Mahesh Babu
-
టాలీవుడ్లో ఇప్పుడదే ట్రెండ్.. చిన్నోడు.. పెద్దోడు.. మళ్లీ వచ్చేస్తున్నారు..!
టాలీవుడ్ ప్రియులను అలరించిన చిత్రాల్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ముందు వరుసలో ఉంటుంది. విక్టరీ వెంకటేశ్, మహేశ్ బాబు అన్నతమ్ముళ్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ చిత్రంలో అంజలి, సమంత హీరోయిన్లుగా నటించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో శిరీష్ నిర్మించారు. 2013లో సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సినీ ప్రియులను మెప్పించింది.తాజాగా ఈ చిత్రం రీ రిలీజ్కు సిద్దమైంది. ఇటీవల పలు సూపర్ హిట్ చిత్రాలను రీ రిలీజ్ చేసే ట్రెండ్ టాలీవుడ్లో నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీని మరోసారి బిగ్ స్క్రీన్పై చూసే అవకాశం ఫ్యాన్స్కు దక్కనుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ను విడుదల చేసింది. మార్చి 7న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు థియేటర్లలో సందడి చేయనుందని పోస్ట్ చేసింది. ఈ ప్రకటనతో వెంకటేశ్, మహేశ్ బాబు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. The wait is over! 🎬✨Relive the magic of family, love, and brotherhood with Peddhodu @VenkyMama & Chinnodu @urstrulyMahesh 🙌Catch the timeless classic #SeethammaVakitloSirimalleChettu in theatres on March 7th❤️🔥Get Ready to experience the nostalgia once again🔥… pic.twitter.com/mYD1RZvvnI— Sri Venkateswara Creations (@SVC_official) February 21, 2025 -
ఛత్రపతి శివాజీగా ఆయన బాగా సెట్ అవుతారు: పరుచూరి గోపాలకృష్ణ
బాలీవుడ్ కథానాయకుడు విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ‘ఛావా’. హిందీలో మాత్రమే విడుదలైన ఈ చిత్రానికి మంచి ప్రశంసలే దక్కుతున్నాయి. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ దీనిని తెరకెక్కించారు. ఈ మూవీ టాలీవుడ్ ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేయాలి అంటూ చాలామంది సోషల్మీడియా వేదికగా డిమాండ్ కూడా చేస్తున్నారు. దేశం కోసం శౌర్యం చూపిన గొప్ప వ్యక్తుల గురించి అందరికీ తెలిసేలా ఇలాంటి చిత్రాలను అన్నీ భాషలలో విడుదల చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. అయితే, ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టోరీని తెలుగు హీరోలు తెరకెక్కించాలని అభిమానులు కోరుతున్న సమయంలో సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఛత్రపతి శివాజీగా మహేష్ బాబు అయితే చాలా బాగా సరిపోతారని ఆయన అభిప్రాయపడ్డారు.సూపర్ స్టార్ కృష్ణకు తన జీవితంలో డ్రీం ప్రాజెక్ట్ ఛత్రపతి శివాజీ. భారీ బడ్జెట్తో ఈ మరాఠ యోథుడి చరిత్రను తెలుగు ప్రేక్షకులకు ఆయన చూపించాలని ఆశ పడ్డారు. సింహాసనం సినిమా తర్వాత శివాజీ సినిమా గురించి ప్లాన్ చేశారు. కానీ, పలు కారణాల వల్ల ముందుకు సాగలేదు. ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ వంటి లెజండరీ హీరోనే శివాజీ పాత్ర చేయలేకపోయారు. కానీ, కృష్ణ పూర్తిస్థాయిలో ఛత్రపతి శివాజీగా కనిపించకపోయినప్పటికీ చంద్రహాస్,నంబర్-1 అనే సినిమాల్లో చిన్న వేషం వేసి కృష్ణ తన కోరిక నెరవేర్చుకున్నారు.అయితే, ఇప్పుడు దానిని భర్తి చేసే ఏకైక నటుడు మహేష్బాబు అని పరుచూరి గోపాలకృష్ణ ఇలా అన్నారు. 'సూపర్స్టార్ కృష్ణ నటించలేని ఒక పాత్ర ఇప్పటికీ అలాగే ఒకటి మిగిలిపోయింది. అదీ ఛత్రపతి శివాజీ. నేను మహేష్ బాబును కోరుతున్నాను. మీరు( అభిమానులు) కూడా కోరండి. శివాజీ గెటప్కు వారి తండ్రి కృష్ణ మాదిరి ఆయన అద్భుతంగా సెట్ అవుతారు. శివాజీ పాత్ర మహేష్ చేస్తే భవిష్యత్లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కుతుంది. ఛత్రపతి శివాజీగా మహేష్ కనిపించాలని నేను ఆయన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ పాత్రలో ఆయన్ను చూడాలనే కోరిక నాకు ఉంది. ' అని ఆయన అన్నారు. View this post on Instagram A post shared by urstrulyvijju_ (@urstrulyvijju_) -
మహేష్, ప్రియాంక చోప్రా పై పలు కీలకమైన సన్నివేశాలు చిత్రీకరణ?
-
మహేశ్ బాబు వల్లే నా సినిమాకు గుర్తింపు.. ఆయన ఒప్పుకుంటే: కోలీవుడ్ డైరెక్టర్
ఓ మై కడవులే, లక్కీ మ్యాన్, ఓరి దేవుడా చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ సూపర్ హిట్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు. ప్రస్తుతం డ్రాగన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తమిళంలో తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులోనూ రిలీజవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో డ్రాగన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన అశ్వత్ మరిముత్తు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా తెలుగులో సినిమా తీస్తే ఫస్ట్ మూవీని ఎవరితో చేస్తారని ప్రశ్నించగా.. దానిపై స్పందించారు. తెలుగులో సూపర్ స్టార్తోనే నా మొదటి సినిమా చేస్తానని మనసులో మాటను బయటపెట్టారు.అశ్వత్ మరిముత్తు మాట్లాడుతూ..'ఆయన వల్లే నాకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగింది. ఓసారి నా చిత్రం ఓహ్ మై కడవులే చిత్రానికి ట్విటర్లో ఊహించని విధంగా వ్యూస్ వచ్చాయి. దానికి కారణం ఏంటో మొదట తెలియలేదు. కానీ ఆ తర్వాత మహేశ్ బాబు మా సినిమాపై మెచ్చుకుంటూ పోస్ట్ చేశాడని తెలిసింది. ఆయన వల్లే మా చిత్రానికి గుర్తింపు వచ్చింది. కేవలం రూ.3 కోట్లతోనే ఆ సినిమాను నిర్మించాం. ఇది చాలా చిన్న సినిమా. తెలుగులో మహేశ్ బాబు ఒక్క ఛాన్స్ ఇస్తే ఆయనతోనే మొదటి సినిమా చేస్తా. ఆయనతో మూవీ చేయాలనేది నా చిరకాల కోరిక' అని వెల్లడించారు.ఓ మై కడవులే చిత్ర నిర్మాతల నుంచి ఎటువంటి ముందస్తు అభ్యర్థన లేకుండానే మహేష్ బాబు ఆ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారని మరిముత్తు వెల్లడింతారు. ఆయన వల్లే పలువురు తెలుగు దర్శకులు, నటీనటులు ఈ చిత్రాన్ని వీక్షించి అభినందనలు తెలిపారు. ఆ క్షణం నుంచి మహేష్ బాబును డైరెక్ట్ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని మరిముత్తు తెలిపారు. మరి దర్శకుడి కోరికను మన మహేష్ బాబు అంగీకరిస్తాడో లేదో వేచి చూడాల్సిందే.ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ డ్రాగన్ చిత్రానికి దర్శకత్వ వహించారు మరిముత్తు. ఈ చిత్రం ఈనెల 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. #MaheshBabu వల్ల తెలుగు ఇండస్ట్రీ లో పేరు వచ్చింది - Director #AshwathMarimuthu#Dragon #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/fKHaTJiHr8— Telugu FilmNagar (@telugufilmnagar) February 17, 2025 -
SSMB 29: మహేశ్కి జక్కన్న కండీషన్.. నిర్మాతకు రూ. కోటి సేఫ్!
రాజమౌళి(SS Rajamouli )తో సినిమా అంటే నటీనటులు ఎంత ఇష్టపడతారో అంతే భయపడతారు కూడా. ఒక్కసారి ఆయనతో సినిమా కమిట్ అయితే చాలు.. షూటింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరు ఆయన మాట వినాల్సిందే. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే జక్కన్న పెట్టే కండీషన్స్ ఫాలో అవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ దర్శకధీరుడు మహేశ్ బాబు(Mahesh Babu)తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే షూటింగ్ కూడా ప్రారంభమైంది. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ మూవీ కాబట్టి… ఖర్చుల దగ్గర జక్కన్న చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అనవసరపు ఖర్చులు తగ్గించి, ఆ డబ్బంతా సినిమా క్వాలిటీ కోసం ఖర్చు చేయబోతున్నారట. ఈ నేపథ్యంలో జక్కన్న ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెట్లో ప్లాస్టిక్ని పూర్తిగా నిషేదించారట. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ని సెట్లోకి అనుమతించట్లేదట. మహేశ్బాబుతో సహా ప్రతి ఒక్కరు ఈ రూల్ని పాటించాల్సిందేనట.నిర్మాతలకు రూ.కోటి వరకు సేఫ్రాజమౌళి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్లో రోజుకు దాదాపు రెండు వేల మంది వరకు పాల్గొంటున్నారట. అంత మందికి వాటర్ బాటిళ్లు అందించడం అంటే చాలా ఖర్చు అవుతుంది. అందుకే సెట్లో గాజు బాటిళ్లను ఏర్పాటు చేయిస్తున్నారట. దాహం వేస్తే ప్రతి ఒక్కరు దీనితోనే నీళ్లు తాగాలట. పర్సనల్గా తెచ్చుకున్న ప్లాస్టిక్ బాటిల్ అయితే ఉండొద్దని చెప్పారట. అలాగే ప్లాస్టిక్ వస్తువులను కూడా తప్పనిసరి పరిస్థితుల్లోనే వాడలని చెప్పారట. వీలైనంత వరకు ప్లాస్టిక్ని నిషేదించాలని యూనిట్ని ఆదేశించారట. దీని వల్ల నిర్మాతకు దాదాపు రూ. కోటి వరకు సేఫ్ అవుతుందట. ఈ నిర్ణయం కారణంగా డబ్బు ఆదా అవ్వడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు సహాయపడినట్లు అవుతుందని జక్కన్న ప్యామిలీ భావిస్తుందట. ఈ ఆలోచన కీరవాణి సతీమణి వల్లీకి వచ్చిందట. ఆమె చెప్పడంతోనే రాజమౌళి ప్లాస్టిక్ బాటిళ్లను నిషేదించారట.మహేశ్ సినిమాకు టైటిల్ కష్టాలు..మహేశ్- రాజమౌళి కాంబినేషన్లో సినిమా వస్తుందని చాలా రోజుల కిందటే ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత తాను మహేశ్తో సినిమా చేస్తున్నానని రాజమౌళి ప్రకటించినప్పటికీ.. కథ అప్పటికీ ఫిక్స్ కాలేదు. ఆర్ఆర్ఆర్ రిలీజైన కొద్ది రోజులకి ఈ కథపై దృష్టి పెట్టాడు. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో మాత్రం జక్కన్నకు ఇంకా క్లారిటీ రాలేదట. గతంలో గరుడ, మహారాజ్ లాంటి టైటిల్స్ వినిపించినా... ఏది ఫైనల్ కాలేదు. ప్రస్తుతం షూటింగ్ చేస్తూనే టైటిల్ ఫైనల్ చేసే పనిలో ఉంది జక్కన్న టీమ్. టైటిల్ పెట్టే వరకు మీడియాకు దూరంగా ఉండాలని, ఎలాంటి ఈవెంట్స్ నిర్వహించొద్దని రాజమౌళి ఆదేశించారట. అందుకే ఎలాంటి హడావుడి లేకుండా షూటింగ్ని ప్రారంభించారు. టైటిల్ ఫిక్స్ అయిన తర్వాత చిన్న టీజర్ని రిలీజ్ చేస్తూ టైటిల్ని వెల్లడించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. -
ఈ స్టార్ హీరోల రెస్టారెంట్స్, పబ్స్ గురించి తెలుసా..?
ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న వ్యాపారరంగంలోకి కంగనా రనౌత్ అడుగుపెట్టారు. సినీ, రాజకీయ రంగాల్లో బిజీగా ఉన్న ఆమె హిమాచల్లోని మనాలిలో కేఫ్ను ప్రారంభించారు. హిమాలయాల నడిబొడ్డున ‘ది మౌంటెన్ స్టోరీ’ పేరుతో ఒక సుందరమైన రెస్టారెంట్ను ప్రారంభించడంతో అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే, హైదరాబాద్ వేదికగా కొందరు సినీ సెలబ్రిటీలు పలు రెస్టారెంట్స్లను ప్రారంభించారు. విలాసవంతమైన ఆహారం, బ్రేవరేజస్తో పాటు, అధునాతన జీవన శైలికి అద్ధం పట్టే అద్భుతమైన ఇంటీరియర్ ఫ్యాషన్ లుక్ నేటి రెస్టారెంట్ కల్చర్లో భాగమైపోయింది. అయితే నగర వాసుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరినీ ఆకర్షించేందుకు ఎవరికి వారు తమ సొంత స్టైల్లో యునీక్ యాంబియన్స్ కోసం తాపత్రయపడుతున్నారు.బంజారా హిల్స్లో మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ 'AN రెస్టారెంట్'తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ డిసెంబర్ 8, 2022న AN రెస్టారెంట్ని బంజారా హిల్స్లో ప్రారంభించారు. మినర్వా, ఆసియన్ ఫుడ్ గ్రూపులతో కలిసి వారు దీనిని ప్రారంభించారు. రెస్టారెంట్లో అద్భుతమైన ఇంటీరియర్స్, అగ్రశ్రేణి సర్వీస్తో పాటు వివిధ రకాల ప్రపంచ వంటకాలతో భారీగానే మెనూ లిస్ట్ ఉంటుంది. ఆహార ప్రియులకు తప్పకుండా నచ్చేలా ఇక్కడి ఫుడ్ ఉంటుందని చాలామంది పేర్కొన్నారు.విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల వన్–8 కమ్యూన్గత ఏడాదిలో హైదరాబాద్లోని హైటెక్ సిటీకి దగ్గరలో వన్–8 కమ్యూన్ పేరుతో ఒక లగ్జరీ రెస్టారెంట్ను కోహ్లీ, అనుష్క శర్మ ప్రారంభించారు. హైదరాబాద్కు ఉన్న రాజసాన్ని, రిచ్ ఫ్లేవర్ను ప్రతిబింబిస్తుంది. ఇందులోని కిచెన్.. పాక ప్రపంచానికి నూతన హంగులు అద్దిందని ఫుడ్ లవర్స్ చెబుతున్నారు. వన్–8 కమ్యూన్ బ్రాండ్ ఎథోస్కు కట్టుబడి, రెస్టారెంట్ డిజైన్ అందంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఇక్కడి వింటేజ్ లుక్స్ నగరవాసులను విశేషంగా ఆకర్షిస్తుంది. జుహు, బెంగుళూరు, గుర్గావ్లలో ఇప్పటికే ఆదరణ పొందుతున్న ఈ రెస్ట్రో బార్ను ఇక్కడ ఏర్పాటు చేయడంతో చాలామంది చిల్ అవుతున్నారు. ఫుడ్ లవర్స్తో పాటు క్రికెట్ ప్రియులు సైతం ఆసక్తిగా ఇక్కడికి విచ్చేస్తున్నారు. రెస్ట్రో బార్లో భాగంగా రిచ్ ఫుడ్ డిషెస్తో పాటు బ్రేవరేజస్ అందుబాటులో ఉండటంతో అన్ని వర్గాల వారికీ హాట్ స్పాట్గా మారింది. కోహ్లీకి అత్యంత ఇష్టమైన కార్న్ బార్లీ రిసోట్టో, మష్రూమ్ గూగ్లీ డిమ్ సమ్, టార్టేర్ టాప్డ్ అవకాడో వంటి పలు వంటకాలను ప్రత్యేకంగా వండి వడ్డిస్తున్నారు.రకుల్ ప్రీత్ సింగ్ 'ఆరంభం'గచ్చిబౌలి 'ఎఫ్ 45' పేరుతో జిమ్ను ప్రారంభించిన రకుల్ ప్రీత్ సింగ్ .. జూబ్లీహిల్స్లో కూడా ఓ బ్రాంచ్ మొదలు పెట్టి లీజ్కు ఇచ్చేసింది. అయితే, ఆరోగ్యంపై అవగాహన పెంచే ప్రయత్నంలో, నటి రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్లో మిల్లెట్ ఆధారిత రెస్టారెంట్ను ప్రారంభించారు. హైదరాబాద్లోని మాదాపూర్ వద్ద 'ఆరంభం' పేరుతో ఒక రెస్టారెంట్ను ఓపెన్ చేశారు. Curefoods భాగస్వామ్యంతో, సాంప్రదాయ భారతీయ వంటకాల డొమైన్లో మిల్లెట్-ఎయిడెడ్ ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేయడానికి ఆమె ఈ వెంచర్ను ప్రారంభించారు. మిల్లెట్ను భారతీయ ఆహారంలో ప్రధాన భాగం చేయడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో ఈ చొరవ తీసుకున్నట్లు ఆమె చెప్పారు. రుచిలో రాజీ పడకుండా ఆరోగ్యకరమైన, పోషకమైన భోజనం అందిస్తున్నట్లు ఆమె రెస్టారెంట్పై ప్రశంసలు వచ్చాయి. అల్లు అర్జున్ హైలైఫ్పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో అభిమానులను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ కూడా రెస్టారెంట్ వ్యాపారంలో ఉన్నారు. అంతర్జాతీయ రేంజ్లో గుర్తింపు ఉన్న హైలైఫ్ బ్రూయింగ్ కంపెనీ గురించి వినే వింటారు. హైలైఫ్ పేరుతో 2016లోనే జూబ్లీహిల్స్లో ఈ రెస్టారెంట్ను ఆయన ప్రారంభించారు. అంతర్జాతీయ హాస్పిటాలిటీ బ్రాండ్ M కిచెన్, నిర్మాత కేదార్ సెలగంశెట్టితో కలిసి రన్ చేస్తున్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోబఫెలో వైల్డ్ వింగ్స్ (B-డబ్స్) అనే అమెరికన్ రెస్టారెంట్ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ రెండూ కూడా హైదరాబాద్లోని పార్టీలకు స్వర్గధామంగా మారాయి. మీరు ఏదైనా సందర్బంలో పార్టీ కోసం వెతుకుతున్నట్లయితే, హైలైఫ్ మీకు సరైన స్థలమని చెప్పవచ్చు.అక్కినేని నాగార్జున యొక్క 'N గ్రిల్, N ఏషియన్'టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునకు కూడా హైదరాబాద్లో ప్రముఖ రెస్టారెంట్స్ ఉన్నాయి. జూబ్లీహిల్స్ వద్ద N గ్రిల్ పేరుతో ఆయనకు ఒక రెస్టారెంట్ ఉంది. 2014లో ఎంటర్ప్రెన్యూర్ ప్రీతం రెడ్డి సహకారంతో ఆయన దీనిని ప్రారంభించారు. ఇది ఆధునిక గ్రిల్ హౌస్గా గుర్తింపు ఉంది. దీంతో పాటు జూబ్లీ హిల్స్లో కూడా ఎన్ ఏషియన్ అనే చైనీస్ రెస్టారెంట్ని కూడా నాగ్ ఏర్పాటు చేయడం విశేషం. రెండు రెస్టారెంట్లు భారతీయ, ఇటాలియన్, పాన్ ఆసియన్తో పాటు మెడిటరేనియన్ వంటకాలను అందించే విభిన్న మెనూకు ప్రసిద్ధి చెందాయి. హైదరాబాద్లో ప్రీమియం డైనింగ్ అనుభవం కోసం వెతుకుతున్న ఆహార ప్రియుల కోసం ఈ ప్రదేశాలు బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. నాగ చైతన్య 'షోయూ'ఫుడ్ బిజినెస్లోకి 2022లోనే నాగచైతన్య ఎంట్రీ ఇచ్చేశాడు. 'షోయూ' పేరుతో జూబ్లీహిల్స్ ప్రాంతలో ఓ సరికొత్త రెస్టారెంట్ను ఆయన ఓపెన్ చేశాడు. అక్కడ అనేక రకాల పాన్-ఆసియన్ వంటకాలు దొరుకుతాయి. క్లౌడ్ కిచెన్గా తన వ్యాపారాన్ని ఆయన ప్రారంభించారు. స్విగ్గీ ఫుడ్ డెలివరీ సంస్థతో హైదరాబాద్ చుట్టూ ఉన్న ఆహారప్రియులకు తమ వంటకాలను అందిస్తుంది. రుచికరమైన జపనీస్ మీల్స్ అక్కడి ప్రత్యేకత. బ్రాండ్ స్థిరమైన ప్యాకేజింగ్ను ఉపయోగించడం ద్వారా పర్యావరణ స్పృహతో కూడిన విధానాన్ని అవలంబిస్తుంది, క్లయింట్లు పర్యావరణ ప్రయోజనకరమైన భోజన అనుభవాన్ని కలిగి ఉండేలా రెస్టారెంట్ యాజమాన్యం చూస్తుంది.నవదీప్- BPM పబ్హీరో నవదీప్ కూడా చాలా రోజుల క్రితమే ఒక పబ్ను ప్రారంభించారు. సినిమాల్లో బిజీగా ఉంటూనే ఈ వ్యాపారంలో ఆయన రాణించారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో బీట్స్ పర్ మినిట్ అకా BPM పబ్ను నవదీప్ నడుపుతున్నాడు. చాలామంది సెలబ్రిటీలు అక్కడకు వెళ్తూ ఉంటారు. -
డ్రాగన్ డ్యాన్స్ చేస్తే.. పాన్ ఇండియా ఊగిపోదా..
-
ఎప్పటికీ నీతోనే.. నమ్రతకు మహేశ్ లవ్ నోట్
సినీ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం కామన్. ఇప్పటికే చాలా మంది హీరోహీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారిలో కొంతమంది మాత్రమే ఇప్పటికీ కలిసి సంతోషంగా ఉంటున్నారు. అలాంటి వారిలో మహేశ్-నమ్రత జంట ఒకటి. పెళ్లయి ఏళ్లు గడుస్తున్న ఇప్పటి వరకు ఈ జంటపై చిన్న రూమర్ కూడా రాలేదంటే.. ఎంత అనోన్యంగా ఉంటున్నారో అర్థం చేసుకోవచ్చు. నేడు(ఫిబ్రవరి 10) ఈ బ్యూటిఫుల్ కపుల్ 20వ పెళ్లి రోజు. ఈ సందర్భంగా తన సతీమణికి సోషల్ మీడియా వేదికగా యానివర్సరీ విషెస్ తెలియజేశాడు మహేశ్. ‘నువ్వు, నేను.. అందమైన 20 వసంతాలు. ఎప్పటికీ నీతోనే నమ్రత..’ అంటూ నమ్రత, తను కలిసి ఉన్న నవ్వుతున్న ఫోటోని ఇన్స్టాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. మహేశ్ అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు మహేశ్-నమ్రత జంటకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సినిమా కలిపిందిమహేశ్ బాబు, నమ్రతలను ఒక్కటి చేసింది ఓ సినిమా. వీరిద్దరు జంటగా వంశీ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మనసులు కలిశాయి. ఓసారి ఈ సినిమా అవుట్డోర్ షూటింగ్లో భాగంగా చిత్ర యూనిట్ న్యూజిలాండ్ వెళ్లారు. దాదాపు 25రోజుల పాటు అక్కడే షూట్ చేశారు. ఆ సమయంలోనే వీరి స్నేహం మరింత బలపడింది.నమ్రత మహేశ్ కంటే నాలుగేళ్లు పెద్ద. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ముందే ఆమె మిస్ ఇండియా పోటీల్లో గెలుపొందింది. వంశీ సినిమా షూటింగు తొలిచూపులోనే మహేశ్ను ఇష్టపడింది. న్యూజిలాండ్ షెడ్యూల్ నుంచి తిరిగి వచ్చాక మొదట నమ్రతనే తన ప్రేమను వ్యక్తపరిచింది. అప్పటికే నమ్రత అంటే మహేశ్కు ఎంతో ఇష్టం ఉండటంతో ఆయన కూడా వెంటనే ఓకే చెప్పేశారు. దాదాపు ఐదేళ్ల ప్రేమాయణం అనంతరం 2005 ఫిబ్రవరి 10న నమ్రత-మహేశ్లు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. 2005లో తెలుగు సంప్రదాయం ప్రకారం చాలా సింపుల్గా వీరి పెళ్లి జరిగింది. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
ఓటీటీలో 'మహేశ్ బాబు' మేనల్లుడి సినిమా స్ట్రీమింగ్
'దేవకీ నందన వాసుదేవ' మూవీ ఓటీటీలోకి రానుంది. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది. 'హీరో' అనే సినిమాతో మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఇతడు మరోసారి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీనే ఈ 'దేవకీ నందన వాసుదేవ'. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ స్టోరీ అందించారు. మైథలాజికల్ యాక్షన్ సినిమాకు ఒక వర్గం ప్రేక్షకుల నుంచి పర్వాలేదనిపించింది. మేనల్లుడి కోసం మహేష్ బాబు కూడా ఇందులో నటించబోతున్నాడని నెట్టింట ప్రచారం దక్కడంతో ఈ సినిమాకు భారీ బజ్ క్రియేట్ చేసింది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.ఫిబ్రవరి 8 నుంచి 'దేవకీ నందన వాసుదేవ' చిత్రం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్కు రానుంది. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కానీ, హిందీ వర్షన్లో మాత్రమే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అయితే, ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. అదే సమయంలో కలర్స్ సినీప్లెక్స్ ఛానెల్లోనూ ఈ చిత్రం ప్రసారం కానుంది. తెలుగు మూవీ అయినప్పటికీ ఓటీటీ, టీవీలో మొదట హిందీ వర్షన్ రావడం విశేషం. అయితే, తెలుగు వర్షన్ కూడా ఫిబ్రవరి 8 నుంచే అందుబాటులోకి రావచ్చని నెట్టింట ప్రచారం జరుగుతుంది.ప్రశాంత్ వర్మ పేరుతో ఈ సినిమాని పాన్ ఇండియాలో కూడా ప్రమోట్ చేశారు. 'ఆదిపురుష్'లో హనుమంతుడిగా చేసిన దేవదత్తా.. ఇందులో విలన్గా చేశాడు. 'దేవకి నందన వాసుదేవ' సినిమాలో కృష్ణుడు, కంసుడు రిఫరెన్స్లతో కథను రాసుకున్నారు. సాయి మాధవ్ చాలా అద్భుతమైన డైలాగ్స్ రాశారు. ఎమోషనల్ డెప్త్ పట్టుకుని కథకి తగ్గట్టుగా మాటలందించారు. భీమ్స్ ఈ సినిమాకి తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో మెప్పించాడు. -
ఓటీటీలో 'ముఫాసా: ది లయన్ కింగ్' స్ట్రీమింగ్
హాలీవుడ్ బ్లాక్బస్టర్ ఫిల్మ్ ‘ది లయన్ కింగ్ (2019)’ సినిమాకు ప్రీక్వెల్గా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ అనే చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. బారీ జెంకిన్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. వాల్ట్ డిస్నీ పిక్చర్స్ పతాకంపై అడెలె రోమన్ స్కీ, మార్క్ సెరియాక్ ఈ సినిమాను నిర్మించారు. డిసెంబరు 20న విడుదలైన ఈ సినిమా ఇండియాలో కూడా ప్రేక్షకులను మెప్పించింది. సుమారు రూ. 1260 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 3,200 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఓటీటీకి రానున్నడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రం ఫిబ్రవరి 18న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రీమియర్ అవుతుంది. అయితే, రెంటల్ విధానంలో అధనంగా డబ్బు చెల్లించి ఈ చిత్రాన్ని చూసే అవకాశం ఉంటుంది. ఆపై ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ, ఫాండాంగోతో సహా వీడియో-ఆన్-డిమాండ్ (VOD) ప్రాతిపదికన అందుబాటులో ఉంటుంది. ఇక్కడ కూడా అదనంగా రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి మాత్రమే ఈ చిత్రాన్ని ఉచితంగా చూసే అవకాశం ఉంటుందని డిస్నీ ప్లస్ హాట్స్టార్కు సంబంధించిన ఒకరు స్క్రీన్రాంట్ మీడియాతో తెలిపారు.ఇంగ్లిష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రంలో టైటిల్ రోల్కు టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో తెలుగు ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. హిందీ వెర్షన్లో ముఫాసా పాత్రకు షారుక్ ఖాన్, ముఫాసా చిన్నప్పటి పాత్రకు ఆయన కుమారుడు అబ్రం వాయిస్ అందించారు. ఈ చిత్రంలోని సింబా పాత్రకు షారుక్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ వాయిస్ ఇవ్వడం విశేషం. -
హీరో మహేష్బాబు ఓటు తొలగింపు
గుంటూరు: శాసనమండలి కృష్ణా–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితాలో ప్రముఖ సినీ నటుడు ఘట్టమనేని మహేష్బాబు పేరుతో నమోదైన ఓటును తొలగించినట్లు గుంటూరు నగరపాలకసంస్థ అదనపు కమిషనర్, ఏఈఆర్వో చల్లా ఓబులేసు గురువారం తెలిపారు. గుంటూరులో హీరో మహేష్బాబుకు ఓటు శీర్షికతో బుధవారం ‘‘సాక్షి’’ మెయిన్ ఎడిషన్లో ప్రచురితమైన కథనానికి ఏఈఆర్వో స్పందించారు. మహేష్బాబు పేరుతో ఓటు తప్పుగా నమోదైందని, ఫారం–7 విచారణ అనంతరం ఓటును తొలగించామని వివరించారు. గుంటూరు అర్బన్లో దరఖాస్తులపై బూత్ లెవల్ అధికారులతో విచారణ చేయించామన్నారు. అర్హులైన వారి దరఖాస్తులను ఆమోదించినట్లు పేర్కొన్నారు. -
మహేశ్ మూవీలో విలన్?
మహేశ్బాబు మూవీలో విలన్గా నటించనున్నారట ప్రియాంకా చోప్రా. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ ఫిల్మ్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా ఓ కీలక పాత్రకు ఎంపికయ్యారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇటీవల ప్రియాంకా చోప్రా హైదరాబాద్ రావడం, కొన్ని రోజులు ఇక్కడే ఉండటం వంటి అంశాలు ఈ మూవీలో ఆమె భాగమయ్యారనే విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేస్తున్నట్లుగా ఉన్నాయి. కాగా ఈ మూవీలో ప్రియాంకా చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ ఆమె చేయనున్నది హీరోయిన్ రోల్ కాదని, నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ రోల్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఇటీవల మహేశ్–ప్రియాంక పాల్గొనగా హైదరాబాద్లో షూట్ జరిగింది. ఇది టెస్ట్ షూట్ అని, కాదు రెగ్యులర్ షూట్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. -
మా మధ్య గొడవలు లేవు : శిల్పా శిరోద్కర్
బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ (Shilpa Shirodkar) కొద్దిరోజుల క్రితం హిందీ బిగ్బాస్ 18వ సీజన్కు వెళ్లొచ్చింది. టాప్ 5లో ఉంటుందనుకున్న ఆమె 100 రోజుల జర్నీ తర్వాత గ్రాండ్ ఫినాలే వీక్ మధ్యలోనే ఎలిమినేట్ అయింది. కానీ, చాలామంది అభిమానాన్ని ఆమె దక్కించుకుంది. అయితే ఈ షోకు వెళ్లడానికి ముందు నమ్రతతో గొడవపడినట్లు బిగ్బాస్లో ఉన్నప్పుడే శిల్ప చెప్పింది. ఆ సమయంలో వారిద్దరూ రెండు వారాలు మాట్లాడుకోలేదంది. ఫ్యామిలీ వీక్లో నమ్రత రావాలని కూడా ఆమె కోరుకుంది. కానీ, నమ్రతకు బదులుగా శిల్ప కూతురు బిగ్బాస్కు వెళ్లింది. శిల్పకు సపోర్ట్గా ఆమె అక్కాబావ నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar)- మహేశ్బాబు(Mahesh Babu) తనకు సపోర్ట్ చేయలేదని ప్రచారం జరిగింది. రెండు కుటుంబాల మధ్య తీవ్రమైన గొడవ జరిగిందని రూమర్స్ రావడంతో శిల్ప శిరోద్కర్ మరోసారి రియాక్ట్ అయింది.'సోషల్ మీడియాలో పెడుతున్న పోస్ట్ల వల్ల బంధాలను జడ్జ్ చేయడం తప్పు. సోషల్ మీడియా పోస్ట్ల ద్వారా సంబంధాలను అంచనా వేయకూడదు.. మనుషుల మధ్య అనుబంధాన్ని తెలిపేందుకు సోషల్ మీడియా పోస్ట్ అవసరం లేదు. మేమిద్దరమూ మా భావాలను బహిరంగంగా వ్యక్తీకరించుకోలేం.. ఆన్లైన్ వేదికగా అలాంటివి మాకు ఇష్టం ఉండదు. నాకు సపోర్ట్గా నమ్రత పోస్ట్ చేస్తేనే మా మధ్య సంబంధాలు ఉన్నాయని, లేదంటే గొడవలు ఉన్నాయని ఊహించుకోవడం చాలా తప్పు. నా గుర్తింపు కోసం నేను బిగ్ బాస్ 18కి వెళ్లాను. నమ్రత సోదరి గానో లేదా మహేష్ మరదలిని కావడం వల్లో వెళ్లలేదు. వాస్తవానికి మహేశ్ ఒక సూపర్ స్టార్. ఆయన చాలా పాపులర్. కానీ, వారు నా కెరీర్లో భాగం కావాలని అర్థం కాదు కదా..? మహేశ్, నమ్రత ఇద్దరూ చాలా ప్రైవేట్గా ఉండాలనుకుంటారు. దీంతో వారికి పొగరు అని అందరూ అనుకుంటారు. ఇదీ ముమ్మాటికి నిజం కాదు. వారిద్దరూ చాలా మంచివారు. మహేశ్ చాలా సింపుల్, కూల్గా మాట్లాడుతారు. అతను చాలా మంచి వ్యక్తి. మీకు ఏదైనా అవసరమైతే.., ఎల్లప్పుడూ మీ కోసం అండగా నిలబడుతాడు.' అని శిల్పా పేర్కొంది. బిగ్ బాస్లో శిల్పా శిరోద్కర్కు ఓటు వేయాలని మహేశ్, నమ్రత శిరోద్కర్ విజ్ఞప్తి చేసి ఉంటే.. ఆమె తప్పకుండా గెలిచి ఉండేది అని చాలామంది భావించారు. ఈ క్రమంలో శిల్ప ఇలా రియాక్ట్ అయింది.నమ్రతను కలిసిన శిల్పతాజాగా శిల్ప.. నమ్రతను కలిసింది. వీరిద్దరూ కలిసి జాలీగా ఉన్న ఫోటోలను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్.. ఇద్దరూ ట్విన్స్లా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. జనవరి 22న నమ్రత బర్త్డే సందర్భంగా శిల్ప ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది. హ్యాపీ బర్త్డే.. ఐ లవ్యూ సో మచ్. నేను నిన్ను ఎంతగా మిస్ అయ్యానో అస్సలు ఊహించలేవు. నువ్వు ఎప్పటికీ నా సొంతమే అంటూ నమ్రతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. -
కెన్యా కాలింగ్?
మహేశ్బాబు(Mahesh Babu) హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో అడ్వెంచరస్ యాక్షన్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ అతి కానుందని సమాచారం. హైదరాబాద్ శివార్లలో ఈ సినిమా కోసం భారీ సెట్ వర్క్ జరుగుతోంది. అలాగే గత ఏడాది అక్టోబరులో దర్శకుడు రాజమౌళి(Rajamouli) కెన్యా వెళ్లి, అక్కడి లొకేషన్స్ను పరిశీలించిన సంగతి గుర్తుండే ఉంటుంది.ముందుగా ఈ సినిమా షూటింగ్ కెన్యాలోనే ప్రారంభం అవుతుందని, ఆ దిశగా రాజమౌళి ఆల్రెడీ ఏర్పాట్లు పూర్తి చేశారని ఫిల్మ్నగర్ భోగట్టా. ఇక ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా ఓ కీలక పాత్రలో నటించనున్నారు. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ లీడ్ రోల్ చేస్తారనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతోంది. అయితే ఈ విషయంపై ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదని, ఏదైనా ఉంటే మేమే చెబుతామని పృథ్వీరాజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో విడుదల కావొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు కీరవాణి స్వరకర్త. -
మహేశ్ బాబు, నేను కలిసి క్వశ్చన్ పేపర్ కొనేవాళ్లం: టాలీవుడ్ డైరెక్టర్
ఆకాష్ మురళి, అదితి శంకర్ జంటగా నటించిన చిత్రం ప్రేమిస్తావా. ఈ మూవీని పంజా ఫేం విష్ణు వర్ధన్ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సంక్రాంతి కానుకగా తమిళంలో ‘నేసిప్పాయా’ పేరుతో విడుదలై మంచి విజయం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మైత్రీమూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు ముందుకొచ్చింది. జనవరి 30న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. ప్రేమజంట మధ్య లవ్, రిలేషన్ షిప్, గొడవలు నేపథ్యంలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఈ సినిమా రిలీజ్ సందర్భంగా దర్శకుడు విష్ణు వర్ధన్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ప్రస్తుత సమాజంలో రిలేషన్ షిప్స్ ఎలా ఉన్నాయనే కోణంలో ఈ మూవీని తెరకెక్కించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఓకే స్కూల్లో చదివినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా తన బెంచ్మేట్ అయిన ప్రిన్స్ మహేశ్ బాబు గురించి ఆసక్తిక విషయాలు పంచుకున్నారు. మహేశ్ బాబుతో తన అనుబంధం గురించి ఆయన మాట్లాడారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.డైరెక్టర్ విష్ణు వర్ధన్ మాట్లాడుతూ..' మహేశ్ బాబుతో చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే మేమిద్దరం బెంచ్మేట్స్. ఆయనతో చాలా మధురమైన, సరదా క్షణాలు ఉన్నాయి. కొన్నింటిని బయటికే చెప్పలేం. మేము చెన్నైలో చదివే రోజుల్లో నేను చాలా యావరేజ్ స్టూడెంట్. బిలో యావరేజ్ అనుకోండి. మహేశ్ బాబుకు తెలుగుతో పాటు తమిళం కూడా బాగా మాట్లాడతాడు. ఒక ఏరియాలో ప్రశ్న పత్రం అమ్ముతున్నారని కొందరు చెప్పారు. ఈ విషయం మహేశ్ బాబుతో చెప్పా. నేను వెంటనే మహేశ్ బాబును లాక్కొని అక్కడికి తీసుకెళ్లా. కానీ అక్కడకు వెళ్తే మా డబ్బులు పోయాయి కానీ క్వశ్చన్ పేపర్ అయితే దొరకలేదు. అన్నీ ఫేక్. మహేశ్ బాబు నటించిన చిత్రాల్లో ఒక్కడు సినిమా నాకు చాలా ఇష్టం. భవిష్యత్తులో ఛాన్స్ వస్తే మహేశ్ బాబు సినిమా తీస్తా' అని ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. నేను, #MaheshBabu డబ్బులిచ్చి QUESTION PAPER కొనేవాళ్ళం 😂 - Director #VishnuVardhan#Premisthava #TeluguFilmNagar pic.twitter.com/cq5gNxJovt— Telugu FilmNagar (@telugufilmnagar) January 30, 2025 -
ప్రియాంక చోప్రా..రెమ్యునరేషన్ ఇన్నికోట్ల..!
-
మహేశ్ బాబు- రాజమౌళి ప్రాజెక్ట్లో సలార్ హీరో.. క్లారిటీ ఇదే!
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు- దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో భారీ అడ్వెంచరస్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ మూవీకి 'ఎస్ఎస్ఎంబీ29' అనే వర్కింగ్ టైటిల్ను ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పనులతో రాజమౌళి బిజీగా ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ లోకేషన్స్ కోసం విదేశాలకు సైతం వెళ్లివచ్చారు మన డైరెక్టర్.అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త తెగ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా చేయనున్నారని నెట్టింట టాక్ నడుస్తోంది. సలార్తో తెలుగులోనూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సుకుమారన్ మహేశ్బాబు చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న వార్తలపై పృథ్వీరాజ్ సుకుమారన్ స్పందించారు. ప్రస్తుతం మలయాళంలో ఎంపురాన్ మూవీలో నటిస్తోన్న ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చారు.నాకంటే మీకే ఎక్కువ విషయాలు తెలుస్తున్నాయని మీడియాతో అన్నారు. మహేశ్ బాబు చిత్రంలో నటించే విషయం గురించి ఇప్పుడే చెప్పలేను.. ప్రస్తుతానికైతే చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే ఇంకా ఏదీ ఫైనల్ కాలేదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఓకే అయ్యాక ఈ విషయం గురించి మాట్లాడుకుందామని పృథ్వీరాజ్ సుకుమారన్ వెల్లడించారు. సలార్తో మరింత్ స్టార్డమ్ సొంతం చేసుకున్న పృథ్వీరాజ్.. సలార్-2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. సలార్ సమయంలో ప్రభాస్ నుంచి చాలా నేర్చుకున్నానని అన్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో భారీ బడ్జెట్తో ఎస్ఎస్ఎంబీ29 చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ భామ ప్రియాకం చోప్రాను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవలే ఆమె హైదరాబాద్లోని చిలుకురు బాలాజీ ఆలయాన్ని సందర్శించారు. కొత్త ప్రయాణం మొదలైంది అంటూ ఫోటోలను కూడా షేర్ చేశారు. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. -
సెట్లో ఫోన్లు నిషిద్ధం.. మహేశ్బాబు సహా అందరితో అగ్రిమెంట్!
రాజమౌళి (SS Rajamouli) సినిమా అంటే అంచనాలు ఆకాశాన్నంటాల్సిందే! అందులోనూ తెలుగు సూపర్స్టార్ మహేశ్బాబు (Mahesh Babu)తో అంటే బాక్సాఫీస్ను బ్లాస్ట్ చేసేందుకు జక్కన్న ఏదో గట్టిగా ప్లాన్ చేశాడనే అర్థం. వీరిద్దరి కాంబోలో ఇటీవలే #SSMB29 సినిమా లాంచ్ చేశారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథ రెండు భాగాలుగా రానుంది. తొలి భాగం ప్రేక్షకుల ముందుకు రావడానికి కనీసం రెండేళ్లయినా పట్టొచ్చని టాక్! ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటించనున్నట్లు ఒక వార్త తెగ వైరలవుతోంది.షూటింగ్ షురూ?!ఇప్పటికే తన సినిమా కోసం ఒక సింహాన్ని లాక్ చేసినట్లు ఓ పోస్ట్ పెట్టాడు రాజమౌళి. అంటే మహేశ్బాబును తన ప్రాజెక్ట్ కోసం లాక్ చేశానని చెప్పకనే చెప్పాడు. అలాగే షూటింగ్ షురూ అని కూడా హింట్ ఇచ్చాడు. ఈ పోస్టుకు మహేశ్బాబు స్పందిస్తూ.. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని రిప్లై ఇచ్చాడు. ప్రియాంక చోప్రా.. ఫైనల్లీ అని కామెంట్ పెట్టింది. ఇదిలా ఉంటే తన సినిమా కోసం రాజమౌళి చాలా జాగ్రత్తపడుతున్నాడట! అగ్రిమెంట్ఎట్టి పరిస్థితుల్లోనూ కథ, షూటింగ్ క్లిప్స్, సినిమాలో నటించేవారి గురించి ఎలాంటి వివరాలు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నాడట. ఈ విషయంలో చిత్రయూనిట్కు హెచ్చరికలు జారీ చేశాడట. నటీనటులు, సాంకేతిక నిపుణులతో నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ (NDA) చేయించినట్లు తెలుస్తోంది. మహేశ్బాబు, ప్రియాంక చోప్రాతోనూ ఈ ఒప్పందంపై సంతకం చేయించారట! ఈ అగ్రిమెంట్ ప్రకారం సినిమాకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని కూడా యూనిట్ సభ్యులు బయటకు చెప్పేందుకు వీల్లేదు. లీక్ చేశారంటే భారీ మూల్యం..దర్శకనిర్మాతల అనుమతి లేకుండా ఎవరైనా సమాచారాన్ని లీక్ చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు. అలాగే హీరోతో సహా సెట్లో ఉన్న ఎవరూ ఫోన్లు తీసుకురావడానికి అనుమతి లేదని తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో తీస్తున్న సినిమా కాబట్టి ఆమాత్రం జాగ్రత్తలు పాటిస్తే తప్పేం కాదంటున్నారు సినీప్రియులు. జక్కన్న ప్లాన్ బానే ఉంది.. మరి ఆచరణ ఏమేరకు సాధ్యమవుతుందో చూడాలి! View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli) చదవండి: గేమ్ ఛేంజర్ డిజాస్టర్పై స్పందించిన అంజలి.. బాధేస్తోందంటూ.. -
SSMB29 తొలి రోజే 1000 కోట్లు కొల్లగొడతాడా?
-
మహేశ్బాబు సినిమా కోసం 'ప్రియాంక చోప్రా' భారీ రెమ్యునరేషన్
మహేశ్బాబు(Mahesh Babu) - దర్శకధీరుడు రాజమౌళి SSMB29 భారీ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. అయితే, ఇందులో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కూడా నటిస్తున్నారు. ఆమె రెమ్యునరేషన్ గురించి నెట్టింట పెద్ద చర్చ నడుస్తుంది. ప్రియాంక చోప్రా సుమారు దశాబ్ధం పాటు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగారు. అదే సమయంలో ఆమె హాలీవుడ్లో అవకాశాలు దక్కించుకుని పలు ప్రాజెక్ట్లలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా అక్కడ రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో స్థిరపడ్డారు. అయితే సుమారు పదేళ్ల తర్వాత ఒక ఇండియన్ (తెలుగు) సినిమాలో ప్రియాంక నటిస్తుండటం విశేషం. ఆమె ఎప్పుడో 2015 సమయంలో ఒప్పుకున్న 'ది స్కై ఈజ్ పింక్' చిత్రం 2019లో విడుదలైంది. బాలీవుడ్లో ఇదే ఆమె చివరి సినిమా.భారీ రెమ్యునరేషన్బాలీవుడ్కు మించిన రెమ్యునరేషన్లు తెలుగు చిత్ర పరిశ్రమ ఇస్తుంది. టాలీవుడ్లో ఇప్పటివరకు అత్యధిక పారితోషికం కల్కి సినిమా కోసం దీపికా పదుకోన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఆమె ఏకంగా సుమారు రూ. 20 కోట్లు తీసుకున్నట్లు అప్పట్లో భారీగా వార్తలు వచ్చాయి. అయితే, SSMB29 ప్రాజెక్ట్ కోసం ప్రియాంక చోప్రా ఏకంగా రూ.25 కోట్లు రెమ్యునరేషన్గా తీసుకుంటున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతుంది. కానీ, హాలీవుడ్ మీడియా మాత్రం సుమారు రూ. 40 కోట్లు వరకు ఉంటుందని కథనాలు ప్రచురించాయి. ఆమెకు అంత పెద్ద మొత్తంలో పారితోషికం ఇచ్చేందుకు నిర్మాత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.అంత మొత్తం ఇవ్వడానికి కారణం ఇదేప్రియాంక చోప్రా మార్కెట్ బాలీవుడ్లో భారీగానే ఉంది. చాలా గ్యాప్ తర్వాత ఆమె నటించిన సినిమా వస్తుండటంతో హిందీ బెల్ట్లో మంచి బిజినెస్ చేసే ఛాన్స్ ఉంది. ఆపై హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా ప్రియాంక అప్పీయరెన్స్ సినిమాకు ప్లస్ అవుతుంది. SSMB29 ప్రాజెక్ట్ను హాలీవుడ్ రేంజ్లో జక్కన్న ప్లాన్ చేశాడు. దీంతో సులువుగా అక్కడి మార్కెట్కు సినిమా రీచ్ అవుతుందని తెలుస్తోంది. ఈ లెక్కలన్నీ వేసుకునే ప్రియాంక చోప్రాకు భారీ మొత్తంలో ఆఫర్ చేసినట్లు టాక్. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా వస్తే.. అప్పుడు ఆమె రెమ్యునరేషన్ లెక్కలు మారిపోతాయి. ఏదేమైనా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా ప్రియాంక చోప్రా రికార్డ్ క్రియేట్ చేశారని ఆమె అభిమానులు చెప్పుకుంటున్నారు.హాలీవుడ్లో ఫుల్ బిజీబాలీవుడ్లో ఎన్నో సూపర్హిట్ సినిమాలలో నటించిన ప్రియాంక 'క్వాంటికో' అనే టెలివిజన్ సిరీస్తో హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు దగ్గరయ్యారు. ఆ తర్వాత బేవాచ్, ఏ కిడ్ లైక్ జాక్,లవ్ అగైన్,టైగర్, వుయ్ కెన్ బీ హీరోస్, ది వైట్ టైగర్ తదితర చిత్రాలలో నటించి ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా పలు షోలకు హోస్ట్గా వ్యవహరించి అక్కడి వారిని మెప్పించారు. హాలీవుడ్కి చెందిన ప్రముఖ పాప్ సింగర్ నిక్ జోనాస్ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు అదనపు గుర్తింపు లభించింది. -
సింహాన్ని లాక్ చేసిన రాజమౌళి.. స్పందించిన మహేశ్బాబు, ప్రియాంక
మహేశ్బాబు- ఎస్ఎస్ రాజమౌళి సినిమా పనులు ప్రారంభమయ్యాయి. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్గా ఈ మూవీపై అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో 'SSMB 29' చిత్రాన్ని లాంచ్ చేశారు. చిత్ర యూనిట్తో పాటు మహేశ్బాబు(Mahesh Babu) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కానీ, ఈ సినిమా కార్యక్రమానికి సంబంధించి చిత్ర యూనిట్ నుంచి ఆ సమయంలో ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. అయితే, తాజాగా జక్కన్న తన ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటో షేర్ చేసి అభిమానుల్లో జోష్ పెంచాడు.మహేశ్బాబు అభిమానుల దృష్టి అంతా SSMB29 సినిమాపైనే ఉంది. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాజమౌళి( S. S. Rajamouli) ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఒక వీడియోను పంచుకున్నారు. ఒక సింహాన్ని లాక్ చేసినట్లు అందులో ఉంది. అంటే మహేశ్ను తన ప్రాజెక్ట్ కోసం లాక్ చేసినట్లు చెప్పేశాడు. జక్కన్న పోస్ట్కు కామెంట్ బాక్స్లో మహేశ్బాబు కూడా 'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను..' అంటూ రెస్పాండ్ అయ్యాడు. ఆపై నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) కూడా చప్పట్ల ఎమోజీతో చిత్ర యూనిట్కు ఆల్ ది బెస్ట్ చెప్పింది. అయితే, 'ఫైనల్లీ' అంటూ బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కామెంట్ బాక్స్లో రియాక్ట్ కావడం విశేషం. ఇలా జక్కన్న చేసిన పోస్ట్కు చాలామంది సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. జక్కన్న పాస్పోర్ట్ చూపిస్తూ సింహం ఫోటోతో పోజ్ ఇచ్చారు. దీంతో SSMB29 సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లేనని మహేశ్ అభిమానులు అనుకుంటున్నారు.'ఫైనల్లీ' తేల్చేసిన ప్రియాంక చోప్రాహీరోయిన్ ప్రియాంక చోప్రా ఇప్పటికే హైదరాబాద్లో అడుగుపెట్టారు. SSMB29 ప్రాజెక్ట్ కోసమే ఆమె ఇక్కడకు వచ్చినట్లు తేలిపోయింది. తాజాగా రాజమౌళి చేసిన పోస్ట్కు ఫైనల్లీ అంటూ ఆమె రెస్పాండ్ అయ్యారు. దీంతో మహేశ్బాబు- ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో ప్రియాంక చోప్రానే హీరోయిన్ అని క్లారిటీ వచ్చేసింది. సింగర్, యాక్టర్ నిక్ జోనాస్తో పెళ్లి తర్వాత అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో స్థిరపడిన ప్రియాంక. చాలా రోజుల తర్వాత హైదరాబాద్లో అడుగుపెట్టారు. ఈ చిత్రంలో మహేశ్బాబుకి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో ప్రియాంకా చోప్రా, కియారా అద్వానీ, ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్గా ప్రియాంకా చోప్రాని కథానాయికగా ఫిక్స్ చేశారని పరోక్షంగా క్లారిటీ వచ్చేసింది. త్వరలో అధికారికంగా ప్రకటన రావచ్చు అని తెలుస్తోంది.‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజమౌళి.. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని ఈ చిత్రంలో రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్రప్రసాద్ ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథ రెండు భాగాలుగా రానుంది. తొలి భాగాన్ని 2027లో విడుదల చేస్తారని ప్రచారంలో ఉంది. ఈ ప్రాజెక్ట్లో హాలీవుడ్ నటీనటులతో పాటు టెక్నీషియన్స్ కూడా ఇందులో భాగం కానున్నారు. View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli) -
గుంటూరు కారం సాంగ్.. ఆ దేశంలో క్రేజ్ చూశారా!
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు గతేడాది సంక్రాంతికి అభిమానులను అలరించాడు. త్రివిక్రమ్- మహేశ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం పొంగల్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేశ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ రావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఊహించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద అభిమానులను ఆకట్టుకోలేకపోయింది.అయితే ఈ మూవీలో కుర్చీని మడతపెట్టి అనే సాంగ్ విపరీతమైన క్రేజ్ను సొంతం చేసుకుంది. ఈ సాంగ్లో టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల తన స్టెప్పులతో ఫ్యాన్స్ను ఊపేసింది. ఈ సినిమాలో ముఖ్యంగా తమన్ మ్యూజిక్ మహేశ్ బాబు ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియులను అలరించింది.అయితే సినిమా రిలీజైన ఏడాది దాటిపోయినా కుర్చీని మడతపెట్టి సాంగ్కు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను ఓ ఊపు ఊపేస్తోంది. తాజాగా నేపాల్లో ఈ పాటకు ఇద్దరు యువతులు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రోడ్డు పక్కన యువతులు గుంటూరు కారం సాంగ్కు స్టెప్పులు వేస్తూ కనిపించారు. అంతేకాకుండా నేపాల్లోని ఓ కళాశాలలో స్టూడెంట్స్ సైతం కుర్చినీ మడతపెట్టి అనే సాంగ్కు డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. ఇది చూసిన మహేశ్ బాబు ఫ్యాన్స్ గ్లోబల్ స్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. మహేశ్బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి ముఖ్య పాత్రల్లో నటించిన గుంటూరు కారం గతేడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైంది. మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీలో తమన్ అందించిన సంగీతం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా కుర్చీ మడతపెట్టి పాట అభిమానులకు గూస్బంప్స్ తెప్పించింది. ఈ సాంగ్ యూట్యూబ్లో రిలీజవగానే సెన్సేషనల్ హిట్ అయింది. మహేశ్, శ్రీలీల ఎనర్జిటిక్ డ్యాన్స్కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ పాట యూట్యూబ్లో ఏకంగా 50 కోట్ల (500 మిలియన్) వ్యూస్ సాధించింది. #KurchiMadathapetti Mania in NEPAL ❤️🔥Global sensation @urstrulyMahesh - @MusicThaman 🥁 #MaheshBabu | #GunturKaaram pic.twitter.com/mfJcQurGrS— VardhanDHFM (@_VardhanDHFM_) January 22, 2025 -
'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ పార్టీలో మహేశ్బాబు (ఫొటోలు)
-
లాస్ ఏంజెల్స్ టు హైదరాబాద్
ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రా హైదరాబాద్లో అడుగుపెట్టారు. అందులో విషయం ఏముందీ అనుకోవచ్చు. సింగర్, యాక్టర్ నిక్ జోనాస్తో పెళ్లి తర్వాత అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో స్థిరపడ్డారు ప్రియాంక. ఇప్పుడు ఇలా హైదరాబాద్లో అడుగుపెట్టడానికి కారణం ఏంటి? అనేది హాట్ టాపిక్గా మారింది. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూ΄పొందనున్న సినిమా కోసమే ఆమె భాగ్యనగరానికి చేరుకున్నారని టాక్. ఈ చిత్రంలో మహేశ్బాబుకి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో ప్రియాంకా చోప్రా, కియారా అద్వానీ, ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్గా ప్రియాంకా చోప్రాని కథానాయికగా ఫిక్స్ చేశారని భోగట్టా. ప్రియాంకా చోప్రా లాస్ ఏంజెల్స్ నుంచి హైదరాబాద్కి చేరుకోవడంతో ఈ మూవీ చిత్రీకరణ కోసమే ఆమె వచ్చారనే రూమర్లు వినిపిస్తున్నాయి. మరి... ఈ వార్త ఎంతవరకూ నిజమో తెలియాల్సి ఉంది. -
బిగ్బాస్ ఫినాలే ఛాన్స్ మిస్.. నమ్రతా, మహేశ్ బాబు సపోర్ట్పై శిల్పా రియాక్షన్
బిగ్బాస్ సీజన్-18 దాదాపు చివరిదశకు చేరుకుంది. ఈనెల 19న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఇప్పటికే టాప్-6 కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్లో మిగిలి ఉన్నారు. ముఖ్యంగా ఫైనలిస్ట్లో కచ్చితంగా ఉంటుందని భావించిన నమ్రతా శిరోద్కర్ సిస్టర్ శిల్పా శిరోద్కర్ ఊహించని విధంగా ఎలిమినేట్ అయింది. ఫైనలిస్ట్ అయ్యే అవకాశాన్ని ఒక్క అడుగు దూరంలోనే మిస్ చేసుకుంది. హౌస్ నుంచి బయటకు వచ్చిన ఆమె బిగ్బాస్ హౌస్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే తన సిస్టర్ నమ్రతా, మహేశ్ బాబు గురించి మాట్లాడింది. వాళ్లు సోషల్ మీడియాలో తనకు మద్దతు ప్రకటించకపోవడంపై కూడా స్పందించింది.ఎలిమినేషన్ గురించి శిల్పా మాట్లాడుతూ..'ఈ లిటీ షోకు నేను పెద్ద అభిమానిని. మిడ్వీక్లో ఎవిక్షన్ ఉంటుందని మనందరికీ తెలుసు. ఏ విషయంలోనూ నేను అబద్ధం చెప్పను. ఈ సీజన్లో టాప్ -3లో ఉండాలని ఆశించా. నా పేరు ప్రకటించినప్పుడు కాస్తా విచారంగా అనిపించింది. కానీ నా ఎలిమినేషన్ చాలా గౌరవంగా ఉంది. బిగ్ బాస్ నా పేరును కూడా ప్రకటించలేదు. నా లేఖను కూడా నేనే చదివా. ఈ షో అభిమానిగా హౌస్లో ప్రవేశించా. బిగ్ బాస్ హౌస్లో నా ప్రయాణంతో సంతోషంగా ఉన్నా' అని అన్నారు.అయితే శిల్పా శిరోద్కర్కు సోదరి నమ్రతా శిరోద్కర్, మహేష్ బాబు దంపతుల నుంచి ఆమెకు తగినంత సపోర్ట్ లభించలేదని కొందరు సోషల్ మీడియా పోస్ట్లు పెట్టారు. ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానులు ఆమెకు ఓట్లు వేయాలని నమ్రతా కోరకపోవడంపై కొందరు అభిమానులు షాకయ్యారు.అయితే ఇదే విషయం శిల్పా మాట్లాడుతూ.. "ఒక కుటుంబంగా, మాకు ఒకరిపై ఒకరికి అలాంటి అంచనాలు ఉండవు. ఈ ఇంటి ద్వారా నేను అన్ని రకాల వ్యక్తులను కలిశాను. మన తెలివితేటలను బట్టే మనల్ని అంచనా వేస్తారని తెలుసుకున్నా. నమ్రతా నన్ను ఎంతగా ప్రేమిస్తుందో నాకు తెలుసు. అలా అని నాకు సపోర్ట్ చేయాలని నేను చెప్పను. ఇలాంటివీ మా మధ్య బంధాన్ని ప్రభావితం చేయలేవు. ఆమె నాకు మద్దతు ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. తానేంటో నాకు తెలుసు..నేనేంటో తనకు తెలుసు.' అని వెల్లడించింది. మరోవైపు బిగ్బాస్ హౌస్లో వివియన్ ద్సేనా, కరణ్ వీర్ మెహ్రా తనకు స్నేహితులని శిల్పా శిరోద్కర్ తెలిపింది.బిగ్బాస్లో అనుభవం గురించి మాట్లాడుతూ..' ఇక్కడ నా ఆత్మగౌరవం గురించి ప్రశ్నించారని నాకు తెలుసు. కానీ నేను ఎలాంటి అంచనాలు లేకుండా షోలోకి ప్రవేశించా. అసలు నేను ఇన్ని రోజులు హౌస్లోని ఉంటానునుకోలేదు. ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తారని తెలుసు. మేం చేసే ప్రతి విషయం వారికి గుర్తుంటుంది. నా కుమార్తె హౌస్లోకి వచ్చినప్పుడు చాలా సంతోషం కలిగింది. అప్పుడే గెలిచినంత ఆనందం వేసింది.' అని పంచుకుంది. కాగా.. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన బిగ్బాస్ సీజన్-18 రియాలిటీ షో ఫైనల్ జనవరి 19 ఆదివారం జరగనుంది. -
పెద్దోడి సినిమాపై చిన్నోడి ప్రశంసలు.. గర్వంగా ఉందంటూ..
సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam Movie).. సినిమా టైటిట్ ఏ ముహూర్తాన పెట్టారో కానీ సంక్రాంతి కళ మొత్తం బాక్సాఫీస్ వద్దే కనిపిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ చలో అంటూ థియేటర్కు క్యూ కట్టారు. సినిమాలంటే పెద్దగా ఇష్టపడని వాళ్లు కూడా కాసేపు సరదాగా నవ్వుకోవడానికైనా ఈ మూవీకెళ్దామని అనుకుంటున్నారు. అక్కడే అనిల్ రావిపూడి సక్సెస్ అయిపోయాడు.సూపర్ హిట్గా సంక్రాంతికి వస్తున్నాం2025 సంక్రాంతికి గేమ్ ఛేంజర్ (Game Changer Movie), డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రిలీజయ్యాయి. రెండు రోజుల వ్యవధితో ఒక్కో సినిమా విడుదలైంది. జనవరి 10న వచ్చిన గేమ్ ఛేంజర్ ఎక్కువగా నెగెటివ్ టాక్ తెచ్చుకోగా జనవరి 12న రిలీజైన డాకు మహారాజ్ (Daaku Maharaaj Movie)కు స్పందన బాగుంది. చివరగా జనవరి 14న విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం మూవీ.. బ్లాక్బస్టర్ టాక్ సంపాదించుకుంది. వెంకటేశ్ కెరీర్లోనే అత్యధికంగా తొలి రోజే రూ.45 కోట్లు సంపాదించింది. (చదవండి: మంచు మనోజ్ అభిమానులపై మోహన్బాబు బౌన్సర్ల దాడి)గర్వంగా ఉందితాజాగా ఈ సినిమాపై హీరో మహేశ్బాబు (Mahesh Babu) స్పందించాడు. సంక్రాంతికి వస్తున్నాం అసలు సిసలైన పండగ సినిమా. ఈ మూవీ చూసి చాలా ఆనందించాను. వెంకటేశ్ సర్ మీరు అదరగొట్టారు. వరుస బ్లాక్బస్టర్స్ ఇస్తున్న అనిల్ రావిపూడిని చూస్తుంటే ఒకింత సంతోషంగా, ఒకింత గర్వంగా ఉంది. ఐశ్వర్య, మీనాక్షి తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. పిల్లాడు బుల్లిరాజు యాక్టింగ్ అయితే వేరే లెవల్. సినిమా యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు అని ట్వీట్ చేశాడు.పొంగల్ విన్నర్?ఇది చూసిన జనాలు సంక్రాంతికి వచ్చేస్తున్నాం సినిమాను పొంగల్ విన్నర్గా పేర్కొంటున్నారు. మరికొందరేమో మహేశ్బాబు.. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు ఎలాంటి రివ్యూ ఇవ్వకుండా కేవలం ఈ ఒక్క సినిమాకు ఇచ్చాడంటేనే ఏది హిట్టో తెలిసిపోతోందని కామెంట్లు చేస్తున్నారు. కాగా మహేశ్, వెంకటేశ్.. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అన్నదమ్ములుగా నటించారు. ఇందులో వెంకటేశ్ పెద్దోడిగా, మహేశ్ చిన్నోడిగా యాక్ట్ చేశారు.సినిమా విశేషాలుసంక్రాంతి సినిమా విషయానికి వస్తే.. వెంకటేశ్ (Venkatesh Daggubati) హీరోగా నటించగా ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ సినిమాలో బాగా హైలైట్ అయిన పాత్రల్లో బుల్లిరాజు ఒకటి. బుల్లి రాజుగా చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ భీమల నటించాడు. అతడి పాత్రకు అద్భుతమైన స్పందన లభిస్తోంది.గతేడాది సంక్రాంతికి డిజాస్టర్వెంకటేశ్ కెరీర్లో సంక్రాంతికి వచ్చిన మెజారిటీ సినిమాలు విజయం సాధించాయి. కానీ గతేడాది మాత్రం ఈ సమయానికి డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. సైంధవ్ చిత్రంతో ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈసారి మాత్రం అలాంటి పొరపాటు మళ్లీ జరగకుండా జాగ్రత్తపడ్డాడు. సంక్రాంతికి వచ్చేస్తున్నాంతో బ్లాక్బస్టర్ పొంగల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. జీవిత సూత్రాలుఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో నేటి తరానికి కొన్ని సూచనలు ఇచ్చాడు. జీవితాన్ని హాయిగా.. సంతోషంగా జీవించాలి. అత్యాశలకు పోకూడదు. అతిగా ఆలోచించకూడదు. మన ఆలోచనలు సానుకూలంగానే ఉండాలి. అదే సమయంలో మనం ఏదైనా కోరుకుంటున్నప్పుడు ఆ పనిని నిజాయితీతో చేయాలి. క్రమశిక్షణగా ఉండాలి... కష్టపడాలి. అప్పుడు సాధ్యమౌతుంది. లైఫ్లో ఎప్పుడూ హోప్ను కోల్పోకూడదు అని చెప్పాడు. Enjoyed watching #SankranthikiVasthunam , A proper festive film... @VenkyMama sir is just terrific👌👌👌So proud and happy for my director @AnilRavipudi for giving consecutive Blockbusters 👍👍👍@aishu_dil @Meenakshiioffl were superb in their characters. The kid "Bulli…— Mahesh Babu (@urstrulyMahesh) January 15, 2025 చదవండి: పీరియడ్స్ అన్నా పట్టించుకోరు... అతనొక్కడే...: నిత్యామీనన్ -
సుకుమార్ కూతురి చిత్రం.. ట్రైలర్ రిలీజ్ చేసిన మహేశ్ బాబు
పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి(Sukriti Veni Bandreddi) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'గాంధీ తాత చెట్టు'(Gandhi Tatha Chettu) ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై అవార్డ్స్ను అందుకుంది. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, గోపీటాకీస్ సంస్థలతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మించారు. ఈ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ భార్య తబితా సుకుమార్ సమర్పకురాలుగా వ్యవహరించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను(Gandhi Tatha Chettu Trailer) విడుదల చేశారు మేకర్స్. ప్రిన్స్ మహేశ్ బాబు చేతుల మీదుగా గాంధీతాత చెట్టు ట్రైలర్ రిలీజ్ చేశారు. గాంధీ తాత చెట్టు ట్రైలర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. అందరి మనసులను హత్తుకునే సినిమాలా అనిపిస్తోంది. సుకృతికి, అలాగే ఈ సినిమా టీమ్ అందరికి నా అభినందనలు అంటూ ప్రిన్స్ మహేష్బాబు తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.తాజాగా రిలీజైన గాంధీ తాత చెట్టు ట్రైలర్ చూస్తే ఓ బాలిక ఇచ్చిన మాట కోసం గాంధీ మార్గాన్ని ఎంచుకున్న కథగా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. గాంధీ పేరు పెట్టుకున్న ఓ అమ్మాయి.. ఆయన బాటను, సిద్దాంతాలను అనుసరిస్తూ, తన తాతకు ఇష్టమైన చెట్టును, తన ఊరును ఎలా రక్షించుకుంది అనే కథాంశంతో సినిమా తెరకెక్కినట్లుగా తెలుస్తోంది. గాంధీగా సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ఈ సినిమాలో నటించారు. ట్రైలర్ అందరి హృదయాలకు హత్తుకునే విధంగా ఉంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా సుకుమార్ కూతురి నటన అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ట్రైలర్ విడుదల చేసిన సూపర్స్టార్ మహేష్బాబుకు నిర్మాతలు, దర్శకురాలు, చిత్ర సమర్పకురాలు తబితా సుకుమార్ తమ కృతజ్ఞతలు తెలియజేశారు.కాగా.. ఇప్పటికే ఈ 'గాంధీ తాత చెట్టు' సినిమా పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శించడమే కాకుండా ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి పురస్కారం పొందారు. దీంతో పుష్ప అభిమానులు సుకుమార్ కూతురు అనిపించుకున్నావ్ అంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు. తండ్రి నేషనల్ అయితే, కూతురు ఇంటర్నేషనల్ అంటూ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు.ఈ సందర్భంగా దర్శకురాలు పద్మావతి మల్లాది మాట్లాడుతూ 'ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడా చూసిన ద్వేషాలు, అసూయ..ఇలా ఓ నెగెటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం.. గొడవలు ఇలా ఎన్నో ఘర్షణలు కనిపిస్తున్నాయి.ఇక సాధారణంగా మనకు అహింస అనగానే మనకు మన జాతిపిత మహాత్మగాంధీ గుర్తొస్తారు. ఇలాంటి తరుణంలో గాంధీ గారి సిద్ధాంతాలు అభిమానిస్తూ, ఆయన బాటను అనుసరించే ఓ పదమూడేళ్ల అమ్మాయి తను పుట్టిన ఊరిని కాపాడుకోవడం కోసం ఏం చేసింది? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చూపించాల్సిన సినిమా. అందరి హృదయాలను హత్తుకునే భావోద్వేగాలు ఈ చిత్రంలో ఉంటాయి. చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ ఓ అనీర్వచనీయమైన అనుభూతికి లోనవుతారు. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకముంది. ఈ నెల 24న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో ఆనంద్ చక్రపాణి, రఘురామ్, భాను ప్రకాశ్, నేహాల్ ఆనంద్ కుంకుమ, రాగ్ మయూర్ ముఖ్య పాత్రలు పోషించారు. -
పెద్దోడి ట్రైలర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది: మహేశ్ బాబు
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం సంక్రాంతి వస్తున్నాం. ఈ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందించారు. శ్రీ వెంకటేశ్వర బ్యానర్లో దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పొంగల్ కానుకగా ఈ నెల 14న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్కు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. నిజామాబాద్లో నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో రిలీజ్ చేశారు. సూపర్ స్టార్, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ను విడుదల చేశారు.ఈ సందర్భంగా చిత్రబృందానికి మహేశ్ బాబు అభినందనలు తెలిపారు. మా పెద్దోడి మూవీ ట్రైలర్ విడుదల చేయడం అనందంగా ఉందన్నారు. అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబోలో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మహేశ్ బాబు పోస్ట్ చేశారు. జనవరి 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ ట్వీట్ చేశారు.కాగా.. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్గా వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ నటించారు. వెంకటేశ్ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షీ చౌదరి కనిపిస్తారు.కేవలం 72 రోజుల్లోనే షూటింగ్ పూర్తి..సాధారణంగా స్టార్ హీరోలతో సినిమా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం ఏడాది సమయం అయినా పడుతుంది. కానీ ఈ రోజుల్లో మాత్రం ఏ స్టార్ హీరో సినిమా అయినా సరే రెండు, మూడు నెలల కంటె ఎక్కువ సమయం తీసుకోవట్లేదు. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించాడు.నాలుగైదు నిమిషాలే వృథాఇటీవల ప్రచార కార్యక్రమంలో భాగంగా అనిల్రావిపూడి మాట్లాడుతూ.. సినిమా మేకింగ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సినిమా షూటింగ్ని కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేశామని తెలిపారు. అంతేకాదు ఐదారు నిమిషాల ఫుటేజ్ మాత్రమే వృథా అయిందని పేర్కొన్నారు.అనిల్ రావిపూడి మాట్లాడుతూ..' ఈ చిత్రం అనౌన్స్ చేసినప్పుడే ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించాం. తక్కువ సమయం షూటింగ్ ముగించుకోవాలనుకున్నాం. స్క్రిప్ట్ సమయంలోనే ఎడిటింగ్ చేసేశాం. ఫలానా సీన్ మూడు నిమిషాలు తీయాలనుకుంటే అంతే తీశాం. అందుకే 72 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. మొత్తం సినిమా దాదాపు 2.26 గంటల నివిడితో పూర్తయితే.. 2.22 గంటల నిడివితో సెన్సార్కు పంపాం. కేవలం ఐదారు నిమిషాలు మాత్రమే ఎడిట్ చేయాల్సి వచ్చింది. ఈ మూవీకి ఎంత బడ్జెట్ అవసరమో అంతకు ఏమాత్రం తగ్గకుండా తీశాం. క్వాలిటీ విషయంలోనూ అస్సలు రాజీపడలేదు’ అని అన్నారు.సంక్రాంతి బరిలో మూడు సినిమాలు..మరోవైపు ఈ సంక్రాంతి బరిలో మొత్తం మూడు సినిమాలు విడుదల కానున్నాయి. వెంకటేశ్ సంక్రాంతి వస్తున్నాం మూవీతో పాటు రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ జనవరి 10న విడుదల కానుంది. బాలకృష్ణ-బాబీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ చిత్రం కూడా జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది. Looks like a sure shot🎯🔥Glad to launch the trailer of my peddhodu @VenkyMama garu and my blockbuster director @AnilRavipudi's #SankranthikiVasthunam Wishing you a both a victorious hattrick and the entire team a memorable Sankranthi. Looking forward to the film on Jan 14th!!…— Mahesh Babu (@urstrulyMahesh) January 6, 2025 -
గేమ్ ఛేంజర్తో పోటీ పడనున్న మూవీ.. మహేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ హీరో సోనూ సూద్ హీరోగా నటించిన తాజా చిత్రం ఫతే. అరుంధతి సినిమాతో టాలీవుడ్లో ఫేమస్ అయిన సోనూ సరికొత్త థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమాను తానే దర్శకత్వం వహించడం మరో విశేషం. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటున్నాయి.కాగా.. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సోనాలి సూద్, ఉమేష్ కెఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సైబర్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సైబర్ మాఫియా బారిన ఒక అమ్మాయిని హీరో ఏవిధంగా రక్షించాడు? అనే కోణంలో రూపొందించారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న బాలీవుడ్లో విడుదల కానుంది. దక్షిణాది భాషల్లో రిలీజ్ చేస్తారో లేదో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే పాన్ ఇండియా రేంజ్లో అదే రోజున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ కూడా రిలీజవుతోంది. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. పొంగల్ బరిలో నిలిచిన ఫతే హిందీలో గేమ్ ఛేంజర్తో పోటీ పడడం ఖాయంగా కనిపిస్తోంది. దక్షిణాది భాషల్లోనూ ఫతే రిలీజైతే గనక చెర్రీ మూవీతో బాక్సాఫీస్ వద్ద పోరు తప్పేలా లేదు.తాజాగా ఈ మూవీ మరో ట్రైలర్ను కూడా విడుదల చేయనున్నట్లు సోనూ సూద్ ట్వీట్ చేశారు. తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు చేతుల మీదుగా ఫతే ట్రైలర్-2 రిలీజ్ చేశారు. ఈ మేరకు ట్విటర్లో పోస్ట్ చేశారు మహేశ్ బాబు.తెలుగులో ప్రత్యేక గుర్తింపు..కాగా.. అనుష్క లీడ్ రోల్లో నటించిన అరుంధతి సినిమాలో పశుపతిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్. టాలీవుడ్లో జులాయి, అతడు లాంటి సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించారు. తెలుగు పలువురు స్టార్ హీరోల సినిమాల్లో ప్రతినాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. An action-packed spectacle that looks absolutely amazing! Wishing all the very best to my dear friend @SonuSood Can’t wait for everyone to witness this magic on screen! 😊 #Fateh https://t.co/d9CZlhWnnk— Mahesh Babu (@urstrulyMahesh) January 6, 2025 Love you brother ❤️ https://t.co/jXadXxOqQt— sonu sood (@SonuSood) January 6, 2025 This will Hit you Hard 🔥Be Ready🪓 #Fateh Trailer-2 🩸https://t.co/DtgNrqoBd0In cinemas on 10th January.@Asli_Jacqueline @ZeeStudios_ @condor_dop @Vm_buffy @ShaktiSagarProd @Fateh4Bharat pic.twitter.com/5UKXIAqEeX— sonu sood (@SonuSood) January 6, 2025 This will Hit you Hard 🔥Be Ready🪓 #Fateh Trailer-2 🩸 pic.twitter.com/s0U9s1Iyri— sonu sood (@SonuSood) January 6, 2025 -
లుక్కు మారింది.. కిక్కు ఖాయం
సంవత్సరం మారింది... లుక్ మార్చి బాక్సాఫీస్ లెక్కలు కూడా మార్చాలని డిసైడ్ అయ్యారు కొందరు హీరోలు. ఇందు కోసం కథానుగుణంగా గెటప్ మార్చేశారు. ఇలా సరికొత్త లుక్లో తమ అభిమాన హీరోలు కనిపించడానికి అభిమానులకు ఓ కిక్కు అని ప్రత్యేకంగా చెప్పలేదు. ఇక ఈ ఏడాది స్క్రీన్పై ఆడియన్స్ను సర్ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతున్న కొందరు స్టార్స్ గురించి తెలుసుకుందాం.సరికొత్త మహేశ్ మహేశ్బాబు కెరీర్లో ఇప్పటివరకు ఇరవై ఎనిమిది సినిమాలు పూర్తయ్యాయి. అయితే స్క్రీన్పై ఎప్పుడూ కనిపించనంత కొత్తగా మేకోవర్ అయ్యే పనిలో పడ్డారు మహేశ్బాబు. రాజమౌళి డైరెక్షన్లోని కొత్త సినిమా కోసమే మహేశ్బాబు సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఈ సినిమాలోని లుక్, మేకోవర్ కోసం ఆయన జర్మనీలో కొంత సమయం గడిపారు. గురువారం ఈ సినిమా లాంచ్ జరిగింది. కానీ మహేశ్ లుక్ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు రాజమౌళి అండ్ టీమ్. ఈ సినిమాలో మహేశ్ లాంగ్ హెయిర్తో, కాస్త గెడ్డంతో కనిపిస్తారని ఇటీవల బయటికొచ్చిన ఆయన ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. భారీ బడ్జెట్తో కేఎల్ నారాయణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. రాజా సాబ్ ప్రభాస్ తొలిసారిగా చేస్తున్న హారర్ మూవీ ‘రాజాసాబ్’. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ప్రభాస్ రెండు గెటప్స్లో ఉన్న లుక్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. అయితే ప్రభాస్ కుర్చీలో కూర్చున్న ఓ గెటప్ మాత్రం కొత్తగా అనిపిస్తోంది. అలాగే ప్రభాస్ ఇటీవల ఎక్కువగా రగ్డ్ లుక్తో, గెడ్డంతోనే కనిపించారు. కానీ ‘రాజాసాబ్’లో మాత్రం క్లీన్ షేవ్తో ఓ గెటప్, కాస్త రగ్డ్ లుక్తో మరో గెటప్లో కనిపిస్తారు.మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. అయితే విడుదల విషయంలో మార్పు ఉండొచ్చనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. అలాగే ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ అనే పోలీస్ యాక్షన్ డ్రామా చిత్రం కమిటయ్యారు ప్రభాస్. ఈ చిత్రంలోనూ ప్రభాస్ ఓ డిఫరెంట్ గెటప్లో కనిపించనున్నారని టాక్. ఆ మేకోవర్ కోసం హాలీవుడ్ స్థాయి సాంకేతిక నిపుణులను సంప్రదిస్తున్నారట సందీప్ రెడ్డి వంగా.రగ్డ్ పెద్ది ‘గేమ్ చేంజర్’ మూవీలో రామ్చరణ్ క్లీన్ షేవ్ లుక్స్తో కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్లో మాత్రం గుబురు గడ్డం, కాస్త లాంగ్ హెయిర్తో రగ్డ్గా కనిపిస్తున్నారు. చరణ్ ఇలా కొత్తగా మేకోవర్ అయ్యింది తన లేటెస్ట్ మూవీ కోసం అని ఊహించవచ్చు. రామ్చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ అనే ఓ స్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది.ఈ సినిమా కోసమే రామ్చరణ్ కొత్తగా మేకోవర్ అయ్యారు. ఇందుకోసం రామ్ చరణ్ విదేశాల్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారని తెలిసింది. ఫిజిక్ విషయంలోనే కాదు... హెయిర్ స్టైల్తోనూ చరణ్ కొత్తగా కనిపిస్తారు. ‘పెద్ది’ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ మైసూర్లో జరిగింది. ఈ షెడ్యూల్లో సెలిబ్రిటీ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ పాల్గొని, రామ్చరణ్ హెయిర్ స్టైల్ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ‘పెద్ది’ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఆఫీసర్ అర్జున్ సర్కార్ రోల్కు తగ్గట్లుగా నాని మౌల్డ్ అవుతుంటారు. తాజాగా అర్జున్ సర్కార్ పాత్ర కోసం నాని కొంత మేకోవర్ అయ్యారు. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హిట్ 3’. ఈ మూవీలో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో నటిస్తున్నారు నాని. ఈ చిత్రంలో నాని కొన్ని సీన్స్లో ఫుల్ వైట్ హెయిర్తో కనిపిస్తారని తెలిసింది. అంటే... ఓ సీనియర్ పోలీసాఫీసర్ లెక్క అన్నమాట. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్పై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్న ‘హిట్ 3’ మే 1న రిలీజ్ కానుంది. అలాగే ‘దసరా’ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఫుల్ వయొలెన్స్తో సాగే ఈ చిత్రంలో ఓ ఫిరోషియస్ లుక్లో నాని కనిపించనున్నారు. ఇందుకోసం నాని ప్రత్యేకంగా మేకోవర్ కావాల్సి ఉంది. ‘హిట్ 3’ చిత్రీకరణ పూర్తయిన తర్వాత నాని కొత్త మేకోవర్ స్టార్ట్ అవుతుందని ఊహించవచ్చు.రొమాంటిక్ లవ్స్టోరీ గతేడాది వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో కాస్త మాసీ లుక్లో కనిపించారు హీరో రామ్. తన తాజా చిత్రం కోసం రామ్ కంప్లీట్గా మేకోవర్ అయ్యారు. ఈ రొమాంటిక్ లవ్స్టోరీ కోసం లాంగ్ హెయిర్ పెంచారు రామ్. అలాగే బరువు కూడా తగ్గారు. యంగ్ లుక్లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. పి. మహేశ్బాబు దర్శకత్వంలో ఈ సినిమాను నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే థియేటర్స్లోకి వచ్చే చాన్స్ ఉంది. స్పై డ్రామా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో ఫ్యామిలీ మేన్లా కనిపించారు విజయ్ దేవరకొండ. అయితే ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో అందుకు భిన్నంగా కనిపించనున్నారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్లుగా తెలిసింది. దీంతో పోలీస్ రోల్కు తగ్గట్లుగా షార్ట్ హెయిర్తో, కరెక్ట్ ఫిజిక్తో కనిపించనున్నారట విజయ్. కాగా ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో విజయ్ సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని, ఈ సీన్స్లో విజయ్ లుక్ రగ్డ్గా... చాలా మాస్గా ఉంటుందని సమాచారం. ఇలా ఈ చిత్రంలో విజయ్ రెండు గెటప్స్లో కనిపించనున్నారట. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 28న విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీలో మార్పు ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.మాస్ సంబరాలు ‘సంబరాల ఏటి గట్టు’ సినిమాలో సాయి దుర్గా తేజ్ మేకోవర్ చూశారుగా... మాసీ లుక్లో కనిపిస్తున్నారు. ఈ మాస్ సినిమా కోసం ఫిజికల్గా చాలా హార్డ్వర్క్ చేశారు సాయి దుర్గాతేజ్. సిక్స్ఫ్యాక్ చేశారు. కేపీ రోహిత్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, దాదాపు రూ. వంద కోట్ల భారీ బడ్జెట్తో కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుందని తెలిసింది. తొలి భాగం సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది.లేడీ గెటప్లో.. మాసీ లుక్స్తో కనిపించే విశ్వక్ సేన్ తొలిసారిగా లైలాగా అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు. ఓ అబ్బాయి లేడీ గెటప్లో నటించాలంటే స్పెషల్గా మేకోవర్ అవ్వాల్సిందే. అలా లైలాగా కనిపించడానికి విశ్వక్ మౌల్డ్ అయ్యారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ చిత్రంలో మోడల్ సోను, లైలా అనే అమ్మాయి... ఇలా రెండు డిఫరెంట్ గెటప్స్లో కనిపిస్తారు విశ్వక్ సేన్. లెనిన్గా... ‘ఏజెంట్’ తర్వాత అఖిల్ హీరోగా చేయాల్సిన నెక్ట్స్ మూవీపై మరో అధికారిక ప్రకటన రాలేదు. అయితే ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రదర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరితో అఖిల్ ఓ మూవీ చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమాకు ‘లెనిన్’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారని, ఆల్రెడీ హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణ మొదలైందని, ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారని ఫిల్మ్నగర్ టాక్. అలాగే ఈ సినిమా కథ అనంతపురం నేపథ్యంలో సాగుతుందని, లెనిన్ పాత్ర కోసం అఖిల్ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారని తెలిసింది.పీరియాడికల్ వార్ హీరో నిఖిల్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘స్వయంభూ’. పీరియాడికల్ వార్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం నిఖిల్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. చెప్పాలంటే గత ఏడాదిగా ఈ లుక్నే మెయిన్టైన్ చేస్తున్నారు నిఖిల్. లాంగ్ హెయిర్తో, స్ట్రాంగ్ ఫిజిక్తో కనిపిస్తున్నారు నిఖిల్. అంతే కాదు... ఈ సినిమా కోసం నిఖిల్ కొన్ని యాక్షన్ సీన్స్లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ సినిమాతో భరత్ కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ కోవలో మరికొందరు హీరోలు కూడా తమ కొత్త సినిమాల కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యే పనిలో ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
మహేశ్బాబు- రాజమౌళి భారీ ప్రాజెక్ట్ ప్రారంభం
మహేశ్బాబు- ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న అత్యంత భారీ ప్రాజెక్ట్ సినిమా ప్రారంభమైంది . గురువారం హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో అధికారికంగా 'SSMB 29' చిత్రాన్ని లాంచ్ చేశారు. చిత్ర యూనిట్తో పాటు మహేశ్బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కానీ, ఈ సినిమా కార్యక్రమానికి సంబంధించి చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు.‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజమౌళి.. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని ఈ చిత్రంలో రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్రప్రసాద్ ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథ రెండు భాగాలుగా రానుంది. తొలి భాగాన్ని 2027లో విడుదల చేస్తారని ప్రచారంలో ఉంది. ఈ ప్రాజెక్ట్లో హాలీవుడ్ నటీనటులతో పాటు టెక్నీషియన్స్ కూడా ఇందులో భాగం కానున్నారు. అయితే, హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించనున్నట్లు ఒక వార్త భారీగా వైరల్ అయింది.ఈ సినిమాలో మహేశ్ సరికొత్తగా కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం చాలా రోజులుగా ఆయన కసరత్తులు కూడా చేస్తున్నారు. ఈ సమ్మర్లో చిత్రీకరణ కూడా రాజమౌళి ప్రారంభించనున్నారు. అందుకోసం ఆయన ఇప్పటికే పలు లొకేషన్స్ కూడా సెర్చ్ చేసిన విషయం తెలిసిందే. ఒడిశాతో పాటు ఆఫ్రికా వంటి అడవుల్లో ఆయన పర్యటించారు. దుర్గా ఆర్ట్స్పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. -
క్రేజీ కాంబో.. రాజమౌళి- మహేశ్ బాబు మూవీ అప్డేట్ వచ్చేసింది!
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించనున్న చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి డైరెక్షన్లో వస్తోన్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు తొలిసారిగా టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో జతకట్టనున్నారు మన జక్కన్న. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని జనవరి 2న నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. న్యూ ఇయర్ వేళ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈనెల చివరి వారంలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని రాజమౌళి ఆఫీస్లోనే చిత్రయూనిట్ సభ్యుల సమక్షంలో ఈ పూజా కార్యక్రమం జరగనుంది.కాగా.. మహేశ్బాబు - రాజమౌళి కాంబినేషన్ చిత్రంపై మరోవైపు రూమర్స్ భారీగా వస్తూనే ఉన్నాయి. వీరిద్దరి సినిమా తీస్తున్నట్లు ప్రకటన వచ్చిన సమయం నుంచి ఈ ప్రాజెక్టపై ప్రేక్షకులు అమితాసక్తిని చూపుతున్నారు. టైటిల్ వంటి తదితర వివరాల కోసం నెట్టింట ఆరా తీస్తున్నారు. SSMB 29 పేరుతో ఈ ప్రాజెక్ట్ పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కనుంది. ఇటీవల ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనే అంశం సోషల్మీడియాలో ట్రెండింగ్ అయింది.హీరోయిన్గా ప్రియాంక చోప్రా..?ఫుల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ జనవరి 2025 నుంచి ప్రారంభం కానుంది. అయితే, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ క్రమంలో హీరోయిన్ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్కు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అయితే ఆ పాత్రకు న్యాయం చేయగలదని చిత్ర యూనిట్ భావించిందట. ఈ కథలో హీరోతో పాటు హీరోయిన్ పాత్రకు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఉందని టాక్. అందుకే ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో ఎక్కువగా విదేశీ నటులు కనిపించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఆమె పలు హాలీవుడ్ చిత్రాలలో కూడా నటించిన విషయం తెలిసిందే. ప్రియాంకా చోప్రాను డైరెక్టర్ రాజమౌళి పలుమార్లు కలిసినట్లు బాలీవుడ్ మీడియా కూడా వెల్లడించింది. ఈ సినిమాలో నటించేందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే, ఇండోనేషియా నటి 'చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్' ఈ చిత్రంలో నటిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. చెల్సియా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రాజమౌళిని ఫాలో అవుతుండడంతో ఆ వార్తలు నిజమేనని నమ్మారు. మరి ఆమె పాత్ర ఈ చిత్రంలో ఏ మేరకు ఉంటుందో తెలియాల్సి ఉంది. -
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో స్టార్స్.. ప్రభాస్ ఎక్కడంటే..?
2024కి బై చెప్పి... 2025కి వెల్కమ్ చెప్పడానికి అందరూ సెలబ్రేషన్ మోడ్లోకి వెళ్లిపోయారు. కొందరు స్టార్స్ అయితే కొత్త సంవత్సరం జరుపుకోవడానికి విదేశాలు వెళ్లారు. షూటింగ్స్కి కాస్త విరామం దొరకడంతో వెకేషన్ ప్లాన్ చేసుకునే అవకాశం ఈ స్టార్స్కి దక్కింది. వారి ఈ వెకేషన్ గురించి తెలుసుకుందాం...ఈ ఏడాది మహేశ్బాబు ఇప్పటికే రెండుసార్లు జర్మనీ వెళ్లొచ్చారు. అయితే ఇది హాలిడే ట్రిప్ కాదు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ప్రిపరేషన్లో భాగంగా జర్మనీ వెళ్లారని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి ఏడాది మహేశ్బాబు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఫారిన్లో జరుగుతుంటాయి. ఈ ఏడాది కూడా ఫారిన్లోనే మహేశ్బాబు ప్లాన్ చేశారని సమాచారం. మహేశ్బాబు మోస్ట్లీ యూరప్కు వెళ్లనున్నారట. ఇక ప్రభాస్ ఆల్రెడీ యూరప్లో ఉన్నారని తెలిసింది. ఇటీవల ఓ సినిమా చిత్రీకరణలో భాగంగా ప్రభాస్ కాలికి గాయమైంది. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. యూరప్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని, ప్రభాస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడే అని టాక్. విదేశాల నుంచి తిరిగొచ్చిన తర్వాత ‘రాజా సాబ్, ఫౌజి’ చిత్రీకరణలో పాల్గొంటారు ప్రభాస్. ఈ సినిమాల చిత్రీకరణలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ చిత్రాన్ని ఆరంభిస్తారు ప్రభాస్. ఇక ‘దేవర’ సక్సెస్ జోష్లో ఉన్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ హిందీలో స్ట్రయిట్ ఫిల్మ్ ‘వార్ 2’ (ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరో హీరో) లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు చెందిన ఓ లెంగ్తీ షూట్ను పూర్తి చేశారు. ఆ తర్వాత ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్లారని తెలిసింది. సో... ఎన్టీఆర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లండన్లోనే అని ఊహించవచ్చు. లండన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్తో ఎన్టీఆర్ బిజీ అవుతారట. ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం హీరోయిన్ పూజా హెగ్డే స్పెయిన్ వెళ్లారు. రష్మికా మందన్నా ఆల్రెడీ ఫారిన్లోనే ఉన్నారని తెలిసింది. హీరోయిన్ తమన్నా, ఫరియా అబ్దుల్లా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ను అమెరికాలో ప్లాన్ చేశారని తెలిసింది. వీరితో పాటు మరి కొందరు టాలీవుడ్ యాక్టర్స్ గోవా, మాల్దీవ్స్లో వేడుకలు ప్లాన్ చేశారని సమాచారం. భర్త విఘ్నేష్ శివన్తో నయనతార దుబాయ్ వెళ్లారు. అక్కడే మాధవన్, ఆయన భార్య సరిత కూడా ఉన్నారు. సో... ఈ రెండు ఫ్యామిలీస్ ఒకే చోట వేడుక చేసుకోనున్నారు. కలిసి ఉన్న ఫొటోను కూడా షేర్ చేశారు. అలాగే బాలీవుడ్ స్టార్ట్ హీరో హృతిక్ రోషన్ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్పాట్గా దుబాయ్నే ఎంచుకున్నారు. ఇంకా ఫ్యామిలీతో కలిసి దియా మీర్జా శ్రీలంక వెళ్లారు. అర్జున్ రాంపాల్ సెలబ్రేషన్స్ గోవాలో జరుతాయని సమాచారం. ఫ్యామిలీతో కలిసి కరీనా కపూర్ స్విట్జర్లాండ్లో, శిల్పాశెట్టి లండన్లో, భర్త జహీర్ ఇక్భాల్తో కలిసి హీరోయిన్ సోనాక్షీ సిన్హా ఆస్ట్రేలియాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోనున్నారు. ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తీ దిమ్రీ ఫిన్ల్యాండ్ వెళ్లారు. -
ఈ ఏడాది టాప్ సాంగ్స్ లిస్ట్ ప్రకటించిన యూట్యూబ్.. తెలుగు పాటకు చోటు
తెలుగు సాంగ్ గ్లోబల్ రికార్డ్ను క్రియేట్ చేసింది. 2024లో విడుదలైన సాంగ్స్లలో టాప్-10 లిస్ట్ను యూట్యూబ్ అధికారికంగా ప్రకటించింది. అందులో ఇండియా నుంచి ఒక సాంగ్ మాత్రమే ఉంది. అయితే, అది తెలుగు సినిమాకు సంబంధించిన పాట కావడం విశేషం. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాదిలో 'గుంటూరు కారం'తో సందడి చేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లు రాబట్టింది. అయితే ఈ సినిమాలోని 'కుర్చీ మడతపెట్టి' పాటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ సాంగ్తో లెక్కలేనన్నీ రీల్స్ కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో మరో అరుదైన ఘనత సాధించింది.'కుర్చీ మడతపెట్టి' సాంగ్ విడుదలైనప్పటి నుంచే యూట్యూబ్లో భారీ క్రేజ్ ఏర్పడింది. 527+ మిలియన్ వ్యూస్తో ఇప్పటికి కూడా నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. దీంతో 2024 యూట్యూబ్ టాప్ సాంగ్స్లో స్థానం దక్కించుకున్న ఏకైక ఇండియన్ పాటగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే విషయాన్ని యూట్యూబ్ అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 7 టాప్ హిట్ సాంగ్స్ను యూట్యూబ్ ప్రకటించింది. అందులో భారత్ నుంచి ఎంపికైన ఏకైక పాట 'కుర్చీ మడతపెట్టి' అనే సాంగ్ ఉండటం విశేషం. కేవలం తెలుగులోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ తెలుగు పాట సత్తా చాటడంతో మహేష్ అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు.గుంటూరు కారం సినిమా 2024 జనవరి 12న విడుదలైంది. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హారికా అండ్ హసిని బ్యానర్స్పై నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. 'కుర్చీ మడతపెట్టి' సాంగ్లో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల, మహేష్ వేసిన స్టెప్పులకు థియేటర్స్ దద్దరిల్లాయి. -
మహేశ్బాబు - రాజమౌళి సినిమాలో స్టార్ హీరోయిన్
మహేశ్బాబు - రాజమౌళి కాంబినేషన్ చిత్రంపై రూమర్స్ భారీగా వస్తూనే ఉన్నాయి. వారిద్దరూ కలిసి సినిమా తీస్తున్నట్లు ప్రకటన వచ్చిన సమయం నుంచి ఈ ప్రాజెక్టపై ప్రేక్షకులు అమితాసక్తిని చూపుతున్నారు. టైటిల్ వంటి తదితర వివరాల కోసం నెట్టింట ఆరా తీస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనే అంశం సోషల్మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.SSMB 29 పేరుతో ఈ ప్రాజెక్ట్ పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కనుంది. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ 2025 మార్చి నుంచి ప్రారంభం కానుంది. అయితే, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్కు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అయితే ఆ పాత్రకు న్యాయం చేయగలదని చిత్ర యూనిట్ భావించిందట. ఈ కథలో హీరోతో పాటు హీరోయిన్ పాత్రకు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఉందని టాక్. అందుకే ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆమె పలు హాలీవుడ్ చిత్రాలలో కూడా నటించిన విషయం తెలిసిందే. ప్రియాంకా చోప్రాను డైరెక్టర్ రాజమౌళి పలుమార్లు కలిసినట్లు బాలీవుడ్ మీడియా కూడా వెల్లడించింది. ఈ సినిమాలో నటించేందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే, ఇండోనేషియా నటి 'చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్' ఈ చిత్రంలో నటిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. చెల్సియా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రాజమౌళిని ఫాలో అవుతుండడంతో ఆ వార్తలు నిజమేనని నమ్మారు. మరి ఆమె పాత్ర ఈ చిత్రంలో ఏ మేరకు ఉంటుందో తెలియాల్సి ఉంది.గ్లోబల్ లెవెల్లో భారీ బడ్జెట్తో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తి అయినట్లు తెలుస్తోంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో ఎక్కువగా విదేశీ నటులు కనిపించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దుర్గా ఆర్ట్స్పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. -
కలిసొచ్చిన మహేశ్ బాబు వాయిస్.. కోట్లు కొల్లగొట్టిన 'ముఫాసా'
హాలీవుడ్ బ్లాక్బస్టర్ ఫిల్మ్ ‘ది లయన్ కింగ్ (2019)’ సినిమాకు ప్రీక్వెల్గా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ అనే చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. బారీ జెంకిన్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. వాల్ట్ డిస్నీ పిక్చర్స్ పతాకంపై అడెలె రోమన్ స్కీ, మార్క్ సెరియాక్ ఈ సినిమాను నిర్మించారు. డిసెంబరు 20న విడుదలైన ఈ సినిమా మొదటి వారంలో భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఒక పోస్టర్ను అధికారికంగా విడుదల చేశారు. ఈ చిత్రం దేశవ్యాప్తంగా మొదటివారం రూ.74 కోట్లు వసూలు చేసినట్లు ప్రకటించారు.ఇంగ్లిష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది ఈ చిత్రం. మొదటి వారంలో దేశవ్యాప్తంగా ఇంగ్లిష్ వర్షన్లో రూ.26.75 కోట్లు, హిందీ రూ.11.2కోట్లు, తెలుగు, రూ.11.3 కోట్లు కలెక్షన్స్ సొంతం చేసుకుంది. అయితే, ప్రపంవ్యాప్తంగా రూ. 74 కోట్లు రాబట్టింది. ఇందులో టైటిల్ రోల్కు టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో తెలుగు ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. ఆపై హిందీ వెర్షన్లో ముఫాసా పాత్రకు షారుక్ ఖాన్, ముఫాసా చిన్నప్పటి పాత్రకు ఆయన కుమారుడు అబ్రం వాయిస్ అందించారు. ఈ చిత్రంలోని సింబా పాత్రకు షారుక్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ వాయిస్ ఇవ్వడం విశేషం.ముఫాసా చిత్రానికి ఇతర దేశాల్లో కాస్త ఆదరణ తక్కువగా ఉన్నప్పటికీ ఇండియాలో మాత్రం అదరగొడుతుంది. ఈ సినిమా కోసం దాదాపు రూ. 1750 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు. అయితే, మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. రూ. 1700 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. -
పొరపాటు చేసి క్షమాపణ చెప్పిన రష్మిక
'పుష్ప 2'తో మరో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన హీరోయిన్ రష్మిక.. సారీ చెప్పింది. తాను చేసిన పొరపాటు విషయంలో ఇలా చేసింది. సూపర్స్టార్ మహేశ్ బాబు మూవీస్ విషయంలో కన్ఫ్యూజ్ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ రచ్చంతా జరిగింది. ఇంతకీ అసలేమైంది? రష్మిక సారీ ఎందుకు చెప్పింది?ప్రస్తుతం 'పుష్ప 2' సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న రష్మిక.. మిస్ మాలిని అనే యూట్యూబ్ ఛానెల్కి ఇంటర్వ్యూలో ఇచ్చింది. మీరు చూసిన తొలి సినిమా ఏది? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. తమిళ హీరో దళపతి విజయ్ 'గిల్లీ' అని చెప్పింది. అందుకే విజయ్ దళపతి అంటే తనకు ఇష్టమని చెప్పింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్బాస్ 8' సోనియా.. ఫొటోలు వైరల్)'నేను చూసిన ఫస్ట్ సినిమా గిల్లి. ఈ మూవీ పోకిరి చిత్రానికి రీమేక్ అని నాకు ఈ మధ్యే తెలిసింది. నాకు దాని గురించి తెలీదు. అయితే ఇందులో అప్పిడి పోడే పోడే సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. నా లైఫ్ మొత్తంలో ఆ పాటకు ఎన్ని సార్లు డ్యాన్స్ చేశానో కూడా తెలీదు' అని రష్మిక చెప్పింది.రష్మిక చెప్పిన సినిమాలు వేర్వేరు. ఎందుకంటే మహేశ్ బాబు 'ఒక్కడు' సినిమాకు రీమేక్గా తమిళంలో 'గిల్లీ' తీశారు. 'పోకిరి' సినిమాని అదే పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూ అనంతరం తను పొరబడ్డానని తెలుసుకున్న రష్మిక.. 'అవును. ఇంటర్వ్యూ అయిపోయాక గుర్తొచ్చింది' అని సారీ చెప్పింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)Avunu .. telusu sorry.. okka booboo aipoindi.. 🐒 interview ayipointarvata annukunna reyyyy ghilli is okkadu ra .. pokkiri is pokiri ani.. 🤦🏻♀️ social media lo ippudu estuntaaru ani.. sorry sorry my bad.. but I love all of their movies so it’s ok. 🐒— Rashmika Mandanna (@iamRashmika) December 21, 2024 -
Mufasa Review: ముఫాసా మూవీ రివ్యూ
మనం చూసే ప్రతి సినిమాలో నిజ జీవిత పాత్రలు మనలోనివారు కొంతమంది తెర మీద పోషించి మనల్ని మెప్పించడం సహజమే. కాని మనలోని భావావేశాలను జంతువులచే డిజిటల్ రూపంలో పలికించి మన మనస్సులను కదిలించడమంటే సామాన్యమైన విషయం కాదు. ఈ విషయంలో హాలీవుడ్ను నిజంగా అభినందించాలి. కానీ హాలీవుడ్ కన్నా మన టాలీవుడ్ 40 ఏళ్ళ క్రితమే అంటే డిజిటల్ సాంకేతికత మనకు పరిచయమవ్వని రోజుల్లోనే ఇటువంటి కోవలో మనకు ఓ సినిమా పరిచయం చేసింది. దాని పేరే మాకూ స్వాతంత్రం కావాలి. ఇక్కడ టాలీవుడ్, హాలీవుడ్ చేసిందా అన్నది కాదు, మనుషులకు జంతువులతో కూడా భావావేశాలు పలికించవచ్చన్నదే విషయం. ముఫాసా సినిమా 2019వ సంవత్సరంలో 'ది లయన్ కింగ్' సినిమా సిరీస్లో వచ్చిన రెండవ భాగం. ముఫాసా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో ప్రతి భాషలో విడుదలైంది. ముఫాసా సినిమాకి అన్ని భాషల్లో పేరున్న గొప్ప నటీనటులు డబ్బింగ్ చెప్పడం మరో విశేషం. తెలుగులో ప్రముఖ నటులు మహేశ్బాబు, బ్రహ్మానందం, అలీ తదితరులు వాయిస్ ఇచ్చారు. కాబట్టి సినిమా చూస్తున్నంతసేపు మన నేటివిటీ ఎక్కడా తగ్గదు ఒక్క పేర్లలో తప్ప.ఈ సినిమాకి దర్శకుడు బారీ జెర్కిన్స్. కథాపరంగా లయన్ కింగ్కు కొనసాగింపైన ఈ ముఫాసాలో సింబా - నాలా సింహాలకు కియారా అనే ఆడ సింహం పుడుతుంది. ఆ తర్వాత సింబ- నాలా జంట టిమన్, పంబ దగ్గర కియారాను వదిలేసి ఇంకో బిడ్డకు జన్మనివ్వడానికి సెరేన్ ఒయాసిస్కు బయలుదేరతాయి. అప్పుడు రఫీకి అనే కోతి కియారాకు తాను సింబ వయస్సులో ఉన్నపుడు జరిగిన ముఫాసా కథ గురించి చెప్తుంది. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్ సి యం రాజు ఈ కోతికి గాత్రదానం చేశారు. కథంతా ఈ రఫీకీయే చెప్తాడు. ముఫాసా అనే పిల్ల సింహం ఓ తుఫానులో చిక్కుకుని తన తల్లిదండ్రుల నుంచి విడిపోతుంది. అలా నీళ్లలో ముఫాసా కొట్టుకుపోతూ టాకా అనే మరో సింహం పిల్లను కలుస్తుంది. టాకా తల్లిదండ్రులు ఒబాసీ, ఇషా. వీళ్ళిద్దరూ వారి ప్రాంతంలో రాజు, రాణి. టాకాని యువరాజును చేయాలనుకుంటారు. ఇంతలో తెల్ల సింహాల గుంపు వీరి రాజ్యం మీద దాడి చేస్తుంది. వాటి నుండి ముఫాసా, టాకా తప్పించుకుంటారు. ముఫాసా తన తల్లిదండ్రులను వెతుక్కుంటూ మిలేలే అనే ప్రాంతానికి వెళ్లాలనుకుంటాడు. తరువాత సినిమా అంతా ముఫాసా తన తల్లిదండ్రులను చేరుకుంటాడా లేదా అన్నదే. పైన చెప్పుకున్నట్టు ఈ సినిమా స్క్రీన్ ప్లే పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. అలానే పెద్దల మనసును సైతం కదిలిస్తుంది. ఎక్కడా గ్రాఫిక్స్ అన్నదే తెలియకుండా నిజజీవితంలో జంతువుల కథను దగ్గరగా చూసినట్టుంది. వర్త్ఫుల్ మూవీ ఫర్ ఫ్యామిలీ.- హరికృష్ణ ఇంటూరు -
నిజ జీవితంలో నాన్నకు ముఫాసాతో పోలికలు: సితార
మహేశ్ సినిమా వచ్చి చాలా రోజులైంది. మళ్లీ ఎప్పుడో వస్తుందో తెలీదు. ఎందుకంటే రాజమౌళితో ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం సెట్ వర్క్ నడుస్తోంది. వచ్చే ఏడాది నుంచి షూటింగ్ మొదలవ్వొచ్చు. ఈ మూవీకి ముందే మహేశ్.. ఓ హాలీవుడ్ సినిమాతో రాబోతున్నాడు. ఇందులో మహేశ్ నటించట్లేదు, డబ్బింగ్ చెప్పాడంతే! అదే 'ముఫాసా: ద లయన్ కింగ్'.డిసెంబర్ 20న ఈ హాలీవుడ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగు వెర్షన్లో ముఫాసా పాత్రకు మహేశ్ డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈ సందర్భంగా ప్రచారంలో మహేశ్ కనిపించట్లేదు. కానీ కొన్నిరోజుల క్రితం భార్య నమ్రత.. 'ముఫాసా' ఈవెంట్లో పాల్గొంది. ఇప్పుడు కూతురు సితార కూడా 'ముఫాసా' మూవీపై ఓ వీడియో రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: ఒక్క క్షణం కూడా వదలట్లేదు.. భర్త గురించి వరలక్ష్మి)'ముఫాసా తెలుగు వెర్షన్కి నాన్న డబ్బింగ్ చెప్పడం చాలా గర్వంగా ఉంది. నిజజీవితంలోనూ నాన్నకు ముఫాసాతో పోలికలు ఉన్నాయి. ఎందుకంటే అంతలా ప్రేమిస్తారు, అండగా ఉంటారు. నాన్న ఈ సినిమాకు డబ్బింగ్ చెబుతారనే విషయం తెలియగానే చాలా సంతోషంగా అనిపించింది. అయితే ఆయన కంటే నేనే.. డిస్నీ సంస్థలో 'ఫ్రోజెన్' మూవీ కోసం పనిచేశా. ఈ విషయంలో మాత్రం ఆటపట్టించాను. ముఫాసా పాత్రకు డబ్బింగ్ చెప్పేందుకు చాలా ప్రాక్టీస్ చేశారు. తొలిసారి అయినా సరే పాత్రకు సరిగ్గా సరిపోయారు. ట్రైలర్ చూసిన ప్రతిసారి.. సినిమా ఎప్పుడు వస్తుందా, చూస్తానా అనిపిస్తుంది' అని సితార తన ఆనందాన్ని బయటపెట్టింది.2019లో 'ద లయన్ కింగ్' పేరుతో సినిమా రిలీజైంది. దీనికి ప్రీక్వెలే ఇప్పుడొస్తున్న 'ముఫాసా: ద లయన్ కింగ్'.. ఈ సినిమాలోని ప్రధాన పాత్రలకు తెలుగులో మహేశ్ బాబు, బ్రహ్మానందం, అలీ, సత్యదేవ్ తదితరులు డబ్బింగ్ చెప్పారు. హిందీలో షారుక్, తమిళంలో అర్జున్ దాస్ డబ్బింగ్ చెప్పడం విశేషం. పిల్లలతో పాటు పెద్దవాళ్లని కూడా ఎంటర్టైన్ చేసే ఈ మూవీ క్రిస్మస్ వీకెండ్లో ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు) -
రాజమౌళి-మహేశ్ మూవీలో ఇంటర్నేషనల్ బ్యూటీ!
బాలీవుడ్ హీరోయిన్, మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా, హీరో మహేశ్బాబుకి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్నగర్ వర్గాలు. మహేశ్బాబు హీరోగా రాజమౌళి ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ‘ఎస్ఎస్ఎమ్బి 29’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ చిత్రం రూపొంనుంది. ఈ సినిమా కోసం పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, మీసాలతో సరికొత్త లుక్లోకి మారిపోయారు మహేశ్బాబు. దుర్గా ఆర్ట్స్పై కేఎల్ నారాయణ నిర్మించనున్న ఈ సినిమా 2025లో ప్రారంభం కానుంది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో రెండు భాగాలుగా రూపొందనున్న ఈ సినిమాలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ ఈ మూవీని అనువదించనున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమాకి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఈ సినిమాలో మహేశ్బాబు సిక్స్ప్యాక్లో కనిపిస్తారని టాక్. ఇదిలా ఉంటే... ఈ చిత్రంలో మహేశ్బాబుకి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ప్రియాంకా చోప్రా కథానాయికగా నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ప్రముఖ సింగర్, యాక్టర్ నిక్ జోనాస్తో వివాహం తర్వాత అమెరికాలో స్థిరపడ్డ ప్రియాంక కేవలం హాలీవుడ్ చిత్రాలపైనే దృష్టి పెట్టారు. అయితే ‘సిటాడెల్ సీజన్– 1’లో నటించిన ఆమె సీజన్ 2లో కూడా నటిస్తున్నారు. ఇక అబ్దుల్ మాజిద్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘తమిళన్’ (2002) మూవీతో హీరోయిన్గా పరిచయమైన ప్రియాంక చోప్రా తర్వాత దక్షిణాది సినిమాల్లో నటించకుండా కేవలం బాలీవుడ్కే పరిమితమయ్యారు. అయితే రామ్చరణ్కి జోడీగా ‘జంజీర్’ (2013) చిత్రంలో నటించినప్పటికీ అది స్ట్రైట్ బాలీవుడ్ మూవీ. ఒకవేళ ఆమె మహేశ్బాబు–రాజమౌళి కాంబో చిత్రంలో నటిస్తారన్న వార్త నిజమైతే అప్పుడు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత దక్షిణాదిలో ప్రియాంకా చోప్రా నటించినట్లు అవుతుంది. -
బాహుబలి సెంటిమెంట్ తో మహేష్, రాజమౌళి సినిమా..
-
ఈ సారి అయిన హిట్ పడేనా ?
-
ముఫాసా: ది లయన్ కింగ్.. మహేశ్ బాబు స్పెషల్ పోస్టర్ రిలీజ్
చిన్నా, పెద్దా అనే తేడా అందరినీ అలరించిన చిత్రం లయన్ కింగ్. ఈ చిత్రంలో రాజ్యాన్ని పాలించే ముఫాసా, అతని తమ్ముడు స్కార్ పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అడవికి రాజుగా ముఫాసా తన రాజ్యాన్ని కాపాడుతూ ఉంటారు. అతనికి సింబా అనే కుమారుడు జన్మిస్తాడు. ఈ సిరీస్లో ఇప్పటికే లయన్ కింగ్-2 కూడా వచ్చింది. తాజాగా లయన్ ప్రీక్వెల్తో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు మేకర్స్.అయితే ముఫాసా ది లయన్ కింగ్ పేరుతో ప్రీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ముఫాసా క్యారెక్టర్కు ప్రిన్స్ మహేశ్ బాబు వాయిస్ అందిస్తున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. మహేశ్ బాబు వెనకాల ముఫాసా ఉన్న ఫోటోలను నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ స్డూడియోస్ ఆఫ్ ఇండియా ట్విటర్లో పోస్ట్ చేసింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.కాగా.. అకాడమీ అవార్డ్ విజేత, దర్శకుడు బారీ జెంకిన్స్ లయన్ కింగ్ ప్రీక్వెల్ను తెరకెక్కించనున్నారు. ముఫాసా ఎదగడానికి చేసిన ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ చిత్రంలో రఫీకిగా జాన్ కనీ, పుంబాగా సేథ్ రోజెన్, టిమోన్గా బిల్లీ ఐచ్నర్, సింబాగా డోనాల్డ్ గ్లోవర్, నాలాగా బియాన్స్ నోలెస్-కార్టర్ కనిపించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 20న థియేటర్లలోకి రానుంది. 1994లో వచ్చిన ది లయన్ కింగ్ యానిమేటెడ్ క్లాసిక్ ఆధారంగా రూపొందిస్తున్నారు. 2019లో జోన్ ఫావ్రూ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.When @urstrulyMahesh s̶p̶e̶a̶k̶s̶ ROARS, the pride listens! 🦁🔥Presenting special poster for Mufasa: The Lion King, featuring superstar Mahesh Babu!Watch the film in cinemas on 20th December! pic.twitter.com/LDU6IyXObX— Walt Disney Studios India (@DisneyStudiosIN) December 1, 2024 -
మహేశ్-నమ్రతని మించిపోతున్న సితార
రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్న మహేశ్ బాబు.. బయట పెద్దగా కనిపించట్లేదు. మరోవైపు ఇతడి భార్య, కూతురు మాత్రం ఇప్పుడు ముంబైలో కనిపించారు. ప్రముఖ పాప్ సింగర్ దువా లిపా కన్సర్ట్కి హాజరయ్యారు. బ్లాక్ అండ్ బ్లాక్ ఔట్ ఫిట్లో కనిపించారు.(ఇదీ చదవండి: బిగ్బాస్ 8: తేజ ఎలిమినేట్.. 8 వారాలకు ఎంత సంపాదించాడు?)ప్రస్తుతం సితార టీనేజీ అమ్మాయి. అయితేనేం డ్యాన్సుల్లో మంచి ప్రావీణ్యం సంపాదించింది. ఎత్తు, అందంలోనూ తల్లితండ్రులని మించిపోయేలా ఇప్పుడే కనిపిస్తోంది. చూస్తుంటే అందం విషయంలో మహేశ్ని మించిపోతుందేమోనని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.మహేశ్.. ప్రస్తుతం రాజమౌళి మూవీ కోసం మేకోవర్ అవుతున్నాడు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ మూవీ షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి. అంతవరకు మహేశ్ అయితే పెద్దగా కనిపించడని చాలామంది అనుకున్నారు. కానీ ఎప్పటికప్పుడు అయితే ఎయిర్పోర్ట్ లేదా ఏదో ఓ ఈవెంట్లో కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ముంబై కన్సర్ట్కి భార్య-కూతురిని మాత్రం పంపించాడు.(ఇదీ చదవండి: కోడలు శోభితకి నాగార్జున ఆ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడా?) -
కుర్చీ మడతపెట్టి పాటకు మైండ్ బ్లాక్ అయ్యే రికార్డ్
కొన్ని పాటలు భాషతో సంబంధం లేకుండా క్లిక్ అవుతాయి. అలా ఈ ఏడాది కుర్చీ మడతపెట్టి పాట సూపర్డూపర్ హిట్టయింది. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ లెవల్లోనూ ఈ పాట మార్మోగిపోయింది. సూపర్స్టార్ మహేశ్బాబు ప్రధాన పాత్రలో నటించిన గుంటూరు కారం సినిమాలోనిదే ఈ పాట!పాట బ్లాక్బాస్టర్ హిట్మహేశ్బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైంది. మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీలో తమన్ అందించిన సంగీతం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా కుర్చీ మడతపెట్టి పాటకైతే విజిల్స్ పడ్డాయి.వన్స్మోర్ఈ సాంగ్ యూట్యూబ్లో రిలీజవగానే సెన్సేషనల్ హిట్ అయింది. మహేశ్, శ్రీలీల ఎనర్జిటిక్ డ్యాన్స్కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. రిపీట్ మోడ్లో పాట వింటూనే ఉన్నారు. తాజాగా ఈ పాట అరుదైన రికార్డు అందుకుంది. ఏకంగా 50 కోట్ల (500 మిలియన్) వ్యూస్ సాధించింది. ఈ సంతోషకర సమయంలో ఫ్యాన్స్ వన్స్మోర్ అంటూ మరోసారి కుర్చీ మడతపెట్టి సాంగ్ వింటున్నారు. చదవండి: నాన్న ఇంటికి రావొద్దన్నారు.. చచ్చిపోదామనుకున్నా: రాజేంద్రప్రసాద్ -
అనార్కలీ డ్రెస్లో మహారాణిలా వెలిగిపోతున్న మాజీ మిస్ ఇండియా (ఫోటోలు)
-
సడన్ గా గడ్డం తీసేసిన మహేష్ బాబు.. షాక్ లో రాజమౌళి..?
-
ఎనర్జీ సంస్థ ప్రచారకర్తగా మహేశ్ బాబు
హైదరాబాద్: సోలార్ ఎనర్జీ సెక్టార్లోని సన్టెక్ ఎనర్జీ బ్రాండ్ ‘ట్రూజన్ సోలార్’కు సినీనటుడు మహేశ్బాబు ప్రచారకర్తగా నియమితులయ్యారు. రూఫ్టాఫ్ సోలార్ ఇన్స్టలేషన్లో 2025 మార్చి నాటికి భారత్లో అగ్రగామిగా నిలిచేందుకు కట్టుబడి ఉన్నామని సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ వ్యవస్థాపకులు, ఎండీ, సీ.హెచ్. భవానీసురేశ్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న సంస్థతో కలిసి పనిచేయడం గౌరవంగా ఉందని మహేశ్బాబు తెలిపారు. -
ఓకే ఫ్రేమ్లో ఘట్టమనేని ఫ్యామిలీ.. చాలా రోజుల తర్వాత ఇలా! (ఫోటోలు)
-
అచ్చం సూపర్ స్టార్లాగానే.. వయసు తరుగుతోంది.. అందం పెరుగుతోంది
-
హకునా.. మటాటా... మరో నెలరోజులే అంటోన్న మహేశ్ బాబు!
ది లయన్ కింగ్ పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు ముఫాసా. చిన్నపిల్లలే కాదు.. పెద్దలు కూడా ఈ లయన్ కింగ్ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. హాలీవుడ్లో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అందుబాటులో ఉంది. అయితే సూపర్ హిట్ అయిన చిత్రానికి ప్రీక్వెల్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. ముఫాసా: ది లయన్ కింగ్ పేరుతో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు మరింత స్పెషల్ కానుంది. ఎందుకంటే సూపర్ స్టార్ మహేశ్ బాబు ముఫాసా పాత్రకు తన వాయిస్ అందించారు. దీంతో ఈ చిత్రంపై ఆడియన్స్లో మరింత క్యూరియాసిటీ పెరిగింది. తాజాగా ఈ మూవీ తెలుగు ఫైనల్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.ఈ మూవీలో ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి బేరీ జెంకిన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. మరో నెల రోజుల్లో హకునా.. మటాటా..ముఫాసా అంటూ టిమోన్, పుంబా డైలాగ్ను షేర్ చేశారు. ప్రస్తుతం మహేశ్ చేసిన నెట్టింట వైరల్గా మారింది. ఈ చిత్రాన్ని వాల్ట్ డిస్నీ స్టూడియోస్ నిర్మించింది. Hakuna ̶M̶a̶t̶a̶t̶a̶ ̶ Mufasa it is!🦁 The new roar. 🎵1 Month from now, get ready to watch Mufasa: The Lion King in cinemas from 20th Dec.#MufasaTheLionKing @DisneyStudiosIN pic.twitter.com/pjdeugoXec— Mahesh Babu (@urstrulyMahesh) November 20, 2024 -
మహేశ్ బాబు మేనల్లుడి సినిమా.. టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి అలా!
మహేశ్బాబు మేనల్లుడు అశోక్ గల్లా, మానస వారణాసి ప్రధాన పాత్రల్లో వస్తోన్న తాజా చిత్రం దేవకీ నందన వాసుదేవ. ఈ సినిమా ద్వారా మిస్ ఇండియా మానస వారణాసి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రశాంత్ వర్మ రాసిన కథతో దర్శకుడు అర్జున్ జంధ్యాల ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు.అయితే ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది చిత్రబృందం. అందరిలా కాకుండా కాస్తా వైరైటీగా మూవీ ప్రమోట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా మొదటి ఐదు నిమిషాల మూవీని ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రదర్శించనున్నారు. టాలీవుడ్ ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా సాహోసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు మేకర్స్. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం. ఈ మూవీ ఈ నెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. #DevakiNandanaVasudeva ఏం అయివుంటుంది? pic.twitter.com/FR1sIUH5xf— Kakinada Talkies (@Kkdtalkies) November 19, 2024 -
'మీరు కూడా నాతో చేరండి'.. మెన్స్ డేపై మహేశ్ బాబు పోస్ట్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో జతకట్టనున్నారు. వీరిద్దరి కాంబోలో మొదటిసారి వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్పైకి వెళ్లే అవకాశముంది. అయితే ఇవాళ ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా మహేశ్ బాబు చేసిన ట్వీట్ చేశాడు. మహిళలపై అత్యాచారాలు, వివక్ష, లింగ సమానత్వం కోసం ఏర్పాటు చేసిన మార్డ్ అనే సామాజిక కార్యక్రమంలో ప్రిన్స్ కూడా భాగమయ్యారు. మార్డ్ ప్రచారం కోసం బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్తో మన టాలీవుడ్ సూపర్ స్టార్ చేతులు కలిపారు.మహేశ్ బాబు తన ట్వీట్లో రాస్తూ..'గౌరవం, సానుభూతి, బలమైన వ్యక్తిత్వం మగవారి నిజమైన లక్షణాలు. సమానత్వం కోసం నిలబడి, తన ప్రతి చర్యలో దయ చూపేవాడే అసలైన రియల్మార్డ్. ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం రోజు మీరు కూడా నాతో చేరండి' అంటూ పోస్ట్ చేశారు.కాగా.. ఈ ప్రచారంలో భాగంగా ఫర్హాన్ అక్తర్ తండ్రి, రచయిత జావేద్ అక్తర్ హిందీలో రాసిన కవిత తెలుగు వర్షన్ను మహేశ్ బాబు పాడారు. తాను మార్డ్లో భాగమైనట్లు మహేశ్ బాబు పోస్ట్ పెట్టారు. దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న నేపథ్యంలో ఫర్హాన్ అక్తర్ లింగ అసమానతకు, నేరాలకు వ్యతిరేకంగా ఈ మార్డ్ ప్రచారాన్ని ప్రారంభించారు. తన భావాలన్నింటినీ ఓ కవితగా మార్చి ప్రచారం చేస్తున్నారు. Respect, empathy, and strength of character are the real traits of a man. He who stands for equality, and brings kindness into his every action is a #RealMard. This #InternationalMensDay, join me in my commitment with @MardOfficial to redefine #ModernMasculinity…— Mahesh Babu (@urstrulyMahesh) November 19, 2024 -
వివాదంలో నయన్.. మహేశ్ బాబు పోస్ట్ వైరల్
గత రెండు మూడు రోజులుగా నయనతార-ధనుష్ వివాదం తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్. 3 సెకన్ల ఫుటేజీ కోసం రూ.10 కోట్లు డిమాండ్ చేయడం ఏంటా అని నయన్ అడగడంతో ధనుష్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. మరోవైపు ఈమె అభిమానులు.. తామేం తక్కువ కాదన్నట్లు పాత విషయాల్ని తవ్వి తీస్తూ ఏందిరి ఈ పంచాయతీ అనేలా చేస్తున్నారు.ఈ కాంట్రవర్సీ అలా ఉంచితే నయనతార జీవితం, పెళ్లి గురించి తీసిన డాక్యుమెంటరీ 'నయనతార: బియాండ్ ద లైఫ్ స్టోరీ' నెట్ఫ్లిక్స్ సోమవారం రిలీజైంది. ఏదో అంతంత మాత్రంగానే ఉందనే రివ్యూస్ వచ్చాయి. అయితే ఈ డాక్యుమెంటరీ చూసిన మహేశ్ బాబు.. మూడు లవ్ ఏమోజీలతో ఇన్ స్టాలో స్టోరీ పెట్టాడు. దీంతో నెటిజన్లు ఫన్నీ సెటైర్లు వేస్తున్నారు.(ఇదీ చదవండి: అయ్యప్ప మాలలో చరణ్.. కానీ దర్గాకు ఎందుకు వెళ్లాడంటే?)నయన్ డాక్యుమెంటరీ మహేశ్కి అంత నచ్చేసిందా? షూటింగ్ లేకపోయేసరికి ఫుల్ ఖాళీగా ఉన్నట్లున్నాడు? అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. సినిమాలే కాకుండా డాక్యుమెంటరీలని కూడా వదలకుండా రివ్యూస్ ఇచ్చేస్తున్నాడుగా అనే ఫన్నీ సెటైర్లు నుంచి స్వయంగా అతడి అభిమానుల నుంచే వస్తున్నాయి.ప్రస్తుతం రాజమౌళి సినిమా మేకోవర్ అవుతున్న మహేశ్ బాబు.. మొన్నటివరకు గడ్డంతో కనిపించాడు. తాజాగా కీరవాణి కొడుకు ప్రీ వెడ్డింగ్లో క్లీన్ షేవ్తో దర్శనమిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి.(ఇదీ చదవండి: రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్కి పెళ్లి సెట్!) -
SSMB 29: మహేశ్కి జోడీగా హాలీవుడ్ భామ.. ఎవరీ నవోమీ?
మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న చిత్రం ‘ఎస్ఎస్ఎమ్బి 29’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్లో తెరకెక్కనుంది. అందుకే ఈ చిత్రంలో నటించే యాక్టర్స్పై ప్రత్యేక దృష్టి పెట్టారు రాజమౌళి. భారతదేశ నటీనటులే కాకుండా హాలీవుడ్కు చెందిన వారిని కూడా ఈ ప్రాజెక్టులోకి తీసుకోనున్నారాయన. అందులో భాగంగా మహేశ్బాబుకి జోడీగా హాలీవుడ్ నటి నవోమీ స్కాట్ని ఎంపిక చేసుకోనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నవోమీకి భారత మూలాలుగతంలో ‘ఎస్ఎస్ఎమ్బి 29’ హీరోయిన్ల జాబితాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్, ఇండోనేషియాకు చెందిన చెల్సియా ఇస్లాన్ పేర్లు వినిపించాయి. తాజాగా భారత మూలాలున్న నవోమీ స్కాట్ని ఎంపిక చేయనున్నారని భోగట్టా. ఇంగ్లాండులో పుట్టారు నవోమి. భారత సంతతికి చెందిన నవోమి తల్లి ఉషా స్కాట్ గుజరాత్ నుంచి ఇంగ్లాండుకు వలస వెళ్లారట. ‘ది మార్షియన్, అల్లాద్దీన్, ఛార్లీస్ ఏంజెల్స్, స్మైల్, విజర్డ్స్’ వంటి పలు సినిమాల్లో నటించిన నవోమీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. షూటింగ్ ఎప్పుడంటే..?‘ఎస్ఎస్ఎమ్బి 29’లో నటించే విషయంపై ఆమెతో రాజమౌళి చర్చలు కూడా జరిపారని ఫిల్మ్నగర్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి... మహేశ్బాబుకి జోడీగా నవోమీ స్కాట్ ఖరారు అయినట్టేనా? అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభం కానుందని టాక్. -
ప్రభాస్ లేదా మహేశ్.. నీకు పోటీ ఎవరు? బన్నీ ఏం చెప్పాడంటే!
మరో 20 రోజుల్లో 'పుష్ప 2' రిలీజ్ ఉంది. 17న పాట్నాలో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. దీంతో పూర్తిస్థాయిలో ప్రమోషన్స్ షురూ కాబోతున్నాయి. అంతలోనే బన్నీ ప్రచారం మొదలుపెట్టేశాడు. 'అన్స్టాపబుల్' నాలుగో సీజన్లో ఇతడు పాల్గొన్న ఎపిసోడ్ని ఆహా ఓటీటీలో రిలీజ్ చేశారు. మూవీ గురించి, అలానే చాలా విషయాల గురించి బన్నీ ఓపెన్గా మాట్లాడేశాడు.మిగతా వాటి సంగతి పక్కనబెడితే ఇండస్ట్రీలో నీకు అతిపెద్ద పోటీ ఎవరని అనుకుంటున్నావ్? ప్రభాస్ లేదా మహేశ్ అని హోస్ట్ బాలయ్య అడగ్గా.. బన్నీ చాలా లాజికల్గా సమాధానం చెప్పాడు. 'నను మించి ఎదిగేటోడు ఇంకోడు ఉన్నాడు చూడు.. ఎవడంటే అది రేపటి నేనే ! ఐ యామ్ మై బిగ్గెస్ట్ కాంపిటీషన్' అని అన్నాడు.(ఇదీ చదవండి: అల్లు వారి పెళ్లి సందడి.. ఆశీర్వదించిన చిరు, బన్నీ)ప్రస్తుతం 'పుష్ప 2'కి వస్తున్న హైప్ చూస్తుంటే బన్నీ చెప్పింది నిజమనేలా ఉంది. ఈ మూవీకి రిలీజ్కి వెయ్యి కోట్ల బిజినెస్ జరిగిందని టాక్. ఒకవేళ హిట్ టాక్ వస్తే మాత్రం ప్రభాస్ తరహాలో భారీ కలెక్షన్స్ రావడం గ్యారంటీ. అదే టైంలో ప్రభాస్, మహేశ్.. ఇద్దరిలో ఎవరు పేరు చెప్పినా సరే ఆయా ఫ్యాన్స్ హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.అలా ఓవైపు తనకు తాను ఎలివేషన్ ఇచ్చుకున్న బన్నీ.. మిగతా హీరోల అభిమానులని ఇబ్బంది పెట్టకుండా కామెంట్స్ చేశాడని చెప్పొచ్చు. ఇదే ఎపిసోడ్లో ప్రభాస్, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్.. ఇలా తన తోటీ హీరోలందరి గురించి బన్నీ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 12 సినిమాలు)I'm my biggest competitor. Says in Pushpa Raj style#AlluArjun #UnstoppableWithNBK #Pushpa2TheRule pic.twitter.com/2wZgZXVMWn— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) November 15, 2024 -
రాముడిగా మహేశ్బాబు?
మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు మహేశ్బాబు. మరోవైపు ఈ సినిమా చిత్రీకరణను వీలైనంత త్వరగా మొదలుపెట్టాలని దర్శకుడు రాజమౌళి లొకేషన్స్ వేట ప్రారంభించారు. త్వరలోనే కొన్ని లొకేషన్స్ను ఫైనలైజ్ చేయనున్నారాయన. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందనుందని చిత్రసంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి, కథా రచయిత విజయేంద్రప్రసాద్ ఇప్పటికే పేర్కొన్నారు.అయితే ఈ సినిమా నేపథ్యం గురించి మాత్రం ఎప్పటికప్పుడు కొత్త ఊహాగానాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఈ సినిమా కథనం ఓ నిధి అన్వేషణ బ్యాక్డ్రాప్లో ఉంటుందన్న వార్తలు వినిపించాయి. తాజాగా ఈ చిత్రకథలో రామాయణం ఇతిహాసం ప్రస్తావన ఉంటుందని ఫిల్మ్నగర్ భోగట్టా. అంతేకాదు... కొన్ని సీన్స్లో రాముడిగా మహేశ్బాబు కనిపిస్తారని, వారణాసి బ్యాక్డ్రాప్లో వచ్చే సన్నివేశాలు సినిమాలో కీలకంగా ఉంటాయని, ఈ సీన్స్ కోసం హైదరాబాద్లోనే వారణాసిని తలపించే సెట్ను రెడీ చేస్తున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఇక ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభంలో ఆరంభం అవుతుందని సమాచారం. -
చైల్డ్ ఆర్టిస్టులుగానే అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్.. ఈ తారల గురించి తెలుసా? (ఫొటోలు)
-
బిజినెస్మ్యాన్ బర్త్ డే పార్టీలో చిరు-మహేశ్-వెంకటేశ్ ఫుల్ చిల్ (ఫొటోలు)
-
మహేశ్ మేనల్లుడి సినిమా ట్రైలర్ రిలీజ్
'హీరో' అనే సినిమాతో మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'దేవకీ నందన వాసుదేవ'. ప్రశాంత్ వర్మ స్టోరీ అందించిన ఈ చిత్ర ట్రైలర్ని తాజాగా రిలీజ్ చేశారు. ఇంతకీ ఇది ఎలా ఉందంటే?(ఇదీ చదవండి: స్టార్ హీరో ఫ్యాన్స్ నన్ను టార్గెట్ చేశారు: మహిళా ఎంపీ)ప్రశాంత్ వర్మ పేరుతో ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. లెక్క ప్రకారం నవంబర్ 14నే మూవీ రిలీజ్ కావాలి. కానీ 'మట్కా', 'కంగువ'తో పోటీ ఎందుకులే అని వాయిదా వేసుకున్నారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. సినిమాలో ఉన్నట్లే హీరో ఎంట్రీ, హీరోయిన్ వెనక పడటం, విలన్, చివరలో కృష్ణుడి రిఫరెన్స్.. ఇలా ప్రస్తుత ట్రెండ్కి తగ్గట్లే అన్ని ఎలిమెంట్స్ చూపించారు.'ఆదిపురుష్'లో హనుమంతుడిగా చేసిన దేవదత్తా.. ఇందులో విలన్గా చేశాడు. ట్రైలర్లోని ఎలివేష్ షాట్స్ చూస్తుంటే యాక్షన్ కూడా బాగానే దట్టించినట్లు అనిపిస్తుంది. ట్రైలర్ అయితే బాగానే ఉంది కానీ కృష్ణుడి అనే స్టోరీ పాయింట్ ఈ సినిమాకు ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత) -
రానా, తేజ సజ్జా సారీ చెప్పాల్సిందే.. మహేశ్ బాబు ఫ్యాన్స్ డిమాండ్!
టాలీవుడ్లో సంక్రాంతి పండుగకు ఉన్న క్రేజే వేరు. అగ్రహీరోల సినిమాలన్నీ ఆ రోజు కోసమే ఎదురు చూస్తుంటాయి. పొంగల్ బాక్సాఫీస్ పోటీకి థియేటర్లు దొరకడం అంతా ఆషామాషీ కాదు. అందుకే పెద్ద హీరోలంతా ముందుగానే కర్చీఫ్ వేసేస్తారు. ఇప్పటికే వచ్చే ఏడాది సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేశ్ చిత్రం రెడీ అయిపోయాయి. త్వరలోనే మరిన్నీ చిత్రాలు పొంగల్ బాక్సాఫీస్ పోటీకి సై అంటున్నాయి.అయితే ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాలే సందడి చేశాయి. మహేశ్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగ, వెంకటేశ్ సైంధవ్తో పాటు ప్రశాంత్ వర్మ హనుమాన్ పోటీలో నిలిచాయి. తేజ సజ్జా నటించిన ఈ చిత్రం ఊహించని విధంగా సంక్రాంతి బాక్సాఫీస్ను షేక్ చేసింది. చిన్న సినిమా అయినప్పటికీ పెద్ద సినిమాలకు గట్టి పోటీనిచ్చింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సీక్వెల్ తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు.అయితే ఇటీవల జరిగిన ఐఫా వేడుకల్లో తేజ సజ్జా కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్కు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి హోస్ట్గా వ్యవహరించారు. వేదికపై వీరిద్దరి మధ్య సరదా సంభాషణ కొనసాగింది. తేజను రానా పొగుడుతూ మాట్లాడారు. అయితే ఆ తర్వాత వెంటనే నేను మహేశ్ బాబు గురించి మాట్లాడనంటూ రానా ఫన్నీగా చెప్పారు. ఇదేంటి ఇది నాకు కూడా సింక్ అయిందేంటని తేజ సజ్జా అన్నారు. ఆ తర్వాత రానా అతను సూపర్ స్టార్, మీరు ఒక సూపర్ హీరో మీరిద్దరూ సంక్రాంతికి వచ్చారు. సంక్రాంతి మ్యాటర్ ఇప్పుడు మాట్లాడవద్దంటూ తేజ సరదాగా అనడంతో.. దానికి ఎందుకు.. అదంతా సెన్సిటివ్ టాపిక్ హా' అని రానా బదులిచ్చాడు.అయితే ఇది చూసిన మహేశ్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి సంభాషణ మహేశ్ బాబును కించపరిచేలా ఉందంటూ నెట్టింట మండిపడుతున్నారు. తమ అభిమాన హీరో మహేశ్ బాబును ఎగతాళి చేశారని తేజ సజ్జా, రానాపై ట్విటర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. 25 ఏళ్లుగా సినిమాల్లో ఉన్న మహేష్ మీద సెటైర్ వేయడం కరెక్ట్ కాదంటున్నారు ఫ్యాన్స్. మహేష్ సినిమాను కించపరిచినందుకు క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ ఓ అభిమాని పోస్ట్ చేశాడు. గుంటూరు కారం సినిమాపై మాట్లాడినందుకు సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు రానా, తేజ సజ్జా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. Context 😤pic.twitter.com/PBTuhvgD3W— Cinderella🦋 (@GlamGirl_Geetha) November 6, 2024 U had one success man, one! Daniki 25 yrs ga ace filmography unna Mahesh meedha satireUnless you come up with a sequel for Hanuman, aa collections thechkolev and yk why @tejasajja123 Inka Rana gurinchi enduku, shelved project adhi— Jimhalpert (@satvikdhfm) November 5, 2024 Dear @tejasajja123 ,Need apology to superstar @urstrulyMahesh garu and his fans You and rana degrade comments about 2024 sankranthi films , in this sankranthi one of my beloved superstar film also there you know also,Please try to understand this situation.Thanks and…— Sagar MB (@dhfmbabu4005) November 5, 2024 -
మహేష్ బాబు - రాజమౌళి టైటిల్ మీద కన్నేసిన బాలయ్య
-
ప్రశాంత్ వర్మ కథలో శ్రీకృష్ణుడిగా మహేశ్ బాబు?
-
లొకేషన్ వేటలో రాజమౌళి..!
కెన్యాలో లొకేషన్ వేట ఆరంభించారు రాజమౌళి. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ ఆఫ్రికన్ అడ్వెంచరస్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిసింది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసిన రాజమౌళి లొకేషన్స్ను ఫైనలైజ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్లో రాజమౌళి ఉన్నారు. కెన్యా, ఆఫ్రికా లొకేషన్స్లో కొన్ని లొకేషన్స్ని ఎంపిక చేసి, తొలి షెడ్యూల్ని అక్కడే ఆరంభిస్తారని సమాచారం. ఇక ఈ సినిమాకు ‘మహారాజా’, ‘మహారాజ్’ అనే టైటిల్స్ను అనుకుంటున్నారని, 18వ శతాబ్దం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని, ఓ నిధి అన్వేషణతో ఈ సినిమా ఉంటుందనీ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. -
అడవుల్లో రాజమౌళి హంటింగ్.. ఆ సినిమా కోసమేనా?
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం వేకేషన్లో చిల్ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత గ్యాప్ ఎక్కువగా రావడంతో ఆఫ్రికాలో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం కెన్యాలోని అడవుల్లో వన్య ప్రాణలను చూస్తూ సేద తీరుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ ప్రాంతంలో సినిమా షూటింగ్ లోకేషన్స్ కోసమే రాజమౌళి వెళ్లినట్లు తెలుస్తోంది. అడవుల్లో తిరుగుతున్న ఫోటోను తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు దర్శకధీరుడు. (ఇది చదవండి: ఆ సమయంలో అవార్డ్ తీసుకోవడం కరెక్ట్ కాదనిపించింది: మెగాస్టార్)మరోవైపు ప్రిన్స్ మహేశ్బాబుతో తన తదుపరి చిత్రం తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధమైంది. ఈ సినిమాను ఎస్ఎస్ఎంబీ29 వర్కింగ్ టైటిల్తో రూపొందించనున్నారు. ఈ మూవీని ఫుల్ యాక్షన్ అడ్వెంచరస్ కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో కథ ఉంటుందని ఇప్పటికే హింట్ కూడా ఇచ్చారు. అందువల్లే ఆఫ్రికాలోని దట్టమైన అడవుల లోకేషన్స్ కోసమే రాజమౌళి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాదిలో ప్రారంభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. #TFNReels: Maverick Director @ssrajamouli is currently scouting locations in Kenya, Africa for #SSMB29!!🌎🔥#MaheshBabu #SSRajamouli #TeluguFilmNagar pic.twitter.com/ABq6DxfVOg— Telugu FilmNagar (@telugufilmnagar) October 29, 2024 View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli) -
రెండో భాగం కూడా..?
హీరో మహేశ్బాబు, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్లో సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ చిత్రం ఒకటి కాదు రెండు భాగాలుగా రూపొందనుందనే న్యూస్ నెట్టింట వైరల్గా మారింది.‘బాహుబలి’ సినిమా తరహాలోనే ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ని కూడా రెండు భాగాలుగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ మూవీ ప్రీప్రోడక్షన్ పనుల్లో బిజీబిజీగా ఉంది. ఈ సినిమా కోసం పొడవాటి హెయిర్ స్టైల్, గెడ్డం, కండలు తిరిగిన బాడీ పెంచే పనిలో ఉన్నారు మహేశ్బాబు.కాగా కథకు ఉన్నప్రాధాన్యం దృష్ట్యా ఒకే భాగంలో చెప్పడం సాధ్యం కాదని, అందుకే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. అలాగే సీక్వెల్స్ వస్తాయనే ఊహాగానాలూ ఉన్నాయి. ఈ వార్తలపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని చిత్ర కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. -
బ్యాంకాక్లో చిల్ అవుతోన్న మహేశ్ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)
-
బరిలోకి మహేశ్, చరణ్, సమంత.. అయినా ఫ్లాప్ తప్పలేదు!
సినీ ప్రేక్షకుడు మారాడు. ఒకప్పుడు తన అభిమాన నటీనటుల సినిమా ఎలా ఉన్నా సరే థియేటర్కి వెళ్లి చూసేవాడు. కానీ ఇప్పుడు హీరోహీరోయిన్ల మొఖం చూడట్లేదు. కథలో దమ్ముంటేనే సినిమా చూస్తున్నారు. స్టార్ హీరో సినిమా అయినా సరే.. టికెట్ తెగాలంటే మంచి కంటెంట్ ఉండాల్సిందే. లేదంటే అపజయం తప్పదు. దీనికి ఇటీవల విడుదలైన ‘జిగ్రా’ సినిమానే మంచి ఉదాహరణ.బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జిగ్రా’. వేదాంగ్ రైనా, మనోజ్ పవా, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలు పోషించారు. వాసన్ బాలా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదలై తొలి రోజే ఫ్లాప్ టాక్ని మూటగట్టుకుంది. ఫలితంగా ఈ సినిమా కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. వీకెండ్ మొత్తంలో రూ. 20 కోట్ల కలెక్షన్స్ని కూడా రాబట్టలేకపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వారం మొత్తంలో హిందీలోనే కేవలం రూ. 18 కోట్ల మాత్రమే వసూలు చేసిందంటే..ఇక మిగతా భాషల్లో కలెక్షన్స్ ఎంత దారుణంగా ఉంటాయో ఊహించుకోవచ్చు.అపజయాన్ని ఆపలేకపోయినా స్టార్స్ఆలియా భట్ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేశారు. తెలుగులో హీరో రానా రిలీజ్ చేశాడు. వాస్తవానికి హిందీ తర్వాత ఈ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేసింది తెలుగులోనే అనే చెప్పాలి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రం ట్రైలర్ని విడుదల చేశాడు. సూపర్స్టార్ మహేశ్బాబు సోషల్ మీడియా వేదికగా తన మద్దతును ప్రకటించాడు. ఇక ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్కి స్టార్ హీరోయిన్ సమంత, త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్యఅతిథులుగా హాజరై.. తన వంతు సాయం అందించారు. ఇలా స్టార్స్ అంతా తమకు తోచిన సహాయం అందించినా.. జిగ్రాకు విజయం అందించలేకపోయారు. తెలుగులో మూడు రోజుల్లో కేవలం 18 లక్షల వసూళ్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. యావరేజ్ టాక్ వచ్చిన ఓ చిన్న సినిమాకు కూడా ఇంతకంటే ఎక్కువే వస్తాయని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే కథలో దమ్ము లేనప్పడు ఏ హీరో అయినా ఏం చేయగలడు? కాస్త బాగున్న సినిమాను ప్రచారం చేస్తే ఎంతో కొంత ఉపయోగపడుతుంది. కానీ కంటెంట్లేని సినిమాకు ఎంత ప్రచారం చేసిన బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. విషయం వీక్గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్స్లో ఉంటుందనడానికి ‘జీగ్రా’ మూవీ బెస్ట్ ఎగ్జాంపుల్. -
'జిగ్రా' కోసం ఆలియాకి మహేశ్ బాబు విషెస్
పేరుకే స్టార్ హీరో కానీ కొత్త సినిమా రిలీజైతే చాలు హీరో మహేశ్ బాబు చూస్తుంటాడు. కచ్చితంగా ట్వీట్ పెట్టి మూవీ ఎలా ఉందో చెప్పేస్తుంటాడు. ఈసారి అలానే రిలీజ్కి ముందే ఆలియా భట్ 'జిగ్రా' మూవీ టీమ్కి శుభాకాంక్షలు తెలియజేశాడు.(ఇదీ చదవండి: 'మా నాన్న సూపర్ హీరో' సినిమా రివ్యూ)బాలీవుడ్ బ్యూటీ ఆలియా ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జిగ్రా'. బ్రదర్-సిస్టర్ సెంటిమెంట్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. హిందీతో పాటు తెలుగులోనూ అక్టోబర్ 11నే థియేటర్లలో రిలీజ్ చేశారు.ఇదే కాదు తెలుగులో ఈసారి దసరాకు 'విశ్వం', 'మా నాన్న సూపర్ హీరో', 'జనక అయితే గనక' చిత్రాలు ప్రేక్షకుల పలకరించాయి. 'వేట్టయన్', 'మార్టిన్', 'జిగ్రా' అనే డబ్బింగ్ చిత్రాలు కూడా ఇదే పండక్కి థియేటర్లలోకి వచ్చాయి. మరి వీటిలో ఏది హిట్ అయిందో లేదో తెలియాలంటే ఈ వీకెండ్ పూర్తవ్వాల్సిందే.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఐదు డోంట్ మిస్) -
బిగ్బాస్ హౌస్లో మహేశ్ బాబు మరదలు.. తెలుగులో ఓకే ఒక్క సినిమా!
బుల్లితెర ప్రియులను అలరిస్తోన్న ఏకైక రియాలిటీ షో బిగ్బాస్. ఇప్పటికే తెలుగులో ఐదు వారాలు పూర్తి చేసుకుంది. ఈ ఆదివారం వెల్డ్ కార్డ్ ద్వారా మరో ఎనిమిది మంది హౌస్లోకి అడుగుపెట్టారు. అయితే అదే రోజు హిందీతో పాటు తమిళంలోనూ బిగ్బాస్ సీజన్స్ మొదలయ్యాయి. అక్టోబర్ 6 నుంచి హిందీ బిగ్బాస్ సీజన్-18 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ఏడాది కూడా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సీజన్లో టాలీవుడ్ హీరో మహేశ్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ హౌస్లో అడుగుపెట్టింది. నమ్రతా శిరోద్కర్ చెల్లి అయిన శిల్పా బిగ్బాస్ సీజన్ 18లోకి నాలుగో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా తనకు బిగ్బాస్ షో అంటే విపరీతమైన అభిమానమని.. నా కల నిజమైన క్షణమని సంతోషం వ్యక్తం చేశారు. నా ప్రయాణం పట్ల ఆనందంగా ఉన్నట్లు శిల్పా శిరోద్కర్ అన్నారు. బిగ్బాస్ ద్వారా తన జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలైందని తెలిపారు. బిగ్బాస్లోకి వెళ్లమని కూతురు ఎప్పుడు తనను అడుగుతుండేదని శిల్పా శిరోద్కర్ వెల్లడించారు. అందరికంటే ఎక్కువ తన కూతురు సంతోషంగా ఉందని పేర్కొంది.(ఇది చదవండి: 'నేనేమన్నా యుద్ధానికి పోతున్నానా?'.. మొదటి రోజే బుక్కైన అవినాశ్!)1990 దశకంలో బాలీవుడ్లో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు శిల్పా శిరోద్కర్. బాలీవుడ్లో బందీష్, మృత్య్దండ్, హమ్, త్రినేత లాంటి సినిమాల్లో నటించారు. మోహన్బాబు హీరోగా నటించిన బ్రహ్మ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆమె నటించిన మూవీ ఇదే కావడం విశేషం. అంతే కాకుండా నాగార్జున నాగార్జున బాలీవుడ్లో నటించిన ఖుదాగవా సినిమాలో నటించింది. ఈ సినిమా తెలుగులోకి కొండవీటి సింహాం పేరుతో డబ్ చేశారు. 2000 సంవత్సరంలో చివరిసారిగా గజగామిని అనే హిందీ చిత్రంలో కనిపించింది. View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) -
కొండా సురేఖ చౌకబారు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: మహేశ్ బాబు
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలుగు చిత్ర పరిశ్రమ భగ్గుమంటుంది. సినీనటి సమంత విడాకులు, రకుల్ ప్రీత్సింగ్ పెళ్లి, అక్కినేని నాగార్జున కుటుంబం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను లేవనెత్తుతూ కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో #FilmIndustryWillNotTolerate అనే హ్యాష్ ట్యాగ్తో కొండా సురేఖపై నటీనటులు భారీగానే విరుచుకుపడుతున్నారు.మహేశ్ బాబు'మంత్రి కొండా సురేఖ గారు మా సినీ ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయి. ఒక కూతురి తండ్రిగా, భార్యకు భర్తగా, తల్లికి కొడుకుగా మీ వ్యాఖ్యలు నన్ను బాధించాయి. ఒక మహిళా మంత్రిగా మీరు మరో మహిళపై చేసిన ఆమోదయోగ్యంకాని వ్యాఖ్యలు, మీ భాష పట్ల తీవ్ర వేదనకు గురయ్యాను. ఎదుటివారి మనోభావాలను దెబ్బతీయనంత వరకు వాక్ స్వేచ్ఛను ఉపయోగించుకోవచ్చు. మీరు చేసిన చౌకబారు, నిరాధారమైన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. సినీ వర్గాన్ని సాఫ్ట్ టార్గెట్గా మార్చుకోవద్దని పబ్లిక్ డొమైన్లో ఉన్న అందరినీ అభ్యర్థిస్తున్నాను. మన దేశంలోని మహిళలను, మన సినీ సోదరులను గౌరవంగా చూడాలి.' అని మహేశ్ కోరారు.రాజకీయ యుద్ధం పేరుతో గౌరవప్రదమైన వారిపై నీచమైన ఆరోపణలు చేస్తూ ఓ మహిళా మంత్రి పైశాచిక వ్యూహాలను అవలంబించడం నన్ను భయాందోళనకు గురిచేస్తోంది. ఇది అవమానానికి మించినది. తమ రాజకీయ శత్రుత్వాల్లోకి అమాయక వ్యక్తులను, ముఖ్యంగా మహిళలను ఎవరూ లాగకూడదు. నాయకులు సమాజానికి ఉదాహరణగా నిలువాలి. అందరిలోనూ సామాజిక విలువలను పెంచాలి. వాటిని తగ్గించకూడదు.- రవితేజమంత్రి కొండా సురేఖ గారి నుంచి ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు వినడం చాలా బాధాకరం. అధికారంలో ఉన్న మహిళగా, మహిళలు విజయం సాధించడం ఎంత సవాలుతో కూడుకున్నదో మీకు తెలిసే ఉంటుంది. రాజకీయ లబ్ధి కోసం సినీ తారల వ్యక్తిగత జీవితాలపై స్త్రీ ద్వేషంతో తప్పుడు ఆరోపణలు చేయడం ఆమోదయోగ్యం కాదు. మీ మాటలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. రాహుల్ గాంధీని కూడా నేను అభ్యర్థిస్తున్నాను. మీ పార్టీలోని నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చూసుకోవాలి. భవిష్యత్ తరాలకు మనం సరైన ఉదాహరణగా ఉండాలి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా అభ్యర్థిస్తున్నాను. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నాను. ఈ వ్యక్తిగత దూషణలు చిత్ర పరిశ్రమ ఏకతాటిపైకి తెస్తోంది. అని భావిస్తున్నాను. - మంచు మనోజ్రాజకీయాల కోసం సినీ, టీవీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాన్ని తప్పుడు ఆరోపణలు ప్రచారం చేయడం సరికాదు. చిత్ర పరిశ్రమలోని మేమందరమూ కూడా కుటుంబ సమేతంగా కలిసి నిరసన తెలియజేస్తున్నాం. వ్యూస్ కోసం తప్పుడు థంబ్నెయిల్లతో అవే వీడియోలను పోస్ట్ చేయవద్దని యూట్యూబర్స్ణు అభ్యర్థిస్తున్నాను. ఇతర వృత్తిలాగే మమ్మల్ని కూడా గౌరవించండి. - సుమ కనకాలసినీ ప్రముఖులపై రాజకీయ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం. ఇది వ్యక్తిగత జీవితాలను దోపిడీ చేయడం .దయచేసి మాట్లాడే ముందు ఆలోచించండి. ఈ రకమైన నీచమైన వ్యాఖ్యలు, మాటల దూషణలకు వ్యతిరేకంగా మేము ఐక్యంగా ఉన్నాము. - కిరణ్ అబ్బవరంశ్రీమతి కొండా సురేఖ.. మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా అసహ్యంగా మాట్లాడటం మమ్మల్ని చాలా బాధపెట్టింది.ఇలాంటి నిరాధారమైన పుకార్లు వ్యాప్తి చేయడం అంత మంచి నిర్ణయం కాదు. మీ రాజకీయం కోసం సినీ పరిశ్రమ సభ్యుల వ్యక్తిగత జీవితాలను లాగితేప సహించం. - రాజశేఖర్మీ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కానివి. చాలా అసహ్యంగా ఉంది. ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు. ఎవరైనా ఇంత నీచంగా దిగజారి, మీడియా ముందు అవమానకరమైన వ్యాఖ్యలను ఎలా చేయగలరు..? సెలబ్రిటీల పేర్లను, వారి వ్యక్తిగత జీవితాన్ని లాగడం, వారిపై నిరాధార ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబు. హద్దులు దాటి ఒక వ్యక్తి గుర్తింపును అగౌరవపరచడం సహించలేని చర్య. ఇలాంటి వాటిని సమాజం తిరస్కరిస్తుంది. ప్రతి ఒక్కరిని గౌరవించండి. రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ.. సమాజాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని భావిస్తున్నాం. మహిళా మంత్రినే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం.' అని చెప్పుకొచ్చింది. - సంయుక్త మేనన్నేటి రాజకీయ నాయకుల ప్రవర్తనపై నా ఆలోచనలు, భావాలను మంచి భాషలో వ్యక్తీకరించడానికి ఇబ్బంది పడుతున్నా. ప్రజలకు మంచి జరగడానికి మేము ఓటు వేస్తామని చాలా మంది రాజకీయ నాయకులకు గుర్తు చేయాలనుకుంటున్నాము. ప్రజలుగా మేము దీన్ని అనుమతించలేము, అంగీకరించలేము. రాజకీయాలు ఏ మాత్రం దిగజారకూడదు. మీరుండేది ప్రజల బాగోగులూ చూసుకునేందకని గుర్తుపెట్టుకోండి. వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల, విద్య గురించి మాట్లాడండి. ఉద్యోగాలు కల్పించి వారి శ్రేయస్సు కోసం కష్టపడండి. ఇలాంటి వ్యాఖ్యలతో రాజకీయాలను దిగజార్చకండి.' అంటూ కొండా సురేఖపై కామెంట్ చేశారు. - విజయ్ దేవరకొండ సమంత గారిపై, అక్కినేని కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్క చేసిన వ్యాఖ్యలు బాధాకరం. గతంలో చైల్డ్ అబ్యూస్ కేసులో ముందుగా స్పందించిన మీరే.. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధనిపిస్తుంది. మీ రాజకీయ విమర్శల కోసం ఏ మాత్రం సంబంధం లేని నటీనటుల పేర్లు తీసుకురావడం.. ఆపై వాళ్ల వ్యక్తిగత జీవితంపై దిగజారుడు ఆరోపణలు చేయడం మంచిది కాదు. గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మీరే ఇలా మాట్లాడడం సమాజానికి శ్రేయస్కరం కాదు. మావి చాలా సున్నితమైన మనసులు. వాటిని గాయం చేసి మీ రాజకీయం కోసం వాడుకోవడం తగదు. గతంలో మా కుటుంబాన్ని కూడా ఎన్నిసార్లు లక్ష్యంగా చేసుకుని దారుణమైన వ్యాఖ్యలు చేసినా మేము స్పందించలేదు. మేమెప్పుడూ ఏమీ అనమని సాఫ్ట్ టార్గెట్ చేయవద్దు. దయచేసి ఇకపై నటులను మాత్రమే కాదు.. ఎవరి వ్యక్తిగత విషయాలపై ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేయకూడదని కోరుకుంటున్నాను. - సాయి ధరమ్తేజ్ -
'ఆగడు' సినిమా చేయకుండా ఉండాల్సింది: శ్రీనువైట్ల
డైరెక్టర్ శ్రీనువైట్ల పేరు చెప్పగానే ఢీ, రెడీ, దూకుడు లాంటి అద్భుతమైన సినిమాలు గుర్తొస్తాయి. కామెడీ విషయంలో సరికొత్త ట్రెండ్ చేసిన ఈయన.. ఆ తర్వాత సరైన మూవీస్ చేయక పూర్తిగా వెనకబడిపోయారు. రవితేజతో తీసిన 'అమర్ అక్బర్ ఆంటోని' ఘోరమైన డిజాస్టర్ కావడంతో కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమయ్యాడు. చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు 'విశ్వం' చిత్రంతో రాబోతున్నారు.(ఇదీ చదవండి: సోనియాలా మారిపోతున్న యష్మీ.. బక్వాస్ గేమ్ అని చాడీలు)గోపీచంద్ హీరోగా నటించిన ఈ సినిమా అక్టోబరు 11న దసరా కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లలో కాస్త బిజీగా ఉన్న దర్శకుడు శ్రీనువైట్ల.. పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. అలా ఓ దానిలో మాట్లాడుతూ.. మహేశ్ బాబు 'ఆగడు' ఫ్లాప్పై స్పందించారు. ఆ మూవీ చేసినందుకు ఇప్పటికీ బాధపడుతుంటానని అన్నారు.''ఆగడు' తీసినందుకు జీవితాంతం బాధపడుతూనే ఉంటా. దానికి ఓ కారణం ఉంది. 'దూకుడు' లాంటి బ్లాక్బస్టర్ తర్వాత మహేశ్ బాబుతో భారీ బడ్జెట్ సినిమా చేయాలనుకున్నా. అప్పుడు 'ఆగడు' మూవీ చేయాలనే ఆలోచనే లేదు. భారీ యాక్షన్ స్టోరీ కూడా మహేశ్కి చెప్పాను. సూపర్ చేసేద్దామని అన్నారు. 14 రీల్స్ సంస్థ నిర్మాతలకు కూడా కథ నచ్చింది. కానీ వాళ్లంత బడ్జెట్ పెట్టలేమన్నారు. అప్పట్లో వాళ్లకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి. దీంతో ఆ కథని పక్కనబెట్టి 'ఆగడు' చేశాం. అయితే అది చేయకుండా ఉండాల్సిందని ఇప్పటికీ బాధపడుతుంటా' అని శ్రీనువైట్ల చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఫీల్ గుడ్ మూవీ.. ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిందే!) -
సుధీర్ బాబు పెళ్లి వీడియో వైరల్.. మహేశ్ బాబే హైలెట్
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు 'మా నాన్న సూపర్ హీరో' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు త్వరలో రానున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి పెళ్లి సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ క్రమంలో తన పెళ్లి వేడుకకు సంబంధించిన పలు ఫోటోలను అభిమానులతో సుధీర్ పంచుకున్నారు. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇదీ చదవండి: హీరోయిన్తో పెళ్లికి రెడీ అవుతున్న శింబుహీరో సుధీర్ బాబు.. సూపర్స్టార్ కృష్ణ కుమార్తె ప్రియదర్శినితో 2006లో వివాహం అయింది. అయితే, నాటి ఫోటోలకు తన కొత్త సినిమా 'మా నాన్న సూపర్ హీరో' నుంచి ఒక పాటను తీసుకుని వీడియో రూపంలో క్రియేట్ చేసి అభిమానులతో పంచుకున్నారు. అందులో సుధీర్ బాబు,ప్రియదర్శిని దంపతులను ఆశీర్వదిస్తున్న మహేశ్ బాబు ఫోటో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.నాడు పెళ్లిచూపుల ఫోటో షేర్ చేసిన సుధీర్సుధీర్ బాబు గతంలో కూడా వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన సతీమణి ప్రియదర్శిని ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలో క్యూట్గా కనిపిస్తుందెరో కాదు అంటూనే.. ప్రియదర్శినికి శుభాకాంక్షలు తెలిపారు. ఆ పిక్ కూడా పెళ్లిచూపుల ఫోటో అని, తన దగ్గర ఉన్న ఆమె మొదటి ఫోటో ఇదేనని ఆయన పేర్కొన్నారు.2010లో ఏ మాయ చేసావే చిత్రంతో ఒక సపోర్టింగ్ రోల్తో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ప్రేమ కథా చిత్రమ్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం 'మా నాన్న సూపర్ హీరో' అనే చిత్రంతో అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు సుధీర్ బాబు రానున్నారు. అభిలాష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తండ్రీకొడుకుల ప్రేమ, అనుబంధాలకు నిజమైన అర్థాన్ని తెలియజేసేలా ఈ చిత్రం ఉండనుంది. ఈ మూవీలో సుధీర్ బాబు తండ్రిగా సాయిచంద్ నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Sudheer Babu (@isudheerbabu) -
Bigg Boss: బిగ్ బాస్ షోలో నమ్రత సోదరి ఎంట్రీ..?
-
స్టైలిష్ లుక్లో మహేశ్.. సీతక్కకు ఫ్యాన్ అంటున్న నమ్రత (ఫోటోలు)
-
బిగ్బాస్ షోలో నమ్రత సోదరి ఎంట్రీ!
బిగ్బాస్ రియాలిటీ షో ప్రేక్షకులకు వినోదాన్ని పంచితే, కంటెస్టెంట్లకు పాపులారిటీని తెచ్చిపెడుతుంది. అందుకే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, మరాఠీ, హిందీ భాషల్లో బిగ్బాస్ విజయవంతంగా ప్రసారమవుతోంది. ప్రస్తుతం తెలుగులో ఎనిమిదో సీజన్ నడుస్తుండగా హిందీలో 18వ సీజన్ అక్టోబర్ 6న ప్రారంభం కానుంది.ఒకప్పుడు హీరోయిన్గా..ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక ఓ కొలిక్కివచ్చిందట! ఈ జాబితాలో నటి శిల్ప శిరోద్కర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమె సూపర్స్టార్ మహేశ్బాబు భార్య నమ్రతకు సోదరి అన్న విషయం తెలిసిందే! భ్రష్టాచార్(1989) సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన శిల్ప.. కిషన్ కన్హయ్య, త్రినేత్ర, హమ్, ఖుదా గవా, ఆంఖెన్, గోపి కిషన్, మృత్యునాద్, బేవఫ సనం ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. బిగ్బాస్ షోలో ఎంట్రీ?తెలుగులో బ్రహ్మ మూవీలో యాక్ట్ చేసింది. పెళ్లి తర్వాత సినిమాలకు చెక్ పెట్టేసిన ఆమె పదేళ్ల గ్యాప్ తర్వాత 2013లో మళ్లీ సీరియల్స్లో కనిపించింది. ఇప్పుడు బుల్లితెరకు సైతం దూరంగా ఉంటున్న శిల్ప.. నిజంగానే బిగ్బాస్ షోలో అడుగుపెడుతుందా? లేదా? అనేది చూడాలి!మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రేవంత్ రెడ్డిని కలిసిన మహేశ్ బాబు, నమ్రత.
-
మహేశ్ బాబు విరాళం.. డిస్కషన్ మాత్రం వాటి గురించి
హీరో మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా ప్రిపరేషన్లో ఉన్నాడు. ప్రీ ప్రొడక్షన్ నడుస్తోంది. మూవీలోని తన పాత్ర కోసం మహేశ్ లుక్ మొత్తం మార్చే పనిలో బిజీగా ఉన్నాడు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వరద బాధితుల సహాయంగా రూ.50 లక్షల విరాళం అందజేశాడు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్ అందించాడు. ఏఎంబీ తరఫున మరో రూ.10 లక్షలు కూడా విరాళమిచ్చాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ నాలుగు డోంట్ మిస్)మహేశ్ విరాళం ఇచ్చాడు. అయితే డబ్బులు సాయం చేశాడు అనే విషయం కంటే అతడు లుక్ హైలెట్ అవుతోంది. జూలపాల జట్టు, గుబురు గడ్డంలో మహేశ్ సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఇన్నాళ్లు మహేశ్ ప్రయోగాలు చేయలేదు, మాస్గా కనిపించలేదు అని ఫ్యాన్స్ తెగ బాధపడ్డారు. ఇప్పుడు డిఫరెంట్గా కనిపిస్తున్న మహేశ్ని చూసి ఫిదా అయిపోతున్నారు.దాదాపు నాలుగేళ్ల క్రితం మహేశ్తో సినిమా ఉంటుందని రాజమౌళి ప్రకటించారు. ఈయన తీసిన 'ఆర్ఆర్ఆర్' వచ్చి కూడా రెండేళ్లకు పైనే అయిపోయింది. అలాంటిది ఓ అప్డేట్ కూడా రాలేదు. ఇప్పట్లో వస్తాదనే గ్యారంటీ కూడా లేదు. కానీ వచ్చే ఏడాది షూటింగ్ మొదలవ్వొచ్చని అంటున్నారు. మరి వీటన్నింటిపై క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: 'కల్కి' సినిమాపై గరికపాటి విమర్శలు.. ఏమన్నారంటే?) -
మహేశ్తో కాలేజ్ డేస్ నుంచే పరిచయం : త్రిష
‘‘మహేశ్బాబు చాలా కాలం నుంచి నాకు తెలుసు. మేమిద్దరం కళాశాల రోజుల్లో చెన్నైలో ఉన్నాం’’ అన్నారు హీరోయిన్ త్రిష. మహేశ్బాబు, త్రిష కలిసి ‘అతడు’ (2005), ‘సైనికుడు’ (2006) వంటి చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత వీరిద్దరూ నటించలేదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిషకి.. ‘మహేశ్బాబు గురించి మీ అభిప్రాయం ఏంటి?’ అనే ప్రశ్న ఎదురైంది. (చదవండి: ఈ వీకెండ్ ఏకంగా 24 మూవీస్.. అవి ఏంటంటే?)ఇందుకు త్రిష బదులిస్తూ– ‘‘నాకు ఇష్టమైన నటుల్లో మహేశ్బాబు ఒకరు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా తోటి నటులను చాలా గౌరవిస్తారు. సెట్లో చాలా సరదాగా ఉంటారు. అలాగే చాలా హార్డ్ వర్క్ చేస్తారు. తన షూటింగ్ అయిపోయినా కేరవ్యాన్లోకి వెళ్లకుండా మానిటర్ దగ్గర కూర్చొని గమనిస్తూ ఉంటారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. మహేశ్ చాలా కాలం నుంచి నాకు తెలుసు. మేమిద్దరం కాలేజ్ డేస్లో చెన్నైలో ఉన్నాం. మా ఇద్దరికీ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉండేవారు. వారి వల్ల మహేశ్తో పరిచయం ఏర్పడింది. మేము యాక్టర్స్ అవుతామని అప్పుడు అనుకోలేదు’’ అన్నారు త్రిష. ఇదిలా ఉంటే త్రిష నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘విశ్వంభర’. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా నటిస్తున్నారు త్రిష. ‘స్టాలిన్’ (2006) సినిమా తర్వాత చిరంజీవి– త్రిష కలిసి నటిస్తున్న చిత్రం ఇదే. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న ‘విశ్వంభర’ విడుదల కానుంది. -
ప్రభాస్, మహేష్ తో కరీనా కపూర్..!