యువతకు నచ్చేలా...
‘రఘువర న్ బీటెక్’ చిత్రంతో తెలుగులో మంచి విజయం అందుకున్న తమిళ నటుడు ధనుష్ త్వరలో ‘అనేకుడు’గా రాబోతున్నారు. అమైరా దస్తూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ‘రంగం’ ఫేం కేవీ ఆనంద్ ద ర్శకుడు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కల్పాత్తి ఎస్.అగోరమ్, ఎస్.గణేష్, ఎస్.సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 10న పాటలను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు కె.వి. ఆనంద్ మాట్లాడుతూ -‘‘యువతకు నచ్చే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి, హారీస్ జైరాజ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు ’’ అని చెప్పారు. కార్తీక్, ఐశ్వర్య, ఆశిష్ విద్యార్థి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ఓం ప్రకాశ్, ఎడిటింగ్: ఆంటోని.