Krishna District News
-
ప్రకాశించాలని.. ప్రయాస!
ఉడికిన కొమ్ములను కల్లంలో ఆరబెట్టిన దృశ్యం పచ్చబంగారం(పసుపు) ఈ సారి ప్రకాశిస్తుందన్న ఆశతో రైతన్నలు ఉత్సాహంగా పనులు చేపడుతున్నారు. వాణిజ్య పంటల్లో ఒకటైన పసుపు పంటను కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఈ వ్యవసాయ సీజన్లో 5,031 ఎకరాల్లోనూ, ఎన్టీఆర్ జిల్లాలో 707 ఎకరాల్లోనూ సాగు చేశారు. కొద్ది రోజులుగా పసుపు ఆకుతీత, దుంప తీత పనులను రైతులు ముమ్మరంగా చేపడుతున్నారు. కల్లాల్లో పసుపు కొమ్ములను రాశులుగా పోసి వంట పనులు చేపడుతున్నారు. సహజంగా పసుపు కొమ్ములను బాండీల్లో పెట్టి ఉడికించి ఆరబెడుతుంటారు. ఈ దఫా అధికశాతం మంది బాయిలర్స్ను వినియోగిస్తున్నారు. ఆ తర్వాత ఎండబెట్టి పసుపు కొమ్ముల నాణ్యత పెంచే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. మంచి ధర వస్తే మార్కెట్కు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. – కంకిపాడు -
చెప్పుకోలేక.. కన్నీళ్లు దిగమింగలేక!
కన్నబిడ్డలు ఉన్నారో లేరో తెలియదు.. భారమై వదిలించుకున్నారో, తానే వాళ్లకు భారమనుకున్నాడో చెప్పుకోలేడు.. ముదిమి వయసులో మండుటెండలో జీవశ్చవమయ్యాడు. కాళ్లు కదపలేడు, కన్నీటిని ఆపుకోలేడు.. ఊరు పేరు తప్ప వివరాలకు ఉబికి వచ్చే కన్నీళ్లే సమాధానం. ఈ 70 ఏళ్ల శరీరం కర్నూలు నడిబొడ్డున, ప్రభుత్వాసుపత్రి ఎదుట మంగళవారం మధ్యాహ్నం దిక్కులు చూస్తూ.. దేవుడిపైనే భారం వేసింది. రోడ్డు మధ్యనున్న పచ్చని డివైడర్లో ఈ ‘పెద్దరికం’ మోడుబారి పడుకుంది. ఇతని పేరు సత్యనాగరాజు. ఊరు విజయవాడ తప్ప ఏమీ చెప్పలేని పరిస్థితి అతనిది. విషయం తెలుసుకున్న ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు చలించిపోయారు. ‘108’ని పంపి ఆయన్ను క్యాజ్వాలిటీలో అడ్మిట్ చేయించారు. –కర్నూలు(హాస్పిటల్) -
ప్లీజ్.. అడ్వాన్స్ ట్యాక్స్ కట్టండి!
వన్టౌన్(విజయవాడపశ్చిమ): బిజినెస్ లేక అల్లాడుతున్న వ్యాపారవర్గాలపై రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ‘అడ్వాన్స్ ట్యాక్స్ కట్టండి ప్లీజ్!’ అంటూ ఒత్తిడి తీసుకురావడం ఉమ్మడి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జీఎస్టీ విధానంలో అడ్వాన్స్ ట్యాక్స్ అనే పదానికి ఆస్కారం లేదు. ‘కూటమి’ అనధికారికంగా ఇలాంటి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొస్తోందంటూ వ్యాపారవర్గాలు మండిపడుతున్నాయి. వ్యాట్లో ఉన్న విధానాన్ని జీఎస్టీలో అమలు చేయాలనుకోవడం ఏంటని వ్యాపార సంఘాల నేతలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మౌఖిక ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుల్లో వాణిజ్య పన్నుల శాఖ ఒకటి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వాణిజ్య పన్నుల శాఖకు మూడు డివిజన్లలో సుమారు 20 సర్కిల్ కార్యాలయాలు ఉన్నాయి. వాటిల్లో ఆదాయం అధికంగా ఉన్న సర్కిల్ కార్యాలయాల్లో అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లుకు అధికారులు ఇటీవల మౌఖిక ఆదేశాలిచ్చారు. ‘కూటమి’ పాలనలో జీఎస్టీ తగ్గిన విషయం తెలిసిందే. ఆర్థిక సంవత్సరం చివర మాసం కావడంతో సాధ్యమైనంత మేర అధికంగా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. జీఎస్టీ పెరిగిందని చెప్పుకోవడానికి కూటమి ఇలాంటి ఎత్తుగడలకు దిగిందని వ్యాపార సంఘాల నేతలు చెబుతున్నారు. వ్యాపారాలు లేక జీఎస్టీ పడిపోతే లేని అమ్మకాలను ఎంత చూపించినా ప్రయోజనం ఏమిటంటూ వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ ఈ నెలలో అడ్వాన్స్ ట్యాక్స్ ద్వారా జీఎస్టీ పెంచినా వచ్చే నెల అది మళ్లీ భారీగా పడిపోతుంది కదా...? అంటూ ప్రశ్నిస్తున్నారు. ‘కూటమి’ తీరుతో దిగజారిన వ్యాపారాలు ‘కూటమి’ పాలక విధానాల నేపథ్యంలో ఉమ్మడి కృష్ణాలో వ్యాపారాలు పూర్తిగా దిగజారాయి. పశ్చిమ కృష్ణాలో నిర్మాణరంగానికి అవసరమైన సిమెంట్ ఇతర వస్తువుల అమ్మకాలతో పాటుగా తూర్పు కృష్ణాలో ఆటోమొబైల్ రంగంలోనూ అనుకున్న అమ్మకాలు వృద్ధి లేక రావాల్సిన పన్నులు గణనీయంగా పడిపోయాయి. ప్రభుత్వ తీరుతో ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడంతో వ్యాపారాలు బాగా తగ్గాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దీంతో వ్యాపారాలను కొనసాగించే పరిస్థితులు లేవంటూ వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఇలాంటి సమయంలో అడ్వాన్స్ ట్యాక్స్ కట్టండంటూ అధికారులు కోరటంపై వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతల నుంచి వ్యతిరేకత కూటమి పార్టీల్లో ఒకటైన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అడ్వాన్స్ ట్యాక్స్కు వ్యతిరేకంగా ఇటీవల రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు లేఖ రాశారు. జీఎస్టీలో అడ్వాన్స్ ట్యాక్స్ అనే నిబంధన లేదని కానీ దాన్ని అమలు చేయాలని చూడటం వ్యాపారులను ఇబ్బందికి గురి చేయటమేనని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. వ్యాపార వర్గాలకు అండగా ఉంటామని చెబుతున్న ప్రభుత్వ విధానానికి సైతం ఇది తూట్లు పొడుస్తుందని ఆయన ఆ లేఖలో చెప్పారు. జిల్లాలోని వ్యాపార వర్గాలు సైతం సీఎం రమేష్ రాసిన లేఖను ఉదహరిస్తూ ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నాయి. లేని నిబంధనలతో తిప్పలు వ్యాపారులపై జీఎస్టీ అధికారుల ఒత్తిడి ఆర్థిక సంవత్సరం ఆఖరు కావడంతో జీఎస్టీ పెంపునకు ఎత్తుగడ వ్యాపారాలు తగ్గలేదని చెప్పుకోవడానికి ‘కూటమి’ తంటాలు ఒకవైపు ప్రభుత్వ తీరుతో జీఎస్టీ పడిపోతుంటే ఆదాయం పెంచాలంటూ ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు జిల్లా అధికారులపై తీవ్ర ఒత్తిడిపెడుతున్నారు. జీఎస్టీ పన్నుల విధానంలో అడ్వాన్స్ ట్యాక్స్ అనే నిబంధన లేదు. రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల ఇప్పటికి వ్యాట్ అమలవుతోంది. దీంతో ప్రభుత్వ పెద్దలు మిగిలిన జిల్లాల్లో జీఎస్టీ విధానంలోనూ అమలు చేసి ఈ నెలలో భారీగా ఆదాయాన్ని పెంచాలంటూ ఒత్తిడి తీసుకువస్తోంది. అధికారులపై తీవ్రమైన ఒత్తిడి పెట్టడంతో వారు కూడా ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నారు. రిటర్నులు వేయమంటున్నాం అడ్వాన్స్ ట్యాక్స్ కాదు అడ్వాన్స్గా రిటర్నులు వేయమంటున్నాం. మేం ఎక్కడా అధికారికంగా అడ్వాన్స్ ట్యాక్స్పై మాట్లాడటం లేదు. ఈ నెలలో జరిగే వ్యాపారానికి సంబంధించి వ్యాపారులు వచ్చే నెల 11వ తేదీ లోపు అమ్మకాలను ఫైనల్ చేసి, 20వ తేదీ లోపు దానిని ఖరారు చేసి ట్యాక్స్ కడుతుంటారు. ఆర్థిక సంవత్సరం చివర కావటంతో ఈ నెలలోనే రిటర్నులను 31వ తేదీలోపు వేయమంటు న్నాం. అంతేగానీ ఏ వ్యాపారికి అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలని నోటీసులు ఇవ్వలేదు. –షేక్ జహీర్, డెప్యూటీ కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖ, విజయవాడ డివిజన్–1 -
గోఆధారిత వ్యవసాయం మేలు
పెనుగంచిప్రోలు: గోఆధారిత వ్యవసాయం ఎంతో మేలని రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ అథారిటీ చైర్మన్ శావల దేవదత్ అన్నారు. స్థానిక రాధాకృష్ణ కల్యాణ మండపంలో మంగళవారం గోఆధారిత వ్యవసాయంపై అవగాహన సదస్సు, అనంతరం వ్యవసాయ రంగంలో వినూత్న రీతిలో పంట ఉత్పత్తులను సాగిస్తున్న 108 మంది ఆదర్శ రైతులను ఉగాది పురస్కారాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. ఆరోగ్యం కావాలంటే ఇది చేయాలి.. మాజీ మంత్రి నెట్టెం రఘురాం మాట్లాడుతూ భూమి ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యకరమైన ఉత్పత్తులు తిని మనమంతా ఆరోగ్యంగా ఉంటామన్నారు. దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే రసాయన రహిత వ్యవసాయం చేయాలన్నారు. దక్షిణ రాష్ట్రాల సేంద్రియ వ్యవసాయ నిపుణులు టి. నాగరాజు మాట్లాడుతూ ఆవు పేడ, మూత్రం తప్ప భూమికి లాభం చేకూర్చేవి ఏమీ లేవన్నారు. ఆవు పేడ, మూత్రంతో జీవామృతం, కషాయాలు తయారు చేసుకుని ఆరోగ్యకర వ్యవసాయం చేసుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ జగ్గయ్యపేట ఏడీఏ సి.భవానీ, జెడ్పీటీసీ సభ్యురాలు వూట్ల నాగమణి, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి బాలాజీ, రైతునేస్తం యడ్లపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. సదస్సు సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు సేంద్రియ, గోఆధారిత ఉత్పత్తులపై స్టాల్స్ ఏర్పాటు చేశారు. సదస్సులో పాల్గొన్న వారి అభిప్రాయాలు వారి మాటల్లో.. రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ అథారిటీ చైర్మన్ శావల దేవదత్ 108 మంది ఆదర్శ రైతులకు ఉగాది పురస్కారాలు -
సర్కారుతో ఢీఎస్సీ!
కదం తొక్కిన నిరుద్యోగులు అవనిగడ్డ: మెగా డీఎస్సీని వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగులు రోడ్డెక్కారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని నినదించారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ వంతెన సెంటర్లో మంగళవారం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో వందలాది మంది అభ్యర్థులు రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. దీంతో కిలో మీటర్ మేర ట్రాఫిక్ స్తంభించింది. కూటమి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. భారీ ర్యాలీ.. ధర్నా.. అవనిగడ్డ గ్రంథాలయం నుంచి వంతెన సెంటర్ వరకూ భారీ ర్యాలీ చేశారు. అనంతరం వంతెన సెంటర్లో ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. మానవహారం నిర్వహించారు. ‘సీఎం చేసిన మొదటి సంతకాన్ని అమలు చేయాలి, ప్రభుత్వం ఆమోదించిన 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయాలి, పది లక్షల మంది డీఎస్సీ నిరుద్యోగులకు న్యాయం చేయాలి, తొలి సంతకం చేసిన డీఎస్సీ ఎక్కడ?, చంద్రన్నా.. మెగా డీఎస్సీ ఏదన్నా, జీవో 117ని రద్దు చేయాలి, ప్రశ్నించే పవన్కల్యాణ్ ఎక్కడ?’ అంటూ నినాదాలు చేశారు. పలు డిమాండ్లతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రశ్నిస్తానన్న పవన్కల్యాణ్ ఎక్కడ? ఎన్నికల ముందు సభలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ఇస్తామని, లేదంటే అభ్యర్థుల తరఫున తానే ప్రశ్నిస్తానని చెప్పిన డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్కడ? అని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి. రామన్న ప్రశ్నించారు. డీఎస్సీ ఇవ్వక పోవడం వల్ల లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర మనోవేదన పడుతున్నారని, ప్రశ్నించడానికే పుట్టానని చెప్పుకునే పవన్కల్యాణ్ నోరు ఎందుకు మూగబోయిందో చెప్పాలన్నారు. యువతను తప్పుదోవ పట్టించేలా మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ నీచమైన రాజకీయాలకు పవన్కల్యాణ్ తెరతీశారని విమర్శించారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు, జేఏసీ నాయకులు, డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు. అవనిగడ్డలో రహదారిపై అభ్యర్థుల బైఠాయింపు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా హోరెత్తిన నినాదాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ -
కృష్ణాజిల్లా
బుధవారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2025 ఇఫ్తార్ సహరి (బుధ) (గురు) మచిలీపట్నం 6.23 4.47 విజయవాడ 6.24 4.49 నిందితులు అరెస్టు రైలులో బ్యాగు చోరీ కేసులో జీఆర్పీ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.15.62 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం జగ్గయ్యపేటలోని తొర్రకుంటపాలెం తిరుమలగిరి రోడ్డులోని సాయి తిరుమల అగ్రి ప్రొడక్ట్ లిమిటెడ్ (కోల్డ్ స్టోరేజ్)లో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. –IIలోu అవనిగడ్డ వంతెన సెంటర్లో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్న డీఎస్సీ అభ్యర్థులు డీసీఎం పవన్ ఏమీ మాట్లాడటం లేదు.. Iన్యూస్రీల్మొదటి సంతకానికే దిక్కులేదు.. డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై. రాము మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీపై చేసిన మొదటి సంతకానికే దిక్కులేదని విమర్శించారు. ఇదిగో డీఎస్సీ, అదిగో డీఎస్సీ అంటూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారన్నారు. మొదటి సంతకానికే భరోసా లేకపోతే ఎవరిని ఆడగాలో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. డీఎస్సీ కోసం నిరుద్యోగులు కుటుంబ సభ్యులను వదిలి అప్పులు చేసి కోచింగ్ సెంటర్ల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే డీఎస్సీ విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
బంగారం చోరీ కేసులో నిందితుల అరెస్టు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలులో బంగారు ఆభరణాల బ్యాగు చోరీ కేసులో జీఆర్పీ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.15.62 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం విజయవాడ రైల్వేస్టేషన్లోని జీఆర్పీ పోలీస్స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సీఐ జి.వి రమణ, ఆర్పీఎఫ్ సీఐ ఫలే ఆలీబేగ్ వివరాలను వెల్లడించారు. తెలంగాణలోని రాజాంపేటకు చెందిన గుడిమెట్ల భానుప్రియ ఈ నెల 13న కుటుంబసభ్యులతో సామర్లకోటకు గౌతమి ఎక్స్ప్రెస్ రైలులో బయలుదేరారు. ఆమె బ్యాగులో ల్యాప్టాప్, బంగారు ఆభరణాలు, సెల్ఫోన్ను ఉంచి దాన్ని తలకింద పెట్టుకుని నిద్రపోయింది. విజయవాడ దాటిన తర్వాత చూసుకుంటే బ్యాగు కనిపించలేదు. టీటీఈలకు ఫిర్యాదు చేసి ఆమె తన ప్రయాణాన్ని కొనసాగించింది. తిరిగి ఈ నెల 16న విజయవాడ జీఆర్పీ స్టేషన్కు చేరుకుని తన బ్యాగును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు ఫిర్యాదు చేసింది. 95 గ్రాముల చైను, 44 గ్రాముల నెక్లెస్, 18 గ్రాముల నెక్లెస్, 18 గ్రాముల రెండు జతల చెవి రింగులు, 42 గ్రాముల నల్లపూసల గొలుసు, 24 గ్రాముల వెండి భరణితో పాటు ల్యాప్టాప్, ఒక సెల్ఫోన్ బ్యాగులో ఉన్నట్లు వాటి విలువ సుమారు రూ. 15.65 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు ప్రత్యేక బృందాలుగా.. కేసు నమోదు చేసిన పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను గుర్తించారు. వారిలో ఖమ్మంజిల్లా బోనకల్లు మండలానికి చెందిన పుచ్చకాయల నరేష్ (25), షేక్ హైమద్(25)ను గుర్తించారు. నిందితులు హైదరాబాద్లోని కేజీహెచ్బీ కాలనీలోని రాఘవేంద్ర మెన్స్ హాస్టల్లో ఉన్నట్లు తెలుసుకుని వారిని పట్టుకున్నారు. వారిని విచారణ చేయగా చోరి చేసినట్లు అంగీకరించారు. వారి వద్ద కొంత బంగారం, ల్యాప్ట్యాప్ లభ్యమవ్వగా, కొంత బంగారాన్ని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో తనఖా పెట్టినట్లు తెలపడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. సెల్ఫోన్ మినహా మొత్తం రికవరీ చేశారు. వీరిపై గతంలో కేసులున్నాయి. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రూ.15.62 లక్షల ఆభరణాలు స్వాధీనం -
కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం
జగ్గయ్యపేట: ధర లేదని కోల్డ్ స్టోరీజ్లో నిల్వ చేసుకున్న తమ కష్టమంతా అగ్నికి ఆహుతైందని మిర్చి రైతులు లబోదిబోమంటున్నారు. జగ్గయ్యపేటలో సోమవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మిర్చి కాలి బూడిదైంది. పట్టణంలోని తొర్రకుంటపాలెం తిరుమలగిరి రోడ్డులోని సాయి తిరుమల అగ్రి ప్రొడక్ట్ లిమిటెడ్ (కోల్డ్ స్టోరేజ్)లో ఏడాదిగా సుమారు 350 మంది రైతులు 35 వేల మిర్చి బస్తాలను నిల్వ చేశారు. సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో స్టోరేజ్ ప్రాంతంలో పొగతో కూడిన మిర్చి ఘాటు రావడంతో స్థానికులు ఫైర్, పోలీసులకు సమాచారం ఇచ్చారు. విజయవాడ, నందిగామ, జగ్గయ్యపేట, సిమెంట్ కర్మాగారాల నుంచి వచ్చిన ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కోల్డ్ స్టోరేజ్ గోడలను జేసీబీలతో పగలగొట్టి మంటలను అదుపు చేయడానికి యత్నించారు. రూ.5 కోట్ల నష్టం జిల్లా ఫైర్ అధికారి శ్రీనివాసరావు, ఏపీ ఫైర్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమీపంలోని కర్మాగారం నుంచి సీవో2ను తీసుకువచ్చి ప్రత్యేక పైప్లైన్తో ఏర్పాటు చేయడంతో మంటలు కొంత మేర అదుపులోకి వచ్చాయి. స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రమాదంలో రూ. 5 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నందిగామ ఆర్డీవో బాలకృష్ణ మాట్లాడుతూ నిల్వ చేసిన రైతుల పేర్లను అందిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయడానికి చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులకు సూచించారు. మంగళవారం సాయంత్రం వరకు దట్టమైన పొగ, మిర్చి ఘాటుతో సమీప గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ కారణంతో సమీపంలోని పాఠశాలలకు మంగళవారం సెలవు ప్రకటించారు. 35 వేల మిర్చి బస్తాలు బుగ్గి జగ్గయ్యపేట తొర్రకుంటపాలెంలో ఘటన -
స్విమ్మింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం
విజయవాడస్పోర్ట్స్: ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ ఆక్వాటిక్ అసోసియేషన్ (ఏపీఏ ఏఏ) రాష్ట్ర నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా ఎం. ఓబుల్ రెడ్డి, ఎం. మోహనవెంకటరామ్ ఎన్నికయ్యారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్ లో రాష్ట్ర సంఘం ఎన్నికలు జరిగాయి. సంఘ చైర్మన్గా డాక్టర్ కె. రవికాంత్, గౌరవాధ్యక్షుడిగా పి.గోవిందరాజు, ఉపాధ్యక్షుడిగా రవి శంకర్ రెడ్డి, ప్రసాద్, శ్రీనివాసరావు, మధు, భాస్కర్, సతీష్, సహాయ కార్యదర్శులుగా మల్లికార్జునరావు, వినోద్, శ్రీధర్, సుబ్బారెడ్డి, నటరాజరావు, కోశాధికారిగా ఐ. రమేష్, కార్యవర్గ సభ్యులుగా కాజ మొహిద్దిన్, నాగ మురళి, దేవుడు, శంకర్ రెడ్డి, మేఘన లను సభ్యులు ఎన్నుకున్నారు. 2028 వరకు వీరంతా సంఘ ప్రతినిధులుగా కొనసాగుతారు. జూడో రాష్ట్ర జట్లు ఎంపిక విజయవాడస్పోర్ట్స్: జాతీయ జూనియర్ జూడో క్రీడా పోటీలకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర జట్లను ఎంపిక చేసినట్టు ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ సీఈవో వెంకట్ నామిశెట్టి తెలిపారు. ఇటీవల నిర్వహించిన రాష్ట్ర జట్టు ఎంపిక పోటీల్లో అత్యుత్తమ క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన క్రీడాకారులను ఎంపిక చేశామన్నారు. బాలుర జట్టుకు తేజకుమార్, తిరుమల, దిలీప్ కుమార్ రెడ్డి, ఉదయ్ కిరణ్, గోవర్ధన్, గగన్ సాయి, శివ సాయి, రంగస్వామి, బాలికల జట్టుకు ప్రవల్లిక, లక్ష్యా రెడ్డి, వైష్ణవి, అలేఖ్య, కీర్తన, భావన, రిషిత కృష్ణ, కోటేశ్వరి ఎంపికై నట్లు తెలిపారు. ఈ నెల 28 నుంచి ఉత్తరా ఖండ్లోని డెహ్రాడూన్లో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. జట్టుకు ఎంపికై న క్రీడాకారులను ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ రవినాయుడు, ఆంధ్రప్రదేశ్ జూడో సంఘం అధ్యక్షుడు గణేష్ సుబ్బారావు, సంయుక్త కార్యదర్శి గమిడి శ్రీనివాస్, ఉషారాణి, కోచ్ తేజ, శ్రీను శాప్ కార్యాలయంలో మంగళవారం అభినందించారు. మధ్యకట్టకు మరమ్మతులు ప్రారంభం మధురానగర్(విజయవాడసెంట్రల్): ఎట్టకేలకు నగరపాలకసంస్థ అధికారులు బుడమేరు మధ్యకట్టలో బుడమేరుకు పడిన గండికి మరమ్మతులు ప్రారంభించారు. బుడమేరు వరదల సమయంలో బుడమేరు మధ్యకట్టలో గండి పడింది. బుడమేరులో వరదప్రవాహం గండి ద్వారా ఏలూరు కాలువలోకి ప్రవహించింది. దీంతో రోడ్డు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉద్ధృతి తగ్గిన తరువాత తూతూ మంత్రంగా బుడమేరులోని మురుగునీరు ఏలూరు కాలువలోకి రాకుండా కొద్దిపాటి మట్టిని వేసి వదలేశారు. దీంతో అప్పటి నుంచి ఇక్కడ రాకపోకలు నిలిచిపోవటంతో స్థానికులు పడుతున్న అవస్థలు వివరిస్తూ ‘సాక్షి’ పలుమార్లు కథనాలు ప్రచురించింది. దీనిపై స్పందించిన అధికారులు ఎట్టకేలకు మరమ్మతు పనులు ప్రారంభించారు. 27న ఉప సర్పంచ్ ఎన్నికలు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలలో ఈనెల 27న ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి లావణ్య కుమారి ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో జి. కొండూరు మండలం కట్టుబడిపాలెం గ్రామ పంచాయతీ, వత్సవాయి మండలం మంగొల్లు, ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం, విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. పంచాయతీల ప్రిసైడింగ్, అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారి హాజరై ఓరియంటేషన్ కార్యక్రమంలో సూచనలు, సలహాలు ఇచ్చారన్నారు. కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి జీఎల్ఎల్వీఎన్ రాఘవన్ పాల్గొని ఓరియంటేషన్ను విజయవంతం చేశారన్నారు. -
హిజ్రా ప్రోద్బలంతోనే హత్య.. ప్రియుడే హంతకుడు
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా తాడేపల్లి రూరల్ కొలనుకొండ డీజీపీ కార్యాలయం సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన లక్ష్మీతిరుపతమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్టు చేసి గుట్టుచప్పుడు కాకుండా కోర్టులో మంగళవారం హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయన కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన హిజ్రా బత్తుల శశి అలియాస్ జెస్సీ ఏడాది క్రితం కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన లక్ష్మీ తిరుపతమ్మ(32)ను వ్యభిచార వృత్తిలోకి దించింది. కొలనుకొండ వద్ద ఆమెతో వ్యభిచారం చేయిస్తోంది. ఈ క్రమంలో స్థానికంగా ఉండే ముత్యాల కోమల్ కుమార్ (చింటూ) తిరుపతమ్మకు పరిచయమయ్యాడు. వీరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరూ ఒకే గదిలో కొంతకాలం సహజీవనం చేశారు. ఈ క్రమంలో బత్తుల శశి అలియాస్ జెస్సీ (హిజ్రా) భర్త నవీన్తోనూ లక్ష్మీతిరుపతమ్మ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడు చింటూను దూరంగా ఉంచుతోంది. దీనిని మనస్సులో పెట్టుకున్న జెస్సీ లక్ష్మీతిరుపతమ్మపై కోపంతో రగిలిపోయింది. చింటూను ఉసిగొల్పి తిరుపతమ్మను హత్య చేయించింది. హత్య జరిగిన 24 గంటల వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపర్చినట్లు డీఎస్పీ ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్పీ సతీష్కుమార్ ఆదేశాల మేరకు తాడేపల్లి సీఐ కల్యాణ్ రాజు, సిబ్బంది కేసును ఛేదించినట్టు వివరించారు. లక్ష్మీతిరుపతమ్మ హత్య కేసు ఛేదించినట్టు పోలీసుల ప్రకటన -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
కొండాయపాలెం(పామర్రు): పామర్రు–దిగమర్రు జాతీయ రహదారిలో కొండాయ పాలెం వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెదమద్దాలి శివారు కొండాయపాలెం గ్రామం వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వస్తున్న మరో లారీ ఢీకొట్టింది. ఢీ కొట్టిన లారీ క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న పామర్రు ఎస్ఐ రాజేంద్రప్రసాద్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మరో లారీకి తాళ్లు కట్టి క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను బయటకు లాగి ప్రాణాలు కాపాడారు. లారీడ్రైవర్ కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు మలుపులో లారీ ఆగి ఉండటంతో వేగం వస్తున్న లారీ డ్రైవర్ చూడక ఢీకొట్టాడని తెలుస్తోంది. లారీ డ్రైవర్ తోట్లవల్లూరు మండలం కళాసుమాలపల్లికి చెందిన గుంజ శ్రీనివాసరావుగా గుర్తించారు. బాధితుడిని మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. లారీ ఢీ.. వృద్ధుడి మృతి పాయకాపురం(విజయవాడరూరల్): నున్న పీఎస్ సమీపంలో ప్రకాష్నగర్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న టి.పైడిరాజు (65)ను లారీ ఢీ కొనగా ఘటనా స్థలిలోనే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇందిరానాయక్నగర్కు చెందిన తాలాడి పైడిరాజు పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. చేపల మార్కెట్ వద్ద చేపలు కొనుగోలు చేసి వాటిని బాగు చేయించడానికి ప్రకాష్నగర్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన లారీ.. అతన్ని ఢీకొట్టింది. రోడ్డుపై పడిపోయిన పైడిరాజు తలపై లారీ ఎక్కడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతుని కుమారుడు టి.శ్రీను ఫిర్యాదుపై పోలీసులు కేసు నమాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కారు ఢీకొని వ్యకి దుర్మరణంచౌటుప్పల్ రూరల్: రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీ కొనడంతో మృతి చెందాడు. ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామ స్టేజీ వద్ద మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్లపెనుమర్రు గ్రామానికి చెందిన గొరిపర్తి నాగేశ్వరరావు(52) 30 ఏళ్ల క్రితం కుటుంబంతో కలిసి చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామానికి వలస వచ్చి స్థానికంగా ఓ కెమికల్ పరిశ్రమలో క్యాంటిన్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బిజినెస్లో నష్టం రావడంతో ప్రస్తుతం అంకిరెడ్డిగూడెం గ్రామ స్టేజీ వద్ద ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. రోజుమాదిరిగా శనివారం హోటల్లో పనిచేయడానికి వెళ్లిన నాగేశ్వరరావు ఉదయం 11గంటలకు ఇంటికి వెళ్లడానికి విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి దాటుతుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావు ఘటనా స్థలిలోనే మరణించాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె వివాహమైంది. భార్య, కొడుకు కూడా హోటల్లోనే పని చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు గొరిపర్తి కృష్ణ ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ చెన్నబోయిన సతీష్పై కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మఽథకుమార్ తెలిపారు. -
చేనేత వస్త్రాలను ఆదరించాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత అన్నారు. ఎంజీ రోడ్డులోని శేషసాయి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలను మంగళవారం ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత వస్త్రాల అమ్మకాలకు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఉగాది నేపథ్యంలో విజయవాడలో నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర చేనేత, జౌళిశాఖ కమిషనర్ రేఖారాణి, జాయింట్ డైరెక్టర్ కన్నబాబు, ఆప్కో జీఎం రాజారావు తదితరులు పాల్గొన్నారు. దారి దోపిడీ కేసులో నిందితులకు కఠిన కారాగార శిక్ష గన్నవరం: దారి దోపిడీ కేసులో ముగ్గురు నిందితులు ఒక్కొక్కరికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ గన్నవరం 8వ అదనపు ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపిన సమాచారం మేరకు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి చెందిన ఓ వైద్యుడు వద్ద మొగల్రాజపురానికి చెందిన కుక్కల వెంకటేశ్వర్లు కారు డ్రైవర్. గతేడాది ఆగస్టు 26వ తేదీ రాత్రి ఆయన మరదలు వరసైన కొమ్ము శిరోమణితో కలిసి వెంకటేశ్వర్లు బైక్పై ముస్తాబాద వైపు బయలుదేరాడు. మార్గమధ్యంలో రిలయన్స్ గోడౌన్ వద్ద ముగ్గురు వ్యక్తులు వీరి బైక్ను అడ్డుకున్నారు. వీరి వద్ద బంగారు చైన్, ఉంగరంతో పాటు చెవి దిద్దులు, కీప్యాడ్ ఫోన్ను లాక్కుని దుండగులు పరారయ్యారు. ఘటనపై వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చోరీకి పాల్పడిన విజయవాడలోని జక్కంపూడికి చెందిన పాలపర్తి వెంకన్న, నల్లగొండ సురేష్, కుమ్మరిపాలెంకు చెందిన నక్కా గోపిరాజును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసులో నిందితులపై నేరం రుజువు కావడంతో కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ 8వ అదనపు ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెల్లడించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో నెల రోజుల జైలుశిక్ష అమలు చేయాలని తీర్పులో పేర్కొన్నారు. కేసులో గన్నవరం సీఐ బీవీ. శివప్రసాద్ నేతృత్వంలో సాక్షులను ప్రవేశపెట్టగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి. మాధవి వాదనలు వినిపించారు. ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ పనులు పూర్తిరైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024–25లో విజయవాడ రైల్వే డివిజన్ 206.29 ఆర్కేఎం (రూట్ కిలోమీటర్లు) ఆటోమెటిక్ బ్లాక్ సిగ్నలింగ్ (ఏబీఎస్)ను విజయవంతంగా పూర్తిచేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. డివిజన్లోనే కీలకమైన సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, రావికంపాడు సెక్షన్లో ఈ నెల 23న 29.67 ఆర్కేఎం ఏడీఎస్ను విజయవంతంగా పూర్తిచేయడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డివిజన్ 206.29 ఆర్కేఎం సాధించినట్లైంది. దీంతో విజయవాడ–విశాఖపట్నం, విజయవాడ– గూడూరు సెక్షన్న్లలో రద్దీ తగ్గుతుంది. ఏబీఎస్ అనేది రైల్వే నిర్వహణ సామర్థ్యాన్ని పెంచు తుంది. ఈ సందర్భంగా డీఆర్ఎం నరేంద్ర అధికారులు, సిబ్బందిని ప్రశంసించారు. -
ఆపద వేళ స్వీయరక్షణ అవసరం
అవగాహన సదస్సులో అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు కోనేరుసెంటర్: మహిళల రక్షణకు అనేక చట్టాలు అమలులో ఉన్నాయని, వాటన్నింటిపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పోలీసు పరేడ్గ్రౌండ్లోని స్పందన హాలులో ‘మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలు– నియంత్రణ’పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న అడిషనల్ ఎస్పీ నాయుడు మాట్లాడుతూ మహిళలు ఆపదలో ఉన్నపుడు పోలీసులను గుర్తు తెచ్చుకోవటం ఎంత అవసరమో.. తనను తాను రక్షించుకునే మార్గాలను అన్వేషించటం కూడా అంతే అవసరమన్నారు. అవసరమైతే ఆ సమయంలో ఆడవాళ్లు ఆదిపరాశక్తిగా మారి తనను తాను ఒక ఆయుధంలా మార్చుకునేందుకు ప్రయత్నించాలన్నారు. అలాగే సామాజిక మాధ్యమాలు అనేవి సమాచార సేకరణకు, భావవ్యక్తీకరణకు ఉపయోగించుకోవాలన్నారు. తమ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసే సమయంలో గోప్యతను పాటించాలన్నారు. ప్రమాదకర పరిస్థితులు ఎదురైనపుడు హెల్ప్ లైన్ నంబర్లు 181, 121, 1098లకు ఫోన్ చేసి పోలీసుల నుంచి తక్షణ రక్షణను పొందవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఫోన్లలో శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకుని పోలీసు సేవలను పొందాలని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. అనంతరం పలువురు అధికారులు చట్టాలు, రక్షణ, పోలీసు చర్యలు, స్వీయరక్షణ తదితర విషయాలను వివరించారు. కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సీఐ వాస వెంకటేశ్వరరావు, సీడబ్ల్యూసీ చైర్మన్ కె.సువార, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్. రాణి, సీడీపీవో మౌనిష, వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అర్చిష్మ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ సబ్ప్లాన్కు రూ. 340 కోట్లు
చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల సంక్షేమం కోసం ఎస్సీ సబ్ప్లాన్ ద్వారా రూ. 340 కోట్లు బడ్జెట్లో కేటాయించిందని రాష్ట్ర మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయానికి ఆమె విచ్చేశారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్రామ్ చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కార్యాలయ అధికారులు, సిబ్బందితో సమావేశమై ఎస్సీ కార్పొరేషన్ కార్యక్రమాల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీదేవి మాట్లాడుతూ ఏప్రిల్ మొదటివారం నుంచి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వివిధ పథకాలను ప్రకటిస్తామన్నారు. ఉపాధి పథకం ద్వారా రూ. 10 లక్షలతో స్విఫ్ట్ డిజైర్ కార్లను నిరుద్యోగ యువకులకు అందజేయాలని ప్రతిపాదించామన్నారు. అలాగే రాష్ట్రంలో 4 వేల ఆటోలను మంజూరు చేయనున్నట్లు వివరించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం లక్ష, రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 వేలు, లబ్ధిదారులకు సబ్సిడీగా అందజేస్తామన్నారు. లబ్ధిదారులు కేవలం రూ. 15 వేలు డౌన్ పేమెంట్గా కడితే మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణం అంద జేస్తుందన్నారు. రూ. 25 లక్షల వ్యయంతో విద్యుత్ వాహనాల చార్జింగ్ పాయింట్లు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి పట్టణాల్లో ఏర్పాటు చేసేలా లబ్ధిదారులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఇన్చార్జ్ షేక్ షాహెద్బాబు, డైరెక్టర్ వాసం మునయ్య పలువురు ఎస్సీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి -
ఆరోగ్యం దెబ్బతింటుంది..
అధికారంలోకి రావడం కోసం ఎన్నో హామీలు ఇచ్చారు. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. పవన్కల్యాణ్ అవనిగడ్డ వచ్చినపుడు ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక డీఎస్సీ గురించి అస్సలు మాట్లాడటం లేదు. మా పక్షాన డీసీఎం గళం విప్పాలి. – కె.సూర్య, పశ్చిమగోదావరి కుటుంబ సభ్యులను వదిలి వచ్చి కోచింగ్లు అంటూ సంవత్సరాలు తరబడి అవనిగడ్డలో ఉంటున్నాం. అప్పులు చేసి మరీ ఇక్కడ ఉండాల్సి వస్తోంది. దీనివల్ల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. డీఎస్సీ ఇస్తామని చెబితే నమ్మి ఓట్లేశాం. ఇప్పటికై నా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. లేకుంటే రానున్న రోజుల్లో మరింత తీవ్రంగా పోరాటాలు చేస్తాం. – భాస్కరరెడ్డి, అనంతపురం -
ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడిగా కేశవరావు బాబు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యులుగా విజయవాడకు చెందిన డాక్టర్ సూర్యదేవర కేశవరావు బాబు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ కార్యవర్గాన్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ కేశవరావు బాబు మధుమేహం, రక్తపోటుపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు తెలుగులో రచనలు చేసి, వైద్య పరిశోధనల్లోనూ తనదైన ముద్ర వేశారు. నగరంలో ఓడీఏ ప్రాజెక్టు వైద్యాధికారిగా, పట్టణ ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్గా, వీఎంసీ స్కూల్ హెల్త్ ఆఫీసర్గా సేవలు అందించారు. ఐఎంఏ నగర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యులుగా నియమితులవడంతో పలువురు అభినందనలు తెలిపారు. ఖో–ఖో టోర్నీలో సత్తా గుడివాడ టౌన్: ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఖో–ఖో టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ పురుషుల టీమ్ బ్రాంజ్ మెడల్ సాధించినట్లు టీమ్ కోచ్ అండ్ మేనేజర్ మడకా ప్రసాద్ సోమవారం తెలిపారు. ఈనెల 21 నుంచి 24 వరకు ఢిల్లీలోని వినయ్ మార్గ్ స్పోర్ట్స్ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో గుడివాడ పట్టణానికి చెందిన క్రీడాకారుడు, తన శిష్యుడు ధనాల రాజ్కుమార్ పాల్గొని అత్యంత ప్రతిభను ప్రదర్శించారన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగి అయిన రాజ్కుమార్ ప్రస్తుతం డెప్యూటేషన్పై మునిసిపల్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా రాజ్కుమార్ను ఆంధ్రప్రదేశ్ ఖో–ఖో సంఘం కార్యదర్శి ఎం. సీతారామిరెడ్డి, కృష్ణాజిల్లా కార్యదర్శి ఎం. సత్యప్రసాద్, గుడివాడ, నూజివీడు మునిసిపల్ కమిషనర్లు బి. శ్రీనివాసరావు, ఆర్. వెంకట రామిరెడ్డి అభినందించారు. వీఎంసీ ఆర్ఎఫ్వోకు ఉత్తమ సేవా పతకం పటమట(విజయవాడతూర్పు): వీఎంసీలోని అగ్నిమాపక విభాగంలోని రీజనల్ ఫైర్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న ఎన్.వెంకటేశ్వరరావుకు ఉత్తమ సేవా పతకం లభించింది. తెలుగు సంవత్సర ఉగాది సందర్భంగా 32 ఏళ్లపాటు విశిష్ట సేవలందించినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, ఏపీ ఫైర్ సర్వీస్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ వెంకటేశ్వరరావును ప్రత్యేకంగా అభినందించారు. -
హతవిఽధీ!
విధి నిర్వహణలో పోలీసుల నిర్లక్ష్యం హతురాలు పామర్రు వాసి.. వీడియోలు, రీల్స్.. హత్య జరిగిన ప్రాంతంలో ఎన్నాళ్లగానో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదు. ఈ ప్రాంతంలో గంజాయి అమ్మకాలూ విస్తృతంగా జరుగుతున్నట్టు సమాచారం. మూడునెలలుగా ఇక్కడే లక్ష్మీ తిరుపతమ్మ, మరికొంతమంది మహిళలు రీల్స్, ఇన్ స్టాగ్రామ్లో పాటలు పాడుతూ సెల్ఫీ వీడియోలు చిత్రీకరించినట్టు సమాచారం. తిరుపతమ్మ, ఆమె ప్రియుడు చింటూ, జెస్సీ కొలనుకొండ ప్రాంతంలో దౌర్జన్యం చేస్తూ వ్యభిచార వృత్తిలో ఉన్న ఇతరులను రానీయకుండా విటులను తీసుకెళ్లి సొమ్ము చేసుకుంటారని, ఇక్కడ వీరి ఆధిపత్యం ఏమిటనే భావనతో ప్రత్యర్థులు ఈ హత్య చేసి ఉంటారా అనే అనుమానమూ వ్యక్తమవుతోంది. తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని కొలనుకొండలో సాయిబాబా గుడి వెనుక కృష్ణాకెనాల్కు వచ్చే జంక్షన్లో జనవరి 31న కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని ప్రాథమిక దర్యాప్తు చేయకుండా రాత్రికిరాత్రే పోలీసులు మార్చురీకి తరలించారు. 45 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు సేకరించలేదు. తాజాగా ఆదివారం రాత్రి కొలనుకొండ జాతీయ రహదారి పక్కనే జరిగిన లక్ష్మీతిరుపతమ్మ హత్య కేసులోనూ పోలీసులు ఇలాగే వ్యవహరించారు. రాత్రి 9 గంటలకు వచ్చిన పోలీసులు 11 గంటలకల్లా మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. హత్య జరిగిన వెంటనే ఘటనా స్థలం వద్దకు డాగ్ స్క్వాడ్ను తీసుకు రావడంలో పోలీసులు విఫలమయ్యారు. తెల్లవారుజామున ఎప్పుడో నాలుగు గంటలకు డాగ్స్క్వాడ్ వచ్చింది. అప్పటికే ఘటనా స్దలం వద్ద ఉన్న సిమెంటుతో కూడిన చెప్పులు, కండోమ్స్, హ్యాండ్బ్యాగ్, అమెరికన్ క్లబ్ సిగరెట్ పెట్టెలను తీసివేయడంతో డాగ్ స్క్వాడ్ వచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. చివరకు ఎస్పీ సతీష్కుమార్ వచ్చేంత వరకు కూడా మృతదేహాన్ని ఉంచకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు పోలీసువర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా డీజీపీ కార్యాలయానికి సమీపంలో వీవీఐపీలు నిత్యం తిరిగే ప్రాంతంలో మహిళ అత్యంత దారుణంగా హత్యకు గురైనా పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటనే వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎవరు చంపి ఉండొచ్చు? జెస్సీ, నజీరాతోపాటు లక్ష్మీతిరుపతమ్మ ఆదివారం రాత్రి కూడా కొలనుకొండ జాతీయ రహదారి వద్దకు వచ్చింది. జెస్సీ విటులను పిలిచి లక్ష్మీతిరుపతమ్మతో పంపేది. ఆదివారం రాత్రి కూడా తొలుత ఇద్దరు విటులు వెళ్లారు. అనంతరం చేతిలో ఒక సంచి పట్టుకుని హిందీలో మాట్లాడే పొట్టిగా నల్లగా ఉన్న వ్యక్తి లక్ష్మీ తిరుపతమ్మ వద్దకు వెళ్లాడు. అతను తిరిగి వచ్చిన తరువాత ముళ్ల పొదలలో నుంచి తిరుపతమ్మ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన జెస్సి, నజీరా లోపలకు వెళ్లి చూశారు. రక్తపు మడుగులో పడి వున్న తిరుపతమ్మ కనిపించింది. దీంతో భయపడిన వారిద్దరూ పెద్దగా కేకలు వేశారు. 108కు ఫోన్ చేశారు. 108 సిబ్బంది రావడంతో లక్ష్మీ తిరుపతమ్మ మృతి చెందిందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాత్రి 8 గంటలకు ఘటన జరిగితే తాడేపల్లి పోలీసులు రాత్రి 9.30 గంటలకు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ సమయంలో తిరుపతమ్మ మాజీ ప్రియుడు చింటూ కూడా అదే ప్రాంతంలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. కొంతకాలంగా తిరుపతమ్మ తనను దూరం పెడుతుందని చింటూ కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. అనాథలుగా పిల్లలు లక్ష్మీతిరుపతమ్మ మృతి వార్త తెలుసుకుని ఘటనాస్థలానికి వచ్చిన ఆమె తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇప్పుడు ఆమె ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారని రోధించారు. పిల్లలను ప్రభుత్వం సంరక్షించాలని విన్నవించారు. తాడేపల్లి రూరల్: డీజీపీ కార్యాలయం సమీపంలో ఆదివారం జరిగిన హత్యాచారం కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ సతీష్కుమార్ విచారణకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎస్పీ సతీష్కుమార్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ సుప్రజ, డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. దీంతోపాటు విజయవాడకు చెందిన సీసీఎస్ పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. పామర్రు స్వగ్రామం.. మృతురాలు కృష్ణాజిల్లా పామర్రు గ్రామానికి చెందిన సజ్జ లక్ష్మీ తిరుపతమ్మ (32)గా పోలీసులు గుర్తించారు. ఈమె భర్త అయిన నవీన్ అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లి శీలం ఝాన్సీ వద్ద పిల్లలిద్దరినీ ఉంచింది. విజయవాడలో వంటపని చేస్తున్నానని ఆమెకు చెబుతూ వస్తోంది. విజయవాడలోని కృష్ణలంకలో ఉంటోంది. ఏడాది క్రితం ట్రాన్స్జెండర్ జెస్సీ పరిచయమైంది. ఆమె లక్ష్మీతిరుపతమ్మను వ్యభిచార వృత్తిలోకి దించినట్టు సమాచారం. ఆ తర్వాత మరో ట్రాన్స్జెండర్ నజీరాతోనూ తిరుపతమ్మకు పరిచయం అయింది. వీరిద్వారా తిరుపతమ్మ మాజీ ప్రియుడు రాధారంగా నగర్కు చెందిన చింటూ గురించి పోలీసులు తెలుసుకున్నారు. అతడినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. తిరుపతమ్మ తన ఇద్దరు బిడ్డలను చదివించుకోవడం కోసమే ఈ వృత్తి చేపట్టినట్లు తెలుస్తోంది. -
27న ఇఫ్తార్ విందుకు పక్కా ఏర్పాట్లు
సమన్వయ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 27న ముస్లింలకు విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించే ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఈ ఇఫ్తార్ విందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు హాజరవుతారన్నారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సోమవారం ఇఫ్తార్ విందు కార్యక్రమ సన్నద్ధతపై కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక వాతావరణంలో కార్యక్రమం సజావుగా జరిగేందుకు అధికారులు ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేయాలని సూచించారు. విందుకు సంబంధించిన ఏర్పాట్లతో పాటు తాగునీటికి, చేతులు శుభ్రం చేసుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, వక్ఫ్బోర్డు సీఈవో షేక్ మహ్మద్ అలీ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ యాకుబ్ బాషా, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి అబ్దుల్ రబ్బాని, వక్ఫ్ ఇన్స్పెక్టర్ ఖాజా మస్తాన్, మైనార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
లెక్కల పరీక్షకు 343 మంది గైర్హాజరు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి సోమవారం జరిగిన మ్యాథ్స్ పేపరుకు 343 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలోని 168 పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న పదో తరగతి పరీక్షలకు సోమవారం 28,122 మంది విద్యార్థులను కేటాయించగా అందులో 27,779 మంది హాజరయ్యారు. హాజరు 98.78 శాతంగా అధికారులు ప్రకటించారు. పాఠశాల విద్యా జోన్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ జి. నాగమణి జిల్లాలోని నాలుగు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు గవర్నరుపేట, సత్యనారాయణపురం, జక్కంపూడి, గాంధీనగర్, అజిత్సింగ్నగర్ తదితర ప్రాంతాల్లోని సుమారు ఎనిమిది పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్లు 114 కేంద్రాలను తనిఖీ చేశాయి. అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలు స్వాధీనం జగ్గయ్యపేట: తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పి. వెంకటేశ్వర్లు సోమవారం పేర్కొన్నారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని ముక్త్యాల గ్రామానికి రాత్రి గస్తీ నిమిత్తం సీఐ వెళ్లారు. అక్కడ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఇసుక లారీలు అనుమానాస్పదంగా ఉండటంతో తనిఖీలు చేశారు. చందర్లపాడు మండలం కాసరబాద నుంచి ఇసుక అక్రమంగా తెలంగాణకు తరలుతున్నట్లుగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి లారీలను చిల్లకల్లు స్టేషన్కు తరలించినట్లు సీఐ చెప్పారు. -
కార్తికేయునికి వెండి వస్తువులు బహూకరణ
మోపిదేవి: స్థానిక మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి చెన్త్నెకు చెందిన బి. రంగరామానుజం రూ. 1,20,000 విలువుగల వెండి వస్తువులు సోమవారం బహూకరించారు. ఉదయం స్వామివార్లను దర్శించుకున్న అనంతరం 440 గ్రాముల వెండి చటారి, 532 గ్రాముల వెండి వేలాయుధం, 125 గ్రాముల వెండి చిన్నబిందెను స్వామివారికి కానుకగా ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావుకు అందజేశారు. అనంతరం దాత లను ఆలయ మర్యాదలతో సత్కరించారు. నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం.. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన మాలంపాటి రామకృష్ణయ్య, సీతాలక్ష్మి దంపతులు రూ. లక్ష విరాళంగా సోమవారం సమర్పించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వీరు తొలుత స్వామివార్లను దర్శించుకున్న అనంతరం ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావుకు విరాళాన్ని అందజేశారు. -
రేపు సిద్ధార్థలో ‘ఇన్కెండో–2కే25’
పోస్టర్ను ఆవిష్కరించిన కళాశాల ప్రతినిధులు, విద్యార్థులు మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కామర్స్ కోర్సు చదువుతున్న విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు తమ కళాశాల కామర్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ బుధవారం ఇన్కెండో–2కే25 పేరుతో పాఠ్యాంశాలు, సాంకేతిక అంశాల్లో పోటీలను నిర్వహిస్తున్నామని సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రమేష్ చెప్పారు. కళాశాల ఆవరణలోని సెమినార్ హాలులో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ 2010 నుంచి ఇన్కెండో పేరుతో కామర్స్ విద్యార్థులకు పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులకు క్విజ్, దలాల్ స్ట్రీట్, ఫైనాన్షియల్ ఎనలిస్ట్, యాడ్ మేడ్, డ్యాన్స్ టు ట్రిబ్యూట్, మిస్టర్ అండ్ మిస్ ఇన్కెండో, ఇన్కెండో ప్రీమియర్ లీగ్ వంటి అంశాల్లో పోటీలు ఉంటాయన్నారు. కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటుగా గుంటూరు, తెనాలిలోని కళాశాలల నుంచి విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. కళాశాల కామర్స్ విభాగాధిపతి కోనా నారాయణరావు, కళాశాల డీన్ రాజేష్ సి. జంపాల, అధ్యాపకులు పాల్గొన్నారు. -
వర్గీకరణకు చట్టబద్ధత కల్పించండి
ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నాగరాజు మాదిగ భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని వెంటనే జాతీయ ఎస్సీ కమిషన్ అనుమతికి పంపాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జాతీయ ఎస్సీ కమిషన్ రిపోర్ట్ వచ్చిన వెంటనే వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. విజయవాడ రూరల్ నల్లకుంట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్లో నిర్వహించిన ఉమ్మడి కృష్ణాజిల్లా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వర్గీకరణ అమలు అయ్యేవరకు అన్ని విభాగాల్లో ఉద్యోగ నియామకాలు నిలుపుదల చేయాలని, అలాగే ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లను కూడా ఆపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో ఆర్డినెన్స్ జారీ చేయటంపట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ఆదూరి నాగమల్లేశ్వరరావు మాదిగ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్ మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెల్లి ఎలీష, ఉత్తర కోస్తా జిల్లాల ఇన్చార్జ్ ముమ్మిడివరపు చిన సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
డిజిటల్ ఆటోమేషన్ వైపు దేశం అడుగులు
గుడ్లవల్లేరు: దేశంలో ఇప్పుడు అన్ని రంగాల్లో డిజిటల్ ఆటోమేషన్ వైపు అడుగులు పడుతున్నాయని కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ కె.రాంజీ అన్నారు. గుడ్లవల్లేరు వీవీ ఇన్స్ట్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాలలో 15వ వార్షికోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన వీసీ రాంజీతో పాటు కళాశాల కో సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ వల్లూరుపల్లి రామకృష్ణ, ప్రెసిడెంట్ వల్లభనేని సుబ్బారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.లక్ష్మణరావు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా రాంజీ మాట్లాడుతూ.. ఒక కళాశాల ఉత్తమ విద్యను అందించాలంటే అధ్యాపకులు, మానవ వనరులతో పాటు మౌలిక సదుపాయాలు ఎంతో అవసరమన్నారు. ఆ వనరులన్నీ ఈ కళాశాలకు ఉన్నా యని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మిషన్ లెర్నింగ్, ఇతర డిజిటల్ టూల్స్పై విద్యార్థులకు అవగాహన పెంచాలని ప్రిన్సిపాల్కు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం ఎకడమిక్ టాపర్లు, ఆటల పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. 1,05,617 బస్తాల మిర్చి విక్రయం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు సోమవారం 1,18,783 బస్తాల మిర్చి వచ్చింది. నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానంలో 1,05,617 బస్తాలు విక్రయించారు. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్ –10 రకాల క్వింటా సగటు ధర రూ.9,500 నుంచి రూ.14 వేల వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాలకు రూ.10 వేల ధర వచ్చింది.కృష్ణా యూనివర్సిటీ వీసీ రాంజీ -
క్షయ రహిత జిల్లాగా కృష్ణా
మచిలీపట్నంఅర్బన్: క్షయవ్యాధి చాలా ప్రమాదకమైందని, కృష్ణా జిల్లాను క్షయ రహితంగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్. శర్మిష్ఠ తెలిపారు. ప్రపంచ క్షయవ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి సోమ వారం నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డాక్టర్ శర్మిష్ఠ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా భారతదేశంలో క్షయవ్యాధిగ్రస్తులు ఉన్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కుటుంబాల్లో ఎవరికైనా క్షయవ్యాధి ఉన్నట్లయితే ఆ కుటుంబ సభ్యులకు ఆ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. క్షయ నివారణకు డాట్స్ కేంద్రంలో ఉచిత వైద్య సౌకర్యాలు అందిస్తున్నామని తెలిపారు. క్షయ బాధితులకు పౌష్టికాహార కిట్లను సైతం అందచేస్తున్నమని పేర్కొన్నారు. రెండు వారాలు లేదా అంతకుమించి దగ్గుతో బాధపడుతూ ఉంటే వెంటనే, కళ్లి, కఫం పరీక్ష చేయించుకోవాలని సూచించారు. వ్యాధి లక్షణాలు ఉన్నట్లు అయితే సమీప డాట్స్ కేంద్రంను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ అంబటి వెంకట్రావు, డీఎన్ఎం వేణుగోపాల్ రావు, ఏఆర్టీ హెచ్ఎం వాసుదేవరావు, సీపీఎం ఎల్.మధుసూదనరావు, పలువురు ఏఎన్ఎంలు, విద్యార్థులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ శర్మిష్ఠ -
బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యం
‘మీ కోసం’లో కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు కోనేరుసెంటర్: ‘మీ కోసం’లో అందిన ప్రతి అర్జీని చట్టపరిధిలో పరిష్కరిస్తామని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని స్పందన హాలులో సోమవారం జరిగిన మీ కోసంలో బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించిన ఎస్పీ, మరికొన్ని అర్జీలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేసి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమస్య ఎలాంటిదైనా పరిష్కరించటమే పోలీసుల కర్తవ్యమన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా పోలీసు చర్యలు ఉంటాయన్నారు. అర్జీకి పరిష్కారం లభించని పక్షంలో మరలా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అమర్యాదగా ప్రవర్తించినా తన దృష్టికి తీసుకురావాలన్నారు. అలాంటి చర్యలకు పాల్పడే సిబ్బందిపై కచ్చితంగా శాఖాపరమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. సోమవారం జరిగిన మీ కోసంలో 37 అర్జీలు అందినట్లు ఎస్పీ తెలిపారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి. సత్యనారాయణ, జిల్లా అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
మధ్యవర్తిత్వ శిక్షణ ప్రారంభం
విజయవాడలీగల్: స్థానిక కోర్టు కాంప్లెక్స్లో సోమవారం న్యాయవాదుల కోసం మధ్యవర్తిత్వ శిక్షణ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక ప్రారంభించారు. కాన్సెప్ట్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ మీడియేషన్లో 40 గంటల పాటు శిక్షణ కార్యక్రమాలు జరుగనున్నాయని న్యాయమూర్తి అరుణ సారిక తెలిపారు. తమిళనాడుకు చెందిన సీనియర్ ట్రైనీ ఎస్.అరుణాచలం, ఢిల్లీకి చెందిన రేణు అగర్వాల్ శిక్షణ ఇవ్వనున్నారు. న్యాయవాదులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తి అరుణసారిక సూచించారు. ఈ కార్యక్రమం జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ కె.వి.కృష్ణయ్య, రెండో అదనపు జిల్లా జడ్జి ఎ.సత్యానంద్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే
బీఎస్పీ ఏపీ సమన్వయకర్త డాక్టర్ పూర్ణచంద్రరావు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర జనాభాలో 52 శాతంగా ఉన్న బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల పదవుల్లో 52 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మాజీ డీజీపీ, బీఎస్పీ ఏపీ సమన్వయకర్త డాక్టర్ పూర్ణచంద్రరావు డిమాండ్ చేశారు. సోమవారం విజయవాడ ప్రెస్క్లబ్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు ముందు బీసీ కులగణన చేయాలని జాతీయ స్థాయిలో డిమాండ్ వచ్చిందన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం సచివాలయాల సిబ్బందితో కులగణన చేయించిందన్నారు. బిహార్లో జనగణన చేసి బీసీ జనాభా 65 శాతం ఉన్నట్లు తేల్చారన్నారు. దాంతో ఆ రాష్ట్రంలో బీసీలకు 65 శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారన్నారు. మన రాష్ట్రంలోనూ బిహార్ తరహాలో జనాభా ప్రాతిపదికన బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు కల్పించడం లేదని ప్రశ్నించారు. బీసీల్లో అనేక కులాలకు చట్టసభల్లో నేటికీ ప్రాతినిధ్యం లేకుండా పోయిందన్నారు. టీడీపీ అంటేనే బీసీల పార్టీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడు.. తమ ప్రభుత్వం వద్ద ఇప్పటికే సిద్ధంగా ఉన్న బీసీల లెక్కలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. -
ముగ్గురు రైల్వే సిబ్బందికి జీఎం సేఫ్టీ అవార్డులు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైళ్ల నిర్వహణలో లోపాలను గుర్తించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించిన విజయవాడ డివిజన్కు చెందిన ముగ్గురు ఉద్యోగులు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా ‘జీఎం మ్యాన్ ఆఫ్ ద మంత్ సేఫ్టీ అవార్డు’ అందుకున్నారు. సోమవారం జోనల్ హెడ్ క్వార్టర్స్ సికింద్రాబాద్ రైల్ నిలయం నుంచి విజయవాడ డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్తో పాటుగా సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్ డివిజన్ల డీఆర్ఎంలతో వర్చువల్ పద్ధతిలో జీఎం భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రయాణికుల సురక్షిత ప్రయాణం, భద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతరం విజయవాడ డివిజన్లో విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించిన గొల్లప్రోలు ఇంజినీరింగ్ సెక్షన్లోని ట్రాక్ మెయింటైనయిర్ ఎల్.వెంకటరమణ, అసిస్టెంట్ లోకోపైలెట్ టింకు యాదవ్, రాజమండ్రి మెకానికల్ విభాగంలోని టెక్నీషియన్–1 వై.యశ్వంత్కుమార్లకు జీఎం అరుణ్కుమార్ జైన్ అవార్డులను అందజేశారు. అవార్డులు సాధించిన డివిజన్ సిబ్బందిని డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు. -
30న బాడీబిల్డింగ్ క్రీడాకారుల ఎంపిక
పెనమలూరు: మినీ స్టేట్ బాడీ బిల్డింగ్ పోటీలకు ఉమ్మడి కృష్ణా జిల్లా బాడీ బిల్డింగ్ క్రీడాకారులను ఈ నెల 30వ తేదీన ఎంపిక చేస్తామని జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి తాళ్లూరి అశోక్ సోమవారం తెలిపారు. ఏప్రిల్ నాలుగో తేదీన 13 జిల్లాల మినీ స్టేట్ బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్ పోటీలు భీమవరంలో జరుగుతాయని పేర్కొన్నారు. ఈ పోటీలకు ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి కృష్ణా జిల్లా క్రీడాకారులను ఈ నెల 30వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు విజయవాడ సింగ్ నగర్ మనోహర్ జిమ్లో ఎంపిక చేస్తామన్నారు. 55 నుంచి నుంచి 85 కిలోల బరువు వారు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని సూచించారు. 165 సెంటీమీటర్ల ఎత్తు లోపు, పైబడిన వారికి రెండు గ్రూపులుగా మోడల్ ఫిజిక్ పోటీలు కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 86867 71358, 85550 47808 సెల్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. జీఎస్ఎంసీకి కేంద్ర ప్రభుత్వ ప్రశంసా పత్రంలబ్బీపేట(విజయవాడతూర్పు): రీసెర్చ్ విభాగంలో చేసిన కృషికి గాను విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల(జీఎస్ఎంసీ)కు కేంద్ర ప్రభుత్వ హెల్త్ అండ్ రీసెర్చ్ విభాగం ప్రశంసా పత్రం అందజేసింది. ఈ నెల 20వ తేదీన న్యూడిల్లీలో జరిగిన మెడికల్ కాలేజీస్ రీసెర్చ్ కనెక్ట్–2025 కార్యక్రమంలో ఐసీఎంఆర్ సెక్రటరీ అండ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్, జాయింట్ సెక్రటరీ రిచా ఖోడా చేతుల మీదుగా ప్రిన్సిపాల్ డాక్టర్ పి.అశోక్కుమార్ ఈ ప్రశంసా పత్రం అందుకున్నారు. దేశ వ్యాప్తంగా 118 మల్టీ డిసిప్లీనరీ రీసెర్చ్ యూనిట్లు (ఎంఆర్యూ) ఆ కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహించాయి. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ఏఆర్యూ నోడల్ అధికారి డాక్టర్ ఎన్.శ్రీదేవి, రీసెర్చ్ సైంటిస్ట్–సీ డాక్టర్ పి.మధుసూదన్ పాల్గొన్నారు. ప్లాస్టిక్ రహిత కృష్ణా జిల్లా లక్ష్యంచిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణాజిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ డి.కె.బాలాజీ కోరారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన పోస్టర్లను ఆయన సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాల్సిన అవసరం ఉందన్నారు. హ్యూమన్ రైట్స్ కన్వీనర్ లక్ష్మీఉష మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకం కారణంగా కొత్త జబ్బులు వస్తున్నా యని ఆందోళన వ్యక్తంచేశారు. ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గోవాడ ప్రశాంతి, డాక్టర్ గౌతమ్, రేవతి తదితరులు పాల్గొన్నారు. సీసీ కెమెరాలు ప్రారంభంమచిలీపట్నంటౌన్: స్థానిక గోసంఘం టిడ్కో గృహ సముదాయాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. టిడ్కో గృహ సముదాయాలను మంత్రి రవీంద్ర సోమవారం సందర్శించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇల్లు లేని ప్రతి ఒక్క పేదవాడి సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో జిల్లాలో టిడ్కో గృహాలను నిర్మించామన్నారు. ఇల్లు నిమిత్తం నగదు చెల్లించిన లబ్ధిదారులకు ఇల్లు పొందకపోయి ఉంటే వారందరికీ తిరిగి డబ్బులు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని క్రీడాకారులందరికీ ఉపయోగపడే విధంగా అథ్లెటిక్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, ఇతర క్రీడల కోర్టుల నిర్మాణానికి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో సుమారు రూ.50 కోట్ల వ్యయంతో మల్టీ పర్పస్ స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. గృహ సముదాయాల వద్ద మొక్కలను నాటారు. టిడ్కో ప్రాజెక్ట్ ఆఫీసర్ బి.చిన్నోడు, మునిసిపల్ కమిషనర్ బాపిరాజు, మునిసిపల్ మాజీ చైర్మన్ ఎం.వి.బాబాప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రెపాటి గోపీచంద్, నాయకులు బండి రామకృష్ణ, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమ వారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం జరిగింది. కలెక్టర్, జేసీ గీతాంజలి శర్మ, డీఆర్వో చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పద్మా దేవి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 183 అర్జీలు అందాయి. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా అధికారులు తమ కార్యాలయ సిబ్బంది అందరితో ఉద్యోగుల ఆరోగ్య పథకంలో పేరు నమోదు చేయించి కార్డు పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా అధికారులు ఎవరైనా పీజీఆర్ఎస్కు రాలేకపోతే ముందుగా తన అనుమతి పొందాలని స్పష్టంచేశారు. పీజీఆర్ఎస్కు హాజరుకాని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాని, అర్జీదారుల ప్రవర్తనను పరిశీలించేందుకు వచ్చే సోమవారం నాటికి సీసీ కెమెరాలతో పాటు ఆడియో రికార్డింగ్ ఏర్పాటు చేయాలని డీఆర్వోను ఆదేశించారు. లేకుంటే తాను ఆ కార్యక్రమానికి హాజరుకానని స్పష్టంచేశారు. అనంతరం కలెక్టర్ బాలాజీ వీడియోకాన్ఫరెన్స్ హాలులో జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్కు సంబంధించి వివిధ ప్రభుత్వశాఖల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్ఎస్లో కలెక్టర్ బాలాజీ వివిధ సమస్యలపై 183 అర్జీలు ముఖ్యమైన అర్జీలు ఇలా.. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికల ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఏబీసీ గ్రూపులుగా చేస్తూ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలతో మాదిగలకు సమన్యాయం జరగలేదని, ఎస్సీ గణాంకాలపై కులాల వారీగా రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం కమిషన్ నివేదికను మరొక్కసారి పరిశీలించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులు కంచర్ల సుధాకర్, జె.ప్రశాంతి, సైమన్బాబు అర్జీ ఇచ్చారు. గూడూరు మండలం తుమ్మలపాలెం పంచాయతీలో కొత్త తుమ్మలపాలెం ఎస్సీ కాలనీలో 120 కుటుంబాల వారు నివసిస్తున్నారని, నీటి సమస్య ఎక్కువగా ఉందని తరకటూరు చెరువు నుంచి తమ గ్రామానికి ఎస్సీ కాలనీ మీదుగా పైప్లైన్ వేసేలా చర్యలు తీసుకోవాలని గూడూరుకు చెందిన జడ దావీదురాజు అర్జీ ఇచ్చారు. బాపులపాడు మండలం పెరికీడు వంతెన గ్రామంలోని విజయ డ్వాక్రా గ్రూపులుగా తాము సభ్యులుగా ఉన్నామని, గ్రూపు సెక్రటరీ తిరుమలశెట్టి నాగరమ్య, పద్మకు ప్రతి నెలా గ్రూపు సభ్యులు రుణం బ్యాంకులో చెల్లించేందుకు ఇస్తున్న డబ్బులను జమ చేయడం లేదని, రూ.7 లక్షల వరకు తమను మోసం చేశారని, తమకు న్యాయం జరిగేలా చూడాలని విశాఖ రమాదేవి, పి.లక్ష్మి తదితరులు కోరారు. -
ఆర్పీల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి
ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం డిమాండ్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) నందు పనిచేస్తున్న ఆర్పీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ)డిమాండ్ చేసింది. సోమవారం విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ నందు ఏపీ మెప్మా ఆర్పీల సంఘం ఆధ్వర్యంలో ఆర్పీలకు మూడు సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, బకాయి వేతనాలు చెల్లించాలని, వేతనాలు పెంచాలని, వేతనాలకు పనికి ముడిపెట్టకుండా గ్రేడింగ్ విధానం రద్దుచేసి పదివేల రూపాయల వేతనం ప్రభుత్వమే చెల్లించాలి వంటి డిమాండ్ల పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించారు. ధర్నాలో పెద్ద సంఖ్యలో ఆర్పీలు పాల్గొని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు తదితరులు ప్రసంగించారు. అనంతరం మెప్మా అధికారులు ఆర్పీల సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులు ముజఫర్, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. -
ఉపాధిలో అవినీతి మేట్లు
జి.కొండూరు: కూటమి అధికారంలోకి వచ్చిన ఈ పది నెలల కాలంలో అక్రమాలకు అడ్డేలేకుండా పోయింది. దోచుకునేందుకు కాదేదీ అనర్హం అన్నట్లు తయారైంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అధికార పార్టీ నాయకులు నియమించుకున్న ఆ పార్టీ సానుభూతిపరులు చేస్తున్న అక్రమాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండల పరిధి చండ్రగూడెం గ్రామ పంచాయతీలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉద్యాన పంటలకు ఇచ్చే కూలీల వేతనాల్లో అక్రమాలకు పాల్పడిన 24 మంది మేట్లపై సోమవారం వేటుపడింది. ఫీల్డ్ అసిస్టెంటును తొలగించాలని ఉన్నతాధికారులకు నివేదించారు. ఈ 24 మంది మేట్లు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నియమితులైన వారే కావడం గమనార్హం. వారంతా ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్తో కుమ్మకై ్క రైతులకు అందాల్సిన వేతన నగదు రూ.25 లక్షల వరకు స్వాహా చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ స్వాహా పర్వంపై అధికారులు విచారణ చేపట్టారు. అక్రమం జరిగింది ఇలా... చండ్రగూడెం గ్రామ పంచాయతీలో రైతులు కొన్నేళ్లుగా మల్లెతోటలు సాగు చేస్తున్నారు. ఇక్కడి మల్లెలు విజయవాడ, హైదరాబాద్ వరకు ఎగుమతి అవుతాయి. అయితే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మల్లెతోటల పెంపకానికి ఆర్థిక సాయం అందిస్తున్న నేపథ్యంలో గ్రామానికి చెందిన 43 మంది రైతులు మల్లెసాగుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ 43 మంది రైతులు 19.40 ఎకరాల్లో 31,040 మల్లె మొక్కలు నాటారు. ఈ మొక్కలు నాటడానికి అవసరమైన కూలీలతో గుంతలు తవ్విస్తారు. ఒక్కొక్క గుంతకు రూ.35 చొప్పున ఉపాధి పథకం కింద వేతనం ఇస్తారు. ఇది కాక రైతులకు ఏడాదికి తోటల నిర్వహణ కింద వంద రోజుల పని దినాలను సైతం కల్పిస్తారు. గుంతలు తవ్వేందుకు రైతులు ఉపాధి కూలీలను వినియోగించుకుంటారు. ఈ క్రమంలో జాబ్కార్డు ఉండి తమకు అనుకూలంగా ఉన్న గ్రామస్తులను మేట్లు ఎంచు కొని వారి పేర్లను పని చేయకుండానే గుంతలు తవ్విన వారి జాబితాలో చేర్చారు. ఆ తరువాత వారి పేరిట వచ్చిన వేతన నగదును వాటాలు వేసుకొని పంచుకున్నారు. ఈ క్రమంలో వేతన నగదు రాని గ్రామానికి చెందిన రైతులు కొందరు ఉపాధి హామీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనితో మేట్ల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. రైతుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన అధికారులు ముగ్గురు రైతులకు చెందిన రూ.22 వేలు పక్కదారి పట్టినట్లు గుర్తించారు. ఇదే కాకుండా గ్రామంలో రైతులు అందరినీ విచారణ జరిపిన తర్వాత పక్కదారి పట్టిన నగదును మేటల్ నుంచి రికవరీ చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ముందుగా గ్రామానికి చెందిన 24 మంది మేట్లు, ఒక ఫీల్డ్ అసిస్టెంట్ను విధుల నుంచి తొలగించారు. రూ.25 లక్షల స్వాహా చేశారని అంచనా పక్కదారి పట్టిన నగదు రూ.లక్ష వరకే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే అంత తక్కువ నగదు పక్కదారి పట్టినప్పుడు 24 మంది మేట్లను, ఫీల్డ్ అసిస్టెంట్ను తొలగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మల్లె తోటలే కాకుండా గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద సాగవుతున్న ప్రతి ఉద్యాన పంటల కూలీల వేతనాల్లో అక్రమాలు జరిగాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో అప్పటికే సాగులో ఉన్న ఉద్యాన పంటలకు కూడా ఆర్థిక సాయం ఇప్పిస్తామంటూ మేట్లు రైతులతో దరఖాస్తులు చేయించి, ఆయా పంటల సాగుకు వేతనాల రూపంలో వచ్చే నగదును కూడా నొక్కేశారని ఆరోపణలు వస్తు న్నాయి. ఇవే కాకుండా గ్రామంలో జరిగిన ఉపాధి పనుల్లో సైతం పనిలోకి రాని కూలీల పేర్లు కూడా నమోదు చేసి ఆ నగదును నొక్కేశారని తెలుస్తోంది. మొత్తంగా గ్రామ పంచాయతీ నుంచి రూ.25 లక్షల వరకు మేట్లు దోచారని సమాచారం. ఈ నగదును వాటాలు పంచుకునే విషయమై మేట్ల మధ్య తేడాలు రావడంతో అక్రమ దందా బయటకు పొక్కిందని సమాచారం. రైతులకు అందాల్సిన వేతన నగదును దోచిన మేట్లు చండ్రగూడెంలో రూ.25 లక్షల వరకు స్వాహా చేసిన వైనం వేతనాల అక్రమాలపై విచారణ జరుపుతున్న అధికారులు 24 మంది మేట్లు విధుల నుంచి తొలగింపు ఈ మేట్లు అందరూ టీడీపీ సానుభూతిపరులే.. మేట్లను తొలగించాం చండ్రగూడెం గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన మల్లె తోటల్లో గుంతల తవ్వకంలో అవకతవకలపై 24 మంది మేట్లను తొలగించాం. ఫీల్డ్ అసిస్టెంట్ తొలగింపునకు ప్రాజెక్టు డైరెక్టర్కు నివేదిక ఇచ్చాం. ముగ్గురు రైతులకు చెందిన రూ.22 వేలు పక్కదారి పట్టినట్లు తేలింది. గ్రామంలో రైతులు అందరినీ విచారించి పక్కదారి పట్టిన నగదును మేట్ల నుంచి రికవరీ చేస్తాం. – వెంకటేశ్వరరావు, ఏపీఓ, మైలవరం -
గంగాభవానీ అమ్మవారిని తాకిన సూర్యకిరణాలు
కోడూరు: భక్తుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న కోడూరు గంగాభవానీ అమ్మవారి మూలమూర్తిని ఆదివారం ఉదయం సూర్యకిరణాలు తాకాయి. ఉదయం 6.47గంటల సమయంలో సూర్యకిరణాలు నేరుగా గర్భాలయంలో ఉన్న అమ్మవారి శిలపై పడ్డాయి. అమ్మవారి శిలకు ఇత్తడి తొడుగు కూడా ఉండడంతో ఆ కిరణాల వెలుగుల మధ్య అమ్మవారు ప్రకాశించారు. గతంలో ఎన్నడూ ఇలా నేరుగా అమ్మవారిపై సూర్యకిరణాలు పడలేదని, తొలిసారి అమ్మవారి శిలను సూర్యకిరణాలు తాకాయని ఆలయ ప్రధానార్చకుడు కోమ్మూరి శ్రీనివాసశర్మ తెలిపారు. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దరఖాస్తు గడువు పెంపు చిలకలపూడి(మచిలీపట్నం): బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ కులాల వారికి స్వయం ఉపాధి పథకాల కోసం దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 25వ తేదీ మంగళవారం వరకు పొడిగించినట్లు బీసీ కార్పొరేషన్ ఈడీ కె.శంకరరావు ఆదివారం తెలిపారు. ఈ–బీసీ, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్కు సంబంధించిన లబ్ధిదారులకు వివిధ పథకాల ద్వారా సబ్సిడీ మంజూ రు చేసేందుకు దరఖాస్తుదారులు ఏపీవోబీఎంఎంఎస్ ద్వారా పేరును ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. ప్రస్తుతం ఈ గడువు 20వ తేదీ వరకు పొడిగించారన్నారు. కాపు కార్పొరేషన్కు సంబంధించి వయో పరిమితిని 21 నుంచి 60 ఏళ్లుగా నిర్ణయించారన్నారు. అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ‘సబ్కా కృష్ణా’ నూతన కార్యవర్గం ఎన్నిక పటమట(విజయవాడ తూర్పు): ేస్టట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఉమ్మడి కృష్ణా జిల్లా శాఖ(సబ్కా కృష్ణా) 2025–26 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. ఆదివారం లబ్బీపేటలోని అసోసియేషన్ కార్యాలయంలో కృష్ణా జిల్లా సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గౌరవాధ్యక్షుడిగా కలిదిండి కృష్ణం రాజు, కృష్ణాజిల్లా అధ్యక్షుడిగా మండ వ సాయి, కార్యదర్శిగా లింగం రవికిరణ్, ఉపాధ్యక్షుడిగా కోటిరెడ్డి, మురళీధర్ ఎన్నికయ్యారు. ట్రెజరర్గా వెంకటేశ్వర రాజు, జాయింట్ సెక్రటరీలుగా రవికుమార్, సురేష్ కుమార్, భూపతి రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా పూర్ణ, శ్రీధర్, వీరబ్రహ్మం, శ్రీనివాసరెడ్డి, శేషగిరి రావు, శ్రీనివాసరావు, హరికృష్ణలు ఎన్నికవ్వగా అడ్వైజర్లుగా సకలారెడ్డి, రత్నారావు, అమర్ బాబు, సుధీర్ ఎన్నికయ్యారు. గ్రంథాలయ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా గుమ్మా పటమట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం, కృష్ణాజిల్లా శాఖ అధ్యక్షుడిగా ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ గుమ్మా సాంబశివరావు, కార్యదర్శిగా కె.బి.ఎన్.కళాశాల గ్రంథపాలకుడు వై. శ్రీనివాసరాజు ఎన్నికయ్యారు. జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం ఆదివారం ఉదయం బెంజిసర్కిల్ వద్ద ఉన్న సర్వోత్తమ భవనంలో జిల్లా శాఖ అధ్యక్షుడు వేములపల్లి కేశవరావు అధ్యక్షతన జరిగింది. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావి శారద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మైలవరం లకిరెడ్డి బల్రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల లైబ్రేరియన్ టి. సాంబశివరావు ఉపాధ్యక్షుడిగా, కృష్ణాజిల్లా అభ్యుదయ రచయితల సంఘ కార్యదర్శి పి.అజయ్ కుమార్ సహాయ కార్యదర్శిగా, మరో ఐదుగురిని కార్యవర్గ సభ్యులుగాను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో గ్రంథాలయరంగ పరిస్థితులపై సభ్యులు చర్చించి, పలు అంశాలపై తీర్మానించారు. -
ఆగని కూటమి నేతల దోపిడీ పర్వం
కృష్ణాజిల్లాలో ఇసుకదందా జోరుగా సాగుతోంది. కూటమి నాయకుల కనుసన్నల్లో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. ప్రజాప్రతినిధుల అండతో వారి అనుచరగణం అధికారమే పరమావధిగా క్వారీల్లో ఇసుకను దోచేస్తూ భారీగా లబ్ధి పొందుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో కృష్ణానది పరీవాహక ప్రాంతమైన కంకిపాడు మండలం మద్దూరు, తోట్లవల్లూరు మండలం రొయ్యూరు, నార్తువల్లూరు, ఘంటసాల మండలం శ్రీకాకుళం రేవుల్లో ఇసుక తవ్వకాలు గత కొంతకాలంగా యథేచ్ఛగా సాగు తున్నాయి. గతంలో ఇచ్చిన అనుమతులు ఫిబ్రవరి 6తో ముగియటంతో అధికారులు అదే రీచ్లకు రెన్యువల్ చేసి జూలై 14 వరకు అనుమతులు మంజూరు చేశారు. కూటమి ఎమ్మెల్యేల అండదండలతో ఆయా రీచ్లలో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు రాత్రి, పగలు తేడా లేకుండా జరుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా భారీ లోడుతో లారీలు ఇసుకను రవాణా చేస్తున్నాయి. ఇరవై టన్నుల లోడుతో వెళ్లాల్సిన లారీలు నలభై టన్నులు పైగా ఇసుకను రవాణా చేస్తుండటంతో రహదారులు దెబ్బతింటున్నాయి. ఇసుక లారీల రవాణాతో రోడ్లు దుమ్మెత్తిపోతున్నాయి. అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు ఆయా క్వారీల వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కంచికచర్ల: ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల్లో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. కృష్ణానది, మునేరు, వైరా ఉపనదుల పరీవాహక ప్రాంతాల్లో ఉన్న ఇసుకను తెలుగుతమ్ముళ్లు నిత్యం దోచుకుంటున్నారు. పగలూరాత్రి తేడా లేకుండా రీచ్ల వద్ద అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం కాసరబాద ఇసుక రీచ్లో బిల్లులు లేకుండా ఒక్కో లారీకి రూ.10వేలు చెల్లిస్తే చాలు లోడింగ్ ఎంతైనా ఇసుక నింపుతాం అంటూ నిర్వాహకులు ఓపెన్ ఆఫర్ చేస్తున్నారు. ఇలా రోజుకు రూ. 10లక్షల ఆదాయం దోచుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. తెలంగాణాకు అక్రమ రవాణా.. నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతంలోని ఇసుకకు తెలంగాణాలో భారీ డిమాండ్ ఉంది. మునేరు, కృష్ణానది ఇసుకకు అక్కడ మంచి ధర లభిస్తోంది. లారీ ఇసుక ధర ఖమ్మం, వైరా రూ.45వేల నుంచి రూ. 60వేలు వరకు డిమాండ్ ఉంది. అదే హైద్రాబాద్లో రూ. 90 వేల నుంచి రూ.1లక్ష వరకు ధర ఉంటుంది. అధికారపార్టీకి చెందిన ఎంపీతో పాటు, టీడీపీ నాయకులు ఆయా ప్రాంతాలకు ఇసుకను తరలించి లాభాలు ఆర్జిస్తున్నారు. ఇటీవల తెలంగాణా రాష్ట్ర సరిహద్దులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 14 లారీలను అధికారులు పట్టుకున్నారు. అయినా ఇసుక దందా ఆగటంలేదు. కంచికచర్ల మండలం కీసర మునేరు ఉపనది నుంచి టీడీపీకి చెందిన ఓ చోటా నాయకుడు పగటి పూట ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలించి గ్రామంలో ఓ దేవాలయం సమీపంలో డంపింగ్ చేసి రాత్రి సమయంలో ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నాడు. అటువైపు కనీసం రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు అధికారులపై మండిపడుతున్నారు. నందిగామ మండలం మాగల్లు, పెనుగంచిప్రోలు మండలం శనగపాడు, జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు, చిట్యాల, మునేరు నుంచి కూటమి నేతలు ఇసుకను తవ్వి ఇతర రాష్ట్రాలకు లారీలతో తరలిస్తున్నారు. కృష్ణమ్మకు గర్భశోకం.. కృష్ణానది మధ్యలో ఇసుక తవ్వకాలు భారీగా జరుపుతున్నారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద కృష్ణా నదిలో అధికారుల అనుమతులు లేకుండా కూటమి నాయకులు భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు. నదీ గర్భంలో ఇసుకను తవ్వకూడదనే ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. వాల్టా చట్టానికి తూట్లు పొడిచి నదీ గర్భంలో డ్రెడ్జింగ్ యంత్రాలు వినియోగించి ఇసుకను తవ్వేస్తున్నారు. అయినప్పటికీ ఇల్లు నిర్మించుకునే అసలైన లబ్ధిదారులకు ఇసుక దొరకటం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కృష్ణా, ఎన్జీఆర్ జిల్లాల్లో దోచుకో.. పంచుకో.. ఉచితం మాటున భారీగా ఆదాయార్జన ఎన్టీఆర్ జిల్లాలో ఎంపీ కనుసన్నల్లో అంతా! స్థానిక అధికారపార్టీ ప్రజా ప్రతినిధులకూ వాటాలు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తున్న అక్రమ ఇసుక పట్టించుకోని మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు -
గంగమ్మ ఒడికి ఆలివ్ రిడ్లే
● సముద్రబాట పట్టిన తాబేళ్ల పిల్లలు కోడూరు: బుల్లి బుల్లి తాబేళ్ల పిల్లలు బుడిబుడి అడుగులు వేసుకుంటూ సముద్రుడి ఒడిలోకి చేరాయి. హంసలదీవి సాగరతీరంలోని పాలకాయతిప్ప సంతానోత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి అయిన 300 తాబేళ్ల పిల్లలను మైరెన్ ఎస్ఐ పూర్ణమాధురి సిబ్బందితో కలిసి ఆదివారం సముద్రంలోకి విడిచిపెట్టారు. సముద్రం కలుష్యాన్ని తగ్గించే అరుదైన ఆలీవ్ రిడ్లే జాతి తాబేళ్ల పిల్లలను కేంద్రంలో నిర్ణీత ఉష్టోగ్రత దగ్గర పెంచుతారు. ఈ కేంద్రంలో ఇప్పటి వరకు రెండు వేల తాబేళ్ల గుడ్లను సేకరించినట్లు అటవీ రేంజర్ శ్రీసాయి తెలిపారు. మే నెలాఖరు లోపు సుమారు ఐదు వేల పిల్లలను సముద్ర బాట పట్టించేలా ప్రణాళిక రూపొందించినట్లు ఆయన వివరించారు. బగళాముఖి సేవలోహైకోర్టు న్యాయమూర్తి చందోలు(కర్లపాలెం): చందోలు శ్రీ బగళాముఖి అమ్మవారిని ఆదివారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గుణరంజన్ సతీమణి విజిత, కుమారుడు గిరీష్, కుమార్తె గ్రీష్మ, రైల్వే కోర్టు జడ్జి పి.రమాదేవి, నూజివీడు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వరరావు దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి, అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి చిత్రపటాలను, ప్రసాదాలను వారికి ఈవో అందజేశారు. -
నిబంధనల మేరకు ఖైదీలకు సదుపాయాలు
గన్నవరం: స్థానిక సబ్జైలును ఆదివారం ప్రిన్సిపల్ జిల్లా జడ్జి అరుణసారిక, జిల్లా లీగల్ సెల్ అథారిటీ చైర్మన్ కేవీ రామకృష్ణ సందర్శించారు. సబ్జైలులో ఖైదీల వివరాలను, వారికి కల్పిస్తున్న సదుపాయాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సబ్జైలులోని వంటిగది, ఖైదీల కోసం సిద్ధం చేసిన ఆహర పదార్థాలను పరిశీలించారు. అనంతరం జిల్లా జడ్జి అరుణసారిక మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగా ఖైదీలకు సదుపాయలను కల్పించాలని చెప్పారు. ఖైదీల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని వైద్య పరీక్షలు చేయించాలని సూచించారు. కొత్త భవన సముదాయం నిర్మించాలి.. అనంతరం జిల్లా జడ్జిని బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గారపాటి రవికుమార్, రామకూరి ప్రకాశరావు నేతృత్వంలో నూతన కార్యవర్గం మర్యాద పూర్వకంగా కలిశారు. శిథిలావస్థకు చేరుకున్న పాత భవనం స్థానంలో కోర్టుల కొత్త సముదాయం నిర్మించాలని కోరారు. అనంతరం అరుణసారికను బార్ అసోసియేషన్ కార్యవర్గం సత్కరించింది. ఉపాధ్యక్షుడు ఎల్. వేణుబాబు, కోశాధికారి ఆర్. విమల్కుమార్, మహిళా ప్రతినిధి భాగీరథీ పలువురు సభ్యులు పాల్గొన్నారు. జిల్లా జడ్జి అరుణసారిక -
కృష్ణాజిల్లా
సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2025నేడు ‘మీ కోసం’ చిలకలపూడి: కలెక్టరేట్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. డివిజన్, మండలస్థాయిల్లోనూ కార్యక్రమం కొనసాగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కిక్కిరిసిన కార్తికేయుని ఆలయం మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ఆదివారం కోలాహలంగా మారింది. నాగపుట్ట, నాగ మల్లి వృక్షం వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఇసుక.. కూటమి నేతలకు కాసులు కురిపిస్తోంది. ఎలాంటి నిబంధనలు వారికి వర్తించడం లేదు. తమకు నగదు చెల్లిస్తే చాలు ఎంతైనా లోడ్ చేసేస్తామంటూ బహిరంగంగా ప్రచారం చేసుకుంటున్నారు. బిల్లు కావాలంటే రూ. 10వేలు, బిల్లు వద్దనుకుంటే రూ. 8వేలు చెల్లిస్తేచాలట.. 20 టన్నుల నుంచి 40 టన్నుల వరకూ లోడ్ చేసేస్తామని ఓపెన్ ఆఫర్ ఇచ్చేస్తున్నారు. అర్ధరాత్రి వేళ లారీలకు లారీలు రాష్ట్ర సరిహద్దులను దాటించేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నామమాత్రపు దాడులతో సరిపెడుతూ కాలం గడుపుతున్నారు. తోట్లవల్లూరు మీదుగా రాత్రి వేళ యథేచ్ఛగా సాగుతున్న ఇసుక రవాణా ఇఫ్తార్ సహరి (సోమ) (మంగళ) విజయవాడ 6.24 4.50 మచిలీపట్నం 6.23 4.497అదే పంథా..న్యూస్రీల్ -
26న వైఎస్సార్ సీపీ ఇఫ్తార్ విందు
పటమట(విజయవాడతూర్పు): రంజాన్ సందర్భంగా ఈ నెల 26వ తేదీన ఇఫ్తార్ విందు ఇస్తున్నట్లు వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. ఆదివారం గుణదలలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించే ఇఫ్తార్ విందులో మాజీ సీఎం, పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటున్నారన్నారు. నగరంలోని గురునానక్ కాలనీలో ఉన్న ఎన్ఏసీ కల్యాణ మండపంలో ఇఫ్తార్ విందు ఇస్తున్నామని, ముస్లింలకు జగన్ మాత్రమే అండగా నిలబడ్డారని, పదవులు ఇవ్వటం నుంచి పథకాలు అమలు చేసే వరకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ఘనత జగన్కే దక్కుతుందని పేర్కొన్నారు. ముస్లిం పక్షపాతి వైఎస్ జగన్.. ఎమ్మెల్సీ రుహుల్లా మాట్లాడుతూ ముస్లింలకు జగన్ చేసిన మేలు మర్చిపోలేనిదన్నారు. ముస్లింల పక్షపాతిగా వైఎస్సార్ సీపీ ఎంతో న్యాయం చేసిందని, జగన్ సారధ్యంలోనే ముస్లింలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందారని కొనియాడారు. పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు ఆసిఫ్ మాట్లాడుతూ ముస్లిం ఉన్నత స్థానాలలో స్థిర పడే విధంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరి జగన్ కూడా తన వంతు సహాయం చేశారని, తండ్రి బాటలో హజ్ యాత్రకు వెళ్లేవారికి అన్ని సౌకర్యాలు, రాయితీలు కల్పించారని పేర్కొన్నారు. ద్రోహులు కూటమి నేతలు.. పార్టీ నందిగామ నియోజకవర్గ ఇన్చార్జ్ మొండి తోక జగన్ మోహనరావు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ హయాంలో ముస్లింలందరికీ మంచి జరిగిందని, కుటమి ప్రభుత్వం ముస్లింలను మోసం చేస్తోందన్నారు. పార్టీ నేత పోతిన మహేష్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ముస్లింలకు ఎప్పుడూ అండగా ఉంటుందని, చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ముస్లింల ద్రోహులని, ముస్లింలకు మంచి జరగటం వారికి ఇష్టం ఉండదన్నారు. కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి, వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మహబూబ్ షేక్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, మునీర్ అహ్మద్ షేక్లతోపాటు పలువురు కార్పొరేటర్లు రాష్ట్ర జిల్లాస్థాయి పార్టీ నేతలు పాల్గొన్నారు హాజరుకానున్న మాజీ సీఎం వైఎస్ జగన్ విజయవాడలోని ఎన్ఏసీ కల్యాణ మండపంలో ఏర్పాట్లు వివరాలు వెల్లడించిన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ -
గీత.. కన్నీటి గాథ!
జి.కొండూరు: గ్రామీణ ప్రాంతాలలో ఫామ్ వైన్గా పిలుచుకునే తాటికల్లు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. తరతరాలుగా తాటికల్లును తీస్తూ ప్రజలకు అందిస్తున్న గౌడన్నలు ఆ వృత్తిని వదిలేస్తున్నారు. దశాబ్దాలుగా ప్రభుత్వాల ఆదరణ కరువై ఆర్థికంగా ఎదుగుదల లేక.. ఆరోగ్యం సహకరించక, తాటిచెట్లు ఎక్కలేక ఒక్కొక్కరిగా వెనకడుగు వేస్తున్నారు. తాము దశాబ్దాలుగా పడిన కష్టాలు భవిష్యత్తులో తమ కుటుంబాలు పడకూడదనే ఆలోచనతో పిల్ల లను చదివించి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు పంపుతున్నారు. ప్రస్తుతం నలభై ఏళ్లు పైబడిన వారు గౌడ సామాజిక వర్గంలో ఒకటి రెండు శాతం మంది మాత్రమే ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తు తరాలు తాటికల్లు గురించి పుస్తకాలలో చదువుకోవాల్సి వచ్చేలా ఉంది. బెల్టు షాపులతో కల్లుకు కాటు.. గతంలో తాటికల్లు లీటరు రూ.60 నుంచి రూ.100 వరకు ప్రాంతాల వారీగా డిమాండ్ను బట్టి విక్రయించేవారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా బెల్టుషాపులను తెరిచి మద్యం విక్రయించడంతో పాటు మద్యం రూ.99కి క్వార్టర్ను అందుబాటులోకి తీసుకురావడంతో కల్లుకు డిమాండ్ తగ్గింది. తక్కువ ధర ఎక్కువ కిక్కు ఇస్తుండడంతో గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్యానికి మేలు చేసే కల్లును వదిలేసి మద్యం వైపు పరుగులు తీస్తున్నారు. దీనితో గీతకార్మికులు తాటి చెట్ల నుంచి తీసిన కల్లును తాగేవాళ్లు లేక పారబోస్తున్నారు. ఒక్క ఆదివారం మినహా మిగతా రోజుల్లో కల్లు విక్రయాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయని చెబుతున్నారు. మితం హితమే.. తాటికల్లు అనేక పోషకాలతో నిండి ఉంటుందని, తాజా కల్లుని మితంగా తీసుకోవడం వల్ల మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పోటాషియంతో పాటు విటమిన్లు బీ,సీ,ఈ, ఐరన్ పుష్కలంగా ఉంటాయంటున్నారు. అదే సమయంలో కల్లుని అతిగా తాగినా, నిల్వ ఉంచి పులిసిన కల్లుని తాగినా ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాల ఆదరణకు నోచుకోని కల్లుగీత కార్మికులు ఒక్కొక్కరిగా వృత్తిని వదిలేస్తున్న గౌడన్నలు ఉమ్మడి కృష్ణాజిల్లాలో 12వేల మంది కల్లుగీత కార్మికులు బెల్టు షాపులతో తీరని నష్టం -
రక్త నిల్వల కొరత!
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో ప్రాణాధారమైన రక్త నిల్వలు తగ్గిపోతున్నాయి. ఏ బ్లడ్ బ్యాంక్కు వెళ్లినా నో స్టాక్, నో బ్లడ్ అన్న సమాధానమే. జిల్లాలో రక్త నిల్వల కొరత ఎదురవుతోంది. రక్తం అవసరం ఉన్న రోగుల బంధువులు బ్లడ్ బ్యాంక్ల చుట్టూ తిరుగుతున్నా నిరాశే ఎదురవుతోంది. ఈ పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నో స్టాక్.. నో బ్లడ్జిల్లాలో తొమ్మిది బ్లడ్ బ్యాంకుల పరిధిలో 2023– 24లో మొత్తం 19,550 యూనిట్ల రక్తసేకరణ జరిగింది. 2024– 25 ఫిబ్రవరి నెల వరకు 12,845 యూనిట్లు మాత్రమే సేకరణ చేశారు. ఏటా మే, జూన్ నెలల్లో రక్తం కొరత అధికంగా ఉంటోంది. అయితే ఈ ఏడాది మార్చిలోనే ‘కొరత’ ఎదురవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి బ్లడ్ బ్యాంక్ రోజుకు 5 నుంచి 15 యూనిట్ల వరకూ రోగులకు రక్తం అందిస్తుంటాయి. ప్రధానంగా రక్తం నిల్వచేసే రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో నో స్టాక్.. నో బ్లడ్ అన్న సమాధానం ఎదురవుతోంది. శనివారం వరకు రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంకులో కేవలం మూడు యూనిట్లు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 20 యూనిట్లు, కొన్ని బ్లడ్ బ్యాంకుల్లో సింగిల్ యూనిట్లు, మరికొన్ని చోట్ల నిల్వలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నిరాశే..రక్తం కొరత ప్రభావం.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిపై తీవ్రంగా పడుతోంది. తలసేమియా వంటి రోగులు రక్తదాతలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. బ్లడ్ కోసం ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంక్ల చుట్టూ తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదు. గర్భిణులు, యాక్సిడెంట్స్లో గాయాల పాలైన వారు రక్తం కోసం పరుగులు పెడుతున్నారు. అక్కడ వారికి నిరాశే ఎదురవుతోంది. వేసవిలో ఇబ్బందే..రోగుల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కొన్ని రకాల శస్త్రచికిత్సలను వేసవిలోనే నిర్వహిస్తారు. వీటి నిర్వహణకు కూడా రక్తం యూనిట్లు నిల్వల అవసరం మరింత పెరుగుతోంది. సాధారణంగా రక్తం సేకరణకు కళాశాలలు, పలు సంస్థల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారు. ప్రస్తుతం వాటి నిర్వహణ ఊసే లేదు. రానున్నది వేసవి కావడంతో ప్రజలు రక్తదానం చేయడానికి విముఖత చూపుతారు. కళాశాలలకు కూడా సెలవులు ప్రకటిస్తారు. ఇలాంటి కారణాలతో రక్త నిల్వలు తగ్గిపోతాయి. దీంతో సమస్య మరింత జఠిలమవుతుందని పలువురు వైద్యులు అంటున్నారు. ప్రజల్లో అవగాహన పెరగాలి..ప్రముఖల జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదాన సేకరణను పెంచాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా సంబంధిత అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది. రక్తం నిల్వల సేకరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. రక్తదాతలూ.. రండి ఏటా వేసవిలో సమస్య ఈ ఏడాది మార్చిలోనే నిల్వలు తగ్గడంతో ఆందోళన మరింత తీవ్రమయ్యే అవకాశం అన్ని చర్యలు తీసుకుంటున్నాం గడిచిన కొద్దిరోజుల నుంచి ఎండ తీవ్రత అధికం కావడం, విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కావడంతో రక్త సేకరణ తగ్గింది. రోగుల అవసరం మేరకు యూనిట్లను సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది. నిల్వలు పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. –హనుమంతయ్య, మెడికల్ ఆఫీసర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్, మచిలీపట్నం -
ఉమ్మడి కృష్ణా సీనియర్స్ రగ్బీ జట్ల ఎంపిక
నున్న(విజయవాడరూరల్): ఉమ్మడి కృష్ణా జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యాన ఆదివారం నున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీనియర్ పురుషులు, మహిళల జిల్లా రగ్బీ జట్ల ఎంపికలు జరిగాయి. వీటిలో 25 మంది బాలురు, 20 మంది బాలికలు పాల్గొన్నారని కార్యదర్శి ఎన్.చంద్రకళ తెలిపారు. పురుషుల జట్టుకు జి.బిళ్లహరి, సీహెచ్ మోహనవంశీ, ఎం.లక్ష్మీనారాయణ, (విజయవాడ), వై.జిక్రిరెడ్డి (జూనియర్ కళాశాల,పాయకాపురం), కె.రాహుల్(ధనేకుల), నున్న వికాస్కు చెందిన పి.సాయి ధనుష్, యు.వెంకట రమణ, ఎండి ఫిరోజ్ జిలానీ,ఎం. లక్ష్మణస్వామి (సంగమూడి), పి.రవినాగ శంకర్లు ఎంపికయ్యారు. మహిళల జట్టుకు ఉంగుటూరుకు చెందిన వై.నందిని, ఎస్.కీర్తన, ఒ.సుధారాణి, కె.నందిని, జి.గంగా భవాని, (హనుమాన్ జంక్షన్), విజయవాడకు చెందిన వి.గీతశ్రీ, బి.నిహారిక, సీహెచ్ జాహ్నవి. డి.చిన్ని నున్న కు చెందిన ఎ.గౌతమి, పి.జెస్సికా ఎంపికయ్యారు. -
ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన పలు అర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు కొనసాగింది. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఘాట్రోడ్డు, మహా మండపం లిప్టు, మెట్ల మార్గంలో కొండపైకి చేరుకున్నారు. రూ. 500, రూ.300, రూ.100 టికెట్తో పాటు సర్వ దర్శనం క్యూలైన్లో భక్తుల రద్దీ కనిపించింది. సర్వ దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది. అర్జిత సేవల్లో ఉభయదాతలు తెల్లవారుజామున ప్రధాన ఆలయంలో అమ్మవారి మూలవిరాట్ వద్ద నిర్వహించిన ఖడ్గమాలార్చన, ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, యాగశాలలో నిర్వహించిన చండీహోమం, శాంతి కల్యాణంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. అర్జిత సేవల్లో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలో అమ్మవారి దర్శనానికి అనుమతించారు. రూ. 500 టికెట్ కొనుగోలు చేసిన భక్తులతో పాటు వీఐపీలు, సిఫార్సు లేఖలపై వచ్చిన భక్తులకు అంతరాలయ దర్శనం కల్పించారు. అంతరాలయ రద్దీ తగ్గుముఖం పట్టిన కొంత సమయం తర్వాత రూ.300 క్యూలైన్లో వేచి ఉన్న భక్తులను ముఖ మండప దర్శనానికి అనుమతించారు. భక్తులకు అమ్మవారి బంగారు వాకిలి దర్శనం కల్పించడంతో త్వరిత గతిన అమ్మవారి దర్శన భాగ్యం కలిగింది. భక్తులకు ఇబ్బంది కలగకుండా.. రద్దీ నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏఈవో చంద్రశేఖర్ క్యూలైన్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎండల కారణంగా ఆలయ ప్రాంగణంతో పాటు మహామండపం, గోశాల, కనకదుర్గనగర్, ఘాట్రోడ్డులో దేవస్థానం భక్తులకు మంచినీటిని సరఫరా చేసింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత భక్తుల రద్దీ మరింత పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దర్శనం పూర్తయిన భక్తులకు దేవస్థానం ఉచిత అన్న ప్రసాద వితరణ చేసింది. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలోనూ భక్తులు, ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. కిటకిటలాడిన క్యూ సర్వ దర్శనానికి రెండు గంటలు -
భాష, సంస్కృతి వికాసానికి కృషి
విజయవాడ కల్చరల్: భాష, సంస్కృతి వికాసానికి కవులు, రచయితలు కృషి చేయాలని ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గజల్ చారిటబుల్ సంస్థ, సేవ్ టెంపుల్ ఆధ్వర్యంలో దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ నృత్య సంగీత కళాశాలలో ఆదివారం ఉగాది వేడుకలు, కవి పండితులకు సత్కారం, జాతీయ కవి సమ్మేళనం నిర్వహించారు. బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కవులు సమాజాన్ని అధ్యయనం చేయాలన్నారు. న్యాయవాది వేముల హజరత్తయ్య మాట్లాడుతూ గజల్ సాహిత్యానికి చేసిన సేవలను వివరించారు. గజల్ శ్రీనివాస్ సభకు అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ 2026లో గుంటూరులో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తునట్లు తెలిపారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను వివరిస్తూ స్వీయ గజల్ను గానం చేశారు. వివిధ రంగాలకు చెందిన గోళ్ళ నారాయణరావు, డోగిపర్తి శంకరావు,చలపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పరామర్శకు వెళ్తూ అనంతలోకాలకు.. తిరువూరు రూరల్/దమ్మపేట: పరామర్శకు వెళ్తున్న తల్లీకుమారులను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృత్యువాత పడ్డారు. ఘటన తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గాంధీనగరం గ్రామ శివారులో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన తల్లీకుమారులు అరిసెపల్లి సరస్వతి(66), అరిసెపల్లి కృష్ణ(49). సరస్వతి సోదరుడి కుమారుడు అనారోగ్యం బారిన పడ్డాడు. వారిని పరామర్శించడానికి తల్లీకుమారులు ద్విచక్రవాహనంపై తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం గ్రామంలోని బంధువుల ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో గాంధీనగర్ గ్రామ సమీపంలో గుర్తు తెలియని వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తల్లీకుమారులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్లో ఆశ్వారావుపేటకు తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ సాయికిషోర్రెడ్డి తెలిపారు. ముష్టికుంట్లలో విషాదఛాయలు తల్లీకుమారుల మృతితో ముష్టికుంట్లలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడు కృష్ణ గ్రామంలో నాయీ బ్రాహ్మణ వృత్తితో పాటు, బ్యాండ్ మేళం ట్రూప్లో పని చేస్తూ కుటుంబపోషణ చేస్తున్నాడు. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అతని కుమారుడు ప్రైవేట్ ఉద్యోగి. కుమార్తెకు వివాహమైంది. కృష్ణ మృతితో కుటుంబం పెద్దదిక్కును కోల్పోయామని భార్యా పిల్లలు కన్నీరు మున్నీరవుతున్నారు. సరస్వతి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వంట పని చేస్తుంటుంది. 70 ఏళ్ల భర్త వేలాద్రికి చేదోడుగా ఉంటుంది. మరో కుమారుడు మల్లేశ్వరరావు కూలి పని చేస్తూ జీవిస్తున్నాడు. ఒకేసారి ఆ కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో వారి వేదన వర్ణనాతీతంగా ఉంది. -
జెడ్పీటీసీ సభ్యురాలి భర్త రమేష్కు రిమాండ్
కంచికచర్ల(నందిగామ): ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లకు చెందిన వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యురాలు ప్రశాంతి భర్త వేల్పుల రమేష్ను ఆదివారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో సాయంత్రం నందిగామలోని జడ్జి ఎదుట రమేష్తో పాటు తలమాల మరియమ్మ, గారపాటి ఆంధ్రియను పోలీసులు హాజరు పరిచారు. వారికి జడ్జి 14రోజుల రిమాండ్ విధించారని ఎస్ఐ బోనగిరి రాజు తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిర మండలం బయ్యారం గ్రామానికి చెందిన తుమ్మల జోజి మొదటి భార్య కుమార్తె వాణికి కంచికచర్ల మండలం కీసర గ్రామానికి చెందిన సుధీర్తో 2009లో వివాహమైంది. వాణి, సుధీర్కు ముగ్గురు సంతానం. ఈ ఏడాది ఫిబ్రవరి 23న సుధీర్ ప్రమాదవశాత్తు కాలుజారి నేలబావిలో పడి మరణించాడు. సుధీర్ కర్మకాండలకు జోజి వచ్చారు. అప్పుడు వాణి అత్త తలమాల మరియమ్మ, కుల పెద్ద గారపాటి ఆంధ్రియ, వేల్పుల రమేష్ అతని ఆస్తిలో వాణికి అరెకరం పొలం రాయాలని కోరారు. పెద్దల మాట విన్న జోజి కుమార్తె వాణికి అర ఎకరం పొలం స్వాధీన అగ్రిమెంట్ చేశాడు. అయితే తన పేరుతో ఉన్న పొలాన్ని కుమార్తె వాణికి రాయాలని పెద్దలు బలవంతం చేశారని, భయంతో పొలాన్ని స్వాధీన అగ్రిమెంట్ చేశానని కంచికచర్ల పీఎస్లో నాలుగు రోజుల క్రితం జోజి ఫిర్యాదు చేశాడు. వాణి అత్త మరియమ్మ, కులపెద్ద గారపాటి ఆంద్రియ, వేల్పుల రమేష్పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వారిని నందిగామలోని జడ్జి ఎదుట హాజరుపర్చామని రిమాండ్ విఽధించారని ఎస్ఐ తెలిపారు. ఆదివారం ఉదయం అరెస్ట్ రమేష్తోపాటు మరియమ్మ, ఆంధ్రియకు రిమాండ్ -
అమరావతి బ్రాహ్మణ సేవా సంఘానికి నూతన కార్యవర్గం
విజయవాడ కల్చరల్: అమరావతి బ్రాహ్మణ సేవా సంఘానికి 2025–2026, 2026–2027 సంవత్సరాలకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు సేవా సంఘం ప్రధాన కార్యదర్శి తాళ్లూరి వెంకట దశరథ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. గాంధీనగర్లోని కౌతా పూర్ణానందం కళావేదికపై ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో సంస్థ అధ్యక్షుడిగా కామర్స్ విజయభార్గవ రాజేష్, కాశీభట్ల సూర్యనారాయణ శాస్త్రి ఉపాధ్యక్షుడు, కోశాధికారి అనుముల సోమశేఖర్, సీతారాంబాబు, ఈసీ సభ్యులుగా డాక్టర్ యడ్లపాటి శేషసాయి, భమిడిపాటి గణపతి, దత్తా ప్రసాద్,కుందేటి రత్నకుమార్, కావూరి సూర్యనారాయణమూర్తిని ఎన్నుకున్నారని పేర్కొన్నారు. -
నైపుణ్యాల పెంపునకు క్రీడలు దోహదం
విజయవాడస్పోర్ట్స్: సంకల్పం, లక్ష్యాలను నిర్దేశించే నైపుణ్యాన్ని పెంచుకునేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటక్చర్ ఇనిస్టిట్యూట్(ఎస్పీఏ) డైరెక్టర్ రమేష్ శ్రీకొండ అన్నారు. ఎస్పీఏ జాతీయ క్రీడా పోటీలు విజయవాడలోని ఎస్పీఏ ఇనిస్టిట్యూట్లో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. క్రీడా జ్యోతి వెలిగించి ఈ పోటీలను రమేష్ శ్రీకొండ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృషి, పట్టుదల, స్నేహభావం ప్రాముఖ్యతను క్రీడలు తెలియజేస్తాయన్నారు. క్రీడాకారులు సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉంటారని, నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో క్రీడాకారులు ముందు వరసలో ఉంటారని తెలిపారు. చదువుతో పాటు ప్రతి ఒక్క విద్యార్థి క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. ఈ జాతీయ పోటీల్లో ఢిల్లీ, భోపాల్, విజయవాడ ఇనిస్టిట్యూట్ల విద్యార్థినీ విద్యార్థులు ఫుట్బాల్, క్రికెట్, బాస్కెట్బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్ క్రీడాంశాల్లో తలపడతారని వివరించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 300 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ట్రోఫీలను రమేష్ శ్రీకొండ ఆవిష్కరించారు. ఇనిస్టిట్యూట్ రిజిస్ట్రార్ కె.ఉమామహేశ్వరరావు, డీన్ స్టూడెంట్ అఫైర్స్ ఎస్.వి.కృష్ణకుమార్, ఆర్కిటెక్చర్ హెచ్వోడీ శ్రీనివాస్, అసిస్టెంట్ ప్రొఫెసర్, స్పోర్ట్స్ కమిటీ సభ్యురాలు డి.జగత్కుమారి, ప్లానింగ్ హెచ్వోడీ ప్రశాంత్వర్థన్ పాల్గొన్నారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ డైరెక్టర్ రమేష్ శ్రీకొండ ఎస్పీఏ ఇనిస్టిట్యూట్ ప్రాంగణంలో అట్టహాసంగా ప్రారంభమైన జాతీయ క్రీడలు -
దేశ భద్రతలో సీఐఎస్ఎఫ్ కీలకం
చిలకలపూడి(మచిలీపట్నం): దేశ శాంతి భద్రతల పరిరక్షణలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ ఎఫ్) ప్రముఖ పాత్ర పోషిస్తుందని, వారు సురక్షిత తీరం – సమృద్ధి భారత్ లక్ష్యంగా చేపట్టిన సైకిల్ ర్యాలీ అభినందనీయమని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ ప్రాంగణంలో శుక్రవారం ఉదయం సముద్ర తీర సైకిల్ ర్యాలీని జిల్లా కలెక్టర్, ఏఎస్పీ సత్యనారాయణతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. సైకిల్ ర్యాలీలో 50 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బందితో కలసి జిల్లా కలెక్టర్ బాలాజీ, అదనపు ఎస్పీ సత్యనారాయణ నగరంలో మూడు స్తంభాల సెంటర్ వరకు సైకిల్ తొక్కుతూ వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ దేశంలో అత్యున్నత ప్రమాణాలతో భద్రతను అందిస్తున్న పారా మిలటరీ దళం సీఐఎస్ఎఫ్ అని కొనియాడారు. సముద్ర తీర ప్రాంత ప్రజల్లో దేశ భద్రత, సమైక్యతను పెంపొందించి దేశ, రాష్ట్ర, జిల్లా ప్రజలను సీఐఎస్ఎఫ్ సిబ్బందితో మమేకం చేస్తూ ర్యాలీ చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ సైకిల్ ర్యాలీ కలకత్తా నుంచి మొదలై తమిళనాడులోని కన్యాకుమారి వరకు 6 వేల కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతాల్లో సాగుతుందన్నారు. సముద్రతీరంలో ఏమైనా చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు, ఇతర ఇంటిలిజెన్స్ సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలు భద్రత సిబ్బందికి తెలియజేయడం ద్వారా రాబోయే ముప్పును అరికట్టవచ్చన్నారు. కార్యక్రమంలో సీఐఎస్ఎఫ్ డెప్యూటీ కమాండెంట్లు వినీత్ కుమార్ ప్రభాకర్, హృషబ్ దేవాంగన్, అసిస్టెంట్ కమాండెంట్ అరవింద్ శర్మ పలువురు సీఐఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. నిషేధిత మందులు విక్రయిస్తే కఠిన చర్యలు అవనిగడ్డ: నిషేధిత మందులను విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ ఐజీ రవికృష్ణ హెచ్చరించారు. అవనిగడ్డ లోని పలు మెడికల్ షాపులను విజిలెన్స్ అధికారులు శుక్రవారం తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 100 టీములు మెడికల్ షాపులను తనిఖీలు చేసినట్టు తెలిపారు. కొన్నిచోట్ల నిషేధిత మందులు, ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా విక్రయిస్తున్నారని, అలా చేస్తే వారిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవనిగడ్డలో రికార్డుల్లో చూపించిన వాటికంటే ఎక్కువగా ఉన్న రూ.55వేల విలువైన ట్రెమడాల్, ఆల్ఫాజూలం మందులను సీజ్ చేసినట్టు వెల్లడించారు. ఇలాంటి మందులను ఉపయోగించడం వల్ల దుష్పరిణామాలు ఎక్కువగా ఉంటాయన్నారు. డాక్టర్ సూచనలు లేకుండా ఇలాంటి మందులు విక్రయించడం నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మందుల దుకాణాల యజమానులు ప్రిస్కిప్షన్ లేకుండా మందులు విక్రయించినా, అధిక ధరలకు అమ్మినా 1972 లీగల్ కంట్రోల్ సెల్కు సమాచారం ఇస్తే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీజ్ చేసిన డ్రగ్ని అవనిగడ్డ డీఎస్పీ విద్యశ్రీకి ఐజీ రవికృష్ణ అప్పగించారు. ఈ దాడుల్లో విజిలెన్స్ ఎస్పీ నగేష్బాబు, డ్రగ్ కంట్రోల్ శాఖ డైరెక్టర్ ఎంబీఆర్ ప్రసాద్, అడిషనల్ డైరెక్టర్ అనిల్కుమార్, ఇన్స్పెక్టర్ శ్రీరామ్, పోలీస్శాఖ సోషల్ మీడియా సీఐ నున్నరాజు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 టీములతో మెడికల్ షాపుల తనిఖీ విజిలెన్స్ ఐజీ రవికృష్ణ -
ఇచ్చింది గోరంత
నష్టం కొండంత...జి.కొండూరు: గతేడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన భారీ వర్షాలకు బుడమేరు కనీవినీ ఎరుగని బీభత్సం సృష్టించింది. ఈ వరదలతో ఇటు మైలవరం నియోజకవర్గంతో పాటు విజయవాడ రూరల్ మండలాల్లో జనజీవనం అతలాకుతలమైంది. వందలాది మూగజీవాలు, ప్రజలు ప్రాణాలు కోల్పోగా వందల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ వరదలకు కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని అప్పట్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. ఈ క్రమంలో బుడమేరు డైవర్షన్ కెనాల్కు ఎడమవైపున కొండపల్లి శాంతినగర్కు సమీపంలో పడిన మూడు భారీ గండ్ల వలనే విజయవాడ పరిసర ప్రాంతాలు రోజుల తరబడి వరద ముంపులోనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గండ్లు పడిన ప్రదేశాన్ని పరిశీలించి బుడమేరు ప్రక్షాళన చేస్తామంటూ మీడియా ముందు ఊదరగొట్టారు. ఆ తర్వాత బుడమేరు ప్రక్షాళనకు రూ.500 కోట్లతో మొదటి దశ ప్రణాళిక అంటూ ఆర్భాటంగా ప్రకటించి తదనంతరం ఈ వ్యవహారాన్ని పట్టించుకోకుండా వదిలేశారు. ఈ క్రమంలో బుడమేరు ఆధునికీకరణ, హెడ్ రెగ్యులేటర్ మరమ్మతులు, గండ్లు పూడ్చిన ప్రదేశంలో లీకేజీల వలన వరద ప్రవాహంపై ‘సాక్షి’ పలుమార్లు కథనాలను ప్రచురించింది. ‘సాక్షి’ కథనాలకు స్పందించిన కలెక్టర్ లక్ష్మీశ సైతం ఇటీవల హెడ్ రెగ్యులేటర్ను, గండ్లు పడిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఆ తర్వాత రెగ్యులేటర్ మరమ్మతులు, గండ్లు పడిన ప్రదేశంలో లైనింగ్ పనులకు గానూ రూ.39.77 కోట్లు నిధులు విడుదల చేస్తున్నామంటూ అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖ మంత్రి ప్రకటించారు. ఈ నిధులపై ప్రభుత్వం శుక్రవారం జీఓని విడుదల చేసింది. చేయాల్సింది కొండంత... బుడమేరుకు వచ్చిన వరద ఉధృతితో వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎగువన అంటే బుడమేరు ప్రారంభం వరకు 42 కిలోమీటర్ల మేర ఉన్న బుడమేరు కాల్వకు 80కి పైగా గండ్లు పడ్డాయి. వీటిని అధికారులు 65 పనులుగా నిర్ధారించి రూ.29 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనాలు తయారు చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి మూడు నెలల క్రితం ప్రతిపాదనలు పంపారు. ఈ నిధులు ఇప్పటివరకు విడుదల చేయలేదు. ఈ గండ్లను శాశ్వతంగా పూడ్చడంతో పాటు ఆక్రమణలు తొలగించి బుడమేరుకు ఇరువైపులా కట్టలు బలోపేతం చేయాల్సి ఉంది. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణానది వరకు 11.90 కిలోమీటర్ల మేర ఉన్న బుడమేరు డైవర్షన్ కెనాల్కు ఎడమ వైపు కట్టకు మూడు గండ్లు, కుడి వైపు కట్టకి ఏడు చోట్ల గండ్లు పడ్డాయి. ఈ గండ్లను అప్పట్లో తాత్కాలికంగా పూడ్చారు. ఈ 11.90 కిలోమీటర్ల డైవర్షన్ కెనాల్ను 37,555 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యానికి పెంచుతూ లైనింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. అయితే కేవలం అర కిలోమీటరు లైనింగ్ పనులకు మాత్రమే నిధులు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎనికేపాడు వరకు 13.25 కిలోమీటర్ల మేర ఆక్రమణలు తొలగించాల్సి ఉంది. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని బుడమేరులో 202 ఎకరాలకు గానూ 70 ఎకరాల వరకు ఆక్రమణల చెరలో ఉన్న బుడమేరుకు ఆక్రమణలు తొలగించి మోక్షం కలిగించాల్సి ఉంది. ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు 50.6 కిలోమీటర్ల మేర బుడమేరుకు ఇరువైపులా గట్లను బలోపేతం చేయాల్సి ఉంది. ఇవే కాకుండా మైలవరం నియోజకవర్గంలోని పులివాగు, కోతులవాగుతో పాటు పలు వాగులకు పడిన గండ్లు, ఎన్ఎస్పీ కాల్వలు, 32 చెరువులకు పడిన గండ్లకు శాశ్వతంగా మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. వీటికి గానూ రూ.30 కోట్లకు పైగా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ పనులకు నిధులు విడుదల చేయలేదు. ఈ పనులను చేపట్టకపోతే వచ్చే వర్షాకాలంలో పది సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనా విజయవాడను మరోసారి వరద ముంచెత్తే ప్రమాదం ఉంది. ప్రభుత్వం అరకొర నిధులు కేటాయించి చేతులు దులుపుకొంటే మరో ఉప్పెనను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రక్షాళనకు రూ.500 కోట్లు అంటూ రూ.39.77 కోట్లకు జీఓ విడుదల హెడ్ రెగ్యులేటర్కు ఎగువ బుడమేరు గండ్లకు విడుదల కాని నిధులు డైవర్షన్ కెనాల్ పూర్తి ఆధునికీకరణ ప్రశ్నార్థకమే వచ్చే ఏడాదీ వరద ముంపు తప్పదని ప్రజల ఆందోళన నిధుల విడుదల ఇలా... ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం వెలగలేరు వద్ద బుడమేరు హెడ్ రెగ్యులేటర్ మరమ్మతుల కోసం రూ.180 లక్షలను కేటాయించారు. డైవర్షన్ కెనాల్కు ఇరువైపులా కొండపల్లి శాంతినగర్ సమీపంలో పడిన గండ్ల వద్ద 3.840 కిలోమీటర్ల నుంచి 4.340 కిలోమీటర్ల వరకు అర కిలోమీటరు లైనింగ్ పనులకు గానూ రూ.3,797 లక్షలను కేటాయించారు. మొత్తంగా ఈ పనులకు రూ.39.77 కోట్లను కేటాయించి చేతులు దులుపుకొన్నారు. -
ఆదాయంలో విజయవాడ డివిజన్ రికార్డు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇంకా 11 రోజులు ఉండగానే విజయవాడ రైల్వే డివిజన్ రూ.5,638 కోట్ల ఆదాయం సాధించి సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. అందులో సరకు రవాణా ద్వారా రూ.4,092.21 కోట్ల ఆదాయంతో రవాణాలోనే సుస్థిరమైన వృద్ధి సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.5,625 కోట్ల స్థూల ఆదాయం రాగా, అందులో సరకు రవాణా ద్వారా రూ.4,032 కోట్లు ఆదాయం లభించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు డివిజన్ స్థూల ఆదాయం రూ.5,638 కోట్లు కాగా, అందులో 72.6 శాతం భాగం సరుకు రవాణా ద్వారా రూ.40,98 కోట్లు, 23.78 శాతం ప్రయాణికుల ఆదాయంతో రూ.1,342 కోట్లు, 1.9 శాతంతో ఇతర కోచింగ్ సేవలు (పార్శిల్, టికెట్ తనీఖీలు) ద్వారా రూ.109 కోట్లు, 1.6 శాతం ఇతర మార్గాల ద్వారా రూ.89 కోట్లు ఆదాయం సమకూర్చుకుంది. ఆదాయంలో డివిజన్ వృద్ధి సాధించడం పట్ల సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు, సీనియర్ డీఓఎం డి.నరేంద్రవర్మలను డీఆర్ఎం ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5,638 కోట్ల స్థూల ఆదాయం 72.6 శాతం సరకు రవాణా ఆదాయం -
ఫిషింగ్ హార్బర్ పనులు జూన్ 15 నాటికి పూర్తి
మచిలీపట్నంటౌన్: వచ్చే జూన్ 15వ తేదీ నాటికి ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రారంభిస్తామని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంత్రి రవీంద్ర శుక్రవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి గిలకలదిండి సముద్ర తీరంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను పరిశీలించారు. తొలుత వారు గిలకలదిండిలోని మత్స్యశాఖ కార్యాలయ కమ్యూనికేషన్ స్టేషనులో ఫిషింగ్ హార్బర్ రేఖా చిత్రపటా న్ని పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ఫిష్ హ్యాండ్లింగ్, ఆక్షన్ హాల్, ఐస్ ప్లాంట్, రేడియో కమ్యూనికేషన్ తదితర భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మచిలీపట్నం చేపల వేటకు ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. పడవల తయారీ కూడా ఇక్కడే జరుగుతుందన్నారు. రూ.421 కోట్ల వ్యయంతో మార్చి 2021 సంవత్సరంలో హార్బర్ నిర్మాణం పనులు చేపట్టినప్పటికీ 35 శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయన్నారు. నిర్ణీత గడువు ముగిసినందున మరలా నిర్మాణ కాలం గడువు పొడిగింపునకు నిధుల మంజూరుకు మారిటైంబోర్డు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుందన్నారు. డ్రెడ్జింగ్ పనులు కొంతమేరకు జరిగాయని, సముద్ర ముఖ ద్వారం డిజైన్లు ఇంకా నిర్ధారణ కాలేదని, చైన్నె ఐఐటీ నివేదిక అందాల్సి ఉందన్నారు. ఆ నివేదిక తక్షణమే తెప్పించేందుకు తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామన్నారు. హార్బర్లో వివిధ రకాల భవనాల నిర్మాణ పనులు, నీరు, మురుగునీటి వ్యవస్థ, రహదారుల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. వచ్చే ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు వేట నిషేధ కాలం ఉంటుందని, ఆ లోగా తప్పనిసరిగా అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. తన చిన్నతనంలో ఇక్కడ ఓడల నిర్మాణం జరిగేదని, ఈ ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకురావడానికి తన వంతు గట్టిగా కృషి చేస్తానన్నారు. ఇందులో భాగంగా ఇక్కడి మత్స్యకారులకు పర్యాటక శాఖ ద్వారా పడవల నిర్మాణంపై నైపుణ్యం పెంపొందించేందుకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. భవిష్యత్తులో ఇక్కడ తయారయ్యే పడవలను ప్రపంచంలో ఎక్కడికై నా పంపించే విధంగా అభివృద్ధి పరుస్తామన్నారు. ఇక ప్రతి వారం ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి సత్వరమే పూర్తికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామన్నారు. పర్యటనలో మంత్రి, కలెక్టర్ వెంట మత్స్య శాఖ అధికారి నాగబాబు, మారిటైమ్ బోర్డు కన్సల్టెన్సీ ఏపీ అర్బన్ సీనియర్ ఇంజినీర్ శశికుమార్, ప్రాజెక్టు మేనేజర్ ప్రసాదరావు, తహసీల్దారు మధుసూదన్రావు తదితర అధికారులు పాల్గొన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర -
సుబ్రహ్మణ్యుని సన్నిధిలోసీఐఎస్ఎఫ్ బృందం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని కొల్కత(వెస్ట్ బెంగాల్) సీఐఎస్ఎఫ్ బృందం శుక్రవారం దర్శించుకుంది. ఉదయం ఆలయానికి చేరుకున్న వీరికి చల్లపల్లి సీఐ ఈశ్వరరావు, ఆలయ సిబ్బందితో కలసి స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ చేసిన అనంతరం నాగపుట్ట లో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు విరూప్ శర్మ స్వామివారికి అభిషేకం నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. కొల్కత నుంచి కన్యాకుమారికి సైకిల్ యాత్ర చేపట్టిన సీఐఎస్ఎఫ్ బృందానికి ఆలయ అధికారి మధుసూదనరావు, స్థానిక ఎస్ఐ సత్యనారాయణ, ఆలయ సిబ్బంది, గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు. నీరు అత్యంత విలువైన వనరు గుడివాడటౌన్: ప్రపంచంలో అత్యంత విలువైన వనరు నీరు అని 11వ అదనపు జిల్లా జడ్జి జి.సుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు. నీటి వాడకంలో మార్పులను ప్రేరేపించడానికి ఇది ఒక మంచి అవకాశం అన్నారు. శనివారం జరగనున్న ప్రపంచ నీటి దినోత్సవంను ప్రజలు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. నీటి నిల్వలు పెరిగేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి నీటిని సంరక్షించాలని, నీటి వినియోగంపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. నీటిని వృథా చేయకుండా ఉండటం, పరిశుభ్రమైన నీటిని తాగడం ప్రతి ఒక్కరి హక్కు అని తెలిపారు. నీటి కాలుష్యం తగ్గేలా, నీటిలో ప్రమాదకరమైన రసాయనాల విడుదల అరికట్టేలా అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. పర్వతాలు, అడవులు, చిత్తడి నేలలు, నదులు, జలాశయాలు, సరస్సులు వంటి నీటి సంబంధిత పర్యావరణ వ్యవస్థను రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ట్రాఫిక్ డీసీపీ నాయుడుకి మహోన్నత సేవా పథకం విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మహోన్నత సేవా పథకానికి ట్రాఫిక్ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) ఎం.కృష్ణమూర్తి నాయుడు ఎంపికయ్యారు. పోలీస్ శాఖలో సమర్థంగా పనిచేసి ప్రజలకు విశిష్ట సేవలు అందించినందుకు గాను 2025వ సంవత్సరానికి మహోన్నత సేవా పథకానికి ఎంపికయ్యారు. 1989లో కృష్ణమూర్తి నాయుడు ఎస్ఐగా సర్వీస్ ప్రారంభించి అంచెలంచెలుగా డీసీపీ స్థాయి హోదాకు ఎదిగారు. సేవా పథకానికి ఎంపికై న కృష్ణమూర్తి నాయుడుని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు ప్రత్యేకంగా అభినందించారు. జన గణనతో పాటే కుల గణన జరపాలి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు మంగళగిరి: జనగణనతోపాటే సమగ్ర కుల గణన జరపాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని ఆత్మకూరు జాతీయ రహదారి వెంట ఉన్న సంఘం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓబీసీల ప్రధాన డిమాండ్లపై జాతీయస్థాయిలో ఈ నెల 24,25,26 తేదీలలో తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. మహిళా రిజర్వేషన్ కోటాలో ఓబీసీ మహిళల సబ్ కోటా చేయాలని డిమాండ్ చేశారు. ఓబీసీల ప్రధాన డిమాండ్లపై 24న కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులను కలిసి విజ్ఞాపన పత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు. సమగ్ర కుల గణనపై జాప్యాన్ని నిరసిస్తూ జంతర్ మంతర్ వద్ద 25న ధర్నా చేపడతామన్నారు. 26న ఓబీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపడతామన్నారు. కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి కుమ్మరి క్రాంతికుమార్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఉప్పాల శివలక్ష్మి, శాలివాహన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీవీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
గ్రామీణ వైద్యులపై దుష్ప్రచారాలు తగదు
హనుమాన్జంక్షన్ రూరల్: దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందిస్తూ, స్వయం ఉపాధి పొందుతున్న ఆర్ఎంపీ, పీఎంపీలపై అవాస్తవాలను దుష్ప్రచారం చేస్తున్నారని కృష్ణాజిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బి.వెంకట రాజు, ప్రధాన కార్యదర్శి ఎన్.రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక నూజివీడు రోడ్డులోని పౌల్ట్రీ ఫ్మార్మర్స్ వెల్ఫేర్ సిండికేట్ హాల్లో హనుమాన్జంక్షన్ ఏరియా గ్రామీణ వైద్యుల సమావేశం శుక్రవారం జరిగింది. అనంతరం సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వెంకటరాజు, రాంబాబు మాట్లాడుతూ గ్రామీణ వైద్యులు యాంటీ బయోటిక్స్, స్టెరాయిడ్స్ అధికంగా వాడుతున్నారనే దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం అందించి జీవనోపాధి పొందుతున్న ఆర్ఎంపీల వ్యవస్థను నిర్వీర్యం చేయాలనే తలంపు మంచిది కాదన్నారు. దీనిపై మరింత విస్తృతంగా చర్చించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు అనంతపురంలో ఈ నెల 24, 25 తేదీల్లో రాష్ట్ర ఫెడరేషన్ కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. అంతకు ముందుగా ప్రభ హాస్పిటల్ (ఏలూరు) ఆధ్వర్యంలో ఎముకలు, కీళ్ల వైద్య నిపుణడు డాక్టర్ సునీల్ సందీప్ ఆర్ఎంపీలకు పలు ప్రాథమిక వైద్య సేవలపై అవగాహన కల్పించారు. సంఘం జిల్లా కోశాధికారి రంగారావు, హనుమాన్జంక్షన్ ఏరియా అధ్యక్షుడు కె.నరసింహారావు, కార్యదర్శి కోటా చైతన్య, కోశాధికారి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
బందరులో దారుణ హత్య
కోనేరుసెంటర్: వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాన్ని బలి తీసుకుంది. స్నేహితుడే అతన్ని అంతమొందించాడు. ఈ ఘటన మచిలీపట్నంలోని వర్రేగూడెంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్రేగూడెంకు చెందిన వీర్నాల శ్రీను అలియాస్ టోపీ శ్రీను(45) వ్యాను నడుపుతుంటాడు. అదే ప్రాంతానికి చెందిన, గతంలో హోంగార్డుగా పనిచేసిన సుంకర రమణ, శ్రీను స్నేహితులు. సుంకర రమణ ప్రేమ వివాహం చేసుకోగా.. ఈతని భార్యతో శ్రీను సన్నిహితంగా మెలిగేవాడు. ఈ విషయంలో ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. కొంత కాలంగా రమణ భార్యను శ్రీను వేరే ఇంట్లో పెట్టి వివాహేతర సంబంధం నడుపుతున్నాడు. అవమానం తట్టుకోలేని రమణ కొంతకాలం క్రితం హైదరాబాద్ వెళ్లిపోయాడు. అక్కడే ఉంటూ వేరే పనులు చేసుకుంటున్నాడు. మూడు రోజుల క్రితమే వచ్చి.. హైదరాబాద్లో ఉంటున్న రమణ మూడు రోజుల క్రితం మచిలీపట్నం వచ్చాడు. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో రమణ, శ్రీనుల మధ్య మరలా ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో రమణ అతని స్నేహితులతో కలిసి శ్రీనును క్రికెట్ బ్యాట్తో తలపై బలంగా కొట్టి చంపాడు. విషయం తెలుసుకున్న ఇనగుదురుపేట పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని మచిలీ పట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు సీఐ పరమేశ్వరరావు తెలిపారు. హత్య జరిగిన విషయాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు సంఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు. ఘటనకు గల కారణాలను తెలుసుకున్నారు. హత్యకు పాల్పడిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు. స్నేహితుడిని క్రికెట్ బ్యాట్తో కొట్టి చంపిన వైనం వివాహేతర సంబంధమే కారణం కేసు నమోదు చేసిన పోలీసులు -
ప్రజాభాగస్వామ్యంతో బందరు అభివృద్ధి
మచిలీపట్నంటౌన్: బందరు అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు సహకారం అందించాలని గనులు, భూగర్భ వనరులు ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. బందరు స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నగర పరిధిలోని పాత రైల్వే స్టేషన్ నుంచి బందరుకోటకి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఇతర కూటమి నాయకులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం, కూటమి నాయకుల సహకారంతో నగరం మొత్తాన్ని పచ్చదనంగా మార్చేందుకు, రహదారులను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ ప్రణాళికలో భాగంగా నగరంలో రహదారులకిరువైపులా ఉన్న ఆక్రమణలను ఇప్పటికే తొలగిస్తూ వస్తున్నామన్నారు. సీఆర్డీఏ పరిధిలోకి ముడా.. నగరంలోని రహదారులపై పశువుల సంచారంతో ప్రమాదాలకు ముప్పుగా మారిందని, దీనిని అధిగమించేందుకు మంగినపూడి బీచ్ ప్రాంతంలో 15 ఎకరాలు కేటాయించి, పట్టించుకోని పశువులను అక్కడకు తరలించనున్నట్లు మంత్రి చెప్పారు. జిల్లా పరిధిలోని ముడా ఏరియాని సీఆర్డీఏ రాజధాని పరిధిలోకి తీసుకువచ్చే విధంగా జిల్లాలోని ముఖ్య నాయకులతో త్వరలో ముఖ్యమంత్రిని కలిసి అభ్యర్థిస్తామన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపిచంద్, జిల్లా ప్రజా రవాణా అధికారి వాణీశ్రీ, కూటమి నాయకులు పాల్గొన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర -
ఆటోమేటిక్ రెయిన్గేజ్ స్టేషన్కు సన్నాహాలు
కంకిపాడు: మండల కేంద్రమైన కంకిపాడులో ఆటోమేటిక్ రెయిన్గేజ్ స్టేషన్ ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఎగువ వైపు ఖాళీ స్థలంలో రెయిన్గేజ్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని గుర్తించారు. ఆ స్థలంలో రెయిన్గేజ్ స్టేషన్ ఏర్పాటుకు అవసరమైన పనులను చేపట్టారు. వాతావరణ పరిస్థితుల అంచనాలు, వర్షపాత నమోదు తదితర అంశాలు స్టేషన్ ద్వారా వెల్లడి కానున్నాయి. స్టేషన్ పనులను తహసీల్దార్ వి.భావనారాయణ సిబ్బందితో కలిసి శుక్రవారం పరిశీలించారు. పోలీసులకు సేవా, ఉత్తమ సేవా పతకాలు కోనేరుసెంటర్: ఉగాది పండుగను పురస్కరించుకుని జిల్లాలో పలువురు పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకాలు, ఉత్తమ సేవా పతకాలను అందజేయనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణాజిల్లా స్పెషల్బ్రాంచ్ విభాగంలో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న వై. లక్ష్మణస్వామి ఉత్తమ సేవా పతకానికి ఎంపికయ్యారు. అలాగే జిల్లా స్పెషల్బ్రాంచ్లో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న కె. హేమానందం (హెచ్సీ–1252), మచిలీపట్నం పోలీస్స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా పని చేస్తున్న కేవీ శ్రీనివాసరావు(హెచ్సి–604), డార్మిట్లో ఏఆర్ హెడ్కానిస్టేబుల్ జె. నందకిషోర్ (ఏఆర్హెచ్సీ–915), అవనిగడ్డ పీఎస్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్న కె. వెంకటేశ్వరరావు(హెచ్సీ–719), ఉమెన్ పీఎస్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న బి. శాంతకుమారి (ఉమెన్ ఏఎస్ఐ– 1617), డార్మిట్లో పనిచేస్తున్న ఏఆర్ హెడ్కానిస్టేబుల్ ఎస్కే ఇబ్రహీం (ఏఆర్హెచ్సీ–2363), గుడివాడ టూ టౌన్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఎస్కే రీహాన్ (పీసీ–1108), కంకిపాడు పీఎస్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ పి. రాధాకృష్ణ (పీసీ–794)లు సేవా పతకాలకు ఎంపిక అయ్యారు. వీరంతా ఉగాది రోజున ప్రభుత్వం తరపున పతకాలను అందుకోనున్నారు. ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంతం చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి శుక్రవారం ఇంగ్లిష్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 21,114 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 20,840 మంది విద్యార్థులు హాజరయ్యారు. డీఈవో పీవీజే రామారావు జిల్లాలోని ఏడు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ డేవిడ్రాజు రెండు పరీక్ష కేంద్రాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 37 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఓపెన్ స్కూల్స్కు సంబంధించి 1,035 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 739 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందని, మాస్ కాపీయింగ్ జరగలేదని డీఈవో తెలిపారు. -
నర్సింగ్ వృత్తి పవిత్రమైంది
గన్నవరం రూరల్: నర్సింగ్ వృత్తి పవిత్రమైనదని, ఒత్తిడిని జయించి నర్సింగ్ వృత్తిలో రాణించాలని ఏపీ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సుశీల సూచించారు. మండలంలోని చిన అవుటపల్లి డాక్టర్ సి. శోభనాద్రి సిద్ధార్థ నర్సింగ్ అండ్ స్కూల్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన రాష్ట్ర స్థాయి నర్సింగ్ కాన్ఫరెన్స్కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన వర్క్ షాప్ను ఉద్ధేశించి ఆమె మాట్లాడుతూ అసాధారణ ఒత్తిడి ఉద్యోగ జీవితంలో ప్రభావితం చేయరాదన్నారు. సెల్ఫోన్, సోషల్ మీడియా ప్రభావంతో మానవ సంబంధాలు విచ్ఛిన్నం అవుతున్నాయని, బాధ్యతాయుత వృత్తిలో ఉన్న నర్సులు వీటికి దూరంగా ఉండాలన్నారు. ఒత్తిడిని జయించేందుకు మార్గాలను వివరించారు. ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ నర్సులు చిరునవ్వుతో సేవలందించాలన్నారు. రోగులను నిరంతరం కనిపెట్టుకుని ఉండేది నర్సులేనన్నారు. రాష్ట్రంలోని 18 నర్సింగ్ కళాశాలల నుంచి విద్యా ర్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు వర్క్ షాప్నకు హాజరయ్యారు. రిసోర్స్ స్పీకర్స్గా సిస్టర్ ఫ్లోరెన్స్, కోటేశ్వరమ్మ, ప్రిన్సిపాల్ జె.వందన, డాక్టర్ ఝాన్సీ రాణి వ్యవహరించారు. మెడికల్ కళాశాల డైరెక్టర్ జనరల్ డాక్టర్ సి.నాగేశ్వరరావు, డైరెక్టర్ డాక్టర్ సీవీ రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ భీమేశ్వర్, నర్సింగ్ కళాశాల కన్వీనర్ వి.శశికళ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఏపీ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ సుశీల -
విజేతలుగా గుంటూరు, విజయవాడ ఉద్యోగులు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): భీమవరంలో జరిగిన ఆల్ ఇండియా సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్ 45 ప్లస్ డబుల్స్ కేటగిరీలో విజయవాడ, గుంటూరు డివిజన్ల ఉద్యోగులు విజేతలుగా నిలిచారు. ఈ నెల 20న జరిగిన ఫైనల్స్లో విజయవాడ డివిజన్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్లో టెక్నీషియన్ సంపత్కుమార్, గుంటూరులోని అమరావతి బెంచ్ రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ అదనపు రిజిస్ట్రార్ రాజేంద్ర ప్రసాద్ చాంపియన్స్గా నిలిచారు. హారాహోరీగా జరిగిన ఫైనల్లో ఖమ్మంకు చెందిన వెంకటేశ్వరరావు, పాల్వంచ నుంచి భాస్కరరావులతో వారు పోటీపడి విజేతలుగా గెలిచారు. -
హ్యాండ్బాల్ రాష్ట్ర విజేత పశ్చిమగోదావరి
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి అండర్–19 జూనియర్ బాలికల హ్యాండ్బాల్ పోటీల్లో పశ్చిమగోదావరి జిల్లా సత్తా చాటింది. ఈ నెల 20వ తేదీన విజయవాడలోని ఆంధ్రా లయోల కాలేజీలో ప్రారంభమైన ఈ పోటీలకు 12 ఉమ్మడి జిల్లాలు ప్రాతినిధ్యం వహించారు. లీగ్ కం నాకౌట్ పద్ధతిలో జరిగిన ఈ పోటీల్లో పశ్చిమగోదావరి జట్టు వరుస విజయాలను సాధించింది. శుక్రవారం జరిగిన ఫైనల్స్లో ప్రత్యర్థి తూర్పుగోదావరి జిల్లా జట్టును ఓడించి విన్నర్ ట్రోఫీని అందుకుంది. తూర్పు గోదావరి జిల్లా రన్నర్ ట్రోఫీని అందుకుంది. మూడో స్థానం కోసం కృష్ణా, విశాఖపట్నం జిల్లాలు తలపడ్డాయి. ఈ పోటీల్లో కృష్ణాజిల్లా జట్టు విజయం సాధించి తృతీయ బహుమతిని అందుకుంది. విజేతలకు ఆంధ్రప్రదేశ్ హ్యాండ్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మల్లేశ్వరరావు, లయోల కాలేజీ వ్యాయామ విద్యా విభాగాధిపతి డాక్టర్ కె.సుజాత ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో హ్యాండ్బాల్ సంఘం రాష్ట్ర కార్యదర్శి పెనుమత్స సత్యనారాయణరాజు, కృష్ణాజిల్లా హ్యాండ్బాల్ సంఘం కార్యదర్శి ఎన్.వంశీకృష్ణప్రసాద్ పాల్గొన్నారు. రన్నరప్గా తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాకు మూడో స్థానం -
నాణ్యమైన రెవెన్యూ సేవలే లక్ష్యం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజలకు నాణ్యమైన రెవెన్యూ సేవలు అందించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా సూచించారు. విజయవాడ గవర్నర్పేట రైతు శిక్షణ కేంద్రం సమావేశ మందిరంలో శుక్రవారం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం ఆధ్వర్యంలో రెవెన్యూ సేవల పంపిణీపై అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలకు శిక్షణ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, సీసీఎల్ఏ జి.జయలక్ష్మి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రెవెన్యూ సేవలు అందించడంతోపాటు ఏవైనా సమస్యలు ఎదురైతే వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, నిరంతర పర్యవేక్షణ, క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం తదితరాలపై మార్గనిర్దేశం చేశారు. రెవెన్యూ అంశాలకు సంబంధించి వచ్చే ఆరు నెలల సమయం చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో ఎక్కడా జాప్యం లేకుండా రోజువారీ కార్యకలాపాలు నిర్వహించేందుకు, డేటా నమోదులో కచ్చితత్వానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ల్యాండ్ ఎన్ క్రోచ్ మెంట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కచ్చితంగా అమలు చేసి కేసులు నమోదు చేయాలన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పేపర్ లెస్, స్మార్ట్ గవర్నన్స్ అందించాలన్నారు. రీసర్వేపై సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల డైరెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, ఇనామ్, ఎస్టేట్, పీవోటీ చట్టాలపై విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ లక్ష్మీ నరసింహం, రికార్డ్ ఆఫ్ రైట్స్, భూ ఆక్రమణలు, ల్యాండ్ గ్రాబింగ్పై విశ్రాంత ఐఏఎస్ అధికారి బి.రామయ్య శిక్షణ ఇవ్వగా.. వెబ్ల్యాండ్ సంబంధిత అంశాలపై ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.రచన వివరించారు. వివిధ సందేహాలను నివృత్తి చేశారు. శిక్షణ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా -
నిర్లక్ష్యమే ప్రాణం తీసింది!
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): బుడమేరు కాలువ లీకేజీల పూడ్చివేతలో అధికారులు నిర్లక్ష్యం ఓ విద్యార్థి ప్రాణం బలి తీసుకుంది. కొండపల్లి శాంతినగర్ వద్ద శుక్రవారం లీకేజీలతో ఏర్పడిన గుంత లో ప్రమాదవశాత్తూ పడి బలుసుపాటి కుమార్(14)అనే విద్యార్థి మృత్యువాత పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. కవులూరు గ్రామానికి చెందిన బలుసుపాటి పద్మారావు, నాగమణి దంపతులకు ఇద్దరు కుమారులు. రిక్షా తొక్కి కాయకష్టంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు బిడ్డలను స్థానిక జెడ్పీ పాఠశాలలో చదివిస్తున్నారు. పెద్ద కుమారుడు ప్రస్తుతం టెన్త్క్లాస్ పరీక్షలకు హాజరవుతుండగా, రెండో కుమారుడు బలుసుపాటి కుమార్ 9వ తరగతి చదువుతున్నాడు. పాఠశాల సమీపంలో ఉన్న లీకేజీ గుంతల వద్దకు తన స్నేహితుడితో కలిసి వెళ్లగా ప్రమాదవశాత్తూ కాలుజారి గుంతలో పడి విద్యార్థి మృత్యువాత పడ్డాడు. మరో విద్యార్థి ద్వారా విషయం తెలుసుకున్న గ్రామస్తులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. అల్లారుముద్దుగా పెంచి పోషించుకున్న కుమారుడు కళ్లముందు నిర్జీవంగా ఉండటాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు. ఈ పాపం ఎవరిది? గత ఆగష్టు, సెప్టెంబర్లలో వచ్చిన వర్షాలతో కొండపల్లి వద్ద బుడమేరు కట్టలకు భారీస్థాయి గండ్లు పడి విజయవాడలో అనేక ప్రాంతాలను నీటితో ముంచెత్తింది. గండ్లను తాత్కాలికంగా పూడ్చి పని అయిపోయినట్లు ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంది. అయితే పూడ్చిన గండ్లు వద్ద అనతి కాలంలో లీకేజీలు ఏర్పడి రైతులు పంటపొలాల్లో నీరు ప్రవహించి భారీస్థాయి గుంతలు ఏర్పడ్డాయి. వీటిని ఇప్పటికీ పూర్తిస్థాయిలో పూడ్చక పోవడంతో ఆ గుంతలో పడిన విద్యార్థి ప్రాణం కోల్పోయాడు. దీంతో తల్లిదండ్రులకు తీరని వేదన మిగిలింది. బుడమేరు లీకేజీ గుంతలో పడి బాలుడు మృతి -
సీఎం చంద్రబాబుకు ఉగాది పచ్చడి పంపుతాం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వలంటీర్లకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరుతూ సీఎం చంద్రబాబు నాయుడుకు ఉగాది పచ్చడి పంపబోతున్నట్లు వలంటీర్ల అసోసియేషన్ ప్రకటించింది. శుక్రవారం విజయవాడ హనుమాన్ పేట సీపీఐ కార్యాలయంలో వలంటీర్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు ఉగాది పచ్చడి తింటూ.. వలంటీర్లకు తీపి కబురు చెబుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తానని, నెలకు రూ. 5వేలు ఎలా సరిపోతాయి? పెరిగిన డీజిల్, పెట్రోల్, గ్యాస్, నిత్యవసర సరుకులు ధరలకు అనుగుణంగా రూ. 10వేలు గౌరవ వేతనం పెంచుతామని హామీ ఇచ్చారన్నారు. ఎన్నికల ప్రచారంలో అనేక సభల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, పురంధేశ్వరి వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారన్నారు. కానీ అధికారంలోకి వచ్చి తర్వాత 10 నెలలు గడుస్తున్నా వలంటీర్లకు ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. మార్చి 30 ఉగాది సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వలంటీర్లు సీఎం చంద్రబాబు నాయుడుకు ఉగాది పచ్చడి పంపాలని పిలుపునిచ్చారు. వలంటీర్లు పంపిన పచ్చడి తిని వలంటీర్లకు ఇచ్చిన హామీని గుర్తు తెచ్చుకోవాలన్నారు. సమావేశంలో నాయకులు మమత, షైని, నరేష్, కల్యాణ్, శివ పార్వతి, స్వప్న, దమ్ము రమేష్ పాల్గొన్నారు. ఏపీ గ్రామ, వార్డు వలంటీర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ -
హ్యాండ్బాల్ రాష్ట్ర విజేత పశ్చిమగోదావరి
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి అండర్–19 జూనియర్ బాలికల హ్యాండ్బాల్ పోటీల్లో పశ్చిమగోదావరి జిల్లా సత్తా చాటింది. ఈ నెల 20వ తేదీన విజయవాడలోని ఆంధ్రా లయోల కాలేజీలో ప్రారంభమైన ఈ పోటీలకు 12 ఉమ్మడి జిల్లాలు ప్రాతినిధ్యం వహించారు. లీగ్ కం నాకౌట్ పద్ధతిలో జరిగిన ఈ పోటీల్లో పశ్చిమగోదావరి జట్టు వరుస విజయాలను సాధించింది. శుక్రవారం జరిగిన ఫైనల్స్లో ప్రత్యర్థి తూర్పుగోదావరి జిల్లా జట్టును ఓడించి విన్నర్ ట్రోఫీని అందుకుంది. తూర్పు గోదావరి జిల్లా రన్నర్ ట్రోఫీని అందుకుంది. మూడో స్థానం కోసం కృష్ణా, విశాఖపట్నం జిల్లాలు తలపడ్డాయి. ఈ పోటీల్లో కృష్ణాజిల్లా జట్టు విజయం సాధించి తృతీయ బహుమతిని అందుకుంది. విజేతలకు ఆంధ్రప్రదేశ్ హ్యాండ్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మల్లేశ్వరరావు, లయోల కాలేజీ వ్యాయామ విద్యా విభాగాధిపతి డాక్టర్ కె.సుజాత ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో హ్యాండ్బాల్ సంఘం రాష్ట్ర కార్యదర్శి పెనుమత్స సత్యనారాయణరాజు, కృష్ణాజిల్లా హ్యాండ్బాల్ సంఘం కార్యదర్శి ఎన్.వంశీకృష్ణప్రసాద్ పాల్గొన్నారు. రన్నరప్గా తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాకు మూడో స్థానం -
ఎస్ఆర్ఆర్ కళాశాలలో పీ4 జిల్లా స్థాయి పోటీలు
మధురానగర్(విజయవాడసెంట్రల్): మాచవరం ఎస్ఆర్ఆర్అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం పేదరిక నిర్మూలన అనే అంశంపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఆధ్వర్యంలో వ్యాసరచన, వక్తృత్వం, పోస్టర్ మేకింగ్ జిల్లా స్థాయి పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు పోటీలలో పాల్గొని వారిలోని సృజనాత్మకతను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు పోటీలు నిర్వహించామన్నారు. పోటీలలో విజేతలకు జిల్లా కలెక్టర్ చేతులమీదుగా బహుమతి ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఎన్టీఆర్ జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కొల్లేటి రమేష్, డాక్టర్ శాంతకుమారి, డాక్టర్ అజయ్ బాబు, డాక్టర్ రాధిక, డాక్టర్ పీఎల్ దాస్, డాక్టర్ భాను ప్రసాద్ వ్యవహరించారు. -
గుడులు, గోవులకూ రక్షణ కరువు
మధురానగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వంలో గుడులు, గోవులకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. జీవీఆర్ నగర్ ట్రెండ్ సెట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న వినాయక ఆలయాన్ని వీఎంసీ అధికారులు కూల్చివేయటం దారుణమని మండిపడ్డారు. అధికారులు పొక్లయినర్లతో కూల్చివేసిన ఆలయాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఆలయాన్ని కూల్చివేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోసియేషన్ సభ్యులకు కనీస సమాచారం అందించకుండా.. అప్పటికప్పుడు రెండు పొక్లయినర్లతో కూల్చివేయటం ఏమిటని ప్రశ్నించారు. గత ఏడాది కాలంగా ట్రెండ్ సెట్లో ఆలయ నిర్మిస్తామని.. అభ్యంతరాలు ఉంటే ప్రాథమిక దశలోనే ఎందుకు నిలుపుదల చేయలేదని ప్రశ్నించారు. పైగా గర్భగుడిలోకి జేసీబీలను పంపించటం.. కూటమి ప్రభుత్వ అహంకారానికి అద్దం పడుతోందన్నారు. కౌన్సిల్ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తారని చెప్పారు. కూల్చివేతల పరంపర.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక మధురానగర్ కాలువగట్టుపై 40 ఏళ్ల నాటి నాగేంద్రస్వామి పుట్టని తొలగించటంతో పాటు దుర్గాదేవి ఆలయం, రాజరాజేశ్వరి దేవి ఆలయం, శ్రీకృష్ణ మందిరం వద్ద ఏర్పాటు చేసిన గోశాలను కూడా దౌర్జన్యంగా కూల్చివేశారని మల్లాది విష్ణు గుర్తు చేశారు. గతంలోనూ హిందూ దేవాలయాలపై దాడులు, కూల్చివేతలు అత్యధికంగా జరిగినది టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి అధికారాన్ని పంచుకున్న సమయంలోనేనని మల్లాది విష్ణు విమర్శించారు. కృష్ణా పుష్కరాల సమయంలోనూ నగరంలో 23 దేవాలయాలను కూల్చివేసిన చరిత్ర చంద్రబాబుదని.. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వాటిని పునర్నిర్మించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి, నాయకులు మార్తి చంద్రమౌళి, సామంతకూరి దుర్గారావు, డి.దుర్గారావు, పవన్ రెడ్డి, నగరి ప్రసాద్, ఓంకార్ రెడ్డి, చైతన్య, రమేష్, తదితరులు పాల్గొన్నారు. వినాయక ఆలయం కూల్చివేత దారుణం వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు -
దుక్కి ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ దుర్మరణం
నాగాయలంక: దుక్కిదున్నుతూ ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి చెందిన ఘటన మండలంలోని భావదేవరపల్లిలో బుధవారం రాత్రి జరిగింది. ఎస్ఐ కలిదిండి రాజేష్ కథనం మేరకు.. భావదేవరపల్లి గ్రామానికి చెందిన ముమ్మారెడ్డి నరసింహారావు(36) అదే గ్రామానికి చెందిన అబ్రహం ట్రాక్టర్పై డ్రైవర్గా బుధవారం రాత్రి చెరువుల్లో దుక్కి దున్నే పనికి వెళ్లాడు. ఒక చెరువు నుంచి మరో చెరువులోకి వెళ్లే క్రమంలో గట్టు దాటుతున్న సమయంలో ట్రాక్టర్ అదుపు తప్పి తిరగబడింది. నరసింహారావు ట్రాక్టర్ కింద చిక్కుకుని తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ఈ ఘటనను అతని బంధువులు, గ్రామస్తులు రాత్రి 11 గంటల సమయంలో గుర్తించారు. అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో మృతదేహాన్ని ఇంటికి తరలించారు. మృతుడి తండ్రి ముమ్మారెడ్డి బెనర్జి ఈ ప్రమాదంపై గురువారం ఉదయం నాగాయలంక స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ తెలిపారు. -
ఉద్యమంలా ప్రకృతి వ్యవసాయం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన ప్రకృతి వ్యవసాయం – ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికపై సమన్వయ సమావేశం గురువారం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. రసాయన పురుగు మందులు, ఎరువులు మనిషి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. సాగులో సేంద్రియ ఎరువులు, జీవ ఉత్ప్రేరకాలు, కషాయాలు, ద్రావణాల వినియోగం వల్ల ఆరోగ్యకరమైన వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని సూచించారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్లోనూ రైతులకు సాయపడాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో రైతులను ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రోత్సహించాలని, శాసీ్త్రయ ఆధారాలతో అపోహలను తొలగించాలని కోరారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ప్రకృతి సాగు దిశగా నడిపించాలని, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు. ర్యాలీలు, పొలం సందర్శనలు, ప్రకృతి వ్యవసాయాన్ని విజయవంతంగా చేస్తున్న రైతులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ (జెడ్బీఎన్ఎఫ్) విధానాలు నేలసారం తగ్గకుండా పంటకు సత్తువనిస్తాయని, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని వివరించారు. ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పులనూ తట్టుకునే సామర్థ్యం ఈ విధానాల పంటలకు ఉంటుందన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చేయూతతో నిమ్మ, సపోటా, డ్రాగన్ ఫ్రూట్, ఆపిల్ బేర్, దానిమ్మ తదితర పండ్ల తోటలతో పాటు పూల తోటలు 19 రకాల ఉద్యాన పంటలను చేపట్టవచ్చని పేర్కొన్నారు. ఉద్యాన పంటల సాగుదిశగా నడిపించాలని సూచించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో వ్యవసాయ రంగ వృద్ధిని ఆరు శాతం నుంచి 15 శాతానికి తీసుకెళ్లేందుకు అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రకృతి సాగుతో ముందుకెళ్తున్న రైతులు వెంకట గురుప్రసాద్ (నున్న), శ్రీనివాస్రెడ్డి (రెడ్డిగూడెం)ని కలెక్టర్ సత్కరించారు. జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, డ్వామా పీడీ ఎ.రాము, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కల్పన, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారి పి.ఎం.సుభాని, జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ కె.ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. ఖరీఫ్ కార్యాచరణ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ -
సామూహిక లైంగిక దాడి కేసును ఛేదించిన పోలీసులు
గన్నవరం: బాలికపై జరిగిన సామూహిక లైంగికదాడి కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను ఆత్కూరు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు గన్నవరం పోలీస్స్టేషన్లో కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు సమక్షంలో నిందితులను అరెస్ట్ చూపించారు. అనంతరం ఎస్పీ కేసు వివరాలను మీడి యాకు వెల్లడించారు. ఎస్పీ కథనం మేరకు.. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరుకు చెందిన 14 ఏళ్ల బాలిక తమ ఇంటి పక్కనే ఉండే కుటుంబంతో సన్నిహితంగా మెలిగేది. ఈ నెల తొమ్మిదిన గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో జరిగిన అమ్మవారి జాతరకు సదరు కుటుంబంతో పాటు బాలిక కూడా వచ్చింది. ఈ నెల 13వ తేదీ రాత్రి ఆ బాలిక కనిపించకుండా పోవడంతో వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 17వ తేదీ రాత్రి ఓ ఆటో డ్రైవర్ ద్వారా బాలిక మాచవరం పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. ఈ విషయం తెలుసుకున్న ఆత్కూరు పోలీసులు ఆమె తల్లిదండ్రుల సమక్షంలో బాలికను తీసుకొచ్చి పెద్ద ఆవుటపల్లిలోని బంధువుల ఇంటికి పంపించారు. అనంతరం కడుపు నొప్పితో బాధపడుతున్న ఆ బాలికను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఉమెన్ ఎస్ఐ నేతృత్వంలో విచారణ జరపగా సామూహిక లైంగికదాడి విషయం బయటపడింది. ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆ బాలికను ఆమె స్వగ్రామంలో దింపుతామని వీరపనేనిగూడెం గ్రామానికి చెందిన కొంత మంది యువకులు నమ్మబలికారు. అనంతరం ఆ బాలికను వేర్వేరు ప్రాంతాలకు మార్చుతూ యువకులు ఆమైపె సామూహిక లైంగిక దాడికి పాల్పొడ్డారని విచారణలో తేలింది. ఆ బాలిక నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు రేప్ కేసుగా మార్చి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన వీరపనేనిగూడెంనకు చెందిన బాణవతు లక్ష్మణజితేంద్రకుమార్నాయక్, పగడాల హర్షవర్ధన్ను అరెస్టు చేశారు. మరో ఆరుగురు యువకులను పట్టుకోవాల్సి ఉందని, వారిలో మైనర్లు ఉన్నారని పోలీ సులు తెలిపారు. కేసు దర్యాప్తులో చాకచాక్యంగా వ్యవహరించిన అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, సీఐ కె.వి.వి.ఎన్.సత్యనారాయణ, ఆత్కూరు ఎస్ఐ చావా సురేష్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. డీఎస్పీ సీహెచ్.శ్రీనివాసరావు, గన్నవరం ఎస్ఐ శ్రీధర్ పాల్గొన్నారు. -
ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇటీవల ముగిసిన ఇంటర్మీడియెట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఎన్టీఆర్ జిల్లాలో ప్రారంభమైంది. విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాలలో ఈ ప్రక్రియకు ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాట్లు చేసింది. ఈ నెల మొదటి తేదీన ప్రారంభమైన ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్లో ప్రధాన సబ్జెక్ట్ల పరీక్షలు ఇటీవలే పూర్తయ్యాయి. దీంతో ఈ నెల 17 నుంచి మూల్యాంకనం ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. గురువారం నుంచి అధ్యాపకులు పూర్తి స్థాయిలో మూల్యాంకనం ప్రక్రియకు హాజరవుతున్నారు. జిల్లాకు వచ్చిన జవాబు పత్రాలు.. ఎన్టీఆర్ జిల్లాకు వివిధ జిల్లాల నుంచి సుమారుగా 4,08,565 జవాబు పత్రాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల ఏడో తేదీ నాటికి సంస్కృతం పేపర్లు జిల్లాకు చేరుకున్నాయి. అప్పుడే అరకొరగా మూల్యాంకనాన్ని ప్రారంభించినా ఈ నెల 17వ తేదీకి పూర్తిస్థాయిలో పేపర్లు చేరుకోవటంతో తాజాగా గురువారం నుంచి ఊపందుకుంది. ప్రస్తుతం సంస్కృతం, తెలుగు, ఇంగ్లిష్, హిందీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులకు సంబంధించిన పేపర్లు జిల్లాకు చేరుకున్నాయి. మరో ఒకటి, రెండు రోజుల్లో ఫిజిక్స్, ఎకనామిక్స్ పేపర్లకు సంబంధించిన మూల్యాంకనం ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. దఫదఫాలుగా అధ్యాపకులు.. జిల్లాలో జరుగుతున్న మూల్యాంకనం కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 450 మంది అధ్యాపకులు గురువారం నాటికి అధికారులకు రిపోర్ట్ చేశారు. అందులో భాగంగా సంస్కృతం 13, తెలుగు–6, ఇంగ్లిష్–21, హిందీ–1, మ్యాథ్స్–40, సివిక్స్–6 చొప్పున బోర్డులను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బోర్డులో ఒక చీఫ్ ఎగ్జామినార్, ఐదుగురు అసిస్టెంట్ ఎగ్జామినర్లతో పాటుగా ఒక స్కూృట్నీజర్ ఉంటారు. అదేవిధంగా ఈ నెలలో మరో మూడు దఫాల్లో మరికొంతమంది అధ్యాపకులు ఈ మూల్యాంకనంలో పాల్గొననున్నారు. ఏప్రిల్ మొదటి వారం వరకూ కొనసాగనున్న స్పాట్ వాల్యూయేషన్ జిల్లాకు చేరుకున్న 4,08,565 పేపర్లు రిపోర్ట్ చేసిన 450 మంది అధ్యాపకులు మార్క్స్ టేబులేషన్ ప్రక్రియ.. స్పాట్ వాల్యూయేషన్లో భాగంగా జవాబు పత్రాల మూల్యాంకనంతో పాటుగా మార్క్స్ టేబులేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. గతంలో అసిస్టెంట్ ఎగ్జామినర్ మూల్యాంకనం చేసిన పత్రాలను చీఫ్ ఎగ్జామినార్ పరిశీలించి వాటిని ఇంటర్మీడియెట్ బోర్డుకు పంపించేవారు. అక్కడ కోడ్ ప్రకారం విద్యార్థులకు మార్కులు కేటాయించి అంతిమంగా ఫలితాలను విడుదల చేసేవారు. అయితే దీనిలో కొంత జాప్యం జరుగుతుండటంతో స్పాట్ వాల్యూయేషన్లోనే జవాబు పత్రాలు మూల్యాంకనం అయిన తరువాత మార్క్స్ టేబులేషన్ను (స్కానింగ్ ప్రక్రియ) నిర్వహిస్తున్నారు. దీనివల్ల జాప్యం లేకుండా ఫలితాలను త్వరగా ప్రకటించటానికి అవకాశం ఏర్పడుతుంది. గత ఏడాది నుంచి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ ప్రక్రియను ప్రారంభించింది. అధ్యాపకులను స్పాట్కు పంపించాలి.. స్పాట్ వాల్యూయేషన్ విధులకు నియమించిన అధ్యాపకులను కళాశాల ప్రిన్సిపాల్స్ రిలీవ్ చేసి పంపించాలి. ఇప్పటికే స్పాట్ పూర్తిస్థాయిలో ప్రారంభమైంది. ఏప్రిల్ మొదటి వారం వరకూ ఈ మూల్యాంకనం ప్రక్రియ కొనసాగనుంది. కళాశాల ప్రాంగణంలో ఉన్న సదుపాయాలు, పేపర్ల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకులను రెండు మూడు దఫాలుగా హాజరయ్యే విధంగా ఏర్పాటు చేశాం. విధులు కేటాయించిన అధ్యాపకులు తప్పనిసరిగా హాజరు కావాల్సిందే. – సీఎస్ఎస్ఎన్ రెడ్డి, ఆర్ఐవో, ఎన్టీఆర్ జిల్లా -
మచిలీపట్నం చేరుకున్న సీఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీ
చిలకలపూడి(మచిలీపట్నం): దేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన భద్రతను అందిస్తున్న పారా మిలటరీ దళమైన కేంద్ర పారిశ్రామిక భద్రత దళం సీఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీ గురువారం సాయంత్రం మచిలీపట్నం చేరుకుంది. జెడ్పీ కన్వెన్షన్ హాలులో అడిషనల్ ఎస్పీ సి.సత్యనారాయణ ఈ సైకిల్ ర్యాలీ బృందానికి స్వాగతం పలికారు. అనంతరం జరిగిన అభినందన సభలో బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. సీఐఎఫ్ డెప్యూటీ కమాండెంట్లు హ్రిషబ్, ప్రభాకర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు సీఐఎస్ఎఫ్ను స్థాపించి ఈ నెల పదో తేదీ నాటికి 55 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సురక్షిత తీరం – సమృద్ధి భారత్’ పేరుతో ఆరు వేల కిలోమీటర్లకు పైగా సముద్రతీర ప్రాంతంలో దేశ భద్రత, సమైఖ్యతను పెంపొందించేందుకు ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల ఏడో తేదీన పశ్చిమబెంగాల్లోని బఖ్ఖలి నుంచి 60 మంది సభ్యులతో తమిళనాడులోని కన్యాకుమారి వరకు సముద్ర ప్రాంతం గుండా ఈ ర్యాలీ కొనసాగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు శ్రీనివాస్, శిఖర్ లోహియా, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
అదనపు పనులు చేయలేం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీలను పూర్తిస్థాయిలో వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలోకి తేవాలని ఏపీ యునైటెడ్ విలేజ్ అండ్ వార్డ్ హెల్త్ సెక్రటరీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ నందు గురువారం అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ధర్నాను ఉద్దేశించి అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాధవి, సంధ్యారాణి మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయ హెల్త్ సెక్రటరీలు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, డీఎంహెచ్ల పరిధిలో పనిచేయడం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఒకే సమయంలో వేర్వేరు శాఖల పనులతో పనిభారం పెరిగిందన్నారు. పనిభారం తగ్గించాలని ఉన్నతాధికారులను కోరుతున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదన్నారు. అదనపు పనులు చేయించవద్దని వైద్య ఆరోగ్యశాఖ జారీ చేస్తున్న ఉత్తర్వులను క్షేత్రస్థాయిలో అధికారులు అమలు చేయడం లేదన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలన్నారు. అసోసియేషన్ గౌరవ సలహాదారుడు ఏవీ నాగేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు జగన్మోహన్రావు, కార్యనిర్వాహక అధ్యక్షుడు అన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ధర్నాలో గ్రామ, వార్డు సచివాలయాల హెల్త్ సెక్రటరీలు -
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పేర్లు నమోదు చేసుకోవాలి
పెనమలూరు: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, వివిధ రాయితీలు పొందటానికి ఉద్యం రిజిస్ట్రేషన్ పోర్టల్లో వారు పేర్లు నమోదు చేసుకోవాలని కృష్ణా జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆర్.వెంకట్రావు సూచించారు. కానూరు ఆటోనగర్ క్లస్టర్ భవనంలో గురువారం ఉద్యం రిజిస్ట్రేషన్ క్యాంపు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జీఎం వెంకట్రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సూక్ష్మ, చిన్న పరిశ్రమల వృద్ధిలో భాగంగా ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) సెక్టార్ అభివృద్ధికి చర్యలు చేపట్టిందని వివరించారు. ప్రభుత్వం అందించే సబ్సిడీలు, రుణ సదుపాయం లబ్ధిపొందాలంటే ఉద్యం రిజి స్ట్రేషన్ సర్టిఫికెట్ తప్పనిసరని తెలిపారు. పారి శ్రామికవేత్తలు, వ్యాపారులు తమ యూనిట్లకు సంబంధించి ఉద్యం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆటోనగర్ క్లస్టర్ ఎండీ అన్నే శివనాగేశ్వరరావు, డైరెక్టర్లు, పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు పాల్గొన్నారు. -
దీర్ఘకాలిక రోగులను ‘స్పాట్’ నుంచి మినహాయించాలి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): త్వరలో జరిగే పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ విధుల నుంచి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని మినహాయించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, ఎ.సుందరయ్య కోరారు. ఈ మేరకు డీఈఓ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి యు.వి.సుబ్బారావును కలిసి గురువారం వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దీర్ఘకాలిక జబ్బులు, సుదూర ప్రాంతాల వారు, 60 ఏళ్లు నిండిన, గర్భిణులు, దివ్యాంగులు, బాలింతలను స్పాట్ విధుల నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ విద్యాసంస్థల్లో రివర్షన్కు గురైన ఉపాధ్యాయుల జీతాలు, ఇతర సమస్యలు గురించి నాయకులకు డీఈఓకు వినతిపత్రాన్ని అందించారు. వీటిపై పరిశీలించి ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని డీఈఓ సుబ్బారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎ.గోపాలకృష్ణ, వి.కొండలరావు, ఎం.శ్రీనివాసరావు, ఎస్.చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణా జిల్లా ఇన్చార్జ్ అధికారిగా మనజీర్ జిలానీ సమూన్
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా ఇన్చార్జ్ అధికారిగా డాక్టర్ మనజీర్ జిలానీ నమూన్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం మచిలీపట్నంలోని కలెక్టరేట్కు విచ్చేసి కలెక్టర్ డి.కె.బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మతో పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో జరిగే సంక్షేమ, అభివృద్ధి పనుల పర్యవేక్షణ, పరిపాలనను పటిష్ట పరిచేందుకు అంతర్ శాఖల సమావేశం సమన్వయం కోసం సీనియర్ ఐఏఎస్ అధికారులను జిల్లా ఇన్చార్జులుగా నియమించింది. ఈ నేపథ్యంలో మనజీర్ జిలానీ నమూన్ జిల్లాలోని అమలవుతున్న పలు అంశాలు, సంక్షేమ పథకాలపై కలెక్టర్, జాయింట్ కలెక్టర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తొలుత కలెక్టర్ బాలాజీ ఆయనకు మొక్క అందజేసి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు పాల్గొన్నారు. -
మనస్తాపంతో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
చల్లపల్లి: తన ప్రమేయం లేకపోయినా తనను తోటి ఉద్యోగి అల్లరి చేస్తున్నా డని మనస్తాపానికి గురైన ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన గురువారం చలపల్లిలో జరిగింది. చల్లపల్లి నారాయణరావునగర్ కాలనీకి చెందిన వరిగంజి నాగార్జున అవనిగడ్డ ఆర్టీసీ డిపోకు చెందిన అద్దె బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. నాగార్జునకు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందని అతనితోపాటు పాటు పనిచేస్తున్న రమేష్ కొంత కాలంగా అల్లరి చేస్తున్నాడు. దీంతో నాగార్జున మనస్తాపం చెందాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన చావుకు రమేష్ కారమని చెబుతూ పురుగుమందు తాగుతూ తీసిన సెల్ఫీ వీడియోను స్నేహితులకు పంపాడు. వెంటనే అతని స్నేహితులు నాగార్జున ఇంటికి వెళ్లి అతడిని చల్లపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం నాగార్జున పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మచిలీపట్నం నుంచి వివరాలు రావాల్సి ఉందని వచ్చిన తరువాత కేసు నమోదు చేస్తామని చల్ల పల్లి పోలీసులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
మైలవరం: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం మైలవరం మండలం వెల్వడం అడ్డ రోడ్డు వద్ద జరిగింది. జి.కొండూరుకు చెందిన భార్యాభర్తలు లంకా కోటేశ్వరమ్మ, వెంకటేశ్వరరావు గురువారం ఉదయం ద్విచక్రవాహనంపై ఆగిరిపల్లిలోని తమ మామిడి తోటలను చూసేందుకు వెళ్లారు. మధ్యాహ్నం తిరిగి జి.కొండూరు బయలుదేరారు. మైలవరం మండలం వెల్వడం సమీపంలోని గణపవరం అడ్డరోడ్డు మలుపు వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొన డంతో కోటేశ్వరమ్మ (50) అక్కడికక్కడే మృతిచెందింది. వెంకటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. తన కళ్ల ముందే భార్య మృతి చెందడాన్ని తట్టుకోలేక తల్లడిల్లాడు. -
ఒకే పని.. రెండు బిల్లులు
అవనిగడ్డ: నిధులులేక ఎన్నో సంవత్సరాల నుంచి పలు చోట్ల పంట కాలువల్లో పూడికతీత పనులు జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవనిగడ్డలో మాత్రం ఒకే పంట కాలువకు రెండు రకాల బిల్లులతో పనులు జరుగుతున్నాయి. ఒక పక్క యంత్రాలతో కాంట్రాక్టర్ పంటకాలువ పూడిక తీత పనులు చేపట్టారు. మరో వైపు అదే కాలువలో ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలతో పూడికతీత పనులు జరుగుతున్నాయి. ఒకే పనిని రెండు రకాలుగా చేయడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆరు రోజులుగా పనులు అవనిగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 16 పంట కాలువల్లో పూడికతీత పనులను రూ.39.90 లక్షలకు విజయవాడకు చెందిన ఓ కాంట్రాక్టర్ టెండర్ దక్కించుకున్నారు. ఈ మేరకు ఆరు రోజుల నుంచి యంత్రాలతో పూడిక తీత పనులు చేపట్టారు. ఈ పనుల్లో భాగంగా అవనిగడ్డ మండల పరిధిలోని అశ్వరావుపాలెం – మందపాకల పంటకాలువ పూడిక తీతను రెండు రోజుల క్రితం క్రితం చివరి ప్రాంతం నుంచి ప్రారంభించారు. ఇదే కాలువకు మొదలులో నాలుగు రోజుల నుంచి రోజుకు 50 నుంచి 60 మంది ఉపాధి కూలీలు ఉపాధిహామీ పథకం ద్వారా పూడికతీత పనులు చేస్తున్నారు. ఈ పంటకాలువకు సంబంధించి ఇప్పటి వరకూ ఉపాధి కూలీలు రూ.80 వేలు విలువగల పనులు పూర్తి చేశారు. ఈ కాలువకు సంబంధించి ఎవరు ఎన్నిచోట్ల పనులు చేసినా కాంట్రాక్టర్కు కేటా యించిన నిధులు మాత్రం ఆయనకు ఇవ్వాల్సి ఉంటుంది. చాలా చోట్ల డ్రెయిన్లు, పంట బోదెలకు సంవత్సరాల తరబడి పూడికతీయలేదు. దీంతో కొద్దిపాటి వర్షాలకు సైతం డ్రెయిన్లు పొంగి పంటపొలాలను ముంచెత్తడం దివి సీమలో పరిపాటిగా మారింది. గత ఏడాది ఖరీప్లో కురిసిన భారీ వర్షాలకు ఆరు మండలాల్లో 23 వేల ఎకరాలు వరిపంట ముంపునకు గురైన విషయం విదితమే. అవసరమైన చోట పనులు చేయకుండా ఒకే కాలువకు రెండు విధాలుగా పనులు చేయిస్తూ ప్రజాధనం వృథా చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల కోసం ముసలి కన్నీరు కారుస్తున్న స్థానిక ప్రజాప్రతినిధి ఒకేపనికి రెండు విధాలా ప్రజాధనం వృథా అవుతుంటే ఏమి చేస్తున్నారని కొంత మంది రైతులు ప్రశ్నిస్తున్నారు. పనుల నిర్వహణపై ఇరిగేషన్ డీఈ పులిగడ్డ వెంకటేశ్వరరావును వివరణ కోరగా.. అశ్వరావుపాలెం – మందపాకల కాలువకు ఉపాధి కూలీలు పనులు చేస్తున్న విషయం తనకు తెలియదన్నారు. రేపటి నుంచి పనులు ఆపేస్తామని చెప్పారు. ఏపీఓ రవి కుమార్ని వివరణ కోరగా.. ఇరిగేషన్ అధికారుల ఆదేశాల మేరకే కూలీలతో ఉపాఽధి పనులు చేపట్టామని చెప్పడం గమనార్హం. ఎగువ నుంచి యంత్రాలతో పనులు చేపట్టిన కాంట్రాక్టర్ దిగువ నుంచి ఉపాధి హామీ పథకంకూలీలతో జరుగుతున్న పనులు ఒకే కాలువకు రెండు విధాలా పనులపై విస్మయం ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని విమర్శలు -
ఉద్యోగులందరూ ధ్రువీకరణ పత్రాన్ని పొందాలి
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ఉద్యోగులందరూ ఈ నెల 26వ తేదీలోగా ‘కర్మయోగి భారత్’ ఆన్లైన్ శిక్షణ పూర్తి చేసుకుని ధ్రువీకరణ పత్రం పొందాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లోని వీడియోకాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా అధికారులతో గురువారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సీఎఫ్ఎంఎస్ గుర్తింపు సంఖ్య కలిగిన ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ఆన్లైన్ ద్వారా వారి సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో కర్మయోగి భారత్ ధ్రువీకరణపత్రం పొందాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. మొదట్లో సీనియర్ అధికారులు మాత్రమే ఈ శిక్షణను పొందారని, ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా సమర్థనీయ సేవలు అందించేందుకు ఉద్యోగులందరూ ఈ శిక్షణ పొందేలా చూడాలని తీర్మానం చేశామన్నారు. ఈ విషయంపై ప్రతి జిల్లా అధికారి ప్రత్యేక శ్రద్ధ వహించి వారి పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులందరితో ఈ నెల 26వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయించాలని కలెక్టర్ సూచించారు. ఈ శిక్షణలో మూడు కోర్సులు ఉంటాయని అందులో హార్ట్ ఇన్ గవర్నెన్స్, కోడ్ ఆఫ్ కండక్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఓరియంటేషన్ మాడ్యూల్ ఆన్ మిషన్ లైఫ్ కోర్సులు ఉన్నాయన్నారు. ఈ మూడు కోర్సులకు సంబంధించి మూడు వీడియోలు మొదటి నుంచి చివరి వరకు చూసిన తరువాత వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పిన అనంతరం ఒక ధ్రువీకరణ పత్రం విడుదలవుతుందన్నారు. డీఆర్వో చంద్రశేఖరరావు, రాష్ట్ర ప్లానింగ్ సొసైటీ సీనియర్ సలహాదారు వెంకటేశ్వరస్వామి, కలెక్టరేట్ ఏవో సీహెచ్ వీరాంజనేయప్రసాద్ పాల్గొన్నారు. -
ద్విచక్ర వాహనం ఢీకొని గొర్రెలకాపరి మృతి
ఘంటసాల: ద్విచక్ర వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడిన గొర్రెల కాపరి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఘంటసాల రజకపేటకు చెందిన కొడాలి దేవచంద్రరావు (29) గొర్రెల కాపరిగా జీవిస్తున్నాడు. బుధవారం యథావిధిగా గొర్రెలను మేపడానికి వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా మల్లాయి చిట్టూరు రోడ్డులో అతడిని ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో దేవచంద్రరావు తల వెనుక భాగంలో తీవ్రగాయమైంది. ఈ సమాచారం అందుకున్న చల్లపల్లి 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని చల్లపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు విజయవాడ తీసుకెళ్లాలని సూచించారు. విజయవాడ తీసుకెళ్తుండగా దారిలోనే మృతి చెందాడు. దేవచంద్రరావుకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. తమను ఎవరు పోషిస్తారంటూ మృతుడి భార్య భవానీ విలపిస్తున్న తీరు పలువురిని కలిచివే సింది. భవాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కృష్ణాజిల్లా
శుక్రవారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2025 ఇఫ్తార్ సహరి (శుక్ర ) (శని) మచిలీపట్నం 6.22 4.51 విజయవాడ 6.23 4.53 బందరు చేరిన సైకిల్ ర్యాలీ దేశంలో అత్యున్నత భద్రతను అందించే కేంద్ర పారిశ్రామిక భద్రత దళం సీఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీ గురువారం మచిలీపట్నం చేరుకుంది. నిత్యాన్నదానానికి విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి గుడివాడకు చెందిన సుంకర బాలాంబ కుటుంబం రూ. 2,00,116 విరాళాన్ని అందజేసింది. –8లోuప్రాధాన్యత అంశాలపై నివేదికలు ఇవ్వండి చిలకలపూడి(మచిలీపట్నం): సీఎం చంద్ర బాబునాయుడు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఈ నెల 25, 26 తేదీల్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వశాఖలకు సంబంధించిన ప్రాధాన్యత అంశాలతో నివేదికలు తక్షణమే సమర్పించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మతో కలిసి వివిధ శాఖల అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు సంబంధించిన ప్రగతి, ప్రధాన సమస్యలను కాన్ఫరెన్స్లో వివరించేందుకు శాఖలకు సంబంధించిన సమాచారాన్ని సిద్ధం చేయాలన్నారు. రాబోయే మూడు నెలల్లో పంచాయతీ, మునిసిపల్, ఇరిగేషన్, డ్వామా, గ్రామీణ నీటి పారుదల, వ్యవసాయం తదితర శాఖలు నిర్వహించాల్సిన ముఖ్యమైన కార్యాచరణ ప్రణాళికలు అందజేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో కె. చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆనంద్కుమార్, ఆర్అండ్బీ ఈఈ లోకేష్, డీపీవో జె. అరుణ, డీఈవో పీవీజే రామారావు, డీఎస్వో వి. పార్వతీ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ డివిజన్కు ప్రతిష్టాత్మక అవార్డు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రోజువారీ విధుల్లో అధికార భాషను అమలు పరచడంలో విశేష కృషి చేసినందుకు గానూ ప్రతిష్టాత్మకమైన ‘రఘువీర్ చాల్ వైజయంతి’ షీల్డ్ను విజయవాడ డివిజన్ సాధించింది. గురువారం న్యూఢిల్లీలోని రైల్భవన్లో జరిగిన అధికార భాష అమలు కమిటీ సమావేశంలో డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్, డివిజన్ రాజభాష అధికారి ఎం.కె.నాగరాజుతో కలసి రైల్వేబోర్డు చైర్మన్ సతిష్కుమార్ చేతుల మీదుగా షీల్డ్ను అందుకున్నారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మాట్లాడుతూ రాజభాష అమలులో ఎంతో ప్రతిష్టాత్మక అవార్డు రావటం డివిజన్కే గర్వకారణమన్నారు. డివిజన్ సాధించిన విజయంతో పాటుగా గుంటుపల్లిలోని రాయపాడు వ్యాగన్ వర్కుషాపునకు రాజభాష అమలులో ‘ఆదర్శ కార్ఖానా’గా గుర్తింపు వచ్చినట్లు తెలిపారు. 31వరకే ధాన్యం కొనుగోలు కేంద్రాలు చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి 2024–25 ధాన్యం సేకరణ ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే కొనుగోలు చేస్తారని జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ గురువారం తెలిపారు. జిల్లాలోని రైతులు పండించిన ధాన్యాన్ని ఇంకా విక్రయించాల్సిన వారు ఉంటే సంబంధిత కేంద్రాలకు వెళ్లి విక్రయించుకోవాలని ఆమె సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 70,718 రైతుల నుంచి రూ. 1,333.43 కోట్ల విలువ కలిగిన 5,83,117 టన్నులు ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేశామని చెప్పారు. వర్సిటీల్లో సమస్యలను పరిష్కరించాలని వినతి మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను తక్షణమే భర్తీ చేయలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ మధు మూర్తిని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆయన కార్యాలయంలో గురువారం కలిసి వినతిప్రతం అందజేశామని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకట గోపి ఓ ప్రకటనలో తెలిపారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే మంజూరు చేసే లా ప్రభుత్వంతో చర్చలు జరిపి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడా లని, వర్సిటీల అభివృద్ధికి ప్రత్యేక గ్రాంట్ విడుదల చేయాలని కోరామని పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చిన విధంగా జీఓ 77ను రద్దుచేసి పీజీ విద్యను అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విన్నవించామన్నారు. ఏబీవీపీ జాతీయ సమితి సభ్యుడు యాచంద్ర, పరిషత్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు అఖిల్కుమార్ రెడ్డి, సురేంద్ర, పరిషత్ సభ్యులు వినతిపత్రం అందజేసిన వారిలో ఉన్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: గత ఏడాది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు మునేరు ఊహించని విధంగా ఉప్పొంగి.. రైతులను దారుణంగా ముంచేసింది. దాదాపు 3.50 లక్షల కూసెక్కుల మేర వరద ప్రవాహం రావడంతో భారీగా ఇసుక మేటలు వేసింది. భూములు పెద్ద ఎత్తున కోతకు గురయ్యాయి. మునేరు పరిధిలోని కాలువలకు 70చోట్ల గండ్లు పడ్డాయి. అంతేకాక 212 మైనర్ ఇరిగేషన్ చెరువులకూ గండ్లు పడి ధ్వంసం అయ్యా యి. ఇందులో ప్రధానంగా మునేరు పక్కన ఉన్న తువ్వకాలువకు 40 చోట్ల వరకు గండ్లు పడి నాశనమైంది. వత్సవాయి మండలం ఆళ్లూరుపాడు, వేములనర్వ వద్ద నాలుగు, పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు వద్ద ఒక పెద్ద గండి పడింది. వీటికి శాశ్వత ప్రాతిపదికన గండ్లు పూడ్చలేదు. ఫలితంగా రైతులకు కడగండ్లు తప్పడం లేదు. అన్నదాతల ఆందోళన.. తెలంగాణ నుంచి వచ్చే మునేరు 240 కిలోమీటర్ల మేర ప్రవహించి ప్రకాశం బ్యారేజి ఎగువన కృష్ణా నదిలో కలుస్తుంది. వత్సవాయి మండలం పోలంపల్లి నుంచి ప్రారంభమయ్యే మునేరు ప్రాజెక్టు పరిధిలో మెయిన్కాలువ ఉంది. ఇది వత్సవాయి మండలం ఆళ్లూరుపాడు, వేమవరం.. పెనుగంచిప్రోలు మండలంలోని ముచ్చింతాల, పెనుగంచిప్రోలు, అనిగండ్లపాడు, గుమ్మడిదుర్రు, నందిగామ మండలం సోమవరం వరకు విస్తరించి ఉంది. దీని పరిధిలో 22,000 ఎకరాలకు పైగా సాగు ఉంది. దీనికి పడిన గండ్లు తాత్కాలికంగా పూడ్చారు తప్ప శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేయలేదు. ఇక తువ్వ కాలువ వత్సవాయి మండలం ఆళ్లూరుపాడు నుంచి పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదుర్రు వరకూ ప్రవహిస్తుంది. తువ్వకాలువ(పెనుగంచిప్రో లు) బ్రాంచ్ కింద సుమారు 3 వేల ఎకరాల వరకు సాగవుతోంది. కాలువకు వేమవరం, ఆళ్లూరుపాడు వద్ద పెద్ద గండ్లు పడ్డాయి. ఆయా చోట్ల తాత్కాలికంగా పూడ్చారు. శాశ్వత ప్రాతిపదికన పనులు చేయ లేదు. దీంతో మళ్లీ వరద వస్తే ఇబ్బందులు తప్పవనే ఆందోళన రైతుల నుంచి వ్యక్తం అవుతోంది. రెండు సీజన్లు కోల్పోయిన రైతులు.. గండ్లు పడటంలో ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు విలువైన పంట కోల్పోయారు. అంతేకాక పొలాల్లో ఇసుక మేట వేయటం, భూములు కోతకు గురి కావటం, మోటార్లు, బోర్లు పాడవడంతో రైతులు దారుణంగా నష్టపోయారు. అయితే వరదలు పోయి ఆరు నెలలు అవుతున్నా గండ్లు పూడ్చటంపై అధికారులు దృష్టి పెట్టటం లేదు. దీంతో ఖరీఫ్తో పాటు రబీ సాగు కూడా రైతులు కోల్పోయారు. కొద్ది మంది రైతులు మాత్రం పొలాలను సొంత డబ్బు ఖర్చు పెట్టి రబీ సాగు చేశారు. నేటికీ చాలా పొలాల్లో ఇసుక మేటలు అలాగే ఉన్నాయి. అరకొరగా నష్టపరిహారం.. ● వరదలకు వత్సవాయి మండలం ఆళ్లూరుపాడు, వేమవరంలో సుమారు 200 ఎకరాల్లో పంట పాడవగా 100 ఎకరాల్లో ఇసుక మేట వేసింది. ● పెనుగంచిప్రోలు మండలంలో 3097 ఎకరాల్లో వరి పంట నాశనమైంది. అందులో 300 ఎకరాల్లో ఇసుక మేట వేసింది. ● ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు మాత్రం నామమాత్రంగా పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంది. ఇసుక మేటకు, కోతకు గురైన భూములకు ఎలాంటి నష్ట పరిహారం చెల్లించలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ సీజన్లో పనులు చేయకపోతే, వర్షాకాలంలో మునేరుకు వరద వస్తే కడగండ్లు తప్పవని ఆందోళన చెందుతున్నారు. ● ప్రభుత్వం మాత్రం గండ్లు పూడ్చటానికి కేవలం ప్రతిపాదనలు సిద్ధం చేసిన, నిధులు మంజూరు చేయలేదు. దీంతో గండ్లు పూడ్చడంపై సందిగ్ధత నెలకొంది. మునేరు మెయిన్ కాలువకు పడిన గండి(ఫైల్)● మునేరుకు వచ్చిన భారీ వర్షాలకు 70చోట్ల గండ్లు పడ్డాయి. తాత్కాలిక మరమ్మతులకు రూ.7కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.43.02 కోట్లు, మొత్తం రూ.50.02 కోట్లు అవుతాయని అంచనా వేశారు. ● మైనర్ ఇరిగేషన్ చెరువులకు సంబంధించి 212 చోట్ల గండ్లు పడగా, తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.21.656కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.38.62 కోట్లు, మొత్తం రూ.53.276కోట్లు అవుతాయని ప్రతిపాదనలు రూపొందించారు. ● మునేరు, చెరువులకు కలిపి మొత్తం 282 గండ్లకు రూ.103.296కోట్లు నిధులు అవసరమని అంచనాలు రూపొందించారు. ● అయితే అక్కడక్కడ తాత్కాలికంగా గండ్లు పూడ్చినా.. శాశ్వత పనులకు ఇప్పటి వరకు నిధులు మంజూరు చేయలేదు. దీంతో ఈ ప్రతిపాదనలన్నీ అటకెక్కాయి. చర్లపల్లి–కన్యాకుమారి మధ్య వారాంతపు ప్రత్యేక రైళ్లు లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ ప్రయాణికుల సౌకర్యార్థం సమ్మర్ వారాంతపు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు డివిజన్ సీనియర్ డీసీఎం ప్రదీప్కుమార్ గురువారం తెలిపారు. చర్లపల్లి–కన్యాకుమారి వయా గుంటూరు డివిజన్ మీదుగా ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు ప్రత్యేక రైలు(07230) ప్రతి బుధవారం నడపనున్నట్టు వివరించారు. ఈ రైలు చర్లపల్లి స్టేషన్ నుంచి రాత్రి 9.50 గంటలకు బయలుదేరి రెండో రోజు అర్ధరాత్రి 2.30 గంటలకు కన్యాకుమారి స్టేషన్కు చేరుకుంటుందని వెల్లడించారు. అలాగే కన్యాకుమారి–చర్లపల్లి రైలు(07229) ఏప్రిల్ 4 నుంచి జూన్ 27 ప్రతి శుక్రవారం నడపనున్నట్టు వివరించారు. ఈ రైలు కన్యాకుమారి స్టేషన్ నుంచి తెల్లవారు జామున 5.15 గంటలకు బయలు దేరి మరుసటి రోజు రాత్రి 11.40 గంటలకు చర్లపల్లి స్టేషన్కు చేరుకుంటుందని వెల్లడించారు. నాగాయలంక: ఆలీవ్ రిడ్లే తాబేళ్ల ప్రాణహాని కలిగించే చర్యలకు పాల్పడవద్దని పాలకాయతిప్ప కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ సిబ్బంది గురువారం తీరగ్రామాల ప్రజలకు అవగాహన కల్పించారు. మండలంలోని ఎదురుమొండి, గుల్లలమోద, ఏటిమొగ, దీనదయాళపురం గ్రామాల్లో వివిధ అంశాలపై విస్త్రృత ప్రచారం, హెచ్చరికలు జారీ చేశారు. సముద్రపు తాబేళ్లు గుడ్లు పెట్టే సమయం కావడంతో చేపల వేటలో మత్స్యకారులు వాటికి ప్రాణహాని కలిగించే నిషేధిత వలలు(టేకు వల, మూడు పొరల వల వంటివి) ఉపయోగించకూడదని చెప్పారు. అలాగే వేట సమయంలో వలల్లో చిక్కిన తాబేళ్లను సురక్షితంగా సముద్రంలో వదిలిపెట్టాలని సూచించారు. మైరెన్ పోలీస్ సిబ్బంది, ఆయా గ్రామాల పెద్దలు, మత్స్యకారులు పాల్గొన్నారు. నాగాయలంక మండలం ఏటిమొగ వద్ద స్థానికులకు అవగాహన కల్పిస్తున్న మైరెన్ పోలీసులు7న్యూస్రీల్ గత సెప్టెంబర్లో కురిసిన వర్షాలకు 70 చోట్ల గండ్లు 212 మైనర్ చెరువులకు నష్టం 25వేల ఎకరాలకు పైగా ఆయకట్టు ప్రశ్నార్థకం పలు ప్రాంతాల్లో మేటలు వేసిన ఇసుక, కోతకు గురైన భూమి ఇప్పటి వరకు పట్టించుకోని ప్రభుత్వం ప్రతిపాదనలు ఇలా.. మార్క్స్ టేబులేషన్ ప్రక్రియ.. స్పాట్ వాల్యూయేషన్లో భాగంగా జవాబు పత్రాల మూల్యాంకనంతో పాటుగా మార్క్స్ టేబులేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. గతంలో అసిస్టెంట్ ఎగ్జామినర్ మూల్యాంకనం చేసిన పత్రాలను చీఫ్ ఎగ్జామినార్ పరిశీలించి వాటిని ఇంటర్మీడియెట్ బోర్డుకు పంపించేవారు. అక్కడ కోడ్ ప్రకారం విద్యార్థులకు మార్కులు కేటాయించి అంతిమంగా ఫలితాలను విడుదల చేసేవారు. అయితే దీనిలో కొంత జాప్యం జరుగుతుండటంతో స్పాట్ వాల్యూయేషన్లోనే జవాబు పత్రాలు మూల్యాంకనం అయిన తరువాత మార్క్స్ టేబులేషన్ను (స్కానింగ్ ప్రక్రియ) నిర్వహిస్తున్నారు. దీనివల్ల జాప్యం లేకుండా ఫలితాలను త్వరగా ప్రకటించటానికి అవకాశం ఏర్పడుతుంది. గత ఏడాది నుంచి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ ప్రక్రియను ప్రారంభించింది. గ్రామాల్లో పాలకాయతిప్ప కోస్టల్ సెక్యూరిటీ సిబ్బంది అవగాహన -
5 వేల మొక్కల విక్రయం
సాంబశివరావు నర్సరీలో అరబికం, ఉబేసం, నోవా టాంజానియా, క్రిస్పం, స్వాజికం, సోమాలియన్స్, మల్టీఫ్లోరం, సోకోట్రానమ్, బహుమీనియం, తాయ్ సోకోట్రానమ్ వంటి రకాలు, ఉప రకాల మొక్కలు ఉన్నాయి. మూడు నెలల నుంచి పదేళ్లవయసు మొక్కలు కొలువుదీరాయి. ప్రత్యేకంగా సృష్టించిన రకాల్లో టవర్ఫామ్, రూట్ ట్రెయిన్ప్లాంట్, అన కొండ వంటివి ఉన్నాయి. నాలుగేళ్లలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఢిల్లీ, మేఘాలయ ప్రాంతాలు మినహా దాదాపు మిగిలిన అన్ని రాష్ట్రాలకు ఐదు వేలకు పైగా మొక్కలను ఎగుమతి చేశారు. తన SambaAdeniums అనే ఇస్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్ల ద్వారా ఆర్డర్లు సేకరించి ఈ మొక్కలు సరఫరా చేస్తున్నట్లు సాంబశివరావు తెలిపారు. రూ.150 నుంచి రూ.25 వేల విలువైన, అరుదైన మొక్కలు తన వద్ద ఉన్నట్లు చెప్పారు. ప్రతి నెలా రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకూ మొక్కల విక్రయం ద్వారా తనకు ఆదాయం వస్తోందని వివరించారు. -
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం
గూడూరు: మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. గూడూరుకు చెందిన లంకపల్లి నరసింహారావు(64) అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం పొలం వెళ్లి వస్తుండగా గూడూరు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ప్రమాదంలో తలకు, కాలికి బలమైన గాయాలవ్వడంతో వెంటనే మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. గూడూరు ఏఎస్ఐ స్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏకపక్షంగా కేసులు కట్టడం సరికాదు
వైఎస్సార్ సీపీ కార్యకర్తల అక్రమ అరెస్ట్పై డీసీపీకి వినతి పెనుగంచిప్రోలు/లబ్బీపేట(విజయవాడ తూర్పు): వైఎస్సార్ సీపీ కార్యకర్తల అక్రమ అరెస్ట్పై సరైన న్యాయం చేయాలంటూ వైఎస్సార్ సీపీ నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం విజయవాడలో డీసీపీ మహేశ్వరరాజుకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మవారి చిన్నతిరునాళ్ల సందర్భంగా ఈనెల 18న తెల్లవారు జామున పసుపు–కుంకుమ బండ్లు సమర్పించేందుకు అన్ని పార్టీల వారు ప్రభలు కట్టుకుని వస్తుండగా పెనుగంచిప్రోలు పోలీస్స్టేషన్ సెంటర్లో టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగిందన్నారు. దీనిపై పోలీసులు ఏకపక్షంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తల పైన మాత్రమే కేసులు పెట్టటం బాధాకరమన్నారు. ఈ విషయాన్ని నిశితంగా పరిశీలించి, పోలీసులు వారికి గాయాలయ్యేందుకు కారణమైన ఇరుపార్టీల వారిపై కేసులు కట్టాలని వారు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీపీల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మార్కపూడి గాంధీ, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఏలూరి శివాజీ, శ్రీకనకదుర్గమ్మవారి ఆలయ మాజీ డైరక్టర్ నంబూరి రవి, న్యాయవాది పృధ్వీ, ఎస్సీసెల్ నాయకులు కన్నమాల శామ్యూల్, తదితరులు పాల్గొన్నారు. ఘర్షణ కేసులో 16 మందికి రిమాండ్ పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మవారి చిన్న తిరునాళ్లలో భాగంగా మంగళవారం తెల్లవారు జామున ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి బుధవారం 16 మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్టు జగ్గయ్యపేట సీఐ పి.వెంకటేశ్వర్లు తెలిపారు. న్యాయమూర్తి వారికి 14 రోజులు రిమాండ్ విధించారన్నారు. -
ఆటోలో బ్యాగ్ను మర్చిపోయిన మహిళ
గంటలో రికవరీ చేసిన పోలీసులు పాయకాపురం(విజయవాడరూరల్): బంగా రపు వస్తువులున్న బ్యాగ్ను ఓ మహిళ ఆటోలో మర్చిపోయింది. బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించిన నున్న పోలీసులు గంట వ్యవధిలోనే ఆ బంగారం వస్తువులున్న బ్యాగ్ను రికవరీ చేసి, బాధితురాలికి అందజేసిన ఘటన బుధవారం జరిగింది. సుందరయ్య నగర్కు చెందిన ఐలూరి ప్రసన్న అనే మహిళ విజయవాడ ఆర్టీసీ బస్టాండు వద్ద పరిమళ పాపారావు ఆటో ఎక్కింది. బంగారం వస్తువులున్న బ్యాగ్ను మర్చిపోయి ఇంట్లోకి వెళ్లింది. కొద్దిసేపటికి ఆటోలో బ్యాగ్ మర్చిపోయినట్టు గుర్తు తెచ్చుకున్న ఆమె నున్న పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సీఐ పి.కృష్ణమోహన్ ఆదేశాల మేరకు క్రైమ్ పోలీసులు సీసీ కెమెరాల ద్వారా ఆటోని గుర్తించారు. అందులో చూడగా బంగారపు వస్తువులున్న బ్యాగ్ యథావిధిగా ఉంది. ఆ బ్యాగ్ను తిరిగి బాధితురాలికి సీఐ అందజేశారు. దీంతో బాధితురాలు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
మొక్కవోని హాబీ
అందాల బోన్సాయ్ ● అడీనియం మొక్కలకు చిరునామాగా వెలివోలు ● పచ్చని సీమలో ఎడారి మొక్కల అందాలు ● కనువిందు చేస్తున్న బోన్సాయ్ మొక్కలు ● నాలుగేళ్లలో 12 నుంచి 10 వేలకు చేరిన మొక్కలు చల్లపల్లి: పచ్చని సీమలో ఎడారి మొక్కల అందాలు కనువిందు చేస్తున్నాయి. హాబీగా చేపట్టిన బోన్సాయ్ మొక్కల పెంపకం సిరులు కురిపిస్తోంది. ఎడారికి అందాలు అద్దే అడీనియం మొక్కలకు మండలంలోని వెలివోలు గ్రామం చిరునామాగా మారింది. ఈ కుగ్రామం నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు అడీనియం మొక్కలు సరఫరా అవుతు న్నాయి. వెలివోలు గ్రామానికి చెందిన కుంభా సాంబ శివరావు ప్రైవేటు స్కూల్లో వ్యాయామోపాధ్యాయుడగా పనిచేసేవారు. 2020లో తన హాబీ మేరకు తెలిసిన వారి దగ్గర నుంచి 12 రకాల అడీనియం మొక్కలను తెచ్చి తన ఇంటి పెరటిలో నాటారు. కరోనా సంక్షోభం కారణంగా ఓ పక్క స్కూల్స్ మూతపడటం, మరోపక్క చేసేందుకు ఎక్కడా పని దొరక్కపోవటంతో తన దృష్టిని ఎడారి మొక్కల పెంపకంపై కేంద్రీకరించారు. తన పెరటిలో ఉన్న 12 అడీనియం మొక్కల నుంచి విత్తనాలను సేకరించి, వాటి నుంచి మొక్కలను పునరుత్పత్తి చేయడం ప్రారంభించారు. రెండు పద్ధతుల్లో మొక్కల పునరుత్పత్తి తన పెరటిలో ఉన్న అడీనియం మొక్కలతోపాటు థాయ్ల్యాండ్, కేరళ, తమిళనాడు నుంచి మరికొన్ని రకాల మొక్కలను సాంబశివరావు దిగుమతి చేసుకున్నారు. వాటి ద్వారా అరుదైన అడీనియం రకాలను సృష్టించడం ప్రారంభించారు. తన ఇంటి పెరట్లో 12 మొక్కలతో ప్రారంభమైన నర్సరీ నేడు 75 సెంట్ల స్థలంలో సుమారు 10 వేల అడీనియం మొక్కలతో విరాజిల్లుతోంది. ఇక్కడ మొక్కలను రెండు రకాలుగా పునరుత్పత్తి చేస్తున్నారు. అంటుకట్టు పద్ధతిలో ఇప్పటి వరకూ 100 రంగులకు పైగా పూలు పూసే మొక్కలను ఉత్పత్తి చేశారు. రెండో పద్ధతిలో విత్తనాలు నాటడం ద్వారా మరో 200 రకాల మొక్కలను సృష్టించినట్లు సాంబశివరావు తెలిపారు. మక్కువే పెట్టుబడి కరోనా తరువాత ఉద్యోగం లేక పనిదొరక్క ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. మొక్కల పెంపకంపై ఉన్న నా మక్కువను అడీనియం మొక్కల వ్యాపారా నికి పెట్టుబడిగా పెట్టా. 12 మొక్కలతో ప్రారంభించిన నర్సరీ 10 వేల మొక్కలకు విస్తరిం చింది. మారుమూల గ్రామమైన వెలివోలు నుంచి దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు మొక్కలు సరఫరా చేస్తున్నా. ఇష్టమైన అలవాట్లను వ్యాపార అవకాశాలుగా మార్చుకుంటే తప్పక విజయం సాధిస్తామని నా నమ్మకం. –కుంభా సాంబశివరావు, నర్సరీ యజమాని, వెలివోలు -
ఆక్టోపస్ మాక్డ్రిల్ అదుర్స్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): బుధవారం అర్ధరాత్రి సమయం.. దుర్గ గుడి వద్ద నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.. ఆలయం పరిసరాలను పారి శుద్ధ్య సిబ్బంది శుభ్రం చేస్తున్నారు.. కొద్ది గంటల్లో అమ్మవారి సుప్రభాత సేవకు సమయం దగ్గర పడుతుండటంతో ఎవరి హడావుడిలో వారున్నారు.. మహా మండపం మొదటి అంతస్తులో భక్తులు పిల్లా పాపలతో కలిసి నిద్ర చేస్తున్నారు.. ఒక్క సారిగా మహా మండపం, ఆలయ ప్రాంగణాల్లో చిమ్మ చీకట్లు అలుముకున్నాయి.. ఆరుగురు ఆగంతకులు ముఖాలకు ముసుగులు ధరించి పొగ బాంబులు విసురుతూ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించారు.. ఒక్క ఉదుటున భక్తుల మధ్యకు చేరి భయభ్రాంతులకు గురిచేశారు.. ఆలయ సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమై స్పెషల్ ఫోర్స్ కమాండోలకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ఆక్టోపస్ కమాండోలు ధైర్యసాహసాలతో భక్తుల మధ్య దాక్కుని ఉన్న ఆగంతకులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇదంతా నిజం కాదు. ఆక్టోపస్ కమాండోల మాక్డ్రిల్. ఈ నిజం తెలుసుకున్న భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై బుధవారం రాత్రి ఆక్టోపస్ మాక్ డ్రిల్ నిర్వహించింది. దుర్గామల్లేశ్వర స్వామి వార్లను ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. అనుకోని రీతిలో, విపత్కర పరిస్థితుల్లో తీవ్రవాదులు ఆలయంపై దాడులు చేస్తే వారికి ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లకుండా ఏ విధంగా కాపాడాలనే దానిపై క్షేత్ర స్థాయిలో మాక్ డ్రిల్ నిర్వహించారు. మాక్డ్రిల్లో వంద మందికి పైగా కమాండోలు, అధికారులు భాగస్వాములయ్యారు. మధ్యాహ్నం దేవస్థానానికి చెందిన జమ్మిదొడ్డి ఆవరణలోని పరిపాలనా భవనంలోని బోర్డు మీటింగ్ హాల్లో ఆక్టోపస్ బృందానికి చెందిన కమాండోలు ఆలయ అధికారులతో సమావేశమై భద్రతా వ్యవహా రాలపై చర్చించారు. దేవస్థానంలో కీలక ప్రాంతా లను పరిశీలించిన ఆక్టోపస్ బృందాలు భద్రతా అంశాలపై పలు సూచనలు చేశాయి. ఆలయ ఈఓ కె.రామచంద్రమోహన్, ఇంజినీరింగ్ అధికారులు, సెక్యూరిటీ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. మాక్డ్రిల్ నిర్వహిస్తున్న ఆక్టోపస్ కమాండోలు -
భూముల రీసర్వే పరిశీలన
చందర్లపాడు(నందిగామ టౌన్): ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతున్న భూ రీ సర్వేలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. చందర్లపాడు మండలం ఉస్తేపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న రెండో దశ రీసర్వే ప్రక్రియను ఆయన బుధవారం తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అత్యంత జవా బుదారీ తనంతో భూముల లెక్కలను పక్కాగా తేల్చేందుకే రీసర్వే జరుగుతోందన్నారు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన గ్రామంలో సర్వే, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో రీసర్వే చేస్తున్నారని తెలిపారు. రైతుల అనుమానా లను నివృత్తి చేస్తూ ఎటువంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా కచ్చిత రికార్డుల రూపకల్పనకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం రైతులతో మాట్లాడి రీ సర్వేతో చేకూరే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో నందిగామ ఆర్డీఓ బాలకృష్ణ, సర్వే, భూ రికార్డులు అసిస్టెంట్ డైరెక్టర్ త్రివిక్రమరావు, మండల సర్వేయర్, వీఆర్వోలు పాల్గొన్నారు. నిత్యాన్నదానానికి పలువురు భక్తుల విరాళాలుఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి బుధవారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. విజయవాడ పటమటకు చెందిన కొల్లి నాగశివ మారుతీధర్ కుటుంబ సభ్యులు నిత్యాన్నదానానికి రూ.1,16,001 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. గుంటూరు గోరంట్లకు చెందిన వాసా భాస్కరరావు రూ.లక్ష విరాళం సమర్పించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. దాతలకు వేద పండితులు ఆశీర్వచనం, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.2.65 కోట్లు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు భక్తులు రూ.2.65 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులు, ముడుపుల రూపంలో సమర్పించారు. అమ్మవారికి భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను బుధవారం మహా మండపం ఆరో అంత స్తులో లెక్కించారు. రూ.2,65,88,961 నగదు, 500 గ్రాముల బంగారం, 4.358 కిలోల వెండి సమకూరాయని ఆలయ ఈఓ కె.రామచంద్రమోహన్ తెలిపారు. కార్యక్రమాన్ని ఆలయ డీఈఓ రత్నరాజు, దేవస్థాన ఏఈఓలు, సూప రింటెండెంట్లు, దేవదాయ శాఖ అధికారులు పర్యవేక్షించారు. సేవలందించిన విద్యార్థులకు సత్కారంపెనమలూరు: మండలంలోని కానూరు పీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 341 ఇంజినీరింగ్ కాలేజీల నుంచి 31 మంది సిబ్బంది, 155 మంది విద్యార్థులు అటల్ టింకరింగ్ ల్యాబ్ మెంటార్లుగా సేవలందించారు. వారిని ఘనంగా సత్కరించారు. ఇంజినీరింగ్ కాలేజీల సిబ్బంది, విద్యార్థులు సమీపంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ప్రాథమిక సాంకేతిక పరిజ్ఞానంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఏపీ ఉన్నత విద్యా మండలి, బే కన్సర్వేషన్ డెవలప్మెంట్ కమిషన్ (బీసీడీసీ), యూనిసెఫ్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనిసెఫ్ ఇండియా చీఫ్ ఆఫీసర్ జెలాలెం బి.టఫెస్సే, సమగ్ర శిక్ష రాష్ట్ర అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎఆర్.ప్రసన్నకుమార్, నీతి ఆయోగ్ ప్రోగ్రాం మేనేజర్ ప్రతీక్దేశ్ముఖ్, బీసీడీఐ కార్యదర్శి ప్రొఫెసర్ ఎం.ఎల్. ఎస్.దేవకుమార్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శివాజీబాబు, పలు సంస్థల ప్రతినిధులు శేషగిరి, సుదర్శన్, శిఖరాణా, కిషోర్ గైక్వాడ్, డాక్టర్ శ్యామ్ పాల్గొన్నారు. -
సమగ్రాభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి
ఎన్టీఆర్ జిల్లా ప్రత్యేక అధికారి జి. జయలక్ష్మి గుణదల(విజయవాడ తూర్పు): పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచే దిశగా అన్ని శాఖల అధికారలు సమష్టిగా కృషి చేయాలని జిల్లా ప్రత్యేక అధికారి జి. జయలక్ష్మి అన్నారు. గుణదలలోని హయత్ ప్లేస్ హోటల్లో స్వచ్ఛతా గ్రీన్ లీఫ్ రేటింగ్, టూరిజం రంగ అభివృద్ధిపై ప్రత్యేక సదస్సు బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ పర్యాటలకులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. హోటల్ యాజమాన్యాలు సైతం పర్యాటక మిత్ర విభాగాలుగా పనిచేయాలన్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి జిల్లాల మధ్య పోటీతత్వంతో పాటు సమన్వయం అవసరమని పేర్కొన్నారు. వృద్ధి సాధించాలి.. అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర లక్ష్యాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఆర్థిక వ్యవస్థలో 66 శాతం సేవా రంగానికి వాటా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న రంగంలో వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో 22.22 శాతం వృద్ధి లక్ష్యాన్ని నిర్ధేశించామన్నారు. రాత్రి 12గంటల వరకే అనుమతి.. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నగరంలో హోటళ్లు రాత్రి 12 గంటల వరకు తెరచి ఉంచే విధంగా పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు. మూడు నెలల తరువాత పొడిగింపుపై నిర్ణయిస్తామని పేర్కొన్నారు. విజయవాడ పర్యాటకానికి అనుకూలమైన నగరమని టూరిస్టులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శాంతి భద్రతలను పరిరక్షించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు నగరంలో 3500 సీసీ కెమెరాలను వినియోగిస్తామన్నారు. కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, ఏపీ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్. వీరాస్వామి, ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పొట్లూరి భాస్కర్, జిల్లా పర్యాటక అధికారి ఎ. శిల్ప, జిల్లా పరిశ్రమల అధికారి బి. సాంబయ్య, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ముగిసిన ప్రజాప్రతినిధుల క్రీడా పోటీలు
విజయవాడస్పోర్ట్స్: ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్రీడా పోటీలు ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో రెండో రోజు బుధవారం హోరాహోరీగా సాగాయి. క్రికెట్, టగ్వార్, మ్యూజికల్ చైర్, వాలీబాల్, 100 మీటర్ల రన్నింగ్, కబడ్డీ, బ్యాడ్మింటన్, టెన్నిస్, త్రోబాల్, టేబుల్ టెన్నిస్ క్రీడాంశాల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జట్లు తలపడ్డాయి. 100 మీటర్ల రన్నింగ్ రేస్ పురుషుల 50 ఏళ్ల లోపు విభాగంలో శ్రీధర్, విజయ్చంద్ర, 60 ఏళ్ల లోపు విభాగంలో కె.ఇ.శ్యామ్, సత్యకుమార్, 60 ఏళ్లు పైబడిన విభాగంలో రామాంజనేయులు, గద్దె రామ్మోహన్, 100 కేజీల బరువు కేటగిరీలో కె.శ్రీకాంత్, విజయ్కుమార్, మహిళల షాట్పుట్లో పి.సింధూరరెడ్డి, ఆర్.మాధవిరెడ్డి, పురుషుల 60 ఏళ్ల లోపు విభాగంలో విజయ్కుమార్, ఆదిరెడ్డి వాసు, 60 ఏళ్లు పైబడిన విభాగంలో కామినేని శ్రీనివాస్, గద్దె రామ్మోహన్ వరుసగా విన్నర్, రన్నర్లుగా నిలిచారు. త్రోబాల్, వాలీబాల్ మహిళల విభాగంలో బి.అఖిలప్రియరెడ్డి–వంగలపూడి అనిత జట్లు ఫైనల్స్లో తలపడ్డాయి. మ్యూజికల్ చైర్ పోటీల్లో మిర్యాల శిరీష(ప్రథమ), ఎస్.సవిత(ద్వితీయ), పి.సింధూరరెడ్డి(తృతీయ) సత్తా చాటారు. మిగిలిన క్రీడాంశాల్లో పోటీలు ఫ్లడ్ లైట్ల వెలుగులో రాత్రి వరకు కొనసాగాయి. నేడు బహుమతి ప్రదానం.. పోటీలు బుధవారం రాత్రితో ముగిశాయని, విజేతలకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గురువారం ట్రోఫీలు, మెడల్స్ అందజేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు వెల్లడించారు. శాప్ ఎండీ పి.ఎస్.గిరీషా, స్పోర్ట్స్ ఆఫీసర్ కోటేశ్వరరావు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల డీఎస్డీవోలు ఎస్.ఏ.అజీజ్, జాన్సీ పోటీలను పర్యవేక్షించారు. క్రీడా ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. -
చాపచుట్టేశారు!
అత్యవసర పశు వైద్యానికి మంగళంపామర్రు: గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం తర్వాత పాడి పరిశ్రమే. పల్లెల్లో రైతుల జీవన ప్రమాణాలు మెరుగు పడాలంటే పాడి పంటలు ఎంతో ముఖ్యం. వ్యవసాయం కలిసి రాక పోయినా పాడి ద్వారా కుటుంబ పోషణకు ఇబ్బంది ఉండదు. అటువంటి పాడి పశువులకు అత్యవసర వైద్య సేవలను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం సంచార అంబులెన్సులను నియోజకవర్గానికి రెండు చొప్పున ఏర్పాటు చేసింది. వీలైతే ఇంటి వద్దకే వైద్యం, మెరుగైన వైద్యం అవసరమైతే ఆస్పత్రికి తరలించేందుకు వీలుగా అంబులెన్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ సేవను కూటమి ప్రభుత్వం నిలిపి వేసింది. కక్షపూరితంగా.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉమ్మడి కృష్ణాజిల్లాలో 2021లో మొదటి విడతలో 9, రెండో విడతలో 10 వాహనాలు మంజూరు చేసింది. ఒక్కొక్క వాహనంలో వైద్యులు, టెక్నీషియన్, ఫార్మసిస్టులు, పైలెట్ కలిపి నలుగురు ఉంటారు. మారుమూల గ్రామాల్లోనూ పశువులకు అత్యవసర వైద్య సేవలు అవసరమైతే 1962 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేస్తే అంబులెన్సులు నేరుగా ఇంటికి వెళ్లి వైద్య సేవలందిస్తాయి. అత్యాధునికంగా హైడ్రాలిక్ సిస్టమ్తో పశువులను నేరుగా అంబులెన్సులోకి ఎక్కించి ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందించి తిరిగి తీసుకు వచ్చే విధంగా వీటిని రూప కల్పన చేశారు. వీటి ద్వారా రైతులకు పైసా ఖర్చు లేకుండా ఇంటి వద్దనే వైద్యం అందేది. రాష్ట్ర వ్యాప్తంగా వీటి నిర్వహణ బాధ్యతలను జీవీడీ ఫౌండేషన్కు అప్పగించింది. దీనికి గత నెలలో గడువు ముగిసింది. ఫలితంగా మార్చి 1వ తేదీ నుంచి మొదటి ఫేజ్లో మంజూరైనా 9 అంబులెన్సులు నిలిపి వేసి అందులో పని చేసే వారిని ఇంటికి పంపారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్కారు వైఖరిపై మండిపడుతున్నారు. సంచార అంబులెన్సుల నిలిపివేత పాడి రైతులకు శాపంగా పరిణమించిన ప్రభుత్వ నిర్ణయం వైద్యులు, టెక్నీషియన్, ఫార్మసిస్టులు, పైలెట్ కొలువులు గోవిందా గత ప్రభుత్వ పథకాలపై కూటమి సర్కార్ కక్ష -
హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం
అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్ పటమట(విజయవాడతూర్పు): రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయటానికి దూకుడుగా వ్యవరిస్తోందని అఖిల భారత మాలసంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవీప్రసాద్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ, క్యాబినెట్ నిర్ణయం, ఆర్ఆర్ మిశ్రా నివేదికకు వ్యతిరేకంగా బుధవారం విజయవాడ నగరంలోని ధర్నాచౌక్లో పోలీస్ అనుమతితో శాంతియుతంగా ధర్నా చేపట్టామని, ముందు అనుమతి ఇచ్చి తర్వాత లేదని తమను గృహ నిర్భంధం చేయటంపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం మాలల పురోగతిని అణచివేయాలని చూస్తోందని, ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేపట్టిన తమను హోంమంత్రి కనుసన్నల్లో నిర్భందించి తమ హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు జేఏసీ సభ్యులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు దుర్మరణం
గూడూరు: పెడన సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గూడూరు మండలం లేళ్లగరువు పీఏసీఎస్ మాజీ చైర్మన్ రాయపురెడ్డి శ్రీనివాసరావు(57) దుర్మరణం చెందారు. పెడన పల్లోటీ పాఠశాల సమీపంలో ఉన్న చెరువు దగ్గరకు వెళ్లి తిరిగి ద్విచక్రవహనంపై ఇంటికి వస్తున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీ కొనడంతో శ్రీనివాసరావు వాహనంతో పాటు పడిపోయారు. ఆ సమయంలో తలకు బలమైన గాయమవ్వడంతో తీవ్ర రక్తస్రావమైంది. హుటాహుటిన మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారు. శ్రీనివాసరావు గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో లేళ్లగరువు పీఏసీఎస్ చైర్మన్గా వ్యవహరించారు. 2006లో ఆయన సతీమణి రాయపురెడ్డి శ్రీలక్ష్మి గ్రామ సర్పంచిగా పనిచేశారు. శ్రీనివాసరావుకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. పెడన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాసరావు మృతి పట్ల రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. -
మంగినపూడి బీచ్ ఉత్సవాలకు సిద్ధం కావాలి
చిలకలపూడి(మచిలీపట్నం): త్వరలో మంగినపూడి బీచ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సంసి ద్ధంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో బీచ్ ఉత్సవాల నిర్వహణపై బుధవారం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ముఖ్య మంత్రి నిర్వహించే కలెక్టర్ల కాన్ఫరెన్స్ తరువాత మంత్రి కొల్లు రవీంద్రతో బీచ్ ఉత్సవాలపై చర్చించి నిర్వహణ తేదీలను నిర్ణయిస్తామని కలెక్టర్ తెలిపారు. గతంలో మాదిరిగా మ్యూజికల్ నైట్, ఫుడ్ స్టాల్స్, పిల్లలు ఆడుకునే వస్తువులు, ఎగ్జిబిషన్, హ్యాండీ క్రాఫ్ట్స్, హెలికాప్టర్ రైడింగ్, సాంస్కృతిక కార్యక్ర మాలు, వాటర్ స్పోర్ట్స్తో ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అయ్యే ఖర్చుల అంచనాల నివేదికను సిద్ధం చేయాలని సూచించారు. పార్కింగ్ ప్రదేశాన్ని దూరంగా ఏర్పాటు చేసి, అక్కడి నుంచి పర్యాటకులు ప్రభుత్వ వాహనాల్లో సముద్రతీరం వద్దకు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జేసీ గీతాంజలిశర్మ, రాష్ట్ర సాంస్కృతికశాఖ సంచాలకుడు మల్లికార్జునరావు, జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, మెప్మా పీడీ పి.సాయిబాబు, డీపీఓ అరుణ, పంచాయతీ రాజ్ ఎస్ఈ రమణారావు, బందరు మునిసిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
మధ్యాహ్న భోజన కార్మికుల ఆకలి కేకలు
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఎద్దేవా చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ.3 వేల వేతనమా? అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల తమ పిల్లలకు ఒక పూట భోజనానికి ఎంత ఖర్చు పెడుతు న్నారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ‘మీకో న్యాయం. పేద పిల్లలకో న్యాయమా? ప్రభుత్వానికి సిగ్గుండాలి’ అంటూ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్నం భోజన పథకం వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో వేతనాలు, మెస్ చార్జీలు పెంచాలని విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో బుధవారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లా డుతూ.. కార్మికులకు కనీసం వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టిన డెప్యూటీ సీఎం పవన్కల్యాణ్ కార్మికులకు వేతనాలు పెంచకుండా వారి డొక్కలు ఎండబెడుతున్నారని దుయ్యబట్టారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు కనీస అవగాహన లేదని ఎద్దేవాచేశారు. నెలకు కేవలం రూ.3 వేల వేతనంతో ఒక కుటుంబం ఎలా జీవిస్తుందని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చలసాని వెంకటరామారావు, ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. రమేష్బాబు, ఏఐటీయూసీ డెప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్.వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ.. పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు వేతనాలు పెంచా లని మంత్రులను కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. కార్మికులకు కనీసం రూ.10 వేల వేతనం చెల్లించాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ బుచ్చిబాబు, చాంద్ బాషా, పుల్లారావు, ప్రమీలమ్మ, ఈశ్వరమ్మ, బాషా, లాజర్, కవిత, సులోచన, వేణుగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక కుటుంబానికి రూ.3 వేల వేతనం ఎలా సరిపోతుంది? మీ పిల్లలకు ఇలానే ఖర్చు చేస్తున్నారా? ప్రభుత్వాన్ని నిలదీసిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ -
ఎన్టీటీపీఎస్ కోల్ప్లాంట్లో అగ్ని ప్రమాదం
ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ కోల్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోల్ ప్లాంట్ లోని టీపీ–9, 4ఏ2బెల్డ్ వద్ద మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ప్రమాదంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను అదుపు చేసేందుకు బుధవారం తెల్లవారుజాము వరకు అగ్నిమాపక సిబ్బంది శ్రమించారు. విద్యుత్ ఉత్ప త్తి కోసం వ్యాగన్ టిప్లర్ వద్ద నుంచి బెల్ట్ల ద్వారా బొగ్గు సరఫరా చేయాల్సి ఉంది. ఈ ప్రాంతంలో అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కాకుండా ఆలస్యంగా స్పందించడంతో బొగ్గు సరఫరా బెల్ట్తో పాటు వివిధ రకాల సామగ్రి కాలిబూడిదగా మారి మరింత నష్టాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 50లక్షల మేరకు సంస్థకు నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. కోల్ప్లాంటులో వేసవిలో అగ్ని ప్రమాదాలు జరుగుతాయనే అంచనా ఉన్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ప్రమాదం జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే జరిగిన ప్రమాదాన్ని పక్కన పెట్టి బెల్డ్, తదితర సామగ్రికి ఇన్సూరెన్స్ ఉందనే వాదన అధికారులు తెరపైకి తేవడం గమనార్హం. -
సన్నచిన్నకారు రైతులకు ‘ఉపాధి’ ఊతం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ చందర్లపాడు(నందిగామ రూరల్): ఉపాధి హామీ పథకంలో చిన్నసన్నకారు రైతులకు నూరు శాతం రాయితీపై ఉద్యాన పంటలను చేపట్టి ఆర్థిక పరిపుష్టి పొందుతున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో చందర్లపాడు మండలం ముప్పాళ్ల సమీపంలో చేపడుతున్న డ్రాగన్ ఫ్రూట్, నిమ్మతోటలను బుధవారం ఆయన పరిశీలించి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా రైతులు కోనంగి భారతి, కొనంగి తిరుపతమ్మ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా అర ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్, రెండెకరాలలో నిమ్మ తోట సాగు చేస్తున్నట్లు తెలిపారు. 1300 ఎకరాల్లో సాగు.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో 1300 ఎకరాలలో పండ్లు, పూలు, మునగ తోటల సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహించామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. మామిడి, జామ, నిమ్మ, సపోట, నారింజ, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్, జీడిమామిడి, దానిమ్మ, నేరేడు, ఆపిల్బేర్, తదితర పండ్ల తోటలతో పాటు మునగ, పామాయిల్ వంటి మొక్కల పెంపకాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. రైతులు వారికి అవసరమైన పండ్లు, పూలు, మొక్కలు, ఎరువులను నేరుగా కొనుగోలు చేసేందుకు అయ్యే ఖర్చును ఉపాధి హామీ పథకం ద్వారా చెల్లిస్తున్నట్లు తెలిపారు. మొక్కలు నాటేందుకు గుంతలు తీయటం, మొక్కలు నాటిన తర్వాత మూడేళ్ల పాటు మొక్కల పెంపకం నిర్వహణకు ఉపాధి హామీ పని దినాలను కేటాయిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం పీడీ రాము, ఆర్డీవో బాలకృష్ణ, ఇన్చార్జ్ మండల అధికారి నాంచారయ్య, ప్లాంటేషన్ జిల్లా మేనేజర్ ఉషారాణి, సూపర్వైజర్ వెంకటేశ్వరరావు, ఏపీవో వెంకటేశ్వర్లు, టెక్నికల్ అసిస్టెంట్ సాయికృష్ణ, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ వంశీకృష్ణ పాల్గొన్నారు. -
30 నుంచి వసంత నవరాత్రులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో 30వ తేదీన విశ్వావసు నామ సంవత్సరాది, వసంత నవరాత్రుల వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 7వ తేదీ వరకు కొనసాగనున్న ఉత్సవాలలో అమ్మవారికి ప్రతి రోజు ఒక విశేషమైన పుష్పార్చన నిర్వహిస్తారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజా కార్యక్రమాలను జరిపిస్తారు. అమ్మవారి స్నపనాభిషేకం నేపథ్యంలో తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ, వస్త్రాలంకరణ సేవ, ఖడ్గమాలార్చన, నవగ్రహ శాంతి హోమం, పల్లకీ సేవలను దేవస్థానం రద్దు చేసింది. అమ్మవారికి స్నపనాభిషేకం అనంతరం ఉదయం 9 గంటలకు దర్శనం ప్రారంభమవుతుంది. పంచాంగ శ్రవణం.. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయంలో పంచాంగ శ్రవణం చేస్తారు. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం ఎదుట కళావేదికపై మధ్యాహ్నం 3 గంటలకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఇక సాయంత్రం నాలుగు గంటలకు మండప పూజ, అగ్నిప్రతిష్టాపన జరుగుతాయి. సాయంత్రం 6 గంటలకు వెండి రథోత్సవాన్ని దేవస్థానం నిర్వహిస్తోంది. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు వెండి రథంపై నగర పురవీధుల్లో విహరిస్తారు. ప్రత్యేక పుష్పార్చనలు.. వసంత నవరాత్రులలో భాగంగా 30వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రత్యేక పుష్పార్చనలు జరుగుతాయి. 30వ తేదీ ఉదయం 9.15 గంటలకు కలశస్థాపన, అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతి మందిరం వద్ద జరుగుతుంది. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమయ్యే విశేష పుష్పార్చనలో రోజుకో ప్రత్యేకమైన పుష్పాలతో అమ్మవారికి అర్చన చేస్తారు. 7వ తేదీ ఉదయం 10 గంటలకు అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. 5 నుంచి శ్రీరామనవమి వేడుకలు ఏప్రిల్ 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు శ్రీరామనవమి వేడుకలను దుర్గమ్మ సన్నిధిలో నిర్వహించనున్నారు. ఇంద్రకీలాద్రి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారికి 5వ తేదీ ఉదయం 6 గంటలకు అభిషేకాలు, నాగవల్లీ దళార్చన (తమలపాకుల) జరుగుతుంది. ఘాట్రోడ్డులోని స్వామి వారి ఆలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 6వ తేదీ అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కళావేదికపై సీతారాముల కల్యాణం, 7వ తేదీ శ్రీరాముల వారి పట్టాభిషేక మహోత్సవాలు జరుగుతాయి. ఏప్రిల్ ఏడో తేదీ వరకూ ఇంద్రకీలాద్రిపై ఉత్సవాలు -
విపత్తు ఏదైనా మేమున్నాం!
నాగాయలంక: వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలప్పుడు తీసుకునే రక్షణ చర్యలపై ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మంగళవారం మాక్డ్రిల్ నిర్వహించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా నాగాయలంక వద్ద కృష్ణాతీరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏపీఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, తదితర రెస్క్యూ టీమ్లు పాల్గొన్నాయి. విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ పర్యవేక్షణలో 16శాఖలకు సంబంధించిన అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో ఈ మాక్ ఎక్సర్సైజ్ను నిర్వహించారు. భవనం కూలిపొయి ప్రజలు దానిలో చిక్కుకున్నప్పుడు.. నదిలో వరదకు బోట్ బోల్తా పడినపుడు.. నది మధ్య లంకల్లో చిక్కుకున్న ప్రజలను బయటకు తీసుకురావడం.. కృష్ణానదిలో చేపలవేట సమయంలో జాలరి పడిపోతే తోటి మత్స్యకారులు అతనిని ఎలా రక్షించాలి.. వంటి వాటిని డెమో చేసి చూపించారు. అలాగే లంకల్లో గర్భిణులు చిక్కుకుంటే బయటకు తీసుకురావడాన్ని ఐసీడీఎస్, మత్స్యశాఖ టీమ్ ప్రదర్శించింది. ఆకట్టుకున్న స్టాల్.. విత్తుల వేళ అప్రమత్తంగా ఉండాల్సిన 16శాఖలు ప్రదర్శించిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ఈ స్టాల్స్ను సందర్శించి పలు సూచనలు చేశారు. కృష్ణాజిల్లా ఐసీడీఎస్ పీడీ రాణి, జెడ్పీ డెప్యూటీ సీఈఓ ఆనందకుమార్, బందరు ఆర్డీఓ కె.స్వాతి, నియోజకవర్గం ప్రత్యేక అధికారి పి.సాయిబాబు(మెప్మా పీడీ), స్థానిక తహసీల్దార్ ఎం.హరనాథ్ ఎంపీడీఓ జి.సధాప్రవీణ్, అవనిగడ్డ సీఐ యువకుమార్ మాక్డ్రిల్ను పర్యవేక్షించారు. ఆపద వేళ రక్షణపై విపత్తుల సంస్థ మాక్డ్రిల్ -
పరిశ్రమల ఏర్పాటుకు తక్షణ అనుమతులు
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా దరఖాస్తు చేసుకున్న వెంటనే సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ డి.కె.బాలాజీ సబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం మంగళవారం జరిగింది. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. జిల్లాలోని పారిశ్రామికవాడల్లో సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. సింగిల్ విండో పద్ధతిపై పరిశ్రమల ఏర్పాటుకు తక్షణ అనుమతులు, రాయితీలు కల్పించాలన్నారు. పరిశ్రమల ఏర్పాట్లలో మౌలిక వసతులకు సంబంధించి ఆయా శాఖల వద్దకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిబంధనల ప్రకారం వసతులు కల్పించాలన్నారు. సముద్రపు నాచు పెంపకం ప్రాజెక్టు ఏర్పాటు కోసం స్థలం కొనుగోలుకు సొంత నిధులను వెచ్చిస్తామని, రోడ్డు, విద్యుత్ సౌకర్యాలు కలిగిన తీర ప్రాంతంలో అనువైన స్థలాన్ని కేటాయించాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్త కోరారు. కలెక్టర్ స్పందిస్తూ మత్స్యశాఖ జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే చర్యలు చేపట్టా లని సూచించారు. పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్.వెంకట్రావు, జెడ్పీ సీఈఓ కె. కన్నమనాయుడు, డీఆర్డీఏ పీడీ వై.హరిహరనాథ్, ఎల్డీఎం రవీంద్రారెడ్డి పాల్గొన్నారు. -
కార్మికులపై కక్ష సాధింపులు ఆపాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్లో నిధులు పెంచాలని, కార్మికులకు వేతనాలు, మెనూ చార్జీలు పెంచాలని కోరుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు రోడ్డెక్కారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. పథకంలో పనిచేస్తున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ. 10వేలు వేతనం పెంచాలని, మెనూ చార్జీలు పాఠశాల విద్యార్థులకు రూ.20, కాలేజీ విద్యార్థులకు రూ.40 పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపాలన్నారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయా రమాదేవి, యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఉత్తర, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి. రమాదేవి, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, సీఐటీయూ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఎ.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ధర్నా -
మహిళల రక్షణే లక్ష్యంగా శక్తి టీంలు
కోనేరుసెంటర్: మహిళల రక్షణకు పోలీసుశాఖ అత్యంత ప్రాధాన్యమిస్తోందని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు అన్నారు. అందుకోసం శక్తి టీంలను మరింత బలోపేతం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో మహిళల రక్షణ నిమిత్తం కొత్తగా ఏర్పాటు చేసిన మరో 12 శక్తి టీంలను మంగళవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ మహిళల రక్షణకు పోలీసుశాఖ నిరంతరం పని చేస్తుందన్నారు. శక్తి టీంలు నిరంతరం కళాశాలలు, బస్టాండ్, షాపింగ్ మాల్స్, జనసంచారం అధికంగా ఉన్న ప్రదేశాలలో పహార కాస్తూ, మహిళలపై జరిగే వేధింపులను అరికట్టడంలో కీలకంగా వ్యవహరించాలన్నారు. మహిళలు, చిన్నారులు ఎవరైనా సరే సమస్యల్లో ఉన్నాం, అత్యవసర పరిస్థితుల్లో చిక్కుకున్నాం, అని శక్తి యాప్ ద్వారా సహాయం కోసం సంప్రదిస్తే తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకొని వారికి భరోసాగా నిలవటమే శక్తి టీంల కర్తవ్యమన్నారు. ప్రతి ఒక్కరి మొబైల్లో శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వీవీ నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి. సత్యనారాయణ, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు -
ఉత్సాహంగా ప్రజాప్రతినిధుల క్రీడా పోటీలు
విజయవాడస్పోర్ట్స్: ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో మంగళవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 173 మంది సభ్యులు పాల్గొంటున్నట్లు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్రెడ్డి ప్రకటించారు. మంగళవారం క్రికెట్, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, బ్యాడ్మింటన్, త్రో బాల్, టెన్నిస్, కబడ్డీ పోటీల్లో ప్రజాప్రతినిధుల జట్లు తలపడ్డాయి. ఆహ్లాదభరిత వాతావరణంలో జరిగిన ఈ పోటీల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఉత్సాహభరితంగా తలపడ్డారు. శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల డీఎస్డీవోలు ఎస్.ఎ.అజీజ్, జాన్సీ, స్పోర్ట్స్ ఆఫీసర్ కోటేశ్వరరావు ఈ పోటీలను పర్యవేక్షించారు. -
మే 15 నుంచి ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు
లోగో ఆవిష్కరించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) 17వ జాతీయ మహాసభలు మే 15 నుంచి 18 వరకు తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన్, సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తెలిపారు. ఈ మహాసభలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జాతీయ మహాసభల లోగో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఎన్నో ఉద్యమ ఆటుపోట్లను ఎదుర్కొన్న అఖిల భారత యువజన సమాఖ్య పోరాడి వయోజనులకు ఓటు హక్కు సాధించిందన్నారు. ‘జాబ్ ఆర్ జైల్’, ‘సేవ్ ఇండియా చేంజ్ ఇండియా’ నినాదాలతో ఉద్యమించిందని అన్నారు. జాతీయ 17వ మహాసభలలో నిరుద్యోగ యువత, ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించి భవిష్యత్ ఉద్యమ రూపకల్పన చేస్తామన్నారు. జాతీయ మాజీ కార్యదర్శి జి. ఈశ్వరయ్య, జాతీయ కార్యదర్శి నక్కి లెనిన్ బాబు, రాష్ట్ర అధ్యక్షుడు ఎం. యుగంధర్, ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణాజిల్లా
బుధవారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2025u8లో ఇఫ్తార్ సహరి (బుధ) (గురు) విజయవాడ 6.23 4.56 మచిలీపట్నం 6.22 4.53నిత్యాన్నదానానికి విరాళం ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి విజయవాడ భవానీపురానికి చెందిన కనమర్లపూడి రామకృష్ణ, సౌమిత్రి పద్మవల్లి రూ. 1,00,116 విరాళాన్ని అందజేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డు, మండలంలోని కొత్తపేట గ్రామ సచివాలయాల్లో శనగల కొనుగోలు కేంద్రాలను మంగళవారం ప్రారంభించారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: బెజవాడ దుఃఖదాయినిగా మారిన బుడమేరు ఆధునికీకరణపై కూటమి ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను మభ్య పెడుతోంది. గత ఏడాది వరదల సమయంలో విజయవాడ కలెక్టరేట్లో వారం రోజులకుపైగా బసచేసి, నగరంలో ముంపు నివారణ కోసం ఎన్నికోట్లు అయిన ఖర్చు చేస్తామని హడావుడి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మళ్లీ దాని గురించి పట్టించుకోవటం లేదు. ముఖ్యంగా బుడమేరు ఆధునికీకరణ విషయంలో అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తొలుత బుడమేరు ప్రక్షాళన అంటూ మొదలు పెట్టి.. తొలి దశకు రూ.500 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశారు. తీరా బడ్జెట్లో చూస్తే ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు బుడమేరు మళ్లింపు కాలువలకంటూ కొన్ని నిధులు విధిల్చారు. మంగళవారం జరిగిన మంత్రి వర్గంలో రూ.37.97 కోట్లను కేటాయించారు. కేవలం గండ్లు పడిన ప్రాంతంలో వరద నివారణకు రక్షణ గోడల నిర్మాణానికి మాత్రమే జలవనరులకు శాఖకు పరిపాలన అనుమతులు ఇచ్చారు. ఆధునికీకరణ ఊసే ఎత్తలేదు. దీంతో బుడమేరు పరీవాహక ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బాధితుల తరఫున వైఎస్సార్ సీపీ పోరాటం.. మొదటి నుంచి వైఎస్సార్ సీపీ బుడమేరు బాధితులకు అండగా నిలిచింది. బాధితులకు సాయంతోపాటు, ఆధునికీకరణ పనులు చేపట్టాలని ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా చేపట్టింది. గవర్నర్ను కలిసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇదే సమస్యపై మండలిలో రెండుమార్లు డాక్టర్ మొండితోక అరుణకుమార్ సమస్యను ప్రస్తావించి, న్యాయం చేయాలని కోరారు. బుడమేరు బాధితులకు జరిగిన అన్యాయాన్ని ఆయన ఎమ్మెల్సీ రుహుల్లాతో కలిసి కళ్లకు కట్టినట్లు వివరించారు. ఆ సమయంలో సాక్షాత్తూ విపత్తుల శాఖ మంత్రి బాధితులను ఆదుకోవడానికి రూ.497.07 కోట్ల విరాళాలు వచ్చాయని, వీటితో బాధితుల సహాయం కోసం రూ.274.95కోట్లు, ఖర్చు చేశామని చెప్పారు. అయితే మిగిలిన నిధులతో అయినా కనీసం పనులు నిర్వహించకపోవడం గమనార్హం. వెలగలేరు వద్ద బుడమేరుపై ఉన్న హెడ్ రెగ్యులేటర్ లాకులు పూర్తిగా కిందకు దిగకపోవడంతో నీరు లీకవ్వకుండా వేసిన ఇసుక బస్తాలు కవులూరు శివారులో గండ్లు పూడ్చిన ప్రదేశంలో లీకవుతున్న నీరు7న్యూస్రీల్బుడమేరు యాక్షన్ ప్లాన్ అమలేది? వరదలు వచ్చిన సమయంలో విజయవాడ ప్రజలను ముంపు నుంచి రక్షించాలనే లక్ష్యంగా ఆపరేషన్ బుడమేరు యాక్షన్ ప్లాన్ కార్యాచరణ రూపొందించారు. నగరాన్ని ముంపు రహిత మార్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రులు హడావుడి చేశారు. ప్రాథమికంగా మొదటి దశలో బెజవాడలో బుడమేరు కాలువ సామర్థ్యాన్ని 5వేల నుంచి 10 వేల క్యూసెక్కులకు పెంచాలని ప్రతిపాదించారు. ఈ మేరకు దాదాపు రూ.500 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. 13.25 కిలోమీటర్ల వరకు బుడమేరు ఆక్రమణలకు గురైందని తేల్చారు. ఇందులో విద్యాధరపురం నుంచి గుణదల వరకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 202 ఎకరాలకు గానూ 70 ఎకరాలు ఆక్రమణకు గురికాగా, వీటిలో 3,051 ఇళ్ల నిర్మాణాలు జరిగినట్లు గుర్తించారు. బుడమేరుకు వచ్చే వరద నీటిని సమాంతరంగా కాలువ తవ్వి మళ్లించే విధంగా ప్రణాళిక రచించారు. దీంతో పాటు చీమలవాగు, కేసరపల్లి, ఎనికేపాడు, యూటీల సామర్థ్యం పెంచాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు వెళ్లే 50.6 కిలో మీటర్ల కాలువ గట్లను మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రస్తుతం ఈ యాక్షన్ ప్లాన్ అమలుకు ప్రభుత్వ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. బెజవాడ దుఃఖదాయినిని పట్టించుకోని కూటమి ప్రభుత్వం హడావుడి చేసి చేతులెత్తేసిన వైనం కేవలం గండ్లు పూడ్చేందుకు మాత్రమే నిధుల కేటాయింపు ఈ సీజన్లో పనులు చేయకపోతే వచ్చేది కష్టకాలమే ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు -
భవిష్యత్తులో ప్రమాదమే..
ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా గండ్లు మాత్రమే పూడ్చేందుకు నిధులు విడుదల చేసి చేతులు దులుపుకుంటే భవిష్యత్తులో పెను ప్రమాదమే జరుగుతుంది. బుడమేరుకు వెల్లటూరు వద్ద పడిన గండ్ల వల్ల నేను సాగు చేసిన ఆరు ఎకరాల్లో వరిపైరు కుళ్లిపోయింది. రెండో సారి నాట్లు వేయాల్సి వచ్చింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం సైతం పడిపోయింది. ప్రభుత్వం సమగ్రమైన ప్రణాళికతో బుడమేరు ప్రక్షాళన చేపడితేనే మేలు జరుగుతుంది. – దొడ్డా విష్ణువర్థన్రావు, రైతు, ఆత్కూరు, జి.కొండూరు మండలం -
మలేరియా ల్యాబ్ టెక్నీషియన్లకు పునశ్చరణ శిక్షణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా మలేరియా విభాగంలో ల్యాబ్ టెక్నీషియన్లుగా విధులు నిర్వహిస్తున్న వారికి రెండు రోజుల పాటు నిర్వహించే పునశ్చరణ శిక్షణ మంగళవారం ప్రారంభమైంది. అజిత్సింగ్నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న మొదటి బ్యాచ్ శిక్షణను డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ శిక్షణ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్లు సుశిక్షతులై రాబోయే రోజుల్లో మలేరియా, పైలేరియా వంటి వ్యాధుల నియంత్ర ణలో బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలన్నారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మోతీ బాబు మాట్లాడుతూ.. మలేరియా విభాగంలో పనిచేసే ఎల్టీలను మూడు బ్యాచ్లుగా విభ జించి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి బ్యాచ్కు రెండు రోజుల శిక్షణ ఇస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ డైరెక్టర్ రామనాథ్రావు, మలేరియా పూర్వ అధికారులు రత్నజోసఫ్, ఆదినారాయణ పాల్గొన్నారు. తిరుపతమ్మ ఆలయానికి రూ.1.03 కోట్ల ఆదాయం పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మవారి ఆలయం వద్ద వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకునేందుకు మంగళవారం ఆలయ బేడా మండపంలో బహిరంగ వేలం జరిగింది. ఈ వేలంలో ఆలయానికి రూ.1,03,55,000 ఆదాయం సమకూరిందని ఈఓ కిషోర్కుమార్ తెలిపారు. ఆలయం వద్ద ఏడాది పాటు కొబ్బరికాయలు విక్రయించుకునే హక్కును రూ.58.50 లక్షలు, పొంగళి షెడ్ల నిర్వహణ, పొంగలి తయారీ సామగ్రి విక్రయించుకునే హక్కునకు రూ.29.55 లక్షలకు పచ్చల శివప్రసాద్ హెచ్చు పాటదారుగా నిలిచి దక్కించుకున్నారు. దేవస్థానం ప్రాంగణంలో పొంగలి షెడ్డు వద్ద మట్టికుండలు విక్రయించుకునే హక్కును కె.వీరవర ప్రసాద్ రూ.15.50 లక్షలకు పొందారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ జంగాల శ్రీనివాసరావు, పాలకవర్గ సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. శనగల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కంచికచర్ల: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు, మండలంలోని కొత్తపేట గ్రామ సచివాలయంలో శనగల కొనుగోలు కేంద్రాలను మార్క్ఫెడ్ డీఎం కె.నాగమల్లిక మంగళవారం ప్రారంభించారు. ఈ మేరకు డీఎం మాట్లా డుతూ.. సీఎం యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి రైతూ తమకు కేటాయించిన తేదీ ప్రకారం కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చి తాము పండించిన శనగ పంటను విక్రయించుకోవచ్చని తెలిపారు. క్వింటా శనగల మద్దతు ధర రూ.5,650గా ప్రభుత్వం నిర్ణయించింద న్నారు. నిర్ణీత తేమశాతం, నాణ్యతా ప్రమాణాలు ఉంటేనే శనగలను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. నగదు మాత్రం రైతుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమవుతుందని డీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ కార్యదర్శి ఎస్.శ్రీనివాస్, సూపర్వైజర్ కె.నరేష్కుమార్ పాల్గొన్నారు. -
చిన్న తిరునాళ్లలో అపశ్రుతి
పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మవారి చిన్న తిరునాళ్ల ఉత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. వత్సవాయి మండలం కొత్త రేగులగడ్డకు చెందిన సోదరులు గింజుపల్లి సాయిమణికంఠ (24), గింజుపల్లి గోపి మంగళవారం రాత్రి తిరునాళ్లకు వచ్చారు. ఎగ్జిబిషన్లోని క్రాస్ జయింట్ వీల్ ఎక్కారు. ప్రమాదవశాత్తు తొట్టి లింక్ ఊడటంతో వారు ఇద్దరు పైకి లేచి పక్కనే ఉన్న సీసీ రోడ్డుపై పడిపో యారు. ఈ ప్రమాదంలో సాయిమణికంఠ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. గోపికి కాలు, చెయ్యి విరగ టంతో 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇద్దరికీ వివాహం కాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాయిమణికంఠ సాఫ్ట్వేర్ ఇంజినీరుగా ఉద్యోగం చేస్తూ తిరునాళ్లకు ఇంటికి వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు సరైన భద్రతా చర్యలు పాటించక పోవటంతోనే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు -
కష్టజీవిని కావ్య నాయకుడిని చేసిన శ్రీశ్రీ
గుణదల(విజయవాడతూర్పు): తెలుగు సాహిత్యానికి శ్రీశ్రీ మార్గదర్శి అని బెంగళూరు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య కొలకలూరి ఆశాజ్యోతి పేర్కొన్నారు. ఆంధ్ర లయోల కళాశాల ప్రాచ్య భాషల విభాగం ఆధ్వర్యంలో శ్రీశ్రీ సాహిత్యంపై మంగళవారం జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆశాజ్యోతి ఆన్లైన్ ద్వారా ముఖ్య అతి థిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యంలో విశిష్టమైన మహా ప్రస్థానం అమృతోత్సవం సందర్భంగా శ్రీశ్రీ సాహిత్యంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. శ్రీశ్రీ సాహిత్యంలోని ప్రగతిశీల భావాలను విద్యార్థులు అలవరుచుకోవాలని సూచించారు. కష్టజీవిని కావ్య నాయకుడిగా చేసిన ఘనత శ్రీశ్రీకే దక్కుతుందన్నారు. సభకు అధ్యక్షత వహించిన లయోల కళాశాల ప్రిన్సిపాల్ రెవరెండ్ ఫాదర్ డాక్టర్ జి.ఎ.పి.కిశోర్ మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యాన్ని మరో మలుపు తిప్పిన మహా కవి శ్రీశ్రీ అని కొనియాడారు. కళాశాల రెక్టార్ రెవ రెండ్ ఫాదర్ డాక్టర్ జాన్బాబు మాట్లాడుతూ శ్రీశ్రీ ఎంతో మంది కవులను ప్రభావితం చేశారని చెప్పారు. వాషింగ్టన్ నుంచి ఆన్లైన్ ద్వారా మాధురి ఇంగువ విశిష్ట అతిథిగా పాల్గొని శ్రీశ్రీ కవితా తత్త్వాన్ని విశ్లేషించారు. గౌరవ అతిథిగా పాల్గొన్న హైదరాబాద్ ప్రభుత్వ సిటీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడు డాక్టర్ కోయి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. శ్రామికవర్గ సౌభాగ్యాన్ని, కార్మిక లోక కల్యాణాన్ని శ్రీశ్రీ తన కవిత్వంలో అద్భుతంగా చిత్రించారని పేర్కొన్నారు. మరో అతిథి శ్రీశ్రీ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ బాల్యం నుంచి శ్రీశ్రీ కవిత్వం ద్వారా ప్రేరణ పొందానని అన్నారు. కీలకోపన్యాసం చేసిన గరికపాటి రమేష్బాబు మాట్లాడుతూ.. శ్రీశ్రీ సాహిత్య ప్రస్థానం అభ్యుదయ సాహిత్య ఉద్యమానికి దారి, దీపమై నిలిచిందని, విప్లవోద్యమానికి ప్రేరణ ఇచ్చిందని వివరించారు. ప్రాచ్య భాషల విభాగం అధ్యక్షుడు, సదస్సు కన్వీనర్ డాక్టర్ కోలా శేఖర్ ఈ సదస్సు లక్ష్యాలను వివరించారు. తెలుగు అధ్యాపకులు అమృతరావు సభకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సంస్కృత అధ్యాపకుడు వెంకటేశ్వరావు వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా పరిశోధకుల పత్రాలతో కూడిన వ్యాససంకలనాన్ని అతిథులు ఆవిష్కరించారు. డాక్టర్ గుమ్మా సాంబశివరావు, డాక్టర్ విజయానందరాజు, దివి కుమార్, అనిల్ డానీ, వెన్నా వల్లభరావు, కళాశాల అధ్యాపకులు కృపారావు, స్నేహల్ విమల్ శుక్ల తదితరులు పాల్గొన్నారు. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం పుస్త కాన్ని పాకెట్ సైజ్లో ముద్రించి విశ్వేశ్వరరావు కళాశాల విద్యార్థులకు ఉచితంగా బహూకరించారు. శ్రీశ్రీ సాహిత్య నిధి కన్వీనర్ సింగంపల్లి అశోక్ కుమార్ వంద శ్రీశ్రీ బుల్లెట్ పుస్తకాలను విద్యార్థులకు, పరిశోధకులకు బహూకరించారు. -
లబ్ధిదారులకు విరివిగా రుణాలు ఇవ్వండి
బ్యాంకర్లకు కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ సూచన చిలకలపూడి(మచిలీపట్నం): రైతులకు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు విరివిగా రుణాలు అందజేసి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ బ్యాంకర్లకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో మంగళవారం వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. పంట సాగు చేస్తూ సీసీఆర్సీ కార్డులు ఉన్న కౌలు రైతులకు పంట రుణాలు తప్పనిసరిగా అందించాలన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రోత్సాహకంగా ప్రత్యేకించి బ్యాంకు రుణాలు అందించాలని, అవసరమైతే రుణ పరిమితిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంఎస్ఎంఈ కింద ఏపీఐఐసీ ద్వారా స్థలం కేటాయింపులు జరిపిన పారిశ్రామికవేత్తలకు ఉదారంగా రుణాలు ఇవ్వాలని పేర్కొన్నారు. రవాణా రంగానికి సంబంధించి బ్యాంకు అధికారులు రుణాలు తక్కువగా ఇస్తున్నారని, దానికి ప్రాధాన్యం ఇచ్చి ఎస్సీ, ఎస్టీలను ప్రోత్సహించాలని కోరారు. బ్యాంక్ కంట్రోలింగ్ అధికారులు పరిశ్రమల అధికారులతో వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు రుణాలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఏడు వేల మంది మహిళా వ్యాపారవేత్తలను తయారుచేసి, అవసరమైన జీవనోపాధి కల్పించి ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ యించిందన్నారు. ఇందు కోసం బ్యాంకులు, స్వయం సహాయక సంఘాల మహిళలకు విరివిగా రుణాలు అందించి ప్రోత్సహించాలన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ద్వారా లక్ష రూపాయల వరకు బ్యాంకు రుణాలను ఎటువంటి బిల్లులు లేకుండా మంజూరు చేసి చేతి వృత్తుల వారిని ప్రోత్సహించాలని కోరారు. ప్రధాన మంత్రి సూర్య ఘర్ పథకానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. సైబర్ నేరాల నేపథ్యంలో బ్యాంకు ఖాతాదారులకు భరోసా ఇచ్చేలా చూడాలన్నారు. బ్యాంకు లావాదేవీలపై ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆర్బీఐ ఏజీఎం అభిషేక్, ఎల్డీఎం రవీంద్రారెడ్డి, ఇండియన్ బ్యాంక్ డీఎం రామారావు, ఎస్బీఐ ఆర్ఎం సుబ్రహ్మణ్యం, యూనియన్ బ్యాంక్ ఆర్ఎం తాతాజీ, జిల్లా పరిశ్రమల అధికారి ఆర్.వెంకట్రావు, జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, టిడ్కో పీడీ చిన్నోడు తదితరులు పాల్గొన్నారు. -
అటవీ భూముల రక్షణకు పటిష్ట నిఘా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో అటవీ భూములు ఆక్రమణకు గురి కాకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. అర్హులకు ఇబ్బంది లేకుండా ఆర్ఓఎఫ్ఆర్ (రికార్డ్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) పట్టాల పంపిణీకి సంబంధించి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన అటవీ శాఖ సమీక్ష సమావేశం మంగళవారం జరిగింది. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీ, హరిత విస్తీర్ణం పెంపు, ఆక్రమణల నియంత్రణ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. జిల్లాలో అటవీ భూముల రక్షణకు పటిష్ట నిఘా అవసరమన్నారు. ఏవైనా ఆక్రమణలను గుర్తిస్తే అటవీ, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో కూడిన జాయింట్ తనిఖీల బృందాలు క్షేత్రస్థాయి తనిఖీలు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు జిల్లాస్థాయిలో అటవీ శాఖకు సంబంధించి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. హరితాంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు జిల్లాలో పకడ్బందీగా అమలయ్యేలా చూడాలన్నారు. పచ్చదనం పెంచేలా వినూత్న కార్యాచరణతో అడుగులు వేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలోని వివిధ నీటి వనరుల గట్ల వెంబడి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మొక్కల వల్ల పర్యావరణానికి మేలు జరగడంతో పాటు గట్లు కూడా బలంగా ఉంటాయని వివరించారు. ఈ సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, డీఎఫ్ఓ జి.సతీష్, ఎఫ్ఆర్ఓ కె.శ్రీనివాసులురెడ్డి, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఎ.రవీంద్రరావు, కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్ సీహెచ్.దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలపైప్రత్యేక దృష్టిపెట్టండి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ -
స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి సహకరించండి
చిలకలపూడి(మచిలీపట్నం): స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీతో పాటు అవసరమైన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ కోరారు. ఆయన తన చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికలకు సంబంధించిన అంశాలపై మంగళవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలోనే కాకుండా అంతకు ముందుగా కూడా ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణ, క్లయిమ్లు, అభ్యంతరాల పరిష్కారం, అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై సహాయ సహకారాలు అందించాలన్నారు. ఇకపై ప్రతి నెలా గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, అభిప్రాయాలు తీసుకుని ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటా మని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ దృష్టికి వచ్చిన ఎన్నికల అంశాలు ఏమైనా ఉంటే సమావేశంలో ప్రస్తావించాలని కోరారు. ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు సరిదిద్దటం వల్ల స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారవుతుందని పేర్కొన్నారు. అప్పుడే రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఓటర్ల జాబితాపై విశ్వాసం కలుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో హడావుడి చేయకుండా ముందుగానే పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపు, మరుగుదొడ్లు తదితర కనీస సౌకర్యాలు ఎవరికీ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పోలింగ్ కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో అవసరమైన మరమ్మతులు చేపట్టి, కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఎక్కడైనా బూత్స్థాయి అధికారుల స్థానాలు ఖాళీగా ఉంటే భర్తీ చేస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు కోసం నమోదు చేసుకునేలా చూడాలన్నారు. సమావేశంలో డీఆర్వో చంద్రశేఖరరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు షేక్ సలార్దాదా, కొడాలి శర్మ, పి.వి.గజేంద్ర, బత్తిన దాసు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం డెప్యూటీ తహసీల్దార్ ఎం.వి.శ్యామ్నాథ్, వై.నారాయణ పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటులోసలహాలు, సూచనలు ఇవ్వండి రాజకీయ పార్టీల ప్రతినిధులతో కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
తిరుపతమ్మ తిరునాళ్లలో ఉద్రిక్తత
పెనుగంచిప్రోలు: తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్లలో భాగంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తిరునాళ్లలో ప్రధాన ఘట్టమైన అమ్మ వారి పుట్టింటి పసుపు – కుంకుమ బండ్లు అమ్మ వారి ఆలయం వద్దకు చేరుకునే సరికి సోమవారం అర్ధరాత్రి దాటింది. ఈ క్రమంలో అమ్మవారి బండితో పాటు టీడీపీ, జనసేన, సీపీఐ, వైఎస్సార్ సీపీ బండ్లు, ట్రాక్టర్లకు కూడా ప్రభలు కట్టారు. టీడీపీ, వైఎస్సార్ సీపీ బండ్లు పోలీస్స్టేషన్ సెంటర్ చేరే సరికి టీడీపీ వారు డీజేల్లో పాటలు, డైలాగులతో కవ్వింపు చర్యలకు దిగారు. ఇది కొట్లాటకు దారి తీసింది. ఈ ఘటనలో ఎవరో విసిరిన రాళ్లతో ఏపీఎస్పీ ఎస్ఐ లక్ష్మీనారాయణతో పాటు విజయవాడ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎస్.మణికంఠ, ఏఆర్ హెడ్కానిస్టేబుల్ ఎ.యేసోబు రాజు, పెనుగంచిప్రోలు కానిస్టేబుల్ రమేష్కు గాయాలయ్యాయి. వారికి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు. వైఎస్సార్ సీపీ బండి గంటల తరబడి నిలిపివేత వైఎస్సార్ సీపీ బండిని అడుగడుగునా అడ్డుకున్నారు. పోలీస్స్టేషన్ సెంటర్లో సుమారు రెండు గంటలకు పైగా టీడీపీ బండ్లు వచ్చే వరకు వైఎస్సార్ సీపీ బండి ముందుకు వెళ్లకుండా అధికార పార్టీకి చెందిన ఒకరిద్దరు నాయకులు దగ్గరుడి నిలిపి వేశారని స్థానికులు పేర్కొంటున్నారు. టీడీపీ బండ్లు వచ్చిన తరువాత వారు రెచ్చగొట్టే డైలాగ్లు, పాటలు పెట్టడంతోపాటు ఎవరో వాటర్ బాటిల్ విసరటంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ మొదలైందని తెలిపారు. పోలీసులు ప్రత్యేక బృందాలతో ఇరు వర్గాలను లాఠీలకు పనిచెప్పి చెదరగొట్టారు. టీడీపీ బండి వచ్చే వరకు వైఎస్సార్ సీపీ బండిని నిలపకుండా వెళ్లనిస్తే ఘర్షణ జరిగేది కాదని, పోలీసుల తీరు వల్లే ఇలా జరిగిందని విమర్శిస్తున్నారు. రెండు వర్గాలను చెదరగొట్టాం నందిగామ ఏసీపీ తిలక్ మాట్లాడుతూ.. ఉత్సవాలకు ముందు అన్ని పార్టీల నాయకులు, గ్రామస్తులతో సమీక్షా సమావేశాలు నిర్వహించామని, బండ్ల వద్ద డీజేలకు ఎలాంటి పార్టీ పాటలు, రెచ్చగొట్టే డైలాగ్స్ ఉండకూడదని చెప్పామన్నారు. నాయ కులు కూడా అలాంటివి ఉండవని చెప్పారని పేర్కొన్నారు. అమ్మవారి బండి వెనుక టీడీపీ, జనసేన బండ్లు, తరువాత వైఎస్సార్ సీపీ బండ్లు పంపుతున్నామని, ఈ క్రమంలో పోలీస్స్టేషన్ సెంటర్లో ఒకరికొకరు ఎదురు పడిన సందర్భంలో కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని, వెంటనే అప్రమత్తమై ఇరు వర్గాలను చెదరగొట్టామన్నారు. రాళ్లుతో దాడి చేసిన వారిని గుర్తించామన్నారు. పోలీస్స్టేషన్ సెంటర్లో రెండు వర్గాల ఘర్షణ నలుగురు పోలీసులకు గాయాలు -
నేడు అశోక్ లేల్యాండ్ ప్లాంట్ ప్రారంభం
హనుమాన్జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం మల్లవల్లిలోని ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో ఏర్పాటు చేసిన అశోక్ లేల్యాండ్ బస్ బాడీ బిల్డింగ్ తయారీ పరిశ్రమను మంత్రి నారా లోకేష్ బుధవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. 75 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన బస్ బాడీ బిల్డింగ్ తయారీ యూని ట్లో పెండింగ్ పనులను పూర్తి చేయటంతో పాటు ఇటీవలే ట్రయన్ రన్ నిర్వహించారు. ఈ యూనిట్లో అత్యాధునిక సాంకేతికతతో ఈవీ, బీఎస్–6 నాణ్యాతా ప్రమాణాలతో బస్సులను తయారు చేయనున్నారు. ఈ ప్లాంట్ ఏటా 4800 బస్సుల ఉత్పత్తి సామర్థ్యంతో ఐదు వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించనుంది. మంత్రి లోకేష్ పర్యటన నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ మంగళవారం సాయంత్రం ఏర్పాట్లను పరిశీలించారు. అశోక్ లేల్యాండ్ మల్లవల్లి ప్లాంట్ హెడ్ శ్రీధరన్ను కార్యక్రమ ఏర్పాట్లను కలెక్టర్కు వివరించారు. గుడివాడ ఆర్డీఓ బాల సుబ్రహ్మణ్యం, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్.వెంకట్రావు, బాపులపాడు తహసీల్దార్ బండ్రెడ్డి మురళీకృష్ణ పాల్గొన్నారు. -
మినుము కొనుగోళ్లకు సన్నాహాలు
కంకిపాడు: మినుము కొనుగోళ్లకు అధికారులు ఎట్టకేలకు చర్యలు చేపట్టారు. మార్కెట్లో ధర అర కొరగా దక్కుతున్న స్థితిలో రైతులు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితిపై ‘సాక్షి’లో ఈ నెల తొమ్మిదో తేదీన ‘మినుము రైతు దిగాలు’ శీరిక్షన కథనం ప్రచురితమైంది. ఈ కథనంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఆఘమేఘాలపై జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి మినుము కొనుగోలు చేపట్టేందుకు సన్నాహాలు చేశారు. ఇందులో భాగంగా తొలుత కంకిపాడు మార్కెట్ యార్డు ప్రాంగణంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించనున్నారు. 45 శాతం మినుము తీతలు పూర్తి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది రబీ సీజన్లో 2,84,237 ఎకరాల్లో మినుము సాగు చేపట్టారు. ఇప్పటికే 45 శాతం మినుము తీతలు పూర్తయ్యాయి. పంట మార్కెట్కు చేరుతోంది. ఎకరాకు సరాసరిన ఆరు నుంచి ఎనిమిది బస్తాల వరకూ దిగుబడి వస్తోంది. దిగుబడులు ఫర్వాలేదనిపించినా మార్కెట్లో ధర ఆశాజనకం లేకపోవటంతో రైతులు ఆర్థికంగా నష్టాన్ని చవిచూస్తున్నారు. క్వింటా మినుము ధర ప్రస్తుతం రూ.7400 నుంచి రూ.7500 వరకు పలుకుతోంది. గత సీజన్లో ఇదే సమయంలో క్వింటా మినుముల ధర రూ.9100. మార్కెట్లో కొందరు వ్యాపారులు సిండికేట్గా మారి ధరను పెరగనివ్వకుండా అడ్డు కుంటున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆ కార ణంగానే గడిచిన పది రోజులుగా మార్కెట్లో ధర స్ధిరంగా ఉందని రైతులు అంటున్నారు. ఎకరాకు మినుము సాగుకు తెగుళ్లు ప్రభావంతో యాజమాన్య చర్యలతో కలిపి రూ.40 వేలపైగా పెట్టుబడులయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరను బట్టి రైతులకు ఖర్చులు కూడా చేతికందని దుస్థితి. ప్రభుత్వం మద్దతు ధర రూ.7,400 ప్రభుత్వం క్వింటా మినుముల మద్దతు ధరను రూ.7400గా నిర్ణయించింది. ఆఖరికి అది కూడా దక్కే పరిస్థితి లేకపోవటంతో మినుము రైతుల కష్టాలుపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావటంతో అధికారుల్లో కదలిక వచ్చింది. మార్క్ఫెడ్ అధికారులు జిల్లాలో సాగు అధికంగా ఉన్న 12 ప్రాంతాలను గుర్తించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసింది. బాపులపాడు మండలం ఆరుగొలనులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుకానుంది. మిగిలిన మోదుగుమూడి ఆర్ఎస్కే (అవనిగడ్డ), మల్లేశ్వరం ఏఎంసీ (బంటుమిల్లి), పెరికీడు ఆర్ఎస్కే (బాపులపాడు), గుడ్లవల్లేరు ఏఎంసీ (గుడ్లవల్లేరు), కంకిపాడు ఏఎంసీ (కంకిపాడు), మొవ్వ ఆర్ఎస్కే (మొవ్వ), పెడన ఏఎంసీ (పెడన), గంగూరు ఆర్ఎస్కే (పెనమలూరు), బొడ్డపాడు ఆర్ఎస్కే (తోట్లవ ల్లూరు), ఆత్కూరు ఆర్ఎస్కే (ఉంగుటూరు), ఉయ్యూరు ఏఎంసీ (ఉయ్యూరు) ప్రాంతాల్లో డీసీఎంఎస్ ద్వారా కొనుగోలు ప్రక్రియ చేపట్టనున్నారు. ఆయా కేంద్రాల పరిధిలోని 144 రైతు సేవా కేంద్రాల ద్వారా నిర్దేశించిన కొనుగోలు కేంద్రం నుంచి కొనుగోళ్లు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. నేడు తొలి కేంద్రం ప్రారంభం జిల్లాలో తొలుత కంకిపాడు కేంద్రంగా మినుము కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు మార్క్ ఫెడ్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు కంకిపాడు ఏఎంసీ కార్యాలయ ప్రాంగణంలో కొనుగోళ్లను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ‘సాక్షి’ కథనంతో కదిలిన అధికారగణం జిల్లాలో 12 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నేడు కంకిపాడులో కొనుగోలు కేంద్రం ప్రారంభం మద్దతు ధర పొందాలి మినుము సాగు రైతులు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి. బయట మార్కెట్లో ధర ఆశాజనకంగా లేకపోతే తక్షణమే రైతు సేవా కేంద్రంలో పేర్లు నమోదు చేసుకుంటే మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేపట్టాం. దళారులను ఆశ్రయించి మోస పోకుండా మద్దతు ధరను పొందాలి. – మురళీకిషోర్, డీఎం, మార్క్ఫెడ్, కృష్ణాజిల్లా -
ముగిసిన హెల్త్ వర్సిటీ క్రీడా పోటీలు
గన్నవరంరూరల్: వైద్య విద్యార్థులు క్రీడల్లో రాణించటం అభినందనీయమని సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు అన్నారు. మండలంలోని డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో జరుగుతున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పురుషుల 26వ ఇంటర్ క్రీడా పోటీలు సోమవారంతో ముగిశాయి. ఓవరాల్ చాంపియన్షిప్ను రాజమండ్రి జీఎస్ఎల్ మెడికల్ కళాశాల కై వసం చేసుకుంది. బ్యాడ్మింటన్లో విన్నర్గా రాజమండ్రి జీఎస్ఎల్ మెడికల్ కళాశాల, రన్నర్గా ఏలూరు ఆశ్రం మెడికల్ కళాశాల నిలిచాయి. టేబుల్ టెన్నిస్లో విన్నర్గా శ్రీకాకుళం గ్రేట్ జీఈ మెడికల్ కళాశాల, రన్నర్గా అనంతపురం మెడికల్ కళాశాల, టెన్నిస్లో విన్నర్గా గుంటూరు కాటూరి మెడికల్ కళాశాల, రన్నర్గా రాజమండ్రి జీఎస్ఎల్ మెడికల్ కళాశాల, ఫుట్బాల్లో రాజమండ్రి జీఎస్ఎల్ మెడికల్ కళాశాల, నెల్లూరు ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కళాశాల మెడికల్ విద్యార్థులు రాణించారు. విజేతలకు ట్రోఫీలు, పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. కళాశాల డైరెక్టర్ జనరల్ డాక్టర్ సి.నాగేశ్వరరావు, డైరెక్టర్ డాక్టర్ సీవీ రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ భీమేశ్వర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్, హెల్త్ యూనివర్సిటీ స్పోర్ట్స్ సెక్రటరీ డాక్టర్ ఇ.త్రిమూర్తి, ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవినేని రవి తదితరులు పాల్గొన్నారు. -
వైద్యసేవ ఫీల్డ్ సిబ్బందికి కేడర్ కల్పించాలి
మచిలీపట్నంఅర్బన్: వైద్య సేవా పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ లెవల్ సిబ్బందికి మినిమమ్ స్కేల్, కేడర్, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఆరోగ్య మిత్ర కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన తెలిపారు. అధికారులను ఎన్నిసార్లు కలిసినా సమస్యలు పరిష్కారం అవ్వలేదని సోమవారం ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ సిబ్బంది 17 ఏళ్ల సర్వీసుని పరిగణనలోకి తీసుకొని ఫీల్డ్ సిబ్బందిని ప్రభుత్వ పరిధిలో ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. వైద్య మిత్రాలకు డీపీఓ కేడర్, ఆఫీస్ అసోసియేట్, టీమ్ లీడర్లకు సమాన అర్హత కలిగిన కేడర్, జిల్లా మేనేజర్లకు డీవైఈఓ కేడర్ అమలు చేసి కనీత వేతనం ఇవ్వాలని కోరారు. అనంతరం మీ కోసంలో కలెక్టర్ డీకే బాలాజీకి వినతి పత్రం సమర్పించారు. స్టేట్ యూనియన్ జనరల్ సెక్రటరీ గురవయ్య, జిల్లా ప్రెసిడెంట్ నాగరాజు, సెక్రటరీ పోతురాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ డెన్నిపాల్, కోశాధికారి అనిత తదితరులు పాల్గొన్నారు. విధులు బహిష్కరించి నిరసన తెలిపిన ఉద్యోగులు -
ప్రతి సమస్యకూ పరిష్కారం
కోనేరుసెంటర్: ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి చట్టపరిధిలో సమస్యకు పరిష్కారం చూపుతామని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ‘మీ కోసం’లో పాల్గొన్న ఎస్పీ వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. పలు అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని అర్జీలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేసి చట్టపరిధిలో పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అర్జీదారులను అవమానిస్తూ మాట్లాడినట్లు తెలిసినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు -
కొనసాగుతున్న అక్రమ అరెస్టుల పర్వం
పెడన: పెడనలో రెడ్ బుక్ ర్యాజ్యాంగం నడుస్తోంది. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఎందుకు కేసు పెడుతున్నారో? ఏం సెక్షన్లు పెడుతున్నారో? అసలు బయటకు చెప్పకుండా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిని తిరిగి ప్రశ్నించడమే నెపంగా పెడన పట్టణంలోని వైఎస్సార్ సీపీ నాయకులు, కౌన్సిలర్ను ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకూ పెడన పోలీస్ స్టేషన్లోనే ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు ఏం జరిగిందంటే.. ఆదివారం మధ్యాహ్నం దక్షిణ తెలుగుపాలెం(డీటీ పాలెం)కు చెందిన పాము నాగరాజు, తుమ్మ పైడియ్య ఓ కిళ్లీ షాపు వద్దకు వెళ్లారు. అదే సమయంలో టీడీపీ కార్యకర్త సులేమాన్దాదా అక్కడే ఉండి.. డీటీ పాలెంలో నూతన రామాలయం నిర్మాణానికి పాలెం వ్యక్తులు చందాలు వసూలు చేస్తున్న విషయంపై నోరు పారేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆ ఇద్దరు వ్యక్తులు 19వ వార్డు కౌన్సిలర్ శిరివెళ్ల జయేష్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో సులేమాన్దాదాను ప్రశ్నించడానికి ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో జయేష్ వెళ్లారు. సులేమాన్దాదా, కౌన్సిలర్ మధ్య ఈ విషయంపై మాటామాటా పెరిగి, తోసుకునే వరకు వెళ్లింది. ఈ లోగా సులేమాన్దాదా అనుచరులు పెద్ద ఎత్తున గుమికూడటమే కాకుండా దాడికి సిద్ధమయ్యారు. దీంతో జయేష్ అక్కడి నుంచి వచ్చేసి.. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లేందుకు పెడన పోలీస్ స్టేషన్కు వెళ్లారు. దీనిని తెలుసుకున్న సులేమాన్దాదా తనకు గాయాలైనట్లుగా నటిస్తూ మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో చేరారు. ఈలోపు పెడన్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన కౌన్సిలర్ జయేష్తో పాటు పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పోలీసులు స్టేషన్లోనే ఉంచేశారు. హైడ్రామా నడుమ పెడన వైఎస్సార్ సీపీ నాయకులపై కేసులు విచారణ అంటూ తెల్లవార్లూ పోలీస్ స్టేషన్లోనే.. సీసీ ఫుటేజీలు పరిశీలన.. ఆధారాల్లేకున్నా అరెస్టులుసోమవారం ఉదయం వచ్చిన మచిలీపట్నం డీఎస్పీ సీహెచ్ రాజా కేసు విషయాలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా దాటవేశారు. పెడన సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేంద్రప్రసాద్ను వివరణ కోరగా ప్రాథమిక విచారణ పూర్తికాలేదని, అవ్వగానే పూర్తి సమాచారం ఇస్తామంటూ తప్పించుకున్నారు. కాగా కౌన్సిలర్ జయేష్తో పాటు 11మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు సమాచారం. సోషల్ మీడియాలో వైరల్.. ఈ లోగా సోషల్మీడియాలో టీడీపీ కార్యకర్తపై హత్యాయత్నం చేసిన వైస్సార్సీపీ నాయకులు, జోగి రమేష్ అనుచరులంటూ ఆ పార్టీ శ్రేణులు వైరల్ చేశారు. సమాచారం అందుకున్న పెడన సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేంద్రప్రసాద్, పెడన ఎస్ఐ సత్యనారాయణ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. మచిలీపట్నం డీఎస్పీ సెలవులో ఉండటంతో గుడివాడ డీఎస్పీ, మచిలీపట్నం ఆర్పేట సీఐతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన ఎస్ఐలు పెడనకు చేరుకుని పరిస్థితిపై విచారణ చేపట్టారు. నవరంగ్ టీ స్టాల్లోని సీసీ కెమెరాతో పాటు పలు చోట్ల సీసీ కెమెరాలను పరిశీలించారు. కొన్ని చోట్ల సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, పనిచేసిన చోట క్లారిటీ లోపించడంతో వెనుదిరిగారు. -
చెక్కు మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని తీర్పు
చిలకలపూడి(మచిలీపట్నం): ఖాతాదారులకు చెక్కు మొత్తాన్ని వడ్డీతో చెల్లించాలని వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు చింతలపూడి కిషోర్కుమార్, సభ్యులు నందిపాటి పద్మారెడ్డి, శ్రీలక్ష్మీరాయల సోమవారం తీర్పు చెప్పారు. కంకిపాడు మండలం ఈడ్పుగల్లుకు చెందిన కోనేరు సాత్విక్ సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఈడ్పుగల్లు బ్రాంచ్లో సేవింగ్ ఖాతా ఉంది. 2017 నవంబర్ 6వ తేదీన రూ. 13.50 లక్షల హెచ్డీఎఫ్సీ చెక్కు క్లియరెన్స్ నిమిత్తం సేవింగ్స్ ఖాతాల్లో దాఖలు చేశారు. ఆ చెక్కు నిమిత్తం కోనేరు సాత్విక్ బ్యాంకు ఖాతాలో జమ కాకపోవటంతో బ్యాంకు అధికారులను ప్రశ్నించగా చెక్కు కొరియర్ ద్వారా క్లియరింగ్కు పంపామని ట్రాన్సిట్లో మిస్ప్లేస్ అయ్యిందని తెలిపారు. దీంతో మరొక చెక్కును ప్రజెంట్ చేయాలని బ్యాంకు అధికారులు సాత్విక్కు చెప్పారు. ఖాతాదారుడు సాత్విక్ బ్యాంకు అధికారులు చేసిన పనికి వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. దీంతో పూర్వాపరాలను విచారించిన అనంతరం కమిషన్ సభ్యులు చెక్కు మొత్తం రూ. 13.50 లక్షలు 2017 నవంబర్ 6వ తేదీ నుంచి 9 శాతం వడ్డీతో చెల్లించాలని, లక్ష రూపాయలు మానసిక వేదనకు రూ. 10 వేలు ఖర్చుల నిమిత్తం 30 రోజుల్లోగా అందజేయాలన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం జి.కొండూరు: ద్విచక్రవాహనంపై వెళ్తున్న తండ్రీకొడుకులు యూటర్న్ తీసుకుంటున్న ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టిన ఘటనలో కొడుకు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా, నందిగామకు చెందిన తమ్మిశెట్టి నర్సింహారావు, ఆయన పెద్ద కుమారుడు రవి(42) ఇద్దరూ ద్విచక్ర వాహనంపై సోమవారం ఉదయం 7గంటల సమయంలో మైలవరం మండల పరిధి గణపవరంలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఉదయం 10.30గంటల సమయంలో జి.కొండూరు మండల పరిధి కట్టుబడిపాలెం గ్రామం వద్దకు రాగానే ద్విచక్ర వాహనానికి మందు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ లారీ అకస్మాత్తుగా యూటర్న్ తీసుకుంది. దీంతో ద్విచక్రవాహనం ఆ ట్యాంకర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తమ్మశెట్టి రవి మీదుగా లారీ ఎక్కడంతో తీవ్ర గాయాలయ్యాయి. తండ్రి నర్సింహారావుకి కూడా స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు ఇరువురిని 108 అంబులెన్స్లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే రవి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి నర్సింహారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్ కుమార్ తెలిపారు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ: వ్యక్తి మృతి కృత్తివెన్ను: లారీ, బైక్ ఢీ కొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రగాయాలపాలైన సంఘటన కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం వద్ద సోమవారం ఉదయం జరిగింది. పోలీసులు కథనం మేరకు 216 జాతీయ రహదారిపై లక్ష్మీపురం లాకు సెంటర్ సమీపంలో పశ్చిమగోదావరి జిల్లా నాగిడిపాలెం నుంచి బైక్పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో వి. రాధాకృష్ణ (57) ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి బర్రె నారాయణస్వామి తీవ్రగాయాలపాలయ్యాడు. తీవ్రంగా గాయపడిన నారాయణస్వామిని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించినట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య కేసులో నిందితులు అరెస్ట్ ఇబ్రహీంపట్నం: స్థానిక ఫెర్రీలో ఈనెల 14వ తేదీ తెల్లవారుజామున రౌడీ షీటర్ జరబన వెంకటేష్ (41) హత్యకేసులో ముగ్గురు నిందితులను ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. జూపూడి బస్టాప్ వద్ద సోమవారం తెల్లవారుజామున సంచరిస్తున్న నిందితులు పొనమాల వేణు, చింతా వీరాంజనేయులు, కొప్పనాతి వీర్రాజును సీఐ ఏ.చంద్రశేఖర్ తన సిబ్బందితో అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టిన అనంతరం విజయవాడ కోర్టులో హాజరు పరిచామని సీఐ చంద్రశేఖర్ తెలిపారు. న్యాయమూర్తి ముగ్గురికి రిమాండ్ విధించినట్లు ఆయన చెప్పారు. ఎండీయూ వ్యాన్పై విజిలెన్స్ దాడి నిల్వ లెక్క తేలని 71 బియ్యం బస్తాలు గుర్తింపు సంగమేశ్వరం(నాగాయలంక): మండలంలోని సంగమేశ్వరం, పాత ఉపకాలి చెందిన 36, 11నంబర్ల రేషన్ దుకాణాల ఎండీయూ వ్యాన్పై మంగళవారం రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి దాడి చేసి లెక్క ప్రకారం నిల్వ ఉండాల్సిన 71బస్తాల ఆచూకీ లేకపోవడంతో కేసు నమోదు చేశారు. ఈ రెండు షాపులను డీలర్ విశ్వనాథపల్లి ఉదయలోల నిర్వహిస్తున్నారు. షాపులను తనిఖీ చేయగా ఒక షాపు కింద 56బస్తాలు, మరో షాపు కింద 15బస్తాల రేషన్ బియ్యం తరుగు ఉండటాన్ని గుర్తించారు. ఎండీయూ వాహనాన్ని సీజ్ చేసి, తదుపరి చర్యలు నిమిత్తం పీడీఎస్ డెప్యూటీ తహసీల్దార్ ఖాసిమ్బాబుకు అప్పగించారు. కాగా పూర్తి వివరాలతో బుధవారం సమగ్ర నివేదికలు రూపొందించి తదుపరి చర్యలు తీసుకుంటామని డీటీ వివరించారు. -
ఐటీడీఏ ఏర్పాటుకు తీర్మానం చేయండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నాచౌక్లో ధర్నా చేసింది. ధర్నాలో పాల్గొన్న ఆదివాసీ సంక్షేమ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబయోగి మాట్లాడుతూ శ్రీకాకుళ సాయుధ గిరిజన రైతాంగ పోరాటం తర్వాత దేశవ్యాప్తంగా ఆదివాసీలకు ఐటీడీఏలు వచ్చాయన్నారు. శ్రీకాకుళం జిల్లాకు మాత్రం ఐటీడీఏ లేకపోవడం బాధాకరమన్నారు. ప్రస్తుతం ఉన్న శ్రీకాకుళం జిల్లా ఎనిమిది నియోజకవర్గాలతో ఏర్పడిందని, 16 మండలాల్లో ఆదివాసీలు సుమారు రెండు లక్షల మంది ఉన్నారన్నారు. వీటిలో ఐదు సబ్ ప్లాన్ మండలాలు ఉన్నాయన్నారు. కనీసం ఒక్క గ్రామం 5వ షెడ్యూల్లో లేకపోవడం విచారకరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన పలాస, పాతపట్నం బహిరంగ సభలలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీకాకుళం జిల్లాకు ఐటీడీఏ ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలన్నారు. ఈ ధర్నాకు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సంఘీభావం ప్రకటించింది. ధర్నాలో రాష్ట్ర నాయకులు వంకల మాధవరావు, కె.కల్యాణ్ కృష్ణ, కె. పొలారి, జమ్మయ్య, భాస్కర్ రావు, పాపారావు, ఆదివాసి సంక్షేమ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. విజయవాడలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా -
తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్గా చోరీలు
నందిగామ టౌన్: తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని పట్టపగలు చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ తిలక్ పేర్కొన్నారు. స్థానిక ఏసీపీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చందర్లపాడు మండలంలోని లక్ష్మీపురం, కాండ్రపాడు గ్రామాలలో వరుస చోరీలకు పాల్పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని వారిలో ఒకరు మైనర్ ఉన్నట్లు తెలిపారు. సీసీ ఫుటేజ్, సెల్ఫోన్ సిగ్నల్స్, తదితర సాంకేతిక పరిజ్ఞానంతో నాలుగు ప్రత్యేక బృందాలు రెండు తెలుగు రాష్ట్రాలలో గాలించి పట్టుకున్నట్లు చెప్పారు. తెలంగాణాలోని సూర్యాపేట ప్రాంతానికి చెందిన నాగరాజుతో పాటు అతనికి అనుచరునిగా ఉన్న గుంటూరు జిల్లా అచ్చంపేటకు చెందిన మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. గత కొంత కాలంగా నందిగామ, జగ్గయ్యపేట, అచ్చంపేట పరిసర ప్రాంతాలలో తొమ్మిదిళ్లలో చోరీలకు పాల్పడ్డారన్నారు. వీరి వద్ద నుంచి 300 గ్రాముల బంగారం, 400 గ్రాముల వెండి వస్తువులు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న నందిగామ రూరల్ సీఐ చవాన్, చందర్లపాడు ఎస్ఐ దుర్గామహేశ్వరరావు, ఐడీ పార్టీ కానిస్టేబుల్ జాలయ్యలను ఆయన అబినందించారు. సీఐ చవాన్, ఎస్ఐ దుర్గామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు -
బాల్ బ్యాడ్మింటన్ విజేత సిద్ధార్థ మహిళా కాలేజీ
విజయవాడస్పోర్ట్స్: కృష్ణా యూనివర్సిటీ అంతర కళాశాలల బాల్ బ్యాడ్మింటన్ మహిళల పోటీల్లో శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కాలేజీ జట్టు సత్తా చాటింది. విజయవాడలోని సిద్ధార్థ మహిళా కాలేజీ క్రీడా ప్రాంగణంలో సోమవారం జరిగిన పోటీల్లో గెలుపొంది విన్నర్ ట్రోఫీని కై వసం చేసుకుంది. ఈ పోటీల్లో వైవీఎన్ఆర్ అండ్ జేడీ కాలేజీ (కై కలూరు) ద్వితీయ స్థానం, శ్రీపద్మావతి హిందు డిగ్రీ మహిళా కాలేజీ (మచిలీపట్నం) మూడో స్థానం, డాక్టర్ ఎల్హెచ్ఆర్ అండ్ జీడీ కాలేజీ (మైలవరం) నాలుగో స్థానం సాధించాయి. విజేతలకు సిద్ధార్థ మహిళా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.కల్పన, కన్వీనర్ శ్రీ లలిత్ప్రసాద్, స్పెషన్ ఆఫీసర్ డాక్టర్ ఆర్.మాధవి, ఫిజకల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.హేమ బహుమతులు అందజేశారు. ఈ నెల 29 నుంచి చెన్నయ్ అలగప్ప యూనివర్సిటీలో జరిగే జాతీయ అంతర విశ్వవిద్యాలయాల బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే కృష్ణా వర్సిటీ జట్టులో తమ విద్యార్థినులు ఎం.ఉమామహేశ్వరి, పి.భువనేశ్వరి, కె.సరస్వతి, ఎ.శ్రీరాజిని చోటు దక్కించుకున్నారని ప్రిన్సిపాల్ కల్పన ఈ సందర్భంగా తెలిపారు. -
ప్రజాప్రతినిధుల క్రీడలకు సర్వం సిద్ధం
విజయవాడస్పోర్ట్స్: ప్రజాసేవలో తలమునకలయ్యే ప్రజాప్రతినిధులకు ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం తలపెట్టిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల క్రీడలను సమర్థంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు అంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ నెల 18న ఈ పోటీలు ప్రారంభమవుతాయని, రెండు రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని వెల్లడించారు. పోటీలకు ఏర్పాట్లను ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బొజ్జల సుధీర్రెడ్డి, సుందరపు విజయ్కుమార్, పీవీజీఆర్ నాయుడు (గణబాబు), ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాజగోపాల్రెడ్డి, పంచుమర్తి అనురాధ, శాప్ పరిపాలన అధికారి రమావత్ వెంకటరమణనాయక్తో కలిసి సోమవారం పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల క్రీడా సంబరాల్లో 13 క్రీడలను నిర్వహించనున్నామని, మంగళవారం మధ్యాహ్నం క్రీడాశాఖామంత్రి, స్పీకర్ కలిసి క్రీడలను ప్రారంభిస్తారన్నారు. 20వ తేదీన క్రీడలు ముగిసిన తర్వాత గెలుపొందినవారికి బహుమతులు ప్రదానం చేస్తారన్నారు. శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు -
పెండింగ్ పనులపై ఫోకస్
చిలకలపూడి(మచిలీపట్నం): గ్రామీణ ప్రాంతా ల్లోని వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, అంగన్వాడీ కేంద్ర భవనాల మరమ్మతులకు సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయన చాంబర్లో ఆర్డ బ్ల్యూఎస్, ఐసీడీఎస్, సీపీవో, గనులు, పంచాయతీ తదితర అధికారులతో సీఎస్ఆర్, ఎంపీ లాడ్స్ నిధుల వినియోగంపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల భవనాలకు శ్లాబ్లు, ఫ్లోరింగ్, కిటికీలు, మరుగుదొడ్లు, ప్రహరీల నిర్మాణం, ఇంకుడు గుంతల ఏర్పాటు వంటివి ప్రాధాన్యతాక్రమంలో పూర్తి చేయాలన్నారు. సకాలంలో 148 అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగునీటి వసతుల పనులు పూర్తి చేసిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ అభినందించారు. జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, డీపీవో జె. అరుణ, ఆర్డబ్ల్యూఎస్ అధికారి నటరాజ్, ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి పాల్గొన్నారు. త్వరితగతిన పూర్తి చేయాలని కృష్ణా కలెక్టర్ బాలాజీ ఆదేశం -
పరిష్కారం తక్కువ
ఆర్భాటం ఎక్కువ.. అర్జీదారులకు భరోసా ఇవ్వని పీజీఆర్ఎస్ నాలుగు సార్లు తిరిగినా పరిష్కారం కాలేదు మా బంధువులకు ఉన్న 90 సెంట్ల భూమిలో 12 సెంట్ల భూమి సహకార సంఘానికి, ఐదు సెంట్ల భూమిని స్కూలు భవనానికి ఇచ్చాం. మిగిలిన భూమిని మేము విక్రయించుకునే వీలు లేకుండా మొత్తం ప్రభుత్వ భూమిని 22ఏలో చేర్చారు. ఈ విషయంపై ఈ ప్రభుత్వం వచ్చాక నాలుగు సార్లు కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్కు వచ్చా. అయినా సమస్య పరిష్కారం కాలేదు. ఈ రోజు జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే అర్జీ తీసుకుని పరిశీలిస్తామన్నారు. నా సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందో తెలియటం లేదు. – దివి శ్రీనివాసరావు, కానూరు, బందరు మండలం పింఛను రాకుండానే మృతి 62 సంవత్సరాల వయసులో పామర్రు గ్రామానికి చెందిన ఆరేపల్లి వెంకటాచలం వికలాంగ పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పింఛను మంజూరు చేయాలని నాతో పాటు దరఖాస్తు చేసుకునేందుకు కలెక్టరేట్ పీజీఆర్ఎస్ కార్యక్రమానికి పలుమార్లు వచ్చాడు. అయినా కొత్త పింఛను మంజూరు చేయలేదు. పింఛను రాలేదన్న దిగులుతో 2024 డిసెంబరు 23న అతను మరణించాడు. ప్రస్తుతం ఆయన భార్య వెంకటేశ్వరమ్మౖ కెనా వృద్ధాప్య పింఛను మంజూరు చేయాలని కలెక్టర్కు అర్జీ ఇచ్చా. – జంపాన శ్రీనివాసగౌడ్, సామాజిక కార్యకర్త ●చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) అమలు తీరు ప్రచార ఆర్భాటం ఎక్కువ.. సమస్యల పరిష్కారం తక్కువ.. అన్న చందంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమస్యలను పరిష్కరించకుండానే పరిష్కరించినట్లు అధికారులు నమోదు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. పరిష్కరించామని అధికారులు చెబుతున్న సమస్యలపై మళీమళ్లీ పీజీఆర్ఎస్లో అర్జీలు అందడమే ఇందుకు నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని 2024 జూన్ 15వ తేదీన ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ప్రతి సోమవారం ఈ కార్యక్రమన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు 17,194 అర్జీలు వచ్చాయి. వీటిలో 14,936 అర్జీలు పరిష్కారమైనట్లు అధికారులు రికార్డుల పరంగా చూపుతున్నారు. కేవలం 2,258 అర్జీలను మాత్రమే పరిష్కరించాల్సి ఉందని పేర్కొంటున్నారు. తాము స్వీకరించిన అర్జీలను ఉన్నతాధికారులు సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే సంబంధిత శాఖల అధికారులు తూతూ మంత్రంగా అర్జీదారులకు ఎండార్స్మెంట్ ఇచ్చి ఆ అర్జీని పరిష్కరించామని వారి ఫోనులకు మెసేజ్ల రూపంలో పంపుతున్నారు. అయితే ఆ అర్జీదారుడు తిరిగి అదే సమస్యపై మళ్లీ పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వస్తున్నారు. ‘మీరు చెప్పినప్పటికీ కిందిస్థాయి అధికారులు ఆ దిశగా మాకు పరిష్కారం చూపటం లేదు’ అని కలెక్టర్కు అర్జీదారులు చెబుతున్నారు. గతంలో నాణ్యమైన పరిష్కారం గత ప్రభుత్వంలో అర్జీదారులకు భరోసా ఉండేది. అర్జీ ఇచ్చిన వెంటనే నిర్ణీత సమయంలోగా నాణ్యమైన పరిష్కారం చూపేలా ఉన్నతాధికారులు సంబంధిత ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చేవారు. ఆ అర్జీలు ఒకవేళ రీ–ఓపెన్ అయితే సంబంధిత అధికారులకు మెమోలు జారీ చేసే వారు. దీంతో సంబంధిత అధికారులు అర్జీదారుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు. ప్రస్తుతం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలో ఉన్న సమస్యలను కిందిస్థాయి అధికారులకు పంపి చేతులు దులుపుకొంటున్నారు. ఫలితంగా సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని అర్జీదారులు వాపోతున్నారు. పీజీఆర్ఎస్కు హాజరుకాకుంటే చర్యలు మచిలీపట్నంలోని కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పలువురు గైర్హాజరయ్యారు. వారిపై కలెక్టర్ డి.కె.బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి హాజరు కాని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయా లని డీఆర్వో చంద్రశేఖరరావును ఆదేశించారు. ఇదే తప్పిదాన్ని రెండు, మూడు సార్లు చేస్తే ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులకు రిపోర్టు చేస్తా నని కలెక్టర్ హెచ్చరించారు. కృత్తివెన్ను ఈఓపీఆర్డీ కోర్టు ఆర్డరును అమలు చేయకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్లో ఈఓపీఆర్డీతో మాట్లాడి కోర్టు ఆర్డర్ను తక్షణమే అమలు చేయాలని, లేకపోతే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ఈ నెల 25, 26 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్న దృష్ట్యా శాఖాపరంగా వివరాలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో అధికారులు 145 అర్జీలను స్వీకరించారు. ●తాము ఉంటున్న ఇంటిని తమ కుమారుడి పేరు మీద రాశా మని, దానిని అతను బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకుని, బాకీ చెల్లించకుండా వెళ్లిపోయాడని, బ్యాంకు అధికారులు తమ వద్దకు వచ్చి ఇల్లును జప్తు చేస్తాం, తాళాలు వేసేస్తామని తమను వేధింపులకు గురిచేస్తు న్నారని ఉయ్యూరు మండలం కాటూరు గ్రామానికి చెందిన వృద్ధులు ప్రొద్దుటూరి బాబూరావు దంపతులు సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. కూటమి పాలనలో జిల్లాలో 17,194 అర్జీల స్వీకరణ 14,936 అర్జీలను పరిష్కరించామంటూ గొప్పగా ప్రచారం ఆ సమస్యలపై మళ్లీమళ్లీ అర్జీలు దాఖలవుతున్న వైనం బ్యాంకు అధికారులు వేధిస్తున్నారు -
పెనుగంచిప్రోలు పంచాయతీకి ప్రథమ స్థానం
పెనుగంచిప్రోలు: పంచాయతీ రాజ్ శాఖ కమిషనరేట్ నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో అత్యుత్తమ పారిశుద్ధ్య నిర్వహణలో పెనుగంచిప్రోలు గ్రామ పంచాయతీ ఎన్టీఆర్ జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఐవీఆర్ఎస్ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా 85 శాతం మందికి పైగా ప్రజలు గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణను అభినందించారు. గ్రామాభివృద్ధికి కృషి ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వేల్పుల పద్మకుమారి మాట్లాడుతూ.. తాను సర్పంచ్గా ఎన్ని కై న నాటి నుంచి పెనుగంచిప్రోలు అభివృద్ధికి కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. గ్రామంలోని రోడ్ల పక్కన మొక్కలు పెంచుతున్నామని, ప్రజలను చైతన్యవంతం చేస్తూ తడి,పొడి వ్యర్థాలను వేర్వేరుగా సేకరిస్తున్నామని తెలిపారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని జిల్లాలోనే ఒక మోడల్గా నిర్వహిస్తూ అధికారుల నుంచి జిల్లా కలెక్టర్ వరకు అందరి అభినందనలు అందుకున్నామని వివరించారు. గ్రామంలో అందమైన పూలమొక్కలతో పాటు అదనపు ఆదాయాన్ని సమకూర్చేలా కూరగాయలు, ఆకుకూరల పెంపకం చేపట్టామని తెలిపారు. ఇటీవల అన్ని మండలాల పంచాయతీ కార్యదర్శులు, పారిశుద్ధ్య సిబ్బందికి పెగుగంచి ప్రోలు చెత్త సంపద కేంద్రం వద్ద శిక్షణ తరగతులు ఏర్పాటుచేసి, వాటి నిర్వహణపై అవగాహన కల్పించారని పేర్కొన్నారు. పెనుగంచిప్రోలును ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామాభివృద్ధిలో రాజకీయ జోక్యం ఉండకూడదని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు గ్రామ ప్రజలు, పంచా యతీ సిబ్బంది, ఇతర శాఖల సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. -
రాజ్యాంగానికి లోబడి పని చేయాలి
కేయూ ఉపకులపతి ఆచార్య రాంజీ కోనేరుసెంటర్(మచిలీపట్నం): ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి లోబడి, కళాశాలలు నిబంధనల మేరకు పనిచేయాలని కృష్ణా విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య కె.రాంజీ స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయ అనుబంధ యూజీ, పీజీ, బీఈడీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సోమవారం నిర్వహించిన సమావేశంలో వీసీ మాట్లాడుతూ.. కళాశాలల్లో అడ్మిషన్ల పెంపు కోసం ఆయా కళాశాలల్లో ఆన్లైన్ సెంటర్ను ప్రారంభించి అవగాహన పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 2025–26 విద్యా సంవత్సరం నుంచి పలు మార్పులు తీసుకురాబోతున్నట్లు చెప్పారు. విద్యా సంస్థలో భద్రతా చర్యలు చేపట్టాలని, ఫైర్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. కళాశాలల్లో స్టూడెంట్ క్లబ్లు ఏర్పాటు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు పొందవచ్చని సూచించారు. రెక్టర్, సీడీసీ డీన్ ఆచార్య ఎం.వి.బసవేస్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎన్.ఉష, పలు విభాగాధిపతులు ఆచార్య మారుతి, ఆచార్య దిలీప్, సహ ఆచార్యులు డాక్టర్ బ్రహ్మచారి, డాక్ట్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పసుపు–కుంకుమ ఉత్సవం
కనుల పండువగా పుట్టింటి అనిగండ్లపాడు(పెనుగంచిప్రోలు): శ్రీతిరుపతమ్మ అమ్మ వారి చిన్న తిరునాళ్ల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన అమ్మ వారి పుట్టినిల్లు అనిగండ్లపాడు గ్రామం నుంచి పసుపు – కుంకుమ బండ్లు తీసుకువచ్చే కార్యక్రమం సోమవారం రాత్రి కనుల పండువగా సాగింది. అమ్మవారి వంశీకులు కొల్లా శ్రీనివాసరావు ఇంటి వద్ద ఆలయ వేద పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రంగురంగుల విద్యుత్ దీపాలలు, పూలతో అలంకరించిన బండిపై పసుపు – కుంకుమ ఉంచి గ్రామంలో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి పుట్టినింటికి చేరుకొని ఆనంద పరవశులయ్యారు. గ్రామంలో రోడ్ల వెంట భక్తులు బారులు తీరి పసుపు – కుంకుమ బండ్లను వీక్షించటంతో పాటు వార్లు పోసి పూజలు నిర్వహించారు. కోలాట నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకు న్నాయి. అర్ధరాత్రి 12 గంటల తరువాత పసుపు – కుంకుమ బండ్లు పెనుగంచిప్రోలులోని అమ్మ వారి ఆలయానికి చేరాయి. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ జంగాల శ్రీనివాసరావు, ఈఓ బి.హెచ్.వి.ఎస్.ఎన్.కిషోర్కుమార్, ఈఈ ఎల్.రమ, డీసీపీ మహేశ్వరరాజు, నందిగామ ఏసీపీ తిలక్, ఎంపీటీసీ సభ్యురాలు పొందూరు విజయలక్ష్మి, తహసీల్దార్ ఎ.శాంతిలక్ష్మి, ఏఈ రాజు, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణాజిల్లా
మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2025 ఇఫ్తార్ సహరి (మంగళ) (బుధ) విజయవాడ 6.23 4.56 మచిలీపట్నం 6.22 4.53బాబా సేవలో ధనుంజయ శర్మ మధురానగర్(విజయవాడసెంట్రల్): ముత్యాలంపాడు సాయిబాబా మందిరాన్ని అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా చల్లా ధనుంజయ శర్మ సోమవారం దర్శించుకున్నారు. మందిర గౌరవాధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి పాల్గొన్నారు. ఎస్పీని కలిసిన వీసీ రాంజీ కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణా వర్సిటీ వీసీ రాంజీ సోమవారం ఎస్పీ ఆర్.గంగాధరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీకి మొక్క అందజేసి, వర్సిటీ భద్రతపై చర్చించారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధ దంపతులు యార్లగడ్డ మస్తాన్, సక్కుభాయమ్మ స్వగ్రామం మొవ్వ మండలం తురకపాలెం. ఇద్దరి వయసు ఏడు పదులు దాటింటింది. కన్నబిడ్డలు దూరంగా ఉండటంతో ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. వృద్ధాప్య పింఛన్తో బతుకుబండి లాగొచ్చని ఆశపడ్డారు. పింఛను ఇప్పించాలని సచివాలయ సిబ్బందిని, కూటమి నాయకులను వేడుకున్నారు. ‘మీరు మాకు ఓటు వేయలేదు కదా? పింఛను ఎందుకు ఇవ్వాలి’? అని కూటమి నాయకులు కోపగించుకున్నారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆ వృద్ధ దంపతులు కలెక్టరేట్కు వచ్చారు. పింఛన్ మంజూరు చేయాలని కలెక్టర్ను వేడుకున్నారు. పిల్లలపై ఆధారపడకుండా పింఛను డబ్బులతో తాము బతుకు వెళ్లదీస్తామని, తమ వేదనను అధికారులు అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. 7న్యూస్రీల్ -
ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు ప్రారంభం
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 145 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు 8.30 గంటలకే తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు కుటుంబ సభ్యులతో చేరుకున్నారు. ముందుగా సమీపంలోని దేవాలయాలకు వెళ్లి హాల్టిక్కెట్లను స్వామివారి వద్ద ఉంచి పూజలు జరిపించుకున్నారు. అనంతరం పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సెక్యూరిటీ సిబ్బంది విద్యార్థుల హాల్టిక్కెట్లను పరిశీలించిన అనంతరం వారిని లోనికి అనుమతించారు. పరీక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన నోటీసుబోర్డుల ఆధారంగా హాల్టిక్కెట్ల నంబర్ల ప్రకారం ఏ రూమ్ను కేటాయించారో పరిశీలించు కుని ఆ రూమ్ వద్దకు చేరుకున్నారు. అనంతరం ఇన్విజిలేటర్లు జవాబుపత్రాలు, ప్రశ్నాపత్రాలను అందజేశారు. అధికారుల పరిశీలన జిల్లాలో 21,072 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 20,822 మంది హాజర య్యారు. ప్రైవేటు విద్యార్థులు 90 మందికి 54 మంది హాజరయ్యారు. జిల్లా అబ్జర్వర్ కృష్ణమోహన్ గన్నవరంలోని జెడ్పీహెచ్ఎస్, స్రవంతి ఇంగ్లిషు మీడియం హైస్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. డీఈఓ పి.వి.జె.రామారావు మచిలీపట్నం నగరంలోని భాష్యం, పాండురంగ హైస్కూల్, నిర్మల హైస్కూల్, కేకేఆర్ గౌతమ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సెంటర్లను తనిఖీ చేశారు. అసిస్టెంట్ కమిషనర్ ప్రభుత్వ పరీక్షలు డేవిడ్ రాజు పెడన మండలంలోని రెండు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 36 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశాయని, ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని డీఈఓ రామారావు తెలిపారు. పరీక్ష కేంద్రాలను పరిశీలించిన డీఈఓ తొలి రోజు పరీక్షలకు20,822 మంది విద్యార్థులు హాజరు -
అలా కవర్ చేశారు!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘ఉపాధి’లో నాణ్యత డొల్ల శీర్షికన సాక్షి దినపత్రికలో శనివారం ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. నాసిరకంగా వేసిన రోడ్లకు మరమ్మతులు చేపట్టారు. వివరాలు ఇవి.. కొత్తూరు తాడేపల్లి పంచాయతీలో రూ.1.04 కోట్లతో వేసిన సిమెంటు రోడ్లు నాసిరకంగా ఉన్నాయి. గ్రావెల్ స్థానంలో చెరువు బురద, మట్టి వేశారు. దీనిపై కథనం రావడంతో అధికారులు దానిని చదును చేసి, దానిపైన డస్ట్ వేసి కవర్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే వేమవరంలో ప్రారంభానికి ముందే రోడ్లు పగుళ్లు వచ్చిన విషయాన్ని సాక్షి హైలెట్ చేయడంతో రోడ్డు దెబ్బ తిన్న ప్రాంతంలో వాటిని పగులగొట్టి, మళ్లీ కొత్తగా సిమెంటుతో పూడ్చారు. దీంతో ఆ పంచాయతీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల నాణ్యతపై విజిలెన్స్ అధికారులతో విచారించాలని కోరుతున్నారు. -
నిర్మూలనపై సమీక్ష..
నాటుసారా నిర్మూలనపై సాక్షి ప్రచురించిన వరుస కథనాలతో ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్దేవ్ శర్మ స్పందించారు. తిరువూరు ఎకై ్సజ్శాఖ పోలీసుస్టేషన్ను శనివారం తనిఖీ చేశారు. ఇప్పటి వరకు నమోదైన కేసులు, నిందితుల వివరాలకు సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎకై ్సజ్ శాఖ జిల్లా అధికారి ఎస్. శ్రీనివాసరావు, రాష్ట్ర టాస్క్ఫోర్స్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మధుబాబు, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రాంశివ, తిరువూరు ఎకై ్సజ్ సీఐ జె. శ్రీనివాస్తో సమీక్ష జరిపారు. నాటుసారా నియంత్రణలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని హెచ్చరించినట్లు సమాచారం. పదేపదే పోలీసులకు చిక్కుతున్న నిందితులపై పీడీ యాక్టును ప్రయోగించాలని సూచించినట్లు తెలిసింది. ఈ యాక్టులో కేసు నమోదై రుజువైతే ఒకటి నుంచి రెండు సంవత్సరాలపాటు నిందితులు జైలుపాలవుతారు. -
మర్యాదపూర్వక కలయిక
కోనేరుసెంటర్: కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.రాంజీ ఆదివారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. అమరావతిలో కేంద్ర మంత్రిని కలిసిన ఆయన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కృష్ణా విశ్వవిద్యాలయంలో అంతర్గత రహదారులు, ఇతర అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు. అనంతరం యూనివర్సిటీ ప్రాంగణంలో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులను ఆయనకు వివరించారు. తొలుత కేంద్ర మంత్రి పెమ్మసానిని వీసీ శాలువా కప్పి సత్కరించి మొక్కను బహూకరించారు. మదర్స్ మిల్క్ బ్యాంక్ ప్రారంభం లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోనే తొలిసారిగా విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్లో మదర్స్ మిల్క్ బ్యాంకు ఏర్పాటు చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ మిల్క్ బ్యాంకును ఆదివారం సినీ హీరో మహేష్బాబు సతీమణి నమ్రత లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం నమ్రత మీడియాతో మాట్లాడుతూ.. నవజాత శిశువుల కోసం మదర్స్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గుండె జబ్బులున్న చిన్నారులకు సేవా భావంతో సర్జరీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సేవా కార్యక్రమాల్లో తమ భాగస్వామ్యం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆస్పత్రి పిడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పి.వి.రామారావు మాట్లాడుతూ.. మదర్స్ మిల్క్ బ్యాంకు ద్వారా ఏటా సుమారు 7200 మంది నవజాత శిశువులు లబ్ధిపొందే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ పి.వి.రమణమూర్తి, ఫీటల్ స్పెషలిస్టు డాక్టర్ పద్మ, రోటరీ ప్రతినిధి డాక్టర్ కామినేని పట్టాభిరామయ్య పాల్గొన్నారు. -
మంచి ఉపాధి అవకాశాలు చూపే కోర్సులు, కళాశాలలే టార్గెట్
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇంటర్మీడియెట్ పరీక్షలు ముగిశాయి. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువులకు ఎక్కడ చేర్పిస్తే బాగుంటుంది? ఏది చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది? ఏ కోర్సు చేస్తే ఉపాధి అవకాశాలు మెండుగా వస్తాయి? అనే అంశాలపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఇంటర్మీడియెట్లో ఎంపీసీ గ్రూప్ చేసిన విద్యార్థుల తల్లిదండ్రులంతా దాదాపు ఇదే ఆలోచనల్లో మునిగి తేలుతున్నారు. ఇప్పటికే పలువురు విజయవాడకు సమీపంలో ఉన్న ప్రైవేటు విశ్వ విద్యాలయాలను సందర్శించడంతో పాటు, ఆయా యూనివర్సిటీలు అడ్మిషన్స్ కోసం నిర్వహించే పరీక్షల వివరాలు, ఫీజుల వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. ప్లేస్మెంట్స్కే ప్రాధాన్యం.. ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగం మందకొడిగా నడుస్తోంది. అధిక నైపుణ్యం ఉన్న విద్యార్థులే ప్లేస్మెంట్స్ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మంచి ఆఫర్లు ఏ కళాశాల, యూనివర్సిటీల్లో ఎక్కువ వస్తున్నాయో తల్లిదండ్రులు ఆరా తీస్తున్నారు. అంతేకాక ఇంజినీరింగ్, డిగ్రీలో ఏ కోర్సులు చేసిన వారికి ప్లేస్మెంట్స్ వస్తున్నాయో కూడా తెలుసుకుంటున్నారు. తల్లిదండ్రుల ఆలోచనలకు అనుగుణంగానే ప్రైవేటు విశ్వ విద్యాలయాలు, కళాశాలలు తమ వద్ద చేరితే వంద శాతం ప్లేస్మెంట్స్ వస్తాయి.. ఈ విద్యా సంవత్సరంలో ఇంత మంది ప్లేస్మెంట్ పొందారంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రాల వద్ద సైతం అదే తరహా కరపత్రాలను యూనివర్సిటీ, కళాశాలల యాజమాన్యాలు పంపిణీ చేశారు. డిగ్రీకి పెరిగిన క్రేజ్.. ప్రస్తుతం డిగ్రీలోని పలు కోర్సులకు క్రేజ్ పెరిగింది. వాటిలో బీబీఏతో పాటు, బీఎస్సీ కంప్యూటర్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి వాటిపై విద్యార్థులు దృష్టి పెడుతున్నారు. ఆయా కోర్సులు చేసిన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తుండటంతో డిగ్రీ కాలేజీల్లో ఆ కోర్సుల్లో చేరేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. వాటితో పాటు సివిల్స్, గ్రూప్–1, గ్రూప్–2 వంటి ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టి పెట్టిన వారు బీఏలో చేరుతున్నారు. ఇప్పుడు డిగ్రీతో పాటు, సివిల్స్, గ్రూప్స్లో శిక్షణ ఇచ్చే కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో బీఏలో చేరే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ముగిసిన ఇంటర్మీడియెట్ పరీక్షలు విద్యార్థుల ఉన్నత చదువులపై దృష్టిసారిస్తున్న తల్లిదండ్రులు డిగ్రీ, ఇంజినీరింగ్ కోర్సుల్లో అవకాశాలు వేటిలో ఎక్కువుంటాయంటూ ఆరా ప్రైవేటు యూనివర్సిటీలు, కళాశాలల వివరాలు తెలుసుకుంటున్న వైనం పేరెంట్స్కు ఫోన్లు చేస్తున్న ప్రైవేటు కళాశాలల పీఆర్ఓలు -
అన్ని వర్గాలను ఆకట్టుకునే ‘రాబిన్హుడ్’
లబ్బీపేట(విజయవాడతూర్పు): కామెడీ, క్రైమ్, థ్రిల్లర్ అంశాలతో కూడిన రాబిన్హుడ్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆ చిత్ర హీరో నితిన్ అన్నారు. ఈ చిత్రంలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక పాత్రలో ప్రేక్షకులను కనువిందు చేయనున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 28న విడుదల కానున్న రాబిన్హుడ్ చిత్ర ప్రమోషన్లో భాగంగా యూనిట్ సభ్యులు ఆదివారం నగరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎంజీ రోడ్డులోని ఓ హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. నితిన్ మాట్లాడుతూ దుర్గమ్మ ఆశీస్సులతో చిత్ర ప్రమోషన్ను విజయవాడ నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో గతంలో తాను నటించిన భీష్మ చిత్రం విజయవంతమైందని, రాబిన్హుడ్ కూడా అదే రీతిలో సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ విజయవాడలో చదువుకుని దర్శకుడిగా మారినట్లు తెలిపారు. నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ నితిన్ అన్ని క్యారెక్టర్లకు సరిపోయే హీరో అన్నారు. క్రికెటర్ వార్నర్ను తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ద్వారా పరిచయం కానున్నారన్నారు. త్వరలో పుష్ప 3 చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందని, మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. చిత్ర హీరో నితిన్ -
శోభాయమానం.. దివ్య ప్రభోత్సవం
పెనుగంచిప్రోలు: తిరుపతమ్మవారి చిన్న తిరునాళ్లలో మూడో రోజు ఆదివారం రాత్రి 90 అడుగుల దివ్య ప్రభోత్సవం కమనీయంగా జరిగింది. దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తయిన ప్రభగా గుర్తింపు పొందిన ఈ దివ్య ప్రభోత్సవం 1928 నుంచి జరుగుతున్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ముందుగా అమ్మవారికి రజకులు, శాలివాహనులు కుంభం పోసి ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం ఆలయ ఈవో బీహెచ్వీఎస్ఎన్ కిషోర్కుమార్, చైర్మన్ జంగాల శ్రీనివాసరావు, ఆలయ ఈఈ ఎల్ రమ ఆధ్వర్యంలో రంగురంగుల విద్యుత్ దీపాలంకరణతో అలంకరించిన ఇనుప ప్రభపై ఉత్సవ విగ్రహాలను ఉంచి దేవస్థానం వారు గ్రామానికి చెందిన రైతుల ఎడ్లను కట్టి రథాన్ని గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించారు. ప్రభ ముందు డప్పు వాయిద్యాలు, కొమ్ము వాయిద్యాలు, నృత్యాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నందిగామ ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట సీఐ పి. వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఎస్ఐ అర్జున్ పోలీసు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె. బాలకృష్ణ, ఆలయ ఏఈఓలు ఉమాపతి, తిరుమలేశ్వరరావు, ఏఈ రాజు ఆలయ పాలకరవ్గ సభ్యులు, గ్రామపెద్దలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మూడో రోజు కొనసాగిన తిరుపతమ్మ చిన్న తిరునాళ్ల -
‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం
చిలకలపూడి(మచిలీపట్నం): పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు జిల్లాలో 22,341 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరి కోసం 145 పరీక్ష కేంద్రాలను విద్యాశాఖాధికారులు సిద్ధం చేశారు. విద్యార్థులకు అందించే ప్రశ్న, సమాధాన పత్రాలు ఈ నెల 14వ తేదీ నాటికే జిల్లాకు చేరగా.. వాటిని 23 స్ట్రాంగ్రూమ్లలో భద్రపరిచారు. పరీక్ష ప్రారంభించిన రోజు ఆయా స్ట్రాంగ్రూమ్ల నుంచి పరీక్ష కేంద్రాలకు చేరవేసేలా చర్యలు తీసుకున్నారు. ఆ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి.. జిల్లాలో ఏర్పాటు చేసిన 145 కేంద్రాల్లో 52 కేంద్రాలను సీ–కేటగిరీ కేంద్రాలుగా గుర్తించి ఆ కేంద్రాల్లో 52 సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఆరు సమస్యాత్మక పరీక్ష కేంద్రాలను గుర్తించారు. వీటిలో గన్నవరం మండలం ముస్తాబాద జెడ్పీహెచ్ఎస్, కంకిపాడు మండలం పునాదిపాడు జెడ్పీహెచ్ఎస్, బంటుమిల్లి మండలం పెదతుమ్మిడి జెడ్పీహెచ్ఎస్, బందరు మండలం తాళ్లపాలెం జెడ్పీహెచ్ఎస్, గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గవర్నమెంట్ హైస్కూల్, అవనిగడ్డ మండలం అవనిగడ్డ జెడ్పీహెచ్ఎస్లో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఏర్పాట్లు చేశారు. వీటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దానికి సంబంధించి డీఈవో కార్యాలయంలో కంట్రోల్రూమ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్.. జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఆదివారం కలెక్టర్ విద్యాశాఖాధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు చేయాలన్నారు. మహిళా విద్యార్థినులకు తనిఖీ చేసేందుకు కొన్ని చోట్ల మహిళా పోలీసుల కొరత ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, సచివాలయంలో పనిచేస్తున్న మహిళా పోలీసుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో మొబైల్ ఫోన్లను అనుమతించకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చూడాలన్నారు. కేంద్రాల్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు విద్యార్థులకు నిబంధనలు కచ్చితంగా తెలియజేయాలన్నారు. కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాట్లు పరిశీలించిన విద్యాశాఖాధికారులు టెలి కాన్ఫరెన్స్లో అధికారులకు కలెక్టర్ బాలాజీ దిశానిర్దేశం -
అమరజీవి త్యాగం.. చిరస్మరణీయం
చిలకలపూడి(మచిలీపట్నం): భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆధ్యులైన అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ తెలుగుభాషకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన మహనీయుడు పొట్టిశ్రీరాములన్నారు. 58 రోజుల పాటు నిరాహారదీక్ష చేసి తెలుగు రాష్ట్రం ఏర్పాటు కోసం తుదిశ్వాస విడిచారన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి దేశంలోనే మొట్టమొదటిసారిగా భాషాప్రయుక్త రాష్ట్రంగా తెలుగువారి కోసం ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో సీహెచ్ వీరాంజనేయప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. చిన్న తిరుపతికి కూరగాయల వితరణ గన్నవరం: ద్వారకాతిరుమలలోని శ్రీవారి సన్నిధిలో జరిగే నిత్య అన్నసమారాధనకు గన్నవరం గ్రామస్తులు 3,500 కిలోల కూరగాయలను వితరణగా అందజేశారు. ఈ మేరకు ఆదివారం స్థానిక శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం వద్ద కూరగాయల లోడ్తో వెళ్తున్న వ్యాన్ను పుర ప్రముఖులు నెక్కలపూడి ఈశ్వరరావు, మండల వెంకటప్రభాకరరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మండవ మాట్లాడుతూ గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి 11 టన్నులు, శ్రీశైలం ఆలయానికి 4 టన్నులు కూరగాయలను గన్నవరం నుంచి పంపించినట్లు తెలిపారు. తొలిసారిగా చిన్నతిరుపతికి కూడా కూరగాయలను అందజేసినట్లు చెప్పారు. స్వచ్ఛందంగా ముందుకువచ్చి కూరగాయలను వితరణగా అందజేసిన భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. పుర ప్రముఖులు తుమ్మల మురళీకృష్ణ, కాసన్నేని బాబురావు, కొణసాని నాగేశ్వరరావు, కాసన్నేని శ్రీనివాసరావు, చిలకపాటి సీతారామయ్య, తుమ్మల జితేంద్ర, ఆలయ ఈఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా కలెక్టర్కు అభినందన సర్టిఫికెట్ చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టర్ డీకే బాలాజీకి అభినందన సర్టిఫికెట్ మచిలీపట్నం యోగా గురువు గురునాథబాబు, ఆల్ ఇండి యా యోగా ప్రిన్సిపాల్ డాక్టర్ దమయంతి శర్మ అందజేశారు. ఆదివారం కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా పరిషత్ కల్యాణమండపంలో 150 మంది యోగా సభ్యులతో కలిసి 108 రౌండ్ల సూర్య నమస్కారాలు చేశారు. ఈ నమస్కారాలు చేసినందుకు యోగా గురువులు, ప్రిన్సిపాల్ ఆయనకు అభినందన సర్టిఫికెట్ను అందజేశారు. కార్యక్రమంలో యోగా గురువులు పాల్గొన్నారు. ముగిసిన జూడో రాష్ట్ర క్రీడా పోటీలు విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి జూడో జూనియర్ బాల, బాలికల క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో రెండు రోజుల పాటు ఈ పోటీలు హోరాహోరీగా సాగాయి. పోటీల అనంతరం ఈ నెల 28 నుంచి డెహ్రాడూన్లో జరిగే జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టులో విజయవాడకు చెందిన పి.ప్రవళ్లిక, ఎం.కీర్తన, బి.భావన, ఆర్.కోటేశ్వరి, జి.గగన్సాయి చోటు దక్కించుకున్నారు. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, జూడో రాష్ట్ర సంఘం సీఈవో వెంకట్ నామిశెట్టి, అధ్యక్షులు గణేష్ సుబ్బారావు, కార్యదర్శి ఎన్.పవన్సందీప్, ప్రతినిధులు విజేతలకు మెడల్స్ అందజేశారు. -
ఎకై ్సజ్.. ఎక్సర్సైజ్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: తిరువూరు నియోజకవర్గంలో నాటుసారా నిర్మూలన కోసం సాక్షి దిన పత్రిక చేపట్టిన యజ్ఞం సత్ఫలితాలను ఇస్తోంది. వరుస కథనాలతో ప్రభుత్వ యంత్రాంగంలో కొంత కదలిక వచ్చింది. ఎకై ్సజ్శాఖ రాష్ట్ర అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా తిరువూరు ఎకై ్సజ్ పోలీసుస్టేషన్ను తనిఖీ చేశారు. తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక అధికారులకు సూచనలు చేశారు. దీంతో స్థానిక ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. మూలాలపై దృష్టి.. సారా నిర్మూలనలో భాగంగా ఇప్పటి వరకు తయారీ, విక్రయాలు చేస్తున్న వ్యక్తులపై మాత్రమే ఎకై ్సజ్శాఖ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అయితే నాటుసారా తయారీకి వినియోగించే బెల్లం, పటిక, పాత్రలు, డ్రమ్ములు, చెక్కలు విక్రయించే వ్యక్తులతో పాటు ఆర్థికంగా అండగా ఉంటున్న వ్యక్తులు, సపోర్టుగా ఉంటున్న పెద్ద మనుషులపై అధికారులు దృష్టి పెడుతున్నారు. నాటుసారా తయారీకి సహకరించే వ్యక్తులపైనా కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే మేడూరులో నాటుసారా తయారీకి బెల్లం విక్రయిస్తున్న అద్దగిరి వేణుబాబు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని నుంచి 71కేజీల బెల్లంను స్వాధీనం చేసుకున్నారు. కలెక్టర్ సైతం.. సారా రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ‘నవోదయం’ కార్యక్రమంలో భాగంగా తిరువూరు శ్రీ వాహిని ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 18న నాటుసారా నిర్మూలనపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నసారా నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన గ్రామ కమిటీలు, మండల కమిటీలు, ఎకై ్సజ్శాఖ అధికారులతో సమీక్ష జరపనున్నారు. సారాపై ‘సాక్షి’ కథనాలతో కదిలిన యంత్రాంగం తిరువూరు చేరిన రాష్ట్ర ఎకై ్సజ్శాఖ ఉన్నతాధికారులు మూలాలను వెతికే పనిలో నిమగ్నం నిందితులపై పీడీ చట్టాన్ని ప్రయోగించాలని ఆదేశాలు రేపు జిల్లా కలెక్టర్ తిరువూరులో సమావేశం -
దుర్గమ్మ సన్నిధిలో ప్రముఖులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హీరో నితిన్, రాబిన్ హుడ్ దర్శకుడు వెంకి, నిర్మాత రవిశంకర్లతో పాటు సంగీత దర్శకుడు తమన్ వేర్వేరుగా అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. హీరో నితిన్ తన నూతన చిత్రం విజయవంతం కావాలని అమ్మవారిని వేడుకున్నానని పేర్కొన్నారు. ● దుర్గమ్మను రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, హడ్కో అధికార బృంద సభ్యులు ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన మంత్రి నారాయణ, హడ్కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) సంజయ్ కులశ్రేష్ఠ, కార్పొరేట్ ప్లానింగ్ డైరెక్టర్ ఎం.నాగరాజు, ఫైనాన్స్ డైరెక్టర్ దిల్జిత్సింగ్ కఠారి, ఏపీ రీజనల్ చీఫ్ బి.ఎన్.ఎ.మూర్తి, ఎస్.ఎం.శ్రీనివాస్, టి.సుబ్బారావుతో కూడిన బృందానికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. -
కృష్ణానదిలో యువకుడి మృతదేహం లభ్యం
ఇబ్రహీంపట్నం: కృష్ణా నదిలో గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని ఫెర్రీ స్నాన ఘాట్ వద్ద ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని వయసు సుమారు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటాయని, ఎత్తు 5.7 అడుగులు ఉన్నట్లు గుర్తించారు. వంకాయ కలర్ టీషర్ట్, బ్లాక్ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. జేబులో ఇంటితాళాలు, రెండు చెవులకు పోగులు కలిగి ఉన్నాడు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 94406 27084, 90591 21109 నంబర్లకు సమాచారం అందివ్వాలని గుంటుపల్లి సెక్టార్ ఎస్ఐ విజయలక్ష్మి అన్నారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. -
పంచాయతీకో మోడల్ ప్రైమరీ స్కూల్ కావాలి
కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. విజయవాడ గవర్నర్పేటలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో యూటీఎఫ్ ఆధ్వర్యాన సంఘ రాష్ట్ర ఆడిట్ కన్వీనర్ టి.ఎస్.మల్లేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం విద్యారంగ – ఆర్థిక సమస్యల సాధనకు రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథి లక్ష్మణరావు మాట్లా డుతూ.. రాష్ట్రంలోని 13,325 గ్రామ పంచాయతీల్లో మోడల్ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని పంచాయతీల్లో సాధ్యం కాకపోతే విడుతల వారీగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఐదు తరగతులకు ఐదుగురు టీచర్లతో పాటు ఐదు తరగతి గదులు, అన్ని సౌకర్యాలు ఉండే విశాలమైన పాఠశాలగా తీర్చిదిద్దాలన్నారు. అందుకు బడ్జెట్ కేటాయించాలన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలో 60 మంది పైగా విద్యార్థులు ఉంటే హైస్కూల్గా అప్గ్రేడ్ చేయాలని, లేకపోతే యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రజలు ప్రభుత్వ పాఠశాలల వైపు చూసే విధంగా తీర్చిదిద్దాలన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. విద్యారంగంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంస్కరణలు, దాని ఫలితాలు, భవిష్యత్లో ఏర్పడబోయే సమస్యలు, ఎలా పరిష్కరించాలి అనే అంశాలపై రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. మొదటి సదస్సును విజయవాడలో నిర్వహించామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్.ప్రసాద్, సహాధ్యక్షులు కుసుమకుమారి, లక్ష్మీరాజా, సుభాషిణి, శ్రీలక్ష్మి, ఉమామమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
తిప్పలు పడుతున్నాం
గ్రామంలో తాగునీరు వారానికి ఒకసారి వస్తుంది. అరకొరగానే కుళాయిల నుంచి వస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో నివసించే వారికి ప్రధాన పైపుల ద్వారా తాగునీరు సరఫరా కావట్లేదు. అధికారులు ట్రాక్టర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయడం లేదు. దీంతో తిప్పలు పడుతున్నాం. మేజర్ గ్రామమైనా తాగునీటి కష్టాలు తప్పడం లేదు. –కంచర్ల పద్మావతి, బీసీ కాలనీ, పరిటాలతాగునీటిని కొనుగోలు చేస్తున్నాం కాలనీకి వారానికి ఒకసారి కూడా తాగునీరు రావడం లేదు. మినరల్ వాటర్ ప్లాంట్ల వద్దకు వెళ్లి తాగునీటిని కొనుగోలు చేసి దాహార్తిని తీర్చుకుంటున్నాం. నీటి సరఫరాపై అనేకసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకునేవారే లేరు. –బొక్కా కుమారి, అరుంధతీ నగర్, కంచికచర్ల ● -
వైభవంగా నృసింహుని పుష్పయాగోత్సవం
మంగళగిరి: మంగళాద్రిలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం పుష్పయాగోత్సవం వైభవంగా నిర్వహించారు. 11 రోజుల నుంచి జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారికి వివిధ రకాల పుష్పాలతో యాగోత్సవం చేశారు. ఆలయ ఆస్థాన మండపంలో జరిగిన ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని పుష్ప సేవ చేశారు. ఉత్సవానికి కై ంకర్యపరులుగా నందం సాంబశివరావు, శాంతికుమారి వ్యవహరించగా ఆలయ ఈవో ఎ.రామకోటిరెడ్డి పర్యవేక్షించారు. -
పొట్టి శ్రీరాములుకు నివాళి
విజయవాడస్పోర్ట్స్: ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతిని విజయవాడ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. శ్రీరాములు చిత్రపటానికి సీపీ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు విశేషంగా కృషి చేశారని, మహాత్మాగాంధీ బోధించిన సత్యం, అహింస మార్గాల్లో పయనించారన్నారు. మద్రాసు రాజధానిగా ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో తెలుగువారి కష్టాలకు చలించి భాష ప్రయుక్త రాష్ట్రం కావాలని ఉద్యమించి అమరులయ్యారని తెలిపారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తే సహించబోం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం నియమ, నిబంధనలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించే వారిని సహించేది లేదని రాష్ట్ర అధ్యక్షుడు రామస్వామి అన్నారు. అలా వ్యవహరించేవారిని సంఘం పదవుల నుంచి తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు. విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్క్లబ్లో విశ్వబ్రహ్మణ సంఘం సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ.. కొందరు సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని పేర్కొన్నారు. మాతృ సంఘాన్ని స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవాలని చూస్తున్నారని వివరించారు. అటువంటి వారందరినీ రాష్ట్ర సంఘ కార్యకలాపాల్లో పాల్గొనకుండా బహిష్కరిస్తున్నామన్నారు. సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడిగా చేవూరు రామస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఫిరంగి చంద్రశేఖర్, గౌరవ సలహాదారులు సూర్యనారాయణ, మహిళా కమిటీ అధ్యక్షురాలిగా బి.నీరజ, రాష్ట్ర మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీదేవి, గురజాడ రాజేశ్వరి, వర్కింగ్ ప్రెసిడెంట్గా విజయలక్ష్మి, లత, వరలక్ష్మిని ఎన్నుకున్నామని ఆయన తెలిపారు. -
సౌకర్యాల ఏర్పాటుకు ప్రాధాన్యం
పెనుగంచిప్రోలు: అమ్మవారి భక్తులకు సదుపాయాలు కల్పించడానికి ఆలయ అధికారులు ప్రాధాన్యమివ్వాలని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ సూచించారు. పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ ఆలయ అభివృద్ధికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన రూ.4.75కోట్లతో నిర్మించిన కేశఖండనశాల, టాయిలెట్ బ్లాక్తోపాటు హైదరాబాద్కు చెందిన చిన్నం యాగయ్య జ్ఞాపకార్థం ఆయన సతీమణి కృష్ణవేణి కుటుంబ సభ్యులు రూ.కోటితో నిర్మించిన డార్మెటరీని ఆదివారం ఆయన ప్రారంభించారు. మున్నేరు పక్కన కరకట్ట నిర్మాణానికి సంబంధించి ఆలయ అధికారులు, గ్రామపెద్దలతో సమీక్షించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. డార్మెటరీని నిర్మించిన దాతలు కృష్ణవేణి కుటుంబసభ్యులను అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలతో సత్కరించారు. కార్యక్రమంలో చైర్మన్ జంగాల శ్రీనివాసరావు, ఆలయ ఈవో కిషోర్కుమార్, సర్పంచ్ వేల్పుల పద్మకుమారి, ఈఈ ఎల్.రమ, ఏఈవో ఉమాపతి, ఏఈ రాజు, నాయకులు చింతల సీతారామయ్య, కొత్తపల్లి సతీష్, ఆలయ మాజీ చైర్మన్లు కాకాని శ్రీనివాసరావు, కర్ల వెంకటనారాయణ, కల్లూరి శ్రీవాణి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
వట్టిపోయిన మున్నేరు
కంచికచర్ల: నాడు నిండుకుండలా జలకళతో కనపడిన మున్నేరు నేడు నీటిచుక్కలేక వట్టి పోయింది. మున్నేరులో జల లేక తాగునీరు, సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రబీ సీజన్లో రైతులకు సాగునీరు అందక పంటలన్నీ ఎండిపోతున్నాయి. పూర్తి వేసవి రాక ముందే గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. కంచికచర్ల మండలం మున్నేరు ఉపనది నుంచి మున్సిపాలిటీ అయిన నందిగామ, మండల కేంద్రం కంచికచర్ల, గండేపల్లి, కీసర, పెండ్యాల, వేములపల్లి, పెండ్యాల, ఎస్.అమరవరం, మోగులూరు, పేరకలపాడు, గండేపల్లి తదితర గ్రామాలకు మున్నేరు నుంచి రక్షిత మంచినీటి పఽథకం ద్వారా తాగునీరు సరఫరా అవుతుంది. మున్నేరులో నీరు లేక రక్షిత మంచినీటి పథకానికి ఏర్పాటు చేసిన బోర్లకు నీరు అందడంలేదు. మరమ్మతులకు గురవుతున్న విద్యుత్ మోటార్లు, బోర్లు మున్నేరు ఉపనదిలో నందిగామ, కంచికచర్ల పట్టణాలతో పాటు పలు గ్రామాలకు చెందిన రక్షిత మంచినీటి పథకానికి గత ప్రభుత్వాలు బోర్లు ఏర్పాటు చేశాయి. మున్నేరులో నీరు లేక ఈ బోర్లకు నీరు అందకపోవడంతో వాటికి ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్లు మరమ్మతులకు గురవుతున్నాయని ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు అంటున్నారు. విద్యుత్ మోటార్లు కాలిపోవడం.. పంచాయతీలో నిధులు లేకపోవటంతో సకాలంలో మోటార్లను బాగు చేయటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పూర్తి వేసవి రాకముందే గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు ఆరోపిస్తున్నారు. రబీలో అందని సాగునీరు రైతులు మున్నేరు పరిసర ప్రాంతాల్లో రబీ సీజన్లో మొక్కజొన్న, మినుము, తదితర పలు రకాల పంటలను సాగుచేశారు. నీరు లేకపోవడంతో మున్నేరుపై ఉన్న ఎత్తిపోతలకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు అంటున్నారు. పశుపక్ష్యాదులు కూడా అల్లాడిపోతున్నాయి. మినరల్ వాటర్ ప్లాంట్లే దిక్కు రక్షిత మంచినీటి పథకం ద్వారా గ్రామాలకు తాగునీరు సక్రమంగా సరఫరా జరగక కొంతమంది తాగునీటిని కొనుగోలు చేసి దాహార్తిని తీర్చుకుంటున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న మినరల్ వాటర్ప్లాంట్ల నిర్వాహకులు ఒక్కో 20 లీటర్ల క్యాను రూ. 20 నుంచి రూ.30 వరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో మినరల్ వాటర్ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఎమ్మెల్యేకు చెప్పినా.. స్పందన లేదు పరిటాల గ్రామానికి తాగునీరు సక్రమంగా సరఫరా కావట్లేదని చెవిటికల్లులోని కృష్ణానది నుంచి తాగునీటి పైపులువేసి గ్రామానికి సరఫరా కావడానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు గ్రామస్తులు విన్నవించారు. పైలెట్ ప్రాజెక్టు కింద నిధులు మంజూరు చేసి గ్రామానికి తాగునీటి ఇబ్బందుల్లేకుండా చూడాలని పలుమార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని టీడీపీ నాయకులే ఆరోపిస్తున్నారు. వారానికి ఒకసారి వచ్చే తాగునీటితో కాలం వెళ్లబుచ్చుతున్నా మని చెప్పినా ఫలితం లేదని మహిళలు అంటున్నా రు. పాలకులు, అధికారులు స్పందించాల్సి ఉంది. నాడు మున్నేరుకు జలకళ నేడు చుక్క నీరు లేదు తప్పని తాగునీటి తిప్పలు పలుగ్రామాల్లో వారానికి ఒకసారి నీటి సరఫరా పట్టించుకోని పాలకులు, అధికారులు -
వైభవంగా తిరుపతమ్మ రథోత్సవం
పెనుగంచిప్రోలు: తిరుపతమ్మ చిన్న తిరునాళ్లలో రెండో రోజు శనివారం రాత్రి గోపయ్యసమేత తిరుపతమ్మ రథోత్సవం వైభవంగా జరిగింది. తొలుత ఉత్సవమూర్తులను అలంకరించిన రథంపై ఉంచారు. రథం ముందు రజకులు, శాలివాహనులు కుంభం పోసిన అనంతరం డప్పు వాయిద్యాలు, మేళతాళాల మధ్య రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈఓ బీహెచ్వీఎస్ఎన్ కిషోర్కుమార్, చైర్మన్ జంగాల శ్రీనివాసరావు, ఈఈ ఎల్.రమ, పాలకవర్గసభ్యులు బెజవాడ శ్రీనివాసరావు, పాలాది వెంకటరమణ కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రథోత్సవం సాగింది. కార్యక్రమంలో తహసీల్దార్ ఎ.శాంతిలక్ష్మి, ఏఈవోలు ఉమాపతి, తిరుమలేశ్వరరావు, ఏఈ రాజు, చుంచు రమేష్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆదివారం రాత్రి గం.9.05 గంటలకు దివ్య ప్రభోత్సవం జరుగుతుందని ఆలయ ఈఓ తెలిపారు. -
కలెక్టరేట్లో ప్లాస్టిక్ వాడకం నిషేధం
చిలకలపూడి(మచిలీపట్నం): పర్యావరణ పరిరక్షణలో భాగంగా కలెక్టరేట్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ప్రకటించారు. శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్లాస్టిక్ వాడకం నియంత్రణపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మూడో శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర నిర్వహించాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగా పర్యావరణాన్ని మెరుగుపరిచే కార్యాచరణలో ఒక్కొక్క నెల ఒక్కొక్క ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడకాన్ని నివారించడానికి నిర్ణయించామన్నారు. జిల్లా అధికారులతో పాటు సిబ్బందికి స్టీల్ బాటిల్స్ను ఆయన అందజేశారు. ఇకపై జిల్లా అధికారులు కలెక్టరేట్లో సమావేశాల నిర్వహణలో ప్లాస్టిక్ సీసాలను పంపిణీ చేయకూడదని అధికారులకు ఇచ్చిన స్టీల్ సీసాలో నీరు తెచ్చుకోవాలన్నారు. మచిలీపట్నంలో రోజుకు 80 టన్నుల చెత్త తయారవుతోందని, అందులో 36 శాతం ప్లాస్టిక్ సంబంధిత వస్తువులే ఉంటున్నాయన్నారు. ప్లాస్టిక్ సీసాల వాడకం చిత్తశుద్ధితో ఆపే ప్రయత్నం చేయాలన్నారు. అనంతరం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంద్ర ప్రతిజ్ఞను అధికారులు, సిబ్బందితో ఆయన చేయించారు. కలెక్టరేట్ నుంచి అధికారులు, సిబ్బందితో కలిసి ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద ఉన్న కూడలి వరకు ర్యాలీ చేశారు. అక్కడ మానవహారంగా ఏర్పడి మరోసారి కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, జెడ్పీ డెప్యూటీ సీసీవో ఆనందకుమార్, డ్వామా, డీఆర్డీఏ పీడీలు శివప్రసాద్, హరిహరనాఽథ్, బందరు ఆర్డీవో స్వాతి, డీపీవో అరుణ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బాలాజీ -
అలరించిన భక్తప్రహ్లాద నాటక ప్రదర్శన
విజయవాడ కల్చరల్: ఏపీ సాంస్కృతిక శాఖ, సృజనాత్మక సమితి, దక్షిణమండల సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యాన 6 రోజులపాటు నిర్వహించే సురభి నాటకోత్సవాలు దుర్గాపురంలోని సంగీత కళాశాలలో శనివారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు శ్రీ వెంకటేశ్వర సురభి థియేటర్, విజయ భారతి నాట్యమండలి ఆధ్వర్యాన సురభి జయచంద్రవర్మ పర్యవేక్షణలో భక్తప్రహ్లాద నాటకాన్ని రసరమ్యంగా ప్రదర్శించారు. ఒకే కుటుంబానికి చెందిన 50 మంది చిన్నా పెద్దా కళాకారులు పాల్గొనడం విశేషం. తొలుత నాటకోత్సవాలను గ్రీవెన్స్ అధికారి చిన్నారావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సురభి నాటకాలకు 140 సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. భాషా సాంస్కృతిక శాఖ ఉప సంచాలకుడు పెంచలయ్య సురభి నాటకంపై మాట్లాడారు. నర్తనం ప్రధాన సంపాదకురాలు మాధవి పురాణం సురభి నాటక ప్రస్తానం అంశంగా ప్రసంగించారు. కార్యక్రమాన్ని అంతర్జాతీయ నాట్యాచారిణి స్వర్ణలత నిర్వహించారు. -
అన్ని రంగాల్లో అగ్రగామిగా. .
సీసీఎల్ఏ కమిషనర్, జిల్లా ప్రత్యేక అధికారి జయలక్ష్మి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాను అన్ని రంగాల్లోను అగ్రగామిగా నిలపాలని భూ పరిపాలన చీఫ్ కమిషనర్ (సీసీఎల్ఏ), జిల్లా ప్రత్యేక అధికారి జి.జయలక్ష్మి అన్నారు. శనివారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో ఆయా శాఖల ప్రగతిని జిల్లా ప్రత్యేక అధికారి జి.జయలక్ష్మి తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రాధాన్యతా రంగాలు, కార్యక్రమాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతి నెలా ముందస్తు టూర్ ప్రోగ్రామ్ను నిర్దేశించుకొని పర్యటిస్తే క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను సమన్వయంతో పరిష్కరించవచ్చన్నారు. ప్రజలు అందజేస్తున్న అర్జీలకు నాణ్యతతో కూడిన పరిష్కారం చూపాలన్నారు. కమర్షియల్ ట్యాక్స్, ఎకై ్సజ్, మైన్స్, తదితర శాఖలు జిల్లా స్థాయిలోనే లక్ష్యాలను నిర్దేశించుకొని ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జాబ్ మేళా నిర్వహణ, ఉద్యోగ కల్పన తదితర లక్ష్యాలను పూర్తిచేశామన్నారు. సమావేశంలో వీఎంసీ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, సీపీవో శ్రీలత, ఆర్డీవోలు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.