మొక్కజొన్న కొనుగోలులో ఇబ్బందులు లేకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేయడంతో పాటు నగదు జమ కావడంపై మండలంలోని కొండాయిగూడెం సొసైటీ పరిధిలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం సీఎం రేవంత్రెడ్డి, జిల్లా మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం సొసైటీ చైర్మన్ ధనియాకుల హన్మంతరావు, సీఈఓ దొడ్డా ముత్తయ్యను సత్కరించారు. ధనియాకుల మాధవరావు, వీరభద్రరావు, శ్రీనివాసరావు, దుద్దుకూరి నవీన్, గొడుగు కొరివిలు, వీరన్న, నాగరాజు ఉన్నారు. వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలి ఖమ్మం మామిళ్లగూడెం: వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని సీపీఎంఎల్ మాస్ లైన్ నాయకులు ఆవుల అశోక్ డిమాండ్ చేశారు. సోమవారం సీహెచ్.శిరోమణి అధ్యక్షతన స్థానిక రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆరోగ్యశ్రీకి ప్రత్యేక బడ్జెట్ ని కేటాయించాలన్నారు. ఝాన్సీ, శ్రీనివాస్, శోభ, తేజ నాయక్, ఎన్రాకేష్, భరత్, లక్ష్మణ్, రామనాథం, పాపారావు ఉన్నారు. -
ఎత్తుకు.. పైఎత్తు !
సాక్షిప్రతినిధి, ఖమ్మం: అక్రమ సంపాదనకు అలవాటుపడిన ఇసుకాసురులు సరికొత్త వ్యూహాలతో అక్రమ రవాణాకు దారులు వెతుకుతున్నారు. ఇదేసమయాన నిరంతరం నిఘా, పక్కా ప్రణాళికతో వారి వ్యూహాలను పోలీసులు చిత్తు చేస్తూ చెక్ పెడుతున్నారు. ఇటీవల ఏపీ నుంచి ఇసుక తరలిస్తున్న కంటెయినర్ వైరాలో పట్టుబడింది. లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లలో ఇన్నాళ్లు ఇసుక తరలిస్తుండగా, కొత్తగా కంటెయినర్ పట్టుబడడం.. దీనికి ఎస్కార్ట్గా ఖరీదైన థార్ ఉండడం విస్తుపోయేలా చేసింది. ఇసుక అక్రమ రవాణాలో అందెవేసిన ఓ ముఠా ఈ పనికి పాల్పడినట్లు గుర్తించారు. ఏపీ టూ తెలంగాణ ఇసుక స్మగ్లింగ్లో ఆరితేరిన ఓ ముఠా నిత్యం దందాకు పాల్పడుతోంది. ఆంధ్రప్రదేశ్ ఇసుక రీచ్ల వద్ద టన్ను రూ.200కు కొనుగోలు చేసి.. అక్కడి నుంచి పోలీసులను ఏమారుస్తూ సరిహద్దు దాటి తెలంగాణలోకి వాహనాలను చేరుస్తున్నారు. ఇక్కడ అవసరాల దృష్ట్యా టన్ను రూ.1,500 నుంచి రూ.2వేల వరకు అమ్ముతూ ముఠా రూ.లక్షలు దాటి రూ.కోట్లలో సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలోనే కాక ఈ ముఠా హైదరాబాద్లో కూడా ఇసుక విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఖమ్మంకు చెందిన చల్లమల్ల వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు సుమంత్కుమార్ ఇసుక అక్రమ రవాణానే ప్రధాన వృత్తిగా ఎంచుకున్నట్లు తెలుస్తుండగా వైరాలో పోలీసులకు వీరిద్దరు పట్టుబడ్డారు. ఇందులో సుమంత్పై ఇప్పటికే 12కు పైగా కేసులు ఉండగా, కొన్నిసార్లు జైలుకు వెళ్లినా తీరు మారలేదని తేలింది. ఆయన తండ్రి వెంకటేశ్వరరావుపై గతంలో కేసులు నమోదయ్యాయి. కొత్త ఎత్తుగడ.. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. అలాగే నిఘా కూడా పటిష్టం చేశారు. అయినా ఆంధ్రప్రదేశ్లోని ఇసుక రీచ్ల నుంచి ఇసుకను తెలంగాణకు తరలించేందుకు ఈ ముఠా 22 చక్రాల భారీ లారీని కొనుగోలు చేసి చెక్కపలకలతో మార్పులు చేసి అసలు స్వరూపాన్ని మార్చేసింది. చెక్పోస్టుల వద్ద చూసినా ఏదైనా సామగ్రి తరలిస్తున్నారని భ్రమపడేలా కంటెయినర్ తరహాలో రూపొందించారు. అంతేకాక చెక్పోస్టులు, ఇతర ప్రాంతాల్లో తనిఖీలను ముందుగా తెలుసుకునేందుకు ఖరీదైన థార్ వాహనంలో తమ అనుయాయులను పైలట్గా పంపించడం గమనార్హం.ఆంధ్రప్రదేశ్ నుంచి ఇసుక రవాణాను అడ్డుకునేందుకు సీపీ సునీల్దత్ ఆదేశాలతో వైరా ఏసీపీ సారంగపాణి పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు నిరంతరం నిందితుల కదలికలను పరిశీలించడం మొదలుపెట్టాయి. పోలీసులు, మైనింగ్, రెవెన్యూ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు చిక్కకుండా తప్పించుకునేలా ఇసుక రవాణా ముఠా కొత్త ఎత్తుగడలు అమలుచేస్తోందని సమాచారం అందడంతో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈక్రమంలోనే ఇసుక తరలిస్తున్న కంటెయినర్ పట్టుబడగా, ముఠా బాధ్యులు పాత నిందితులేనని గుర్తించారు.స్మగ్లర్ల వ్యూహాలకు చెక్ పెడుతున్న పోలీసులు -
ప్రతీ చిన్నారికి ఆరోగ్య భద్రత
● ఈనెల నేటి నుంచి ‘స్టాప్ డయేరియా’ క్యాంపెయిన్ ● కలెక్టర్ దివాకర టీ.ఎస్.ఖమ్మం వైద్యవిభాగం: జిల్లాలో ప్రతీ చిన్నారికి ఆరోగ్య భద్రత కల్పించడమే లక్ష్యంగా వైద్యులు, ఉద్యోగులు పనిచేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. కలెక్టరేట్లో సోమవారం ఆయన వైద్య, ఆరోగ్యశాఖ కార్యక్రమాలపై అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంగళవారం నుంచి వచ్చేనెల 31 వరకు ‘స్టాప్ డయేరియా’ పేరిట నిర్వహించే క్యాంపెయిన్లో భాగంగా ఐదేళ్లలోపు పిల్లల్లో డయేరియా కారణంగా సంభవించే మరణాల నివారణకు తీసుకో వాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. అంగన్వాడీలు, పాఠశాలలు, గ్రామాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ● ఈనెల 28న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా పిల్లలకు శిబిరాల్లో చుక్కల మందు వేయాలని, 29, 30వ తేదీల్లో ఇంటింటి సందర్శన ద్వారా మిగిలిన పిల్లలకు కూడా మందు వేయాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 0–5 ఏళ్ల పిల్లలు 80,411 మంది ఉన్నట్లు గుర్తించగా, అందరికీ చుక్కల మందు వేయడమే లక్ష్యంగా నిర్దేశించుకోవాలని సూచించారు. ● వచ్చేనెల 13న జాతీయ నులిపురుగుల నివారణ, 20న మాప్ అప్ కార్యక్రమం ద్వారా 1 – 19 ఏళ్ల వారికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ వయస్సు వారు జిల్లాలో 2,89,533 మంది ఉన్నారని వివరించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ రామారావు, డిప్యూటీ డెమో కే.వీ.రాజు తదితరులు పాల్గొన్నారు. పనిదినాలు పెరిగేలా పర్యవేక్షణ కొణిజర్ల/వైరా రూరల్: ఉపాధి పనులకు ఎక్కువ మంది కూలీలు హాజరయ్యేలా చూస్తూ పని దినాలు కేటాయించాలని, పనుల్లో గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడేవి ఎంపిక చేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. కొణిజర్ల, వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో ఉపాధి హామీ పథకం పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏయే పనులు చేపడుతున్నారు, ఎందరు కూలీలు హాజరవుతున్నారనే వివరాలు ఆరా తీయడమే కాక హాజరు నమోదులో అవాంతరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.307 కూలీ దక్కేలా పనులు కల్పిస్తూ, ఎక్కువ మంది హాజరయ్యేలా గ్రామాల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. ఈక్రమంలో రైతులకు ప్రయోజనం జరిగేలా సాగునీటి వనరుల అభివృద్ధి, గ్రామాల్లో వసతుల కల్పన పనులనే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పాలి. ఉష్ణోగ్రతలు ఇంకా కొనసాగుతున్నందున పని ప్రదేశాల్లోటెంట్లు, తాగునీరు, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలన్నారు. కాగా, రెండు వారాల వేతనాలు రాలేదని కూలీలు చెప్పగా, రెండు, మూడు రోజుల్లో జమ చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కొణిజర్ల, స్నానాల లక్ష్మీపురం సర్పంచ్లు గూదె పుష్పావతి, నూతి వెంకటేశ్వర్లు, ఎంపీడీఓలు ఆర్.ఉపేంద్రయ్య, సక్రునాయక్, తహసీల్దార్లు ఎన్.అరుణ, సీహెచ్.సురేష్, ఉద్యోగులు రమేష్, గురుమూర్తి, రమేష్, మోష తదితరులు పాల్గొన్నారు. వరద నష్టం నివారణకు కార్యాచరణ ఖమ్మం సహకారనగర్: వర్షాకాలంలో వరదల ద్వారా ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. విపత్తుల నిర్వహణ సన్నద్ధతపై అదనపు కలెక్టర్లు క్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. కలెక్టరేట్లో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమే కాక 1077 టోల్ ఫ్రీ నంబర్పై విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. వరద ముంపునకు గురయ్యే కాలనీలు, ప్రాంతాలే కాక అక్కడి ప్రజలను తరలించాల్సిన పునరావాస కేంద్రాలను ముందుగా గుర్తించాలని సూచించారు. ప్రతీ మండలంలో అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని తెలిపారు. ఈసమావేశంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్, ట్రెయినీ కలెక్టర్ పారస్ కుమార్, డీఆర్వో సీహెచ్.రామ్మూర్తి, జెడ్పీ సీఈఓ దీక్షారైనా తదితరులు పాల్గొన్నారు. ● వెలుగుమట్లలో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలని కలెక్టర్ దివాకర్ సూచించారు. వెలుగుమట్లలో నిర్మాణాలను పరిశీలించిన ఆయన సూచనలు చేశారు. ఈ విషయంలో లబ్ధిదారులకు అధికారులు సహకారం అందించాలని తెలిపారు. హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఈఈ జగ్గారావు పాల్గొన్నారు. ● ఖమ్మం సహకారనగర్: ప్రజలు అందించే ప్రతీ ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. గ్రీవెన్స్ డేలో భాగంగా కలెక్టరేట్లో సోమవారం ఆయన అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమావేశమై దరఖాస్తుల పరిశీలన, పరిష్కారంపై సూచనలు చేశారు. -
చేపలు పట్టి.. ఎత్తిపోసి !
నేలకొండపల్లి: మండలంలోని చెరువుమాధారం చెరువులో రెండేళ్ల తరువాత సోమవారం చేపల వేట మొదలైంది. కేజీన్నర, రెండు కేజీల బరువైన చేపలను తెప్పల ద్వారా వలలతో మత్స్యకారులు వేట సాగించారు. అయితే, పట్టిన చేపలను ఒడ్డుకు తీసుకొచ్చి వాహనాల్లో చేర్చేందుకు ఇబ్బంది ఎదురుకాగా వినూత్నంగా ఆలోచించారు. ఏకంగా క్రేన్ సాయంతో నేరుగా చెరువు నీటిలో నుంచి చేపల వలలను ఎత్తి ఒడ్డున ఉన్న వాహనంలోకి చేర్చారు. ఆపై అమ్మకానికి సూర్యాపేట జిల్లా కోదాడ తరలించారు. కాగా, చేపల వేట సందర్భంగా ఘర్షణ జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. -
టామ్కాం ద్వారా దుబాయ్లో ఉద్యోగ అవకాశాలు
ఖమ్మం రాపర్తినగర్: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్కాం) ద్వారా దుబాయ్లో క్యాబ్ డ్రైవర్, బైక్ రైడర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్.మాధవి తెలిపారు. 23 – 45 ఏళ్ల వయస్సు కలిగి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండడంతో ఇంగ్లిషు మాట్లాడడం, చదవడం తెలిసిన వారు అర్హులని పేర్కొన్నారు. క్యాబ్ డ్రైవర్కు నెలకు రూ.64వేల నుంచి, బైక్ రైడర్కు రూ.64,850 నుంచి ఆదాయం మొదలవుతుందని తెలిపారు. ఆసక్తి, అర్హతలు ఉన్నవారు వివరాల కోసం 94400 49520, 94400 48590 నంబర్లలో సంప్రదించాలని ఆమె సూచించారు. వృద్ధులకు అండగా నిలుస్తాం.. ఖమ్మంలీగల్: వృద్ధులకు న్యాయసాయం అందించడంతో పాటు ఇతర అంశాల్లో అండగా నిలుస్తామని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి పి.దేవీమానస తెలిపారు. ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఖమ్మంలోని జీవనసంధ్య వృద్ధాశ్రమంలో అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి దేవీమానస వృద్ధుల హక్కులు, సంక్షేమం కోసం అమల్లో చట్టాలను గురించి వివరించారు. అలాగే, వారి సమస్యలను తెలుసుకుని ఉచిత న్యాయసాయం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పారా లీగల్ వలంటీర్లు, వృద్ధాశ్రమం నిర్వాహకులు పాల్గొన్నారు. రవాణా శాఖ స్పెషల్డ్రైవ్ ఆరు బస్సుల బాధ్యులపై కేసు ఖమ్మంక్రైం: ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోని ప్రైవేట్ స్కూళ్ల బస్సులను గుర్తించేందుకు రవాణా శాఖ అధికారులు సోమవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. విద్యాసంవత్సరం మొదలు కావడంతో జిల్లావ్యాప్తంగా ఇన్చార్జ్ ఆర్టీఓ శ్రీనివాస్ ఆధ్వర్యాన తనిఖీ నిర్వహించారు. తొలిరోజు 79 బస్సులను తనిఖీ చేయగా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోని ఐదు బస్సులతో పాటు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేని మరో బస్సును గుర్తించి బాధ్యులపై కేసు నమోదు చేశారు. తనిఖీల్లో ఎంవీఐ రాజశేఖర్, ఏఎంవీఐలు స్వర్ణలత, ప్రమీల, మధు, రాంబాబు, సుమలత, రవిచంద్ర, దినేష్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఇన్చార్జ్ ఆర్టీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ తనిఖీలు నిరంతరం కొసాగుతతాయని, అన్ని బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోకపోతే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
రేపు ఖమ్మంకు కేటీఆర్
ఖమ్మం వైద్యవిభాగం: బీఆర్ఎస్ పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ఈనెల 17వ తేదీన నిర్వహించే సమన్వయ కమిటీల సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారని సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన ఎమ్మెల్సీ తాతా మధుసూదన్తో కలిసి మాట్లాడారు. పాలేరు నియోజకవర్గ పరిధిలోని శ్రీహర్ష కన్వెన్షన్లో బుధవారం ఉదయం 11గంటలకు మొదలయ్యే నియోజకవర్గాల ముఖ్య ప్రతినిధులు, సమన్వయ కమిటీ సభ్యుల సమావేశంలో కేటీఆర్ పాల్గొంటారని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల ఇన్చార్జ్లు, సభ్యత్వ నమోదు బాధ్యులు, ముఖ్యనేతలు హాజరవుతారని పేర్కొన్నారు. వీరు కాకుండా ఇతర శ్రేణులు వచ్చి ఇబ్బంది కలిగించవద్దని రవీందర్రావు, మధుసూదన్ కోరారు. కాగా, పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్ విధానంలో చేపట్టనున్నందున త్వరలోనే పార్టీ అధినేత కేసీఆర్ యాప్ను విడుదల చేస్తారని తెలిపారు. కాగా, కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ జాబితా సమగ్ర ప్రత్యేక సవరణపై బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ఈ సమావేశంలో నాయకులు బెల్లం వేణుగోపాల్, ఉన్నం బ్రహ్మయ్య, వేముల వీరయ్య, బిచ్చాల తిరుమలరావు, తదితరులు పాల్గొన్నారు.వెల్లడించిన ఎమ్మెల్సీలు రవీందర్రావు, మధు -
ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో..
మాది సూర్యాపేట జిల్లా గోపాలపురం. వ్యవసాయ కుటుంబానికి చెందిన అమ్మానాన్నలు కృష్ణారెడ్డి – పద్మకు నేను, అన్నయ్య సంతానం. 10వ తరగతి వరకు తెలుగు మీడియంలోనే చదు వుతూ అన్నయ్యతో పాటు స్కూల్కి వెళ్లగా, ఉపాధ్యాయులు సత్యనారాయణ, సైదులు ప్రభావం నాపై ఎంతో ఉంది. ఎనిమిదో తరగతి నుంచి ఊరికి ఐదు కి.మీ. దూరాన పాఠశాలకు సైకిల్పై వెళ్లేవాళ్లం. పదో తరగతి తర్వాత సివిల్స్ను లక్ష్యంగా ఎంచుకున్నప్పటికీ నాన్న కోరికతో ఇంటర్లో బైపీసీ ఇంగ్లిష్ మీడియం చదివి, ఎంబీబీఎస్ పూర్తిచేశా. ఆపై పీజీ అనంతరం 2018లో ప్రభుత్వ వైద్యుడిగా ఎంపి కయ్యా. తొలి పోస్టింగ్ భద్రాచలంలో రాగా, ఇక్కడే సూపరింటెండెంట్ స్థాయికి చేరా. మా ఊరిలో మొదటి వైద్యుడిని నేనే. నన్ను ప్రోత్సహించిన నాన్న, అన్నయ్యతో పాటు ఉపాధ్యాయులకు రుణపడి ఉంటా. – డాక్టర్ రాజశేఖర్రెడ్డి, భద్రాచలం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ -
ప్రారంభానికి సన్నద్ధం
గతంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు మాత్రమే పోస్టర్లు, కరపత్రాలతో ఇంటింటి ప్రచారం చేసేవారు. కానీ రెండేళ్లుగా ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయులు సైతం తమ పాఠశాల విద్యార్థులు సాధించిన మార్కులను వివరిస్తూ వినూత్న ప్రచారం చేస్తున్నారు. బడిబాట పేరిట ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలపై అవగాహన కల్పించడంతో పాటు మార్కులు, ఇతర సౌకర్యాలను వివరిస్తున్నారు. ఖమ్మంసహకారనగర్: వేసవి సెలవుల అనంతరం సోమవారం నుంచి కొత్త విద్యాసంవత్సరం మొదలుకానుంది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 12వ తేదీనే పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ఎండల తీవ్రత దృష్ట్యా సెలవులు మరో మూడు రోజులు పొడిగించారు. ఈ మేరకు సొమవారం మొదలయ్యే కొత్త విద్యాసంవత్సరానికి ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు విద్యార్థులకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, పాఠశాలల్లో ఇప్పటికే మధ్యాహ్న భోజనం అమలవుతుండగా, ఈసారి నుంచి అల్పాహారం కూడా సమకూరుస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, తొలిరోజే అల్పాహారం మొదలవుతుందా, కొంత సమయం పడుతుందా అన్నది సోమవారం స్పష్టత రానుంది. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా జిల్లాలోని 952 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పూర్తయింది. అంతేకాక గత ప్రభుత్వ హయంలో చేపట్టిన ‘మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి’ పథకం ద్వారా 195 పాఠశాలల్లో కూడా పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థుల కోసం అన్ని టైటిళ్లు కలిపి 4,45,820 పాఠ్య పుస్తకాలు అవసరమని అధికారులు ప్రతిపాదించారు. ఇందులో ఇప్పటికే 4,05,426 పాఠ్య పుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరగా, ఎమ్మార్సీలకు ఆపై పాఠశాలలకు చేరవేశారు. మిగిలిన 40,394 పుస్తకాలు కూడా ఒకటి, రెండు రోజుల్లో జిల్లాకు చేరతాయని అధికారులు తెలిపారు. అలాగే, విద్యార్థులకు అవసరమైన నోట్ పుస్తకాలు పాఠశాలలకు చేర్చారు. తద్వారా పాఠశాలలు పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు పాఠ్య, నోట్ పుస్తకాలు అందించనున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో నర్సరీ, ఎల్కేజీ నిర్వహిస్తుండడంతో తల్లిదండ్రులు అటే మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యాన ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఈ ఏడాది నుంచి ప్రీ ప్రైమరీ బోధన ప్రవేశపెట్టారు. గత ఏడాది జిల్లాలో 30 పాఠశాలలు ఉండగా, ఈసారి మరో 114 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో గదులకు రంగులు వేయించడం, పిల్లలను ఆకట్టుకునే బొమ్మలు వేసి సౌకర్యాలు సమకూర్చేందుకు నిధులు మంజూరు చేశారు. అంతేకాక ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామకం కూడా చివరి దశకు చేరింది. యాజమాన్యం సంఖ్య విద్యార్థులు ప్రభుత్వ, అనుబంధం 1,319 84,222 ప్రైవేట్ 265 78,151 సీబీఎస్ఈ (ప్రైవేట్) 12 10,680 జిల్లాలో 21 మండలాల్లో ఎనిమిది భవిత కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించారు. శారీరక వైకల్యంతో బాధపడే విద్యార్థులకు ఈ కేంద్రాల్లో ఫిజియోథెరపీ తదితర సేవలందించనున్నారు. ఈ మేరకు ప్రత్యేక పరికరాలు సమకూర్చడంతో పాటు ఇతర వసతులు సమకూర్చారు. -
ఆదేశాలు బేఖాతర్
● 241 బస్సులకు పరీక్ష చేయించని ప్రైవేట్ స్కూళ్ల బాధ్యులు ● నేటి నుంచి రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ ఖమ్మంక్రైం: జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలలు సోమవారం తెరుచుకోనున్నాయి. అయితే, పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇప్పటివరకు తమ బస్సులకు పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోలేదు. ఈ నెల 12వ తేదీ వరకే అధికారులు గడువు విధించినా తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించడం గమనార్హం. ఫిట్నెస్ లేని బస్సులు రోడ్డు ఎక్కితే విద్యార్థుల భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యాన సోమవారం నుంచి రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టనుండగా, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని బస్సులను సీజ్ చేస్తామని చెబుతున్నారు. 241 బస్సులు దూరం జిల్లాలో అన్ని ప్రైవేట్ పాఠశాలలకు కలిపి 769 బస్సులు ఉన్నాయి. ఖమ్మం రవాణా శాఖ కార్యాలయ పరిధిలో 514, సత్తుపల్లి కార్యాలయ పరిధిలో 120, వైరాలో 135 బస్సులు ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకు 528 బస్సులకే ఫిట్నెస్ చేయించారు. ఇంకా 241 బస్సులకు ఫిట్నెస్ పరీక్ష చేయించకపోవడం గమనార్హం. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండానే కొన్ని స్కూళ్ల యాజమాన్యాలు పిల్లల రాకపోకలకు బస్సులు వినియోగించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. బస్సులు సరైన స్థితిలో లేనందున వీటిని వినియోగిస్తే పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడినట్టేనని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఏటా రూ.వేలల్లో ఫీజులు పెంచుతూ, బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోని యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. ప్రతీ పాఠశాల బస్సును తనిఖీ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోతే సీజ్ చేస్తాం. ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉన్నా బస్సులు నిబంధనల మేరకు లేకపోతే చర్యలు తీసుకుంటాం. –శ్రీనివాస్, ఇన్చార్జ్ ఆర్టీఓ -
నాన్న సైకిల్పై నేను, చెల్లి, తమ్ముడు
మాది సింగరేణి మండలం గేటుకారేపల్లి. నాన్న భూక్యా చిట్టిబాబు పోస్టుమాస్టర్గా పనిచేస్తూనే వ్యవసాయం చేసేవారు. అమ్మానాన్న చిట్టిబాబు – రాధకు నేను మొదటి కుమార్తెను. ఆ తర్వాత చెల్లె సుజాత, తమ్ముడు అరుణ్ ఉన్నారు. చెల్లి, తమ్ముడితో కలిసి సిద్ధమయ్యాక నాన్న సైకిల్పై తీసుకెళ్లి స్కూల్లో దింపేవారు. శ్రద్ధగా చదువుతూ ఏ రోజు హోం వర్క్ ఆరోజు చేసేవాళ్లం. ఎనిమిదో తరగతికి వచ్చాక కారేపల్లి హైస్కూల్కు వెళ్లే మార్గంలో బుగ్గవాగు ఉండడంతో నాన్న భద్రాచలం ఏపీఆర్ఎస్లో చేర్పించారు. ఇంటర్ తర్వాత అశ్వారావుపేటలో ఏజీబీఎస్సీ, ఆపై ఎమ్మెస్సీ పూర్తిచేశా. నాన్న ఆశయం మేరకు దమ్మపేట ఏఓగా గెజిటెడ్ ర్యాంక్ ఉద్యోగం సాధించా. ప్రస్తుతం ఖమ్మం వ్యవసాయ సాంకేతిక సంస్థ (ఆత్మ) పీడీగా కొనసాగుతున్నా. – బి.సరిత, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్, ఖమ్మం -
నడుస్తూ.. వాగులు దాటుతూ...
భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం ధనియాలపాడులో జన్మించిన నాకు చదువులో మార్గదర్శకుడు అన్న వెంకటేశ్వర్లు. మా గ్రామంలో 3వ తరగతి వరకు ఉండేది. ఆ తర్వాత నాలుగు కి.మీ. అన్నతో కలిసి నడుస్తూ వాగులు దాటి స్కూల్కు వెళ్లేవాడిని. అలా మా గ్రామం నుంచి 15మంది ఉండేవాళ్లు. తిరిగి వచ్చేటప్పుడు మధ్యలో చెట్ల కింద కూర్చొని చదువుకునేవాళ్లం. అమ్మనాన్నది వ్యవసాయ కుటుంబమైనా మమ్ముల్ని చదువులో ప్రోత్సహించేవాళ్లు. అయితే, స్కూల్ దూరం కావడంతో ఇబ్బందిగా ఉందని కిన్నెరసాని గురుకులంలో చేర్పించారు. అక్కడ పదో తరగతి వరకు, భద్రాచలంలో ఇంటర్ పూర్తి చేసి అశ్వారావుపేటలో ఏజీబీఎస్సీ చదివాక ఉద్యోగం సాధించా. మా అన్నయ్య వెంకటేశ్వర్లు ఉన్నత విద్య పూర్తిచేసి సింగరేణిలో జీఎంగా పనిచేస్తున్నారు. అమ్మానాన్న ప్రోత్సాహంతో హాస్టళ్లలో ఉండి చదువుకోవడంతో ఈ స్థాయికి చేరాం. – ధనసరి పుల్లయ్య, డీఏఓ, ఖమ్మం -
సైకిళ్లపై స్కూలుకు వెళ్లేవాళ్లం
మా నాన్న ఎన్.ఎస్.రాయుడు న్యాయవాది కాగా, అమ్మ లక్ష్మీదేవి రైల్వే శాఖలో ఆఫీస్ సూపరింటెండెంట్గా పనిచేశారు. దీంతో సికింద్రాబాద్లోని రైల్వే పాఠశాలలో నా చదువు కొనసాగింది. అమ్మ ఉదయం క్యారేజీ రెడీ చేస్తే, ఆ తర్వాత స్కూల్కు వెళ్లే వరకు నాన్న వెంట ఉండేవారు. ప్రాథమిక తరగతులకు ఆటోలో వెళ్లగా, ఆ తర్వాత స్నేహితులతో కలిసి సైకిళ్లపై స్కూల్కు వెళ్లా. అమ్మానాన్న సూచనలతో చదువు, క్రమశిక్షణలో ముందు నిలుస్తూ చదువులో స్నేహితులతో పోటీ పడేవాడిని. ఇంజనీరింగ్ అయ్యాక ఎస్బీఐ, ఇంటెలిజెన్స్ శాఖలో ఉద్యోగాలు వచ్చాయి. కానీ రైతులకు సేవలందించాలనే తపనతో డీసీసీబీ సీఈఓ పోస్టు ఎంచుకున్నా. – ఎన్.వెంకటఆదిత్య, డీసీసీబీ సీఈఓ -
వర్షాల వేళ విద్యుత్తో జాగ్రత్త
ఖమ్మంవ్యవసాయం: వర్షాకాలం విద్యుత్ ప్రమాదాలు జరిగే ఆస్కారమున్నందున రైతులే కాక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి సూచించారు. ఈదురుగాలులకు విద్యుత్ వైర్లు తెగి పడడడంతో పాటు చెట్ల కొమ్మలకు వైర్లు ఆనుకొని ఉన్న చోట ప్రమాదాలు జరిగే అవకాశముంని తెలిపారు. ఈ నేపథ్యాన తడి స్తంభాలు, వైర్లను తాకొద్దని సూచించారు. తెగిన వైర్లు కనిపిస్తే 1912 లేదా వాట్సాప్ 87124 81489 నంబర్ ద్వారా సమాచారం ఇవ్వాలే తప్ప సొంతంగా తొలగించే ప్రయత్నం చేయొద్దని తెలిపారు. అలాగే, ఇళ్లలో దుస్తులు ఆరేసేందుకు ఇనుప తీగలు కాకుండా ప్లాస్టిక్ తీగలు వాడాలని చెప్పారు. ఎవరైనా షాక్కు గురైతే చేతితో నేరుగా తాకకుండా కర్ర లేదా ప్లాస్టిక్ వస్తువులతో దూరం చేయాలని తెలిపారు. అలాగే, ఇళ్లు, వ్యవసాయ మోటార్లకు సరైన ఎర్తింగ్ చేయించుకోవాలని ఎస్ఈ ఓ ప్రకటనలో సూచించారు. 26న ‘కనకతార’ నాటిక ప్రదర్శన ఖమ్మంగాంధీచౌక్: తొలి తెలుగు సినిమా పాటల రచయిత చందాల కేశవదాసు 150వ జయంతి సందర్భంగా ఈ నెల 26న ‘కనకతార’నాటిక ప్రదర్శన ఉంటుందని చందాల కేశవదాసు కళా పరిషత్ అధ్యక్షుడు కొండపల్లి జగన్మోహన్రావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఖమ్మంలో వాల్పోస్టర్లను పలు సంస్థల ప్రతినిధులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ నెల 26న సాయంత్రం ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సురభి భానోదయ నాట్యమండలి కళాకారులు ఈ నాటకాన్ని ప్రదర్శిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్ కుమార్, జగన్మోహన్రావు, డాక్టర్ నాగబత్తిని రవి, సీతారామారావు, డాక్టర్ సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి కూలీలకు నష్టం కలిగించొద్దు ఖమ్మంమయూరిసెంటర్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వీబీజీరాంజీగా పేరు మార్చి కార్మికులకు నష్టం జరిగేలా వ్యవహరిస్తే కేంద్ర ప్రభుత్వ పతనం తప్పదని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేశ్ హెచ్చరించారు. ఖమ్మంలోని గిరిప్రసాద్ భవన్లో ఆదివారం తాటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (బీకేఎంయూ) సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ కూలీల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరించి వేస్తోందన్నారు. ఈ మేరకు కార్మిక వ్యతిరేక చర్యలను తిప్పికొట్టేలా ఉద్యమించాలని సూచించారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీకేఎంయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దినేని కర్ణకుమార్ మాట్లాడుతూ.. సంఘం ఆధ్వర్యాన ఈ నెల 23న కలెక్టరేట్ ఎదుట చేపట్టే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. నాయకులు ఏసు, మేళ్లచెరువు వీరబాబు, సింగారపు సత్యనారాయణ, పిట్టల రాంబాబు, అయోధ్య, గోగుల ఆది పాల్గొన్నారు. కిన్నెరసానిలో సందడిపాల్వంచరూరల్: ఎండ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో సండే సందడి వాతవరణం కన్పించింది. ఆదివారం జిల్లాతోపాటు ఇరుగుపొరుగు ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. 724 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.38,125 ఆదాయం లభించింది. 400 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.25,000 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. నేవీ మార్కోస్లో గుండాల యువకుడు గుండాల: మండలంలోని నర్సాపురంతండాకు చెందిన బోడా నరేశ్నాయక్ భారత నావికా దళంలోని మార్కోస్ (మైరెన్ కమాండో)కు ఎంపికయ్యాడు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నివీర్కు దరఖాస్తు చేసుకుని పోటీ పరిక్షల్లో ప్రతిభ కనబర్చి ఎంపికయ్యాడు. శిక్షణలోనూ ఉత్తమ ప్రతిభ కనపర్చిన నరేశ్నాయక్ మార్కోస్కు ఎంపిక కావటంపై తల్లిదండ్రులు శ్రీను – సరోజ హర్షం వ్యక్తం చేశారు. ఒడిశాలో నాలుగు నెలల పాటు శిక్షణ పొందిన ఆయన త్వరలో మార్కోస్లో చేరబోతున్నాడని వారు తెలిపారు. -
ఆగుదామా.. ‘సాగు’దామా ?!
ఖమ్మంవ్యవసాయం: వానాకాలం పంటల సాగుపై అన్నదాతల్లో అయోమయం నెలకొంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. పంటలకు అవసరమైన ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షపాతం తక్కువగా నమోదవుతుందని వెల్లడించగా.. రాష్ట్ర ప్రభుత్వం రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసేలా వ్యవసాయ శాఖ ద్వారా విస్తృత అవగాహన కల్పిస్తోంది. ఇప్పటికే వానాకాలం సీజన్ మొదలైనందున అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఏడు లక్షల ఎకరాల్లో సాగు అంచనా జిల్లాలో ఈ ఏడాది అన్ని పంటలు కలిపి 7 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అధికారులు తొలుత అంచనా వేశారు. ఇందులో ప్రధాన పంటగా వరి దాదాపు 3.20 లక్షల ఎకరాల్లో, ఆ ఆర్వాత 2.69 లక్షల ఎకరాల్లో పత్తి, లక్ష ఎకరాల మేర మిర్చి సాగు చేస్తారని భావించారు. అయితే, ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువ కురవనున్న నేపథ్యాన నీటి వినియోగం అధికంగా ఉండే వరి, పత్తికి బదులు పెసర, మినుము, కంది, జొన్న, వేరుశనగ వంటి పంటలు సాగు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నేల స్వభావం వరికి మాత్రమే అనుకూలంగా ఉంటే స్వల్పకాలిక రకాలను, వెదజల్లే సాగు చేసుకోవాలని చెబుతున్నారు. అంతేకాక పత్తిలో అధిక సాంద్రత విధానాన్ని అవలంబించాలని సూచిస్తున్నారు. వనరులపై ఆశలు అధికారులు అవగాహన కల్పిస్తున్నా రైతులు మాత్రం జిల్లాలోని నీటి వనరులపై ఆశగా ఉన్నారు. జిల్లాకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రధాన నీటి వనరుగా ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా నీరు విడుదలైతే జిల్లాలోని జలాశయాల్లోకి సమృద్ధిగా నీరు చేరడమే కాక భూగర్భ జలాలు సైతం పెరుగుతాయి. రెండేళ్లుగా విస్తారంగా కురిసిన వర్షాలకు పలు జలాశయాల్లో ఇప్పటికే సమృద్ధిగా నీరు ఉంది. దీనికి తోడు అరకొరగా వర్షాలు కురిసినా పంటల సాగుకు నీరు సరిపోతుందని రైతులు భావిస్తున్నారు. కాగా, జిల్లాలో ఈ నెల 11 నాటికి సాధారణ వర్షపాతం 34.4 మి.మీలు కాగా అంతకు మించి 63.3 మి.మీ.లుగా నమోదైంది. కానీ ప్రస్తుతం ఆశించిన స్థాయిలో వర్షాలు లేక, పంటలకు అవసరమైన ఆగస్టు, సెప్టెంబర్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియడం లేదు. పత్తి సాగుకు ప్రస్తుతమైతే దుక్కులు చేస్తున్నాం. కానీ వర్షాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అదే జరిగితే నష్టపోతామని భయం ఉంది. మాగాణి భూముల్లో వానాకాలం ఆరుతడి పంటలు పండవు. జలాశయాల్లో నీరు చేరితే వరి సాగు చేస్తా. –సోమనబోయిన వెంకటేశ్వర్లు, రైతు, తెట్టెలపాడు ఎల్నినో ప్రభావం నేపథ్యాన ప్రత్యామ్నాయ పంటలకే ప్రాధాన్యత ఇవ్వాలి. వాతావరణం, నీటి వనరులకు అనుగుణంగా తక్కువ కాల పరిమితి కలిగిన పంటలు ఎంచుకుని, అపరాలు సాగు చేయడమే మంచిది. తొందరపడి పొడి దుక్కుల్లో పత్తి విత్తనాలు నాటొద్దు. – ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి నెల సాధారణం నమోదు జూన్ 131.2 123.9 జూలై 240.9 281.6 ఆగస్టు 240.0 389.7 సెప్టెంబర్ 179.0 241.1 జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తుండడంతో రైతులు దుక్కులు సిద్ధం చేశారు. కొందరు రైతులు పొడిదుక్కుల్లోనే పత్తి విత్తనాలు నాటారు. వరి సాగు చేసే భూముల్లో భూసారం పెంపునకు పచ్చి రొట్ట విత్తనాలను వేస్తున్నారు. అయినా వాతావరణ పరిస్థితులు, ప్రభుత్వ సూచనలతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. మరోపక్క వానాకాలం ప్రారంభమైనా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవ డం, ఉష్ణోగ్రతలు కొనసాగుతుండడంతో వారిలో సందిగ్ధత నెలకొంది. అధికారుల సూచనలను కాదని జలాశయాల్లో నీటి ఆధారంగా వరి తదితర పంటలు సాగు చేస్తే పైరు దశలో నీటి సమస్య ఎదురై, నష్టపోతామనే భావనతో రైతులు డోలాయమానంలో పడిపోయారు. -
అర్ధరాత్రి భూకంపం
పాల్వంచరూరల్/బూర్గంపాడు/పాల్వంచ: భద్రాద్రి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి 2:26 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది. పాల్వంచ మండలం సారెకల్లు, అశ్వాపురం మండలం మామిళ్లవాయి గ్రామాల మధ్యలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ భూకంప కేంద్రంగా ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ విభాగం గుర్తించింది. భూ ఉపరితలం నుంచి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉండగా, తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8 నమోదైంది. పాల్వంచ మండలంలోని లక్ష్మీదేవిపల్లి, జగన్నాథపురం, కేశవాపురం, సారెకల్లు, కారెగట్టు ప్రాంతాలతోపాటు పాల్వంచ పట్టణం, బూర్గంపాడు మండలాల్లో భూప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు. ప్రకంపనలతో ఉలిక్కిపడి బయటకు వచ్చినట్లు కొందరు చెబుతున్నారు. మరికొందరు భూకంప ప్రభావమేమీ కనిపించలేదని పేర్కొంటున్నారు. రాత్రి 2.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంచం, తలుపులు స్వల్పంగా కంపించినట్లు అనిపించిందని, భూకంపంమే అని భావించి కుటుంబ సభ్యులతో బయటకు వచ్చామని పాల్వంచ గట్టాయిగూడేనికి చెందిన లింగం వెంకటేశ్వర్లు తెలిపారు. తక్కువ లోతు కావడంతో.. భూమి లోపలి పొరల్లో జరిగే ఘర్షణల కారణంగా భూకంపాలు తరచుగా సంభిస్తుంటాయి. వీటి తీవ్రతను రిక్టరు స్కేలు సాయంతో గుర్తిస్తుంటారు. భూకంపం తీవ్రత, అది సంభవించిన లోతును, భూ ఉపరితలం పరిస్థితుల ఆధారంగా భూకంప ప్రభావం ఉంటుంది. సాధారణంగా రిక్టర్ స్కేల్పై 3 కంటే తక్కువగా నమోదు అయ్యే కంపనాల గురించి సామాన్యులకు అర్థం కూడా కాదు. భూకంప తీవ్రత 3.5 దాటితే స్వల్పంగా ప్రభావం కనిపిస్తుంది. ప్రస్తుత భూంకప తీవ్రత 3.8 నమోదుకాగా, ఇది అంత ప్రమాదకరమైనది కాకపోయినా భూ ఉపరితలం నుంచి కేవలం 10 కి.మీ లోతులో కంపన కేంద్రం ఉండటం వల్ల తీవ్రత పెరిగింది. అందువల్లే అర్థరాత్రి 2.26 గంటల సమయంలో భూమి కంపించినా కొందరు ప్రజలు గుర్తించగలిగారు. అంతకుముందు 2024 డిసెంబర్ 4న ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉదయం 7:27 గంటల సమయంలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై ప్రమాదకర స్థాయిలో 5.3గా నమోదైంది. ఈ భూకంప తీవ్రత ఉత్తర తెలంగాణ అంతా చవిచూసింది. అయితే, అప్పుడు 40 కి.మీ.లోతులో భూకంప కేంద్రం ఉండటంతో ప్రమాద తీవ్రత తగ్గింది. భూకంపాలు ఎప్పుడెప్పుడు వచ్చాయంటే.. గోదావరి తీరంలో విస్తరించిన జిల్లాకు భూకంపాలు కొత్తేమి కాదు. 1954లో రిక్టర్ స్కేల్పై 4.3 భూకంప తీవ్రత నమోదుకాగా, భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. 1969లో దుమ్ముగూడెం మండలం పర్ణశాల దగ్గర 5.3 తీవ్రతతో భూంకపం వచ్చినట్టు రికార్డులు చెబుతున్నాయి. జిల్లాకు సంబంధించినంత వరకు అతి పెద్ద భూకంపంగా ఇది రికార్డుల్లో ఉంది. ఆ తర్వాత 2004లో మరోసారి వచ్చింది. ఆ తర్వాత చాలా ఏళ్లకు 2018 ఆగస్టు 14న జిల్లాలోని మణుగూరు, కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ, ఇల్లెందు, బూర్గంపాడు ప్రాంతాల్లో రాత్రి వేళ కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. మళ్లీ 2023 ఆగస్టు 25 తెల్లవారుజామున మణుగూరులో భూమి కంపించిన అనుభూతిని ప్రజలు పొందారు. 1968, 2004, 2009ల్లో కూడా స్వల్ప భూకంపం వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. చివరిసారి 2024 డిసెంబరులో ములుగులో వచ్చిన భూకంపానికి రాష్ట్రం మొత్తం వణికిపోయింది. తేదీ తీవ్రత సమయం 5 –7– 1969 5.3 –– 14 –8–2018 5.1 9:10 పీఎం 25 –8–2023 3.5 4:45 ఏఎం 04–12–2024 5.3 7:27 ఏఎం 13 –6– 2026 3.8 2.26 ఏఎం -
అన్నయ్య చేయి పట్టుకుని నడిచా..
మాది వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం తిమ్మాపూర్. అమ్మానాన్న యాదగిరి – భాగ్య వ్యవసాయం చేస్తూ నన్ను, అన్నయ్య రాజును చదివించారు. చిన్నప్పుడు స్కూల్కు వెళ్లేందుకు మారాం చేసేవాడిని. కానీ అన్నయ్య సర్దిచెప్పి వెంట తీసుకెళ్లేవాడు. మా ఊరి ప్రభుత్వ పాఠశాలలోనే తెలుగు మీడియంలో 10వ తరగతి, ఇంటర్ వరంగల్లో చదివి ఓపెన్ డిగ్రీ పూర్తిచేశా. 2007లో హైదరాబాద్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ 2009లో ఎస్ఐగా ఎంపికవడంతో తొలి పోస్టింగ్ కరకగూడెంలో వచ్చింది. ఈ జిల్లాలోని పలు స్టేషన్లలో విధులు నిర్వర్తించాక సీఐగా పదోన్నతిపై హైదరాబాద్ వెళ్లినా, మళ్లీ డీఎస్పీగా పదోన్నతితో భద్రాచలంలో పోస్టింగ్ వచ్చింది. మా అన్నయ్య రాజు జనగామ ్ల రెవెన్యూ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు. అన్నయ్య ప్రోత్సాహంతోనే చదువు పూర్తిచేసి ఈ స్థాయికి చేరగలిగా. – అరుణ్కుమార్, భద్రాచలం డీఎస్పీ


