Kondapeta Village
-
ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య
కొండపేట(చెన్నూరు): చెన్నూరు మండలంలోని కొండపేట గ్రామానికి చెందిన జెండాల మస్తాన్(36) అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ వినోద్కుమార్, మృతుని బంధువుల కథనం మేరకు..మస్తాన్ ట్రాక్టర్లో వరిపొట్టు పోసే కూలీగా వెళ్లేవాడు. బుధవారం రాత్రి భార్య, కుమారుడు, అదే గ్రామంలో ఉండే బంధువుల ఇంటికి వెళ్లారు. రాత్రి బాగా కడుపు నొప్పిగా ఉందని కుమార్తెకు చెప్పడంతో తల్లికి ఫోన్చేసి చెప్పింది. ఈ వేళలో వెళ్లేందుకు ఇబ్బందని ఉదయాన్నే వెళదామని చెప్పడంతో కుమార్తెను పడుకోమని చెప్పి, మస్తాన్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయాన్నే కొడుకు వెళ్లి తలుపు తట్టగా తీయకపోవడంతో తోసి చూడగా పైపునకువేలాడుతూ కనిపించాడు. పక్కింటి వారి సాయంతో కిందకు దించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని రిమ్స్కు తరలించారు. విచారణ చేస్తున్నామని ఎస్ఐ వివరించారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
కలసపాడు: మండలం పరిధిలోని పాతరామాపురం వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కొండపేట గ్రామానికి చెందిన బొజ్జా బాలకొండయ్య దుర్మరణం చెందాడు. మరో వ్యక్తి బొజ్జా నరసింహులు తీవ్రగాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండపేట గ్రామానికి చెందిన బొజ్జా బాలకొండయ్య కలసపాడు నుంచి గురువారం రాత్రి హైదరాబాద్ వెళ్లేందుకు బద్వేల్ డిపో హైటెక్ బస్సుకు టికెట్ రిజర్వేషన్ చేసుకున్నారు. బాల కొండయ్య గ్రామం నుంచి కలసపాడులో బస్సు ఎక్కేందుకు ఆలస్యంగా రావడంతో బస్సు వెళ్లిపోయింది. ఆ బస్సునే ఆందుకునేందుకు మృత్యుడు బాలకొండయ్య అతని అన్న కుమారుడు బొజ్జా నరసిం హులు ద్విచక్రవాహనం పై వేగంగా గిద్దలూరు రోడ్డుపై వెళ్లారు. కలసపాడు శివారున పాతరామాపురం గ్రామం వద్ద తెలుగు గంగ బ్రిడ్జి దాటిన తరువాత దిగువన ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డుపై పడింది. బాలకొండయ్యకు తీవ్రగాయాలు కాగా అతనిని వెంటనే చికిత్స నిమిత్తం పోరుమామిళ్లకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్లు తెలిపారు. వాహనం నడుపుతున్న నరసింహులుకు చిన్నచిన్న గాయాలయ్యాయి.