killed family
-
దారుణం : పిల్లల్ని కూడా వదిలిపెట్టలేదు
బ్యాంకాక్ : నూతన సంవత్సరానికి స్వాగతం చెబుతూ అత్తింటివారు చేసుకుంటున్న పార్టీకి తనని సరిగా ఆహ్వానించలేదని ఓ థాయ్ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తనకు మర్యాదలు చేయలేదని భావించి అత్తింటి వారిని, భార్యాపిల్లల్ని చంపి.. తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు... థాయ్ల్యాండ్కు చెందిన సుచీప్ సార్న్సంగ్ అనే వ్యక్తి భార్యాపిల్లలతో కలిసి కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొనేందుకు అత్తగారింటికి వెళ్లాడు. అయితే తనకు ఆహ్వానం పలికేందుకు ఎవరూ రాకపోవడాన్ని అతడు అవమానంగా భావించాడు. అందరూ కలిసి పార్టీ చేసుకుంటున్న సమయంలో ఫుల్లుగా మద్యం సేవించిన సుచీప్... అత్తామామలు, తన భార్యాపిల్లల(తొమ్మిదేళ్ల కొడుకు, ఆరేళ్ల కూతురు)ను తుపాకీతో కాల్చి చంపేశాడు. ఆ తర్వాత తను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. -
తల్లి, భార్య, కూతుర్లను నరికి చంపాడు
అనంతపురం(కంబదూరు): కంబదూరు మండలం నూతిమడుగులో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. సోమశేఖర్(40) అనే మతిస్థిమితం లేని వ్యక్తి తల్లి, భార్యా, కుమార్తెలను పాశవికంగా నరికి చంపాడు. ఆ తర్వాత తాను గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో తల్లి నర్సమ్మ(54), భార్య రామాంజమ్మ(34), కుమార్తె చిన్ను(4) అక్కడిక్కడే మరణించారు.ఈ హఠాత్పరిణామంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.