breaking news
Mahabubnagar District Latest News
-
బీసీలకు 26, మహిళలకు 30 డివిజన్లు
● మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో రిజర్వేషన్లు ఖరారు ● మూడు మున్సిపాలిటీల్లోనూ రిజర్వేషన్ల ప్రకటన మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఎట్టకేలకు మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లు, మూడు మున్సిపాలిటీల్లోని వార్డుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. పాలమూరులో మొత్తం 60 డివిజన్లు ఉండగా.. అందులో జనరల్ (అన్ రిజర్వ్డ్)కు 14, జనరల్ మహిళలకు 16 కేటాయించారు. ఇక బీసీలకు 26, ఎస్సీలకు 3, ఎస్టీలకు 1 రిజర్వు చేశారు. ఇందులో బీసీల కేటగిరీకి కేటాయించిన 26 డివిజన్లలో పురుషులు, మహిళలకు సమానంగా 13 చొప్పున రిజర్వ్ చేశారు. ఎస్సీలలో పురుషులకు 2, మహిళలకు 1, ఎస్టీలలో ఉన్న ఒక్కటి పురుషులకే వెళ్లింది. ఇవన్నీ 2011 జనాభా లెక్కల ప్రకారమే ఆయా కేటగిరీల వారీగా విభజించామని అందులో పేర్కొన్నారు. అలాగే బీసీలకు సంబంధించి తాజాగా డెడికేటెడ్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకున్నారు. మొత్తానికి మహిళలకు జనరల్, బీసీ, ఎస్సీ కేటగిరిలో 30 డివిజన్లు కేటాయించడం విశేషం. ఇక ఏ డివిజన్ ఏ కేటగిరీకి రిజర్వు చేస్తారో త్వరలోనే కలెక్టర్ విజయేందిర ఆధ్వర్యంలో నిర్ణయించనున్నారు. 3 మున్సిపాలిటీలలో రిజర్వేషన్లు ఇలా.. ● భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 10 వార్డులు ఉన్నాయి. ఇందులో జనరల్కు 2, జనరల్ మహిళలకు 3, బీసీలకు 2 (పురుషులు, మహిళలకు ఒక్కొక్కటి), ఎస్సీలు 1 (పురుషులకు), ఎస్టీలు 2 (పురుషులు, మహిళలకు ఒక్కొక్కటి) చొప్పున కేటాయించారు. ● దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. ఇందులో జనరల్కు 2, జనరల్ మహిళలకు 4, బీసీలకు 3 (పురుషులు 2, మహిళలు 1), ఎస్సీలు 2 (పురుషులు, మహిళలకు ఒక్కొక్కటి), ఎస్టీలు 1 (పురుషులు) రిజర్వు చేశారు. ● జడ్చర్ల మున్సిపాలిటీకి పాలకవర్గం గడువు ఈ ఏడాది మే వరకు ఉన్నప్పటికీ తాజాగా రిజర్వేషన్లు ఖారారు చేశారు. మొత్తం 27 వార్డులుండగా.. ఇందులో జనరల్కు7, జనరల్ మహిళలకు 7, బీసీలకు 9 (పురుషులు 5, మహిళలు 4), ఎస్సీలకు 3 (పురుషులు 2, మహిళలు 1), ఎస్టీలు 1 (పురుషులకు) కేటాయించారు. -
ఆకాశమే హద్దుగా పతంగుల సందడి
స్టేషన్ మహబూబ్నగర్: సంక్రాంతి సమయంలో గాలిపటాలు ఎగురవేయడం అనవాయితీగా వస్తోంది. పిల్లలే కాదు.. యువకులు, పెద్దలు సైతం గాలి పటాలను ఎగురవేసేందుకు పోటీ పడుతుంటారు. ఇతరుల గాలిపటం కంటే మనదే ఎక్కువ ఎత్తులోకి ఎగురవేసే క్రమంలో కేరింతలు కొడుతారు. గాలిపటాల సందడి మార్కెట్లో సంక్రాంతికి పది రోజుల ముందు నుంచే ప్రారంభమైంది. జిల్లాకేంద్రంలోని ప్రధాన ప్రాంతాలు, వీధుల్లో గాలిపటాలను విక్రయిస్తున్నారు. కేవలం పట్టణాలకు వరకే ఉన్న గాలిపటాల హల్చల్ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు పాకింది. చక్కని ఆకృతితో ఆకట్టుకునేలా వివిధ డిజైన్ల పతంగులు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. చిన్నారులను ప్రత్యేకంగా ఆకర్షించేలా ప్రింటెడ్, కార్టూన్ గాలిపటాలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ● గాలిపటాలను ఆకాశంలో ఎగురవేయడం ఒక ఎత్తయితే ఒకదానికి ఒకటి పోటీపడడం మరో ఎత్తు. ఎవరి గాలిపటాలు తెగి పడుతాయోన్న విషయం ఎవరికీ అర్థం కాదు. తెగిపడిన గాలిపటాలను తీసుకోవడానికి చిన్నారులు ఒక్కటే పరుగు తీస్తారు. మహబూబ్నగర్లోని పాన్చౌరస్తా పతంగుల మార్కెట్గా పేరొందింది. హైదరాబాద్లోని చార్మినార్, ధూల్పేట్, లాడ్బజార్ తదితర ప్రాంతాల నుంచి గాలిపటాలు, మాంజాలను తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. రూ.5 నుంచి రూ.500 వరకు పతంగులు అందుబటులో ఉన్నాయి. ఈ 3 రోజులు మరింత గిరాకీ మా కుటుంబం 52 ఏళ్ల నుంచి సంక్రాంతి పండుగ దినాల్లో గాలిపటాలను విక్రయిస్తుంది. నాతో పాటు నా సోదరుడు, కుమారులు ఇదే వ్యాపారాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. నా చిన్నతనంలో పేపర్తో తయారుచేసిన గాలిపటాలను అమ్మేవాళ్లం. ప్రస్తుతం ఎన్నో రకాల గాలిపటాలు వస్తున్నాయి. కులమతాలకతీతంగా చిన్నారులు గాలిపటాలను కొనుగోలు చేస్తున్నారు. సంక్రాంతి పండుగ మూడు రోజులు మరింత గిరాకీ ఉంటుంది. – అశ్వాక్అలీ పాష, పాన్చౌరస్తా, మహబూబ్నగర్ -
అభివృద్ధి దిశగా పాలమూరు
దేవరకద్ర/ భూత్పూర్: వెనకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లాను ఈ ప్రాంత బిడ్డ, సీఎం రేవంత్రెడ్డి అభివృద్ధిగా నడిపిస్తున్నారని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ మాత్రం పాలమూరు ప్రాజెక్టు పనులు 10 శాతమే మిగిలి ఉన్నాయని, వాటిని సీఎం రేవంత్రెడ్డి పూర్తి చేయడం లేదని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బుధవారం దేవరకద్రలో రూ.10 కోట్లతో మున్సిపాలిటీ సుందరీకరణ, సీసీరోడ్లు, పుట్పాత్, పార్కింగ్, రూ.5 కోట్లతో డ్రెయినేజీల నిర్మా ణం, రూ.10 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్తోపాటు భూత్పూర్ చౌరస్తాలో రూ.14 కోట్లతో చేపట్టే స్ట్రోం వాటర్ డ్రెయినేజీ, ఊరచెరువు సుందరీకరణ, ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్, సారిక టౌన్షిప్లో పార్కు అభివృద్ధి పనులకు రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డితో కలిసి కోమటిరెడ్డి శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో జిల్లాను దత్తత తీసుకుని వివక్ష చూపించారని విమర్శించారు. దేవరకద్ర నియోజవవర్గ అభివృద్ధి కోసం ఇక్కడి ఎమ్మెల్యే కురుమూర్తి ఘాట్ రోడ్డుకు రూ.110 కోట్లు మంజూరు చేయించుకున్నారని, అలాగే కోయిల్సాగర్ రోడ్డుకు, డ్యాం అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చా రు. సర్పంచ్ ఎన్నికల మాదిరిగానే మున్సిపల్, రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కార్యకర్తలే నాయకులుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలన్నారు. మంత్రి వాకిటి మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రూ.కోట్లలో నిధులు విడుదల చేసి అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత దేవరకద్రకు గుర్తింపు తేవడంతోపాటు డిగ్రీ కళాశాల, కోర్టు, వంద పడకల ఆస్పత్రి తెచ్చామని, సీఐ ఆఫీసు, ఫైర్ స్టేషన్, రిజిష్ట్రేషన్ ఆఫీసు త్వరలో రాబోతున్నాయని చెప్పారు. దేవరకద్రను మున్సిపాలిటీగా మార్చి ఇప్పటికే రూ.25 కోట్లు తెచ్చామని, ఇంకా కావాల్సిన నిధులు తెచ్చి అందమైన మున్నిపాలిటీగా తీర్చిదిద్దుతానన్నారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ విజయేందిర, జెడ్పీ మాజీ చైర్పర్సన్ స్వర్ణమ్మ, అరవింద్రెడ్డి, లక్ష్మీకాంత్రెడ్డి, అంజిల్రెడ్డి, గోవర్ధన్రెడ్డి, అంజన్కుమార్రెడ్డి, ఫారుఖ్, బాలస్వామి, వెంకటేశ్, రాఘవేందర్రెడ్డి, రాజశేఖర్, శేఖర్రెడ్డి, భూపతిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నరేష్బాబు, తహసీల్దార్ కిషన్ పాల్గొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాలపై కేసీఆర్వి పచ్చి అబద్ధాలు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టండి రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
మహబూబ్నగర్
డూడూ.. బసవన్న అయ్య వారికి.. అమ్మవారికి దండంపెట్టు ● గంగిరెద్దులతో సంక్రాంతికి కళ ● పండగకు ముందు నుంచే సందడి ● ఉమ్మడి జిల్లాలో వంద కుటుంబాలపైగా గంగిరెద్దులోళ్లు ఉమ్మడి జిల్లాలోపండుగ శోభ ● రంగవల్లులతో సప్తవర్ణశోభితంగా వాకిళ్లు ● బంధుమిత్రులతో కళకళలాడుతున్న పల్లెలు ● ఘనంగా భోగి వేడుకలు గురువారం శ్రీ 15 శ్రీ జనవరి శ్రీ 2026డూడూ బసవన్న అనగానే సంక్రాంతి సంబరాల్లో గంగిరెద్దు గుర్తుకు వస్తుంది. పండగ భోగి మొదలు కనుమ వరకు మూడు రోజుల పాటు గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ యాచిస్తూ గంగిరెద్దుల వాళ్లు చేసే విన్యాసాలు అలరిస్తుంటాయి. రెండు మూడు దశాబ్దాల కిందటి వరకు నాలుగైదు ఊర్లలో మూడు నాలుగు వందల కుటుంబాలు ఉండే గంగిరెద్దుల వాళ్లు ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 105 కుటుంబాలు మాత్రమే మిగిలాయి. గంగిరెద్దులను ఆడించే వారు యాదవ కులంకు చెందిన వారే అయినప్పటికీ వారితో సంబంధాలు అంతంత మాత్రమే. వీరిది అంతా సంచార జీవనమే. యాచక వృత్తి ప్రధానంగా జీవిస్తుంటారు. పండగలు, పర్వదినాలతో పాటు ఎవరైనా మరణిస్తే అక్కడ ప్రత్యక్షం అవుతుంటారు. ముఖ్యంగా పంటలు చేతికి వచ్చే సమయానికి గంగిరెద్దులతో వీరు ప్రత్యక్షం అవుతుంటారు. అప్పటి వరకు ఊరూరా సంచరిస్తూ జీవనం గడుపుతుంటారు. గంగిరెద్దు అలంకరణ ఎద్దుకు వారు చెప్పినట్లుగా ఆడేలా శిక్షణ ఇచ్చి అలంకరిస్తారు. మూపురం నుంచి తోక వరకు ఎంతో అందంగా రంగు రంగులతో కుట్టిన బొంతలు, పాత పట్టు చీరలను అలంకరిస్తారు. కొమ్ములను రింగులతో అందంగా తీర్చిదిద్ది వాటికి గొట్టాలను ధరింపజేసి రంగురంగుల ఊలు ధారాలను కడతారు. వీటిని కుప్పెలుగా పిలుచుకుంటారు. నొసటిభాగంలో తోలుతో అలంకరించి పైన గవ్వలు వేలాడదీస్తారు. కాళ్లకు గజ్జెలు కట్టి ఆడిస్తుంటారు. సన్నాయి, బూర గంగిరెద్దును ఆడించే వారి వేషాధారణ సైతం ప్రత్యేకంగానే ఉంటుంది. వారి చేతిలో సన్నాయి, బూర, చిన్న గంట పట్టుకుంటారు. ఎవరైనా పాతకోటు ఇస్తే అది వేసుకుని తిరుగుతుంటారు. ఏకాలనీలోకి అడుగుపెట్టినా సరే సన్నాయి బూర శబ్దం వచ్చిందంటే గంగిరెద్దులోళ్లు వచ్చారని అట్టే అర్థం అవుతుంది. ఆదరణ తగ్గింది మా గ్రామం చర్లపల్లి అయినా పెద్దలనుంచి వచ్చిన గంగిరెద్దులను ఆడించటం కోసం సంచార జీవనం గడుపుతున్నా. భార్య ఇద్దరు పిల్లలతో గంగాపూర్లో గుడారాలు వేసుకొని జీవిస్తున్నాను. నా చిన్నతనం నుంచి ఇదే వృత్తిలో ఊరూరా తిరుగుతుంటాను. ఏడాదిలో ఈ మూడు రోజులే జడ్చర్లలో తిరిగి యాచకం చేస్తా. ఇంతకుముందు అయితే ధనం, ధాన్యం, గడ్డి అన్ని దానం చేసేవారు. ఇప్పుడు పూర్తిగా ఆదరణ తగ్గిపోయింది. – రాములు, గంగిరెద్దులను ఆడించే వ్యక్తి ఎద్దులే సాకుతాయి.. ఎద్దులను మంచిగా చూసుకుంటే అవి మా కుటుంబాలను సాకుతున్నాయి. వాటినే నమ్ముకుని ఏళ్ల తరబడి బతుకుతున్నాం. ఎద్దులు మంచిగా ఉంటేనే మా కుటుంబాలు చల్లగా ఉంటాయి. మారుతున్న సమాజంతో పొటీ పడేలా మాకు ప్రత్యేకమైన సదుపాయలు కల్పిస్తే మానుగడ సాగిస్తాం. తాతల నుంచి వస్తున్న ఆచారాన్ని కొనసాగించేలా నెట్టుకొస్తున్నాం. – రాములు, నవాబుపేట ● -
మురిపించే.. ముగ్గుల హారం
చుక్కలు.. గీతలు.. మెలికలు.. వెరసి అందమైన ముగ్గులు. ఈ ముగ్గులు మహిళల సృజనాత్మక శక్తికి ప్రతీకలుగా నిలుస్తాయి. వీటిని వేయడం వల్ల ఇంటికే కొత్త అందం వస్తుంది. సాధారణంగా ముగ్గు లేని వాకిలి కనిపించదు. ఇంటి ముందు కళ్లాపి చల్లి ముగ్గులు వేయడమంటే ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించటమేనని పెద్దలు చెబుతారు. సాధారణం ముగ్గులు అనగానే సంక్రాంతి పండుగనే గుర్తుకు వస్తుంది. సంక్రాంతి లక్ష్మీని ఆహ్వానించే చక్కటి ప్రక్రియ ఈ ముగ్గులు. సంక్రాంతి పండుగకు కొద్ది రోజుల ముందునుంచే ముగ్గుల సందడి మొదలవుతుంది. మహిళల మునివేళ్ల స్పర్శతో ముగ్గు ఎన్నో రూపాలను సంతరించుకొని అందమైన ఆకారాల్లో ఒదిగిపోయి లోగిళ్లకు కొత్త అందాలను అద్దుతాయి. అలాంటి ముగ్గుల్లోనూ రకాలు ఉన్నాయి. మెలికలు తిరుగుతై మధ్యమధ్యలో చుక్కలు ఉండేవి ముత్యాల ముగ్గులని, సరిసంఖ్యలో ఉన్న చతుర్భుజాలు, అష్ట భుజాలు, త్రికోణాలు వచ్చేవి రత్నాల ముగ్గులని చెబుతారు. బియ్యం పిండితో, ముగ్గు పిండితో ముగ్గులు వేసి వాటి మధ్యలో లక్ష్మీదేవికి ప్రతి రూపమైన గొబ్బెమ్మలు ఉంచుతారు. ఆవుపేడతో చేసిన ఈ గొబ్బెమ్మలపై గుమ్మడి, బీర పూలు ఉంచి, కొత్తగా పండిన నవధాన్యాలు, పళ్లు, ఆకులతో అలంకరిస్తారు. ప్రస్తుత ట్రెండ్ను బట్టి కొందరు మహిళలు మెసేజ్ ఇచ్చే తరహాలో ముగ్గులు వేస్తున్నారు. కాగా.. సంక్రాంతి వేళ పలు సంఘాలు, సంస్థల ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ముగ్గుల పోటీలు నిర్వహించి, గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేస్తున్నారు. -
చిన్నారిపై వీధికుక్క దాడి
అడ్డాకుల: పొన్నకల్లో ఓ చిన్నారిపై వీధికుక్క దాడిచేసి తీవ్రంగా గాయపర్చింది. గ్రామానికి చెందిన మన్నెంకొండ, విజయలక్ష్మి దంపతుల కుమార్తె అనూష మంగళవారం సాయంత్రం ఇంటి పరిసరాల్లో ఆడుకుంటోంది. ఈ క్రమంలో సమీపంలో ఉన్న ఓ షాపు వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా.. ఓ వీధి కుక్క చిన్నారిపై దాడి చేసింది. చుట్టుపక్కల వారు కుక్కను తరిమేందుకు ప్రయత్నించినా.. కుక్క చిన్నారిపై చాలాసేపు దాడి చేసింది. చివరికి అందరు కలిసి కుక్కను తరుమడంతో చిన్నారిని వదిలి పారి పోయింది. ఈ ఘటనలో చిన్నారి ముఖంపై దవడ భాగంలో రంధ్రం ఏర్పడింది. స్థానికు లు వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉందని, అధికారులు స్పందించి కుక్కలను నివారణకు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, డీసీఎం ఢీ మానవపాడు: జాతీయ రహదారి 44పై జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న బస్సును వెనుక నుంచి డీసీఎం ఢీకొట్టిన ఘటన మానవపాడు శివారులో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. హైదారాబాద్ నుంచి బెంగుళూరు వైపు వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ ఐరావత్ ట్రావెల్స్ బస్సును వెనుక వైపు నుంచి డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ సమయంలో బస్సులో దాదాపు 31మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. బస్సు డ్రైవర్ శరణయ్య చాకచాక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనలో డీసీఎం డ్రైవర్ ప్రవీణ్కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ నియంత్రించారు. -
ఉమామహేశ్వరుడికి శ్రీశైలం నుంచి పట్టువస్త్రాలు
అచ్చంపేట రూరల్: శ్రీశైల ఉత్తర ముఖద్వారమైన ఉమామహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే పార్వతీపరమేశ్వరుల కల్యాణోత్సవానికి భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున ఆలయానికి ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వర ఆలయంలో ఈనెల 15నుంచి 22వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ చైర్మన్ బీరం మాధవరెడ్డి శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలికి చేసిన విజ్ఞప్తి మేరకు ఈనెల 16న ఉమామహేశ్వరంలో నిర్వహించే పార్వతీపరమేశ్వరుల దివ్య కల్యాణ మహోత్సవానికి శ్రీశైల దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు, తలంబ్రాలను అందజేయాలని నిర్ణయించింది. ఇలా పట్టు వస్త్రాలు అందజేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా మంగళవారం శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు సుధాకర్రెడ్డి ఉమామహేశ్వర ఆలయాన్ని సందర్శించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆలయ చైర్మన్ బీరం మాధవరెడ్డి, కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావుతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం వారు ఉమామహేశ్వర ఆలయ బ్రహోత్సవాల సందర్భంగా జరిగే పార్వతీ పరమేశ్వరుల కల్యాణానికి జారీచేసిన ఆర్డర్ కాపీని ఆలయ చైర్మన్కు అందజేశారు. ఈ సందర్భంగా కట్ట సుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. ఉమామహేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి భవిష్యత్లో శ్రీశైల దేవస్థానం నుంచి సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. అనంతరం సుధాకర్రెడ్డిని ఆలయం తరఫున ఘనంగా సన్మానించారు. -
జూనియర్ నేషనల్ కబడ్డీ పోటీలకు హేమంత్కుమార్
మహబూబ్నగర్ క్రీడలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న జూనియర్ నేషనల్ కబడ్డీ చాంపియన్షిప్కు జిల్లాలోని జడ్చర్లకు చెందిన హేమంత్యాదవ్ ఎంపికయ్యాడు. ఇటీవల రాష్ట్రజట్టులో క్యాంప్నకు ఎంపికై న హేమంత్కుమార్ ప్రతిభచాటి తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. అలాగే టోర్నీలో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర బాలుర కబడ్డీ జట్టుకు జిల్లాకు చెందిన గణేష్ మేనేజర్గా, టోర్నీలో రెఫరీగా ఆర్.శ్రీనివాసులు వెళ్లనున్నారు. వీరి ఎంపికపై జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు బి.శాంతికుమార్ హర్షం వ్యక్తం చేశారు. వీరిని ఎంపిక చేసినందుకు రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్షులు కాసాని వీరేశ్ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి మద్ది మహేందర్రెడ్డిలకు జిల్లా కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. మొక్కజొన్న లారీ మాయం అలంపూర్: రైతుల నుంచి కొనుగోలు చేసిన మొక్కల లారీ మాయమైంది. డబ్బులు ఖాతాల్లో జమ కాలేదని రైతులు ఆందోళన చేయడంతో ఈ సంఘటన అలస్యంగా వెలుగు చూసింది. ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. అలంపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో గత డిసెంబర్ 21 పాపనాశిని ఆలయాల సమీపంలోని కేంద్రం వద్ద అధికారులు రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలు చేశారు. ఇలా కొనుగోలు చేసిన మూడు ధాన్యం లారీలను అలంపూర్ చౌరస్తా సమీపంలోని వీకేర్ గోదాంకు తరలించారు. అయితే ఇందులో ఒక లారీ లోడ్ వీకేర్ గోదాంకు చేరలేదు. ఏపీ 39 వీఎల్ 4269 నంబర్ గల లారీ ధాన్యాన్ని గోదాంలో అన్లోడ్ చేయకుండానే మాయమైంది. ఘటన జరిగి దాదాపు 20 ఇరవై రోజుల తర్వాత గుర్తించిన పీఏసీఎస్ కార్యదర్శి శ్రీనివాసులు సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ● గతేడాది డిసెంబర్ 21న మాయమైన లారీ ● గోదాంకు చేరకపోవడంతో విషయం బయటికి -
పండుగ వేళ విషాదం
భూత్పూర్: సంక్రాంతి పండగను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకొందామని గ్రామానికి వెళ్తుండగా.. ప్రమాదం రూపంలో ఆ కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. కళ్లముందే భార్య దుర్మరణం చెందగా.. మూడేళ్ల కూతురు చికిత్స పొందుతూ మృతి చెందింది. తండ్రితోపాటు మరో కూతురు గాయాలతో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం భూత్పూర్ వద్ద బ్రిడ్జిపై కారు ప్రమాదంలో సంక్రాంతి పండగకని కూతురు వద్దకు తిరుపతి వెళ్తుండగా భార్యాభర్తలు మృతిచెందిన ఘటన మరువక ముందే మరో ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన ఘటన వాహనదారులను కలిచివేసింది. వివరాలిలా.. ఏపీలోని నంద్యాల జిల్లా పగిడియాల మండలం మచ్చుమర్రికి చెందిన సూర్య తిరుపతయ్య, భార్య భాగమణి (25) చిన్న కూతరు యస్న(3), మరో కూతరు ప్రియాంచితో కలిసి హైదారాబాద్లోని అల్వాల్లో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సంక్రాంతి పండగకని స్వగ్రామానికి బైక్పై మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మార్గమధ్యంలో భూత్పూర్ మండలం అన్నాసాగర్ సమీపంలోని గాజులపేట స్టేజీ జాతీయ రహదారిపై మోటర్ సైకిల్ అదుపు తప్పి రోడ్డుపక్కనే ఉన్న రేలింగ్ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో భార్య నాగమణి (25) అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. చిన్నకూతురు యస్న (3) జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. తిరుపతయ్యతోపాటు మరో కూతురు ప్రియాంచి గాయాలతో చికిత్స పొందుతున్నారు. నాగమణి తల్లి ఉస్సేనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. రెండ్రోజుల్లో రెండో ప్రమాదం భూత్పూర్ వద్ద జాతీయ రహదారిపై బ్రిడి వద్ద రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు ఏపీ వాసులు భార్యాభర్తలు మృతిచెందారు. పండగవేళ తిరుపతిలోని కూతురు వద్దకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో భార్య, కూతురు మృతి భర్త, మరో కూతురుకి తీవ్ర గాయాలు రెండ్రోజుల్లో రెండో ప్రమాదం, నలుగురి మృతి -
దివ్యాంగులందరిలో ఏదో ఒక ప్రతిభ
● బీజేపీ జాతీయ ఉపాఽధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ ● రూ.1.50 కోట్ల విలువైన ఉపకరణాలు పంపిణీ మహబూబ్నగర్ రూరల్: దివ్యాంగుల ప్రతిఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ, మేధస్సు తప్పక కలిగి ఉంటారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లాకేంద్రంలోని స్టేట్హోమ్ ఆవరణలో నిర్వహించిన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ డీకే అరుణ సభాధ్యక్షత వహించారు. మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని మహబూబ్నగర్, వనపర్తి, జడ్చర్ల నియోజకవర్గాల్లో వెయ్యిమంది దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అలింకో ద్వారా రూ.1.50కోట్ల విలువైన 986 ఉపకరణాలు బ్యాటరీ ట్రై సైకిల్స్, సాధారణ ట్రై సైకిల్స్, హ్యాండ్ స్టిక్స్, హియర్ ప్యాడ్లను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. అనంతరం ఎంపీ డీకే అరుణ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అలింకో దివ్యాంగుల సాధికరతకు పనిచేస్తుందన్నారు. ఈసారి ఉపకరణాలు రానివారికి మరోసారి పంపిణీ చేపడతామని హామీ ఇచ్చారు. -
ప్రపంచ ప్రసిద్ధ మేధో యుద్ధక్రీడ చెస్
● రాష్ట్రస్థాయి జనరల్ సెక్రెటరీ బసవప్రభు ● ముగిసిన ఉమ్మడి జిల్లాస్థాయి చెస్ పోటీలు వనపర్తిటౌన్: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మేధో యుద్ధ క్రీడ చెస్ అని చెస్ అసోసియేషన్ రాష్ట్రస్థాయి జనరల్ సెక్రెటరీ బసవప్రభు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన ఉమ్మడి జిల్లాస్థాయి ముగింపు చెస్ పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చెస్తో మెదడు వ్యాయామంగా పనిచేసి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, సమస్య పరిష్కార శక్తి పెరుగుతుందన్నారు. విద్యార్థులకు ఇది మ్యాథ్స్, సైన్స్ వంటి విషయాల్లో లాజికల్ థింకింగ్ను మెరుగుపరుస్తుందన్నారు. జిల్లా అధ్యక్షుడు యాదగిరి మాట్లాడుతూ.. రెండురోజుల పోటీల్లో 96మంది పాల్గొన్నారని తెలిపారు. బాలుర విభాగంలో జగదీశ్, అనీశ్ ఆదిత్యరెడ్డి, కార్తీక్, సాజిత్, బాలికల విభాగంలో ఆరాధ్య శ్రీ, మనస్వి, తన్మయి శ్రీ, మధుమిత, అభిష్ట వెండి పతకాలతోపాటు ట్రోఫీని అందుకున్నారని చెప్పారు. అనంతరం స్పాన్సర్స్ రామ్ షా హోల్సెల్ డీలర్ రామకృష్ణ, పూజ ఎలక్ట్రానిక్స్ వెంకటేశ్వర్రెడ్డి, లక్ష్మీకాంత్తో కలిసి విజేతలకు బహుమతలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో చెస్ అసోయేషన్ జనరల్ సెక్రెటరీ వేణుగోపాల్, ట్రెజరర్ టీపీ కృష్ణయ్య, గౌరవ అధ్యక్షుడు మురళీధర్, సభ్యులు గణేశ్కుమార్, రామ్ప్రసాద్, సత్యనారాయణ, నర్సింహ, రాములు, రాములుయాదవ్, నగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పొలానికి వెళ్తుండగా రైతు మృతి
● బైక్ అదుపు తప్పడంతో ప్రమాదం బిజినేపల్లి: మండలంలోని ఎర్రకుంటతండా గ్రామ పంచాయతీలోని జకునతండాకు చెందిన రైతు హన్మంత్నాయక్ (55) పొలానికి వెళ్తుండగా బైక్ అదుపుతప్పి కిందపడడంతో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. హన్మంత్నాయక్ మంగళవారం ఉదయం కేఎల్ఐ పిల్ల కాల్వ మీదుగా ద్విచక్ర వాహనంపై పొలానికి వెళ్తున్నాడు. కాల్వపై గుంతలు ఎక్కువగా ఉండటంతో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కకు పడిపోయాడు. అటుగా వెళ్తున్న కొందరు విషయం గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు గుర్తించారు. హన్మంత్నాయక్కు భార్య సాలీ, నలుగురు సంతానం ఉన్నారు. పురుగు మందు తాగి.. వ్యక్తి మృతి మాగనూర్: మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన రవి (41) చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. గ్రామానికి చెందిన కావలి రవి– సుజాత దంపతులు తరచూ గొడవపడుతూ ఉండేవారు. ఈనెల 11న కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో రవి క్షణికావేశంతో పురుగులమందు తాగాడు. కుమారుడు వంశీ ఇంటికి వచ్చే సరికే స్పహ కోల్పోయి ఉన్నాడు. వెంటనే మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించాడు. దీంతో భార్య మంగళవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అశోక్బాబు తెలిపారు. భార్య కాపురానికి రాలేదని గొంతు కోసుకున్న భర్త గద్వాల క్రైం: భార్య కాపురానికి రాలేదని మనస్థాపం చెందిన భర్త గొంతు కోసుకున్న ఘటన మంగళవారం గద్వాల పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ రెండో ఎస్ఐ సతీష్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని వడ్డెవీధికి చెందిన రాధమ్మకు రాయిచూర్కు చెందిన రాజుతో ఐదేళ్ల క్రితం పైళ్లెంది. అయితే వివాహం అయినప్పటి నుంచి రాజు భార్యను వేధిస్తుండడంతో మనస్థాపం చెందిన ఆమె కొన్ని నెలల క్రితం పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో భార్యను తనతో పాటు రాయిచూర్కు పంపించాలని రాజు అత్తగారింటి వారితో వాగ్వాదానికి దిగాడు. ఆమె వెళ్లేందుకు నిరాకరించింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న రాజు క్షణికావేశంలో బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యామత్నం చేశాడు. రక్తస్రావం కావడంతో గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు శస్త్ర చికిత్స చేసి గొంతుకు కుట్లు వేశారు. బలమైన గాయం కాలేదని నరాలపై ప్రభావం పడిందని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇది ఇలా ఉండగా ఆరు నెలల క్రితమే భర్త వేధింపులు తాళలేక భార్య రాధమ్మ పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరికీ సఖీ సెంటర్లో కౌన్సెలింగ్ సైతం అందించామని ఎస్ఐ తెలిపారు. చెరువులో దూకి వృద్ధురాలి బలవన్మరణం తిమ్మాజిపేట: మండలంలోని గొరిటకు చెందిన వృద్ధురాలు దాసరి అక్కమ్మ (70) చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ హారిప్రసాద్రెడ్డి తెలిపిన వివరాలు.. అక్కమ్మ తన ఒక్కగానొక్క కుమార్తెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించింది. దీంతో వృద్ధాప్యంలో తన పనులు కూడా తాను చేసుకోలేని స్థితికి చేరుకోవడంతో తీవ్ర మసస్తాపానికి గురై గ్రామ సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం మృతదేహం నీటిపై తేలడంతో గుర్తించిన స్థానికులు కుమార్తెకు సమాచారం అందించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వితంతు మహిళ ఆత్మహత్య వీపనగండ్ల: అత్తగారి గ్రామంలో ఉన్న ఇంటి స్థలాన్ని విక్రయించేందుకు అత్త అడ్డుచెప్పడంతో మనస్థాపానికి గురైన వితంతువు వడ్డె శిల్ప (28) వాజ్మాయిల్ తాగి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. ఏఎస్ఐ వెంకట్రెడ్డి తెలిపిన ప్రకారం.. బొల్లారం గ్రామానికి చెందిన శిల్పకు పెంట్లవెల్లి గ్రామానికి చెందిన శివతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. రెండేళ్ల క్రితం భర్త చనిపోవడంతో శిల్ప బొల్లారంలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో పెంట్లవెల్లిలో ఉన్న ఇంటి స్థలాన్ని విక్రయించాలని ప్రయత్నించగా.. అత్త అడ్డుకోవడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి కుమారుడు ఉన్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. -
ఉత్కంఠ పోరులో మహబూబ్నగర్ విజయం
● 13 పరుగుల తేడాతో నిజామాబాద్పై గెలుపు ● అర్ధసెంచరీతో రాణించిన అబ్దుల్ రాఫే మహబూబ్నగర్ క్రీడలు: కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ జిల్లాల టీ–20 లీగ్లో భాగంగా రెండో దశ పోటీల్లో భాగంగా స్థానిక ఎండీసీఏ మైదానంలో నిర్వహిస్తున్న లీగ్ మ్యాచ్లు మంగళవారం ముగిశాయి. చివరి వరకు ఉత్కంఠగా సాధిన నిజామాబాద్– మహబూబ్నగర్ మ్యాచ్లో మహబూబ్నగర్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మహబూబ్నగర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. జట్టులో ఓపెనర్ అబ్దుల్ రాఫే బిన్ అబ్దుల్లా (42 బంతుల్లో 8 ఫోర్లతో 55 పరుగులు) మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆకాష్ వెంకట్ (37 నాటౌట్), డేవిడ్క్రిపాల్ రాయ్ (33), శ్రీకాంత్ నాయక్ (30) రాణించారు. నిజామాబాద్ బౌలర్ లలిత్రెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన నిజామాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. హర్షవర్దన్ (57) అర్ధసెంచరీ చేయగా.. అజిత్(31), విక్రంయాదవ్ (21), సాయిప్రతీక్ (20) రాణించారు. పాలమూరు బౌలర్లు ముఖితుద్దీన్, తేజావత్ హరీశ్, రాకేష్నాయక్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా అబ్దుల్ రాఫె బిన్ అబ్దుల్లా (మహబూబ్నగర్) నిలిచాడు. ● మరో మ్యాచ్లో నిజామాబాద్ 56 పరుగుల తేడాతో కరీంనగర్ జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన నిజామాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. విక్రం యాదవ్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 8 ఫోర్లతో 84 పరుగులు నాటౌట్, ఎం.సాయిప్రతీక్ 49 పరుగులు, వైవీరెడ్డి 34 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన కరీంనగర్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. జట్టులో తక్షిల్ (56) అర్ధ సెంచరీ చేయగా... ఎం.సాయిప్రతీక్, లలిత్రెడ్డి మూడేసి వికెట్లు తీశారు. బ్యాటింగ్, బౌలింగ్లో రాణించిన సాయిప్రతీక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. -
రేపటి నుంచి సింగోటం బ్రహ్మోత్సవాలు
కొల్లాపూర్ రూరల్: మండలంలోని సింగోటంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైయింది. ఈ నెల 15 నుంచి 21వరకు స్వామివారి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు అధికారులు, ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఆలయ గోపురానికి రంగులు అద్దడంతో పాటు ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ, ఆలయ కమిటీ నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొల్లాపూర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల డిపోల నుంచి సింగోటం గ్రామానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు డిపో అధికారులు తెలిపారు. భక్తులు స్నానాలు చేయడానికి గుండంలో వసతులు కల్పించారు. ఉత్సవాలలో భాగంగా 15 న స్వామివారికి శకటోత్సవం, పల్లకీ సేవ, 16న స్వామివారికి అశ్వవాహన సేవ, 17న గుండంలో ప్రబోత్సవం, సింహవాహన సేవ, 18న బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం నిర్వహిస్తారు. ఆ రోజు వేలాది మంది భక్తులు హాజరై తేరు లాగుతారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. 19న రాత్రి 7 గంటలకు స్వామివారికి తెప్సోత్సవం, డోతోత్సవం నిర్వహిస్తారు. 20న స్వామివారికి శేషవాహన, 21 రాత్రి 7 గంటలకు శ్రీవారి సముద్రంలో స్వామివారికి హంసవాహన సేవ చేయడంతో ఉత్సవాలు ముగుస్తాయి. అనంతరం స్వామివారి సన్నిధిలో జాతర దాదాపు నెల రోజులు జరుగుతుంది. లక్ష్మీనరసింహస్వామి ఆలయం ముస్తాబు ప్రధానఘట్టం 18న రథోత్సవం 21న హంసవాహన సేవతో ముగింపు ఏర్పాట్లు పూర్తి చేసిన దేవాదాయ శాఖ అధికారులు, ట్రస్ట్ సభ్యులు -
మూడు రోజుల పండుగ
సంక్రాంతిని మూడు రోజు ల పండుగగా నిర్వహిస్తారు. మొదటి రోజు భోగి పురస్కరించుకొని పిల్లలకు ఆరో గ్యం కలిగించాలని సూర్య నారాయణను ప్రార్థిస్తూ భోగి పళ్లు వేస్తారు. రెండో రోజు సంక్రాంతి.. విశేష రీతిలో సూర్య ఆరాధన నిర్వహిస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలం సందర్భంగా అనేక మంది జపాలు, తర్పణాలు, హోమాలు, పితృదేవత ఆరాధనలు నిర్వహిస్తారు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా శుభ కార్యాలు చేయడానికి యోగ్యమైన కొంతకాలంగా జ్యోతిష్య శాసనం తెలియజేస్తోంది. మూడో రోజు కనుమపండుగ సందర్భంగా పశువుల పూజలు నిర్వహిస్తారు. – గొండ్యాల రాఘవేంద్రశర్మ, మహబూబ్నగర్ -
నోరూరించే పిండి వంటలు
సంక్రాంతి అనగానే ముందుగా గుర్తుచ్చేవి అరిసలు. బెల్లంతో తయారు చేసే అరిసెలు ఆరోగ్యానికి మంచిది. కొత్త బియ్యపు పిండి, నూనె, బెల్లం, నువ్వులతో అరిసెలు తయారు చేస్తారు. అదేవిధంగా బియ్యం పిండి, కొబ్బరి, నువ్వుల పిండితో బూరెలు చేస్తారు. వీటికి తయారీకి కొంతమంది పంచదార పాకాన్ని వాడుతారు. సంక్రాంతి పండుగలో అతి బలవర్ధకమైన ఆహారం నువ్వుల ఉండలు. నువ్వుల ఉండలు తినడం ద్వారా రక్తహీనతను నివారించవచ్చు. సంక్రాంతి సంప్రదాయ వంటగా కజ్జికాయలను తయారు చేస్తారు. అలాగే నేతితో చేసిన గారెలు, పాయసం, పరమాన్నం, జంతికలు, సున్నుండలు, లడ్డూలు తయారుచేస్తారు. నువ్వుల రొట్టెలు ప్రత్యేకం భోగి రోజు అందరి ఇళ్లల్లోనూ నువ్వుల రొట్టెలు చేయటం ప్రత్యేకత. కొందరు బియ్యంపండి, మరికొందరు జొన్నపిండిలో నువ్వులను వేసి రొట్టెలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. చలికాలం కావటం వల్ల నువ్వులు వంటికి వేడిని అందిస్తాయని భోగి రోజున వాటిని ఆరగిస్తారు. అలాగే చిక్కుకాయ లేదా వివిధ రకాల కూరగాయలను కలిపి వండుతారు. -
వీబీ–జీ రామ్జీ చట్టంపై తప్పుడు ప్రచారం
● కేంద్రం నిధులిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పుకోవడం సరికాదు ● ఎంపీ డీకే అరుణ పాలమూరు: వికసిత్ భారత్ రోజ్ గార్ ఔర్ ఆజివిక మిషన్ గ్రామీణ్ (వీబీ–జీ రామ్జీ)చట్టంపై కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, దేశంలోని అన్ని రంగాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ముందుకు వెళుతోందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వికసిత్ భారత్ కావాలంటే వికసిత్ గ్రామం కావాలని జీ రామ్జీ పథకం తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. యూపీఏ హయాంలో ఎంఎన్ఆర్ఈజీఏ కింద రూ.2 లక్షల కోట్ల పై చిలుకు ఖర్చు చేస్తే మోదీ ప్రభుత్వం రూ.8.53 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. గతంలో ఈ పథకం అధికార పార్టీల నేతల జేబులు నింపుకోవడానికి ఉపయోగపడిందన్నారు. ఈ పథకం ద్వారా గ్రామ సభలలో అభివృద్ధి పనులను తీర్మానం చేసి ప్రణాళిక రూపొందించాలని దీని ముఖ్య ఉద్దేశమన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక అభివృద్ధి నిధులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు.. ఈనిధులు ఎక్కడివో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు సీఎం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వీబీ–జీ రామ్ జీ పథకానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏమి తగ్గడం లేదని రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు అదనంగా కేటాయిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.600 కోట్లకు పైగా నిధులు వచ్చాయని వాటిని రాష్ట్ర ప్రభుత్వ నిధులు చెప్పుకోవడం సరైంది కాదన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, పద్మజారెడ్డి, బాలరాజు, వీర బ్రహ్మచారి, పాండురంగారెడ్డి, అంజయ్య, రమేష్, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
సిరిసంపదలు పొంగాలంటూ..
రైతులు ఆరుగాలం శ్రమించగా చేతికి వచ్చిన పంటలతో సంతోషంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. మూడు రోజుల పండగలో రెండవరోజు సంక్రాంతి. పాలు పొంగించి పొంగళి అనే తీపిపదార్థం తయారు చేస్తారు. వచ్చే ఏడాది పాటు తమ ఇళ్లల్లో సిరి సంపదలు పాలు పొంగినట్లుగా పొంగాలని కోరుకుంటూ ఇళ్లల్లో పాలు పొంగించటం ఆనవాయితీగా వస్తోంది. రెండు కొత్త కుండలు (గురిగి) తీసుకువచ్చి వాటిని అలంకరించి పాలు పోసి బెల్లం వేస్తారు. ఆవు పిడకలు, నెయ్యితో మంట వేసి ఆ పాలు పొంగేవరకు మంటపెడతారు. పాలు ఈశాన్యం వైపు పొంగితే ఆ ఇంట సిరిసంపదలకు తావుండదని విశ్వాసం. ఇంటిముందు రంగవళ్లులు తీర్చిదిద్దటం వల్ల లోగిళ్లన్ని ఇంద్రధనుస్సును తలపిస్తూ కొత్త కాంతిని ప్రసరింపజేస్తాయి. కొన్ని ప్రాంతాల్లో పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. మూడో రోజు కనుమపండగ సందర్భంగా పశువులను అలంకరించి వాటికి పూజలు చేసి విందు, వినోదాలతో గడుపుతారు. -
జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): పదోతరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలక్టర్ విజయేందిర బోయి పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్ జిలా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లో డైరీని కలెక్టర్, డీఈఓ ప్రవీణ్కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వందశాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలన్నారు. అనంతరం యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సతీశ్, తాహెర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ము ఖ్యంగా గత సంవత్సరంలో పదో తరగతి మూ ల్యాంకన పారితోషికం వెంటనే విడుదల చేయాలని, మున్సిపాలిటీ ఎన్నికల్లో మహిళా ఉద్యోగ ఉపాధ్యాయులను మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఏఎంఓ శ్రీనివాసులు, సీఎంఓ సుధాకర్రెడ్డి, డీఎస్ఓ షంషీర్, జీసీటీఓ అస్రాఖాద్రి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు హమీద్అలీ, రాష్ట్ర కార్యదర్శులు ఫరీద్, శశిధర్ ఉపాధ్యక్షులు అనిల్కుమార్ శరణప్ప మల్లికార్జున్, శ్రీనివాసులు, కృష్ణనాయక్ పాల్గొన్నారు. -
మహిమ గల దేవుడు..
మా పూర్వీకుల నుంచి చింతలకుంట ఆంజనేయస్వామిని కొలుస్తున్నాం. ఈ స్వామివారు చాలా మహిమ గల దేవుడు. మా కుటుంబం ఆలయ అభివృద్ధిలో కొద్దిమేర భాగస్వాములయ్యాం. ప్రజాప్రతినిధులు, భక్తులు, దాతలు ముందుకొచ్చి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సహకరించాలి. – వెంకటస్వామి, భక్తుడు, సూగూరు, పెబ్బేరు మండలం భక్తుల రాక పెరుగుతోంది.. కోరిన కోరికలు తీరుతుండడంతో ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతుంది. పెద్దసంఖ్యలో భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని ఆలయం, పరిసరాలను అభివృద్ధి చేసేందుకు భక్తులు, దాతలు ముందుకు రావాలి. ఇక్కడ ప్రతి అమావాస్య రోజు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం. – వెంకటేశ్వర్లు, ఆలయ పూజారి -
పాలమూరుకు తీరని ద్రోహం చేసిన బీఆర్ఎస్
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో మహబూబ్నగర్ను అభివృద్ధికి ఆమడదూరంలో ఉంచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్లకే దక్కుతుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. పాలమూరు పేరును పదేపదే వందలసార్లు నోట్లో నానబెట్టి, చివరకు ఆ పేరునే ముంచేశారని మండిపడ్డారు. ఇది నిర్లక్ష్యం కాదు.. అనుకోని తప్పు కాదు.. పూర్తి తెలిసే చేసిన తీరని ద్రోహం.. నిన్న మహబూబ్నగర్లో జరిగిన కేటీఆర్ మీటింగ్ అభివృద్ధిపై చర్చించేందుకు కాదు.. పాలమూరు ప్రజల జ్ఞాపకశక్తిని తక్కువ చేసి మాట్లాడేందుకు, వారి సహనాన్ని పరీక్షించేందుకు జరిగిన సభ..’ అని విమర్శించారు. జూరాల పై నుంచి వచ్చే వరద నీటిని తన కాలు అడ్డం పెట్టి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలం చేస్తానన్న కేసీఆర్.. చివరకు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను శ్రీశైలానికి ఎలా తరలించారని ప్రశ్నించారు. జూరాల నీటిని ఒడిసి పట్టుకునే చిత్తశుద్ధి బీఆర్ఎస్ నాయకులకు లేకపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నారాయణపేట, మక్తల్, కొడంగల్ ఎత్తిపోతల పథకాలకు అనుమతులు మంజూరు చేసి రైతులపై సీఎం రేవంత్రెడ్డికి ఉన్న మమకారాన్ని చూపించారన్నారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. వచ్చే మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 50 డివిజన్లకు పైగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ రెండేళ్లలో సుమారు రూ.రెండు వేల కోట్లతో నగర అభివృద్ధికి సీఎం చేయూతనిచ్చారన్నారు. రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, కాంగ్రెస్ పార్టీ నాయకులు మారేపల్లి సురేందర్రెడ్డి, సీజేబెన్హర్, సిరాజ్ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు. -
రేగుపళ్లతో బోడాలు
విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వటంతో ఇప్పటికే పిల్లలు ఇళ్లకు చేరుకున్నారు. కొత్తగా వివాహాలు అయిన వారిళ్లలో ఆడపడుచులతో పాటు అల్లుళ్లు రావడంతో కొత్త ఉత్సాహం నెలకొంది. బుధవారం భోగి పురస్కరించుకుని చిన్నారులకు రేగుపళ్లతో దిష్టి తీయటం చేస్తుంటారు. మూడు నెలల చిన్నారినుంచి ఐదేళ్ల బాలబాలికలకు చీడపీడలు దరిచేరకుండా ఉండాలని కోరుకుంటూ రేగుపళ్లు, నూగులు, బియ్యంతో దిష్టి తీస్తుంటారు. ఎలాంటి రుగ్మతలు దరి చేరకుండా ఉండాలని మూడుసార్లు రేగుపళ్లను తలపై పోస్తారు. దీనిని భోగిపళ్లు, బోడాలుగా పిలుచుకుంటారు. రేగుపళ్లతో పాటు ఇటీవల కాలంలో పూలను వాడుతున్నారు. ఈ వేడుకలో భాగంగా పేరంటాలకు పసుపు, కుంకుమలు, చందనం అందించి, శనగలు, పటికబెల్లం, నువ్వులు, బెల్లం కలిపి దంచిన చిమ్మిలి ఉండలు ఇస్తారు. ఈ అన్ని కార్యాల వల్ల గ్రహ శాంతి కూడా కలుగుతుందని విశ్వసిస్తారు. జడ్చర్లలో మంగళవారం సాయంత్రమే కొందరు బోడాల వేడుక నిర్వహించారు. -
దశ మారనున్న ‘దేవరకద్ర’
● నేడు ఇద్దరు మంత్రుల రాక ● రూ.18 కోట్ల పనులకు శంకుస్థాపన దేవరకద్ర: దేవరకద్ర మున్సిపాలిటీగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా మంజూరైన నిధులతో వివిధ అభివృద్ధి పనులకు బుధ వారం మంత్రుల కోమిటిరెడ్డి వెంకట్రెడ్డి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం పూర్తి ఏర్పాట్లు చేశారు. కొత్త మున్సిపాలీటీ కింద రూ.15కోట్లు మంజూరు కాగా, మున్సిపాలిటీ భవన నిర్మాణానికి మరో రూ.5కోట్లు మంజూరయ్యాయి. అలాగే మూడా కింద మరో రూ.3కోట్లు గతంలోనే మంజూరుకాగా.. వచ్చిన నిధులతో చేపట్టే పనుల వల్ల దేవరకద్ర దశ మారనుంది. దేవరకద్ర ఆర్వోబీకి రెండువైపులా సర్వీసు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఇప్పటికే రాఘవేంద్ర టాకీస్ నుంచి సర్వీసు రోడ్డు సీసీ పనులు పూర్తికాగా దీనిని ప్రారంభోత్సవం చేస్తారు. అలాగే ఆర్వోబీ పిల్లర్లకు మధ్యన గోడలు నిర్మించి చెట్లను పెంచడం గ్రీనరీగా మార్చడం, చిన్న వ్యాపారులకు షాపుల నిర్మాణం, యూటర్న్ రోడ్లు, సుందరీకరణ పనులు చేపట్టడానికి నిధులను కేటాయించారు. అడిగిన రెండు రోజుల్లోనే రూ.5కోట్లు దేవరకద్రలోని ఆర్అండ్బీకి సంబంధించి శిథిలలైన గెస్టుహౌస్ స్థానంలో మున్సిపల్ కార్యాలయం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి సీఎం రేవంత్రెడ్డి అడిగిన రెండు రోజుల్లోనే రూ.5కోట్లు మంజూరు చేసి ప్రొసీడింగ్ ఇచ్చారని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి తెలిపారు. దేవరకద్ర మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్ది ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా పెట్టుకున్నామని తెలిపారు. దేవరకద్ర నుంచి మార్కెట్ రోడ్డు బల్సుపల్లి, గోప్లాపూర్, మీనుగోనిపల్లి, చౌదర్పల్లి రోడ్లకు డివైడర్లు పెట్టించి చెట్లను పెంచే పనులు త్వరలో చేపడతామని తెలిపారు. -
ఐటీఐ కళాశాలలో వసతుల పరిశీలన
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: మహబూబ్నగర్లోని ప్రభుత్వ బాలుర, బాలికల కళాశాలలను లేబర్ ఎంప్లాయిమెంట్, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి దాన కిషోర్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆయా కళాశాలల్లో నెలకొన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇటీవల నెలకొల్పిన ఏటీసీ సెంటర్లలో ఏర్పాటు చేసిన ఆధునిక యంత్రాల పనితీరు, వసతులను పరిశీలించారు. కళాశాలలో విద్యార్థులు తక్కువగా హాజరుకావడానికి కారణాలపై ఆరాతీశారు. బాలికల కళాశాలలో హాస్టల్ వసతి ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వచ్చే వారంలో ఉమ్మడి జిల్లా స్కిల్ విజనింగ్ వర్క్షాప్ నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో రీజినల్ జాయింట్ డైరెక్టర్ రాజు, ప్రిన్సిపాళ్లు శాంతయ్య, గోపాల్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
చారిత్రక ఆలయాల్లో సందర్శకులకు సౌకర్యాలు
అలంపూర్ రూరల్: హైదరాబాద్ సర్కిల్ పరిధిలోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అలంపూర్లోని చారిత్రత్మక ఆలయాల్లో సందర్శకుల సౌకర్యాలు మెరుగుపరచడానికి సమగ్ర చర్యలు ప్రారంభించినట్లు పరిరక్షణ సహాయకుడు వెంకటయ్య తెలిపారు. అలంపూర పట్టణంలోని సంగమేశ్వర, పాపానాశీశ్వర ఆలయాల్లో జరుగుతున్న పనులను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాల్లో సందర్శుకుల సౌకర్యాల కోసం వృద్ధ సందర్శకులు, దివ్యాంగులకు సుభంగా చేరుకోవడానికి పాపనాశీశ్వర ఆలయంలో ర్యాంపును చేపట్టామన్నారు. ప్రాంగణంలో పర్యావరన పరిరక్షణ, మెరుగైన సౌందర్యానికి దోహదపడేందుకు రెండు ఆలయ సముదాయాల్లో ట్రీ గార్డులను ఏర్పాటు చేశామన్నారు. ఆలయం లోపల సందర్శకుల సురక్షితమైన కదలికలను నిర్ధరించడానికి మార్గాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వారసత్వ స్మారక చిహ్నాలను సంరక్షించడంలో ఏఎస్ఐ నిబద్ధతను ప్రతిబింభిస్తాయన్నారు. సంగమేశ్వర ఆలయంలో ఒక వివరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఏఎస్ఐ ప్రతిపాదించినట్లు, ఇది సందర్శకులకు చారిత్రకు, సాంస్కృతిక సమాచారన్ని అందిస్తుందన్నారు. సంగేమేశ్వర ఆలయ ప్రాంగణంలో ఒక గదిని కేటాయించడంతో జిల్లా పరిపాలన మద్దతిచ్చిన తర్వాత ఈ చొరవ అమలు చేయబడుతుందన్నారు. కొనసాగుతున్న ప్రతిపాదిత పరిణామాలు ప్రఖ్యాత అలంపూర్ ఆలయ సముదాయం వారసత్వ అవగాహన, సందర్శకుల సౌకర్యం, స్థిరమైన పరిరక్షణను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పరిరక్షణ సహాయకుడు వెంకటయ్య తెలిపారు. -
ఉత్సాహంగా టీ–20 లీగ్–2 పోటీలు
● గెలుపొందిన ఖమ్మం, నల్లగొండ జట్లు ● నేడు మహబూబ్నగర్– నిజామాబాద్ మధ్య మ్యాచ్ మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఎండీసీఏ మైదానంలో జరుగుతున్న కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ జిల్లాల టీ–20 లీగ్–2 మ్యాచ్లు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఖమ్మం జట్టు 9 వికెట్ల తేడాతో వరంగల్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వరంగల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. జట్టులో శివరాం 31, చంద్ర 27, పర్దిపాన్ 25 పరుగులు చేశారు. ఖమ్మం బౌలర్లు మహేష్ చౌదరి 3, విశాల్ యాదవ్ 3, సిద్ధార్థ వాసిరెడ్డి 1 వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఖమ్మం జట్టు సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. 10.4 ఓవర్లలో వికెట్ కోల్పోయి 112 పరుగులు చేసింది. విశాల్యాదవ్ 41 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్తో 71 పరుగులు నాటౌట్, హర్షిత్రెడ్డి 35 పరుగులు నాటౌట్గా నిలిచారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా విశాల్యాదవ్ (ఖమ్మం) నిలిచాడు. 86 పరుగుల తేడాతో.. మరో లీగ్ మ్యాచ్లో నల్లగొండ జట్టు 86 పరుగుల తేడాతో కరీంనగర్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన నల్లగొండ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. జ్ఞానప్రకాశ్ 43 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్లతో 85 పరుగులు, జశ్వంత్ యాదవ్ 36 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 60 పరుగులు, సాయినాథ్ పగిడిమరి 36 పరుగులు నాటౌట్ చేశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన కరీంనగర్ జట్టు 18.1 ఓవర్లలో 131 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జట్టులో విఘ్నేష్ 28, సయ్యద్ అఖ్దమ్ 17 పరుగులు చేశారు. నల్లగొండ బౌలర్లు సాయినాథ్ పగిడిమరి 3, అబ్దుల్ జీషాన్ 2 వికెట్లు తీశారు. బ్యాటింగ్, బౌలింగ్లో ప్రతిభచాటిన సాయినాథ్ పగిడిమరి (నల్లగొండ) మ్యాన్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. కాగా మంగళవారం ఉదయం 9 గంటలకు మహబూబ్నగర్– నిజామాబాద్, మధ్యాహ్నం ఒంటిగంటకు కరీంనగర్– నిజామాబాద్ జట్లు తలపడనున్నాయి. అనంతరం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన క్రీడాకారులకు రూ.5 వేల చెక్ అందజేశారు. కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కార్యదర్శి వెంకట్, వరంగల్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, ఎండీసీఏ ఉపాధ్యక్షులు సురేష్కుమార్, కోచ్లు అబ్దుల్లా, మన్నాన్, ముఖ్తార్అలీ తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్పైపులీకై వ్యాపించిన మంటలు
ఆత్మకూర్: గ్యాస్ సిలీండర్ పైపు లీకేజీ కారణంగా మంటలు వ్యాపించి ఐదుగురికి గాయాలైన ఘటన సోమవారం ఆత్మకూర్ మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని కత్తేపల్లికి చెందిన భారతి సోమవారం మధ్యాహ్నం సిలీండర్ స్టౌపై వంట చేస్తుంది. ఇంతలోనే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇంట్లో ఉన్న ఐదుగురు ఉక్కిరిబిక్కిరయ్యారు. బయటకు పరుగులు తీశారు. సిలీండర్ పైపు చాలపాతద అని ఆ పైపునకు రంధ్రాలు పడితే ప్లాస్టర్లు వేసి వాడుకుంటున్నారని అందులో భాగంగానే మంటలు చెలరేగాయని గ్రామస్తులు తెలిపారు. ఈ ప్రమాదంలో భారతి, సంధ్య, లోకేశ్, లావణ్య, శావణికి గాయాలయ్యాయి. విషయాన్ని గమనించిన చుట్టుపక్కలవారు ‘108శ్రీలో ఆత్మకూర్ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఐదుగురికి గాయాలు -
యూరియాకు ప్రత్యామ్నాయం అన్వేషించాలి
బిజినేపల్లి: యూరియా కొరత, డ్రోన్ ఆధారిత వ్యవసాయం, సమీకృత వ్యవసాయం, యాంత్రీకరణ, నాణ్యమైన విత్తనం, చేపల పెంపకం తదితర వాటిపై అన్నిశాఖల సమన్వయంతో క్షేత్ర ప్రదర్శనలు, శిక్షణలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని దక్షిణ తెలంగాణ మండల సహ పరిశోధన సంచాలకుడు డా. ఎల్.కృష్ణ అన్నారు. సోమవారం పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శాసీ్త్రయ సలహాసంఘం 2025–26 సమావేశం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యూరియాకు ప్రత్యామ్నాయం అన్వేషించాలని, మామిడిలో అంతర పంటగా అల్లం సాగు చేయాలని, నీటికుంటల్లో చేపల పెంపకం, చిరుధాన్యాలతో పౌష్టికాహారం తయారీ, మహిళా సంఘాలకు స్వగృహ వ్యాపారాలు వంటి వాటిపై భవిష్యత్ ఫలితాలను అద్భుతంగా సాధించాలన్నారు. కార్యక్రమంలో పాలెం కేవీకే కో–ఆర్డినేటర్ డా. శ్రీదేవి, డీఏఓ యశ్వంత్రావు, ఇతర శాస్త్రవేత్తలు డా. ఎం.వెంకటేశం, నర్సింహారావు, పద్మవేణి, మనోహర్రెడ్డి, చంద్రశేఖర్, శ్రీశైలంగౌడ్, జ్ఞానశేఖర్, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు. ఎతైన కొండలపై.. 500 అడుగుల ఎత్తైన నల్లమల కొండలపై ఉమామహేశ్వర క్షేత్రం వెలిసింది. పురాణ ప్రసిద్ధిగాంచిన శ్రీశైల క్షేత్రంకు ఉత్తర ద్వారంగా ఉమాశక్తి పీఠంగా ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ప్రసిద్ధి చెందింది. రావణాసురుని చంపిన తదుపరి శ్రీరాముడు శ్రీశైలం ప్రదక్షిణను ఉమామహేశ్వర క్షేత్రం నుంచి ప్రారంభించినట్లు స్థల పురాణం చెప్పుతుంది. అహోబిలం, మహానంది, శ్రీశైలం తదితర పుణ్యక్షేత్రాలు వెలిసిన నల్లమల ప్రాంతంలోనే ఈ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రం కొండ బాణం ఆకారంలో వంపు తిరిగి ఉండటంతో ఎంతగానో ఆకట్టుకుంటుంది. రెండు కొండలు ఒకదానిపై ఒకటి అమర్చినట్లు ఉండటం విశేషం. మొదటి కొండపై రెండోది 20 అడుగుల ఎత్తున ఉంటుంది. కింది కొండ విశాలంగా ఉండగా పైన ఉన్న కొండ కేవలం ఐదు అడుగుల వెడల్పు మాత్రమే ఉంది. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి : డీవైఎఫ్ఐ -
రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు
నారాయణపేట: విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ శిఖా గోయెల్ ఆదేశాల మేరకు సోమవారం ఆర్వీఈఓ ఆనంద్కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సిటీ–2 యూనిట్ డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం నారాయణపేట జిల్లాలోని రెండు రైసు మిల్లులపై జిల్లా సివిల్ సప్లయ్ డీటీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో కలిసి ఆకస్మికంగా దాడులు చేపట్టారు. దామరగిద్ద మండలంలోని రెండు రైసు మిల్లుల్లో తనిఖీలు చేయగా ఆశన్పల్లిలో గల అన్నపూర్ణ రైస్ మిల్లులో 1,38,422 వరి ధాన్యం బస్తాలు, క్యాతన్పల్లిలోని శ్రీసాయిరాం ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో 23,970 బస్తాల కొరత ఉండగా.. ఈ ధాన్యం విలువ రూ.15,92,28,860 ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు సదరు రైసు మిల్లుల యజమాని సత్యనారాయణరెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సివిల్ సప్లయ్ డీఎం సైదులును ఆదేశించారు. -
వివాహిత బలవన్మరణం
బిజినేపల్లి: మండలంలోని అల్లీపూర్కు చెందిన వివాహిత శివలీల (33) సోమవారం మండల కేంద్రంలోని తన పుట్టింట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. శివలీల కొద్దిరోజుల కిందట అల్లీపూర్ నుంచి వచ్చి పుట్టింట్లోనే ఉంటుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. కాసేపటికి కుటుంబ సభ్యులు వచ్చి చూడగా ఉరేసుకొని మృతిచెంది కనిపించింది. సంతానం లేదని మానసికంగా బాధపడుతుండేదని గ్రామస్తులు తెలిపారు. యువతి బలవన్మరణం గద్వాల క్రైం: మండలంలోని సంగాలకు చెందిన బొల్లెద్దుల పవిత్ర (20) ఆదివారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. గ్రామానికి చెందిన పవిత్ర, అదే గ్రామానికి చెందిన లక్ష్మన్న ఏడాదిగా ప్రేమించుకున్నారు. వివాహం చేసుకునేందుకు యువకుడు నిరాకరించడంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుంది. సోమవారం ఉదయం గుర్తించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సోదరుడు చరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వివరించారు. వాగులోపడి వ్యక్తి మృతి కేటీదొడ్డి: మండలంలోని నందిన్నె–కుచినెర్ల రహదారిలో ఉన్న వాగులో పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు.. కర్ణాటకలోని మండ్లిగేరకు చెందిన గూని ఆంజనేయులు (45) బంధువు మండలంలోని సోంపురం గ్రామంలో మృతిచెందాడు. దీంతో ఆయన సోమవారం అంత్యక్రియల్లో పాల్గొనేందుకు స్వగ్రామం నుంచి బైక్పై వెళ్తుండగా.. మార్గమధ్యంలో వాగు వద్ద బైక్ అదుపుతప్పి అందులో పడి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ శ్రీనివాసులు ఘటన స్ధలానికి చేరుకొని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆంజనేయులుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నట్లు బంధువులు తెలిపారు. డీసీఎం డ్రైవర్ దుర్మరణం అడ్డాకుల: మండల కేంద్రంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ మృతి చెందినట్ల ఎస్ఐ ఎం.శ్రీనివాస్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్లోని పొద్దుటూర్కు చెందిన కరీముల్లా (38) డీసీఎం డ్రైవర్గా పని చేస్తుండేవాడు. ఆదివారం సాయంత్రం బద్వేల్లో పాత ఇనుప సామగ్రి లోడ్ చేసుకొని షాద్నగర్కు బయలుదేరాడు. సోమవారం తెల్లవారుజామున అడ్డాకుల సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారి ఫ్లైఓవర్పై ముందు వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెనుకే ఉన్న డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. రహదారి నిర్వాహకులు, పోలీసులు క్షతగాత్రుడిని అంబులెన్స్లో జిల్లా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ వివరించారు. భార్య షేక్ మున్నీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జడ్చర్ల కొత్త బస్టాండ్లో చోరీ ● 7 తులాల బంగారు ఆభరణాలు అపహరణ జడ్చర్ల: స్థానిక కొత్త బస్టాండ్లో సోమవారం ఓ ప్రయాణికురాలి బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. ప్రత్యక్షుల కథనం మేరకు.. మిడ్జిల్ మండలం కొత్తూరుకు చెందిన వరలక్ష్మి హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్లేందుకు సోమవారం జడ్చర్ల కొత్త బస్టాండ్లో దిగింది. కల్వకుర్తి బస్సు ఎక్కే సమయంలో హ్యాండ్బ్యాగులో దాచిన బ్రాస్లైట్, నక్లెస్, కమ్మలు, బుట్టాలు, చైన్ తదితర ఏడు తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. బస్సు ఎక్కిన తర్వాత హ్యాండ్బ్యాగు చైన్లు తెరచి ఉండటంతో బ్యాగులోని ఆభరణాలు చూసుకోగా కనిపించలేదు. దీంతో వెంటనే బస్సు డ్రైవర్కు సమాచారం ఇవ్వడంతో నేరుగా స్థానిక పోలీస్స్టేషన్ ఎదుట ఆపి ప్రయాణికులను తనిఖీ చేసినా ఫలితం లేకపోయింది. బస్సు ఎక్కే సమయంలో రద్దీ అధికంగా ఉందని, అప్పుడే ఆభరణాలు అపహరించి ఉంటారని బాధితురాలు అనుమానం వ్యక్తం చేసింది. వాటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని వాపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. -
గుంటల లెక్కన ప్లాట్ల విక్రయాలు
● వెంచర్ చేయకుండా వ్యాపారుల కొత్త ప్రయోగం ● అక్రమ అమ్మకాలపై స్పందించని యంత్రాంగం అమరచింత: వ్యవసాయ పొలం సాగుకు పనికి రాదని అధికారులతో అనుమతి తీసుకుని ప్లాట్లుగా విభజించి రియల్టర్లు వ్యాపారం చేస్తారు. కానీ, ఇందుకు విరుద్ధంగా ఓ వ్యక్తి గుంటల లెక్కన పొలం అమ్ముతూ ప్లాట్ల దందాకు తెరలేపాడు. మండలంలోని సింగంపేట గ్రామంలో సర్వే నం.5ఆలో ఉన్న ఎకరా పొలాన్ని నాన్ అగ్రికల్చర్గా మార్చకుండా, డీటీసీపీ, పంచాయతీ అనుమతి లేకుండానే గుంటల లెక్కన భూమిని ప్లాట్లుగా చేసి అక్రమంగా విక్రయిస్తున్నారు. ప్రస్తుతం పొలం చదును చేసి వాటిని ఇప్పటి వరకు ఐదుగురికి గుంటల లెక్కన విక్రయించినట్లు తెలిసింది. అయితే ఇక్కడ గుంట లెక్కన కొన్న వారికి తర్వాత ఇల్లు నిర్మించుకునే సమయంలో అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫీజుతోపాటు ఇంటి నిర్మాణం కోసం అయ్యే ఖర్చులను సైతం పంచాయతీకి పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి ప్లాట్ల దందా గతంలో పట్టణ శివారులోని నాగులకుంట సమీపంలోని పొలాలను సైతం గ్రీన్ల్యాండ్ పేరుతో గుంటల లెక్కన అమ్మినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఇలాంటి వ్యాపారాలు జోరందుకుంటున్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు.. సింగంపేట గ్రామంలో నాన్ అగ్రికల్చర్ పర్మిషన్ తీసుకోకుండా వ్యవసాయ పొలాలను గుంటల లెక్కన విక్రయిస్తున్నారన్న విషయం మాకు తెలియదు. ఈ విషయమై ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అక్రమంగా ప్లాట్ల విక్రయాలు జరిపితే చట్టపరంగా నేరం. – రవికుమార్యాదవ్, తహసీల్దార్, అమరచింత -
బ్రహ్మోత్సవాలకు వేళాయే..
● 14నుంచి 22 వరకు ఉమామహేశ్వరుడి ఉత్సవాలు ● ఏర్పాట్ల పర్యవేక్షణలో ఆలయ కమిటీ సభ్యులు అచ్చంపేట: శ్రీశైలం ఉత్తరద్వారంగా బాసిల్లుతున్న ఉమామహేశ్వర క్షేత్రం ఉత్సవాలకు వేళైంది. ఉత్సవాల నిర్వహణకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. అచ్చంపేట మండలం రంగాపూర్ పంచాయతీ పరిధిలో నల్లమల కొండలపై వెలిసిన ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాలు ప్రతిఏటా మకర సంక్రాంతి సందర్భంగా ఉత్తరాయణంలో ఈనెల 14న మొదలై 22 వరకు వారంపాటు కొనసాగుతాయి. ఉమామహేశ్వర స్వామివారి దర్శనానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. నిత్యాన్నదానం పర్యాటకశాఖ ఆధ్వర్యంలో కొండ దిగువన భోగమహేశ్వరంలో హరిత గదులు, ఆహ్లాదకరమైన ఉద్యాన వనం ఏర్పాటు చేశారు. కొండ కింద కోనేరు నుంచి ప్రధాన ఆలయం వరకు 600 మెట్లు, విశ్రాంతి గది, పాపనాశం వద్ద ప్రత్యేక స్నానపు గదులు, డ్రెస్సింగ్ రూములు నిర్మించారు. ఆలయం నుంచి నాగుల వరకు ప్రాంగణాన్ని విస్తరించారు. క్షేత్రంలో నాలుగేళ్లుగా నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఇక్కడికి వచ్చే భక్తులు, పర్యాటకులకు 600నుంచి 1000 మందికి ఆకలి తీర్చుతున్నారు. దాతలు, భక్తులు ఇచ్చే విరాళాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భోజన వసతి పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భోగమహేశ్వరం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ ఉమామహేశ్వరం కింది కొండ భోగమహేశ్వరంలో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. దాతల సహకారంతో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ఉమామహేశ్వర క్షేత్రంలో సౌకర్యాలు కల్పించేందుకు స్థల సమస్య ఉండడంతో కింద ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే కొండపైకి రెండు బసులు ఏర్పాటు చేశాం. పార్కింగ్ సమస్య లేకుండా చూస్తున్నాం. రాాబోవు రోజుల్లో అన్నదాన కేంద్రం కూడా కిందికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. రోడ్డుమార్గంలో విద్యుద్దీపాలు, హైమాస్ట్ లైట్స్ ఏర్పాటు చేశాం. – బీరం మాధవరెడ్డి, ఆయల కమిటీ చైర్మన్ స్వామివారి బ్రహ్మోత్సవాలు 14న బుధవారం సాయంత్రం 4గంటలకు అయ్యప్పస్వామి పూజ, సాయంత్రం 6గంటలకు మకర జ్యోతి దర్శనం అనంతరం మంగళహారతి ఉంటుంది. 15న గురువారం సాయంత్రం 7గంటలకు అంకురార్పణ, ధ్వజారోహణం, అగ్నిప్రతిష్టాపన, బలిహరణం, నీరాజనం, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం ఉంటుంది. రాత్రి 8గంటలకు అచ్చంపేట భ్రమరాంబ ఆలయం, వివిధ గ్రామాల నుంచి అలంకరణాలతో ఏర్పాటు చేసిన ప్రభలు ఉమా మహేశ్వరానికి వస్తాయి. రాత్రి 2గంటలకు స్వామివారు ఉమామహేశ్వరం కొండపై నుంచి మంగళవాయిధ్యాలతో పల్లకీసేవతో కిందకు వస్తారు. అచ్చంపేట నుంచి ప్రభత్సోవం భోగమహేశ్వరం చేరుకోగానే 16న శుక్రవారం తెల్లవారుజామున 4గంటలకు పార్వతీపరమేశ్వరుల కల్యాణోత్సవం దిగువ భోగమహేశ్వరంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి. అదేరోజు రాత్రి 7గంటలకు పల్లకీసేవ ఉంటుంది. 17న శనివారం రాత్రి 7గంటలకు అశ్వవాహనసేవ, 18న ఆదివారం రాత్రి 7గంటలకు నంది వాహనసేవ ఉంటుంది. 19న సోమవారం శేషవాహన సేవ ఉంటుంది. 16నుంచి 22వరకు ఉత్తరాయణ పుణ్యకాల స్నానములు, ప్రత్యేక పూజలు జరుగుతాయి. -
17న సీఎం రేవంత్రెడ్డి జిల్లా పర్యటన
● రూ.1,200కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం ● పకడ్బందీ ఏర్పాట్లు చేయండి: మంత్రి జూపల్లి కృష్ణారావు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 17వ తేదీన మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించి.. దాదాపు రూ.1,200 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో సీఎం పర్యటన సభా ఏర్పాట్లు, భద్రతా చర్యలు, మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పర్యటనలో భాగంగా ట్రిపుల్ఐటీ కళాశాల నిర్మాణం, అండర్గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ, శాశ్వత తాగునీటి సరఫరా, ఎంవీఎస్ కళాశాల భవన నిర్మాణం వంటి అత్యంత కీలక అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ కార్యక్రమాలు మహబూబ్నగర్ జిల్లా విద్యా, మౌలిక వసతుల అభివృద్ధికి మైలురాయిగా నిలవనున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదని, సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు. సభా ప్రాంగణం, వేదిక ఏర్పాట్లు, రహదారుల అభివృద్ధి, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్య చర్యలు, భద్రత వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనతో మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధికి మరింత ఊతం లభించనుందని, సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని అధికారులను కోరారు. అనంతరం జిల్లా అధికారులు ఇప్పటివరకు చేపట్టిన ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించగా.. మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ విజయేందిర, అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మధుసూదన్నాయక్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ఆర్డీఓ నవీన్, జెడ్పీసీఈఓ వెంకట్రెడ్డి పాల్గొన్నారు. -
మహిళలే కీలకం..!
పోలింగ్ కేంద్రాలు 302 మున్సిపాలిటీ/ డివిజన్లు/ పోలింగ్ ఓటర్లు.. కార్పొరేషన్ వార్డులు కేంద్రాలు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం మహబూబ్నగర్ 60 279 97,636 1,00,191 14 1,97,841 దేవరకద్ర 12 12 4,909 5,161 0 10,070 భూత్పూర్ 10 11 5,975 6,089 0 12,064 వనపర్తి 33 95 31,655 32,527 8 64,190 కొత్తకోట 15 30 8,822 9,370 0 18,192 పెబ్బేరు 12 24 7,076 7,257 0 14,333 అమరచింత 10 18 4,364 4,783 0 9,147 ఆత్మకూరు 10 20 5,624 6,013 0 11,637 గద్వాల 37 78 31,730 33,630 10 65,370 అయిజ 20 26 11,233 11,790 0 23,023 అలంపూర్ 10 20 4,681 4,940 1 9,622 వడ్డేపల్లి 10 19 5,256 5,347 1 10,604 నారాయణపేట 24 54 17,244 18,216 0 35,460 మక్తల్ 16 35 11,407 11,938 0 23,345 కోస్గి 16 32 10,028 10,219 1 20,248 మద్దూర్ 16 20 6,171 6,530 0 12,701 నాగర్కర్నూల్ 24 48 17,460 17,918 0 35,378 కల్వకుర్తి 22 44 12,975 13,048 0 26,023 కొల్లాపూర్ 19 38 9,593 9,763 0 19,356 సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పురపాలికల ఓటర్ల లెక్క తేలింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పదవీ కాలం పూర్తి కాని జడ్చర్ల, అచ్చంపేట మినహా మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మరో 18 పురపాలికలకు సంబంధించి సోమవారం తుది ఓటర్ల జాబితాను ఖరారు చేశారు. అన్ని మున్సిపాలిటీల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల జయాపజయాల్లో వారి కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. అత్యల్పంగా నాగర్కర్నూల్లో.. మహబూబ్నగర్ జిల్లాలోని మహబూబ్నగర్, దేవరకద్ర, భూత్పూర్ పురపాలికల్లో మొత్తంగా పురుషుల కంటే 2,921 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. వనపర్తి జిల్లాలోని వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, అమరచింత, ఆత్మకూరు మున్సిపాలిటీల్లో 2,409.. జోగుళాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి పురపాలికల్లో 2,807.. నారాయణపేట జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీల్లో 2,053.. నాగర్కర్నూల్ జిల్లాలోని నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ పురపాలికల్లో మొత్తంగా 701 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. శాతాల వారీగా గమనిస్తే గద్వాల జిల్లాలో 2.58 శాతం మంది మహిళలు అధికంగా ఉన్నారు. అదేవిధంగా నారాయణపేట జిల్లాలో 2.24 శాతం, వనపర్తిలో 2.05 శాతం, మహబూబ్నగర్లో 1.33 శాతం, చివరగా నాగర్కర్నూల్ జిల్లాలో అత్యల్పంగా 0.87 శాతం మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. రిజర్వేషన్ల ఖరారే తరువాయి.. ఓటర్ల తుది జాబితా ఖరారు సోమవారం రాత్రి వరకు కొనసాగింది. దీంతో ఫొటోల వారీగా డివిజన్లు/వార్డుల ఓటర్ లిస్ట్ను మంగళవారం ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మిగిలింది డివిజన్లు/వార్డులు, పురపాలికల పీఠాల వారీగా ఎస్టీ, ఎస్టీ మహిళ, ఎస్సీ, ఎస్సీ మహిళ, బీసీ, బీసీ మహిళ, అన్రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్కు అనుగుణంగా ఆయా సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసేలా ఆయా జిల్లాల అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఈనెల రెండో వారంలో పురపాలికల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా వచ్చే నెల రెండో వారంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పరిష్కారం చూపించలేదంటూ విమర్శలు.. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాత దాదాపుగా అన్ని మున్సిపాలిటీల్లోనూ అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఇంటి నంబర్ల ప్రకారం ఓటు హక్కు కల్పించలేదని.. ఇతర వార్డుల్లో ఓట్లు నమోదయ్యాయని.. వేరే జిల్లాలు, గ్రామాలు, ఇతర ప్రాంతాల ఓటర్లు తమ వార్డుల్లో నమోదైనట్లు వందలాది మంది ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఈ నెల పదో తేదీనే తుది ఓటర్ల జాబితాను ప్రకటించాల్సి ఉండగా.. మరో రెండు రోజులు పొడిగించారు. ఈ మేరకు సోమవారం అధికారులు ఫైనల్ ఓటర్ల జాబితాను వెల్లడించగా.. ఇందులోనూ పలు అభ్యంతరాలకు పరిష్కారం చూపలేదని రాజకీయ పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. ప్రధానంగా మహబూబ్నగర్ కార్పొరేషన్, అయిజ, పెబ్బేరు, అమరచింత, మద్దూరు పురపాలికల్లో ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఫిర్యాదులు పరిష్కరించి.. తుది జాబితాను వెల్లడించినట్లు చెబుతున్నారు. ఇతరులు 14 పురపాలికల్లో తేలిన ఓటర్ల లెక్క ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో వెల్లడి జడ్చర్ల, అచ్చంపేటకు పూర్తి కాని పదవీ కాలం ఉమ్మడి జిల్లాలో పట్టణ ఓటర్లు 6,18,604 మంది పలు మున్సిపాలిటీల్లో పరిష్కారం కాని అభ్యంతరాలు? పురపాలికల వారీగా ఓటర్ల వివరాలు.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ కార్పొరేషన్లోని 60 డివిజన్లు.. మరో 18 మున్సిపాలిటీల్లోని 316 వార్డుల పరిధిలో మొత్తం 903 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఫైనల్ చేశారు. ఈ మేరకు పురుష ఓటర్లు 3,03,839 మంది, మహిళా ఓటర్లు 3,14,730 మంది, ఇతర ఓటర్లు 35 మంది ఉన్నారు. ఈ లెక్కన పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 10,891 మంది అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
28 నుంచి మన్యంకొండ జాతర
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఈనెల 28 నుండి మార్చి 5 వరకు నిర్వహించనున్న మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్హాల్లో వివిధ శాఖల అధికారులతో కలిసి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన తాగునీరు, శానిటేషన్, టాయిలెట్లు, బందోబస్తు రద్దీ నియంత్రణ వంటి సౌకర్యాలను కల్పించాలన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ముఖ్య శాఖల అధికారులతో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ ఏర్పాటు చేసి ప్రతి శాఖ నుంచి ఒక అధికారిని నియమించి ఏర్పాట్ల పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం ఫిబ్రవరి 1న స్వామి వారి గరుడ వాహనసేవ, రథోత్సవం ఉంటాయని ఈ సందర్భంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్శాఖ తరఫున అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ తగినన్ని బస్సులు నడపాలని, కొండపైకి మినీ బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. కొండ దిగువన అలివేలు మంగతాయారు దేవాలయం వద్ద ప్రత్యేక మెడికల్ క్యాంపులు, డాక్టర్లు, మందులు ఏర్పాటు చేయాలన్నారు. జాతర సందర్భంగా దేవాలయం చుట్టూ పక్కల మద్యపానాన్ని నిషేధించాలని ఎకై ్సజ్ శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం మన్యంకొండ బ్రహ్మోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశంలో దేవాలయ కమిటీ వంశపారంపర్య ధర్మకర్త అళహరి మధుసూదన్, కార్యనిర్వహణ అధికారి జి. శ్రీనివాసరాజు, ఏఎస్పీ రత్నం, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
పాలమూరుకు నీళ్లు
కేసీఆర్ వస్తేనే మైగ్రేషన్ జిల్లా కాదు.. ఇరిగేషన్కు మారుపేరుగా మార్చాం బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు.. ఎత్తుకుపోయే బ్యాచ్.. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘పాలమూరు అభివృద్ధి చెందాలంటే మళ్లీ కేసీఆరే రావాలి. ఐటీ హబ్ పునర్ వైభవం పొందాలంటే, ఉద్యోగాలు రావాలంటే, అమర్ రాజా కంపెనీ మళ్లీ రావాలన్నా, రైతులు, మహిళల ముఖాల్లో చిరునవ్వు చూడాలన్నా, భూముల ధరలు పెరగాలన్నా మళ్లీ కేసీఆర్ రావాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం మహబూబ్నగర్లో ఎస్వీఎస్ మెడికల్ కళాశాల నుంచి ఎంబీసీ మైదానం వరకు బీఆర్ఎస్ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఎంబీసీ మైదానం నిర్వహించిన బీఆర్ఎస్ నూతన సర్పంచులు, ఉపసర్పంచుల సన్మాన కార్యక్రమంలో మాట్లాడారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొడంగల్తో సహా 14 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురుతుందని చెప్పారు. అభ్య ర్థిగా ఎవరున్నా గులాబీ జెండాను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలోనే ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుందన్నారు. 40 సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవడమే అందుకు నిదర్శనమన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఇదే స్ఫూర్తితో కష్టపడి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. వలసలకు మారుపేరుగా ఉన్న పాలమూరు జిల్లాను బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ జిల్లాగా మార్చామని చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు రిజర్వాయర్లతో సహా 90 శాతం పనులు పూర్తి చేశామన్నారు. పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామని చెప్పారు. భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేసి ఉమ్మడి జిల్లాలో 8లక్షల ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. పాలమూరులోని ఐటీ హబ్లో ఏర్పాటైన 14 పరిశ్రమలు ఎందుకు పారిపోయాయని ప్రశ్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకద్రలో ఆల వెంకటేశ్వరరెడ్డి 1,300 ఓట్లతో, మర్రి జనార్దన్రెడ్డి 5వేల ఓట్లతో, లక్ష్మారెడ్డి తక్కువ తేడాతోనే ఓటమి చెందారన్నారు. మళ్లీ కేసీఆర్ వస్తేనే పాలమూరుకు నీళ్లొస్తాయని, దుర్మార్గుల పాలనలో ఒక్క పని కూడా చేయరని చెప్పారు. పాలమూరు నుంచే మున్సిపల్ ఎన్నికల జైత్రయాత్ర కొనసాగాలన్నారు. మహబూబ్నగర్లో ఉన్న జోష్ పాలమూరులోని 14 నియోజకవర్గాలకు వ్యాపించాలని కోరారు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం అతి తక్కువ కాలంలోనే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకుందని, ఇక భవిష్యత్ మొత్తం బీఆర్ఎస్ పార్టీదేనని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ రాకముందు గ్రామాల్లో కనీసం తాగేందుకు నీళ్లు కూడా ఉంటేవి కాదని, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చినట్లు తెలిపారు. తమ హయాంలో సర్పంచ్కు ఎలాంటి కష్టం లేకుండా చేశామన్నారు. 90 శాతం పనులు పూర్తయిన పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పండబెట్టిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మోసం మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదని విమర్శించారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కుటుంబాన్ని చీల్చాలని కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. మహబూబ్నగర్ను కార్పొ రేషన్ చేసినా ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత కేసీఆర్దే పాలమూరు బిడ్డనంటూ రేవంత్ గద్దెనెక్కారు రెండేళ్లయినా ఒక్క పనీ చేయలేదు పాలమూరు నుంచే మున్సిపల్ ఎన్నికల జైత్రయాత్ర మహబూబ్నగర్లో సర్పంచుల సన్మాన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాలమూరు బిడ్డగా చెప్పుకుంటే సెంటిమెంట్తో సీఎం అయిన రేవంత్రెడ్డి.. రెండేళ్లలో పాలమూరు కోసం ఒక్క పనైనా చేశారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. రూ.2 వేల పెన్షన్ను రూ.4 వేలు ఇస్తానని చెప్పి రెండేళ్లయినా ఇవ్వలేదన్నారు. కల్యాణలక్ష్మి కింద రూ.లక్షతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని హామీ ఇచ్చారని, సీఎం రేవంత్కు బంగారం దుకాణాలు దొరకడం లేదా? లేక ఎవరూ నమ్మడం లేదా? అని ప్రశ్నించారు. వీళ్లు బంగారం ఇచ్చే బ్యాచ్ కాదని, పుస్తెలతాడుతో సహా ఎత్తుకుపోయే బ్యాచ్ అని చెప్పారు. గూట్లో రాయి తీయలేనోడు.. ఏట్లో రాయి తీస్తామని చెబుతున్నారన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెబుతున్నారని, అది జరగాలంటే కోటి కోట్లు కావాలని చెప్పారు. ఆడబిడ్డలకు స్కూటీలు కొనిస్తామని చెప్పి లూటీ మాత్రం చేస్తున్నారన్నారు. -
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
మెట్టుగడ్డ: బీసీలకు న్యాయంగా దక్కాల్సిన 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి బీసీల ఆత్మగౌరవం పెంచేలా అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఫౌండర్ చైర్మన్, మాజీ ఐఏఎస్ చిరంజీవులు అన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్తో ఆదివారం మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలో నిర్వహించిన పాలమూరు బీసీ సామాజిక న్యాయసభకు ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్లో 42 శాతం హామీ ఇచ్చి.. ఇప్పుడు కేంద్రానికి పంపాం అన్న నిర్లక్ష్య ధోరణి వీడకపోతే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రాన్ని ఒప్పించకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోవడంతో బీసీ సోదరులు రాజకీయంగా ఎంతో నష్టపోయారన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించకపోతే భవిష్యత్ తరాలు మరింత నష్టపోతారన్నారు. రాబోయే మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీలకు తమ వాటా దక్కే వరకు అన్ని బీసీ, కుల సంఘాలు ఏకమై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. పాలమూరు సామాజిక న్యాయసభ స్ఫూర్తితో 2029లో బహుజన శక్తిగా మారుద్దామని పేర్కొన్నారు. – బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహరాజ్ మాట్లాడుతూ బీసీల సహనాన్ని పరీక్షించకుండా వెంటనే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తుంటే కేంద్రానికి పంపాం.. మా పనైపోయిందనే విధంగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్రెడ్డి బీసీల వైపు ఉంటారా.. బీజేపీ వైపు ఉంటారో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. మేధావులంతా మన బీసీలను చైతన్యపరచడంలో ముందువరుసలో ఉండాలని కోరారు. అనంతరం పాలమూరు సామాజిక న్యాయసభలో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. కార్యక్రమంలో బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు సంగెం సూర్యారావు, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్, బీసీ జేఏసీ నాయకులు బాలరాజుగౌడ్, వేణుకుమార్,అం నారాయణగౌడ్, మాధ వ్, బెకెం జనార్దన్, శ్రీనివాస్సాగర్, లక్ష్మీకాంత్, రమేష్గౌడ్, ప్రొఫెసర్ భూమయ్య, వెంకటయ్య, నారాయణయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎల్సీ ఇవ్వలేదని పురుగుమందు డబ్బాతో ఆందోళన
మిడ్జిల్: ఎల్సీ ఇవ్వలేదని పురుగుల మందు డబ్బాతో రైతు స్థానిక సబ్స్టేషన్ ఎదుట ఆందోళన చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. రైతు రాజేందర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని బోయిన్పల్లికి చెందిన రైతు వ్యవసాయ పొలం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్కు ఆదివారం మధ్యాహ్నం ఫ్యూజ్ ఎగిరిపోయింది. లైన్మెన్ బాలకిష్టయ్యకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా.. తాను అందుబాటులో లేనని సమాధానం ఇవ్వడంతో రైతు మిడ్జిల్ సబ్స్టేషన్కు వచ్చి ఎల్సీ ఇవ్వాలని ఆపరేటన్కు విజ్ఞప్తి చేశాడు. డ్యూటీలో ఉన్న ఆపరేటర్ తండ్రి మరణించడంతో అతడు వెళ్లిపోయాడు. విద్యుత్ ఏఈ అత్యవసరంగా వేరే ఆపరేటన్ను సబ్స్టేషన్కు పిలిచి విధులు నిర్వహించాలని కోరడంతో, వచ్చిన ఆపరేటర్ను రైతు ఎల్సీ ఇవ్వాలని కోరాడు. దీంతో లైన్మెన్ అడిగితేనే ఎల్సీ ఇస్తామని, మీరడిగితే ఇవ్వడం కుదరదని చెప్పడంతో రైతు ఆందోళన వ్యక్తం చేశాడు. అనంతరం రైతు ఇంటికి వెళ్లి పురుగుల మందు డబ్బాతో సబ్స్టేషన్కు వచ్చాడు. ఎల్సీ ఇవ్వకపోతే మందు తాగి ఇక్కడే చనిపోతానని బెదిరించడంతో.. లైన్మెన్ బాలకిష్టయ్య సాయంత్రం 6.30 గంటలకు సబ్స్టేషన్కు వచ్చి ఫ్యూజ్ వేస్తానని రైతును సముదాయించడంతో సమస్య సద్గుమనిగింది. లైన్మెన్ అందుబాటులో లేకపోవడంతో కరెంట్ సమస్య వచ్చిన ప్రతిసారి ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఏపీవాసుల మృతి
భూత్పూర్: పట్టణంలోని జాతీయ రహదారి–44 బ్రిడ్జిపై ఆదివారం రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు ఏపీవాసులు మృతి చెందగా, ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి భూత్పూర్ ఎస్ఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి చెందిన మిలటరీ రిటై ర్డ్ అధికారి మేలుకోటి శేషయ్య(73), భార్య నవనీత(66)తో కలిసి హైదరాబాద్లో ఉన్న కుమారుడు శేషాచలం, కుమార్తె వద్దకు వెళ్లి.. తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఆదివారం వీరు హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు కారులో వెళ్తుండగా వెనుక నుంచి అతివేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మేలుకోటి శేషయ్య, భార్య నవనీత అక్కడికక్కడే మృతిచెందారు. కారు డ్రైవర్ పూర్ణచంద్రరావుతోపాటు వెనుక నుంచి ఢీకొట్టిన కారులో ప్రయాణిస్తున్న అరుణ్కుమార్, చంద్రారెడ్డి, బీఎస్ కుమార్, శ్రీనివాస్రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వీరిని చికిత్స నిమిత్తం అంబులెన్స్లో మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. శేషయ్య (ఫైల్) -
ఆత్మహత్య కాదు.. హత్య
మానవపాడు: దళిత బిడ్డ డా.లావణ్య మృతి చాలా బాధాకరమని, ఆమెది ఆత్మహత్య కాదని.. హత్యేనని ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహరాజ్ అన్నారు. జల్లాపురంలో లావణ్య చిత్రపటానికి నివాళులర్పించి.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లావణ్య మృతిచెంది రోజులు గడుస్తున్నా స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నేటివరకు బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం దారుణమన్నారు. అధికారులు సైతం కులవివక్ష చూపారని ఆవేదన వ్యక్తంచేశారు. లావణ్య మృతికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ. 50లక్షల ఆర్థికసాయం అందించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. -
పుర ఎన్నికల్లో సత్తా చాటుదాం
● మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ నారాయణపేట: జిల్లాలోని మూడు నియోజకవర్గా ల్లో ఉన్న అన్ని పురపాలికల్లో అత్యధిక పార్టీ కౌ న్సిలర్లను గెలిపించి బీజేపీ జెండా ఎగరవేయాలని పాల మూరు ఎంపీ డీకే అరుణ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ గెస్ట్హౌస్లో పుర ఎన్నికల సన్నాహక సమావేశం పార్టీ జి ల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆయా పురపాలికల్లోని కార్యకర్తలు సమష్టిగా పనిచేసి పార్టీ అభ్యర్థులను కౌన్సిలర్లు, చైర్మన్లుగా గెలిపిస్తే అభివృద్ధికి అడుగులు పడతా యని చెప్పారు. ప్రధాని మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. గతంలో జరిగి న కొన్ని పొరపాట్లు ఈసారి పునరావృతం కాకుండా చూడాలని కోరారు. సమావేశంలో పురపాలక సంఘాల ఇన్చార్జ్లుగా కొత్తకాపు రతంగ్పాండు రెడ్డి, బలరామిరెడ్డి, భాస్కర్.. అమరచింత, ఆత్మకూర్కు బంగ్లా లక్ష్మీకాంత్రెడ్డి, మద్దూర్, కోస్గికి నా గులపల్లి ప్రతాప్రెడ్డి, కొడంగల్కు పున్నంచంద్ లా హోటిని నియమించారు. కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాది రఘువీర్యాదవ్, అదనపు న్యాయ వాది నందూనామాజీ, కృష్ణ చైతన్య, పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి లక్ష్మి శ్యాంసుందర్గౌడ్, జిల్లా నాయకులు రఘురామయ్యగౌడ్, మున్సిపల్ మాజీ ఫ్లోర్లీడర్ సత్య రఘుపాల్రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు పోషల్ వినోద్, మిర్చి వెంకటయ్య, వెంకట్రాములు, మదన్, కర్నె స్వామి, సుజాత, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ -
మహబూబ్నగర్లో క్రికెట్ అకాడమీ
● ఈ నెల చివర్లో ఉత్తరాఖండ్ – హైదరాబాద్ మహిళల మ్యాచ్ ● హెచ్సీఏ జాయింట్ సెక్రెటరీ బస్వరాజ్ ● ఉత్సాహంగా టీ–20 లీగ్ రెండో ఫేజ్ పోటీలు మహబూబ్నగర్ క్రీడలు: మహబూబ్నగర్లో త్వరలోనే క్రికెట్ అకాడమీ ప్రారంభిస్తామని హెచ్సీఏ జాయింట్ సెక్రెటరీ బస్వరాజ్ అన్నారు. కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ జిల్లాల టీ–20 లీగ్లో భాగంగా రెండో ఫేజ్ లీగ్ మ్యాచ్లు ఆదివారం జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని ఎండీసీఏ మైదానంలో జరిగాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బస్వరాజ్ మాట్లాడుతూ ఫిబ్రవరి మొదటి వారంలో అకాడమీని ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అకాడమీలో బాలికలకు అండర్–15, 19, 23, సీనియర్, పురుషులకు అండర్–14 16, 19, 23, సీనియర్ విభాగాల్లో క్రికెట్ కోచింగ్ ఇప్పిస్తామన్నారు. అదేవిధంగా ఈ నెల చివర్లో ఇక్కడి మైదానంలో ఉత్తరాఖండ్– హెచ్సీఏ మహిళా జట్ల వన్డే ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎండీసీఏ చీఫ్ ప్యాట్రన్ మనోహర్రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ చక్కటి క్రికెట్ మైదానం రూపుదిద్దుకోవడం సంతోషంగా ఉందన్నారు. క్రికెటర్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని, ఇక్కడి మైదానంలో బీసీసీఐ మ్యాచ్లు నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఉపాధ్యక్షులు సురేష్కుమార్, క్యూరెటర్ చంద్రశేఖర్, భార్గవ్, కోచ్లు అబ్దుల్లా, మన్నాన్, ముఖ్తార్అలీ, సీనియర్ క్రీడాకారులు ఆబిద్ హుస్సేన్, రంజిత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. 9 వికెట్ల తేడాతో రంగారెడ్డి విజయం ఉదయం జరిగిన లీగ్ మ్యాచ్లో రంగారెడ్డి జట్టు 9 వికెట్ల తేడాతో మెదక్ జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మెదక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన రంగారెడ్డి జట్టు 11.5 ఓవర్లలో వికెట్ కోల్పోయి 132 పరుగులు చేసి గెలుపొందింది. 22 పరుగుల తేడాతో ఆదిలాబాద్ మరో లీగ్ మ్యాచ్లో ఆదిలాబాద్ జట్టు 22 పరుగుల తేడాతో హైదరాబాద్ జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆదిలాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. దీంతో ఆదిలాబాద్ జట్టు 22 పరుగుల తేడాలో హైదరాబాద్పై గెలుపొందింది. -
ప్రేమ పేరుతో వంచించే వారిని శిక్షించాలి
మానవపాడు: ఆడబిడ్డలను ప్రేమ పేరుతో వంచించే వారిని కఠినంగా శిక్షించాలని.. నిందితుడు జైలు లో ఉండగానే పూర్తిస్తాయి విచారణ చేసి కఠిన శిక్ష అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఆదివారం మానవపాడు మండలం జల్లాపురంలో డా.లావణ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంత రం మందకృష్ణ మాట్లాడుతూ.. దళిత వర్గానికి చెందిన వారిని ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడి ఆత్మహత్యలకు కారణమవుతున్నారని.. అలాంటి వారికి బెయిల్ కూడా ఇవ్వొద్దన్నారు. జాతీయ భద్ర త చట్టం, దేశద్రోహం కింద అరెస్ట్ అయితే దశాబ్దాలుగా జైలులో ఉండగానే శిక్షలు పడుతుంటాయని తెలిపారు. ప్రేమ పేరుతో మోసం చేయడాన్ని పెద్ద ద్రోహంగా పరిగణించి కఠినమైన చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే మోసాలు తగ్గుతాయన్నారు. మోసం చేశారని ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని.. ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. అన్నింటికీ ఆత్మహత్య పరిష్కారం కాదన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన కోరారు. ధైర్యంగా మోసం చేసే వారిని ఎదుర్కోవాలి ఆత్మహత్యలకు పాల్పడొద్దు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ -
గ్రామీణ క్రీడలకు జీవం ‘వావివాల’
ప్రత్యేక యాగాలు, హోమాలు.. ఎర్రవల్లి: ఇటిక్యాల మండలంలోని వావివాల బ్ర హ్మోత్సవాలు గ్రామీణ సంప్రదాయ క్రీడలకు నిలయంగా మారనున్నాయి. ఈ ఉత్సవాలకు అంతరాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరై గ్రామీణ క్రీడల్లో సత్తా చాటుతారు. ఈ నెల 12 నుంచి 16 వరకు శివాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో 12న సుప్రభాతసేవ, గణపతిపూజ, పుణ్యహవాచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, పంచగవ్య మేళన ప్రాఽశనం, యాగశాల ప్రవేశం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, కలశస్థాపన, ధ్వజారోహణం, పల్లకీసేవ నిర్వహిస్తారు. 13 న బిందె సేవ, రుద్రాభిషేకం, నవగ్రహ హోమం, బలిహరణ, ఉపనయనసేవలు ఉంటాయి. 14న పంచామృత అభిషేకం, జలక్షీర తర్పణం, నిత్యహోమాలు, రాత్రి రథాంగహోమం, రథోత్సవం కనులపండువగా జరుగుతాయి. 15న సుగంధద్రవ్యాలతో అభిషేకం, లక్ష్మీగణపతి హోమం, నవగ్రహహోమం, రుద్రహోమం, బలిహ రణ, పల్లకీసేవ, తీర్థప్రసాద ఆశీర్వచణం, 16న మూలమంత్ర హననం, దశ దిక్పాలక బలి, మహా పూర్ణాహుతి, రుత్విక్ సన్మానం, తెప్పోత్సవం, స్వామివారి జలక్రీడలు, పల్లకీసేవతో ఉత్సవాలు ముగుస్తాయి. ప్రతి సంవత్సరం మకర సంక్రమణ పుణ్యకాలం నందు స్వామి వారికి ఉపనయన కార్యక్రమం, రథోత్సవం, తిరునాళ్ల భక్తిశ్రద్ధలతో ఐదు రోజుల పాటు ఉత్సవాలు చేస్తారు. ఆలయంలో గ్రామస్తులు, దే వాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా నర్మదబాణం ప్రతిష్ఠించారు. బాణాసురుడు వింధ్యా పర్వతాల్లో నర్మదానది తీరంలో శంకరుడి గూర్చి ఘోర తపస్సు ఆచరించి నీలకంఠుని దర్శన భాగ్యం పొందాడని, స్వామి యొక్క ఆత్మలింగాలు నర్మదానదిలో దొరికినట్లు, నర్మద నదిలో దొరికిన బాణం సాక్షాత్తు పరమశివుడని ఇక్కడి ప్రజల నమ్మకం. ఉత్సవాల్లో భాగంగా ఆనందాశ్రమ వ్యవస్థాపకుడు, అశ్వమేథ యాగకర్త అయిన డాక్టర్ పెరిశెపల్లి వెంకట శేషసాయిచే శ్రీ చక్ర ప్రతిష్ఠ, శ్రీయాగం, చండీయాగం, గణపతి హోమం, పాశుపతం మొదలగు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఐదు రోజుల పాటు జరగనున్న శివాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలకు చట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి 18 వరకు వివిధ గ్రామీణ సాంప్రదాయ పోటీలను నిర్వహించనున్నారు. 12న అంతరాష్ట్ర భజన పోటీలు, 13న ముగ్గుల పోటీలు, 14న బ్యాండ్ ప్రదర్శన, 15న నాలుగుపళ్ల విభాగం బండలాగుడు పోటీలు, 16న ఆరుపళ్ల విభాగం బండలాగుడు పోటీలు, పొటేళ్ల బల ప్రదర్శన పోటీలు, డ్యాన్స్ పోటీలు, 17న న్యూ కేటగిరి విభాగం బండలాగుడు పోటీలు, జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు, 18న సీనియర్ విభాగం బండలాగుడు పోటీలు, 60 కిలోల చందరాళ్ల ఎత్తే పోటీలు, 90 కిలోల గుబ్బల గుండ్లు ఎత్తే పోటీలు, 120కిలోల దొబ్బడు గుండు ఎత్తే పోటీలు, 140 కిలోల ఇసుక సంచి ఎత్తే పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి పోటీదారులు అధిక సంఖ్యలో హాజరై ఉత్సవ పోటీల్లో తమ బల ప్రదర్శన చేస్తారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి శివాంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించి, విజేతలకు నగదు బహుమతులను కూడా అందజేస్తారు. నేటి నుంచి శివాంజనేయస్వామి ఉత్సవాలు వివిధ రాష్ట్రాల నుంచి తరలిరానున్న క్రీడాకారులు, భక్తులు ఐదు రోజుల పాటు జరగనున్న వేడుకలు పోటాపోటీగా పొట్టేళ్ల పందెం, ఇసుక బస్తా, తోపుడు గుండ్ల పోటీలు -
దుస్తులు ఉతికేందుకు వెళ్లి మహిళ మృతి
నాగర్ కర్నూల్ క్రైం: దుస్తులు ఉతికేందుకు వెళ్లిన మహిళ చెరువులో పడి మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలో శనివారం జరిగింది. ఎస్ఐ గో వర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన కొట్ర శ్యామలమ్మ (55) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఈమె శనివారం ఉదయం దుస్తులు ఉతికేందుకు స్థానికంగా ఉన్న కేసరి సముద్రం చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయింది. మృతదేహం ఆదివారం నీటిపై తేలియాడటంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు బాలరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు వ్యక్తి దుర్మరణం జడ్చర్ల: మున్సిపాలిటీ పరిధిలోని నాగసాలకు చెందిన సాకలి వెంకటయ్య(55) ప్రమాదవశాత్తు మిషన్ భగీరథ గేటువాల్ నీటిగుంతలో జారిపడి మృతిచెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కూలీ పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్నండగా దారిపక్కన మూత్ర విసర్జనకు వెళ్లి గేట్వాల్ గుంతలో పడిపోయాడు. గుంతలో నిల్వనీటిలో మునిగి మృతిచెందాడు. గేట్ మ్యాన్హోల్ తెరిచి ఉండడంతో గమనించలేక అందులో పడిపోయాడు. మ్యాన్హోల్పై బిగించిన మూత ఇటీవల ధ్వంసం కావడంతో తిరిగి మూతను బిగించలేదన్నారు. మృతుడికి భార్య సత్యమ్మ, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. ఉరేసుకొని యువకుడి బలవన్మరణం వీపనగండ్ల: మండలంలో ని బొల్లారం గ్రామానికి చెందిన గొల్ల నవీన్ (17) అనే యువకుడు శనివారం ఇంట్లో ఎవరు లేని సమ యంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రా మస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కుందేళ్ల కుర్మయ్య, భాగ్యలక్ష్మి దంపతులు మూడో కుమారుడైన నవీన్ పొలం పనులు చేసుకుంటూ తల్లిదండ్రు లకు ఆసరాగా ఉండేవాడు. ఏమైందో ఏమో గానీ ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నెమలిని కాపాడిన రైతులు పాన్గల్: పంట కాల్వలో చిక్కుకున్న నెమలిని రైతులు కాపాడి పోలీసులకు అప్పగించిన ఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. వారి కథనం మేరకు.. మండలంలోని కొత్తపేట–మాందాపూర్ మధ్యన ఉన్న పంట కాల్వలో నెమలి చిక్కుకొని అస్వస్థతకు గురైంది. గుర్తించిన రైతులు దానిని బయటకుతీసి ప్రథమ చికిత్స నిర్వహించి పోలీసులకు అప్పగించారు. వారు అటవీ అధికారులకు అందజేయగా మాధవరావుపల్లి సమీపంలోని అడవుల్లో వదిలినట్లు చెప్పారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ యాదగిరి, ఫారెస్టు అధికారి గౌతమ్, రాములు తదితరులు పాల్గొన్నారు. లారీ ఢీకొని డ్రైవర్ మృతి కొత్తకోట రూరల్: డ్రైవర్ అజాగ్రత్తగా లారీని వెనకకు తీయడంతో మరో డ్రైవర్కు తగిలి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన అప్పరాల సమీపంలో గల కృష్ణవేణి షుగర్ ప్యాక్టరీ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. లారీ డ్రైవర్లు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జహీ రాబాద్ నుంచి చెరుకు లోడ్తో ఖలీల్(45) లారీని కృష్ణవేణి షుగర్ ప్యాక్టరీకి తీసుకొచ్చా డు. ఈ క్రమంలో లారీ అన్లోడ్ చేసేందుకు ఆలస్యం కావడంతో భోజనం చేసేందుకు ప్యాక్టరీలోని క్యాంటీన్కు వెళ్తున్నాడు. అదే సమయంలో చెరుకును అన్లోడ్ చేసి బయటకు వెళ్తున్న మరో లారీని డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతివేగంగా నడుపుతూ ఖలీల్ను బలంగా ఢీకొట్టాడు. దీంతో అక్కడే ఉన్న ఫ్యాక్టరీ సిబ్బంది క్షతగాత్రుడిని కొత్తకోటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు ఖలీల్ అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ఘటనపై తోటి లారీ డ్రైవర్లు ఖలీల్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ ఆనంద్ తెలిపారు. రేషన్ బియ్యం పట్టివేత జడ్చర్ల: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు నిఘా వేసి పట్టుకున్న ఘటన శనివారం రాత్రి మండలంలోని లింగంపేట వద్ద చోటు చేసుకుంది. మండలంలోని లక్ష్మన్నాయక్ తండా నుంచి రేషన్ బియ్యాన్ని సేకరించి బొలేరోలో అక్రమంగా తరలిస్తుండగా పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో లింగంపేట వద్ద బొలేరోను స్వాధీనం చేసు కుని పోలీస్స్టేషన్కు తరలించారు.డ్రైవర్ మహేశ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సంబంధిత సివిల్ సప్లయ్ అధికారులకు సమాచారం ఇచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. -
కుళ్లు తెగుళ్లు.. నివారిస్తే లాభాలు
అలంపూర్: ఈ ఏడాది వేరుశనగ సాగు కాస్త పెరిగింది. వానాకాలంలో అధిక వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో రెండో పంటగా రబీలో అక్కడక్కడ వేరుశనగను సాగు చేశారు. అయితే పంటకు కాండం కుళ్లు తెగుళ్లు ఆశించే అవకాశం ఉండడంతో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్ రైతులకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆస్పర్ జిల్లస్తో శిలీంధ్రంతో తెగుళ్లు కాండం కుళ్లు ఆస్పర్ జిల్లస్ అనే శీలింధ్రం వలన పంటకు ఆశిస్తుంది. ఈ శీలింధ్రాలు మొక్క కణాలు, భూమిలో ఉండి పంటకు సోకి తెగుళ్లు వ్యాపింపజేస్తాయి. ఈ కణాలను కొనిడియా అని పిలుస్తారు. ఈ కొనిడియా గింజ నుంచి మొలక వచ్చిన వెంటనే భూమికి దగ్గరగా ఉండే కాండంకు ఆశిస్తుంది. తర్వాత కాండంపై నల్లటి రంగు లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడి అక్కడ అంత తెల్లటి బూజు లాంటి పదార్థం తయారై మొక్క చనిపోతుంది. మూడు దశల్లో తెగుళ్లు... ● గింజ భూమిలో ఉన్నప్పుడు తెగుళ్ల ఆశించే అవకాశం ఉంటుంది. ● మొక్క మొలకెత్తిన 20 నుంచి 25 రోజుల్లో తెగుళ్లు ఆశించే అవకాశం ఉంటుంది. ● మొక్క 60 నుంచి 65 రోజుల్లో ఉన్న సమయంలో ఈ తెగుళ్లు ఆశిస్తాయి. నివారణ ఇలా.. కాండం తెగుళ్లు ఆశించిన పంటకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి, కార్బండిజమ్ అలాగే మాంకోజెబ్ గ్రాము లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్లు తడిచేటట్లు వారానికి రెండు సార్లు పిచికారీ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పాడి–పంట -
ఉపాధి నిధులతో కొత్త పనులు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) వీజీజీ రామ్ (ఉపాధి హామీ) నిధులతో సరికొత్త పనులు చేపట్టేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామాల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తోంది. ఉపాధి నిధులతో మెటీరియల్ కంపోనెంట్ కింద గతంలో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, కల్వర్టుల నిర్మాణాలు మాత్రమే చేసేవారు. అయితే పాత పద్ధతికి స్వస్తి పలుకుతూ కొత్త రకం పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో మహిళా సంఘాలకు సొంత భవనాల నిర్మాణం, ఆహార ధాన్యాలు నిల్వ చేసుకునేందుకు వంద మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంలు, వివిధ రకాల పనులు చేసేవారికి వర్క్ షెడ్లు నిర్మించాలని నిర్ణయించారు. మహిళా భవనాలు, వర్క్షెడ్ల కోసం రూ.10 లక్షల చొప్పున, ఆహార ధాన్యాల నిల్వ కోసం చేపట్టే పనులకు రూ.30 లక్షలు కేటాయించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మహిళా భవనాలకు ఇది వరకు ఎమ్మెల్యే, ఎంపీలు మాత్రమే తమ కోటా నిధుల నుంచి కేటాయించేవారు. అనేక చోట్ల అనువైన భవనాలు లేకపోవడంతో మహిళలు తమ సమావేశాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఆహార ధాన్యాల నిల్వ కోసం ప్రతి గ్రామంలో గోదాంలను నిర్మిస్తే రైతులు తాము ఆశించిన ధర వచ్చినప్పుడే పంట దిగుబడులు విక్రయించుకోవడం, లేదా అవసరం ఉన్నన్ని రోజులు నిల్వ చేసుకోవడానికి వీలవుతుంది. వృత్తి, ఇతర పనులు చేసేవారికి షెడ్లు లేకపోవడంతో అద్దె గదుల్లోనే కాలం వెల్లదీస్తున్నారు. ఈ క్రమంలో ఉపాధి నిధులతో కొత్త తరహా పనులు చేపడితే ప్రజాప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామసభలో ఆమోదం.. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి గాను మెటీరియల్ కంపోనెంట్ కింద కొత్త పనుల కోసం ప్రతిపాదనలు స్వీకరించనున్నారు. గ్రామస్థాయిలో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు చేసి గ్రామసభలో ఆమోదం పొందాలి. అక్కడి నుంచి మండల స్థాయిలో, ఆ తర్వాత జిల్లాస్థాయిలో సాంకేతిక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గ్రామ కంఠం పరిధిలో ఉన్న భూముల్లోనే నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. అనువైన స్థలాలు ఉన్నచోట మూడు రకాల పనులు పూర్తి చేయడానికి అవకాశం ఉంది. పాత విధానాలకు స్వస్తి పలికి కొత్త పనులు చేపట్టాలని ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయం తీసుకోవడం ఆహ్వానించదగిన పరిణామం అని చెప్పొచ్చు. మహిళా సంఘాలకు భవనాల ఏర్పాటుకు చర్యలు ఆహార ధాన్యాల నిల్వ, ఇతర వర్క్ షెడ్ల నిర్మాణం సీసీ రోడ్లు, కల్వర్టుల స్థానంలో.. ప్రతిపాదనలు తీసుకోవాలని ఆదేశాలు రైతులకు మేలు.. ఉపాధి పథకంలో కొత్తగా ఆహార ధాన్యాల నిల్వకు అవసరమైన గోదాంలు, ఇతర వర్క్ షెడ్ల నిర్మాణాలు చేపట్టవచ్చు. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కూలీలకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ కొత్త పనులతో రైతులకు మేలు జరుగుతుంది. – నర్సింహులు, డీఆర్డీఓ -
లక్ష్యం.. గ్రీన్ గంగాపురం
జడ్చర్ల టౌన్: స్వామి వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకుని మండలంలోని గంగాపురం గ్రామంలో 6 మంది సభ్యులతో 2013 ఏడాదిలో హెల్పింగ్ హార్ట్స్ ఫర్ గంగాపూర్ (స్వామి వివేకానంద యూత్) పేరిట ఏర్పాటైనన యువజన సంఘం నేడు 222 మంది సభ్యులకు చేరింది. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటైన ఈ సంఘం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రతిఒక్కరిలోనూ సేవాభావం పెంపొందిస్తున్నారు. ఉత్తరాఖండ్ వరద బాధితుల కోసం గ్రామంలో విరాళాలు సేకరించి అప్పటి కలెక్టర్కు అందజేశారు. తొలి అడుగు విజయవంతం కావడంతో హెల్పింగ్ హార్ట్స్ ఫర్ గంగాపూర్ సంఘం నమోదు చేయించారు. 6 మందితో ప్రారంభమైన సంఘంలో ప్రస్తుతం 222 మంది సభ్యులు చేరారు. ఎన్నో భవిష్యత్ లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా గ్రీన్ గంగాపురంగా మార్చడానికి కృషిచేస్తున్నారు. -
‘మేయర్ గెలుచుకునేలా కష్టపడదాం’
స్టేషన్ మహబూబ్నగర్: కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేయర్ను గెలుచుకునేలా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం ముడా చైర్మన్, పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కా ర్పొరేషన్ ఎన్నికల్లో సర్వేల ప్రకారం టికెట్ కేటాయిస్తామని, పార్టీ జెండాలు మోసిన వారికి ప్రా ధాన్యత ఉంటుందన్నారు. టికెట్ల ఎంపిక కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. టికెట్ ఎంత మంది ఆశించినా ఒక్కరికే వస్తుంది కాబట్టి.. టికెట్ రానివారు నిరాశచెందకుండా అభ్యర్థి గెలుపు కోసం సమష్టిగా పనిచేయాలన్నారు. అత్యధికంగా కార్పొరేటర్ స్థానాలనుకైవసం చేసుకుందామన్నారు. ప్రతి డివిజన్లో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను సేకరించాలని కోరారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో 50 డివిజన్లకు పైగా స్థానాల్లో కాంగ్రెస్ను గెలిపిస్తామని సీఎంకు మాట ఇచ్చామని.. ఈ మేరకు నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉండి అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. గడిచిన రెండేళ్లలో పట్టణంలో రూ.2 వేల కోట్లకుపైగా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని, సీఎంను ఒప్పించి మహబూబ్నగర్ను మున్సిప ల్ కార్పొరేషన్గా మంజూరు చేయించుకున్నామని గుర్తుచేశారు. సమావేశంలో టీజీఎంఎఫ్సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, వైస్ చైర్మన్ విజయ్కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్గౌడ్, నాయకులు చంద్రకుమార్గౌడ్, జహీర్ అఖ్తర్, వినోద్కుమార్, ఎన్పీ వెంకటేశ్, ఎం.సురేందర్రెడ్డి, వసంత, బెనహర్, మధుసూదన్రెడ్డి, రాఘవేందర్రాజు, సుధాకర్రెడ్డి, సిరాజ్ఖాద్రీ, అజ్మత్అలీ, షబ్బీర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
సేవ చేయడం అదృష్టం..
ఆత్మకూర్లో వివేకానంద సేవాసమితిని నెలకొల్పిన నాటి నుంచి యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నాం. రక్తదాన, వైద్యశిబిరాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. పారిశుద్ధ్య కార్యక్రమాలు, విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం. పేదలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. – బాలు, సేవాసమితి అధ్యక్షుడు, ఆత్మకూర్ ఆత్మకూర్: పట్టణానికి చెందిన డాన్స్మాస్టర్ బాలు, మ్యాడం శ్రీను, ల్యాబ్ టెక్నీషియన్ రాజేశ్ తదితరులు ఎనిమిదేళ్ల క్రితం స్వామి వివేకానంద సేవాసమితిని నెలకొల్పి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం క్లాత్ సంచులను పంపిణీ చేస్తున్నారు. తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ.. ఇప్పటివరకు 275 మందితో రక్తదానం చేయించారు. నేత్రం ఫౌండేషన్ సహకారంతో విద్యార్థుల్లో కంటి లోపాలను గుర్తించి.. చికిత్స అందేలా చూస్తున్నారు. యువతను క్రీడల్లో ప్రోత్సహిస్తున్నారు. ●తలసేమియా బాధితులకు అండగా.. -
సేవాతత్పరులు
స్వామి వివేకానంద.. తన జీవన విధానంలో ఎందరికో స్ఫూర్తినిచ్చిన మహనీయుడు. లక్ష్యం లేకుండా పయనించే యువతకు ఆయనే ఓ దిక్సూచి. మానవ సేవయే.. మాధవసేవగా భావించి సామాన్య ప్రజలపై అసామాన్య సానుభూతిని కనబరిచిన మానవతావాది. ఈయనను స్ఫూర్తిగా తీసుకొని కొంతమంది యువకులు ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఆశించకుండా మనల్ని మనమే సంస్కరించుకోవాలని ముందడుగు వేస్తున్నారు. రక్తదానం, అన్నదానం, విద్యాదానం, విద్యార్థులకు పుస్తకాలు, ప్యాడ్లు పంపిణీ, మొక్కల పెంపకం, శ్రమదానంతోపాటు.. సామాజిక, ఆర్థిక అసమానతలపై చైతన్యం కల్పిస్తూ ఇతరుల్లోనూ స్ఫూర్తిని రగిలిస్తున్నారు. ఏటికేడాది తమ లక్ష్యాలను మార్చుకుంటూ.. వాటి సాధన కోసం అవిశ్రాంతగా శ్రమిస్తూ ముందుకు సాగుతున్నారు. సోమవారం స్వామి వివేకానందుడి జయంతి (జాతీయ యువజన దినోత్సవం)ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేస్తున్న యువజన సంఘాలపై ప్రత్యేక కథనం.. ముందుండి.. రక్తదానం నవాబుపేట: సేవా కార్యక్రమాల్లో అతి ముఖ్యమైన రక్తదానాలకు పెట్టింది పేరు నవాబుపేట స్వామి వివేకానంద సేవాసమితి. మరికొందరు యువత తమ తల్లిదండ్రుల పేరుతో సంస్థలను స్థాపించి.. పేదలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. రక్తదాన శిబిరాలు ఒకరు ఏర్పాటు చేస్తుంటే.. మరొకరు అన్నదాన కార్యక్రమాలు, పేదలకు ప్రతినెలా కొంత ఆర్థిక సాయం అందిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సామాజిక సేవలో తరిస్తున్న యువతరం రక్తదానం, అన్నదానంతోపాటు ప్రగతిలో మమేకం సామాజిక, ఆర్థిక అసమానతలపై చైతన్యం స్వామి వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు.. నేడు జాతీయ యువజన దినోత్సవం -
వసూళ్లలో తగ్గిన దూకుడు
పాలమూరు: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆర్టీఏ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం చేరుకోవడానికి సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో మూడు నెలల గడువు ఉన్న క్రమంలో అప్పటి వరకు ఇచ్చిన లక్ష్యం కంటే అధిక మొత్తంలో పూర్తి చేయాలని చూస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో వాహనాలకు జరిమానాలు, అధిక లోడ్, పత్రాలు లేకుండా, డ్రైవర్కు లైసెన్స్ లేకుండా తిరిగే వాహనాలకు జరిమానాలు విధించడానికి తనిఖీలు పూర్తిస్థాయిలో జరగడం లేదు. జిల్లా ఆర్టీఏ శాఖ జీవిత కాల పన్నుతోపాటు ఫీజుల వసూలులోనూ పూర్తిగా వెనుకబడి ఉంది. ప్రధానంగా త్రైమాసిక పన్నులు అయితే పూర్తిగా తగ్గిపోవడంతో సమస్యగా మారింది. దీంతోపాటు తనిఖీల వల్ల వచ్చిన ఆదాయం కూడా తగ్గింది. ప్రతిరోజు తనిఖీలు చేయాలని లక్ష్యం ఉన్నా.. సిబ్బంది కొరత వల్ల అది సాధ్యం కావడం లేదు. అరకొరగా ఉన్న అధికారులు రోడ్ల మీద వాహన తనిఖీలకు వెళ్తే కార్యాలయంలో పనులు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. అధిక లోడ్.. పత్రాలు.. జిల్లాలో జాతీయ రహదారి–44 ఉండటంతో అధిక లోడ్ కలిగిన వాహనాలు అధిక సంఖ్యలో వెళ్తుంటాయి.. అలాంటి వాహనాలపై ఆర్టీఏ శాఖ కొరడా ఝులిపిస్తుంది. అదేవిధంగా పత్రాలు లేకుండా కూడా అధిక సంఖ్యలో వాహనాలు తిరుగుతున్న నేపథ్యంలో వాటిపై కూడా పన్నులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి వాహనాల కోసం ఆర్టీఏ శాఖ వారు జాతీయ రహదారిపై చెక్పోస్టులు ఏర్పాటు చేసి పన్నులు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు పత్రాలు లేకుండా అధిక మొత్తంలో పన్నులు వసూలు చేయడం జరుగుతుంది. ఇందులో మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి సర్వీస్ ఫీజు, డిటెక్షన్, గ్రీన్ట్యాక్స్ వసూలులో లక్ష్యానికి మించి సాధించారు. ప్రత్యేక కార్యాచరణ.. జిల్లాలో ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం చేరుకోవడానికి ప్రత్యేక కార్యాచరణతో వెళ్తున్నాం. ప్రత్యేక టీంల ద్వారా ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు చేసి ఆదాయం పెరిగే విధంగా చూస్తాం. జీవిత కాల బీమా, నూతన వాహనాల ట్యాక్స్ ఇతర ఆదాయ మార్గాల్లో లక్ష్యం పూర్తి చేస్తాం. మరో మూడు నెలల గడువు ఉన్న నేపథ్యంలో అన్ని రకాల వాహనాల ధ్రువపత్రాలపై తనిఖీలు చేసి జరిమానాలు విధిస్తాం. – రఘుకుమార్, ఆర్టీఓ, మహబూబ్నగర్ లక్ష్యం చేరుకోవడంలో వెనకబడిన ఉమ్మడి జిల్లా ఆర్టీఏ శాఖ జీవితకాల ఫీజు, త్రైమాసిక పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం సిబ్బంది కొరతతో నామమాత్రంగా తనిఖీలు మూడు నెలల్లో ముగియనున్న ఆర్థిక సంవత్సరం -
నేడు కేటీఆర్ పర్యటన
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం పాలమూరుకు రానున్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డుసభ్యులను సన్మానించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందుకోసం జిల్లాకేంద్రంలోని ఎంబీసీ గ్రౌండ్లో సన్మాన కార్యక్రమం, బహిరంగ సభ నిర్వహించనుండగా.. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను ఆదివారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ పరిశీలించారు. మరోవైపు జిల్లాకేంద్రంలోని ప్రధాన రహదారులు, చౌరస్తాల్లో గులాబీ తోరణాలతో అలంకరించి.. భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో ప్రజలు విసిగిపోయారన్నది సర్పంచ్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందన్నారు. మహబూబ్నగర్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తామని, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకు టికెట్ ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మ న్ యాదయ్య, నాయకులు శివరాజు, ప్రభాక ర్, మున్నూర్ రాజు తదితరులు పాల్గొన్నారు. బాలికలనుఅన్నిరంగాల్లో తీర్చిదిద్దాలి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: బాలికలను అన్నిరంగాల్లో తీర్చిదిద్దాలని హైదరాబాద్ ప్రాంతీయ విద్యా సంచాలకులు ఎం.సోమిరెడ్డి అన్నారు. జాతీయ విద్యా ప్రణాళిక, పరిపాలన సంస్థ (ఎన్ఐఈపీఏ– నీపా) ఆధ్వర్యంలో మహబూబ్నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలకు చెందిన కేజీబీవీల ప్రత్యేకాధికారులకు సాధికారతపై నిర్వహించిన ఐదు రోజుల శిక్షణ తరగతులు ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల అభ్యున్నతికి నాణ్యమైన విద్యతోపాటు జీవన నైపుణ్యాలు, క్రీడలు, కళలు, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. తల్లిదండ్రుల వద్ద కంటే విద్యార్థినులు ఎక్కువ సమయం ఉపాధ్యాయులు, వార్డెన్లతోనే గడుపుతారని వారి భవిష్యత్ కేజీబీవీల ప్రత్యేకాధికారులు, ఉపాధ్యాయులపైనే ఆధారపడి ఉంటుందన్నారు. విద్యార్థినులకు ఉత్తమ విద్య, అవసరమైన సౌకర్యాలు కల్పించడమే గాక సత్ప్రవర్తనతో ఆదర్శంగా మెలగాలన్నారు. ఇక్కడ నేర్చుకున్న అంశాలను కేజీబీవీలలో తప్పక అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జీసీడీఓలు అర్షాఖాద్రీ, సంగీత, మాస్టర్ ట్రైనర్లు నాయుడు, పల్లవి, శివలీల, నర్మద తదితరులు పాల్గొన్నారు. దేవరకద్ర మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించండి దేవరకద్ర: దేవరకద్ర మున్సిపాలిటీకి నూతన భవనం మంజూరు చేయడంతోపాటు డ్రెయినేజీలు, సీసీరోడ్ల నిర్మాణం, తాగునీటి సరఫరా మెరుగుపరచడానికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి సీఎం రేవంత్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. శనివారం రాత్రి సీఎం నివాసంలో కలిసి పలు అంశాలపై చర్చించారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కావడం వల్ల కార్యాలయం నిర్వహణ కోసం కొత్త భవనం అవసరం అని పేర్కొన్నారు. దీనికి గాను సానుకూలంగా స్పందించిన సీఎం వెంటనే సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని ఎమ్మెల్యే చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే ● బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఫౌండర్ చైర్మన్ చిరంజీవులు -
మర్దాన్అలీషా దర్గా శతాబ్ది ఉర్సుకు ఏర్పాట్లు పూర్తి
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లా కేంద్రం షాసాబ్గుట్టలోని హజ్రత్ సయ్యద్ మర్దాన్ అలీషా రహెమతుల్లా అలై దర్గా శతాబ్ది ఉర్సు ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. శతాబ్ది ఉర్సును ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల తొలిరోజు దర్గాలో గుస్లే షరీఫ్ (జలాభిషేకం), 12న గంథోత్సవాన్ని షేక్ మొహియోద్దీన్ ఇంటినుంచి వన్టౌన్, న్యూటౌన్ల మీదుగా దర్గాకు తీసుకెళ్తారు. అనంతరం భక్తులనడుమ దర్గాలో పూలు, చాదర్లు సమర్పించి ప్రత్యేక ఫాతేహాలు నిర్వహిస్తారు. 13వ తేదీన (చిరాగే) దీపారాధన, ఖవ్వాలి ఏర్పాటు చేయనున్నారు. 14వ తేదీన దర్గాలో ఖత్మే ఖురా నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తారు. ఉత్సవాలను పురస్కరించుకొని దర్గా పీఠాధిపతి సయ్యద్ అబ్దుల్ రజాక్షాఖాద్రీ ఆధ్వర్యంలో వేలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం పాలమూరు: సమాజంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు, హింసలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దామని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు యు.సృజన అన్నారు. వందేళ్ల సీపీఐ పార్టీ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని శనివారం జిల్లాకేంద్రంలోని సురవరం వెంకట్రామిరెడ్డి భవన్ వద్ద మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు బానిసత్వాన్ని తెంచి స్వేచ్ఛ, సమానత్వం సాధించిన ఘనత కమ్యూనిస్టు పార్టీదేనని అన్నారు. మహిళల హక్కుల కోసం రాజీలేని పోరాటాలు ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో మహిళలు నిర్వహించినట్లు చెప్పారు. విదేశి విష సంస్కృతి మన దేశ సంస్కృతి సంప్రదాయాలను విధ్వంసం చేస్తున్నాయన్నారు. అందాల పోటీల పేరుతో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. మహిళలు భారతదేశ సంప్రదాయాలను చాటుతూ హక్కుల కోసం పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. సీపీఐ సీనియర్ నాయకులు నరేందర్రెడ్డి, జిల్లా కార్యదర్శి బాలకిషన్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం గొంతెత్తి నినాదిస్తుందని, మహిళ, విద్యార్థి, ఉద్యోగ, కార్మికుల పక్షాన ఉద్యమాలు చేసిన ఘనత సీపీఐకి దక్కుతుందన్నారు. ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహిస్తున్న సీపీఐ వందేళ్ల ముగింపు సభకు జిల్లా నుంచి పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా కార్యదర్శి పద్మావతి, జిల్లా అద్యక్షురాలు భార్గవి, ఇందిర, శ్రీలత, పూజ, భవన, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి సురేశ్, రాము పాల్గొన్నారు. సమాజ సంఘటితం కోసం సత్సంగాలు స్టేషన్ మహబూబ్నగర్: సమాజ సంఘటితం కోసం గ్రామస్థాయిలో సత్సంగాలు చేపట్టాలని విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వరశర్మ అన్నారు. జిల్లాకేంద్రంలో విశ్వహిందూ తెలంగాణ ప్రాంత సమావేశాలు శనివారం ప్రారంభయ్యాయి. సమావేశంలో ముఖ్యవక్తగా పాల్గొన్న కోటేశ్వరశర్మ మాట్లాడుతూ ప్రతి ప్రఖండ కేంద్రంగా కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో విశ్వహిందూ పరిషత్ కమిటీలు ఏర్పాటు చేసే దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. దేవాలయాలపై జరుగుతున్న ఆకృత్యాలను ప్రతి కార్యకర్త ధైర్యంగా ఎదుర్కొనే స్థాయిని నేర్చుకోవాలన్నారు. ప్రతి దేవాలయాన్ని కేంద్రంగా చేసుకొని గోరక్ష కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. పండుగలో మొట్టమొదటగా గోపూజ చేసుకునే సంప్రదాయాన్ని వీహెచ్పీ కార్యకర్తలు మొదలుపెట్టాలని కోరారు. సమావేశంలో వీహెచ్పీ కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి స్థానమలై, తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు నరసింహమూర్తి, కార్యదర్శి పరాయితం లక్ష్మినారాయణ, జిల్లా అధ్యక్షులు మద్ది యాదిరెడ్డితోపాటు ఆయా జిల్లాల అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శులు, బజరంగ్దళ్, దుర్గావాహిని, మాతృశక్తి, సామాజిక సమరసత, ధర్మప్రసార సత్సంగ్ తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి ఓపెన్ చెస్ పోటీలు వనపర్తిటౌన్: ఉమ్మడి జిల్లాస్థాయి ఓపెన్ చెస్ పోటీలు సోమ, మంగళవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదగిరి తెలిపారు. శనివారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్విస్ లీగ్ పద్ధతిలో పోటీలు ఉంటాయని.. బాలికలు, బాలురు, సీ్త్రలు, పురుషులకు రెండు కేటగిరీల్లో నిర్వహిస్తామని చెప్పారు. ఉమ్మడి పాలమూరు జిల్లావాసులే అర్హులని.. ఆసక్తిగల వారు శనివారం సాయంత్రంలోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు సెల్నంబర్లు 99591 54743, 94913 76340సంప్రదించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి వేణుగోపాల్, కోశాధికారి టీపీ కృష్ణయ్య, ప్రతినిధి ఎం.రాములు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు మార్షల్ ఆర్ట్స్లో రాణించాలి జడ్చర్ల: విద్యార్థులు మార్షల్ ఆర్ట్స్లో రాణించాలని సినీ నటుడు సుమన్ అన్నారు. శనివారం మండల పరిధిలోని పోలేపల్లి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులోని ఎస్వీకేఎం స్కూల్లో జరిగిన క్రీడా ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అండర్– 14 విద్యార్థులకు కబడ్డీ, ఖోఖో, అండర్–17 విద్యార్థులకు వాలీబాల్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్ తదితర పోటీలను నిర్వహించారు. అనంతరం విజేతలకు బెల్టులు, షీల్డ్లు, ప్రశంస పత్రాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రిన్స్పాల్ ఎబినేజర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
30 నుంచి చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు
గద్వాల టౌన్: గద్వాల కోటలో వెలసిన శ్రీభూలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వారంరోజుల పాటు ఈ వేడుకలు మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠం ఆధ్వర్యంలో జరగనున్నాయి. వేడుకలను పురస్కరించుకొని ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. 18 ఏళ్ల క్రితం గద్వాల కోటలోని ఆలయ పరిసర ప్రాంతాలు, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను మంత్రాలయ మఠానికి అప్పగించారు. గద్వాల పెద్ద జాతరగా పిలువబడే చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలకు గద్వాల చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు కర్ణాటక ప్రాంతానికి చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని కొలుస్తారు. పెద్ద జాతర సందర్భంగా జమ్ములమ్మ ఉత్సవాలు ప్రారంభం కావడంతో గద్వాల ప్రాంతంలో భక్తుల రద్దీ నెలకొంటుంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 4 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 31న కల్యాణోత్సవం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డితోపాటు పట్టణ పుర ప్రముఖులు, జిల్లా అధికారులు హాజరు కానున్నారు. ఫిబ్రవరి 1న అర్ధరాత్రి రథోత్సవం నిర్వహిస్తారు. రథోత్సవ కార్యక్రమానికి, అంతకు ముందు జరిగే పూజా కార్యక్రమాలు మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థ శ్రీపాదుల ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు మంత్రాలయ పీఠాధిపతి హోమాలు, విశేష పూజలు, లింగంబావిలో తెప్పోత్సవం ఉంటుంది. శనివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో వనపర్తి జిల్లా న్యాయమూర్తి సునీత బ్రహోత్సవాలకు సంబంధించిన వాల్పోస్టర్లు, బ్రోచర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో ఆలయ విచారణకర్త ప్రభాకర్, మేనేజర్ శ్రీపాదజోషి, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. -
ఊరెళ్తున్నారా..జర జాగ్రత్త!
మహిళల అణచివేతకువ్యతిరేకంగా పోరాటం ఒకే ఊరు.. మూడు పేర్లు.. ● రాత్రి పగలు తేడా లేకుండా క్షణాల్లో చోరీలు ● తాళం వేసిన ఇంటిని వదలని దొంగలు ● పోయేది రూ.కోట్లలో స్వాధీనం రూ.లక్షల్లో ● తక్కువగా రికవరీ శాతం ప్రాణం తీసిన.. బైక్ సరదా ● అతివేగంగా వెళ్లి కిందపడడంతో బాలుడి దుర్మరణం – వివరాలు IIలో.. – వివరాలు IVలో.. -
‘ఉర్దూ వర్సిటీ భూములను కాపాడుకుందాం’
స్టేషన్ మహబూబ్నగర్: హైదరాబాద్లోని మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ భూములను మతాలకతీతంగా కాపాడుకుందామని తెలంగాణ ఉద్యమకారుడు, సామాజికవేత్త హనీఫ్ అహ్మద్ కోరారు. జిల్లా కేంద్రంలోని టీఎఫ్టీయూ కార్యాలయంలో శనివారం గట్టన్న అధ్యక్షతన రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. హనీఫ్ అహ్మద్ మాట్లాడుతూ.. ఒకవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని ప్రైవేట్ కార్పొరేట్లకు దారాదత్తం చేస్తుండగా.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్గా చూస్తున్నదని ఆరోపించారు. అందుబాటులో ఉన్న విలువైన భూములను అమ్మకానికి పెడుతున్నదని విమర్శించారు. ఉర్ధూభాషను, సాహిత్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉర్ధూ యూనివర్సిటీని మతం ప్రాతిపదికన చూడకూడదని తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేశారు. ముస్లిం మైనార్టీల పట్ల కాంగ్రెస్ వివక్ష ఒకస్థాయికి చేరిందని ఆరోపించారు. మౌలానా యూనివర్సిటీ భూములను గుంజుకుంటామని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడుతామని హెచ్చరించారు. అదే విధంగా సమావేశంలో పలువురు మాట్లాడుతూ రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చడం దురదృష్టకరమన్నారు. సమావేశంలోు షేక్ సిరాజ్, అబ్దుల్లా, బదివుల్లా బేగ్, సికందర్, అబ్దుల్ అజీజ్, టీఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు విజయ్కుమార్ పాల్గొన్నారు. -
‘పది’ విద్యార్థులకు ‘ప్రత్యేక’ స్నాక్స్
ఫిబ్రవరి 16నుంచి మార్చి10వరకు అల్పాహారం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్న క్రమంలో వారికి సాయంత్రం చిరుతిళ్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా నిధులను విడుదల చేస్తూ.. ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం, సాయంత్రం నిర్వహించే ప్రత్యేక తరగుతలకు హాజరవుతున్న విద్యార్థులకు ఆకలితో ఉండకుండా ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు అందించే స్నాక్స్ కేవలం 19రోజులపాటు అందించనుంది. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు చిరుతిళ్లను అందించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే అన్ని పాఠశాలల్లో ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగుతులు జరుగుతున్నా.. వాటిని సకాలంలో అందించకుండా విద్యాసంవత్సరం చివరన అందించడంతో పెద్దగా ప్రయోజనం ఉండదని ఉపాధ్యాయ సంఘం నాయకులు పేర్కొంటున్నారు. బిస్కెట్లు, పల్లీలు ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు బిస్కెట్లు, పల్లీలు, ఉడకబెట్టిన పెసర్లు, బెబ్బర్లు, శనగలు, పల్లిబెల్లం, మిల్లెట్ బిస్కెట్స్, ఉల్లిగడ్డ పకోడి వంటివాటిని అందించనున్నారు. ఇందుకు ఒక్కో విద్యార్థిపై రూ.15ఖర్చు చేయనునన్నారు. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 459 పాఠశాలల్లో చదువుతున్న 19, 495 మంది విద్యార్థులకు ప్రభుత్వం రూ.55, 56, 918 నిధులను విడుదల చేసింది. వీటిని ప్రభుత్వం డీఈఓ ఖాతాలో జమచేయనుంది. వాటిని వివిధ పాఠశాలల హెచ్ఎంలకు అవసరమైన విధంగా వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. కలెక్టర్ నిధుల నుంచి అందిస్తున్నాం నవంబర్ చివరివారం నుంచి జిల్లావ్యాప్తంగా విద్యార్థులకు స్నాక్స్ అందిస్తున్నాం. ఒక్కో విద్యార్థికి రూ.5చొప్పున కలెక్టర్ నిధుల నుంచి ఖర్చుచేసి బిస్కెట్లు పంపిణీ చేస్తున్నాం. ప్రభుత్వం స్నాక్స్ కోసం నిధులను కూడా విడుదల చేసింది. ఎటువంటి ఆటంకం లేకుండా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం. – ప్రవీణ్కుమార్, డీఈఓ, మహబూబ్నగర్ ఉడకబెట్టిన పెసర్లు, బెబ్బర్లు, బెల్లంపట్టి, మిల్లెట్ బిస్కెట్స్ ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15ఖర్చు చేయనున్న ప్రభుత్వం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 459హైస్కూళ్లలో 19,495మందికి ప్రయోజనం -
ఇద్దరికి జైపాల్రెడ్డి స్మారక అవార్డు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: మాజీ కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం అందించే స్మారక పురస్కారాలను ఈ సంవత్సరం కూడా ఇద్దరికి అందిస్తున్నట్లు న్యాయవాది మనోహర్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని రెడ్క్రాస్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవార్డులను పోతుల రాంరెడ్డి, గద్వాల చంద్రశేఖర్రెడ్డికి అందిస్తున్నట్లు తెలిపారు. వీరికి అవార్డుతోపాటు రూ.25వేల నగదు కూడా అందిస్తామన్నారు. ఇటువంటి వారిని ఎంపిక చేసి గౌరవించి సన్మానించడం చాలా గొప్ప విషయమని, ఇందుకు కారణమైన జేపీఎన్సీ చైర్మన్ రవికుమార్ను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. రవికుమార్ ఒక సాధారణ వ్యక్తిగా పెద్ద కళాశాల ప్రారంభించేందుకు సహరించిన జైపాల్రెడ్డిని గుర్తుంచుకుని ఆ స్మారక అవార్డులను ఇవ్వడం గొప్ప విషయమన్నారు. ఈనెల 12న సంక్రాంతి వేడుకలను జేపీఎన్సీ కళాశాలలో నిర్వహిస్తామని అక్కడ ఎంపిక చేసినవారికి అవార్డులను కూడా అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేపీఎన్సీ చైర్మన్ రవికుమార్, బాద్మిశివకుమార్, కార్యదర్శి వెంకటరామారావు, గిరిధర్రెడ్డి తదితరులు ఆపల్గొన్నారు. -
హైలెవల్.. ముందడుగు
జూరాల వద్ద ప్రారంభమైన వంతెన నిర్మాణం ఆత్మకూర్: ఈ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల సాకారం కాబోతుంది. మండలంలోని జూరాల, గద్వాల జిల్లా కొత్తపల్లి మధ్యనున్న కృష్ణానదిపై హై లెవల్ వంతెన నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల మధ్య తాత్కాలిక రోడ్డు నిర్మించడంతో కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు రాకపోకలు సాగిస్తున్నాయి. రూ.123 కోట్లతో హైలెవల్ వంతెన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డిసెంబర్ 1న శంకుస్థాపన చేశారు. వెంటనే తాత్కాలిక రోడ్డు నిర్మాణం చేపట్టి రాకపోకలు ప్రారంభించారు. ● ఆత్మకూర్ నుంచి జూరాల మీదుగా గద్వాలకు వెళ్లాలంటే 32 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వంతెన నిర్మాణం పూర్తయితే కేవలం పది కిలోమీటర్లు ప్రయాణించి గద్వాలకు చేరుకోవచ్చు. అలాగే గద్వాల నుంచి హైదరాబాద్కు వెళ్లాలంటే ఎర్రవల్లి చౌరస్తా మీదుగా హైవేపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వంతెన నిర్మాణం అనంతరం గద్వాల నుంచి ఆత్మకూర్ మీదుగా కొత్తకోట హైవేకు చేరుకోవచ్చు. దీంతో 40 కిలోమీటర్ల దూరం తగ్గనున్నట్లు అంచనా వేస్తున్నాయి. అలాగే ఎమ్మిగనూరు, ఆదోని, బళ్లారి, మంత్రాలయం వెళ్లే ప్రయాణికులకు దూరభారం తగ్గనుంది. రవాణా సౌకర్యం మెరుగుపడటంతో వ్యాపారపరంగా ఆత్మకూర్, జూరాల, గద్వాల జిల్లా కొత్తపల్లి ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి. ● కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ.123 కోట్లు కేటాయించడంతో ఆర్అండ్బీశాఖ టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. గత నెలలోనే పనులను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించగా.. మంత్రి వాకిటి శ్రీహరి త్వరతగతిన నిర్మాణం పూసేందుకు సంబంధిత కాంట్రాక్టు కంపెనీ, ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడుతున్నారు. రూ.123 కోట్ల అంచనా వ్యయంతో.. తాత్కాలిక రోడ్డు ఏర్పాటు..కొనసాగుతున్న రాకపోకలు ఆత్మకూర్, గద్వాల మధ్య తగ్గనున్న దూరం -
వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడనే హత్య
గద్వాల క్రైం: వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో నిందితుడు అబ్రహం ఖయ్యూం అనే యువకుడిని హత్య గావించినట్లు గద్వాల డీఎస్పీ మొగిలయ్య తెలిపారు. శనివారం గద్వాల సీఐ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో హత్య కేసు వివరాలు వెల్లడించారు. గట్టు మండలం బల్గెర గ్రామానికి చెందిన తిమ్మప్ప(ఖయ్యూం) (28) మేసీ్త్ర పనులు చేస్తుంటాడు. ఈ నెల 4న రాయచూర్కు వెళ్లి తిరిగి బల్గెరకు వస్తున్న క్రమంలో తండ్రి సనక దేవన్నకు ఫోన్చేసి బల్గెర బస్టాప్ వద్దకు బైక్ తీసుకొని రమ్మన్నాడు. బస్టాప్ వద్ద తండ్రి వేచి చూస్తున్నప్పటికీ ఎంతకు రాలేదు. మరుసటి రోజు 5వ తేదీన ఖయ్యూం ఆచూకీ కోసం వెతకగా ముసల్మాన్దొడ్డి అటవీ ప్రాంతంల్లో అతని బైక్, కొంత దూరంలో మోకాళ్లపై తలపెట్టుకొని రక్తపు మడుగులో మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. దీంతో మృతుడి తండ్రి దేవన్న గట్టు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ మల్లేష్, సీఐ శ్రీను కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వెలుగులోకి ఇలా... మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి సోదరుడు ఏబేలు(మేసీ్త్ర) ఆరు నెలల క్రితం బల్గెరలో ఇంటి నిర్మాణ పనులు చేస్తూ గోడ కూలి మృతి చెందాడు. అయితే మిట్టదొడ్డి గ్రామానికి చెందిన అబ్రహం(మేసీ్త్ర) అనే వ్యక్తి ఏబేలుకు స్నేహితుడు కావడంతో తరచూ అతని ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో ఏబేలు భార్యతో వివాహేతర బంధం ఏర్పడింది. ఇది గమనించిన తిమ్మప్ప తన వదిన ఇంటి వైపునకు అబ్రహాన్ని రావద్దని మందలించాడు. తిమ్మప్పపై ద్వేషం పెంచుకున్న అబ్రహం ఎలాగైనా అడ్డు తొలగించాలనే ఉద్దేశంతో ఈ నెల 4వ తేదీన మద్యం తాగుదామని ఫోన్ చేసి రమ్మన్నాడు. బల్గెర గ్రామానికి చేరుకొని ఇద్దరు కలసి అక్కడే మద్యం కొనుగోలు చేసి రెండు బైకులపై ముసల్మాన్దొడ్డి అటవీ ప్రాంతం వైపునకు వెళ్లారు. నిర్మానుష ప్రాంతంలో మద్యం సేవించారు. ఈ నేపథ్యంలో అబ్రహం బండరాయితో మద్యం మత్తులో కూర్చన్న తిమ్మప్ప తలపై వెనుక నుంచి బలంగా మోదాడు. దాడిలో మృతుడు తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం అబ్రహం మృతుడి సెల్ఫోన్ తీసుకొని మాచర్ల గ్రామ శివారులోని చెరువులో పడేసి వెళ్లిపోయాడు. మృతుడి సెల్ఫోన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన క్రమంలో నేరస్తుడు అబ్రహంగా గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. నేరస్తుడుని గుర్తించేందుకు రెండు బృందాలచే గాలింపు చర్యలు చేపట్టిన క్రమంలో అబ్రహం అయిజ చౌరస్తా సమీపంలో బైక్పై వెళ్తున్నట్లు సమాచారం మేరకు శనివారం ఉదయం అదుపులోకి తీసుకుని విచారించగా తిమ్మప్పను హత్య చేసినట్లు నేరం అంగీకరించాడన్నారు. నిందితుడు నుంచి బైక్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని సీజ్ చేసి గద్వాల కోర్టులో హాజరుపరచి రిమాండ్కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుడుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హత్య కేసులో ఒక్కడే ఉన్నాడ లేక ఇతరులు ఉన్నారనే అంశాలపై విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సీఐ శ్రీను, ఎస్ఐ కేటీ మల్లేష్, సిబ్బంది పాల్గొన్నారు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ మొగిలయ్య -
బాలుడి ప్రాణం తీసిన వాటర్ హీటర్
ఖిల్లాఘనపురం: ఇంట్లో ఆడుకుంటూ వాటర్ హీటర్ వైరు పట్టుకున్న బాలుడు విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన ఘటన ఖిల్లాఘనపురం మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఖిల్లాఘనపురం గ్రామానికి చెందిన సింగనమోని వెంకటేశ్, సరిత దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు చైతన్యరామ్ (10) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం ఇంటి వద్ద ఉండగా.. రోజు మాదిరిగానే పిల్లల స్నానానికి వేడి నీటి కోసం సరిత వాటర్ హీటర్ పెట్టింది. ఇంట్లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వాటర్ హీటర్ వైరును చైతన్యరామ్ పట్టుకోవడంతో విద్యుత్ షాక్కు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు అడ్డాకుల: మూసాపేట మండలం జానంపేట సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. బాధితుల వివరాల ప్రకారం.. గద్వాలకు చెందిన వీరశేఖర్, రంగన్న ద్విచక్రవాహనంపై మహబూబ్నగర్ నుంచి గద్వాలకు వెళ్తున్నారు. జానంపేట వద్ద అదే గ్రామానికి చెందిన లక్ష్మయ్య ద్విచక్ర వాహనంపై రాంగ్రూట్లో వచ్చి వీరశేఖర్, రంగన్న బైక్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలపై ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. ఇందులో లక్ష్మయ్య, వీరశేఖర్కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. లక్ష్మయ్య రాంగ్రూట్లో వచ్చి ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
ఊరెళ్తున్నారా.. జర జాగ్రత్త!
మహబూబ్నగర్ క్రైం: సంక్రాంతి పండగ నేపథ్యంలో నేటి నుంచి ఈనెల 18 వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ క్రమంలో నగరంతో పాటు పట్టణాల్లో ఉండే చాలా మంది గ్రామీణా ప్రాంతాలకు, యాత్రల పేరుతో ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇదే అదునుగా చోరులు ఇంటికి కన్నం వేస్తుంటారు. పేద, మధ్య తరగతి ప్రజలు కష్టపడి దాచుకున్న బంగారం.. అవసరాలకు కూడబెట్టుకున్న నగదును ఒక్కరాత్రిలో దోచుకుపోతే వారి బాధ వర్ణణాతీతం. ఆటో ద్వారా ప్రచారం: నగరంలో దొంగతనాలపై ప్రజలను అప్రమత్తం చేయడానికి టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్ ఆధ్వర్యంలో ఆటోలకు సూచనలతో కూడిన బ్యానర్స్ ఏర్పాటు చేసి కాలనీలు, వీధుల వెంట తిరుగుతూ కర్రపత్రాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఇంటికి తాళం వేసి వెళ్లే వాళ్లు ఇంట్లో విలువైన వస్తువులు పెట్టొద్దని సూచించారు. అలాగే పోలీస్ శాఖ కూడా నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా కాలనీల్లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కన్పిస్తే డయల్ 100, 112, జిల్లా పోలీస్ కంట్రోల్ రూం 87126 59360 నంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు. దొంగల ఎదురుచూపులు: ఎప్పుడు సెలవులు వస్తాయా.. ఎప్పుడూ ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్తారా..? అవి గమనించే దొంగలు అణువంత అవకాశం దొరికినా ఉన్నదంతా ఊడ్చుకెళ్తారు. పట్టణాల్లో ఎండాకాలం సెలవుల్లోనే చోరీలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ వేసవి సెలవుల్లో ఇప్పటికే చాలా మంది ఇళ్లకు తాళాలు వేసి సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. దొంగలకు ఇది అదనుగా కాకూడదంటే అవసరమైన భద్రత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే తాళం వేసిన ఇళ్లు రాత్రికి రాత్రి లూటీ అవుతాయి. బస్సులో ప్రయాణించేందుకు వెళ్తే ఖరీదైన వస్తువులు మాయమవుతున్నాయి.. బ్యాంకులకు వెళ్తే ముఠాలు నగదుని దోచుకెళ్తున్నాయి. ఇలా ప్రతీ చోటా దొంగలు, దోపిడీ ముఠాల బెడద పెరిగింది. దీంతో పట్టణవాసులు ఒకింత ఆందోళన చెందుతున్నారు. అయితే చోరీల కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నా, ప్రజలు కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ఉత్తమం. రాత్రి పగలు తేడా లేకుండాక్షణాల్లో చోరీలు పోయేది రూ.కోట్లలో స్వాధీనం రూ.లక్షల్లో తక్కువగా రికవరీ శాతం జిల్లా కేంద్రంలో చోరీల పరంపర తాళం వేసిన ఇంటిని వదలని దొంగలు చోరీలు జరుగుతూనే ఉన్నాయి: మహబూబ్నగర్ సబ్ డివిజన్ పరిధిలో చోరీలు జరుగుతూనే ఉన్నాయి. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయినా కూడా గస్తీని పెంచినా దొంగలు తమ పని కానిచ్చేస్తున్నారు. దొంగలు ప్రధానంగా పట్టణ శివారు కాలనీలను, జన సంచారం తక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. ఇన్ని చోరీలు జరుగుతున్నా ప్రజలు ఇప్పటికీ అప్రమత్తంగా వ్యవహారించడం లేదు. చోరీలు జరిగిన తర్వాత ఫిర్యాదులు చేస్తున్నారు తప్పా ముందస్తు జాగ్రత్తలు మాత్రం తీసుకోవడం లేదు. దీంతో చాలా వరకు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. సెలవుల ‘దడ’: ప్రస్తుతం పోలీసుల్లోనూ వేసవి సెలవుల ‘దడ’ పుట్టుకుంది. సెలవుల్లో చాలా మంది తమ ఇళ్లకు తాళాలు వేసి దూర ప్రాంతాలకు వెళ్తుంటారు. ప్రతీ ఒక్కరి దృష్టి పండుగ వేడుకల మీద ఉంటుంది. ఇదే సమయంలో తాళం వేసిన ఇళ్లు లక్ష్యంగా దొంగలు రెచ్చిపోయే అవకాశం లేకపోలేదు. గతంలో ఈ సీజన్లో దొంగతనాలు కేసులు భారీగా నమోదయ్యాయి. రోజురోజుకూ నేరగాళ్ల సంఖ్య పెరుగుతుండటంతో వారిని గుర్తించడం పోలీసులకు తలనొప్పిగా మారింది. -
నేడు బీసీ సామాజిక న్యాయసభ
మెట్టుగడ్డ: 42శాతం బీసీ రిజర్వేషన్ల సాధన – 9వ షెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్తో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం బీసీ సామాజిక న్యాయసభను నిర్వహిస్తున్నట్లు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు రమేశ్గౌడ్ ప్రకటనలో తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఫౌండర్ చైర్మన్ చిరంజీవులు, మాజీ సుప్రీం కోర్టు జడ్జి జస్టీస్ ఈశ్వరయ్య, వి శారదన్ మహారాజ్, సంగెం సూర్యారావు పా ల్గొంటున్నట్లు తెలిపారు. కావున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీలు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. కేటీఆర్ సభ ఏర్పాట్ల పరిశీలన జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఈనెల 12వ తేదీన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఎంబీసీ మైదానంలో బహిరంగసభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. సభా వేదిక, పార్కింగ్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ తరఫున గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డుమెంబర్లను కేటీఆర్ సన్మానిస్తారని పేర్కొన్నారు. సభకు నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, పట్టణ అధ్యక్షుడు శివరాజు, మున్నూరురాజు, ప్రభాకర్, వర్ధభాస్కర్, కిషన్, రమేష్, సత్తి, తదితరులు పాల్గొన్నారు. రోడ్డు నిబంధనలు పాటించాలి అడ్డాకుల: ప్రతిఒక్కరూ రోడ్డు నిబంధనలను పాటించాలని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. అడ్డాకుల మండలం శాఖాపూర్ టోల్ప్లాజా వద్ద శనివారం 37వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా ద్విచక్ర వాహనదారులతో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా తలకు హెల్మెట్ ధరించాలని చెప్పారు. రోడ్డు నిబంధనలను పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని కోరారు. రాంగ్రూట్లో వాహనాలను నడుపొద్దని సూచించారు. సెల్ఫోన్లో మాట్లాడుతూ, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయరాదన్నారు. కారులో ప్రయాణించే వారు తప్పకుండా సీటుబెల్టు పెట్టుకోవాలని చెప్పారు. అతివేగం ప్రమాదాలకు కారణమవుతుందన్నారు. రోడ్డు నిబంధనలను పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్ఫెక్టర్ ప్రవీణ్కుమార్, ఎస్ఐ శ్రీనివాస్, ప్రాజెక్టు హెడ్ అరుణ్కుమార్, ప్లాజా మేనేజర్ కార్తీక్, వివిధ విభాగాల ఇన్చార్జిలు కిశోర్రెడ్డి, రఘునందన్గౌడ్, సురేందర్రెడ్డి తదితరులు ఉన్నారు. వేరుశనగ క్వింటా రూ.8,641 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో శనివారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.8,641, కనిష్టంగా రూ.6,495 ధరలు లభించాయి. ధాన్యం ఆర్ఎన్ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,759, కనిష్టంగా రూ.1,601, హంస రూ.1,929, కందులు గరిష్టంగా రూ.6,921, కనిష్టంగా రూ.5,116, పత్తి గరిష్టంగా రూ.7,599, కనిష్టంగా రూ.5,699, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,965, కనిష్టంగా రూ.1,761, ఉలువలు గరిష్టంగా రూ.4,250, కనిష్టంగా రూ.4,202, మినుములు గరిష్టంగా రూ.8,150, కనిష్టంగా రూ.7,999 ధరలు లభించాయి. దేవరకద్రలో కందులు గరిష్టంగా రూ.6,759గా ఒకే ధర నమోదయ్యాయి. -
సీఎంకురుణపడి ఉంటాం
గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూర్ మండలం కొత్తపల్లి మధ్యనున్న కృష్ణానదిపై వంతెన నిర్మిస్తారని చిన్నతనం నుంచి వింటున్నా. ప్రస్తుతం నిర్మాణానికి అడుగులు పడగా.. తాత్కాలిక రోడ్డు పనులు పూర్తయి గ్రామం మీదుగా రాకపోకలు కొనసాగుతుండటంతో ఆనందంగా ఉంది. ఏళ్లనాటి కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రుణపడి ఉంటాం. – మహేశ్వర్రెడ్డి, మాజీ సర్పంచ్, కొత్తపల్లి (గద్వాల) సందడిగా మారింది.. మా ఊరి మీదుగా ఆత్మకూర్, గద్వాలకు వాహనాలు తిరుగుతుంటే సందడిగా మారింది. గతంలో మా గ్రామంవైపు కన్నెత్తి చూడనివారు సైతం ఊరి మీదుగా ప్రయాణం చేస్తున్నారు. ఊరి రూపురేఖలు మారడం ఖాయం. – నర్సింహ, సర్పంచ్, జూరాల (ఆత్మకూర్) రెండేళ్లలో నిర్మాణం పూర్తి.. కృష్ణానదిపై హైలేవల్ వంతెన నిర్మాణ పనులు రెండేళ్లలోపు పూర్తిచేసేలా ముందుకు సాగుతున్నాం. ఇందులో భాగంగా మొదట తాత్కాలిక రోడ్డు నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చాం. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్ట్ కంపెనీ పనులు వేగంగా కొనసాగిస్తోంది. – దేశ్యానాయక్, ఈఈ, ఆర్అండ్బీ ● -
నేటినుంచి టీ–20 రెండోదశ పోటీలు
● హాజరుకానున్న పదిజట్లు, ఐదు లీగ్ మ్యాచ్లు ● 13న తలపడనున్న మహబూబ్నగర్–నిజామాబాద్ జట్లు మహబూబ్నగర్ క్రీడలు: కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ జిల్లాల టీ–20 లీగ్ రెండో ఫేజ్ పోటీలు తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు రెండో ఫేజ్ పోటీలకు మహబూబ్నగర్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆదివారం నుంచి ఈనెల 13వ తేదీ వరకు పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని ఎండీసీఏ మైదానంలో టీ–20 లీగ్ పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఆధ్వర్యంలో అన్నిఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజులపాటు ఆయా జిల్లాల క్రీడాకారులకు మైదానంలో టిఫిన్, భోజన సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు. ఎండీసీఏ మైదానంలో ఏర్పాటు చేసిన టర్ఫ్ వికెట్పై ఇతర జిల్లాల జట్ల మ్యాచ్లు జరగనున్నాయి. మైదానంలో ఏర్పాటు చేసిన సైడ్ స్క్రీన్లు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పది జట్లు, ఐదు లీగ్ మ్చాచ్లు ఎండీసీఏ మైదానంలో జరిగే కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ జిల్లాల టీ–20 లీగ్ రెండో ఫేజ్ పోటీలకు మహబూబ్నగర్ జట్టుతోపాటు మెదక్, రంగారెడ్డి, ఆదిలాబాద్, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్ జట్లు పాల్గొంటున్నాయి. మూడు రోజులపాటు ఐదు లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. ఆదివారం ఉదయం 9 గంటలకు మెదక్–రంగారెడ్డి, మధ్యాహ్నం ఒంటిగంటకు ఆదిలాబాద్–హైదరాబాద్, 12న ఉదయం 9గంటలకు వరంగల్–ఖమ్మం, మధ్యాహ్నం కరీంనగర్–నల్గొండ, 13న ఉదయం 9 గంటలకు మహబూబ్నగర్–నిజామాబాద్ జట్లు తలపడనున్నాయి. మ్యాచ్ల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ జిల్లాల టీ–20 లీగ్ రెండో ఫేజ్ పోటీల్లో కొన్ని మ్యాచ్లను మహబూబ్నగర్ ఎండీసీఏ మైదానంలో నిర్వహించే అవకాశం కల్పించినందుకు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. మైదానంలో ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. మ్యాచ్ల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పోటీలను పురస్కరించుకొని పలువురు హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కోచ్లు అబ్దుల్లా, ముఖ్తార్అలీ, క్యూరెటర్ సత్యనారాయణ యాదవ్, సీనియర్ క్రీడాకారుడు రంజిత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పెద్ద పులులు.. వన్యప్రాణులు
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో అటవీ అధికారులు టైగర్ సఫారీ ద్వారా పెద్ద పులులు, చిరుతలు, ఇతర వన్యప్రాణులు, అడవి అందాలను వీక్షించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. నల్లమలలో 34 వరకు పెద్ద పులులు, వందకుపైగా చిరుతలు, ఎలుగుబంట్లు, వందల సంఖ్యలో జింకలు, దుప్పులు, మనుబోతులు, అడవి పందులు, అడవి కుక్కలు తదితర వన్యప్రాణులు ఉన్నాయి. టైగర్ సఫారీ వాహనంలో ప్రయాణించే సందర్శకులకు తరచుగా వన్యప్రాణులు కనిపిస్తున్నాయి. ఇటీవల 20 రోజుల వ్యవధిలోనే సందర్శకులకు మూడుసార్లు పెద్ద పులులు కనిపించాయి. ఎలుగుబంట్లు, జింకలు, మనుబోతులు ఇక్కడికి వస్తున్న సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. నల్లమలను సందర్శించాలనుకునే పర్యాటకులు అటవీశాఖ టైగర్ స్టే ప్యాకేజీతోపాటు జంగిల్ సఫారీ ట్రిప్ను అందిస్తోంది. సఫారీ వాహనంలో ప్రయాణించాలనుకునే సందర్శకులు హైదరాబాద్– శ్రీశైలం రహదారిలో ఉన్న ఫర్హాబాద్ గేటు వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. -
పుచ్చ సాగుకు సమయమిదే
కాయ కోత: పక్వానికి వచ్చిన కాయలను సాయంత్రం వేళల్లో కోసి ఉదయం రవాణా చేయాలి. కాయలను తడితే డొల్ల శబ్దం వస్తే కాయ పక్వానికి వచ్చిందని గుర్తుంచుకోవాలి. సస్యరక్షణ: పుచ్చ సాగుకు ప్రధానంగా తామర పురుగు ఆశించి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు ముడుచుకుంటాయి. దీన్ని నివారణకు పిప్రోనిల్ 2 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అదే విధంగా ఆల్టర్నేరియా మచ్చతెగులు నివారణకు కార్బండిజమ్ 1 గ్రాము లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అలంపూర్: వర్షాభావ పరిస్థితుల్లో తక్కువ నీటితో పుచ్చసాగు చేసుకునే అవకాశం ఉంటుంది. సరైన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు, కొద్దిపాటి మెళకువలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. పుచ్చసాగుకు సంబంధించి రైతులకు పలు విషయాలను వివరించారు. నేలలు.. వాతావరణం: పుచ్చకాయ పక్వానికి వచ్చినప్పుడు అధిక ఉష్ణోగ్రతలు ఉంటే మంచి రుచి, నాణ్యత వస్తోంది. 23 నుంచి 27 డిగ్రీల ఉష్ణోగ్రతతో కూడిన తేమ వాతావరణం అనుకూలం. మురుగునీరు ఇంకిపోయే వసతి గల ఇసుక, బంకమట్టి నేలలు పుచ్చకాయ పంటకు అనుకూలంగా ఉంటాయి. చౌడు, ఉప్పు నేలలు సాగుకు పనికిరావు. రకాల ఎంపిక: అర్యజ్యోతి, అర్య మానిక్, షుగర్ బేబి, అపర్ణ, మధుబాల, మోహిన వంటి రకాలే కాకుండా ప్రైవేటు సంస్థల సంకర విత్తనాలను విత్తుకోవచ్చు. ఎన్ని విత్తనాలు అవసరం: హైబ్రిడ్ విత్తనాలు అయితే ఎకరాకు 300 గ్రాములు, మేలు రకాలైతే ఎకరాకు 600 నుంచి 1000 గ్రాముల వరకు అవసరం ఉంటుంది. జనవరిలో ఈ పంట విత్తేందుకు అనుకూలం నాటే విధానం: విత్తనం నాటే ముందు భూమిని నాలుగైదు సార్లు బాగా దున్ని భూ సారం మేరకు 8 నుంచి 10 అడుగుల దూరంలో 2 అడుగుల వెడల్పులో నీటి కాల్వలను తయారు చేయాలి. లోపలివైపు రెండు వైపులా రెండు అడుగుల దూరంలో విత్తనాలు వేసుకోవాలి. విత్తే ముందు రోజు నీరు పెట్టాలి. ఎరువుల యాజమాన్యం: విత్తనాలు వేయడానికి ముందు ఎకరాకు నాలుగు టన్నుల పశువుల ఎరువు లేదా టన్ను వానపాముల ఎరువులు, 150 కిలోల సూపర్, 40 కిలోల పొటాష్, 25 కిలోల యూరియా వేయాలి. 30 రోజుల తర్వాత పైపాటుగా 25 కిలోల యూరియా అందించాలి. పూత, పిందె సమయాల్లో 60 కిలోల కాల్షియం, అమ్మోనియం, సల్ఫేట్ మొక్క మొదలుకు ఇరువైపు గోతి తీసి ఎరువులు వేసి మట్టి కప్పాలి. తీగలు పాకే సమయంలో తల తుంచి సూక్ష్మ ధాతువులు మొక్కలకు అందేలా 4 గ్రాముల ఎఫ్–4 లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే తీగలు సాగి నాణ్యమైన దిగుబడులు వస్తాయి. నీటి యాజమాన్యం: పంట ప్రథమ దశలో వారం రోజుల వ్యవధిలో నీటితడి ఇవ్వాలి. తర్వాత వాతారణం, భూమి స్వభావం మేరకు 5 నుంచి 7 రోజులకు ఒకసారి తడి ఇవ్వాలి. పూత వచ్చే సమయంలో నీరు ఆపి.. కొంచెం బెట్ట పరిస్థితులు కల్పించాలి. ఆ తర్వాత నీరు అందిస్తే పూత బాగా వచ్చి ఆడ పూల శాతం పెరుగుతుంది. కాయ ఎదిగేటప్పుడు నీటి ఎద్దడి లేకుండా చూడాలి. కాయలు పక్వానికి వచ్చిన తర్వాత నీరు ఎక్కువగా ఇస్తే కాయలు పగిలే అవకాశం ఉంది. పాడి–పంట యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలతో నాణ్యమైన దిగుబడి -
చైన్స్నాచింగ్ కేసులో నిందితుల అరెస్టు
నర్వ: 2024 ఏడాదిలో బైక్పై వచ్చి మహిళ మెడలో బంగారు గొలుసును అపహరించిన చైన్స్నాచింగ్ కేసులో ముగ్గురు నిందితులను నర్వ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ పబ్బతి రమేశ్ కథనం ప్రకారం.. 9అక్టోబర్ 2024లో 24గ్రాముల బంగారు గొలుసును బైక్పై వచ్చి లాక్కొని పరారైన కేసులో రాజుపల్లికి చెందిన జయప్రద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పేర్కొన్నారు. నమ్మదగిన సమాచారం మేరకు సుధీర్ఘ దర్యాప్తు అనంతరం మహిళలను లక్ష్యంగా చేసుకొని బైక్పై వచ్చి బంగారు గొలుసులను అపహరిస్తున్న ముగ్గురు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇందులో అమరచింత మండల నాగల్కడ్మూర్కు చెందిన ఏ–1 కుర్వరాములు, ఏ–2 గట్టు వెంకటేశ్, ఏ–3 డ్యాం వెంకటేశ్ ఉన్నారు. వీరిని ఆదివారం పోలీస్కస్టడీలోకి తీసుకొని నారాయణపేట కోర్టులో హాజరుపర్చామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎలాంటి అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలన్నారు. దీపం మంటలు వ్యాప్తి చెంది ఇల్లు దగ్ధం మహబూబ్నగర్ క్రైం: వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం కృష్ణవేణి అనే మహిళ ఇంట్లో ఉదయం పూజ చేసి దీపం పెట్టి కూలీ పనికి వెళ్లింది. ఆ తర్వాత దీపం ద్వారా ఇంట్లో మంటలు వ్యాప్తిచెంది ఇంట్లో ఉన్న దుస్తులు, వంట సామగ్రి, వస్తువులు ఇతర గృహోపకరాలు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకుని మంటలు అదుపు చేసింది. ఇల్లు దగ్ధం కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న కృష్ణవేణి, ఆమె కుమారుడికి వన్టౌన్ సీఐ అప్పయ్య నెలరోజులకు ఉపయోగపడే నిత్యావసర వస్తువులు, వంట సామగ్రి, ఇతర వస్తువులను డీఎస్పీ వెంకటేశ్వర్లు చేతులమీదుగా అందించారు. చెరువులో మహిళ మృతదేహం లభ్యం నాగర్కర్నూల్ క్రైం: గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటన జిల్లా కేంద్రంలోని కేసరిసముద్రం చెరువులో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ గోవర్ధన్ తెలిపిన వివరాలు.. కేసరిసముద్రం చెర్వు బతుకమ్మ ఘాట్ వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని జనరల్ ఆస్పత్రికి తరించారు. మృతురాలి వయస్సు 50 ఏళ్లు ఉంటుందని ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని పోలీసులు పేర్కొన్నారు. పందిని తప్పించబోయి ఆటోబోల్తా.. ● ఇద్దరికి తీవ్రగాయాలు గోపాల్పేట: గ్రామంలో రోడ్డుకు అడ్డంగా వచ్చిన పందిని తప్పించబోయి ఓ ఆటో బోల్తా కొట్టగా ఇద్దరు వృద్ధులు గాయాలపాలైన ఘటన చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. ఏదుల మండలంలోని మాచుపల్లికి చెందిన ఆటో ఉదయం 9 గంటల ప్రాంతంలో మాచుపల్లి నుంచి ఏదుట్ల, గోపాల్పేట మీదుగా వనపర్తి వెళ్తోంది. గోపాల్పేట సబ్స్టేషన్ దాటి రాంనగర్ కాలనీసమీపంలో వెళ్తుండగా ఓ పంది రోడ్డుపైకి వచ్చింది దీంతో ఆటోడ్రైవర్ పందిని తప్పించేందుకు ప్రయత్నించగా ఆటోబోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఇద్దరు వృద్ధులు తీవ్రంగా గాయపడ్డారు. ఇంతలోనే ఎదురుగా వచ్చిన ఓ ద్విచక్రవాహనం సైతం ఆటోను ఢీకొట్టి ద్విచక్రవాహనం నడిపిన వృద్ధుడు సైతం కిందపడిపోయాడు. ఆటో ఇంజిన్ బంద్కాకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతం మొత్తం పొగతో నిండిపోయింది. కింద పడిన ఇద్దరు వృద్ధులకు తలకు, కాళ్లు, చేతులకు రక్తగాయాలయ్యాయి. అనంతరం ఇద్దరిని వెంటనే గోపాల్పేట పీహెచ్సీకి తరలించా రు. పందుల వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని పాలకులు, అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
ప్రపంచ సంపద కార్పొరేట్ చేతుల్లో
నారాయణపేట: వెనిజువేలా మాజీ అధ్యక్షుడు మదురోను అక్రమంగా ఎత్తుకెళ్లడం ఒక సార్వభౌమాధికారం కలిగిన దేశంపై దౌర్జన్యంగా వ్యవహరించడం అన్యాయమని, ప్రపంచ పోలీసులా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్సార్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో సీపీఎం విస్తృత స్థాయి జిల్లా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ఉక్రెయిన్, రష్యా, పాలస్తీనా ఇజ్రాయిల్ తదితర యుద్ధాలకు అమెరికన్ కారణమవుతుందని, ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంది అమెరికానేనన్నారు. యుద్ధాలను ప్రేరేపించడం, ఆయుధాలను అమ్ముకోవడం, కార్పొరేట్ అనుకూల విధానాలు అమలు చేయడం ట్రంప్ విధానాలుగా ఉన్నాయన్నారు. ప్రపంచంలో నిరుద్యోగం, దరిద్రం, ఆకలి ఒకవైపు పెరిగిపోతుండగా, మరోవైపు ప్రపంచ సంపద అంతా కొద్ది మంది బడా కార్పొరేట్ శక్తుల్లో కేంద్రీకృతమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడిదారీ విధానాలు శాంతి, సౌభాగ్యాలను కాపాడలేవన్నారు. బ్రిటిష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా పోరాడిన వీరోచిత వారసత్వం కలిగిన దేశం భారతదేశమని, కానీ నేడు మన ప్రధాని మాత్రం ప్రపంచ పోలీసులా వ్యవహరిస్తున్న ట్రంప్ విధానాలను ఖండించడం లేదని విమర్శించారు. మోదీ బడా కార్పొరేట్ అనుకూల విధానాలు అవలంభిస్తూ కార్మిక, కర్షక, కూలీల వ్యతిరేక విధానాలను గౌరవిస్తుందని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు జీ రాంజీ బిల్లును తెచ్చారన్నారు. స్వాతంత్య్రం పూర్వం నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలన్నిటినీ యజమానులకు అనుకూలంగా మార్చేందుకు నాలుగు కార్మిక కోడ్లు తెచ్చారని మండిపడ్డారు. అదే విధంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సాగర్ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం పార్టీ సమరశీలంగా పోరాటం చేస్తుందన్నారు. దేశంలో పలువురు మతోన్మాద విధానాలు అవలంభిస్తూ ఆర్ఎస్ఎస్ విధానాలను తీసుకొస్తున్నారన్నారు. కేంద్రంలో పరిపాలిస్తున్న పాలకులకు లౌకిక రాజ్యమన్న సోషలిజం అన్న నచ్చడం లేదని అందుకే భారత రాజ్యాంగంలో లౌకిక సోషలిస్ట్ పదాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. చివరికి రాజ్యాంగాన్ని మార్చి అసమానతల కూడుకున్న మనధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సీపీఎం పార్టీ మద్దతుతో నూతంగ ఎన్నికై న నలుగురు సర్పంచులను ఎర్ర కండువాలతో అభినందించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రాంరెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గోపాల్, అంజిలయ్యగౌడ్, బల్రాం, పుంజనూర్ ఆంజనేయులు, కాశప్ప, జోషి పాల్గొన్నారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్వెస్లీ విమర్శ -
ప్రకృతి ఒడి.. పరవశించే మది
ఆక్టోపస్ వ్యూపాయింట్ నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో అటవీశాఖ చేపట్టిన టైగర్ స్టే ప్యాకేజీ, టైగర్ సఫారీలకు విశేష స్పందన లభిస్తోంది. సాధారణం కన్నా శని, ఆదివారాలతోపాటు సెలవు రోజుల్లో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. హైదరాబాద్, ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత రెండు నెలల వ్యవధిలో సుమారు 8 సార్లు పెద్ద పులి కనిపించడం విశేషం. జంగిల్ సఫారీలో నిత్యం పర్యాటకులకు పులులతోపాటు చిరుతలు, వన్యప్రాణులు తారసపడుతూ కనువిందు చేస్తున్నాయి. దీంతో అటవీశాఖ అమలుపరుస్తున్న టైగర్ స్టే ప్యాకేజీతోపాటు జంగిల్ సఫారీ కోసం పెద్దసంఖ్యలో సందర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు.రెండు రోజులపాటు.. పర్యాటక ప్రియులను ఆకర్షిస్తున్న నల్లమల టూరిజం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఫర్హాబాద్, ఆక్టోపస్ వ్యూపాయింట్లు జంగిల్ సఫారీలో పెద్ద పులులు, ఇతర వన్యప్రాణుల కనువిందు వారాంతాలు, సెలవు రోజుల్లో విశేషంగా పెరుగుతున్న ఆదరణ రెండు రకాల ప్యాకేజీల్లో అవకాశం కల్పిస్తున్న అటవీశాఖ సఫారీ టూర్ కోసం పర్యాటకులు (amrabadtigerreserve.com) వెబ్సైట్ను సందర్శించి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. -
మట్టి తరలింపును అడ్డుకున్న పోలీసులు
చిన్నచింతకుంట: మండలంలోని ఉంద్యాలలో శనివారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు గ్రామస్తులు మట్టిని తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా మట్టిని అక్రమంగా ట్రాక్టర్లలో తరలిస్తున్నట్లు గుర్తించి.. పోలీస్స్టేషన్కు తరలించేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్దఎత్తున అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు. గ్రామంలోని ప్రధాన రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కోట్ల ఆంజనేయులు, ఉపసర్పంచ్ బండారు యోన, బీఆర్ఎస్ నాయకుడు చంద్రాయుడు మాట్లాడుతూ.. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు మట్టి, ఇసుక అందించకపోవడంతో మధ్యలోనే నిర్మాణాలు నిలిచిపోయాయని తెలిపారు. ఇళ్ల బేస్మెంట్లు పూడ్చేందుకు మట్టి అవసరమని వారం రోజుల క్రితం అధికారులను సంప్రదిస్తే స్పందించడం లేదన్నారు. దీంతో చేసేదేమీ లేక గ్రామ శివారులోని రైతు పొలం నుంచి మట్టిని తరలిస్తుండగా.. పోలీసులు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పోలీసులు మట్టి ట్రాక్టర్లను వదిలిపెడితేనే ఆందోళన మిరమిస్తామని భీష్మించారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ ఎల్లయ్య గ్రామానికి చేరుకొని మట్టి తరలింపునకు అనుమతులు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆందోళనకు దిగిన గ్రామస్తులు -
ప్రాణం తీసిన.. బైక్ సరదా
కల్వకుర్తి టౌన్: ముక్కుపచ్చలారని వయస్సులో బైక్ నడపాలన్న సరదా.. అతివేగంగా దూసుకెళ్లడంతో ఓ బాలుడి నిండు ప్రాణం బలితీసుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కొడుకు అకాల మృతి.. ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చింది. ఈ విషాదకర ఘటనకు సంబంధించి వివరాలు ఏఎస్ఐ శ్రీనివాసులు కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని గాంధీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న రఘుపతి పెయింటింగ్ పని, సునీత ఇంట్లోనే టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి ఒక్కగానొక్క కుమారుడు సాయి ప్రణీత్(13) స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో శనివారం ఉదయం గాంధీనగర్ నుంచి తన ఉన్న సైకిల్ తీసుకొని వరుసకు మామ అయిన వారి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఉన్న బైక్ తీసుకొని తిరిగి ఇంటికి బయలుదేరిన వికాస్ కొద్దిసేపటికే ఎక్సలెంట్ స్కూల్ వద్దకు రాగానే, వేగాన్ని నియంత్రించలేక బైక్ను ఓ ఇంటి ర్యాంపు పై ఎక్కించి అక్కడే ఉన్న బెంచీని ఢీకొని పక్కనే ఉన్న మురుగుకాల్వలో పడి తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని బాలుడి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకున్న తల్లి ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడన్న విషయం తెలిసి సొమ్మసిల్లి పడిపోగా ఆమెకు అక్కడే ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ ఘటనపై బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అతివేగంగా వెళ్లి కిందపడటంతో బాలుడి దుర్మరణం -
ప్రజల ‘ఉపాధి’ని కాలరాస్తున్న బీజేపీ
స్టేషన్ మహబూబ్నగర్: దేశంలోని బడుగు, బలహీనవర్గాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో 2005లో యూపీఏ ప్రభుత్వం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొస్తే ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నదని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టంలో మార్పులు తీసుకొచ్చి ప్రజల ఉపాధి హక్కును కాలరాస్తున్నదని విమర్శించారు. ఉపాధి హామీ చట్టంలో మహాత్మాగాంధీ పేరును తొలగించడం సరికాదన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 20నుంచి 30వరకు జిల్లాలోని 423 గ్రామాల్లో పర్యటించి ఈ చట్టాన్ని యాథావిధిగా అమలు చేసేలా గ్రామసభలు నిర్వహిస్తామని తెలిపారు. ఉపాధి హామీ చట్టంలో జరుగుతున్న అన్యాయం గురించి ప్రజలకు తెలియజేయడానికి సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలో పర్యటనలు చేస్తారని, అందులో భాగంగా వచ్చే నెల 3న లక్షమందితో మహబూబ్నగర్ నుంచే సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో టీజీఎంఎఫ్సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, నాయకులు చంద్రకుమార్గౌడ్, వినోద్కుమార్, ఎన్పీ.వెంకటేశ్, దుష్యంత్రెడ్డి, లింగంనాయక్, సీజే బెనహర్ తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ -
ఒకే ఊరు.. మూడు పేర్లు
మదనాపురం: కాలచక్రం తిరుగుతున్న కొద్దీ మనుషుల జీవనశైలే కాదు.. ఊర్ల పేర్లు, ఉనికి కూడా మారుతుంటా యి. అందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది మదనాపురం మండలంలోని నిలివిడి. ఒకే గ్రామ పంచాయతీ కానీ.. మూడు పేర్ల చరిత్ర ఈ ఊరి సొంతం. ఈ విచిత్ర పరిణామం వెనుక తరాల చరిత్ర, వలసల గాథ దాగి ఉంది. కాలగర్భంలో నెల్లూరు.. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని నెల్లూరు అని పిలిచే వారు. పాత తరం నోళ్లలో ఇప్పటికీ ఆ పేరు నానుతూనే ఉంది. అయితే కాలక్రమేణా ఆ ఉచ్చారణ మారి నిలివిడిగా స్థిరపడింది. సుమారు 1500 జనాభా, 930 మంది ఓటర్లతో కళకళలాడే ఈ గ్రామంలో మెజార్టీ ప్రజలు రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. వ్యవసాయం, కూలీ పనులే వీరి ప్రధాన జీవనాధారం. గ్రామస్తులు ఏమంటున్నారంటే.. తమ చిన్నతనంలో పెద్దలు ఊరిని నెల్లూరు అని పిలిచేవారని గ్రామస్తులు తెలిపారు. అయితే ప్రభు త్వ రికార్డులు, వాడుకలో అది నిలివిడిగా మారిపోయిందని పేర్కొంటున్నారు. పేరు ఏదైనా ఈ మట్టి తమకు ప్రాణమని.. తాము ఇక్కడే పుట్టి పెరిగామని.. ఊరు పెరిగి రెండుగా చీలిపోయినా తమ బంధాలు మాత్రం అలాగే ఉంటాయంటున్నారు. లక్ష్మీపురం కాలనీ నెలివిడి గ్రామం కొత్త కాలనీకి లక్ష్మీపురం పేరు.. గ్రామ చరిత్రలో 2000వ సంవత్సరం ఒక మైలురాయి. గ్రామంలోని కొందరు తమ పొలం పనుల అవసరాల కోసం, రవాణా సౌకర్యాల కోసం ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఆత్మకూర్, కొత్తకోట ప్రధాన రహదారి వద్దకు మకాం మార్చారు. అలా వెళ్లిన వారు అక్కడ కొత్త కాలనీని ఏర్పాటు చేసుకున్నారు. భవిష్యత్పై నమ్మకంతో లక్ష్మీపురం అని నామకరణం చేసుకున్నారు. నేడు నిలివిడి అంటే తెలియని వారు కూడా లక్ష్మీపురం అంటే గుర్తుపట్టేలా ఆ కాలనీ అభివృద్ధి చెందింది. -
తాజాగా ఏసీబీకి చిక్కిన డీఎం
వనపర్తి జిల్లా పౌరసరఫరాల సంస్థ డీఎం జగన్మోహన్ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. కొత్తకోట మండలంలోని ఓ రైస్ మిల్లుకు సంబంధించి సీఎమ్మార్ అనుమతి కోసం రూ.1.70 లక్షలు డిమాండ్ చేశాడు. గురువారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో కలెక్టరేట్లోని తన కార్యాలయం నుంచి బయటకు వెళ్తూ కారులో మిల్లు నిర్వాహకులను ఎక్కించుకుని తొలి విడతగా రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఈ ఘటనతో పౌర సరఫరాల శాఖలో వేళ్లూనుకున్న అవినీతి పర్వం, అధికారుల ధనదాహం మరోసారి వెలుగుచూసినట్లయింది. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: అవినీతికి కేరాఫ్గా నిలిచిన సివిల్ సప్లయ్ శాఖపై ముప్పేట దాడులు కొనసాగుతున్నాయి. ఒకవైపు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, మరోవైపు అవినీతి నిరోధకశాఖ దూకుడు పెంచడంతో అధికార యంత్రాంగం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రధానంగా ఇటీవల వనపర్తి జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎం జగన్మోహన్ రెడ్హ్యాండెడ్గా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం.. ఆ తర్వాత ఆ జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), డీఎస్ఓలను సైతం విచారించడం చర్చనీయాంశంగా మారింది. కలెక్టరేట్ వేదికగా చోటుచేసుకున్న ఈ పరిణామాలు ఉమ్మడి పాలమూరులో సంచలనం సృష్టిస్తున్నాయి. కింది స్థాయి సిబ్బంది నుంచి మొదలు పైస్థాయి దాకా లంచాల్లో వాటాల పంపకాలు నిత్యకృత్యంగా మారాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిల్లర్లతో ‘దోస్తాన్’ దందాతోనే.. మర ఆడిచేందుకు ప్రభుత్వం మిల్లులకు కేటాయించిన సీఎమ్మార్ ధాన్యంలో మిల్లర్ల అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. పెట్టుబడి పెట్టకుండా అవకతవకలకు పాల్పడుతూ బహిరంగ మార్కెట్లో విక్రయిస్తూ అప్పనంగా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమాలను అరికట్టాల్సిన సివిల్ సప్లయ్ శాఖ మిన్నకుండిపోయింది. ప్రధానంగా మిల్లర్ల నుంచి ఆ శాఖకు చెందిన పలువురు సిబ్బంది, అధికారులు కుమ్మకై ్క నెల నెలా లంచాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సహకరించని మిల్లర్లను నానా తిప్పలు పెట్టి దారికి తెచ్చుకున్న ఘటనలు కూడా వెలుగుచూశాయి. ఇలా మిల్లర్లతో పౌర సరఫరాల శాఖ అధికారులు దోస్తాన్ దందాకు తెగబడడంతో ప్రధానంగా వనపర్తిలో పరిస్థితులు మరింత దిగజారాయి. ఈ నేపథ్యంలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్.. ఏసీబీ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. డీఎస్ఓ, అడిషనల్ కలెక్టర్పై విచారణతో.. పౌరసరఫరాల సంస్థ డీఎం జగన్మోహన్ను వల పన్ని పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు తాజాగా శుక్రవారం డీఎస్ఓ కాశీనాథం, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కీమ్యానాయక్ను విచారించడం సంచలనం సృష్టిస్తోంది. ఉదయం కలెక్టరేట్లోని డీఎం కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ అధికారులు వారిని పిలిపించుకున్నారు. సుమారు ఏడు నుంచి పది గంటల వరకు ఇద్దరు జిల్లాస్థాయి అధికారులను విచారించడం ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. పౌర సరఫరాల శాఖలో లంచావతారులు కింది స్థాయి నుంచి పైదాకా వాటాల పంపకాలు? రూ.50 వేలతో రెడ్హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కిన వనపర్తి డీఎం తాజాగా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), డీఎస్ఓలపై విచారణతో కలకలం ఓ వైపు విజిలెన్స్, మరోవైపు అవినీతి నిరోధక శాఖ దాడులు ఉమ్మడి పాలమూరులో అధికారులఉక్కిరిబిక్కిరి -
ఓటరు జాబితాపై ముగిసిన అభ్యంతరాల గడువు
● కార్పొరేషన్కు 254 దరఖాస్తులు ● ఇప్పటివరకు 234 పరిష్కరించిన అధికారులు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముసాయిదా ఓటర్ల జాబితాకు సంబంధించిన అభ్యంతరాల గడువు శుక్రవారంతో ముగిసింది. నగర ప్రజల నుంచి చివరి రోజు 30 దరఖాస్తులు రాగా..మొత్తం 254కు చేరాయి. ఇందులో ఈనెల 2న 26, 3న 48, 4న 24, 5న 46, 6న 39, 7న 13, 8న 28 అందాయి. వీటిలో ఇప్పటివరకు 234 అభ్యంతరాలను మున్సిపల్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం వార్డు ఆఫీసర్లు ఆయా డివిజన్ల వారీగా వాటిని సరిదిద్దారు. మిగిలిన 20 దరఖాస్తులను ఈనెల 10న పూర్తి చేయనున్నారు. మరోవైపు మారిన షెడ్యూల్ను తాజాగా కార్యాలయ నోటీసు బోర్డులో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్కుమార్ రెడ్డి, మేనేజర్ వెంకటేశ్వరరావు సమక్షంలో ఉంచారు. దీని ప్రకారం 12న డివిజన్ల వారీగా ఫొటోలతో ఉన్న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. 13న పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా వివరాలను టీ–పోల్లో అప్లోడ్ చేస్తారు. చివరగా ఈనెల 16న పోలింగ్ కేంద్రాల వారీగా తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు. వీటి వివరాలను కలెక్టరేట్, ఆర్డీఓ, మున్సిపల్ కార్పొరేషన్ తదితర కార్యాలయాలలో అందుబాటులో ఉంచుతారు. ఇక ప్రతి రోజూ ప్రజలు తమ పేర్లు ముసాయిదా ఓటరు జాబితాలో సరిగ్గా ఉన్నాయా? లేవా? అనేది కార్యాలయంలోని రూం నం.2కు వచ్చి చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏమైనా తప్పొప్పులు ఉంటే ఆ వెంటనే అధికారులకు దరఖాస్తులు సమర్పించడం గమనార్హం. -
ఉత్తమ ఫలితాలు సాధించాలి: ఎమ్మెల్యే యెన్నం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: విద్యార్థులు బాగా చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో రిషి విద్యాసంస్థల ఆధ్వర్యంలో ‘లక్ష్యసాధన–2026’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే పదోతరగతి, ఇంటర్ వార్షిక పరీక్షలకు విద్యార్థులు అన్ని విధాలా సన్నద్ధం కావాలన్నారు. రాష్ట్రస్థాయిలో మహబూబ్నగర్ ఫస్ట్ ఉండేలా ముందుకు సాగాలన్నారు. కాగా, విద్యార్థులు లక్ష్యాన్ని ఎలా నిర్ధారించుకోవాలి, అనుసరించాల్సిన విధానాలు, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ తదితర అంశాలపై మోటివేషనల్ స్పీకర్ షఫీ దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో రిషి విద్యాసంస్థల చైర్మన్ వెంకటయ్య, డైరెక్టర్లు ప్రవీణ్కుమార్, మోహన్రెడ్డి, కృష్ణ, శిరీష, పూజిత, సుశాంత్, ప్రిన్సిపాల్స్ వెంకటరమణ, సోమశేఖర్, ప్రసన్నకుమారి, జూనియర్ కళాశాల డీన్స్ భూపాల్రెడ్డి, లక్ష్మారెడ్డి, కల్యాణ్బాబు తదితరులు పాల్గొన్నారు. -
12న పాలమూరుకు కేటీఆర్
● పార్టీ సర్పంచ్, ఉప సర్పంచ్లు,వార్డు సభ్యల సన్మాన కార్యక్రమం ● ఎంబీసీ మైదానంలో బహిరంగ సభ ● మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఈనెల 12వ తేదీన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాలో పర్యటించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ తరఫున గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను కేటీఆర్ సన్మానిస్తారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గా లు అసంతృప్తిలో ఉన్నాయని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికీ అండగా ఉంటామని చెప్పారు. మహబూబ్నగర్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సరిస్తామన్నారు. పురపాలిక ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకు టికెట్ ఇస్తామని చెప్పారు. మరో రెండేళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అనంతరం బహిరంగసభ జరిగే ఎంబీసీ మైదానంలో ఏర్పాట్లను వారు పరిశీలించారు. సభకు పెద్ద మొత్తంలో నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, నాయకులు రహమాన్, బాలరాజు, నరేందర్, కరుణాకర్గౌడ్, దేవేందర్రెడ్డి, గణేష్, కోట్ల నర్సింహ, కొండ లక్ష్మయ్య, శ్రీనివాస్, అనంతరెడ్డి, అన్వర్ పాష, వెదవత్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
13న దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ
మహబూబ్నగర్ రూరల్: ఈనెల 13వ తేదీన జిల్లాలోని దివ్యాంగులు, వయో వృద్ధులకు ఉపకరణాల పంపిణీ చేపట్టనున్నట్లు జిల్లా సంక్షేమాధికారి జరీనా బేగం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2024 అక్టోబర్, 2025 జూన్లో హైదరాబా ద్కు చెందిన అలింకో సంస్థ జిల్లాలోని అర్హులైన దివ్యాంగులు, వయో వృద్ద్ధులకు సులభంగా జీవించడానికి ఉపకరణాల కోసం అసెస్మెంట్ క్యాంపులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఇందులో అర్హత పొందిన దివ్యాంగులు, వయో వృద్ధులకు 13వ తేదీ ఉదయం 9.30 గంటలుకు జిల్లాకేంద్రంలోని మెట్టుగడ్డలోని స్టేట్ హోమ్లో ఉపకరణాలను అందజేస్తారని, అర్హులందరూ హాజరు కావాలని ఆమె సూచించారు. -
ఆల్ఫ్రాజోలం తరలిస్తున్న వ్యక్తుల రిమాండ్
జడ్చర్ల: మండలంలోని నక్కలబండ తండా వద్ద గురువారం రాత్రి ఆల్ఫ్రాజోలం (మత్తు పదార్థం) తరలిస్తుండగా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎకై ్సజ్ సీఐ విప్లవరెడ్డి తెలిపారు. సీఐ కథనం మేరకు.. ఆల్ఫ్రాజోలం తరలిస్తున్నారన్న సమాచారం మేరకు నక్కలబండ తండా వద్ద నిఘా వేసి ఉంచిన సమయంలో కోయిల్కొండ మండలం పెద్దతండాకు చెందిన కొండ్యానాయక్ బైక్పై వెళ్తుండగా తాము తనిఖీ చేసిన సమయంలో అతడి వద్ద 240 గ్రాముల అల్ఫ్రాజోలం పట్టుబడింది. నిందితుడి నుంచి వచ్చిన సమాచారంతో హైదరాబాద్లోని దమ్మాయిగూడెంలో రాంసాగర్, నాగరాజును అదుపులోకి తీసుకుని వారి నుంచి 85 గ్రాముల అల్ఫ్రాజలమ్ను స్వాధీనపర్చుకున్నారు. వీరు ఒక గ్రామును రూ.1000కి జిల్లాలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. వీరివద్ద నుంచి బైక్, మొబైల్ ఫోన్లను స్వాధీనపర్చుకుని నిందితులను శుక్రవారం కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఎస్ఐలు నాగరాజు, కార్తీక్రెడ్డి ఉన్నారు. -
దండిగా నిధులు..
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గత కొన్నేళ్లుగా అనుకున్న స్థాయిలో వసతులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఇంటర్ కళాశాలలపై దృష్టిసారించి వారి అవసరాలకు అనుగుణంగా నిధులను మంజూరు చేయడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పనున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెల 2 నుంచి 21 వరకు సైన్స్ విద్యార్థులకు ప్రభుత్వం ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనుంది. వీటికి సంబంధించి ల్యాబ్స్ నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. వీటితోపాటు కళాశాలల నిర్వహణ, మైనర్ రిపేర్లు, స్కావెంజర్ల వేతనాలు, స్పోర్ట్స్ వంటి వాటికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దీంతో ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోనుంది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 61 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా.. సుమారు 90 వేల మంది మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ల్యాబ్స్ నిర్వహణకు ఒక్కో కళాశాలకు రూ.50 వేలను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటితోపాటు ప్రతి కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ పంపిణీకి రూ.10 వేలు, మరుగుదొడ్ల నిర్వహణకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఒక్కరు లేదా ఇద్దరు స్కావెంజర్స్కు వేతనాలు ఇస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో చాలా వరకు పాత కళాశాలల భవనాలు ఉండడంతో వాటి మైనర్ రిపేర్ల కోసం కూడా నిధులు ఇచ్చారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.5.5 కోట్ల ఇవ్వగా మహబూబ్నగర్ జిల్లాకు రూ.2.03 కోట్లు ఇచ్చారు. ఒక్క బాలికల జూనియర్ కళాశాలకు మాత్రమే రూ.22 లక్షలు కేటాయించింది. జిల్లా కళాశాలలు ల్యాబ్ల స్పోర్ట్స్కు నిధులు నిర్వహణ (రూ.లక్షల్లో..) మహబూబ్నగర్ 15 7.50 1.50 నారాయణపేట 10 5.00 1.00 నాగర్కర్నూల్ 16 8.00 1.60 వనపర్తి 12 6.00 1.20 జో.గద్వాల 8.00 4.00 0.80 ఇంటర్ కళాశాలల ల్యాబ్ల నిర్వహణకు రూ.50 వేలు స్పోర్ట్స్ కోసం రూ.10 వేలు, స్కావెంజర్లకు వేతనాలు మైనర్ రిపేర్ల నిమిత్తం మహబూబ్నగర్కు రూ.2.03 కోట్లు కేటాయింపు ఉమ్మడి జిల్లాలోని 61 కళాశాలల్లో 90 వేల మంది విద్యార్థులు జిల్లాల వారీగా కళాశాలలు, నిధులు ఇలా.. ఇబ్బందులు తీరుతాయి.. వచ్చే నెల 2 నుంచి ప్రాక్టికల్స్ జరగనున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో ల్యాబ్స్ నిర్వహణకు ప్రభుత్వం రూ.50 వేలు ఇచ్చింది. ఇక స్పోర్ట్స్ కోసం ప్రతి కళాశాలకు రూ.10 వేలు, స్కావెంజర్లకు వేతనాలను కూడా ఇస్తుంది. దీంతో కళాశాలల్లో ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికి మొత్తం 21 వేల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. – కౌసర్జహాన్, డీఐఈఓ, మహబూబ్నగర్ -
కందిలో యాజమాన్య పద్ధతులు పాటించాలి
ఇటిక్యాల: కంది పంటకు వేరు కుళ్లు తెగులు ఆశించి మొక్కలు ఎండిపోతున్నాయని, రైతులు జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు సూచించారు. మండల కేంద్రంలో సాగు చేసి కంది పంట ఎండిపోతుండంతో ఆందోళన వ్యక్తం చేసిన రైతులు వ్యవసాయాధికారులకు సమాచారం అందించారు. దీంతో శుక్రవారం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేతల బృందంతో కలిసి మండల వ్యవసాయశాఖ అధికారి రవికుమార్తో క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ కంది పంటకు వేరు కుళ్లు తెగులు కారణంగా పూత, కాయ దశలో మొక్క ఎండిపోవడం, వేర్లు సులువుగా విరిగేలా మారడం, వేర్లపై నల్లటి బొగ్గు లాంటి శిలీంధ్రపు పొడి కనిసిస్తుందన్నారు. ఎండలు, తేమ లోపం ఉన్నప్పుడు వ్యాధి తీవత్ర పంటలో ఎక్కువగా ఉంటుందన్నారు. -
అదృశ్యమైన విద్యార్థిని.. కాల్వలో శవమై తేలింది..
పాన్గల్: మండలంలో అదృశ్యమైన విద్యార్థిని భీమా కాల్వలో శవమై కనిపించిన ఘటన శుక్రవారం చోటు చేసుకుందని ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చింతకుంట గ్రామానికి చెందిన మాసయ్య, ఎల్లమ్మ కుమార్తు జ్యోతి (14) గ్రామంలోని ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. గురువారం తెల్లవారుజామున వాకింగ్కు వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంపై విద్యార్థిని తండ్రి మాసయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యమైందని కేసు నమోదైంది. భీమా కాల్వ ఒడ్డుపై బూట్లు, స్వెటర్ ఉండటంతో భీమా కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకుందనే అనుమానంతో పోలీసులు గాలింపు చేపట్టగా.. శుక్రవారం కాల్వలో కంప చెట్లకు తట్టుకొని విద్యార్థిని మృతదేహం లభించిందని ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. ఇంటి పనులు నేర్చుకోవాలని కుటుంబ సభ్యులు మందలించడంతోనే ఆత్మహత్య చేసుకుందా.. ఇతర కారణం ఏదైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. విద్యార్థిని మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చికిత్స పొందుతూ మహిళ మృతి వంగూరు: వంగూరు మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన స్వాతి (22) చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. వంగూరు ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 6న భర్త పరుశురాములు బైక్పై కూర్చుని తుమ్మలపల్లి నుంచి వంగూరుకు వెళ్తుండగా మార్గమధ్యలో బీపీ అధికమై కిందపడి తలకు గాయమైంది. చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. తల్లి రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి బల్మూర్: మండలంలోని జిన్కుంటకు చెందిన కొండల్(50)చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కొండల్ కొంతకాలంగా భార్యాపిల్లలతో కలిసి జీవనోపాధికై హైదరాబాద్ వలస వెళ్లాడు. వారం క్రితం పనిచేసేందుకు వెళ్తుండగా.. రోడ్డుదాటుతున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య చిట్టెమ్మ, ఇద్దరు సంతానం ఉన్నారు. కుక్కల దాడి.. 55 గొర్రె పిల్లలు మృతి అమరచింత: వ్యవసాయ పొలంలో ఉన్న గొర్రె పిల్లల మందపై కుక్కలు దాడి చేయడంతో 55 గొర్రె పిల్లలు మృత్యువాత పడిన ఘటన తూక్యానాయక్ తండా శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. అమరచింత పట్టణానికి చెందిన ఆర్ఎన్.రాజు, మోసట్ల శ్రీను, మోసట్ల వెంకట్రాములు వృత్తిరీత్యా గొర్రెలను విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో వీరందరూ కలిసి 55 గొర్రె పిల్లలను వారం కిందట కొనుగోలు చేసి పొలంలోనే కంచె వేసి అందులో ఉంచారు. శుక్రవారం మధ్యాహ్నం పొలంలో చొరబడిన కుక్కలు గొర్రెపిల్లలను కొరికి వేయడంతో మృతి చెందాయి. దాదాపు రూ.2.50 లక్షలు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. -
బీచుపల్లిలో భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన పూజలు
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో విశ్వహిందూ పరిషత్ సామాజిక సమరసతా అభియాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిందూర్ కుంకుమ, రుద్రాక్ష అర్చనలు శుక్రవారం కనులపండువగా నిర్వహించారు. ప్రకృతి విపత్తుల బారిన పడకుండా దేశం సుభిక్షంగా ఉండాలని, సైనికుల ఆయురారోగ్యాలు శక్తి సామర్థ్యాలను పెంపొందించడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వందల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా త్రిభాష ప్రవచనకర్త రాఘవేంద్ర ఆచార్యులు ఆలయంలో మొదటగా లలితా పారాయణం, శివ అష్టోత్తర నామావళి, లింగాష్టకం, హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం అర్చకులు కుంకుమ, రుద్రాక్ష అర్చనను వేదమంత్రాల నడుమ వైభవంగా నిర్వహించారు. అర్చనలో పాల్గొన్న భక్తులకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచితంగా కంచి రుద్రాక్ష, అమ్మవారి డాలర్ అందజేశారు. కార్యక్రమంలో వీహెచ్పీ రాష్ట్ర మహిళా కన్వీనర్ శోభారాణి, జిల్లా అధ్యక్షుడు ఫణిమోహన్రావు, అలంపూర్ ధర్మరక్షక్ నర్సింహులు, ఆలయ మేనేజర్ సురేందర్రాజు, అర్చకులు సత్యప్రియ ఆచార్యులు, సత్యప్రకాష్రావు, జయసింహారావు, భక్తులు పాల్గొన్నారు. -
‘బీసీలను మభ్యపెట్టే రాజకీయాలు సరికాదు’
● కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి ● 11న సామాజిక న్యాయ సభ మెట్టుగడ్డ: కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా మభ్యపెడుతుందని బీసీ జేఏసీ చైర్మన్ బెక్కెం జనార్దన్ అన్నారు. బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఇప్పుడు కాలయాపన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ చెల్లని జీఓలు జారీ చేస్తూ బీసీలను మభ్యపెట్టే రాజకీయాలు చేస్తోందని, బిల్లు పెట్టాం కేంద్రానికి పంపించాం అని చెప్పి బాధ్యాతారాహితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్ష ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి 42శాతం రిజర్వేషన్ల బిల్లును తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే తెలంగాణ బంద్ నిర్వహించి బీసీల పట్ల వారికున్న చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. బీసీల రిజర్వేషన్ల అంశాన్ని రాహుల్గాంధీ జాతీయ సమస్యగా తీసుకొని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ రూపొందించి పార్లమెంట్ను స్తంభింపచేయాలని కోరారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు – 9వ షెడ్యూల్లో రాజ్యాంగ రక్షణ కోసం పాలమూరులో ఆదివారం నిర్వహిస్తున్న సామాజిక న్యాయ సభను బీసీలంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్ మద్దతు ప్రకటించారు. సమావేశంలో రమేష్గౌడ్, సారంగి లక్ష్మీకాంత్, లక్ష్మణ్గౌడ్, భాస్కరయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘సింగోటం’ భక్తులకు ఇబ్బందులు రానీయొద్దు
● మంత్రి జూపల్లి కృష్ణారావు ● దుర్వినియోగమైన గత నిధుల రికవరీపై ఆదేశాలు ● 15 నుంచి సింగోటం లక్ష్మీనర్సింహాస్వామి బ్రహ్మాత్సవాలుకొల్లాపూర్ రూరల్: సింగోటం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మండలంలోని సింగోటంలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 15నుంచి జరుగుతున్నందున శుక్రవారం కలెక్టర్ల సంతోష్ అధ్యక్షతన ఆలయ ఆవరణలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్నిశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి పాల్గొని మాట్లాడారు. ఈఓ రంగారావును పిలిచి గతలో ఆలయానికి వచ్చిన నిధులు చెప్పాలని ఆదేశించారు. ఇండెక్స్, అకౌంటు రికార్డులు పరిశీలిస్తూ నిధుల గురించి ఆరా తీశారు. నిధుల దుర్వినియోగంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ లెక్కలు పారదర్శకంగా ఉండాలని హెచ్చరించారు. దుర్వినియోగమైన ఆలయ టెండర్లకు సంబంధించిన డబ్బులు నెలరోజుల్లో రికవరీ చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. రాయలసీమ నుంచి నదిలో వచ్చే భక్తులకు అన్నిఏర్పాట్లు చేయాలన్నారు. కొల్లాపూర్ నుంచి నందికొట్కూర్కు బస్సులు నడపాలని డిపో మేనేజర్ ఉమాశంకర్ను ఆదేశించారు. టూరిజం శాఖ నుంచి రూ.20లక్షల నిధులు ఇవ్వడం జరుగుందని.. అట్టి నిధులతో కట్టపై, ఆలయ పరిసరాల్లో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వాహన పార్కింగ్, పారిశుద్ధ్య పనులు, మంచినీటి వసతి చక్కబెట్టాలని అధికారులను ఆదేశించారు. అన్నిశాఖల అధికారులు కొల్లాపూర్ ఆర్డీఓతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులున్న కలెక్టర్కు సమాచారం ఇవ్వాలని దేవాదాయశాఖ అధికారులను ఆదేశించారు. గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వారికి బ్రహ్మోత్సవాలు జరిగినన్ని రోజులు ఆహారం, వసతి, వేతనం ఇవ్వాలని ఆలయ పౌండర్ చైర్మన్ ఆధిత్య లక్ష్మణ్రావును ఆదేశించారు. జాతరలో అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఆర్డీఓ బన్సిలాల్, సర్పంచ్ యాదన్నగౌడ్, ఉపసర్పంచ్ సాయికృష్టగౌడ్, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు ఎంపిక
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రానికి చెందిన ద్రోణదత్తా అనే ఇంటర్ విద్యార్థి అండర్ –17 విభాగంలో జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. చత్తీస్గడ్లో ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు జరిగే 69వ నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో పాల్గొనే తెలంగాణ బాలుర జట్టులో చోటు దక్కించుకున్నాడు. ద్రోణదత్తా 2024లో జరిగిన 40వ జాతీయస్థాయి యూత్ బాస్కెట్బాల్ చాంపియన్షిప్ పోటీలకు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించాడు. విద్యార్థి జాతీయ బాస్కెట్బాల్ పోటీలకు ఎంపిక కావడంపై జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి, పీడీ ఫారుఖ్ ముకర్రం హర్షం వ్యక్తం చేశారు. జాతీయస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి జిల్లాకు గుర్తింపు తేవాలని ఆకాంక్షించారు. దుండగుల దాడిలో వంట మాస్టార్ మృతి మహబూబ్నగర్ క్రైం: గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంతో వంట మాస్టార్గా పనిచేసే ఓ వ్యక్తి మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ విజయ్కుమార్ కథనం ప్రకారం.. నగరంలోని షాషాబ్గుట్టకు చెందిన అవుసలి శ్రీనివాసులు(51)ను శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో తీవ్ర గాయాలతో మృతిచెందాడు. మృతుడు శ్రీను జీవన ఉపాధిలో భాగంగా పెళ్లిల్లు, శుభకార్యాలయాలకు వంటలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 8న రాత్రి సమయంలో నగరంలోని అన్నపూర్ణ గార్డెన్లోపలికి వెళ్లగా దొంగతనం చేయడానికి వచ్చాడని భావించిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని శ్రీనివాసులు కొడుకుకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత అన్నపూర్ణ ఫంక్షన్ హాల్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూసి ఆ మృతదేహం తన భర్తదేని గుర్తించింది. ఆ తర్వాత మృతదేహం జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
దేవరకద్ర ఆర్యూబీకి త్వరలో టెండర్లు
● రైల్వే జీఎంను కలిసిన ఎంపీ డీకే అరుణ దేవరకద్ర: దేవరకద్ర పట్టణ ప్రజలతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నిత్యం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఆర్యూబీ నిర్మించడానికి గతంలో ఎంపీ డీకే అరుణ స్వయంగా సమస్యను పరిశీలించి రైల్వే శాఖకు ప్రతిపాద నలు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆర్యూబీకి సంబంధించి మంజూరు ఉత్తర్వులను జారీ చేసి ఫి బ్రవరిలో పనులకు సంబంధించి టెండర్లు పిలుస్తా రని రైల్వే అధికారులు వెల్లడించారు. ఎంపీ డీకే అరుణ సికింద్రాబాద్ రైల్ నిలయంలో సౌత్సెంట్ర ల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవను కలిసి ఆర్యూబీ, ఆర్ఓబీ, ఎల్హెచ్ఎస్కు సంబంధించి చర్చించారు. ఆర్వోబీ నిర్మా ణం తర్వాత దేవరకద్ర పరిసర గ్రామాల ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆర్యూబీ మంజూరు చేయడంతో ఇబ్బందులు దూరమవుతాయని ఎంపీ తెలిపారు. త్వరలో పనులు పూర్తి చేసి ఆర్యూబీని అందుబాటులోకి తేవాలని కోరారు. -
19 నుంచి జోగుళాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు
అలంపూర్: పట్టణంలోని శ్రీజోగుళాంబ అమ్మవారి ఆలయంలో అమ్మవారి వార్షిక బ్రహోత్సవాలు, మహాశివరాత్రి మహోత్సవ కరపత్రాలు, ఆహ్వాన పత్రికలను, శ్రీజోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల 2026 క్యాలెండర్ను శుక్రవారం ఎమ్మెల్యే విజయుడుతో కలిసి ఆలయ ఈఓ దీప్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. ఈ నెల 19, సోమవారం నుంచి 23, శుక్రవారం వరకు శ్రీజోగుళాంబ అమ్మవారి వార్షిక బ్రహోత్సవాలు కొనసాగుతాయన్నారు. ఫిబ్రవరి 14 శనివారం నుంచి 18, బుధవారం వరకు శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనిఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. ఆలయాలను దర్శించుకున్న ఎమ్మెల్యే దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాలను ఎమ్మెల్యే విజయుడు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీబాలబ్రహ్మేశ్వర స్వామి, శ్రీజోగుళాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం పలికారు. శేషవస్త్రాలతో సత్కరించారు. కరపత్రాలు విడుదల చే సిన ఎమ్మెల్యే విజయుడు,ఈఓ దీప్తి -
ఫిబ్రవరి 3న జడ్చర్లకు సీఎం రాక
జడ్చర్ల టౌన్: ఫిబ్రవరి 3న బాదేపల్లి హైస్కూల్ శతాబ్ది ఉత్సవాల ప్రారంభానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రానున్నారని జడ్చర్లఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి వెల్లడించారు. గురువారం హైస్కూల్ శతాబ్ది ఉత్సవ కమిటి రూపొందించిన లోగోను ఆయన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీతోసమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 3న ట్రిపుల్ ఐటీ శంకుస్థాపనకు సీఎం రానున్నారని, ముందుగా హైస్కూల్ ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం ట్రిపుల్ ఐటీ శంకుస్థాపన చేస్తారన్నారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకుందామన్నారు. ఉత్సవాలు జయప్రదం చేసేందుకు తనవంతుగా పూర్తి సహకారం అందిస్తానని, ఉత్సవ కమిటీ, పాఠశాల ఉపాధ్యాయ బృందం సమష్టిగా ముందుకు సాగాలన్నారు. ఉత్సవాలకు సీఎంతో పాటు ముగింపు వేడుకలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఆహ్వానిద్దామన్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రవిశంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ వి.కృష్ణ, ప్రధానకార్యదర్శి రమణాచార్యులు, ఆహ్వానకమిటీసభ్యులు ఎంఈఓ మంజులాదేవి, గోవింద్నాయక్, హెచ్ఎం చంద్రకళ, కమిటీ సభ్యులు జయప్రకాష్, ఆకుల వెంకటేశ్, సూరి, మేడిశెట్టి రామకృష్ణ, శ్రీహరి, సంతోష్, సూరి, రాజుగౌడ్, టైటాస్ పాల్గొన్నారు. -
సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పోడియం తొలగింపు
మెట్టుగడ్డ: రిజిస్ట్రేషన్ల శాఖలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆనవాయితీకి స్వస్తి పలుకుతూ సబ్ రిజిస్ట్రార్లు కూర్చునే ఎత్తైన పోడియాలను తొలగించారు. రిజిస్ట్రేషన్ శాఖ ఆదేశాలతో అన్ని కార్యాలయాల్లో పారదర్శకమైన వాతావరణం కల్పించేలా తీసుకున్న సంస్కరణల్లో భాగంగా ఈ చర్యను చేపట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 కార్యాలయాల్లో ఎత్తైన పోడియాలను తొలగించారు. నిజాంకాలం నుంచే సబ్ రిజిస్ట్రార్లకు ప్రత్యేక అధికారాలుండేవి. వారికి కొన్ని జ్యుడిషియల్ అఽధికారాలను చట్టం కల్పించింది. డాక్యుమెంట్లు రిజిస్టర్ చేసే సమయంలో క్రయ, విక్రయదారుల, సాక్షుల స్టేట్మెంట్ తీసుకోవడం, వీలునామాలను విచారించే అధికారాలు ఉండటంతో వారికి న్యాయస్థానాల తరహాలో పోడియాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాధారణ టేబుళ్లపై సబ్ రిజిస్ట్రార్లు విధులు నిర్వహిస్తుండటం గమనార్హం. సాధారణ టేబుళ్లపైనే విధి నిర్వహణ దశాబ్దాల ఆనవాయితీకి స్వస్తి రిజిస్ట్రేషన్ల శాఖలో కీలక మార్పులు.. -
కాంగి‘రేసు’లో పోటాపోటీ..
అధికార కాంగ్రెస్లో మేయర్ ఆశావహులు అధిక సంఖ్యలో ఉన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్గౌడ్, మారెపల్లి సురేందర్రెడ్డి (ఎమ్మెస్సార్) ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే యెన్నం గెలుపు కోసం కృషి చేసిన వారిలో పలువురు నాయకులు ఉన్నప్పటికీ.. ఆనంద్గౌడ్, ఎమ్మెస్సార్లది కీలక రోల్ అనే చర్చ పార్టీ శ్రేణుల్లో ఉంది. ఈ క్రమంలో ఇరువురూ మేయర్ పీఠంపై నజర్ వేయడం.. ముందస్తుగానే సన్నాహాలు మొదలుపెట్టడం హాట్ టాపిక్గా మారింది. మరోవైపు టీఎన్జీఓ మాజీ నాయకుడు రాజేందర్రెడ్డి, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఎన్పీ వెంకటేష్తో పాటు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రాధా అమర్ కూడా మేయర్ రేసులో ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా ఇద్దరి మధ్యే.. ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే కాంగ్రెస్లో మేయర్ పీఠం కోసం ఇటు మారెపల్లి సురేందర్ రెడ్డి, అటు ఆనంద్గౌడ్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. 11వ డివిజన్ నుంచి ఎమ్మెస్సార్.. 49వ డివిజన్ నుంచి ఆనంద్గౌడ్ కార్పొరేటర్ పదవి కోసం డీసీసీకి దరఖాస్తు చేసుకున్నారు. బీసీ రిజర్వేషన్ వచ్చి.. అఽధిష్టానం అవకాశం ఇస్తే మేయర్ బరిలో ఉంటానని ఎన్పీ వెంకటేష్ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈసారి కార్పొరేటర్గా బరిలో ఉంటానని.. అన్రిజర్వ్డ్ (జనరల్) వస్తే తాను మేయర్ పోటీలో ఉండాలని అనుకుంటున్నానని.. అయితే అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అని రాజేందర్రెడ్డి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో ఎమ్మెస్సార్, ఆనంద్గౌడ్ మధ్యే మేయర్ అభ్యర్థిత్వం దోబూచులాడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఉన్నది ఉన్నట్లు సమర్పిస్తాం
పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో 28 మంది మాట్లాడిన అభిప్రాయాలన్నింటిని నమోదు చేసుకున్నాం. వీడియో చిత్రీకరణ చేశాం. మీటింగ్ మినిట్స్తో పాటు వీడియోను కాలుష్య నియంత్రణ మండలికి ఉన్నది ఉన్నట్లు సమర్పిస్తాం. – సురేష్, ఈఈ, పీసీబీ హైదరాబాద్ ప్రాజెక్టుతో ఆర్థిక వ్యవస్థ మెరుగు ఈ ప్రాజెక్టు చిట్టెం నర్సి రెడ్డి కన్న కల. చిట్టెం వెంకటేశ్వర్రెడ్డి దీనికోసం పాదయాత్ర చేశారు. ఈ ప్రాంతంలో రాళ్లు తేలిన భూములు కనిపిస్తాయి. వన్యం లేదు.. వన్యప్రాణులు లేవు. నీళ్లు ఉంటే వన్యప్రాణులు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టుతో ఆర్థికవ్యవస్థ మెరుగుపడుతుంది. పర్యావరణ అనుమతులు ఈ రోజు ఇస్తే ఈ నెలలోనే ఈ ప్రాజెక్టు ప్రారంభించుకునే అవకాశం ఉంది. – కుంభం శివకుమార్రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు ● -
సమసమాజనిర్మాణమే లక్ష్యం
మెట్టుగడ్డ: సామాజిక సేవలు, వృద్ధుల సమస్యల పరిష్కారం, సమ సమాజ నిర్మాణమే తమ ప్రధాన లక్ష్యమని సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు అన్నారు. గురువారం ఫోరం విసృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా సీనియర్ సిటిజన్ మహిళలకు ఫోరం భవనం ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామ ని తెలిపారు. ఫోరం భవన ప్రహరీ మరమ్మతుల పనులు, వృద్ధులకు ఆహ్లాదకరమైన వా తావరణం కోసం లాన్ ఏర్పాటు పనులు ము మ్మరంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సూచనల మేరకు ఫోరం సభ్యత్వం రూ.పది వేలకు పెంచే దిశగా డ్రైవ్ చేపట్టామని తెలిపారు. సభ్యత్వం పొందిన నూతన సభ్యులను సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు రామేశ్వరయ్య, ఉపాధ్యక్షుడు రాజసింహుడు, ప్రధాన కార్యదర్శి ఎన్.నాగభూషణం, సంయుక్త కార్యదర్శి గంగాధర్, జి.నాగభూషణం, రాములు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పాలమూరు: రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్రెడ్డి స్థానిక పార్టీ కార్యాలయంలో స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి రోజు 180 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఈనెల 11వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, 15 నుంచి 20 వరకు దరఖాస్తుల పరిశీస్తామని చెప్పారు. 8 వార్డులకు కలిపి ముగ్గురు చొప్పున సీనియర్ నాయకులను నియమించినట్లు తెలిపారు. 1వ వార్డు నుంచి 8వ వార్డు వరకు జి.పద్మజారెడ్డి, పోతుల రాజేందర్రెడ్డి, పడాల సత్యం, 9 నుంచి 18 వరకు పడాకుల బాల్రాజు, క్రిస్టియానాయక్, ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షుడు యాదయ్య, 19 నుంచి 23 వార్డు వరకు వీరబ్రహ్మచారి, కిరణ్కుమార్రెడ్డి, కె.సతీష్కుమార్, 24 నుంచి 30 వరకు నాగేశ్వర్రెడ్డి, అంజయ్య, జాజం సుబ్రహ్మణ్యం, 31 నుంచి 38 వరకు కృష్ణవర్ధన్రెడ్డి, జయశ్రీ, కొండయ్య, 39 నుంచి 45 వార్డు వరకు ఎస్.పాండురంగారెడ్డి, కర్ణాకర్రెడ్డి, గడ్డ బుచ్చన్న, 46 నుంచి 52 వార్డు వరకు మెట్టుకాడి శ్రీనివాసులు, రామాంజనేయులు, నవీన్రెడ్డి, 53 నుంచి 60 వార్డు వరకు కె.రాములు, బుచ్చిరెడ్డి, ఎన్.రమేష్కుమార్లను నియమించినట్లు తెలిపారు. ఆర్ఎన్ఆర్ క్వింటా రూ.2,739 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో గురువారం ధాన్యం ఆర్ఎన్ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,739, కనిష్టంగా రూ.2,409 ధరలు లభించాయి. హంస రూ.1,916, కందులు గరిష్టంగా రూ.7,560, కనిష్టంగా రూ.5,667, వేరుశనగ గరిష్టంగా రూ.8,781, కనిష్టంగా రూ.3,051, ఉలువలు రూ.3,517, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,927, కనిష్టంగా రూ.1,841, పత్తి గరిష్టంగా రూ.7,370, కనిష్టంగా రూ.7,149 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్లో కందులు గరిష్టంగా రూ.6,789, కనిష్టంగా రూ.6,769 ధర లభించింది. -
మామిడిలో పూత, పిందె
చీడ పీడలు మామిడికి చీడపీడలు పూత, పిందె దశలో ఆశించడం వలన పూత, పిందె బాగా రాలుతుంది. పురుగులు, తెగుళ్లను జాగ్రత్తగా గమనిస్తూ చర్యలు తీసుకోవాలి. తేనె మంచు పురుగు: పూత, పిందె దశలో ఈ పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. పిల్ల పురుగులు గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చి వేయడం వలన పూత మాడిపోతుంది. దీని నివారణకు ఇమిడాక్లోప్రిడ్ను తగిన మోతాదులో వాడుకోవాలి. తామర పురుగులు: తామర పురుగులు రసాన్ని పీల్చడం వలన పూత రాలిపోతుంది. పిందె దశలో కాయపై గోకి రసాన్ని పీల్చడం వలన మచ్చలు ఏర్పడతాయి. ఇవి ఆశించిన కాయలపై మంగు ఏర్పడుతుంది. వీటి నివారణకు డైమిథోయేట్ 2 మి.లీ/ లీటరు నీటిని కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెగులు: ఆకులు, పూత, పిందెలపై తెల ్లని బూడిద వంటి పొడి ఏర్పడుతుంది. తెగులు సోకిన పూత, పిందెలు రాలిపోతాయి. దీని నివారణకు పూత మొగ్గ దశలో హెక్సాకొనజోల్/మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలంపూర్: మామిడిలో పూత, పిందె ఎక్కువగా వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. పూతను, పిందెను నిలుపుకొని నాణ్యమైన అధిక దిగుబడులు సాధించాలంటే తగు జాగ్రత్తలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు అన్నదాతలకు వివరిస్తున్నారు. మామిడిలో పూల రకాలు : మామిడిలో ఉండే పూలగుత్తుల్లో రెండు రకాలు పుష్పాలు ఉంటాయి. ఒక రకం ద్విలింగ పుష్పాలు, రెండో రకం మగ పుష్పాలు. ప్రతి పూలగుత్తిలో రకాన్ని బట్టి 200 నుంచి 4,000 వేల వరకు పుష్పాలు ఉంటాయి. ద్విలింగ పుష్పాలు రకాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఉదాహరణకు రుమాని రకంలో 0.74 శాతం, నీలం రకం 55 శాతం, లాంగ్రా రకం 69 శాతం, బంగనపల్లిలో 22 శాతం ద్విలింగ పుష్పాలు ఉంటాయి. ద్విలింగ పుష్పాలు మాత్రమే ఫలిదీకరణం చెంది పిందెలుగా ఏర్పడతాయి. మగపూలు ఫలదీకరణలో తోడ్పడి తర్వాత రాలిపోతాయి. ద్విలింగ పుష్పాల్లో కూడ ఫలదీకరణానికి ముందే పలు కారణాల వలన రాలిపోతాయి. పోషకాల యాజమాన్యం: మామిడి కాయలు అంగుళం పరిమాణం నుంచి భుజాలు ఏర్పడే వరకు చాలా త్వరగా పెరుగుతాయి. ఈ సమయంలో పోషకాలైన నత్రజని, పొటాష్ను తప్పక అందించాలి. నీటి వసతి ఉన్న పొలాల్లో చెట్టు వయస్సును బట్టి 500 గ్రాముల నుంచి కేజీ వరకు, 300 గ్రాముల పొటాష్ను పిందెలు బాదం కాయ పరిమాణం ఉన్నప్పుడు వేసి నీరు పెట్టాలి. నీటి వసతి లేని తోటల్లో నీటిలో కరిగే ఎరువులైన పాలీఫీడ్, మల్టీ–కే ఎరువులు లీటరు నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. హార్మోన్ల యాజమాన్యం: హార్మోన్ల లోపం, సమతుల్యత దెబ్బతింటే పూత, పిందె బాగా రాలుతుంది. దీని నివారణకు ప్లానోఫిక్స్ను 5 లీటర్ల నీటిలో/మి.లీ కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. మోతాదుకు మించి పిచికారీ చేస్తే పిందె రాలిపోయే ప్రమాదం ఉంది. పాడి–పంట -
ఉత్సాహంగా జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: ఆదిలాబాద్లో ఈ నెల 18న జరిగే రాష్ట్రస్థాయి అంతర్ జిల్లా సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను గురువారం మెయిన్ స్టేడియంలో నిర్వహించారు. ఎంపికలను జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎంపికల్లో దాదాపు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. అథ్లెట్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. అండర్–8, 10, 12, 14 విభాగాలకు సంబంధించి రన్నింగ్, స్టాండింగ్ బ్రాడ్జంప్, లాంగ్జంప్, లాంగ్జంప్ (స్టాండింగ్ బ్యాక్ త్రో), హైజంప్, షాట్పుట్, 20 ఏళ్ల లోపు వారికి 100 మీటర్ల, 400 మీటర్ల పరుగు అంశాల్లో ఎంపికలు నిర్వహించారు. ఎంపికై న క్రీడాకారుల వివరాలు తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పీడీలు ఆనంద్కుమార్, పి.శ్రీనివాస్, జి.రాజు, బాలరాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రయాణికుల సౌకర్యార్థం..
హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలు, బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా, అదనపు వలంటీర్లను అందుబాటులో ఉంచుతున్నారు. అదేవిధంగా తాగునీటి వసతి, కూర్చోవడానికి కుర్చీలు, బస్సుల వివరాలు, సూచనలను ఎప్పటికప్పుడూ ప్రయాణికులకు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. సద్వినియోగం చేసుకోండి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అన్ని డిపోల నుంచి అదనపు బస్సులు నడపనున్నాం. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. సురక్షితమైన ప్రయాణానికి ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలి. – సంతోష్కుమార్, ఆర్టీసీ ఆర్ఎం -
ప్రియుడే కడతేర్చాడు..
వనపర్తి: భర్తను కోల్పోయిన మహిళ ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం సదరు వ్యక్తి ఇంట్లో తెలియడంతో దూరం పెట్టారు. ఈ క్రమంలో తనను ఎందుకు దూరం పెడుతున్నావంటూ మహిళ తరచుగా గొడవ పడుతుండటంతో.. ఎలాగైనా వదిలించుకోవాలని అతడు నిర్ణయించుకొని హతమార్చాడు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలో చోటు చేసుకున్న మహిళ హత్యకేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్రావు వివరాల మేరకు.. బెక్కెం గ్రామానికి చెందిన గుంటి రాధ (42) ఈ నెల 1న బీచుపల్లి ఆలయానికి వెళ్లి వస్తానని కూతురు మేఘనకు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లింది. ఐదు రోజులుగా తల్లి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కూతురు.. ఈ నెల 5న చిన్నంబావి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి కొప్పునూర్ గ్రామ శివారులో లక్ష్మీపల్లికి చెందిన రైతు పాటిమీది వెంకటయ్య కందిచేనులో గుర్తుతెలియని మహిళ మృతదేహం కనిపించింది. అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని వనపర్తి మార్చురీకి తరలించారు. మృతురాలు బెక్కెం గ్రామానికి చెందిన గుంటి రాధగా గుర్తించారు. అయితే తన తల్లి తరచూ ఓ వ్యక్తితో ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుండేదని మేఘన పోలీసులకు చెప్పడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. అమ్మాయిపల్లికి చెందిన మౌలాలిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. నేరం ఒప్పుకున్నాడు. మూడేళ్లుగా గుంటి రాధతో మౌలాలి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో రాధను దూరం పెట్టాడు. ఈ క్రమంలో తనను ఎందుకు దూరం చేస్తున్నావని.. తనను కలవాలని తరచుగా ఒత్తిడి తేవడంతో కొప్పునూర్ శివారులో మౌలాలి కౌలుకు చేస్తున్న భూమి వద్దకు రమ్మన్నాడు. అక్కడికి వచ్చిన రాధ మౌలాలితో గొడవ పడటంతో విసుగు చెందిన అతడు.. ఆమె చీర కొంగుతోనే గొంతు బిగించి హత్యచేశాడు. శవాన్ని అక్కడి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో గల కంది చేనులో పడేశాడని డీఎస్పీ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. వీడిన మహిళ హత్య మిస్టరీ నిందితుడి అరెస్టు వివరాలు వెల్లడించిన డీఎస్పీ వెంకటేశ్వర్రావు -
విద్యార్థులను ఇళ్లకు పంపడంపై విచారణ
బల్మూర్: మండలంలోని చెంచుగూడెం బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులను సంక్రాంతి పండుగ సెలవులకు మూడు రోజుల ముందే ఇంటికి పంపించి ఆశ్రమ పాఠశాలకు తాళం వేశారు. ప్రభుత్వం ఈనెల 10 నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. అయితే స్థానిక ఆశ్రమ పాఠశాలలోని డిప్యూటీ వార్డెన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న మనెమ్మ మూడు రోజుల ముందే విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి మరీ విద్యార్థులను ఇంటికి పంపించి ఏకంగా పాఠశాలకు తాళం వేశారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా గురువారం ఏటీడబ్ల్యూఓ నాగరాజు ఆశ్రమ పాఠశాలను సందర్శించి విచారణ జరిపారు. పాఠశాల హెచ్ఎం శంకర్ సెలవుల్లో ఉండగా డిప్యూటీ వార్డెన్ మనేమ్మ ఇన్చార్జిగా బాధ్యతలు చూస్తున్నారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు ఏటీడబ్ల్యూఓ నాగరాజు తెలిపారు. -
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వేగవంతం చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్)/జడ్చర్ల టౌన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) వేగవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. గురువారం కలెక్టరేట్తో పాటు జడ్చర్ల డా.బీఆర్ అంబేద్కర్ కళాభవన్లో ఎస్ఐఆర్ అమలు తీరుపై కలెక్టర్ బీఎల్ఓ, సూపర్వైజర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్ఐఆర్ ఓటర్ల మ్యాపింగ్, ఇంటింటి పరిశీలన, ప్రోజెనీ (సంతతి) సర్వేలను రెండు, మూడు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. మహబూబ్నగర్, జడ్చర్ల పట్టణ ప్రాంతాల్లో బీఎల్ఓల పనితీరు 25 శాతం కంటే తక్కువగా ఉందని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. గతంలో నమోదైన ఓటర్లు ప్రస్తుతం కొనసాగుతున్నారా లేదో వారి వివరాలను గుర్తించి మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. ఎన్నికల సంఘానికి సంబంధించిన ఈ పనిని అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి, బీఎల్ఓలో వచ్చే రెండు మూడు రోజుల్లో 80 శాతం పూర్తి చేసేలా సంబంధిత సూపర్ వైజర్లు, తహసీల్దార్లు, ఇతర సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మధుసూదన్నాయక్, ఆర్డీఓ నవీన్, డీఎంహెచ్ఓ కృష్ణ, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి జరీనా బేగం, తహసీల్దార్లు ఘన్సీరాం, నర్సింగ్రావు, తదితరులు పాల్గొన్నారు. -
రూ.28 కోట్లతో అభివృద్ధి పనులు
● ముడా రెండో సాధారణ సమావేశంలో కమిటీ ఆమోదం ● హాజరైన నలుగురు ఎమ్మెల్యేలు.. కొత్త లోగో ఆవిష్కరణ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లావ్యాప్తంగా ముడా ఆధ్వర్యంలో రూ.28 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు కమిటీ ఆమోదం తెలిపింది. గురువారం భూత్పూర్ రోడ్డులోని ముడా కార్యాలయంలో చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్ అధ్యక్షతన రెండో సాధారణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. ఇందులో భాగంగా మహబూబ్నగర్ నియోజకవర్గానికి రూ.ఏడు కోట్లు, జడ్చర్ల దేవరకద్రకు రూ.ఐదు కోట్ల చొప్పున కేటాయించారు. ముడా నిధులతో మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల్లో రూ.రెండు కోట్ల చొప్పున ఒక్కో మహాప్రస్థానం ఏర్పాటు చేయనున్నారు. ఇక జిల్లా కేంద్రంలోని ఏనుగొండ సర్వే నం.25లో అర ఎకరా (20 గుంటల) స్థలంలో నిర్మించనున్న కార్యాలయ పక్కా భవనానికి రూ.ఐదు కోట్లు వెచ్చించనున్నారు. కాగా, ఎల్ఆర్ఎస్ ద్వారా వసూలైన రూ.24 కోట్లు, మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్కు రావాల్సిన రూ.18 కోట్లు ఆయా ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. అనంతరం ముడా కొత్త లోగోను ఆవిష్కరించారు. సమావేశంలో ముడా వైస్చైర్మన్ టి.ప్రవీణ్ కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, అనిరుధ్రెడ్డి, జి.మధుసూదన్రెడ్డి, టి.రామ్మోహన్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణానికి ముప్పులేదు..
నారాయణపేట: మక్తల్–నారాయణపేట–కొడంగ ల్ ఎత్తిపోతల పథకం చేపడితే ఈ ప్రాంతంలో ఎలాంటి పర్యావరణ ముప్పు.. విఘాతం కలగడం లేదని, వీలైనంత త్వరగా ఆ పథకానికి పర్యావరణ అనుమతులు ఇచ్చి ప్రారంభించాలని ప్రజలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. గురువారం మక్తల్ –నారాయణపేట –కొడంగల్ ఎత్తిపోతల పథకంపై జిల్లాలోని దామరగిద్ద తండాలో గురువారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం నుంచి ఈఈ సురేష్ హాజరు కాగా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రామచందర్ నాయక్, నీటి పారుదల శాఖ ఎస్. ఈ శ్రీధర్ సమక్షంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లోని 7 మండలాల నుంచి ప్రజా ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, విశ్రాంత ఉద్యోగులు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఏకాభిప్రాయాన్ని బృందం ముందు వెల్లడించారు. వందలాది మంది సమక్షంలో 28 మంది తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పనులను త్వరగా ప్రారంభించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని, ఆ పథకం పూర్తి చేసి సాగు, తాగునీరు అందించాలని ఆకాంక్షించారు. మక్తల్– పేట– కొడంగల్ ప్రాజెక్టుకు అనుమతివ్వాలి ఉద్యమాలు, పోరాటాలతో ప్రాజెక్టు సాధించుకున్నాం ఈ ప్రాంతానికి సాగు, తాగునీరు అందించాలి పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడించిన ప్రజలు మూడు నియోజకవర్గాల్లోని ఏడు మండలాల నుంచి హాజరు -
‘ఉపాధిహామీ’ని నిర్లక్ష్యం చేస్తున్న కేంద్రం
● ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం ఉధృతం ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అచ్చంపేట రూరల్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగార్చేందుకు కుట్రలు చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆరోపించారు. గురువారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం ఉపాధిహామీ చట్టంలో 40 శాతం రాష్ట్రాలు భరించాలని చెప్పడం సరైంది కాదని.. గతంలో 90 శాతం కేంద్ర నిధులున్నా కొన్ని రాష్ట్రాల్లో సక్రమంగా అమలు కాలేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూలీలు, సిబ్బంది వేతనాలు అందక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొందని.. మహాత్మాగాంధీ పేరు ఉండటం కూడా సహించడం లేదని తెలిపారు. పథకం పేరు, చట్టం మార్పిడిని సీపీఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని.. కూలీలు, సిబ్బందికి పార్టీ మద్దతు పలికి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. విద్యుత్ను ప్రైవేట్పరం చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తుందని.. అమలు జరిగితే పేదలు, రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చ జరగలేదని, వ్యక్తిగత ధూషణలతోనే కాలం వెల్లదీశారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే గత పార్టీలకు పట్టిన గతే పడుతుందన్నారు. మత్తు వ్యాపారాన్ని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని.. దీంతో యువత తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 12న నిర్వహించే సమ్మెకు సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ జి ల్లా కార్యదర్శి పర్వతాలు, నాయకులు పాల్గొన్నారు. -
‘సంక్రాంతి’కి ఆర్టీసీ సన్నద్ధం
స్టేషన్ మహబూబ్నగర్: పల్లె సంస్కృతి ప్రతిబింబించే సంక్రాంతి పండుగకు ఎక్కడున్న వారి స్వస్థలాలకు రావడం పరిపాటిగా మారింది. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు, శ్రామికులు ఈ పండుగకు ఇళ్లకు వచ్చి మూడు రోజులు జరిగే పండుగ సంబరాలను ఆస్వాదిస్తారు. అయితే ఈ ఏడాది పండుగను పురస్కరించుకొని ఆర్టీసీ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని 10 డిపోల నుంచి అదనపు బస్సులను నడపనున్నారు. శుక్రవారం నుంచి 13 వరకు హైదరాబాద్ నుంచి రీజియన్లోని పది డిపోలకు 430 బస్సులు నడపనున్నారు. పండుగ తిరుగు ప్రయాణంలో ఈ నెల 17 నుంచి 21 వరకు ఆయా డిపోల నుంచి హైదరాబాద్ వైపు 364 బస్సులను నడపడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రజలు సంక్రాంతి పండుగకు ఎక్కువ సంఖ్యలో వారి స్వస్థలాలకు వచ్చే అవకాశం ఉండడంతో హైదరాబాద్కు అదనపు సర్వీసులు నడపడానికి అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. అన్ని డిపోలకు హైదరాబాద్ రూట్లో ఎక్కువ ఆదాయం వస్తుండడంతో ఈ రూట్లోనే ఎక్కువగా అదనపు బస్సులు నడపనున్నారు. రీజియన్ నుంచి అదనపు బస్సులు హైదరాబాద్ నుంచి డిపోల వైపు 430 సర్వీసులు నేటినుంచి ప్రారంభం కానున్న రాకపోకలు -
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
మహబూబ్నగర్ రూరల్: దళిత విద్యార్థుల మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ గురువారం ప్రజా, దళిత సంఘాల ఆధ్వర్యంలో మహబూబ్నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు కిల్లె గోపాల్ మాట్లాడుతూ.. వేములకు చెందిన దళిత విద్యార్థిని గ్యాంగ్ రేప్ చేసిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలన్నారు. అదే విధంగా పాత పాలమూరుకు చెందిన దళిత విద్యార్థి కొత్తకోట మైనార్టీ గురుకుల కళాశాలలో చదువుతూ గతేడాది నవంబర్ 9న రేణిగుంట రిజర్వాయర్లో శవమై తేలాడని.. అతడు ఎలా చనిపోయాడో ఇప్పటి వరకు పోలీసులు నిర్ధారించకపోవడం దారుణమన్నారు. మృతుడి తల్లిదండ్రులు హైదరాబాద్కు వెళ్లి రాష్ట్ర మైనార్టీశాఖ మంత్రి, కార్యదర్శులతో పాటు కలెక్టర్, ఎస్పీ, దేవరకద్ర, మహబూబ్నగర్ ఎమ్మెల్యేలను కలిసి విన్నవించినా.. వనపర్తి జిల్లా పోలీసులు మాత్రం పంచనామా (ఎఫ్ఎస్ఎల్) రిపోర్టు రాలేదని కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ ఘన్సీరామ్కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో సీఐటీయూ పట్టణ కన్వీనర్ రాజ్కుమార్, ఉపాధ్యక్షుడు ఖమర్ అలీ, నాయకులు రాజు, శ్రీనివాసులు, వెంకట్రాములు, వెంకటలక్ష్మి, నవాబ్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలి
● సీఎం కప్ టార్చ్ ర్యాలీ ప్రారంభోత్సవంలో ఎస్పీ జానకి ● క్రీడా ప్రతిభ చాటేందుకు గొప్ప వేదిక: అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ మహబూబ్నగర్ క్రీడలు: గ్రామీణ యువత పల్లె స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించాలని ఎస్పీ డి.జానకి పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో గురువారం చీఫ్ మినిస్టర్స్ కప్ (సీఎం కప్) టార్చ్ ర్యాలీని ఎస్పీ డి.జానకి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎంకప్ టార్చ్ ర్యాలీ ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల యువతను క్రీడలవైపు ఆకర్శించి జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ప్రతిభను చాటేలా ప్రోత్సహించడమేనన్నారు. పోలీసు, రవాణాశాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న నెలరోజుల జాతీయ రోడ్డు భద్రతపై మాసోత్సవాల సందర్భంగా రోడ్డుభద్రతపై విద్యార్థులు, క్రీడాకారులకు ఎస్పీ అవగాహన కల్పించారు. హెల్మెట్, సీటు బెల్టు లేకుండా వాహనాలు నడవవద్దని, యువత రోడ్డు ప్రమాదాల్లో మరణించడం కుటుంబాలకు తీరని నష్టాన్ని కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్టు తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ మాట్లాడుతూ సీఎం కప్ ద్వారా ప్రభుత్వం యువతకు, విద్యార్థులకు క్రీడా ప్రతిభను ప్రదర్శించుకునే గొప్పవేదికను కల్పించిందన్నారు. దీనిని సద్వినియోగం చేసుకొని కష్టపడి ఆడి జాతీయ, అంతర్జాతీ వేదికలపై కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ మెట్టుగడ్డలోని డైట్ కళాశాల వరకు నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీసీఈఓ వెంకట్రెడ్డి, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, డీవైఎస్ఓ ఎస్.శ్రీనివాస్, డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ, డీపీఆర్ఓ శ్రీనివాస్, జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి కురుమూర్తిగౌడ్, పలు క్రీడాసంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
సైలెంట్ స్టెప్స్!
మేయర్ గిరిపై ప్రధాన పార్టీల కన్ను ● మహబూబ్నగర్ కార్పొరేషన్ ఆవిర్భావం తర్వాత తొలి ఎన్నికలు ● మొదటి సారే కుర్చీ దక్కించుకుని ఘనత చాటేలా కాంగ్రెస్ కసరత్తు ● పీఠంపై ఆనంద్గౌడ్, ఎమ్మెస్సార్ నజర్.. సన్నాహాలు ముమ్మరం ● బీఆర్ఎస్, బీజేపీలో కూడా మొదలైన కదలిక సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: మహబూబ్నగర్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా జరగనున్న ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొదటిసారే కార్పొరేషన్పై పార్టీ జెండాను ఎగురవేసి.. చరిత్రలో నిలిచిపోవాలనే లక్ష్యంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే పురపాలిక ఎన్నికలపై ఆయా పార్టీల్లో ఓ దఫా సమావేశాలు పూర్తి కాగా.. మేయర్ పీఠాన్ని అధిరోహించాలనే సంకల్పంతో ఆయా పార్టీలకు చెందిన పలువురు నేతలు సైలెంట్గా కదన రంగంలోకి దూకారు. వార్డుల వారీగా బలాబలాలను బేరీజు వేసుకుంటూ ముందస్తుగానే మద్దతు కూడబెట్టుకుంటున్నారు. -
టీడీగుట్ట బ్రిడ్జి నిర్మాణానికి ఏప్రిల్లో టెండర్లు
పాలమూరు: దేవరకద్రలో లిమిటెడ్ హైట్ సబ్వే, మహబూబ్నగర్ నగరంలో టీడీగుట్ట ఆర్ఓబీ బ్రిడ్జి మంజూరయ్యిందని, నిర్మాణ పనులకు ఏప్రిల్లో టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవ్ ఎంపీ డీకే అరుణకు వివరించారు. గురువారం హైదరాబాద్లోని రైల్ నిలయంలో శ్రీవాస్తవ్తో ఎంపీ డీకే అరుణ భేటీ అయ్యారు. మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో పలు రైల్వే సమస్యలపై ఎంపీ ఇచ్చిన వినతి పత్రాలపై మేనేజర్ అధికారులతో సమీక్షించారు. తిమ్మసానిపల్లి, బోయపల్లిగేట్, వీరన్నపేటలోని రైల్వే ట్రాక్లపై రోడ్డు ఓవర్ బ్రిడ్జి, మోతీనగర్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలకు సంబంధించిన ఫిజబులిటీ రిపోర్ట్ పూర్తయిందని, రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. వీటికి సంబంధించి మార్చిలో అనుమతులు వస్తాయని అధికారులు తెలిపారు. త్వరగా మంజూరు చేసి పనులు సైతం సకాలంలో పూర్తి చేయాలని ఎంపీ కోరారు. -
ట్రాక్టర్ కిందపడిడ్రైవర్ దుర్మరణం
ఊర్కొండ: మండల పరిధిలోని మాదారం గ్రామంలో శివయ్య (25) ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి మరణించాడు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు.. మాదారం గ్రామానికి చెందిన శివయ్య (25) వృత్తి రీత్యా డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగే గురువారం ఉదయం పొలంలో కరిగేట దున్నడానికి వెళ్లారు. భూమి మెత్తగా ఉండటం లేదా గట్టు అంచున అదుపు తప్పడం వల్ల ట్రాక్టర్ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ క్రమంలో స్టీరింగ్ పక్కనే ఉన్న డ్రైవర్ సీటు నుంచి కింద పడిపోగా, ట్రాక్టర్ ఇంజిన్ ఆయనపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబపోషణకు వెళ్లి తిరిగి రాని లోకానికి వెళ్లడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ కృష్ణదేవ తెలిపారు. కాల్వలో పడి వృద్ధుడు మృతి గోపాల్పేట: మండల కేంద్రంలోని చంద్రాయుని గడ్డ కాలనీలో ఓ వృద్ధుడు కాల్వలో పడి మరణించాడు. గ్రామస్తుల కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన బాలయ్య (57) గత కొంతకాలంగా తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం కట్టెలకు వెళుతున్నానని బయటికి వెళ్లాడు. ఏమైందో ఏమో తెలియదు గురువారం తెల్లవారుజామున చంద్రాయుని గడ్డ కాలనీ సమీపంలో ఉన్న కాల్వలో శవమై కనిపించాడు. బహిర్భూమికి వెళ్లిన వారు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. విద్యుదాఘాతంతో యువకుడి మృతి తెలకపల్లి: విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ సురేందర్ తెలిపిన వివరాలు.. మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన చింతకుంట్ల బాలరాజు (23) గురువారం ఉదయం తన పొలంలో వేరుశనగ పంటకు నీరు పెట్టడానికి వెళ్లాడు. ఈ క్రమంలో అనుకోకుండా ప్రమాదవశాత్తు పొలంలోనే విద్యుత్ షాక్ గురై అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి చింతకుంట్ల ఏకాకి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు. యువకుడు అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. నిందితులపై చర్యలు తీసుకోవాలి గద్వాల క్రైం: గట్టు మండలం బల్గెరకు చెందిన తిమ్మప్ప అలియాస్ ఖయ్యూం ఈ నెల 5న ముల్లంపల్లి రిజర్వ్ ఫారెస్ట్ శివారులో దారుణహత్యకు గురైన విషయం విధితమే. అయితే హంతకులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ గురువారం బాధిత కుటుంబీకులు ఎస్పీ శ్రీనివాసరావును కలిసి విజ్ఞప్తి చేశారు. తిమ్మప్పను అదే మండలానికి చెందిన అబ్రహంతో పాటు మరికొందరు కలిసి మద్యం తాగించి ఉద్దేశపూర్వకంగా హత్య చేశారని అనుమానం వ్యక్తం చేశారు. కాగా ఈ కేసులో పోలీసులు అబ్రహంను మాత్రమే అరెస్ట్ చేసి మిగిలిన వారు ఎవరనేది గుర్తించడం లేదని ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. ఇందుకు స్పందించిన ఎస్పీ విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కోడిపందెం స్థావరంపై పోలీసుల దాడి మరికల్: మండలంలోని చిత్తనూర్ గ్రామ శివారులో రహస్యంగా కోడిపందెలు నిర్వహిస్తున్న స్థావరంపై గురువారం పోలీసులు దాడి చేసి 19 మందిని అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు దాడి చేసి 3 కోడిపుంజులు, 14 బైకులు, రూ.15 వేలు నగదు, 16 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే 19 మంది పేకాటరాయుళ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాము తెలిపారు. పీయూలో క్యాంపస్ డ్రైవ్.. మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో కే12 సంస్థ ఆధ్వర్యంలో క్యాంపస్ ఎంపికలు నిర్వహించారు. ఈ మేరకు పలువురు ఎంబీఏ, ఎంసీఏ డిపార్ట్మెంట్ విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు వచ్చిన ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్లేస్మెంట్ అధికారి అర్జున్కుమార్, వినోద్, నరసింహ పాల్గొన్నారు. -
‘ బీఆర్ఎస్ నేతల మాటల హాస్యాస్పదం’
వనపర్తి టౌన్: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు జరుగుతున్నప్పుడు అప్పటి సీఎం కేసీఆర్ నోరు తెరవకపోవడంతో 11వేల క్యూసెక్కుల నుంచి 99 వేల క్యూసెక్కుల నీళ్లు పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు తరలిస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాలమూరు నుంచి భవిష్యత్లో ఎవరూ సీఎం కాలేరని, రేవంత్రెడ్డిని ఆదరించి పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు కలిసికట్టుగా ముందుకు సాగుదామన్నారు. జూరాల సోర్స్గా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టి, కొడంగల్ లిఫ్టును అనుసంధించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి నల్గొండకు నీళ్లు ఇచ్చేందుకు కేసీఆర్ శ్రీశైలం సోర్స్గా రాత్రిరాత్రికే నిర్ణయం తీసుకొని పాలమూరుకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. రూ.55వేల కోట్లతో ప్రాజెక్టు చేపట్టి రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి 90 శాతం పనులు పూర్తయ్యాయని బీఆర్ఎస్ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అదనంగా రూ.6వేల కోట్లను పాలమూరు–రంగారెడ్డికి ఖర్చు చేశామన్నారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులతో ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని, నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్ వరకు పనులు చేసి ఆ తర్వాత కాల్వలు తీయలేదని, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కట్టకుండా వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండలోని డిండికి శ్రీశైలం సోర్స్గా నీరు తీసుకోవాలని క్యాబినేట్లో తాను ప్రస్తావించిన కేసీఆర్ పట్టించుకోలేదని ఆరోపించారు. కేవలం రూ.300 కోట్ల ఖర్చు పెట్టి వట్టెం నుంచి నీళ్లు తీసుకుపోయే అవకాశం ఉన్నా.. రూ.1,800 కోట్లతో ఏదుల రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకెళ్లేందుకు పరిపాలన అనుమతులిచ్చిచారని మండిపడ్డారు. పాలమూరులోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టులను రూ.7వేల కోట్లతో దివంగత సీఎం వైఎస్సార్ చేపట్టారని చిన్నారెడ్డి తెలిపారు. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఆ ప్రాజెక్టులను తానే చేసినట్లు చె ప్పుకోవడం సరికాదని హితువు పలికారు. ఏపీ సీఎం చంద్రబాబుకు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవ డం అలవాటే అని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ వ ల్లే పాలమూరులో తాగు, సాగునీరు ఇబ్బందు లు తొలిగాయన్నారు. వైఎస్సార్ బతికి ఉంటే 2011లోనే ప్రాజెక్టులు పూర్తయ్యేవని, కేసీఆర్ ప్ర భుత్వం వైఎస్సార్ చేపట్టిన ప్రాజెక్టులకు ఏ మా త్రం నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. -
మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య
దేవరకద్ర రూరల్: మనస్తాపంతో గడ్డి మందు తాగి, చికిత్స పొందుతూ విద్యార్థి మృతిచెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానిక వివరాల ప్రకా రం.. బోల్లారం గ్రామానికి చెందిన పవన్కుమార్ (18) జిల్లాకేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇంట్లో చిన్న గొడవ జరగడంతో సోమవారం చిన్నచింతకుంటలో ఉన్న అక్క దగ్గరికి వెళ్లాడు. అదేరోజు సాయంత్రం అక్కడే ఉన్న వ్యవసాయ పొలానికి వెళ్లి గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని హైదరాబాద్లోని నిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. ఉన్న ఒక్కగానొక్క కూమారుడి మృతితో తల్లితండ్రుల రోదనలు మిన్నంటాయి. మహిళ అనుమానాస్పద మృతి చిన్నంబావి: మండలంలోని కొప్పునూరు శివా రులో ఓ మహిళ అనుమానాస్పదస్థితిలో మృతిచెందినట్లు సీఐ కృష్ణ తెలిపారు. ఆయ న కథనం మేరకు.. మండలంలోని బెక్కం గ్రామానికి చెందిన గుంటి రాధ (40) ఈ నెల 1న బీ చుపల్లికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటిని నుంచి బ యలుదేరింది. ఎంతకూ తిరిగి రాకపోవడంతో మండలంలోని అమ్మాయిపల్లికి చెందిన మౌలాలిపై అనుమానం వ్యక్తం చేస్తూ కు మార్తె గుంటి మేఘన 4వ తేదీన స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశా రు. కొప్పునూరు శివారులో మహిళ మృతదేహం ఉన్నట్లు బుధవారం పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి రాధ మృతదేహంగా నిర్ధారించారు. అనుమానాస్పద మృతిగా కేసు న మోదు చేసుకొని విచారణ చేపడుతున్నట్లు సీఐ వివరించారు. ఇదిలా ఉండగా.. రాధ కు ఓ కుమార్తె ఉండగా భర్త అనారోగ్యంతో ఐదేళ్ల కిందట మృతిచెందాడు. మహిళ మృతికి వివాహేతర సంబంధమే కారణంగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చోరీ కేసులో వ్యక్తికి రిమాండ్ ఖిల్లాఘనపురం: మద్యం దుకానంలో చోరీ చేసిన ఓ వ్యక్తిని రిమాండ్కు తరలించినట్లు ఎస్ ఐ వెంకటేష్ తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. ఖిల్లాఘనపురం మండల కేంద్రంలోని దుర్గా వైన్స్లో 2025 జూలైలో చోరీ చోటుచేసుకుంది. సెల్ఫోన్తోపాటు కొన్ని డబ్బులు పోయినట్లు వైన్షాపు వారు ఫిర్యాదు చేశారు. నాటినుంచి దొంగల కోసం వెతికినా పోలీసులు ఎట్టకేలకు దొంతనంలో పాల్గొన్న మొహమూద్ ఖాన్ను అదుపులోకి తీసుకుని వనపర్తి కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. న్యాయమూర్తి అతనికి జ్యూడిషియల్ రిమాండ్ విదించడం జరిగిందని ఎస్సై తెలిపారు. దొంగతనంలో పాల్గొన్న మరోదొంగ పరారీలో ఉన్నాడని, దొంగ దగ్గరి నుంచి రూ.10వేల విలువ చేసే సెల్ఫోన్ను జప్తు చేసినట్లు పేర్కొన్నారు. ఏటీఎం చోరీకీ విఫలయత్నం రాజాపూర్: గుర్తు తెలియని దొంగలు మండల కేంద్రంలోని ఓ ఏటీఎంలో చోరీ చేసేందుకు మిషన్ను ధ్వంసం చేసిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గుర్తు తెలియని దొంగలు బుధవారం తెల్లవారుజామున రాజాపూర్ ఎక్స్రోడ్డు పక్కన ఉన్న ఇండియావన్ అనే ఏటీఎం సెంటర్లోకి ప్రవేశించి ఇటుకతో మిషన్ను ధ్వంసం చేసి అందులో ఉన్న డబ్బులు తీసుకునే ప్రయత్నం చేసినా.. సాధ్యం కాలేదు. ఇంతలోనే రోడ్డుపై శబ్దం రావడంతో దొంగలు పారిపోయినట్లు ఏటీఎం మెయిన్టెనెన్స్ సూపర్వైజర్ సంతోష్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుతున్నట్లు ఎస్ఐ శివానందంగౌడ్ తెలిపారు. -
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు
మహబూబ్నగర్ క్రైం: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి బుధవారం తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. భూత్పూర్ మండలం కొత్తూర్కు చెందిన సత్తయ్య 2023, మే 23న ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భూత్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. బుధవారం కోర్టులో 8 మంది సాక్షుల వాదనలు విన్న తర్వాత నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి సత్తయ్యకు 20 ఏళ్ల కఠిన కారాగార జైలుశిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. అలాగే బాధిత బాలికకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. కేసులో నిందితుడికి శిక్షపడేలా కృషి చేసిన భూత్పూర్ పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ డి.జానకి అభినందించారు. తండ్రి కళ్లెదుటే మూడేళ్ల కుమారుడి మృతి పెద్దకొత్తపల్లి: తండ్రి కళ్లెదుటే మూడేళ్ల కుమారుడు మృతిచెందిన విషాదకర ఘటన పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. పూర్తి వివరాలిలా.. గ్రామానికి చెందిన మల్లేష్ వ్యవసాయ పనుల నిమి త్తం పొలానికి వెళ్తుండగా.. కూడా అతని మూ డేళ్ల కుమారుడు మిట్టు వెళ్లాడు. తండ్రి మల్లేష్ ట్రాక్టర్కు రోటోవేటర్ను అమర్చే పనిలో ఉండగా.. అక్కడే ఆ డుకుంటున్న బాలుడు మిట్టు అనుకోకుండా రోటోవేటర్ వద్దకు వెళ్లాడు. అ ది గమనించని తండ్రి రోటోవేటర్ను కిందికి దించగా ప్రమాదవశాత్తు అక్క డే ఉన్న బాలుడిపై పడింది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే ప్రాణా లు కోల్పోయాడు. అప్పటివరకు కళ్ల ముందు బుడిబుడి అడుగులు వేస్తూ.. ఆడుకుంటున్న కుమారుడు విగతజీవిలా మారడంతో ఆ తండ్రి గుండెలవిసేలా రోదించాడు. కుటుంబసభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. ● ట్రాక్టర్కు రొటోవేటర్ అమర్చుతుండగాప్రమాదవశాత్తు బాలుడిపై పడిన వైనం -
మళ్లీ పెరిగిన ఉల్లి ధర
దేవరకద్ర: స్థానిక మార్కెట్ యార్డులో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. రెండు వారాలుగా దిగి వచ్చిన ఉల్లి ధరలు ఈ వారంలో కొంత వరకు పెరుగుదల కనిపించింది. మార్కెట్కు దాదాపు వేయి బస్తాల ఉల్లి అమ్మకానికి వచ్చింది. ఎర్ర ఉల్లికి తక్కువగా, తెల్లగా ఉన్న ఉల్లికి ఎక్కువ ధర పలికింది. జోరుగా సాగిన వేలం... దేవరకద్ర మార్కెట్లో తెల్లగా ఉండి నాణ్యతగా ఉన్న ఉల్లిని కొనడానికి వ్యాపారులు పోటీ పడగా.. గరిష్టంగా రూ. 2,100 వరకు ధర పలికింది. ఇదే వరుసలో కొంత నాణ్యత తక్కువగా ఉన్న ఉల్లికి క్వింటాల్కు రూ.1,800 నుంచి రూ.2 వేల వరకు ధరలు లభించాయి. ఎర్ర ఉల్లికి గరిష్టంగా రూ.1,500 వరకు ధర రాగా.. కనిష్టంగా రూ.1,100 పలికింది. మార్కెట్లో చిరు వ్యాపారులతో పాటు వినియోగదారులు ఉల్లిని ఎక్కువగా కొనుగోలు చేశారు. 50 కేజీల బస్తా ధర గరిష్టంగా రూ.1,050, కనిష్టంగా రూ.900, ఎర్ర ఉల్లి గరిష్టంగా రూ.750, కనిష్టంగా రూ.500 పలికాయి. ● గరిష్టంగా రూ.2,100 ● కనిష్టంగా రూ.1,500 -
ముగిసిన పీఎంశ్రీ జిల్లా స్పోర్ట్స్ మీట్
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్న పీఎంశ్రీ జిల్లాస్థాయి స్పోర్ట్స్మీట్ బుధవారం ముగిశాయి. చివరి రోజు బాలబాలికలకు ఖోఖో, అథ్లెటిక్స్, బాలురకు ఫుట్బాల్ పోటీలు నిర్వహించారు. ఖోఖో బాలుర విభాగంలో బాదేపల్లి (బాలుర) ప్రథమ, నవాబ్పేట ద్వితీయ, బాలికల్లో బాలానగర్ ప్రథమ, చిన్నచింతకుంట ద్వితీయ, ఫుట్బాల్ బాలురలో రాజాపూర్ ప్రథమ, బాదేపల్లి (బాలుర) ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. అథ్లెటిక్స్ అంశాల్లో 100 మీటర్ల పరుగులో బాలుర విభాగంలో పాల్ జెడ్పీహెచ్ఎస్ బాదేపల్లి (బాలుర) ప్రథమ, కె.శ్రీనాథ్ జెడ్పీహెచ్ఎస్ నవాబ్పేట ద్వితీయ, షాట్పుట్లో గణేష్ జెడ్పీహెచ్ఎస్ గార్లపాడ్ ప్రథమ, శ్రీకాంత్ జెడ్పీహెచ్ఎస్ కావేరమ్మపేట ద్వితీయ, లాంగ్జంప్లో సందీప్ జెడ్పీహెచ్ఎస్ అడ్డాకుల ప్రథమ, రితిషరాజ్ జెడ్పీహెచ్ఎస్ కావేరమ్మపేట ద్వితీయ, బాలికల విభాగంలో 100మీటర్ల పరుగులో అనూష జెడ్పీహెచ్ఎస్ బాలానగర్ ప్రథమ, హేమలత టీజీఆర్ఎస్ బాలానగర్ ద్వితీయ, షాట్ఫుట్లో రమ్య టీఆర్ఐఈఎస్ బాలానగర్ ప్రథమ, కె.శ్రీవల్లిక కేజీబీవీ చిన్నచింతకుంట ద్వితీయ, లాంగ్జంస్లో జి.కావేరి కేజీబీవీ భూత్పూర్ ప్రథమ, అక్షయ జెడ్పీహెచ్ఎస్ నవాబ్పేట ద్వితీయ స్థానాల్లో నిలిచారు. ఆయా క్రీడాపోటీలో గెలుపొందిన వారికి జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి, క్రీడల ఇన్చార్జీ వేణుగోపాల్, పెటాటీఎస్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్గౌడ్ తదితరులు ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో పీడీలు వడెన్న, రమేష్బాబు, ఆనంద్కుమార్, మొగులాల్, కృష్ణ పాల్గొన్నారు. -
క్రికెట్లో విద్యార్థులు సత్తా చాటాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు క్రికెట్లో సత్తా చాలని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎండీసీ క్రికెట్ గ్రౌండ్లో సౌత్జోన్ యూనివర్సటీ, ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కిక్రెట్ ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రికెట్లో రాణించే విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉందని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంపికలు పూర్తయిన తర్వాత నిరంతరం ప్రాక్టిస్ చేసి, పీయూకు గోల్డ్మెడల్ తీసుకురావాలని ఆకాక్షించారు. ఈ సందర్భంగా గత సంవత్సరం విజ్జీ ట్రోఫీకి ఎంపికై న క్రీడాకారుడు డీవీడీ కృపను అభినందించారు. వీరికి ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసి పోటీలకు సన్నద్ధ చేయాలని పీడీ శ్రీనివాస్కు సూచించారు. ఇక్కడ ఎంపికై న విద్యార్థులు తమిళనాడులోని అన్నా యూనివర్సిటీలో జరిగే పోటీల్లో పాల్గొనున్నారు. కార్యక్రమంలో కంట్రోలర్ ప్రవీణ, పీడీ శ్రీనివాస్, ఎండీసీఏ సెక్రెటరీ రాజశేఖర్, ప్రెసిడెంట్ సురేశ్కుమార్ రెడ్డి, యుగేంధర్, రజిని, శ్వేత తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీలో ఒగ్గు కళా ప్రదర్శనకు పీజీ విద్యార్థి ఎంపిక
కొల్లాపూర్:కొల్లాపూర్ ప్రభు త్వ పీజీ కళాశాలలో ఎంఏ తెలుగు ద్వితీయ సంవత్స రం చదువుతున్న కె.శివరాజ్ ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఒగ్గు కళా ప్రదర్శనకు ఎంపికయ్యారు. జానపద కళల్లో విశేష ప్రతిభ కనబర్చి న శివరాజ్ ఈనెల 26 వతేదీన జరగనున్న గణతంత్ర వేడుకల్లో ప్రదర్శన ఇచ్చేందుకు ఎంపిక చేశారు. ఈనెల 8వ తేదీ నుంచి జరిగే రిహార్సల్ కు ఆయన హాజరుకానున్నారు. శివరాజ్ ఎంపిక పట్ల కళాశాల ప్రిన్సిపల్ మార్క్పోలోనియస్తోపాటు అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. రేపు పీయూలో ప్రాంగణ ఎంపికలు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: కే12 టెక్నో సర్వీసెస్ ఆధ్వర్యంలో పీయూలో గురువారం ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ప్లేస్మెంట్ అధి కారి అర్జున్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ, ఎంసీఏ పూర్తి చేసిన విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చని, ఉదయం 10 గంటలకు ఎంపికలకు అభ్యర్థులు బయోడేటాతో రావాలని, మరింత సమాచారం కోసం 9849445877 నంబర్ను సంప్రదించాలని సూచించారు. పేగు బంధం.. లేదు పొమ్మంది మరికల్: కన్నబిడ్డల కడసారి చూపును చూసు కో ను, మాజీ భర్త పార్థీవ దేహానితో సంబంధం లే దు అన్న సదరు మహిళ తీరుపై మండలంలోని తీలేర్ గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నా రు. పూర్తి వివరాలు.. తీలేర్ గ్రామానికి చెందిన శివరాములు భార్య లేని జీవితం తనకు, తన ఇద్దరి పిల్లలకు ఎందుకని పిల్లలను దారుణంగా హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న విష యం తెలిసిందే. నా భార్య విడాకులు ఇవ్వడం వల్లే ముగ్గురం కలిసి ఆత్మహత్య చేసుకున్నామని మరణ వాంగ్మూలం ఇచ్చిన విషయాన్ని పోలీసులు పిల్లల తల్లికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. తనకు ఏమీ సంబంధం లేదని పోలీసులకు చెప్పడం, కన్నపిల్లల చివరి చూపునకు రాని కర్కశ తల్లి తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులు చిన్నారుల అంత్యక్రియలు పూర్తి చేశారు. హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన చిన్నారుల తండ్రి శివరాములు అంత్యక్రియలను బుధవారం నిర్వహించారు. -
ఉత్సాహంగా నెట్బాల్ జట్ల ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: తెలంగాణ పురుషుల, మహిళా నెట్బాల్ జట్ల చివరి ఎంపిక ట్రయల్స్ను బుధవారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. త్వరలో జరిగే సీనియర్ నేషనల్ నెట్బాల్ చాంపియన్షిప్లో పాల్గొననున్న తెలంగాణ జట్ల ఎంపికలు బుధవారం నిర్వహించగా.. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరైనట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. ఎంపికలకు ఉత్తరాఖండ్కు చెందిన సురేందర్ పరిశీలకుడిగా హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా నెట్బాల్ అసోసియేషన్ ప్రతినిధి అంజద్అలీ తదితరులు పాల్గొన్నారు. -
దుందుభీలో దోపిడీ
యంత్రాలతో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు● భారీగా నిల్వలు ● రాత్రిళ్లు టిప్పర్లతో తరలింపునకు సన్నాహాలు ● అనుమతులు లేవంటున్న అధికారులు జడ్చర్ల: మిడ్జిల్ మండల శివారులోని దుందుభీ వా గులో ఇసుకాసురులు మళ్లీ ఇసుక తవ్వకాలు చేపడుతూ తరలింపునకు సర్వం సిద్ధం చేశారు. ఆరునెలల కింద ఇక్కడే అడ్డగోలుగా తవ్వకాలు చేపట్టి యథేచ్ఛగా తరలించారు. టీజీఎండీసీ నుంచి అనుమతి పొందిన వారు నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు తెరలేపి తవ్వకాలు, తరలింపు చేపట్టడంతో నాడు కలెక్టర్ విచారణ చేపట్టి రద్దు చేయడంతో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వారం రోజు లుగా వాగులో భారీ యంత్రాలు, టిప్పర్లను వినియోగించి దర్జాగా తవ్వకాలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ డంప్లను సిద్ధంగా ఉంచి సమయం దొరికినప్పుడల్లా తరలించాలన్న ఉద్దేశంతో ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు. వందల సంఖ్యలో టిప్పర్లు.. కొత్తపల్లి శివారులోని దుందుభీ వాగులో ఇసుక డంపులకు అతి దగ్గరగా టిప్పర్లు, హిటాచీలను సిద్ధంగా ఉంచారు. టిప్పర్లు సురక్షితంగా రాకపోకలు సాగించేందుకు దారులు పటిష్టం చేశారు. ఏ క్షణమైనా కనుసైగతో ఇసుక డంప్లను మాయం చేసేలా పక్కా ప్రణాళికలను ఇసుకాసురులు అమ లు చేస్తున్నారు. వాగులో ఎక్కడికక్కడ ఇసుక కుప్ప లు కనిపిస్తున్నాయంటే పరిస్థితి ఊహించుకోవచ్చు. అధికారులు రాకుండా జాగ్రత్తలు.. సంబంధిత అధికారులు, పోలీసులు ఆ ప్రాంతాల్లోకి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఎవరైనా ఫిర్యాదు చేసినా చూస్తాం.. చేస్తా్ం.. వస్తున్నాం లేదా బిజీగా ఉన్నామంటూ కాలయాపన చేసే సమాధానాలు వచ్చేలా వ్యూహరచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఏదైమైనా ఈ విడతలో వాగును కొల్లగొట్టాలన్న లక్ష్యంతో ఇసుకాసురులు దురాలోచనలకు పదును పెట్టినట్లు తెలుస్తోంది. ఇసుక తరలింపు, తవ్వకాలకు సంబంధించి తాము ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని మిడ్జిల్ రెవెన్యూ ఆర్ఐ రఘు తెలిపారు. అనుమతులు లేకున్నా వాగులో కొనసాగుతున్న హడావుడి అంతా ఇంతా కాదు. యథేచ్ఛగా తవ్వకాలు కొనసాగుతున్నా.. సంబంధిత అధికారులు అటుగా తొంగిచూడక పోవడంపై విమర్శలు వెల్లువెతుత్తున్నాయి. కలెక్టర్ స్పందించి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత రైతులు, ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ముగిసిన పర్వతాపూర్ మైసమ్మ ఉత్సవాలు
నవాబుపేట: మండలంలోని పర్వతాపూర్ మైసమ్మ దేవత ఉత్సవాలు బుధవారం జరిగిన ప్రత్యేక పూజలు మహామంగళహారతితో ముగిశాయి. వారంరోజులు జరిగిన ఉత్సవాలను అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి హారతినిచ్చి కార్యక్రమాలను ముగించినట్లు ఆలయ అధికారి నర్సింహులు, చైర్మన్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. కాగా, ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు, వసతులు ఏర్పాటు చేసిన సభ్యులు, పోలీస్, వైద్యసిబ్బందికి ఆలయ కమిటీ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాకర్లపహాడ్ సర్పంచ్ బాలయ్య, ఆలయ సిబ్బంది శ్రీకాంత్శర్మ, గోపాల్, మల్లేశ్, నర్సింహులు, మాజీ చైర్మన్ గోపాల్, సుభాన్చారి, వేణాచారి, మైనోద్దిన్, నరేందర్, మాధవులు, బాలయ్య, వెంకటయ్య, శ్రీను, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. ● మైసమ్మ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి హుండీలను బుధవారం లెక్కించారు. ఈ సందర్భంగా హుండీలో కిలో వెండి ఆభరణాలు, 6మాసాల బంగారు ఆభరణాలు, రూ.1,11,413 నగదు కానుకలు సమర్పించారు. -
డయాలస్ట్రెస్!
ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న ‘కిడ్నీ’ బాధితులు ● వనపర్తి, గద్వాల, మహబూబ్నగర్ జిల్లాల్లో అధికం ● అధునాతన పరికరాలున్నా.. వైద్యులు కరువు ● గతేడాది 7,270 మందికి డయాలసిస్.. ప్రస్తుతం 900 మందికి చికిత్స పాలమూరు: రోజురోజుకు మూత్రపిండ సంబంధిత వ్యాధులు విస్తరిస్తున్నాయి. ఏటా పదుల సంఖ్యలో బాధితులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లాలో నెలకొన్న విభిన్న పరిస్థితులు, అలవాట్లు, భూగర్భజలాలు కలుషితం కావడం వంటివి కూడా బాధితుల పెరుగుదలకు కారణమవుతున్నాయి. గతేడాది 7,270 మందికి డయాలసిస్ చేయగా.. ప్రస్తుతం ప్రభుత్వ సెంటర్లలో 550 మంది, ప్రైవేటులో మరో 350 మందికి పైగా బాధితులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. ప్రధానంగా మక్తల్, నారాయణపేట, వనపర్తి ప్రాంతాలతో పాటు భూత్పూర్ మండలంలోని గ్రామాల్లో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న బాధితులు అధికమవుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 12 సెంటర్లు ఉండగా.. కొత్తగా మళ్లీ ప్రతి 20 కి.మీ. పరిధిలో ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖంగా ఉండటంతో.. ఉమ్మడి జిల్లా నుంచి 20 సెంటర్లు నూతనంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపించారు. ● రెండు నెలల్లో గద్వాలలో అత్యధికంగా డయాలసిస్ చేయించుకున్న బాధితులున్నారు. ఉమ్మడి జిల్లాలో గద్వాల సెంటర్లో 12 మిషన్లు ఉండగా.. నవంబర్లో 963, డిసెంబర్లో 976 మందికి డయాలసిస్ సేవలు అందించారు. కాగా.. అధునాత కేంద్రాలున్నా.. పాలమూరులో రోగులకు సలహాలు, సూచనలు అందించేందుకు ఒక్క నెఫ్రాలజిస్టు అందుబాటులో లేకపోవడం గమనార్హం. -
లింగ నిర్ధారణకు పాల్పడితే చర్యలు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిరతో కలిసి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. గర్భిణుల స్కానింగ్ సమయంలో పుట్టబోయే శిశువు లింగాన్ని వెల్లడించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. అన్ని క్లినిక్స్ వద్ద లింగ నిర్ధారణ నిషేధమని స్పష్టంగా తెలియజేసే బోర్డులు తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. డయాగ్నొస్టిక్, ఇతర స్కానింగ్ సెంటర్లలో అధికారులు 90 రోజుల్లోగా తనిఖీలు నిర్వహించి.. సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర మాట్లాడుతూ.. పీసీపీఏన్డీటీ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలుచేయాల్సిన అవసరం ఉందన్నారు. పుట్టబోయే శిశువు లింగాన్ని వెల్లడించే వ్యక్తులు, క్లినిక్స్పై క్రిమినల్ కేసులు నమోదు చేసి.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం జిల్లాలో సీ్త్ర, పురుష నిష్పత్తి 1000 మంది పురుషులకు 964 మహిళలుగా ఉందన్నారు. లింగ నిష్పత్తి పరిరక్షణకు కఠిన పర్యవేక్షణ అవసరమని అన్నారు. కాగా, జిల్లాలో 85 గర్భకాల నిర్ధారణ కేంద్రాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డా.కృష్ణ, ఏఎస్పీ రత్నం, డీఈఎంఓ మంజుల, ఐఎంఏ ప్రతినిధి రామ్మోహన్ ఉన్నారు. -
పార్టీ కోసం పనిచేసే వారికే ప్రాధాన్యత
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్న వారికే ప్రాధాన్యత ఇస్తామని.. కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపునకు సమష్టిగా పనిచేసి గెలిపించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పార్టీ శ్రేణులకు సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తన ఫాంహౌస్లో మహబూబ్నగర్ పట్టణ ముఖ్యనాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం లేని లోటు ప్రజలకు కనిపిస్తుందన్నారు. గ్రామాల్లో పర్యటనకు వెళ్తే ప్రజలు అనేక సమస్యలను ఏకరువు పెడుతున్నారని అన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనే సమాధానం ప్రజల నుంచి వస్తుందన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఆంధ్ర ప్రాంతానికి మేలుచేసే విధంగా కాంగ్రెస్ పాలన సాగుతోందన్నారు. కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ల రిజర్వేషన్ల ప్రక్రియలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ నాయకులకు ఆయన సూచించారు. సమావేశంలో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, గణేశ్, శ్రీనివాస్రెడ్డి, అనంతరెడ్డి, అన్వర్పాషా, రెహమాన్, ఆంజనేయులు, ప్రవీణ్, నరేందర్, రాము, వేదావత్, నవకాంత్, కిషోర్, సుధాకర్ తదితరులు ఉన్నారు. వేరుశనగకు రికార్డు ధర జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో బుధవారం వేరుశనగకు రికార్డు స్థాయి ధర దక్కింది. ఈఏడాది ఇప్పటి వరకు ఇంత ధర లభించలేదు. క్వింటాలుకు గరిష్టంగా రూ.9,126, కనిష్టంగా రూ.6,966 ధరలు పలికాయి. వాస్తవంగా ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్ రూ.7,263గా ఉంది. మార్కెట్లో ఈ ఏడాది మద్దతు ధరలకు మించి వేరుశనగకు మంచి ధరలు లభిస్తున్నాయి. త్వరలోనే క్వింటా రూ.10 వేల వరకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. గతేడాది వేరుశనగకు మద్దతు ధరలు కూడా లభించని పరిస్థితి ఉంది. ఇక ధాన్యం ఆర్ఎన్ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,739, కనిష్టంగా రూ.2,386 , హంస రూ.1,832, కందులు గరిష్టంగా రూ.6,920, కనిష్టంగా రూ.5,171, పత్తి గరిష్టంగా రూ.7,370, కనిష్టంగా రూ.6,629, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,976, కనిష్టంగా రూ.1,716 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్లో కందులు గరిష్టంగా రూ.6,712, కనిష్టంగా రూ.6,074 ధర పలికింది. -
ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యం: ఎస్పీ
రాజాపూర్: ప్రజల భద్రతే పోలీసుశాఖ ప్రధాన లక్ష్యమని ఎస్పీ జానకి అన్నారు. బాలానగర్లో చేపట్టిన ఎన్హెచ్–44 ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులను బుధవారం ఆమె పరిశీలించారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో హైవేపై వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉందని.. ఫ్లైఓవర్ బ్రిడ్జి పనుల వద్ద ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్థానిక పోలీసులు, నేషనల్ హైవే అధికారులకు ఎస్పీ సూచించారు. ముఖ్యంగా పనులు జరిగే ప్రాంతాల్లో సూచిక, హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసి, వాహనాల రాకపోకలు సజవుగా సాగేలా చూడాలన్నారు. ఎస్పీ వెంట సీఐ నాగార్జునగౌడ్, ఎస్ఐలు లెనిన్గౌడ్, శివానందం ఉన్నారు. -
వృద్ధులు, దివ్యాంగుల సమస్యలు పరిష్కరించండి
మహబూబ్నగర్ రూరల్: వృద్ధులు, దివ్యాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. బుధవారం అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో ఆమె వృద్ధులు, దివ్యాంగుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఆ వెంటనే సంబంధిత అధికారులకు రెఫర్ చేస్తూ పరిష్కారం చేయాలని ఆదేశించారు. గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ల కోసం వినతులు వచ్చాయి. దివ్యాంగులకు కమ్యూనిటీ భవనం ఏర్పాటుచేయాలని ఆ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు జిల్లా సంక్షేమశాఖ అధికారి జరీనాబేగం గతంలో వచ్చిన ఫిర్యాదులను సమగ్రంగా కలెక్టర్కు వివరించారు. డీఆర్డీఓ నర్సింహులు, ఆర్డీఓ నవీన్, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు పాల్గొన్నారు. -
పాలమూరును ఎడారి చేసేందుకు కుట్ర
అమరచింత/ కొల్లాపూర్/ కొల్లాపూర్ రూరల్: కేవలం 9 టీఎంసీల సామర్థ్యం గల జూరాల నుంచి కొడంగల్, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలకు కృష్ణా నీటిని తరలించి పాలమూరును ఎడారిగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ జలపోరులో భాగంగా జూరాల, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను మంగళవారం ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సందర్శించారు. ముందుగా జూరాల వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టులపై అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలు ముందుకు సాగలేదని విమర్శించడం సరికాదన్నారు. జూరాలలో నీటి నిల్వలను కాపాడుకునే ప్రయత్నం చేయలేని సీఎం రైతులు, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ ప్రచారం తెరపైకి తెచ్చారన్నారు. వేసవి రాక ముందే జూరాలలో నీటి నిల్వలు అడుగంటాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జూరాల ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు రెండు పంటలకు సాగునీరు ఇవ్వలేక క్రాప్ హాలీడే ప్రకటించడమే ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అన్నారు. కేవలం 9 టీఎంసీల సామర్థ్యం కలిగిన జూరాలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి తరలించేలా పనులు ప్రారంభించి 90 శాతం పూర్తిచేశారని చెప్పారు. ప్రస్తుతం మిగులు పనులు చేస్తే ఆంధ్ర రాష్ట్రానికి నీటి కొరత ఉంటుందనే సాకుతో ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీటి తరలింపు దండగని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పాలమూరు జిల్లా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత నష్టపోయిందని అలాంటి జిల్లాలో సాగునీటితోపాటు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కృష్ణానది జలాలు వందశాతం వాడుకునే హక్కు పాలమూరుకే ఉందన్నారు. ఆయా కార్యక్రమాల్లో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి, అంజయ్యయాదవ్, పట్నం నరేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఎస్.రాజేందర్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, జైపాల్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 90 శాతం పూర్తయినప్రాజెక్టుపై నిందలా జూరాల నుంచి కొడంగల్కు నీటి పంపింగ్ ఎలా సాధ్యమవుతుంది సీఎం, మంత్రులకు ‘పాలమూరు’పై కనీస అవగాహన లేదు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల సందర్శనలో మాజీ మంత్రుల ధ్వజం -
జైలులో ఖైదీలుసత్ప్రవర్తనతో మెలగాలి
పాలమూరు: జిల్లా జైలులో వివిధ రకాల కేసుల్లో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలు పూర్తిగా సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత అన్నారు. నగరంలో ఉన్న జిల్లా జైలును మంగళవారం న్యాయమూర్తి సందర్శించి స్థానిక పరిస్థితులను పరిశీలించారు. ఖైదీలకు సంబంధించిన బ్యారక్లు, లీగల్ ఎయిడ్ క్లినిక్ పనితీరు తనిఖీ చేశారు. అనంతరం కిచెన్, జైలు అంతర్గత పరిసరాలను పరిశీలించారు. ఆ తర్వాత ఖైదీలకు నిర్వహించిన అవగాహన సదస్సులో న్యాయమూర్తి మాట్లాడుతూ కొందరు క్షణికావేశంలో చేసిన తప్పులు మళ్లీ బయటకు వెళ్లిన తర్వాత చేయకుండా ఉత్తమ జీవనం సాగించాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఇందిర, జైలు సూపరింటెండెంట్ వెంకటేశం, మెడికల్ ఆఫీసర్ మిర్జా అలీబేగ్, రవీందర్, యోగేశ్వర్రాజ్, మల్లారెడ్డి పాల్గొన్నారు. చైనా మాంజాపైపూర్తిగా నిషేధం: ఎస్పీ మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో చైనా మాంజాపై పూర్తిగా నిషేధం ఉందని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి విక్రయాలు చేసినా, నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జానకి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఉల్లంఘించి విక్రయాలు చేసిన లేదా వినియోగించిన దాని వల్ల ఎవరికై నా ప్రమాదం జరిగినట్లయితే సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సంక్రాంతి నేపథ్యంలో జిల్లాలో ఉన్న అన్ని పోలీస్స్టేషన్ పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేయడంతో పాటు ప్రత్యేక నిఘా పెట్టనున్నట్లు పేర్కొన్నారు. సాఽ దారణ ధారాలతో గాలిపటాలు ఎగురవేయాలని, పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా చైనా మంజా విక్రయాలు లేదా వినియోగం జరిగినట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూం నంబర్ 87126 59360కు సమాచారం ఇవ్వాలని కోరారు. ‘సర్వే దరఖాస్తులుపెండింగ్లో పెట్టొద్దు’ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): సర్వే చేయాల్సిన దరఖాస్తులను పెండింగ్లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ సూచించారు. మంగళవారం తన చాంబర్లో అన్ని మండలాల సర్వేయర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల సర్వేయర్లు తమ స్థాయిలో మండలాల్లో సర్వే చేయాలని, పెండింగ్ పెట్టొద్దని సూచించారు. ఎఫ్లైన్ పిటిషన్లు ఎప్పటికప్పుడు ఫీల్డ్కు వెళ్లి పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో ఏడీ సర్వే అశోక్ పాల్గొన్నారు. 8న అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: ఆదిలాబాద్ జిల్లాలో ఈనెల 18వ తేదీన జరిగే రాష్ట్రస్థాయి అంతర్జిల్లాల సబ్ జూనియర్ బాలబాలికల అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను 8న జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 8.30 గంటలకు ఎంపికలు ప్రారంభమయవుతాయని, ఆసక్తి గల క్రీడాకారులు తహసీల్దార్ ద్వారా జారీచేసిన కుల ధ్రువీకరణ పత్రం, జనన ధ్రువపత్రం, ఆధార్ కార్డుతో హాజరుకావాలని ఆయన కోరారు. -
ఎటు చూసినా డబ్బాలే!
నగర పరిధిలోని ఎన్హెచ్–167కు ఇరువైపులా ఏర్పాటు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగర పరిధిలోని ప్రధాన రోడ్లకు ఇరువైపులా ఎక్కడ చూసినా ఇబ్బడిముబ్బడిగా డబ్బాలు వెలిశాయి. ముఖ్యంగా ఎన్హెచ్–167పై వందలాది డబ్బాలను కొందరు ప్రైవేట్ వ్యక్తులు మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలాలలో ఏర్పాటు చేసి ఇతరులకు కిరాయికి ఇస్తూ దండిగా సంపాదిస్తున్నారు. వాస్తవానికి ఏడాదిన్నర క్రితం వరకు తైబబజార్ అమలులో ఉండగా సదరు కాంట్రాక్టరు ప్రతి వీధి వ్యాపారి నుంచి రూ.30 నుంచి రూ.120 వరకు వసూలు చేసేవారు. రోడ్లపై తోపుడుబండ్లతో పాటు లోకల్ ట్రాన్స్పోర్ట్ (లోడింగ్, అన్లోడింగ్) వాహనాలు, ఆయా డబ్బాల్లో చిరు వ్యాపారుల నుంచి ముక్కుపిండి వసూలు చేసేవారు. అనంతరం దీనిని రద్దు చేయడంతో ఇదే అదనుగా భావించిన కొందరు వ్యక్తులు యథేచ్ఛగా డబ్బాలను ఏర్పాటు చేయసాగారు. మెప్మా ఆధ్వర్యంలో మరికొన్ని.. సుమారు ఐదేళ్ల క్రితం మెప్మా ఆధ్వర్యంలో 123 డబ్బాలను నిర్మించి వీధి వ్యాపారుల కోసం కేటాయించారు. ఇందులో భాగంగా జిల్లా అటవీశాఖ కార్యాలయం వద్ద 55, బాదం రామస్వామి గోల్డెన్ మున్సిపల్ ఆడిటోయం వద్ద 8, జీజీహెచ్కు ఎదురుగా 11, మెట్టుగడ్డ వద్ద 31, బండ్లగేరిచౌరస్తాలో 9, పాలకొండ డివిజన్ కార్యాలయం వద్ద 7, వేపురిగేరిలోని రెమానియా బ్రిడ్జి వద్ద 2 ఏర్పాటు చేశారు. అలాగే సుమారు ఏడాది క్రితం క్లాక్టవర్ వద్ద ఎమ్మెల్యే నిధులతో 18 డబ్బాలు (రేకుల షెడ్లు) నిర్మించారు. అయితే కొన్నిచోట్ల కేటాయించిన వారు వ్యాపారం నిర్వహించకుండా ఏకంగా ఇతరులకు కిరాయికి ఇచ్చేశారు. ఇలా ఒక్కో డబ్బా నుంచి రూ.మూడు వేల వరకు వసూలు చేస్తూ దండిగా సంపాదిస్తున్నారు. ● రూ.30 లక్షలు వెచ్చించి 2020లో పాన్చౌరస్తా సమీపంలోని మున్సిపల్ స్థలంలో జీ ప్లన్ వన్గా మహిళా సంఘ భవనం నిర్మించారు. పైన మహిళల కోసం పెద్ద హాలుతో పాటు కింద రెండు పెద్ద షాపు లు, మరో రెండు చిన్న షాపులు నిర్మించారు. అయి తే అప్పట్లోనే ఈ నాలుగు షాపులను రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని ఎలాంటి అద్దె లేకుండా ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు చేజిక్కించుకున్నారు. ఇందులో ఒకరు మాజీ కౌన్సిలర్ కుటుంబ సభ్యులే ఎంబ్రాయిడరీ, టైలరింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకున్నారు. మరో పెద్ద షాపు, చిన్నషాపును బంగారు నగలు తయారు చేసే ఇతరులకు అద్దెకు ఇచ్చినా మున్సిపల్ కార్పొరేషన్కు మాత్రం నయాపైసా చెల్లించకపోవడం గమనార్హం. మిగిలిన చిన్న షాపును వేరే మహిళ మగ్గం వర్క్ చేసేందుకు ఇతరులకు అద్దెకు ఇచ్చేశారు. ఈ వ్యవహారంపై గతంలో పలుసార్లు మున్సిపల్ కౌన్సిల్లో కొందరు కౌన్సిలర్లు సమావేశం దృష్టికి తెచ్చారు. బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఏడాది క్రితం అప్పటి మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్కడికి వెళ్లి ఈ షాపులను ఖాళీ చేయాలని బాధ్యులకు నోటీసులు అందజేసినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. ముఖ్య కూడళ్లు,ప్రధాన రహదారులే అడ్డా.. నగర పరిధిలో అప్పన్నపల్లి మొదలుకుని బండమీదిపల్లి వరకు ఎన్హెచ్–167 సుమారు 6 కి.మీ. విస్తరించింది. దీనికి ఇరువైపులా ముఖ్యకూడళ్లు, వ్యాపార సముదాయాల వద్ద కిక్కిరిసి రద్దీగా ఉండే ప్రాంతాల్లో డబ్బాలు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే వన్టౌన్ నుంచి భూత్పూర్ రోడ్డు వెంట క్రిస్టియన్పల్లి వరకు, బోయపల్లిగేట్ మొదలుకుని నవాబ్పేట రోడ్డు వరకు, టీడీగుట్ట నుంచి కోయిల్కొండ ఎక్స్రోడ్డు వరకు, మెట్టుగడ్డ నుంచి పిల్లలమర్రి రోడ్డు వరకు వందలాది ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా వాటిలో కొందరు సొంతంగా వివిధ వ్యాపారాలు కొనసాగిస్తుండగా.. మరికొందరు దీనిని ఒక ఆదాయ వనరుగా మార్చుకుని ప్రభుత్వ స్థలంలో ఫుట్పాత్ను ఆనుకుని వేస్తుండటంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చివరకు రోడ్లపైనే నడవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ స్థలమైనా మున్సిపల్ కార్పొరేషన్కు దక్కని ఆదాయం మెప్మా ఆధ్వర్యంలో ఉన్నవి కేవలం 123 మాత్రమే పాన్చౌరస్తా సమీపంలోని 4 షెట్టర్లు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి.. ఏడాది క్రితమే బాధ్యులకు నోటీసులిచ్చినా ఖాళీ చేయని వైనం -
చదువుతో పాటు ఆటల్లో ప్రతిభ చాటాలి
మహబూబ్నగర్ క్రీడలు: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభచాటాలని జిల్లా విద్యాశాఖాధికారి ప్రవీణ్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మెయిన్స్టేడియంలో రెండు రోజులపాటు జరిగే పీఎంశ్రీ జిల్లాస్థాయి స్పోర్ట్స్ మీట్ మంగళవారం ప్రారంభమైంది. కార్యక్రమంలో పాల్గొన్న డీఈఓ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కబడ్డీ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఆయన మాట్లాడుతూ జిల్లాస్థాయిలో విజేతగా నిలిచిన వారు రాష్ట్రస్థాయి పీఎంశ్రీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపొంది ఢిల్లీస్థాయిలో పాల్గొని మన జిల్లాకు పేరు తేవాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్, క్రీడల ఇన్చార్జి వేణుగోపాల్, పీడీలు జగన్మోహన్గౌడ్, సాదత్ఖాన్, రాజవర్దన్రెడ్డి, వడెన్న, పరుశరాములు, రాంచందర్, ముస్తఫా, శ్రీనివాస్రెడ్డి, రాజశేఖర్, శంకర్, వినోద్, కృష్ణ, మొయిన్ తదితరులు పాల్గొన్నారు. ● పీఎంశ్రీ క్రీడల్లో భాగంగా కబడ్డీ, వాలీ బాల్ పోటీలు నిర్వహించారు. కబడ్డీ బాలుర విభా గంలో బాదేపల్లి (బాలుర) ప్రథమ, గార్లపాడ్ ద్వితీయ, బాలికల్లో టీజీఆర్ఎస్ బాలానగర్ ప్రథమ, వస్పుల ద్వితీయ, బాలుర విభాగం వాలీబాల్లో బాదేపల్లి (బాలుర) ప్రథమ, వేముల ద్వితీయ, బాలికల్లో బాలానగర్ ప్రథమ, చిన్నచింతకుంట ద్వితీయ స్థానాల్లో నిలిచారు. నేడు (బుధవారం) పీఎంశ్రీ జిల్లాస్థాయి క్రీడాపోటీల్లో భాగంగా ఖోఖో, ఫుట్బాల్, అథ్లెటిక్స్ పోటీలు జరగనున్నాయి. కబడ్డీ ఆడుతున్న బాలికలు -
అభ్యంతరాలు పరిశీలించి.. పరిష్కరిస్తాం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మున్సిపల్ వార్డు ల వారీగా ఈనెల 1న ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితా పై వచ్చిన అభ్యంతరాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో మున్సిపల్ ఎన్నికల ముసాయిదా ఓటరు జాబితాపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు మహబూబ్నగర్ నగర పాలక సంస్థలో 144, భూత్పూర్ మున్సిపాలిటీలో 88, దేవరకద్ర మున్సిపాలిటీలో 9 అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. ముఖ్యంగా ఒక వార్డులో ఉన్న ఓటర్లు మరో వార్డులో రావడం, కుటుంబ సభ్యులకు వేర్వేరు పోలింగ్ కేంద్రాలలో ఓట్లు రావడం, ఒక కాలనీ ఓటర్లు రెండు మూడు పోలింగ్ కేంద్రాలలో ఉండడం వంటి వాటిపై అభ్యంతరాలు ఉన్నట్లు రాజకీయ పార్టీల ప్రతినిధులు తెలిపారు. వార్డు వారీగా ప్రచురించిన ఓటరు జాబితాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పునఃపరిశీలన చేస్తున్నామని, రాజకీయ పార్టీల ప్రతినిధులకు కలెక్టర్ తెలిపారు. వీటన్నింటినీ ఈ నెల 9లోగా పరిశీలించి 10న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామని, అంతలోపు ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాజకీయ పార్టీలు తెలియజేయాలని కోరారు. ఎలాంటి తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించి మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆమె కోరారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ మాట్లాడుతూ ఈనెల 1న మున్సిపాలిటీలలో ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించడం జరిగిందని, అభ్యంతరాల స్వీకరణకై మున్సిపాలిటీలలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి, అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని, ముసాయిదా జాబితా ముందే అన్ని రాజకీయ పార్టీలకు అందచేయాలని కోరారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్గౌడ్, బీజేపీ నాయకులు శ్రీనివాస్రెడ్డి, ఇతర పార్టీ నాయకులు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు. తప్పులు లేకుండా ఓటరు జాబితాను రూపొందిస్తాం మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి కలెక్టర్ విజయేందిర బోయి -
గ్రామాల్లో క్రీడాసందడి
మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోంది. గ్రామీణస్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది కూడా సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. గ్రామస్థాయి, మండల–అర్బన్, అసెంబ్లీ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు సీఎం కప్ పోటీలు జరగనున్నాయి. ఈ నెల 17, 22 వరకు గ్రామస్థాయి, 28 నుంచి 31 వరకు మండల/అర్బన్, వచ్చేనెల 3 నుంచి 7 వరకు అసెంబ్లీ స్థాయి, 10 నుంచి 14 వరకు జిల్లాస్థాయి, వివిధ ప్రాంతాల్లో 19 నుంచి 26 వరకు రాష్ట్రస్థాయిలో సీఎం కప్ క్రీడాపోటీలు జరగనున్నాయి. ముఖ్యంగా గ్రామస్థాయిలో క్రీడలతో ఒక నూతన ఉత్సాహం నెలకొనే అవకాశం ఉంటుంది. ఈసారి చిన్నారులు, ఇతరులకు కూడా రీక్రియేషన్ క్రీడలు జరగనున్నాయి. సీఎం కప్ సందర్భంగా జనవరి 8 నుంచి 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక టార్చ్ ర్యాలీ నిర్వహించనున్నారు. వివిధ క్రీడాంశాల్లో పోటీలు సీఎం కప్లో 44 క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, స్విమ్మింగ్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్, షూటింగ్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, హాకీ, ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, సెపక్తక్రా, చెస్, బేస్బాల్, నెట్బాల్, కిక్బాక్సింగ్, సైక్లింగ్, రోయింగ్, స్క్వాష్ రాకెట్, కనోయింగ్–కయాకింగ్, వుషు, అత్యపత్య, పవర్ లిఫ్టింగ్, సాఫ్ట్బాల్, తైక్వాండో, బిలియర్డ్స్ స్నూకర్స్, జూడో, కరాటే, యోగా, స్కేటింగ్, ఫెన్సింగ్, పికిల్బాల్, సెయిలింగ్, బాల్బ్యాడ్మింటన్, మల్లకంబ్, పారా గేమ్స్, రీక్రియషనల్ క్రీడలులకు పోటీలు నిర్వహిస్తారు. గతేడాది 90 పతకాలు.. సీఎం కప్ క్రీడాపోటీలు క్రీడాకారుల ప్రతిభకు వేదికగా నిలుస్తున్నాయి. 2024 డిసెంబర్ నుంచి 2025 జనవరి 2 వరకు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మొదటి సీఎం కప్ పోటీలను విజయవంతంగా నిర్వహించారు. మహబూబ్నగర్లో రాష్ట్రస్థాయి కబడ్డీ, నెట్బాల్ పోటీలు జరిగాయి.రాష్ట్రస్థాయిలో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు 90 పతకాలు సాధించారు. వీటిలో 26 బంగారు పతకాలతో సత్తాచాటారు. మహబూబ్నగర్ క్రీడాకారులు 9 బంగా రు, 15 రజతం, 11 కాంస్య పతకాలతో మొత్తం 35 పతకాలు సాధించారు. వనపర్తి జిల్లా 8 బంగారు, 6 రజతం, 5 కాంస్య పతకాలు మొత్తం 19 పతకాలు, నారాయణపేట జిల్లా 6 బంగారు, 6 రజతం, 2 కాంస్యంతో 14 పతకాలు, జోగుళాంబ గద్వాల జిల్లా 2 బంగారు, 2 రజతం, 5 కాంస్య పతకాలతో మొత్తం 9 పతకాలు, నాగర్కర్నూల్ జిల్లా ఒక బంగారు, 2 రజతం, 10 కాంస్యంతో 13 పతకాలు సొంతం చేసుకున్నారు. ఔత్సాహికులకు మంచి అవకాశం సీఎం కప్ క్రీడలు ఔత్సాహిక క్రీడాకారులకు మంచి అవకాశం. గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభ బయటికి వస్తుంది. గ్రామస్థాయి నుంచి ప్రపంచస్థాయి వరకు క్రీడాకారులను తీర్చిదిద్దడమే సీఎం కప్ ప్రధాన ఉద్దేశం. అధికారులు, క్రీడాసంఘాలు, పీడీ, పీఈటీలు, సీనియర్ క్రీడాకారుల సహకారంతో జిల్లాలో సీఎం కప్ పోటీలను విజయవంతంగా నిర్వహిస్తాం. ఆసక్తిగల క్రీడాకారులు https://satg.telangana.govi.in/ cmcup వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. – ఎస్.శ్రీనివాస్, డీవైఎస్ఓ సీఎం కప్ కోసం సన్నాహాలు గ్రామ, మండల, అసెంబ్లీ, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు పోటీలు ఈ నెల 17వ తేదీ నుంచి ఫిబ్రవరి 26 వరకు క్రీడలు -
తీర్థయాత్రలకెళ్లి తిరిగిరాని లోకాలకు..
● ఉజ్జయిని పుణ్యక్షేత్రం సమీపంలో రోడ్డుప్రమాదం ● తుఫాన్, ట్రక్ ఢీకొని ఇద్దరు యువకులు, తూఫాన్ డ్రైవర్ మృతి ● మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలు చిన్నచింతకుంట: భక్తిభావంతో తీర్థయాత్రలకు వెళ్లి దైవదర్శనం చేసుకుందామని.. ఆపదలు రాకుండా చూడమని మొక్కుకుందామని అనుకున్నారు.. కానీ ఆ దేవుడు వారి మొర ఆలకించలేదు. విధి ఆడిన నాటకంలో ఇద్దరు యువకులు తిరగిరాని లోకాలకు వెళ్లారు. వివరాలిలా.. చిన్నచింతకుంట మండలం పర్ధిపురం గ్రామానికి చెందిన 12మంది గ్రామస్తులు శనివారం తీర్థయాత్రలకు బయలు దేరారు. మంగళవారం తెల్లవారు జామున మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకొని గ్రామానికి చెందిన కావలి నర్సింహులు(28), శివ(26)తోపాటు దేవసూగూరుకు చెందిన తుఫాన్ డ్రైవర్ జగన్(26) దుర్మరణం చెందారు. శనివారం జగన్ తుఫాన్లో తీర్థయాత్రలకు బయలుదేరారు. ముందుగా కర్ణాటకలోని మంత్రాలయం వెళ్లి అక్కడ దైవదర్శనం చేసుకొని అక్కడి నుంచి మహారాష్ట్రలోని తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాంకాళిని దర్శించుకునేందుకు బయలు దేరారు. అంతలోనే మార్గమధ్యంలో మంగళవారం తెల్లవారుజామున ఉజ్జయినికి 6 కిలో మీటర్ల సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రక్ ఢీకొట్టింది. తుఫాన్లో ఉన్న తొమ్మిది మందికి స్వల్ప గాయాలు కాగా.. తుఫాన్ డ్రైవర్ జగన్, నర్సింహులు, శివకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి స్వగ్రామానికి తరలించారు. ఉలికిపడ్డ పర్ధిపురం పర్ధిపురం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గ్రామానికి చెందిన 11మంది శనివారం తీర్థయాత్రలకు బయలుదేరగా.. అందులో ఇద్దరు రోడ్డుప్రమాదంలో మృతిచెందారన్న వార్త విని కుటుంబ సభ్యులు, బంధవుల రోదనలు గ్రామంలో మిన్నంటాయి. మృతులు అభంశుభం ఎరుగని గొర్రెలకాపరులు తీర్థయాత్రలకు వెళ్లి మృతిచెందారని వారి మృతితో వారి కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయ్యాయని అకుటుంబాలు రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయని గ్రామస్తులు కనీరుమున్నీరు అయ్యారు. -
బైలెల్లిన మైసమ్మ బోనం
ఫత్తేపూర్ మైసమ్మ అడవి అమ్మవారి నామంతో మర్మోగింది. అమ్మా బైలెల్లినాది.. తల్లి మైసమ్మ బైలెల్లినాది అంటూ అమ్మవారి బోనాలను వైభవంగా నిర్వహించారు. మైసమ్మ అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం 116 బోనాలతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పచ్చని అడవి మొత్తం భక్తులతో కిటకిలాడింది. మైసమ్మ ఆలయ ఉత్సవాల్లో ఆలయ కమిటీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, ఆలయ అధికారి నర్సింహులు ప్రత్యేకంగా అలంకరించిన బోనాల ఊరేగింపులో పాల్గొన్నారు. కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కాకర్లపహాడ్తోపాటు పరిసర గ్రామాల ప్రజలు ప్రత్యేకంగా అలంకరించిన ఎద్దుల బండ్లతో శకటోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో కాకర్లపహాడ్ సర్పంచ్ బాలయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తులసీ రాంనాయక్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాంచంద్రయ్య, నర్సింహులు, గోపాల్, కృష్ణయ్య, నరేందర్, మాధవులు, నారాయణరెడ్డి, ఖాజామైనోద్దిన్, బాలయ్య, శ్రీనివాస్, నర్సింహులు, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు. – నవాబుపేట -
హెల్మెట్ లేకుంటే పెట్రోల్ పోయొద్దు
మహబూబ్నగర్ క్రైం: ప్రయాణికులను తరలించే ప్రతిక్యాబ్, ఆటో డ్రైవర్లు అత్యంత సురక్షితమైన డ్రైవింగ్ చేయాల్సి ఉంటుందని, వారి చేతుల్లో అనేకమంది ప్రాణాలు ఉంటాయనే విషయాన్ని గుర్తించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా టూటౌన్ పోలీస్స్టేషన్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని అర్ఆండ్బీ అతిథి గృహంలో క్యాబ్, ఆటో డ్రైవర్లకు ప్రత్యేక అవగహన సదస్సుతోపాటు ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై వాహనాలు నడిపే వారిలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు ఇతర వాహనదారులు తప్పక సీటు బెల్ట్ ధరించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, రాష్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్, న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రతిబంక్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి ● మహబూబ్నగర్ నగరం పరిధిలో ఉన్న అన్నిరకాల పెట్రోల్ బంకుల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ సీఐ భగవంత్రెడ్డి సూచించారు. మంగళవారం పెట్రోల్ బంకుల యాజమానులతో ట్రాఫిక్ సీఐ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించకుండా వచ్చిన వాహనదారులకు వాహనాల్లో పెట్రోల్ పోయరాదని సూచించారు. హెల్మెట్ ధరించడంతో ప్రాణరక్షణ సాధ్యమవుతుందని, తలకు జరిగే గాయాలతో అధికంగా ప్రాణాలు పోతున్నాయని హెల్మెట్ ఉంటే మృతుల సంఖ్య తగ్గుతుందన్నారు.‘ నో హెల్మెట్–నో ఫ్యూయల్’ నినాదంతో అన్ని పెట్రోల్ బంకుల్లో స్పష్టమైన బోర్డులు ఏర్పాటు చేసి ఇకపై హెల్మెట్ లేకుండా వచ్చిన ఎవరికై నా పెట్రోల్ పోయరాదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర -
ఆద్యంతం.. ఉత్సాహభరితం
జ్ఞాపికలు.. సర్టిఫికెట్లు చివరిరోజు తొమ్మిది వేదికల్లో విద్యావిషయకు అంశాలకు సంబంధించి మట్టితో బొమ్మలు, తెలుగు, ఇంగ్లిష్లో సీనియర్, జూనియర్ విభాగాల విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించారు. జూనియర్లకు భారతదేశ పటంలో, సీనియర్లకు ప్రపంచ పటంలో ప్రాంతాలను గుర్తించే పోటీలు నిర్వహించారు. సాంస్కృతిక విభాగంలో సీనియర్లకు జానపద, శాసీ్త్రయ నృత్యం, కోలాటం, సైన్స్ ఎగ్జిబిషన్, లఘునాటిక, దేశభక్తి గేయాల పోటీలు నిర్వహించి.. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి జ్ఞాపికలు, పోటీల్లో పాల్గొన్న వారందరికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి వీరాంజనేయులు, సలహాదారులు జగపతిరావు, లక్ష్మణ్గౌడ్, డాక్టర్ మహేష్బాబు, వీణశివకుమార్, ప్రమోద్కుమార్, వెంకటస్వామి, వేణుగోపాల్వర్మ, పులి జమున, ఇరువింటి వెంకటేశ్వరశర్మ, రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. స్టేషన్ మహబూబ్నగర్: చిన్నారులకు ఆట విడుపుగా.. చూపరులకు కనులపండువగా రెండురోజులపాటు కొనసాగిన పిల్లలమర్రి బాలోత్సవం నాలుగో పిల్లల జాతర వారిలో మధురానుభూతుల్ని నింపింది. జిల్లాకేంద్రం సమీపంలోని ఓ గార్డెన్స్లో నిర్వహించిన పిల్లలమర్రి బాలోత్సవం మంగళవారం ఘనంగా ముగిసింది. కార్యక్రమంలో పాల్గొన్న పీయూ వైస్ చాన్స్లర్ శ్రీనివాస్ మాట్లాడుతూ పిల్లల్లో నైపుణ్యాల్ని వెలికితీసేందుకు ఇలాంటి బాలోత్సవాలు ఉత్తమ వేదిక అన్నారు. ఇదే స్ఫూర్తితో విద్యార్థులు మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించే చక్కటి వేదికను కల్పించిన బాలోత్సవ కమిటీ కృషిని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆర్.శశిధర్ కొనియాడారు. పిల్లలమర్రి బాలోత్సవ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బెక్కెం జనార్దన్, డాక్టర్ ప్రతిభ మాట్లాడుతూ మన పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో చక్కని ప్రతిభను ప్రదర్శించేందుకు ఇలాంటి వేదికను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పిల్లల్లో ఆరోగ్యకరమైన పోటీ, సృజనాత్మకత, అంతర్గత నైపుణ్యాలను వెలికితీసేలా విద్యా విషయక, సాంస్కృతిక విభాగాలకు సంబంధించి దాదాపు 35 అంశాలకు పోటీలు నిర్వహించినట్లు వెల్లడించారు. ముగిసిన పిల్లలమర్రి 4వ బాలోత్సవం -
ఇసుక తరలింపును అడ్డుకున్న గ్రామస్తులు
మక్తల్: మండలంలోని చిట్యాల పెద్ద వాగు నుంచి మక్తల్ మండల కేంద్రానికి ఇసుకను తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గజరందొడ్డి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇసుక తరలింపునకు అనుమతులు తీసుకొని వాగు దగ్గర జేసీబీలను ఏర్పాటు చేసి టిప్పర్ల ద్వారా ఇసుకను తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డగించారు. తమకు అనుమతి ఇస్తే వాగు నుంచి బయటికి డంప్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లేలా సహకరిస్తామని జేసీబీలను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను పంపించి వేశారు. అనుమతితోనే ఇసుక తరలిస్తుండగా అడ్డుకోవడంపై ఇటు పోలీసులు, అటు రెవెన్యూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయంపై రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు సంయుక్తంగా చర్చించి గ్రామస్తులకు నష్టం కలుగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
ఉత్కంఠపోరులో మహబూబ్నగర్ విజయం
● 4 వికెట్ల తేడాతో వరంగల్పై.. ● అర్ధసెంచరీతో రాణించిన అబ్దుల్ రాఫే మహబూబ్నగర్ క్రీడలు: కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ20 లీగ్ రెండో ఫేజ్లో మహబూబ్నగర్ జట్టు 4 వికెట్ల తేడాతో వరంగల్ జట్టుపై విజయం సాధించింది. సిద్దిపేటలో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన వరంగల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. కొత్త రోహిత్రెడ్డి 43, కె.ప్రదీప్ 36 నాటౌట్, నిక్షిత్ 30 పరుగులు చేశారు. మహబూబ్నగర్ బౌలర్లు వెంకటచంద్ర 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, మహ్మద్ షాదాబ్ అహ్మద్ 4 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి 2, ఆకాష్ వెంకట్, ఎన్.జశ్వంత్ చెరో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన మహబూబ్నగర్ జట్టు నిర్ణీత 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. జట్టులో ఓపెనర్ అబ్దుల్ రాఫే 61 బంతుల్లో 9 ఫోర్లతో 79 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మహ్మద్ షాదాబ్ అహ్మద్ 31, ఎ.శ్రీకాంత్నాయక్ 22 పరుగులు చేశారు. వరంగల్ బౌలర్లు కె.శ్రీఅఖిలేష్ 2, ఎస్.ఆదర్శ్, నిక్షిత్, పర్దిపన్ చెరో వికెట్ తీశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన అబ్దుల్ రాఫే (మహబూబ్నగర్) రూ.5వేల నగదు, మెమోంటో అందుకున్నాడు. ఎండీసీఏ అభినందనలు కాకా వెంకటస్వామి మెమోరియల్ టీ–20 లీగ్ మ్యాచ్లో మహబూబ్నగర్ జట్టు విజయం సాధించడంపై ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో లీగ్లో ప్రతిభ చాటి చాంపియన్గా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కోచ్ అబ్దుల్లా పాల్గొన్నారు. -
చిరుత సంచారంతో గ్రామస్తుల ఆందోళన
మల్దకల్: ఉలిగేపల్లి, అడవిరావులచెర్వు గ్రామాల మధ్య ఉన్న బతుకోని చెరువు సమీపంలో వ్యవసాయ పొలాల వద్ద సోమవారం రాత్రి చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత సంచారంపై గ్రామస్తులు ఫారెస్ట్, పోలీసు అధికారులకు తెలియజేయగా మంగళవారం ఫారెస్టు అధికారులు మన్యం, జాకీర్ గుట్టల్లో చిరుత జాడల కోసం పరిశీలించారు. చిరుత సంచారంతో ప్రజలు పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఈ విషయంపై ఫారెస్టు అధికారులను సంప్రదించగా తమ పరిశీలనలో ఎలాంటి చిరుత జాడలు లేవని, అది హైనా అయి ఉండవచ్చన్నారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఫారెస్టు అధికారి పర్వేజ్ అహ్మద్ తెలిపారు. ఉర్దూ ఘర్ను వ్యతిరేకిస్తూ నిరసన మహబూబ్నగర్ రూరల్: వుహబూబ్నగర్ పట్టణంలోని అంబేడ్కర్ కళాభవన్ ఆవరణలో ఉర్దూ ఘర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు మంగళవారం కళాభవన్ పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కళా భవన్కు ఉర్దూ ఘర్కు ఎటువంటి ఆధారాలు లేకున్నా రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ నకిలీ కాగితాలు సృష్టించి దౌర్జన్యంగా ఉర్దూ ఘర్ను నిర్మాణ పనులను పూనుకున్నారని ఆరోపించారు. కళాభవన్ ఆవరణలో ఉర్దూ ఘర్ నిర్మాణ పనులను దళిత సంఘాల నాయకులు అడ్డుకోవడంతో విషయం తెలుసుకున్న టూటౌన్ సీఐ సిబ్బందితో అక్కడికి చేరుకుని ఇరువర్గాల మధ్య గొడవలు జరగకుండా నచ్చజెప్పారు. అక్కడినుంచి నాయకులను సీఐ డీఎస్పీ దగ్గరకు తీసుకెళ్లగా ఆయన రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో పూర్తి సమాచారం తీసుకొని స్థల వివాదం పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారని దళిత సంఘాల నాయకులు తెలిపారు. నిరసన కార్యక్రమంలో జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ సింగిరెడ్డి పరమేశ్వర్, కో–చైర్మన్ రాయికంటి రాందాస్, అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి రాజగాని అశోక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తాళం వేసిన ఇంట్లో చోరీ ● 59 తులాల వెండి, 7 గ్రాముల బంగారు, నగదు అపహరణ పాన్గల్: తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన మంగళవారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలు.. మండలంలోని రేమద్దుల గ్రామానికి చెందిన తనుపుల పద్మ చిన్న కుమారుడు అరవింద్తో కలిసి హైదరాబాదులో ఉంటుంది. రేమద్దులల్లో ఉన్న ఇంటికి నెలలో ఒకటి, రెండు సార్లు వచ్చి పోతుంటారు. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్ 17న సర్పంచ్ ఎన్నికలు ఉండటంతో బంగారు, వెండి వస్తువులు వెంట తెచ్చుకొని ఇంట్లోని బీరువాలో పెట్టారు. ఈ క్రమంలో డిసెంబర్ 21న ఇంట్లోనే ఆభరణాలు వదిలి హైదరాబాద్ వెళ్లినట్లు తెలిపారు. మంగళవారం ఇంటి పక్కన ఉండే వ్యక్తి పద్మ పెద్దకుమారుడు భాన్ప్రకాష్కు ఫోన్ చేసి ఇంటి తాళం ధ్వంసం చేసి ఉందని సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు వచ్చి చూడగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోని బీరువా ధ్వంసం చేసి 59 తులాలు వెండి, 7 గ్రాముల బంగారు వస్తువులు, రూ.10 వేల నగదు అపహరించినట్లు గుర్తించారు. చోరీపై పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బ్లాక్ గ్రానైట్ తవ్వకాలు నిలిపేయాలి
చారకొండ: మండలంలోని సిర్సనగండ్ల శివారులో సర్వే నంబర్ 182లో చేపడుతున్న బ్లాక్ గ్రానైట్ తవ్వకాలను నిలిపివేయాలని రైతులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఏడాది క్రితం బ్లాక్ గ్రానైట్ తవ్వకాలు నిలిపి వేయాలని తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, మైనింగ్ అధికారులకు వినతిపత్రాలు అందించడంతో తాత్కాలికంగా తవ్వకాలు నిలిపివేశారు. కానీ మంగళవారం మళ్లీ యంత్రాలతో గ్రానైట్ తవ్వకాలు ప్రారంభించారు. దీంతో స్థానిక రైతులు, గ్రామస్తులు తవ్వకాలు నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ పనులు అడ్డుకొని యంత్రాల ఎదుట బైఠాయించారు. తవ్వకాలు చేపడితే ఈ ప్రాంతానికి నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పనులు ఆపకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం పనులు నిలిపి వేయాలని సర్పంచ్ రామస్వామి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, తహసీల్దార్ ఉమ కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో రైతులు పసుల శ్రీను, విజయ్కుమార్, అంజయ్య, దుర్గయ్య, కృష్ణయ్య, ఎల్లయ్య, రమేష్, ఇస్తారయ్య, పెద్దయ్య తదితరులు ఉన్నారు. -
రామన్పాడులో తగ్గిన నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో మంగళవారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులకుగాను 1,020 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయానికి జూరాల ఎడమ కాల్వ నుంచి 707 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా నిలిచినట్లు చెప్పారు. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 15 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 873 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. ముడా కార్యాలయానికి స్థలం కేటాయింపు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఎట్టకేలకు ఏనుగొండలో ముడా కార్యాలయానికి అర ఎకరా (20 గుంటల) స్థలం కేటాయించారు. ఈ మేరకు కలెక్టర్ విజయేందిర బోయి నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో మంగళవారం కలెక్టరేట్లో ఆమెతో పాటు ఇతర ఉన్నతాధికారులను ముడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్ వేర్వేరుగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలోనే భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, సుమారు మూడేళ్లుగా భూత్పూర్రోడ్డులోని పబ్లిక్ హెల్త్ – మున్సిపల్ ఇంజినీరింగ్ కార్యాలయ సముదాయంలో ముడా అధికారులు కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. -
నాన్నా.. మేమేం చేశాం?
మహబూబ్ నగర్ జిల్లా: భార్య విడాకులు ఇచ్చిందనే కోపంలో అతడు కిరాతకుడిలా మారాడు. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన కొడుకు, కూతురిని కర్కశంగా హతమార్చాడు. ఆపై మూడుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. చివరకు ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ మృతి చెందాడు. సీఐ రాజేందర్రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు గ్రామానికి చెందిన చాకలి శివరాములుకు ఊట్కూరు మండలం పెద్దజట్రం గ్రామానికి చెందిన ఓ మహిళతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. శివరాములు డ్రైవర్గా పనిచేస్తూ హైదరాబాద్లో స్థిరపడ్డారు. వీరికి కూతురు రితిక, కుమారుడు చైతన్య ఉన్నారు. అయితే దంపతులు తరచూ గొడవపడేవారు. ఆరేళ్ల క్రితం భర్తను వదిలి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో శివరాములు తీలేరుకు వచ్చాడు. ఇద్దరు పిల్లల ఆలనాపాలనా శివరాములు అమ్మానాన్న చూసేవారు. ఈ క్రమంలో దంపతులను కలపాలని రెండుసార్లు గ్రామపెద్దలు పంచాయతీ పెట్టారు. ఫలితం లేకపోవడంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా.. గతేడాది మార్చి నెలలో కోర్టు విడాకులు మంజూరు చేసింది. అప్పటి నుంచి శివరాములు మనస్తాపానికి గురై ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. మూడు రోజుల నుంచే ప్లాన్.. తాను చనిపోతే పిల్లలు అనాథలు అవుతారని భావించిన శివరాములు మూడు రోజుల క్రితం నిర్ణయించుకున్న ఓ ప్లాన్ ప్రకారం తన ఇద్దరు పిల్లలు రితిక(8), చైతన్య(6)లను పొలం దగ్గరకు తీసుకెళ్లి రాత్రి అక్కడే నిద్రించి ఉదయం ఇంటికి వచ్చేవారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం భోజనం చేయకుండా తన పిల్లలను బైక్పై తీసుకెళ్లాడు. ఇంటికి రాకపోవడంతో శివరాములు తమ్ముడి భార్య రాత్రి 8 గంటలకు ఫోన్ చేయగా రితిక అనారోగ్యంతో ఉందని మరికల్ ఆస్పత్రికి తీసుకొచ్చా.. డాక్టర్కు చూపించి వస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. మళ్లీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా వెళ్లి కూతురు, కుమారుడిని పొలం దగ్గర ఉన్న పశువుల కొట్టంలో పడుకోబెట్టాడు. అర్ధరాత్రి సమయంలో వారు గాఢనిద్రలో ఉండగా తాడుతో ఒక్కొక్కరి గొంతు నులిమి చంపేశాడు. పొలం పక్కనే ఉన్న కోయిల్సాగర్ సాగునీటి కాల్వలో మృతదేహాలను పడేసి నీళ్లలో లోపలికి తొక్కేశాడు. పిల్లలను చంపిన తర్వాత తానూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ముందుగా పొలం దగ్గర ఉన్న గడ్డి మందు తాగాడు. ఆపై పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను పట్టుకున్నాడు. అయితే సింగిల్ ఫేజ్ ఉండి అది ట్రిప్ కావడంతో షాక్ కొట్టి వదిలేసింది. మళ్లీ పశువుల కొట్టంలోకి వచ్చి గడ్డపారతో పొడుచుకొని చనిపోవాలని ప్రయత్నించాడు. అది కూడా సాధ్యం కాకపోవడంతో బ్లేడ్తో గొంతు కోసుకున్నాడు. అయినా చనిపోకపోవడంతో తనను బతికించాలని పక్క పొలం రైతులకు మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఫోన్ చేశాడు. వారు వెంటనే అక్కడకుచేరుకొని చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పిల్లలను కాల్వలో నుంచి బయటకు తీశారు. శివరాములు పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని ఉస్మానియాకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చిన్నారుల మృతదేహాలను నారాయణపేట ఆస్పత్రికి తరలించారు. కాగా.. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రితిక 4వ తరగతి, చైతన్య 1వ తరగతి చదువుతున్నారు. డబ్బులు ఇవ్వడం లేదని.. తండ్రిని చంపిన తనయుడు పాపన్నపేట(మెదక్): డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఓ కొడుకు కన్నతండ్రినే దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని సీతానగర్లో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్గౌడ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన లంగడి లక్ష్యయ్య (48) వ్యవసాయంతోపాటు విద్యుత్ లైన్మెన్ వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నాడు. భార్య శేఖమ్మతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు శ్రీకాంత్ వివాహం, వ్యవసాయం నిమిత్తం కొంత అప్పులు చేశాడు. శ్రీకాంత్ ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతూ, ఖర్చుల కోసం తరచూ తండ్రిని వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమంలో పలుమార్లు తండ్రీకొడుకు మధ్య గొడవలు జరిగాయి. సోమవారం రాత్రి లక్ష్మయ్య ఇంటికి రాగానే కొడుకు డబ్బులు అడగడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో శ్రీకాంత్ ముందుగా సుత్తితో తండ్రిపై దాడి చేయగా, తల్లి కొడుకు చేతి నుంచి సుత్తి లాక్కుంది. తీవ్ర ఆవే«శంతో రగిలిపోతున్న శ్రీకాంత్.. అక్కడే ఉన్న కర్రతో తండ్రి తలపై బాదాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మయ్యను చికిత్స నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారు. -
భళా.. బాలోత్సవం
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రంలోని బృందావన్ గార్డెన్స్లో సోమవారం పిల్లలమర్రి బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలోత్సవం నాలుగో పిల్లల జాతర అలరించింది. జిల్లావ్యాప్తంగా పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన వేలాదిమంది విద్యార్థులు బాలోత్సవానికి తరలివచ్చి జాతర జరుపుకున్నారు.అకాడమిక్ అంశాల్లో సీనియర్, జూనియర్ విభాగాల్లోని తొమ్మిది వేదికల్లో చిత్రలేఖనం, వ్యాసరచన, కథారచన, కవితారచన, దేశభక్తి గీతాలు, స్పెల్బీ, క్విజ్లు, సాంస్కృతిక అంశాల్లో జానపద, శాసీ్త్రయ నృత్యాలు, బతుకమ్మ వేషధారణ, ఏకపాత్రాభినయం, లఘు నాటికలు, ఫ్యాన్సీ డ్రెస్ అంశాల్లోనూ, సైన్స్ఫెయిర్ విభాగాల్లో విద్యార్థులు చురుగ్గా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఫ్యాన్సీ డ్రెస్లో వచ్చిన చిన్నారులకు నిర్వాహకులు అప్పటికప్పుడే మెడల్స్ను బహుకరించారు. పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయవచ్చు పిల్లలమర్రి బాలోత్సవంతో పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయవచ్చని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత అన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడు తూ చిన్నారులు మట్టిలో మాణిక్యాలు అని, వారిని చదువుతో పాటు ఆటల్లో ప్రోత్సహించాలన్నారు. చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన పిల్లలమర్రి బాలోత్సవం చక్కటి కార్యక్రమం అని కొనియాడారు. అంతకుముందు బాలోత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు బెక్కం జనార్దన్, డాక్టర్ పి.ప్రతిభ జాతీయ జెండా, బాలోత్సవ జెండాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి వీరాంజనేయులు, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు, వీణ శివకుమార్, సువర్ణలత, రాజేంద్రకుమార్, నాగేష్, ప్రమోద్కుమార్, వేణుగోపాల్వర్మ, వెంకటస్వామి, అశోక్గౌడ్, లక్ష్మణ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు -
బీఆర్ఎస్: పట్టు నిలుపుకొనేలా..
గత మున్సిపల్ ఎన్నికల్లో అప్పటి అధికార బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాల క్రమంలో పట్టు నిలుపుకునేలా తగిన వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ప్రత్యక్షంగా ఇప్పటివరకు ఎలాంటి సన్నాహక సమావేశాలు నిర్వహించకున్నా.. ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతలు తమ తమ అనుచరుల ద్వారా గెలుపు గుర్రాలపై జల్లెడ పడుతున్నట్లు తెలుస్తోంది. ఆయా వార్డుల్లో ఆశావహులను ప్రోత్సహిస్తూ రంగం సిద్ధం చేసుకోవాలని.. రిజర్వేషన్ల ప్రకారం పార్టీ నిర్ణయం మేరకు నడుచుకునేలా వారిని సమాయత్తం చేస్తున్నట్లు సమాచారం. అధికార కాంగ్రెస్ పన్నుతున్న వ్యూహాలను పరిశీలిస్తూ.. పై ఎత్తులతో పార్టీ నేతలు ముందుకు సాగుతున్నారు. -
15 లోగా చిన్న నీటి వనరుల గణన పూర్తి చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఏడో చిన్న నీటి వనరుల గణన ఈ నెల 15లోగా పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి, తహసీల్దార్లు, ఎంపీడీఓలను కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మందిరంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ చిన్న నీటి వనరుల గణనలో మహబూబ్నగర్ జిల్లా ప్రగతి ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో కేవలం 20 శాతం గ్రామాల్లో మాత్రమే గణన జరిగిందని, జనవరి 15లోగా వంద శాతం సర్వేను ఆన్లైన్లో క్షేత్రస్థాయిలో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులు, జీపీఓలు, ఫీల్డ్ అసిస్టెంట్లో గణన పూర్తి చేసేలా తగు చర్యలు తీసుకోవాలన్నా రు. మండలంలో సమావేశం నిర్వహించి గణనపై సమీక్షించి తగు ఆదేశాలు జారీ చేయాలని ఆదేశించారు. కాగా.. కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో జరిగిన ప్రజావాణికి 90 ఫిర్యాదులు అందాయి. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి జాతీయ రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ విజయేందిర, అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మధుసూదన్నాయక్, జిల్లా అధికారులు, సిబ్బంది రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాద సమయంలో తలకు గాయం కాకుండా నివారించి విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. అలా గే నాలుగు చక్రాల వాహనాలు నడిపే వారు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలని సూచించారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, ఆర్డీఓ నవీన్, జిల్లా రవాణా శాఖ అధికారి రఘు, డీఆర్డీఓనరసింహులు, తదితరులు పాల్గొన్నారు. -
డ్రైవింగ్ నిర్లక్ష్యం వల్లే రోడ్డు ప్రమాదాలు
● విద్యార్థులు, యువత ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకోవాలి ● కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత పాలమూరు: రోడ్డు ప్రమాదాలను తగ్గించి వాహనదారుల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా సోమవారం జిల్లా కోర్టులో పోస్టర్లు ఆవిష్కరించారు. రోజురోజుకు అన్ని రకాల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని, నిర్లక్ష్యంతో కూడిన డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడమే ప్రధాన కారణమన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలని, కార్లు ఇతర వాహనదారులు సీటుబెట్టు పెట్టుకోవాలన్నారు. మద్యం తాగి ఎలాంటి పరిస్థితిలో కూడా వాహనం నడపరాదని, ఇలా చేయడం వల్ల రెండు కుటుంబాలు నష్టపోతాయని తెలిపారు. ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత తమ వ్యక్తిగత బాధ్యతగా భావించి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తే అనేక ప్రాణాలను రక్షించవచ్చునని తెలిపారు. విద్యార్థులు, యువత ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర పాల్గొన్నారు. ● జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో సోమవారం మండల పరిధిలోని గాజులపేటలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం నగరంలోని ఐటీఐ బాలుర కళాశాలలో రోడ్డు భద్రతలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. -
బీజేపీ: సత్తా చాటేలా..
పురపాలికల్లో అత్యధిక స్థానాలను కై వసం చేసుకునేలా బీజేపీ తమ వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ మేరకు ఇప్పటికే మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆయా డివిజన్ల వారీగా పార్టీ పరిస్థితి, గెలుపు గుర్రాలపై కీలక నేతలతో చర్చించారు. గెలవడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని.. పార్టీ అభ్యున్నతే లక్ష్యంగా ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. 2024 ఎంపీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల ఆధారంగా డివిజన్ల వారీగా నేతలు సమన్వయం చేసుకుంటూ ఓటర్లను ఆకర్షించాలని పిలుపునిచ్చారు. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ కు దీటుగా అభ్యర్థులను రంగంలోకి దించేలా క్షేత్రస్థాయిలో గెలుపు గుర్రాలను జల్లెడ పట్టే బాధ్యతలను పలువురికి అప్పగించినట్లు సమాచారం. -
‘ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలి’
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రాజీవ్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలిక ఐటీఐ కాలేజీ ఆవరణలో ఐటీఐ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (ఫోరం) ఉమ్మడి జిల్లా ఉద్యోగుల సర్వసభ్య సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్ల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఐటీఐ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం పోరాడే సంఘం టీఎన్జీఓ మాత్రమేనని అన్నారు. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బిల్స్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు, లేకపోతే ఉద్యోగుల ఆగ్రహానికి గురి అవుతారని పేర్కొన్నారు. టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి చంద్రనాయక్, నాయకులు భరత్, కొండల్ రెడ్డి, ఐటీఐ ఫోరం జిల్లా అధ్యక్షులు నవీన్, కార్యదర్శి నర్సింహులు, మహేష్, దీప్తి, వెంకట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ నేరాల్లో రీఫండ్లో ప్రతిభ చాటిన కానిస్టేబుల్స్
● రాష్ట్రంలో టాప్–5లో ముగ్గురు మన జిల్లా సిబ్బందే మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో సైబర్ నేరాల నియంత్రణతో పాటు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాల నిర్వహణలో ప్రతిభ చూపిన జిల్లాకు చెందిన ముగ్గురు సైబర్ వారియర్స్(కానిస్టేబుల్స్)కు ప్రశంసలు దక్కాయి. వారికి సోమవారం హైదరాబాద్లో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కార్యాలయంలో డీజీపీ శివధర్రెడ్డి, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్చార్జి శికా గోయల్ ప్రశంస పత్రాలతో పాటు నగదు రివార్డులు అందించారు. రాష్ట్రంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి సైబర్ నేరాల్లో బాధితులకు ఇచ్చే రీఫండ్ సాధనలో రాష్ట్రంలో టాప్–5లో జిల్లాకు చెందిన ముగ్గురు మహబూబ్నగర్ రూరల్ కానిస్టేబుల్స్ మధుగౌడ్, మహబూబ్నగర్ వన్టౌన్ వికాస్రెడ్డి, దేవరకద్ర పోలీస్స్టేషన్ నుంచి శ్రీనివాసులు ఎంపిక అయ్యారు. వీరికి ఒక్కొక్కరికి రూ.25వేల నగదు రివార్డు అందించారు. ముగ్గురు కానిస్టేబుల్స్ను ఎస్పీ డి.జానకి ప్రత్యేకంగా అభినందిచారు. -
616 ఫిర్యాదులు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పురపాలికల పరిధిలో ఓటర్ల ముసాయిదా జాబితాపై భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జడ్చర్ల, అచ్చంపేట మినహా మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లు.. మిగిలిన 18 మున్సిపాలిటీలో మొత్తం 316 వార్డులు ఉన్నాయి. ఈ మేరకు ఇప్పటివరకు మొత్తంగా 616 అభ్యంతరాలు వచ్చాయి. అదేవిధంగా సోమవారం ఆయా పురిపాలికల పరిధిలో అధికారులు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పలు అభ్యంతరాలు చెబుతూ.. పరిష్కరించాలని విన్నవించారు. మహబూబ్నగర్ కార్పొరేషన్లో 60 డివిజన్ల పరిధిలో 144 ఫిర్యాదులు వచ్చాయి. మున్సిపాలిటీల విషయానికి వస్తే.. దేవరకద్రలో 9, నాగర్కర్నూల్లో 121, కొల్లాపూర్లో 8, కల్వకుర్తిలో 36, నారాయణపేటలో 4, మక్తల్ 10, కోస్గిలో 5, మద్దూరులో 16, గద్వాలలో 17, అయిజలో 22, వడ్డేపల్లిలో 36, వనపర్తిలో 8, కొత్తకోటలో 6చ అమరచింత 4, ఆత్మకూర్లో 11, పెబ్బేరులో 71 ఫిర్యాదులు రాగా.. అలంపూర్ మున్సిపాలిటీలో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. ముసాయిదాలో తప్పొప్పులను సరిదిద్దండి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముసాయిదా ఓటర్ల జాబితాలో దొర్లిన తప్పొప్పులను వెంటనే సరిదిద్దాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. సోమవారం సాయంత్రం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగర ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఏయే డివిజన్లో ఓటర్లు ఎక్కువగా నమోదయ్యారు? ఇతర జిల్లాలు, గ్రామాలకు చెందిన వారి పేర్లు ఏమైనా ఉన్నాయా? అనేది పరిశీలించి తొలగించాలన్నారు. ఈనెల 10న ప్రకటించే తుది జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూడాలన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలను తూచ తప్పకుండా పాటించాలన్నారు. ఈ విషయంలో ఎవరైనా అజాగ్రత్తగా వ్యవహరిస్తే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్కుమార్రెడ్డి, ఏఎంసీ అజ్మీర రాజన్న, మేనేజ ర్ వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్జెండర్ల సమస్యలు పరిష్కరిస్తాం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ట్రాన్స్జెండర్ల సమస్యలను ఆయా శాఖల ద్వారా పరిశీలించి పరిష్కరిస్తామని రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ మధుసూదన్నాయక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్ లో వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కాగా, తమకు కొత్త ఆధార్ కార్డుల జారీతో పాటు వాటిలో ఏమైనా సవరణలుంటే తప్పక చేయాలన్నారు. ముఖ్యంగా రేషన్కార్డులు, ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు మంజూరు చేయాలన్నారు. అలాగే జిల్లా కేంద్రంలో ప్రత్యేక సమాధి స్థలం కేటాయించాలన్నారు. వీటన్నింటినీ కలెక్టర్ విజేందిర బోయికి దృష్టికి తీసుకెళతామని ఆయన హామీ ఇచ్చారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారిణి జరీనాబేగం, జిల్లా పౌరసరఫరాల సంస్థ డీఎం రవినాయక్ పాల్గొన్నారు. నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రాజెక్టుల బాట మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని సాగు, తాగునీటి ప్రాజెక్టులను మంగళవారం బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర నేతలు సందర్శించనున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా జూరాల కుడి, ఎడమ కాల్వను పరిశీలిస్తామని పేర్కొన్నారు. అలాగే కొల్లాపూర్ సమీపంలోని ఎంజీకేఎల్ఐతో పాటు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను పరిశీలిస్తామని తెలిపారు. ఆర్ఎన్ఆర్ క్వింటా రూ.2,679 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో సోమవారం ధాన్యం ఆర్ఎన్ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,679, కనిష్టంగా రూ.1,831 ధరలు లభించాయి. అలాగే హంస గరిష్టంగా రూ.1,911, కనిష్టంగా రూ.1,831, కందులు గరిష్టంగా రూ.6,960, కనిష్టంగా రూ.5,689, వేరుశనగ గరిష్టంగా రూ.8,766, కనిష్టంగా రూ.7,129, పెబ్బర్లు రూ.7,369, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,972, కనిష్టంగా రూ.1,710 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్లో కందులు గరిష్టంగా రూ.6,702, కనిష్టంగా రూ.6,512, ఆర్ఎన్ఆర్ ధాన్యం రూ.2,630గా ఒకే ధర లభించాయి. -
డివిజన్ల బౌండరీలోని ఓట్లే తీసుకోవాలి
● ఇప్పటికే కలిసిన మిగతావి తొలగించాలి ● ముక్తకంఠంతో కోరిన అన్ని పార్టీల ప్రతినిధులు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఆయా డివిజన్ల బౌండరీ (సరిహద్దు)లోని ఓట్లే జాబితాలో పొందుపరచాలని అన్ని పార్టీల ప్రతినిధులు ముక్తకంఠంతో కోరారు. ఇతర జిల్లాలు, గ్రామాలకు చెందిన ఓటర్ల పేర్లను వెంటనే తొలగించాలన్నారు. క్షేత్రస్థాయికి వార్డు ఆఫీసర్లు, బీఎల్ఓలను పంపించి అన్నింటినీ సరిదిద్దాలన్నారు. సోమవారం మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో ముసాయిదా ఓటర్ల జాబితాపై గుర్తింపు పొందిన 13 పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చాలా డివిజన్లలో 200 నుంచి 300 మంది వరకు ఎక్కువ ఓటర్లు ఉన్నట్లు ముసాయిదాలో ప్రకటించారన్నారు. ఒక కుటుంబంలో పది ఉంటే అందులోని ఇద్దరు ముగ్గురి పేర్లు వేరే డివిజన్లో ఎలా చూపిస్తారన్నారు. ఈ జాబితా పూర్తిగా తప్పుల తడకగా, గందరగోళంగా ఉందన్నారు. ఒక డివిజన్ ఓట్లు మరో డివిజన్లో ఉండటం తగదన్నారు 60 డివిజన్ల పరిధిలో 4,708 తప్పులు ఉన్నాయని, ఈ విషయమై ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేశామని వీటిని వెంటనే సరిచేయాలన్నారు. కొన్ని డివిజన్లలో ఇంటి నంబరుకు బదులు వ్యక్తుల పుట్టిన తేదీలు ఉన్నాయన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్లు తప్పక పాటించాలన్నారు. గతంలో 49 వార్డులకు గాను ఎస్సీలకు నాలుగు సీట్లు దక్కాల్సి ఉండగా ఇద్దరికే అవకాశం ఇచ్చారన్నారు. ఇప్పుడు 60 డివిజన్లకు కచ్చితంగా 9 కేటాయించాలన్నారు. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా మారిన సమయంలో అశాసీ్త్రయంగా డివిజన్లను ఏర్పాటు చేశారని ఆరోపించారు. చాలా డివిజన్లలో 3,200 ఓటర్లకు బదులు ఏకంగా 3,600 వరకు ఈ జాబితాలో ఉన్నాయన్నారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ గత జూన్లో ఏర్పాటు చేసిన డివిజన్ల మ్యాపింగ్ ప్రకారమే ఓటర్లు ఉండేలా చూస్తామన్నారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ముసాయిదా జాబితాలో నిబంధనల మేరకు మార్పులు, చేర్పులు చేస్తామన్నారు. ఒక్కో డివిజన్లో మూడు నుంచి నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కనీసం 800 నుంచి 840 మంది వరకు ఓటర్లు ఉండేలా జాబితాలో పొందుపరుస్తున్నామన్నారు.


