Krishna District News
-
యోగాంధ్రలో జిల్లాను నంబర్ వన్గా నిలుపుదాం
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): వికసిత్ భారత్ స్ఫూర్తితో వెల్దీ, హెల్దీ, హ్యాపీ స్వర్ణాంధ్ర సాకారానికి పునాది పడేలా యోగాంధ్ర మాసోత్సవాలను ఈ నెల 21న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని.. మీడియాతో పాటు ప్రతి వర్గం సమష్టి భాగస్వామ్యంతో ఎన్టీఆర్ జిల్లాను యోగాంధ్రలో నంబర్ వన్గా నిలిపేందుకు కృషి చేద్దామని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు. కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి థీమ్ ఆధారిత యోగాంధ్ర మాసోత్సవాలపై శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మే 21 నుంచి జూన్ 21వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతాయన్నారు. జిల్లాలో దాదాపు 10 లక్షల నుంచి 15 లక్షల మందికి యోగాను నేర్పేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఇందుకోసం దాదా పు 2,500 మంది యోగా ట్రైనర్ల సేవలను వినియోగించుకుంటామన్నారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో ఏడుగురు ట్రైనర్లు అందుబాటులో ఉంటారని.. ఒక్కో ట్రైనర్ ఒక సెషన్కు 50 మందితో యోగాభ్యాసం చేయించనున్నట్లు తెలిపారు. థీమ్ ఆధారిత యోగా కార్యక్రమాలు.. మన భారతీయ వారసత్వ, సాంస్కృతిక సంపద అయిన యోగాను ప్రతి ఒక్కరూ ఆచరించి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకునేలా ప్రోత్సహించేందుకు జిల్లాలోనూ నెల రోజుల పాటు థీమ్ ఆధారిత యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మే 24న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులతో కార్యక్రమం ప్రారంభమై జూన్ 20న సెలబ్రిటీలతో థీమ్ ఆధారిత 45 నిమిషాల కామన్ యోగా ప్రొటోకాల్తో యోగాభ్యసన కార్యక్రమాలు పూర్తవుతాయన్నారు. ప్రత్యేక పోటీల నిర్వహణ.. యోగాంధ్ర మాసోత్సవాలను పురస్కరించుకొని గ్రామ/వార్డు స్థాయిలో యోగా ఫర్ ఆల్, మండల స్థాయిలో యూనిటీతో యోగా, జిల్లాస్థాయిలో యోగా అండ్ యూత్ ఇతివృత్తాలతో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాస్థాయిలో విజేతలు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని, విజేతలకు అవార్డుల బహూకరణ ఉంటుందన్నారు. పోటీల నిర్వహణకు గ్రామ, మండల, జిల్లాస్థాయిలో ప్రత్యేక కమిటీల ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. జిల్లా యోగాంధ్ర నోడల్ అధికారులు డాక్టర్ ఎం. సుహాసిని, డాక్టర్ జె.సుమన్, ట్రైనర్లు పాల్గొన్నారు.ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ -
లబ్ధిదారులతో మర్యాదగా వ్యవహరించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, పనితీరు మెరుగుపరుచుకుని వారితో మర్యాదగా వ్యవహరించాలని కృష్ణా జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ హెచ్చరించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో పింఛన్ పంపిణీ అధికారులతో కౌన్సెలింగ్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రతి నెలా అధికారులు ఐవీఆర్ఎస్, 1100 కాల్ సెంటర్ల ద్వారా ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తీసుకుంటున్నారన్నారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో కనీసం ఐదుగురు లబ్ధిదారుల స్పందనను తెలుసుకుంటున్నారన్నారు. జిల్లాలో గత మూడు నెలలుగా పింఛన్ పంపిణీ కార్యక్రమంపై ప్రతికూల స్పందన వస్తోందన్నారు. దీనిలో కారణాలను పరిశీలిస్తే పింఛన్ ఇస్తున్నామా, లేదా, నగదు మొత్తం కచ్చితంగా ఇస్తున్నామా, లేదా, సమాయానికి ఇవ్వలేకపోతే వారికి నచ్చజెప్పి మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నామా, లేదా అనే విషయాలను ప్రతి ఒక్కరూ విశ్లేషించుకోవాలన్నారు. ఉన్నతాధికారులు ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారని, లబ్ధిదారుల నుంచి ప్రతికూల ప్రభావం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్ పాల్గొన్నారు.కృష్ణా ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను శుక్రవారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు తలనీలాలను సమర్పించి, ఘాట్రోడ్డు, మహా మండపం మీదుగా ఆలయానికి చేరుకున్నారు. సర్వదర్శనానికి గంటన్నర సమయం పట్టింది. మరో వైపున రూ. 100, రూ.300, రూ.500 టికెట్ క్యూలైన్లో ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు రద్దీ కనిపించింది. అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు గాను మధ్యాహ్నం 12 గంటలకు అన్ని దర్శనాలు నిలిపివేశారు. ఆర్జిత సేవలకు డిమాండ్.. శుక్రవారం, ఏకాదశిని పురస్కరించుకుని అమ్మవారికి నిర్వహించిన ఆర్జిత సేవలకు డిమాండ్ కనిపించింది. తెల్లవారుజామున ఖడ్గమాలార్చనకు 23 మంది ఉభయదాతలు హాజరు కాగా, లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, శాంతి కల్యాణం, చండీ హోమంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. లక్ష కుంకుమార్చనకు ఈవో శీనానాయక్ దంపతులు హాజరయ్యారు. -
బీచ్ కబడ్డీ పోటీల్లో రాష్ట్ర జట్టుకు బ్రాంజ్
విజయవాడస్పోర్ట్స్: ఖేలో ఇండియా మొదటి జాతీయ బీచ్ కబడ్డీ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ పురుషుల జట్టు సత్తా చాటింది. ఈ నెల 19వ తేదీ నుంచి గుజరాత్లోని డమాన్ డయ్యులో ప్రారంభమైన ఈ పోటీల్లో రాష్ట్ర జట్టు అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి బ్రాంజ్ మెడల్ను సొంతం చేసుకుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ పోటీలను నిర్వహించింది. తొలుత లీగ్ పోటీల్లో హిమాచల్ప్రదేశ్ను 41–38, ఉత్తర్ప్రదేశ్ను 42–37, హరియాణాను 42–39 తేడాతో ఓడించి సెమీ ఫైనల్కు చేరింది. సెమీస్లో రాజస్థాన్పై 40–43 తేడాతో ఓడి మూడో స్థానంలో నిలిచి పతకాన్ని అందుకుంది. జట్టులో నవీన్(నెల్లూరు), లక్ష్మారెడ్డి(ప్రకాశం) రాణించి జట్టు విజయాలకు తోడ్పాటు అందించినట్లు కోచ్లు సాతేంద్రసింగ్, పి.చైతన్య తెలిపారు. ప్రతిష్టాత్మకమైన పోటీల్లో పతకాన్ని సాధించిన జట్టును ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు కె.వి.ప్రభావతి, కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ నక్కా అర్జునరావు అభినందించారు. -
జోయాలుక్కాస్ షోరూమ్ పునఃప్రారంభం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): బందరురోడ్డులోని జోయాలుక్కాస్ షోరూమ్ను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో వరల్డ్ ఫేవరేట్ జోయాలుక్కాస్ షోరూమ్ను ఆధునికీకరించి మూడు అంతస్తుల్లో పునఃప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. షోరూమ్ ప్రతినిధులు మాట్లాడుతూ షోరూమ్ పునఃప్రారంభం సందర్భంగా లక్ష రూపాయలు అంతకంటే ఎక్కువ విలువైన డైమండ్ జ్యూవెలరీ కొనుగోలు చేసిన ప్రతి ఒక్క వినియోగదారుడికి గ్రాము గోల్డ్ కాయిన్ ఉచితంగా అందజేస్తున్నామన్నారు. ది బ్రిలియన్స్ డైమండ్ జ్యూవెలరీ షో జూన్ 8వ తేదీ వరకు తమ షోరూమ్ లో జరుగుతుందని చెప్పా రు. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా, సీపీ రాజశేఖరబాబు పాల్గొన్నారు. షోరూమ్ ప్రారంభం సందర్భంగా మోడల్స్ బంగారు ఆభరణాలు ధరించి ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకున్నారు. ‘గోల్డ్’ శివ.. జోయాలుక్కాస్ షోరూమ్ పునఃప్రారంభం సందర్భంగా పెనమలూరుకు చెందిన కుంచం శివ శంకర సాయి కుమార్ (శివ) అనే వ్యాపారవేత్త సుమారు కోటిన్నర రూపాయలకు పైగా విలువైన బంగారు ఆభరణాలను ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. శివ పెనమలూరు సమీపంలోని మురళీనగర్ నివాసి. బంగారం ధరించి బయటకు వచ్చేటప్పుడు ఇంటిలోని కుటుంబసభ్యులు చాలా జాగ్రత్తలు చెప్పి పంపుతారని ‘సాక్షి’తో ఆయన చెప్పారు. -
యోగాతో ఆరోగ్య మహాభాగ్యం కలెక్టర్ లక్ష్మీశ, ప్రభుత్వ విప్ బొండా ఉమా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మంచి ఆరోగ్యానికి మించిన సంపద లేదని, అందుకే ప్రతి ఒక్కరూ యోగాసనాలను అభ్యసిస్తూ ఆరోగ్య మహాభాగ్యాన్ని సొంతం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు సూచించారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం విజయవాడ బీఆర్ టీఎస్ రోడ్డు శారదా కళాశాల జంక్షన్ వద్ద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే ఉమా తదితరులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు యోగా విశిష్టతపై అవగాహన కల్పిస్తున్నామని, ఆరోగ్యంపై శ్రద్ధ, ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని యోగాను తమ జీవనశైలిలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన కుటుంబాలు, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం ఆరోగ్యంగా, సుసంపన్నంగా ఉంటుందని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కావూరి చైతన్య, అదనపు కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్, ఇన్చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, ఎన్ ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కొల్లేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
యోగాంధ్ర నిర్వహణకు బృందాల ఏర్పాటు
ఉత్తర్వులు జారీ చేసిన ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో యోగాంధ్ర–2025 కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించేందుకు వివిధ బృందాలను ఏర్పాటు చేస్తూ ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే భూమి – ఒకే ఆరోగ్యం కోసం యోగా అనే అంశంతో రాష్ట్ర ప్రభుత్వం మే 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు నెల రోజుల పాటు యోగా నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి యోగా శిక్షకులు మండలాల వారీగా మాస్టర్ ట్రైనీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని స్థాయిల్లో యోగా సాధన శిబిరాలు నిర్వహించాల్సి ఉంది. జిల్లా స్థాయి కమిటీలో కలెక్టర్ చైర్మన్గా, ఎస్పీ వైస్చైర్మన్గా, జాయింట్ కలెక్టర్ నోడల్ అధికారిగా, డీఎంఅండ్హెచ్వో కన్వీనర్గా మొత్తం 24 మంది సభ్యులు ఉంటారని పేర్కొన్నారు. మండల, పట్టణ స్థాయి కమిటీలో మునిసిపల్ కమిషనర్ లేదా ఎంపీడీవో చైర్మన్గా, ఎంఈవో కన్వీనర్గా, ఇతర అధికారులు కో–కన్వీనర్, సభ్యులుగా మొత్తం తొమ్మిది మంది ఉంటారు. గ్రామస్థాయి కమిటీలో పంచాయతీ కార్యదర్శి లేదా వార్డులో అడ్మిన్ సెక్రటరీ చైర్మన్గా, వీఆర్వో, ప్రధానోపాధ్యాయులు, పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తలు సభ్యులుగా ఉంటారన్నారు. షెడ్యూలు ప్రకారం ట్రైనర్స్ ద్వారా శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మండలస్థాయిలో 56 మంది వ్యాయామ ఉపాధ్యాయులను మాస్టర్ ట్రైనర్లుగా నియమించామన్నారు. అధికారులందరూ వారి పరిధిలో కేటాయించిన అన్ని విధులకు హాజరుకావాలని ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలు పాటించాలని, అన్ని కార్యక్రమాలు తగిన విధంగా నిర్వహించి యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. -
కృష్ణాజిల్లా
శనివారం శ్రీ 24 శ్రీ మే శ్రీ 2025సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 512.50 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 5,598 క్యూసెక్కులు విడుదలవుతోంది.బెజవాడ నగరంలో డ్రెయినేజి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. చిన్నపాటి వర్షానికే నగరంలో డ్రెయిన్లు పొంగి రహదారులను ముంచెత్తు తున్నాయి. రోడ్లపై నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వచ్చిందంటే కొన్ని రహదారుల్లో ప్రయాణించాలంటేనే భయపడుతున్నారు. కొన్ని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. వర్షాకాలానికి ముందే డ్రెయిన్లు, కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాల్సిన కార్పొరేషన్ అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: నగరంలో ఈ ఏడాది మేజర్ కాలువలు, డ్రెయిన్లలో పూడికతీత పనుల కోసం మూడు సర్కిల్ల పరిధిలో రూ.17కోట్లతో పనులను చేపట్టారు. ఈ పనులు తూతూ మంత్రంగా చేస్తూ చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభం అవుతుండటంతో ఈ సీజన్లో సైతం నగర వాసులకు కష్టాలు తప్పేలాలేవు. వర్షాలు కురిసినప్పుడు నగరంలో కొన్ని ప్రాంతాల్లో డ్రెయిన్లు పొంగి మురుగునీరు రోడ్లపైకి రావడం, లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం మురుగు నీరు కాలువల్లో సక్రమంగా ప్రవహించేలా, డ్రెయిన్లలో పూడికతీత తొలగించకపోవటమే. ఇప్పటికే నగర కమిషనర్ పలు ప్రాంతాల్లో పర్యటించి నగరంలో కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగకుండా క్షేత్ర స్థాయిలో ఆయా శాఖాధిపతులు పర్యటించి డ్రెయిన్లలో నీరు నిలువకుండా ఉండే విధంగా ఉన్న అడ్డంకులను తొలగించాలని ఆదేశించారు. కాని ఆచరణలో మాత్రం అమలు కావటం లేదు. జాతీయ రహదారి పైనుంచి వచ్చే వర్షపునీరు సర్వీసు రోడ్డుపై నిలిచిఉండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పటం లేదు. అవుట్ ఫాల్ డ్రైన్లను పరిశీలించి వర్షపు, మురుగునీరు ప్రవాహానికి ఆటంకం లేకుండా చేయడంలో సిబ్బంది విఫలం అవుతున్నారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం నగరంలో డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతోనే, గత ఏడాది సెప్టెంబరులో కురిసిన వర్షాలకు బుడమేరు పొంగింది. దీంతో నరగంలో పలు కాలనీలు జలమయం అయ్యాయి. వారం రోజులకు పైగా నీరు కాలనీల నుంచి వెళ్లక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీసం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోకుండా నగరంలో ప్రధాన డ్రైన్లు గుంటతిప్ప, పుల్లేరు, బుడమేరులో నామమాత్రంగా పూడిక తీశారు. దీంతో ప్రధానంగా డ్రైన్లు ప్రవహించే లబ్బీపేట, పిన్నమనేని పాలిక్లినిక్, గాయత్రినగర్, ఎల్ఐసీ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, గుణదల, భారతినగర్, గురునానక్ కాలనీ, మారుతి కో–ఆపరేటివ్కాలనీ, భారతినగర్, ఆటోనగర్, అజిత్సింగ్ నగర్, మధురానగర్ ,పాయకాపురం, బెంజి సర్కిల్, పంటకాలువ రోడ్డు, తోట వారి వీధి, ఊర్మిళా నగర్, నిర్మల కాన్వెంట్ రోడ్డు, కృష్ణవేణి రోడ్డు, రమేష్ ఆస్పత్రి ప్రాంతాల్లో కొద్దిపాటి వర్షానికే రోడ్లపై మురుగు, వర్షపునీరు పొంగి ప్రవహిస్తోంది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.ఎక్కడ రోడ్డు ఉందో ఎక్కడ డ్రెయిన్ ఉందో తెలియక పాద చారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిధులు ఖర్చు చేసినా... ఈ ఏడాది వేసవిలో డ్రైన్లలో పేరుకుపోయిన చెత్త, చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు విజయవాడ నగర వ్యాప్తంగా ఉన్న మేజర్ అవుట్ ఫాల్ డ్రెయిన్ల నుంచి సైడు డ్రైన్ల వరకు సిల్టు తీయటానికి వీఎంసీ రూ.17 కోట్లు వీఎంసీ సాధారణ నిధుల నుంచి కేటాయింపులు జరిపారు. సిల్టు తొలగింపునకు కార్మికులు లేకపోవటం, ఉన్న కార్మికులు సుదీర్ఘ సెలవులపై ఉండటంతో గ్యాంగ్వర్క్ పనులు ఆలస్యం అవుతున్నాయని అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ సరైన ప్రణాళిక, డ్రైన్ల రూట్మ్యాప్, డ్రైన్లపై ఏర్పాటు చేసిన గేజ్ల నిర్వహణ లేకపోవటం, డ్రైన్లపై అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టటంతో సిల్టు తొలగింపు ప్రహసనంగా మారింది. నగరవ్యాప్తంగా ప్రతి రోజు వచ్చే 250 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ అధికంగా డ్రెయిన్లు, కాల్వల్లోనే సేకరించటానికి ప్రధాన కారణం వ్యాపార సముదాయాలు, వాణిజ్య ప్రాంతా ల్లో డ్రెయిన్లపై ఇనుప గేజ్లు ఏర్పాటు వలనే జరుగుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. విజయవాడ మిల్క్ప్రాజెక్ట్ సమీపంలో పేరుకుపోయిన చెత్తచెదారం 9తీరానికి తాళం ముందస్తు ప్రకటన లేకుండా అధికారులు హంసలదీవి తీరం గేట్లను మూసివేశారు. దీంతో పర్యాటకులు గంటల తరబడి నిరీక్షించి, నిరాశతో వెనుదిరిగారు న్యూస్రీల్ చెత్త, వ్యర్థాలతో నిండిపోతున్న డ్రెయిన్లు కొద్దిపాటి వర్షానికే పొంగి పొర్లుతున్న వైనం రోడ్లపైనే భారీగా నిలుస్తున్న వర్షపు నీరు నగరవాసులకు తప్పని తిప్పలు అంతంత మాత్రంగానే డీసిల్టింగ్ పనులు విజయవాడ నగరంలో మురుగునీరు పారుదలకు, వర్షంనీటి పారుదలకు నగరవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 142 కిలోమీటర్ల మేర మేజర్ అవుట్ఫాల్ డ్రైన్లు, 302 కిలోమీటర్ల మైనర్ డ్రైన్లు నిర్మాణమయ్యాయి. నగరంలోని సర్కిల్–1 పరిధిలో వించిపేటలో, సర్కిల్–2 పరిధిలోని అజిత్సింగ్నగర్లో, సర్కిల్–2 పరిధిలోని గుణదలలోని పుల్లేటి కాల్వ నుంచి నగరంలోని మురుగునీరు, వర్షంనీరు బందరు, ఏలూరు, రైవస్, బుడమేరుల్లో కలుస్తున్నాయి. డ్రెయిన్లలో వచ్చే ఇతర వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా కాల్వల్లో మురుగునీరు ముందుకు పారటంలేదు. దీనికితోడు ప్రతి ఏడాది వేసవిలో చేపట్టాల్సిన డీసిల్టింగ్ పనులు కూడా అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. మూడు సర్కిళ్ల పరిధిలోని ప్రధాన అవుట్ఫాల్ డ్రెయిన్లలో ఎప్పటికప్పుడు సిల్టు, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడంలో నరగపాలక సంస్థ అధికారులు విఫలం అవుతున్నారు. వరద నీరు డ్రెయిన్లలో సరిగా ప్రవహించకపోవడంతో నీరు వెనక్కి తన్ని కాలనీలు, రోడ్లు జలమయం అవుతున్నాయి. -
ప్రాణాంతకంగా బూడిద రవాణా
● పైన పట్టాలు కప్పకుండా యథేచ్ఛగా తరలింపు ● గాలికి లేచి వాహన చోదకుల కళ్లల్లో పడుతున్న వైనం ● ఈ కారణంగా ఎదురొచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు ● ఇబ్రహీంపట్నం, జి.కొండూరు మండలాల్లో ప్రధానంగా సమస్య ● పట్టించుకోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు జి.కొండూరు: బూడిద రవాణా చేసే అక్రమార్కుల, లారీ యజమానుల అత్యాశ వాహన చోదకులకు ప్రాణాంతకంగా మారింది. బూడిదపై పట్టాలు కప్పకుండా లారీలలో పరిమితికి మించి ట్రక్కు పైన రెండు నుంచి మూడు అడుగుల మేర అదనపు లోడింగ్ చేసి రవాణా చేయడంతో దారి పొడవునా గాలికి లేచిన బూడిద వెనక వెళ్తున్న వాహన చోదకుల కళ్లల్లో పడుతోంది. తత్ఫలితంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనపడక ప్రమాదాల పాలవుతున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కానీ, ఆర్టీఓ కానీ, పోలీసు అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో బూడిద రవాణా ఇష్టారాజ్యంగా మారిపోయింది. రహదారులపై కుప్పలు తెప్పలుగా... ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ నుంచి విద్యుత్ ఉత్పత్తి అనంతరం విడుదలైన బూడిదను నీటితో కలిపి బూడిద చెరువులోకి తరలిస్తారు. అయితే బూడిదకి డిమాండ్ పెరగడంతో నీటితో ఉన్న బూడిదనే లారీలకు లోడింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో లారీ ప్రయాణించినంత దూరం లారీలో ఉన్న డస్టు నీటితో కలిసి రహదారి పొడవునా ట్రక్కుకు ఉన్న రంధ్రాల నుంచి కిందకు పడుతోంది. ఈ డస్టు ఎండకి ఎండిన తర్వాత రహదారిపై వచ్చే వాహనాల వేగానికి వచ్చే గాలితో కలిసి రహదారి పక్కన ఉన్న దుకాణాలు, ఇళ్లలోకి చేరుతుంది. దీనితో స్థానికులు నరకయాతన పడుతున్నారు. ముఖ్యంగా ఇబ్రహీం పట్నం, జి.కొండూరు మండలాల్లో జాతీయ రహదారులపై ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. లారీలను అడ్డుకున్న గ్రామస్తులు బూడిద లారీలను రహదారిపై నిలపడం వలన కుప్పులు కుప్పలుగా బూడిద రహదారిపై పడి నరకయాతన పడుతున్నామని ఏప్రిల్ 24వ తేదీన పశ్చిమ ఇబ్రహీంపట్నంలో స్థానికులు విజయ వాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బూడిద లారీలను అడ్డుకోవడంతో రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు రంగప్రవేశం చేసి సర్దిచెప్పడంతో స్థానికులు తమ నిరసనను విరమించారు. ప్రతి రోజూ 500కు పైగా లారీలు వీటీపీఎస్ బూడిదను భవన నిర్మాణాలు, రహదారులు, ఇటుక బట్టీలకు రవాణా చేసేందుకు ప్రతి రోజూ ఐదు వందలకు పైగా లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటితో పాటు ఇబ్రహీంపట్నం, జి.కొండూరు మండలాల పరిధిలో ఉన్న క్వారీలు, క్రషర్లలో వచ్చే డస్టును తరలించేందుకు కొన్ని లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ లారీలలో రోజుకి 18వేల టన్నులకు పైగా బూడిద రవాణా అవుతుంటుంది. ఇంత పెద్ద ఎత్తున నిబంధనలకు విరుద్ధంగా లారీలలో డస్టును తరలిస్తుంటే అధికారులు మాత్రం కన్నెత్తి చూడడంలేదు. హెల్మెట్ లేదనో, లైసెన్సు లేదనో సామాన్యుల నుంచి ఫైన్ కట్టించే పోలీసులు, ఆర్టీఓ అధికారులు ఈ విషయం ఎందుకు పట్టించుకోరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
కాసుల వేటలో నేతలు
బదిలీలు షురూ.. ● ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం చర్యలు ● అనువైన స్థానాల్లో చోటు కోసం ఉద్యోగుల పాట్లు ● నేతల చుట్టూ ఉద్యోగుల ప్రదక్షిణలు ● సిఫార్సు లేఖల కోసం పడిగాపులు ● అందిన కాడికి దండుకునే పనిలో నేతలు కంకిపాడు: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు కూటమి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. బదిలీలకు వచ్చే నెల 2వ తేదీ వరకూ అవకాశం ఇస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో ఉద్యోగులు తమకు అనువైన ప్రాంతాల్లో పోస్టు దక్కించుకోవటం కోసం నానా పాట్లు పడుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు, కూటమి నేతల మెప్పుతో పోస్టింగులను పదిలం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. సందట్లో సడేమియాగా ముఖ్య ప్రజాప్రతినిధులు తమ చేతికి మట్టి అంటకుండా ‘షాడో’లతో సిఫార్సులు అందిస్తున్నారు. ముఖ్యనేతలతో పాటు షాడోలు చక్రం తిప్పుతూ అందిన కాడికి కొమ్ము కాస్తూ పరిస్థితులను చక్కబెట్టుకుంటున్నారు. పెద్ద ఎత్తున పైరవీలు జిల్లా వ్యాప్తంగా 4,115 మంది ఉద్యోగులు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నారు. రెండేళ్లు నిండిన వారు బదిలీలకు అర్హత కాగా, ఐదేళ్లు నిండిన వారు తప్పనిసరిగా బదిలీ కావాలని ప్రభుత్వ మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ మేరకు జిల్లాలో సగానికి పైగా ఉద్యోగులకు స్థానచలనం కలుగుతున్నట్లు తెలుస్తోంది. విజయవాడ నగరానికి ఆనుకుని ఉన్న సెమీ అర్బన్ ప్రాంతాల్లో పోస్టుల కోసం ఉద్యోగులు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సుల కోసం వారి కార్యాలయాల చుట్టూ తిరుగుతూ పెద్ద ఎత్తున పైరవీలు చేసుకుంటున్నారు. చేతికి మట్టి అంటకుండా.. గత అనుభవాలతో కూటమి నేతలు జాగ్రత్త పడుతున్నారు. నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధులు తమ చేతికి మట్టి అంటకుండా ‘షాడో’లను రంగంలోకి దించారు. ఎక్కడికక్కడ మండల స్థాయిలో క్యాంపులు తెరిచారు. సచివాలయ ఉద్యోగుల నుంచి వివిధ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల వరకూ ఆ క్యాంపుల వద్ద పడిగాపులు పడుతున్నారు. బదిలీలకు సమయం మించి పోతుందనే కారణంతో సిఫార్సు లేఖల కోసం తిరుగుతున్నారు. తమకు అనుకూలమైన అధికారులను, సిబ్బంది తమ తమ నియోజకవర్గాల్లో కొలువుదీరేలా నేతలు సైతం కుస్తీ పడుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి వరకూ అందరికీ గులాం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. చోటా మోటా నేతలు కూడా సిఫార్సు లేఖలు ఇప్పిస్తామంటూ ఉద్యోగులను ఆకట్టుకుంటున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కార్యదర్శి సీటు కోసం గ్రామ స్థాయి నేతలకు లకారం వరకూ ముట్టజెబుతున్నట్లు తెలుస్తోంది. మండల స్థాయి పోస్టులకు ఎంత మేరకు బేరం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా విజయవాడ నగరానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలతో పాటు మున్సిపాలిటీ, నగర పంచాయతీ ఏరియాలకూ డిమాండ్ అధికంగా ఉంటోంది. ఆ మేరకే ‘షాడో’ నేతలు తమకు అనుకూలం అని చెప్పుకుంటూనే లెక్కలు సరిచేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేతల కులపోకడ ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో భాగంగా ఇచ్చే సిఫార్సుల విషయంలో నేతలు కులపోకడ వదలటం లేదు. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గ ప్రాభల్యం ఉన్న ప్రాంతాల్లో తమ వారు అయితేనే లేఖలు అంటూ బాహాటంగా చెబుతుండటం ఉద్యోగ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. అర్హతలతో పాటుగా పని విధానం, సిన్సియార్టీ చూడకుండా కేవలం కులాన్ని చూడటం ఏంటంటూ పెదవి విరుస్తున్నారంటే నేతల వ్యవహారశైలి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో వైపు బదిలీల్లో గత ప్రభుత్వంలో తమకు తీరని అన్యాయం జరిగిందనే వాదనను నిస్సిగ్గుగా లేవనెత్తుతున్న పరిస్థితి. బలవంతంగా తమను ఇక్కడి నుంచి బదిలీ చేశారంటూ కొందరు కూటమి నేతలను ప్రసన్నం చేసుకుని పోస్టులను పదిలం చేసుకుంటున్నారు. కొందరు అధికారుల వల్ల తమ పనులు ఏవీ నెరవేరలేదంటూ సాగనంపే పనిలోనూ నేతలు ఉన్నారు. తమకు అన్యాయం జరిగితే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ఉద్యోగులు చెబుతున్నారు. -
బలమైన హిందువులే దేశాన్ని రక్షిస్తారు
● హనుమాన్ శోభాయాత్రలో రాధామనోహర్దాస్ పెడన: బలమైన హిందువులు మాత్రమే దేశాన్ని రక్షించగలరని, ఆ విధంగా హిందువులు మారి ప్రతిజ్ఞ చేయాలని అభయ హిందూ సేన ఫౌండర్, హిందూ ప్రచార రాష్ట్ర కార్యదర్శి రాధా మనోహర్దాస్ అన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని గురువారం పెడన నియోజకవర్గం పోసినవారిపాలెం పంచాయతీ పిండివారిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయస్వామి ఆలయం నుంచి హనుమాన్ శోభాయాత్రను హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాధామనోహర్దాస్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి హనుమాన్ శోభాయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. హిందువులగానే ఉండాలి.. తొలుత ఆయన హిందువులను ఉద్దేశించి భావోద్వేగ ప్రసంగం చేశారు. భూమ్మీద మారాల్సింది హిందూవులేనని, ప్రశ్నించాల్సింది, మాట్లాడాల్సింది, ఏమి చేయకపోయినా నశించిపోయేది కూడా హిందూవులేనని స్పష్టం చేశారు. ఇంటి దొంగల వల్ల దేశం సర్వనాశనం అవుతుందని దుయ్యబెట్టారు. తన టార్గెట్ ఇతర మతస్తులు కాదని, హిందువులు మైనార్టీలుగా మారితే గుళ్లు, దేవాలయాలుండవన్నారు. హిందువులు హిందువులగానే ఉండాలని ఆకాంక్షించారు. మన దేశం చాలా గొప్పదని, రామాయణం, భాగవతం, హిందూత్వం వల్ల మన దేశం చాలా గొప్పగా నిలిచిందని, దానిని కొందరు సెక్యూలరీజం వారు నాశనం చేస్తున్నారని చెప్పారు. అనంతరం ఆయన శోభయాత్రాలో పాల్గొంటున్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. హనుమంతుని చిత్రంతో ఉన్న కాషాయ జెండాను ఊపిశోభాయాత్రను ప్రారంభించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. గూడూరు మండలం పోసినవారిపాలెం, సురాదాయిపేట, పెడన పట్టణంలోని బ్రహ్మపురం, దక్షిణ తెలుగుపాలెం, ప్రధాన రహదారి వెంబడి మీదుగా తోటమూల, ఆగస్తేశ్వరస్వామి ఆలయం, బస్టాండు సెంటరులోని అభయాంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకుని యాత్రను ముగించారు. హిందూ చైతన్యవేదిక జిల్లా అధ్యక్షుడు నాదెండ్ల కోటేశ్వరరావు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
ప్రైవేటుకే పటుత్వం!
గన్నవరం: ప్రభుత్వంలో కీలకమైన రవాణా శాఖ ఒక్కొక్క బాధ్యతల నుంచి తప్పుకుంటోంది. ఇప్పటికే రవాణా శాఖకు చెందిన అనేక సేవలను ఆన్లైన్ చేసింది. పలు సేవలను ప్రైవేట్ పరం చేసింది. కొత్తగా వాహన పటుత్వ (ఫిట్నెస్) పరీక్ష నిర్వహణ బాధ్యతలను కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించనుంది. ఇప్పటి వరకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ)పర్యవేక్షణలో నిర్వహించిన వెహికల్ ఫిట్నెస్ టెస్ట్లు ఇకపై పూర్తిగా ఆటోమెటిక్ విధానంలో జరగనున్నాయి. ఇప్పటికే కర్నూలు, నంద్యాల, గుంటూరు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రిలో ఫిట్నెస్ టెస్ట్లను ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. కొత్తగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ ఇప్పటికే విజయవాడ రూరల్ మండలం నున్న పరిధిలో టెస్టింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. నిత్యం రద్దీగా గన్నవరం కేంద్రం.. ట్రాన్స్పోర్ట్ హబ్గా గుర్తింపు పొందిన విజయవాడలోని రవాణా శాఖ కార్యాలయానికి అనుసంధానంగా గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా వాహన పటుత్వ, వాహన చోదక యోగ్యత పరీక్ష నిర్వహణ కేంద్రం నడుస్తోంది. వెహికల్ ఫిట్నెస్ పరీక్షల నిమిత్తం విజయవాడ రవాణా శాఖ పరిధిలోని వేలాది ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఇక్కడికి వస్తుంటాయి. ఈ వాహనాలకు ఎంవీఐ దగ్గర ఉండి బ్రేక్లు, ఛాసిస్, ఇంజిన్ నంబర్లు, సిగ్నల్ లైట్లు, ఇంజిన్ పనితీరు, గేర్ బాక్స్, ఎయిర్ ప్రెజర్ను వంటి విభాగాలను పరీక్షించి ఫిట్నెస్ సర్టిఫికెట్ మంజూరు చేస్తుంటారు. సదరు వాహనం ప్రమాదానికి గురైనప్పుడు ఫిట్నెస్ పరీక్ష నిర్వహించిన ఎంవీఐ వెళ్లి వాహనం పరిస్థితిని ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఫిట్నెస్ టెస్ట్లకు వచ్చే వాహనదారులు, సంబంధిత వ్యక్తులతో గన్నవరం కేంద్రం నిత్యం రద్దీగా దర్శనమిచ్చేది. ఇప్పుడు వెహికల్ ఫిట్నెస్ టెస్ట్ బాధ్యతలను ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడంతో రానున్న రోజుల్లో ఈ కేంద్రం నిరుపయోగంగా మారనుంది. బీవీఎస్ఆర్ సంస్థకు కాంట్రాక్టు.. వెహికల్ ఫిట్నెస్ టెస్ట్ కాంట్రాక్ట్ను బీవీఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. ఆ సంస్థ వాహన పటుత్వ పరీక్షల నిర్వహణ నిమిత్తం నున్న సమీపంలోని వికాస్ కళాశాలకు వెళ్లే రోడ్డులో సెంటర్ను సిద్ధం చేసింది. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తిచేసింది. ఎంవీఐలతో సంబంధం లేకుండా పూర్తిగా కంప్యూటరైజ్డ్ విధానంలో యంత్రాల సహాయంతో వెహికల్ ఫిట్నెస్ పరీక్షలను నిర్వహించనుంది. సదరు టెక్నికల్ రిపోర్ట్ ఆధారంగా ఫిట్నెస్ సర్టిఫికెట్లను జారీచేయనున్నారు. అయితే ప్రైవేట్ సంస్థల పర్యవేక్షణలో జరిగే వాహన పటుత్వ పరీక్షలకు ఎంత వరకు కచ్చితత్వం ఉంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ సంస్థ చేతికి వెహికల్ ఫిట్నెస్ టెస్ట్ బాధ్యతలు ఎంవీఐ పర్యవేక్షణలో మాన్యువల్ పరీక్షలకు స్వస్తి ఆటోమేటిక్ విధానంలో నిర్వహణకు ఏర్పాట్లు విజయవాడ రూరల్ పరిధిలోని నున్న వద్ద కేంద్రం ఏర్పాటు -
చిన్నారిని చిదిమేసిన నిర్లక్ష్యం
మామిడి కాయల కోసం ట్రాక్టర్ వెంట పరిగెడుతూ మృతిజి.కొండూరు: కన్న తల్లిందండ్రుల అశ్రద్ధ, ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ చిన్నారి జీవితాన్ని చిదిమేసింది. అభం శుభం తెలియని వయసులో ఆశతో తీసిన పరుగు ఆ చిన్నారికి ఏడేళ్ల వయసులోనే నూరేళ్లు నిండిపోయేలా చేసింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులు ఆ చిన్నారిపై ఓ కన్ను వేసి ఉంచినా, ట్రాక్టర్ డ్రైవర్ ఒక క్షణం ట్రాక్టర్ ఆపినా ఒక నిండు ప్రాణం దక్కేది. మామిడి కాయల కోసం ట్రాక్టర్ వెంట పరుగెత్తిన చిన్నారి, ట్రాక్టర్ తగిలి రోడ్డుపై పడి మృతి చెందిన ఘటన వెల్లటూరు గ్రామ శివారులో ఇటుక బట్టీల వద్ద బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఒడిశా రాష్ట్రం, నబరంగ్పూర్ జిల్లా, జారిగామ్ చెందిన మంచుగౌడ్ ఆయన భార్య నీలాంద్రిగౌడ్ తమ ఇద్దరి పిల్లలు శంకర్ గౌడ్, చిన్న కుమారుడు దేబరాజ్గౌడ్(7)తో కలిసి గత మూడేళ్లుగా ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండల పరిధి వెల్లటూరు శివారులో నిర్వహిస్తున్న ఇటుక బట్టీలో పని చేస్తున్నారు. కాయలు విసరడంతో వెంటపడుతూ.. అయితే బుధవారం రాత్రి ఏడు గంటల సమయంలో వీరు పని చేస్తున్న ఇటుక బట్టీకి పక్కగా ఉన్న రహదారిపై మామిడి కాయల లోడుతో ట్రాక్టర్ వెళ్తుంది. ఈ క్రమంలో మామిడి కాయల కోసం ఇటుక బట్టీలో పని చేస్తున్న కుటుంబాలకు చెందిన మరి కొంత మంది పిల్లలతో కలిసి దేబరాజ్ గౌడ్ అనే చిన్నారి ట్రాక్టర్ వెంట పరిగెత్తడం ప్రారంభించాడు. ట్రాక్టర్లో ఉన్న కూలీలు కొన్ని మామిడి కాయలను కిందకు విసరడంతో ఆ మామిడి కాయలను తీసుకునే క్రమంలో ట్రాక్టర్ తగిలిన దేబరాజ్ గౌడ్ రోడ్డుపై పడిపోయాడు. తలకు బలమైన గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లిన దేబరాజ్గౌడ్ను ఇటుక బట్టీ యజమాని తన కారులో మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పొట్ట కూటి కోసం రాష్ట్రాలు దాటి వచ్చి పని చేసుకుంటున్న ఆ కుటుంబంలో చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు ఆవేదన వర్ణనాతీతంగా మారింది. చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం మైలవరంలోని ఆంత్యక్రియలు నిర్వహించారు. మృతుడు తండ్రి మంచుగౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్కుమార్ తెలిపారు. -
యోగాంధ్ర స్ట్రీట్గా బీఆర్టీఎస్ రోడ్డు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర వ్యాప్తంగా కనీసం రెండుకోట్ల మందికి యోగాలో ప్రవేశం లక్ష్యంతో యోగాంధ్ర ప్రచార కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. ఇందులో భాగంగా జూన్ 21 విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో రోజూ ఉదయం 5.30 గంటల నుంచి 7.30 గంట ల వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా గురువారం విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బీఆర్టీఎస్ రోడ్డులోని శారదా కళాశాల జంక్షన్ వద్ద ప్రత్యేక యోగాభ్యసన కార్యక్రమం జరిగింది. ఇందులో కలెక్టర్ లక్ష్మీశ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం తదితరులు పాల్గొని యోగాసనాలను సాధన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ మనిషి జీవన నాణ్యతను పెంచేందుకు, శ్రేయస్సుకు యోగా గొప్ప మార్గమని వివరించారు. ఇతివృత్తం ఆధారిత యోగా సెషన్లతో పాటు వివిధ పర్యాటక ప్రాంతాల్లోనూ కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. ట్రైనర్లు, పౌరుల రిజిస్ట్రేషన్కు ఏర్పాటు చేస్తున్నామని.. ఈ నెల రోజుల పాటు యోగాసనాల అభ్యసనతో పాటు ఆసనాల ప్రదర్శన, సూర్య నమస్కార్, ప్రాణాయామ ప్రదర్శన, గ్రూప్ యోగా, ఆర్టిస్టిక్ యోగా.. ఇలా వివిధ విభాగాల్లో పోటీలు కూడా నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తున్నట్లు చెప్పారు. ప్రతిఒక్కరూ మరో ముగ్గురిని యోగాచరణ దిశగా ప్రోత్సహించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. మన చారిత్రక సంపదను సద్వినియోగం చేసుకోవాలి.. యోగా అనేది భారతీయ వారసత్వ, చారిత్రక సంపద అని.. ఈ సంపదను సద్వినియోగం చేసుకొని.. శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారు కావాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర అన్నారు. యోగా అభ్యసనను ఏ ఒక్క రోజుకో పరిమితం చేయకుండా జీవితాంతం ప్రతిరోజూ యోగాను ఆచరించడం వల్ల కొత్త ఉత్తేజంతో మంచి ఫలితాలు సాధించొచ్చని పేర్కొన్నారు. విజయవాడ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, చీఫ్ ఇంజినీర్ ఆర్.శ్రీనాథ్ రెడ్డి, ఇన్చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. జూన్ 21 వరకు రోజూ ఉదయం ప్రత్యేక యోగా కార్యక్రమాలు వివరాలు వెల్లడించిన కలెక్టర్ జి.లక్ష్మీశ -
రేషనలైజేషన్తో వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లకు తీవ్ర అన్యాయం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రేషనలైజేషన్లో వీఆర్వో, సర్వేయర్లకు తీవ్ర అన్యాయం జరగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు అన్నారు. డిపార్ట్మెంట్ హెడ్లతో ప్రమేయం లేకుండా జీఎస్డబ్ల్యూఎస్ జీవో 4ను జారీ చేయడం దారుణమన్నారు. విజయవాడ ప్రెస్క్లబ్ నందు గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేస్తున్న వీఆర్వో, వీఎస్లను క్లస్టర్ విధానంలో రేషనలైజేషన్ పేరుతో జీఎస్డబ్ల్యూఎస్ మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. జనాభా ప్రాతిపదికన రెండు, మూడు సచివాలయాలను కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి సచివాలయానికో వీఆర్వో, వీఎస్ను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. ఈ విధానంలో 7,500 మంది వీఆర్వోలు, 4,722 మంది వీఎస్లను తగ్గించి చూపారన్నారు. దీని వలన ఉద్యోగోన్నతులకు అర్హులైన వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. క్లస్టర్ విధానంలో జరుగుతున్న లోపాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. రెవెన్యూలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరారు. వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్, ఆర్ఐలుగా ఉద్యోగోన్నతులు కల్పించడం ద్వారా ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక భారం ఉండదన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న గ్రేడ్ –2 వీఆర్వోలను గ్రేడ్–1, వీఆర్వోలుగా వన్ టైమ్ సెటిల్మెంట్గా ప్రమోషన్లు కల్పించాలన్నారు. ప్రతి రెవెన్యూ విలేజ్కు ఒక వీఆర్వోను కొనసాగించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనాయుడు, రాష్ట్ర కోశాధికారి మౌళి బాషా, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యకులు లక్ష్మీనారాయణ, ప్రసన్న కుమార్, మధు తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణలంక హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
● ఒక దానికొకటి ఢీ కొన్న నాలుగు వాహనాలు ● ముగ్గురికి స్వల్ప గాయాలు కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణలంక జాతీయ రహదారిపై సత్యంగారి హోటల్ జంక్షన్ వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ప్రమాదంలో మూడు కార్లు, ఒక వ్యాన్ ఒక దానికొకటి ఢీకొనడంతో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సేకరించిన వివరాల మేరకు గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో బస్టాండ్ వైపు నుంచి వేగంగా వస్తున్న ఆల్టో కారు సత్యంగారి హోటల్ జంక్షన్ వద్ద యూటర్న్ తీసుకునే క్రమంలో ముందు వెళ్తున్న వ్యాన్ను ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. వ్యాన్ డివైడర్ను ఢీకొట్టింది. ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు.. అదే సమయంలో వారధి వైపు నుంచి బస్టాండ్ వైపు వేగంగా ఎర్టిగా, ఐ10 కార్లు వస్తున్నాయి. అప్పటికే పల్టీలు కొట్టి రోడ్డు మీద పడి ఉన్న ఆల్టో కారును ఐ10 కారు ఢీ కొనగా వెనుక వస్తున్న ఎర్టిగా కారు ఐ10 కారును ఢీకొట్టింది. దీంతో మూడు కార్లు, వ్యాన్ దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదం చూసిన స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై కారులో ఉన్న వారిని కాపాడేందుకు పరుగులు తీశారు. ఆల్టో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలవ్వగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కార్లలోని బెలూన్లు సైతం ఓపెన్ అయ్యాయంటే ప్రమాద తీవ్రత ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో కార్లను పక్కకు తీసి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఈ ప్రమాదానికి కారణమైన జంక్షన్ను వెంటనే పోలీసులు బారీకేడ్లతో మూసివేశారు. ప్రమాదాలు నిత్యకృత్యమైన ఈ కూడలిని శాశ్వతంగా మూసేస్తామని పోలీసులు తెలిపారు. కూడలిని మూసివేయడంతో కృష్ణలంక అండర్పాస్ వద్ద నిలిచిపోయిన ట్రాఫిక్ను ట్రాఫిక్ పోలీసులు క్రమబద్ధీకరించారు. ప్రమాదంపై వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
దివ్యాంగులకు తప్పని తిప్పలు
● పూర్తి స్థాయిలో హాజరు కాని వైద్యులు ● ప్రహసనంలా సదరం ధ్రువపత్రాల పునఃపరిశీలన మచిలీపట్నంటౌన్: స్థానిక జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో నిర్వహిస్తున్న సదరం దివ్యాంగుల ధ్రువీకరణ పత్రాల పునఃపరిశీలన కార్యక్రమం ప్రహసనంలా మారింది. ఎన్నో ఏళ్లుగా జిల్లా వ్యాప్తంగా పింఛన్లు పొందుతున్న దివ్యాంగుల వికలాంగ శాతాన్ని పునఃపరిశీలించి ఉన్న పింఛన్లను తొలగింపే లక్ష్యంగా కూటమి పాలకులు ఆస్పత్రిలో కొద్ది నెలలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లాలోని పలు మండలాలకు చెందిన పింఛన్లు పొందుతున్న దివ్యాంగులకు ఆయా ప్రాంతాల్లోని సచివాలయాల సిబ్బంది ఫలానా తేదీన ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని నోటీసులు ఇస్తున్నారు. ఈ నోటీసులతో వారంతా జిల్లా ఆస్పత్రికి తరలివచ్చి సంబంధిత విభాగ వైద్యులతో పరీక్షలు చేయించుకుని వెళ్తున్నారు. మొదట్లో సోమ, మంగళ, బుధ వారాల్లో ఈ పరీక్ష శిబిరాలను నిర్వహించారు. ప్రస్తుతం ఈ శిబిరాలు బుధ, గురు, శుక్రవారాల్లో నిర్వహిస్తున్నారు. ఈ శిబిరాలకు ఇక్కడి వైద్యులు కాకుండా విజయవాడ, గుంటూరు, గుడివాడ ఇలా తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో పని చేస్తున్న జూనియర్, సీనియర్ వైద్యులు హాజరవుతున్నారు. పూర్తి స్థాయిలో హాజరుకాని వైద్యులు... ఈ సదరం ధ్రువీకరణ పత్రాల పునఃపరిశీలన శిబిరాలకు ఆయా విభాగాలకు చెందిన వైద్యులు పూర్తిస్థాయిలో హాజరై సేవలందించకపోవటంతో దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడికి వస్తున్న వైద్యుల వద్దకు కూటమి పార్టీలకు చెందిన నాయకులు వెళ్లి ఫలానా దివ్యాంగులకు ఎక్కువ వికలాంగ శాతం వేయాలని ఇటీవల కాలంలో పైరవీలు అధికమయ్యాయి. దీంతో విసుగు చెందిన పలువురు వైద్యులు ఈ శిబిరాలకు వచ్చి సేవలందించేంకు విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవల రాజధాని అమరావతి సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరైన సందర్భంలో ప్రత్యేక విధులు నిర్వహించటంతో మరి కొంత మంది వైద్యులు శిబిరాలకు రావటం లేదు. వైద్యులు ప్రతి రోజు 25 మంది దివ్యాంగులకు పరీక్షలు చేయాల్సి ఉంది. అయితే వైద్యులు పూర్తి స్థాయిలో హాజరుకాకపోవటం, పలు మార్లు శిబిరాలు రద్దు కావటంతో దివ్యాంగులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో అరకొరగా వస్తున్న వైద్యులు దివ్యాంగులందరికీ పరీక్షలు చేయకపోవటంతో వారు రోజుల తరుబడి నిరాశతో వెనుతిరగాల్సివస్తోంది. తాము రోజుకు 25 మందినే పరీక్షించాల్సి ఉండగా 75 మందికి పైగానే చూడాల్సి వస్తోందని తమపై పని భారం పెరుగుతోందని విధులకు వస్తున్న వైద్యులు వాపోతున్నారు. దీంతో దివ్యాంగులకు ఇబ్బందులు తప్పటం లేదు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించి తమకు ఇబ్బంది కలగకుండా చూడాలని దివ్యాంగులు కోరుతున్నారు. -
మారని అధికారులు..
నమో వాయుపుత్ర శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాంజనేయం.. భజేహం పవిత్రం.. అంటూ భక్తులు హనుమంతుడిని భక్తితో కొలిచారు. జై హనుమాన్.. జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. హనుమత్ జయంతి సందర్భంగా గురువారం వాడవాడలా అభయాంజనేయుడికి ప్రత్యేక పూజలు చేశారు. విశ్వహిందూ పరిషత్ మహానగర్ ఆధ్వర్యంలో విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. శైవపీఠాధిపతి శివస్వామి ర్యాలీని ప్రారంభించారు. భారీ సంఖ్యలో హాజరైన హనుమాన్ భక్తులు జెండాలు చేత పట్టుకొని ఉత్సాహంగా ముందుకుసాగారు. మహిళలు కూడా బైక్లపైకి ఎక్కి నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ అభయాంజనేయుడికి భక్తజన నీరాజనం హనుమాన్జంక్షన్ రూరల్: హనుమాన్జంక్షన్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. జై హనుమాన్ నామస్మరణలతో మార్మోగింది. అంజనీపుత్రుడిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. హనుమజ్జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం ప్రసిద్ధ శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో తెల్లవారుజాము మూడు గంట ల నుంచే బారులు తీరారు. స్వామివారిని నూతన వస్త్రాలు, బంగారు, వెండి ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. ఉదయం 4 గంటలకు ప్రభాతసేవ, అర్చన, వేదపారాయణం నిర్వహించారు. హనుమాన్జంక్షన్ లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 25 వేల మందికి అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం వైభవంగా సాగింది. ర్యాలీ ప్రారంభం.. జెండా ఊపి ర్యాలీ ప్రారంభిస్తున్న శైవపీఠాధిపతి శివస్వామి తదితరులుఅధికారులకు ఆదేశాలిచ్చాం: కలెక్టర్లు సర్వసభ్య సమావేశంలో సభ్యుల ఆవేదనను అర్థం చేసుకున్నామని, ఇకపై ఎటువంటి కార్యక్రమాలు జరిగినా సంబంధిత ప్రజాప్రతినిధులకు సమాచారం అందించేలా అధికారులకు ఆదేశాలిచ్చామని కృష్ణా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలిశర్మ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా సభలో ప్రకటించారు. అలాగే జిల్లా పరిషత్ ద్వారా ఆయా మండలాలకు మంజూరైన నిధులు త్వరితగతిన నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజలకు సేవ చేసేందుకు ప్రజల ద్వారా ఎన్నికై న తాము ప్రజలకు చేయాల్సిన పనులు చేయలేకపోతున్నామని.. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు తమకు సమాచారం ఇవ్వటం లేదని.. కనీసం ప్రొటోకాల్ పాటించటం లేదని జెడ్పీటీసీ, ఎంపీపీలు వాపోయారు. గురువారం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో జెడ్పీ సర్వసభ్య సమావేశం చైర్ పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సమావేశానికి సంబంధిత అధికారులు, మంత్రులు హాజరు కాకపోవడంపై స్థానిక సంస్థల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు రారు.. మంత్రులు కనిపించరు.. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ విషయంలో ప్రతి సర్వసభ్య సమావేశంలో అధికారులకు చెబుతున్నా పట్టించుకోవటం లేదని, ఈ రోజు మాత్రం తమకు కచ్చితమైన హామీ ఇవ్వాలని వారు భీష్మించుకొని కూర్చున్నారు. గౌరవం ఇవ్వరా.. క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులుగా ఉన్న తమకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎటువంటి గౌరవం దక్కటం లేదని జెడ్పీటీసీ, ఎంపీపీలు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక దాదాపుగా 18 నెలలుగా తమకు గౌరవవేతనం చెల్లించకుండా తాత్సారం చేస్తున్నారని, సమావేశానికి రావాలంటే తమకు రూ.5వేలు ఖర్చవుతోందని అయినప్పటికీ ప్రజాసేవ కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం సమావేశంలో తెలియపరిచేందుకు తామిక్కడికి వస్తే సంబంధిత అధికారులు ఉండరూ, మంత్రులు హాజరుకారు.. ఇలా అయితే గ్రామాల్లో తమకు ప్రాధాన్యం ఏముంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు తమ గోడును వెళ్లబుచ్చుకున్నా అధికారులు కూటమి నాయకుల ఒత్తిళ్లకు లొంగిపోతున్నారన్నారు. పేరుకు శిలాఫలకాలపై పేర్లు ఉన్నప్పటికీ ఆ కార్యక్రమం గురించి తమకు సమాచారం ఇవ్వటం లేదని ఆరోపించారు. గౌరవవేతనం ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారన్నారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా జీతాలు నిలుపుదల చేస్తే తమ బాధ అర్థమవుతుందన్నారు. నిరసనగా బాయ్కాట్.. సర్వసభ్య సమావేశంలో జెడ్పీటీసీ, ఎంపీపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానం రాకపోవటంతో కొద్దిసేపు పోడియం వద్ద నిరసన తెలిపారు. అనంతరం అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వకపోవటంతో సమావేశం నుంచి బాయ్కాట్ చేసి సమావేశ మందిరం బయట నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ప్రొటోకాల్ పాటించాలి, గౌరవవేతనం వెంటనే చెల్లించాలంటూ నినాదాలు చేశారు. అలాగే తమ మండలాల్లో కూటమి నాయకులు చేస్తున్న అరాచకాలను ప్రశ్నించాలని వస్తే సంబంధిత అధికారులు, శాసనసభ్యులు ఎవరూ ఉండరని, సమాధానం ఎలా వస్తుందని వాపోయారు. చర్చలు జరిపినా ససేమిరా.. సమావేశం నుంచి బాయ్కాట్ చేసిన అనంతరం జెడ్పీటీసీ, ఎంపీపీలతో ఇన్చార్జ్ సీఈవో ఆర్సీ ఆనంద్కుమార్ చర్చలు జరిపారు. ఈ విషయాలపై ఉన్నతాధికారులకు తెలియజేస్తామని, గౌరవవేతనం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తామని చెప్పినప్పటికీ స్పష్టమైన హామీ కావాలంటూ వారు ఒప్పుకోలేదు. ఇకపై ఉమ్మడి జిల్లాకు చెందిన ఇరువురు మంత్రులు, శాసనసభ్యులు, అధికారులందరూ ఉంటేనే సమావేశం నిర్వహించాలని.. అలా అయితేనే తమను ఆహ్వానించాలని ఘంటాపదంగా చెప్పారు. పోడియం వద్ద నిరసన తెలుపుతున్న జెడ్పీటీసీ, ఎంపీపీలు స్థానిక సంస్థలను చిన్నచూపు చూస్తున్నారంటూ ఆవేదన ప్రొటోకాల్ అమలు కావడం లేదని నిరసన 18 నెలలుగా గౌరవ వేతనం ఇవ్వకపోవడంపై ఆందోళన ఎమ్మెల్యేల జీతాలు కూడా ఆపేయండంటూ నిలదీత చర్చలు జరిపినా ససేమిరా అన్న ప్రజాప్రతినిధులు సమావేశాన్ని వాయిదా వేసిన చైర్పర్సన్ ఉప్పాల హారిక స్థానిక సంస్థలు ఉండాలా.. వద్దా?: చైర్ పర్సన్ హారిక స్థానిక సంస్థలను ప్రవేశపెట్టి క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రజల నుంచి ఎన్నికై న తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఎక్కడా ప్రోటోకాల్ అమలు జరగటం లేదని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. ఏ పనులు జరిగినా సంబంధితశాఖల అధికారులు సంబంధిత ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వటం లేదన్నారు. గౌరవవేతనం గురించి తాము ప్రభుత్వానికి రెండు సార్లు లేఖ రాసినా దానిని తిరిగి పంపించి వేశారన్నారు. ఇటువంటి పరిణామాలు చోటుచేసుకున్న దృష్ట్యా జెడ్పీటీసీలు, ఎంపీపీలు సమావేశంలో స్పష్టమైన హామీ వస్తుందని ఆశపడి భంగ పడటంతో బాయ్కాట్ చేసి వెళ్లిపోయారన్నారు. తక్షణమే దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. తొలుత జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పెహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన 26 మంది ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో నూజివీడు సబ్కలెక్టర్ స్మరణ్రాజ్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మూడు జిల్లాల అధికారులు పాల్గొన్నారు. -
కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విశాఖ ఉక్కును రక్షించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విశాఖ ఉక్కును కాపాడేందుకు కేంద్రంపై కూటమి ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో విశాఖ ఉక్కు రక్షణకు కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు సంఘీభావంగా వామపక్ష పార్టీలు బుధవారం ధర్నా చేశాయి. బీజేపీ డౌన్ డౌన్.. విశాఖ ఉక్కును కాపాడుకుందాం అంటూ ఆ పార్టీల నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ధర్నాలో సీపీఎం రాష్ట్ర దర్శివర్గ సభ్యుడు సీహెచ్.బాబూరావు, కార్యవర్గ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు ప్రసంగించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో ప్రయత్నాలను కొనసాగిస్తోందన్నారు. ఇందులో భాగంగానే దఫదఫాలుగా వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించిందన్నారు. పర్మనెంటు కార్మికులు 1400 మందిని తగ్గిస్తోందన్నారు. ఎనిమిది నెలల నుంచి కార్మికులకు సగం జీతాలే చెల్లిస్తోందని వివరించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించకుండా కేంద్రం మోసం చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినట్లే ప్రకటించి బ్యాంకుల బకాయిల రూపంలో తిరిగి జమ చేసుకుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు కార్మికులు, ప్రజలు పోరాడుతుంటే వారిని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో అణిచివేస్తోందన్నారు. కార్మి కుల తొలగింపు చర్యలు మానుకోవాలన్నారు. సీఐటీయూ నాయకులు ఎ.వి.నాగేశ్వరరావు, కె.దుర్గారావు, ఎన్.సీహెచ్.శ్రీనివాసరావు, మూలి సాంబశివ రావు, డి.హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రజలకు శాపం
● బీడీసీ గండ్ల వద్ద కాంక్రీట్ గోడ నిర్మాణ పనులకు వర్షాలతో ఆటంకం ● పనుల కోసం జరిగిన తవ్వకాలతో ప్రమాదకరంగా బీడీసీ ఎడమ కట్ట ● కొద్దిపాటి వర్షం పడినా వరదంతా విజయవాడ వైపు తరలే ప్రమాదం జి.కొండూరు: ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. గతేడాది ఎన్టీఆర్ జిల్లాలో జల ప్రళయానికి కారణమైన బుడమేరు డైవర్షన్ కెనాల్ గండ్ల వద్ద కాంక్రీట్ గోడ నిర్మాణ పనుల్లో ప్రభుత్వ డొల్లతనం బయటపడింది. వేసవి చివరిలో గోడ నిర్మాణ పనులను ప్రారంభించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో అడుగడుగునా బ్రేక్లు పడి పనులు ముందుకు సాగడంలేదు. ఈ పనుల కోసం జరిగిన తవ్వకాలతో డైవర్షన్ కెనాల్ కట్ట ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. భారీ వర్షం పడితే మైలవరం నియోజకవర్గంలో కురిసిన ప్రతి వర్షపు బొట్టు విజయవాడ వైపు తరలిపోయి మరో జల ప్రళయం వచ్చే ప్రమాదం పొంచి ఉంది. వరద నివారణ చర్యల్లో ప్రభుత్వ పని తీరును చూసి ఇదేనా విజన్ బాబూ అంటూ స్థానికులు విస్తుపోతున్నారు. ఎనిమిది నెలలుగా కాలయాపన గతేడాది ఆగస్టు 30వ తేదీ రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలకు బుడమేరు వరద పోటెత్తి జల ప్రళయాన్ని సృష్టించిన సంగతి విదితమే. ఈ ప్రళయానికి కారణం కూడా ప్రభుత్వ నిరక్ష్యమే కారణమని అప్పట్లో విమర్శలు తలెత్తాయి. ఈ వరదలకు ప్రధాన కారణమైన బుడమేరు డైవర్షన్ కెనాల్ గండ్లను అప్పట్లో మిలటరీ సాయంతో ప్రభుత్వం తాత్కాలికంగా పూడ్చింది. అయితే ఈ గండ్ల వద్ద కాంక్రీటు వాల్ నిర్మించకపోతే మరో సారి గండ్లు పడే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ నిపుణులు తేల్చారు. అయినప్పటికీ కాంక్రీట్ గోడ నిర్మాణ పనుల కోసం నిధులను కేటాయించ డంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపింది. గండ్లు పడిన ఆరు నెలల తర్వాత మార్చి 21న హెడ్ రెగ్యులేటర్ మరమ్మతులకు రూ.1.80 కోట్లు, డైవర్షన్ కెనాల్కు గండ్లు పడిన ప్రదేశంలో ఎడమ వైపు 500 మీటర్లు, కుడి వైపు 50 మీటర్ల కాంక్రీట్ గోడ నిర్మాణ పనుల కోసం రూ.37.97 కోట్ల కేటాయిస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఈ నిధుల్లో రూ.28 కోట్లతో గోడ నిర్మాణ పనుల కోసం 54 రోజుల తర్వాత మే 15వ తేదీన శంకుస్థాపన చేశారు. ఈ పనులు నిరంతరాయంగా కొనసాగితే మూడు నెలల్లో కాంక్రీట్ గోడ నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే వర్షాలు పడుతున్న నేపథ్యంలో వచ్చేది కూడా వర్షా కాలం కావడంతో పనులు ముందుకు సాగే అవకాశం కనిపించడంలేదు. వర్షంతో పనులకు బ్రేక్ బుడమేరు డైవర్షన్ కెనాల్కు జి.కొండూరు మండల పరిధి కవులూరు, కొండపల్లి శాంతినగర్కు సమీపంలో కట్టకు ఎడమ వైపు మూడు గండ్లు పడిన ప్రదేశంలో కాంక్రీట్ గోడ నిర్మాణం కోసం కట్టను తవ్వి పనులు ప్రారంభించారు. ఎగువ నుంచి నీరు దిగు వకు రాకుండా ఈ ప్రదేశంలో కెనాల్కు అడ్డంగా ఆనకట్ట కట్టారు. అయితే రెండు రోజులుగా భారీగా వర్షం పడుతున్న నేపథ్యంలో ఈ కాంక్రీట్ గోడ నిర్మాణ పనులకు ప్రారంభంలోనే బ్రేక్ పడింది. కాలువ కట్ట బురదమయం కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి పనులు ముందుకు సాగడంలేదు. కెనాల్ ఎగువున నిల్వ ఉన్న నీటి నుంచి ఊట వస్తుండటంతో ట్రాక్టరు ఇంజిన్లతో నీటిని తోడే ప్రక్రియను ప్రారంభించారు. మరో వైపు నైరుతి రుతుపవనాలు కూడా మరో నాలుగైదు రోజుల్లో రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉండడంతో ఇప్పటికే కృష్ణాజిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో యుద్ధ ప్రాతిపదికన పనులను చేపట్టడం లేదా కట్టను తవ్విన ప్రదేశంలో గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. -
కృష్ణా జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ
యోగ సాధనతో మానసిక ప్రశాంతత చిలకలపూడి(మచిలీపట్నం): యోగ సాధనతో మానసిక ప్రశాంతత పొందొచ్చని కృష్ణా జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్హాలులో బుధవారం జరిగిన యోగాంధ్ర–2025 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే యోగా కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. జూన్ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. నెల రోజుల పాటు జిల్లాలో యోగా పోటీలు, పలు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆయుష్ శాఖ వివిధ యోగా సంఘాల సహకారంతో జిల్లాస్థాయిలోనే కాకుండా మండల, గ్రామస్థాయిలో కూడా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. యోగా గురువులు, శిష్య బృందంతో ప్రజలందరికీగాపై శిక్షణ ఇస్తారని వివరించారు. వేసవి సెలవులు పూర్తయిన తరువాత కళాశాలలు, పాఠశాలల్లో శిక్షణ తరగతులు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో జూన్ 21న మంగినపూడిబీచ్లో భారీగా యోగా కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తు న్నామన్నారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలిశర్మ సహా పలువురు అధికారులు యోగ సాధన చేశారు. ఈ కార్యక్ర మంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, బందరు ఆర్డీఓ కె.స్వాతి, డీఈఓ పి.వి.జె.రామారావు, పశుసంవర్ధకశాఖ అధికారి చిననరసింహులు, మునిసిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణాజిల్లా
గురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2025సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 512.60 అడుగుల వద్ద ఉంది. ఇది 136.1274 టీఎంసీలకు సమానం. మున్సిపల్ కార్మికుల ఆందోళనవిజయవాడ ధర్నా చౌక్లో మున్సిపల్ కార్మి కులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం ఆగదని కార్మికులు తేల్చిచెప్పారు. నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం ఇంద్రకీలాద్రి: బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి హైదరాబాద్కు చెందిన ఎం.పద్మారావు కుటుంబం బుధవారం రూ.లక్ష విరాళం సమర్పించింది. – 8లో7 -
వైద్య సేవల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ పటమట(విజయవాడతూర్పు): అనారోగ్యానికి గురై చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితిలో నిరుపేదలు వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రులకు వస్తారని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించడం దైవ సేవతో సమానమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలందించడంలో ప్రభుత్వాస్పత్రిని అగ్రస్థానంలో నిలపాలని, టీమ్ జీజీహెచ్ స్ఫూర్తితో పనిచేయా లని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ (హెచ్డీఎస్) సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వాస్పత్రిలో చేపట్టాల్సిన చర్యలపై చర్చించి, పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు అందించాలన్న లక్ష్యాన్ని నెరవేర్చడంలో ప్రతిఒక్కరూ అంకితభావంతో పనిచేయా లన్నారు. ఇటీవల ప్రభుత్వాస్పత్రుల పనితీరుపై ప్రభుత్వం సేకరించిన ప్రజాభిప్రాయ నివేదిక ప్రకారం విజయవాడ సర్వజనాస్పత్రికి ఇచ్చిన నివేదికలో వైద్యులు అందిస్తున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, మందుల సరఫరా, పారిశుద్ధ్యం, అవినీతి రహిత సేవలు ఆశించిన స్థాయిలో లేకపోవడం బాధాకరమని అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య సేవల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ఆదర్శవంతమైన ఆస్పత్రిగా జీజీహెచ్ను తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషిచేయా లని సూచించారు. ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ.. పేద రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో అడిషనల్ డీఎంఈ డాక్టర్ వెంకటేష్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.అశోక్కుమార్, ఆర్ఎంఓలు డాక్టర్ పద్మావతి, డాక్టర్ మంగాదేవి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ నాగార్జున, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. ఆమోదం పొందిన అంశాలు ఇవీ.. పల్మనరీ మెడిసిన్ డిపార్టుమెంటుకు రూ.5.17 లక్షలు, గైనకాలజీ డిపార్టుమెంటుకు రూ.4.50 లక్షలు, మైక్రోబయాలజీ డిపార్టుమెంటుకు రూ.10.90 లక్షలు, ఈఎన్టీ డిపార్టుమెంటుకు రూ.3 లక్షలు, డీవీఎల్ డిపార్టుమెంటుకు రూ.2.82 లక్షలు, ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్టుమెంటుకు రూ.3.74 లక్షలతో వివిధ సౌకర్యాలు కల్పించేందుకు కమిటీ ఆమోదం తెలిపింది. పాత, కొత్త జీజీహెచ్లతో పాటు పీఎంఎస్ఎస్వై బ్లాక్లో రూ.4.50 లక్షలతో పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్ ఏర్పాటుకు కూడా కమిటీ ఆమోదం తెలిపింది. ఓపీ కౌంటర్ల క్యూబికల్స్ కోసం రూ.లక్షతో పనులు చేపట్టేందుకు, ఆర్థోపెడిక్ డిపార్టుమెంట్లో దాదాపు రూ.3 లక్షలతో అవసరమైన సౌకర్యాల కల్పనకు కూడా ఆమోదం తెలిపారు. -
ఏపీ ఈఏపీసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు ప్రారంభం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఏపీ ఈఏపీసెట్ పరీక్షల్లో భాగంగా ఇంజినీరింగ్ స్ట్రీమింగ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్ష నిర్వహించారు. బుధవారం నుంచి ఇంజినీరింగ్ విభాగం ప్రవేశ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం, సాయంత్రం రెండు విడతలుగా పరీక్షలు జరిగాయి. జిల్లాలో 12 కేంద్రాల్లో 7,816 మంది విద్యార్థు లకు 7,328 మంది పరీక్షలు రాశారు. కృష్ణాజిల్లాకు మూడు కేంద్రాల్లో 1,009 మంది విద్యార్థులకు 973 మంది హాజరయ్యారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కోనేరుసెంటర్(మచిలీపట్నం): యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.రాంజీ పేర్కొన్నారు. విశ్వవిద్యాలయంలో బుధవారం యోగా డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు అధ్యాపకులు, విద్యార్థులతో యోగా గురువులు ఆసనాలు వేయించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వీసీ రాంజీ మాట్లాడుతూ.. యోగాతో ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేసి ఆరోగ్యవంతు లుగా జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య ఎన్.ఉష, ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ రెజ్లింగ్ పోటీలకు నిహారిక, కుమార్ విజయవాడస్పోర్ట్స్: అండర్ –17 జాతీయ రెజ్లింగ్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే ఆంధ్ర ప్రదేశ్ జట్టులో విజయవాడ క్రీడాకారులు బి. నిహారిక, బి.కుమార్ చోటు దక్కించుకున్నారని ఎన్టీఆర్ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఇన్చార్జి కార్యదర్శి డి.శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఇటీవల చిత్తూరులో జరిగిన రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో ఈ ఇద్దరు క్రీడాకారులు సత్తాచాటి పతకాలు సాధించారని పేర్కొన్నారు. ఈ నెల 25 నుంచి 27 వరకు హరియాణా రాష్ట్రంలోని పల్వాల్లో జరిగే జాతీయ పోటీల్లో నిహారిక 36–40 కిలోల విభాగం, కుమార్ 41–45 కిలోల విభాగంలో ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. ‘ఉపాధి’లో ఉచితంగా పండ్ల తోటల పెంపకం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రైతులు ఉచితంగా పండ్ల తోటల సాగు చేపట్టొచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంపై రైతులకు అవగాహన కల్పించి, సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని ఆదేశిం చారు. కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశ ఉపాధి హామీ పథకంలో పండ్ల తోటలు, పశుగ్రాసం పెంపకా నికి సంబంధించిన సమాచారంతో కూడిన కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ఉద్యాన పంటల ద్వారా రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తుందన్నారు. ఉపాధి పథకం ద్వారా ఉచితంగా ఉద్యాన పంటల సాగు చేపట్టొచ్చని పేర్కొన్నారు. మామిడి, జామ, నిమ్మ, సపోట, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, కొబ్బరి, ఆయిల్పామ్, ఆపిల్ బేర్, మునగ, మల్లి, గులాబీ వంటి తోటల పెంపకానికి ఐదెకరాల లోపు పొలం ఉన్న చిన్న, సన్నకారు రైతులు అర్హులని తెలిపారు. సొంత భూమి ఉండి పశుపోషణ చేస్తున్న రైతులు పశుగ్రాసం పెంపకం చేపట్టవచ్చన్నారు. ఆసక్తిగల రైతులు ఎంపీడీఓ లేదా ఉపాధి హామీ ఏపీఓ లేదా గ్రామ సచివా లయ ఉద్యాన అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ ఎ.రాము, గ్రామ/వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, ఏడీఏ అనిత, డ్వామా జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ కె.ఉష తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు అకాల కష్టం
● పసుపు, మొక్కజొన్నరైతులకు కోలుకోలేని దెబ్బ ● ధర లేక ఇప్పటికీకల్లాల్లోనే ఉన్న పంట దిగుబడులు ● ఆపై వెంటాడుతున్న అకాల వర్షాలు కంకిపాడు: అకాల వర్షం కృష్ణా జిల్లా రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చేతికొచ్చిన పంటను కాపాడుకోవటానికి అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. పండిన పంట వర్షానికి దెబ్బతినకుండా సంరక్షించుకోవటానికి నానా పాట్లు పడుతున్నారు. ధర లేక కల్లాలు, ఖాళీ స్థలాల్లోనే పంట ఉత్పత్తులు రాశులుగా పోసి ఉండటంతో రైతుల్లో ఆందోళన రెట్టింపవుతోంది. వర్షాల వల్ల మార్కెట్ ధరపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. విడవకుండా అకాల వర్షాలు ప్రస్తుత పరిస్థితుల్లో రైతులను అకాల వర్షాలు విడవటం లేదు. రబీ సీజన్లో వరి, పసుపు, మొక్కజొన్న, మినుము ఇతర పంటలు చేతికొచ్చింది మొదలు అడపాదడపా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లా వ్యాప్తంగా ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. ఆ శాఖ అంచనా మేరకు కృష్ణా జిల్లాలో 54 హెక్టార్లలో పంట దెబ్బతింది. వీటిలో ప్రధానంగా అరటి, తమలపాకు, బొప్పాయి, కూరగాయల పంటలు ఉన్నాయి. తాజాగా ద్రోణి ప్రభావంతో వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అతి కష్టం మీద ధాన్యాన్ని ఆర్ఎస్కేలు, బయటి వ్యాపారుల ద్వారా మిల్లులకు తరలించి రైతులు సొమ్ము చేసుకోగలిగారు. పసుపు, మొక్కజొన్నకు తప్పని నష్టం ఈ సీజన్లో మొక్కజొన్న, పసుపు రైతులకు అకాల వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లోని పలు గ్రామాలతో పాటుగా లంక ప్రాంతాల్లో సాగు చేసిన మొక్క జొన్న పంట ఇంకా కల్లాల్లో రాశులు, పంట చేను మీద ఉంది. గాలులు, భారీ వర్షానికి చాలా చోట్ల పంట నేలవాలిపోయింది. మొక్కజొన్న కండెలు వర్షానికి తడిచిపోవటంతో నాణ్యత దెబ్బతింది. రాశులు మీద ఉన్న గింజలు వర్షానికి నానుతు న్నాయి. ఇదిలా ఉంటే జిల్లాలో 5,031 ఎకరాల్లో పసుపు సాగు చేశారు. రైతులు కొమ్ములను ఉడకబెట్టి ఎండబెట్టి ఉంచారు. పూర్తి స్థాయిలో ఎండబెట్టి మార్కెట్కు తరలించే క్రమంలో విడవకుండా పడుతున్న వర్షాలకు పంట నాణ్యత దెబ్బతిం టోంది. కొమ్ములు కటిక (నలుపు) వస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా అటు మొక్కజొన్న, ఇటు పసుపు కొమ్ములను సంరక్షించుకోవడానికి రైతులు నిత్యం కల్లాలు, ఖాళీ వెంచర్లలో పంట మధ్యే గడుపుతున్న దుస్థితి. చినుకు పడితే పరదాలు కప్పటం, తెరపివ్వగానే ఎండ పొడకు పంటను ఎండబెట్టే పనుల్లో నిమగ్నం కావాల్సిన పరిస్థితి. ధరపై దిగులు ఈ విపత్కర పరిస్థితుల్లో మార్కెట్ ధరపై రైతులు దిగులు చెందుతున్నారు. ప్రస్తుతం క్వింటా మొక్క జొన్న రూ.2 వేల నుంచి రూ.2100 వరకు కొనుగోళ్లు జరుగుతున్నాయి. వదలకుండా పడుతున్న వానలకు గింజ నాణ్యత దెబ్బతింటే ధర మార్కెట్లో పతనం అయ్యే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. మరో వైపు ఎకరాకు 25 క్వింటాళ్లు వరకూ ఎండు పసుపు కొమ్ముల దిగుబడి వస్తున్న విషయం తెలిసిందే. క్వింటా రేటు రూ.11,500 వరకూ పలుకుతోంది. వానల వల్ల కొమ్ములు నలుపు వచ్చినా, నాణ్యత దెబ్బతిన్నా ధర తగ్గుతుందనే ఆందోళన రైతులను కలవరపెడుతోంది. కన్నెత్తి చూడని అధికారులు అటు వ్యవసాయశాఖ, ఇటు ఉద్యాన శాఖ అధికారులు తమ గోడు పట్టించుకోవటం లేదని రైతులు వాపోతున్నారు. మొక్కజొన్న పొలంలోనే నేలవాలిన, పంటకు నష్టం జరి గినా కనీసం తమ పొలాలకు వచ్చి చూసి పంట నష్టం నమోదు చేసిన అధికారులు లేరంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ ఆదేశాలతో పంట నష్టం నమోదు ప్రాథమిక అంచనాల్లో సైతం ఒక ఎకరం విస్తీర్ణంలోనూ పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ చూపకపోవటం విడ్డూరం. పసుపు పంట చేతికొచ్చాక వర్షాలకు తడిచి దెబ్బతిందని, ఈ దశలోనూ నష్టం నమోదు చేస్తే తమకు ఊరటగా ఉంటుందని రైతులు సూచిస్తున్నారు. అకాల వర్షాలకు తీవ్ర నష్టం 1.5 ఎకరాల్లో మొక్కజొన్న, 70 సెంట్లలో పసుపు సాగు చేశాను. మొక్కజొన్న పూర్తిగా పడిపోయింది. చేలోనే పంట ఉండిపోయింది. ఎంత వస్తుందో దిగుబడి, ఎంత ధర వస్తుందో కూడా తెలియదు. పసుపు పంట ఎండబెట్టి మార్కెట్కు పంపుదామని చూస్తూంటే రోజూ వర్షమే. తడవటం, ఆరబెట్టడం ఇదే పనిగా మారింది. ఈ ఖర్చులే ఇప్పటి వరకూ రూ.10 వేలు అయ్యాయి. ఈ సీజన్లో వానల వల్ల పడ్డ ఇబ్బంది అంతా ఇంతా కాదు. – చెన్ను బాబూజీ, కౌలురైతు, గొడవర్రు అధికారులకు పట్టడంలేదు ఎకరంన్నరలో మొక్కజొన్న, ఎకరంన్నరలో పసుపు సాగు చేశాను. మొక్కజొన్న చేను పడిపోయి నష్టం జరిగిందని అధికారుల వద్దకు వెళ్లాను. పంట తీసుకొచ్చి చూపండని చెప్పారే కానీ వారు వచ్చి చేను చూడటం, నమోదు చేయటం జరగలేదు. ఇంకా మా బాధలు ఏం చెప్పాలి? తరుచూ కురుస్తున్న వానలకు పసుపు పంట తడుస్తోంది. కటిక వచ్చి నాణ్యత దెబ్బతింటే మార్కెట్లో ధర పడిపోయే ప్రమాదం ఉందని భయంగా ఉంది. – నూతక్కి ధనకోటేశ్వరరావు, కౌలురైతు, గొడవర్రు -
ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
మచిలీపట్నంటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నగరంలోని 38వ డివిజన్లో రూ.80 లక్షల వ్యయంతో నిర్మించనున్న పట్టణ ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి బుధవారం మంత్రి రవీంద్ర శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రధానంగా ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందన్నారు. ఈ కేంద్రం నిర్మాణం పూర్తయితే పరిసర ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికి, ముఖ్యంగా డయాలసిస్ రోగులకు చాలా ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల అనుసంధానంగా ఆసుపత్రి నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నామన్నారు. వైద్య కళాశాలలో ఫిజికల్ ఫిట్నెస్ కేంద్రం ఏర్పాటుకు రూ.12 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచామని త్వరలో పనులు మొదలవుతాయన్నారు. పేద ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిధులు రూ.3 కోట్లను ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు అందజేశామన్నారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ ఈ ఆరోగ్య కేంద్రం నిర్మాణం పూర్తయ్యాక పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ బాపిరాజు, డీఎంహెచ్ఓ డాక్టర్ శర్మిష్ట, మునిసిపల్ డీఈ కుబియా నాయక్, ఏఈ రాజేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకష్ణ, కొనకళ్ళ బుల్లయ్య అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర -
రాజ్యాధికారంతోనే అణగారిన వర్గాల అభివృద్ధి
చల్లపల్లి: జీవన విధానంలోని వ్యత్యాసాలను రూపుమాపాలన్నా, అణగారిన వర్గాలు అభివృద్ధి పథంలో నడవాలన్నా రాజ్యాధికారం ఒక్కటే మార్గమని, అందుకోసమే బహుజన సమాజ్ పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ అన్నారు. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అన్న నినాదంతో ప్రధాన రహదారి వెంట ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక షాదీఖానాలో సంకల్ప సభ నిర్వహించారు. తొలుత జ్యోతిరావు పూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, కాన్షీరామ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గుంటూరు నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో గౌతమ్ మాట్లాడుతూ సమాజంలో 25 శాతం ఉన్న ఎస్సీలు కేవలం మూడు శాతం మాత్రమే ఉన్న అగ్రవర్ణాల వారికి రాజ్యాధికారం కట్టబెట్టడం ఎంతవరకూ న్యాయమో ఆలోచించాలని కోరారు. బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుష్పరాజ్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా ఇంకా అణగారిన వర్గాల వారి గృహాలు ఊరి బయటే ఉంటున్నాయని అన్నారు. జిల్లా అధ్యక్షుడు గుంటూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి మండలంలో బీఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటుచేసి రాజ్యాధికారం సాధించే దిశగా అడుగులు వేయడానికి అందరూ ఐకమత్యంగా కలిసి రావాలని కోరారు. అనంతరం గౌతమ్కుమార్ను గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రవీంద్ర, దొండపాటి శామ్యూల్, బోసుబాబు, వెంకటేశ్వరరావు, మరియబాబు, బాలాజి, పెద్ద సంఖ్యలో బీఎస్పీ కార్యకర్తలు, సానుభూతిపరులు పాల్గొన్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ -
సంక్షేమం గాలికి.. కక్ష సాధింపే లక్ష్యంగా...
అవనిగడ్డ: సంక్షేమ పఽథకాలను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలే లక్ష్యంగా పాలన సాగిస్తోందని విజయవాడ సెంట్రల్ మాజీ శాసన సభ్యుడు మల్లాది విష్ణు విమర్శించారు. అవనిగడ్డ మాజీ శాసనసభ్యుడు సింహాద్రి రమేష్బాబు స్వగృహంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి కరెంట్ని రూ.2.40కి కొనుగోలు చేస్తూ విద్యుత్ ఒప్పందం కుదుర్చుకుంటే ఇప్పుడున్న కూటమి పార్టీలు నానా యాగీ చేశాయన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే కరెంట్ని రూ.4.60కు ఎలా కొనుగోలు చేస్తూ ఒప్పందం కుదుర్చుకుందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కృష్ణాజిల్లాలో రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసేవారు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో చాలా చోట్ల రైతులు కల్తీ విత్తనాలతో నష్టపోయినా, గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తుందే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మల్లాది విమర్శించారు. ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోయిన టీడీపీ కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. పోలీసులు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని, అందుకు తిరువూరు ఘటనే నిదర్శన మన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టులు ప్రభుత్వాన్ని, పోలీసులను హెచ్చరించినా బుద్ధి తెచ్చుకోవడం లేదన్నారు. అన్ని పన్నులు పెంచేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ చార్జీలు, నిత్యావరసర వస్తువులు, నీటి పన్నులు, ఇలా అన్నీ పెంచేశారని, ఇప్పుడు తాజాగా ఆస్తి పన్ను పెంచేందుకు రంగం సిద్ధం చేశారన్నారు. ప్రజాసమస్యలపై వైఎస్సార్సీపీ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు, జెడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, వైఎస్సార్సీపీ నాయకులు రాజనాల మాణిక్యాలరావు, గరికపాటి కృష్ణారావు పాల్గొన్నారు. కూటమి పాలనపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపాటు -
దుర్గమ్మ సేవలో మంత్రి అచ్చెన్నాయుడు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయ వాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు బుధవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన మంత్రికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో శీనానాయక్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. పెనమలూరు సర్పంచి 3 నెలలు సస్పెన్షన్ పెనమలూరు: పెనమలూరు సర్పంచి లింగాల భాస్కరరావును మూడు నెలల పాటు విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. పెనమలూరు గ్రామం పల్లిపేటలో నిబంధనలకు విరుద్ధంగా 15వ ఆర్థిక సంఘ నిధులు, రూ.55,25,112, గ్రామ పంచాయతీ సాధారణ నిధులతో పల్లిపేటలో సీసీ రోడ్డు వేశారని డీఎల్పీవో విచారణలో పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ నిధులు రూ.63,42,912 సర్పంచి భాస్కరరావు, పూర్వ పంచాయతీ కార్యదర్శి సుబ్బారావు అభ్యంతరకరంగా ఖర్చు చేశారని డీపీఓ నివేదిక ఇచ్చారు. దీంతో ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సర్పంచి భాస్కరరావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఉపసర్పంచి శీలం సుమతికి సర్పంచి బాధ్యతలు అప్పగించారు. చెక్ పవర్ ఉప సర్పంచితో పాటు డెప్యూటీ మండల పరిషత్ అధికారికి కౌంటర్ సంతకం చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. -
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి
చిలకలపూడి(మచిలీపట్నం): సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బాజీ పఠాన్ కోరారు. సీపీఎస్ విధానంపై ఆందోళన మరింత ఉధృతం చేసే కార్యక్రమంలో భాగంగా సెప్టెంబరు 1వ తేదీన గుంటూరు నుంచి విజయవాడ వరకు భారీఎత్తున పెన్షన్ మార్చ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ 2004 సెప్టెంబరు 1వ తేదీ తరువాత ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఉద్యోగంలో చేరిన ఉద్యోగులు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 3.5 లక్షల మంది ఉన్నారని 21 సంవత్సరాలుగా సీపీఎస్ ఉద్యోగులు దుర్భరజీవితం గడుపుతున్నారన్నారు. సీపీఎస్ రద్దుకు దశల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. గతంలో తాము ఉద్యమం చేపట్టినప్పుడు పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు పి.రాము, కార్యనిర్వాహక కార్యదర్శి సింహాద్రి రాంబాబు, ఉపాధ్యక్షుడు లోకేష్, కోటేశ్వరరావు, బాలాజీ, పరమేశ్వరరావు, తోట వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మకు వినతి సెప్టెంబరు 1న పెన్షన్ మార్చ్ ప్రకటన -
మసుల ఫెస్ట్ వేడుకలను విజయవంతం చేస్తాం
కోనేరుసెంటర్: జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్లో వచ్చే నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరగనున్న మసుల ఫెస్ట్ను విజయ వంతం చేసేందుకు అధికారులు సన్నద్ధం కావాలని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ రవి నాయుడు అన్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని నిర్వహించనున్న జల క్రీడలు, బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్ పోటీలను అందరి సమన్వయంతో సమర్థంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేయాలన్నారు. బుధవారం ఆయన మంగినపూడి బీచ్ను సందర్శించి అక్కడి ఏర్పాట్లకు సంబం ధించి అధికారులతో చర్చించారు. అనంతరం జల క్రీడలు నిర్వహించే ప్రదేశాన్ని పరిశీలించారు. క్రీడలను వేల సంఖ్యలో ప్రజలు వీక్షించేందుకు వీలుగా గ్యాలరీలు, విద్యుత్ దీపాలు, సౌండ్ సిస్టం, ప్రమాదాలు జరగకుండా రక్షణ వలయాలు పకడ్బందీగా చేయాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మచిలీపట్నానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా కెనోయింగ్, కయా కింగ్ వంటి జల క్రీడలు, బీచ్ కబడ్డీ, వాలీబాల్ వంటి పోటీలు నిర్వహించనున్నామని చెప్పారు. ఈ ఉత్సవాలకు మసుల ఫెస్ట్–25గా నామకరణం చేశామని, త్వరలో డాల్ఫిన్ లోగోను ఆవిష్కరిస్తామన్నారు. మత్స్యకారులకు గుర్తుగా ఈ చిహ్నాన్ని మలిచారన్నారు. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా సాంస్కృతిక, పర్యాటక రంగాలలో ఉన్న ప్రముఖులను ఈ ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మెప్మా పీడీ సాయిబాబు, డీఎస్డీఓ ఝాన్సీలక్ష్మి, విజయవాడ క్రీడల అధికారి కోటేశ్వరరావు, తహసీల్దార్ హరినాథ్, జల క్రీడల జిల్లా అధ్యక్షుడు దావులూరి సురేంద్రబాబు, ఫిలిం ఆర్ట్ డైరెక్టర్ రమణ వంక తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు అధికారులతో కలిసి మసుల ఫెస్ట్ ఏర్పాట్ల పరిశీలన ఏర్పాట్లకు సంబంధించి పలు సూచనలు, సలహాలు జారీ -
కృష్ణా నదిని డంపింగ్ యార్డులా చేస్తున్నారు
కొందరు వ్యక్తులు బిల్డింగ్ మెటీరియల్, ఇతర వ్యర్థాలను వాహనాల్లో తరలించి నదిలో కలుపుతున్నారు. వారధి వద్ద, రామలింగేశ్వరనగర్ ప్రాంతాల్లో విపరీతంగా వ్యర్థాలను నదిలో వదులుతున్నారు. కృష్ణానదిని డంపింగ్ యార్డుగా తయారుచేస్తున్నారు. పలుమార్లు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం. ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ వ్యక్తుల వాహనాలు నదిలోకి వెళ్లకుండా అబ్జర్వర్ను గానీ, గేటు గానీ ఏర్పాటు చేయాలి. నదులను కలుషితం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. –పుప్పాల కృష్ణ, సీపీఎం తూర్పు నగర కార్యదర్శి -
కాలుష్యం కోరల్లో కృష్ణమ్మ
పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంకృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రకృతి ప్రసాదించిన జీవనది కృష్ణమ్మకు కష్టాలు వచ్చి పడ్డాయి. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో ఓ వైపు మురుగునీరు, పేరుకుపోయిన చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలతో నదీ జలాలు కలుషితమవుతుంటే మరోవైపు భవన శిథిలాలు, మట్టితో కృష్ణానది పరివాహక ప్రాంతం పూడ్చివేతకు గురవుతోంది. రాణిగారితోట, 18వ డివిజన్లో వారధి వెంబడి ఉన్న ర్యాంప్ ద్వారా కొందరు ఇష్టారాజ్యంగా భవన నిర్మాణ వ్యర్థాలను ట్రాక్టర్లు, ఆటోల, ఇతర వాహనాల ద్వారా నదీగర్భంలోకి తరలించి డంప్ చేస్తుండగా సాక్షాత్తు ప్రభుత్వ అభివృద్ధి పనులు చేసే ఓ కాంట్రాక్టర్ కూడా టిప్పర్ల ద్వారా యథేచ్ఛగా మట్టిని నదిలోకి తొలి పూడ్చివేతకు పాల్పడుతున్నారు. కృష్ణానదిలో ఇసుక తిన్నెలతో పాటు నదీ పరివాహక ప్రాంతంలో ఎటువంటి ఆక్రమణ లు గానీ, వ్యర్థాలు గానీ లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ సంబంఽధిత అధికారులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తూ చోద్యం చూస్తుండడంపై పలు విమర్శలొస్తున్నాయి. కాలువలు, చెరువుల్లో పూడిక తీయాలని ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందిస్తుంటే ఇక్కడ అధికారులు మాత్రం కృష్ణానదిని వ్యర్థాలతో నింపి పూడ్చే దిశగా ప్రయత్నం చేస్తుండడం శోచనీయం. కృష్ణానదిపై పర్యవేక్షణ లోపించటం వలనే పూడ్చివేతకు గురవుతోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో, నదీగర్భంలో ఎలాంటి చెత్తాచెదారం, భవన శిథిలాలను వేయరాదని నిబంధనలు ఉన్నప్పటికీ కొందరు వాటిని అతిక్రమించి రేయింబగళ్లూ తేడా లేకుండా ట్రాక్టర్లు, ఆటోల ద్వారా నదిలో డంప్ చేస్తూ కృష్ణానదిని డంపింగ్ యార్డుగా మార్చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల రాణిగారితోట, 18వ డివిజన్, సిమెంట్ గోడౌన్స్లో ఓ కాంట్రాక్టర్ నూతనంగా వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. తానేం తక్కువ కాదన్నట్లు నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వగా వచ్చిన మట్టిని టిప్పర్ల ద్వారా నదీగర్భంలోకి తరలించి వారధి పక్కన, రిటైనింగ్ వాల్ వెంబడి డంప్ చేశారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు చోద్యం చూస్తున్నారో అర్థం కాని పరిస్థితి. దాదాపు 50 టిప్పర్ల వరకు మట్టిని నదిలోకి తరలించారని, అందుకు అధికారుల సహకారం ఉన్నట్లు సమాచారం. కృష్ణానది పూడ్చి వేతకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని పర్యావరణ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. ఇలా చేయడం వలన నదిలో వ్యర్థాలు పేరుకుపోయి రాబోయే రోజుల్లో నదీజలాలు అడుగంటి ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఏర్పడుతుందని, ఇప్పటికై నా అధికారులు స్పందించి నదీ గర్భ పరిశుభ్రతకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి నదీగర్భంలో వ్యర్థాలు వేయరాదని నిబంధనలు ఉన్నా కాంట్రాక్టర్ ఎవరి అండ చూసుకుని టన్నుల కొద్దీ మట్టిని నదిలోకి తరలించాడో చెప్పాలని పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్టర్తోనే నదిలో నుంచి మట్టిని తొలగించేందుకు చర్యలు చేపట్టి పర్యావరణాన్ని పరిరక్షించాలని, నదులను సంరక్షించే బాధ్యతను అధికారులు సక్రమంగా నిర్వర్తించాలని కోరుతున్నారు. రక్షణగా గేటు ఏర్పాటు చేస్తాం డంపింగ్ యార్డులా తయారైన కృష్ణానది వ్యర్థాలు, మట్టికుప్పలతో నింపేస్తున్న వైనం కాంట్రాక్టర్ బాధ్యతారాహిత్యం చోద్యం చూస్తున్న వీఎంసీ అధికారులు కృష్ణానదిలో వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకుంటాం. వాటర్ ట్యాంక్ నిర్మాణంలో భాగంగా వచ్చిన మట్టిని కాంట్రాక్టర్ కృష్ణానదిలో వేసినట్లు మా దృష్టికి వచ్చింది. వాటిని పరిశీలించి నోటీసులిస్తాం. అక్కడ నుంచి మట్టి కుప్పలను కాంట్రాక్టర్ తోనే తొలగింపచేసేందుకు చర్యలు తీసుకుంటాం. అనుమతి లేకుండా నదిలోకి ఎవరూ వెళ్లకుండా పటిష్ట చర్యలు చేపడతాం. రెండు మూడు నెలల్లో రక్షణగా గేటును ఏర్పాటు చేస్తాం. –సామ్రాజ్యం, వీఎంసీ ఈఈ (సర్కిల్–3) -
రోడ్డున పడిన ఎండీయూ ఆపరేటర్లు, హెల్పర్లు
పెనుగంచిప్రోలు: కూటమి ప్రభుత్వ దుర్మార్గపు చర్యల వలన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 వేల మంది ఎండీయూ ఆపరేటర్లు, హెల్పర్లు రోడ్డున పడ్డారని వైఎస్సార్ సీపీ ఎంపీపీల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మార్కపూడి గాంధీ అన్నారు. పెను గంచిప్రోలులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్ణయాలను అక్కసుతో వ్యతిరేకిస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా ఎండీయూ వాహనాలను అర్ధాంతరంగా తొలగించిందన్నారు. ఇప్పటికే 2.50 లక్షల మంది వలంటీర్లు, మద్యం దుకాణాల్లో పనిచేసే వారిని, వంట ఏజెన్సీ కార్మికులు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఈ ప్రభుత్వం తొలగించిందన్నారు. ఎండీయూ వాహనాల సిబ్బందిని ఎటువంటి చర్చలు లేకుండా ఒక్క సంతకంతో తొలగించటం దుర్మార్గపు చర్య అని అన్నారు. గతంలో రేషన్ దుకాణాల వద్ద ప్రజలు పడిగాపులు పడటాన్ని చూసిన నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఎండీయూ వ్యవస్థ తీసుకొచ్చి ఇళ్ల వద్దనే రేషన్ సరుకులు అందించారన్నారు. కూటమి ప్రభుత్వంలో రేషన్ వినియోగదారులకు మళ్లీ తిప్పలు తప్పవన్నారు. రాబోయే రోజుల్లో తొలగించిన ఉద్యోగులే కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ బీసీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు, నియోజకవర్గ ఎస్సీ సెల్, ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు కీసర లోకేశ్వరరావు, మెండెం రామారావు, మండల సోషల్ మీడియా కన్వీనర్ నలబోతు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కార్మికులకు శాపంగా మారిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో నిరసన, ధర్నా జరిగింది. కార్మికులకు శాపంగా మారిన నాలుగు లేబర్కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ప్రైవేటీకరణ విధానాన్ని రద్దు చేయాలని, ఎనిమిది పని గంటలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దోపిడీనే లక్ష్యంగా.. ధర్నాలో పాల్గొన్న ఆయా కార్మిక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన ఈ నాలుగు లేబర్ కోడ్లకు రూపకల్పన చేసి ప్రవేశపెట్టిందని విమర్శించారు. కార్పొరేట్లు యథేచ్ఛగా దోపీడీ కొనసాగించడమే కాకుండా కార్మికుల శ్రమను దోచుకునేందుకు కోడ్లు తెచ్చిందని మండిపడ్డారు. కార్మికులు పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులు, చట్టాలు కనుమరుగవుతున్నాయన్నారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లుతోందన్నారు. కార్మికుల జీతభత్యాలు సక్రమంగా అందవని, ఉద్యోగాలు తొలగింపు తీవ్రతరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నించినా, సమ్మె చేసినా క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రమాదకరమైన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి, తిరిగి కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.నూతన మార్కెట్ విధానం వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకుంటుందన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జూలై 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ధర్నాలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె. దుర్గారావు, ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి మూలీ సాంబశివరావు, సీఐటీయూ రాష్ట్ర నాయకులు వీఎల్ నరసింహులు, ఏ వెంకటేశ్వరరావు, ఏ కమల, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు వెంకటసుబ్బయ్య, కేఆర్ ఆంజనేయులు, ఏఐయూటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సుధీర్, ఏఐసీసీటీయూ రాష్ట్ర నాయకులు ఉదయ్ కుమార్, ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రామకృష్ణ, శంకర్, టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు మరీదు ప్రసాద్ బాబు పాల్గొన్నారు. కేంద్ర కార్మిక సంఘాల డిమాండ్ -
యోగా ప్రాధాన్యం తెలిసేలా యోగాంధ్ర
చిలకలపూడి(మచిలీపట్నం): యోగ ప్రాముఖ్యతను తెలియజేసేలా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ కోరారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో యోగాంధ్ర కార్యక్రమ నిర్వహణపై వివిధ శాఖల జిల్లా అధికారులతో ఇన్చార్జి కలెక్టర్ సమావేశమై చర్చించారు. ఆమె మాట్లాడుతూ జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రోజున విశాఖపట్నం సముద్రం ఒడ్డున రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారని, ఆ కార్యక్రమానికి భారత ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా హాజరవుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నెలరోజుల పాటు మే 21వ తేదీ నుంచి జూన్ 21 వరకు యోగ ప్రాముఖ్యతను తెలియజేసేలా యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమాన్ని నగరంలో నిర్వహిస్తున్నామని, బుధవారం ఉదయం నగరంలో ర్యాలీ, అనంతరం బ్యాడ్మింటన్ కోర్టు ఇండోర్ స్టేడియంలో కార్యక్రమం ప్రారంభిస్తామని, ముగింపు కార్యక్రమం మంగినపూడి బీచ్ లేదా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తామన్నారు. ఆ ప్రకారం కార్యక్రమం సజావుగా నిర్వహించేలా సమన్వయం చేసుకుంటూ సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమం ఇలా.. డీఆర్ఓ కె. చంద్రశేఖరరావు మాట్లాడుతూ ఉదయం 6.30 గంటలకు నగరంలోని సాయిబాబా గుడి నుంచి ర్యాలీగా బయలుదేరి జిల్లా కోర్టు సమీపంలోని బ్యాడ్మింటన్ కోర్టు ఇండోర్ స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ర్యాలీకి సంబంధించిన జెండాలు, బ్యానర్లు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కె.ఆర్.ఆర్.సి డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఝాన్సీ లక్ష్మి, నగర మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు తదితర శాఖాధికారులు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ -
చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
స్కానింగ్ సెంటర్లకు కలెక్టర్ లక్ష్మీశ హెచ్చరిక గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ (పీసీ–పీఎన్డీటీ) చట్టాన్ని ఉల్లంఘిస్తే స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ హెచ్చరించారు. సమన్వయ శాఖల అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు, డెకాయ్ ఆపరేషన్లను ముమ్మరం చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం, ఏఆర్టీ–సరోగసీ చట్టాల అమలుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు, సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కమ్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ ఎ.సత్యానంద్ హాజరయ్యారు. ప్రజల్లో అవగాహన కల్పించాలి.. సమావేశంలో కమిటీ చైర్మన్, కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ఫిర్యాదులు వస్తే వాటిని త్వరితగతిన విచారించి, తగిన చర్యలు తీసుకోవాలన్నారు. చట్టంలోని నిబంధనలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే ఉన్న స్కానింగ్ కేంద్రాలకు అదనంగా కొత్త రిజిస్ట్రేషన్లకు సంబంధించిన తొమ్మిది దరఖాస్తులను, మూడు రెన్యువల్ దరఖాస్తులను, నాలుగు క్యాన్సిలేషన్ దరఖాస్తులను కమిటీ పరిశీలించి, చర్చించి, ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఏఆర్టీ లెవెల్–1 కేటగిరీకి సంబంధించిన రెండు దరఖా స్తులు, ఏఆర్టీ లెవెల్–2 కేటగిరీకి సంబంధించిన రెండు దరఖాస్తులతో పాటు సరోగసీ క్లినిక్కు సంబంధించి ఒక దరఖాస్తుకు కమిటీ ఆమోదం తెలిపింది. సమావేశంలో డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, వాసవ్య స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి జి.రేష్మీ, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ పద్మజ, ఎన్హెచ్ఎం డీపీఎంవో డాక్టర్ నవీన్ పాల్గొన్నారు. -
కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ
గుణదల(విజయవాడ తూర్పు): రాష్ట్రంలో కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసి రాజ్యాధికారమే ధ్యేయంగా ఏకపక్ష ధోరణితో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని దుయ్యబట్టారు. గుణదలలోని తన కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ప్రజాసంక్షేమాన్ని కనుమరుగు చేసి ప్రజా స్వామ్యాన్ని హరించే దిశగా కూటమి ప్రభుత్వం నీచ రాజకీయాలకు తెగబడిందన్నారు. జిల్లాలోని తిరువూరు నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం తప్పుదారి పట్టింస్తోందన్నారు. ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ కౌన్సిలర్లకు మద్దతు ప్రకటించేందుకు వైఎస్సార్ సీపీ నాయకులం వెళ్తుండగా వంద లాది మంది టీడీపీ గూండాలు అడ్డగించారని పేర్కొన్నారు. నడిరోడ్డుపై తమ వాహనాలను నిలిపి, తమను చుట్టుముట్టి బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించలేని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏమి రక్షణ కల్పిస్తుందని సూటిగా ప్రశ్నించారు. ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలను, ఉద్రిక్త పరిస్థితులను వేదికగా మార్చారని దుయ్యబట్టారు. ఎన్నికల అధికారులను మరోమారు కలసి తమ సమస్యను చెప్పు కొంటామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని దుర్మార్గం సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందామంటున్న కూటమి నేతలు కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో దిగజారుడుతనంతో వ్యవహరించారని, ఇది దేశంలో ఎక్కడా లేని దుర్మార్గ మని ఎమ్మెల్సీ మొండితోక అరుణకుమార్ విమర్శించారు. మున్సిపల్ చైర్పర్సన్ పదవి కోసం నడిరోడ్డుపై దాదాగిరీ ప్రదర్శించిన కూటమి నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ అభ్యర్థులకు మద్దతు ప్రకటించేందుకు వెళ్తున్న వైఎస్సార్ సీపీ నేతలపై టీడీపీ నాయకులు హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులే టీడీపీ గూండాలకు మద్దతుగా నిలవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇటువంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, న్యాయం కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. తిరువూరు చైర్పర్సన్ ఎన్నికపై నీచరాజకీయాలు దౌర్జన్యాలు, దాడులకుతెగబడిన టీడీపీ గూండాలు వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ -
బ్లాస్టింగ్తో బండరాళ్లు వచ్చి పడుతున్నాయి..
రాతి క్వారీలో నాణ్యతలేని నాసిరకం పేలుళ్ల పదార్థాలను బ్లాస్టింగ్ సమయంలో ఉపయోగించటం ద్వారా అవి పెద్ద పెద్ద శబ్దంతో పేలుళ్లు వస్తున్నాయి. అనుభవం లేని కార్మికులచే నిబంధనలకు విరుద్ధంగా, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఆ బండరాళ్లన్నీ పొలాల్లోకి వచ్చి పడుతున్నాయి. అదే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలకు తీవ్రగాయాలైన సంఘటనలు ఉన్నాయి. నాణ్యత, మన్నిక లేని నాసిరకం పేలుళ్ల పదార్థాలు గాతాల్లో పెట్టి రాళ్లను పేల్చుతున్నారు. ఆ పేలుళ్లకు ఇంటి గోడలు పెచ్చులూడి పడుతున్నాయి. పేలుళ్ల సమయంలో రాళ్లు లేచి జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు సైతం తీవ్రగాయాలైన సంఘటనలు సాధారణమైంది. -
యోగాపై అవగాహన పెంచాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు యోగాంధ్ర పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. నెల రోజులు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు కృషిచేయాలని ఆదేశించారు. కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేసే యోగాపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో యోగా సంబంధిత కార్యక్రమాలను నిర్వహించా లని, ఉద్యోగులు, సిబ్బంది యోగా సాధన చేయాలని, పాఠశాల, కళాశాల విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని సూచించారు. బాపూ మ్యూజియం, కొండపల్లి ఖిల్లా, గాంధీ హిల్ వంటి చారిత్రక, పర్యాటక ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. టెలికాన్ఫరెన్స్లో విజయవాడ మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, ఆర్డీఓలు కె.చైతన్య, కె.బాలకృష్ణ, కె.మాధురి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కార్పొరేట్లకు సాగిల పడుతున్న పాలకులు కంకిపాడు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు సాగిల పడుతూ ఊడిగం చేస్తున్నా యని కౌలురైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. హరిబాబు విమర్శించారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కంకిపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం నిరసన చేపట్టారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకోవాలని కోరారు. కార్మిక, కర్షక వర్గాలు ఐక్యమై హక్కులు, చట్టాలను సాధించుకునేందుకు ఉద్యమిస్తున్నాయన్నారు. విద్యారంగంలో సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు ఆందో ళనబాట పట్టాయని స్పష్టంచేశారు. కనీస వేతనం అమలుచేయాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. నిరసన అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయ అధికారులకు అప్పగించారు. వివిధ ప్రజా సంఘాల మండల బాధ్యులు తాడంకి నరేష్, జి.కుమారి, వి.శివశంకర్, వి.జాన్మోజేస్, వి.మరియదాసు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
గ్రంథాలయాలు మనో వికాస కేంద్రాలు
విజయవాడకల్చరల్: గ్రంథాలయాలు మనోవికాస కేంద్రాలని ఏపీ గ్రంథాలయ పరిషత్ రాష్ట్ర సంచాలకుడు కృష్ణమోహన్ అన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ, గ్రంథాలయ పునర్వికాస వేదిక, స్వేచ్ఛ ఆంధ్ర ఆధ్వర్యంలో 15 రోజులపాటు నిర్వహించే గ్రంథాలయ వర్క్షాప్ను గవర్నర్పేటలోని బుక్ఫెస్టివల్ సొసైటీ కార్యాలయంలో ఆయన మంగ ళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ.. బాలబాలికలకు నిత్య పఠనాన్ని అలవాటు చేయాలని సూచించారు. వేసవి సెలవుల్లో గ్రంథాలయాలను విద్యార్థులు సందర్శించాలన్నారు. గ్రంథాలయాల కోసం కొత్త వెబ్సైట్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రంథాలయ ఉద్యమనేత గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో గ్రంథాలయ పునర్వికాసానికి గ్రంథా లయ పునర్వికాస వేదిక ద్వారా కృషి చేస్తున్నామని, ప్రజలు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు సహకరించాలని కోరారు. గ్రంథాలయ పునర్వికాస వేదిక రాష్ట్ర కన్వీనర్ వల్లూరి శివప్రసాద్ మాట్లాడుతూ గ్రంథాలయాల పూర్వవైభవం కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. పిల్లల ఠాగూర్ గ్రంథాన్ని కృష్ణమోన్ ఆవిష్కరించారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యవర్గసభ్యులు మనోహర్ నాయుడు, లక్ష్మయ్య, అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ, ఎమెస్కో లక్ష్మీ, పల్లవి వెంకటనారాయణ, అరణ్కుమార్, జేసీ ప్రసాద్, నవరత్న రవి, సుబ్బరామయ్య, శైలజామూర్తి, నాగిరెడ్డి పాల్గొన్నారు. -
అమ్మ భూమిపై విచారణలో జాప్యం
కంకిపాడు: అమ్మవారి భూమి అన్యాక్రాంతం వ్యవహారం ఇంకా ఓ కొలిక్కిరాలేదు. భూ ఆక్రమణ వ్యవహారం వెలుగులోకి వచ్చి రోజులు గడిచిపోతున్నా విచారణ పేరుతో కాలయాపన జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దేవదాయశాఖ అధికారులు ఇంకా విచారణ సాగిస్తున్నారు. రెవెన్యూ రికార్డులతో పాటుగా కన్యకా పరమేశ్వరి సత్రానికి చెందిన దస్తావేజులు, రికార్డులను సైతం పరిశీలన చేస్తున్నారు. కోట్లాది రూపాయల విలువైన భూమిని పరిరక్షించటంలో తాత్సారంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంకిపాడు మండలం నెప్పల్లి గ్రామ పరిధిలో ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సుమారు 20 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వెంచరు వేస్తోంది. దీనికి సరైన రహదారి సదుపాయం లేకపోవటంతో సమీపంలోని మరో వెంచరు నిర్వాహకులతో మాట్లా డుకుని అందులో నుంచి తమ వెంచరులోకి దారి ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 20 సెంట్లకు పైగా భూమిలో రోడ్డు నిర్మించారు. ఈ దారి నిర్మాణమే వివాదాస్పదమైంది. దారి నిర్మించిన భూమి దేవదాయశాఖ పరిధిలోనిదని కొందరు, కన్యకాపరమేశ్వరి సత్రానికి చెందిన భూమని మరి కొందరు చెబుతున్నారు. ఫిర్యాదులతో వెలుగులోకి.. నెప్పల్లి గ్రామానికి చెందిన కొందరు ఈ భూమి అన్యాక్రాంతం అవుతోందంటూ కృష్ణా జిల్లా కలెక్టరు సహా దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో భూమి అన్యాక్రాంతం వ్యవహారం వెలుగుచూసింది. దీనిపై ఈనెల 7న ‘అమ్మవారి భూమి అన్యాక్రాంతం’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీంతో దేవదాయశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. క్షేత్రస్థాయి పరిశీలనలో గ్రామంలోని సర్వే నంబరు 101లో ఉన్న 4.41 ఎకరాల భూమి ఉందని తేలింది. ఈ భూమి ఆర్ఎస్ఆర్లో విజయవాడ కనకదుర్గ దేవస్థానానికి చెందినదిగా ఉంది. అడంగల్లో మాత్రం కన్యకాపరమేశ్వరి సత్రం భూమిగా నమోదైంది. రెండు రికార్డుల్లో రెండు విధాలుగా ఎందుకు నమోదై ఉంద న్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. భూ వివాదం వెలుగులోకి వచ్చాక, ఎకరాకు రూ.200 చొప్పున సత్రం కన్యకాపరమేశ్వరి సత్రం నిర్వాహకులు తహసీలు చెల్లించారు. వివాదం తేలే వరకూ ఉండకుండా సత్రం నిర్వాహకులు నుంచి రెవెన్యూ అధికారులు తహసీలు వసూలు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెప్పల్లి భూ వివాదానికి తెరపడేదెప్పుడో? నేటికీ కొనసాగుతున్న వెంచరు పనులు రికార్డుల పరిశీలనలో దేవదాయ శాఖ ఉత్సవాల నిర్వహణకు భూమి అప్పగించారంటున్న సత్రం నిర్వాహకులు భూమిని పరిరక్షిస్తాం వివాదాస్పద భూమిని కచ్చితంగా పరిరక్షిస్తాం. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన చర్యలను అడ్డుకుంటాం. రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్నాం. సమస్య జిల్లా కలెక్టరు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంది. సత్రం నిర్వాహకులు కూడా కొన్ని వివరాలను అధికారులకు అందించారు. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది. భూమిని అన్యాక్రాంతం కానివ్వబోం. – నూతక్కి వెంకట సాంబశివరావు, ఏసీ, దేవదాయశాఖ, కృష్ణాజిల్లా రూ.కోట్ల విలువైన భూమికి రక్షణ లభించేనా? కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూమికి రక్షణ లభించేనా అన్న అనుమానాలు నెప్పల్లి గ్రామస్తులు వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం నెప్పల్లి పరిసరాల్లో ఎకరం భూమి విలువ రూ.5 కోట్ల వరకూ పలుకుతోంది. ఈ లెక్కన 4.41 ఎకరాల విలువ రూ.20 కోట్లు పైగా పలుకుతుంది. కోటి రూపాయల విలువైన దేవదాయ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా వెంచరు నిర్వాహకులు రోడ్డు నిర్మించి యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నారు. ఈ మార్గం గుండానే వెంచ రులోకి అవసరమైన నిర్మాణ సామాగ్రిని తర లిస్తూ దర్పం ప్రదర్శిస్తున్నారు. భూమి వ్యవహారం తేలే వరకూ రియల్ ఎస్టేట్ వెంచర్ నిర్వాహకులను కట్టడి చేయటం, భూమిని స్వా ధీనం చేసుకునే ప్రక్రియలో అధికారులు మెతకవైఖరి ఎందుకు ప్రదర్శిస్తున్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భూమి లీజు కేటాయింపులు అదే గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి ఎలా దక్కాయన్నది కూడా ప్రశ్నగానే మిగిలింది. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన దేవదాయ శాఖ అధికారులు మాత్రం రోడ్డు నిర్మాణం అక్రమమేనని, పరిరక్షిస్తామని చెబుతున్నారు. సత్రం నిర్వాహకులు మాత్రం తమకు ఈ భూమిని ఉత్సవాల నిర్వహణకు ఏళ్లనాడు అప్పగించారంటూ కలెక్టరుకు సమర్పించిన నివేదికలో పొందుపర్చినట్లు తెలుస్తోంది. -
ప్రజల్లో సంతృప్తి స్థాయిని పెంచాలి
కృష్ణా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలిశర్మ చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంచేలా ప్రభుత్వ శాఖల్లో పనితీరు మెరుగుపరుచుకోవాలని కృష్ణా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలిశర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి ముఖ్యమంత్రి కార్యాలయ చీఫ్ గవర్నెన్స్ అధికారి మంగళవారం నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్లో ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ, పలువురు అధికారులు వీడియోకాన్ఫరెన్స్ హాలు నుంచి పాల్గొన్నారు. జూమ్ కాన్ఫరెన్స్ అనంతరం గీతాంజలిశర్మ అధికారులతో మాట్లాడుతూ.. అర్జీదారులతో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నేరుగా కాల్సెంటర్ 1100 నంబరు నుంచి మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారని, దాని విశ్లేషణ ఆధారంగా ప్రభుత్వశాఖల అధికారులకు ర్యాంకింగ్ ఇస్తున్నా రని పేర్కొన్నారు. ఇకపై ప్రజాసమస్యలపై వెంటనే స్పందించి వారితో సానుకూలంగా మాట్లాడి అర్జీల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. డీఆర్వో కె. చంద్రశేఖరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాల నలో ప్రజల సంతృప్తి స్థాయి చాలా కీలకమన్నారు. మండలాల్లో పరిపాలనా విధానం బాగాలేదని ప్రజలు చెబుతున్నట్లు నివేదికలు అందుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి జూన్ 12వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో ఏ మేరకు సేవలు అందుతున్నాయో అడిగి తెలుసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఐసీడీఎస్ పీడీ ఎం.ఎన్.రాణి, డీఎస్ఓ వి.పార్వతి, ఇన్చార్జ్ సీఈఓ ఆర్.సి.ఆనంద్కుమార్, పంచాయతీరాజ్ ఎస్ఈ రమణరావు, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి
పెనమలూరు: మండలంలోని కానూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ కథనం మేరకు.. కానూరు కామయ్యతోపు ప్రాంతా నికి చెందిన చిలికోటి సరోజిని(65) మంగళవారం రాయల్ ఫర్నిచర్ షాపు వద్ద బందరు రోడ్డు దాటుతుండగా వేంగా వచ్చిన బైక్ ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సరోజిని అపస్మారకస్థితికి చేరుకుంది ఆమెను హుటాహుటిన విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. -
డాబాపై నుంచి పడి వృద్ధుడి మృతి
పెడన: సోమవారం రాత్రి డాబాపై నిద్రించి వర్షం పడుతోందని కిందకు దిగుతూ ప్రమాదవశాత్తు కిందపడి వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన పెడన పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వేకువ జామున జరి గింది. పెడన పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కవిపురం గ్రామానికి చెందిన పుప్పాల మాణిక్యాల రావు (67) తన భార్య వీరకుమారితో కలిసి సోమవారం డాబాపై నిద్రించారు. మంగళవారం వేకువ జామున వర్షం పడుతుండ టంతో భార్యాభర్తలు కిందికి దిగుతున్న సమయంలో మాణిక్యాలరావు ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. కిందనున్న పిల్లర్లు ఊచలు మాణిక్యాలరావు ఛాతీలో బలంగా దిగబడ్డాయి. వీరకుమారి అరుపులకు ఇంట్లోని కుమారుడు, చుట్టు పక్కల వారు వచ్చి మాణిక్యాల రావును పైకి తీసి అంబులెన్సులో మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మాణిక్యాలరావు మృతిచెందాడని నిర్ధారించారు. మృతుడి చిన్నకుమారుడు బాలకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెడన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పచ్చని పొలాలకు కాలుష్య కాటు
అంజనీపుత్రుడికి భక్తజన నీరాజనాలు కంచికచర్ల: రాతి క్వారీలు, క్రషర్లు వెదజల్లే దుమ్ము ధూళి వల్ల రెండు పంటలు పండే పొలాలన్నీ బీడు భూములుగా మారుతున్నాయి. పంటలు సాగుచేసే సమయంలో సాగర్ కాలువను పూడ్చటంతో సాగునీరు సరఫరా కాక పంటలన్నీ ఎండిపోతున్నాయి. పొలాలను అమ్ముకుని ఇతర ప్రాంతాల్లో భూములను కొనుగోలు చేద్దామనుకుంటే క్రషర్ యజమానులు భూములను అమ్ముకోవద్దని తమను బెదిరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంచికచర్ల మండలం పరిటాల శివారు దొనబండ సమీపంలో 801 సర్వే నంబర్లలో 74 రాతి క్వారీలు, 25 వరకు క్రషర్లు ఉన్నాయి. క్వారీలు, క్రషర్ల సమీపంలో 450 ఎకరాల పంట భూములున్నాయి. ఆ భూముల్లో రైతులు పంటలు సాగు చేద్దామన్నా కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయి. నిత్యం వందల సంఖ్యలో లారీలకు భారీగా లోడింగ్ చేసి కంకర, మట్టి తరలిస్తున్నారు. దీంతో కాలుష్యం నిరంతరం వెదజల్లుతోంది. సాగర్ జలాలు రాకుండా కాల్వ పూడ్చివేత.. పంట పొలాలకు నాగార్జున సాగర్ జలాలు వచ్చేవి. ఆ నీటితో మూడు దశాబ్దాల క్రితం వరకు ఆ భూముల్లో రైతులు రెండు పంటలు పండించేవారు. కానీ క్వారీ గుత్తేదారులు, క్రషర్ల యజమానులు వారి వ్యాపారం కోసం సాగర్ కాలువలను సైతం పూడ్చివేసి రోడ్లు వేసుకున్నారు. దీంతో పంటలు సాగుచేసేందుకు సాగునీరు రాకపోవటంతో రైతుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. క్రషర్ల యజమానుల బెదిరింపులు.. పంట పొలాలను తక్కువ ధరకు ఇవ్వాలని లేకపోతే ఇతరులకు ఎవరికి విక్రయించినా ఊరుకునేది లేదని క్వారీ గుత్తేదారులు బెదిరిస్తున్నారని రైతులు చెబుతున్నారు. రాజధానికి అతి సమీపంలో ఉన్న తమ పొలాలు బయట మార్కెట్లో ఎకరం భూమి రూ. కోటి 20 లక్షలు వరకు కొనుగోలు జరుగుతున్నాయని క్వారీ నిర్వాహకులు మాత్రం తమ భూములను కేవలం రూ.40 లక్షలకే ఇవ్వాలని బెదిరిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. దుమ్ము ధూళితో బీడు భూములుగా మారుతున్న వైనం సాగర్ కాల్వను పూడ్చటంతో సరఫరా కాని సాగు జలాలు భూములను అమ్ముకుందామన్నా బెదిరిస్తున్న క్రషర్ల యజమానులు ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న రైతులు -
కృష్ణా జిల్లాలో 44.3 మి.మీ. సగటు వర్షపాతం
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో 44.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం మంగళవారం నమోదైంది. అత్యధికంగా పమిడి ముక్కల మండలంలో 87.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా గన్నవరం మండలంలో 10.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని మిగిలిన మండలాల్లోని నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. చల్లపల్లి మండలంలో 71.8 మిల్లీమీటర్లు, మోపిదేవి 70.2, ఘంటసాల 69.2, పామర్రు 60.6, అవనిగడ్డ 57.4, మచిలీపట్నం 54.2, గుడ్లవల్లేరు 52.6, మొవ్వ, నాగాయలంక 50.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గుడివాడ మండలంలో 49.4 మిల్లీమీటర్లు, ఉయ్యూరు 48.2, బంటుమిల్లి 46.2, కంకిపాడు 44.2, పెదపారుపూడి 43.2, గూడూరు 36.0, నందివాడ 32.4, కోడూరు 31.2, పెనమలూరు 29.4, పెడన 28.8, తోట్లవల్లూరు 26.6, ఉంగుటూరు 21.4, కృత్తివెన్ను 18.2, బాపులపాడు మండలంలో 16.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్భారీ వర్షాలతో ఎలాంటి ఇబ్బంది కలిగినా సమాచారం ఇవ్వండి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, మునిసిపల్, వ్యవసాయ తదితర శాఖల అధికారులను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లో ప్రత్యేకంగా 9154 970 454 నంబర్తో కమాండ్ కంట్రోల్ కేంద్రం (సీసీసీ) ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భారీ వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా ఈ నంబర్లో సంప్రదించి, సమాచారమివ్వాలని కోరారు. తాగునీరు కలుషితం కాకుండా, సరఫరాలో ఆటంకం లేకుండా పంచాయతీరాజ్, మునిసిపల్ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి, నిరంతరం పరిస్థితిని సమీక్షించాలన్నారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా.. రోడ్లపై నిలిచిన నీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపేందుకు అవసరమైన సిబ్బంది, ఇంజిన్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఒకవేళ ఎక్కడైనా చెట్లు కూలితే వెంటనే తొలగించేలా ఆదేశాలిచ్చామన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని.. చెట్ల కింద నిలబడవద్దని, వాహనాలను భద్రమైన ప్రదేశాల్లో పార్క్ చేసుకోవాలని సూచించారు. టంగుటూరి జీవితం స్ఫూర్తిదాయకం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నేటి తరం యువత ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మంగళవారం తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద లోబ్రిడ్జి సమీపంలోని ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం వద్ద ఆయన 60వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆంధ్రకేసరి టంగుటూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు జీవిత విశేషాలను వివరించారు. కార్పొరేటర్ శర్వాణి మూర్తి, చల్ల సుధాకర్, తోపుల వర లక్ష్మి, మాత మహేష్,మురళి కృష్ణంరాజు, గజ్జల కొండ వాసు పాల్గొన్నారు. ‘పది’ పరీక్షలు రెండో రోజూ ప్రశాంతం వన్టౌన్(విజయవాడపశ్చిమ): పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రెండో రోజు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. మంగళవారం సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష 30 కేంద్రాల్లో నిర్వహించారు. 495 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 260 మంది పరీక్ష రాశారు. 52.53 శాతం మాత్రమే హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. 235 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. ఓపెన్ స్కూల్ పరీక్షలకు సంబంధించి మరో 29 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. జిల్లా విద్యాశాఖ నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్లు 28 పరీక్ష కేంద్రాలను పరిశీలించాయి. జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు పాత బస్తీలోని సుందరమ్మ వీఎంసీ బాలికల ఉన్నత పాఠశాల, సెయింట్ ఆంథోని హైస్కూల్తో పాటుగా పలు కేంద్రాలను పరిశీలించారు. -
కృష్ణాజిల్లా
బుధవారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2025రైల్వేస్టేషన్లో పోలీసుల తనిఖీలు వన్టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వేస్టేషన్లో జీఆర్పీ పోలీసులు మంగళవారం జాగిలాల సాయంతో విస్తృత తనిఖీలు నిర్వహించారు. టీడీపీ దౌర్జన్యం తిరువూరు మునిసిపల్ చైర్మన్ ఎన్నికను ఎలాగైనా అడ్డుకోవాలని కూటమి నాయకులు వైఎస్సార్ సీపీ నాయకులను దారి కాచి అడ్డగించారు. భారీ వర్షం అవనిగడ్డ: దివిసీమలోని పలు ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారు జామున కుండపోత వర్షం కురిసింది. దీంతో పలు రోడ్లు జలమయమయ్యాయి. అధునాతన భవనాలు కట్టినా పాత ఇంటి బిల్లులు ఇంకా జనరేట్ అవుతున్నట్లు డీఏంఏ కార్యాలయానికి ఫిర్యాదులు చేరినట్లుగా తెలిసింది. కొత్తగా భవనాలు నిర్మించినా, మొదటి అంతస్తు వరకు పన్ను వేసి రెండు, మూడు అంతస్తులకు పన్నులు వేయకపోవడం, కాలనీలకు పన్నులు వేయకపోవడం, డాక్యూమెంట్లు సరిగ్గా లేవని పన్నులు వేయకుండా ఉండటం వంటి విషయంలో డీఎంఏ కార్యాలయం చాలా సీరియస్గా స్పందించినట్లు అధికారులు చెబుతున్నారు. తక్షణం ఇటువంటి వాటిని గుర్తించి 20 శాతం పన్ను వేయాల్సిందేనని స్పష్టం చేసినట్లు వివరిస్తున్నారు. కొలతలు ప్రకారం పన్ను ఉందా లేక తగ్గిందా చూడాలని, ఏమాత్రం తగ్గినట్లు అనుమానం ఉన్నా తక్షణం వాటికి పన్నులు వేయాలని పేర్కొందని చెబుతున్నారు. డీఎంఏ కార్యాలయం నుంచి వెళ్లిన బృందాలకు పలు మునిసిపాలిటీల్లో, కార్పొరేషన్లలో ఈ దుస్థితి ఎదురైందని, పలువురు అడ్మిన్లను సస్పెండ్ చేసినట్లు పేర్కొంటూ హెచ్చరికలు జారీ చేసిందని వివరిస్తున్నారు.పెడన: పట్టణాలు, నగరాల్లో ఆస్తిపన్ను అసెస్ మెంట్లు పెరుగుతున్నా ఆదాయం పెరగకపోవడంపై పురపాలక శాఖ పరిపాలన విభాగం(డీఎంఏ) సీరి యస్ అయ్యింది. ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులు, టెలికాన్ఫరెన్సుల్లో ఇదే విషయాన్ని మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లోని అధికారులకు స్పష్టం చేసింది. పన్నులు వసూళ్లు చేయడంలోనే కాకుండా ఇంకా పాత రేట్లను కొనసాగిస్తున్నారంటూ మండిపడింది. ఆయా కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో అసెస్మెంట్లు పెరుగుతున్న స్థాయిలో ఆస్తి పన్నులు కూడా పెరగాల్సి ఉండగా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉందని.. తక్షణం వార్డు సచివాలయాల్లో ని అడ్మిన్లు, ఇంజినీరింగ్, ప్లానింగ్ కార్యదర్శులతో పునఃపరిశీలన చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పెడన పురపాలక సంఘ కార్యాలయం ఆదేశాలు నిజమే.. అసెస్మెంట్లు పెరుగుతున్నా.. ఆదాయం పెరగడం లేదని, ఆస్తి పన్నులు పునఃపరిశీలన చేయాలని డీఎంఏ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల జరిగిన వీసీల్లోను, టీసీల్లో ఇదే విషయమై చర్చ కూడా జరిగింది. అడ్మిన్ల వ్యవస్థ వచ్చిన తర్వాత ఆస్తిపన్నులు పెంపుదలలో బాగా వెనుకబడ్డారని తెలిపింది. గతంలో బిల్ కలెక్టర్లు ఉన్న సమయంలో పనులు సక్రమంగా జరిగేవని, ఇప్పుడు ఎందుకు ఆస్తి పన్నులు పెంచలేదని ఉన్నతాధికారులు అడిగారు. అనుమానం ఉన్న ఇంటిని కాదు, ప్రతి ఇంటినీ క్రాస్ చెక్ చేయాలని ఆదేశించారు. ఆ దిశగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. – పి.వెంకటేశ్వరరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్,పురపాలక సంఘం, పెడన 7న్యూస్రీల్భవనాలు కట్టినా.. కృష్ణాజిల్లాలో పెరిగిన అసెస్మెంట్ల వివరాలు.. కార్పొరేషన్/ అసెస్మెంట్లు మునిసిపాలిటీ 2023–24 2024–25 పెరిగినవిమచిలీపట్నం 48,272 52,570 4,298 గుడివాడ 26,258 29,384 3,126 తాడిగడప 44,671 48,006 3,335 ఉయ్యూరు 9,911 10,119 208 పెడన 7,234 7,578 344 ఆస్తి పన్నుల రూపంలో ఆదాయం వచ్చే విషయంలో మీనమేషాలు లెక్కిస్తే మాత్రం శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని డీఎంఏ స్పష్టం చేసింది. డీఎంఏ కార్యాలయం నుంచి ప్రత్యేక బృందాలు ఆస్తి పన్నులపై క్రాస్ చెక్ చేస్తాయని, ఆ సమయంలో ఏమైనా పన్నులు సక్రమంగా వేయలేదని గుర్తిస్తే మాత్రం సస్పెన్షన్కు గురికావాల్సి ఉంటుందని కూడా హెచ్చరికలు జారీ చేసింది. దీంతో వార్డు సచివాలయాలకు చెందిన అడ్మిన్లు ఆస్తిపన్నులపై దృష్టి సారించారు. చాలా చోట్ల సిఫార్సులతోను, రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో కొన్ని ఇళ్లకు సక్రమంగా పన్నులు విధించడం లేదని విషయాలపై కూడా ఫిర్యాదులు డీఎంఏ కార్యాలయానికి వెళ్లినట్లు సమాచారం. -
అభయాంజనేయునికి విశేష పూజలు
హనుమాన్జంక్షన్రూరల్: హనుమాన్జంక్షన్లోని ప్రసిద్ధ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమజ్జయంతి ఉత్సవాలు మూడో రోజైన సోమవారం ఘనంగా జరిగాయి. ఉత్సవాలను పురస్కరించుకుని దేవస్థానాన్ని, స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయం వద్ద బారులు తీరారు. ప్రధాన అర్చకులు మారేపల్లి సీతారామానుజాచార్యులు, అర్చకులు గొట్టిపాళ్ల శ్రీనివాసాచార్యులు, శృంగారం వెంకట శేషారామాచార్యులు అంజనీపుత్రునికి ప్రభాత సేవ, 1,008 చామంతి పూలతో ప్రత్యేక పూజలు చేశారు. అధ్యాత్మిక వేదికపై కోదండ రామాంజనేయ భజన మండలి (బిళ్లనపల్లి) భక్త బృందం సభ్యులు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. సాయంత్రం హనుమంతునికి బంగారు, వెండి పుష్పాలతో ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఆలయం ఎదుట సాయికృష్ణ భజన మండలి మహిళలు నిర్వహించిన కోలాటం ఆద్యంతం ఆకట్టుకుంది. కొరియోగ్రాఫర్ అనిల్కుమార్ ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన ‘డ్యాన్స్ బేబి డ్యాన్స్’ నృత్య ప్రదర్శన, నవీన ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో నిర్వహించిన సినీ మ్యూజికల్ నైట్ అలరించింది. ఆలయ కార్యనిర్వాహణాధికారి పితాని తారకేశ్వరరావు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
అన్నమయ్య పదశోభకు పట్టంకట్టిన సంకీర్తనలు
విజయవాడకల్చరల్: శ్రీ వెంకటేశ్వర సంకీర్తనా అకాడమీ(శ్వాస), కంచికామకోటిపీఠస్థ శారదా చంద్రమౌళీశ్వర, వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య 617వ జయంతి సందర్భంగా లబ్బీపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న పదయజ్ఞం కార్యక్రమాలు సోమవారంతో ముగిశాయి. చివరి రోజు కార్యక్రమంలో ముడుంబై లక్ష్మి, రుగ్వేదం సోదరీమణులు, వడ్డాది కామేశ్వరి, వీరుభొట్ల సీతారమణి, తిరుపతికి చెందిన చిన్నమదేవి, ఎన్సీ శ్రీదేవిలు సంగీత యజ్ఞంలో పాల్గొన్నారు. అన్నమయ్య సంకీర్తనలకు విశేష ప్రాధాన్యం కలిగించిన గరిమెళ్ల బాల కృష్ణప్రసాద్ స్మృత్యర్ధం ఆయన ఆలపించిన కీర్తనల వీడియోలను, ఆయన అందుకున్న పురస్కారాలను ప్రదర్శించారు. అలరించిన సప్తగిరుల సంకీర్తనం.. తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామివారిని చేరుకోవాలంటే ఏడుకొండలను దాటి రావాలి ఒక్కో పర్వతానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. వాటిని ప్రాధాన్యతను వివరిస్తూ అన్నమయ్య రచించిన కీర్తనలకు సప్తగిరులని పేరు అవి భావములోన, బ్రహ్మకడిగిన పాదము, యెంతమాత్రమున, పొడగంటిమయ్యా, కొండలలోనెలకొన్న, నారాయణతే నమోనమో, ముద్గుగారే యశోద కీర్తనలను నగరానికి చెందిన పలువురు విద్వాంసులు మధురంగా ఆలపించారు. నిర్వాహకులు స్వామి వారికి ఊంజల్ సేవను వైభవంగా నిర్వహించారు. లబ్బీపేట శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మాగంటి వేణుగోపాల్, కార్యనిర్వాహకుడు డాక్టర్ సి.రామ్మోహనరావు, మేనేజర్ శర్మ పాల్గొన్నారు. కారు ఢీకొని ఆటోడ్రైవర్ మృతి కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కారు ఆటోను ఢీ కొట్టిన ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృత్యువాత పడ్డాడు. కొండపల్లి శాంతినగర్ సమీపంలో 30వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కొండపల్లి గ్రామానికి చెందిన కంపా సాంబయ్య(59) ఆటోడ్రైవర్గా పని చేస్తాడు. ఇబ్రహీంపట్నం నుంచి జి.కొండూరు వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన కారు ఆటోను ఢీకొట్టింది. ఈప్రమాదంలో కంపా సాంబయ్య అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికుల సమాచారం మేరకు 108 వాహన సిబ్బంది చేరుకుని వైద్యపరీక్షలు జరిపి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆటోలో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉండగా, ఇద్దరికి వివాహాలయ్యాయి. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ప్రతి ఫిర్యాదును పరిష్కరించండి
మీ కోసంలో కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు కోనేరుసెంటర్: మీ కోసంలో వచ్చిన ప్రతి ఫిర్యాదును ఖచ్చితంగా పరిష్కరించాలని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు జిల్లాలోని పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని స్పందన హాలులో సోమవారం జరిగిన మీ కోసంలో పాల్గొన్న ఆయన వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 33 మంది బాధితుల ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులు అందించిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు.. కొన్ని అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించి బాధితులకు భరోసా కల్పించారు. మరికొన్ని అర్జీలను చట్ట పరిధిలో విచారణ జరిపి తదుపరి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మీ కోసంలో వచ్చిన ప్రతి ఫిర్యాదును అధికారులు, సిబ్బంది గౌరవంగా స్వీకరించాలన్నారు. సమస్య ఎలాంటిదైనా తొలుత అర్జీని అందుకుని పూర్తి విచారణ జరిపిన తరువాత చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించాలని చెప్పారు. బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా మసులుకోవాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలిసినా, అమర్యాదగా మాట్లాడినట్లు తన దృష్టికి వచ్చినా సంబంధిత సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వచ్చిన అర్జీల్లో కొన్ని.. ● గుడివాడకు చెందిన మాధవి అనే యువతి ఎస్పీని కలిసి ఆర్థిక అవసరాల నిమిత్తం తన స్నేహితురాలికి రెండు లక్షల రూపాయలను అప్పుగా ఇచ్చానని తెలిపింది. తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వమని అడుగుతుంటే స్నేహితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులు తనను దూషిస్తూ దాడికి సైతం దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని కోరింది. ● అవనిగడ్డ నుంచి బాలస్వామి అనే రైతు తన వ్యవసాయ భూమిలో సాగు చేసుకుంటుండగా సరిహద్దుదారుడు తన పొలంలోకి వెళ్లేందుకు దారి ఇవ్వకపోగా దాడికి దిగుతున్నాడని తెలిపాడు. అతనిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరాడు. ● గన్నవరానికి చెందిన దివ్య అనే మహిళ నాలుగేళ్ల క్రితం తనకు వివాహం జరిగిందని భర్త, ఆయన కుటుంబ సభ్యులు అధిక కట్నం తీసుకురావాలని ప్రతి రోజు వేధిస్తున్నారని కన్నీరు పెట్టుకుంది. వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని వేడుకుంది. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వి.నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. -
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత కావాలి
కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ కృష్ణలంక(విజయవాడతూర్పు): భారత రాజ్యాంగ పరిరక్షణ వర్తమానంలో అందరి బాధ్యత కావాలని సీనియర్ పాత్రికేయుడు, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. పాలనకు పక్షవాతం సోకిందని, ఫెడరలిజానికి ప్రమాదం ఏర్పడిందన్నారు. గవర్నర్పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో స్వాతంత్య్ర సమరయోధుడు, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా భారతదేశ ఫెడరల్ వ్యవస్థ–ఎదురవుతున్న సవాళ్లు అనే అంశంపై ఎం.బి.విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ చైర్మన్ పి.మధు అధ్యక్షతన సోమవారం స్మారకోపన్యాసం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీధర్ సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఫోర్త్ ఎస్టేట్లో ప్రశ్నించే ధోరణి లేదు.. అనంతరం శ్రీధర్ మాట్లాడుతూ.. రాజ్యాంగం అందరికీ సమాన అవకాశాలు కల్పించినా వాటికి భంగం కలిగించే ప్రయత్నాలు ముమ్మరం కావడం ప్రమాదకరమన్నారు. ఎంతో ముందు చూపుతో అత్యున్నత రాజ్యాంగం అందుబాటులోకి తెచ్చుకున్నామని చెప్పారు. ఆర్టికల్ 200, 201 ప్రకారం బిల్లుల ఆమోదానికి పరిధి ఉన్నప్పటికీ రాష్ట్రపతి ప్రశ్నలు వేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఫైనాన్స్ ఫెడరలిజం అనేది ప్రశ్నార్ధకం అయ్యిందన్నారు. ఆర్టీఐ చట్టం కింద సమాచారం ఇవ్వాల్సి ఉండగా డేటా చట్టం పేరుతో సమాచారం లేకుండా చేస్తున్నారని, ఫోర్త్ ఎస్టేట్లో ప్రశ్నించే ధోరణి మాయమవుతుందని చెప్పారు. రాజ్యాంగం విలువలకు తిలోదకాలు ఇచ్చారని మండిపడ్డారు. ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వ బిల్లులను గవర్నర్ అడ్డుకుంటే ఇక ఫెడరలిజం ఎక్కడుందని ప్రశ్నించారు. విచక్షణ లేని వారంతా గవర్నర్ స్థానంలో ఉండడం వలన పాలన కూడా పక్షవాతం బారిన పడుతోందన్నారు. రాష్ట్రాల సమాఖ్యగా ఉన్న దేశంలో ఇలాంటివి శ్రేయస్కరం కాదని, ప్రజలే భారత రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, పి.రామరాజు, టి.క్రాంతి, వై.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎంఈఎఫ్ జిల్లా కమిటీ ఏర్పాటు
మచిలీపట్నంటౌన్: ఎమ్మార్పీ ఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆదేశాలతో మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కృష్ణాజిల్లా నూతన కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఎన్నికల్లో ఈ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి బిక్షాలు మాదిగ తెలిపారు. ఎంఈఎఫ్ కృష్ణా జిల్లా నూతన కమిటీ అధ్యక్షుడిగా దేవరపల్లి విక్టర్ బాబు, ఉపాధ్యక్షుడిగా జే అనిల్కుమార్, ప్రధాన కార్యదర్శిగా బీడెల్లి మరియ కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శిగా బొకినాల కృష్ణ, కోశాధికారిగా రాచపూడి బాలస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉడుముల దుర్గారావు, గౌరవ అధ్యక్షుడిగా మేదర రమేష్, గౌరవ ముఖ్య సలహాదారుగా రావెల వరుణ్ కుమార్, లీగల్ అడ్వైజర్గా అద్దేపల్లి నిరంజన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో గండ్రపు శీనయ్య మాస్టర్, ఏసుబాబు, రాబర్ట్ జాన్సన్, పి.నవీన్, ధనరాజు, ఎం.ప్రభాకర్రావు, ఎం.ప్రవీణ్, ఎం.జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. 925 వెండి నాగపడగలు సమర్పించిన అజ్ఞాత భక్తులు ఘంటసాల: స్థానిక నాగేంద్ర స్వామి పుట్ట వద్ద అజ్ఞాత భక్తులు వెండి నాగ పడగలు వేసి వెళ్లినట్లు శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తలు గొర్రెపాటి వెంకట రామకృష్ణ(ట్రస్టీ), గొర్రెపాటి జగన్మోహనరావు, గొర్రెపాటి సురేంద్ర సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘంటసాల గ్రామంలో ప్రసిద్ధి గాంచిన సంతాన సాఫల్య స్వామిగా పేరుగాంచిన శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయ(షష్టి గుడి) ప్రాంగణంలోని నాగేంద్ర స్వామి పుట్ట వద్ద మధ్యాహ్నం సమయంలో గుర్తు తెలియని అజ్ఞాత భక్తులు వెండితో చేసిన నాగ పడగలు పుట్టపై వేసి వెళ్లిపోయారన్నారు. వీటిని ఆలయ సిబ్బంది గుర్తించి తమకు అందజేశారని చెప్పారు. వాటిని లెక్కించగా 925 నాగ వెండి పడగలు ఉన్నాయన్నారు. భక్తులు తమ కోర్కెలు తీరినందు వల్లే ఇలా మొక్కబడి తీర్చుకుని ఉంటారని ఆలయ ధర్మకర్తలు తెలిపారు. ఆలయ చరిత్రలో తొలిసారిగా పుట్టపై భక్తులు వెండి నాగ పడగలు వేశారని, ఆ భక్తులకు స్వామి వార్ల ఆశీస్సులు అందించాలని కోరారు. వీటి విలువ రూ.లక్ష వరకు ఉంటుందని ఆలయ ధర్మకర్తలు అంచనా వేశారు. -
క్రీడల్లో ఏపీని అగ్రగామిగా నిలబెట్టాలి
విజయవాడస్పోర్ట్స్: జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలని, క్రీడల్లో ఏపీని అగ్రగామిగా నిలబెట్టేందుకు క్రీడాకారులు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా కలిదిండిలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి సిలంబం(కర్రసాము) పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులు విజయవాడలోని శాప్ కార్యాలయంలో చైర్మన్ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ.. ఎస్వీఆర్కే ఇండియన్ ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో 73 గోల్డ్ మెడల్స్, 16 సిల్వర్ మెడల్స్, 5 బ్రాంజ్ మెడల్స్ సాధించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, క్రీడాకారులకు అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ప్రపంచ క్రీడా వేదికపై అత్యధిక పతకాలు సాధించి రాష్ట్ర, దేశ గౌరవాన్ని పెంచాలని క్రీడాకారులకు సూచించారు. కార్యక్రమంలో సిలంబం కోచ్లు శ్రీకాంత్, వర్మ పాల్గొన్నారు. -
హోంగార్డు కుటుంబానికి ఆర్థిక చేయూత
విజయవాడస్పోర్ట్స్: జిల్లా పోలీస్ కమిషనరేట్ హోంగార్డ్స్ యూనిట్లో హోంగార్డ్గా విధులు నిర్వర్తిస్తూ బ్రెయిన్ స్ట్రోక్తో మృతిచెందిన పి.శ్రీమన్నారాయణ కుటుంబానికి జిల్లాలోని హోంగార్డులు ఆర్థిక చేయూతనందించారు. శ్రీమన్నారాయణ కుటుంబ సభ్యులకు ఆర్థిక ఆసరా కల్పించేందుకు జిల్లాలో పని చేస్తున్న హోంగార్డులందరూ వారి ఒక్క రోజు వేతనాన్ని సమకూర్చారు. రూ.5 లక్షల నగదు చెక్కును పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు చేతుల మీదుగా శ్రీమన్నారాయణ భార్య పి.నరసమ్మకు కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం అందజేశారు. కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ కేజీవీ సరిత, హోంగార్డ్స్ ఆర్ఐ కె.సుధాకరరెడ్డి పాల్గొన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా గట్టుభీమవరం(వత్సవాయి): హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తా పడిన సంఘటన జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. వివరాల మేరకు హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న క్రమంలో బస్సు జాతీయ రహదారిపై కొంగరమల్లయ్య గట్టు దాటాక సాయిబాబా గుడి సమీపంలో లారీని తప్పించబోయి అదుపు తప్పి పక్కకు ఒరిగింది. దీంతో బస్సులోని ప్రయాణికులు వెంటనే దిగిపోయారు. తరువాత చిన్నగా బస్సు బోల్తా పడింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఘటనపై ఫిర్యాదు అందలేదని ఎస్ఐ పి.ఉమామహేశ్వరరావు తెలిపారు. -
తొలి రోజు పరీక్ష ప్రశాంతం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. పరీక్షల సందర్భంగా ఆయా పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పాఠశాల విద్య, అధికారులతో పాటుగా రెవెన్యూ, పోలీసు, మెడికల్ తదితర శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశారు. 61.04 శాతం హాజరు.. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రారంభమైన పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 61.04 శాతం విద్యార్థులు హాజరయ్యారు. తొలి రోజు 1,014 మంది విద్యార్థులకు 30 పరీక్ష కేంద్రాలను కేటాయించారు. అందులో 614 మంది హాజరుకాగా 395 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు కేటాయించిన మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు 27 కేంద్రాలను పరిశీలించారు. విద్యాశాఖ ప్రాంతీయ సంచాలకులు జోన్–2 (కాకినాడ) జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (కొండపల్లి)లోని పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే ఎస్పీఎన్ఆర్సీ ఉన్నత పాఠశాల (గొల్లపూడి) కేంద్రాన్ని పరిశీలించారు. డీఈవో యూవీ సుబ్బారావు విజయవాడలోని ఏపీఎస్ఆర్ మునిసిపల్ ఉన్నత పాఠశాల కృష్ణలంక వీఎంసీ ఉన్నత పాఠశాల, పటమట జీడీఈటీ ఉన్నత పాఠశాల, సీవీఆర్ ఎంసీ ఉన్నత పాఠశాల తదితర పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. జిల్లాలో ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం -
ఇద్దరు రైల్వే ఉద్యోగులకు సేఫ్టీ అవార్డులు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చి మ): రైళ్ల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించిన విజయవాడ డివిజన్కు చెందిన ఇద్దరు ఉద్యోగులకు ‘జీఎం మ్యాన్ ఆఫ్ ద మంత్ సేఫ్టీ అవార్డు’ లభించింది. సోమవారం జోనల్ హెడ్ క్వార్టర్స్ సికింద్రాబాద్లోని రైల్ నిలయం నుంచి విజయవాడ డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్తో పాటు సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్ డివిజన్ల డీఆర్ఎంలతో వర్చువల్ పద్ధతిలో భద్రతపై జీఎం అరుణ్కుమార్ జైన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రయాణికుల సురక్షిత ప్రయాణం, భద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్రమం తప్పకుండా అన్ని సెక్షన్లలో సేఫ్టీ డ్రై వ్లు నిర్వహిచాలని ఆదేశించారు. అనంతరం విజయవాడ డివిజన్లో విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించిన కాకినాడలోని మెకానికల్ విభాగానికి చెందిన టెక్నీషియన్ దార్ల బంగారి, గన్నవరంలోని ఆపరేటింగ్ విభాగానికి చెందిన స్టేషన్ మేనేజర్ జె.దుర్గాప్రసాద్లకు జీఎం అరుణ్కుమార్ జైన్ అవార్డులను అందజేశారు. అవార్డులు సాధించిన డివిజన్ సిబ్బందిని విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు. -
కార్తికేయుని సేవలో ప్రముఖులు
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవిలో వేంచేసియున్న శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని కేంద్ర ప్రభుత్వ హౌసింగ్ బోర్డు డైరెక్టర్, తమిళనాడు రాష్ట్రం ఎయిర్ పోర్ట్ల అడ్వైజరీ కమిటీ సభ్యుడు గూడూరు రాధాకృష్ణ కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. అలాగే విశ్రాంత సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందజేసి ఆలయ మర్యాదలతో సత్కరించారు. సత్యదేవుని ఆలయానికి రూ. లక్ష విరాళం గుడ్లవల్లేరు: స్థానిక శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి దేవాలయ గోపుర అభివృద్ధి పనులకు రూ.1,08,000ను సోమవారం దాతలు అందించారు. అట్లూరి సత్యనారాయణ, భాస్కరరావు, వీరమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు అట్లూరి వీరప్రభు చలపతి, రామకృష్ణ దుర్గా వరప్రసాద్, కుమార్తెలు కొండపల్లి వీర కుమారి, చాపరాల కస్తూరి చేతుల మీదుగా ఈ విరాళాన్ని గుడ్లవల్లేరు ఎస్ఈఆర్ఎం విద్యా సంస్థల చైర్మన్ వల్లభనేని వెంకట్రావుకు అందించారు. క్రికెట్ అండర్–15 జిల్లా బాలికల జట్టు ఎంపిక విజయవాడస్పోర్ట్స్: ఉమ్మడి కృష్ణాజిల్లా అండర్–15 బాలికల క్రికెట్ జట్టును కృష్ణాజిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.రవీంద్రచౌదరి సోమవారం ప్రకటించారు. టి.సౌమ్య (కెప్టెన్), డి.షాలినీచౌదరి, పి.లక్ష్మీలోహిత, టి.కావ్య, కె.మేఘనసాయి, ఆర్.తేజశ్వని, పి.ఆనందదీప్తి, బి.కార్తీక, కె.రుత్వేకఆరాధ్య, కె.జస్వితసాయిరెడ్డి, బి.తమిళిక, కె.మేఘన, ఆర్.లక్ష్మీప్రసన్న, జి.హరణి, కె.అక్షయ, కె.స్పూర్తి, పి.హనీషా, కె.కుశిక జట్టులో చోటు దక్కించుకున్నారని పేర్కొన్నారు. 2025–26 సీజన్లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఈ జట్టు ఉమ్మడి కృష్ణాజిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తుందని వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం ఆటోనగర్(విజయవాడతూర్పు): ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా తొలి రోజు 23మంది సభ్యులు నామినేషన్ దాఖలు చేసినట్టు ఎన్నికల అధికారులు పంచకర్ల వెంకటరమణారావు, తాడేపల్లి శ్రీనివాస దివాకర్ తెలిపారు. మంగళవారం సాయంత్రానికి నామినేషన్ల పర్వం ముగుస్తుందని చెప్పారు. మొత్తం 21 వార్డు మెంబర్లకుగానూ తొలి రోజే 23 నామినేషన్లు వచ్చినట్లు తెలిపారు. ఈ నెల 29న ఎన్నికలు నిర్వహించనున్నట్టు చెప్పారు. గతంలో ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంధం వెంకటేశ్వరరావు నామినేషన్ వేశారు. ఈసారి అదనంగా ఇద్దరు వార్డు సభ్యు లు నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈ సారి అధ్యక్షుడికి మంచి పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. ఉత్తమ నాటికగా ‘చీకటి పువ్వు’ చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: చిలకలూరిపేటలో కళాకారుల ప్రతిభా వేదికగా నిలిచిన తొమ్మిదో ఆహ్వాన నాటికల పోటీలు ఆదివారం రాత్రితో ఘనంగా ముగిశాయి. చిలకలూరిపేట కళా పరిషత్, సీఆర్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహించిన ఈ మూడు రోజుల కళా ఉత్సవం 9 నాటికల ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించింది. బహుమతులు అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. చైతన్య కళాభారతి(కరీంనగర్) వారి ‘చీకటి పువ్వు’నాటిక ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై బహుమతిని సొంతం చేసుకుంది. అమృత లహరి థియేటర్ ఆర్ట్స్(గుంటూరు) వారి ‘నాన్న నేను వచ్చేస్తా’ నాటిక ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా నిలవగా, అమరావతి ఆర్ట్స్’ (గుంటూరు) వారి ‘చిగురు మేఘం’ నాటిక తృతీయ ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై ంది. -
బరితెగింపు
బలం లేకపోయినా సాక్షి ప్రతినిధి, విజయవాడ/తిరువూరు: తిరువూరు మునిసిపల్ చైర్మన్ పదవి కోసం తెలుగుదేశం పార్టీ దుశ్శాసన, దుర్వినీత పర్వానికి తెరతీసింది. సాక్షాత్తూ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, తన అనుచరులతో కలిసి మునిసిపల్ కార్యాలయం వద్ద వీధి రౌడీలా వ్యవహరించారు. తాయిలాలు ఎరవేసి వైఎస్సార్ సీపీ సభ్యులను తన వైపు తిప్పుకునేందుకు యత్నించారు. ఎన్నిక వాయిదా వేయించాలనే కుట్రతో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను మునిసిపల్ కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. మహిళా కౌన్సిలర్లపై చెప్పులు, వాటర్ బాటిళ్లతో దాడికి తెగబడ్డారు. బారికేడ్లను ధ్వంసం చేశారు. రెండు గంటలపాటు భీతావహ వాతావరణం సృష్టించారు. ఈ దౌర్జన్యకాండను అడ్డుకోవాల్సిన పోలీసులు అడుగడుగునా అధికారపార్టీకి తొత్తులుగా వ్యవహరించారు. దీంతో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యకుడు దేవినేని అవినాష్, నియోజకవర్గపార్టీ ఇన్చార్జి స్వామిదాసు ఆధ్వర్యంలో పార్టీ నాయకులే కవచంలా ఏర్పడి రక్షించుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే మునిసిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, పార్టీ జగ్గయ్యపేట ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావుతో పాటు జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. భర్తతో ఒత్తిడి చేయించి.. ఒకటో వార్డు కౌన్సిలర్ కొలికపోగు నిర్మల భర్తను టీడీపీలో చేర్చుకున్న కూటమి నేతలు అతని చేత ఆమైపె ఒత్తిడి చేయించారు. అయినా ఆమె వైఎస్సార్ సీపీకే ఓటు వేస్తానంటూ తేల్చి చెప్పారు. పార్టీ కౌన్సిలర్లతోపాటు చైర్మన్ ఎన్నిక కోసం సోమవారం మునిసిపల్ కార్యాలయానికి వచ్చారు. అయితే నిర్మలను కిడ్నాప్ చేశారంటూ ఆమె భర్తతో పోలీసు కేసు పెట్టించిన ఎమ్మెల్యే కొలికపూడి మునిసిపల్ కార్యాలయం వద్ద గొడవకు దిగారు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు, నేతలను అడ్డుకున్నారు. మహిళా కౌన్సిలర్లపై చెప్పులు, వాటర్ బాటిళ్లు, రాళ్లతో చెలరేగిపోయారు. అయినా వైఎస్సార్ సీపీ నాయకులు సంయమనం పాటించారు. అండగా అవినాష్.. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పోలీసుల నిర్బంధాలను దాటుకుని మునిసిపల్ కార్యాలయానికి వచ్చి తమ కౌన్సిలర్లకు రక్షణగా నిలిచారు. ఈ దశలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, దేవినేని అవినాష్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అయినా వెనక్కి తగ్గని అవినాష్తోపాటు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి నల్లగట్ల స్వామి దాస్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సుధారాణి, ఎమ్మెల్సీ మొండితోక అరుణకుమార్, షేక్ ఆసిఫ్ కౌన్సిలర్లకు అండగా నిలిచారు. చివరకు పోలీసులే నిర్మలను బలవంతంగా తీసుకెళ్లి ఆమె భర్తకు అప్పగించారు. చివరకు కోరం సరిపోలేదంటూ ఎన్నికల అధికారి, ఆర్డీఓ మాధురి ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కమిషనర్కు ఫిర్యాదు.. టీడీపీ నాయకుల తీరుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ కుమార్, పీఏసీ సభ్యుడు షేక్ ఆసిఫ్ వైఎస్సార్ సీపీ వార్డు సభ్యులతో కలిసి సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తిరువూరులో టీడీపీ అరాచక పర్వం గెలవలేమని తెలిసీ..ప్రజాస్వామ్యం ఖూనీ.. మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తిరువూరులో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందన్నారు. టీడీపీ బరిలో నిలిపిన చైర్మన్ అభ్యర్థి కూడా టీడీపీలో గెలిచిన వ్యక్తి కాదని, పోలీసులు ఖాకీ యూనిఫామ్ బదులు, పచ్చ దుస్తులు వేసుకున్నారన్నారు. తమ కౌన్సిలర్ను లాక్కెళ్లి ఆమె మెడలోని వైఎస్సార్ సీపీ కండువాను తీసి చెట్లలో పడేశారని, ఎన్టీఆర్ జిల్లాలో అసలు పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా అని పోలీస్ కమిషనర్ను ప్రశ్నించారు. కలెక్టర్ చర్యలు తీసుకోవాలి.. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, టీడీపీ నేతలు బీభత్సం సృష్టించారన్నారు. ఎన్నిక జరగకుండా ఉండేందుకు చెప్పులు.. వాటర్ బాటిల్స్ విసిరి రాద్ధాంతం చేశారన్నారు. ఎన్నికలు సక్రమంగా నిర్వహించలేని అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తి స్థాయిలో రక్షణ కల్పించి.. నేటి ఎన్నికను ప్రశాంతంగా జరిపించాలని కోరుతున్నామన్నారు. తీవ్ర అభ్యంతరకరం.. ఎమ్మెల్సీ మొండితోక అరుణ కుమార్ మాట్లాడుతూ తిరువూరులో టీడీపీ నేతలు, పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు. తమకు ఓటు వేసుకునే అవకాశం కల్పించాలని ఎన్నికల కమిషన్కు వచ్చి ప్రజాప్రతినిధులు ఏనాడైనా కోరుకున్న సందర్భాలున్నాయా అని ప్రశ్నించారు. అలాంటి పరిస్థితులను ఈ కూటమి ప్రభుత్వం కల్పించిందన్నారు. తిరువూరులో పోలీసులు పసుపు చొక్కాలేసుకుని డ్యూటీలు చేశారని విమర్శించారు.. తిరువూరు నగర పంచాయతీ ఎన్నికల్లో ఇరవై వార్డులకు 17 వైఎస్సార్ సీపీ గెలుపొందింది. టీడీపీ మూడు వార్డులనే గెలుచుకోగలిగింది. అప్పట్లో చైర్మన్గా ఎన్నికై న గత్తం కస్తూరిబాయి ముందస్తు ఒప్పందంలో భాగంగా ఇటీవల రాజీనామా చేశారు. దీంతో ఎన్నికల కమిషన్ సోమవారం ఎన్నిక నిర్వహించాలని నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీనిని అదునుగా భావించిన టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చైర్మన్ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు కాకర్లమూడి సుందర్కుమార్, పసుపులేటి శేఖర్బాబు, దారా పద్మజను ప్రలోభాలకు గురి చేసి టీడీపీలో చేర్చుకున్నారు. మరో ఇద్దరిని బలవంతంగా తమ వైపు తిప్పుకున్నారు. అయినా బలం చాలకపోవడంతో ఎన్నిక వాయిదా వేయించేందుకు దౌర్జన్యాలకు తెగబడ్డారు. -
అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజల నుంచి వచ్చే అర్జీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి సానుకూలంగా సకాలంలో పరిష్కరించాలని ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమం నిర్వహించారు. ఇన్చార్జ్ కలెక్టర్తో పాటు డీఆర్వో కె. చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీ దేవి, ఆర్డీవో కె. స్వాతి, సమగ్ర శిక్ష ఏపీసీ కుముదిని సింగ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. బదిలీల ప్రక్రియ ప్రారంభించండి.. తొలుత గీతాంజలిశర్మ మాట్లాడుతూ ఐ గాట్ కర్మ యోగి ఆన్లైన్ శిక్షణ తరగతుల కింద ఎనిమిది కోర్సులను ప్రతి ఒక్క ఉద్యోగి పూర్తి చేయాలని సూచించారు. ఈ శిక్షణ తరగతులపైన త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రితో సమీక్ష జరపనున్నారని ప్రస్తుతం కృష్ణాజిల్లా 18వ స్థానంలో ఉందని ఈ నెల 20వ తేదీలోగా ఉద్యోగులు శిక్షణ తరగతులు పూర్తి చేసి జిల్లాను ముందంజలో నిలపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బదిలీలకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, ఆ ఉత్తర్వుల్లో ఉన్న నిబంధనలను అనుసరించి వారి పరిధిలోని బదిలీల ప్రక్రియ వెంటనే చేపట్టాలన్నారు. మంగళవారం మీకోసం కార్యక్రమంపై రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించనున్నారని పెండింగ్లో ఉన్న అర్జీలను వెంటనే పరిష్కరించాలన్నారు. కోర్టు సెలవులు ఉన్నప్పటికీ జారీ చేసిన ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలన్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రతి చోట అంతర్గత కమిటీలను నియమించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. క్రీడా సామగ్రి అందజేత.. క్రీడాకారుల కోసం 45 వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క శిబిరానికి రూ. 5 వేలు విలువ చేసే క్రీడా సామగ్రిని ఇన్చార్జ్ కలెక్టర్ చేతుల మీదుగా క్రీడాకారులకు అందజేశారు. మీకోసంలో అధికారులు మొత్తం 157 అర్జీలను ప్రజల నుంచి స్వీకరించారు. ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ ‘మీ కోసం’లో 157 అర్జీల స్వీకరణ వచ్చిన అర్జీల్లో కొన్ని.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎంపీహెచ్ఏ (మగ) పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వ ఉత్తర్వులు అనుసరించి పీహెచ్సీల నుంచి తప్పించి ఎన్వీపీడీసీపీ ప్రోగ్రాం నందు పనిచేసేందుకు రీడిప్లాయిమెంట్ ద్వారా సర్దుబాటు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో ఎస్సీ కేటగిరీలోని అభ్యర్థులను నూతనంగా అమలు జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ ప్రకారం చేపట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులు బి. కృష్ణ, జి. శీనయ్య, బి. మరియకుమార్ అర్జీ ఇచ్చారు. మోపిదేవి భాస్కరరావు చెరువు నుంచి పాలకాయతిప్ప అవుట్ఫాల్స్ వరకు మేజర్ డ్రెయినేజీ కట్ట గండ్లు పడి ముళ్లతుమ్మ చెట్లతో మూసుకుపోయి నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఈ గండ్లను పూడ్చి ముళ్ల చెట్లను తొలగించాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి ఆవుల బసవయ్య అర్జీ ఇచ్చారు. మోపిదేవి మండలం కప్తానుపాలెం మండవ శ్రీలక్ష్మి అర్జీనిస్తూ.. తమకు గ్రామంలో 205/05, 6 సర్వే నంబర్లలో 30 సెంట్ల మాగాణి భూమి ఉందన్నారు. ఈ భూమికి సంబంధించి జాతీయ రహదారి నుంచి రాకపోకలు సాగించేందుకు 60 ఏళ్లుగా దారి ఉందని తెలిపారు. అయితే ముందున్న పొలాల వారు ఈ దారి గుండా రాకపోకలు సాగించేందుకు వీలు లేదని కంచె వేసి అడ్డగిస్తున్నారని, ఈ విషయంపై తాము మీ కోసంలో అర్జీ ఇచ్చి, పది నెలలుగా తిరుగుతున్నప్పటికీ న్యాయం జరగటం లేదని అధికారుల వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. సమస్యను పరిష్కరించాలని విన్నవించారు. -
ఏపీ ఈఏపీ సెట్ ప్రారంభం
తొలి రోజు ఎన్టీఆర్ జిల్లాలో 91.21, కృష్ణాలో 95.71 శాతం హాజరు వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఇంజినీరింగ్, అగ్రికల్చల్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ పరీక్ష(ఏపీ ఈఏపీ సెట్)– 2025 సోమవారం ప్రారంభమైంది. తొలి దశలో రెండు రోజుల పాటు అగ్రికల్చర్, ఫార్మసీ (బైపీసీ) విద్యార్థులకు నిర్వహించనున్నారు. మొదటి రోజు ఉమ్మడి జిల్లాలో మొత్తం 15 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, అలాగే మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పరీక్షలు కొనసాగాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఉదయం సెషన్కు 1,700 మందికి 1,555 మంది హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం సెషన్కు 1,700 మందికిగానూ 1,546 మంది పరీక్ష రాశారు. అదేవిధంగా కృష్ణాజిల్లాలో ఉదయం సెషన్కు 291 మందికి 282మంది, మధ్యాహ్నం సెషన్కు 292 మందికి 276 మంది హాజరయ్యారు. కృష్ణాలో 95.71, ఎన్టీఆర్లో 91.21శాతం హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం 3,983 మందికి 3,659 మంది పరీక్ష రాశారు. -
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
పెడన: మద్యానికి బానిసై రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెడన పట్టణంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. మచిలీపట్నం రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.... పట్టణంలోని రామలక్ష్మీ వీవర్స్ కాలనికి చెందిన సింహాద్రి రమేష్ (52) శనివారం వేకువ జామున గుడివాడ – మచిలీపట్నం ప్యాసింజరు రైలు కింద పెడన– వడ్లమన్నాడు రైలు మార్గంలోని పెడన శివారులో రైలుకు ఎదురువెళ్లాడు. రైలు ఢీ కొట్టడంతో పక్కకు పడి చనిపోయాడు. రైలు డ్రైవర్ ఈ విషయాన్ని రైల్వే పోలీసులకు తెలియజేయడంతో వారు పెడన వచ్చి మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. మృతదేహం ఫొటోను వాట్సప్ గ్రూపుల్లో గుర్తించిన బంధువులు రైల్వే పోలీసులకు పూర్తి వివరాలను అందజేయడంతో వారు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. -
కృష్ణాజిల్లా
ఆదివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2025సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 512.70 అడుగుల వద్ద ఉంది. ఇది 136.3003 టీఎంసీలకు సమానం. ‘ప్లాస్టిక్’ నుంచి విముక్తి మోపిదేవి: ప్లాస్టిక్ ముప్పు నుంచి సమాజానికి విముక్తి కలిగిద్దామని శనివారం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ ఈఓ వరప్రసాదరావు స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞలో పిలుపునిచ్చారు. రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో సోమవారం నుంచి ఏపీ ఈఏపీ సెట్ ప్రారంభంకానుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు చేశారు. –8లో7న్యూస్రీల్ -
సేంద్రియ ఎరువులపై అవగాహన కల్పించండి
జికొండూరు: సేంద్రీయ ఎరువుల తయారీ గుంతలపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సేంద్రీయ ఎరువుల గుంతలతో పారిశుద్ధ్యం సమస్యకు చెక్ పెట్టడంతో పాటు బహుళ ప్రయోజనాలు కలిగిన సేంద్రీయ ఎరువులు తయారు చేసుకోవచ్చని సూచించారు. జికొండూరులో సేంద్రీయ ఎరువుల (కంపోస్ట్ ఫిట్) తయారీ గుంతల తవ్వకం పనులను శనివారం ఆయన ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ కంపోస్ట్ ఫిట్లకు ఎటువంటి ఖర్చులు లేకుండా ఉపాధిహామీ పథకంలో చేపట్టవచ్చన్నారు. ఈ ఏడాది జిల్లాలో 17వేల గుంతలు తీసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. పారిశుద్ధ్యం, పశు వ్యర్థాలతో కంపోస్ట్ తయారు చేయవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ రాము, డీఆర్డీఏ పీడీ నాంచారరావు, డీపీవో లావణ్యకుమారి పాల్గొన్నారు. కృష్ణానదిలో దూకి వ్యక్తి మృతి తోట్లవల్లూరు: పేకాటశిబిరంపై పోలీసులు దాడి చేసేందుకు వస్తుండగా గమనించిన కొందరు జూదగాళ్లు తప్పించుకునే క్రమంలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ కృష్ణానదిలో పడిపోయి మృతి చెందిన ఘటన శనివారం మండలంలోని రొయ్యూరు సమీపంలో చోటుచేసుకుంది. ఎస్ఐ సీహెచ్ అవినాష్ ఆధ్వర్యంలో పేకాట శిబిరంపై దాడి చేసేందుకు రొయ్యూరు–మద్దూరు సమీపంలోని కృష్ణానది తీరానికి వెళ్లారు. శిబిరానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఉండగానే పోలీసులను గుర్తించిన జూదరులు పారిపోయే ప్రయత్నం చేశారు. కంకిపాడు మండలం మద్దూరుకు చెందిన వల్లభనేని గోపాలరావు, ఒడుగు వెంకటేశ్వరరావు మద్దూరు వైపు పారిపోయే క్రమంలో సమీపంలోని కృష్ణానది నీటిలో దూకారు. ఈ ఘటనలో వల్లభనేని గోపాలరావు (35) మృతి చెందగా, ఒడుగు వెంకటేశ్వరరావు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. మృతుడు గోపాలరావు కుటుంబానికి న్యాయం చేయాలంటూ మద్దూరు నుంచి మృతుడి బంధువులు పెద్ద ఎత్తున పోలీస్స్టేషన్కు తరలివచ్చారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్నట్లు ఎస్ఐ తెలిపారు. జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ -
అందం అదరహో
● కృష్ణమ్మ చెంతన సేద తీరేవారికి పర్యాటక అనుభూతి ● ప్రకృతి గీచిన కృష్ణమ్మ ఇసుక తిన్నెలపై పిల్లలకు ఆహ్లాదకరం ● శ్రీరామపాదక్షేత్రం ఎదుట నది మధ్య ఇసుక దీవితో బీచ్ సోయగం నాగాయలంక: దివిసీమలోని నాగాయలంక శ్రీరామపాద క్షేత్రం పుష్కర ఘాట్ ఎదుట నది మధ్యలో చిరుదీవి ‘నవలంక’. ఇక్కడ కృష్ణమ్మ గీచిన ఇసుక తిన్నెలు సందర్శకులకు వేసవి విడిదిగా అలరిస్తున్నాయి. నది మధ్య ప్రకృతి పరిచిన సహజ సైకత పరదాలతో బీచ్ అందాలు సంతరించుకున్నాయి. ఈ తెల్లటి ఇసుక దిబ్బలు సందర్శకులకు పర్యాటక అనుభూతిని కలిగిస్తూ రా.. రమ్మంటోంది నవలంక సోయగం. ఘాట్ నుంచి సమీపంలోని ఈ ఐల్యాండ్కు ప్రైవేట్ పడవల్లో షికారుగా చేరుకుంటారు. గత ఏడాది వరదలకు ఇక్కడి ముళ్ల చెట్లు నదీ ప్రవాహానికి పూర్తిగా తుడిచి పెట్టుకుపోయాయి. దీంతో సముద్రపు బీచ్లా ఏర్పడి తెల్లటి స్వచ్ఛమైన ఇసుక తిన్నెలు ఆకర్షణీయంగా మారాయి. వివిధ ఆకృతుల్లోని ఇసుక గుంతలు చూసి పర్యాటకులు ముచ్చట పడుతున్నారు. సందర్శకులకు ఆహ్లాదం ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా గుంపులుగా ఈ దీవికి నీటి కొంగలు, బాతులు, ఇతర పక్షులు చేరుతున్నాయి. అవి ఇక్కడ విహరిస్తూ సందర్శకులను ఆహ్లాదపరుస్తూ సేద తీరడంతో నవలంక దీవికి కొత్త అందాలు చేకూరాయి. ప్రభుత్వం మరిన్ని సంరక్షణ చర్యలు చేపడితే, కొన్ని నిర్మాణాలు చేస్తే దివిసీమ ప్రాంత వాసులను ఆహ్లాదపర్చే మంచి పర్యాటక దీవిగా ఆకర్షిస్తుందని సందర్శకులు చెబుతున్నారు. ఈ ప్రాంతవాసులకు నవలంకే వేసవిలో సేద తీర్చే విడిదిగా మారడంతో రోజూ సాయంత్రం వేళల్లో శ్రీరామపాదక్షేత్రం ఘాట్, నవలంక సందర్శనకు ఉత్సాహంగా వస్తున్నారు. నిత్య సుందరం నాగాయలంక కృష్ణానది పశ్చిమ దిక్కులో సూర్యాస్తమయ దృశ్యాలు నిత్యం సుందరంగా ఆవిష్కృతమవుతాయి. ఇవి సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. వేసవితాపం, ఒత్తిడి తగ్గించుకునేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో పెద్దలు, యువకులు, చిన్నారులు కృష్ణానదిలో ఈత కొడుతూ సందడి చేస్తుంటారు. చిన్నారులు ఇసుకతో పిచుక గూళ్లు కట్టి కేరింతలతో చేసే సరదాలు, మొబైల్ ఫోన్ల ఫొటోలు, సెల్ఫీలతో చేసే సందడి కనువిందు చేస్తున్నాయి. పిల్లలు నదిలోకి బోట్లలో నుంచి ఎగిరి దూకుతూ చేసే అల్లరితో పైకెగిసి పడే నీటి జల్లులు పులకరింప చేస్తుంటాయి. రారండోయ్ నవలంక సోయగం చూద్దాం సంపూర్ణ పర్యాటక అనుభూతి కలిగేలా అభివృద్ధి చేయాలి నాగాయలంక శ్రీరామపాద క్షేత్రం ఎదురుగా న్యూ ఐల్యాండ్ను పర్యాటకాభివృద్ధి క్రమంలో ప్రాచుర్యం కలిగించేందుకు ప్రణాళిక రూపకల్పన చేయాలి. అప్పుడే దివిసీమ వాసులకు ముఖ్యమైన పర్యాటక కూడలి అనుభూతి కలుగుతుంది. రాష్ట్ర పర్యాటక శాఖ, జిల్లా యంత్రాంగం నవలంక, శ్రీరామపాదక్షేత్రం వైపు దృష్టి సారించాలి. బ్రాండ్ ఇమేజ్ తెచ్చేరీతిలో దివిసీమ పర్యాటక ప్రదేశాలను ప్రాచుర్యంలోకి తేవాలి. –వాడపల్లి నాగేశ్వరరావు, ప్రకృతి ప్రేమికుడు, నాగాయలంక -
ఎండీయూలకు స్వస్తి.. రేషన్ కోసం కుస్తీ!
ఇబ్రహీంపట్నం: రేషన్ కార్డుదారుల ఇళ్ల వద్దకే నిత్యావసర సరుకులను చేరుస్తున్న మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ) వాహనాల సేవలకు ప్రభుత్వం త్వరలో మంగళం పాడనుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే జరిగితే బియ్యం కార్డుల లబ్ధిదారులు పనులు మానుకుని, తమ ఇళ్లకు దూరంగా ఉన్న రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు దాపురిస్తాయి. ఇటీవల పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎండీయూ వాహనదారులు, రేషన్ దుకాణదారులతో విజయవాడలో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు సేకరించారు. రేషన్ పంపిణీలో లోపాలు ఉన్నట్లు గుర్తించామని ప్రకటించారు. రేషన్ పంపిణీపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ పరిణామాలతో ఎండీయూ వాహనాలకు మంగళం పాడనున్నట్లు తేటతెల్లమవు తోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఎండీయూ వాహనాల ద్వారా రేషన్కార్డుదారుల ఇంటి వద్దకే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఐదేళ్ల పాటు ఇంటి వద్దకే రేషన్ సరుకుల పంపిణీ సక్రమంగా సాగింది. ఇప్పుడు ఈ వ్యవస్థను నిలిపి వేసేందుకు కూటమి ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది. ఎండీయూ వాహనాలను నిలిపివేస్తే మైలవరం నియోజకవర్గంలో సుమారు 84,788 మంది రేషన్ కార్డుదారులు, 52 మంది ఎండీయూ వాహనదారులకు ఇబ్బందులు తప్పవు. 2027 జనవరి వరకు అగ్రిమెంట్ వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ప్రతి నెలా లబ్ధిదారుల ఇంటి వద్దనే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వాహనం ఏ వీధికి వస్తుందో ముందుగానే తెలియజేయడంతో లబ్ధిదారులు ఇంటి వద్ద ఉండి రేషన్ సరుకులు తీసుకునేవారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళలకు ఈ విధానం సౌకర్యవంతంగా ఉండేది. గత ప్రభుత్వ చేసుకున్న అగ్రిమెంట్ మేరకు 2027 జనవరి వరకు ఎండీయూ వాహన వ్యవస్థ కొనసాగాల్సి ఉంది. వాహనాలకు బీమా ప్రీమియం చెల్లిస్తామని, అప్పటి వరకు కొనసాగించాలని వాహనదారులు కోరుతున్నప్పటికీ ప్రభుత్వం అందుకు సుముఖంగా లేదని సమాచారం. ఎండీయూ వాహనాల తొలగింపునకు కసరత్తు కూటమి ప్రభుత్వం తిరిగి రేషన్ డీలర్ల ద్వారా ప్రజలకు రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు సమాయత్తమవుతోందని సమాచారం. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం త్వరలోనే నూతన విధానాన్ని అమలు చేసేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలో వాహనదారులు, డీలర్లతో సమావేశం నిర్వహించారు. త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఎండీయూ వాహనాల రద్దు ప్రతిపాదన వస్తుందని తెలుస్తోంది. ఎండీయూ వాహనాల వ్యవస్థను రద్దు చేస్తే రేషన్ డీలర్ల వద్దకు వెళ్లి కార్డులు లైన్లో పెట్టి పడిగాపులు కాయాల్సి వస్తుందని వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండీయూ వాహనాలకు ప్రభుత్వం మంగళం డీలర్లతో రేషన్ సరుకుల పంపిణీకి కసరత్తు నిలిచిపోనున్న ఇంటింటికీ రేషన్ పంపిణీ ఆందోళనలో ఎండీయూ వాహనదారులు, కార్డుదారులు ఇంటి వద్దే రేషన్ ఇవ్వాలి ఎండీయూ వాహనం ద్వారా ఇప్పటి వరకు ప్రతినెలా ఇంటి వద్దనే రేషన్ బియ్యం తీసుకుంటున్నా. ఇక నుంచి ఇంటి వద్దకు వాహనం రాదనే ప్రచారం జరుగుతోంది. ఎండీయూ వాహనాలను రద్దు చేస్తే రేషన్ దుకాణం వద్దకు వెళ్లి సరుకులు తెచ్చుకోవాలి. ఇంటికి దూరంగా ఉన్న రేషన్ దుకాణానికి వెళ్లి బియ్యం తెచ్చుకోవాలంటే ఇబ్బందులు తప్పవు. – సెశెట్టి ఈశ్వరి, గృహిణి, కొండపల్లి సరుకుల కోసం పని మానుకోవాలి ఎండీయూ వాహనాలను తొలగించాలని ఆలోచన చేయడం బాధాకరం. ఇళ్లకు దూరంగా ఉన్న రేషన్ దుకాణాలకు దివ్యాంగులు, వద్ధులు, మహిళలు వెళ్లి రేషన్ తెచ్చుకునేందుకు ఇబ్బందులు పడా ల్సిందే. షాపుల వద్దకు వెళ్తే సరుకుల కోసం ఒక రోజు పని మానుకోవాల్సి వస్తుంది. ఇంటింటి రేషన్ పంపిణీపై ప్రభుత్వ పునరాలోచించాలి. – కంతేటి అగ్నేసమ్మ, కిలేశపురం -
రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇంజినీరింగ్, అగ్రికల్చల్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ – పరీక్ష (ఏపీఈఏపీసెట్)– 2025 సోమవారం నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానుంది. సంబంధిత పరీక్షలను కంప్యూటర్ ఆధారిత (ఆన్లైన్) విధానంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా అగ్రికల్చర్, ఫార్మసీ (బైపీసీ) విద్యార్థులకు ఈ నెల 19, 20 తేదీలలో ఆన్లైన్ పరీక్ష నిర్వహించనుండగా ఇంజినీరింగ్ స్టీమ్ (ఎంపీసీ) విద్యార్థులకు 21 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందులో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్లో పరీక్షలు జరగనున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 15 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులో ఎన్టీఆర్ జిల్లాలో ఇంజినీరింగ్కు 37,666 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు 6671 మంది, రెండు పరీక్షలకు హాజరువుతున్న వారు 86 మంది ఉండగా మొత్తం జిల్లాలో పరీక్షకు హజరయ్యేవారు 44,468 మంది విద్యార్థులు ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద అత్యధికంగా 38,269 మంది విద్యార్థులు ఒక్క విజయవాడలోనే పరీక్షలకు హాజరవ్వనున్నారు. అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి ఇంజనీరింగ్ విభాగానికి 5,050 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి 1141, ఇంజినీరింగ్, ఫార్మసీ పరీక్షలకు హాజరవుతున్నవారు 18 మంది జిల్లా వ్యాప్తంగా హాజరయ్యే వారు 6209 మంది విద్యార్థులున్నారు. ఇందులో ఉదయం సెషన్ తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం సెషన్కు 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఆన్లైన్లో పరీక్షను నిర్వహించనున్నారు. జిల్లాలో పరీక్ష కేంద్ర వివరాలు ఇలా... ఈఏపీసెట్ పరీక్ష కోసం ఉమ్మడి కృష్ణా జిల్లాలో 15 పరీక్షా కేంద్రాలను సిద్ధం చెశారు. ఎన్టీఆర్ జిల్లాలో పన్నెండు, కృష్ణా జిల్లాలో మూడు కేంద్రాలు ఉన్నాయి. అవి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ధనేకుల ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఐకాన్ డిజిటల్ జోన్ కానూరు, ఎన్ఆర్ఐ గ్రూప్ ఆఫ్ కాలేజీస్, పొట్టిశ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ప్రసాద్ వీ పొట్లూరి సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్ఆర్కే ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సాయిలక్ష్మీ కంప్యూటర్స్, గొల్లపూడి, శ్రీ విజయదుర్గా ఐటీ ఇన్ఫో సొల్యూయేషన్స్, కానూరు (కానూరు ఎనికేపాడు డొంకరోడ్డు), ఎస్వీటీ ఇన్ఫోటెక్, గవర్నరుపేట విజయవాడ, వెలగపూడి రామకృష్ణ సిద్థార్థ ఇంజనీరింగ్ కళాశాలను ఎంపిక చేశారు. అదేవిధంగా తిరువూరులో శ్రీవాహిణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరువూరు, మైలవరంలో లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మైలవరం తదితర కేంద్రాలను కేటాయించారు. అదేవిధంగా కృష్ణాజిల్లాలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ గుడ్లవల్లేరు, దైతా మధుసూధన్ శాస్త్రి శ్రీ వెంకటేశ్వర హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మచిలీపట్నం, శ్రీ వాసవీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, నందమూరు మచిలీపట్నం కేంద్రాలు ఉన్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 15 పరీక్ష కేంద్రాలు రెండు జిల్లాల్లో పరీక్షకు హాజరుకానున్న 50,677 మంది విద్యార్థులు రాష్ట్రంలో అత్యధికంగా విజయవాడలోనే పరీక్షకు హాజరు కానున్న విద్యార్థులు 19, 20వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు 21 నుంచి 27 వరకూ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు -
జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ ఎస్.శర్మిష్ట
వడదెబ్బ తగలకుండా జాగ్రతలు పాటించాలి గుడివాడరూరల్: వేసవిలో వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ ఎస్.శర్మిష్ట పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర– స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని మోటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో బీట్ ద హీట్ పేరుతో వడదెబ్బ–తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులతో సాధారణంగా వడదెబ్బ, డీహైడ్రేషన్కు గురవుతున్నారన్నారు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణహాని జరిగే అవకాశం ఉంటుందని వివరించారు. వడదెబ్బ తగిలితే మగత, నిద్ర, కలవరింతలు, శరీర ఉష్ణోగ్రత పెరగడం లేదా పాక్షికంగా అపస్మారక స్థితి, వణుకు పుట్టడం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. రోజూ కనీసం 15గ్లాసుల నీరు, పళ్ల రసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. అత్యవసరమైతే గొడుగు, టోపీ వంటివి తీసుకుని బయటకు వెళ్లాలన్నారు. జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆనంద్కుమార్ మాట్లాడుతూ డెంగీ లక్షణాలు, దోమల బారిన పడకుండా తీసుకోవాల్సిన రక్షణ చర్యలను వివరించారు. డ్వామా పీడీ శివప్రసాద్ మాట్లాడుతూ వేసవిలో వేతన శ్రామికులు వేళలు మార్చుకుని ఉదయం 6గంటలకు ఉపాధి పనులకు వచ్చి 10గంటల లోపే ముగించుకోవాలన్నారు. అనంతరం వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కళాభారతి కళాజాత బృంద నాయకులు శేఖర్బాబు, ప్రశాంత్కుమార్ ప్రజలకు అవగాహన కల్పించారు. వైద్య ఆరోగ్యశాఖ రూపొందించిన కరపత్రాలను డీఎంహెచ్వో అధికారులతో కలసి ఆవిష్కరించి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞను ప్రజలతో చేయించారు. పీహెచ్సీ ప్రాంగణంలో మొక్కలు నాటించారు. తొలుత పీహెచ్సీకి ఆరోగ్యశాఖ సిబ్బంది బంతు తనూజ, తలారి శ్రావణిలు ఎయిర్కూలర్ను, గంటా వెంకట రామానుజరావు ఒక ఏసీని వితరణగా అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కూరగంటి పద్మ, జిల్లా కార్యక్రమ అధికారి నిరీక్షణరావు, ఎంపీడీవో విష్ణుప్రసాద్, పీహెచ్సీ డాక్టర్లు ప్రీతి, తేజ, మహేష్, హిమబిందు, పంచాయతీ సెక్రటరీ కోటయ్య తదితరులు పాల్గొన్నారు. -
టెన్త్ సప్లిమెంటరీకి సన్నద్ధం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని వారికి నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 19 నుంచి 28వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఫలితాల వెల్లడి రోజునే షెడ్యూల్ విడుదల చేసింది. గతంలో పదో తరగతి విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షను రాసినట్లయితే వారికి ఆ సర్టిఫికెట్పై సప్లిమెంటరీగా నమోదైది. కానీ గతంలో మాదిరిగా కాకుండా సప్లిమెంటరీ విద్యార్థులను కూడా రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణించనున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 59 పరీక్షా కేంద్రాలను అధికారులు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక తరగతులు.... గతేడాది మాదిరిగానే పదో తరగతి పరీక్షలు తప్పిన విద్యార్థులకు ఆయా పాఠశాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి వారు ఉత్తీర్ణులయ్యే విధంగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతున్నారు. ఈ మేరకు దాదాపుగా అన్ని పాఠశాల్లో తరగతులు కొనసాగుతున్నాయి. జిల్లాలోని ఆయా సబ్జెక్ట్లకు చెందిన ఉపాధ్యాయులు ప్రతి రోజూ ప్రత్యేక తరగతులను తీసుకొని తప్పిన విద్యార్థులను పరీక్షలకు సమాయత్తపరుస్తున్నారు. కొన్ని మెలకువలను నేర్పించి తీర్చిదిద్దుతున్నారు. హాల్ టికెట్లను పరీక్షల విభాగం ఆయా పాఠశాలలకు పంపించగా, ప్రధానోపాధ్యాయులు డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందించే పనిలో ఉన్నారు. 24 వరకూ ఓపెన్ స్కూల్ పరీక్షలు... ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఓపెన్ స్కూల్ విద్యార్ధులకు సైతం ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకూ సప్లమెంటరీ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలకు పదో తరగతితో పాటుగా ఇంటర్మీడియట్ విద్యార్థులు హాజరవుతారు. వీరికి సంబంధించి 1677 మంది పరీక్షలకు హాజరవుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షలకు పదో తరగతికి 17, ఇంటర్మీడియెట్కు 12 చొప్పున పరీక్షా కేంద్రాలను అధికారులు కేటాయించారు. అధికారుల నియామకం జిల్లాలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు 30 కేంద్రాలకు 30 మంది చీఫ్ సూపరింటెండెంట్లను జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు నియమించారు. వారితో పాటుగా మరో 30 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లును నియమించారు. ప్రశాపత్నాలు భద్రపరిచేందుకు, వాటిని పంపిణీ చేసేందుకు వివిధ పోలీసుస్టేషన్లను ఎంపిక చేశారు. అదేవిధంగా ఓపెన్ స్కూల్కు సంబంధించి సైతం మరో 29 మంది అధికారులను కేటాయించారు. వాటితో పాటుగా పరీక్షల నిర్వహణకు సుమారుగా 300 మంది ఇన్విజిలేటర్లను సైతం అధికారులు సిద్ధం చేశారు. అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏడు బృందాలు పరీక్షలను పరిశీలించనున్నాయి. ప్రశ్నాపత్రాల పంపిణీని ఈ నెల 16వ తేదీన ప్రారంభించారు. 19 నుంచి 28వ తేదీ వరకూ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 30 పరీక్ష కేంద్రాలు పరీక్ష రాయనున్న 1677 మందిఓపెన్ స్కూల్ విద్యార్థులు ఓపెన్ స్కూల్ పరీక్షలకు మరో 29 కేంద్రాలు పరీక్షకు హాజరు కానున్న 6149 మంది విద్యార్థులు పరీక్షలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా సాధారణ ఎస్ఎస్సీ పరీక్షలకు 30 కేంద్రాలను, ఓపెన్ స్కూల్ పరీక్షలకు 29 కేంద్రాలను ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఆయా పాఠశాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి సైతం దృష్టా సారించి వాటిని సిద్ధం చేస్తున్నాం. ఇతర విభాగాల సహకారంతో అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేస్తాం. – యువీ సుబ్బారావు, డీఈవో, ఎన్టీఆర్ మార్చి 19వ తేదీ నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం పరీక్షలను నిర్వహించింది. అందులో ఎన్టీఆర్ జిల్లా నుంచి 27,467 మంది విద్యార్థులు పరీక్షకు హజరయ్యారు. వారిలో 23,534 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అలాగే వారిలో 3933 మంది విద్యార్థులు వివిధ సబ్జెక్ట్ల్లో తప్పటంతో పదో తరగతి పరీక్షలు ఉత్తీర్ణులు కానట్లుగా ఫలితాలను ప్రకటించారు. వారితో పాటుగా గతంలో ఫెయిలైన విద్యార్థులతో కలిపి మొత్తం 6149 మంది విద్యార్థులు పరీక్షలకు హజరవుతున్నట్లు అధికారులు ప్రకటించారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి పరీక్షకు హజరయ్యే విద్యార్థులు ఉండటంతో దాదాపుగా అన్ని మండలాల్లో పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. -
రైల్వే హాస్పిటల్లో నేరస్తుల సామాజిక సేవ
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైళ్లు, రైల్వే స్టేషన్ పరిసరాల్లో చిన్న, చిన్న నేరాలకు పాల్పడిన నేరస్తులకు రైల్వే కోర్టు న్యాయమూర్తి ఆర్.వి శర్మ భారత న్యాయ సురక్షా సంహిత్ను అనుసరించి 133 మంది నేరస్తులకు జరిమానాతో పాటు సమాజ సేవా చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో ఆర్పీఎఫ్ పోలీసులు పర్యవేక్షణలో 133 మంది నేరస్తులు విజయవాడ రైల్వే హాస్పటల్ ప్రాంగణంలో రోగులకు మజ్జిగ సరఫరా చేశారు. అనంతరం హాస్పటల్ పరిసరాలను శుభ్రపరిచారు. ఇటువంటి శిక్షలు విధించడంతో వారిలో పరివర్తన, సామాజిక బాధ్యత తెలుస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 22న జెడ్పీ సర్వసభ్య సమావేశం చిలకలపూడి(మచిలీపట్నం):ఈ నెల 22వ తేదీన జిల్లా పరిషత్ స్థాయీ సంఘాలు, సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జ్ సీఈవో ఆర్సీ ఆనంద్కుమార్ శనివారం తెలిపారు. ఉదయం 10 గంటలకు ఏడు స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం 11 గంటలకు జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో సర్వసభ్య సమావేశం నిర్వహణ ఉంటుందని చెప్పారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రి కొల్లు రవీంద్రతో పాటు శాసనసభ్యులు, ఇతర ప్రత్యేక ఆహ్వానితులు, ఉమ్మడి కృష్ణా జిల్లా అధికారులు హాజరవుతారని తెలిపారు. -
ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించుకుందాం
డీఆర్వో చంద్రశేఖరరావు చిలకలపూడి(మచిలీపట్నం): పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించుకుందామని జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు అన్నారు. కలెక్టరేట్లో శనివారం ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’లో భాగంగా ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించి మానవహారంగా ఏర్పడ్డారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డీఆర్వో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రతి మూడో శనివారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కలెక్టరేట్ ఏవో సీహెచ్ వీరాంజనేయప్రసాద్, డాక్టర్ నిరీక్షణ సిబ్బంది పాల్గొన్నారు. పీహెచ్సీల్లో కాన్పులు పెరగాలిలబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలను పెంచాలని, రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులను మాత్రమే పెద్ద ఆస్పత్రులకు పంపాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని సూచించారు. జిల్లాలోని పీహెచ్సీ, యూపీహెచ్సీ వైద్యాధికారులతో ఆరోగ్య కార్యక్రమాల అమలుపై శనివారం తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాచర్ల సుహాసిని మాట్లాడుతూ.. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల నమోదు, ఎన్సీడీ– సీడీ సర్వే, గర్భిణుల నమోదు వంటి కార్యక్రమాల లక్ష్యసాధనలో వెనుకబడి ఉన్న గ్రామీణ ప్రాంత వైద్యాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఇందుమతి, ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ మాధవి, మాతృసంరక్షణ నోడల్ అధికారి డాక్టర్ పద్మావతి, డీపీహెచ్ఎన్ డీపీఎంఓ డాక్టర్ నవీన్, లిడియా ఇతర వైద్యాధికారులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు. 21న జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముట్టడి కూటమి విధానాలపై వైఎస్సార్ టీఎఫ్ తిరుగుబాటు మచిలీపట్నంఅర్బన్: ఉపాధ్యాయ బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ మే 21వ తేదీ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముట్టడి చేస్తున్నట్లు ఆ సంఘ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల అధ్యక్షులు మల్లంపల్లి వెంకట మహంకాళిరావు, టి. జగదేశ్వర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలపై కూటమి ప్రభుత్వం తీసు కుంటున్న అస్పష్టమైన, అస్తవ్యస్త విధానాలపై ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఉపాధ్యాయ సంఘాలు ఇటీవల విజయవాడలో జరిగిన కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సమావేశాన్ని బహిష్కరించాయని తెలిపారు. గుర్తింపు పొందిన తొమ్మిది ఉపాధ్యాయ సంఘాలు సంయుక్తంగా ఆందోళన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించాయని వివరించారు. దీనిలో భాగంగా ఈ నెల 21న మచిలీపట్నంలోని ఉమ్మడి జిల్లాల విద్యాశాఖ కార్యాలయం ముట్టడికి నిర్ణయించామని తెలిపారు. 23న విజయవాడలో డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేస్తామని పేర్కొన్నారు. కొండపల్లి బొమ్మల ఖ్యాతి భావితరాలకు చాటాలి కొండపల్లి(ఇబ్రహీంపట్నం): దేశ విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన కొండపల్లి బొమ్మల ఔన్నత్యాన్ని భావితరాలకు చాటిచెప్పేలా ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. కొండపల్లిలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు పనులను క్షేత్రస్థాయిలో శనివారం పరిశీలించి పలు సూచనలు చేశారు. చారిత్రక, సాంస్కృతిక ఔన్నత్యమున్న జిల్లాను పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. శతాబ్దాల నేపథ్యం కలిగిన కొండపల్లి బొమ్మ విశిష్టతను పర్యాటకులకు చాటిచెప్పేలా ఎక్స్పీరియన్స్ సెంటర్ అభివృద్ధి చేస్తామన్నారు. ఖిల్లా ట్రెక్కింగ్కు అనుకూలంగా మెట్లమార్గం అభివృద్ధి చేస్తామన్నారు. ఏపీ టూరిజం అథారిటీ చీఫ్ మార్కెంటింగ్ ఆఫీసర్ ఎస్.పద్మారాణి, టూరిజం కన్సల్టెంట్ సాహితి, జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, మునిసిపల్ కమిషనర్ రమ్యకీర్తన, తహసీల్దార్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలిశర్మ
లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు చిలకలపూడి(మచిలీపట్నం): స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని దీన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలిశర్మ హెచ్చరించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం మధ్యాహ్నం ఆరవ అదనపు జిల్లా న్యాయమూర్తి పాండురంగారెడ్డితో కలిసి వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉన్న జిల్లాలోని స్కానింగ్ కేంద్రాల్లో పక్కా నిఘా ఉంచి తనిఖీలు చేయాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారిపై మాత్రమే కాకుండా అడిగిన వారు, ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. న్యాయమూర్తి పాండురంగారెడ్డి మాట్లాడుతూ జిల్లా జనాభాలో సీ్త్ర, పురుష లింగ నిష్పత్తుల గణాంకాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నిష్పత్తుల్లో వ్యత్యాసం లేకుండా క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో రిజిస్ట్రేషన్ కలిగిన స్కానింగ్ కేంద్రాలు మొత్తం 89 ఉండగా వాటిలో 15 ప్రభుత్వ, 72 ప్రైవేటు కేంద్రాలు ఉన్నాయని వైద్యాధికారులు తెలిపారు. కొత్తగా స్కానింగ్ కేంద్రాలకు రిజిస్ట్రేషన్ కోసం ఐదు దరఖాస్తులు, రెన్యువల్ కోసం మూడు, క్యాన్సిలేషన్కు ఒక దరఖాస్తు వచ్చినట్లు డీఎంఅండ్హెచ్వో ఎస్ శర్మిష్ట వివరించారు. సమావేశంలో కమిటీ సభ్యులు ధర్మతేజ, పి. వెంకటేశ్వరరావు, విద్య మాస్ మీడియా అధికారి సీహెచ్ వాణిశ్రీ పాల్గొన్నారు. -
ఐటీఐ అర్హతతో అద్భుత ఉపాధి అవకాశాలు
ఐటీఐ అర్హతతో అద్భుత ఉపాధి అవకాశాలు ఉన్నాయి. సాంకేతిక విద్యపై ఆసక్తి కలిగి, వివిధ కారణాలతో ఉన్నత చదువులకు వీలుకాని వారికి ఐటీఐ విద్యాకోర్సులు చక్కని ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి. ఐటీఐలో చేరదలిచే విద్యార్థులు ఈ నెల 24వ తేదీ వరకు ఐటీఐ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. కోర్సులు పూర్తి చేసిన తరువాత నైపుణ్యం కలిగిన విద్యార్థులకు జాబ్మేళాలు నిర్వహించి ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తాం. – ఎం.కనకారావు, ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఐటీఐ, విజయవాడ ● -
చె
రువు మట్టి.. రబట్టి పామర్రు, గుడివాడ నియోజకవర్గాల్లో జోరుగా మట్టి తవ్వకాలు సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా జిల్లాలో కూటమి నేతలు సహజ వనరులను కొల్లగొట్టేస్తున్నారు. వారి ధన దాహానికి అడ్డూఅదుపు లేకుండా పోయింది. చెరువులను చెరబట్టి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా మట్టిదందా సాగిస్తున్నారు. పామర్రు నియోజకవర్గంలో రాత్రి, పగలు అన్న తేడా లేకుండా మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా సాగిస్తున్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే మట్టి దందా సాగుతోంది. ప్రైవేటు వెంచర్లకు మట్టిని విక్రయిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. మరో వైపు ఉచిత ఇసుకను కూడా బొక్కేస్తున్నారు. తోట్లవల్లూరు మండలంలోని రొయ్యూరు గ్రామం మొదలుకొని పమిడిముక్కల మండలంలోని లంకపల్లి వరకు సుమారు 30 కిలోమీటర్ల పరిధిలో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో పేదల కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత ఇసుక విధానానికి తూట్లు పొడుస్తున్నారు. రోజుకు 400 లారీల ఇసుకను అక్రమంగా తరలించి జేబులు నింపుకొంటున్నారు. భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేస్తుండటంతో, లంకపల్లి చుట్టుపక్కల కార్మికులు తమ ఉపాధికి గండి కొడుతున్నారని రోడ్డెక్కిన ఘటనలు ఉన్నాయి. గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ మండలంతో పాటు, బుడమేరులో యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు చేస్తూనే ఉన్నారు. పామర్రు నియోజకవర్గంలో.. పొలాల్లో పూడికతీత, గ్రామాల్లో ఇళ్ల స్థలాల మెరకల పేరుతో కూటమి నాయకులు గ్రామాల్లో చెరువులను, కుంటలను చెరబట్టారు. చెరువులు, కుంటల్లో అక్రమంగా మట్టిని తవ్వి ప్రైవేటు వెంచర్లకు తరలిస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాలను ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారు. రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు సైతం మామూళ్లు తీసుకుంటూ తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మట్టి తవ్వకాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ అక్రమ తవ్వకాలు ప్రారంభమయ్యాయి. రోజుకు వందల సంఖ్యలో టిప్పర్ల ద్వారా పామర్రు, ఉయ్యూరు ప్రాంతంలోని ప్రైవేటు వెంచర్లు, ఇళ్ల స్థలాల మెరకు మట్టి తరలిస్తున్నారు. కొన్ని చెరువుల్లో ఇప్పటికే మట్టి అక్రమ తవ్వకాల ద్వారా కోట్ల రూపాయల దోపిడీని పచ్చనేతలు చేశారు. ఒక్కో చెరువులో మట్టి తరలింపు ద్వారా కోటి రూపాయలకు పైగా దోచుకున్నట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోతున్నారు. గుడివాడ నియోజక వర్గంలో.. గుడివాడ నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రజాప్రతినిఽధి కనుసన్నల్లో యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు చేస్తూ, కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. బుడమేరులో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. ఇక్కడి నుంచి తవ్విన మట్టిని ఓ ఇంటర్నేషనల్ స్కూల్కు తరలిస్తున్నారు. నందివాడ మండలంలో వెన్ననపూడి, ఇలపర్రు గ్రామ చెరువుల్లోనూ మట్టి అక్రమ తవ్వకాలు జోరుగాసాగుతున్నాయి. గుడివాడ మండలంలో లింగవరం, నాగవరప్పాడు, బిళ్లపాడు, సిరిసింతల, కలువపూడి అగ్రహారం, మోటూరు గ్రామ చెరు వుల్లో మట్టి దోపిడీ చేస్తున్నారు. గుడ్లవల్లేరు మండలంలో విన్నకోట గ్రామ చెరువులో యథేచ్ఛగా మట్టి దందా సాగిస్తున్నారు. ఈ మట్టిని రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. అక్రమంగా చెరువుల్లో మట్టి తవ్విప్రైవేటు వెంచర్లకు తరలింపు పామర్రు నియోజకవర్గప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే తవ్వకాలు అధికారం అండతో రూ.కోట్లు దోచుకుంటున్న కూటమి నేతలు -
బుడమేరు కాంక్రీట్ పనులకు భూమిపూజ
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): బుడమేరు వద్ద పడిన గండ్లకు శాశ్వత ప్రాతిపదికన చేపట్టనున్న కాంక్రీట్ రక్షణ గోడ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గురువారం భూమిపూజ చేశారు. వేద పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత మాట్లాడుతూ సుమారు రూ.28 కోట్ల అంచనాతో గండ్లు పడిన మూడు ప్రాంతాల్లో 500 మీటర్ల పొడవునా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపడతామని తెలిపారు. గతంలో బుడమేరు వరద ప్రవాహంతో విజయవాడ నగరం వరదతో ముంచెత్తిన విషయం తెలిసిందే అన్నారు. భవిష్యత్లో అలాంటి పరిణామాలు చోటుచేసుకోకుండా శాశ్వత ప్రాతిపదికన రక్షణ గోడ నిర్మాణం చేపడుతున్నామన్నారు. జూన్ 10లోపు రిటైనింగ్ వాల్ నిర్మాణం పనులు పూర్తి చేయాలని నిర్మాణ ఏజెన్సీ సంస్థను కోరారు. అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. -
కొండపల్లి ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పర్యాటకులకు మధురానుభూతిని కల్పించేలా కొండపల్లి ఖిల్లా, కొండపల్లి బొమ్మల తయారీ కేంద్రాలను అభివృద్ధి చేయడంతో పాటు ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సంబంధిత అధికారులకు ఆదేశించారు. కొండపల్లి బొమ్మల తయారీ కాలనీ వద్ద ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు, కొండపల్లి ఖిల్లా అభివృద్ధి పై గురువారం కలెక్టర్ లక్ష్మీశ పర్యాటక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొండపల్లిలో సుమారు 400 ఏళ్లకు పైగా రాజస్థాన్కు చెందిన హస్త కళాకారులు అత్యంత కళానైపుణ్యంతో తయారు చేసిన బొమ్మలకు జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించిందన్నారు. కొండపల్లి పరిసర ప్రాంతాలలో లభ్యమయ్యే తెల్ల పొణికి చెక్కతో రూపొందించే కొండపల్లి బొమ్మలకు మరింత ప్రాచుర్యం కల్పించి కళాకారులను ప్రోత్సహించడం ద్వారా జిల్లాను పర్యాటక హబ్గా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో భాగంగా శతాబ్దాల చారిత్రక వారసత్వానికి సజీవ సాక్ష్యంగా ఉన్న కొండపల్లి బొమ్మల విశిష్టతను పర్యాటకులకు చాటిచెప్పేలా ఎక్స్పీరియన్స్ సెంటర్ను అభివృద్ధి చేస్తామన్నారు. భవనంలో మౌలిక వసతులను అభివృద్ధి చేసి, సుందరీకరణ పనులు చేపట్టి ఆకర్షణీయంగా తీర్చిదిదేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొండపల్లి బొమ్మల కాలనీ నుంచి ఖిల్లా వరకు ఉన్న మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసి పర్యాటకులకు అనువుగా తీర్చిదిద్దాలన్నారు. కొండపల్లి వద్ద పర్యాటకులు ట్రెక్కింగ్ నిర్వహించుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఎస్.పద్మారాణి, టూరిజం కన్సల్టెంట్ సాహితి, జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డీఈ శ్రీనివాస యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ -
కొత్త పింఛన్ల కోసం నిరీక్షణ
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో కొత్త పింఛన్ల మంజూరు కోసం అర్హులు ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా కొత్త పింఛన్ల మంజూరుపై నిర్ణయం ప్రకటించలేదు. కొత్త పింఛన్లు మంజూరవుతాయో లేదోనని అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, కళాకారులు ఆందోళన చెందుతున్నారు. పింఛన్లు ఇప్పించాలని కోరుతూ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దరఖాస్తు చేసుకుందామంటే ఆన్లైన్లో సైట్ ఓపెన్ కావటం లేదని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలని అధికారులు చెబుతుంటే ఏం చేయాలో పాలుపోక తల్లడిల్లుతున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వృద్ధులు, వికలాంగులు పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తులు చేసుకుంటున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి సంవత్సరం జనవరి, జూలైలో కొత్త పింఛన్లు మంజూరు చేసి, లబ్ధిదారులకు నగదు పంపిణీ చేసేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కొత్త పింఛన్లకు అవకాశం లేకపోవటంతో అర్హులకు ఎదురుచూపులు తప్పడంలేదు. మంజూరైనా ఎదురుచూపులే.. జిల్లాలో ఇటీవల వితంతు పింఛన్లను మంజూరు చేశారు. ఈ మంజూరులో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ మందికి ఇవ్వాలన్న ఆలోచన లేకుండా షరతులు విధించింది. 2023 డిసెంబర్ ఒకటి నుంచి 2024 అక్టోబర్ 31వ తేదీలోపు చనిపోయిన పింఛన్దారుల భార్యలకు మాత్రమే వితంతు పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పింది. పింఛన్ పొందని వ్యక్తి చనిపోతే అతని భార్యకు అర్హత లేకుండా చేసింది. జిల్లాలో 3,287 మందికి మాత్రమే కొత్తగా వితంతు పింఛన్లు మంజూరు చేశారు. వారికి పింఛన్లు అందజేసేందుకు గ్రామీణాభివృద్ధి అధికారులకు ఆదేశాలు రాలేదు. ఈ పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారో తెలి యక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 2,34,414 మంది లబ్ధిదారులు జిల్లాలో ప్రస్తుతం 2,34,414 మందికి వివిధ సామాజిక పింఛన్లు అందుతున్నాయి. నియోజకవర్గాల వారీగా అవనిగడ్డలో 42,359 మంది, గన్నవరం 30,297, గుడివాడ 27,744, మచిలీపట్నం 30,019, పామర్రు 35,560, పెడన 31,632, పెనమలూరులో 36,803 మంది లబ్ధిదారులు పింఛన్లు అందుకుంటున్నారు. కొత్త పింఛన్ల కోసం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో అర్హులు సమర్పించిన దరఖాస్తుల్లో కొన్నింటిని గ్రామీణాభివృద్ధి శాఖకు, మరి కొన్నింటిని సంబంధిత ఎంపీడీఓలకు బదిలీ చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక వెయ్యికు పైగా వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పింఛన్ను రూ.1000 పెంచి, మిగిలిన హామలన్నీ తుంగలోకి తొక్కింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని చెప్పినా నేటికీ అమలు చేయలేదు. పీజీఆర్ఎస్లో పింఛన్ల కోసం వెయ్యికి పైగా దరఖాస్తులు మంజూరైన వితంతు పింఛన్లకు నగదు అందజేసేదెప్పుడో? గతంలో సంవత్సరానికి రెండుసార్లు పింఛన్లు మంజూరువితంతు పింఛను మంజూరు చేయలేదు కూటమి ప్రభుత్వం వితంతు పింఛను మంజూరు చేస్తుందని ఆశించాను. అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా ఇంత వరకు నాకు పింఛను మంజూరు చేయలేదు. పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. కలెక్టర్కు చెప్పుకుంటే న్యాయం జరుగుతుందనే ఆశతో నాగాయలంక నుంచి మచిలీపట్నం వచ్చాను. ఇప్పటికైనా పింఛను మంజూరు చేసి నాకు న్యాయం చేయాలి. – కరంకి నాగేంద్రం, గణపేశ్వరం, నాగాయలంక మండలం ప్రతి నెలా పింఛన్లు మంజూరు చేయాలి దరఖాస్తులను పరిశీలించి అర్హులకు ప్రతినెలా మంజూరు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఇంత వరకు పింఛన్లపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన దరఖాస్తులను 15 రోజుల్లో పరిష్కరించాల్సి ఉంది. అయితే పింఛన్ల దరఖాస్తుల్లో ఆ నిబంధన అమలుకావడంలేదు. అర్హులకు ఎదురు చూపులు తప్పడంలేదు. – బూర సుబ్రహ్మణ్యం, సీఐటీయూ మచిలీపట్నం నగర అధ్యక్షుడు -
గురుకుల విద్యార్థుల ప్రతిభకు పట్టం
భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, గురుకుల పాఠశాలల్లో చదువుతూ పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో సత్తాచాటిన విద్యార్థులను సత్కరించారు. వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో ఎంజేపీ గురుకులాలు, బీసీ గృహాల్లో చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించి, అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా 31 గురుకుల పాఠశాలల్లో నూరు శాతం ఫలితాలను తీసుకొచ్చేందుకు కృషి చేసిన ప్రిన్సిపాళ్లను కూడా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 200 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు, 22 మందికి రూ.20 వేలు, రూ.15, రూ.10 వేల చొప్పున నగదు పురస్కారాలను అందజేశామని తెలిపారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా గురుకుల పాఠశాలల బీసీ విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించటం అభినందనీయమన్నారు. జూన్ 15వ తేదీన తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. అన్ని హాస్టళ్లల్లో సన్న బియ్యంతో భోజనం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, సంచాలకుడు డాక్టర్ ఎ.మల్లికార్జున్, అడిషనల్ డైరెక్టర్ డి.చంద్రశేఖర్రాజు, మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల సొసైటీ కార్యదర్శి పి.మాధవీలత, ఎ.కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
నూరు శాతం ఉద్యోగాల సాధన హర్షణీయం
మచిలీపట్నంరూరల్: కృష్ణా యూనివర్సిటీలో విద్యను అభ్యసించిన విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్లో నూరు శాతం ఉద్యోగాలు సాధించటం గొప్ప విషయం అని రాష్ట్ర ఎకై ్సజ్, భూగర్భ వనరులు, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా యూనివర్సిటీలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అకడమిక్ బ్లాక్లో గురువారం అచీవర్స్ డే ఘనంగా నిర్వహించారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎం.ఉష అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రూ.45 కోట్లతో విశ్వవిద్యాలయంలో సర్వ సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయిస్తామని, పల్లె తుమ్మలపాలెంలో మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించామన్నారు. అనంతరం జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ మాట్లాడుతూ ప్రైవేట్ రంగంలో విస్తృతంగా ఉద్యోగావకాశాలు ఉన్నాయన్నారు. విద్యార్థులు ఇంజినీరింగ్, డాక్టర్ కోర్సుల వైపు కాకుండా ఇతర రంగాలను ఎంచుకోవడం చాలా అవసరం అన్నారు. వీసీ ఆచార్య కె.రాంజీ మాట్లాడుతూ కేయూ క్యాంపస్ సెలక్షన్స్లో ఎంపికై న విద్యార్థులు సంవత్సరానికి తొమ్మిది లక్షల రూపాయల ప్యాకేజీ పొందటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను, అధ్యాపకులను అభినందించారు. కార్యక్రమంలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మంత్రి ఘనంగా సత్కరించారు. విద్యార్థులకు వారి తల్లిదండ్రుల చేతులమీదుగా ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు కొనకళ్ళ బుల్లయ్య, నెక్స్ ్ట హబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సీఈఓ సాయికృష్ణ, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ కుమారి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంబాబు, పలువురు ఆచార్యులు పాల్గొన్నారు. -
పేరుకుపోతున్న ధాన్యం నిల్వలు
జగ్గయ్యపేట: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) ద్వారా పార్ బాయిల్డ్ బియ్యం కొనుగోళ్లు నిలిచిపోవటంతో మిల్లు యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. గత 45 రోజులుగా ఎఫ్సీఐ కొనుగోళ్లు ఆపివేయటంతో మిల్లుల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. అయినా పౌర సరఫరాల శాఖాధికారులు పట్టించుకోవటం లేదని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఆయా మిల్లుల్లో 10 వేల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. జిల్లాలో నాలుగు మిల్లులు.. జిల్లాలో జగ్గయ్యపేటలో వెంకటేశ్వర పార్ బాయిల్డ్, అనుమంచిపల్లిలో శ్రీ పద్మావతి శ్రీనివాసా, విస్సన్నపేట మండలం పుట్రేలలోని వెంకటేశ్వర, ఎ.కొండూరులోని వెంకట శేషసాయి పార్ బాయిల్డ్ రైస్ మిల్లులున్నాయి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మిల్లుల వద్ద నుంచి పార్బాయిల్డ్ రైస్ కొనుగోలు చేస్తుంది. 45 రోజులుగా కొనుగోళ్లు నిలిపివేయటంతో మిల్లుల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. దీంతో మిల్లర్లు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రబీ సీజన్ ముగియటంతో ఆయా గ్రామాలలోని రైతు సేవా కేంద్రాల ద్వారా వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా, ఇప్పటికే మిల్లుల్లో ఽనిల్వ ఉన్న ధాన్యంతో రైతులు తీసుకువచ్చే ధాన్యానికి స్థలం లేక ధాన్యం తీసుకోమంటూ మిల్లు యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇటీవల జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం, నందిగామ ప్రాంతాల్లోని రైతులకు, యజమానులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మరొక పక్క యజమానులు మాత్రం ఎఫ్సీఐ అధికారులు ధాన్యం కొనుగోళ్లను ప్రారంభిస్తే మిల్లుల్లో ధాన్యం ఖాళీ అవుతుందని, అప్పుడు రబీ సీజన్కు ధాన్యం తీసుకునేందుకు మిల్లుల్లో అనువుగా ఉంటుందని, రైతులకు గోనె సంచుల కొరత ఉండదని చెబుతున్నారు. రంగు మారే అవకాశం.. ఎఫ్సీఐ బియ్యం కొనుగోలు చేయకపోవటంతో మిల్లుల్లో ఆరుబయట ఉన్న ధాన్యం బాయిల్డ్ సమయంలో రంగు మారే అవకాశం ఉందని అంతేకాకుండా వర్షాలు పడుతుండటంతో తడిసే అవకాశం ఉందని మిల్లర్లు చెబుతున్నారు. బ్యాంకు గ్యారంటీ గడువు కూడా ముగుస్తుందని, ఎఫ్సీఐ అధికారులు కనీస నిబంధనలు కూడా చెప్పటం లేదని వాపోతున్నారు. 45 రోజులుగా నిలిచిన ఎఫ్సీఐ బియ్యం కొనుగోళ్లు పట్టించుకోని అధికారులు రబీ ధాన్యం తీసుకునేందుకు స్థలం లేక మిల్లర్ల ఇబ్బందులు జిల్లాలోని మిల్లుల్లో 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు రెండు, మూడు రోజుల్లో కొనుగోళ్లకు అనుమతులు పార్ బాయిల్డ్ రైస్ మిల్లుల నుంచి ఎఫ్సీఐ గోడౌన్లకు బియ్యం కొనుగోళ్లకు రెండు, మూడు రోజుల్లో అనుమతులు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలోని మిల్లర్లతో మాట్లాడుతున్నాం. అనుమతులు రాగానే కొనుగోలు చేస్తాం. – సతీష్, పౌరసరఫరాల శాఖ డీఎం -
పారిశ్రామిక శిక్షణ.. ఉపాధికి నిచ్చెన
వన్టౌన్(విజయవాడపశ్చిమ): పరిశ్రమలకు అవస రమైన కోర్సులను అందించే ఐటీఐ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. పదో తరగతి అనంతరం ఐటీఐ కోర్సులు చేసిన వెంటనే ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉండటమే దీనికి కారణం. ఇటీవల పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పదో తరగతి అనంతరం చేరాల్సిన కోర్సులపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దృష్టి సారిస్తున్నారు. కొంత మంది విద్యార్థులు పాలిసెట్, రెసిడెన్షియల్ కళాశాలల ప్రవేశ పరీక్షలు రాశారు. అధిక శాతం మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ కోర్సుల్లో చేరనున్నారు. ఇంకా కొందరు విద్యార్థులు టెక్నికల్ కోర్సులు ఉన్న పాలిటెక్నిక్, ఐటీఐలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. పదో తరగతి పూర్తి చేయగానే త్వరితగతిన ఉపాధి పొందేందుకు ఐటీఐ కోర్సులు దోహదం చేస్తాయని సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఐటీఐ కాలేజీలు ఇలా.. ఎన్టీఆర్ జిల్లాలో ఒక ప్రభుత్వ, పది ప్రైవేటు ఐటీఐ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో వివిధ ట్రేడ్లలో 680 సీట్లు ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలల్లో సుమారుగా 944 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాల విజయవాడలో రమేష్బాబు హాస్పిటల్ రోడ్డులో ఉంది. ప్రైవేట్ కళాశాలలకు సంబంధించి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఐటీఐ (గొల్లపూడి), సెయింట్ జోసఫ్ ఐటీఐ (గుణదల), జంపాల అన్నపూర్ణ ఐటీఐ (విజయవాడ), శ్రీ పద్మావతి ఐటీఐ (నందిగామ), వివేకానంద ఐటీఐ (విజయవాడ), సాయి కృష్ణ ఐటీఐ (తిరువూరు), శ్రీమతి ఈకే ఐటీఐ (జగ్గయ్యపేట), పీఎస్సీ బోస్ ఐటీఐ (నందిగామ), డోలూస్ ఐటీఐ (నందిగామ), నలంద ఐటీఐ (విజయవాడ) కళాశాలలు ఈ సంవత్సరం అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఎన్టీఆర్ జిల్లాలో ఒక ప్రభుత్వ, పది ప్రైవేట్ కాలేజీలు వివిధ ట్రేడుల్లో అందుబాటులో 1,624 సీట్లు అడ్మిషన్ల రిజిస్ట్రేషన్లకు ఈ నెల 24 వరకు గడువు -
హోరాహోరీగా ఎడ్ల బండ లాగుడు పోటీలు
నందిగామ రూరల్: మండలంలోని లింగాలపాడు గ్రామంలో ఉన్న లక్ష్మీ పేరంటాళ్లు అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఎడ్ల బండ లాగుడు పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోటీలలో భాగంగా న్యూ కేటగిరీ విభాగంలో నిర్వహించిన ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన పోటీలను గురువారం రాత్రి పశుప్రదర్శన కమిటీ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యూ కేటగిరీ విభాగంలో ఎనిమిది జతలు పోటీలో పాల్గొన్నాయన్నారు. పోటీలను తిలకించేందుకు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న ఎడ్ల జత యజమానులకు అంబారుపేట గ్రామంలోని సత్యమ్మ అమ్మవారి ఆలయ మాజీ చైర్మన్ గరికపాటి భాస్కరం సోదరులు వస్త్రాలు, జ్ఞాపికలను అందజేశారు. నగదు బహుమతుల అందజేత గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన ఆరుపళ్ల విభాగం పోటీలలో విజేతలైన ఎడ్ల జత యజమానులకు కమిటీ సభ్యులు నగదు బహుమతులు అందజేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామానికి చెందిన శ్రీకావ్య నంది బ్రీడింగ్ బుల్స్ నెల్లూరి రామకోటయ్య ఎడ్ల జత 15 నిమిషాల వ్యవధిలో 3911.08 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచింది. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామానికి చెందిన అనంతనేని కావ్యమధు ఎడ్ల జత 3583.2 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం, బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం పంగులూరు గ్రామానికి చెందిన చిలుకూరి నాగేశ్వరరావు ఎడ్ల జత 3,500 అడుగుల దూరం లాగి తృతీయ స్థానంలో నిలిచాయన్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి గ్రామానికి చెందిన గాదే అశేర్ సుమన్వీరెడ్డి ఎడ్ల జత 3,481.8 అడుగుల దూరం లాగి నాలుగవ స్థానం, పల్నాడు జిల్లా నకిరేకల్ మండలం చల్లగుండ్ల గ్రామానికి చెందిన మేక అంజిరెడ్డి ఎడ్ల జత 3412.3 అడుగుల దూరం లాగి ఐదవ స్థానం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాసరావు ఎడ్ల జత 3,313.3 అడుగుల దూరం లాగి ఆరవ స్థానంలో నిలిచాయని తెలిపారు. విజేతలకు వరుసగా రూ.40 వేలు, రూ.35 వేలు, రూ.30 వేలు, రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.15 వేల చొప్పున నగదు బహుమతులు అందించినట్లు కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, రాంబాబు, విక్రమ్, రాంబాబు, వెంకట్రావ్, శివాజీ తదితరులు పాల్గొన్నారు. -
నిత్యాన్నదానానికి భక్తుల విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గురువారం పలువురు భక్తులు విరాళాలు అందచేశారు. హిందూ పూర్కు చెందిన బి.నవీన్ అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ ఈఓ శీనానాయక్ను కలిసి నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని అందచేశారు. విజయవాడ భవానీపురానికి చెందిన శీలం సాయి ఫణీంద్ర కుటుంబం అమ్మవారి నిత్యాన్నదాన పథకానికి రూ.1,01,116 విరాళం సమర్పించింది. దాతలకు ఈఓ శీనానాయక్, ఆలయ పర్యవేక్షకుడు నాథురామ్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. దుర్గమ్మకు వెండి పంచపాత్ర సమర్పణ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం దంపతులు గురువారం వెండి పంచపాత్రను సమర్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు లక్ష్మీకాంతం దంపతులు ఆలయానికి విచ్చేయగా, ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం రూ.2 లక్షలు ఖర్చుచేసి 2.028 కిలోల వెండితో తయారు చేయించిన పంచపాత్రను ఆలయ అధికారులకు అందజేశారు. లక్ష్మీకాంతం దంపతులకు అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. తిరుమలగిరి హుండీ ఆదాయం రూ. 26.41 లక్షలు తిరుమలగిరి(జగ్గయ్యపేట): స్థానిక వాల్మీకోద్భవ వెంకటేశ్వర స్వామికి హుండీ కానుకల ద్వారా రూ.26,41,390 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రసాద్ తెలిపారు. గురువారం ఆలయ ప్రాంగణంలో కానుకల లెక్కింపు నిర్వహించారు. గత నెలలో నిర్వహించిన స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. కానుకల లెక్కింపులో దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ పవన్కల్యాణ్, పరిటాల సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అడ్డుకున్న గ్రామస్తులు హుండీ కానుకల లెక్కింపు సమాచారాన్ని ఆలయ పాలకవర్గానికి ఇవ్వలేదని కొద్దిసేపు గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇటీవల జరిగిన కల్యాణ మహోత్సవాల్లో ఆలయ ఈఓ ఇష్టానుసారం డబ్బు ఖర్చు చేశారని, ఆ వివరాలు కూడా చెప్పటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఆలయం వద్దకు చేరుకుని గ్రామస్తులకు సర్దిచెప్పారు. ఆ సమయంలో ఆలయ ఈఓ కార్యాలయంలో లేరు. తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నట్లు ఇద్దరు వ్యక్తులపై ఆలయ ఈఓ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కొండపల్లి మునిసిపల్ చైర్మన్ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్ ఇబ్రహీంపట్నం: మండలంలోని కొండపల్లి మునిసిపాలిటీ చైర్మన్ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మునిసిపల్ కమిషనర్ రమ్యకీర్తనకు హైకోర్టు నుంచి సీల్డ్ కవర్ వచ్చింది. సీల్డ్ కవర్ను సబ్ ట్రెజరీలో భద్రపర్చాలని ఆదేశాలు ఉన్నాయి. దీంతో మైలవరం సబ్ ట్రెజరీ అధికారులకు దానిని గురువారం మునిసిపల్ కమిషనర్ అందజేశారు. విజయవాడ ఆర్డీఓ చైతన్య ఈ సీల్డ్ కవర్ను తెరిచి అందులో ఉన్న ఉత్తర్వుల మేరకు మునిసిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. 2021 నవంబర్లో 29 వార్డులకు ఎన్నికలు జరిగాయి. వైఎస్సార్ సీపీ నుంచి 14 మంది, టీడీపీ నుంచి 14 మంది కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. ఒకరు ఇండిపెండెంట్గా గెలుపొందారు. ఇండిపెండెంట్ కౌన్సిలర్ టీడీపీలో చేరడంతో వారి సంఖ్య 15కు చేరింది. అప్పటి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ ఎక్స్ అఫీషియో ఓటుతో వైఎస్సార్ సీపీ సంఖ్య కూడా 15 అయింది. అప్పటి టీడీపీ ఎంపీ కేశినేని నాని ఎక్స్అఫీ షియో ఓటు కోసం కోర్టును ఆశ్రయించడంతో ఎన్నిక నిర్వహించి సీల్డ్కవర్ ద్వారా కోర్టుకు సమర్పించారు. ఇటీవల కాలంలో కేశినేని నాని కేసు ఉపసంహరించుకోవడంతో ప్రస్తుతం కోర్టు ఉత్తర్వులు సీల్డ్ కవర్లో వచ్చాయి. -
నిర్లక్ష్యాన్ని సహించను
ఉపాధి లక్ష్యాల సాధనలో గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా శ్రామికులకు 80 లక్షల పనిదినాలను కల్పించాలనే లక్ష్యాన్ని సాధించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, లక్ష్య సాధనలో నిర్లక్ష్యాన్ని సహించనని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరించారు. పనుల నిర్వహణలో వెనుకబడితే చర్యలు తప్పవని, శ్రామికులకు రూ.307 కనీస వేతనం కల్పించి ఆర్థిక ఊతం ఇచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో చేపడుతున్న పనుల ప్రగతిపై బుధవారం నీటి యాజమాన్య సంస్థ అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు, మండలాభివృద్ధి అధికారులు, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అధికారులతో కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా శ్రామికులకు పని కల్పించి వారికి ఆర్థిక ఊతం ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడంలో ఎటువంటి అలసత్వం వహించినా సహించేది లేదన్నారు. ఈ ఏడాది శ్రామికులకు 80 లక్షల పని దినాలను కల్పించాలన్నది లక్ష్యం కాగా ఇప్పటివరకు కేవలం 13.40 లక్షల పని దినాలను మాత్రమే కల్పించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో పనులను మరింత వేగవంతం చేసి లక్ష్య సాధన వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. జగ్గయ్య పేట, నందిగామ, చందర్లపాడు, రెడ్డిగూడెం విస్సన్నపేట, ఎ.కొండూరు మండలాలలో ఆశించిన స్థాయిలో లేదని, ఆయా మండలాల అధికారులు మరింత ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఉపాధి హామీ ద్వారా 3వేల పంట కుంటలను నిర్మించాలని లక్ష్యం కాగా, ఇప్పటివరకు 572 కుంటలు మాత్రమే పూర్తి చేశారన్నారు. ఉపాధి హామీ పనులలో ఉద్యాన పంటల పనులకు ఆర్థిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఉద్యాన పంటల సాగుకు ప్రతి గ్రామంలో కనీసం 20 ఎకరాలను గుర్తించాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు సరాసరి 294 రూపాయలు మాత్రమే శ్రామికులకు లభిస్తోందని చేపట్టనున్న పనుల ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన రూ.307 దినసరి కనీస వేతనం తప్పనిసరిగా లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జాతీయ ఉపాధి హామీ పథకం ప్రాజెక్టు డైరెక్టర్ ఎ.రాము, ఉద్యాన శాఖ సహాయ సంచాలకుడు పి. బాలాజీ కుమార్, గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి జి.జ్యోతి, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. శ్రామికులకు కనీస వేతనం రూ.307 కల్పించాలి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ -
ఆకట్టుకున్న గోదా కల్యాణం నృత్య రూపకం
శ్రీకాకుళం(ఘంటసాల): శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషాభిమానాన్ని కళ్లకు కట్టినట్లు ప్రదర్శించిన గోదా కల్యాణం కూచిపూడి నృత్య రూపకం ఆసాంతం ఆకట్టుకుంది. శ్రీకృష్ణదేవరాయల మహోత్సవం సందర్భంగా ఆముక్త మాల్యద కావ్యం నుంచి డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్, కేవీ సత్యనారాయణ రచించిన గోదా కల్యాణం కూచిపూడి నృత్య రూపకాన్ని బుధవారం రాత్రి ప్రదర్శించారు. శ్రీకృష్ణదేవరాయలుగా కేవీ సత్యనారాయణ అభినయించారు. తొలుత కేవీ సత్యనారాయణను జస్టిస్ యు.దుర్గా ప్రసాద్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఘనంగా సన్మానించారు. -
ప్రతిభకు కార్పొరేట్ వల
కంకిపాడు: ‘‘ఇంటర్లో స్టేట్ 1, 2, 3 ర్యాంకులు మావే... నీట్, ఎంసెట్లోనూ మేమే టాప్..’’ అంటూ కార్పొరేట్ విద్యాసంస్థలు తమ స్థాయిని పదిలం చేసుకోవాలంటే ప్రతిభావంతులైన విద్యార్థులు ఉంటేనే సాధ్యం. అందుకు ప్రతిభావంతులైన విద్యార్థులు పక్క విద్యాసంస్థల్లో చేరకుండా తమ సంస్థల్లోనే అడ్మిషన్లు పొందేలా చేసుకోవాలి. దీంతో పలు విద్యాసంస్థలు అడ్మిషన్లలో తీవ్ర పోటీ పడుతున్నాయి. ప్రతిభావంతులను చేర్చుకునే పనిలో పడ్డాయి. సమయం లేదుగా... ఈ విద్యాసంవత్సరం ఇంటర్మీడియెట్ తరగతులు జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు తమకు అనువైన, అందుబాటులో ఉన్న కళాశాలల్లో కోర్సులను ఎంపిక చేసుకుని అడ్మిషన్లను పొందుతున్నారు. ఈ కొద్ది రోజుల సమయాన్ని వినియోగించుకుని అడ్మిషన్లను భారీగా నమోదు చేసుకునే పనిలో పేరొందిన కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన విద్యాసంస్థలు నేడు గ్రామీణ ప్రాంతాల్లోనూ బ్రాంచిలను అందుబాటులోకి తెచ్చి గ్రామీణ విద్యార్థులను చేర్పించుకుంటూ, అందుబాటులోనే తమ సంస్థ బ్రాంచిలు ఉన్నాయంటూ ప్రచారంలో ముందున్నాయి. ఆఫర్లే...ఆఫర్లు పది ఫలితాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులపై టాప్–5లో ఉన్న కార్పొరేట్ సంస్థలు దృష్టి సారించాయి. వారు చదివిన పాఠశాలల నుంచి విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు సేకరించి వారిని నేరుగా కలుసుకుని అడ్మిషన్లను ఖాయం చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఇటీవల విడుదలైన పది ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభను చూసి ఆఫర్లు ఇస్తున్నారు. 550 మార్కులు దాటితే ఫీజులో 50 శాతం రాయితీ, 575 మార్కులు దాటితే 75 శాతం రాయితీ, 590 పైన మార్కులు వస్తే 80–90 శాతం వరకూ ఫీజుల్లో రాయితీ, అవసరమైతే అదనపు సౌకర్యాలు కూడా కల్పిస్తామంటూ ఆఫర్లు మీద ఆఫర్లు అందిస్తున్నారు. ఇదే క్రమంలో గత విద్యాసంవత్సరంలో తమ సంస్థకు వచ్చిన ర్యాంకులు, నీట్, ఎంసెట్ ఫలితాల్లో టాప్గా నిలిచామంటూ ప్రకటనలను చూపించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆకర్షణ మంత్రం వాడుతున్నారు. ఎంసెట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ అన్నింటికి కోచింగ్ ఇదే ఫీజులో అందిస్తామంటూ ఆశ చూపుతున్నారు. ఇంటర్లో అడ్మిషన్ల కోసం క్యూలు కడుతున్న వైనం విద్యార్థుల ఇళ్ల చుట్టూ అధ్యాపకుల ప్రదక్షిణలు రకరకాల ఆఫర్ల పేరుతో ఆకర్షించే యత్నం అడ్మిషన్లు మిస్సయితే జీతాలు కట్ కొంతమంది విద్యార్థుల వ్యక్తిగత ప్రతిభను తమ ఖాతాలో వేసుకుని కోట్లు దండుకుంటున్నాయి కార్పొరేట్ విద్యా సంస్థలు. టెన్త్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు వల వేసి, వారికి ఫీజుల్లో 50 నుంచి 90 శాతం వరకు కూడా రాయితీల ఆశ చూపించి తమ సంస్థల్లో చేర్చుకుంటాయి. ఇంటర్లో వారు సాధించిన ర్యాంకులను తమ గొప్పలుగా చెప్పుకొంటూ లక్షలాది అమాయక విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కోట్లాది రూపాయలు పోగేసుకుంటున్నాయి. మరో వైపు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మెడపై కార్పొరేట్ సంస్థలు కత్తి పెడుతున్నాయి. ఎంపిక చేసుకున్న విద్యార్థుల అడ్మిషన్ నూరు శాతం ఓకే అవ్వాలి. అడ్మిషన్ల సంఖ్య తగ్గినా, ముఖ్యమైన టార్గెట్ మిస్సయినా మే నెల జీతాలు ఉండబోవని ఆయా సంస్థలు తమ సిబ్బందికి టార్గెట్లు నిర్ణయిస్తున్నాయి. దీంతో సిబ్బంది చేసేది లేక విద్యార్థులు, వారి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఎలాగోలా అడ్మిషన్ ఓకే అయ్యేలా చేసేందుకు నానా తిప్పలు పడుతున్నారు. -
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వరస్వామి వార్లకు భక్తులు హుండీల ద్వారా రూ.3.73 కోట్ల నగదు కానుకలు, ముడుపులు, మొక్కుబడుల రూపంలో సమర్పించారు. ఆది దంపతులకు భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం మహామండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 23 రోజులకు గాను మొత్తం రూ.3,73,37,549 నగదు, 420 గ్రాముల బంగారం, 7.020 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈఓ శీనానాయక్ పేర్కొన్నారు. కానుకల లెక్కింపును దేవదాయ శాఖ అధికారులు, ఎస్పీఎఫ్ సిబ్బంది పర్యవేక్షించగా, ఆలయ అధికారులు, సిబ్బంది, సేవా సిబ్బంది పాల్గొన్నారు.దుర్గమ్మకు అగ్గిపెట్టెలో పట్టుచీర సమర్పించిన సిరిసిల్ల నేతన్నఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయ వాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయ్కుమార్ అగ్గిపెట్టెలో ఇమిడ్చిన పట్టుచీరను సమర్పించారు. దుర్గగుడికి బుధవారం చేరుకున్న విజయ్కుమార్ అగ్గిపెట్టెలో తెచ్చిన పట్టుచీరను ఆలయ ఈవో శీనానాయక్కు అందజేశారు. తొలుత అమ్మవారి దర్శనానికి విచ్చేసిన విజయ్కుమార్ కుటుంబానికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా విజయ్కుమార్ మాట్లాడుతూ సుమారు వంద గ్రాముల బరువు కలిగిన పట్టుచీర ఐదున్నర మీటర్లు, 48 ఇంచుల వెడల్పున తయారు చేశామన్నారు. తమ కుటుంబం నుంచి ప్రతి రెండేళ్లకో సారి అమ్మవారికి పట్టుచీరను తయారు చేసి అందిస్తున్నామన్నారు. అనంతరం ఆలయ ఈవో శీనానాయక్ విజయ్కుమార్కు అమ్మవారి ప్రసాదాలను అందించారు.దసరా లోగా చేనేత సొసైటీలకు ఎన్నికలులబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో దసరా పండుగ లోగా చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. చేనేతలకు త్వరలో హెల్త్ ఇన్సూరెన్స్ అమలు చేయనున్నామని చెప్పారు. లబ్బీ పేటలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో బుధవారం మంత్రి సవిత చేనేత కార్మికులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత చేనేత కార్మికులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చేనేత వస్త్రాలను మూడు నెలలకు ఓ సారి ఆప్కో ద్వారా కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారంలో ఒక రోజు చేనేత దుస్తులు తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, సెర్ఫ్ సీఈఓ కరుణ, ఆప్కో ఎండీ విశ్వ తదితరులు పాల్గొన్నారు.ఎవరినీ ఉపేక్షించం : హోంమంత్రిఉయ్యూరు రూరల్: రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, అవినీతి అక్ర మాలకు పాల్పడినా వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఉయ్యూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ను బుధవారం ఆమె ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమా వేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎవరికీ భయపడదని, తప్పు చేసిన వారిని ఉపేక్షించేది లేదన్నారు. త్వరలో నూజివీడు వద్ద పోలీస్ ట్రైనింగ్ అకాడమీ, విజయ నగరం జిల్లాలో గ్రాండ్ ట్రైనింగ్ అకాడమీ నిర్మించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పాల్గొన్నారు. -
ఖరీఫ్ సాగుపై నీలినీడలు
నిధులు మంజూరు చేయని ప్రభుత్వం గండ్లు పూడ్చకపోతే సాగు చేయలేం వెల్లటూరు పడమర చెరువు కింద నాకు 2 ఎకరాల పొలం ఉంది. పోయిన సంవత్సరం ఖరీఫ్లో వరి సాగు చేశాను. చెరువుకు ఐదు చోట్ల గండ్లు పడి పైరు పూర్తిగా కొట్టుకుపోయి తీవ్రంగా నష్టపోయాను. ఇప్పటివరకు గండ్లు పూడ్చలేదు. గండ్లు పూడ్చకపోతే పంట సాగు చేయలేం. –మాదు నాగయ్య, రైతు, వెల్లటూరు పులివాగు గండ్లతో తీవ్రంగా నష్టపోయాం గత ఏడాది బుడమేరుకు వచ్చిన వరదలతో పులివాగు పొంగి గండ్లు పడ్డాయి. ఈ వరదల వలన నేను సాగు చేసిన నాలుగు ఎకరాల్లో వరిపైరు కుళ్లిపోయింది. తీవ్రంగా నష్టపోయాను. గండ్లు ఇప్పటివరకు పూడ్చలేదు. ఈ ఏడాది సాగు చేపట్టడం కూడా దండగ అనిపిస్తోంది. గండ్లు పూడ్చకపోతే సాగు చేపట్టలేం. –బెజవాడ వీరయ్య, రైతు, కవులూరు ఎనిమిది నెలలైనాగండ్లు పూడ్చలేదు గత ఏడాది వరదల వలన పులివాగుకు గండ్లు పడి నేను సాగు చేసిన పది ఎకరాల్లో వరిపైరు పాడైపోయింది. తీవ్రంగా నష్టపోయాను. గండ్లు పడి ఎనిమిది నెలలు దాటినా గండ్లు పూడ్చకపోవడం దారుణం. ప్రభుత్వం వెంటనే గండ్లను పూడ్చాలి. లేదంటే ఈ ఏడాది సాగు చేపట్టడం కష్టమే. –బొర్రా శ్రీనివాసరావు, రైతు, కవులూరు కూటమి ప్రభుత్వానికి అమరావతి జపం తప్ప రాష్ట్రంలో రైతులు ఏమై పోయినా పట్టదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా దళారీల దోపిడీకి దారులు తెరుస్తోంది. మిర్చికి గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నా పట్టించుకోదు. బుడమేరు వరదలకు గండ్లు పడి ఎనిమిది నెలలైనా వాటిని పూడ్చాలనే ధ్యాసే ఈ ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది ఖరీఫ్లో 10 వేల హెక్టార్లలో సాగు ప్రశ్నార్థకం కానుంది. జి.కొండూరు: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. గత ఏడాది జల ప్రళయాన్ని సృష్టించిన బుడమేరు ప్రక్షాళన సంగతి దేవుడెరుగు కనీసం చెరువులకు, వాగులకు పడిన గండ్లను పూడ్చడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో ఈ ఏడాది ఖరీఫ్ సాగు చేపట్టాలో లేదో తెలియక రైతులు అయోమయంలో ఉన్నారు. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎగువ బుడమేరు గండ్లతో పాటు పలు వాగులు, ఎన్ఎస్పీ కాల్వలకు పడిన గండ్లను అలానే వదిలేయడంతో మరో జల ప్రళయానికి ఆస్కారమిచ్చేలా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ... బుడమేరు డైవర్షన్ కెనాల్కు జి.కొండూరు మండల పరిధి కవులూరు శివారులో పడిన భారీ గండ్ల వద్ద జరుగుతున్న లైనింగ్ పనులను ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చెరువులు, వాగులు, ఎగువ బుడమేరు గండ్లు పూడ్చకపోతే తాము సాగు చేయలేమంటూ మొరపెట్టుకున్నారు. ఖరీఫ్ సాగు చేయమంటారా, వద్దంటారా అని మంత్రిని రైతులు పశ్నించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ దాటవేత ధోరణితో మాట్లాడారు. గండ్లు పూడ్చేందుకు ప్రతిపాదనలు ఆర్థికశాఖ వద్ద పెండింగ్లో ఉన్నాయని, నిధులు విడుదల చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. లైనింగ్ పనులకు విడుదలైన నిధులనే ఆర్థికశాఖ రిజెక్ట్ చేస్తే సమస్య తీవ్రతను వివరించి నిధులు తెచ్చామంటూ గొప్పలు చెప్పారు. మంత్రి మాటలను విని నవ్వాలో, ఏడవాలో తెలి యని పరిస్థితిలో రైతులు ఉన్నారు. గండ్లు పూడ్చకపోతే క్రాప్ హాలిడే ప్రకటించడమే మేలని భావిస్తున్నారు.ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోతే బుడమేరు వరద ముంపునకు గురైన పదివేల హెక్టార్లలో ఈ ఏడాది ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకం కానుంది. వర్షాకాలం ముంచుకొస్తున్నా... గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన భారీ వర్షానికి బుడమేరు ఉగ్రరూపం దాల్చడంతో మైలవరం నియోజకవర్గంలో 34 చెరువులకు గండ్లు పడ్డాయి. వీటితో పాటు పులివాగు, కోతులవాగు, ఎన్ఎస్పీ కాల్వలకు సైతం గండ్లు పడి వేలాది ఎకరాల్లో ఖరీఫ్ పంటను రైతులు నష్టపోయారు. ఈ వరదల వలన చెరువులకు పడిన గండ్లను తాత్కాలికంగా కొన్ని చోట్ల పూడ్చినప్పటికీ కొన్ని చెరువులు, వాగులు, ఎగువ బుడమేరు గండ్లకు తట్ట మట్టి కూడా వేయలేదు. వేసవి కాలం పూర్తయి వర్షాకాలం వస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇంకా చోద్యం చూస్తుండడంతో ఖరీఫ్ సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. బుడమేరు గండ్లు పూడ్చడంలో మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వం వర్షాకాలం సమీపిస్తున్న వేళ రైతుల ఆందోళన గండ్లు పూడ్చకపోతే సాగు చేపట్టడం కూడా దండగేనంటున్న రైతులు గండ్లు పూడ్చాలంటూ ఇరిగేషన్ మంత్రికి మొరపెట్టుకున్న రైతులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేసిన మంత్రి 10వేల హెక్టార్లలో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకమే క్రాప్ హాలిడే తప్పదాబుడమేరు వరదల వలన వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎగువ బుడమేరు అంటే బుడమేరు ప్రారంభం వరకు వాగుకు ఇరువైపులా కట్టలకు పడిన గండ్లను పూడ్చేందుకు అధికారులు 65 పనులుగా నిర్థారించారు. ఈ పనులకు రూ.29 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనాలు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపి నెలలు గడుస్తున్నా నిధులు విడుదల చేయలేదు. దీంతో పాటు చెరువులు, పులివాగు, కోతులవాగు, ఎన్ఎస్పీ కాల్వలకు పడిన గండ్లను శాశ్వతంగా పూడ్చేందుకు రూ.35 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనాలు పంపినా నిధులను విడుదల చేయలేదు. కేవలం బుడమేరు డైవర్షన్ కెనాల్కు కవులూరు గ్రామశివారులో పడిన భారీ గండ్ల వద్ద లైనింగ్ పనులు, హెడ్ రెగ్యులేటర్ మరమ్మతులకు మాత్రమే రూ.39.77 కోట్లు నిధుల విడుదల చేసి చేతులు దులుపుకొన్నారు. -
రసవత్తరంగా ఎడ్ల బండ లాగుడు పోటీలు
నందిగామ రూరల్: మండలంలోని లింగాలపాడు గ్రామంలో వేంచేసియున్న లక్ష్మీపేరంటాళ్లు అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఎడ్ల బండ లాగుడు పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఆరు పళ్ల విభాగం పోటీలను బుధవారం రాత్రి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త వెంకటలక్ష్మీ సాయిబాబు ప్రారంభించారు. ఈ విభాగంలో 17 జతలు పాల్గొన్నాయని, 10.20 క్వింటాళ్ల బరువును 15 నిమిషాల వ్యవధిలో లాగిన దూరాన్ని బట్టి విజేతలను నిర్ణయిస్తామని నిర్వాహకులు తెలిపారు. పోటీల్లో పాల్గొన్న ఎడ్ల జత యజ మానులకు అంబారుపేట గ్రామంలోని సత్యమ్మ అమ్మవారి ఆలయ మాజీ చైర్మన్ గరికపాటి భాస్కరం సోదరులు వస్త్రాలు, జ్ఞాపికలను అందజేశారు. నగదు బహుమతుల అందజేత మంగళవారం రాత్రి జరిగిన నాలుగు పళ్ల ఎడ్ల ప్రదర్శన పోటీల్లో విజేతలుగా నిలిచిన ఎడ్ల జతల యజమానులకు కమిటీ సభ్యులు నగదు బహుమతులు అందజేశారు. గుంటూరు జిల్లా కొల్లిపర గ్రామానికి చెందిన గుదిబండ మాధవరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎడ్ల జత 4,750 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచింది. బాపట్ల జిల్లా సంతమాగులూరుకు చెందిన వజ్రాల తేజారెడ్డి, కృష్ణాజిల్లా పెనమలూరుకు చెందిన అనంతనేని శ్రీకన్యశ్రీమధు ఎడ్ల జత 4,702 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం, బాపట్ల జిల్లా యద్దన పూడికి చెందిన ఖాదర్ మస్తాన్, బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పూసపాడుకు చెందిన ఏలూరి లిఖిత చౌదరి ఎడ్ల జత 3,750 అడుగుల దూరం లాగి తృతీయ స్థానం, మండల కేంద్రమైన చందర్లపాడు గ్రామానికి చెందిన గడుపూడి సాంబశివరావు ఎడ్ల జత 3,500 అడుగుల దూరం లాగి నాలుగో స్థానం, పల్నాడు జిల్లా నరసారావుపేట మండలం ఇస్సప్పాలేనికి చెందిన మందలపు వాసవికారెడ్డి, జశ్వితరెడ్డి ఎడ్ల జత 3,250.11 అడుగుల దూరం లాగి ఐదో స్థానం, పల్నాడు జిల్లా నరసారావుపేట మండలం రావిపాడుకు చెందిన యద్దనపల్లి పెద్దబ్బాయ్ బుజ్జి మెమోరియల్ మనోజ్ చౌదరి ఎడ్ల జత, పల్నాడు జిల్లా క్రోసూరు మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన ప్రవీణ్కుమార్, ప్రేమ్కుమార్ ఎడ్ల జత 3,221 అడుగుల దూరం లాగి ఆరో స్థానంలో నిలిచాయి. విజేతలకు వరుసగా రూ.30 వేలు, రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.12 వేలు, రూ.10 వేల నగదు బహుమతులు అందించినట్లు కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, రాంబాబు, విక్రమ్, రాంబాబు, వెంకట్రావ్, శివాజీ తదితరులు తెలిపారు. -
వైభవంగా శ్రీకృష్ణదేవరాయల మహోత్సవం
ఘంటసాల: తెలుగు భాషలోని నీతులు, సామాజిక రీతులను చిన్నారులకు చెప్పకపోవడం వల్లే నేటి సమాజంలో మానవ సంబంధాలు దెబ్బతింటున్నా యని హై కోర్టు విశ్రాంత న్యాయమూర్తి, ప్రభుత్వ హైపవర్ కమిటీ చైర్మన్ జస్టిస్ యు.దుర్గాప్రసాద్ అన్నారు. ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో వేంచేసియున్న శ్రీకాకుళేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ కృష్ణదేవరాయలు మహోత్సవం బుధవారం రాత్రి వైభవంగా జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి, డీసీ దాసరి శ్రీరామ వర ప్రసాదరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. ఇలాంటి ఉత్సవాలు తెలుగు భాషాభివృద్ధికి దోహదం చేస్తాయని అన్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లా డుతూ.. యావత్ తెలుగు జాతికి స్ఫూర్తినిచ్చిన మహోన్నత వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు అని కొనియాడారు. తెలుగులో ఆముక్తమాల్యద గ్రంథాన్ని రచించారని పేర్కొన్నారు. తొలుత ఈ కార్యక్ర మానికి హాజరైన జస్టిస్ దుర్గాప్రసాద్కు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆముక్తమాల్యద మండపంలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి జస్టిస్ దుర్గా ప్రసాద్, ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి.వి.పూర్ణచందు, ఏఏంసీ చైర్మన్ తోట కనకదుర్గ, సర్పంచ్ ఎం.రవి ప్రసాద్, పీసీ చైర్మన్ డి.వెంకటేశ్వరరావు, ప్రత్యేకాధికారి సాయిబాబు, తహసీల్దార్ బి.విజయ ప్రసాద్, ఎంపీడీఓ డి.సుబ్బారావు పాల్గొన్నారు. -
ఇన్ని రకాల పాఠశాలలు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా?
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భారత దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తొమ్మిది రకాల పాఠశాలలను నెలకొల్పే ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) ఎద్దేవా చేసింది. ఇన్ని రకాల పాఠశాలలు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా అంటూ కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో 117 జీఓకు పూర్వం ఉండే పాఠశాల వ్యవస్థ విధానాలు కావాలని కోరుతూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా జరిగింది. కూటమి ప్రభుత్వం విధానంతో ప్రభుత్వ పాఠశాలలు బలహీన పడతాయని ధ్వజమెత్తింది. ఈ ధర్నాను ప్రారంభించిన ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి మంజుల మాట్లాడుతూ.. విద్యారంగాన్ని గాడిలో పెడతామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ రంగాన్ని మరింత గందరగోళంలోకి నెడుతోందన్నారు. దీనిని ఏపీటీఎఫ్ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తోందని స్పష్టంచేశారు. గత ప్రభుత్వం కేవలం 3, 4, 5, తరగతులను మాత్రమే ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తే... ఈ ప్రభుత్వం ఒకటి, రెండు తరగతులను కూడా విలీనం చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవాచేశారు. మోడల్ ప్రాథమిక పాఠశాలల పేరుతో, ఫౌండేషన్ పాఠశాలలను నెలకొల్పడం సరికాదన్నారు. మోడల్ ప్రాథమిక పాఠశాలలకు స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టు టీచర్లను నియమించడం అశాసీ్త్రయమని విమర్శించారు. ఈ ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.భానుమూర్తి మాట్లాడుతూ ‘గత ప్రభుత్వ విద్యారంగ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. 12వ నేతన సవరణ కమిషన్ నియమించి 2023 జూలై నుంచి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పీఆర్సీ అమలు చేయాలని, ప్రభుత్వం ఉద్యోగులకు బాకీపడిన 34 డీఏలను తక్షణం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ ప్రధాన సంపాదకుడు షేక్ జిలాని మాట్లాడుతూ.. విద్యారంగంలో విధ్వంస విధానాలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి పి.పాండురంగ వరప్రసాద్ మాట్లాడుతూ ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తొమ్మిది రకాల పాఠశాలలను నెలకొల్పడం, పాఠశాలకు పాఠశాలకు మధ్య అనేక అంతరాలను సృష్టించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు ఎ.శ్యాంసుందరరెడ్డి, కె.అశోక్ కుమార్, టి.త్రినాథ, మర్రివాడ అనిత, పువ్వాడ వెంకటేశ్వర్లు, కార్యదర్శులు డి.సరస్వతి, బి.ఎ.సాల్మన్రాజు, సయ్యద్ చాంద్బాషా, ఎన్.రవికుమార్, కె.శ్రీనివాసు, ఎం.శ్రీనివాసరావు, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వానికి ఏపీటీఎఫ్ సూటి ప్రశ్న -
జూన్ మొదటి వారంలో బీచ్ ఫెస్టివల్
మచిలీపట్నంరూరల్: జూన్ మొదటి వారంలో నాలుగు రోజులపాటు బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తా మని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. మంగినపూడి బీచ్ను మంత్రి బుధవారం సందర్శించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. తొలుత ప్రవేశ మార్గంలో ఫిలిం ఆర్ట్ డైరెక్టర్ రమణ వంక ఏర్పాటు చేస్తున్న స్వాగత తోరణాలను మంత్రి పరిశీలించారు. బీచ్కు వెళ్లే ప్రధాన రోడ్డును వెడల్పు చేసి మధ్యలో కూడలి ఏర్పాటు చేసి అక్కడి నుండి హెలిపాడ్ వరకు రహదారి నిర్మించాలని సూచించారు. ఉత్సవాల్లో భాగంగా బీచ్ కబడ్డీ, కయా కింగ్ జల క్రీడలను కూడా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. పారా గ్లైడింగ్, హెలికాప్టర్ రైడింగ్, మోటార్ స్పీడ్ బోట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె.స్వాతి, మచిలీపట్నం వ్యవసాయ మా ర్కెట్ కమిటీ చైర్మన్ కుంచె నాని, ఏఎంసీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, తహసీల్దార్లు హరి నాథ్, నాగభూషణం, సీఐ ఏసుబాబు, విద్యుత్ శాఖ డీఈ రామకృష్ణ, ఆర్ అండ్బీ డీఈ సంగీత తదితరులు పాల్గొన్నారు. -
ఘాట్రోడ్డు, స్నానఘాట్లలో దుర్గమ్మ జలప్రసాద కేంద్రాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ దర్శనానికి విచ్చేసే భక్తులకు జల ప్రసాదాన్ని అందించేందుకు దాతలు ముందుకు రావడం హర్షనీయమని దుర్గగుడి ఈఓ శీనానాయక్ పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రి ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం, భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే దుర్గాఘాట్లో మినరల్ వాటర్ ప్లాంట్లను ఈఓ శీనానాయక్ బుధవారం ప్రారంభించారు. దివీస్ ల్యాబోరేటరీస్ లిమిటెడ్ భక్తులకు రక్షిత మంచినీటిని అందించేందుకు వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సామాజిక సేవలోనే దైవత్వం ఇమిడి ఉంటుందని, భక్తులకు సేవ చేస్తే భగవంతుడికి చేసినట్లేనని ఈఓ పేర్కొన్నారు. దాతలు, సామాజిక సంస్థలు, కార్పొరేట్ సంస్థలు భక్తుల సేవలో పాలుపంచుకోవాలని కోరారు. అనంతరం ఈఓ శీనానాయక్ స్వయంగా భక్తులకు మంచినీటిని అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఈ కోటేశ్వరరావు, వైకుంఠరావు, దివీస్ ప్రతినిధులు పాల్గొన్నారు.20 నుంచి విద్యార్థులకు గ్రంథాలయ వర్క్షాప్విజయవాడ కల్చరల్: విజయవాడ బుక్ఫెస్టివల్ సోసైటీ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, తమ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు గ్రంథాలయ వర్క్షాప్ జరుగుతుందని గ్రంథాలయ పునర్వికాస ఉద్యమవేదిక ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ గోళ్ల నారాయణరావు తెలిపారు. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులు ఈ వర్క్షాప్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. సంస్థ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. రోజూ ఉద యం తొమ్మిది నుంచి 11గంటల వరకు, సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు వర్క్షాప్ జరుగు తుందని తెలిపారు. సివిల్ కోర్టుల ఎదురుగా ఉన్న విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కేంద్రంగా ఈ శిక్షణ జరుగుతుందని పేర్కొన్నారు. గ్రంథాలయాల వినియోగం, తెలుగు భాషపై ఆసక్తిని పెంచడం, పుస్తక పఠనం, కథలు రాయడం, చెప్పడం, ఆటలు, మ్యాజిక్ షో, సైన్స్ సందేహాలు, చిత్రలేఖనంపై ఆయా అంశాల్లో నిపుణులు శిక్షణ ఇస్తారని వివరించారు. మరిన్ని వివరాలకు 0866 2570843, 94943 40664 ఫోన్ నంబర్లలో సంప్రదించా లని నారాయణరావు కోరారు. ఈ సందర్భంగా వర్క్ షాప్ బ్రోచర్ను అతిథులు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో గ్రంథాలయ ఉద్యమ సారథులు మనోహర నాయుడు, లక్ష్మయ్య, వెంకట నారాయణ, రెహమాన్, శ్రీపతిరాయ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆటో బోల్తా.. 15 మందికి గాయాలు
గూడూరు: విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై చిట్టిగూడూరు సమీపంలో ఆటో బోల్తా కొట్టిన ఘటనలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మచిలీపట్నంలో జరిగే ఓ శుభకార్యానికి వెళ్లడానికి ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లికి చెందిన 15 మంది ఆటోలో బయలుదేరారు. ఆ ఆటో తరకటూరుపాలెం దాటిన తర్వాత అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన గూడూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆటో డ్రైవర్ తాడిశెట్టి శివరామప్రసాద్, పునుగుపాటి కోటేశ్వరమ్మ, పునుగుపాటి వెంకటేశ్వరమ్మ, మోచర్ల బ్లెస్సీ, కామరవపు శ్రీరష్మ, మోచర్ల సుజాత, రామకోటి ధనుష్, మోచర్ల జాయి, మోచర్ల వెంకటేశ్వరరావు తదితరులు గాయపడ్డారు. గూడూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సిరివాడలో వృద్ధురాలి దారుణ హత్య హనుమాన్జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం సిరివాడ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వృద్ధురాలిని బుధవారం గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. వృద్ధురాలి తలపై కత్తితో దాడి చేసి కిరాతకంగా హతమార్చాడు. గ్రామానికి చెందిన తలారి మేరీఫ్లోరెన్స్ (65) భర్త చనిపోవటంతో ఒంటరిగా జీవిస్తోంది. సంతానం లేకపోవటంతో ప్రశాంతిని గతంలో దత్తత తీసుకుంది. ఆమెకు ఆత్కూరుకు చెందిన గోపితో వివాహమైంది. భర్త గోపితో విభేదాలు రావడంతో ప్రశాంతి అతని నుంచి విడిపోయి 12 ఏళ్ల కుమారుడు రూపేష్తో కలిసి పుట్టింటి వద్దే ఉంటోంది. గోపి, ప్రశాంతి కాపురం నిలబెట్టేందుకు మేరీ ఫ్లోరెన్స్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో గోపి నాలుగు రోజుల క్రితం సిరివాడ వచ్చాడు. బుధవారం మధ్యాహ్నం ప్రశాంతికి ఓ ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్ పేరిట ఓ వ్యక్తి ఫోన్ చేసి హనుమాన్జంక్షన్లోని ఆఫీసుకు రావాలని ఒత్తిడి చేశాడు. దీంతో భర్త గోపితో కలిసి ప్రశాంతి హనుమాన్జంక్షన్ వెళ్లింది. మనవడు రూపేష్తో ఉన్న మేరీ ఫ్లోరెన్స్పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఆకస్మాత్తుగా ఇంట్లోకి చోరబడి కత్తితో తల, మెడ భాగాలపై విచక్షణరహితంగా దాడి చేయటంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనతో భయపడిన రూపేష్ కేకలు వేస్తూ ఇరుగుపొరుగు వారిని పిలిచాడు. వారు వచ్చేసరికి హంతుకుడు బైక్పై పరారయ్యాడు. ఈ ఘటనపై వీరవల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వృద్ధు రాలి హత్యకు కారణాలపై పలుకోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్ పేరిట ఫోన్ చేసిన వ్యక్తే గోపి, ప్రశాంతిని పథకం ప్రకారం బయటకు పంపి, మేరీ ఫ్లొరెన్స్ను హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. హనుమాన్జంక్షన్ సీఐ కె.వి.వి.ఎన్. సత్యనారాయణ, హనుమాన్జంక్షన్, వీరవల్లి ఎస్ఐలు సురేష్, శ్రీనివాస్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్టీం ద్వారా ఆధారాలు సేకరించారు. -
దుర్గగుడి ఈఓ శీనానాయక్
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయండి ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఈవో శీనానాయక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలోని అభివృద్ధి పనులను ఈవో మంగళవారం పరిశీలించారు. ప్రాంగణంలో నిర్మిస్తున్న పూజా మండపాన్ని పరిశీలించారు. ప్లాన్ ప్రకారం ఇంకా జరగాల్సిన పనులు, రెండో అంతస్తును తనిఖీ చేశారు. దాతల సహకారంతో నిర్మించిన నూతన యాగశాల తుది పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయనే వివరాలను ఈఈ కోటేశ్వర రావును అడిగి తెలుసుకున్నారు. మల్లేశ్వరస్వామి ఆలయం చుట్టూ పచ్చదనం పెంపొందించాలని ఆదేశించారు. నూతన పూజా మండపాలు, యాగశాలను త్వరగా విని యోగంలోకి తీసుకురావాలని సూచించారు. అభివృద్ధి పనులు పూర్తయ్యేలా కాంట్రాక్టర్లకు తగిన ఆదేశాలు ఇవ్వాలని, రోజువారీ సమీక్షించి నివేదిక ఇవ్వాలని సూచించారు. ఈవో వెంట ఈఈ కోటేశ్వరరావు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. కమిషనర్ సమీక్ష దుర్గగుడి ఈవో శీనానాయక్, ఇంజినీరింగ్ అధికారులు, ఇతర ఆలయ అధికారులు మంగళవారం కమిషనర్ రామచంద్రమోహన్తో సమావేశమయ్యారు. గొల్లపూడిలోని దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఆలయంలో జరుగుతున్న పనులతో పాటు భవిష్యత్తు ప్రణాళికలపై ఈవోతో చర్చించినట్లు సమాచారం. -
తిరుపతమ్మకు బోనాలు
పెనుగంచిప్రోలు: గ్రామంలోని శ్రీతిరుపతమ్మవారికి మంగళవారం నాయీబ్రాహ్మణులు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఏటా అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని వారు తెలిపారు. కార్యక్రమంలో నాయీబ్రాహ్మణ సంఘ నేతలు కొలిపాక బ్రహ్మం, రాము, ఉప్పు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర స్థాయి బాడీబిల్డింగ్ పోటీల్లో బంగారు పతకంపెనమలూరు: రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన బాడీ బిల్డర్ సీహెచ్ దుర్గాప్రసాద్ 70 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించాడని జిల్లా బాడీబిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బి.మనోహర్, అశోక్ తెలిపారు. మంగళవారం వివరాలు వెల్లడిస్తూ ఈ నెల 12న సత్యసాయి జిల్లా బాడీబిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన కదిరిలో రాష్ట్ర స్థాయి బాడీబిల్డింగ్ పోటీలు నిర్వహించారన్నారు. దుర్గాప్రసాద్ 70 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించగా, 70 కేజీల పైవిభాగంలో రాహుల్కృష్ణ బెస్ట్ ఆఫ్ సిక్స్ సాధించాడన్నారు.కనులపండువగా నరసింహునికి చక్రతీర్థంవేదాద్రి(జగ్గయ్యపేట): ప్రముఖ పుణ్యక్షేత్రం యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి తిరుక్కల్యాణ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామి వారికి చక్రతీర్థం కార్యక్రమాన్ని కనులపండువగా చేశారు. స్వామి వారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా సమీపంలోని కృష్ణానదిలో అర్చకులు పరాంకుశం శ్రీనివాసాచార్యులు, వేదాంతం శ్రీధరాచార్యులు, మురళీధరాచార్యుల పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు చేసి చక్రతీర్థం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పల్లకిలో ఊరేగించారు. రాత్రికి పూర్ణాహుతి, ధ్వజారోహణ చేశారు. ఈవో సురేష్బాబు, భక్తులు పాల్గొన్నారు.స్విమ్మర్లకు అభినందనపటమట(విజయవాడతూర్పు): ఖేలో ఇండియా–2025 యూత్ గేమ్స్ అండర్–18 కేట గిరీలో ఆలిండియా చాంపియన్షిప్లో 64 పాయింట్లతో ఏపీ తృతీయ స్థానంలో నిలిచింది. విజయాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించిన అండర్–18 స్విమ్మర్లు తీర్థు సామదేవ్, దేవ గణేష్, యజ్ఞ సాయిలను వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్లో మంగళవారం కమిషనర్ ధ్యానచంద్ర అభినందించారు. కమిషనర్ మాట్లాడుతూ ప్రతిభ చూపిన స్విమ్మర్లకు వీఎంసీ తరఫున అన్ని విధాలా సహకరిస్తామని, భవిష్యత్తులో మరింత ప్రగతి సాధించాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ డాక్టర్ లత, ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీ ఐ.రమేష్, కృష్ణా జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీ వి.వినోద్, సహాయక కోచ్ నితీష్, ఇతర కోచ్లు పాల్గొన్నారు.ఇంటర్ సప్లిమెంటరీకి 7,762 మంది హాజరుమచిలీపట్నంఅర్బన్: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు రెండో రోజైన మంగళవారం జిల్లా వ్యాప్తంగా 7,762 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్ఐఓ పీబీ సాల్మన్రాజు తెలిపారు. జిల్లాలోని 42 కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన మొదటి ఏడాది ఇంగ్లిష్–1 పరీక్షకు 7,626 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా 7,306 మంది హాజరయ్యారన్నారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరిగిన రెండో ఏడాది ఇంగ్లిష్–2 పరీక్షకు 136 మంది హాజరవ్వాల్సి ఉండగా 115 రాశారని తెలిపారు. -
కబ్జాకోరల్లో బుడమేరు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/గుడివాడరూరల్: బుడమేరు కాలువను అడ్డగోలుగా ఆక్రమించేస్తున్నారు. దీనిపై చేపల చెరువులు, తోటలు సాగు చేయడంతోపాటు, ఫ్యాక్టరీలు, భవనాలు నిర్మిస్తుండటంతో బుడమేరు కబ్జా కోరల్లో చిక్కుకుంది. దీంతో వానలు పడితే బుడమేరు కాల్వ పరిసర ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమని కాలం గడపాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.కొందరు అధికారుల అండతో..కొందరు అవినీతి అధికారుల అండదండలతో డ్రెయిన్లో చేపల చెరువుల యజమానులు అక్రమాలకు పాల్పడ్డారు. బాపులపాడు మండలం కురిపిరాల, ఓగిరాల, పెదపాడు మండలంలోని కొణికి, ఒడ్డిగూడెం, నందివాడ మండలం పుట్టగుంట, కుదరవల్లి, అరిపిరాల, ఎల్ఎన్పురం, ఇలపర్రు ప్రాంతాల్లో అడ్డగోలుగా డ్రెయిన్లో చేపల, రొయ్యల చెరువుల సాగు మూడు పువ్వులు ఆరు కాయలు అనే చందాన సాగుతోంది. చెరువుల తవ్వకాలను పరిసర ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అయినా బడాబాబులు పాలకుల అండదండలతో తవ్వేయడంతో డ్రెయిన్ కరకట్ట కుదించుకుపోయింది. ఫలితంగా నీరు దిగువకు వెళ్లని పరిస్థితి నెలకొంది.ఫ్యాక్టరీల నిర్మాణాలుజిల్లాలో అరిపిరాలకు చెందిన ఓ టీడీపీ నేత ఏకంగా డ్రెయిన్లో భారీస్థాయిలో బిల్డింగ్లు నిర్మించి వాటిల్లో పలు రకాల ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశాడు. డ్రెయిన్లోనే 25 మీటర్ల మేర పూడ్చి ఆరడుగుల మేర మెరకచేశాడు. అయితే నీరు–చెట్టు పనులను సైతం సదరు నేత సబ్ కాంట్రాక్ట్ తీసుకోవడంతో ఆక్రమణలు తొలగ కుండా జాగ్రత్త పడటం విశేషం. ఆక్రమణలు ఉన్న ప్రాంతం గన్నవరం నియోజకవర్గంలో ఉండటం అక్కడ ఎమ్మెల్యే ఇంటి పేరు, సామాజికవర్గం.. ఇదే నేతది కావడంతో ఆక్రమణలు తొలగించే దమ్ము ఎవరికి ఉందంటూ సదరు నేత బహిరంగంగానే వ్యాఖ్యానించడంపై సొంత పార్టీ నాయకులే గుర్రుగా ఉన్నారు. దీంతో ఆక్రమణల పర్వం కొనసాగుతూనే ఉంది.విజయవాడ పరిసర ప్రాంతాల్లోని మురుగు నీటిని బుడమేరు కొల్లేటిలోకి తీసుకువెళ్తుంది. ఇది మురుగునీటి కాలువగానే కాకుండా విజయవాడరూరల్, నందివాడ, ఉంగుటూరు, పెదపారుపూడి, బాపులపాడు, పెదపాడు, మండవల్లి మండలాల్లోని గ్రామాలకు సాగునీరు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది. ఇటీవల విజయవాడ, ఉంగుటూరు ప్రాంతాల్లో బుడమేరును ఆక్రమించి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. పెదపారుపూడి, నందివాడ, బాపులపాడు, పెదపాడుకు సంబంధించి కొందరు బడాబాబులు డ్రెయిన్లో అడ్డగోలుగా చేపల చెరువులు తవ్వేశారు. డ్రెయిన్, కాల్వల్లో చేపల చెరువులు తవ్వడానికి అనుమతులు లేవు.ప్రభుత్వం ఆక్రమణలు తొలగించేనా?కొంతకాలం క్రితం బుడమేరుకు వచ్చిన వరదల దెబ్బకు గ్రామాలతోపాటు విజయవాడ వంటి మహా నగరం సైతం ముంపునకు గురై విలవిలలాడింది. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బుడమేరు ఆధునికీకరణకు చర్యలు తీసుకున్నారు. ఆయన మరణాంతరం 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక బుడమేరు ఆధునీకరణ పనులు చేపట్టినా ఆ పార్టీ నేతలే నీరు–చెట్టు రూపంలో కాంట్రాక్టర్లగా అవతారం ఎత్తి పనులు చేపట్టారు. బుడమేరును ఐదు రీచ్లుగా విభ జించి పనులు జరిగాయి. పసుపు నేతల ‘మేత’ కారణంగా లోపభూయిష్టంగా జరిగాయి. కరకట్ట అభివృద్ధి పనులను తూతూ మంత్రంగా చేయడంతో బుడమేరుకు ముంపు సమస్య తప్పలేదు. ఇటీవల బుడమేరు వరదలతో కలిగిన నష్టాన్ని బేరీజు వేసుకుని దాన్ని ప్రక్షాళన చేస్తామని సాక్షాత్తూ సీఎం చంద్రబాబు ప్రకటించారు. విజయవాడ నుంచి బుడమేరు కొల్లేరులో కలిసే వరకు ఉన్న ఆక్రమణలన్నీ తొలగిస్తామన్నారు. బుడమేరు పరీవాహక గ్రామాల ప్రజలు, రైతులు మాత్రం త్వరగా ఆక్రమణలు తొలగించి ముంపు నుంచి కాపాడాలని కోరుతున్నారు. -
ఇంకెంత కాలం!
● గోకులం బిల్లుల కోసం పాడిరైతుల నిరీక్షణ ● జిల్లాలో 1,081 గోకులం షెడ్లు మంజూరు ● 1,051 పనులు ప్రారంభం.. 751 షెడ్లు నిర్మాణం పూర్తి ● మిగిలినవి వివిధ దశల్లో నిలిచాయి ● లబ్ధిదారులకు రావాల్సిన నిధులు రూ.6.19 కోట్లు పెడన: గోకులం, మినీ గోకులం పథకాల కింద పశువుల షెడ్లు నిర్మించుకున్న పాడి రైతులు బిల్లుల కోసం నిరీక్షిస్తున్నారు. ఐదు నెలలు దాటినా బిల్లులు రాకపోవడంతో ఇంకెంత కాలమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రాయితీ ఇస్తోందని ముందుకొచ్చిన వారి ఆశలు అడియాసలుగా మారు తున్నాయి. ఒక్కో షెడ్డు నిర్మాణానికి రూ. లక్షలు ఖర్చు చేసినా నేటి వరకు బిల్లులు అందలేదు. ఎప్పటికి వస్తాయనేది తెలియడం లేదు. అప్పులు చేసి నిర్మించామని, ఇప్పటి వరకూ నగదు ఇవ్వకపోవడంతో అప్పులే మిగిలాయని పాడి రైతులు వాపోతున్నారు. జిల్లాలో 1,081 గోకులం షెడ్లు మంజూరు కాగా 1,051 షెడ్ల పనులు ప్రారంభించారు. 751 షెడ్లను రైతులు నిర్మించుకున్నారు. ఇవి పూర్తై ఐదు నెలలు దాటి ఆరో నెల వచ్చినా రావాల్సిన బిల్లులు రూ.6.19 కోట్ల ఇంకా విడుదల చేయలేదు. ఎన్నికల సమయంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామని ఎడాపెడా హామీలిచ్చిన సీఎం చంద్రబాబు ఇప్పుడు స్పందించకపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. గ్రామాల్లో పశుపోషకులు గోకులం షెడ్ల పనులు ప్రారంభించిన తర్వాత ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో మధ్యలో నిర్మాణ పనులను నిలిపేసినవి కూడా ఉన్నాయి. పాడి రైతులంటే చిన్నచూపా! కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల తర్వాత పాడిరైతుల అభివృద్ధికి మినీ గోకులం షెడ్లు నిర్మిస్తామని ముందుకు వచ్చింది. కేంద్ర సహకారంతో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణ పెంచి పశుపోషకుల జీవన శైలి మెరుగుపర్చాలన్నదే గోకులం షెడ్ల ప్రధాన లక్ష్యమని పేర్కొంది. ఉపాధి పథకం ద్వారా నిర్మించే గోకులం షెడ్లకు.. పశువుల షెడ్లకు 90 శాతం రాయితీ, గొర్రెలు, మేకలు, కోళ్లకు 70 శాతం రాయితీ ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వీటిని నిర్మించాలని సంకల్పించింది. రెండు పశువులకు రూ.1.15లక్షలు, నాలుగు పశువులకు రూ.1.85 లక్షలు, ఆరు పశువులకు రూ.2.30లక్షలను అందిస్తామని పేర్కొంది. ఇందులో లబ్ధిదారుని వాటా పది శాతంగా తెలిపింది. ఆరు పశువులకు నిర్మించే షెడ్డుకు రూ.2.30లక్షలు కేటాయించగా లబ్ధిదారుని వాటా రూ.23వేలు పోగా మిగిలిన రూ.2.07 లక్షలు ప్రభుత్వం చెల్లించాలి. రెండు పశువులకు లబ్ధిదారుని వాటా రూ.11,500అయితే రూ.1,03,500 ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. 90, 70 శాతం సబ్సిడీ ఇస్తుండటంతో పాడి రైతులు ఆసక్తిగా సిఫార్సులతో మరీ గోకులం షెడ్లును నిర్మించుకున్నారు. తీరా ఇప్పుడు బిల్లులు రాకపోవడంతో కొన్ని నెలలుగా ఇబ్బంది పడుతున్నారు. అప్పులు చేసి మరీ.. గోకులాలకు రాయితీ ఇస్తామని ప్రభుత్వం పాడి రైతులకు ఆశపెట్టింది. దీంతో షెడ్ల నిర్మాణానికి రైతులు ముందుకొచ్చారు. నిర్మాణ దశలో ఉన్నప్పుడు రెండు విడతలుగా నగదు చెల్లించాలి. బేస్మెంట్ దశలో రూ.30 వేలు, షెడ్డు పూర్తి స్థాయిలో నిర్మించాక మిగిలిన నగదు ఇవ్వాలి. గోకులం షెడ్లు నిర్మాణం ప్రారంభించి ఐదు నెలలు దాటినా కూటమి ప్రభుత్వం ఒక్క పైసా కూడా చెల్లించలేదు. రైతులకు ఉపాధి హామీ మస్తర్ల రూపంలో చెల్లించాల్సిన నగదు కూడా నేటికీ జమకాలేదు. అప్పులు చేసి షెడ్లును పూర్తి స్థాయిలో నిర్మించారు. మరికొందరు రైతులు గోకులం షెడ్ల నిర్మాణ పనులు అసలు ప్రారంభించలేదు. కృష్ణా జిల్లాలో 1,081 గోకులం షెడ్లు మంజూరు జిల్లాలోని 25 మండలాల్లో 415 గ్రామ పంచాయతీల్లో 1,081 గోకులం షెడ్లు నిర్మాణానికి ఆమోదం వచ్చింది. వీటిల్లో 1051 షెడ్లు పనులు ప్రారంభమయ్యాయి. అత్యధికంగా బంటుమిల్లి మండలంలో 80 మంజూరయ్యాయి. ఆ తర్వాత బాపులపాడులో 78, గూడూరు 67, పెడన 62, కృత్తివెన్ను 60 చొప్పున మంజూరు కావడమే కాకుండా పనులు కూడా ప్రారంభమయ్యాయి. జిల్లాలో 751 షెడ్లను పూర్తి స్థాయిలో నిర్మించారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. అయితే పూర్తి స్థాయిలో నిర్మించిన 751 షెడ్లకు సుమారుగా ఉపాధి శ్రామికుల వేతనాల రూపంలో రూ.6.19 కోట్ల నిధులు మంజూరు కావాల్సి ఉంది. -
గృహనిర్మాణాలపై ప్రత్యేక దృష్టి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో గృహ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి ఈ నెల 22వ తేదీ నాటికి 910 గృహాలను పూర్తి చేయాలని ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలిశర్మ అధికారులను ఆదేశించారు. జెడ్పీ సమావేశపు హాలులో మంగళవారం సాయంత్రం గృహ నిర్మాణ పురోగతిపై సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. గృహ నిర్మాణంలో కృష్ణా జిల్లా రాష్ట్రంలో చాలా వెనుకబడి ఉందని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో 10 వేల గృహాలు నిర్మాణం పూర్తిచేయాల్సి ఉందన్నారు. ఏప్రిల్ 16న కలెక్టర్ సమీక్షించినప్పుడు రూఫ్ లెవల్లో 506, పై కప్పు స్థాయిలో 2,033 గృహాలు ఉన్నాయన్నారు. ఇప్పుడు పురోగతిని పరిశీలిస్తే కేవలం 237 గృహాలు మాత్రమే పూర్తి చేశారని ఇలా ఉంటే లక్ష్యాలను ఎప్పటికి సాధిస్తారని ఆమె ప్రశ్నించారు. ఇకనైనా ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు గృహ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కువ పెండింగ్లో ఉన్న లేఅవుట్లలో లబ్ధిదారులు, ఇంజినీరింగ్ సహాయకులతో సమావేశం నిర్వహించి 22వ తేదీ నాటికి 910 గృహాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.రూ.72 లక్షలు మాత్రమే వినియోగించారుజిల్లాకు రూ.13 కోట్ల అదనపు ఆర్థిక సాయంగా నిధులు విడుదలైనా ఇప్పటి వరకు కేవలం రూ.72లక్షలు మాత్రమే వినియోగించారన్నారు. ఉన్నతాధికారులు 15 రోజులకు ఒకసారి గృహనిర్మాణ పురోగతిపై సమీక్షిస్తున్నారని జిల్లాలో ప్రగతి లేకపోవడంతో తాము సమాధానం చెప్పడానికి ఇబ్బంది కలుగుతోందన్నారు. ఇకపై క్షేత్ర స్థాయిలో అధికారులు వారానికి మూడుసార్లు గృహనిర్మాణంపై సమీక్షించాలన్నారు. ప్రతిరోజూ తాను టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తానన్నారు. సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ అధికారి వెంకట్రావు, ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి, ఏపీఎంఐపీ పీడీ విజయలక్ష్మి, డీటీడబ్ల్యూవో ఫణిదూర్జటి, బీసీ సంక్షేమ శాఖాధికారి జి. రమేష్, డెప్యూటీ సీఈవో ఆనంద్కుమార్, మునిసిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ -
ఎన్టీటీపీఎస్లో మాక్డ్రిల్
ఇబ్రహీంపట్నం: యుద్ధ వాతావరణం, ఉగ్ర ముప్పు నుంచి ఉద్యోగులు ఎలా రక్షణ పొందాలనే అంశంపై ఎస్పీఎఫ్ సిబ్బంది ఎన్టీటీపీఎస్లో మంగళవారం మాక్డ్రిల్ నిర్వహించారు. ముఖ్యఅతిథి ఆర్డీఓ కావూరి చైతన్య మాట్లాడుతూ అనుకోని విపత్తలు ఎదురైనప్పుడు ఉద్యోగులు తమకు తాము రక్షించునే పద్ధతులు తెలియజేయడమే మాక్డ్రిల్ ఉద్దేశమన్నారు. అగ్నిప్రమాదం, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు తీసుకోవల్సిన రక్షణ చర్యలు, ఎదుటివారు సమస్యల్లో చిక్కుకుంటే ఎలా స్పందించాలనే అంశాలపై అవగాహన కల్పించారు. ఉపద్రవాల సమయంలో స్పందించాల్సిన తీరుపై అగ్నిమాపక శాఖ, పోలీస్, మెడికల్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది మాక్డ్రిల్ ద్వారా చూపించారు. ఏసీపీ ఎస్వీడీ ప్రసాద్, ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్ రాజు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సీఈ శివరామాంజనేయులు, పోలీస్, ఫైర్, మెడికల్, తదితర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బరువు.. ఆధరవు
● దివిసీమ రైతుకు బిహార్ కంద సాగుతో లాభాలు ● కంద బరువు 13.50 కిలోలు మేళ్లమర్తిలంక(మోపిదేవి): వాణిజ్య పంటలకు కృష్ణాజిల్లా దివిసీమకు చెందిన మోపిదేవి మండలానికి మంచి పేరు ఉంది. అధిక దిగుబడులు సాధించడానికి రైతులు పోటీ పడుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవల మేళ్లమర్తిలంకకు చెందిన మోర్ల వెంకటేశ్వరరావు 10 సెంట్ల మెట్ట భూమిలో బిహార్ కంద సాగు చేపట్టారు. ప్రతి కందదుంప 10 నుంచి 13 కిలోల బరువు వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. సాధారణంగా ఒక్కొక్కదుంప 3నుంచి 4 కిలోల బరువు ఉంటుంది. 10 సెంట్ల భూమిలో 4(1,000కిలోల) పుట్టల కంద దిగుబడి వచ్చిందని, మార్కెట్లో పుట్టెకు రూ. 15 వేల వంతున విక్రయించగా మొత్తం రూ. 60 వేలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఖర్చులు సుమారు రూ. 7 వేలు అయినట్లు వివరించారు. అత్యధికంగా 13.50 కిలోల బరువున్న కంద దుంపను చూసి రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
నిధులు ఈ వారంలో వచ్చేస్తాయి
జిల్లాలో గోకులం షెడ్ల నిర్మాణం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టారు. మెటీరియల్కు సంబంధించి నిధులు వచ్చి ఉన్నాయి. ఉపాధి కూలీల వేతనాలు రూ.6,19,71,224 రావాల్సి ఉంది. ఇవి కూడా వారం పది రోజుల్లో వస్తాయని సమాచారం ఇచ్చారు. పాడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఆలస్యమైందంటే. 751 షెడ్లు పూర్తయ్యాయి. మిగిలిన వాటిని కూడా పూర్తి చేయాలని చెబుతున్నాం. –ఎన్వీ శివప్రసాద్, డ్వామా పీడీ, మచిలీపట్నం, కృష్ణాజిల్లా -
ఉత్కంఠభరితంగా ఎడ్ల బండ లాగుడు పోటీలు
రెండు పళ్ల విభాగం విజేతలకు బహుమతుల అందజేత నందిగామరూరల్: మండలంలోని లింగాలపాడు గ్రామంలో ఉన్న లక్ష్మీ పేరంటాళ్లు అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఎడ్ల బండ లాగుడు పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోటీలలో భాగంగా మంగళవారం రాత్రి నిర్వహించిన నాలుగు పళ్ల విభాగంలో ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన పోటీలను ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చిరుమామిళ్ల వెంకటలక్ష్మీ సాయిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా పశు ప్రదర్శన కమిటీ సభ్యులు మాట్లాడుతూ నాలుగు పళ్ల విభాగంలో ఏడు జతలు పోటీ పడ్డాయని, 15 నిమిషాల వ్యవధిలో 8.50 క్వింటాళ్ల బండను లాగినట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొన్న ఎడ్ల జత యజమానులకు అంబారుపేట గ్రామంలోని సత్యమ్మ అమ్మవారి ఆలయ మాజీ చైర్మన్ గరికపాటి భాస్కరం సోదరులు వస్త్రాలు, జ్ఞాపికలను అందజేశారు. నగదు బహుమతుల అందజేత గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన రెండు పళ్ల ఎడ్ల ప్రదర్శన పోటీలలో విజేతలైన ఎడ్ల జత యజమానులకు కమిటీ సభ్యులు నగదు బహుమతులు అందజేశారు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం బయ్యారం గ్రామానికి చెందిన కేఎంకే బుల్స్ కడియం మణికంఠ ఎడ్ల జత మూడు వేల అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలవగా, సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు గ్రామానికి చెందిన కేఆర్ఆర్ బుల్స్ కొప్పుల గోవర్దన్రెడ్డి ఎడ్ల జత 2,695.09 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం, గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగం జాగర్లమూడికి చెందిన జమ్మనబోయిన సుబ్రహ్మణ్యం ఎడ్ల జత 2,061 అడుగుల దూరం లాగి తృతీయ స్థానంలో నిలిచాయన్నారు. చందర్లపాడు మండలం బ్రహ్మబొట్లవారిపాలెం గ్రామానికి చెందిన పాలెం వెంకటేశ్వర్లు, పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం రాగిపాడుకు చెందిన యద్దనపల్లి మనోజ్ చౌదరి ఎడ్ల జత 2,045 అడుగుల దూరం లాగి నాలుగవ స్థానం, బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం అడవిపాలెం గ్రామానికి చెందిన పోకల శ్రీనివాసరావు నాయుడు, పద్మావతి నాయుడు ఎడ్ల జత 1,750 అడుగుల దూరం లాగి ఐదవ స్థానం, నందిగామ మండలం రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బట్ట కార్తికేయ యాదవ్ ఎడ్ల జత 1,554 అడుగుల దూరం లాగి ఆరవ స్థానంలో నిలిచాయని తెలిపారు. విజేతలకు వరుసగా రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.18 వేలు, రూ.15 వేలు, రూ.12 వేలు, రూ.10 వేలు నగదు బహుమతులు అందించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, రాంబాబు, విక్రమ్, రాంబాబు, వెంకట్రావ్, శివాజీ పాల్గొన్నారు. -
ఆర్టీసీ డ్రైవర్పై దాడికి పాల్పడిన నిందితుల అరెస్ట్
కోనేరుసెంటర్/బంటుమిల్లి: బంటుమిల్లిలో ఆర్టీసీ డ్రైవర్పై దాడికి పాల్పడిన నిందితులను బంటుమిల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం బందరు డీఎస్పీ సీహెచ్ రాజ మచిలీపట్నంలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తున్న ఎం.నాగరాజు గత వారం విధి నిర్వహణలో భాగంగా గుడివాడ డిపో నుంచి బస్సు తీసుకుని సరిగ్గా బంటుమిల్లి సెంటర్కు రాగానే ఎదురుగా బైక్లు అడ్డు రావటంతో హారన్ కొట్టాడు. దీంతో ఆగ్రహానికి గురైన సోమిశెట్టి వెంకటనారాయణ, రాఘవరపు సతీష్, దాసు శ్రీనివాసు మద్యం మత్తులో డ్రైవర్ నాగరాజుపై దాడికి పాల్పడ్డారు. వీరి దాడిని సెల్ఫోన్లో చిత్రీకరిస్తున్న మహిళా కండక్టర్పై కూడా దురుసుగా వ్యవహరించారు. బాధితుడు నాగ రాజు అదే రోజు బంటుమిల్లి పోలీస్స్టేషన్లో జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు ముగ్గురిపై కేసు నమోదు చేసి మంగళవారం కోర్టుకు హాజరుపరచగా 15 రోజులు రిమాండ్ విధించినట్లు డీఎస్పీ తెలిపారు. విధినిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడికి పాల్పడిన ముగ్గురిపై నాన్ బెయిలబుల్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ చెప్పారు. రూరల్ సీఐ, బంటుమిల్లి ఎస్ఐ పాల్గొన్నారు. -
దుర్గమ్మ సన్నిధిలో మొరాయిస్తున్న స్టేర్ లిఫ్ట్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో సుమారు రూ.8 లక్షల వ్యయంతో ఏర్పాటు స్టేర్ లిఫ్ట్ తరచూ మొరాయిస్తుండడంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే వృద్ధులు, వికలాంగులు స్టేర్ లిఫ్ట్ను సద్వినియోగం చేసుకుని స్కానింగ్ పాయింట్ వరకు చేరుకుంటున్నారు. అయితే ఈ లిఫ్ట్ తరచుగా మొరాయిస్తోంది. ప్రారంభించిన 7 నెలల కాలంలో ఎక్కువ సార్లు మరమ్మతులకు గురికావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్టేర్ లిఫ్ట్ను ప్రారంభించిన నెల రోజుల వ్యవధిలోనే అంటే గత ఏడాది నవంబర్ 8న మొదటిసారిగా నిలిచిపోవడంతో టెక్నికల్ సిబ్బంది మరమ్మతులు చేశారు. అప్పటి నుంచి ప్రతి 15 రోజులకు ఓ సారి ఈ స్టేర్ లిఫ్ట్ పని చేయకపోవడం పరిపాటిగా మారింది. గత మూడు రోజులుగా స్టేర్ లిఫ్ట్ పని చేయకపోవడంతో ఆలయ ఇంజినీరింగ్ సిబ్బంది టెక్నీషియన్ను పిలిపించారు. ఆరు బయ ట వర్షం నీరు పడటంతో మోటరు పాడైపోయిందని చెప్పారు. అయితే స్టేర్ లిఫ్ట్కు ఏడాది పాటు వారంటీ ఉండటంతో కంపెనీనే పూర్తి బాధ్యత వహిస్తుందని చెబుతున్నా, ఆ తర్వాత పరిస్థితి ఏంటనేది భక్తుల ప్రశ్న. స్టేర్ లిఫ్ట్ ఏర్పాటు చేసే సమయంలోనే మెట్లపై వర్షం నీరు పడకుండా షెడ్డు ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. -
సుమధురంగా అన్నమయ్య సంకీర్తనం
విజయవాడకల్చరల్: శ్రీ అన్నమయ్య సంకీర్తనా అకాడమీ( శ్వాస), కంచికామకోటి పీఠస్థ శారదా చంద్రమౌళీశ్వర, వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య జయంతి సందర్భంగా లబ్బీపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న అన్నమయ్య జయంతి జాతీయ స్థాయి సంగీత కార్యక్రమాలు మధురంగా సాగుతున్నాయి. మంగళవారం నాటి కార్యక్రమంలో పారుపల్లి రామకృష్ణయ్య పంతులు సంగీత విద్యాలయం విద్యార్థినులు, ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాల విద్యార్థినులు, బంకుమల్లి విద్యాసాగర్, ధూళిపాళ వాసవి అన్నమయ్య రచించిన చక్కని తల్లికి చాంగ్భళా, పలుకుతేనియ తల్లిని, అదివో అల్లదివో శ్రీహరి వాసము, తందనానా ఆహి తందనానాతో పాటు అనేక సంకీర్తనలను అత్యంత మధురంగా ఆలపించారు. చివరిగా మల్లాది సోదరులు అన్నమయ్య పదానికి పట్టం కడుతూ సంకీర్తనలను గానం చేశారు. శ్వాస నిర్వాహకులు సత్యబాబు, ప్రసాద్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సీబీఎస్ఈ ఫలితాల్లో కేకేఆర్ గౌతమ్ విద్యార్థుల ప్రతిభ గుడివాడటౌన్: సీబీఎస్ఈ విడుదల చేసిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో కేకేఆర్ గౌతమ్ స్కూల్ విద్యార్థులు అద్భుత ఫలితాలను సాధించినట్లు ప్రిన్సిపాల్ సత్యారామ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలకు చెందిన జె.లక్ష్మీ నరసింహ భరద్వాజ్ 490/500, ఎం.అక్షయప్రియ, ఆర్.వివేక్ 488/ 500తో పాటు 480 పైబడి 24 మంది, 475 పైబడి 52 మంది, 470 పైబడి 81 మంది, 460 దాటిన వారు 165 మంది విజయం సాధించారని పేర్కొన్నారు. ప్రతిభను ప్రదర్శించిన విద్యార్థులను, ఉపాధ్యాయులను, సిబ్బందిని, ప్రోత్సహించిన తల్లిదండ్రులను స్కూల్ యాజమాన్యం తరఫునఅభినందించారు. పలు కేసుల్లో నిందితునిపై పీడీ యాక్టు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గంజాయి విక్రయాలతో యువత ఆరోగ్యానికి భంగం కలిగించడంతో పాటు దొంగతనాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న అక్బర్ బాషాపై ప్రభుత్వం పీడీ యాక్ట్ ప్రయోగించింది. విద్యాధరపురానికి చెందిన అక్బర్ బాషాపై ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో 35 కేసులు ఉన్నాయి. వీటిలో 5 గంజాయి కేసులు, 30 దొంగతనం, దోపీడీ కేసులు నమోదయ్యాయి. భవానీపురం స్టేషన్లోనే 4 గంజాయి కేసులు, 5 దొంగతనం కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో బెయిల్పై విడుదల అయి వచ్చి తిరిగి గంజాయి విక్రయాలు, దొంగతనాలు కొనసాగిస్తున్నాడు. అతని ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోవడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుండడంతో ప్రభుత్వం అక్బర్బాషాపై పీడీ యాక్ట్ ప్రయోగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అక్బర్ బాషాను రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్కు తరలించినట్లు సీఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. -
వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి
ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సుహాసిని లబ్బీపేట(విజయవాడతూర్పు): రాబోయే రోజుల్లో ఎండలు మరింత తీవ్రతరమై ప్రజలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు పాటిద్దాం, వడదెబ్బ వలన సంభవించే మరణాలను అరికడదామని ఆమె పిలుపునిచ్చారు. ఎండ తీవ్రత వలన శరీర ఉష్ణోగ్రత కూడా పెరిగి (104.9 డి.ఎఫ్) మెదడు మీద ప్రభావం చూపుతుందని, దీని వలన మెదడులోని ఉష్ణోగ్రత నియంత్రించే కేంద్రం (హైపో థలామస్) దెబ్బతిని వడదెబ్బకు గురి అవుతారని చెప్పారు. దీనినే ‘హీట్ స్ట్రోక్‘లేదా ’సన్ స్ట్రోక్ ‘అంటారని, ఇది ప్రమాదకరం, ప్రాణాంతకమని హెచ్చరించారు. వాతావరణపు వేడిమికి శరీరం ఎక్కువసేపు గురికావడం వలన చెమట పట్టి శరీరంలోని లవణాలు (సోడియం క్లోరైడ్) తగ్గిపోవడం, శరీరంలో నీటి నిష్పత్తి తగ్గిపోవడం సంభవిస్తుందని, అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాలలో ఎక్కువ శ్రమతో కూడిన పని చేస్తున్నప్పుడు ప్రతి గంటకు మూడు లేక నాలుగు లీటర్ల నీటిని చెమట రూపంలో మన శరీరం కోల్పోయి వడదెబ్బకు ఎక్కువగా గురవుతారని డాక్టర్ సుహాసిని తెలిపారు. వయస్సు 65 ఏళ్లు దాటిన వారు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులతో భాదపడే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. -
ట్రాఫిక్తో టెన్షన్.. టెన్షన్
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఒకవైపు మండే ఎండలు, మరోవైపు గజిబిజి ట్రాఫిక్తో రోడ్డుపై ప్రయాణించాలంటేనే జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొంతమంది యువకులు అడ్డదిడ్డంగా నడిపే వాహనాలతో ట్రాఫిక్లో పద్ధతిగా వెళ్లేవారికి వాహనాలు నడపాలంటేనే చిరాకు, టెన్షన్ వస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో నిత్యం ట్రాఫిక్లో ప్రయాణించే వారు అనేక శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. పిల్లల్ని పరీక్షలకు తీసుకెళ్లడం, ఉద్యోగ విధులకు వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ జామ్ కావడంతో సమయానికి వెళ్లలేమని టెన్షన్ పడుతుంటారు. మచ్చుకు కొన్ని ఉదాహరణలు... ● పెనమలూరుకు చెందిన రాజేష్ వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్నారు. ఉదయం 9 గంటలకు డ్యూటీకి వెళ్లేటప్పుడు నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుంది. అసలే ఆఫీసులో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ అమలులో ఉంది. పది నిమిషాలు ఆలస్యమైతే, మూడు రోజులకు ఒక సీఎల్ కట్ చేస్తుండటంతో తీవ్రమైన టెన్షన్ నెలకొంటుంది. ట్రాఫిక్లో ప్రయాణిస్తూ తీవ్రమైన మానసిక వత్తిడికి గురవుతున్నారు. ● గాంధీనగర్కు చెందిన ఉద్యోగి గన్నవరంలో పనిచేస్తుంటారు. ప్రతిరోజూ తమ కుమార్తెను బెంజిసర్కిల్ వద్ద కళాశాలలో దించి కార్యాలయానికి వెళ్తుంటారు. ఇలా ప్రతిరోజూ కళాశాలకు, కార్యాలయానికి సమయానికి వెళ్లలేమనే టెన్షన్కు గురవుతూ, నలభై ఏళ్ల వయస్సులోనే హైపర్టెన్షన్ బారిన పడ్డారు. ఇలా వీరిద్దరే కాదు. నగరంలోని ట్రాఫిక్తో అనేకమంది అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఏమి చేయాలి... ● మనం వెళ్లే ప్రాంతం దగ్గరలో ఉన్న సమయానికి కంటే కొద్దిగా ముందుగా బయలు దేరాలి. అప్పుడు ట్రాఫిక్ ఉన్నా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ● వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గించి, పబ్లిక్ వాహనాల్లో ప్రయాణిస్తే ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. ● నిత్యం ప్రయాణించే వారు యోగా, మెడిటేషన్ చేయాలి. ● కాలుష్యం బారిన పడకుండా రక్షణ చర్యలు చేపట్టాలి. వైద్యులు గుర్తించిన సమస్యలివే... ట్రాఫిక్లో ప్రయాణించే వారు యాంగ్జయిటీకి గురవుతున్నారు. యాంగ్జయిటీకి గురయ్యే వారు కార్యాలయానికి వెళ్లిన గంట వరకూ పనిపై దృష్టి పెట్టలేక పోతున్నారు. నిత్యం ట్రాఫిక్లో డ్రైవింగ్ చేసే వారికి కాలుష్యం కారణంగా రక్తం చిక్కపడి గుండెపోటు, మెదడుపోటు వచ్చే అవకాశం ఉంది. నిత్యం ట్రాఫిక్లో డ్రైవింగ్ చేసే వారు చిన్న వయస్సులోనే హైపర్టెన్షన్ బారిన పడే అవకాశం ఉంది. ట్రాఫిక్లో ప్రయాణంతో నిద్ర సమస్యలు తలెత్తుతున్నాయి. ఎక్కువ సేపు డ్రైవింగ్ చేసే వారిలో స్పైన్ సమస్యలు వస్తున్నాయి. ట్రాఫిక్ చిక్కులతో కోపం, ఆవేశం, చిరాకు పెరుగుతుంది. ట్రాఫిక్లో డ్రైవింగ్తో సమస్యలు ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో ప్రయాణించడం వలన కాలుష్య ప్రభావానికి గురవుతుంటారు. ఫలితంగా రక్తం చిక్కపడి బ్రెయిన్స్ట్రోక్, గుండెపోటు వంటి వాటికి గురయ్యే ప్రమాదం ఉంది. అంతే కాకుండా చికాకు, పనిపై దృష్టిపెట్టలేక పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. బీపీ, వెన్నెముక సమస్యలకు సైతం దారితీయొచ్చు. –డాక్టర్ టీవీ మురళీకృష్ణ ,జనరల్ మెడిసిన్ స్పెషలిస్టు రద్దీ రోడ్లపై ప్రయాణంతో మానసిక, శారీరక సమస్యలు రక్తపోటు అధికం అవుతుందంటున్న వైద్యులు యాంగ్జయిటీ, నిద్ర సమస్యలు ఎక్కువే కాలుష్యంతో రక్తం చిక్కపడి స్ట్రోక్కు దారితీయొచ్చు విపరీతంగా పెరిగిపోయిన వ్యక్తిగత వాహనాలు యాంగ్జయిటీకి గురవుతారు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయడం ద్వారా కొందరు యాంగ్జయిటీకి గురవుతారు. దీనివలన చికాకుతో రాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. హైపర్టెన్షన్ బారిన పడతారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టును వినియోగించడం మేలు. –డాక్టర్ గర్రే శంకరరావు, సైకాలజిస్ట్ -
పెడన మున్సిపల్ కమిషనర్పై సీడీఎంఏకు ఫిర్యాదు
పెడన: పెడన మున్సిపల్ కమిషనర్ ఎం.గోపాలరావు పనితీరు సక్రమంగా లేదని, మున్సిపల్ స్థలాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు సీడీఎంఏకు ఫిర్యాదు చేశారు. అమరావతిలోని సీడీఎంఏ కార్యాలయంలో సీడీఎంఏ పి.సంపత్కుమార్ను కలిసి ఈ మేరకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ కౌన్సిలర్ కటకం ప్రసాద్ మాట్లాడుతూ పెడన పట్టణ మున్సిపాలిటీకి చెందిన ఆర్ఎస్ నంబర్ 366–1బి లో 18 సెంట్ల స్థలాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకున్న మున్సిపల్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావుపై సివిల్ అండ్ క్రిమినల్ చర్య తీసుకోవడానికి వీలు లేకుండా మున్సిపాలిటీ స్థలాన్ని అమ్ముకున్న వారికి సపోర్ట్ చేస్తున్న పెడన మున్సిపల్ కమిషనర్ ఎం.గోపాలరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ ఏడాది జనవరి 21న పెడన మున్సిపాలిటీకి చెందిన 9వ వార్డు కౌన్సిలర్ గరికిముక్కు చంద్రబాబు తన లేఖ ద్వారా ఒక అంశాన్ని అజెండాలో చేర్చి కౌన్సిల్లో చర్చించి, తీర్మానించి ప్రభుత్వానికి పంపించవలసిందిగా కోరారన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ రిపోర్ట్ నంబర్ 84సి నంబర్ 1241/బి, అండ్ జి/ఈ1– 2025 ప్రకారం ఇది 2017 సెప్టెంబరు 6న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ డిపార్ట్మెంట్ పెడన మున్సిపాలిటీకి తెలిపిన విధంగా పెడన మున్సిపాలిటీకి చెందిన ఆర్ఎస్ నంబర్ 366–1 బి లో 18 సెంట్ల తామరచెరువు ప్రభుత్వ స్థలాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు కబ్జా చేసి ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించి రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు. మున్సిపాలిటీకి చెందిన 18 సెంట్ల స్థలాన్ని అక్రమంగా అమ్ముకుని సొమ్ము చేసుకున్న వారిపై సివిల్ అండ్ క్రిమినల్ చర్యలు తీసుకునే నిమిత్తం కౌన్సిల్ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాలని కోరామన్నారు. కౌన్సిల్ మీటింగ్లో ఈ విషయాన్ని ఒక అంశంగా చేర్చమని కమిషనర్ ఎం.గోపాలరావుకు పంపించామన్నారు. ఈ విషయమై కమిషనర్ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్కు లీగల్ ఒపీనియన్ నిమిత్తం పంపించారని, వారి వద్ద నుంచి ఈ అంశం న్యాయంగానే ఉందని రిపోర్టు ఇచ్చారని సీడీఎంఏకు వివరించారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో కౌన్సిల్లో కమిషనర్ నోటిఫై చేసి తీసుకురాకుండా కౌన్సిల్ను తీవ్ర అవమానపరిచారని అన్నారు. కౌన్సిల్ సమావేశంలో సభ్యులు పలుమార్లు అడిగినా సమాధానం దాటవేశారని తెలిపారు. అదీ కాకుండా కౌన్సిల్ సభ్యులను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ఎండార్స్మెంట్లు పంపించారని తెలిపారు. సదరు కమిషనర్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సీడీఎంఏను కలసిన వారిలో కటకం ప్రసాద్తో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ ఖాజా, కౌన్సిలర్ చంద్రబాబు, వైఎస్సార్సీపీ నాయకుడు కోమట్ల అనిల్ తదితరులున్నారు. -
మంత్రిని కలవకుండా సీహెచ్ఓలను అడ్డుకున్న పోలీసులు
భవానీపురం(విజయవాడపశ్చిమ): తమ సమస్యల పరిష్కారం కోసం మంత్రిని కలుద్దామని వస్తే అడ్డగిస్తారా అంటూ పోలీసులపై కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ (సీహెచ్ఓ) ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజులుగా సమస్యల పరిష్కారం కోరుతూ సీహెచ్ఓలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వస్తున్నట్లు సీహెచ్ఓలు తెలుసుకున్నారు. తమ సమస్యలను మంత్రికి వివరిద్దామని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే వారిని కళాక్షేత్రం ఆవరణలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. శాంతియుతంగా మంత్రిని కలిసి తమ గోడు వెళ్లబోసుకునేందుకు వస్తే పోలీసులు అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. -
సర్దుబాటు ప్రక్రియపై ఉపాధ్యాయుల నిరసన
చిలకలపూడి(మచిలీపట్నం): పాఠశాలల పునఃవ్యవ స్థీకరణ ప్రక్రియలో భాగంగా ఉపాధ్యాయుల సర్దుబాటు చర్య తమకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం మచిలీ పట్నంలోని ధర్నా చౌక్ వద్ద ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. జీఓ నంబరు 117ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దాని స్థానంలో కొత్త జీఓ విడుదల చేసిన అనంతరం పాఠశాలలను పునః వ్యవస్థీకరించాలని కోరారు. అన్ని ప్రాథమిక పాఠశాలల్లో 1ః20 నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులను నియమించాలని పేర్కొన్నారు. అన్ని మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో ఐదు తరగతులను బోధించడానికి ఐదుగురు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. విద్యార్థుల సంఖ్య 75కు మించితే పీఎస్, హెచ్ఎం పోస్టులను అద నంగా కేటాయించాలని స్పష్టం చేశారు. విద్యార్థుల సంఖ్య 130 మించితే ఆరో ఎస్జీటీ, ప్రతి 30 మందికి ఒక ఎస్జీటీని, అన్ని ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూలు అసిస్టెంట్ పోస్టులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని కోరారు. అనంతరం ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మను కలెక్టరేట్లోని సమావేశంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.ఎ.ఉమామహేశ్వరరావు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎండీ షౌకత్హుస్సేన్, బి.కనకా రావు, జె.లెనిన్బాబు తదితరులు పాల్గొన్నారు. -
కళతప్పిన మామిడి మార్కెట్
జి.కొండూరు: మైలవరం మామిడి పండ్ల మార్కెట్ రైతు మార్కెట్గా పేరుగాంచింది. సహజ సిద్ధంగా పండించిన మామిడి పండ్లను రైతులు నేరుగా ఈ మార్కెట్కు తీసుకొచ్చి విక్రయాలు జరుపుతుంటారు. వినియోగదారులతో పాటు చిరు వ్యాపారులు సైతం ఈ మార్కెట్లోనే పండ్లను కొనుగోలు చేస్తుంటారు. మూడు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న ఈ మామిడి పండ్ల మార్కెట్కి ఇప్పుడు కష్టమొచ్చింది. ఈ ఏడాది పురుగులు, తెగుళ్లు ఆశించి, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో మామిడి దిగుబడులు తగ్గిపోయి మార్కెట్ కళ తప్పింది. మరోవైపు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేక రోడ్ల పక్కనే రైతులు విక్రయాలు సాగిస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సహించి ప్రత్యేక స్థలం కేటాయించి మార్కెట్కు ఊతమిస్తే జిల్లాలోనే అతి పెద్ద మామిడి పండ్ల మార్కెట్గా అవతరించే అవకాశం ఉందని రైతులు, వ్యాపారులు పేర్కొంటున్నారు.తోటల నుంచి నేరుగా మార్కెట్కు..మైలవరం మామిడి పండ్ల మార్కెట్కు మైలవరం, జి.కొండూరు, విజయవాడరూరల్, రెడ్డిగూడెం, ఎ.కొండూరు మండలాల పరిధిలోని మామిడి తోటల నుంచి రైతులు నేరుగా పండ్లు తీసుకొస్తారు. బంగినపల్లి, చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసాలు వంటి పండ్లను ఎక్కువగా విక్రయిస్తారు. రైతులతో పాటు ఈ మార్కెట్లో దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్న కొందరు వ్యాపారులు మామిడి తోటలను లీజుకొని పండ్లను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ మార్కెట్లో స్థిరంగా వ్యాపారం చేసే వ్యాపారులు 50 మంది వరకు ఉండగా రైతులు చుట్టు పక్కల మండలాల నుంచి 200 మంది వరకు వచ్చి మామిడి పండ్లను విక్రయిస్తుంటారు. మామిడి ప్రారంభంలో వచ్చే కాయలను ప్రయివేటు మార్కెట్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. కాయ ముదిరి పంటకు వచ్చిన తర్వాతనే ఈ మార్కెట్ ప్రారంభమవుతుంది. మైలవరం మామిడి పండ్ల మార్కెట్ ఏప్రిల్ రెండో వారం తరువాత ప్రారంభమై జూన్ రెండో వారం ముగిసే వరకు కొనసాగుతుంది. రైతులు, తోటలు లీజుకు తీసుకున్న వ్యాపారులు నేరుగా విక్రయాలు జరపడం వల్ల నాణ్యమైన, సహజ సిద్ధంగా పండిన పండ్లు వినియోదారుడికి తక్కువ ధరకే లభిస్తాయి. గత ఏడాది వరకు ఈ మార్కెట్లో రోజుకు 15 టన్నుల వరకు పండ్ల విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది దిగుబడి లేకపోవడంతో వ్యాపారం సగానికి పడిపోయింది. ఈ మార్కెట్లో వ్యాపారం మూడు అంచలుగా జరుగుతుంది. రైతులతో పాటు కొంత మంది వ్యాపారులు కూడా పండ్లు విక్రయిస్తారు. హోల్సేల్ ధరలకే వినియోగదారుడికి మామిడి పండ్లు లభిస్తాయి. మైలవరం పశువుల ఆస్పత్రి ఎదురుగా విజయవాడ, భద్రాచలం జాతీయ రహ దారికి ఇరువైపులా మార్కెట్ను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చిన్న, పెద్ద రసాలు డజను రూ.150 నుంచి సైజును బట్టి విక్రయిస్తున్నారు. బంగినపల్లి డజను రూ.240 చొప్పున విక్రయిస్తున్నారు.ఈ ఫొటోలోని మహిళ పేరు సందిపాము వెంకట రత్నమ్మ. ఇరవై ఏళ్లుగా మైలవరం మామిడి పండ్ల మార్కెట్లో వ్యా పారం చేస్తోంది. ఈ ఏడాది 12 ఎకరాల తోట లీజుకు తీసుకొని రూ.3 లక్షల వరకు ఖర్చు పెట్టింది. పురుగులు, తెగుళ్లు, పెనుగాలులతో కూడిన అకాల వర్షం వల్లన తీవ్రంగా నష్టపోయింది. లాభం సంగతి అటుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి నష్టపోయింది. అయినప్పటికీ పండ్లను సరసమైన ధరకే విక్రయిస్తోంది. లాభం వచ్చినా, నష్టం వచ్చినా ఈ వ్యాపారానికే అలవాటు పడిపోయానని పేర్కొంటోంది. ప్రభుత్వం పరిహారం అందిస్తే కొంతమేర నష్టాలు తగ్గుతాయని ఆశిస్తోంది. -
పెండింగ్ అర్జీలను పరిష్కరించాలి
పీజీఆర్ఎస్లో డీఆర్వో చంద్రశేఖరరావు చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన అర్జీలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు ఆదేశించారు. కలెక్ట రేట్లోని సమావేశపు హాలులో సోమవారం పీజీ ఆర్ఎస్ (మీ–కోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఆర్వోతో పాటు కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, బందరు ఆర్డీఓ కె.స్వాతి, సమగ్ర శిక్ష ఏపీసీ కుమిదిని సింగ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. డీఆర్వో మాట్లాడుతూ.. పెండింగ్ అర్జీలను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. ప్రస్తుతం అందుతున్న అర్జీలతో పాటు వివిధ శాఖల వద్ద పరిష్కరించాల్సిన గతంలోని కొన్ని అర్జీలు పెండింగ్లో ఉన్నాయని వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలన్నారు. రక్తహీనత, తలసేమియా బాధితులతో పాటు గర్భిణులకు అత్యవసర పరిస్థితుల్లో రక్తాన్ని అందించేందుకు అవసరమైన రక్తాన్ని సేకరించేందుకు నియోజకవర్గాల వారీగా మండలస్థాయిలో రక్తదాన శిబిరాలను నిర్వహించాలన్నారు. వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్న కోర్టు కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అవసరమైన వాటికి సకాలంలో కౌంటర్ దాఖలు చేయాలన్నారు. ఈ కార్య క్రమంలో అధికారులు 125 అర్జీలను స్వీకరించారు. ముఖ్యమైన అర్జీలు ఇవీ.. ● గుడివాడలోని ఏఎన్ఆర్ కళాశాలలో ఎంబీఏలో చేరానని, ఆర్థిక సమస్యల కారణంగా చదువును కొనసాగించలేకపోయానని, 2020వ సంవత్సరంలో అడ్మిషన్ల సమయంలో తన వద్ద నుంచి తీసుకున్న సర్టిఫికెట్లను పూర్తి ఫీజు చెల్లించ కుండా ఇవ్వనంటున్నారని తన ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇప్పించాలని పెదపారుపూడి మండలం మహేశ్వరపురం గ్రామానికి చెందిన సీహెచ్. శ్యామన్ అర్జీ ఇచ్చారు. ● తమ గ్రామంలో పంటబోదెలను యంత్రాలతో తవ్వి మట్టిని యథేచ్ఛగా రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, ఉపాధి హామీ పథకం ద్వారా పూడికతీత పనులు చేపట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని బందరు మండలం గుండుపాలెం గ్రామస్తులు అర్జీ ఇచ్చారు. ● మచిలీపట్నం – విజయవాడ జాతీయ రహదారిలోని మొవ్వ మండలం నిడుమోలు గ్రామం వద్ద సర్వీస్ రోడ్డు సరిగా లేక వాహనదారులు, ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జాతీయ రహదారి అధికారులను అడిగితే స్పందించటం లేదని సర్వీస్ రోడ్డు, డ్రెయిన్ల నిర్మాణం చేయాలని కోరుతూ గ్రామస్తులు అర్జీ ఇచ్చారు. -
దుర్గమ్మ ఆర్జిత సేవలకు డిమాండ్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వైశాఖ పౌర్ణమి నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున మూడు గంటలకు నిర్వహించిన సుప్రభాత సేవకు 15 మంది ఉభయదాతలు హాజరయ్యారు. అనంతరం అమ్మవారి ప్రధాన ఆలయంలో మూలవిరాట్ వద్ద నిర్వహించిన ఖడ్గమాలార్చన 32 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో ఉత్సవ మూర్తి వద్ద నిర్వహించిన లక్ష కుంకుమార్చన, శ్రీచక్ర నవార్చనలో ఉభయదాతలు విశేషంగా పాల్గొనగా, రికార్డు స్థాయిలో చండీహోమానికి 139కు టికెట్లను విక్రయించారు. రెండు 250 మందికి పైగా భక్తులు ఈ హోమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు, ఆర్జిత సేవల్లో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లు అన్నీ కిటకిటలాడాయి. మధ్యాహ్నం అమ్మవారికి మహానివేదన సమర్పించేందుకు అర్ధగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేశారు. -
డైట్లో 10 మంది అధ్యాపకుల నియామకం
గుడ్లవల్లేరు: మండలంలోని అంగలూరులో ఉన్న ప్రభుత్వ జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థ (డైట్)లో పది మంది అధ్యాపకులను నియమిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వారిలో తొమ్మిది మంది విధుల్లో చేరారు. డైట్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల్లో చాలా కాలానికి పది మంది స్కూల్ టీచర్లను డెప్యుటేషన్పై నియమించారు. వారిలో ముగ్గురు శనివారం, మరో ఆరుగురు సోమవారం విధుల్లో చేరారు. రాధాకృష్ణ (ఫిలాసఫీ), రాంప్రసాద్ (గణితం), డాక్టర్ మోహనరావు(గణితం), శ్రీనివాస్ (సైన్స్), శివ పార్వతి (సైన్స్), వేణుగోపాల్ (తెలుగు), వెంకట సుబ్బలక్ష్మి (ఇంగ్లిష్), జోజిబాబు (ఇంగ్లిష్), లక్ష్మీనాంచారమ్మ (సైకాలజీ) ఛాత్రోపాధ్యాయులకు పాఠాలు చెప్పనున్నారు. ఈ సందర్భంగా డైట్ సీనియర్ అధ్యాపకుడు డాక్టర్ పి.వినయకుమార్ నూతనంగా విధుల్లో చేరిన వారికి అభినందనలు తెలిపారు. వారికి కొన్ని సూచనలు చేశారు.ఎన్టీఆర్ జిల్లాలో శిశు మరణాలపై సమీక్షలబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలో 2024 డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరు వరకూ జరిగిన శిశు మరణాలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని ఆధ్వర్యంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఆయా శిశువుల మరణాలపై అంతర్గత శాఖాపరమైన ఆడిట్ నిర్వహించారు. ప్రతి శిశు మరణాన్ని శాసీ్త్రయ దృక్ఫ థంతో విశ్లేషించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని స్పష్టంచేశారు. పోషకాహార, జన్యు, అవగాహనలోపాలు, సామాజిక కారణాలు తదితర వాటిని విశ్లేషించుకోవడం రానున్న రోజుల్లో శిశు మరణాలను నివారించగలమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. శిశు మరణాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఐఓ డాక్టర్ శరత్బాబు, డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఇందుమతి, శిశు మరణాలు జరిగిన ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.వైభవంగా నరసింహ స్వామి తెప్పోత్సవంవేదాద్రి(జగ్గయ్యపేట): జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం యోగానంద లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో తరుకల్యాణ మహోత్సవాల్లో వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం రాత్రి స్వామి తెప్పోత్సవం అంగరంగ వైభ వంగా జరిగింది. ఆలయ సమీపంలోని కృష్ణానదిలో ప్రత్యేకంగా పడవను ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలంకరణలో స్వామి వారి ఉత్సవ మూర్తులను నదిలో ఊరేగించారు. లోకకల్యాణార్థం ఏటా స్వామి, అమ్మవార్ల కల్యాణం నిర్వహిస్తున్నట్లు అర్చకులు పరాంకుశం శ్రీధరాచార్యులు, శేషాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ సురేష్బాబు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.మండు వేసవిలో మంచు తెరలుచల్లపలి: మండు వేసవిలో మండల కేంద్రమైన చల్లపల్లిలో మంచు తెరలు కనువిందుచేశాయి. వేసవి నేపథ్యంలో పగటి ఉష్ణోగ్రతలు అత్యధి కంగా నమోదవుతయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం కురిసిన మంచు ప్రజలకు కొంతమేర ఉపశమనం కలిగించింది. మండు వేసవిలో మంచు ఇలా మంచు పట్టడంపై ప్రజలు ఒకింత ఆశ్చర్యచకితులయ్యారు. తెల్లవారుజాము నుంచి ఏడు గంటల వరకు మంచు దట్టంగా కురిసింది. -
ఘంటసాల శయన ప్రాజెక్టు నిర్మాణానికి కృషి
మంత్రి కందుల దుర్గేష్ ఘంటసాల: కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఘంటసాల శయన ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కృషి చేస్తానని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఘంటసాల గ్రామంలోని బౌద్ధ స్థూపం వద్ద బుద్ధుని జయంతి వేడుకలు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు రేగుళ్ల మల్లికార్జునరావు ఆధ్వర్యంలో సోమ వారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బౌద్ధ పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా కేంద్ర ప్రభుత్వం సహకారంతో పర్యాటక రంగం అభివృద్ధి చేస్తామన్నారు. నేటి సమాజంలో బుద్ధని బోధనలు అనుసరణీయమన్నారు. బౌద్ధ భిక్షువు భంతే ధమ్మ ధజ థెరోతో కలసి మంత్రి దుర్గేష్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ రవీంద్ర కుమార్ డప్పువాయిద్యాలు, నృత్య కళాకారులతో కలసి భారీ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం బౌద్ధ భిక్షువులు, కార్యక్రమానికి సహకరించిన ప్రజా ప్రతినిధులు, అధికారులను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. జిల్లాలోని ప్రముఖ బౌద్ధ క్షేత్రమైన ఘంటసాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అన్నారు. బుద్ధ విహార్ వద్ద బుద్ధ జయంతి ఉత్సవాలను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు రేగుళ్ల మల్లికార్జునరావులతో కలసి గీతాంజలి శర్మ ప్రారంభించారు. ఉత్సవంలో భాగంగా జరిగిన రెండు సదస్సుల్లో బౌద్ధ శాసనాలు, బౌద్ధ నాటకాలు, ఘంటసాల బ్రహ్మీ శాసనాలు, నాటకాలు, సామాజిక ప్రగతి తదితర విషయాలను చర్చించారు. ఈ కార్యక్రమాల్లో మెప్మా పీడీ సాయిబాబు, డీసీ చైర్మన్ భాను ప్రకాష్, తహసీల్దార్ బి.విజయప్రసాద్, ఎంపీడీఓ డి.సుబ్బారావు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. -
వైభవంగా ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివారు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ సోమవారం అంగరంగ వైభవంగా సాగింది. ఇంద్రకీలాద్రి ఘాట్రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం వద్ద పూలతో అలంకరించిన వాహనాన్ని అధిష్టించిన ఉత్సవమూర్తులకు ఈవో శీనానాయక్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ప్రచార రథంతో పాటు ప్రత్యేకంగా పూలతో అలంకరించిన వాహనం ముందుకు సాగింది. శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఉత్సవ మూర్తులకు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ, భక్తజనుల కోలాటనృత్యాలు, డప్పుకళాకారులు విన్యాసాల మధ్య ఊరేగింపు ముందుకు సాగింది. ఘాట్రోడ్డు నుంచి ప్రారంభమైన ప్రదక్షిణ కుమ్మరిపాలెం, విద్యాధరపురం, సితారా జంక్షన్, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్రావునగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, నెహ్రూబొమ్మ సెంటర్, బ్రాహ్మణవీధి మీదగా అమ్మవారి ఆలయానికి చేరింది. ఆది దంపతులకు పసుపు, కుంకుమ, పూజా సామగ్రి, పండ్లు సమర్పించి తమ కుటుంబాలు చల్లగా ఉండేలా దీవించాలని వేడుకున్నారు. స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనం పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు స్వర్ణకవచాన్ని అలంకరించారు. స్వర్ణకవచంలో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ప్రతి నెలా పౌర్ణమి రోజున అమ్మవారికి స్వర్ణకవచం అలంకరిస్తారు. -
19 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
చిలకలపూడి(మచిలీపట్నం): పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు ఈ నెల 19 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశ మందిరంలో విద్య, వైద్య, ఏపీఎస్ ఆర్టీసీ, పోలీసు, పోస్టల్, మున్సిపల్, విద్యుత్ తదితర శాఖల అధికారులతో పది అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 30 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఆయా శాఖలు సమన్వయం చేసుకుంటూ పరీక్షల నిర్వహణకు అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,544 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని తెలిపారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్, కస్టోడియన్, ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లను ఇప్పటికే నియమించారన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, వాటికి సమీపంలో ఎలాంటి జిరాక్స్ సెంటర్లు తెరవకుండా చూడాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద ముఖ్యమైన ఔషధాలతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను వైద్య సిబ్బంది సిద్ధంగా ఉంచాలన్నారు. అన్ని ఏర్పాట్లు చేయండి పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అసౌకర్యం లేకుండా నిరంతరాయ విద్యుత్, ఆయా రూట్లలో విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ పరీక్షలకు సమాంతరంగా 14 పరీక్ష కేంద్రాల్లో ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్ పరీక్షలు కూడా జరుగుతాయని, మొత్తంగా 2,307 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. సమావేశంలో డీఈవో పీవీజే రామారావు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, మచిలీపట్నం ఆర్డీవో కె.స్వాతి ఇతర అధికారులు పాల్గొన్నారు. 30 పరీక్ష కేంద్రాలు జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖర రావు -
గడువు ముగిసినా కొనసాగుతుంది
రేషన్కార్డులకు సంబంధించి ఈకేవైసీ గడువు ఏప్రిల్ 30తో ముగిసింది. అయినా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఏమి రాలేదు. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లబ్ధి పొందాలన్నా, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తదితర వాటికి తెల్ల రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ప్రజలు అవగాహనతో ఈకేవైసీ చేయించుకునేందుకు ముందుకు రావాలి. సభ్యులు ఈకేవైసీ చేయించుకోకపోతే నిత్యావసర సరకులు పొందడానికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంకా ఎవరైనా చేయించుకోవాల్సిన వారుంటే తక్షణం ఈకేవైసీ చేయించుకోవాలి. –కె అనిల్కుమార్, ఇన్చార్జి తహసీల్దార్, పెడన -
బైక్ దొంగల అరెస్ట్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని భవానీపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 20లక్షల నగదు, 11 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఇటీవల భవానీపురం పోలీసు స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తులు వరుసగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు సంఘటనా స్థలంలోని ఆధారాలను సేకరించి దర్యాప్తు చేశారు. వెస్ట్ ఏసీపీ దుర్గారావు పర్యవేక్షణలో సీఐ ఉమామహేశ్వరరావు సిబ్బంది బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని అనుమానితులు, పాత నేరస్తులపై నిఘా ఉంచారు. హెచ్బీ కాలనీకి చెందిన గడ్డం శరణ్సాయి, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం డోలాస్ నగర్కు చెందిన బొక్కా కార్తీక్లను అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. వారిచ్చిన సమాచారం మేరకు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా గొల్లపూడిలోని అట్కిన్సన్ స్కూల్ సమీపంలో తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో ఇద్దరు నిందితులు మైనర్లు కావడంతో వారిని జువైనల్ హోంకు పంపారు. రూ. 20 లక్షల నగదు, 11 బైక్లు స్వాధీనం -
ముగిసిన గడువు.. పూర్తికాని ఈకేవైసీ
పెడన: రేషన్ కార్డుదారులు ఈకేవైసీ చేయించుకునే గడువు ముగిసినా.. లక్ష్యం పూర్తి కాలేదు. ఈకేవైసీ చేయని కార్డుదారుల పేర్లు తొలగిస్తారని తెలుస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో లోపాలను సవరించి పారదర్శక సేవలు అందిస్తామని అంటూనే ప్రజాభారం తగ్గించుకునేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రేషన్కార్డుల్లో సభ్యులను తొలగించడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం రేషన్కార్డులో ఎంత మంది కుటుంబ సభ్యులుంటే అందులోని వారంతా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని ఆదేశించింది. దీనికి అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుని సంబంధిత రేషన్ డీలర్ల ద్వారా ఈకేవైసీ చేయించారు. దీని గడువు ఏప్రిల్ 30తో ముగిసింది. అయినా వందశాతం పూర్తి కాకపోవడంతో తదుపరి ఆదేశాలు వచ్చేవరకు స్థానిక అధికారులు వేచి చూస్తున్నారు. 19,905 యూనిట్లకు ఈకేవైసీ చేయాలి ప్రస్తుతం ఇప్పటి వరకు మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో 3,79,692 యూనిట్లు ఉంటే వీటిల్లో 3,59,787 యూనిట్లు ఈకేవైసీ పూర్తయ్యాయి. మిగిలిన 19,905 యూనిట్లు ఈకేవైసీ కావాల్సి ఉంది. వీరు అడ్రస్లలో లేరా లేక స్థానికంగా నివాసం ఉండటం లేదా అనేది తేలాల్సి ఉంది. అదీ కాకుండా వీరి పేరుతో ప్రతి నెలా రేషన్ కూడా పంపిణీ అవుతుందా లేదా అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కార్డుల్లో ఉన్న కుటుంబ సభ్యులను బట్టి యూనిట్లుగా విభజించారు. ఒక్కో కార్డులో ఒకటి నుంచి ఐదుగురు సభ్యులు వరకు ఉన్నారు. ఐదేళ్లు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేయించాల్సి ఉంది. ఈకేవైసీ చేయని కార్డుదారుల పేర్లు తొలగింపు! పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో 3.79 లక్షలు యూనిట్లు ఇప్పటి వరకు రూ.3.59 లక్షలు ఈకేవైసీ పూర్తి మరో 19 వేల యూనిట్లు పరిస్థితి ఏంటో.. పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో యూనిట్లును పరిశీలిస్తే... మండలం మొత్తం ఈకేవైసీ ఈకేవైసీ యూనిట్లు అయినవి కానివి మచిలీపట్నం 1,93,322 1,81,618 11,704 పెడన 57,797 55,148 2,649 గూడూరు 44,334 42,718 1,616 బంటుమిల్లి 40,355 38,471 1,884 కృత్తివెన్ను 43,884 41,832 2,052 మొత్తం 3,79,692 3,59,787 19,905 -
ట్రాక్టర్పై నుంచి జారిపడి డ్రైవర్ మృతి
గూడూరు: మట్టి ట్రాక్టర్పై నుంచి జారిపడిన డ్రైవర్ మరణించిన ఘటన సోమవారం మండల పరిధిలోని మల్లవోలులో చోటు చేసుకుంది. మల్లవోలు శివారు ముదిరాజుపాలెం గరువుకు చెందిన పూల నరసింహ(25) ట్రాక్టర్ డ్రైవర్. వారం రోజులుగా రాయవరం పొలిమేర నుంచి చటారిపాలెంకు ట్రాక్టర్లతో మట్టి తోలకానికి వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం చటారిపాలెం మట్టి డంప్ చేసి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తూ ట్రాక్టర్పై నుంచి జారి పడిపోయాడు. అతని నడుంపై నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో ఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయాడు. నరసింహను తొక్కుకుంటూ వెళ్లిన ట్రాక్టరు చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. వెనుక వస్తున్న ట్రాక్టర్ డ్రైవర్లు నరసింహ అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించి మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు. గూడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూలీ పనులు చేసుకుని జీవించే పూల శ్రీనుకు ఇద్దరు కుమారులు వారిలో నరసింహ పెద్దవాడు. తన కుమారుడికి పెళ్లి కూడా కాలేదంటూ.. అతను దుర్మరణం చెందడంపై శ్రీను కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. -
ప్రజల కోసమే పోలీసులు
కోనేరుసెంటర్: ప్రజల కోసమే పోలీసు వ్యవస్థ పని చేస్తోందని ఎవరికి ఎలాంటి అన్యాయం జరిగినా నేరుగా తమను కలిసి న్యాయం పొందవచ్చని కృష్ణా ఎస్పీ ఆర్గంగాధరరావు తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన మీకోసంలో పాల్గొన్న ఆయన వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మీకోసమన్నారు. సమస్యల పరిష్కారంలో సిబ్బందిపై ఎలాంటి అవినీతి ఆరోపణలకు పాల్పడినా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్పీ పలు అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరి కొన్ని అర్జీలను ఫోన్లలో మాట్లాడి పరిష్కరించారు. మిగిలిన అర్జీలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేసి వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. సోమవారం జరిగిన మీకోసంలో 38 అర్జీలు అందినట్లు ఆయన తెలిపారు. ఎస్పీ గంగాధరరావు -
అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులతో అప్రమత్తం
చిలకలపూడి(మచిలీపట్నం): వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అన్నారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన అంశాలపై ముద్రించిన కరపత్రాలను ఆమె సోమవారం కలెక్టరేట్లోని సమావేశం హాలులో విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులకు డీ హైడ్రేషన్, సాధారణంగా వచ్చే వ్యాధులతో సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రమాదకరమన్నారు. వడదెబ్బ నుంచి తట్టుకునేందుకు ప్రతి రోజూ నీరు, పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ, ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. తేలిక పాటి కాటన్ దుస్తులు ధరించాలని సూచించారు. మితంగా భోజనం చేయాలన్నారు. ఎండల్లో బయట తిరగ కూడదని సూచించారు. అతిసార వ్యాధి నుంచి పిల్లలను రక్షించండి అతిసార వ్యాధి నుంచి పిల్లలను రక్షించడానికి చర్యలు చేపట్టాలని గీతాంజలిశర్మ అన్నారు. ఈ వ్యాధి సోకకుండా సబ్బునీటితో చేతులను పరిశుభ్రం చేసుకోవాలన్నారు. శుభ్రమైన తాగునీటిని ఉపయోగించాలన్నారు. చిన్న పిల్లలకు మొదటి ఆరు నెలలు తప్పనిసరిగా తల్లిపాలను మాత్రమే తాగించాలన్నారు. కార్యక్రమాల్లో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, డీఎంఅండ్హెచ్వో డాక్టర్ ఎస్.షర్మిష్ట, ఆర్డీవో కె.స్వాతి తదితరులు పాల్గొన్నారు. కృష్ణా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ -
తల్లిదండ్రుల కళ్లెదుటే కానరాని లోకాలకు..
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): తల్లిదండ్రుల కళ్లెదుట కుమార్తె కానరాని లోకాలకు వెళ్లిపోయింది. కొండపల్లి శ్రామికనగర్కు చెందిన తిరుమలకొండ వీరబాబు, సుచరిత దంపతుల కుమార్తె మహాలక్ష్మి(5) రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. తిరువూరు సమీపంలోని వల్లంపట్ల గ్రామంలో ఆదివారం రాత్రి శుభకార్యానికి కారులో వెళ్లారు. సోమవారం ఉదయం తిరుగు ప్రయాణంలో ఎ.కొండూరు వద్ద కారును ట్రక్ ఆటో ఢీకొట్టింది. కారులో కూర్చున్న మహాలక్ష్మి (5) మృత్యువాత పడింది. మిగిలిన వారికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని తిరువూరు వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె కళ్లెదుటే మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కొండపల్లి తీసుకువచ్చిన బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వ వైద్యశాలకు పోలీసులు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఐదేళ్ల బాలిక మృతి -
పాపం.. పసుపు రైతు!
కంకిపాడు: బహిరంగ మార్కెట్లో జరుగుతున్న మాయాజాలానికి పసుపు రైతులు నలిగిపోతున్నారు. వ్యాపారులు సిండికేట్గా మారి ధరను స్థిరంగా ఉంచుతున్నారు. సన్నకొమ్ములు, పుచ్చులు కనిపిస్తున్నాయంటూ ధరను తగ్గించి అన్నదాతలను లూటీ చేస్తున్నారు. గత రెండు సీజన్లలో ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది కూడా గరిష్ట ధర దక్కుతుందనే ఆశలో అన్నదాతలు ఉన్నారు. దీనికి తోడు పంటను నిల్వ చేసుకునే సన్నాహాల్లో ఉన్నారు. కష్ట, నష్టాలకోర్చి సాగు.. ప్రధాన వాణిజ్య పంటల్లో పసుపు ఒకటి. దీన్ని ఈ ప్రాంత రైతాంగం పచ్చబంగారంగా పిలుస్తారు. ఈ సీజన్లో కృష్ణాజిల్లా వ్యాప్తంగా 5,031 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లాలో 707 ఎకరాల్లో పంటను సాగు చేశారు. ప్రధానంగా కడప మైదుకూరు, ప్రగతి, శీలం, ఇతర స్థానిక విత్తన రకాలను ఎంపిక చేసుకుని సాగు చేసుకున్నారు. ఎకరాకు రూ.1.70 లక్షలు వరకూ పెట్టుబడులు పెట్టారు. భారీ వర్షాలు, వరదలతో సాగు ఆరంభంలో పంటకు నష్టం జరిగింది. ఆటు పోట్లను అధిగమించి రైతులు పంటను సంరక్షించుకున్నారు. వర్షాల కారణంగా అక్కడక్కడా దుంప పుచ్చు ఆశించింది. పచ్చి పసుపు 60–70 పుట్టు (పుట్టు అంటే 225 కిలోలు) వరకూ దిగుబడి వచ్చింది. ఉడకబెట్టి, ఎండబెట్టిన పిదప 22 క్వింటాళ్ల నుంచి గరిష్టంగా 26 క్వింటాళ్ల వరకూ దిగుబడులు చేతికందాయి. సిండికేట్తో రైతులకు కష్టాలు.. ఈ ఏడాది పంట చేతికొచ్చిన మార్చి, ఏప్రిల్ నెలల్లో క్వింటా పసుపు కొమ్ములు రూ. 9,100 పలికింది. ఇంకా ధర పెరుగుతుందని అన్నదాతలు ఆశలు పెట్టుకున్నారు. అదే విధంగా ధర క్రమంగా పెరుగుతూ వచ్చింది. రూ. 11,500 వరకూ చేరింది. అయితే గడిచిన 20 రోజులుగా క్వింటా పసుపు కొమ్ముల ధర రూ. 11వేల మీదే నిలిచిపోయింది. ధర పెరగకుండా వ్యాపారుల సిండికేట్ అడ్డు పడుతోందని రైతులు భావిస్తున్నారు. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు పంట నాణ్యత దెబ్బతినటం, ఊట సరిగా ఊరకపోవటంతో కొమ్ములు నాణ్యంగా ఉన్నప్పటికీ సైజు సన్నగా ఉండటాన్ని వ్యాపారులు సాకుగా మార్చుకున్నారు. అక్కడక్కడా పుచ్చు, కొమ్ములు సన్నంగా ఉన్నాయని ధరను తగ్గించేస్తున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా మార్చుకుని ధర నిర్ణయం చేస్తూ అందినకాడికి దోచేస్తున్నారు. సన్నం, పుచ్చు నెపంతో క్వింటా రూ. 9వేల నుంచి రూ. 11వేల లోపు చెల్లిస్తూ అన్నదాతను నిట్టనిలుపునా ముంచేస్తూ వ్యాపారులు తమ జేబులు నింపుకుంటున్నారన్న విమర్శలు బహిరంగ మార్కెట్లో వినిపిస్తున్నాయి. సిండికేట్ అయి కొను‘గోలుమాల్’ నాసిరకం పేరుతో ధర తగ్గింపు రూ. 9వేల నుంచి రూ. 11వేలు పలుకుతున్న ధర 20 రోజులుగా ధరను స్థిరంగా ఉంచుతున్న వైనం ధర పెరుగుతుందనే ఆశలో అన్నదాతలు పంటను నిల్వ చేసుకునేందుకు సన్నాహాలు ధర పెరగకుండా వ్యాపారుల మాయాజాలం -
పద కవితకు ఆద్యుడు అన్నమయ్య
విజయవాడ కల్చరల్: పద కవితకు ఆద్యుడు అన్నమయ్య అని లబ్బీపేట శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్వహణ బాధ్యుడు డాక్టర్ సీహెచ్ రామ్మోనరావు అన్నారు. శ్రీ వేంకటేశ్వర సంకీర్తనా అకాడమీ(శ్వాస) కంచి కామకోటిపీఠం శారదా చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో 8 రోజులపాటు నిర్వహించే జాతీయ అన్నమయ్య సంగీత మహోత్సవాలు లబ్బీపేటలోని శ్రవణ సదనంలో ఆదివారం ప్రారంభమయ్యాయి. రామ్మోనరావు మాట్లాడుతూ అన్నమయ్య సంకీర్తనలు తెలుగు భాషా వీచికలుగా అభివర్ణించారు. లలిత కళలతోనే మనో వికాసం కలుగుతుందన్నారు. తొలిరోజు నృసింహ జయంతి సందర్భంగా తరికొండ వెంగమాంబ జయంతిని నిర్వహించారు. వెంగమాంబ రచించిన సంకీర్తనలను సంగీత కళాశాల ప్రిన్సిపాల్ కె.లక్ష్మీనరసమ్మ, శ్రేష్ట మ్యూజిక్ అకాడమీ విద్యార్థినులు, మానస, లాస్యలు మధురంగా ఆలపించారు. కార్యక్రమాన్ని సంస్థ సభ్యులు సత్యబాలు, ప్రసాద్ నిర్వహించారు. నగరానికి చెందిన పలువురు సంగీత విద్వాంసులు పాల్గొన్నారు. -
నూతన కార్యవర్గం ఎన్నిక
చిలకలపూడి(మచిలీపట్నం): నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. స్థానిక నాల్గో తరగతి ఉద్యోగుల సంఘ భవనంలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా ఎస్ఎస్ఎన్ఎంవీఆర్వీ ప్రసాద్, సహాధ్యక్షుడిగా ఎం. ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షుడిగా డి. కుమార్, ఎ. కోదండరామ్, కార్యదర్శిగా ఎస్. రాము, సంయుక్త కార్యదర్శులుగా నాగలక్ష్మి, గోపీకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎస్కే జాబార్, కోశాధికారిగా ఎం. నాగలక్ష్మీలను ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన ఆర్. శ్రీనివాస్, కె. కొండయ్య తెలిపారు. గుడివాడలో జాబ్మేళా చిలకలపూడి(మచిలీపట్నం)/గుడివాడ రూరల్: గుడివాడలోని ఏఎన్ఆర్ కళాశాలలో ఈ నెల 14వ తేదీన జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ ఆదివారం తెలిపారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనాశాఖ ఆధ్వ ర్యంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ జాబ్మేళాను నిర్వహిస్తున్నామన్నారు. హెటీరో ల్యాబ్స్ లిమిటెడ్, ఎంఆర్ఎఫ్ లిమిటెడ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ముత్తూట్ ఫైనాన్స్, పతంజలి ఫుడ్స్ తదితర కంపెనీల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఈ కంపెనీల్లో ఉద్యోగాలకు పదో తరగతి నుంచి పీజీ వరకు పూర్తి చేసి ఉన్న వారు పాల్గొనవచ్చని, వయసు 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలన్నారు. ఎంపికై న వారికి మంచి వేతనంతో పాటు సౌకర్యాలతో కూడిన ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. వివరాలకు 9848819682, 9666654641లలో సంప్రదించాలన్నారు. ద్వారకాతిరుమల వెంకన్నకు పట్టువస్త్రాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం తరఫున ఆలయ ఈవో వీకే శీనానాయక్ ఆదివారం పట్టువస్త్రాలను సమర్పించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ద్వారకాతిరుమల వెళ్లిన దుర్గగుడి ఈవో శీనానాయక్ దంపతులను ఆ దేవస్థాన ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఈవో దంపతులు, దుర్గగుడి ప్రధాన అర్చకులు లింగంభోట్ల దుర్గాప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు శంకర శాండిల్య పట్టు వస్త్రాలు, పూలు, పండ్లు, పూజా సామగ్రిని సమర్పించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు ప్రసాదాలను అందించారు. నేడు కలెక్టరేట్లో మాక్డ్రిల్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అగ్ని మాపక శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి 9 గంటల వరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? అగ్ని కీలల్లో, ఉక్కిరిబిక్కిరి చేసే పొగల్లో ఎవరైనా చిక్కుకుంటే ఎలా కాపాడాలి? భూకంపాలు, ఎడతెరపి లేకుండా కురిసే భారీ వర్షాల సమయాల్లో భవనాలు కూలితే ఏమిచేయాలి? అనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు దీనిని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్, రవాణా తదితర శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొంటారని, నగర ప్రజలు కూడా కార్యక్రమాన్ని తిలకించి అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ కోరారు. పవర్ లిఫ్టింగ్లో షబీనాకు 4 స్వర్ణాలు మంగళగిరి: ఉత్తరాఖండ్లోని డెహ్రడూన్లో జరుగుతున్న ఏషియన్ జూనియర్ ఎక్యూప్డ్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన షేక్ షబీనా 84 కేజీల విభాగంలో 4 బంగారు పతకాలు సాధించారు. ఆదివారం గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోషియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కొమ్మాకుల విజయభాస్కరరావు, షేక్ సంధాని వివరాలు చెబుతూ.. ఈ నెల 10వ తేదీన జరిగిన స్క్వాట్ 190 కేజీలు, బెంచ్ ప్రెస్ 85 కేజీలు, డెడ్ లిఫ్ట్ 180 కేజీలు, ఓవరాల్ 455 కేజీల విభాగాలలో పతకాలు కై వసం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా తెనాలికి చెందిన షబీనా మంగళగిరిలోని పవర్ లిఫ్టింగ్ కోచ్ షేక్ సంధాని వద్ద శిక్షణ పొందుతున్నారు. -
ఘనంగా తిరునక్షత్ర మహోత్సవం
తాడేపల్లి రూరల్: ఎంటీఎంసీ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ఆదివారం శ్రీ లక్ష్మీ నారసింహస్వామి తిరునక్షత్ర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ పరమహంస పరివ్రాజకులు త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి మంగళాశాసనంలో ఉదయం 9 గంటలకు సర్వగ్రహ దోష నివారణ, దృష్టి దోష నివారణ కోసం లక్ష్మీ నారసింహస్వామి హోమం అంగరంగ వైభవంగా నిర్వహించామని, సాయంత్రం 6 గంటలకు పంచామృత అభిషేకం, స్వామి వారి కల్యాణం, మల్లె పుష్పార్చన ఉత్సవాలు నిర్వహించామని అనంతరం తీర్థ ప్రసాద గోష్టి నిర్వహించామని తెలిపారు. -
‘ప్రొటోకాల్’కు టికెట్లు తప్పనిసరి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ‘ప్రొటోకాల్, అంతరాలయ దర్శనాలకు టికెట్లు తప్పని సరి చేయండి.. సిఫార్సులపై వచ్చే వారి ఆధార్ నంబర్లతో పాటు వారిని ఎవరు పంపారనే వివరాలు పుస్తకంలో నమోదు చేయండి.. గతంలో ఏం జరిగిందో నేను అడగను.. ఇకపై తప్పనిసరిగా ఇవి చేయండి’ అని దుర్గగుడి ఈవో వీకే శీనానాయక్ ఆలయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం దుర్గగుడిపై భక్తుల రద్దీ అధికంగా ఉండటంలో కీలక ప్రదేశాల్లో ఆయన తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా ఆలయ ప్రాంగణంలోని స్కానింగ్ పాయింట్ వద్ద పెద్ద ఎత్తున భక్తులు గుంపులు గుంపులుగా ఉండటాన్ని గమనించి పరిశీలించారు. వివిధ ప్రభుత్వ విభాగాలు, అధికారుల పేరిట వచ్చిన వారిగా గుర్తించి టికెట్లపై ఆరా తీశారు. ప్రొటోకాల్ ఉన్న వారికి ప్రస్తుతం జరుగుతున్న విధానాన్ని స్వస్తి పలికి, ఇకపై ప్రతి ఒక్కరికీ ఒక టికెటు కొనుగోలు చేయాలని ఆదేశించారు. అవసరమయితేనే దేవస్థాన సిబ్బంది ప్రొటోకాల్ దర్శనాలకు రావాలని సూచించారు. అనంతరం టికెట్ చెకింగ్ పాయింట్ వద్ద అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లో వస్తున్న భక్తులతో మాట్లాడారు. సమాచార కేంద్రంలో విధుల్లో ఉన్న అధికారులతో మాట్లాడిన ఈవో సిఫార్సులపై దర్శనానికి విచ్చేసే ప్రతి ఒక్కరి ఆధార్ కార్డుతో పాటు సిఫార్సు చేసిన వారి వివరాలు నమోదు చేయాలని సూచించారు. మహా మండపంలో తనిఖీలు.. మహా మండపం 7వ అంతస్తులోని దేవస్థాన మైక్ ప్రచార కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఎస్పీఎఫ్ సిబ్బంది చాంబర్లో తనిఖీలు నిర్వహించిన ఆయన డ్యూటీ చార్ట్ను పరిశీలించారు. వేసవి నేపథ్యంలో ప్రాంగణంలో దేవస్థాన ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత మజ్జిగ పంపిణీని పరిశీలించి, భక్తులకు పంపిణీ చేశారు. -
ప్రీ వెడ్డింగ్ షూట్కు వెళ్లి వస్తుండగా ప్రమాదం
పిడుగురాళ్ల: పట్టణ శివారు అయ్యప్పస్వామి దేవస్థానం వద్ద హైవే పక్కనున్న సేఫ్టీ రెయిలింగ్ను కారు ఢీకొట్టిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా కొండాపూర్కు చెందిన బాణావత్ అరవింద్, సోనియాల వివాహం ఈ నెల 23న జరగనున్న నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్ షూట్కు కోసం చీరాల సముద్ర తీరానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా పిడుగురాళ్ల సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి హైవే పక్కనున్న రెయిలింగ్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురి గాయాలయ్యాయి. ప్రాణ నష్టం జరగకపోయేసరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే స్థానికుల సమాచారంతో 108 వాహనం ద్వారా పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేశారు. అనంతరం సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెరువులో దూకి వాచ్ మెకానిక్ ఆత్మహత్య
గన్నవరం: కోనాయి చెరువులో ఓ వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఇస్లాంపేటకు చెందిన మొఘల్ అన్వర్(60) వాచ్ మెకానిక్.. రెండేళ్ల క్రితం అతని భార్య మృతి చెందగా, అప్పటి నుంచి మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి కోనాయి చెరువులోని పైలెట్ ప్రాజెక్ట్లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చెరువు గట్టుపై అతని సైకిల్, చెప్పులు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ శ్రీధర్, సిబ్బంది అక్కడికి చేరుకుని మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్ఐ తెలిపారు. మృతుడికి కుమారుడు, కుమారై ఉన్నారు. బైక్ ఢీ.. వ్యక్తి మృతి మక్కపేట(వత్సవాయి): బైక్ ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోళ్ల నాగేశ్వరరావు(45) పంచాయతీ కార్యాలయంలో కొంతకాలంగా స్వీపర్గా చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో అతన గోపినేనిపాలెం రహదారివైపు నడుచుకుని వెళ్తుండగా చిల్లకల్లు వైపు నుంచి వేగంగా వచ్చిన బైక్ అదుపుతప్పి నాగేశ్వరరావును ఢీకొట్టింది. ఘటనలో నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్ప్రతికి తరలించారు. ఘటనపై ఎస్ఐ పి.ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేశారు. ఐదుగురు గంజాయి విక్రేతల అరెస్ట్ 10 కేజీల గంజాయి స్వాధీనం మధురానగర్(విజయవాడసెంట్రల్): గంజాయి విక్రయించడానికి సిద్ధంగా ఉన్న ఐదుగురు యువకులను ఆదివారం గుణదల పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గుణదల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎం. ఏడుకొండల గుణశేఖర్, కె.సాయి నితిన్, కొత్తపల్లి వసంత కుమార్, వల్లపు మణికంఠ, కట్ట గోపి ఐదుగురు స్నేహితులు. వీరు మధురానగర్లో ఒక రూమ్లో ఉంటే వేర్వేరు పనులు చేస్తుంటారు. వీళ్లు జల్సాలు, మద్యం, గంజాయికి బానిసయ్యారు. వీరికి డబ్బులు సరిపోక గంజాయి కొని తీసుకొచ్చి ఇక్కడ అధిక లాభానికి అమ్ముదామని ఆలోచనతో ఐదుగురూ ఒడిశా వెళ్లి అక్కడ మారుమూల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొని తీసుకువచ్చారు. గుణదల రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయిని ఐదుగురు పంచుకొనడానికి రాగా ముందస్తు సమా చారం మేరకు గుణదల సీఐ వాసిరెడ్డి శ్రీను, గుణదల సిబ్బంది ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. వారి నుంచి 10 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించారు. అనుమానాస్పద మృతిపై కేసు కంకిపాడు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై కంకిపాడు పోలీస్స్టేషన్లో ఆదివారం రాత్రి కేసు నమోదైంది. ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. కంకిపాడుకు చెందిన సాయిరాం వరప్రసాద్ సింగ్(62) బ్యాంక్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. అతనికి వివాహమైంది. కుమారై ఉన్నారు. అతని భార్య సుమారు ఐదేళ్ల క్రితం మరణించారు. అప్పటి నుంచి ఒంటరిగా నివసిస్తున్నాడు. మద్యానికి బానిసైన సింగ్ అనారోగ్య కారణాలతో మనస్తాపానికి గురై అపార్ట్మెంట్ కిటికీకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 10వ తేదీ జరిగిన ఘటనపై కుటుంబ సభ్యులు కంకిపాడు పోలీసులకు సమాచారం అందించారు. ఆదివారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
మైలవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి మైలవరం బైపాస్ రోడ్డులో జరిగింది. సేకరించిన వివరాలు ప్రకారం మైలవరం గ్రామానికి చెందిన పజ్జూరు శివనారాయణ(55) ద్విచక్ర వాహనంపై పశువుల మేతకు గడ్డి తీసుకువస్తున్నాడు. ఎ.కొండూరు మండలం చీమలపాడు నుంచి కూరగాయల లోడుతో విజయవాడ వెళుతున్న నాలుగు చక్రాల ఆటో వాహనానికి గేదె అడ్డు వచ్చింది. దీంతో గేదెను తప్పించబోయి ద్విచక్ర వాహనానికి ఆటో తగిలింది. ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శివనారాయణ రోడ్డుపై పడిపోయాడు. అతని తలకు బలమైన దెబ్బ తగలడంతో ఘటనా స్థలిలోనే మృతి చెందాడు. నాలుగు చక్రాల ఆటోను స్థానికులు అడ్డుకుని నిలిపివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
హైకోర్టు మాజీ ఏజీపీ నాగభూషణం మృతి
జగ్గయ్యపేట అర్బన్: వైఎస్సార్ సీపీ నాయకుడు, సీనియర్ న్యాయవాది, హైకోర్టులో ఏజీపీగా సేవలందించిన అమృత నాగభూషణం(60) అనారోగ్యానికి గురై ఆదివారం ఉదయం జగ్గయ్యపేటలో మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాగభూషణం మరణం వార్త తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ నాయకులు.. మృతుడు నాగభూషణం నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు వట్టెం మనోహర్, పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నెపాగ సుందరరావు, న్యాయవాది పసుపులేటి సత్యశ్రీనివాసరావు, పార్టీ పట్టణ యూత్ ప్రధాన కార్యదర్శి గొట్టిపాళ్ల సురేష్, ప్రచార విభాగం అధ్యక్షుడు గోగుల వెంకయ్య ఉన్నారు. న్యాయవాదుల నివాళులు బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఫౌండర్, న్యాయవాది నాగభూషణం ఆకస్మిక మృతిపై బార్ కౌన్సిల్ తరఫున పలువురు న్యాయవాదులు నివాళులర్పించారు. సీనియర్ న్యాయవాది రాయపూడి శ్రీనివాసరావు, బార్ మాజీ అధ్యక్షుడు అన్నెపాగ కాంతారావు, న్యాయవాదులు గోనెల వెంకటేశ్వర్లు, దామాల సంతోష్, మన్నెపల్లి బసవరాజు, ఆరేపల్లి వెంకటేశ్వర్లు, ఆలేటి కిషోర్, అన్నెపాగ కిషోర్బాబు తదితరులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
చర్మవ్యాధులు సోకకుండా జాగ్రత్తలు
● వేసవిలో శరీరానికి మాయిశ్చరైజర్స్, సన్స్క్రీన్ లోషన్స్ రాసుకోవాలి. ● ఎక్కువగా ఎండకు ఎక్స్పోజ్ కాకుండా గొడుగు, తలకు టోపీ ధరించాలి. ● ముఖ్యంగా లూజు దుస్తులు, కాటన్వి వేసుకోవాలి. ● రాత్రి వేళల్లో సైతం గాలిసోకే ప్రాంతంలో నిద్రించాలి. ● గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. అనంతరం శరీరాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి. ● స్నానం అనంతరం చర్మానికి పౌడర్ రాసుకుంటే చెమట పొక్కులు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నివారించవచ్చు. ● ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సోకిన వారు వాడే టవల్స్ మరొకరు వాడితే సోకే అవకాశం ఉంది. వాటిని వేడి నీటిలో నానబెట్టి వాష్ చేయాలి. -
అదును చూసి మట్టి అక్రమ తవ్వకాలు
సెలవు రోజులే లక్ష్యంగా తవ్వేస్తున్న మట్టి మాఫియా ఘంటసాల: మండలంలో మట్టి మాఫియా అదును చూసి అక్రమ తవ్వకాలు చేపడుతోంది. సెలవు రోజులే లక్ష్యంగా అర్ధరాత్రులు హడావుడిగా మట్టి తవ్వేస్తున్నారు. శనివారం అర్ధరాత్రి ఘంటసాల మండలం తెలుగురావుపాలెం శివార్లలో రాత్రికి రాత్రే మట్టి తవ్వకాలు చేశారు. తెల్లవారి ఆదివారం మట్టి తవ్వకాలు చూసి గ్రామస్తులు నివ్వెరపోతున్న పరిస్థితి నెలకొంది. ఘంటసాల గ్రామంలోని మల్లంపల్లి రోడ్డులో శనివారం రాత్రి టిప్పర్లతో భారీగా మట్టిని తరలించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘంటసాల మండలంలో సెలవు రోజే లక్ష్యంగా జరుగుతున్న మట్టి మాఫియా ఆగడాలను అధికారులు అరికట్టాలని, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
కవులు సమాజాన్నిఅధ్యయనం చేయాలి
విజయవాడ కల్చరల్: కవులు సమాజాన్ని అధ్యయనం చేయాలని కవి నగ్నముని అన్నారు. లలిత పబ్లికేషన్స్ ప్రచురించిన రాధాకృష్ణ కరి రచించిన లైఫ్ డ్రామా, అమూల్యాచందు రచించిన భూమినవ్వడం చూశాను కవితా సంపుటాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని బాలోత్సవ్ భవన్లో ఆదివారం నిర్వహించారు. నగ్నముని మాట్లాడుతూ యువ కవుల చేతులో కవిత్వం కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. సమాజాన్ని చైతన్య పరిచే అంశాలు అందులో కనిపిస్తున్నట్లు తెలిపారు. సీనియర్ జర్నలిస్ట్ శాంతి శ్రీ అమూల్యాచందు రచించిన భూమి నవ్వడం చూశాను పుస్తకాన్ని సమీక్ష చేస్తూ అమూల్య కవిత్వంలో సమాజ ప్రేరేపిత అంశాలు కనిపిస్తాయన్నారు. కవిత్వంలో ఆమె వాడిన పదాల కూర్పు, పదబంధాలు ఆలోచింప చేస్తాయన్నారు. రాధాకృష్ణ కవిత్వాన్ని కవయిత్రి వాణిశ్రీ నైనాల సమీక్షించారు. సీనియర్ కవి వసీరా సుధామురళి ప్రసంగించారు. నగ్నముని కవితా సంపుటాలను ఆవిష్కరించారు. పదోన్నతులు కల్పించండి ఉమెన్ హెల్త్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు వీకేఎన్ జయలక్ష్మి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైద్య ఆరోగ్యశాఖలో క్షేత్రస్థాయిలో 28 ఏళ్లుగా ఉద్యోగోన్నతి లేకుండా చేస్తున్న సిబ్బందికి పదోన్నతులు కల్పించాలని ఏపీ ఉమెన్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ఉమెన్ హెల్త్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు వీకేఎన్ జయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గాంధీనగర్ ఏపీ ఎన్జీవో అసోసియేషన్ హాల్లో ఆదివారం సంఘ సమావేశం జరిగింది. ఆమె మాట్లాడుతూ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్ నుంచి సూపర్వైజర్లుగా పదోన్నతి కల్పించాలన్నారు. 2211 హెడ్ కింద పని చేస్తున్న ఎంపీహెచ్ఏ(ఎఫ్)లకు ఐదేళ్లుగా రవాణా భత్యాలు లేవన్నారు. ప్రభుత్వం స్పందించి రవాణాభత్యం ఇప్పించాలని కోరారు. రెగ్యులర్ ఎంపీహెచ్ఏ(ఎఫ్) రీడిప్లాయ్మెంట్ రద్దు చేసి బదిలీలు చేయాలని కోరారు. ఫీల్డ్ స్టాఫ్కు ఎఫ్ఆర్ఏ రద్దు చేయాలని కోరారు. నర్సెస్ డే సందర్భంగా ఏఎన్ఎంలను ఘనంగా సత్కరించారు. సమావేశంలో ఉమెన్ హెల్త్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రమీల, ఎస్వీ మహాలక్ష్మి, బి.విమల, కె.మురళీకృష్ణ, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
మహిళలపై పోలీసుల తీరు అమానవీయం
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో మహిళలపై పోలీసులు అమానవీయంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. మాజీ మంత్రి అని కూడా చూడకుండా విడదల రజనిపై పోలీసులు ప్రదర్శించిన తీరే నిదర్శనమన్నారు. వారి వైఖరిని ఖండిస్తున్నామన్నారు. విజయవాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకవైపు దేశంలో యుద్ధవాతావరణం నెలకొంటే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష పార్టీలను ఏ రకంగా కట్టడి చేయాలి, ఎలా కక్ష తీర్చుకోవాలనే దానిపై దృష్టి పెట్టినట్లు ఆరోపించారు. మాజీ మంత్రి విడదల రజని విషయంలో పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే రౌడీల్లా వ్యవహరించడం చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో దిగజారిపోయాయో ఆ ఘటనే ఉదాహరణ అన్నారు. అధికారంలోకి వచ్చిన నాటినుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్టంలో చేసిందేమీ లేదన్నారు. రెడ్బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పాలన ఎటు పోతోందో అర్థం కావడం లేదని, బీసీ, దళిత మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు క్రూరంగా వ్యవహరించారన్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తు పెట్టుకోవాలని, తప్పనిసరిగా చట్టం ముందు నిలబడి మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
ఇంద్రకీలాద్రిపై భక్తజన సందడి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై భక్తజన సందడి నెలకొంది. దుర్గామల్లేశ్వరస్వామివార్లను ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటకల నుంచి పెద్ద ఎత్తున యాత్రికులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ఆదిదంపతులకు జరిగిన పలు ఆర్జిత సేవల్లోనూ ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, శాంతి కల్యాణం, చండీహోమం, లక్ష కుంకుమార్చన విశేషంగా జరిగాయి. లిప్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్న భక్తులు సర్వ దర్శనంతో పాటు రూ. 100, రూ.300, రూ.500 టికెట్ల క్యూలైన్లలో అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక ఏర్పాట్లు రద్దీ నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు త్వరత్వరగా దర్శనం కలిగేలా చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం మహా నివేదన నిమిత్తం అర్ధగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేయడంతో రద్దీ మరింత పెరిగింది. మధ్యాహ్నం రెండు గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. అమ్మవారి ఆలయంలో సూర్యోపాసన సేవ జరిగింది. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, అనంతరం పల్లకీ సేవలోనూ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మోపిదేవిలో..మోపిదేవి: శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. తెల్లవారుజాము నుంచే తెలుగు ఉభయ రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది. నాగపుట్ట, పొంగళ్లశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డీసీ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
విద్యార్థులకు స్వేచ్ఛనిద్దాం
జగ్గయ్యపేటకు చెందిన హారికకు చిన్నప్పటి నుంచే లెక్కలు అంటే ఇష్టం. ఇంజినీరింగ్ చేయాలన్నది ఆమె కోరిక. తల్లిదండ్రులకు కుమార్తెను డాక్టరుగా చూడాలనుకున్నారు. ఆ తపనతో వారు ఆమెను బైపీసీలో బలవంతంగా చేర్పించారు. పాస్ మార్కులతో గట్టెక్కడంతో మెడిసిన్లో సీటు రాలేదు. అప్పటికిగానీ తల్లిదండ్రులు వారి తప్పును తెలుసు కోలేకపోయారు. ● పిల్లల భవిత.. పెద్దల బాధ్యత ● గ్రూపుల ఎంపికలో పిల్లలకు స్వేచ్ఛనివాలంటున్న విద్యావేత్తలు ● తల్లిదండ్రుల నిర్ణయాలతో పిల్లలకు కష్టాలు ● వారి ఇష్టాన్ని గుర్తించాలంటున్న విద్యావేత్తలు ● బలవంతం చేస్తే మొదటికే మోసం మచిలీపట్నానికి చెందిన కుమార్కు ఆర్ట్స్ గ్రూపు అంటే ఇష్టం. చిన్నతనం నుంచే సోషల్ సంబంధిత సబ్జెక్ట్లపై మంచి పట్టుసాధించాడు. గ్రూప్స్ రాయాలనేది అతని కోరిక. పది పూర్తయ్యాక ఆర్ట్స్ గ్రూపులో చేరాలనుకున్నాడు. ఇంట్లో పెద్దల బలవంతంతో ఎంపీసీలో చేరాడు. అతను చదవలేక ఫెయిలయ్యాడు. గుడివాడకు చెందిన గణేష్కు చిన్నతనం నుంచే సీఏ చేయాలన్నది కోరిక. పది పూర్తయ్యాక ఎంఈసీలో చేరాలనుకున్నాడు. తల్లిదండ్రులేమో కొడుకును ఇంజినీరుగా చూడాలనుకున్నారు. అతన్ని బలవంతంగా ఎంపీసీలో చేర్పించారు. అయిష్టంతో చదివిన అతను ఎంపీసీని పాస్ మార్కులతో గట్టెక్కాడు. ఇంజినీరింగ్లో సీటు రాకపోవడంతో డిగ్రీలో ఆర్ట్స్ గ్రూప్ తీసుకున్నాడు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇంటర్లో గ్రూపులు ఎంచుకునే స్వేచ్ఛను పిల్లలకివ్వాలి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అనేక మంది విద్యార్థులు తల్లిదండ్రుల ఒత్తిడితో మక్కువ లేని సబ్జెక్టులు తీసుకుని చదవలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇంటర్ ప్రవేశ సమయంలో తల్లిదండ్రుల బల వంతంతో కొందరు, గొప్పగా చెప్పుకోవాలనే ఆలోచనతో మరికొందరు ఇష్టం లేని గ్రూపుల వైపు అడుగులేసి చతికిలపడుతున్నారు. ఇంటర్ కీలకం విద్యార్థి దశలో ఇంటర్ కీలకం. ఈ దశలో పడిన అడుగు జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే పది పరీక్షలు రాసి ఇంటర్ ప్రవేశాల కోసం వేలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. పిల్లల ఆసక్తి తెలుసుకుని ప్రోత్సహించాలి. అప్పుడే వారు రాణించగలుగుతారు. ఇష్టాన్ని గుర్తించాలి పిల్లల ఇష్టాలను పక్కనబెట్టి డాక్టర్, ఇంజినీర్ చేయాలని తల్లిదండ్రులు కలలుకంటున్నారు. తమ అభిప్రాయాలను పిల్లలపై రుద్దుతున్నారు. మేము చెప్పే కోర్సులను తీసుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. దీంతో విద్యార్థులు వారి ఆసక్తిని పక్కనబెట్టి తల్లిదండ్రులు చెప్పిన కోర్సులో చేరి రాణించలేకపోతున్నారు. పిల్లల ఇష్టాన్ని గుర్తించినప్పుడే రాణిస్తారన్న సత్యాన్ని తల్లిదండ్రులు తెలుసుకోవాలని మానసిక శాస్త్రవేత్తలు హితవు పలుకుతున్నారు. జిల్లాలో పది ఉత్తీర్ణులైనవారు 41,260 మంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో 48,243 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 41,260 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో కొందరు ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో చేరడానికి సన్నద్ధమవుతున్నారు. ఇంకొందరు ప్రభుత్వ కళాశాలల్లో చేరనున్నారు. మరికొందరు పాలిటెక్నిక్, ఏపీఆర్ జేసీ వంటి పోటీ పరీక్షలతో ఆయా కోర్సుల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. పాస్ మార్కులతో గట్టెక్కిన విద్యార్థులు తక్కువ సమయంలో ఉపాధి లభించే ఐటీఐ, ఒకేషనల్ కోర్సులను ఎంచుకుంటున్నారు. సామర్థ్యాన్ని అంచనా వేసుకుని ఇప్పటికే విద్యార్థులు ప్రణాళిక రచించుకున్నారు. ఇలాంటి సమయంలో ఏది ఉత్తమం, ఏ కోర్సులు తీసుకోవాలి వంటి సలహాలు ఇవ్వడం వరకే తల్లిదండ్రులు తమ బాధ్యతగా భావించాలి. గ్రూపుల ఎంపికలో పిల్లలకు స్వేచ్ఛ నివ్వాలని నిపుణులు చెబుతున్నారు. -
చెరువు తవ్వకాలు నిలిపివేత
కృత్తివెన్ను: మండలంలోని నిడమర్రు పంచాయతీ పరిధిలో జరుగుతున్న చెరువు తవ్వకాలను నిలిపివేసినట్లు డెప్యూటీ తహసీల్దార్ శశికుమార్ తెలిపారు. అక్రమ చెరువుల తవ్వకాలపై శనివారం ‘కన్నేసి..తవ్వేసి’ శీర్షికతో ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. ఎంఆర్ఐ మాధవి, వీఆర్వోలు నాగరాజు, దుర్గ క్షేత్రస్థాయికి వెళ్లి పనులు నిలిపివేయించారు. ఇకపై పనులు చేస్తే చర్యలు తీసుకుంటామని డీటీ హెచ్చరించారు. ఎన్టీటీపీఎస్లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్లోని రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. శుక్రవారం సాయంత్రం ఒకటో యూనిట్ సాంకేతిక లోపంతో నిలిచింది. దీంతో 210 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఆ తర్వాత కొంతసేపటికి 8వ యూనిట్లోని బాయిలర్ ట్యూబ్ లీకవడంతో యూనిట్ను షట్డౌన్ చేయడానికి ఇంజినీర్లు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎర్త్ అయ్యి ఒక్కసారిగా ప్లాంటు మొత్తం నిలిచి పోయింది. ఈ పరిణామాలతో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పతి ఆగిపోయింది. రెండు యూనిట్లో మొత్తం 1,010 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఇంజినీరింగ్ అధికారులు అర్ధరాత్రి ఒంటిగంట వరకు మరమ్మతులు చేసినా రెండు ప్లాంట్లు వినియోగంలోకి రాలేదని అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టం విమానాశ్రయం(గన్నవరం): ఇండియా–పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ హెచ్చరికల మేరకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం)లో భద్రతను కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయం ప్రవేశం వద్ద వాహనాలను క్షుణంగా తనిఖీ చేసిన తర్వాతే పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు. ప్రయాణికులను మాత్రమే ఎయిర్పోర్ట్లోకి పంపిస్తున్నారు. విమానాశ్రయ సందర్శనకు వచ్చే విజిటర్లను భద్రత కారణాల దృష్ట్యా లోపలికి అనుమతించడం లేదు. టెర్మినల్లో ప్రయాణికులు, వారి లగేజీని పూర్తిస్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ పరిసరాల్లో పోలీస్ భద్రతను పెంచడంతో పాటు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. 13న ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక విజయవాడస్పోర్ట్స్: ఉమ్మడి కృష్ణా జిల్లా అండర్–16 బాలుర క్రికెట్ జట్టును ఈ నెల 13వ తేదీ విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఎంపిక చేస్తున్నట్లు కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.రవీంద్రచౌదరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2009 సెప్టెంబర్ ఒకటో తేదీ తర్వాత జన్మించిన వారు పోటీలకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆధార్, జనన ధ్రువీకరణ పత్రం, వైట్ డ్రస్, స్పోర్ట్స్ షూస్, సొంత కిట్తో ఆ రోజు ఉదయం ఏడు గంటలకు ఎంపిక ప్రాంగణంలో సంప్రదించాలని సూచించారు. జట్టుకు ఎంపిౖకైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. డ్రెస్ కోడ్ పాటించరే..! పెనుగంచిప్రోలు(జగ్గయ్యపేట): పెనుగంచి ప్రోలులోని తిరుపతమ్మ ఆలయ ఈఓ బి.హెచ్.వి.ఎస్.ఎన్.కిషోర్కుమార్ శనివారం డ్రెస్ కోడ్ పాటించకుండానే అమ్మవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణకు భిన్నంగా వన్థర్డ్ (షార్ట్), టీషర్టుతో అమ్మవారిని దర్శించుకోవడంతోపాటు ఆలయ పరిసరాలను సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఆలయ ఉద్యోగులు అందరూ తెల్లని సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంది. ఉద్యోగులందరికీ మార్గదర్శకంగా ఉండాల్సిన ఆలయ కార్య నిర్వాహణాధికారే డ్రెస్ కోడ్ పాటించకపోవడంపై భక్తులు అభ్యంతరం తెలుపుతున్నారు. -
బైక్ చోరీల ముఠా ఆటకట్టు
కంకిపాడు: కంకిపాడు పోలీసులు మోటారు బైక్ల చోరీ ముఠా ఆటకట్టించారు. ఈ కేసులో నలుగురి నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ మేరకు కంకిపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్రావు శనివారం కేసు వివరాలను వెల్లడించారు. గత నెల 25న గంగూరు గ్రామానికి చెందిన మహమ్మద్ జివుల్ రెహమాన్ ఈడుపుగల్లులోని మసీదు వద్ద నమాజ్ చేసుకునేందుకు తన స్నేహితుడి మోటారు బైక్పై వచ్చాడు. నమాజ్ చేసుకుని బయటకు వచ్చి చూసే సరికి బైక్ కనిపించలేదు. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం ఉదయం డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో సీఐ జె.మురళీకృష్ణ, ఎస్ఐ డి.సందీప్ కంకిపాడు పట్టణంలోని ఫ్లై ఓవర్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా యువకులు రెండు మోటారు బైక్లపై వెళ్తూ పట్టుబడ్డారు. వారి వాహనాలకు రికార్డులు లేకపోవటంతో గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ద్విచక్ర వాహనాలను చోరీ చేసే ముఠాగా గుర్తించారు. రూ.21.46 లక్షల విలువైన 50 బైక్ల రికవరీ కృష్ణాజిల్లాలోని కంకిపాడు, పెనమలూరు, పెడన, మచిలీపట్నం, గుడ్లవల్లేరు, ఎన్టీఆర్ జిల్లాలోని భవానీపురం, మాచవరం, విజయవాడ టూ టౌన్, గుంటూరు జిల్లా కొత్తపేట, మంగళగిరి టౌన్, ఏలూరు జిల్లాలోని ఏలూరు టూ టౌన్, బాపట్ల జిల్లాలోని రేపల్లె పోలీసుస్టేషన్లలో మొత్తం ఐదు జిల్లాల పరిధిలో 17 పోలీసుస్టేషన్లలో రూ.21.46 లక్షల విలువైన 50 ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు విచారణలో నేరం అంగీకరించారు. మచిలీపట్నం నిజాంపేటకు చెందిన మొహమ్మద్ రిజ్వాన్, కోడూరు మండలం గౌడపాలెంకు చెందిన కేశన సురేష్, ఉల్లిపాలెం గ్రామానికి చెందిన షేక్ ఇబ్రహీం, కోలా కృష్ణారావులను మోటారు బైక్ల చోరీ కేసులో నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. ముందుగానే చోరీ చేసేందుకు ఒక ప్రాంతాన్ని ఎంచుకుని సీసీ కెమెరాల్లో చిక్కకుండా ఉండేలా హెల్మెట్ ధరించి చోరీలకు పాల్పడటం ఈ ముఠా నైజమన్నారు. ఫంక్షన్ హాల్స్, దేవాలయాలు, చర్చిలు, మసీదులు, హాస్పిటల్స్ వద్ద పార్కు చేసి ఉన్న వాహనాలే వీరి లక్ష్యంగా పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు తెలిపారు. కేసు విచారణలో ప్రత్యేక చర్యలు తీసుకున్న సీఐ జె.మురళీకృష్ణ, ఎస్ఐ డి.సందీప్, హెచ్సీ కె.చంద్రబాబు, పీసీలు పీఎస్ఎన్ మూర్తి, ఎస్డి బాబీబాబులను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కంచికచర్ల: హైదరాబాద్ నుంచి విజయవాడకు బైక్పై వస్తుండగా శనివారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ బి.రాజు కథనం మేరకు విజయవాడ సున్నపు బట్టీల సెంటర్కు చెందిన మహ్మద్ రఫీ ఉజ్ జమాన్(45) అనే వ్యక్తి హైదరాబాద్లో జీహెచ్ఎంసీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అతని కుటుంబ సభ్యులు విజయవాడలో నివాసం ఉంటున్నారు. రఫీ పెద్ద కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుందని భార్య ఫోన్ చేసి చెప్పింది. దీంతో రఫీ హైదరాబాద్ నుంచి బైక్పై విజయవాడ బయలుదేరారు. కంచికచర్ల సమీపంలోకి రాగానే ఫ్లై ఓవర్పై గోడకు బైక్ తగిలి కిందపడ్డాడు. తలకు తీవ్రగాయాలవటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. రఫీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నందిగామ ప్రభుత్వాస్పపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
నరసింహస్వామికి వైభవంగా హనుమంతు సేవ
వేదాద్రి(జగ్గయ్యపేట): ప్రముఖ పుణ్యక్షేత్రం యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి తిరుక్కల్యాణ మహోత్సవాల్లో భాగంగా శనివారం హనుమంతు సేవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హనుమంతు వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తులను ఉంచి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. అర్చకులు శ్రీధరాచార్యులు, వాసుదేవాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో సురేష్బాబు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు స్వామి వారి కల్యాణం జరుగుతుండటంతో ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీక్షా స్వాముల ఇరుముడి సమర్పణ, అమ్మ, స్వామి వారి ఎదురుకోలోత్సవానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చిల్లకల్లు పోలీసులు ప్రత్యేక బందోబస్తు చేశారు. సీఎస్ఎస్ఎస్ఎన్రెడ్డికి డీఐఈఓగా ఉద్యోగోన్నతి పాయకాపురం(విజయవాడరూరల్): ఎన్టీఆర్ జిల్లా డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇన్చార్జిగా పని చేస్తున్న సీఎస్ఎస్ఎస్ఎన్ రెడ్డిని ప్రభుత్వం వైఎస్సార్ కడప జిల్లా డీఐఈఓగా ప్రమోషన్ ఇచ్చి బదిలీ చేసింది. ఆయన పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా, జిల్లా ఒకేషనల్ ఆఫీసర్గా పని చేశారు. ప్రస్తుతం ఆయన స్థానంలో ఏలూరు నుంచి బి.ప్రభాకర్ను ప్రభుత్వం ఎఫ్ఏసీగా నియమించింది. -
సైనికుల త్యాగాలు మరువలేనివి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. వీర జవాన్ మురళీనాయక్కు నివాళులర్పిస్తూ ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన స్వరాజ్య మైదానంలోని అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం (సామాజిక న్యాయ మహా శిల్పం) వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి.. మురళీనాయక్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కొవ్వొత్తుల ప్రదర్శన చేసి రెండు నిముషాలు మౌనం పాటించారు. వుయ్ స్టాండ్ విత్ ఇండియన్ ఆర్మీ, మురళీ నాయక్ అమర్ హై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ యుద్ధంలో మురళీనాయక్ మరణించాడన్న వార్త తెలిసిన వెంటనే మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారని, ఆయన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి ఓదార్చారన్నారు. ఈనెల 13న వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా మురళీనాయక్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదారుస్తారన్నారు. మాజీ మంత్రి విడదల రజనిపై పోలీసుల దాడి దుర్మార్గమన్నారు. రజనిపై పోలీసుల దాడి అమానుషం మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ బీసీ మహిళ, మాజీ మంత్రి విడదల రజనిపై పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషమన్నారు. సెంట్రల్ సమన్వయకర్త మల్లాది విష్ణు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుచర్యలకు పాల్పడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, కార్పొరేటర్లు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ● వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ● వీరజవాన్ మురళీనాయక్ కుటుంబానికి అండగా ఉంటాం -
సిటిజెన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ ప్రారంభం
లబ్బీపేట(విజయవాడతూర్పు): క్యాన్సర్పై అవగాహన పెంచుకోవడం ద్వారా తొలిదశలో గుర్తించి, పూర్తిగా నయం చేసేందుకు అవకాశం ఉంటుందని టెలికం రంగ దిగ్గజం ఎన్కే గోయల్ సూచించారు. క్యాన్సర్పై అవగాహన పెంచేందుకు స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. క్యాన్సర్పై అవగాహన పెంచడం, క్యాన్సర్ రోగులకు అండగా నిలిచేందుకు ఏర్పాటు చేసిన సిటిజెన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ను ఆయన శనివారం ఆవిష్కరించారు. విజయవాడ మహాత్మాగాంధీరోడ్డులోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో గోయల్ మాట్లాడుతూ.. ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో స్వచ్ఛంద సంస్థల కృషి ఎంతో కీలకమన్నారు. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ ఎన్.సుబ్బారావు మాట్లాడుతూ.. క్యాన్సర్ వ్యాధి బారినపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందన్నారు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోవడం ద్వారా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, నిర్ధారణ పరీక్షలు, అందుబాటులో ఉన్న చికిత్సలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వ్యాధిని జయించేందుకు అవసరమైన తోడ్పాటు అందించాలన్నారు. క్యాన్సర్ విముక్త భారత నిర్మాణానికి కృషి.. ఇండియన్ రేడియాలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్(ఐఆర్ఐఏ) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వేమూరి వరప్రసాద్ మాట్లాడుతూ.. క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే చికిత్స ప్రభావవంతంగా ఉంటుందన్నారు. అందుబాటులో ఉన్న అత్యాధునిక వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా క్యాన్సర్ విముక్త భారత నిర్మాణానికి సిటిజెన్ ఫోర్స్ కృషి చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సిటిజెన్ ఫోర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ పిన్నంశెట్టి రమేష్బాబు మాట్లాడుతూ.. క్యాన్సర్ రహిత సమాజ నిర్మాణం కోసం సిటిజెన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ పని చేస్తుందన్నారు. ఇండియన్ రేడియోలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.వి.మోహన్ ప్రసాద్, సినీ నటి చంద్రానీదాస్ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి విక్రేత మనోజ్పై పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ అమలు
సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): గంజాయి సరఫరా, పలు చోరీ కేసుల్లో నిందితుడైన నగరానికి చెందిన తుమ్మల మనోజ్పై నగర పోలీసులు పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ అమలు చేశారు. విజయవాడ నగరంతో పాటు పలు జిల్లాల్లోని విద్యాసంస్థల వద్ద గంజాయి విక్రయిస్తూ యువతను మత్తుకు బానిసలు చేయడమే లక్ష్యంగా పనులు నిర్వహించడం ఇతని నైజం. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఆర్పీ రోడ్డులో నివాసముండే తుమ్మల మనోజ్పై 2011లో తొలిసారిగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసు నమోదైంది. ఆ తరువాత 2012లో మరో కేసు నమోదు కాగా అప్పటి నుంచి వరుసగా గంజాయి విక్రయిస్తూ పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. సత్యనారాయణపురం, వన్టౌన్, కంచికచర్ల, నందిగామ, జగ్గయ్యపేట, భవానీపురం, కృష్ణలంక, పటమట, మాచవరం, పట్టాభిపురం, నూజివీడు టౌన్, విశాఖపట్నంలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో 28 సార్లు గంజాయి అమ్ముతూ పట్టుబడి అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లాడు. బెయిల్పై బయటకు వచ్చిన తరువాత కూడా తన నేర ప్రవృత్తిని కొనసాగించేవాడు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగ జేస్తున్నందున అతనిపై పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్–1988 అమలు చేస్తూ పోలీసుశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో నగర ఇన్చార్జి పోలీసు కమిషనర్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉత్తర్వుల మేరకు శనివారం పశ్చిమ ఏడీసీపీ జి.రామకృష్ణ పర్యవేక్షణలో నార్త్ ఏసీపీ స్రవంతి రాయ్ ఆధ్వర్యంలో సత్యనారాయణపురం ఇన్స్పెక్టర్ లక్ష్మినారాయణ సిబ్బందితో కలిసి మనోజ్ను అదుపులోనికి తీసుకున్నారు. న్యాయస్థానంలో హాజరుపర్చిన అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. -
విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన సురేష్ సాధారణ విద్యార్థి. పదో తరగతి పాస్ మార్కులతో గట్టెక్కాడు. గణితం, సైన్సు సబ్జెక్టులపై పట్టు లేదు. అయితే స్నేహితులు ఎంపీసీ, బైపీసీ తీసుకోవడంతో తాను గొప్పగా చెప్పుకోవడానికి ఎంపీసీని ఎంచుకున్నాడు. సబ్జెక్టులు కష్టం కా
బలవంతం చేయడం సరికాదు విద్యార్థులను సాధ్యమైనంత వరకూ వారికి నచ్చిన గ్రూపులోనే చేర్పించాలి. పదో తర్వాత ఇంటర్ మీడి యెట్ ప్రవేశంలో పిల్లల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. వారికి నచ్చిన కోర్సుల్లో చేరేందుకు సహకరించాలి. తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను చెప్పడం వరకే సరి పెట్టుకోవాలి. వారి అభిప్రాయాలను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయకూడదు. ఇరుగుపొరుగు పిల్లలతో పోల్చకూడదు. –డాక్టర్ డి. కై లాసరావు, విద్యావేత్త ● ఒత్తిడి పెట్టడంతో ఇబ్బందులే పిల్లల అభిప్రాయాలు తెలుసుకోకుండా చదవాలంటూ ఒత్తిడి పెట్టడితే ఇబ్బందులు తలెత్తుతాయి. పిల్లల సామర్థ్యాలను తెలుసుకోవాలి. –డాక్టర్ ప్రసాద్బాబు, సైకాలజిస్ట్, అసిస్టెంట్ రీజనల్ డైరెక్టర్, ఇగ్నో -
మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ నందు ఏపీ మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం ధర్నా జరిగింది. సమాన పనికి సమాన వేతనం, కార్మికులను పర్మినెంట్ చేయాలని నినాదాలు చేశారు. ధర్నాలో పాల్గొన్న యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.కోటేశ్వరరావు గౌడ్, గౌరవాధ్యక్షుడు గుంటుపల్లి శేషగిరిరావు మాట్లాడుతూ.. అత్యవసర విభాగాలైన నీటి సరఫరా, వీధి దీపాలు, డ్రెయినేజీ, పార్క్లు, మెకానిక్లు, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ అన్ని విభాగాల్లో పనిచేస్తున్న టెక్నికల్ సిబ్బందికి రూ.29,200లు, నాన్ టెక్నికల్ సిబ్బందికి రూ.24,500లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్ల సర్వీసు పైబడిన కార్మికులను క్రమబద్ధీకరించాలన్నారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి.. కార్మికులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆప్కాస్ను రద్దు చేస్తే కార్మికులందరిని పర్మినెంట్ చేయాలన్నారు. కార్మికుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు, ఇతర ఉద్యోగుల మాదిరిగా గ్రాట్యుటీ, కనీస పెన్షన్ రూ.10 వేలు ఇవ్వాలి, ఆదివారాలు, దేశ, జాతీయ పండుగలకు సెలవు దినాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో యూనియన్ సమన్వయ కార్యదర్శి బత్తుల శివశంకర్, నగర అధ్యక్షుడు పిట్టా మహేష్, కార్యదర్శి ఎండీ గౌస్, ఉపాధ్యక్షులు బుచ్చిబాబు, వి.జైపాల్, బి.నాగరాజు, నాయకులు సాంబశివరావు, విష్ణుప్రసాద్, శివాజీ, బి.విజయ్, ఎన్.దుర్గారావు పాల్గొన్నారు. కొంకేపూడి పవర్ ప్లాంట్, ఓఎన్జీసీల పరిశీలన పెడన: భారత్, పాక్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేయడంతో పెడన మండలంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలైన కొంకేపూడి పవర్ప్లాంట్, నందిగామ ఓఎన్జీసీ కార్యాలయాలను పెడన అధికారులు పరిశీలించారు. పెడన సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.నాగేంద్రబాబు, ఇన్చార్జి తహసీల్దార్ కె.అనిల్కుమార్లతో పాటు పెడన ఎస్ఐ జి.సత్యనారాయణ ఆయా ప్రాంతాల్లోని అధికారులు, సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. పవర్ప్లాంట్ పనులు ఇంకా ప్రారంభించలేదని అధికారులు పేర్కొనడంతో అయినా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే నందిగామ ఓఎన్జీసీ వద్ద నిఘా పెంచాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. -
జల్లు స్నానాలకూ అవకాశం లేదు !
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సార్ కృష్ణా నదిలో నీళ్లు అడుగు ఎత్తు కూడా లేవు.. కనీసం జల్లు స్నానాలు చేసేందుకు కూడా అవకాశం లేకుండా ఉందని పలువురు భక్తులు దుర్గాఘాట్లో పుణ్యస్నానాల గురించి ఈవో వీకే శీనానాయక్ ఎదుట ఏకరువు పెట్టారు. నదీ తీరంలో ఉన్నా తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకడం లేదు. కృష్ణమ్మ చెంతనే ఉన్నా భక్తులు నీళ్లు కొనుక్కొవాల్సి వస్తుందని మరో మహిళా భక్తురాలు ఆవేదన వ్యక్తం చేశారు. సార్ బట్టలు మార్చుకునేందుకు గదులు కట్టారు.. అందులో క్షణం కూడా ఉండలేని పరిస్థితి.. ఉక్కపోతతో అల్లాడుతున్నామని.. కనీసం గదులకు మరమ్మతులు చేయించాలని మరో భక్తురాలి విన్నపం... దుర్గగుడి ఈవో వీకే శీనానాయక్ దుర్గాఘాట్, కేశ ఖండనశాల, హెడ్ వాటర్ వర్క్స్ వద్ద కొండ ప్రాంతం, శివాలయం, యాగశాల, నూతన పూజా మండపాలు, జమ్మిదొడ్డిలోని దేవస్థాన భవనాలను శనివారం పరిశీలించారు. ఒకరిపై మరొకరు..! దుర్గాఘాట్కు చేరుకున్న ఈవో శీనానాయక్కు పుణ్యస్నానాలు ఆచరించేందుకు విచ్చేసిన భక్తులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. నదీలో నీటి మట్టం తగ్గినా జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేయలేదు సార్ అని వివరించగా, ఈవో దానిపై ఇంజినీరింగ్ అధికారులను ప్రశ్నించారు. అయితే షవర్లకు నీటిని పంపింగ్ చేసేందుకు విద్యుత్ సదుపాయం లేదని చెప్పారు. దీంతో ఎలక్ట్రికల్ విభాగం సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆలయ ఎలక్ట్రికల్ సిబ్బంది విద్యుత్ లైన్లను పరిశీలించగా, మోటార్లు పని చేయడం లేదని తేలింది. ఇదే విషయాన్ని ఈవో దృష్టికి తీసుకువెళ్లగా, అసలు వేసవి కాలం మొదలైన తర్వాత మోటార్లను తనిఖీ చేశారా అని ప్రశ్నించారు. మరో భక్తురాలు స్నానఘాట్లో తాగునీటి ఇబ్బంది గురించి ఫిర్యాదు చేశారు. నదీ తీరం పక్కనే ఉన్నా తాగేందుకు నీళ్లు అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈవో ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా స్నానఘాట్లో పూజా సామగ్రి విక్రయించే వారు అధిక ధరలకు విక్రయిస్తున్నారని గుర్తించారు. దుస్తులు మార్చుకునే గదులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. పూజా మండపం, యాగశాల పరిశీలన అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న పూజా మండపం, యాగశాలలను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఈవో శీనానాయక్ ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలోని నూతన నిర్మాణాలతో పాటు మరమ్మతులకు గురైన అర్చక క్వార్టర్స్, వాటర్ ట్యాంక్లను పరిశీలించారు. వాటర్ ట్యాంక్లను ఎప్పుడు శుభ్రం చేసింది వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. అనంతరం దుర్గాఘాట్కు ఎదురుగా ఉన్న కేశ ఖండన శాలను పరిశీలించి ప్రతి నిత్యం ఎంత మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తారు.. తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈవో వెంట ఈఈలు కోటేశ్వరరావు, వైకుంఠరావు, ఏఈలు కుటుంబరావు, మస్తాన్రావు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నదీ తీరం పక్కనే ఉన్నా తాగేందుకు నీళ్లు లేవు దుర్గాఘాట్లో సమస్యలపై ఈవోకు భక్తుల ఏకరువు దుస్తులు మార్చుకునే గదుల్లో మార్పులు చేయాలి