Mahabubabad District News
-
కాలానికి అనువైన పంటలు ఎంచుకోవాలి
వైరా: రైతులు ఎప్పటికప్పుడు కాలానికి అనుగుణంగా పంటలు సాగు చేసుకోవాలని.. తద్వారా నష్టం లేకుండా అధిక దిగుబడులు సాధించొచ్చని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకుడు డాక్టర్ ఎం.బలరామ్ తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రంలో సోమవారం నిర్వహించిన మధ్య తెలంగాణ మండల (ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మెదక్) వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా సంఘం సమావేశంలో పాల్గొన్నారు. తొలుత రైతులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం బలరామ్ మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులు, మార్కెట్లో డిమాండ్ను తెలుసుకుంటూ పంటల సాగులో మెళకువలు పాటిస్తే ఫలితం ఉంటుందని తెలిపారు. అనంతరం యూనివర్సిటీ విస్తరణ సంచాలకుడు డాక్టర్ ఎం.యాదాద్రి, మధ్య తెలంగాణ రీజియన్ సహాయ పరిశోధన సంచాలకుడు డాక్టర్ ఆర్.ఉమారెడ్డి, మల్యాల కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ మాలతి, మధిర వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రుక్మిణీదేవి మాట్లాడారు. కార్యక్రమంలో వ్యవసాయ విశ్వ విద్యాలయం డైరెక్టర్లు, వివిధ విభాగాల ప్రధాన శాస్త్రవేత్తలు, ఉమ్మడి ఖమ్మం, మెదక్, వరంగల్ జిల్లాల వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, ఆదర్శ రైతులు పాల్గొన్నారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకుడు బలరామ్ -
చేపల పెంపకంతో ఆర్థికంగా ఎదగాలి
మామునూరు : చేప పిల్లల పెంపకంతోపాటు చేప పిల్లల ఉత్పత్తికేంద్రాలు, నర్సరీలు ఏర్పాటు చేసుకుని గ్రామీణ నిరుద్యోగ యువత, మహిళా రైతులు ఆర్థికంగా ఎదగాలని మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రాజన్న సూచించారు. ఖిలా వరంగల్ మండలం మామునూరు కృషి వి జ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ మత్స్య అభివృద్ధి మండలి, హైదరాబాద్ సౌజన్యంతో నర్సరీల్లో తెల చేపల పెంపకంపై ఐదు రోజుల శిక్షణ శిబిరం సోమవారం ప్రారంభమైంది. ఆయన ముఖ్యఅ తిథిగా హాజరై శిక్షణ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత మహిళలు, నిరుద్యోగ యువత ముందుకు వచ్చి నర్సరీల్లో చేపల పంపకం చేపడితే లాభాలు అర్జించొచ్చని పేర్కొన్నారు. అనంతరం చేపల పెంపకం, చేపలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. శాస్త్రవేత్తలు జె.సాయి కిరణ్, గణేశ్, రాజు, తదితరులు పాల్గొన్నారు. మూమునూరు కేవీకే కోఆర్డినేటర్ రాజన్న -
రాష్ట్రస్థాయి యూత్ పార్లమెంట్కు ఎంపిక
కేయూ క్యాంపస్ : వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ జిల్లా స్థాయిలో ఈనెల 22, 23 తేదీల్లో కాకతీయ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ వలంటీర్లకు ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ అనే అంశంపై ప్రసంగ పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులను రాష్ట్ర స్థాయి యూత్పార్లమెంట్కు ఎంపిక చేసినట్లు కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ సోమవారం తెలిపారు. ఈ పోటీల్లో హనుమకొండ, ములుగు, ఏటూరునాగారం, భూ పాలపల్లి జిల్లాల నుంచి వివిధ డిగ్రీ కళాశాలల ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పాల్గొని తమకు ఇచ్చిన సమ యం ప్రకారం ప్రసంగించారు. ఇందులో పదిమందిని రాష్ట్రస్థాయి యూత్పార్లమెంట్ ఎంపిక చేశారు. అందులో బి.సంధ్య బైరెడ్డి, ఎం. శ్రావ్య, శ్రీజయాదవ్, కాలాజ్ఞ (కేయూ బయోటెక్నాలజీ ), మహ్మద్ హాసన్ (యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కాలేజీ, హ నుమకొండ), ఎం. శ్రావ్య, కార్తీక్ (కేయూ కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజీ), ఎ.వినీలా (ప్రభుత్వ పింగిళి మహిళా కాలేజీ హనుమకొండ), అలేఖ్య, సిద్దార్థ (వరంగల్ కిట్స్ కాలేజీ), రచన (ములుగు ప్రభుత్వడిగ్రీ కాలేజీ), శంకర్ (భూపాలపల్లి ప్ర భుత్వ డిగ్రీకాలేజీ) ఉన్నారు. వీరు రాష్ట్ర అసెంబ్లీలో జరగబోయే స్టేట్లెవ్ వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్లో పాల్గొనబోతున్నారు. ఈనెల 23న ఎన్ఎస్ఎస్ వలంటీర్లు మాక్ పార్లమెంట్ కూడా నిర్వహించుకున్నారు. ఈ యూత్పార్లమెంట్ పోటీల సమావేశంలో కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, ప్రిన్సిపాల్ టి. మనోహర్, నెహ్రూ యువకేంద్రం జి ల్లా డిప్యూటీ ఆఫీసర్ అన్వేశ్, ఈ ప్రోగ్రాం కన్వీనర్ రాధిక, జ్యూరీ మెంబర్, కేయూ జూవాలజీ విభా గం ఆచార్యుడు మామిడాల ఇస్తారి పాల్గొన్నారు. -
మార్కెట్కు 16 టన్నుల మామిడి
వరంగల్: వరంగల్ ఏనుమాముల పరిధిలోని ముసలమ్మకుంట సమీపంలో ఏర్పాటు చేసిన మార్కెట్కు 21 వాహనాల్లో 16 టన్నుల మామిడి అమ్మకానికి వచ్చింది. గరిష్ట ధర క్వింటాకు రూ.10వేలు, కనిష్ట ధర రూ.2వేలు (రాలిన కాయలు), మోడల్ ధర రూ.6,700 పలికినట్లు ఉద్యోగులు తెలిపారు. దారి తవ్వకంతో రాకపోకలకు అంతరాయం మామిడి మార్కెట్కు వెళ్లే దారిని ఆ స్థల యాజమానులు తవ్వడంతో రైతులు, వ్యాపారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. ఈవిషయం తెలిసిన మార్కెట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థలానికి సంబంధించిన పత్రాలు తీసుకురావాలని పేర్కొనడంతో స్థల యజమానులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, వరంగల్ వ్యవసాయ మార్కెట్లో మిర్చి యార్డులో వ్యాపారిపై హమాలీ చేయి చేసుకున్నట్లు తెలిసింది. ఈవిషయంపై వ్యాపార వర్గాలను విచారించగా దాట వేశారు. నాట్యాచార్యులు సుధీర్రావుకు జాతీయస్థాయి ఫెలోషిప్ హన్మకొండ కల్చరల్ : నగరానికి చెందిన నాట్యాచార్యులు, సద్గురు శివానంద నృత్యమాల వ్యవస్థాపకుడు బొంపల్లి సుధీర్రావు కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల శాఖ నుంచి జాతీయస్థాయి సీనియర్ ఫెల్షిప్నకు ఎంపికయ్యారు. ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా అత్యుత్తమ నాట్యకళాకారులను తీర్చిదిద్దిన సుధీర్రావు జిల్లాకు అవార్డులు తేవడం ప్రారంభించారు. ఇద్దరు దొంగల అరెస్ట్వరంగల్ క్రైం: తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సుబేదారి పోలీసులు అరెస్ట్ చేసినట్లు హనుమకొండ ఏసీపీ దేవేందర్రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన నిమ్మల వినయ్కుమార్, భద్రాది కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపేట మండలం అనిశెట్టిపల్లి గ్రామానికి చెందిన తంబళ్ల నితిన్ తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు. బంగారు ఆభరణాలు, నగదు చోరీకి పాల్పడుతున్నారు. ఈనెల 19న సంతోశ్నగర్ కాలనీలో విజయగిరి రాజు తన ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లగా తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. సుబేదారి ఇన్స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా, స్థానిక ఇంటెలిజెన్స్ను వినియోగించుకుని సోమవారం అదాలత్ వద్ద నిందితులను గుర్తించి విచారించగా.. నేరం ఒప్పుకున్నారు. నిందితుల నుంచి రూ.1.70 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, రూ. 90 వేలు స్వాధీ నం చేసుకుని రిమాండ్కు తరలించారు. -
రైతు ఉత్పత్తుల మేళాకు సర్వం సిద్ధం
ఖిలా వరంగల్: వరంగల్ నక్కలపల్లి రహదారిలోని జీఎం కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేయనున్న రైతు ఉత్పత్తుల మేళా ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. వరంగల్ జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల నేతృత్వంలో మంగళవా రం నుంచి 27వ తేదీ వరకు మేళా జరగనుంది. జిల్లాలోని రైతులు ఉత్పత్తి చేసిన గృహ, వంటగది అవసరాలు, ఆరోగ్యకర ఆల్పాహారాలు, అందం, ఆరోగ్య సంరక్షణ.. ఇలామరెన్నో ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. జిల్లా వ్యవసాయ అధికారులు జిల్లాలోని ప్రజలందరినీ మేళాకు ఆహ్వానిస్తున్నారు. సహజ సిద్ధమైన, మేలైన ఉత్పత్తులను ఆసక్తి ఉన్న ప్రజలు కొనుగోలు చేసేందుకు 42 స్టాళ్లు ఏర్పాటు చేశారు. రైతులు తాము ఉత్పత్తి చేసిన వస్తువులను మేళా ద్వారా అధిక రాబడి పొందడానికి స్టాళ్లలో విక్రయించుకునే అవకాశం కల్పించారు. ప్రజలకు ఆయా ఉత్పత్తులపై అవగాహన కల్పించనున్నారు. ప్రభుత్వ అందించే ప్రోత్సాహకాలను అధికారులు వివరించనున్నారు. వ్యవసాయ సాగుకు ఉపయోగపడే అన్ని రకాలు పరికరాలు, పనిముట్లు ప్రదర్శనలో ఉంచనున్నారు. వీటిలో ప్రధానంగా పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవడం, సాంకేతిక పరిజ్ఞానం పొందడం, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సస్యరక్షణ మందులు, పంట రుణాలు పొందేందుకు అవగాహన కల్పించనున్నారు. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ రైతు ఉత్పత్తుల మేళా ఏర్పాట్లను కలెక్టర్ సత్యశారద సోమవారం జిల్లా వ్యవసాయ అధికారి అనురాధతో కలిసి పరిశీలించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ఉత్పత్తులపై అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు, ఏసీపీ తిరుపతి, ఇన్స్పెక్టర్ రమేశ్, ఏఓ రవీందర్రెడ్డి, ఏఈఓలు పాల్గొన్నారు. విజయవంతం చేయాలి.. వరంగల్: వరంగల్ నక్కలపల్లి రోడ్డులోని జీఎం కన్వెన్షన్ హాల్లో ఈనెల 25నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్న ‘తెలంగాణ రాష్ట్ర స్థాయి రైతు ఉత్పత్తిదారు సంఘాల మేళా’ను విజయవంతం చేయాలని వరంగల్ జిల్లా వ్యవసాయధికారి కె.అనురాధ ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ మేళాలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన 40 రైతు ఉత్పత్తిదారు సంఘాల ఉత్పత్తులను స్టాళ్లలో ప్రదర్శించడంతోపాటు అమ్మకాలు చేపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.నేటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు నిర్వహణ వరంగల్ నక్కలపల్లి రోడ్డులోని జీఎం కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు 42 స్టాళ్లపై గృహ, వంటగది అవసరాలు, ఆరోగ్యకర అల్పాహారాలు, తదితర ఉత్పత్తుల ప్రదర్శన మేళా ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ సత్యశారద -
నీళ్లపాలు..
నిబంధనలుబకాయిలు లేవు డెయిరీ నిబంధనల ప్రకారం డిస్ట్రిబ్యూటర్ నుంచి రెండు రోజులకు సంబంధించిన అమ్మకాల మొత్తం విలువ రూ.12 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చేసుకున్నాం. డిస్ట్రిబ్యూటర్ ద్వారా ప్రతీ రోజు 240 ప్రభుత్వ సంస్థలు, సివిల్ మార్కెట్ కలుపుకుని 10వేల లీటర్ల అమ్మకాలు జరుగుతున్నాయి. నిబంధనల మేరకు డిస్ట్రిబ్యూటర్ ఏరోజు చెల్లించాల్సిన డబ్బులను అదే రోజు చెల్లిస్తున్నాడు. ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎలాంటి బకాయిలు లేవు. – శ్రవణ్కుమార్, డిప్యూటీ డైరెక్టర్, విజయ డెయిరీ, వరంగల్ హన్మకొండ చౌరస్తా : ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ నిర్వహణపై రోజురోజుకూ నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ప్రైవేట్ డెయిరీల పోటీని తట్టుకుని.. పాల అమ్మకాలు పెంచేందుకు అధికారులు చేపట్టిన చర్యలు ఫలితాలు ఇవ్వకపోగా.. నష్టాలు తెచ్చిపెడుతున్నాయి. అధికారుల అనాలోచిత నిర్ణయాలు, నిర్లక్ష్యం కారణంగా పాల అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయ పాలను ప్రజలకు మరింత చేరువచేసి అమ్మకాలు పెంచాలనే ఉద్దేశంతో గతేడాది నవంబర్లో డిస్ట్రిబ్యూటర్కు అప్పగించారు. నిబంధనల ప్రకారం వరంగల్ యూనిట్ పరిధిలో రోజుకు 10 వేల లీటర్ల పాల అమ్మకాలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్కు డెయిరీ అనుమతులు ఇచ్చింది. అయితే రెండు రోజుల అమ్మకాల మొత్తాన్ని ముందే చెల్లించేలా (కాషన్ డిపాజిట్) రూ.15 లక్షలు చెల్లించాలని షరతులు విధించింది. కాగా, రూ. 15 లక్షలు డిపాజిట్ చేసిన సదరు డిస్ట్రిబ్యూటర్.. నిబంధనల ప్రకారం ఏ రోజు అమ్మకాలకు సంబంధించిన మొత్తం (డబ్బు) చెల్లించాల్సి ఉన్నప్పటికీ తన ఇష్టానుసారంగా చెల్లిస్తూ ప్రస్తుతం డెయిరీ రూ.40 లక్షలు బకాయి ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. డిస్ట్రిబ్యూటర్కు అనధికారికంగా సాయం.. డెయిరీకి ఏ రోజు డబ్బులు అదే రోజు చెల్లించాల్సి ఉండగా రోజుల తరబడి బకాయిలు పేరుకుపోతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. రోజు చెల్లిస్తున్నట్లు డిస్ట్రిబ్యూటర్కు అనధికారికంగా డెయిరీ అధికారుల్లో కొందరు సాయం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పొంతన లేని లెక్కలు చూపెడుతూ ఉన్నతస్థాయి అధికారులను సైతం పక్కదోవపట్టిస్తున్నారనే ఆరోపణలు డెయిరీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. లాభాలు గడిస్తున్నా బకాయిలు చెల్లించడం లేదు.. ఒక్కో లీటర్ పై డిస్ట్రిబ్యూటర్కు రూ. 8 చెల్లిస్తున్నామని డెయిరీ అధికారులు చెబుతున్నప్పటికీ అధికారికంగా రూ.10.50 పైసలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. రోజుకు 10వేల లీటర్ల పాలు విక్రయిస్తున్న డిస్ట్రిబ్యూటర్ లాభాలను గడిస్తున్నప్పటికీ డెయిరీకి చెల్లించాల్సిన లక్షలాది రూపాయలు పెండింగ్లో పెడుతూ సంస్థకు నష్టాలు చవిచూపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు చోద్యం చూస్తుండడం పై పాడి రైతులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ పాల అమ్మకాలపై పూర్తిస్థాయి విజిలెన్స్ విచారణ జరిపిస్తే మరిన్ని అక్రమాలు, అవినీతి బయటపడుతుందని పాడిరైతులు పేర్కొంటున్నారు. -
మద్యం తాగడానికి డబ్బు ఇవ్వలేదని..
● క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు దేవరుప్పుల : మద్యం తాగడానికి డబ్బు అడగగా భార్య నిరాకరించడంతో క్షణికావేశానికి గురైన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన దేవరుప్పుల మండలం సీతారాంపురంలో చోటుచేసుకుంది. ఎస్సై ఊర సృజన్కుమార్ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన బత్తుల గోపి (27) కుటుంబంతో జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సీతారాంపురం గ్రామానికి వలస వచ్చా డు. ఇక్కడ సమీప బంధువైన బత్తుల రామకృష్ణకు చెందిన ఇటుక బట్టీలో నాలుగు నెలల నుంచి పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం సాయంత్రం మద్యం కోసం రూ.200 కావాలని భార్యను అడగగా నిరాకరించింది. దీంతో ఆమెతో గొడవపడ్డారు. క్షణికావేశంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. ఈ విషయమై మృతుడి తల్లి వెంకమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
మహంకాళి దేవాలయ భూమిపై వివాదం
హసన్పర్తి: హసన్పర్తి మండల కేంద్రంలోని మహంకాళి దేవాలయ భూమిపై వివాదం నెలకొంది. కబ్జాకు గురైన ఆలయ భూమిని స్వాధీనం చేసుకుని హద్దులు నిర్ధారించాలని స్థానికులు సోమవారం గ్రీవెన్స్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, తమ భూమిలో నిర్మాణాలు చేపట్టడానికి యత్నిస్తుండగా కొంతమంది అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వల్లాల జగన్ అనే వ్యక్తి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై దేవేందర్ తెలిపారు. ఫిర్యాదుపై విచారణ జరుపుతామన్నారు. వివరాలు ఉన్నాయి. మండల కేంద్రంలో పురాతన మహంకాళి ఆలయం ఉంది. గతంలో ఈ ఆలయంలో అమ్మవారికి దీపదూప నైవేద్యాలు సమర్పించేవారు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ఆలయం పూజలకు నోచుకోలేదు. ఇదే అవకాశంగా భావించిన ఆలయం పక్క ఉన్న జగన్ సోదరులు ఇక్కడ కట్టెల మండీ ఏర్పాటు చేసినట్లు స్థానికులు చెప్పారు. ఇది కొన్నాళ్లు కొనసాగుతూ వచ్చింది. అయితే ఆరేళ్ల క్రితం స్థానిక పద్మశాలి సేవా సంఘం మహంకాళి ఆలయం ఉన్నట్లు వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో జగన్కు స్థానికుల మధ్య వివాదం నెలకొంది. ఈ విషయంలో అప్పుడు కార్పొరేటర్గా పనిచేసిన నాగమళ్ల ఝాన్సీ భర్త నాగమళ్ల సురేశ్ ఇరువురితో మాట్లాడి సమస్యను సద్దుమణిగించారు. అయితే వారం రోజులుగా మళ్లీ వివాదం తెరపైకి వచ్చింది. ఇటీవల స్థానిక కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు పిట్టల కుమారస్వామి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు పావుశెట్టి శ్రీధర్ పంచాయితీ చేశారు. అది కొలిక్కి రాలేదు. చివరికి పంచాయితీ వాయిదా పడింది. కాగా, సోమవారం స్థానికులు కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేయగా, జగన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కబ్జా చేశారని స్థానికులు కలెక్టర్కు.. చేయలేదని మరోవర్గం పీఎస్లో ఫిర్యాదు -
మెరుగైన విద్యుత్ సరఫరాకు కొత్త ట్రాన్స్ఫార్మర్లు
నెహ్రూసెంటర్: సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు పట్టణంలో నాలుగు కొత్త ట్రాన్స్ఫార్మ ర్లు ఏర్పాటు చేశామని డీఈ పి.విజయ్ అన్నారు. ‘సాక్షి’ దినపత్రికలో సోమవారం ‘వెక్కిరిస్తున్న ఖాళీలు’ ‘నిరుపయోగంగా ఉన్న సబ్ స్టేషన్లు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన విద్యుత్శాఖ అధికారులు జిల్లా కేంద్రంలోని నందినగర్, రాహుల్గనర్, సుందరయ్యనగర్, గుండ్లకుంటలో ఏర్పా టు చేసిన ట్రాన్స్ఫార్మర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ... వేసవికాలం దృష్ట్యా అధిక లోడ్, లో ఓల్టేజ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి ముందస్తుగానే కొత్త ట్రాన్స్ఫార్మర్లన్లు ఏ ర్పాటు చేశామన్నారు. విద్యుత్ వినియోగం, పొదు పు, విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కాలనీ ప్రజలకు అవగాహ న కల్పించారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కో సం టోల్ ఫ్రీ నంబర్ 1912లో సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఏడీఈ సీహెచ్.ప్రశాంత్, ఏఈ సంగీత, సబ్ఇంజనీర్ రామకృష్ణ, విద్యుత్ సిబ్బంది రాంబాబు, స్వామి, శ్రీనివాస్, ప్రజలు పాల్గొన్నారు. -
ఎంజీఎంలో ‘టూడీ’కి స్వస్తి..
ఎంజీఎం : ఎంజీఎం.. ఉత్తర తెలంగాణకు గుండె. పేదలకు పెద్ది దిక్కు. ఇంతటి ఘన కీర్తి కలిగిన ఈ ఆస్పత్రిలో రోజురోజూకూ సేవలు క్షీణించిపోతున్నాయి. నాలుగు ఉమ్మడి జిల్లాలు, కొత్తగా ఏర్పడిన పది జిల్లాలకు చెందిన రోగులు ఆపత్కాళంలో ఎంజీఎంకు వస్తారు. ఇలాంటి ఆస్పత్రిపై దృషి సారించాల్సిన రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఆస్పత్రి పాలనపై దృష్టి సారించకపోవడంతో వామ్మో ఎంజీఎం ఆస్పత్రా అనే విధంగా తయారైంది పరిస్థితి. ఆస్పత్రి విభాగాధిపతులు వారాని రెండు రోజులు విధులకు హాజరువుతున్నారు. వచ్చినా రోజు రెండు, మూడు గంటల పాటు మాత్రమే విధులు నిర్వర్తించడంతో ఒక్కొక్క విభాగం మూత పడుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆస్పత్రిలో అత్యంత కీలకమైన కార్డియాలజీ విభాగం సేవలు పూర్తి అధ్వానంగా తయారయ్యాయి. ఈసీజీ పరికరాల్లో సాంకేతిక లోపాలు, ఏకంగా 24 గంటల పాటు అత్యవసర సేవలు అందించాల్సిన టూడీ ఎకో పరీక్షల పరికరాలను కేఎంసీ తరలించారు. నామామాత్రపు విధులు నిర్వర్తిస్తూ ఎంజీఎంలో టూడీ ఎకో సేవలు బంద్ చేశారు. నిత్యం అందించాల్సిన టూడీ ఎకో సేవలకు స్వస్తి పలికి రెండు, మూడు రోజులకోమారు ఓ ప్రత్యేక అంబులెన్స్లో 20 మంది, 30 మందిని తరలిస్తూ నామామాత్రపు సేవలందిస్తూ పేద రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. శస్త్రచికిత్సల్లో టూడీ ఎకో సేవలు కీలకం.. ఎంజీఎంలో అన్ని విభాగాల్లో నిర్వహించే శస్త్రచికిత్సల్లో ఈసీజీ, టూడీ ఎకో నివేదికలు కీలకం. ఆస్పత్రిలో రోజూ 10 నుంచి 20 శస్త్రచికిత్సలను నిర్వహిస్తుంటారు. ఇలాంటి సేవలను నిలిపివేసి కేఎంసీలోని సూపర్ ఆస్పత్రికి పరిమితి చేసి విధులకు ఏగనామం పెట్టి ప్రైవేట్ కేంద్రాలతో కుమ్మక్క అయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి విభాగాలను పర్యవేక్షించే విభాగాధిపతులు విధులకు ఏగనామం పెడుతున్నారు. వారానికి రెండు రోజులు విధులు నిర్వర్తించడం వల్ల ఇలాంటి సమస్యలు తలెతుత్తున్నాయి.ఆస్పత్రిలో ఎకో సేవలు నిలిపివేత.. కేఎంసీకి తరలింపు వారానికి రెండు రోజులు మాత్రమే పరీక్షలు ఇక్కడ కూడా మధ్యాహ్నం తరువాత సేవలు నిలిపివేత చేసేదేమిలేక ప్రైవేట్కు తరలుతున్న పేద రోగులు ప్రైవేట్ కేంద్రాలతో కుమ్మక్కు.. ఎంజీఎంలో టూడీ ఏకో సేవలు కీలకం. ఈసీజీలో ఏమైనా తేడాలు వస్తే వెంటనే టూడీ ఏకో పరీక్షలకు రెఫర్ చేస్తారు. ఈ సమయంలో ఆస్పత్రిలో టూడీ ఏకో సేవలు లేకపోవడంతో కేఎంసీలోని సూపర్ ఆస్పత్రిలో చేయించుకోవాలని రెఫర్ చేస్తారు. కేఎంసీలో మధ్యాహ్నం 12 గంటలు దాటితే సేవలు నిలిపివేస్తారు. ఈ క్రమంలో ఎంజీఎంలో టూడీ ఏకో సేవలను నిలిపివేయడంతో పేద రోగులు, ఖైదీలను రిమాండ్ పంపించే విషయంలోనూ పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో అత్యవసర రోగులు.. పోలీసు సిబ్బంది సైతం ప్రైవేట్ కేంద్రాలకు వెళ్లి టూడీ ఎకో పరీక్షలు చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది.సమస్య పరిష్కారానికి కృషి టూడీ ఎకో సేవలు అవసరం ఉన్న వారిని కేఎంసీలోని సూపర్ ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నాం. వివిధ విభాగాల్లో ఫోర్టబెలిటీ పరికరంతో సేవలందిస్తున్నాం. రోగులకు ఇబ్బంది కలగకుండా ఎంజీఎంలోనే టూడీ ఏకో సేవలపై ఆయా విభాగాధిపతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. – కిశోర్, సూపరింటెండెంట్, ఎంజీఎం -
బాధితులకు అండగా పోలీసులు
మహబూబాబాద్ రూరల్: మహిళలపై జరిగే నేరాలను పూర్తిగా అరికట్టేందుకు షీ టీమ్స్, మహిళా పోలీస్స్టేషన్ కీలకపాత్ర పోషిస్తున్నాయని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. షీ టీమ్స్ కార్యాలయం, మహిళా పోలీస్ స్టేషన్ను సోమవారం సందర్శించి, మహిళా భద్రత, హక్కుల పరిరక్షణ, కేసుల ప్రగతి మొదలైన అంశాలపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు. కాలేజీలు, కార్యాలయాలు, బస్టాండ్లు, పబ్లిక్ ప్రాంతాల్లో మహిళల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలు, వేధింపుల ఆపరేషన్ల గురించి ఆర్ఎస్సై సు నందను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళల భద్రతకు సంబంధించి హెల్ప్ లైన్ నంబర్లను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. నేర నివేదికలు, పెండింగ్ కేసులు, బాధితులకు అందిస్తున్న సహాయం, కౌన్సెలింగ్ సేవలు, స్టేషన్లో మహిళా సిబ్బంది సంఖ్య గురించి తెలుసుకున్నా రు. బాధిత మహిళలతో మాట్లాడి వారికి పోలీసు శాఖ నుంచి అందించాల్సిన సహాయంపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. పోక్సో, గృహహింస, వేధింపుల కేసుల్లో బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు వేగంగా చర్యలు తీసుకోవాల న్నారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ చంద్రమౌళి, రూరల్ సీఐ సరవయ్య, ఎస్సై దీపిక, ఆర్ఎస్సై సునంద, ఎస్సై ఆనందం, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
నేడు వీరభద్రస్వామి హుండీ లెక్కింపు
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి హుండీలను నేడు(మంగళవారం) లెక్కిస్తామని ఆలయ ఈఓ సత్యనారాయణ సోమవారం తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 26నుంచి ఈనెల 24వ తేదీ వరకు భక్తులు సమర్పించుకున్న కానుకలను లెక్కిస్తామన్నారు. ఆలయ అధికారులు సకాలంలో హాజరుకావాలని సూచించారు. ‘పది’ పరీక్ష కేంద్రం పరిశీలనబయ్యారం: మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని డీఈఓ రవీందర్రెడ్డి సోమవారం పరిశీలించారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దని, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. డీఈఓ వెంట గార్ల–బయ్యారం సీఐ రవికుమార్, ఎస్సై తిరుపతి, ఎంఈఓ దేవేంద్రాచారి తదితరులు ఉన్నారు. ఉపాధి పనులు పారదర్శకంగా చేపట్టాలి● డీఆర్డీఓ మధుసూదన్రాజు తొర్రూరు: ఉపాధి హామీ పనులను పారదర్శకంగా చేపట్టాలని, అవకతవకలకు చోటు ఇవ్వవద్దని డీఆర్డీఓ మధుసూదన్రాజు పేర్కొన్నారు. సోమవారం డివిజన్ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధిహామీ పనులపై ప్రజా వేదిక కార్యక్రమం చేపట్టారు. ఎంపీడీఓ పూర్ణచందర్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజా వేదికలో 2023–24లో మండలంలోని ఆయా గ్రామాల్లో చేపట్టిన ఉపాధిహామీ పనులపై సమీక్ష నిర్వహించారు. ఉపాధి పనుల్లో అవకతవకలు గుర్తించిన అధికారులు రూ.1.62 లక్షల రికవరీకి ఆదేశించారు. 29 గ్రామాలకు సంబంధించిన ఈజీఎస్ సిబ్బంది ఉపాధిహామీ పనులకు సంబంధించిన నివేదికలను చదివి వినిపించారు. పలు గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు జాబ్కార్డులు, నో డిమాండ్, రికార్డుల నిర్వహణ సక్రమంగా చేయకపోవడం, మస్టర్ల వద్ద సంతకాలు తీసుకోకపోవడం వంటివి బహిర్గతమయ్యాయి. డీఆర్డీఓ మాట్లాడుతూ.. ఉపాధిహామీ పనుల్లో అవకతవకలు జరిగితే ఉపేక్షించబోమన్నారు. జాబ్ కార్డు కలిగిన పేదలకు ఉపాధి పని చూపించాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి సిబ్బందిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఏపీఓలు మధు,పార్థసారథి, అంబుడ్స్మెన్ ఆడమ్, సిబ్బంది పుష్పలత, సురేంద్ర, చెన్నకేశవులు, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోu● ‘పక్కఫొటోలో ఉన్న దంపతులు మరిపెడ మండలం బావోజీగూడెం గ్రామానికి చెందిన దిగజర్ల అంతయ్య–సుమతి. ఉద్యానశాఖ అధికారుల సూచన మేరకు గ్రామంలో తమకు ఉన్న చెలకలో డ్రాగన్ ఫ్రూట్ తోట సాగు చేశారు. ఇందుకోసం రూ. 3.75లక్షల ప్రోత్సాహాన్ని ఉపాధి హామీ జాబ్ కార్డు ద్వారా చెల్లిస్తారు. కాగా అధికారులు చెప్పిన విధంగా ఆ దంపతులు చేనులోనే పనిచేశారు. మస్టర్ వేయమని ఫీల్డ్ అసిస్టెంట్ వద్దకు వెళ్లారు. పని మొత్తం పూర్తయిన తర్వాత వేస్తామని చెప్పారు. ఈక్రమంలో ఏపీఓ, ఎంపీడీఓ వద్దకు వెళ్లినా మస్టర్ వేయలేదు. ఈమేరకు ఈనెల 3వ తేదీన, 10న, 12న, 17న గ్రీవెన్స్, ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ తిరిగినా లాభం లేకపోయింది. పనిచేసి పైసలు అడిగితే పట్టించుకునే వారు కరువయ్యారని వారు వాపోయారు.’ -
వినతులు వెంటనే పరిష్కరించాలి
● కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ ● ప్రజావాణిలో 84 వినతులు మహబూబాబాద్: ప్రజావాణి దరఖాస్తుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారి వినతులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్ వినతులను కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం అనే విషయాన్ని గమనించాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు వసతి గృహాలను తనిఖీ చేయాలన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతీఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. కాగా ప్రజావాణిలో 84 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అనంతరం కలెక్టరేట్లో స్వయం సహాయక సంఘాల సభ్యులచే ఏర్పాటు చేసిన స్టాల్స్ను కలెక్టర్, అదనపు కలెక్టర్లు సందర్శించారు. జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీసీఓ వెంకటేశ్వర్లు, డీపీఓ హరిప్రసాద్, ఆర్అండ్బీ ఈఈ బీమ్లానాయక్, డీవీహెచ్ఓ డాక్టర్ కిరణ్కుమార్, డీడబ్ల్యూఓ ధనమ్మ, సివిల్ సప్లయీస్ మేనేజర్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. పింఛన్ మంజూరు చేయాలి నా కుమారుడు 8 సంవత్సరాలుగా మంచానికే పరిమితమయ్యాడు. చిన్నతనంలోనే మెదడుకు సంబంధించిన వ్యాధితో కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. మానసికంగా కూడా దివ్యాంగుడే, సదరం క్యాంపులో సర్టిఫికెట్ తీసుకుని దరఖాస్తు చేసినప్పటికీ.. నేటికీ దివ్యాంగ పింఛన్ రావడం లేదు. వెంటనే మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశా. – పూజ, దివ్యాంగుడు కీర్తన్జాయి తల్లి, ఎడ్జర్ల, మరిపెడ మండలం -
బైక్ను ఢీకొన్న టిప్పర్..
హసన్పర్తి : టిప్పర్.. బైక్ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందా రు. ఈఘటన హనుమకొండ–కరీంనగర్ ప్రధాన రహదారిలోని హసన్పర్తి పెద్దచెరువు సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకా రం.. హసన్పర్తి మండలం సీతంపేటకు చెందిన బౌతు మ హేశ్(22), దుర్గం పవన్ కల్యాణ్(22) స్నేహితులు. వీరిద్ద రు డెకర్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆదివారం ఇద్దరు బైక్పై వ్యక్తిగత పనినిమిత్తం హసన్పర్తికి వచ్చి తిరు గు ప్రయాణంలో సీతంపేటకు బయల్దేరారు. మార్గమధ్యలో ని హసన్పర్తి పెద్ద చెరువు మలుపు వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న మొరం టిప్పర్.. బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో మహేశ్, పవన్ కల్యాణ్కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీస్ ఇన్స్పెక్టర్ చేరాలు, ఎౖస్సై రవి ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం తరలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ చేరాలు తెలి పారు. కాగా, జాతీయ రహదారి నిర్మాణం సందర్భంగా మొరం తీసుకొచ్చే టిప్పర్ ఢీకొని రెండు రోజుల క్రితం ఇద్దరు గాయపడినట్లు స్థానికులు చెబుతున్నారు. మిన్నంటిన రోదనలు.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారనే సమాచారం అందుకున్న కుటుంబీకులు, బంధువులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాల మీద పడి గుండెలవిసేలా రోదించారు. కుందారం వద్ద బైక్ను ఢీకొన్న డీసీఎం.. ● యువకుడి దుర్మరణంలింగాలఘణపురం: డీసీఎం.. బైక్ను ఢీకొ న్న ప్రమాదంలో ఓ యువకుడు దుర్మర ణం చెందాడు. ఈ ఘటన మండలంలోని జనగామ– సూర్యాపేట రోడ్డుపై కుందా రం క్రాస్ వద్ద జరిగింది. ఎస్సై శ్రావణ్కుమార్ కథనం ప్రకారం.. కుందారం గ్రామానికి చెందిన దీగో జు మధు(26) రోజు వారీగా పనికోసం ద్విచక్రవాహనంపై జనగామకు వెళ్తుంటాడు. ఆదివారం కూడా వెళ్తుండగా కుందారం క్రాస్ వద్ద సూర్యాపేట నుంచి జనగామ వైపు వెళ్తున్న డీసీఎం.. కారును తప్పించబోయి ద్విచక్రవాహనంపై వెళ్తున్న మధును ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య, తల్లి, సోదరుడు ఉన్నారు. రోజు పని చేసి కుటుంబాన్ని పోషించుకొనే మధు మృతి చెందడంతో కుటుంబం దిక్కులేనిదయ్యింది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.● ఇద్దరు యువకుల దుర్మరణం ● హసన్పర్తి పెద్దచెరువు సమీపంలో ఘటన -
ప్రమాదంలో భారత రాజ్యాంగం
● ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ బెల్లయ్య నాయక్హన్మకొండ: భారత రాజ్యాంగం ప్రమాదంలో ప డిందని ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్, తెలంగాణ ఎస్టీ సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ బెల్లయ్య నాయక్ అన్నారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ.. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తోందని విమర్శించారు. ‘రాజ్యాంగాన్ని కాపాడడం ఎలా’ అనే అంశంపై ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివాసీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు ఏప్రిల్ 13, 14, 15 తేదీల్లో శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు వివరించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీలను అణిచివేస్తోందన్నారు.ఆదివాసీలకు బీజేపీ చేస్తున్న అన్యాయాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో చేసిన కులగణన కేవలం బీసీ కులగణన మాత్రమే కాదని, అన్ని కులాల శాతాన్ని నిర్ధారించామన్నారు. కులగణను బీజేపీ తప్పు పట్టడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. బీజేపీ విధానాలు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయన్నారు. ఆదివాసీలను మేల్కోపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో హనుమకొండలో వచ్చే నెలలో నిర్వహిస్తున్నామని, గిరిజన నాయకులు, కార్యకర్తలు ఈ శిక్షణకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆదివాసీ కాంగ్రెస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గుగులోత్ రవీందర్ నాయక్, ఇన్చార్జ్ చంద్రకళ, నాయకులు రమేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం ● రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం కాటారం: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభింవించి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున కాటారం మండలం దేవరాంపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బాధితురాలు జిముడ దుర్గమ్మ గ్రామంలో తెలిసిన వారి ఇంట్లో నిద్రిస్తోంది. ఈ క్రమంలో ఆమె ఇంట్లో విద్యుత్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు భారీగా చెలరేగాయి. గమనించిన చుట్టు పక్కల వారు దుర్గమ్మకు సమాచారం అందించి మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రావడంతో మంథని ఫైర్స్టేషన్కు సమాచారం చేరవేయగా ఇంజన్, సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. కానీ ఆలోపే ఇల్లు మొత్తం కాలిపోవడంతోపాటు సామగ్రి, నిత్యావసర సరుకులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో రూ. 1.50 లక్షల నగదు, రెండు తులాల బంగారం, 20 తులాల వెండి, పత్తి బస్తాలు, బియ్యం, నిత్యావసర సరుకులు కాలిబూడిదైనట్లు బాధితురాలు దుర్గమ్మ కన్నీరుమున్నీరైంది. సుమారు రూ.10 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్లు పేర్కొంది. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని దుర్గమ్మ వేడుకుంది. యువతితో మాట్లాడినందుకు.. ● యువకుడిపై కొందరి దాడి ● హనుమకొండ పీఎస్లో కేసు నమోదు వరంగల్ క్రైం: ఓ యువతితో మాట్లాడినందుకు కొంతమంది యువకులు.. ఓ యువకుడిని కిడ్నాప్ చేసి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హనుమకొండ ఇన్స్పెక్టర్ సతీశ్ కథనం ప్రకారం.. న్యూశాయంపేటకు చెందిన కోడెం సాయిచరణ్గౌడ్ ఈనెల 22న సాయంత్రం హనుమకొండ చౌరస్తాలో ఓ యువతితో ఉద్యోగ విషయంలో మాట్లాడుతున్నాడు. కొంత మంది యువకులు ఆ యువతితో ఎందుకు మాట్లాడుతున్నావని కిడ్నాప్ చేసి దాడికి పాల్ప డ్డారు. ఈ ఘటనపై యువకుడి ఫిర్యాదు మేరకు ఎండీ అజిమ్, అఫ్సర్ షేక్, ఎండీ ఇర్షద్, ముజ్జు, మహ్మద్, షాబాజ్, ఫయాజ్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
బీఆర్ఎస్ నేతల నిరసన సిగ్గుచేటు
స్టేషన్ఘన్పూర్: పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు దేవాదుల ప్రాజెక్టును పట్టించుకోలేద ని, ప్రస్తుతం దేవాదుల పంప్హౌస్ వద్ద నిరసన చే యడం సిగ్గుచేటని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడి యం శ్రీహరి అన్నారు. ఆదివారం డివిజన్ కేంద్రంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క ల్యాణలక్ష్మి, సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కా ర్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. ఏడాదిలోగా దేవాదుల పెండింగ్ పనులు పూర్తి చేసి నియోజకవర్గంలోని ప్రతీగ్రామంలో ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తామని ఽధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూడేళ్లలో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగి పనికిరాకుండాపోయిందని, అదే దేవాదుల ప్రాజెక్టుకు రూ.5వేల కోట్లు కేటాయిస్తే పనులు పూర్తయ్యేవన్నారు. దేవాదుల కాల్వలు పూడిక, చెట్లు పెరిగి అధ్వాన స్థితిలో ఉన్నా ఏ నాడు బీఆర్ఎస్ నేతలు పట్టించుకోలేదని విమర్శించారు. పదిహేనేళ్లు ఎమ్మెల్యేగా ఉండి ఏనాడు దేవాదుల కాల్వల వెంట తిరగని వ్యక్తి, కాల్వల్లో మట్టితీయని వ్యక్తి ప్రస్తుతం దేవాదుల గురించి మాట్లాడేందుకు సిగ్గు ఉండాలన్నారు. దేవాదులను పూర్తి చేసి చివరి ఆయుకట్టు వరకు సాగునీరు అందించే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఆర్డీఓ డీఎస్ వెంకన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శిరీశ్రెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ విజయశ్రీ, ఆర్ఐ శ్రీకాంత్, సతీశ్, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
మతంపేరుతో సాగుతున్న దౌర్జన్యాలను ఎండగట్టాలి
హన్మకొండ అర్బన్: మనువాద ముసుగులో మతంపేరుతో సాగుతున్న దౌర్జన్యాలను ఎండగట్టాలి.. మనువాదాన్ని ఓడించడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు అగ్రవర్ణాల్లోని ప్రగతిశీల భావాలున్నవారిని కలుపుకుపోవాలని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పిలు పునిచ్చారు. హనుమకొండలోని కాళోజీ కళాక్షత్రంలో ఆదివారం నిర్వహించిన ఎస్ఎఫ్ఐ ఉమ్మడి వరంగల్ జిల్లా పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, అతిథులుగా ప్రొఫెసర్ నాగేశ్వర్, గాయకుడు సుద్దాల అశోక్తేజ పాల్గొని ప్రసంగించారు. గోరటి వెంకన్న మా ట్లాడుతూ.. ప్రపంచంలో ఏ మతంలోనూ మనుషు ల మధ్య అసమానతలు లేవని.. కేవలం మనువా దంలోనే అసమానతలు ఉన్నాయన్నారు. సాధారణ జీవితం గడపడాన్ని ఎస్ఎఫ్ఐ నేర్పిస్తుందని చెప్పా రు. ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం డీమిలిటేషన్ పేరుతో సమాఖ్య స్ఫూర్తిపై దాడిచేస్తోందన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అన్న స్ఫూర్తి ని చాటినచోట ఒకే జాతి, ఒకే మతం, ఒకే ఎన్నికలు అంటూ కొత్త విధానాలు ప్రవేశపెడుతున్నారని దుయ్యబట్టారు. సుద్దాల అశోక్తేజ మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమాలు, ఎర్ర జెండా ద్వారా స్ఫూర్తి పొంది తాను పాటలు రాయడం నేర్పుకున్నానని పేర్కొంటూ ఎస్ఎఫ్ఐతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ పరిధి జిల్లాల నుంచి ఎస్ఎఫ్ఐ నేతలు తరలివచ్చారు. కళాక్షేత్రం ఆవరణలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ మహ్మద్ రియాజ్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎస్.వీరయ్య, కేయూ మాజీ వీసీ టి.రమేశ్, ప్రముఖ రచయిత పసునూరి రవీందర్, నాయకులు జి.రాములు, ఎ.నర్సింహారెడ్డి, సీనియ ర్ జర్నలిస్ట్ కోల వెంకటేశ్వర్లు, శేషగిరిరావు, రమేశ్, పర్వతాలు, టి.ఉప్పలయ్య పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ సమ్మేళనంలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పాల్గొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్, సుద్దాల అశోక్తేజ -
ఆడుకుంటూ వెళ్లి అనంతలోకాలకు..
సంగెం: ఓ చిన్నారి ఆడుకుంటూ వెళ్లి అనంతలోకాలకు చేరింది. నీటి తొట్టిలో పడి మృతి చెందింది. ఈ ఘటన సంగెం మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాలోని బులియాభన్ గ్రామానికి చెందిన రాజు మహాకూర్, రాణి దంపతులు బతుకుదెరువు నిమిత్తం మూడు నెలల క్రితం సంగెం మండలం ఆశాలపల్లికి వలస వచ్చారు. గ్రామ శివారులో బుజ్జయ్య చౌదరి ఇటుకబట్టీలో పనిచేస్తున్నారు. రాజుకు బబితా మహాకూర్ అనే ఏదాదిన్నర ఏకై క కూతురు ఉంది. ఈక్రమంలో తల్లి దండ్రులు శనివారం సాయంత్రం ఇటుక బట్టీలో పనిచేస్తుండగా వారి పక్కనే చిన్నారి బబితా ఆడుకుంటోంది. ఆడుకుంటూ అక్కడే ఉన్న నీటి తొట్టిలో పడింది. బబితను మరో కూలీ రశ్మీత పటేల్ చూసి కేకలువేయడంతో హుటాహుటిన బయటకు తీసి వెంటనే ఎంజీఎం తరలించి చికిత్స చేయిస్తుండగా అదే రోజు రాత్రి మృతి చెందింది. బతుకుదెరువు కోసం వస్తే ఏకై క కూతురు నీటితొట్టికి బలైందని ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటారు. ఈ ఘటనపై రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ ఆదివారం తెలిపారు.నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి ● ఆశాలపల్లిలో ఘటన ● మిన్నంటిన వలస కూలీ దంపతుల రోదనలు -
వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య
మరిపెడ రూరల్: అప్పుల బాధతో ఓ వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన శనివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తయాయగూడెంలో చోటు చేసుకుంది. ఎస్సై సతీశ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వల్లందాసు సోమయ్య (50) గతంలో తన ఇద్దరు కుమార్తెల వివాహాలు జరిపించాడు. ఈ క్రమంలో సుమారు రూ.3 లక్షల వరకు అప్పుచేశాడు. అప్పు తీర్చే మార్గం కనబడలేదు. దీంతో మనస్తాపానికి గురై శనివారం వ్యవసాయ క్షేత్రం వద్ద గడ్డి మందు తాగాడ. అపస్మారక స్థితిలో పడి ఉన్న సోమయ్యను కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మాణిక్యాపురంలో యువకుడు.. లింగాలఘణపురం: మండలంలోని మాణిక్యాపురం గ్రామానికి చెందిన చిన్నం మహేశ్ (24) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్రావణ్కుమార్ తెలిపారు. మేసీ్త్ర పనితోపాటు వ్యవసాయం చేస్తున్న మహేశ్.. ఆదివారం వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే మహేశ్ ఆత్మహత్యకు కారణాలు తెలియలేదని ఎస్సై తెలిపారు. పిల్లలు లేరనే మనస్తాపంతో లక్ష్మీపూర్తండా గ్రామంలో వ్యక్తి..చిట్యాల: అనార్యోగంతో పాటు పిల్లలు లేరనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన మండలంలోని లక్ష్మీపూర్తండా గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన భుక్యా నరసింహ(55), విమల దంపతులకు 30 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి వారికి పిల్లలు జన్మించలేదు. అలాగే, నరసింహ నాలుగు సంవత్సరాల నుంచి టీబీతో బాధపడుతున్నాడు. రెండు రోజులు నుంచి ఆరోగ్యం బాగా లేదని, తాను బతికి ఎవరికి ఉపయోగం, తనకు పిల్లలు లేకపాయే అని శనివారం తన భార్యతో చెప్పి బాధపడ్డాడు. ఈ క్రమంలో ఆదివారం ఆస్పత్రికి వెళ్దామని భార్య విమల చెప్పిగా ఇద్దరు రాత్రి నిద్రించారు. తెల్లవారుజామున విమల బయటకు వచ్చి చూడగా నరసింహ ఇంటి ఎదుట ఉన్న చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి కనిపించాడు. ఈ ఘటనపై మృతుడి భార్య విమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై శ్రావన్కుమార్ పేర్కొన్నారు. వేర్వేరు కారణాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు ఆత్మహత్యలకు పాల్పడారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. -
లోనికి పంపిస్తారా.. రోడ్డుపై బైఠాయించాలా?
హసన్పర్తి: పంప్హౌస్ను సందర్శించి వస్తాం.. లోనికి పంపిస్తారా.. లేదంటే ఇక్కడే బైఠాయించా లా అని మాజీ మంత్రి దయాకర్రావు అన్నారు. దేవన్నపేటలో నిర్మించిన దేవాదుల ప్రాజెక్టు మూడో దశ పంప్ హౌస్ను బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఆదివారం సందర్శించడానికి వెళ్లింది. ముందు జాగ్రత్తగా కాజీపేట ఏసీపీ తిరుమల్ ఆధ్వర్యాన భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పంప్హౌస్ వద్దకు చేరుకోవడానికి ముందే బీఆర్ఎస్ ప్రతినిధి బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. లోనికి పంపిస్తారా.. రోడ్డుపై బైఠాయించాలా? అని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించడంతో.. వారిని రెండు విడతలుగా వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. మొదటి విడతలో మాజీ మంత్రి దయాకర్రావు, మాజీ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డితో పాటు మరికొంత మంది కి, రెండో విడతలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటి కొండరాజయ్యను అనుమతించారు. అనంతరం పల్లా, ఎర్రబెల్లి మా ట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలోనే దేవాదుల ప్రాజెక్టు పనులు 90శాతం పూర్తయ్యాయని, కాంగ్రెస్ సర్కార్ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయన్నారు. దీంతో వేలాది ఎకరాల పొలాలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండి రజనీకుమార్, మాజీ సర్పంచ్లు చుంచు రవి, కొండపాక రఘు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు, ఏనుగుల రాజేష్రెడ్డితో పాటు దివ్యారాణి, రాజునాయక్, యాదగిరి, చింతం సదా నందం తదితరులు పాల్గొన్నారు. పోలీసులతో ‘ఎర్రబెల్లి’ వాగ్వాదం దేవాదుల పంప్హౌస్ను సందర్శించిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందం -
కంఠాయపాలెంలో విషాదచాయలు
తొర్రూరు రూరల్: సూర్యాపేట జిల్లాలోని బీబీగూడెం గ్రామ శివారులో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొర్రూరు మండలంలోని కంఠాయపాలెం గ్రామానికి చెందిన భార్య, భర్తలతోపాటు కూతురు మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. వివరాల ప్రకారం.. కంఠాయపాలెం గ్రామానికి చెందిన గడ్డం రవీందర్ హైదరాబాద్ కారు డ్రైవర్గా పని చేస్తూ భార్య, కూతురు, కుమారుడిని పోషించుకుంటున్నాడు. ఈక్రమంలో తన అత్తగారి స్వగ్రామమైన ఆత్మకూరు మండలంలోని కోటపహాడ్ గ్రామంలో జరిగిన ఓ పండుగకు హాజరై కుటుంబ సభ్యులతో తిరిగి హైదారాబాద్కు కారులో వెళ్తుండగా.. మార్గమధ్యలో బీబీగూడెం శివారులో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈప్రమాదంలో కారు డ్రైవర్గా ఉన్న గడ్డం రవీందర్(34), భార్య గడ్డం రేణుక( 28), కుమారై రిషిత(8)కు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే మరికొంతమందికి తీవ్రగాయాలైనట్లు తెలిసింది. సమాచారం తెలిసిన కంఠాయపాలెం గ్రామంలోని మృతుడు రవీందర్ తల్లి గడ్డం లక్ష్మితోపాటు బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం భార్యా, భర్త, కూతురు మృతి స్వగ్రామంలో మిన్నంటిన రోదనలు -
డైరెక్టర్ పోస్టులు ఖాళీ..
హన్మకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ మండలిలో (టీజీ ఎన్పీడీసీఎల్) డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. నోటిఫికేషన్ జారీ చేసి 14 నెలలు అయినా నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. ఫలితంగా ఆశావాహుల్లో నైరాశ్యం నెలకొంటోంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2024 జనవరి 29న అప్పటి వరకు ఉన్న టీజీ ఎన్పీడీసీఎల్ పాలక మండలిని తొలగించింది. కొత్త పాలక మండలి నియామకంలో భాగంగా నాలుగు డైరెక్టర్ పోస్టుల నియామకానికి 2024 జనవరి 30న నోటిఫికేషన్కు జారీ చేసింది. అప్పటికే ఐఏఎస్ అధికారి కర్నాటి వరుణ్ రెడ్డిని చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా నియమించింది. నాలుగు డైరెక్టర్ల పోస్టులకు 2024 మార్చి 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించింది. దాదాపుగా 83 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ పోస్టుల భర్తీపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు రావడం లేదు. ఫలితంగా ఆ పోస్టులు ఎప్పుడు భర్తీ అవుతాయో తెలియని అయోమయంలో ఆశావహులు కొట్టుమిట్టాడుతున్నారు. డైరెక్టర్ పోస్టుల భర్తీలో నాన్చివేత ధోరణి.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అప్పటి వరకు పని చేస్తున్న డైరెక్టర్లను తొలగించి చీఫ్ జనరల్ మేనేజర్లను ఇన్చార్జ్ డైరెక్టర్లుగా నియమించారు. వీరు సీజీఎంలుగా, డైరెక్టర్లుగా రెండు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సీజీఎంగా ఒక విభాగం, డైరెక్టర్గా మరో విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలోని టీజీ ట్రాన్స్కో, టీజీ జెన్కో, టీజీ ఎన్పీడీసీఎల్, తెలంగాణ సౌథర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పని చేస్తున్న సీజీఎంలు, రిటైర్డ్ సీఈలు, గతంలో పని చేసిన డైరెక్టర్లు.. టీజీఎన్పీడీసీఎల్ డైరెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో టీజీ ఎన్పీడీసీఎల్లో ప్రస్తుతం పని చేస్తున్న సీజీఎంలు కూడా ఉన్నారు. దరఖాస్తులు స్వీకరించి 12 నెలలవుతున్నా డైరెక్టర్ పోస్టుల భర్తీలో నాన్చివేత ధోరణి అవలంబిస్తోంది. దీంతో ఆశావహులు సుదీర్ఘకాలం వేచిచూడక తప్పని పరిస్థితి నెలకొంది. పూర్తి కాలం డైరెక్టర్ల నియామకం చేపట్టకపోయిన కంపెనీకి కార్యకలాపాలు, అభివృద్ధి పనులు యథాతథంగా నడుస్తుండడంతో డైరెక్టర్లు లేని లోటు కనిపించడం లేదు. ఆశావహులకు నిరాశ, ఎదురుచూపులే.. ప్రధాన నిర్ణయాలు తీసుకునే బోర్డులో కనీస డైరెక్టర్లు ఉండడంతో నిర్ణయాలు తీసుకోవడంలో ఎలాంటి అవాంతరాలు, అడ్డంకులు ఏర్పడడం లేదు. బోర్డు మీటింగ్లో పాల్గొనేందుకు కనీసం ముగ్గురు పూర్తి స్థాయి డైరెక్టర్లు ఉంటే సరిపోతుందని విద్యుత్రంగ నిపుణులు తెలిపారు. ఈ మేరకు బోర్డు ఆఫ్ డైరెక్టర్లుగా ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి, టీజీ ట్రాన్స్కో నుంచి జి.నర్సింగరావు, ప్రభుత్వ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటీ సెక్రటరీ కె.చంద్రకళ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.పక్కీరిసామి, రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దల్జీత్సింగ్ ఖత్రీ పూర్తి స్థాయి డైరెక్టర్లు ఉన్నారు. వీరితో పాటు ఈ బోర్డులో ఇన్చార్జ్ ఫైనాన్స్ డైరెక్టర్ వి.తిరుపతి రెడ్డి, ఇన్చార్జ్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టి.సదర్లాల్ ఉన్నారు. దీంతో నిర్టయాలు తీసుకోవడంతో పాటు పనుల చకచకా సాగుతున్నాయి. పూర్తి స్థాయి డైరెక్టర్లు లేరనే లోటు కనిపించడం లేదు. అయితే డైరెక్టర్లు కావాలనే ఆశావహులకు మాత్రమే నిరాశ, ఎదురుచూపులు తప్పడం లేదు.నోటిఫికేషన్ విడుదల చేసి 14 నెలలు.. దరఖాస్తులు స్వీకరించినా కొనసాగని ప్రక్రియ టీజీ ఎన్పీడీసీఎల్లో ఇన్చార్జ్ డైరెక్టర్లతో పనులు సర్కారు జాప్యంతో ఆశావహుల్లో నైరాశ్యంటీజీఎన్పీడీసీఎల్ స్వరూపం..కంపెనీ విస్తరించిన జిల్లాలు 17 మండలాలు 299 గ్రామాలు 5,580 హామ్లేట్ గ్రామాలు 7,474 విద్యుత్ సర్వీస్లు 68,62,858 ఉద్యోగులు 9 వేలకు పైగా.. -
గుండెపుడిలో తాగునీటి గోస
మరిపెడ రూరల్: మరిపెడ మండలం గుండెపుడి గ్రామస్తులు తాగునీటి కోసం గోస పడుతున్నారు. గ్రామంలోని బర్లపెంట బజార్కు మూడు నెలలుగా నీటి సరఫరా కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామ పంచాయతీ వాటర్మెన్కు సమస్య తెలియజేసినప్పటికీ.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాగునీటిని ట్యాంకర్ల ద్వారా తెప్పించుకొని వాడుకునే దుస్థితి నెలకొందని కాలనీవాసులు వాపోయారు. అదేవిధంగా మరికొంత మంది సుదూర ప్రాంతంలోని చేతి పంపు నీటిని తెచ్చుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తమ కాలనీకి నీటి సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు వేడుకున్నారు. -
బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టాలి
మహబూబాబాద్ రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న అసత్య ప్రచా రాలు, కుట్రలను తిప్పికొట్టాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, జై బాపు–జై భీమ్–జె సంవిధాన్ జిల్లా ఇన్చార్జ్ చెరగాని దయాకర్ అన్నారు. జై బాపు–జై–భీమ్–జై సంవిధాన్ కార్యక్రమ పాదయా త్ర ప్రారంభంపై జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల కాంగ్రెస్ శ్రేణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంవిధాన్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని పాదయాత్రతో ప్రజల్లోకి తీసుకెళ్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను ప్రధాని మోదీ, అమిత్ షా విస్మరించారన్నారు. మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పి కొట్టాలన్నారు. సంవిధాన్ కార్యక్రమం ఏడాదిపాటు కొనసాగుతుందని, గ్రామాల్లో పాదయాత్ర ప్రారంభానికి ముందు బాపూజీ, అంబేడ్కర్ విగ్రహాలకు నివాళులర్పించాలన్నారు. మండల అధ్యక్షులు ప్రతీ గ్రామంలో పర్యటించి, సమావేశాలు నిర్వహించి పాదయాత్ర చేసే విధంగా సంవిధాన్ కార్యాచరణ రూపొందించుకోవాలన్నా రు. అనంరతం కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ నాయక్, నాయకులు ప్రకాశ్రెడ్డి, రామిరెడ్డి, నాగేశ్వర్ రావు, సతీష్, ప్రభాకర్, వెంకన్న, వీరభద్రం, రఘువీర్, రజనీకాంత్, శ్రీను పాల్గొన్నారు. -
సమయం లేదు మిత్రమా..
జిల్లాలో 482 జీపీలు.. జిల్లాలో ప్రస్తుతం 482 గ్రామపంచాయతీలు ఉన్నాయి. పాత జీపీలు 461 ఉండగా ఇటీవల కేసముద్రం మున్సిపాలిటీగా అప్గ్రేడ్ కాగా ఐదు గ్రామాలు ఆ మున్సిపాలిటీలో కలిశాయి. దీంతో జీపీల సంఖ్య 456కు తగ్గింది. అనంతరం కొత్తగా 26 జీపీలు ఏర్పాటు చేయడంతో సంఖ్య 482కి చేరింది. జిల్లాలో 428 మంది కార్యదర్శులు ఉండగా వారిలో 39జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, 377మంది సీనియర్ పంచాయతీ కార్యదర్శులు, అవుట్ సోర్సింగ్లో 12 మంది పనిచేస్తున్నారు. అలాగే 1,806 మంది మల్టీపర్పస్ వర్కర్లు ఉన్నారు. కార్యదర్శులపై భారం ఉండడంతో పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కాగా జిల్లాలో 2,02,496 గృహాలు ఉన్నాయి● గ్రామ పంచాయతీల్లో 85శాతం పన్నుల వసూలు ● గంగారం, డోర్నకల్, చిన్నగూడూరులో వందశాతం పూర్తి ● మిలిగింది 7 రోజులే..మహబూబాబాద్: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్ల ప్రక్రియ సాగుతోంది. ఇప్పటి వరకు 85శాతం వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. మున్సిపాలిటీల కంటే జీపీల్లో వసూళ్లు మెరుగ్గా ఉన్నాయి. కాగా, ఉన్నతాధికారుల ఆదేశాలతో పన్నుల వసూళ్లను వేగవంతం చేశారు. డిమాండ్ రూ.4,99,06,067 ఉండగా.. రూ.4,25,78,125 వసూళ్లు చేశారు. ఇంకా రూ.73,27,942 బ్యాలెన్స్ ఉందని అధికారులు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ఈనెల 31తో ముగియనుండగా.. వందశాతం వసూలు చేసేలా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. డిమాండ్ వసూళ్లు శాతంనెల్లికుదురు మండలంలోని పార్వతమ్మ గూడెం జీపీ మొత్తం మండలాల వారీగా పన్నుల డిమాండ్, వసూళ్లు, శాతం ఇలా..85% -
సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోuవిద్యుత్శాఖలో సిబ్బంది లేక ఇబ్బంది ● 105జేఎల్ఎం పోస్టుల్లో 93 వెకెన్సీ.. ● ఆపరేటర్లు లేక నిరుపయోగంగా సబ్స్టేషన్లు ● ఫ్యూజ్పోతే గంటల తరబడి ఎదురుచూపులునిరుపయోగంగా తాళ్లపూసపల్లి సబ్స్టేషన్సాక్షి, మహబూబాబాద్: విద్యుత్ విలాస వస్తువు నుంచి నిత్యావసరంగా మారింది. కరెంట్ లేకపోతే అంతా ఉక్కిరి బిక్కిరి.. ఎక్కడి పనులు అక్కడే.. ఇంతటి ప్రాధాన్యత ఉన్న విద్యుత్ శాఖలో సరిపడా సిబ్బంది, ఉద్యోగులు లేక ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గతంతో పోలిస్తే విద్యుత్ కనెక్షన్లు, వినియోగం పెరిగింది. కానీ అందుకు అనుగుణంగా ఉద్యోగుల నియామకం జరగకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతుందని అధికారులు చెబుతున్నారు. పెరిగిన వినియోగం.. జిల్లా వ్యాప్తంగా రోజురోజుకూ విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ప్రస్తుతం జిల్లాలో గృహ అవసరాల కోసం 2,17,294 కనెక్షన్లు, కమర్షియల్ 22,927, పరిశ్రమలకు1,287, కుటీర పరిశ్రమలకు 373, వ్యవసాయ పంపుసెట్లకు 93,422, వీధి దీపాలకు 3,104, తాగునీటి సరఫరాకు 1,577, గుడి, బడికి 1,380, తాత్కాలిక అవసరాల కోసం 165, మొత్తం 3,41,530 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఈమేరకు జిల్లాలో ఏడు 133/33 కేవీ సబ్స్టేషన్లు, రెండు 220/130 సబ్స్టేషన్లు ఉన్నాయి. అలాగు 72 చోట్ల 33/11 కేవీ సబ్స్టేషన్లు ఉన్నాయి. కాగా లోడు పెరగడంతో తాళ్లపూసపల్లి, రామచంద్రాపురం, నర్సింహులగూడెం, సత్యనారాయణపురం ప్రాంతాల్లో ఇటీవల 33/11 కేవీ సబ్స్టేషన్లు నిర్మించారు. కేసముద్రం, బత్తులపల్లి, ఉప్పరపల్లి, సోమ్లాతండా, వేంనూరు, రాంచంద్రాపురం, మట్టెవాడ, కోమట్లగూడెం ప్రాంతాల్లో కొత్త సబ్స్టేషన్లు అవసరమని గుర్తించారు. కొన్నిచోట్ల స్థల సేకరణ కూడా చేశారు. వెంటాడుతున్న ఉద్యోగుల కొరత.. పెరిగిన విద్యుత్ వినియోగానికి అనుగుణంగా కొత్త సబ్స్టేషన్ల నిర్మాణాలు చేపట్టడంతో పాటు మరి కొన్ని చోట్ల ఏర్పాటుకు రూపకల్పన చేస్తున్నారు. అయితే ఇందుకు అనుగుణంగా సిబ్బంది, ఉద్యోగులను నియమించడం లేదనే విమర్శలు ఉన్నాయి. గతంలో ప్రతీ గ్రాపంచాయతీకి ఒక హెల్పర్, పెద్ద పంచాయతీలకు లైన్మెన్, మండలానికో ఏఈ ఉండేవారు. అయితే జిల్లా ఆవిర్భావం తర్వాత ప్రస్తుతం 18 మండలాలు, 482 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే ఇందుకు అనుగుణంగా కొత్త పోస్టుల మంజూరు లేకపోగా.. మంజూరైన 109 జూనియర్ లైన్మెన్ల పోస్టులకు గాను కేవలం 16 పోస్టులే భర్తీ చేశారు. అంటే ఒక్క జేఎల్ఎం పోస్టులే 93 ఖాళీలు ఉన్నాయి. అదే విధంగా హెల్ప ర్ల వ్యవస్థ లేకపోవడంతో అన్మ్యాన్డ్, ఆర్టిజన్ పేరిట కాంట్రాక్టు ఉద్యోగులను నియమించినా.. అవి కూడా కొన్నిచోట్లకే పరిమితం అయ్యాయి. దీంతో గ్రామాల్లో చిన్నపాటి మరమ్మతు వచ్చినా.. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడటం, సబ్స్టేషన్ల పర్యవేక్షణ చేపట్టాల్సిన ఆపరేటర్ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. ఒక్కో సబ్స్టేషన్కు ముగ్గురు చొప్పున జిల్లాలోని 72 సబ్స్టేషన్లకు 216 మంది ఆపరేటర్లు ఉండాలి. కానీ మొత్తం 140 మంది మాత్రమే పనిచేస్తుండగా 76ఆపరేటర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఉన్న వారిపైనే అదనపు భారం పడి డబుల్ డ్యూటీలు చేయాల్సి వస్తోంది. ఈమేరకు ఇటీవల నాలుగు సబ్స్టేషన్ల నిర్మాణాలు పూర్తికాగా.. ఆపరేటర్లు లేకపోవడంతో మూడు సబ్స్టేషన్లు నిరుపయోగంగా మారాయి. ఒకవైపు సరిప డా సిబ్బంది లేక.. మరోవైపు నిర్మించిన సబ్స్టేషన్లు అందుబాటులోకి రాకపోవడంతో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. న్యూస్రీల్ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం జిల్లాలో ఏఎల్ఎంల కొరత ఉన్నది వాస్తవమే. దీంతో కొత్త సబ్స్టేషన్లను ప్రారంభించడం లేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. వారి ఆదేశాల మేరకు అపరేటర్ల నియామకం చేపడుతాం. మరికొద్దిరోజుల్లో కొత్త జేఎల్ఎం నియామకాలు చేపట్టే అవకాశం ఉంది. కొత్త జేఎల్ఎంలు వస్తే ఇబ్బందులన్నీ తొలుగుతాయి. – జనగాం నరేశ్, ఎస్ఈ, మహబూబాబాద్ -
విప్లవ వీరుడు భగత్సింగ్
నెహ్రూసెంటర్: దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన విప్లవ వీరులు భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్ అని నేతాజీ సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. భగత్సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని భగత్సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో లక్ష్మణ్, వివేక్, గంగాధర్, రోహిత్, రామకృష్ణ, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, రఘు, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వీఓఏల రాష్ట్ర అధ్యక్షురాలిగా మాధవిమరిపెడ రూరల్: తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామానికి చెందిన మారిపెల్లి మాధవి మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం ఎన్నికలు నిర్వహించగా మాధవిని రెండోసారి అధ్యక్షురాలిగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాధవికి మరిపెడ మండల వీఓఏల కమిటీ అధ్యక్షుడు రాంపెల్లి వెంకన్న, కమిటీ సభ్యులు కొండూరు వెంకన్న, మౌనిక, పద్మ, శాంతి, సువర్ణ, గీతాదేవి, ఉపేందర్, కరుణమయుడు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. గోటి తలంబ్రాల శోభాయాత్రడోర్నకల్: సీతారాముల కల్యాణం కోసం సిద్ధం చేసిన గోటి తలంబ్రాలతో డోర్నకల్లో ఆదివారం శోభాయాత్ర నిర్వహించారు. డోర్నకల్ ఆధ్యాత్మిక సమితి ఆధ్వర్యంలో స్థానిక భక్తుల నుంచి సేకరించిన గోటి తలంబ్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శోభాయాత్ర నిర్వహించారు. పాత డోర్నకల్లోని హనుమాన్ మందిర్ నుంచి బ్యాంక్స్ట్రీట్ వేంకటేశ్వరాలయం, గాంధీ సెంటర్లోని ముత్యాలమ్మతల్లి ఆలయం మీదుగా రైల్వే రామాలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలిమహబూబాబాద్ అర్బన్: మార్కెట్లో జరుగుతున్న మోసాలపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని కన్జ్యూమర్ ఫోరం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో వినియోగదారులకు మార్కెట్లో జరుగుతున్న మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. వస్తువుల కొనుగోలులో మోసపోయిన వినియోగదారులకు అండగా ఉండి, న్యాయం జరిగే విధంగా పోరాడుతామన్నారు. ఏ వస్తువు కొనుగోలు చేసిన తప్పనిసరిగా రశీదు తీసుకోవాలన్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తే సంబంధిత వివరాలను కన్జ్యూమర్ ఫోరం దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో కృష్ణయ్య, సురేశ్నాయక్, మంగు నాయక్, అమృత, వెంకన్న, రాజ్ కుమార్, ఉప్పలయ్య, కృష్ణమూర్తి, లింగయ్య, మల్లేశ్, రమేశ్, యాకయ్య తదితరులు పాల్గొన్నారు. -
క్రికెట్ బెట్టింగ్లు ప్రమాదకరం
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మహబూబాబాద్ రూరల్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లపై బెట్టింగ్లు పె ట్టి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. ఆదివారం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. క్రికెట్ బెట్టింగ్లు పెట్టి ఆర్థికంగా నష్టపోయి చివరికు ఆత్మహత్య చేసుకుంటే కుటుంబాలు రోడ్డున పడతాయని అన్నారు. ఐపీఎల్ మ్యాచ్ల వల్ల తమ పిల్లల్లో ఏమైనా మార్పులు కనబడితే తల్లిదండ్రులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. లేదంటే డబ్బులు, ప్రాణాలు పోయే అవకాశం ఉందన్నారు. బెట్టింగులు పెట్టడం చట్టరీ త్యా నేరమని, ఎవరైనా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. ఎవరైనా క్రికె ట్ బెట్టింగ్కు పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్య ంగా ఉంచుతామని పేర్కొన్నారు. -
ఇంటర్ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
హసన్పర్తి: తెలంగాణ రాష్ట గురుకుల విద్యాలయ సంస్థ పరిధిలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కో–ఆర్డినేటర్ కె. ఇందుమతి శనివారం తెలిపారు. 2025లో పదో తరగతి పరీక్షలకు హాజరైన బాలబాలికలు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఏప్రిల్ 23వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. వివరాలకు http:tgrjc.gov.in దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. వివరాలకు 040– 24734899, 9866559727 నంబర్లను సంప్రదించాలని జిల్లా కో–ఆర్డినేటర్ ఇందుమతి సూచించారు. 4వ తేదీన గిరిజన భవన్లో జాబ్మేళా వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఏటూరునాగారం ఐటీడీఏ ఆధ్వర్యంలో వచ్చే నెల 4వ తేదీన ఉదయం 10 గంటలకు హనుమకొండలోని గిరిజన భవన్లో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్టు అధికారి చిత్రమిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, డి.ఫార్మసీ, ఎఎన్ఎం, జీఎన్ఎం, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్ చదవిన, ఆసక్తిగల గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులు తమ బయోడేటా, విద్యార్హత జిరాక్స్ ప్రతులతో సకాలంలో జాబ్మేళాకు హాజరుకావాలని పీఓ పేర్కొన్నారు. -
చెరువులో చేపలు పడుతుండగా..
రఘునాథపల్లి: చెరువులో చేపలు పడుతున్న ఐదుగురిని దొంగలుగా భావించి చెట్టుకు కట్టేసిన ఘటన శనివారం మండలంలోని గోవర్ధనగిరిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్ర కారం.. బిహార్కు చెందిన కొందరు కూలీలు గ్రామశివారులోని ఆ యిల్ కంపెనీలో పనులు చేస్తున్నారు. మధ్యాహ్న సమయంలో గ్రామ శివారులోని ఆనకుంటలో ఐదుగు రు కూలీలు చెరువులో చేపలు ప డుతున్నారు. కుంట చేపలను సంరక్షిస్తున్న కాంట్రాక్టర్లు వారిని దొంగలుగా భావించి తాడుతో చెట్టుకు కట్టేశారు. ఇటీవల వ్యవసాయ మోటార్ల కేబుల్ వైర్లు అపహరణ కు గురవుతుండంతో వీరి పనేగా భావించి, చెట్టుకు కట్టేసిన ఫొటోలు గ్రామ వాట్సాప్ గ్రూపులో పో స్ట్ చేశారు. అదే ఆయిల్ కంపెనీ లో పని చేసే స్థానికులు వారిని గు ర్తించి వారు బిహార్కు చెందిన కూలీలని, దొంగలు కాదని.. సరదాగా చేపలు పట్టేందుకు వచ్చారని వివరించడంతో వదిలేశారు.దొంగలుగా భావించి బిహార్ కూలీలను చెట్టుకు కట్టేసిన కాంట్రాక్టర్లు గోవర్ధనగిరిలో ఘటన -
ఆరోగ్యం కాపాడుకుంటూ విధులు నిర్వర్తించాలి
హన్మకొండ: వేసవిలో ఆరోగ్యం కాపాడుకుంటూ విధులు నిర్వర్తించాలని టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను డిపో మేనేజర్లు, సిబ్బందికి సూచించారు. శనివారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయంలోని 9 డిపోల మేనేజర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కరపత్రాలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ సమ్మర్ చాలెంజ్ను విజయవంతంగా నిర్వహించాలన్నారు. డీహైడ్రేషన్ నివారణకు రోజు తగిన మోతాదులో నీరు, మజ్జిగ, పండ్ల రసాలు, కొబ్బరి నీరు తీసుకోవాలన్నారు. విధులు ముగిసిన తర్వాత తగిన విశ్రాంతి తీసుకోవాలన్నారు. ఎలాంటి లీవ్లు, సిక్ లీవ్ల్ తీసుకోని, గైర్హాజర్ కాకుండా డ్యూటీలకు హాజరైన వారికి ప్రోత్సాహాలు అందించనున్నట్లు చెప్పారు. మార్చి నుంచి జూన్ మాసాంతం వరకు మరింత శ్రద్ధతో పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తూ డిపోల ఆర్థికాభివృద్ధికి, తద్వారా రీజియన్ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. సమావేశంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ కె.భానుకిరణ్, అకౌంట్స్ ఆఫీసర్ రవీందర్ రావు, డిపోల డిపో మేనేజర్లు, ట్రాఫిక్ ఇన్చార్జ్లు పాల్గొన్నారు. ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం డి.విజయ భాను -
సంకీర్ణ ప్రభుత్వాలతోనే సుస్థిర పాలన
కేయూ క్యాంపస్ : సంకీర్ణ ప్రభుత్వాలతో సుస్థిర పాలన సాధ్యమని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్రెడ్డి అన్నారు. కేయూ రాజనీతిశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రెండు రోజులుగా సెనేట్హాల్లో ‘భారత సమాజంలో సంకీర్ణ ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యం’ అనే అంశంపై నిర్వహిస్తున్న జాతీయ సదస్సు శనివారం సాయంత్రం ముగిసింది. ఈ ముగింపు సభలో వీసీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సంకీర్ణ రాజకీయాలు, ప్రభుత్వాలు బహుళ వర్గాల ప్రజల ఐక్యతకు ప్రతీకయే గాకుండా ప్రజలకు జవాబుదారీగా వ్యవహరిస్తాయన్నారు. సంకీర్ణ రాజకీయాలతోనే ప్రజాస్వామ్యం బలోపేతం ప్రజాస్వామ్యం బలోపేతం, సంపదకేంద్రీకరణ సంకీర్ణ రాజకీయాలతోనే సాధ్యమని ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విభాగం రిటైర్డ్ ఆచార్యలు కె. శ్రీనివాసులు అన్నారు. ఈ సదస్సులో ఆయన ప్రధానవక్తగా పాల్గొని మాట్లాడారు. సంకీర్ణం కేవల రాజకీయాలకు మాత్రమే కాదని ఆర్థిక సామాజికంలోనూ అవసరం అన్నారు. సంకీర్ణణానికి భారతీయ జాతీయ ఉద్యమం గొప్ప ఉదాహరణ అన్నారు. అనంతరం కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, పొలిటికల్ సైన్స్ విభాగం అధిపతి సంకినేని వెంకట్, యూజీసీ కోఆర్డినేటర్ ఆర్.మల్లికార్జున్రెడ్డి, మద్రాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మణ్ మాట్లాడారు. ఆ విభాగం బీఓఎస్ చైర్మన్ గడ్డం కృష్ణయ్య, రిటైర్డ్ ఆచార్యులు రఘురాంరెడ్డి, జి వీరన్న,హరిప్రసాద్ పాల్గొన్నారు. ఈ సదస్సులో 9 సెషన్లలో వంద మంది పరిశోధన పత్రాలు సమర్పించారు. ఈ పరిశోధన పత్రాలను పుస్తకం రూపంలోకి తీసుకురాగా వీసీ, రిజిస్ట్రార్ పొలిటికల్ సైన్స్ విభాగం రిటైర్డ్ ఆచార్యులు ఆవిష్కరించారు. కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి ముగిసిన జాతీయ సదస్సు -
సౌర ప్లాంట్తో రైతులు ఆర్థికంగా బలోపేతం
హన్మకొండ: సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుతో రైతులు ఆర్థికంగా బలోపేతమవుతారని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ, తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్కో) సంయుక్తంగా శనివారం ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిళ్ల సూపరింటెండింగ్ ఇంజనీర్ల కార్యాలయంలో ‘కుసుమ్’ పథకం కింద దరఖాస్తు చేసుకున్న రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి సీఎండీ వరుణ్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడారు. రైతులు సౌర శక్తిని ఉత్పత్తి చేసి మరింత ఆదాయం సమకూర్చుకోవడానికి ఇది సువర్ణ అవకాశమన్నారు. సోలా ర్ ద్వారా ఉత్పత్తి చేసిన ప్రతీ యూనిట్కు రూ.3.13 ఇస్తామని, ప్రతీ నెల రైతు ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు. రూ.2 కోట్ల వరకు ఆరు శాతం వడ్డీకి బ్యాంకులు రుణాలు ఇస్తాయన్నారు. దరఖాస్తు చేసుకున్న రైతులు ఈ నెల 28 వరకు రూ.లక్ష పూచీకత్తు సొమ్ము డిపాజిట్ చేయాలన్నా రు. టెండర్ ప్రక్రియ పూర్తి కాగానే పూచీకత్తు సొ మ్ము చెల్లిస్తామన్నారు. 25 ఏళ్ల అగ్రిమెంట్తో రైతులు లాభాలతో కూడిన నిలకడ ఆదాయం పొందొచ్చన్నారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్లు కె.వెంకటరమణ, రాజుచౌహాన్, జీఎం మల్లికార్జున్, టీజీ రెడ్కో డీజీఎం. వెంకటరమణ, డీఈలు అమర్నాథ్, సంపత్రెడ్డి, ఏఈ శ్రీపాల్ పాల్గొన్నారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
నకిలీ పురుగు మందుల ముఠా అరెస్ట్
వరంగల్ క్రైం: ప్రముఖ కంపెనీల పేర్లతోపాటు గడువు తీరిన పురుగు మందులను రైతులకు అంటగడుతున్న ముఠాలోని ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.78లక్షల 63 వేల విలువైన నకిలీ పురుగు మందులు, మిషనరీ, ప్రింటింగ్ సామగ్రి, రెండు కార్లు, ఆరు సెల్ఫోన్లు స్వాధీన చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. ఈ మేరకు వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సన్ప్రీత్ సింగ్.. నిందితుల అరెస్ట్ చూపి వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం వరంగల్ మట్టెవాడ బొడ్రాయి సమీపాన ప్రధాన నిందితుడు ఇరుకుళ్ల వేదప్రకాశ్ ఇంటిపై టాస్క్ఫోర్స్, మట్టెవాడ పోలీసులు, వ్యవసాయధికారులు సంయుక్తంగా దాడి చేశారు. ఇందులో ముగ్గురు నిందితులు సిద్ధిక్, రాజేశ్, సదాశివుడుని అదుపులోకి తీసుకుని పెద్ద మొత్తంలో నకిలీ, గడువు తీరిన పురుగు మందులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మట్టెవాడ పీఎస్లో విచారించారు. ప్రధాన నిందితుడు ఇరుకుళ్ల వేద ప్రకాశ్.. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో స్థానిక వ్యాపారులు, పురుగు మందుల కంపెనీ ప్రతినిధి అయిన మరో నిందితుడు సిద్ధిక్ వద్ద కాలం తీరిన పురుగు మందులను కొనుగోలు చేసేవాడు. అలాగే, గడువు దాటిన పురుగు మందులతోపాటు, ఇద్దరు నిందితులైన ఆళ్ల చెరువు శేఖర్, విష్ణువర్ధన్, ప్రస్తుతం జైలులో ఉన్న ఆదిత్య నుంచి ప్రముఖ పురుగు కంపెనీలైన ధనూక, టాటా, రైల్స్, బెయర్, ఆడ్మాతోపాటు మరికొన్ని కంపెనీ పేర్లతో తయారు చేసిన నకిలీ పురుగు మందులు కొనుగోలు చేసేవాడు. ఈ విధంగా సేకరించిన గడువు తీరిన పురుగు మందులతోపాటు నకిలీ పురుగు మందులను ప్రభుత్వ అనుమతులు లేని మిగతా నిందితులకు విక్రయించాడు. ఈ నకిలీ పురుగు మందులను కొనుగోలు చేసిన నిందితులు.. వీటిని స్థానికంగా ఉన్న వ్యవసాయదారులకు విక్రయిస్తూ మోసగించేవారు. పోలీసులు అరెస్ట్ చేసిన ప్రధాన నిందితుడు ఇరుకుళ్ల వేదప్రకాశ్తో పాటు సదాశివుడు, రాజు ఆదిత్య గతంలోనూ పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ప్రధాన నిందితుడి సమాచారం మేరకు ఆళ్ల చెరువు శేఖర్, విష్ణువర్ధన్ గోదాములపై టాస్క్ఫోర్స్, మట్టెవాడ పోలీసులు దాడులు చేశారు. నిందితుల్లో విష్ణువర్ధన్ పరారీలో ఉన్నాడు. మరో వ్యక్తి ముద్దగుల ఆదిత్య హైదరాబా ద్ జైలులో ఉండగా.. మిగతా ఏడుగురు మట్టెవాడ కు చెందిన ఇరుకుల్ల వేదప్రకాశ్, లక్ష్మీపురానికి చెందిన మహ్మద్ సిద్ధిక్ అలీ, పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్కు చెందిన నూక రాజేశ్ అలియాస్ రాజు, కరీంనగర్కు చెందిన యల్లం సదాశివుడు, ములుగు జి ల్లా గోవిందరావుపేటకు చెందిన ఎండీ రఫీక్, ఏపీలోని ప్రకాశం జిల్లా మడుగుకు చెందిన ఆళ్ల చెరువు శేఖర్, దుగ్గొండికి చెందిన పొదిళ్ల సాంబయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీపీ తెలిపా రు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్, ఇన్స్పెక్టర్లు గోపి, రాజు, ఎస్సైలు వంశీకృష్ణ, నవీన్, ఆర్ఎస్సై భాను ప్రకాశ్, ఏఏఓ సల్మాన్పాషా, టాస్క్ఫోర్స్ కానిస్టే బుళ్లు సురేశ్, సురేందర్, సాంబరాజు, శ్రీనివాస్, సతీశ్కుమార్, నాగరాజు పాల్గొన్నారు. రూ.78 లక్షల 63 వేల విలువైన మందులు, మిషనరీ, ప్రింటింగ్ సామగ్రి, రెండు కార్లు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన సీపీ సన్ప్రీత్ సింగ్ -
వన్యప్రాణుల వేటకు వెళ్లి.. ఉచ్చుకు తగిలి
ఏటూరునాగారం: అటవీ జంతువులను వేటాడటానికి వెళ్లిన ఓ వ్యక్తి.. కరెంట్ షాక్కు గురై తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని కొత్తగుడిసెల ప్రాంతానికి చెందిన తుమ్మ గంగయ్య(50), లొటపెటల నారాయణ, ఎద్దు లోకేశ్ కలిసి శుక్రవారం అర్ధరాత్రి చిన్నబోయినపల్లి అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడేందుకు వెళ్లారు. ముగ్గురు కలిసి 33 కేవీ విద్యుత్లైన్కు కరెంట్ ఉచ్చులు తగిలించే ప్రయత్నం చేశారు. ఇందులో గంగయ్య కర్ర పట్టుకుని కరెంట్ వైర్లకు ఉచ్చుకు అమర్చిన వైర్ తగిలిస్తుండగా విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన లోకేశ్, నారాయణ భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి వచ్చి కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శనివారం ఉదయం ఘటనా స్థలికి చేరుకుని అతడిని రెండు కిలోమీటర్ల మోసుకుంటూ బయటకు తీసుకొచ్చారు. దీనిపై సమాచారం అందుకున్న సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై తాజొద్దీన్ ఘటనా స్థలికి చేర్జుజీని క్షతగాత్రుడిని 108లో వరంగల్ ఎంజీఎం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందాడు. ఈ ఈ ఘటనలో లోకేశ్, లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్, ఎస్సై తాజొద్దీన్ తెలిపారు. మృతుడికి భార్య రమ, ఇద్దరు కూతుళ్లు మౌనిక, అనిత ఉన్నారు. కరెంట్ షాక్కు గురై వ్యక్తికి తీవ్ర గాయాలు చికిత్స పొందుతూ మృతి -
నీటిని పొదుపుగా వాడుకోవాలి
కురవి: ప్రతిఒక్కరు నీటిని పొదుపుగా వాడుకోవాలని జిల్లా భూగర్భ జల శాఖ డిప్యూటీ డైరెక్టర్ వేముల సురేష్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటి సంరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి వృథాను అరికట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి నరసింహస్వామి, తహసీల్ధార్ సునీల్కుమార్ రెడ్డి, ఎంపీడీఓ వీరబాబు, ఏఓ నరసింహరావు పాల్గొన్నారు. పుష్పుల్ రాకపోకలు షురూమహబూబాబాద్ రూరల్: కాజీపేట, విజయవాడ మధ్య నడిచే పుల్పుల్ రైలు రాకపోకలు శనివారం ప్రారంభమయ్యాయి. వివిధ కారణాలతో జనవరి 25 నుంచి పుష్పుల్ రైలు రాకపోకలను దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిలిపేశారు. సుమారు రెండు నెలల అనంతరం మళ్లీ రైలు రాకపోకలు ప్రారంభిస్తున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు పేదలు, చిరువ్యాపారులు, అప్ అండ్ డౌన్ చేసే ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీకి కొత్త బస్సులు నెహ్రూసెంటర్: మహబూబాబాద్ ఆర్టీసీ డిపోకు 11 కొత్త బస్సులు వచ్చాయి. ఇదివరకే డిపోలో ఉన్న బస్సుల్లో కొన్ని మరమ్మతుకు గురికాగా వాటి స్థానంలో కొత్తగా వచ్చిన బస్సులను నడిపించనున్నారు. కొత్త బస్సులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాగానే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బస్సులను ప్రారంభించి మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించనున్నారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికపెద్దవంగర: హైదరాబాద్లో నేడు జరుగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు పెద్దవంగర మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొననున్నారు. ఈ నెల 19న జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో సాద్విక, నందిని, అంజలి ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈ మేరకు ఎంఈఓ బురారపు శ్రీనివాస్, వ్యా యామ ఉపాధ్యాయుడు కంచెర్ల ప్రభాకర్ శని వారం విద్యార్థులను అభినందించి రాష్ట్ర స్థా యిలో కూడా ప్రతిభ కనబర్చాలని కోరారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలిమహబూబాబాద్/నెహ్రూసెంటర్: మహిళలకు, గర్భిణులకు, బాలింతలకు హెచ్ఐవీ, ఎ యిడ్స్, తదితర వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ మురళీధర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సంపూర్ణ సురక్ష కేంద్రం ఆధ్వర్యంలో సీడీపీఓలు, సూపర్వైజర్లు, బాల రక్ష భవన్ సిబ్బంది, చైల్డ్వెల్ఫేర్ కమిటీ సిబ్బందికి అడ్వకేసీ కమిటీ సమావేశం, సెన్సిటైజేషన్ వర్క్షాప్ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీ సర్ డాక్టర్ శ్రవణ్, చైల్డ్వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ ఎస్.నాగవాణి, సీడబ్ల్యూసీ మెంబర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. 8 మంది విద్యార్థుల గైర్హాజరుమహబూబాబాద్ అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షలు రెండో రోజు హిందీ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్రెడ్డి శనివారం తెలిపారు. జిల్లాలో 46 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 8,158 మందికిగాను 8,177 మంది విద్యార్థులు హాజరుకాగా 8 మంది గైర్హాజరయ్యారన్నారు. జిల్లాలోని పలు పరీక్ష సెంటర్లలో తనిఖీ బృందాలు తనిఖీ చేశారన్నారు. -
బాధితులకు భరోసా కల్పించాలి
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మహబూబాబాద్ రూరల్: మహిళలు, చిన్నారులు వేధింపుల నుంచి రక్షణ పొందేలా పోలీసులు, భరోసా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని భరోసా సెంటర్ ఎస్పీ శనివారం సందర్శించి భరోసా సేవలను సమీక్షించారు. ఎస్పీ చొరవతో 2022 నుంచి 2024 వరకు భరోసా కేంద్రం ద్వారా 56 మంది బాధితులకు ప్రభుత్వం తరఫున రూ.20.75 లక్షలు బాధితుల బ్యాంకు ఖాతాల్లోకి జమచేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాయిదా పడకుండా వెంటనే విడుదల చేయించబడగా బాధితులకు పరిహారం అందేవిధంగా కృషి చేసిన డీఎస్పీ తిరుపతిరావు, రూరల్ సీఐ సరవయ్యను ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధితుల ఖాతాల్లోకి పరిహారం వేగంగా జమ చేయడానికి భరోసా యంత్రాంగం మరింత సమర్థంగా పని చేయాలని సూచించారు. బాధితులకు ఇచ్చే మానసిక, లీగల్ కౌన్సెలింగ్ మరింత బలోపేతంచేసి, వారికి తగిన సహాయం అందించాలన్నారు. భరోసా కేంద్రం మహిళలు, చిన్నారుల రక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని, అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన సహాయం పొందేందుకు ప్రజలు దీనిని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భరోసా టీం సభ్యులు జ్యోత్స్న, జయశ్రీ, పార్వతి, రేణుక, మౌనిక, ఎస్బీ సీఐ చంద్రమౌళి, రూరల్ సీఐ సర్వయ్య, రూరల్ ఎస్సై దీపిక, షీ టీం ఎస్సై సునంద, సిబ్బంది పాల్గొన్నారు.శాస్త్రవేత్తగా ఒకరోజుమహబూబాబాద్ అర్బన్: విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలను హైస్కూల్ స్థాయిలో వెలికితీసేందుకు, పరిశోధనలపై ఆసక్తి పెంపొందించేందుకు విద్యార్థులకు శాస్త్రవేత్తగా ఒకరోజు వినూత్న కార్యక్రమానికి ఎన్సీఈఆర్టీ హైదరాబాద్ రీసెర్చ్ సెంటర్ శిక్షణ నిర్వహిస్తుందని డీఈఓ ఏ.రవీందర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఏప్రిల్ 5వతేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారి అప్పారావు (9849598281)ను సంప్రదించాలన్నారు. -
విద్యుత్ అంతరాయం ఉండొద్దు
మరిపెడ రూరల్: వేసవిలో విద్యుత్ అంతరాయం లేకుండా జాగ్రత్తలు పాటించి, నాణ్యమైన విద్యుత్ అందించాలని విద్యుత్ శాఖ సీఈ రాజు చౌహాన్ అన్నారు. శనివారం మరిపెడ మండలం ఎల్లంపేట సబ్ స్టేషన్ పరిధిలోని ఎల్లంపేట, సోమ్లతండా గ్రామాలను వేరు చేస్తూ విద్యుత్ అంతరాయం తగ్గించడంతో భాగంగా రూ.8.79 లక్షలతో మరో బ్రేకర్ను ఏర్పాటు చేయగా సీఈ రాజు చౌహాన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రూ.3.26 లక్షలతో పోల్ స్ట్రక్షర్ అనుసందానం, ఆనెపురం స్టేజీ వద్ద రూ.2.25లక్షలతో కేపాసిటర్ బ్యాంకులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యుత్ అంతరాయానికి తొర్రూర్ డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ అధికారుల చేస్తున్న కృషిని అభినందించాడు. ఈ కార్యక్రమంలో విద్యుత్శాఖ జిల్లా అధికారి జి.నరేష్, ఎంఆర్టీ సునీతాదేవి, డీఈ మధుసూదన్, ఎల్లంపేట ఏఈ బి.అజయ్, లోక్నాథ్రెడ్డి, సబ్ ఇంజనీర్ రుబీనా తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ సీఈ రాజు చౌహాన్ -
విద్యుత్ సేవలు
అరచేతిలో 20 ఫీచర్లతో అందుబాటులోకి..యాప్ రూపొందించిన టీజీ ఎన్పీడీసీఎల్హన్మకొండ: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో టీజీ ఎన్పీడీసీఎల్ ఓ యాప్ను రూపొందించింది. సుమారు 20 ఆధునిక ఫీచర్లతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ యాప్ ద్వారా ఇంట్లోనే ఉండి సమస్యలపై ఫిర్యాదు చేయడంతోపాటు, విద్యుత్ బిల్లుల చెల్లింపులు, నూతన సర్వీస్ల మంజూరు, పేరు మార్పు వంటి సేవలు పొందే అవకాశముంది. రిపోర్ట్ ఆన్ ఇన్సిడెంట్: ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా ఇందులో జీపీఎస్ లోకేషన్ ద్వారా వినియోగదారుడి ఫోన్ కెమెరా నుంచి ఆ ఘటన ఫొటో తీసి పంపవచ్చు. తద్వారా రిపోర్ట్ నేరుగా సంబంధిత అధికారికి వెళ్తుంది. దీంతో సమస్య త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కన్జ్యూమర్ గ్రీవెన్స్: వినియోగదారుడి సమస్యలు నేరుగా ఇందులో పొందుపరచవచ్చు. వినియోగదారుడి మీటర్ నంబర్, సమస్య వివరాలు ఇందులో నమోదు చేస్తే సమస్యను పరిష్కరిస్తారు. విద్యుత్కు సంబంధించి ఏ అంశమైనా ఫిర్యాదు చేసే సౌకర్యం ఈ యాప్లో అందుబాటులో ఉంది. ఫిర్యాదు స్టేటస్ చూసుకునే సౌలభ్యం ఉంది. సమస్య పరిష్కారంపై సంతృప్తి చెందకపోతే పునరావృతం చేసుకునే వీలుంది. సెల్ఫ్ రీడింగ్: ఈ యాప్ ద్వారా వినియోగదారులు సెల్ఫ్ రీడింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ప్రతీ నెల నిర్ణీత తేదీన వారి విద్యుత్ బిల్లులను సెల్ఫ్ మీటర్ రీడింగ్ తీసుకోవచ్చు. పే బిల్స్: నెలవారీ విద్యుత్ బిల్లులను వినియోగదారుల సర్వీస్ నంబర్ నమోదు చేసుకొని చెల్లించవచ్చు. దీంతో సమయం ఆదా అవుతుంది. బిల్ కౌంటర్లకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. బిల్ హిస్టరీ: వినియోగదారులు చెల్లించిన విద్యుత్ బిల్లుల గత చరిత్ర ఇందులో చూసుకోవచ్చు. తద్వారా ప్రతీ నెలా బిల్లు ఎంత వస్తుంది పోల్చుకోవచ్చు. అలాగే విద్యుత్ వినియోగడం ఏ నెల ఎంత పెరిగిందో చూసుకుని పొదుపుగా వాడుకునే అవకాశం ఉంది. ఆన్లైన్ పేమెంట్ హిస్టరీ: ఆన్లైన్ ద్వారా చెల్లించిన బిల్లు వివరాలు ఈ యాప్ ద్వారా తెలుసుకునే సౌకర్యముంది. కొత్త సర్వీస్ స్థితి: కొత్త సర్వీసుల రిలీజ్ స్థితిగతులు ఎప్పటికప్పుడు అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేసి తెలుసుకునే సౌకర్యం ఉంది. తద్వారా కొత్త సర్వీసుల మంజూరు వేగంగా జరుగుతుంది. లింక్ ఆధార్– మొబైల్: వినియోగదారుల ఆధార్, మొబైల్ నంబర్లు లింక్తో విద్యుత్ బిల్లుల సమాచారం ఫోన్కు చేరుతుంది. దీంతో గడువులోగా బిల్లులు చెల్లించవచ్చు కొత్త కనెక్షన్, పేరుమార్పు: కొత్త విద్యుత్ కనెక్షన్ తీసుకోవడానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇందులో పొందుపరిచారు. దీంతోపాటు విద్యుత్ మీటర్ పేరు మార్పు, లోడ్కు సంబంధిందించిన వివరాలు ఇందులో ఉన్నాయి. పవర్ కంజష్షన్ గైడ్ లైన్స్: విద్యుత్ ఉపకరణాలు ఎంత వాడితే ఎంత విద్యుత్ వినియోగం అవుతుందో ఇందులో వివరించారు. టారిఫ్ డీటెయిల్స్: విద్యుత్ వినియోగం చార్జీల వివరాలు కేటగిరీల వారీగా ఇందులో ఉంటాయి. గృహ, గృహేతర వినియోగదారులు, పరిశ్రమలు, ఇతర కేటగిరీల వారీగా చార్జీల వివరాలు ఇందులో పొందుపరిచారు. ఎనర్జీ సేవింగ్, సేఫ్టీ టిప్స్: విద్యుత్ ఉపకరణాలు వాడుతున్నపుడు పాటించాల్సిన పొదుపు సూచనలు, విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇందులో వివరించారు. ఫీడ్ బ్యాక్: వినియోగదారులకు అందిస్తున్న సేవలపై అభిప్రాయాన్ని పంచుకోవచ్చు. ఇది చాలా ముఖ్యం. సలహాలను అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకొని మెరుగైన సేవలు అందించేందుకు దోహదపడుతుంది. మై అకౌంట్: మై అకౌంట్లో వినియోగదారుల పూర్తి వివరాలు ఉంటాయి. వారి మీటర్ తాలూకు వివరాలు, తదితర సమాచారం ఉంటుంది. వినియోగదారుల బిల్లు సమాచారం: దీనిలో వినియోగదారుల సర్వీస్ నంబర్ నమోదు చేసి బిల్లు వివరాలు తెలుసుకోవచ్చు. అధికారి వివరాలు: వినియోగదారుల పరిధిలోని అధికారి వివరాలు ఈ యాప్ ద్వారా తెలుసుకోచ్చు. వినియోగదారులకు ఎటువంటి సందేహాలున్న తమ పరిధిలోని అధికారిని ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. కాంటాక్ట్ ఆజ్: ఇందులో 24/7 పనిచేసే టోల్ ఫ్రీ నంబర్లు 1800 4250028, 1912 ఉంటాయి. వీటిద్వారా సమస్యలు త్వరగా పరిష్కరించుకునే వెసులుబాటు ఉంది. యాప్తో అనేక ప్రయోజనాలు టీజీ ఎన్పీడీసీఎల్ యాప్ ద్వారా అనేక ప్రయోజనాలున్నాయి. వినియోగదారులు తమ మొబైల్ ఫోన్లో ఈ యాప్ను డౌన్ లోడ్ చేసుకొని సేవలు పొందొచ్చు. కార్యాలయాలకు రావాల్సిన సమయం, ఖర్చులు ఆదా అవుతాయి. – గౌతం రెడ్డి, టీజీ ఎన్పీడీసీఎల్, ఎస్ఈ వరంగల్యాప్పై అవగాహన కల్పిస్తున్నాం టీజీ ఎన్పీడీసీఎల్ యాప్పై వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నాం. అరచేతిలోకి విద్యుత్ సేవలు తీసుకెళ్లడానికి ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి యాప్ను ఆధునికీకరించి 20 రకాల సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. – మధుసూదన్రావు, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ, హనుమకొండ ● -
లక్ష్యాలను పూర్తి చేయాలి
మహబూబాబాద్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల లక్ష్యం పూర్తి చేసేందుకు అధికారుల సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ఉపాధి పనులు, ఎల్ఆర్ఎస్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కూలీల సంఖ్య పెంచి వందరోజుల పని దినాలు కల్పించాలన్నారు. మార్చి 31 లోపు ఇంటి పన్ను వంద శాతం వసూళ్లు పూర్తి చేయాలన్నారు. వీసీలో డీఆర్డీఏ పీడీ మధుసూదన్రాజు, డీపీఓ హరిప్రసాద్, పీఆర్ ఈఈ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. రైతులు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి నెహ్రూసెంటర్: రైతులు వ్యవసాయానికి అనుకూలంగా లేని వ్యవసాయ క్షేత్రాల్లో సోలార్ విద్యుత్ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని అదనపు కలెక్టర్ లెనిన్వత్సల్ టొప్పో అన్నారు. విద్యుత్శాఖ ఆధ్వర్యంలో రైతులకు సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, పీఎం కుసుమ్పై అవగాహన సదస్సును సర్కిల్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. సోలార్ విద్యుత్ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. విద్యుత్శాఖ ఎస్ఈ జనగం నరేశ్ మాట్లాడుతూ జిల్లాలో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు 126 మంది దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు 25 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ ఉంటుందన్నారు. ఈ సమావేశంలో డీఈ పెద్ది రాజం, మధుసూదన్, విజయ్, రాజ్యలక్ష్మీ, ప్రశాంత్, లీడ్ బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ లెనిన్వత్సల్ టొప్పో -
యువ రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి
మహబూబాబాద్ రూరల్: యువ రైతులు వ్యవసాయంతో పాటు అనుబంధరంగాలతో అదనపు ఆదాయాన్ని పొందాలని మల్యాల కేవీకే సమన్వయకర్త డాక్టర్ ఎస్.మాలతి అన్నారు. పెరటి కోళ్ల పెంపకంపై మహబూబాబాద్ మండలంలోని మల్యాల కృషి విజ్ఞాన కేంద్రంలో యువ రైతులకు ఆర్య ప్రాజెక్టులో భాగంగా నాలుగు రోజులపాటు శి క్షణ ఇచ్చారు. శనివారం ఏర్పాటు చేసిన శిక్షణ ము గింపు కార్యక్రమంలో కేవీకే సమన్వయకర్త మాలతి మాట్లాడుతూ రైతులు పెరటి కోళ్ల పెంపకం జాగ్రత్తలు రకాల ఎంపికలపై వివరించారు. అనంతరం సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ బి.రామచంద్రనాయక్, డాక్టర్ కిరణ్ కుమార్, బి.క్రాంతి కుమార్, మురళి, రాంబాబు, కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మల్యాల కేవీకే సమన్వయకర్త డాక్టర్ ఎస్.మాలతి -
సరదా.. విషాదమైంది
● ట్రాక్టర్ పైనుంచి జారిపడి బాలుడి మృతి ● పూమ్యాతండా సమీపంలో ఘటన గార్ల: సరదా.. విషాదమైంది. ట్రాక్టర్ పైనుంచి జారి టైర్ కింద పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం పూమ్యాతండా సమీపంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గార్ల గ్రామ పంచాయతీ పూమ్యాతండాకు చెందిన బానోత్ సాయికుమార్(15) సరదాగా ట్రాక్టర్పై మిరుపతోట వెళ్లాడు. మిర్చిబస్తాలు లోడ్ చేసుకుని వస్తున్న ట్రాక్టర్ పొలం గట్టు ఎక్కుతున్న క్రమంలో ఒక్కసారి కుదుపునకు గురైంది. దీంతో బాలుడు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పైనుంచి కిందపడ్డాడు. వెనుక టైర్ బాలుడిపైనుంచి వెళ్లగా అక్కడికక్కడే మృతిచెందాడు. సాయికుమార్ గార్లలో 9వ తరగతి చదువుతున్నాడు. కాగా, సాయికుమార్ తండ్రి మంగీలాల్ 3 ఏళ్ల క్రితం ఆర్థిక ఇబ్బందులతో పురుగుమందు తాగి మృతిచెందాడు. సాయికుమార్కు తల్లి బుజ్జి, ముగ్గురు అక్కలు ఉన్నారు. కుటుంబంలో ఉన్న ఒక్కగానొక్క మగ దిక్కును కోల్పోయామని మృతుడి తల్లి, అక్కలు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పోలీసులు ఘటనా స్థలిని సందర్శిచారు. -
పీఈటీల సమస్యల పరిష్కారానికి కృషి
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న పీఈటీల, పీడీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలంగాణ వ్యాయామవిద్య ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుని విజయ్సాగర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శనిగపురం ప్రభుత్వ పాఠశాలలో శనివారం వ్యాయామవిద్య ఉపాధ్యాయ సంఘం జిల్లా ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు విజయ్సాగర్ హాజరై మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీపీఈడీ అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి పదోన్నతులు కల్పించామని, సీఆర్టీలుగా, ఆర్ఎంఎస్ఏ పీఈటీలుగా ఉన్న వారికి మినిమం టైం స్కేల్ ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం వ్యాయామవిద్య ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడిగా వాసిరెడ్డి ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా బి.చాంప్లనాయక్, కోశాధికారిగా మహాంకాళి వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగరాజుగౌడ్, వివిధ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంగీలాల్, రంగారెడ్డి, సిద్దార్ధ్, ఇమ్రాన్, కొమ్మలు, ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు. పీఈటీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విజయ్సాగర్ -
యూరియా అధిక ధరకు విక్రయిస్తే చర్యలు●
● జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల గంగారం: రైతులకు యాసంగిలో పంటలకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని, ఎవరైన షాపుల యాజమానులు అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల అన్నారు. గంగారం మండలంలోని పలు ఫర్టిలైజర్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం స్టాక్ రికార్డులు పరిశీలించారు. షాపు నోటీసు బోర్డులో ధర పట్టిక రాయాలన్నారు. అనంతరం మొక్కజొన్న పంటను పరిశీలించి రైతులకు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి రాంబాబు, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. -
గుట్టుగా అబార్షన్లు!
తొర్రూరు: జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల పనితీరు, అందిస్తున్న సేవలపై వైద్యాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో అబార్షన్లకు అడ్డూఅదుపు లేకుండా పోతుందనే ఆరోపణలు ఉన్నాయి. వివిధ కారణాలతో మహిళలు అబార్షన్ల కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తే వారు నిరాకరిస్తున్నారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అబార్షన్ చేస్తే చట్ట ప్రకారం శిక్షార్హులవుతారని స్పష్టంగా ఉన్నా.. కొందరు ప్రైవేట్ వైద్యులు బాధితుల నుంచి అందినకాడికి రాబట్టుకుని గుట్టుగా అబార్షన్లు చేస్తున్నారు. తాజాగా నర్సింహులపేటకు చెందిన 16 ఏళ్ల బాలిక గర్భం దాల్చగా అబార్షన్ కోసం తల్లి తన కూతురును తొర్రూరు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించింది. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో ఆస్పత్రి వైద్యుడిపై కేసు నమోదు చేశారు. దీంతో పాటు గర్భానికి కారకుడైన వ్యక్తిపై, అబార్షన్కు సహకరించిన తల్లిపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. యథేచ్ఛగా అబార్షన్లు.. జిల్లాలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో అబార్షన్లు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. 2024 ఏప్రిల్ 7న కురవి మండలం పిల్లిగుంట్ల తండాలోని ఓ ఇంట్లో గర్భిణులకు ఆర్ఎంపీలు మొబైల్ యంత్రంతో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండగా పోలీసులు, వైద్యాధికారులు ఆ ప్రదేశానికి వెళ్లి వారిని పట్టుకున్నారు. 2023 అక్టోబర్లో తొర్రూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ వికటించి ఓ మహిళ మృతి చెందింది. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఇలాంటివి పునరావృతం అవుతున్నాయి. జిల్లాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 986 మంది మాత్రమే ఆడపిల్ల లు ఉన్నారు. ఈ గణాంకాలు భవిష్యత్లో ఎదురయ్యే ప్రమాద ఘంటికలను తెలియజేస్తున్నాయి. జిల్లాలో ఏడాది కాలంలో 2,218 అబార్షన్లు జరిగినట్లు వైద్యాధికారులు గుర్తించారు. నిబంధనలు ప్రచారానికే.. లింగనిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమనే విష యం ప్రచారానికే పరిమితమైంది. భ్రూణహత్యల నియంత్రణలో వైద్యారోగ్య శాఖ అధికారులు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లోని కొన్ని ఆస్పత్రులు ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. లింగ నిర్ధారణ పరీక్షలు నేరమని తెలిసినా కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ కేంద్రాల తీరు మారడం లేదు. అనుమతి లేకున్నా స్కానింగ్ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ అనుమతి ఉన్న కేంద్రాల్లో రేడియాలజిస్టు స్కానింగ్ చేస్తారు. బహిర్గత పరచరు. అనుమతిలేని కేంద్రాల్లో పుట్టేది ఆడో, మగో తేల్చేస్తున్నారు. ఇందుకు ఒక్కో వ్యక్తి నుంచి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.. లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరం. అనుమతి లేకుండా స్కానింగ్ సెంటర్లు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అబార్షన్లు చేసినట్లు తేలితే ఆస్పత్రిని సీజ్ చేస్తాం. అన్ని స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ నిబంధనలను అమలు చేసేలా చర్యలు తీసుకుంటాం. సమాచారం తెలిసిన వారు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. – గుండాల మురళీధర్, డీఎంహెచ్ఓఇద్దరిపై పోక్సో కేసు నమోదుబాలికకు అబార్షన్ చేసిన ఘటనలో పోలీసులు ఇద్దరిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఎస్సై ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింహులపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళతో మరిపెడ మండలం చిల్లంచెర్ల గ్రామానికి పోలోజు రాజు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో వివాహిత కూతురుతోనూ రాజు శారీరక సంబంధం పెట్టుకున్నాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. అప్పటికే 5 నెలల గర్భం ఉందని తేలడంతో తొర్రూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అబార్షన్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు సీడబ్ల్యూసీ చైర్పర్సన్ నాగవాణి, చైల్డ్ లైన్ ప్రతినిధులు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. వారి నిర్ధారణ అనంతరం పోలీ సులు, ఐసీడీఎస్, వైద్యాధికారులకు సమాచా రం అందించారు. ఐసీడీఎస్ అఽధికారుల ఫిర్యా దు మేరకు అబార్షన్ చేసిన వైద్యుడిపై కేసు నమోదు చేయడంతో పాటు గర్భం దాల్చేందుకు కారకుడైన వ్యక్తిపై, అబార్షన్కు సహకరించిన తల్లిపై పోక్సో కేసు నమోదు చేశారు. అనుమతులు లేకున్నా.. లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఆస్పత్రులు పట్టించుకోని వైద్యశాఖ అధికారులు -
రోయింగ్ పోటీలకు హేమంత్
కేసముద్రం: ఛండీగఢ్లోని పంజాబ్ యూనివర్సిటీలో ఈ నెల 22నుంచి 27వరకు జరగనున్న ఆల్ ఇండియా ఇంటర్ వర్సిటీ రోయింగ్ చాంపియన్షిప్ పోటీలకు కేసముద్రం స్టేషన్కు చెందిన నల్లగొండ హేమంత్ ఎంపికై నట్లు జేఎన్టీయూ(హెచ్) ఫిజికల్ డైరెక్టర్ నల్లగొండ అశోక్ శుక్రవారం తెలిపారు. హైదారాబాద్లోని లయోలా కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుతున్న హేమంత్ ఉస్మానియా యూనివర్సిటీ తరఫున పోటీల్లో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణకు ‘హైపర్’ ప్రణాళిక నెహ్రూసెంటర్: ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాల కారణంగా నిలిచిన విద్యుత్ సరఫరాను తక్కువ సమయంలో పునరుద్ధరించేందుకు ‘హైపర్’ కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని విద్యుత్శాఖ ఎస్ఈ జె.నరేశ్ శుక్రవారం తెలిపారు. హెడ్ క్వార్టర్స్లో అప్రమత్తంగా ఉంటూ.. సమాచారం అందిన వెంటనే వ్యూహాత్మకంగా విద్యుత్ను పునరుద్ధరించడమే లక్ష్యమన్నారు. వేగంగా విద్యుత్ పునరుద్ధరణ, పనులకు హైపర్ ప్రణాళిక ఉపయోగపడుతుందని తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానం మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగ యువత స్వయం ఉపాధి అవకాశాలతో ఆర్థిక పురోగతి సాధించా లనే లక్ష్యంతో అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాసం పథకం ప్రకటించిందన్నారు. ఈ పథకం కింద నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పిస్తుందని చెప్పారు. ఆసక్తిగల యువత ఆన్లైన్లో సంబంధిత వెబ్సైట్లో శనివారం నుంచి ఏప్రిల్ 5వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. సీల్డ్ టెండర్లకు... జిల్లాలో పంట రుణమాఫీ, రైతు భరోసా పథకం కింద ముద్రించిన లబ్ధిదారుల జాబితా ప్రింటింగ్ సరఫరా చేయడానికి ఏజెన్సీల నుంచి సీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తున్నామని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రూ.1,0000తో జిల్లా వ్యవసాయాధికారి పేరిట టెండర్ డీడీ తీయాలని చెప్పారు. శనివారం నుంచి ఈనెల 26వ తేదీ వరకు ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటలకు టెండర్లు స్వీకరిస్తామన్నారు. ఈనెల 27న ఉదయం 11గంటలకు టెండర్ ఖరారు చేస్తామన్నారు. పూర్తి వివరాలకు జిల్లా వ్యవసాయ అధికారి 72888 94786, 72888 94780 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. విరగకాసిన తునికిపండ్లు గంగారం: మండలంలోని అటవీ ప్రాంతంలో తునికి పండ్లు విరగకాశాయి. ఏజెన్సీ ప్రజలు పండ్లను సేకరించి అమ్ముకుంటారు. అలాగే పండ్లను ఎండబెట్టి రెండు, మూడు నెలల వరకు నిల్వ చేసి తింటారు. కాగా తునికి పండ్లు బాగా కాస్తే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ఇక్కడి ప్రజల నమ్మకం. -
సాహిత్యం సమాజానికి దిక్సూచి
మహబూబాబాద్ అర్బన్: సాహిత్యం సమాజానికి మంచి మార్గం చూపే దిక్సూచి అని మానుకోట రచయితల సంఘం(మరసం) జిల్లా అధ్యక్షుడు చింతకుట్ల కుమారస్వామి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మరసం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ కవితా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతకుట్ల కుమారస్వామి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకాలం నుంచి సాహిత్యాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారని, విద్యార్థులు, యువత సాహిత్యాన్ని అధ్యయనం చేయాలన్నారు. అనంతరం కవితల బులెటిన్ను కళాశాల ప్రిన్సిపాల్ పొక్కుల సదానందం ఆవిష్కరించారు. కార్యక్రమంలో మరసం జిల్లా కార్యదర్శి మద్దెర్ల రమేశ్, గౌరవ సలహాదారు సయ్యద్ ఖుర్షిద్, కళాకారుడు సత్యనారాయణ, గ్రంథాలయ సిబ్బంది వీరేందర్, అధ్యాపకులు చొప్పరి శ్రీనివాస్, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. -
శనివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2025
స్టేజీల వారీగా ఎన్ని టికెట్లు జారీ అవుతున్నాయి.. ఇందులో డిజిటల్ పేమెంట్స్ ద్వారా ఎన్ని, నగదు రూపేణా ఎన్ని, జీరో టికెట్లు ఎన్ని జారీ అయ్యాయో తెలుసుకునే సౌకర్యం ఉంది. ● ఆర్టీసీ డిపోలు, వరంగల్ రీజియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డ్యాష్ బోర్డు ద్వారా ప్రతీబస్లో జారీ అవుతున్న టికెట్ల వివరాలు స్టేజీల వారీగా అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ● ఈ టిమ్స్ పూర్తిస్థాయిలో పని చేయడానికి మరికొంత సమయం పట్టనుంది. ● ముందుగా ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం (ఓపీఆర్ఎస్) వర్తింపజేస్తున్న బస్సులో వీటిని వినియోగించనున్నారు. ● కండక్టర్లు, డ్రైవర్లకు శిక్షణ ఇచ్చిన తర్వాత పల్లె వెలుగు బస్సుల వరకు క్రమంగా అమలు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు ఆర్టీసీ ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుంటోంది. ప్రయాణికులకు సౌకర్యవంతంగా టికెట్ జారీకి ఇ–టిమ్స్ను ప్రవేశ పెట్టింది. దీనిలో భాగంగా ఆర్టీసీ వరంగల్ రీజియన్లోని ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈమేరకు కండకర్లు, డ్రైవర్లకు శిక్షణ ఇస్తూ క్రమంగా ఇ–టిమ్స్ను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటివరకు ఉపయోగించిన టిమ్స్తో చూసుకుంటే మరిన్ని ఫీచర్లతో వీటిని రూపొందించారు. ఆధునిక సాంకేతిక పద్ధతులతో ఇ–టిమ్స్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇ–టిమ్స్ను రూపొందించారు. ప్రస్తుతం రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్న బస్సుల్లో మాత్రమే వీటిని వినియోగిస్తున్నాం. క్రమంగా పల్లె వెలుగు వరకు అమలు చేస్తాం. వీటి ద్వారా ప్రయాణికులకు సులువుగా టికెట్ జారీ చేయవచ్చు. – డి.విజయ భాను, ఆర్టీసీ వరంగల్ ఆర్ఎంవరంగల్ రీజియన్లో ప్రతిరోజూ 936 బస్సులు వివిధ రూట్లలో తిరుగుతుంటాయి. 3.76 లక్షల కిలోమీటర్లు తిరిగి సగటున రోజుకు రూ.2.20 కోట్ల ఆదాయాన్ని సంస్థ రాబట్టుకుంటుంది. 936 బస్సులకుగాను ప్రస్తుతం 750 ఇ–టిమ్స్ మాత్రమే చేరుకున్నాయి. అన్ని బస్సుల్లో అమలుచేయాలంటే మరో 186 అవసరం. ఎప్పుడైనా టిమ్ మొరాయిస్తే బాగు చేసే వరకు వినియోగించుకునేలా అదనంగా మరికొన్ని అవసరం. ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపులతో టికెట్ల జారీ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న సంస్థ వరంగల్ రీజియన్కు చేరుకున్న 750 ఇ–టిమ్స్ టికెట్ జారీపై మరింత స్పష్టత ప్రతి స్టేజీ వారీగా వివరాలు తెలుసుకునే సౌకర్యం ప్రతీది ఆన్లైనే.. -
గుంత.. చింత!
రోడ్డునపడిన కుటుంబాలు.. చిన్ననాగారం నుంచి మండల కేంద్రమైన ఇనుగుర్తికి వెళ్లే దారి లో మూలమలుపు ప్రమాదకరంగా ఉంది. సూచిక బోర్డు లేకపోవడంతో ఇటీవల నెల్లికుదురు మండలం నైనాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి, చిన్ననాగారం గ్రామానికి చెందిన ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో వారి కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఖమ్మం– వరంగల్ రహదారిలో..ప్రమాదాలకు నిలయంగా గుంతల రోడ్లు ● మూలమలుపుల్లో సూచిన బోర్డులు కరువు ● ప్యాచ్ వర్క్లు కూడా చేయని దుస్థితి ● ప్రతీరోజు ఏదో ఒకచోట యాక్సిడెంట్లు -
టెన్త్ పరీక్షలు షురూ..
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శుక్రవారం జరిగిన తెలుగు పరీక్షకు 8,183 మంది విద్యార్థులు హాజరై.. పదకొండు మంది గైర్హాజరైనట్లు డీఈఓ రవీందర్రెడ్డి తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా 144 సెక్షన్ విధించామని చెప్పారు. జిల్లా పరిధి పలు మండలాల్లోని పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయని, ఎక్కడ ఎలాంటి మాల్ప్రాక్టీస్ జరగలేదన్నారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి వసతి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. జిల్లా కార్యాలయంలో విద్యార్థుల సందేహాల నివృత్తికి కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, 94925 85375 ఫోన్ నంబర్లో విద్యార్థులు సంప్రదించాలన్నారు. కలెక్టర్ తనిఖీ... మానుకోటలోనిప్రభుత్వ బాలుర పాఠశాల పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని, ప్రతీ పరీక్ష కేంద్రంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. మందులు, ఓఆర్ఎస్, వివిధ మెడికల్ కిట్లు ఉండాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దని, విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలన్నారు. కాగా డీఈఓ రవీందర్రెడ్డి, ఏసీజీఈ మందుల శ్రీరాములు కురవి, కేసముద్రంలోని పలు పరీక్ష కేంద్రద్రాలను తనిఖీ చేశారు. జిల్లాలో మొదటిరోజు ప్రశాంతం 8,183 మంది విద్యార్థులు హాజరు పదకొండు మంది గైర్హాజరు: డీఈఓ రవీందర్రెడ్డి వెల్లడి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ -
ప్రాణాలు తీసిన గుంత..
దంతాలపల్లి మండల కేంద్రం శివారు ఖమ్మం–వరంగల్ జాతీయ రహదారిపై గుంత ప్రమాదకరంగా ఉంది. గత ఏడాది జూలై 5వ తేదీన గుంతను తప్పించబోయి ఓ కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో వెలికట్టె గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్, మండలంలోని బీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన పగిండ్ల కుమార్, వాల్యా తండాకు చెందిన నరేశ్ మృతి చెందగా మరో ముగ్గురు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన సంబంధిత శాఖ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. అయితే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోవడంతో మళ్లీ ఈ గుంత ఏర్పడింది. -
ఎల్ఆర్ఎస్ రాయితీతో ప్రయోజనం
మహబూబాబాద్ అర్బన్: ఎల్ఆర్ఎస్ 25శాతం ఫీజు రాయితీతో ప్రజలకు ఎంతో ప్రయోజనం కలు గుతుందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, డీపీఓలు, డీటీసీపీఓలతో ఎల్ఆర్ఎస్పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా దానకిశోర్ మాట్లాడుతూ.. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారికి వెంటనే ప్రొసీడింగ్ క్రమబద్ధీకరణ పత్రాలు అందజేయాలన్నారు. అనంతరం కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎల్ఆర్ఎస్పై క్షేత్రస్థాయిలో ప్రచారం కల్పించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజు తీసుకొని, ప్రొసీడింగ్ కాపీలను వెంటనే అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. వీడియో కాన్ఫ రెన్స్లో జిల్లా పంచా యతీ అధికారి హరిప్రసాద్, మున్సిప ల్ కమి షనర్లు శాంతికుమార్, రవీందర్, నరేశ్ రెడ్డి, ఉదయ్ కుమార్, డీటీసీపీఓ సాయిరామ్, డివిజనల్ పంచాయతీ అధికారులు పుల్లారావు, దుర్గ తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్, ప్రైవేట్ అటెండర్
స్టేషన్ఘన్పూర్: జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్, సీనియర్ అసిస్టెంట్ పర్వతం రామకృష్ణ, ప్రైవేట్ అటెండర్ ఎదునూరి రమేశ్ రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంఘటన గురువారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పర్వతం రామకృష్ణ కొన్ని నెలలుగా స్టేషన్ఘన్పూర్ ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్గా, ఎదునూరి రమేశ్ చాలా ఏళ్లుగా ఈ కార్యాలయంలో ప్రైవేట్ అటెండర్గా పనిచేస్తున్నాడు. సబ్ రిజిస్ట్రార్లకు సంబంధించిన లావాదేవీలు రమేశ్ చేతులమీదుగానే నడుస్తుంటాయి. ఈ క్రమంలో చిల్పూరు మండలం వెంకటేశ్వరపల్లెకు చెందిన బట్టమేకల యాదగిరికి శివరాజ్, ధర్మరాజ్ ఇద్దరు కొడుకులు. తండ్రి పేరిట ఉన్న 585 గజాల స్థలంలోని ఇల్లు, ఇంటి స్థలాన్ని పంచుకున్నారు. ఆ ఆస్తిని తమ పేరిట గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శివరాజ్ ఈనెల 17న ఘన్పూర్ సబ్ రిజిస్ట్రార్ను సంప్రదించగా పార్టీషన్ గిఫ్ట్ డీడ్ చేయమని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అఽధ్యక్షుడినని, ఇద్దరు అన్నదమ్ములకు చేయాలని కోరినా వినిపించుకోలేదు. తర్వాత రెండు డాక్యుమెంట్లు చేయాల్సి ఉంటుంది.. ఒక్కో డాక్యుమెంట్కు రూ.11వేల చొప్పున రూ.22 వేలు ఇస్తే చేస్తామని అటెండర్ రమేశ్ ద్వారా శివరాజ్కు చెప్పించారు. అంత ఇచ్చుకోలేనని వేడుకోవడంతో చివరకు రూ.20వేలు ఇవ్వాలని చెప్పడంతో చేసేది లేక వెళ్లిపోయాడు. ఈ క్రమంలో శివరాజ్ 18న హనుమకొండలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించి విషయం తెలిపారు. రెండు రోజులుగా నిఘా వేసిన ఏసీబీ అధికారులు గురువారం మధ్యాహ్నం శివరాజ్ ద్వారా సదరు లంచం డబ్బులు సబ్ రిజిస్ట్రార్.. అటెండర్ రమేశ్ ద్వారా తీసుకున్నాడు. అక్కడే మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా అటెండర్ రమేశ్ను, సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణను పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు సట్ల రాజు, ఎల్.రాజు తదితరులు పాల్గొన్నారు.● గిఫ్ట్ రిజిస్ట్రేషన్కు రూ.20 వేలు డిమాండ్ ● ఘన్పూర్లో లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం -
ఇంటి వద్దకే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు
● ఆర్టీసీ ఆర్ఎం విజయభాను హన్మకొండ: భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు ఇంటివద్దనే అందించనున్నట్లు ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయ భాను తెలిపారు. ఏప్రిల్ 6వ తేదీ భద్రాచలంలో సీతారాముల కల్యాణం జరుగుతుందని తెలిపారు. గురువారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయంలో సీతారాముల కల్యాణ పోస్టర్ను ఆర్ఎం, అధికారులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులకు ఆర్టీసీ లాజిస్టిక్, పార్సిళ్ల ద్వారా తలంబ్రాలు అందించనున్నట్లు వివరించారు. తలంబ్రాల ఒక్కొక్క ప్యాకెట్కు రూ.151 చెల్లించాలన్నారు. ఆర్టీసీ ఆన్లైన్లో, అన్ని బస్టాండ్లోని లాజిస్టిక్స్ సెంటర్లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ల వద్ద గాని బుక్ చేసుకోవచ్చన్నారు. ఉమ్మడి జిల్లా వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వరంగల్–1 డిపో ఎగ్జిక్యూటివ్ ఎస్.రామయ్య (9154 298759), వరంగల్–2 డిపో పి.నరేందర్ (9154298763), హనుమకొండ డిపో సతీశ్ కుమార్(9154298761), జనగామ కె.వినాశ్ (9154298762), వి.శివ కుమార్(9154298764), నర్సంపేట పి.నరేందర్ (9154298763), మహబూబాబాద్ ఎస్. వేలాద్రి (9154298768), తొర్రూరు పి.చైతన్య కుమార్(9154298766), భూపాలపల్లి వి.శివ కుమార్ (915 4298764), వరంగల్ రీజియన్ ఎం. నవత (9154298758, 9398411765)ను సంప్రదించాలని ఆర్ఎం కోరారు. -
తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ – 2025లో వెల్లడి
తలసరి ఆదాయంలో అంతంతే.. 2023–24లోనూ రంగారెడ్డి జిల్లా రూ.10,55,913ల తలసరి ఆదాయంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవగా.. ఉమ్మడి వరంగల్లో ఆరు జిల్లాలు ర్యాంకింగ్లో 12 నుంచి 29 స్థానాల్లో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఫర్ క్యాపిటల్ ఇన్కం పెరిగినా.. రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గతేడాది రూ.2,28,655లతో 15వ స్థానంలో ఉండగా.. ఈసారి రూ.2,57,851కు పెరిగినా 12వ స్థానానికి పరిమితమైంది. గతంలో 19వ స్థానంలో ఉన్న ములుగు ఈసారి రూ.2,49,338లతో 15, రూ.2,44,278లతో వరంగల్ 17, జనగామ రూ.2,33,215లతో 19, మహబూబాబాద్ రూ.2,12,232లతో 29వ స్థానాల్లో నిలవగా, హనుమకొండ జిల్లా రూ.1,99,490లతో 32వ స్థానానికి పడిపోయింది. గతేడాది రూ.1,86,618లతో 31వ స్థానంలో ఉన్న హనుమకొండ ఈసారి తలసరి ఆదాయంలో మరో మెట్టు దిగింది. జిల్లాల వారీగా తలసరి ఆదాయం...( రూ.లలో) జిల్లా 2020–21 2021–22 2022–23 2023–24వరంగల్ అర్బన్ 1,26,594 1,55,055 1,86,618 1,99,490 వరంగల్ రూరల్ 1,65,549 1,95,115 2,20,877 2,44,278 జనగామ 1,66,392 1,86,244 2,21,424 2,33,215 మహబూబాబాద్ 1,44,479 1,79,057 2,00,309 2,12,232 జేఎస్.భూపాలపల్లి 2,03,564 2,34,132 2,28,655 2,57,851 ములుగు 1,55,821 1,75,527 2,15,772 2,44,278 -
నేటినుంచి ‘పది’ పరీక్షలు
మహబూబాబాద్ అర్బన్: పదో తరగతి వార్షిక పరీ క్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నేటి నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. కాగా సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరుగుతాయి. సెంటర్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా 5నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను కూడా పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని డీఈఓ రవీందర్రెడ్డి తెలిపారు. 46 కేంద్రాలు.. పదో తరగతి పరీక్షలు ఉదయం 9:30నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ పరీక్షలు మాత్రం ఉదయం 9:30నుంచి 11గంటల వరకు జరుగుతాయి. కాగా రోజు విడి చి మరుసటి రోజు పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లాలో 46 పరీక్ష కేంద్రాల్లో రెగ్యులర్ విద్యార్థులు 8,194 మంది,ప్రైవేట్ విద్యార్థులు 120మంది పరీక్షలు రా యనున్నారు. 470మంది ఇన్విజిలేటర్లు విధులు ని ర్వర్తిస్తారని అధికారులు తెలిపారు. విద్యార్థులు పరీ క్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని సూచించారు.అన్ని పరీక్ష కేంద్రాలకు సీఎస్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లను నియమించారు. వారు నిర్వర్తించాల్సిన విధులపై ప్రత్యేక సలహాలు, సూచనలు ఇచ్చారు. వసతుల కల్పన.. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్స్, విద్యుత్, విద్యార్థుల కోసం బల్లలు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే ప్రాథమిక చికిత్స కోసం కేంద్రాల వద్ద ఏఎన్ఎంలు అందుబాటులో ఉంటారు. ప్రాథమిక చికిత్స చేసి మందులు అందజేస్తారు. కాగా అధికారులు, విద్యార్థులు సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లొద్దని అధికారులు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా విద్యార్థులు చెప్పులు మాత్రమే ధరించి పరీక్షలకు హాజరుకావాలని సూచించారు. మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన, ప్రోత్సహించిన వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామన్నారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు... జిల్లాలోని సమస్యాత్మకమైన దంతాలపల్లి, తొర్రూరు, గార్ల సెంటర్ల వద్ద రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అందుకు ఉపాధ్యాయులు సక్రమంగా విధులు నిర్వహించాలన్నారు. జిల్లాలో సిట్టింగ్, ఫ్లయింగ్, రూట్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. పరీక్షల వివరాలు రెగ్యులర్ విద్యార్థులు 8,194 మంది ప్రైవేట్ విద్యార్థులు 120 మంది పరీక్ష కేంద్రాలు 46 ఇన్విజిలేటర్లు 470 మందిఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు జిల్లాలో 46 పరీక్ష కేంద్రాలు సెంటర్ల వద్ద 163–బీఎన్ఎస్ఎస్ సెక్షన్ అమలు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధం‘పది’ విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం నెహ్రూసెంటర్: జిల్లాలో నేటినుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు రాసే విద్యార్థులు కేంద్రాల వద్దకు పల్లె వెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని మానుకోట ఆర్టీసీ డీఎం శివప్రసాద్ గురువారం తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా విద్యార్థినులకు ఉచిత ప్రయాణం, బాలురకు చెల్లుబాటు అయ్యే బస్పాసు ఉండి హాల్ టికెట్ చూపితే రూటుతో సంబంధం లేకుండా బస్సుల్లో ప్రయాణించవ్చని చెప్పారు. బాలురు బస్పాసు ఉండి ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కినట్లయితే కాంబినేషన్ టికెట్ ఇచ్చి అనుమతించబడుతుందని, పాసు లేని వారు టికెట్ తీసుకోవాలని సూచించారు. -
విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలి
కేయూ క్యాంపస్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంజనీరింగ్ విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వి. రామచంద్రం అన్నారు. గురువారం మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో క్యాంపస్లోని ఆడిటోరియంలో ‘రూబిజెస్ట్– 2025’ ఉత్సవాలు నిర్వహిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రిజిస్ట్రార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం కూడా ముఖ్యమన్నారు. తమ లక్ష్యాలు నెరవేరాలంటే కష్టపడి చదువుకోవాలన్నారు. రూబిజెస్ట్ కార్యక్రమం ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థుల్లో టెక్నికల్ ఈవెంట్స్లో ప్రతిభ వెలుగులోకి వస్తుందన్నారు. వ్యోమగామి సునీతా విలియమ్స్లా ధైర్యం, ఆత్మవిశ్వాసం అందిపుచ్చుకొని ఇంజనీరింగ్ విద్యలో రాణించాలన్నారు. అకడమిక్ కోఆర్డినేటర్ వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ ‘రూబిజెస్ట్– 2025’ ఉత్సవాలకు వివిధ కళాశాలల విద్యార్థులు తమ ఈవెంట్స్కు సంబంధించిన ప్రాజెక్టుల డెమోల ద్వారా ప్రతిభ చూపొచ్చన్నారు. ఉత్సవాల కన్వీనర్ సాయితరుణ్.. టెక్నికల్ ఫేస్ అండ్ కల్చరల్ ఫెస్ట్లో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల వివరాలు తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం -
వరంగల్ మామిడికి ప్రత్యేక గుర్తింపు
వరంగల్: వరంగల్ పండ్ల మార్కెట్ నుంచి ఎగుమతి అయ్యే మామిడికి దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం వరంగల్ ఏనుమాముల మార్కెట్ పరిధిలో గల ముసలమ్మ కుంటలో ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్ను వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్.నాగరాజు, వరంగల్ కలెక్టర్ సత్యశారదతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని రైతు సంక్షేమ ప్రభుత్వం ప్రతీ అన్నదాత అభివృద్ధి, సంక్షేమం కోసమే కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే వరంగల్ మార్కెట్ నుంచి ఎగుమతి అయ్యే మామిడికి దేశ వ్యాప్తంగా ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో సంప్రదాయ(ఆర్గానిక్)పద్ధతిలో సాగు చేసే పండ్లను విక్రయించేందుకు వ్యాపారులు ముందుకు రావాలన్నారు. మామిడి మార్కెట్లో మౌలిక వసతుల ఏర్పాటుకు రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు. ఈ నిధులతో మార్కెట్ రోడ్డు అభివృద్ధి చేయిస్తామని హామీ ఇచ్చారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్నాగరాజు మాట్లాడుతూ మార్కెట్లో టాయిలెట్లు నిర్మాణానికి నియోజకవర్గ నిధుల నుంచి రూ.10 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో అదనవు కలెక్టర్ సంధ్యారాణి, జేడీఎం ఉప్పుల శ్రీనివాస్, డీడీఎం పద్మావతి, డీఎంఓ సురేఖ, మార్కెట్ కార్యదర్శి జి.రెడ్డి, హార్టికల్చర్ అధికారి సంగీతలక్ష్మి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీందర్రెడ్డి, ఫ్రూట్ మర్చంట్ అసోసియే షన్ అధ్యక్షుడు వెల్ది సాంబయ్య, కార్పొరేటర్లు తూర్పాటి సులోచన, అనిల్కుమార్, స్థానిక నాయకుడు ఇంతియాజ్, ప్రజాప్రతినిధులు, ట్రేడర్స్, రైతులు తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారతకు ప్రజా ప్రభుత్వం కృషి.. మహిళా సాధికారతకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం వరంగల్ దేశాయిపేటలో దుర్గాబాయి మహిళాశిశు వికాస కేంద్రం ఆధ్వర్యంలో నిర్మించిన ప్రభుత్వ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ను ప్రారంభించారు. 9,462 స్వయం సహాయక బృందాలకు రూ.20 కోట్ల 84 లక్షల 73 వేల బ్యాంక్ లింకేజీ చెక్ను అందజేశారు. అనంతరం వరంగల్, ఖిలావరంగల్ మండలాల పరిధిలోని 457మంది కుటుంబాలకు రూ. 4 కోట్ల 87 లక్షల 56 వేల 492 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి సురేఖ, ఎమ్మెల్యే నాగారాజు, కలెక్టర్ సత్యశారద అందజేశారు. రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ ముసలమ్మకుంటలో మామిడి మార్కెట్ ప్రారంభం మామిడి క్వింటా రూ.11.220 వరంగల్ ఏనుమాముల పరిధిలోని ముసలమ్మకుంటలో ఏర్పాటు చేసిన మామిడి మార్కెట్లో గురువారం తొలిసారి పండ్ల వ్యాపారస్తుల సంఘం అధ్యక్షుడు వెల్ది సాంబయ్య వేలం నిర్వహించారు. ఈ వేలంలో టన్ను మామిడి గరిష్టంగా రూ.లక్షా 22వేల ధర పలింది. క్వింటాకు రూ.11,220కి కొనుగోలు చేశారు. -
గుంపులుగా ఉండొద్దు : ఎస్పీ సుధీర్రాంనాథ్ కేకన్
పదో తరగతి పరీక్ష కేంద్రాలకు 500 మీటర్ల దూ రం వరకు ఇద్దరికి మించి గుంపులుగా ఉండొద్దని ఎస్పీ సుధీర్ రాంనాథ్కేకన్ సూచించారు. కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైకులు, డీజేలతో ఊరేగింపులు, ధర్నాలు, ప్రచారం చేయవద్దన్నారు. పరీక్ష జరుగుతున్న సమయంలో కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయాలని పేర్కొన్నారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద 163–బీఎన్ఎస్ఎస్ సెక్షన్ అమలో ఉంటుందన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు పట్టిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెట్రోలింగ్ ఉంటుందని, నింబధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
ఆర్థికాభివృద్ధివైపు అడుగులు పడట్లే!
జీడీడీపీలో వెనుకబడిన ఓరుగల్లు..అట్టడుగున ఆరు జిల్లాలు.. ● తలసరి ఆదాయంలో పుంజుకున్న భూపాలపల్లి ● 15 నుంచి 12 స్థానానికి పెరిగిన వైనం.. గతంతో పోలిస్తే పరవాలేదు ● అడవుల విస్తీర్ణంలో ములుగు ఫస్ట్.. మూడో స్థానంలో భూపాలపల్లి ● తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ – 2025లో వెల్లడి -
విద్యార్థుల ఇక్కట్లు..
శుక్రవారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2025– IIలోuటాయిలెట్స్ అందుబాటులో లేక అవస్థలు ● స్కూల్కు దూరంగా వెళ్లి మూత్రవిసర్జన ● మన ఊరు–మన బడి, అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పెండింగ్ ● బిల్లులు రాక పూర్తి చేయని కాంట్రాక్టర్లు సాక్షి, మహబూబాబాద్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అనుగుణంగా మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవు. ఉన్నచోట నీటి వసతి లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం హయాంలో ప్రవేశపెట్టిన మన ఊరు–మన బడి కార్యక్రమం, ప్రస్తుత సర్కారు ప్రవేశపెట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు ముందుకు సాగడంలేదు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పూర్తి చేసినా.. అధికారులు కావాలనే బిల్లులు చేయడంలేదని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. దీంతో జిల్లాలోని పలు మండలాల్లో 145 పనులు చేపట్టినప్పటికీ పాఠశాలలకు అప్పగించలేదు. ఆరుబయటే మూత్రవిసర్జన.. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని బ్రహ్మంగారితండా ప్రాథమిక పాఠశాలలో 18 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఈ పాఠశాలకు భవనం లేదు. దీంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టే మహిళ ఇంటి ఆవరణలో బోధన చేపడుతున్నారు. దీంతో మూత్రశాల లేకపోవడం వల్ల ప్రతీరోజు తండా శివారులోని ఎస్సారెస్పీ ఉపకాల్వ వైపు వెళ్లి విద్యార్థులు మూత్ర విసర్జన చేసి వస్తున్నారు.న్యూస్రీల్ -
పైపులైన్ల నిర్మాణం మరిచారు..
నెల్లికుదురు మండలం పార్వతమ్మగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో 110 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 54 మంది బాలికలు, 56 మంది బాలురు ఉన్నారు. అయితే పాఠశాలలో మరుగుదొడ్లు, మూత్రశాలలు సరిపోవడం లేదు. దీంతో అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల్లో భాగంగా స్కూల్కు మంజూరైన నిధుల నుంచి బాలికల కోసం టాయిలెట్లు నిర్మించారు. అయితే పనులు పూర్తి చేసినట్లు అధికారులు రికార్డులు చూపిస్తున్నా.. పైపులైన్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఇప్పటి వరకు వినియోగంలోకి రాలేదు. దీంతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. -
పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్..
దంతాలపల్లి మండలంలోని పెద్దముప్పారం జిల్లా పరిషత్ పాఠశాలలో 70 మంది విద్యార్థులకు సరిపడా మూత్రశాలలు లేవు. దీంతో గత ప్రభుత్వం మన ఊరు–మన బడి కార్యక్రమంలో పాఠశాలను ఎంపిక చేసింది. నిధులు మంజూరు చేసినట్లు అధికారులు ప్రకటించారు. పనులు ప్రారంభించిన తర్వాత బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ మధ్యలోనే నిలిపివేశాడు. దీంతో విద్యార్థులు పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలలోని మూత్రశాలకు వెళ్తున్నారు. అక్కడ ఉన్న 65 మంది విద్యార్థులకు తోడు హైస్కూల్ విద్యార్థులు రావడంతో మూత్ర విసర్జనకు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. -
మా బంగారం ఇప్పించండి..
రాయపర్తి: బ్యాంకులో తామెంత బంగారం తనా ఖా పెట్టామో అంతే ఇప్పించాలంటూ డిమాండ్ చే స్తూ ఖతాదారులు గురువారం రాయపర్తి మండలకేంద్రంలోని ఎస్బీఐ ఎదుట ఆందోళన చేపట్టారు. గత సంవత్సరం నవంబర్ 19వ తేదీన రాయపర్తి ఎస్బీఐలో ఖాతాదారుల 19 కిలో బంగారం చోరీకి గురైన విషయం విధితమే. ఈ ఘటనలో బ్యాంకు అధికారులు సదరు బంగారంలో తరుగు తీసి డ బ్బులు చెల్లిస్తామని కొంతకాలంగా ఖాతాదారులకు చెబుతున్నారు. అయితే ఖాతాదారులు మాత్రం బ్యాంకులో తామెంత బంగారం తనాఖా పెట్టామో అంతే ఇవ్వాలని, లేనిపక్షంలో తరుగు తీయకుండా డబ్బు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపి వారి నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని, మరో రెండు రోజుల్లో సమాచారం అందజేస్తానమ ని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఖాతాదారులు వెనుదిరిగారు. కాగా, బ్యాంకులో ఎలాంటి గొడవలు జరగకుండా ఎస్సై శ్రవణ్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఖాతాదారుల డిమాండ్ రాయపర్తి ఎస్బీఐ ఎదుట ఆందోళన -
అత్యుత్తమ ఫలితాలు సాధించాలి
మరిపెడ రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా రాష్ట్రస్థాయిలో ముందు వరుసలో ఉండాలని కలెక్టర్ అద్వైత్కుమా ర్ సింగ్ విద్యార్థులకు సూచించారు. మరిపెడ మండలం గిరిపురం క్రాస్ రోడ్డులోని కేజీబీవీ విద్యాలయాన్ని గురువారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశా రు. వసతి గృహంలోని కిచెన్ షెడ్, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి గృహాల్లో తగిన సౌకర్యాలు కల్పిస్తూ రుచికరమైన ఆహారం అందించాలని సూ చించారు. మెనూ పక్కాగా పాటించాలన్నారు. రాష్ట్రస్థాయిలో జిల్లా అత్తుత్తమ ఫలితాలు సాధించడానికి కొన్ని రోజుల నుంచి ప్రణాళిక ప్రకారం విద్యాశాఖ ముందుకు వెళ్తుందన్నారు. పీహెచ్సీ తనిఖీ మరిపెడ: మరిపెడలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ తనిఖీ చేశారు. రికార్డులు, ఇన్పేషెంట్లు, అవుట్పేషెంట్ల వివరాలు తెలుసుకున్నారు. పరిసరాలను పరిశీలించి మాట్లాడారు. ప్రస్తుత వాతవరణ పరిస్థితుల దృష్ట్యా ఆస్పత్రుల్లో తగిన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలన్నారు. ఓటరు నమోదుపై దృష్టి పెట్టాలి మహబూబాబాద్: ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్కుమార్సింగ్ ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ స మావేశ మందిరంలో ఓటరు నమోదు, ఇతర ఎన్ని కల అంశాలపై అన్ని రాజకీయ పార్టీల ప్రతి నిధులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఒకే కుటుంబ సభ్యులు ఒకే చోట ఓటు హక్కు వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి, సంబంధిత అధికారులు, నాయకులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ -
ముగిసిన ఇంటర్ పరీక్షలు
మహబూబాబాద్ అర్బన్: ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు డీఐఈఓ మదార్ గౌడ్ గురువారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జనరల్ విద్యార్థులు 3,184 మందికి 3107మంది హాజరయ్యారన్నారు. 77మంది గైర్హాజరైనట్లు చెప్పారు. ఒకేషనల్ కోర్సులో 713 మందికి 674 మంది విద్యార్థులు హాజరై, 41 మంది గైర్హాజరయ్యారన్నారు. జిల్లాలో పరీక్ష సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించినందుకు ఎస్పీకి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ, విద్యుత్ సరఫరా చేసిన విద్యుత్శాఖ అధికారికి కృతజ్ఞతలు తెలిపారు. ‘యువ ఉత్సవ్’తో నైపుణ్యాల వెలికితీతమహబూబాబాద్ అర్బన్: విద్యార్థులు, యువకుల్లో దాగిఉన్న నైపుణ్యాలను వెలికితీసే వేదిక యువ ఉత్సవ్ అని ఏఆర్ డీఎస్పీ పి.శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం నెహ్రూ యువకేంద్రం మై భారత్ ఆధ్వర్యంలో యువ ఉత్సవ్ నిర్వహించారు. ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. యువతను అన్ని రంగాల్లో ప్రొత్సహించడానికి ఇలాంటి వేదికలు చాలా అవసరమన్నారు. సీడబ్ల్యూసీ చైర్పర్సన్ నాగవాణి, నెహ్రూ యువకేంద్రం మైభారత్ డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ మాట్లాడారు. నృత్యం, వక్తృత్వ, చిత్రలేఖనం వంటి వివిధ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి డీఈఓ రవీందర్రెడ్డి, ఇంజనీరింగ్ కళాశాల వీసీ బలరాం నాయక్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. పరీక్ష కేంద్రాల సందర్శనకేసముద్రం: కేసముద్రం, ఇనుగుర్తి మండలాల్లోని పదో తరగతి పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్ లెనిన్ టొప్పో గురువారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు, సీసీ కెమెరాల ఏర్పాటు, తాగునీరు, విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని, 144 సెక్షన్ విధించినట్లు ఆయన తెలిపారు. తహసీల్దార్ దామోదర్, ఎంఈఓ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. నేడు ‘డయల్ యువర్ డీఎం’తొర్రూరు: తొర్రూరు బస్ డిపో పరిధిలో శుక్రవారం ఉదయం 11నుంచి 12గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఎం పద్మావతి తెలిపారు. వివిధ మార్గాల్లో కొత్త బస్సు సర్వీసుల కేటాయింపు, వేళల్లో మార్పులు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రయాణ ప్రాంగణాల్లో సమస్యలు, సంస్థ ఉన్నతికి చేపట్టాల్సిన చర్యలపై ప్రజలు నేరుగా తమ సూచనలు, సలహాలు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఆసక్తిగలవారు 99592 26053 నంబర్కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి గార్ల: ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగంచేసుకోవాలని డీఎంహెచ్ఓ మురళీధర్రావు అన్నారు. గురువారం గార్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో సంపూర్ణ సురక్ష కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎండల తీవ్రత పెరుగుతుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రైతులు, కూలీలు ఉదయాన్నే పనులు ముగించుకొని ఇళ్లకు చేరుకోవాలన్నారు. ఎవరికై నా వడదెబ్బ తగిలితే వెంటనే స్థానిక వైద్యసిబ్బంది, వైద్యులను సంప్రదించి వైద్యసేవలు పొందాలన్నా రు. వైద్యశిబిరంలో 184 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. -
మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి
● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డితొర్రూరు: తొర్రూ రు మున్సిపాలిటీని అభివృద్ధి చేయడంతో పాటు అన్ని వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తెలిపారు. పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని గురువారం ఎమ్మెల్యే పరిశీలించారు. తాగునీటి ఎద్దడి నివారణకు అమృత్ పథకం కింద హరిపిరాల రోడ్డులో కొనసాగుతున్న పైపులైన్ పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం మినీ ట్యాంక్బండ్ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా వార్డుల్లో అసంపూర్తిగా మిగిలిపోయిన డ్రెయినేజీలు, సీసీ రోడ్లను పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తొర్రూరు మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి నిదుల కోసం టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ను కలిసి విన్నవించినట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీలో అంతర్గత రహదారులు, డ్రెయినేజీ వ్యవస్థ మెరుగుదల, తాగునీటి సరఫరా, స్మార్ట్ లైటింగ్ వంటి సదుపాయాల విస్తరణ చేపడుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, నాయకులు జినుగ సురేందర్రెడ్డి, గంజి విజయ్పాల్రెడ్డి, సోమ రాజశేఖర్, తూనం శ్రావణ్, సురేశ్, మహేశ్, కిషన్ పాల్గొన్నారు. -
ఇల్లెందు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం
బయ్యారం: ములుగు తరహాలో ఇల్లెందు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువారం మండలంలోని పలు గ్రామాల్లో రూ.9.90కోట్ల నిధులతో నిర్మించనున్న రహదారులు, బ్రిడ్జి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాజీవ్ యువశక్తి పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ప్రతిపక్ష బీఆర్ఎస్కు పేదలంటే అభిమానం లేదని, తమ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో పేదల కోసం 3500 ఇళ్లు నిర్మించనుందన్నారు. పేదలకు ఉచిత కరెంట్ ఇస్తున్న ఘనత సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రాష్ట్రంలో మహిళలకు బస్సులు అందజేశామని, రాబోయే రోజుల్లో మిల్లులు, గోదాముల నిర్వహణ బాధ్యత మహిళలకే అప్పగించనున్నట్లు తెలిపారు. బయ్యారం మండలంలోని రైతుల రెండు పంటలకు అవసరమైన నీటిని పాకాల చెరువు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అందించేందుకు త్వరలో నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి సీఎం రేవంత్రెడ్డిని కలిసి వివరిస్తామన్నారు. అనంతరం బయ్యారం పెద్ద చెరువును మంత్రి సీతక్క పరిశీలించారు. శిలాఫలకాలపై కానరాని ఎమ్మెల్సీ పేరు.. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన శిలాఫలకాలపై పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కార్యక్రమంలో ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్,ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఉన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం కొత్తగూడ: ప్రజా సంక్షేమమే లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. మంత్రి ధనసరి సీతక్క -
ఆర్థికాభివృద్ధివైపు అడుగులు పడట్లే!
జీడీడీపీలో వెనుకబడిన ఓరుగల్లు.. అట్టడుగున ఆరు జిల్లాలు.. సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ సామాజిక–ఆర్థిక దృక్పథ నివేదిక – 2025 గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి వరంగల్ జిల్లాలు ఈసారి కూడా వెనుకబడ్డాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు 32, 33వ స్థానంతో అట్టడుగున నిలిచాయి. ఈ జిల్లాల వృద్ధి రేటు రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడి ఉంది. 2022–23 సంవత్సరాలకు ప్రస్తుత ధరల్లో జీడీడీపీ విలువ పెరుగుదల కనిపించినప్పటికీ రాష్ట్ర స్థాయిలో మిగతా జిల్లాలతో పోలిస్తే చాలా వెనుకబడ్డాయి. జాతీయ ధరల సూచీ ప్రకారం గణించే తలసరి ఆదాయం విషయంలో గతంతో పోలిస్తే కొంత పరవాలేదు. జయశంకర్ భూపాలపల్లి 15 స్థానం నుంచి 12 స్థానానికి చేరింది. అడవుల విస్తీర్ణంలో ములుగు మొదటి, భూపాలపల్లి మూడో స్థానాల్లో నిలిచాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిదినాలను కల్పించడంలో 9 నుంచి 29 స్థానాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలు నిలిచాయి. అయితే ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు ద్వారా నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి పథంలో సాగుతున్నట్లు పేర్కొన్నారు. మౌలిక వసతులు కల్పన, విద్యుత్ కనెక్షన్లు, మహిళా, శిశు సంక్షేమంలో ప్రగతి సాధించినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా పరిస్థితులపై రాష్ట్ర ఆర్థిక, గణాంకశాఖ విడుదల చేసిన ‘తెలంగాణ సామాజిక–ఆర్థిక దృక్పథ నివేదిక – 2025’ గణాంకాల ఆధారంగా ప్రత్యేక కథనం. జిల్లాల వారీగా మొత్తం జనాభా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇలా.. జిల్లా మొత్తం జనాభా గ్రామీణం పట్టణ/నగరం హనుమకొండ 10,62,247 4,98,618 5,63,629 వరంగల్ 7,37,148 5,10,057 2,27,091 జనగామ 5,34,991 4,63,634 71,357 జేఎస్.భూపాలపల్లి 4,16,763 3,74,376 42,387 మహబూబాబాద్ 7,74,549 6,98,173 76,376 ములుగు 2,94,671 2,83,178 11,493 -
ఖనిజ వనరుల ఆదాయంలో ములుగు..
ఖనిజ వనరుల ద్వారా తెలంగాణకు ఆదాయ లక్ష్యం రూ.1,575 కోట్లకు రూ.1,176 కోట్లు సమకూరగా, ములుగు జిల్లాలో రూ.34.94 కోట్లకు రూ.33.86 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. ఆ తర్వాత మహబూబాద్ జిల్లా రూ.25.03 కోట్లకు రూ.22.15 కోట్లతో పదో స్థానంలో ఉంది. జేఎస్ భూపాలపల్లి జిల్లా 11, హనుమకొండ రూ.41.97కోట్ల లక్ష్యానికి రూ.25.84 కోట్లు సాధించి 24వ స్థానంలో ఉన్నాయి. రూ.15.44 కోట్లకు గాను రూ.8.62 కోట్లతో వరంగల్ 27, జనగామ రూ.8.25 కోట్లకు రూ.4.55 కోట్లతో 28వ స్థానాల్లో నిలిచాయి. -
ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా
వరంగల్: కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నిర్మాణంలో భూములు కోల్పోయి నష్టపరిహారం రాని కొంతమంది రైతులు హనుమకొండలోని వరంగల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. మెగా టెక్స్టైల్ పార్కులో తమ భూములను తీసుకున్న రెవెన్యూ అధికారులు నష్టపరిహారం ఇప్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. తమ బాధను ఆర్డీఓ, కలెక్టర్ తెలిపేందుకు వచ్చామని, ఇప్పటిౖకై నా పరిహారాన్ని వెంటనే 15 రోజుల్లో చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. పురుగుల మందు డబ్బాతో వచ్చి ధర్నా చేయడంతో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కార్యక్రమంలో భూనిర్వాసితుల సంఘం నాయకుడు సముద్రాల యాకస్వామి తదితరులు పాల్గొన్నారు. పురుగుల మందు డబ్బాలతో భూనిర్వాసితుల ఆందోళన టెక్స్టైల్ పార్కులో భూములు కోల్పోయినా పరిహారం ఇవ్వలేదని ఆవేదన -
‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’తో మేలు
హన్మకొండ: ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ ద్వారా అనేక ప్రయోజనాలున్నాయని, ఇది దేశ భవిష్యత్ను మార్చే నిర్ణయమని బీజేపీ నేత, న్యాయవాది రావు అమరేందర్రెడ్డి అన్నారు. హనుమకొండ దీన్దయాళ్ నగర్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక – బీజేపీ దృష్టి కోణం’ అనే అంశంపై జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి అధ్యక్షతన బుధవారం వర్క్షాపు జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రతీ సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక ఎన్నిక జరుగుతుండడంతో అభివృద్ధికి ఆటంకం కలుగుతోందన్నారు. ఈక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవిద్ చైర్మన్గా, హోంమంత్రి అమిత్ షా, గులాంనబీ ఆజాద్, కశ్యప్ ఇలా అన్ని వర్గాల వ్యక్తులతో కమిటీ వేశారని గుర్తుచేశారు. ఆ కమిటీ నివేదిక ప్రకారం దేశంలో ఒకేసారి రాష్ట్ర, కేంద్ర ఎన్నికలు నిర్వహించి మూడు నెలల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి తర్వాత నాలుగున్నరేళ్ల పాటు ఎన్నికలు లేకుండా కేవలం పాలనపై దృష్టి కేంద్రీకరించవచ్చన్నారు. వర్క్షాపులో మాజీ మేయర్ డాక్టర్ టి.రాజేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, బీజేపీ హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, నాయకులు చాడ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ పగడాల కాళీప్రసాద్, దొంతి దేవేందర్రెడ్డి, కె.సంపత్రెడ్డి, సండ్ర మధు పాల్గొన్నారు. బీజేపీ నేత, న్యాయవాది రావు అమరేందర్ రెడ్డి -
బడ్జెట్పై సమాచారంతో సిద్ధంగా ఉండాలి..
● సమీక్షలో మేయర్, కమిషనర్ వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై ప్రతీ సభ్యుడు అడిగే ప్రశ్నలకు బాధ్యతాయుతంగా సమాధానాలు అందించాల్సిన బాధ్యత మీపై ఉందని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను హెచ్చరించారు. బుధవారం బల్దియా కార్యాలయంలో గురువారం 2025–26 బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మేయర్, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే వింగ్ అధికారులతో సమావేశమై దిశా నిర్దేశం చేశారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. అధికారులు ఆదాయ, వ్యయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ జోనా, సెక్రటరీ అలివేలు, బయాలజిస్ట్ మాధవరెడ్డి, ఇన్చార్జ్ సీపీ రవీందర్ రాడేకర్, హెచ్ఓలు రమేశ్, లక్ష్మారెడ్డి ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్ ఈఈలు తదితరులు పాల్గొన్నారు.గేట్లో రేవంత్కుమార్కు ఫస్ట్ ర్యాంక్వరంగల్: గేట్–2025 (అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగం)లో వరంగల్ దేశాయిపేటకు చెందిన కీర్తి రేవంత్కుమార్ జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. గేట్ పరీక్షలో 100 మార్కులకు 74.67 మార్కులు సాధించి మొదటి ర్యాంకు పొందాడు. రేవంత్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను స్థానికులు అభినందించారు. -
దేవాదుల మోటార్లు నడిపించకుండానే పలాయనం
హన్మకొండ: దేవన్నపేటలో మోటార్లు నడిపించిన తర్వాత వరంగల్ నుంచి వెళ్తామని చెప్పిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెల్లారేసరికి పలాయనం చిత్తగించారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దుయ్యబట్టారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మంగళవారం హసన్పర్తి మండలం దేవన్నపేట పంప్ హౌజ్ వద్ద మంత్రులు పూజలు చేసి మోటార్లు ఆన్ చేసేందుకు ప్రయత్నించగా స్టార్ట్ కాలేదన్నారు. దీంతో మంత్రులు అధికారులపై మండిపడ్డారని ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు మాజీ సీఎం కేసీఆర్ను విమర్శించారన్నారు. దేవాదుల మెయింటెన్స్కు కాంట్రాక్టరకు ఏటా రూ.7 కోట్లు ఖర్చు అవుతుందని, ఇందులో 20 శాతం కమీషన్ ఇవ్వనందునే సర్కారు పెద్దలు బిల్లులు విడుదల చేయలేదని ఆరోపించారు. కాంట్రాక్టర్.. సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడంతో సమ్మె చేశారని, దీంతో మెయింటెన్స్ చేయలేదని వి వరించారు. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేసిన కడియం శ్రీహరి పార్టీలు మారడం, బిడ్డ ఎంపీ సీటు మీద దృష్టి సారించాడే తప్ప రైతుల ప్రయోజనాలు పట్టించుకోలేదన్నారు. త్వరలో బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు దేవాదుల పంపు హౌజ్ పర్యటన చేపడుతామన్నారు. సమావేశంలో టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, బీఆర్ఎస్ నా యకులు తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, పులి రజినీకాంత్, జోరిక రమేశ్, సల్వాజీ రవీందర్ రావు, నయీమొద్దీన్, బండి రజినీకుమార్, చాగంటి రమేశ్, పోలపల్లి రామ్మూర్తి, ఖలీల్, శ్రీకాంత్చారి, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి -
అద్దం లేక అపాయం!
వాహనాలకు సైడ్ మిర్రర్ లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు ఈ ఘటనల్లో ద్విచక్రవాహనాలే ఎక్కువ నిర్లక్ష్యం.. అతివేగమే ప్రధాన కారణాలు నగరంలో పెరుగుతున్న యాక్సిడెంట్లు బైక్ అద్దాలపై అవగాహన పెంచాలంటున్న ప్రజలు..వాహనాలకు సైడ్ మిర్రర్లు తప్పనిసరి వాహనాలకు సైడ్ మిర్రర్ ఉంటే చాలా వరకు ప్రమాదాలు తగ్గుతాయి. నగరంలో చాలా ఘటనల్లో వెనుక వచ్చే వాహనాలు చూసుకోక పక్కకు తిప్పడం వల్లే ప్రమాదాలు జరిగాయి. ద్విచక్రవాహనాలతో పాటు ఆటోలు, కార్లు సైడ్ మిర్రర్లు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకుంటే ప్రమాదాలు నివారించవచ్చు. అంతేకాకుండా హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తే సురక్షితంగా గమ్యం చేరుకోవచ్చు. – శోభన్బాబు ఇన్చార్జ్ ఆర్టీఓ వరంగల్ ఖిలా వరంగల్ : ఏ వాహనానికైనా సైడ్ మిర్రర్ తప్పనిసరి.. వెనుక నుంచి వస్తున్న వాహనాలు కనిపించాలంటే అద్దం కచ్చితంగా ఉండాలి. అప్పు డే రోడ్డు ప్రమదాలు జరగవు. అయితే చాలా మంది అద్దం లేకుంటే ఏమవుతుందిలే అనుకుంటున్నారు. చిన్న పొరపాటే ప్రాణాల మీదికి తెస్తోంది. కేవలం అద్దం లేకపోవడంతోనే ఇటీవల పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. బైక్ అందం పాడు చేస్తుందని కొంత మంది అద్దాలు తీసేస్తున్నారు. ఫలితంగా వెనుక నుంచి వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాల సంభవిస్తున్నాయి. వీరిలో 80 శాతం మందికి సైడ్ మిర్రర్ లేకపోవడంతో అపరాధ రుసుం వేసినా మారడం లేదు. తమ వాహనాలకు అద్దం ఏర్పాటు చేసుకోవడం లేదు. రోజు ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు.. వరంగల్ జిల్లాతోపాటు నగరంలో రోజు ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిండు ప్రాణాలు గాల్లో కలుస్తూనే ఉన్నాయి. దీనికి ప్రధానం కారణం సైడ్ మిర్రర్ లేకపోవడమేనని తెలుస్తోంది. యువత బైక్కు అద్దాలు తీసి వాహనంపై అతివేగంగా ర్యాష్ డ్రైవింగ్, మద్యం మత్తు, సెల్ఫోన్ డ్రైవింగ్ కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. తొందరపాటు ఎందుకు? యువతలో హడావిడిగా బయల్దేరే వారే ఎక్కువ ఉంటున్నారు. సమయం మించి పోతుందనే ధోరణిలో వేగంగా వెళ్తుంటారు. అందుకే ప్రయాణంపై ముందస్తు ప్రణాళిక తప్పనిసరిగా ఉండాలి. హెల్మెట్తో లాభం.. ప్రమాదాల సమయంలో హెల్మెట్ వాహనదారులకు రక్షణ కవచంగా నిలుస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగి బైక్ నుంచి కిందపడిన సందర్భంలో తలకు గాయాలవ్వకుండా హెల్మెట్ నిలువరిస్తుంది. ద్విచక్రవాహనంపై ప్రయాణం చేస్తున్న సమయంలో దుమ్ము, ఎండ నుంచి హెల్మెట్ రక్షణగా ఉంటుంది. వేగం కన్నా ప్రాణం ముఖ్యమనే అంశం ప్రతీ వాహనదారుడు గుర్తుంచుకోవాలి. ర్యాష్ డ్రైవింగ్తో ప్రాణాలకు ముప్పు బాలురు, యువకులు డ్రైవింగ్ మీద అవగాహన లేక మితిమీరిన వేగంతో వాహనాలు నడపడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. యువత ద్విచక్రవాహనాలు నడిపే సమయంలో స్పీడ్ కంట్రోల్ చేసి నడిపితే క్షేమం. 18 నుంచి 20 సంవత్సరాల్లోపు యువకులు ఎక్కువగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దు యువత మద్యం తాగి మాకేం కాదులే అని వాహనాలు నడుపుతోంది. భారీ వాహనాలను వెనుక నుంచి అనుసరించడం, ఎదుటి వాహనాలను పట్టించుకోకుండా ఓవర్టేక్ చేయడం ప్రమాదకరం. వి న్యాసాలు చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. నిర్లక్ష్యం వద్దు.. రోడ్డుపై అప్పటి వరకు వరకు నెమ్మదిగా వెళ్తున్న వారు కూడా వెనుక నుంచి క్రాస్ చేసిన వారిని ఓవర్టేక్ చేయాలని దూసుకెళ్తారు. ఇందుకోసం వాహన వేగం పెంచుతున్నారు. ఇలాంటివి వద్దు. శిక్షణ లేకుండా వద్దు.. అత్యధిక శాతం మంది సరైన శిక్షణ లేకుండానే బైక్ నడుపుతున్నారు. ఇంటి వద్దకు వచ్చిన బైక్ను సరదాగా బయటకు తీయడం వంటివి చేసి తమకు బైక్ నడపడం వచ్చిందనే భ్రమలో రోడ్డు ఎక్కుతున్నారు. ఈవిషయంలో తల్లిదండ్రులే అప్రమత్తంగా ఉండాలి. సిగ్నల్స్ చూసుకోండి.. రహదారులపై వాహనాల సంఖ్య భారీగా పెరిగాయి. దీంతో కూడళ్ల వద్ద వాటిని నియంత్రించేందుకు సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వచ్చే వారికి ఈ విషయంపై సరైన అవగాహన ఉండడం లేదు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిపై అందరికీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. -
ఉపాధ్యాయుడికి నోటీస్ జారీ
తొర్రూరు రూరల్: మండలంలోని గుడిబండతండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుడు ఎస్. వినీల్కు సంజాయిషీ నోటీస్జారీ చేసినట్లు ఎంఈఓ మహంకాళి బుచ్చ య్య బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. పాఠశాలల తనిఖీల్లో భాగంగా గుడిబండతండా పాఠశాలను సైతం సందర్శించినట్లు చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పాఠశాలకు ఆలస్యంగా రావడంతో సంజాయిషీ కోరుతూ నోటీస్ జారీ చేసినట్లు చెప్పారు. సంబంధిత ఉపాధ్యాయుడు వినీల్ వెంటనే జిల్లా, మండల విద్యాశాఖ అధికారులకు వివరణ ఇవ్వాలని లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఉత్పాదకతలో ఎంఎస్ఎంఈ పాత్ర కీలకం
హన్మకొండ: స్థూల ఉత్పాదకత, ఉపాధి కల్పనలో సూక్ష్మ, చిన్న, మధ్య, తరహా సంస్థ (ఎంఎస్ఎంఈ) కీలక భూమిక పోషిస్తోందని కామన్ వెల్త్ విజిటింగ్ ఫెల్లో యునైటెడ్ కింగ్డమ్, గ్లోబల్ అసోసియేషన్ ఫర్ ఎంఎస్ఎంఈఎస్ కో ఫౌండర్ ప్రొఫెసర్ హిమాచలం దాస రాజు అన్నారు. హనుమకొండ నయీంనగర్లోని వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాలలో ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ త్రో ఎంఎస్ఎంఈఎస్ అనే అంశంపై జాతీయ సెమినార్ బుధవారం జరిగింది. ఈసందర్భంగా రాజు మాట్లాడుతూ.. దేశ జీడీపీలో 30 శాతం, ఉద్యోగ కల్పనలో 40 శాతం, ఉత్పాదక రంగంలో 45 శాతం మేర సూక్ష్మ, చిన్న, మధ్య, తరహా సంస్థ దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ రాజేందర్, ప్రొఫెసర్ అమరవేణి, డాక్టర్ మహేందర్ కు మార్, వాగ్దేవి కళాశాల అకడమిక్ డైరెక్టర్ వాహినీ దేవి, ప్రిన్సిపాల్ ఎ.శేషాచలం, కాన్ఫరెన్స్ కన్వీనర్లు పి.సుగుణాకర్రెడ్డి, ప్రేమ్కుమార్, కో కన్వీనర్ ఎ.రజిని కుమార్, కోఆర్డినేటర్లు బి.కిశోర్ కుమార్, టి.అ నూష, సీహెచ్.కరుణ, బి.చంద్రకళనాయక్, శాంభవి, డాక్టర్ ఎం.అరవింద తదితరులున్నారు. -
మహారాష్ట్రలో సమ్మయ్య బృందం ప్రదర్శన
దేవరుప్పుల: మహారాష్ట్రలోని సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ నాగ్పూర్ ఆధ్వర్యంలో అమరావతి విశ్వవిద్యాలయంలో బుధవారం తలపెట్టిన లోక్ మాన్య సమరోత్సాహం–2025లో పద్మశ్రీ గ్రహీత గడ్డం సమ్మయ్య బృందం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూకై లాస్ యక్షగాన నాటకం వేసి తెలంగాణ గ్రామీణ ప్రాంత సాంస్కృతిక కళా ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సమ్మయ్యను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందించారు. కార్యక్రమంలో గడ్డం రఘుపతి, శ్రీపతి, సోమరాజు, ప్రభాకర్, ముకుందం, మురళీకృష్ణ, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎంను దూషించిన కేసులో ఒకరి అరెస్ట్
నెల్లికుదురు: జిల్లాలోని ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామానికి చెందిన దర్శనం వెంకటయ్య హైదరాబాద్లో ఇటీవల ఓ యూట్యూబ్ చానల్లో సీఎం రేవంత్రెడ్డిని అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ మాట్లాడిన ఘటనలో అక్కడి సీసీఎస్ పోలీసులు బుధవారం అతడిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఈ మేరకు వెంకటయ్య భార్య దర్శనం లక్ష్మి, తల్లి ఇద్దమ్మ విలేకరులతో మాట్లాడుతూ వెంకటయ్య ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేస్తుండగా పోలీసులు వచ్చి ‘సీఎంను తిట్టినావట’ అంటూ తీసుకెళ్లారని తెలిపారు. వెంకటయ్య బీపీ, షుగర్తో బాధపడుతున్నాడని చెప్పినా పోలీసులు వినకుండా తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. నా భర్తను క్షేమంగా ఇంటి వద్ద వదిలిపెట్టాలని భార్య లక్ష్మి ప్రభుత్వాన్ని కోరింది. నా భర్తను క్షేమంగా వదిలిపెట్టాలి దర్శనం వెంకటయ్య భార్య లక్ష్మి -
బడ్జెట్లో ఉమ్మడి వరంగల్కు నిధుల ప్రతిపాదనలు ఇలా..
బడ్జెట్ కేటాయింపుల్లో ప్రత్యక్షంగా ఉమ్మడి వరంగల్కు ప్రతిపాదించిన నిధుల వివరాలు ఇలా ఉన్నాయి. సాగునీటిరంగం కేటాయింపుల్లో జేఎస్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ నుంచి ఉమ్మడి ఏడు జిల్లాలకు విస్తరించి ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.2,685 కోట్లు ప్రతిపాదించింది. ఇందులో పనుల కంటే పెండింగ్ బిల్లుల చెల్లింపులకే ఎక్కువ ప్రాధాన్యం ఉండే అవకాశం ఉంది. ● ప్రస్తుతం 91 శాతం పనులు పూర్తయి.. భూసేకరణ జరగక అసంపూర్తిగా ఉన్న దేవాదుల ప్రాజెక్టు కోసం రూ.245 కోట్లు ఇచ్చారు. ఏఐబీపీ కింద రెండు పద్దుల్లో మరో రూ.58 కోట్లను పేర్కొన్నారు. ● స్మార్ట్సిటీ పనుల కోసం రూ.179.09 కోట్లు, ఎస్సారెస్పీ స్టేజ్–2కు రూ.25 కోట్లు, కాకతీయ యూనివర్సిటీకి రూ.50 కోట్లు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు రూ.50 కోట్లు కేటాయించారు. మామునూరు వెటర్నరీ సైన్స్ కళాశాలకు రూ.25 కోట్లు, కాళేశ్వరం టూరిజం సర్క్యూట్కు రూ.10 కోట్లు, టీఎస్ స్పోర్ట్స్ స్కూల్స్ కోసం వరంగల్, కరీంనగర్కు కలిపి రూ.41 కోట్లు ప్రతిపాదించారు. ● రామప్ప, పాకాలకు ఐదేసి కోట్ల రూపాయలు, లక్నవరానికి రూ.2 కోట్లు, మల్లూరువాగుకు రూ.కోటి, కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి రూ.2 కోట్లు బడ్జెట్లో ప్రకటించారు. -
ఎమ్మార్టీలో పదోన్నతి ఎప్పుడు?
హన్మకొండ: తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ఎమ్మార్టీ విభాగంలో పదోన్నతి కల్పించడంలో జాప్యం జరుగుతున్నా కొద్దీ.. ఉద్యోగుల్లో ఆందోళన పెరిగిపోతోంది. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధి 16 సర్కిళ్ల (జిల్లా)లో 16 ఎమ్మార్టీ డివిజన్లున్నాయి. ఈడివిజన్లలో అన్ని కేడర్లు కలిపి 285 పోస్టులున్నాయి. ఇందులో 220 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇందులో లైన్మెన్ పోస్టులు 47 ఖాళీగా ఉన్నప్పటికీ పదోన్నతి కల్పించి భర్తీ చేయడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. టీజీ ఎన్పీడీసీఎల్లో ఎమ్మార్టీ విభాగానిది కీలక భూమిక. సబ్ స్టేషన్లు, డీటీఆర్ల నిర్వహణలో వీరి పాత్ర ముఖ్యమైంది. వీటితో పాటు సిటీ మీటర్స్, హెచ్టీ మీటర్స్, ఎల్టీ మీటర్స్ రోటేషన్ పద్ధతిలో పరీక్షిస్తుంటారు. సబ్స్టేషన్లలో పవర్ ట్రాన్స్ఫార్మర్ల మెయింటెనెన్స్ వీరిదే బాధ్యత. వీరు ఏ మాత్రం అలసత్వం వహించినా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగడమో.. నాణ్యమైన, మెరుగైన విద్యుత్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడమో జరుగుతుంటుంది. అదే విధంగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల లోపాలను సరిదిద్దేదీ ఈ విభాగ ఉద్యోగులే. విద్యుత్ శాఖలో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తున్న వీరిపై యాజమాన్యం అ నుసరిస్తున్న వివక్షతో వారంతా విసిగిపోతున్నారు. యాజమాన్యం పట్టించుకోవట్లేదు.. ఎమ్మార్టీలో జూనియర్ లైన్మెన్, టెస్టర్ గ్రేడ్–2 (లైన్మెన్), టెస్టర్ గ్రేడ్–1 (లైన్ ఇన్స్పెక్టర్), ఫోర్మెన్ గ్రేడ్–1 పోస్టులున్నాయి. ఆపరేషన్ విభాగంలో మాదిరిగా టెస్టర్ గ్రేడ్–1 తర్వాత సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ పోస్టులు సృష్టించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నా.. యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫోర్మెన్ గ్రేడ్–1 పదోన్నతి కల్పించే క్రమంలో అధికారులు వింత పోకడలు అవలంబిస్తున్నారు. అసలే పోస్టు లేని ఫోర్మెన్ గ్రేడ్–2గా డీగ్రేడ్ చేస్తూ ఏడాది తర్వాత ఫోర్మెన్ గ్రేడ్–1గా పదోన్నతి కల్పిస్తున్నారు. దీంతో ఒకే వ్యక్తికి ఒక సంవత్సరంలోనే నాలుగు ఇంక్రిమెంట్లు (రెండు పదోన్నతి) ఇస్తున్నారు. డీ గ్రేడ్ చేస్తున్న ఫోర్మెన్ గ్రేడ్–2 స్థానంలో సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ పోస్టును క్రియేట్ చేయాలని ఎమ్మార్టీ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఫోర్మెన్ గ్రేడ్–1, ఫోర్మెన్ గ్రేడ్–2 పదోన్నతి అంశంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఆశ్యర్యానికి గురి చేస్తోంది. ఫోర్మెన్ గ్రేడ్–1 పోస్టు భర్తీ చేస్తే ఫోర్మెన్గ్రేడ్–2 ఖాళీగా ఉంటుంది. ఫోర్మెన్ గ్రేడ్–2 భర్తీ చేస్తే ఫోర్మెన్ గ్రేడ్–1 ఖాళీగా ఉంటుంది. ఈరెండు పోస్టుల్లో ఒకే సారి ఉద్యోగుల భర్తీ కనిపించదు. ఖాళీగా టెస్టర్ గ్రేడ్–2 (లైన్మెన్) పోస్టులు ప్రమోషన్ కోసం జేఎల్ఎంల ఎదురుచూపులు20 ఏళ్ల వరకు పదోన్నతి లేదా?ఎమ్మార్టీ విభాగంలో ఆరేళ్ల నుంచి 20 ఏళ్ల వరకు పదోన్నతి పొందకుండా ఒకే పోస్టులో కొనసాగుతున్నామని ఎమ్మార్టీ ఉద్యోగులు వాపోతున్నారు. జూనియర్ లైన్మెన్లు టెస్టర్ గ్రేడ్–2 పదోన్నతి కోసం గత ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. టెస్టర్ గ్రేడ్–2 ఉద్యోగులు గ్రేడ్–1 కోసం 10 నుంచి 18 ఏళ్ల నుంచి, టెస్టర్ గ్రేడ్–1 నుంచి ఫోర్మెన్ పదోన్నతి కోసం 10 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. టెస్టర్ గ్రేడ్–2 నుంచి పదోన్నతికి అనువుగా పోస్టులు లేక పోవడంతో వీరికి అవకాశం దక్కడం లేదు. పైస్థాయిలో ఉన్న ఉద్యోగులు రిటైర్డ్ అయితేనే పోస్టు ఖాళీ అవుతుంది. అప్పుడే పదోన్నతికి అవకాశముంటుంది. ఈక్రమంలో ఈ పోస్టుల మధ్య కొత్త పోస్టులు క్రియేట్ చేస్తే పదోన్నతి చానల్ పెరుగుతుందని ఎమ్మార్టీ ఉద్యోగులు యాజమాన్యాన్ని కోరుతున్నారు. ఖాళీగా ఉన్న టెస్టర్ గ్రేడ్–2 పోస్టులు 47 ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయకపోవడంతో ఎన్పీడీసీఎల్ యాజమాన్యం అంతర్యమేంటో అర్థం కావట్లేదని ఉద్యోగులు వాపోతున్నారు. దీంతో ఉద్యోగిగా తమకు రావాల్సిన ప్రయోజనాలను కోల్పోతున్నామని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా తమకు పదోన్నతి కల్పించాలని ఎమ్మార్టీ ఉద్యోగులు కోరుతున్నారు. -
వీసీని కలిసిన పోలీస్ కమిషనర్
కేయూ క్యాంపస్: వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ కేయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డిని బుధవారం యూనివర్సిటీలో కలిశారు. వీసీకి పుష్పగుచ్ఛం అందించారు. కాగా.. పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి వీసీ కె.ప్రతాప్రెడ్డి సన్మానించారు. అనంతరం వర్సిటీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఎర్రగట్టు జాతర ఆదాయం రూ.16,33,296హసన్పర్తి: ఎర్రగట్టు గుట్ట వేంకటేశ్వర స్వామి ఆలయ జాతర ఆదాయం రూ.16,33,296 వచ్చినట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ ఆరెల్లి వెంకటస్వామి, ఈఓ వెంకట్రావు తెలిపారు. దేవస్థానంలో హుండీలను బుధవారం లెక్కించగా ఆదాయ వివరాలను వారు వెల్లడించారు. వేలం ద్వారా రూ.6,22,500, కల్యాణం ద్వారా రూ.11,160, శీఘ్ర దర్శనం ద్వారా రూ.68,800, ప్రత్యేక దర్శనం ద్వారా రూ.1,92,450, అర్చనల ద్వారా రూ.60,700, విరాళాలు రూ.12,364, స్వామి వారి కట్నాలు రూ.6,859, కేశఖండనం ద్వారా రూ.40, గండదీపం ద్వారా రూ.36,232, హుండీ ఆదాయం రూ.5,88,225, తైబజార్ ఆదాయం రూ.33,966 వచ్చినట్లు వివరించారు. గత జాతర కంటే ఈసారి రూ.3,49,583 ఆదాయం ఎక్కువ వచ్చినట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ధర్మకర్తలు శీలం రమేశ్, కనపర్తి రాజు, సంతోశ్, సురేశ్, తదితరులు పాల్గొన్నారు.కేయూకు బ్లాక్ గ్రాంట్ రూ.145 కోట్లుకేయూ క్యాంపస్: తెలంగాణ ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కాకతీయ యూనివర్సిటీకి ఇచ్చే బ్లాక్గ్రాంట్ నిధులు సుమారు రూ.10 కోట్ల వరకు పెరిగాయి. ఈఆర్థిక సంవత్సరానికి (2025–26) బడ్జెట్లో బ్లాక్ గ్రాంట్ కింద గ్రాంట్ ఇన్ ఎయిడ్ అధ్యాపకుల, ఉద్యోగుల, పెన్షనర్ల వేతనాల కోసం రూ.114.62 కోట్లు కేటాయించారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల కోసం రూ.31 కోట్లు కేటాయించారు. కాగా.. ఈఆర్థిక సంవత్సరానికి వర్సిటీలో డెవలప్మెంట్ ఫండ్ కింద ప్రభుత్వం నిధులు కేటాయించింది. దీంతో మొత్తం రూ.145.62 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. గతేడాదితో పోలిస్తే రూ.10 కోట్ల వరకు పెరిగినట్లయింది. కాకతీయ యూనివర్సిటీ వీసీగా కె.ప్రతాప్రెడ్డి బాధ్యతలు స్వీకరించి కొన్ని నెలలవుతోంది. పలు మార్లు ప్రభుత్వ ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి యూనివర్సిటీకి బ్లాక్ గ్రాంట్ పెంచాలని, అభివృద్ధి పనులకు కూడా నిధులు కేటాయించాలని కోరారు. ప్రతిపాదనలు కూడా పంపారు. అందుకు వీసీ కృషి చేయడంతో కేటాయించిన నిధులు పెరిగినట్లు భావిస్తున్నారు. ఈసారి బడ్జెట్లో నిధులు పెరగడంతో అధికారులు, అధ్యాపకులు, ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మానుకోటలో మహిళ ఆత్మహత్యాయత్నంమహబూబాబాద్ రూరల్: తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి తనకు అన్యాయం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ బీపీ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం జరిగింది. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ మహిళ ఒక ఎస్సైతో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. కాగా.. ఆయన తాను పనిచేస్తున్న ప్రాంతంలో మరో మహిళతో సన్నిహితంగా ఉండగా.. పద్ధతి మార్చుకోమని చెప్పగా పట్టించుకోలేదని తెలిసింది. ఈ క్రమంలో సదరు మహిళ మానసిక వేదనకు గురై మానుకోటలోని జిల్లా పోలీసు కార్యాలయ సమీపంలో మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్థానికులు ఆమెను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా.. కాసేపటికే ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం. -
ఆరు గ్యారంటీలకు బడ్జెట్లో ప్రాధాన్యం.. మహిళా పథకాలకు పెద్దపీట
అందరినోటా ఆరు గ్యారంటీలు.. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చేర్చిన ఆరు గ్యారంటీ పథకాలకు ఈ బడ్జెట్లోనూ అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో 8,77,173 మంది రైతులకు రైతుభరోసా పథకం ఈ ఏడాది కూడా అమలు కానుంది. ఒక కార్పొరేషన్, 9 మున్సిపాలిటీలు, 1,708 గ్రామపంచాయతీలుండగా మహాలక్ష్మి పథకం కింద సుమారు ప్రతి మహిళకు రూ.2.500 చొప్పున సుమారు 7.21 లక్షల మందికి అందే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సుల్లో వరంగల్ రీజియన్లో రోజుకు సగటున సుమారు 55 వేల మంది మహిళలు ఉచితంగా రాకపోకలు సాగించేందుకు ఢోకా లేదు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కనెక్షన్లపై రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకంలో 6,10,220 మంది లబ్ధిదారులకు కొనసాగనుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటికే 2.50 లక్షల మందిని రెవెన్యూ అధికారులు అర్హులుగా గుర్తించగా, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల లోపు కరెంట్ వాడిన 6,12,901 మందికి ఉచిత విద్యుత్ సౌకర్యం కలగనుంది. -
మార్కెట్కు పోటెత్తిన మిర్చి
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు భారీగా మిర్చి వస్తోంది. బస్తాలతో యార్డు నిండిపోవడంతో మార్కెట్ ప్రధాన ద్వారానికి తాళంవేసి క్రమక్రమంగా వాహనాలను సిబ్బంది లోనికి పంపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ స్థలం రైతుల అవసరాలకు సరిపోవడం లేదు. మిర్చి అధికంగా వచ్చినప్పుడు కొనుగోళ్లు బంద్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించి మార్కెట్ రేటుతో సంబంధం లేకుండా ధర తగ్గిస్తున్నారు. అటు తక్కువ ధరకు ఆమ్ముకోలేక ఇటు తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో మిర్చి కొనుగోలు చేసే వ్యాపారులే బయట ధరలు తగ్గించి రైతులను మోసం చేయడం గమనార్హం. ఈ తతంగం అంతా తెలిసిన అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 6,727 బస్తాల మిర్చి కొనుగోళ్లు.. వ్యవసాయ మార్కెట్ పరిధిలో బుధవారం తేజ రకం, తాలు రకం మొత్తంగా 6,727 బస్తాల మిర్చి కొనుగోళ్లు జరిగాయి. తేజ రకం 6,177 బస్తాలు (2,477 క్వింటాళ్లు), తాలు రకం 550 బస్తాలు (220 క్వింటాళ్లు)కొనుగోలు చేయగా తేజ రకం గరి ష్ట ధర క్వింటాకు రూ.13,639 పలుకగా కనిష్ట ధర రూ.9,500 పలికింది. తాలు రకం గరిష్ట ధర క్వింటాకు రూ.6,350 పలుకగా, కనిష్ట ధర రూ.5,020 పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు. రైతులు మిర్చి తీసుకురావద్దు... వ్యవసాయ మార్కెట్ యార్డుకు అధికంగా మిర్చి రావడం వల్ల అన్ని షెడ్లు నిండి ఖాళీ స్థలం లేదని ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ తెలిపారు. ప్రస్తుతం 6,500 బస్తాలు బిడ్డింగ్, కాంటా కావాల్సి ఉందని, రోజుకు ఏడు వేల బస్తాల వరకు మిర్చి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా మార్కెట్ యార్డులో గురు, శుక్రవారాల్లో కొనుగోళ్లు జరిపేందుకు 15 వేల మిర్చి బస్తాలు వచ్చి ఉన్నాయని, మొత్తం 21,500 మిర్చి బస్తాలు వచ్చాయని పేర్కొన్నారు. మార్కెట్ యార్డులో ఖాళీ స్థలం లేనందున బయట నుంచి యార్డులోకి మిర్చిని అనుమతించమని తెలిపారు. రైతులు తమ మిర్చిని తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు.యార్డుల్లో నిండిన బస్తాలు స్థలం సరిపోక రైతుల ఇబ్బందులు -
విద్య, వైద్య రంగాలకు కేటాయింపులపై భిన్నస్వరాలు
అసెంబ్లీలో ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన 2025–26 రాష్ట్ర బడ్జెట్లో ఉమ్మడి వరంగల్కు దక్కిన ప్రాధాన్యంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. రెండో రాజధానిగా హైదరాబాద్కు పోటీగా అభివృద్ధి చేస్తామంటున్న ప్రభుత్వం.. బడ్జెట్లో ఆ మేరకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో అభివృద్ధి, సంక్షేమ రంగాలకు చేసిన కేటాయింపుల్లోనే ఉమ్మడి వరంగల్కు ప్రయోజనాలు కలుగుతాయన్న మరో వాదన కూడా వినిపిస్తోంది. ముఖ్యమంత్రిగా మొదటిసారి వరంగల్ నగరంలో పర్యటించిన రేవంత్రెడ్డి.. నగరం అభివృద్ధి కోసం 8 అంశాలు ప్రాధాన్యంగా రూ.6,115 కోట్ల విడుదలకు ఉత్తర్వులు జారీ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఇన్నర్, ఔటర్ రింగు రోడ్లు, మామునూరు ఎయిర్పోర్టు తదితర అంశాలు అందులో ఉన్నాయి. వీటికి నేరుగా నిధులు ఇచ్చేలా ప్రతిపాదనలు చేసినట్లు బడ్జెట్లో కనిపించ లేదు. కాగా, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనిపించిందన్న చర్చ ఉంది.– సాక్షి ప్రతినిధి, వరంగల్సంక్షేమం, ఐటీ, అభివృద్ధిపైన ఆశలు..ఎస్సీ, బీసీ, ఎస్టీ, మహిళా సంక్షేమం కోసం ఈసారి భారీ కేటాయింపులే జరిగాయి. అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా కలిగిన జిల్లాలో ఆ వర్గాలకు మేలు జరుగనుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎస్సీ సంక్షేమం కోసం రూ.40,232, ఎస్టీలకు రూ.17,169 కోట్లు కేటాయించడం పట్ల ఉమ్మడి వరంగల్కు ప్రాధాన్యం ఉంటుందంటున్నారు. ఐటీ, పరిశ్రమల రంగంపైన దృష్టి సారించిన నేపథ్యంలో రెండో నగరంగా వరంగల్ వృద్ధి చెందుతుందన్న ఆశాభావం కూడా వ్యక్తమవుతోంది. పీఎం మిత్ర నిధులతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉండగా, ఐటీ హబ్, టెక్స్టైల్ పార్కు, మడికొండ పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలపై ఆశలు రేకెత్తుతున్నాయి. ఎకో టూరిజానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిన నేపథ్యంలో ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు మహర్దశ రానుంది.విద్యారంగానికి మంచి రోజులు..ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రోత్సహించడానికి ఈసారి రూ.23,108 కోట్లు కేటాయించింది. దీంతో సర్కారు చదువులకు ఇంకా మంచి జరగనుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. 20–25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మించ తలపెట్టిన ప్రభుత్వం ఇటీవల ఉమ్మడి జిల్లాకు రూ.1400 కోట్లతో ఏడింటిని మంజూరు చేసింది. ఈ బడ్జెట్తో ఈసారి ఆ స్కూళ్లు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అలాగే, వరంగల్లో మొత్తం 3,331 ప్రభుత్వ బడులు ఉండగా, అందులో 4,67,011 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రహరీలతోపాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈసారి నిధులు వెచ్చించే అవకాశం ఉంది.బడ్జెట్పై వివిధ వర్గాల అభిప్రాయాలురైతులు, రైతుకూలీలకు బీమా..ఉమ్మడి వరంగల్లో 15,01,109 ఎకరాల్లో 4,33,229 మంది రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో 4,09,098 మంది రైతులకు బీమా సౌకర్యం కొనసాగనుంది. 9,02,099 ఎకరాలకు పంటల బీమా వర్తించనుంది. అలాగే, రైతు కూలీలకు బీమా వర్తింపజేసే ప్రతిపాదనలు తక్షణమే అమల్లోకి వస్తే.. ఉమ్మడి జిల్లాలో 18,45,326 మందికి ప్రయోజనం కలుగుతుంది.మహిళలకు పెద్దపీటప్రతి మండలంలో మహిళలతో రైస్ మిల్లులు, మినీ గోదాముల ఏర్పాటు.. ఐకేపీ కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మహిళా రైస్ మిల్లుల్లో మిల్లింగ్ చేయిస్తాం, మహిళా స్వయం సహాయక సంఘాలకు మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎఫ్సీఐకి సరఫరా చేసే బాధ్యత అప్పగిస్తామని ప్రకటించారు. దీంతో ఉమ్మడి వరంగల్లోని 48,717 మహిళా స్వయం సహాయక సంఘాల్లోని 8,76,906 మందికి లబ్ధి చేకూరనుంది. -
వేసవి దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి
మహబూబాబాద్: జిల్లాలో వేసవికాలం దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ ఆదేశించారు. కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో బుధవారం జిల్లాస్థాయి వాతావరణ మార్పుల టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వడదెబ్బ, ఎండ దెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఉపాధి హామీ పనుల వద్ద కూలీలు, మున్సిపల్, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పశుసంపద సంరక్షణకు తీసుకోవాల్సి జాగ్రత్తలను తెలియజేయాలన్నారు. అటవీశాఖ అధికారులు అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారి, ఆర్డీఓలు కృష్ణవేణి, గణేశ్, డీఆర్డీఓ మధుసూదన్ రాజు, డీఎంహెచ్ఓ మురళీదర్, మున్సిపల్ కమిషనర్లు నోముల రవీందర్, నరేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లక్ష్యాలు పూర్తి చేయాలి.. రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలు పూర్తిస్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో బుధవారం జిల్లాస్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పంట రుణాల పంపిణీకి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సబ్సిడీ రుణాల పంపిణీ విషయంలో జాప్యం చేయవద్దన్నారు. వీధి వ్యాపారులకు విరివిగా ముద్ర రుణాలతో పాటు స్టాండ్ ఆఫ్ ఇండియా రుణాలు అందించాలన్నారు. సమావేశంలో ఆర్బీఐ ఎల్డీఓ సాయి చరణ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణ మూర్తి, నాబార్డు ఏజీఎం చంద్రశేఖర్, డీఏఓ విజయనిర్మల పాల్గొన్నారు. కలెక్టర్ అౖద్వైత్కుమార్ సింగ్ -
మందులు వాడితే టీబీ వ్యాధి నయం
నెహ్రూసెంటర్: క్రమం తప్పకుండా మందులు వాడితే టీబీ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని, వ్యాధి నివారణపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ మురళీధర్ అన్నారు. వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో టీబీ నియంత్రణ దినోత్సవ పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. టీబీ వ్యాధిపై అవగాహన పెంచుకుని నయం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ విజయ్కుమార్, డాక్టర్ శ్రావణ్, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, హెచ్ఈ కేవీ రాజు, టీబీ ప్రోగ్రాం మేనేజర్ నీలిమాశ్వేత, కోఆర్డినేటర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఆశకార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలిమహబూబాబాద్: ఆశకార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం రూ.18,000 చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్ళి కుంట ఉపేందర్ డిమాండ్ చేశారు. బుధవారం సీఐటీయు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆశకార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కుంట ఉపేందర్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆశకార్యకర్తలకు ఇచ్చిన హామీ లను అమలు చేయాలన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఏఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన ఆశలకు ఎస్ఎన్ఎం పోస్టుల్లో ప్రమోషన్ కల్పించాలన్నారు. రూ.50 లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలని, టార్గెట్లు రద్దు చేయాలన్నారు. డిమాండ్లు పరిష్కరించాలని, లేని ఝెడల ఈ నెల 24న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నా యకులు నాగన్న, మల్లయ్య, ఉపేంద్ర, రమాదేవి, నళిని, స్వరూప, రమ, ఆసియా, విజయ, జయసుధ, నిర్మల తదితరులు పాల్గొన్నారు. పోలీస్స్టేషన్ తనిఖీనర్సింహులపేట: మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను బుధవారం ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణ, గదులను పరిశీలించిన అనంతరం రికార్డులను తనిఖీ చేశారు. మండలంలోని శాంతిభద్రతలు, కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసులు పెండింగ్ ఉండొద్దని, వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఆన్లైన్ బెట్టింగ్లు, సైబర్ నేరాలపై గ్రామాల్లో అవగాహన పెంచాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్, తొర్రూరు సీఐ గణేశ్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, సైబర్ క్రైం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై మాలోతు సురేశ్, సిబ్బంది పాల్గొన్నారు. నేడు బయ్యారంలో మంత్రి సీతక్క పర్యటనబయ్యారం: బయ్యారం మండలంలోని పలు గ్రామాల్లో గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క పర్యటించనున్నట్లు ఇల్లెందు ఎమ్మెలే కనకయ్య బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలోని గౌరారం వట్టేరు బ్రిడ్జి, కోడిపుంజులతండా–వినోభానగర్, బయ్యారం–కోటగడ్డ రహదారి నిర్మాణపనుల శంకుస్థాపనతో పాటు మొట్లతిమ్మాపురం బ్రిడ్జిని మంత్రి ప్రారంభిస్తారన్నారు. మంత్రితో పాటు ఎంపీ బలరాంనాయక్ తదితరులు పాల్గొంటారని ఎమ్మెల్యే చెప్పారు. -
ఒకే దేశం.. ఒకే ఎన్నికతోనే అభివృద్ధి
మహబూబాబాద్ అర్బన్: ఒకే దేశం ఒకే ఎన్నికతోనే దేశాభివృద్ధి సాధ్యమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఒకే దేశం–ఒకే ఎన్నిక అనే అంశంపై సమావేశం నిర్వహించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే వ్యయం తగ్గుతుందన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న ప్రయత్నానికి ప్రతీ ఒక్కరు మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శ్యామ్సందర్శర్మ, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు వద్దిరాజు రామచంద్రరావు, నాయకులు గాదె రాంబాబు, కొనతం పెంటయ్య, చీకటి మహేశ్గౌడ్, పల్లె సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
నీటిపారుదల రంగానికి మరిన్ని నిధులు కేటాయించాలి
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నీటి పారుదల రంగానికి మరిన్ని నిధులు కేటాయిస్తే బాగుండేది. ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాల్వల నిర్మాణం, భూసేకరణ వందశాతం జరగాలంటే నీటి పారుదల రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. 70 శాతం వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు నింపాలంటే ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టు సాగు పెంచాలంటే నిధుల కేటాయింపు అధికంగా ఉండాలి. –గోపు బాలశౌరెడ్డి, గుంటూరుపల్లి, నర్మెట, జనగామ జిల్లా -
స్వల్పంగా పెరిగినా సరిపోని కేటాయింపులు
భూపాలపల్లి అర్బన్: బడ్జెట్లో విద్యాశాఖకు గత ఏడాది కంటే రూ.1,816 కోట్లు స్వల్పంగా పెరి గినా సరిపోని కేటాయింపులు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న 15 శాతం హామీకి ఆమడ దూరంలో ఉంది. విద్యాశాఖ పరిధిలో ఉన్న 26,067వేల ప్రభుత్వ పాఠశాలలను గాలికొదిలేసి రెసిడెన్షియల్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల గురించి మాత్రమే మాట్లాడుతోంది. విద్యారంగానికి కేవలం 7.57శాతం బడ్జెట్ కేటాయించడం శోచనీయం. – నక్క తిరుపతి, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు -
భారత రాజ్యాంగం.. సెక్యులర్ వ్యవస్థ
రాజ్యాంగ విలువలకు తిలోదకాలు రాజ్యాంగ వ్యవస్థను గత 75 సంవత్సరాలుగా ప్రజలు గౌరవిస్తున్నారని, రాజ్యాంగానికి లోబడి రాజ్య పాలన నిర్వహించాలని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త, హెచ్సీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ జి. హరగోపాల్ అన్నారు. కానీ నేడు పాలకులు రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య వ్యవస్థకు తిలోదకాలు ఇచ్చి సొంత ఎజెండాతో పాలన కొనసాగిస్తున్నారన్నారు.కేయూ క్యాంపస్ : భారత రాజ్యాంగం సెక్యులర్ భావాలతో కూడిన వ్యవస్థని, రాజ్యాంగం ఒక వ ర్గానిదో.. ఒక కులానిదో కాదని, దేశ ప్రజలందరిద ని తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రయ్య అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఎస్సీ, ఎస్టీ అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో ‘ 75 సంవత్సరాల భారత రాజ్యాంగం– మైలురా ళ్లు– సమస్యలు– సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు బుధవారం సాయంత్రం ముగిసింది. ఈ ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజంలో ప్రతీ వ్యక్తి భగవద్గీత, ఖురాన్, బైబిల్తోపాటు రాజ్యాంగాన్ని కూడా అధ్యయనం చేయాలన్నారు. అప్పుడే రాజ్యాంగం విలువలు, తమ హ క్కులేమిటో తెలుస్తాయన్నారు. సమసమాజ ని ర్మాణం కోసం రాజ్యాంగం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. దేశ ప్రజల హక్కులను రక్షించేది రా జ్యాంగమేనని, రాజ్యాంగాన్ని సమగ్రంగా రచించి న గొప్ప వ్యక్తి బి.ఆర్ అంబేడ్కర్ అన్నారు. దేశ ప్రజలు అంబేడ్కర్కు రుణపడి ఉండాలన్నారు. రాజ్యాంగం వైరుధ్యాలను పరిష్కరిస్తుందన్నారు. రాజ్యాంగానికి లోబడే వ్యవహరించాలి.. భారత రాజ్యాంగం ప్రపంచంలో గొప్పదని మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యుడు అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. చట్టసభల్లో అట్టడుగు వర్గాల వారు ప్రవేశించడానికి రాజ్యాంగంలో పే ర్కొన్న రిజర్వేషన్ విధానమే కారణమన్నారు. రా జ్యాంగానికి లోబడే ఎవరైనా వ్యవహరించాలేగాని రాజ్యాంగ పరిధి దాటి వ్యవహరిస్తే ప్రతికూల ప్ర భావాలు చూపుతాయన్నారు. అనంతరం కేయూ యూజీసీ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ ఆర్. మల్లికార్జున్ రెడ్డి, కేయూ ఎస్సీ,ఎస్టీ సెల్డైరెక్టర్, ఈ సెమినార్ డైరెక్టర్ తుమ్మల రాజమణి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్. నారాయణ మాట్లాడారు. లైబ్రరీ సైన్స్విభాగం అధిపతి రాధిక రాణి, వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రయ్య కేయూలో ముగిసిన జాతీయ సదస్సు -
విద్యకు ప్రాధాన్యమివ్వని బడ్జెట్
కేయూ క్యాంపస్: ప్రభుత్వ బడుల వసతుల కల్పనలో జాతీయ స్థాయిలో తెలంగాణ 32వ స్థానంలో ఉండగా.. నాణ్యమైన విద్య, సమర్థంగా బడుల నిర్వహణలో 27వ స్థానంలో ఉందని తెలంగాణ విద్యా కమిషన్తెలిపింది. అయితే ఆ స్థితిని మెరుగు పరిచేలా ప్రభుత్వం రెండో బడ్జెట్లో విద్యకు ప్రాధాన్యమివ్వలేదు. రూ. 3,04,965 కోట్లలో విద్యకు రూ.23,108 కోట్లు కేటాయించారు. ( 7.57 శాతం ) ప్రభుత్వ విద్యా సంస్థల అభిృద్ధికి ఏ మాత్రం సరిపోవు. –కడారి భోగేశ్వర్, టీపీటీఎఫ్ పూర్వ కార్యదర్శి -
ఈఆర్సీ చైర్మన్కు సమస్యలు విన్నవించిన వినియోగదారులు
బహిరంగ విచారణకు అధ్యక్షత వహించిన ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 17 జిల్లాల నుంచి వినియోగదారులు హనుకొండ కలెక్టరేట్కు చేరుకుని తమ సమస్యలను ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్కు సమస్యలు వివరించారు. వీరితో భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు వినియోగదారులకు జరుగుతున్న ఇబ్బందులు, కంపెనీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు అందించారు. ఆగ్రో బేస్డ్ పరిశ్రమలకు విద్యుత్ టారిఫ్లో రాయితీ ఇవ్వాలని వినియోగదారులు కోరారు. రాయితీ లేక ఈ రంగంలో పరిశ్రమలు రావడం లేదన్నారు. అదే విధంగా 2011లో ట్రాన్స్కో రాతపూర్వకంగా ఇచ్చిన ఆదేశాల మేరకు కాటన్ ఇండస్ట్రీస్ నడిపిస్తే ఆ తర్వాత జరిమానా విధించారని వాపోయారు. వడ్డీ విధిస్తూ ఎరియర్స్గా చూపిస్తున్నారని, 18 ఇండస్ట్రీస్కు రూ.15 నుంచి 30 లక్షల వరకు జరిమానా విధించారని, వీటిని రద్దు చేయాలని కోరారు. రైతులు తమ వ్యవసాయ మోటార్ల వద్ద ఓల్టేజీ తెలుసుకోవడానికి 20 ఆంప్స్ విద్యుత్ బల్బులు వాడుకునేందుకు అనుమతి ఉందని, అయితే న్యూట్రల్ వైర్ లేక వినియోగించుకోలేక పోతున్నామని, వ్యవసాయ సర్వీస్ లైన్లకు న్యూటల్ వైన్ వేయాలని కోరారు. అదే విధంగా పంట పొలాల మద్యన ఉన్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను రోడ్డు సౌకర్యం ప్రాంతానికి తరలించడానికి రైతులను డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని, దీనికి స్వస్తి పలికి సంస్థనే ఉచింతంగా తరలించాలని కోరారు. రైతులు మారినప్పుడు వ్యవసాయ సర్వీస్లో పేర్లు మార్చే విధానం సులభతరం చేయాలని కోరారు. చాలా గ్రామాలకు జూనియన్ లైన్మెన్లు, లైన్మెన్లు లేరని, వెంటనే నియమించాలని కోరారు. ఇళలపై నుంచి వెళ్తున్న విద్యుత్ లైన్లను ఎలాంటి చార్జీలు విధించకుండా మార్చాలని కోరారు. వినియోగదారులు ఇంకా చాలా సమస్యలు ఈఆర్సీ దృష్టికి తీసుకెళ్లగా వాటిని పరిష్కరించాలని ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్..టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిని ఆదేశించారు.టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 17 జిల్లాల నుంచి వినియోగదారులు హనుకొండ కలెక్టరేట్కు చేరుకుని తమ సమస్యలను ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్కు వివరించారు. వీరితో భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు వినియోగదారులకు జరుగుతున్న ఇబ్బందులు, కంపెనీ అభివృద్ధికి తీసుకోవాల్సి న చర్యలపై సలహాలు, సూచనలు అందించారు. ఆగ్రో బేస్డ్ పరిశ్రమలకు విద్యుత్ టారిఫ్లో రాయితీ ఇవ్వాలని వినియోగదారులు కోరారు. రాయితీ లేక ఈ రంగంలో పరిశ్రమలు రావడం లేదన్నారు. అదే విధంగా 2011లో ట్రాన్స్కో రాతపూర్వకంగా ఇచ్చిన ఆదేశాల మేరకు కాటన్ ఇండస్ట్రీస్ నడిపిస్తే ఆ తర్వాత జరిమానా విధించారని వాపోయారు. వడ్డీ విధిస్తూ ఎరియర్స్గా చూపిస్తున్నారని, 18 ఇండస్ట్రీస్కు రూ.15 నుంచి రూ.30 లక్షల వరకు జరిమానా విధించారని, వీటిని రద్దు చేయాలని కోరారు. రైతులు తమ వ్యవసాయ మోటార్ల వద్ద ఓల్టేజీ తెలుసుకోవడానికి 20 ఆంప్స్ విద్యుత్ బల్బులు వాడుకునేందుకు అనుమతి ఉందని, అయితే న్యూట్రల్ వైర్ లేక వినియోగించుకోలేక పోతున్నామని, వ్యవసాయ సర్వీస్ లైన్లకు న్యూటల్ ౖలైన్ వేయాలని కోరారు. అదే విధంగా పంట పొలాల మధ్య ఉన్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను రోడ్డు సౌకర్యం ఉన్న ప్రాంతానికి తరలించడానికి రైతులను డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని, దీనికి స్వస్తి పలికి సంస్థనే ఉచితంగా తరలించాలని కోరారు. రైతులు మారినప్పుడు వ్యవసాయ సర్వీస్లో పేర్లు మార్చే విధానం సులభతరం చేయాలని కోరారు. చాలా గ్రామాలకు జూనియన్ లైన్మెన్లు, లైన్మెన్లు లేరని, వెంటనే నియమించాలని కోరారు. ఇళ్ల పైనుంచి వెళ్తున్న విద్యుత్ లైన్లను ఎలాంటి చార్జీలు విధించకుండా మార్చాలని కోరారు. వినియోగదారులు ఇంకా చాలా సమస్యలు ఈఆర్సీ దృష్టికి తీసుకెళ్లగా వాటిని పరిష్కరించాలని ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్..టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిని ఆదేశించారు. -
హెల్త్ యూనివర్సిటీ వీసీ బాధ్యతల స్వీకరణ
ఎంజీఎం: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నూతన వైస్ చాన్స్లర్గా డాక్టర్ పీవీ నందకుమార్రెడ్డి బుధవారం అధికారికంగా తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్సిటీ ప్రతిష్టను పెంచేందుకు అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. అనంతరం వర్సిటీలోని పలు విభాగాలను పరిశీలించి సిబ్బందితో ముచ్చటించారు. నూతన వీసీగా బాధ్యతలు చేపట్టిన నందకుమార్రెడ్డికి రిజిస్ట్రార్ డాక్టర్ సంధ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ మల్లేశ్వర్, జాయింట్ రిజిస్ట్రార్ డాక్టర్ రమేశ్, అడ్మిషన్ కమిటీ మెంబర్ డాక్టర్ ప్రవీణ్కుమార్, డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ హేమంత్కుమార్, ఫైనాన్స్ ఆఫీసర్ ఖాలీద్, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. -
ఆటో డ్రైవర్కు ఏడాది జైలు
జనగామ: ఆటోను అజాగ్రత్తగా నడిపి ఇద్దరి మృతికి కారణమైన డ్రైవర్కు జనగామ కోర్టు ఏడాది కఠిన కారాగార శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. సీఐ దామోదర్రెడ్డి కథనం ప్రకారం.. 2016లో నర్మెట మండలం కన్నెబోయినగూడెం నుంచి అదే గ్రామానికి చెందిన ధారావత్ టీక్యా, నర్మెటకు చెందిన శిరీష, ఆమె తల్లి కనకలక్ష్మితో పాటు మరో ఐదుగురు ఆటోలో జనగామకు బయలుదేరారు. లింగాలఘనపురం మండలం నెల్లుట్లకు చెందిన ఆటో డ్రైవర్ యోహాన్ అజాగ్రత్త, అతివేగం నడపడం వల్ల జనగామ మండలం గానుగుపహాడ్ దాటిన తర్వాత వాహనం పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో టీక్యా అక్కడికక్కడే మృతి చెందగా, కనకలక్ష్మికి తీవ్ర గాయాలు కావడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం తరలించే క్రమంలో మార్గమధ్యలో మృతి చెందింది. అప్పటి సీఐ ముస్కె శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా, అసిస్టెంట్ పీపీ కిరణ్ కుమార్ వాదించారు. కోర్టు కానిస్టేబుల్ టి.రవికుమార్, హెడ్ కానిస్టేబుల్ యాదగిరి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా, ఇరువురి వాదనలు విన్న జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జి.శశి.. నిందితుడు యోహాన్కు ఏడాది కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించినట్లు సీఐ తెలిపారు. నేడు మామిడి మార్కెట్ ప్రారంభంవరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్ పరిధి లక్ష్మీపురం ఫ్రూట్ మార్కెట్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తున్నందున ఈ ఏడాది మామిడి సీజన్ నిర్వహణ కోసం ఏనుమాముల ముసలమ్మకుంట పక్కనే మార్కెట్ స్థలంలో మామిడి మార్కెట్ను ఏర్పాటు చేస్తున్నారు. గురువారం ఉదయం రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు ఈమార్కెట్ను ప్రారంభించనున్నట్లు వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి గుగులోతు రెడ్డి తెలిపారు. కాగా.. కరోనా సాకుతో నాలుగేళ్ల క్రితం ధర్మారంలోని ఓ ప్రైవేట్ గోదాంలో మామిడి మార్కెట్ను ఓపెన్ చేసి ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా వ్యాపారులు ఇన్నాళ్లు కొనసాగించారు. దీంతో మార్కెట్ కమిటీ పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోయింది. ముసలమ్మకుంట పక్కన మార్కెట్కు సంబంధించిన 10 ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు అధికారుల నుంచి అనుమతులు రావడంతో మంత్రి చేతుల మీదుగా మామిడి మార్కెట్ను ప్రారంభిస్తున్నట్లు సమాచారం. -
సునీతావిలియమ్స్ భావితరాలకు స్ఫూర్తి..
టెక్నాలజీకి హ్యుమన్ స్పిరిట్ తోడు టెక్నాలజీకి హ్యుమన్ స్పిరిట్ తోడవడంతోనే సునీతా విలియమ్స్ ధైర్యంగా పరిశోధనలకు అంతరిక్షంలోకి వెళ్లింది. ఎనిమిది రోజుల కోసం అంతరిక్షం వెళ్లి అక్కడే చిక్కుకుంది. 9 నెలలు వివిధ ప్రయోగాలు నిర్వహించింది. బుధవారం తెల్లవారుజామున క్షేమంగా భూమిపై ల్యాండ్ అయ్యింది. సునీతా విలియమ్స్ అంతరిక్ష పరిశోధనలు చేపట్టేందుకు యువ శాస్త్రవేత్తలకు దిక్సూచిగా నిలుస్తారు. –అబ్దుల్ అజిమ్, ఫిజిక్స్ ప్రొఫెసర్, నిట్భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతావిలియమ్స్ భావితరాలకు స్ఫూర్తి అని పలువురు సైన్స్ మాజీ అధికారులు, ప్రొఫెసర్లు అన్నారు. ప్రయోగాల నిమిత్తం 9 నెలల క్రితం అంతర్జాతీయ అంతరిక్షంలోకి వెళ్లిన సునీతావిలియమ్స్ బుధవారం తెల్లవారుజామున భూమిపై సురక్షింతగా ల్యాండ్ అయ్యారు. దీనిపై భారత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కాగా, సునీతావిలియమ్స్ 9 నెలల సమయంలో అంతరిక్షంలో 150కి పైగా ప్రయోగాలు నిర్వహించారు. –కాజీపేట అర్బన్ -
ఈఆర్సీకి సమస్యల గోడు
హన్మకొండ: విద్యుత్ నియంత్రణ మండలికి వినియోగదారులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్లో 2025–2026 ఆర్థిక సంవత్సరానికి సవరణ చేయబడిన రిటైల్ సప్లయ్ వ్యాపారానికి సమగ్ర ఆదాయ ఆవశ్యకత, ధరలు, క్రాస్ సబ్సిడీ సర్ చార్జీల ప్రతిపాదనలపై విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ ఆధ్యక్షతన బహిరంగ విచారణ జరిగింది. ఈ విచారణలో టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి.. సంస్థ ద్వారా వినియోగాదారులకు అందిస్తున్న సేవలు వివరించారు. విద్యుత్ చార్జీలు పెంచడం లేదని చెప్పారు. ఆధునిక సాంకేతికను వినియోగించి వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఎన్పీడీసీఎల్లో అమలు చేస్తున్న సాంకేతిక పద్ధతులు, సంస్థను వినియోగదారులకు చేరువ చేసిన విధానాన్ని పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బాధితులకు ఈఆర్సీ చైర్మన్ చేతుల మీదుగా చెక్కు అందజేత.. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఈదురుగడ్డకు చెందిన అంగిడి అనిత, రాజ్ కుమార్ దంపతుల ఇల్లు విద్యుదాఘాతంతో దగ్ధమైందని, ఈ ఘటనలో వారి కుమారుడు సాయి కుమార్(07) చనిపోయాడని, ఇంటి పైనుంచి విద్యుత్ లైన్ వెళ్లడం ద్వారానే ఈ ఘటన జరిగిందని భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధి జోగినిపల్లి సంపత్రావు ఈఆర్సీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. బాధితులను ఈఆర్సీ ముందుంచి వారి బాధను వివరించారు. ఈ ఘటన జరిగి 5 నెలలవుతున్నా ఎలాంటి పరిహారం చెల్లించలేదని తెలిపారు. స్పందించిన ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ పరిహారం చెల్లించాలని సూచించారు. దీంతో బహిరంగా విచారణ సభలోనే ఈఆర్సీ చైర్మన్ చేతుల మీదుగా బాధితులు అనితా, రాజ్కుమార్ దంపతులకు రూ.5 లక్షల చెక్కు అందించారు. సీజీఆర్ఎఫ్ సేవలు విస్తృతం చేయాలి.. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్) సేవలను మరింత విస్తృతం చేయాలని ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ అధికారులకు సూచించారు. దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. విద్యుత్ వినియోగదారులకు అందిస్తున్న సేవలకు ఎన్పీడీసీఎల్ యాజమాన్యాన్ని అభినందించారు. విద్యుత్ చార్జీలు పెరగవు.. టీజీ ఎన్పీడీసీఎల్ రెవెన్యూ లోటు రూ.10,393 కోట్లు. 2025–2026 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నిర్వహణకు రూ.19,814 కోట్ల ఆదాయం అవసరం కాగా, రూ.9,421 కోట్లు మాత్రమే ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. దీంతో రెవెన్యూ భారీ లోటు ఏర్పడనుంది. ప్రభుత్వం ఈ మేరకు రీయింబర్స్ చేయాల్సిన అవసరముంది. అదే విధంగా ఈ సంవత్సరం విద్యుత్ చార్జీల టారిఫ్ పెంపుపై ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు. దీంతో విద్యుత్ చార్జీలు పెరగవు. విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి భారం పడదు.చైర్మన్కు వివరించిన విద్యుత్ వినియోగదారులు సీజీఆర్ఎఫ్ సేవలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజ్ నాగార్జున్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
విద్యారంగానికి 7.57 శాతమే
కేయూ క్యాంపస్: ఈ సారి బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపుల్లో 1,816 కోట్లు పెరిగినా మొత్తం బడ్జెట్లో రూ. 3 లక్షల కో ట్లలో చూసినప్పుడు రూ. 23 వేల కోట్లు వర కు కేటాయించారు. 7.57 శాతమే కేటాయింపులు జరిగాయి. ఇందులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు అధి క నిధులు కేటాయించారు. స్వాగించాల్సిందే. కానీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మౌలిక సదుపాయాలు అమలు చేయాలంటే 15 శాతం నిధులు కేటాయించాల్సిండేది. –భీమళ్ల సారయ్య, విద్యావారధి సంస్థ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు -
సంక్షేమ బడ్జెట్..
కేయూ క్యాంపస్: 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఇందులో రాజీవ్ యువ వికాస్ పథకానికి రూ. ఆరువేల కోట్లు కేటాయించారు. దీని వల్ల యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. యంగ్ స్కిల్ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిటీ ఏర్పాటుతో సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. ఈ బడ్జెట్తో బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి సాధించడానికి అవకాశం కలుగుతుంది. –సురేశ్లాల్, ప్రొఫెసర్, కేయూ ఎకనామిక్స్ విభాగం -
భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం
ఖిలా వరంగల్ : మామునూరు ఎయిర్పోర్ట్ భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామని వరంగల్ ఆర్డీఓ సత్యపాల్రెడ్డి అన్నారు. మంగళవారం వరంగల్ నక్కలపల్లి , గాడిపల్లి గ్రామాల్లో తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు, ఆర్అండ్బీ, హార్టికల్చర్, ఇరిగేషన్ అధికారులు, రైతులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా సర్వే ద్వారా గుర్తించిన 253 ఎకరాల భూములతోపాటు బావులు, బోర్లును పరిశీలించారు. బోర్లు, బావుల నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని అంచనా వేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం ఆర్టీఓ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్వర్వుల ప్రకారం విమానాశ్రయం రన్వే విస్తీర్ణం కోసం 253 ఎకరాల భూమిని సేకరించే పనిలో ఉన్నామని, సర్వే ద్వారా నక్కలపల్లి, గాడిపల్లి గ్రామాల్లో 253 ఎకరాలను గుర్తించమన్నారు. భూమి విలువతోపాటు బావులు, బోర్లు విలువను సైతం పరిహారంలో చెల్లిస్తామని తెలిపారు. ప్రతీ రైతుకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామని, త్వరలో నివేదిక తయారు చేసి కలెక్టర్కు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల ఆర్ఐ ఆనంద్ కుమార్, సర్వేయర్ రజిత, ఇతర శాఖల సిబ్బంది, భూ నిర్వాసితులు పాల్గొన్నారు. శరవేగంగా రన్వే భూ సేకరణ పనులు వరంగల్ ఆర్డీఓ సత్యపాల్రెడ్డి నక్కలపల్లి, గాడిపల్లిలో బావులు, బోర్ల పరిశీలన -
వినియోగదారులతో సీఎండీ ముఖాముఖి
హన్మకొండ: విద్యుత్ వినియోగదారులతో టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. మంగళవారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి విద్యుత్ వినియోగదారులతో ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడారు. నూతనంగా సర్వీస్లు పొందిన గృహ, వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమల వినియోగాదారులకు స్వయంగా ఫోన్ చేసి వారితో సంభాషించారు. సర్వీస్ మంజూరు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కొత్త సర్వీస్ మంజూరులో జాప్యం జరిగిందా? కాల పరిమితికి లోబడి మంజూరు చేశారా? విద్యుత్ అధికారులు నిబంధనల మేరకు మంజూరు చేస్తున్నారా? అధికారులు ఎలా పని చేస్తున్నారు? వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు ఇతర సేవలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం వరుణ్ రెడ్డి మాట్లాడుతూ మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడానికి వినియోగదారుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు నేరుగా వారితో మాట్లాడానన్నారు. ఫీడ్ బ్యాక్ తీసుకోవడం, అభిప్రాయాలు తెలుసుకోవడం ద్వారా అవసరమైన మార్పులు తీసుకొచ్చే అవకాశముందన్నారు. అదే విధంగా సత్సంబంధాలు పెరుగుతాయన్నారు. వినియోగదారుల్లో కంపెనీపై విశ్వాసం, సేవల పట్ల నమ్మకం కలుగుతుందన్నారు. వినియోగాదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి ప్రతీ ఉద్యోగి నిబద్దతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. -
సినీఫక్కీలో హరిబాబు కోర్టుకు..
న్యాయస్థానం వెనుక గేటు నుంచి రిమాండ్కు తరలింపు భూపాలపల్లి : సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో నిందితుడు హరిబాబు, అతడి పరారీకి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు కోర్టుకు తీసుకొచ్చి రిమాండ్కు తరలించారు. కోర్టుకు రాజలింగమూర్తి భార్య సరళ, బంధువులు రావడం.. అక్కడే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా ఉండడంతో సుమారు అరగంటపాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉదయం 9 గంటలకే కోర్టుకు.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన భూపాలపల్లి పట్టణానికి చెందిన రాజలింగమూర్తి గత నెల 19న హత్యకు గురి కాగా, ఈ హత్య కేసులో ఏ–8గా ఉన్న నిందితుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, అతడి పరారీకి సహకరించి, వెంటే ఉన్న ములుగు జిల్లాకు చెందిన వట్టే రమణయ్య, రమను ఏ–11, ఏ–12గా చేర్చిన భూపాలపల్లి పోలీసులు మంగళవారం ఉదయం 9 గంటలకే జిల్లా కేంద్రంలోని ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టులో హాజరుపర్చగా నిందితులకు జడ్జి ఎన్. రాంచందర్రావు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు నిందితులను ఖమ్మం జైలుకు తరలించారు. కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత.. కోర్టు వద్ద ఘర్షణ చోటు చేసుకునే అవకాశం ఉందని భావించిన పోలీసులు సినీ ఫక్కీలో హరిబాబు ను రిమాండ్కు తరలించారు. రమణయ్య, రమను కోర్టు ముందు గేటు ద్వారా తీసుకెళ్లారు. హరిబాబు ను మాత్రం వెనుక గేటు నుంచి తీసుకెళ్లి పోలీసు వాహనంలో రిమాండ్కు తరలించారు. విషయాన్ని గమనించిన సరళ, ఆమె బంధువులు.. హరిబాబు ను తమకు చూపించాలని పోలీసులను డిమాండ్ చేశారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులను సరళ నిలదీసింది. ఏ11, ఏ12కు బెయిల్? హరిబాబు పరారీకి సహకరించి, అతడి వెంట ఉన్న రమణయ్య, రమకు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు తెలిసింది. జమానతులు సమర్పిస్తే నేడు బెయిల్ రానున్నట్లు సమాచారం. ఆరుగురు నిందితుల కస్టడీకి పోలీసుల అప్పీలు.. హత్య కేసులో ఏ–1గా ఉన్న రేణికుంట్ల సంజీవ్, ఏ–2 పింగిలి సేమంత్, ఏ–3 మోరె కుమార్, ఏ–4 కొత్తూరి కిరణ్, ఏ–6 దాసారపు క్రిష్ణ, ఏ–8 కొత్త హరిబాబును విచారణ నిమిత్తం ఏడు రోజుల కస్టడీ కోసం పోలీసులు కోర్టులో నేడు పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. హరిబాబు బెయిల్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ.. కొత్త హరిబాబు పరారీలో ఉండి ఈ నెల 4వ తేదీన హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. మూడు, నాలుగుసార్లు వాదనలు జరగగా విచారణ మంగళవారం(నిన్న)కు వాయిదా పడగా అదే రోజున హరిబాబును పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో హరిబాబు తరపున లాయర్ ముందస్తుకు బదులు సాధారణ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా బుధవారం విచారణ జరగనున్నట్లు సమాచారం. ముగ్గురి అరెస్ట్.. రాజలింగమూర్తి హత్య కేసులో ప్రధాన నిందితుడు కొత్త హరిబాబుతో పాటు, అతడు పారిపోవడానికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ డి. నరేశ్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ములుగు జిల్లాకు చెందిన వట్టే రమణయ్య, రమ.. హరిబాబు పారిపోవడానికి సహకరించారని, ముగ్గురిని ఒకే దగ్గర అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. హరిబాబుతోసహా మరో ఇద్దరు సహాయకుల అరెస్ట్, కోర్టులో హాజరు కోర్టుకు వచ్చిన రాజలింగమూర్తి భార్య సరళ, బంధువులు నిందితుడిని చూపించాలని డిమాండ్ అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకుల నిలదీత .. అరగంటపాటు ఉద్రిక్తత హరిబాబు పరారీకి సహకరించిన ఇద్దరికి బెయిల్ మంజూరు? -
సాంకేతిక లోపంతో నిలిచిన గూడ్స్..
● 2 గంటల పాటు ఆగిన పలు ఎక్స్ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్లు ● తీవ్ర అసౌకర్యానికి గురైన ప్రయాణికులు డోర్నకల్/గార్ల: డోర్నకల్, మహబూబాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య గూడ్స్ ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తి మెయిన్ లైన్లో నిలిచింది. దీంతో మంగళవారం పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఉదయం 6 గంటల సమయంలో బొగ్గు లోడ్తో వరంగల్ వైపునకు వెళ్తున్న గూడ్స్ ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తి నిలిచింది. దీంతో డోర్నకల్లో కాకతీయ రైలు 2.10 గంటల వరకు నిలిచింది. గుండ్రాతిమడుగులో తమిళనాడు ఎక్స్ప్రెస్ 2.20 గంటలు, గార్లలో ఏపీ ఎక్స్ప్రెస్ 2.10 గంటల వరకు నిలిచిపోగా కోణార్క్ ఎక్స్ప్రెస్ డోర్నకల్ అవుట్ సిగ్నల్ వద్ద గంట పాటు, సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ పోచారం రైల్వే స్టేషన్లో రెండు గంటల పాటు నిలిచాయి. మహబూబాబాద్ వైపు నుంచి రిలీఫ్ రైలింజన్ వచ్చి గూడ్స్ను మహబూబాబాద్కు తరలించిన అనంతరం రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. రెండు గంటలకు పైగా రైళ్లు నిలవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్రిడ్జిపై స్తంభించిన రాకపోకలు.. డోర్నకల్: స్థానిక రైల్వే స్టేషన్లోని ఫుట్ఓవర్ బ్రిడ్జిపై మంగళవారం కొద్దిసేపు రాకపోకలు స్తంభించాయి. ఉదయం సింగరేణి, శాతవాహన రైళ్లు ఆలస్యంగా నడవడం, మహారాష్ట్రకు వెళ్తున్న కూలీలు బ్రిడ్జిపై తమ సామాన్లతో కూర్చోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో ఆర్పీఎఫ్ సిబ్బంది స్పందించి బ్రిడ్జికి ఇరుపక్కలా కూర్చున్న కూలీలను ప్లాట్ఫామ్లపైకి తరలించి రాకపోకలను పునరుద్ధరించారు. -
బుధవారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోuజిల్లాలో సాగునీటి వనరులు జిల్లాలోని 1,590 చెరువుల నీటితో మొత్తం 95,460 ఎకరాల భూమి సాగులో ఉంది. జిల్లాలోని ఎస్సారెస్పీ డీబీఎం 58, 59, 60 ద్వారా పాలకుర్తి, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలకు సాగునీరు అందుతోంది. ఇప్పటి వరకు జిల్లాలోని 403 చెరువులు మాత్రమే కాల్వల ద్వారానీరు నింపే అవకాశం ఉండగా.. 1,187 చెరువులు ఇప్పటికీ వర్షాధారంగానే ఉన్నాయి. అయితే జిల్లాలోని నాలుగు లక్షలకు పైగా ఎకరాల భూమి సాగుకు అనుకూలంగా ఉంది. కానీ, సరిపడా నీటి వనరులు లేక ప్రతీ ఏడా ది పంటలు ఎండుతున్నాయి. ఈ బడ్జెట్లో పాకాల వరకు వచ్చిన దేవాదులకు, జిల్లా నుంచి వెళ్లే సీతా రామ ప్రాజెక్టుల నీటిని లిప్టుల ద్వారా ఎగువన ఉ న్న చెరువులు నింపితే జిల్లాలోని గూడూరు, గంగా రం, కొత్తగూడ, గార్ల, బయ్యారం, మహబూబా బాద్ మండలాలకు సాగునీటి సమస్య తీరుతుంది. అరకొరగా సాగునీటి వసతి ● అసంపూర్తిగా వైద్యారోగ్యశాఖ భవనాలు ● పంట ప్రాసెసింగ్ యూనిట్లు లేక ఇబ్బందులు ● నేడు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో నేడు(బుధవారం) ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రవేశపెట్టే బడ్జెట్పై జిల్లా ప్రజలు ఆశగా ఉన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న పనులతోపాటు, పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి ఈ బడ్జెట్లోనైనా నిధులు కేటాయిస్తారేమోనని ఎదురుచూస్తున్నారు. – సాక్షి, మహబూబాబాద్విద్యాభివృద్ధికి నిధులు.. జిల్లా వ్యాప్తంగా 922 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఇందులో సగం పాఠశాలల్లో ఏదో ఒక సౌకర్యం లేకపోవడం, పలు పాఠశాలల్లో ప్రహరీ గోడలు, మూత్రశాలలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం మన ఊరు– మన బడి,ప్రస్తుత ప్రభుత్వం అమ్మ ఆద ర్శ పాఠశాలల పేరిట నిధులు మంజూ రు చేస్తున్నామని చెప్పారు. కానీ, ఏదీ సంపూర్ణంగా చేయలేదు. ఇందుకు నిధుల కొరతే కారణమని అధికారులు బాహాటంగానే చెబుతున్నారు. అదేవిధంగా జిల్లాలో సోషల్ వెల్ఫేర్తోపాటు అన్ని సంక్షేమలశాఖ ద్వారా 31 పాఠశాలలు ఉండగా ఇందులో 16 అద్దె భవనా ల్లోనే కొనసాగుతున్నాయి. వీటికి కొత్త భవనాలు నిర్మించేందుకు నిధులు కేటాయించాలి. కానరాని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు గిరిజనులు, ఆదివాసీలు ఎక్కువగా ఉన్న జిల్లాలో అత్యధిక మంది వ్యవసా యం, అటవీ సంపద మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రధానంగా వరి, మిర్చి, పసుపు, కూరగాయలు ఎక్కువగా పండించే రైతులు ఉన్నా వాటిని ప్రాసెసింగ్ చేసి లేదా.. నిల్వ చేసి విక్రయించే అవకాశం లేదు. దీంతో రైతులు తక్కువ ధరలకు ఉత్పత్తులను అమ్ముతున్నారు. అదేవిదంగా అడవిలో దొరికే ఇప్ప పువ్వు, తేనె, ఇతర ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసే యూనిట్లు పెట్టేందుకు నిధులు మంజూరు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. న్యూస్రీల్ -
దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ఉండాలి
● అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో మహబూబాబాద్: దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం విద్యాశాఖ, అలింకో కంపెనీ ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు ఉచితంగా ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగులకు కల్పిస్తున్న పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. దివ్యాంగ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించడంతోపాటు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఈఓ రవీందర్రెడ్డి, సహిత విద్యా జిల్లా కోఅర్డినేటర్ ఆజాద్ చంద్రశేఖర్, ఏడీ రాజేశ్వరరావు, డీఎస్ఓ అప్పారావు, అలింకో కంపెనీ ఇంచార్జ్లు సురేష్, మోహిత్ తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంమహబూబాబాద్ అర్బన్/ మహబూబాబాద్: ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకానికి అర్హులైన యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీమన్నారాయణరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్న్షిప్కు ఎంపికై న యువకులకు నెలకు రూ.5వేల నుంచి రూ.6వేలు భత్యం అందుతుందని తెలిపారు. శిక్షణ 12 నెలలు కొనసాగుతుందని తెలిపారు. 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండి, కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి లేని వారికి అవకాశం ఉంటుందని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లమా, డిగ్రీ పూర్తి చేసి ఉండాలని, కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8 లక్షల లోపు ఉండాలని తెలిపారు. అర్హత కలిగిన వారు ఈనెల 31వ తేదీ వరకు pminternship.mca.gov.in వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 1800 116090 నంబర్ ద్వారా సంప్రదించాలని కోరారు. ఆహారం కల్తీ చేస్తే కఠిన చర్యలుడోర్నకల్: ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ రోహిత్ హెచ్చరించారు. స్థానిక మెయిన్ రోడ్డులోని హోటళ్లు, స్వీట్ హోమ్స్, బేకరీలు, జ్యూస్ పాయింట్లు, మిర్చి, బజ్జీ బండ్లలో మంగళవారం ఆయన ఆకస్మికంగా తని ఖీలు నిర్వహించారు. కల్తీ నూనెతో తయారు చేసిన బజ్జీలు, మిర్చీలను గుర్తించి కాల్వలో పడేశారు. హోటళ్లలో పరిశుభ్రత పాటించని ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. జ్యూస్ పాయింట్లు, స్వీట్ హోముల నుంచి ఆహార పదార్థాలు, జ్యూస్ నమూనాలు సేకరించారు. కల్తీ ఆహార పదార్థాలు విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూ.3.63 లక్షల విలువైన నల్లబెల్లం పట్టివేత మహబూబాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని గుండ్లకుంట కాలనీలో రూ.3.63 లక్షల విలువ గల తొమ్మిది క్వింటాళ్ల నల్లబెల్లం, 10 కిలోల పటిక, ఐదు లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నామని మహబూబాబాద్ టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ మంగళవారం తెలిపారు. జిల్లా కేంద్రంలో టౌన్ ఎస్సై కె.శివ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తుండగా విశ్వసనీయ సమాచారం వచ్చిందన్నా రు. దీంతో గుండ్లకుంట కాలనీ ప్రాంతానికి చేరుకు ని తనిఖీలు నిర్వహించగా నల్లబెల్లం, పటిక, గు డుంబా లభ్యమయ్యాయని తెలిపారు. టౌన్ ఎస్సై శివ ఫిర్యాదు మేరకు మరో టౌన్ ఎస్సై అలీమ్ హుస్సేన్ నల్లబెల్లం అక్రమ రవాణాకు సంబంధించి పెసర రమేశ్పై కేసు నమోదు చేశారన్నారు. -
వైద్యానికి నిధులు
జిల్లా ఏర్పాటుతోపాటు తలమాణికంగా ఉన్న మెడికల్, నర్సింగ్ కళాశాలల భవనాల నిర్మాణాలు మూడు సంవత్సరాలుగా కుంటి నడకనడుస్తున్నాయి. వీటిని పూర్తి చేసేందుకు ఈ బడ్జెట్లో నిధులు మంజూరు చేయాలి. అదేవిధంగా తొర్రూరు, మరిపెడ, కేసముద్రం మున్సిపాలిటీల్లో ఉన్న పీహెచ్సీలను సీహెచ్సీలుగా 100 పడకల స్థాయి పెంచుతున్నామని, నర్సింహులపేట, సీరోలు, పెద్దవంగర మండలాల్లో నూతన పీహెచ్సీలు మంజూరు చేశారు. కానీ మూడు సంవత్సరాలుగా నిధులు మంజూరు చేయలేదు. ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తే పేదలకు మెరుగైన ప్రభుత్వ వైద్యం అందే అవకాశం ఉంది. -
లైంగిక దాడి కేసులో నిందితుడికి పదేళ్ల జైలు
కాటారం: మహాముత్తారం మండలానికి చెందిన ఓ వివాహితపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి పది సంవత్సరాల ఆరు నెలల కఠిన జైలు శిక్షతో పాటు రూ.1500 జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు మంగళవారం తీర్పు వెలువరించారు. మహాముత్తారం ఎస్సై మహేందర్కుమార్ కథనం ప్రకారం.. మహాముత్తారం మండలం మహబూబ్పల్లికి చెందిన అర్నేని నరేశ్ 2015లో ఓ వివాహిత రాత్రి ఒంటరిగా ఇంట్లో నిద్రిస్తుండగా ఆమైపె లైంగికదాడికి పాల్పడ్డాడు. సదరు మహిళ కేకలు వేయగా చుట్టు పక్కల వారు రావడంతో నరేశ్ పారిపోయాడు. మరుసటి రోజు వివాహిత ఈ విషయం తన భర్తకు చెప్పడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై వెంకటేశ్వరరావు.. నరేశ్పై కేసు నమోదు చేయగా అప్పటి సీఐ మహేశ్ చార్జ్షీట్ దాఖలు చేశారు. కొన్ని రోజులుగా కోర్టులో విచారణ కొనసాగగా డీఎస్పీ గడ్డం రామ్మోహన్రెడ్డి, సీఐ నాగార్జునరావు, ఎస్సై మహేందర్కుమార్ ఆధ్వర్యంలో సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణలో భాగంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ వాదనలు వినిపించగా నేరం రుజువైంది. దీంతో నరేశ్కు పదేళ్ల ఆరు నెలల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1500 జరిమాన విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు తీర్పు వెల్లడించారు. నిందితుడికి శిక్షపడేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన డీఎస్పీ, సీఐ, ఎస్సైతో పాటు సాక్షులను సకాలంలో ప్రవేశపెట్టిన కోర్టు సిబ్బందిని ఎస్పీ కిరణ్ఖరే అభినందించారు. హత్యాయత్నం కేసులో భర్తకు ఐదేళ్లు.. మహబూబాబాద్ రూరల్ : భార్యను అదనపు కట్నం కోసం వేధించడంతోపాటు ఆమెను హత్యచేయాలని ప్రయత్నించిన భర్తకు 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.7 వేలు జరిమానా విధిస్తూ మహబూబాబాద్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సి.సురేశ్ మంగళవారం తీర్పు వెలువరించారు. కోర్టు డ్యూటీ అధికారి, హెడ్ కానిస్టేబుల్ నెలకుర్తి అశోక్ రెడ్డి కథనం ప్రకారం.. మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గడ్డిగూడెం తండా గ్రామానికి చెందిన ధరావత్ రవికి మానుకోట జిల్లా కేంద్రంలోని శిఖార్ఖానా గడ్డకు చెందిన భవానితో 2017లో వివా హం జరిగింది. ఈ దంపతులకు ఆరు సంవత్సరాల కుమార్తె మహిమ ఉంది. భవానీని రవి, అతడి తల్లిదండ్రులు కాంతి, ఉమ్లా, ఆడపడుచు దంపతులు లక్ష్మి, విష్ణు అదనపు కట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేశారు. భర్త రవి ఉరేసి చంపే ప్రయత్నం చేయగా భవాని 2021 ఫిబ్రవరి 22వ తేదీన రూరల్ పో లీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి ఎస్సై చీర రమేశ్ బాబు కేసు నమోదు చేయగా విచారణ జరిపి అప్పటి ఎస్సై సి.హెచ్.నగేశ్ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ పక్షాన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సంతోషిణి, గణేశ్ ఆనంద్ కోర్టులో వాదనలు వినిపించగా ప్రస్తుత రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై దీపిక ఆధ్వర్యంలో కోర్టు డ్యూటీ అధికారి అశోక్రెడ్డి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. వాదనలు విన్న అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సి.సురేశ్.. రవికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.7 వేలు జరిమానా జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. -
విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దు
మహబూబాబాద్ రూరల్: పదో తరగతి విద్యార్థులు విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి సూచించారు. మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఎంశ్రీ వార్షికోత్సవం, పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఈఓ రవీందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. కంబాలపల్లి పాఠశాల జిల్లాలోనే ప్రాముఖ్యత కలిగి ఉన్నదని, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏ పో టీలు నిర్వహించినా ఈ పాఠశాల విద్యార్థులు తప్పనిసరిగా బహుమతి పొందుతారని అన్నారు. వివిధ సబ్జెక్టు టాలెంట్ టెస్టుల్లో కూడా బహుమతులు సాధిస్తారని తెలిపారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించి పాఠశాలకు పేరుతేవాలని, రాష్ట్ర స్థాయిలో జిల్లాను సింగిల్ డిజిట్కు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు స్పెషల్ టెస్టులు నిర్వహించడం ద్వారా మంచి ప్రోగ్రెస్ ఉంటుందని, ఉపాధ్యాయులు అందరి కృషి వల్ల ఈ సంవత్సరం మంచి ఫలితాలు వస్తాయని ఆకాంక్షించారు. కార్యక్రమములో ఎంఈఓ వెంకటేశ్వర్లు, హెచ్ఎం రమేష్ బాబు, మైస శ్రీనివాస్, వీరయ్య, విష్ణువర్ధన్, రామసహాయం శ్రీధర్ రెడ్డి, ఉప్పలయ్య, సోహెన్ బీ, శ్రీనివాసరావు, తిరుపతి, సతీష్ కుమార్, శిభారాణి, సోమేశ్వర్, ఝాన్సీ, మల్లారెడ్డి, వెంకటేశ్వర్లు, కృష్ణమూర్తి, వీరభద్రం, వెంకటేశ్వర్లు, యుంగేందర్, కవిత పాల్గొన్నారు. డీఈఓ రవీందర్రెడ్డి -
పనుల్లో వేగం పెంచాలి
మహబూబాబాద్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఉపాధి హామీ పనులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ మాట్లాడుతూ.. కూలీలు వంద శాతం పనులకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈజీఎస్లో జరుగుతున్న పనులు ఈనెల 31లోపు పూర్తి కావాలన్నారు. అధికారులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీసీలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, డీఆర్డీఓ మధుసూదన్, రాజు, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ -
ప్రణాళిక ప్రకారం చదివితేనే విజయం
● గ్రూప్–1 టాపర్ తేజస్విని రెడ్డి విద్యారణ్యపురి: ప్రణాళిక ప్రకారం కష్టపడి చదివి తేనే పోటీ పరీక్షల్లో విజయం సాధ్యమని గ్రూప్ –1 టాపర్ జిన్నా తేజస్విని రెడ్డి అన్నారు. మంగళవా రం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెరీర్ గైడెన్స్ కౌన్సెలింగ్ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో తేజ స్వినిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సరైన ప్రణాళికతో సొంతంగా నోట్స్ రాసుకోవాలన్నారు. పోటీ పరీక్షల్లో తమకు ఏ సబ్జెక్ట్పై ఆసక్తి ఉందో దానిపైపట్టు సాధించేలా అందుకు సంబంధించిన పుస్తకాలు చదవవాలన్నారు. శాస్త్ర,సాంకేతిక అంశాలపై శిక్షణ నిపుణలు చల్లా నారాయణరెడ్డి, ఆ కళాశాల ప్రిన్సిపాల్ జి. రాజారెడ్డి, వైస్ప్రిన్సిపాల్ కె. రజనీలత, స్టాఫ్సెక్రటరీ ఎం. రవికుమార్,కెరీర్ అండ్ గైడెన్స్సెల్ కోఆర్డినేటర్ బి.కవిత, డాక్టర్ చి న్నా మాట్లాడారు. అనంతరం తేజస్వినిరెడ్డిని ప్రిన్సి పాల్ రాజారెడ్డి ఇతర అధ్యాపకులు సన్మానించారు. విద్యుత్ మోటారు ఆన్ చేస్తూ.. మృత్యుఒడికి ● షాక్కు గురై రైతు మృతి ● కొండపర్తిలో ఘటన ఐనవోలు: విద్యుత్ మోటారు ఆన్ చేస్తున్న క్రమంలో షాక్కు గురై ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని కొండపర్తిలో చోటు చేసుకుంది. ఎస్సై పస్తం శ్రీనివాస్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాల్నె రమేశ్ (45) వ్యవసాయంతో పాటు కులవృత్తి (గౌడ) కల్లు తీస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజు మాదిరిగానే వరి పంటకు నీరు పారించడానికి మంగళవారం ఉదయం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో స్టార్టర్ ద్వారా వ్యవసాయ మోటారు ఆన్ ఆన్ చేస్తుండగా ఎడమ చేతికి విద్యుత్ తీగ తగిలి షాక్కు గురై పక్కనే ఉన్న నీటి కాల్వలో పడి అక్కడికక్కడే మృతిచెందాడు. చుట్టుపక్కల రైతులు గమనించి మృతుడి భార్య, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తన భర్త మృతి విషయంలో ఎవరిపై ఎలాంటి అనుమానం లేదని మృతుడి భార్య శోభారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి వెంకటాపురం(కె): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈఘటన మంగళవారం రాత్రి మండల కేంద్రంలోని దుర్గమ్మ గుడి సెంటర్లో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన రాజా(58) దుర్గమ్మ గుడి సెంటర్ నుంచి నడుచుకుంటూ అంబేడ్కర్ సెంటర్ వైపునకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నవాబ్ పేటకు చెందిన ఉదయ్ కిరణ్ (30) ద్విచక్రవాహనంపై వేగంగా వస్తూ రాజాను ఢీకొన్నాడు. దీంతో రాజా అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే, ద్విచక్రవాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టి కిందపడడంతో ఉదయ్ కిరణ్ కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. -
‘దేవాదుల’ గట్టెక్కించేనా?
సాక్షిప్రతినిధి, వరంగల్/హసన్పర్తి/ధర్మసాగర్: వేసవి ఎండల తీవ్రత.. అడుగంటుతున్న భూగర్భజలాలు.. దీంతో జనగామ, హనుమకొండ జిల్లాల్లోని నాలుగు నియోజకవర్గాల్లో అక్కడక్కడ పంట లు ఎండుతున్నాయి. చేతికందే దశలో దేవాదుల ప్రాజెక్టు పరిధిలో వరి పంటలు దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టు కింద 50 నుంచి 60వేల ఎకరాలకు సాగునీరందించేలా దేవాదుల ప్రాజెక్టు మూడవ దశలో భాగంగా దేవన్నపేటలో నిర్మించిన పంపుహౌస్ మోటార్లను జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రారంభించేందుకు మంగళవారం సాయంత్రం పంపుహౌస్కు చేరుకున్నారు. కానీ, మోటారు మరమ్మతుకు రావడం, ఆస్ట్రియానుంచి వచ్చిన బృందం చేపట్టిన రిపేర్లు పూర్తి కాకపోవడంతో మంత్రులు రాత్రి ఎన్ఐటీ గెస్టుహౌస్లో ఉన్నారు. అసెంబ్లీలో బుధవారం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో రాత్రి 11.30 గంటలకు హైదరాబాద్కు వెళ్లిపోయారు. హడావుడిగా సాగిన మంత్రుల పర్యటన.. దేవాదుల చివరి ఆయకట్టుకు సాగునీరందిచేందుకు యుద్ధప్రాతిపదికన ఖరారైన మంత్రుల టూర్ హడావిడిగా సాగింది. మొదట మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా హసన్పర్తి మండలం దేవన్నపేటకు పంప్హౌజ్కు చేరుకున్నారు. అక్కడినుంచి ధర్మసాగర్ రిజర్వాయర్లో నీరు పంపింగ్ అయ్యేలా మోటార్ ఆన్ చేయాల్సి ఉంది. అనంతరం ధర్మసాగర్ రిజర్వాయర్కు చేరుకుని అక్కడ పూజలు చేసి.. మీడియా సమావేశంలో మాట్లాడుతారనేది షెడ్యూల్. కానీ, అనుకున్న ప్రకారం దేవన్నపేటకు మంత్రులు చేరుకున్నప్పటికీ మోటార్ మొరాయించడంతో స్విచాన్ చేయకుండా అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద వేసిన టెంట్లు, కుర్చీల వద్దే ప్రజలు, కార్యకర్తలు ఉండిపోయారు. చివరి నిమిషంలో మీడియా సమావేశం దేవన్నపేటలోనే ఉంటుందనడంతో ధర్మసాగర్ నుంచి దేవన్నపేటకు మీడియాతోపాటు నాయకులు, కార్యకర్తలు, అధికారులు వెళ్లాల్సి వచ్చింది. కాగా దేవన్నపేట పంపుహౌస్, ధర్మసాగర్ రిజర్వాయర్తో పాటు పలుచోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల పక్కన ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, మామిడాల యశస్విని రెడ్డి తదితరుల ఫొటోలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అధికారులపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం దేవాదుల ప్రాజెక్టు దశలు ఎప్పుడు ప్రారంభమయ్యాయని, ఇతర అంశాలపై మంత్రులు అడిగిన ప్రశ్నలకు నీటిపారుదల శాఖ అధికారుల నుంచి సరైన సమాధానం లేదు. దీంతో వారిపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్ష కు సమాచారం లేకుండా వట్టి చేతులతో వస్తారా అని మండిపడ్డారు. చిన్న చిన్న సమస్యలతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, నీటిపారుదలశాఖ ము ఖ్య కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, బల్దియా కమిషనర్ అశ్వినీ తానాజీ వాక డే, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవారెడ్డి, కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, మేయర్ గుండు సుధారాణి, పీసీసీ మాజీ కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్, ఎన్ఎస్ యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు సురేందర్రెడ్డితోపా టు దేవాదుల ఉన్నతాఽధికారులు పాల్గొన్నారు. రాత్రి వరకు కాని మోటార్ మరమ్మతు చివరి ఆయకట్టు రైతుల్లో ఆందోళన హడావుడిగా సాగిన మంత్రుల పర్యటన ‘ధర్మసాగర్ రిజర్వాయర్’ కార్యక్రమం రద్దు దేవన్నపేట పంపుహౌస్కు హుటాహుటిన అధికారులు ఫేజ్–3 పనులపైనే దృష్టి... చేతికందే పంటలను కాపాడేందుకు మూడో ఫేజ్ పనులపై అధికారులు దృష్టి సారించారు. దేవన్నపేట పంపుహౌస్లో ప్రస్తుతం ఒక్కో మోటారు 800 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఇక్కడ మూడు మోటార్లు ఏర్పాటు చేయగా.. అందులో ఒక్కటి ఆన్చేసి జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో సుమారు 60వేల నుంచి 65వేల ఎకరాల వరకు సాగునీరు అందించడంపై దృష్టి పెట్టారు. మంగళవారం రాత్రి వరకు మోటారు మొరాయించడంతో ఈ యాసంగి పంట చేతికందే వరకు నీటి సరఫరా అవుతుందా? అన్న ఆందోళన ఆ నాలుగు నియోజకవర్గాల్లోని రైతుల్లో వ్యక్తమవుతోంది. -
రామప్పలో అమెరికా దేశస్తులు
వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సుప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని మంగళవారం అమెరికాకు చెందిన షేమ్, ని సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప అందాలు బాగున్నాయని కొనియాడారు. సరిగమలు పలికే పొన్నచెట్టు శిల్పాన్ని మీటుతూ ముగ్ధులయ్యారు. రామప్ప శిల్పాలను తమ సెల్ఫోన్లో బంధించుకున్నారు. అనంతరం సరస్సు కట్టకు చేరుకొని సరస్సులో బోటింగ్ చేస్తూ అందాలను తిలకించారు. -
మరమ్మతుల్లో చెరువులు, చెక్ డ్యాములు
గత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 55 చెరువు కట్టలు కొట్టుకుపోయాయి. 72 చెరువులకు గండ్లు పడ్డాయి. వీటితోపాటు, ఆకేరు, మున్నేరు, పాలేరు వాగులపై నిర్మించిన 42 చెక్ డ్యాముల్లో సగం మేరకు దెబ్బతిన్నాయి. రోడ్లు ధ్వంసం అయ్యాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతోపాటు కేంద్ర బృందం ఈ ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేశారు. తాత్కాలిక మరమ్మతుల పేరిట కొన్ని నిధులు మంజూరు చేసినా.. అవి సగం పనులకు కూడా సరిపోలేదు. ఈ బడ్జెట్లో నిధులు కేటాయించి చెరువులు, చెక్ డ్యామ్ల మరమ్మతులు చేస్తేనే సాగునీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుంది. -
మామిడి తోటల్లో జాగ్రత్తలు చేపట్టాలి
మహబూబాబాద్ రూరల్: మామిడి తోటలు సాగు చేస్తున్న రైతులు ప్రస్తుత తరుణంలో సరైన జాగ్రత్తలు చేపట్టి అధిక దిగుబడులు పొందాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి మరియన్న, జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం రైతు నేస్తం కార్యక్రమంలో అధికారులు, రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా యాసంగిలో మామిడి తోటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చీడపీడల నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలపై రైతులకు సూచనలు ఇచ్చారు. క్రాప్ బుకింగ్, పీఎం కిసాన్, రైతుబంధు, రైతు బీమా పథకాలపై జిల్లాలోని మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి తిరుపతిరెడ్డి, వ్యవసాయ అధికారి (టెక్నికల్) రాజు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి మరియన్న -
సామాజిక అభ్యున్నతికి దోహదం
భారత రాజ్యాంగం.. కేయూ క్యాంపస్ : భారత రాజ్యాంగం సామాజిక వ్యవస్థ అభ్యున్నతికి దోహదపడుతున్న విలువైన డాక్యుమెంట్ అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నారాయణ అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ‘75 ఏళ్ల భారత రాజ్యాంగం మైలు రాయి.. సమస్యలు– సవాళ్లు’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు మంగళవారం సెనేట్హాల్లో నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. భారతీయ సమాజం విభిన్న సంస్కృతుల జాతుల కలయిక అని, ఇండియాలో నివసించే వ్యక్తులందరూ రాజ్యాంగం పరిధిలో జీవిస్తున్నారన్నారు. సమసమాజ స్థాపనకు భారత రాజ్యాంగ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సెక్యులర్ భావాలతో రాజ్యాంగంలో పేర్కొన్న ప్రతీ ఆర్టికల్ దేశ ప్రజలందరికీ ఉపయోగపడుతుందన్నారు. మానవ అభివృద్ధికి విద్య దోహదం.. మానవ అభివృద్ధికి విద్య ఎంతో దోదపడుతుందని తెలంగాణ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య అన్నారు. బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు సమాజ అభ్యున్నతికి దోహదపడుతున్నాయన్నారు. భగవద్గీత, వేదాలు ఉపనిషత్తులు, అన్ని గ్రంథాలతోపాటు రాజ్యాంగాన్ని కూడా ప్రతి ఒక్కరూ చదవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అధిక నిధులు కేటాయించాలన్నారు. విద్య, వైద్యం ఉచితంగా అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాలు రావాలి.. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో విలువలు లేవని, దీనివల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరగడం లేదని, అందుకే ప్రత్యామ్నాయ రాజకీయాలు రావాలని కేయూ మాజీ రిజిస్ట్రార్ శ్రీనివాస్రెడ్డి అన్నారు. దేశంలో నిజాయితీ గల రాజకీయ వ్యవస్థ లేకుండా పోయిందన్నారు. సెక్యులర్ భావాలు కలిగిన వ్యవస్థ.. ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగ వ్యవస్థను కలిగిన భారతదేశంలో భిన్న సంస్కృతులు, ఆచార వ్యవహారాలు ఉన్నాయని, ముఖ్యంగా సెక్యులర్ భావాలతో కలిగిన వ్యవస్థ ఉందని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర గ్రంథాలయాల సంస్థ చైర్మన్ మహ్మద్ రియాజ్ అన్నారు. తెలంగాణలో రేవంత్రెడ్డి ప్రజాపాలనలో అనేక సమస్యల పరిష్కారానికి కృషి జరుగుతోందన్నారు. యూనివర్సిటీల్లో కూడా టీచింగ్ ఫ్యాకల్టీని నియమించబోతున్నారని వెల్లడించారు. అనంతరం కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి, కేయూ ఎస్సీ,ఎస్టీ సెల్ డైరెక్టర్, సెమినార్ డైరెక్టర్ తుమ్మల రాజమణి, ఓయూ ‘లా’ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ద్వారకానాథ్ మాట్లాడారు. కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, సైన్స్కోర్సుల డైరెక్టర్ బి. వెంకటగోపినాథ్, డాక్టర్ మేఘనరావు, డాక్టర్ ప్రగతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏపీ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ నారాయణ కేయూలో జాతీయ సదస్సు ప్రారంభం -
నెల క్రితం ఇంటి నుంచి వెళ్లి.. శవమై కనిపించి..
● వడదెబ్బతో వ్యక్తి మృతి కేసముద్రం: నెల రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి.. సరైన ఆహారం లేక, వడదెబ్బకు గురై మృతి చెందాడు. ఈ ఘటన కేసముద్రంమున్సిపాలిటీ పరిధి ముత్యాలమ్మగుడి సమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై మురళీధర్రాజు కథనం ప్రకారం.. పెద్దవంగర మండలం ఉప్పరిగుడెం గ్రామానికి చెందిన దుంపల రాజు(48) నెలరోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. చుట్టుపక్కల, బంధువుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో సోమవారం మున్సిపాలిటీ పరిధి ముత్యాలమ్మగుడి సమీపంలో వ్యక్తి మృతదేహం కనిపించగా స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతుడు పెద్దవంగర మండలం ఉప్పరిగుడెంకు చెందిన రాజుగా గుర్తించారు. సరైన ఆహరం లేక, వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడి కుమారుడు సాయికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఉల్లాసంగా బోధిస్తేనే ఉపయోగకరం
మహబూబాబాద్ అర్బన్/పెద్దవంగర/తొర్రూరు రూరల్/నెల్లికుదురు: ఉత్సాహంగా, ఉల్లాసభరితంగా బోధన సాగితేనే విద్యార్థులకు సులువుగా అర్థమవుతుందని ఎస్సీఈఆర్టీ ఫ్యాకల్టీ సభ్యుడు ఎస్ఎం.అహ్మద్ పేర్కొన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా కేంద్రం మానుకోటలోని కస్తూ ర్బాగాంధీ విద్యాలయం, పెద్దవంగరలోని జెడ్పీ ఉన్నత పాఠశాల, కేజీబీవీ, తొర్రూరు మండలంలోని అమ్మాపురం ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు, నెల్లికుదురు మండల కేంద్రంలోని కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలను జిల్లా కోఆర్డినేటర్ ఆజాద్ చంద్రశేఖర్తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీ లించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థులందరూ అభ్యసన ఫలితాలు సాధించేలా ప్రణాళికబద్ధమైన బోధన చేపట్టాలని, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉపయోగించాలని మార్గనిర్దేశం చేశారు. ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత డిజిటల్ పద్ధతుల్లో విద్యాబోధన చేపట్టాలని సూచించారు. కంప్యూటర్ పరిజ్ఞానంతో విద్యార్థుల సంఖ్య పెరిగేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓలు బుదారపు శ్రీనివాస్, మహంకాళి బుచ్చయ్య, జీసీడీఓ విజయకుమారి, కేజీవీబీ ప్రిన్సిపాల్ భవాని, ఎస్ఓ స్రవంతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. ఎస్సీఈఆర్టీ ఫ్యాకల్టీ సభ్యుడు ఎస్ఎం అహ్మద్ -
మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2025
ఉమ్మడి వరంగల్ జిల్లాలో టెన్త్ విద్యార్థుల వివరాలు– 8లోuఏడాదంతా చదివింది ఒక ఎత్తయితే.. దాన్ని పరీక్షల్లో ప్రజెంట్ చేయడం మరో ఎత్తు.. కొందరు విద్యార్థులు బాగా చదువుతారు. తీరా పరీక్ష సమయానికి మరిచిపోతుంటారు.. మరికొందరేమో ఎంత చదివినా హ్యాండ్ రైటింగ్ బాగోలేక మార్కులు కోల్పోతారు.. ఇంకొందరైతే పరీక్ష అంటే గాబరా పడిపోయి ప్రశ్నల కు సమాధానం తెలిసినా నిర్ణీత సమయంలో రాయలేకపోతారు.. ఇలా చాలా మంది విద్యార్థులు ఏదో ఒక సమస్యతో బాధపడేవారే. వీరంతా మంచి మార్కులు సాధించేందుకు, పరీక్షలను ఈజీగా రాసేందుకు సబ్జెక్టు నిపుణులు సూచనలిస్తున్నారు. ఈనెల 21 నుంచి పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. మంచి మార్కులు సాధించడానికి ఆయా సబ్జెక్టుల నిపుణులను ‘సాక్షి’ పలకరించింది. విద్యార్థుల కోసం వారు తమ సూచనలు, సలహాలు వెల్లడించారు. – మహబూబాబాద్ అర్బన్ మొత్తం విద్యార్థులు 42,262బాలికలు 20,600బాలురు 21,662ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలిపదో తరగతి వార్షిక పరీక్షలు మరో మూడ్రోజుల్లో ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలి. బాగా చదివాను.. పరీక్షలు బాగా రాస్తాను.. అనే భావనతో వెళ్లాలి. నెగెటివ్ ఆలోచనలను దరిచేర నీయొద్దు. గతంలో సాధించిన విజయాలను గుర్తు చేసుకోవాలి. టీవీ, సెల్ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు వహించాలి. ఫాస్ట్ఫుడ్, జంక్ఫుడ్ జోలికి వెళ్లొద్దు. సాత్విక ఆహారం తీసుకుంటే తొందరగా జీర్ణమవుతుంది. తగినంతగా నీరు తాగాలి. ఎవరైనా ఒత్తిడికి లోనైనా.. పరీక్షలంటే భయం కలిగినా 93911 17100, 94408 90073 నంబర్లకు ఫోన్ చేస్తే తగిన సూచనలిస్తాం. – పోగు అశోక్, తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వివరాలు 8లోu -
వినియోగదారులకు మెరుగైన విద్యుత్ అందించాలి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి హన్మకొండ : విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ అందించాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన పనులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ లోడ్ పెరిగే అవకాశం ఉన్న అన్ని చోట్ల అన్ని సర్కిళ్ల పరిధిలో పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏ ర్పాటు చేశామన్నారు. ఇంటర్ లింకింగ్ పనులు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పా టు, వీసీబీల ఏర్పాటు, పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్ఈలను ఆదేశించారు. ఏప్రిల్లో పంట కోతలు పూర్తి కాగానే వ్యవసాయ సర్వీసుల త్వరితగతిన రిలీజ్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్ లాల్, టి.మధుసూదన్, సీఈలు తిరుమల్రావు, రాజు చౌహాన్, అశోక్, బీకం సింగ్, వెంకటరమణ, డీఈ అనిల్ కుమార్ పాల్గొన్నారు. పోక్సో కేసులో ఇద్దరికి జైలు గణపురం: పోక్సో కేసులో ఇద్దరికి జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ భూపాలపల్లి ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు సోమవారం తీర్పు వెలువరించారు. 2020 సంవత్సరంలో గణపురం మండలం దుబ్బపల్లికి చెందిన ఓ బాలికను అదే గ్రామానికి చెందిన మోతె రవీందర్ వేధించగా బాలిక ఈ విషయం తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయి తీ నిర్వహించారు. ఈ సమయంలో రవీందర్ భా ర్య సునీత.. బాలికను, ఆమె తల్లిదండ్రులను దూషి స్తూ వారిపై దాడి చేయగా బాలిక తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో అప్పటి ఎస్హెచ్ఓ ప్రభాకర్ పోక్సో కేసు నమోదు చేయగా అప్ప టి ఎస్సై సత్యనారాయణ రాజు చార్జ్షీట్ ఫైల్ చేశా రు. కోర్టు స్పెషల్ పీపీ విష్ణువర్ధన్ వాదనలు వినిపించారు. ప్రస్తుత సీఐ మల్లేశ్, ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో కోర్టు లైజనింగ్ అధికారి, ఏఎస్సై గాండ్ల వెంకన్న, కోర్టు కానిస్టేబుల్ శ్వేత సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువుకావడంతో భూపాలపల్లి ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు నింది తులకు సంవత్సరం జైలు, రవీందర్కు రూ.4,500, సునీతకు రూ.1,500 జరిమానా విధించారు. గంజాయి కేసులో ఒకరికి పదేళ్లు.. రేగొండ: గంజాయి కేసులో ఒకరికి పది సంవత్సరాల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తూ భూపాలపల్లి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు సోమవారం తీర్పు వెలువరించారు. పోలీ సుల కథనం ప్రకారం.. కొత్తపల్లిగోరి మండలం ని జాంపల్లి గ్రామానికి చెందిన వంగల రాజన్న ఇంట్లో గంజాయి ఉందనే సమాచారం మేరకు 2019లో అప్పటి ఎస్సై సధాకర్ సోదాలు నిర్వహించి 25 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అప్పటి సీఐ సాయిరమణ విచారణ చేపట్టి కేసు న మోదు చేశారు. అనంతరం చిట్యాల సీఐ పులి వెంకట్ చార్జ్షీట్ దాఖలు చేశారు. ప్రస్తుత సీఐ మల్లేశ్, ఎస్సై సందీప్కుమార్ ఆధ్వర్యంలో కోర్టు డ్యూ టీ అధికారి జ్యోతి.. సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా ప్రభుత్వ న్యాయవాది శ్రీనివాస్ వాదనలు విని పించారు. కేసు పూర్వాపరాలు విచారించిన జిల్లా ప్రధా న న్యాయమూర్తి నారాయణబాబు.. నిందితుడికి ప ది సంవత్సరాల జైలు శిక్ష రూ.లక్ష జరిమానా విధి స్తూ తీర్పు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. 20న జాబ్ మేళాహన్మకొండ అర్బన్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు ఈనెల 20న(గురువారం) జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా ఉపాధి కల్పనా అధికారి ఎం.మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో వర్చువల్ సెల్స్ ఎగ్జిక్యూటివ్, యాక్సిస్ బ్యాంక్లో బిజినెస్ డెవెలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ 20 పోస్టుల భర్తీకి ములుగు రోడ్డు ప్రభుత్వ ఐటీఐ బాయ్స్ క్యాంపస్లోని జిల్లా ఉపాఽధి కార్యాలయంలో ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. అభ్యర్థుల వయసు 18–35 ఏళ్ల లోపు ఉండాలని, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని, ఆసక్తి ఉన్న యువతీ యువకులు బయోడేటా, రెజ్యూమ్, విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో ఉదయం 11 గంటలకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 98488 95937 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. -
వినతులు వెంటనే పరిష్కరించాలి
అన్యాయం చేశారు.. పోలియో వల్ల మా కుమారుడు జీవన్ కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. తన పేరున స్వయం ఉపాధి కింద రూ.50వేల రుణం కోసం మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేశాం. ఈ విషయంలో సంబంధిత అధికారులు అన్యాయం చేశారు. కనీసం ఇంటర్వ్యూకు కూడా పిలువలేదు. ఈ విషయంలో విచారణ చేసి రుణం మంజూరు చేయాలి. –సురేశ్–శైలజ దంపతులు, ఇనుగుర్తి మహబూబాబాద్: ప్రజావాణిలో వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె.వీరబ్రహ్మచారి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో మాట్లాడుతూ.. పెండింగ్ వినతులను కూడా పరిష్కరించాలని, పరిష్కారం కాకపోతే, అందుకు గల కారణాలను తెలుపు తూ నివేదిక అందజేయాలన్నారు. సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం అనే విషయాన్ని అధికారులు గుర్తు పెట్టుకోవాలన్నారు. దరఖాస్తుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కాగా ప్రజావాణిలో 69 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, సీపీఓ సుబ్బారావు, సివిల్ సప్లయీస్ డీఎం కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో -
వేగంగా ‘అమృత్’ పనులు
మహబూబాబాద్ రూరల్: రైల్వే ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలనే లక్ష్యంతో మానుకోట రైల్వేస్టేన్ను అమృత్ భారత్ పథకానికి ఎంపిక చేసి రూ.39కోట్లు కేటాయించారు. ఈమేరకు అభివృద్ధి పనులు చకచక కొనసాగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వేశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరుగుతున్న పనులు పూర్తయితే రైల్వేస్టేషన్ రూపురేఖలు మారిపోనున్నాయి. ఈమేరకు రైల్వే ప్రయాణికులకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయి. పూర్తయిన పనులు.. రైల్వేస్టేషన్ మాస్టర్, డిప్యూటీ ఎస్ఎస్ ప్యానెల్ రూమ్, ఎస్ఎన్టీ, టీఐ రిలే రూమ్ భవన నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. వచ్చే నెల 18వ తేదీ వర కు ఆయా విభాగాల కార్యకలాపాలను ఆ భవనం నుంచే నిర్వహించనున్నట్లురైల్వే అధికారులు పేర్కొన్నారు. ఒకటో నంబర్ ప్లాట్ ఫారంపై పూర్తిస్థాయిలో మరుగుదొడ్లు, మూత్రశాలలు, ఉన్నత శ్రేణి ఏసీ విశ్రాంతి గది, రెండో తరగతి ఏసీ, సాధారణ వి శ్రాంతి గది నిర్మాణ పనులు పూర్తి చేశారు. అలాగే ఒకటో ప్లాట్ ఫారం వైపున ప్రధాన ద్వారం ప్రాంతంలో ఫెసాడ్ పనులు పూర్తయ్యాయి. ప్రయాణికుల అవసరాల మేరకు షెడ్ల నిర్మాణం చేపట్టారు. జరుగుతున్న పనులు.. రైల్వేస్టేషన్ 1, 2ప్లాట్ ఫారాలను రీ మోడలింగ్ చేస్తున్నారు. కొత్తగా 21 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఎస్కలేటర్, 4 లిఫ్టులు, ఒక ర్యాంపు నిర్మాణం చేయనుండగా.. గార్డెన్ ఆధునికీకరణ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఒకటో నంబర్ ప్లాట్ ఫారంపై పూర్తిస్థాయిలో షెడ్ల నిర్మాణం, మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణం చేయాల్సి ఉంది. రెండు ప్లాట్ ఫారాలపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రూ.39 కోట్లతో మానుకోట రైల్వేస్టేషన్ ఆధునికీకరణ అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు మెరుగైన వసతులు -
విద్యార్థుల్లో పెరుగుతున్న కంటి సమస్యలు
మహబూబాబాద్ అర్బన్/నెహ్రూసెంటర్: పాఠశాల స్థాయి విద్యార్థుల్లో కంటి సమస్యలు పెరుగుతున్నాయని డీఎంహెచ్ఓ మురళీధర్ అన్నారు. ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో ఇటీవల కంటి పరీక్షలు చేపట్టగా.. సోమవారం సమస్యలు ఉన్న విద్యార్థులకు ప్రభుత్వ ఆస్పత్రిలో కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 17 నుంచి 28వరకు కంటి పరీక్షలు నిర్వహించి, కంటి సమస్యలు ఉన్న 633మంది విద్యార్థులను గుర్తించామన్నారు. మొదటి విడతగా 274 మంది విద్యార్థులు కళ్లద్దాలు పంపిణీ చేశామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్బీఎస్కే ప్రోగ్రాం ఆఫీసర్లక్ష్మీనా రాయణ, ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ నర్సయ్య, నోడల్ అఽధికారి డాక్టర్ కుమార్, సబ్ యూనిట్ అధికారి రామకృష్ణ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమ్య, ఫార్మసిస్ట్ శ్రీలక్ష్మీ, ఏఎన్ఎం లావణ్య పాల్గొన్నారు. సీపీఆర్పై అవగాహన.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సీపీఆర్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ మురళీధర్, కళాశాల ప్రిన్సిపాల్ లీలా, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వరప్రసాద్, వైస్చైర్మన్ డాక్టర్ నెహ్రూ, కోశాధికారి వెంకట్రెడ్డి, డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ వరప్రసాద్, అశోక్, శిరీష, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ మురళీధర్ -
ఘనంగా పుష్పయాగం, ఆరాధన పూజలు
మహబూబాబాద్ రూరల్: మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని అనంతాద్రి జగన్నాథ వేంకటేశ్వర స్వామివారి దేవాలయ 20వ వార్షికోత్సవంలో భాగంగా శ్రీపుష్పయాగం, ద్వాదశ ఆ రాధన, పవళింపు సేవ, ఆశీర్వచన పూజలు ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఆ లయ ప్రధాన అర్చకులు గొడవర్తి చక్రధరాచా ర్యులు పర్యవేక్షణలో గొడవర్తి శ్రీనివాసచా ర్యుల నిర్వహణలో సహ అర్చకులు విశ్వం, మట్టపల్లి విజయ్ కుమార్, గౌతమ్, చరణ్ పూజా కార్యక్రమాలు జరిపారు. శ్రీశక్రు, సోని యమ్మ సేవా సమితి వ్యవస్థాపకుడు, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ. శరత్, కుటుంబ సభ్యుల అధ్వర్యంలో సామూహిక అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గీతాంజలి స్కూల్ పక్షాన పొనగంటి రామకృష్ణ దంపతులు ద్వాదశ ఆరాధన ప్రసాదానికి విరాళం అందజేశారు. కార్యక్రమంలో నాయిని ప్రభాకర్ రెడ్డి, భక్తులు పాల్గొన్నారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా రమేశ్కుమార్ ఎంపికమరిపెడ రూరల్: మరిపెడ మండలం వీరారం గ్రామ పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న భూక్య రమేశ్కుమార్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. గత ఏడాది జూన్లో నిర్వహించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షల్లో రమేశ్నాయక్ ఉత్తీర్ణత సాధించారు. రమేశ్కుమార్ స్వగ్రామం మండలంలోని సోమ్లతండా కాగా ఆయనను తోటి ఉద్యోగస్తులు, మిత్రులు, గ్రామస్తులు అభినందించారు. తొర్రూరులో నలుగురు.. తొర్రూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష ఫలితాల్లో తొర్రూరు మండలం నుంచి నలుగురు ఎంపికయ్యారు. మడిపెల్లి గ్రామానికి చెందిన అబ్బనాపురి బ్రహ్మచారి, పత్తేపురం గ్రామానికి చెందిన అనిరెడ్డి మోహన్రెడ్డి, చెర్లపాలెం గ్రామానికి చెందిన హనుమాండ్ల ప్రదీప్రెడ్డి, ధర్మారపు రాజు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లుగా ఎంపికయ్యారు. ఉద్మోగాలు సాధించిన వారిని మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, బంధువులు, కుటుంబ సభ్యులు అభినందించారు. ఉద్యమకారులకు ప్రభుత్వ గుర్తింపు మహబూబాబాద్ రూరల్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తిస్తుందని ప్రముఖ కవి, గాయకులు గొడిశాల జయరాజ్ అన్నారు. తమ స్వస్థలమైన జిల్లా కేంద్రానికి వచ్చిన జయరాజ్ సోమవారం అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఘనపురపు అంజయ్య నివాసంలో విలేకరులతో మాట్లాడారు. అనంతరం గోడిశాల జయరాజును ఘనపురపు అంజయ్య, సుభాషిణి దంపతులు ఘనంగా సన్మానించారు. -
వర్సిటీల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
● కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి కేయూ క్యాంపస్ : రాష్ట్ర పరిధిలోని ప్రభుత్వ యూనివర్సిటీల అభివృద్ధికి, పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని, యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయొద్దని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్రెడ్డి అన్నారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో సోమవారం కేయూ సెనేట్హాల్లో ‘యూజీసీ నూతన నిబంధనలు, రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి’ అనే అంశంపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన మాట్లాడారు. యూజీసీ నూతన ముసాయిదాతో యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. అందుకే నూతన ముసాయిదాను వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో నాణ్యమైన విద్య బోధన జరగాలంటే సరిపడా అధ్యాపకుల నియామకాలు జరగాలన్నారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్, కేయూ రిటైర్డ్ ఆచార్యుడు కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్.. యూనివర్సిటీల అభివృద్ధికి ఇచ్చే నిధులు బాగా తగ్గించిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఇచ్చే యూజీసీ ఫెలోషిప్స్, స్కాలర్షిప్స్లో కోత విధించిందన్నారు. యూజీసీ నూతన ముసాయిదాతో యూనివర్సిటీల స్వయంప్రతిపత్తిని కాలరాయడమేనని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐఎంఏ న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి నున్న అప్పారావు, పీడీఎస్యూ జాతీయ నాయకుడు ఇ. విజయ్కన్నా, రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. సాంబ, రాష్ట్ర సహాయ కార్యదర్శి మిశ్రీన్సుల్తానా పాల్గొన్నారు. -
బకెట్తో నీరు తోడుతూ..
● సంపులో పడి యువతి మృతి ● రాజవరంలో ఘటన చిల్పూరు: బకెట్తో నీరు తోడుతుండగా సంపులో పడి ఓ యువతి మృతి చెందింది.ఈ ఘటన మండలంలోని రాజవరంలో జరిగింది. ఎస్సై సిరిపురం నవీన్కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సామల స్వాతి (21) ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బకెట్తో సంపులో నీరు తోడుతోంది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి సదానందం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సోమవారం తెలిపారు. -
ధాన్యం కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలి
మహబూబాబాద్: యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 432 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో 1,79,000 మెట్రిక్ టన్ను ల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందన్నా రు. కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ కాంటాలు, తాగునీరు తదితర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సాంకేతిక సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ధాన్యం సేకరించిన తర్వాత ఆలస్యం చేయకుండా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు. రైస్ మిల్లర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి, ఆర్డీఓలు కృష్ణవేణి, గణేష్, డీసీ ఓ వెంకటేశ్వర్లు, డీఏఓ విజయనిర్మల, డీసీఎస్ఓ ప్రేమ్కుమార్, సివిల్ సప్లయీస్ డీఎం కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో -
ఎన్ని రోజులు తిరగాలి..
కలెక్టర్ సారూ చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు ● కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోతున్నాం ● ప్రజావాణిలో బాధితుల గోడుసాక్షి, మహబూబాబాద్: ‘మా సమస్యలు నేరుగా కలెక్టర్కే చెప్పుకుంటే పరిష్కారం అవుతాయని సంబురపడ్డాం. ప్రతీ సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజావాణి కోసం దూర ప్రాంతాల నుంచి వస్తున్నాం. దరఖాస్తులు కలెక్టర్ సర్, ఇతర పెద్ద సార్లకు ఇస్తున్నాం. మీ తహసీల్దార్, ఇతర అధికారులతో చెబుతాం.. మీ సమస్య పరిష్కారం అవుతుందని పెద్దసార్లు చెబుతున్నారు.. అక్కడికి వెళ్తే మమ్ముల్ని పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. దీంతో మళ్లీ కలెక్టర్ సార్ వద్దకు రావడం, మళ్లీ కింది స్థాయి అధికారుల వద్దకు వెళ్లడం మినహా మా సమస్య పరిష్కారం కావడం లేదు. కలెక్టర్, తహసీల్దార్, ఇతర అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగున్నాం.. కానీ ఏం లాభం లేకుండా పోయింది.. ఇంకా ఎన్ని రోజులు తిరగాలి’ అని సోమవారం గ్రీవెన్స్కు వచ్చిన పలువురు బాధితులు వాపోయారు. ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి మాకు పర్వతగిరి గ్రామంలో 2.20 ఎకరాల భూమి ఉండేది. దానిలో 9 గుంటలు ఎస్సారెస్పీ కాల్వ నిర్మాణం కోసం తీసుకున్నారు. అలాగే గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణంలో రెండు ఎకరాలు కోల్పోయాం. మిగిలిన 11 గుంటల భూమి సాగుకు అనుకూలంగా లేదు. ఉద్యోగంతో పాటు పరిహారం పెంచి ఇవ్వాలి. – మూలగుండ్ల కిరణ్కుమార్–దివ్య, దంపతులు, పర్వతగిరి -
అడ్డదారి లైసెన్స్లకు చెక్
వాహనం సరిగా నడపగలిగితేనే లైసెన్స్.. లేదంటే అంతేస్మార్ టెస్ట్ ట్రాక్ ఏర్పాటుకు ప్రణాళికలు రెడీ ● ట్రాక్పై డ్రైవింగ్ పరీక్ష పద్ధతికి స్వస్తి ● ఉమ్మడి జిల్లాలో అన్ని ఆర్టీఏల్లో స్థలాల సేకరణకు చర్యలు ● ఇప్పటికే ఆయా కలెక్టర్లకు ఆర్టీఓల వినతి ఖిలా వరంగల్ : రహదారులపై ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా వాహనాలు. లక్షలాది సంఖ్యలో బైకుల.. వేలాది సంఖ్యలో కార్లు కనిపిస్తున్నాయి. అయితే వీటన్నింటినీ నడిపే వారికి లైసెన్స్ ఉందా అంటే.. కొందరికి మాత్రమే ఉంటోంది. మరికొందరికి ఉండడం లేదు. మరి ఉన్నవాళ్లయినా సక్రమంగా తీసుకున్నారా అంటే.. బ్రోకర్ల ద్వారా అడ్డదారుల్లో తీసుకుంటున్నారు. ఫలితంగా ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీంతో రవాణాశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి పాత విధానం ట్రాక్పై డ్రైవింగ్ పరీక్ష పద్ధతికి చెక్ పెడుతూ.. స్మార్ట్ సెన్సార్ కెమెరాల నిఘాతో అధునాతన ట్రాక్పై కొత్త పరీక్ష తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీని వల్ల అడ్డదారిలో లైసెన్స్లు తీసుకునే వాహనచోదకులకు చెక్ పడనుంది. అడ్డదారులు మూత! ప్రస్తుతం.. ప్రతి ఇంట్లో ద్విచక్రవాహనం తప్పని సరి అయ్యింది. కొన్ని ఇళ్లల్లో ఒకటికి మించి ఉంటున్నాయి. ఆర్థికంగా ఉన్న వారు కారు కూడా కలిగి ఉంటున్నారు. ఫలితంగా రోజు రోజుకూ వాహనాల కొనుగోళ్లు భారీగా పెరిగిపోతున్నాయి. అందుకు నిదర్శనమే రహదారులపై పెరిగిపోతున్న ట్రాఫిక్ జామ్. కొంత మంది డ్రైవింగ్పై పూర్తి అవగాహన లేకుండానే రోడ్డెక్కేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. మరి వాళ్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదా.. అంటే ఉంటుంది. కానీ అది అడ్డదారిలో తీసుకున్నదై ఉంటుంది. డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలపై పూర్తి అవగాహన లేకుండా వాహనాలతో రోడ్కెక్కడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని, అందుకు అడ్డదారుల్లో డ్రైవింగ్ లైసెన్స్లు పొందడమే కారణమని గ్రహించిన అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం కొత్త పరీక్ష ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు ఉన్న మ్యానువల్ పరీక్షను తీయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆధునికతకు చర్యలు.. తాజాగా వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను ఆధునీకరించాలని ఆర్టీఏ అధికారులు నిర్ణయించారు. అందుకోసం ప్రస్తుతం కొనసాగుతున్న పాత విధానం కంటే మరింత ప్రామాణికంగా డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆటోమేటిక్ స్మార్ట్ సెన్సార్ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించేందుకు స్థలాల సేకరణలో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో అడ్డదారిలో డ్రైవింగ్ లెసెన్స్ పొందడం కష్టమే.. వాహనం నడిపితేనే లైసెన్స్.. త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న కొత్త పద్ధతిలో రహదారులపై నిత్యం ఎదురువుతున్న ఇబ్బందులను డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్పై కృత్రిమంగా కల్పిస్తారు. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు తప్పని సరిగా పరీక్ష రాయాల్సిందే.. ట్రాక్ మీద వాహనం నడిపిన తర్వాతే లైసెన్స్ పొందుతారు. అయితే ట్రాక్ మీద వాహనం నడిపేటప్పుడు కంప్యూటర్లో రికార్డవుతుంది. ఏదైనా చిన్న తప్పు చేసినా పరీక్ష ఫెయిల్ అయినట్లే.. కొత్త పద్ధతులు ఇలా.. కొత్తగా ఆర్టీఏ అమలు చేయబోయే ఆటో మెటిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ పరీక్షలో 5 ట్రాక్లు ఏర్పాటు చేస్తారు. ముందు ‘హెచ్’ అనే ట్రాక్లో ఆర్టీఏ ప్రమాణాల్లో పేర్కొన్న విధంగా వాహనాన్ని రివర్స్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ‘ఎస్’ అనే ట్రాక్లో ఒక మూల నుంచి మరో మూలకు వాహనాన్ని టర్న్ చేయాలి. అలాగే ‘కే’ అనే ట్రాక్లో బాగా మలుపులు, ఎత్తు పల్లాలు, ఎత్తయిన ప్రదేశాలు, చిన్న లోయలు వంటింటి ఏర్పాటు చేస్తారు. ఆ ట్రాక్లో వాహనాన్ని నడిపి చివరిగా పార్కింగ్ చేసి చూపించాల్సి ఉంటుంది. అయితే ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కారు డ్రైవింగ్ చేసే వారు సీటు బెల్ట్ పెట్టుకోవాలి. ఈ ప్రక్రియ అంతా కంప్యూటర్లో రికార్డవుతుంది. వాహనాన్ని నడిపేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేసినా కంప్యూటర్లో రికార్డు అవుతుంది. ఏ చిన్న మిస్టేక్ చేసినా టెస్ట్లో ఫెయిల్ అయినట్లు చూపిస్తుంది. ఒక వేళ పరీక్షలో ఫెయిలైతే మరో నెల పాటు శిక్షణ తీసుకుని రమ్మంటారు. పూర్తిగా కంప్యూటరీకరణ కావడం వల్ల ఇక్కడ అధికారులను సిబ్బందిని మేనేజ్ చేసేందుకు ఏమాత్రం అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. బ్రోకర్లకు కూడా ఎలాంటి అవకాశం ఉండదని చెబుతున్నారు. దీంతో అడ్డదారుల్లో లైసెన్స్ పొందడం ఇక కష్టతరం కానుంది. ట్రాక్ స్థలం కోసం వినతిపత్రం అందజేశాం అధునాతన డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ కోసం వరంగల్ ఆర్టీఏకు 5 ఏకరాల భూమి అవసరం ఉంది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఇటీవల కలెక్టర్ను కలిసి స్థలం కావాలని కోరుతూ వినతిపత్రం అందజేశాం. కలెక్టర్ సానుకూలంగా స్పందించి స్థలం ఇప్పించేందుకు చర్యలు తీసుకున్నారు. – శోభన్బాబు, ఇన్చార్జ్ ఆర్టీఏ, వరంగల్ ఆయా జిల్లాల కలెక్టర్లకు వినతి.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లిలో రవాణాశాఖ కార్యాలయాలు ఉన్నాయి. ఇందులో వరంగల్లో తప్ప మరెక్కడా డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ లేదు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలో ఆధునిక డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ల కోసం వచ్చే వారికి వరంగల్ రవాణాశాఖ తనిఖీ అధికారులే పరీక్షలు నిర్వహించి లైసెన్స్లు అందజేసే పద్ధతి చాలాకాలం నుంచి కొనసాగుతోంది. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు వరంగల్ ఆర్టీఏకు 5 ఎకరాలు, మిగతా జిల్లాలో రోడ్డు పక్కాన 10 ఎకరాల స్థలాలు కావాలంటూ ఆర్టీఏ అధికారులు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఇటీవల వినతి పత్రాలు అందజేశారు. దీనిపై రెవెన్యూ అధికారులు కావాల్సిన స్థలాల కోసం పరిశీలిస్తున్నారు. -
నేడు కోర్టు ముందుకు కొత్త హరిబాబు?
● అరెస్ట్ చూపించి కోర్టులో హాజరుపరుచనున్న పోలీసులు ● సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న సమయంలోనే పట్టుకున్న ఖాకీలు ● నిందితుడితో పాటు సహకరించిన మరో ఇద్దరు అదుపులోకి? భూపాలపల్లి: సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో ఏ8గా ఉన్న భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు కొత్త హరిబాబును నేడు(మంగళవారం) పోలీసులు అరెస్ట్ చూపించనున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గత నెల 19న రాజలింగమూర్తి దారుణ హత్యకు గురికాగా, ఈ కేసులో నిందితుడి(ఏ8)గా ఉన్న హరిబాబు పరారీలో ఉండగా పోలీసులు వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే హన్మకొండకు చెందిన అతడి సన్నిహితుడి క్రెడిట్ కార్డు తీసుకెళ్లి వినియోగించడంతో హరిబాబు శనివారం రాత్రి ఢిల్లీలో పట్టుబడగా కారులో భూపాలపల్లికి తీసుకురాగా సోమవారం తెల్లవారుజామున చేరుకున్నట్లు సమాచారం. అయితే సోమవారం హరిబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ఉన్న కారణంగా అరెస్ట్ చూపించలేదని తెలుస్తోంది. నేడు(మంగళవారం) జిల్లా కేంద్రంలో అరెస్ట్ చూపించి, కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టును ఆశ్రయించే యత్నం.. రాజలింగమూర్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కొత్త హరిబాబు ఈనెల 4న హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, బెయిల్ వచ్చే అవకాశం లేదని గమనించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు యత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే క్రెడిట్ కార్డు వినియోగం ఆధారంగా అతడిని పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. పోలీసుల అదుపులో మరో ఇద్దరు..? కొత్త హరిబాబుతో పాటు అతడికి పని మనుషులుగా, సహకరించిన మరో ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఢిల్లీలో హరిబాబును పోలీసులు పట్టుకోగా అక్కడే అతడికి సహకరించిన హైదరాబాద్కు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని సోమవారం తమదైన శైలిలో పోలీసులు విచారించినట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసులకు చిక్కకుండా ప్రాంతాలు మార్చి.. హత్య కేసులో నిందితుడిగా ఉన్న హరిబాబు, ఇద్దరు సహాయకులతో కలిసి ప్రాంతాలు మార్చి పోలీసులకు చిక్కకుండా ప్రయత్నించినట్లు సమాచారం. ఢిల్లీ, సిమ్లా, అమృత్సర్ లాంటి ప్రదేశాలను సందర్శించి చివరకు ఢిల్లీకి వచ్చి బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించే క్రమంలోనే పోలీసులకు చిక్కినట్లు తెలిసింది. -
దైవదర్శనానికి వస్తూ.. అనంతలోకాలకు
హసన్పర్తి: దైవదర్శనానికి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందగా మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి పరకాల–కిట్స్ కళాశాల ప్రధాన రహదారిలోని ముచ్చర్ల క్రాస్ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని ఖిలా వరంగల్ తూర్పుకోటకు చెందిన మేకల సుశాంత్(19), మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం పొక్కురు గ్రామానికి చెందిన తాండ్ర విజయ్(19), జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనా గ్రామానికి చెందిన సి.వర్ధన్ (18) స్నేహితులు. సుశాంత్ పరకాలలోని పాలిటెక్నిక్లో థర్డ్ ఇయర్ చదువుతుండగా, వర్ధన్ అదే కళాశాలలో పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ అభ్యసిస్తున్నాడు. విజయ్ మాత్రం పరకాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్నారు. వీరు ముగ్గురు అదే ప్రాంతంలోని బీసీ హాస్టల్ ఉంటూ చదువు కొనసాగిస్తున్నారు. రాత్రి 9.30 గంటలకు హాస్టల్ నుంచి జాతరకు.. ఆదివారం రాత్రి 9.30గంటలకు సుశాంత్, విజయ్, సి. వర్ధన్ పరకాల నుంచి బైక్పై ఎర్రగట్టు జాతరకు బయలుదేరారు. సుశాంత్ బైక్ నడుపుతుండగా, విజయ్, వర్ధన్ వెనుక కూర్చున్నారు. వీరితో పాటు మరికొంత మంది విద్యార్థులు కూడా వారి వెంట తమతమ బైక్లపై జాతరకు పయనమయ్యారు. సుశాంత్ నడుపుతున్న బైక్ ముచ్చర్ల శివారులోని జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపడుతున్న ప్రాంతానికి చేరుకోగానే గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలింపు.. వెనుక నుంచి బైక్లపై వస్తున్న స్నేహితులు క్షతగాత్రులను 108లో ఎంజీఎం తరలించారు. అప్పటికే సుశాంత్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చికిత్స పొందుతూ విజయ్ సోమవారం తెల్లవారు ప్రాణాలు వదిలాడు. వర్ధన్ పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం తరలించారు. మృతుడు సుశాంత్ తండ్రి సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నుట్లు ఎస్సై దేవేందర్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల దుర్మరణం మరొకరికి తీవ్ర గాయాలు ముచ్చర్ల క్రాస్ సమీపంలో ఘటన -
అటవీ జంతువులను వేటాడిన కేసులో ఐదుగురి అరెస్ట్
● వివరాలు వెల్లడించిన అటవీ అధికారులు ఖానాపురం: అటవీ జంతువులను వేటాడిన కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఎఫ్ఆర్ఓ రవి కిరణ్, డీఆర్ఓ రీనా తెలిపారు. ఈ మేరకు సోమవారం నర్సంపేట రేంజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఖానాపురం మండలం చిలుకమ్మనగర్కు చెందిన మధు, సుమన్, పవన్ కుమార్, అశోక్ నగర్కు చెందిన యాకాంబ్రం, సురేశ్, కొత్తగూడ మండలం మొండ్రాయిగూడెంకు చెందిన లవన్ కుమార్ (బాబురావు) ఆదివారం చిలుకమ్మ నగర్ అటవీ ప్రాంతంలో కొండెగొర్రె, కనుజులను వేటాడి నర్సంపేట వైపునకు ఆటోలో తరలిస్తుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న విషయం విధితమే. ప్రమాద సమయంలో అటవీ జంతువుల మాంసం రోడ్డుపై పడేసి పరారీ కావడంతో విచారణ జరిపిన అధికారులు ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. అశోక్ నగర్కు చెందిన యాకాంబ్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
● ఎలుకుర్తి క్రాస్ వద్ద ఘటన మడికొండ/చిల్పూరు: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి మడికొండ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా చిల్పూరు మండలం నష్కల్కు చెందిన చెగొండి వినయ్(22) తన స్నేహితుడు మామిండ్ల అరవింద్తో కలిసి ద్విచక్రవాహనంపై పెద్దపెండ్యాల నుంచి ధర్మసాగర్ వైపునకు వస్తుండగా ఎలుకుర్తి క్రాస్ వద్ద బొలెరో ఢీకొంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన వినయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అరవింద్ తీవ్ర గాయాలతో ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి సంపత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ కిషన్, చిల్పూరు ఎస్సై సిరిపురం నవీన్కుమార్ తెలిపారు. -
సీఎం సభలో తెలంగాణ ఉద్యమ కళాకారుల నిరసన
స్టేషన్ఘన్పూర్: స్టేషన్ఘన్పూర్ మండలంలోని శివునిపల్లిలో ఆదివారం జరిగిన సీఎం రేవంత్రెడ్డి సభలో తెలంగాణ ఉద్యమ కళాకారులు నిరసన తెలిపారు. సభా వేదికపై సీఎం ప్రసంగిస్తుండగా కళాకారులు మట్టెడ కలవేని రాణి, పుష్ప తదితరులు తమకు ఉపాధి కల్పించాలని కోరుతూ ఫ్లెక్సీని ప్రదర్శించారు. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులు వారి వద్ద ఉన్న ఫ్లెక్సీని లాగేశారు. గమనించిన సీఎం వారిని వారించారు. కాగా, సీఎం ప్రసంగం అనంతరం ఉద్యమ కళాకారులు తమ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని నెట్టేశారు. ఈ క్రమంలో ఉద్యమ కళాకారులు, మహిళా పోలీసులకు మధ్య స్వల్ప పెనుగులాట జరిగింది. వారిని సభావేదిక నుంచి మహిళాపోలీసులు బలవంతంగా బయటకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు మాట్లాడుతూ తాము శాంతియుతంగా తమ సమస్యను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు ఉమ్మడి జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చామని, పోలీసులు అత్యుత్సాహంతో తమపై దాడి చేశారన్నారు. ఈ దాడిలో ఫ్లెక్సీని చింపివేశారని, పుస్తెలతాడు తెంపారని, పుస్తెలతాడు లాకెట్తోపాటు ఒకరి గోల్డ్ రింగ్ పోయిందని వాపోయారు. తాము ప్రజాస్వామ్యయుతంగా సమస్యను తెలిపేందుకు వస్తే అడ్డుకోవడం సరికాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 550 మందికి ఉద్యోగ, ఉపాధి కల్పించారని, తెలంగాణ కోసం తాము పాటలు, ధూంధాంలతో ఉద్యమించామని, గుర్తించి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. కళాకారులు పరకాల రమ, పుష్పలత, అడ్డూరి అంజలి, అలేఖ్య, రాణి, రమ, లావణ్య తదితరులున్నారు. -
వాజ్పేయిని స్ఫూర్తిగా తీసుకోవాలి
హన్మకొండ: మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజ్పేయిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి సి.హెచ్.విద్యాసాగర్ రావు అన్నారు. ఆదివారం హనుమకొండ హంటర్ రోడ్డులోని ‘డి’ కన్వెన్షన్లో ‘అటల్ జీ యాదిలో’ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో సి.హెచ్.విద్యాసాగర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ 1975లో కరీంనగర్లో జరిగిన బహిరంగ సభలో ఆటల్ బిహారీ వాజ్పేయి ప్రసంగాన్ని నాటితరం నాయకులు, ప్రజలు ఇప్పటికీ గుర్తు చేస్తారన్నారు. ఆ యన ప్రసంగం ఆధ్యంతం ఆకట్టుకునేలా సాగేదన్నారు. హిందీ భాషలో పద బంధాలు కూర్చి, పేర్చి మాట్లాడేవారన్నారు. దేశంలో అన్ని పార్టీలు దేశహితం కోసం ఒకటిగా ఉండాలని ఆలోచించాలనేవారన్నారు.దేశంలో ప్రజాస్వామ్యం ఫరిడవిల్లాలని కోరుకునేవారన్నారు. ప్రధానిగా దేశంలో అనేక అభివృద్ధి పథకాలు చేపట్టారని వివరించారు. రాష్ట్రంలో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకుని అధికారంలోకి రావాలని, ఈ దిశగా పార్టీ శ్రేణులు శ్రమించాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ అత్యధిక సీట్లు కై వసం చేసుకోవాలన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి ఉత్సవాల ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ సీతారాం నాయక్ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాతో అటల్ బిహారి వాజ్పేయికి అవినాభావ సంబంధముందన్నారు. చాలాసార్లు పర్యటించారన్నారు. ఈ ప్రాంత వ్యక్తులు వాజ్పేయితో ఉన్న సంబంధాలు, ఫొటోలు, టెలిగ్రాంలు, శుభాకాంక్షలు వంటివి ఉంటే తమకు చేరవేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే టి.రాజేశ్వర్ రావు, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, పార్టీ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు కొలను సంతోశ్రెడ్డి, గంట రవికుమార్, నాయకులు కన్నెబోయిన రాజయ్య యాదవ్, మంద ఐలయ్య, నాగపురి రాజమౌళి గౌడ్, దేవేందర్ రెడ్డి, నిశిధర్ రెడ్డి, బలరాం, చాడ శ్రీనివాస్ రెడ్డి, రావుల కిషన్, చందుపట్ల కీర్తి, చాడ స్వాతి, ఆర్.పి.జయంత్లాల్, తదితరులు పాల్గొన్నారు. మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి సి.హెచ్.విద్యాసాగర్ రావు -
రేవంత్ టీ–20 మ్యాచ్ ఆడుతున్నారు
స్టేషన్ఘన్పూర్/జనగామ : అతిపిన్న వయసులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి.. ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు, వ్యక్తిగత దూషణలు ఎదుర్కొంటూ టెస్ట్, వన్డే మ్యాచ్లకు స్వస్తి పలికిన రేవంత్రెడ్డి.. పాలనలో టీ–20 మ్యాచ్ ఆడుతున్నారని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ఘన్పూర్ శివునిపల్లి రోడ్డులో ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభలో ఎమ్మెల్యే కడియం మాట్లాడారు. అభివృద్ధే ధ్యేయంగా రోజుకు 16 గంటలు పని చేస్తున్న రేవంత్రెడ్డి.. సవాళ్లు, ప్రతి సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజాపాలన సాగిస్తున్నారని కితాబిచ్చారు. స్టేషన్ఘన్పూర్ అభివృద్ధికి రూ.8 వందల కోట్లు మంజూరు చేసిన సీఎం రేవంత్రెడ్డికి అభినందనలు తెలిపారు. ఘన్పూర్లో అవినీతి, అక్రమ పాలన, పదవులు, పథకాలు అమ్ము కోవడం తప్ప గడిచిన పదిహేనేళ్లుగా అభివృద్ధి జరగలేదన్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లు ఎదుర్కొంటూ ప్రజాపాలన సాగిస్తున్నారు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
‘టెన్నికాయిట్ ఉమెన్’ విజేత అఖిల
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రెండు రోజుల పాటు నిర్వహించిన 10వ రాష్ట్ర స్థాయి సీనియర్ మెన్ అండ్ ఉమెన్ టెన్నికాయిట్ చాంపియన్షిప్ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ఇందులో మహిళా విభాగంలో హనుమకొండ క్రీడాకారిణి జి. అఖిల విజయం సాధించింది. ద్వితీయ స్థానంలో వరంగల్ క్రీడాకారిణి బి. జ్యోతి నిలిచింది. వరంగల్ జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల ముగింపు వేడుకలకు ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి హాజరై విజేతలకు పతకాలు, ట్రోఫీలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ జేఎన్ఎస్లో టెన్నికాయిట్ కోర్టు నిర్మాణానికి కావాల్సిన నిధుల మంజూరుకు సహకరిస్తానన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టెన్నికాయిట్ అసోసియేషన్ కార్యదర్శి బీఎన్. వెంకటేశ్, శాట్ కోచ్ సద్గురు, అసోసియేషన్ హనుమకొండ, వరంగల్ జిల్లా కార్యదర్శులు అలువాల రాజ్కుమార్, గోకారపు శ్యాంకుమార్ తదితరులు పాల్గొన్నారు. ముగిసిన రాష్ట్ర స్థాయి పోటీలు..విజేతలు పురుషులు జిల్లా మహిళలు జిల్లా ఎండి. యాసిన్ మహబూబ్నగర్ జి. అఖిల హనుమకొండ సుజయత్ మహబూబ్నగర్ బి.జ్యోతి వరంగల్ డి. ప్రకాశ్ హనుమకొండ జి. నవ్య హనుమకొండ జి.మధు వరంగల్ జి.మమత మహబూబ్నగర్ -
రూ.630.27 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
స్టేషన్ఘన్పూర్: జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో రూ.630.27 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్రెడ్డి సభావేదికపైనుంచే వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. విద్యాశాఖకు సంబంఽధించి జఫర్గఢ్ మండలం కోణాయిచలంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా సమీకృత రెసిడెన్షియల్ పాఠశాల సముదాయం, స్టేషన్ఘన్పూర్లో రూ.5.5 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వైద్యారోగ్యశాఖకు సంబంధించి రూ.45. 5 కోట్లతో వంద పడకల ఆస్పత్రి, ఆర్అండ్బీ శాఖకు సంబంధించి రూ.26 కోట్లతో స్టేషన్ఘన్పూర్లో సమీకృత డివిజనల్ కార్యాలయాల సముదాయం, ఇరిగేషన్కు సంబంధించి రూ.148.76 కోట్లతో దేవాదుల కాల్వ సీసీ లైనింగ్ నిర్మాణం, పీఆర్ శాఖ ఆధ్వర్యంలో రూ.38.5 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం, ప్రజాపాలన గ్రామసభ మోడల్ గ్రామాల్లో రూ.250 కోట్లతో 5వేల ఇందిరమ్మ ఇళ్లు, రూ.12 కోట్లతో ఐదు సబ్స్టేషన్లు, ఒక డీఈ కార్యాలయ నిర్మాణం, రూ.24 కోట్లతో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా తండాలకు రోడ్లు, బంజారా భవన్ నిర్మాణం, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ అప్గ్రేడేషన్, రూ.35 కోట్లతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం తదితర పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల మాఫీ కింద ఉమ్మడి వరంగల్లో 48,717 సంఘాలకు రూ. 92 కోట్ల 74 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. అదేవిధంగా జనగామ జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద రూ.వంద కోట్ల 93 లక్షలు చెక్కులను మహిళా సంఘాల సభ్యులకు అందించారు. అదేవిధంగా జిల్లాలోని ఏడు మండలాలకు సంబంధించిన రూ.2.10 కోట్లతో మంజూరైన ఏడు ఇందిరా మహిళా శక్తి బస్సులను ప్రారంభించి వాటిని మహిళా సమాఖ్యలకు అప్పగించారు. -
‘రవాణా భత్యం’ మంజూరు..
విద్యారణ్యపురి : దూర ప్రాంతాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు ఎట్టకేలకు ఇటీవల రవాణా భత్యం మంజూరైంది. కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం నుంచి ప్రాథమిక పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు, 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న యూపీఎస్లో చదువుకునే వారికి, 5కిలో మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న హైస్కూల్లో చదివే విద్యార్థులకు ఈ రవాణా భత్యం అందజేస్తారు. ఒక్కో విద్యార్థికి రూ. 6 వేలు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2024–2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రతి నెల ఒక్కో విద్యార్థికి రవాణా భత్యం రూ. 600 చొప్పున పది నెలలకుగాను రూ. 6వేలు మంజూరు చేశారు. జిల్లాల వారీగా విద్యార్థుల సంఖ్య, మంజూరైన నిధుల వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లాలో.. ● హనుమకొండ జిల్లాలో సమగ్ర శిక్ష పరిధి పాఠశాలల్లోని 704 మంది విద్యార్థులకు రూ. 42లక్షల 24వేలు, పీఎంశ్రీ–1 స్కూళ్లలోని 112 మంది విద్యార్థులకు రూ.6లక్షల 72వేలు, పీఎంశ్రీ –2దశలోని స్కూళ్లలోని 50మంది విద్యార్థులకు రూ. 3లక్షలు మంజూరు చేశారు. ● వరంగల్ జిల్లాలో వివిధ పాఠశాలల్లోని 507మంది విద్యార్థులకు రూ. 30లక్షల 42వేలు, పీఎం శ్రీస్కూళ్లలో 47మంది విద్యార్థులకు రూ.2లక్షల 82వేలు మంజూరయ్యాయి. ● జనగామ జిల్లాలో వివిధ పాఠశాలల్లోని 661మంది విద్యార్థులకు రూ. 39లక్షల 66వేలు, పీఎంశ్రీ–1 స్కూళ్లలోని 78మంది విద్యార్థులకు రూ. 4లక్షల 68వేలు మంజూరయ్యాయి. ● ములుగు జిల్లాలో వివిధ పాఠశాలలకు చెందిన 380 మంది విద్యార్థులకు రూ. 22లక్షల 80వేలు , పీఎంశ్రీ –1 స్కూళ్లకు చెందిన 45మంది విద్యార్థులకు రూ. 2లక్షల 70వేలు, పీఎంశ్రీ –2 స్కూళ్లకు చెందిన 38 మంది విద్యార్థులకు రూ. 2లక్షల 28వేలు మంజూరయ్యాయి. ● మహబూబాబాద్ జిల్లాలో వివిధ పాఠశాలలకు చెందిన 443మంది విద్యార్థులకు రూ. 26లక్షల 58వేలు, పీఎంశ్రీ స్కూళ్లకు సంబంధించిన 30మంది విద్యార్థులు రూ. లక్షా 80 వేలు మంజూరయ్యాయి. ● జయశంకర్భూపాలపల్లి జిల్లాలో వివిధ పాఠశాలలకు చెందిన 367మంది విద్యార్థులకు రూ. 22లక్షల 2వేలు, పీఎంశ్రీ –1 కు సంబంధించిన స్కూళ్లకు చెందిన 64మంది విద్యార్థులకు రూ. 3లక్షల 84వేలు మంజూరయ్యాయి. ఒక్కో విద్యార్థికి రూ. 6వేలు త్వరలో అకౌంట్లలోకి.. -
సరఫరా చేస్తాం
డిమాండ్ ఎంతైనా..సత్వరమే లోపాల గుర్తింపు.. విద్యుత్ సరఫరాలో లోపాల్ని ఆన్లైన్ ద్వారా సత్వరమే గుర్తించి పరిష్కరించడానికి 11 కేవీ ఫీడర్లకు.. ఫీడర్ అవుటేజ్ మేనేజ్మెంట్ సిస్టం అమల్లోకి తీసుకురానున్నాం. విద్యుత్ లైన్లో ఎక్కడ లోపం ఏర్పడి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందో ఈటెక్నాలజీ ద్వారా ఆటోమేటిగ్గా తెలుసుకోగలుగుతాం. ఎక్కడ సమస్య ఉత్పన్నమైందో లోకేషన్తో కూడిన సమాచారం ప్రత్యేక యాప్ ద్వారా అధికారులకు తెలుస్తుంది. అధికారులు వెంటనే అప్రమత్తం కావడానికి ఈ సిస్టం ఉపయోగపడుతుంది. తద్వారా క్షేత్రస్థాయి ఉద్యోగుల ద్వారా సమస్య తలెత్తిన స్థలం వివరించి త్వరగా.. సమస్యను పరిష్కరించే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించవచ్చు. ప్రస్తుతం ఏదైనా సమస్య ఏర్పడితే ఆ లైన్ మొత్తం పరిశీలించాల్సి వస్తోంది. దీంతో చాలా సమయం తీసుకోవడంతో కాలయాపన జరుగుతోంది. ఫీడర్ అవుటేజ్ మేనేజ్మెంట్ సిస్టం అమల్లోకి తీసుకొస్తే సమయం ఆదా కావడంతో పాటు త్వరితగతిన మరమ్మతులు పూర్తి చేసి విద్యుత్ను పునరుద్ధరించగలుగుతాం.● వేసవిలో పెరగనున్న విద్యుత్ డిమాండ్ ● ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్న ఎన్పీడీసీఎల్ ● పైలెట్ ప్రాజెక్టుగా ఇండోర్ సబ్స్టేషన్ల నిర్మాణం ● టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి ● ‘సాక్షి’కి ఇంటర్వ్యూపేపర్ లెస్ వర్క్.. ఈ–స్టోర్స్ విధానం ద్వారా కావాల్సిన మెటీరియల్ ఆన్లైన్ ద్వారా రిజర్వ్ చేసుకుని కావాల్సిన సమయానికి మెటీరియల్ను పొందుతున్నాం. దీంతో పనులు త్వరితగతిన జరుగుతున్నాయి. పేపర్ పని లేకుండా ఆన్లైన్ ద్వారా బుక్ చేసి మెటీరియల్ డ్రా చేసుకునే సౌలభ్యం క్షేత్రస్థాయిలో అధికారులకు కలిగింది. తద్వారా రైతులకు, వినియోగదారులకు పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రతీ పనిలో అధునాతన సాంకేతిక పద్ధతులు అవలంబిస్తున్నాం. సాంకేతికపరంగా మరిన్ని అంశాలు జోడించి టీజీ ఎన్పీడీసీఎల్ యాప్ను 19 ఫీచర్లతో రూపొందించాం.హన్మకొండ: ‘వేసవిలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగనుంది. పెరుగుతున్న డిమాండ్ను ముందుగానే అంచనా వేసి ప్రణాళిక రూపొందించుకుని ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాం. ఈఏడాది ఫిబ్రవరి నుంచి డిమాండ్ పెరిగింది. రోజురోజుకూ పెరుగుతోంది. వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్ అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈనెల 11న (మంగళవారం) ఉదయం అత్యధికంగా 5,815 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ పెరిగింది. గతేడాది ఇదే రోజు 5,468 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. గతేడాదితో పోలిస్తే 347 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ పెరిగింది’ అని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అవన్నీ ఆయన మాటల్లోనే.. సాంకేతికతలో అభివృద్ధి.. ఎన్పీడీసీఎల్లో సాంకేతికతను అభివృద్ధి చేశాం. ప్రతీ పనిని ఆన్లైన్ ద్వారా చేస్తున్నాం. కొత్త సర్వీస్ కనెక్షన్లు, లైన్ షిఫ్టింగ్, ఫిర్యాదులు, దరఖాస్తుల స్థితిగతులు, చెల్లింపులు అన్నీ కూడా ఆన్లైన్ ద్వారా చేపడుతున్నాం. రైతులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఉండేలా.. ఎస్టిమేట్ వివరాలు తెలుగులో అందిస్తున్నాం. భారీ వర్షాలు, ఈదురు గాలులు, సాంకేతికంగా విద్యుత్ సమస్యల వల్ల ఏర్పడే అంతరాయాలను తగ్గించేందుకు.. ఎమర్జెన్సీ పవర్ రీస్టోర్ టీం వాహనాలను వాడుతున్నాం. ఇందులో అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉంటుంది. పాత సబ్స్టేషన్లను పునరుద్ధరిస్తున్నాం. సుదూర లైన్ల మధ్యలో ఏబీ స్విచ్లు పెడుతున్నాం. ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లు కూడా పెట్టాం. తద్వారా అంతరాయాలు త్వరితగతిన గుర్తించి పునరుద్ధరిస్తున్నాం. స్థల సమస్య జఠిలం.. కొత్త సబ్స్టేషన్ల నిర్మాణానికి స్థల సమస్య జఠిలంగా మారింది. ఈక్రమంలో స్థల సమస్యను ఎదుర్కొనేందుకు ఇండోర్ విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం. ముందుగా పైలెట్ ప్రాజెక్టులో భాగంగా హనుమకొండ, కరీంనగర్, ఖ మ్మం, నిజామాబాద్ నగరాల్లో ఒక్కో సబ్ స్టేషన్ను నిర్మించనున్నాం. ఈ సబ్స్టేషన్లు కొత్తవి కావడంతో ఈమేరకు ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇస్తాం. పూర్తిగా అండర్ గ్రౌండ్ కేబుల్ వాడతాం. ఈవ్యవస్థపై అవగాహన కోసం శిక్షణ ఇవ్వనున్నాం. హైదరాబాద్, ముంబాయి, ఢిల్లీలో ఇండోర్ సబ్ స్టేషన్లున్నాయి. ఇండోర్ సబ్ స్టేషన్లతో తక్కువ స్థలంలోనే సబ్స్టేషన్ నిర్మించుకుని వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించవచ్చు. -
రేవంత్ టీ–20 మ్యాచ్ ఆడుతున్నారు..
● సవాళ్లు, ప్రతి సవాళ్లు ఎదుర్కొంటూ ప్రజాపాలన సాగిస్తున్నారు ● స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రూ.630.27 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు సీఎం సభలో తెలంగాణ ఉద్యమ కళాకారుల నిరసన –8లో -
పేదలకు వరం సీఎం సహాయ నిధి
తొర్రూరు: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. తొర్రూరు, పెద్దవంగర, రాయపర్తి మండలాల లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం డివిజన్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. మొత్తం 104 మంది లబ్ధిదారులకు రూ.33.93 లక్షల విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పేదలకు సీఎం సహాయ నిధి వరం లాంటిదని తెలిపారు. సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్న ప్రతీ కుటుంబానికి సీఎం రేవంత్రెడ్డి ఆర్థిక సహాయం అందిస్తూ పేదల పెన్నిధిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోతు హామ్యా నాయక్, నాయకులు గంజి విజయ్పాల్రెడ్డి, సోమ రాజశేఖర్, ముద్దసాని సురేష్, చిత్తలూరి శ్రీనివాస్, మేకల కుమార్, మొగుళ్ల లింగన్న, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. ● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
వైద్య, విద్యారంగానికి పెద్దపీట : మంత్రి సురేఖ
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల కుప్పతో సర్కారుపై ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం రేవంత్రెడ్డి వైద్య, విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందన్నారు. రాబోయే రోజుల్లో వరంగల్ను హైదరాబాద్తో సమానంగా అభివృద్ధి చేయాలని, అందుకు సీఎం రేవంత్రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఎన్నడూ తప్ప లేదని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. -
హూన్యాతండాలో మహిళ హత్య
డోర్నకల్: డోర్నకల్ మండలం హూన్యాతండాలో ఓ మహిళ హత్యకు గురైంది. ఆమె భర్త తీవ్ర గాయాలతో అపస్మారకస్థితిలో చేరాడు. ఈ ఘటన ఆదివారం తండాలో కలకలం సృష్టించింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన భూక్యా బుజ్జి(51), రామా దంపతులు. వీరికి కుమారుడు అశోక్, కూతురు సౌందర్య ఉన్నారు. అశోక్ హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా, సౌందర్య హూన్యాతండా సమీపంలోని గార్ల మండలం పులిగడ్డ తండాలో భర్తతో నివాసం ఉంటుంది. శనివారం రాత్రి హోలీ వేడుకల్లో నృత్యం చేసిన బుజ్జి అనంతరం ఇంటికి వెళ్లింది. ఆదివారం ఉదయం ఇంటి నుంచి దంపతులు బయటకు రాలేదు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో రామా ఇంటి నుంచి తీవ్ర గాయాలతో బయటకు వచ్చి సమీపంలో పడిపోవడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా బజ్జి రక్తపు మడుగులో చనిపోయి ఉంది. డోర్నకల్ సీఐ బి.రాజేశ్, ఎస్సై గడ్డం ఉమ ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. తీవ్ర గాయాలతో అపస్మారకస్థితిలో ఉన్న రామాను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బుజ్జి హత్య విషయం తెలుసుకున్న కూతురు సౌందర్యతోపాటు చుట్టు పక్కల తండాలకు చెందిన ప్రజలు ఘటనాస్థలికి చేరుకున్నారు. మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు తండాకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోలీసులను వివరాలు అగిడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ బి.రాజేశ్ మాట్లాడుతూ దంపతులు బుజ్జి, రామా శనివారం రాత్రి గొడవ పడి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో బుజ్జికి గొంతుపై తీవ్ర గాయమై మృతి చెందిందన్నారు. రామాకు తీవ్ర గాయాలు కావడంతో అపస్మారకస్థితికి చేరుకుని ఇంటి నుంచి బయటకు వచ్చి పడిపోయాడన్నారు. స్థానికుల సమాచారంతో రామాను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. తీవ్ర గాయాలతో అపస్మారకస్థితిలో భర్త.. ఆస్పత్రికి తరలింపు దంపతులు గొడవ పడి పరస్పరం దాడి చేసుకున్నారంటున్న పోలీసులు కలకలం సృష్టించిన ఘటన -
15 ఏళ్ల అభివృద్ధి..15 నెలల్లోనే : వరంగల్ ఎంపీ కావ్య
స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో పదిహేనేళ్లలో జరగని అభివృద్ధిని కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా గెలిచిన 15 నెలల్లోనే రూ.8 వందల కోట్లు తీసుకొచ్చి చేస్తున్నారని, ఎమ్మెల్యే కడియం ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. బూటకపు గుజరాత్ మోడల్ కాకుండా, తెలంగాణ రాష్ట్రాన్ని దేశాన్ని మోడల్గా చేస్తున్న ముఖ్యమంత్రికి మనమంతా అండగా నిలవాలన్నారు. ఉమ్మడి వరంగల్ అంటే రేవంత్ రెడ్డికి ప్రత్యేక అభిమానమని, మామునూరుకు ఎయిర్ పోర్టు తీసుకొచ్చిన ఘనత సీఎం రేవంత్రెడ్డికే దక్కుతుందన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం ఢిల్లీకి వెళ్లి ఒత్తిడి చేస్తామన్నారు. -
పోలీసులకు చిక్కిన కొత్త హరిబాబు?
భూపాలపల్లి: సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కొత్త హరిబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి పట్టణానికి చెందిన రాజలింగమూర్తి గత నెల(ఫిబ్రవరి) 19న రాత్రి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యకు పాల్పడిన, సహకరించిన ఏడుగురిని ఫిబ్రవరి 23న ఎస్పీ కిరణ్ ఖరే అరెస్ట్ చూపించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఏ–9గా ఉన్న పుల్ల నరేశ్ను ఈ నెల1వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ–8గా ఉన్న భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు కొత్త హరిబాబు, ఏ–10గా ఉన్న పుల్ల సురేశ్ కోసం నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. కాగా, కొత్త హరిబాబు ఈ నెల 4వ తేదీన ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. బెయిల్ పిటిషన్పై ప్రస్తుతం వాదనలు జరుగుతున్నాయి. నేడు(సోమవారం) సైతం హైకోర్టులో వాదనలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే హరిబాబును ప్రత్యేక టీం పోలీసులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. క్రెడిట్ కార్డు ఆధారంగా పట్టివేత.. రాజలింగమూర్తి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా చర్చానీయాంశం అయ్యింది. దీంతో హత్య కేసులో ఏ–8 నిందితుడిగా ఉన్న కొత్త హరిబాబును పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే మొబైల్ఫోన్ను వినియోగించకపోవడంతో అతడు ఎక్కడ ఉన్నాడనేది పోలీసులు గుర్తించలేకపోయారు. ఢిల్లీలో ఉన్నట్లు అనుమానించిన పోలీసులు కొద్ది రోజులుగా అక్కడ మకాం వేసి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే అతడు క్రెడిట్ కార్డును పలుచోట్ల వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. సమీప ప్రాంతాలపై నిఘా వేసి శనివారం రాత్రి హరిబాబును పట్టుకొని కారులో బయలుదేరి ఆదివారం రాత్రి భూపాలపల్లికి చేరుకున్నట్లు తెలిసింది. అర్ధరాత్రే అరెస్ట్ చూపించి, జడ్జి ఎదుట హాజరుపరిచి, జడ్జి ఆదేశాల మేరకు జైలుకు పంపించనున్నట్లు సమాచారం. ఇద్దరు మిలీషియా సభ్యుల లొంగుబాటు ఏటూరునాగారం: నిషేధిత సీపీఐ మావో యిస్టు పార్టీకి చెందిన ఇద్దరు మిలీషియా సభ్యులు లొంగిపోయినట్లు ములుగు జిల్లా ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపారు. ఆదివారం స్థానిక ఏఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులకు వివరాలు వెల్ల డించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన మావోయిస్టు పార్టీ సీఎన్ఎం సభ్యుడు మడవి కోస, మరో సభ్యురాలు మడకం సోడి అలియాస్ జోగి పార్టీ సిద్ధాంతాలు నచ్చక లొంగిపోయినట్లు పేర్కొన్నారు. వీరు పోలీసుల సమాచారాన్ని పార్టీ నాయకత్వానికి చేరవేయడంతోపాటు పలు విధ్వంసాలకు పాల్పడినట్లు చెప్పారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. స్వేచ్ఛగా జీవించేలా పోలీసులు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తారని వివరించారు. కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాస్, వెంకటాపురం సీఐ బండారి కుమార్, వెంకటాపురం ఎస్సై తిరుపతిరావు, సెకండ్ ఎస్సై నర్సింహ పాల్గొన్నారు.● రాజలింగమూర్తి హత్య కేసులో ఏ–8గా కేసు నమోదు ● క్రెడిట్ కార్డు వినియోగం ఆధారంగా పట్టుకున్న ప్రత్యేక టీం ● ఢిల్లీ నుంచి కారులో భూపాలపల్లికి తీసుకొచ్చిన పోలీసులు? -
కాంగ్రెస్ అంటే సంక్షేమం, అభివృద్ధి : మంత్రి సీతక్క
కాంగ్రెస్ అంటే సంక్షేమం, అభివృద్ధికి కేరాఫ్ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఉపాధి, మహిళల అభివృద్ధి, పేదలకు కూడు, గూడు, గుడ్డ అందించే ప్రభుత్వం తమదన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 84వేల ఉద్యోగాలు కూడా ఇవ్వని దుస్థితి ఉంటే.. తాము అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలోనే 55 వేల పైచిలుకు ఉద్యో గాలు ఇచ్చి నిరుద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపామన్నారు. ఇందిరమ్మ పాలనలో సీఎం రేవంత్రెడ్డి పేదలకు సంక్షేమం అందిస్తుంటే, బీఆర్ఎస్, బీజేపీ కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నాయ ని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అంటేనే అవినీతి, అక్రమాల ప్రభుత్వంగా చరిత్రలో పేరు లిఖించుకుందని ఎద్దేవా చేశారు. బీజేపీ కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. -
పోటీ పడేలా..
సోమవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2025హైదరాబాద్తో – 8లోuసభలో అభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డిబహిరంగ సభకు హాజరైన ప్రజలు, రిమోట్ ద్వారా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి, చిత్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య, ప్రజాప్రతినిధులున్యూస్రీల్ -
పనులు చేపట్టేదెప్పుడో..?
డోర్నకల్: డోర్నకల్లో బైపాస్ రోడ్డు పనులకు భూసేకరణ అడ్డంకిగా మారింది. గార్ల నుంచి డోర్నకల్ మీదుగా నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. గార్ల గేటు, రైల్వే ఆస్పత్రి, గాంధీసెంటర్, గండి సత్యనారాయణ మిల్లు, యాదవనగర్ మూలమలుపులు ఇరుకుగా, బ్యాంక్ స్ట్రీట్ నిత్యం రద్దీగా ఉంటుంది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురుకావడంతో బైపాస్ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. 2023లో.. రోడ్లు భవనాలశాఖ ఆధ్వర్యంలో రూ.6 కోట్ల నిధులతో బైపాస్ రోడ్డు నిర్మాణానికి 2023 అక్టోబర్ 2న అప్పటి ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ శంకుస్థాపన చేశారు. 90వ లెవల్ క్రాసింగ్ గార్ల గేటు నుంచి గొల్లచర్ల–డోర్నకల్ ఆర్ అండ్ బీ రోడ్డులోని సమ్మర్ స్టోరేజ్ సమీపాన ప్రస్తుతం ఉన్న బైపాస్ రోడ్డును అనుసంధానిస్తూ కొత్త బైపాస్ రోడ్డు వేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే నాటి నుంచి నేటి వరకు పనులు ప్రారంభం కాలేదు. భూసేకరణే అడ్డంకి... గార్ల గేటు వద్ద చేపట్టిన ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి సమ్మర్ స్టోరేజ్ సమీపంలోని ఆర్అండ్బీ రోడ్డు వరకు 1.7కిలోమీటర్ల మేర బైపాస్ రోడ్డు నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం కొంతమేర రోడ్డు ఉండగా.. మిగిలిన రోడ్డు కోసం 8ఎకరాల భూ సేకరణ చేపట్టాలని రెవెన్యూశాఖ అధికారులు గుర్తించారు. 28 మంది రైతుల నుంచి 8ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా ఇందులో 6 ఎకరాలు డోర్నకల్ పట్టణ పరిధిలో.. 2ఎకరాలు గార్ల మండలం బుద్ధ్దారం గ్రామ పరిధిలో ఉంది. రెవెన్యూ సిబ్బంది సర్వే నిర్వహించి సేకరించాల్సిన భూమిని గుర్తించి రైతులకు సమాచారం అందించగా ఒకరిద్దరు రైతులు భూమి ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడంతో రోడ్డు పనులు ప్రారంభం కాలేదు. భూమి అప్పగిస్తే.. రెవెన్యూ సిబ్బంది తమకు భూమి అప్పగిస్తే రోడ్డు పనులు ప్రారంభిస్తామని ఆర్ అండ్ బీ అధికారులు చెబుతున్నారు. కాగా భూసేకరణ పూర్తి చేసి బైపాస్ రోడ్డు పనులు ప్రారంభించాలని ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ గతంలో మహబూబాబాద్ ఆర్డీఓకు లేఖ రాశారు. ప్రస్తుతం ఉన్న బైపాస్ రోడ్డు భారీ వాహనాల రాకపోకలతో పూర్తిగా ధ్వంసం కావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా నూతన బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయితే డోర్నకల్లో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అధికారులు వెంటనే స్పందించి భూసేకరణ పూర్తి చేసి బైపాస్ రోడ్డు పనులు పూర్తిచేయాలని స్థానికులు కోరుతున్నారు. బైపాస్ రోడ్డు పనులకు అడ్డంకిగా మారిన భూసేకరణ ముగింపునకు రైల్వే ఫ్లైఓవర్బ్రిడ్జి పనులు -
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
మహబూబాబాద్ రూరల్: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎంపీ పోరిక బలరాంనాయక్ అన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని సోషల్ మీడియా కో ఆర్డినేటర్లకు ఐడీ కార్డులు, ఇన్సూరెన్స్ కాపీలు, డైరీలను ఎంపీ ఆదివారం అందజేశారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎంపీ బలరాంనాయక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను కాపాడుకుంటామని తెలిపారు. పార్లమెంట్ పరిధిలోని జిల్లా, నియోజకవర్గ, మండల కో ఆర్డినేటర్లకు టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్, టీజీటీఎస్ చైర్మన్ మన్నె సతీశ్కుమార్ సహకారంతో టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి అంబాల శివకుమార్ ఆధ్వర్యంలో ఐడీ కార్డులు, ఇన్సూరెన్స్ కాపీలు, డైరీలు అందజేశామని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, నిరుద్యోగులకు 55వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో బయ్యారం పీఏసీఎస్ డైరెక్టర్ జూలకంటి సీతారాంరెడ్డి, జిల్లా సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సామ మధుసూదన్ రెడ్డి, పినపాక, భద్రాచలం, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు డునుకు రాము, ప్రేమ్, గుగులోతు నవీన్, తవిశెట్టి రాకేష్, షేక్ ఖాజాపాషా, గుగులోతు రమేశ్, నాగేంద్రబాబు, నాళ్ల కిరణ్, మాలిక్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ పోరిక బలరాంనాయక్