Krishna District News
-
ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి
గన్నవరం: గ్రావెల్ను అక్రమ రవాణా చేస్తున్న తొమ్మిది టిప్పర్ లారీలను సోమవారం అర్ధరాత్రి గన్నవరం పోలీస్లు సీజ్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి నుంచి అమరావతి రాజధాని ప్రాంతానికి గ్రావెల్ తరలింపు పేరుతో పక్కదారి పట్టిస్తున్న సమాచారం మేరకు పోలీసులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో మండలంలోని సవారిగూడెం పరిధిలో రియల్ ఎస్టేట్ వెంచర్కు గ్రావెల్ మట్టిని తరలిస్తున్న తొమ్మిది టిప్పర్లను గన్నవరం పోలీసులు పట్టుకున్నారు.అనంతరం టిప్పర్లను సీజ్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. -
అంగన్వాడీల జీతాలు పెంచే వరకు ఉద్యమిస్తాం
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): తాము అధికారంలోకి వస్తే అంగన్వాడీ టీచర్లు, ఆయాల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ హామీలు నెరవేర్చకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సీహెచ్ శ్రీనివాస్, సెంట్రల్ సిటీ సీఐటీయూ ప్రధాన కార్యదర్శి కె.దుర్గారావు హెచ్చరించారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాల జీతాలు పెంచాలని... మే నెలలో వేసవి సెలవులు ఇవ్వాలని, మెనూ చార్జీలు పెంచి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, గ్రాడ్యుటీ ఇవ్వాలని కోరుతూ ఏపీ అంగన్ వాడీ వర్కర్స్–హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో సింగ్ నగర్ కృష్ణాహోటల్ సెంటర్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న వారు మాట్లాడుతూ.. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కూటమి నాయకులు మొసలి కన్నీరు కార్చారని.. తాము అధికారంలోకి వస్తే జీతాలు పెంచుతామని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని, గ్రాడ్యుయేట్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేయటం ఎంతవరకు న్యాయమో చెప్పాలని నిలదీశారు. ఇప్పటికై నా ప్రభుత్వం పునరాలోచించి అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని లేని పక్షంలో దశల వారి ఉద్యమం చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. అంగన్వాడీ వర్కర్స్–హెల్పర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు టి.గజలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విజయవాడ అర్బన్ ప్రాజెక్ట్ నాయకులు ఇ.మాణిక్యం, బి.కాశీరత్నం, కె.పూర్ణిమ, కె.నాగదుర్గ, సుభాషిని తదితరులు పాల్గొన్నారు. -
రిటైర్డు ఉద్యోగులు ఆరోగ్యంగా జీవించాలి
కోనేరుసెంటర్: సుదీర్ఘకాలం పాటు ప్రజలకు తమ విశిష్టమైన సేవలను అందించిన పోలీసు సిబ్బంది పదవీవిరమణ అనంతరం తమ శేషజీవితాన్ని సంతోషంగా, ఆరోగ్యంగా జీవించేందుకు ప్రయత్నించాలని జిల్లా ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో విధులు నిర్వహిస్తూ పదవీవిరమణ పొందిన సిబ్బందిని మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు వృత్తి కత్తి మీద సాములాటిదన్నారు. అలాంటి వృత్తిని దైవంగా భావించి శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పిస్తూ చేసిన సేవలు నిజంగా అభినందనీయమని కొనియాడారు. అనంతరం పదవీవిరమణ పొందిన ఏఎస్సైలు టీఆర్ఏ ప్రసాద్(నాగాయలంక), ఎంవీఎస్ఆర్ఎన్వీ ప్రసాద్(గుడివాడ వన్టౌన్), కె.నగేష్బాబు(ఉయ్యూరు), డీఎన్ మల్లేశ్వరీ (డీసీఆర్బీ), పి.నరసింహారావు (గన్నవరం)లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఇతర అధికారులు, పోలీస్ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్(ఆప్నా) అధ్యక్షుడిగా 2026–27 సంవత్సరానికి గాను నగరానికి చెందిన డాక్టర్ టీవీ రమణమూర్తి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు గవర్నర్పేటలోని ఐఎంఏ హాలులో పూర్వ అధ్యక్షుడు డాక్టర్ సీఎస్ఆర్ ప్రసాదరావు చేతుల మీదగా బాధ్యతలు చేపట్టారు. గన్నవరం: ఓ మైనర్ బాలికను వేధింపులకు గురి చేస్తున్న ఇంటర్మీడియెట్ చదువుతున్న బాలుడిపై గన్నవరం పోలీసులు మంగళవారం పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం... గన్నవరం గ్రామానికి చెందిన ఇంటర్మీడియెట్ సెకండియర్ చదువుతున్న విద్యార్థి అతని ఇంటి పక్కనే నివసిస్తున్న 8వ తరగతి బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక కుటుంబం గన్నవరంలో ఇల్లు ఖాళీ చేసి పెద్దఅవుటపల్లి వెళ్లిపోయారు. అయినప్పటికీ ఆ బాలికను సదరు విద్యార్థి వేధింపులకు గురిచేస్తుండడంతో పాటు ఆ బాలిక ఫొటోలను మార్ఫింగ్ చేసి ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్లో పెడతానని బెదిరిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆ బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతనిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకుని సదరు విద్యార్థి ఆ బాలిక ఇంటికి వెళ్లి ఆమె తల్లిని అసభ్యంగా తిట్టడంతో పాటు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇనగుదురుపేట పరిధిలో.. కోనేరుసెంటర్: ఆరేళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడిపై మంగళవారం పోక్సో కేసు నమోదైంది. ఇనగుదురుపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మచిలీపట్నం రాజుపేటలోని మగ్గాలకాలనీకి చెందిన అబ్దుల్కలాం సోమవారం అదే ప్రాంతానికి చెందిన ఆరేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి సమీపంలో ఉన్న ఆటోలోకి తీసుకువెళ్లాడు. ఆటోలో కూర్చోబెట్టి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని గ్రహించిన స్థానికులు ఆ యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. కేసు పెట్టేందుకు పూనుకోగా స్థానికంగా ఉన్న కొంత మంది పెద్దలు అబ్దుల్కలాంకు మతిస్థిమితం సరిగా ఉండదని సహృదయంతో క్షమించాలని కోరారు. అయితే బాలిక తల్లిదండ్రులు జరిగిన ఘోరంపై మంగళవారం ఇనగుదురుపేట పోలీసులకు జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు అబ్దుల్కలాంపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. యువకుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
కాలుష్యాన్ని తగ్గించేందుకు మిస్ట్ వెహికల్స్
పటమట(విజయవాడతూర్పు): కాలుష్యాన్ని తగ్గించేందుకు విజయవాడ నగరపాలకసంస్థ 6 మిస్ట్ వాహనాలు అందుబాటులోకి తీసుకొచ్చిందని వీఎంసీ స్పెషల్ ఆఫీసర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మిశ అన్నారు. కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో వీఎంసీ ప్రధాన కార్యాలయంలో మిస్ట్ వాహనాలను మంగళవారం మధ్యాహ్నం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మీశ మాట్లాడుతూ.. విజయవాడ నగరపాలక సంస్థ కాలుష్యాన్ని తగ్గించేందుకు, వాయు నాణ్యతను పెంచేందుకు మిస్ట్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు నగరపాలక సంస్థ కృషి చేస్తుందని చెప్పారు. నగర పరిధిలోని ప్రధాన కూడల్లో ఎక్కడైతే కాలుష్యానికి ఎక్కువగా అవకాశం ఉంటుందో అక్కడ ప్రతిరోజు ఈ వాహనాలను అందుబాటులోకి ఉంచి కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుందన్నారు. కార్యక్రమంలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె.అర్జునరావు, చీఫ్ ఇంజినీర్ ఇన్చార్జి పి.సత్యకుమారి సూపరింటెండింగ్ ఇంజినీర్ వర్క్స్ వి.చంద్రశేఖర్, బయాలజీ కామేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో నిర్వహించిన ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–2 (కాంపోజిట్ కోర్స్), ఓపెన్ స్కూల్ సెకండరీ సర్టిఫికెట్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–1 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు తెలిపారు. మంగళవారం పరీక్షల నిర్వహణను డీసీఓ, డీజీఈ కార్యాలయ అధికారులు పర్యవేక్షించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్ బందాలు 50 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయగా, అదనంగా ఏసీజీఈ అధికారులు ఎనిమిది కేంద్రాలను పరిశీలించారని తెలిపారు. అన్ని కేంద్రాల్లో నియమ నిబంధనలు కచ్చితంగా అమలైనట్లు అధికారులు వెల్లడించారు. 99.92 శాతం హాజరు.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,109 మంది విద్యార్థులు పరీక్షలకు నమోదు కాగా, 6,104 మంది హాజరై పరీక్షలు రాశారు. ఐదుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం హాజరు శాతం 99.92గా నమోదైనట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల తనిఖీ.. జిల్లా విద్యాశాఖాధికారి యు.వి. సుబ్బారావు మచిలీపట్నంలోని కేకేఆర్ గౌతమ్ హైస్కూల్, నిర్మలా హైస్కూల్, షార్కీ హైస్కూల్, ప్రభుత్వ రాంజీ హైస్కూల్, మాస్టర్ ఈకే బాలభాను హైస్కూల్, ఎస్ఆర్ ప్రైమ్ హైస్కూల్ పరీక్ష కేంద్రాలను సందర్శించి నిర్వహణ విధానాన్ని పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను సమీక్షించిన అనంతరం సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. -
జీఎస్టీ వసూళ్లు సక్రమంగా జరగాలి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో వస్తు సేవల పన్నులు(జీఎస్టీ) సక్రమంగా వసూలయ్యే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో మంగళవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జీఎస్టీ ఎగవేతకు అడ్డుకట్ట వేయాలని ఈ విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రిజిస్ట్రేషన్శాఖ పరిధిలో జరిగే ఆస్తులు, భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన వివరాలను వాణిజ్య పన్నులశాఖ అధికారులకు అందజేస్తున్నారా, లేదా అని కలెక్టర్ ఆరా తీశారు. పన్నుల వసూళ్లు పూర్తిస్థాయిలో జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో వాణిజ్య పన్నులశాఖ జాయింట్ కమిషనర్ జి.కల్పన, డెప్యూటీ కమిషనర్ సోనియాతార, సహాయ కమిషనర్లు సౌమ్య, జగదీష్, రాజ్కుమార్, జెడ్పీ డెప్యూటీ సీఈఓ ఆనంద్కుమార్, జిల్లా రిజిస్ట్రార్ గోపాలకృష్ణమూర్తి, గనులు, భూగర్భవనరుల ఏడీ కొండారెడ్డి, మునిసిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డీకే బాలాజీ -
నేటి నుంచి స.హ. చట్టం ఆన్లైన్ సేవలు
చిలకలపూడి(మచిలీపట్నం): సమాచార హక్కు చట్టం ద్వారా ఆన్లైన్లో సేవలను ఏప్రిల్ 1వ తేదీ నుంచి అందించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సమాచార హక్కు చట్టంపై వివిధ శాఖలకు చెందిన సంబంధిత అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం – 2005 ద్వారా ఇప్పటి దాకా భౌతికంగా దరఖాస్తులు చేసుకోవటంతో పాటు అర్జీదారులకు భౌతికంగానే సమాచారం అందించామన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్టీఐ చట్టానికి సంబంధించి వివరాలను, దరఖాస్తులను ఆన్లైన్లోనే వెబ్సైట్ https://rtionline.ap.gov.in పోర్టల్ ద్వారా చేయాలని చెప్పారు. నోడల్ అధికారిగా డ్రాయింగ్ ఆఫీసర్లు జిల్లాలోని ప్రతి ప్రభుత్వశాఖాధిపతి కార్యాలయంలో ప్రధానంగా సిబ్బంది జీతభత్యాలు డ్రా చేస్తున్న డ్రాయింగ్ ఆఫీసర్లు నోడల్ అధికారిగా వ్యవహరించాలన్నారు. వారే మొదటి అప్పిలేట్ అధారిటీ లాగిన్ను తరువాత ప్రజాసమాచారాధికారి లాగిన్ను సిద్ధం చేయాలన్నారు. ప్రతి నోడల్ అధికారికి యూజర్ నేమ్ ఇస్తామని చెప్పారు. ఎవరైనా ఆన్లైన్లో ఆర్టీఐ చట్టం ద్వారా దరఖాస్తు చేసుకుంటే నోడల్ అధికారి లాగిన్లోకి వస్తుందని ఆ దరఖాస్తును సంబంధిత అధికారికి పంపాల్సి ఉంటుందన్నారు. ప్రజాసమాచార అధికారి సమాచారం సిద్ధం చేసి సంబంధిత దరఖాస్తుదారుని లాగిన్కు ఆన్లైన్లో పంపాలన్నారు. ఇదే విధంగా క్షేత్రస్థాయిలో ప్రతి శాఖలోనూ సిబ్బందికి శిక్షణ ఇచ్చి అమలు చేయాలని సూచించారు. సమాచారం అందించేందుకు కావాల్సిన రుసుమును ఆన్లైన్లోనే నోడల్ అధికారికి చెల్లించవచ్చునన్నారు. 30 రోజులుగా అర్జీదారునికి సమాచారం అందించాలన్నారు. శిక్షణా తరగతుల్లో గృహనిర్మాణ సంస్థ జిల్లా అధికారి వెంకట్రావు, దివ్యాంగుల సంక్షేమశాఖ ఏడీ కామరాజు, బీసీ సంక్షేమ సాధికారత అధికారి జి.రమేష్, మత్స్యశాఖ జేడీ ఎ.నాగరాజు పాల్గొన్నారు. డీఆర్వో చంద్రశేఖరరావు -
బాబు డ్రామాలు
అమరావతి పేరుతో వన్టౌన్(విజయవాడపశ్చిమ): అమరావతిపై తీర్మానం పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ ‘పశ్చిమ’ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వెలంపల్లి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడం.. కేవలం రెండో విడత ల్యాండ్ పూలింగ్ కోసం ఆడుతున్న డ్రామా అని తెలిపారు. 2028 లోపు రాజధాని పూర్తి చేస్తామని చెబుతూనే, మరోపక్క ‘రాజధాని మార్చేస్తారు’ అనే ప్రచారం ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అవినీతి బయటపడుతుందనే కౌన్సిల్ను పక్కన పెట్టారు కౌన్సిల్ను పక్కన పెట్టి అసెంబ్లీలో తీర్మానాలు చేయడం వెనుక.. అవినీతి బయటపడుతుందనే భయమేనని వెలంపల్లి స్పష్టం చేశారు. రైతులను మభ్యపెట్టి రెండో విడత పూలింగ్ కోసం ప్రభుత్వం ఎత్తుగడలు వేస్తోందని ఆరోపించారు. ఒక్కో ఎకరా అభివృద్ధికి రూ. 2 కోట్లు అంటే, మొత్తం ప్రాజెక్టుకు రూ. 2 లక్షల కోట్లు పైగా అవసరమవుతాయని, ఇంత భారాన్ని భరించే శక్తి రాష్ట్రానికి ఉందా అని ప్రశ్నించారు. కేవలం డిజైన్ల పేరుతో రూ. 400 కోట్లు వృఽథా చేశారని ఆయన విమర్శించారు. అవినీతికి పరాకాష్ట టెండర్లను కొద్దిమంది అనుచర కంపెనీలకే కట్టబెడుతున్నారని, నాలుగు శాతం ఎక్సెస్తో పనులు ఇవ్వడం అవినీతికి పరాకాష్ట అని వెలంపల్లి అన్నారు. 2024 జూన్ తర్వాత తీసుకున్న రూ. 13 వేల కోట్ల రుణాల్లో రూ. 5,000 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ల రూపంలో కమీషన్ల కోసం ఇచ్చారని ఆరోపించారు. రూ. 47,000 కోట్ల అప్పులకు ప్రభుత్వ గ్యారంటీలు ఎందుకు ఇస్తున్నారని, వీటిని ఎవరు తీరుస్తారని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ ఎప్పుడూ అమరావతిని వ్యతిరేకించలేదని, కేవలం అక్కడ జరుగుతున్న అవినీతిని మాత్రమే ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేశారు. జగన్మోహన్రెడ్డి సైతం అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నారని గుర్తు చేస్తూ, తమకు ఆ ప్రాంతంపై ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. అయితే హైపర్లూప్, ఒలింపిక్స్ వంటి సాధ్యం కాని వాగ్దానాలతో ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. మాట్లాడుతున్న వెలంపల్లి శ్రీనివాసరావు చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా జె.అరుణను నియమిస్తూ సోమవారం ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి శశిభూషణ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా పంచాయతీ అధికారిగా పని చేస్తున్న ఆమెను ఉద్యోగోన్నతిపై సీఈవోగా నియమించారు. ఇప్పటి వరకు జెడ్పీ సీఈవోగా విధులు నిర్వహిస్తున్న కె.కన్నమనాయుడు ను పంచాయతీరాజ్శాఖ కమిషనర్ కార్యాలయానికి బదిలీ చేశారు. -
బహిరంగ వేలం ద్వారా రూ.92.90 లక్షల ఆదాయం
పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మ వారి ఆలయం వద్ద ఏడాది పాటు వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకునేందుకు సోమవారం ఆలయ ఆవరణలో నిర్వహించిన బహిరంగ వేలం, ఇ–ప్రొక్యూర్మెంట్ టెండర్ ద్వారా ఆలయానికి రూ.92.90 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ బి.మహేశ్వరరెడ్డి తెలిపారు. ఆలయం వద్ద కొబ్బరికాయలు విక్రయించుకునే లైసెన్స్ హక్కునకు రూ.50,05,000(పచ్చల శివప్రసాద్), మట్టికుండలు నిర్వహణ లైసెన్స్ హక్కునకు రూ.10,50,000(పచ్చల శివప్రసాద్), మునేరు అవతల 7 షెడ్లు, 4 ఏసీ గదులు, ఒక కల్యాణ మండపం నిర్వహణకు రూ.9,50,000(కొత్తపల్లి సతీష్కుమార్), ఆలయం వద్ద సంచారంగా ఐస్క్రీమ్ విక్రయించుకునే లైసెన్స్ హక్కునకు రూ.5,10,000(ముండ్లపాటి నాగరాజు), భక్తుల సామాన్లు, పాదరక్షలు భద్రపరచు లైసెన్ప్ హక్కునకు రూ.3,15,000 (గడిపూడి గోపి), సులభ కాంప్లెక్స్ నిర్వహణకు రూ.11,80,000(నూతలపాటి సురేష్), పువ్వులు, పాలు, బియ్యం పోగుచేసుకునే హక్కునకు రూ.2,80,000(దండా పుష్పలత), హెచ్చు పాటదారులుగా నిలిచి లైసెన్స్ హక్కును పొందారని తెలిపారు. చిలకలపూడి(మచిలీపట్నం): పేదరికం నుంచి బయటకు తీసుకురావాలన్నదే పీ4 కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. పీ4 కార్యక్రమం మొదటి వార్షికోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ సమావేశపు హాలులో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 78వేల మంది బంగారు కుటుంబాలు, 2,903 మంది మార్గదర్శిలను గుర్తించి 4,470 మంది బంగారు కుటుంబాలను దత్తత ఇచ్చామని తెలిపారు. మార్గదర్శిలు బంగారు కుటుంబాలకు వారికి కావాల్సిన సహాయం అందించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ సమాజంలో పేదరికం నిర్మూలనకు పీ4 కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, మార్గదర్శిలు చింతయ్య, తులసీదాస్ పాల్గొన్నారు. -
ప్రతాపమా.. సహించం
పేద రైతులపైచిలకలపూడి(మచిలీపట్నం): బందరు మండల పరిధిలోని సముద్రతీర ప్రాంత గ్రామాల్లో వరి పండని పొలాల్లో అనాదిగా చెరువులు సాగు చేస్తున్నారని పేద రైతులపై మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు, రెవెన్యూ అధికారులు ప్రతాపం చూపిస్తే సహించేది లేదని రాష్ట్ర మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) హెచ్చరించారు. ‘మీ కోసం’లో పేద రైతులు పడుతున్న కష్టాలను జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్కు సోమవారం వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 1990 నుంచి బందరు సౌత్ మండల పరిధిలోని చిన్నాపురం, వాడగొయ్యి, కోన, పల్లెతుమ్మలపాలెం, కేపీటీపాలెం, పాతేరు, పోలాటితిప్ప తదితర గ్రామాల్లో 80 నుంచి 90 శాతం మంది రైతులు వరిపంట పండకపోవటంతో చెరువులుగా మార్చుకుని సాగు చేసుకుని జీవిస్తున్నారు. టీడీపీకి చెందిన ఓ సర్పంచ్ మండలంలో చెరువులు తవ్వుకుంటే తమకు కప్పం కట్టలేదని నాయకులు సీజ్ చేయించారన్నారు. 50 వేలు మెజార్టీ వచ్చిందని చెప్పుకుంటున్న మంత్రి కొల్లు రవీంద్ర ఈ రకంగా ఎరానికి రూ. 50 వేలు వసూలు చేస్తున్నారా అని ఎద్దేవా చేశారు. ఇటీవల కోనలో చిన్న రైతు 80 సెంట్ల భూమిని మరమ్మతులు చేసుకుంటుంటే ఆర్డీవో సాంబశివరావు హుటాహుటిన అక్కడకు వెళ్లి చెరువును పూడ్చి వేయాలని, పట్టాలు తీసుకువచ్చి చూపించాలని హుకుం జారీ చేయడం భావ్యమా అని పేర్ని నాని అన్నారు. పెదపట్నంలో 20 ఎకరాల మడ అడవులు తవ్వుతున్నా పెద్ద రైతులు అసైన్డ్ భూమిలో వంద ఎకరాల్లో చెరువులు తవ్వుతున్నా తహసీల్దార్, ఆర్డీవోకు వారు కనపడారా అని ప్రశ్నించారు. ప్రస్తుత ఆర్డీఓ సాంబశివరావు బాధ్యతలు తీసుకున్న తర్వాత మడ అడవులు, వందల ఎకరాల అసైన్డ్ భూముల్లో చెరువులు తవ్వుతున్నా పట్టించుకోని ఆయన పేద రైతులపై ప్రతాపం చూపుతున్నారని దీనిపై జేసీకి వివరించామన్నారు. ఆయన తీరు ఇలాగే ఉంటే ఏసీబీని ఆశ్రయించడానికి కూడా వెనుకడామన్నారు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఎంత తీసుకుంటున్నారో, ఎవరి ద్వారా తీసుకుంటున్నారో ప్రజలే సాక్షులుగా చెబుతున్నారన్నారు. ఎన్నో ఏళ్లుగా చెరువుల సాగు చేస్తున్న పేద రైతుల మరమ్మతులను అడ్డుకుంటే పోరాడతామని ఆయన హెచ్చరించారు. పేర్ని నాని వెంట జేసీని కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ నాయకులు లంకే వెంకటేశ్వరరావు, గణేశన రమేష్, మట్టా మోహననాంచారయ్య, వన్నెంరెడ్డి రామకృష్ణ, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. రెండేళ్లకోసారి మరమ్మతులు చేయాల్సి వస్తుందని, ఇవి చేయాలంటే మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ కుమారుడు మంత్రాల శ్రీను చెయ్యి తడపనిదే పనులు ముందుకెళ్లే పరిస్థితి లేదన్నారు. ఎకరానికి రూ. 50 వేలు ఇస్తే కానీ మరమ్మతులు చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని ఇటువంటి పేద రైతులు ఇంత మొత్తంలో ఎలా చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితులు నేపథ్యంలో తహసీల్దార్, ఆర్డీఓలు కూడా వారికే ఏజెంట్లుగా పని చేయడం విడ్డూరంగా ఉందన్నారు. -
రావణ వాహనంపై ఆది దంపతులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చైత్రమాస బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు సోమవారం రావణ వాహన సేవ జరిగింది. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఆదివారం నుంచి చైత్రమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో రెండో రోజైన సోమవారం ఉదయం మూలమంత్ర హవనం, సాయంత్రం ఔపాసన, బలిహరణ, హారతి, మంత్రహవనం నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు ఆలయ ప్రాంగణంలోని మహా మండపం నుంచి నగరోత్సవ సేవ ప్రారంభమైంది. రావణ వాహనంపై కొలువై ఉన్న శ్రీగంగా పార్వతీ(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్లకు ఆలయ అర్చకులు విశేషంగా అలంకరించి పూజా కార్యక్రమాలను నిర్వహించగా, ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ ఊరేగింపును ప్రారంభించారు. మహామండపం నుంచి ప్రారంభమైన రావణ వాహన సేవ రథం సెంటర్, బ్రాహ్మణ వీధి, కొత్తపేట, సామారంగం చౌక్, మెయిన్ రోడ్డు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా తమ ఇంటి ముంగిటకు విచ్చేసిన ఆదిదంపతులకు భక్తులు హారతులిచ్చి స్వాగతం పలికారు. ఆది దంపతులకు పూలు, పండ్లు, పూజా సామగ్రిని సమర్పించి పూజలు జరిపించుకున్నారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ, చిన్నారుల కోలాట విన్యాసాలు, డప్పు కళాకారుల విన్యాసాల మధ్య నగరోత్సవం కనులపండువగా జరిగింది. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్య శివ ప్రసాద్ శర్మ, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
జాయింట్ కలెక్టర్ నవీన్
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలోని వినియోగదారులు, వ్యాపార సంస్థలు ఎల్పీజీ గ్యాస్ వినియోగాన్ని తగ్గించి పైపుల ద్వారా సరఫరా అయ్యే సహజవాయువు, ఇతర విద్యుత్ ఆధారిత వంట పరికరాల వినియోగం వైపు మారాలని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ సూచించారు. కలెక్టరేట్లోని సమావేశం హాలులో సోమవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే నాగాయలంక రిఫైనరీ నుంచి సుమారు 450 కిలోమీటర్ల మేర పీఎన్జీ పైప్లైన్ అందుబాటులో ఉందని ఆ సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు. మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు, వైఎస్సార్ తాడిగడప మునిసిపాల్టీల పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆస్పత్రులు తక్షణమే పీఎన్జీ వినియోగానికి మారాల్సిన అవసరం ఉందన్నారు. 90 రోజుల్లోపు మారకపోతే ఎల్పీజీ కనెక్షన్లను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో పీఎన్జీకి మారనున్న 417 పరిశ్రమలు, 179 ఆస్పత్రులు, ఎనిమిది ప్రధాన దేవాలయాలను ఇప్పటికే గుర్తించామన్నారు. అన్నక్యాంటీన్లు, ప్రభుత్వ ఆస్పత్రులు కూడా ప్రాధాన్యత క్రమంలో పీఎన్జీ వినియోగం చేపట్టాలని సూచించారు. గృహ వినియోగదారుల్లో అవగాహన కల్పించేందుకు ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఇండక్షన్ స్టౌలు, బయో గ్యాస్ స్టౌలతో ఎగ్జిబిషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, విజిలెన్స్ డెప్యూటీ కలెక్టర్ పోతురాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
బిల్లుల చెల్లింపులో జాప్యంపై ఆందోళన
నల్ల రిబ్బన్లు , ప్లకార్డులతో నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ ‘మౌన’ దీక్ష భవానీపురం(విజయవాడపశ్చిమ): జల్ జీవన్ మిషన్ (జేజేఎం) కార్యక్రమాల్లో మొదటి నుంచి భాగస్వాములుగా ఉన్న 750కిపైగా ఉన్న చిన్న కాంట్రాక్టర్ల (ఎంఎస్ఎంఈ) బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న తీవ్ర జాప్యం, కార్పొరేట్ సంస్థలపై చూపుతున్న పక్షపాత ధోరణిపై నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆందోళన కొనసాగుతోంది. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఏపీ ఇంజినీర్–ఇన్–చీఫ్ కార్యాలయం వద్ద పెండింగ్ బిల్లుల కోసం నల్ల రిబ్బన్లు ధరించి ప్లకార్డులతో చేపట్టిన ఆందోళన సోమవారం ఏడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సంఘ ప్రధాన కార్యదర్శి కోనేరు శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ టెండర్లు దక్కించుకుని పనులు చేసిన అనంతరం బిల్స్ సబ్మిట్ చేసి ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజుకూ చిన్న కాంట్రాక్టర్లకు సుమారు రూ.1,050 కోట్ల బిల్లులు చెల్లించాలని.. ప్రభుత్వం వద్ద ఈ బిల్లులు ఉన్నాయని, ఏడాదిగా పేమెంట్స్ జరుగుతున్న విధానం విస్మయానికి గురిచేసిందని తెలిపారు. ఫిబ్రవరి 2025 నుంచి ప్రభుత్వం సుమారు రూ.1,331 కోట్లు విడుదల చేసిందని, ఇందులో కార్పొరేట్ సంస్థలకు రూ.932 కోట్లు చెల్లింపులు చేయగా ఆ మొత్తంలో మొబలైజేషన్ అడ్వాన్స్ కూడా ఉండటం దుర్మార్గమని పేర్కొన్నారు. అదే సమయంలో 750కిపైగా ఉన్న చిన్న కాంట్రాక్టర్లకు చేసిన చెల్లింపులు కేవలం రూ.263 కోట్లు మాత్రమేనని గుర్తు చేశారు. కాంట్రాక్టర్లుగా ప్రభుత్వ పనులు చేసేందుకు ఆస్తులు కుదవపెట్టి, తెచ్చిన అప్పులు తీర్చలేక తమ బ్యాంక్ అకౌంట్లు ఎన్పీఎగా మారాయని అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వద్ద పని చేస్తున్న రోజువారీ కార్మికులకు, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దుస్థితి ఏర్పడిం దని, గత్యంతరం లేక రోడ్డెక్కి పోరాటానికి సిద్ధపడ్డామని చెప్పారు. తమ మీద ఆధారపడిన వేలాది కుటుంబాలను ఈ ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం తామున్న పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్మించుకుంటున్న గృహ నిర్మాణ పనులకు కూలీలుగా వెళ్లి శ్రమదానం చేసి నిరసన తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తాము వారం రోజుల నుంచి ధర్నా చేస్తున్నా ఆర్డబ్ల్యూఎస్కు సంబంధించిన శాఖ మంత్రి, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా స్పందించక పోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు. జేసీతో పాటు డీఆర్వో చంద్రశేఖరరావు, డిస్ట్రిక్ట్ విజిలెన్స్ ఆఫీసర్ పోతురాజు, డీటీసీ డీఎస్పీ శ్రీనివాసరావు అర్జీలు స్వీకరించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. అర్జీల్లో కొన్ని -
సమన్వయంతో మాతృ, శిశు మరణాల తగ్గింపు
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో మాతృ, శిశు మరణాలను తగ్గించడానికి వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా, సమన్వయంతో పని చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి.యుగంధర్ సూచించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో సోమవారం సబ్–డిస్ట్రిక్ట్ స్థాయి మాతృ, శిశు మరణాలపై సమీక్ష సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏఎన్ఎంలు, ఆశలు సామర్థ్యాన్ని పెంపొందిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రత్యేక దృష్టి పెట్టాలి శిశు ఆహార పద్ధతులు, ప్రసవానంతర శిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. గర్భిణులు, నవజాత శిశువుల్లో ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే సంబంధిత మెడికల్ ఆఫీసర్కు సమాచారం అందించాలన్నారు. అనధికార వైద్యుల వద్దకు పంపడం పూర్తిగా నివారించాలని సూచించారు. తల్లులు, కుటుంబ సభ్యులకు భయపడకుండా స్పష్టమైన కౌన్సెలింగ్ ఇవ్వాలని, ప్రమాద సూచనలు, సంక్లిష్ట పరిస్థితులపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. హైరిస్క్ గర్భధారణలు, దీర్ఘకాలిక వ్యాధులపై ప్రత్యేక పర్యవేక్షణ అవసరమన్నారు. గర్భిణులు తప్పనిసరిగా నియమిత గర్భధారణ పరీక్షలు చేయించుకోవాలని, స్కాన్లు, 2డీ ఎకో పరీక్షల ప్రాముఖ్యతను వివరించి, సమస్యలను ముందుగానే గుర్తించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో మొత్తం 6 శిశు మరణాలు, 2 మాతృ మరణాల కేసులను విశ్లేషించి, సేవల్లో లోపాలను గుర్తించి నివారణ చర్యలపై చర్చించారు. సమావేశంలో కమిటీ సభ్యులు, వైద్యాధికారులు, ఫీల్డ్ స్థాయి సిబ్బంది పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ యుగంధర్ -
మంటలు చెలరేగి కారు దగ్ధం
కోడూరు: పార్కింగ్లో పెట్టిన కారులోమంటలు చెలరేగి కారు దగ్ధం అయిన ఘటన కోడూరులో సోమవారం చోటు చేసుకుంది. కోడూరుకు చెందిన షేక్ కరిముల్లా తన కారును రామకృష్ణా థియెటర్కు చెందిన ఖాళీ ప్రదేశంలో పెట్టారు. ఉదయం 10 గంటల సమయంలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు మొత్తం అగ్నికి అహుతైంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా, అవనిగడ్డ ఫైర్ అధికారులు వచ్చి మంటలు అదుపు చేశారు. ఘటనాస్థలాన్ని కోడూరు ఎస్ఐ చాణిక్య పరిశీలించి, వివరాలు సేకరించారు. కారుకు ఎవరైనా నిప్పుపెట్టారా, లేక కారు లోపల నుంచి మంటలు వ్యాపించాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. -
2న ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పౌర్ణమిని పురస్కరించుకుని ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 5.55 గంటలకు ఘాట్రోడ్డు నుంచి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుందని దుర్గగుడి వైదిక కమిటీ పేర్కొంది. ప్రతి నెలా పౌర్ణమి రోజు శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ నిర్వహిస్తారు. గురువారం తెల్లవారుజామున ఘాట్రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం నుంచి ప్రదక్షిణ ప్రారంభమవుతుందని తెలిపారు. అక్కడి నుంచి కుమ్మరిపాలెం, విద్యాధరపురం, నాలుగు స్తంభాల సెంటర్, సితార జంక్షన్, కబేళా, పాలప్రాజెక్టు, చిట్టినగర్, కేటీ రోడ్డు, బ్రాహ్మణ వీధి మీదగా ఆలయానికి చేరుకుంటుంది. అమ్మవారి భక్తులు, సేవా సిబ్బంది పాల్గొనాలని కోరారు. నందిగామ రూరల్: అతిసార వ్యాధి పూర్తిగా నియంత్రణలో ఉందని ప్రజలు భయాందోళనకు గురికావద్దని డీఎంహెచ్వో సుహాసిని పేర్కొన్నారు. చందాపురంలో సోమవారం ఆమె పర్యటించారు. ముందుగా గ్రామంలో జరుగుతున్న ఇంటింటి సర్వేను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం అతిసార కేసుల పరిస్థితి, కారణాలు, ప్రాథమిక నివేదికలను అధికారులతో కలిసి ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా, మండల స్థాయి అధికారులు పంచాయతీ సిబ్బందితో సమన్వయం చేస్తూ ఎనిమిది ఆర్ఆర్టీ బృందాలు గ్రామంలో సర్వే చేస్తున్నాయన్నారు. ఆస్పత్రిలో బాధితులు కోలుకుంటున్నారని కొత్త కేసులు నమోదు కాలేదని తెలిపారు. రెండు, మూడు రోజుల పాటు వైద్యారోగ్య, పంచాయతీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ అధికారులు మల్లీశ్వరి, పద్మజ, శ్రీహరి వెంకటేశ్వర్లు, సరిత, భాను కిరణ్, జ్యోతి పాల్గొన్నారు. గుడ్లవల్లేరు: వేమవరం శ్రీ కొండలమ్మవారి దేవస్థానంలోని హుండీలను సోమవారం తెరిచి అందులో భక్తులు వేసిన కానుకలను లెక్కించారు. మొత్తం 31 రోజులకు నోట్ల ద్వారా రూ.13,77,046, చిల్లర ద్వారా రూ.1,44,060 వెరసి మొత్తం రూ.15,21,100 వచ్చింది. మచిలీపట్నం భోగిరెడ్డిపల్లి గ్రూప్ సూపర్వైజర్ అరుణ పర్యవేక్షణలో దేవస్థాన ఈఓ ఆకుల కొండలరావు, ధర్మకర్తల మండలి సభ్యులు కళ్ళేపల్లి సుగుణ శేఖర్, వడ్లమూడి రవీంద్రబాబు, తూము రాజ్యలక్ష్మి, ముంగం ఆంజనేయులు, మన్నెం వీర నాగేంద్రరావు, నూతలపాటి లక్ష్మీ పావని, వేమవరం ర సర్పంచ్ మన్నెం పద్మావతి, వడ్లమన్నాడు ఇండియన్ బ్యాంక్ సిబ్బంది సమక్షంలో కానుకల్ని లెక్కించారు. లెక్కింపులో దేవస్థానం సిబ్బంది, మచిలీపట్నం, ఉయ్యూరు, వేమవరం సేవా సమితి వారు, వేమవరం గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పరిశోధనలు, క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నామని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. విజయవాడలోని విశ్వవిద్యాలయం ఆవరణలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అల్లోపతిలోనే కాకుండా ఆయుష్, డెంటల్, నర్సింగ్, ఫిజియోథెరపీ, ఇతర కోర్సుల విద్యార్థులు, ఫ్యాకల్టీ పరిశోధనలతో పాటు క్రీడా ప్రోత్సాహకాల కోసం ఏటా రూ.22.13 కోట్ల వ్యయం చేయనున్నట్టు ప్రకటించారు. అమరావతిలో విశ్వవిద్యాలయానికి 25 ఎకరాల స్థలం కేటాయించాలని చేసిన ప్రతిపాదన సీఆర్డీఏ పరిశీలనలో ఉందని తెలిపారు. వర్సిటీ రీసెర్చ్, డెవలప్మెంట్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీ సూర్యప్రభ మాట్లాడుతూ డిసీజ్ మోడలింగ్, డెసిషన్ సెంటర్ను రూ.5.73 కోట్లతో ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. -
వృద్ధుడిని హత్య చేసిన ఆగంతకులు
నందిగామ టౌన్: ఇంటి వరండాలో నిద్రించిన వృద్ధుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. చింతలపాడు గ్రామానికి చెందిన రెబ్బగొండ్ల వెంకటపతి (85) ఒంటరిగా నివసిస్తున్నాడు. అతని భార్య గతంలోనే మరణించారు. ముగ్గురు కుమార్తెలకు వివాహమైంది. రోజూ మాదిరిగానే శనివారం రాత్రి తన నివాసంలోని వరండాలో వెంకటపతి నిద్రించాడు. ఆదివారం ఉదయం రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతుడి ముఖంపై కొడవలితో దాడి చేసిన గాయాలను పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ధర్మరాజు తెలిపారు. -
టిడ్కో ఇళ్లు ఎప్పుడిస్తారు?
● ఆశగా ఎదురుచూస్తున్న నిరుపేదలు ● డబ్బులు చెల్లించినా మంజూరు కాని ఇళ్లు ● పట్టించుకోని ప్రజాప్రతినిధులు తిరువూరు: సొంతిల్లు లేని పేద కుటుంబాలకు 2017లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన టిడ్కో ఇళ్ల కోసం అర్హులు ఎదురుచూస్తున్నారు. తిరువూరు పట్టణంలోని 1,536 మంది లబ్ధిదారులకు నేటికీ ఇళ్లు పంపిణీ జరగలేదు. మూడు కేటగిరీలలో నిర్మించే ఈ ఇళ్లకు పలువురు లబ్ధిదారులు తమ వాటా సొమ్ము కూడా చెల్లించినా పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టలేదు. కేటగిరీ–1లో 300 చదరపు అడుగుల్లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, కేటగిరీ–2లో 365 చదరపు అడుగుల్లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, కేటగిరీ–3లో 430 చదరపు అడుగుల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లను నిర్మించాలి. కేటగిరీ–1 ఇళ్లకు రూ.5.72 లక్షలు యూనిట్ ధర కాగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరి రూ.1.50 లక్షల చొప్పున నిర్మాణ వ్యయం భరిస్తుండగా, మిగిలిన రూ.2.71 లక్షలను బ్యాంకు ద్వారా రుణం తీసుకోవాలని కేంద్రం మార్గదర్శకాలిచ్చింది. ఈ కేటగిరీ ఇళ్లకు లబ్ధిదారు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. కేటగిరీ–2లో యూనిట్ నిర్మాణ వ్యయం రూ.6.74 లక్షలు. రూ.50 వేలను లబ్ధిదారు వాటాగా నాలుగు విడతల్లో చెల్లించాలి. కేటగిరీ–3 ఇళ్లకు లబ్ధిదారులు నాలుగు విడతలుగా రూ.లక్ష చెల్లించే అవకాశం కల్పించారు. అయితే, కేటగిరీ 2, 3 ఇళ్లకు లబ్థిదారులు వాటా సొమ్ము చెల్లించినా డిమాండ్కు సరిపడా ప్లాట్ల నిర్మాణం చేపట్టకపోగా, వారికి మంజూరు చేసిన యూనిట్లను రద్దు చేసినట్లు అధికారులు నోటీసులు జారీచేశారు. అయితే వారు చెల్లించిన సొమ్ము మాత్రం ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు. నత్తనడకన నిర్మాణ పనులు తాము అధికారంలోకొస్తే వెంటనే టిడ్కో ఇళ్ల పనులు పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలునేటికీ నెరవేరలేదు. ఉగాది పండుగకే ఈ ఇళ్లను పంపిణీ చేస్తామని పదే పదే అధికారులు ప్రకటనలు గుప్పించారు. అయితే పనులు పూర్తికాకపోవడంతో ఇప్పట్లో టిడ్కో ఇళ్ల సముదాయంలో లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసే అవకాశం కనిపించడం లేదు. -
1న ఉపాధ్యాయుల నిరాహార దీక్ష
మచిలీపట్నంఅర్బన్: ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి యూటీఎఫ్ రణభేరి 3.0లో భాగంగా కృష్ణా కలెక్టరేట్ ఎదుట ఏప్రిల్ ఒకటో తేదీన ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఐక్య ఫెడరేషన్ (యూటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి కె.ఎ.ఉమామహేశ్వరరావు ఆదివారం తెలిపారు. నిరాహార దీక్ష నోటీసును శనివారం రాత్రి డీఆర్వో చంద్రశేఖర్కు అంద జేసినట్లు పేర్కొన్నారు. పీఆర్సీ, డీఏ, బకాయిలు, మెమో 57 అమలు వంటి ఆర్థిక సమస్యల పరి ష్కారం కోసం ఈ కార్యక్రమం చేపట్టామని వివరించారు. 11వ పీఆర్సీ అమలు సమయంలో ఆర్థిక ప్రయోజనాలు సక్రమంగా అందక ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ సమస్యల పరిష్కారంలో పెద్దగా పురోగతి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు 12వ పీఆర్సీ 2023 జూలై నుంచి అమలు కావాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు పీఆర్సీ కమిషన్ను నియమించలేదని విమర్శించారు. పెండింగ్ డీఏలు విడుదల చేయకపోవడం, రిటైర్డ్ ఉద్యోగులకు 18 నెలలుగా గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్ చెల్లింపులు జరగకపోవడం ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ స్పందన లేకపోవడంతో ఫిబ్రవరి 17న విజయవాడలో భారీ ధర్నా నిర్వహించినట్లు తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో మరోమారు ఉద్యమానికి దిగుతున్నామని వెల్లడించారు. పీఆర్సీ కమిషన్ చైర్మన్ను వెంటనే నియమించి, 29 శాతం బేసిక్ రివిజన్ ప్రకటించాలన్నారు పెండింగ్ డీఏలు విడుదల చేయడం, ఉద్యోగులు – పెన్షనర్ల బకాయిల చెల్లింపునకు స్పష్టమైన రోడ్మ్యాప్ ప్రకటించాలని చెప్పారు. కోవిడ్ సమయంలో మరణించిన పంచాయతీరాజ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండి షౌకత్ హుస్సేన్, బి.కనకారావు, గౌరవాధ్యక్షుడు జె.లెనిన్ బాబు, జిల్లా కార్యదర్శి కె.రంగనాథ్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వి.సత్యనారాయణ, కె.అర్జున్, సుబ్రహ్మణ్యం, పి.పాపయ్య, ఒ.వి.నాగేంద్రం, అడపా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
అలరించిన యువ సంకీర్తనా గానం
విజయవాడ కల్చరల్: శ్రీ సుబ్రహ్మణ్య మహతి సంగీత సమితి ఆధ్వర్యంలో నెలవారీ సంగీత మహోత్సవంలో భాగంగా ఆదివారం నిర్వహించిన యువ సంకీర్తనా గానం శాసీ్త్రయ సంగీత వైభవాన్ని చాటింది. యువ సంగీత విద్వాంసులు ఎస్.హిరణ్మయి వీణపై సద్గురువులు ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి రచించిన సంకీర్తనలను హృద్యంగా పలికించారు. కార్తికేయ ఆదినారాయణ వాద్య సహకారం అందించారు. విశాఖపట్నానికి చెందిన తిరువీధుల సుజాతాదేవి నిర్వహించిన గాత్ర సంగీత కచేరి అలరించింది. హనుమంత్ రామ్చరణ్ వయోలిన్పై, కార్తికేయ ఆదినారాయణ మృదంగంపై వాద్యసహకారం అందించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగీత విద్వాంసుడు మోదుమూడి సుధాకర్ మాట్లాడుతూ.. యువ సంగీత విద్వాంసులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సంగీత సమితి కార్యదర్శి సి.వి.రావ్ మాట్లాడుతూ.. సంస్థ ప్రతి నెలా యువ సంగీత కళాకారులను ప్రోత్సహించడానికి సంగీత వేదికలను కల్పిస్తోందన్నారు. -
దుర్గమ్మను దర్శించుకున్న ఎన్హెచ్ఆర్సీ చైర్మన్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) చైర్మన్ జస్టిస్ వి.రామసుబ్రహ్మణియన్ ఆదివారం రాత్రి ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి సతీ సమేతంగా విచ్చేసిన జస్టిస్ రామ సుబ్రహ్మణియన్కు ఆలయ ఈవో శీనానాయక్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. జస్టిస్ రామసుబ్రహ్మణియన్ దంపతులకు ఆలయ ఈవో అమ్మవారి చిత్ర పటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. -
వెంకన్న దర్శనానికి భక్తుల రద్దీ
గుడ్లవల్లేరు: మండలంలోని డోకిపర్రులో వేంచే సిన భూ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా స్వామివారికి మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (మెయిల్) అధినేత, దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్తలు పురిటిపాటి వేంకట కృష్ణారెడ్డి, సుధారెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నసంతర్పణ చేశారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. నిర్వాహకులు కొమ్మారెడ్డి బాపిరెడ్డి, విజయ భాస్కరమ్మ దంపతులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): లోక కల్యా ణార్థం, సకల ప్రాణ కోటికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని కోరుతూ ఆదివారం దుర్గమ్మ సన్నిధిలో సూర్యోపాసన సేవ నిర్వహించారు. అమ్మవారి ఆలయప్రాంగణంలోని లక్ష కుంకుమార్చన వేదిక వద్ద సూర్య భగవానుడి విగ్రహానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ నిర్వహించి సూర్యనారాయణుడికి కేసరిని నివేదనగా సమర్పించారు. అనంతరం అందరికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని ఆకాంక్షిస్తూ భక్తులకు ప్రసాద పంపిణీ జరిగింది. సేవలో పాల్గొన్న ఉభయదాతలను ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా అమ్మ వారి దర్శనానికి అనుమతించారు. కంచికచర్ల: మండలంలోని కీసర సమీపంలో జాతీయ రహదారి పక్కన ప్రభుత్వ భూమిలో ఉన్న 10 ఎకరాల జామాయిల్ తోటకు ఆదివారం రాత్రి నిప్పంటుని దగ్ధమైంది. ఆకతాయిలు నిప్పంటించారని స్థానికులు పేర్కొంటున్నారు. అగ్నిమాపక కేంద్ర సిబ్బంది సంఘట నా స్థలానికి చేరుకుని జామాయిల్తోటలో ఎగిసిపడుతున్న మంటలను ఆర్పివేశారు. అప్పటికే పది ఎకరాల్లో ఉన్న జామాయిల్ తోట పూర్తిగా దగ్ధమైందని, రూ.11 లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని ఫైర్ అధికారి శివారెడ్డి తెలిపారు. కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో పోలీసులు పేకాట, కోడిపందేలు, క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులపై ఆదివారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఒక్క రోజే 133 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో పేకాట, క్రికెట్ బెట్టింగ్లను అరికట్టాలంటూ ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆదివారం జిల్లావ్యాప్తంగా ఏక కాలంలో దాడులు నిర్వహించారు. అదుపులోకి తీసుకున్న వారిని స్థానిక తహసీల్దారుల ఎదుట బైండోవర్ చేశారు. జిల్లాలో పేకాట, క్రికెట్ బెట్టింగ్లకు సంబంధించి ప్రజల వద్ద ఎటువంటి సమాచారం ఉన్నా సంబంధిత పోలీస్స్టేషన్లకు సమాచారం అందజేయాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. -
లోక రక్షకా.. హోసన్నా
గుణదల(విజయవాడ తూర్పు): సర్వ మానవ పాప పరిహారార్థమై జనియించిన లోక రక్షకుడైన క్రీస్తును ప్రతి ఒక్కరూ విశ్వసించి కీర్తించాలని గుణదల మేరీమాత పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు అన్నారు. పుణ్యక్షేత్ర ఆవరణలో మట్టల ఆదివారం సందర్భంగా ప్రత్యేక సమష్టి దివ్యబలి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వ మానవాళినీ సన్మార్గంలో నడిపించేందుకు ఏసుక్రీస్తు ప్రయత్నించారని, ఆయనను విశ్వసించి దేవుని నియమాలను పాటించిన వారికి శాంతి, సమాధానాలు లభిస్తాయన్నారు. మానవాళి రక్షణ కోసం ఏసుక్రీస్తు చేసిన సిలువ త్యాగాన్ని గుర్తించాలన్నారు. అనంతరం పుణ్యక్షేత్ర ప్రధానాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సమష్టి దివ్యబలి పూజ సమర్పించారు. భక్తులకు దివ్య సత్ప్రసాదాన్ని అందజేశారు. అటుపై పుణ్యక్షేత్ర గురువులు, విశ్వాసులు మట్టలను చేతపట్టి గుణదల పుర వీధులలో పవిత్ర యాత్ర నిర్వహించారు. ఈత మట్టలు చేతపట్టుకొని హోసన్నా.. ఏసన్నా.. రాజుల రాజ నీకే జయం.. శాంతి ప్రదాత నీకే స్తోత్రం.. అంటూ నినాదాలు చేస్తూ క్రైస్తవ విశ్వాసులు కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారం ప్రార్థనలు -
ఆస్పత్రిలో సౌకర్యాలు కల్పించాలి..
● మందులు, టెస్టులు అన్నీ బయటకే.. ● పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం ● దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగుల అవస్థలు ● రాష్ట్రంలోని ఏకై క టీచింగ్ ఆయుర్వేద ఆస్పత్రిపై సర్కారు సవతి ప్రేమ లబ్బీపేట(విజయవాడతూర్పు): సంప్రదాయ దేశీయ వైద్యమైన ఆయుర్వేదంపై చంద్రబాబు ప్రభుత్వం వివక్ష చూపుతోంది. రాష్ట్రంలోనే ఏకై క ప్రభుత్వ టీచింగ్ ఆయుర్వేద ఆస్పత్రిగా ఉన్న విజయవాడలోని డాక్టర్ ఆచంట లక్ష్మీపతి ఆయుర్వేద ఆస్పత్రి అరకొర సౌకర్యాలతో కునారిల్లుతోంది. దుష్ఫలితాలు లేని వైద్యమని ఆశతో వస్తున్న రోగులకు నిరాశే ఎదురవుతోంది. మందులు, రక్తపరీక్షలతో పాటు, ఫైల్స్, ఫిస్టులా వంటి వ్యాధులతో వచ్చే వారు దూది.. సూది కూడా బయట కొనుగోలు చేసి తీసుకు రావాల్సిన దయనీయ స్థితి నెలకొంది. గత ప్రభుత్వంలో ఎలాంటి మందుల కొరత ఉండేది కాదు. కానీ నేడు వారి వద్ద ఉన్న వాటినే రోగులకు ఇచ్చి పంపుతున్నారు. లేనివి బయట కొనుగోలు చేసుకోవాలని చెబుతున్నారు. డబ్బులు లేక ప్రభుత్వాస్పత్రికి వస్తే.. ఇక్కడ మందులు కూడా లేవంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికిత్స కోసం వచ్చిన వారికి ఎవరికై నా అల్ట్రాసౌండ్, సీటీ, ఎంఆర్ఐ స్కానింగ్లు అవసరమైతే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికెళ్లి తీయించుకోమని చెప్పవచ్చు. కానీ కమీషన్ల కోసం కొందరు వైద్యులు ప్రైవేటు స్కానింగ్ సెంటర్లకు రాస్తున్నారు. దీంతో ఆ స్లిప్పులు తీసుకుని అక్కడకు వెళితే రూ.వేలల్లో చెబుతున్నారని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అన్ని రకాల వ్యాధుల నిర్ధారణకు రక్తపరీక్షలు సైతం బయటకు రాస్తున్నట్లు రోగులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, వైద్యుల అత్యాశ వెరసి రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో పంచకర్మ విభాగంలో అనేక రకాల చికిత్సలు అందించే వారు. ఊబకాయం, మైగ్రేన్, నడుము నొప్పి, మెడనొప్పిలతో పాటు, వివిధ రకాల చర్మ వ్యాధులకు చికిత్సలు చేసేవారు. ఇప్పుడు పంచకర్మ విభాగం దాదాపు మూలనపడింది. అరకొరగా సేవలు అందిస్తున్నారు. పంచకర్మ చికిత్సలు చేసేందుకు అవసరమైన తైలాలు అందుబాటులో ఉండటం లేదు. అంతేకాకుండా నాల్గో తరగతి సిబ్బంది కొరత ఉండటంతో చికిత్సలు నిలిచిపోయాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు నిరుత్సాహంగా తిరిగి వెళ్తున్నారు. ప్రజలకు విద్య, వైద్యం ఎంతో అవసరం. ప్రభుత్వాలు ఆ రెండు రంగాలను విస్మరించకూడదు. సంప్రదాయ వైద్యమైన ఆయుర్వేదం పట్ల నిర్లక్ష్యం చేయడం తగదు. ఇక్కడ మంచి వైద్యం అందుతుందని దూర ప్రాంతాల నుంచి రోగులు వస్తున్నారు. కానీ మందులు సరిగా ఇవ్వకుండా బయట కొనుక్కోమనడం, దూది కూడా లేక పోవడం దురదృష్టకరం. ప్రభుత్వం స్పందించి, సౌకర్యాలు కల్పించాలి. – ఎండీ నాహిద్, లబ్బీపేట విజయవాడ వన్టౌన్కు చెందిన లక్ష్మీ నడుము నొప్పితో చికిత్స కోసం ఆయుర్వేద ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించి వైద్యులు ఆరు రకాల మందు లు రాశారు. చీటీ తీసుకుని ఫార్మసీ వద్దకు వెళ్లగా మూడు రకాలు చేతిలో పెట్టి, మిగిలినవి బయట కొనుక్కోమని ఉచిత సలహా ఇచ్చి పంపారు. విజయవాడ గాంధీనగర్కు చెందిన వెంకటేశ్వరరావు ఫిస్టులా సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు రెండు రోజులకోసారి డ్రెస్సింగ్ చేయాల్సి వస్తోంది. ఆస్పత్రిలో స్టెరిలైజ్డ్ దూది లేక పోవడంతో బయట కొనుక్కొని తీసుకెళ్తున్నాడు. అంతేకాదు కుట్లు వేసేందుకు సూది కూడా లేని పరిస్థితి ఉంది. ఇలా వీరిద్దరే కాదు ఆస్పత్రికి వచ్చే రోగుల్లో మూడొంతుల మంది సగం మందులు బయట కొనుగోలు చేయాల్సిన దయనీయ స్థితి నెలకొంటుంది. కూటమి ప్రభుత్వం ఆయుర్వేదంపై సవతిప్రేమ చూపుతోందని పలువురు విమర్శిస్తున్నారు. -
ఆస్పత్రుల్లోనే అతిసార బాధితులు
● వివిధ ఆస్పత్రుల్లో 17 మందికి చికిత్స ● రోగులను పరామర్శించిన డీఎంహెచ్ఓ లబ్బీపేట(విజయవాడతూర్పు): నందిగామ మండలం చందాపురంలో శనివారం సోకిన అతిసార అదుపులోకి వచ్చినట్లు ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. ఆమె ఆదివారం అతిసార సోకిన చందాపురంతో పాటు, వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆమె పరామర్శించారు. చందాపురంలో ఏర్పాటు చేసిన శిబిరానికి ఆదివారం స్వల్ప విరేచనాలతో ముగ్గురు రాగా, వారికి అవసరమైన చికిత్స అందించినట్లు తెలిపారు. కాగా 17 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ఆమె వివరించారు. వారిలో నందిగామ ఏరియా ఆస్పత్రిలో 10మంది, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరుగురు, విజయవాడ జీజీహెచ్లో ఒకరు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. వారికి అందుతున్న వైద్య సేవలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. అప్రమత్తంగా ఉండాలి.. ప్రజలు ఒకటి, రెండు సార్లకు మించి విరేచనాలు, వాంతులు అయితే వెంటనే వైద్య సిబ్బందికి తెలిపి సత్వర చికిత్స పొందాలని డీఎంహెచ్ఓ సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిల్వ ఉన్న ఆహార పదార్థాలు కాకుండా, వేడి ఆహార పదార్థాలను తినాలని, క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే తాగాలన్నారు. డోర్టు డోర్ సర్వే.. వైద్య సిబ్బంది బృందాలుగా ఏర్పడి డోర్ టు డోర్ సర్వే చేస్తున్నట్లు వైద్యాధికారి తెలిపారు. అక్కడ సాధారణ పరిస్థితి వచ్చే వరకూ వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఇంధుమతి, డాక్టర్ నవీన్, డాక్టర్ సునీల్, ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. -
కొత్త వాటికి అనుమతి లేదు..
2026–27 విద్యా సంవత్సరానికి జిల్లాలో ఒక్క కొత్త ప్రైవేట్ పాఠశాలకు కూడా అనుమతి ఇవ్వలేదు. కొత్తగా ప్రారంభమవుతున్నట్లు ప్రచారం చేస్తున్న ఏ విద్యాసంస్థకూ అధికారిక అనుమతులు లేవు. అనుమతులు లేకుండా అడ్మిషన్లు చేపడుతున్నట్లు మా దృష్టికి వచ్చిన విద్యాసంస్థలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. ప్రచార హోర్డింగులు, బోర్డులు వెంటనే తొలగించాలని స్పష్టంగా పేర్కొన్నాం. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా అడ్మిషన్లు చేసేటప్పుడు సంబంధిత పాఠశాలల అనుమతుల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. – యూవీ సుబ్బారావు, విద్యాశాఖాధికారి, కృష్ణా జిల్లా -
నిల్వ చేసిన ఆహారం విక్రయిస్తే చర్యలు
నందిగామ టౌన్: రంగు కలిపిన, నిల్వ చేసిన ఆహార పదార్థాలను విక్రయిస్తే సహించేది లేదని ఉమ్మడి కృష్ణాజిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీనివాసరావు హెచ్చరించారు. నందిగామ పట్టణంలోని పలు హోటళ్లు, స్వీట్ దుకాణాల్లో ఆయన ఆదివారం విస్తృత తని ఖీలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. స్వీట్ షాపులు, హోటళ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే చర్యలు తప్పవని స్పష్టంచేశారు. ప్రతి ఒక్కరు ఆహార భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ముఖ్యంగా అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రామలింగేశ్వర స్వీటు దుకాణం, విజయ దుర్గ హోటల్లోని ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపినట్లు తెలిపారు. ఫుడ్ లైసెన్స్, తదితర అనుమతి పత్రాలు ఉండాలని చెప్పారు. వేసవి కాలంలో కావటంతో నిల్వ ఉంచిన మాంసాహారాలు, ఆహార పదార్థాలు అందించటం వల్ల ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదముందని హెచ్చరించారు. నిల్వ ఉన్న ఆహార పదార్ధాలను గుర్తించి బయట పడేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఫుడ్ సేఫ్టీ అధికారి రవీంద్రరెడ్డి, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
మెరుగైన ఫలితాలే శ్రీ గోసలైట్స్ లక్ష్యం
కంకిపాడు: ఏటా మెరుగైన ఫలితాల సాధనే లక్ష్యంగా తమ సంస్థలో విద్యాబోధన సాగుతోందని విజయవాడ శ్రీ గోసలైట్స్ మెడికల్ అకాడమీ చైర్మన్ నరేంద్రబాబు పేర్కొన్నారు. శ్రీగోసలైట్స్ మెడికల్ అకాడమీ రీ–యూనియన్ ఫెస్టివిటీస్ కార్యక్రమం ఆదివారం కంకిపాడులోని అయానా ఫంక్షన్ హాలులో జరిగింది. నరేంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అకాడమీలో శిక్షణ పొంది అత్యుత్తమ ర్యాంకులతో జాతీయ స్థాయి, వివిధ రాష్ట్రాల్లోని మెడికల్ కళాశాలల్లో మెడికల్ సీట్లు సాధించిన మెడికోలను సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా నరేంద్రబాబు మాట్లాడుతూ.. స్థాపించిన నాటి నుంచి ప్రతి ఒక్క తర గతి గదిని పూర్తి స్థాయిలో డిజటలైజ్ చేసి స్మార్ట్ బోర్డుల ద్వారా విద్యార్థులకు బోధన అందిస్తున్న ఏౖకైక విద్యాసంస్థ శ్రీగోసలైట్స్ అని పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలో అద్భుత విజయాలను తమ విద్యార్థులు సాధించేలా బోధనా పద్ధతులు అవలంబిస్తున్నామని తెలిపారు. నీట్ 2021లో 724, 2022లో 1,013, 2023లో 1,237, నీట్ 2024లో 1,392, నీట్ 2025లో 1,413 సీట్లు సాధించడం గర్వకారణమన్నారు. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ, మెడికల్ సీట్లు సాధిస్తున్నామన్నారు. శిక్షణ బృందం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా విద్యా ర్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
కృష్ణాజిల్లా
సోమవారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2026ఆయుర్వేదానికి అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువనుంచి నీరు రావడంలేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.5448 టీఎంసీలు. 7చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమాన్ని ఉదయం 10 గంటల నుంచి ప్రారంభిస్తామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కాల్ సెంటర్(1100) కు కాల్ చేసి కూడా అర్జీ నమోదుతో పాటు దాని స్థితిని తెలుసుకోవచ్చన్నారు.పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మ వారిని ఆదివారం నైమిషారణ్య పీఠాధిపతి, హిందూ ధార్మిక సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బాల బ్రహ్మానంద సరస్వతి దర్శించుకున్నారు. -
నూతన కార్యవర్గం ఎన్నిక
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి వివిధ సేవా టికెట్లు ద్వారా రూ. 9,57,703 ఆదాయం వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ స్వామివారి సేవా టికెట్ల ద్వారా రూ.4,64,890, లడ్డూ ప్రసాదం ద్వారా రూ.1,51,980, నిత్య అన్నదాన కార్యక్రమం ద్వారా రూ.1,10,395, శాశ్వత అన్నదానం ద్వారా రూ.1,24,368, స్వామివారి కల్యాణ కట్ట ద్వారా రూ.24,080, స్వామివారి దర్శన టికెట్ల ద్వారా రూ.45,800 తదితరాలు కలిపి మొత్తం రూ. 9,57,703 ఆదాయం వచ్చినట్లు వివరించారు. గుణదల(విజయవాడ తూర్పు): విద్యార్థులు క్రీడారంగంలో సైతం ప్రావీణ్యం పెంపొందించుకోవాలని లయోల ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ ఫాదర్ జోజిరెడ్డి అన్నారు. కళాశాల ఆవరణలో ఆదివారం చతురంగ–2026 పేరుతో చెస్ టోర్నమెంట్ నిర్వహించారు. యూత్ ఎంపవరింగ్ సర్వీస్, చెస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు జిల్లాలకు చెందిన 148 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదరంగం ద్వారా విద్యార్థుల్లో మానసిక ఎదుగుదల, ఏకాగ్రత పెరుగుతుందన్నారు. నగరానికి చెందిన 3 ఏళ్ల 11 నెలల చిన్నారి ఇవాన్ ఈ పోటీలలో పాల్గొని, గెలిచి అందరినీ ఆకట్టుకున్నాడని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం టోర్నమెంట్లో గెలిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లతో పాటు నగదు బహుమతి అందజేశారు. ఏపీ చెస్ అసోసియేషన్ సెక్రటరీ రాజీవ్, ఫాదర్ బాల బొల్లినేని, ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ పార్కర్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు కార్పొరేట్ వల!
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో అనుమతులు లేని కార్పొరేట్ విద్యాసంస్థలు భారీగా అడ్మిషన్లు చేపడుతుండగా, వాటిని అడ్డుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది. ఇప్పటికే అడ్మిషన్ తీసుకున్న విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడే ప్రమాదం ఉందని విద్యావర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యా వ్యవస్థను క్రమబద్ధీకరించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఒకవైపు చిన్న ప్రైవేట్ పాఠశాలలపై కఠిన నిబంధనలు అమలు చేస్తూ, మరోవైపు కార్పొరేట్ విద్యాసంస్థలకు సడలింపులు ఇస్తోంది. జిల్లాలో 196 ప్రైవేట్ పాఠశాలలకు మాత్రమే అధికారిక అనుమతులు ఉన్నాయి. కాగా కొత్తగా అనుమతులు లేని కొన్ని కార్పొరేట్ సంస్థలు టీడీపీ నేతలు అండతో నిర్భీతిగా అడ్మిషన్లు కొనసాగిస్తున్నాయి. అనుమతులు లేకుండానే అడ్మిషన్లు.. జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన కొత్తగా ఎలాంటి ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు ఇవ్వలేదని అధికారులు చెబుతున్నప్పటికీ, కొత్త కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్మిషన్లు చేపడుతున్న పరిస్థితి తల్లిదండ్రుల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. మచిలీపట్నం రూరల్ మండలంలోని ధర్మక్షేత్ర ఇంటర్నేషనల్ స్కూల్, గూడూరు మండలంలోని ఢిల్లీ వరల్డ్ స్కూల్ వంటి సంస్థలు అనుమతులు లేకుండానే అడ్మిషన్లు ప్రారంభించాయి. ప్రభుత్వ ఒత్తిడి.. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి కారణంగానే విద్యాధికారులు మౌనం వహిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ వ్యవహారం మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని విద్యావర్గాలు హెచ్చరిస్తున్నాయి. ‘సీబీఎస్ఈ’ పేరుతో ఆకర్షణ.. అనుమతులు లేకపోయినా ‘సీబీఎస్ఈ స్కూల్’ పేరు తో తల్లిదండ్రులను ఆకర్షిస్తూ యాజమాన్యాలు అడ్మి షన్లు చేపడుతున్నాయి. సీబీఎస్ఈ పాఠశాల అయినా జిల్లా విద్యాశాఖ నుంచి ఎన్ఓసీ తప్పనిసరి అనే నిబంధన ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం 2026–27 విద్యా సంవత్సరానికి అనుమతులు పొందాలంటే 2025 డిసెంబర్ నాటికి ప్రభుత్వానికి చలాన్ చెల్లించి దరఖాస్తు చేయాలి. ఈ నిబంధనలో ఉన్న లొసుగులను ఆసరాగా తీసుకుని కొన్ని కార్పొరేట్ యాజమాన్యాలు భవన నిర్మాణం పూర్తికాక ముందే అడ్మిషన్లు ప్రారంభించాయి. వాస్తవానికి పాఠశాలకు పూర్తి స్థాయి భవనం, తరగతి గదులు, బోధనా సిబ్బంది, క్రీడా మైదానం వంటి సౌకర్యాలు ఏర్పాటు చేసిన తర్వాతే ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. కానీ ఈ నిబంధనలను పక్కన పెట్టి భారీ ప్రచారం చేస్తూ కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్మిషన్లు చేపడుతున్నాయి. ‘సీబీఎస్ఈ’ పేరిట అడ్మిషన్ల దందా! అనుమతులు లేకుండానే దోపిడీకి శ్రీకారం జిల్లా విద్యాశాఖ ఎన్ఓసీ తప్పనిసరైనా పట్టించుకోని వైనం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులు -
సుర్రుమన్న సూరీడు
పోలీస్ కంట్రోల్ రూం సమీపంలోని ఫై ్లఓవర్నిర్మానుష్యంగా కనిపిస్తున్న కంట్రోల్ రూం జంక్షన్ జనసంచారం లేక వెలవెలబోతున్న బందరురోడ్డు ఎండలు మండుతున్నాయి. మార్చి చివరి వారం నుంచే భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం ఎనిమిది గంటలు దాటితే చాలు రోడ్లపైకి వచ్చేందుకు ప్రజలు వెనుకంజ వేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప పగటి వేళ రోడ్డు ముఖం చూడటంలేదు. దీంతో ఉదయం పది గంటలు దాటితే రోడ్లన్నీ జనసంచారం లేక వెలవెలబోతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే రోడ్లపై సైతం వాహనాల రాకపోకలు తగ్గిపోయాయి. ఆదివారం ఎండ తీవ్రత పెరగడంతో విజయవాడ రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
రోడ్డు ప్రమాదంలో చిన్నారి దుర్మరణం
పామర్రు: రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందిన ఘటన పామర్రులో ఆదివారం జరిగింది. ఆరేపల్లి షణుఖ వెంకటేశ్వరరావు వేరే ఊరి నుంచి వస్తున్న తన బంధువుల కోసం పామర్రు – గుడివాడ రహదారిలోని ఫ్లై ఓవర్ వద్దకు బయలుదేరాడు. ఇంటి సమీపంలో నివసించే బావిశెట్టి జగదీష్(14)ను బైక్ ఎక్కించుకుని ఫ్లై ఓవర్ వద్దకు చేరుకున్నారు. ఇంతలో గుడివాడ నుంచి వేగంగా వచ్చిన లారీ అదుపు తప్పి బైక్ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న జగదీష్ రోడ్డుపై పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన జగదీష్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. జగదీష్ పామర్రులో జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పామర్రు ఎస్ఐ రాజేంద్రప్రసాద్ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కృష్ణాజిల్లా
ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026అత్యధిక పాల సేకరణ ధర ఘనత విజయ డెయిరీదేఘంటసాలలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణమచిలీపట్నంఅర్బన్: ఆర్టీఈ చట్టం 12 (1)(సీ) ప్రకారం 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత అర్హుల జాబితాను విడుదల చేసినట్లు కృష్ణా జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త కుమిదిని సింగ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 686 మంది విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశా లల్లో మొదటి తరగతిలో 25 శాతం రిజర్వేషన్ కోటా కింద ఉచిత ప్రవేశాలు కేటాయించినట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ధ్రువపత్రాలను ఆన్లైన్ దరఖాస్తు ప్రింట్ కాపీతో కేటాయించిన పాఠశాలలో ఏప్రిల్ ఏడో తేదీ లోపు సమర్పించి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. పూర్తి వివరాలకు 18004258599 టోల్ ఫ్రీ నంబర్ సంప్రదించొచ్చని పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి శనివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. విజయవాడ లబ్బీపేటకు చెందిన దేవి నేని రామకృష్ణ, కనకదుర్గాంబ అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులకు నిత్యాన్నదానానికి రూ.1,11,116 విరాళం అందచేశారు. ఇబ్రహీంపట్నానికి చెందిన సముద్రాల వీరభద్రరావు, శ్రీలత అమ్మ వారి నిత్యాన్నదానానికి రూ.1,11,116 విరాళం ఆలయ అధికారులకు అందజేశారు. అమ్మ వారి దర్శనం, వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మ వారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వ కార్యాలయాలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కలెక్టర్ డి.కె.బాలాజీ కోరారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని స్థానిక ఆర్అండ్బీ ఈఈ కార్యాలయ ప్రాంగణంలో శనివారం నిర్వహించారు. కలెక్టర్, వివిధ శాఖల అధికారులు పరి సరాలను పరిశుభ్రం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగాన్ని పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. అమృత్ కృష్ణ పేరుతో గాజు సీసాల్లో తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, డెప్యూటీ సీఈఓ ఆనందకుమార్, ఆర్అండ్బీ ఈఈ లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో వసంత నవరాత్రోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపును పురస్కరించు కుని దేవస్థానం తరఫున అమ్మవారికి విశేష పుష్పార్చన నిర్వహించారు. గులాబీలు, చామంతులు, మల్లెలు, విరజాజులు, తామర పూలు, కాగడాలతో ఆలయ అర్చకులు అమ్మవారికి పుష్పార్చన జరిపించారు. ఆలయ ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మల్లేశ్వరస్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో మహా పూర్ణాహుతిని ఆలయ వైదిక కమిటీ నిర్వహించింది. స్థానాచార్య శివప్రసాద్ శర్మ పర్యవేక్షణలో ఆలయ అర్చక బృందం పూర్ణాహుతిని శాస్త్రోక్తంగా జరిపించారు. పెనమలూరు: మండలంలోని కానూరులో ఉన్న సిద్ధార్థ డీమ్డ్ టూ బీ యూనివర్సీటీలో శనివారం రాష్ట్ర స్థాయి వికసిత్ భారత్ పార్లమెంట్పై పోటీలు నిర్వహించారు. ఏపీ మై భారత్ (మేరా యువభారత్) డైరెక్టర్ అంసుమాన్ప్రసాద్దాస్, ప్రో వైస్ చాన్స్లర్ డాక్టర్ ఎ.వి.రత్నప్రసాద్ ఈ పోటీలను ప్రారంభించారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి యువభారత్ పార్లమెంట్ పోటీల్లో ఎంపికై న 100 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. యూనియన్ బడ్జెట్ –2026, వికసిత భారత్ –2047 వైపు భారత యువత పదాన్ని బలోపేతం చేయడంపై పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఎం.వెంకటసాహిత్య (గుంటూరు జిల్లా), వి.తనకమయ(అన్న మయ్య జిల్లా), టి.యోగవిష్ణురాజ్ (తిరుపతి జిల్లా) విజేతలుగా గెలిచారు. వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.రవిచంద్, జిల్లా యువజన అధికారి సుంకరరాము, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జె.శివరామ్ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జి.కొండూరు: సున్నా పెట్టుబడి.. నిత్యం ఆదాయం.. ఆపై ఉపాధి కల్పన.. అంటూ గొప్పగా ప్రచారం చేసిన ప్రభుత్వం ఆ దిశగా ప్రోత్సాహం అందించకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జీరో పెట్టుబడితో ఉద్యాన సాగు అంటూ స్వల్ప కాల పంటలను సాగు చేసే రైతులను సైతం ఉద్యాన సాగు వైపు మళ్లేలా ప్రభుత్వం ప్రోత్సహించింది. అప్పులు చేసి ఉద్యాన సాగుపై పెట్టుబడి పెట్టిన రైతులకు ఈ ఏడాది మెటీరియల్ నిధులు ఇప్పటి వరకు విడుదల చేయలేదు. దీంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. నిధుల విడుదలలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో వచ్చే ఏడాది ఉద్యాన సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో... జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు ఎన్టీఆర్ జిల్లాలో 1,307 మంది రైతులు 2,500 ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేశారు. అయితే ఈ సాగుకు 2025–28 వరకు మూడేళ్ల కాలానికి కూలీల ఖర్చు కింద రూ.1,170.23 లక్షలు, మెటీరియల్ ఖర్చు కింద రూ.507.02 లక్షలు మంజూరు చేశారు. మొదటి ఏడాది 2025–26 సంవత్సరానికి కూలీల ఖర్చు కింద రూ.257.16 లక్షలు, మెటీరియల్ ఖర్చు కింద రూ.109.86 లక్షలు రైతులకు చెల్లించాల్సి ఉంది. అయితే మెటీరియల్ ఖర్చుకు సంబంఽధించిన నిధులను ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదు. కూలీల ఖర్చు నిధులను 20 శాతం ఇంకా విడుదల చేయలేదని సమాచారం. ఇదే కాకుండా 2024–25 సంవత్సరానికి సాగు చేపట్టిన రైతులకు ఈ ఏడాది విడుదల కావాల్సిన నిర్వహణ ఖర్చులు సైతం 20 శాతానికి పైగా పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం రాయితీ ఇస్తుందని నమ్మి అప్పులు చేసి సాగు చేపట్టిన రైతులు రాయితీ నిధుల విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. పథకం ఇలా... ఉద్యాన పంటల సాగును పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వందశాతం రాయితీతో ప్రోత్సహిస్తోంది. ఈ పథకంలో భాగంగా ఐదు ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉండి ఉద్యాన పంటలను సాగు చేసే రైతులకు మూడేళ్ల కాల పరిమితితో విడతల వారీగా నిర్వహణ ఖర్చులను విడుదల చేస్తారు. పండ్ల తోటలకు ఒక రైతుకు ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు సాగు చేపట్టేందుకు ఈ పథకంలో ఆర్థిక సాయాన్ని అందిస్తారు. అయితే డ్రాగన్, గడ్డి, గట్లు వెంబడి మొక్కల పెంపకానికి గరిష్టంగా ఎకరం వరకు ఆర్థిక సాయాన్ని అందిస్తారు. ఈ విధంగా సాగు చేపట్టిన రైతులు ఉపాధి హామీ పనులకు వెళ్లకుండా తమ తోటలోనే ఏటా వంద రోజులు పనిదినాలు పొందే అవకాశం ఉంటుంది. చిట్టినగర్(విజయవాడపశ్చిమ): దేశంలో అత్యధిక పాల సేకరణ ధర, పాడి రైతులకు బోనస్ అందిస్తున్న ఘనత కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ)ది అని సంస్థ చైర్మన్ చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ 36వ సర్వ సభ్య సమావేశం శని వారం పాలప్రాజెక్టు ఆవరణలోని ఫంక్షన్ హాల్లో జరిగింది. యూనియన్ మాజీ చైర్మన్ మండవ జానకీ రామయ్య చిత్రపటానికి చైర్మన్, ఎండీ, సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ ఏడాది యూనియన్ బోర్డు, సంస్థ ఉద్యోగులు సంయుక్త కృషితో సాధించిన వివరాల గురించి చైర్మన్ సభ్యులకు వివరించారు. సమావేశం అనంతరం చైర్మన్ చలసాని ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. పాడి రైతులు ఆర్థికంగా నిలబడటమే కాకుండా వారికి తోడ్పాటును అందించాలనే కృత నిశ్చయంతో పాల సేకరణ ధరను రూ.30 పెంచి ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఆవుపాల ధరను లీటర్కు రూ.20 పెంచేందుకు సర్వ సభ్య సమావేశంలో తీర్మానించామని పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక పాల సేకరణ ధరను కృష్ణా మిల్క్ యూనియన్ చెల్లించబోతుందన్నారు. పాడి రైతులకు బోనస్గా రూ.15 కోట్లు డిసెంబర్ నుంచి మార్చి వరకు పాడి రైతులకు బోనస్గా రూ.15 కోట్లు చెల్లిస్తామని చలసాని ఆంజనేయులు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.45 కోట్లు బోనస్గా రైతులకు చెల్లించామన్నారు. గత ఏడేళ్లలో కృష్ణా మిల్క్ యూనియన్ రూ.716 వార్షిక టర్నోవర్ను రూ.1,265 కోట్లకు పెంచామని, రూ.96 కోట్ల సమితి మిగులు నిధులను రూ.250 కోట్లకు చేర్చామని వివరించారు. సమితి స్థిరాస్తులను రూ.64 కోట్ల నుంచి రూ.320 కోట్లకు పెంచామన్నారు. వీరవల్లిలోని యూనియన్ కొత్త యూనిట్కు కేంద్ర ప్రభుత్వం రూ.10 కోట్లు సబ్సిడీ ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీ కొల్లి ఈశ్వరబాబు, సమితి పాలక వర్గ సభ్యులు, ట్రస్ట్ సభ్యులు, ఫీడ్ కమిటీ సభ్యులు, సంఘ అధ్యక్షులు, సమితి అధికారులు పాల్గొన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఘంటసాల: దేశంలోని ప్రతి పౌరుడికీ స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం వంటి హక్కులు కల్పించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అని అంబే డ్కర్ మనవడు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ భీమ్ రావ్ యశ్వంత్ అంబేడ్కర్ అన్నారు. ఘంటసాలలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ అధ్యక్షుడు ఉప్పులేటి దేవీప్రసాద్తో కలసి ఆయన శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో యశ్వంత్ అంబేడ్కర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పల్లె, నగరంలో అంబేడ్కర్ విగ్రహాలు ఉండటం ఇక్కడి ప్రజలకు ఆయనపై ఉన్న అపారమైన గౌరవానికి నిదర్శనమన్నారు. మాజీ ఎమ్మెల్యే పాటూరి రామయ్య మాట్లా డుతూ.. ఎస్సీలు క్రైస్తవులైతే ఎస్సీ రిజర్వేషన్లు చెల్లవంటూ ఉన్నత న్యాయ స్థానం తీర్పు ఇవ్వడం సమంజసమా అని ప్రశ్నించారు. ఢిల్లీస్థాయిలో గొంతు వినిపించి ఎస్సీలకు రక్షణ కల్పించాలన్నారు. ముందుగా ఘంటసాల వారసత్వ విగ్రహాల నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. సభావేదిక వద్ద బౌద్ధ సంప్రదాయాలతో భంతే ధమ్మ ధజ థెరో ప్రత్యేక పూజలు చేసి అంబేడ్కర్ విగ్రహావిష్కరణ చేయించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, వైఎస్సార్ సీపీ నాయకులు వేమూరి వెంకట్రావు, వేమూరి ప్రవీణ్, నలకుర్తి సురేష్, జుజ్జువరపు భాగ్యారావు, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి రామకృష్ణ, రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు పంత గాని రమేష్, కృష్ణాజిల్లా అధ్యక్షుడు దోవా గోవర్ధన్, తూమాటి బసవ సుధాకర్, కోటే రామ్నాథ్, గద్దె కోటినాగులు, ఏపీ న్యాయశాఖ జాయింట్ సెక్రటరీ వెలగపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): మార్చి చివరి వారంలోనే ఎండలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వారం రోజులుగా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అనేక మంది అనారోగ్య సమస్యలతో ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. జ్వరం, తల నొప్పితో పాటు కొందరు చలితో కూడిన జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో కొందరు ఎండలోకి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితికి చేరుకున్నారు. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు ఇంకెలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అనారోగ్య సమస్యలు ఇవీ.. 5 డిగ్రీలు ప్రభావం ఎక్కువ ప్రస్తుతం నగరంలో ఉష్ణోగ్రతలు 37 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ వరకూ నమోదవుతున్నాయి. అయితే దాని తీవ్రత ఐదు, ఆరు డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆల్ట్రావైలెట్ కిరణాలు ఎక్కువగా పడటం ఇందుకు కారణమని వివరిస్తున్నారు. ఓజోన్ పొర బలహీన పడకపోయినప్పటికీ గాలిలో ఉండే దుమ్ము కాలుష్యం ఎక్కువగా ఉండటంతో ఇలాంటి పరిస్థితి తలెత్తుతున్నట్లు పేర్కొంటున్నారు. ఖీళీ ప్రదేశం లేని ఇరుకు భవనాలు, మార్జిన్ లేని సిమెంటు రోడ్లు, విచ్చలవిడిగా ఏసీల వినియోగంతో ఇలా మార్చిలోనే తీవ్రమైన ఎండలకు కారణం అంటున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి కాంక్రీట్ జంగిల్తోనే అధిక ఉష్ణోగ్రతలు ప్రస్తుతం విజయవాడ కాంక్రీట్ జంగిల్గా మారడంతో మార్చిలోనే అధిక ఎండలు నమోదవుతున్నాయి. వాటి ప్రభావం కూడా ఐదు నుంచి ఆరు శాతం ఎక్కువగా చూపుతోంది. చెట్లు లేక పోవడం, ఖాళీ ప్రదేశం లేకుండా ఇంటిని అనుకుని ఇళ్లు బహుళ అంతస్తుల నిర్మాణాలు, చెట్లు లేక పోవడం వంటి కారణాలతో చల్లని వాతావరణ కొరవడింది. ఈ పరిస్థితి మారాలంటే సాయంత్రం వాటర్ స్ప్రిక్లింగ్ చేయడం, మొక్కలు పెంచడం వంటివి చేపట్టాలి. Iవిజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 535.80 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి వచ్చే నీటిచేరిక పూర్తిగా నిలిచిపోయింది. ఉపాధి హామీ పథకంలో ఉద్యాన సాగు చేపట్టిన రైతులకు పెట్టు బడి నిధులను వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వం ఇస్తుందనే నమ్మకంతో రైతులు అప్పు చేసి పెట్టుబడులకు వెచ్చించారు. ఇప్పుడు మాట తప్పితే ఉద్యాన సాగు ప్రశ్నార్థకంగా మారుతుంది. కూలీల నిధులను వెంటనే విడుదల చేయాలి. – కోట కల్యాణ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి 2025–26 ఏడాదికి ఉద్యాన పంటలు సాగు చేసిన రైతులకు అందాల్సిన నిధులు ఇలా.. మండలం రైతులు కూలీల ఖర్చు మెటీరియల్ ఖర్చు (రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో) ఎ.కొండూరు 133 33.20 7.86 చందర్లపాడు 73 12.52 11.21 జి.కొండూరు 53 7.76 3.92 గంపలగూడెం 65 11.73 2.91 ఇబ్రహీంపట్నం 28 5.43 2.83 జగ్గయ్యపేట 56 9.39 6.73 కంచకచర్ల 44 5.67 3.84 మైలవరం 168 35.93 19.45 నందిగామ 77 11.56 4.49 పెనుగంచిప్రోలు 61 7.43 5.61 రెడ్డిగూడెం 139 29.86 7.99 తిరువూరు 94 19.29 10.35 వత్సవాయి 75 13.38 7.33 వీరులపాడు 66 16.23 6.46 విజయవాడరూరల్ 32 6.00 2.85 విస్సన్నపేట 143 31.79 6.03 ఎండలు మండుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎండ తీవ్రతకు అనారోగ్యానికి గురైన వారు పలు సమస్యలతో ఆస్పత్రులకు వస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, గర్భిణులు, బాలింతలు ఎండ ప్రభావానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఐదేళ్లలోపు పిల్లలను బయటకు పంపకూడదు. మంచినీరు, ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మసాలా ఆహారం తగ్గించడం ఉత్తమం. – డాక్టర్ మాచర్ల సుహాసిని, డీఎంహెచ్ఓ, ఎన్టీఆర్ మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిపై ఎండ ప్రభావం త్వరగా చూపుతుంది. వారు త్వరగా డీ హైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ తీవ్రతకు గురకాకుండా చూసుకోవాలి. మంచినీరు అధికంగా తాగడం, నీటి శాతం ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ తీసుకోవడం మంచింది. ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోవడం ఉత్తమం. ఎండలోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ కె వేణుగోపాలరెడ్డి, మధుమేహ నిపుణుడు -
సాగర్ కాలువలో పడి యువకుడి దుర్మరణం
తిరువూరు: ద్విచక్రవాహనం అదుపు తప్పి కాలువలో పడిన సంఘటనలో తిరువూరుకు చెందిన యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్ఐ శాతకర్ణి తెలిపిన వివరాల ప్రకారం తిరువూరు 12వ వార్డుకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు నల్లబోతుల సూర్యకుమార్(25) ద్విచక్ర వాహనంపై బైపాస్ రోడ్డు నుంచి సుందరయ్య కాలనీ మీదుగా మధిర రోడ్డు వెళుతూ పక్కనే ఉన్న తిరువూరు మేజరు నాగార్జున సాగర్ కాలువలో జారి పడిపోయాడు. రాత్రివేళ ఎవరూ గుర్తించకపోవడంతో నీట ముని గి ఊపిరాడక చనిపోయా డు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సూర్యకుమార్ మృతదేహానికి తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడు అవివాహితుడు. -
రైతులకు రూ.182.31 లక్షల వడ్డీ మాఫీ
చిలకలపూడి(మచిలీపట్నం): ఉమ్మడి కృష్ణాజిల్లాలో రైతులకు ఉపశమనంగా రూ.182.31 లక్షల వడ్డీ మాఫీకి ఆమోదం తెలిపినట్లు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం శ్రీరఘురాం తెలిపారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఫంక్షన్ హాలులో శనివారం సాయంత్రం నిర్వహించిన మహాజనసభ సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ కేడీసీసీ బ్యాంక్ అభివృద్ధిలో సొసైటీ చైర్మన్ల పాత్ర కీలకమన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునాది అయిన సహకార బ్యాంకింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కేడీసీసీ బ్యాంకు కమర్షియల్ బ్యాంకులకు దీటుగా 5వ స్థానంలో ఉందన్నారు. అయితే కేడీసీసీ బ్యాంక్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటవ స్థానం, దేశంలో నాల్గవ స్థానంలో నిలవటం గర్వకారణమన్నారు. రైతు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిన తమ బ్యాంక్ జనతా ఇన్సూరెన్స్ పథకం ద్వారా రైతులకు భద్రత కల్పిస్తున్నామన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన రైతు కుటుంబానికి రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు. ఆ రైతు తీసుకున్న పంట రుణంపై కూడా వడ్డీ మొత్తాన్ని మాఫీ చేస్తున్నామన్నారు. డిజిటల్ సేవలను విస్తరిస్తున్నాం కేడీసీసీ బ్యాంకు ద్వారా డిజిటల్ సేవలను విస్తరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చైర్మన్ తెలిపారు. ఆర్టీజీఎస్, నెఫ్ట్, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. చిన్న వ్యాపారులను ప్రోత్సహించేందుకు ఫోన్పే క్యూఆర్ కోడ్ సౌకర్యాన్ని అందిస్తున్నామన్నారు. మహాజనసభ సమావేశంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.115.68 కోట్లు బడ్జెట్కు ఆమోదం తెలిపామన్నారు. బంటుమిల్లి, శేరీలక్ష్మీపురం పీఏసీఎస్ల నుంచి స్థలాలు కొనుగోలు చేసి బ్రాంచ్ భవనాలను నిర్మించేందుకు ఆమోదం తెలిపామన్నారు. రెడ్డిగూడెం మండలం వెల్లటూరు, శేరీలక్ష్మీపురం ప్రాంతాల్లో మూడు కొత్త బ్రాంచ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2026–27వ సంవత్సరానికి సంబంధించి మేనేజర్ స్థాయి నుంచి ఏజీఎం స్థాయి వరకు ఉద్యోగుల వేతన సవరణలకు అమూల్యమైన సహకారం అందించామని చైర్మన్ తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో సభ్యులకు అంత్యక్రియల ఖర్చు కోసం రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు. రైతు కుటుంబాల అభివృద్ధి కోసం విద్యా రుణాలు, గృహ రుణాలు, వ్యవసాయ భూమి కొనుగోలు రుణాలు వంటి పలు రుణ సదుపాయాలను అందిస్తున్నామన్నారు. అనంతరం నవాబ్పేట సొసైటీ చైర్మన్ చింతా వెంకటేశ్వరరావు ఇటీవల మరణించిన నేపథ్యంలో ఆయనకు రెండు నిమిషాలు సంతాపం తెలిపారు. కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ సీఈవో ఎ.శ్యామ్మనోహర్, డీసీవో చంద్రశేఖరరెడ్డి, జనరల్ మేనేజర్లు రంగబాబు, బీఎల్ చంద్రశేఖర్, ఉమ్మడి కృష్ణా జిల్లా సొసైటీల అధ్యక్షులు పాల్గొన్నారు. -
కార్మిక పక్షపాతి వైఎస్ జగన్
● వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి ● ఘనంగా ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం మధురానగర్(విజయవాడసెంట్రల్): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిన వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి అన్నారు. స్థానిక సత్యనారాయణపురం ఫుడ్ జంక్షన్లో శనివారం వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ట్రేడ్ యూనియన్ జెండాను ఆవిష్కరించి, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం సుమారు 80 సంఘాలతో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ బలోపేతమయిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో దర్జీలు, ధోబీలు, ఆటో డ్రైవర్లు వంటి వివిధ చేతివృత్తుల కార్మికులకు ఏడాదికి రూ.10,000 నేరుగా లబ్ధి చేకూరిందని అన్నారు. యానిమేటర్ల వేతనాన్ని గత ప్రభుత్వం రూ.3,000 నుంచి రూ.10,000 కు పెంచారని, పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.8,000 నుంచి ఏకంగా రూ.21,000కు ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు, ఫ్యాక్టరీల ద్వారా మరో 34 లక్షల మందికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉపాధి కల్పించారన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, కార్మిక వర్గాల సంక్షేమం కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు కార్మికులందరూ ఏకతాటిపైకి వచ్చి కృషి చేయాలని గౌతం రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ యాదల శ్రీనివాసరావు, జోనల్ ఇన్చార్జ్ ఎన్.రాజారెడ్డి, జిల్లా ఇన్చార్జ్ విశ్వనాథ రవి, రవీంద్ర రెడ్డి, బత్తుల గోవింద్, సామంతపూడి చిన్న, దుర్గాప్రసాద్, ప్రభు, వర్మ, కమ్మిలి రత్నకుమార్, బి.కిషోర్ పాల్గొన్నారు. -
పకడ్బందీగా పది పరీక్షలు
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో ఆరో రోజు శనివారం ఎస్ఎస్సీ, ఏపీఓఎస్ఎస్ పది పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి యు.వి. సుబ్బారావు తెలిపారు. పరీక్షల సమయంలో ఎటువంటి మాల్ప్రాక్టీస్ ఘటనలు నమోదు కాలేదని వెల్లడించారు. జిల్లాలో ఎస్ఎస్సీ బయోలాజికల్ సైన్స్ పరీక్షకు మొత్తం 21,716 మంది విద్యార్థులు నమోదు కాగా, 21,408 మంది హాజరయ్యారన్నారు. 308 మంది గైర్హాజరయ్యారని, హాజరు శాతం 98.58గా నమోదైందని పేర్కొన్నారు. అలాగే ఏపీఓఎస్ఎస్ హిందీ పరీక్షకు ఇద్దరు విద్యార్థులకు గాను ఇద్దరూ హాజరయ్యారన్నారు. 100 శాతం హాజరు నమోదైందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్లు, అయిదు సిట్టింగ్ స్క్వాడ్లు పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించాయన్నారు. అదనంగా ఏడు జోన్లలో 33 విభాగ కమిటీలు, ఏసీజీఈ కృష్ణా, మచిలీపట్నం పరిధిలో నాలుగు ప్రత్యేక కమిటీలు పర్యవేక్షణ నిర్వహించాయని తెలిపారు. నాలుగు పరీక్ష కేంద్రాలు తనిఖీ గూడూరు మండలంలోని జెడ్పీహెచ్ఎస్ మల్లవోలు, కంకటావ, జెడ్పీహెచ్ఎస్ గూడూరు, ఏపీఆర్ఎస్ నిమ్మకూరు పాఠశాలలను డీఈఓ తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ విధానం, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు అందించారు. -
తెలుగుభాషా వైభవాన్ని చాటిచెప్పిన పుట్టపర్తి
చిలకలపూడి(మచిలీపట్నం): తెలుగు సాహిత్యానికి అపారమైన సేవలు అందించిన మహాకవి, పండితుడు పుట్టపర్తి నారాయణాచార్యులు తెలుగుభాషా వైభవాన్ని చాటిచెప్పిన మహనీయుడని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతి సందర్భంగా కలెక్టరేట్లోని సమావేశపు హాలులో శనివారం ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ నారాయణాచార్యులు తెలుగుభాషా సాహిత్య జగత్తులో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. యువత ఆయన సాహిత్య వారసత్వాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ట్రైనీ డెప్యూటీ కలెక్టర్ నిఖిల, కలెక్టరేట్ ఏవో ఏఎస్ఎన్ రాధిక, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ బాలాజీ -
ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్బీఐ ఎస్జీఎస్పీ చెక్కుల పంపిణీ
పటమట(విజయవాడతూర్పు): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, వారి కుటుంబాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండగా ఉంటుందని వీఎంసీ అదనపు కమిషనర్(జనరల్) ఎ.రవీంద్రరావు అన్నారు. వీఎంసీ ప్రాంగణంలోని ఎస్బీఐలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాంక్ అమలు చేస్తున్న ఎస్బీఐ ఎస్జీఎస్పీ (స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్) గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం లబ్ధిదారులకు శనివారం ఆయన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని విభాగాల్లో విధులు నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తిస్తుందని ప్రమాదవశాత్తు, అనారోగ్య కారణాల వల్ల మృతి చెందితే వారి కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఆర్థిక ఆలంబన ఉంటుందన్నారు. ప్రతి ఉద్యోగి వారి వేతనాలు జమయ్యే ఎస్బీఐ బ్రాంచ్లో ఈ పథకం అమలులో ఉంటుందని, ఉద్యోగులందరూ ఈ పథకానికి అర్హులని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం వీఎంసీలో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన ఐదుగురు పబ్లిక్ హెల్త్ వర్కర్స్, ఒక శానిటరీ ఇన్స్పెక్టర్, ఒక శానిటరీ మేసీ్త్ర, కుటుంబ సభ్యులకు వారి బీమా పరిహారపు చెక్కులు అందించారు. ఎస్బీఐ వీఎంసీ విజయవాడ వెస్ట్ ప్రాంతీయ మేనేజర్ ఎన్.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ పథకం కింద రిటైర్మెంట్ వరకు బీమా రక్షణ ఉంటుందని, ఈ బీమా కవరేజ్ పూర్తి ఉచితంగా, ఎటువంటి ప్రీమియం లేకుండా అందిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వీఎంసీ అకౌంట్స్ ఆఫీ సర్ బి.ఎస్.ఎన్.మూర్తి, చీఫ్ మేనేజర్ (డిపాజిట్స్ – వీఏఎస్) ఎం.భాస్కర్ రావు, వీఎంసీ బ్రాంచ్ మేనేజర్ ఎస్.శివరాం పాల్గొన్నారు. -
గ్రామ వ్యవసాయ సహాయకులకు రీ–కౌన్సెలింగ్
చిలకలపూడి(మచిలీపట్నం): కోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో గ్రామ వ్యవసాయ సహాయకులకు శనివారం రీ–కౌన్సెలింగ్ నిర్వహించారు. గత సంవత్సరం జూలై నెలలో జరిగిన కౌన్సెలింగ్లో తమకు అన్యాయం జరిగిందని గ్రామ వ్యవసాయ సహాయకులు హైకోర్టును ఆశ్రయించటంతో కోర్టు రీ–కౌన్సెలింగ్ నిర్వహించాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎన్.పద్మావతి ర్యాంకుల ఆధారంగా సీనియార్టీ జాబితా ప్రకటించి వారికి రీ–కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్లో 103 మంది పాల్గొన్నారు. కమిటీ సభ్యులు ఎన్టీఆర్ వ్యవసాయాధికారి విజయకుమారి, ఏలూరు జిల్లా ఏడీ వెంకటమణి, ఆచార్యులు పాల్గొన్నారు. -
యూపీహెచ్సీలో ఆకస్మిక తనిఖీలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): నగరంలోని చిట్టినగర్ యూపీహెచ్సీని గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో రోజూ ఎంత ఓపీ నమోదు అవుతుంది, అభా ఐడీలు చేస్తున్నారా లేదా, ఆన్లైన్ పక్రియ సక్రమంగా జరుగుతుందా అనే అంశాలను ఆమె పరిశీలించారు. అనంతరం ఫార్మసీలో అత్యవసర మందులు సరఫరా, రోగులకు ఇచ్చిన మందుల వివరాలు, మందుల లభ్యత, వాటిన భద్రపరుచే విధానం వంటి అంశాలను తనిఖీ చేశారు. రోగులకు రక్త పరీక్షల ఎలా నిర్వహిస్తున్నారు.. రిపోర్టులు సక్రమంగా ఇస్తున్నారా అని అక్కడ ఉన్న రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు సిబ్బంది పనిచేయాలని పిలుపునిచ్చారు. -
బస్సుల్లోనే బతుకులు బుగ్గి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రైవేట్ బస్సులంటేనే ప్రయాణికులు భయపడుతున్నారు.వరుసగా ప్రైవేట్ బస్సులు ప్రమాదాలకు గురికావడం పదుల సంఖ్యలో మృత్యువాత పడుతుండటంతో ప్రయాణికులు హడలిపోతున్నారు. గతేడాది కర్నూలు జిల్లాలో, కొన్ని నెలల క్రితం ఎన్టీఆర్ జిల్లా కీసర సమీపంలో.. తాజాగా మార్కాపురంలో ఇలా రాష్ట్రంలో ఏదో ఒక చోట ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు అగ్నికి ఆహుతవుతున్నాయి. వరుసగా జరుగుతున్నా ప్రభుత్వం ప్రైవేటు ట్రావెల్స్పై చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. నిత్యం తనిఖీలు చేయాల్సిన అధికారులు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేస్తున్నారు. కర్నూలు బస్సు ప్రమాదంలో 20 మంది, మార్కాపురం బస్సు ఘటనలో 14 మంది మృత్యువాత పడ్డారు. ప్రైవేటు ట్రావెల్స్కు విజయవాడ రాజధాని ప్రైవేటు ట్రావెల్స్కు విజయవాడ.. రాజధానిగా మారింది. ఇక్కడ నుంచి నిత్యం 500 పైగా బస్సులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిలో చాలా వరకు సరైన పర్మిట్లు, ఫిట్నెస్ లేకపోవడం, సేఫ్టీ పాటించకుండానే రోడ్లెక్కుతున్నాయి. అతి వేగం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల రిజిస్ట్రేషన్ వాహనాలు అధిక సంఖ్యలో తిరుగుతున్నాయి. ఒకే నంబరుతో ఒక బస్సు హైదరాబాద్, మరో బస్సు బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్తున్నా అధికారులకు తెలిసీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. బస్సుల్లో సిబ్బంది వంట కోసం సామగ్రి, స్టౌ, గ్యాస్ వంటివి బస్సు కింది భాగంలో ఉన్న ఖాళీ స్థలంలో పెడుతున్నారు. కొందరు అందులోనే మద్యం తాగుతున్నారు. మరికొన్ని బస్సులు సరుకు రవాణా చేస్తున్నాయి. ఎక్కవగా టైర్లు తరలిస్తున్నారు. అనుకోని ప్రమాదం జరిగి టైర్లకు నిప్పంటుకుంటే మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడే అవకాశం ఉంది. హనుమాన్పేట నుంచి బయలు దేరే బస్సుల్లో సరుకు రవాణా చేస్తున్నా.. ఏ ఒక్క అధికారి వాటి వంక కన్నెత్తి చూడడం లేదు. బస్సు బయలు దేరిన దగ్గర నుంచి సిటీ దాటే వరకు డబ్బులు ఇస్తూ ప్రైవేటు బస్సుల యాజమాన్యం తనిఖీలు చేయకుండా పనికానిచ్చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సి ఉంది.ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి గుంటూరుకు 39 మంది ప్రయాణికులతో వెళ్తున్న వరుణ్ ట్రావెల్స్ బస్సు వెనుక భాగంలో ఉన్న ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. నిత్యం రాష్ట్రంలో ఏదో మూల ప్రైవేటు బస్సులు కాలిబూడిదైపోతున్నాయి. ప్రయాణికులు చనిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం స్పందించదా? ఇంకెన్ని అమాయక ప్రాణాలు పోవాలి? నిబంధనలు పాటించని ప్రైవేటు ట్రావెల్స్పై చర్యలు తీసుకోవాలి. ప్రయాణికులకు భద్రత కల్పించాలి. – వేమా సురేష్, కంచికచర్ల -
కృష్ణాజిల్లా
శుక్రవారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.5884 టీఎంసీలు.భక్తి పరవశం దుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారికి సంపంగి, చామంతి, మల్లెలతో విశేషంగా అర్చన జరిగింది.గాయనీగాయకులకు సత్కారం విజయవాడ కల్చరల్: ‘మహానటి సావిత్రి’ కళాపీఠం సంక్షేమ సంఘం ఆధ్వర్యాన గురువారం విజయవాడలో గాయనీగాయకులను సత్కరించారు. 1 -
పారా కబడ్డీ రాష్ట్ర పురుషుల జట్టు ఎంపిక
గన్నవరం: పారా కబడ్డీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్వీఆర్ ఇండోర్ హాలులో గురువారం పారా పురుషుల రాష్ట్ర కబడ్డీ జట్టు ఎంపిక నిర్వహించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఈ సెలక్షన్స్కు హాజరయ్యారు. వీరిలో అత్యుత్తమ క్రీడా నైపుణ్యం కనబరిచిన 14మంది క్రీడాకారులకు రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసినట్లు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వెలగపూడి ఉజ్వల్ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు చండీగఢ్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. జట్టు కోచ్గా డీఎన్ నాగరాజు, మేనేజర్గా చరణ్తేజ వ్యవహరించనున్నారన్నారు. ఈ సందర్భంగా ఎంపికై న క్రీడాకారులను ఉజ్వల్, ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కేపీ రావు అభినందించారు. -
ధాన్యం కొనుగోలుకు చర్యలు
చిలకలపూడి: రైతుల నుంచి రబీ సీజన్లో సజావుగా ధాన్యం కొనుగోలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆయన చాంబర్లో గురువారం జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ తో కలసి 2025–26 రబీ సీజన్కు ధాన్యం సేకరణ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయశాఖ నివేదిక ప్రకారం జిల్లాలో 54,678 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని రైతులు వారి ధాన్యాన్ని పూర్తిగా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఆరబెట్టుకొని రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. ప్రభుత్వం కల్పించిన వాట్సాప్ షెడ్యూలింగ్ సదుపాయాన్ని రైతులు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం సేకరణకు అవసరమైన కేంద్రాల ఏర్పాటు చేయాలన్నారు. పౌర సరఫరాల సంస్థ డీఎం శివరాంప్రసాద్, డీఎస్వో మోహన్బాబు, జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, భారత ఆహార సంస్థ డివిజనల్ మేనేజర్ సురేష్, డీసీవో చంద్రశేఖర్, ఆర్టీవో శ్రీనివాసరావు, మార్కెటింగ్ ఏడీ నిత్యానందం, తూనికలు, కొలతలశాఖ అధికారి ఈశ్వరయ్య, డిసీఎంఎస్ మేనేజర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
పూల పరిమళం.. భక్తి పరవశం
దుర్గమ్మకు సంపంగి, చామంతి, మల్లెలతో అర్చన ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఎనిమిదో రోజు గురువారం అమ్మవారికి సంపంగి, చామంతి, మల్లెలతో విశేషంగా అర్చన జరిగింది. తొలుత ఆలయ ప్రాంగణంలోని కళావేదిక నుంచి ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ, ఆలయ అర్చకులు, సిబ్బంది అమ్మవారి అర్చన నిమిత్తం సేకరించిన పుష్పాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ప్రధాన ఆలయంలో అమ్మవారి మూలవిరాట్కు పుష్పాలను సమర్పించారు. అనంతరం అర్చకులు పుష్పాలతో అర్చన నిర్వహించారు. పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. ఆ పుష్పాలను భక్తులకు పంపిణీ చేశారు. ఆంజనేయ స్వామికి విశేష పూజలు.. చైత్రమాస అష్టమి, శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి క్షేత్రపాలకుడైన వీరాంజనేయ స్వామి వారికి గురువారం విశేష అర్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని రావిచెట్టు వద్ద ఆంజనేయ స్వామి వారికి, ఘాట్రోడ్డులోని స్వామి వారి ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరువూరు: ఇప్పటివరకు నగర పంచాయతీగా ఉన్న తిరువూరును గ్రేడ్–2 మునిసిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత కౌన్సిల్ సమావేశంలో తిరువూరును మునిసిపాలిటీగా వర్గోన్నతి చేయాలని తీర్మానించి ప్రభుత్వానికి పంపగా, గ్రేడ్–2 మునిసిపాలిటీ హోదా కల్పిస్తూ ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్కుమార్ గురువారం ఉత్తర్వులిచ్చారు. గత రెండు సంవత్సరాల్లో నగర పంచాయతీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పెనమలూరు: కానూరులో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. కానూరు సెక్టార్ ఎస్ఐ జి.రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కానూరు కల్పనానగర్లో కొందరు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో పోలీసులు గురువారం అక్కడకు వెళ్లారు. ఆసమయంలో నలుగురు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారు. పోలీసులను చూసి ఇద్దరు వ్యక్తులు పారిపోయారు. మరో ఇద్దరు పట్టుబడ్డారు. వారి వద్ద రెండు బ్యాగుల్లో ఆకుపచ్చని ఎండిన ఆకులు, కాండం, పువ్వులు, విత్తనాలు కనపడ్డాయి. పట్టుబడిన వారిలో కానూరుకు చెందిన సయన అనంత్కుమార్(32), తాడిగడప గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ మహేష్(26) వద్ద పోలీసులు వివరాలు సేకరించారు. పోలీసులకు చిక్కకుండా పారిపోయిన షేక్ జాన్బాషా(జాన్బెర్రీ), రామవరప్పాడు చెందిన అక్బర్తో కలిసి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నామని వారు తెలిపారు. విశాఖపట్నం, ఒడిశా ప్రాంతాల నుంచి గంజాయి తీసుకు వస్తున్నామన్నారు. బెంగళూరు నుంచి ఎండీఎంఏ మాదకద్రవ్యం కూడా తీసుకువచ్చామని తెలిపారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నామన్నారు. నిందితుల వద్ద 5 కిలోల గంజాయి, ఒక గ్రాము ఎండీఎంఏను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
రైల్వేలో మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్(డబ్ల్యూడబ్ల్యూఓ) మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ వందన శ్రీవాస్తవ అన్నారు. గురువారం విజయవాడ డివిజన్లో పర్యటించిన ఆమె పలు అభివృద్ధి పనులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆర్గనైజేషన్ విజయవాడ డివిజన్ ప్రెసిడెంట్ వర్షా సొనాకియాతో కలసి వందన శ్రీవాస్తవ ముందుగా పునరుద్ధరించిన జాక్ అండ్ జిల్ స్కూల్ను ప్రారంభించారు. అనంతరం వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థినుల్లో ఆత్మగౌరవం పెంచేలా శానిటరీ డిస్పోజల్ యూనిట్ను ఆమె ప్రారంభించారు. అదే విధంగా డివిజన్లోని పలు కార్యాలయాల్లో ఏర్పాటు చేసేందుకు మరో 14 శానిటరీ డిస్పోజల్ యూనిట్లను డివిజన్ ఆర్గనైజేషన్కు అందజేశారు. డివిజన్కే గర్వకారణం.. ఆర్గనైజేషన్ విజయవాడ డివిజన్ ప్రెసిడెంట్ వర్షా సొనాకియా మాట్లాడుతూ పాఠశాలలో జరుగుతున్న పరివర్తన డివిజన్కే గర్వకారణం అన్నారు. పాఠశాల పునరుద్ధరణ, ఆధునిక పారిశుద్ధ్య సౌకర్యాల కల్పన విద్యార్థులు, సమాజంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నారు. ఆర్గనైజేషన్ విజయవాడ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ కొండా వీణా చందన, సెక్రటరీ నిహారిక, స్కూల్ సెక్రటరీ ఆర్.పవిత్ర, వి.సింధూర లక్ష్మి పాల్గొన్నారు. -
పటిష్ట భద్రతలో ఈవీఎం, వీవీ ప్యాట్లు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు(ఈవీఎం), వీవీప్యాట్ల గోదాముకు పటిష్ట భద్రత కల్పించినప్పటికీ నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ సమన్వయ శాఖల అధికారులను ఆదేశించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐ) ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా నెలవారీ తనిఖీల్లో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో కలిసి గురువారం ఆయన విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఈవీఎం, వీవీ ప్యాట్ల గోదామును పరిశీలించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఈసీఐ మార్గదర్శకాల ప్రకారం ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరుస్తున్న గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికను అందిస్తున్నామని తెలిపారు. డీఆర్ఓ లక్ష్మీనరసింహం, యరడ్ల ఆంజనేయరెడ్డి (వైఎస్సార్ సీపీ), కాకాని తరుణ్, బి. కృష్ణారెడ్డి (బీజేపీ), కాకొల్లు సురేష్ (టీడీపీ) తదితరులు ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ -
ఇసుక ట్రాక్టర్ ఢీకొని డెలివరీ బాయ్ మృతి
పెనమలూరు: ఇసుక ట్రాక్టర్ ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. విజయవాడ–అవనిగడ్డ కరకట్టపై ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో డెలివరీ బాయ్ దుర్మరణం చెందాడు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెనమలూరు పల్లిపేటకు చెందిన కొక్కిలిగడ్డ దుర్గేష్ (32) భార్య వీరలక్ష్మి, ఇద్దరు పిల్లలతో ఉంటున్నాడు. అతను డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. కాగా బుధవారం సాయంత్రం పెదపులిపాక శ్రీనగర్కాలనీలో డెలివరీ ఇవ్వటానికి బైక్పై వెళుతుండగా ఇసుక ట్రాక్టర్ అతి వేగంగా వచ్చి అతనిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో దుర్గేష్ తీవ్రంగా గాయపడి స్పాట్లో మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య వీరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న దళితురాలిపై హత్యాయత్నం కేసా!
చిలకలపూడి(మచిలీపట్నం): అభం శుభం తెలియని బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న దళితురాలు సుప్రియపై పామర్రు పోలీసులు అకారణంగా హత్యాయత్నం కేసు నమోదు చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. ఇటీవల పామర్రు సీఐ శుభాకర్, ఎస్సై భాస్కర్ స్టేషన్ పరిధిలోని హోంగార్డు కోటేశ్వరమ్మపై హత్యాయత్నం చేశారనే కేసును సుప్రియపై నమోదు చేశారు. దీనిపై రిమాండ్కు వచ్చిన ఆమెను మచిలీ పట్నం సబ్జైలులో గురువారం పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్తో కలిసి పరామర్శించారు. అనంతరం మీడియాతో పేర్ని నాని మాట్లాడుతూ తెలుగు తమ్ముడు గణేష్ కళ్లలో ఆనందం కోసం పోలీసులు తీసుకున్న చర్యలు సరికాదని హితవు పలికారు. పొలంలో మినపకాయలు లాగుతున్న సమయంలో తన తండ్రిపై నేరం మోపేందుకు పామర్రు సీఐ శుభాకర్, ఎస్సై భాస్కర్ స్టేషన్కు పిలిపించారని ఆమె తెలిపారన్నారు. సోదరుడు తేజను దుర్భాషలాడితే దీనిపై సుప్రియ ప్రశ్నించినందుకు హోంగార్డు కోటేశ్వరమ్మతో బట్టలు చిరిగిపోయేలా ఆమెను లాక్కెళ్లటం అఘాయిత్యం కాదా అని పేర్ని ప్రశ్నించారు. మహిళ అని కూడా చూడకుండా ఛాతీపై చెయ్యి పెట్టి తోసేశారని ఆ అభాగ్యురాలు చెబుతుంటే నిర్ఘాంతపోయామన్నారు. సీఐ, ఎస్సైలు ఆమైపె దాడి చేయడంతో రక్తం వస్తున్నా పట్టించుకోకపోవడంతో ఆటోలో బందరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందినట్లు తమకు తెలియజేసిందన్నారు. మూడు రోజులైనా వాంగ్మూలం రికార్డు చేయడానికి పోలీసులు రాకపోవడం దారుణమని తెలిపారన్నారు. విన్నవించుకుందామని వస్తే అరెస్టు చేస్తారా? తనకు, తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ‘మీ కోసం’లో కలెక్టర్ బాలాజీ ఎదుట వ్యక్తం చేస్తే, ఆయన డీఎస్పీ శ్రీనివాసరావుకు అర్జీని బదిలీ చేస్తూ చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. డీఎస్పీ ఆమెను నమ్మబలికి పామర్రు పోలీసులకు అప్పచెప్పారన్నారు. వారు గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి అనంతరం కోర్టులో హాజరుపరిచారని ఇలా చేయడం న్యాయమా అని పోలీసులను పేర్ని నాని ప్రశ్నించారు. కలెక్టర్కు ఏ రకంగా మర్యాద ఇస్తున్నారో గ్రహించాలన్నారు. ఎస్పీ నాయకత్వంలో పోలీసులు హోంగార్డు కోటేశ్వరమ్మను పావుగా ఎలా వాడుకున్నారో తెలుసుకోవాలన్నారు. కావాలంటే సీసీ పుటేజీని పరిశీలించాలని కోరారు. పోలీసులు ఆమెకు రిమాండ్ విధించేలా చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఎంతో మంది టీడీపీ, జనసేన రౌడీలు రాజ్యమేలుతున్నా వారికి మాత్రం స్టేషన్ బెయిల్ తప్ప రిమాండ్ ఎందుకు ఉండదని ఆయన ప్రశ్నించారు. ఈ పాపం ఊరికే పోదు.. టీడీపీ నాయకుడు గణేష్ కళ్లలో ఆనందం కోసం.. పోలీసులు ఆమె విషయంలో చేసిన పాపాలు ఊరికేపోవన్నారు. గణేష్ ఎన్నికల కౌంటింగ్కు ముందు జుజ్జువరపు చిన్ని తమ్ముడి ఇంటిని తగలబెడితే కేసు నమోదు చేయలేదన్నారు. దళితురాలి విషయంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తోందో అర్థమవుతోందన్నారు. డీసీఎం పవన్ కల్యాణ్కు.. 50 మంది పోలీసులతో బందోబస్తు, ఒక విమానం ఇస్తే ఇలాంటి ఘటనలు కనపడకుండా పోతాయా అని ప్రశ్నించారు. ఓదార్పు మాటలు చెప్పి దళిత మహిళను జైల్లో పెట్టిస్తావా అని డీఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంగార్డు కోటేశ్వరమ్మ మీ అంతరాత్మను ప్రశ్నించుకోవాలన్నారు. పోలీసులు తప్పుడు కేసులు పెట్టి విచారణ చేస్తూ విర్ర వీగుతుంటే మీ చదువుకు అర్థం లేకుండా పోతుందన్నారు. అభం శుభం తెలియని జైలులో ఉన్న సుప్రియకు న్యాయం జరిగే రోజు త్వరలోనే ఆ దేవుడు కల్పించాలని తాము కోరుకుంటున్నామన్నారు. -
టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం
● సీఎన్సీ మిషన్లు, కలప దగ్ధం ● రూ.10లక్షలకు పైగా ఆస్తినష్టం చల్లపల్లి: చెక్కలపై డిజైన్లు చెక్కే ఉడ్ కార్వింగ్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగి, రెండు సీఎన్సీ మిషన్లు, విలువైన టేకు, ఇతర కలప కాలిపోయింది. ఈ ఘటన మండల పరిధిలోని పెదకళ్లేపల్లి రోడ్డులోని మేకలడొంక వద్ద ఉన్న శ్రీసాయి టింబర్ డిపో అండ్ ఉడ్వర్క్ షాపులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. సుమారు అన్నీ కులుపుకొని రూ.10లక్షలకుపైగా నష్టం సంభవించినట్లు బాధితులు చెబుతున్నారు. వివరాలు ఇవి.. మోపిదేవికి చెందిన అద్దంకి సత్యనారాయణ కంప్యూటర్ల సహాయంతో యంత్రాల ద్వారా కలపపై డిజైన్లు వేసే ఉడ్ కార్వింగ్ పనులు చేస్తుంటారు. సీజన్ కావటంతో పనుల ఒత్తిడి ఎక్కువగా ఉంది. బుధవారం రాత్రి 8గంటల సమయంలో కంప్యూటర్లో డిజైన్ను సెట్చేసి మిషన్పై చెక్కలు బిగించాడు. కంప్యూటర్ చెక్కలపై డిజైన్ పని చేసుకుంటుండగా ఈలోపు భోజనం చేసి వద్దామని బయటకు వెళ్లాడు. కొంతసేపటి తరువాత తిరిగి వచ్చే చూసేసరికి అప్పటికే రెండు సీఎన్సీ మిషన్లు, చుట్టూ ఉన్న కలపకు మంటలు వ్యాపించాయి. వెంటనే అవనిగడ్డ అగ్నిమాపక కేంద్రానికి, తన సిబ్బందికి, స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. అప్పటికే షెడ్డులో దట్టమైన పొగ అలముకుని మంటలు వ్యాపించటంతో అదుపుచేయటం కష్టంగా మారింది. ఈలోపు అందినకాడికి కలపను పక్కకు లాగారు. కొంతసేపటికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించి ఉండొచ్చని అంచనా వేశారు. పూర్తిగా దగ్ధం.. మిషన్లు, ఫర్నీచర్ కోసం ఉపయోగించే కలప చెక్కలు, కంప్యూటర్లు కాలిపోయాయి. అప్పటికే డిజైన్ పూర్తయి డెలివరీకి సిద్ధంగా ఉన్న కలప కూడా దగ్ధమైంది. సుమారు రూ.10లక్షల మేర నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. ఉన్నదంతా ప్రమాదంలో కాలిపోయిందని మరలా మిషన్లు ఎలా కొనుక్కోవాలో... ఆర్డర్లు ఇచ్చిన వారికి తిరిగి కలప ఎక్కడ నుంచి తెచ్చి ఇవ్వాలో పాలుపోవటంలేదని యజమాని అద్దంకి సత్యనారాయణ వాపోతున్నారు. -
విద్యార్థులు విలువలతో ఎదగాలి
కృష్ణా వర్సిటీ వీసీ ఆచార్య రాంజీ వన్టౌన్(విజయవాడపశ్చిమ): సాంకేతిక విప్లవం నేపథ్యంలో ఉన్నత విలువలతో విద్యార్థులు ఎదగాలని కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రాంజీ కూన చెప్పారు. కేబీఎన్ కళాశాల 61వ వార్షికోత్సవం రెండో రోజైన గురువారం సాయంత్రం కళాశాల ప్రాంగణంలో విద్యార్థుల కేరింతల నడుము సందడిగా జరిగింది. తొలుత శ్రీ పద్మావతి వేంకటేశ్వర ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ చదలవాడ సుధా నాగేశ్వరరావు దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ రాంజీ కూన మాట్లాడుతూ సాంకేతిక ఏదైనా విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా విద్యనభ్యసించి ఉన్నతి సాధించాలన్నారు. క్వాంటం టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీలు ప్రపంచంలో నూతన విప్లవానికి నాంది పలకనున్నాయన్నారు. శ్రీ పద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ చదలవాడ సుధా నాగేశ్వరరావు దంపతులు మాట్లాడుతూ విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ప్రయోజకులు కావాలన్నారు. కేబీఎన్ కళాశాల సెక్రటరీ డాక్టర్ తూనికుంట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ కేబియన్ కళాశాల విద్యార్థులు సమాజాన్ని శాసించే స్థాయికి ఎదగాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. కృష్ణవేణి వార్షిక నివేదికను అందించారు. ఎస్కేపీవీవీ హిందూ హైస్కూల్స్ కమిటీ కోశాధికారి గోళ్ల బాబా విజయకుమార్, కేబీఎన్ కళాశాల అధ్యక్షుడు ఉసిరిక ఉమా మహేశ్వర రావు, ఉపాధ్యక్షులు చిట్టూరి నాగేంద్ర కుమార్, కోశాధికారి హరగోపాల్, కమిటీ ఏవో డాక్టర్ వి. నారాయణరావు తదితరులు ప్రసంగించారు. తొలుత విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా నేరస్తుడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.3.50 లక్షలు నగదు, 304 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు సీసీఎస్ ఏడీసీపీ ఎం.రాజారావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల జిల్లాలో రాత్రి సమయాల్లో జరుగుతున్న చోరీలపై ప్రత్యేకంగా దృష్టి సారించి, దొంగతనం కేసుల్లోని సంఘటనా స్థలంలో సాంకేతిక ఆధారాలను సేకరించి అనుమానితులపై నిఘా పెట్టినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం తమకు అందిన సమాచారంలో వన్టౌన్ తారాపేట రైల్వేస్టేషన్ వద్ద వెహికల్ చెక్ చేస్తుండగా నిందితుడు ఆరేపల్లి దుర్గారావు కంగారు పడి, తన మోటార్ సైకిల్ను వెనక్కి తిప్పి పారిపోయేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలు చేసినట్లు అంగీకరించాడని తెలిపారు. వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని చోరీ కేసులో రూ. 3.50 లక్షలు నగదు రికవరీ చేసినట్లు తెలిపారు. అదే విధంగా పెడన, ఏలూరు పోలీస్స్టేషన్ల పరిధిలోని కేసుల్లో 304 గ్రాముల వెండిని రికవరీ చేసినట్లు తెలిపారు. వ్యసనాలకు బానిసై.. కాగా మచిలీపట్నం మేకవారిపాలెంకు చెందిన ఆరేపల్లి దుర్గారావు వ్యసనాలకు బానిసై పనులకు వెళ్లి సంపాదించే డబ్బులు సరిపోక, నేరాలకు పాల్పడుతున్నట్లు తేలిందన్నారు. ఇప్పటి వరకూ విజయవాడ సిటీతో పాటు, పరిసర జిల్లాలో 80 వరకూ దొంగతనాలకు పాల్పడినట్లు ఏడీసీపీ రాజారావు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేయడంతో ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ కిషోర్బాబు తమ సిబ్బంది కృషి చేసినట్లు పేర్కొన్నారు. -
యనమలకుదురులో కొనసాగుతున్న విచారణ
పెనమలూరు: యనమలకుదురు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీపార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి దేవస్థానంలో స్వామివారి సొమ్ము స్వాహా ఘటనపై విచారణ కమిటీ విచారణ గురువారం కొనసాగింది. ఆలయంలో హుండీలో సొమ్ము నకిళీ తాళంతో స్వాహా చేశారని ఆలయ ఈవో భవాని, పూజారులు సాగర్, పూర్ణ, ఉద్యోగి రోశయ్యలపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేయాలని ఎండోమెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆలయ రికార్డులను విచారణ కమిటీ తనిఖీ చేస్తున్నారు. మరో రెండు వారాల పాటు విచారణ కొనసాగనుందని తెలుస్తోంది. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విధి నిర్వహణలో అలసత్వం వహించిన ఇద్దరు అర్చకులపై దుర్గగుడి ఈవో శీనానాయక్ సస్పెన్షన్ వేటు వేశారు. ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో 3వ షిఫ్టులో ఉప ప్రధాన అర్చకుడు పి. శ్రీనివాసశర్మ, పరిచారకుడు కె. నాగరాజు విధులు నిర్వర్తించాల్సి ఉంది. బుధవారం రాత్రి ఈవో శీనానాయక్, ఇతర అధికారులు మల్లేశ్వరాలయానికి వెళ్లగా అక్కడ ఇద్దరు అర్చకులు విధులకు హాజరు కాలేదు. సదరు విషయాన్ని ఆలయ అధికారులకు సమాచారం ఇవ్వకపోవడంపై ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇద్దరు అర్చకులను సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంటూ.. ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చకులు ఎవరైనా సరే వారికి కేటాయించిన విధుల్లో ఉండాలని, నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 8 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చిట్టినగర్(విజయవాడపశ్చిమ): నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్న రెండు హోటళ్లపై పౌర సరఫరాల శాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. చిట్టినగర్లోని బాబాయ్ హోటల్, సౌమ్య థియేటర్ సమీపంలోని ఓ టిఫిన్ హోటల్పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సౌమ్య థియేటర్ సమీపంలోని టిఫిన్ హోటల్లో ఉన్న ఐదు గ్యాస్ సిలిండర్లు, చిట్టినగర్ బాబాయ్ హోటల్లో మూడు గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపారాల కోసం వినియోగించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. చిట్టినగర్లో పౌర సరఫరాల శాఖ అధికారులు దాడులు నిర్వహించారనే సమాచారంతో సెంటర్లోని మరి కొన్ని టిఫిన్ హోటళ్లు, బళ్ల నిర్వాహకులు తాళాలు వేసి పరుగులు తీశారు. -
నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి వాడపల్లికి చెందిన భక్తులు గురువారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లికి చెందిన కొప్పుల దుర్గా దివ్య కుటుంబం అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. ఆలయ ఆధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళంగా ఇచ్చారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం వారికి ఆలయ ఏఈవో వెంకటరెడ్డి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. ఇంద్రకీలాద్రిపై ఆహ్లాదం పెంపునకు చర్యలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి ప్రాంగణంలో పచ్చదనం పెంపునకు ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులతోపాటు ఆధ్యాత్మికం, ఆహ్లాద వాతావరణం పెంపునకు నిపుణులైన హైదరాబాద్కు చెందిన డాక్టర్ రమాకాంత, శరవణన్, శరత్తోపాటు అమరావతి అభివృద్ధి సంస్థ అధికారి శ్రీనివాస్ గురువారం ఆలయానికి విచ్చేశారు. ఆలయ ప్రాంగణంలోని గోశాల పరిసరాలు, వాటర్ ట్యాంకులు, నూతన పూజా మండపం, యాగశాల, మల్లేశ్వరస్వామి ఆలయం, మహా మండపం దిగువ ప్రాంతాలను పరిశీలించారు. దేవస్థాన మాస్టర్ప్లాన్ను ఈవో శీనానాయక్ ఆ బృందానికి వివరించారు. జీరో బ్రేక్ డౌన్ లక్ష్యంగా పని చేయాలి గన్నవరం: జీరో బ్రేక్ డౌన్ లక్ష్యంగా ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా ప్రజా రవాణా అధికారి కె.వెంకటేశ్వర్లు సూచించారు. స్థానిక ఆర్టీసీ డిపోను గురువారం ఆయన సందర్శించారు. బస్ స్టేషన్లో ప్రయాణికులు కూర్చునే సీట్లు, తాగునీరు, ఫ్యాన్లు వంటి సదుపాయాలను, మరుగుదొడ్లు, బస్టాండ్ పరిసరాలను ఆయన పరిశీలించారు. అనంతరం గేట్ మీటింగ్ నిర్వహించి అధికారులు, సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చారు. బస్సులు సర్వీస్కు పంపిన తర్వాత ఎటువంటి ఫెయిల్యూర్స్ రాకుండా జాగ్రత్తలు వహించాలని చెప్పారు. బస్సులకు మరమ్మతులు నిర్వహించి కండిషనల్లో ఉంచాలని సూచించారు. అనంతరం గ్యారేజ్లో సర్వీస్ చేసిన బస్సులో రోడ్డు టెస్ట్ డ్రైవ్కు వెళ్లిన డీపీటీవో వాహన సామర్థ్యాన్ని పరీక్షించారు. ఆయన వెంట డిపో మేనేజర్ పి.శివాజి, గ్యారేజ్ ఇన్చార్జ్ వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ ఇన్చార్జ్ మధు, పలువురు సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు. అవార్డులు బాధ్యతలను పెంచుతాయి విజయవాడ కల్చరల్: అవార్డులు బాధ్యతలను పెంచుతాయని కామ్రేడ్ జీఆర్కే పోలవరపు సాహితీ సమితి వ్యవస్థాపకుడు గోళ్ళ నారాయణరావు అన్నారు. 2026 సంవత్సరానికి ఉగాది పురస్కారాలు అందకున్న చిత్రకారులకు అభినందన సభను బాలోత్సవ భవన్లో పోలవరపు సాహితీ సమితి, డ్రీమ్ వర్క్ ఆర్ట్ గ్యాలరీ ఆధ్వర్యాన నిర్వహించారు. గోళ్ల నారాయణరావు చిత్రకారులను అభినందించారు. మాజీ పార్లమెంట్ సభ్యుడు గోకరాజు గంగరాజు మాట్లాడుతూ చిత్రకళలో వస్తున్న ఆధునిక సాంకేతిక పద్ధతులను తెలుసుకోవాలని సూచించారు. చిత్రకారులు ఎన్ఎస్ వెంకట్రావు, వజ్రగిరి, కళాసాగర్, పి.రమేష్, పట్నాల సుధాకర్ను నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో మోతుకూరి ఆంజనేయులు, డాక్టర్ సీహెచ్ రామచందర్, కె. సుధాకర్, లయన్స్ క్లబ్ సభ్యులు ఉపేంద్ర, ఆంజనేయులు, ప్రసాద్ పాల్గొన్నారు. -
వేసవిలో పశు పోషకులు జాగ్రత్త వహించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): రానున్న వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో పశుపోషకులు పశువులను జాగ్రత్తగా సంరక్షించుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముద్రించిన పోస్టర్ను గురువారం ఆయన చాంబర్లో ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతల కారణంగా పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గటం, ఆహార స్వీకరణ సరిగ్గా లేకపోవటం వంటి సమస్యలు తలెత్తి మరణించే అవకాశాలు ఉంటాయన్నారు. ఇందుకోసం పశువులకు ఎప్పటి కప్పుడు చల్లటి తాగునీరు అందించాలన్నారు. నీడ ఉన్న ప్రదేశాల్లో ఉంచాలన్నారు. పశువుల్లో వేడి లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని పశువైద్యుని సంప్రదించాలన్నారు. వీటన్నింటిపై గ్రామ పశువైద్యసిబ్బంది యజమానులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి చిననరసింహులు, డ్వామా పీడీ ఎన్వీ శివప్రసాద్, డీఈవో యూవీ సుబ్బారావు ఉన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
కృష్ణాజిల్లా
గురువారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2026వేసవికి ముందే సిద్ధంగా లేకుంటే మున్ముందు ముప్పే! సాగర్ నీటిమట్టం వివరాలు విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 536.70 అడుగులకు చేరింది. ఇది 181.5216 టీఎంసీలకు సమానం. గంపలగూడెం: నెమలి శ్రీ వేణుగోపాలస్వామి హుండీల్లోని కానుకలను లెక్కించగా రూ. 15.17 లక్షల నగదు, 129గ్రాముల వెండి, 10 ఆస్ట్రేలియా డాలర్లు వచ్చినట్లు ఆలయ ఏసీ సంధ్య తెలిపారు.గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికీ తాగునీటిని అందించేందుకు సమర్థంగా పనులు చేపట్టి ఐదేళ్ల కాలంలో ఎన్టీఆర్ జిల్లాలో 1,10,727 ఇంటింటి కుళాయి కనెక్షన్లను ఏర్పాటు చేశారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వాటా నిధులు విడుదల చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాక ఈ పథకం మరుగున పడిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎనిమిది మంది అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వేస్టేషన్లో గంజాయి తరలిస్తున్న ఎనిమిది మంది అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా సభ్యులను ఈగల్ బృందం అరెస్టు చేసి, వారి నుంచి 66 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఈగల్ బృందం, ఆర్పీఎఫ్, జీఆర్పీ, డాగ్ స్క్వాడ్ల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం విజయవాడ రైల్వేస్టేషన్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పూరి–తిరుపతి ఎక్స్ప్రెస్ రైలులో గంజాయి తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారంతో ఈగల్ బృందం, ఇతర భద్రతా దళాలతో కలసి జాయింట్ ఆపరేషన్ చేపట్టింది. ఈ తనిఖీల్లో సుమారు 66 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని వాటిని తరలిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన 8 మంది అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి.. గంజాయి ముఠా సభ్యులు ఒడిశా నుంచి సేకరించిన గంజాయిని కేరళ, తిరుపతి ప్రాంతాలకు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. విజయవాడ మీదుగా గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల రవాణాను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఈగల్ ఇన్స్పెక్టర్ ఎం.రవీంద్ర హెచ్చరించారు. ఈ తనిఖీల్లో జీఆర్పీ ఇన్స్పెక్టర్లు జె.వి.రమణ, డి.నాగార్జున, ఎస్లు ఎం. వీరాంజనేయులు, రాంబాబు, డాగ్ స్వ్కాడ్ ఆర్ఎస్ఐ దుర్గాప్రసాద్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న అన్నదానానికి, ఉచిత ప్రసాద వితరణకు ముదునూరుకు చెందిన భక్తులు బుధవారం రూ. 2.75లక్షల విరాళాన్ని అందజేశారు. యలమంచిలి రంగారావు అమ్మవారి అన్నదానానికి రూ. 1.40లక్షలు, యలమంచిలి సీతా మహాలక్ష్మి ఉచిత ప్రసాద వితరణకు రూ. 1.35లక్షల విరాళాన్ని ఆలయ అధికారులకు అందించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. దాతలకు వేద పండితుల ఆశీర్వచనంతో పాటు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలతో ఆలయ అధికారులు, అర్చకులు సత్కరించారు. కోడూరు: సముద్ర కాలుష్యాన్ని నివారించే అరుదైన ఆలీవ్ రిడ్లే తాబేళ్ల పిల్లలను అటవీ అధికారులు బుధవారం సముద్ర బాట పట్టించారు. హంసలదీవి సాగరతీరం వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో తాబేళ్ల సంతానోత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆలీవ్ రిడ్లే తాబేళ్లు తీరంలోని ఇసుకతిన్నెల వెంట గుడ్లు పెట్టగా, వాటిని అటవీ సిబ్బంది సేకరించి నిర్ణీత ఉష్టోగ్రత దగ్గర సంతానోత్పత్తి కోసం ప్రత్యేక కేంద్రంలో వాటిని భద్రపర్చారు. ప్రస్తుతం తొలివిడతగా గుడ్ల నుంచి బయటకు వచ్చిన 123 తాబేళ్ల పిల్లలను సముద్ర బాట పట్టించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొని, తాబేళ్ల పిల్లలను సముద్రం వైపునకు విడిచిపెట్టారు. వైల్డ్ లైఫ్ ఏలూరు డివిజన్ డీఎఫ్ఓ త్రిమూర్తుల రెడ్డి, అటవీ రేంజర్ ఎస్వీకే కుమార్, ఫారెస్ట్ సెక్షన్ అధికారి టి.నాగమణి, ఎఫ్బీఓ సత్యనారాయణ పాల్గొన్నారు. ఎ.కొండూరు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వే కార్యక్రమం అమలుపై ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ బుధవారం ఎ.కొండూరు మండలంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. మండల కేంద్రమైన ఎ.కొండూరులోని పాత సినిమాహాలు వద్ద జరుగుతున్న సర్వే పనులను తహసీల్దార్ ఎన్.అరవింద్తో కలసి పరిశీలించారు. భూ సర్వే పక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. గ్రామాల్లో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని ఆదేశించారు. సర్వేలో ఉపయోగిస్తున్న పరికరాలను జేసీ పరిశీలించారు. సర్వే ద్వారా స్పష్టమైన రికార్డులు సిద్ధమవుతాయని, భవిష్యత్తులో భూ వివాదాలు తగ్గే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల్లో రూ. 89,17,515 నగదు రూపంలో వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో మచిలీపట్నం డివిజన్ తనిఖీ అధికారి కె. శ్రీనివాసరావు, బోగిరెడ్డిపల్లి శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్. అరుణ సమక్షంలో కానుకలు లెక్కించారు. డీసీ శ్రీరామ వరప్రసాదరావు మాట్లాడుతూ మొత్తం 76 రోజులకు గాను రూ. 89,17,515నగదు, బంగారం 44.004 గ్రాములు, వెండి 1.686 కిలోలు, అమెరికా డాలర్లు 129, ఇంగ్లాండ్ కరెన్సీ 5, ఆస్ట్రేలియా కరెన్సీ 20 సమకూరినట్లు వివరించారు. లెక్కింపులో ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.జి.కొండూరు: వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలలో క్రమక్రమంగా తాగునీటి సమస్య తలెత్తుతోంది. మోటార్లు, పైపులైన్ల మరమ్మతుల సమస్యతో తాగునీటి సరఫరాకి బ్రేక్పడి, గ్రామీణ ప్రాంతాల ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఆపదలో ఆదుకోవాల్సిన చేతి పంపులు మరమ్మతులకు నోచుకోక మూలన పడుతున్నాయి. వేసవి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు సన్నద్ధత లేకనే సమస్య ఉత్పన్నమవుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోతే కరువు సంభ విస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎనిమిది నెలలుగా తాగునీరు లేక.. జి.కొండూరు మండల పరిధిలో దుగ్గిరాలపాడు గ్రామానికి ఎనిమిది నెలలుగా కృష్ణా నీరు సరఫరా నిలిచిపోయి గ్రామస్తులు నరకయాతన పడుతున్నా రు. గ్రామంలో 1200మంది వరకు జనాభా ఉండగా గ్రామంలో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండటంతో వీరంతా కృష్ణావాటర్పైనే ఆధారపడ్డారు. దీంతో వీరు ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న గంగినేని వెళ్లి ప్యూరిఫైడ్ వాటర్ని తెచ్చుకుంటున్నారు. వీలుకాని వాళ్లు ఫ్లోరైడ్ నీటినే తాగుతున్నారు. అదేవిధంగా గంగినేని, తెల్లదేవరపాడు, సున్నంపాడు, మునగపాడు, గడ్డమణుగు, చెర్వుమాధవరం గ్రామాలకు పైపులైన్ సమస్యతో నెలకు ఒకసారి చొప్పున కృష్ణా నీటిని విడుదల చేస్తున్నారు. భీమవరప్పాడు, చిన్ననందిగామ గ్రామాలకు కృష్ణావాటర్ పైపులైను లేక తాగునీరు అందుబాటులో లేక వాటర్ ప్లాంట్లకు పరుగులు పెడుతున్నారు. జిల్లాలో సమస్యాత్మక గ్రామాలు.. మా గ్రామానికి ఎనిమిది నెలలుగా కృష్ణావాటర్ రావడం లేదు. తాగేందుకు నీరులేక గ్రామస్తులు నరకయాతన పడుతున్నారు. పైపులైన్లు లీకుల వల్ల నీళ్లు రావడంలేదని చెబుతున్నారు. ఎనిమిది నెలలుగా లీకులకు మరమ్మతులు చేయకపోవడం దుర్మార్గం. గ్రామస్తులంతా వాటర్ ప్లాంట్లకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. – జడ రాంబాబు, సర్పంచ్, దుగ్గిరాలపాడు విజయవాడ నగరపాలక సంస్థలో ఐదేళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లకు నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో బుధవారం అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్, డెప్యూటీ మేయర్ దంపతులతో పాటు కార్పొరేటర్లను సత్కరించారు. పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. మేయర్ భాగ్యలక్ష్మి దంపతులను సత్కరిస్తున్న దృశ్యాన్ని చిత్రంలో చూడొచ్చు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ 7ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశఎన్టీఆర్ జిల్లాలో ఆర్డబ్ల్యూఎస్ కింద తాగునీటి సరఫరా వివరాలు తాగునీటి సరఫరా హ్యాబిటేషన్లు 794 గ్రామాలు 321 జనాభా 9,87,854 కుటుంబాలు 2,67,574 ఇంటింటి కుళాయి కనెక్షన్లు 1,10,727 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు 19 ట్యాంకులు రక్షిత మంచినీటి పథకాలు 375 ట్యాంకులు మీడియం రక్షిత మంచినీటి పథకాలు 63 ట్యాంకులు డైరెక్ట్ పంపింగ్ స్కీములు 508 చేతి పంపులు 7,846 -
మే ఒకటో తేదీ నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) ఆధ్వర్యంలో మే 1 నుంచి 31వ తేదీ వరకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నామని శాప్ చైర్మన్ ఏ. రవినాయుడు చెప్పారు. స్థానిక బందరు రోడ్డులోని శాప్ ప్రధాన కార్యాలయంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణపై సమీక్ష సమావేశం బుధవారం జరిగింది. శాప్ ఎండీ ఎస్.భరణీతో పాటుగా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రవినాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, నగరాల్లోని పాఠశాలలు, కళాశాలలు, క్రీడా సంఘాలు, ఇతర విద్యాసంస్థలను కలుపుకొని ఈ వేసవి క్రీడా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ శిక్షణ శిబిరాల నిర్వహణకు శాప్ కోచ్లతో పాటుగా వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు, రిటైర్డ్ ఉద్యోగులు సేవలను వినియోగించుకుంటామన్నారు. విద్యార్థులు, యువత ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకుని క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిందిగా ఆయన కోరారు. -
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళలు కేవలం గృహిణులుగా కాకుండా వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ఫిక్కీ ఫ్లో ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్లో బుధవారం నిర్వహించిన ఉమెన్ హుడ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామీణ మహిళల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ‘రైజ్’ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే మహిళలకు ఎటువంటి ముందస్తు అనుభవం లేకపోయినా, కేవలం ఆలోచనతో వస్తే చాలని, వారికి అవసరమైన శిక్షణ, మార్కెటింగ్ మెలకువలు, సాంకేతిక సహకారాన్ని ఈ సెంటర్ల ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు. ఇన్నర్వీల్ ఇంటర్నేషనల్ మాజీ కోశాధికారి సరిత లునాని, ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ చైర్ పర్సన్ అమ్రిత కుమార్, కలెక్టర్ సతీమణి సుప్రిత, ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ సీనియర్ చైర్ పర్సన్ సుప్రియ మలినేని తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
బహుముఖ ప్రతిభాశాలి యల్లా
విజయవాడకల్చరల్: బహుముఖ ప్రతిభాశాలి యల్లా వెంకటేశ్వరరావు అని గజల్ శ్రీనివాస్ అన్నారు. సంగీత సామ్రాట్ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ, సుమధురగాన సధాకర కేవీ బ్రహ్మానందరావు కళాసంస్థ, తెలుగు కళావాహిని ఆధ్యర్యంలో జీవీఆర్ సంగీత కళాశాలలో అంతర్జాతీయ మృదంగ విద్వాంసులు డాక్టర్ యల్లా వెంకటేశ్వరరావుకు స్వర్ణకంకణ, సత్కార కార్యక్రమాన్ని బుధ వారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ మృదంగ విద్యకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చిన మహానీయుడు యల్లా అని అన్నారు. విశ్రాంత న్యాయమూర్తి టి.వేణుగోపాలరావు మాట్లాడుతూ.. ప్రముఖ సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, ఎంఎస్ సుబ్బులక్ష్మి, పండిట్ రవిశంకర్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్లకు వాద్య సహకారం అందించారన్నారు. గాయకుడు మధుసూదనరావు, సి. వరదరాజులు యల్లా సంగీత సేవలను కొనియాడారు. నిర్వాహకులు కేవీ బ్రహ్మానందరావు, చిట్టిబాబు, గోళ్ల నారాయణరావుల చేతులమీదుగా యల్లా వెంకటేశ్వరరావుకు స్వర్ణ కంకణం ప్రదానం చేసి, ఘనంగా సత్కరించారు. -
భూ పంపిణీతో సకల సమస్యలకు పరిష్కారం
కృష్ణలంక(విజయవాడతూర్పు): సంపూర్ణ పేదరిక నిర్మూలన జరగాలంటే పేదలకు భూ పంపిణీ ఒక్కటే మార్గమని కౌలు రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ గవర్నర్పేటలోని బాలోత్సవ భవన్లో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడు గుంటూరు బాపనయ్య వర్ధంతి సందర్భంగా బుధవారం ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బా రావు అధ్యక్షతన వలస కార్మికులకు రక్షణ చట్టం చేయాలని, 2005 ఉపాధి హామీ చట్టం అమలని కోరుతూ సెమినార్ నిర్వహించారు. ఈ సంద ర్భంగా వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వస్తున్నాయని సీఎం చంద్రబాబు ఊదర కొడుతున్నా రని, ఎక్కడ, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేరళలో వామపక్షపాలనలో భూ సంస్కరణలు అమలు జరగడం వల్లే దేశంలోనే అక్షరాస్యత, పేదరిక నిర్మూలనలో ఆ రాష్ట్రం ముందుందని వివరించారు. వ్యవసాయ కార్మికులకు రక్షణ చట్టం చేసిన మొట్టమొదటి రాష్ట్రం కేరళ అని గుర్తుచేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఎన్డీఏ ప్రభుత్వం ఉపాధి హామీని నిర్వీర్యం చేసిందని, ఫలితంగా వలసలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. 2023–24లో కూలీలకు 25.54 కోట్ల పనిదినాలు కల్పించి రూ.2500 కోట్లు ఖర్చు చేస్తే ఈ ఏడాది రూ.1800 కోట్లు మాత్రమే ఖర్చు చేసి కేవలం 18 కోట్ల పనిదినాలు కల్పించారని వివరించారు. గతంలో కుటుంబం సగటున 55 రోజులు పని చేస్తే ఇప్పుడు 42 రోజులకు పడిపోయిందన్నారు. రాష్ట్రంలో 200 మందికి పైగా వలస కార్మికులు ప్రమాదాల్లో చనిపోయారని ఆందోళన వ్యక్తంచేశారు. వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతికుటుంబానికి 200 రోజల ఉపాధి హామీ పని కల్పించాలని, రోజుకు రూ.600 వేతనం ఇవ్వాలని కోరారు. ఈ సెమినార్లో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.సావిత్రి, వ్యవసాయ సంఘం రాష్ట్ర నాయకులు కోట కళ్యాణ్, అప్పారావు, పిల్లి రామకృష్ణ, రవి, ఆంజనేయులు, కోటేశ్వరి పాల్గొన్నారు. -
ప్రముఖ న్యాయవాది నరహరిశెట్టి శ్రీహరి మృతి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ప్రముఖ న్యాయవాది, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నరహరిశెట్టి శ్రీహరి బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సుదీర్ఘ కాలంగా న్యాయవాదిగా పని చేస్తున్న శ్రీహరి సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. నేషనల్ కాపు ఫెడరేషన్ పేరుతో కాపు ఉద్యమానికి అండగా నిలిచారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ కార్యదర్శిగా పని చేశారు. వావిలాల గోపాలకృష్ణయ్య ఆధ్వర్యంలో మద్య విమోచన ప్రచారానికి కృషి చేస్తూ ప్రత్యేకంగా మద్యానికి వ్యతిరేకంగా పత్రికను నిర్వహించారు. పాతబస్తీ అభివృద్ధి పోరాట సమితి పేరుతో ఈ ప్రాంత అభివృద్ధికి పలు కార్యక్రమాలను నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు న్యాయ వాదిగా సుదీర్ఘకాలం పని చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు నరహరిశెట్టి శ్రీహరి అంతిమయాత్ర జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. పలువురి నివాళి శ్రీహరి మరణ వార్త తెలియగానే ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయి వన్టౌన్లోని ఆయన స్వగృహానికి వెళ్లి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధా, కిలారు రోశయ్య, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (హైదరాబాద్) అధినేత ఉమారెడ్డి రమణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాము, వివిధ పార్టీలకు చెందిన నాయకులు కొలనుకొండ శివాజీ, ఆకుల శ్రీనివాస్, మహాదేవు అప్పాజీరావు, నరేంద్ర, కొనిజేటి రమేష్ నివాళులర్పించారు. -
మద్యం అక్రమ కేసులో రిమాండ్ పొడిగింపు
విజయవాడలీగల్: మద్యం అక్రమ కేసులో రిమాండ్ ముగిసిన ప్రతిసారీ సిట్ అధికారులు ఏ సెక్షన్ల ప్రకారం రిమాండ్ పొడిగింపు కోరుతున్నారో సంబంధిత రిపోర్టులో పేర్కొనకపోవడంపై న్యాయవాది యక్కంటి పుల్లారెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. మద్యం అక్రమ కేసులో నిందితుల రిమాండ్ బుధవారం ముగియడంతో రిమాండ్లో ఉన్న రాజ్ కేసిరెడ్డి, రోణక్కుమార్ను ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఇదే కేసులో బెయిల్పై ఉన్న ఎంపీ మిథున్రెడ్డి, చెరుకూరి వెంకటేష్నాయుడు, యద్దల నవీన్కృష్ణ గైర్హాజరు పిటీషన్ దాఖలు చేశారు. బెయిల్పై ఉన్న మిగిలిన నిందితులు ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ముప్పిడి అవినాష్రెడ్డి, పైలా దిలీప్, అనిల్ చోక్రా, బూనేటి చాణక్య, సజ్జల శ్రీధర్రెడ్డి ఏసీబీ కోర్టులో విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం న్యాయమూర్తి భాస్కరరావు జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న నిందితులకు వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీచేశారు. పోలీసు కస్టడీకి వాసుదేవరెడ్డి, ప్రణోయ్ప్రకాష్ మద్యం అక్రమ కేసులో గుంటూరు జైలులో రిమాండ్లో ఉన్న దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, ప్రణోయ్ ప్రకాష్ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. బుధవారం వారిద్దరికి తొలుత ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం సిట్ కార్యాలయానికి తరలించి విచారించారు. తిరువూరు: రబీ సీజన్లో ధాన్యం కొనుగోలులో రైతులు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలకియా సూచించారు. తిరువూరు వాహినీ కాలేజీలో రబీ ధాన్యం కొనుగోలుపై కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా రెవెన్యూ, వ్యవసాయ, సహకార, సచివాలయ, రైతుసేవా కేంద్రాల సిబ్బందికి బుధవారం శిక్షణ తరగతి నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రైతు సేవా కేంద్రాల్లో నిర్ణీత ప్రమాణాల ననుసరించి ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. జిల్లా పౌరసరఫరాల అధికారిణి వాణి, తిరువూరు ఆర్డీఓ కుమార్, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
స్వామిత్వ సర్వేపై కలెక్టర్ పునఃపరిశీలన
పెడన: ఇంటి స్థలాలు, ఖాళీ స్థలాలకు సంబంధించి స్వామిత్వ సర్వే ప్రక్రియపై కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ బుధవారం పునఃపరిశీలన చేశారు. పెడన మండలంలోని పెనుమల్లి గ్రామ సచివాలయంలో స్వామిత్వ సర్వేకు సంబంధించి ఏర్పాటు చేసిన గ్రామ మ్యాపులు, రికార్డులను పరిశీలించడమే కాకుండా ల్యాప్టాప్లో వివరాలను పరిశీలించారు. కొన్ని విషయాలపై దిశా నిర్దేశం చేశారు. అనంతరం గ్రామంలో పర్యటించారు. అనంతరం సచివాలయానికి వెళ్లి పన్నుల వసూలు తీరును తనిఖీచేశారు. ఏ విధంగా వసూళ్లు చేస్తున్నది పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మీడియాతో మాట్లాడారు. స్వామిత్వ సర్వే ఎలా జరి గిందో పరిశీలించామన్నారు. కొన్ని అభ్యంతరాలు వచ్చాయని, వాటిని పరిష్కరించి సంబంధిత యాజమానులకు ప్రాపర్టీ కార్డులు అందజేస్తామన్నారు. రీసర్వేకు సంబంధించి ఆగ్రికల్చరల్ ల్యాండ్స్పై సర్వేను కూడా నందిగామలో పరిశీలించామని తెలిపారు. పెనుమల్లి గ్రామంలో తాగు నీటికి ఇబ్బందులు పడుతున్నామని, చాలా మంది మోటర్లు ద్వారా మంచి నీటిని తోడేసుకుంటు న్నారని కలెక్టర్కు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందించి తాగునీటిని తోడే మోటార్లను పంచాయతీ కార్యాలయానికి తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. సర్వే ఏడీ పి.లక్ష్మణరావు డీడీఓ జి.పద్మ, డీఎల్డీక్ష రాజావుల్లా, ఇన్చార్జి తహసీల్దారు కె.అనిల్కుమార్, ఎంపీడీఓ ఎ.అరుణ కుమారి, జెడ్పీటీసీ సభ్యుడు అర్జా వెంకటనగేష్, సర్పంచ్ గరికపాటి వెంకటరామానాయుడు, తదితరులు పాల్గొన్నారు. పెనుమల్లిలో పర్యటన సందర్భంగా తొమ్మిది నుంచి పదో తరగతిలోకి ప్రవేశిస్తున్న విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడి వేసవి సెలవుల్లో సబ్జెక్టులపై పట్టు సాధించాలని సూచించారు. ఎంఈఓ–1, 2 ఎన్.సలోమి, హరనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
బీచ్ కబడ్డీ జాతీయ కమిషన్ చైర్మన్గా శ్రీకాంత్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): తమ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బీచ్ కబడ్డీ జాతీయ కమిషన్ చైర్మన్గా నియమితులయ్యారని ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు కె.వి.ప్రభావతి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల వడోదరలో జరిగిన అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏకేఎఫ్ఐ) వార్షిక సర్వసభ్య సమావేశంలో కబడ్డీ అభివృద్ధికి శ్రీకాంత్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా బీచ్ కబడ్డీ జాతీయ కమిషన్ చైర్మన్గా నామినేట్ చేస్తూ ఏకేఎప్ఐ ప్రతినిధులు నియమకపత్రం అందజేశారని తెలిపారు. శ్రీకాంత్కు ఆంధప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నక్కల అర్జునరావు, సంయుక్త కార్యదర్శి కె.వి.నాంచారయ్య, కోశాధికారి ఎం.సుబ్బరాజు తదితరులు అభినందనలు తెలిపారు. వేదాద్రి(జగ్గయ్యపేట): స్థానిక యోగానంద లక్ష్మీ నరసింహ స్వామికి భక్తులు హుండీల్లో సమ ర్పించిన కానుకల ద్వారా రూ.14.58 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ సురేష్బాబు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో బుధవారం హుండీ కానుకలు లెక్కించారు. మూడు నెలల 21 రోజులకు ఈ ఆదాయం వచ్చింది. దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ పవన్కల్యాణ్, కేసీపీ ప్రతినిధి రాంప్రసాద్ పాల్గొన్నారు. ఆగిరిపల్లి: మండలంలోని పోతవరప్పాడు ఎన్ఆర్ఐ ఇంజినీరింగ్ కళాశాలకు డీమ్డ్ యూనివర్సిటీ హోదా లభించింది. ఈ మేరకు యూజీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ రావి వెంకట్రావు బుధవారం మాట్లాడారు. 2007లో ఎన్ఆర్ఐ ఫార్మసీ, 2008లో ఎన్ఆర్ఐ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని స్థాపించగా, 2018లో అటానమస్ హోదా లభించిందన్నారు. ఇప్పటివరకు అనేకమంది విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్యా ప్రమాణాలందించి, అంతర్జాతీయ సంస్థల్లో అవకాశాలు కల్పించామని వివరించారు. డీమ్డ్ యూనివర్సిటీ ఉత్తర్వులను ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. పెనమలూరు: గంగూరులో యూనియన్ పెట్రోల్ బంక్పై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. బుధవారం రాత్రి ఉయ్యూరు మండలం పెదఓగిరాలకు చెందిన ముగ్గురు యువకులు యూనియన్ పెట్రోల్ బంక్కు బైక్పైవచ్చారు. పెట్రోల్ పోసిన తరువాత సొమ్ము చెల్లించే విషయంలో బంక్ సిబ్బందితో వివాదం తలెత్తింది. మద్యం మత్తులో ఉన్న ఆ ముగ్గురు సిబ్బందిపై దాడికి దిగి గాయపరిచారు. అంతటితో ఆగకుండా బంక్ ఫర్నిచర్, అద్దాలు, సామగ్రి ధ్వంసం చేశారు. అదే సమయంలో పెట్రోల్ పోయించుకోవటానికి వచ్చిన వాహనదారులు బెంబేలెత్తారు. కొద్ది సమయం యువకులు రెచ్చిపోయిన తరువాత తేరుకున్న బంక్ సిబ్బంది, స్థానికులు తిరగబడటంతో ఇద్దరు యువకులు పారిపోగా ఒక యువకుడు దొరికాడు. పోలీసులకు సమాచారం ఇవ్వ టంతో పోలీసులు వచ్చి ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
నున్నలో మామిడి కొనుగోళ్లు ప్రారంభం
విజయవాడరూరల్: ఆసియాలోనే పెద్ద మామిడి మార్కెట్గా గుర్తింపు పొందిన నున్నలో బుధవారం మామిడి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. బంగినపల్లి, తోతాపురి (కలెక్టర్), చెరుకు రసం కాయలు ఆరు టన్నులను నున్నకు చెందిన వెంకటరెడ్డి, ఆగిరిపల్లికి చెందిన సుమంత్, ఈదరకు చెందిన నారాయణ తీసుకొచ్చారు. రత్నావత్ కిషోర్ నాయక్ మామిడి కాయలను కొనుగోలు చేశారు. బంగినపల్లి మామిడికాయ రకం టన్ను ధర రూ.1.25 లక్షలు పలికిందని రైతులు తెలిపారు. ఈ సీజన్లో ధర ఆశాజనకంగా ఉంటుందని రైతులు పేర్కొన్నారు. ఇప్పటి నుంచి దాదాపు మూడు నెలలు వ్యాపారం కొనసాగుతుంది. మామిడి కాయల వ్యాపారం ప్రారంభోత్సవానికి పలువురు వ్యాపారులతో పాటు మ్యాంగో గ్రోయర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని పూజలు నిర్వహించారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని 2,800 మంది ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ స్కాలర్షిప్స్ అందజేసింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేతుల మీదుగా ఈ స్కాలర్షిప్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మలబార్ రెస్ట్ ఆఫ్ ఇండియా రిటైర్ ఆపరేషన్స్ హెడ్ సిరాజ్ పీకే మాట్లాడుతూ.. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.200 కోట్లు విలువైన సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 2,800 మందికి రూ.2.52 కోట్లను స్కాలర్షిప్ రూపంలో అందజేశామని వివరించారు. ఈ కార్యక్ర మంలో సిద్ధార్థ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.పద్మజ, మలబార్ హైదరాబాద్ షరీజ్ కే, జోనల్ హెడ్ సెంట్రల్ ఆంధ్రా, రాయలసీమ నిశిల్ చంద్రన్, డెప్యూటీ హెడ్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు. -
4న విజయవాడలో ఏఐ సమ్మిట్
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడలో తొలిసారిగా ఏప్రిల్ నాలుగో తేదీన ఆర్టిఫిషియల్ ఇటెలిజెన్స్ (ఏఐ) సమ్మిట్ జరుగుతుందని ఏపీడీటీఐ చైర్మన్ శ్రీధర్ కొసరాజు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎస్టీపీఐ సహకారంతో ఏ కన్వెన్షన్ సెంటర్లో ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంజీ రోడ్డులోని ఓ హోటల్లో ఆయన బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏఐ ప్రభావంతో అన్ని రంగాల్లో వస్తున్న మార్పులు, పరిశ్రమల్లో ఎలా వినియోగిస్తున్నారు, ఉద్యోగ సాధన కోసం, ఐటీ ఇంజినీరింగ్ విద్యార్థులు ఎటువంటి నైపుణ్యాలు పెంపొందించుకోవాలో అవగాహన కల్పించేందుకు ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. సమ్మిట్ కోచైర్మన్ సురేష్ నర్రా, ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఇంద్రజిత్ అన్నే మాట్లా డుతూ.. ఏఐ ట్రెండ్స్ను అందరికీ తెలపాలనే ఉద్దేశంతో సమ్మిట్ ఏర్పాటు చేశామన్నారు. రాబోయే రెండు మూడేళ్లలో ఏఐ ప్రభావంతో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని పేర్కొన్నారు. -
వైభవంగా వసంత నవరాత్రోత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రోత్సవాలు అంగ రంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఏడో రోజైన బుధవారం అమ్మ వారికి తామర, గన్నేరు, సన్నజాజులు, ఎర్ర మందారాలు, మరువంతో విశేష పుష్పార్చన జరిగింది. తొలుత ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం ఎదుట కళావేదిక నుంచి అమ్మవారికి సమర్పించే పుష్పాలతో ఊరేగింపు నిర్వహించారు. ఆలయ ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణతో పాటు పూజలో పాల్గొనే ఉభయదాతలు, భక్తులు అమ్మవారికి సమర్పించే పుష్పాలతో ప్రధాన ఆలయంలోని మూలవిరాట్ను దర్శించుకున్నారు. అమ్మ వారికి ప్రత్యేక పూజలు జరిపించిన అనంతరం నూతన పూజా మండపంలోఉత్సవ మూర్తి వద్ద ఆలయ అర్చకులు పుష్పా గంపలను అందించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణ మధ్య పుష్పార్చన కనుల పండువగా జరి గింది. పూజ అనంతరం ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. -
మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనాలి
● ఆకాల వర్షాలకు నష్టపోయినరైతులను ఆదుకోవాలి ● జేసీకి వినతి పత్రం అందజేసిన తన్నీరు నాగేశ్వరరావు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్ చార్జి తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఏలూరి శివాజీ డిమాండ్ చేశారు. తక్షణం మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్నను కనీస మద్దతు ధర రూ.2400కు కొనుగోలు చేయాలని కోరారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఇలక్కియాను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ నెల 18వ తేదీన కురిసిన అకాల వర్షాలకు మొక్కజొన్న పంట దెబ్బతిన్న రైతులకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని కోరారు. దెబ్బతిన్న పంటల వివరాలను వెంటనే సేకరించాలన్నారు. నష్టపోయిన వరి, మామిడి, బొప్పాయి, అరటి రైతులను గుర్తించి నష్టపరిహారం అందజేయాలన్నారు. ఈ నెల 18వ తేదీ కురిసిన వర్షాలకు జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో మొక్కజొన్న, వరి, మామిడి, బొప్పాయి అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారని వివరించారు. వరిలో ధాన్యం రాలిపోయి వట్టి కంకులు మాత్రమే మిగిలాయన్నారు. పెనుగంచిప్రోలు మండలంలో గుమ్మడిదుర్రు, వెల్దుర్తిపాడు, అనిగండ్లపాడు గ్రామాలలో 800 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లిందన్నారు. కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసిందని, పొలంలో కోయని కాయలు రాలిపోయాయని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు శివరాత్రి పృథ్వీరాజ్, భైరబోయిన బాబు తదితరులు పాల్గొన్నారు. -
వ్యాధుల పర్యవేక్షణను సమర్థంగా నిర్వహించాలి
మచిలీపట్నంఅర్బన్: నైపుణ్యాలు పెంచుకుని వ్యాధుల పర్యవేక్షణను మరింత సమర్థంగా నిర్వహించాలని కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖా ధికారి డాక్టర్ పి.యుగంధర్ సూచించారు. డీఎంహెచ్ఓ కార్యాలయం సమావేశ మందిరంలో ఇంటిగ్రేటెడ్ డిసీజెస్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్లో భాగంగా ఐహెచ్ఐపీ ఫీల్డ్ సర్వైలెన్స్పై గ్రామ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు సామర్థ్య వృద్ధి శిక్షణ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సంద ర్భంగా డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో వ్యాధుల సమాచార సేకరణ, సమ యానికి నివేదికల సమర్పణ అత్యంత కీలకమని పేర్కొన్నారు. సకాలంలో కచ్చితమైన సమాచారం అందితే వ్యాధుల నియంత్రణ చర్యలను వేగంగా చేపట్టొచ్చని సూచించారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ విజయకృష్ణ, జిల్లా సర్వైలెన్స్ అధికారి డాక్టర్ సాయి కిరణ్ శిక్షణ అందించారు. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా కలిగే అనారోగ్య సమస్యలను నివారించేందుకు అవసరమైన జాగ్రత్తలు, చికిత్స విధానాలపై వివరించారు. కృష్ణా డీఎంహెచ్ఓ డాక్టర్ యుగంధర్ -
టెన్త్ పరీక్షలకు 305 మంది గైర్హాజరు
మచిలీపట్నం అర్బన్: జిల్లాలో పదో తరగతి పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయని సమగ్ర శిక్ష అడిషనల్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా అబ్జర్వర్ డాక్టర్ ఎం.ఆర్. ప్రసన్న కుమార్ తెలిపారు. పరీక్షల పర్యవేక్షణలో భాగంగా జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు జిల్లాలోని ఆరు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. జిల్లా మానిటరింగ్ కోఆర్డినేటర్ తొమ్మిది పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు 42 కేంద్రాలను, ఏసీజీఈ కష్ణా, మచిలీపట్నం అధికారులు పది కేంద్రాలను సందర్శించారు. బుధవారం జరిగిన భౌతిక శాస్త్రం పరీక్షకు 21,716 మంది విద్యార్థులకు 21,411 మంది పరీక్షకు హాజరవగా, 305 మంది గైర్హాజరయ్యారు. హాజరు 98.60 శాతంగా నమోదైంది. డీఈఓ యు.వి. సుబ్బారావు పామర్రు జెడ్పీ, అస్సీసి హై స్కూల్, ఉయ్యూరు జెడ్పీ, వీఆర్కేఎం, ఫ్లోరా హై స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఓపెన్ టెన్త్కు సంబంధించి సాంఘిక శాస్త్రం పరీక్షకు 590 మంది విద్యార్థులకు 414 మంది హాజరయ్యారు. 176 మంది గైర్హాజరయ్యారు. హాజరు 70.17 శాతంగా నమోదైంది. -
కడుపుబ్బా నవ్వించే రాకాస
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాకాస ఒక అద్భుతమైన కామెడీ ఫాంటసీ చిత్రమని, ఇందులో ప్రతి సన్నివేశం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని హీరో సంగీత్ శోభన్ పేర్కొన్నారు. ఏప్రిల్ మూడో తేదీన ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు శనివారం విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ తనకు బాగా నచ్చిందన్నారు. నిహారిక ప్రొడక్షన్లో ఇది తన రెండో సినిమా అని, కుటుంబ సమేతంగా చూడదగ్గ కామెడీ థ్రిల్లర్ ఎంటర్ట్రైనర్గా ఉంటుందని వివరించారు. హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ.. తన పాత్ర ప్రేక్షకులకు బాగా నచ్చుతుందన్నారు. చిత్ర నిర్మాత నిహారిక మాట్లాడుతూ.. విజయవాడ రావడం చాలా సంతోషంగా ఉందని, ఇక్కడి నుంచే తమ సినిమా ప్రమోషన్ మొదలుపెట్టామని అన్నారు. రాకాస చిత్రంలోని ప్రతి పాత్రా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వి స్తుందన్నారు. ఈ సమావేశంలో కమెడియణ్ గెటప్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ఇంజినీరింగ్ విద్యార్థికి కన్నీటి వీడ్కోలు
ఉయ్యూరు: తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన ఏటిపాక మండలం పురుషోత్తపట్నం సమీపంలో కూనవరం వద్ద గోదావరి పాయలో స్నానానికి దిగి మృత్యువాత పడిన ఐదుగురిలో ఉయ్యూరుకు చెందిన తేజజ్ఞసాయి (20) మృతదేహం శనివారం లభించింది. భద్రాచలం రాముడి దర్శనానికి వెళ్లొస్తూ శుక్రవారం గోదావరి నదిలో విద్యార్థులు గల్లంతైన విషయం విదితమే.. నలుగురి మృతదేహాలు శుక్రవారమే లభించాయి. తేజజ్ఞసాయి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తాడిగడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తేజజ్ఞసాయి తండ్రి సౌతాఫ్రికా నుంచి వచ్చేందుకు సమయం పట్టే అవ కాశం ఉండటంతో భౌతికకాయాన్ని ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచారు. దైవ దర్శనానికి వెళ్లి వస్తా నని చెప్పి విగతజీవిగా కళ్లముందున్న తమ బిడ్డను చూసి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. మరో ఇంజినీరింగ్ విద్యార్థి దగ్గుబాటి నవదీప్ (19) మృతదేహానికి స్వగ్రామమైన కనుమూరులో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి నవదీప్ మృతదేహం కుక్కనూరు వద్ద లభ్యంకాగా అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో కనుమూరుకు తరలించారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు నవదీప్ భౌతికకాయాన్ని సందర్శించి కన్నీటి పర్యంతం అయ్యారు. కళాశాలలో విద్యనభ్యసిస్తున్న సహచర విద్యార్థులు గ్రామానికి చేరుకుని నవదీప్ భౌతికకాయానికి నివాళులర్పించారు. తమ స్నేహితుడు ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేక బోరున విలపించారు. అశ్రునయనాల నడుమ నవదీప్ భౌతికకాయాన్ని ఊరేగించి అంత్యక్రియలు జరిపించారు. ఇరువురి బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్ పరామర్శించారు. -
ఆర్థిక ఇబ్బందులతో పండ్ల వ్యాపారి ఆత్మహత్య
గన్నవరం: ఆర్థిక ఇబ్బందులు, క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో పోలీసుల వేధింపులను తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గన్నవరంలోని గాజులపేటలో నివసించే పడమట నాగరాజు దావాజిగూడెం రోడ్డులో పండ్ల దుకాణం నడుపుతున్నాడు. ఐదేళ్ల క్రితం సమీప బంధువు ఓ ఫైనాన్స్ సంస్థలో తీసుకున్న రుణానికి నాగరాజు ష్యూరిటీ సంతాకం చేశాడు. ఆ బంధువు రుణం తిరిగి చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు అప్పు చెల్లించాలని నాగరాజును వేధిస్తున్నారు. అంతే కాకుండా తాడేపల్లికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి నాగరాజు ద్వారా ఓ బుకి వద్ద క్రికెట్ బెట్టింగ్లు వేసి రూ.5 లక్షలు నష్టపోయారు. ఈ వ్యవహారం పోలీస్స్టేషన్కు చేరడంతో ఆ రూ.5 లక్షలకు నాగరాజును బాధ్యుడిని చేసి తిరిగి చెల్లించాలని పోలీసులు ఒత్తిడి చేశారు. ఈ విషయమై నాగరాజును స్టేషన్కు పిలిపించి గట్టిగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన నాగరాజు గుంటూరు సమీపంలోని పొలాల్లో పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు అతనిని గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం మృతి చెందాడు. ఫైనాన్స్ సంస్థతో పాటు పోలీసులు వేధింపుల కారణంగానే నాగరాజు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. నాగరాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
ఘనంగా వసంత నవరాత్రులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ గుడిలో వసంత నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో మూడో రోజైన శనివారం చామంతులు, గులాబీలు, గన్నేరు పుష్పాలతో దుర్గమ్మకు విశేష పుష్పార్చన జరిగింది. తొలుత ఆలయ ఈఓ శీనా నాయక్, అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది అర్చన కోసం సేకరించిన పుష్పాలతో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రధాన అలయానికి చేరుకుని మూలవిరాట్ను దర్శించుకున్నారు. అనంతరం నూతన పూజా మండపానికి చేరుకుని పుష్పాలను అర్చకులకు అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రోచ్చరణ మధ్య అమ్మవారికి విశేష పుష్పార్చన నిర్వహించారు. పుష్పార్చనలో పాల్గొనడం వల్ల భక్తులకు మనశ్వాంతి, ఐశ్వర్యం, అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. పూజలో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. పుష్పార్చన అనంతరం ఆయా పుష్పాలను భక్తులకు అమ్మవారి ప్రసాదంగా పంపిణీ చేశారు. -
టెన్నిస్ టోర్నీలో సత్తాచాటిన రైల్వే ఉద్యోగులు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): భీమవరంలో ఈ నెల 20న జరిగిన ఆల్ ఇండియా ఒపెన్ టెన్నిస్ టోర్నీలో రైల్వే ఉద్యోగులు సత్తాచాటారు. 45 ప్లస్ విభాగంలో రైల్వే ఉద్యోగులు కె.రాజేంద్ర ప్రసాద్, సంపత్కుమార్ డబుల్స్లో విజేతలుగా నిలిచారు. కె.రాజేంద్రప్రసాద్ రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యూనల్లో అదనపు రిజిస్ట్రార్గా, సంపత్కుమార్ ఎలక్ట్రికల్ విభాగంలో టెక్నీషియన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. టోర్నీ అంతటా అత్యుత్తమ ప్రతిభ కనపరుస్తూ ఫైనల్లో తెలంగాణ రాష్ట్రం, ఖమ్మంనకు చెందిన గంజి వెంకటేశ్వర్లు, భాస్కర్పై గెలుపొంది టైటిల్ సాధించారు. ఈ సందర్భంగా పలువురు రైల్వే అధికారులు, సహచర ఉద్యోగులు వారికి అభినందనలు తెలిపారు. -
దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆలయ ప్రాంగణంలో భక్తులకు అవసరమైన సమాచారం తెలియజేయడానికి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశించారు. దుర్గగుడి అభివృద్ధి పనులను కమిషనర్ శనివారం పరిశీలించారు. కనకదుర్గనగర్ నుంచి ప్రారంభమయ్యే ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్, లడ్డూ పోటు, అన్నదాన భవనం పనులను పరిశీలించారు. లోటుపాట్లను గుర్తించిన కమిషనర్ ఇంజినీరింగ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన సూచనలు పాటించకపోవడం సరికాదని, మళ్లీ తనిఖీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. దసరాకు పనులు ఓ కొలిక్కి రావాలని ఆదేశించారు. పనులపై ఆలయ ఈఈ–2 ఎల్.రమ కమిషనర్కు వివరించారు. ఆలయ అధికారులతో సమీక్ష అనంతరం కమిషనర్.. దుర్గగుడి అధికారులతో మూడు గంటలకు పైగా సమీక్షించారు. ఆలయ నిర్వహణ, భక్తులతో వ్యవహరించాల్సిన తీరుపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. తిరుమల తరహాలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరియాలని ఆదేశించారు. వాట్సాప్ ద్వారా టికెట్ల బుకింగ్ను 50 శాతం పైగా జరిగేలా చూడాలన్నారు. ఇటీవల ఆలయంలో జరిగిన కొన్ని సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. భవిష్యత్తులో వీఎంసీ కార్యాలయం ఎదుట ఉన్న ఖాళీ స్థలాన్ని పూర్తిగా పార్కింగ్కు ఉపయోగించి అక్కడి నుంచి ఏసీ బస్సుల్లో భక్తులను కొండపైకి తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానించిన అంశాలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని, చైర్మన్, బోర్డు సభ్యులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ, ఏఈవోలు, సూపరింటెండెంట్లు, సభ్యులు పాల్గొన్నారు. -
జోరుగా ఇసుక అక్రమ రవాణా
వత్సవాయి/పెనుగంచిప్రోలు: జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతా ల్లోని మునేరు నుంచి అధికార పార్టీ నాయకులుకు ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. పగలు ట్రాక్టర్లతో డంప్ చేసి రాత్రుళ్లు తెలంగాణకు రవాణా సాగిస్తున్నారు. వత్సవాయి మండంలోని పోలంపల్లిలో మునేరు నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న 15 ట్రాక్టర్లను శనివారం తెల్లవారు జామున గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ట్రాక్టర్ యజమానులు ఇసుకతో ఉన్న ట్రక్కులను అక్కడ వదిలేసి ట్రాక్టర్లతో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ వెంకటేశ్వరరావు రెవెన్యూ సిబ్బందిని వాటికి కాపలాగా ఉంచారు. తెలంగాణ చెంతనే ఉండటంతో.. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నాయకులు కొందరు అడ్డగోలుగా మునేరు నుంచి ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. నియోజకవర్గానికి సమీపంలోనే తెలంగాణ ప్రాంతం ఉండటంతో అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. వత్సవాయి మండలం నుంచి ఖమ్మంనకు ట్రాక్టర్ ట్రక్కు ఇసుక రూ.5 వేలు, దగ్గరి ప్రాంతాలైతే దూరాన్ని బట్టి రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇసుక రీచ్ల్లో యంత్రాల ద్వారా ట్రాక్టర్ లోడింగ్కు అధికార పార్టీ నాయకులు రూ.500 నుంచి రూ.600 అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఇటీవలన పెనుగంచిప్రోలు పోలీసులు అక్రమంగా హైదరాబాద్కు ఇసుక రవాణా చేస్తున్న తెలంగాణాకు చెందిన మూడు లారీలను పట్టుకున్నారు. లారీలకు ఎస్కార్ట్గా ముందు ఒక వాహనం ఉన్నట్లు కూడా గుర్తించారు. వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లో పెనుగంచిప్రోలుతో పాటు కొళ్లికూళ్ల, సుబ్బాయిగూడెం, వెంగనాయకునిపాలెం, గుమ్మడిదుర్రు, శనగపాడు, పోలంపల్లి, ఇందుగుపల్లి, కన్నెవీడు, శింగవరం, ఆళ్లూరుపాడు గ్రామాల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించి డంపింగ్ చేస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. పెనుగంచిప్రోలు మండలం కొళ్లికూళ్ల వద్ద మునేరులో సుమారుగా 15 గ్రామాలకు పైగా తాగు నీరు అందించే తాగునీటి పథకం వద్ద ఇష్టం వచ్చిన రీతిలో ఇసుక తవ్వకాలు చేస్తు న్నారని పేర్కొన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
కృష్ణాజిల్లా
ఆదివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2026మచిలీపట్నంలో భక్తిశ్రద్ధలతో వేడుకలుభక్తుల కోసం సైన్ బోర్డులు ఏర్పాటు చేయండి7ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ గుడిలో వసంత నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. చామంతులు, గులాబీలు, గన్నేరు పుష్పాలతో శనివారం దుర్గమ్మకు విశేష పుష్పార్చన చేశారు. ఎ.కొండూరు: తిరువూరు నియోజక వర్గం పరిధిలోని నిరుద్యోగ యువతకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇవ్వడానికి జిల్లా యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా శనివారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఎ.కొండూరు మండలంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ యార్డును సందర్శించారు. చైతన్యనగర్ సమీపంలో ఉన్న యార్డు గోడౌన్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలను వినియోగించుకుని త్వరలోనే భారీ స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం ప్రారంభించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికెట్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్, ఎ.కొండూరు తహసీల్దార్ అరవింద్, మార్కెట్ యార్డ్ సిబ్బంది, గిరిజన రాష్ట్ర నేత గోపిరాజు, అధికారులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): మధుమేహం, రక్తపోటు, హెచ్ఐవీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిలో క్షయ ముప్పు పొంచి ఉందని పలువురు శ్వాసకోశ వ్యాధుల నిపుణులు పేర్కొన్నారు. అందు బాటులోకి వచ్చిన అడ్వాన్స్డ్ చికిత్సలతో క్షయను పూర్తిగా నయం చేయొచ్చని సూచించారు. ట్యూబర్ క్యూలోసిస్(క్షయ) అసోసియేషన్ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో రెండు రోజుల రాష్ట్ర స్థాయి సదస్సు శనివారం ప్రారంభమైంది. ఎంజీ రోడ్డులోని మాకినేని బసవపున్నయ్య భవన్లో నిర్వహిస్తున్న సదస్సులో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన శ్వాసకోశ వ్యాధుల నిపుణులు, పల్మనాలజీలో పోస్టు గాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులు 300 మందికిపైగా పాల్గొన్నారు. సదస్సును ఆర్గనైజింగ్ అధ్యక్షుడు డాక్టర్ రఘు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం పలువురు నిపుణులు క్షయ వ్యాధికి అడ్వాన్స్డ్ వైద్యంపై విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం ఉంటే క్షయ నిర్ధారణ పరీక్ష చేయించుకోవడంపై అవగాహన కలిగించాలని సూచించారు. సెషన్ల వారీగా జరిగిన సదస్సులో తొలిరోజు క్షయ వ్యాధిపై విశ్లేషణాత్మక ప్రసంగాలు, చర్చ జరిగింది. సదస్సులో అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవీంద్రరెడ్డి, ఎస్టీఓ డాక్టర్ రమేష్, వైస్ చైర్మన్ డాక్టర్ రామకృష్ణ, ఏపీ మెడికల్ కౌన్సిల్ పరిశీలకులు డాక్టర్ సుజాత, డాక్టర్ తిప్పర్తి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉమ్మడి కృష్ణా జిల్లాలో శనివారం రంజాన్ పండుగను ముస్లింలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు. మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పవిత్ర రంజాన్ను పురస్కరించుకుని ఈద్గాహ్ కమిటీ ఆధ్వర్యాన శనివారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సామూహిక ఈదుల్ ఫితర్ నమాజు జరిగింది. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 15 వేల మంది ముస్లింలు నమాజు చేశారు. ఈ సందర్భంగా మౌలానా హఫీజ్ రియాజ్ సాహెబ్ ఉర్దూలో సందేశాన్ని అందిస్తూ, అరబ్బీలో ఖుత్బా, నమాజ్ చేయించారు. ఆయన మాట్లాడుతూ ఇస్లాం ధర్మం పరస్పర ప్రేమానురాగాలను, సోదర భావాన్ని, ఐక్యతను చాటుతుందని కులమతాలకు అతీతంగా మానవ సేవకే ప్రథమ ప్రాధాన్యమివ్వాలన్నారు. రంజాన్ ఉపవాసాలు మనసులో మాలిన్యాన్ని దూరం చేసి శాంతి, కరుణను నింపుతాయని తెలిపారు. పవిత్ర మాసం అందించే స్ఫూర్తిని ఏడాది పొడవునా కొనసాగించాలని ప్రజలు అందరూ సుఖ శాంతులతో జీవించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక దువా చేశారు. ఇస్లామిక్ పండితుడు అబ్దుల్ ముస్తాన్ నద్వీ ధార్మిక ప్రవచనం చేస్తూ, రంజాన్ పర్వదినం మనకు తక్వా (అల్లాహ్ భయం), సహనం, దానగుణాన్ని నేర్పుతుందని ఉద్ఘాటించారు. ఇస్లాం బోధనలు మానవ జీవితాల్లో వెలుగులు నింపుతాయని ఆయన పేర్కొన్నారు. మత సామరస్యాన్ని పెంపొందిద్దాం ఈద్గా కమిటీ ప్రధాన కార్యదర్శి షేక్ మునీర్ అహ్మద్ మాట్లాడుతూ సమాజంలో మత సామరస్యాన్ని పెంపొందించుదామని పిలుపునిచ్చారు. నిరుపేదల అవసరాలను గుర్తించి సేవలు అందిద్దామని పేర్కొన్నారు. ఒకరి పండుగల్లో మరొకరు భాగస్వాములు కావడంతో రాజకీయంగా ఏర్పడుతున్న విభేదాలను తగ్గించి, మానవత్వాన్ని పెంపొందించే దిశగా అడుగులు వేయాలని కోరారు. ప్రార్థనల ఏర్పాట్లకు సహకరించిన మున్సిపల్, పోలీసు శాఖలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈద్ నమాజులో వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఈద్గా కమిటీ ప్రెసిడెంట్ డాక్టర్ కాలేషా వలి, సభ్యులు అన్వర్ పాషా, ఎండీ ఇర్ఫాన్, షఫీ అహ్మద్ పాషా, సయ్యద్ ఇంతియాజ్, ముక్తార్ అలీ, ఎండీ మొహిద్దీన్, సయ్యద్ అలీం ఎండీ నాహీద్ పాల్గొన్నారు. ముస్లింలకు అండగా నిలిచిన జగన్: అవినాష్ రాష్ట్రంలో ముస్లిం కుటుంబాలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని విధాలుగా అండగా నిలిచారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. రాష్ట్ర చరిత్రలో మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. కుటుంబ సభ్యుల్లాంటి ముస్లింలు సుఖసంతోషాలతో ఉండాలని అల్లాహ్ను కోరుకుంటున్నట్లు తెలిపారు. ముస్లింలు గత ఐదేళ్లలో ఎంతో ఆనందంగా ఉన్నారని, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీల అభివృద్ధికి నిరంతరం పని చేసిన వైఎస్ జగన్కు అల్లాహ్ ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆయన ముస్లింలకు ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా నమాజులో పాల్గొన్న వారందరినీ అవినాష్ ఆత్మీయంగా పలకరించారు.మచిలీపట్నంటౌన్: మచిలీపట్నంలో రంజాన్ను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని ముస్లింలు ఈద్–ఉల్–ఫితర్ పర్వదినాన్ని శనివారం అత్యంత భక్తిశ్రద్ధలతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు. నగరంలోని ముస్తాఖాన్ పేటలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రభుత్వ ఖాజీ అన్వర్ హుస్సేన్ పర్యవేక్షణలో వాజిద్ హుస్సేన్ రంజాన్ విశిష్టతను వివరించారు. కార్యక్రమాలను ఈద్గా కమిటీ అధ్యక్షుడు మహ్మద్ రఫీ, కార్యదర్శి అష్రఫ్బాషా పర్యవేక్షించారు. ఈద్గా వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనలకు వైఎస్సార్ సీపీ నియోజవర్గ ఇన్చార్జి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) హాజరై రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘రైజ్’కు నీతి ఆయోగ్ పట్టం మోపిదేవి: సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి వివిధ సేవా టికెట్ల ద్వారా ఒక రోజు ఆదాయం రూ. 10,23,173 వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు. శనివారం ఆయన మాట్లాడుతూ స్వామివారికి సేవా టికెట్లతో రూ. 4,26,730, లడ్డూ ప్రసాదంతో రూ. 1,05,670, నిత్యాన్నదానం ద్వారా రూ. 1,51,778, శాశ్వత అన్నదానం ద్వారా రూ. 1,85,699, శ్రీవారి దర్శనం ద్వారా రూ. 48,650.. మొత్తం రూ. 10,23,173 ఆదాయం వచ్చినట్లు వివరించారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇబ్రహీంపట్నం గుంటుపల్లిలోని రూరల్ ఇన్నోవేషన్స్ ఇంక్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ సెంటర్( రైజ్)కు నీతి ఆయోగ్ పట్టంకట్టిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు చేపడుతున్న కార్యక్రమాలకు రూ. 1.55 కోట్ల ఆర్థిక మద్దతుకు ఆమోదం తెలుపుతూ తాజాగా ఉత్తర్వులిచ్చినట్లు వెల్లడించారు. దీనిపై కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో శనివారం కలెక్టరేట్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక కుటుంబం– ఒక పారిశ్రామికవేత్త స్ఫూర్తికి అనుగుణంగా అడుగులు వేసి వినూత్నంగా రైజ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణ లక్ష్యంగా రూపొందించిన ఈ వినూత్న కార్యాచరణ ప్రణాళికకు నీతి ఆయోగ్ నుంచి గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. దీనిపై సవివర నివేదిక పంపగా పరిశీలించి ఆర్థిక మద్దతుకు ప్రత్యేక కమిటీ ఆమోదం తెలిపినట్లు వివరించారు. ఈ నిధులు ఇబ్రహీం పట్నం బ్లాక్లో ఏఐ ఆధారిత నైపుణ్య సర్వే, నైపుణ్యాభివృద్ధి , శిక్షణ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన తదితరాలకు ఉపయోగపడతాయని తెలిపారు. ఏఐ సహా విభిన్న అంశాల్లో శిక్షణ నిత్య నూతనం– వినూత్నం నినాదానికి అనుగుణంగా మరిన్ని సృజనాత్మక కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. రైజ్ కేంద్రంలో హెల్ప్ డెస్క్, ఐడియా డెస్క్, స్కిల్లింగ్ డెస్క్, ప్లేస్మెంట్ డెస్క్, బ్యాంకింగ్ డెస్క్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు వివరించారు. దీన్ని వినియోగించుకోవాలనుకునే ఔత్సాహికులు 70753 85588 నంబర్లో సంప్రదించాలని కోరారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ శకుంతల, ఏబీపీ బ్లాక్ కో ఆర్డినేటర్ పి. శ్రీనివాస్, రైజ్ మేనేజర్ బి.తేజస్విని పాల్గొన్నారు. -
దాసాంజనేయ దేవాలయానికి రజత కిరీటం
మధురానగర్(విజయవాడసెంట్రల్): మాచవరం శ్రీదాసాంజనేయస్వామి దేవాలయంలో శ్రీరామ నవమి కల్యాణ మహోత్సవానికి రామవరప్పాడుకు చెందిన దాత ప్రయాగ సీతారామశాస్త్రి అరకిలో వెండి రజత కిరీటాన్ని ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ కృష్ణప్రసాద్కు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా దాత ప్రయాగ సీతారామశాస్త్రి మాట్లాడుతూ కల్యాణోత్సంలో తాను భాగస్వామి కావడం ఆనందంగా ఉందన్నారు. ఆలయ ధర్మ కర్తల మండలి చైర్మన్ కృష్ణప్రసాద్ ఆలయ అభి వృద్ధికి దాతల సహకారం మరువలేనిదన్నారు. అనంతరం అర్చకుడు సుబ్బయ్య ప్రత్యేక పూజలు చేసి దాతను స్వామివారి శేషవస్త్రం, చిత్రపటంతో సత్కరించారు. కార్యక్రమంలో ఈఓ పాతూరి లోకేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయ పంటల పరిశీలన
గంపలగూడెం: మండలంలోని మేడూరు గ్రామానికి చెందిన కోటేశ్వరి తనకున్న 50 సెంట్లలో వరి, మరో 1.7 ఎకరాలు కౌలుకు తీసుకుని పలు రకాల కూరగాయలు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగుగచేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ శనివారం ఆ పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి రైతూ రసాయన రహి తంగా పంటలు పండించాలని సూచించారు. అనంతరం తునికిపాడులో ఇటీవల వర్షాలకు నేలవాలిన మొక్కజొన్న పంటలను పరిశీలించారు. వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం అంచనాలు తయారు చేస్తారని తెలిపారు. మొక్కజొన్న, పెసర తదితర పంటలను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అథారిటీ చైర్మన్ సీహెచ్.దేవదత్తు, తిరువూరు ఆర్డీఓ ఎ.కుమార్, తహసీల్దార్ వి.రాజకుమారి, ఎంపీడీఓ టి.సరస్వతి, ఏఓ హారీష్రావు పాల్గొన్నారు. నలుగురు సీఐలు బదిలీ లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో పరిధిలో నలుగురు సీఐలను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు శనివారం ఆదేశాలు జారీ చేశారు. అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న సీఐ బి.హెచ్.వెంకటేశ్వర్లును సీసీఎస్కు, ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ సీఐగా పనిచేస్తున్న డి.చంద్ర శేఖర్ను అజిత్సింగ్నగర్కు బదిలీ చేశారు. గుణదల సీఐ వి.శ్రీనును సైబర్ క్రైమ్కు, టూ ట్రాఫిక్ సీఐ వై.సత్యరమేష్ను గుణదల పీఎస్కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. హాస్టల్ వాచ్మన్ మృతి గంపలగూడెం: స్థానిక ఇంటిగ్రేటెడ్ హాస్టల్ వాచ్మన్ కొమ్మరవల్లి గంగరాజు(58) శనివారం మధ్యాహ్నం మృతి చెందారు. హాస్టల్ ప్రాంగణంలో ఉన్న ఓ బల్లపై అనారోగ్యంగా కనిపించడంతో తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికుడు రావూరి స్వామి గంగరాజును గమనించాడు. తొలుత గంగరాజు నోటి నుంచి రక్తం వచ్చిందని, అనంతరం అతను మృతిచెందా డని స్వామి తెలిపాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. గంగరాజు స్వగ్రామం విజయవాడ సమీపంలోని గూడ వల్లి. మృతుని కుమారుడు గణేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శశిధర్ తెలిపారు. నవాబుపేట సొసైటీ అధ్యక్షుడి ఆత్మహత్య పెనుగంచిప్రోలు: మండలంలోని నవాబుపేట గ్రామ సొసైటీ అధ్యక్షుడు, టీడీపీ నాయకుడు చింతా వెంకటేశ్వరరావు (బుల్లియ్య) (53) ఆత్మ హత్య చేసుకున్న ఘటన శనివారం తెల్లవారు జామున జరిగింది. తన ఇంటి ముందు రేకుల షెడ్డులో ఉరికి వేలాడుతున్న వెంకటేశ్వర రావును కుటుంబ సభ్యులతో పాటు చుట్టు పక్కల వారు చూసే సరికి మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొంతకాలంగా తన తండ్రి మానసిక వేదనకు గురవుతున్నారని, ఈ క్రమంలో శనివారం తెల్లవారు జామున మృతి చెంది ఉండటాన్ని గమనించామని వెంకటేశ్వరరావు కుమారుడు రవి ఫిర్యాదు చేశారని ఎస్ఐ అర్జున్ తెలిపారు. వెంకటేశ్వరరావు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు గింజుపల్లి వీరయ్య హత్య కేసులో, ఆయన కుమారుడు శ్రీనివాసరావుపై జరిగిన దాడి ఘటనలో ప్రధాన నిందితుడు. పెదకాకాని: పెదకాకానిలోని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం హుండీలు తెరచి కానుకలు లెక్కించారు. దేవదాయ శాఖ ఆదేశాల మేరకు ఈ హుండీల కానుకలు లెక్కింపు కార్యక్రమానికి పర్యవేక్షణాధికారిగా తెనాలి వైకుంఠపురంలోని పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఏసీ వి.అనుపమ హాజరయ్యారు. ఆలయంలో ఉదయం తొమ్మిది గంటలకు ఆలయ కల్యాణ మండపంలో కాను కల లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. 84 రోజులకుగాను హుండీల ద్వారా రూ.48,76,103 ఆదాయం లభించినట్లు డీసీ గోగినేని లీలా కుమార్ తెలిపారు. అన్నప్రసాద వితరణ హాల్ లోని హుండీ ద్వారా రూ.281,368 సమకూరిందన్నారు. విదేశీ నగదు అమెరికన్ డాలర్లు 127 సమకూరినట్లు డీసీ గోగినేని లీలాకుమార్, చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు తెలిపారు. హుండీల లెక్కింపు కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, ఆలయ సిబ్బంది, పెదకాకాని ఎస్బీఐ మేనేజర్ శ్రీనివాసరావు, సిబ్బంది, సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
పోలీసులకు సవాల్గా మారిన చోరీ కేసు
పెనమలూరు: మండలంలోని తాడిగడప గ్రామంలో శుక్రవారం జరిగిన దొంగతనం మిస్టరీగా మారింది. గతంలో ఎరన్నడూ లేని విధంగా భారీ దొంగతనం జరగటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. రూ.10 లక్షల విలువైన నగదు, బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్లిన ఈ ఘటన పోలీసులకు సవాల్గా మారింది. విజయవాడ నగర శివారులో ఉన్న తాడిగడప మునిసిపాలిటీలో పరిధిలో గతంలో చెదురుమదురుగా దొంగతనాలు జరిగాయి. ఇంటికి తాళం వేసి ఉంటే దొంగలు నేరాలకు పాల్పడిన ఘటనలు ఉన్నా పెద్దగా సొత్తు చోరీ జరగలేదు. చైన్ స్నాచింగ్, సెల్ఫోన్ చోరీలు, ఇంటి తాళాలు పగులకొట్టి చోరీలు వంటి ఘటనలు నమోదయ్యాయి. అయితే తాడిగడపలో జరిగిన దొంగతనం అందుకు భిన్నంగా ఉంది. ఇంటి యజమాని తాతేశ్వరరావు కుటుంబ సభ్యులు బెంగళూరుకు వెళ్లారు. తాళం వేసి ఉన్న ఇంటి కిటికీ ఇనుప ఊచల (గ్రిల్)ను చాకచక్యంగా కోసిన దొంగలు లోనికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. నగదు రూ.2.34 లక్షలు, వంద గ్రాములకు పైగా బంగారు ఆభరణాలు, 230 గ్రాముల వెండి వస్తువులను దోచుకున్నారు. ఈ ప్రాంతంలో ఇది పెద్ద దొంగతనంగా స్థానికులు చెబుతున్నారు. దొంగలు ఎవరు..? తాడిగడపలో జరిగిన భారీ చోరీలో దొంగలు ఎవరనేది తేలలేదు. నేర ప్రాంతంలో క్లూస్ టీమ్ బృందం వేలిముద్రలు సేకరించింది. అయితే ఈ ప్రాంతంతో పాటు పక్క జిల్లాలో ఉన్న దొంగల వేలిముద్రలకు అవి సరిపోలేదని సమాచారం. సీసీ పుటేజీ ప్రకారం నలుగురు దొంగలు చోరీకి పాల్పడ్డారు. దొంగలు ఉత్తర భారత్కు చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. బిహార్ లేదా ఉత్తరాధి ప్రాంతాలకు చెందిన వారని అనుమానలు వ్యక్తమవుతున్నాయి. ఈ చోరీ కేసు పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. విజయవాడ నగరానికి కూతవేటు దూరంలో తాడిగడపలో జరిగిన దొంగతనం ఇటు కృష్ణా జిల్లా పోలీసులకు, అటు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఉలిక్కపడే విధంగా చేసింది. దొంగలు ఇతర ప్రాంతాలకు చెందిన వారిగా భావిస్తుండటంతో ఏదన్న ప్రత్యేక గ్యాంగ్ ఈ ప్రాంతంలో సంచరిస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కిటికీ ఇనుప గ్రిల్ను కట్ చేసి చోరీకి పాల్పడటం కలవరపరుస్తోంది. ఇటువంటి దొంగనం ఇక్కడ ఎప్పుడూ జరగలేదు. తాడిగడప మునిసిపాలిటీ, పెనమలూరు మండలంలో పోలీసుల రాత్రి గస్తీ పెంచాలని ప్రజలు కోరుతున్నారు. -
దుర్గగుడిలో పలువురికి అంతర్గత బదిలీలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో సూపరింటెండెంట్లు, జూనియన్ అసిస్టెంట్లను అంతర్గత బదిలీ చేస్తూ ఆలయ ఈఓ శీనానాయక్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ కె.శ్రీనివాసరావు(చందు)కు సత్రాలు, వేద పాఠశాల, దత్తత ఆలయాలకు బదిలీ చేశారు. వేదపాఠశాల, దత్తత దేవాలయాల విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ వి.సత్యనారాయణమూర్తికి కేశఖండనశాల, దుర్గాఘాట్, కృష్ణమ్మ హారతుల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. కేశఖండనశాల, దుర్గాఘాట్, ఆడిట్ జనరల్ విధులు నిర్వహిస్తున్న హేమ దుర్గాంబకు ఆడిట్, జనరల్, అన్న దానం విధులు అప్పగించారు. జూనియర్ అసిస్టెంట్ ఎం.రమేష్ను ప్రధాన ఆలయం నుంచి పారిశుద్ధ్య విభాగానికి బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న వి.జగన్నాథరావును ప్రధాన ఆలయ ఇన్స్పెక్టర్ బాధ్యతలు అప్పగించారు. కేవీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం మచిలీపట్నంటౌన్: స్థానిక పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయలో 2026–27 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాల కోసం ఆన్లైన్లో పేర్లు నమోదు ప్రక్రియ ఈ నెల 20వ తేదీ ఉదయం పది గంటలకు ప్రారంభమై ఏప్రిల్ రెండో తేదీతో ముగుస్తుందని విద్యాలయ ప్రిన్సిపాల్ మహమ్మద్ ఆసిఫ్ హుస్సేన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రీయ విద్యాలయాలో ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు https:// machilipatnam. kvs.ac.in అనే వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఒకటో తరగతి ప్రవేశం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి https:// admission.kvs.gov.in లింక్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. ఒకటో తరగతిలో ప్రవేశానికి కనీస వయస్సు ఆరు ఏళ్లు ఉండాలని అన్ని తరగతులకు సంబం ధించి వయస్సు నిర్ధారణను 31.03.2026 నాటికి పరిగణనలోకి తీసుకుంటామని తెలి పారు. సీట్ల రిజర్వేషన్ అనేది కేవీఎస్ ప్రవేశ మార్గదర్శకాలు 2026–27 ప్రకారం అమలు చేస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న, అర్హత కలిగిన వారు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. నాగిరెడ్డికి మాతృవియోగం నందివాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్. నాగిరెడ్డి మాతృ మూర్తి మలిరెడ్డి నాగసుందర మణిమ్మ (89) గురువారం మరణించారు. మణిమ్మకు ఇద్దరు కుమారులు. వైఎస్సార్ సీపీ గుడివాడ నియోజకవర్గ నాయకులు పలువురు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు నందివాడ మండలం జనార్దనపురంలో నాగసుందర మణిమ్మ అంతిమయాత్ర జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
చల్లపలి: ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించబోయి చీకట్లో రోడ్డు కనిపించక ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిపోయిన ఘటనలో ఓ వృద్ధుడు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ ప్రమాదం పెదకళ్లేపల్లి రోడ్డులో గురువారం జరిగింది. మండలంలోని మంగళాపురం గ్రామానికి చెందిన రైతు పరుచూరి ప్రభాకరరావు (66) అదే గ్రామానికి చెందిన చండ్ర సుబ్బారావు పొలం పనులు ముగించుకుని, పురుగు మందుల కోసం ద్విచక్రవాహనంపై చల్లపల్లి సెంటర్కు వచ్చారు. తిరిగి మంగళాపురం వెళ్లేందుకు పెదకళ్లే పల్లి రోడ్డులో బయలుదేరారు. ఇంకొంత దూరంలో హైవే ఎక్కుతామనే లోపు ఎదురుగా వచ్చే వాహ నాన్ని తప్పించబోయి అప్పటికే చీకటి పడటంతో రోడ్డు కనిపించక వారి వాహనం అదుపుతప్పింది. వాహనం నడుపుతున్న ప్రభాకరరావు, వెనుక కూర్చున్న సుబ్బారావు ఇద్దరూ కింద పడిపోయారు. సుబ్బారావు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడగా, ప్రభాకరరావు ఎడమచేతి, తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే అటుగా వస్తున్న ఆటోలో ప్రభాకరరావును చల్లపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రభాకరరావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రభాకరరావుకు భార్య, ఇద్దరు కుమా ర్తెలు ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో తాను బాగానే ఉన్నానని కంగారు పడవద్దని ప్రభాకరరావు తనతో చెప్పాడని, ఆస్పత్రికి వచ్చేలోపే ప్రాణాలు వదిలాడని చెబుతూ సుబ్బారావు కన్నీరుమున్నీరయ్యారు. -
ఘనంగా ఉగాది వేడుకలు
మచిలీపట్నంటౌన్: నగరంలోని బచ్చుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మండపంలో గురు వారం జిల్లా దేవదాయ, ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ, డీఆర్వో చంద్రశేఖరరావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు మాట్లాడుతూ.. బందరు ఓడరేవు నిర్మాణ పను లను త్వరితగతిన పూర్తి చేసి వచ్చే ఉగాది నాటికి ప్రారంభిస్తామన్నారు. కలెక్టర్ బాలాజీ మాట్లా డుతూ.. ఉగాది పచ్చడిలో తీపి, చేదు కలయికలను సమానంగా అంగీకరించాలన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ.. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెంది అందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలన్నారు. తొలుత విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ సంవత్సరం నవగ్రహాలలో ఆరు గ్రహాలు శుభగ్రహాలుగా ఉన్నాయన్నారు. సకా లంలో వర్షాలు కురిసి, పంటలు బాగా పండి రైతులు ఆనందంగా ఉంటారన్నారు. దేవదాయ శాఖలో విశిష్టంగా సేవలు అందించిన పది మంది వేద పండితులు, అర్చక స్వాములను రూ.10,116 చొప్పున నగదు పురస్కారాలు, శాలువా, నూతన వస్త్రాలతో మంత్రి, కలెక్టర్ సత్కరించారు. అలరించిన కవి సమ్మేళనం రచయిత ముదిగొండ శాస్త్రి నేతృత్వంలో కవులు రచయితలు చింతలపాటి మురళీకృష్ణ, మేరీకృపాబాయి, డాక్టర్ ఓలేటి ఉమా సరస్వతి, వక్కలంక రామకృష్ణ, సింహాద్రి పద్మ, బత్తిన అగస్తీశ్వరరావుతో కలిసి నిర్వహించిన కవి సమ్మేళనం అలరించింది. విద్యార్థినులు ప్రదర్శించిన కూచిపూడి, భరత నాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, బందరు ఆర్డీఓ సాంబశివరావు, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పి.వి.ఫణికుమార్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ హసీం బేగ్, బందరు మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచే నాని, జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. -
మచిలీపట్నంలో కీచక అర్చకుడు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): మచిలీపట్నంలో ఓ కీచక అర్చకుడి వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసు వివరాలను బందరు ఇన్చార్జ్ డీఎస్పీ ధర్మేంద్ర ఆర్పేట పోలీస్స్టేషన్లో గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. మచిలీపట్నంలోని లక్ష్మణరావుపురం రామాలయంలో నిజాంపేటకు చెందిన ఎ.రఘునాథశర్మ అర్చకుడిగా పనిచేస్తున్నాడు. అతని ఇంట్లో ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. ఆ కుటుంబంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న బాలిక ఉంది. ఆమైపె అర్చకుడు రఘునాథశర్మ కన్నేశాడు. ఆమెను తొలుత తన భార్యకు దగ్గర చేశాడు. అనంతరం బాలికతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. వారి కుటుంబం ఎక్కడికి వెళ్లినా భార్యాపిల్లలతో పాటు ఆ బాలికనూ తీసుకెళ్లేవాడు. మాయమాటలు చెప్పి గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు అనేకమార్లు ఆమైపె లైంగికదాడి చేశాడు. బాలిక బుధవారం నలతగా ఉండటంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి బాలిక గర్భంధరించిందని నిర్ధారించారు. తల్లిదండ్రులు ఆగ్రహంతో అందుకు కారణం ఎవరంటూ బాలికను ప్రశ్నించారు. తాను గర్భం దాల్చటానికి కారణం రఘునాథశర్మ అని ఆమె చెప్పటంతో తల్లిదండ్రులు వెంటనే ఆర్పేట పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రఘునాథశర్మను అరెస్ట్ చేశారు. ఈ సమావేశంలో ఆర్పేట సీఐ ఏసుబాబు, ఎస్ఐ యోహాను, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. బాలికపై యువకుడి లైంగికదాడి చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించిన యువకుడు ఆమైపె లైంగిక దాడికి పాల్పడిన ఘటన విజయవాడ కొత్తపేట పోలీస్స్టేషన్ పరిధిలోని పాత రాజరాజేశ్వరిపేటలో చోటు చేసుకుంది. ఘటనపై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. విజయవాడ పాతరాజరాజేశ్వరికి చెందిన బాలిక తొమ్మిదో తరగతి వరకు చదువుకుని మధ్యలో మానేసి ఇంటి వద్దే ఉంటోంది. అదే ప్రాంతంలో నివసించే దేవరపాటి రాజేష్ అలియాస్ నాని కళ్లు ఆ బాలికపై పడ్డాయి. బాలికతో మాట్లాడుతూ చనువుగా ఉండటమే కాకుండా ప్రేమిస్తున్నాని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక రెండు రోజులుగా అనారోగ్యంగా ఉండటంతో ఆమె తల్లి ఏం జరిగిందని ఆరా తీసింది. దీంతో జరిగిన విషయం బాలిక తల్లికి చెప్పింది. బాలిక తల్లి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
అకాల కష్టం
పెడన మండలం ఉరివి వద్ద మినుము కుప్పలు లంకలకలువగుంట వద్ద మినుము పంటపై పరదాలు కప్పుతున్న రైతులు వత్సవాయి మండలం మక్కపేటలో నేలవాలిన మొక్కజొన్న పంట ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా బుధ, గురువారం ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. గాలులు, వర్షం ధాటికి పలు పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. మొక్కజొన్న పైరు పూర్తిగా నేలవాలింది. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి, నూర్పిడికి సిద్ధంగా ఉన్న మినుము పైర్లు వర్షానికి తడిశాయి. అరటి, మామిడి, బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. పెనుగంచిప్రోలు మండలంలోని గుమ్మడిదుర్రు, వెల్దుర్తిపాడు, అనిగండ్లపాడు గ్రామాల్లో గింజ అంతా రాలిపోయి కేవలం వరి కంకులు మిగిలాయి. – సాక్షి నెట్వర్క్ ఘంటసాలలో వర్షానికి తడిసిన మినుము పంట పెనుగంచిప్రోలులో కాపుదశలో విరిగిపడిన బొప్పాయి చెట్లు ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడిలో నేలవాలిన మొక్కజొన్న చేను -
రూ.26 వేల కోట్లు తక్షణం విడుదల చేయాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): రిటైర్మెంట్ బెనిఫిట్లతోపాటు పెన్షనర్లకు రావల్సిన రూ.26 వేల కోట్లను తక్షణమే విడుదల చేసి వారిని ఆదుకోవా లని ఎన్టీఆర్ జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.దాలినాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భవానీపురం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఆల్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో గురువారం నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. పెన్షర్లకు గతంలో ఇచ్చిన విధంగానే అడిషనల్ క్వాంటమ్ చెల్లించాలన్నారు. పెన్షనర్ల ఆర్థికపరమైన సమస్యల పరిష్కారంపై సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. తొలుత విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు ఆవంచ వేణుగోపాల రాధాకృష్ణమూర్తి పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఆల్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యేమినేని వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా విశిష్ట అతిథులుగా అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ కె.వీరబాబు, జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బొమ్మదేవర విష్ణువర్ధన్, ఏపీ స్టేట్ పెన్షనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జి.నారాయణరావు పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా సూరిశెట్టి రామయ్య, వరలక్ష్మి మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యారమ్స్, చెస్ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. క్యారమ్స, చెస్ పోటీల్లో మూడేళ్లపాటు వరుసగా ప్రథమ స్థానంలో నిలిచిన ప్రతాప శ్రీనివాసరావుకు రోలింగ్ షీల్డ్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు యేమినేని వెంకటేశ్వర్లు, యెనిగళ్ల సుబ్బారావు, ఉపాధ్యక్షుడు పమిడిపాటి పట్టాభి రామారావు, గౌరవ సలహాదారు సాలి ఆంజనేయరావు, కొత్తపల్లి సంజీవరెడ్డి, సంయుక్త కార్యదర్శి బర్రె శశాంక బాబు, సహాయ కార్యదర్శి పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దాలినాయుడు -
గొడ్డలితో నరికి హత్యాయత్నం!
ఎ.కొండూరు: పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తి పథకం ప్రకారం దారికాచి మరో వ్యక్తిని గొడ్డలితో నరికి హత్య చేసేందుకు యత్నించిన ఘటన మండ లంలోని పెద్ద తండా సమీపాన మైలవరం బ్రాంచి నాగార్జున సాగర్ కాలువ కట్టపై గురువారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. చీమలపాడు గ్రామానికి చెందిన పటాపంచల జమలయ్య, అదే గ్రామానికి చెందిన లావూరి సీతారాం మధ్య పాత కక్షలు ఉన్నాయి. జమలయ్య గురువారం పెద్ద తండా సమీపంలోని మొక్కజొన్న చేను వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి బయలుదేరాడు. అప్పటికే అతని రాకకోసం ఎన్ఎస్పీ కాలువ కట్టపై లావూరి సీతారాం మాటు వేసి ఉన్నాడు. జమలయ్య బైక్పై తన సమీపంలోకి రాగానే సీతారాం గొడ్డలితో అతడిపై దాడిచేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జమలయ్య అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అతడిని చీమలపాడులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్ పరిశీలించి, గొడ్డలితో దాడిచేయడం వల్ల జమలయ్య తలకు తీవ్రగాయమైందని, వెంటనే విజయవాడ తరలించాలని సూచించారు. దీంతో జమలయ్యను కుటుంబ సభ్యులు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ దాడి ఘటనపై ఎ.కొండూరు ఎస్ఐ జి.మహాలక్ష్మణుడును వివరణ కోరగా.. గొడ్డలితో దాడి జరిగిన మాట వాస్తవమేనని, ఘటనా స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. గాయపడిన జమలయ్యను కుటుంబ సభ్యులు విజయవాడలోని ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారని, బాధితుడి వాంగ్మూలం తీసుకోవడానికి సిబ్బందిని పంపించానని పేర్కొన్నారు. -
విజయకీలాద్రిపై వసంత నవరాత్రోత్సవాలు
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై గురువారం ఉగాది పర్వదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో పరాభవ నామ సంవత్సర ఉగాది వసంత నవరాత్రోత్స వాలు ఈనెల 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నామన్నారు. తొలిరోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం 8 గంటలకు సీతాలక్ష్మణ హనుమత్సమేత శ్రీరామచంద్రస్వామి వారికి అభిషేక మహోత్సవం నిర్వహించామని, చిన్న జీయరుస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉదయం 11 గంటలకు ఉగాది పంచాగ శ్రవణం, సంపూర్ణ రామాయణ పారాయణ ప్రారంభం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం శ్రీరామనామ లేఖనం, శ్రీరామపూజ, నివేదన, మంగళా శాసనం, తీర్థప్రసాద గోష్ఠితో కార్యక్రమాలు వైభవంగా ముగిశాయపేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. -
అకాల వర్షంతో రైతులకు అపార నష్టం
రెండకరాల్లో మునగ, నాలుగెకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. ఈదురు గాలులు, అకాల వర్షాలతో ఎకరన్నర మునగ, మూడెకరాల్లో మొక్కజొన్న నేలకొరిగింది. మునగకు రూ.80వేలు వరకు, మొక్కజొన్న రూ.2.50 లక్షలు మొత్తం రూ.3.30లక్షలు వరకు పెట్టుబడి పెట్టా. ఈసారి ఖర్చులు కూడా వచ్చేలా లేవు. కౌలు మరో రూ.1.50లక్షలు అయింది. ప్రభుత్వమే ఆదుకోవాలి. – నాగేశ్వరరావు, రైతు, కొటికలపూడి గతేడాది రబీ సీజన్లో రెంకరాల్లో మినుము పైరు సాగుచేశా. మోంథా తుపాను ప్రభావంతో పూర్తిగా నష్టపోయా. ఈసారి ఖరీఫ్లో మొక్క జొన్న సాగు చేశా. అకాల వర్షం, ఈదురు గాలులతో నేలమట్టం అయ్యింది. మరో 20 రోజుల్లో పంట చేతికొస్తుందనే తరుణంలో అకాల వర్షం నిండా ముంచింది. ఇప్పటికే రూ.2లక్షల వరకు పెట్టుబడి పెట్టా. చేతికి చిల్లిగవ్వ వచ్చేలా కనిపించడంలేదు. – గోలుల సాంబశివరావు, రైతు, కొటికలపూడి కొటికలపూడి(ఇబ్రహీంపట్నం): అకాల వర్షంతో రైతులకు అపార నష్టం వాటిల్లిందని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. మండలంలో బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి నేలవాలిన పంట పొలాలను కొటికలపూడిలో గురువారం రైతులతో కలసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పంటలకు జరిగిన నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతు అర్జా బాబూరావు మాట్లాడుతూ మరో 20, 30 రోజుల్లో పంట చేతికొచ్చేదని, ఈ దశలో పంట నేలపాలు అయ్యిందని వాపోయారు. ఇప్పటికే పంటకు పెట్టుబడిగా రూ.50వేలు నుంచి రూ.60వేలు వరకు అయిందన్నారు. కౌలు మరో రూ.30వేలు కలుపుకొంటే ఎకరానికి ఇప్పటికే రూ.90వేలు నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టినట్లు జోగి రమేష్కు తెలిపారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరారు. మరో రైతు బోళ్ల మునియ్య మాట్లాడుతూ ప్రస్తుతం యూరియా కట్ట రూ.2,500 వరకు పెరిగిందని పేర్కొన్నారు. వ్యవసాయంలో అన్ని ధరలు పెరిగాయని, రైతులకు గిట్టుబాటు ధర మాత్రం పెరగటం లేదని వాపోయారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పంటలు నష్టపోతే పరిహారం అందించారని గుర్తు చేసుకున్నారు. ఈ ప్రభుత్వంలో రైతులకు అన్నీ కష్టాలే.. జోగి రమేష్ మాట్లాడుతూ అకాల వర్షం రైతుల నడ్డి విరిచిన పరిస్థితి చూశామన్నారు. క్వింటా సుమారు రూ.2వేలు చొప్పున ఎకరాకు 50 క్వింటాలు అయితే ఎకరాకు రూ.లక్ష వరకు వచ్చేవన్నారు. గతంలో మోంథా తుపాను ప్రభుత్వంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. అంచనాలు వేసినా పరిహారం అందించలేని దిక్కుమాలిన ప్రభుత్వం అన్నారు. గత వైఎస్సార్ సీపీ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులను గుండెల్లో పెట్టుకుని చూశారన్నారు. నేడు చంద్రబాబు ప్రభుత్వంలో రైతులను పలకరించే దిక్కు లేదని విమర్శించారు. ఎరువులు లేవు, విత్తనాలు లేవన్నారు. కృష్ణానది అవతల సీఎం చంద్రబాబు ఉన్నారని, ఇవతల రైతులు ఉన్నారన్నారు. అకాల వర్షాలతో మొక్కజొన్న, మునగ, రైతులు నష్టపోతే ఇప్పటి వరకు అధికారులు రైతులు, పంట పొలాల వైపు తిరిగి చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోయిన పంటలకు తప్పనిసరిగా పరిహారం చెల్లించాలని వైఎస్సార్ సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. గతంలో వరదకు పసుపు పంట కోల్పోతే వైఎస్ జగన్ ఎకరాకు రూ.లక్ష ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు రైతులు, ౖ వెఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. -
పరాభవ.. విజయీభవ
భక్తితో కొత్త సంవత్సరాదికి ఆహ్వానం పలికిన ప్రజానీకంఅమ్మవారి ప్రధాన ఆలయం నుంచి ఉత్సవ మూర్తితో ఊరేగింపుగా వస్తున్న ఆలయ ఈవో, చైర్మన్ తదితరులుఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆదిదంపతులైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఉగాది వేడుకలు గురువారం వైభవంగా నిర్వహించారు. దుర్గమ్మకు తెల్లవారుజామున స్నపనాభిషేకం, విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం 8 గంటలకు దర్శనానికి భక్తులను అనుమతించారు. అమ్మవారి ఆలయంతో పాటు మల్లేశ్వరస్వామి వారి ఆలయం, ఉపాలయాల వద్ద విశేష పూలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలోని ప్రధాన ద్వారాలు, ప్రవేశ మార్గాల వద్ద అరటి చెట్టు, మామిడి ఆకులతో ముస్తాబు చేశారు. వసంత నవరాత్రులు ప్రారంభం.. తొలుత ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధా కృష్ణ, ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రధాన ఆలయం నుంచి అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై నూతన పూజా మండపం వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తితో ఆలయ ఈవో, చైర్మన్ ముందుకు సాగారు. నూతన పూజా మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రతిష్టించి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మల్లెలు, మరువంతో పుష్పార్చన చేసి వసంత నవరాత్రులకు అంకురార్పణ చేశారు. తొలి రోజున 13 మంది ఉభయదాతలు సేవలో పాల్గొన్నారు. రూ. 2,500 టికెట్టు కొనుగోలు చేసిన భక్తులు పుష్పార్చనలో పాల్గొనవచ్చని ఆలయ అధికారులు పేర్కొన్నారు. పుష్పార్చన అనంతరం అమ్మవారికి సమర్పించిన పుష్పాలను భక్తులకు పంపిణీ చేశారు. ఇక సేవలో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణం నూతన పూజా మండపంలో పంచాంగ శ్రవణం జరిగింది. అంతకు ముందు శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన వేద పాఠశాలకు చెందిన విద్యార్థుల వేదపఠనంతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఆలయ అర్చకులు అమ్మవారికి, పంచాంగాలకు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి చల్లా శ్రీనివాసశర్మ పంచాంగ పఠనం చేశారు. చల్లా శ్రీనివాసశర్మకు ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ పుష్పమాలను సమర్పించారు. పంచాంగ పఠనంలో 12 రాశుల స్థితిగతులు, ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానాలు, గ్రహ స్థితుల గురించి చక్కటి వ్యాఖ్యానంతో వివరించారు. ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం, నూతన యాగశాల దాత సంగా నరసింహరావు దంపతులను ఘనంగా సత్కరించారు. చైర్మన్, ఈవోలు వారికి నూతన వస్త్రాలు, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. -
శుభ వత్సరం.. స్వాగతం
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం వేడుకలు నిర్వహించారు. పంచాంగ శ్రవణం చేశారు. కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. కార్యక్రమంలో పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, మాజీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, మొండితోక అరుణకుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి, ఇతర నాయకులు పాల్గొని, కొత్త సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు. – లబ్బీపేట(విజయవాడతూర్పు) -
ఈద్ నమాజ్కు ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాట్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో బహిరంగ ఈదుల్ ఫితర్ నమాజు నిర్వహించనున్నట్లు ముస్లిం ఈద్గా కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ కాలేషావలీ, మునీర్ అహ్మద్ షేక్ తెలిపారు. ఈ సందర్భంగా ఈద్నమాజు నిర్వహించే ప్రాంగణంలో గురువారం నమాజు పోస్టర్ను వారు ఆవిష్కరించారు. డాక్టర్ కాలేషావలి, మునీర్ అహ్మద్ షేక్ మాట్లాడుతూ రంజాన్ రోజు ఉదయం 7. 30 గంటలకు ఈద్ సందేశం ప్రారంభమవుతుందని తెలిపారు. నమాజు ఉదయం 8 గంటలకు జరుగుతుందన్నారు. వజూ కోసం శుభ్రమైన నీరు అందుబాటులో ఉంటుందని, నమాజు నిర్వహించుకునేందుకు అనువుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈద్గా కమిటీ ప్రతినిధులు ఎండీ అన్వర్ పాష, ఎండీ ఇర్ఫాన్, ముఖ్తార్ అలీ, ఎండీ మొహిద్దీన్ పాల్గొన్నారు. తిరువూరు ఆర్డీవోగా కుమార్ తిరువూరు: తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా ఏ. కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఒంగోలులో పౌరసరఫరాల విజిలెన్స్లో స్పెషల్ డెప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న ఆయన బదిలీపై తిరువూరుకు వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న కె. మాధురి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో కుమార్ను ఆర్డీవోగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. హెచ్సీ శ్రీమన్నారాయణకు ఉత్కృష్ట సేవ పతకం ఎ.కొండూరు: స్థానిక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న బి.శ్రీమన్నారాయణ కేంద్ర ప్రభుత్వం అందించే ఉత్కృష్ట సేవ పతకానికి ఎంపికయ్యారు. విధి నిర్వహణలో చూపుతున్న అంకితభావం, క్రమశిక్షణ, ప్రజలతో సత్సంబంధాలు వంటి లక్షణాలకు గుర్తింపుగా ఆయనకు ఈ గౌరవం దక్కింది. పోలీస్ శాఖలో ఎన్నో ఏళ్లుగా నిబద్ధతతో సేవలందిస్తూ, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందుండే అధికారిగా శ్రీమన్నారాయణ స్థానికంగా మంచిపేరు ఉంది. శ్రీమన్నారాయణకు అవార్డు లభించడం పట్ల ఎ.కొండూ రు పోలీస్ సిబ్బంది, పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. -
కనికుట్టు స్కీమ్!
జి.కొండూరు: ప్రభుత్వం మాటలు కోటలు దాటడం తప్ప చేతలు గడప కూడా దాటడం లేదనేది ఇప్పటికే పలు సందర్భాల్లో నిరూపితమైంది. స్కిల్ డెవలెప్ మెంట్లో భాగంగా బీసీ కార్పొరేషన్ ద్వారా మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి ఉచితంగా మిషన్లను పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టారు. శిక్షణ అయితే ఇచ్చారు కానీ ఏడు నెలలు గడిచినా మిషన్లను పంపిణీ చేయకపోవడంతో మహిళలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మిషన్లు ఇచ్చే లోపు నేర్చుకున్నది కూడా మరచిపోయేలా ఉన్నామని వాపోతున్నారు. శిక్షణ ఇలా.. ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ ట్రైనింగ్ పార్టనర్గా కర్డ్ అనే సంస్థకి బాధ్యతలను అప్పగించింది. ప్రభుత్వం సూచించిన మేరకు ఉమ్మడి కృష్ణాజిల్లాలో 29సెంటర్లను ఏర్పాటు చేసి ఒక్కొక్క సెంటర్కి రెండు బ్యాచ్లలో 144మంది చొప్పున 4,176మందిని శిక్షణకు ఎంపిక చేశారు. ఈ శిక్షణ కార్యక్రమం 2025, ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో 90రోజులపాటు నిర్వహించారు. అనంతరం శిక్షణ పొందిన మహిళలకు నైపుణ్య పరీక్షను నిర్వహించి ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేయాల్సి ఉంది. శిక్షణ పూర్తయ్యి ఏడు నెలలు గడిచినా ప్రభుత్వం నుంచి నిధుల విడుదలలో స్పందన లేకపోవడంతో సదరు సంస్థ పరీక్షను నిర్వహించలేదు. మిషన్లను పంపిణీ చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే దుస్థితి నెలకొనడంతో లక్షల మంది మహిళల మిషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో.. ఏడు నెలలుగా ఎదురు చూపులు.. కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు ప్రభుత్వం మిషన్లు ఎప్పుడు పంపిణీ చేస్తుందో తెలియక నరకయాతన పడుతున్నారు. శిక్షణ కాలంలో వివిధ గ్రామాల నుంచి మండల కేంద్రాల్లో ఉన్న సెంటర్లకు వచ్చేందుకు 90రోజుల పాటు ప్రతి రోజూ రవాణా చార్జీలు, ఇతర ఖర్చులు కలిపి నెలకు రూ.10వేల వరకు సొంత డబ్బులు ఖర్చు చేశారు. అంతే కాకుండా ఇతర ఆదాయ మార్గాలను సైతం వదులుకొని శిక్షణ పొందామని. మిషన్లు పంపిణీ చేయకపోతే తామెలా బతకాలను వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి కుట్టు మిషన్లను పంపిణీ చేయకపోతే నేర్చుకున్నది కూడా మరిచిపోయాలా ఉన్నామని ఆవేదన చెందుతున్నారు. -
అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉందాం: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో వచ్చే మూడు రోజులపాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదేశించారు. వాతావరణ, విపత్తుల నిర్వహణ శాఖ సూచనల మేరకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. విజయవాడ నగరపాలక సంస్థ, మునిసిపల్, పంచాయతీ శాఖలు డ్రెయినేజీ వ్యవస్థల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడా నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని, పంటలకు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా మిర్చి రైతులను అప్రమత్తం చేయాలని కల్లాల్లోని మిర్చిని జాగ్రత్తగా భద్రపరచుకునేలా చేయూతనివ్వాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, విద్యుత్, ఆర్ అండ్బీ శాఖలు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా సిద్ధంగా ఉండాలని చెప్పారు. సమాచారం ఇవ్వండి.. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా స్థానిక అధికారులను వెంటనే సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంలో కూడా కమాండ్ కంట్రోల్ కేంద్రం (91549 70454 )అందుబాటులో ఉందని.. ఈ నంబర్కి కూడా ఫోన్ చేసి తెలియజేయవచ్చని కలెక్టర్ సూచించారు. జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండి ప్రజల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు. అకాల వర్షాలు, వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని.. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పంటలకు జరిగిన నష్టంపై రైతులకు పరిహారం అందుతోందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. -
పూల ధరలకు రెక్కలు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కృష్ణా మెయిన్ కెనాల్ సమీపంలోని రాజీవ్గాంధీ హోల్సేల్ పూల మార్కెట్ వినియోగదారులతో బుధవారం కిటకిటలాడింది. గురువారం పండుగను పురస్కరించుకొని పూజలకు, ఇతర అలంకరణ నిమిత్తం పూలను తీసుకెళ్లేందుకు నగర వాసులు భారీగా మార్కెట్కు తరలివచ్చారు. అందుకనుగుణంగా రైతులు కూడా భారీగా పూలను మార్కెట్కు తరలించారు. బంతి, చామంతి, మల్లి, లిల్లీ, గులాబీ పువ్వులు భారీగా వచ్చాయి. నగరపాలకసంస్థ ప్రధాన కార్యాలయం రోడ్డు మొత్తం వినియోగదారులు, వాహన చోదకులతో కిక్కిరిసిపోయింది. మార్కెట్లో పువ్వులు కొనుగోలు చేయటానికి వచ్చిన వినియోగదారులు ముందుకు సాగటానికి దారి లేక తోపులాటలు చోటు చేసుకున్నాయి. ధరలు.. భారీగా పెంచేశారు.. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పూల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. రెండు రోజుల క్రితం ఉన్న ధరలు రెట్టింపయ్యాయి. ఆ ధరలను విని వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా మొన్నటి వరకూ కనకాంబరాలు కిలో రూ.200 నుంచి రూ.400 పలుకగా బుధవారం ఉదయం రూ.800, సాయంత్రం రూ.1000 మేర ధర పలికింది. అదేవిధంగా మల్లెపూలు మొన్నటి వరకూ కిలో రూ.200 మాత్రమే ఉండగా బుధవారం రూ.600 దాటింది. వాటితో పాటుగా చామంతి, గులాబీ ధరలు సైతం నాలుగు రెట్లు పెరిగి మూడు వందల నుంచి నాలుగు వందల వరకూ అమ్మకాలు జరుగుతున్నాయి. అలాగే లిల్లీ మొన్నటి వరకూ వంద నుంచి మూడు వందల రూపాయలు పలుకగా, బుధవారం రెండు రెట్లు పెరిగాయి. ఈ ధరలు గత ఏడాది రెట్టింపుగా ఉన్నాయని వ్యాపారులు వివరించారు. పూల ధరలు హోల్సేల్ మార్కెట్లో ఈ విధంగా పలుకుతుంటే రిటైల్గా ఇళ్ల వద్ద ఆ ధరలు మరింత పెరిగి వినియోగదారులకు మరింత భారమయ్యాయి. మార్కెట్లో పూలదండలకు గిరాకీ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రధానంగా ఆలయాలు, ఇళ్లలో దేవుని విగ్రహాలతో పాటుగా అలంకరణకు దండలు వినియోగిస్తారు. అదే విధంగా దస్త్రాలు ఉన్న దుకాణాదారులు సైతం భారీగా పూలదండలను తీసుకెళ్లారు. అదేవిధంగా పండుగ సందర్భంగా వివిధ సభా కార్యక్రమాలను నిర్వహించే సంస్థలు సైతం దండలకు ఆర్డర్లు ఇచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు. వీటి ధరలు రూ.200 నుంచి రూ.1000 వరకూ పలుకుతున్నాయి. -
లారీ ఢీకొని ముగ్గురు చిన్నారులకు గాయాలు
కోనేరుసెంటర్: లారీ ఢీకొనటంతో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో బుధవారం జరిగింది. విషయం తెలుసుకున్న మచిలీపట్నం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. బుధవారం మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో పరాసుపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూలు వదలగా ఓ మహిళ తన పిల్లలను మోపెడ్పై ఎక్కించుకుని ఇంటికి వెళుతోంది. సరిగ్గా పరాసుపేట సెంటర్ సర్కిల్ వద్దకు చేరుకున్న సమయంలో కరగ్రహారం నుంచి పరాసుపేటకు చేరుకున్న లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపుతూ చిన్నారులు వెళుతున్న మోపెడ్ను ఢీకొన్నాడు. తల్లి పిల్లలు రోడ్డుపై పడిపోగా రెండు అడుగుల దూరం వరకు మోపెడ్ను లారీ దూసుకుంటూ ఈడ్చుకు వెళ్లింది. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన తోటి వాహనదారులు లారీడ్రైవర్ నిర్లక్ష్యాన్ని మందలిస్తూ గట్టిగా కేకలు పెట్టారు. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ లారీని రివర్స్ చేయటంతో ఘోర ప్రమాదం తప్పింది. లేదంటే తల్లితో పాటు ముగ్గురు చిన్నారులు లారీ చక్రాల కింద పడి నలిగిపోయే పరిస్థితి ఏర్పడేది. చిన్నారులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పరారీలో డ్రైవర్! గాయాలపాలైన పిల్లలను చికిత్స నిమిత్తం స్థానికులు హుటాహుటిన ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇదే అదునుగా భావించిన లారీడ్రైవర్ వాహనాన్ని పక్కకు పెడుతున్నట్లు నటించి అక్కడి నుంచి ఉడాయించాడు. జరిగిన సంఘటనపై సమాచారం అందుకున్న మచిలీపట్నం పోలీసులు, బందరు ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలించి లారీ ఘంటశాలకు చెందినదిగా గుర్తించిన పోలీసులు లారీ డ్రైవర్తో పాటు వాహన యజమానిని స్టేషన్కు పిలిపించి మాట్లాడుతున్నట్లు సమాచారం. పెడన: పెడన– బంటుమిల్లి 216 జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కట్లపల్లి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో పెడన పట్టణంలోని శ్రీకృష్ణతులసీ థియేటర్ సమీపంలో నివాసం ఉండే పెయింటర్ యాళ్ల సాయి(24) తమ సమీప బంధువుల పిల్లలు గూట్ల మేఘశ్రీ(5), పుట్టి వైష్ణవి(12)లతో కలిసి సాయి తల్లిదండ్రులుంటున్న శింగరాయపాలెంకు సుమారు రాత్రి ఏడున్నర గంటల సమయంలో బయల్దేరాడు. ఈక్రమంలో నరసాపురం నుంచి వస్తున్న కారు ఎదురుగా వచ్చి వీరి బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సాయి, మేఘశ్రీ, వైష్ణవి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. -
జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ ఉగాది సందర్భంగా మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురోరాగ్యాలతో వర్థిల్లాలని ఆయన ఆకాంక్షించారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలో ఈ నెల 24వ తేదీన మాస్టర్స్ (వెటరన్స్) జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె.కోటేశ్వరరావు బుధవారం ప్రకటనలో తెలిపారు. రన్నింగ్, జావెలిన్త్రో, లాంగ్ జంప్, షాట్ పుట్, డిస్కస్త్రో, హైజంప్ల్లో మహిళ లు, పురుషులకు పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు స్పోర్ట్స్.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో ఆధార్ నంబర్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఈ నెల 24వ తేదీ ఉదయం 9 గంటలకు బందరురోడ్డులోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలో ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు. ఈ పోటీల్లో విజేతలైన వారు ఈ నెల 30, 31వ తేదీల్లో గుంటూ రు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆవరణలో జరిగే రాష్ట స్థాయి పోటీల్లో పాల్గొంటారని, వివరాలకు 98661 34016లో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు. ఎ.కొండూరు: మండలం పరిధిలోని చీమలపాడు గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన 33వ జిల్లా మహాసభలు బుధవారం ముగిశాయి. రెండు రోజులపాటు సాగిన ఈ సమావేశాల్లో గత మూడేళ్లుగా చేసిన పోరాటాలు, వ్యవసాయ కార్మికుల సమస్యలపై సమీక్ష చేశారు. పలు కీలక నిర్ణయాలు, డిమాండ్లను ప్రస్తావించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి, పాత చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు. వ్యవసాయ కార్మికులకు పక్కా గృహాలు మంజూరు చేయాలని, జగనన్న కాలనీల్లో ఉన్న ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని విన్నవించారు. అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని తీర్మానించారు. అనంతరం భవిష్యత్తు కార్యాచరణ కోసం నూతన కమిటీని ఎన్నుకున్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పానెం ఆనందరావు, రైతులు పాల్గొన్నారు. పెనమలూరు: కానూరులో ఇంటర్ చదువుతున్న బాలిక బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కానూరు నాగార్జున ఆస్పత్రి సమీపంలో యశ్విని(16) కుటుంబ సభ్యులతో ఉంటుంది. ఆమె విజయవాడ మోగల్రాజపురంలో ఒక ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుతూ మొదటి ఏడాది ఎంఈసీ పరీక్ష రాసింది. అయితే ఆమె ఇంట్లో ఉదయం చున్నీతో ఉరేసుకొని మృతి చెందింది. చదువుల ఒత్తిడి కారణంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
రూ.30లక్షల డ్వాక్రా సభ్యుల సొమ్ము స్వాహా
రెడ్డిగూడెం: రెడ్డిగూడెం మండలం ముచ్చనపల్లి గ్రామంలో తొమ్మిది డ్వాక్రా గ్రూపుల్లో దాదాపు రూ. 30లక్షలు స్వాహా అయిన సంఘటనపై బుధవారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రెడ్డిగూడెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముచ్చనపల్లి గ్రామంలో 9 గ్రూపులకు సంబంధించిన నగదును విస్సన్నపేటలోని ఇండియన్ బ్యాంకులో జమ చేస్తుంటారు. అయితే బుక్ కీపర్ అయిన బత్తుల మౌనిక మహిళ మండలి ప్రిసిడెంట్, సెక్రటరీ, గ్రూపు సభ్యులకు తెలియకుండా పలు దఫాలుగా సుమారు రూ. 30లక్షల వరకూ డ్రా చేసింది. దీనిని గుర్తించిన గ్రూపు సభ్యులు రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇండియన్బ్యాంకు మేనేజర్, సిబ్బంది, ఏపీఎం, సీసీల పేర్లు కూడా ఫిర్యాదులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అలా ఎలా? గ్రూపు సభ్యుల సంతకం తేడా వస్తేనే డబ్బులు ఇవ్వని బ్యాంకు సిబ్బంది.. బుక్ కీపర్కు అంత మొత్తం ఎలా ఇచ్చారంటూ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. కాయకష్టం చేసి మహిళా మండలి సభ్యులు పొదుపు చేస్తుంటే ఇండియన్ బ్యాంకు మేనేజర్, సిబ్బంది, బుక్ కీపర్, ఏపీఎంలు కుమ్మకై డబ్బులు స్వాహా చేసినట్లు వారు ఆరోపిస్తున్నారు. నగదు మాయం నిజమే.. కాగా ఈ విషయమై ఏపీఎం రామకృష్ణను అడుగగా గ్రూపు సభ్యుల నగదు స్వాహా అయిన మాట నిజమేనని, దీనిపై విస్సన్నపేట ఇండియన్ బ్యాంకులో అడిట్ జరుగుతున్నట్లు తెలిపారు. కాగా దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తొమ్మిది డ్వాక్రా గ్రూపు సభ్యులు -
బస్సు, లారీ ఢీ.. తప్పిన పెను ప్రమాదం
విస్సన్నపేట: స్థానిక విస్సన్నపేట–నూజివీడు రోడ్డులో రాణి కల్యాణమండపం సమీపంలో ఓ ట్రావెల్స్ బస్, మినీలారీ ఎదురెదురుగా ఢీ కొట్టుకోవడంతో.. బస్సు రోడ్డు సైడ్కు దూసుకెళ్లి ఆగిన ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో నాలుగు గ్రామాల నుంచి డ్రైవర్తో పాటు 42 మంది కలసి నిర్మలగిరి (గౌరీపట్నం )వెళ్లి.. తిరిగి వచ్చే క్రమంలో ఎదురుగా వస్తున్న మినీ లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు మార్జిన్లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్ డ్రైవర్ లక్ష్మణ్రెడ్డికి కాలు విరిగింది. ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఎస్ఐ అర్జున్ రాజు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని 108లో వైద్యానికి తరలించారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు. -
ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టండి
పామర్రు: రైతులు యూరియా వాడకం తగ్గించి, ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించి, అధిక ఆదాయం పొందాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపు నిచ్చారు. మండల పరిధిలోని పలు గ్రామాలలో కలెక్టర్ బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. తొలుత పామర్రు మండలంలోని కురుమద్దాలి గ్రామం సందర్శించి రైతన్నా.. మీ కోసం కార్యక్రమంలో భాగంగా రైతులతో ముఖాముఖీ మాట్లాడారు. గతేడాది బుడమేరు వరదల కారణంగా దెబ్బతిన్న వరి పంట పొలాలను పరిశీలించామని, ఒక వైపు రసాయనిక ఎరువులు వేసిన వరి పొలం, దాని పక్కనే ప్రకృతి వ్యవసాయంతో సాగు చేసిన వరి పొలం గమనించామని అన్నారు. ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన వరి పంట నిటారుగా నిలిచిందని, మంచి దిగుబడి వచ్చిందని చెప్పారు. రసాయన ఎరువులతో సాగు చేసిన వరి పంట దిగుబడి లేక రైతు నష్ట పోయారని అన్నారు. గ్రామంలో కూలీల సమస్య ఉందని రైతులు కలెక్టర్కు చెప్పగా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి అవసరమైన వారికి డ్రోన్లు పంపిస్తామని వాటిని వినియోగించుకోవాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రం సందర్శన.. అనంతరం కలెక్టర్ ఇటలీకి చెందిన కేర్ టు యాక్షన్ స్వచ్ఛంద సంస్థ సమకూర్చిన నిధులతో పునరుద్ధరించిన అంగన్వాడీ సక్షం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి చిన్నారులతో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ వారి పేర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పామర్రులోకి చాట్లవానిపురంలో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని, ప్రణాళిక చిత్రపటాన్ని పరిశీలించారు. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం.. పామర్రులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం పామ ర్రు సచివాలయం–1లో రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ప్రారంభించిన దివ్యాంగ శక్తి పథకాన్ని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఉయ్యూరు ఆర్డీవో శ్రీదేవి, ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి, ఏపీఈడబ్ల్యూఎస్ ఐడీసీ ఈ రాజన్న, తహసీల్దార్ రవికాంత్, డెప్యూటీ ఎంపీడీవో గంగాధర్రావు, మండల వ్యవసాయ అధికారి శివ నాగరాణి, ఏఈ రాజేష్, వసతి గృహం సంక్షేమ అధికారి వీణకుమారి తదితరులు పాల్గొన్నారు. కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ -
సజావుగా ‘పది’ పరీక్షలు
98.91 శాతం హాజరు నమోదు మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో బుధవారం నిర్వహించిన ఎస్ఎస్సీ హిందీ, ఏపీఓఎస్ఎస్ ఇంగ్లిష్ పబ్లిక్ పరీక్షలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సజావుగా జరిగినట్లు కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. పామర్రులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ డీకే బాలాజీ తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం ఎస్ఎస్సీ పరీక్షలకు 21,312 మంది విద్యార్థులకు గాను 21,079 మంది హాజరవగా, 98.91 శాతం, ఏపీఓఎస్ఎస్లో 598 మందికి గాను 437 మంది హాజరవడంతో 73.08 శాతం హాజరు నమోదైందన్నారు. రెగ్యులర్, వన్స్ ఫెయిల్ విద్యార్థులు.. రెగ్యులర్ ఎస్ఎస్సీ పరీక్షలకు 21,257 మందికి గాను 21,063 మంది హాజరై 99.09 శాతం హాజరు నమోదైందని డీఈఓ తెలిపారు. ఒకసారి ఫెయిల్ అయిన ప్రైవేట్ అభ్యర్థుల్లో 55 మందికి గాను 16 మంది హాజరై 29.09 శాతం హాజరు నమోదవగా, 39 మంది గైర్హాజరయ్యారు. ఏపీఓఎస్ఎస్లో 598 మందికి గాను 437 మంది హాజరై 73.08 శాతం హాజరు నమోదవగా, 161 మంది గైర్హాజరయ్యారు. పలు కేంద్రాలను పరిశీలించి, సిబ్బంది తగు సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలందరికీ ఇఫ్తార్ విందు అందివ్వడం ద్వారా మత సామరస్యాన్ని చాటి చెప్పినట్లు అవుతుందని ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్న ముస్లిం సోదరులకు బుధవారం సీపీ ఎస్వీ రాజశేఖరబాబు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత వున్న రంజాన్ మాసం ప్రత్యేక ప్రార్థనలు, కఠిన ’రోజా’(ఉపవాస దీక్షలు), దానధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుందన్నారు. ముస్లిం సోదరులు పోలీస్ శాఖలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారని, అలాగే ఇతర శాఖల్లో కూడా వారి సేవలు ప్రశంసనీయమన్నారు. డీసీపీలు తిరుమలేశ్వరరెడ్డి, షరీన్బేగం, కేజీవీ సరిత, కె. కృష్ణ ప్రసన్న, ఏబీటీఎస్ ఉదయరాణి, బి. లక్ష్మీనారాయణ, ఎస్వీడీ ప్రసాద్, ముస్లిం మత పెద్దలు పాల్గొనారు. -
పీజీ ఫలితాలు విడుదల
కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణావిశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన పీజీ (రెగ్యులర్, సప్లిమెంటరీ) పరీక్షల ఫలితాలను రెక్టార్ ఆచార్య బసవేశ్వరరావు బుధవారం విఽడుదల చేశారు. విద్యార్థులు ఈ ఫలితాలను కృష్ణా విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్లో పరిశీలించుకోవచ్చని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ పి.వీరబ్రహ్మచారి తెలిపారు. పునఃమూల్యాంకనానికి ఏప్రిల్ ఒకటో తేదీలోగా వెబ్సైట్లో సూచించిన రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఇతర వివరాలను వెబ్సైట్లో పొందుపరిచామని పేర్కొన్నారు. -
గురువారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, విజయవాడ/లబ్బీపేట(విజయవాడతూర్పు): అభిమాన తరంగం ఉప్పొంగింది. వర్షపు జల్లులతో పోటీపడుతూ జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు వెల్లువలా తరలి వచ్చింది. వాన చినుకులను లెక్కచేయక తమ అభిమాన నేత కోసం వేచిచూసింది. జననేత కనిపించిన ఆనందంతో జై జగన్.. జైజై జగన్ అన్న నినాదాలు మారుమోగాయి. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల సందర్భంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో విజయవాడలో ముస్లింలకు బుధవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పా టుచేశారు. ఎస్ఎస్ కన్వెన్షన్లో నిర్వహించిన ఈ విందుకు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈద్ ముబారక్ అంటూ వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఉప్పొంగిన అభిమాన తరంగం ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు తమ అభిమాన నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు విజయవాడ చేరుకున్నారు. ఈదురు గాలులు, వర్షపు జల్లు లను లెక్కచేయక వివిధ ప్రాంతాల నుంచి ఇఫ్తార్ విందు జరిగే ఎస్ఎస్ కల్యాణ మండపం వద్దకు వేలాదిగా తరలి వచ్చారు. కల్యాణ మండపం పరిసరాలు అన్నీ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిశాయి. తమ అభిమాన నేత కనిపించగానే జై జగన్.. జైజై జగన్ అంటూ నినాదాలతో అభిమానులు హోరెత్తించారు. ఆ ప్రాంతం జగన్ నామ స్మరణతో మారుమోగింది. ఇఫ్తార్లో పాల్గొనేందుకు వచ్చిన ముస్లిం సోదరులతో పాటు, పెద్ద సంఖ్యలో అభిమానులతో నమాజు చేసే ప్రాంగణం వైఎస్ జగన్ రాకకు గంట ముందే నిండిపోయింది. బయట చిరు వర్షపు జల్లులు పడుతున్నప్పటికీ తమ అభిమాన నేతను చూసేందుకు తడుస్తూనే అభిమానులు వేచి చూశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. ఇఫ్తార్ విందు ముగించుకుని బయటకు వచ్చిన వైఎస్ జగన్ను చూసి అభిమానులు కేరింతలు కొట్టారు. దీంతో వైఎస్ జగన్ కారు నుంచి బయటకు వచ్చి వారికి అభివాదం చేశారు. అనంతరం రోడ్డుపైకి వచ్చిన తర్వాత సైతం అపార్ట్మెంట్లపై నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు ఎదురు చూస్తుండటాన్ని గుర్తించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సారి కారు నుంచి బయటకి వచ్చి అందరికీ అభివాదం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ మంత్రులు అంజాద్బాషా, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, మొండితోక అరుణకుమార్, ఇషాక్, రమేష్ యాదవ్, జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, స్వామిదాసు, ముస్లిం నేతలు, మగ్బూల్, ఖాదర్ బాషా, నదీమ్, అహ్మద్ అలీఖాన్, నియోజకవర్గ ఇన్చార్జులు తన్నీరు నాగేశ్వరరావు, దేవ భక్తుని చక్రవర్తి, ఉప్పాల రాము, వైఎస్సార్ సీపీ నేతలు గౌతంరెడ్డి, పోతిన మహేష్, అంజిరెడ్డి, శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమాజులో పాల్గొన్న ముస్లింలు (ఇన్సెట్) వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డివర్షంలో తడుస్తూ జననేత వైఎస్ జగన్ను చూసిన ఆనందంలో కేరింతలు కొడుతున్న అభిమానులుఅభిమానులకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి -
నేటి నుంచి వసంత నవరాత్రులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో గురువారం నుంచి వసంత నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి విశేష సుగంధ పుష్పాలతో అర్చన జరగనుంది. నూతన పూజా మండపంలో అమ్మవారికి పుష్పార్చన నిర్వహించేందుకు ఆలయ వైదిక కమిటీ ఏర్పాట్లు చేసింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి గురువారం తెల్లవారుజామున స్నపనాభిషేకం, అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం ఎనిమిది గంటలకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. కళావేదికపై పంచాంగ పఠనం జరుగుతుంది. తెలుగు సంవత్సరాది నేపధ్యంలో అమ్మ వారి ఆలయాన్ని పూలతో విశేషంగా అలకరించారు. మల్లెలు, మరువంతో అర్చన వసంత నవరాత్రోత్సవాలలో తొలి రోజైన గురువారం అమ్మవారికి మల్లెపూలు, మరువంతో విశేషంగా అర్చన జరుగుతుంది. తొలుత అర్చన నిర్వహించే పుష్పాలతో ఆలయ అర్చకులు, వేద పండితులు ఊరేగింపుగా పూజామండపానికి చేరుకుంటారు. పుష్పార్చన అనంతరం ఆయా పుష్పాలను భక్తులకు పంపిణీ చేస్తారు. ఈ సేవలో పాల్గొనే భక్తులు రూ.2500 టికెట్ కొనుగోలు చేయాలి. ఉగాదిని పురస్కరించుకుని శ్రీ గంగ, పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్లకు వెండి రథంపై నగరోత్సవాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు మహామండపం నుంచి ఊరేగింపు ప్రారంభమై కనకదుర్గనగర్, రథం సెంటర్, బ్రాహ్మణ వీధి, జమ్మిదొడ్డి, కోమల విలాస్, రమణయ్య కూల్డ్రింక్స్ షాపు, బోడెమ్మ హోటల్, వన్టౌన్ పోలీస్ స్టేషన్, సామారంగం చౌక్, శ్రీను హోటల్, బ్రాహ్మణ వీధి మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. -
వ్యాగన్ వర్క్షాప్ను సందర్శించిన రైల్వే జీఎం
ఇబ్రహీంపట్నం: మండలంలోని గుంటుపల్లి రైల్వే వ్యాగన్ వర్క్షాపు 50 వసంతాల వేడుకల్లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ బుధవారం పాల్గొన్నారు. వర్క్షాపు చీఫ్ మేనేజర్ ఎస్.శ్రీనివాస్, ఇతర అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వర్క్ షాపులోని పలు విభాగాలను జీఎం శ్రీవాత్సవ పరిశీలించారు. ముఖ్యంగా మెషీన్ షాప్, ఎంఎండబ్ల్యూ సెక్షన్, పెయింట్ షాప్, సాబ్ సెక్షన్, స్క్రాప్ సెక్షన్, ట్రాన్స్పోర్ట్ సెక్షన్, వీల్షాప్ యార్డ్ ఆఫీస్ కాంప్లెక్స్లను సందర్శించారు. సంస్థ నిర్వహణపై అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. వ్యాగన్ వర్క్షాపు ఉద్యోగులు, కార్మికుల కృషితో సంస్థ దేశంలోనే రెండో స్థానంలో నిలవడంపై వారికి అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో సైతం మరింత పురోభివృద్ధి సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన వీల్ మిషన్, పెయింట్ షాపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూ ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదిదంపతుల ఆర్జిత సేవలకు డిమాండ్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అమావాస్య నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు బుధవారం నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయ దాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారు జామున జరిగిన సుప్రభాత సేవలో భక్తులు భారీగా పాల్గొన్నారు. నాలుగు గంటలకు నిర్వహించిన ఖడ్గ మాలార్చనకు 24 టికెట్లను విక్రయించారు. దీంతో రెండు షిఫ్టుల్లో ఈ సేవను నిర్వహించాల్సి వచ్చింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని నూతన యాగశాలలో జరిగిన చండీహోమంలో 150 మంది ఉభయ దాతలు ప్రత్యక్షంగా, మరో 50 మంది పరోక్షంగా పాల్గొన్నారు. లక్ష కుంకుమార్చన, మృత్యుంజయ హోమం, గణపతి హోమం, నవగ్రహ శాంతి హోమంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఈ సేవల్లో పాల్గొన్న ఉభయదాతలను ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): పాత ప్రభుత్వాస్పత్రిలోని మానసిక వైద్య విభాగంలో ఉన్న డీ అడిక్షన్ సెంటర్ను ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ బుధవారం సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, జీవితంలో ముందుకు సాగాలని సూచించారు. గంజాయి, డ్రగ్ నియంత్రణలో ప్రతి తల్లీ ఈగల్ బ్రాండ్ అంబాసిడరేనని, ఏ చిన్న సమాచారం ఉన్నా ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆపరేషన్ ‘సేఫ్ క్యాంపస్ జోన్’లో భాగంగా విద్యార్థుల్లో గంజాయి, డ్రగ్స్ వాడకం పై అవగాహన కలిగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈగల్ ఎస్పీ నగేష్ బాబు, డాక్టర్ సామ్రాజ్యం, విజయవాడ ఈగల్ సెల్ సీఐ రవీంద్ర, స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం ఆర్ఐ నాగార్జున, ఎస్ఐ వీరాంజనేయులు పాల్గొన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ డి.కె.బాలాజీ పాల్గొన్నారు. జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో బుధవారం సాయంత్రం నిర్వహించిన ఈ ఇఫ్తార్ విందులో ముస్లింలతో కలిసి వారు ప్రార్థనలు చేశారు. అనంతరం విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్ర మంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, పలువురు ముస్లింలు పాల్గొన్నారు. -
రైతులతో వాతావరణం
సాక్షి నెట్వర్క్: ఉమ్మడి కృష్ణా జిల్లాలో బుధవారం మధ్యాహ్నం గాలి వాన బీభత్సం సృష్టించింది. అప్పటి వరకు ఎండ మండిపోగా ఒక్క సారిగా వాతావరణం మారిపోయింది. గాలి దుమారం మొదలైన కొద్ది సేపటికే ఆకాశం మేఘావృతమైంది. ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. గాలుల ధాటికి రహదారుల పక్కన ఏర్పాటు చేసిన హోర్డింగులు, ఫ్లెక్సీలు, పలు ప్రచార బోర్డులు నేలకూలాయి. జొన్న, మొక్కజొన్న, మునగ వంటి పంటలు నేల వాలాయి. కల్లాల్లో ఆర బెట్టిన మిర్చి, మొక్కజొన్న పంటలు తడిచిపోయాయి. ఆరుగాలం శ్రమించి సాగు చేసి కల్లాల్లో ఆరబోసిన పంటలపై పట్టాలు కప్పి కాపాడుకునే రైతులు తీవ్ర ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం నియోజకవర్గాలతో పాటు, కృష్ణాజిల్లా పరిధిలో పెనమలూరు, నియోజకవర్గాల్లో పంట నష్టం అధికంగా ఉంది. ఇబ్రహీంపట్నం మండలంలోని కొటికలపూడి, మూలపాడు, లంక గ్రామాల్లో నష్ట తీవ్రత అధికంగా ఉంది. వర్షం నీటితో పొలంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల నేలవాలిన చేలల్లో మొక్కజొన్న గింజలు మొలకెత్తే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు. మునగ చేలు సైతం వేర్లుతో సహా నేలకూలడంతో రైతులు కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. మచిలీపట్నంటౌన్: దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ రావు పేర్కొన్నారు. మచిలీ పట్నం బస్టాండ్ ఆవరణలో దివ్యాంగ శక్తి పథకాన్ని ఆయన బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. దివ్యాంగులు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. వారితో కలిసి చిన్నాపురం గ్రామం వరకు బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా కొనకళ్ల మాట్లాడుతూ.. మహిళలకు ఇప్పటికే ఉచిత బస్సు అమలు చేస్తున్నామన్నారు. దివ్యాంగులు ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ప్రజారవాణా అధికారి వెంకటేశ్వర్లు, మచిలీపట్నం డిపో మేనేజర్ టి.పెద్దిరాజు, వికలాంగుల సంక్షేమశాఖ ఏడీ కామరాజు పాల్గొన్నారు. -
ఆడిందే ఆటగా..
సాక్షి టాస్క్ఫోర్స్: పామర్రులో పేకాట మూడు ముక్కలు.. ఆరు పేకలు అన్న చందంగా సాగుతోంది. కృష్ణా జిల్లాలోనే ఈ నియోజకవర్గం పేకాటకు కేరాఫ్ అడ్రస్గా మారింది. నియోజకవర్గ వ్యాప్తంగా పేకాట డెన్లు ఏర్పాటు చేసి జోరుగా జూదాన్ని సాగిస్తున్నారు. ఆట మోజులో పడి అనేకమంది పేకాట రాయుళ్లు తమ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. అప్పుల పాలై పలు కుంటుంబాలు వీధిన పడుతున్నాయి. ఇదే అదునుగా నియోజకవర్గ ప్రజా ప్రతినిధి పేకాట శిబిరాలను ప్రోత్సహిస్తూ, నిర్వాహకుల నుంచి రోజువారీ, నెలవారీ మామూళ్లు పెట్టి భారీగా దండుకొంటున్నారు. పేకాటను అరికట్టాల్సిన పోలీసులు సైతం సందట్లో సడేమియా అన్నట్లుగా.. పేకాట శిబిరాలపై దాడి మాట దేవుడెరుగు, ఆ శిబిరాలకు వీరే రక్షణ కవచంలా వ్యవహరిస్తుండటం విస్మయానికి గురి చేస్తోంది. పమిడిముక్కల, పామర్రు ప్రాంతాల్లోని పోలీసు బాస్లు, సైతం అక్కడ జరిగే ఆటను బట్టి పర్సంటేజీ పెట్టుకోవడంతో పాటు నియోజకవర్గ ప్రజా ప్రతినిధికి రోజువారీ, నెలవారీ మామూళ్లు వసూలు చేసే బాధ్యతను తీసుకున్నట్లు ఈ ప్రాంతంలో జోరుగా చర్చ సాగుతోంది. జిల్లా స్థాయి పోలీసు ఉన్నతాధికారికి తెలియకుండా స్థానిక పోలీసులే, నియోజకవర్గ ప్రజాప్రతినిధితో కుమ్మక్కై జోరుగా పేకాటను నడుపుతున్నారనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇక్కడ ఇంత ధీమాగా ఆట నడుపుతున్నారంటే, పై స్థాయిలో పోలీసు ఉన్నతాధికారులకు తెలియకుండా ఈ తంతు నడుస్తుందా అనే భావన సైతం పలువురిలో వ్యక్తం అవుతోంది. ఇక్కడ జరుగుతున్న పేకాటకు సంబంధించి నిఘా వర్గాల ద్వారా ఇప్పటికే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించి స్పెషల్ పార్టీలతో ఆకస్మిక దాడులు చేస్తే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. పేకాట జరిగే ప్రాంతాలు ఇవే.. ప్రధానంగా పామర్రు నియోజకవర్గం, మొవ్వ మండలంలోని క్రోసూరు, కాజ, పామర్రు మండ లంలో పామర్రు, ఎన్టీఆర్ జన్మస్థలం నిమ్మకూరు, పెదపారుపూడి మండలంలోని మహేశ్వరపురం, పమిడిముక్కల మండలంలోని హనుమంతపురం, పమిడిముక్కల, తోట్లవల్లూరులోని లంక గ్రామాల్లో యథేచ్ఛగా పేకాట సాగుతోంది. దీంతో పాటు పామర్రులో చిత్తుల ఆట నిర్వహిస్తున్నారు. ఈ ఆటకు సైతం రోజువారీ మామూలు రూ.10 వేలుగా పోలీసులు నిర్ణయించినట్లు జోరుగా చర్చ సాగుతోంది. పర్మినెంట్ పేకాట క్లబ్కు యత్నం.. పెదపారుపూడి మండలం దోసపాడులో పర్మినెంట్ పేకాట క్లబ్ ఏర్పాటు చేసేందుకు అధికార పార్టీ నేతలు రంగం సిద్ధం చేశారు. విషయం బయటకు పొక్కడంతో వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ వెంటనే స్పందించి పామర్రులో ఇలాంటి సంస్కృతి ఎన్నడూ లేదని, ఇక్కడ క్లబ్ ఏర్పాటు చేస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు. దీంతో అధికార పార్టీ నేతలు వెనక్కి తగ్గారు. తాత్కాలికంగా క్లబ్ ప్రతిపాదన ఆగిపోయింది. పామర్రు తరువాత పెనమలూరు నియోజకవర్గంలోనే పేకాట జోరుగా సాగుతోంది. ఇక్కడ కూడా నియోజకవర్గ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే అంతా సాగుతోందని తెలుస్తోంది. పోలీసులకు నెలవారీ మామూళ్లు ఇస్తుండటంతో వారు నోరు మెదపడం లేదు. ప్రధానంగా పోరంకి, పద్మావతి కాలనీ, వణుకూరు, పెనమలూరు, కంకిపాడులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో, ఉయ్యూరులోని పలు ప్రాంతాల్లో పేకాట సాగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పోరంకి–నిడమానూరు రోడ్డులో గన్నవరం నియోజకవర్గం వారు వచ్చి ఆడుకొనేలా అధికార పార్టీనేతలే ఏర్పాట్లు చేశారు. గతంలో పోరంకి సమీపంలో పోలీసుల దాడుల్లో నియోజకవర్గ ప్రజా ప్రతినిధి అనుచరుడు పట్టుపడిన విషయం విదితమే. నియోజకవర్గ ప్రజాప్రతినిధికి, పోలీసులకు ముడుపులు అందుతుండటంతో, ఈ పేకాట డెన్ల వైపు కన్నెత్తి చూడటం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ఆస్కార్ నీరాజనం
నటనా కోటకు కంకిపాడు: పద్మశ్రీ అవార్డు గ్రహీత, సినీనటుడు కోట శ్రీనివాసరావు విలక్షణ నటుడు. తన హావభావాలు, నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి, తనకంటూ సినీ జగత్తులో కొన్ని పేజీలు ఏర్పాటు చేసుకున్నారు. నాటి నుంచి నేటి వరకూ ఆయన నటనకు మంత్ర ముగ్ధులు కాని వారు లేరంటే అతిశయోక్తికాదు. సోమవారం ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ సభలో ఇటీవల మరణించిన భారతదేశ సినీరంగ ప్రముఖులను స్మరించుకున్న నేపథ్యంలో తెలుగు చిత్రపరిశ్రమ నుంచి కోట శ్రీనివాసరావును స్మరించటం తెలుగు చిత్ర పరిశ్రమకు దక్కిన గౌరవంగా భావించొచ్చు. కంకిపాడు నుంచే అన్నీ.. గతేడాది జూలైలో కోట శ్రీనివాసరావు ఆకస్మికంగా మృతి చెందటం కళాభిమానులను కలచివేసింది. అయితే ఆస్కార్ వేదికగా దక్కిన అరుదైన గౌరవానికి ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు. కోట పుట్టింది, పెరిగింది, ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించింది కంకిపాడు నుంచే. చిన్న నాటి నుంచి ఇక్కడి ప్రజలతో అవినాభావ సంబంధం ఉంది. పట్టణంలోని చిన్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద స్వస్థలం ఉంది. ఇక్కడే ఆయన నివాసం కూడా ఉంది. కోట తండ్రి సీతారామాంజనేయులు లాకురోడ్డులోని గాంధీ బొమ్మ సెంటరులోని ఓ ఇంటి వద్ద వైద్యుడిగా క్లినిక్ నడిపేవారు. వైద్యుడిగా అందరికీ సుపరిచితులు. కోట శ్రీనివాసరావు ఆయన సోదరులు నరసింహారావు, శంకర్రావు నాటకరంగం నుంచి సినీరంగం వరకూ ఎదిగి అందరి మన్ననలు పొందటం తెలిసిందే. స్థానికంగా ఉన్న ఎలిమెంటరీ పాఠశాలలో ప్రాథమిక విద్య, ఉన్నత విద్యలను అభ్యసించిన కోట.. బ్యాంకు ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించారు. కంకిపాడు, విజయవాడ, హైదరాబాద్లోని ఎస్బీఐ బ్రాంచిల్లో ఉద్యోగిగా పనిచేస్తూ సినీరంగంలోకి అడుగుపెట్టారు. తొలి నాళ్లలో నాటకరంగంలో ప్రవేశించినా.. అంతటి ప్రాచుర్యం దక్కలేదు. అయితే సినీరంగంలో అంచెలంచెలుగా ఎదిగి, విలక్షణ నటుడిగా గుర్తింపు సాధించారు. ఆయన ప్రతిభను గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించి గౌరవించారు. కోట సీతారామంజనేయులు కుటుంబం అందరికీ సుపరిచితం. తండ్రి వైద్య రంగంలో, కుమారులు కళారంగానికి వన్నె తెచ్చారు. మా ఇంటి పక్కనే నివాసం ఉండే వారు. వీలు దొరికినప్పుడల్లా ఆ కుటుంబంతో గడిపేవాళ్లం. ఆయన మరణం చాలా బాధించింది. అయితే ఆస్కార్ వేదికగా మా కంకిపాడు వాసికి గౌరవం దక్కటం సంతోషంగా ఉంది. – గాదంశెట్టి పరమేశ్వరరావు, కంకిపాడు -
ఆల్ ఇండియా జూనియర్ లాన్ టెన్నిస్ చాంపియన్షిప్–2026 ప్రారంభం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆల్ ఇండియా జూనియర్ (అండర్–16, బాలురు, బాలికల) లాన్ టెన్నిస్ చాంపియన్ షిప్–2026 పోటీలను సోమవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ కామినేని పట్టాభిరామయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల వలన శారీరక దృఢత్వంతో పాటు నాయకత్వ లక్షణాలు అలవడతాయన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మెరుగవుతాయని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్డీవో) కె.కోటేశ్వరరావు మాట్లాడుతూ పిల్లలకు ఏ క్రీడలో ఆసక్తి ఉందో గమనించి తల్లిదండ్రులు ఆ క్రీడల్లో శిక్షణ ఇప్పిస్తే వారు రాణిస్తారని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా లాన్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వై.బాబూరావు మాట్లాడుతూ ఇంటర్నేషనల్ లాన్ టెన్నిస్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ లాన్ టెన్నిస్ అసోసియేషన్, ఎన్టీఆర్ జిల్లా లాన్ టెన్నిస్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ పోటీల్లో 12 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారన్నారు. అసోసియేషన్ కార్యదర్శి ఈ.లలిత్కుమార్, కోశాధికారి శ్రీనివాసరావుతో పాటుగా సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఆకివీడులో మత కల్లోలాలకు కుట్ర నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షుడు జాన్ మస్క్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఉండి నియోజకవర్గ పరిధిలోని ఆకివీడులో మతకల్లోలాలకు కుట్ర జరుగుతోందని నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ జాతీయ అధ్యక్షుడు జాన్ మస్క్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీనగర్ లోని ఒక హోటల్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆకివీడులో గత మూడు నెలలుగా అశాంతి నెలకొందన్నారు. డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వైఖరి వల్ల హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్య విద్వేషాలు పెరిగే ప్రమాదం ఉందన్నారు. ప్రజా ప్రతినిధిగా ఉన్న ఆయన నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసి, మతపరమైన ఉద్రిక్తతలకు కారణమవుతున్నారని జాన్ మస్క్ మండిపడ్డారు. డ్రైనేజీ సమస్యలు, దోమల బెడద, ఇళ్ల నిర్మాణం వంటి మౌలిక వసతులపై దృష్టి సారించకుండా, ప్రార్థనా మందిరాల కూల్చివేతలకు పాల్పడటం శోచనీయమన్నారు. కేవలం బీజేపీకి దగ్గరయ్యేందుకే రఘురామకృష్ణంరాజు రాష్ట్రాన్ని మణిపూర్ తరహాలో మార్చాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. సీఎం చంద్రబాబు ఈ విషయంలో తక్షణమే స్పందించి శాంతి భద్రతలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.సమావేశంలో ఏపీ క్రిస్టియన్ ప్రొటెక్షన్ సెల్ అధ్యక్షుడు పాస్టర్ ఎండీ ఇస్మాయిల్, జి.రాజేష్ ఖన్నా, పీతల రాజు, యోసేబు, విజయ శేఖర్, ప్రకాష్, విల్సన్ తదితరులు పాల్గొన్నారు. -
అజరామరం పొట్టిశ్రీరాములు త్యాగం
చిలకలపూడి(మచిలీపట్నం): ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలు అర్పించిన త్యాగశీలి అమరజీవి పొట్టి శ్రీరాములు అని, ఆయన పట్టుదల ఆదర్శనీయమని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు హాలులో పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరావతిలో 58 అడుగుల స్టాట్ట్యూ ఆఫ్ శాక్రిఫైజ్ కాంస్య విగ్రహాన్ని నారా చంద్రబాబునాయుడు ఆవిష్కరించిన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గాంధేయ వాది అయిన పొట్టి శ్రీరాములులోని పట్టుదల, త్యాగనిరతిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ప్రసంగించారు. డీఆర్వో చంద్రశేఖరరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి పాల్గొన్నారు. -
అధిక ప్రాధాన్యంతో సత్వర పరిష్కారం
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజల నుంచి వచ్చే అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కారవేదిక (మీ కోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్తో పాటు జేసీ ఎం. నవన్, డీఆర్వో చంద్రశేఖరరావు, జిల్లా విజిలెన్స్ అధికారి పోతురాజు, డీఎస్పీ శ్రీనివాసరావు అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతన్నా మీ కోసం రెండో విడత కార్యక్రమం ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులకు ఐదు అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం వ్యవసాయశాఖ రూపొందించిన పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. మీ కోసం కార్యక్రమంలో అధికారులు 109 అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీల్లో కొన్ని.. చల్లపల్లి మండలం కొత్తమాజేరు గ్రామంలో మహాలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్మిల్లు నూతనంగా నిర్మించుకున్న డ్రైయ్యర్ వల్ల అవస్థలు పడుతున్నామని గ్రామ శివారు ఎన్టీఆర్ కాలనీవాసులు పేర్కొన్నారు. డ్రైయ్యర్ కారణంగా ఇళ్లలోకి విపరీతమైన దుమ్మూ, ధూళి వచ్చి తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నామని వివరించారు. ఇప్పటికే దీని కారణంగా ఒకరు చనిపోయారని, ముగ్గురు ఊపిరితిత్తులు, శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వాపోయారు. అంతేకాకుండా మంచి నీటి చెరువు కూడా కలుషితమవుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు అర్జీ ఇచ్చారు. -
తొలి రోజు ప్రశాంతం
జిల్లాలో ప్రారంభమైన పదోతరగతి పరీక్షలు మచిలీపట్నంఅర్బన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు, కాంపోజిట్ తెలుగు)తో పాటు ఓపెన్ స్కూల్ (ఏపీఓఎస్ఎస్) పబ్లిక్ పరీక్షలు (తెలుగు/ఉర్దూ) జిల్లాలో సోమవారం ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. జిల్లాలోని ఆరు పరీక్ష కేంద్రాలను ఏపీ ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డాక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి పరిశీలించగా, మరో 12 పరీక్ష కేంద్రాలను సమగ్ర శిక్ష అదనపు రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా అబ్జర్వర్ ఎం.ఆర్. ప్రసన్న కుమార్ సందర్శించి పరీక్షల నిర్వహణ విధానంపై సంతప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. అదనంగా జిల్లాలో ఏర్పాటు చేసిన ఐదు ఫ్లైయింగ్ స్క్వాడ్లు, రెండు ఏసీజీఈలు మొత్తం 46 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు వెల్లడించారు. ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలు.. జిల్లాలోని 148 పరీక్ష కేంద్రాల్లో ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలకు మొత్తం 21,438 మంది విద్యార్థుల్లో 21,173 మంది హాజరై, 265 మంది గైర్హాజరయ్యారు. మొత్తం హాజరు శాతం 98.76గా నమోదైంది. రెగ్యులర్, వన్స్ ఫెయిల్ విద్యార్థులు.. రెగ్యులర్ విద్యార్థుల్లో 21,272 మంది నమోదు కాగా, 21,080 మంది హాజరై 192 మంది గైర్హాజరయ్యారు. హాజరు 99.10 శాతంగా నమోదు కాగా ప్రైవేట్ (వన్స్ ఫెయిల్) విద్యార్థుల్లో 166 మంది నమోదు కాగా, 93 మంది హాజరై 73 మంది గైర్హాజరయ్యారు. హాజరు 56.02 శాతంగా ఉంది. ఓపెన్ స్కూల్.. ఓపెన్ స్కూల్ పరీక్షలకు జిల్లాలోని ఎనిమిది పరీక్ష కేంద్రాలలో మొత్తం 591 మంది విద్యార్థులు నమోదు కాగా, 428 మంది హాజరయ్యారు. 163 మంది గైర్హాజరయ్యారు. హాజరు శాతం 72.42గా నమోదైంది. పరీక్ష కేంద్రాల పరిశీలన.. జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు నగరంలోని సీపీఎం హైస్కూల్ చిలకలపూడి, నిర్మల హై స్కూల్, హైని హై స్కూల్, బాలాజీ విద్యాలయం, బాలభాను హై స్కూల్ తదితర పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. అలాగే నిర్మల హై స్కూల్, బాలాజీ విద్యాలయంలో నిర్వహిస్తున్న ఓపెన్ స్కూల్ పరీక్ష కేంద్రాలను కూడా సందర్శించారు. పరీక్షల నిర్వహణ విధానం, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను తనిఖీ చేసి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. పరీక్షలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. -
బార్ అనుమతులు రద్దు
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బార్ను పరిశీలించిన ఎకై ్సజ్ శాఖ డీసీ చిలకలపూడి(మచిలీపట్నం): నిబంధనలకు విరుద్ధంగా మంగిన పూడిబీచ్ రోడ్డులో బార్ షాపును నిర్వహిస్తున్నట్లు తమకు వచ్చిన సమాచారం మేరకు పరిశీలించిన అనంతరం అమ్మకాలను నిలిపివేసి, సస్పెండ్ చేస్తున్నట్లు ఎకై ్సజ్ డెప్యూటీ కమిషనర్ టి. శ్రీనివాసరావు తెలిపారు. ‘సాక్షి’ దినపత్రికలో సోమవారం ‘కిక్కు’రుమనడం లేదు! శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి, మచిలీపట్నంలోని ఎకై ్సజ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీ మాట్లాడుతూ ఫిబ్రవరి 5వ తేదీన లాటరీ పద్ధతిలో నిర్వహించిన ప్రక్రియలో ఎంపికై న లైసెన్సుదారుడికి ప్రొవిజినల్ లైసెన్సు అందజేశామని తెలిపారు. అయితే 40 రోజులు గడుస్తున్నా ఇంత వరకు అన్ని సదుపాయాలతో బార్ ఏర్పాటు చేయలేకపోయారన్నారు. అంతేకాకుండా తాత్కాలికంగా అమ్మకాలు జరుపుతున్నారని తమ దృష్టికి రావటంతో ఎకై ్సజ్ అధికారులు పరిశీలించి, నిబంధనలకు లోబడి లేకపోవటంతో వెంటనే అమ్మకాలను నిలిపివేసి, అనుమతులు సస్పెండ్ చేశామన్నారు. లైసెన్సుదారుడికి నోటీసులు జారీ చేశామన్నారు. వారు ఇచ్చిన సమాధానాన్ని పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు ఉంటాయన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన సేవలందించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. సోమవారం 77 మంది కార్యదర్శులకు గ్రేడ్–4 నుంచి గ్రేడ్–3గా సీనియారిటీ ప్రకారం ఉద్యోగోన్నతి ఉత్తర్వులను కలెక్టర్ ఆయన చాంబర్లో అందజేశారు. జిల్లా పంచాయతీ అధికారి జె. అరుణ పాల్గొన్నారు. -
మహనీయుల త్యాగాలు అజరామరం
ఏఎస్పీ నాయుడు జేసీ నవీన్ 23.5 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చల్లపలి: కోళళ్ల ఫారాలకు తరలిస్తున్న 23.5 టన్నుల రేషన్ బియ్యాన్ని చల్లపల్లి పోలీసులు సోమవారం పట్టుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. మండల పరిధిలోని లక్ష్మీపురంలో ఆటోలో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా రేషన్ బియ్యం ఉండడాన్ని గుర్తించారు. బియ్యాన్ని తరలిస్తున్న గూడూరు మండలం పోలవరం గ్రామానికి చెందిన పి.మాణిక్యాలరావు, లంకపల్లికి చెందిన కె.నాగేంద్రం, డ్రైవర్ సాదిక్లపై కేసు నమోదుచేసినట్లు చెప్పారు. -
అలరించిన కూచిపూడి నృత్యాలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై అమ్మవారి సన్నిధిలో యువ కళాకారిణులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు భక్తులను అలరించాయి. శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలోనిని కళావేదికపై నాట్య గురువు మద్దాలి సత్యవాణి శిష్య బృందం కణ్వల, విజయ, నందిత, ప్రసన్న, అనిత, హేమ, వీణ, సరయు, మన్విత, చార్వి, జుహిత, నిష్కళలు పలు అంశాలకు చక్కని అభినయం, ఆహార్యంతో నర్తించి పలువురిరి ప్రశంసలు అందుకున్నారు. వారు ప్రదర్శించిన నృత్యాంశాల్లో నర్తన గణపతిం, బాల కనకమయ, ఆధ్యాత్మిక రామాయణ కీర్తన, కులుకక నడవరో, కాలభైరవాష్టకం, శివ పంచాక్షరి, శివాష్టకం, ఒక పరికొక పరి, శివస్తుతి, భావములోన, పలుకే బంగారమాయెనా, లింగాష్టకం చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా నాట్య గురువు సత్యవాణి మాట్లాడుతూ జగన్మాత కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. -
మహిళలను గౌరవించడం భారతీయ సంస్కృతి
భవానీపురం(విజయవాడపశ్చిమ): భారతీయ సంస్కృతిలోనే మహిళలను గౌరవించే విధానం ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య మహిళా కార్మికులను సత్కరించారు. అనంతరం మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు పద్మశ్రీ ఇచ్చి గౌరవించిన ప్రధాని మోదీ చేతల మనిషి అని కొనియాడారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పని చేసిన పారిశుద్ధ్య కార్మికుల రుణం తీర్చుకోలేనిదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ మనమందరం సంతోషంగా, సుఖంగా ఉండటానికి పారిశుద్ధ్య కార్మికులే కారణమని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి పారిశుద్ధ్య కార్మికులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి, నటుడు బాబు మోహన్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు అందరికంటే మహానుభావులన్న ప్రధాని మోదీ వారి కాళ్లు కడిగారని గుర్తు చేశారు. ఈ నెల 21, 22 తేదీల్లో నా పెద్ద కుమారుని పేరుతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ -
వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో అవినాష్ పుట్టినరోజు వేడుకలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో పార్టీ నేతలు కేక్ కట్ చేయించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, ఎండీ రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ నేత నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారంతా దేవినేని అవినాష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కృష్ణాజిల్లా క్రికెట్ అసోసియేషన్ అండర్–19 (పురుషుల) జట్టు ఎంపికలు ఈ నెల 19వ తేదీ నిర్వహిస్తున్నామని సంఘం కార్యదర్శి ఎం.రవీంద్ర చౌదరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 7 గంటలకు విజయవాడ ఎంజీ రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో సెలక్షన్స్ జరుగుతాయని పేర్కొన్నారు. 1.9.2007 తర్వాత జన్మించిన వారు పాల్గొనడానికి అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, తెల్లటి దుస్తులు(వైట్ డ్రస్), స్పోర్ట్స్ షూ, సొంత క్రికెట్ కిట్, రెడ్ కలర్ బాల్తో ఈ ఎంపికలకు హాజరు కావాలని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి పెనమలూరు: పోరంకి వద్ద విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందడంతో పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం పెనమలూరు సుగాలీ కాలనీకి చెందిన ఎన్.రాంబాబు (45) బోరింగ్ పనులు చేస్తాడు. అతను శనివారం అర్ధరాత్రి రసనా బార్ ఎదురుగా రోడ్డు దాటుతుండగా కంకిపాడు వైపు నుంచి విజయవాడ వైపునకు వెళుతున్న గుర్తు తెలియని కారు అతివేగంగా వచ్చి అతన్ని ఢీ కొట్టింది. ఘటనలో రాంబాబు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆస్పత్రికి తరలించేలోపే మరణించాడు. మృతుడి కుమారుడు సాయినాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కారు నంబర్ కోసం సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. తాడేపల్లి రూరల్: వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో సోమ, మంగళ, బుధవారాల్లో మూడు రోజుల పాటు అంతర్జాతీయ గణిత సదస్సు నిర్వహించనున్నట్లు వర్సిటీ వీసీ డాక్టర్ జి.పార్థసార ట వర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్వాంటం కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు అంశంపై జరగనున్న అంతర్జాతీయ గణిత సదస్సుకు అతిథులుగా వర్సిటీ ప్రో చాన్సలర్ డాక్టర్ కేఎస్ జగన్నాథరావు, జేఎన్టీయూ హైదరాబాద్ అకడమిక్స్ డైరెక్టర్, కంప్యూటర్ సైన్స్ విభాగ ఆచార్యులు డాక్టర్ వి.కామాక్షి ప్రసాద్ హాజరు కానున్నారని వెల్లడించారు. కార్యక్రమాన్ని ఆఫ్లైన్, ఆన్లైన్ విధానాల్లో నిర్వహించనున్నామని పేర్కొన్నారు. గణిత సదస్సులో దేశ విదేశాల నుంచి రీసోర్స్ పర్సన్స్, ఔత్సాహికులు పాల్గొని తాము రూపొందించిన పరిశోధనా పత్రాలను ప్రదర్శించనున్నారన్నారు. సుమారు 500 మంది విద్యార్థులు హాజరుకానున్నారని ఆయన ఆ ప్రకటనలో వివరించారు. -
వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించాలి
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పెనమలూరు: వినియోగదారులకు హక్కులపై అవగాహన కల్పించాలని అప్పుడే వారికి న్యాయం జరుగుతుందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. కానూరులో ఆదివారం సిద్ధార్థ లా కాలేజీ, ఏపీ కన్స్యూమర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినియోగదారుల అవగాహన, సాధికారతపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ వినియోగదారుల సంరక్షణకు అనేక చట్టాలు ఉన్నా హక్కులపై అవగాహన లేక మోసాలకు గురవుతున్నారని తెలిపారు. నేడు సమాజంలో నిబద్ధత, పారదర్శకత లోపిస్తోందని, అవినీతి, కల్తీ పెరిగిందన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జి.రామకృష్ణప్రసాద్ మాట్లాడుతూ దేశంలో ఈ కామర్స్, విద్యా, వైద్యరంగంపై వినియోగదారులకు అవగాహన లేక పోవడంతో మోసాలకు గురవుతున్నారన్నారు. హైకోర్టు న్యాయమూర్తి చీమలపాటి రవి మాట్లాడుతూ విద్య, వైద్యం వ్యాపారంగా మారాయన్నారు. కార్యక్రమంలో సిద్ధార్థ అకాడమి అధ్యక్షుడు ఎం.రాజయ్య, లా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ చెన్నుపాటి దివాకర్బాబు, ప్రో ఉపకులపతి డాక్టర్ రత్నప్రసాద్, బార్ అధ్యక్షుడు మన్నే హరిబాబు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నూరుశాతం అక్షరాస్యత సాధనే లక్ష్యం
వయోజన విద్య డైరెక్టర్ రంజిత్ బాషా కంకిపాడు: నూరుశాతం అక్షరాస్యత సాధనే ప్రభుత్వ లక్ష్యమని వయోజన విద్య డైరెక్టర్ రంజిత్ బాషా అన్నారు. వయోజన విద్యా శాఖ ఆధ్వర్యాన నిర్వహించిన ఉల్లాస్ పరీక్ష కేంద్రాలను ఆదివారం ఆయన సందర్శించారు. అభ్యర్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో రంజిత్బాషా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో భాగంగా 20 లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాయడం, చదవడం, ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ పేమెంట్స్ అంశాలపై అవగాహన కలిగి ఉండేలా అవసరమైన శిక్షణ ఇస్తున్నామన్నారు. గత ఏడాది సెప్టెంబరులో ఉల్లాస్ కార్యక్రమం కింద వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టామన్నారు. ఇప్పటి వరకూ 100 గంటల పాటు అవసరమైన శిక్షణ అందించామన్నారు. 2029 నాటికి దశల వారీగా అందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఎన్.బసవయ్య, పరీక్ష కేంద్రం పర్యవేక్షకురాలు యార్లగడ్డ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. పెనమలూరు: పెనమలూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం అక్షర ఆంధ్ర పరీక్ష కేంద్రాన్ని రంజిత్బాషా సందర్శించి పలు సూచనలు చేశారు. జిల్లాలో 73,327 మంది అభ్యాసకులకు 980 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఉపసంచాలకులు ఎండీ.హాజీబేగ్, ఎంపీడీవోలు, ఏపీఎంలు పాల్గొన్నారు. భవానీపురం(విజయవాడపశ్చిమ): నూతన తెలుగు సంవత్సరాన్ని (ఉగాది) పురస్కరించుకుని ఏపీ ముదిరాజ్ మహాసభ రూపొందించిన ముదిరాజ్ –2026 డైరీని సినీ నటుడు సుమన్ తల్వార్ ఆవిష్కరించారు. ఏపీ ముదిరాజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొర్న వెంకట నారాయణ ఆధ్వర్యాన ఆదివారం విజయవాడలోని ఒక హోటల్లో జరిగిన కార్యక్రమంలో నూతన డైరీని విడుదల చేశారు. కార్యక్రమంలో పీవీఎల్ఎన్ రాజు ముదిరాజు, మద్దం కోటేశ్వరరావు ముదిరాజు, వెంకటేశ్వరరావు ముదిరాజు, మహిళా నాయకురాలు బోడి మాధవి ముదిరాజు తదితరులు పాల్గొన్నారు. కొండపల్లి(ఇబ్రహీంపట్నం): శ్రీరాముని భక్తుడు ఉపేంద్ర దాస్ గంగోత్రి నుంచి రామేశ్వరం వరకు చేపట్టిన గంగోత్రి–రామేశ్వరం యాత్ర ఆదివారం కొండపల్లి గ్రామానికి చేరుకుంది. 2023 జూన్ 2 వ తేదీన ఆయన గంగోత్రిలో భూమిపై సాష్టాంగ నమస్కారం చేస్తూ గంగోత్రి–రామేశ్వరం యాత్ర చేపట్టారు. యాత్ర కొండపల్లి చేరిన సందర్భంగా స్థానిక ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, షాబూఖారీ దర్గా పీఠాధిపతి మహ్మద్ అల్తాఫ్ రజాతో పాటు పట్టణ ప్రముఖులు ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. యాత్రికుడు ఉపేంద్ర దాస్ మాట్లాడుతూ గంగోత్రి నుంచి రామేశ్వరానికి భూమిపై సాష్టాంగ నమస్కారం చేస్తున్న ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం ప్రపంచ శాంతి, లోక కల్యాణమన్నారు. అవనిగడ్డ: స్థానిక లంకమ్మ అమ్మవారిని జిల్లా జడ్జి బాబు నాయక్ ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ఆలయ కమిటీ చైర్మన్ అన్నపరెడ్డి వెంకటస్వామి, ఈవో యార్లగడ్డ శ్రీనివాసరావు బాబు నాయక్కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి చిత్రపటం అందించి సత్కరించారు. పలువురు న్యాయ వాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
భర్త హత్యలో భార్య ప్రమేయం
సహకరించిన మరో ఇద్దరి అరెస్టు గూడూరు: రామరాజుపాలెంలో ఈనెల 10వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పరసా నాగరాజు కేసులో అతని భార్య పరసా జ్యోతి ప్రమేయమున్నట్లు పోలీసులు తేల్చారు. ఆమెకు సహకరించిన కోకనారాయణపాలెంకు చెందిన తటవర్తి ఆంజనేయులు, పుల్లేటి నాగరాజును పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించి పెడన సీఐ కె.నాగేంద్ర ప్రసాద్ వివరాలు వెల్లడించారు. మృతుడు పరసా నాగరాజు భార్య జ్యోతి, కోకనారాయణపాలెంకు చెందిన తటవర్తి ఆంజనేయులుతో కొంత కాలంగా సన్నిహిత సంబంధాలు నడుపుతోంది. ఇది నచ్చని నాగరాజుకు భార్యను పద్ధతి మార్చుకోవాలని వారిస్తున్నాడు. అయినా ఆమె తీరు మారకపోవడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. విషయం తెలిసిన నాగరాజు సోదరులు పద్ధతి మార్చుకోవాలని జ్యోతిని మందలించారు. దీంతో నాగరాజును ఎలాగైనా చంపేయాలని తటవర్తి ఆంజనేయులుతో కలసి పథకం రచించింది. 10 తేదీ రాత్రి వేళ మద్యం సేవించి వచ్చిన పరసా నాగరాజు ఇంట్లో మంచంపై మత్తులో పడుకున్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత జ్యోతి.. ఆంజనేయులకు సమాచారం ఇచ్చింది. అతను తనకు తోడుగా పుల్లేటి నాగరాజు అనే యువకుడిని కూడా తీసుకువచ్చాడు. మద్యం మత్తులో గాఢ నిద్రలో ఉన్న నాగరాజు కాళ్లను పుల్లేటి నాగరాజు గట్టిగా పట్టుకోగా ఆంజనేయులు, జ్యోతి కలిసి మెడకు తుండు చుట్టి ఊపిరాడనీయకుండా చేసి హతమార్చారు. నాగరాజు ప్రాణాలు పోయాయని నిర్ధారించుకున్న ఆంజనేయులు, తనతో వచ్చిన పుల్లేటి నాగరాజును తీసుకుని అక్కడి నుంచి జారుకున్నాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో జ్యోతి తనకు ఏమీ తెలియనట్లు నటిస్తూ... నిద్రపోతున్న తన కుమారుడిని లేపి తండ్రి చనిపోయిన విషయం చెప్పి బంధువులకు సమాచారం ఇచ్చింది. అయితే పరసా నాగరాజు మృతిపై తమకు అనుమానం ఉందని అతని సోదరుడు ఆంజనేయులు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు హంతకులను సాక్ష్యాధారాలతో పట్టుకుని, కోర్టుకు హాజరుపర్చారు. కేసు దర్యాప్తు చేసిన ఎస్సై సీహెచ్ దివ్య ప్రకాష్, ఏఎస్సై స్వాములు, సిబ్బందిని సీఐ అభినందించారు. పెదపాలెం(నాగాయలంక): గ్రామంలోని పేద దళితుడి ఇల్లును ఆదివారం కూల్చేశారు. 40 ఏళ్ల క్రితం గ్రామంలోని ఎస్సీ కాలనీలో పెదపాలెం కాలువ గట్టుపై సిమెంట్ రేకులతో ఇల్లు నిర్మించుకుని జీవిస్తుంటే దౌర్జన్యంగా పొక్లెయినర్తో కూల్చేసి వీధిపాలు చేశారని నాంచారయ్య కుటుంబం గగ్గోలు పెట్టింది. ఆదివారం ఉదయాన్నే తహసీల్దార్ ఆంజనేయ ప్రసాద్, ఎస్.ఐ కలిదిండి రాజేష్ సమక్షంలో పంచాయతీ అధికారులు గృహాన్ని పడగొట్టారు. గ్రామం పరిధిలోని సౌత్చానల్ డైరెక్ట్ పంట కాలువ గట్టుపై ఆక్రమణలో ఉన్న ఈ గృహాన్ని తొలగించాలని ఇరిగేషన్ అధికారులు పంచాయతీని కోరిన మీదట ఈ చర్య చేపట్టినట్లు కార్యదర్శి సునీల్కుమార్ చెప్పారు. పెద నాంచారయ్య ఇంటిని కూల్చి వేసిన ఘటన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్కు దళితులపై ఉన్న అసలు వైఖరిని బహిర్గతం చేసిందని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలుకుర్తి రమేష్ విమర్శించారు. కోర్టు స్టే ఆర్డర్ కేసు పెండింగ్లో ఉన్నా కూల్చేయడం దారుణమని రమేష్ పేర్కొన్నారు. అవనిగడ్డ వంతెన సెంటర్లో నిత్యం ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తూ ప్రమాదాలకు నిలయమైన పెద్దల విగ్రహాలు అధికార యంత్రాంగానికి కనిపించవని మారుమూల ప్రాంతంలో జీవనం సాగిస్తున్న పేద దళితుడు మాత్రం ఆక్రమణ దారుడిగా కనిపిస్తాడని ఆయన విమర్శించారు. -
ప్రభుత్వ విద్య నిర్వీర్యం!
జి.కొండూరు: గత వైఎస్పార్ సీపీ ప్రభుత్వంలో కళకళలాడిన ప్రభుత్వ విద్యారంగం.. చంద్రబాబు పాలనలో నిర్వీర్యమవుతోంది. ‘నాడు–నేడు’తో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తే, చంద్రబాబు సర్కార్ గవర్నమెంట్ స్కూళ్లను ఒక్కొక్కటిగా మూసివేస్తూ ప్రయివేటు రంగానికి ఊతమిస్తోంది. సరిపోనూ లేని ఉపాధ్యాయులు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో తరగతికి ఒక టీచర్ చొప్పున కేటాయించి, విద్యా నాణ్యతపై భరోసా కలిగించేలా ప్రచారం చేస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వం ఆ పని చేయకుండా ఒకరిద్దరు ఉపాధ్యాయులతో పాఠశాలలను నిర్వహించడంతో విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. జి.కొండూరు మండల పరిధిలో మొత్తం 33 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 2025–26 విద్యా సంవత్సరానికి బాలురు 1,352, బాలికలు 1,308 మంది కలిపి 2,660 మాత్రమే ఉన్నారు. గత ప్రభుత్వంలో ఈ సంఖ్య 3,500కి పైగా ఉండేది. వీటిలో 23 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. కోడూరు, వెల్లటూరు, వెలగలేరు, కవులూరు, కట్టుబడిపాలెం, గంగినేని, చెర్వుమాధవరం, గడ్డమణుగు, జి.కొండూరు, చెవుటూరు, కుంటముక్కల గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలను మాత్రమే మోడల్ ప్రైమరీలుగా మార్చారు. ఒక్కొక్క పాఠశాలలో ఐదు తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయుల చొప్పున కేటాయించారు. మిగిలిన 11ప్రాథమిక పాఠశాలలను బేసిక్ ప్రైమరీలుగా మార్చి ఇక్కడ కూడా ఐదు తరగతులు ఉన్నా పాఠశాలకు ఒకరు లేదా ఇద్దరిని మాత్రమే ఉపాధ్యాయులను కేటాయించారు. చంద్రబాబు సర్కార్ వెల్లటూరులోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పడిపోయిందనే నెపంతో ఇటీవల స్కూల్ను మూసివేసింది. దీనిలో గత విద్యాసంవత్సరంలో పది మంది వరకు విద్యార్థులు ఉండేవారు. ఇప్పుడు జి.కొండూరు శివారు గొల్లగూడెం, పినపాక శివారు విద్యానగరం ప్రాథమిక పాఠశాలలను సైతం వచ్చే విద్యా సంవత్సరానికి మూసేయడానికి అధికారులు రంగం సిద్ధం చేశారని తెలిసి ఆయా గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. తరగతులను మెర్జ్ చేయడంతో సమస్య జి.కొండూరు పంచాయతీలోని గొల్లగూడెం ప్రాథమిక పాఠశాలలో 3,4,5 తరగతులను ఎక్కడా లేని విధంగా జి.కొండూరు జెడ్పీ హైస్కూల్లో మెర్జ్ చేసి ఇక్కడ ఒక ఉపాధ్యాయుడుని కేటాయించి దీన్ని ఫౌండేషన్ పాఠశాలగా మార్చారు. దీనితో ఈ స్కూల్లోవిద్యార్థుల సంఖ్య ముగ్గురికి పడిపోయింది. వచ్చే ఏడాది ముగ్గురు కూడా ఉండే అవకాశం లేకపోవడంతో ఈ పాఠశాలను మూసేయడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు కింద ఈ పాఠశాలను ఆధునికీకరించారు. ఈ పాఠశాలను మూసి వేసి జెడ్పీ హైస్కూల్లో తరగతులను కలపడంతో తమ పిల్లలు రోజూ కిలోమీటరుపైగా నడిచి వెళ్లాల్సి వస్తోందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు తమ గ్రామంలోనే ఉంటే విద్యార్థుల సంఖ్య పెరిగి, పిల్లలు నడిచి వెళ్లాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు. జి.కొండూరుకు, గొల్లగూడెంకు మద్యలో పులివాగు కూడా ఉండటంతో వానాకాలంలో పిల్లలు వంతెన దాటి వెళ్లడం ఆందోళన కలిగిస్తోందని గ్రామస్తులు వాపోతున్నారు. గొల్లగూడెం ఫౌండేషన్ పాఠశాలను తొలగిస్తామనే అపోహ వద్దు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలను ఒకటవ తరగతిలో ఫౌండేషన్ స్కూల్లో చేర్చేలా అవగాహన కల్పిస్తున్నాం. పినపాక పాఠశాల బేసిక్ ప్రైమరీగా కొనసాగుతుండటంతో మూసివేయడం జరగదు. –వీరాస్వామి, మండల విద్యాశాఖ అధికారి, జి.కొండూరు -
బరి తెగించి మద్యం అమ్మకాలు
● ఇంజినీరింగ్ కళాశాలకు అతి సమీపంలోనే బార్ ఏర్పాటు ● కల్తీ మద్యం అమ్ముతున్నా మంత్రికి పట్టడం లేదు ● మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం చిలకలపూడి(మచిలీపట్నం): కంచే చేను మేసిన చందంగా ఎకై ్సజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో బరితెగించి మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని.. దానికి మంత్రి వత్తాసు పలుకుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. ఆయన కార్యాలయంలో ఆదివారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ మైక్లలో మాత్రం ప్రజల కోసం ప్రాణాలు ఇస్తామని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని కల్లబొల్లి మాటలు చెబుతున్న మంత్రి.. కాసుల కక్కుర్తితో మద్యాన్ని విచ్చలవిడి చేస్తున్నారన్నారు. మంగినపూడిబీచ్ రోడ్డులో బీజేపీ ఎమ్మెల్యే తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా.. షామియానాలో బార్ను ఏర్పాటు చేయటం అధికార పార్టీ నాయకులకే చెల్లిందన్నారు. బార్ అండ్ రెస్టారెంట్ను ఆరు బయట, స్టేట్ హైవే వద్ద ఏర్పాటు చేసి విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారన్నారు. ప్రజలకు కనపడకుండా ఏర్పాటు చేయాల్సినప్పటికీ డమ్మీగా ఈఎస్ గంగాధరరావును పెట్టుకుని ఏఈఎస్ భార్గవ్ను ఏజెంట్గా పెట్టుకుని అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారి అడ్డగోలుగా దోచుకుంటున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. మంత్రి కనుసన్నల్లో అమ్మకాలు జరుగుతున్నా కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతున్నా ఆయనకు మాత్రం చీమకుట్టినట్లయినా లేదన్నారు. ఈ విషయాలపై తాను సమాచార హక్కు చట్టం కింద నాలుగు నెలల క్రితం కోరినప్పటికీ మామూళ్ల మత్తులో నిద్రపోతున్న ఎకై ్సజ్ అధికారులు ఇంత వరకు సమాధానం చెప్పలేదన్నారు. కలెక్టర్, ఎస్పీ ఏం చేస్తున్నారు? ఈ విధంగా మద్యం మాఫియా చెలరేగుతుంటే కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్నాయుడు ఏం చేస్తున్నారు.. కనీసం పట్టించుకోవాలి కదా అని పేర్ని నాని ప్రశ్నించారు. మంత్రి ఏం పాపం చేసినా చూస్తూ ఊరుకుంటారా అని నిలదీశారు. కేవలం జెండాలు కట్టడానికే పోలీస్ బందోబస్తు పనిచేస్తుందా అని ఆయన అన్నా రు. ఎకై ్సజ్ చట్టాన్ని తుంగలోకి తొక్కి, ప్రొహిబిషనరీ నిబంధనలను గాలికొదిలేసి ఏఈఎస్ భార్గవ్.. మంత్రి కొల్లుకు చెంచాగిరీ చేస్తున్నారని విమర్శించారు. బార్ను సీజ్ చేయండి.. అధికారులు మత్తు వీడి ధర్మానికి ఉద్యోగం చేయాలని పేర్ని హితవు పలికారు. వెంటనే బార్ను సీజ్ చేయాలని, ఏఈఎస్ భార్గవ్ను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ బార్లో ఎంత సరుకు కొంటున్నారో, ఏ బ్రాండ్, ఎంత విలువైనది, ఎన్ని సీసాలు అమ్మారో బహిరంగంగా వివరాలు తెలియజేయాలన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు గాజుల భగవాన్, బూరగ రామారావు తదితరులు ఉన్నారు. -
యనమలకుదురు ఆలయ ఈవో సస్పెండ్
పెనమలూరు: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న యనమలకుదురు పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్.భవానీని సస్పెండ్ చేశారు. సాక్షి దినపత్రికలో ఆలయంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై వచ్చిన వరుస కథనాలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఎండోమెంట్ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. యనమలకుదురు ఆలయంలో హుండీలో సొమ్ము స్వాహా చేసిన ఘటనపై ఎండోమెంట్ జాయింట్కమిషనర్ జిల్లా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఘటనపై విచారణ జరిపి ప్రాథమిక నివేదిక అందించారన్నారు. ఆలయంలో హుండీల లెక్కింపులో సరైన చర్యలు తీసుకోలేదని, సీసీ కెమెరాలు ఆపి బయట వ్యక్తులు ప్రవేశించి, హుండీలలో సొమ్ము కాజేశారని, అంతరాలయంలో హుండీ నకిలీ తాళంతో తెరిచి సొమ్ము స్వాహా చేశారని, స్వామివారి ఆభరణాలు, సొమ్ము భద్రపర్చడంలో విఫలమయ్యారని, పరిపాలనలో పూర్తిగా వైఫల్యం చెందారన్న అభియోగాలు మోపుతూ ఈవో ఎన్.భవానీని సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కాలంలో ఆమె అనుమతి లేకుండా హెడ్క్వార్టర్స్ వీడరాదని ఆదేశాల్లో పేర్కొన్నారు. కానూరు ఆలయ ఈవో సుబ్రహ్మణ్యంకు శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆచూకీ ఎక్కడ? ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిన యనమలకుదురు ఆలయం ఈవో భవానీ ఇప్పటికై నా బయటకు వస్తారనా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎండోమెంట్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆమె హెడ్క్వార్టర్స్ అనుమతి లేకుండా వీడరాదని పేర్కొన్నారు. వాస్తవానికి ఈవో భవానీ గత వారం రోజులుగా అదృశ్యమయ్యారు. పైగా ఆలయంలో ఎండోమెంట్ జాయింట్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ విచారణ చేసిన సమయంలో ఆమె హాజరుకాలేదు. పోలీసులు కూడా భవానీ కోసం గాలిస్తున్నారు. -
దుర్గమ్మ సేవలో జస్టిస్ బాలాజీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మెడపల్లి బాలాజీ కుటుంబ సమేతంగా ఆదివారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అర్చకులు, అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను అందించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన అభివృద్ధి పనులకు అంబేడ్కర్ కోనసీమ జిల్లా కోమరిగిరిపట్నంకు చెందిన కొప్పాడి రమేష్ కుటుంబం రూ. 2.50లక్షల విరాళాన్ని ఆదివారం ఆలయ అధికారులకు అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. కృష్ణలంక(విజయవాడతూర్పు): వ్యవసాయ, అనుబంధ విశ్వవిద్యాలయాల్లో దశాబ్ద కాలంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, ఉద్యోగ విరమణ వయస్సును 62 నుంచి 65 ఏళ్లకు పెంచొద్దని నిరుద్యోగ వ్యవసాయ యువ శాస్త్రవేత్తల బృందం డిమాండ్ చేసింది. గవర్నర్పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ బాలకృష్ణ, డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ వ్యవసాయ, అనుబంధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. విశ్వవిద్యాలయాల్లో కొంతమంది ప్రొఫెసర్లు వారి పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచాలని వివిధ సంస్థల ద్వారా ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. ఇప్పటికే 60 నుంచి 62ఏళ్లకు పెంచడంతో దశాబ్ద కాలంగా ఎటువంటి నియామకాలు జరగలేదన్నారు. దీంతో వ్యవసాయ, అనుబంధ అత్యున్నత విద్యను అభ్యసించిన విద్యార్థులు నిరుద్యోగులుగా మారి నిరాశకు లోనవుతున్నారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 65 ఏళ్ల ఉద్యోగ విరమణ అంశమే లేదని, మరి మన రాష్ట్రంలో పెంచడం ఎందుకని ప్రశ్నించారు. సమావేశంలో యువ శాస్త్రవేత్తలు రాజేష్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. -
మడతెట్టేస్తున్నారు!
కృష్ణాజిల్లాసోమవారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2026తీరంలో తమ్ముళ్ల భూదందా● 100 ఎకరాల మడ భూములపై కూటమి నేతల కన్ను ● ఇష్టానుసారంగా నరికేస్తున్న వైనం ● ఇప్పటికే సుమారు 20 ఎకరాలు నరికివేత ● ఇంత జరుగుతున్నా కన్నెత్తి చూడని అధికారులు కృత్తివెన్ను: అది ప్రభుత్వ అసైన్డ్ భూమి.. మడ అడవులతో నిండి ఉంది.. తుపానుల సమయంలో సముద్రపు ముంపు నుంచి ప్రజలను రక్షించే రక్షణ కవచం.. కానీ కూటమి నేతల కన్ను ఆ భూములపై పడింది.. ఇంకేముంది అనుకున్నదే తడవుగా వందల మందితో ఇష్టానుసారంగా మడ అడవులను నిర్ధాక్షిణ్యంగా నరికేయడం ప్రారంభించారు. కృత్తివెన్ను మండలం నిడమర్రు పంచాయతీ గోగిలేరు పరీవాహక ప్రాంతంలోని ఆర్ఎస్ నంబర్ 105లో సుమారు 120పై చిలుకు ఎకరాల్లో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. ఇప్పుడు వాటిని నరికేసి చెరువులుగా మార్చేందుకుగాను ఇప్పటికే సుమారు 20 ఎకరాల వరకూ చెట్లను నరికేశారు. నిడమర్రు దళితవాడ, గోగిలేరు పాయకు మధ్యలో దాదాపు 120 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములున్నాయి. ఈ భూముల్లో విస్తారంగా మడ అడవులు వ్యాపించి ఉన్నాయి. సముద్రానికి అత్యంత చేరువుగా ఉన్న ఈ ప్రాంతాన్ని తుపానుల సమయంలో సముద్రపు ముంపు నుంచి రక్షించడంలో మడ అడవులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఇప్పుడు స్థానికంగా ఉన్న కొందరు కూటమి నేతలు ఈ భూములపై కన్నేశారు. మడ చెట్లను నరికేసి మొత్తం ఈ భూములను చేపలు, రొయ్యల చెరువులుగా మార్చేందుకు రంగం సిద్ధం చేశారు. రోజుకు సుమారు 100 మందికి పైగా కూలీలను మడచెట్లు నరికే పనికి పురమాయించారు. ఇప్పటి వరకు సుమారు 20 ఎకరాలకు పైగా భూముల్లో మడ చెట్లను నరికేశారు. దీనిపై స్థానికులు కొందరు తమ ప్రాంతాన్ని రక్షించే మడ అడవులను కూటమి నాయకులు ఈ విధంగా దోచుకునేందుకు పాల్పడుతుండటంపై మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా దీనిపై కనీసం స్పందించని అధికారుల తీరును వారు తప్పు పడుతున్నారు. మడ అడవుల నరికేతవేతపై రెవెన్యూ అధికారులను ప్రశ్నించగా.. సర్వే నంబర్ 105లో ఉన్నవన్నీ ప్రభుత్వ భూములేనని, వాటిలో మడచెట్లను నరకడం చట్టవిరుద్ధమన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తామని చెప్పారు. 7చిలకలపూడి: కలెక్టరేట్లో సోమవారం ఉదయం పది గంటల నుంచి ప్రజాసమస్య ల పరిష్కార వేదిక (మీ కోసం)ను నిర్వహిస్తామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మీ కోసం కాల్ సెంటర్(1100)కు కాల్ చేసి కూడా అర్జీ నమోదుతో పాటు దాని స్థితిని తెలుసుకోవచ్చన్నారు. గుడ్లవల్లేరు:వేమవరం శ్రీ కొండలమ్మ అమ్మవారిని రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ ఆదివారం దర్శించుకున్నారు. అధికారులు అమ్మవారి చిత్రపటం అందించారు. తీరప్రాంత పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చించి తీరం వెంబడి మడ మొక్కలను నాటి సంరక్షిస్తుంటే.. కృత్తివెన్ను మండలంలో మాత్రం ప్రభుత్వ భూముల్లో సహజ సిద్ధంగా ఏర్పడ్డ అడవులను ధ్వంసం చేసి కబ్జా చేస్తున్న వైనంపై ఉన్నతాధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. -
మంత్రి ఇలాకాలో యథేచ్ఛగా మద్యం దందా
● జనావాసాల్లోనే బార్, వైన్షాపులు ● ప్రజలు తిరగబడినా ఫలితం శూన్యం ● నెలలు గడుస్తున్నా ప్రొవిజినల్ లైసెన్సుతోనే బార్ నిర్వహణ ● విచ్చలవిడిగా బెల్టుషాపులు ● నిబంధనల అమలును గాలికొదిలేసిన ఎకై ్సజ్ అధికారులు గతంలో ఇలా.. నిబంధనలకు నీళ్లు.. విచ్చలవిడి ‘గొలుసు’.. నిబంధనలంటే అలుసు.. -
దుర్గమ్మ సన్నిఽధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. మరో వైపున ఆదిదంపతులకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు పాల్గొన్నారు. ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమం, శాంతి కల్యాణంలో ఉభయదాతలు పాల్గొన్నారు. మరో వైపున అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. సర్వ దర్శనం క్యూలైన్తో పాటు రూ. 100, రూ. 300, రూ. 500 టికెట్ క్యూలైన్లలో భక్తుల తాకిడి కనిపించింది. రద్దీ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. మరో వైపున అంతరాలయ రద్దీ తగ్గడంతో రూ. 300 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు. సర్వ దర్శనం క్యూలైన్లో ఉన్న భక్తులకు రూ. 100 క్యూలైన్లోకి ఉచితంగా అనుమతించారు. దీంతో మధ్యాహ్నం రెండు గంటలకు రద్దీ తగ్గుముఖం పట్టింది. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలోనూ భక్తులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సూర్యోపాసన సేవ భక్తిశ్రద్ధలతో జరిగింది. సూర్యభగవానుడి విగ్రహానికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సేవలో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. -
విద్యుదాఘాతంతో యువకుడు దుర్మరణం
చల్లపలి: జీవనోపాధి కోసం పనికి వెళ్లిన యువకుడు కరెంటు షాక్ తగిలి మృతి చెందిన ఘటన కృష్ణాజిల్లా చల్లపల్లిలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని రామానగరానికి చెందిన అల్లంశెట్టి నాగేశ్వరరావుకు కుమారుడు సురేష్(25), కుమార్తె ఉన్నారు. శనివారం పాగోలు పంచాయతీ శివారు శ్రీనగర్ కాలనీలో తాపీ పని చేసేందుకు తోటి పనివారితో కలిసి వెళ్లాడు. పొద్దుపోయాక పని ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో పరంజాకు నిలిపి ఉన్న ఇనుప రాడ్డు జారి పక్కకు ఒరిగిపోతుండగా సురేష్ పట్టుకునే ప్రయత్నం చేశాడు. రాడ్డు పక్కనున్న కరెంటు తీగలకు తగిలి సురేష్కు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి పనివారు వెంటనే సురేష్ను చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సురేష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎస్ఐ దంపనపూడి దుర్గాంజనేయులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం సురేష్ దేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేతికందివచ్చిన కొడుకు ఒక్కసారిగా విగత జీవుడిగా మారడంతో సురేష్ తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో ఆసుపత్రి ప్రాంగణంలో ఒక్కసారిగా హృదయవిదారక పరిస్థితి నెలకొంది. రేషన్ బియ్యం పట్టివేత పెనమలూరు: కానూరులో రేషన్ బియ్యాన్ని పోలీసులు శనివారం రాత్రి పట్టుకున్నారు. పోలీసులకు అందిన సమాచారంతో కానూరు ఆటోనగర్లో రోడ్డు పక్కన రేషన్ బియ్యంతో ఉన్న లారీ నిలిపి ఉండటంతో పోలీసులు లారీని స్వాధీనం చేసుకున్నారు. అయితే లారీ డ్రైవర్ పారిపోయాడు. పోలీసులు లారీని పోలీస్స్టేషన్కు తీసుకువచ్చి రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. -
లోక్ అదాలత్లో 1,09,105 కేసులు పరిష్కారం
చిలకలపూడి(మచిలీపట్నం): ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 1,09,105 కేసులను పరిష్కరించినట్లు ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 49 బెంచ్లను ఏర్పాటు చేసి ఈ కేసులను పరిష్కరించినట్లు ఆయన పేర్కొన్నారు. వీటిల్లో 96,999 క్రిమినల్ కేసులు, 394 సివిల్ కేసులు, 886 చెక్కు బౌన్స్ కేసులు పరిష్కరించబడ్డాయన్నారు. 124 మోటారు వాహన ప్రమాదాలకు గాను రూ.20.08 కోట్లు నష్టపరిహారం అందించడానికి ఇన్సూరెన్సు కంపెనీలు అంగీకరించాయన్నారు. 10,702 కేసులు ఫ్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించి అవార్డులను అందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి కేవీ రామకృష్ణయ్య, పలువురు న్యాయ మూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
9వ తరగతి విద్యార్థులను పదికి సిద్ధం చేయండి
వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ బాలాజీ చిలకలపూడి(మచిలీ పట్నం): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులను నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం పదో తరగతికి సిద్ధం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ విద్యాశాఖాధికారులను ఆదేశించారు. కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2027 ఎస్ఎస్సీ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు తొమ్మిదో తరగతి నుంచే పదో తరగతి సిలబస్పై దృష్టి పెట్టాలని సూచించారు. దీని కోసం ఉపాధ్యాయులు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ప్రత్యేకాధికారులు శ్రద్ధ చూపాలని పలు సూచనలు చేశారు. వేసవి సెలవులను వృథా చేయకుండా ప్రణాళిక ప్రకారం పదో తరగతి పాఠ్యాంశాలను చదువుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ప్రతి రోజు ఉదయం 5 గంటలకే నిద్ర లేపి పాఠ్యాంశాలు చదువుకోవటం ద్వారా పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునన్నారు. విద్యార్థులు చదివింది రాయటం, పునఃశ్చరణ చేసుకోవటం వల్ల సబ్జెక్టు ఎక్కువగా గుర్తుంటుందన్నారు. ఏకాగ్రత కోసం ప్రాణాయామాలు చేయాలన్నారు. క్లిష్టమైన సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అవసరమైతే ట్యూషన్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సెల్ఫోన్, టీవీలకు దూరంగా ఉంచి పిల్లలు చదువుకునేందుకు వారి తల్లిదండ్రులు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని సూచించారు. బాగా చదువుకునేందుకు పిల్లల ఆరోగ్యం ఎంతో ముఖ్యమని పోషకాహారంపై శ్రద్ధ పెట్టాలన్నారు. తరచూ పదో తరగతి సిలబస్పై పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థుల్లో పరీక్షలపై భయం పోగొట్టే భరోసా, ధైర్యం, ఆత్మవిశ్వాసం నింపాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు, విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు. -
‘రోల్ మోడల్’ కృష్ణా కలెక్టర్
మచిలీపట్నంఅర్బన్: నాలుగో తరగతి చదువుతున్న తన కుమారుడికి వైద్యం చేయించేందుకు కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ స్వయంగా సర్వజన ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువచ్చి అందరికీ ‘రోల్ మోడల్’గా నిలిచారు. కలెక్టర్ బాలాజీ శనివారం సాధారణ పౌరుడిలా తన బిడ్డకు వైద్యం చేయించడానికి మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ ఆస్పత్రికి రావడంతో అధికారులు, వైద్యులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ వైద్యసేవలపై నమ్మకం ఉంచుతూ స్వయంగా ఆస్పత్రిని ఆశ్రయించడంతో ఆయన అందరికీ ఆదర్శంగా నిలిచారని పలువురు ప్రశంసించారు.మచిలీపట్నంఅర్బన్: జిల్లాలోని 45 కేంద్రాల్లో శనివారం నిర్వహించిన ఫస్ట్ ఇంటర్ సివిక్స్ పేపర్–1 పబ్లిక్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఇంటర్మీడియెట్ పరీక్షల అధికారి ఎస్. సరళకుమారి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలకు మొత్తం 1,923 మంది విద్యార్థులు నమోదు కాగా, 1,726 మంది హాజరయ్యారన్నారు. 197 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ఈ మేరకు మొత్తం హాజరు 90 శాతంగా నమోదైందన్నారు. పరీక్ష నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని, సెట్–3 పేరును వినియోగించినట్లు డీఐఈఓ తెలిపారు. -
కృష్ణాజిల్లా
ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026రేపు ఏ ప్లస్ కన్వెన్షన్లో రాష్ట్ర ప్రభుత్వ ఇఫ్తార్ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు శనివారం పలువురు భక్తులు విరాళాలను అధికారులకు అందజేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన నిమ్మగడ్డ సత్యనారాయణ కుటుంబం అమ్మవారి అన్నదానానికి రూ. లక్ష విరాళంగా ఇచ్చారు. హైదరాబాద్ మల్కాజ్గిరికి ృచెందిన ఎస్. సంధ్యారాణి కుటుంబం అమ్మవారి గోసంరక్షణ పథకానికి రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. అధికారులు చందు శ్రీనివాస్, డీవీవీ సత్యనారాయణలు దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఈనెల 16వ తేదీ నిర్వహించనున్న రాష్ట్ర ప్రభుత్వ ఇఫ్తార్ విందు వేదిక మార్పు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. ముందుగా నిర్ణయించిన విధంగా విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్లో కాకుండా ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఇఫ్తార్ విందు కార్యక్రమానికి సంబంధించిన వేదిక మార్పు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఇఫ్తార్ విందులో పాల్గొనే మత పెద్దలు, ముస్లింలు, ప్రజాప్రతినిధులు వేదిక మార్పును అంశాన్ని గమనించాలన్నారు. ఇఫ్తార్ ఏర్పాట్లపై కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన శనివారం కలెక్టరేట్లో సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భద్రత, వసతులు, ట్రాఫిక్ వంటి విషయాల్లో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఏపీ వక్ఫ్ బోర్డ్ సీఈవో యాకూబ్ బాషా, విజయవాడ ఆర్డీవో టి.వి.సతీష్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి అబ్దుల్ రబ్బాని, ప్రొటోకాల్ డైరెక్టర్ టి.మోహన్రావు, వక్ఫ్ బోర్డు అధికారులు ఆదం షఫీ, మస్తాన్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.మచిలీపట్నంటౌన్: జిల్లాలో గృహ వినియోగ గ్యాస్ సరఫరాకు ఇబ్బంది లేదని ప్రభుత్వం చెబుతున్నా.. వినియోగదారుల్లో దొరకదనే భయం ఉంది. అమెరికా, ఇజ్రాయిల్–ఇరాన్ యుద్ధ ప్రభావంతో మచిలీపట్నం, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల సమస్య జటిలమవుతోంది. గ్యాస్ సిలిండర్పై మచిలీపట్నం, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో చర్చ జరుగుతోంది. సిలిండర్ల కోసం వినియోగదారులు వారి వాహనాలకు గ్యాస్ బండలను కట్టుకొని లేదా ఆటోలో వేసుకుని, మోసుకుంటూ కంపెనీలకు చేరుకుంటున్నారు. గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు సిలిండర్లను బ్లాక్లో వేలాది రూపాయలకు అమ్ముకుంటూ గ్యాస్ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఏజెన్సీల బాట ఓ వైపు డొమెస్టిక్ గ్యాస్ సరఫరా సజావుగానే జరుగుతోందని ప్రభుత్వం చెబుతున్నా మచిలీపట్నంలో పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది. నాలుగు రోజుల నుంచి నగరంలోని గ్యాస్ కంపెనీల వద్ద వినియోగదారులు క్యూ కడుతున్నారు. ఏజెన్సీల నిర్వాహకులు డోర్ డెలివరీ చేయకపోవడంతో సమస్య మరింత పెరిగింది. దీంతో వినియోగదారులు ఆందోళనతో ఏజెన్సీల బాట పడుతున్నారు. గ్యాస్ లోడు ఆటోలను డెలివరీకి పంపకుండా కంపెనీల వద్దే ఉంచుతున్నారు. బందరు సుకర్లాబాదులో ఉన్న ఇండియన్ గ్యాస్ కంపెనీ వద్ద శనివారం నిండు గ్యాస్ సిలిండర్లతో ఉన్న నాలుగు ఆటోలు నిలిపి ఉన్నాయి. నగరంలోని భారత్, హెచ్పీ గ్యాస్ కంపెనీల వద్ద కూడా ఇదే పరిస్థితి ఉండడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా చూడాల్సిన సివిల్ సప్లయి అధికారులు పట్టించుకోకపోవడంతో వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికైనా సివిల్ సప్లయి అధికారులు దృష్టి సారించి గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారులకు డోర్ డెలివరీ అయ్యేలా చూడాలని వారు కోరుతున్నారు.7 -
గ్యాస్ అక్రమ వినియోగంపై కేసులు నమోదు
41 సిలిండర్లు స్వాధీనం పెనమలూరు: గృహ అవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ అక్రమ వినియోగంపై రెవెన్యూ అధికారులు కేసులు నమోదు చేశారు. మండల పరిధిలోని పోరంకి, కానూరు, తాడిగడప ప్రాంతాల్లో పెనమలూరు, మొవ్వ, గుడివాడ, గన్నవరం ప్రాంతాలకు చెందిన డెప్యూటీ తహసీల్దార్ల బృందం శనివారం దాడులు చేశారు. గృహావసరాలకు ఉపయోగించాల్సిన వంట గ్యాస్ను టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, హోటళ్లు, స్వీట్ షాపులు, వ్యాపార అవసరాలకు వినియోగిస్తుండటంతో 41 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను వ్యాపార అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. గ్యాస్ ఏజెన్సీలు కూడా నిబంధనలు పాటించాలని సూచించారు. రేపటి నుంచి రైతన్న మీకోసం వారోత్సవాలు జిల్లా వ్యవసాయాధికారి పద్మావతి కంకిపాడు /గుడ్లవల్లేరు: కృష్ణాజిల్లా రైతులకు ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు రైతన్న మీకోసం వారోత్సవాలను నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి శనివారం విలేకరులకు తెలిపారు. జిల్లాలో తిరిగి ఇదే నెలలో 23 నుంచి 25వరకు రైతన్న మీకోసం వారోత్సవాలను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ రెవెన్యూ ఆఫీసర్, గ్రామ ఉద్యాన సహాయకులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్ తదితర గ్రామ స్థాయి సిబ్బంది పాల్గొంటారని వివరించారు. జిల్లాలోని ఆయా గ్రామాల్లో ఉన్న రైతుల ఇళ్లకు వెళ్లి వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంపించిన లేఖలోని సందేశాన్ని అందించి రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి పథకాల గురించి తెలియజేస్తామన్నారు. రైతుల నుంచి వారికి కావలసిన సమాచారాన్ని వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పశుసంవర్ధక ఇతర అనుబంధ శాఖల వారు సేకరిస్తారన్నారు. తదనుగుణంగా 2026 – 27వ సంవత్సరానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తారన్నారు. జిల్లాలోని రైతులందరూ రైతన్న మీకోసం వారోత్సవాలలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా జేడీఏ పద్మావతి కోరారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సాధనం విద్య భవానీపురం(విజయవాడపశ్చిమ): ప్రపంచంలో అత్యంత శక్తివంతమైంది విద్య ఒక్కటేనని, దానిని అందించే గురువులు కూడా అంతే శక్తివంతమైనవారని డీసీపీ కేజీవీ సరిత అన్నారు. శనివారం పోరంకి భాష్యం బ్లూమ్స్లో బ్లూమ్స్ బ్లూమ్రాంగ్ పేరుతో నిర్వహించిన వార్షికోత్సవాల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రతి తల్లి, తండ్రి తమ బిడ్డ ఏ విధంగా గురువుల చేతిలో తీర్చిదిద్దబడుతున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న తరుణంలో తమ పిల్లలు దానిని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారో ఆరా తీయాలని సూచించారు. మరో అతిథి డిపార్ట్మెంట్ ఆఫ్ పిడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ తరన్నుమ్ మాట్లాడుతూ పరీక్షల వేళ విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించి అనుకున్న లక్ష్యాలను సాధించాలని అన్నారు. సభకు భాష్యం ఐఐటీ అకాడమీ ప్రోగ్రామర్ ఆనంద్ అధ్యక్షత వహించగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో కృష్ణాజిల్లా భాష్యం జెడ్ఈఓ జోషి, పోరంకి భాష్యం బ్లూమ్స్ ప్రిన్సిపాల్ మహాలక్ష్మి, గుంటూరు భాష్యం బ్లూమ్స్ జెడ్ఈఓ అండ్ ప్రిన్సిపాల్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
పది పరీక్షలకు సర్వం సిద్ధం
మచిలీపట్నంఅర్బన్: ఈ నెల 16 నుంచి ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి.సుబ్బారావు తెలిపారు. పది పరీక్షలపై జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు చెప్పారు. జిల్లాలో మొత్తం 411 హైస్కూళ్లకు చెందిన 22,232 మంది విద్యార్థులు పరీక్షలకు నమోదై ఉన్నారన్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 21,296 మంది కాగా, ప్రైవేట్ విద్యార్థులు 936 మంది ఉన్నారని వివరించారు. రెగ్యులర్ విద్యార్థుల్లో బాలురు 11,351 మంది, బాలికలు 9,945 మంది ఉన్నారని, ప్రైవేట్ విద్యార్థుల్లో బాలురు 590 మంది, బాలికలు 346 మంది ఉన్నారన్నారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో 148 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూడు డివిజన్లలో... జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు డివిజన్లలో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మచిలీపట్నం డివిజన్లో 7,692 మంది రెగ్యులర్ విద్యార్థులు, 264 మంది ప్రైవేటు విద్యార్థులు కలిపి మొత్తం 7,956 మంది పరీక్షలకు హాజరవుతారు. ఈ డివిజన్లో 13 స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. గుడివాడ డివిజన్లో 118 పరీక్ష కేంద్రాల్లో 6,462 మంది రెగ్యులర్, 341 మంది ప్రైవేట్ విద్యార్థులు కలిపి మొత్తం 6,803 మంది పరీక్షలు రాయనున్నారు. ఈ డివిజన్లో 9 స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఉయ్యూరు డివిజన్లో 120 పరీక్ష కేంద్రాల్లో 7,142 మంది రెగ్యులర్, 331 మంది ప్రైవేట్ విద్యార్థులు కలిపి మొత్తం 7,473 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. ఇక్కడ 7 స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం విద్యార్థులు తమ హాల్ టికెట్లను చూపించి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఇంటి వద్ద నుంచి పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు, తిరిగి ఇంటికి చేరేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని డీఈవో తెలిపారు. పరీక్ష కేంద్రాల ఏర్పాటు జిల్లాలో మచిలీపట్నం డివిజన్లో 173 పాఠశాలలు, గుడివాడ డివిజన్లో 118, ఉయ్యూరు డివిజన్లో 120 పాఠశాలలను పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించారు. పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు జిల్లాలో మొత్తం 29 స్టోరేజ్ పాయింట్ల నుంచి ప్రశ్నపత్రాల పంపిణీ కోసం 10 రూట్లను గుర్తించి 20 మంది రూట్ అధికారులను నియమించారు. ఎనిమిది కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు 205 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 205 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, అదనపు చీఫ్ డిపార్ట్మెంటల్ అధికారులను నియమించారు. సమస్యాత్మక కేంద్రాల కోసం 51 మంది అదనపు జాయింట్ కస్టోడియన్లను నియమించారు. మొత్తం 1,562 మంది ఇన్విజిలేటర్లు పరీక్షలను పర్యవేక్షిస్తారు. విద్య, రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో 5 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లు పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాపీయింగ్కు అవకాశం లేకుండా ఇన్విజిలేటర్లు పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. పరీక్ష సమయం ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు కనీసం 50 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని డీఈవో సూచించారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాను కూడా జిల్లా వ్యాప్తంగా ఆకస్మికంగా పర్యటిస్తూ ఏర్పాట్లను పరిశీలిస్తానని డీఈవో పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన సమాచారం, సందేహాలు, ఫిర్యాదుల స్వీకరణ కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల కాలంలో కంట్రోల్ రూమ్లో కె. గణేష్ (9491505378), వై.ప్రసాదరావు (9441665999), కె.నాగరాజు (7702427788), బి.నాగమల్లేశ్వరరావు (9849501067) 24 గంటలు విధులు నిర్వర్తిస్తూ ఫోన్ కాల్స్ స్వీకరిస్తారు. -
అటెన్షన్!
పదో తరగతి పరీక్షలకు సన్నద్ధంవన్టౌన్(విజయవాడపశ్చిమ): పదో తరగతి పరీక్షలు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 28,142 మంది విద్యార్థులు 149 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. బాలురు 14,425 మంది, బాలికలు, 13,717 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 27,359 మంది రెగ్యులర్ విద్యార్థులు. పరీక్షల కాలం సమీపిస్తుండటంతో విద్యార్థుల్లో ఇప్పటికే ‘టెన్’షన్ మొదలైంది. తొలిసారి పబ్లిక్ పరీక్షలు అనగానే తెలియని ఆందోళన. తెలిసిన సమాధానాలే అయినా వాటిని పేపరుపై ఎలా రాయాలో తెలియక కొందరు సతమతమవుతారు. తరగతి గదిలో ఠకీమని జవాబు చెప్పే కొందరు విద్యార్థులు పరీక్షలలో మాత్రం వెనుకబడుతూంటారు. వచ్చిన సమాధానాలను సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోవడమే దీనికి కారణం. ఆ చిన్న అవరోధాన్ని అధిగమిస్తే విజయం వారి పాదాక్రాంతమవుతుంది. రెండు వేల మంది సిబ్బంది.. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా జరిగే పరీక్షలకు సుమారుగా రెండు వేల నుంచి 2100 మంది ఉపాధ్యాయులను వినియోగిస్తున్నారు. అందులో డిపార్ట్మెంటల్ అధికారులుగా 149 మందిని, చీఫ్ సూపరింటెండెంట్లుగా 149 మందిని, కస్టోడియన్లు, ఇన్విజిలేటర్లుగా 1700 మంది సేవలందిస్తున్నారు. సబ్జెక్ట్ టీచర్లకు ఆయా సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు జరిగే రోజున విధులను మార్పు చేస్తారు. జిల్లాలోని సుమారుగా 26 పోలీసుస్టేషన్ల పరిధిల్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. అందులో అర్బన్లోని ఎనిమిది, రూరల్లోని 18 పోలీసుస్టేషన్లు ఈ పరీక్షలకు బందోబస్తును అందిస్తున్నాయి. పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 నిమిషాల వరకు జరుగుతుంది. 483 విద్యాసంస్థల నుంచి విద్యార్థులు ఈ పరీక్షలకు జిల్లాలోని 483 విద్యాసంస్థల నుంచి విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల నుంచి 11,122 మంది విద్యార్థులు (5085 మంది బాలురు, 6037 మంది బాలికలు) ఉన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల నుంచి 16237 మంది (8824 మంది బాలురు, 7413 మంది బాలికలు) ఉన్నారు. అలాగే ఒకసారి పరీక్ష తప్పి పరీక్షకు హాజరవుతున్న వారు 783 మంది(519 మంది బాలురు, 267 మంది బాలికలు) ఉన్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఎన్టీఆర్ జిల్లాలో పలు పరీక్ష కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి అప్రమత్తం చేస్తున్నారు. గుర్తించిన కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్లు నిరంతరం పరిశీలించనున్నాయి. ఈ బృందంలో తహసీల్దార్ లేదా డెప్యూటీ తహసీల్దార్, ఎస్ఐ స్థాయి పోలీసు అధికారి, ఎడ్యుకేషనల్ ఆఫీసర్, పోలీసు ఎస్కార్ట్ ఉంటారని అధికారులు తెలిపారు. జిల్లా స్టోరేజీ పాయింట్గా బిషప్ అజరయ్య హైస్కూల్.. ఎన్టీఆర్ జిల్లా పది పరీక్షలకు సంబంధించి జిల్లా స్టోరేజీ పాయింట్గా నగరంలోని బిషప్ అజరయ్య బాలికల హైస్కూల్ను ఏర్పాటు చేశారు. విజయవాడ కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో పరీక్ష పత్రాల మూల్యాంకనం జరుగుతుంది. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కస్టోడియన్స్ను ఏర్పాటు చేశారు. ఈ నెల 12, 13 తేదీల్లో ఆయా పరీక్ష కేంద్రాల సమీప పోలీసుస్టేషన్లకు ప్రశ్నపత్రాలు చేరుకోనున్నాయి. ఈ ఏడాది సైతం సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి పరీక్షలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ప్రశ్నపత్రానికి ఒక క్యూఆర్ కోడ్ను ఇవ్వటంతో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే నో మొబైల్ జోన్గా పరీక్ష కేంద్రాలను ప్రకటించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ఉంటుందని అధికారులు ప్రకటించారు. విజయవాడ డివిజన్ పరిధిలో 92, నందిగామ డివిజన్ పరిధిలో 38, తిరువూరు డివిజన్ పరిధిలో 19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. -
పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్
ఎన్టీఆర్ జిల్లాలో ఈ నెల 16 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులు సజావుగా పరీక్షలు రాసేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ చెప్పారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ డీఈవో ఎల్. చంద్రకళతో కలిసి కలెక్టరేట్లో శుక్రవారం మీడి యా సమావేశం ఏర్పాటు చేశారు. 27,360మంది విద్యార్థులకు 149 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలను నో మొబైల్ జోన్లుగా ప్రకటించామని.. 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. వెయ్యి మీటర్లలోపు జిరాక్సు షాపులు తెరిచి ఉండకూడదని స్పష్టం చేశారు. విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం పొందవచ్చన్నారు. పరీక్షలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా జిల్లాస్థాయి కంట్రోల్ రూమ్ 9154970454కు ఫోన్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు. పూర్తి పారదర్శకంగా.. డీఈవో చంద్రకళ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబరును ఆన్సర్ స్క్రిప్ట్ లేదా ఓఎంఆర్ షీట్పై ఎక్కడా రాయకూడదన్నారు. ప్రత్యేక అవసరాలున్న (సీడబ్ల్యూఎస్ఎన్) 193 మంది విద్యార్థులకు స్కైబ్లను ఏర్పాటు చేశామనిని.. వీరికి గ్రౌండ్ ఫ్లోర్లోనే పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేశామని వివరించారు. -
బ్లాక్స్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లాలో నోటిఫై చేసిన 123 బ్లాక్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా రహదారి భద్రత కమిటీ (డీఆర్ఎస్సీ) సమావేశం జరిగింది. జిల్లాలో రహదారి ప్రమాదాలు, ఎన్ఫోర్స్మెంట్, హిట్ అండ్ రన్ స్కీమ్ అమలు, ఈ–డిటైల్డ్ యాక్సిడెంట్ రిపోర్టు తదితరాలపై చర్చించారు. గత సమావేశంలో తీర్మానించిన అంశాలకు సంబంధించి తీసుకున్న చర్యలను సమీక్షించారు. గతేడాది 1,105 రహదారి ప్రమాదాలు జరగగా 373 మరణాలు సంభవించాయని, 967 మంది క్షతగాత్రులయ్యారని వివరించారు. ఈ ఏడాది మొదటి రెండు నెలల్లో 171 ప్రమాదాలు జరగ్గా.. 58 మరణాలు నమోదయ్యాయని తెలిపారు. ద్విచక్ర వాహన ప్రమాదాలే అధికం.. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ భాగస్వామ్య పక్షాలు పటిష్ట సమన్వయంతో పనిచేసి రహదారి ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందన్నారు. 38 శాతం ప్రమాదాలు ద్విచక్ర వాహనాలకు సంబంధించినవేనని.. ఈ నేపథ్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రమాదాలు జరగకుండా ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. ట్రాఫిక్ డేటా సమగ్ర విశ్లేషణ.. విజయవాడలో ట్రాఫిక్ వ్యవస్థను సమర్థంగా నిర్వహించేందుకు రియల్టైమ్ డేటాను విశ్లేషిస్తున్నామని సీపీ రాజశేఖరబాబు అన్నారు. డీటీసీ ఎం.పురేంద్ర, డీసీపీ (ట్రాఫిక్) షేక్ షరీన్ బేగం, ఆర్టీవో ఆర్.ప్రవీణ్, ఎంవీఐలు ఎంవీఎన్ రాజు, మొహమ్మద్ అలీ, పూర్ణిమ, అధికారులు పాల్గొన్నారు. రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
సజావుగా సెకండ్ ఇంటర్ ఫిజిక్స్–2 పరీక్ష
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో శనివారం నిర్వహించిన సెకండ్ ఇంటర్మీడియెట్ ఫిజిక్స్–2 పరీక్ష సజావుగా జరిగినట్లు జిల్లా ఇంటర్మీడియెట్ పరీక్షల అధికారి ఎస్.సరళకుమారి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 62 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించామన్నారు. మొత్తం 20,282 మంది విద్యార్థులు పరీక్షకు నమోదు కాగా, వీరిలో 20,129 మంది హాజరయ్యారయ్యా రని, 153 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. పరీక్షకు సెట్–3 ప్రశ్నపత్రాన్ని వినియోగించా మని, మొత్తం 99 శాతం హాజరు నమోదైనట్లు డీఐఈఓ పేర్కొన్నారు. గన్నవరం: కొండపావులూరు శివారులోని ఎన్డీఆర్ఎఫ్ ప్రాంగణంలో సీఎం చంద్రబాబుకు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. సూరంపల్లి శివారులో జరగనున్న అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన హెలికాఫ్టర్లో సాయంత్రం 4.42 గంటలకు ఇక్కడికి చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద సీఎంకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్, ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ వి.వి.ఎన్. ప్రసన్నకుమార్, కృష్ణా కలెక్టర్ డి.కె.బాలాజీ, ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు తదితరులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం రోడ్డు మార్గంలో సభ వేదిక వద్దకు బయలుదేరారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): అద్విక ట్రేడింగ్ కంపెనీలో కొద్ది మొత్తంలో డిపాజిట్ చేసి, అధిక మొత్తంలో కంపెనీ నుంచి నగదు బదిలీ చేయించుకున్న ఇద్దరు ఏజెంట్లను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల ప్రకారం రామవరప్పాడుకు చెందిన చిలకలపూడి నాగ దుర్గాకల్యాణ్ అద్వికలో ఏజెంట్గా ఉన్నారు. సుమారు రూ.5.70 లక్షలు డిపాజిట్ చేశారు. ఆ మొత్తానికి వడ్డీ, ఏజెంటు కమిషన్ కలిసి రూ. 1.02 కోట్లు కంపెనీ నుంచి పొందారు. అతనితో పాటు, తమ్ముడు చిలకలపూడి వీర వెంకట నాగ రాజేంద్రకుమార్తో కలిసి కంపెనీలో వారికి తెలిసిన వారి ద్వారా డిపాజిట్లు పెట్టించి, అద్విక ఐపీ పెట్టేలోపు అధిక లాభాలు పొందారు. వారు రూ.1.53 కోట్లు డిపాజిట్లు చేయగా, రూ 4.77 కోట్లు అక్రమంగా అధికంగా పొందారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మరొకరు ఇలా.. ప్రకాశం జిల్లా చింతల గ్రామానికి చెందిన పాటిబండ్ల సుధాకర్ ఏజెంట్గా ఉండి అద్విక నుంచి అక్రమంగా అధిక మొత్తం పొందినందుకు టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు 18 మంది నుంచి రూ.2.87 కోట్లు డిపాజిట్ చేయించారు. వారికి రిటర్న్గా రూ.1.67 కోట్లు చెల్లించారు. నిందితుడు రూ.8.35 లక్షలు డిపాజిట్ చేయగా, ఏజెంట్ కమిషన్ డిపాజిట్తో కలిసి రూ.3.22 కోట్లు అక్రమంగా పొందాడు. ఇతనికి కంపెనీ నుంచి రూ.2.76 కోట్లు అధికంగా వచ్చాయి. ఇలా అతని చెల్లెలు బొల్లినేని సుజాతతో డిపాజిట్ చేయించి అధిక మొత్తంలో పొందడంతో అతనిపై టాస్క్ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేసి శుక్రవారం అరెస్టు చేశారు. మైలవరం: రైతుల రుణభారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ –పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతుకు రూ.6వేలు రైతు ఖాతాలో జమచేస్తుందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. మైలవరం మండలం వెల్వడం గ్రామం రైతు సేవా కేంద్రంలో అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ మూడవ విడత నిధులు విడుదల కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, కలెక్టర్ లక్ష్మీశ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో అధికారులు, రైతులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. పటమట(విజయవాడతూర్పు): రోడ్డు ప్రమాదంలో ఓ మెడికల్ విద్యార్థి మృతి చెందిన ఘటన పటమట పీఎస్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పిఠాపురానికి చెందిన చెర్రి లిఖిత్సాయి నగరంలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. కళాశాల సమీపంలోని కరెన్సీనగర్లో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. గురువారం రాత్రి రూమ్ నుంచి ద్విచక్ర వాహనంపై లబ్బీపేటలోని ఫుడ్కోర్టుకు వెళ్లి వస్తున్నారు. ప్రభుత్వాస్పత్రి ఎదురుగా ఉన్న ఆస్పత్రి వద్ద సర్వీస్రోడ్డులో ముందు వెళ్తున్న వారిని.. ఎదురుగా వస్తున్న కారును.. తప్పించిపోయి అదుపుతప్పి పడిపోయాడు. స్థానికులు లిఖిత్సాయి స్నేహితుడు గరగ అరుణ్ఆదిత్యకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న లిఖిత్ స్నేహితుడు సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన లిఖిత్ మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. మృతుని స్నేహితుడు అరుణ్ ఆదిత్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఇసుక రీచ్కు అనుమతి ఇవ్వొద్దు
ప్రజాభిప్రాయ సేకరణలో శ్రీకాకుళం గ్రామస్తులు శ్రీకాకుళం(ఘంటసాల): ఇసుక రీచ్కు అనుమతిస్తే ఉన్న కొద్దినీరు అడుగంటి సంక్షోభ పరిస్థితులు ఎదురవుతాయని.. శ్రీకాకుళం గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. శ్రీకాకుళంలో ఇసుక రీచ్ నిర్వహణకు విజయవాడకు చెందిన ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో శ్రీకాకుళం పంచా యతీ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం పర్యావరణ సంబంధిత ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు ఈఈ పి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బందరు ఆర్డీవో సాంబశివరావు అధ్యక్షతన సేకరణ జరిగింది. ఎస్వీ ఎన్విరో ల్యాబ్స్, రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు శ్రీకాకుళం ఇసుక రీచ్ కార్యనిర్వాహక సంక్షిప్త వివరణ వినిపించారు. స్పందించిన సర్పంచ్ ముప్పనేని రవి ప్రసాద్ మాట్లాడుతూ ఇసుక రీచ్పై పర్యవేక్షణ పంచాయతీకి ఇవ్వాలని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. తెలుగురావుపాలెం సర్పంచ్ రాచూరి ప్రసాద్ బాబు మాట్లాడుతూ లంక భూముల్లో పంటలు పండించుకోవడానికి ఇసుక మేటలు తొలగించుకోవడానికి అనుమతి ఇవ్వని అధికారులు, ఇప్పుడు శ్రీకాకుళం ఇసుక రీచ్కు ఎలా అనుమతిస్తారని నిలదీశారు. లంక భూములను తవ్వేస్తారా! ఇసుక రీచ్ కొరకు 30 హెక్టార్లు గుర్తించామంటున్న వారు అక్కడ అంతభూమి లేదని వాపోతే లంకభూములను తవ్వేస్తారా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ ప్రతినిధి జేటీ రామారావు మాట్లాడుతూ సొమ్ము శ్రీకాకుళంది, సోకు అమరావతిది అన్న చందాన శ్రీకాకుళం ఇసుకరీచ్ పని ఉందన్నారు. నిబంధనల మేరకు పనులు చేయాలని, ఓ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. రీచ్కు అనుమతిస్తే ఇబ్బందులు వస్తాయని గ్రామస్తుడు నాగరాజు తెలిపారు. పాపవినాశనం క్వారీపై వైస్ ఎంపీపీ నాగేంద్రబాబు మాట్లాడారు. స్పందించిన ఆర్డీవో సాంబశివరావు పాపవినాశనం ఇసుక క్వారీని మైనింగ్ అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ బి.విజయ ప్రసాద్, ఎస్ఐ వేమన చందన, ఆర్ఐ కె.శ్రీనివాస్, వీఆర్వో దగాని గోపి, గ్రామస్తులు పాల్గొన్నారు. -
విస్తృత అవగాహనతోనే విపత్తులకు కళ్లెం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విపత్తులపై ప్రజలు విస్తృత అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరమని.. ముందస్తు సిద్ధత, అప్రమత్తతతో ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా అధికార యంత్రాంగం, విపత్తు స్పందన–అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్ఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ఫెమిలియరైజేషన్ ఎక్సర్సైజ్(ఫామెక్స్)–2026లో భాగంగా మాక్డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా భవనాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజలను కాపాడే విధానంతో పాటు ఫైర్ డెమో, వాటర్ డెమో నిర్వహించారు. అగ్నిప్రమాదాల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి వచ్చిన అధునాతన పరికరాలు, ఫైర్ బాల్ పనితీరు, ఏబీసీ పౌడర్ ఆధారిత అగ్నిమాపక పరికరాలు, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ల పనితీరును ప్రదర్శించారు. కొండపావులూరు ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ ఇన్స్పెక్టర్ భూపేంద్ర కుమార్ సారథ్యంలో బృంద సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందస్తు సన్నద్ధతతో సమర్థత.. మాక్ డ్రిల్ అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మీడియాతో మాట్లాడుతూ విపత్తులపై సరైన అవగాహన, ముందస్తు సన్నద్ధతతోనే వాటిని సమర్థంగా ఎదుర్కొనగలమని పేర్కొన్నారు. డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, జిల్లా అగ్నిమాపక అధికారి ఏవీ శంకరరావు, ఆటోనగర్ అగ్నిమాపక కేంద్ర అధికారి జి.రామారావు, ఎన్డీఆర్ఎఫ్ టీం సభ్యులు కె.వెంకటేశ్వర్లు, ఎస్ఆర్కేజీ వెంకట్, ఐ.హరికృష్ణ, డీఎంహెచ్వో ఎం.సుహాసిని పాల్గొన్నారు. -
విద్యుత్ చౌర్యానికి పాల్పడితే చర్యలు
చిల్లకల్లు(జగ్గయ్యపేట): విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యుత్ విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ విజయకుమారి హెచ్చరించారు. చిల్లకల్లు సెక్షన్ పరిధిలోని 20 గ్రామాల్లో శుక్రవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. అనంతరం పాలశీతలీకరణ కేంద్ర భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెక్షన్ పరిధిలోని ఆయా గ్రామాల్లో 41 బృందాలుగా ఏర్పడి 2,522 విద్యుత్ సర్వీసులను తనిఖీ చేశామన్నారు. వీటిలో 359 సర్వీసులు అదనపు విద్యుత్ వాడుతున్నట్లు గుర్తించి వారికి రూ. 7.67 లక్షల అపరాధ రుసుం విధించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దాడులు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో విజయవాడ రూరల్ డీఈ రవిచంద్ర, విజిలెన్స్ డీఈలు శ్రీనివాసరావు, శివకుమార్, గురుకిషోర్, సుధాకర్, ఏఈ రమేష్బాబు, అకౌంట్స్ అదికారి రవికుమార్, డివిజన్లోని సిబ్బంది పాల్గొన్నారు. -
ఇఫ్తార్ విందు ఏర్పాట్ల పరిశీలన
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 18న రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలకు ఇవ్వనున్న ఇఫ్తార్ విందు ఏర్పాట్లను శుక్రవారం ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పరిశీలించారు. లబ్బీపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించే ఈ ఇఫ్తార్ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఆ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్బాషా, కదిరి ఇన్చార్జి మక్బుల్లతో కలిసి దేవినేని అవినాష్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి ముస్లిం మైనార్టీలు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. వారి వెంట మైనారిటీ నేత మీర్హుస్సేన్ కూడా ఉన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): గొప్ప కవయిత్రిగా మొల్లమాంబ పేరుప్రఖ్యాతలు గడించారని జిల్లా రెవెన్యూ అధికారి కె. చంద్రశేఖరరావు అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో శుక్రవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం డీఆర్వో మాట్లాడుతూ మొల్లమాంబ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నేటి యువత, విద్యార్థులు స్ఫూర్తిపొందాలన్నారు. రామాయణాన్ని సరళమైన భాషలో రచించిన గొప్ప కవయిత్రి అని కొనియాడారు. బీసీ సంక్షేమశాఖ సాధికారత అధికారి జి. రమేష్, కుమ్మరి, శాలివాహన సంఘ నాయకులు ఏసుబాబు, వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారులు పాల్గొన్నారు. మధురానగర్(విజయవాడసెంట్రల్): ఏపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నాన్టీచింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు శుక్రవారం ఏపీఎన్జీఓ అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నాన్టీచింగ్ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలో పనిచేస్తున్న నాన్–టీచింగ్ ఉద్యోగుల సమస్యలు, సంక్షేమం, సేవా సంబంధిత అంశాలపై సంయుక్త సంచాలకులను కలిసి వివరించామన్నారు. ఉద్యోగుల సంక్షేమం, కళాశాలల పరిపాలనా వ్యవస్థ మరింత బలోపేతం కావడానికి సంఘం సహకారం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నాన్టీచింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్. విద్యాసాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.మురళీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానం, ఉచిత ప్రసాద వితరణకు పలువురు భక్తులు శుక్రవారం విరాళాలు సమర్పించారు. హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన ఎం. దశరథ రామారావు, ఇందిర అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ చైర్మన్ రాధాకృష్ణను కలిసి నిత్యాన్నదానానికి రూ. 2,01,116 అందించారు. చీరాల వైకుంఠపురానికి చెందిన వైబీవీ నాయుడు కుటుంబం ఉచిత ప్రసాద వితరణ పథకానికి రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. -
మచిలీపట్నంలో జనసేన రౌడీయిజం!
కోనేరుసెంటర్(మచిలీపట్నం): మచిలీపట్నంలో జనసేన నేతల రాజకీయ రౌడీయిజం రోజు రోజుకూ మితిమీరుతోంది. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) ఇంటికి అతి సమీపంలో జనసేన జెండా దిమ్మెను నిర్మించి రాజకీయ చిచ్చు రేపేందుకు శుక్రవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూనుకున్నారు. పోలీసుల సమక్షంలోనే పక్కాగా కాంక్రీటుతో దిమ్మె నిర్మించారు. రెండో రోజు అడ్డుకున్న వైఎస్సార్ సీపీ నేతలు రామానాయుడుపేటలో గురువారం జనసేన, వైఎస్సార్ సీపీ నాయకులకు జెండా ఏర్పాటు విషయంలో వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. పోలీసులు జనసేనకు కొమ్ముకాస్తూ వైఎస్సార్ సీపీ నేతలపై జులుం ప్రదర్శించి అక్కడి నుంచి బలవంతంగా పంపేశారు. శుక్రవారం జనసేన నాయకులు పోలీసుల సమక్షంలో అదే ప్రాంతంలో జెండా దిమ్మె నిర్మాణానికి పూనుకున్నారు. సమాచారం తెలిసిన వైఎస్సార్ సీపీ నాయకుడు, అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ బొర్రా విఠల్, మరి కొంత మంది.. జనసేన నాయకుల ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. పోలీసులు వైఎస్సార్ సీపీ నేతలను అక్కడ నుంచి పంపడానికి యత్నించారు. ఆ సమయంలో పోలీసులు, విఠల్కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బొర్రా విఠల్ అక్రమ నిర్బంధం ఇదే అవకాశంగా భావించిన పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకుడు బొర్రా విఠల్ను బలవంతంగా జీపులోకి ఎక్కించి గూడూరు పోలీస్స్టేషన్ తరలించి అక్రమంగా నిర్బంధించారు. అక్కడ ఆయన్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. పోలీసులపై విఠల్ దాడి చేశాడనే సాకు చూపించి ఆయనపై అక్రమంగా కేసు బనాయించేందుకు పోలీసులు యత్నిస్తున్నట్లు సమాచారం. ఇతర నాయకులను బైండోవర్ చేసి భయపెట్టడానికి యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గూడూరులో పోలీసుల ఓవరాక్షన్! గూడూరు: బొర్రా విఠల్ను అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఆ సమయంలో బలప్రయోగం చేయడంతో విఠల్ చేతి వేలికి తీవ్ర గాయమై రక్త స్రావమైంది. తనపై ఎలాంటి కేసు లేకుండా ఎందుకు అదుపులోకి తీసుకున్నారన్న విఠల్ ప్రశ్నకు పోలీసులు స్పందించలేదు. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున గూడూరు పీఎస్కు తరలిరావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీసీ నాయకుడి అక్రమ అరెస్టుపై శ్రేణులు పీఎస్ ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదేసమయంలో మచిలీ పట్నం ఇన్చార్జి పేర్ని కిట్టు, ఇతర నేతలు స్టేషన్కు వచ్చారు. పెడన ఇన్చార్జి ఉప్పాల రాము కూడా స్టేషన్కు రావడంతో పోలీసులు విఠల్కు నోటీసులు ఇచ్చి బయటకు పంపేశారు. నడుచుకుంటూ.. అయితే తనను ఎలా పోలీసు వాహనంలో తీసుకువచ్చారో అలాగే తీసుకెళ్లి దించాలంటూ పట్టుబట్టారు. పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో గూడూరు స్టేషన్ నుంచి నడుచుకుంటూ మచిలీ పట్నం బయలుదేరారు. సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి పేర్ని నాని కూడా గూడూరుకు చేరుకున్నారు. పేర్ని నాని, ఉప్పాల రాము, పేర్ని కిట్టు పోలీసుల వైఖరిని నిరసిస్తూ పాదయాత్రగా గూడూరు సెంటరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ స్తంభించింది. పరిస్థితిని గమనించిన పోలీసులు బొర్రా విఠల్ను పోలీసు వాహనంలోకి ఎక్కించుకుని మచిలీపట్నం తీసుకెళ్లడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
దుర్గమ్మ సన్నిధిలో భక్తజన సందడి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ ఉదయం పది గంటల తర్వాత మరింత పెరిగింది. సుప్రభాత సేవ, ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమం, లక్ష కుంకుమార్చన, చండీహోమం, శాంతి కల్యాణంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. అమ్మవారి మహానివేదనకు మధ్యాహ్నం గంట సేపు దర్శనాలు నిలిపేశారు. ఆ తర్వాత అన్ని లైన్లలో భక్తులు బారులు తీరి కనిపించారు. సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారికి పంచహారతుల సేవ చేయగా పలువురు ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన వారు పాల్గొన్నారు. అనంతరం దర్బారు సేవ, పల్లకీ సేవలను నిర్వహించగా, ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండటంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం కనిపించింది. -
● ‘బండ’ కోసం బారులు
మిడిల్ ఈస్ట్లో యుద్ధ సెగ జిల్లాను తాకింది. చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో సామాన్య ప్రజల ఆందోళన తారస్థాయికి చేరుకుంది. ఫలితంగా వంట గ్యాస్ సిలిండర్ల కోసం బారులు తీరుతున్నారు. ఆన్లైన్ సేవలు సైతం నిలిచిపోవడంతో ఏం జరుగుతుందో అన్న భయంతో ఏజెన్సీ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ తక్షణం స్పందించి పరిస్థితి సరిదిద్దాలని పలువురు వినియోగదారులు కోరుతున్నారు. విజయవాడ మిల్క్ప్రాజెక్ట్ ప్రాంతంలోని ఓ గ్యాస్ కంపెని వద్ద పరిస్థితిని చిత్రాల్లో చూడొచ్చు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
కృష్ణాజిల్లా
శనివారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2026సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ మట్టం శుక్రవారం 537.60 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 19,172 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. విపత్తులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఫామెక్స్లో భాగంగా మాక్డ్రిల్ నిర్వహించారు.I రెండు జిల్లాల్లోనూ భారీగా తగ్గిన లబ్ధిదారులు కౌలు రైతులకు ఎగనామం భరోసా లేక అవస్థలు పడుతున్న అన్నదాతలు


