Khammam District News
-
అగచాట్లు
అడ్డంకులు..ముదిగొండ సొసైటీలో ఆన్లైన్ కోసం వేచి ఉన్న రైతులు సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కొనుగోళ్లలో జాప్యం, అడుగడుగునా సమస్యలతో మొక్కజొన్న ఎందుకు సాగు చేశామా అని రైతులు ఆవేదన చెందుతున్నారు. కోత మొదలు గోదాంకు తరలించే వరకు ఎదురవుతున్న అడ్డంకులు వారిని ఇబ్బంది పెడుతున్నారు. ఇవి ఇలా కొనసాగుతుండగానే ప్రభుత్వం తాజాగా ఒక సొసైటీ రోజుకు 2వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పినట్లు తెలుస్తుండడం గుదిబండలా మారనుంది. వీటన్నింటికీ తోడు కౌలు రైతులను ఆన్లైన్ సమస్య వేధిస్తోంది. ఆన్లైన్లో జాప్యం ఈ యాసంగిలో ఉమ్మడి జిల్లాలో 2.43 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా, ఎకరానికి 40 – 45 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా ప్రైవేట్ వ్యాపారులు క్వింటాకు రూ.1,700కు మించి ధర పెట్టలేదు. దీంతో ప్రభుత్వం క్వింటాకు రూ.2,400 మద్దతు ధరతో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లకు సిద్ధమైంది. ఇక అడపాదడపా కురిసిన అకాల వర్షాలతో మొక్కజొన్న పంట కిందకు వాలింది. దీంతో కింద పడ్డ కంకులు మిషన్తో కోయడం సాధ్యం కాక కూలీల రూపంలో అదనపు భారం పడింది. ఆపై పంట అమ్ముకునేందుకు వెళ్తే సకాలంలో ఆన్లైన్ కాక రైతులు రోజుల తరబడి వేచి ఉంటున్నారు. ఇక కౌలు రైతులు పాస్పుస్తకం, ఆధార్కార్డుతో వెళ్లి ఏఈఓ దగ్గర ధ్రువపత్రం తీసుకున్నాక ఆన్లైన్లో డీఎం అనుమతి తీసుకోవాలి. ఆతర్వాత సొసైటీలో వేలిముద్ర వేయడానికి చాలా సమయం పడుతోంది. సర్వర్ మొరాయిస్తుండడంతో జాప్యం జరుగుతుండగా.. కొన్నిచోట్ల ఏఈఓలు చేసిన క్రాప్ బుకింగ్, క్షేత్రస్థాయి పంటకు తేడా రావడంతో ఇబ్బంది పడుతున్నారు. కాంటాలు కాక.. లారీలు లేక.. కొనుగోలు కేంద్రాలకు మక్కలు తీసుకొచ్చిన రైతులు కాంటాల కోసం రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. గన్నీ బ్యాగ్లు ఇవ్వకపోవడంతో రైతులే రూ.26 చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తోంది. కొన్నిచోట్ల కల్లాల్లో మొక్కజొన్నలను నిల్వ చేయగా.. ఎండ వేడికి నిప్పంటుకుంటోంది. ఇలాగే బోనకల్, చింతకాని మండలాల్లో పంట అగ్నికి ఆహుతైంది. మరోపక్క లారీల కొరతతో గోదాంలకు తరలింపులో జాప్యం జరుగుతోంది. స్థానికంగా గోదాంలకై తే టన్నుకు రూ.450, సూర్యాపేటలోని గోదాంలకు రూ.500 నుంచి రూ.550 మాత్రమే లారీలకు ఇస్తున్నారు. కానీ అన్లోడ్ చేయడానికి రోజుల తరబడి వేచి ఉండాల్సి రావడంతో లోడ్కు రూ.16వేలే వేస్తున్నాయంటూ లారీల యాజమానులు ముందుకు రావడం లేదు. క్వింటాకు రూ.100 నుంచి రూ.120 ఇచ్చే రైతుల సరుకు తీసుకెళ్తుండగా, అలా ఇవ్వలేని రైతులు పడిగాపులు కాస్తున్నారు. రెండు వేల క్వింటాళ్లేనట.. మార్క్ఫెడ్ తాజాగా కొత్త నిబంధన అమలులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. కాంటా అయిన మొక్కజొన్నలను తీసుకెళ్లిన లారీలు రకరకాల కారణాలతో గోదాంల వద్ద నిలిచిపోతున్నాయి. దీంతో ఒక్కో సొసైటీ రోజుకు రెండు వేల క్వింటాళ్లే కొనుగోలు చేయాలనే నిబంధన తీసుకొచ్చినట్లు సమాచారం. అంతవరకే ట్రక్ షీట్లు జారీ చేస్తుండడం రైతులు వేచి ఉంటున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే విక్రయించిన పంటకు సకాలంలో నగదు జమ కాక రైతులు ఆవేదన చెందుతున్నారు.మొక్కజొన్న విక్రయానికి రైతుల అవస్థలు -
నేడు జిల్లాకు రాష్ట్ర మంత్రులు
కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర మంత్రులు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. నల్లగొండ పర్యటన అనంతరం మధ్యాహ్నం 2–30 గంటలకు హెలికాప్టర్ ద్వారా వారు నాయకన్గూడెం చేరుకుంటారు. తొలుత పాలేరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడనున్నారు. ఆతర్వాత 3–30 గంటలకు కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా అధికారులతో సమావేశం కానున్న మంత్రులు ధాన్యం కొనుగోలుపై సమీక్షిస్తారు. ప్రశాంతంగా పాలిసెట్ ఖమ్మం సహకారనగర్/మధిర: పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశానికి బుధవారం నిర్వహించిన పాలిసెట్ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. ఖమ్మంలో ఆరు కేంద్రాలు ఏర్పాటుచేయగా 3,157 మంది విద్యార్థులకు గాను 2,902 మంది హాజరయ్యారని పరీక్షల నగర కోఆర్డినేటర్ డాక్టర్ మహ్మద్ జాకీరుల్లా తెలిపారు. పరీక్షలు పకడ్బందీగా జరిగేలా పర్యవేక్షించినట్లు వెల్ల డించారు. అలాగే, మధిరలోని మూడు పరీక్ష కేంద్రాల్లో 539 మంది విద్యార్థులకు గాను 496 మంది హాజరయ్యారని ప్రిన్సిపాల్ కె.సాంబయ్య తెలిపారు. ప్రారంభమైన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఖమ్మంసహకారనగర్: ఇంటర్మీడియట్ అడ్వా న్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం నిర్వహించారు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించాక లోపలికి అనుమతించగా, కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పా టు చేశారు. మొదటి సంవత్సరం ఇంటర్ విద్యార్థులు 4,072 మందికి 3,821 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షకు 1,039 మందిలో 941మంది హాజరయ్యారని అధికారులు తెలి పారు. కాగా, ఉదయం 20 సెంటర్లలో, మధ్యాహ్నం 16 సెంటర్లలో పరీక్షల కన్వీనర్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో పాటు డీఐఈఓ రవిబాబు తనిఖీ చేశారు. బక్రీద్ ప్రశాంతంగా జరుపుకునేలా పర్యవేక్షణ ఖమ్మంక్రైం: బక్రీద్ పండుగను ప్రశాంత వాతా వరణంలో జరుపుకునేలా వివిధ శాఖల అధి కారులు పర్యవేక్షించాలని డీజీపీ సీవీ.ఆనంద్ సూచించారు. పోలీసు, పశుసంవర్ధక, రెవె న్యూ, మున్సిపల్ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం మాట్లాడారు. జిల్లా నుంచి పోలీస్ కమిషనర్ సునీల్దత్ మాట్లాడుతూ గోవధ, పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి జిల్లాలో ఏడు చెక్పోస్టులు ఏర్పాటుచేసి నిరంతరం తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. పశువైద్యుల ధ్రువీకరణ లేకుండా జంతువులను రవాణా చేస్తే జప్తు చేస్తున్నామని చెప్పారు. అంతేకాక పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేయగా, ఇప్పటికే గోరక్షక కమిటీలు, ముస్లిం మతపెద్దలతో సమావేశమై సూచనలు చేశామని తెలిపారు. ఇంకా ఈ వీసీలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీలు రమణమూర్తి, సారంగపాణి, సాంబరాజు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా.. గరం, గరం
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతుండడంతో అగ్నిగుండాన్ని తలపిస్తోంది. కొద్ది రోజులుగా 40 – 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, బుధవారం గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 8గంటలకే మొదలవుతున్న ఎండ గంటగంటకు పెరుగుతూ మధ్యాహ్నం వడగాలులు కూడా వీస్తున్నాయి. ఇక ఉదయం, రాత్రి తేడా లేకుండా ఏసీలు, కూలర్లు వినియోగిస్తుండడంతో విద్యుత్ వినియోగం పెరిగి అంతరాయాలు చోటు చేసుకుంటున్నాయి. సరఫరాలో ఎలాంటి సమస్య లేదని, విద్యుత్ వినియోగం పెరగడంతో అవాంతరాలు వస్తున్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. తిమ్మారావుపేటలో గరిష్టం ఏన్కూరు మండలం తిమ్మారావుపేటలో బుధవారం గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, బాణాపురంలో 43.8, గుబ్బగుర్తిలో 43.7, సిరిపురంలో 43.5, పమ్మిలో 43.3, ఏన్కూరులో 43.1, చింతకాని, ఎర్రుపాలెంలో 42.4, పెద్దగోపతిలో 42.2, గౌరారంలో 42.1 ఉష్ణోగ్రత నమోదైంది. ఇక కల్లూరులో 41.9, నేలకొండపల్లి, ఖమ్మం ఖానాపురం, ప్రకాష్నగర్ల్లో 41.8, కూసుమంచి, రావినూతలలో 41.7, తల్లాడ, కొణిజర్లలో 41.6, వైరాలో 41.5, వైరాలో 41.4, కుర్నవల్లిలో 41.3, నాగులవంచ, ఖమ్మం కలెక్టరేట్ వద్ద 41.2, మధిర 41.1, పల్లెగూడెం, ముదిగొండలో 41, పెనుబల్లిలో 40.8, బచ్చోడు, తిరుమలాయపాలెంలో 40.7, గేటు కారేపల్లి, మధిరలో 40.6, పంగిడిలో 40.5, లింగాల 40.3, రఘునాథపాలెంలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జనానికి అవస్థలు ఎండ తీవ్రతతో మధ్యాహ్నం వేళ జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. దీంతో ప్రధాన రహదారులు బోసిపోయి కనిపిస్తున్నాయి. రేకులు, పెంకుటిళ్లలో నివసించేవారే ఎండ తీవ్రతకు అల్లాడిపోతున్నారు. ప్రధానంగా రైతులు, కూలీలు, నిర్మాణ రంగ కార్మికులు పనుల్లో ఇబ్బంది పడుతున్నారు. ఎండల కారణంగా ఇటీవల వడదెబ్బ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈనేపథ్యాన నిర్మాణ రంగం. వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ పనులకు వెళ్లే వారు ఎండ తీవ్రత నేపథ్యాన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత -
మక్కల నిల్వలకు అదనపు గోదాములు
ఖమ్మంవ్యవసాయం: మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మొక్కజొన్నల నిల్వ కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న గోదాంలే కాక అదనపు గోదాంలను సిద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్ తెలిపారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న నిల్వలను బుధవారం ఆయన అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాంటాలు కాగానే గోదాంలకు మక్కలు తరలించేలా సరిపడా హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ గోదాంలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు. ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, వైస్ చైర్మన్ తల్లాడ రమేష్, జిల్లా మార్కెటింగ్ అధికారి అలీం తదితరులు పాల్గొన్నారు. సాఫీగా ధాన్యం కొనుగోళ్లు కూసుమంచి: రైతులు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగేలా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ దివాకర ఆదేశించారు. పాలేరులో ఐకేపీ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సీపీ సునీల్దత్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన తనిఖీ చేశారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా ధాన్యాన్ని కాంటా వేసి మిల్లులకు తరలించాలని తెలిపారు. ఆపై ఆన్లైన్లో నమోదు చేస్తే రైతులకు సకాలంలో నగదు జమ అవుతుందని చెప్పారు. ఎండల దృష్ట్యా కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను సమకూర్చాలని ఆదేశించారు. జిల్లా పౌర సరఫరాల సంస్థ ఇన్చార్జి మేనేజర్ సునీల్రెడ్డి, డీఆర్డీఓ శ్రీరాం, జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి చందన్కుమార్, తహసీల్దార్ సైదులు పాల్గొన్నారు.కలెక్టర్ దివాకర టీ.ఎస్. -
మోదీ విధానాలు దేశానికి ప్రమాదకరం
ఖమ్మంమయూరిసెంటర్: ప్రధాని మోదీ అవలంబిస్తున్న విధానాలు దేశానికి ప్రమాదకరంగా మారుతున్నాయని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు అన్నారు. పార్టీ జిల్లా సమితి సమావేశం బుధవారం ఖమ్మంలో జరగగా ఆయన మాట్లాడారు. ఓట్ల తొలగింపు, ఎన్నికల కమిషన్ విధానం, ప్రలోభాలు తదితర అంశాలు బీజేపీ గెలుపు వెనక దాగి ఉన్నాయన్నారు. దేశంలో ధరలు పెరుగుతుండగా, ఇతర సమస్యలను పరిష్కరించకుండా ప్రతీ సమస్యకు కర్మ ఫలమే పరిష్కారమనే వాదనను బీజేపీకి తెరపైకి తీసుకొస్తోందని తెలిపారు. సమస్యలను పరిష్కరించకుండా హిందుత్వ నినాదంతో ప్రజల మధ్య విభజన రేఖ తీసుకురావడం ద్వారా లబ్ధి పొందాలనే లక్ష్యం దాగి ఉందని చెప్పారు. కాగా, రాష్ట్రంలో రైతు భరోసా పూర్తిస్థాయిలో అందక రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. అంతేకాక ధాన్యం, మొక్కజొన్నల కొనుగోళ్లలోనూ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మొక్కజొన్నలు కొని రెండు నెలలు దాటినా రైతుల ఖాతాల్లో నగదు జమ కావడం లేదని తెలిపారు. కాగా, పార్టీ ప్రజా సంఘాల బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని హేమంతరావు కోరారు. జిల్లా కార్యదర్శి దండి సురేశ్ కార్యక్రమాల నివేదికను ప్రవేశపెట్టగా పార్టీ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహ్మద్ మౌలానా, నాయకులు జమ్ముల జితేందర్రెడ్డి, పావులూరి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశంలో హేమంతరావు -
చేపల కోసం తూముల ధ్వంసం
కల్లూరురూరల్: చెరువుల నిండా నీరు ఉండడంతో వచ్చే సీజన్లో వర్షాలు ఆలస్యమైనా సాగుకు డోకా ఉండదని రైతులు ఆశతో ఉన్నారు. కానీ, కొందరు చెరువులోవేట కష్టంగా మారిందని తూములు పగలగొట్టి నీటిని బయటకు వృథాగా పంపిన వైనమిది. కల్లూరు మండలంలోని చిన్నకోరుకొండి, వేంపల్లి చెరువులో చేపలు పెంచతున్న వ్యాపారులు నీళ్లు నిండుగా ఉండడం వేట ఆలస్యమవుతోందని భావించినట్లు తెలిసింది. దీంతో మంగళవారం రాత్రి తూములు పగలగొట్టి పక్కనే ఉన్న వరిమడుల్లోకి నీరు వదిలిపెట్టారు. ఫలితంగా ఆయకట్టు పరిధిలోకి చేరిన నీటిని బుధవారం ఉదయం రైతులు గుర్తించి సమాచారం ఇవ్వగా జల వనరుల శాఖ డీఈ వెంకటేశ్వరరావు, ఏఈ చేరుకుని అడుకట్ట వేయించారు. వరి మడులు నీటితో నిండడంతో దుక్కులు దున్నే అవకాశం లేదని, ఖరీఫ్లో వర్షాలు ఆలస్యమైతే పరిస్థితి ఏమిటని రైతులు ఆవేదన చెందుతున్నారు. కాగా, తూములు పగలగొట్టిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొణిజర్ల మండలంలో... కొణిజర్ల: చేపల వేట కోసం కొందరు చెరువులో నీరు ఖాళీ చేస్తున్నారు. కొణిజర్లలోని ఊర చెరువు, చీకటి చెరువులో రెండు రోజులుగా రెండు తూముల ద్వారా భారీగా నీరు బయటకు పంపిస్తున్నారు. ఏటా చేపల వేట కోసం చెరువులో నీటిని వృథా చేస్తున్నా ఒకరిద్దరు రైతులు మినహా అటు ప్రజాప్రతినిధులు కానీ, జలవనరుల శాఖ అఽధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వేసవిలో పశువులకు తాగునీరు, వానాకాలంలో రైతులు నార్లు పోసుకునేందుకు చెరువులో నీరు ఉండాలి. కానీ చేపల వేటగాళ్లు ఎవరికీ అనుమానం రాకుండా రాత్రివేళ తూములు తెరిచి నీళ్లు బయటకు వదులుతున్నారు. ఫలితంగా చెరువులు ఖాళీ కావడమే కాక నీరు వృథాగా పొలాల్లోకి, ఏటిలోకి చేరుతోంది. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చెరువులు ఖాళీ చేయకుండా పర్యవేక్షించాలని రైతులు కోరుతున్నారు. -
ప్రతీ దరఖాస్తుకు పరిష్కారం చూపుతాం
కూసుమంచి: ‘ఇది ప్రజల ప్రభుత్వం.. యంత్రాంగమే మీ ముందుకు వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తోంది.. ప్రతీ సమస్యకు పరిష్కారం చూపే బాధ్యత తీసుకుంటున్నందున ధైర్యంగా ఉండాలి’ అని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. కూసుమంచి మండలం జీళ్లచెరువులో బుధవారం నిర్వహించిన ప్రజాదర్బార్లో ఆయన కలెక్టర్ దివాకర టీ.ఎస్.తో కలిసి ప్రజల నుంచి వినతులు, దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రజలకు పాలన మరింత చేరువ చేసేందుకు పాలేరు నియోజకవర్గంలో ప్రజాదర్బార్కు శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రతీ మండలాన్ని మూడు క్లస్టర్లుగా విభజించి ప్రజాదర్బార్ నిర్వహిస్తుండగా ఇప్పటి వరకు పది క్లస్టర్లలో జరిగాయన్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తుండగా, మిగిలిన వాటిని మూడు నెలల్లో పరిష్కరించడమే లక్ష్యంగా నిర్దేశించామని తెలిపారు. రాష్ట్రంలోని పేదలందరికీ గూడు సమకూర్చాలనే భావనతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. త్వరలోనే రెండో విడత ఇళ్ల మంజూరు ఉంటుందని తెలిపారు. రైతుల భూసమస్యల పరిష్కారం కోసం భూభారతి పోర్టల్ను తీసుకొచ్చామని వెల్లడించారు. పాలేరు నియోజకవర్గంలో అన్ని వసతులు కల్పించి అన్ని రంగాల్లో అభివృద్ది చేయడమే తన లక్ష్యమని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇందిరమ్మ గృహప్రవేశంలో... నేలకొండపల్లి: నేలకొండపల్లి ఎస్సీ, బీసీ కాలనీలో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ గృహ ప్రవేశం బుధవారం జరగగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారురాలు అందిమళ్ల నాగరాణి ఇంటిని ప్రారంభించి నూతన వస్త్రాలు అందజేశారు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న సొంతింటి కల నెరవేర్చిన మంత్రికి రుణపడి ఉంటామని ఆమె తెలిపారు. అలాగే, ఆచార్లగూడెంలో నిర్మించిన ఆలయంలో మంత్రి పూజలు చేసి అన్నదానాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొడాలి గోవిందరావు, సర్పంచ్ కొలికపొంగు ఉప్పలమ్మతో పాటు నాయకులు పాల్గొన్నారు. -
కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు..
కొణిజర్ల: రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని గురువారం మిల్లులకు తరలిస్తామని పౌర సరఫరాల సంస్థ జిల్లా ఇన్చార్జ్ మేనేజర్ సునీల్రెడ్డి తెలిపారు. మండలంలోని లాలాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన తహసీల్దార్ ఎన్.అరుణ, ఏఓ డి.బాలాజీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు ధాన్యాన్ని మిల్లులకు తరలించాక క్వింటాకు 10 కేజీల తరుగు కింద తీస్తున్నారని, అందుకు ఒప్పుకుంటేనే మిల్లర్లు దిగుమతి చేసుకుంటున్నారని చెప్పారు. అంతేకాక దిగుమతి ఆలస్యమైన లారీల అద్దె కూడా తమపైనే వేస్తున్నారని తెలిపారు. ఇకనైనా స్పందించి కొనుగోళ్లలో వేగం పెంచి సరిపడా లారీలు సమకూర్చాలని కోరగా సునీల్రెడ్డి ప్రతీ బస్తా మిల్లుకు తరలించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
గిన్నిస్ రికార్డ్ ప్రదర్శనలో రిటైర్డ్ కండక్టర్
మధిర: మధిరకు చెందిన రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ రెంటపల్లి ఫ్రాన్సిస్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు. హైదరాబాద్లో ఫిబ్రవరి 2న జరిగిన కార్యక్రమంలో 22 దేశాల నుంచి 2 వేల మంది కీబోర్డు ప్రదర్శన ఇచ్చారు. ఇందులో ప్రతిభ కనబర్చిన 777 మందిని రికార్డుకు ఎంపిక చేయగా ఫ్రాన్సిస్కు స్థానం దక్కింది. ఈ మేరకు 8వ తేదీన విజయవాడలో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకులు దండంగి అగస్టీన్ ఆయనకు రికార్డు పత్రం, పతకాన్ని బహూకరించారు. హెచ్పీఎస్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం ఖమ్మంమయూరిసెంటర్: రామాంతపూర్, బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూళ్లలో మొదటి తరగతిలో ప్రవేశానికి అర్హులైన ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖాధికారి జి.జ్యోతి తెలిపారు. జిల్లాకు రెండు సీట్లు కేటాయించగా.. రామాంతపూర్, బేగంపేటలో ఒక్కో సీటు అందుబాటులో ఉందని వెల్లడించారు. వయస్సు, వార్షిక ఆదా యం ఆధారంగా అన్ని సర్టిఫికెట్లతో కలెక్టరేట్ లోని తమ కార్యాలయంలో ఈ నెల 29వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు అందించాలని సూచించారు. జిల్లా కోటా కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే జూన్ 1వ తేదీన లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. ఆయిల్పామ్ సాగుతో లాభాలుఖమ్మంఅర్బన్: ప్రస్తుత పరిస్థితుల్లో సంప్రదాయ పంటలకు బదులు ఆయిల్పామ్ సాగు రైతులకు లాభదాయకంగా మారుతోందని రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్బాషా తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా బాలాపేటలోని పలువురు రైతుల ఆయిల్పామ్ క్షేత్రాలను బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ.. ఆయిల్పామ్ సాగుచేస్తే తక్కువ నిర్వహణ ఖర్చు లతో అధిక ఆదాయం పొందే అవకాశముందని తెలిపారు. శాఖ జాయింట్ డైరెక్టర్ సరోజినీదేవి, జిల్లా ఉద్యాన శాఖాధికారి ఎంవీ మధుసూదన్, పట్టు పరిశ్రమశాఖ డీడీ ముత్యాలు, రైతులు మానుకొండ రాధాకిశోర్, కుర్ర సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఖమ్మం ప్రజల ఆశీస్సులతోనే ఈ స్థాయికి..
ఖమ్మంఅర్బన్: దివంగత సీఎం ఎన్టీఆర్ ఆశీస్సులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల సహకారానికి తోడు ఖమ్మం జిల్లా ప్రజల ప్రేమాభిమానాలతోనే తాను ఈ స్థాయికి చేరానని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మంత్రిగా తొలిసారి ఆయన ప్రమాణ స్వీకా రం చేసి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం ఖమ్మం డిగ్రీ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో తుమ్మల మాట్లాడారు. సామాన్యుడినైన తనకు గత 45 ఏళ్లుగా అవకాశాలు కల్పించిన ప్రజలు, ప్రోత్సహించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు, తాను ఉన్న వ్యవస్థ, నాయకత్వానికి చేదోడుగా నిలుస్తూ, అధికారాన్ని సామాన్యులు, కష్టజీవుల సంక్షేమానికి వినియోగిస్తానని చెప్పారు. నిజాయితీతో కూడిన రాజకీయాలకే తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. కాగా, మంత్రి తుమ్మల తన ప్రసంగంలో భావోద్వేగానికి లోనయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ప్రజాసేవే లక్ష్యంగా మంత్రి తుమ్మల పని చేశారని తెలిపారు. ఎన్నికల సమయంలోనే కాక సాధారణ రోజుల్లోనూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని కొనియాడారు. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ.. ఆదివాసీల అభివృద్ధికి తుమ్మల కృషి చేశారని తెలిపారు. ఆదివాసీల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై శ్రద్ధ చూపారని చెప్పారు. ఇంకా సభలో వివిధ పార్టీలు, ఉద్యోగ, ప్రజాసంఘాల నాయకులు బాగం హేమంతురావు, ఎండీ.సలాం, డాక్టర్ వాసిరెడ్డి రామ నాథం, గడిపల్లి కవిత, ఏలూరి శ్రీనివాసరావు, నూతి సత్యనారాయణ, రాయల నాగేశ్వరరావు తదితరులు మాట్లాడారు. ఇంకా కార్యక్రమంలో శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ అధ్యక్షులు మేళ్లచెరువు వెంకటేశ్వరరావుతో పాటు నాయకులు తుమ్మల యుగంధర్, నాగండ్ల దీపక్చౌదరి, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రావూరి సైదబాబు, సాధు రమేశ్రెడ్డి, చండ్రా రాంబాబు, గుత్తా వెంకటేశ్వర్లు, యరగర్ల హనుమంతురావు, దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, సంక్రాంతి నాగేశ్వరరావు, దేవ్సింగ్, దండి సురేశ్ తదితరులు పాల్గొన్నారు. తొలుత నాయకన్గూడెం నుంచి సభావేదిక వద్దకు ర్యాలీగా చేరుకోగా, మార్గమధ్యలో ఎన్టీఆర్ విగ్రహానికి తుమ్మల పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఖమ్మంసహకారనగర్: మంత్రిగా 40 ఏళ్ల ప్రస్థానం పూర్తయిన సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావును టీజేఏసీ బాధ్యులు బుధవారం సన్మానించారు. టీజేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు, జిల్లా చైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి కొణిదెన శ్రీనివాసరావు, జైపాల్, రుక్మారావు తదితరులు పాల్గొన్నారు. అభినందన సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
● గోదాముల కొరత
ఖమ్మంవ్యవసాయం: మొక్కజొన్నల నిల్వలకు గోదాముల సమస్య తలెత్తింది. జిల్లాలో 1.99 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం మార్క్ఫెడ్ను ఆదేశించింది. ఇప్పటివరకు 40 కేంద్రాల ద్వారా 1.89 లక్షల మెట్రిక్ టన్నుల పంట కొనుగోలు చేశారు. కానీ జిల్లాలో అవసరమైన గోదాములు లేక ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నూతనంగా నిర్మించిన మిర్చి మోడల్ మార్కెట్లోని ఐదు షెడ్లలో 25వేల మెట్రిక్ టన్నుల పంట నిల్వ చేశారు. ఆపై ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి మార్కెట్లోని షెడ్లలో 3 వేల మెట్రిక్ టన్నులు, కూసుమంచి మండలం కల్లూరుగూడెం గోదాముల్లో కూడా నిల్వ చేస్తున్నారు. అయినా ఇంకా పంట ఉండడంతో రైస్ మిల్లులు, ఫంక్షన్ హాళ్లు, పాత సినిమా హాళ్లను పరిశీలిస్తున్నారు. ఇవికాక పొరుగు జిల్లాలైన సూర్యాపేట, నల్లగొండ, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా చిలుకూరు ప్రాంతాల్లో ఉన్న గోదాములను లీజ్కు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
గీతాసారం
జీవిత పాఠం..అష్టాదశ శ్లోకాలపై శిక్షణ ఖమ్మంగాంధీచౌక్: భగద్గీతలో అష్టాదశ శ్లోకాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మహాభారత యుద్ధం సమయాన శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన గీతాసారమే భగవద్గీత. ఇందులో 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉంటాయి. ఖమ్మం గుట్టలబజార్లోని శ్రీరామకృష్ణ విద్యాలయం ఉపాధ్యాయురాలు అపర్ణ విద్యార్థులకు భగవద్గీతతో పాటు రామాయణం, మహాభారతంపై శిక్షణ ఇస్తున్నారు. ప్రధానంగా భగవద్గీతలోని అష్టాదశ శ్లోకాలపై ఇస్తున్న శిక్షణకు మంచి స్పందన వస్తోందని చెబుతున్నారు. ఈ శ్లోకాల సారం జీవిత పాఠాలను నేర్పుతుందని, సమాజంలో బాధ్యతలను గుర్తుచేస్తాయని నమ్ముతున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాక శ్లోకాల పఠనం ద్వారా విద్యార్థుల్లో భాష ఉచ్ఛారణ, స్పష్టత వస్తుందని, మెదడు చురుగ్గా పనిచేస్తుందని నమ్ముతున్నారు. ఈ క్రమాన వేసవిలో ఉదయం నామమాత్రపు ఫీజుతో పలు అంశాల్లో శిక్షణ ఇస్తున్నామని రేణుక తెలిపారు. -
కనులపండువగా కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం రామయ్య కల్యాణం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం చేశారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించాక పెద్దసంఖ్యలో పాల్గొన్న భక్తుల సమక్షాన నిత్య కల్యాణ మహోత్సవాన్ని అర్చకులు జరిపారు. అలాగే, బేడా మండపంలో స్వామికి స్నపన తిరుమంజనం గావించారు. -
మరింత వేగంగా అభివృద్ధి పనులు
మధిర: మధిర మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. మధిరలో అభివృద్ధి పనులను బుధవారం పరిశీలించిన ఆమె అధికారులతో సమీక్షించారు. పనులు వేగంగా చేపట్టడమే కాక నాణ్యత లోపించకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పనుల సమయాన ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయించాలని తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ సామినేని సుజాత రామనాథం, కమిషనర్ సంపత్ కుమార్, నాయకులు, కౌన్సిలర్లు మిర్యాల వెంకటరమణ గుప్తా, వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పారుపల్లి విజయకుమార్, తలుపుల వెంకటేశ్వర్లు, బాణావత్ వెంకటరమణ నాయక్, యన్నం కోటేశ్వరరావు, దోర్నాల రవికుమార్, బండారు నరసింహారావు, మైలవరపు చక్రి పాల్గొన్నారు. -
ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్గా సతీష్కుమార్
ఖమ్మంవైద్యవిభాగం: ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్గా డాక్టర్ సతీష్కుమార్ నియమితులయ్యారు. ఏడాది కాలంగా పోస్టు ఖాళీగా ఉండడంతో ఆరోగ్యశ్రీ సేవలపై ప్రభావం పడుతోంది. ఈనేపథ్యాన సతీష్కుమార్ను నియమించగా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలు అర్హులకు సాఫీగా అందేలా పర్యవేక్షిస్తామని తెలిపారు. ఎవరికై నా ఇబ్బందులు ఎదురైతే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలోని తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. రైతు డిస్కంకు సై! ఖమ్మంవ్యవసాయం: వ్యవసాయ, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా విద్యుత్ సర్వీసుల కోసం రాష్ట్రస్థాయిలో విద్యుత్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన రైతు డిస్కంలోకి వెళ్లేందుకు ఉద్యోగులు పలువురు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఆర్పీడీసీఎల్) పేరిట నిర్వహిస్తున్న ఈ డిస్కంలో చేరేందుకు ఇతర డిస్కంల ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. గత నెల 30 నుంచి ఈ నెల 8 వరకు దరఖాస్తులు స్వీకరించగా ఎన్పీడీసీఎల్ పరిధిలో 1,252 మంది ఆసక్తి చూపించారు. ఇందులో ఖమ్మం విద్యుత్ సర్కిల్ నుంచి 80 మంది ఉద్యోగులు ఉన్నారు. ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి కూడా దరఖాస్తు చేసుకోగా, నలుగురు డివిజనల్ ఇంజనీర్లు, ఒక ఏడీఈ, ఏడుగురు ఏఈలు ముందుకొచ్చారు. డివిజన్ల వారీగా పరిశీలిస్తే ఖమ్మం రూరల్ డివిజన్ నుంచి అత్యధికంగా 26 మంది, ఖమ్మం టౌన్ డివిజన్లో 11 మంది, సత్తుపల్లి డివిజన్లో 14 మంది, వైరా డివిజన్లో 9 మంది, మధిర డివిజన్లో ఆరుగురు రైతు డిస్కంలోకి వెళ్తామని పోర్టల్ ద్వారా దరఖాస్తులు సమర్పించారు. పదోన్నతులు వస్తాయని.. నూతన డిస్కంలో త్వరగా పదోన్నతి వస్తుందనే భావనతో ఇంజనీర్లు, అధికారులు, ఉద్యోగులు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొందరు ఉద్యోగులు ఏళ్ల తరబడి ఒకేస్థాయిలో పనిచేస్తున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే డిస్కంలో చేరితే పదోన్నతుల్లో ప్రాధాన్యత ఉంటుందనే భావనకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, డిస్కం నిర్వహణకు 2 వేల మంది ఉద్యోగుల అవసరమని భావిస్తుండగా, ఎన్పీడీసీఎల్ నుంచే 1,250 మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. మిగతా డిస్కంలు, ట్రాన్స్కో, జెన్కో ఉద్యోగులను పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన పూర్తయినందున బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. ఆయా ఉద్యోగులు 15వ తేదీన ప్రస్తుత స్థానాల్లో రిలీవ్ అయి పోస్టింగ్ ఆర్డర్లు తీసుకున్నాక కొత్త స్థానాల్లో 25వ తేదీలోగా చేరాల్సి ఉంటుంది. విద్యుత్ సెక్షన్ల విలీనం పలు ఇంజనీరింగ్ పోస్టులు రద్దు ఖమ్మంవ్యవసాయం: రైతు డిస్కం ప్రత్యేక ఏర్పాటుతో విద్యుత్ సెక్షన్ల విలీనానికి సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. వ్యవసాయ, వాటర్ వర్క్స్ కనెక్షన్ల నిర్వహణకు ప్రత్యేకంగా రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీజీ ఆర్పీడీసీఎల్)ను ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలోని 1,22,757 వ్యవసాయ, 7,912 వాటర్ వర్క్స్ కనెక్షన్లు ఆ డిస్కం పరిధిలోకి వెళ్తాయి. ఫలితంగా టీజీ ఎన్పీడీసీఎల్ పరిధి ఖమ్మం విద్యుత్ సర్కిల్లో సర్వీసుల సంఖ్య తగ్గనుంది. ఈ మేరకు మిగిలిన కనెక్షన్లలో 15 వేలకు ఒకటి చొప్పున సెక్షన్ ఏర్పాటుకు కంపెనీలు ఆదేశాలు జారీ చేశాయి. ఈ నిర్ణయంతో రాయుడుపాలెం, వేంసూరును ఒక సెక్షన్గా, ఏన్కూరు, తిమ్మారావుపేట కలిపి ఒకటి, బోనకల్, మోటమర్రిని ఒక సెక్షన్గా విలీనం చేస్తున్నారు. అంతేకాక ఎస్ఈ కార్యాలయంలో టెక్నికల్ ఏడీఈ, ముదిగొండ ఏడీఈ, విలీనమైన సెక్షన్లలో మూడు ఏఈ పోస్టులు, సబ్ ఇంజనీర్ల పోస్టుల రద్దుకు నివేదికలను సీఎండీకి పంపించారు. -
ప్రతీ ఓటమి గెలుపునకు నాంది
ఖమ్మంసహకారనగర్: ఓటమితో కుంగిపోకుండా గెలుపునకు నాందిగా భావించి ముందుకు సాఘాలని డీఈఓ చైతన్యజైనీ సూచించారు. పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం కూసుమంచి, సత్తుపల్లి, శాంతినగర్, ఎన్ఎస్సీ కాలనీ, మధిర పాఠశాలల్లో సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేశారు. కూసుమంచి ఉన్నత పాఠశాలలో క్యాంప్ను మంగళవారం డీఈఓ ప్రారంభించి మాట్లాడుతూ.. అందరి జీవితంలో జయాపజయాలు ఉంటాయని తెలిపారు. ప్రతీ ఓటమిని స్ఫూర్తిగా తీసుకొని కారణాలు విశ్లేషించుకుంటూ ముందుకు సాగితే విజయాలు సొంతమవుతాయని చెప్పారు. ఆ తర్వాత సాంస్కృతిక, క్రీడాంశాల్లో శిక్షణకు ఏర్పాటు చేసిన క్యాంప్ను కూడా డీఈఓ పరిశీలించారు. ఏఎంఓ పి.ప్రభాకర్రెడ్డి, ఎంఈఓ వీరస్వామి పాల్గొన్నారు. -
ఆర్టీసీలో ప్రతీ మంగళవారం గ్రీవెన్స్
ఖమ్మంమయూరిసెంటర్: టీజీఎస్ఆర్టీసీలో ఉద్యోగులు, కార్మికుల సమస్యలను తెలుసుకునేందుకు మంగళవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఖమ్మంలోని ఆర్ఎం కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా రీజినల్ మేనేజర్ ఎ.సరిరామ్ ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డిపోల వారీగా కార్యాలయాల్లో కాక రీజినల్ స్థాయిలోనూ ప్రతీ మంగళవారం గ్రీవెన్స్డే నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు మెరుగు రవీంద్రనాథ్ ఆధ్వర్యాన పదోన్నతుల్లో అవకతవకలను అరికట్టాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అలాగే, డీఎం కార్యాలయంలో మేనేజర్ శివప్రసాద్కు మహిళా కార్మికులు తమ సమస్యలను వివరించారు. రాత్రి 11 గంటల వరకు విధులు నిర్వర్తించాల్సి రావడంతో ఇబ్బంది ఎదురవుతోందని, డిపోలు, బస్టాండ్లలో సరైన రెస్ట్ రూమ్స్ లేక అవస్థ పడుతున్నామని మహిళా కండక్టర్లు తెలిపారు. -
ఆశాజనకమేనా ?
సాక్షిప్రతినిధి, ఖమ్మం: గత నెలాఖరు నుంచి సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. అడపాదడపా జల్లులు మినహా అకాల వర్షాలు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో జిల్లాలో భూగర్భ జలమట్టం క్రమంగా పడిపోతోంది. అయినా జిల్లాలోని ప్రధాన చెరువులు, రిజర్వాయర్లలో ప్రస్తుతానికి నీటిమట్టం సంతృప్తికరంగానే ఉంది. కానీ రాబోయే వానాకాలం సాగు మొత్తం నైరుతి రుతుపవనాలపైనే ఆధారపడి ఉండడం.. రుతుపవనాల రాక ఆలస్యమవుతుందనే ప్రచారం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. నాగార్జునసాగర్ వంటి ప్రధాన ప్రాజెక్టులు నిండితేనే సాగు సాఫీగా సాగనుంది. భయపెడుతున్న భానుడు ఎండాకాలం ఉష్ణోగ్రతలు, వేడిగాలుల ప్రభావం వానాకాలం సాగుపై పడుతుందని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం జలాశయాల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో ఉన్నా పంటల సాగుకు బోర్లు, బావులపై పెద్దసంఖ్యలో రైతులు ఆధారపడతారు. ఎండలకు తోడు వర్షాలు ఆలస్యమై భూగర్భ జలాలు మరింత తగ్గితే నీరు అందని పరిస్థితి ఎదురవుతుంది. మండువేసవిలో జలకళ జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్లలో వేసవిలోనూ నీటినిల్వలు ఉండటం విశేషం. ప్రధానంగా సాగర్ ప్రాజెక్టు నుంచి వచ్చి చేరే నీటితో పాలేరు రిజర్వాయర్ కళ సంతరించుకుంది. ఈ రిజర్వాయర్లో గరిష్ట నీటిమట్టం 23 అడుగులు కాగా.. ప్రస్తుతం 19.45 అడుగుల మేర నీరు ఉంది. వైరా మధ్య తరహా ప్రాజెక్టు, జాలిముడి ప్రాజెక్టుల్లోనూ నీరు ఉండగా.. లంకాసాగర్ ప్రాజెక్టు, బేతుపల్లి చెరువు, కట్టలేరులో కొంత మేర తగ్గింది. 463 చెరువులు నిండా.. జిల్లాలో 962 చెరువులు ఉండగా.. అందులో 463 చెరువుల్లో 75 శాతం నుంచి 100శాతం నీరు ఉంది. కేవలం 233 చెరువుల్లోనే 25 శాతం లోపు నీటి నిల్వ లు ఉన్నాయి. గత ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో నీటి వనరులు నిలకడగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో 87 చెరువుల్లో 50 – 75 శాతం మేరకు నీరు ఉండటం సానుకూలాంశంగా చెప్పుకోవచ్చు. అయితే ఎండలు మరింత ముదిరితే ఇంకొన్ని చెరువుల్లో నిల్వలు తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉంది. రానున్న వానాకాలం సీజన్ వరకు ఈ నిల్వలు తగ్గకపోతే పంటల సాగుకు ఉపయుక్తం కానున్నాయి. వర్షాలపైనే ఆధారం.. జిల్లాలోని జలాశయాల్లో నీటి నిల్వలు కొత్త ఆశలను కల్పిస్తున్నా.. రానున్న వానాకాలం సీజన్ సజావుగా సాగాలంటే వరుణుడి కరుణ తప్పనిసరి. ఎల్నినో ప్రభావంతో రుతుపవనాలు ఆలస్యమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే వానాకాలం సాగుపై నీలినీడలు కమ్ముకుంటాయి. రుతుపవనాలు బలహీన పడి సకాలంలో వర్షాలు కురవకపోతే వ్యవసాయంపై ప్రభావం పడుతుంది. అలాకాకుండా ప్రస్తుతం చెరువులు, రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వలకు తోడు జూన్ రెండు, మూడో వారాల్లో వర్షాలు కురిసి జలాశయాలు నిండితేనే సాగు గాడిన పడనుంది. ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుత నిల్వలు పాలేరు రిజర్వాయర్ 23 19.45 వైరా రిజర్వాయర్ 18.03 14.04 లంకాసాగర్ ప్రాజెక్టు 16 05.05 బేతుపల్లి చెరువు 16 08.03 జాలిముడి ప్రాజెక్టు 15 15.01 -
ఎస్సెస్సీ టాపర్లకు విమానయానం
బోనకల్: పదో తరగతి ఫలితాల్లో మండల ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు విమానయానం కల్పిస్తామన్న ఊటుకూరి ఫౌండేషన్ అధ్యక్షుడు ఊటుకూరి నాగేశ్వరరావు తన హామీ నెరవేర్చుకున్నారు. ఈ మేరకు మొదటి రెండు స్థానాల్లో నిలిచిన టి.భానుప్రకాశ్ (ఆళ్లపాడు – 560 మార్కులు), టి.చంద్రిక (రావినూతల – 546 మార్కులు)ను విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు సొంత ఖర్చులతో విమానంలో తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యార్థుల వెంట ఎంఈఓ దామాల పుల్లయ్య కూడా వెళ్లారు. పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు నిరవధిక వాయిదా కేయూక్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో ఈ నెల 14 నుంచి జరగాల్సిన ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీతో పాటు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల పరీక్షలను నిరవధికంగా వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ వి.రామచంద్రం తెలిపారు. పీజీ కోర్సుల నాలుగో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని ఈ నెల 11న కొందరు విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యాన మంగళవారం సాయంత్రం విద్యార్థులతో సమావేశం కాగా, పోటీ పరీక్షలు ఉండడమే కాక ఎండల కారణంగా పరీక్షలు వాయిదా వేయాలని పట్టుబట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాక నాలుగో సెమిస్టర్ విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించామని, ఈ నెల 13న మధ్యాహ్న భోజనం తర్వాత యూనివర్సిటీలోని హాస్టళ్లు, మెస్లను మూసివేస్తారని వెల్లడించారు. జూన్ 8న వేసవి సెలవులు ముగిశాక సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు. బరువు తగ్గిస్తామనే హామీ విఫలంతో జరిమానా ఖమ్మంలీగల్: బరువు తగ్గిస్తామని నమ్మబలికి రూ.వేలల్లో ఫీజు తీసుకున్నాక సేవల్లో నిర్లక్ష్యం వహించడంతో ఖమ్మంలోని కలర్స్ (కలర్స్ – సీజే హెల్త్, వెల్నెస్) సంస్థ పరిహారం చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ మంగళవారం తీర్పునిచ్చింది. భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం గత్తాయిగూడెంకు చెందిన అట్లూరి తేజశ్రీ ఆరు నెలల్లో 15 కిలోల బరువు తగ్గిస్తామనే కలర్స్ సంస్థ ప్రకటన చూసి సంప్రదించింది. ఈ మేరకు 2024 నవంబర్లో రెండు విడతలుగా రూ.2 లక్షలు ఫీజు చెల్లించారు. ఆపై ప్రతీ వారం రామవరం నుంచి ఖమ్మంకు వచ్చివెళ్తూ ఎనిమిది నెలల చికిత్స పొందారు. అయినా బరువులో ఎలాంటి మార్పు రాకపోగా సంస్థ ప్రతినిధులను ప్రశ్నించినా, లీగల్ నోటీసు జారీ చేసినా వారు స్పందించలేదు. దీంతో ఆమె వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. కేసు విచారణ సందర్భంగా కలర్స్ సంస్థ సేవల్లో లోపం ఉన్నట్లు నిర్ధారణ కావడం, విచారణకు ప్రతినిధులు హాజరుకాకపోవడంతో బాధితురాలు చెల్లించిన రూ.2లక్షల మొత్తాన్ని తిరిగి ఇవ్వడమే కాక ఆర్థిక నష్టానికి రూ.20 వేలు, కేసు ఖర్చులుగా రూ.10 వేలు చెల్లించాలని తీర్పు చెప్పింది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లో చెల్లించకపోతే వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుందని తీర్పులో స్పష్టం చేసింది. -
నీట్ నిస్తేజం
● పరీక్ష రద్దుతో విద్యార్థుల్లో ఆందోళన ● కష్టపడి సిద్ధమయ్యామంటూ వెల్లడి ● మరోమారు పరీక్షకు సన్నద్ధతపై భిన్నాభిప్రాయాలు ఖమ్మంసహకారనగర్: మెడికల్ కాలేజీల్లో యూజీ ప్రవేశాలకు ఈ నెల 3వ తేదీన నిర్వహించిన ‘నీట్’ను రద్దు చేశారు. రాజస్థాన్లో ప్రశ్నాపత్రం లీకై నట్లు నిర్ధారణకు వచ్చిన జాతీయ పరీక్ష వ్యవస్థ (ఎన్టీ) దర్యాప్తు సంస్థల విచారణతో ఈ నిర్ణయం తీసుకుంది. పరీక్ష కేంద్రం మార్పు లేకుండా, మరోమారు ఫీజు చెల్లించే అవసరం లేకుండా త్వరలో ఇంకోసారి పరీక్ష నిర్వహిస్తామని చెబుతున్నా.. కష్టనష్టాలకోర్చి సిద్ధమైన విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. పరీక్ష కీ చూసుకుని మంచి మార్కులు సాధిస్తామని, తప్పక సీటు వస్తుందని నమ్మకంతో ఉన్న విద్యార్థులు రద్దయిందనే సమాచారంతో ఏం చేయాలో పాలుపోని స్థితి ఎదుర్కొంటున్నారు. ప్రత్యేక శిక్షణతో.. కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు పలువురు రూ.లక్షలు ధారపోసి లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకున్నారు. కంటిమీద కునుకు లేకుండా పుస్తకాలతో కుస్తీపట్టారు. అంతేకాక తాజాగా ఇంటర్ చదివిన వారు షార్ట్టర్మ్ శిక్షణతో నీట్ లక్ష్యంగా సన్నద్ధమయ్యారు. ఇందుకోసం తల్లిదండ్రులు తమ పొదుపు మొత్తాన్ని వెచ్చించారు. కానీ పరీక్ష రద్దు కావడంతో వారిలో నిరాశ అలుముకుంది. ఎంతో శ్రమించి సన్నద్ధమై ఒకసారి పరీక్ష రాశాక.. మళ్లీ రాయడమంటే ఆ స్థాయిలో ఏకాగ్రత సులువు కాదని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. పేపర్ లీక్ పరిణామం తెలివైన విద్యార్థులకు తీరని నష్టం చేకూరుస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయాన దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని చెబుతున్న నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మొబైల్ మాయ.. నష్టాల తోవ
కరకగూడెం: ఒక ఊరిలో ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. వాళ్లలో ఒకరు ఎప్పుడూ సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతూ కాలం గడిపేవాడు. మరొకరు ప్రతిరోజూ కొంత సమయం చదువు, కొంత సమయం ఆటలకు, ఇంకొంత సమయం కొత్త విషయాలు నేర్చుకోవడానికి కేటాయించేవాడు. కాలం గడిచింది. మొబైల్తో సమయం వృథా చేసిన బాలుడు చదువులో వెనుకబడిపోయాడు. కానీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకున్న బాలుడు చదువులోనే కాదు ఆటల్లోనూ, చిత్రలేఖనంలోనూ ప్రతిభ చూపించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఒకరోజు మొబైల్కు బానిసైన బాలుడు తన స్నేహితుడిని అడిగాడు. ‘నువ్వు ఎలా విజయవంతమయ్యావు?’అని. అప్పుడు ఆ విద్యార్థి ‘మొబైల్ మనకు ఉపయోగపడాలి. మనమే మొబైల్కు బానిసలు కాకూడదు’అని చెప్పాడు. ఆ మాటలు విని మొదటి విద్యార్థి ఆలోచనలో పడ్డాడు. మరుసటి రోజు నుంచి మొబైల్ వినియోగాన్ని తగ్గించి, స్నేహితులతో కలిసి బయట ఆటలు ఆడడమే కాక పుస్తకాలు చదవడం ప్రారంభించాడు. అమ్మమ్మ చెప్పిన నీతి కథ -
పులిగుండాల వెళ్లొద్దామా ?!
ఎకో టూరిజంలో భాగంగా పెనుబల్లి మండలంలోని పులిగుండాల రిజర్వాయర్ వద్ద పర్యాటకుల కోసం వసతులు కల్పించారు. అక్కడ నిండా నీళ్లతో కళకళలాడే రిజర్వాయర్ను చూస్తూ రోజంతా గడపొచ్చు. అలాగే, అడవిలో షికారుకు సఫారీ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. సేద తీరేందుకు విడిది గృహాలు, అడవిని వీక్షించేలా వాచ్టవర్ కూడా నిర్మించారు. ఈ క్రమాన పులిగుండాల టూరిజంప్రాజెక్టుపై ప్రచారం కోసం వాటర్ ఫాల్స్, వివిధ జంతువుల బొమ్మలతో కూడిన ప్రాజెక్టు నమూనాను కలెక్టరేట్ ప్రవేశద్వారం వద్ద ఏర్పాటు చేశారు. దీన్ని చూస్తే చాలు సెలవుల్లో ఒకరోజు ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాలనే ఆసక్తి కలగడం ఖాయమని చెబుతున్నారు. – ఖమ్మంమయూరిసెంటర్ కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణఖమ్మంవ్యవసాయం: పులిగుండల ఎకో–టూరిజం ప్రాజెక్టు వివరాలతో రూపొందించిన ‘కాఫీ టేబుల్ బుక్’ను హైదరాబాద్లో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సి.సువర్ణ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ పులిగుండాలను పరిరక్షణ, పర్యాటకం, పర్యావరణ విద్యకు కేంద్రంగా తీర్చిదిద్దడంలో పూర్వ డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్సింగ్, ఉద్యోగుల కృషిని అభినందనీయమన్నారు. అలాగే, పుస్తక రూపకల్పనపై విక్రమ్సింగ్ను అభినందించారు. -
పారదర్శకంగా రీ సర్వే
● కలెక్టర్ దివాకర టీ.ఎస్. ● కాకరవాయిలో సర్వే పరిశీలన.. ఉద్యోగులకు సూచనలుతిరుమలాయపాలెం: భూముల రీ సర్వేను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో రీ సర్వే ప్రక్రియను కలెక్టర్ మంగళవారం పరిశీలించి ఉద్యోగులకు సూచనలు చేశారు. గ్రామంలో ఆర్ఎస్ఆర్ పట్టా విస్తీర్ణం సమస్యల పరిష్కారానికి రీ సర్వే చేపడుతుండగా.. ఆతర్వాత కచ్చితంగా వివరాలు నమోదు చేయనున్నట్లు చెప్పారు. ఐదు బృందాల ద్వారా చేపడుతున్న సర్వే వివరాలను రైతు వేదికలోనే కంప్యూటర్ ఏర్పాటు చేసి నమోదు చేయాలని సూచించారు. గ్రామంలోని అన్ని రహదారులు, ప్రజాస్థలాలు, ప్రభుత్వ భూములను కచ్చితమైన వివరాలతో గుర్తించాలని చెప్పారు. ఐదు బృందాలు కలిపి రోజుకు 250 – 300 ఎకరాలు సర్వే చేయాలని తెలిపారు. ఈ సర్వేతో ఎవరికీ నష్టం జరగకపోగా, సర్వే నంబర్లలో గందరగోళం తొలగిపోతుందని వివరించారు. ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ విల్సన్, ఎంపీడిఓ సిలార్సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. వానాకాలానికి ముందే రైతు రిజిస్ట్రీ ఖమ్మంవ్యవసాయం: వానాకాలం సీజన్కు ముందే రైతు రిజిస్ట్రీ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర సూచించారు. కలెక్టరేట్లో వ్యవసాయ శాఖపై సమీక్షించిన ఆయన మాట్లాడుతూ వ్యవసాయ, రవాణా శాఖ, సీడ్ కార్పొరేషన్, పోలీసు శాఖలు సమన్వయంతో నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా నిలువరించాలని తెలిపారు. ఇందుకోసం టాస్క్ఫోర్స్ బందాల ద్వారా నిరంతరం తనిఖీ చేయాలని చెప్పారు. అలాగే, క్రాప్ బుకింగ్, రైతు రిజిస్ట్రీపై సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి.పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. సోలార్ విలేజ్గా రఘునాథపాలెంరఘునాథపాలెం: పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా రఘునాథపాలెం గ్రామాన్ని సోలార్ రూప్టాప్ వ్యవస్థ కలిగిన పైలట్ గ్రామంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. రఘునాథపాలెంలో సోలార్ మోడల్ ప్రాజెక్టు పనులను మంగళవారం తనిఖీ చేసి మాట్లాడారు. ఇప్పటివరకు 110 ఇళ్లపై ప్యానళ్లు ఏర్పాటుచేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ భవనాలు, ఇతర సామూహిక ప్రదేశాలపైనా సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం జనగణన సర్వేపై కలెక్టర్ ఆరా తీశారు. విద్యుత్ శాఖ డీఈ రామారావు, ఏడీఈ సంజయ్కుమార్, రెడ్కో జిల్లా మేనేజర్ పోలిశెట్టి అజయ్కుమార్, తహసీల్దార్ శ్వేత, సర్పంచ్ గాజుల కృష్ణారావు, ఎంపీడీఓ ఆశోక్కుమార్, ఆర్ఐ వహీద్, గ్రామ కార్యదర్శి అనురాధ పాల్గొన్నారు. ఖమ్మంసహకారనగర్: మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది రాకుండా సాఫీగా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్రెడ్డి ఆదేశించారు. పలువురు మంత్రులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకష్ణారావుతో కలిసి ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొక్కజొన్న ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 2.78 లక్షల టన్నుల మొక్కజొన్న కేంద్రాలకు చేరగా, కొనుగోళ్లు చేపడుతున్నామని తెలిపారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల జిల్లాఅధికారులు చందన్కుమార్, శ్రీరామ్, డి.పుల్లయ్య, గంగాధర్, ఎం.ఏ.అలీం, సునీల్రెడ్డి పాల్గొన్నారు. -
మొక్కజొన్న రైతుల రాస్తారోకో
కొణిజర్ల: మొక్కజొన్నల కాంటా పూర్తయినా ఎగుమతికి ట్రక్షీట్లు ఆన్లైన్ చేయకుండా మార్క్ఫెడ్ అధికారులు కోతలు విధిస్తున్నారని రైతులు మండిపడ్డారు. ఈ మేరకు కొణిజర్లలోని ఖమ్మం – సత్తుపల్లి జాతీయ రహదారిపై మంగళవారం రాస్తారోకో చేశారు. మొక్కజొన్నల కాంటా పూర్తయ్యాక ఎగుమతికి మార్క్ఫెడ్ అధికారులు ఆన్లైన్లో ట్రక్షీట్ మంజూరు చేయాలి. పట్టాదారు రైతు వేలి ముద్ర వేస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఇందుకోసం పలు గ్రామాల రైతులు మంగళవారం ఉదయమే సొసైటీ కార్యాలయానికి రాగా, మార్క్ఫెడ్ అధికారులు రోజుకు 2 వేల బస్తాల ఎగుమతికే ఆన్లైన్ చేశారు. దీంతో ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న తమ పరిస్థితి ఏమిటని రైతులు రాస్తారోకోకు దిగారు. ఈ మేరకు సొసైటీ సీఈఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ అరుణ చేరుకుని మాట్లాడారు. లారీ యజమానులు బస్తాకు రూ.50 తీసుకుంటున్నారని, ట్రక్షీట్ జారీ కాక వేచి ఉండాల్సి వస్తే రోజుకు రూ.3 వేలు చొప్పున వసూలు చేస్తున్నారని రైతులు వాపోయారు. దీంతో తహసీల్దార్ అరుణ మార్క్ఫెడ్ అధికారులతో ఫోన్లో మాట్లాడగా వారు సర్వర్లో మార్పులు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కాగా, రాస్తారోకోతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోగా ఎండలో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. బస్తాల ఎగుమతిలో నిబంధనలపై ఆగ్రహం -
రద్దు బాధాకరం
నీట్లో మంచి మార్కులు వస్తాయనే నమ్మకంతో ఉన్నా. విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే అటు ఇంటర్, ఇటు నీట్కు సిద్ధమయ్యాం. పేపర్ లీక్ అయిందని పరీక్ష రద్దు చేయడంతో వేదనకు గురయ్యా. భవిష్యత్లోనైనా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి. – హారికారెడ్డి, రెజొనెన్స్ కళాశాల, ఖమ్మం నీట్ రద్దయినట్లు తెలిసి బాధ కలిగింది. పరీక్ష చాలా బాగా రాయడంతో మంచి మార్కులు వస్తాయని అనుకున్నా. మరో రాష్ట్రంలో పేపర్ లీకేజీతో ఇంకోసారి పరీక్ష రాయాల్సి రావడం ఇబ్బందే. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పరీక్షల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలి. – కె.గుణశేషు, న్యూవిజన్ కళాశాల విద్యార్థి, ఖమ్మం ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఎన్టీఏ పరీక్ష నిర్వహించగా.. పేపర్ లీకేజీ కావడంపై సమగ్ర విచారణ జరిపించాలి. లీకేజీ వ్యవహారంతో లక్షల మంది విద్యార్థుల భవిష్యత్పై ప్రభావం పడుతోంది. ఈ అంశంపై విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. – ఇటికల రామకృష్ణ, ఏఐఎస్ఎఫ్ నాయకుడు దేశమంతా కాకుండా పేపర్ లీకై న ప్రాంతాల్లోనే మళ్లీ పరీక్ష నిర్వహిస్తే బాగుంటుంది. ఏడాది పాటు విద్యార్థులు కష్టపడి చదివినందున ఈ నిర్ణయం తీసుకోవాలి. అంతటా రద్దు చేస్తే ఇబ్బంది పడతారు. గతంలో మంచిగా రాసిన వారు మళ్లీ అలా రాయగలరా అనేది చెప్పలేం. – డాక్టర్ రాజశేఖర్గౌడ్, డీసీహెచ్ఎస్ -
హెచ్పీవీ వ్యాక్సినేషన్ 49శాతం పూర్తి
ఖమ్మంవైద్యవిభాగం: గర్భాశయ ముఖద్వార కేన్సర్ నివారణకు ప్రభుత్వం హెచ్పీవీ(హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 14 ఏళ్లు పూర్తయి 15ఏట కొనసాగుతున్న బాలికలకు ఈ టీకా వేయాలని నిర్ణయించి మార్చి 8వ తేదీన జిల్లాలో వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. అధికారుల అంచనా ప్రకారం జిల్లాలో ఈ వయస్సు బాలికలు 10,883 మంది ఉండగా, సోమవారం నాటికి 5,329 మందికి(49శాతం) వ్యాక్సినేషన్ పూర్తయింది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పాటు నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు, మూడు ఏరియా ఆస్పత్రులు, నాలుగు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో పాటు 15 పీహెచ్సీల్లో వ్యాక్సినేషన్ కొనసాగిస్తున్నారు. తొలుత మూడు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని నిర్దేశించుచుకున్నా, సాధ్యం కాకపోవడంతో సెంటర్ల పెంపునకు నిర్ణయించారు. ఖరీదైన గార్డాసిల్–4 వ్యాక్సిన్ ఉచితంగా అందుబాటులో ఉన్న నేపథ్యాన, తల్లిదండ్రులు తమ కుమార్తెలను తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు 37 కేంద్రాలు ఖమ్మంసహకారగనర్: జిల్లాలో బుధవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు జరిగే ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 37కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి కె.రవిబాబు తెలిపారు. ఖమ్మం నయాబజార్ కళాశాలలో సోమవారం ఆయన అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ ఎండల నేపథ్యాన కేంద్రాల్లో తాగునీటి వసతి కల్పించి ఓఆర్ఎస్ ప్యాకెట్లు సమకూర్చాలని తెలిపారు. ఉదయం 9నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2–30నుంచి 5–30 గంటల వరకు జరిగే పరీక్షలకు ప్రథమ సంవత్సరం విద్యార్థులు 10,433 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 3,562 మంది పరీక్షలు హాజరవుతారని చెప్పారు. హాల్టికెట్లలో తప్పులు ఉంటే ప్రిన్సిపాల్ ద్వారా డీఐఈఓ ఆఫీస్లో సంప్రదించేలా అవగాహన కల్పించాలని సూచించారు. డీఈసీ సభ్యులు ఎం.సింహాచలం, ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పాలిసెట్కు ఏర్పాట్లు పూర్తి ఖమ్మం సహకారనగర్: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల నిర్వహించే పాలిసెట్ ఈనెల 13వ తేదీ బుధవారం జరగనుండగా, ఏర్పాట్లుచేసినట్లు నగర కోఆర్డినేటర్, ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహమ్మద్ జాకిరుల్లా తెలిపారు. పరీక్షకు హాజరయ్యే 3,157మంది విద్యార్థుల కోసం ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల, ఎస్బీఐటీ, కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాల, దరిపల్లి అనంతరాములు ఇంజినీరింగ్ కళాశాల, డీఆర్ఎస్ డిగ్రీ కళాశాల, యూనివర్సిటీ పీజీ కళాశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశామని వెల్లడించారు. పరీక్ష బుధవారం ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1–30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. విద్యార్థులను 10 గంటల నుంచే అనుమతిస్తామని వెల్లడించారు. విద్యార్థులు హాల్టికెట్తో పాటు హెచ్బీ పెన్సిల్, బ్లూ లేదా బ్లాక్ పెన్ తీసుకురావాలని సూచించారు. కేంద్రాల వద్ద 163 సెక్షన్ ఖమ్మంక్రైం: పాలిసెట్ కేంద్రాల వద్ద ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ సునీల్దత్ తెలి పారు. ఉదయం 9నుంచి మధ్నాహ్నం 3–30 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనుండగా, కేంద్రం నుంచి 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండొద్దని సూచించారు. సభలు, ర్యాలీలకు అనుమతి ఉండదని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. 13,14వ తేదీల్లో ప్రజాదర్బార్ ఖమ్మంరూరల్/కూసుమంచి: పాలేరు నియోజకవర్గంలోని మండలాల్లో క్లస్టర్ల వారీగా ప్రజల నుంచి దరఖాస్తులు, వినతిపత్రాలు స్వీకరించేలా నిర్వహిస్తున్న ప్రజాదర్బార్లు ఈనెల 13, 14వ తేదీల్లో మూడు చోట్ల జరగనున్నాయి. కూసుమంచి మండలం జీళ్లచెరువు ఈనెల 13న బుధవారం మధ్యాహ్నం 3గంటలకు జరిగే ప్రజాదర్బార్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొంటారు. ఇక్కడ పోచా రం, తురకగూడెం, నేలపట్ల, అగ్రహారం, కోక్యాతండా, లోక్యాతండా, ముత్యాలగూడెం, చేగొమ్మ, ధర్మతండా, మునిగేపల్లి, కేశవా పురం, కిష్టాపురం గ్రామాల ప్రజలు వినతిపత్రాలు అందజేయవచ్చు. అలాగే, 14న ఉదయం 8గంటలకు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో, మధ్యాహ్నం 3గంటలకు రామన్నపేట జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. కస్టర్ల వారీగా డివిజన్ల ప్రజల నుంచి వినతిపత్రాలు, దరఖాస్తులు స్వీకరిస్తారు. -
ఇంటింటి సర్వే ఆరంభం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జనగణనలో కీలక అడుగు పడింది. ఇందులో తొలి దశగా ఇంటింటి గణనకు ఎన్యుమరేటర్లు రంగంలోకి దిగారు. ఇప్పటికే సిద్ధం చేసిన 2,651 హౌస్ లిస్టింగ్ బ్లాక్ల ఆధారంగా ఇంటింటికీ వెళ్లి కుటుంబాలకు నంబర్లు కేటాయించనున్నారు. ఇదంతా మూడు రోజుల్లో పూర్తవుతుంది. ఆతర్వాత యాప్లోని ప్రశ్నావళి ఆధారంగా ఇంటింటా వివరాలు సేకరించనున్నారు. కాగా, ఇళ్ల గణన ప్రక్రియను కలెక్టర్ దివాకర టీ.ఎస్. కొణిజర్లలో పరిశీలించి ఎన్యుమరేటర్లకు సూచనలు చేశారు. రెండు దశల్లో జనగణన.. జనగణన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు దశల్లో చేపడుతోంది. మొదటి దశ సోమవారం మొదలు కాగా.. రెండో దశ వచ్చే ఏడాది ఉంటుంది. ప్రస్తుత సర్వేలో తొలుత గృహగణన చేపడతారు. ఒక ప్రాంతంలో ఉన్న నివాస గృహాలు, వాణిజ్య భవనాలు, ఖాళీ స్థలాల వివరాలను సేకరిస్తారు. వీటికి నంబర్లు కేటాయించి జాబితా తయారు చేస్తారు. అలాగే ఎన్యుమరేషన్ బ్లాక్లు(జనాభా గణన బ్లాక్లు) కూడా ఏర్పాటవుతాయి. జనగణనను సులువుగా చేపట్టేందుకు నిర్దిష్ట ప్రాంతాలను విభజిస్తారు. పెద్ద గ్రామాలు, పట్టణాలను చిన్నచిన్న భౌగోళిక ప్రాంతాలుగా విభజిస్తారు. ప్రతీ బ్లాక్కు నియమించిన గణన అధికారి తమ పరిధిలో ప్రతీ ఇంటిని సందర్శించి వివరాలు సేకరిస్తారు. దీన్ని సర్వేలో ప్రాథమిక దశగా పిలుస్తారు. ఇది గురువారం నుంచి జూన్ 9వ తేదీ వరకు కొనసాగుతుంది. స్వీయగణనకు నాలుగో స్థానం జనగణనలో భాగంగా ప్రజలే సొంతంగా తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకోవడానికి కేంద్రప్రభుత్వం సెల్ఫ్ ఎన్యుమరేషన్ పేరుతో అవకాశం కల్పించింది. గతనెల 26నుంచి ఈనెల 10వ తేదీ వరకు వెబ్సైట్ అందుబాటులో ఉండగా.. జిల్లాలో 30,398 మంది తమ వివరాలను నమోదు చేసుకున్నారు. ఇలా నమోదు చేసుకున్న వారికి ఎస్ఈ ఐడీ వస్తుంది. ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఈ నంబర్ చూపిస్తే పరిశీలించి.. లోపాలు ఉంటే సరిచేసుకునే వీలు కల్పించారు. తద్వారా ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని చెబుతున్నారు. కాగా, స్వీయ గణనలో రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో నిలవగా, ఖమ్మం జిల్లా నాలుగో స్థానం దక్కించుకుంది. ఇక గ్రామీణ జిల్లాల్లో పరిశీలిస్తే ఖమ్మం మొదటి స్థానాన నిలవడం విశేషం. స్వీయ గణన వల్ల ఎన్యుమరేటర్లకు పని సులభం కావడంతో పాటు సమయం సైతం ఆదా అవుతుంది. ఇళ్ల గణన ప్రారంభం జిల్లాలో సోమవారం నుంచి జనగణన మొదటి దశలో భాగంగా ఇళ్ల జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి మూడు రోజులు ఇళ్ల సంఖ్య లెక్కించి నంబర్లు కేటాయిస్తూ, నాలుగో రోజు నుంచి గృహ సమాచారం, ఆ తర్వాత కుటుంబంలో వినియోగించే ధాన్యం, సదుపాయాలు, ఆస్తుల వివరాలను సేకరిస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి డిజిటల్ రూపంలో వివరాలు చేస్తున్నారు. తద్వారా కచ్చితత్వం, పారదర్శక ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం తయారు చేసే ఇళ్ల జాబితా ఆధారంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జనగణనను చేపడతారు. జనగణనలో తొలిదశ ప్రక్రియలో భాగంగా ఇళ్ల గణన కార్యక్రమం జిల్లాలో మొదలైంది. ఎన్యుమరేటర్లు ప్రతీ ఇంటికి వచ్చి కుటుంబ వివరాలను సేకరిస్తారు. ప్రజలు పూర్తి, సరైన సమాచారాన్ని అందించి సహకరించాలి. ప్రభుత్వ పథకాలు కోల్పోతామనే అపోహలు విడనాడాలి. ప్రజలు ఇచ్చే వివరాలన్నీ గోప్యంగా ఉంటాయి. ఇలా సేకరించే సమాచారం దేశ భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు ఉపయోగపడుతుంది. – దివాకర టీఎస్, కలెక్టర్కొణిజర్ల: దేశాభివృద్ధికి ప్రణాళికల రూపకల్పనలో కీలకంగా నిలిచే జనగణన విధులను ఎన్యుమరేటర్లు నిబద్ధతతో నిర్వర్తించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. జిల్లాలో సోమవారం ఇంటింటి గణను కొణిజర్లలో ఆయన పరిశీలించారు. గ్రామంలో మొత్తం 2,600 గృహాలను ప్రాథమికంగా గుర్తించగా, పది బ్లాక్లుగా రూపొందించి పది మంది ఎన్యుమరేటర్లను నియమించామని తహసీల్దార్ అరుణ తెలిపారు. అనంతరం ఇంటి గణన, నంబర్ల కేటాయింపు వివరాలపై ఎన్యుమరేటర్ను అడిగి తెలుసుకున్నారు. ఆతర్వాత ఎస్సీ కాలనీలో గృహ గణనను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్.. ప్రజలకు అవగాహన కల్పిస్తూ కచ్చితమైన సమాచారాన్ని సేకరించాలని సూచించారు. తొలుత మల్టీపర్పస్ వర్కర్ల ద్వారా ఇంటింటికీ సమాచారం చేరవేస్తే ఎన్యుమరేటర్ వెళ్లే సరికి కుటుంబీకులు వివరాలు సిద్ధం చేస్తారని చెప్పారు. తద్వారా పని సులువుగా, త్వరగా పూర్తవుతుందని కలెక్టర్ తెలిపారు. సీపీఓ ఏ.శ్రీనివాస్, వివిధ శాఖల ఉద్యోగులు శ్రీకాంత్, ఆర్.ఉపేంద్రయ్య, ఎన్.తిరుపతిరావు, రమేష్, గురుమూర్తి, రమేష్, అరుణాకర్, ప్రసాద్, హనుమతో పాటు సర్పంచ్ గూదె పుష్పావతి తదితరులు పాల్గొన్నారు.స్వీయ జనగణన పూర్తి.. గృహ గణన మొదలు -
పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
● కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న ప్రధాని మోదీ ● బెంగాల్లో అధికారంలోకి వచ్చిన మూడు రోజులకే లెనిన్ విగ్రహం తొలగింపు ● మాస్లైన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాగూర్ ఇల్లెందు: మిలిటెంట్ పోరాటాలతోనే రైతు సమస్యలు పరిష్కారమవుతాయని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ జాతీయ ప్రధాన కార్యదర్శి, అఖిల భారత ఐక్య రైతు సంఘం(ఏఐయూకేఎస్) జాతీయ నాయకుడు ప్రదీప్ సింగ్ ఠాగూర్ అన్నారు. సోమవారం నుంచి ఇల్లెందులో ఏఐయూకేఎస్ జాతీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. చీలికలుగా మారిన సీపీఐ(ఎంఎల్)లోని కొన్ని గ్రూపులు కలిసి మాస్లైన్గా ఆవిర్భవించాయి. ఆ పార్టీ ఆధ్వర్యంలో 16 రారష్ట్రాల్లోని రైతు సంఘాలతో అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏర్పాటు చేశారు. ఈ సంఘం సభలను ఇల్లెందులో నిర్వహిస్తున్నారు. సభకు పలు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు తరలివచ్చారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అరుణోదయ కళాకారులు ఆటపాటలతో అలరించారు. అనంతరం సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదీప్సింగ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశంలోని రైతుల నడ్డి విరిచేలా ఇతర దేశాల నుంచి వరి, మొక్కజొన్న, పత్తి పంటల ఉత్పత్తుల దిగుమతికి ఒప్పందాలు చేసుకుంటున్నారని విమర్శించారు. గంభీర ఉపన్యాసాలు దంచే మోదీ ట్రంప్ షరతులకు తలొగ్గాడని అన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తోందని ఆరోపించారు. ఇక పశ్చిమబెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన మూడు రోజులకే లెనిన్ విగ్రహాన్ని తొలగించారని విమర్శించారు. మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ ఎన్డీ పార్టీ ప్రతిఘటన పోరాటం అంటూ కేడర్ను మోసం చేస్తోందని ఆరోపించారు. జీవితాలను ధారబోసిన మావోయిస్టు పార్టీ కూడా ఆచరణ సాధ్యం కాని విధానంలో పని చేశామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో పీడిత ప్రజల రాజ్యం రావాలంటే అన్ని పార్టీలు ఏకం కావాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు అవుతున్నా ఎన్నికల హామీలు అమలు చేయడం లేదన్నారు. రైతులు పడిగాపులు కాస్తున్నా మక్కలు, ధాన్యం కొనే పరిస్థితి లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని, ఇల్లెందుకు నీరు ఇవ్వాలని అన్నారు. సభలో అలిండియా కన్వీనర్ విమల్ త్రివేది, తుమ్మలపల్లి ప్రసాద్, కిచ్చెల రంగయ్య, గుమ్మడి నర్సయ్య, కె.రమ, డీహెచ్ పూజార్, కృష్ణ గగోయ్, చండ్ర అరుణ, కృష్ణ, రాము, భిక్షం, నాయిని రాజు, వెంకన్న, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సమాజమే కథలకు పునాది
సత్తుపల్లిటౌన్: విద్యార్థి దశ నుంచి సమాజాన్ని నిశితంగా పరిశీలిస్తే కథారచనకు అవసరమైన అనేక అంశాలు కనిపిస్తాయని సత్తుపల్లి ప్రభుత్వ హైస్కూల్ హెచ్ఎం ఎస్కే సోందు తెలిపారు. ‘సాక్షి’దినపత్రికలో ప్రచురితమవుతున్న వేసవి వికాసం స్ఫూర్తితో గార్లపాటి – బొల్లేపల్లి ట్రస్ట్ ఆధ్వర్యాన సోమవారం పాఠశాలలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు కథా కార్యశాల ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోందు మాట్లాడుతూ.. కథా రచనలో మెళకువలు, అవసరమైన అంశాల గుర్తింపునకు కార్యశాల ఉపయోగపడుతుందన్నారు. ఆ తర్వాత తెలుగు ఉపాధ్యాయిని రమాదేవి కథా ప్రారంభం, విస్తరణ, ముగింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ట్రస్ట్ నిర్వాహకులు జి.రామకృష్ణ మాట్లాడుతూ.. వేసవిలో విద్యార్థులకు సాహిత్యంపై ఆసక్తి పెంచేలా ‘సాక్షి’ప్రత్యేక శీర్షిక నిర్వహించడం అభినందనీయమన్నారు. బాల సాహితీవేత్త బొల్లెపల్లి మధుసూదన్రాజు మాట్లాడగా ఎంఈఓ ఎన్.రాజేశ్వరరావు, పి.నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆ తర్వాత విద్యార్థులతో ఆసక్తి ఉన్న అంశాలపై కథలు రాయించి అందులో లోపాలను సరిచేసుకోవడంపై అవగాహన కల్పించారు. ‘కథా కార్యశాల’లో వక్తలు -
లక్ష్యం మేర రెడ్క్రాస్ సొసైటీ సభ్యత్వాలు
ఖమ్మంసహకారనగర్/ఖమ్మంవైద్యవిభాగం: రెడ్క్రాస్ సొసైటీ ద్వారా శాఖల వారీగా కేటాయించిన సభ్యత్వాలు నమోదు చేయించాలని కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన కలెక్టరేట్లో సభ్యత్వాలపై సమీక్షించారు. అన్ని శాఖల ఉన్నతాధికారులు దృష్టి సారించి ఉద్యోగులు సభ్యత్వం తీసుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు. అత్యవసర సమయాల్లో ఉపయోగపడే రెడ్క్రాస్ సొసైటీలో జిల్లా నుంచి కనీసం వేయి మంది ఉద్యోగులు సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ మ్యాపింగ్ వేగవంతం చేయాలి ఖమ్మంసహకారనగర్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా తాజా ఓటరు జాబితాను 2002 నాటి జాబితాతో మ్యాపింగ్ను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సోమవారం ఆయన వీసీ ద్వారా ఎస్ఐఆర్ మ్యాపింగ్పై సమీక్షించారు. రానున్న 15 రోజుల్లో 90 శాతం మ్యాపింగ్ పూర్తి చేసేలా ఉద్యోగులకు సూచనలు చేయాలని తెలిపారు. జిల్లా నుంచి కలెక్టర్ దివాకర మాట్లాడుతూ.. జిల్లాలో మ్యాపింగ్ 42 శాతం పూర్తయిందని, మరింత వేగం పెరిగేలా చూస్తామని వివరించారు. ఇంకా ఈ వీసీలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్, ఎన్నికల విభాగం డీటీ అన్సారీ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ దివాకర టీఎస్ -
ప్రకృతి ఒడిలో ఆటపాటలు
సెలవుల నేపథ్యాన గ్రామాల్లో చిన్నారుల సందడి నెలకొంది. ఉదయం, సాయంత్రం వేళల్లో నీడ పట్టున ఆటపాటలతో కాలక్షేపం చేస్తున్నారు. ఒకప్పుడు టీవీలు, మొబైళ్లకే పరిమితమైన చిన్నారులు ఇప్పుడు అందుబాటులో ఉన్న వనరులతో మైదానాల్లో గడుపుతున్నారు. చెట్ల నీడలో ఊయల ఊగుతూ కొందరు.. పాత టైర్లతో ఆడుకుంటూ ఇంకొందరు సెలవులను ఆస్వాదిస్తున్నారు. –పాల్వంచరూరల్ / కరకగూడెం కరకగూడెం : పాత టైర్లతో ఆడుకుంటున్న బాలురు -
వాహనం ఢీకొని ఏడు పాడిగేదెలు మృతి
కొణిజర్ల: గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఏడు పాడిగేదెలు మృతి చెందిన ఘటన మండలంలోని బొట్లకుంట సమీపాన సోమవారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ప్రతాపనేని రామకృష్ణ, కూచిపూడి తిరపతిరావుకు చెందిన ఏడు పాడిగేదెలు ఆదివారం సమీపంలోని పొలాల్లో మేతకు వెళ్లి తిరిగి రాలేదు. అయితే, గేదెలు గ్రీన్ఫీల్డ్ హైవేపైకి వెళ్లినట్లు తెలియడంతో సోమవారం ఉదయం రైతులు వెతుకుతూ వెళ్లారు. ఈక్రమాన అవి రోడ్డుపై చనిపోయి కనిపించాయి. భారీ వాహనం ఢీకొనడంతోనే గేదెలు మృతి చెందినట్లు భావిస్తుండగా, ఒక్కో గేదె విలువ రూ.90 వేల వరకు ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట పొలాల్లో ఆగని మంటలు చింతకాని: మండలంలోని నాగులవంచ, లచ్చగూడెం, పాతర్లపాడు గ్రామాల్లో పలువురు రైతుల పొలాల్లో సోమవారం మంటలు చెలరేగాయి. కొందరు తమ పొలాల్లో చెత్తకు నిప్పు పెడుతుండగా, గాలులకు సమీప పొలాలకు మంటలు వ్యాపిస్తున్నాయి. ఈ మేరకు సోమవారం కూడా పలువురి పొలాల్లో మంటలు అంటుకోవడంతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని అదుపు చేయడంతో ఎలాంటి నష్టం జరగలేదు. అంతేకాక నాగులవంచ సబ్స్టేషన్ సమీపాన కూడా మంటలు రావడంతో అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేశారు. చుక్కల దుప్పి స్వాధీనం ఖమ్మంరూరల్: మండలంలోని మద్దివారిగూడెం సమీపాన గుట్టల నుంచి సోమవారం ఓ చుక్కల దుప్పి పిల్ల గ్రామానికి వచ్చింది. దుప్పిపిల్లను వీధి కుక్కలు తరుముతుండడంతో స్థానికులు రక్షించి అటవీ శాఖ ఉద్యోగులకు సమాచారం ఇచ్చారు. దీంతో కూసుమంచి డీఆర్ఓ కేవీ రామారావు సిబ్బందితో చేరుకుని దుప్పికి పరీక్షలు చేయించాక కిన్నెరసాని డీర్ పార్క్కు తరలించారు. -
అమ్మ.. ఆవకాయ.. ఆదివారం
సీటీజీ ఆధ్వర్యాన వినూత్నంగా మాతృదినోత్సవం ఖమ్మంఅర్బన్: అవకాయతో తెలుగు వారి అనుబంధం మరువలేనిదని వక్తలు పేర్కొన్నారు. ఖమ్మం సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ (సీటీజీ) సభ్యులు మాతృదినోత్సవం సందర్భంగా ‘అమ్మ – ఆవకాయ – ఆదివారం’పేరిట వరంగల్ క్రాస్ రోడ్డులోని విజయలక్ష్మి – మహేశ్బాబు ఇంట్లో ఆదివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి మానుకొండ జ్యోతి, షేక్ కై సర్, కొణిదెన శ్రీనివాస్ సంధానకర్తలుగా వ్యవహరించగా 50 మంది సభ్యులు పాల్గొని 50 కిలోల పచ్చడి సామూహింగా తయారు చేశారు. సూర్యాపేట జెడ్పీ సీఈఓ దేవరపల్లి శిరీష ముఖ్య అతిథిగా పాల్గొని ఇళ్లలో పనులు చేస్తూ నలుగురు కుమారులను ఉన్నతస్థాయికి చేర్చిన కేస్లా లక్ష్మి తదితరులను సన్మానించారు. -
సృజనాత్మకత పెంపునకు సమ్మర్ క్యాంప్లు
బోనకల్: వేసవి సెలవులు వృథా కాకుండా విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీయడం, వారిలో సృజనాత్మకతను పెంపొందించడమే లక్ష్యంగా సమ్మర్ క్యాంప్లు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి చైతన్యజైనీ తెలిపారు. బోనకల్ మండలం ముష్టికుంట్ల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన సమ్మర్ క్యాంప్ను సర్పంచ్ పిల్లలమర్రి నాగేశ్వరరావు సోమవారం ప్రారంభించగా డీఈఓ పరిశీలించి మాట్లాడారు. విద్యార్థులకు కంప్యూటర్, యోగా, ఆటలు, బొమ్మల తయారీ నేర్పించేలా ఇన్స్ట్రక్టర్లను నియమించామని తెలిపారు. కాగా, గ్రామ విద్యార్థులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పిల ్లలు వచ్చేలా ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అమిరేశి సీతయ్య, సొసైటీ చైర్మన్ బోయినపల్లి వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు ముస్తఫా, చాంద్పాషా, ఉపాధ్యాయులు సరస్వతి, ఉషశ్రీ, నాగుల్మీరా తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులకు అన్ని సౌకర్యాలు ఖమ్మంసహకారనగర్: దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్ను సురక్షితంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పిస్తోందని డీఈఓ చైతన్యజైనీ తెలిపారు. ఖమ్మం నయాబజార్లోని జీపీఎస్ భవిత కేంద్రంలో దివ్యాంగులకు సోమవారం ఆమె వీల్చైర్లు, సీపీ వాకర్లు, టీఎల్ఎం కిట్లుఅందజేశాక మాట్లాడారు. క్యాంప్ ఇన్చార్జ్, జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ ఆఫీసర్ బాజోజు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గుర్తింపు శిబిరంలో చిన్నారులకు 534 పరికరాలను అందజేశామన్నారు. ఖమ్మం అర్బన్ ఎంఈఓ శైలజాలక్ష్మీ, కాంప్లెక్స్ హెచ్ఎం ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. డీఈఓ చైతన్యజైనీ -
నా బాల్యం
వేసవి సెలవులన్నీ అమ్మమ్మ ఇంట్లోనే.. సత్తుపల్లిటౌన్: వేసవి సెలవులు వచ్చాయంటే అందరం కలిసి అమ్మమ్మ ఇంటికి వెళ్లేవాళ్లం. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం దామగట్లలో అమ్మమ్మ ఇంటికి వెళ్లి మేనమామలు, వారి పిల్లలతో సందడిగా గడిపేవాళ్లం. రోజూ సద్ది కట్టుకొని పొలాలకు వెళ్లేవాళ్లం. అంతేకాక వరి కోత పనులు, నాట్లు వేయడం, వేరుశనగ తీయడంలో పాలుపంచుకునేవాళ్లం. రాత్రి వేళ పిల్లలందరం కలిసి అష్టాచెమ్మా, దొంగా పోలీస్, కుంటాట, ఉప్పాట ఆడుకునేది. ఇంకా భక్షాలు (బొబ్బట్లు) చేసేవాళ్లం. మజ్జిగ చిలకడం ఇష్టంగా చేసేదానిని. ఆరో తరగతి చదివేటప్పుడు కడపలో నాలుగైదు కిలోమీటర్లు నడిచి స్కూల్కు వెళ్లాను. ఏడు నుంచి పదో తరగతి వరకు నందికొట్కూరులో ఎన్సీసీ కేడెట్గా స్కూల్ ఫస్ట్ వచ్చా. ఇలా నా బాల్యమంతా ఆటపాటలతో ఆనందంగా గడిచిపోయింది. – డాక్టర్ మట్టా రాగమయి, సత్తుపల్లి ఎమ్మెల్యే -
మరిచిపోయిన బ్యాగ్ అప్పగించిన ఆటోడ్రైవర్
ఖమ్మంక్రైం: ఓ మహిళ ఆటోలో మర్చిపోయిన హ్యాండ్బ్యాగ్ను డ్రైవర్ తిరిగి అప్పగించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సర్వారం గ్రామానికి చెందిన మాలోతు మంజుల వైద్యం కోసం ఖమ్మం వచ్చింది. పాత బస్టాండ్లో దిగాక ఆటోలో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా.. హడావుడిలో రూ.20 వేల నగదు ఉన్న బ్యాగ్ను ఆటోలోనే మర్చిపోయింది. కాసేపయ్యాక గుర్తించిన ఆమె ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అంతలోనే డ్రైవర్ కూడా బ్యాగ్ యాజమాని గుర్తింపునకు ప్రయత్నిస్తున్నాడు. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా ఆటోను గుర్తించిన పోలీసులు డ్రైవర్కు సమాచారం ఇవ్వడంతో ఆయన బ్యాగ్ను మంజులకు అందజేశాడు. ఈ సందర్భంగా డ్రైవర్తో పాటు ట్రాఫిక్ సిబ్బందిని సీఐ సత్యనారాయణ అభినందించారు. ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి వేంసూరు: ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో సోదరి ఇంటికి వెళ్లి వస్తున్న ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. మండలంలోని బీమవరం – మర్లపాడు గ్రామాల మధ్య ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం వివరాలు.. రాయుడుపాలెం గ్రామానికి చెందిన విసంపల్లి మురళీకృష్ణ (30) తన తండ్రి రాములు, బాబాయి కొడుకు నాగేంద్రబాబుతో కలిసి నారాయణపురంలో ఉంటున్న అక్క వద్దకు ట్రాక్టర్లో వెళ్లాడు. సోదరికి సామగ్రి అప్పగించి తిరిగి రాత్రి 11 గంటలకు వస్తుండగా భీమవరం – మర్లపాడు మధ్య ఒక్కసారిగా ట్రాక్టర్ బ్రేక్ వేయడంతో రోడ్డు పక్కకు పల్టీ కొట్టింది. ట్రాక్టర్ ఇంజన్ చెక్కపై కూర్చున్న మురళీకృష్ణ కింద పడడం, ఆయనపై ట్రక్కు పడడంతో తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య కూసుమంచి: వ్యవసాయం కోసం చేసిన అప్పులు పెరిగిపోవడం, తీర్చే మార్గం లేకపోవడంతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మండలంలోని చౌటపల్లి గ్రామానికి చెందిన దామళ్ల సుధాకర్ (49) తనకు ఉన్న కొంత భూమితో పాటు మరికొంత కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. అయితే, కొన్నేళ్లుగా దిగుబడులు రాక అప్పులు పెరిగిపోయాయి. అప్పుల విషయమై ఇంట్లో దంపతుల మధ్య గొడవలు జరుగుతుండటంతో మనస్తాపానికి గురైన సుధాకర్ ఆదివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన భార్య మమత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. కల్లూరు: అన్నం వండే విషయమై భార్యభర్తల మధ్య వివాదం నెలకొనడంతో మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కల్లూరు మండలం వెన్నవల్లికి చెందిన మేకల చిన్ననాగయ్య ఆదివారం మధ్యాహ్నం అన్నం వండే విషయంలో భార్య సత్యవతి(40)ని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఎలుకల మందు తాగింది. కుటుంబీకులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై ఆమె భర్త ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, సత్యవతి దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
త ల్లిదండ్రుల ప్రోత్సాహం..
ఖమ్మంగాంధీచౌక్: ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, పాఠశాలల్లో జరిగే వేడుకలు, కుటుంబాల్లో పెళ్లిళ్లు.. ఇలా ఏ వేదికపై అయినా చిన్నారులు నృత్యం చేసేందుకు అవకాశం దక్కుతోంది. దీనికి కొందరు చిన్నారుల్లో నృత్యంపై సహజంగానే ఆసక్తి ఉంటోంది. ఈ మేరకు వేసవి సెలవుల్లో పలువురు కూచిపూడి నృత్యం నేర్చుకునేందుకు ముందుకొస్తున్నారు. ఏపీలోని కృష్ణా జిల్లా కూచిపూడిలో ఆవిర్భంవించిన ఈ కళానృత్యం వైపు చిన్నారులు దృష్టి సారిస్తున్నారు. కళారూపం, హస్తముద్రలు, ముఖ, కంటి కదలికలతో పాటు వేగవంతమైన పాద విన్యాసంతో పురాణ గాథలు, భక్తిని ఈ నృత్యం ప్రదర్శిస్తుంది. భరత నాట్యానికి దగ్గరగా ఉండే ఈ నృత్యం ప్రత్యేక శైలిని కలిగి ఉండడంతో చిన్నారులు ఆకర్షితులవుతున్నారు. ఖమ్మం గట్టయ్యసెంటర్లోని ఏలూరి మీనా కొందరు చిన్నారులకు శిక్షణ ఇస్తోంది. చిన్నారుల ఆసక్తికి అనుగుణంగా నామమాత్రపు ఫీజుతో శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం మీనా వద్ద 50 మంది చిన్నారులు కూచిపూడి నృత్యం నేర్చుకునేందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారుల్లో కూచిపూడిపై ఆసక్తి పెరగుతోందని.. అందుకు అనుగుణంగా వేసవి సెలవుల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. నృత్య ప్రదర్శనలు అంటే ఇష్టం. చాలా రకాల నృత్యాలు ఉన్నా కూచిపూడిపై ఆసక్తితో నేర్చుకోవాలని నిర్ణయించుకున్నా. మా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావటంతో శిక్షణ పొందుతున్నా. –జ్ఞాన సహస్ర, గట్టయ్యసెంటర్, ఖమ్మం -
రూ.200 కోట్ల పనులకు టెండర్లు ఆహ్వానం
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి, విస్తరణ పనులకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఆలయ అభివృద్ధికి మూడు దశల్లో రూ. 351 కోట్లను కేటాయించిన సంగతి విదితమే. ఇందులో కీలకమైన టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో పనులకు రంగం సిద్ధం చేశారు. సుమారు రూ.200 కోట్ల నిధులతో చేపట్టాల్సిన పనుల జాబితా సిద్ధంచేసి ఈనెల 9న టెండర్లు ఆహ్వానించారు. ఈనెల 15వరకు సివిల్ పనులకు గడువు విధించారు. ఆతర్వాత పరిశీలించి ఖరారు చేస్తారు. భవనాల తొలగింపునకు సుమారు రూ.5 కోట్లు అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలో ఉన్న భవనాలను కూల్చివేసి, వాటి శిఽథిలాలను తొలగించే పనులకు రూ.4,97,64,000కు టెండరు పిలిచారు. మొత్తం 1,058 నిర్మాణ పనులకు రూ.200 కోట్ల 89 వేలుగా ప్రతిపాదించారు. కాగా ఈ పనుల పూర్తికి 30 నెలల గడువు విధించారు. వచ్చే మార్చి నాటికి ఆలయ ప్రాంగణంలో పనులను పూర్తి చేసి గోదావరి పుష్కరాలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభు త్వం నిర్ణయించినట్లు ప్రకటించారు. అయితే టెండర్ ప్రక్రియలో రెండున్నరేళ్ల గడువు విధించడంతో పుష్కరాల నాటికి ఆలయ అభివృద్ధి పనులు పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. -
సత్వర పరిశీలన, పరిష్కారం
ఖమ్మంసహకారనగర్: ప్రజలు తమ సమస్యలపై ఇచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి(గ్రీవెన్స్ డే)లో ఆయన అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డిలతో కలిసి అర్జీలను స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమై దరఖాస్తుల పరిశీలన, పరిష్కారంపై సూచనలు చేశారు. సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని, అలా సాధ్యం కాని పక్షంలో కారణాలను దరఖాస్తుదారులకు తెలియచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దీక్షారైనా, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అర్జీల్లో కొన్ని... ● తల్లాడ మండలం కలకొడిమకు చెందిన మనుబోలు రామారావు తన ఇంటి మార్గంలోని రోడ్డుపై కొందరు కంప వేశారని ఫిర్యాదు చేయగా.. తక్షణ చర్యలు తీసుకోవాలని డీపీఓను కలెక్టర్ ఆదేశించారు. ● మధిర మండలం వెంకటాపురం, వంగవీడు, సిరిపురం రైతులు పాలవాగు వరద వెళ్లేలా పైపులు పాడైతే ఒక వైపే కొత్తవి వేశారని ఫిర్యాదు చేశారు. దీంతో వర్షం పడినప్పుడు నీరు వాగు వైపునకు రావటం లేదని పేర్కొనగా, పరిశీలించాలని సత్తుపల్లి ఈఈ ఆర్ అండ్ బీకి సూచించారు. ● ఖమ్మంకు దివ్యాంగుడు పగిళ్ల రాము ఉపాధి కోసం మీ సేవ సెంటర్ మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశాడు. ● ఖమ్మంకు చెందిన నిరుపేద దివ్యాంగులు పది మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు డి.నాగరాజు కోరారు. ● కొణిజర్ల మండలం పెద్దగోపతిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్నారని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించగా.. కొణిజర్ల తహసీల్దార్ ఎన్.అరుణ అప్పటికప్పుడు కేంద్రాన్ని పరిశీలించారు. క్వింటాకు 10 కేజీల తరుగు తీస్తున్నారని, ఖాళీ గోనె సంచులను తిరిగి అప్పగించకపోతే రూ.85 చొప్పున చెల్లించాలని చెబుతున్నట్లు రైతులు వాపోయారు. దీంతో విచారణ జరిపిస్తామని ఆమె తెలిపారు. గ్రీవెన్స్ డేలో కలెక్టర్ దివాకర -
విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం
ఖమ్మంఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి అల్పాహారం సమకూర్చనుండగా నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. పోషకాలతో కూడిన అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించడమే కాక నాణ్యత పాటించేలా జిల్లాలోని 21మండలాలకు చెందిన 42 మంది కుక్–కమ్–హెల్పర్లకు ఖమ్మం వెలుగుమట్లలోని కేజీబీవీలో సోమవారం శిక్షణ ఇచ్చారు. డీఈఓ చైతన్యజైనీ ఆధ్వర్యాన జరిగిన శిక్షణను అదనపు కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. ప్రతీ మండలం నుంచి ఎంపిక చేసిన ఇద్దరికి ఇక్కడ శిక్షణ ఇస్తుండగా, ఆ తర్వాత మండల స్థాయి రిసోర్స్ పర్సన్లుగా మిగతా వారికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పోషకాహారం ద్వారా వారు చురుగ్గా ఉంటూ చదువులో రాణిస్తారని తెలిపారు. డీఈఓ చైతన్య జైనీ మాట్లాడుతూ అల్పాహారంతో జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లోని 60 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని చెప్పారు. సెక్టోరియల్ అధికారులు రూబీ పంకజం, ప్రవీణ్కుమార్, రామకృష్ణ, ప్రభాకర్రెడ్డి, రచ్చ శ్రీనివాస్, ఎంఈఓ శైలజాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు .వర్కర్ల శిక్షణలో అదనపు కలెక్టర్ శ్రీజ -
తాలు పేరుతో కోత విధించొద్దు
● అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఖమ్మం సహకారనగర్: రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాక తాలు పేరుతో కోత విధించొద్దని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్లో ఆదివారం ఆయన పౌర సరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని నిర్దిష్ట కారణాలు లేకుండా తిరస్కరించొద్దని తెలిపారు. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదని భావిస్తే జిల్లా పౌర సరఫరాల అధికారికి సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఆ తర్వాత సాంకేతిక సహాయ కమిటీ పరిశీలించి నాణ్యత ప్రమాణాలు లేవని నిర్ధారణ అయితేనే ధాన్యాన్ని తిరస్కరిస్తామని తెలిపారు. అలాగే, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా జరిగేలా హమాలీల సంఖ్య పెంచాలని సూచించారు. ఈ సమావేశంలో డీసీఎస్ఓ చందన్ కుమార్, మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు బొమ్మ రాజేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ఫీల్డ్ హైవేపై మళ్లీ బ్రేక్ వైరా: ఫాస్ట్ట్రాక్కు సంబంధించి సర్వర్ మొరాయించడంతో ఖమ్మం – దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేపై ఆదివారం రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మూడు రోజుల క్రితం ఇదే సమస్య ఏర్పడగా సరిచేశారు. మళ్లీ ఆదివారం కూడా సర్వర్లో అంతరాయం ఏర్పడడంతో హైవే మార్గంలోని వైరా మండలం సోమవరం ఎగ్జిట్ పాయింట్ వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో మండుటెండలో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఈమేరకు అధికారులు సాంకేతిక లోపాన్ని సరిచేయడంతో రాకపోకలు మొదలయ్యాయి. కిన్నెరసానిలో పర్యాటక సందడిపాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం సందడి నెలకొంది. వివిధ జిల్లాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్పార్కులోని దుప్పులను వీక్షించారు. 474 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.25,370 ఆదాయం లభించింది. 210 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.12,632 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
నిప్పుల కుంపటి
● 43 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు ● వడగాలులు, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరిఖమ్మంవ్యవసాయం: భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. జిల్లాలో ఉష్ణోగ్రతల ప్రభావం పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కొద్ది రోజులుగా జిల్లా అంతటా 40 – 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9గంటలకే మొదలవుతున్న ఎండ ప్రభావం సాయంత్రం 5గంటల వరకు కూడా కొనసాగుతోంది. మధ్యాహ్నం వేళ ఎండకు తోడు వడాగాలుల తీవ్రతతో జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. దీంతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. యాసంగి పంటలు చేతికి అందుతున్న వేళ వ్యవసాయ కూలీలు, రైతులు సైతం ఉదయం, సాయింత్రమే పనులు చేసుకుంటున్నారు. ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి ఎండతీవ్రత పెరిగి ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రధానంగా పిల్లలు, వృద్దులు సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా పగలు, రాత్రీ తేడా లేకుండా కూలర్లు, ఏసీలు వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగి తరచూ విద్యుత్ అంతరాయాలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే, రాత్రివేళ లోవోల్టోజీ సమస్య వేధిస్తోంది. విద్యుత్ వినియోగం పెరగడంతోనే ఈ సమస్య వస్తోందని విద్యుత్ ఉద్యోగులు చెబుతున్నారు. గరిష్టంగా గుబ్బగుర్తిలో.. కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో ఆదివారం గరిష్టంగా 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, తిమ్మారావుపేట, పమ్మిలో 42.8, బాణాపురం, నేలకొండపల్లిలో 42.6, రావినూతలలో 42.5, వైరా(ఏఆర్ఎస్)లో 41.8, ప్రకాష్నగర్లో 41.3, కూసుమంచిలో 41.2, వైరాలో 41.1 మేర ఉష్ణోగ్రత నమోదైంది. ఇక కొణిజర్లలో 40.9, మధిరలో 40.7, ఖమ్మం ఖానాపురం, ఏన్కూరులో 40.6, గౌరారం, సిరిపురంలో 40.5, కుర్నవల్లిలో 40.4, పంగిడిలో 40.3, లింగాల, నాగులవంచలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా కనిష్టంగా వేంసూరులో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
నాడు కొత్తగూడెమే టాప్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రస్తుతం దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ నడుస్తోంది. 2021లో జరగాల్సిన గణన ఐదేళ్లు ఆలస్యంగా మొదలైంది. సోమవారం నుంచి ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించనున్నారు. అయితే, తొలిసారిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన జనగణన 1961లో జరిగింది. అప్పటి విశేషాలు, ప్రస్తుత పరిస్థితులపై ప్రత్యేక కథనం. ఏడు తాలూకాలతో.. ఉమ్మడి వరంగల్ జిల్లాను విభజించి 1953 అక్టోబర్ 1న ఖమ్మం జిల్లా ఏర్పాటు చేశారు. ఇందులో ఖమ్మం, మధిర, ఇల్లెందు, బూర్గంపాడు, పాల్వంచ (కొత్తగూడెం) తాలుకాలు ఉన్నాయి. ఆ తర్వాత 1959లో తూర్పు గోదావరి జిల్లాలో భాగంగా ఉన్న భద్రాచలం, నుగూరు తాలూకాలను కూడా ఖమ్మం జిల్లాలో చేర్చారు. భద్రాచలం, నుగూరు (వాజేడు, వెంకటాపురం మండలాలతో కూడిన ఉప తాలూకా)లు పూర్తిగా ఏజెన్సీ తాలూకాలుగా ఉండేవి. పూర్తిస్థాయిలో ఖమ్మం జిల్లా ఏర్పాటైన తర్వాత తొలిసారిగా జన గణన 1961లో జరిగింది. ఆ సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా జనాభా 10,57,542గా తేలింది. 1990 వరకు అప్రతిహతంగా అభివృద్ధి 1960 నుంచి 1990 వరకు కొత్తగూడెం పట్టణం అప్రతిహతంగా అభివృద్ధి పథంలో నడిచింది. కిన్నెరసాని ప్రాజెక్ట్, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ల రాకతో పాల్వంచ సరికొత్త పట్టణంగా రూపాంతరం చెందింది. స్పాంజ్ ఐరన్, ఏపీ స్టీల్స్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు కిన్నెర స్టీల్స్, బేరియం ఫ్యాక్టరీ, మైలారం రాగి గనులు, నవభారత్ వంటి ప్రైవేటు రంగ సంస్థలతో 90వ దశకం నాటికి ఖమ్మంపై కొత్తగూడెం అన్ని రంగాల్లో పైచేయి సాధించింది. మరోవైపు సింగరేణి గనుల కారణంగా కొత్తగూడెం, ఇల్లెందుకు తోడుగా మణుగూరు కూడా పట్టణ ప్రాంతంగా వృద్ధికి వచ్చింది. పేపర్ బోర్డు కారణంగా సారపాక–భద్రాచలం, ఉద్యాన పంటల కారణంగా అశ్వారావుపేట పారిశ్రామిక ప్రాంతాలుగా ఎదిగాయి. 90వ దశకం నుంచి దూసుకొస్తున్న ఖమ్మం ఆర్థిక సంస్కరణలు 1990లో అమల్లోకి వచ్చిన తర్వాత ప్రైవేటు రంగంలో పెట్టుబడులు ఊపందుకున్నాయి. విద్య, వైద్య రంగాల్లో పెట్టుబడులు వచ్చాయి. అప్పటికే ఉన్న గ్రానైట్, ఆగ్రో ఇండస్ట్రీస్, మార్కెట్లు ఖమ్మం అభివృద్ధికి తోడ్పడ్డాయి. కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, మణుగూరు ఏరియాలు ఏజెన్సీ ప్రాంతాలు కావడం, 1/70 చట్టం కారణంగా ఇక్కడున్న ఉద్యోగులు, కార్మికులకు సొంతిళ్లు కట్టుకునేందుకు ఖమ్మమే అనువైన ప్రాంతంగా కనిపించింది. వెరసి ప్రస్తుతం ఖమ్మం నగర జనాభా (మున్నేరు ఆవల కలుపుకుని) దాదాపు నాలుగు లక్షలకు మించింది. తెలంగాణాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా నిలిచింది. నిజామాబాద్, కరీంనగర్లకు గట్టిపోటీ ఇస్తోంది. పూర్వ వైభవం వచ్చేనా..? కొత్తగూడెంలో ఉన్న అనేక ప్రైవేటు, ప్రభుత్వ పరిశ్రమలు 1990 తర్వాత మూతపడ్డాయి. దీంతో ఉద్యోగులు, కార్మికుల సంఖ్య తగ్గిపోవడం మొదలైంది. 2016లో కొత్తగూడెం జిల్లా కేంద్రం కావడం, మెడికల్ కాలేజీ, పోలీస్ బెటాలియన్, యూనివర్సిటీ వంటివి రావడంతో కొంత మేరకు నష్ట నివారణ జరిగింది. అయినా ఖమ్మానికి పోటీ ఇచ్చే స్థితిలో కొత్తగూడెం లేదు. కొత్తగూడెం, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చంచుపల్లి, రుద్రంపూర్లను కలిపినా కొత్తగూడెం అర్బన్ జనాభా మూడు లక్షలకు మించడం లేదు. సీతారామ ద్వారా గోదావరి జలాలు అందివ్వడం, ఉద్యోగులు సొంతింటి కల సాకారమయ్యేలా చూడటం, ప్రైవేటు రంగంలో పెట్టుబడులు తేవడం, జాతీయ రహదారుల ఆధారంగా కొత్త అభివృద్ధికి శ్రీకారం చుట్టడం, ఎకో–టెంపుల్ టూరిజంపై ఫోకస్ చేయడం వంటి చర్యల ద్వారా భద్రాద్రి కొత్తగూడేనికి పూర్వ వైభవం తీసుకురావాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది.జనగణన–1961 జరిగే సమయానికి కొత్తగూడెం పట్టణం ఇటు జనాభా, అటు విస్తీర్ణం పరంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నంబర్ వన్ స్థానంలో ఉంది. కొత్తగూడెం మున్సిపాలిటీ 69,728 మంది జనాభాతో క్లాస్–2 మున్సిపాలిటీ ఉండగా, ఖమ్మం 35,888 జనాభాతో క్లాస్–3 మున్సిపాలిటీగా ఉంది. ఖమ్మానికి పాలక మండలి ఉండగా, కొత్తగూడేనికి లేదు. ఆ తర్వాత ఇల్లెందు 10,955 మంది జనాభాతో క్లాస్–4 మున్సిపాలిటీగా గుర్తింపు దక్కించుకుంది. ఇక మున్సిపాలిటీ కేటగిరిలోకి రాకుండా 6,059 జనాభాతో మధిర, 5,740 జనాభాతో భద్రాచలం పట్టణ ప్రాంతాలుగా నిలిచాయి. 1953లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆవిర్భావం -
ఘనంగా నదీ హారతి
భద్రాచలంటౌన్: భద్రగిరి క్షేత్రంలో గోదావరి నదీ తీరం భక్తి పారవశ్యంతో పులకించింది. శ్రీ సీతా రామచంద్రస్వామి వారి సన్నిధిలో ప్రవహిస్తున్న పుణ్య గౌతమికి ఆదివారం నిర్వహించిన నదీహారతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. తొలుత గణపతి పూజ నిర్వహించి, అనంతరం దీపోత్సవం చేపట్టారు. భక్తులు వెలిగించిన దీపాలతో గోదావరి మాతకు, శ్రీరాముడికి అష్టోత్తర శతనామార్చనలు చేశారు. చిన్నారుల భరత నాట్య ప్రదర్శన అలరించింది. కుంచాల రాజశేఖర్ దంపతులు భక్తులకు ప్రసాద వితరణ చేశారు. రెడీమేడ్ బట్టల షాప్ అసోసియేషన్ సభ్యులు పూజా సామగ్రిని సమకూర్చారు. ఈ కార్యక్రమంలో అర్చకులు రామవజ్జుల రవికుమార్, సత్యప్రసాద్ శర్మ, రామాచార్యులు, ఫణికుమార్ శర్మ, తేజశర్మ, కృష్ణశర్మ పాల్గొన్నారు. -
పచ్చిరొట్ట విత్తనాలు రెడీ..
● 50శాతం సబ్సిడీతో నేటి నుంచి పంపిణీ ● సహకార సంఘాలు, ఆగ్రోస్ సంస్థల ద్వారా సరఫరా ● ఉమ్మడి జిల్లాలో 18,440 క్వింటాళ్లకు ఇండెంట్ఖమ్మంవ్యవసాయం: పచ్చిరొట్ట విత్తనాల పంపిణీకి తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధమైంది. సేంద్రియ విధానంలో భూసారాన్ని పెంచడంలో పచ్చిరొట్ట సాగు ఉపయోగపడుతుంది. ఆహార పదార్థాలుగా వినియోగించే వరి, అపరాలు, నూనె గింజల పంటలు, ఉద్యాన పంటల సాగుకు ముందు పచ్చిరొట్ట ఎరువులను సాగు చేసి భూమిలో కలియదున్నుతారు. తద్వారా రసాయన ఎరువుల వినియోగం తగ్గి నాణ్యమైన పంట దిగుబడులు వస్తాయి. ఈమేరకు ఏటా మాదిరిగానే ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. అటు సబ్సిడీ.. ఇటు ధర భారం పచ్చిరొట్ట విత్తనాలకు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఈ ఏడాది 50 శాతం సబ్సిడీ ప్రకటించింది. ఈ విధానంలో జీలుగు, జనుము, పిల్లి పెసర పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేయనున్నారు. అయితే, పచ్చిరొట్ట విత్తనాల ధరలు మూడేళ్లుగా క్రమంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇస్తున్నా ధరలు పెరగడంతో రైతులకు అంతగా ప్రయోజనం కలగటం లేదు. విత్తన ధర క్వింటాకు రూ.15 వేల నుంచి 20 వేల వరకు పలుకుతుండగా, సబ్సిడీ పోగా రైతులు రూ.8వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కొందరు రైతులు రసాయన ఎరువుల వినియోగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎక్కువగా జీలుగు ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు మొత్తం 18,340 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు కావాలని ఇండెంట్ పెట్టారు. అధికంగా 16వేల క్వింటాళ్ల జీలుగు విత్తనాలు అవసరమని అందులో పేర్కొన్నారు. అలాగే, జనుము 1,760 క్వింటాళ్లు, పిల్లి పెసర 680 క్వింటాళ్లకు అవసరమని తెలిపారు. ప్రస్తుతం విత్తనాభివృద్ధి సంస్థ వద్ద 500 క్వింటాళ్ల జీలుగు, 150 క్వింటాళ్ల జనుము విత్తనాలు ఉండగా, పంపిణీ చేస్తుంటే దశల వారీగా చేరనున్నాయి. ఈ విత్తనాలను ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్), ఆగ్రోస్ రైతు సేవా సంస్థల ద్వారా సోమవారం నుంచి పంపిణీకి నిర్ణయించారు. ఖమ్మం జిల్లాలో 75 సహకార సంఘాలు, ఏడు ఆగ్రోస్ రైతు సేవా సంస్థలు, భద్రాద్రి జిల్లాలో 20 సహకార సంఘాలు, రెండు ఆగ్రోస్ రైతు సేవా సంస్థల ద్వారా పంపిణీ జరగనుంది. ప్రభుత్వం ఈ విత్తనాలను ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి సేకరించి సరఫరా చేస్తుంది.వ్యవసాయ శాఖ ఇచ్చిన ఇండెంట్ మేరకు పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇప్పటికే విత్తనాలను వివిధ ప్రాంతాలకు సరఫరా చేశాం. ఈనెల 20వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో విత్తనాలు సిద్ధంగా ఉంటాయి. – ఎన్.భిక్షం, విత్తనాభివృద్ధి సంస్థ, ఉమ్మడి జిల్లా ప్రాంతీయ మేనేజర్ -
పల్లెలకు ఆర్టీసీ కళ..
నూతన సర్వీసుల వివరాలు.. ఖమ్మం నుంచి బోనకల్ వెళ్లే ప్రయాణికుల కోసం నాగులవంచ, రామాపురం, గార్లపాడు, రావినూతల మీదుగా కొత్త సర్వీసు మొదలుకానుంది. ఈ బస్సు బోనకల్ నుంచి ఉదయం 8 గంటలకు మొదలై రామాపురం నుంచి ఖమ్మం చేరుకుంటుంది. సాయంత్రం 4.15 గంటలకు ఖమ్మం నుంచి బయలుదేరి ఇదే మార్గంలో బోనకల్ వెళ్తుంది. అలాగే, ఖమ్మం – పందిళ్లపల్లి – మత్కేపల్లి మీదుగా గంధసిరి గ్రామానికి కొత్త సర్వీ సు ప్రారంభిస్తున్నారు. ఖమ్మం నుంచి ఉదయం 7.15, మధ్యాహ్నం 3.40 గంటలకు మొదలయ్యే ఈ బస్సులు, గంధసిరి నుంచి ఉదయం 8.30 గంటలకు, సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతాయి. పునరుద్ధరించిన సర్వీసులు ప్రయాణికుల వినతితో పెద్దమండవ, చిన్నమండవ చింతకాని, పమ్మి గ్రామాలకు గతంలో నడిచిన బస్సు సర్వీసులను పునరుద్ధరించారు. ఖమ్మం నుంచి ఉదయం 8.30, సాయంత్రం 4.30 గంటలకు పెద్దమండవకు బస్సులు మొదలవుతాయి. అలాగే, పెద్దమండవ నుంచి ఉదయం 9.50, సాయంత్రం 5.30 గంటలకు తిరుగు ప్రయాణం అవుతాయి. అంతేకాక చిన్నమండవకు ఖమ్మం నుంచి ఉదయం 8.55 గంటలకు, సాయంత్రం 6.30 గంటలకు, చిన్నమండవ నుంచి ఉదయం 10.05 గంటలకు, రాత్రి 7.40 గంటలకు బస్సులు మొదలవుతాయి. ఖమ్మం నుంచి చింతకానికి ఉదయం 7 గంటలకు, సాయంత్రం 4.30 గంటలకు, చింతకాని నుంచి ఖమ్మంకు ఉదయం 8, సాయంత్రం 5.30 గంటలకు బస్సులు ఉంటాయి. అలాగే, ఖమ్మం నుంచి పమ్మికి ఉదయం 7.55 గంటలకు, సాయంత్రం 4.25 గంటలకు.. తిరుగు ప్రయాణంలో పమ్మి నుంచి ఉదయం 8.55, సాయంత్రం 5.30 గంటలకు బస్సులు బయలుదేరతాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా ఖమ్మం ఆర్టీసీ డిపో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని పలు మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడేలా నూతన సర్వీసుల ఏర్పాటుకు నిర్ణయించారు. అంతేకాక గతంలో నిలిచిపోయిన సర్వీసులను సైతం పునరుద్ధరించనున్నారు. విద్యాసంస్థలు, కార్యాలయాల పనివేళలకు బస్సుల షెడ్యూల్ రూపొందించగా సోమవారం నుంచి సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. – ఖమ్మంమయూరిసెంటర్గ్రామాల్లోని విద్యార్థులు, సామాన్య ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్త సర్వీసు లు ఏర్పాటు చేయడమే కాక పాత సర్వీసులను పునరుద్ధరించాం. తద్వారా విద్యార్థులు, ఉద్యోగులే కాక రైతు లు, చిరువ్యాపారులు నగరానికి వచ్చి వెళ్లడం సులభమవుతుంది. ప్రజలు ఆర్టీసీ సర్వీసులను వినియోగించుకుని సంస్థకు సహకరించాలి. –శివప్రసాద్, డీఎం, ఖమ్మం -
పెద్దమ్మతల్లి గుడి వద్ద కూలిన వృక్షం
పాల్వంచరూరల్: మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మగుడి) సమీపాన సంతానం లేని మహిళ భక్తులు ఊయ్యాలతొట్టి కట్టే 63 ఏళ్ల నాటి వృక్షం (రావిచెట్టు) గాలివానకు శనివారం రాత్రి నేలకూలింది. ఈ చెట్టు కొమ్మలు ఆలయ ప్రాంగణంలో రేకులషెడ్పై పడడంతో దెబ్బతిన్నాయి. ఆలయం వద్ద1963లో నాటిన వేప, రావిచెట్లు మహావృక్షాలుగా ఎదిగాయి. రెండూ కలిసి ఉండడంతోఅశ్వాత్థామ వృక్షంగా భావించి ఏటా అశ్వత్థామకల్యాణం నిర్వహిస్తారు. ఈ వృక్షం చుట్టూభక్తులు ప్రదక్షిణలు చేసేందుకు ప్రత్యేక గద్దె,చుట్టూ స్టీల్ రెయిలింగ్ నిర్మించారు. శనివారంరాత్రి భారీగా గాలివానకు వృక్షం నేలకూలింది. వేపచెట్టు మాత్రం అలాగే ఉంది. చెట్టు కొమ్మలు పడటంతో షెడ్ కొంతభాగందెబ్బతిన్నది. స్టీల్ రెయిలింగ్ ఒకవైపు విరిగిపోయింది. అంతేకాక విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అయితే, రాత్రి కావడంతోఎవరూ లేకపోగా పెనుప్రమాదం తప్పినట్లయింది. -
బడుల్లో సమ్మర్ క్యాంపులు
● 18 పీఎంశ్రీ పాఠశాలల్లో నిర్వహణకు ఏర్పాట్లు ● నేటి నుంచి 25వ తేదీ వరకు శిక్షణ ఖమ్మంసహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా ప్రత్యేక క్యాంపుల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలోని 18 పీఎంశ్రీ పాఠశాలలతో పాటు ఒక కేజీబీవీలో ఈ క్యాంపులను సోమవారం ప్రారంభిస్తారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 25వ తేదీ వరకు క్యాంపులు కొనసాగనున్నాయి. ఆటపాటలు.. విద్యాభివృద్ధి విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేలా క్యాంపుల్లో శిక్షణ ఇస్తారు. సంగీతం, చిత్రలేఖనం, నృత్యం, కథలు చెప్పడమే కాక చెస్, క్యారమ్స్ వంటి ఇండోర్ గేమ్స్లో శిక్షణ ఉంటుంది. అంతేకాక చదువుపై ఆసక్తి కల్పించడం, ఆటపాటల ద్వారా అభ్యసనంపై అవగాహన కల్పిస్తారు. ప్రతీ క్యాంపులో నిపుణులైన నలుగురు ఇన్స్ట్రక్టర్లను నియమించారు. ఈ క్యాంపులు ప్రతీరోజు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. పీఎంశ్రీ పాఠశాలల్లోని బాలబాలికలే కాక సమీప పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు కూడా ఈ క్యాంపులకు హాజరుకావొచ్చు. ప్రత్యేక నిధులు క్యాంపుల నిర్వహణకు ఒక్కో పాఠశాలకు రూ.50 వేల నిధులు కేటాయించారు. ప్రతీ క్యాంప్లో ఏవైనా నాలుగు కోర్సులకు సంబంధించి రిసోర్స్ పర్సన్లు లేదా మాస్టర్ ట్రెయినర్లు, వృత్తి నిపుణులను నియమించుకోవచ్చు. ఈ మేరకు 15 రోజులకు గాను ఒక్కొక్కరికీ రూ.3 వేల గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, బాలబాలికల శిక్షణకు ఉపయోగపడే చార్టులు, స్కెచ్లు, పేపర్లు, ఇతర సామగ్రి కొనుగోలుకు రూ.10 వేలు వెచ్చించాలి. అంతేకాక ఫ్లెక్సీలు ఏర్పాటుకు రూ.3,500 కేటాయించారు. అలాగే, క్యాంప్లకు హాజరయ్యే విద్యార్థులకు స్నాక్స్ అందిస్తారు. వంట పనుల్లో సాయపడే ఇద్దరు వర్కర్లకు రూ.వేయి చొప్పున చెల్లించాలి. ఈ బాధ్యతలన్నీ సమ్మర్ క్యాంప్ కొనసాగే పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నిర్వర్తించాల్సి ఉంటుంది. జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో నిర్వహించే సమ్మర్ క్యాంపుల ద్వారా విద్యార్థుల నైపుణ్యాలు పెంచేలా శిక్షణ ఉంటుంది. ఆటపాటలతో పాటు ఇతర అంశాల్లో శిక్షణ ఇప్పిస్తాం. సెలవుల్లో ఈ క్యాంపులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. –పెసర ప్రభాకర్రెడ్డి, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి జిల్లాలోని 18 పీఎంశ్రీ పాఠశాలల్లో సమ్మర్ క్యాంపుల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే ఇన్స్ట్రక్టర్ల నియామకం వంటి పనులు పూర్తయ్యాయి. 15 రోజుల పాటు కొనసాగే క్యాంపులను పర్యవేక్షిస్తూ విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు కృషి చేస్తాం. –చైతన్య జైనీ, జిల్లా విద్యాశాఖాధికారి -
నేటి నుంచి విద్యా వారోత్సవాలు
● ఈ నెల 17వ తేదీ వరకు నిర్వహణ ● రోజుకొక కార్యక్రమంతో షెడ్యూల్ ఖరారు ఖమ్మంసహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా విద్యా వారోత్సవాల నిర్వహణకు సిద్ధమయ్యారు. సోమవారం నుంచి ఈ నెల 17వ తేదీ వరకు విద్యాశాఖ ఆధ్వార్యన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలను సిద్ధం చేయడమే కాక ప్రవేశాల పెంపునకు కార్యాచరణ రూపొందించారు. ఇదీ షెడ్యూల్.. సోమవారం (ఈ నెల 11వ తేదీ): ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టాల్సిన మరమ్మతులు, నూతన నిర్మాణాలే కాక అమ్మ ఆదర్శ పాఠశాల ఆధ్వర్యాన చేపట్టే పనులను ప్రారంభిస్తారు. అలాగే, 18 పీఎంశ్రీ పాఠశాలలు, ఒక కేజీబీవీలో రెసిడెన్షియల్ సమ్మర్ క్యాంప్లను ప్రారంభిస్తారు. ●మంగళవారం (12వ తేదీ): పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం రెండు సమ్మర్ క్యాంపులను ప్రారంభిస్తారు. ఇందుకోసం కూసుమంచి, రఘునాథపాలెం జెడ్పీహెచ్ఎస్లను ఎంపిక చేశారు. ఈ క్యాంపుల్లో పాల్గొనే విద్యార్థుల హాజరును ముఖ గుర్తింపు ద్వారా నమోదు చేస్తారు. అలాగే, మధ్యాహ్న భోజనం, స్టేషనరీ కింద రూ.వంద, రవాణా అలవెన్స్గా ప్రతీ విద్యార్థికి రూ.వేయి నగదు అందజేస్తారు. ఈ క్యాంప్ల నిర్వహణతో సప్లిమెంటరీ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ●బుధవారం (13వ తేదీ): ప్రతీ మండలస్థాయిలో సర్పంచ్లకు వర్క్షాప్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, ఇతర విద్యా కార్యక్రమాలను వారికి వివరిస్తారు. అంతేకాక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపునకు సహకరించాలని వివరిస్తారు. ●గురువారం (14వ తేదీ): ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల ఆధ్వర్యాన బడిబాట ద్వారా విద్యార్థుల నమోదు చేపడుతారు. అలాగే, వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలల్లో అల్పాహారం అందించే అంశాన్ని వివరిస్తారు. డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులను తిరిగి చేర్పించడంతో పాటు సున్నా ప్రవేశాలు ఉన్న పాఠశాలల్లో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ●శుక్రవారం (15వ తేదీ): విద్యావారోత్సవాల్లో భాగంగా ఐదో రోజున లైబ్రరీ డేగా నిర్వహిస్తారు. ఈ మేరకు ప్రతీ పాఠశాలలో ఉన్న గ్రంథాలయ సదుపాయంపై తల్లిదండ్రులు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. అంతేకాక దాతల నుంచి పుస్తకాలు స్వీకరిస్తారు. ●శనివారం (16వ తేదీ): విద్యార్థులకు జిల్లాస్థాయి ఆర్ట్, క్రాఫ్ట్, సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తారు. మండలాల్లో విజేతలను ఆహ్వానించి జిల్లాస్థాయి పోటీలు నిర్వహించాక విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. ఈ కార్యక్రమం ఖమ్మం మామిళ్లగూడెంలోని బాల భవన్లో జరగనుంది. ●ఆదివారం (17వ తేదీ): వారోత్సవాల్లో ముగింపును చివరి రోజు ఘనంగా నిర్వహించాలని ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా పదో తరగతిలో జిల్లాస్థాయి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసి అభినందిస్తారు.నేటి నుంచి 17వ తేదీ వరకు విద్యా వారోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే ఎంఈఓలు, హెచ్ఎంలతో పాటు విద్యాశాఖ బాధ్యులతో సమీక్ష నిర్వహించి సూచనలు చేశాం. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సహకరించాలి. –చైతన్య జైనీ, జిల్లా విద్యాశాఖాధికారి -
12 ఎకరాల్లో మొక్కజొన్న పంట దగ్ధం
చింతకాని: మండలంలోని సీతంపేటకు చెందిన రైతులు పోలూరి పుల్లారావు, మోహన్రావు, మాగు నూరి కొండల్రావు 12 ఎకరాల్లో సాగుచేసిన మొక్కజొన్న పంట ఆదివారం అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. సమీప రైతులు చేన్లలో వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో మంటలు ఎగిసిపడుతూ మోహన్రావు, కొండల్రావు మొక్కజొన్న పంటకు వ్యా పించాయి. ఈ విషయమై సమాచారం తెలిసి రైతు లు వెళ్లేలోగా రూ.10లక్షల విలువైన పంట కాలిపోయిందని వాపోయారు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరారు. పిండిప్రోలు కళాశాలలో ఫర్నిచర్ నిధులు స్వాహా? తిరుమలాయపాలెం: మండలంలోని పిండిప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫర్నిచర్ కొనుగోలు సందర్భంగా నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఇక్కడ పనిచేసి బదిలీపై వెళ్లిన ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ నిధులను అక్రమంగా డ్రా చేశారని పలువురు విమర్శిస్తున్నా రు. ఈ విషయమై 9న తిరుమలాయపాలెంలో జరిగిన ప్రజాదర్బార్లో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ స్వాతి ఫిర్యాదు చేశారు. ఇన్చార్జ్ ప్రిన్సిపాల్గా పనిచేసిన వ్యక్తి బదిలీపై వెళ్లే సమయాన ఖాళీ చెక్కు లపై సంతకాలు చేయించుకొని సుమారు రూ.10 లక్షలు డ్రా చేసి సొంతానికి వాడుకున్నారని తెలిపారు. పాత ఫర్నిచర్, ఫ్యాన్లు, ఇతర వస్తువులు ఉన్నా కొత్త వస్తువులను ఎక్కువ ధరతో కొనుగోలు చేసి కమీషన్లు తీసుకున్నారని పేర్కొన్నారు. దీంతో స్పందించిన మంత్రి నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. విద్యుదాఘాతంతో పాడి గేదెలు మృతి సత్తుపల్లి: మండలంలోని కాకర్లపల్లిలో విద్యుదాఘాతం కారణంగా ఆదివారం రెండు పాడిగేదెలు మృత్యువాత పడ్డాయి. గ్రామ రైతు పువాళ్ల ప్రసాద్ కు చెందిన రెండు పాడి గేదెలు మేతకు వెళ్తూ ఇంటికి సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ను తాకాయి. దీంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాయి. రూ. 1.50 లక్షల విలువైన పాడిగేదెలు మృతి చెంది నందున తనను ఆదుకోవాలని రైతు ప్రసాద్ కోరాడు. -
మొదలుపెడదామా!
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలో జనగణనకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లుచేసింది. రెండు దశల్లో గణన చేపట్టనుండగా. తొలిదశ సోమవారం మొదలవుతుంది. ఇప్పటికే జిల్లాలో ప్రతీ 300 ఇళ్లను కలుపుతూ బ్లాక్లుగా రూపొందించారు. ఈమేరకు జిల్లా వ్యాప్తంగా 2,651 హౌస్ లిస్టింగ్ బ్లాక్లను గుర్తించి మ్యాపింగ్ చేశారు. సోమవారం నుంచి ఎన్యుమరేటర్లు క్షేత్రస్థాయిలో వివరాల సేకరణ ప్రారంభిస్తారు. గతంలో మాదిరి మాన్యువల్గా కాకుండా ఈసారి వివరాలన్నీ ఆన్లైన్లోనే నమోదు చేసేలా కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా హెచ్ఎల్ఓ యాప్ను రూపొందించింది. ఈ యాప్ ద్వారానే ఎన్యుమరేటర్లు వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. 2,669 మంది ఎన్యుమరేటర్లు జిల్లాలో జనగణనకు సంబంధించి ఇప్పటికే 2,651 హౌస్ లిస్టింగ్ బ్లాక్లను ఏర్పాటు చేశారు. ఈ బ్లాక్ల్లో సర్వే కోసం 2,669 మంది ఎన్యుమరేటర్లను నియమించారు. అలాగే, ప్రతీ ఆరుగురు ఎన్యుమరేటర్లకు ఒక సూపర్వైజర్ ఉండేలా 485 మందికి విధులు కేటాయించారు. తొలి దశలో 31 ప్రశ్నలకు ప్రజల నుండి వివరాలు సేకరిస్తారు. ఎన్యుమరేటర్ వచ్చినప్పుడు కుటుంబంలో ఎవరు ఉన్నా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. ఈ సర్వే వచ్చేనెల 9వ తేదీ వరకు జరగనుండగా, రెండో దశ 2027 ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. 19వేల కుటుంబాలు స్వీయగణన జనగణనలో ప్రజలు సొంతంగా తమ వివరాలను నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం స్వీయగణనకు అవకాశం కల్పించింది. ఈమేరకు వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకురాగా.. ఆదివారం రాత్రి 11–59 గంటలకు గడువు ముగిసింది. ఆదివారం సాయంత్రం వరకు జిల్లాలో 19వేల మందికి పైగా స్వీయగణన పూర్తి చేసుకున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. ఇందులో ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోనే 3,500కు మందికి పైగా స్వీయగణన చేసుకున్నారు. కేఎంసీలో భారీ నెట్వర్క్ ఖమ్మం నగరంలో జనగణన సర్వే పారదర్శకంగా చేపట్టేలా 524 హెచ్ఎల్బీ(హౌజ్ లిస్టింగ్ బ్లాక్స్) లుగా విభజించారు. ఒక్కో బ్లాక్లో సుమారు 290 ఇళ్లు, 800 మంది జనాభా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక సర్వే కోసం ఉపాధ్యాయులు 524మందిని ఎన్యుమరేటర్లను నియమించారు. గణనకు అవసరమైన కిట్లు, మ్యాపులను ఇప్పటికే అందజేశారు. సర్వేలో పొరపాట్లు జరగకుండా కమిషనర్ ఆదేశాల మేరకు పటిష్ట పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సూపర్వైజర్ల పనితీరును పర్యవేక్షించేందుకు కేఎంసీకి చెందిన 22 మంది అధికారులను కేటాయించారు. అంతేకాక డిప్యూటీ, అదనపు కమిషనర్లను నోడల్ ఆఫీసర్లుగా నియమించారు. ఎండల దృష్ట్యా జాగ్రత్తలు తీవ్రమైన ఎండల నేపథ్యాన సర్వే ఉదయాన్నే చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. సిబ్బందికి ఎక్కడా ఇబ్బంది రాకుండా పర్యవేక్షించనున్నారు. ఎక్కడైనా సిబ్బంది అస్వస్థతకు గురైనా, ఎవరైనా గైర్హాజరైనా ఆ ప్రాంతంలో సర్వే నిలిచిపోకుండా రిజర్వ్గా ఉన్న ఎన్యుమరేటర్లను కేటాయించేలా మానిటరింగ్ ఆఫీసర్లు చర్యలు తీసుకుంటారు.జనగణన వివరాల నమోదు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా హెచ్ఎల్ఓ సెన్సెస్–2027 పేరుతో యాప్ను తీసుకొచ్చింది. ఈ యాప్లో ఎన్యుమరేటర్లు తాము సర్వే చేసిన కుటుంబ వివరాలన్నీ నమోదు చేయాలి. ఆదివారం అర్ధరాత్రి 11–59 గంటల తర్వాత ప్లే స్టోర్లో అందుబాటులోకి వచ్చే ఈ యాప్ను సోమవారం ఉదయం ఎన్యుమరేటర్లు ఇన్స్టాల్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటికే ఎవరైనా ఇన్స్టాల్ చేసుకుంటే తొలగించి మళ్లీ ఇన్స్టాల్ చేసుకోవాలని స్పష్టం చేశారు. ఆతర్వాత ఎన్యుమరేటర్కు కేటాయించిన ఐడీతో పాస్వర్డ్ రూపొందించుకుని వివరాల నమోదు ఆరంభించాల్సి ఉంటుంది.జనగణన సర్వేకు వేళాయె.. జనగణనకు సంబంధించి విధులు కేటాయించిన ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు అధికారులు శిక్షణ ఇచ్చారు. వీరంతా సోమవారం నుంచి క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించనున్నారు. తొలి మూడురోజులు హౌస్ లిస్టింక్ బ్లాక్లను పరిశీలించనున్నారు. ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన బ్లాక్లో ఉన్న కుటుంబాల సంఖ్య, వివరాలను నమోదు చేసుకుంటారు. ఏదైనా బ్లాక్లో 300 ఇళ్ల కన్నా ఎక్కువగా ఉంటే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి తగ్గించాల్సి ఉంటుంది. 310– 320 కుటుంబాలు ఉంటేనే ఎన్యుమరేటర్లు సర్వే చేయాలని సూచించారు. అంతకు మించి కుటుంబాల సంఖ్య ఉంటే మాత్రం మరో భాగంగా విభజించి అదనపు ఎన్యుమరేటర్ను నియమిస్తారు. -
ఈత సరదా.. కావొద్దు బాధ
● వేసవి సెలవుల్లో నేర్చుకునేందుకు పిల్లల ఆసక్తి ● తగిన జాగ్రత్తలు పాటిస్తేనే ప్రాణాలు పదిలం ● తల్లిదండ్రులు, నిపుణుల పర్యవేక్షణ తప్పనిసరి ఇల్లెందురూరల్: వేసవి వచ్చిందంటే ఉక్కబోత కారణంగా పిల్లలు ఈత కొట్టాలని ఆసక్తి కనబరుస్తుంటారు. ఇందులో పట్టణాల్లో స్విమ్మింగ్ పూల్లు అందుబాటులో ఉన్నా.. గ్రామాలకు వచ్చేసరికి బావులు, చెరువులను ఆశ్రయిస్తారు. అయితే, ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అనారోగ్య సమస్యలు దరి చేరడమే కాక ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తుంది. ఈ నేథ్యాన తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలకు ఎన్నో ఉపయోగాలు ఉన్న ఈత నేర్పించడం సులువవుతుంది. అవగాహన లేక ఇల్లెందు మండలం హనుమంతులపాడుకు చెందిన ఊకం సాగర్ (14) నాలుగు రోజుల క్రితం స్నేహితులతో కలిసి బావిలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత రాకున్నా రక్షణ పరికరాలు లేకుండా బావిలోకి దూకగా మునిగిపోయాడు. రెండేళ్ల క్రితం మామిడిగుండాల గ్రామానికి చెందిన ఎర్రిపోతు భిక్షపతి ఈత రాకున్నా డబ్బా నడుముకు కట్టుకొని బావిలోకి దిగాడు. డబ్బా మధ్యలోనే జారిపోవడంతో మృత్యువాత పడ్డాడు. గతేడాది ఎల్లాపురం గ్రామానికి చెందిన పూనెం రాంబాబు చెరువులో చేపలు పడుతుండగా గడ్డిజాతి తీగలు కాళ్లకు చుట్టుకొని నీట మునిగిపోయి మృతిచెందాడు. తల్లిదండ్రుల్లో మార్పు తల్లిదండ్రుల దృక్పథం గతంతో పోలిస్తే మారింది. ఎన్ని లక్షలైనా ఖర్చు చేస్తాం చదువును మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని మాత్రమే భావిస్తున్నారు. మిగతా క్రీడలతో పాటు ఈత వంటి సంప్రదాయ, అభిరుచి ఉన్న ఆటల వైపు ప్రోత్సహించడం లేదు. పాఠశాలలు, శిక్షణలు, ప్రత్యేక తరగతుల పేరుతో యవ్వన దశ దాటేస్తుండగా.. నడి వయస్సులో ఈత నేర్చుకునే అవకాశం ఉన్నా వీలు కాని పరిస్థితి నెలకొంది. అప్రమత్తత తప్పనిసరి తల్లిదండ్రులు తమ సంరక్షణలోనే పిల్లలకు ఈత నేర్పాలి. లేదంటే అనుభవం ఉన్న వారితో తర్ఫీదు ఇప్పించాలి. ఆడా, మగ తేడా లేకుండా పిల్లలకు తప్పనిసరిగా ఈత నేర్పితే భవిష్యత్లో నీటి ప్రమాదాలకు ఆస్కారముండదు. ఈతరాని వారు నీటి వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అడుగంటిన బావులు, చెరువులలో నీరు కలుషితంగా మారి అందులో ఈత కొడితే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందుకే మంచినీరు ఉన్న బావులు, చెరువులనే ఎంచుకోవాలి. అంతేకాక బుర్రలను కట్టుకొని దిగితే నీటిలో తడిసి, బుర్రకాయకు రంధ్రాలు ఉంటే చిన్నారులు మునిగే అవకాశముంది. అందుకే సొరకాయ బుర్రలు, డబ్బాలకు బదులు నాణ్యమైన, సరిపడా సైజ్ కలిగిన ట్యూబ్లను వాడాలి.వేసవిలో పిల్లలకు ఈత సరదాగా ఉంటుంది. ఈత మంచిదే అయినా ఆరోగ్యకరమైన చికాకులు కూడా ఉంటాయని పెద్దలు గుర్తించాలి. కలుషిత నీటి వల్ల కంటి సంబంధ, చర్మ, అతిసారా వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. మంచినీరు ఉన్న వనరులను ఎంచుకోవడమే కాక నిపుణుల పర్యవేక్షణలో నేర్చుకుంటే ప్రమాదాలను అధిగమించవచ్చు. –డాక్టర్ మోతీలాల్, చిన్నపిల్లల వైద్యుడు, ఇల్లెందు -
జీవాలే నేస్తాలు
బాహ్య ప్రపంచానికి దూరంగా, ప్రకృతి ఒడిలో పెరిగే కొండరెడ్డి చిన్నారుల జీవనశైలికి ఈ చిత్రం అద్దం పడుతోంది. పట్టణ ప్రాంతాల్లో చిన్నారులు ఆడుకోవడానికి అనేక సౌకర్యాలు, సామగ్రి అందుబాటులో ఉంటాయి. కానీ కొండరెడ్ల చిన్నారులు మాత్రం అవేమీ లేక మేకపిల్లలతో ఆడుకుంటూ కాలం గడుపుతున్నారు. ఇదే సమయాన పెద్దలంతా పనికి వెళ్తే వీళ్లే మేకల పిల్లలను సంరక్షిస్తున్నట్లవుతుంది. అశ్వారావుపేట మండలంలోని కొండరెడ్ల గ్రామమైన గోగులపూడిలో ఈ దృశ్యం కనిపించింది. – అశ్వారావుపేటరూరల్ -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అంతరాలయంలోని మూ లమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి చిత్రకూట మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. అంజన్నకు రామయ్య పట్టు వస్త్రాలు.. భద్రాచలంటౌన్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో వెలిసిన శ్రీ ఆంజనేయస్వామి వారికి భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం తరఫున ఆదివారం పట్టు వస్త్రాలను సమర్పించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయ ఈఓ కే. దామోదర్ రావు, స్థానాచార్యులు కేఈ స్థలశాయి స్వామివారికి పట్టు వస్త్రాలను అందజేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. నేటి నుంచి ఏఐయూకేఎస్ జాతీయ మహాసభలు ఇల్లెందురూరల్: ఏఐయూకేఎస్ జాతీయ ప్రథ మ మహాసభలు ఈనెల 11, 12, 13 తేదీలలో ఇల్లెందులో నిర్వహిస్తున్నట్లు సంఘం జాతీయ కన్వీనర్ రంగయ్య తెలిపారు. ఇల్లెందులో ఆది వారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాసభలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు. మొదటి రోజు సాయంత్రం ఇల్లెందు జేకే మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర పాలకుల తీరు వల్లే నేడు వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుపోయిందని ఆరోపించారు. పంటలకు కనీస మద్దతు ధరలు నిర్ణయించినా అమలులో పాలకులు విఫలమవుతున్నారని అన్నారు. మహాసభల్లో రైతుల సమస్యలపై చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని వివరించారు. -
●సమన్వయంతో సంతోషం
::.. తడికెళ నవ్యజ్యోతి, కేఎంసీ డీఈ ఖమ్మంమయూరిసెంటర్: ఇంట్లో గృహిణిగా, అమ్మగా, ఉద్యోగినిగా పలువురు మహిళలు బహుముఖ పాత్రలు పోషిస్తున్నారని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ డీఈ తడికెళ నవ్యజ్యోతి వెల్లడించారు. కుటుంబంపై ప్రేమ, సమాజంపై బాధ్యతే మహిళా ఉద్యోగులను ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దుతోందని తెలిపారు. వృత్తి, వ్యక్తిగత జీవితాలకు సమ ప్రాధాన్యత ఇవ్వడం వల్లే తాను కుటుంబంతో, బాధ్యతల పరంగా కార్యాలయంలో సజావుగా పని చేయగలుగుతున్నానని చెప్పారు. విధుల నిర్వహణ సమయాన అక్కడి సమస్యలే తన దృష్టిలో ముఖ్యమని, ఇంటికి వెళ్లాక మాత్రం పిల్లలు, భర్త, కుటుంబమే సర్వస్వమని తెలిపారు. ఇలా ప్రతీఒక్కరూ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే సంతోషంగా ఉండొచ్చని వెల్లడించారు. ‘అమ్మ’ అనే పదంలో అపారమైన ప్రేమ, త్యాగం, సహనం, బాధ్యత దాగి ఉన్నాయని.. ప్రతీ కుటుంబానికి అమ్మ ఒక బలమైన ఆధారమని చెప్పారు. తాను సైతం ఆమె స్ఫూర్తితోనే ఉద్యోగం, కుటుంబ జీవనంలోనూ రాణిస్తున్నట్లు తెలిపారు. -
ఆలన.. పాలన
● కుటుంబ – ఉద్యోగ బాధ్యతల్లో మహిళామణులు ● రెండింటిని సమన్వయం చేస్తూ ముందడుగు ● సహోద్యోగులు, కుటుంబం అండగా నిలిస్తే మేలని భావన నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం●ఖాకీ చొక్కా చాటున మాతృత్వం ::.. సంకీర్తన, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కరకగూడెం: కరకగూడెంకు చెందిన సంకీర్తన దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్లోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రయాణికుల భద్రతను పర్యవేక్షిస్తూనే, తన మూడేళ్ల కుమారుడు రుద్రాన్ష్ గౌడ్ పెంపకంలో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు సాగుతున్నారు. యూనిఫామ్ ధరిస్తే విధినిర్వహణలో.. ఇంటికి వెళ్లగానే ఆప్యాయత పంచే తల్లిగా ఆమె పాత్ర పోషిస్తారు. రైల్వే రక్షణ రంగం అంటే నిర్ణీత వేళలు ఉండకపోగా అర్ధరాత్రి అయినా, పండుగ రోజైనా అత్యవసర సమయాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ‘కొన్ని సందర్భాల్లో కుమారుడిని వెంట తీసుకెళ్లిన రోజులు ఉన్నాయి. ఉద్యోగాలు చేసే మహిళలకు సమాజం సరైన ప్రోత్సాహం.. భర్త, అత్తమామల సహకారం ఉంటే వృత్తిపరంగా మరింత ఎత్తుకు ఎదుగుతారు. అంతేకాక ప్రజా సేవలో భాగస్వాములవుతున్న మహిళల కష్టాన్ని గుర్తించి గౌరవించే సమాజం కావాలి’ అని సంకీర్తన ఆకాంక్షించారు. -
రేపటి నుంచి ఏఐయూకేఎస్ జాతీయ మహాసభలు
ఖమ్మంమయూరిసెంటర్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రైతాంగం, వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళ్లాయని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) రాష్ట్ర కోశాధికారి ఆవుల వెంకటేశ్వర్లు అన్నారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విత్తనాలు, ఎరువులపై సబ్సిడీ ఎత్తివేయడంతో పాటు దిగుమతి సుంకాలు తగ్గించడం, ఆపై అమెరికా నుంచి దిగుమతులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ తరుణాన ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు ఇల్లెందులో నిర్వహించే ఏఐయూకేఎస్ ప్రథమ జాతీయ మహాసభలు కీలకంగా మారనున్నాయని తెలిపారు. ఈ సభల్లో రైతుల సమస్యలపై చర్చించడమే కాక భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. తొలిరోజైన సోమవారం ఇల్లెందులో ర్యాలీ, సింగరేణి మైదానంలో బహిరంగ సభ ఉంటాయని తెలిపారు. ఆల్ ఇండియా ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ కెచ్చెల రంగారెడ్డి అధ్యక్షతన నిర్వహించే సభలో జాతీయ నాయకులు ప్రదీప్సింగ్ఠాగూర్, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు తదితరులు పాల్గొంటారని, సభలను జయప్రదం చేసేందుకు మేధావులు, రైతులు, ప్రజలు తరలిరావాలని కోరారు. సమావేశంలో నాయకులు మలీదు నాగేశ్వరరావు, కమ్మకోమటి నాగేశ్వరరావు, పాశం అప్పారావు, కేలోతు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
●కుటుంబం, ఉద్యోగం రెండు కళ్లు
ఇల్లెందురూరల్: అటవీ శాఖ ఇల్లెందు రేంజ్లో ఇస్లావత్ సత్యవతి బీట్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అడవిలో విధులు నిర్వర్తించడం, స్తూనే వన్యప్రాణుల నుంచి కాపాడుకోవడం, అటవీ సంపదను రక్షించడం ఒక మహిళకు కత్తిమీద సామే. అయినా అలాంటి విధులను నిబద్ధతతో నిర్వర్తిస్తున్న సత్యవతి కుటుంబాన్ని సైతం చక్కగా తీర్చిదిద్దుకుంటోంది. ఉదయమే విధులకు హాజరయ్యేందుకు తాను సిద్ధమవుతూనే పాఠశాలకు వెళ్లే పిల్లలను సిద్ధం చేస్తుంది. ఇలా ఒకే సమయంలో పిల్లలు, వ్యవసాయ పనులకు వెళ్లే భర్త మనోజ్ను సిద్ధం చేసి తాను విధులకు హాజరవుతోంది. రోజంతా విధుల్లో శ్రమించినా సాయంత్రం ఆ అలసట తనలోనే దాచుకొని పిల్లలను చదివిస్తూ నిర్ధేశించుకున్న లక్ష్యం దిశగా భర్త సహకారంతో కుటుంబాన్ని ముందుకు నడిపిస్తోంది. ఈ ప్రయాణంలో ఎంత కష్టం ఎదురైనా కుటుంబం, ఉద్యోగం రెండు కళ్లలా భావిస్తానని సత్యవతి చెబుతోంది. -
ఐదెకరాల భూమి.. రూ.కోటి విరాళం
చింతకాని: చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో శ్రీ సత్యసాయి సేవాసంస్థల ఆధ్వర్యాన శ్రీ సత్యసాయి ప్రేమామృత విద్యాల యం, ప్రకృతి వైద్యాలయం ఏర్పాటుకు శని వారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవాసంస్థల జిల్లా బాధ్యులు మాట్లాడుతూ విద్యాలయంలో కేజీ నుంచి పీజీ వరకు మానవతా విలువలతో కూడిన ఉచిత విద్య అందిస్తామని తెలిపారు. అంతేకాక కంప్యూటర్ విద్య, అగ్రిటెక్లో శిక్షణ కూడా ఉంటుందన్నారు. కాగా, విద్యాలయం ఏర్పాటుకు నాగులవంచ గ్రామానికి చెందిన చల్లా కోటయ్య ఐదెకరాల భూమి, నిర్మాణానికి సేవాసంస్థల మహబూబాబాద్ జిల్లా కన్వీనర్ మాధవరపు నాగేంద్ర రూ.కోటి విరాళంగా అందజేశారని తెలిపారు. అనంతరం పెద్దసంఖ్యలో హాజరైన భక్తులకు అన్నదానం ఏర్పాటుచేశారు. నాగులవంచ, సీతంపేట సర్పంచ్లు నారగాని రాంబాయి, ఆళ్ల మణి, వీవీసీ సంస్థల చైర్మన్ వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, మత్కేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు, ఎన్ఆర్ఐ బయ్యన బాబూరావు, సత్యసాయి సేవాసంస్థల జిల్లా అధ్యక్షుడు దమ్మాలపాటి సుధాకర్తో పాటు వంగవేటి భాస్కర్రావు, భిక్షమయ్య గురూజీ, సభ్యులు పాల్గొన్నారు.నాగులవంచలో సత్యసాయి విద్యాలయానికి భూమిపూజ -
చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం..
● ఈనెలాఖరు నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తిరుమలాయపాలెం: రైతులు యాసంగిలో పండించిన వరి, మొక్కజొన్న చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని.. ఈ విషయంలో రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తిరుమలాయపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద శనివారం నిర్వహించిన ప్రజాదర్బార్లో కలెక్టర్ దివాకర టీ.ఎస్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి దరఖాస్తులు, వినతిపత్రాలు స్వీకరించాక మంత్రి మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకులు కల్లాల వద్దకు వచ్చి ప్రభుత్వంపై బురద చల్లుతూ మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. గతంలో రైతులకు బేడీలు వేసిన వారు నేడు కొనుగోలు కేంద్రాల వద్ద విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అయితే, తమది రైతు పక్షపాత ప్రభుత్వమని.. అందుకే రుణమాఫీ చేయడంతో పాటు సన్నధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. కాగా, పాలేరు నియోజకవర్గంలో ఇప్పటివరకు నిర్వహించిన ప్రజాదర్బార్లలో 14,700 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు, భూ సమస్యలు, పింఛన్లు, ఉచిత విద్యుత్ కోసం ఉన్నాయని చెప్పారు. అవకాశం ఉన్న వాటిని తక్షణమే పరిష్కరిస్తూ, మిగతావి మూడు నెలల్లో పరిష్కరించేలా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అర్హులందరికీ ఇళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన మొదటి ఏడాదిలోనే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. నిర్మాణ పురోగతి ఆధారంగా లబ్ధి దారులైన మహిళల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా నిధులు జమ చేస్తూ పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. అర్హులందరికీ దశల వారీగా ఇళ్లు కేటాయిస్తామని, రెండో విడతగా ఈ నెలాఖరు నుంచి మంజూరు ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో రైతులు ఇబ్బంది పడుతున్నందున తాము ‘భూ భారతి’కార్యక్రమాన్ని తీసుకొచ్చామని వివరించారు. సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంతో పేదలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. కాగా, మొక్కజొన్న అమ్మి నెల దాటినా డబ్బు జమ కాలేదని, పంటను వెంటనే గోదాంలకు తరలించాలని రైతులు, నాయకులు, తహసీల్ భవనం 11 నెలల అద్దె ఇప్పించాలని యజమాని మంత్రి పొంగులేటికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డీపీఓ రాంబాబు, విద్యుత్ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, హౌజింగ్ పీడీ శ్రీనివాస్, జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి చందన్కుమార్, డీఆర్డీఓ శ్రీరామ్, మద్దులపల్లి మార్కెట్, ఆత్మ కమిటీల చైర్మన్లు హరినాథ్బాబు, చావా శివరామకృష్ణ, నాయకులు, ప్రజాప్రతినిధులు రామసహాయం నరేశ్రెడ్డి, బెల్లం శ్రీనివాస్, కొప్పుల అశోక్, మంగీలాల్, సుజాత తదితరులు పాల్గొన్నారు. -
●అందరి సహకారం ఉంది..
::.. తాళ్లపల్లి శిరీష, కొత్తగూడెం కార్పొరేషన్ ఉద్యోగి కొత్తగూడెం అర్బన్: పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇలాంటి వారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని చెబుతున్నారు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ సీనియర్ అసిస్టెంట్ తాళ్లపల్లి శిరీష. పిల్లల పోషణ, కుటుంబ నిర్వహణతో పాటు ఉద్యోగ బాధ్యతలను సమన్వయం చేసుకోవడం ఎవరికై నా భారంగానే ఉంటుందని తెలిపారు. అయితే, ఇంట్లో భర్తతో పాటు కార్యాలయంలో అధికారులు, సహోద్యోగుల సహకారంతో భారం తగ్గి పనులు సులువుగా చేసుకోగలుగుతున్నానని వెల్లడించారు. పది నెలల పాపను, ఎల్కేజీ చదివే అబ్బాయిని చూసుకుంటూనే ఆఫీసుకు వెళ్లి పని చేయడానికి తన భర్త కూడా సమయం కేటాయించి పనుల్లో సాయం చేయడం వల్లే సాధ్యమవుతుందని తెలిపారు. 2020 సంవత్సరంలో వీఆర్ఓగా సుజాతనగర్ మండలంలో పనిచేసినప్పుడు ఆరు నెలల కుమారుడిని తనతో పాటే తహసీల్కు తీసుకెళ్లి పనిచేసినా అధికారులు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. అందరి నుంచి సహకారం ఉన్నప్పటికీ సమాజంలో ఇంకొంత మార్పు రావాలని, కష్టపడుతున్న వారికి అండగా నిలవాల్సిన బాధ్యతను గుర్తించాలని తెలిపారు.అమ్మ అంటే ప్రేమకు ప్రతీక మాత్రమే కాదు.. బాధ్యత, ఓర్పు, త్యాగానికి మరో పేరు. నేటి ఆధునిక సమాజంలో మహిళలు ఇంటికే పరిమితం కాకుండా ఉద్యోగ రంగంలోనూ రాణిస్తున్నారు. కచ్చితమైన పనివేళలు కాకుండా ఎప్పుడైనా విధులకు సిద్ధంగా ఉండే ఉద్యోగాలను సైతం మహిళలు ఎంచుకుంటున్నారు. ఈక్రమాన ఓ వైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు ఉద్యోగాలను సమన్వయం చేసుకుంటూ రాణిస్తున్నారు. నేడు (ఆదివారం) అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ఉద్యోగం – కుటుంబాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న కొందరు మహిళా ఉద్యోగుల పరిచయం. -
విద్యావారోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు
● వీసీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తిరుమలాయపాలెం: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం నుంచి నిర్వహించే విద్యా వారోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సూచించారు. హైదరాబాద్ నుంచి శనివారం ఆయన వీసీ ద్వారా జనగణన, ఫార్మర్ రిజిస్ట్రీ, ధాన్యం కొనుగోళ్లు, విద్యా వారోత్సవాలపై సమీక్షించగా, తిరుమలాయపాలెం తహసీల్ నుంచి కలెక్టర్ దివాకర టీ.ఎస్. పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ విద్యా వారోత్సవాల్లో రోజువారీ షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అలాగే, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని సూచించారు. ఆ తర్వాత ఫార్మర్ రిజిస్ట్రీ, జనగణనపై సూచనలు చేశారు. డీవైఎస్ఓ సునీల్రెడ్డి, సీపీఓ శ్రీనివాస్, డీఈఓ చైతన్యజైనీ తదితరులు పాల్గొన్నారు.జమలాపురం ఆలయంలో ప్రత్యేక పూజలు ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భగుడిలోని స్వామి మూలవిరాట్తో పాటు ఆలయ ఆవరణలోని స్వామి వారి పాదాలకు తెల్లవారుజామునే అర్చకులు పంచామృతంతో అభిషేకాలు చేశారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్యకల్యాణం పల్లకీసేవ నిర్వహించగా పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈకార్యక్రమంలో ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పాలిసెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి మధిర: పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశానికి ఈనెల 13న పాలిసెట్ జరగనుండగా ఏర్పాట్లు పూర్తిచేసినట్లు మధిర ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్, జిల్లా సమన్వయకర్త కె.సాంబయ్య తెలిపారు. జిల్లాలో తొమ్మిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఖమ్మంలో ఆరు, మధిరలో మూడు ఏర్పాటుచేశామని వెల్లడించారు. మధిరలోని ప్రభుత్వ పాలిటెక్నిక్, టీవీఎం స్కూల్, సీపీఎస్ స్కూల్తో పాటు ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్, ఎస్బీఐటీ, కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాల, దరిపల్లి అనంతరాములు ఇంజనీరింగ్ కళాశాల, డీఆర్ఎస్ డిగ్రీ కళాశాల, యూనివర్సిటీ పీజీ కాలేజీల్లో ఏర్పాటుచేసిన కేంద్రాల్లో 3,696 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1–30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, అభ్యర్థులను 11 గంటల వరకే అనుమతిస్తామని, నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని ఆయన స్పష్టం చేశారు. రహదారిని పరిశీలించిన ఆర్అండ్బీ ఈఎన్సీ చింతకాని: మండలంలోని మత్కేపల్లిలో ఆర్అండ్బీ రోడ్డు నుంచి జగన్నాథపురం వరకు ఇటీవల నిర్మించిన బీటీ రహదారిని పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ఇంజనీరింగ్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) జోగారెడ్డి శనివారం పరిశీలించారు. రూ.కోటి వ్యయంతో ఈ రహదారి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగారహదారి నాణ్యత, వ్యవసాయ బావుల వద్ద గోడల నిర్మాణం, మూలమలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటుపై సూచనలు చేశారు. పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈ వెంకటరెడ్డి, ఈఈ మహేష్బాబు, తదితరులు ఉన్నారు. -
నాణ్యమైన వైద్యసేవలే లక్ష్యం
● ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలి ● కలెక్టర్ దివాకర టీ.ఎస్.మధిర: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. మధిరలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిని శుక్రవారం ఆయన తనిఖీ చేసిన వివిధ విభాగాలను పరిశీలించాక చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి సేవలపై ఆరాతీశారు. ఆతర్వాత వైద్యులు, సిబ్బంది హాజరు, రోజువారీ ఓపీ, ఔషధాల లభ్యత, పరిశుభ్రతను పరిశీలించి సేవలు మరింత మెరుగుపర్చాలని ఆదేశించారు. ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలే తప్ప అనవసరంగా సిజేరియన్లు చేయొద్దని తెలిపారు. అనంతరం మధిరలో రూ.3కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం, రూ.4 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల అదనపు భవన నిర్మాణ పనులతో పాటు సిరిపురంలో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం, ఐటీఐ భవనం, ఏఐటీసీ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యతపై సూచనలు చేశారు. తహసీల్దార్ రాంబాబు, విద్యాశాఖ ఇంజనీరింగ్ అధికారి బుగ్గయ్య తదితరులు పాల్గొన్నారు. సోలార్ ప్రాజెక్ట్ ఆదర్శంగా నిలవాలి ఎర్రుపాలెం: రాష్ట్రంలోనే తొలిసారి ఎర్రుపాలెం మండలం రాజుపాలెంలో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన ఒక మెగావాట్ సోలార్ ప్రాజెక్టు నిర్వహణ ఆదర్శంగా నిలిచేలా పనిచేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. రాజుపాలెంలో సోలార్ ప్లాంట్ పనులను పరిశీలించిన ఆయన మాట్లాడారు. మహిళల ఆర్ధికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని తెలిపారు. పవర్ ప్లాంట్ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించనున్నందున త్వరగా పనులు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఆతర్వాత ఇందిరా మహిళా డెయిరీ నిర్వహణ తీరును పరిశీలించారు. డీఆర్డీఓ కొండపల్లి శ్రీరామ్, రెడ్కో డీఎం పి.అజయ్కుమార్, డీఆర్డీఓ ఏపీడీ జయశ్రీ, ఏడీఏ విజయ్చందర్, తహసీల్దార్ ఉషాశారద, మధిర మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు, సర్పంచ్ బొగ్గుల గోవర్దన్రెడ్డి, ఏపీఎం హరినారాయణ పాల్గొన్నారు. పనుల్లో నాణ్యత తప్పనిసరి బోనకల్: యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణంలో వేగంతో పాటు నాణ్యత కూడా అంతే ముఖ్యమని కలెక్టర్ దివాకర స్పష్టం చేశారు. బోనకల్ మండలంలోని లక్ష్మీపురంలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న స్కూల్ భవనాన్ని పరిశీలించి మాట్లాడారు. అయితే, తల్లిదండ్రుల వెయిటింగ్ హాల్, తదితర అంశాలపై సరైన సమాధానం చెప్పకపోవడంతో ఈఈ జనగాం బుగ్గయ్య తీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులపై నిరంతరం పర్యవేక్షిస్తూ గడువులోగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ రురావత్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
కోతకు గురైన నూతన వారధి
● సారపాక వైపు దెబ్బతిన్న గోదావరి బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు ● పాత వంతెనపైకి ట్రాఫిక్ మళ్లింపుభద్రాచలంటౌన్/బూర్గంపాడు: సారపాక–భద్రాచలం మధ్య గోదావరి నదిపై నిర్మించిన రెండో బ్రిడ్జి అప్రోచ్ సారపాక వైపు కోతకు గురైంది. అప్రోచ్ రోడ్డు వద్ద మట్టి జారిపోవడంతో వంతెన – రోడ్డు మధ్య భారీ గ్యాప్ ఏర్పడింది. ఈ విషయన్ని గురువారం రాత్రి గమనించిన నేషనల్ హైవేస్ అధికారులు కొత్త బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేసి పాత బ్రిడ్డి పైకి మళ్లించారు. ఒకే బ్రిడ్జిపై రాకపోకలతో వాహనాల రద్దీ పెరిగింది. నిన్నటి వరకు భద్రాచలం వెళ్లే వాహనాలు కొత్త బ్రిడ్జిపై నుంచి, భద్రాచలం నుంచి బయటకు వచ్చే వాహనాలు పాత బ్రిడ్జిపై నుంచి రాకపోకలు కొనసాగాయి. ప్రస్తుతం కొత్త బ్రిడ్జి అప్రోచ్కు పోసిన మట్టి కోతకు గురికావటంతో మళ్లీ పాత బ్రిడ్జియే రాకపోకలకు దిక్కయింది. 60 ఏళ్ల క్రితం నిర్మించిన పాత బ్రిడ్జి ఇప్పటి వరకు ఎక్కడ పెద్దగా దెబ్బతినలేదు. ఏడాది క్రితం నిర్మించిన కొత్త బ్రిడ్జి అప్రోచ్ కోతకు గురవడంతో పనుల నాణ్యతపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆది నుంచీ విమర్శలే.. రూ.కోట్ల వ్యయంతో వంతెన నిర్మాణం చేపట్టగా, పనుల దశ నుంచే విమర్శలు వస్తున్నాయి. నిర్మాణ సమయంలోనే ఓ పిల్లరు కుంగిపోవడంతో అధికారులు దానిని తొలగించి మళ్లీ నిర్మించాల్సి వచ్చింది. తాజాగా అప్రోచ్ రోడ్డు వద్ద మట్టి పక్కకు జారిపోవడంతో నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సరైన పద్ధతిలో రాతి అప్రోచ్ను బలోపేతం చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే ఎప్పటి నుంచో కుంగిన అప్రోచ్ గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో మట్టి మరింతగా జారిపోయింది. భద్రాచలం ట్రాఫిక్ పోలీసులు, జాతీయ రహదారుల విభాగం అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాద తీవ్రతను గమనించి వంతెన రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు ప్రధాన వారధిగా ఉన్న ఈ వంతెనపై రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. పూర్తిస్థాయిలో నాణ్యత పరీక్షలు నిర్వహించిన తర్వాతే వంతెనను అందుబాటులోకి తీసుకురావాలని, కాంట్రాక్ట్ సంస్థపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
సీహెచ్పీలో సిగ్నలింగ్ విధానం
సత్తుపల్లిరూరల్: సింగరేణి సత్తుపల్లి ఏరియా జేవీఆర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లో సిగ్నలింగ్ టెలీ కమ్యూనికేషన్ సిస్టంను ఏర్పాటుచేశారు. జీఎంలు చింతల శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, రామ్మూర్తి ఈ విధానాన్ని శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లో ఏర్పాటుచేసిన ఈ విధానం ద్వారా వ్యాగన్లలో బొగ్గు లోడింగ్, రవాణా పారదర్శకంగానే కాక వేగంగా జరుగుతుందని తెలిపారు. లోడింగ్ మొదలు గమ్యానికి వ్యాగన్లు చేరే వరకు పర్యవేక్షించడం సులువవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు రామకృష్ణ, శ్రీనివాస్, సోమశేఖర్రావు, సునీల్వర్మ, రాజేశ్వరరావు, రవికుమార్, సూర్యప్రకాష్, కోటి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ముందస్తుగా పుస్తకం
● జిల్లాకు చేరిన 3.67లక్షల పాఠ్యపుస్తకాలు ● బడి తెరిచిన మొదటిరోజే పంపిణీకి సిద్ధం ఖమ్మంసహకారనగర్: వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం రోజునే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేలా రాష్ట్రప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. గతంలో బడులు తెరిచిన చాలారోజుల వరకు పుస్తకాలు అందకపోయేవి. కానీ రెండేళ్లుగా మార్పులు చేశారు. ఇందులో భాగంగా ఈసారి కూడా జిల్లాకు టైటిళ్ల వారీగా పుస్తకాలను చేరవేస్తున్నారు. 1,230 స్కూళ్లు, 60వేల మంది విద్యార్థులు జిల్లాలో అన్ని యాజమాన్యాలు కలిపి 1,230 ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతున్నాయి. వీటిలో 60వేల మంది వరకు విద్యార్థులు చదువుతున్నట్లు అంచనా. వీరికి కావాల్సిన పాఠ్యపుస్తకాలను జిల్లాకు చేరవేయడం మొదలుపెట్టారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా 1నుంచి 10వ తరగతి వరకు ద్విభాషా పాఠ్య పుస్తకాలు ముద్రించారు. ఒకే పుస్తకంలో తెలుగు, ఆంగ్ల మీడియం పాఠాలు ఉంటాయి. తొలుత పార్ట్–1 రెండు భాషల్లో ముద్రణతో పుస్తకాలను పాఠ్యాంశాల వారీగా రెండుగా విభజించారు. ఇందులో పార్ట్–1 పుస్తకాలను తొలుత అందజేస్తారు. జిల్లా విద్యార్థులకు అన్ని టైటిళ్లు కలిపి పార్ట్–1లో 4,45,820 పుస్తకాలు అవసరమని అధికారులు ప్రతిపాదించారు. ఇందులో ఇప్పటివరకు 3,67,366 పుస్తకాలు జిల్లాకు చేరాయి. మిగతావి కూడా స్కూళ్ల ప్రారంభానికి ముందే చేరతాయని చెబుతున్నారు. ఈ పుస్తకాలను ప్రస్తుతానికి జిల్లా కేంద్రంలోనే నిల్వ చేస్తుండగా, త్వరలోనే ఎమ్మార్సీలకు, అక్కడి నుంచి పాఠశాలల వారీగా సరఫరా చేస్తారు. ప్రారంభం రోజునే పంపిణీ.. జూన్ 12వ తేదీ నుంచి విద్యాసంవత్సరం మొదలవుతుంది. అదేరోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తారు. కాగా, గతంలో పాఠ్యపుస్తకాలతో పాటే నోట్ పుస్తకాలను సైతం గోదాములకు చేర్చి అక్కడి నుంచి పాఠశాలలకు పంపించేవారు. కానీ ప్రస్తుతం నోట్పుస్తకాలను నేరుగా పాఠశాలలకు పంపిస్తున్నారు. -
11నుంచి విద్యా వారోత్సవాలు
ఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈనెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు విద్యా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైనీ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆమె కలెక్టరేట్లో ఎంఈఓలు, హెచ్ఎంలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఈనెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు విద్యా వారోత్సవాల్లో భాగంగా షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సెక్టోరియల్ అధికారులు రామకృష్ణ, పెసర ప్రభాకర్రెడ్డి, రూబీ, ప్రవీణ్కుమార్, శ్రీనివాసరెడ్డి, శ్యామ్సన్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు సైకిళ్లు అందజేసిన డీఈఓ నేలకొండపల్లి: పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపి న విద్యార్థులు సొంతంగా సైకిళ్లు అందిస్తానని ప్రకటించిన డీఈఓ చైతన్య జైనీ ఆ మాట నెరవేర్చారు. నేలకొండపల్లి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల సమయాన సొంత నిధులతో అల్పాహారం సమకూర్చారు. అప్పట్లో మండల స్థాయి అత్యధిక మార్కులు సాధించిన ఇద్దరికి సైకిళ్లు ఇస్తానని తెలిపారు. ఈమేరకు 564మార్కులు సాధించిన చిట్టెంశెట్టి మహేష్, 537మార్కులు సాధించిన మోత్కూరి రక్షితకు శుక్రవారం సైకిళ్లు అందించడమే కాక మహేష్ ఉన్నత చదువుకు సహకరిస్తానని చెప్పారు. ఎంఈఓ బి.చలపతిరావు, హెచ్ఎం గోపగాని రమేష్ తదితరులు పాల్గొన్నారు. డీఈఓ చైతన్య జైనీ -
సైబర్ నేరాల కట్టడికి కృషి
పోలీస్ కమిషనర్ సునీల్దత్ సత్తుపల్లి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయటంతో పాటు సైబర్ నేరాల కట్టడికి కృషి చేస్తున్నామని ఖమ్మం పోలీసు కమిషనర్ సునీల్దత్ తెలిపారు. సత్తుపల్లిలో ఆధునికీకరించిన కల్లూరు ఏసీపీ కార్యాలయాన్ని ఏసీపీ వసుంధర యాదవ్తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీసు శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల కట్టడి, మాదకద్రవ్యాల నిర్మూలనకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులకు మెరుగైన వసతీ సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. తొలుత సిబ్బంది నుంచి సీపీ గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, సీఐలు శ్రీహరి, ముత్తిలింగం, ఎస్సైలు పాల్గొన్నారు. మత్స్యకారులకు శిక్షణ కూసుమంచి: మండలంలోని పాలేరు పీ.వీ. నర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రంలో ఆరు జిల్లాల షెడ్యూల్ కులాలకు చెందిన మత్స్యకారులకు ఇస్తున్న శిక్షణ శుక్రవారం రెండో రోజుకు చేరింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్ల గొండ, మహబూబాబాద్, నాగర్కర్నూల్, ములుగు జిల్లాల మత్స్యకారులు పాల్గొనగా.. శాస్త్రవేత్తలు శాంతన్న, రవిందర్, అరుణ్ ‘జలాశయాల్లో చేపల పెంపకం – యాజమాన్య పద్ధతులు’పై అవగాహన కల్పించారు. దడి(కంచె)లో చేపల పెంపకానికి స్థలం ఎంపిక, దడి నిర్మాణంలో జాగ్రత్తలు, పంజరాల్లో చేపల పెంపకం చేపట్టేలా అవసరమైన నీరు, మేత, మార్కెటింగ్ అవకాశాలపై వివరించారు. నేడు తిరుమలాయపాలెంలో ప్రజాదర్బార్ తిరుమలాయపాలెం: పాలేరు నియోజకవర్గంలోని మండలాల్లో క్లస్టర్ల వారీగా నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ శనివారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో జరగనుంది. ఎంపీడీఓ కార్యాలయంలో జరిగే ప్రజాదర్బార్లో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులు, వినతిపత్రాలు స్వీకరించనున్నారు. ఈమేరకు ఏర్పాట్లను మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. తహసీల్దార్ లూథర్ విల్సన్, ఎంపీడీఓ సిలార్సాహెబ్, ఎస్సై కూచిపూడి జగదీష్, ఎంపీఓ ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రజాదర్బార్లో తిరుమలాయపాలెం, బాలాజీనగర్ తండా, ఎదుళ్లచెరువు, కేశ్వాపురం, పిండిప్రోలు, ఎర్రగడ్డ, కొక్కిరేణి, తాళ్లచెరువు, తిమ్మక్కపేట, అజ్మీరా తండా, దమ్మాయిగూడెం, తెట్టెలపాడు, తిప్పారెడ్డిగూడెం, పడమటి తండాతో పాటు హైదర్సాయిపేట గ్రామాల ప్రజలు వినతిపత్రాలు అందించవచ్చని అధికారులు తెలిపారు. పదోన్నతుల జాబితాలో ముగ్గురు ఏడీఏలు ఖమ్మం వ్యవసాయం: రాష్ట్రప్రభుత్వం పదోన్నతులు, బదిలీలకు అనుమతి ఇవ్వడంతో వ్యవసాయ శాఖలో ప్రక్రియ మొదలైంది. తొలుత పదోన్నతులకు అర్హులైన వారిని డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ(డీపీసీ) ద్వారా గుర్తించారు. ఇందులో భాగంగా ఏడీఏ(సహాయ వ్యవసాయ సంచాలకులు)లకు డీడీఏ(ఉప సహాయ సంచాలకులు)లుగా పదోన్నతి కల్పించేలా జాబితా రూపొందించగా ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురికి స్థానం దక్కింది. మధిర ఏడీఏ ఎస్.విజయ్చందర్, ఖమ్మం భూసార పరీక్షా కేంద్రం ఏడీఏ స్వరూపారాణి, భద్రాద్రి జిల్లా వ్యవసాయాధికారి(ఏడీఏ) బాబూరావు ఇందులో ఉన్నారు. త్వరలోనే వీరికి డీడీఏలుగా పదోన్నతి కల్పించి నూతన స్థానంలో పోస్టింగ్ ఇవ్వనున్నారు. ఇదే సమయాన మండల వ్యవసాయాధికారులకు కూడా సహాయ వ్యవసాయ సంచాలకులుగా పదోన్నతి కల్పించే అవకాశాలున్నాయి. నెల వ్యవధిలో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలిసింది. -
సైకిల్ సవారీ.. గోళీల ఆట!
కరకగూడెం: వేసవి తీవ్రతతో పిల్ల లను బయటకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. కానీ సెలవుల్లో పిల్లలను ఆపడం వారి వల్ల కావడం లేదు. ఈనేపథ్యాన నీడ పట్టున ఆడుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఈక్రమంలో మధ్యాహ్నం ఇళ్ల ఆవరణ, చెట్ల నీడలో.. ఉదయం, సాయంత్రం ఆరుబయట ఆటలతో పిల్లలు సందడిగా గడుపతున్నారు. స్నేహితుల సాయంతో.. కొందరు చిన్నారులు సైకిల్ నేర్చుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. స్నేహితులు వెనక నుంచి సైకిల్ పట్టుకుంటే భయం భయంగానే పెడల్ తొక్కుతూ పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకటి, రెండుసార్లు కింద పడినా నిరాశ చెందకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ సైకిల్ నేర్చుకుంటున్నారు. లక్ష్యసాధన.. పాతకాలపు ఆటలను సైతం పిల్లలు మరువడం లేదు. కొందరు చిన్నారులు నేలపై గీసిన వలయంలో రంగురంగుల గోళీలను పెట్టి లకా్ష్య్న్ని గురి పెట్టి కొడుతూ ఆటలో మునిగిపోతున్నారు. గెలుపోటములను ఆస్వాదిస్తున్న చిన్నారులు కేరింతల మార్మోగుతున్నాయి. ఈ ఆట ద్వారా పిల్లల్లో ఏకాగ్రత, లక్ష్యసాధన, స్నేహభావం పెరుగుతోందని పెద్దలు చెబుతున్నారు.స్నేహితుల సాయంతో సైకిల్ నేర్చుకుంటున్న బాలుడు గోళీలు ఆడుతున్న చిన్నారులు -
తలసేమియా చిన్నారులకు సహకారం
ఖమ్మంవైద్యవిభాగం: తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు కావాల్సిన రక్తం సమకూర్చడంలో సహకరిస్తామని ఏసీపీ రమణమూర్తి, ఐఎంఏ అధ్యక్షురాలు రెహానాబేగం తెలిపారు. ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని శుక్రవారం సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యాన ఖమ్మంలో నిర్వహించగా ఏసీపీ మాట్లాడుతూ సంకల్ప ఆధ్వర్యాన పిల్లల కోసం పలుమార్లు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. భవిష్యత్లోనూ సహకరిస్తామని చెప్పారు. ఐఎంఏ అధ్యక్షురాలు రెహానాబేగం మాట్లాడుతూ తలసేమియా జన్యుపరమైన వ్యాధి అని, దీనిని దృష్టిలో పెట్టుకుని గర్భిణులే కాక పెళ్లి చేసుకునే వారు ముందస్తుగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఏఆర్ ఏసీపీ నర్సయ్య మాట్లాడగా చిన్నారులు ప్రదర్శించిన ‘వివాహనికి ముందు హెచ్బీఏ2 టెస్ట్’ స్కిట్, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం చిన్నారులకు రక్తదానం, చికిత్సకు ఆర్థికసాయం చేసిన దాతలను సత్కరించారు. సంస్థ ఫౌండర్ ప్రొద్దుటూరి అనిత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైద్యులు డి.నారాయణమూర్తి, సతీష్ నారాయణచౌదరి, మానస, జి.సుజాతరాణి, బీవీఎన్.కృష్ణ, నరేష్, లక్ష్మీదీప, శ్రావణి, ద్రౌపది, పి.పావని, పి.రవిచందర్, పి.ఉదయ్ భాస్కర్, పి.వంశీకిరిటీ, పి.ప్రియ, అనురాధ పాల్గొన్నారు. రక్తదాన శిబిరం ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ ప్రదీప్కుమార్ ఆధ్వర్యాన రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ చిన్నారుల మధ్య కేక్ కట్ చేయగా, యుగంధర్తో పాటు ప్రదీప్కుమార్ రక్తదానం చేశారు. అలాగే, ‘యువం ఫౌండేషన్’ సభ్యులు 50 మంది రక్తదానం చేశారు. ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు రెహనా బేగం, కోటేశ్వరరావుతో పాటు కూరపాటి ప్రీతి, సనాఉల్లా, సిద్ధార్థ్, నరేష్, అభిషేక్, మల్లేష్, నజీర్, మోతీలాల్, సిరాజ్, సుచరిత, లక్ష్మి, సుగుణ, నిర్మల పాల్గొన్నారు. ఏసీపీ రమణమూర్తి, ఐఎంఏ అధ్యక్షురాలు రెహానాబేగం -
వృద్ధురాలి ఆవేదనకు మంత్రి స్పందన
ఖమ్మంరూరల్: మండలంలోని గోళ్లపాడుకు చెందిన వెలుతురు భద్రమ్మ దశాబ్దాలుగా తన భూసమస్య పరిష్కారం కావడం లేదని ఈనెల 5న మంగళగూడెంలో జరిగిన ప్రజాదర్బార్లో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేసింది. దీంతో అక్కడికక్కడే స్పందించిన మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈమేరకు అధికారులు శుక్రవారం వివాదంలో ఉన్న భూమిని పరిశీలించారు. రికార్డుల ప్రకారం సరిహద్దులను నిర్ధారించడమే కాక ఏళ్ల తరబడి సమస్య ఎందుకు పరిష్కారం కావడం లేదనే వివరాలు సేకరించారు. ప్రజాదర్బార్లో ఫిర్యాదు చేయగానే స్పందించి క్షేత్రస్థాయి పరిశీలనకు మంత్రి పొంగులేటి ఆదేశించడం, ఉద్యోగులు రావడంతో భద్రమ్మ ఆనందం వ్యక్తం చేస్తోంది. రేపటి మోదీ సభకు ఖమ్మం నుంచి ప్రత్యేక రైలు ఖమ్మం మామిళ్లగూడెం: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఆదివారం సాయంత్రం జరిగే సభలో ప్రధాని మోదీ పాల్గొననుండగా, సభకు వెళ్లే వారి కోసం ప్రత్యేక రైలు ఏర్పాటుచేసినట్లు బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయిల వెంకట్ తెలిపారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావుతో కలిసి శుక్రవారం ఆయన మాట్లాడారు. ఖమ్మం నుంచి ఆదివారం ఉదయం 8–30గంటలకు ప్రత్యేక రైలు బయలుదేరుతుందని, రైతులు, మహిళలు, యువత రావాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు సన్నె ఉదయ్ప్రతాప్, కోటమర్తి సుదర్శన్, ప్రభాకర్, మందడపు సుబ్బారావు, మేకల నాగేందర్, రజనీరెడ్డి, మంద సరస్వతి, నక్కల రవిగౌడ్, శ్రీరామనేని మణి పాల్గొన్నారు. 11న అప్రెంటీస్ మేళా ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 11వ తేదీన జాతీయ అప్రెంటీషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఏ.శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్కు చెందిన ఎంఎన్సీ కంపెనీలు, జిల్లాలోని ఇతర కంపెనీల బాధ్యులు పాల్గొని అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారని వెల్లడించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు www. apprenticeshipindia. gov. in వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకుని, రిజిస్ట్రేషన్ కాపీతో ఎస్సెస్సీ, ఐటీఐ మెమోలు, కుల ధృవీకరణపత్రం, రెండు పాస్ ఫొటోలతో హాజరుకావాలని సూచించారు. -
విద్యార్థులకు వెన్నుపోటు పొడిచిన సర్కార్
ఖమ్మంమయూరిసెంటర్: ఫీజు రీయింబర్స్మెంట్ను రద్దు చేసేలా జీఓ 7ను తీసుకురావడం ద్వారా రాష్ట్రప్రభుత్వం పేద విద్యార్థులకు వెన్నుపోటు పొడిచిందని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్తో పాటు వివిధ పార్టీల నాయకులు పేర్కొన్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యాన ఖమ్మంలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సురేష్తో పాటు సీపీఎం, మాస్లైన్, న్యూడెమోక్రసీ, ఏఐఎస్ఎఫ్ నాయకులు ఎర్ర శ్రీనివాసరావు, ఆవుల అశోక్, షేక్ ఖాసిం, రావి శివరామకృష్ణ మాట్లాడారు. రాష్ట్రంలో 14 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఆసరాగా నిలుస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేయాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల పెంపునకు అనుమతించగా, ఆ భారం విద్యార్థులపై పడుతుందన్నారు. ఈక్రమాన ఫీజు రీయింబర్స్మెంట్ను రద్దు చేయకుండా పెంచడంతో పాటు ఉపకార వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ సమావేశంలో వివిధ పార్టీలు, సంఘాల నాయకులు అజ్మీరా రామ్మూర్తి, పుల్లయ్య, ఇటికల రామకృష్ణ, తాటి వెంకటేశ్వరరావు, మెరుగు సత్యనారాయణ, మేకల శ్రీనివాసరావు, ఝాన్సీ. నందిపాటి మనోహర్, ఏసు, జగన్, తుడుం ప్రవీణ్, గోకినపల్లి మస్తాన్, మనోజ్, నరేందర్, ఉమామహేష్ తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు -
చేపలు, రొయ్యల పెంపకానికి చెరువులే కీలకం
కల్లూరు: చేపలు, రొయ్యల పెంచే వారు చెరువుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా మత్స్యశాఖ అధికారి శివప్రసాద్ సూచించారు. కల్లూరు రైతు వేదికలో మత్స్యశాఖ, జలవనరుల శాఖల ఆధ్వర్యాన మత్స్యకారులకు శుక్రవారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. చెరువుల్లో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలని, లేనిపక్షంలో నీటి నాణ్యత తగ్గి చేపల ఎదుగుదలకు ఆటంకం ఏర్పడుతుందన్నారు. ఈమేరకు జాగ్రత్తలు పాటించాలని తెలిపా రు. జలవనరుల శాఖ ఈఈ సురేష్బాబు, డీఈ ఈలు వెంకటేశ్వరరావు, రాజారత్నం పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలం మంచుకొండ సమీపాన ఖమ్మం– ఇల్లెందు రహదారిపై శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఘటన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడుకు చెందిన ఎర్రగడ్డ నరేష్(29) బైక్పై వెళ్తుండగా ఖమ్మం నుంచి ఇల్లెందు వైపు వెళ్తున్న లారీ ముందు ఉన్న నరేష్ వాహనాన్ని ఢీకొట్టింది. అంతేకాక అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును సైతం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్, కారు నుజ్జునుజ్జు కాగా తీవ్రగాయాలతో నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. అంతేకాక కారులో ఉన్న కామేపల్లి మండలం గోవింద్రాల వాసులు మూడ్ బాలకృష్ణ – అనూష దంపతుల్లో అనూషకు తీవ్రగాయాలు కాగా, మిగతా వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంతో రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడగా స్థానికులు క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఆపై సమాచారం అందుకున్న ఎస్సై నరేష్ సిబ్బందితో చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. కాగా, ఎర్రగడ్డ నరేష్ తన తల్లిదండ్రుల మృతితో కార్పెంటర్ పనిచేస్తూ కుటుంబ పెద్దగా నిలిచే క్రమాన ఆయన మృతితో విషాదం నెలకొంది.బైక్ను ఢీకొట్టి కారుపైకి దూసుకెళ్లిన లారీ -
గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు..
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి ఏదులాపురం క్రాస్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో గ్రామానికే చెందిన కొండా అజిత్(26) మృతి చెందాడు. వ్యక్తిగత పనిపై అజిత్ వరంగల్ క్రాస్రోడ్డుకు వెళ్లి తిరిగి నడుస్తూ ఇంటికి వస్తున్నాడు. ఆయన రోడ్డు దాటుతుండగా అతివేగంతో వచ్చిన వాహనం ఢీకొట్టి ఆయన పైనుంచి వెళ్లడంతో మృతదేహం చిధ్రమైంది. అక్కడకు చేరుకున్న పోలీసులు అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు, బృందం సహకారంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఆరోగ్యం.. యోగానందం
వేసవి సెలవుల్లో యోగా శిక్షణ పొందుతున్న సత్తుపల్లి ప్రభుత్వ బాలికల హైస్కూల్ విద్యార్థినులు పలు పోటీల్లో ప్రతిభ చాటుకున్నారు. మూడేళ్లుగా వేసవి సెలవుల్లో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ శ్రీదేవి ఆధ్వర్యాన యోగా శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి మొదలైన శిక్షణ తరగతులకు విద్యార్థినులు ఆసక్తిగా హాజరవుతున్నారు. అయితే, సెలవుల్లో కాకుండా తర్వాత కూడా పలువురు విద్యార్థినులు శిక్షణ కొనసాగిస్తుండడంతో రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటుకున్నారు. ప్రస్తుతం ప్రతిరోజూ ఉదయం గంట పాటు తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ తరగతులకు హాజరవుతుండడంతో విద్యార్థినుల్లో మానసిక ప్రశాంతత, ఆరోగ్యవంతమైన జీవనశైలి అలవడుతోందని శిక్షకురాలు శ్రీలత చెబుతున్నారు. అంతేకాక శారీరక ఆరోగ్యం పెరిగి.. ఒత్తిడి దూరమవుతుందని పేర్కొన్నారు. – సత్తుపల్లిటౌన్ మూడేళ్లుగా యోగా శిక్షణ తీసుకుంటున్నా. ఈ శిక్షణతో ఉత్సాహంగా ఉండడమే కాక చదువు సైతం ఆసక్తిగా సాగుతోంది. నల్లగొండ, హైదరాబాద్, కరీంనగర్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో బహుమతులు సాధించా. – కిన్నెర ఫ్రూటీ జస్విత, సత్తుపల్లియోగా శిక్షణకు విద్యార్థినులు ఆసక్తిగా హాజరవుతున్నారు. ఈ శిక్షణతో ఒత్తిడి తగ్గడమే కాక శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుంది. ఇక్కడ శిక్షణ పొందిన 13 మంది రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. – చీకటి శ్రీదేవి, పీడీ, బాలికోన్నత పాఠశాల, సత్తుపల్లియోగా నేర్చుకోవడం వల్ల చదువుపై ఏకాగ్రత పెరుగుతోంది. మానసిక ప్రశాంతత లభిస్తోంది. అంతేకాక మనసు ఉల్లాసంగా ఉంటోంది. కరీంనగర్, హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. – కె.ధనవర్ష, సత్తుపల్లి -
రిజర్వాయర్లో పడి వ్యక్తి మృతి
కొణిజర్ల: ప్రమాదవశాత్తు వైరా రిజర్వాయర్లో పడిన వ్యక్తి మృతి చెందాడు. కొణిజర్ల ఎస్ఐ గుగులోత్ సూరజ్ తెలిపిన వివరాలు... వైరా మున్సిపాలిటీ పరిధి లీలా సుందరయ్యనగర్కు చెందిన లారీ డ్రైవర్ ఆది శివప్రసాద్(48) గురువారం రాత్రి భోజనం తర్వాత రిజర్వాయర్ ఆనకట్టపైకి వాకింగ్ కోసం వెళ్లాడు. ఈక్రమాన ప్రమాదవశాత్తు రిజర్వాయర్లో పడినట్లు తెలుస్తోంది. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం రిజర్వాయర్లో శివప్రసాద్ మృతదేహం తేలడంతో గుర్తించారు. ఆయనకు భార్య, ఓ కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. శివప్రసాద్ తండ్రి జగన్నాధం ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య పెనుబల్లి: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెనుబల్లి మండలం గంగదేవిపాడుకు చెందిన అనుమోలు రమేష్(52) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చికిత్స చేయించుకున్నా నయం కాకపోవడంతో మనస్థాపానికి గురైన ఆన శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. కాసేపటికి గమనించిన కుటుంబీకులు పెనుబల్లి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయనకు ఒక కుమారుడు, ఓ కుమార్తె ఉండగా, పోలీసులు కేసు నమోదు చేశారు. -
వ్యర్థాలకు నిప్పుతో సమీప పంటలు దగ్ధం
తిరుమలాయపాలెం: మొక్కజొన్న చేనులో వ్యర్థాలకు నిప్పు పెట్టగా సమీపంలోని వరి, జామాయిల్ పంటలకు నిప్పంటుకుని సుమారు రూ.80 వేల నష్టం వాటిల్లింది. ఈ ఘటనపై బాధిత రైతుల ఫిర్యాదుతో పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. మండలంలోని దమ్మాయిగూడెంలో వీరదాసు భాగ్యమ్మ తన మొక్కజొన్న పంట కోత అనంతరం వ్యర్థాలకు నిప్పు పెట్టింది. అయితే, గాలిదుమారంతో పక్కనే ఉన్న ఆలస్యం సత్యనారాయణ, నూకారపు నాగేశ్వరరావుకు చెందిన వరి, జామాయిల్ పంటలకు మంటలు వ్యాపించి కాలిపోయాయి. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.జగదీష్ తెలిపారు. కాగా, రైతులు వ్యర్థాలకు నిప్పు పెట్టకుండా వ్యవసాయ అధికారుల సూచనల మేరకు కలియదున్నాలని సూచించారు. పని ప్రదేశాల్లో వసతులు కల్పించాలి ఎర్రుపాలెం: ఉపాధి హామీ పథకం ద్వారా పనులు జరుగుతున్న ప్రదేశాల్లో కూలీలకు తగిన వసతులు కల్పించాలని డీఆర్డీఓ కొండపల్లి శ్రీరామ్ ఆదేశించారు. ఎర్రుపాలెం మండలం మీనవోలు, పెగళ్లపాడు గ్రామాల్లో పనులతో పాటు నర్సరీని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడిన ఆయన.. రోజుకు సగటున రూ.307 వచ్చేలా కొలతల ప్రకారం పనిచేయాలని తెలిపారు. ఎండల నేపథ్యాన ఉదయాన్నే పనికి రావాలని చెప్పారు. అలాగే, పని ప్రదేశాల్లో టెంట్ వేయించడంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు సమకూర్చాలని సిబ్బందికి సూచించారు. అనంతరం సర్పంచ్లు సమకూర్చిన మజ్జిగ ప్యాకెట్లను కూలీలకు అందజేశారు. నర్సరీలోని ఖాళీ సంచుల్లో త్వరగా మొలకలు వచ్చే విత్తనాలు నాటా లని ఆదేశించారు. ఎంపీడీఓ బి.సురేందర్, ఏపీఓ నాగరాజు, సర్పంచ్లు కె.కన్నమ్మ, కె.అనిల్కుమార్, ఈసీ లక్ష్మయ్య, కార్యదర్శులు పాల్గొన్నారు. -
మక్క రైతులపై అదనపు బాదుడు
ఖమ్మంవ్యవసాయం: కష్టనష్టాలను ఓర్చుకుని మొక్కజొన్న సాగు చేసిన రైతులు.. ఆ పంటను అమ్ముకునేందుకు మరిన్ని అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రైవేటు మార్కెట్లో మద్దతు ధర లేకపోవడంతో విక్రయాల్లో అడుగడుగునా అవరోధాలు ఏర్పడుతున్నాయి. వే బ్రిడ్జి కాంటాలు, దిగుమతుల్లో హమాలీ మామూళ్ల పేరిట అదనపు వసూళ్లు చేస్తుండడంతో రైతులకు నష్టం ఎదురవుతోంది. పంట ఆరబెట్టాక తేమ శాతం పరీక్ష చేయించుకోవటం, విక్రయించుకునేందుకు గన్నీ బస్తాల కోసం వేచిచూడటం, ఆ తర్వాత కాంటాలు వేయించటం, ప్రభుత్వ శాఖలు అనుమతించినప్పుడు ట్రాక్టర్లో లోడ్ చేయించి మక్కలను గోదాము(ఖమ్మం మార్కెట్)కు తరలించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో అడుగడుగునా అదనపు వసూళ్లతో రైతు చిత్తవుతున్నాడు. దూరాన్ని బట్టి వసూలు.. గ్రామంలో పంట విక్రయ సమయాన క్వింటాకు కాంటా ఖర్చు, లోడింగ్కు రూ.65 – రూ.80 తీసుకుంటున్నారు. ఇక ట్రాక్టర్పై రవాణాకు దూరం ఆధారంగా చార్జి వసూలు చేస్తున్నారు. గోదాం వద్ద వెంటనే దిగుమతి కాకపోతే వెయిటింగ్ చార్జిఅదనంగా తీసుకుంటున్నారు. ఈ చార్జీలు క్వింటాకు రూ.50 వరకు అవుతున్నాయి. అయితే, ఈ చార్జీలను మార్క్ఫెడ్ చెల్లిస్తామని చెబుతున్నా.. ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక ట్రాక్టర్ వే బ్రిడ్జిపై కాంటాకు ఒక్కో టిక్కీ(50 కిలోల బస్తా)కి రూ.2 ట్రాక్టర్ మొత్తం కాంటాకు రూ.100, లారీ అయితే రూ.200 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇక దిగుమతి వద్ద హమాలీలు మామూళ్ల పేరిట ట్రాక్టర్కు రూ.500 వరకు వసూలు చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. మక్కలు క్వింటాకు ప్రభుత్వం రూ. 2,400గా ప్రకటించినా.. ఇతర ఖర్చులు రూ.400 పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాంటాలు, మామూళ్ల పేరిట వసూళ్లుఈ యాసంగిలో 15 ఎకరాల్లో మొక్కజొన్న వేశా. ఎండల్లో పంట పండించడంలో పడిన ఇబ్బంది కంటే విక్రయంలో మరిన్నిపాట్లు పడుతున్నాం. ప్రతిచోట అదనపు రేట్లు వసూలు చేస్తున్నారు. వే బ్రిడ్జి వద్ద, హమాలీలు మామూళ్ల పేరిట అన్నీ అదనంగా వసూలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. – చావా ప్రవీణ్, రైతు, ముఠాపురం, నేలకొండపల్లి మండలం -
ఖమ్మం మార్కెట్కు వేసవి సెలవులు
● 10 నుంచి జూన్ 7 వరకు క్రయవిక్రయాలకు బ్రేక్ ఖమ్మంవ్యవసాయం: ఎండ తీవ్రత నేపథ్యాన ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు వేసవి సెలవులు ప్రకటించారు. వేసవి ఉష్ణోగ్రతల కారణంగా పంటల క్రయవిక్రయాల్లో కార్మికులు, గుమస్తాలు, వ్యాపారులు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉండడంతో సెలవులు ప్రకటించాలని చాంబర్ ఆఫ్ కామర్స్ బాధ్యులు మార్కెట్ కమిటీని కోరారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా సెలవులకు అనుమతించారు. దీంతో ఈనెల 10 నుంచి జూన్ 7వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్ తెలిపా రు. వారాంతపు సెలవైన శనివారం(9వ తేదీ న) మార్కెట్లో పంటల కొనుగోళ్లు నిర్వహించనుండగా, ఆతర్వాత సెలవులు మొదలవుతాయని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు. 19వరకు ఓపెన్ యూనివర్సిటీ ఫీజు గడువు ఖమ్మం సహకారనగర్: డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రథమ సంవత్సరం రెండు, ద్వితీయ సంవత్సరం నాలుగు, తృతీయ సంవత్సరం ఆరో సెమిస్టర్ విద్యార్థులు ఫీజు చెల్లించేందుకు ఈనెల 19వ తేదీ వరకు అవకాశముంది. ఈ విషయాన్ని ఎస్ఆర్బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జాకీరుల్లా, అధ్యయన కేంద్ర కోఆర్డినేటర్ డాక్టర్ బి.వీరన్న తెలిపారు. పరీక్షలు జూన్ 14వ తేదీ నుంచి నిర్వహించనున్న నేపథ్యాన విద్యార్థులు ఆన్లైన్లో నేరుగా లేదా మీ సేవా కేంద్రాల్లో పరీక్ష ఫీజు, ప్రాక్టికల్స్ ఫీజు చెల్లించాలని సూచించారు. వివరాలకు Dr.BRAOU.Online.in వెబ్సైట్లో పరిశీలించాలని తెలిపారు. హైవేపై నిలిచిన వాహనాలు ● టోల్ బూత్ వద్ద సాంకేతిక సమస్య వైరా: ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలోని వైరా మండలం సోమవరం టోల్బూత్ వద్ద గురువారం సాంకేతిక సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యాన వాహనాల టోల్ఫీజు వసూళ్లు నిలిచి పోయాయి. సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వాహనాలను ఓ వైపు నుంచే అనుమతించారు. ఫలితంగా గంటల తరబడి వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగగా వేచిఉండాల్సి వచ్చింది. చివరకు సమస్య పరిష్కారం కావడంతో రాకపోకలను క్రమబద్ధీకరించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు ఖమ్మం సహకారనగర్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 13వ తేదీ నుంచి జరగనుండగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. నిర్ణీత తేదీల్లో పరీక్షలు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2–30 నుంచి సాయంత్రం 5–30 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో 37కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రథమ సంవత్సరం విద్యార్థులు 10,344 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 3,562 మంది విద్యార్థులు హాజరుకానున్నారని చెప్పారు. ఎండల నేపథ్యాన కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. అంతేకాక కేంద్రాల సమీపంలో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయించి భద్రత కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో డీఐఈఓ కె. రవిబాబు, డీఈసీ సభ్యులు ఎం.సింహాచలం, డీఎంహెచ్ఓ రామారావు తదితరులు పాల్గొన్నారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన పాల్వంచరూరల్: పాల్వంచ మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో అమ్మవారికి గురువారం వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. అర్చకులు అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ పాల్గొన్నారు. -
హెచ్చరిస్తే మేలు
తడిసిపోతున్న ధాన్యం భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా సుమారు 6.59 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. చిన్న, సన్నకారు, మోతుబరి అంతా కలుపుకుని 1.75 లక్షల మందికి పైగా రైతులు ఉన్నారు. ఇందులో రెండు పంటలు పండే వరి పొలాలు 1.80 లక్షల ఎకరాలు వరకు ఉండగా, సుమారు లక్ష ఎకరాల్లో పత్తి, మరో లక్ష ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ప్రస్తుతం యాసంగి సీజన్ వరి, మొక్కజొన్న పంటలు చేతికి వచ్చాయి. పంట ఉత్పత్తుల్లో సింహభాగం కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టి ఉంచారు. మండిపోతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా పడిగాపులు కాస్తున్నారు. అయితే అకాల వర్షాలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కేవలం గంట వ్యవధిలోనే ఒక్కసారిగా వాతావరణ పరిస్థితులు మారిపోవడం, అకస్మాత్తుగా వడగండ్లు, భారీ వానలు కురుస్తుండటంతో రైతులు నష్టపోతున్నారు. జాగ్రత్త పడతారు.. రైతు వేదికలు, వాట్సాప్లు, మొబైల్ ఫోన్లు అన్ని అందుబాటులో ఉన్నా రైతులు ఇప్పటికీ ఆకాశం వైపు చూసి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది. తక్కువ సమయంలో కాపాడులేకపోతుండటంతో ఆరబోసిన ధాన్యం, మక్కలు వర్షార్పణమవుతున్నాయి. ఇక రోడ్ల వెంబడి, పొలంలో నిల్వ చేసిన ధాన్యం విషయంలో నష్టం మరింత ఎక్కువగా ఉంటోంది. ఈ తరహా ఘటనలు ఇటీవల బూర్గంపాడు, ఇల్లెందు మండలాల్లో చోటు చేసుకున్నాయి. ఆకస్మిక వర్షాలు వచ్చినప్పుడు ఆయా ప్రాంతాల రైతులను అప్రమత్తం చేస్తే.. పంట ఉత్పత్తులను జాగ్రత్త చేసుకునేందుకు ఎక్కువ సమయం అందుబాటులో ఉంటుంది. కొన్ని సమయాల్లో టార్పాలిన్లు అందుబాటులో లేకపోతే వాటిని సమకూర్చుకునేందుకు అవకాశం కూడా కలుగుతుంది. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని రైతులు అంటున్నారు. అలర్ట్ చేసే వారెవరు? జాతీయ స్థాయిలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నుంచి భూకంపాలు, వరదలతోపాటు ఆకస్మిక వానలకు సంబంధించిన అలెర్ట్లు ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతీ ఐదు వేల ఎకరాలను ఒక క్లస్టర్గా విభజించి రైతు వేదికలు నిర్మించారు. క్లస్టర్లోని రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు వ్యవసాయ విస్తరణ అధికారు(ఏఈఓ) లు ఉన్నారు. వీరు ఎప్పటికప్పుడు రైతులతో టచ్లో ఉంటున్నారు. వాట్సాప్ గ్రూపులు కూడా ఉన్నా యి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీతోపాటు నిబద్ధత, నమ్మకం కలిగిన ప్రైవేటు వాతావరణ సంస్థలు సైతం 24 గంటల ముందే ఏ ప్రాంతాల్లో ఆకస్మిక వానలు, వడగళ్ల వర్షాలు పడతా యనే అంశంపై సమాచారం అందిస్తున్నారు. ఇలా వచ్చిన సమాచారాన్ని ఆకస్మిక వానాలు వచ్చేందుకు అవకాశం ఉన్న జిల్లాలు, అందులోని మండలాలు ఏవనేవి గుర్తించి, ఆ మేరకు రైతులను అప్రమత్తం చేసే విధానం ప్రస్తుతానికి అందుబాటులో లేదు.ప్రమాదం ముంచుకొస్తుందని తెలిసినా రైతులు నష్టాల నుంచి తప్పించుకోలేకపోతున్నారు. సాంకేతికత అందుబాటులోకి వచ్చినా ఆకాశం వైపు చూసి నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. వరదలు, అగ్నిప్రమాదాల తరహాలోనే ఆకస్మిక వానల నుంచి పంట ఉత్పత్తులను కాపాడటాన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా చేయాలని కోరుతున్నారు. – సాక్షి ప్రతినిఽధి భద్రాద్రి కొత్తగూడెంవర్షసూచనల సమాచారంలేక నష్టపోతున్న రైతులు -
ఫుడ్ సేప్టీ అధికారి ఆకస్మిక తనిఖీలు..
అశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు హోటళ్లు, డాబాల్లో గురువారం జిల్లా ఫుడ్ సేప్టీ అధికారి శరత్ ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. స్థానిక ఓ హాటల్లో కొద్ది రోజుల క్రితం కొనుగోలు చేసిన ఆహారంలో కోడి ఈక రాగా, దీనిపై బాధిత వినియోగదారుడు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో ఫుడ్ సేప్టీ అధికారి పలు హోటళ్లు, డాబాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా హోటళ్లు, డాబాలలో పరిశుభ్రత ప్రమాణాలు, ఆహార పదార్థాల నిల్వ విధానం, వంట గదులు, ఫుడ్ సేప్టీ లైసెన్సులను ఆయన పరిశీలించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్–2006 ప్రకారం 5 నమూనాలు, 12 సర్వేలైన్స్ నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షలకు పంపారు. అలాగే నిబంధనలు పాటించని నిర్వాహకులను గుర్తించి వారికి నోటీసులు జారీ చేశారు. ఫుడ్ సేప్టీ లైసెన్సులు లేకుండానే వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి ఒక వారం రోజుల గడువు ఇచ్చి లైసెన్సులు పొందాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో డిజిగ్నేటెడ్ ఆఫీసర్ దినేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
పంటలు.. బుగ్గిపాలు
● అవశేషాల కాల్చివేతతోనే తీరని నష్టం ● అన్నదాతల్లో అవగాహనలేమితో ప్రమాదాలు ● పలు ప్రాంతాల్లో రూ.లక్షల విలువైన పంటలు ఆహుతిఖమ్మంవ్యవసాయం: యాసంగిలో ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు పలు కారణాలతో బుగ్గి పాలవుతున్నాయి. రైతుల అవగాహన ఏమి, ప్రకృతివైపరీత్యాల కారణంగా పంటలు అగ్నికి ఆహుతవుతున్నాయి. ఈ ఏడాది జలాశయాల్లో సమృద్ధిగా నీరు ఉండడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న, వరి గణనీయ స్థాయిలో సాగయ్యాయి. ప్రస్తుతం కోత, కల్లాల్లో ఆరబెట్టడం, విక్రయించే పనులు సాగుతున్నాయి. ఈ దశలో చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాదాలతో రూ. లక్షల విలువైన పంట కాలిపోతోంది. పైరుపైన కోతదశలో ఉన్న మొక్కజొన్న, వరి పంటలే కాక కోసి రాశులుగా పోసిన పంట కూడా ప్రమాదాల బారిన పడుతుండగా మామిడి, ఆయిల్ పామ్ తోటలు కూడా కాలిపోతున్నాయి. వరుస ఘటనలు.. తాజాగా చింతకాని మండలం పాతర్లపాడులో 45 మంది రైతులకు చెందిన రూ. 15లక్షల విలువైన 600 క్వింటాళ్ల మొక్కజొన్నలు కాలిపోయాయి. బస్వాపురంలో నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న కాలిబూడిదైంది. అలాగే, 20 ఎకరాల్లో మామిడి తోటలు, లచ్చగూడెంలో పామాయిల్ తోట, చింతకానికి చెందిన రైతు ట్రాక్టర్, కామేపల్లి మండలం సాతానపురం, జీ.వీ.నారాయణపురంలో మొక్కజొన్న చేన్లు, మధిర మండలం మాటూరు, బోనకల్ మండలంలో మొక్కజొన్న రాశులు, కాలిపోగా.. కొణిజర్ల, నేలకొండపల్లి, ముదిగొండ, కూసుమంచి, కల్లూరు మండలాల్లో కూడా అగ్ని ప్రమాదాలు జరిగాయి. అవశేషాల కాల్చివేతతోనే.. పంట కోతలు పూర్తయ్యాక రైతులు అవశేషాలకు మంట పెడుతున్నారు. ప్రస్తుత వేసవిలో వడగాలులతో మంటలు వేగంగా విస్తరిస్తూ సమీపంలోని పంట చేన్లు, రాశులను తాకి కాలిపోతున్నాయి. పరిసరాల్లో ఉన్న ఆయిల్ పామ్ తోటలు, మామిడి తోటలకూ మంటలు చేరి కాలిపోతుండడంతో రైతులకు తీరని నష్టం ఎదురవుతోంది. నష్టాలపై అవగాహన లేక.. పంటల అవశేషాలు కాల్చడం వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాక నేలకు, రైతు ఆదాయానికి నష్టం ఎదురవుతోంది. నేలలో పంట వ్యర్థాలు తగలబెడితే సేంద్రియ కర్బనం, నైట్రోజన్, పాస్పరస్, పొటాష్, గంధకం వంటి పోషకాలు నశించిపోతున్నాయి. మేలు చేసే బ్యాక్టీరియా తగ్గడంతో నేల బురదగా మారి దున్నడం కష్టమవుతుంది. ఫలితంగా దిగుబడి తగ్గుతుంది. పంట అవశేషాలు, వ్యర్థాలను కాల్చకుండా భూమిలో కలియదున్నితే లాభాలు ఉన్నాయనే అంశంపై రైతుల్లో అవగాహన లోపించడం ఇందుకు కారణమని చెబుతున్నారు. నష్టపరిహారం వర్తించదు.. పంట కాలిపోతే నష్టపరిహారం వర్తించదు. అతివృష్టి, అనావృష్టి సమయాన ప్రకృతి వైపరీత్యాల కింద ప్రభుత్వం నిబంధనల మేరకు పరిహారం చెల్లిస్తుంది. కానీ అగ్నిప్రమాదానికి పరిహారం లేదు. ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం ప్రత్యేకంగా స్పందిస్తేనే సాయం అందే అవకాశముంది. ఇటీవల జిల్లాలో అగ్ని ప్రమాదాల కారణంగా జరిగిన పంట నష్టాలను కొందరు ప్రజా ప్రతినిధులు, రైతు కమిషన్ ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఇదే సమయాన ప్రభుత్వ శాఖలు కూడా కాలిపోయిన పంటల వివరాలపై నివేదికలను సిద్ధం చేస్తున్నాయి.అవశేషాల కాల్చివేతతో అన్ని రకాలుగా నష్టం ఎదురవుతోంది. ఈ అనర్థాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. రైతు వేదికల్లోనే కాక క్షేత్రస్థాయిలో నిర్వహించే కార్యక్రమాల్లో మంట పెడితే నష్టాలు, కలియదున్నితే కలిగే లాభాలను వివరిస్తున్నాం. అరుగాలం శ్రమించి పండించిన పంటలు కాలిపోతే నష్టం ఎదురుకానున్నందున రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలి. – ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి -
సింగరేణి వైద్యుల నియామకంలో జాప్యం
రుద్రంపూర్: సింగరేణి ఆస్పత్రుల్లో వైద్యుల నియామకంలో యాజమాన్యం తీవ్ర జాప్యం చేస్తోంది. స్పెషలిస్ట్ వైద్యుల కొరతను తీర్చేందుకు సంస్థ వ్యాప్తంగా 32 ఖాళీలను భర్తీ చేసేందుకు గత డిసెంబర్లో యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 8, 9వ తేదీల్లో హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సంస్థ ఉన్నతాధికారులు, సీనియర్ వైద్యాధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కానీ ఇప్పటివరకు పోస్టింగ్ ఇవ్వలేదు. కాగా 32 పోస్టులకు 74 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యారు. జనరల్ సర్జన్–4, గైనకాలజిస్ట్–7, పీడియాట్రీషియన్–4, చెస్ట్ ఫిజీషియన్–3, ఈఎన్టీ సర్జన్–2, అనష్థీసియన్– 7, పెథాలజిస్ట్–1, హెల్త్ ఆఫీసర్–3, సైక్రియాట్రిస్ట్–1 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇప్పటికై నా యాజమాన్యం స్పందించి పోస్టులు భర్తీ చేయాలని కార్మికులు కోరుతున్నారు. -
మిషన్ భగీరథ కార్మికుడు ఆత్మహత్య
వైరా: వైరా మున్సిపాలిటీ పరిధి గండగలపాడుకు చెందిన మిషన్ భగీరథ కార్మికుడు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు... గ్రామానికి చెందిన పింగళి శ్రీను(48) మిషన్ భగీరథలో పంప్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఆయన మద్యానికి బానిస కావడంతో వారం క్రితం భార్య రాధ, ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్థాపానికి గురైన శ్రీను ఈనెల 4న ఇంట్లో ఉరి వేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేకపోగా, ఈ విషయం బయటపడలేదు. అయితే, గురువారం శ్రీను సోదరుడు వెళ్లి ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా ఆయన ఆత్మహత్య విషయం బయటపడింది. ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామారావు తెలిపారు. ఆయిల్పామ్ మొక్కలు దగ్ధం కొణిజర్ల: మండలంలోని లక్ష్మీపురంలో రైతు ధరావత్ నంద్యానాయక్ సాగు చేస్తున్న తోటలో ఆయిల్పామ్ చెట్లు కాలిపోయాయి. ఆయన ఐదెకరాల్లో ఆయిల్పామ్ సాగు చేస్తుండగా గురువారం ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. దీంతో రెండెకరాల విస్తీర్ణంలో మొక్కలు కాలిపోయాయి. సీపీఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, నాయకులు కుటుంబరావు, హరిచంద్, చింతపల్లి ప్రసాద్, అజయ్కుమార్, మహబూబ్ అలీ, కృష్ణకాంత్ తదితరులు తోటను పరిశీలించి రైతును ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసులపై దాడికి యత్నించిన వ్యక్తి అరెస్ట్ మణుగూరు టౌన్: డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్న పోలీసులపై మద్యం మత్తులో కత్తితో దాడికి యత్నించిన వ్యక్తిని మణుగూరు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. తోగ్గూడెం సమ్మక్క–సారలమ్మ దేవాలయం వద్ద బుధవారం సాయంత్రం పోలీసులు వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపట్టారు. ఈ క్రమంలో తోగ్గూడెం గ్రామానికి చెందిన సోలం నాగేశ్వరరావు మద్యం సేవించి ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. పోలీసులు అడ్డుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా నిర్థారణ అయింది. దీంతో అతడిని మందలించి ఇంటికి పంపించారు. ఆతర్వాత తనకే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారా అంటూ నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి కత్తి తీసుకుని తనిఖీలు చేపడుతున్న పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. -
కళ్ల ముందే పంట.. రైతు కన్నుమూత
కామేపల్లి: ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యం చేతికొచ్చింది.. హార్వెస్టర్ ద్వారా నూర్పిడి చేసిన ధాన్యాన్ని ఆరబోసేందుకు తీసుకెళ్లాలని రైతు సిద్ధమవుతుండగా ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్త కారణంగా మృతి చెందాడు. కామేపల్లి మండలం జాస్తిపల్లిలో గురువారం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. జాస్తిపల్లికి చెందిన వేముల ఉపేందర్(40) సాగు చేసిన వరి పొలాన్ని హార్వెస్టర్ ద్వారా నూర్పిడి చేయించాడు. ఆతర్వాత ధాన్యాన్ని తీసుకెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. అదే గ్రామానికి చెందిన రాయల పెద్దిరాజు ట్రాక్టర్ను అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ వచ్చాడు. ఈక్రమాన హార్వెస్టర్ పక్కనే ఉన్న ఉపేందర్ను గమనించకకుండా ఢీకొట్టడంతో పడిపోగానే ఆయన పైకి ట్రాక్టర్ ఎక్కింది. సమీప రైతులు అప్రమత్తమై తీవ్రగాయాలతో ఉన్న ఆయనను ఆటోలో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఘటనపై ఉపేందర్ భార్య రేణుక ఫిర్యాదుతో ట్రాక్టర్ డ్రైవర్ పెద్దిరాజుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.ట్రాక్టర్ కింద పడడంతో మృతి -
కాల్చొద్దు... కలియదున్నండి
వైరా/మధిర/బోనకల్: జిల్లాలోని పలుచోట్ల పంట అవశేషాలకు నిప్పు పెడుతుండడంతో అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యాన పంట అవశేషాలకు నిప్పు పెట్టకుండా భూమిలో కలియదున్నడం ద్వారా కలిగే లాభాలను వైరా కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ సుచరితాదేవి వివరించారు. కోఆర్డినేటర్తో పాటు వివిధ మండలాల వ్యవసాయ శాఖాధికారులు వెల్లడించిన వివరాలు.. మరో పంట వేయాలని.. వరి, మొక్క కోశాక వేరే పంట వేయడానికి తక్కువ సమయం ఉండడం, వ్యర్థాలు కుళ్లడానికి 20 రోజుల సమయం పడుతుండడంతో రైతులు అవశేషాలను కాల్చడానికి సిద్ధమవుతున్నారు. అయితే, టన్ను వరిగడ్డి కాల్చడం వల్ల 5.5 కిలోల నత్రజని, 2.3 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాషియంను భూమి కోల్పోతుంది. ఇదేసమయాన 60 కిలోల కార్బన్ మోనాకై ్సడ్, 1640 కిలోల కార్బన్ డయాకై ్సడ్, 199 కిలోల బూది, 2 కిలోల సల్పర్ డయాకై ్సడ్ విడుదలై వాయు కాలుష్యం ఏర్పడుతుంది. ఇలా చేస్తే మేలు.. వరిలో స్వల్పకాలిక రకాలను ఎంచుకుంటే త్వరగా కోతలు ముగియగానే.. వ్యర్థాలను నేలలో కలియదున్నాలి. కొయ్య కాళ్లను భూమిలో కలియదున్నితే గడ్డి ద్వారా పోషకాలు తిరిగి నేలకు చేరతాయి. పొలం దున్నే 10 రోజుల ముందు గడ్డిని పొలంలో పరిచి నీరు అందించి, ఆ తర్వాత ఎకరాకు 50 కిలోల సూపర్ పాస్పేట్ చల్లితే భూమిలో సేంద్రియ పదార్థాల స్థాయి పెరుగుతుంది. అంతేకాక వరి అవశేషాలను వర్మీ కంపోస్ట్ / బయోచర్ / బయోగ్యాస్ తయారీలో ఉపయోగించవచ్చు. అలాగే, వరి సాగు తర్వాత దున్నకుండా మొక్కజొన్న పంటను జీరో టిల్లెజ్ పద్ధతిలో సాగు చేస్తే మంచిది. -
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి
ఖమ్మం అర్బన్: ఖమ్మం నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలోని సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, పంపింగ్ వెల్ నిర్మాణాలకు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. అలాగే, 15వ డివిజన్ పాఠశాలలో పూర్తయిన అదనపు తరగతి గదులు, 55వ డివిజన్ బ్యాంక్ కాలనీలో సీసీ డ్రెయిన్, కల్వర్టులు, 12వ డివిజన్ లకారం ట్యాంక్బండ్ వద్ద నేతాజీ పార్క్ను ప్రారంభించడమే కాక అల్లీపురంలో 9 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్, డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ వ్యవస్థను ప్రారంభించారు. ఆతర్వాత అల్లీపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. నలభై ఏళ్ల ప్రజాసేవలో పల్లెపల్లెకు రహదారులు, తాగునీటి సదుపాయం, విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి కృషి చేస్తూనే భారీ ప్రాజెక్టులను తీసుకొచ్చానని పేర్కొన్నారు. తద్వారా ఖమ్మం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంతో పాటు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా కృషి చేస్తున్నానని తెలిపారు. ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ తొలిసారి అల్లీపురంలో 24 గంటల తాగునీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు. మంత్రి తుమ్మల సహకారంతో టీటీడీ ఆధ్వర్యాన ఆలయ నిర్మాణం, మెడికల్ కాలేజీ, ఖమ్మం ఖిల్లాకు రోప్వే తదితర పనులు జరుగుతున్నాయని చెప్పారు. అనంతరం సుడా చైర్మన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియమితులైన పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖాదర్అలీతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరాను సన్మానించారు. కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ పి.శ్రీజ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావుతో పాటు రావూరి కరుణసైదబాబు, కమర్తపు మురళి, సైదబాబు, ఎస్.నాగేశ్వరరావు, పి.వెంకటేశ్వరరావు, నాగండ్ల దీపక్చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
హిందువుల ఐక్యతే.. జాతీయ సమైక్యత
● సమ్మేళనంలో దత్తేశ్వరానంద భారతి ఖమ్మం అర్బన్: హిందువులైన ప్రతీఒక్కరు గర్వించాలని దత్తేశ్వరానంద భారతి సూచించారు. ఖమ్మం ఆరో డివిజన్ ప్రశాంత్నగర్లో గురువారం రాత్రి జరిగిన విరాట్ హిందూ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. హిందువుల ఐక్యతే జాతీయ సమైక్యతగా నిలుస్తుందని తెలిపారు. విరాట్ హిందూ సమ్మేళన ఆహ్వాన కమిటీ, అభయ వేంకటేశ్వర ఆలయ కమిటీ బాధ్యులు అద్దంకి నాగేశ్వరరావు, కొల్లా రవీందర్, అల్లిక అంజయ్యతో పాటు పల్లెబోయిన చంద్రయ్య, బస్వోజు వెంకటేశ్వర్లు, ఏలూరి శ్రీనివాసరావు, బొల్లి కొమరయ్య, వనతడపా గౌతమ్కుమార్, చారి, దండా జ్యోతిరెడ్డి, భగవాన్శర్మ, కోనేటి శ్రీనివాసరావు, మేకల వీరన్నపురం, పల్లపు సత్యం, పురం తిరుపతయ్య, దాచేపల్లి సంతోష్, నాగండ్ల కోటి తదితరులు పాల్గొన్నారు. కోళ్ల వ్యర్థాలు డ్రెయినేజీల్లో వేయొద్దు.. ● పలు షాపుల్లో తనిఖీ చేసిన ఎమ్మెల్యే కనకయ్య ఇల్లెందు: చికెన్ షాపుల నిర్వాహకులకు వ్యర్థాలను డ్రెయినేజీల్లోకి వదలొద్దని ఇల్లెందు ఎమ్మెల్యే సూచించారు. ఇల్లెందులోని పలు షాపుల నుంచి వ్యర్థాలు డ్రెయిన్లలోకి చేరుతుండడంతో దుర్వాసనకు కారణంగా ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఎమ్మెల్యేకుఫిర్యాదు చేశారు. దీంతో గోవింద్ సెంటర్లోని పలు షాప్లను గురువారం ఆయన మున్సిపల్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. దుర్వాసన వెదల్లుతుండడాన్ని గుర్తించిన ఆయన షాపుల యజమానులను హెచ్చరించడమే కాక నిరంతరం తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. అలాగే, కోళ్ల వ్యర్థాలను సేకరించి బయటకు తరలించేలా టెండర్ ద్వారా బాధ్యతలు అప్పగించాలని తెలిపారు. మున్సిపల్ డీఈ మురళి, నాయకులు పాల్గొన్నారు. చలివేంద్రం ధ్వంసం ఘటనపై కేసు ఖమ్మం అర్బన్: ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని ఖమ్మం 20వ డివిజన్ కార్పొరేటర్ బిక్కసాని ప్రశాంతలక్ష్మి జశ్వంత్ ఇచ్చిన ఫిర్యాదుతో ఖమ్మం అర్బన్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. చలివేంద్రంలోని కుండల్లో మూత్ర విసర్జన చేసి అమానుషంగా ప్రవర్తించడమే కాక ఫ్లెక్సీలను చింపివేశారని ఫిర్యాదు అందింది. పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితులను చర్యలు తీసుకోవాలని కోరగా, కేసు నమోదు చేసినట్లు సీఐ భానుప్రకాశ్ తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణపై అవగాహన మధిర: ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న రైతు వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మధిర రైతు వేదికలో గురువారం సౌర విద్యుత్ ఉత్పత్తి, పీఎం కుసుమ్, వ్యవసాయ యాంత్రీకరణపై అవగాహన కల్పించారు. అంతేకాక సాగులో ఉయోగపడే పరికరాలను ప్రదర్శించి వాటి వినియోగాన్ని రైతులకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి డి.పుల్లయ్య మాట్లాడుతూ.. మార్కెట్లో డిమాండ్ ఉండే మేలైన సన్నరకం వరి విత్తనాలు సాగు చేయాలని సూచించారు. తొలకరి వర్షాలు పడ్డాకే విత్తనాలు నాటుకోవాలని, ముందుగా నాటితే మొలక శాతం తగ్గుతుందని పేర్కొన్నారు. సంప్రదాయ పంటలకు బదులు ఆయిల్పామ్ సాగుతో దీర్ఘకాలిక లాభాలు ఉంటాయని తెలిపారు. కాగా, పంట వ్యర్థాలకు నిప్పు పెట్టకుండా భూమిలో కలియదున్నాలని సూచించారు. మధిర మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు మాట్లాడగా.. శాస్త్రవేత్త నాగస్వాతి, వ్యవసాయ, విద్యుత్ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. భద్రాచలంలో కూలిన సిగ్నల్ పోల్ భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో గురువారం రాత్రి తీవ్రమైన గాలిదుమారం కారణంగా అంబేడ్కర్ సెంటర్లోని ట్రాఫిక్ సిగ్నల్ ఐరన్ పోల్ పక్కకు ఒరిగి రోడ్డుపై పడింది. అయితే, ఈ సమయాన వాహనాల రద్దీ తక్కువగా ఉండటంతో ప్రమాదమే తప్పినట్లయింది. ప్రధాన కూడలిలో స్తంభం అడ్డంగా పడడంతో రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది. -
● అచ్చతెలుగులో అందిస్తున్న వెబ్సైట్లు ● వేసవి సెలవుల్లో చిన్నారులకు ఉపయోగం
ఇల్లెందు రూరల్: వేసవి సెలవులు రాగానే చిన్నారుల్లో ఎక్కడ లేని ఆనందం. అయితే ఈ సెలవులను సద్వినియోగం చేసుకునేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది. ఒకప్పుడు నీతి కథలు, పురాణాలు, ఇతిహాసాల్లోని కథలను అమ్మమ్మలు, తాతయ్యలు చెప్పేవారు. ప్రస్తుతం అలాంటివి చెప్పేవారు ఉన్నా.. వినే ఓపిక పిల్లలకు లేకుండా పోయింది. సెలవులనగానే సెల్ఫోన్ చేతపట్టి ఇంటర్నెట్తో కాలక్షేపం చేస్తున్నారు. వీడియో గేమ్లు, కార్టూన్ చానళ్లతోనే కాలం గడుపుతున్నారు. అలాకాకుండా తల్లిదండ్రులు కాస్త మనసు పెడితే పిల్లలు ఆసక్తిగా చూసేలా నీతి కథలు, విలువలను బోధించే కార్టూన్లను పరిచయం చేసే అవకాశం ఉంది. సెలవుల్లో విజ్ఞానం పాలు తాగే పసిపాప మొదలు బుడిబుడి అడుగులు వేసే పిల్లలు, ఆపై వయస్సు పిల్లలు కూడా సెల్ఫోన్లలో ఆటలకు పరిమితమయ్యారు. చిన్నవయస్సులో ఏడస్తున్న పసిహృదయాలకు సెల్ఫోన్ చేతిలో పెట్టి ఊరుకోబెడుతూ తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు. కానీ ఆ ప్రయత్నమే చిన్నారులను సెల్ఫోన్కు అతుక్కుపోయేలా చేస్తోంది. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని వారికి ఉపయోగపడేలా కథలను అందించే కొన్ని వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లిష్లోనే కాక అచ్చతెలుగులో విజ్ఞానాన్ని పెంచే కథలు, సామెతలు, పొడుపు కథలు, అక్బర్, బీర్బల్, చందమామ కథలు వంటివి చదవొచ్చు.. వినొచ్చు. మరికొన్ని సైట్లు పిల్లల పత్రికలు, మ్యాగజైన్లను అందిస్తున్నాయి. సెల్ఫోన్తో మారాం చేసే చిన్నారులకు వెబ్సైట్లలో నీతి కథలు వినిపిస్తూ వినోదం, విజ్ఞానం కూడా అందించేలా తల్లిదండ్రులు దృష్టి సారిస్తే మంచి ఫలితాలు వస్తాయి. వెబ్సైట్లలో ఏముందంటే.. వెబ్సైట్లలో చిన్నారుల మేథోవికాసాన్ని పెంపొందించే పిట్టకథలు, బుర్రకథలు, తెనాలి రామకృష్ణ, సరదా కథలు, పాటలు, చందమామ కథలు, తెగులు పద్యాలు, పిల్లల వీడియోలు, పొడుపు కథలు, వేమ, సుమతి, భాస్కర శతక పద్యాలు లభిస్తాయి. అలాగే, పంచతంత్ర కథలు, గొప్ప రాజులు, పురాతన ఆలయాలు, శ్లోకాలు తదితరాలను పరిచయం చేస్తున్నారు. సాహిత్యంలో భాగంగా రామాయణం, మహాభారతం, భాగవతం, పురాణాలు, ప్రవచనాలు అందుబాటులో ఉన్నాయి. -
●మండు వేసవిలోనూ జలకళ
ఒకప్పుడు తిరుమలాయపాలెం మండలంలో చుక్కనీరు లేక చెరువులు నెర్రెలు బారి కనిపించేవి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. మండలంలోని పలు చెరువులు మండు వేసవిలోనూ జలకళ సంతరించుకుని కనిపిస్తున్నాయి. వచ్చే ఖరీఫ్లో వర్షాభావ పరిస్థితులు ఎదురైనా ఇబ్బంది రాకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జలవనరుల శాఖ అధికారులు భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా నీరు విడుదల చేసి చెరువులను నింపారు. దీంతో దాదాపు అన్ని చెరువులు జలకళ సంతరించుకున్నాయి. చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండడంతో భూగర్భ జాలలు కూడా భారీగా పెరిగిన నేపథ్యాన వర్షాకాలంలో వానలు ఆలస్యమైనా సాగుకు ఇబ్బంది ఉండదని రైతులు చెబుతున్నారు. – తిరుమలాయపాలెం -
తలసేమియా బాధితులను గుర్తించాలి
చుంచుపల్లి: తలసేమియా బాధితులను గుర్తించాలని భద్రాద్రి డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ సూచించారు. శుక్రవారం ప్రపంచ తలసేమియా దినోత్సవం కావడంతో గురువారం ఆయన మహిళ ఆరోగ్య కార్యకర్తలతో ఆన్లైన్ సమావేశం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల్లో తలసేమియా వ్యాధిపై అవగాహన పెంపొందించేందుకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. తలసేమియా వారసత్వ రక్త సంబంధిత వ్యాధి అని, ముందస్తుగా గుర్తిస్తే సరైన చికిత్సతో బాధితులు ఆరోగ్యంగా జీవిస్తారని వివరించారు. చిన్నపిల్లల్లో తరచుగా రక్తహీనత, అలసట, బలహీనత, ఎదుగుదల లోపం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని సూచించారు. తలసేమియా బాధితులను గుర్తించేందుకు రక్త పరీక్షలు అవసరమని తెలిపారు. వివాహానికి యువత తలసేమియా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా భవిష్యత్లో పిల్లలకు ఈ వ్యాధి రాకుండా నివారించవచ్చని వివరించారు. గర్భిణులు కూడా అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఎన్సీడీ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని వేగవంతం చేసి మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను ముందుగానే గుర్తించాలని సూచించారు. వేసవికాలం దృష్ట్యా అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ప్రజలు ఎండలో తిరగకూడదని, ఉదయం 11 గంటల వరకు పని ముగించుకుని ఇంటికి చేరాలని, ఓఆర్ఎస్ ద్రావణాన్ని తీసుకోవాలని, ఎక్కువ నీటిని తాగాలని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ప్రతాప్, రాందాస్, సిబ్బంది మోహన్, రాంప్రసాద్ పాల్గొన్నారు.భ ద్రాద్రి డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ -
చెరువుల్లో పూడికతీత కష్టమే!
ఖమ్మంఅర్బన్: ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది చెరువుల పూడికతీత పనులు చేపట్టడంపై మీమాంస నెలకొంది. సాగర్ ఆయకట్టు పరిధిలోని చెరువులన్నీ నిండా నీటితో ఉండడమే ఇందుకు కారణంగా మారింది. గత నెల చివరి వరకు సాగర్ నీటి విడుదల కొనసాగడంతో పలు మండలాల పరిధిలోని చెరువుల్లో సగానికి పైగా నిల్వలు ఉన్నాయి. దీంతో అధికారులు ఎటూ తేల్చకోలేకపోతున్నారు. జిల్లాలో 1,415 చెరువులు జిల్లాలో 1,415 చెరువులు ఉన్నాయి. ఇందులో 100 ఎకరాలకుపైగా ఆయకట్టు కలిగినవి 984 ఉన్నట్లు జలవనరుల శాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది. చెరువుల్లో నీటి సామర్ధ్యం పెంచడం, తద్వారా ఆయకట్టుకు సరిపడా సాగునీరు అందేలా ఏటా వేసవిలో పూడికతీత పనులు చేపడుతారు. ఈ మట్టిని రైతులు పొలాల్లోకి ఉచితంగా తీసుకెళ్లే వెసులుబాటు కల్పిస్తారు. ఈసారి కూడా ప్రణాళిక రూపొందించినా, చెరువుల్లో పూడికతీతకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా నీటి నిల్వలతో పనులు మొదలుకాలేదు. అంతేకాక మే నెల రెండో వారం వస్తుండడంతో జూన్లో వర్షాలు మొదలయ్యే పనులు చేపట్టాలంటే కష్టమేనని భావిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని చెరువుల అంచుల్లో మాత్రమే 10 శాతం మేర పూడికతీతకు అవకాశముందని చెబుతున్నారు. ఇదే సమయాన సాగర్ నీరు ప్రవహించని గ్రామాల పరిధిలో కొన్నిచెరువుల్లో మాత్రం పూడికతీత, రైతులు మట్టి తరలించడానికి అధికారులు అనుమతులు ఇస్తున్నా పనులు జోరందుకోలేదు. కాగా, మట్టి కోసమంటూ చెరువుల్లో నీటిని బయటకు వదిలేలా ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఉంటాయని జల వనరుల శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. -
ప్రధాని మోదీ సభను జయప్రదం చేయండి
ఖమ్మం మామిళ్లగూడెం: హైదరాబాద్లో ఈనెల 10న జరిగే సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొంటున్నందున పార్టీ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నాయకుడు పొంగులేటి సుధాకర్రెడ్డి పిలుపునిచ్చారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ ఈనెల 10వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్ చేరుకుని రూ.8 వేల కోట్ల వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఆతర్వాత పరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారని వెల్లడించారు. ఈమేరకు జిల్లా నుంచి పెద్దసంఖ్యలో తరలిరావాలని సూచించారు. కాగా, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు మూడోసారి బ్రహ్మరథం పట్టడమే కాక పశ్చిమబెంగాల్లోనూ అధికారం కట్టబెట్టారని తెలిపారు. సుస్థిరమైన, అవినీతి రహిత పాలన అందిస్తున్న బీజేపీ మాత్రమే అన్ని పార్టీలకు ప్రత్యామ్నాయమని సుధాకర్రెడ్డి స్పష్టం చేశారు. అనంతరం మాజీ సైనికులు డి.పాండురంగయ్య, అబ్దుల్ రషీద్, అంబటి సురేష్, మెహబూబ్, హన్మంతరావును ఆయన సన్మానించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, నాయకులు సన్న ఉదయప్రతాప్, గోంగూర వెంకటేశ్వరరావు, భాగ్యరెడ్డి, రుద్ర ప్రదీప్, నున్నా రవి, శ్యామ్సుందర్, రవి రాథోడ్, సాయిరాం, విజయారెడ్డి, మణి, మల్లేశ్వరి, రమణ, సంజయ్, పాలెపు రాము పాల్గొన్నారు. -
కనుల పండువగా కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో గురువారం రామయ్య నిత్యకల్యాణం కనుల పండువగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. స్వామివారికి బేడా మండపంలో స్నపన తిరుమంజనం గావించారు. -
పంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదు..
దమ్మపేట: దమ్మపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డులు చోరీ జరిగిన ఘటనకు గ్రామ పంచాయితీ కార్యదర్శి అనంత్కుమార్, ఆయనతో సన్నిహితంగా ఉండే సిబ్బంది కారణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ.. వార్డు సభ్యులు పోలీస్ స్టేషన్లో బుధవారం రాత్రి ఫిర్యాదు చేశారు. వార్డు సభ్యుల కథనం ప్రకారం.. దమ్మపేట గ్రామ పంచాయతీలో జరిగిన అక్రమ వేతనాల చెల్లింపులు, ప్రత్యేక అధికారుల పాలన కాలంలో జరిగిన తీర్మానాలు, ఎంబీలు, చెల్లింపుల వివరాలను వార్డు సభ్యులు రెండు వారాలుగా అడుగుతుండగా, కార్యదర్శి వాయిదాలు వేస్తూ, చివరకు ఈ నెల 6న ఉదయం 10 గంటలకు ఇస్తానని తెలిపారు. కాగా అదే రోజు ఉదయం 9–30 గంటలకే అట్టి వివరాలకు సంబంధించిన రికార్డులు దొంగిలించబడ్డాయని కార్యదర్శి చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. అవకతవకలను కప్పిపుచ్చడానికే కార్యదర్శి ఈ చోరీ నాటకం ఆడుతున్నారనే అనుమానం కలుగుతుందని తెలిపారు. ఈ చోరీ ఘటనలో కార్యదర్శి, ఆయన సన్నిహిత సిబ్బంది పాత్ర ఉందనే కోణంలో విచారణ జరిపాలని కోరతూ, వార్డు సభ్యులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. పంచాయతీ పాలకవర్గ సమావేశాలకు రావొద్దు.. వార్డు సభ్యుల ఫిర్యాదు మేరకు దమ్మపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో పాలకవర్గం సమావేశాలు జరిగే సమయంలో సర్పంచ్ భర్తను రావొద్దని కార్యదర్శి అనంత్కుమార్ ఆయకే నేరుగా సూచించారు. గురువారం దమ్మపేట గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశంలో కార్యదర్శి మాట్లాడుతూ.. పంచాయతీలో జరిగిన ఆదాయ, వ్యయ వివరాలను నేరుగా తనని సంప్రదిస్తే ఇస్తానని తెలపగా, ఇప్పటివరకు పలుమార్లు అడిగిన ఎందుకు ఇవ్వలేదని వార్డు సభ్యులు ప్రశ్నించారు. పంచాయతీలో ఓ మల్టీ పర్పస్ వర్కర్ అతి ప్రవర్తనపై ఏంచేద్దామని వార్డు సభ్యులను అడగగా, తరువాత సమావేశంలో నిర్ణయం తీసుకుందామని కొందరు వార్డు సభ్యులు తెలిపారు.అవకతవకలను కప్పిపుచ్చుకోవడానికే చోరీకి తెర తీశారని ఆరోపణ -
‘వన్ మినిట్ రూల్’తో భద్రతకు ప్రాధాన్యం
హన్మకొండ అర్బన్: విద్యుత్ సిబ్బంది భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ టీజీఎన్పీడీసీఎల్లో ‘వన్ మినిట్ రూల్’ అమలు చేస్తున్నట్లు సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి తెలిపారు. క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించే ముందు సిబ్బంది ఒక్క నిమిషం పాటు భద్రతా ప్రమాణాలను పరిశీలించడమే దీని ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉండడంతో ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పనికి ముందు లైన్ క్లియర్ పొందడం, ఇండక్షన్ టెస్టర్తో లైన్లో విద్యుత్ లేదని నిర్థారించుకోవడం, పీపీఈ కిట్లు ధరించడం, ఎర్తింగ్ ఏర్పాటు, డబుల్ ఫీడింగ్ లేకుండా చూడడం, పరికరాల భద్రతను పరిశీలించడం వంటి అంశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ విధానంతో విద్యుత్ ప్రమాదాలు తగ్గించి సిబ్బంది ప్రాణాలు రక్షించడమే లక్ష్యమని తెలిపారు. ‘ఒక్క నిమిషం ఆలోచన – జీవితాంతం భద్రత’అనేదే ‘వన్ మినిట్ రూల్’ప్రధాన సందేశమని సీఎండీ వరుణ్రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు.టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
వైద్యసేవలతో పాటు పరిపాలనపైనా దృష్టి
● వైద్యులు సమయపాలన పాటించాలి ● వైద్య, ఆరోగ్య శాఖ పనితీరుపై సమీక్షలో కలెక్టర్ దివాకరఖమ్మంవైద్యవిభాగం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించడమే కాక పరిపాలన అంశాలపైనా వైద్యులు దృష్టి సారించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి గురువారం ఆయన వైద్య, ఆరోగ్య శాఖ పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ, చికిత్సకు వచ్చే వారితో మర్యాదగా ప్రవర్తిస్తే ఆస్పత్రులపై నమ్మకం పెరుగుతుందని తెలిపారు. ఆస్పత్రుల్లో పనిచేయని యంత్రాల సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ పరిష్కరించాలని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా పీహెచ్సీ స్థాయిలో అవసరమైన పరీక్షా సామగ్రి అందుబాటులో ఉంచాలని, ప్రతీ గర్భిణీకి పరీక్షలు చేసేలా ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలకు లక్ష్యాలు నిర్దేశించాలని చెప్పారు. అలాగే, 14 – 15 వయస్సు బాలికలకు వ్యాక్సిన్ వేయించేలా తల్లిదండ్రులను అవగాహన కల్పించాలని చెప్పారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మాట్లాడుతూ ఆస్పత్రుల్లో అవసరమైన మరమ్మతులు, ఫర్నీచర్ కోసం గురువారం నాటికి ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. డీఎంహెచ్ఓ రామారావు, అదనపు డీఎంహెచ్ఓ చందునాయక్, పీఓలు అరుణాదేవి, ఐ.మోత్యా, డీఐఓ పి.సంపత్ తదితరులు పాల్గొన్నారు. గడువులోగా పనులు పూర్తి చేయండి ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని ఆస్పత్రులు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ దివాకర ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెడికల్ కళాశాల నిర్మాణ పనులు నాణ్యతగా జరిగేలా నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. జిల్లాలోని 15 జూనియర్ కళాశాలల్లో మరమ్మతులు, అమ్మ ఆదర్శ పాఠశాల్లో జరుగుతున్న పనులపై నివేదిక అందించాలని చెప్పారు. తిరుమలాయపాలెంలో 30 పడకల ఆస్పత్రి 50 పడకలకు విస్తరణ, వంద పడకల ఆస్పత్రుల నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలన్నారు. అలాగే, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, భవిత కేంద్రాలు, వైరా జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదులు, కేజీబీవీల్లో పనులపై కలెక్టర్ సూచనలు చేశారు. ఈ సమావేశంలో పీఆర్ ఎస్ఈ వై.వెంకట్రెడ్డి, ఆర్ అండ్ బీ ఎస్ఈ ఎం.యాకోబు, టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ బుగ్గయ్య పాల్గొన్నారు. -
మళ్లీ మొండిచేయే!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: నామినేటెడ్ పదవులు భర్తీ చేయనున్నారని ఉత్సాహంతో ఎదురుచూసిన అధికార పార్టీలోని కొందరు ఆశావహులకు భంగపాటు తప్పలేదు. రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లకు బుధవారం చైర్మన్, వైస్ చైర్మన్లను నియమించగా జిల్లాలో కొందరికి అవకాశం దక్కినప్పటికీ.. చివరి వరకు ప్రయత్నించినా పలువురు నేతలకు మాత్రం భంగపాటు ఎదురైంది. పార్టీలో ముఖ్యనేతలుగా చెలామణి అయిన వారిని పదవులు వరించకపోవడంతో వారిలో ఆవేదన వ్యక్తమవుతోంది. ఇప్పటికే రెండున్నరేళ్లుగా ఎదురుచూస్తుండడం, ఇప్పట్లో మరోమారు పదవుల భర్తీ చేపట్టకపోవచ్చనే ప్రచారంతో వారిలో ఆవేదన అలుముకుంది. ముమ్మర ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ దాదాపు పదేళ్ల తర్వాత 2023లో రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకుంది. దీంతో ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు పలువురు తమకు నామినేటెడ్ పదవులు దక్కుతాయని ఆశించింది. కొందరు నేతలకు తొలి దఫా భర్తీలోనే చోటు లభించింది. ఇంకొందరు ముఖ్యనేతలు రాష్ట్రస్థాయి కార్పొరేషన్లతోపాటు జిల్లాస్థాయి చైర్మన్ పదవులను ఆశిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి వినతులు అందజేశారు. పండుగలు, వివిధ ఎన్నికల సమయాల్లో పదవులు భర్తీ అంశంపై తెరపైకి వచ్చినా ఆ తర్వాత మరుగున పడడం సాధారణమైపోయింది. అయినా పదవులను ఆశించిన నేతలు పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నాలు కొనసాగించారు. జిల్లాకు ప్రాధాన్యత దక్కినా... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవులు భర్తీ చేసిన ప్రతీసారి ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యత దక్కింది. గత ఎన్నికల్లో మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. దీంతో 2024లో జరిగిన పదవుల భర్తీ సమయాన ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులు దక్కాయి. ఆతర్వాత ఉమ్మడి జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గాలను ఏర్పాటు చేశారు. ఇక బుధవారం ప్రకటించిన పదవుల్లోనూ రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవుల్లో జిల్లాకు చెందిన నేతలకు చైర్మన్లు, వైస్చైర్మన్లుగా అవకాశం దక్కింది. ఇదేసమయాన జిల్లాస్థాయిలో సుడా, గ్రంథాలయ సంస్థ చైర్మన్లను సైతం నియమించారు. ఇదే ఆఖరా ? ఉమ్మడి జిల్లాలోని నేతలు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులను దక్కించుకునేందుకే ప్రాధాన్యత ఇచ్చారు. అలాకాని పక్షంలో జిల్లా స్థాయి చైర్మన్ పదవులైనా వస్తే సర్దుకోవాలని భావించారు. కానీ చాలామందికి అవకాశం దక్కలేదు. ఇప్పటివరకు రెండుసార్లు పదవులు భర్తీ చేయగా.. ఇంకోసారి పదవులు భర్తీ చేయాలంటే కొంత సమయం పడుతుందనే చర్చ నేపథ్యాన స్థానాలు దక్కని నేతలు తమ పరిస్థితి ఏమిటనే అంతర్మథనంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలు, కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల సమయంలోనూ కొందరు నేతలు నామినేటెడ్ పదవులపై ఆశతో పోటీకి దిగలేదు. వీరు కూడా తాము నమ్ముకుని నేతలను కలిసి పదవులపై ప్రస్తావిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అందరినీ సంతృప్తి పర్చలేకపోయినట్లు ముఖ్యనేతలు సర్దిచెప్పేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం.నామినేటెడ్ పదవుల భర్తీలో ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యత దక్కినా.. పదవులు ఆశించిన కొందరు ప్రధాన నేతలకు చుక్కెదురైంది. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్లో కొనసాగుతున్న వారు, ఎన్నికల ముందు, తర్వాత పార్టీలో చేరిన నాయకులు నామినేటెడ్ పదవులను ఆశించారు. కానీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రధాన అనుచరులుగా ఉంటూ కీలకంగా వ్యవహరిస్తున్న నేతల ఆశలు ఫలించలేదు. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ ఎన్నికల్లో శ్రమించిన నేతలు గుర్తింపు కలిగిన నామినేటెడ్ పదవులను ఆశించి మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదనే నైరాశ్యం నెలకొంది. -
కోడిపుంజుల బడాయి
సత్తుపల్లిటౌన్: ఒక ఊరిలో రెండు కోడి పుంజులు ఉండేవి. రెండింటికి బడాయి ఎక్కువే కావడంతో ఒక దాన్ని మించి మరొకటి బడాయి పోయేవి. ఓ రోజు గింజలు ఏరుకుని తింటున్న రెండు పుంజుల మధ్య మాటామాట పెరిగింది. ఆ మాటలు పెరిగి పందేనికి దారి తీశాయి. ఎవరు ఎక్కువ ఎత్తు ఎగరగలరనే అంశంపై పందెం వేసుకున్నాయి. నేను ఎక్కువ ఎత్తు ఎగరగలనని మొదటి పుంజు అంటే.. నీ కంటే నేనే ఎక్కువ ఎత్తు ఎగురుతాను అన్నది రెండో పుంజు. పెద్దమనిషిగా వ్యవహరించమని వీటి కంటే పెద్ద వయస్సు ఉన్న పుంజును అడిగాయి. ఆ పెద్దమనిషి పుంజు మాత్రం ఇలాంటి పందేలు వద్దని వారించింది. వీటితో నష్టం కలుగుతుందని హితవు చెప్పింది. అయినా పందెం మోజులో ఉన్న పుంజులకు మంచి మాటలు తలకెక్కలేదు. పెద్దమనిషి లేకపోతేనేం.. మనమే న్యాయంగా పోటీ పడదామని అంగీకారానికి వచ్చాయి. వద్దు.. వద్దు అని ఇంకొన్ని పుంజులు చెప్పినా వినలేదు. పందెం మొదలైంది. మొదటి పుంజు ప్రహరీ మీదకు ఎగిరింది. రెండో పుంజు ఇంటి కప్పు మీదకు ఎగిరింది. చూశావా నేనే ఎత్తు ఎగిరిరాను అన్నట్టు రెండో పుంజు చూస్తుండగానే మొదటి పుంజు చెట్టుకొమ్మపై వాలింది. మొదటి పుంజు గాలిలోకి అంత ఎత్తున రివ్వున ఎగిరింది. ఇంతలో సుడిగాలిలా వచ్చిన గద్ద మొదటి పుంజును తన కాళ్లతో ఒడిసి పట్టుకుని ఎగరేసుకుపోయింది. చిటారు కొమ్మన కూర్చున్న రెండో పుంజు ఇది చూసి చిగురుటాకులా వణికి పోయింది. గద్దకు కనబడకుండా ఒదిగి కూర్చుంది. గద్ద కనుమరుగయ్యాక కిందకి దిగింది. ఇదంతా చూస్తున్న మిగతా పుంజులు బడాయికి పోతే ప్రాణమే పోయింది కదా అని అనుకుంటూ గూటికి పయనమయ్యాయి. నీతి : ప్రతీ ఒక్కరిలో అంతర్లీనంగా శక్తి ఉంటుంది. కానీ దాన్ని అవసరాలకు మాత్రమే వాడుకోవాలి. అలాకాకుండా బడాయికి వెళ్తే శతృవుల బారిన పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎదురవుతుంది.అమ్మమ్మ చెప్పిన కథ -
ఇకపై ఫోర్లు.. సిక్స్లే!
ఖమ్మం స్పోర్ట్స్/ఖమ్మం రూరల్: క్రికెట్పై ఆసక్తి ఉన్నా శిక్షణ కోసం పటేల్ స్టేడియంలోని నెట్స్ తప్ప సరైన సదుపాయాలు లేక.. మ్యాచ్ల నిర్వహణకు సరిపడా మైదానాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి ఇది శుభవార్త! జిల్లా కేంద్రానికి సమీపాన క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదించగా.. సాధ్యాసాధ్యాలపై ఖమ్మం లోక్సభ సభ్యుడు రామసహాయం రఘురాంరెడ్డి దృష్టి సారించారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ బాధ్యుల వినతితో ఆయన గురువారం రఘునాథపాలెం మండలం జింకల తండా, ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు హైవే వెంట స్థలాలను పరిశీలించారు. స్టేడియం నిర్మాణానికి ఎంత స్థలం అవసరం, ఎక్కడెకక్కడ అనువైన స్థలాలు ఉన్నాయనే అంశంపై మ్యాప్ల ఆధారంగా ఆరా తీశారు. ఔత్సాహిక క్రికెటర్ల కలలను సాకారం చేసేలా క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఈ సందర్భంగా ఎంపీ వెల్లడించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, డీవైఎస్ఓ సునీల్రెడ్డి, రఘునాథపాలెం, ఖమ్మం రూరల్ తహసీల్దార్లు ఎస్.శ్వేత, విజయేందర్రెడ్డి, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, గతంలో బాలపేట వద్ద క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు 20ఎకరాల స్థలం కేటాయించినట్లు ప్రకటించారు. మరోమారు ఎంపీ స్టేడియం నిర్మాణానికి స్థలాలు పరిశీలించడంతో క్రీడాకారులు ఆశలు చిగురిస్తున్నాయి.క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు ఎంపీ రఘురాంరెడ్డి పరిశీలన -
నేడు మంత్రి తుమ్మల పర్యటన
ఖమ్మంఅర్బన్: రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఖమ్మంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు పూర్తయిన పనులను ప్రారంభిస్తారు. ఖమ్మంలోని సారథినగర్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనుండగా, పంపింగ్ వెల్రోడ్, గుట్టల బజార్, నిజాంపేట్, బ్యాంక్ కాలనీ, వేణుగోపాల్ నగర్, రాపర్తి నగర్ తదితర ప్రాంతాల్లో సైతం శంకుస్థాపన చేస్తారు. అలాగే, లకారం పార్క్ సమీపాన పెట్ పార్క్, కొత్తగూడెం, అల్లీపురం ప్రాంతాల్లో సీసీ డ్రెయిన్లు, డ్రింక్ ఫ్రం ట్యాప్ పథకాన్ని మంత్రి ప్రారంభించనున్నారు. జిల్లా కోర్టును సందర్శించిన ఎంపీ రఘురాంరెడ్డి ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా న్యాయస్థానాన్ని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి బుధవారం సందర్శించారు. బార్ అసోసియేషన్ ఆహ్వానంతో కోర్టుకు వెళ్లిన ఆయన జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్ను మర్యాదపూర్వకంగా కలవగా ఎంపీని సత్కరించారు. అలాగే, వేసవి దృష్ట్యా రామసహాయం కల్పనా రెడ్డి జ్ఞాపకార్థం దద్దోజనం, పెరుగన్నం పంపిణీని ఎంపీ పరిశీలించి జూన్ 1వ తేదీ వరకు కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఆతర్వాత సొసైటీ రూమ్ను కూడా పరిశీలించారు. సీనియర్ న్యాయవాదులు స్వామి రమేష్కుమార్, నిరంజన్రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు యడ్లపల్లి రమేష్, కొప్పుల రవి, దండ సుధాకర్తో పాటు రాజశేఖర్రెడ్డి, రవీందర్, శరత్కుమార్రెడ్డి, రత్నాకర్, తాళ్లూరి దిలీప్, ఊటుకూరి విజయలక్ష్మి, రాధమ్మ, దేవరకొండ కళ్యాణి, తన్నీరు లలిత, ప్రీతి, కొప్పుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా అథ్లెటిక్స్ జట్ల ఎంపిక ఖమ్మం స్పోర్ట్స్: అథ్లెటిక్స్ జిల్లా జట్ల ఎంపికకు ఖమ్మంలోని ఎస్ఆర్అండ్్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం పోటీలు నిర్వహించారు. అండర్–8, 10, 12, 14, 16, 18 విభాగాలతో పాటు సీనియర్ పురుషుల, మహిళల విభాగాల నుంచి 60మంది అథ్లెట్లు హాజరయ్యారు. అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యాన పోటీలు నిర్వహించి ప్రతిభ చాటిన వారితో జిల్లా జట్లను ఎంపిక చేశారు. జూనియర్స్ జట్టు హనుమకొండలో, సబ్ జూనియర్ జట్లు హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నాయి. ఆయా జట్లకు టి.రిణిత్, ఎం.వివేక్, జి.ఉత్తేజ్, నాయక్, ఇమీష్ ప్రీత్, బి.భానుప్రకాష్, ఉపేక్షిత్, డి.దినేష్, తమన్ కార్తీక్, వరుణ్, కె.విజయరామ అరవింద్, ఈ.పవన్కుమార్, బి.ప్రసన్నకుమార్, ఎం.మురళీకృష్ణ, బి.హరీష్, కె.వేణు, హాజీరా ఫాతిమా ఎంపికయ్యారని నిర్వాహకులు తెలిపారు. కాగా, జట్లను కలెక్టర్ దివాకర అభినందించగా అథ్లెటిక్స్ అకాడమీ చీఫ్ కోచ్ ఎం.డీ.గౌస్, అథ్లెటిక్స్ అసోసియేషన్ బాధ్యులు ఎం.డీ.షఫీక్అహ్మద్, కృష్ణయ్య, రవికుమార్, రవి పాల్గొన్నారు. మానవాళి విముక్తి సిద్ధాంతమే మార్క్సిజం సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రంఖమ్మంమయూరిసెంటర్: ప్రజలను దోపిడీ నుంచి విముక్తి చేసే సిద్ధాంతమే మార్క్సిజం అని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభధ్రం అన్నారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో బుధవారం సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బండారు రమేష్ అధ్యక్షతన కార్ల్ మార్క్స్ జయంతి సందర్భంగా ‘మార్క్సిజం సమకాలీనత – సవాళ్లు’ అంశంపై చర్చా గోష్టి నిర్వహించగా ఆయన మాట్లాడారు. పెట్టుబడిదారీ సమాజంలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతోందన్నారు. ఇది ఇప్పుడు యుద్ధ రూపంలో ప్రపంచాన్ని కబళించేలా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.. అంతేకాక నిరుద్యోగం, ధరల పెరుగుదల సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ సంక్షోభ సమయాన ప్రభుత్వాలు ప్రజలను ఆదుకోవాల్సి ఉన్నా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కాగా, కమ్యూనిస్టుల బలం కేవలం ఓట్లు, సీట్లలో కాకుండా.. ప్రజలను ఐక్యం చేస్తూ ప్రజా ఉద్యమాలను నిర్మించే కృషిలో ఉంటుందని తమ్మినేని తెలిపారు. ఈ అవగాహనతో ప్రజలతో మమేకమై వారి పని చేయడం ద్వారా మార్క్స్కు నివాళి అర్పించాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకుడు ఎం.సుబ్వారావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావుతో పాటు బండి రమేష్, బోడపట్ల రవీందర్, రఫీ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల ముంగిట్లోకే పాలన
● అర్హులందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు ● ప్రజాదర్బార్లో రాష్ట్ర మంత్రి శ్రీనివాసరెడ్డి నేలకొండపల్లి: రాష్ట్రంలో పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతే ధ్యేయంగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామని తెలిపారు. నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో బుధవారం జరిగిన ప్రజాదర్బార్లో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, కలెక్టర్ దివాకరతో కలిసి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రజల ఇబ్బందులను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే ప్రజాదర్బార్ లక్ష్యమని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం వలన రైతులు ఇబ్బంది పడితే తాము రుణమాఫీ చేయడమే కాక రైతుభరోసా ఇస్తున్నామని చెప్పారు. అలాగే, పండించిన ప్రతీ పంటను మద్దతు ధరతో కొనుగోలు చేస్తూనే సన్న ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నామని పేర్కొన్నారు. కాగా, మే నెలాఖరు నాటికి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. భూ సమస్యలను భూభారతి ద్వారా ప్రక్షాళన చేస్తున్నామని, సాదాబైనామా దరఖాస్తులను రాబోయే 35 రోజులలో ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజాదర్బార్లో అందిన ప్రతీ న్యాయబద్ధమైన దరఖాస్తును గరిష్టంగా మూడు నెలల్లో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. కాగా, వ్యక్తిగత సమస్యలపైనే కాక నేషనల్ హైవే నేలకొండపల్లిలో ఎగ్జిట్, కట్టలమ్మ చెరువు వద్ద వాకింగ్ ట్రాక్, మినీ స్టేడియం ఏర్పాటు, వంద పడకల ఆస్పత్రి, రామదాసు మందిరానికి ప్రహరీ, బాలసముద్రంలో బోటింగ్ ఏర్పాటు చేయాలని పలువురు వినతిపత్రాలు అందజేశారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, డీపీఓ రాంబాబు, మార్కెట్ చైర్మన్ సీతారాములు, వివిధ పార్టీల నాయకులు శాఖమూరి రమేశ్, కొడాలి గోవిందరావు, మైశా శంకర్, జెర్రిపోతుల అంజని, పసుపులేటి శ్రీలత, బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల సత్యనారాయణ, భద్రయ్య, కడియాల నరేశ్, మేకల వెంకటేశ్వర్లు, తిగుళ్ల భవాని, పాకనాటి కన్నారెడ్డి, చెరుకుపల్లి రాజేశ్, మందడి నాగశ్రీను, కర్ల ఆశోక్, ఆనం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గ్రంథాలయ చైర్మన్గా ఖాదర్ అలీ
ఖమ్మంగాంధీచౌక్: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఖమ్మం ఖిలా ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖాదర్ అలీ(ఖాదర్ బాబా) నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి బుధవారం ప్రభుత్వ కార్యదర్శి ఏ.శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. నామినేటెడ్ పదవుల భర్తీలో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాల గ్రంథాలయ చైర్మన్లను నియమించారు. ఇందులో భాగంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడిగా సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతున్న ఖాదర్ అలీకి అవకాశం దక్కింది. 1999 నుంచి తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వాన టీడీపీలో ప్రస్థానం ప్రారంభించిన ఆయన 2005 నుంచి 2010 వరకు ఖమ్మం మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత తుమ్మలతో పాటు టీఆర్ఎస్లో చేరి సుడా డైరెక్టర్గా పనిచేశారు. అనంతరం తుమ్మలతో పాటే కాంగ్రెస్లో చేరి పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా, వన్టౌన్ పార్టీ కమిటీలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈమేరకు జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియమితులైన ఖాదర్ అలీని పలువురు అభినందించారు. -
రేస్ ఎప్పుడో?!
కార్పొరేషన్..ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) పాలకవర్గ పదవీ కాలం బుధవారంతో ముగిసింది. ఈ నేపథ్యాన ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే అంశంపై చర్చలు, ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవలే మున్సిపాలిటీలు, రాష్ట్రంలోని పలు కార్పొరేషన్ల ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ తరుణాన కేఎంసీ ఎన్నికల నిర్వహణపై ఆసక్తి నెలకొంది. కాగా, ఖమ్మం కార్పొరేషన్ పాలకవర్గం ఎన్నికై నప్పటితో పోలిస్తే ముగిసే నాటికి పార్టీల బలాబలాలు తారుమారు కావడం విశేషం. 2021 మే 3న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ ఆధ్వర్యాన అదేనెల 7న పునుకొల్లు నీరజ మేయర్గా పాలకవర్గం ఏర్పడింది. ఐదేళ్ల తర్వాత కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాలకవర్గ పదవీకాలం ముగిసింది. – సాక్షిప్రతినిధి, ఖమ్మం43 డివిజన్లలో గెలుపు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు 2021 ఏప్రిల్ 30న జరగగా మే 3న ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఐ పొత్తుతో పోటీ చేయగా.. బీఆర్ఎస్ అభ్యర్థులు 43డివిజన్లలో విజయం సాధించారు. సీపీఐ రెండు చోట్ల గెలిచింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థులు 10 డివిజన్లలో, సీపీఎం రెండు చోట్ల, స్వతంత్ర అభ్యర్థులు రెండు చోట్ల, బీజేపీ అభ్యర్థి ఒక డివిజన్లో విజయం సాధించారు. బీఆర్ఎస్కు తిరుగులేని ఆధిక్యత దక్కడంతో మేయర్గా పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్గా ఫాతిమా జోహారాతోపాటు కార్పొరేటర్లు అదే ఏడాది కార్పొరేషన్ పాత కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఇద్దరు బీఆర్ఎస్లో చేరడంతో కాంగ్రెస్ బలం ఎనిమిదికి పడిపోయింది. మేయర్, డిప్యూటీ మేయర్ సహా.. గత అసెంబ్లీ ఎన్నికల వరకు కేఎంసీ పాలకవర్గం బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే కొనసాగింది. 2023 డిసెంబర్లో అటు రాష్ట్రం, ఇటు జిల్లాలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈనేపథ్యాన ఎన్నికలకు ముందే కొందరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ చేరికల పరంపర ఫలితాలు వచ్చాక కూడా కొనసాగింది. మేయర్, డిప్యూటీ మేయర్ సైతం కాంగ్రెస్లో చేరగా.. ఇంకొందరు కార్పొరేటర్ల చేరికతో కేఎంసీలో కాంగ్రెస్ పార్టీ బలం 41కి పెరిగింది. మేయర్, డిప్యూటీ మేయర్తోపాటు మెజార్టీ కార్పొరేటర్లు కాంగ్రెస్ పక్షాన ఉండటంతో ఆ పార్టీ కనుసన్నల్లోనే పాలకవర్గం పనిచేసింది. అన్ని డివిజన్లలో అభివృద్ధి.. ప్రభుత్వాలు ఏమైనా కేఎంసీ పాలకవర్గం 2021 నుంచి 2026 వరకు పూర్తిస్థాయిలో అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరించింది. 60 డివిజన్లలోనూ పార్టీలతో సంబంధం లేకుండా మౌలిక వసతులు కల్పించారు. ఐదేళ్ల కాలంలో వివిధ రూపాల్లో వచ్చిన రూ.830 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, పార్కులు, సెంట్రల్ లైటింగ్, గోళ్లపాడు చానల్ ఆధునికీకరణ వంటి పనులు పూర్తయ్యాయి. వీటితోపాటు మరో రూ.2 వేల కోట్లతో నూతన బస్టాండ్, ఐటీ హబ్, సమీకృత మార్కెట్లు, ఆర్అండ్బీ రోడ్లు, తీగల వంతెన, రిటైనింగ్ వాల్ తదితర పనులను చేపట్టారు. ఇందులో కొన్ని పూర్తవగా.. మరికొన్ని పురోగతిలో ఉన్నాయి. అంతేకాక అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం కూడా కొనసాగుతోంది.కేఎంసీ పాలకవర్గ పదవీ కాలం ముగియడంతో ఎన్నికల నిర్వహణపై చర్చ మొదలైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పదవీకాలం ముగిసిన రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించింది. ఆ సమయంలోనే కేఎంసీ మేయర్ పదవిని జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు. అప్పుడే పాలకవర్గాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని భావించినా.. రకరకాల కారణాలతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. ప్రస్తుతం పాలకవర్గ పదవీకాలం ముగియడంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్న అంశంపై చర్చలు మొదలయ్యాయి. ఎన్నికల నిర్వహణకు సమయం తీసుకుంటారా.. వెంటనే స్పందిస్తారా అన్నది తేలాల్సి ఉంది. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం కేఎంసీ ఎన్నికలకు మరికొంత సమయం పడుతుందనే చెబుతున్నారు. అప్పుటి వరకు ప్రత్యేక అధికారి పాలనలో పాలన సాగనుంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీ చేసేలా తాజా మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీల్లోని ఆశావహులు సిద్ధమవుతున్నారు. గతంలో టికెట్ దక్కని వారు.. పోటీ చేసి ఓడిపోయిన వారు, తాజా మాజీలు తమవంతు ప్రయత్నాలను ప్రారంభించారు. ఇక రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలకు సంబంధించి కసరత్తు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. ముగిసిన కేఎంసీ పాలకవర్గ పదవీ కాలం -
పెండింగ్ సమస్యలు పరిష్కరించండి
● మార్గదర్శకాల ప్రకారం సాదాబైనామా దరఖాస్తుల క్లియరెన్స్ ● రెవెన్యూ శాఖపై సమీక్షలో కలెక్టర్ దివాకరఖమ్మంసహకారనగర్: రెవెన్యూ శాఖలో పెండింగ్ సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తూ ప్రజలకు సేవలు అందించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. కలెక్టరేట్లో బుధవారం ఆయన కల్లూరు సబ్కలెక్టర్ అజయ్యాదవ్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, భూభారతి, సాదాబైనామా, ప్రభుత్వ భూములు, పెండింగ్ సర్వేలు, ఇసుక, ఎస్ఐఆర్ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సాదాబైనామా దరఖాస్తుల పరిశీలనలో మార్గదర్శకాలను పాటిస్తూ పరిష్కరించాలని తెలిపారు. భూభారతి పెండింగ్ స్లాట్లను పరిశీలించి ప్రతిరోజు మూడు మండలాల ఫైళ్లను జిల్లాస్థాయికి పంపించాలన్నారు. ఆ తర్వాత రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తుల పరిష్కారం, ప్రభుత్వ భూముల లభ్యత, నేలకొండపల్లి మండలంలో రైస్ మిల్ ఏర్పాటుకు స్థల కేటాయింపు, ఓటర్ల జాబితా మ్యాపింగ్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక సరఫరా తదితర అంశాలపై సమీక్షించిన కలెక్టర్ సూచనలు చేశారు. సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్లు, పలు శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. పనులు వేగంగా పూర్తి చేయండి ఖమ్మంమయూరిసెంటర్: అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, సింథటిక్ ట్రాక్ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. ఖమ్మం లకారం ట్యాంక్బండ్ వద్ద అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులను పరిశీలించిన ఆయన ట్రంక్ మెయిన్, ఎస్టీపీ కేంద్రం వివరాలు ఆరా తీశారు. ఆ తర్వాత సర్దార్ పటేల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ను పరిశీలించి మిగిలిన పనులు త్వరగా పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం ఖిల్లా వద్ద రోప్ వే పనులను పరిశీలించిన కలెక్టర్ లోయర్ స్టేషన్ పాయింట్, కేబిన్ల తయారీపై సూచనలు చేశారు. పబ్లిక్ హెల్త్ డీఈ నవీన్కుమార్, ఏఈ నవ్యజ్యోతి, డీవైఎస్ఓ సునీల్రెడ్డి, డీఈ రామకృష్ణ, ఏఈ నరేశ్ తదితరులు ఉన్నారు. పంట అవశేషాలు కాలిస్తే పర్యావరణానికి ముప్పు ఖమ్మంవ్యవసాయం: పంట అవశేషాలను కాలిస్తే పర్యావరణానికి ముప్పుగా మారడమే కాక భూసారం దెబ్బతింటుందని కలెక్టర్ దివాకర్ తెలిపారు. అంతేకాక అవశేషాలను కాల్చడంతో సమీపంలోని పంటలు, ఆస్తులు, విద్యుత్ లైన్లు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు రైతులు పర్యావరణాన్ని కాపాడేలా పంట అవశేషాలను కాల్చకుండా రోటొవేటర్ ద్వారా నేలలో కలియదున్నాలని సూచించారు. తద్వారా భూమి సారవంతమవుతుందని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇంగ్లిష్ చదువు.. చేతిరాత
ఖమ్మంగాంధీచౌక్: వేసవి సెలవులు వృథా కాకుండా పిల్లలకు ఏదో అంశంలో తర్ఫీదు ఇప్పించాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ నేపథ్యాన విద్యార్థులకు భవిష్యత్లో ఉపయోగపడే ఇంగ్లిష్ నేర్పించేలా మాజీ సైనికుడు ముందుకొచ్చారు. ఇంగ్లిష్ ప్రాధాన్యత, పిల్లల సెలవుల దృష్ట్యా నేవీలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన సత్యమూర్తి అరుణ్ ఖమ్మం మమత ఆస్పత్రి రోడ్డులో నామమాత్రపు ఫీజుతో ‘అరుణ్ ఇంటర్నేషనల్ స్పోకెన్ ఇంగ్లిష్’ సంస్థ ద్వారా శిక్షణ ఇస్తున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు హాజరయ్యే అవకాశం ఉండగా ఉదయం 8–10, 10–12, సాయంత్రం 5–8 వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇంగ్లిష్ చదివే విధానం, మాట్లాడే విధానం, అక్షరాలను పలకడం, సంభాషణ తదితర అంశాలపై అరుణ్ శిక్షణ ఇస్తున్నారు. అంతేకాక కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించేలా శిక్షణ ఇస్తుండడంతో పాఠశాల విద్యార్థులు మొదలు కాలేజీ విద్యార్థులే కాక కొందరు ఉద్యోగులు కూడా వస్తున్నారు. హ్యాండ్ రైటింగ్ ప్రత్యేకం పరీక్షల్లో మంచి మార్కులు సాధించడంలో సమాధానాలు రాయడమే కాక చేతిరాతకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఈ నేపథ్యాన సత్యమూర్తి తన కేంద్రంలో చేతి రాత శిక్షణ కూడా ఇస్తున్నారు. అక్షరాలను ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ పూర్తి చేయాలనే తదితర అంశాలపై శిక్షణ ఇస్తుండడంతో పిల్లలు ఆసక్తిగా హాజరవుతున్నారు. పిల్లల కోసం మాజీ సైనికుడి అక్షర సేద్యం -
‘సుడా’ చైర్మన్గా పువ్వాళ్ల
● 29నెలల తర్వాత కొత్త కమిటీ నియామకం ● ఏజెన్సీ ప్రాంతాలు మినహా అంతా ‘సుడా’ పరిధిలోనే.. ఖమ్మంమయూరిసెంటర్: స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా) చైర్మన్గా పువ్వాళ్ల దుర్గాప్రసాద్ నియమితులయ్యారు. ఈమేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2023 డిసెంబర్లో నాటి కమిటీని రద్దు చేయగా.. 29 నెలల తర్వాత కొత్త కమిటీ ఎంపికకు సంబంధించి చైర్మన్ను నియమించారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం సుడా పరిధి కూడా పెరిగింది. రెండేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు మినహా అన్ని మండలాలు, గ్రామాలు సుడా పరిధిలోకి వచ్చాయి. విధేయతకు పట్టం తెలంగాణ ఏర్పడ్డాక పదేళ్ల పాటు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పువ్వాళ్ల దుర్గాప్రసాద్ బాధ్యతలు నిర్వహించారు. ఈ క్రమాన రెండు పర్యాయాలు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా నుంచి ఎక్కువ స్థానాలను కాంగ్రెస్ కై వసం చేసుకుంది. అయితే, రెండు పర్యాయాలు డీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న ఏఐసీసీ సూచనలతో దుర్గాప్రసాద్ డీసీసీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కాగా, సుడా చైర్మన్గా పువ్వాళ్ల దుర్గాప్రసాద్కు అవకాశం దక్కుతుందని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ప్రచారం జరుగుతోంది. దీన్ని నిజం చేస్తూ బుధవారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. 1984లో తొలిసారి కాంగ్రెస్లో సభ్యత్వం తీసుకున్న దుర్గాప్రసాద్ తొలుత వైరా గ్రామ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఆతర్వాత 1987లో వైరా సహకార సంఘం ఎన్నికల్లో పోటీ చేశారు. 1993లో డైరెక్టర్గా గెలుపొందారు. 2001 నుంచి 2006 వరకు వైరా సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2014 ఫిబ్రవరి 10 వరకు ఉమ్మడి జిల్లా గ్రంథాలయ చైర్మన్గా పనిచేశారు. ఆ తర్వాత 2015లో డీసీసీ అధికార ప్రతినిధి నియమితులైన ఆయన 2018 ఏప్రిల్ నుంచి ఏడాది పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్గా వ్యవహరించారు. ఇక 2019 ఫిబ్రవరి 10 నుంచి 2025 డిసెంబర్ 1 వరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా పార్టీని వీడకుండా కొనసాగిన దుర్గాప్రసాద్ విధేయతను పరిగణనలోకి తీసుకుని జిల్లాలో కీలకమైన సుడా చైర్మన్ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. -
శ్రీవారి ఆలయానికి గ్రీన్ సిగ్నల్
● నిర్మాణానికి టీటీడీ బోర్డు ఆమోదం ప్రతీ ప్రసవం.. సురక్షితంఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలోని ప్రభుత్వ ప్రసవాలు సురక్షితంగా జరిగేలా ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు డీఎంహెచ్ఓ రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో గర్భం దాల్చిన మహిళలు సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో పేరు నమోదు చేసుకోవడం, వైద్యపరీక్షలు చేయించుకునేలా పర్యవేక్షిస్తామని వెల్లడించారు. వైద్యపరీక్షలు చేయించుకోవడం ద్వారా రక్తపోటు, రక్తహీనత, షుగర్ వంటి సమస్యలను ముందుగానే గుర్తించి ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. అలాగే, గర్భిణులను పర్యవేక్షిస్తూ అవసరమైన వారిని ఉన్నత ఆస్పత్రులకు రిఫర్ చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. అంతేకాక పోషకాహారం ప్రాముఖ్యత, ఐరన్, కాల్షియం మాత్రలు తీసుకోవడం, వ్యాక్సిన్ వేయించుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. కాగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిపుణులైన వైద్యులు, సిబ్బంది, అవసరమైన మందులు, 24 గంటల వైద్యం అందుతుండడమే కాక అత్యవసర పరిస్థితుల్లో 102, 108 వాహనాలు సిద్ధంగా ఉన్నందున గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇళ్లలో ప్రసవాలతో పోలిస్తే ఆస్పత్రుల్లోనే సురక్షితం అయినందున కుటుంబీకులు సహకరించాలని డీఎంహెచ్ఓ కోరారు. తద్వారా ప్రతీ ప్రసవాన్ని సురక్షితంగా మార్చాలని సూచించారు. -
కార్పొరేషన్ కార్యవర్గాల్లో స్థానం
ఖమ్మంమామిళ్లగూడెం/ఖమ్మం గాంధీచౌక్: రాష్ట్రంలో పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా వివిధ కార్పొరేషన్ల చైర్మన్, వైస్చైర్మన్లుగా ఉమ్మడి జిల్లా నేతలకు స్థానం దక్కింది. ఈమేరకు మున్నూరుకాపు కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్గా ఖమ్మంకు చెందిన ప్రముఖ న్యాయవాది బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి నియమితులయ్యారు. ఆయన నియామకంపై మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ హర్షం వ్యక్తం చేశారు. కాగా, శ్రీరామ్ తండ్రి, దివంగత ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు మున్నూరుకాపులతో పాటు బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేశారని తెలిపారు. ● ఖమ్మంగాంధీచౌక్: బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్గా బసవరాజ్ శ్రీనివాస్ నియమితులయ్యారు. ఎర్రుపాలెం మండలం చొప్పకట్లపాలెంకు చెందిన ఆయన నియామకంతో జిల్లాకు ప్రాధాన్యత ఉంటుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ నియామకంపై నియోగి బ్రాహ్మణ స్వతంత్ర సేవా సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోసూరి ప్రసాద్, గెంటేల శ్రీనివాసరావుతో పాటు చకిలం జనార్దన్రావు, వనం వెంకటప్పారావు, గోళ్లమూడి సత్యనారాయణ శర్మ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ● బోనకల్: కమ్మ కార్పొరేషన్ వైస్ చైర్మన్గా పరుచూరి మురళి నియమితులయ్యారు. బోనకల్ మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఆయనను వైస్ చైర్మన్గా నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయన నియామకంపై పీసీసీ సభ్యుడు పైడిపల్లి కిశోర్, ఆత్మ కమిటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరరావు, నాయకులు, ప్రజాప్రతినిధులు గాలి దుర్గారావు, మోదుగు సుధీర్బాబు, పిల్లలమర్రి నాగేశ్వరరావు, భద్రునాయక్, తుళ్లూరి లక్ష్మీనర్సయ్య తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ● భద్రాచలంటౌన్: భద్రాచలంకు చెందిన పీసీసీ సభ్యుడు బుడగం శ్రీనివాస్ పెరిక కార్పొరేషన్ వైస్ చైర్మన్గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ స్పందిస్తూ పెరిక సామాజిక వర్గ అభివృద్ధికి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆయనకు పలు వురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. -
సివిల్స్ శిక్షణకు ఆర్థిక సాయం
ఖమ్మంగాంధీచౌక్/ఖమ్మంమామిళ్లగూడెం: సివిల్స్ కోచింగ్ తీసుకోవాలని భావించినా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న చింతకాని మండలం నేరడకు చెందిన యాదా లావణ్యగుప్తకు ఆర్యవైశ్య మహాసభ బాధ్యులు అండగా నిలిచారు. ఈ మేరకు లావణ్యకు రూ.2.50 లక్షల ఆర్థిక సాయాన్ని బుధవారం జిల్లా జడ్జి జి.రాజగోపాల్ చేతుల మీదుగా అందజేశారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, వివిధ సంస్థల బాధ్యులు పాపారావు, మంద కృష్ణ, దేవత అనిల్, గెల్లా శ్రీరామ్, గుర్రం ఉమామహేశ్వరరావు, రంగా వెంకటేశ్వర్లు, సుగుణావతి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ ఆర్థిక సాయం అందిందని తెలిపారు. కార్యక్రమంలో వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయ అధ్యక్షుడు మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు పసుమర్తి చందర్రావు, కాళ్ల సూర్యకృష్ణ, పాల్వాయి వెంకటేశ్వరరావు, తేరాల ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. ఉన్నత చదువులకు రూ.1.50 లక్షలు.. ఖమ్మంసహకారనగర్: కల్లూరు మండలం చెన్నూరుకు చెందిన గడ్డం వెంకటేశ్వర్లు ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో బీబీఏ చదువుతూ క్యాట్ రాసి రూర్కేలా ఎన్ఐటీలో ఎంబీఏ ప్రవేశానికి అర్హత సాధించాడు. అయితే, ఆయన ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో కాలేజీ అధ్యాపకుడు సూరంపల్లి రాంబాబు సహకారంతో మిగతా అధ్యాపకులు, ఉద్యోగులు రూ.1.50 లక్షలు సేకరించి అందజేశారు. అలాగే, రెండో సెమిస్టర్ ఫీజుకు తాము చేయూతనిస్తామని ఎన్ఆర్ఐ ఫౌండేషన్ అధ్యక్షుడు బయ్యన బాబూరావు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మహ్మద్ జకీరుల్లా, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్, అధ్యాపకులు డాక్టర్ బి.శ్రీనివాస్, డాక్టర్ కె.కిరణ్ కుమార్, సుజాత, దడిగల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వడదెబ్బతో రైతు మృతి బోనకల్: మండలంలోని సీతానగరం గ్రామానికి చెందిన వ్యక్తి బుధవారం వడదెబ్బతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన కేశగాని కృష్ణయ్య (60) పొలంలో పని ముగించుకుని మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఎండ కారణంగా ఆయన ఇంటికి రాగానే సొమ్మసిల్లి పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. వారం రోజులుగా ఎండలో పనిచేస్తుండడంతో వడదెబ్బ తాకి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఈతకు వెళ్లి బాలుడు... ● పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చి మృత్యువాత కొణిజర్ల: నాయనమ్మతో కలిసి పెళ్లికి వచ్చిన ఓ బాలుడు స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లగా బావిలో మునిగి మృతి చెందాడు. కొణిజర్ల మండలం చిన్నగోపతిలో బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలను ఎస్ఐ జి.సూరజ్ వెల్లడించారు. వైరా మండలం గొల్లపూడికి చెందిన బాల్ది వెంకటేశ్వర్లు – నాగేంద్ర దంపతుల కుమారుడు అరవింద్(13) బుధవారం ఉదయం తన నాయనమ్మ కౌసల్యతో కలిసి కొణిజర్ల మండలం చిన్నగోపతిలో బంధువుల ఇంట పెళ్లికి వచ్చాడు. అందరూ హడావిడిలో ఉండగా అరవింద్ తన స్నేహితులతో కలిసి గ్రామ సమీపాన వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లాడు. బావి లోతు ఎక్కువగా ఉండడంతో ఈత సరిగా రాని అరవింద్ నీట మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు బాలుడిని బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. ఏడో తరగతి పూర్తిచేసిన అరవింద్ మృతితో వెంకటేశ్వర్లు దంపతుల రోదనలు మిన్నంటాయి. -
చెరుకు రైతుల సంక్షేమమే లక్ష్యం
నేలకొండపల్లి: చెరుకు సాగు చేస్తున్న రైతుల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని చెరుకు అభివృద్ధి మండలి (సీడీసీ) చైర్మన్ ఎర్రబోలు సూర్యనారాయణరెడ్డి తెలిపారు. మండలంలోని రాజేశ్వరపురంలో మధుకాన్ షుగర్, పవర్ ఇండస్ట్రీస్లో మంగళవారం రైతులకు సబ్సిడీపై బొదే సెట్లకు సంబంధించి చెక్కులను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. చెరుకు రైతుల సమస్యలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కేన్ కమిషనర్ రవీందర్రావు, మధుకాన్ ఫ్యాక్టరీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కోటయ్య, రాజేశ్వరపురం సర్పంచ్ దండా రంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
నిజాయితీకి బహుమతి
కరకగూడెం: కరకగూడెంనకు చెందిన రావుల ఓజస్వి రెండు నెలల క్రితం పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా రోడ్డు పక్కన ఒక పర్సు దొరికింది. అందులో పరిశీలించగా రూ.వేలల్లో నగదు, విలువైన చేతి గడియారం ఉంది. ఈ విషయాన్ని తండ్రికి చెప్పగానే ఆయన తీసుకెళ్లి స్థానిక పోలీసులకు అప్పగించారు. కొద్దిసేపటికే ఆ పర్సు పోగొట్టుకున్న వృద్ధ దంపతులు అక్కడికి వచ్చారు. తమ కష్టార్జితం తిరిగి దొరకడంతో వారి కళ్లల్లో ఆనందం చూడగానే ఓజస్వికి ఎంతో సంతోషం కలిగింది. అంతేకాక ఓజస్వి నిజాయితీని మెచ్చుకున్న ఆ దంపతులు పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు. వెలకట్టలేని వస్తువులు దొరికినప్పుడు ఆశ కలిగినా.. వాటిని యజమానులకు ఇచ్చేసినప్పుడు కలిగే ఆత్మసంతృప్తి గొప్పదని.. తద్వారా గౌరవం లభిస్తుందని చిన్నారి ఆ రోజే తెలుసుకుంది. -
ఎస్ఐ చొరవతో నలుగురికి కృత్రిమ కాళ్లు
వైరా: ఉమ్మడి జిల్లాలోని నలుగురు దివ్యాంగులకు వైరా ఎస్ఐ పుష్పాల రామారావు చొరవతో హైదరాబాద్కు చెందిన నారాయణ సేవా సంస్థాన్ బాధ్యులు కృత్రిమ కాళ్లను సమకూర్చారు. వైరా మండలం సోమవరం గ్రామానికి చెందిన కొప్పుల రామకృష్ణారావు, గొల్లపూడికి చెందిన బంకా మల్లయ్య భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం తిమ్మంపేటకు చెందిన తుర్రం శ్రీరాములుతో పాటు ఏపీలోని కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన మీసాల వెంకటసత్యనారాయణ పలు కారణాల వల్ల ఒక్కో కాలు కోల్పోయారు. వీరి సమస్యను ఎస్ఐ రామారావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన నారాయణ సేవా సంస్థాన్ బాధ్యులకు వివరించారు. దీంతో నలుగురికి కృత్రిమ కాళ్లను సమకూర్చారు. ఈ సందర్భంగా వారు మంగళవారం ఎస్ఐని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
ఇంటాబయట.. ఆట !
పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చారు. హాస్టళ్లు, గురుకులాల్లో ఉండే విద్యార్థులు ఇళ్లకు చేరుకున్నారు. ఈ సెలవుల్లో రోజూ ఆటలతో సరదాగా గడిపేద్దామని చిన్నారులు భావిస్తారు. వీరి కోరికను తల్లిదండ్రులు మన్నించినా ఒక క్రమపద్ధతిలో కొనసాగితేనే ప్రయోజనం ఉంటుంది. పిల్లల అభిరుచికి తగినట్లుగా మెదడు, శరీరానికి వ్యాయామం చేయించే ఆటలు ఆడిస్తే అటు మనోవికాసం.. ఇటు వడదెబ్బ నుంచి రక్షణ లభిస్తుంది. – ఇల్లెందురూరల్ఎండవేడిలో ఆరుబయట ఆడితే పిల్లలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఇన్డోర్ గేమ్స్పై ఆసక్తి కలిగించాలి. ఇలాంటి ఆటలతో శారీరక కదలిక లేకపోయినా మెదడుకు పదును పెడుతాయి. పుస్తకాల్లో పజిల్స్ పూరించడంతో సమస్య పరిష్కారానికి ఉత్తమ మార్గాలు అన్వేషించే నైపుణ్యాలు అలవడుతాయి. క్యారమ్స్, చెస్తో ఏకాగ్రత, లక్ష్యంపై గురి ఏర్పర్చుకునే నైపుణ్యం పెరుగుతుంది. పుస్తకాలు చదవడం, కథలు చెప్పడం, పాటలు పాడటం ద్వారా భాష, పఠనా నైపుణ్యాలతో పాటు పద సంపద పెరుగుతుంది. మైదానాలు సిద్ధం చేయాలి దాదాపు ప్రతీ గ్రామపంచాయతీలో క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి. యువత వాలీబాల్, ఖోఖో, కబడ్డీ ఆడుకునేలా కోర్టులతో పాటు చిన్నారులు సరదాగా గడిపేందుకు జారుడు బల్లలు, ఊయలలు, ఇతర పరికరాలను ఏర్పాటు చేశారు. అయితే, నిర్వహణ లోపంతో కొన్ని పాడైనందున వేసవి సెలవుల నేపథ్యాన వీటిని శుభ్రం చేయించి అందుబాటులోకి తీసుకురావాలి. చిన్నారులు ఆడుకునేలా, వ్యాయామం చేసేలా కనీస సౌకర్యాలు కల్పించాలి. ఏ ఆటలు ఎక్కడ ఆడాలంటే.. వాతావరణం చల్లగా ఉన్న సమయాన ఉదయం, సాయంత్రం ఆరుబయట క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ, లాంగ్జంప్, బాస్కెట్బాల్, జాగింగ్ వంటి ఆటలు ఆడుకోవాలి. అందరికీ ఆసక్తి ఉండే ఈత విషయానికొచ్చేరికి రక్షణ సామగ్రి ధరించడం, నిపుణుల పర్యవేక్షణలో నేర్చుకోవడం ప్రారంభించాలి. ఇక ఎండ వేడి అధికంగా ఉండే మధ్యాహ్న సమయాన నీడ ప్రదేశాల్లో చెస్, క్యారమ్స్, వైకుంఠపాళి ఆడుకోవచ్చు. ఇదే సమయాన పద వినోదం, కాగితాల వ్యర్థాలతో బొమ్మల తయారీ, పెయింటింగ్, పుస్తకాలు చదువుకోవడం వంటివి సాధన చేస్తే సెలవులు సద్వినియోగం అవుతాయి. ఇవీ ప్రయోజనాలు వ్యాయామం ప్రతీ వ్యక్తికి శారీరక దారుఢ్యాన్ని అందిస్తుంది. పరుగెత్తడం, ఎగరడం, దూకడం ద్వారా కండరాలు బలోపేతం అవుతాయి. జట్టు క్రీడలతో సాంఘిక జీవనం, స్నేహసంబంధాలు మెరుగవుతాయి. మైదానంలో ఆడే ఆటలు సమస్య పరిష్కారం, ఏకాగ్రత, విమర్శనాత్మక ఆలోచన, సమయోచిత నిర్ణయం తీసుకునే నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి. తాజా గాలి, సూర్యకాంతి యువతకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గిస్తాయి. లేలేత కిరణాలు ప్రసరించే సమయంలో ఎండకు ఉండటంతో శరీరానికి విటమిన్ డీ అందుతుంది. ఫలితంగా ఎముకలు బలపడుతాయి. అలాగే, శారీరక శ్రమతో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. సెలవుల్లో వడదెబ్బకు గురికాకుండా సమయానుకూలంగా క్రమపద్ధతిలో ఆటలు ఆడుకునేలా ప్రోత్సహించాలి. తద్వారా పిల్లలకు ఆరోగ్యం, ఆహ్లాదం, ఆటవిడుపు లభిస్తాయి. అంతేకాక అందరితో కలిసిపోవడం అలవాటుగా మారుతుంది. –డాక్టర్ మోతీలాల్, చిన్నపిల్లల వైద్యుడు, ఇల్లెందు ప్రస్తుతం అన్ని వయస్సుల వారు సెల్ఫోన్కు అతుక్కుపోతున్నారు. ఎక్కువ సమయం సెల్ఫోన్ చూడటం వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలా కాకుండా సెలవుల్లో ిపిల్లలను సెల్ఫోన్కు దూరంగా ఉంచాలంటే ఆటల వైపు దృష్టి మళ్లించాలి. – డాక్టర్ కె.రఘు, పీడీ, సుభాష్నగర్ హైస్కూల్, ఇల్లెందు మండలం -
టీజీ టీ–20ని తక్షణమే నిలిపివేయాలి
ఖమ్మంస్పోర్ట్స్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఆధ్వర్యాన నిర్వహించనున్నట్లు ప్రకటించిన తెలంగాణ టీ–20 క్రికెట్ టోర్నీని వెంటనే నిలిపివేయాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) జిల్లా అధ్యక్షుడు కూరపాటి ప్రదీప్ డిమాండ్ చేశారు. కేవలం హైదరాబాద్కే క్రికెట్ను పరిమితం చేసి, జిల్లాల్లో నైపుణ్యం కలిగిన క్రీడాకారులను విస్మరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా క్రికెటర్లకు ఆవకాశం కల్పించాలని బీసీసీఐ చేసిన సూచనలకు భిన్నంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇకనైనా హెచ్సీఏ తీరు మార్చుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రదీప్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని గిరిజన సంక్షేమ శాఖ గురుకుల జూనియర్ కళాశాల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు ఈనెల 16, 18వ తేదీల్లో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని భద్రాదాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ ఓ ప్రకటనలో తెలిపారు. బాలుర కు ఈనెల 16న దమ్మపేట, కిన్నెరసాని డ్యాంసైడ్, గుండాల, కృష్ణసాగర్, సింగరేణి, తిరుమలాయపాలెం గురుకులాల్లో కోర్సుల వారీగా కౌన్సెలింగ్ ఉంటుందని వెల్లడించారు. అలాగే, 18వ తేదీన బాలికలకు భద్రాచలం, సుదిమళ్ల, అంకంపాలెం, అన్నపురెడ్డిపల్లి, మణుగూరు, కొత్తగూడెం, వైరా కాలేజీల్లో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఏడాది పదో తరగతి పాసైన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని పీఓ సూచించారు. షార్ట్సర్క్యూట్తో అగ్ని ప్రమాదం రూ.10 లక్షల విలువైన సామగ్రి దగ్ధం ఖమ్మంక్రైం: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఖమ్మంలోని ఓ ఆటోమొబైల్ షాప్లో సోమవారం అర్ధరాత్రి దాటాక అగ్ని ప్రమాదం సంభవించింది. జమ్మిబండ ప్రాంతంలోని అయ్యప్ప ఆటోమొబైల్స్ దుకాణాల నిర్వాహకులు సోమవారం రాత్రి మూసివేసి వెళ్లిపోయారు. అయితే, అర్ధరాత్రి దాటాక షాపులో నుంచి పొగలు వస్తున్నాయని స్థానికులు యజమానితో పాటు అగ్నిమాపక శాఖ, పోలీస్ సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో ఫైర్ అధికారి కోదండరామిరెడ్డి ఆధ్వర్యాన సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రధాన రహదారిపై షాపు ఉండడంతో సమీప షాప్లకు మంటలు వ్యాపించకుండా అదుపు చేయడంతో ప్రమాదం తప్పినట్లయింది. షార్ట్ సర్క్యూట్తోనే ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించగా, ఆటోమొబైల్ షాపులో సుమారు రూ.10 లక్షల విలువైన సామగ్రి కాలిపోయిందని అంచనా వేశారు. -
హిందూ సమాజ ఐక్యత అవసరం
బోనకల్: హిందువులు ఐక్యంగా ఉంటూ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు పాటుపడాలని పలువురు సూచించారు. బోనకల్ మండల కేంద్రంలో మంగళవారం హిందూ సమ్మేళనం నిర్వహించగా డాక్టర్ జి.వీరభద్రం, పణిభట్ల రాజేశ్వరశాస్త్రి ముఖ్య అతిథులుగా మాట్లాడారు. యువత పెడదోవ పట్టకుండా సంస్కృతి, సంప్రదాయాలను పాటించాలని తెలిపారు. ఆ తర్వాత రామాయణం, మహాభారతంలోని పలు అంశాలను వివరించారు. అనంతరం హాజరైన వారికి అన్నదానం ఏర్పాటు చేశారు. సర్పంచ్ బానోతు జ్యోతి, ఉపసర్పంచ్ బానోరతు కొండతో పాటు హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
తండ్రి కళ్ల ముందే చిన్నారి మృతి
మధిర: సెలవుల్లో ఇంటికి వచ్చిన బంధువుల పిల్లలతో పాటు తన పిల్లలను సమీపంలోని వైరా నదిపై బ్రిడ్జిని చూడాలని చెప్పడంతో ఆయన అందరినీ తీసుకెళ్లాడు. అక్కడ లోతైన గుంతను గమనించక చిన్నారులు మునిగిపోతుండగా.. ముగ్గురిని కాపాడినప్పటికీ తన కుమార్తెను మాత్రం రక్షించుకోలేకపోయాడు. కడుపున పుట్టిన బిడ్డ కళ్ల ముందే కన్నుమూయడంతో ఆ తండ్రి రోదనలు మిన్నంటాయి. మధిర మండలం వంగవీడులో మంగళవారం జరిగిన ఈ ప్రమాదం వివరాలు... నలుగురు పిల్లలను తీసుకుని.. వంగవీడుకు చెందిన గుడిద జితేంద్ర ఇంటికి సెలవుల్లో బంధువుల పిల్లలు వచ్చారు. గ్రామ సమీపంలోని వైరా నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జిని చూడాలని కోరడంతో ఆయన తన పెద్ద కుమార్తె చైత్ర, చిన్న కుమార్తె దీక్షితతో పాటు బంధువుల పిల్లలను తీసుకుని వెళ్లాడు. అక్కడ వైరా నదిలో పిల్లలు సరదాగా స్నానం చేస్తూ బ్రిడ్జి పిల్లర్ వద్దకు వెళ్లాడు. అక్కడ లోతైన గుంత ఉందని తెలియకపోవడంతో పిల్లలంతా నీట మునిగారు. దీంతో జితేంద్ర చైత్ర సహా ముగ్గురు పిల్లలను రక్షించినా చిన్న కుమార్తె దీక్షితను మాత్రం కాపాడలేకపోయాడు. కాసేపటికి ఆమెను బయటకు తీసి మధిర ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సరదాగా పిల్లలను బయటకు తీసుకెళ్లి ఓ కుమార్తెను కోల్పోయిన జితేంద్ర కుటుంబీకులు రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. కాగా, దీక్షిత మధిరలోని ఒక ప్రైవేట్ స్కూల్లో ఆరో తరగతి పూర్తి చేసింది. ఘటనపై మధిర రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సరదాగా నీళ్లలో ఆడుతూ మునిగిపోవడంతో ప్రమాదం -
సంగీత సాధన..
ఆన్లైన్ శిక్షణ ఇల్లెందురూరల్: చిన్నప్పటి నుంచి నాకు పాటలు పాడడమంటే ఇష్టం. నా ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు వేసవి సెలవుల్లో సంగీతంలో శిక్షణ ఇప్పించాలని అనుకున్నారు. కానీ స్థానికంగా శిక్షణ అందుబాటులో లేకపోవడంతో బందువుల ద్వారా తెలుసుకుని బెంగళూరుకు చెందిన ప్రముఖ సంస్థకు ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. అనుమతి లభించడంతో క్రమం తప్పకుండా ఆన్లైన్ ద్వారా శిక్షణ పొందుతున్నా. శిక్షణ తీసుకుంటూనే సాధన చేస్తుండడంతో ఇప్పుడిప్పుడే ఫలితం కనిపిస్తోంది. మంచి గాయనిగా ఎదగాలన్న నా ఆకాంక్షకు వేసవి సెలవులు సద్వినియోగం అవుతున్నాయని ఆనందంగా ఉంది. –గాదె జియాన్షి, 5వ తరగతి, కొల్లాపురం, ఇల్లెందు మండలం -
ఉత్తమ సేవలకు ‘ప్రగతిచక్ర’ అవార్డులు
భద్రాచలంటౌన్/సత్తుపల్లిటౌన్: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే కాక సంస్థ అభివృద్ధికి తోడ్పడుతున్న సిబ్బందిని ప్రోత్సహించేలా ‘ప్రగతి చక్ర’ అవార్డులు ఇస్తున్నట్లు ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. భద్రాచలం డిపోలో మంగళవారం జరిగిన సమావేశంలో రీజియన్ స్థాయిలో ఎంపికై న వారికి ఆయన అవార్డులు అందజేసి మాడ్లాడారు. అనంతరం రీజియన్ పరిధిలో 56 మంది డ్రైవర్లు, కండక్టర్లు, అద్దె బస్సు డ్రైవర్లకు ఆర్ఎం అవార్డులు అందజేశారు. ఇందులో సత్తుపల్లి డిపో నుంచి ఉత్తమ బస్టాండ్ అవార్డు ఎస్ఎం ఆనందం, అద్దె బస్సు డ్రైవర్లు ఎంఎస్.రావు, జీవీ.ప్రసాద్, పీవీబీ.రావుతో పాటు కండక్టర్లు యాదగిరి, మారేశ్వరరావు, గ్యారేజీ నుంచి సాయి శ్రీనివాస్, మాధవరావు, ధనుంజయ్ అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం మల్లయ్య, భద్రాచలం, మధిర, సత్తుపల్లి, ఖమ్మం డీఎంలు జంగయ్య, రామయ్య, లక్ష్మీనారాయణ, శివప్రసాద్తో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు. -
తాగునీటి ఎద్దడి రాకుండా పర్యవేక్షణ
ఖమ్మం అర్బన్: వేసవి నేపథ్యాన జిల్లాలో ఎక్కడ కూడా తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. తాగునీటి సరఫరా కార్యాచరణపై అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి కలెక్టరేట్లో ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు అప్రమత్తంగా ఉంటూ ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే స్పందించాని సూచించారు. అధికారులు కూడా కార్యాలయాలకే పరిమితం కాకుండా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలని చెప్పారు. తాగునీటి సమస్య పరిష్కారం, సరఫరాను ఆర్డబ్ల్యూఎస్ శాఖకు పరిమితం చేయకుండా ఎంపీడీఓలు, ఎంపీఓలతో పాటు పంచాయతీ కార్యదర్శులు, స్థానిక సంస్థల అధికారులు బాధ్యతగా భావించాలని సూచించారు. మిషన్ భగీరథ నీటిని వినియోగిస్తూ, అవసరమైతే స్థానిక వనరులను వినియోగించుకోవాలని చెప్పారు. ఆతర్వాత బోర్లు, చివరకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని తెలిపారు. వేసవి దృష్ట్యా పోలీస్ స్టేషన్లు, అంగన్వాడీ కేంద్రాలు, ఆస్పత్రులతో పాటు పంట ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. అంతేకాక గ్రామాలు, పట్టణాల్లో వీధి జంతువులు, పక్షుల కోసం నీటి గుంతలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఇంకా ఈ సమావేశంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డీఎంహెచ్ఓ రామారావు, డీపీఓ రాంబాబు, మిషన్ భగీరథ ఎస్ఈ శేఖర్రెడ్డి, ఈఈలు పుష్పలత, వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ దివాకర టీఎస్ -
వెళ్దామా.. వద్దా ?!
● విద్యుత్ ఉద్యోగుల్లో ఊగిసలాట ● రాష్ట్రంలో కొత్తగా రైతు డిస్కం ఏర్పాటుకు సన్నాహాలు ● ఇతర డిస్కంల్లోని ఉద్యోగుల నుంచి దరఖాస్తుల ఆహ్వానంఖమ్మంవ్యవసాయం: విద్యుత్ పంపిణీ కోసం రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న డిస్కంలకు తోడు ప్రభుత్వం కొత్తగా తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీజీ ఆర్పీడీసీఎల్)ను ఏర్పాటుచేస్తోంది. వ్యవసాయ సంబంధిత కనెక్షన్ల నిర్వహణ, విద్యుత్ పంపిణీతో పాటు ప్రభుత్వ నీటి సరఫరా పథకాల నిర్వహణ కోసం ఈ డిస్కంను ఏర్పాటుచేస్తున్నట్లు చెబుతున్నారు. ఈమేరకు ప్రస్తుత డిస్కంల్లోని ఉద్యోగులే ఇందులో విధులు నిర్వర్తించేందుకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి. టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్, టీజీ ట్రాన్స్కో, టీజీ జెన్కోల్లో ప్రొబేషనరీ పీరియడ్ పూర్తి చేసుకున్న ఉద్యోగులు, ఆర్టిజన్లు బదిలీలకు అర్హులుగా నిర్ణయించారు. అయితే, కొత్త డిస్కంలోకి వెళ్లాలా, వద్దా అన్న మీమాసంలో ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త డిస్కంలో తక్కువ మంది ఉద్యోగులే ఉండనుండడంతో త్వరగా పదోన్నతులు వస్తాయని కొందరు చెబుతున్నారు. మరికొందరు మాత్రం పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉన్నందున ఇబ్బందులు ఎదురవుతాయనే భావనలో ఉన్నట్లు సమాచారం. అందుబాటులో పోర్టల్ రైతు డిస్కంలోకి రావడానికి ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాటుచేసిన పోర్టల్ ఏప్రిల్ 30న అందుబాటులోకి వచ్చింది. ఈమేరకు ఉద్యోగులు ఈనెల 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకుంటే 12వ తేదీలోగా అర్హతలను పరిశీలిస్తారు. ఆతర్వాత ఎంపిక చేసిన వారికి ఈనెల 13న ఉత్తర్వులు ఇవ్వనుండగా.. ప్రస్తుత స్థానంలో 15న రిలీవ్ అయి రైతు డిస్కంలో 18వ తేదీ నాటికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ 19వ తేదీన జారీ చేసే పోస్టింగ్ ఆర్డర్ల ఆధారంగా ఈనెల 25వ తేదీ వరకు కేటాయించిన స్థానంలో చేరాలి. కమిటీ వేయాలి ప్రభుత్వం నూతనంగా రూపొందించిన డిస్కం విధివిధానాలపై కమిటీ వేయాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ డిమాండ్ చేస్త్తోంది. ఇటీవల రైతు డిస్కం సీఎండీ ముషారఫ్ అలీ ఫరూక్తో యూనియన్ ప్రతినిధులు సమావేశమై బదిలీలకు సంబంధించి చర్చించారు. రైతు డిస్కంపై ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని కోరారు. ప్రస్తుతం ఉన్న డిస్కంల కన్నా ప్రత్యేక రైతు డిస్కంతో కొత్తగా జరిగే మేలు ఏమీ ఉండనందున.. ప్రతిపాదనపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాక ప్రస్తుతం ఉన్న డిస్కంల నుంచి ఉద్యోగులు వెళ్తే ఖాళీలు పెరిగి ఇబ్బందులు వస్తాయని సీఎండీకి వివరించారు. ఏం చేద్దాం? రైతు డిస్కంలో వెళ్లాలా, వద్దా అన్న మీమాంసలో విద్యుత్ ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది. తొలిదశలోనే దరఖాస్తు చేసుకుని వెళ్లే పదోన్నతులు త్వరగా వస్తాయని, ఇతర బెనిఫిట్లలోనూ ముందు ఉంటామని కొందరు భావిస్తున్నారు. ఇదే సమయాన వ్యవసాయ పంపుసెట్ల కనెక్షన్లు, ప్రభుత్వ నీటి సరఫరా పథకాల నిర్వహణ కోసం ఏర్పాటుచేస్తున్న డిస్కం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లోనే పనిచేయాల్సి ఉంటుందని ఇంకొందరు చెబుతున్నారు. మరోపక్క డిస్కం ఏర్పాటు ప్రతిపాదననే వెనక్కి తీసుకోవాలని యూనియన్లు కోరుతున్నందున ఉద్యోగులు డోలాయమానంలో పడినట్లు తెలుస్తోంది. కొత్త డిస్కంలోకి వెళ్లేందుకు అధికారులు, ఉద్యోగులకు కనీస సేవా కాలాన్ని కూడా నిర్దేశించారు. ఎస్ఈ తత్సమన అధికారులకు ఏడాది, డీఈల నుంచి కింది స్థాయి అధికారులు, ఫోర్మెన్లు కింది స్థాయి ఉద్యోగులైతే రెండేళ్ల పదవీ కాలం పూర్తయితే అర్హులుగా నిర్ణయించారు. అర్హతల, టీజీఆర్పీడీసీఎల్(రైతుడిస్కం) పాలసీ మేరకు పదోన్నతులు ఉంటాయని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అయితే, ఏసీబీ, క్రిమినల్ వంటి కేసులు నమోదై వారిని బదిలీకి అనర్హులుగా ప్రకటించారు. వేతనాలు, అలవెన్సులు, సర్వీస్ ప్రొటెక్షన్ వంటివి నిబంధన మేరకు ఉంటాయని.. ఈపీఎఫ్, జీపీఎఫ్, పెన్షన్ యథాతధంగా కొనసాగుతాయని పేర్కొన్నారు. -
భగవంతుడిని ప్రేమతో పూజించండి
శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామిములకలపల్లి(అన్నపురెడ్డిపల్లి): ఫలితాన్ని ఆశించకుండా భగవంతుడిని పవిత్ర ప్రేమతో పూజించాలని.. అప్పుడే స్వామి అనుగ్రహం లభిస్తుందని శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఉద్బోధించా రు. అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని శ్రీ బాలా జీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న ఉత్సవాలకు మంగళవారం హాజరైన ఆయన భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. దేవాలయాలు ఆధ్యాత్మిక భావన, నైతిక విలువలు నెలకొల్పే ప్రధాన కేంద్రాలుగా నిలుస్తున్నాయని తెలిపారు. ప్రతీఒక్కరూ నేను, నాది అనే అహం విడిచిపెట్ట డమే కాక మానవజాతికి గతి, గమ్యం, దిక్కు, రక్షకుడు దేవుడేనని గుర్తించాలని సూచించారు. ఆలయాలు, ఆలయ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని తెలిపారు. అలా కాకుండా ఆలయ వ్యవస్థ చెడితే సమాజానికే అరిష్టమని స్పష్టం చేశారు. వేయి సంవత్సరాల చరిత్ర కలిగిన బాలాజీ ఆలయానికి రెండేళ్ల క్రితం వచ్చానని జీయర్ స్వామి గుర్తు చేసుకున్నారు, ఆలయ నిర్మాణకర్తలు 2,232 ఎకరాలు భూమి ఇచ్చారని, ఆ రోజుల్లోనే గర్భాలయం, అర్థమండపం, ముఖ మండపం, బేడామండపంతో కూడిన సువిశాల ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. ఆలయంలో ప్రస్తుతం మహాకుంభాభిషేకాన్ని ముందుండి నడిపిస్తున్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణను జీయర్స్వామి అభినందించారు. తొలుత ఆలయ ప్రధానార్చకులు ప్రసాదాచార్యులు ఆధ్వర్యాన జీయర్స్వామిని ఆలయ మర్యాదలతో స్వాగతించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దంపతులతోపాటు సర్పంచ్ లాకావత్ లక్ష్మి, మేనేజర్ పాకాల వెంకటరమణ, కమిటీ సభ్యులు పర్సా వెంకటేశ్వర్లు, బొంకూరి సురేష్, వనమా శ్రీనివాసరావు, సత్యనారాయణరెడ్డి, బోడా పద్మ, శ్రీను, శివాలయ పునఃనిర్మాణకర్త మారగాని శ్రీనివాసరావు, చైర్మన్ మల్లాల నర్పింహారావు, వనమా గాంఽధీతో పాటు పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
ఆయిల్ పామ్తో రైతులకు లాభాల పంట
రఘునాథపాలెం/తిరుమలాయపాలెం: రైతులు సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా ఆయిల్పామ్ వంటివి సాగు చేయాలని, తద్వారా ఏళ్ల తరబడి నికర ఆదాయం వస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న రైతు వారోత్సవాల్లో మంగళవారం రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా రఘునాథపాలెం రైతు వేదికలో ఉద్యాన పంటలపై ఏర్పాటుచేసిన సదస్సులో డీఏఓ పుల్లయ్య మాట్లాడుతూ ఆయిల్పామ్ సాగుతో 30ఏళ్ల పాటు స్థిరమైన దిగుబడి, ఆదాయం ఉంటుందని తెలిపారు. ఆత్మ కమిటీ ఖమ్మం డివిజన్ చైర్మన్ దిరిశాల వెంకటేశ్వరరావు, ఏడీఏ కొంగర వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఉద్యానవనాధికారి జి.నగేష్, ఏఓలు ఉమామహేశ్వర్ రెడ్డి, ఎస్వీకే.నారాయణ, డీఎంకే.శ్రీనివాస్, తాతా రఘురాం, ఏఈఓలు శివ, శ్రీకాంత్, వ్యాస్, శరణ్మయితో పాటు గోద్రెజ్ కంపెనీ మేనేజర్ ఏ.రామకృష్ణ పాల్గొన్నారు. అలాగే, తిరుమలాయపాలెంలో నిర్వహించిన సదస్సులో జిల్లా ఉధ్యానశాఖ అధికారి మధుసూదన్ మాట్లాడారు. వ్యవసాయశాఖ జిల్లా ప్రత్యేక అధికారి శివానంద్, ఏడీఏ సతీష్ శాస్రవేత్త జమునారాణి, ఉద్యాన అధికారి పి.అపర్ణ, ఏఓ సీతారాంరెడ్డి పాల్గొన్నారు. రద్దయిన సొసైటీ పాలకవర్గాలకే తిరిగి అవకాశం హైకోర్టు ఆదేశాలతో బాధ్యత స్వీకరణ ఖమ్మంవ్యవసాయం: కొన్నాళ్ల క్రితం రద్దు చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) పాలకవర్గాలను తిరిగి కొనసాగించాలంటూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను ప్రభుత్వం అమలుచేసింది. రాష్ట్రంలో సహకార సంఘాల పాలకవర్గాలకు 2020 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగగా, 2025 ఫిబ్రవరి 14నాటికి పదవీ కాలం ముగిసింది. దీంతో సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా సహకార శాఖ అధికారులను పర్సన్ ఇన్చార్జిలుగా నియమించారు. అయితే, ఎన్నికలు జరిగే వరకు పాలకవర్గాలనే కొనసాగించాలని కొందరు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఏడాదికి పైగా కోర్టులో విచారణ జరగగా, ప్రభుత్వం నుంచి సరైన సమాధానం లేకపోవటంతో తిరిగి సొసైటీ పాలకవర్గాలను కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈమేరకు ఏప్రిల్ 29న ఉత్తర్వులు జారీ కాగా సహకార శాఖ ఉన్నతాధికారులు పర్సన్ ఇన్చార్జ్లను ఉపసహరించుకొని పాత పాలకవర్గాలను కొనసాగించాలనే జిల్లా అధికారులను ఆదేశించారు. ఈమేరకు ఉమ్మడి జిల్లాలోని వంద సహకార సంఘాల్లో రద్దయిన పాలకవర్గాలు మంగళవారం తిరిగి బాధ్యతలు స్వీకరించాయి. అయితే, వ్యాక్సినేషన్ మొదటి విడత విజయవంతం ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో మీజిల్స్–రుబెల్లా వ్యాక్సినేషన్ మొదటి దశ విజయవంతమైందని డీఎంహెచ్ఓ రామారావు తెలిపారు. ఏప్రిల్ 27 నుంచి ఈనెల 4వ వరకు 469శిబిరాలు నిర్వహించగా, 1,138 మంది పిల్లలకు టీకాలు వేశామని వెల్లడించారు. గంగారం, చింతకాని, మంచుకొండ, వేంసూరు పీహెచ్సీలు, శ్రీనివాసనగర్ యూపీహెచ్సీల పరిధిలో మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ఈ శిబిరాల ద్వారా గతంలో టీకాలు వేయించుకోని పిల్లల గుర్తింపులో ఆశా, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు కీలకంగా వ్యవహరించారని చెప్పారు. కాగా, వ్యాక్సినేషన్ రెండో విడత జూలై 20 నుండి 27 వరకు నిర్వహించనున్నందున తల్లిదండ్రులు తమ పిల్లలను టీకాలు వేయించాలని సూచించారు. కమనీయంగా రామయ్య కల్యాణం భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం రామ య్య కల్యాణం కమనీయంగా సాగింది. తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం నిర్వహించారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణం జరిపించారు. రూ.1.70లక్షల విలువైన వెండి పళ్లెం శ్రీ సీతారామ చంద్రస్వామి వారికి భద్రాచలం వాసి మద్దాల భవన్సాయి మెహర్ వెండిపళ్లెంమంగళవారం వితరణగా అందజేశారు. ఆయన 655 గ్రాముల వెండితో చేయించిన రూ.1.70లక్షల విలువైన పళ్లెంను స్వామి వారి పాదాల చెంత పూజల అనంతరం ఆలయ అధికారులకు అందించారు. అధికారులు కత్తి శ్రీనివాస్, అర్చకులు పాల్గొన్నారు. -
అర్హతే ప్రామాణికం
ఖమ్మంరూరల్: ప్రజల సమస్యలను పరిష్కరించడమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని.. ఇందులో రాజకీయాలకు తావు లేకుండా అర్హతలనే ప్రామాణికంగా తీసుకుంటామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అర్హత కలిగిన ఉన్న ప్రతీ దరఖాస్తుకు మూడు నెలల్లో పరిష్కారం చూపిస్తామని తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెంలో మంగళవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన కలెక్టర్ దివాకర టీ.ఎస్.తో కలిసి ప్రజల నుంచి వినతిపత్రాలు, దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ భూసమస్యల పరిష్కారరంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ద్వారా ఎదురైన ఇబ్బందులను, తమ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి ద్వారా తొలగిస్తున్నామని పేర్కొన్నారు. సాదాబైనామా దరఖాస్తులను అర్హత మేరకు రానున్న 35 రోజుల్లో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అయితే సాదాబైనామా పేరుతో ప్రభుత్వ భూములను కాజేయాలని చూస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. ఇళ్ల కోసమే ఎక్కువ సీఎం రేవంత్రెడ్డి నాయకత్వాన పేదలు, మహిళలు, నిరుద్యోగ యువత పక్షాన తమ ప్రభుత్వం నిలబడుతోందని పొంగులేటి తెలిపారు. ఇప్పటివరకు పాలేరు నియోజకవర్గంలోని ఏడు క్లస్టర్ల పరిధిలో ప్రజాదర్బార్లు నిర్వహించగా పది వేల దరఖాస్తులు అందితే, అందులో 5వేలు వరకు ఇందిరమ్మ ఇళ్ల కోసమే ఉన్నాయని చెప్పారు. ఈమేరకు త్వరలోనే రెండో దశ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. వృద్ధురాలికి భరోసా ప్రజాదర్బార్కు వచ్చిన గోళ్లపాడు గ్రామానికి చెందిన వందేళ్ల వృద్ధురాలు వెలుతురు భద్రమ్మ తన భూసమస్యను మంత్రి పొంగులేటికి విన్నవించింది. దీంతో సమస్యను విని వివరాలు తెలుసుకున్న ఆయన పరిష్కారంపై సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్, మంగళగూడెం సర్పంచ్ మేకల సత్యనారాయణ, ఉపసర్పంచ్ అన్నేటి అనిల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నేడు గువ్వలగూడెంలో... నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో బుధవారం ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొని దరఖాస్తులు స్వీకరిస్తారు. గువ్వలగూడెం క్లస్టర్ పరిధిలోని అనాసాగారం, సదాశివాపురం, ముజ్జుగూడెం, నాచేపల్లి, ఆచార్లగూడెం, ఆరెగూ డెం, కోనాయిగూడెం, అమ్మగూడెం, నేలకొండపల్లి గ్రామాల ప్రజలు మధ్యాహ్నం 3గంటల నుంచి జరిగే ప్రజాదర్బార్లో దరఖాస్తులు ఇవ్వొచ్చని మార్కెట్ మాజీ చైర్మన్ శాఖమూరి రమేష్, నాయకులు కొడాలి గోవిందరావు తెలిపారు. -
ఐదేళ్లు.. రూ.830కోట్లు!
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో గడిచిన ఐదేళ్లలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది. డివిజన్లలో మౌలిక వసతుల కల్పన మొదలు పార్కులు, ఇతర సౌకర్యాలు కల్పించడంలో కేఎంసీ పాలకవర్గం, అధికారులు కృషి చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న పాలకవర్గం 2021 మే 7న బాధ్యతలు చేపట్టగా ఈనెల 7వ తేదీతో గడువు ముగియనుంది. ఈ ఐదేళ్ల కాలంలో పాలకవర్గం, అధికారుల కృషితో వివిధ రూపాల్లో రూ.830.67 కోట్ల నిధులు రాబట్టి ఖమ్మంను రాష్ట్రంలోనే అగ్రగామి నగరంగా తీర్చిదిద్దారు. శివారు ప్రాంతాలు, కొన్ని కాలనీల్లో సమస్యలు ఉన్నప్పటికీ ఎక్కువ ప్రాంతాల్లో వసతులు సమకూరాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనూ పెద్దమొత్తంలో నిధులు రావడం విశేషం. రూ.410 కోట్ల పబ్లిక్ హెల్త్ నిధులతో.. మరో రూ.410 కోట్ల పబ్లిక్ హెల్త్ నిధులు కేఎంసీ అభివృద్ధికి కేటాయించారు. మున్సిపల్ కార్పొరేషన్లు, స్థానిక సంస్థల అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించే తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీయూఎఫ్ఐడీసీ) ద్వారా రూ.80 కోట్లు అందాయి. ఈ నిధులను నగరంలో మౌలిక వసతుల కల్పన, సుందరీకరణకు కేటాయించారు. అలాగే అమృత్–1 ద్వారా రూ.230 కోట్లు, అమృత్–2.0 ద్వారా రూ.50 కోట్లు కేటాయించారు. దీంతో ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి శుద్ధి చేసిన తాగునీరు సరఫరా చేస్తున్నారు. అలాగే భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. వర్షపునీరు నిల్వ ఉండకుండా డ్రెయిన్లు నిర్మాణంలో ఉన్నాయి. నగరంలో త్రీటౌన్ ప్రాంతంలో మురికి కూపంగా ఉన్న గోళ్లపాడు చానల్ ఆధునికీకరణ, సుందరీకరణ కోసం రూ.50 కోట్లు వెచ్చించారు. మురుగునీరు, వర్షపునీరు వేర్వేరుగా వెళ్లేలా డ్రెయినేజీలు నిర్మించడమే కాకుండా.. గోళ్లపాడు చానల్పై అందమైన పార్కులు ఏర్పాటు చేయడంతో స్థానికులకు ఆహ్లాదం అందుబాటులోకి వచ్చింది. ఈ పార్కుల్లో చిన్నారులు ఆడుకోవడానికి పరికరాలు ఏర్పాటు చేయడంతోపాటు గ్రంథాలయాలు, వాకింగ్ట్రాక్లు, ఓపెన్ జిమ్లను నిర్మించారు. ఇక ఎన్నెస్పీ కెనాల్పై వాక్వేలు, ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులను కోసం ప్రభుత్వం నుంచి వివిధ రకాల నిధులు విడుదలయ్యాయి. ఇందులో జనరల్ ఫండ్తోపాటు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్), సీఎం అసూరెన్స్, 14, 15వ ఆర్థిక సంఘం నిధులు, ఎల్ఆర్ఎస్ ద్వారా వచ్చిన నిధులు, ఎంపీ లాడ్స్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్, నియోజకవర్గాల అభివృద్ధి నిధులు ఉన్నాయి. ఇవి మొత్తం రూ.150 కోట్లు కాగా, ఇతర అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నుంచి రూ.270 కోట్లు అందాయి. మొత్తంగా రూ.420 కోట్లతో డివిజన్లలో వసతుల కల్పన, సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటికే చాలాచోట్ల పనులు పూర్తికాగా, ఇంకొన్ని చోట్ల పురోగతిలో ఉన్నాయి. అంతేకాక తాగునీటి సౌకర్యం, పార్కుల ఆధునికీకరణకు భారీగానే నిధులను వెచ్చించారు. ప్రత్యేక నిధుల ద్వారా సెంట్రల్ లైటింగ్, డివైడర్ల నిర్మాణం పూర్తి చేశారు. ఇవి కాకుండా ప్రస్తుతం రూ.180 కోట్లతో మున్నేరుపై నిర్మిస్తున్న తీగల వంతెన పూర్తయితే ఖమ్మంకు మణిహారంగా నిలవనుంది. నిధుల వరదతో కేఎంసీ అభివృద్ధి బాట ఐదేళ్ల కాలంలో వెచ్చించిన మొత్తం నిధుల్లో జనరల్ ఫండ్, ఎస్డీఎఫ్ (ప్రత్యేక అభివృద్ధి నిధులు), ఎల్ఆర్ఎస్ ద్వారా వచ్చిన నిధులే అత్యధికంగా ఉన్నాయి. మున్సిపల్ జనరల్ ఫండ్ రూ.58,48,52,000 కాగా.. ఎస్డీఎఫ్ రూ.55,60,02,000 ఉన్నాయి. ఇక ఎల్ఆర్ఎస్ ద్వారా రూ.22,79,40,000 నిధులు సమకూరాయి. అంతేకాక జనరల్ ఫండ్ నిధులతో పాటు ఆస్తి పన్ను, నీటి పన్ను, వివిధ రకాల అనుమతులు, జరిమానాలు, ఇతర వనరుల నుంచి కేఎంసీకి ఈ సొమ్ము సమకూరింది. అలాగే ఎస్డీఎఫ్ ద్వారా స్థానిక సమస్యలను పరిష్కరించడంతోపాటు నిధుల కొరతతో ఆగిన పనులను పూర్తి చేశారు. ప్రధానంగా మౌలిక వసతుల కల్పనకు ఈ నిధులు వెచ్చించారు. -
మత సామరస్యంతో బక్రీద్ జరుపుకోవాలి
ఖమ్మంక్రైం: బక్రీద్ పండుగను మత సామరస్యం, పరస్పర గౌరవంతో జరుపుకోవాలని పోలీసు కమిషనర్ సునీల్దత్ సూచించారు. ముస్లిం మతపెద్దలు, మసీద్ కమిటీల సభ్యులతో సీపీ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి అంతర్ రాష్ట్ర చెక్పోస్టులు ఏర్పాటుచేశామని తెలిపారు. ఆయా చెక్పోస్టుల వద్ద నిరంతరం తనిఖీలు కొనసాగుతున్నాయని చెప్పారు. కాగా, పశువులను తరలించేవారు సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వార్తలు, వదంతులు నమ్మకుండా, అలాంటివి వ్యాప్తి చేసే వారి సమాచారాన్ని తెలియచేయాలని సూచించారు. అంతేకాక అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 100లేదా సమీప పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అలాగే, ఇతర సమస్యలు ఉంటే కమాండ్ కంట్రోల్ నంబర్ 87126 59111కు సమాచారం ఇవ్వొచ్చని సీపీ వెల్లడించారు. ఈసమావేశంలో ఏసీపీలు రమణమూర్తి, మహేష్, సీఐలు కరుణాకర్, మోహన్బాబు, బాలకృష్ణ, ఎస్ఐ మౌలానా తదితరులు పాల్గొన్నారు.పోలీసు కమిషనర్ సునీల్దత్ -
విద్యుత్ శాఖకు రూ.12 లక్షల నష్టం
150 ఎకరాల్లో దెబ్బతిన్న ఉద్యానపంటలు ఖమ్మంవ్యవసాయం: జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురవగా విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో వృక్షాలు, చెట్ల కొమ్మలు విద్యుత్ లైన్లపై పడ్డాయి. దీంతో స్తంభాలు విరగడమే కాక లైన్లు తెగిపోయాయి. మొత్తం 192 విద్యుత్ స్తంభాలు విరిగిపోగా, రెండు ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడంతో రూ.12లక్షల మేర నష్టం వాటిల్లింది. ఈమేరకు ఆదివారం రాత్రి విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. అనంతరం సోమవారం మరమ్మతులు పూర్తిచేసి సరఫరాను పునరుద్ధరించారు. బోనకల్, కారేపల్లి తదితర మండలాల్లో పనులను ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి పర్యవేక్షించారు. ● ముదిగొండ: ముదిగొండ మండలంలో ఈదురుగాలుల కారణంగా పలు గ్రామాల్లో దాదాపు 115విద్యుత్ స్తంభాలు విరిగిపోగా, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయని ఏఈ నారాయణ తెలిపారు.ఈమేరకు కొత్త స్తంభాలను ఏర్పాటు చేసి సరఫరా పునరుద్ధరించామని వెల్లడించారు. మామిడి, అరటి, బొప్పాయి తోటలకూ నష్టం.. ప్రకృతి వైపరీత్యానికి జిల్లాలో 44 మంది రైతులకు చెందిన 150 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. నేలకొండపల్లి, చింతకాని, వైరా మండలాలకు చెందిన 32 మంది రైతులకు చెందిన 121 ఎకరాల్లో మామిడి తోటలు, కామేపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లో నలుగురు రైతులకు చెందిన 11 ఎకరాల్లో అరటి పంట దెబ్బతిన్నది. అలాగే, కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో 8 మంది రైతులకు చెందిన 18 ఎకరాల్లో బొప్పాయి పంట ధ్వంసమైంది. నష్టంపై అధికారులు ప్రాథమిక అంచనాలు రూపొందించినా, ప్రభుత్వం ఆదేశిస్తే సమగ్ర విచారణ అనంతరం పరిహారం చెల్లించే అవకాశముంది. -
నూతన షెడ్లలో మొక్కజొన్న నిల్వలు
ఖమ్మంవ్యవసాయం: రైతు ప్రయోజనాల దృష్ట్యా నూతన నిర్మాణాలను వినియోగిస్తున్నామని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు తెలిపారు. వైస్ చైర్మన్ తల్లాడ రమేష్తో కలిసి సోమవారం ఆయన మాట్లాడారు. మిర్చి క్రయవిక్రయాల్లో ఇబ్బందులను అధిగమించేలా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రూ.155 కోట్లు కేటాయించగా 15.29 ఎకరాల్లో అధునాతన యార్డు నిర్మాణమవుతోందని తెలిపారు. తొలి దశలో రూ.114 కోట్లతో ఏడు షెడ్లు నిర్మిస్తున్నామని స్తూ, ఇందులో ఆరింటిని మార్కెట్ కార్యకలాపాలకు, మరో షెడ్డును రైతుల విశ్రాంతి, కార్మికుల కోసం కేటాయించనున్నట్లు చెప్పారు. మొదటి దశలో ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. అలాగే, ధరల వివరాలు ప్రదర్శించేలా డిజిటల్ బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాచేయడమే కాక వాటర్ ప్లాంట్లు, టాయిలెట్ బ్లాకులు, ఫైర్ వ్యవస్థ, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ ఉంటుందని వెల్లడించారు. కాగా, యాసంగి మొక్కజొన్న నిల్వలకు ఇబ్బంది రాకుండా మంత్రి తుమ్మల, కలెక్టర్ సూచనలతో మార్కెట్లోని నాలుగు నూతన షెడ్లు కేటాయించామని చైర్మన్ తెలిపారు. మార్కెట్ కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్తో పాటు డైరెక్టర్లు రెంటాల ప్రసాద్, బోజెడ్ల సత్యనారాయణ, వెనిగండ్ల బాబూరావు, చెరుకూరి సీతారాములు, బాణోత్ బీమా, మొర్రిమేకల నాగేశ్వరరావు, బాణత్ రమేష్, అంగడాల నర్సింహారావు, షేక్ లతీఫ్, చిట్టిబాబు పాల్గొన్నారు. ఖమ్మం మార్కెట్ చైర్మన్ హన్మంతరావు -
సేంద్రియ వ్యవసాయంతో నేల ఆరోగ్యానికి రక్షణ
వైరారూరల్: రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ సాగు విధానాలపై దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్ అధికారి, రైతు వారం ప్రోగ్రాం అబ్జర్వర్ శివానంద్ సూచించారు. తద్వారా నేల ఆరోగ్యమే కాక రైతుల ఆరోగ్యం బాగుంటుందని తెలిపారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ భాగంగా నిర్వహిస్తున్న ‘రైతు వారం’ కార్యక్రమాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వైరా మండలం ఖానాపురం రైతు వేదికలో ఏర్పాటుచేసిన సమావేశంలో శివానంద్ మాట్లాడుతూ నేల ఆరోగ్యం, సమగ్రతను కాపాడుకుంటేనే సాగుకు అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. వరిలో సన్న రకాలు, మట్టి పరీక్షకు నమూనా తీసే విధానం, వరి, మొక్కజొన్న కోతల అనంతరం కొయ్యలను కాల్చకుండా నేలలో కలియదున్నితే కలిగే లాభాలు, నానో యూరియా, నానో డీఏపీ ఉపయోగాలపై అవగాహన కల్పించారు. ఆతర్వాత పలువురు రైతులకు భూసార పరీక్ష ఫలితాల కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య, జిల్లా ఉద్యానశాఖ అధికారి మధుసూదన్, కేవీకే కోఆర్డినేటర్ పావని, ఏడీఏ తమ్ములపల్లి కరుణశ్రీ, ఏఓ మయాన్ మంజుఖాన్, వైరా మార్కెట్ చైర్మన్ బొళ్ల గంగారావు, సర్పంచ్లు భూక్యా బాలాజీ, కారుమంచి ఏసు, మార్కెట్ డైరెక్టర్లు షేక్ మోలాలి, తోటకూర నాగేశ్వరరావు, ఏఈఓ సపావత్ సైదులు తదితరులు పాల్గొన్నారు. డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన అగర్వాల్ ఖమ్మంవ్యవసాయం: జిల్లా అటవీ అధికారిగా అనూజ్ అగర్వాల్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఖమ్మం డీఎఫ్ఓగా ఉన్న సిదార్థ్ విక్రమ్ సింగ్ను నిజామాబాద్కు, వరంగల్ డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ను ఖమ్మం బదిలీ చేశారు. ఈమేరకు ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ దివాకర్ టీఎస్ను మర్యాద పూర్వకంగా కలిశారు. అలాగే, జిల్లాలోని అటవీ అధికారులు, ఉద్యోగులు నూతన డీఎఫ్ఓను కలిసి శుభాకంక్షలు తెలిపారు. నేడు మంగళగూడెంలో ప్రజాదర్బార్ ఖమ్మంరూరల్: ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెంలో మంగళవారం ప్రజాదర్బార్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామంలోని సీతారామచంద్రస్వామి ఆలయ కళ్యాణ మండపంలో మధ్యాహ్నం 3–30 గంటలకు మొదలయ్యే ప్రజాదర్బార్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా జిల్లా అధికారులు పాల్గొంటారు. ఈమేరకు మంగళగూడెం, పోలిశెట్టిగూడెం, కామంచికల్, పడమటితండా, దారేడు, తీర్థాల, పోలేపట్లి, పల్లెగూడెం, గోళ్లపాడు గ్రామపంచాయతీల ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు అందించవచ్చని అధికారుల తెలిపారు. ప్రశాంతంగా ఎప్సెట్ ఖమ్మం సహకారనగర్: అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఎప్సెట్ తొలిరోజైన సోమవారం ప్రశాంతంగా ముగి సింది. పరీక్ష నిర్వహణకు ఖమ్మంలో ఏడు కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఆయా కేంద్రాల్లో ఉదయం పరీక్షకు 1,910మందిలో 1,756 మంది, మధ్యాహ్నం పరీక్షకు 1,909మంది విద్యార్థుల్లో 1,776మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. సత్తుపల్లిలో రెండు కేంద్రాలు ఏర్పాటుచేయగా ఉదయం పరీక్షకు 250 మందిలో 226మంది, మధ్యాహ్నం పరీక్షకు 500 మందికి గాను 466మంది హాజరయ్యారు. -
మంత్రులున్నా.. రైతుల కంట కన్నీరే
కొణిజర్ల: ముగ్గురు ప్రధాన శాఖల మంత్రులు ఉన్న జిల్లాలో రైతులు కంటతడి పెట్టే పరిస్థితి నెలకొందని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందరావు పేర్కొన్నారు. సకాలంలో మక్కలు, ధాన్యం కొనుగోళ్లు జరగక, కాంటా వేసినా తరలించక అకాల వర్షంతో నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. ఇకనైనా స్పందించి 48 గంటల్లో కొనుగోళ్లు పూర్తి చేయకపోతే మక్కలను కలెక్టరేట్ లేదా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయానికి తరలిస్తామని హెచ్చరించారు. కొణిజర్ల మండలం తనికెళ్లలో మక్కలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం సాయంత్రం ఆయన పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఏఓ బాలాజీ, సొసైటీ సీఈఓ వెంకటేశ్వర్లుతో ఎంపీ ఫోన్లో మాట్లాడి సూచనలు చేశారు. తెలంగాణలోనూ కాషాయ జెండా ఎగురవేస్తాం ఖమ్మం మామిళ్లగూడెం: దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో విస్తరించిన ఎన్డీఏ త్వరలో తెలంగాణలోనూ జెండా ఎగురవేయడం ఖాయమని మెదక్ ఎంపీ రఘునందన్రావు ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ సాగిస్తున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేయడంతో బీజేపీ అధికారం వచ్చిందన్నారు. ఈనెల 10న సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరవుతున్నందున జయప్రదం చేయాలని ఎంపీ కోరారు. పార్టీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు, నాయకులు ఉదయ్ప్రతాప్, వాకధాని పుల్లారావుయాదవ్, రుద్ర ప్రతాప్, నాయుడు రాఘవరావు, చిలుకూరు రమేష్, ఈ.వీ.రమేష్, వక్కలంక సుబ్రహ్మణ్యం, పమ్మి అనిత, విజయ రాజు, మందడం సుబ్బారావు, మారుతి బాబురావు, బొబ్బ భాగ్యరెడ్డి, బండారు నరేష్ బాబు, కవిడ మురళి, బండారు సత్యనారాయణ పాల్గొన్నారు.మెదక్ ఎంపీ రఘునందన్రావు -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
ఖమ్మం సహకారనగర్: ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి సోమవారం ఆయన మంత్రులు వాకాటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్కుమార్, దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి తెలిపారు. సోమవారం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షించారు. రైతులకు ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలు జారీ చేయడమే కాక, కేంద్రాల్లో అవసరం మేర టార్పాలిన్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ వీసీకి జిల్లా నుంచి కలెక్టర్ దివాకర హాజరుకాగా.. అనంతరం అధికారులతో సమావేశమైన కొనుగోళ్లలో సూచనలు, కేంద్రాల్లో ఏర్పాట్లపై సూచనలు చేశారు. రైతులు గన్నీ బ్యాగులు తీసుకువస్తే వాటికి కూడా ప్రభుత్వం నగదు చెల్లిస్తుందనే విషయాన్ని వివరించాలని తెలిపారు. సీపీఓ శ్రీనివాస్, డీఆర్డీఓ శ్రీరామ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో డీసీఎస్ఓ తనిఖీలు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచడమే కాక కాంటా పూర్తికాగానే కేటాయించిన మిల్లులకు తరలించాలని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్కుమార్ సూచించారు. జిల్లాలోని మధిర, సత్తుపల్లి, పెనుబల్లి మండలాల్లో పలు కొనుగోలు కేంద్రాలు, మిల్లులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీఎస్ఓ మాట్లాడుతూ అవసరమైన గన్నీ బస్తాలు సమకూర్చుకోవడమే కాక ధాన్యం తరలింపునకు లారీల కొరత రాకుండా చూడాలన్నారు. ధాన్యం కొనుగోళ్లకు క్రమపద్ధతి పాటిస్తూ, కాంటా కాగానే నిర్దేశిత మిల్లులకు తరలించాలని తెలిపారు. ఆయన తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు. -
‘పది’లో గురుకులాల హవా
● ఐదు పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత ● ఉమ్మడి జిల్లాలోని ఇతరచోట్ల కూడా మెరుగైన ఫలితం నేలకొండపల్లి: క్రమశిక్షణతో కూడిన చదువు... వెనకబడిన పిల్లలపై ప్రత్యేక దృష్టి.. ఉపాధ్యాయుల బోధనకు తోడు అధికారుల నిరంతర పర్యవేక్షణ ఫలితంగా తాజాగా విడుదలైన పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. ఉమ్మడి జిల్లాలో 20 బాలుర, బాలికల గురుకుల పాఠశాలలు ఉండగా... ఐదింట్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. మిగతా గురుకులాల్లోనూ మెరుగైన ఫలితాలు రావడం విశేషం. కాగా, ఖమ్మం జిల్లాలోని గురుకులాల నుంచి 880 మంది విద్యార్థులు ఎస్సెస్సీ పరీక్షలు రాయగా, 862 మంది ఉత్తీర్ణత సాధించారు. అంతా పేద విద్యార్థులే... సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 20గురుకుల పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఇందులో అత్యధిక శాతం పేద విద్యార్థులే చదువుకుంటున్నారు. మెరుగైన ఫలితాలు వస్తుండడంతో ఏటా ప్రవేశాలకు డిమాండ్ పెరుగుతోంది. మంచి ఫలితాలు వచ్చేలా ఉపాధ్యాయులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. రోజువారీగా శ్రద్ధ కనబర్చడమే కాక సబెక్టుల వారీగా స్టడీ అవర్స్ నిర్వహిస్తుండడంతో మంచి ఫలితాలు నమోదవుతున్నాయి. పదో తరగతి ప్రారంభంలోనే సామర్ధ్య పరీక్ష నిర్వహించి.. విద్యార్థుల స్థాయిని అంచనా వేస్తారు. అందుకు అనుగుణంగా బోధిస్తూ, వెనుకబడిన వారిపై మరింత శ్రద్ధ పెడుతుండడంతో మెరుగైన స్థాయిలో ఉత్తీర్ణత నమోదవుతోంది. అన్ని చోట్ల మెరుగే... మధిర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 99శాతం ఉత్తీర్ణత నమోదైంది. అలాగే, ఎర్రుపాలెంలో 98.07, అన్నపరెడ్డిపల్లిలో 98.5, దమ్మపేటలో 98.5, వైరాలో 97 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇక పాల్వంచలో 96.2, నేలకొండపల్లిలో 96, అడవిమల్లెలలో 96, ముదిగొండలో 95.23, ములకలపల్లిలో 94.8, మణుగూరులో 94.2, పాల్వంచ(సీడీఈ) 94 శాతం, ఇల్లెందులో 93.3, తిరుమలాయపాలెంలో 92.85, భద్రాచలం గురుకుల పాఠశాలలో 89.47శాతంగా ఉత్తీర్ణత నమోదైంది. పదోతరగతి విద్యార్థులకు మొదటి నుంచే ప్రణాళికాయుతంగా పాఠాలు బోధిస్తాం. వెనుకబడిన వారిని గుర్తించేలా పరీక్షలు నిర్వహిస్తాం. అందులో ఫలితంగా ఆధారంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం. ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించి బోధిస్తుండడంతో ఈ ఏడాది కూడా మెరుగైన ఫలితాలు సాధించాం. – జి.శ్రీలత, ప్రిన్సిపాల్, నేలకొండపల్లి గురుకుల పాఠశాలటేకులపల్లి, కల్లూరు, దానవాయిగూడెం, సత్తుపల్లి, కూసుమంచి గురుకుల పాఠశాలల్లో ఎస్సెస్సీ విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. -
గర్వం పనికి రాదు..
ఈ వేసవి సెలవుల్లో సత్తుపల్లిలోని మా అమ్మమ్మ గారి ఇంటికి వచ్చా. ప్రతిరోజు రాత్రి భోజనాలయ్యాక నాతో పాటు అన్న పార్ధు, ఇంకొందరు స్నేహితులకు మా అమ్మమ్మ కథ చెబుతుంది. తాజాగా చెప్పిన కథే ఇది. అయితే, ఈ కథ చెప్పే ముందే మా అమ్మమ్మ ఇందులోని నీతిని పాటించాలనే మాట తీసుకుంది. అందుకే మాట ఇచ్చాకే కథ విన్నాం. ఈ కథేమిటో మీరూ చదవండి..సత్తుపల్లిటౌన్: ఒక రోజు సాయత్రం వేళ ఒక మిణుగురు పురుగు తన వెలుగుని చూసి గర్వపడి ప్రపంచానికి నేనే వెలుగును ఇస్తున్నాను అనుకుందంటా. ఇంతలో నక్షత్రాలు వచ్చేసరికి మిణుగురు వెలుగు మాయమైంది. అప్పుడు నక్షత్రాలు మా కాంతితోనే ప్రపంచానికి వెలుగు వస్తుందని గర్వపడ్డాయట. ఆ కాసేపటికే చంద్రుడు వచ్చాడు. అంతలో నక్షత్రాల వెలుగు మాయమైంది. అప్పుడు చంద్రుడు కూడా నా వెలుగే ప్రపంచానికి ఆనందాన్ని ఇస్తుందని బడాయి పోయాడట. సరే తెల్లవారింది. సూర్యుడు రానే వచ్చాడు. సూర్యుడు రావడంతో చంద్రుని వెన్నెల మాయమై పోయింది. అమ్మమ్మ చెప్పిన నీతి కథ -
డాన్స్ చేయడమంటే ఇష్టం
ఇల్లెందురూరల్: నాకు చిన్న వయస్సు నుంచి డాన్స్ చేయడమంటే ఎంతో ఇష్టం. ఇంట్లో టీవీలో వచ్చే పాటలకు నృత్యం చేస్తుంటే మా నాన్న సెలవుల్లో శిక్షణకు పంపించేవాడు. ఏటా సెలవుల్లో ఎంతో కొంత నేర్చుకుంటూ ఇంటి వద్ద కూడా ప్రాక్టీస్ చేస్తుంటా. ప్రస్తుతానికి డాన్స్లో కొంత నైపుణ్యం సాధించా. పాఠశాలలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో డ్యాన్స్ చేస్తూ అభినందనలు అందుకోవడం ఆనందాన్ని ఇస్తుంది. ఈ వేసవిలోనూ క్లాస్లకు వెళ్తూ సెలవులను నా అభిరుచికి అనుగుణంగా సద్వినియోగం చేసుకుంటున్నా. – బొంగాని హన్విత, 6వ తరగతి, సుభాష్నగర్ -
మొక్కజొన్న నిల్వలకు భరోసా
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి క్రయవిక్రయాల కోసం నిర్మిస్తున్న నాలుగు షెడ్లను మొక్కజొన్నల నిల్వలకు వినియోగిస్తున్నారు. మార్క్ఫెడ్ కేంద్రాల్లో కాంటాలు పూర్తయినా తరలింపులో జాప్యమై రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇంతలోనే అకాల వర్షాల కారణంగా నష్టం జరుగుతోంది. అయితే, మార్క్ఫెడ్కు వివిధ ప్రాంతాల్లో గోదాములు ఉన్నా అవన్నీ నిండి ఉన్నాయి. దీంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ దివాకర్ టీ.ఎస్. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నూతనంగా నిర్మించిన నాలుగు షెడ్లను వినియోగించుకోవాలని ఆదేశించారు. ఈమేరకు వివిధ ప్రాంతాల్లో కొనుగోలు చేసిన మొక్కజొన్నలను లారీల్లో తరలిస్తున్నారు. ఇక్కడ నాలుగు షెడ్లలో ఏడు లక్షల బస్తాల మొక్కజొన్న(40 వేల మెట్రిక్ టన్నులు)లు నిల్వ చేసే అవకాశముంది.ఖమ్మం మార్కెట్లోని కొత్త షెడ్లలోకి సరుకులు -
ఏ ఉద్యోగమూ చిన్నది కాదు..
ఖమ్మంరాపర్తినగర్: నిరుద్యోగ యువత ప్రైవేట్ ఉద్యోగాలను నిర్లక్ష్యం చేయకుండా, అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్లో ఉన్నత స్థాయికి చేరాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. ఉమ్మడి జిల్లాలోని యువతకు ఉపాధి కల్పించే దిశగా ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్స్లో సోమవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాను కలెక్టర్ దివాకర ప్రారంభించి మాట్లాడారు. యువత నిరుద్యోగులుగా ఎక్కువ కాలం ఉండొద్దంటే అందుబాటులో ఉన్న అవకాశాలను చేజిక్కించుకోవాలని తెలిపారు. ప్రైవేట్ ఉద్యోగాలను చిన్నచూపు చూడొద్దని, ప్రారంభంలో వేతనం తక్కువగా ఉన్నా వ్యక్తిగత ప్రతిభతో ఉన్నత స్థాయికి చేరొచ్చన్నారు. తనకు తెలిసిన ఓ వ్యక్తి రూ.12 వేల వేతనంతో ఉద్యోగాన్ని ప్రారంభిస్తే ఎనిమిదేళ్ల తర్వాత రూ.లక్షలు సంపాదించే స్థాయికి చేరాడని ఉదహరించారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మాట్లాడుతూ ఏదో ఒక ఉద్యోగాన్ని ప్రారంభిస్తే అనుభవం, ఆత్మవిశ్వాసం పెరిగి భవిష్యత్ లక్ష్యాల సాధన సులువవుతుందని తెలిపారు. టాస్క్ సీఈఓ నితిన్కుమార్రెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం డీవైఎస్ఓలు టి.సునీల్కుమార్రెడ్డి, ఎం.పరంధామరెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం ప్రవీణ్, ఈడీఎం దుర్గాప్రసాద్, ఎంప్లాయిమెంట్ అధికారి ఎన్.మాధవి, ఏసీపీ రమణమూర్తి, డిప్యూటి డీఎంహెచ్ఓ చందునాయక్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ పుష్పలత, కార్పొరేటర్ లకావత్ సైదులు తదితరులు పాల్గొన్నారు. 2,756మంది హాజరు జాబ్ మేళాలో పాల్గొనేందుకు ఉమ్మడి జిల్లా నుంచి 42,231 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. పలువురు రెండు, మూడు ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ చేసుకోగా మొత్తం 2,756మంది హాజరయ్యారు. ఇంట ర్వ్యూల అనంతరం వీరిలో 1,102 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. అయితే, ఇంకొందరిని కూడా ఎంపిక చేసే అవకాశముందని తెలిసింది. తొలిదశలో ఎంపికై న వారికి మరో రెండు దఫాలుగా ఇంటర్వ్యూ చేశాక ఈనెల 23న నియామకపత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా, జాబ్ మేళాకు పెద్దసంఖ్యలో అభ్యర్థులు హాజరైనా ఎవరూ ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశామని డీవైఎస్ఓ సునీల్కుమార్రెడ్డి వెల్లడించారు. మెగా జాబ్మేళాలో 78కంపెనీల బాధ్యులు పాల్గొననుండగా, 3వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు ఉన్నాయని అధికారులు ప్రకటించారు. ఈమేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరుద్యోగ యువతీ, యువకులు తరలిరావడంతో ఎస్ఆర్ గార్డెన్స్ కిక్కిరిసింది. కంపెనీల వారీగా స్టాళ్లు ఏర్పాటుచేసి అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలిస్తూ ఇంటర్వ్యూలు నిర్వహించారు. -
తరలించక... తడిసి ముద్దయి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఈ ఏడాది యాసంగిలో మొక్కజొన్న సాగు చేసిన రైతులను అడుగడుగునా సమస్యలు వెంటాడుతున్నాయి. మార్క్ఫెడ్ ఆధ్వర్యాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటులో అశాసీ్త్రయత, ఎకరాకు 26 క్వింటాళ్ల మొక్కజొన్నలే కొనుగోలు చేస్తామనే నిబంధనతో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా రూ.2,400 మద్దతు ధర కోసం రైతులు మండుటెండల్లో ఎదురుచూశారు. ఆపై కాంటా అయ్యాక గోదాములకు తరలించే వరకు రైతులదే బాధ్యత అని చెప్పడంతో వాహనాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడాల్సి వచ్చింది. ఇంతలోనే ఆదివారం సాయంత్రం పలు ప్రాంతాల్లో అకాల వర్షం కురవగా మొక్కజొన్నలు తడిసి రైతులు నష్టపోయారు. అంచనాలకు మించి సాగు.. ఈ యాసంగిలో నీరు పుష్కలంగా ఉండడం, వాతావరణ సమస్యలు లేకపోవడంతో ఉమ్మడి జిల్లాలో 2.43 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. కానీ బహిరంగ మార్కెట్లో క్వింటా మొక్కజొన్నలకు రూ.1,700కు మించి ధర పెట్టలేదు. దీంతో మార్క్ఫెడ్ ఆధ్వర్యాన రూ.2,400 మద్దతు ధరతో కొనుగోలు చేస్తామనే ప్రకటన రావడంతో సంతోషపడ్డారు. ఆతర్వాత కొనుగోళ్లలో పరిమితి, కేంద్రాల ఏర్పాటులో ఇక్కట్లు ఎదురయ్యాయి. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 51కేంద్రాల ద్వారా శనివారం వరకు 1.17లక్షల టన్నుల మొక్కజొన్నలు కొనుగోలు చేశారు. ఇంకా 50శాతం మంది రైతులు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు. పెనుభారంగా రవాణా.. కేంద్రాల్లో కొనుగోలు చేసిన మొక్కజొన్నలను ఉమ్మడి జిల్లాతో పాటు సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో గోదాంలకు తరలించే బాధ్యత కాంట్రాక్టర్లకు అప్పగించారు. కానీ కాంట్రాక్టర్లు సరిపడా లారీలను ఏర్పాటు చేయడం లేదు. దీంతో కాంటా వేసిన వారం నుంచి పదిహేను రోజులు దాటినా లారీల జాడ లేక రైతులు సొంతంగా వాహనాలు మాట్లాడుకుంటున్నారు. ఫలితంగా బస్తాకు రూ.50 చొప్పున లారీకి రూ.వేలల్లో ఖర్చయింది. దీనికి తోడు గోదాంల వద్ద వేచి ఉండాల్సి ఉన్నందున లారీ డ్రైవర్లు అదనపు వసూళ్లకు పాల్పడుతుండడంతో రైతులపై భారం పడుతోంది. అలాగే, బస్తాలు అందుబాటులో లేక రూ.25నుంచి రూ.30వెచ్చించి కొనుగోలు చేయగా, హమాలీ ఖర్చులు కూడా రైతులే భరించారు.మక్క రైతులను వెంటాడుతున్న సమస్యలు ఇరవై రోజుల క్రితం మొక్కజొన్నలను కేంద్రానికి తీసుకొచ్చా. మొత్తం 704 క్వింటాళ్లు కాంటా వేసినా లారీలు లేక ఎగుమతి కావడం లేదు. మార్క్ఫెడ్ నుంచి టన్ను తరలింపునకు రూ.450 చెల్లిస్తున్నా లారీ యజమానులు క్వింటాకు రూ.80 అడుగుతున్నారు. దీంతో టన్నుకు రూ.800 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. – షేక్ ఇబ్రహీం, ముష్టికుంట్ల, బోనకల్ మండలంకొణిజర్ల మండలం తనికెళ్లకు చెందిన యాస విష్ణుమూర్తి 12 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తే 480 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. తనికెళ్ల ఎస్సీ సంక్షేమ వసతిగృహం పక్కన కొనుగోలు కేంద్రానికి పంట తరలించి 170 క్వింటాళ్లు అమ్మాడు. కానీ పంటను తరలించేందుకు లారీలు దొరకడం లేదు. ఒకటి, రెండు లారీలు వచ్చినా.. డ్రైవర్లు, లారీ యజమానులు అదనంగా డబ్బులు ఇచ్చిన వారి పంటే తరలించడంతో విష్ణుమూర్తి పడిగాపులు కాస్తున్నాడు. ఈ కేంద్రంలో 200 మంది రైతులు మొక్కజొన్నలు తీసుకురాగా బస్తాలు లేకపోవడంతో రూ.25 నుంచి రూ.30 వరకు చెల్లించి కొనుగోలు చేశారు. -
పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు
నేలకొండపల్లి: వర్షం కారణంగా ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన ఇది. వివరాలిలా ఉన్నాయి. నేలకొండపల్లి మండలం మంగాపురం తండాలో ఆదివారం రాత్రి వర్షం కురిసింది. ఈ సమయాన ఖమ్మం నుంచి గ్రామానికి వచ్చిన బస్సు శివార్లలో అదుపు తప్పగా పొలాల్లోకి దిగింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురైనా ఎవరికీ గాయాలు కాలేదు. ఈమేరకు సమాచారం అందుకున్న సర్పంచ్ ధీరావత్ అశోక్రాణి, ధీరావత్ రాధాకృష్ణమూర్తి తదిరతులు చేరుకుని జోరు వర్షం కురుస్తుండగా చీకట్లో సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికప్పుడు జేసీబీని రప్పించి బస్సును బయటకు లాగి రోడ్డుపైకి చేర్చారు. అంతేకాక రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లను తొలగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.తృటిలో తప్పిన ప్రమాదం -
అకాల వర్షంతో ఆగమాగం
● జిల్లాలో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వాన ● కల్లాల్లో తడిసిన మొక్కజొన్నలు ● వరికి నష్టం.. రాలిన మామిడికాయ ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో ఆదివారం సాయంత్రం వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటివరకు ఎండలు ఉక్కిరిబిక్కిరి చేయగా.. సాయంత్రం ఐదు గంటల నుంచి అంతా మారిపోయింది. ఈదురుగాలులకు తోడు ఉరుములు, మెరుపులతో పాటు పలుచోట్ల వర్షం కురిసింది. జిల్లాలో మూడు రోజులుగా 45 డిగ్రీలను దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, ఈ వర్షంతో ప్రజలకు ఉపశమనం కలిగింది. కానీ రైతులకు మాత్రం తీరని నష్టాన్ని మిగిల్చింది. పంటలకు ప్రతికూలం యాసంగిలో సాగు చేసిన పంటలు చేతికందుతున్న వేళ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో రైతులకు నష్టం ఎదురైంది. మొక్కజొన్న కోతలు దాదాపు పూర్తి కాగా, వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. పాలేరు, మధిర, వైరా ప్రాంతాల్లో వరి కోత దశలో ఉంది. ఈక్రమాన ఈదురుగాలులతో పంట నేలవాలడమే కాక గింజ రాలింది. అంతేకాక పలుచోట్ల కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన మొక్కజొన్న, వరి ధాన్యం తడిసిపోయాయి. అలాగే, జిల్లాలో దాదాపు 30 వేల ఎకరాల్లో సాగవుతున్న మామిడికి కూడా నష్టం వాటిల్లింది. ప్రస్తుతం మామిడి కోత దశలో ఉండడంతో ఈదురుగాలుల వల్ల కాయ నేలపాలైంది. కాగా, అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యాన రైతులు అప్రమత్తంగా ఉంటూ, పంటలను రాశులుగా చేసుకుని రక్షించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. ఫ్లెక్సీలతో విద్యుత్ సరఫరాకు అంతరాయం జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఆదివారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ మేరకు రహదారులు, విద్యుత్ లైన్ల వెంట, భవనాలపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తెగిపోయి విద్యుత్ లైన్లపై పడ్డాయి. దీంతో తరచూ ట్రిప్ అవుతూ సరఫరాకు అంతరాయం ఎదురైంది. ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు విద్యుత్ లైన్లపై పడడంతో సరఫరా నిలిచిపోయింది. దీంతో నగర ఏడీఈ సీహెచ్ నాగార్జున పర్యవేక్షణలో సిబ్బంది రంగంలోకి దిగి ఫ్లెక్సీలను తొలగించి సరఫరా పునరుద్ధరించారు. ఏ శాఖ నియంత్రణ లేక అనధికారికంగా వందల సంఖ్యలో ఫ్లెక్సీలు కడుతుండడంతో ఈ పరిస్థితి ఎదురైంది. -
బాలభవన్కు ఆహ్వానం !
ఖమ్మంసహకారనగర్: ఖమ్మంలోని బాలభవన్లో ఏటా మాదిరిగానే ఈసారి కూడా వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. చదువుతో సంబంధం లేకుండా 5 – 16 ఏళ్ల లోపుపిల్లలకు ఇక్కడ శిక్షణ ఇస్తారు. ఈ నెల 2న మొదలైన శిక్షణ వచ్చేనెల 10వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా బాలభవన్లో డ్రాయింగ్, క్రాఫ్ట్స్, కూచిపుడి నృత్యంతో పాటు నో కాస్ట్ – లో కాస్ట్ అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ కోసం ప్రతీ అంశానికి రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగే శిక్షణకు 25 మంది హాజరవుతుండగా, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.నాలుగు అంశాల్లో మొదలైన శిక్షణ -
వైద్య విద్యార్థులు పరిశోధనల వైపు మళ్లాలి
ఖమ్మంవైద్యవిభాగం: వైద్య విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా ఎంబీబీఎస్ దశ నుంచే పరిశోధనలపై దృష్టి సారించాలని అదనపు డీఎంఈ, ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ టి.శంకర్ సూచించారు. ఖమ్మం మెడికల్ కాలేజీలో ఆదివారం ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ సెల్(ఐఆర్సీ), ఇన్స్టిట్యూషనల్ ఎథిక్స్ కమిటీ (ఐఈసీ) సంయుక్త ఆధ్వర్యాన బేసిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషనల్ ఓరియంటేషన్(బ్రియో) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ మాట్లాడుతూ వైద్య రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవాలంటే పరిశోధనలు కీలకమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో పరిశోధనలపై ఆసక్తిని పెంచేందుకు కళాశాలలో ఐఆర్సీ, ఐఈసీ విభాగాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ ఓరియంటేషన్లో ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాలలు, మమత మెడికల్ కాలేజీకి చెందిన 60 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. మహారాష్ట్రలోని ప్రవారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు చెందిన డాక్టర్ రాహుల్ కుంకులోల్, డాక్టర్ స్వప్నిల్ బోర్సే పలు అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే, వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ ఎస్.రాజేశ్వర్రావు, డాక్టర్ సరిత, కోఆర్డినేటర్లు డాక్టర్ వినీల, డాక్టర్ సుగుణ మాట్లాడగా వివిధ విభాగాల బాధ్యులు డాక్టర్ బొలిసెట్టి వేణు, డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ రాధాకృష్ణ శిక్షణ ఇచ్చారు. ‘బ్రియో’లో నాలుగు కాలేజీల విద్యార్థులు -
ప్రశాంతంగా ‘నీట్’
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన నీట్ (నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు) జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలో ఏడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఈమేరకు 2,762మంది విద్యార్థులకు గాను 2,680 మంది హాజరుకాగా 82మంది గైర్హాజరయ్యారని జిల్లా నోడల్ అధికారి నరేందర్ వెల్లడించారు. – ఖమ్మం సహకారనగర్ఖమ్మం క్రైం: నీట్ పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తును పోలీసు కమిషనర్ సునీల్దత్ పరిశీలించారు. ఖమ్మంలోని శాంతినగర్ కాలేజీ, కేంద్రియ విద్యాలయంను సందర్శించిన ఆయన బందోబస్తుపై పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు. ఏసీపీలు రమణమూర్తి, సాంబరాజు తదితరులు పాల్గొన్నారు.11గంటల నుంచే అనుమతి నీట్ మధ్యాహ్నం 2నుంచి 5గంటల వరకు జరగగా విద్యార్థులను ఉదయం 11గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఉదయం 10–30గంటలకల్లా చేరుకున్నారు. ఈమేరకు విద్యార్థుల అడ్మిట్ కార్డులు, ఇతర ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాక అనుమతించారు. కాగా, కేంద్రాల్లోని మధ్యాహ్నం 1–30గంటల తర్వా త అనుమతించేది లేదని ముందుగానే అధికారులు స్పష్టం చేశారు. ఈమేరకు చాలా మంది ముందుగానే వచ్చినా కొందరు మాత్రం హడావుడిగా చేరుకున్నారు. ఇంకొందరు ఆభరణాలు, షూ ధరించి రావడంతో వాటిని తీసివేశాకే లోనకు అనుమతించారు. మరికొందరు ఫొటోలు తీసుకురాకపోవడంతో సెల్ఫోన్లో ఫొటో తీసి సమీపంలోని జిరాక్స్ కేంద్రాలకు బంధువులు పరుగులు తీశారు. ఒకరిద్దరు 1–30గంటల తర్వాత రాగా వారిని అనుమతించలేదు.నీట్లో మంచి మార్కులతో అర్హత సాధిస్తాననే నమ్మకం ఉంది. బయాలజీ ప్రశ్నలు ఈజీగా రాశా. ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో పలు క్లిష్టమైన ప్రశ్నలు వచ్చాయి. అయినా నేర్చుకున్న అంశాలకు దగ్గరగా ఉండడంతో బాగానే రాశాను. – గుండ్ల రుచిత ఐశ్వర్య, ఖమ్మంనీట్ మంచిగా రాశా. ప్రశ్నాపత్రంలో బయాలజీ సబ్జెక్ట్కు సంబంధించి ప్రశ్నలు సులభంగా వచ్చాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రం కొంచెం కష్టంగా అనిపించింది. అయినా బాగానే రాశాను. మంచి మార్కులు సాధిస్తాననే నమ్మకం ఉంది. – ఏపూరి ప్రేరణ, ఖమ్మం -
నేటి నుంచి ఎప్సెట్
● హాజరుకానున్న 2వేల మందికి పైగా విద్యార్థులు ఖమ్మం సహకారనగర్: జిల్లాలో ఎప్సెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 4వ తేదీ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఎప్సెట్ జరగనుంది. జేఎన్టీయూ ఆధ్వర్యాన ఆన్లైన్ విధానంలో ఈ పరీక్ష నిర్వంచనున్నారు. జిల్లా కేంద్రంలో ఫార్మసీ అండ్ అగ్రికల్చరల్ పరీక్ష నిర్వహణకు ఏడు కేంద్రాలను ఏర్పాటు చేయగా 5,725 మంది విద్యార్థులు హాజరవుతారు. అలాగే, ఇంజనీరింగ్ ప్రవేశపరీక్షకు ఎనిమిది కేంద్రాల్లో 12,174 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈనెల 4, 5వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశపరీక్షలు ఉదయం 9నుంచి 12 గంటల వరకు జరగనుండగా 8–30గంటల వరకే అనుమతిస్తారు. ఇక మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగే రెండో సెషన్ పరీక్షలకు 2–30గంటల వరకు అనుమతించనున్నారు. ఇక ఈనెల 9నుంచి 11వ తేదీ వరకు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు రెండేసి సెషన్లలో జరుగుతాయి. కాగా, సత్తుపల్లిలో కూడా రెండు కేంద్రాలు ఏర్పాటుచేయగా ఇంజనీరింగ్ పరీక్షకు 3వేల మంది, అగ్రికల్చర్, ఫార్మసీకి పరీక్షకు 1,005మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 6న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఖమ్మం స్పోర్ట్స్: జిల్లాస్థాయి అథ్లెటిక్స్ జట్ల ఎంపికకు ఈనెల 6వ తేదీన పోటీలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం.డీ.షఫీక్ అహ్మద్ తెలిపారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో బుధవారం ఈ పోటీలు జరుగుతాయని వెల్లడించారు. ఇక్కడ ఎంపిక చేసే అండర్–8, 10, 12, 14, 16, 18, 20, సీనియర్ మహిళలు, పురుషుల జట్లు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 9గంటలకు రిపోర్టు చేయాలని సూచించారు. రామయ్యకు సువర్ణ పుష్పార్చన భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి చిత్రకూట మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. వైభవంగా గోదావరి నదీ హారతిభద్రాచలంటౌన్: భద్రాచలంలో ఆదివారం సాయంత్రం గోదావరికి నదీ హారతి సమర్పించారు. భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గణపతి పూజతో ప్రారంభించి, 108 ప్రమిదలతో దీపోత్సవం, అష్టోత్తర శతనామార్చన, శ్రీరామ నామ భజనలు గావించారు. అనంతరం మంత్రోచ్ఛరణల మధ్య గోదావరి మాత, స్వామికి హారతులు సమర్పించారు. అప్రమత్తంగా ఉండాలి.. ● అకాల వర్షాల నేపథ్యాన కలెక్టర్ సమీక్ష ఖమ్మం సహకారనగర్: జిల్లాలో ఆదివారం అకాల వర్షం కురవగా.. సోమ, మంగళవారాల్లో కూడా వర్షసూచనలు ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండేలా అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. ఆయన ఆదివారం రాత్రి మొక్కజొన్నలు, ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు మక్క కొనుగోలు కేంద్రాలకు గన్నీ బ్యాగులతో వస్తే వాటికీ ప్రభుత్వం చెల్లింపులు చేస్తుందన్నారు. అయితే, కేంద్రాల్లో తడిసిన మక్కలను ఆరబెట్టాకే లోడ్ చేయాలని సూచించారు. కొణిజర్ల, చింతకాని, మద్దులపల్లి ప్రాంతాల్లో నిల్వలు ఎక్కువగా ఉన్నందున త్వరగా గోదాంలకు తరలించాలని తెలిపారు. అంతేకాక మార్క్ఫెడ్ పరిధిలోని కేంద్రాల్లో మక్కలు ఏ మేర తడిసాయో 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని చెప్పారు. కాగా, కేంద్రాల్లో నిల్వ ఉన్న మొక్కజొన్నలు, ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచి సరిపడా వాహనాలు, హమాలీలను సమకూర్చుకోవాలని తెలిపారు. అలాగే, కూసుమంచి మండలంలో తడిసిన ధాన్యాన్ని లారీల ద్వారా బాయిల్డ్ రైస్ మిల్లర్లకు తరలించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో మార్క్ఫెడ్, పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అగ్నికి ఆహుతైన మొక్కజొన్న పంట
చింతకాని: మండలంలోని పాతర్లపాడులో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 45 మంది రైతులకు చెందిన 600 క్వింటాళ్ల మొక్క జొన్న పంట కాలిబూడిదైంది. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం భారీగా వీచిన ఈదురుగాలులతో మొక్కజొన్న చేన్లలో నిప్పంటుకుని మంటలు వ్యాపించాయి. చేన్లలో కుప్ప పోసిన పంటే కాక కల్లాల్లో కాంటా పూర్తయిన మొక్కజొన్న బస్తాలకు సైతం వ్యాపించి కాలిపోయాయి. అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించగా ఫలితం లేక గ్రామపంచాయతీ ట్యాంకర్ను రప్పించినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. ఘటనలో సుమారు రూ.15 లక్షల నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. కోత పూర్తయిన మొక్కజొన్న చేన్లలో చెత్తకు నిప్పుపెడుతుండడంతో మంటలు వ్యాపిస్తున్నాయని చెబుతున్నారు. షార్ట్ సర్క్యూట్తో వరి.. రఘునాథపాలెం: మండలంలోని కోయచలకలో ఆదివారం ఓ రైతుకు చెందిన వరి చేను కాలిపోయింది. గ్రామానికి చెందిన మడుపు బ్రహ్మయ్య రెండెకరాల్లో వరి సాగు చేయగా కోతకు సిద్ధంగా ఉంది. ఈ క్రమాన ఆదివారం విద్యుత్ లైన్లో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ వల్ల నిప్పురవ్వలు పొలంలో పడడం మంటలు వ్యాపించాయి. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేక కోతకు సిద్ధంగా ఉన్న పంట క్షణాల్లోనే అగ్నికి ఆహుతైంది. ఘటనలో రూ.లక్షకు పైగా నష్టం జరిగిందని రైతు బ్రహ్మయ్య వాపోయాడు.45 మంది రైతులకు రూ.15 లక్షల మేర నష్టం -
అర్హతలే కొలమానం..
కూసుమంచి: ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, అధికారులే నేరుగా వచ్చి అర్జీలు స్వీకరించి పరిష్కరించేలా ప్రజాదర్బార్లు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించా రు. ఇదే సమయాన రాజకీయాలకు తావులేకుండా అర్హులందరికీ పథకాలు అందిస్తున్నామని తెలిపా రు. కూసుమంచిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా ల ఆవరణలో ఆదివారం నిర్వహించిన ప్రజా దర్బార్లో కలెక్టర్ దివాకర టీ.ఎస్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి పాల్గొన్న మంత్రి ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి పాలనను ప్రజల గడప వద్దకే తీసుకొస్తున్నామని తెలిపారు. మండలాలను క్లస్టర్లుగా విభజించి నిర్వహిస్తున్న ప్రజాదర్బార్లలో అందిన ప్రతీ దరఖా స్తును రాజకీయాలకు అతీతంగా పరిష్కరిస్తామని తెలిపారు. సాదా బైనామా, భూమి రికార్డుల వంటి దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు. గత ప్రభుత్వ తీరుతోనే... ప్రజాదర్బార్లలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసమే దరఖాస్తులు వస్తున్నాయని, గత ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని మంత్రి విమర్శించారు. మే నెలాఖరు నాటికి రెండో దశ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పుడు అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతుండడంతో సంతోషంగా ఉంటున్నారని తెలిపారు. దీన్ని బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక, అబద్ధాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికే.. తిరుమలాయపాలెం: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తిరుమలాయపాలెం మండలం బచ్చోడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ప్రజాదర్బార్లో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పడ్డాక సంక్షేమ పథకా లు అమలు చేయడమే కాక ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చామని చెప్పారు. కలెక్టర్ దివాకర మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పాలేరు నియోజకవర్గంలో ప్రజా దర్బార్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, ప్రజాదర్బార్ జరుగుతుండగానే బచ్చోడులో గాలి దుమా రంతో కూడిన వర్షం మొదలైంది. అయితే, పెద్దసంఖ్యలో హాజరైన ప్రజలు నిరాశ చెందకుండా పాఠశాల వరండాలో మంత్రి, కలెక్టర్ కూర్చుని దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, మార్కెట్ చైర్మన్ హరినాథ్ బాబు, ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ సైదులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
కృతజ్ఞతలు ఎవరికి తెలపాలి?
సత్తుపల్లిటౌన్: అశోక్ ఇంట్లో దిగులుగా కూర్చున్నాడు. ఆయన భార్య అభిక ఏమిటని ఆరా తీస్తే అశోక్ ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. ‘పొద్దున్నే బజారుకు వెళ్లగా నడవలేని ముసలమ్మను బండి ఎక్కించుకున్నా.. ఎక్కడికి వెళ్లాలి అడిగితే పది కిలోమీటర్ల దూరాన గ్రామంలో ఆమె కుమారుడు ఉంటాడని చెబితే అక్కడే దింపాను. ఆ వెంటనే ఇంట్లోకి వెళ్లింది తప్ప నాకు కనీసం కృతజ్ఞతలు చెప్పలే’ అని వెల్లడించాడు. కృతజ్ఞతలు చెప్పించుకోవడం ఇష్టమైన అశోక్.. అడిగిన, అడగని వారికి సాయం చేస్తుంటాడు. ఎవరైనా కృతజ్ఞతలు చెబితే సంతోషిస్తాడు. చెప్పకపోతే దిగాలు పడతాడు. భర్త దిగులుకు గల కారణం తెలుసుకున్న అంబిక ‘ఓస్ ఇంతేనా.. దీనికే దిగులు పడిపోతారా? మనం సాయం చేసిన ప్రతిఒక్కరూ కృతజ్ఞతలు చెప్పాలని రూలేంలేదు. కొందరు పొరపాటుగా, ఇంకొందరు అలవాటుగానే మర్చిపోతా రు. అలాంటివన్నీ పట్టించుకోకూడదు అని అనున యంగా చెప్పింది’. కానీ అశోక్ మాత్రం ‘నాకు సాయం చేసిన చేసిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతాను.. నీకు తెలుసు కదా?’ అన్నాడు. దీనికి అంబిక స్పందిస్తూ ‘ఆ మాటకొస్తే మనం కృతజ్ఞతలు చెప్పాల్సిన వారు ఇద్దరు ఉన్నారు. వాళ్లకెప్పుడైనా చెప్పామా?’ అని అడిగింది. వారెవరని అశోక్ ఆరా తీయగా ఆమె సమాధానం చెప్పింది. ‘ఒకరు దేశానికి అన్నం పెడుతున్న రైతు. మరొకరు దేశాన్ని కాపాడుతున్న సైనికుడు. వీరికి ఎప్పుడైనా కృతజ్ఞతలు చెబుతున్నామా?’ అని అడిగింది. ‘నిజమే సుమా! రైతు వ్యవసాయం చేయకపోతే మనకు తిండిలేదు. సైనికుడు సరిహద్దులలో కాపలా కాయకపోతే రక్షణే లేదు’ అన్నాడు అశోక్. దీంతో అప్పటి నుంచి అశోక్ ఇతరుల నుంచి కృతజ్ఞతలు ఆశించడం మానివేసి ప్రతిరోజు రైతులు, సైనికులకు కృతజ్ఞతలు చెప్పడం అలవాటుగా మార్చుకున్నాడు.నా పేరు ఆవుల పోతురాజు. సత్తుపల్లికి చెందిన నేను ఇటీవల పదో తరగతి ఉత్తీర్ణత సాధించగా.. వేసవి సెలవుల్లో అమ్మానాన్నలకు పనుల్లో సాయపడుతున్నాను. నాకు కథలు రాయడమంటే చాలా ఇష్టం. పదో తరగతి చదువుతున్నప్పుడు నేను రాసిన కథలతో గార్లపాటి – బొల్లేపల్లి ట్రస్ట్ ‘నాన్నే నీ హీరో’ పేరుతో పుస్తకంగా ముద్రించింది. ఈ వేసవి సెలవుల్లోనూ మరికొన్ని కథలు రాస్తున్నాను. అందులో ఒక కథే ఇది. -
ఎవరెస్టు బేస్క్యాంప్ వద్దకు జిల్లా యువకుడు
● ఐటీడీఏ పీఓ చిత్రంతో కూడిన ఫ్లెక్సీ ప్రదర్శన భద్రాచలం: పెనుబల్లి మండలం వీఎం.బంజరకు చెందిన గిరిజన యువకుడు బి.మోతీకుమార్ ఎవరెస్టు శిఖరం బేస్ క్యాంప్ వద్దకు చేరుకుని సత్తా చాటాడు. అంతేకాక అక్కడ భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ ఫొటోతో కూడిన ఫ్లెక్సీ ప్రదర్శించాడు. గతంలోనూ మోతీకుమార్ కిలిమంజారో, ఎలబ్రస్ పర్వతాలను అధిరోహించాడు. ప్రస్తుతం సముద్ర మట్టానికి 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ పర్వతం బేస్క్యాంప్ వరకు వెళ్లి వచ్చాడు. గిరిజనుల సంక్షేమం, వారి సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న పీఓ రాహుల్పై అభిమానంతో అక్కడ ఆయన చిత్రంతో కూడిన ఫ్లెక్సీ ప్రదర్శించినట్లు వెల్లడించాడు. కాగా, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు సిద్ధమవుతున్న తనకు దాతలు సహకరించాలని కోరాడు. 176 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్ ఎర్రుపాలెం: మండలంలోని బనిగండ్లపాడు, పెద్దగోపవరం, మామునూరు గ్రామాల్లో శనివారం అర్ధరాత్రి ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లయీస్ ఓఎస్డీ అంజయ్య, డిప్యూటీ తహసీల్దార్ ప్రసన్న ఆధ్వర్యాన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురి ఇళ్లలో అక్రమంగా నిల్వ చేసిన 176 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆపై బియ్యాన్ని గోదాంలకు తరలించారు. మామునూరు, పెద్దగోపవరానికి చెందిన లాలా, సుభాని, మల్లికార్జునరావు, తెహరా, లాలుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తనిఖీల్లో ఎస్ఐ అజయ్కుమార్, సిబ్బంది సైదులు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాదవశాత్తు నిప్పు.. ● కాలిపోయిన పాలిహౌస్ కొణిజర్ల: మండలంలోని చిన్నమునగాలలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో శనివారం మంటలు మొదలై మొక్కజొన్న దంటుకు నిప్పంటుకుంది. ఆపై మంటలు అంతకంతకూ పెరుగుతూ సమీపంలోనే ఉన్న మాజీ సర్పంచ్ పాపగంటి నాగభూషణం పాలీహౌస్కు సైతం అంటుకున్నాయి. దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో వైరా నుంచి అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పివేశారు. అప్పటికే పాలీహౌస్ పాక్షికంగా కాలిపోగా రూ.2 లక్షల మేర నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపాడు. -
‘రోడ్డెక్కితేనే రవాణా చేస్తారా?’
బోనకల్: రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తేనే కొనుగో లు కేంద్రాల నుంచి మొక్కజొన్నలను తరలిస్తారా అని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతి నేని సుదర్శన్ ప్రశ్నించారు. మండలంలోని లక్ష్మీపురం, రావినూతలలో మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సరఫరా చేయాల్సిన గోనె సంచులను తామే కొనుగోలు చేశామని, చివరికి లారీని కూడా తమనే తెచ్చుకోమంటున్నారని రైతులు ఆయనకు వివరించారు. అనంతరం సుదర్శన్ మాట్లాడుతూ.. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా రైతుల గోడు పట్టడం లేదని విమర్శించారు. బస్తాలు కొనడమే కాక లారీ డ్రైవర్కు క్వింటాకు రూ.80 అదనంగా చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. బోనకల్ మండలంలోని కేంద్రాల్లో వేలాది బస్తాలు కాంటా వేసి ఉండగా, అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నందున ఇకనైనా స్పందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మందా కరుణ, రైతుసంఘం జిల్లా, మధిర డివిజన్ కార్యదర్శులు బొంతు రాంబాబు, దొండపాటి నాగేశ్వరరావు, నాయకులు మడిపల్లి గోపాల్రావు, కిలారు సురేశ్, మాదినేని వీరభద్రం, గుగులోతు నరేశ్, గుడ్డూరు వెంకటనర్సయ్య పాల్గొన్నారు. -
నీడనిద్దాం.. నీరు పోద్దాం..
ఇల్లెందురూరల్: భానుడు భగభగ మండుతున్నాడు. పగటి ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరువవుతోంది. ఇంట్లో కూలర్, ఫ్యాన్ ఉన్నా మనం ఇబ్బంది పడుతున్నాం. అలాంటిది ఎండలో పక్షులు నీడ, నీటి కోసం విలవిల్లాడుతుండడాన్ని గుర్తించా. అంతేకాక మా ఇంటి పెరడులో ఓ పక్షి ఎండకు సొమ్మసిల్లి పడిపోవడం చూసి జాలేసింది. దీంతో ఇంటి ఆవరణలో ఉన్న చెట్టుకు తాడు కట్టి ఒక మట్టిపాత్ర వేలాడదీశాను. అందులో క్రమం తప్పకుండా చల్లటి నీరు పోస్తున్నా. ఇక్కడకు పక్షులు వచ్చి నీరు తాగి కాసేపు ఉండి వెళ్తున్నాయి. నీరు తాగేందుకు వచ్చిన పక్షులను చూసినప్పుడల్లా నాకెంతో తృప్తిగా ఉంటుంది. మీరూ.. మీ ఇంటి ఆవరణలో చెట్ల కింద ఒక పాత్ర పెట్టి నీరు పోయండి. లేదా చెట్టుకు పాత్రను వేలాడి దీసి నీరు నింపండి. తద్వారా వేసవితాపానికి అల్లాడిపోతున్న పక్షులను ఆదుకునే ప్రయత్నం చేయండి. –కాసాని పార్థసారధి, స్టేషన్బస్తీ, ఇల్లెందు


