Krishna District Latest News
-
సందేశాత్మకం.. హాస్యభరితం
● సుందరయ్య కళానిలయం ఆధ్వర్యంలో జాతీయస్థాయి నాటికల ప్రదర్శన ● యడ్లపాడులో ఎంవీ చౌదరి వేదికపై ప్రదర్శనలు ● మూడోరోజు అలరించిన మూడు నాటికలు యడ్లపాడు: స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 22వ జాతీయస్థాయి నాటికల పోటీలు కొనసాగుతున్నాయి. మూడో రోజు ఆదివారం మూడు సందేశాత్మక నాటికలు ఎంవీ కళావేదికపై ప్రదర్శితం అయ్యాయి. కళానిలయం అధ్యక్షుడు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు, అరుణకుమారి దంపతులు పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కళానిలయం ప్రతినిధులు ముత్తవరపు రామారావు, పద్మారావు, నూతలపాటి కాళిదాసు, జరుగుల రామారావు, శంకరరావు తదితరులు పర్యవేక్షించారు. ఆడపిల్లలకు సందేశం ‘నాన్న నేనొచ్చేస్తా’ పెళ్లంటే సర్దుబాటు.. సంసారం అంటే దిద్దుబాటు అనే విషయాన్ని మహిళలు తెలుసుకోవాలనే సందేశాన్ని గుంటూరు అమృతలహరి థియేటర్ ఆర్ట్స్ వారు ప్రదర్శించిన నాన్న నేనొచ్చేస్తా నాటిక ద్వారా ఇచ్చారు. ప్రతి తల్లితండ్రి మనసులో ఉండే పరమశక్తి ప్రేమ. పిల్లలు ఎదగాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, తాము పొందలేనిది వారికి ఇవ్వాలన్న తపన తల్లిదండ్రుల్లో ఉండటం సహజం. కానీ వివాహం తర్వాత వచ్చిన సమస్యల్లో, తల్లిదండ్రుల అభిమానం వల్ల ఆడపిల్లలకు సహనశక్తి తక్కువైపోతుంది. బాధ్యతను విడిచిపెట్టి, భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది వ్యక్తిగత వైఫల్యం మాత్రమే కాదు, సమాజంలో వేళ్లూనుకున్న ‘అత్యధిక అనురాగం’ అనే కొత్త వ్యాధికి నిదర్శనమని ప్రదర్శన ద్వారా హెచ్చరిక చేశారు. తాకబత్తుల వెంకటేశ్వరరావు రచన చేయగా, అమృత లహరి దర్శకత్వం వహించారు. అందరిలోనూ కనిపించే మంచితనం ‘బ్రహ్మస్వరూపం’ స్వచ్ఛమైన దృష్టితో చూస్తే ప్రతి వ్యక్తిలోనూ మంచితనం కనిపించి ప్రపంచం మమకారాల నిలయంగా అనిపిస్తోందనే విజయవాడ మైత్రి కళానిలయం వారు తమ కళారూపం ద్వారా చూపే ప్రయత్నం చేశారు. శాంతియుత జీవితంలోకి ఊహించని కష్టాలు వస్తే, ప్రతికూల శక్తుల రూపంలో విధి విఘాతం కలిగిస్తే, నిరాశ నిస్పృహాలతో ఉన్న ఆ క్షణాన ధర్మస్థాపనకై సాక్షాత్తూ బ్రహ్మస్వరూపం ప్రత్యక్షమై, తుదితీర్పును ప్రసాదిస్తాడని సందేశాన్నిచ్చే కథాంశమే ఈ నాటిక. శ్రీ స్నిగ్ధ రచించగా, టీవీ పురుషోత్తం దర్శకత్వం వహించారు. హాస్యభరితం ‘బావా ఎప్పుడు వచ్చితివి’ కుటుంబ సంబంధాలు మరింత బలపడాలంటే అమ్మ, నాన్న, అక్క, బావ వంటి ప్రేమతో నిండిన పిలుపులే రుజువులు. అవి అనురాగాలకు మూలస్తంభాలుగా నిలుస్తాయి. వీటిని హృద్యంగా, హాస్యరసంతో హత్తుకునేలా వినోదాన్ని అందించిన యడ్లపాడు మానవతా సంస్థ నాటిక ‘బావా ఎప్పుడు వచ్చితివి’. ఈ నాటికలో కుటుంబ పిలుపులు అర్థభేదాలకూ, అపోహలకూ దారితీయగలవని, కొన్నిసార్లు మహిళల మనోభావాల్ని గాయపరచగలవని, భర్తకు అవమానం గానీ, అనుమానం గానీ కలిగించగలవని ఆద్యంతం హాస్యాన్ని మేళవించి కడుపుబ్బ నవ్వించారు. స్వర్గీయ పీవీ భవానీప్రసాద్ రచించగా, సినీదర్శకుడు జరుగుల రామారావు దర్శకత్వం వహించిన ఈ నాటికలో యడ్లపాడుకు చెందిన కళాకారులు ప్రదర్శించిన ప్రత్యేక ప్రదర్శన ఆహుతుల్ని ఎంతో ఆకట్టుకుంది. -
‘మణి’ మాస్టారు ఇకలేరు
చల్లపల్లి(అవనిగడ్డ): జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, రిటైర్డు ప్రధానోపాధ్యాయుడు కొక్కిలిగడ్డ మణిప్రభాకరరావు(75) మాస్టారు గుండె పోటుతో ఆదివారం మృతి చెందారు. తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటిన విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు. కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ మణిప్రభాకరరావు ఉపాధ్యాయ వృత్తిలో విశేష సేవలందించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నో అవార్డులు అందుకున్నారు. అవివాహితుడైన మణిమాస్టార్ సమాజ సేవకే అంకితమయ్యారు. స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చల్లపల్లిలో లయన్స్ క్లబ్ ఏర్పాటు చేసిన నాటినుంచి తన సేవలు అందిస్తూ ప్రస్తుతం చార్టర్ సభ్యులుగా కొనసాగుతున్నారు. మణి ప్రభాకరావు మాస్టారు భౌతికకాయాన్ని ఆదివారం సాయంత్రం స్వగ్రామమైన వక్కలగడ్డకు తీసుకురాగా పలువురు సందర్శించి ఆయనకు ఘన నివాళులర్పించారు. పలువురు నిరుపేద విద్యార్థులు, అనాథలకు తన ఇంటిలోనే ఆశ్రయం కల్పించి వారికి విద్యాబుద్ధులు నేర్పించిన మహోన్నత వ్యక్తి మణిప్రభాకరరావు మాస్టారు అని స్థానికులు కొనియాడారు. -
దుర్గమ్మకు విశేష పుష్పార్చన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):వసంత నవరాత్రోత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆదివారం విశేష పుష్పార్చన చేశారు ఉత్సవాలలో భాగంగా ఎనిమిదో రోజైన ఆదివారం అమ్మవారికి చామంతి, సంపంగి పూలతో విశేష అర్చన నిర్వహించారు. తొలుత అర్చన నిమిత్తం సేకరించిన పుష్పాలను అర్చకులు, ఆలయ అధికారులు, సిబ్బంది కలసి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ప్రధాన ఆలయానికి తీసుకువచ్చారు. అమ్మవారి మూలవిరాట్కు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం పూజా మండపానికి చేరుకున్నారు. పూజా మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి తెల్ల, పచ్చ చామంతి, సంపంగి, మల్లెలు, మందార పుష్పాలతో ఆలయ అర్చకులు అర్చన చేశారు. విశేష పుష్పార్చనలో ఉభయదాతలు, భక్తులు, ఆలయ అర్చకుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారికి పంచహారతుల సేవ నిర్వహించారు. ఉభయదాతలకు అమ్మవారికి అర్చన నిర్వహించిన పుష్పాలను అందజేశారు. అనంతరం ప్రత్యేక క్యూలైన్ ద్వారా వారిని అమ్మవారి దర్శనానికి అనుమతించారు. -
ఈ–డైరెక్టరీ ఆవిష్కరణ
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎనస్తీయాలజిస్ట్స్ విజయవాడ సిటీ బ్రాంచ్ ఈ– డైరెక్టరీని ఆదివారం ఐఎంఏ హాల్లో డాక్టర్ భవానీశంకర్ (యూఎస్ఏ) ఆవిష్కరించారు. విజయవాడ సొసైటీ ఆఫ్ ఎనస్తీషియాలజిస్టు ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ)లో భాగంగా ఆయన క్యాఫ్నోగ్రఫీ, అబ్స్టెట్రిక్ ఎనస్తీషియాను వివరించారు. ఈ సందర్భంగా పలువురి సందేహాలను నివృత్తి చేశారు. సంఘ రాష్ట్ర అకడమిక్ చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి తారకప్రసాద్ మాట్లాడుతూ ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎనస్తీయాలజిస్ట్స్ విజయవాడ సిటీ బ్రాంచ్ ఈ– డైరెక్టరీ ఆవిష్కరించడం అభినందనీయమని కొనియాడారు. ఈ–డైరెక్టరీలో విజయవాడకు చెందిన 150 మంది ఎనస్తీషియా వైద్యుల వివరాలు పొందుపరిచినట్లు తెలిపారు. డైరెక్టరీని తయారు చేసిన డాక్టర్ దివ్యరావెళ్ల, డాక్టర్ కీర్తి చిగురుపాటిని అభినందించారు. అనంతరం డాక్టర్ కె.భవానీశంకర్ను అభినందించారు. కార్యక్రమంలో ఐఎస్ఏ పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎంవీ భీమేశ్వర్, డాక్టర్ కిరణ్, డాక్టర్ ఫణి, డాక్టర్ రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
శోభాయాత్రను అడ్డుకున్న పోలీసులు
వీరులపాడు: శ్రీరామనవమి పండుగ సందర్భంగా వీరులపాడు మండలం అల్లూరు గ్రామంలో మాజీ సర్పంచ్ కోటేరు సూర్యనారాయణరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ కోటేరు మల్లీశ్వరి ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రభలను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ గ్రామానికి చెందిన మహిళా భక్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. విషయం తెలుసుకున్న నందిగామ మాజీఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు అక్కడకు చేరుకుని పోలీసుల తీరుపై మండిపడ్డారు. గ్రామంలో టీడీపీ, వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పండుగ వేడుకలను నిర్వహిస్తుండగా టీడీపీ వారి వేడుకలకు డీజే పర్మిషన్ ఇచ్చి వైఎస్సార్ సీపీ కార్యక్రమానికి పర్మిషన్ లేదనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఒకరికి పర్మిషన్ ఉందని మరొకరికి పర్మిషన్ లేదంటూ పోలీసులు పక్షపాత వైఖరి చూపడం తగదన్నారు. నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన పోలీసులు అధికారపార్టీకి కొమ్ముకాస్తుండటం రాజ్యాంగ విరుద్ధమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగ వేడుకలను సైతం రాజకీయకోణంలో చూస్తూ అడ్డంకులు సృష్టించడం ఏమిటని పోలీసులను ప్రశ్నించారు. గ్రామానికి చెందిన మహిళలు పెద్దసంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసుల తీరును తప్పుపట్టారు. ఒకరికి మైకు పర్మిషన్ ఇచ్చి మరొకరికి ఇవ్వకపోవటమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు రహదారిపై నిరసనకు దిగడం చట్టవిరుద్ధమంటూ మహిళలను అక్కడి నుంచి పంపించివేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన మహిళలు పోలీసుల తీరును ఖండించిన మాజీఎమ్మెల్యే జగన్మోహనరావు -
తప్పిన పెనుప్రమాదం
గుడివాడరూరల్: స్థానిక రాజేంద్రనగర్లోని ఆర్టీవో కార్యాలయం ఎదురుగా వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి చెందిన ఓ అపార్టుమెంట్ 2వ అంతస్తు ఫ్లాట్ నంబరు 202లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి వెళ్లి మంటలు చుట్టుపక్కల వ్యాప్తి చెందకుండా అదుపు చేశారు. ఈ ఘటనలో ఎటువంటి ఆస్తినష్టం జరుగలేదు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఎస్టీ కమిషన్ ఎదుట హాజరుకానున్న దేవదాయశాఖ కమిషనర్ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): జాతీయ ఎస్టీ కమిషన్ ఎదుట రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఈనెల 8వ తేదీన హాజరుకానున్నారు. దుర్గగుడి సీనియర్ అసిస్టెంట్ నాగేశ్వరరావు తన ఉద్యోగోన్నతి వ్యవహారంలో అన్యాయం జరుగుతుందంటూ గతనెలలో జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో 8వ తేదీన ఢిల్లీలోని కమిషన్ కార్యాలయానికి రావాలంటూ దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఫిర్యాదీ నాగేశ్వరరావుకు ఆదేశాలు అందాయి. 2021లో ఆలయ చీరల విభాగంలో గోల్మాల్ జరిగిందంటూ నాగేశ్వరరావును దేవస్థానం ఉన్నతాధికారులు ఐదునెలలపాటు సస్పెండ్ చేశారు. ఈవ్యవహారంతో నాగేశ్వరరావుకు రావాల్సిన ఇంక్రిమెంట్, ప్రమోషన్ నిలిచిపోయింది. దీంతో కోర్టును ఆశ్రయించిన నాగేశ్వరరావు ఆ ఆరోపణలను ఖండిస్తూ చీరలను ఆలయ అధికారులకు లెక్క చూపారు. ఈ విషయంపై ప్రత్యేక కమిటీ సైతం నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో తనకు న్యాయం జరిగేలా చూడాలంటూ నాగేశ్వరరావు ఫిర్యాదు చేయడంతో 8వ తేదీన జరిగే విచారణకు ప్రమోషన్కు సంబంధించి అన్ని ఒరిజినల్ రికార్డులతో హాజరు కావాలంటూ జాతీయ ఎస్టీ కమిషన్ దేవదాయశాఖ కమిషనర్కు ఆదేశాలు జారీ చేసింది. అపార్టుమెంట్లో మంటలు అదుపుచేసిన ఫైర్ సిబ్బంది -
బూజు పట్టి.. తుప్పు కంపుకొట్టి
కంకిపాడు: బూజు పట్టి.. తప్పు కంపు కొడుతున్న టేక్ హోం రేషన్ గర్భిణులు, బాలింతలకు అందుతోంది. గర్భిణులు, బాలింతలకు అవసరమైన పోషకాలను సమకూర్చడానికి ప్రభుత్వం సరఫరా చేస్తున్న టేక్ హోం రేషన్ కిట్లు నాసిరకంగా ఉన్నాయి. ఈ కిట్లు వినియోగిస్తే పోషకాలు మాటేమో కానీ, ఆస్పత్రి పాలవడం మాత్రం ఖాయమని పలువురు తల్లులు వాపోతున్నారు. ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణా లోపం కారణంగా నాసిరకం పౌష్టికాహారం కిట్లు సరఫరా అవుతున్నాయన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కంకిపాడు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో..కంకిపాడు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో కంకిపాడు మండలంలో 62 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 520 మంది వరకూ గర్భిణులు, బాలింతలు ఉన్నారు. వీరికి ప్రతినెలా టేక్ హోం రేషన్ కిట్ పేరుతో 5 లీటర్ల పాలు, 25 గుడ్లు, 250 గ్రాముల ఎండు కర్జూరం, 200 గ్రాములు పల్లీ చిక్కీలు, 3 కిలోలు బియ్యం, 250 గ్రాములు బెల్లం, కిలో అటుకులు, 2 కిలోలు రాగిపిండి, అరలీటరు పామాయిల్, కిలో కందిపప్పు సరఫరా చేస్తున్నారు. కర్జూర ప్యాకెట్లు తెరిస్తే వాసన..టేక్ హోం రేషన్ కిట్ గత నెల 25న అన్ని అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యింది. నెల ఆరంభంలో రావాల్సిన కిట్ నెలాఖరుకు రావటంతో వీటిని ఆయా కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు సిబ్బంది హడావిడిగా పంపిణీ చేసేశారు. ఈ కిట్లోని ఎండు కర్జూరం బూజుపట్టి పాడైన కాయలు వచ్చాయి. ఒక్క పాక్యెట్లో కనీసం ఐదు కాయలు పైగా పాడై ప్యాకెట్ తెరవగానే దుర్గంధం వచ్చిన పరిస్థితి. బెల్లం తుప్పు కంపుకొడుతోందని సమాచారం. రాగిపిండి జల్లెడ పడితే పొట్టుతో కూడిన వ్యర్థాలు వస్తున్నాయని చెబుతున్నారు. కంకిపాడు పట్టణంలోని ఓ వార్డులో తనకు వచ్చిన కిట్లో సామాగ్రి నాణ్యత లేకపోవడంపై ఓ మహిళ అధికారులకు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఆ కిట్ను తీసుకుని మరో కిట్ను అందించినట్లు అధికారులు చెప్పడం నాసిరకంగా కిట్లు వస్తున్నాయన్న విమర్శలకు బలం చేకూరుస్తోంది. పర్యవేక్షణ సున్నా..కిట్ల సరఫరా, పంపిణీ విధానంపై ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కిట్లు అంగన్వాడీ కేంద్రాలకు చేరుకోగానే కనీసం ఏదో ఒక కేంద్రాన్ని అధికారులు సందర్శించి కిట్ల నాణ్యత పరిశీలించడం, పంపిణీని పర్యవేక్షించడంలో లోపం కారణంగా నాసిరకంగా కిట్లు వస్తున్నాయన్న విమర్శలున్నాయి. ఫలితంగా గర్భిణులు, బాలింతల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉంది. దీనిపై అధికారులు ఏ మేరకు చర్యలు చేపడతారో వేచిచూడాల్సి ఉంది. మూడు నెలలుగా బెల్లం అధ్వానం నాణ్యత లేని రాగిపిండి నాసిరకం బెల్లం, ఎండు కర్జూరం గర్భిణులు, బాలింతలకు అందుతున్న టేక్హోం రేషన్ ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణ శూన్యం బెల్లం సరఫరా మూడు నెలలుగా అధ్వానంగా ఉంటోందని సమాచారం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పావు కిలో బెల్లం అచ్చు లబ్ధిదారులకు సరఫరా జరిగింది. కూటమి పాలనలో ఈ మూడు నెలల్లో టేక్ హోం రేషన్ కిట్లు నాణ్యత పూర్తిగా దెబ్బతిందని తెలుస్తోంది. మూడు నెలలుగా ముక్కలు ముక్కలుగా ఉన్న బెల్లం ప్యాకెట్లను సరఫరా చేస్తున్నారని, అది కూడా తినే పరిస్థితి లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాడైతే తిరిగి ఇచ్చేయండి..నెలాఖరుకు కిట్లు రావటం, వరుసగా సెలవులతో కిట్లు డ్యామేజ్ అయ్యాయి. రేషన్ కిట్లు తీసుకునే లబ్ధిదారులు చెక్ చేసుకుని, పాడైతే వెంటనే తిరిగి ఇచ్చేయాలి. అప్పుడు ఆరోగ్య సమస్యలు ఉండవు. కంకిపాడులో ఓ మహిళ ఫోన్ చేస్తే విచారణ చేసి కిట్ను మార్చి ఇచ్చాం. ఎవరి వద్ద పాడైన కిట్లు ఉన్నాయో కేంద్రానికి తీసుకురావాలని సూచించాం. ఉన్నతాధికారుల దృష్టిలో సమస్య ఉంచాం. నెలాఖరుకు కిట్లు రావడంతో హడావిడి అయ్యింది. – కె.బి. సుకన్య, సీడీపీఓ, ఐసీడీఎస్ ప్రాజెక్టు, కంకిపాడు -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
జూపూడి(ఇబ్రహీంపట్నం): అనుమానాస్పద స్థితిలో ఓవ్యక్తి మృతి చెందిన ఘటన ఇబ్రహీంపట్నం మండలంలోని జూపూడి మద్యం దుకాణం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున వెలుగుచూసింది. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంట కాలువలో మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతుడు కిలేశపురం గ్రామానికి చెందిన జూటూరి నాగరాజు(45)గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే. కిలేశపురం గ్రామానికి చెందిన జూటూరి నాగరాజు ఇంటికి శనివారం గుంటూరుకు చెందిన ఇద్దరు బంధువులు వచ్చారు. వారితో కలిసి మద్యం సేవించేందుకు ఆరోజు రాత్రి మద్యం దుకాణానికి వెళ్లారు. అర్థరాత్రి అయినా భర్త ఇంటికి చేరలేదని భార్య పిల్లలు ఆరా తీశారు. బంధువులతోపాటు గుంటూరు వెళ్లి ఉంటాడని భావించారు. ఈక్రమంలో ఆదివారం ఉదయం పోలీసులు నాగరాజు కుటుంబసభ్యులకు ఈ మేరకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న నాగరాజు భార్య చంద్రమ్మ, కుటుంబసభ్యులు కలసి గుంటూరు బంధువులను ఆరా తీసేందుకు ఫోన్చేయగా వారి ఫోన్లు స్విచ్చాఫ్లో ఉన్నాయి. రాతిక్వారీలో పనిచేసే నాగరాజు తన ఇద్దరు పిల్లలను చదివించి వెయిట్ లిఫ్టింగ్లో కోచింగ్ ఇప్పించాడు. పెద్ద కుమారుడు జూటూరి కోటేశ్వరరావు మూడేళ్ల కిందట జాతీయస్థాయి ఖేల్ ఇండియా పోటీల్లో పతకం సాధించాడు. కాయకష్టంతో బతికీడుస్తున్న కుటుంబంలో పెద్దదిక్కు కోల్పోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నాగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన పోలీసులు, ఈ మేరకు అతనిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పగలురాత్రీ తేడా లేకుండా మద్యం అందుబాటులో ఉండటంతో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
చెట్టుపై నుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతి
కోడూరు:రపమాదవశాత్తు చెట్టు మీద నుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతిచెందిన ఘటన కోడూరు పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. మండలంలోని ఉల్లిపాలెం గ్రామానికి చెందిన ఉప్పాల ఏసు (52) తాడిచెట్ల నుంచి కల్లుగీస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే శనివారం సాయంత్రం కూడా ఏసు తాడిచెట్టు ఎక్కి కల్లుగీస్తుండగా ప్రమాదవశాత్తు మోకు తెగడంతో కింద పడిపోయాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలైన ఏసును స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. మృతుడు భార్య అనురాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెచ్సీ విక్రమ్ తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ వివాదంలో యువకుడికి తీవ్రగాయాలు తిరువూరు: స్థానిక మునుకుళ్ళ రోడ్డులో క్రికెట్ బెట్టింగ్ విషయంలో ఇద్దరు యువకుల మధ్య ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. గత నెల 30న జరిగిన సీఎస్కే ఆర్సీబీ ఐపీఎల్ మ్యాచ్పై కర్రి నవీన్కుమార్, కొయ్యల గంగా మహేష్ బెట్టింగ్ కాశారు. ఎవరు గెలిచినా రెండోవారు ఒక క్వార్టర్ బాటిల్ మద్యం కొని ఇవ్వాలని బెట్టింగ్ కాసినపుడు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయంలో ఆదివారం ఇరువురి మధ్య మాటామాటా పెరగడంతోపాటు మద్యం మత్తులో ఉన్న మహేష్, ఖాళీ సీసాతో నవీన్పై దాడిచేశాడు. ఈఘటనలో నవీన్ తల, శరీరభాగాలపై తీవ్రగాయాలు కావడంతో అతన్ని తిరువూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదవశాత్తూ వ్యక్తి మృతి తాడేపల్లి రూరల్ : కుంచనపల్లిలోని ఓ అపార్ట్మెంట్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఓవ్యక్తి మృతి చెందిన ఘటనపై తాడేపల్లి పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ ఖాజావలి కథనం ప్రకారం.. కుంచనపల్లి అపర్ణ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ 8వ ఫ్లోర్లో తుళ్లూరు మండలం వెంకటపాలెంకు చెందిన పాటిబండ్ల సదాశివరావు (53) ఆయన భార్య మాధవి, కుమార్తె నివాసం ఉంటున్నారు. ఉదయం బాల్కనీలో వాకింగ్ చేస్తుండగా సదాశివరావు కళ్లుతిరిగి 8వ అంతస్తు పైనుంచి కిందకి పడిపోయాడు. అక్కడికక్కడే మరణించాడు. భార్య మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఖాజావలి తెలిపారు. -
అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో విజయవాడకు చెందిన కళాక్షేత్ర నృత్య కళాబృంద సభ్యులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కళావేదికపై సీహెచ్ తన్మయి పర్యవేక్షణలో 25మంది కళా బృంద సభ్యులు పలు కీర్తనలకు లయబద్ధంగా నృత్య ప్రదర్శన ఇచ్చారు. సాయంత్రం పంచహారతుల సేవ అనంతరం అమ్మవారిని దర్శించుకుని కళావేదిక వద్దకు చేరుకున్న భక్తులు నృత్య ప్రదర్శనను ఆద్యంతం ఎంతో ఆసక్తితో వీక్షించి చిన్నారులను అభినందించారు. అనంతరం ఆలయ అధికారులు, కళాబృందానికి అమ్మవారి దర్శనం కల్పించి ప్రసాదాలను అందజేశారు. -
రమణీయం.. సీతారామ కల్యాణం
జగదభిరాముడి కల్యాణం వేళ.. జగమంతా ఆనందంతో పరవశించింది. రాతిని నాతిని చేసిన మహిమాన్వితుడు రఘురాముడి పెళ్లి సందర్భంగా వాడవాడాలా రామనామ స్మరణతో పులకించింది. ఉమ్మడి జిల్లాలో శ్రీరామనవమి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పల్లెలు, పట్టణాల్లో రామాలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి కనిపించింది. వేడుకల్లో సీతారాముల కల్యాణాన్ని కనులపండవగా చేశారు. చలువ పందిళ్ల కింద జగదానందకారకుడైన శ్రీరాముడు, సీతాదేవిల విగ్రహాలకు వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ కల్యాణ క్రతువు ఘనంగా జరిగింది. ఉత్సవ కమిటీలు పానకాన్ని తయారుచేసి పంపిణీ చేశారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
కృష్ణాజిల్లా
సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025నేడు ప్రజాసమస్యల పరిష్కార వేదికచిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్లో జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదికలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి అర్జీలను స్వీకరిస్తారని కలెక్టర్ బాలాజీ తెలిపారు. ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 516.60 అడుగుల వద్ద ఉంది. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకు 3,031 క్యూసెక్కులు విడుదలవుతోంది. అన్నదానానికి విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై నిత్యాన్నదానానికి కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన శ్రీరామ్చరణ్తేజ కుటుంబం రూ.లక్ష విరాళం అందజేసింది. 7 -
ఢిల్లీకి కృష్ణా జేసీ
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ విధి నిర్వహణలో భాగంగా ఆదివారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. సోమ, మంగళ, బుధవారాల్లో ఢిల్లీలో డిజాస్టర్ మేనేజ్మెంట్పై జరిగే శిక్షణలో పాల్గొననున్నారు. కలెక్టర్ డీకే బాలాజీ జాయింట్ కలెక్టర్ బాధ్యతలను మూడు రోజుల పాటు అదనంగా నిర్వహించనున్నారు. దుర్గమ్మ సన్నిధిలో సీతారామ కల్యాణం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీరామ నవమి పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం శ్రీసీతారామ కల్యాణం కనుల పండువగా జరిగింది. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాంగణంలోని కళావేదికను కల్యాణ వేడుకకు ముస్తాబు చేశారు. ఘాట్రోడ్డులోని వీరాంజనేయస్వామి ఆలయం నుంచి శ్రీసీతారామ లక్ష్మణ, వీరాంజనేయస్వామి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చారు. అర్చకులు, వేద పండితులు కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం సీతారాముల కల్యాణం విశిష్టతను అర్చకులు తెలిపారు. కల్యాణాన్ని ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు లింగంభొట్ల దుర్గాప్రసాద్, యజ్ఞనారాయణ శర్మ ఇతర అర్చకులు, వేద పండితులు జరిపించారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా కళావేదిక వద్ద కూలర్లు ఏర్పాటు చేశారు. 4.10 ఎకరాల భూమి విరాళం నందివాడ: శ్రీరామనవమి సందర్భంగా నందివాడ మండలంలో లక్ష్మీ నరసింహపురంగ్రామం కొత్తూరు సెంటర్లోని శ్రీ కోదండ రామాలయానికి పమిడి అచ్యుతరావు, మణిమ్మ దంపతులు 4.10 ఎకరాలను విరాళంగా ఇచ్చారు. ఆలయ కమిటీ పెద్దలు సింగ వరపు సత్యనారాయణ, సువ్వారి వెంకట రంగారావు, హనుమంతు పాపారావు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. పవర్ లిఫ్టింగ్ పోటీలకు ‘ఎల్హెచ్ఆర్’ విద్యార్థి మైలవరం: జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు మైలవరం ఎల్హెచ్ఆర్ కళాశాలలో బీఎస్సీ మూడో సంవత్సరం విద్యార్థి సీహెచ్ దుర్గాప్రసాద్ కృష్ణా విశ్వవిద్యాలయం తరఫున ఎంపికై నట్లు కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ మేజర్ మన్నే స్వామి ఆదివారం తెలిపారు. ఈ నెల 7, 8 తేదీల్లో జమ్మూ కాశ్మీర్లోని యూనివర్సిటీ ఆఫ్ కశ్మీర్లోని భారత జాతీయ అంతర్ విశ్వవిద్యాలయాల పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొననున్నారు. విజయవాడ ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రసాద్ ప్రతిభ చూపి 67 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించాడని ఆయన తెలిపారు. అతను ఎంపిక కావడం సంతోషంగా ఉందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇళ్ల రవి పేర్కొన్నారు. అతన్ని కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు అభినందించారు. వేణుగోపాలస్వామి ఆలయ ఆవిర్భావ దినోత్సవం తిరువూరు: నెమలి శ్రీవేణుగోపాలస్వామి ఆలయ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఆలయ అర్చకుడు తిరునగరి గోపాలాచార్యులు ఆధ్వర్యాన స్వామివారికి విశేష పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం జరిగింది. దత్తత దేవాలయమైన శ్రీప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో రామనవమి సందర్భంగా సీతారామ కల్యాణం చేశారు. ఆలయ సహాయ కమిషనర్ సంధ్య పర్యవేక్షించారు. -
వైభవంగా శోభాయాత్ర
మచిలీపట్నంటౌన్: శ్రీరామనవమి సందర్భంగా హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యాన ఆదివారం మచిలీపట్నం నగరంలో శ్రీరామ శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. సాయంత్రం హిందూ కళాశాల వద్ద నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీలో వందలాది మంది భక్తులు స్వచ్ఛందంగా పాల్గొని జై శ్రీరామ్.. జై హనుమాన్.. నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు. ర్యాలీ వెంట, ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ర్యాలీలో వైఎస్సార్ సీపీ మచిలీపట్నం నియోజకవర్గ కన్వీనర్ పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. పలువురు ముస్లింలు యాత్రలో పాల్గొన్న శ్రీరాముని భక్తులకు శీతల పానీయాలను అందజేసి మతసామరస్యాన్ని చాటుకున్నారు. శ్రీరాముని జీవిత విశేషాలను సమాజానికి తెలిపేందుకు ఈ యాత్ర చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. -
మళ్లీ నిషేధిత జాబితాలోకి చేర్చారు
అప్పటి టీడీపీ ప్రభుత్వం మా భూములను 22ఏ నిషేధిత జాబితాలోకి చేర్చి హక్కులను కోల్పోయేలా చేసింది. నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల గోడును అర్థం చేసుకొని 22ఏ నిషేధిత భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ జీవోను జారీ చేశారు. ప్రసుత్తం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాజధాని అభివృద్ధి పేరుతో తీరప్రాంత భూములను నిషేధిత జాబితాలోకి చేర్చడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. – కమ్మిలి కోటేశ్వరరావు, రైతు, ఉల్లిపాలెం, కోడూరు సాక్షి ప్రతినిధి, విజయవాడ: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిషేధిత భూములకు విముక్తి కలిగిస్తే.. కూటమి సర్కార్ మళ్లీ ‘చుక్క’ పెట్టింది. ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటూ, రైతుల ఆధీనంలో ఉన్న భూములను నిషేధిత భూముల్లోకి చేర్చింది. 2016లో చంద్రబాబు హయంలోనే చుక్కల భూములను 22ఏ(1) నిషేధిత భూముల్లో చేర్చారు. దీంతో భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. వారి అవసరాలకు అవి ఉపయోగపడని పరిస్థితి. గత సెప్టెంబర్లోనే నిషేధిత జాబితాలో.. ఈ సమస్యను గత ప్రభుత్వంలో నాటి సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసి క్షేత్రస్థాయిలో విచారణ చేసి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో భాగంగానే అర్హులైన రైతులకు యజమాన్య హక్కులు కల్పించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి ఆ భూములను గత ఏడాది సెప్టెంబరులో నిషేధిత భూముల జాబితాలో చేర్చింది. 35,669 ఎకరాల భూములకు విముక్తి ఎన్నో ఏళ్ల నుంచి రైతులు సాగుచేసుకుంటున్న, రిజిస్ట్రేషన్ అయిన భూములను 2016లో నాటి సీఎం చంద్రబాబు 196 జీవో ద్వారా నిషేధిత జాబితాలో చేర్చారు. రాష్ట్రలోని 355 గ్రామాల్లో 22,042 మంది రైతులకు సంబంధించి 35,699 ఎకరాలు నిషేధిత భూముల జాబితాలో చేరాయి. ఈ సమస్య కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంది. 10,019 మంది రైతులకు సంబంఽధించి 15,791 ఎకరాలు నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయి. 2022 ఆగస్టులో నాటి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు, ఆనాటి కలెక్టర్.. నాటి సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి చర్యలు చేపట్టారు. దీంతో 2022 అక్టోబర్ 20న అవనిగడ్డలో బహిరంగసభ ఏర్పాటు చేసి 22ఏ (1) నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించి, రైతులకు యాజమాన్య హక్కు పత్రాలు అందజేశారు. చికిత్సకు డబ్బులు అందక ప్రాణం పోయింది ముంబయిలో ఉంటున్న కె.నాగేశ్వరరావుకు కోడూరు మండలం సాలెంపాలెం రెవెన్యూ పరిధిలో ఎకరం పొలం ఉంది. గతంలో 22ఏ(1) కింద ఉన్న ఈ భూమిని మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించారు. చంద్రబాబు వచ్చాక సర్వే పేరుతో మళ్లీ చుక్కల భూమిలో చేర్చారు. ప్రైవేటు ఉద్యోగి నాగేశ్వరరావుకు నాలుగు నెలల క్రితం కిడ్నీ సంబంధిత సమస్య వచ్చింది. ముంబయిలో ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పిస్తే రోజుకు రూ.8వేలు ఖర్చు అవుతుందన్నారు. ఇక్కడనున్న పొలాన్ని బ్యాంకులో తనఖా పెట్టి డబ్బులు తీసుకుందామని ఆయన భార్య ప్రభావతి ఇక్కడకు వచ్చి తనఖా రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళితే చుక్కల భూముల జాబితాలో ఉంది కుదరదన్నారు. తెలిసిన వారి వద్దకెళ్లి పాస్ పుస్తకాలు తనఖా పెట్టుకుని డబ్బులు ఇవ్వమంటే ఎవరూ ముందుకు రాలేదు. చికిత్సకు డబ్బులు అందక మూడు నెలల క్రితం చనిపోయాడు. చంద్రబాబు మళ్లీ చుక్కల భూముల జాబితాలో చేర్చడంతో పొలం ఉన్నా అక్కరకు రాక ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. నాగేశ్వరరావులాంటి బాధితులు ఎందరో ఉన్నారు. ప్రభుత్వ భూముల సాకుతోగతంలో ఒకసారి చుక్కల భూముల్లో చేర్చిన చంద్రబాబు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. మరోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గత ఏడాది సెప్టెంబర్లో మళ్లీ వీటిని నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో రైతులకు మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి. వీటిలో ప్రభుత్వ భూములు ఉన్నాయనే సాకుతో మరోసారి సర్వే చేసేందుకు ఇలా చేయాల్సి వచ్చిందని కూటమి ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. రైతులకు తీవ్ర నష్టం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నదాతలకు అండగా నిలిచి అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు ఏన్నో ఏళ్లగా ఉన్న నిషేధిత భూముల సమస్యను కూడా పరిష్కరించారు. ఇప్పటికై నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడి రైతులకు న్యాయం చేయాలి. – సీహెచ్ విజయభాస్కరరావు, రైతు, లింగారెడ్డిపాలెం, కోడూరు కూటమి వచ్చాక మళ్లీ ‘చుక్క’ పెట్టారు నాడు సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో 35,665 ఎకరాలకు విముక్తి అవనిగడ్డలోనే 15,791 ఎకరాలు ప్రస్తుతం రూ.లక్షల విలువైన భూములు చేతిలో ఉన్నా అక్కరకు రాని పరిస్థితి -
నిజాయతీకి మారుపేరు జగ్జీవన్రామ్
చిలకలపూడి(మచిలీపట్నం): నిజాయతీకి మారుపేరు బాబూ జగ్జీవన్రామ్ అని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కొనియాడారు. శనివారం నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యాన భారత మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ బాలాజీ, రాష్ట్ర నాటక అకాడమీ అధ్యక్షుడు గుమ్మడి గోపాలకృష్ణతో కలిసి జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థి దశలో అనేక కష్టాలు ఎదుర్కొన్న జగ్జీవన్రామ్ ఎంతో కష్టపడి ఉన్నత స్థానానికి చేరారని కొనియాడారు. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రైల్వే స్టేషన్కు వెళ్లి ఆంగ్ల పత్రికను చదివి ఇంగ్లిష్పై పట్టు సాధించారన్నారు. కార్యక్రమంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, సాంఘిక సంక్షేమ శాఖ ఇన్చార్జి డీడీ డబ్ల్యూఓ ఫణి ధూర్జటి, జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్, ఎస్సీ సంఘాల నాయకులు ఆదినారాయణ, కొడాలి శర్మ, జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. ‘పది’ మూల్యాంకన బడ్జెట్ కేటాయింపులు జరపాలి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పదో తరగతి మూల్యాంకన బడ్జెట్ కేటాయింపులు జరపాలని డీపీఆర్డీయూ రాష్ట్ర అధ్యక్షుడు డి. శ్రీను ప్రభుత్వాన్ని కోరారు. శనివారం విజయవాడలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కేవీ శ్రీనివాసులురెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. మూల్యాంకనంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు సకాలంలో పారితోషికాలు చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ను కోరారు. శ్రీరామనవమి సందర్భంగా మూల్యాంకన విధులకు ఒకరోజు సెలవు ప్రకటించాలని కోరారు. డీపీఆర్టీయూ అభ్యర్థనపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కేవీ శ్రీనివాసులు రెడ్డి సానుకూలంగా స్పందించారని శ్రీను తెలిపారు. మూల్యాంకన యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సి ఉందని, సెలవు ఇవ్వడం సాధ్యం కాదని తెలిపారన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా ఒక గంట పర్మిషన్ ఇచ్చారని శ్రీను తెలిపారు. మూల్యాంకన బడ్జెట్ విడుదలపై సానుకూలంగా స్పందించారన్నారు. డైరెక్టర్ను కలిసిన వారిలో డీపీ ఆర్టీయూ నేతలు అక్బర్ బాషా, కుమార్ రాజా, మధుకర్, ఎడం శ్రీను, సర్వేశ్వరరావు, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. నేడు దళితవాడల్లో శ్రీరామనవమి ఉత్సవాలు విజయవాడకల్చరల్: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ రామనవమి సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార ప్రాంతాల్లో టీటీడీ నిర్మించిన దేవాలయాల్లో శ్రీరామనవమి ఉత్సవాలను ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ధర్మప్రచార పరిషత్ అసిస్టెంట్ సీవీకే ప్రసాద్ శనివారం తెలిపారు. పున్నమ్మతోటలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మన గుడి – మన ప్రాంతం కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో టీటీడీ 16 దేవాలయాలు నిర్మించిందన్నారు. ఆలయాల్లో పూజాదికాలు నిర్వహించడానికి టీటీడీ స్థానికులకే శిక్షణనిచ్చి, వారిచే ఉత్సవాలను నిర్వహిస్తోందని చెప్పారు. శ్రీ రామనవమిని పురస్కరించుకొని ఆయా ప్రాంతాల్లో శ్రీరాముని కల్యాణోత్సవానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. భక్తుల కోసం తిరుపతి నుంచి వచ్చిన శ్రీవారి కంకణాలు, కుంకుమ, గోవిందనామాలు, భగవద్గీత పుస్తకాలను అందజేస్తామని తెలిపారు. టీటీడీ పూజా కిట్ను పూజారులకు అందజేశారు. కార్యక్రమంలో సమరత సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మప్రచారక్ జయశంకర్ పాల్గొన్నారు అన్నప్రసాద వితరణ.. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం 300 మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. అన్నప్రసాద పంపిణీ కార్యక్రమంలో నంబూరి కై సాలనాథ్, వీరలక్ష్మి, అత్తిలి అంజలి పాల్గొన్నారు. టెంపుల్ ఇన్స్పెక్టర్ లలితా రమాదేవి పర్యవేక్షించారు. -
శ్రీరాముడి కల్యాణం.. పల్లెకు పేరంటం
కొటికలపూడి(ఇబ్రహీంపట్నం): కొటికలపూడిలో రాములోరి కల్యాణానికి సర్వం సిద్ధం చేశారు. సుమారు వందేళ్ల క్రితం బ్రిటిష్ కాలం నుంచి దళిత సామాజిక వర్గం వారు ఇక్కడి రామాలయంలో ఏటా వైభవంగా కల్యాణం చేస్తున్నారు. నాడు పూరిపాకలో పూజలు అందుకున్న స్వామికి ప్రస్తుతం చిన్న ఆలయాన్ని భక్తులు నిర్మించారు. స్వామివారిని ఆరాధ్యదైవంగా కొలుస్తూ పూజలు చేస్తారు. అనాదిగా ఇక్కడ దళిత పూజారులు పూజలు, కల్యాణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఐదుగురు కమిటీ పెద్దలతో.. ఐదుగురు కమిటీ పెద్దలు.. కుల కట్టుబాట్లతో ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు చెక్కభజనలు, కోలాటాలు, కృష్ణానదిలో పుణ్యస్నానాలు, స్వామివారి పూజా స్తంభం, గ్రామ దేవతలకు భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం ఆచారంగా వస్తోంది. కారం పూడిలోని మాచర్ల చెన్నకేశవస్వామి ఆచారాల మాదిరిగా ఇక్కడ పూజలు చేయడం గమనార్హం. ‘నవమి’కి మూడు రోజుల ముందు నుంచి.. నవమి పండుగకు మూడు రోజుల ముందుగా ఉపవాసం ఉన్న భక్తులు శ్రీరామనవమి రోజు పదునైన కత్తులతో స్వామి వారికి సేవలు చేస్తారు. అయినా శరీరంపై ఎటువంటి గాయాలు కాకపోవడం వారి భక్తికి నిదర్శనంగా భావిస్తారు. స్వామివార్ల కల్యాణానికి పెళ్లికుమార్తె (సీతాదేవి) తరఫున దాసరి వంశీయులు, పెళ్లి కుమారుడు(రాములవారు)కి గోసుల వంశీయులు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తుంటారు. స్వామివారి చిత్రపటానికి కల్యాణం అనాదిగా ఇక్కడ ఆలయ ప్రతిష్ట, స్వామివార్ల ప్రతిష్ట జరగకపోవడంతో స్వామివార్ల చిత్రపటానికి కల్యాణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. దీపారాధన స్తంభాన్నే స్వామివారిగా భావించి ఇంటింటికీ ఊరేగిస్తారు. మూడు రోజుల పాటు ఊరేగింపు జరుగుతుంది. భక్తులు స్వామి వారికి నూతన వస్త్రాలు, కానుకలు, వ్యవసాయ పంటలు అందజేసి మొక్కలు చెల్లించుకుంటారు. కల్యాణం అనంతరం సుమారు 700 కుటుంబాలకు అన్నదానం చేస్తారు. క్రీడా పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు పండగకు ముందు మూడురోజుల పాటు క్రీడా పోటీలు, వివిధ సాంస్కృతిక (సాంఘిక, జానపద నాటికలు) కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏటా మండల స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించేవారు. ఈ సంవత్సరం రాష్ట్రస్థాయి వాలీబాల్పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ గ్రామ ఆడపిల్లలకు ఆగ్రామ యువకులతోనే ఎక్కువగా వివాహాలు జరుగుతాయి. పండగ తర్వాతే గ్రామంలో వివాహాలు చేస్తారు. గ్రామంలోని వీధులు, రామాలయానికి విద్యుత్ దీపాలంకరణ చేశారు. కొటికలపూడిలో రామాలయం ముస్తాబు విద్యుత్ దీపాలంకరణ దీపారాధన స్తంభంతో ఊరేగింపు -
వీఆర్ఏల సమస్యలు తక్షణమే పరిష్కరించండి
కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి టీడీపీ కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. విజయవాడలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో శనివారం ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం(గ్రామ సేవకుల సంఘం) రాష్ట్ర సదస్సు జరిగింది. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ బందగి సాహెబ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ కేవలం రూ.10,500తో బతకలేక వీఆర్ఏల కుటుంబాలు అవస్థలు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 70 శాతం అటెండర్, వాచ్మెన్, రికార్డ్ అసిస్టెంట్, డ్రెవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం అర్హులైన వీఆర్ఏలకు ఉద్యోగోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల న్యాయమైన పోరాటానికి పీడీఎఫ్ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు 2047 విజన్ ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తామంటున్నారని, కానీ వీఆర్ఎల జీవితాలపై మాత్రం మాట్లాడటం లేదని విమర్శించారు. వీఆర్ఏల డిమాండ్ల సాధనకు ఈ నెల 6, 7 తేదీల్లో తహసీల్దార్లకు, 8, 9 తేదీల్లో ఆర్డీఓలకు 10, 11, 12 తేదీల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు, 15, 16 తేదీల్లో కలెక్టర్లకు రాయబారాలు, ఏప్రిల్ 28, 29 తేదీల్లో జిల్లా కేంద్రాలలో దీక్షలు, 30వ తేదీ కలెక్టర్లకు సామూహిక రాయబారం, మే నెల 13, 14 తేదీలలో రాష్ట్ర కేంద్రంలో రిలే దీక్షలు నిర్వహించాలని సదస్సు ఏకగ్రీవంగా తీర్మానించింది. సంఘం రాష్ట్ర నేతలు త్రినాథరావు, రవికుమార్, కృష్ణారావు, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు -
ముగిసిన ఇంటర్ ‘స్పాట్’
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లాలో ఇంటర్మీడియెట్ బోర్డు ఆధ్వర్యాన జరుగుతున్న ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం శనివారంతో ముగిసింది. విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో మూల్యాంకనం కార్యక్రమాన్ని నిర్వహించారు. గత నెల 17న ప్రారంభమైన స్పాట్ జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రం ఐదో తేదీ శనివారం వరకూ కొనసాగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఇంటర్మీడియెట్ మొదటి, రెండో సంవత్సరానికి చెందిన 3,94,596 జవాబు పత్రాలను సుమారు 20 రోజుల పాటు నిరంతరాయంగా మూల్యాంకనం చేశారు. స్పాట్ వాల్యూయేషన్ క్యాంప్ ఆఫీసర్గా ఇంటర్మీడియెట్ బోర్డు జిల్లా విద్యాశాకాధికారి సత్యనారాయణరెడ్డి వ్యవహరించారు. స్పాట్ కేంద్రంలోనే మార్కుల నమోదు మొన్నటి వరకూ మూల్యాంకనం అనంతరం ఓఎంఆర్ షీట్లోని పార్ట్–3 (మార్కులు నమోదు చేసిన షీట్)ను విడదీసి బండిల్స్గా ఇంటర్మీడియెట్ బోర్డుకు పంపించేవారు. అక్కడ ఓంఎంఆర్ షీట్ పార్ట్–3లో మార్కులను స్కాన్ చేసి, నమోదు అనంతరం ఫలితాలను ప్రకటించేవారు. ఈ ప్రక్రియలో ఆలస్యాన్ని తగ్గించడానికి బోర్డు అధికారులు గతేడాది తొలి సారిగా ప్రతి మూల్యాంకనం కేంద్రానికి స్కానర్ను అందించారు. స్కానర్ ద్వారా స్పాట్ కేంద్రంలో మూల్యాంకనం చేసిన అనంతరం మార్కుల నమోదు చేపట్టారు. 3,94,596జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు. ఈ ప్రక్రియలో మొత్తం సుమారు 1,280 మంది అధ్యాపకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మూల్యాంకనం చేసిన 3,94,596 జవాబు పత్రాలు హాజరైన 1,280 మంది అధ్యాపకులు స్పాట్ కేంద్రంలోనే మార్కుల పోస్టింగ్ఇంటర్ స్పాట్ విజయవంతంగా పూర్తి చేశాం జిల్లాలో ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యూయేషన్ను నిబంధనల ప్రకారం ప్రక్రియను పూర్తి చేశాం. అన్ని స్థాయిల్లోని సిబ్బంది పూర్తి స్థాయిలో నిమగ్నమై దీనిని విజయవంతంగా పూర్తి చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి అన్ని ప్రక్రియలను పూర్తి చేసి ప్రభుత్వానికి మార్కులను ఆన్లైన్ ద్వారా పంపించాం. – సీఎస్ఎస్ఎన్ రెడ్డి, ఆర్ఐవో, ఎన్టీఆర్ జిల్లా -
8 నుంచి చైత్రమాస బ్రహ్మోత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రి చైత్రమాస బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 8వ తేదీ మంగళవారం నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు ఆరు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల్లో ఆదిదంపతులకు పలు విశేష వాహన సేవలు జరుగుతాయి. 8వ తేదీ వెండి పల్లకిపై, 9న వెండి రథోత్సవం, 10వ తేదీ రావణ వాహనంపై, 11వ తేదీ నంది వాహనంపై, 12వ తేదీ సింహ వాహనంపై, 13వ తేదీ సాయంత్రం పవిత్ర కృష్ణా నదిలో విహారం ఉంటుంది. ఉత్సవాల్లో తొలిరోజు ప్రత్యేక పూజలు చేస్తారు. 11వ తేదీ రాత్రి 7 గంటలకు మల్లేశ్వరస్వామి ఆలయం వద్ద రాయబార ఉత్సవం(ఎదుర్కోలు ఉత్సవం) జరుగుతుంది. ఆ రోజు రాత్రి 10.30 గంటలకు ఆది దంపతుల దివ్య కల్యాణోత్సవం చేస్తారు. 12వ తేదీ సదస్యం, వేదస్వస్తి, వేదాశీస్సుల కార్యక్రమాన్ని మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్వహిస్తారు. 13వ తేదీ ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి, ధాన్యకోట్నోత్సవం, వసంతోత్సవం, ధ్వజావరోహణతో ఉత్సవాలు పరి సమాప్తమవుతాయి. 14వ తేదీ ద్వాదశ ప్రదక్షిణలు, 15, 16 తేదీల్లో పవళింపు సేవలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. -
అనుమానాస్పద స్థితిలో బీటెక్ విద్యార్థి మృతి
కోడూరు: పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకొనేందు కు అర్థరాత్రి ఇంట్లో నుంచి వెళ్లిన బీటెక్ విద్యార్థి రెండు రోజుల తరువాత అనుమానాస్పద స్థితిలో చెట్టుకు ఉరి వేసుకొని శవమై కనిపించిన ఘటన కోడూరు మండలంలో సంచలనంగా మారింది. మండలంలోని లింగారెడ్డిపాలెం శివారు నక్కవానిదారి గ్రామానికి చెందిన జరుగు సత్యనారాయణకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు లక్ష్మీ వర్థన్(22) కంచికచర్లలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. వారం రోజుల క్రితం లక్ష్మీవర్థన్ ఇంటికి వచ్చాడు. ఈ నెల 2న ఉద యం లక్ష్మీవర్థన్ తోటి స్నేహితులతో కలిసి మాచవరం తుంగపల్లెమ్మ ఆలయం వద్ద జరిగిన కేటరింగ్ పనికి వెళ్లి, సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు. 3న లక్ష్మీవర్థన్ పుట్టిన రోజు కావడంతో 2న రాత్రి 11గంటల స మయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన 10 నిమిషాలకు ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తల్లి దండ్రులు కుమారుడి ఆచూకీకోసం వెతుకులాట ప్రా రంభించారు. స్నేహితులు, బంధువుల ఇళ్లవద్ద ఆరా తీసినా ప్రయోజనం లేకపోవడంతో ఈ నెల 4న ఉద యం కోడూరు పోలీస్స్టేషన్లో కుమారుడు అదృశ్యమైయ్యాడని తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. సముద్ర తీరంలో చెట్టుకు వేలాడుతూ.. లక్ష్మీవర్థన్ ఆచూకీ కోసం వెతుకుతున్న పోలీసులకు శనివారం ఉదయం బసవానిపాలెం – పాత ఉపకాలి గ్రామల మధ్య సముద్ర తీరంలోని ఓ చెట్టుకు యువకుడి శవం వేలాడుతుందనే సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించగా, ఆ శవం లక్ష్మీవర్థన్గా గుర్తించారు. పోలీసులు శవానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతిపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. లక్ష్మీవర్థన్ ఇంటి దగ్గర నుంచి మృతి చెందిన ఘటనా ప్రాంతానికి 13 కిలోమీటర్ల దూరం ఉంటుంది. లక్ష్మీవర్థన్ శరీరమంతా రక్తపు మరకలు ఉండడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఎవరో ప్లాన్ ప్రకారం హత్య చేశారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. తన కుమారుడికి ఎవరితో వివాదాలు లేవని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు అవనిగడ్డ సీఐ యువకుమార్ చెప్పారు. మృతుడి సెల్ఫోన్ లభ్యం కాలేదని, కాల్ డేటా, సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఘటనాస్థలాన్ని సీఐతో పాటు ఎస్ఐ చాణిక్య, సిబ్బంది పరిశీలించారు. -
మొక్కజొన్న మెషీన్లో పడి మహిళ దుర్మరణం
పెనమలూరు: చోడవరం గ్రామంలో మొక్కజొన్న మెషీన్లో శనివారం ప్రమాదవశాత్తు మహిళ పడి దుర్మరణం చెందింది. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెంకు చెందిన తుమ్మలజ్యోతి(30) సహచర కూలీలతో కలిసి చోడవరం గ్రామానికి మొక్కజొన్న గింజలు ఓలిచే పనులకు వచ్చింది. వారు ఉదయం నుంచి మెషీన్ యజమాని శ్రీనివాసరావుతో కలిసి చోడవరం నాగేంద్రస్వామివారి ఆలయ సమీపంలో కౌలు రైతుకు చెందిన పొలంలో మొక్కజొన్న కండెలను మెషీన్లో వేస్తూ పనులు చేశారు. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారి ఈదురుగాలి రావటంతో మొక్కజొన్న పంట వద్ద ఉన్న టార్పాలిన్ పట్టా గాలికి ఎగరటంతో జ్యోతి పట్టాను పట్టుకోవటానికి యత్నించగా ఆమె చీర మెషీన్కు చుట్టుకుని ప్రమాదవశాత్తు మొక్కజొన్న మెషీన్లో పడింది. మెషీన్ తిరుగుతుండటంతో జ్యోతి మెషీన్లోనికి సగభాగం వెళ్లింది. ఈ ఘటనలో ఆమె తల ముక్కలైంది. అక్కడే ఉన్న ఇతర కూలీలు మెషీన్ను ఆపారు. అయితే ఆమె శరీరం నుజ్జుకావటంతో మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో నాలుగు పూరిళ్లు దగ్ధం
మోపిదేవి: మోపిదేవి నుంచి అవనిగడ్డ వెళ్లే మార్గంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో శనివారం నాలుగు పూరిళ్లు కాలి బూడిదయ్యాయి. ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. వివరాల్లోకి వెళ్లితే మోపిదేవి నుంచి అవనిగడ్డ వెళ్లే ప్రధాన రోడ్డు పక్కన నివాసం ఉంటున్న పేదలకు చెందిన పూరిళ్లలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు రేగాయి. ఇళ్లలో గ్యాస్ బండలు కూడా ఉండటంతో చుట్టు పక్కలవారు భయాందోళనతో పరుగులు తీశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అవనిగడ్డ అగ్నిమాపక సిబ్బంది హుటాహూటిన ఘటనా ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. స్థానిక ఎస్ఐ సత్యనారాయణ, గ్రామ ఉప సర్పంచ్ కోనేరు సుందరసింగ్, మాజీ గ్రామ సర్పంచ్ రావ నాగేశ్వరరావు స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సహకరించారు. ఈ ప్రమాదంలో రాజులపాటి రాజేశ్వరమ్మ, సింగోతు రంగారావు, పెండ్ర ముసలి, మోర్ల సీతారావమ్మ పూరిళ్లు పూర్తిగా కాలిపోయాయని ఫైర్ సిబ్బంది తెలిపారు. సుమారు రూ.3.80 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని చెప్పారు. -
80 కేజీల గంజాయి స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్
పటమట(విజయవాడతూర్పు): విశాఖపట్నం నుంచి బెంగళూరుకు గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను పటమట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు పటమట స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించిన సీఐ పవన్కిశోర్ మాట్లాడుతూ.. పటమట పోలీసు స్టేషన్ పరిధిలోని ఎనికేపాడు లారీ బే వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాల తనికీ చేపట్టామన్నారు. ఈ క్రమంలో గన్నవరం వైపు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారును పోలీస్ సిబ్బంది ఆపగా కారు డ్రైవర్ కారును రోడ్డు మార్జిన్లో నిలిపి డ్రైవర్, కారు లోపల మరో వ్యక్తి దిగి పారిపోయేందుకు ప్రయత్నించారన్నారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని, కారును తనిఖీ చేయగా కారులో 80 కేజీల గంజాయి గుర్తించామని చెప్పారు. నిందితులు చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం మినికి గ్రామానికి చెందిన షేక్ షాజాద్(34), అదే జిల్లా పుంగనూరు మండలం, కొత్తపేటకు చెందిన షేక్ ఫయాజ్లుగా గుర్తించామన్నారు. వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని 80 కేజీల గంజాయిని, కారును స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చామన్నారు. -
గురుకుల వసతి గృహాన్ని సందర్శించిన సీఎం
నందిగామటౌన్: బాబూ జగ్జీవన్రామ్ జయంతి వేడుకలు, ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముప్పాళ్ల గ్రామంలోని గురుకుల సంక్షేమ వసతి గృహం, పాఠశాలను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహం, పాఠశాలలోని విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించి విద్యార్థులతో కలిసి తేనీటిని స్వీకరించారు. పాఠశాల మొత్తం కలియతిరిగి వంటశాల, భోజనశాల పరిశుభ్రత ను, కోడిగుడ్లు, బియ్యం, కూరగాయలు, వంట సరుకుల నాణ్యతను, డార్మిటరీని పరిశీలించారు. అనంతరం భోజన రుచి, నాణ్యత, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం అల్పాహారం, భోజనం అందిస్తున్నారా లేదా తదితర వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు నమూనాలను పరిశీలించి అభినందించారు. వెలవెలబోయిన ప్రజావేదిక రోడ్లు.. నందిగామటౌన్: సీఎం చంద్రబాబు బహిరంగ సభకు ప్రజలు ఆసక్తి చూపకపోవటంతో ప్రజావేదిక సభకు వెళ్లే రోడ్లు వెలవెలబోయాయి. సభా ప్రాంగణంలోకి ముప్పాళ్ల గ్రామ ప్రజలనే అనుమతించటంతో నియోజకవర్గంలోని ఆయా గ్రామాల ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు సైతం సీఎం పర్యటనకు ఆసక్తి చూపలేదు. ముప్పాళ్ల గ్రామ ప్రజలు కూడా ఒక మోస్తరుగా రావటంతో సభా ప్రాంగణానికి వెళ్లే రోడ్డు నిర్మానుష్యంగా దర్శనమిచ్చింది. సభా ప్రాంగణంలో కూర్చునేందుకు ఏర్పాటు చేసిన వారు తప్ప సభా ప్రాంగణం వెలుపల పలుచగా టీడీపీ శ్రేణులు కనిపించారు. భోజన స్టాల్స్ వద్ద కూడా ఆశించిన మేర ప్రజలు లేకపోవటం గమనార్హం. -
‘సహకార సేనాని’ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంక్ పూర్వ అధ్యక్షుడు, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే మానం ఆంజనేయులు సహకార రంగానికి అందించిన సేవలకు గుర్తుగా రూపొందించిన ‘సహకార సేనాని’ ప్రత్యేక సంచికను ది గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రాంగణంలో శనివారం ఆవిష్కరించారు. నాలుగు దశాబ్దాల పాటు సహకారోద్యమాలకు నాయకత్వం వహిస్తూ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ ఫెడరేషన్(న్యూఢిల్లీ) డైరెక్టర్గా, ఉపాధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ వ్యవస్థాపక కార్యదర్శిగా, అధ్యక్షుడిగా తెలుగునాట అర్బన్ బ్యాంకుల అభ్యున్నతికి పాటుపడిన ఆంజనేయులు సేవలకు గుర్తింపుగా ఆయన సహకార ప్రస్థానంపై ఏపీ ఫెడరేషన్ ఈ ప్రత్యేక సంచికను రూపొందించింది. ఏపీ స్టేట్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు చిట్టూరి రవీంద్ర, సహకారోద్యమ నేత మానం ఆంజనేయులు, ఏపీ రాష్ట్ర కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీ ఫెడరేషన్ కార్యదర్శి, విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ చలసాని రాఘవేంద్రరావు, ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు షేక్ అబ్దుల్ జిలాని, డైరెక్టర్లు కోళ్ల అచ్యుతరామారావు, ఎం.వెంకటరత్నం, ఏవీ అంబికా ప్రసాద్, వేమూరి వెంకట్రావు, శాశ్వత ప్రత్యేక ఆహ్వానితులు కె.రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
బాబూ జగ్జీవన్రామ్ మానవతావాది
కోనేరుసెంటర్: మానవతావాదం, ఆదర్శవాదం భారత మాజీ ఉప ప్రధానమంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు దివంగత బాబూ జగ్జీవన్రామ్కే సొంతమని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు పేర్కొన్నారు. భారత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్రామ్ జయంతిని శనివారం జిల్లా పోలీసు క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జగ్జీవన్రామ్ నేటి తరానికి ఆదర్శప్రాయుడన్నారు. సామాజిక న్యాయంతో పాటు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు పోరాటాలు చేసిన యోధుడు జగ్జీవన్రామ్ అన్నారు. నిమ్న జాతుల అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. అంటరానితనాన్ని నిర్మూలించేందుకు మహాత్మాగాంధీతో కలిసి అనేక పోరాటాల్లో పాల్గొన్నారని చెప్పారు. స్వాతంత్య్ర పోరాటంలో క్విట్ ఇండియా, శాసనోల్లంఘన ఉద్యమాల్లో సైతం గాంధీతో కలిసి ఆయన కూడా అడుగులు వేశారన్నారు. అటువంటి గొప్ప నాయకుడిని స్మరించుకోవటం మనందరి అదృష్టమన్నారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్, ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు -
వాటర్ ట్యాంకు ఎక్కిన మహిళను కాపాడిన యువకుడు
చల్లపల్లి: స్థానిక నారాయణరావు నగర్లో నిర్మాణం పూర్తి చేసుకున్న వాటర్ ట్యాంక్పైకి ఎక్కిన ఓ మహిళను ఓ యువకుడు శనివారం కాపాడాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం స్థానికంగా నివాసం ఉండే ఓ ముస్లిం యువతి వాటర్ ట్యాంక్పైకి ఎక్కి ఏడుస్తూ నిలబడింది. ఆదమరిస్తే కిందకు పడిపోయే పరిస్థితిలో అటూ ఇటూ కదులుతున్న ఈ యువతిని కొంతమంది స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సీఐ ఈశ్వరరావు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని గమనించారు. అప్పటికే స్థానికంగా ఉండే యువకులు చెంబురెడ్డి మణి, తళ్లూరు విష్ణుభరత్లతో పాటు మరి కొంతమంది ట్యాంక్ ఎక్కారు. కిందకు దిగాలని ఆమెను కోరగా, ఆమె ఏడుస్తూ ఒక్కో అడుగు ముందుకేయడంతో అందరూ తీవ్ర ఆందోళన చెందారు. సీఐ ట్యాంక్ ఎక్కి వెనక్కు వచ్చేయాలని కోరారు. మహిళతో మాట్లాడుతూ ఆమె భర్త ఫోన్ నంబర్ చెప్పాలని కోరుతూ ఆమెని మాటల్లో పెట్టారు. అనంతరం చెంబురెడ్డి మణి చుట్టూ తిరిగివెళ్లి ఆ మహిళను గట్టిగా పట్టుకుని కిందకు పడకుండా వెనక్కి లాగాడు. అనంతరం సీఐ ఆ మహిళలను ట్యాంకుపై నుంచి కిందకు తీసుకొచ్చారు. ఆమెకు కుటుంబ సమస్యలతో పాటు మానసిక ఆరోగ్య పరిస్థితి బాగుండక పోవడంతో ఈ పనికి ఒడిగట్టినట్టు చెప్పారు. మహిళను సురక్షితంగా కిందకు దించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
యనమలకుదురు లంకల్లో మహిళ మృతదేహం లభ్యం
పెనమలూరు: యనమలకుదురు గ్రామ పరిధి కృష్ణానది లంకల్లో శనివారం రక్తం గాయాలతో మహిళ మృతదేహం కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఘటనాస్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పెనమలూరు ఎస్ఐ ఫిరోజ్ తెలిపిన వివరాల ప్రకారం యనమలకుదురు లంకల్లో గుర్తు తెలియని మహిళ(55) మృత దేహం ఉండటంతో గ్రామస్తులు తెలిపిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. రెండు రోజుల క్రితం మహిళ మృతి చెందినట్లు గుర్తించారు. ఆమె ముఖం, ఒంటిపై రక్తం గాయాలున్నాయి. మృతదేహం వద్ద ఎటువంటి వివరాలు, క్లూ లభించలే దు. మృతి చెందిన మహిళ యనమలకు దురు గ్రామానికి దూ రంగా కృష్ణానది లంకల్లోకి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చి ఉంటుందో విచారిస్తున్నా రు. ఆమెది హత్యా లే క సహజంగానే మరణించిందా అనేకోణం లో దర్యాప్తు చేపట్టారు. పోలీసులుఆమె మృత దేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
స్వర పేటిక తెగినా వైద్యులు ఊపిరి పోశారు..
పటమట(విజయవాడతూర్పు): రోడ్డు ప్రమాదంలో స్వరపేటిక తెగిన ఓ వ్యక్తికి విజయవాడ ప్రభుత్వాసుపత్రి వైద్య బృందం, సిద్ధార్థ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థులు విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారు. సేకరించిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా భీమడోలు మండలం, ఆగడాలలంక గ్రామానికి చెందిన ఎస్.పవన్కళ్యాణ్(35) చేపలు అమ్మే నిమిత్తం సంతకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇనుప కంచైపె పడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో అతని మెడ ముందు భాగంలో స్వర పేటిక పూర్తిగా తెగిపోయింది. ఊపిరి ఆడటం కష్టంగా ఉండటంతో ఏలూరు జీజీహెచ్ నుంచి విజయవాడ జీజీహెచ్కు తరలించారు. రోగి ఆర్థిక స్థితిని గమనించి ఈఎన్టీ విభాగం హెచ్వోడీ డాక్టర్ కొణిదే రవి, సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీ రావు రూ.50 వేల ఖరీదు చేసే టి.ట్యూట్ను ముంబయి నుంచి కొనుగోలు చేసి షియాన్–యాన్లీ పద్ధతి ద్వారా అమర్చారు. శస్త్ర చికిత్స విజయవంతం అవటంతో పేషెంట్ పూర్తిగా కోలుకుని మాట్లాడుతున్నారని వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్స చేసిన బృందాన్ని శుక్రవారం సిద్ధార్థ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.అశోక్ కుమార్ అభినందించారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స -
నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి
కంకిపాడు: నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కొనుగోలు ప్రక్రియ సాగాలని, రైతులకు మద్దతు ధర లభించాలని మార్క్ఫెడ్ ఎండీ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. కంకిపాడు మార్కెట్యార్డులో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినుము, పెసలు కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల ద్వారా అపరాల సేకరణ తీరుపై సిబ్బందిని వివరాలు అడిగారు. మార్క్ఫెడ్ ప్రత్యేకాధికారి కిషోర్, కొనుగోలు మేనేజర్లు నరసింహారెడ్డి, నళిని జిల్లాలోని 8 కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2,948 హెక్టార్లలో పెసలు సాగు చేయగా, 3,435 మెట్రిక్ టన్నులు దిగుబడు లు వస్తాయని అంచనా వేశారన్నారు. ఇప్పటి వరకూ జిల్లాలో రూ.1.36 కోట్ల విలువైన 157 మెట్రిక్ టన్నుల పెసలు సేకరించి సీడబ్ల్యూసీ గోదాముకి తరలించామన్నారు. మార్క్ఫెడ్ ఎండీ మనజీర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రం వద్ద ఎలాంటి జాప్యం జరగకుండా సేకరణ ప్రక్రియ, సొమ్ము చెల్లింపు వేగంగా జరిగేలా ఆన్ లైన్లో వివరాలను సమర్థంగా నమోదు చేయాలన్నారు. ఈ–క్రాప్ నమోదులో పంట నమోదు వ్యత్యాసం ఉందని రైతు చెప్పటంతో వ్యత్యాసం రావటానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రబీలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరవాలని రైతులు కోరారు. దీనిపై స్పందిస్తూ రబీ సీజన్లో ధాన్యం సేకరణకు మార్గదర్శకాలు జారీ అయ్యాయని, త్వరలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కార్యక్రమంలో ఏఓ పీఎం కిరణ్, ఏఈఓలు సూర్యభవాని, వాణి, వీఏఏ కె.సురేష్ తదితరులు పాల్గొన్నారు. పెసలు కొనుగోలు కేంద్రం పరిశీలించిన మార్క్ఫెడ్ ఎండీ -
‘పది’ స్పాట్ వాల్యూయేషన్ పరిశీలన
వన్టౌన్(విజయవాడపశ్చిమ): నగరంలో జరుగుతున్న పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ను జిల్లా పరిశీలకునిగా నియమితులైన ఏపీ లైబ్రరీస్ డైరెక్టర్ కృష్ణమోహన్ శుక్రవారం పరిశీలించారు. నగరంలోని బిషప్ అజరయ్య హైస్కూల్లో పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. సుమారు 800 మంది ఉపాధ్యాయులు పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రభుత్వం నియమించిన పరిశీలకులు కృష్ణమోహన్ శుక్రవారం స్పాట్ ప్రాంగణాన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదో తేదీ వరకూ మూల్యాంకనం ప్రక్రియ కొనసాగుతుందన్నారు. -
దుర్గమ్మకు వెండి పంచ పాత్ర బహూకరణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు పూర్వ జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం దంపతులు వెండి పంచపాత్రను సమర్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు లక్ష్మీకాంతం దంపతులు ఆలయానికి విచ్చేయగా, వారికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అధికారులను కలిసి సుమారు రెండు కిలోల వెండితో తయారు చేయించిన పంచపాత్రను అందజేశారు. లక్ష్మీకాంతం దంపతులకు అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. మంగినపూడి బీచ్లోకి 300 ఆలివ్ రిడ్లే తాబేలు పిల్లలు కోనేరుసెంటర్: కృష్ణాజిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మచిలీపట్నం మండలం తాళ్లపాలెం పంచాయతీ పరిధిలోని గిరిపురం బీచ్లోకి 300 ఆలివ్ రిడ్లె తాబేలు పిల్లలను అటవీశాఖ, మైరెన్ పోలీసులు వదిలారు. బందరు మండల కేంద్రంలో మొట్ట మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఆలివ్ రిడ్లే తాబేలు గుడ్ల సంరక్షణ కేంద్రంలో సంరక్షిస్తున్న గుడ్ల సంతాన ఉత్పత్తి కేంద్రం నుంచి గురువారం 300 పిల్లలు గుడ్ల నుంచి బయటకు రాగా వాటిని సముద్రంలోకి వదిలారు. కార్యక్రమంలో అటవీశాఖ రేంజర్ సాయి, సంరక్షణకేంద్రం ఇన్చార్జి ఒ.నాగరాజు, గిలకలదిండి మైరెన్ ఎస్ఐలు వి.జె.చంద్రబోస్, పరింకాయల మురళీకృష్ణ, స్టేషన్ రైటర్ మద్దియ్య, ఆలివ్ రిడ్లె తాబేలు పిల్లల సంరక్షణ కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. హాకీ జిల్లా జట్టు ఎంపిక విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి జూనియర్ బాలుర హాకీ పోటీలకు ప్రాతినిధ్యం వహించే జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా హాకీ సంఘం కార్యదర్శి కె.రాజశేఖర్ తెలిపారు. సింగ్నగర్లోని ఎంబీపీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ఎంపిక పోటీల్లో అత్యుత్తమ క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన చరణ్రాజ్, సునీల్కుమార్, విశ్వతేజనూతన్, నితిన్రాజ్, హరివినయ్, చిరంజీవిఏసురాజు, సూర్య, దినేష్సాయిరామ్, ప్రవీణ్, మున్నర్ వలీ, భార్గవ్, అశోక్, జస్వంత్, జగదీష్బాబు, అమీర్, యాసిన్, హర్షలను జట్టుకు ఎంపిక చేశామన్నారు. ఈ నెల ఆరు నుంచి తొమ్మిదో తేదీ వరకు శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందన్నారు. 1,23,485 బస్తాల మిర్చి విక్రయం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శుక్రవారం 1,13,955 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,23,485 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.13,500 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.6,300 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 47,777 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. -
జై భవానీ.. జైజై భవానీ
దుర్గమ్మకు విశేష సేవలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు శుక్రవారం పలు విశేష సేవలు జరిగాయి. సాయంత్రం అమ్మవారికి పంచహారతుల సేవ, పల్లకీ సేవ, దర్బారు సేవలు నిర్వహించగా పెద్ద ఎత్తున భక్తులు, ఉభయదాతలు పాల్గొని తరించారు. సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి పంచహారతుల సేవ చేయగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. పంచహారతుల సేవ అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవ మూర్తికి పూజా కార్యక్రమాలను నిర్వహించిన తర్వాత పల్లకీ సేవ జరిగింది. పల్లకీపై ఆది దంపతులు కొలువుదీరగా, మేళతాళాలు, మంగళవాయిద్యాల మధ్య అమ్మవారి ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశారు. అనంతరం పూజా మండపంలో అమ్మవారికి దర్బారు సేవ జరిగింది. గత శనివారం నుంచి శుక్రవారం వరకు ఆలయంలో జరిగిన విశేష సేవలు, ఆదాయ, వ్యయా లను అమ్మవారికి ఆలయ అర్చకులు వివరించారు. ఉద యం 10 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. సర్వదర్శనంతో పాటు రూ.100, రూ.300, రూ.500 టికెటు క్యూలైన్లో అమ్మవారి దర్శనం గంట లోపే పూర్తయింది. రద్దీ నేపధ్యంలో ఆలయ ప్రాంగణంలో క్యూలైన్లను ఏఈవో చంద్రశేఖర్, ఇతర ఆలయ అధికారులు పర్యవేక్షించారు. పల్లకీ సేవలో ఉభయదాతలు, భక్తులు -
అగ్ని గండం.. అప్రమత్తం!
పామర్రు: కృష్ణాజిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా పది నెలల్లోనే 700కు పైగా అగ్ని ప్రమాదాలు జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. పల్లెల్లో కంటే పట్టణాల్లోనే ఎక్కువగా అగ్ని ప్రమాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా గతంలో గ్రామాల్లో గడ్డి వాములు, ఎండిపోయిన పైర్లు వంటి వాటి వల్ల ప్రమాదాలు జరిగేవి. కానీ ఇప్పుడు పట్టణాల్లో గ్యాస్ లీకేజ్, ఎలక్ట్రికల్ షార్టు సర్క్యూట్ల కారణంగా 70 శాతం ప్రమాదాలు జరుగుతుండటం గమనార్హం. భారీగా ఆస్తి నష్టం విద్యుత్ స్తంభాలు, లైన్లు, వైరింగ్ సరిగా లేకపోవడం తదితర కారణాల వల్ల ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటి నిర్వహణ విషయంలో విద్యుత్ అధికారులు దారుణంగా విఫలమవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక పట్టణాల్లోని చాలా ఇళ్లలో వెంటిలేషన్ సరిగా లేకపోవడం వల్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలోనే కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరుగుతున్నట్లు అంచనా. ఈ ఏడాది అగ్ని ప్రమాదాల్లో ప్రాణ నష్టం జరగనప్పటికీ 14 జీవాలు మృతి చెందాయి. ఎండ తీవ్రతకు వాహనాలు విపరీతంగా వేడెక్కి వాటి నుంచి మంటలు చెలరేగుతున్నాయి. నాలుగు మాసాల క్రితం విజయవాడ–మచిలీపట్నం హైవే సమీపంలో కారులో మంటలు వ్యాపించి దగ్ధమైంది. జిల్లాలో ఫైర్ స్టేషన్లు ఈ ఏడాది సాధారణ అగ్నిప్రమాదాలు మధ్యస్థ జాగ్రత్తలు పాటించాలి ● వెలుతురు సరిగా లేని ఇళ్లలో రాత్రి గ్యాస్ సిలిండర్కు సంబంధించి రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. ● సిలిండర్ ఆన్లో ఉంచి కిచెన్లో లైట్లు వేయకూడదు. ● ఎలక్ట్రిక్ స్విచ్లు వేస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ● విద్యుత్ స్తంభాల వద్ద కరెంట్ ఎర్త్ అవుతుందేమో గమనిస్తుండాలి. ● ఏసీలు, హీటర్లు వాడుతున్నప్పుడు నిప్పు రవ్వలు చెలరేగుతున్నాయేమో గమనించాలి. ● బైక్, స్కూటర్ లేదా కారు ఇంజిన్ వేడెక్కినప్పుడు కాస్త విరామం ఇవ్వాలి. అగ్నిమాపక వాహనాలు భారీ అగ్ని ప్రమాదాలు 2 ప్రమాదాల్లో ఆస్తి నష్టం రూ. 5.17కోట్లు 10పెద్దవి, 2 చిన్నవి అప్రమత్తంగా ఉండాలి గ్యాస్, ఎలక్ట్రిక్ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.వేసవి నేపధ్యంలో మరో మూడు నెలలు ప్రజలు అప్రమర్తంగా ఉండాలి. వంట పూర్తివగానే సిలిండర్ ఆపేస్తే మంచిది. ఎలక్ట్రిక్ వస్తువులపై నిఘా ఉంచాలి.ఇరుగు గదుల్లో ఉండే దుకాణ దారులు,షాపింగ్ మాల్స యజమానులు నిరంతరంచెక్ చేసుకుంటూ ఉండాలి. –డి.ఏసురత్నం, జిల్లా అగ్నిమాపక అధికారి, కృష్ణాజిల్లా ● పది నెలల్లో 700కు పైగా అగ్ని ప్రమాదాలు రూ.5 కోట్లకు పైగా ఆస్తి నష్టం ఎక్కువగా గ్యాస్, ఎలక్ట్రిక్ వస్తువుల వలనే... వేసవిలో అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు 709 9 34 -
ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే నష్టపోతాం
నేను కౌలుకు తీసుకుని 20 ఎకరాలలో మొక్కజొన్న సాగు చేశాను. కోత పూర్తయిన తర్వాత మైలవరం మార్కెట్ యార్డులో ఆరబోశాను. ప్రభుత్వం మొక్కజొన్నలను కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసేందుకు వచ్చారు. క్వింటాకు రూ.20 సెజ్ కట్టాలని మార్కెట్ యార్డు అధికారులు చెప్పడంతో వ్యాపారులు వెనక్కిపోయారు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి నా మొక్కజొన్న పంట మొత్తం తడిసిపోయింది. ఇప్పుడు దళారులు కొనే అవకాశం లేదు. పది లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాను. ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి పంటను కొనుగోలు చేయాలి. లేదంటే నష్టపోతాం. –చెరుకూరి అర్జునరావు, కౌలు రైతు, అనంతవరం, మైలవరం మండలం -
అపార నష్టం
అకాల వర్షం..సాక్షి ప్రతినిధి, విజయవాడ: అకాల వర్షం రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. పంట చేతికొచ్చిన దశలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న, పసుపు తడిసిపోయాయి. నున్న ప్రాంతంలో గాలివానకు మామిడి కాయలు రాలిపోయాయి. రబీలో సాగు చేసిన వరి దెబ్బతింది. వెన్నుదశలో ఉన్న వరికి సంబంఽధించి సుంకు రాలిపోయింది. ఇప్పటికే ఽగిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులకు మళ్లీ గోరుచుట్టు మీద రోకలి పోటు అన్నట్లు, మళ్లీ తడిసిన ధాన్యం ఆరబెట్టుకునేందుకు ఖర్చు తడిసి మోపెడు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరబోసేందుకు అదనపు భారం కృష్ణాజిల్లాలో ఈ రబీ సీజనులో 4,750 హెక్టార్లలో మొక్కజొన్న, 4,816 హెక్టార్లలో వరిపంటను సాగు చేశారు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో మామిడి పంట 22,500 హెక్టార్లలో సాగు చేశారు. కృష్ణా జిల్లాలోని దావులూరు, చలివేంద్రపాలెం, ప్రొద్దుటూరు, కంకిపాడు, ఈడుపుగల్లు, పునాదిపాడు ప్రాంతాల్లో కల్లాల్లో ఉన్న పంట తడిసిపోయింది. ఈ పంటను ఆరబోసుకునేందుకు ఎకరాకు రూ.5వేలకు పైగా ఖర్చు అవుతుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నామని, ఈ అదనపు ఖర్చుతో మరింత నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపు పంటకు సంబంధించి రైతులు ఉడకబెట్టి ప్రస్తుతం కల్లాల్లో ఆరబోశారు. వర్షానికి తడిసి నాణ్యత దెబ్బతిని, కాటు వస్తుందని వాపోతున్నారు. ప్రస్తుతం పసుపు రేటు క్వింటా రూ.9500 ఉందని, క్వింటా రూ.13వేలకు పైగా ఉంటే గాని గిట్టుబాటు కాదని రైతులు అంటున్నారు. రబీలో వరి సాగు చేసిన రైతులు సైతం వరి కంకి దశలో ఉందని, సుంకు రాలిపోయి దిగు బడిపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నున్న ప్రాంతంలో ఎకరానికి పైగా అరటితోట పూర్తిగా నేలకు ఒరిగింది. నేలరాలిన మామిడి కాయలు తడిసిన మొక్కజొన్న, పసుపు వరి పంటపైనా ప్రభావం ఇప్పటికే గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతు గోరుచుట్టుపై రోకటిపోటులా వర్షం మామిడి రైతుకు కోలుకోలేని దెబ్బ... ఈ ఏడాది ఇప్పటికే నల్లతామరతో మామిడి పంట బాగా దెబ్బతింది. అరకొరగా కాసిన మామిడి కాయలు సైతం గురువారం వీచిన గాలులు, వర్షానికి రాలిపోయాయి. నున్న ప్రాంతంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఉద్యానవన అధికారుల లెక్క ప్రకారం 50 ఎకరాల్లో మామిడి పంటకు నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. ఈ ఏడాది దిగుబడులు అంతంత మాత్రంగానే ఉండగా, కాసిన కొద్ది కాయలు నేల రాలిపోవడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇదే విధంగా మరోసారి వర్షం వస్తే మామిడి పంట పూర్తిగా తుడిచి పెట్టుకుపోతుందని మామిడి రైతులు వణికి పోతున్నారు. -
ఇంటి దొంగ అరెస్ట్
182 గ్రాముల బంగారం స్వాధీనం చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ఆశ్రయం ఇచ్చిన ఇంటికే కన్నం వేసిన వ్యక్తిని కొత్తపేట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ.9 లక్షల విలువైన 182 గ్రాముల బంగారపు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను కొత్తపేట సీఐ చిన కొండలరావు మీడియాకు వివరించారు. జక్కంపూడి కాలనీలోని అటికల శివాజీకి దూరపు బంధువైన బొడ్డు రమణ(52) జీవనోపాధి కోసం విజయవాడ వచ్చాడు. ఈ నెల 1న రమణ శివాజీ కుమార్తె చింతల భారతి ఇంట్లోని బీరువాలో బంగారపు వస్తువులు, నగదును చోరీకి పాల్పడ్డాడు. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా.. నిందితుడు ఇంటి నుంచి బంగారపు వస్తువులను తీసుకుని ఆటోలో వెళ్లడం సీసీ కెమెరాలో రికార్డు అయింది. దీంతో పోలీసులు నిందితుడు ప్రయాణించిన ఆటోను గుర్తించి, డ్రైవర్ను ఆరా తీశారు. 3వ తేదీ సాయంత్రం రమణ బస్టాండ్ వద్ద తిరుగుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. రమణకు వివాహం కాగా వ్యసనాల కారణంగా భార్య, పిల్లలను వదిలి విడిగా ఉంటున్నాడు. శివాజీ ఇంటికి వచ్చిన క్రమంలో భారతీ ఇంట్లో ఉన్న బంగారపు వస్తువులపై కన్ను పడింది. ఒకటో తేదీ ఇంట్లోని వారందరూ విస్సన్నపేటకు వెళ్లగా, అక్కడి నుంచి ఇంటికి వచ్చిన రమణ ఇంట్లో బీరువాను స్క్రూడ్రైవర్, కట్టర్తో పగలగొట్టి బంగారపు వస్తువులను కాజేశాడు. నిందితుడిని పట్టుకున్న సిబ్బందిని సీఐ కొండలరావు అభినందించారు. -
కలంకారీ పరిశ్రమలన్నీ సంఘటితం కావాలి
పెడన: కలంకారీ పరిశ్రమలన్నీ ఏకతాటిపైకి రావాలని, అప్పుడు క్లస్టర్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. శుక్రవారం గూడూరు రోడ్డులోని దేవాంగ కల్యాణ మండలంలో కలంకారీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రొగ్రాంను ఎస్ఎంఎస్ఈ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ కలంకారీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా కలంకారీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను శాశ్వత పరిష్కారంతో పాటు కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అలాగే కలంకారీ క్లస్టర్కు అవసరమైన స్థలాలను, భవనాలను గుర్తించి వాటి అనుమతుల కోసం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని, కలెక్టర్ కూడా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అమలు చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, ఎస్ఎంఎస్ఈ జీఎం వెంకట్రావు, జ్యూవెలరీ పార్క్ అధ్యక్షుడు వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కలంకారీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఎమ్మెల్యే కాగిత -
రూ. 28.97లక్షల విలువైన మద్యం బాటిళ్లు ధ్వంసం
కోనేరుసెంటర్: కృష్ణాజిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో పలు కేసులకు సంబంధించి సీజ్ చేసిన మద్యం బాటిళ్లను శుక్రవారం జిల్లా పోలీసులు ధ్వంసం చేశారు. జిల్లా పోలీస్ పరేడ్గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ ఆర్. గంగాధరరావు ఇతర అధికారులతో కలసి మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్ చేత ధ్వంసం చేయించారు. జిల్లావ్యాప్తంగా అక్రమ మద్యం రవాణాతో పాటు సారా తయారీ కేంద్రాలపై జరిపిన దాడులకు సంబంధించి 814 కేసులు నమోదు చేసిన పోలీసులు.. రూ. 28,97,000 విలువ గల 15,280 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అలాగే 65 ఎకై ్సజ్ కేసులకు సంబంధించి 684.83 లీటర్ల నాటుసారాను సీజ్ చేశారు. వీటిని శుక్రవారం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 2023 నుంచి ఇప్పటి వరకు సీజ్ చేసిన అన్ని మద్యం బాటిళ్లు, సారాను ధ్వంసం చేయించినట్లు తెలిపారు. అక్రమ మద్యం రవాణా, సారా తయారీలకు సంబంధించి సమాచారం ఉంటే హెల్ప్లైన్ 14405, డయల్ 100, 112లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని ప్రజలను కోరారు. జిల్లా అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి. సత్యనారాయణ, బందరు, అవనిగడ్డ, గుడివాడ, గన్నవరం డీఎస్పీలు సీహెచ్ రాజ, శ్రీవిద్య, వి. ధీరజ్నీల్, సీహెచ్ శ్రీనివాసరావు, డీటీసీ డీఎస్పీ జి. శ్రీనివాసరావు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
టిప్పర్ ఢీకొని యువకుడి దుర్మరణం
తిరువూరు: స్థానిక బైపాస్రోడ్లో గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో షేక్ సుభాని(21) దుర్మరణం చెందాడు. తిరువూరు రాజుపేటకు చెందిన సుభాని బస్టాండు సెంటర్లోని ఒక జ్యూవెలరీ షాపులో పనిచేస్తున్నాడు. దుకాణం నుంచి బయటికి వెళ్లిన యువకుడు తన స్నేహితుడిని ఇంటివద్ద దింపి వస్తుండగా బైపాస్రోడ్డులో ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుభాని తల ఛిద్రం కాగా అక్కడికక్కడే మరణించాడు. ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్గా పనిచేసే సుభాని తండ్రి ఉస్మాన్ ఐదేళ్ల క్రితం ఖమ్మం జిల్లా ముత్తగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తండ్రి మరణానంతరం సుభానిపైనే కుటుంబం ఆధారపడగా, అతని మరణంతో జీవనాధారం కోల్పోయింది. తిరువూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుభాని మృతదేహానికి స్థానిక ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
కోనేరుసెంటర్: పోలీసు కుటుంబాలకు పోలీసుశాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుందని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తూ గత ఏడాది మే 6వ తేదీన రోడ్డు ప్రమాదంలో మరణించిన మురాల వెంకటేశ్వరరావు సతీమణి వీరమల్లు రాజేశ్వరికి పోలీసు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం కల్పిస్తూ శుక్రవారం ఎస్పీ కారుణ్య నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటేశ్వరరావు అకాల మరణం అత్యంత బాధాకరమన్నారు. కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన వారు నేటి నుంచి విధుల పట్ల అంకితభావం, క్రమశిక్షణతో పాటు విధులను అత్యంత బాధ్యతగా నిర్వర్తించాలని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి. సత్యనారాయణ, ఏవో ఎంఎం సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఒలింపిక్ సంఘం ప్రక్షాళనే పరిష్కారం విజయవాడస్పోర్ట్స్: ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్(ఏపీవోఏ) ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్), ఫెడరేషన్ గుర్తింపు ఉన్న రాష్ట్ర క్రీడా సంఘాలతో గురునానక్కాలనీలోని టీడీపీ కార్యాలయంలో ఎంపీ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ ప్రస్తుతం ఏపీవోఏ ప్రతినిధులుగా కొనసాగుతున్న వ్యక్తుల కారణంగా ఇటీవల జరిగిన ఉత్తరాఖండ్ జాతీయ క్రీడల్లో ఆంధ్ర రాష్ట్ర క్రీడాకారులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ఏపీవోఏని రెండుగా విడదీసిన వ్యక్తులతో చర్చించి, ఏపీవోఏని ఒక్కటిగా చేయాలని గతంలో ఆలోచించామన్నారు. ఏపీవోని ప్రక్షాళన చేయడమే ప్రభుత్వం ముందున్న మార్గమని బహిర్గతం చేశారు. ఏపీవోఏ అడహాక్ కమిటీ ఏర్పాటు విషయమై సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) అధ్యక్షురాలు, ఎంపీ పి.టి.ఉషతో ఇటీవలే చర్చించామని, దీనికి ఆమె సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. అడహాక్ కమిటీ ఏర్పాటునకు క్రీడా సంఘాలన్ని కలిసి ఏకతాటిపైకి రావాలని ఆదేశించారు. ఏపీ జూడో సంఘం సీఈవో వెంకట్ నామిశెట్టి, దక్షిణ భారత అథ్లెటిక్స్ మానటరింగ్ కమిటీ చైర్మన్ ఆకుల రాఘవేంద్రరావు, కబడ్డీ సంఘం కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ సమక్షంలో రాష్ట్ర షటిల్ బ్యాడ్మింటన్, కాయకింగ్, తైక్వాండో, ఫుట్బాల్, రగ్బీ, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, ఖోఖో, హాకీ, మోడ్రన్పెంటత్లాన్, స్కైస్నోబోర్డ్, రైఫిల్షూటింగ్, బేస్బాల్ క్రీడా సంఘాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
వంశీ బెయిల్ పిటిషన్పై తీర్పు మరోసారి వాయిదా
గన్నవరం: కృష్ణాజిల్లా ఆత్కూరు పోలీస్స్టేషన్లో నమోదైన స్థల వివాదం కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ బెయిల్ పిటిషన్పై కోర్టు తీర్పు సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసులో వంశీమోహన్ బెయిల్ పిటిషన్పై స్థానిక 8వ అదనపు ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో గురువారం వాదనలు పూర్తి కాగా తీర్పును రిజర్వ్ చేశారు. ఈ కేసు తీర్పు శుక్రవారం వెలువడాల్సిన నేపథ్యంలో ఆత్కూరు పోలీసులు వంశీని మరోసారి కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇరువైపులా న్యాయవాదుల వాదనలు విన్న జడ్జి తీర్పును సోమవారం ఇవ్వనున్నట్లు తెలిపారు. బెయిల్ పిటిషన్పై కూడా అదే రోజు తీర్పు వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. నలుగురు కూలీలను కాపాడి మేస్త్రి మృతి గన్నవరం: శ్లాబ్ నిర్మాణ పనుల్లో జరిగిన ప్రమాదంలో నలుగురు మహిళలను రక్షించే క్రమంలో కాంక్రీట్ లిఫ్ట్ గడ్డర్ల కింద పడిన ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటనపై శుక్రవారం గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ఏలూరు జిల్లా ఆగిరిపల్లికి చెందిన పిల్లిబోయిన కొండలు(35) కాంక్రీట్ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గన్నవరం మండలం మాదలవారిగూడెంలో ఓ భవనానికి శ్లాబ్ నిర్మాణ నిమిత్తం గురువారం కొంత మంది కూలీలను తీసుకుని వెళ్లారు. శ్లాబ్ నిర్మాణం జరుగుతున్న సమయంలో కాంక్రీట్ను పైకి లిఫ్ట్ చేసే యంత్రంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో లిఫ్ట్ బాక్స్ వైర్లు ఒక్కసారిగా తెగి ఐరన్ గడ్డర్లు కిందపడిపోవడం గమనించిన కొండలు.. అక్కడే ఉన్న మహిళలను కాపాడే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ఆ నలుగురు మహిళలను పక్కకు నెట్టివేసి.. కొండలు మాత్రం బరువైన లిఫ్ట్ బాక్స్ గడ్డర్ల కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. అతనికి భార్య, ఇరువురు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై గన్నవరం ఎస్ఐ ప్రేమ్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చిల్లకల్లు(జగ్గయ్యపేట): భర్త వేధింపులు తాళలేక భార్య ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన చిల్లకల్లులో గురువారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన బత్తుల భవానీ (25)కి 2015లో చిల్లకల్లుకు చెందిన బత్తుల శ్రీనుతో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త అల్ట్రాటెక్ కర్మాగారంలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. భర్త మద్యానికి బానిసై గత కొంత కాలంగా భార్యను వేధిస్తున్నాడని ఈ క్రమంలో గురువారం రాత్రి కూడా ఇద్దరి మధ్యన వాగ్వాదం జరగటంతో భార్యను కొట్టటంతో మనస్తాపం చెందిన భవానీ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం సమయంలో చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తండ్రి వెంకటేష్ భర్త వేధింపులు తాళలేకనే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రైనీ ఐపీఎస్ మనీషా రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
లబ్ధిదారులకు ఎంతకష్టం!
● ఎంఎంసీ అధికారుల అనాలోచిత నిర్ణయంతో ఇబ్బందులు ● ఒకేసారి 3,900మందిని ఇంటర్వ్యూకు పిలవడంతో అదుపు తప్పిన పరిస్థితి ● కింద పడిపోయిన మహిళలు ● సొమ, మంగళవారాల్లో మరోసారి ఇంటర్వ్యూ మచిలీపట్నంటౌన్: బలహీన వర్గాలకు చెందిన లబ్ధిదారులు అవస్థలు పడ్డారు. వివిధ స్వయం ఉపాధి యూనిట్ల కోసం ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఇంటర్వ్యూకి వచ్చి.. అధికారుల అనాలోచిత చర్యల కారణంగా తిప్పలు పడి.. బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు. శుక్రవారం బందరు నగరపాలక సంస్థ కార్యాలయం(ఎంఎంసీ)లో ఇరుకుగా ఉండే మీటింగ్ హాల్లో నగరంలోని 50 డివిజన్ల నుంచి 3,900 మందిని ఒకేసారి ఇంటర్వ్యూకి పిలవడంతో తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాటలో కొంత మంది మహిళలు కిందపడిపోయారు. నగరపాలక సంస్థ అధికారుల అనాలోచిత చర్యతో ఈ పరిస్థితి నెలకొనడంతో దరఖాస్తుదారులు అసహనం వ్యక్తం చేశారు. రుణాల కోసం వచ్చిన తమపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖం చాటేసిన బ్యాంకర్లు, వెల్ఫేర్ సెక్రటరీలు.. నగరపాలకసంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రుణ ఇంటర్వ్యూలకు కీలకమైన బ్యాంకర్లు ముఖం చాటేశారు. నగరంలోని దాదాపు 15 బ్యాంకర్లను నగరపాలక సంస్థ ఆహ్వానం పలుకగా కేవలం ఆరు బ్యాంకులకు సంబంధించిన సిబ్బందే హాజరయ్యారు. అలాగే ఆయా డివిజన్ సచివాలయాలకు చెందిన పలువురు వెల్ఫేర్ సెక్రటరీలు కూడా గైర్హాజరయ్యారు. దీంతో తమ సెక్రటరీలు కానరాక దరఖాస్తుదారులు ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి కీలక సమావేశాలు ఉంటే గత ప్రభుత్వ హయాంలో 10 నుంచి 15 డివిజన్లకు ఒక చోట నిర్వహించేవారు. దీంతో తోపులాట లేకుండా సజావుగా కార్యక్రమం ముగిసేది. ప్రస్తుతం పాలకులు, అధికారులకు సరైన అవగాహన లేకపోవటంతో ఒకే రోజు ఒకే చోట ఇంటర్వ్యూ ఏర్పాటు చేసి దరఖాస్తుదారుల ఇబ్బందులకు కారణమయ్యారు. ఇంటర్వ్యూ వాయిదా.. శుక్రవారం నిర్వహించిన ఈ ఇంటర్వ్యూను తిరిగి ఈ నెల 7, 8 తేదీల్లో నిర్వహించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. స్థానిక టౌన్ హాల్ల్లో ఈ ఇంటర్వ్యూలు ఉంటాయని చెబుతున్నారు. ఇంటర్వ్యూలకు హాజరైన దరఖాస్తుదారులతో కిక్కిరిసిన ఎంఎంసీ కార్యాలయంఇబ్బందులు పడ్డాం.. నగరపాలకసంస్థ అధికారుల అనాలోచిత చర్యలతో మేము ఇబ్బంది పడ్డాం. ఇరుకు గదిలో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసి నగరంలోని 50 డివిజన్ల నుంచి బీసీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న 3,900 మంది ఒకే సారి పిలవడం ఎంతవరకూ సమంజసం. పైగా వెల్ఫేర్ సెక్రటరీలు హాజరుకాలేదు. వారు వచ్చి ఉంటే మా దరఖాస్తులు పరిశీలించి ఒక క్రమ పద్ధతితో ఇంటర్వ్యూలకు పంపేవారు. – లక్ష్మి, దరఖాస్తుదారు -
రైతుకు సహకార నిరాకరణ!
● పది నెలల్లో సహకార సంఘాల్లో పాలన అస్తవ్యస్తం ● ప్రభుత్వం మారగానే ఆగిపోయిన గోడౌన్ల నిర్మాణం ● రుణాల మంజూరు అంతంతమాత్రమే ● గత ప్రభుత్వంలో కార్పొరేట్ బ్యాంకులకు దీటుగా పరుగులు పెట్టిన వ్యవస్థ కూటమి నిర్వాకంతో వ్యవస్థ నిర్వీర్యంజి.కొండూరు: గ్రామస్థాయిలో రైతు బ్యాంకులుగా పేరొందిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు నిర్వీర్యమవుతున్నాయి. దశాబ్దాలుగా రైతులకు సేవలందించిన ఈ సహకార సంఘాలు ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు సమర్థనీయ సేవలను అందించడంలో విఫలమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సహకార సంఘాలకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రీమెన్ కమిటీలను రద్దు చేసి ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ పది నెలల కాలంలో సంఘాలకు పాలనా కమిటీలను నియమించడంలో ప్రభుత్వం జాప్యం చేయడంతో వ్యవస్థ కుంటుపడుతోంది. గత ప్రభుత్వ హయాంలో కార్పొరేట్ బ్యాంకులకు దీటుగా సకల వసతులతో అన్ని రకాల సేవలను అందించిన ఈ సహకార సంఘాలు ఇప్పుడు నామమాత్రపు సంఘాలుగా మారుతున్నాయి. గోడౌన్లపై వివక్ష ఎందుకు? రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ఆరబెట్టుకునేందుకు, నిల్వ చేసుకునేందుకు వీలుగా గోడౌన్ విత్ ప్లాట్ఫారంల నిర్మాణాలు గత ప్రభుత్వ హయాంలో సహకార సొసైటీల ఆధ్వర్యంలో చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లాలో రూ.21.44కోట్లతో 52చోట్లు గోడౌన్ విత్ ప్లాట్పారంలను నిర్మాణాలు చేయాల్సి ఉండగా గత ప్రభుత్వంలోనే 50శాతంకి పైగా గోడౌన్లు పూర్తి చేసి ప్రారంభించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధుల మంజూరులో జాప్యం జరగడంతో వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలు నిలిచిపోయాయి. నిర్మాణాలు పూర్తయిన గోడౌన్లకు సైతం రహదారి సమస్యలు వంటి చిన్న చిన్న సమస్యలను పరిష్కరించకపోవడంతో పాటు గోడౌన్ల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించడంతో సహకార సంఘాలు విఫలం కావడంతో వినియోగంలోకి రాలేదు. అంతే కాకుండా నిర్మాణ దశలో ఆగిపోయిన గోడౌన్లు సంచార జీవనం సాగించే కుటుంబాలకు ఆవాసాలుగా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. పక్కా భవనాలు కూడా.. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో పీఏసీఎస్లు 131, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బ్రాంచ్లు 22కి గానూ 98 నూతన భవనాలు, కొన్ని భవనాలకు అదనపు గదులు నిర్మాణం, మరమ్మతుల కోసం రూ.28.36కోట్లు కేటాయించారు. వీటిలో 80శాతంకి పైగా భవనాల నిర్మాణాలు గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. గత ప్రభుత్వంలో బలోపేతం ఇలా.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సహకార వ్యవస్థ పరుగులు పెట్టింది. అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సంస్కరణల వల్ల అధునిక వసతుల కల్పనతో పాటు రుణాల మంజూరు, టర్నోవర్, డిపాజిట్లు ఇలా అన్ని రంగాలలో సహకార వ్యవస్థ బలోపేతమై లాభాల బాటలో నడిచింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 57 కేడీసీసీ బ్రాంచ్లు, రెండు ప్రధాన కార్యాలయాలు, 6 జిల్లా కో ఆపరేటివ్ ప్రోసెసింగ్ సెంటర్లు, 425సొసైటీలు ఉన్నాయి. ● కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకు పరిధిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం అధికారంలో చివరి ఏడాది 2019కి మొత్తం రుణాలు రూ.3,201.21 కోట్లు ఉండగా మొత్తం టర్నోవర్ రూ.5,138.46 కోట్లు ఉంది. షేర్ క్యాపిటల్ రూ.170.12 కోట్లు, రిజర్వ్ ఫండ్స్ రూ.148.33 కోట్లు, డిపాజిట్లు రూ.1,937.25కోట్లుగా ఉన్నాయి. ● 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 వరకు ఐదేళ్ల పాలనలో మొత్తం రుణాలు రూ.8,134.51కోట్లు ఉండగా మొత్తం టర్నోవర్ రూ.11,279.48కోట్లుగా ఉంది. షేర్ క్యాపిటల్ రూ.390.75కోట్లు, రిజర్వ్ ఫండ్స్ రూ.308.54కోట్లు, డిపాజిట్లు రూ.3,144.97 కోట్లుగా ఉన్నాయి. రుణాల మంజూరు లేదు.. నష్టాల్లో ఉన్న సహకార సంఘాలను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం లాభాల బాట పట్టించింది. సహకార సంఘాలకు అదనపు ఆదాయం కోసం పెట్రోలు బంకులు, మినరల్ వాటర్ ప్లాంట్లు, మెడికల్ దుకాణాలు ఏర్పాటు చేశాం. గోడౌన్ల పట్ల ప్రస్తుత ప్రభుత్వం వివక్ష చూపడం దుర్మార్గం. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే గోడౌన్ల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి. రుణాల రికవరీ టార్గెట్ పూర్తి కాలేదని రుణాలు మంజూరు చేయకపోవడం దారుణమైన విషయం. ప్రత్యేక అధికారుల పాలన వల్ల సంఘాల్లో పారదర్శకత ఉండదు. రైతుల పట్ల ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే పాలనా కమిటీలను ఏర్పాటు చేసి సహకార సంఘాలను బలోపేతం చేయాలి. – తన్నీరు నాగేశ్వరరావు, కేడీసీసీబీ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్చార్జ్ సహకార సంఘాలకు కూటమి ప్రభుత్వం పాలనా కమిటీలను ఏర్పాటు చేయకుండా ప్రత్యేక అధికారులతో వ్యవస్థను నడిపిస్తున్న క్రమంలో రుణాల మంజూరు అంతంతమాత్రంగానే సాగుతోంది. 2023–24తో పోలిస్తే 2024–25సంవత్సరానికి 60శాతం మాత్రమే రుణాలను రైతులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రత్యేక అధికారుల పాలన రైతులకు రుణాల మంజూరులో తలనొప్పిగా మారినట్లు సమాచారం. రుణాల రికవరీ టార్గెట్లు పూర్తికాలేదని రుణాల మంజూరును ఆపేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. -
నూతన ఆర్థిక చట్టాన్ని వ్యతిరేకిద్దాం
బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి వరప్రసాద్ పటమట(విజయవాడతూర్పు): కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక నూతన ఆర్థిక విధానాల్ని వ్యతిరేకించాలని, పెన్షన్ విధానంలో మార్పులు చేస్తూ దొడ్డిదారిన పార్లమెంటులో ఫైనాన్స్ బిల్లు పెట్టారని ఆలిండియా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి వి.వరప్రసాద్ అన్నారు. అసోసియేషన్ సర్వసభ్య సమావేశం శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పటమటలోని రఘురామ కల్యాణ వేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రతి పదేళ్లకు జరిగే వేతన సవరణలో ఉద్యోగులకు పెరిగే వేతనాలకు తగ్గట్టుగా పెన్షన్లో కూడా పెంపుదల జరిగే మార్పులు చేస్తూ 2026 నుంచి రిటైర్ అయ్యే వారికి మాత్రమే వేతన సవరణ అవకాశం కల్పించిందని అన్నారు. ఈ నూతన పెన్షన్ విధానం పాత పెన్షనర్స్కు మాత్రం మార్పులు లేని విధంగా, న్యాయపరమైన జోక్యం లేకుండా చట్టం చేస్తూ దేశ వ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్స్ మెడకు ఉరితాడు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం ప్రధాన కార్యదర్శి సి. భాస్కరరావు, సర్కిల్ కార్యదర్శి టి.ఆశీర్వాదం, సలహాదారు డి.దుర్గారావు కోశాధికారి శివ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోళ్లు లేక డీలా
కృష్ణాజిల్లాశుక్రవారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025దిగుబడులు భళా.. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 517.80 అడుగుల వద్ద ఉంది. జలాశయం నుంచి కుడి కాలువకు 3,031 క్యూసెక్కులు విడుదలవుతోంది. కనులపండువగా.. దుర్గమ్మ సన్నిధిలో చైత్రమాస వసంత నవరాత్రోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. గురువారం అమ్మవారికి శ్వేత, హరిత వర్ణ పుష్పాలతో అర్చన చేశారు.నిత్యాన్నదానానికి విరాళం మోపిదేవి: స్థానిక వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి నిత్యాన్నదానానికి బాపట్ల జిల్లా కావూరుకు చెందిన తుమ్మల సాయి రాఘవ్ రూ. లక్షను విరాళంగా సమర్పించారు. –8లోuకంకిపాడు: సీజన్లు మారుతున్నాయే తప్ప అన్నదాత కష్టాలు మాత్రం తీరటం లేదు. ఏ ఏటికాయేడు కష్టాలు.. నష్టాలే. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికందే నాటికి ప్రభుత్వం రిక్తహస్తం చూపుతోంది. దీంతో సరైన మద్దతు ధర లభించక రైతులు నష్టపోతున్నారు. అన్నదాతలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు రైతుల పట్ల అడుగడుగునా నిర్లక్ష్యం కనబరుస్తోంది. దిగుబడులు ఘనం.. రబీ వరి సాగులో దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. ఎకరాకు విత్తనం, పైపాటు, సమగ్ర యాజమాన్య చర్యలకు రూ. 35 వేల వరకూ పెట్టి సాగు చేశారు. పంట చేతికొచ్చింది. ఎకరాకు సరాసరిన 42 నుంచి 45 క్వింటాళ్లు వరకూ దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. తెగుళ్ల బెడద తగ్గటంతో దిగుబడులు ఆశించిన మేరకు లభించాయని అంటున్నారు. చితికిపోతున్న అన్నదాత.. దిగుబడులు చూసి ఆనందించే లోపే రైతులు దళారుల చేతిలో చితికి దిగాలు చెందుతున్నారు. పంట మార్కెట్కు చేరుతుండటంతో దళారులు, మిల్లర్లు పంట పొలాల్లోకి వెళ్లిపోతున్నారు. ఉన్న పళంగా కోసిన ధాన్యం కోసినట్లుగా మిల్లుకు తరలించేందుకు 75 కిలోల బస్తాకు రూ.1,250 నుంచి రూ.1,300 మాత్రమే ఇస్తామని నొక్కి మరీ పంటను తరలించుకుపోతున్నారు. కొనుగోలు కేంద్రాల జాడ లేకపోవటంతో రైతులు కూడా చేసేది లేక దళారులకే అమ్మి సొమ్ము చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. చలివేంద్రపాలెం సమీపంలో యంత్రంతో వరి కోత పనులు చేస్తున్న కూలీలు 7న్యూస్రీల్జిల్లాలో పరిస్థితి.. కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది రబీ సాగుకు అనుమతి అధికారికంగా లేదు. ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని పాలకులు, అధికారులు సూచించారు. అయితే బోర్లు సదుపాయం ఉన్న రైతులు, అపరాల పంట సాగుకు అనువుగా లేని భూముల్లో రైతాంగం రబీ వరి సాగు చేపట్టారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 12,285 ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రధానంగా ఎంటీయూ 1156, 1153, 1121, 1010, 1061, బీపీటీ 5204, పీఆర్ 126 విత్తన రకాలను రైతులు సాగుకు ఎంచుకున్నారు. మూడు రోజులుగా జిల్లాలోని పలు చోట్ల పంట చేతికి రావటంతో వరి కోత యంత్రాలతో వరి కోత పనులను నిర్వహిస్తున్నారు. ప్రారంభమైన రబీ వరి కోతలు మార్కెట్కు చేరుతున్న ధాన్యం మద్దతు ధర కోసం అన్నదాతల అగచాట్లు సమీక్షలు జరుగుతున్నాయి.. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ఇంకా సమీక్ష జరుగుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఏర్పాట్లపై చర్చించాలి. పది వేల టన్నులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నుంచి సూచన ప్రాయంగా ఆదేశాలు వచ్చాయి. ఏ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రా లు తెరవాలి అన్నదానిపై చర్చించి రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. – పద్మాదేవి, జిల్లా మేనేజరు, జిల్లా పౌరసరఫరాల సంస్థ కొనుగోలు కేంద్రాల ఊసేదీ? తక్షణమే తెరవాలి.. రబీ వరి పంట చేతికొచ్చింది. ఎకరాకు రూ. 30 వేలకు పైగా పెట్టుబడులు అయ్యాయి. దిగుబడులు బాగా వచ్చాయి. ఖరీఫ్లో జరిగిన నష్టం నుంచి తేరుకోవాలంటే రబీలో కూడా మద్దతు ధర అందేలా పాలకులు చర్యలు తీసుకోవాలి. అప్పుడే అన్నదాతలకు మేలు జరుగుతుంది. త్వరగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తేవాలి. – నకరికంటి శేఖర్, కౌలు రైతు, ఈడుపుగల్లు వరి కోత పనులు మూడు రోజులుగా సాగుతున్నాయి. పంట మార్కెట్కు చేరుతోంది. అయినా ఇప్పటి వరకూ రబీ వరి కొనుగోళ్లపై ప్రభుత్వం ఎలాంటి ముందడుగు వేయలేదు. పౌరసరఫరాల సంస్థ పంట దిగుబడులు వచ్చే నాటికే రైతు సేవా కేంద్రాలను సిద్ధం చేయటం, కొనుగోలు ప్రక్రియకు సన్నాహాలు చేయటం జరగలేదు. 12,285 ఎకరాల్లో వరి సాగు చేయటం ద్వారా 43,824 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తుందని వ్యవసాయశాఖ అంచనాలు చెబుతున్నాయి. ఖరీఫ్లో కురిసిన భారీ వర్షాలు, వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. 44,521 హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్లు అధికారుల ప్రాథమిక అంచనాలే ఉన్నాయి. ఖరీఫ్లో ఏర్పడిన నష్టాన్ని అధిగమించి ఒడ్డున పడాలనే ఆశతో రైతులు అనుమతులు లేకున్నా బోర్లు సదుపాయం ఉన్న భూముల్లో వరి సాగు చేసుకున్నారు. దిగుబడులు ఘనంగా వచ్చాయి. కానీ అధికారులు, పాలకులు రైతులు పండించిన పంటకు సరైన మద్దతు ధర అందించే విషయంలో వైఫల్యం చెందారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. -
ఏ బిడ్డా అనాథగా మిగిలిపోకూడదు
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): అనాథ పిల్లలను దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తున్న దంపతులు ఎంతో మందికి ఆదర్శనీయులని, ఏ బిడ్డా అనాథగా మిగిలిపోకూడదని కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. గురువారం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఆర్వో కె. చంద్రశేఖరరావుతో కలిసి జిల్లాలోని వివిధ శిశుగృహల్లో ఉంటున్న ముగ్గురు చిన్నారులను కారా (సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ) ద్వారా జిల్లా బాలల రక్షణ విభాగం (డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్) ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలకు చెందిన ముగ్గురు జంటలకు దత్తత ఇచ్చి పత్రాలను అందించారు. మచిలీపట్నం శిశు గృహ నుంచి హిమాన్షు అనే ఏడు నెలల బాబుని చిత్తూరు జిల్లాకు చెందిన పీఎస్ ప్రసాద్ సుజాత దంపతులకు, బుద్ధవరం శిశు గృహ నుంచి రెండున్నర సంవత్సరం వయసున్న పాపని హైదరాబాద్కు చెందిన వికాస్ పంక్వని మనీషా దంపతులకు, అదేవిధంగా నాలుగేళ్ల సుశాంత్ అనే బాలుడిని బెంగళూరుకు చెందిన కృష్ణా నందిని దంపతులకు కారా ద్వారా దత్తత ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారులను బాగా చూసుకొని, మంచిగా చదివించి వారికి బంగారు భవిష్యత్తును అందించాలని దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. -
కనువిందుగా విహంగామా
పెనుగంచిప్రోలు: మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఎక్కడ చూసినా కొంగల కోలాహలం కనపడుతోంది. వందల సంఖ్యలో వచ్చిన పెయింటెడ్ స్టాక్స్ నేడు సంతానోత్పత్తి ద్వారా వేల సంఖ్యకు చేరాయి. వీటి అరుపులు, ఇవి చేసే ధ్వనులతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోతోంది. గ్రామ స్తులు ఏమాత్రం విసుక్కోకుండా, ఓపికగా వాటిని కాపాడుకుంటున్నారు. ప్రస్తుతం గూళ్లల్లో పిల్లలను చేసి వాటిని సంరక్షించుకుంటున్నాయి. వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి.. ఏటా వెంకటాపురం గ్రామానికి ఆస్ట్రేలియా నుంచి పెయింటెడ్ స్టాక్స్(ఎర్రకాళ్ల కొంగలు) డిసెంబర్లో వచ్చి విడిది చేస్తాయి. వందల సంఖ్యలో వచ్చే పక్షులు సంతానోత్పత్తి తరువాత జూన్లో వాటి స్వస్థలాలకు వెళ్తుంటాయి. కలిసి వస్తున్న నీటి వనరులు... పక్షులు ముఖ్యంగా తాగునీటి ఇబ్బందులతో గతంలో అనేకం మృత్యువాత పడేవి. కుంటల్లో, చెరువుల్లో, పక్కనే ఉన్న మునేరులో కూడా నీరు లేక ఆహారం కూడా దొరకక అనేక ఇబ్బందులు పడేవి. అయితే గత రెండు మూడేళ్లుగా మునేరులో, నీటి కుంటలో, చెరువులలో కూడా నీరు పుష్కలంగా ఉండటంతో పక్షుల ఆవాసానికి ఉపయోగకరంగా ఉన్నాయి. ఆహారానికి అవసరమైన చేపలు చెరువుల్లో, మునేరులో ఉండటంతో పక్షులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవిస్తున్నాయి. వెంకటాపురంలో ఎర్రకాళ్ల కొంగల కోలాహలం -
బందరుకోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నంఅర్బన్: మచిలీపట్నం వారసత్వ సంపద గల చారిత్రాత్మక నగరమని, బందరు కోటను పర్యాటక సర్క్యూట్లో మార్చేందుకు పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖల అధికారులతో కలిసి నగరంలోని బందరుకోట, డచ్ వారి సమాధులను పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురావస్తు శాఖ, విజయవాడ సహాయ సంచాలకులు స్వామి నాయక్ మాట్లాడుతూ బందరుకోట 17వ శతాబ్దంలోనిదన్నారు. కేంద్ర పురావస్తుశాఖ కన్సల్టెంట్ అసిస్టెంట్ నాగేంద్రకుమార్ మాట్లాడుతూ మొదటి దశలో బందరు కోటలో పైకప్పు పునరుద్ధరణ, గన్ పౌడర్ మ్యాగజైన్ మరమ్మతు పనులు చేపట్టాలని అంచనాలు రూపొందించామన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇదివరకు బందరు కోటను సందర్శించి పునరుద్ధరణ పనులు చేపట్టాలని సూచించినప్పటికీ ఏమాత్రం పనులు జరగలేదని.. ఇకనైనా ఈ విషయం తీవ్రంగా పరిగణించి పనులు వేగవంతం చేయాలని సూచించారు. అవసరమైతే ఢిల్లీలోని పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్తో మాట్లాడతామని చెప్పారు. కలెక్టర్ వెంట కేంద్ర ప్రభుత్వ పురావస్తు శాఖ ఉప పర్యవేక్షకుడు ఎంఎస్ శివకుమార్, రాష్ట్ర పురావస్తు శాఖ ఉపసంచాలకులు సురేష్, జిల్లా పర్యాటక అధికారి రామ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
మంగినపూడి బీచ్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక
రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంరూరల్: మంగినపూడి బీచ్ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించామని ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గురువారం రాత్రి మంత్రి రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, కలెక్టర్ డీకే బాలాజీలతో కలిసి మంగినపూడి బీచ్ను పరిశీలించారు. అక్కడి ఆహ్లాదకర వాతావరణాన్ని గమనించిన ముఖ్య కార్యదర్శి బీచ్ అభివృద్ధికి ఎంతో మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. అనంతరం మంత్రి రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతికి, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు, భీమవరం, రేపల్లె, గుంటూరు తదితర ప్రాంతాలకు మంగినపూడి బీచ్ దగ్గరగా ఉందన్నారు. ఈ బీచ్ సురక్షితమైనదే కాకుండా ఇక్కడ 200 ఎకరాల భూమి కూడా అందుబాటులో ఉందని, అందులో ఇప్పటికే 150 ఎకరాల భూమిని గుర్తించామన్నారు. మిగిలిన 50 ఎకరాల భూమిని కూడా గుర్తించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. పీపీపీ పద్ధతిలో అభివృద్ధి.. పీపీపీ పద్ధతిలో స్వదేశీ దర్శన్ పథకం కింద బీచ్లో రిసార్టులు, హోటళ్లు తదితర అభివృద్ధి పనులు చేసేందుకు రూ. 108కోట్ల నుంచి రూ. 150 కోట్ల వ్యయం అయ్యే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. ఆ మేరకు సమగ్ర ప్రణాళికతో ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపేందుకు సిద్ధం చేశామన్నారు. మే 15వ తేదీ నుంచి బీచ్ ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నానున్నారు. కియా కింగ్, బీచ్ కబడ్డీ జాతీయ క్రీడలను కూడా ఈసారి మంగినపూడి బీచ్ లో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు. పర్యాటకశాఖ ప్రాంతీయ సంచాలకులు వై.వి.ప్రసన్నలక్ష్మి, జిల్లా పర్యాటక అధికారి రామ్ లక్ష్మణ్, ఆర్డీవో స్వాతి తదితరులు పాల్గొన్నారు. -
లారీ కింద పడి ప్రాణాలతో బయటపడిన యువకుడు
పెనమలూరు: పోరంకి సెంటర్లో గురువారం యువకుడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. అనకాపల్లికి చెందిన సింగంపల్లి గోవిందు పని కోసం పోరంకికి వచ్చాడు. అతను పోరంకి సెంటర్లో బైక్పై డివైడర్ కటింగ్ వద్ద రోడ్డు దాటుతుండగా కంకిపాడు వైపు నుంచి విజయవాడ వైపునకు వెళ్తున్న టిప్పర్ బైక్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్తో పాటు గోవిందు లారీ కిందకు వెళ్లాడు. ఒక్కసారిగా అందరూ గోవిందు ప్రాణాలకు ముప్పు జరిగిందని భావించారు. అయితే అతను లారీ మధ్యలో ఉండటంతో లారీ చక్రాలు అతని పైకి ఎక్కలేదు. అతను సురక్షితంగా లారీ కింద నుంచి బయటకు వచ్చాడు. స్వల్వ గాయాలు కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి దుర్మరణం పమిడిముక్కల: విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై గురజాడ బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఉయ్యూరుకు చెందిన చాగంటిపాటి వీరభద్రరావు(82) గురజాడ వెళ్తుండగా, ఉయ్యూరు నుంచి మచిలీపట్నం వైపు వెళుతున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వీరభద్రరావు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందిన వెంటనే సీఐ చిట్టిబాబు, ఏఎస్ఐ రాజ్కుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చిట్టిబాబు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ మృతి గుడివాడరూరల్: రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం గుడ్లవల్లేరు మండలం కూరాడ గ్రామానికి చెందిన వలిశెట్టి వనాజీ(50) సిద్ధాంతం గ్రామ పరిధిలోని పెట్రోల్ బంక్లో ఆటోలో ఆయిల్ కొట్టించుకుని నలుగురి ప్రయాణికులతో గుడివాడ వైపు వస్తుండగా గుడ్లవల్లేరు వైపు నుంచి వస్తున్న మరొక ప్యాసింజర్ ఆటో ఢీ కొంది. దీంతో సదరు ఆటో పల్టీకొట్టగా ఆటోడ్రైవర్ వనాజీకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు, వాహనదారులు గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆటోలోని నలుగురు ప్రయాణికుల్లో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. మిగిలిన వారికి ఎటువంటి గాయాలు కాలేదు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఎన్.చంటిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. వంశీ బెయిల్ పిటిషన్పై ముగిసిన వాదనలు గన్నవరం: కృష్ణాజిల్లా ఆత్కూరు పోలీస్స్టేషన్లో నమోదైన స్థల వివాదం కేసులో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై స్థానిక 8వ అదనపు ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో గురువారం వాదనలు పూర్తయ్యాయి. ఉంగుటూరులోని ఓ స్థలం వివాదంపై తేలప్రోలుకు చెందిన శనగల శ్రీధర్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆత్కూరు పీఎస్లో ఈ ఏడాది ఫిబ్రవరి 24న కేసు నమోదైంది. విజయవాడ జిల్లా జైలులో ఉన్న వంశీమోహన్ను పీటీ వారెంట్పై ఆత్కూరు పోలీసులు ఇటీవల స్థానిక కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో వంశీమోహన్ బెయిల్పై దాఖలు చేసిన పిటిషన్పై కోర్టులో గురువారం తుది విచారణ జరిగింది. ఇరువైపులా న్యాయవాదుల సుదీర్ఘ వాదనలు విన్న జడ్జి బి.శిరీష తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేశారు. -
సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర
మచిలీపట్నంఅర్బన్: ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రవేశపెట్టిన సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర ఏప్రిల్ 8 నుంచి 19వ తేదీ వరకు కొనసాగుతుందని స్టేషన్ మేనేజర్ ఎన్.పోతురాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ సమ్మర్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ ప్యాకేజీలో భాగంగా ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ విజయవాడ, ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్, నిజామాబాద్, నాందేడ్, పూర్ణలో బోర్డింగ్, డే బోర్డింగ్ చేసే సౌకర్యం ఉందన్నారు. విజయవాడలో 8వ తేదీ రాత్రి 9 గంటలకు బయలుదేరి ఉజ్జయిని(మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర), ద్వారక(నాగేశ్వర్), సోమ్నాథ్, పూణే (భీమశంకర్), నాసిక్ (త్రాయంబకేశ్వర్), ఔరంగాబాద్(గ్రీష్ణేశ్వర్) జ్యోతిర్లింగాల దర్శనం చేసుకుని 19వ తేదీ సాయంత్రం 4 గంటలకు రైలు విజయవాడ చేరుకుంటున్నారు. ట్రైన్ జర్నీ, నైట్ స్టే, అల్పాహారం, వెజిటేరియన్ భోజనం, వాష్ అండ్ చేంజ్, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ ఒకే ప్యాకేజ్లో అందుతాయన్నారు. ఆన్లైన్ బుకింగ్కు www.irctctourism.com సైట్లో సంప్రదించాలని కోరారు. -
ప్రభుత్వ పథకాల లబ్ధిని ప్రజలకు చేరువ చేయాలి
చిలకలపూడి(మచిలీపట్నం): కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వాటి లబ్ధిని వారికి చేరువ చేసేలా అధికారులు కృషి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో వ్యవసాయ, ఉద్యాన తదితరశాఖల అధికారులతో కేంద్ర ప్రభుత్వ పథకాల వినియోగంపై గురువారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు విద్యకు ప్రాధాన్యతను ఇస్తూ ప్రజల సంక్షేమాభివృద్ధికి ఎన్నో పథకాలను అమలు చేస్తోందన్నారు. వాటిని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని సూచించారు. జాతీయ ఆహార భద్రత మిషన్ పథకం ద్వారా పప్పు, బియ్యం, మినీ యంత్రాలను అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు జిల్లాకు ఎక్కువ మొత్తంలో యూనిట్లు మంజూరు చేసే విధంగా వ్యవసాయశాఖ కమిషనర్కు ప్రతిపాదనలు పంపాలన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయంలో ఆక్వా ల్యాబ్ ఏర్పాటు.. గుడివాడలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ బాలాజీ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా మొబైల్ భూసార పరీక్షలకు అవసరమైన వాహనాల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. ధాన్యం ఆరబెట్టే యంత్రాల కొనుగోలుకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని వాటిని జిల్లాకు వెంటనే అందించేందుకు సంబంధించిన చెల్లింపులు సకాలంలో ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తేనటీగల పెంపకంపై ప్రభుత్వం అందిస్తున్న రాయితీలపై ఆసక్తి ఉన్న వారికి అవగాహన కల్పించి ప్రోత్సహించాలన్నారు. అవనిగడ్డలో 39 మంది లబ్ధిదారులకు తేనెటీగల పెంపకం కిట్లను అందించామని తోట్లవల్లూరులో ఇటీవల అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిని ప్రోత్సహిస్తున్నామని అధికారులు కలెక్టర్కు వివరించారు. కృష్ణా విశ్వవిద్యాలయంలో ఆక్వా ల్యాబ్ ఏర్పాటుకు యూనివర్సిటీ అధికారులు సంసిద్ధంగా ఉన్నారని మత్స్యశాఖ అధికారులు వారితో సమన్వయం చేసుకుంటూ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ పథకాల సహకారం తీసుకోవాలన్నారు. సమావేశంలో మత్స్యశాఖ జిల్లా అధికారి నాగబాబు, వ్యవసాయశాఖ డీడీ మనోహరరావు, పశుసంవర్ధకశాఖ అధికారి చిననరసింహులు, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పీడీ విజయలక్ష్మి, కృష్ణా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎన్.ఉష, బయో సైన్సెస్ ప్రొఫెసర్ డాక్టర్ వై.మారుతీ తదితరులు పాల్గొన్నారు. -
రైలులో గంజాయి తరలిస్తున్న నిందితుడి అరెస్ట్
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలులో గంజాయి అక్రమంగా తరలిస్తున్న నిందితుడిని ప్రభుత్వ రైల్వే పోలీసులు(జీఆర్పీ) అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జీఆర్పీ సిబ్బంది గురువారం విజయవాడ రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 1వ నంబర్ ప్లాట్ఫాం దక్షిణం వైపు చివరలో ఒక యువకుడు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న బ్యాగును సోదా చేయగా అందులో ఏడు కేజీల గంజాయి లభ్యమైంది. నిందితుడిని అంబాపురానికి చెందిన సందునపల్లి రాంబాబుగా గుర్తించారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి వాటిని చిన్న పొట్లాలుగా కట్టి నగరంలో అధిక ధరకు విక్రయిస్తుంటాడు. ఒడిశాలోని గంజాం జిల్లాలో చందు అనే వ్యక్తి నుంచి రాంబాబు గంజాయి కొనుగోలు చేసి రైలులో విజయవాడ చేరుకోగా రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాంబాబును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పెట్రోల్ బంక్ సీజ్ నందిగామరూరల్: మండలంలోని అడవిరావులపాడు గ్రామ సమీపంలోని నయారా పెట్రోల్, డీజిల్ బంకును తూనికలు, కొలతల శాఖాధికారులు సీజ్ చేశారు. పెట్రోల్, డీజిల్ రీడింగ్లు, కొలతల్లో తేడాలున్నాయని వినియోగదారులు గురువారం బంకు వద్ద ఆందోళన చేశారు. మూడు నెలల నుంచి కొలతల్లో తేడాలను గమనిస్తున్నామని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు పెట్రోల్ బంకును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తూనికలు, కొలతల శాఖ జిల్లా అధి కారి భానుప్రసాద్ మాట్లాడుతూ డీజిల్ మోటార్ పంపు ఆన్ చేయగా డీజిల్ రీడింగ్ హెచ్చుతగ్గులు చూపిస్తోందన్నారు. దీంతో క్షుణ్ణంగా తనిఖీ చేయగా మోటర్ జంప్ టెక్నిక్ను గుర్తించామన్నారు. దీంతో బంక్ సీజ్ చేశామని చెప్పారు. పీడీఎస్ డీటీ రామ్మూర్తి రెడ్డి పాల్గొన్నారు. రైలు ఢీ కొని గుర్తు తెలియని యువకుడి మృతి రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీ కొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటనపై విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ – ఏలూరు మధ్య మూడో లైన్లో గుర్తు తెలియని యువకుడు మృతి చెంది ఉండటాన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న వారు వివరాలు సేకరించారు. మృతుడి వయసు 30 సంవత్సరాలు ఉంటాయని, సిమెంట్ రంగు టీ షర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని, కుడి చేతిపై ‘అమ్మ’ అనే పచ్చ బొట్టు ఉందని, ఇతర ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. ఒంటిపై అనేక చోట్ల గాయాలు ఉండటంతో ట్రాక్ దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీ కొనడంతో మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు విజయవాడ జీఆర్పీ స్టేషన్ లేదా 88971 56153, 94406 27544 నంబర్లకు సంప్రదించాలని సూచించారు. -
కనులపండువగా వసంత నవరాత్రోత్సవాలు
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో చైత్రమాస వసంత నవరాత్రోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజైన గురువారం అమ్మవారికి శ్వేత(తెలుపు), హరిత(పచ్చ) వర్ణ పుష్పాలతో విశేషంగా అర్చన జరిగింది. అమ్మవారికి తెల్ల జిల్లేడు, మల్లె పూలు, మారేడు బిల్వ పత్రాలు, తులసీ దళాలు, మందార పుష్పాలతో అర్చన నిర్వహించారు. తొలుత ఆలయ ఈఓ కె.రామచంద్రమోహన్, ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఇతర అర్చకులు, వేద పండితులు, ఆలయ అధికారులు, సిబ్బంది అమ్మవారికి అర్చన నిర్వహించే పుష్పాలను ప్రధాన ఆలయంలో మూలవిరాట్కు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా పూజా మండపానికి చేరుకున్నారు. పూజా మండపంలో అమ్మవారి ఉత్సవ మూర్తికి ఆయా పుష్పాలతో అర్చన నిర్వహించగా, పెద్ద ఎత్తున ఉభయ దాతలు, భక్తులు పాల్గొన్నారు. -
గంగాభవానీకి ‘లక్ష’ గారెలతో మహానివేదన
కోడూరు: కోడూరు గంగాభవానీ అమ్మవారికి ‘లక్ష’ గారెలతో మహానివేదన కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహించారు. అమ్మవారి 50వ జాతరోత్సవాల నేపథ్యంలో గురువారం గారెలతో మహానివేదన జరిపారు. కోడూరు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మహిళలు తమ ఇళ్ల వద్ద నుంచి గారెలను వండి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఒక్కో మహిళ 54 లేదా 108 గారెలను తీసుకువచ్చి అమ్మవారికి నివేదించారు. గంగాభవానీ చిన్నఅమ్మవారి విగ్రహం ముందు గారెలను రాశిగా పోసి పండితులు కొమ్మూరి శ్రీనివాసరావు పూజలు చేశారు. జాతరకు వచ్చిన గ్రామ ఆడపడుచులు, మహిళలు ప్రతి ఒకరూ కార్యకమ్రంలో పాల్గొని భక్తిభావం చాటుకున్నారు. మహానివేదన అనంతరం గారెలను ప్ర సాదంగా భక్తులకు అందజేశారు. ధర్మకర్త కోట యుగంధరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. తిరుపతమ్మ ఆలయానికి రూ.13.90 లక్షల ఆదాయం పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీతిరుపతమ్మ వారి ఆలయంలో బహిరంగ వేలం ద్వారా రూ.13.90 లక్షల ఆదాయం వచ్చిందని ఈఓ కిశోర్కుమార్ తెలిపారు. ఆలయ బేడా మండపంలో గురువారం జరిగిన వేలంలో ఆలయం వద్ద ఏడాది పాటు భక్తుల సెల్ఫోన్లు భద్రపరుచు లైసెన్స్ హక్కుకు రూ.13.90 లక్షలకు(కాకాని రవిబాబు) పాడుకున్నారు. ఈఈ రమ, పాలకవర్గ సభ్యులు బెజవాడ శ్రీనివాసరావు, పాలాది వెంకటరమణ, ఏఈఓ ఉమాపతి పాల్గొన్నారు. రేపు సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ పరీక్ష ఈ నెల ఐదో తేదీన నగరంలో నిర్వహించనున్నట్లు విజయవాడ కేంద్రం కోఆర్డినేటర్ జి.బర్న్బస్ తెలిపారు. విజయవాడలోని పొట్టిశ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, చిట్టూరి హైస్కూల్ ప్రాంగణాల్లో పరీక్ష జరుగుతుందన్నారు. 973 మంది ఆరో తరగతి ప్రవేశ పరీక్ష విద్యార్థులు, 393 మంది తొమ్మిదో తరగతి ప్రవేశ పరీక్ష విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఆరో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకూ, తొమ్మిదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పరీక్ష జరుగుతుందన్నారు. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తోందన్నారు. ప్రతి కేంద్రానికి ఇద్దరు పరిశీలకులను ఆ శాఖ నియమించిందని, వారి ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహిస్తారని చెప్పారు. -
బాల్యం బడికి దూరం
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లలో మధ్యలో బడికి దూరమవుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ విద్యను మెరుగుపర్చేందుకు కూటమి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ విద్యార్థుల డ్రాపౌట్స్ను మాత్రం తగ్గించలేకపోతోంది. 2024–25 విద్యా సంవత్సరంలో మార్చి 19వ తేదీ వరకు డ్రాపౌట్స్(పెండింగ్) అత్యధికంగా మచిలీపట్నం డివిజన్లో 184 మంది బడికి దూరమవ్వగా ఉయ్యూరు డివిజన్ 84, గుడివాడ డివిజన్ 49 మంది ఉన్నారు. అత్యధికంగా 71 మంది మచిలీపట్నం మండలం నుంచి డ్రాపౌట్స్ అయ్యారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు ఎక్కువగా మానేస్తున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివేవారు అంతా పేదలే. ఆర్థిక పరిస్థితుల కారణంగా మధ్యలోనే తల్లిదండ్రులు పిల్లలను స్కూల్స్ మాన్పిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నా స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థి తల్లికి ఆర్థిక సాయం తల్లికి వందనం అందని కారణంగా పాఠశాలల్లో డ్రాపౌట్స్ పెరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయంలో.. గత ప్రభుత్వ హయాంలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల చర్యలకు చేపట్టిన నాడు–నేడు కార్యక్రమంతో డ్రాపౌట్స్ తగ్గాయి. దీనికి తోడు పాఠశాల విద్యపై బడ్జెట్లో నిధుల కేటాయింపు ఉండేది. దీంతో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల నమోదు సంఖ్య గణనీయంగా పెరిగింది. అప్పుడు మౌలిక సదుపాయాల కల్పనతో చెప్పుకోదగిన అభివృద్ధి కనిపించింది. విద్యా కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డిజిటల్ టెక్నాలజీకి యాక్సెస్, బ్రిడ్జ్ కోర్సులు, అకడమిక్ లోటులను పరిష్కరించటంతో డ్రాపౌట్స్ తగ్గాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు తరగతులకు హాజరయ్యేలా చర్యలు చేపట్టడంతో పాటు వారికి నూతన విధానంలో విద్యా బోధన చేయటంతో విద్యార్థులు పాఠశాలలు మానేసే ప్రక్రియ చాలా వరకు తగ్గించారు. మధ్యలోనే మానేస్తున్నారు.. 2023–24లో జిల్లాలో బడి పిల్లల డ్రాపౌట్స్ 372 కాగా 2024–25లో మార్చి 19 వరకు 386కు చేరింది. ఈ ఏడాది 3.76 శాతం జిల్లా వ్యాప్తంగా అనూహ్యంగా పెరిగింది. ఈ పరిస్థితిని మార్చడానికి గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమ్మ ఒడి ప్రవేశపెట్టి తల్లిదండ్రులకు ఆర్థిక వెసులుబాటు కల్పించింది. డ్రాపౌట్స్ను చాలావరకు తగ్గించింది. ప్రాథమిక స్థాయిలో కొంత వరకు బాగానే ఉన్నప్పటికీ ఉన్నత పాఠశాల 10వ తరగతి స్థాయికి వచ్చేసరికి చాలామంది విద్యార్థులు బడి మానేస్తున్నారు. ప్రధానంగా అర్బన్ ప్రాంతాల్లో డ్రాపౌట్స్ ఎక్కువగా ఉన్నాయి. అసలు ఈ డ్రాపౌట్స్ సమస్య ముఖ్యంగా ఆర్థిక అంశాలతో ప్రభావితమై ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నా తల్లికి వందనం ఇవ్వకపోవడం, పాఠశాలల్లో నేర్చుకునే విద్యలో లోటుపాట్లు, అకడమిక్ సవాళ్లు డ్రాపౌట్స్కు కారణమవుతున్నాయి. ఉన్నత పాఠశాల విద్యార్థులే అధికంగా బడికి దూరం ఆర్థిక అంశాలతో డ్రాప్ఔట్స్ ప్రభావితం గతంలో అమ్మఒడితో తగ్గిన డ్రాపౌట్స్ అర్బన్ ప్రాంతాల్లోనే అధికంగా బడి మానేస్తున్న విద్యార్థులు పామర్రులో విద్యార్థి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇస్తున్న అధికారులు(ఫైల్)అన్ని చర్యలు తీసుకుంటాం.. బడిఈడు పిల్లలను ఇప్పటికే ఆయా మండలాల్లో టీమ్లుగా ఏర్పాటు చేసి గుర్తించటం జరిగింది. వారిని రాబోయే విద్యా సంవత్సరానికి బడికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. జూన్ నెలలో ఇందుకోసం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించి తల్లిదండ్రులు, విద్యార్థులతో మాట్లాడి పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. – ఎం.ఫణి దూర్జటి, ఇన్చార్జి అసిస్టెంట్ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ సమగ్ర శిక్షా -
100 అడుగుల రోడ్డులో కారు బీభత్సం
పెనమలూరు: కానూరు 100 అడుగుల రోడ్డులో బుధవారం రాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఎనికేపాడు నుంచి తాడిగడప జంక్షన్ వైపునకు అతి వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి డివైడర్పై నుంచి దూసుకెళ్లి రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి పంట బోదెలో పడింది. డివైడర్ మధ్యలో ఉన్న సెంట్రల్ లైటింగ్ స్తంభం విరిగి రోడ్డుపై పడిపోయింది. ఆ సమయంలో రహదారిపై ప్రయాణికులు ఎవరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. రోడ్డుపై ఎవరైనా ఉంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. ఘటనపై పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదు. తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని సీఐ వెంకటరమణ తెలిపారు. దెబ్బతిన్న విద్యుత్ స్తంభం అలానే ఉంది. కిడ్నాప్ కలకలం.. పోరంకిలో బుధవారం రాత్రి కిడ్నాప్ కలకలం చెలరేగింది. తన తండ్రిని కొందరు ఇంటి వద్ద నుంచి కిడ్నాప్ చేశారని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. వ్యాపారంలో ఆర్థిక లావాదేవీల కారణంగానే పోరంకిలో ఉంటున్న వెంకటేశ్వరరావును వ్యాపార పార్టనర్ రాజు అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడని ఆమె తెలిపింది. ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, కేసు నమోదు చేయలేదని సీఐ వెంకటరమణ తెలిపారు. ఈ ఘటనలో ఇరువురు రాజీ పడినట్లు సమాచారం. -
వైభవంగా సుబ్రహ్మణ్యస్వామి కల్యాణోత్సవం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): షష్ఠిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కల్యాణోత్సవాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కళావేదికపై శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు అర్చకులు శాస్త్రోక్తంగా కల్యాణోత్సవాన్ని జరిపించారు. తొలుత ఆలయ ప్రాంగణంలోని ఉపాలయం నుంచి ఉత్సవమూర్తులను ప్రత్యేక పల్లకీపై ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకురాగా, ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణోత్సవంలో పాల్గొన్నా, వీక్షించినా భక్తుల ఇంట సకల శుభాలు కలుగుతాయని, సంతానం లేని వారికి సంతాన యోగం, వివాహం కాని వారికి వివాహ యోగం కలుగుతుందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఉభయ దాతలకు ప్రత్యేక క్యూ మార్గం ద్వారా ఆది దంపతుల దర్శనానికి అనుమతించారు. -
రాష్ట్ర క్రీడా ఖ్యాతిని చాటిన స్కేటర్ కై వల్య
శాప్ చైర్మన్ రవినాయుడు విజయవాడస్పోర్ట్స్: తైవాన్లో ఇటీవల జరిగిన అంతర్జాతీయ తైవాన్ ఆర్టిస్టిక్ స్కేటింగ్ చాంపియన్షిప్లో విజయవాడ క్రీడాకారుడు కొప్పవరపు కై వల్య ఐదు పతకాలతో ఓవరాల్ చాంపియన్షిప్ సాధించి నేటి తరం యువతకు ఆదర్శంగా నిలిచాడని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు అన్నారు. గత నెల 26 నుంచి 30వ తేదీ వరకు తైవాన్లో జరిగిన అంతర్జాతీయ స్కేటింగ్ పోటీల యూత్ ఫ్రీ స్టయిల్, ఇన్లైన్, సోలో డ్యాన్స్, పెయిర్ స్కేటింగ్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్, కపుల్ డ్యాన్స్లో సిల్వర్ మెడల్ సాధించాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కైవల్యను శాప్ కార్యాలయంలో చైర్మన్ రవి నాయుడు బుధవారం దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి అతని క్రీడా నైపుణ్యాన్ని కొనియాడారు. భారత దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారుల్లో కైవల్య అత్యధికంగా 275.5 పాయింట్లు సాధించి అగ్రగామిగా నిలిచాడని తెలిపారు. తైవాన్, జపాన్, ఇటలీ, దక్షిణ కొరియా, సింగపూర్, అస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల క్రీడాకారులను వెనక్కి నెట్టి ఓవరాల్ చాంపియన్షిప్ సొంతం చేసుకోవడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు. ప్రపంచ క్రీడా వేదికపై సత్తా చాటి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమ డింపజేసిన కై వల్యను ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో రాణించాలని యువతకు సూచించారు. ఇదే క్రీడా స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని పతకాలు సాధించాలని సూచించారు. క్రీడాకారుడు కై వల్యను రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి నరేష్శర్మ, భారత ఆర్టిస్టిక్ స్కేటింగ్ చైర్మన్ ప్రదీప్ మాల్వాయ్, ఏపీ ఆర్టిస్టిక్ స్కేటింగ్ చైర్మన్ ఆకుల పవన్కుమార్, కోచ్ పి.సత్యనారాయణ అభినందించారు. -
కేడీసీసీబీ టర్నోవర్ రూ.11,307 కోట్లు
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ 2024–25 సంవత్సరానికి సంబంధించి రూ.11,307.14 కోట్ల టర్నోవర్ సాధించిందని బ్యాంక్ ప్రత్యేకాధికారి, జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ బుధవారం తెలిపారు. టర్నోవర్ గత సంవత్సరం కంటే రూ.257.32 కోట్ల మేర పెరిగిందన్నారు. బ్యాంకులో షేర్ క్యాపిటల్ రూ.393.70 కోట్ల నుంచి రూ.418.50 కోట్లకు పెరిగిందని వివరించారు. డిపాజిట్లు రూ.3,094.40 కోట్ల నుంచి రూ.3,265.20 కోట్లకు పెరిగాయని తెలిపారు. గత సంవత్సరం రూ.7,955.42 కోట్ల రుణాలు ఇవ్వగా ఈ సంవత్సరం రూ.8,041.94 కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. రుణాలు రూ.86.52 కోట్ల మేర పెరిగాయన్నారు. దీంతో బ్యాంకు టర్నోవర్ రూ.11,049.82 కోట్ల నుంచి రూ.11,307.14 కోట్లు చేరిందని వివరించారు. బ్యాంకుకు నికర ఆదాయం రూ.99.27 కోట్లు వచ్చిందని గీతాంజలి శర్మ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకార బ్యాంకు అనుబంధంగా 425 పీఏసీఎస్లలో కంప్యూటరీకరణ చేపట్టగా ఇప్పటి వరకు 314 పీఏసీఎస్లలో 74 శాతం మేర పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. నూతనంగా 66 మంది స్టాఫ్ అసిస్టెంట్లను నియమించేందుకు నోటిఫికేషన్ జారీ చేశామని వెల్లడించారు. వారికి త్వరలో రాతపరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. 2024 నవంబర్ 26వ తేదీన నాప్కాబ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో కేడీసీసీ బ్యాంక్ బెస్ట్ ఫెర్ఫార్మిగ్ బ్యాంక్గా నిలిచి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా చేతుల మీదుగా అవార్డు అందుకున్నామని గుర్తుచేశారు. నికర ఆదాయం రూ.99.27 కోట్లు ప్రత్యేకాధికారి గీతాంజలిశర్మ -
నేటి నుంచి పది స్పాట్
మచిలీపట్నంఅర్బన్: జిల్లా కేంద్రమైన మచిలీ పట్నంలో పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్కు పాఠశాల విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల మూడు నుంచి తొమ్మిదో తేదీ వరకూ మచిలీపట్నంలోని లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ స్పాట్ వాల్యూయేషన్ జరగనుంది. పదో తరగతి పరీక్షలు గత నెల 17వ తేదీన ప్రారంభమై ఈ నెల ఒకటో తేదీన ముగిసిన విషయం తెలిసిందే. జిల్లాలో 22,341 మంది విద్యార్థులు 145 కేంద్రాల్లో పరీక్షలు రాశారు. ఇప్పటికే విద్యార్థులు రాసిన జవాబు పత్రాల మూల్యాంకనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జవాబు పత్రాల మూల్యాంకనానికి కోడింగ్ ప్రక్రియను ఇప్పటికే చేపట్టారు. సర్వం సిద్ధం పదో తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకనం గురువారం ప్రారంభంకానుంది. లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో టెన్త్ స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రక్రియను నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు డెప్యూటీ క్యాంప్ ఆఫీసర్ ఎం.డేవిడ్ రాజు బుధవారం తెలిపారు. జిల్లాకు మొత్తం 1,91,627 జవాబు పత్రాలు అందాయన్నారు. సీఈలు 134 మంది, ఏఈలు 794 మంది, ఎస్ఏలు 268 మంది చొప్పున మొత్తం 1,196 మంది మూల్యాంకనం విధుల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రతి రోజూ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జవాబు పత్రాల మూల్యాంకనం చేపట్టానున్నారన్నారు. ఇప్పటికే జవాబు పత్రాల కోడింగ్ పూర్తి అయింది. చివరిగా నిర్వహించిన పరీక్ష సాంఘిక శాస్త్రం కోడింగ్ బుధవారం పూర్తయింది. పూర్తి బందోబస్తు మధ్య మూల్యాంకనం జరగనుందని డెప్యూటీ క్యాంప్ ఆఫీసర్ ఎం.డేవిడ్ రాజు తెలిపారు. మూల్యాంకనం ఇలా.. మూల్యాంకనం కేంద్రంలో మొత్తం 16 గదులు, ఆరు హాళ్లు ఏర్పాటు చేశారు. ఒక చీఫ్ ఎగ్జామినర్, ఆరుగురు అసిస్టెంట్ ఎగ్జామినర్లు, ఇద్దరు స్పెషల్ అసిస్టెంట్లు ఒక టీంగా వ్యవహిస్తారు. మొత్తం సిబ్బందిని 134 టీములుగా విభజించారు. ఒక్కొక్క అసిస్టెంట్ ఎగ్జామినర్ ఉదయం 20, మధ్యాహ్నం సెక్షన్లో 20 చొప్పున జవాబు పత్రాలు మూల్యాంకనం చేయాల్సి ఉంది. మూల్యాంకన కేంద్రంలో ఉపాధ్యాయులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించారు. వేసవి నేపథ్యంలో అన్ని గదుల్లో ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. కేంద్రం వద్ద తాగునీరు, వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు భోజనం, అల్పాహారం కోసం ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేశారు. లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మూల్యాంకనం జిల్లాకు 1,91,627 సమాధాన పత్రాల రాక 1,196 మంది సీఈ, ఏఈలు, ఎస్ఏలకు విధుల కేటాయింపు ఒరియంటేషన్ నిర్వహించిన అధికారులు మూల్యాంకన విధులకు ఆయా సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులను నియమిస్తూ ఇప్పటికే ఉత్తర్వులను ఆయా జిల్లా విద్యాశాఖాధికారులు జారీ చేశారు. స్పాట్ వాల్యూయేషన్ ఉత్తర్వులను ఉపాధ్యాయులకు అందజేసే ప్రక్రియ దాదాపుగా ముగిసింది. జవాబు పత్రాల మూల్యాంకనానికి సంబంధించి సబ్జెక్టు వారీగా ఉపాధ్యాయులను నియమించారు. ఎనిమిది రోజుల పాటు మూల్యాంకనం చేస్తారు. దానికి సంబంధించి బుధవారం స్పాట్ జరిగే ప్రాంగణంలో ఉపాధ్యాయులకు ఇతర అధికారులకు ఒరియేంటేషన్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. -
ఎంపీటీసీ సభ్యులను అభినందించిన వైఎస్ జగన్
నందిగామటౌన్: అధికార దాహంతో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ధైర్యంతో ఎంపీపీ స్థానాన్ని నిలబెట్టుకున్నారంటూ ఎంపీటీసీ సభ్యులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారని శాసన మండలి సభ్యుడు డాక్టర్ మొండితోక అరుణకుమార్, మాజీ శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల సమావేశంలో మండలంలోని ఎంపీటీసీ సభ్యులతో కలిసి వారిద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీటీసీ సభ్యుల పూర్తి సహకారంతోనే మండల పీఠాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుందని చెప్పారు. రానున్న రోజుల్లో కూడా ఇదే సంకల్పంతో పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని చెప్పారు. అన్ని రకాలుగా పార్టీ అండగా ఉంటుందని జగన్మోహన్రెడ్డి ధైర్యం చెప్పారని తెలిపారు. జగన్మోహన్రెడ్డిని కలిసిన బృందంలో వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ కూడా ఉన్నారు. -
సీపీఎస్ రద్దు కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా
చిలకలపూడి(మచిలీపట్నం): సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఫ్యాప్టో జిల్లా సెక్రటరీ జనరల్ పి.రాజేంద్రప్రసాద్ అన్నారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద బుధవారం నిరసన తెలిపారు. ధర్నాను ఉద్దేశించి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ 2023 డీఎస్సీ అభ్యర్థులను మెమో 57 ప్రకారం పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావాలన్నారు. ఐఆర్, పీఆర్సీ కమిషన్ను నియమించాలన్నారు. 30 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలన్నారు. పెండింగ్లో ఉన్న డీఏ, పీఎఫ్ను, ఏపీజీఎల్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలన్నారు. కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలన్నారు. ఉమ్మడి సర్వీస్రూల్స్ జీవోల ఆధారంగా అమలు చేయాలన్నారు. ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. పదో తరగతి పరీక్షల మూల్యాంకన విధుల్లో ఆరోగ్యపరంగా, వయసు మీరిన వారిని, గర్భిణులకు విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు బి.కనకారావు, ఎంవీఎస్ఎన్ ప్రసాద్, ఐవీ రామారావు, టి.దస్తగిరి, డి.చంద్రశేఖర్, బి.లంకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ధర.. కన్నీటి ధార
బజ్జీ మిర్చి రైతుల ఆశలు నేలపాలు బజ్జీ మిర్చి రైతు ఆశలు నేలపాలవుతున్నాయి. మద్దతు ధర లభించకపోవడంతో దివిసీమలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతంలోనే బజ్జీ మిర్చి సాగు అధికంగా సాగవవుతోంది. ధర లేక.. కొనుగోళ్లు జరగక పంటను కోత కోయించి పారబోస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.మోపిదేవి (అవనిగడ్డ): కనీస మద్దతు ధర లభించక ఓ వైపు సాధారణ మిర్చి రైతులు రోడ్డెక్కుతుంటే.. బజ్జీ మిర్చి సాగుచేసే రైతులు కూడా ఆశించిన రేటులేక.. కొనుగోళ్లు జరగక లబోదిబోమంటున్నారు. కృష్ణాజిల్లా దివిసీమ ప్రాంతంలో బజ్జీ మిర్చి సాగు ఎక్కువగా జరుగుతుంది. అయితే బజ్జీ మిర్చి ధర ఈ ఏడాది బాగా పడిపోయింది. దీంతో రైతులు పంటను కోయించి పారబోస్తున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని మోపిదేవి, అవనిగడ్డ మండలాల్లోని 165 ఎకరాల్లో బజ్జి మిర్చి సాగుచేస్తున్నారు. ఇది సాధారణ మిర్చిలా కారం ఉండదు. దీంతో కూరల్లో వీటిని వినియోగించరు. బజ్జీలు, సాస్లకు మాత్రమే వాడతారు.. గతేడాది బస్తా రూ.2,500.. ఇప్పుడు రూ.250 గత సంవత్సరం బస్తా (50 కిలోలు) ధర రూ.2,500 వరకూ పలికింది. దీంతో ఎక్కువమంది రైతులు ఈ మిర్చి సాగుకు మొగ్గు చూపారు. ఎకరాకు లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం మిర్చి ధర బస్తా రూ.250 మాత్రమే పలుకుతోంది. సంచికి రూ.50, కోసినందుకు కూలీకి రూ.150, రవాణాకు రూ.50 మొత్తం కలుపుకుని రూ.250 అవుతుంది. బస్తా మిర్చి ధర కూడా ఇదే రేటు ఉంది. గత్యంతరంలేని పరిస్థితుల్లో రైతులు పంటను కోసేసి పారబోస్తున్నారు. తయారైన మిర్చిని పదిహేను రోజులు కోయకుండా వదిలిస్తే పండిపోయి కుళ్లిపోతుంది. తయారైన కాయలు కోయకపోతే కొత్తగా పూత, పిందె పడదు. అందుకే కాయలు కోసి పారబోస్తున్నట్లు రైతులు ఆవేదనతో చెప్పారు. దక్కని మద్దతు ధర కోత కోయించి పారేస్తున్న రైతులు గతేడాది 50 కిలోల బస్తా రూ.2,500, నేడు కేవలం రూ.250 ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల ఖర్చు సాస్ కంపెనీలు కొనుగోళ్లుఆపేయడంతో పడిపోయిన ధర కృష్ణా జిల్లా దివిసీమ రైతుల గగ్గోలు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి గతేడాది బజ్జీ మిర్చి బస్తాను రూ.2,000 పైగా ధరకు కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం 3.5 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగుచేశాను. ఎకరాకు కౌలు రూ.40 వేలు.. ఖర్చు రూ.1 లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు అయ్యాయి. కొనుగోళ్లు నిలిచిపోవడంతో ఏంచేయాలో తెలీడంలేదు. ప్రభుత్వం కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకోవాలి. – రాజులపాటి రామ్మోహనరావు, రైతు, మోపిదేవిలంక, మోపిదేవి మండలం మార్క్ఫెడ్ అధికారుల దృష్టికి తీసుకెళ్తా బజ్జీ మిర్చి కొనుగోళ్లు జరగడంలేదనే విషయం నా దృష్టికి రాలేదు. గతేడాది బాగా ధర ఉండటంతో ఈసారి ఎక్కువమంది ఈ రకం మిర్చిని సాగుచేశారు. మార్క్ఫెడ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటాం. – రమేష్, ఉద్యాన శాఖాధికారి, అవనిగడ్డ -
గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి
కోనేరుసెంటర్: గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మచిలీపట్నంలోని చిలకలపూడి రైల్వే స్టేషన్లో బుధవారం జరిగింది. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. రైల్వే ఎస్ఐ ఎండీ షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం 6:30 గంటల సమయంలో కొండవీడు ఎక్స్ప్రెస్ మచిలీపట్నం వైపు వస్తుండగా సుమారు 40 సంవత్సరాల వయసు గల వ్యక్తి ఒక్కసారిగా రైలు కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన వ్యక్తి సుమారు 5.5 అడుగుల ఎత్తు కలిగి ఎరుపు పచ్చ రంగు ఫుల్ హ్యాండ్ గళ్ళ చొక్కా, సిమెంటు రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు ఎస్ఐ షరీఫ్ తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు 94406 27050, 73960 69566 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. -
దుర్గమ్మకు ఎర్రకలువలు, మందార పుష్పాలతో అర్చన
ఇంద్రకీలాద్రి (విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రతి నిత్యం విశేష పుష్పార్చన జరుగుతుంది. నాల్గో రోజైన బుధవారం దుర్గమ్మకు మందార పూలు, ఎర్ర కలువలు, మల్లెలు, ఎర్ర గన్నేరు పుష్పాలతో అర్చన నిర్వహించారు. తొలుత రాజగోపురం నుంచి అమ్మవారికి అర్చన నిమిత్తం తీసుకువచ్చిన పుష్పాలను మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ప్రధాన ఆలయానికి తీసుకువచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం పూజా మండపంలో అమ్మవారి ఉత్సవ మూర్తికి ఆలయ అర్చకులు పుష్పాలతో అర్చన నిర్వహించారు. ప్రత్యేక పుష్పార్చనలో పలువురు ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి సమర్పించిన పుష్పాలను భక్తులకు పంపిణీ చేశారు. యాదవ కార్పొరేషన్ చైర్మన్ ప్రమాణ స్వీకారం భవానీపురం(విజయవాడపశ్చిమ): ఆంధ్రప్రదేశ్ యాదవ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన జి.నరసింహయాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఫైల్పై సంతకం చేసి బాధ్యతలు చేపట్టారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ సభకు వ్యవసాయశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు ముఖ్యఅతిథిగా హాజరై నరసింహయాదవ్ను అభినందించారు. మంత్రులు కొలుసు పార్థసారథి, సవిత, రాంప్రసాద్రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్, ఎమ్మెల్సీ డి.రామారావు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, టీటీడీ బోర్డ్ సభ్యులు పనబాక లక్షి, జంగా కృష్ణమూర్తి, బీసీ నాయకురాలు నూకాలమ్మ తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి ఉచిత పాలీసెట్ శిక్షణ గుడ్లవల్లేరు: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పూర్తి చేసుకున్న విద్యార్థులకు గుడ్లవల్లేరు ఏఏఎన్ఎం అండ్ వీవీఆర్ఎస్ఆర్ పాలిటెక్నిక్ కాలేజీలో ఉచితంగా పాలీసెట్కు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఎన్.రాజశేఖర్ బుధవారం తెలిపారు. ఈ నెల 3వ తేదీ నుంచి పాలీసెట్ తరగతులు ప్రారంభం కానున్నాయన్నారు. పాలీసెట్ ఈ నెల 30న జరుగుతుందన్నారు. -
దొంగతనం కేసులో మహిళ అరెస్ట్
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఇంట్లో పనిమనిషి గా చేస్తూ దుర్భుద్ధితో ఆ ఇంట్లోనే దొంగతనానికి పాల్పడిన నిందితురాలిని కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి సుమారు రూ.45లక్షల విలువైన 625 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం బస్టాండ్ లోని పోలీస్ ఔట్పోస్ట్లో జరిగిన విలేకరుల సమావేశంలో నిందితురాలిని హాజరుపర్చారు. కేసుకు సంబంధించిన వివరాలను ట్రైనింగ్ డీఎస్పీ పావని, సీఐ నాగరాజుతో కలిసి సౌత్ ఏసీపీ పావన్కుమార్ వెల్లడించారు. రాణిగారితోటలోని పాత ఆంజనేయస్వామి గుడి పక్కనే ఉన్న పవన్ సాయి రెసిడెన్సీలో గుంటి సీతామహాలక్ష్మి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. గత 18 నెలలుగా వారి ఇంట్లో బాలాజీనగర్కు చెందిన కటారి భవాని పని మనిషిగా చేస్తోంది. సీతామహాలక్ష్మి తన కుటుంబ సభ్యులతో కలిసి గత నెల 30వ తేదీ మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి షిరిడికి వెళ్లారు. తిరిగి బుధవారం ఉదయం 6 గంటలకు ఇంటికి చేరుకుని చూసుకోగా ఇంట్లో ఉండాల్సిన బంగారు, వెండి ఆభరణాలు కనిపించలేదు. దొంగతనం జరిగినట్లు నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్బాబు ఆదేశాల మేరకు కృష్ణలంక పీఎస్ క్రైమ్ సిబ్బందితో సంఘంటనా స్థలానికి చేరుకొని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని అనుమానితురాలైన భవానీపై పూర్తి నిఘా ఏర్పాటు చేసి ఆమెను అదుపులోనికి తీసుకుని విచారించారు. ఇంటి యజమానులు షిరిడికి వెళ్లడంతో ముందుగానే దొంగిలించిన అదనపు తాళం సహాయంతో యజమాని ఇంట్లోకి వెళ్లి బంగారం, వెండి నగలు దొంగిలించినట్లు ఆమె అంగీకరించింది. ఆమె వద్ద నుంచి సుమారు రూ.45 లక్షల విలువైన 625 గ్రాముల బంగారు, 250 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్టు ఏసీపీ వివరించారు. ఫిర్యాదు అందిన గంట వ్యవధిలోనే చాకచక్యంగా నిందితురాలిని అదుపులోకి తీసుకున్న కృష్ణలంక ఎస్ఐ సూర్యనారాయణ, సిబ్బంది ధనలక్ష్మి, సారథినాయక్, ప్రవీణ్కుమార్, సాంబయ్య, బాబూరావులను సీపీ రివార్డులతో అభినందించారు. ఫిర్యాదు అందిన గంట వ్యవధిలోనే నిందితురాలి అరెస్ట్ ఇంటి పనిమనిషే నేరస్తురాలుగా గుర్తింపు నిందితురాలి నుంచి రూ.45 లక్షల విలువైన 625 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం -
జూట్ బ్యాగులు కొనాల్సిందే!
నాడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్రెడ్డి డ్వాక్రా అక్కచెల్లెమ్మలను వ్యాపారవేత్తలుగా తయారుచేసేందుకు మహిళా మార్ట్లు ప్రారంభించి గొప్ప ప్రయోగం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నష్టాల పేరుతో మహిళా మార్టులను మూసివేసింది. డ్వాక్రా మహిళలను వ్యాపారులుగా కాకుండా కొనుగోలుదారులుగానే చూస్తూ వారికి బలవంతంగా పచ్చళ్లు, జ్యూట్బాగ్లను అంటగడుతోంది. బలవంతం ఏమీ లేదు... పెడన: వైఎస్సార్ సీపీ హయాంలో డ్వాక్రా అక్కాచెల్లెమ్మలను ఉన్నత స్థితికి తీసుకువచ్చేందుకు మహిళా మార్ట్లను ఏర్పాటు చేసి వారిని వ్యాపార వేత్తలుగా మలచడానికి చిత్తశుద్ధిగా కృషి చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ముందుగా మహిళా మార్ట్లను మూసివేశారు. ఇప్పుడు పచ్చళ్లు, జ్యూట్ బ్యాగులు డ్వాక్రా మహిళలతో బలవంతంగా కొనుగోలు చేసేలా ఒత్తిడి తెస్తున్నారు. వేలాది గ్రూపులను వదిలి పెట్టి ఏదో నాలుగైదు గ్రూపులకు మాత్రమే లబ్ధి చేకూర్చేలా యంత్రాంగం ప్రయత్నాలు చేయడాన్ని డ్వాక్రా మహిళలు తప్పుబడుతున్నారు. ఆ మాత్రం పచ్చళ్లు మేం ఇళ్ల వద్ద పట్టుకోలేమా అంటూ వాపోతున్నారు. జ్యూట్ బ్యాగులు తమకెందుకు అంటగడుతున్నారంటూ మథనపడుతున్నారు. ఏడెనిమిది రకాల పచ్చళ్లు...జ్యూట్ బ్యాగులు.. ఏడెనిమిది రకాల పచ్చళ్లు అర కేజీ సీసాలను అంటగడుతున్నారు. గోంగూర, నిమ్మ, మామిడి, అల్లం, పండుమిర్చి, ఉసిరి, టమాటో పచ్చళ్లతో పాటు జ్యూట్ బ్యాగులు నాలుగు రకాల డిజైన్లు కల వాటిని అంటగడుతున్నారు. పచ్చడి అర కేజీ రూ.150.30 పైసలు. జ్యూట్బ్యాగు వెల రూ.144. మొదట్లో ఒక్కో గ్రూపు పది పచ్చడి సీసాలు లేదా పది జ్యూట్ బ్యాగులు కొనుగోలు చేయాల్సిందేనని మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ఆ తరువాత ఏవైనా పది కొనుగోలు చేయాలన్నారు. ఆ తరువాత ప్రతి గ్రూపు కూడా రెండు చొప్పున కొనుగోలు చేయాల్సిందేనని పేర్కొనడంతో పాటు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తీసుకువచ్చారు. ఒత్తిళ్లు భరించలేక కొందరు ఆర్పీలు సభ్యులకు తరువాత విక్రయించుదామని చెప్పి ముందుగా పెట్టుబడు లు పెట్టి పచ్చడి సీసాలు, జ్యూట్బ్యాగులు కొనుగోలు చేసి వారి వద్ద ఉంచుకుని, సభ్యులకు నిదానంగా అంటగడుతున్నారు. మండలాల్లో 29,529, పట్టణాల్లో 9,518 గ్రూపులు జిల్లా వ్యాప్తంగా సెర్ఫ్ ఆధ్వర్యంలో స్వయం సహాయక గ్రూపులు 29,529 ఉన్నాయి. వీటిల్లో 3,06,936 మంది గ్రూపు సభ్యులున్నారు. పట్టణాల్లో 9,518 గ్రూపులుండగా వీటిలో సుమారుగా 95,524 మంది గ్రూపు సభ్యులున్నారు. వీరంతా మెప్మా ఆధ్వర్యంలో రుణాలు పొందుతున్నారు. వీరందరికీ పచ్చళ్లు, జ్యూట్ బ్యాగులు ఇవ్వాలని నిర్ణయించి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు నుంచి ఎన్డీయే కూటమిలోని అధికారులు చక్రం తిప్పి గ్రూపు సభ్యులకు అంటగడుతూ వస్తున్నారు. డ్వాక్రా మహిళలపై అధికారుల ఒత్తిడి ప్రతి గ్రూపు నుంచి కనీసం రెండు కొనాలంటూ మౌఖిక ఆదేశాలు ఒత్తిళ్లు భరించలేక కొందరు ఆర్పీలు ముందుగా పెట్టుబడి పెట్టి కొనుగోళ్లు మెప్మా...సెర్ఫ్ల ఆధ్వర్యంలో డ్వాక్రా గ్రూపు సభ్యులకు అంటగడుతున్నారు పచ్చళ్లు, జ్యూట్ బ్యాగులు కొనుగోలు చేయాలని ఎవరూ బలవంతం చేయడం లేదు. ఒత్తిళ్లు చేయడం లేదు. ఆర్పీలకు తెలియజేసి ఎవరైనా ఆసక్తి ఉంటే కొనుగోలు చేస్తే వారిని ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసుకోవాలని సూచించాం. ఆ విధంగానే చాలా మంది పచ్చళ్లు, జ్యూట్ బ్యాగులను కొనుగోలు చేశారు. పెడనలో 500 వరకు పచ్చడి సీసాలను కొనుగోలు చేశారు. జ్యూట్ బ్యాగులు 50 నుంచి 60 వరకు కొనుగోలు చేశారు. ఆర్పీల పైన, గ్రూపు సభ్యులపైన ఎటువంటి ఒత్తిళ్లు చేయలేదు. – భోగేశ్వరరావు, టీఎంసీ, మెప్మా, పురపాలక సంఘం, పెడన -
నవలంక దీవి సందర్శించిన జిల్లా అధికారులు
నాగాయలంక: స్థానిక శ్రీరామ పాదక్షేత్రం పుష్కరఘాట్ ఎదుట ఉన్న నవలంక మినీ ఐలెండ్ను బుధవారం ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ రీజనల్ డైరక్టర్ వై.వి.ప్రసన్నలక్ష్మి, కృష్ణాజిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు స్థానిక రెవెన్యూ అధికారులతో కలసి సందర్శించారు. నాగాయలంక తహసీల్దార్ ఎం.హరనాఽథ్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీవి మ్యాప్ను పరిశీలించారు. ఇప్పటివరకు చేసిన సర్వే మేరకు 16.75 ఎకరాలు దీవిలో గుర్తించినట్లు పేర్కొన్నారు. దీవిలో మిగతా పరిధిని కూడా సర్వే చేయాలని భావిస్తున్నారు. ప్రాథమిక పరిశీలనగా నవలంకలో ఏ విధంగా పర్యాటకాభివృద్ధి చేయవచ్చు అనే అంశాలపై చర్చించనున్నారు. అనంతరం మండలంలోని ఎదురుమొండి దీవిలో పర్యటించారు. ఆకస్మిక తనిఖీలో భాగంగా డీఆర్వో చంద్రశేఖరరావు అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆసుపత్రి రికార్డులు పరిశీలించారు. వైద్యసేవల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం సమీపంలో గుల్లలమోద వద్ద డీఆర్డీఓ క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటివ్ భవనం, ప్రాజెక్ట్ సైట్లను పరిశీలించారు. ఈనెల ఏపీ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీ ఈ క్షిపణి ప్రయోగ కేంద్రానికి వర్ుచ్యవల్గా శంకుస్థాపన చేయునున్నారన్న ప్రచారం నేపథ్యంలో డీఆర్వో ఈ ప్రాజెక్ట్ సైట్ను సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యాటక అభివృద్ధి ప్రణాళిక అంశాలు పరిశీలన గుల్లలమోద డీఆర్డీఓ కేంద్రం స్థల సందర్శన -
జేఈఈ మెయిన్స్ ప్రారంభం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మొయిన్స్ –2025 రెండో సెషన్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రెండు విడతలుగా ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఏర్పాటు చేసిన ఆన్లైన్ పరీక్ష కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారితంగా ఈ పరీక్షలు నిర్వహి స్తున్నారు. ఈ నెల తొమ్మిదో తేదీ వరకూ ఈ పరీక్షలు కొనసాగుతాయి. జిల్లాలోని ఐయాన్ డిజిటల్ జోన్ (కానూరు), శ్రీ విజయదుర్గా ఐటీ ఇన్ఫో సొల్యూషన్స్ (ఎనికేపాడు), ఐయాన్ డిజిటల్ జోన్ (కండ్రిక), లకిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (మైలవరం) తదితర కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11,488 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్ష కేంద్రాల వద్ద వేచి ఉండటంతో ఆయా ప్రాంతాలన్నీ సందడిగా మారాయి. పృథ్వీశ్వరుడికి అరుణకిరణాల అభిషేకంచల్లపల్లి: మండలంలోని నడకుదురు క్షేత్రంలో స్వయంభూగా వెలసిన శ్రీబాల త్రిపుర సుందరీ సమేత శ్రీపృథ్వీశ్వరస్వామి ఆరుణ కిరణాలతో దేదీప్యమానంగా వెలుగొందుతూ బుధవారం సాయంత్రం భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అపురూప దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు భారీగా ఆలయానికి తరలివచ్చారు. పురాతన ఆలయం కావటంతో స్వామి గర్భాలయం సుమారు ఐదు అడుగుల లోతులో ఉంటుంది. స్వామికి ఎదురుగా నేలమట్టంపై నాలుగు అడుగుల పీఠంతో ధ్వజస్తంభం ఉంది. దానికి ఎదురుగా సుమారు 40 అడుగుల రాజగోపురం, దానికి ముందు ఆరు అడుగుల ఎత్తున్న నందీశ్వరుడు, పైన 12 అడుగుల ఎత్తులో మంటపం ఇలా వరుసగా ఒకదాని వెనుక మరొకటి ఉన్నాయి. ఇన్ని అడ్డుగా ఉన్నప్పటికీ సూర్యకిరణాలు స్వామిని ఎలా తాకుతున్నాయనేది ఆశ్చర్యంగా ఉందని పలువురు భక్తులు పేర్కొన్నారు. ఏటా ఉగాది పండుగ ముగిసిన తరువాత ఒకటి రెండు రోజులు సాయంత్రం వేళల్లో సూర్యుని కిరణాలు స్వామిని తాకుతాయని ఆలయ అర్చకుడు పృథ్వీశర్మ తెలిపారు. రైతుబజారులో మంత్రి మనోహర్ తనిఖీలుఆటోనగర్(విజయవాడతూర్పు): కొద్ది రోజుల నుంచి విజయవాడ ఏపీఐఐసీ రైతుబజారులో అన్ని రకాల కూరగాయలు దొరకడంలేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కు వినియోగదారులు ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో ఏపీఐఐసీ కాలనీ లోని రైతుబజారును మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా స్టాళ్లను సందర్శించి వ్యాపారులతో మాట్లాడారు. కూరగాయల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. రైతు బజారులో టమాటా సహా పలు రకాల కూరగాయలు లేకపోవడాన్ని గుర్తించి అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ, జేడీ ఎస్టేట్ అధికా రులు శ్రీనివాసరావు, రమేష్బాబు టమాటా ఎందుకు రావడంలేదని ప్రశ్నించారు. వారిద్దరు సరిగా సమాధానం ఇవ్వలేకపోయారు. అన్ని రకాల కూరగాయలు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మరో సారి ఫిర్యాదులు వస్తే సహించేది లేదని హెచ్చరించారు. -
పాఠశాలల విలీనంతో విద్యార్థులకు దూరాభారం
పామర్రు: పాఠశాలల విలీనం వలన విద్యార్థులకు దూరాభారం అవుతుందని పలువురు తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ ఎదుట వాపోయారు. కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం పామర్రు మండల పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల పరిధిలోని విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. పామర్రులోని నర్సు చెరువు వద్ద ఉన్న ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న పాఠశాలల విలీనంపై పాఠశాల ఎస్ఎంసీ కమిటీ చైర్పర్సన్ ఎం.మంగాదేవి కలెక్టర్ ఎదుట తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తనకు ఇద్దరు పిల్లలని, ప్రస్తుతం వారు కిలోమీటరు దూరంలో ఉన్న పాఠశాలలో చదువుతున్నారని, ఇప్పుడు విలీనం వలన రెండు కిలోమీటర్ల దూరం వెళ్లవలసి వస్తుందని చెప్పారు. రద్దు చేసిన పాఠశాలను తిరిగి పునరుద్ధరించాలని కోరారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పాఠశాలల పునర్వ్యవస్థీకరణ జరుపుతోందని తల్లిదండ్రులు అందరూ సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. దుర్గంధంతో ఫౌండేషన్ ప్లస్ పాఠశాల ప్రభుత్వం పామర్రులోని ఫౌండేషన్ ప్లస్ బాలుర ఎంపీపీ ప్రాథమిక పాఠశాలను ఎంపిక చేశారు. ఈ పాఠశాల ఆవరణ మురికి కాలువలు గుర్రపు డెక్కతో నిండి దుర్వాసన వస్తూ ఉండటంతో జిల్లా కలెక్టర్ గ్రామ పంచాయతీ ఈవోకు కాలువలు సరి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కాలువ గుడివాడ–పామర్రు అండర్పాస్ జాతీయ రహదారిలో భాగంగా అనుసంధానమై ఉండటంతో నీళ్లు నిలిచిపోతున్నాయని ఈవో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా కలెక్టర్ వెంటనే స్పందించి సంబంఽధిత జాతీయ రహదారి అధికారికి ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు, డీవైఈఓ పద్మారాణి, ఎంఈవో పద్మవాణి, ఉపాధ్యాయురాలు మృదుల పాల్గొన్నారు. కలెక్టర్ ఎదుట అసంతృప్తి వ్యక్తం చేసిన ఎస్ఎంసీ చైర్పర్సన్ తల్లిదండ్రులకు నచ్చజెప్పే యత్నం చేసిన కలెక్టర్ -
జంతు సంరక్షణ సామాజిక బాధ్యత
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జంతువుల సంరక్షణ సామాజిక బాధ్యతని, జంతువులపై క్రూరత్వ నివారణ చట్టం అమలుకు పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టర్ అధ్యక్షతన జంతువులపై క్రూరత్వ నివారణ జిల్లా సొసైటీ (డీఎస్పీసీఏ) సర్వసభ్య సమావేశం బుధవారం వర్చువల్గా జరిగింది. తొలుత జిల్లా సొసైటీలో ప్రగతిశీల రైతులు ఎ.శ్రీపద్మ, వి.రవికుమార్ సభ్యత్వానికి సమావేశం ఆమోదం తెలిపింది. అనంతరం జిల్లా పరిధిలో జంతు సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు, వేసవి కార్యాచరణ, వీధి కుక్కలు – జనన నియంత్రణ కార్యక్రమం అమలు, యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ తదితరాలపై చర్చించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. జిల్లా సొసైటీ సభ్యుల సమష్టి కృషితో జంతువులపై క్రూరత్వ నివారణ చట్టం పటిష్ట అమలుకు కృషి చేస్తున్నామన్నారు. విజయవాడ నుంచి 10 నుచి 15 కిలో మీటర్ల లోపు జిల్లా ఎస్పీసీఏ యానిమల్ షెల్టర్ (గోశాల) ఏర్పాటుకు ఎకరా స్థలాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. వేసవి నేపథ్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సహాయంతో అన్ని ఆవాసాల్లోనూ నీటి తొట్టెల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉన్నవాటికి మరమ్మతులు అవసరమైతే యుద్ధప్రాతిపదికన చేసి, వినియోగంలోకి తీసుకురావాలని పంచాయతీరాజ్, డ్వామా, పశు సంవర్ధక శాఖల అధికారులను ఆదేశించారు. భారత జంతు సంక్షేమ బోర్డు (ఏడబ్ల్యూబీఐ) మార్గదర్శకాలు, యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్–2023 ప్రకారం జిల్లాలో వీధి కుక్కల సంతాన నియంత్రణ కార్యక్రమాన్ని (యానిమల్ బర్త్ కంట్రోల్–ఏబీసీ) అమలుచేస్తున్నట్లు తెలిపారు. నెలకు సగటున 1100 ఏబీసీ శస్త్రచికిత్సలు జరుగుతున్నాయన్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 211 కెన్నెళ్లు అందుబాటులో ఉన్నాయని, మరో 100 కెన్నెళ్ల నిర్మాణం పూర్తయి వినియోగానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. జంతు సంరక్షణపై పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలను కొనసాగించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ ఎం.హనుమంతరావు, జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, డీపీఓ పి.లావణ్య కుమారి, డీఈఓ యు.వి.సుబ్బారావు, నాన్ అఫీషియల్ వైస్ ప్రెసిడెంట్ పాకూరి బాలకృష్ణ, సొసైటీ సభ్యులు గోవింద సాబూ, ఎం.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.డీఎస్పీసీఏ సర్వసభ్య సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన
చందర్లపాడు(నందిగామ టౌన్): చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలో ఈ నెల ఐదో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో నిర్వహించే బాబు జగ్జీవన్రామ్ జయంతి వేడుకలలో ముఖ్యమంత్రి పాల్గొంటారన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి గ్రామంలోని దేవాలయాలు, ఖాళీ స్థలాలు, భూములు, తదితరాలను పరిశీలించినట్లు తెలిపారు. సభ ఏర్పాట్లపై కలెక్టర్, అధికారులతో ఆమె చర్చించారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా తొలిసారి చంద్ర బాబు నాయుడు నియోజకవర్గానికి వస్తున్నారని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఆర్డీవో బాల కృష్ణ, లాల్ బహదూర్ కెనాల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కోట వీరబాబు పాల్గొన్నారు.హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక దృష్టిలబ్బీపేట(విజయవాడతూర్పు): హై రిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించి, వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎన్టీఆర్ జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని అన్నారు. ఆమె జిల్లాలో జరుగుతున్న ఎన్సీడీ– సీడీ సర్వేను మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అందులో భాగంగా రెడ్డిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, గర్భిణుల నమోదు, సిబ్బంది హాజరు వంటి అంశాలను పరిశీలించారు. ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ సేవలపై ఆరా తీశారు. అనంతరం బూరుగగూడెం, రంగాపురం సచివాలయాల పరిధిలో నిర్వహిస్తున్న ఎన్సీడీ–సీడీ సర్వేను క్షేత్రస్థాయిలో ఆమె పరిశీలించారు. సర్వే జరుగుతున్న తీరును స్వయంగా ప్రజలతో మాట్లాడి తెలుసుకున్నారు. రెడ్డిగూడెం వైద్యాధికారి డాక్టర్ మణిబాబు, సీహెచ్ఓ శ్యాం సుందర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.నిత్యాన్నదానానికి విరాళంఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి వరంగల్కు చెందిన భక్తులు మంగళవారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. వరంగల్కు చెందిన సీహెచ్ రమేష్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,00,116 విరాళాన్ని అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించగా, వేద పండి తులు ఆశీర్వచనం ఇచ్చారు. ఆలయ అధికారులు దాతలను అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలతో సత్కరించారు.అంతర్జాతీయ స్కేటింగ్ పోటీల్లో చైత్రదీపిక సత్తావిజయవాడస్పోర్ట్స్: తైవాన్లో జరిగిన అంతర్జాతీయ తైవాన్ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ పోటీల్లో విజయవాడ క్రీడాకారిణి చైత్రదీపిక మూడు పతకాలతో సత్తా చాటింది. గత నెల 24 నుంచి 30వ తేదీ వరకు తైవాన్లో జరిగిన ఈ పోటీలకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, ఉత్తరకొరియా, ఇటలీ, సింగపూర్, భారత దేశాల క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించారు. ఈ పోటీల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన చైత్రదీపిక పెయిర్ విభాగంలో బంగారు పతకం, ఇన్లైన్ విభాగంలో కాంస్యం, కపుల్ డ్యాన్స్లో రజత పతకాలను సొంతం చేసుకుంది. క్రీడాకారిణి చైత్రదీపిక పటమటలోని ఎన్ఎస్ఎం స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. క్రీడాకారిణిని శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, కోచ్ పి. సత్యనారాయణను పలువురు క్రీడాభిమానులు అభినందించారు. -
సత్వరమే పారిశ్రామిక అనుమతులు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశగాంధీనగర్(విజయవాడసెంట్రల్): సత్వర పారిశ్రామిక అనుమతుల జారీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పారిశ్రామిక విధానాల కింద పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, పారిశ్రామిక అనుమతులు తదితరాలపై చర్చించారు. 2024, డిసెంబర్ 19 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా పారిశ్రామిక అనుమతులకు సంబంధించి 105 దరఖాస్తులు అందాయని, వాటిలో ఇప్పటికే 90 ఆమోదం పొందాయని పరిశ్రమల శాఖ అధికారులు వివరించారు. మిగిలిన దరఖాస్తులను కూడా నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పారిశ్రామిక అభివృద్ధి విధానం– 2015–20, 2020–23, 2023–27 కింద ఎంఎస్ఎంఈ రంగానికి అందించే ప్రోత్సాహకాలపై స్క్రూట్నీ కమిటీ సమావేశాలు నిర్వహించి 46 క్లయిమ్లకు రూ. 3.20 కోట్ల మేర ప్రతిపాదనలు పంపాయన్నారు. ఈ ప్రాతిపాదనలపై తాజాగా చర్చించి డీఐఈపీసీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీఎంఈజీపీ వంటి పథకాలను సద్వినియోగం చేసుకుంటూ యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి బి.సాంబయ్య, ఎల్డీఎం కె.ప్రియాంక, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ కె.బాబ్జి, డీపీవో పి.లావణ్యకుమారి, పీసీబీ ఈఈ పి.శ్రీనివాసరావు, జిల్లా అగ్నిమాపక అధికారి ఏవీ శంకరరావు పాల్గొన్నారు. -
రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ కుట్ర
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జగ్గయ్యపేట అర్బన్: భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కుట్ర పన్నిందని, దేశంలోని సెక్యులర్ పార్టీలన్నీ ఒక్కతాటి మీద నిలబడి అడ్డుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. వక్ఫ్బోర్డుల ఆస్తుల సవరణను వ్యతిరేకిస్తూ పట్టణంలోని పాత మునిసిపల్ కార్యాలయం కూడలిలో మంగళవారం రాత్రి లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సభ జరిగింది. ముఖ్య అతిథి రామకృష్ణ మాట్లాడుతూ.. దేశంలోని అన్ని మతాలు, కులాలకు సమన్యాయం కలిగేలా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిందన్నారు. అంబానీ, టాటా, అదానీ, ఆదిత్య బిర్లా వంటి కంపెనీలకు రూ.లక్షల కోట్లు దోచిపెట్టడమే మోదీ విధానమన్నారు. చంద్రబాబు, పవన్వి అబద్ధాలు.. సూపర్ సిక్స్ అంటూ గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిందేమీ లేదని రామకృష్ణ విమర్శించారు. ఇప్పటికీ చంద్రబాబు, పవన్కల్యాణ్లు అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని, పేదరికం పోవాలంటే జనాభాను పెంచుకోవాలని చెప్పడమేమిటని ప్రశ్నించారు. పేదరికం పోవాలంటే జనాభాను పెంచుకోవడం కాదని, సంపద సృష్టించాలని సూచించారు. పార్టీ నాయకులు దోనేపూడి శంకర్, అంబోజి శివాజి, చుంటూరు సుబ్బారావు, దళిత హక్కుల పోరాటసమితి కార్యదర్శి బుట్టి రాయప్ప, పట్టణ కార్యదర్శి జె.శ్రీనివాసరావు, ఏఐటీయూసీ నియోజకవర్గ కన్వీనర్ పోతిపాక వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
చరిత్ర తిరగరాసిన రైల్వే డివిజన్
సరుకు లోడింగ్, ఆదాయార్జనలో సరికొత్త రికార్డు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం, సరుకు లోడింగ్, రైళ్ల సమయపాలనలో సరికొత్త రికార్డు సాధించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 38.322 మిలియన్ టన్నుల సరుకు లోడింగ్ నమోదు చేసు కుంది. దశాబ్దం తర్వాత 2014–15 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 38.169 మిలియన్ టన్నులను అధిగమించింది. తద్వారా సరుకు లోడింగ్ ద్వారా డివిజన్ రూ.4,239.74 కోట్లు ఆదాయం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం కంటే 3.8శాతం వృద్ధితో డివిజన్ స్థూల ఆదాయం రూ. 5,836.61 కోట్లకు చేరుకుంది. ఈ సందర్భంగా డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ డివిజన్ సాధించిన ఉత్తమ ఫలితాలకు కారణమైన సరుకు వినియోగదారులు, ప్రయాణికులకు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా విధుల్లో అంకితభావంతో పనిచేసిన సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు, సీనియర్ డీఓఎం డి.నరేంద్ర వర్మ తదితరులను అభినందించారు. 2024–25లో డివిజన్ వృద్ధి ఇలా.. ● ప్రయాణికుల ద్వారా గతం కంటే 0.12శాతం వృద్ధితో రూ. 1,386.14 కోట్లు ● కోచింగ్ ఆదాయం 18శాతం వృద్ధితో రూ. 111.70 కోట్లు ● ఇతర ఆదాయ మార్గాల ద్వారా 18శాతం వృద్ధితో రూ. 99.03 కోట్లు ● 66.7 మిలియన్ల ప్రయాణికులు డివిజన్ నుంచి ప్రయాణించారు. గతంలో 63.6 మిలియన్లు ఉండగా 4.8 శాతం ప్రయాణికులు పెరిగారు. ● డివిజన్ రైళ్ల నిర్వహణలో 80.19శాతం అత్యుత్తమ సమయపాలన నమోదు చేసుకుంది. -
పేదలకు మెరుగైన వైద్యమే లక్ష్యం
చిలకలపూడి(మచిలీపట్నం): వైద్య సహాయం నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చే పేదల పట్ల సహృదయంతో వ్యవహరించి మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంపై పలువురు చేసిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు కలెక్టర్ ఆయన చాంబర్లో జిల్లా క్రమశిక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించటమే ఎన్టీఆర్ వైద్యసేవ పథక లక్ష్యమన్నారు. ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా సక్రమంగా నిర్వహించాలన్నారు. రోగులకు బిల్లుల భారం లేకుండా పూర్తి నగదు రహిత వైద్యం అందించేలా ఆస్పత్రుల యాజమాన్యం బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు వైద్యం నిరాకరించకుండా పూర్తి వైద్యసేవలు అందించాలని ప్రభుత్వం ఇటీవల పెండింగ్ బిల్లులను చెల్లించిన విషయాన్ని ఆస్పత్రుల యాజమాన్యానికి ఆయన గుర్తు చేశారు. సమావేశంలో డీఎంఅండ్హెచ్వో డాక్టర్ ఎస్. శర్మిష్ట, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఎం. జయకుమార్, ఎన్టీఆర్ వైద్యసేవ కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎస్. సతీష్కుమార్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పక్కాగా పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ మచిలీపట్నంలో పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ పక్కాగా చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో అధికారులతో మంగళవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మచిలీపట్నం నియోజకవర్గంలో 205 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వీటిలో నగరంలో 135 ఉన్నట్లు తెలిపారు. అందులో ఒకే ఇంటి నంబరులో ఉన్న ఓటర్ల పేర్లు వివిధ పోలింగ్ కేంద్రాల్లో ఉన్నాయని వారందరినీ ఒకే కేంద్రంలో ఉండేలా చేర్చాలన్నారు. ఇంటి నంబర్లు కూడా వరుసగా ఉండేలా ఓటర్ల జాబితా తయారు చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను మచిలీపట్నం ఈఆర్వో పరిధిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలన్నారు. వచ్చే 15వ తేదీ మరలా సమావేశం నిర్వహించి ఆమోదం కోసం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి పంపిస్తామన్నారు. డీఆర్వో కె. చంద్రశేఖరరావు, ఇన్చార్జ్ ఆర్డీవో సీహెచ్ పద్మాదేవి, మునిసిపల్ కమిషనర్ బాపి రాజు, తహసీల్దార్లు మధుసూదనరావు, నాగ భూషణం తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ డీకే బాలాజీ -
కన్నీరే పారు
చివరి ఆయకట్టుకు సాగునీరు ప్రశ్నార్థకమే! చంద్రయ్య డ్రెయిన్లో మేట వేసుకుపోయిన గుర్రపుడెక్కబుడమేరు డ్రెయిన్లో పుట్టగుంట వద్ద నుంచి గుర్రపుడెక్క దట్టంగా పేరుకుపోయింది. కాంట్రాక్టర్ మెయింటెనెన్స్ పేరుతో ఏటా కాంట్రాక్టు తీసుకోవడమే కానీ పనులు చేయడం లేదు. పుట్టగుంట వద్ద నుంచి కొల్లేరు వరకు ఒక్క తూడు మొక్క తీసిన దాఖలాలు లేవు. అడ్డగోలుగా సగానికి సగం టెండర్లు దాఖలు చేసి పనులు చేయకుండానే బిల్లులు చేజిక్కించుకుంటున్నారు. దీని వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. – సత్యనారాయణ, రైతు ఎల్ఎన్పురం సాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. పంట కాలువలు గుర్రపుడెక్క, వ్యర్థాలతో పూడుకుపోయి అధ్వానంగా మారాయి. ఏళ్ల తరబడి పూడికతీతలు లేవు. కాలువ చివరి భూములకు నీరు ప్రశ్నార్థకంగా మారింది. కేవలం గుర్రపుడెక్కపై క్రిమిసంహారక మందులు పిచికారీ చేయటంతో సరిపెట్టకుండా పూర్తి స్థాయిలో పూడికతీతలు చేపట్టాలి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నాటికి కాలువల ఆధునికీకరణ పనులు పూర్తి చేసి రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పాలకులు చర్యలు తీసుకోవాలి. – వి.మరియదాసు, కౌలురైతు, గొడవర్రు, కంకిపాడు మండలం ఇప్పటికే పరిపాలన అనుమతుల కోసం కాడ్కు ప్రతిపాదనలు పంపాం. ఆమోదం లభించిన వెంటనే పనులను నీటి సంఘాల ఆధ్వర్యంలో చేపడతాం. కాలువలకు తాగునీరు విడుదల చేసి నిలిపివేసిన తర్వాత ఈ పనులు చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తాం. – మోహనరావు, నీటిపారుదల శాఖ ఎస్ఈ, ఉమ్మడి కృష్ణా జిలా్ల సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా డెల్టాలో కాలువలు, డ్రెయిన్ల నిర్వహణ, మరమ్మతులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సకాలంలో పనులు చేయక పోవడంతో చివరి ఆయకట్టుకు నీరు అందడం ప్రశ్నార్థకంగా మారుతోంది. వర్షాలు వస్తే, డ్రెయిన్లు పొంగి పొలాల నుంచి నీరు బయటకు పోక అల్లాడిపోతున్నారు. కృష్ణా డెల్టా పరిధిలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా తూర్పు డెల్టా పరిధిలో కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి 6.79 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సింది. అయితే కాలువలు, డ్రెయిన్లకు సకాలంలో పూడికతీత, మరమ్మతులు చేపట్టకపోవడంతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గత ఏడాది(2024–25) పనులకు టెండర్లు ఆలస్యంగా పిలిచి, ఖరారు చేయడంలోనూ జాప్యం జరిగింది. 160 పనులు రూ.32.79కోట్లతో చేపట్టారు. అయితే ఈ పనుల్లో టీడీపీ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకొని, టెండర్లతో సంబంధం లేకుండానే కొంత మంది కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పారు. వారు 40–48 శాతం తక్కువకు పనులు దక్కించుకున్నారు. వీరంతా కాలువలు, డ్రెయిన్ల పనులు చేయకుండానే మమ అనిపించి చేతులు దులుపుకున్నారు. నిర్వహణను గాలికి వదిలేశారు. కాలువలకు జూన్లోనే నీరు విడుదల చేసే అవకాశం ఉండటంతో పనులు చేసే పరిస్థితి లేదు. దీంతో కాంట్రాక్టర్లు, నీటి పారుదల శాఖ అధికారులతో కుమ్మక్కై నామమాత్రంగా పనులు చేసి, బిల్లులు దండుకొంటున్నట్లు తెలుస్తోంది. ఈ సారైనా చేస్తారా? 2025–26కు సంబంధించి కృష్ణా డెల్టా ప్రాజెక్టు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ, సాగునీటి వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో నీటి పారుదల శాఖ అధికారులు 568 పనులు రూ.26.03కోట్లతో కాడ్(కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) కమిటీకి ప్రతిపాదనలు పంపారు. ఇంకా పనులకు ఆమోదం లభించలేదు. అయితే ఈ ఏడాది నీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు జరగటంతో వారి ఆధ్వర్యంలో పనులు సాగనున్నాయి. టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలోనే పనులు కట్టబెట్టనున్నారు. పనులు సకాలంలో మంజూరు చేసి, పరిపాలనా అనుమతులు ఇవ్వకపోతే.. నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉంది. అధ్వానంగా డ్రెయిన్లు.. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు బుడమేరు పొంగటంతో పెద్ద ఎత్తున పంట పొలాలు నీట మునిగి, రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ప్రస్తుతం వర్షం వస్తే రైతులకు కంటిమీద కునుకు ఉండని పరిస్థితి కృష్ణా డెల్టాలో నెలకొంది. కొద్ది పాటి వర్షానికే డ్రెయిన్లు పొంగి పంట పొలాలను ముంచెత్తుతున్నాయి. గుడివాడ నియోజకవర్గ పరిధిలోని గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో డ్రెయిన్లు పూడికతీయకపోవడం వల్ల అధ్వానంగా మారాయి. బుడమేరు, చంద్రయ్య, నెహ్రాల్లీ, మోటూరు ఎల్ఎస్ మేజర్ డ్రెయిన్లు దారుణంగా ఉన్నాయి. లజ్జబండ, శివగంగ, తాళ్లపాళెం, ఏనుగులకొడు, వన్నేరు, ముస్తాఫాకొడు, యూటీ, పెద్దలంక, గుండేరు, రత్నకొడు డ్రెయిన్లలో గుర్రపుడెక్క, నాచు, తూడు దట్టంగా పేరుకుపోయి మురుగు నీరు సక్రమంగా దిగువకు ప్రవహించని పరిస్థితి. విజయవాడ నుంచి నందివాడ మండలం ఎల్ఎన్ పురం వరకు బుడమేరులో గుర్రపుడెక్క దట్టంగా పేరుకుపోయింది. ఈ ఏడాదైనా పనులు సక్రమంగా చేపట్టకపోతే, రైతులు తీవ్ర ఇబ్బంది పడతారు. అధ్వానంగా కాలువలు, డ్రెయిన్లు పేరుకుపోయిన తూటికాడ, గుర్రపుడెక్క వర్షం వస్తే పంట పొలాల మునక ఈ ఏడాది నిర్వహణ పేరిట 568 పనులకు రూ. 26 కోట్లతో ప్రతిపాదనలు ప్రతిపాదనలు పంపాం..ఈ ఏడాది(2025–26) కాలువల నిర్వహణ కోసం ప్రతిపాదించిన పనులు.. డివిజన్ పనుల విలువ సంఖ్య (రూ.కోట్లలో) కృష్ణా తూర్పు 121 8.45 కృష్ణా సెంట్రల్ 144 7.28 డ్రెయినేజి విభాగం 288 9.00 స్పెషల్ 15 1.30 మొత్తం 568 26.03 -
బెదిరేది లేదు.. వైఎస్సార్ సీపీని వీడేది లేదు
చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వేధించినా.. మానసికంగా ఎంత ఇబ్బంది పెట్టినా.. భయ పడేది లేదని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) స్పష్టం చేశారు. బందరులోని తన నివాసం వద్ద ఆయన మంగళవారం మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వ్యవస్థ మొత్తాన్ని ప్రజలకు మేలు చేసే విధంగా వినియోగించకుండా రాజకీయంగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను వేధింపులకు గురిచేసేందుకు వాడుతోందని విమర్శించారు. బియ్యం సరఫరా కేసులో తమకే పాపం తెలియదని పోలీసులు, న్యాయవ్యవస్థకు తెలిసినప్పటికీ, ప్రభుత్వానికి జరిగిన నష్టానికి రెట్టింపు మొత్తం చెల్లించినప్పటికీ ఇంకా వేధించే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా కోర్టులో వారు మోపిన చట్టం ఈ కేసులో చెల్లదని న్యాయమూర్తులు చెప్పినప్పటికీ వేధింపులే లక్ష్యంగా హైకోర్టులో తన భార్య బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేశారన్నారు. క్రిమినల్ కేసులు ఎలా వేస్తారు? పౌరసరఫరాలశాఖ ఏర్పడినప్పటి నుంచి బియ్యం సరఫరాల్లో జరిగిన అక్రమాలపై 6ఏ కేసులు నమోదు తప్ప ఇంత వరకు ఎవరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయలేదని పేర్ని నాని అన్నారు. సాక్షాత్తూ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ పోర్టులో 20 వేల టన్నుల బియ్యం అక్రమ రవాణాను పట్టుకున్నప్పుడు కూడా 6ఏ కేసు తప్ప క్రిమినల్ కేసులు పెట్టలేదని గుర్తుచేశారు. కేవలం తమను వేధించడానికే కక్షతో దిగజారుడుతనంగా కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో వేధింపులే పై చేయి సాధిస్తే.. తమ కుటుంబమంతా జైలుకెళ్లి వస్తామే తప్ప, వైఎస్సార్ సీపీని వీడేది లేదని పేర్ని నాని స్పష్టం చేశారు. కాకినాడ పోర్టులో బియ్యం తరలించినా క్రిమినల్ కేసులు పెట్టలేదు కేవలం కక్షసాధింపు కోసమే మాపై క్రిమినల్ కేసులు పెట్టారు మాజీ మంత్రి పేర్ని నాని -
ప్రశాంతంగా ముగిసిన ‘పది’ పరీక్షలు
రేపటి నుంచి మూల్యాంకనం మచిలీపట్నంఅర్బన్: పదో తరగతి పరీక్షలు మంగళవారంతో ప్రశాంతంగా ముగిశాయి. మార్చి 17న పరీక్షలు ప్రారంభమవగా.. జిల్లాలో 22,341 మంది విద్యార్థులు 145 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాశారు. కాగా మంగళవారం జరిగిన భౌతిక శాస్త్రం పరీక్షకు 21,049 హాజరుకాకావాల్సి ఉండగా 20,691 మంది హాజరు కాగా అత్యధికంగా 358 మంది గైర్హాజరయ్యారు. అంతకుముందు తెలుగు పరీక్షకు 21,072 గాను 250, హిందీకి 21,024 గాను 315, ఇంగ్లిష్కు 21,040 గాను 244, గణితానికి 21,049 గాను 257, సాంఘిక శాస్త్రం పరీక్షకు 21,024 గాను 255 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. మూల్యాంకనానికి ఏర్పాట్లు.. ఏప్రిల్ 3 నుంచి 9వ తేదీ వరకు పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం జరుగనుంది. మచిలీపట్నంలోని లేడీయాంప్తిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మూల్యాంకనాన్ని నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు. జిల్లాకు 1,91,627 జవాబు పత్రాలు వచ్చాయి. 1,196 మంది సీఈ, ఏఈలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జవాబు పత్రాల మూల్యాంకనం చేయనున్నారు. మత్స్య సంపద అభివృద్ధికి ‘సిఫా’ సేవలు రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామ్శంకర్నాయక్పెనమలూరు: మత్స్యరంగం అభివృద్ధికి, రైతులు మత్స్య దిగుబడులు సాధించటానికి మంచినీటి జీవపాలన సంస్థ (సిఫా) ఎంతో కృషి చేస్తోందని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామ్శంకర్నాయక్ అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలో మంగళవారం నిర్వహించిన సిఫా ప్రాంతీయ పరిశోధన కేంద్రం 38వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సిఫా పరిశోధనలతో చేపలలో నూతనంగా 26 వంగడాలు సృష్టించారన్నారు. చేపలలో వచ్చే వ్యాధుల నివారణకు, చేపల సాగు రైతులకు అధిక దిగుబడులు రావడానికి సిఫా ఉత్తమమైన సూచనలు, సలహాలు ఇస్తోందని పేర్కొన్నారు. సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ రమేష్ రాథోడ్ మాట్లాడుతూ సిఫా పంగాస్, రూప్చంద్ చేపల ఉత్పత్తి చేసి నేడు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. ప్రొఫెసర్ డాక్టర్ కె.రాఘవరావు, ఆర్జీసీఏ సైంటిస్టు ఇన్చార్జ్ అప్పలనాయుడు, సైంటిస్ట్ అజిత్కేశవ్ చౌదరిపాల్గొన్నారు. -
తెలంగాణ సెర్ఫ్ బృందం పర్యటన
జగ్గయ్యపేట: మండలంలోని తక్కెళ్లపాడు, అనుమంచిపల్లి గ్రామాల్లో మంగళవారం జరిగిన సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ పని తీరును తెలంగాణ సెర్ఫ్ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా సెర్ఫ్ బృంద ప్రతినిధి గోపాలరావు, బృంద సభ్యులు సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న పింఛన్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొబైల్ యాప్ ద్వారా పెన్షన్ల పంపిణీ లేదని పీవోటీ డివైస్ ద్వారా పంపిణీ జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పింఛన్ల పంపిణీ పరిశీలనకు వచ్చామని చెప్పారు. కొందరు లబ్ధిదారులు గత ప్రభుత్వంలో వలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేశారని చెప్పగా గత ప్రభుత్వంలో కూడా పంపిణీ బాగుందని తెలిసిందన్నారు. కార్యక్రమంలో బృంద సభ్యులు శ్రీనివాస్, గోపీనాథ్, గిరిధర్, రవి, ఎంపీడీవో నితిన్, సర్పంచ్లు యలమర్ది శ్రీనివాసరావు, త్రివేణి, కార్యదర్శులు శేఖర్, శ్రావణ్, సిబ్బంది పాల్గొన్నారు. పాలిసెట్కు ఉచిత శిక్షణ మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశానికి నిర్వహిస్తున్న పాలిసెట్–2025కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం ఉచిత శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.విజయసారథి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బెంజ్సర్కిల్ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో బుధవారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ శిక్షణ తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు. తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను ఉచితంగా అందజేస్తామని తెలిపారు. పాలిసెట్–2025కు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 15వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పాలిసెట్–2025 ప్రవేశ పరీక్ష ఈ నెల 30వ తేదీన జరుగుతుందని తెలిపారు. పరీక్షకు సంబంధించిన సమాచారం కోసం 94926 85021లో సంప్రదించాలని ఆయన కోరారు. సూరంపల్లిలో 40 పందులు చోరీ గన్నవరం: మండలంలోని సూరంపల్లి శివారు లో 40 పందులను దొంగలు అపహరించుకుపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా వున్నాయి. గ్రామానికి చెందిన కొంత మంది శివారులో పందులను పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజాము సమయంలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 40 పందులను వాహనంలో ఎక్కించుకుని ఎత్తుకుపోయారు. తెల్లవారుజామున పందులు కనిపించకపోవడంతో సదరు పెంపకందారులు గన్నవరం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. వీటి విలువ సుమారు రూ.4 లక్షలకుపైనే ఉంటుందని చెబుతున్నారు. రంగంలోకి దిగిన క్రైం పోలీసులు బాధితుల ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టారు. గ్రామ పరిధిలోని సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. -
కమిషనర్ అత్యుత్సాహం
పేదల ఇళ్లు కూల్చివేతకుబందరులో గృహాల తొలగింపు నేపథ్యంలో ఉద్రిక్తత మచిలీపట్నంటౌన్: నగరంలోని కాలేఖాన్పేట మురుగుకాలువ సెంటర్లో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముగ్గురు పేదలకు చెందిన నివాస గృహాలను ఈ నెల 10వ తేదీ వరకూ తొలగించవద్దని స్థానిక కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ లెక్క చేయకుండా భారీ పోలీసు పహారా నడుమ వాటిని కూల్చేందుకు టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీహరిప్రసాద్ సిబ్బందితో రావటం వివాదానికి కారణమైంది. నగరంలోని 30వ డివిజన్ కాలేఖాన్పేటలో దేవీ నాంచారమ్మ అమ్మవారి ఆలయం ఎదురుగా మురుగుకాలువ గట్టుపై 40 ఏళ్లకు పైగా బడే లక్ష్మీరాజ్యం, దాసరి సుజన కుమారి, మాదాసు కనకదుర్గ నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. ఒకవైపు ఆర్అండ్బీ రోడ్డు మరో పక్క మురుగుకాలువ గట్టుపై ఉన్న నివాసాలు ట్రాఫిక్కు సైతం ఇబ్బంది లేకుండా ఉన్నప్పటికీ టీపీఓ వాటిని పొక్లెయినర్లతో తొలగించేందుకు రావటంతో ఆ ప్రాంతానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు కోసూరి ముసలయ్య, మిరియాల రాంబాబు, కోసూరి లక్ష్మీనాంచారయ్య గత రెండు రోజులుగా అధికారుల తీరును వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర కమిషనర్ బాపిరాజు మంగళవారం ఈ గృహాలను తొలగించాలంటూ టీపీఓను పంపటంతో మళ్లీ వివాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ పేర్ని కృష్ణమూర్తి(కిట్టు), కార్పొరేటర్లు, నాయకులు పేదలకు అండగా నిలిచారు. గృహాలను తొలగించే ప్రయత్నం చేసిన టీపీఓకు కోర్టు ఆర్డర్ను చూపించి, కోర్టు ఆర్డర్ను ధిక్కరించి ఎలా కూలుస్తారని కిట్టు ప్రశ్నించారు. ఎవరు కూల్చమన్నారని అడగ్గా కమిషనర్ ఓరల్గా చెప్పారని టీపీఓ బదులిచ్చారు. ఓరల్గా చెప్తే ఎవరి ఇల్లయినా కూల్చేస్తారా.. ఇదెక్కడి న్యాయం.. అని నిలదీశారు. ఈ విషయమై మాట్లాడేందుకు కమిషనర్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేయకపోవటంతో ఆయన వచ్చేవరకూ ఇక్కడే ఉంటామని కిట్టు, వైఎస్సార్ సీపీ నాయకులు అక్కడే బైఠాయించారు. అక్కడ విధులకు వచ్చిన ఎస్ఐలకు కూడా కోర్టు ఆర్డన్ను చూపించి కోర్టు ఆర్డర్కు వ్యతిరేకంగా నిర్వహించే తొలగింపునకు మీరు ఎలా పహారా కాస్తారని ప్రశ్నించారు. పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఈ విషయాన్ని ఫోన్లో వివరించారు. ఈ దశలో కమిషనర్ బాపిరాజు అక్కడకు వచ్చారు. కోర్టు ఆర్డర్ ఉండగా ఎలా కూలుస్తారని కిట్టూ ఆయన్ను ప్రశ్నిస్తున్నా ఆయన పట్టించుకోకుండా గృహాలు కూల్చాలని జేసీబీ డ్రైవర్లకు పలుమార్లు సైగ చేశారు. దీంతో కోపోద్రిక్తులైన పేర్ని కిట్టు, వైఎస్సార్ సీపీ శ్రేణులు ఒక్కసారిగా కమిషనర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా పేదల ఇళ్లు కూల్చి కూటమి నాయకుల మన్ననలు పొందాలని చూస్తున్నావా, కమిషనర్లా కాకుండా ఓ వీధి రౌడీలా వ్యవహరించటం ఎంత వరకూ సబబని ప్రశ్నించారు. ఈ దశలోనే బాధితులు తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్ను మీద పోసుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. బాధితుల వద్ద ఉన్న పెట్రోల్ బాటిల్, టిన్నులను అక్కడున్న పోలీసులు లాక్కున్నారు. దీంతో అక్కడ నుంచి వెళ్లిపోయిన కమిషనర్ మధ్యాహ్నం దేవీ నాంచారమ్మ ఆలయం వద్దకు వచ్చి బాధితులకు జీ ప్లస్–3 గృహాలను కేటాయిస్తామని అమ్మవారి సాక్షిగా హామీ ఇచ్చారు. గృహాలను కేటాయించిన తర్వాతే ఈ గృహాలను తొలగించాలని నాయకులు కమిషనర్ను కోరగా అంగీకరించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నగర క్లస్టర్ అధ్యక్షుడు మేకల సుబ్బన్న, గూడవల్లి నాగరాజు, మండల వెస్ట్ జోన్ అధ్యక్షుడు మట్టా నాంచారయ్య, మాజీ పీపీ కొక్కిలిగడ్డ శరత్కుమార్, మాజీ కౌన్సిలర్లు చిటికిన నాగేశ్వరరావు, శీలం బాబ్జీ, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. కమిషనర్ బాపిరాజుతో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పేర్ని కిట్టు, నాయకుల వాగ్వాదం కోర్టు స్టే ఉన్నందున తొలగించరాదంటూ అడ్డుకున్న వైనం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన బాధితులు చర్చలు ఫలించడంతో సద్దుమణిగిన వివాదం -
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
గూడూరు: విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై చిట్టిగూడూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ అరండల్ పేటకు చెందిన సంరెడ్డి ఫణి(34) పామర్రులోని వాటర్ప్లాంట్లో పనిచేస్తున్నాడు. ఫణి పనిమీద పామర్రు నుంచి ద్విచక్రవాహనంపై మచిలీపట్నం వెళ్తున్నాడు. అదే సమయంలో పాలకొల్లుకు చెందిన పిన్నంరెడ్డి రామారావు కుటుంబ సభ్యులు విజయవాడలో కార్యక్రమానికి హాజరై తిరిగి మచిలీపట్నం జాతీయ రహదారి గుండా పాలకొల్లు వెళ్తున్నారు. గూడూరు మండలం చిట్టిగూడూరు దగ్గరలో కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొడుతూ అమాంతం రోడ్డుపక్కనున్న కాల్వలోకి పల్టీలు కొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఫణికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున పిన్నంరెడ్డి రామారావుకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. రామారావు భార్య ఆదిలక్ష్మి, కుమారుడు దామోదర్, మనవరాలు జొన్నల బేబిలకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఫణిని మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. గూడూరు ఎస్ఐ కె.ఎన్.వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నలుగురికి తీవ్ర గాయాలు -
15 వరకు వంశీమోహన్ రిమాండ్ పొడిగింపు
గన్నవరం: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్స్టేషన్లో నమోదైన స్థల వివాదం కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ రిమాండ్ను గన్నవరం 8వ అదనపు ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. ఈ కేసులో రిమాండ్ మంగళవారంతో ముగియడంతో విజయవాడ జిల్లా జైలులో ఉన్న వంశీమోహన్ను పోలీసులు ఆన్లైన్ విధానంలో కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన రిమాండ్ను మరో 14 రోజుల పాటు కోర్టు పొడిగించింది. వంశీమోహన్ బెయిల్ పిటిషన్పై కూడా వాదనలు జరిగాయి. ఇరువైపులా న్యాయవాదుల వాదనలు విన్న జడ్జి బి.శిరీష విచారణను బుధవారానికి వాయిదా వేశారు.గల్లంతైన బిహార్ యువకుడి మృతదేహం లభ్యంజగ్గయ్యపేటఅర్బన్: పట్టణం సమీపంలోని పాలేటిలో మహమ్మద్ ఫైజాన్(22) అనే బిహార్కు చెందిన యువకుడు సోమవారం సాయంత్రం గల్లంతవగా అతని మృతదేహం మంగళవారం లభ్యం అయింది. ఈ సంఘటనకు సంబంధించి మృతుని స్నేహితుడు భాషిత్ అనే యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం జగ్గయ్యపేట పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు సరదాగా వచ్చిన ఫైజాన్ పాలేటిలోకి దిగడంతో ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. స్నేహితులు ఫైజాన్ను బయటకు లాగేందుకు ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యారు. మృతుని స్నేహితుల ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్ఐ జి.రాజు ఆధ్వర్యంలో పోలీసులు పాలేటిలో గాలింపుచర్యలు చేపట్టారు. మంగళవారం మధ్యాహ్నం ఆచూకీ లభించడంతో పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు ఫైజాన్ బిహార్ రాష్ట్రంలోని బడి శంఖ గ్రామానికి చెందిన అవివాహితుడు.ఉరి వేసుకుని మహిళ మృతికృష్ణలంక(విజయవాడతూర్పు): అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ ఉరేసుకుని మృతిచెందిన ఘటన కృష్ణలంక పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల మేరకు బండారు శివరూపిణి(32) అనే అవివాహిత ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కృష్ణలంక, తిరుమలరావువీధిలో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటోంది. గత రెండు నెలలుగా ఆమె తన తండ్రి రమేష్బాబుకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇంటి వద్దనే ఉంటోంది. సిగరెట్ తాగొద్దని తండ్రికి చెబుతున్నా ఆయన మానుకోవడంలేదు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి 11 గంటల సమయంలో కూడా సిగరెట్ తాగొద్దని చెప్పినా వినకపోవడంతో ఆమె కోపంతో రూమ్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఎంతకూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు తెరిచి చూడగా ఫ్యాన్కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. మృతురాలి సోదరుడు శివకుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను సోమవారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. వరుస సెలవుల నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ కనిపించింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకకు చెందిన భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచే అన్ని క్యూలైన్లలో భక్తులు బారలు తీరి కనిపించారు. రద్దీ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. సర్వ దర్శనానికి రెండు గంటలు, రూ. 100, రూ.300 దర్శనం గంట లోపే పూర్తి కాగా, రూ. 500, వీఐపీ దర్శనం గంటన్నర పైగా సమయం పట్టింది. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన నిమిత్తం అరగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేయడంతో మహా మండపం ఆరో అంతస్తు వరకు, ఘాట్రోడ్డులో దేవస్థాన సమాచార కేంద్రం వరకు క్యూలైన్లు కిటకిటలాడుతూ కనిపించాయి. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలోనూ ఉభయదాతలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తరలించారు. సర్వ దర్శనానికి రెండు గంటలు -
పాస్టర్ ప్రవీణ్ మృతిపై నిజాలు నిగ్గుతేల్చండి
లబ్బీపేట(విజయవాడతూర్పు): పాస్టర్ ప్రవీణ్ పడగాల మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం నిజాలు వెల్లడించాలని ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ పీస్ ఫోరమ్ అధ్యక్షుడు లంకా కరుణాకర్ దాస్ డిమాండ్ చేశారు. విజయవాడ మహాత్మాగాంధీరోడ్డులోని ఓ హోటల్లో సోమవారం ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు చెందిన క్రైస్తవ సంఘాల మత పెద్దలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కరుణాకర్ దాస్ మాట్లాడుతూ.. ప్రవీణ్ పగడాల మృతి ఘోర పరిణామం అన్నారు. ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లే సమయంలో విభిన్న చిత్రాలు వెళ్లడవుతున్నాయని, పోలీసులు చెప్పిన చిత్రాల్లో ముఖం సరిగా కనిపించడం లేదన్నారు. పోస్టుమార్టం రిపోర్టు ఇప్పటి వరకూ రాలేదని, పంచనామా క్లియర్గా లేదని, డాక్టర్ల నుంచి సరైన సమాచారం లేదని, ఇవి అనుమానాలకు తావిస్తున్నట్లు పేర్కొన్నారు. నేడు క్రైస్తవులు తమని తాము కాపాడుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయన్నారు. అందుకోసం పాస్టర్లు, మతపెద్దలు అందరూ భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకునేందుకు సమావేశమైనట్లు తెలిపారు. క్రైస్తవులపై ఎవరైనా దాడి చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవాలన్నారు. మన్నా మినిస్ట్రీస్ అధినేత బిషప్ పి.స్పర్జన్ రాజు, పాస్టర్ వేశపోగు జాన్ భాస్కరరావు, సింపని గాస్పల్ అధినేత ఏఆర్ స్టీఫెన్ సన్, సువార్త చానల్ అధినేత చాట్ల లూథర్ ప్రశాంత్, పాస్టర్లు ఎం.రవికుమార్, ఎం. మ్యాథ్యూస్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ పీస్ ఫోరం అధ్యక్షుడు లంకా కరుణాకర్ దాస్ -
ఆలయం.. వివాదాలమయం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలోని రెండో అతి పెద్ద దేవస్థానమైన దుర్గగుడిని కొద్ది రోజులుగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఆలయ బాధ్యతలు నిర్వహించే ఈవో స్థానంలో ఉన్న కె. రామచంద్రమోహన్కు దేవదాయ శాఖలో మరో రెండు కీలక స్థానాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో దుర్గగుడిపై పాలన అదుపు తప్పుతోంది. గత ఐదేళ్లలో ఎప్పుడూ లేని పరిస్థితి ఈ పది నెలల కాలంలో ఇంద్రకీలాద్రిపై కనిపిస్తోంది. గతంలో ప్రతి నెలా మొదటి, రెండో వారాల్లో వచ్చే ఆలయ సిబ్బంది వేతనాలు గత రెండు నెలలుగా ఆలస్యంగా వస్తుండగా, గత నెల అయితే ఏకంగా 17వ తేదీ తర్వాతే వారి ఖాతాలో జమయ్యాయి. మరి ఏప్రిల్ నెలలో వేతనాలు ఎప్పుడు వస్తాయోననే ఆందోళనలో దేవస్థాన ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు. దీనికి తోడు ఆలయంలో వివిధ పనులు చేసే కాంట్రాక్టర్లు సైతం తమ బిల్లులు ఎప్పుడు అవుతాయో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఈవో రామచంద్రమోహన్ ప్రతి ఫైల్ను ఈ–ఫైల్లో అప్లోడ్ చేయాలని చెబుతున్నారు. అయితే ఈ–ఫైల్లో పెట్టిన బిల్లు ఎప్పుడు ఆడిట్కు వస్తుందో, అక్కడి నుంచి ఎప్పుడు చెక్కు వెళ్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. అధికారుల తీరుపై ఆలయ డీఈవో ఆగ్రహం.. దుర్గగుడి ఆలయ అధికారులకు డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(డీఈవో) రత్నరాజుకు మధ్య పోరు నడుస్తోంది. అధికారుల తీరుపై డీఈవో గుర్రుగా ఉన్నారు. ఆలయంలో నిర్వహించే ఉత్సవాలు, ఆర్జిత సేవల్లో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆలయంలో జరుగుతున్న విశేష పుష్పార్చనలో ఈ వ్యవహారం బయట పడింది. ఆలయంలో కొంత మంది అధికారులు, సిబ్బంది తానంటే లెక్కలేనితనంగా చూస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. సోమవారం ఉదయం అమ్మవారికి విశేష పుష్పార్చన నిర్వహించే పుష్పాలను ఆలయానికి తీసుకువచ్చారు. అయితే ఆ సమయంలో పూల గంపలను తీసుకుని అమ్మవారి సన్నిధికి వెళ్తున్నామని ఫెస్టివల్ సెక్షన్ అధికారి, ఏఈవో దుర్గారావు డీఈవో రత్నరాజుకు సమాచారం ఇచ్చారు. అయితే డీఈవో అక్కడికి వచ్చే సరికి కొంత మంది బోయి సిబ్బంది, ఆలయ సిబ్బంది పూల గంపలను తీసుకుని రాజగోపురం వరకు వచ్చేశారు. దీంతో తనను పిలిచి ఇలా అవమానించడం సరికాదంటూ రత్నరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అమ్మవారిని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత పూజా మండపంలోనూ కొంత మంది అర్చకులు డీఈవోను చూసీ చూడనట్లు వ్యవహరించారు. దీంతో మరో మారు ఆగ్రహం వ్యక్తం చేసిన డీఈవో ఆలయ అధికారులు, సిబ్బంది తీరు సరిగా లేదని తగిన రీతిలో చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇంద్రకీలాద్రి దేవస్థానంలో రోజుకో పంచాయితీ కౌంటర్ల నిర్వహణపై వరుస ఫిర్యాదులు పాలన అంతా అస్తవ్యస్తం ఆలయ డీఈఓ వర్సెస్ అధికారులు అన్నట్లుగా పరిస్థితి పర్యవేక్షణ లోపంతో వరుస ఫిర్యాదులు.. దుర్గగుడిలో ఏర్పాటు చేసిన క్లోక్రూమ్, చెప్పుల స్టాండ్, సెల్ఫోన్ కౌంటర్లపై ఆలయ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గత కొద్ది రోజులుగా ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. గతంలో కాంట్రాక్టర్ నిర్వహించే చెప్పుల స్టాండ్ను గత ఫిబ్రవరి నెల మధ్య నుంచి దేవస్థానం పర్యవేక్షణలో ఉచితంగా నిర్వహిస్తున్నారు. అయితే కౌంటర్లోని సిబ్బంది భక్తుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదులందుతున్నాయి. టెండర్ నిర్వహించడం వల్ల దేవస్థానానికి సుమారు రూ. 30 లక్షల మేర ఆదాయం సమకూరేది. అయితే దేవస్థానం నిర్వహించడం వల్ల ఆదాయం కోల్పోవడమే కాకుండా వివాదాలకు తలకు ఎత్తుకున్నట్లు అయింది. దీంతో సెక్షన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మరో వైపున భక్తుల సెల్ఫోన్లు భద్రపరిచే కౌంటర్లపైన ఇటీవల ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. ఆలయంలోకి భక్తులెవరూ సెల్ఫోన్లు తీసుకువెళ్లకూడదని దేవస్థానం నిర్ణయించింది. దీంతో టెండర్ ప్రక్రియ ద్వారా కౌంటర్ల నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్కు అప్పగించింది. అయితే అమ్మవారి దర్శనానికి వచ్చే వారిలో పదిశాతం మంది ఎవరో ఒకరి సిఫార్సులపై ఆలయానికి వచ్చే వారే. వారిని కౌంటర్లో సెల్ఫోన్ భద్రపరుచుకోమని కాంట్రాక్టర్ సిబ్బంది చెప్పడం, అది వివాదాలకు దారి తీయడం పరిపాటిగా మారిపోయింది. సోమవారం క్యూలైన్లో తనిఖీలు చేస్తున్న నలుగురు కాంట్రాక్ట్ సిబ్బంది అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ ఓ భక్తుడు ఆలయ ఈవో రామచంద్రమోహన్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈవో క్యూలైన్లో తనిఖీలు చేస్తున్న ప్రైవేటు సిబ్బందిని వెంటనే పోలీసులకు అప్పగించాలని ఆదేశించడమే కాకుండా వారిపై కేసు పెట్టాలని అధికారులను ఆదేశించారు. -
చేతికొచ్చే సమయంలో పంట ధ్వంసం
మైలవరం: ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి కొంతమంది వ్యక్తులు ఆ పంటను రాత్రికి రాత్రే ధ్వంసం చేశారంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. మైలవరం పొందుగల రోడ్డులోని భవానీనగర్కు సమీపంలో తనకు పొలం ఉందని, 2012లో తన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందని, అప్పటి నుంచి ఆ పొలాన్ని సాగు చేస్తూ జీవనం గడుపుతున్నానని మైలవరానికి చెందిన రైతు బొమ్మారెడ్డి రవికుమార్రెడ్డి తెలిపారు. ఈ ఏడాది పొలంలో గుమ్మడి పంట సాగు చేశానని, నాలుగైదు రోజుల్లో కాపుకొచ్చిన గుమ్మడి కాయలు కోద్దామని అనుకుంటున్న సమయంలో గత రాత్రి వజ్రాల వెంకటేశ్వరరెడ్డి మరి కొంతమందితో కలిసి ట్రాక్టర్ను తీసుకువచ్చి పంటను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టానని, పంట ధ్వంసం చేయడంతో చిల్లి గవ్వ కూడా రాని పరిస్థితి నెలకొందని వాపోయారు. దొంగ సంతకాలు సృష్టించి తనను ఇక్కడి నుంచి వెళ్లగొట్టాలని చూస్తున్నారని తెలిపారు. దీనిపై మైలవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు రవికుమార్రెడ్డి తెలిపారు. రవికుమార్ రెడ్డికి చెందిన భూమిని కొంతమంది దొంగ పత్రాలు సృష్టించడంలో రెవెన్యూ అధికారులు కూడా సహకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎస్ఐ సుధాకర్ను వివరణ కోరగా పంట ధ్వంసం చేయడానికి ఉపయోగించిన ట్రాక్టర్ను పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చామని, డ్రైవర్ దొరకలేదని తెలిపారు. -
భక్తిశ్రద్ధలతో రంజాన్ ప్రార్థనలు
మచిలీపట్నంటౌన్: పవిత్ర రంజాన్ పండుగను ముస్లింలు సోమవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నగరంలోని ముస్తాఖాన్పేటలో ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మౌలానా మొహమ్మద్ వాజీద్ హుస్సేన్ సాహెబ్ ప్రార్థనలు చేసి రంజాన్ పండుగ విశిష్టతను వివరించారు. ఈద్గా వద్ద జరిగిన ప్రార్థనల్లో పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్దాదా, ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ మహమ్మద్ సద్రుద్దీన్ ఖురేషి తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేర్ని కిట్టు మాట్లాడుతూ ముస్లింలకు వ్యతిరేకమైన వక్ఫ్ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తోందన్నారు. కిట్టు ముస్లింలను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గా కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ రఫీ, కార్యదర్శి అష్రఫ్భాషా, కోశాధికారి హనీఫ్, సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్పొరేటర్ గోపిశెట్టి సతీష్, వైఎస్సార్ సీపీ మైనారిటీ విభాగం నాయకులు షేక్ మహ్మద్ సాహెబ్, మహ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. బాలకొండలరావుకుఘన సత్కారం కూచిపూడి(మొవ్వ): ఉగాది వేడుకలు, వసంత నవ రాత్రోత్సవాలను పురస్కరించుకుని కూచిపూడి నాట్య కళాకారిణి, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ఏ బాల కొండలరావు (విశాఖపట్నం)ను కూచిపూడి నాట్య క్షేత్రంలో సోమవారం ఘనంగా సత్కరించారు. కూచిపూడి శిల్పారామం వ్యవస్థాపకుడు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ వేదాంతం రాధేశ్యాం ఆధ్వర్యంలో సత్కార కార్యక్రమం జరిగింది. ఆల్ ఇండియా న్యూస్ పేపర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు చలాది పూర్ణచంద్రరావు, దీవి శ్రీ రంగా చార్యులు, పిన్నమనేని గోపాల కృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఏ బాలకొండలరావ రావు శిష్యులతో పాటు పలువురు నాట్యకళాకారులు కూచిపూడి నాట్యాంశాలను ప్రదర్శించి, ప్రేక్షకులను మన్నలను అందుకున్నారు. -
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
పెనమలూరు: యనమలకుదురులో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యనమలకుదురు పుట్టరోడ్డుకు చెందిన గడ్డం పెదనాంచారయ్య(38) భార్య వాణి, ఇద్దరు పిల్లలతో ఉంటున్నారు. భర్త పెయింటింగ్ పనులు చేస్తుండగా, భార్య విజయవాడలో ప్రైవేటు హోటల్లో పని చేస్తుంది. అయితే భర్త తరచుగా పని మానివేస్తుండటంతో భార్య మందలించింది. కాగా ఆదివారం భార్య పనికి వెళ్లగా భర్త ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. కాగా సాయంత్రం భార్య వాణి ఇంటికి వచ్చి తులుపులు కొట్టగా భర్త ఇంటి తలుపులు తెరవలేదు. దీంతో వాణి ఇరుగు పొరుగువారిని పిలిచి బలవంతంగా ఇంటి తలుపులు తెరిచి చూడగా నాంచారయ్య సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని మృతి చెంది ఉన్నాడు. పని లేకపోవడం కారణంగా మనస్తాపంతో మృతి చెందాడని భార్య ఫోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు. -
సాగర్ కాలువలో పడి లస్కర్ మృతి
విస్సన్నపేట: విధి నిర్వహణలో ఉన్న లస్కర్ మండలంలోని చండ్రుపట్ల ఎన్ఎస్పీ కాలువలో పడి మరణించారు. విస్సన్నపేట ఎన్ఎస్పీ కార్యాలయంలో లస్కర్గా పనిచేసే చిలకమర్తి నాగేంద్ర(45) ఆదివారం ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. సోమవారం ఉదయం సాగర్ కాలువలో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు చండ్రుపట్ల వెళ్లి కాలువలో పరిశీలించారు. మృతుడు నాగేంద్రగా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడి భార్య అనూష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ సక్రు తెలిపారు. నాగేంద్ర ప్రమాదవశాత్తూ కాలువలో పడి మృతిచెంది ఉండవచ్చని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నాగేంద్రకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
ఉద్యోగవిరమణ చేసిన సిబ్బందికి సత్కారం
కోనేరుసెంటర్: ఆరోగ్యమే మహాభాగ్యమని సంపూర్ణ ఆరోగ్యంతో ఉద్యోగ విరమణ పొందిన సిబ్బంది తమ శేష జీవితాన్ని సంతోషంతో పాటు ఆరోగ్యవంతంగా గడిపేలా వారిని ఆశీర్వదించాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తూ ఉద్యోగవిరమణ పొందిన ఎస్ఐ ఏకే జిలాని (ఎస్ఐ–777), ఏఎస్ఐ వీఎస్ఎస్ ప్రసాద్ (ఏఎస్ఐ–935)లను సోమవారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉద్యోగ విరమణ పొందటమనేది అదృష్టంగా భావించాలన్నారు. ఉద్యోగవిరమణ పొందిన ప్రతి ఒక్కరూ శేష జీవితాన్ని కుటుంబసభ్యులతో సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించాలన్నారు. -
మధుమేహం వచ్చే ప్రమాదం..
నైట్రోజన్ డయాకై ్సడ్ అధికంగా ఉన్న గాలిని పీల్చేవారు మధుమేహం బారిన పడతారు. గాలిలో 2.5 మైక్రో మీటర్ల కన్నా తక్కువ పరిమాణం ఉన్న కాలుష్య పదార్థాలు ఊపిరితిత్తుల ద్వారా శరీరంలోకి చేరి ఆక్సిడేటివ్ స్ట్రెస్ను పెంచడమే కాక, ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను ప్రేరేపించడం ద్వారా ఇన్సులిన్ నిరోధకతకు కారణభూతమై మధుమేహానికి దారితీస్తాయి. వాహనాల శబ్దకాలుష్యంతో నిద్రలేమి, తీవ్రమైన ఒత్తిడితో హార్మోన్లు, మెటబాలిజం అసమతుల్యతో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. ఆ ఫలితంగా మధుమేహం రావచ్చు. – డాక్టర్ కె. వేణుగోపాలరెడ్డి, మధుమేహ నిపుణుడు -
మెదడుపై ప్రభావం..
కాలుష్యం మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. మెదడులో కీలక భాగాలపై కాలుష్యంలోని రసాయనాలు ప్రభావం చూపి న్యూరోలాజికల్ సమస్యలు తలెత్తవచ్చు. అంటే కాలు, చేయి పట్టుతప్పడం, బ్రెయిన్స్ట్రోక్, వణుకుడు రోగం (పార్కిన్సన్) వంటివి రావచ్చు. కాలుష్యం బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సిటీలో ట్రాఫిక్ సమయాల్లో మాస్క్ వాడటం మంచిది. – డాక్టర్ దేవనబోయిన అనిల్కుమార్, న్యూరాలజిస్ట్ -
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు చర్యలు
ఏప్రిల్ ఏడో తేదీ నుంచి ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పెంచడానికి కృషి చేస్తున్నాం. మంగళవారం నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల తరగతులను ప్రారంభిస్తున్నాం. ప్రభుత్వ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు అన్ని వసతులు అందించడానికి చర్యలు చేపడుతున్నాం. తరగతుల నిర్వహణ, అడ్మిషన్ల ప్రక్రియ తదితర అంశాలపై ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకుంటాం. –సీఎస్ఎస్ఎన్ రెడ్డి, ఆర్ఐఓ, ఎన్టీఆర్ జిల్లా -
కృష్ణాజిల్లా
మంగళవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025భక్తిశ్రద్ధలతో రంజాన్ సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 519.70 అడుగుల వద్ద ఉంది. జలాశయం నుంచి కుడికాలువకు 4,050 క్యూసెక్కులు విడుదలవుతోంది. కార్తికేయుని సన్నిధిలో.. మోపిదేవి: శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని సోమవారం సినీనటుడు శర్వానంద్ దంపతులు దర్శించుకున్నారు. మొక్కుబడులు తీర్చుకుని.. ప్రత్యేక పూజలు చేశారు. నిత్యాన్నదానానికి విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ నిత్యాన్నదానానికి చిలకలూరిపేటకు చెందిన జి.శ్రీనివాసరావు కుటుంబం సోమవారం రూ. లక్ష విరాళాన్ని అందజేసింది. 7న్యూస్రీల్–8లోu -
డీలిమిటేషన్పై అఖిలపక్షం ఏర్పాటు చేయండి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు కృష్ణలంక(విజయవాడతూర్పు): డీలిమిటే షన్పై రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, మేధావులతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సూచించారు. విజయవాడ గవర్నర్పేటలోని బాలోత్సవ్ భవన్లో జన చైతన్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి అధ్యక్షతన సోమవారం డీలిమిటేషన్పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇటీవల చైన్నెలో డీలిమిటేషన్పై జరిగిన సదస్సుకు టీడీపీ, జనసేన హాజరు కాకపోవడం, రాష్ట్ర సీఎం చంద్రబాబునాయుడు పాల్గొనక పోవడం దురదృష్టకరమన్నారు. రాజకీయాలకు అతీతంగా తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి గణనీయంగా డీలిమిటేషన్ సదస్సులో పాల్గొన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ రాష్ట్ర చైర్మన్ తులసీరెడ్డి మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దేశ సమైక్యతకు సమగ్రతకు ప్రమాదం వాటిల్లుతుందని పేర్కొన్నారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి డీలిమిటేషన్పై తీర్మానం చేయాలన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, సీపీఐ సీనియర్ నేత ఎ.వనజ, కాంగ్రెస్ నేత ఎన్.నరసింహారావు, కె.శివాజీ, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం.వి.ఆంజనేయులు, సామాజిక విశ్లేషకులు డాక్టర్ కె.వసుంధర తదితరులు పాల్గొన్నారు. -
వేడెక్కిన రాజకీయం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: తిరువూరులో టీడీపీలోని రెండు వర్గాల మధ్య అక్రమార్జన విషయంలో ఆధిపత్య పోరు జరుగుతోంది. ఈ అంశం టీడీపీ అధిష్టానానికి తల నొప్పిగా మారింది. తిరువూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధి, పార్లమెంటు ప్రజాప్రతినిధికి మధ్య అక్రమార్జనలో ఏర్పడిన వివాదం అక్కడ పార్టీలో గ్రూపు రాజకీయాలకు బీజం వేసింది. ప్రతి పనిలో కమీషన్లకు పాకులాడుతూ తనంత నిజాయతీపరుడైన రాజకీయ నాయకుడు మరెవరూ లేరంటూ నిత్యం మీడియాలో పబ్లిసిటీ కోరుకునే ప్రజాప్రతినిధి ఒకరు. సైలెంట్గా తాను చేసే అవినీతి తన నీడకు కూడా తెలియనీయకుండా ప్రతి నియోజకవర్గం నుంచి వాటా రావాలని ఆదేశాలిచ్చే నేత మరొకరు. వికృత క్రీడలో నేతలు బలిపశువులు కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పార్లమెంటు ప్రజాప్రతినిధి, నియోజక వర్గ ప్రజాప్రతినిధి ఇద్దరూ కలిసి ఆడుతున్న రాజకీయ వికృత క్రీడలో సొంతపార్టీ నేతలు బలి పశువులు అవుతున్నారని తెలుస్తోంది. ఇద్దరు నేతలూ అక్రమార్జనే ధ్యేయంగా రూ.కోట్ల ప్రజా ధనాన్ని వెనకేసుకొని వాటాల వద్ద తేడాలు రావడంతో ఒకరిపై ఒకరు ఆధిపత్యానికి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ రాజకీయ రచ్చ స్థానికులు, అధికారులకు తలనొప్పిగా మారింది. మట్టి దందాలో తలెత్తిన వివాదం తిరువూరు నియోజకవర్గంలో ఎ.కొండూరు మండలం గోపాలపురం, విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామాల్లో పెద్ద ఎత్తున ఇద్దరు నేతల కనుసన్నల్లో మట్టి, గ్రావెల్ అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. రోజూ వందల లారీల గ్రావెల్ను తెలంగాణకు తరలించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. ఇద్దరు నేతలూ కొంతకాలం మట్టి దందాను కొనసాగించారు. అధికారులు సతమతం ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుతో అధికారులు సతమతమవుతున్నారు. ఇద్దరి నాయకుల తీరుతో అభివృద్ధి కుంటుపడుతోందని విమర్శలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధులే వర్గాలుగా ఏర్పడి బహిరంగ సవాళ్లు చేసుకోవడంతో పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. టీడీపీలో పార్లమెంట్, తిరువూరు అసెంబ్లీ నియోజక వర్గ ప్రజాప్రతినిధుల మధ్య వికృత రాజకీయ క్రీడ గోపాలపురం మట్టి దోపిడీలో ముదిరిపాకాన పడ్డ విభేదాలు గ్రూపు రాజకీయాలతో కుంటుపడుతున్న అభివృద్ధి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజాప్రతినిధిపై వేటుకు రంగం సిద్ధం! చర్యలకు రంగం సిద్ధం పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడంటూ తిరువూరు ప్రజాప్రతినిధిపై చర్యలు తీసుకునేందుకు అధిష్టానం ఇప్పటికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ నుంచి మరొక ఇన్చార్జిని ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే దళిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేని అణగదొక్కేందుకు నియోజకవర్గంలోని అగ్ర కులాల నేతలందరినీ గ్రూపుగా తయారుచేసి పార్లమెంటు ప్రజాప్రతినిధి అధిష్టానానికి తప్పుడు సమాచారం చేరవేస్తున్నాడని, అసమ్మతి నేతల వెనుకుండి కఽథ నడిపిస్తున్నారని నియోజక వర్గ ప్రజాప్రతినిధి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రమేయం ఏమీలేదని పార్లమెంటు ప్రజా ప్రతినిధి వర్గం ఆరోపిస్తోంది. తిరువూరు టీడీపీలోని ఈ వివాదం ఏ పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే. ఎంపీ వర్గంలో ఎ.కొండూరు మండలానికి చెందిన మాజీ ఏఎంసీ చైర్మన్ దళిత మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని అతనిపై చర్యలు తీసుకోపోతే తాను రాజీనామా చేస్తానంటూ ఇటీవల తిరువూరు ఎమ్మెల్యే అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. ఇదంతా ఎమ్మెల్యే నాటకమని ఏఎంసీ మాజీ చైర్మన్ మీడియా సాక్షిగా ప్రకటించారు. తాను ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేకి రూ. 50 లక్షలు ఇచ్చానని, మళ్లీ రూ. 2 కోట్లు ఇవ్వాలంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఆరోపించారు. ఇదిలా ఉంటే మాజీ ఏఎంసీ చైర్మన్ ప్రవర్తన ఘటనపై అధిష్టానం చర్యలు తీసుకోకుండా పార్లమెంటు ప్రజా ప్రతినిధి పీఏకి ముడుపులు ఇచ్చినట్లు తన విచారణలో తేలిందని నియోజక వర్గ ప్రజాప్రతినిధి ఆరోపించారు. నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల్లో, ప్రైవేటు కట్టడాల్లో, రియల్ ఎస్టేట్, మద్యం వ్యాపారంలో, అక్రమ రేషన్ దందాలో ఎమ్మెల్యే కమీషన్లు దండుకుంటున్నాడని పార్లమెంటు ప్రజాప్రతినిధి వర్గం బహిరంగంగానే విమర్శిస్తోంది. -
బీసీ సంఘం ఉద్యోగ విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా మూర్తి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఉద్యోగ విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా విజయవాడకు చెందిన ఎంవీవీఎస్ఎన్ మూర్తిని నియమించినట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు. స్థానిక మొగల్రాజపురం రత్నమాంబ వీధి లోని కుమ్మరి శాలివాహన సంఘం కార్యాలయంలో కేసన శంకరరావు, బీసీ సంక్షేమ సంఘం యువత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మరి క్రాంతికుమార్ కలిసి ఎంవీవీఎస్ఎన్ మూర్తికి నియామక పత్రాన్ని ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా కేసన శంకరరావు మాట్లాడుతూ జిల్లా అటవీ శాఖ అధికారిగా, కుమ్మరి శాలివాహన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, మోస్ట్ బ్యాక్ వర్డ్ క్లాసెస్(ఎంబీసీ) ఆల్ ఇండియా ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంవీవీఎస్ఎన్ మూర్తి పనిచేశారని వివరించారు. అలాగే 2005 నుంచి 2008 వరకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఉద్యోగుల సంఘా నికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా సేవలు అందించారని చెప్పారు. బీసీల సమస్య పరిష్కారంతోపాటు సమస్యలు, బీసీ సమాజ సాధికారతకు తన వంతు కృషి చేస్తానని ఎంవీవీఎస్ఎన్ మూర్తి పేర్కొన్నారు. -
ఆమ్రపాలి బోట్ పునఃప్రారంభం
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కు సంబంధించి భవానీపురంలోని బెరంపార్క్లోగల బోటింగ్ పాయింట్ వద్ద ఆధునికీకరించిన ఆమ్రపాలి బోట్ సర్వీస్ను ఏపీటీడీసీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరమ్మతులకు గురైన ఈ బోట్ గత రెండేళ్లుగా పక్కన ఉందన్నారు. దీనిని ఆధునికీకరించి, అధిక సంఖ్యలో పర్యాటకులు ప్రయాణించేలా రూపకల్పన చేశామని తెలిపారు. విశాలమైన సీటింగ్, ప్రథమ చికిత్స సదుపాయం, భద్రత వ్యవస్థ ఏర్పాటు చేశామని అన్నారు. ఈ బోటు కృష్ణానదిపై రోజుకు మూడు ట్రిప్పులు (ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం) తిరుగుతుందని చెప్పారు. పర్యాటకులు ఆన్లైన్ లేదా బెరంపార్క్లోని టికెట్ కౌంటర్ వద్ద బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఏపీటీడీసీ విజయవాడ డీవీఎం పి. కృష్ణచైతన్య, బెరంపార్క్, బోటింగ్ మేనేజర్లు కె. శ్రీనివాస్, నాగరాజు, మన్నం కొండయ్య, బోటింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
దుర్గమ్మకు పోలీసుల ప్రత్యేక పూజలు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉగాది పర్వదినం సందర్భంగా వెండిరథంపై ఊరేగిన దుర్గమ్మకు పోలీసు శాఖ పక్షాన ఆదివారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది పర్వదినం రోజు శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం నిర్వహించే వెండి రథోత్సవం పాతబస్తీ వీధుల్లో ఊరేగుతూ తిరుగు ప్రయాణంలో వన్టౌన్ పోలీసుస్టేషన్కు చేరుకుంది. అక్కడ పోలీసు శాఖ పక్షాన సీపీ ఎస్వీ రాజశేఖర్బాబు దంపతులు, స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ సీఐ గురుప్రకాష్,, ఏసీపీ దుర్గారావు, ఇతర అధికారులు పూజలు నిర్వహించి స్టేషన్ ప్రాంగణంలోకి తీసుకువచ్చారు. అనంతరం పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అధికారులు గౌతమిశాలి, గుణ్ణం రామకృష్ణ, ఎం. కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏసీపీ దుర్గారావు, సీఐ గురుప్రకాష్లో సీపీ దంపతులను జ్ఞాపికతో సత్కరించారు. విజయవాడ వన్టౌన్ పీఎస్ వద్ద పండుగ వాతావరణం -
ఇకపై దంపతులకు స్వామివారి చిత్రపటం బహూకరణ
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి ఆలయంలో నిర్వహించే నిత్య శాంతి కల్యాణంలో పాల్గొనే దంపతులకు దేవస్థానం తరఫున శ్రీ విశ్వావసునామ ఉగాది పర్వదినం నుంచి స్వామివారి చిత్రపటాన్ని బహూకరిస్తున్నట్లు ఆలయ డీసీ దాసరి శ్రీరామవరప్రసాదరావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఆలయంలో నిత్యం జరిగే పూజ కార్యక్రమాల్లో శాంతి కల్యాణానికి ప్రాముఖ్యత ఉందని, తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని తెలిపారు. ఆలయం తరఫున వారికి శేష వస్త్రం, జాకెట్ ముక్కలతో పాటు కల్యాణపు పెద్ద లడ్డూ ఇస్తుంటారని, ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం నుంచి కల్యాణంలో పాల్గొనే భక్తులకు సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి చిత్రపటాన్ని బహూకరిస్తున్నట్లు వివరించారు. తొలిసారిగా స్వామివారి కల్యాణంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి చిత్రపటాలను అందజేశారు.ప్రపంచ కప్ కబడ్డీ పోటీల్లో శ్రీకాంత్కు కీలక బాధ్యతలువిజయవాడస్పోర్ట్స్: అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య (ఐకేఎఫ్) ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహిళల ప్రపంచ కప్ కబడ్డీ–2025 పోటీల ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడిగా విజయవాడకు చెందిన యలమంచిలి శ్రీకాంత్ నియమితులయ్యారు. బిహార్లోని రాజ్గిర్లో 13 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాల జట్లు పాల్గొంటాయి. ఈ పోటీల నిర్వహణలో కీలక బాధ్యతను శ్రీకాంత్ అప్పగిస్తూ అమేచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఏకేఎఫ్ఐ) అధ్యక్ష, కార్యదర్శులు విబోర్ వి. జైన్, జితేంద్ర పి. ఠాగూర్ ఈనెల 29వ తేదీ శనివారం ఉత్త ర్వులు జారీ చేశారు. శ్రీకాంత్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శిగా, ఏకేఎఫ్ఐ కార్యవర్గ సభ్యుడి హోదాలో ఉన్నారు. ఈ సందర్భంగా దక్షిణ భారత అథ్లెటిక్స్ మానటరింగ్ కమిటీ చైర్మన్ ఆకుల రాఘవేంద్రరావు, ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ సీఈవో వెంకట్ నామిశెట్టి తదితరులు శ్రీకాంత్ను ఆదివారం ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు జి.వెంకట్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నక్కా అర్జునరావు, కోశాధికారి ఎన్.సుబ్బరాజు అభినందించారు.ముగ్గుల పోటీల్లో జగ్గయ్యపేట యువతి సత్తాజగ్గయ్యపేట అర్బన్: సంక్రాంతి సందర్భంగా ఆంధ్రపదేశ్ అమెరికన్ అసోసియేషన్(ఏఏఏ) ఆన్లైన్లో నిర్వహించిన ప్రపంచ స్థాయి ముగ్గుల పోటీల్లో జగ్గయ్యపేటకు చెందిన మామిడి హర్షిత అనే డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న యువతి సత్తా చాటి, ద్వితీయ బహుమతి గెలుచుకుంది. ద్వితీయ బహుమతికి రూ.15,00,116 నగదు ఇస్తారని ఆమె వివరించారు. శ్రీనివాస కల్యాణం ఇతివృత్తంతో రోజుకు 7, 8 గంటలు చొప్పున 15 రోజులు శ్రమించి ముగ్గును తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హర్షితను మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య), వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు తదితరులు అభినందించారు. -
విజయమియ్యవే విశ్వావసు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విశ్వావసు నామ తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామిని ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, విశేష అలంకరణ, అర్చన అనంతరం ఉదయం 8.15 గంటలకు భక్తులను అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. అమ్మవారికి అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ఈవో కె. రామచంద్రమోహన్, ఇతర అధికారులు అమ్మవారిని తొలుత దర్శించుకున్నారు. ఉగాదిని పురస్కరించుకుని అమ్మవారి ప్రధాన ఆలయాన్ని వివిధ రంగుల పుష్పాలతో అందంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలోని లక్ష కుంకుమార్చన వేదిక వద్ద అమ్మవారి ఉత్సవ మూర్తికి ఈవో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవ మూర్తిని ఊరేగింపుగా నూతన పూజా మండపానికి తీసుకువచ్చారు. వేదికపై అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రతిష్టించి పూజా కార్యక్రమాలను జరిపించారు. నూతన మండపంలో ప్రత్యేక పుష్పార్చన ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన పూజా మండపాన్ని ఆలయ ఈవో కె. రామచంద్రమోహన్, డీఈవో రత్నరాజు, ఈఈ కోటేశ్వరరావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం పూజా మండపంలో అమ్మవారి ఉత్సవ మూర్తికి ప్రత్యేక పుష్పార్చన నిర్వహించారు. వసంత నవరాత్రోత్సవాలలో తొలి రోజైన ఆదివారం అమ్మవారికి మల్లెలు, మరువంతో ఆలయ అర్చకులు అర్చన నిర్వహించారు. అనంతరం పంచహారతుల సేవ నిర్వహించి ఉభయదాతలకు ప్రసాదాలను అందజేశారు. భక్తులకు పుష్పార్చనలో వినియోగించిన పుష్పాలను పంపిణీ చేశారు. అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని బయటకు వచ్చిన భక్తులకు ఉచిత ప్రసాదాల పంపిణీ కౌంటర్ వద్ద ఉగాది పచ్చడిని అందజేశారు. అంతరాలయ దర్శనం రద్దు.. ఉగాదికి అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఉదయం 8.15 గంటలకు దర్శనం ప్రారంభమయ్యే సమయానికి అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో అంతరాలయ దర్శనాన్ని ఆలయ అధికారులు రద్దు చేశారు. ఉదయం నుంచే మహా మండపం దిగువన, ఘాట్రోడ్డులోని కౌంటర్ల రూ. 500 టికెట్లు విక్రయాలను పూర్తిగా నిలిపివేశారు. ముందుగానే ఆన్లైన్లో రూ. 500 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు వీఐపీ క్యూలైన్లోకి అనుమతించారు. దీంతో అరగంట లోపే వారికి అమ్మవారి దర్శనం పూర్తయింది. మరో వైపున అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లు కిటకిటలాడాయి. సర్వ దర్శనానికి రెండు గంటల సమయం పట్టగా, రూ. 100, రూ. 300 టికెట్టుపై దర్శనానికి గంట సమయం పట్టింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. మజ్జిగ పంపిణీ.. వేసవిని నేపథ్యంలో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రెండు చోట్ల భక్తులకు మజ్జిగను పంపిణీ చేశారు. లక్ష్మీ గణపతి ప్రాంగణం, మహా మండపం 7వ అంతస్తులోని తులాభారం వద్ద భక్తులకు మజ్జిగను పంపిణీ చేశారు. దాతల సహకారంతో ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు మజ్జిగ పంపిణీ జరుగుతుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. వెండి రథంపై ఆది దంపతులు ఉగాదిని పురస్కరించుకుని ఆదిదంపతులైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు వెండి రథోత్సవంపై నగరోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని మహా మండపం వద్ద ఆదిదంపతులకు ఈవో కె. రామచంద్రమోహన్ దంపతులు పూజాకార్యక్రమాలు నిర్వహించారు. మహా మండపం నుంచి ప్రారంభమైన నగరోత్సవం కనకదుర్గనగర్, బ్రాహ్మణ వీధి, సామారంగం చౌక్, వన్టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. స్థానాచార్య శివప్రసాదశర్మ, వైదిక కమిటీ సభ్యులు శ్రీనివాసశాస్త్రి, ఈఈ వైకుంఠరావు, ఉభయదాతలు, భక్తులు పాల్గొని తరించారు. కొత్త సంవత్సరాది వేళ భక్తుల ప్రత్యేక పూజలు కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి తెల్లవారుజామున దుర్గమ్మకు స్నపనాభిషేకం ఉదయం 8.15 గంటలకు ప్రారంభమైన దర్శనం కనులపండువగా ఆది దంపతుల నగరోత్సవం -
బుసక భూచోళ్లు!
కృష్ణాజిల్లాసోమవారం శ్రీ 31 శ్రీ మార్చి శ్రీ 2025నేటి ‘మీ కోసం’ రద్దు చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక(మీ కోసం) పవిత్ర రంజాన్ నేపథ్యంలో రద్దు చేసినట్లు కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదివారం తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. ఈద్ ముబారక్ నెల రోజులుగా కఠిన నియమాలతో ఉపవాస దీక్షలను పాటించిన ముస్లింలు సోమవారం పవిత్ర రంజాన్ పండుగను జరుపుకోనున్నారు. u8లో పెడన: ప్రస్తుతం వేసవి దృష్ట్యా నిర్మాణ రంగం ఊపందుకుంది. నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దీంతో బుసక, మట్టికి మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా భవనాలు, ఎన్హెచ్ రోడ్లు, ఫ్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాల్లో మెరక పనులకు ఈ బుసకతో పాటు మట్టి ఎంతో ఉపయోగపడుతుంది. దీంతో మూడు టన్నులుండే ట్రాక్టరు బుసక రూ.1,800పైనే పలుకుతోంది. దూరం పెరిగితే ఆ ధర మరింత పెరుగుతోంది. దీనిని అదనుగా చేసుకుంటున్న పెడనలోని మట్టి, బుసక మాఫియా చెలరేగిపోతోంది. ‘తెలుగు తమ్ముళ్లు’ అంతా తమ కనుసన్నల్లో నడిపిస్తూ.. అక్రమ దందాకు తెరలేపారు. రాత్రీ పగలూ తేడా లేకుండా సరిహద్దులు దాటించేస్తున్నారు. అయితే దందాలో తమ్ముళ్లలో వారి మధ్య వారికే ఆధిపత్య పోరు తలెత్తి.. ఒకరిపై ఒకరు అధికారులకు ఫిర్యాదులు చేసుకునే పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. ఈ విషయాలపై అధికారులను మీడియా ప్రశ్నిస్తుంటే అటువంటి పరిస్థితి ఏమి లేదంటూ దాటవేస్తుండటం గమనార్హం. పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో.. పెడన నియోజకవర్గంలోని పెడన, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో పెద్ద ఎత్తున బుసక, మట్టి తరలిపోతోంది. పెడన మండలంలో కొంకేపూడి, పల్లోటి స్కూలు వెనుక లే అవుట్లు దాటిన తర్వాత, కట్లపల్లి, బల్లిపర్రు, బంటుమిల్లి మండలం మణిమేశ్వరం, చోరంపూడి, ఆర్తమూరు, కృత్తివెన్ను మండలం కృత్తివెన్ను, పల్లెపాలెం, చినగొల్లపాలెం, నిడమర్రు, చినపాండ్రయ, సంగమూడి గ్రామాల నుంచి బుసక, మట్టి తరలిపోతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కృత్తివెన్ను మండలంలో ముమ్మరంగా పనులు జరగ్గా ప్రస్తుతం నిలుపుదల చేశారు. మళ్లీ గుట్టుచప్పుడు కాకుండా పనులు ప్రారంభించే అవకాశాలున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆధిపత్య పోరు.. పెడన మండలంలో ఒక పంచాయతీ సర్పంచ్కు ఇతర నాయకులకు మధ్య మట్టి పంచాయితీ ఏర్పడింది. ఆ సర్పంచ్ బుసక, మట్టి తవ్వేసి విక్రయించుకుంటుంటే మరో వర్గం నాయకులు అధికారులకు ఫిర్యాదు చేసి ఆ సర్పంచ్ వాహనాలు పట్టించారు. దీంతో ఆ సర్పంచ్ కూడా మట్టి అక్రమ తరలింపులు చేపడుతున్న బుసక టిప్పర్లకు ఎదురువెళ్లి నిలుపుదల చేసి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ పంచాయితీ స్థానిక నియోజకవర్గ ప్రజాప్రతినిధి వద్దకు చేరింది. అక్కడ కూడా తెగని విధంగా ఈ పంచాయితీ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై డివిజన్, జిల్లా స్థాయి అధికారులు దృష్టి సారించి బుసక, మట్టి మాఫియాలను నిలువరించాలని ఆయా ప్రాంతాల్లోని గ్రామస్తులు మొరపెట్టుకుంటున్నారు. పెడన మండలం కొంకేపూడి వద్ద బుసకను తవ్వుతున్న పొక్లయినర్పంచాయతీ చెరువులో వేలం.. 7న్యూస్రీల్తనిఖీలు చేస్తున్నాం.. బుసక, మట్టి తరలిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో దాడులు చేస్తూనే ఉన్నాం. గత నాలుగు నెలలుగా పట్టుకున్న వాహనాల నుంచి అపరాధ రుసుం కింద రూ.1.20 లక్షలను వసూలు చేశాం. అయితే టిప్పర్ల ద్వారా తరలించే వాటికి ఎన్హెచ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి మైనింగ్ శాఖ నుంచి అనుమతులు తీసుకుని, రాయల్టీ చెల్లింపులు చేసి తీసుకువెళ్తున్నారు. స్థానికంగా రైతులు మెరక పనులు చేసుకుంటూ మట్టిని ఇళ్లకు ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఈ విషయమై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మాపై ఎవరూ ఎటువంటి ఒత్తిళ్లు చేయడం లేదు. ఫిర్యాదులు వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – కె. అనిల్కుమార్, ఇన్చార్జి తహసీల్దార్, పెడన పెడన, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో మాఫియా విజృంభణ తెలుగు తమ్ముళ్ల కనుసన్నల్లోనే అంతా.. ఆధిపత్య పోరుతో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చెరువులనూ వదలని వైనం బుసక మాఫియా చెరువులను కూడా వదలడం లేదు. ఇప్పటికే చాలా పంచాయతీల్లో చెరువులను ఎండగట్టి మట్టి తవ్వుకునేందుకు ఏర్పాటు చేశారు. ఇటీవల పెడన మండలం బల్లిపర్రులో గోగులమ్మ గుడి పంచాయతీ చెరువులో బుసుక విక్రయానికి గ్రామంలో టాంటాం వేసి వేలం పాటలు నిర్వహించాలని చూశారు. పంచాయతీ చెరువులోని బుసకను విక్రయించడం ఏమిటంటూ స్థానికులు అడ్డం తిరగడంతో వేలం పాటలు నిలుపదల చేశారు. -
అందరికీ యోగదాయకమే
మచిలీపట్నంటౌన్: నూతన తెలుగు సంవత్సరాది అన్ని వర్గాల ప్రజలకు యోగదాయకంగా ఉంటుందని పంచాగకర్త విష్ణుభట్ల సూర్యనారాయణశర్మ అన్నారు. నగరంలోని బచ్చుపేట శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మండపంలో దేవదాయ, ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీవిశ్వావసు నామ నూతన సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం చేసిన సూర్యనారాయణశర్మ మాట్లాడుతూ ఈ సంవత్సరం రైతులకు, కార్మికులకు, పాలకులకు, అధికారులకు అందరికీ యోగదాయకమైన, అనుకూలమైన సంవత్సరంగా ఉంటుందన్నారు. మంచి ఆలోచనలతో ముందడుగు.. ప్రతి ఒక్కరూ చేసిన తప్పులను వదిలేసి కొత్త తెలుగు సంవత్సరంలో మంచి ఆలోచనలు, కార్యాలతో జీవితాన్ని పునఃప్రారంభించుకునేందుకు మొదటి అడుగు వేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్తో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ పాల్గొన్నారు. అనంతరం పంచాంగకర్తలను ఘనంగా సన్మానించారు. గంటల పంచాంగాన్ని, శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం పత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమానికి హాజరైన వారికి ఉగాది పచ్చడి, చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం, మజ్జిగ ప్రసాదాల పంపిణీ చేశారు. పలువురికి సత్కారాలు.. ఆగమశాస్త్రంలో నిష్ణాతులైన అర్చక స్వాములు అగ్నిహోత్రం యుధిష్టిర కోదండపాణి, మురికిపూడి సత్యనారాయణ, రొంపిచర్ల విజయ సారధి కృష్ణమాచార్యులు, ఐలూరి మల్లికార్జునరావులను రూ. 10,116 నగదు పురస్కారం తోపాటు ప్రశంసా పత్రం, జ్ఞాపిక, శాలువలతో ఘనంగా సన్మానించారు. ముఖ్య అర్చకులు ఘంటసాల భాస్కర శర్మ, జూనియర్ అసిస్టెంట్ బొప్పన వీర కోటేశ్వరరావు, కార్యనిర్వహణ అధికారి సింగనపల్లి శ్రీనివాసరావు, అటెండర్ నరహరిశెట్టి సోమశేఖర్, తనిఖీదారులు కోటిపల్లి అనురాధ, నాదస్వరం విద్వాంసుడు క్రొవ్విడి శివబాబు, ఆలయ కార్యనిర్వాహణాధికారి సమ్మెట ఆంజనేయస్వామిలకు ఉగాది సేవా పురస్కారాలు, జ్ఞాపిక, ప్రశంసా పత్రాలు అందజేశారు. పంచాంగకర్త విష్ణుభట్ల సూర్యనారాయణశర్మ ఉగాది వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ డీకే బాలాజీ ఆకట్టుకున్న కవి సమ్మేళనం.. ఈ సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనం అమితంగా ఆకట్టుకుంది. కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులను ఆర్టీసీ చైర్మన్, జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అప్పికట్ల దీప్తి వీణ వాయిద్య ప్రదర్శన, చింతలపాటి పూర్ణచంద్రరావు శిష్య బృందం ప్రదర్శించిన కోలాటం, కూచిపూడి నృత్యం ఆకట్టుకున్నాయి. వీరిని కూడా ఘనంగా సన్మానించారు. దేవదాయ శాఖ సహాయ కమిషనర్ వెంకట సాంబశివరావు, కేఆర్ఆర్సీఎస్ డీసీ శ్రీదేవి, ఇన్చార్జ్ ఆర్డీఓ సీహెచ్ పద్మావతి, జెడ్పీ డెప్యూటీ సీఈఓ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆధునిక సౌకర్యాలతో మిత్ర హాస్పిటల్
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించే లక్ష్యంతో మిత్ర హాస్పిటల్ ఏర్పాటు చేసినట్లు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె.దుర్గానాగరాజు తెలిపారు. ఉగాది పర్వదినం సందర్భంగా సూర్యారావుపేట నరసింహనాయుడు వీధిలో నూతన హాస్పిటల్ను ఆదివారం ప్రారంభించారు. అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో చికిత్సలందించేలా మిత్ర హాస్పిటల్ను తీర్చిదిద్దినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఆస్పత్రిలో తనతో పాటు యూరాలజిస్ట్ డాక్టర్ సతీష్ మర్రివాడ, పీడియాట్రిక్ అండ్ నియోనేటల్ సర్జన్ డాక్టర్ కేవీ రవికుమార్, అనస్థిషియాలజిస్ట్ డాక్టర్ పీ విశ్వేశ్వరరావులు సేవలు అందిస్తారని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలతో పాటు పారదర్శకంగా రోగ నిర్ధారణ, పరిపూర్ణ వైద్య చికిత్సలు అందిస్తామన్నారు. ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దీనదయాళన్, స్పైన్ సర్జన్ డాక్టర్ అజోయ్ ప్రసాద్ శెట్టి, యూరాలజిస్ట్ డాక్టర్ సుబ్బారావు చోడిశెట్టి, ఏజీహెచ్ చైర్మన్ డాక్టర్ జి.రమేష్, ఫిజీషియన్ డాక్టర్ పి.చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. -
ముస్లిం కుటుంబాలకు రంజాన్ శుభాకాంక్షలు
కోనేరుసెంటర్: జిల్లాలోని పోలీసు కుటుంబాలతో పాటు ముస్లిం సోదర, సోదరీమణులకు జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు రంజాన్ శుభాకాంక్షలను తెలియజేశారు. పవిత్ర రంజాన్ పండుగను ముస్లింలు సంతోషంగా జరుపుకోవాలని అల్లాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. రంజాన్ పండుగ ముస్లిం కుటుంబాల్లో సుఖసంతోషాలను, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని అల్లాను ప్రార్థిస్తున్నానన్నారు. అలాగే అందరూ ఐకమత్యంతో కులమతాలకతీతంగా సోదరభావంతో మెలగాలని కాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి కోనేరుసెంటర్: ప్రమాదవశాత్తు ట్రాక్టర్పై నుంచి పడి ఓ ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందిన ఘటనపై ఆదివారం రాత్రి చిలకలపూడి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బందరు మండలం మేకవానిపాలెం పంచాయతీ హమాలీ కాలనీకి చెందిన కట్టా నాగమల్లేశ్వరరావు(54) ట్రాక్టర్ నడుపుతుంటాడు. శనివారం మధ్యాహ్నం కాలనీ నుంచి జెడ్పీ సెంటర్ వైపు వెళ్తుండగా ఒక్కసారి తూలు రావటంతో ట్రాక్టర్ చిలకలపూడి సెంటర్లోని డివైడర్ను ఢీ కొంది. ఈ ప్రమాదంలో నాగమల్లేశ్వరరావు ట్రాక్టర్పై నుంచి జారి పడిపోయాడు. తలకు బలమైన గాయం కావటంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన వైద్య సిబ్బంది తలకు గాయం కావటంతో కుట్లు వేసి పంపించారు. అర్ధరాత్రి మరలా ఇబ్బంది కావటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. విజయవాడ ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు వివరాలు నమోదు చేసుకునేందుకు విజయవాడ వెళ్లినట్లు చిలకలపూడి పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కృష్ణానదిలో పున్నమి ఘాట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని భవానీపురం పోలీసులు తెలిపారు. మృతుడి వయసు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని, ఐదున్నర అడుగుల ఎత్తు ఉన్నాడన్నారు. మృతుడి ఒంటిపై నలుపు, ఎరుపు రంగు గళ్ల షర్ట్, తెలుపు రంగుపై బ్లూ కలర్ గళ్ల లుంగీ ధరించి ఉన్నాడు. 40వ డివిజన్ 121 సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శి నల్లూరి శాంతకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. -
తెలుగు తమ్ముళ్ల ఆధ్వర్యంలో జోరుగా కోడిపందేలు
కోనేరుసెంటర్: బందరు మండలం కోన గ్రామంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వం అన్ని చోట్ల కవులు, వేద పండితుల సమక్షంలో పంచాంగ శ్రవణం నిర్వహిస్తే ఈ గ్రామంలో తెలుగు తమ్ముళ్లు మాత్రం కాయ్ రాజా కాయ్ అంటూ కోడిపందేలకు తెరలేపారు. పందేల విషయంలో తేడా వచ్చినప్పుడల్లా తమదైన శైలిలో ఒకరిపై ఒకరు బూతు పదాలు విసురుకుంటూ వివాదాలకు సైతం దిగారు. గ్రామంలోని శివారు ప్రాంతంలోని గంగానమ్మ గుడికి సమీపంలో వందలాది మంది జూదరులు ఒక చోటుకు చేరి పదుల సంఖ్యలో కోడిపందేలు నిర్వహించి పండుగను జరుపుకున్నారు. ఆదివారం ఉదయం మొదలైన కోడిపందేలు మధ్యాహ్నం వరకు ఏకధాటిగా కొనసాగినా పోలీసులు పట్టించుకున్నా పాపాన పోలేదు. దీంతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. పక్క గ్రామాల్లోని జూదరులకు ఫోన్లు చేసి మరీ పిలిపించి కోడిపందేలు నిర్వహించారు. పోలీసులకు భయపడే వాళ్లతో మీరేం భయపడాల్సిన అవసరం లేదు రండీ పోలీసులు మన బాబాయిలే వచ్చేయండీ అంటూ ధైర్యం ఇచ్చి మరీ పందేలకు పిలిచారు. పందెంకోళ్లకు కత్తులు కట్టి పందెం బరిలో రక్తం ఏరులై పారించారు. కాకి మాది నెమిలి మాది డేగ మాది అంటూ రూ.లక్షల్లో పందేలు కడుతూ పందెం కూతలు పెట్టారు. ఇక్కడ జరిగిన కోడిపందేలకు కోన గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న మరో గ్రామాలకు చెందిన జూదరులు కోళ్లు పట్టుకుని రావటంతో ఆదివారం కోన గ్రామంలో జరిగిన కోడిపందేలు సంక్రాంతి బరిని తలపించాయి. తెలుగు తమ్ముళ్లు బరితెగించి పెద్ద ఎత్తున కోడిపందేలు నిర్వహించినా పోలీసులు పట్టించుకోకపోవటం సర్వత్రా విమర్శలకు దారి తీసింది. -
రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): కదులుతున్న రైలు నుంచి జారి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటనపై విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు(జీఆర్పీ) కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వాంబే కాలనీ రైల్వే ట్రాక్ పక్కన మగ వ్యక్తి మృతిచెంది ఉండటాన్ని గుర్తించిన సిబ్బంది రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు. మృతుడికి 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుందని, ఒంటిపై వంకాయ రంగు హాఫ్ హ్యాండ్ షర్ట్, నీలం రంగు జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడని, ఇతర ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి ఆచూకీకి విజయవాడ జీఆర్పీ పోలీస్ స్టేషన్ లేదా 94406 27544 ఫోన్ నంబర్లో సంప్రదించాలని పోలీసులు కోరారు.ఫుట్బోర్డుపై ప్రయాణిస్తూ..ఉంగుటూరు: బస్సులో ఫుట్బోర్డుపై ప్రయాణం చేస్తున్న వ్యక్తి జారిపడి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్ద అవుటపల్లి గ్రామానికి చెందిన అవుటపల్లి ఏసుబాబు(29) రెండు రోజుల క్రితం బస్సు ఎక్కి విజయవాడ వెళ్తున్నాడు. పెద్ద అవుటపల్లి సెంటర్లో సర్వీస్ రోడ్డు నుంచి హైవే పైకి బస్సు మలుపు తిరుగుతుంది. అదే సమయంలో ఫుట్బోర్డుపై నిల్చున్న ఏసుబాబు ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. తలకు తీవ్రగాయం కావడంతో కుటుంబ సభ్యులు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి అపస్మారకస్థితిలో చికిత్స పొందుతున్న ఏసుబాబు ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో ఏఎస్ఐ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు అవివాహితుడు, దివ్యాంగుడు. గన్నవరం బస్స్టాండ్ వద్ద ఆటోలకు సర్వీసింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. -
కార్తికేయ పుణ్యక్షేత్రంలో ఉగాది వేడుకలు
మోపిదేవి: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో విశ్వావసు నామ ఉగాది వేడుకలు ఆలయ ప్రాంగణంలో ఆదివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆలయ డీసీ దాసరి శ్రీరామ వరప్రసాదరావు నేతృత్వంలో ఉదయం ఆలయ ప్రధానార్చకులు బుద్దు పవన్కుమార్ శర్మ బ్రహ్మత్వంలో ఆలయ వేద పండితులు ఘనాపాటి నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించారు. విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు దేవదాయశాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిపారు. ఉగాది సందర్భంగా దేవస్థానం ఆచార మర్యాదలో భాగంగా శ్రీకాకుళం దేవస్థానం ప్రధాన అర్చకులు అగ్నిహోత్రం భాస్కరాచార్యులు, పంచాంగ కర్త నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్యశర్మలను దేవస్థానం తరఫున ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అవనిగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్దప్రసాద్ సతీమణి విజయలక్ష్మి, నియోజకవర్గ యువనేత మండలి వెంకట్రామ్, సాయిసుప్రియ దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొని స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. తొలుత నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. అనంతరం స్వామివార్లను దర్శించుకుని విశేష పూజలు అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు స్వామివారి లడ్డుప్రసాదాలు అందించి ఘనంగా సత్కరించారు. ఆలయ అధికారులు, గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చలివేంద్రం ప్రారంభం.. వేసవిని దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం దేవస్థానం తరఫున చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు ఆలయ డీసీ దాసరి శ్రీరామవరప్రసాదరావు తెలిపారు. ఆదివారం ఉదయం దేవస్థానం ఎదుట నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు, యాత్రికులకు చల్లని మజ్జిగను పంపిణీ చేశారు. -
తుది దశకు హైస్పీడ్ ట్రాక్ల ఆధునికీకరణ
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): భారతీయ రైల్వేలో రోజురోజుకు పెరుగుతున్న హైస్పీడ్ రైళ్ల వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు రైల్వేశాఖ ట్రాక్ల ఆధునికీకరణ దిశగా చర్యలు చేపట్టారు. ఈ దిశగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో హైస్పీడ్ రైళ్ల నిర్వహణను సమర్థంగా నిర్వహించేందుకు అధికారులు ప్రధాన మార్గాల్లో ట్రాక్ల ఆధునికీకరణ పనులను చేపట్టారు. విజయవాడ డివిజన్లో ప్రధానంగా 1,070.83 కిలో మీటర్ల(టీకేఎం) మేర ట్రాక్లు ఉన్నాయి. ప్రధాన మార్గంలోని ఇతర ట్రాక్లతో కలుపుకొని మొత్తంగా 2,228.35 ట్రాక్ కిలో మీటర్లు ఉన్నాయి. వీటి గరిష్ట వేగం ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క విధంగా సాధారణ రైళ్ల నిర్వహణకు తగినట్టుగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితిలో వందేభారత్, అమృత్ భారత్ వంటి సెమీ హైస్పీడ్ రైళ్ల ప్రవేశంతో ట్రాక్లు సామర్థ్యం తట్టుకునేలా గంటకు 110 కిలో మీటర్ల నుంచి 130 కిలో మీటర్ల గరిష్ట వేగానికి తగినట్లుగా ట్రాక్ల ఆధునికీకరణ దిశగా డివిజన్ అధికారులు చర్యలు చేపట్టారు. పనులు వేగంగా పూర్తిచేసేలా ప్రణాళికలు విజయవాడ డివిజన్లో ప్రధాన మార్గాలైన గూడురు – విజయవాడ – దువ్వాడ మార్గంతో పాటుగా విజయవాడ – కొండపల్లి సెక్షన్లలో ఇప్పటి వరకు గంటకు 130 కిలో మీటర్ల గరిష్ట వేగ సామర్థ్యంతో 1,128.76 టీకేఎం ఆధునికీకరించారు. దీంతో డివిజన్లో 130 కిలోమీటర్ల సామర్థ్యంతో 58 శాతం ట్రాక్ల ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయి. వీటితో పాటుగా బ్రాంచ్ లైన్లు అయిన నిడదవోలు, భీమవరం – నర్సాపూర్ – గుడివాడ – మచిలీపట్నం, కాకినాడ పోర్టు–సామర్లకోట సెక్షన్లో 473.4 టీకేఎంలు గంటకు 110 కిలో మీటర్ల రైళ్ల వేగాన్ని నిర్వహించేందుకు అప్గ్రేడ్ చేశారు. దీంతో డివిజన్లో ఇప్పటి వరకు 1,761 ట్రాక్ కిలోమీటర్లతో 80 శాతం ట్రాక్ల అప్గ్రేడ్ పనులు పూర్తి చేసుకుంది. రానున్న రోజుల్లో ఇతర అన్ని సెక్షన్లలో కూడా ట్రాక్ల ఆధునికీకరణ పనులు వేగంగా పూర్తిచేసేలా అధికారులు ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. ఇంజినీరింగ్ అధికారుల కృషి..80 శాతం ట్రాక్ల పునరుద్ధరణ హైస్పీడ్ రైళ్ల నిర్వహణ సజావుగా జరిగేలా ట్రాక్ల అప్గ్రేడ్ పనులు చేపట్టాం. ట్రాక్ల బలోపేతం, ఎక్కువ కాలం మన్నిక ఉండేలా ఆధునిక యంత్రాలతో పనులు చేస్తున్నాం. అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థ, ట్రాక్లు, స్లీపర్లను అనుసంధానం చేసేందుకు ‘పాండ్రాల్ రహీ ఫాస్టెనింగ్’, ‘వోస్లోహ్ ఫాస్టెనింగ్’ వంటి కొత్త ఫిటింగ్లను ఉపయోగించడంతో 12 ఏళ్ల పాటు మ్యానువల్ జోక్యం లేకుండా ట్రాక్లు దృఢంగా ఉంటాయి. టీఆర్టీ యంత్రాన్ని ఉపయోగించి గోదావరి వంతెనపై గడువు ముగిసిన స్లీపర్లను నిర్ణీత సమయంలోనే విజయవంతంగా పునరుద్ధరించాం. రానున్న రోజుల్లో అన్ని సెక్షన్లలో ట్రాక్ల ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తాం. – ఎస్.వరుణ్బాబు, సీనియర్ డీఈ ప్రధాన మార్గంలో 130 కి.మీ. సామర్థ్యంతో 1,287 టీకేఎం పనుల పూర్తి బ్రాంచ్ లైన్లతో 110 కి.మీ.సామర్థ్యంతో 473 కి.మీ. ట్రాక్ల ఆధునికీకరణ విజయవాడ డివిజన్లో అంతటా 1/4 వంతు నాసిరకం మట్టితో ట్రాక్ల నిర్మాణం జరిగింది. తరచూ వర్షాలకు మట్టి కుంచించుకుపోవడం, జారి పోవడం జరుగుతుండేవి. దీంతో తరచూ ట్రాక్ల పటిష్టత దెబ్బతింటుండేది. ఇటువంటి పరిస్థితుల్లో తరచూ ట్రాక్ల పటిష్టతను పర్యవేక్షించడం, లోపాలను లోతుగా పరిశీలించి ట్రాక్ల పునర్నిర్మాణ పనులు చేపడ్డం ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బందికి సవాలుతో కూడి ఉండేది. వీటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారతీయ రైల్వేలోనే మొదటిసారిగా మ్యానువల్ జోక్యం లేకుండా ట్రాక్ల డీప్ స్క్రీనింగ్ కోసం డివిజన్లో ఒక డీసీఎం(బ్యాలెస్ట్ క్లీనింగ్ మెషిన్)ను ఏర్పాటు చేసుకుంది. ఈ ఆధునిక మిషన్తో 30 రోజుల్లో జరిగే పనులను కేవలం రెండు లేదా మూడు రోజుల్లోనే పూర్తవుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టీఆర్టీ(ట్రాక్ రిలేయింగ్ ట్రైన్), పీక్వూర్ఎస్ (ప్లాసర్ క్వీక్ రిలేయింగ్ సిస్టం) మిషన్లను ఉపయోగించి రికార్డు స్థాయిలో 129 కిలో మీటర్ల స్లీపర్లను పునరుద్ధరణతో పాటు 164 కిలో మీటర్ల ట్రాక్ నిర్మాణ పనులను సాధించింది. -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
జి.కొండూరు: బైక్పై మేనత్త ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎన్టీఆర్ జిల్లా, వీరులపాడు మండల పరిధి పొన్నవరం గ్రామానికి చెందిన షోడగిరి రాజేష్(24) అదే గ్రామానికి చెందిన షోడగిరి అనిల్తో కలిసి బైక్పై వెల్లటూరులోని మేనత్త ఇంటికి శనివారం ఉదయం బయలుదేరాడు. వెల్లటూరు శివాలయం మలుపు వద్దకు రాగానే గేదెలు ఆకస్మాత్తుగా రోడ్డు మీదకు రావడంతో బైక్ అదుపు తప్పి పక్కనే ఉన్న ప్రహరీ వైపు పడ్డారు. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న రాజేష్ తలకు తీవ్రమైన గాయం కావడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. వెనుక కూర్చున్న అనిల్కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108 అంబులెన్స్లో విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజేష్ శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడి తమ్ముడు రాకేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
బందరు ప్రాంత అభివృద్ధికి చేయూతనివ్వండి
మచిలీపట్నంటౌన్: నూతనంగా వ్యాపారం ప్రాంభించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ యాజమాన్యం ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. స్థానిక వల్లూరి రాజా సెంటర్లో ఏర్పాటు చేసిన మలబార్ గోల్డ్ అండ్ డమండ్స్ షోరూంను మంత్రి రవీంద్ర గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇతర వ్యాపార సంస్థలు సీఎస్ఆర్ ఫండ్ను కేవలం రెండు శాతం మాత్రమే ఇస్తాయని, మలబార్ సంస్థ ఐదు శాతం మేర ఇవ్వడం అభినందనీయమన్నారు. పోర్టు, ఇతర సంస్థల స్థాపనతో జరుగు తున్న అభివృద్ధిలో ఈ ప్రాంతానికి చెందిన ప్రైవేటు సంస్థలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. మచిలీపట్నంలో రోల్డ్గోల్డ్ వస్తువుల తయారీకి ప్రసిద్ధి చెందిందని రానున్న రోజుల్లో బంగారు వస్తువుల తయారీవైపు అడుగులు వేయాలని ఆకాంక్షించారు. గోల్డ్ విక్రయాల్లో దిగ్గజ సంస్థయిన మలబార్ మచిలీపట్నంలో బ్రాంచ్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, మునిసిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రిటైల్ హెడ్ రెస్ట్ ఆఫ్ ఇండియా సిరాజ్ పీకే , ఏపీ జోనల్ హెడ్ నిఖిల్ చంద్రన్, మచిలీపట్నం షోరూం హెడ్ మహమ్మద్ నస్విహ్, విజయవాడ షోరూం హెడ్ అర్జున్, బండి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. మలబార్ షోరూమ్ ప్రారంభోత్సవంలో మంత్రి రవీంద్ర -
ఆర్టీసీ డిస్పెన్సరీ ప్రారంభం
మచిలీపట్నంటౌన్: స్థానిక ఆర్టీసీ డిపో ఆవరణలో నిర్మించిన జిల్లా డిస్పెన్సెరీ భవనాన్ని సంస్థ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఎండీ ద్వారకా తిరుమలరావులతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర గురువారం ప్రారంభించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.80 లక్షలతో నిర్మించిన ఈ నూతన డిస్పెన్సరీలో ఏర్పాటు చేసిన సదుపాయాలను మంత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మచిలీపట్నం నుంచి రేపల్లె, బాపట్ల, చీరాల మీదుగా ఒంగోలు బస్సు సర్వీసును మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లా డుతూ.. ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది కోసం డిస్పెన్సరీ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ.. 50 వేల ఉద్యోగులు, 8 వేల మంది ఒప్పంద ఉద్యోగు లతో అతిపెద్ద వ్యవస్థగా ఆర్టీసీ నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ గంగాధరరావు, జిల్లా ప్రజా రవాణాధికారి ఎ.వాణిశ్రీ, డిపో మేనేజర్ టి.పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీటీపీఎస్లో ఉద్యోగాల పేరుతో మోసం
ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ కోల్ప్లాంటులో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న వి.పోతురాజు ఉద్యోగాలు ఇప్పి స్తానని పలువురిని మోసగించి రూ.23 లక్షలు వసూలు చేశాడు. మూడేళ్ల క్రితం మోసానికి గురైన బాధితులు ఇబ్రహీంపట్నంలో గురువారం మీడియాను ఆశ్రయించి వివరాలు వెల్లడించారు. వారి కథనం మేరకు.. ఎన్టీటీపీఎస్కు చెందిన 327 కాంట్రాక్ట్ కార్మిక యూనియన్ అధ్యక్షుడు వి.పోతురాజు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసపు వల విసిరాడు. విద్యుత్ సౌధలో సీఎండీ పీఏగా పనిచేస్తున్నట్లు బాధితులను నమ్మించి శ్రీహరి అనే వ్యక్తిని పరిచయం చేశాడు. అతని ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. యూనియన్లో మరో నాయకుడు రామును మధ్యవర్తిగా పెట్టి మచిలీపట్నానికి చెందిన 23 మంది యువకుల నుంచి విడతల వారీగా రూ.23 లక్షలు వసూలు చేశాడు. గేట్ పాస్ల కోసం వారి నుంచి సంతకాలు తీసుకున్నారు. ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో ఆరు నెలల క్రితం పోతురాజును నిలదీయడంతో రూ.4 లక్షలు తిరిగి చెల్లించాడు. మరో రూ.19 లక్షలు చెల్లించకుండా, ఉద్యోగాలు ఇప్పించకుండా ముఖం చాటేశాడు. ఈ మోసంపై మచిలీపట్నం స్టేషన్కు సమాచారం ఇచ్చామన్నారు. రూ.23 లక్షలు వసూలు చేసిన కాంట్రాక్ట్ కార్మికుడు న్యాయం కోసం మీడియాను ఆశ్రయించిన బాధితులు -
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ
జగ్గయ్యపేట అర్బన్: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకమని, వీటి ఏర్పాటులో జగ్గయ్యపేట దిక్సూచిగా నిలుస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన 508 సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం స్థానిక కోదాడ రోడ్లోని బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్ గుప్తా, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య), ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ముందుగా సీసీ కెమెరాలను బటన్ నొక్కి ఆమె ప్రారంభించారు. అనంతరం హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ జగ్గయ్య పేటలో 508 సీసీ కెమెరాల ఏర్పాటుకు కారణం అయిన ఎమ్మెల్యే తాతయ్య, సీపీ రాజశేఖరబాబు నేతృత్వంలో జిల్లా పోలీస్ యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. అనంతరం పోక్సో చట్టానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఆఫ్ పేష్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మహిళల రక్షణ కోసం నిర్ధేశించిన శక్తి యాప్పై అవగాహన కల్పించారు. అగ్రగామిగా జిల్లా.. పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఎన్టీఆర్ జిల్లా కేసులు ఛేదించడంలోనూ, రికవరీలోను అగ్రగామిగా ఉందన్నారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో 2,500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డీసీపీలు మహేశ్వరరాజు, గౌతమిశాలి, సరిత, ఉదయరాణి, తిరుమలేశ్వరరెడ్డి, కృష్ణమూర్తినాయుడు, ఏడీసీపీలు రామకృష్ణ, ప్రసన్నకుమార్, సురక్ష కమిటీ కన్వీనర్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత -
మహిళల రక్షణకు భంగం కలిగిస్తే కఠిన శిక్షలు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): మహిళల రక్షణకు భంగం కలిగించే వారు ఎవరైనా సరే చట్టం దృష్టిలో శిక్షార్హులేనని జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు పేర్కొన్నారు. ‘సమాజంలో మహిళలు, చిన్నారులుపై జరుగుతున్న దాడులు – చట్టాలు’పై జిల్లా పోలీసు కార్యాలయంలోని స్పందన సమావేశపుహాలులో గురువారం అవగాహన సదస్సు జరిగింది. న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు మాట్లాడుతూ.. చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే వారికి పోక్సో చట్టం ప్రకారం జీవిత ఖైదు తప్ప దని హెచ్చరించారు. స్పెషల్ జ్యుడీషి యల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ప్రొహిబిషన్, ఎకై ్సజ్ కోర్టు జడ్జి మేరీ మాట్లాడుతూ.. చిన్నారులు, విద్యార్థినులకు వేధింపులు ఎదురైతే ధైర్యంగా తల్లిదండ్రు లకు చెప్పి పోలీసుల రక్షణ పొందవచ్చన్నారు. దిశ సీఐ వాస వెంకటేశ్వరరావు, న్యాయవాదులు అజ్మతున్నీసా, ముసలయ్య పాల్గొన్నారు. -
సారా రహిత జిల్లాగా కృష్ణా
మే ఒకటి నాటికిచిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాను మే ఒకటో తేదీ నాటికి నాటుసారా రహిత జిల్లాగా ప్రకటించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో ఎకై ్సజ్శాఖ ఆధ్వర్యంలో నవోదయం 2.0 – నాటుసారా నిర్మూలన కార్యక్రమంపై సమన్వయ కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సారాపై ప్రజల్లో అవగాహన కలిగించి నిర్మూలించడానికి నవోదయం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. గ్రామాలు, పట్టణాల్లో అవగాహన సదస్సులు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించి నాటుసారా వినియోగం వల్ల కలిగే అనారోగ్య సమస్యలను ప్రజలకు వివరించాలన్నారు. నాటుసారా కాచే వారిని గుర్తించి వారి జీవనోపాధి కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం ఆర్థిక చేయూతను ఇస్తుందన్నారు. జిల్లా ప్రభుత్వాస్పత్రిలో డీ–ఎడిక్షన్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తీవ్రమైన నేరం.. కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ నాటుసారా ఎవరు కాచినా, అమ్మినా తీవ్రమైన నేరంగా పరిగణించాలన్నారు. వారిపై నిఘా ఉంచాలన్నారు. అవసరమైతే పీడీ చట్టాన్ని కూడా నమోదు చేయాలన్నారు. ఎస్పీ ఆర్. గంగాధరరావు మాట్లాడుతూ నాటుసారా నిర్మూలనకు పోలీస్ యంత్రాంగం పూర్తిగా సహకరిస్తుందన్నారు. ఎకై ్సజ్ డెప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో 14 గ్రామాల్లో నాటుసారా కాచి విక్రయిస్తున్నట్లు గుర్తించామని ఈ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 129 కేసులు నమోదు చేసి 73 మందిని అరెస్టు చేశామన్నారు. నాటుసారా సమాచారం అందించేందుకు టోల్ఫ్రీ నంబర్ 14405 ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. అనంతరం నవోదయం పై ముద్రించిన వాల్పోస్టర్లు, పాంప్లేట్లను ఆవిష్కరించారు. డీఆర్వో కె. చంద్రశేఖరరావు, ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ వై. శ్రీనివాసచౌదరి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జి. గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు. అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర -
ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతికి గుండె తరలింపు
విమానాశ్రయం(గన్నవరం): బ్రెయిన్ డెడ్ అయిన ఓ మహిళ గుండెను జీవన్దాన్లో భాగంగా గురువారం గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి.. గుంటూరులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో బ్రెయిన్ డెడ్ అయిన ఓ మహిళ శరీరంలోని అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకువచ్చారు. ఆమె గుండెను తిరుపతిలోని పద్మావతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మరో వ్యక్తికి అమర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ప్రత్యేక బాక్స్లో భద్రపరిచిన గుండెను అంబులెన్స్లో గ్రీన్ చానల్ ద్వారా గుంటూరు నుంచి ఎయిర్పోర్ట్కు తరలించారు. ఇక్కడి నుంచి ప్రత్యేక విమానంలో వైద్యుల పర్యవేక్షణలో గుండెను తిరుపతి విమానాశ్రయానికి తీసుకు వెళ్లారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పర్యవేక్షించారు. మెట్రో భూ సేకరణపై దృష్టి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ మెట్రో ప్రాజెక్టు భూ సేకరణ ప్రక్రియపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని, ఏపీ మెట్రోరైలు కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎంఆర్సీఎల్) అందించిన ప్రతిపాదనల ప్రకారం ఉమ్మడి తనిఖీలకు చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. గురువారం జరిగిన మెట్రోరైలు కార్పొరేషన్ బోర్డు సమావేశానికి వర్చువల్గా కలెక్టర్ హాజరయ్యారు. సమావేశంలో మెట్రో రైలు ప్రాజెక్టు భూ సేకరణ సంబంధిత అంశాలపై రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్ సూచనలు చేశారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఫేజ్–1 విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు భూ సేకరణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఫేజ్–1 కారిడార్ 1ఏ (గన్నవరం–పీఎన్బీఎస్), కారిడార్ 1బీ (పీఎన్బీఎస్–పెనమలూరు) భూ సేకరణ, నిధుల అంచనా తదితరాలపై అధ్యయనం చేస్తామన్నారు. -
పెద్దాస్పత్రిలో పేదోళ్ల కష్టాలు
‘ఓపీ’క నశించి.. నీరసిస్తున్న రోగులుపేదోళ్లకు పెద్దాస్పత్రి అంటే పెద్దన్నలాంటిది. ఎలాంటి వ్యాధియైనా వారికి కనిపించే ఏకై క దిక్కు అదే. అలాంటి ఆస్పత్రిలో వైద్యం మిథ్యగా మారుతోంది. కనీస సౌకర్యాలు కనుమరుగవుతున్నాయి. చికిత్స కావాలంటే గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఆస్పత్రిలో సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు ఏసీ గదులు దాటి బయటకు రాకపోవడంతో రోగులకు అవస్థలు తప్పడం లేదు. లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రోగుల ఇబ్బందులను పట్టించుకునే వారే కరువయ్యారు. ఎక్కడ చూసినా రోగులు బారులు తీరి క్యూలైన్లలో దర్శనం ఇస్తున్నారు. సరైన సౌకర్యాలు లేక పోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగులు ఇబ్బందులు పడకుండా నిత్యం పర్యవేక్షించాల్సిన రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్లు మాత్రం ఏసీ గదులను వీడటం లేదు. దీంతో సిబ్బంది కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వాస్పత్రిలో సేవలు రోజు రోజుకు దిగజారుతున్నాయి. పర్యవేక్షణేది.. రోగులకు అందుతున్న సేవలను నిత్యం రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్లు పర్యవేక్షించాల్సి ఉంది. ఎక్కడైనా ఇబ్బందులు పడుతుంటే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి.. అవసరమైతే సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లాలి. కానీ ఆర్ఎంఓలు ఏసీ గదులకే పరిమితం కావడంతో పట్టించుకునే వారే కరువయ్యారు. అంతేకాదు సమయం దాటిన తర్వాత మహాప్రస్థానం వాహనం కోసం మాట్లాడేందుకు ఆర్ఎంఓలు ఫోన్లు ఎత్తడం లేదు. దీంతో సూపరింటెండెంట్కు ఫోన్చేస్తే ఆయన స్పందించాల్సి వస్తోంది. ఆర్ఎంఓల పనితీరుపై ఎప్పటి నుంచి ఆరోపణలు వస్తున్నా, వారిలో చలనం మాత్రం రావడం లేదు. రోగుల కష్టాలు వారికి పట్టడం లేదు. అరకొరగా మందులు.. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో పక్షవాతం, గుండె జబ్బులు, మధుమేహం వంటి రోగులు నిత్యం 300 నుంచి 400 మందికి పైగా వస్తుంటారు. వారికి గతంలో వైద్య పరీక్షలు చేసి, 30 రోజులకు మందులు ఇచ్చేవారు. ఇప్పుడు వారం నుంచి 15 రోజులకే ఇస్తున్నట్లు రోగులు చెబుతున్నారు. దీంతో నెలలో రెండు సార్లు ఆస్పత్రికి రావాల్సి వస్తోందని, చార్జీలకే చాలా వ్యయం అవుతోందని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దీర్ఘకాలిక రోగులకు నెలకు మందులు ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. విజయవాడ జీజీహెచ్లో రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎక్కడ చూసినా క్యూలైన్లలో నిరీక్షణే దీర్ఘకాలిక రోగులకు మందులు వారం నుంచి 15 రోజులకే ఇస్తున్న వైనం ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు ఎక్కడ చూసినా క్యూలైన్లే.. జీజీహెచ్కి వచ్చిన రోగులు ఓపీ తీసుకునే వద్ద నుంచి వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత మందులు తీసుకునే వరకూ ప్రతిచోట క్యూలైన్లలో వేచి ఉండాల్సిందే. ఓపీ కోసం కనీసం 30 నిమిషాలు క్యూలో ఉంటున్నారు. ఒక్కోసారి 45 నిమిషాలకు పైగానే పడుతోంది. అక్కడి నుంచి డాక్టర్ కన్సల్టేషన్ వద్దకు వెళితే అక్కడ గంటపాటు క్యూలో ఉండాల్సిందే. అక్కడి నుంచి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు వెళ్తే మరో 30 నుంచి 45 నిమిషాలు, మందులు కోసం 30 నిమిషాలు.. ఇలా ప్రతిచోట క్యూలైన్లు ఉండటంతో రోగులు నీరసించి పోతున్నారు. ప్రస్తుతం ఎండలు కూడా ఎక్కువగా ఉండటంతో పరిస్థితి దయనీయంగా మారుతోంది. సూపర్ స్పెషాలిటీ విభాగాలైన న్యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ విభాగాల వద్ద పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది. -
తిరుపతమ్మ హుండీ కానుకల ఆదాయం రూ.87.48 లక్షలు
పెనుగంచిప్రోలు: తిరుపతమ్మవారికి భక్తులు హుండీల ద్వారా రూ.87.48 లక్షల నగదును కానుకలు, మొక్కుబడుల రూపంలో సమర్పించారు. గురువారం అమ్మవారి మండపంలో కానుకలను లెక్కించారు. 52 రోజులకు గాను ఆలయంలో మొత్తం హుండీ కానుకలను లెక్కించగా నగదు రూపంలో రూ.87,48,911, బంగారం 35 గ్రాముల 500 మిల్లీ గ్రాములు, వెండి 620 గ్రాములు వచ్చినట్లు ఆలయ ఈఓ బీహెచ్వీఎస్ఎన్ కిషోర్కుమార్ పేర్కొన్నారు. అలాగే విదేశీ నగదు కొంత వచ్చిందన్నారు. కానుకలను ఆలయ సిబ్బందితో పాటు పరిటాలకు చెందిన ఉమ సేవా సమితి సభ్యులు, గ్రామానికి చెందిన భక్తులు లెక్కించారు. కానుకల లెక్కింపును ఆలయ ఈఓతో పాటు చైర్మన్ జంగాల శ్రీనివాసరావు, పాలకవర్గ సభ్యులు, జూపూడి గ్రూప్ టెంపుల్స్ ఈవో బి. రవీంద్రబాబు, ఏఎస్ఐ శంకర్ పర్యవేక్షించారు. దుర్గమ్మ సన్నిధిలో చలువ పందిళ్లు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వేసవి నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల సన్నిధిలో దేవస్థానం చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తోంది. ఘాట్రోడ్డులోని ఓం టర్నింగ్ మొదలు లక్ష్మీగణపతి ప్రాంగణం, గాలి గోపురం, ఆలయ ప్రాంగణం, రాజగోపురం పరిసరాల్లో ఈ పందిళ్ల పనులు నిర్వహిస్తోంది. అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు ఆయా చలువ పందిళ్ల కింద సేదదీరేందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఆలయ పరిసరాల్లోని క్యూలైన్ మార్గాలలో కూలర్లు అందుబాటులో ఉంచారు. దేవస్థానంపై కీలక ప్రాంతాలతో పాటు ఘాట్రోడ్డు, మహా మండపం, కనకదుర్గనగర్లలో మంచినీటి సరఫరా చేసేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫ్యాప్టో జిల్లా చైర్మన్గా అలవాల సుందరయ్య వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జిల్లా కార్యవర్గ సమావేశంలో చైర్మన్గా అలవాల సుందరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సెక్రటరీ జనరల్గా డాక్టర్ ఇంటి రాజు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జిల్లా కార్యవర్గ సమావేశం గురువారం ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సంఘం నూతన కమిటీని ఎన్నిక చేసుకుంది. ఎన్నికల అధికారిగా సయ్యద్ ముస్తాక్ వ్యవహించారు. సమావేశంలో ఫ్యాప్టో ఎన్టీఆర్ జిల్లా చైర్మన్గా అలవాల సుందరయ్య (యూటీఎఫ్)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని సయ్యద్ ఖాసీం ప్రకటించారు. అదేవిధంగా సెక్రటరీ జనరల్గా డాక్టర్ ఇంటి రాజు (బీటీఏ), కోచైర్మన్లుగా జి. రామారావు(డీటీఎఫ్), ఆర్. రాంబాబు నాయక్ (ప్రధానోపాధ్యుయుల సంఘం) సయ్యద్ హఫీజ్ (రూటా), డెప్యూటీ సెక్రటరీ జనరల్గా సయ్యద్ ఖాసీం ( ఏపీటీఎఫ్), వి. భిక్షమయ్య(ఎస్టీయూ), సదారతుల్లా (ఏపీపీటీఏ), రవీంద్రప్రసాద్ (ఏపీటీఎఫ్ ) లను సమావేశం ఎన్నుకుంది. పరమ పదనాథుడు అలంకారంలో నరసింహస్వామి మంగళగిరి టౌన్: మంగళాద్రిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా గురువారం పరమ పద నాథుడు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఈవో రామకోటిరెడ్డి పర్యవేక్షించారు. ఉత్సవ కైంకర్యపరులుగా ఆత్మకూరుకు చెందిన మురికిపూడి మాధవరావు కుమారులు, ఆస్థాన కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన లంకా కృష్ణమూర్తి వ్యవహరించారు. -
రుద్రాక్ష వృక్షం
ఆకట్టుకుంటున్న నాగాయలంకలో తలశిల వెంకట నరసింహారావు (తాతయ్య) ఇంటి పెరటిలో రుద్రాక్ష వృక్షం ఏపుగా పెరుగుతోంది. చెట్టు నిండా కాయలతో ఆకట్టుకుంటోంది. శివుడి నయనాల నుంచి జాలువారిన నీటి బిందువులే రుద్రాక్షలుగా ఆవిర్భవించాయని పురాణాలు పేర్కొంటున్నాయి. సముద్ర తీరప్రాంతమైన నాగాయలంక గ్రామంలో ఎనిమిదేళ్ల క్రితం తాతయ్య రుద్రాక్ష మొక్క నాటారు. స్వచ్ఛ నాగాయలంక సొసైటీలో సేవా కార్యకర్తగా పనిచేస్తున్న తరుణంలో 2016లో దేవాలయాల ప్రాంగణాల్లో నాటేందుకు కొన్ని రుద్రాక్ష మొక్కలు తెప్పించారు. తన పెరటిలో, స్థానిక శివాలయ ప్రాంగణంలో ఒక్కొక్క రుద్రాక్ష మొక్క నాటారు. గత ఏడాది కొంత మేరకు కాపు వచ్చింది. ఈ ఏడాది ప్రస్తుతం వందల సంఖ్యలో రుద్రాక్షలతో చెట్టు ఆకట్టుకుంటోంది. చెట్టు ప్రధాన కాండం మూడు కొమ్మలుగా త్రిశూలాకృతిలో విస్తరించి చెట్టు అంతా కాయలు కాయడం తమ అదృష్టమని, త్రిమూర్తుల ఆవతారంగా భావించే త్రిముఖ రుద్రాక్షలే అధికశాతం వస్తుండటం విశేషమని తాతయ్య కుటుంబం సంబరపడుతోంది. అడిగిన వారికి రుద్రాక్షలను ఉచితంగా అందజేస్తోంది. – నాగాయలంక -
రోగుల ఇబ్బందులు పట్టడం లేదు..
జబ్బు చేసి చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన రోగులకు అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. ఏదైనా ప్రశ్నిస్తే మేమింతే అన్నట్లుగా సిబ్బంది వ్యవహరిస్తున్నారు. దీంతో చేసేది లేక అష్టకష్టాలు పడుతూ వైద్యం పొందుతున్నారు. ముఖ్యంగా రోగులు అధికంగా వచ్చే న్యూరాలజీ, న్యూరోసర్జరీ వంటి విభాగాల వద్ద పర్యవేక్షణ కొరవడింది. – చందా కిరణ్తేజ, మాచవరం మందులు ఇవ్వడం లేదు.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ప్రభుత్వాస్పత్రికి వెళ్తే రోగులకు మందులు అరకొరగా ఇస్తున్నారు. దీంతో పదిహేను రోజులకోసారి వెళ్లాల్సి వస్తోంది. అక్కడికి వెళ్తే క్యూలైన్లలో ఉండలేక పక్షవాతం వచ్చిన రోగులు, గుండె జబ్బులు ఉన్న వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోగులపై కనికరం కూడా ఉండటం లేదు. – ఎండీ రిజ్వాన్, అశోక్నగర్ -
ఎంఈఎఫ్ జిల్లా నూతన కమిటీ ఏర్పాటు
మచిలీపట్నంటౌన్: మాదిగ ఉద్యోగుల సంఘం ఉమ్మడి కృష్ణా జిల్లా నూతన కమిటీ నియామం గురువారం జరిగిందని సంఘ జిల్లా అధ్యక్షుడు బొకినాల కృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. మచిలీపట్నంలో జరిగిన సమావేశంలో మాదిగ ఉద్యోగుల సంఘంజిల్లా ఉపాధ్యక్షుడిగా జె.అనీల్, మచిలీపట్నం నియోజకవర్గ సమన్వయకర్తగా కటారి మహేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు. సమావేశం అనంతరం మల్కాపట్నంలోని గుప్తా సెంటర్లో ఉన్న భారత మాజీ ఉప ప్రధాని బాబూజగ్జీవన్రామ్ విగ్రహానికి సంఘ నాయకులు పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ దేవరపల్లి విక్టర్బాబు, సంఘ నాయకులు గండ్రపు శీనయ్యమాస్టార్, అద్దేపల్లి నిరంజన్రావు, కొక్కిలిగడ్డ చిట్టిబాబు, మట్టా జయప్రకాష్, గురువిందపల్లి విజయ్బాబు, సాయిబాబు, దాస్, శరత్, బండారు సోమేశ్వరరావు, రాజేష్, జూనపూడి గణేష్, ఇసుక పల్లి అజయ్, బండ్రపల్లి బాబీ, ఎస్ హనోక్, విజయ రత్నం, మరియకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సన్న వరి రకం సాగు విస్తీర్ణం పెంచాలి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో అధికంగా వినియోగించే సన్న రకాల వరి పంటల సాగు విస్తీర్ణం పెంచేలా రైతులను ప్రోత్సహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, మిల్లర్లు, రైతులతో గురువారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 1,51718 హెక్టార్లలో, రబీ సీజన్లో ఐదు వేల హెక్టార్లలో వరి పంట సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. అందులో బీపీటీ 5204, ఎంటీయూ 1224, ఎంసీఎం 125, ఎంటీయూ 1061, ఎంటీయూ 1121 రకాలు ఉన్నాయని వివరించారు. వాటిలో బీపీటీ 5204, ఎంటీయూ 1224, ఎంసీఎం 125 సన్న రకాల వరి పంటలు గత ఖరీఫ్ సీజన్లో 30 శాతం సాగు చేశారని తెలిపారు. ఈ మూడు రకాల వరి పంటలను మరింత ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేందుకు రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఇందుకోసం గ్రామ విత్తన ఉత్పత్తి పథకం కింద ఈ సన్న రకం విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. మండలాల వారీగా అభ్యుదయ రైతులను గుర్తించాలన్నారు. మిల్లర్లు కూడా ఈ రకం వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి మనోహర్, ఏడీ మణిధర్, పౌరసరఫరాల సంస్థ డీఎం పద్మాదేవి, శాస్త్రవేత్తలు డాక్టర్ డి.సుధారాణి, డాక్టర్ కె.నాగేంద్ర, ఏపీ సీడ్స్ కార్పొరేషన్ డీఎం శ్రీనివాసరావు, పలువురు రైతులు, మిల్లర్లు పాల్గొన్నారు. -
భానుడు భగభగ.. ప్రజలు విలవిల
లబ్బీపేట(విజయవాడతూర్పు): మార్చి నాలుగో వారంలోనే ఎండలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వారం పది రోజులుగా ఎండల ప్రభావం తీవ్రంగా ఉండగా, గత ఆది, సోమవారాల్లో కొంచెం తక్కువగా ఉంది. ఎండ తీవ్రతకు గురైన అనేక మంది అనారోగ్య సమస్యలతో ఆస్పత్రులకు దారి తీస్తున్నారు. ఈ ఏడాది ఎండలు ప్రజలకు కొత్త సమస్యలను తీసుకువస్తున్నాయి. దీంతో కొందరు ఎండలోకి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. మార్చిలోనే ఎండల పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు ఇంకెంత దారుణంగా ఉంటుందోనని జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 5 డిగ్రీలు ఎక్కువ ప్రభావం ప్రస్తుతం నగరంలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సంఖ్య కంటే దాని ప్రభావం ఐదు, ఆరు డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటున్నట్లు వాతావరణ నిపుణులు చెపుతున్నారు. ఆల్ట్రా వైలెట్ కిరణాలు ఎక్కువగా పడటం, ఉష్ణ కిరణాలు బాగా వేడిని కలిగిస్తున్నాయంటున్నారు. ఓజోన్ పొర బలహీన పడకపోయినప్పటికీ గాలిలో ఉండే దుమ్ము, కాలుష్యం ఎక్కువగా ఉండటంతో ఇలాంటి పరిస్థితి తలెత్తుతున్నట్లు చెబుతున్నారు. ఖాళీ ప్రదేశం లేని ఇరుకు భవనాలు, మార్జిన్ లేని సిమెంటు రోడ్లు, విచ్చలవిడిగా ఏసీల వినియోగం ఇలా మార్చిలోనే తీవ్రమైన ఎండలకు కారణం అంటున్నారు. అప్రమత్తంగా ఉండాలి ఎండ తీవ్రతకు అనారోగ్యానికి గురైన వారు పలు సమస్యలతో ఆస్పత్రులకు వస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగులు, గర్భిణులు, బాలింతలు ఎండకు ఫోకస్ కాకుండా ఉండాలి. ఐదేళ్లలోపు పిల్లల్ని బయటకు పంపవద్దు. మంచినీరు ద్రవ పదార్ధాలు ఎక్కువగా తీసుకో వడం, మసాలా ఆహారం తగ్గించడం ఉత్తమం. – డాక్టర్ మాచర్ల సుహాసిని, డీఎంహెచ్ఓ, ఎన్టీఆర్ జిల్లా కాంక్రీట్ జంగిల్తోనే అధిక ఉష్ణోగ్రతలు ప్రస్తుతం విజయవాడ కాంక్రీట్ జంగిల్గా మారడంతో మార్చిలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చెట్లు లేకపోవడం, ఖాళీ ప్రదేశం లేకుండా ఇంటిని అనుకుని ఇళ్లు, బహుళ అంతస్తుల నిర్మాణాలు వంటి కారణాలతో చల్లని వాతావరణం కొరవడింది. ఈ పరిస్థితి మారాలంటే సాయంత్రం నీళ్లు చల్లడం చేయడం, మొక్కలు పెంచడం వంటివి చేపట్టాలి. – డాక్టర్ ఎ.శ్రీకుమార్, వాతావరణ శాస్త్రవేత్త జాగ్రత్తలు తప్పనిసరి ఎండలోకి వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ ఈ కింది విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మంచినీరు ఎక్కువగా తాగటం, తీవ్రమైన ఎండకు ఫోకస్ కాకుండా ఉండాలి. మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగులు మరింత అప్రమత్తంగా ఉండాలి. గర్భిణులు, బాలింతలు, ఐదేళ్లలోపు చిన్నారుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనారోగ్య సమస్యలివే.. ఎండ తీవ్రతకు గురైన వారిలో కింద పేర్కొన్న లక్షణాలు గోచరిస్తున్నాయి. ఆకస్మికంగా వాంతులు, విరోచనాలతో పాటు తీవ్రమైన కడుపునొప్పి వస్తుంది. చలితో కూడిన జ్వరం కూడా వస్తున్నట్లు చెబుతున్నారు. తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు. వికారంగా ఉండటం, ఆకలి లేక పోవడం వంటి లక్షణాలు ఉంటున్నాయి. ఎండలో తిరిగే వారిలో చాలా మంది రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదని చెబుతున్నారు కొందరికి చర్మంపై దురదలు వస్తున్నాయి. ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి కొత్త సమస్యలతో బాధపడుతున్న వైనం ఎండల తీవ్రతకు వాంతులు, విరేచనాలు చలితో కూడిన జ్వరం, తీవ్రమైన నీరసం ఇప్పటికే జిల్లాలో చాలా మందిలో ఈ లక్షణాలు అప్రమత్తంగా ఉండాలనివైద్యనిపుణుల సూచన -
బౌద్ధ మ్యూజియాన్ని అభివృద్ధి చేయాలి
కోల్కతా రీసెర్చ్ స్కాలర్ స్మితా హల్దార్ ఘంటసాల: శిథిలావస్థకు చేరుతున్న ఘంటసాల బౌద్ధ మ్యూజియం పాడవకముందే అభివృద్ధి చేసి శిల్ప సంపదను ప్రభుత్వం సంరక్షించాలని కోల్కతాకు చెందిన రీసెర్చ్ స్కాలర్ స్మితా హల్దార్ అన్నారు. ప్రముఖ బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న ఘంటసాల బౌద్ధారామాన్ని రీసెర్చ్ స్కాలర్ స్మితా హల్దార్ బృందం గురువారం సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఘంటసాల బౌద్ధారామాన్ని 10 నుంచి 15 సార్లు సందర్శించి పుస్తకాన్ని రాశానని, కాని ఎన్నిసార్లు సందర్శించినా బౌద్ధారామం కొత్తగానే కనిపిస్తుందన్నారు. కార్యక్రమంలో రీసెర్చ్ స్కాలర్ స్మితా హల్దార్కు సహకరించడానికి రేపల్లెకు చెందిన శాసన పరిశోధకులు డాక్టర్ బెల్లంకొండ రమేష్ చంద్ర, ఒంగోలుకు చెందిన చరిత్ర ఉపన్యాసకులు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొండా శ్రీనివాసులు, పాండిచ్చేరి యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ బి.రామచంద్రారెడ్డి పాల్గొనగా ఈ బృందానికి ఘంటసాలలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి రామకృష్ణ, మ్యూజియం సిబ్బంది సహకరించారు. -
గ్రామ స్వరాజ్యం కోసం కృషి చేయాలి
జిల్లా ఎస్పీ గంగాధరరావు బంటుమిల్లి: పార్టీలు, ఎన్నికలు తాత్కాలికమని, ఆతర్వాత గ్రామస్తులు అందరూ కలసి గ్రామాభివృద్ధికి, గ్రామ స్వరాజ్యం కోసం కృషి చేయా లని ఎస్పీ ఆర్.గాంగధరరావు సూచించారు. మండలంలోని మల్లేశ్వరంలో బుధవారం రాత్రి జరిగిన పల్లెనిద్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ప్రాథమిక పాఠశాల ఆవరణలో సర్పంచి చెన్ను శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ.. పార్టీలు, ఎన్నికలను కొంత వరకే పరిమితం చేయాలన్నారు. విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే వివాదాలు, గొడవలకు దూరంగా ఉండొచ్చని సూచించారు. గ్రామ ప్రజలు ఒకమాటపై నిలబడి పెద్దల సూచనలు పాటిస్తే నేరాల సంఖ్య గణణీయంగా తగ్గుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. యువకులు బెట్టింగ్లు, జూదాలు, మాద కద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. తొలుత గ్రామస్తులతో మాట్లాడించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామ సమస్యలను కలెక్టరు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు చర్యలు తీసుకుంటానని ఎస్పీ గంగాధరరావు హామీ ఇచ్చారు. అంతకు ముందు బందరు డీఎస్పీ సీహెచ్.రాజ మాట్లాడుతూ.. పలు చట్టాలపై అవగాహన కల్పించారు. తొలుత ఎస్పీ గంగాధరరావుకు సర్పంచి శ్రీనివాసరావు బొకే అందచేసి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సీఐ నాగేంద్ర ప్రసాద్, ఎస్ఐ గణేష్కుమార్, బంటుమిల్లి డీసీ చైర్మన్ బి.కాశీవిశ్వేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు కె.వీరబాబు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు జె.కొండలరావు, జి.శివయ్య, ఎం. గంగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్పీఎఫ్ మహిళా బ్యారక్ ప్రారంభం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడలో ఆర్పీఎఫ్ మహిళా బ్యారక్ ప్రారంభమైంది. ఆర్పీఎఫ్ మహిళా సిబ్బంది సంక్షేమం, సాధికారత దిశగా విజయవాడ డివిజన్లో రూ.1.5 కోట్లుతో 30 పడకల మహిళా బ్యారక్ను రైల్వే కోర్టు సమీపంలో నిర్మించారు. దక్షిణ మధ్య రైల్వే ఇన్స్పెక్టర్ జనరల్, ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ ఆరోమా సింగ్ ఠాకూర్ ఈ బ్యారక్ను బుధవారం రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆర్పీఎఫ్ ఎస్కార్ట్, ప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్పీ), రైల్వే విధులకు హాజరయ్యే మహిళా పోలీసులు విశ్రాంతి తీసుకునేందుకు బ్యారక్లో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్పై వర్కుషాపు విజయవాడ డివిజన్ సెక్యూరిటీ విభాగం ఆధ్వర్యంలో రైల్వే ఆడిటోరియంలో ఏపీఆర్పీఎఫ్, ప్రభుత్వ రైల్వే పోలీసులకు ‘యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ ’ పై శిక్షణ ఇచ్చారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ల్కు కీలకమైన జ్ఞానం, నైపుణ్యాలు అందించడమే శిక్షణ తరగతుల లక్ష్యమని ఆరోమా సింగ్ ఠాకూర్ తెలిపారు. అనంతరం విధుల్లో అనుసరించాల్సిన పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్ఎం కొండా శ్రీనివాసరావు, సీనియర్ డీఎస్సీ వల్లేశ్వర బి.టి, సీనియర్ డీఈఎన్ ఎస్.వరుణ్బాబు, సీనియర్ డీఓఎం డి.నరేంద్ర వర్మ తదితరులు పాల్గొన్నారు. -
రక్త నిల్వల కొరతపై డీఎంహెచ్వో హెచ్చరిక
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలోని బ్లడ్ బ్యాంక్లలో రక్త నిల్వల కొరతపై డీఎం అండ్ హెచ్వో డాక్టర్ ఎస్.శర్మిష్ట బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. ‘రక్త నిల్వల కొరత’ శీర్షికతో ఈ నెల 24వ తేదీ సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో వార్త ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆమె బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో రక్తనిల్వలు తగ్గాయని, స్వచ్ఛంద రక్తదాన శిబిరాల ఏర్పాటులో ప్రభుత్వ, ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ప్రతి రక్తదాన శిబిరంలో 100కు తగ్గకుండా బ్లడ్ యూనిట్లు సేకరణ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల పనితీరుపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం సాకులు చెబుతూ స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు నిర్వహించకుంటే బ్లడ్ బ్యాంక్ లైసెన్సుల రద్దుకు సిఫారసు చేస్తామన్నారు. ప్రతి రోజూ బ్లడ్ బ్యాంకులు ఈ–రక్తఖోష్ యాప్లో స్టాక్ అప్డేట్ చేయాలన్నారు. ప్రతి నెల 5 వ తేదీ లోగా నెలవారీ రిపోర్ట్ పంపించాలని స్పష్టం చేశారు. ఈ మధ్య కాలంలో ప్లాస్మా వినియోగంలో అక్రమాలు తమ దృష్టికి వచ్చాయని, అలాంటి సంఘటనలు పునరావృతం అయితే బ్లడ్ బ్యాంకులు, డాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డీఎల్ఎటీఓ అంబటి వెంకట్రావు, సీపీఎం ఎల్.మధుసూదనరావు, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్లు, రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
రాగితీగలు చోరీ చేసే అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
కంకిపాడు: సులభ సంపాదన మోజులో రాగితీగల చోరీలకు పాల్పడ్డ అంతర్ రాష్ట్ర ముఠాకు కంకిపాడు పోలీసులు చెక్ పెట్టారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 22 కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.4.50 లక్షల విలువైన 300 కిలోల రాగి తీగ స్వాధీనం చేసుకున్నారు. కంకిపాడు పోలీసుస్టేషన్లో బుధవారం గన్నవరం డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రెడ్డిగూడెం మండలం కుదప గ్రామానికి చెందిన పంబి శ్రీను తాపీ కార్మికుడు. తాపీ పనిపై వచ్చే డబ్బులు సరిపోకపోవటంతో తన విలాసాల కోసం చోరీలను మార్గంగా ఎంచుకున్నాడు. ఇతనిపై గతంలోనే 12 వైరు చోరీ కేసులు, రెండు స్నాచింగ్ కేసులు ఉన్నాయి. జల్సాలను తీర్చుకోవటానికి తనకు పరిచయస్తులైన ఇబ్రహీంపట్నం ఫెర్రీకి చెందిన ముత్యాల గోపాలకృష్ణ, జి.కొండూరు గ్రామానికి చెందిన వెన్నముద్దల దుర్గాప్రసాద్రెడ్డిలను కలుపుకొని వ్యవసాయ మోటర్ల దగ్గర ఉండే కరెంటు వైర్లు, ట్రాన్స్ఫార్మర్లకు ఉండే వైర్లు కత్తిరించి అందులోని రాగివైరు చోరీ చేయటం మొదలుపెట్టారు. నాలుగు నెలలుగా మోటరు సైకిళ్లపై బయలుదేరి పంట పొలాల్లో ఉన్న వ్యవసాయ మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి వైర్లు కత్తిరించి పంట పొలంలోనే వైర్లు కాల్చి అందులో ఉన్న రాగివైరు చోరీ చేసి అమ్ముకుంటుంటారు. ట్రాన్స్ఫార్మర్లను పగలకొట్టి రాగివైర్లు చోరీ చేస్తుంటారు. రెక్కీలో పట్టుబడ్డ నిందితులు కంకిపాడు మండలం ప్రొద్దుటూరు పరిధిలోని కొణతనపాడు అడ్డరోడ్డు వద్ద పోలీసులు బుధవారం వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో రెండు మోటర్ బైక్లపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా ప్రవర్తించటంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రధాన నిందితులైన పంబి శ్రీను, ముత్యాల గోపాలకృష్ణ, వెన్నముద్దల దుర్గా ప్రసాద్రెడ్డిగా గుర్తించారు. వీరిపై ఇప్పటి వరకూ కంకిపాడు–4, ఉంగుటూరు–1, తోట్లవల్లూరు–4, ఆత్కూరు–2, వీరవల్లి–7, హనుమాన్ జంక్షన్–3, ఎ.కొండూరు–1 చొప్పున 22 కేసులు ఉన్నాయి. వీరు 216 వ్యవసాయ మోటర్లు, 7 ట్రాన్స్ఫార్మర్ల నుంచి రాగివైరు చోరీ చేసినట్లు నిర్థారించారు. నిందితుల నుంచి రూ.4.50 లక్షల విలువైన 300 కిలోల బరువు, 2400 మీటర్ల పొడవు గల రాగివైరు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. కేసు విచారణలో ప్రతిభ చూపిన సీఐ జె.మురళీకృష్ణ, ఎస్ఐ డి.సందీప్, హెచ్సీ కె.చంద్రబాబు, పీసీలు పీఎస్ఎన్ మూర్తి, అశోక్, ఎస్డీ బాజీబాబు, హెచ్జీలు మురార్జీ, వీఎన్ పిళ్లైలకు రివార్డులు అందించారు. సీఐ జె.మురళీకృష్ణ, ఎస్ఐ డి.సందీప్, ఉయ్యూరు రూరల్ ఎస్ఐ సురేష్బాబు పాల్గొన్నారు. -
షణ్ముఖుడి హుండీ ఆదాయం రూ.1.02 కోట్లు
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడికి హుండీ కానుకల రూపంలో రూ.1,02,44,254 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస రావు పర్యవేక్షణలో ఆలయ ప్రాంగణంలో బుధవారం హుండీ కానుకలు లెక్కించారు. 104 రోజులకు ఆలయం, అన్నదానం హుండీల ద్వారా రూ.1,02,44,254 నగదు, 48 గ్రాముల బంగారం, 2.188 కిలోల వెండి సమకూరాయిని ఈఓ తెలిపారు. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు, చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల అధికా రులు, పోలీస్ సిబ్బంది, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.జాతీయ బాడీబిల్డింగ్ పోటీలకు క్రీడాకారుల ఎంపికపెనమలూరు: జాతీయ బాడీబిల్డింగ్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే ఆంధ్ర జట్టుకు ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి నలుగురు క్రీడాకారులు ఎంపి కయ్యారని జిల్లా బాడీబిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి తాళ్లూరి అశోక్ తెలిపారు. పెనమలూరు మండలం కానూరులోని అశోక్జిమ్లో బుధవారం జరిగిన క్రీడాకారుల అభినందన కార్యక్రమంలో ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెల 29, 30 తేదీల్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాస్పూర్లో జాతీయ బాడీబిల్డింగ్ పోటీలు జరగనున్నాయి. రాష్ట్ర జట్టుకు ఉమ్మడి జిల్లా నుంచి 55 కిలోల విభాగంలో సీహెచ్.దినేష్రెడ్డి, 60 కిలోల విభాగంలో ఎం.దినేష్, 66 కిలోల విభాగంలో కె.హరి, 75 కిలోల విభాగంలో సీహెచ్.గోపీచంద్ ఎంపికయ్యారు. ఎంపికై న క్రీడాకా రులను ఉమ్మడి జిల్లాల బాడీబిల్డింగ్ అసోసియేషన్ చైర్మన్ గొట్టిపాటి రామకృష్ణప్రసాద్, గౌరవ అధ్యక్షుడు ఈదా రాజేష్, అధ్యక్షుడు బి. మనోహర్, వైఎస్సార్ సీపీ తాడిగడప మునిసిపల్ అధ్యక్షుడు వేమూరి బాలకృష్ణ తదితరులు అభినందించారు. క్రీడాకారులకు అశోక్ జిమ్లో ప్రత్యేక శిక్షణ ఇస్తామని అశోక్ తెలిపారు.17 మందికి కారుణ్య నియామకాలుచిలకలపూడి(మచిలీపట్నం): విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా, అంకితభావంతో పనిచేసి ఉన్నతాధికారుల మన్ననలు పొందాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక సూచించారు. విధి నిర్వహణలో మరణించిన వారికి కుటుంబ సభ్యులకు హారిక బుధవారం తన చాంబర్లో కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. 12 మందికి జూనియర్ అసిస్టెంట్లుగా, ఐదుగురిని టైపిస్ట్లుగా నియమించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ హారిక మాట్లాడుతూ.. కొత్తగా ఉద్యోగాల్లో నియమితులైన వారు తమకు అప్పగించిన విధులను బాధ్యతతో నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, డెప్యూటీ సీఈఓ ఆర్.సి.ఆనంద్కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఎన్టీఆర్ వర్సిటీ బాల్ బ్యాడ్మింటన్ జట్టు ఎంపికవిజయవాడస్పోర్ట్స్: జాతీయ అంతర విశ్వ విద్యాలయాల బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మహిళల జట్టును ఎంపిక చేసినట్లు వర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డాక్టర్ ఇ.త్రిమూర్తి తెలిపారు. ఇటీవల నిర్వహించిన ఎంపిక పోటీల్లో అత్యుత్తమ క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన స్వపంతి, గ్రీష్మ, రక్షిత, చరితా రెడ్డి, ఉదయలక్ష్మి, అన్నపూర్ణాదేవి, ఉదయలక్ష్మి, సిరి, శిరీష, కీర్తిగాయత్రి జట్టుకు ఎంపికయ్యారని పేర్కొన్నారు. చైన్నెలోని అలగప్ప యూనివర్సిటీలో ఈ నెల 29 నుంచి జరిగే జాతీయ పోటీలకు ఈ జట్టు ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు. జట్టును వర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ నరసింహం, రిజిస్ట్రార్ రాధికరెడ్డి వర్సిటీ ప్రాంగణంలో బుధవారం అభినందించారు. జట్టుకు మేనేజర్గా రాము, కోచ్గా పవన్ కుమార్ వ్యవహరిస్తారు. -
● ఉప్పొంగిన అభిమానం
ఉత్సాహం ఉరకలెత్తింది.. అభిమానం తరంగం తరలివచ్చింది. తమ అభిమాన నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు వేలాదిగా ప్రజలు కదిలివచ్చారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో బుధవారం గురునానక్కాలనీలోని ఎన్ఏసీ కల్యాణ మండపంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. తమ అభిమాన నేతతో కలిసి ప్రార్థనలు, ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు ముస్లింలు వేలాదిగా తరలివచ్చారు. కల్యాణమండపం సమీపంలోని రోడ్లు అభిమానులతో కిక్కిరిశాయి. జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ వస్తుండగా జై జగన్ అన్న నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. – లబ్బీపేట(విజయవాడతూర్పు) -
వివాహేతర సంబంధమే హత్యకు కారణం
కోనేరుసెంటర్: మచిలీపట్నంలో ఈ నెల 21వ తేదీన జరిగిన వీర్నాల శ్రీనివాసరావు అలియాస్ టోపీ శ్రీను హత్య కేసును బందరు పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా నిర్ధారించారు. హత్యలో దాదాపు 10 మంది పాల్గొన్నట్లు తెలుసుకున్న పోలీసులు వారిలో తొమ్మిది మందిని బుధవారం అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. బందరు డీఎస్పీ సీహెచ్ రాజా ఇనకుదురుపేట పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం మచిలీపట్నం వర్రేగూడెంకు చెందిన వీర్నాల శ్రీను వ్యాను డ్రైవర్గా పనిచేయటంతో పాటు సెంట్రింగ్ పనులు చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన సుంకర ఉదయ వెంకటరమణ, శ్రీను స్నేహితులు. వెంకటరమణ హోంగార్డుగా పని చేస్తుండగా పలు ఆరోపణల కారణంగా అధికారులు అతన్ని హోంగార్డు ఉద్యోగం నుంచి తప్పించారు. ఇదిలా ఉండగా రమణ ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వర్రేగూడెంలో కాపురం ఉంటుండగా మృతుడు శ్రీను రమణ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రమణ పలుమార్లు శ్రీనును హెచ్చరించడమే కాక ఘర్షణ పడి దాడి చేశాడు. దీంతో ఇనకుదురుపేట పోలీసులకు శ్రీను ఫిర్యాదు కూడా చేశాడు. ఈ నేపథ్యంలోనే రమణ భార్య శ్రీనుతో వేరే ఇంట్లో కాపురం పెట్టింది. అవమానం తట్టుకోలేని రమణ కొంతకాలం క్రితం హైదరాబాదు వెళ్లిపోయాడు. అక్కడే ఉంటూ పనులు చేసుకుంటున్నాడు. పది రోజుల క్రితం మచిలీపట్నం వచ్చాడు. 21వ తేదీన వర్రేగూడెంలోని మీసేవ సెంటర్కు సమీపంలోని వాటర్ట్యాంకు వద్ద రమణతో పాటు అతని మేనల్లుడు మెరుగు రోహిత్, చిన మేనమామ మెరుగు నాగదుర్గాప్రసాద్, స్నేహితులైన షేక్ సాజీద్ అలియాస్ సజ్జు, మహమ్మద్ ఘాజీ అబ్బాస్ అలియాస్ గౌస్య, ఇలియాస్ అలియాస్ అంబటి, వైశెట్టి శ్రీవాసు అలియాస్ వాసు, షేక్ రెహమాన్ అలియాస్ బుడా, బడే పూర్ణచంద్రరావు అలియాస్ పూర్ణ కలిసి మద్యం తాగుతున్నారు. అదే సమయంలో మృతుడు శ్రీను అతని స్నేహితుడు దుర్గా అనే వ్యక్తితో కలిసి అక్కడికి వెళ్లాడు. శ్రీనుని చూసిన రమణ ఆగ్రహంతో ఊగిపోయాడు. గతం గుర్తు చేసుకుని శ్రీనుతో గొడవకు దిగాడు. రమణకు తోడు మేనల్లుడు రోహిత్, మేనమామ దుర్గాప్రసాద్, మిగిలిన స్నేహితులు శ్రీనుతో గొడవకు కాలు దువ్వటంతో రమణ అందుబాటులో ఉన్న క్రికెట్ బ్యాట్తో శ్రీను తలపై గట్టిగా కొట్టాడు. అడ్డు వచ్చిన స్నేహితుడు దుర్గా తలపై బాదాడు. దీంతో దుర్గా అక్కడి నుంచి పారిపోగా రమణ, రోహిత్, దుర్గాప్రసాద్ క్రికెట్బ్యాట్, రాడ్లు, కర్రలతో శ్రీనుపై మూకుమ్మడి దాడి చేసి తలపై బలమైన దెబ్బలు కొట్టారు. దీంతో శ్రీను తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీను చనిపోవటంతో అందరూ అక్కడి నుంచి పారిపోయారు. జరిగిన సంఘటనపై సమాచారం అందుకున్న ఇనకుదురుపేట పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతుని వివరాలతో పాటు హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. హత్య చేసింది రమణ అని తెలుసుకున్న పోలీసులు మృతుని భార్య వీర్నాల రామలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హత్య జరిగిన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు స్వయంగా పరిశీలించటంతో పాటు హత్యకు పాల్పడిన నిందితులను తక్షణమే అదుపులోకి తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు బుధవారం మధ్యాహ్నం రమణతో పాటు హత్యలో పాల్గొన్న అతని మేనల్లుడు, మేనమామ, హత్యకు సహకరించిన మిగిలిన స్నేహితులను చిన్నాపురం రోడ్డులోని టిడ్కో గృహాల వద్ద అదుపులోకి తీసుకున్నారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. అదుపులోకి తీసుకున్న హంతకులను కోర్టుకు హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు తెలిపారు. కేసును ఛేదించటంలో ప్రతిభ కనబరచిన పోలీసులను ఎస్పీ అభినందించినట్లు చెప్పారు. సమావేశంలో ఇనకుదురుపేట సీఐ పరమేశ్వరరావు, ఎస్ఐ బేగ్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. నాలుగు రోజుల్లోనే హంతకులను పట్టుకున్న పోలీసులు ఇనకుదురుపేట పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించిన డీఎస్పీ -
రంగు వెలుస్తున్న రంగస్థలం
జి.కొండూరు: ప్రాచీన కళలు ఆదరణ కోల్పోతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని కళాసంస్థల కృషి కారణంగానే అక్కడక్కడ ఈ కళలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రాచీన యుగం నుంచి నేటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు, మూఢాచారాలు, సామాజిక సమస్యల పరిష్కారం, స్వాతంత్రోద్యమం, ప్రజా ప్రయోజన ఉద్యమాల్లో ప్రజల్లో ఆలోచన, చైతన్యం, అవ గాహన కల్పించడంలో కళారంగానికి ప్రత్యేక స్థానం ఉంది. టీవీలు, థియేటర్ల రాకతో వాటికి ఆదరణ కరువైంది. ప్రస్తుతం సెల్ఫోన్ల కారణంగా సోషల్ మీడియా, సినిమా, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు, రియాలిటీ షోల వైపు ప్రజలు ఆకర్షితులయ్యారు. దీంతో సంస్కృతి, సంప్రదాయాలకు జీవం పోసిన ప్రాచీన కళారంగం నిరాదరణకు గురైంది. వాటికి జీవం పోయాల్సిన ప్రభుత్వాలు సైతం రంగస్థల దినోత్సవాల్లో హామీలు గుప్పించడం మినహా ప్రోత్సాహం ఇస్తున్న దాఖలాలు లేవు. కాలంతో పోటీ పడుతూ ప్రాచీన కళారంగానికి పూర్వ వైభవం తెచ్చేందుకు నాటక రంగ కళాకారులు కొందరు ఆరాటపడుతున్నారు. గురువారం ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాకారులందరికీ శుభాకాంక్షలు చెబుతున్నారు. మైలవరంలో నాటకరంగ ఆనవాళ్లు ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరంలో పూర్వం జమీందార్లు నాటక రంగాన్ని ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషించారని చరిత్ర చెబుతోంది. మైలవరం రెండో రాజుగా ప్రసిద్ధి చెందిన రాజా సూరానేని వెంకటపాపయ్యారావు బహుద్దూర్ 1912లో మైలవరం కంపెనీ అని పిలవబడే ‘బాలభారతి నాట్యమండలి’ని స్థాపించారు. ఆయన ఈ సమాజం ద్వారా నాటక రంగాన్ని, కళాకారులను ఎంతగానో ప్రోత్సహించారు. 1917, 1918లో బెజవాడలో ‘మైలవరం థియేటర్’ నిర్మించిన తర్వాత ఈ నాటక సమాజాన్ని అక్కడికి తరలించి ఎందరో ప్రముఖ కళాకారులకు వేతనాలు చెల్లించి ప్రోత్సహించారు. మైలవరం బాలభారతి నాటక సమాజ ప్రదర్శన అంటే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక గుర్తింపు ఉండేదని కళాకారులు చెబుతున్నారు. ఈ నాటక సమాజంలో యడవల్లి సూర్యనారాయణ, జొన్నవిత్తుల శేషగిరిరావు, దైతా గోపాలం, ఉప్పులూరి సంజీవరావు, గోవిందరాజుల వెంకట్రామయ్య వంటి ఎందరో సుప్రసిద్ధ కళాకారులు పనిచేశారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో... ఉమ్మడి కృష్ణాజిల్లాలో ప్రాచీన కళలకు ప్రత్యేక స్థానం ఉంది. పౌరాణిక పద్య నాటకం, చారిత్రక , జానపద నాటకాలు, సాంఘిక నాటకాలు, పరిషత్తు నాటకాలు, హరికథ, బుర్రకథ, జముకుల కథ, చెక్క భజన, తోలు బొమ్మలాట, డప్పు కళలు ఇలా అన్ని ప్రాచీన కళలకు చెందిన నాలుగువేల మంది వరకు కళాకారులు ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఉన్నారు. వీరిలో నాటక రంగానికి చెందిన కళాకారులు 1500 మంది ఉన్నారు. వీరు కాక కోలాటం వంటి వివిధ కళలకు చెందిన కళాకారులు అదనం. పూర్వ వైభవానికి కృషి ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండలం వెలగలేరు గ్రామానికి చెందిన నాటక, సినీరంగ కళాకారులు పోలుదాసు రంగనాయకులు, పోలుదాసు శ్రీనివాసరావు సోదరులు ‘ఆదర్శ గ్రామీణ సాంస్కృతిక సేవా సంస్థ’, ‘వెలగలేరు థియేటర్ ఆర్ట్స్’ పేర్లతో సంస్థలను ఏర్పాటు చేసి గత కొన్నేళ్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ నాటక సమాజాలను ఆహ్వానించి నాటకోత్సవాలను నిర్వహిస్తున్నారు. సోదరుల్లో ఒకరైన పోలుదాసు రంగనాయకులు 50కి పైగా నాటకాల్లో విభిన్న పాత్రలు పోసిస్తూ రెండు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన నాటకరంగానికి జీవం పోసేందుకు కళాకారులతో ప్రదర్శనలు ఇప్పించడం, సీనియర్ కళాకారులను సన్మానించడం వంటి కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. పోలుదాసు శ్రీనివాసరావు వినూత్న కథాంశంతో నాటికలు రచించి, కళాకారులకు శిక్షణ ఇచ్చి, జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇప్పిస్తుంటారు. ఇదే మండలంలోని కోడూరు గ్రామానికి చెందిన నాటక, సినీ రంగ కళాకారుడు వీరంకి వెంకట నర్సింహారావు ‘చైతన్య కళా స్రవంతి’ సంస్థను స్థాపించి గ్రామంలో నాటకోత్సవాలను నిర్వ హిస్తున్నారు. ప్రభుత్వాల ఆదరణకు నోచుకోని ప్రాచీన కళలు స్వచ్ఛందంగా నాటక రంగానికి జీవం పోస్తున్న కళాకారులు ఉమ్మడి కృష్ణాజిల్లాలో 1500 మంది నాటకరంగ కళాకారులు నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం -
నేడు ఆర్టీసీ జిల్లా డిస్పెన్సరీ నూతన భవనం ప్రారంభం
మచిలీపట్నంటౌన్: మచిలీపట్నం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నూతనంగా నిర్మించిన వైద్య ఆరోగ్య డిస్పెన్సరీ భవన ప్రారంభోత్సవం గురువారం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రవాణా శాఖా మంత్రిగా పని చేసిన మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని) ప్రత్యేక కృషితో ఈ డిస్పెన్సరీ నిర్మాణం ప్రారంభమైంది. ప్రస్తుతం డిస్పెన్సరీ నిర్వహిస్తున్న గృహం శిథిలావస్థకు చేరటంతో వైద్య సేవలందించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా పేర్ని నాని దాదాపు రూ.80 లక్షల నిధులు మంజూరు చేయించి ఈ నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. భవన నిర్మాణం ఎప్పుడో పూర్తయినా కూటమి నాయకులు ఎట్టకేలకు గురువారం దీనిని ప్రారంభించేందుకు నిర్ణయించారు. ఈ డిస్పెన్సరీలో జిల్లాలోని ఐదు ఆర్టీసీ డిపోల్లో పని చేస్తున్న దాదాపు 1400 మంది ఉద్యోగులు, సిబ్బంది వైద్య సేవలు పొందనున్నారు. ప్రతి రోజూ సరాసరిన 80 మంది వైద్య సేవలు పొందుతున్నారు. పేర్ని నాని రవాణా శాఖా మంత్రిగా ఉన్న సమయంలోనే బస్టాండ్ అభివృద్ధికి దాదాపు రూ.3.40 కోట్లను కేటాయింప చేసి పనులను పూర్తి చేశారు. చిన్న పాటి వర్షానికే చెరువును తలపించే బస్టాండ్ ఆవరణలో కాంక్రీట్ మెరక పనులు చేశారు. అధునాతన టాయిలెట్లు, బస్టాండ్ ఎలివేషన్, బస్టాండ్ భవన విస్తరణ తదితర పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం బస్టాండ్ అభివృద్ధి అంతా నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వ కృషికి నిదర్శనంగా నిలుస్తోంది. గురువారం ఉదయం 10 గంటలకు జరిగే ఈ డిస్పెన్సరీ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖా మంత్రి ఎం.రామ్ప్రసాద్రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, జిల్లా ఇన్చార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ కార్యదర్శి కాంతీలాల్దండే, ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హాజరవుతారని జిల్లా ప్రజా రవాణాధికారి ఎ.వాణిశ్రీ బుధవారం తెలిపారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యునిగా కై లే
పామర్రు: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పామర్రు నియోజకవర్గ మాజీ శాసన సభ్యుడు, పార్టీ అధికార ప్రతినిధి కై లే అనిల్కుమార్ను వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యునిగా నియమిస్తూ కేంద్ర కార్యాలయం నుంచి బుధవారం రాత్రి ఉత్తర్వులు వచ్చాయి. ఈ సందర్భంగా కై లే అనిల్కుమార్ మాట్లాడుతూ తనను నమ్మి అవకాశాన్ని కల్పించిన జగనన్నకు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ ఇచ్చిన ఈ పదవిని సద్వినియోగం చేసుకుని పార్టీని మరింతగా పటిష్టపరిచే విధంగా తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని చెప్పారు. పీఎం యోగ అవార్డుకు దరఖాస్తు చేసుకోండి విజయవాడస్పోర్ట్స్: దేశవ్యాప్తంగా యోగ అభివృద్ధికి, ప్రచారానికి కృషి చేసిన యోగా నిపుణులకు కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ 2025 వ సంవత్సరానికి గాను ప్రధానమంత్రి యోగ అవార్డును ప్రదానం చేసేందుకు ప్రకటన జారీ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఎండీ పి.ఎస్.గిరీష తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న రాష్ట్రానికి చెందిన యోగా నిపుణులు అవార్డు నిమిత్తం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.దరఖాస్తులు httpr:// innovate india.mygov.in/pm-yoga-awardrs–2025/ వైబ్సెట్ ద్వారా ఆన్ లైన్ లో ఈ నెల 30వ తేదీ లోపు పంపించాలని పేర్కొన్నారు.ఘంటసాల బౌద్ధ స్థూపాన్ని సందర్శించిన జపాన్ దేశస్తులు ఘంటసాల: ప్రముఖ బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న ఘంటసాల బౌద్ధ స్థూపాన్ని, మ్యూజియాన్ని సందర్శించడం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని జపాన్ దేశస్తులు అన్నారు. కృష్ణాజిల్లా ఘంటసాల గ్రామంలోని బౌద్ధ స్థూపం, బౌద్ధ మ్యూజియాన్ని బుధవారం వారు సందర్శించారు. ఈ సందర్భంగా బౌద్ధ స్థూపం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్థూపం ఎదురుగా ఉన్న బౌద్ధ శిల్ప సంపద ఉన్న మ్యూజియాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘంటసాల గ్రా మ చరిత్ర, బౌద్ధ స్థూపం, మ్యూజియం వివరాలను జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి రామకృష్ణ జపాన్ దేశస్తులకు వివరించారు. తెలుగు రాష్ట్రాల్లోని బౌద్ధ క్షేత్రాల సందర్శనలో భాగంగా ఘంటసాల బౌద్ధ స్థూపం, మ్యూజియాన్ని సందర్శించినట్లు హైదరాబాద్కు చెందిన గైడ్ కరుణానిధి తెలిపారు. అమరావతి, నాగా ర్జున సాగర్, గుంటుపల్లి గుహలు, శ్రీకాకుళం జిల్లాలోని బౌద్ధ ప్రదేశాల్లో పర్యటించి ఘంటసాలకు వచ్చినట్లు చెప్పారు. జపాన్ దేశస్తులు నాకజిమ యుకి హిసా, కటయమా తత్తసు, ఊరగామి నోరికో, సానో కాజుహారు, కనికో తకాకాజు, మంచిదా షాంచి, యామజకి తదశి, వాకుయ్ తోషిమితసు, టోనే మోటాకో పాల్గొన్నారు. -
ప్రకాశించాలని.. ప్రయాస!
ఉడికిన కొమ్ములను కల్లంలో ఆరబెట్టిన దృశ్యం పచ్చబంగారం(పసుపు) ఈ సారి ప్రకాశిస్తుందన్న ఆశతో రైతన్నలు ఉత్సాహంగా పనులు చేపడుతున్నారు. వాణిజ్య పంటల్లో ఒకటైన పసుపు పంటను కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఈ వ్యవసాయ సీజన్లో 5,031 ఎకరాల్లోనూ, ఎన్టీఆర్ జిల్లాలో 707 ఎకరాల్లోనూ సాగు చేశారు. కొద్ది రోజులుగా పసుపు ఆకుతీత, దుంప తీత పనులను రైతులు ముమ్మరంగా చేపడుతున్నారు. కల్లాల్లో పసుపు కొమ్ములను రాశులుగా పోసి వంట పనులు చేపడుతున్నారు. సహజంగా పసుపు కొమ్ములను బాండీల్లో పెట్టి ఉడికించి ఆరబెడుతుంటారు. ఈ దఫా అధికశాతం మంది బాయిలర్స్ను వినియోగిస్తున్నారు. ఆ తర్వాత ఎండబెట్టి పసుపు కొమ్ముల నాణ్యత పెంచే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. మంచి ధర వస్తే మార్కెట్కు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. – కంకిపాడు -
బంగారం చోరీ కేసులో నిందితుల అరెస్టు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలులో బంగారు ఆభరణాల బ్యాగు చోరీ కేసులో జీఆర్పీ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.15.62 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం విజయవాడ రైల్వేస్టేషన్లోని జీఆర్పీ పోలీస్స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సీఐ జి.వి రమణ, ఆర్పీఎఫ్ సీఐ ఫలే ఆలీబేగ్ వివరాలను వెల్లడించారు. తెలంగాణలోని రాజాంపేటకు చెందిన గుడిమెట్ల భానుప్రియ ఈ నెల 13న కుటుంబసభ్యులతో సామర్లకోటకు గౌతమి ఎక్స్ప్రెస్ రైలులో బయలుదేరారు. ఆమె బ్యాగులో ల్యాప్టాప్, బంగారు ఆభరణాలు, సెల్ఫోన్ను ఉంచి దాన్ని తలకింద పెట్టుకుని నిద్రపోయింది. విజయవాడ దాటిన తర్వాత చూసుకుంటే బ్యాగు కనిపించలేదు. టీటీఈలకు ఫిర్యాదు చేసి ఆమె తన ప్రయాణాన్ని కొనసాగించింది. తిరిగి ఈ నెల 16న విజయవాడ జీఆర్పీ స్టేషన్కు చేరుకుని తన బ్యాగును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు ఫిర్యాదు చేసింది. 95 గ్రాముల చైను, 44 గ్రాముల నెక్లెస్, 18 గ్రాముల నెక్లెస్, 18 గ్రాముల రెండు జతల చెవి రింగులు, 42 గ్రాముల నల్లపూసల గొలుసు, 24 గ్రాముల వెండి భరణితో పాటు ల్యాప్టాప్, ఒక సెల్ఫోన్ బ్యాగులో ఉన్నట్లు వాటి విలువ సుమారు రూ. 15.65 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు ప్రత్యేక బృందాలుగా.. కేసు నమోదు చేసిన పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను గుర్తించారు. వారిలో ఖమ్మంజిల్లా బోనకల్లు మండలానికి చెందిన పుచ్చకాయల నరేష్ (25), షేక్ హైమద్(25)ను గుర్తించారు. నిందితులు హైదరాబాద్లోని కేజీహెచ్బీ కాలనీలోని రాఘవేంద్ర మెన్స్ హాస్టల్లో ఉన్నట్లు తెలుసుకుని వారిని పట్టుకున్నారు. వారిని విచారణ చేయగా చోరి చేసినట్లు అంగీకరించారు. వారి వద్ద కొంత బంగారం, ల్యాప్ట్యాప్ లభ్యమవ్వగా, కొంత బంగారాన్ని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో తనఖా పెట్టినట్లు తెలపడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. సెల్ఫోన్ మినహా మొత్తం రికవరీ చేశారు. వీరిపై గతంలో కేసులున్నాయి. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రూ.15.62 లక్షల ఆభరణాలు స్వాధీనం -
ఆరోగ్యం దెబ్బతింటుంది..
అధికారంలోకి రావడం కోసం ఎన్నో హామీలు ఇచ్చారు. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. పవన్కల్యాణ్ అవనిగడ్డ వచ్చినపుడు ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక డీఎస్సీ గురించి అస్సలు మాట్లాడటం లేదు. మా పక్షాన డీసీఎం గళం విప్పాలి. – కె.సూర్య, పశ్చిమగోదావరి కుటుంబ సభ్యులను వదిలి వచ్చి కోచింగ్లు అంటూ సంవత్సరాలు తరబడి అవనిగడ్డలో ఉంటున్నాం. అప్పులు చేసి మరీ ఇక్కడ ఉండాల్సి వస్తోంది. దీనివల్ల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. డీఎస్సీ ఇస్తామని చెబితే నమ్మి ఓట్లేశాం. ఇప్పటికై నా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. లేకుంటే రానున్న రోజుల్లో మరింత తీవ్రంగా పోరాటాలు చేస్తాం. – భాస్కరరెడ్డి, అనంతపురం -
ఆపద వేళ స్వీయరక్షణ అవసరం
అవగాహన సదస్సులో అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు కోనేరుసెంటర్: మహిళల రక్షణకు అనేక చట్టాలు అమలులో ఉన్నాయని, వాటన్నింటిపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పోలీసు పరేడ్గ్రౌండ్లోని స్పందన హాలులో ‘మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలు– నియంత్రణ’పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న అడిషనల్ ఎస్పీ నాయుడు మాట్లాడుతూ మహిళలు ఆపదలో ఉన్నపుడు పోలీసులను గుర్తు తెచ్చుకోవటం ఎంత అవసరమో.. తనను తాను రక్షించుకునే మార్గాలను అన్వేషించటం కూడా అంతే అవసరమన్నారు. అవసరమైతే ఆ సమయంలో ఆడవాళ్లు ఆదిపరాశక్తిగా మారి తనను తాను ఒక ఆయుధంలా మార్చుకునేందుకు ప్రయత్నించాలన్నారు. అలాగే సామాజిక మాధ్యమాలు అనేవి సమాచార సేకరణకు, భావవ్యక్తీకరణకు ఉపయోగించుకోవాలన్నారు. తమ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసే సమయంలో గోప్యతను పాటించాలన్నారు. ప్రమాదకర పరిస్థితులు ఎదురైనపుడు హెల్ప్ లైన్ నంబర్లు 181, 121, 1098లకు ఫోన్ చేసి పోలీసుల నుంచి తక్షణ రక్షణను పొందవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఫోన్లలో శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకుని పోలీసు సేవలను పొందాలని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. అనంతరం పలువురు అధికారులు చట్టాలు, రక్షణ, పోలీసు చర్యలు, స్వీయరక్షణ తదితర విషయాలను వివరించారు. కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సీఐ వాస వెంకటేశ్వరరావు, సీడబ్ల్యూసీ చైర్మన్ కె.సువార, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్. రాణి, సీడీపీవో మౌనిష, వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అర్చిష్మ తదితరులు పాల్గొన్నారు. -
స్విమ్మింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం
విజయవాడస్పోర్ట్స్: ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ ఆక్వాటిక్ అసోసియేషన్ (ఏపీఏ ఏఏ) రాష్ట్ర నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా ఎం. ఓబుల్ రెడ్డి, ఎం. మోహనవెంకటరామ్ ఎన్నికయ్యారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్ లో రాష్ట్ర సంఘం ఎన్నికలు జరిగాయి. సంఘ చైర్మన్గా డాక్టర్ కె. రవికాంత్, గౌరవాధ్యక్షుడిగా పి.గోవిందరాజు, ఉపాధ్యక్షుడిగా రవి శంకర్ రెడ్డి, ప్రసాద్, శ్రీనివాసరావు, మధు, భాస్కర్, సతీష్, సహాయ కార్యదర్శులుగా మల్లికార్జునరావు, వినోద్, శ్రీధర్, సుబ్బారెడ్డి, నటరాజరావు, కోశాధికారిగా ఐ. రమేష్, కార్యవర్గ సభ్యులుగా కాజ మొహిద్దిన్, నాగ మురళి, దేవుడు, శంకర్ రెడ్డి, మేఘన లను సభ్యులు ఎన్నుకున్నారు. 2028 వరకు వీరంతా సంఘ ప్రతినిధులుగా కొనసాగుతారు. జూడో రాష్ట్ర జట్లు ఎంపిక విజయవాడస్పోర్ట్స్: జాతీయ జూనియర్ జూడో క్రీడా పోటీలకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర జట్లను ఎంపిక చేసినట్టు ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ సీఈవో వెంకట్ నామిశెట్టి తెలిపారు. ఇటీవల నిర్వహించిన రాష్ట్ర జట్టు ఎంపిక పోటీల్లో అత్యుత్తమ క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన క్రీడాకారులను ఎంపిక చేశామన్నారు. బాలుర జట్టుకు తేజకుమార్, తిరుమల, దిలీప్ కుమార్ రెడ్డి, ఉదయ్ కిరణ్, గోవర్ధన్, గగన్ సాయి, శివ సాయి, రంగస్వామి, బాలికల జట్టుకు ప్రవల్లిక, లక్ష్యా రెడ్డి, వైష్ణవి, అలేఖ్య, కీర్తన, భావన, రిషిత కృష్ణ, కోటేశ్వరి ఎంపికై నట్లు తెలిపారు. ఈ నెల 28 నుంచి ఉత్తరా ఖండ్లోని డెహ్రాడూన్లో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. జట్టుకు ఎంపికై న క్రీడాకారులను ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ రవినాయుడు, ఆంధ్రప్రదేశ్ జూడో సంఘం అధ్యక్షుడు గణేష్ సుబ్బారావు, సంయుక్త కార్యదర్శి గమిడి శ్రీనివాస్, ఉషారాణి, కోచ్ తేజ, శ్రీను శాప్ కార్యాలయంలో మంగళవారం అభినందించారు. మధ్యకట్టకు మరమ్మతులు ప్రారంభం మధురానగర్(విజయవాడసెంట్రల్): ఎట్టకేలకు నగరపాలకసంస్థ అధికారులు బుడమేరు మధ్యకట్టలో బుడమేరుకు పడిన గండికి మరమ్మతులు ప్రారంభించారు. బుడమేరు వరదల సమయంలో బుడమేరు మధ్యకట్టలో గండి పడింది. బుడమేరులో వరదప్రవాహం గండి ద్వారా ఏలూరు కాలువలోకి ప్రవహించింది. దీంతో రోడ్డు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉద్ధృతి తగ్గిన తరువాత తూతూ మంత్రంగా బుడమేరులోని మురుగునీరు ఏలూరు కాలువలోకి రాకుండా కొద్దిపాటి మట్టిని వేసి వదలేశారు. దీంతో అప్పటి నుంచి ఇక్కడ రాకపోకలు నిలిచిపోవటంతో స్థానికులు పడుతున్న అవస్థలు వివరిస్తూ ‘సాక్షి’ పలుమార్లు కథనాలు ప్రచురించింది. దీనిపై స్పందించిన అధికారులు ఎట్టకేలకు మరమ్మతు పనులు ప్రారంభించారు. 27న ఉప సర్పంచ్ ఎన్నికలు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలలో ఈనెల 27న ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి లావణ్య కుమారి ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో జి. కొండూరు మండలం కట్టుబడిపాలెం గ్రామ పంచాయతీ, వత్సవాయి మండలం మంగొల్లు, ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం, విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. పంచాయతీల ప్రిసైడింగ్, అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారి హాజరై ఓరియంటేషన్ కార్యక్రమంలో సూచనలు, సలహాలు ఇచ్చారన్నారు. కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి జీఎల్ఎల్వీఎన్ రాఘవన్ పాల్గొని ఓరియంటేషన్ను విజయవంతం చేశారన్నారు. -
చేనేత వస్త్రాలను ఆదరించాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత అన్నారు. ఎంజీ రోడ్డులోని శేషసాయి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలను మంగళవారం ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత వస్త్రాల అమ్మకాలకు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఉగాది నేపథ్యంలో విజయవాడలో నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర చేనేత, జౌళిశాఖ కమిషనర్ రేఖారాణి, జాయింట్ డైరెక్టర్ కన్నబాబు, ఆప్కో జీఎం రాజారావు తదితరులు పాల్గొన్నారు. దారి దోపిడీ కేసులో నిందితులకు కఠిన కారాగార శిక్ష గన్నవరం: దారి దోపిడీ కేసులో ముగ్గురు నిందితులు ఒక్కొక్కరికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ గన్నవరం 8వ అదనపు ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపిన సమాచారం మేరకు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి చెందిన ఓ వైద్యుడు వద్ద మొగల్రాజపురానికి చెందిన కుక్కల వెంకటేశ్వర్లు కారు డ్రైవర్. గతేడాది ఆగస్టు 26వ తేదీ రాత్రి ఆయన మరదలు వరసైన కొమ్ము శిరోమణితో కలిసి వెంకటేశ్వర్లు బైక్పై ముస్తాబాద వైపు బయలుదేరాడు. మార్గమధ్యంలో రిలయన్స్ గోడౌన్ వద్ద ముగ్గురు వ్యక్తులు వీరి బైక్ను అడ్డుకున్నారు. వీరి వద్ద బంగారు చైన్, ఉంగరంతో పాటు చెవి దిద్దులు, కీప్యాడ్ ఫోన్ను లాక్కుని దుండగులు పరారయ్యారు. ఘటనపై వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చోరీకి పాల్పడిన విజయవాడలోని జక్కంపూడికి చెందిన పాలపర్తి వెంకన్న, నల్లగొండ సురేష్, కుమ్మరిపాలెంకు చెందిన నక్కా గోపిరాజును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసులో నిందితులపై నేరం రుజువు కావడంతో కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ 8వ అదనపు ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెల్లడించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో నెల రోజుల జైలుశిక్ష అమలు చేయాలని తీర్పులో పేర్కొన్నారు. కేసులో గన్నవరం సీఐ బీవీ. శివప్రసాద్ నేతృత్వంలో సాక్షులను ప్రవేశపెట్టగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి. మాధవి వాదనలు వినిపించారు. ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ పనులు పూర్తిరైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024–25లో విజయవాడ రైల్వే డివిజన్ 206.29 ఆర్కేఎం (రూట్ కిలోమీటర్లు) ఆటోమెటిక్ బ్లాక్ సిగ్నలింగ్ (ఏబీఎస్)ను విజయవంతంగా పూర్తిచేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. డివిజన్లోనే కీలకమైన సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, రావికంపాడు సెక్షన్లో ఈ నెల 23న 29.67 ఆర్కేఎం ఏడీఎస్ను విజయవంతంగా పూర్తిచేయడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డివిజన్ 206.29 ఆర్కేఎం సాధించినట్లైంది. దీంతో విజయవాడ–విశాఖపట్నం, విజయవాడ– గూడూరు సెక్షన్న్లలో రద్దీ తగ్గుతుంది. ఏబీఎస్ అనేది రైల్వే నిర్వహణ సామర్థ్యాన్ని పెంచు తుంది. ఈ సందర్భంగా డీఆర్ఎం నరేంద్ర అధికారులు, సిబ్బందిని ప్రశంసించారు. -
సర్కారుతో ఢీఎస్సీ!
కదం తొక్కిన నిరుద్యోగులు అవనిగడ్డ: మెగా డీఎస్సీని వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగులు రోడ్డెక్కారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని నినదించారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ వంతెన సెంటర్లో మంగళవారం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో వందలాది మంది అభ్యర్థులు రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. దీంతో కిలో మీటర్ మేర ట్రాఫిక్ స్తంభించింది. కూటమి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. భారీ ర్యాలీ.. ధర్నా.. అవనిగడ్డ గ్రంథాలయం నుంచి వంతెన సెంటర్ వరకూ భారీ ర్యాలీ చేశారు. అనంతరం వంతెన సెంటర్లో ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. మానవహారం నిర్వహించారు. ‘సీఎం చేసిన మొదటి సంతకాన్ని అమలు చేయాలి, ప్రభుత్వం ఆమోదించిన 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయాలి, పది లక్షల మంది డీఎస్సీ నిరుద్యోగులకు న్యాయం చేయాలి, తొలి సంతకం చేసిన డీఎస్సీ ఎక్కడ?, చంద్రన్నా.. మెగా డీఎస్సీ ఏదన్నా, జీవో 117ని రద్దు చేయాలి, ప్రశ్నించే పవన్కల్యాణ్ ఎక్కడ?’ అంటూ నినాదాలు చేశారు. పలు డిమాండ్లతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రశ్నిస్తానన్న పవన్కల్యాణ్ ఎక్కడ? ఎన్నికల ముందు సభలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ఇస్తామని, లేదంటే అభ్యర్థుల తరఫున తానే ప్రశ్నిస్తానని చెప్పిన డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్కడ? అని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి. రామన్న ప్రశ్నించారు. డీఎస్సీ ఇవ్వక పోవడం వల్ల లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర మనోవేదన పడుతున్నారని, ప్రశ్నించడానికే పుట్టానని చెప్పుకునే పవన్కల్యాణ్ నోరు ఎందుకు మూగబోయిందో చెప్పాలన్నారు. యువతను తప్పుదోవ పట్టించేలా మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ నీచమైన రాజకీయాలకు పవన్కల్యాణ్ తెరతీశారని విమర్శించారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు, జేఏసీ నాయకులు, డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు. అవనిగడ్డలో రహదారిపై అభ్యర్థుల బైఠాయింపు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా హోరెత్తిన నినాదాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ -
గోఆధారిత వ్యవసాయం మేలు
పెనుగంచిప్రోలు: గోఆధారిత వ్యవసాయం ఎంతో మేలని రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ అథారిటీ చైర్మన్ శావల దేవదత్ అన్నారు. స్థానిక రాధాకృష్ణ కల్యాణ మండపంలో మంగళవారం గోఆధారిత వ్యవసాయంపై అవగాహన సదస్సు, అనంతరం వ్యవసాయ రంగంలో వినూత్న రీతిలో పంట ఉత్పత్తులను సాగిస్తున్న 108 మంది ఆదర్శ రైతులను ఉగాది పురస్కారాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. ఆరోగ్యం కావాలంటే ఇది చేయాలి.. మాజీ మంత్రి నెట్టెం రఘురాం మాట్లాడుతూ భూమి ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యకరమైన ఉత్పత్తులు తిని మనమంతా ఆరోగ్యంగా ఉంటామన్నారు. దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే రసాయన రహిత వ్యవసాయం చేయాలన్నారు. దక్షిణ రాష్ట్రాల సేంద్రియ వ్యవసాయ నిపుణులు టి. నాగరాజు మాట్లాడుతూ ఆవు పేడ, మూత్రం తప్ప భూమికి లాభం చేకూర్చేవి ఏమీ లేవన్నారు. ఆవు పేడ, మూత్రంతో జీవామృతం, కషాయాలు తయారు చేసుకుని ఆరోగ్యకర వ్యవసాయం చేసుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ జగ్గయ్యపేట ఏడీఏ సి.భవానీ, జెడ్పీటీసీ సభ్యురాలు వూట్ల నాగమణి, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి బాలాజీ, రైతునేస్తం యడ్లపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. సదస్సు సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు సేంద్రియ, గోఆధారిత ఉత్పత్తులపై స్టాల్స్ ఏర్పాటు చేశారు. సదస్సులో పాల్గొన్న వారి అభిప్రాయాలు వారి మాటల్లో.. రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ అథారిటీ చైర్మన్ శావల దేవదత్ 108 మంది ఆదర్శ రైతులకు ఉగాది పురస్కారాలు -
హిజ్రా ప్రోద్బలంతోనే హత్య.. ప్రియుడే హంతకుడు
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా తాడేపల్లి రూరల్ కొలనుకొండ డీజీపీ కార్యాలయం సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన లక్ష్మీతిరుపతమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్టు చేసి గుట్టుచప్పుడు కాకుండా కోర్టులో మంగళవారం హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయన కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన హిజ్రా బత్తుల శశి అలియాస్ జెస్సీ ఏడాది క్రితం కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన లక్ష్మీ తిరుపతమ్మ(32)ను వ్యభిచార వృత్తిలోకి దించింది. కొలనుకొండ వద్ద ఆమెతో వ్యభిచారం చేయిస్తోంది. ఈ క్రమంలో స్థానికంగా ఉండే ముత్యాల కోమల్ కుమార్ (చింటూ) తిరుపతమ్మకు పరిచయమయ్యాడు. వీరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరూ ఒకే గదిలో కొంతకాలం సహజీవనం చేశారు. ఈ క్రమంలో బత్తుల శశి అలియాస్ జెస్సీ (హిజ్రా) భర్త నవీన్తోనూ లక్ష్మీతిరుపతమ్మ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడు చింటూను దూరంగా ఉంచుతోంది. దీనిని మనస్సులో పెట్టుకున్న జెస్సీ లక్ష్మీతిరుపతమ్మపై కోపంతో రగిలిపోయింది. చింటూను ఉసిగొల్పి తిరుపతమ్మను హత్య చేయించింది. హత్య జరిగిన 24 గంటల వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపర్చినట్లు డీఎస్పీ ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్పీ సతీష్కుమార్ ఆదేశాల మేరకు తాడేపల్లి సీఐ కల్యాణ్ రాజు, సిబ్బంది కేసును ఛేదించినట్టు వివరించారు. లక్ష్మీతిరుపతమ్మ హత్య కేసు ఛేదించినట్టు పోలీసుల ప్రకటన -
చెప్పుకోలేక.. కన్నీళ్లు దిగమింగలేక!
కన్నబిడ్డలు ఉన్నారో లేరో తెలియదు.. భారమై వదిలించుకున్నారో, తానే వాళ్లకు భారమనుకున్నాడో చెప్పుకోలేడు.. ముదిమి వయసులో మండుటెండలో జీవశ్చవమయ్యాడు. కాళ్లు కదపలేడు, కన్నీటిని ఆపుకోలేడు.. ఊరు పేరు తప్ప వివరాలకు ఉబికి వచ్చే కన్నీళ్లే సమాధానం. ఈ 70 ఏళ్ల శరీరం కర్నూలు నడిబొడ్డున, ప్రభుత్వాసుపత్రి ఎదుట మంగళవారం మధ్యాహ్నం దిక్కులు చూస్తూ.. దేవుడిపైనే భారం వేసింది. రోడ్డు మధ్యనున్న పచ్చని డివైడర్లో ఈ ‘పెద్దరికం’ మోడుబారి పడుకుంది. ఇతని పేరు సత్యనాగరాజు. ఊరు విజయవాడ తప్ప ఏమీ చెప్పలేని పరిస్థితి అతనిది. విషయం తెలుసుకున్న ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు చలించిపోయారు. ‘108’ని పంపి ఆయన్ను క్యాజ్వాలిటీలో అడ్మిట్ చేయించారు. –కర్నూలు(హాస్పిటల్) -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
కొండాయపాలెం(పామర్రు): పామర్రు–దిగమర్రు జాతీయ రహదారిలో కొండాయ పాలెం వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెదమద్దాలి శివారు కొండాయపాలెం గ్రామం వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వస్తున్న మరో లారీ ఢీకొట్టింది. ఢీ కొట్టిన లారీ క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న పామర్రు ఎస్ఐ రాజేంద్రప్రసాద్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మరో లారీకి తాళ్లు కట్టి క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను బయటకు లాగి ప్రాణాలు కాపాడారు. లారీడ్రైవర్ కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు మలుపులో లారీ ఆగి ఉండటంతో వేగం వస్తున్న లారీ డ్రైవర్ చూడక ఢీకొట్టాడని తెలుస్తోంది. లారీ డ్రైవర్ తోట్లవల్లూరు మండలం కళాసుమాలపల్లికి చెందిన గుంజ శ్రీనివాసరావుగా గుర్తించారు. బాధితుడిని మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. లారీ ఢీ.. వృద్ధుడి మృతి పాయకాపురం(విజయవాడరూరల్): నున్న పీఎస్ సమీపంలో ప్రకాష్నగర్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న టి.పైడిరాజు (65)ను లారీ ఢీ కొనగా ఘటనా స్థలిలోనే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇందిరానాయక్నగర్కు చెందిన తాలాడి పైడిరాజు పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. చేపల మార్కెట్ వద్ద చేపలు కొనుగోలు చేసి వాటిని బాగు చేయించడానికి ప్రకాష్నగర్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన లారీ.. అతన్ని ఢీకొట్టింది. రోడ్డుపై పడిపోయిన పైడిరాజు తలపై లారీ ఎక్కడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతుని కుమారుడు టి.శ్రీను ఫిర్యాదుపై పోలీసులు కేసు నమాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కారు ఢీకొని వ్యకి దుర్మరణంచౌటుప్పల్ రూరల్: రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీ కొనడంతో మృతి చెందాడు. ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామ స్టేజీ వద్ద మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్లపెనుమర్రు గ్రామానికి చెందిన గొరిపర్తి నాగేశ్వరరావు(52) 30 ఏళ్ల క్రితం కుటుంబంతో కలిసి చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామానికి వలస వచ్చి స్థానికంగా ఓ కెమికల్ పరిశ్రమలో క్యాంటిన్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బిజినెస్లో నష్టం రావడంతో ప్రస్తుతం అంకిరెడ్డిగూడెం గ్రామ స్టేజీ వద్ద ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. రోజుమాదిరిగా శనివారం హోటల్లో పనిచేయడానికి వెళ్లిన నాగేశ్వరరావు ఉదయం 11గంటలకు ఇంటికి వెళ్లడానికి విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి దాటుతుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావు ఘటనా స్థలిలోనే మరణించాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె వివాహమైంది. భార్య, కొడుకు కూడా హోటల్లోనే పని చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు గొరిపర్తి కృష్ణ ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ చెన్నబోయిన సతీష్పై కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మఽథకుమార్ తెలిపారు.