-
అగ్రనేతల క్యూ! సై.. అంటే సై!!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: లోక్సభ ఎన్నికల పోరు కీలక దశకు చేరింది. ఇంకా వారం రోజుల్లో ప్రచార పర్వం ముగియనుంది. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి.రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ సొంత ఇలాకా కావడంతో పార్టీ అధిష్టానం పాలమూరుపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది. రెండింటిలోనూ విజయకేతనం ఎగురవేసి సత్తా చాటాలని బీజేపీ.. సిట్టింగ్ స్థానాలను తిరిగి దక్కించుకుని, పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ కదనరంగంలో దూకుడు ప్రదర్శిస్తున్నాయి.ప్రచార గడువు దగ్గరపడుతుండడంతో ఆయా పార్టీ ల అభ్యర్థులకు మద్దగా అగ్రనేతలు రంగంలోకి దింపుతున్నారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ పార్లమెంట్ల పరిధిలో జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు రోడ్షోలు, బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారం మరింత హోరెత్తనుంది.ఇవి చదవండి: మరోసారి పీఠమెక్కేదెవరో..? -
బీఎస్పీ గూటికి మందా
అలంపూర్: లోక్సభ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. పోటీయే ప్రధానం అన్నట్టుగా కొందరు ఉన్న పార్టీని వదిలి.. మరో పార్టీ కండువా కప్పుకొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘కారు’ దిగిన మాజీ ఎంపీ మందా జగన్నాథం.. ఆ తర్వాత ‘చెయ్యి’ అందుకున్నారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానానికి పోటీచేసే అవకాశం కల్పిస్తారని ఆశించగా, పార్టీ అధిష్టానం మరొకరికి టికెట్ కేటాయించింది. ఈనేపథ్యంలో మందా జగన్నాథం కాంగ్రెస్ పార్టీని వీడుతారనే ప్రచారం జోరుగా సాగింది. ఎట్టకేలకు ఆయన కాంగ్రెస్ను వీడి ఏనుగెక్కారు. బుధవారం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మందా ప్రభాకర్ ఆధ్వర్యంలో పార్టీ అధినేత్రి మాయావతిని రాజస్థాన్లో కలిసి, పార్టీ కండువా కప్పుకొన్నారు. 1996లో రాజకీయాల్లోకి ఆరంగేట్రం.. మాజీ ఎంపీ మందా జగన్నాథం 1996లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. వైద్య వృత్తిలో కొనసాగిన ఆయన.. ఆ తర్వాత అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి 4 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 1996, 1999, 2004 ఎన్నికల్లో టీడీపీ తరఫున, 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి 4వ సారి లోక్సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ● బీఎస్పీలో చేరిన మందా జగన్నాథం నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో నిలవనున్నారు. 2014లో బీఆర్ఎస్ నుంచి ఇదే స్థానం నుంచి పోటీచేసి ఓటమి చెందారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో పోటీచేసే అవకాశం దక్కలేదు. 2023 అక్టోబర్ వరకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి పనిచేసిన ఆయన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. కాగా.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో బీఎస్పీ గూటికి చేరారు. కాగా, అలంపూర్ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతలు ఈ సారి నాగర్కర్నూల్ స్థానం నుంచి పోటీపడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్ధిగా అలంపూర్కు చెందిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బరిలో ఉండగా.. కొండేరుకు చెందిన మందా జగన్నాథం బీఎస్పీ నుంచి బరిలో నిలుస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బీఎస్పీని వీడి బీఆర్ఎస్ నుంచి బరిలో నిలవగా.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, అక్కడి నుంచి బీఎస్పీలో చేరిన మందా జగన్నాథం పోటీలో ఉండనుండటం కొసమెరుపు. మాయవతి సమక్షంలో ఏనుగు పార్టీలో చేరిన మాజీ ఎంపీ జగన్నాథం నాగర్కర్నూల్ పార్లమెంట్ బరిలో నిలిచే అవకాశం -
రూ. 3,15 లక్షల నగదు పట్టివేత
రాజాపూర్: ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల పోలీసు లు వాహనాల తనిఖీలు చేపట్టి రూ.3,15 లక్షల నగదు పట్టుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నా యి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాజాపూర్ శివారులో రంగారెడ్డిగూడ వద్ద బుధవారం జాతీ య రహదారిపై ఎస్ఐ రవి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. అందులో రూ.2,15,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆత్మకూర్కు వెళ్తున్న అహ్మద్పాష, సహదేవ్ నాయుడు, బీచుపల్లి వద్ద నగదుకు సంబంధించి ఎటువంటి వివరాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నగదును ఎలక్షన్ గ్రీవెన్స్ కమిటీ మహబూబ్నగర్కు పంపించినట్లు తెలియజేశారు. పాన్గల్లో రూ.లక్ష.. పాన్గల్: పాన్గల్ మండలం తెల్లరాళ్లపల్లి స్టేజీ సమీపంలో చెక్పోస్టు వద్ద బుధవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా.. రూ.లక్ష నగదు పట్టుబడినట్లు ఎస్ఐ వేణు తెలిపారు. ఎలాంటి రశీదు లేకుండా కొల్లాపూర్ మండలం సింగోటం నుంచి జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం గార్లపాడుకు చెందిన కుర్వ ఉస్సెన్ బొలెరొ వాహనంలో నగదు తీసుకవెళ్తుండగా గుర్తించి సీజ్ చేసినట్లు చెప్పారు. ఎన్నికల నిబంధనాల ప్రకారం ఒక వ్యక్తి రూ.50 వేల కంటే ఎక్కువ నగదును వెంట తీసుకెళ్లాలంటే రశీదులు గాని, బ్యాంకు కౌంటర్ ఫైల్స్ గాని తప్పనిసరిగా ఉండాలని సూచించారు. -
మదినిండా రామనామం
బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో సీతారామస్వామి కల్యాణ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సీతారామస్వామికి ఉదయం 6 గంటలకు సుప్రభాతసేవ, అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం ఉదయం 10గంటలకు వేదమంత్రాల నడుమ సీతారాములకు కనులపండువగా కల్యాణాన్ని జరిపారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. భక్తులు ఉదయాన్నే బీచుపల్లికి చేరుకొని భక్తిశ్రద్ధలతో సీతారాముల కల్యాణంలో పాల్గొని తిలకించారు. కల్యాణానికి హాజరైన భక్తుల కోసం రంగాపురానికి చెందిన ఆవుల చిన్నకృష్ణ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ మేనేజర్ సురేందర్రాజు పేర్కొన్నారు. అదేవిధంగా బీచుపల్లి అభయాంజనేయస్వామి ఆలయంతో పాటుగా మండలంలోని వివిధ గ్రామాల్లో సీతారాముల కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. -
బాధ్యతగా విధులు నిర్వర్తించాలి
మన్ననూర్: సలేశ్వరం ఉత్సవాల్లో అటవీశాఖ అధికారులు, సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని ఐటీడీఏ ఇన్చార్జి పీఓ, డీఎఫ్ఓ రోహిత్రెడ్డి సూచించారు. బుధవారం మన్ననూర్లోని వనమాళికా ప్రాంగణంలో ఆయన అధికారులు, సిబ్బందితో వేర్వేరుగా చర్చించారు. అటవీ పరిసరాలు, వన్య ప్రాణులకు నష్టం కలగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ప్రతి విషయంలో తగినన్ని జాగ్రత్తలు పాటించాలన్నారు. మూడు రోజుల పాటు ఉత్సవాల కోసం నియమిస్తున్న వలంటీర్లను సంయమనం చేసుకుంటూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది, స్థానికులు, పత్రికా విలేకర్లు అందరూ ఉత్సవాలు విజయవంతంగా పూర్తయ్యేలా అటవీ శాఖకు సహకరించాలన్నారు. అదేవిధంగా అటవీలో నిప్పు రాకుండా, ప్లాస్టిక్ తదితర వ్యర్థ పదార్థాలు పడేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎఫ్ఆర్ఓ ఈశ్వర్, డీఆర్ఓ రవికుమార్, శ్వేత, ఎఫ్ఎస్ఓలు, బీట్ ఆఫీసర్లు తదితరులు ఉన్నారు. వన్యప్రాణులకు నష్టం కలగకుండా చర్యలు డీఎఫ్ఓ రోహిత్రెడ్డి -
ఉద్దేశపూర్వకంగానే దాడి:బండ్ల రాజశేఖర్రెడ్డి
‘తాము అసెంబ్లీ ఎన్నికల్లో సొంత బంధువర్గాన్ని కాదని బీసీ అభ్యర్థి అయిన సరితకు అండగా నిలబడి పార్టీ కోసం పనిచేశాం. అయితే వారు తమను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగానే పార్టీలో అణచివేయాలని చూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం గద్వాలకు వచ్చిన మంత్రి జూపల్లి, ఎంపీ అభ్యర్థి మల్లురవిని మా ఇంటికి అల్పాహారానికి ఆహ్వానించాం. అనంతరం ప్రచారం నిమిత్తం నేను మా సోదరుడు బండ్ల చంద్రశేఖర్రెడ్డి కలిసి మల్దకల్కు వెళ్లాం. తాను ప్రచార వాహనంలో ఎక్కేందుకు వెళ్లగా అక్కడే సరిత వర్గానికి చెందిన పెద్దొడ్డి రామకృష్ణ అకారణంగా మాపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడి ముందుగా వేసుకున్న ప్లాన్లో భాగంగానే జరిగింది. మళ్లీ బీసీలపై దాడి చేశారని అబద్దపు ప్రచారం చేయడం మంచిది కాదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాం’ అని బండ్ల రాజశేఖర్రెడ్డి తెలిపారు. నాపై దాడికి పాల్పడ్డారు:పెద్దొడ్డి రామకృష్ణ ‘తాను ప్రచార వాహనంపై ఉంటే బండ్ల చంద్రశేఖర్రెడ్డి అకారణంగా నాపైకి వచ్చి నన్ను బూతులు తిడుతూ చొక్కా పట్టుకుని కిందకు లాగి దాడికి పాల్పడ్డారు. నాపై జరిగిన దాడి బీసీలపై జరిగిన దాడిగా అభిప్రాయపడుతూ ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. బీసీలు రాజకీయంగా ఎదుగుతుంటే ఓర్వలేకనే ఇలాంటి దాడులు చేశారు’ అని పెద్దొడ్డి రామకృష్ణ అన్నారు. -
జగదభిరాముడి కల్యాణం.. జగమంతా ఆనందం
సిర్సనగండ్లలో సీతారాముల కల్యాణ ఘట్టం నిర్వహిస్తున్న అర్చకులు చారకొండ: అపర భద్రాద్రిగా విరాజిల్లుతున్న సిర్సనగండ్ల క్షేత్రంలో జగదానంద కారకుడు, జగదాభిరాముడు కల్యాణ వేడుక...బుధవారం కనులపండువగా సాగింది. దేవదేవుడి కల్యాణవైభోగాన్ని కనులారా వీక్షించి భక్తజనం పులకించారు. ఉదయం 10 గంటలకు వేదమంత్రోచ్ఛారణలు, మేళతాళాలు, భక్తుల జయజయ ద్వానాల మధ్య కల్యాణమూర్తులను ఊరేగింపుగా కల్యాణవేదిక వద్దకు తీసుకురాగా.. ఆలయ చైర్మన్ డేరం రామశర్మ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. లోకమంతా వేయికళ్లతో ఎదురుచూసిన అభిజిత్ లగ్నంలో సీతమ్మ మెడలో రామయ్య మాంగళ్యధారణ చేశారు. వేలాది సంఖ్యలో తరలివచ్చిన భక్తుల రామనామస్మరణ మధ్య ఆ జగదభిరాముడు జానకమ్మను మనువాడాడు. రాముడు దోసిట తలంబ్రాలు నీలపురాసులుగా జానకి దోసిట తలంబ్రాలు మణిమాణిక్యాలై సాక్ష్యాత్కరించిన వేళ.. సిర్సనగండ్ల క్షేత్రం భక్తి పారవశ్యంతో ఓలలాడింది. ఈ సందర్భంగా జైశ్రీరాం నినాదాలు మార్మోగాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. వీఐపీ తాకిడితో పాటు ఎండలు ఎక్కువగా ఉండడంతో భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. కల్యాణోత్సవానికి దాదాపు 30 వేల మందికి పైగా భక్తులు హజరైనట్లు దేవస్థాన చైర్మన్, ఈఓ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. నయనానందంగా సాగిన రాములోరి కల్యాణం జనసంద్రంగా మారిన సిర్సనగండ్ల క్షేత్రం మార్మోగిన జైశ్రీరామ్ నినాదాలు -
టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: 2010 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని టీపీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతి సత్యనారాయణ కోరారు. జిల్లా కేంద్రంలోని యూనియన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్సీటీఈ నుంచి సవరణ ఉత్తర్వులు ఇచ్చేవిధంగా ప్రభుత్వం కృషి చేయడంతో పాటు వేసవి సెలవుల్లో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధ్యాయులకు కొన్నేళ్లుగా బదిలీలు, పదోన్నతులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రెండేళ్ల నుంచి పెండింగ్లో ఉన్న మెడికల్, జీపీఎఫ్, సరెండర్ బిల్లులను విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో టీపీఆర్టీయూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ యుగంధర్రెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంబాబు, రమాకాంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి, రాకేష్రెడ్డి, సతీష్కుమార్, శ్రీధర్, భూపతిసింగ్ తదితరులు పాల్గొన్నారు. -
No Headline
సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవంలో ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులతో పాటు మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, భరత్ప్రసాద్, బీజేపీ నేత ఆచారి తదితర ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సీఐ విష్ణువర్ధన్రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్తో పాటు పలువురు ఎస్ఐలు పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. సిర్సనగండ్లకు చెందిన రాచమళ్ల నర్సింహ కుటుంబసభ్యులు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం, రాంపురం గ్రామానికి చెందిన చిలుకాని బాల్రెడ్డి, వెంకటమ్మ జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. భారతిసిమెంట్, ఇతర సేవా సంస్థల ద్వారా తాగునీటి వసతి, మజ్జిగ అందజేశారు. కాగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల ప్రజాప్రతినిధులు, ఎంపీ అభ్యర్థులు, నాయకులు ఒకే వేదికపై కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. -
విషాదంలోనూ ఔదార్యం
ఊట్కూర్: పుట్టెడు దుఃఖంలోనూ తన భర్త కళ్లను దానంచేసి ఔదార్యం చాటుకుందో భార్య. భర్తకు ఇచ్చిన మాట ప్రకారం లయన్స్ క్లబ్ వారికి కళ్లను దానంచేసి ఆదర్శంగా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే.. ఊట్కూర్ మండలం పులిమామిడి గ్రామానికి చెందిన దాసరి విష్ణు (40) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడేవాడు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇటీవల కుటుంబ సభ్యులు మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. కాగా, తాను చనిపోతే తన కళ్లను ఆస్పత్రి వారికి దానం చేయాలని భార్య శశికళకు చెప్పాడు. అతడి కోరిక మేరకు రెండు కళ్లను లయన్స్ క్లబ్ వారికి దానం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారని.. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
లక్ష్మీచెన్నకేశవస్వామిని దర్శించుకున్న జిల్లా జడ్జి
జడ్చర్ల టౌన్: మండలంలోని గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్వామిని బుధవారం జిల్లా జడ్జి పాపిరెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఆలయానికి చేరుకోగా.. పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను పూజారులు న్యాయమూర్తికి వివరించారు. అక్కడి నుంచి కోడ్గల్ సమీపంలోని నచికేత తపోవన ఆశ్రమాన్ని న్యాయమూర్తి సందర్శించి, శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆశ్రమంలో సేవా కార్యక్రమాల వివరాలను ఆలయ నిర్వాహకుడు నచికేత గురూజీ న్యాయమూర్తికి వివరించారు. ఈసందర్భంగా జడ్చర్ల కోర్టు జడ్జి లక్ష్మి, ముదాత్అలీ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జంగయ్య ఉన్నారు. అలరించిన వసంతకవితోత్సవం స్టేషన్ మహబూబ్నగర్: శ్రీరామ నవమిని పురస్కరించుకొని తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక భారత్ స్కౌట్స్, గైడ్స్ భవనంలో వసంత కవితోత్సవం నిర్వహించారు. ఈకార్యక్రమానికి అవధాని చుక్కాయపల్లి శ్రీదేవి అధ్యక్షత వహించగా.. ప్రముఖ వక్త డా.పొద్దుటూరి ఎల్లారెడ్డి మాట్లాడారు. పితృవాక్య పాలకుడైన శ్రీరాముడి జగత్ ప్రసిద్ధమైన కల్యాణాన్ని వీక్షిస్తే, మంచి ఫలితం ఉంటుందన్నారు. రామాయణం అనేది కుటుంబ బంధమని అన్నారు. ప్రవచనకర్త డా.పల్లెర్ల రామ్మోహనరావు మాట్లాడుతూ రామాయణాన్ని మించిన వ్యక్తిత్వ వికాస గ్రంథం ప్రపంచంలో మరొకటి లేదన్నారు. రామనామస్మరణలో గొప్ప శక్తి దాగి ఉందని.. మానవాళి అనుసరించాల్సిన ఎన్నో విషయాలు రామాయణంలో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రావూరి వనజ, జి.శాంతారెడ్డి సమన్వయ కర్తలుగా వ్యవహరించగా.. కవులు బాదేపల్లి వెంకటయ్య, లక్ష్మణ్గౌడ్, గుముడాల చక్రవర్తి గౌడ్, జగపతిరావు, వెంకటేశ్వర్రావు, కమలేకర్ శ్యాంప్రసాద్రావు, అనురాధ, పులి జమున, సుజాత, రజని, మధుసూదన్ జోషి, మహేష్, రమేశ్, బసవ రాజప్ప, ప్రాణేష్, కృష్ణకుమార్ తదితరులు కవితలు వినిపించి ఆకట్టుకున్నారు. నేటినుంచి యథావిధిగా మార్కెట్ లావాదేవీలు దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో బుధవారం సెలవు దినం కావడంతో వారానికి ఒక సారి జరిగే ఉల్లి వేలం జరగకపోవడంతో పాటు ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. గురువారం నుంచి మార్కెట్లో యథావిధిగా లావాదేవీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని మార్కెట్లో టెండర్ల ద్వారా అమ్ముకోవచ్చని చెప్పారు. సివిల్స్ ర్యాంకర్ అనన్యరెడ్డికి సన్మానం అడ్డాకుల: యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయస్థాయి మూడవ ర్యాంక్ సాధించిన పొన్నకల్ గ్రామవాసి దోనూరు అనన్యరెడ్డిని బుధవారం హైదరాబాద్లో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి శాలువాతో సత్కరించి అభినందించారు. జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించి, పాలమూరు జిల్లాకే కాకుండా రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు మహిమూద్, విజయకుమార్రెడ్డి, కృష్ణ, నర్సింహారెడ్డి, ప్రభాకర్రెడ్డి, ప్రతాప్రెడ్డి, జాజాల రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. -
No Headline
ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజు మన్యంకొండలో శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా శోభాయమానంగా అలంకరించిన పల్లకీలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను గర్భగుడి నుంచి దేవస్థానం సమీపంలోని రామసదనం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి, స్వామివారి కల్యాణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా జరిపించారు. వేదమంత్రోచ్ఛారణలు, సన్నాయి వాయిద్యాలు, అశేష భక్తజనం నడుమ అమ్మవారికి మంగళసూత్రధారణ, తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకీలో మళ్లీ గర్భగుడి వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందాచారి తదితరులు పాల్గొన్నారు. మన్యంకొండలో సంప్రదాయబద్ధంగా.. -
కాంగ్రెస్లో కల్లోలం
గద్వాల రూరల్: నడిగడ్డ కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు మరింత ముదిరాయి. శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం చోటుచేసుకున్న వివిధ పరిణామాల నేపథ్యంలో ఎడముఖం పెడముఖంగా ఉంటూ వర్గాలుగా విడిపోయిన జెడ్పీ చైర్పర్సన్ సరిత, బండ్ల చంద్రశేఖర్రెడ్డి మధ్య మంగళవారం రాత్రి శాంతినగర్లో మాటల యుద్ధం చోటుచేసుకోగా.. బుధవారం మల్దకల్లో ఇరు వర్గాల నాయకులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం సంచలనం రేపుతుంది. ● శాసనసభ ఎన్నికల ముందు జెడ్పీ చైర్పర్సన్ సరిత, బండ్ల చంద్రశేఖర్రెడ్డి ఇద్దరూ కలిసికట్టుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇరువురు నేతలు ఐక్యంగానే ఉంటూ బీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొన్నారు. అయితే ఫలితాలు వారి అంచనాలకు భిన్నంగా రావడంతో నాలుగు నెలలుగా ఇరువురి నేతల మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు అంతర్గత చర్చలలో విమర్శలు ప్రతి విమర్శలతో ఆధిపత్య ప్రదర్శనకు పాల్పడ్డారు. ఇదిలా ఉండగా మంగళవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు అలంపూర్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సమాచారాన్ని తమకు ఇవ్వడం లేదని బండ్ల చంద్రశేఖర్రెడ్డి సరితను గట్టిగా ప్రశ్నించడంతో పాటు ఎన్నికల సమయంలో ఖర్చు చేసిన డబ్బుల వ్యవహారం వంటి అంశాలు కూడా చర్చకు రావడం, ఇది కాస్తా ముదిరి ఇరువురి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. జెడ్పీచైర్పర్సన్ సరితను దురుసు మాటలతో బాధపెట్టారని అక్కడే సరిత వర్గం నాయకులు బండ్ల చంద్రశేఖర్రెడ్డిపై దాడికి యత్నించగా పక్కనే ఉన్న పార్టీ నాయకులు సర్ది చెప్పారు. ముష్టియుద్ధం కాగా.. బుధవారం ఎన్నికల ప్రచారాన్ని గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్ మండలం నుంచి మొదలుపెట్టారు. ఈ క్రమంలో మల్దకల్లో ప్రచారరథం వాహనాన్ని ఎక్కేందుకు బండ్ల చంద్రశేఖర్రెడ్డి సోదరుడు బండ్ల రాజశేశేఖర్రెడ్డి యత్నించగా వాహనంపై నున్న సరిత వర్గం నాయకుడు పెద్దొడ్డి రామకృష్ణ వాహనాన్ని ఎక్కవద్దని అడ్డుపడ్డాడు. ఈక్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈక్రమంలో అక్కడికి వచ్చిన బండ్ల చంద్రశేఖర్రెడ్డి వాహనం ఎక్కవద్దు అనడానికి నీవెవరూ? అంటూ వాహనంపైనున్న పెద్డొడ్డి రామకృష్ణను చొక్కాపట్టుకొని కిందికి లాగాడు. దీంతో కోపోద్రిక్తుడైన పెద్దొడ్డి రామకృష్ణ వెంటనే బండ్ల చంద్రశేఖర్రెడ్డిపై దాడికి పాల్పడడంతో అతడు కిందపడిపోయాడు. దీంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొనగా అక్కడే ఉన్న మరికొందరు పార్టీ కార్యకర్తలు బండ్ల చంద్రశేఖర్రెడ్డిపై ముష్టిఘాతాలు కురిపించడంతో అతను గాయపడ్డారు. అక్కడే ఉన్న బండ్ల చంద్రశేఖర్రెడ్డి వర్గీయులు ఆయనను చికిత్స నిమిత్తం మల్దకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం గద్వాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గద్వాల కాంగ్రెస్లోముదిరిన విభేదాలు జెడ్పీ చైర్పర్సన్ సరిత వర్సెస్ బండ్ల చంద్రశేఖర్రెడ్డి మల్దకల్లో ఇరు వర్గాల నేతలపరస్పర భౌతిక దాడులు అంతకు ముందురోజు శాంతినగర్లో ఇద్దరి మధ్య మాటల యుద్ధం -
ఆస్పత్రిలో తల్లి, శిశువు మృతి
నారాయణపేట రూరల్: కాన్పు చేస్తుండగా బిడ్డతో పాటు తల్లి మృతిచెందిన ఘటన జిల్లా ఆస్పత్రిలో బుధవారం చోటు చేసుకుంది. ఇందుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మద్దూర్ మండలం భీంపురం గ్రామానికి చెందిన రోషనప్పకు 15 ఏళ్ల కిందట గోవిందమ్మతో వివాహం జరిగింది. ఇద్దరు మగపిల్లలు పుట్టగా ఒకరు మృతిచెందారు. తాజాగా మూడోకాన్పు కోసం మద్దూర్ పీహెచ్పీకి వెళ్లగా పరీక్షించిన వైద్యులు జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేశారు. దీంతో బుధవారం మధ్యాహ్నం జిల్లా ఆస్పత్రికి వచ్చారు. కాన్పు చేసే సమయంలో గోవిందమ్మ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వైద్యులు సిజేరియన్ చేసేందుకు ప్రయత్నం చేయగా తల్లీ బిడ్డ మృతిచెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు రోధిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. వీరికి సీపీఐ, పీడీఎస్యూ నాయకులు మద్దతు తెలిపారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకొని సముదాయించడంతో శాంతించారు. ● ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. రంజిత్ మాట్లాడుతూ.. కాన్పు చేసే సమయంలో వైద్యులు జాగ్రత్తగా వ్యవహరించారని, నిర్లక్ష్యం ఎక్కడా జరగలేదన్నారు. గర్భిణికి పల్స్రేట్ పడిపోవడం, ఆయాసం రావడంతో ఆక్సిజన్ అందించి వైద్యం చేసినట్లు తెలిపారు. వైద్యుల బృందం ఎంత ప్రయత్నం చేసినా బతకలేదని వివరించారు. ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్న బంధువులు వైద్యుల నిర్లక్ష్యమేనంటూ కుటుంబసభ్యుల ఆందోళన -
పాలమూరులో ఆధ్యాత్మిక శోభ
శ్రీరామ నవమిని పురస్కరించుకొని పాలమూరులో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పలు ఆలయాలను సుందరంగా ముస్తాబు చేసి, సీతారాముల కల్యాణోత్సవాన్ని నయనానందంగా నిర్వహించారు. టీచర్స్కాలనీ సీతారామచంద్రాస్వామి ఆలయం, పంచముఖ ఆంజనేయస్వామి, శ్రీనివాసకాలనీ అభయాంజనేయస్వామి, అప్పన్నపల్లి, ఏనుగొండ, రాజేంద్రనగర్, శివశక్తినగర్ కాలనీ, భూలక్ష్మికాలనీ, అయోధ్యనగర్, హనుమాన్పూరల్లో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీనివాస కాలనీ ఆంజనేయస్వామి, టీచర్స్కాలనీ రామాలయం, సంజయ్నగర్కాలనీ, టీడీగుట్ట, కుమ్మరివాడ వీరాంజనేయస్వామి తదితర ఆలయాల్లో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పాల్గొని తిలకించారు. అప్పన్నపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి సతీ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. -
పకడ్బందీగా చేపడతాం: కలెక్టర్
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: లోక్సభ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వాన్ని పకడ్బందీగా చేపడతామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జి.రవినాయక్ అన్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ ఆయా జిల్లా కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బదులిస్తూ ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు అభ్యర్థులతో నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. ఈపాటికే రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. తుది ఓటర్ల జాబితా రూపకల్పనలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఓటరు స్లిప్పులు ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు చేపడుతున్నామన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
నేటినుంచి నామినేషన్ల పర్వం
పాలమూరు/మహబూబ్నగర్ న్యూటౌన్/జడ్చర్ల: పార్లమెంట్ ఎన్నికల పర్వంలో మొదటి అంకం నామినేషన్ల ప్రక్రియ గురువారం మొదలు కానుంది. 25 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉండగా ప్రధాన పార్టీల అభ్యర్థులంతా మంచి ముహూర్తం చూసుకొని నామినేషన్లు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో అధికార యంత్రాంగం నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాకేంద్రాల్లో ఎన్నికల అధికారులైన కలెక్టర్లు నామినేషన్ పత్రాలను స్వీకరించనున్నారు. ఇందుకోసం కలెక్టర్ చాంబర్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్ణీత వేళల్లో పోటీదారుల నుంచి నామినేషన్ పత్రాలతో పాటు అఫిడవిట్లను స్వీకరించనున్నారు. సెలవు దినమైన ఆదివారం మినహా మిగతా అన్ని రోజుల్లో నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. పోటీ చేసేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. ఈ నేపథ్యంలో మంచి ముహూర్తాలు చూసుకొని నామినేషన్లు వేయాలని, నామినేషన్ల దాఖలు రోజు జన సమీకరణ, ర్యాలీలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సీఎం రాకకు జడ్చర్లలో ఏర్పాట్లు మహబూబ్నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరుకానున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్రెడ్డి జడ్చర్లకు హెలీకాప్టర్లో వస్తారని అధికారులు తెలిపారు. సీఐ ఆదిరెడ్డి ఆధ్వర్యంలో స్టేడియం మైదానంలో హెలీప్యాడ్ను పరిశీలించారు. జడ్చర్ల నుంచి మహబూబ్నగర్ వరకు కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం వంశీచంద్రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అరుణ నామినేషన్కు హాజరుకానున్న లక్ష్మణ్ బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ గురువారం ఉదయం 11.15గంటలకు మహబూబ్నగర్ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 8గంటలకు కాటన్ మిల్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు యువ మోర్చా ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించనున్నారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు అన్నపూర్ణ గార్డెన్కు చేరుకుని అక్కడి నుంచి క్లాక్టవర్ వరకు ర్యాలీ నిర్వహిస్తారు. ఆ తర్వాత క్లాక్టవర్లో నిర్వహించే కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు, బీజేపీ బీసీమోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు. నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి బీజేపీ శ్రేణులు కసరత్తు చేస్తున్నారు. ముహూర్త బలం చూసుకుంటున్న అభ్యర్థులు తొలి రోజే నామినేషన్ దాఖలు చేయనున్న డీకే అరుణ రేపు కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ కూడా.. హాజరుకానున్న సీఎం రేవంత్రెడ్డి 25 వరకు గడువు, 26న పరిశీలన.. 29న ఉపసంహరణకు అవకాశం -
క్రీడలతో దేహదారుఢ్యం
మహబూబ్నగర్ క్రీడలు: క్రీడలతో మానసిక వికాసంతో పాటు దేహదారుఢ్యం పెంపొందుతుందని మున్సిపల్ చైర్మన్ ఆనంద్కుమార్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎండీసీఏ మైదానంలో బుధవారం గోర్ బంజారా ప్రీమియర్ లీగ్ సీజన్–7 క్రికెట్ టోర్నీ కొనసాగింది. ఈసందర్భంగా సేవాలాల్ మహరాజ్ చిత్రపటానికి మున్సిపల్ చైర్మన్ పూలమాలవేసి పూజలు చేశారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని మాట్లాడారు. జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలని.. ఇలాంటి క్రీడా పోటీలకు తనవంతు సహకారం ఉంటుందని తెలిపారు. కాగా, రెండో రోజు జరిగిన మ్యాచుల్లో లోకా మసంద్ జట్టు 20 పరుగుల తేడాతో లక్కీషా బంజారా జట్టుపై గెలుపొందింది. మరో మ్యాచ్లో ఏకలవ్య జట్టు 13 పరుగుల తేడాతో కొమురం భీం జట్టుపై విజయం సాధించింది. టోర్నీలో విన్నర్ జట్టుకు రూ.1,00,155, రన్నరప్ జట్టుకు రూ.50.155 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు అందజేస్తామని జీబీపీఎల్ కమిటీ చైర్మన్ రమావత్ రవిరాథోడ్ తెలిపారు. కార్యక్రమంలో ఢాక్యానాయక్, పున్యానాయక్, మోహన్నాయక్, చందర్ రాథోడ్, ఆలిండియా బంజారా సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.శేఖర్ నాయక్, పాపారాయుడు, కౌన్సిలర్లు మోతీలాల్నాయక్, నర్సింహులు పాల్గొన్నారు. -
ప్రభుత్వరంగ సంస్థలను కొల్లగొట్టడమే బీజేపీ కర్తవ్యం
అమరచింత: పదేళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కొనసాగుతున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ రంగాలకు అప్పజెప్పి, దేశ సంపదను కొల్లగొట్టడమే బీజేపీ ప్రభుత్వం ప్రధాన కర్తవ్యంగా పెట్టుకుందని మహబూబ్నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. మండలంలోని నాగల్కడ్మూర్లో సీతారామస్వామి కల్యాణంలో ఆయన సతీమణితో హాజరయ్యారు. కల్యాణం అనంతరం కాంగ్రెస్ ముఖ్య నాయకులు, శ్రీరాంభూపాల్తో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. దేశాన్ని మతోన్మాద ముసుగులో దోచుకుంటున్న పార్టీకి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లి, ప్రభుత్వరంగ సంస్థలను విస్తరించి, ఉద్యోగ అవకాశాలు కల్పించి, పేదలన ఆదుకున్న కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నాయకులు విమర్శలు చేయడం వింతగా ఉందన్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని దేశం వదిలి వెళ్లిన వ్యక్తులకు రక్షణ కల్పిస్తూ.. వారి అప్పులను మాఫీ చేస్తుంది ప్రధాని మోదీ అనే విషయాన్ని ప్రజలు మరిచిపోలేరన్నారు. మహబూబ్నగర్ను దత్తత తీసుకుంటానని పదేళ్ల పాటు మోసం చేసిన మాజీ సీఎం కేసీఆర్కు ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారు. ఇదే తరహాలో కేంద్రంలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన బీజేపీకి తగిన బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని, పార్టీ గెలుపులో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో శ్రీరాంభూపాల్, టీపీసీసీ కల్లుగీత డిపార్ట్మెంట్ రాష్ట్ర చైర్మన్ కేశం నాగరాజ్ గౌడ్, జలంధర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి డా.వంశీచంద్రెడ్డి -
భక్తకోటి పరవశం
శ్రీరామ నవమిని పురస్కరించుకొని బుధవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాల్లో సీతారాముల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. చల్లువ పందిళ్ల కింద కల్యాణ వేదికలను సుందరంగా ముస్తాబు చేయగా.. కల్యాణ వేడుకను భక్తకోటి తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేదమంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య సీతారామచంద్రాస్వామి ఉత్సవ మూర్తులను పట్టువస్త్రాలతో అలంకరించి.. అభిజిత్ లగ్నంలో రుత్వికులు జీలకర్ర బెల్లం పెట్టారు. అనంతరం మాంగళ్యధారణ, తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. సీతారాముల కల్యాణ వేడుకను భక్తులు కనులారా తిలకించి పులకించిపోయారు. ఈసందర్భంగా రామనామస్మరణ మార్మోగింది. – మహబూబ్నగర్ రూరల్/స్టేషన్ మహబూబ్నగర్/కోయిల్కొండ/ జోగుళాంబ శక్తిపీఠం/ఎర్రవల్లిచౌరస్తా భక్తిశ్రద్ధలతో శ్రీరామ నవమి వేడుకలు కనులపండువగా రాములోరి లగ్నం మార్మోగిన రామనామస్మరణ.. పులకించిన భక్తజనం -
శ్రీరామకొండ.. జనసంద్రం
ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీరామకొండ క్షేత్రంలో సీతారామస్వామి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రామయ్య కల్యాణోత్సవంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని తిలకించారు. నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి దంపతులు సీతారాముల కల్యాణంలో పాల్గొనగా.. కోయిల్కొండకు చెందిన లక్ష్మీనారాయణగౌడ్ బియ్యం గింజలపై శ్రీరామనామం రాసి, తలంబ్రాలుగా అందజేశారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శ్రీరామకొండలో సీతారాముల కల్యాణం జరిపిస్తున్న అర్చకులు -
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: హామీల అమలు లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని మాజీ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చి 130 రోజులైనా రూ. 2లక్షల రైతు రుణాన్ని ఎందు కు మాఫీ చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడంతో పంటలు చేతికి అందక రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ అంశాలపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నందుకు ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే భయపడవద్దని అన్నారు. అనంతరం ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పటికే విద్యుత్ కోతలు ఆరంభమయ్యాయని, సాగునీరు అందక పంటలు ఎండుతున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా సమన్వయకర్త ఆషాప్రియా ఉన్నారు. -
అనన్య.. ప్రతిభ
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్/ అడ్డాకుల: యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో పాలమూరు బిడ్డ సత్తాచాటింది. సివిల్స్– 2023 ఫలితాల్లో జిల్లాకేంద్రానికి చెందిన దోనూరు అనన్యరెడ్డి జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. ఆమె ఒక సాధారణ కుటుంబంలో జన్మించి సివిల్స్లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చడం పట్ల కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఐఏఎస్ కావాలన్న ఆశయం ఉన్న ఆమె బాల్యమంతా మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోనే గడిచింది. ఆమె ఐఏఎస్ కావాలన్న కలలకు స్ఫూర్తినిచ్చింది తాత కృష్ణారెడ్డి ఆయన సలహాలు, సూచనలతో చిన్నప్పటి నుంచి సివిల్సే లక్ష్యంగా చదువుకున్నట్లు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఎలాంటి శిక్షణ లేకుండా.. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ జాతీయస్థాయిలో మూడో ర్యాంకు సాధించింది. ఇంటర్ ప్రారంభం నుంచే.. అనన్య ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు మహబూబ్నగర్లోని గీతం పాఠశాలలో చదివారు. ఎస్సెస్సీలో మంచి గ్రేడింగ్తో ఉత్తీర్ణత సాధించింది. ఇంటర్ ప్రారంభం నుంచి ఐఏఎస్ వైపు అడుగులు పడ్డాయి. దీంతో ఆమెను హైదరాబాద్లోని నారాయణ ఐఏఎస్ అకాడమీలో చేర్చారు. ఇంటర్ పూర్తయ్యాక ఢిలీల్లోని మిరిండా హౌస్ కళాశాలలో ఏబీ (బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్)లో చేరారు. డిగ్రీ పూర్తయ్యాక 2020 నుంచి పూర్తిస్థాయిలో సివిల్స్ ప్రిపరేషన్పై దృష్టిపెట్టారు. ఢిల్లీలోనే పీజీ చదువుతూ సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సివిల్స్లో ఆప్షనల్ సబ్జెక్టులుగా ఆంత్రపాలజీని ఎంపిక చేసుకున్నారు. ఈ ఒక్క ఆంత్రపాలజీ కోసం ఆన్లైన్లోనే శిక్షణ తీసుకున్నారు. దీంతో మిగతా సబ్జెక్టులు అన్ని కూడా సొంత ప్రిపరేషన్తో ముందుకు సాగారు. ప్రతిరోజు 12 నుంచి 14 గంటల పాటు సిద్ధమయ్యాయని చెప్పారు. సొంత ప్రిపరేషన్ సివిల్స్కు సిద్ధమయ్యే క్ర మంలో అనన్యరెడ్డి సొంత ప్రిపరేషన్పైనే ఎక్కు వగా దృష్టిపెట్టారు. ప్రతి రోజు 12 గంటల నుంచి 14 గంటలపాటు చదువుకునేవారు. సబ్జెక్టులో ప్రతి అంశాన్ని నోట్గా రాసుకునే అలవాటు ఉండటంతో శిక్షణ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. చాలా సులువుగా లక్ష్యాన్ని చేరు కుని ప్రణాళిక ప్రకారం నిర్దేశిత సమయంలో సిలబస్ను పూర్తిచేసే విధంగా ఆమె ప్రిపరేషన్ కొనసాగించారు. సివిల్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలకు హాజరయ్యే క్రమంలో సీనియర్ల సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడినట్లు అనన్యరెడ్డి చెప్పారు. పొన్నకల్లో సంబరాలు అనన్యరెడ్డి యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. పొన్నకల్వాసికి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు రావడంతో కుటుంబసభ్యులు, బంధువులు అనన్యరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అనన్యరెడ్డి తండ్రి సురేష్రెడ్డి గ్రామంలో కొన్నాళ్లపాటు వ్యవసాయం చేశారు. 20 ఏళ్ల కిందట ఇద్దరు కుమార్తెల చదువుల కోసం మహబూబ్నగర్ వెళ్లి స్థిరపడ్డాడు. అక్కడే వ్యాపారాలు చేస్తూ కుమార్తెలను చదివించారు. మెరిసిన ఆత్మకూర్ ఆణిముత్యం ఆత్మకూర్: యూపీఎస్సీ ఫలితాల్లో ఆత్మకూర్కు చెందిన ఎహ్తేదా ముఫస్సీర్ ప్రతిభచాటింది. ఎలాంటి కోచింగ్ లేకుండానే ఆలిండియా 278 ర్యాంకు సాధించి ఐఏఎస్కు ఎంపికై ంది. ఆత్మకూర్కు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు సయ్యద్ఖాసిం కుమారుడు ఇబ్రహిం ఖలీల్కు ఇద్దరు కుమార్తెలు రుఫియా, ఎహ్తేదా ముఫస్సీర్, కుమారుడు సయ్యద్ తఫస్సూల్ ఉన్నారు. రెండో కుమార్తె ఎహ్తేదా ముఫస్సీర్ పదో తరగతి వరకు మహబూబ్నగర్లోని ఆకృతి పాఠశాలలో చదివి 2014లో 10/10 గ్రేడ్ను సాధించిన ఆమె.. ఇంటర్ బైపీసీ సిరి కళాశాలలో పూర్తి చేసి 987 మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. అనంతరం ఢిల్లీలోని లేడి శ్రీరాం కళాశాలలో పొలిటికల్ సైన్స్ డిగ్రీ విద్యను 2020లో పూర్తి చేసింది. తర్వాత సోదరి రుఫియాతో కలిసి ఎహ్తేదా ముఫస్సీర్ ఇంట్లోనే సివిల్స్కు ప్రిపేర్ అయ్యి.. 2023లో నిర్వహించిన యూపీఎస్సీ పరీక్షలకు హాజరైంది. ఈ క్రమంలో మంగళవారం విడుదలైన ఫలితాల్లో జాతీయ స్థాయిలో 278 ర్యాంకు సాధించగా.. ఆమె సోదరి రుఫియా ఫలితాల్లో స్వల్ప తేడాతో వెనకబడిపోయింది. ఎహ్తేదా అత్యుతమ ర్యాంకు సాధించడంతో ఆత్మకూర్లో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తాతయ్యే స్ఫూర్తి.. ‘మా తాతయ్య సయ్యద్ఖాసీం రిటైర్డు ఉపాధ్యాయుడు. తాను, తన కుమారులు ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగుతున్నామని.. మీరు ఇంకా గొప్పస్థాయిలో కలెక్టర్ కావాలని తరచుగా చెప్పేవారు.’ అని ఎహ్తేదా చెప్పారు. దీంతో పదో తరగతి నుంచే గట్టిగా నిర్ణయించుకొని సివిల్స్ వైపు అడుగులు వేశానని పేర్కొన్నారు. 278 ర్యాంకు రావడంతో మా తాతయ్య కల సాకారమైందని ఆనందం వ్యక్తం చేశారు. పేదలకు అండగా నిలబడలన్నదే తన లక్ష్యం అని వివరించారు. గర్వకారణం.. మా కుటుంబానికి చెంది న దోనూరు అనన్యరెడ్డి యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించడం చాలా గర్వంగా ఉంది. ఆమె తండ్రి సురేష్రెడ్డి తన ఇద్దరు కుమార్తెల చదువుల కోసం గ్రా మాన్ని వదిలి మహబూబ్నగర్లో స్థిరపడ్డా రు. తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన అనన్యరెడ్డికి శుభాకాంక్షలు. – దోనూరు నాగార్జున్రెడ్డి, ఎంపీపీ, పొన్నకల్ గ్రామం జాతీయస్థాయిలో గుర్తింపు యూపీఎస్సీ ఫలితాల్లో దోనూరు అనన్యరెడ్డి జా తీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించి పొన్నకల్కు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చింది. చదువులో రాణించి ఉన్నత స్థాయి ఉద్యోగానికి ఎంపికవడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. పట్టుదలతో చదువుకుంటే ఉన్నత స్థాయికి చేరొచ్చని నిరూపించింది. – దోనూరు విజయకుమార్రెడ్డి, పొన్నకల్ -
భూగర్భ విద్యుత్ కేంద్రం వద్ద ఫైర్ మాక్డ్రిల్
దోమలపెంట: జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు పురస్కరించుకుని టీఎస్ జెన్కో పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ కేంద్రం ప్రవేశ మార్గం పీఏటీ వద్ద మంగళవారం ఫైర్ సిబ్బంది ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇందులో భాగంగా కేంద్రంలోని విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల వద్ద ఉండే ప్యానల్ బోర్డులలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగినప్పుడు ప్యానల్ బోర్డు స్విచ్లను ఆఫ్ చేయడం కోసం ఫైర్ ప్రూఫ్ సూట్ ధరించి మంటల్లో వెళ్లి స్విచ్ ఆఫ్ ఎలా చేస్తారో ఫైర్ సిబ్బంది ప్రదర్శించారు. దీని కి సంబంధించిన వివరాలను కేంద్రం సేఫ్టీ అధికారి డీఈ శ్రీకుమార్గౌడ్ తెలిపారు. సీఈ సూర్యనారా యణ, ఎస్ఈ(ఓఅండ్ఎం) ఆదినారాయణ, ఎస్ఈ(సివిల్)రవీంద్రకుమార్, డీఈ శ్రీనివాసరెడ్డి, ఎస్పీ ఎఫ్ ఆర్ఐ సూర్యరావు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మల్లికార్జున, ఫైర్ మరియు ఓఅండ్ఎం స్టాఫ్ పాల్గొన్నారు. -
‘బీసీలను అవమానిస్తున్న పార్టీలకు గుణపాఠం చెబుతాం’
స్టేషన్ మహబూబ్నగర్: పాలమూరు పార్లమెంట్ పరిధిలో బీసీ బిడ్డలకు జరుగుతున్న అవమానాలను బీసీ సమాజ్ తీవ్రంగా ఖండిస్తున్నామని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్సాగర్ అన్నారు. ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉన్న రెడ్డీలను ఓడగొట్టి బీసీ అభ్యర్థి పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నాడన్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి నారాయణపేట సభలో షరతులతో కూడిన తన ప్రసంగంలో అత్యధిక ఎంపీ సీట్లు గెలిస్తే ముదిరాజ్ బిడ్డను ఆగస్టులో మంత్రిని చేస్తానని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. కనీసం పార్టీ సభ్యత్వం లేని మాజీ ఎంపీ ఏపీ జితేందర్రెడ్డి పార్టీలో చేరకముందే క్యాబినెట్ హోదా కల్పిస్తూ.. ఉత్తర్వులు జారీ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రెడ్డీలకు ఒక న్యాయం, బీసీలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. సీఎంకు నిజంగా బీసీలు, ముదిరాజ్లపై అభిమానం ఉంటే.. షరతులతో సంబంధం లేకుండా వాకిటి శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకొని మాట నిలుపుకోవాలన్నారు. బీజేపీలో ఆ పార్టీ అభ్యర్థి డీకే అరుణ ఒంటెద్దు పోకడలతో, బీసీలపై తన వైఖరితో చాలా మంది బీసీలు పార్టీని వీడుతున్నారన్నారు. గద్వాల తరహా రాజకీయాలు మహబూబ్నగర్ పార్లమెంట్లో చెల్లవని, ఈ నియోజకవర్గ పరిధిలోని 65 శాతం బీసీ జనాభాను దృష్టిలో మీరు బీసీల వ్యతిరేకిగా ముద్రపడ్డారని అన్నారు. ‘మన ఓటు మనమే వేసుకుందాం’ అనే నినాదంతో ముందుకు వెళ్తామన్నారు. ఏడు నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు, సభలతో బీసీలందరిని చైతన్య పరుస్తూ.. ఐక్యమత్యంతో బీసీ అభ్యర్థిని పార్లమెంట్కు పంపేలా కృషి చేస్తామన్నారు. సమావేశంలో జాండ్ర సంఘం జిల్లా అధ్యక్షుడు మహేందర్, పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సారంగి లక్ష్మికాంత్, గోపాల్ ముదిరాజ్, రమేష్యాదవ్, సవారి సత్యం, రుద్రారం సత్యం, బి.శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
మానసిక వైద్యుల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్ వడ్డాది
300 మంది దివ్యాంగులకు కృత్రిమ చేతుల పంపిణీ
పేరంటాలమ్మ తిరునాళ్లు
ప్రాణం తీసిన ఈత సరదా
టీడీపీ నాయకులపై అట్రాసిటీ కేసు
రేపు ఎంఎస్ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ మెగా లోన్ మేళా
దాత సహకారంతో నిర్మాణం
సీనియర్ అసిస్టెంట్ అరెస్ట్
మహిళల స్వయం సమృద్ధికి పనికల్పన : డీఈఓ
ఉపాధ్యాయ అర్హత పరీక్ష షురూ
తప్పక చదవండి
- కవితపై ఈడీ చార్జిషీట్.. నేడు రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- IPL 2024: ఫైనల్ వేటలో ఎవరిదో జోరు!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement