Lay-outs
-
ఆక్రమణల ‘దుర్గం’
• 35 ఎకరాల్లో వెలసిన లే-అవుట్లు • పెద్దల ఒత్తిడితో రెండు రోజులుగా నీరు విడుదల • పరిరక్షణపై శ్రద్ధ చూపని ప్రభుత్వం హైదరాబాద్: నగరం నడిబొడ్డున అత్యంత ఖరీదైన ప్రాంతం... చుట్టూ అత్యంత సుందరమైన ఐటీ కారిడార్. ఆ భూమిపై పెద్దల కన్ను పడింది. పదుల ఎకరాల్లో లే అవుట్లు, అపార్ట్మెంట్లు వెలిశాయి. ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. అధికారులు మామూళ్ల గం తలు కట్టుకోగా.. ప్రభుత్వం పెద్దలకే వంత పాడింది. చెరువులను పునరుద్ధరిస్తాం అంటూ వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ ఆక్రమణలను చూసీచూడనట్లే వదిలేస్తోంది. దీంతో రోజురోజుకు చెరువు కుంచించుకుపోతోంది. ఇదీ కబ్జా కోరల్లో చిక్కుకున్న దుర్గం చెరువు దుస్థితి. ఐటీ కారిడార్లో సుందర తటాకమైన దుర్గం చెరువు కబ్జా కోరల్లో చిక్కుకుంది. వేలాది ఎకరాలు కబ్జాకు గురైనా గత ప్రభుత్వాలు తలెత్తి అటు వైపు చూడలేదు. మిషన్ కాకతీయ పేరిట చెరువుల సంరక్షణకు పెద్దపీట వేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దుర్గం చెరువు పరిరక్షణలో పెద్దగా శ్రద్ధ చూపడం లేదనే విమర్శలున్నారుు. మాదాపూర్లోని దుర్గం చెరువు 160 ఎకరాలలో విస్తరించి ఉంది. మాదాపూర్ సర్వే నంబర్ 61లోనే దాదాపు 90 ఎకరాలు. రాయదుర్గం, గుట్టల బేగంపేట పరిధిలో మరో 70 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. రెండు గుట్టల మధ్యలో ఉన్న దుర్గం చెరువు సుందర తటాకంగా నిలుస్తూ పర్యాటకులకు ఆహ్లాదం పంచుతోంది. 35 ఎకరాలు కబ్జా...: దుర్గం చెరువు ప్రస్తుతం కేవలం 125 ఎకరాల విస్తీర్ణంలోనే ఉంది. దాదాపు 35 ఎకరాలు కబ్జాకు గురైంది. ఇనార్భిట్మాల్ నుంచి కావూరి హిల్స్కు వెళ్లే రోడ్డు ఫుల్ ట్యాంక్ లెవల్(ఎఫ్టీఎల్) పరిధిలోకి వస్తుంది. అంతేకాదు వందలాది నిర్మాణాలు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయి. నెక్టార్ గార్డెన్తో పాటు, అమర్సొసైటీ, కావరి హిల్స్, సెలైంట్ వ్యాలీలోని కొంత భాగం దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోకే వస్తారుు. దాదాపు 35 ఎకరాల్లో అపార్ట్మెంట్లు వెలిశారుు. నెక్టార్ గార్డెన్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబుమోహన్ నివాసం ఉంటున్నారు. అంతే కాకుండా దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే సినీ, రాజకీయ ప్రముఖులు ఉండటం గమనార్హం. దిగువకు నీరు విడుదల.. భారీ వర్షాలు వచ్చినా దుర్గం చెరువు పూర్తిగా నిండడం గగనమే. అలాంటిది పూర్తి స్థారుు మట్టానికి పది అడుగుల ఉండగానే దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎఫ్టీఎల్లోని సెలైంట్ వ్యాలీ నివాసితులు రెండు రోజులుగా ఇరిగేషన్ అధికారులకు ఫోన్లు చేసి నీళ్లు కిందికి వదలాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజులుగా నీటిని విడుదల చేస్తున్నారు. గతంలోనూ ఒత్తిళ్లు.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దుర్గం చెరువు గేట్లు మూరుుంచారు. దీంతో దుర్గం చెరువు గేట్ ముందు ఉన్న అపార్ట్మెంట్లు, ఇళ్లలోకి నీళ్లు వచ్చారుు. నెక్టార్ గార్డెన్లోకి నీళ్లు రావడంతో స్వయంగా బాబుమోహన్ రంగంలోకి దిగి నీటిని కిందికి విడుదల చేరుుంచారు. దుర్గం చెరువు మొత్తం విస్తీర్ణం: 160 ఎకరాలు ప్రస్తుతం ఉన్న విస్తీర్ణం : 125 ఎకరాలు కబ్జాకు గురైంది : 35 ఎకరాలు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు: నెక్టార్ గార్డెన్, అమర్సొసైటీ, కావూరి హిల్స్, సెలైంట్ వ్యాలీలోని కొంత భాగం దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో వెలసిన నిర్మాణాలు -
మహానగరాభివృద్ధిని ‘పాత’రేశారు!
పాత తేదీలతో లే అవుట్లు, భవనాలకు అనుమతులు * బిల్డర్లతో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్ల కుమ్మక్కు * రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని 5 గ్రామాల్లో అక్రమాలు * హెచ్ఎండీఏ ప్రత్యేక విచారణలో వెల్లడి.. క్రిమినల్ కేసులకు సిఫారసు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పరిధిలోని గ్రామాల్లో లే అవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులు జారీలో భారీ అవకతవకలు జరుగుతున్నాయి. బిల్డర్లు, రియల్టర్లతో గ్రామ పంచాయతీల కార్యనిర్వహణాధికారులు(ఈఓలు), కార్యదర్శులు, సర్పం చ్లు కుమ్మక్కై ఏకంగా దశాబ్ద కాలం కింది నాటి పాత తేదీలతో దొడ్డిదారిలో అనుమతులు జారీ చేసేస్తున్నారు. అక్రమ మార్గంలో లభించిన అనుమతులతో బిల్డర్లు వందల సంఖ్యలో నివాస, వ్యాపార సముదాయాలతో పాటు గేటెడ్ కమ్యూనిటీలను ఇష్టారాజ్యంగా నిర్మిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఈఓలు, సర్పంచ్లకు లక్షల రూపాయల్లో మామూళ్లు అందుతున్నాయి. నేరుగా హెచ్ఎండీఏ కమిషనర్లు ఇవ్వాల్సిన అనుమతులను ఈవోలే ఇచ్చేస్తుండటంతో సంస్థకు రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి గండిపడుతోంది. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని నిజాంపేట, గండి మైసమ్మ, ప్రగతినగర్, బౌరంపేట, దూలపల్లి గ్రామాల పరిధిలో అక్రమ అనుమతుల ఆరోపణలపై హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తాజాగా చేపట్టిన విచారణలో ఈ బాగోతం వెలుగు చూసింది. అధికార పరిధి దాటిన ఈఓలు... గ్రామ పంచాయతీ ఈఓల అధికారాలను కేవలం రెండంతస్తుల భవన నిర్మాణాల అనుమతుల వరకే పరిమితం చేస్తూ 2008 ఏప్రిల్ 17న హెచ్ఎండీఏ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇంకా పాత తేదీలతో దొడ్డిదారిలో ఈఓలు మూడంతస్తుల భవనాలకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఈ ఐదు గ్రామాల్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 36 భవన సముదాయాలతోపాటు ఆరు గేటెడ్ కమ్యూనిటీలను హెచ్ఎండీఏ బృందం పరిశీలించగా, అందులో 30 భవనాలకు స్థానిక గ్రామ పంచాయతీల ఈఓలు పాత తేదీలతో అనుమతులు జారీ చేసినట్లు బయటపడింది. అధికారులను ఈఓలు దుర్వినియోగం చేయడంతోపాటు బిల్డర్లతో కుమ్మక్కై భారీగా లంచాలు స్వీకరించినట్లు ఈ విచారణలో తేలింది. ఇక ఎల్ఆర్ఎస్ పథకం గడువు ముగిసి ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఈ గ్రామాల్లో పాత తేదీలతో అక్రమ లే అవుట్లను క్రమబద్ధీకరిస్తున్నట్లు హెచ్ఎండీఏ గుర్తించింది. ఈఓలు, సర్పంచ్లతో కుమ్మక్కైన బిల్డర్లు బౌరంపేట, మల్లంపల్లి గ్రామాల్లో సుమారు 45 ఎకరాల్లో పెద్ద మొత్తంలో గేటెడ్ కమ్యూనిటీలను నిర్మిస్తున్నట్లు బయటపడింది. ప్రభుత్వానికి హెచ్ఎండీఏ లేఖ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ కోసం బీపీఎస్ పథకాన్ని మళ్లీ ప్రవేశపెట్టనుందని, అప్పుడు అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించుకోవచ్చని ఈఓలు సలహా ఇవ్వడంతోనే బిల్డర్లు అక్రమ నిర్మాణాలు జరుపుతున్నారని హెచ్ఎండీఏ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈ ఐదు గ్రామాల్లో అక్రమ మార్గంలో అనుమతులు జారీ చేసిన ఈఓలు, సర్పంచ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హెచ్ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రా ప్రభుత్వానికి లేఖ రాశారు. అక్రమ లే అవుట్లు, కట్టడాల ఫొటోలు, ఇతర వివరాలతో సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.