Medak District News
-
సమష్టిగా పని చేయండి
నర్సాపూర్: పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్రెడ్డి గెలుపునకు అందరూ సమష్టిగా పనిచేయాలని రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ అన్నారు. గురువారం పట్టణంలో నిర్వహించిన పట్టభద్రుల నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు కాంగ్రెస్లో తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు అందుబాటులో ఉంటానని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలన అవినీతిమయమైందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బున్న వ్యక్తులకే బీజేపీ ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ సేవ చేసే వ్యక్తికి అవకాశం కల్పించిందన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ.. నరేందర్రెడ్డిని గెలిపించేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను పట్టభద్రులకు వివరించి నరేందర్రెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భవాని, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేష్, నాయకులు రాజుయాదవ్, కరుణాకర్రెడ్డి, రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు. ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ -
338మంది కార్మికులపై వేటు!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సదాశివపేట శివారులోని ఓ ప్రైవేటు టైర్ల పరిశ్రమ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. తమను క్రమబద్ధీకరించాలంటూ ఆందోళనకు దిగిన 338మందికి పైగా కార్మికులపై వేటు వేసింది. ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం యాజమాన్యం శిక్షణ పేరుతో నిరుద్యోగ యువతను ఉద్యోగాల్లోకి తీసుకుంది. అప్పట్నుంచి వీరిని పర్మినెంట్ చేయకుండా ట్రైనీగానే పనిచేయించుకుంటూ నెలకు రూ.14వేలు మాత్రమే చెల్లిస్తోంది. ఇన్నాళ్లు తక్కువ వేతనమిచ్చినా సర్దుకుపోయామని, తమను పర్మినెంట్ చేయాలంటూ ఆందోళనకు దిగడంతో సదరు పరిశ్రమ ఒక్కసారిగా వీరందరినీ ఉద్యోగాల నుంచి తొలగించింది. దీంతో ఆ కార్మిక కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ శాఖ డీఆర్డీఏ (జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ) అప్పట్లో నిర్వహించిన జాబ్మేళాలో ఈ ఉద్యోగాలు పొందారు. నిబంధనల ప్రకారం ఒకటి రెండేళ్లకు మించి ట్రైనీగా కొనసాగించరాదు. నాలుగేళ్లుగా అరకొర వేతనాలతో ట్రైనీగా కొనసాగిస్తూ తమను శ్రమ దోపిడీకి గురి చేస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 22న మరోసారి చర్చలు! ఉద్యోగాలు పోయిన సుమారు 338 మంది కార్మికులు వారం రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కార్మికశాఖ అధికారులకు కూడా వినతిపత్రాలు అందజేశారు. ఆ శాఖ అధికారులు ఇప్పటికే పలుమార్లు యాజమాన్యంతో చర్చలు జరపగా, కంపెనీ ప్రతినిధులు ఇంకా ఎటూ తేల్చడం లేదు. ఈ నెల 22న మరోసారి చర్చించాలని నిర్ణయించారు. సదాశివపేటలోని ఓ ప్రైవేటు టైర్ల పరిశ్రమ సంచలన నిర్ణయం ఆందోళనకు దిగిన కార్మికులను తొలగించిన యాజమాన్యం చర్చలు జరుపుతున్నాం: డిప్యూటీ కమిషనర్ చర్చలు జరుపుతున్నాంసుమారు 338 మందికిపైగా ట్రైనీలను ఉద్యోగాల్లోంచి తొలగించడంతో సంబంధిత కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపాం. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 22న మరోసారి చర్చలు జరుపుతాం. ట్రైనీగా ఎన్ని రోజులు కొనసాగించాలనే దానిపై నిర్ణీత నిబంధనలేవీ లేవు. చర్చలు ఫలించకపోతే లేబర్ కోర్టుకు రిఫర్ చేస్తాం. –శ్రీనివాస్రెడ్డి, కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ -
జాతరలో ప్లాస్టిక్ కనిపించొద్దు
అదనపు కలెక్టర్ నగేష్ పాపన్నపేట(మెదక్): అధికారులు సమన్వయంతో పనిచేసి ఏడుపాయల జాతరను జయప్రదం చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ పిలుపునిచ్చారు. గురువారం ఏడుపాయల్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 26 నుంచి ప్రారంభమయ్యే జాతరకు సుమారు 10 లక్షలకు పైగా భక్తులు వస్తారని చెప్పారు. ఏ షాపులో ప్లాస్టిక్ కనిపించొద్దని ఆదేశించారు. ఇప్పటికే ప్లాస్టిక్ కవర్లు ఉంటే వాటిని తమకు అప్పగిస్తే బదులుగా పేపర్ కవర్లు ఇస్తామని సూచించారు. జాతర పరిసరాల్లో మరిన్ని శౌచాలయాలు ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ ప్రదేశాల నుంచి నడవలేని వ్యక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. లడ్డూ, పులిహోర కేంద్రాల వద్ద ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పారు. ఆలయం వద్ద తొక్కిసలాట జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 24 వరకు ఏర్పాట్లు పూర్తి కావాలని ఆదేశించారు. సమావేశంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, డీఎల్పీఓ సురేష్ బాబు, ఈఓ చంద్రశేఖర్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. -
బాధతో వచ్చే వారికి భరోసా ఇవ్వాలి
ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డిహవేళిఘణాపూర్(మెదక్): ఏదైనా సమస్యతో పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులకు మేమున్నామంటూ భరోసా ఇచ్చి వారి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి అన్నారు. గురువారం మెదక్రూరల్ పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేసి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. నేర ప్రవృత్తి గల వారిపై నిఘా పెట్టాలని, అనుమానితుల సమా చారాన్ని సేకరించాలని సిబ్బందికి సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ వారు ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు. డయల్ 100 కాల్స్ వచ్చిన వెంటనే తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, మెదక్రూరల్ సీఐ రాజశేఖర్రెడ్డి, ఎస్ఐ మురళి, సిబ్బంది ఉన్నారు. -
సస్యరక్షణ చర్యలు తప్పనిసరి
కలెక్టర్ రాహుల్రాజ్ చిన్నశంకరంపేట(మెదక్): వ్యవసాయ అధికారులు వరి పంటలను నిత్యం క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలో వరి పంటలను పరిశీలించారు. ఈసందర్భంగా రైతులతో మాట్లాడి పంటలకు సోకుతున్న తెగుళ్లపై ఆరా తీశారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారులు సైతం నిత్యం పంట పొలాలను పరిశీలించి రైతులను అప్రమత్తం చేయాలన్నారు. జిల్లాలో అత్యధిక శాతం రైతులు వరి పంటనే సాగుచేస్తున్నారని తెలిపారు. ఈసందర్భంగా ఏఓ ప్రవీణ్కు పలు సూచనలు చేశారు. అనంతరం చేగుంటలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వానాకాలంలో ఆస్పత్రి స్లాబ్ నుంచి నీరు వస్తుందని డాక్టర్ అనిల్కుమార్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. జిల్లా వైద్యాధికారితో మాట్లాడి మరమ్మతుల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఓటరు స్లిప్లు పంపిణీ చేయాలి మెదక్ కలెక్టరేట్: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు స్లిప్లు పంపిణీ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గురువారం హవేళిఘణాపూర్ తహసీల్దార్ సింధు రేణుక కలెక్టర్ రాహుల్రాజ్ను క్యాంపు కార్యాలయంలో కలిసి ఓటర్ స్లిప్ అందజేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తయిన తర్వాత రిపోర్టు సమర్పించాలని ఆదేశించారు. పట్టభద్రులు, టీచర్లు ఈనెల 27న ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. -
మల్లన్న హుండీ ఆదాయం రూ.78 లక్షలు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి హుండీ ఆదాయం రూ.78 లక్షలు వచ్చినట్లు ఆల య కార్యనిర్వహణ అధికారి రామాంజనేయులు తెలిపారు. గురువారం ఆలయ ముఖ మండపంలో హుండీలలోని కానుకలను లెక్కించారు. 19 రోజులలో నగదు రూ.78,31,047, విదేశి కరెన్సీ నోట్లు 130, మిశ్రమ బంగారం 82 గ్రాములు, మిశ్రమ వెండి 5 కిలోల 100 గ్రాములు, పసుపు బియ్యం13 క్వింటాళ్లు వచ్చినట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్ ఆలయ ధర్మకర్తలు, లలిత సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. -
పెద్ద బండి.. భలే ఉందండి
నార్సింగి జాతీయ రహదారిపై 160 టైర్లతో కూడిన భారీ వాహనం ఆకట్టుకుంది. గురువారం మధ్యాహ్నం రైస్మిల్లుల సమీపంలోని సర్వీస్రోడ్డుపై డ్రైవర్లు వాహనాన్ని నిలిపి కొద్దిసేపు సేదతీరారు. దీంతో జాతీయ రాహదారిపై రాకపోకలు సాగించేవారు ఆసక్తిగా గమనించారు. హైదారాబాద్ నుంచి యూపీలోని ఝాన్సీకి 280 టన్నుల తోషిబా కంపెనీ భారీ ట్రాన్స్ఫార్మర్ను ఈ వాహనంలో తరలిస్తున్నారు. ఈ కంటైనర్ గంటకు 20 కిలోమీటర్ల వేగంతో రోజుకు 40 నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణించనుంది. – చిన్నశంకరంపేట(మెదక్) -
పంట రుణాల మంజూరులో వివక్ష
వెల్దుర్తి(తూప్రాన్): వ్యవసాయ రుణాల మంజూరులో మాసాయిపేట కెనరా బ్యాంక్ మేనేజర్ నవీన్రెడ్డి వివక్ష చూపుతున్నారని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. ఈ మేరకు గురువారం బ్యాంక్ మేనేజర్ను నిలదీశారు. నిబంధనల మేరకే సిబిల్ లేని రైతులకు రుణాలు మంజూరు చేయడం లేదని మేనేజర్ చెప్పడంతో లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని పట్టుబట్టారు. ఈసందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ రుణమాఫీ పొందిన రైతులకు తిరిగి రుణాలు చెల్లించడంలో మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతుభరోసా డబ్బులను సైతం గోల్డ్ రుణాల కింద జమ చేయడంతో వ్యవసాయ పెట్టుబడికి రైతులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. రుణమాఫీ వర్తించిన రైతులకు తిరిగి రుణాలు రీ షెడ్యూల్ చేయడంతో పాటు రైతు భరోసా డబ్బులను ఇతర రుణాల కింద జమ చేయవద్దని ఓ వైపు ప్రభుత్వం ఆదేశిస్తున్నా, ఇవేమీ పట్టనట్లు మేనేజర్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. -
ఎల్ఆర్ఎస్.. ఆఫర్
ఎల్ఆర్ఎస్ (లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం) వేగవంతానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్ ఫీజులో 25 శాతం రాయితీ ప్రకటించింది. దీనికి మార్చి 31లోపు గడువు విధించింది. పైగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే నేరుగా ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించింది. మెదక్జోన్: జిల్లావ్యాప్తంగా 21 మండలాలతో పాటు మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీల్లో ఐదేళ్ల కాలంలో 21,459 మంది ప్లాట్లను కొనుగోలు చేశారు. వీరంతా మీసేవ కేంద్రాల ద్వారా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ప్రారంభం కాగా కోర్టు కేసుతో 2022లో నిలిచిపోయింది. అనంతరం ఈ స్కీంపై ప్రభుత్వం దృష్టి పెట్టలేకపోయింది. 2023లో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎల్ఆర్ఎస్పై నిర్ణయం తీసుకుంది. ప్లాట్లను మూడు శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సక్రమంగా ఉంటేనే క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పింది. లేకుంటే తిరస్కరిస్తామని తెలిపింది. ఫీజు చెల్లించింది 144 మంది మాత్రమే నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 14,756 మంది, గ్రామీణ ప్రాంతంలో 6,703 మంది ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఇందులో మున్సిపాలిటీల పరిధిలో మూడు నెలల వ్యవధిలో అధికారులు 1,129 దరఖాస్తులను పరిశీలించారు. అందులో 282 సక్రమంగా లేవని తిరస్కరించారు. 842 దరఖాస్తులకు అనుమతి ఇచ్చారు. కానీ అందులో కేవలం 141 మంది మాత్రమే ఫీజు చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకున్నారు. ఇంకా 701 మంది ముందుకు రాలేదు. అలాగే గ్రామీణ ప్రాంతంలోని 21 మండలాల పరిధిలో 6,703 మంది దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు 562 దరఖాస్తులకు అనుమతి ఇవ్వగా.. అందులో కేవలం ముగ్గురు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వేగవంతం కానున్న ప్రక్రియ..! ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ వేగవంతం అవుతుందని పలువురు పేర్కొంటున్నారు. అయితే మార్చి 31 వరకు మాత్రమే గడువు ఇవ్వడంతో, ఆలోగా పూర్తిస్థాయిలో దరఖాస్తులు పరిశీలించటం సాధ్యమవుతుందా..? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్లాట్లను మూడు శాఖల అధికారులు పరిశీలించిన తర్వాతే క్రమబద్ధీకరణకు గ్రీన్సిగ్నల్ ఇస్తున్నారు. 40 రోజుల గడువు మాత్రమే ఉండటంతో దరఖాస్తుదారులు ముందుకు వస్తే అందుకు తగిన ఏర్పాట్లు చేసి, స్పెషల్ డ్రైవ్ చేపట్టే యంత్రాంగం ప్రస్తుతం అందుబాటులో లేదని తెలుస్తోంది. ప్లాట్ల కొనుగోలుదారులకు 25 శాతం రాయితీ మార్చి 31 వరకు గడువు జిల్లావ్యాప్తంగా 21,459 దరఖాస్తులు పరిశీలన పూర్తయినవి 1,691 -
పెన్షన్ డబ్బులు స్వాహా..
బ్యాంకు ఎదుట సొమ్మసిల్లిపడిపోయిన బాధితురాలువెల్దుర్తి(తూప్రాన్): వృద్ధురాలి బ్యాంకు అ కౌంట్ నుంచి గుర్తుతెలియని వ్యక్తులు రూ. 12 వేలు కాజేశారు. వైద్య ఖర్చుల కోసం డబ్బులు డ్రా చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్లగా.. ఖాతాలో డబ్బులు లేవని సిబ్బంది చెప్పడంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. మండల కేంద్రం మాసాయిపేటలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన శేషును పెంటమ్మ, పోచయ్య దంపతులకు ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. పోచయ్య గతంలోనే మృతిచెందడంతో పెంటమ్మకు ప్రభుత్వం నుంచి వితంతు పెన్షన్ వస్తుంది. అయితే కొన్నినెలలుగా అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్లోని కూతుర్ల వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ఇటీవల పెన్షన్ డబ్బులు డ్రా చేసుకోవడానికి స్వగ్రామానికి వచ్చింది. స్థానిక కెనరా బ్యాంకుకు వెళ్లగా ఖాతాలో డబ్బులు లేవని సిబ్బంది చెప్పారు. తన ఖాతాలో సుమారు ఆరు నెలల పెన్షన్ డబ్బులు రూ. 12 వేలు ఉండాలని, వాటిని ఇవ్వాలని కోరింది. ఈ విషయమై రెండు, మూడు రో జులుగా బ్యాంకు చుట్టూ తిరిగినా స్పందన లేకపోవడంతో బుధవారం బ్యాంకు ఎదుట బైఠాయించింది. ఈక్రమంలో నీరసించి కింద పడిపోయింది. తన ఇంటి నుంచి గుర్తుతెలియని వ్యక్తులు బ్యాంకు పాస్బుక్ దొంగిలించి అందులో వారి ఫొటోను జతపరిచి బ్యాంకు సిబ్బంది సహకారంతో పెన్షన్ డబ్బులు కాజేశారని ఆరోపించింది. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ నవీన్రెడ్డిని వివరణ కోరగా.. పూర్తి విచారణ జరిపి బాధితురాలికి తగిన న్యాయం చేస్తామని చెప్పారు. సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు తేలితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బ్యాంకు ఎదుట వృద్ధురాలి ఆందోళన -
మహిళా సంఘాలకు ఎన్నికలు!
సంగారెడ్డి జోన్: మార్చిలో మహిళా సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నారు. మార్చి నెలాఖరులోగా ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. మహిళా స్వయం సంఘాల బలోపేతానికి సంఘాల సభ్యులతో పాటు అధ్యక్షుల పాత్ర కీలకం. జిల్లాలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మహిళా సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాలకు కొత్త అధ్యక్షులను త్వరలో ఎన్నుకోనున్నారు. ఎన్నికల నిర్వహించేందుకు ఇప్పటికే మండల స్థాయిలోని ఏపీఎంతో పాటు సీసీలకు శిక్షణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. మహిళా సంఘాల సభ్యులకు ఎన్నిక నిర్వహణపై అవగాహన కల్పించనున్నారు. మూడు పద్దతులలో ఎన్నిక మహిళా స్వయం సహాయక సంఘాల ఎన్నిక ప్రక్రియ మూడు పద్దతులలో ఎన్నుకోనున్నారు. నిబంధనల మేరకు రిజర్వేషన్ ప్రకారం ఏకగీవ్రం, చేతులు పైకి ఎత్తి, చీటీలు రాసి ప్రక్రియలో ఏదైనా ఒక ప్రక్రియలో ఎన్నుకుంటారు. ప్రతి గ్రామంలో ఉన్న సంఘాల ద్వారా ఎన్నికై న అధ్యక్షులు గ్రామ సమాఖ్య అధ్యక్షురాలును ఎన్నుకుంటారు. ఎన్నికై న గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు అందరూ కలిసి మండల సమాఖ్య అధ్యక్షురాలుని, మండల సమాఖ్య అధ్యక్షురాలు కలిసి జిల్లా సమాఖ్య అధ్యక్షురాలిని ఎన్నుకుంటారు. మే నుంచి సంఘాలకు కొత్త అధ్యక్షులు కొనసాగనున్నారు. అధ్యక్షుల పదవీ కాలం పొడిగింపు గతంలో కంటే అధ్యక్షుల పదవీ కాలాన్ని పొడిగించినట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామైక్య సంఘం అధ్యక్షురాలి పదవీ కాలం ఐదేళ్లకు, మండల, జిల్లా సమాఖ్యలను మూడేళ్ల పాటు నిర్ణయించారు. అదే విధంగా గతంలో కంటే ప్రస్తుతం కమిటీలో సభ్యుల సంఖ్యను తగ్గించారు. మండల, జిల్లా సమాఖ్య సంఘానికి అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారితో కమిటీని ఎన్నుకోవాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మార్చిలో ఎన్నికల నిర్వహణపైఅధికారులకు శిక్షణ మే నుంచి సంఘాలకు కొత్త అధ్యక్షులు -
రైతుల అభివృద్ధికి కృషి చేయాలి
డీఏఓ వినయ్ విన్సెంట్ కౌడిపల్లి(నర్సాపూర్): నాణ్యమైన ఎరువులు, విత్తనాలు సరఫరా చేసి రైతుల అభివృద్ధికి డీలర్లు కృషి చేయాలని డీఏఓ వినయ్ విన్సెంట్ అన్నారు. బుధవారం మండలంలోని తునికి కేవీకేలో జాతీయ విస్తరణ యాజమాన్య సంస్థ, వ్యవసాయశాఖ, ఆత్మ సౌజన్యంతో 48 వారాల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న 40 మంది దేశి (డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్) డీలర్లకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీలర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. మోతాదుకు మించి ఎరువులు వాడకుండా చూడాలన్నారు. క్షేత్ర పర్యటన చేస్తూ చీడపీడల ఉధృతిని గమనించి ప్రారంభదశలోనే సరైన పురుగు, తెగులు మందులు వాడేలా చూడాలన్నారు. దీంతో రైతులకు పెట్టుబడి తగ్గి ఆదాయం పెరిగేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. చట్టానికి లోబడి మత్రమే డీలర్లు వ్యాపారం చేయాలని, రికార్డులు సక్రమంగా నిర్వహించాలన్నారు. అనంతరం కేవీకే హెడ్ అండ్ సైంటిస్ట్ శంభాజీ దత్తాత్రేయ మాట్లాడుతూ.. రైతులు జీవన ఎరువులు వాడేవిధంగా అలవాటు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఏడీఏ పుణ్యవతి, ఏఓ స్వప్న, దేశి కోఆర్డినేటర్లు అమరేష్కుమార్, నరేంద్ర, కేవీకే శాస్త్రవేత్త రవికుమార్, డీలర్లు పాల్గొన్నారు. పంట కోతలపై అవగాహన అవసరం నర్సాపూర్ రూరల్: పంట కోతలపై ప్రతి రైతుకు అవగాహన అవసరమని జిల్లా వ్యవసాయ అధికారి విన్సెంట్ వినయ్ అన్నారు. బుధవారం మండలంలోని ఇబ్రహీంబాద్, రెడ్డిపల్లి, లింగాపూర్, అవంచ రైతు వేదికల్లో ఆయా క్లస్టర్ల పరిధిలోని రైతులకు పంట కోతలపై అవగాహన కల్పించారు. పంట పూర్తి పక్వానికి వచ్చిన తర్వాతే కోతలు మొదలుపెట్టాలని సూచించారు. హార్వెస్టర్ ఆర్పీఎం 18 నుంచి 20 లేదా ఆపైన ఉండేలా చూసుకోవాలన్నారు. ధాన్యాన్ని తప్పకుండా ఎండబెట్టి కొనుగోలు కేంద్రాలకు తరలించాలని సూచించారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఏడీఏ సంధ్యారాణి, మండల వ్యవసాయ అధికారి దీపిక, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. -
వరి కోతల సమయంలో అప్రమత్తంగా ఉండాలి
కౌడిపల్లి(నర్సాపూర్): వరికోతల సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సురేష్ అన్నారు. బుధవారం మండలంలోని కౌడిపల్లి, మహమ్మద్నగర్, తునికి రైతువేదికల్లో రైతులకు వరికోతలు, జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి గింజలు పూర్తిగా గట్టిపడిన తర్వాతే కోత కోయాలన్నారు. వరికోత యంత్రాలను జా గ్రత్తగా నడిపేలా చూడాలన్నారు. ధాన్యంలో తాలు, మట్టి పెడ్డలు, ఇతర వ్యర్థాలు లేకుండా కొనుగోలు కేంద్రాలకు తరలించాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ పుణ్యవతి, ఏఓ స్వప్న, ఏఈఓలు సాహితి, సృజన, సౌజన్య రైతులు పాల్గొన్నారు. -
డంపుయార్డు.. మాకొద్దు
నర్సాపూర్: ప్యారానగర్లో డంపుయార్డు ఎత్తి వేయాలంటూ నర్సాపూర్లో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరహార దీక్షలు బుధవారం మూడో రోజుకు చేరాయి. దీక్షలకు మద్దతుగా గుమ్మడిదల మండలం నల్లవల్లికి చెందిన ప్రజలు తరలివచ్చా రు. స్థానిక నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. ఎస్ఐ శ్రీనివాస్ రాస్తారోకోను విరమింపచేయడంతో అక్కడి నుంచి రిలే దీక్ష శిబిరానికి చేరుకుని సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ.. డంపుయార్డుతో నర్సా పూర్ అడవులతో పాటు చెరువులు కలుషితమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీక్షలో జేఏసీ నాయకులు రాజేందర్, శ్రీధర్గుప్తా, రమణారావు, జగదీశ్వర్, నర్సింలు, ఆనంద్కుమార్, ఆంజిగౌడ్, దావూద్, జనార్దన్, సాగర్, మల్లేష్, చంద్రశేఖర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి
మెదక్జోన్: °gê-Ƈ$$-¡V>, °çÙµ„ýS-´ë-™èl…V> G°²-MýSÌS Ñ«§ýl$Ë$ °Æý‡ÓÇ¢…-^éÌS° sîæ^èlÆŠ‡ GÐðl$ÃÎÞ G°² MýSÌS ç³Ç-ÖÌS-MýS$yýl$ Ð]l$õßæ-ÔŒæ-§ýl™Œæ GM>P A¯é²Æý‡$. º$« §ýlÐéÆý‡… MýSÌñæ-MýSt-Æó‡-sŒæÌZ ¯øyýlÌŒæ A«¨-M>-Æý‡$ÌS™ø çÜÐ]l*-ÐólÔèæ… °Æý‡Ó-íßæ…-^éÆý‡$. DçÜ…§ýl-Æý‡Â…V> BĶæ$ ¯]l Ð]l*sêÏyýl$-™èl*.. çÜM>-ÌS…ÌZ KrÆŠ‡ íÜÏ糚ÌS¯]l$ ç³…í³×îæ ^ólĶæ*ÍÞ E…r$…-§ýl°, D G°²-MýSË$ »êÅÌñæsŒæ §éÓÆ>¯ól Mö¯]l-Ýë-VýS$-™éĶæ$° ÑÐ]l-Ç…-^éÆý‡$. ´ùÍ…VŠæ A«¨-M>-Æý‡$-Ë$V> Æð‡Ððl¯]l*Å, Ð]lÅÐ]l-Ýë-Ķæ$Ô>-Q, ç³…^éĶæ$¡Æ>gŒæ A«¨-M>-Æý‡$Ë$ Mö¯]l-Ýë-VýS$-™éÆý‡° A¯é² Æý‡$. ÒÇMìS ´ùÍ…-VŠæOò³ çÜÐ]l${VýS Õ„ýS×æ AÐ]l-çÜÆý‡-Ð]l$¯é² Æý‡$. G°²-MýSÌS íܺ¾…¨ MýSÌñæMýStÆŠ‡ HÆ>µr$ ^ólõÜ Ðéçßæ-¯]l…ÌZ Ð]l*{™èlÐól$ ÐðlâêÏ-ÌS-° çÜ*_…-^éÆý‡$. hÌêÏÐéÅ-ç³¢…V> HÆ>µr$ ^ólçÜ$¢¯]l² 21 ´ùÍ…VŠæ MóS…{§éÌZÏ 1,347 Ð]l$…¨ Kr$ çßæMýS$P Ñ°-Äñæ*-W…-^èl$Mø-¯]l$-¯é²Æý‡° ™ðlÍ-´ëÆý‡$. Gïܵ E§ýl-ÄŒæ$MýS$-Ð]l*-ÆŠ‡-Æð‡yìlz Ð]l*sêÏyýl$-™èl*.. çÜÐ]l$-ÝëÅ-™èlÃMýS ´ùÍ…VŠæ õÜtçÙ-¯]lÏOò³ {ç³™ólÅMýS §ýl–íÙt ÝëÇ-Ýë¢Ð]l$° ^ðl´ëµÆý‡$. çÜÐ]l*-ÐólÔèæ…ÌZ MýSÌñæMýStÆŠḥæÆ>çßæ$ÌŒ Æ>gŒæ, A§ýl-¯]lç³# MýSÌñæ-MýStÆŠ‡ ¯]lVóSÔŒæ, BÈz-KË$ Æý‡Ð]l*-§ól-Ñ, fĶæ$^èl…{§é-Æð‡yìlz, Ð]l$íßæ´ë-ÌŒæ-Æð‡yìlz, gñæyîlµ ïÜDK GÌSÏĶæ$Å, A«¨-M>-Æý‡$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. -
కేంద్ర బడ్జెట్ను సవరించాలి: సీపీఎం
మెదక్ కలెక్టరేట్: కేంద్ర బడ్జెట్ను సవరించి రైతులు, కార్మికులు, పేదలకు అధిక నిధులు కేటాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కడారి నర్సమ్మ డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం కలెక్టరేట్ ఏఓ యూనుస్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్పొరేట్ పన్నులు పెంచాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించాలన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ వారికి అప్పగించడం సరికాదన్నారు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేయరాదన్నారు. వెనుకబడిన తరగతులకు అధిక నిధులు కేటాయించకుండా సబ్ కా వికాస్ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం స్పందించి బడ్జెట్ను సవరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అజ్జమర్రి మల్లేశం, కోరెంకల మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు సంతోష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
మెదక్లో ఇంటర్మూల్యాంకన కేంద్రం
పాపన్నపేట(మెదక్): మెదక్లో ఇంటర్ పరీక్షల మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేసినట్లు జిల్లా గెజిటెడ్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో మెదక్కు సంబంధించిన ప్రశ్నాపత్రాలు సిద్దిపేట, సంగారెడ్డి పట్టణాల్లో మూల్యాంకనం చేసేవారని అన్నారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, కలెక్టర్ రాహుల్రాజ్, డీఐఓ మాధవి కృషితో మెదక్లో కేంద్రం ఏర్పాటు చేశారని చెప్పారు. పశువులకు వ్యాధులు సోకకుండా జాగ్రత్త పడాలి మనోహరాబాద్(తూప్రాన్): పశువులకు వ్యా ధులు సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పశు వైద్యాధికారి వెంకటయ్య రైతులకు సూచించారు. బుధవారం మండలంలోని పాలాటలో పశుగణాభివృద్ధి సంస్థ, సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా 240కు పైగా దూడలకు నట్టల నివారణ మా త్రలు, 42 పశువులకు గర్భకోశ చికిత్స చేశారు. గొర్రెలలో అమ్మతల్లి వ్యాధి రాకుండా టీకాలు వేశారు. కార్యక్రమంలో సహాయ సంచాలకులు తిరుపతి, మండల వైద్యులు లక్ష్మి, పున్నయ్య, మహేందర్రెడ్డి, గోపాలమిత్ర సత్యనారా యణ, సిబ్బంది కృష్ణకుమార్, రాజిరెడ్డి, అమరావతి, రామస్వామి, శేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వందశాతం ఫలితాలు సాధించాలి: డీఈఓ శివ్వంపేట(నర్సాపూర్): పదో తరగతిలో వందశాతం ఫలితాలు సాధించాలని డీఈఓ రాధాకిషన్ అన్నారు. బుధవారం మండలంలోని శివ్వంపేట, దొంతి, చెండి, కొంతాన్పల్లి ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. శ్రద్ధగా చదవుకోవాలని, పరీక్షలంటే భయపడవద్దని విద్యార్థులకు సూచించారు. అనుమానాలు, సమస్యలుంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. విద్యార్థులకు అల్పాహారంతో పాటు నాణ్యమైన భోజనం పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈఓ బుచ్చానాయక్, సీఆర్పీ రవీందర్, ఆ యా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రం సందర్శన మనోహరాబాద్(తూప్రాన్): ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాన్ని తూప్రాన్ డీఎస్పీ వెంకట్రెడ్డి బుధవా రం సందర్శించారు. ఈసందర్భంగా తూప్రాన్ సీఐ రంగాకృష్ణ, ఎస్ఐ సుభాష్గౌడ్కు పలు సూచనలు చేశారు. అధిక సంఖ్యలో కేసులు రాజీ కావాలి మెదక్ కలెక్టరేట్: జాతీయ లోక్ అదాలత్లో అధికంగా కేసులు రాజీపడేలా న్యాయవాదులు, పోలీస్ అధికారులు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద అన్నారు. బుధవారం జిల్లా ప్రధాన న్యాయస్థానం ఆవరణలో లోక్ అదాలత్కు సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా న్యాయ మూర్తి మాట్లాడుతూ.. మార్చి 8న జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి జితేందర్, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. కేతకీ హుండీ ఆదాయం రూ. 28 లక్షలు ఝరాసంగం(జహీరాబాద్): శ్రీ కేతకీ సంగమేశ్వర ఆలయం 76 రోజుల హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. గర్భగుడిలోని పార్వతీపరమేశ్వరులకు అభిషేకం, మహామంగళహారతి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హైదరాబాద్లోని శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు ఆదాయాన్ని లెక్కించారు. ఈ మేరకు రూ.28,07,500ల ఆదాయం వచ్చి నట్లు ఆలయాధికారులు వెల్లడించారు. -
చెంతనే నీరు.. ఎండుతున్న పైరు
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు మహేశ్దత్ ఎక్కా దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా మారింది అన్నదాతలపరిస్థితి. చెరువుల్లో పుష్కలంగా నీరున్నా ఆయకట్టు భూముల్లో సాగు చేసిన పంటలకు సరిపడా నీరు అందక ఎండిపోతున్నాయి. ఫలితంగా వేలాది రూపాయలు వెచ్చించి పంటలు సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు.మెదక్జోన్: జిల్లావ్యాప్తంగా 1,400కు పైగా చెరువులు ఉండగా.. వాటి ఆయకట్టు పరిధిలో సుమారు 50 వేల వరకు పంటలు సాగవుతున్నాయి. కాగా వీటిలో 60 శాతం చెరువు ఆయకట్టు భూముల్లో రైతులు యాసంగి పంటలు సాగు చేశారు. అయితే క్షేత్రస్థాయిలో చెరువులు, కుంటలను పర్యవేక్షించే (లస్కర్లు) సిబ్బంది కరువయ్యారు. దీంతో సాగునీటి చెరువులను పట్టించుకునే వారు లేకుండా పోయారు. గతంలో గ్రామాల్లో నీరడీ, మస్కూరులు ఉండగా.. వారు గ్రామాల్లోని పనులతో పాటు చెరువుల బాధ్యతను చూసేవారు. కాల్వల వెంట తిరిగి సాగుకు అవసరమయ్యే నీటిని వదిలేవారు. అయితే గత ప్రభుత్వ వీరిని తొలగించింది. పెద్ద చెరువుల ఆయకట్టులోనే.. జిల్లాలో 100 ఎకరాలు పైబడిన ఆయకట్టు చెరువులు పదుల సంఖ్యలో ఉన్నాయి. వాటిలో అతిపెద్దది మెదక్ మండలం కోంటూర్ చెరువు. దీని ఆయకట్టు 8 గ్రామాల పరిధిలో 15 వందల ఎకరాలకు పైగా సాగువుతోంది. చిన్నశంకరంపేట మండలం అంబాజిపేట చెరువు రెండో పెద్దది. దీని ద్వారా ఆరు గ్రామాల పరిధిలోని 14 వందల పైచిలుకు ఎకరాలకు సాగు నీరు అందుతోందని రికార్డులు చెబుతున్నాయి. అందులో అంబాజీపేట, శంకరంపేట, గవ్వలపల్లి, మల్లుపల్లి, చందాపూర్, జంగరాయి గ్రామాల పరిధిలోని పంట పొలాలకు సాగు నీరందుతోంది. కాగా ఈ ఏడాది వానాకాలంలో వర్షాలు పుష్కలంగా కురవటంతో ఈ చెరువు నిండుకుండలా మారింది. దాని పరిధిలోని ఆరు గ్రామాల రైతులు యాసంగిలో వరి పంటలను సమృద్ధిగా సాగు చేశారు. అయితే పంట కాలువల పూడిక తీయకపోవటంతో వాటిలో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. దీనికి తోడు ఇరిగేషన్ శాఖలో క్షేత్రస్థాయి సిబ్బంది కరువయ్యారు. ఆయకట్టు పరిధిలో ఎన్ని ఎకరాల్లో పంటలు సాగు చేశారు.. నీటిని ఏ మేరకు వదలాలనే నిబంధన లేకపోవటంతో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గవ్వలపల్లి శివారులో సాగునీరందక ఎండిపోయిన పొలం కాషాయమయం నీటిని వదిలి ఆదుకోవాలి అంబాజీపేట చెరువు ఆధారంగా ఆరెకరాల్లో వరి సా గు చేశా. పెట్టుబడికి ఇప్పటివరకు ఎకరాకు రూ. 15 వేలు ఖర్చు చేశా. సాగు నీరు వదలకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఆదుకోవాలి. – శేఖర్రెడ్డి, రైతు, జంగరాయి -
చిన్నమ్మకు నివాళి
చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని కామా రం గ్రామానికి చెందిన పీఏసీఎస్ చైర్మన్ అంజిరెడ్డి మాతృమూర్తి బాలమణి అంత్యక్రియల్లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్.సుభాష్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన చిన్నమ్మ బాలమణి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం అంజిరెడ్డి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీమన్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్లు, తోటి పీఏసీఎస్ చైర్మన్లు అంతిమయాత్రలో పాల్గొన్నారు.అంత్యక్రియల్లో పాల్గొన్న జస్టిస్ సుభాష్రెడ్డి -
బాల్య వివాహాలను అరికడదాం
నర్సాపూర్ రూరల్: బాల్య వివాహాలు అరికట్టే బాధ్యత అందరిపై ఉందని మిషన్ శక్తి జిల్లా మహిళా సాధికారిత విభాగం సభ్యురాలు నాగమణి అన్నారు. మంగళవారం నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారిత విభాగం, ఎన్ఎస్ఎస్ సేవా పథకం ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భ్రూణహత్యలు, లింగవివక్షత, సీ్త్రల అక్రమ రవాణా, లైంగిక వేధింపులు, బాల్యవిహాలు మహిళల పురోగతికి అవరోధంగా మారాయన్నారు. రాజ్యాంగపరంగా మహిళలకు ఎన్నో హక్కులు కల్పించినప్పటికీ పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లలను రక్షించి చదివించాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉందన్నారు. మహిళలకు సఖీ కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వేధింపులకు గురవుతున్న బాలికలు, మహిళులు మానసికంగా కృంగి పోకుండా ధైర్యంగా పోలీసులు, భరోసా కేంద్రాలను సంప్రదించాలని సూచించారు. సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు ఉద్బోధించారు. అనంతరం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సఖీ కేంద్రం అధికారిణి కళావతి ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ అడెప్ప, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సురేష్ కుమార్, అధ్యాపకులు సమీరా, రుక్మిణి, శ్రీనివాస్ విద్యార్థులు పాల్గొన్నారు.మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి నాగమణి బేటీ బచావో.. బేటీ పడావోపై అవగాహన -
అంగన్వాడీలు బాధ్యతాయుతంగా ఉండాలి
అల్లాదుర్గం(మెదక్): అంగన్వాడీ టీచర్లు విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా ఉండాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి హైమావతి అన్నారు. మండలంలోని ముస్లాపూర్లో మంగళవారం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీచర్లు సమయపాలన పాటించాలని, పిల్లలకు ప్రీస్కూల్ కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని చెప్పారు. ఆన్లైన్ రిపోర్టులు ఎప్పటికప్పుడు పూర్తి చేసి గ్రామాలలో బాల్యవివాహాలు జరగకుండా ఉండేందుకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. మేనరికం వివాహాల వల్ల అంగవైకల్యం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో సీడీపీఓ పద్మలత, డీహెచ్ఈడబ్లూ సంతోషి, ప్రాజెక్ట్ సూపర్వైజర్లు, పోషణ్ అభియాన్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.జిల్లా సంక్షేమ శాఖ అధికారి హైమావతి -
అపార్ఐడీ త్వరగా పూర్తిచేయండి
కౌడిపల్లి(నర్సాపూర్): విద్యార్థుల ఆపార్ ఐడీ త్వరగా పూర్తి చేయాలని గిరిజన సంక్షేమశాఖ సెక్టోరియల్ అధికారి జ్యోతి అన్నారు. మంగళవారం కౌడిపల్లిలోని ఎీస్టీ ఆశ్రమ పాఠశాలను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదిలో విద్యాబోధన, మధ్యాహ్న భోజనం, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని తెలిపారు. విద్యార్థుల ఆపార్ఐడీ కార్డులు వందశాతం పూర్తిచేయాలన్నారు. సమస్యలుంటే ఎంఈఓ, జిల్లా అధికారులకు తెలియజేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో హెచ్డబ్ల్యూఓ జయరాజ్, ఉపాధ్యాయులు దుర్గయ్య, నరేందర్, మంజూల, రాజేశ్వరీ, సత్యాగౌడ్, వినోద, గేమ్సింగ్, పీఈటీ పొనీల్కుమార్, ఏఎన్ఎం వెన్నెల, సీఆర్పీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.గిరిజన సంక్షేమశాఖ జిల్లా సెక్టోరియల్ అధికారి జ్యోతి -
పాలిటెక్నిక్తో.. కొలువు పక్కా!
● తక్కువ ఖర్చుతో సాంకేతిక విద్య ● ‘సాక్షి’తో మహిళా పాలిటెక్నికల్కళాశాల ప్రిన్సిపాల్ భవానిమెదక్ కలెక్టరేట్: పదో తరగతి అనంతరం విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యవైపు దృష్టి సారించాలని మెదక్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ భవాని సూచించారు. అతి తక్కువ ఖర్చుతో బంగారు బాటలు వేసేందుకు సాంకేతిక విద్యను అందిసున్నట్లు తెలిపారు. ప్రపంచమంతా ఏఐ వైపు పరుగులు పెడుతోందని.. ఈ సమయంలో సాంకేతిక నైపుణ్యత లేకుంటే భవిష్యత్లో ఉపాధి దొరకడం కష్టమేనని అన్నారు. పాలిటెక్నిక్ విద్యతో లభించే ప్రయోజనాలను సోమవారం ఆమె ‘సాక్షి’కి వివరించారు. డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పరిశ్రమలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందులో సాఫ్ట్వేర్, ఇంజనీరింగ్, ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, రైల్వే, ఎయిర్లైన్స్, ట్రాన్స్పోర్ట్, గనులు, ఎస్సీసీఎల్, ఇండియన్ ఆర్మీ, నేవి, ఆర్టీసీ, ట్రాన్స్కో, జెన్కో, బీహెచ్ఈల్, బీడీఎల్, బీఈఎల్, బీఎస్ఎన్ఎల్, డిఫెన్స్, ఎన్టీపీసీ వంటి పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. స్వయం ఉపాధి కూడా పొందవచ్చు. ఇందుకోసం బ్యాంకులు సైతం రుణాలు త్వరితగతిన అందజేస్తాయి. పాలిటెక్నిక్ డిప్లొమాలో కంప్యూటర్, ఏఐ, మెషిన్ లర్నింగ్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, మెకానికల్ ఇంజనీరింగ్ తదితర 24 కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.పాలిటెక్నిక్ అనంతరం ఉన్నత విద్యావకాశాలు ఉన్నాయి. అందులో ఈసెట్ ద్వారా యూనివర్సిటీ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో నేరుగా రెండో సంవత్సరంలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఎంసెట్ ద్వారా యూనివర్సిటీ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో నేరుగా ప్రవేశించవచ్చునని ప్రిన్సిపాల్ వివరించారు. మెదక్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్, సీఈసీ కోర్సులలో బోధించడానికి అనుభజ్ఞులైన అధ్యాపకులు ఉన్నట్లు తెలిపారు. అన్ని వసతులతో కూడిన ల్యాబ్లు, టెక్నికల్ పరికరాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. భవిష్యత్లో ఇంజనీరింగ్ చేసి త్వరితగతిన ఉద్యోగం సాధించాలనుకునే బాలికలకు మంచి అవకాశం ఉన్నట్లు తెలిపారు. హాస్టల్ వసతి కళాశాలతోపాటు పరిసరాల్లోనే బాలికలకు ప్రత్యేకంగా అన్ని వసతులతో కూడిన హాస్టల్ వసతి ఉన్నట్లు తెలిపారు. మహిళా వార్డెన్ అందుబాటులో ఉండి నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం హాస్టల్లో 102 మంది విద్యార్థులు ఉండి విద్యనభ్యసిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఇక్కడ విద్యనభ్యసించిన విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నట్లు తెలిపారు. పదో తరగతి అనంతరం బాలికలు అతితక్కువ ఖర్చుతో కూడిన పాలిటెక్నిక్ సాంకేతిక విద్యను ఎంచుకొని త్వరిగతిన ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ప్రిన్సిపల్ భవాని సూచించారు. -
బీజేపీవి మత రాజకీయాలు
మెదక్జోన్: బీజేపీవి మత రాజకీయాలని, కాంగ్రెస్తోనే ప్రజాస్వామ్య విలువలు కొనసాగుతాయని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 22న జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్రెడ్డి గెలుపు కోసం సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశానికి మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ హాజరు కానున్నట్లు తెలిపారు. బీజేపీ పాలనలో అన్ని వర్గాల వారికి నష్టం జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఇసుక, మట్టి మాఫియా అరాచకాలు అంతా ఇంత కాదన్నారు. దేశంలో ఏ పార్టీ చేయని కుల గణన, ఆరు గ్యారంటీలు అమలు చేసి కాంగ్రెస్ ఆదర్శంగా నిలిచిందన్నారు. బీజేపీకి మేలు చేసేందుకే బీఆర్ఎస్ పోటీలో అభ్యర్థిని నిలపలేదని విమర్శించారు. సమావేశంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, నాయకులు సుప్రభాత్రావు, సురేందర్ గౌడ్, రమణ, శ్రీనివాస్చౌదరి, ఆంజాగౌడ్, శ్రీనివాస్, పవన్, శేఖర్, రాజలింగం, మల్లేశం గౌడ్, మధుసుదన్రావు పాల్గొన్నారు.డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ -
బుధవారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
మెదక్ కలెక్టరేట్: వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో సాగునీరు, తాగునీరు, విద్యుత్ సరఫరా, రైతు భరోసా తదితర అంశాలపై ఆయాశాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వ్యవసాయ రంగం, తాగునీరు, విద్యుత్ అంతరాయం లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అర్హులందరికీ రైతుభరోసా అందేలా చూడాలన్నారు. అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ నగేష్, డీపీఓ యాదయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. స్కిల్ వర్సిటీ పనులు వేగవంతం చేయాలి పాపన్నపేట(మెదక్): మెదక్ జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి స్థలం గుర్తింపు పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని తమ్మాయపల్లి, పాపన్నపేట గ్రామశివారులో ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. యూనివర్సిటీ ఏర్పాటుకు 10 నుంచి 15 ఎకరాల భూమి అవసరమవుతుందని చెప్పారు. అనువైన భూమికి సంబంధించి ప్రతిపాదనలు తయారు చేసి, హైదరాబాద్లోని భూ పరిపాలనా విభాగం కార్యాలయానికి పంపాలని సూచించారు. ఆయన వెంట ఆర్డీఓ రమాదేవి, డిప్యూటీ తహసీల్దార్ మహేందర్ గౌడ్ ఉన్నారు. పదోన్నతి బాధ్యతను పెంచుతుంది మెదక్ కలెక్టరేట్: పదోన్నతి బాధ్యతను పెంచుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న 11 మంది జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు కేటాయించారు. పదోన్నతి పొందిన ఉద్యోగులు మంగళవారం కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని కలెక్టర్ అభినందించారు. వృత్తినే దైవంగా భావించి ప్రజలకు సేవలు అందించాలని సూచించారు.న్యూస్రీల్ -
అంగన్వాడీలకు మహర్దశ
వసతుల కల్పనకురూ. 90.52 లక్షలు మంజూరు ● ముమ్మరంగా సాగుతున్న పనులు జిల్లాలో అంగన్ వాడీ కేంద్రాలకు మహర్దశ కలగనుంది. ఆయా కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మెదక్జోన్: ఆట పాటలతో చిన్నారులకు ప్రాథమిక విద్యను అందించే అంగన్ వాడీ కేంద్రాలకు మంచి రోజులొచ్చాయి. ఆయా కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం రూ. 90.52 లక్షల నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం, చిన్న చిన్న మరమ్మతులు చేపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 1,075 అంగన్ వాడీ కేంద్రాలు ఉండగా, వాటిలో 369 సెంటర్లకు సొంత భవనాలు ఉన్నాయి. అద్దె భవనాల్లో 302, పాఠశాలలు, కమ్యూనిటీ హాల్స్లో 404 కేంద్రాలు కొనసాగుతున్నాయి. వాటిలో 52,780 మంది చిన్నారులు ప్రాథమిక విద్యనభ్యసిస్తున్నారు. కాగా అనేక కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేకపోవటంతో చిన్నారులు అవస్థలు పడుతున్నారు. దీంతో తాగునీటి వసతి, మరుగుదొడ్లు, మరమ్మతుల కోసం ‘సాక్ష్యం’పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కాగా జిల్లాలో 282 కేంద్రాల్లో మౌలిక వసతులు కరువయ్యాయి. 227 కేంద్రాల్లో మరుగుదొడ్లు లేకపోవటంతో చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. ఒంటికి, రెంటికి వస్తే ఇళ్లకు వెళ్లి తిరిగి పాఠశాలకు రావడం లేదు. ఈ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఒక్కో నిర్మాణానికి రూ. 36 వేల చొప్పున రూ. 81,72,000 నిధులు కేటాయించారు. అలాగే 40 కేంద్రాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండటంతో, ఒక్కో కేంద్రానికి రూ. 17 వేల చొప్పున రూ. 6,80,000 మంజూరయ్యాయి. వీటితో సంపు నిర్మాణం, భవనంపై ట్యాంకు, నల్లాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 15 అంగన్ వాడీ కేంద్రాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్నింటిలో తలుపులు, కిటీకీలు దెబ్బతినగా.. మరికొన్ని వర్షాకాలంలో ఉరుస్తున్నాయి. వీటిలో మరమ్మతుల కోసం మరో రూ. 2 లక్షలు మంజూరయ్యాయి. ఈ లెక్కన మొత్తం రూ. 90.52 లక్షల నిధులు మంజూరు కావటంతో పంచాయతీరాజ్శాఖ అధికారుల పర్యవేక్షణలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.జిల్లాలో ఇలా.. అంగన్ వాడీ కేంద్రాలు 1,075నూతనంగా నిర్మించే మరుగుదొడ్లు 227తాగునీటి సౌకర్యం కల్పించే కేంద్రాలు 40కేటాయించిన నిధులు (లక్షల్లో) రూ.90.52పనులు చకచకా సాగుతున్నాయి అంగన్వాడీ కేంద్రాల్లో టాయిలెట్స్, తాగునీటి వసతిలేక చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం నిధులు మంజూరు కావడంతో పనులు చక చక కొనసాగుతున్నాయి. దీంతో శాశ్వతంగా సమస్యలు తీరనున్నాయి. – హైమావతి, డీడబ్ల్యూఓ -
రేపటి నుంచి పారిశుద్ధ్య కార్మికుల సమ్మె
సీఐటీయూ ఉపాధ్యక్షురాలు బాలమణి ప్రకటన రామాయంపేట(మెదక్): తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పారిఽశుద్ధ్య కార్మికులు మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి మాట్లాడుతూ.. ఈనెల 20 నుంచి సమ్మె చేస్తామని, పారిశుద్ధ్య పనులు బంద్ చేస్తామని ప్రకటించారు. కార్మికుల సమస్యల పరిష్కారం విషయమై ఎవరూ పట్టించుకోవడంలేదని విమర్శించారు. జూలై నుంచి పీఎఫ్, ఈఎస్ఐ వారి ఖాతాల్లో జమ కావడం లేదని, వెట్టిచాకిరీ చేస్తున్న కార్మికులకు ఇస్తున్న నెలవారీ వేతనాలు సైతం సక్రమంగా రావడం లేదన్నారు. వారికి ఇవ్వాల్సిన సబ్బులు, మాస్కులు, గ్లౌవుజులు సైతం ఇవ్వడంలేదని వాపోయారు. రేపటి నుంచి ఎలక్ట్రిక్ బగ్గీల పోటీలు నర్సాపూర్ : బీవీ రాజు ఇంజనీరింగ్ కాలేజీలో 20 నుంచి 25 వరకు ఎలక్ట్రిక్ బగ్గీల పోటీలు ప్రారంభ మవుతాయని ప్రిన్సిపాల్ సంజయ్ దూబె తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జాతీయ స్థాయి ఈ బాహ –సే ఇండియా 2025ను తమ కాలేజీలో వరుసగా రెండోసారి నిర్వహించడం ఆనందించదగ్గ విషయమన్నారు. పోటీల ద్వారా విద్యార్థులు తమలోని నైపుణ్యాన్ని పెంచుకోవడంతోపాటు నిబద్ధత ప్రదర్శించే అవకాశం లభిస్తుందన్నారు. పోటీల్లో పలు రాష్ట్రాలకు చెందిన 85 ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన విద్యార్థుల జట్లు పాల్గొంటాయని పేర్కొన్నారు. ఈ పోటీలు వివిధ దశల్లో ఉంటాయని తెలిపారు. ఆయన వెంట కాలేజీ ప్రొఫెసర్లు రాయుడు, దశరథ రామయ్య, తదితరులు పాల్గొన్నారు. ప్రశ్నించే గొంతుకను ఎమ్మెల్సీగా గెలిపించండిసంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి చిన్నశంకరంపేట(మెదక్): ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకనే ఎమ్మెల్సీగా గెలిపించాలని సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి కోరారు. మంగళవారం నార్సింగి మండల కేంద్రంలో మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మల్లేశంగౌడ్తో కలిసి తన భర్త ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు, జెడ్పీ పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక గ్రాడ్యుయేట్స్ను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సామాజిక రంగంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడంతోపాటు ప్రజల కోసం పని చేసే వారిని గెలిపించాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే గుంపులో ఒకడిగా ఉంటాడు తప్పితే ప్రజల సమస్య పట్టవన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యపాల్రెడ్డి, గోవింద్, గణేశ్, పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్, బీజేపీ నాయకులు లింగారెడ్డి, నర్సింహులు, గురుపాథం, హరిబాబు, నరేశ్, సంతోష్రెడ్డి, చంద్రశేఖర్గౌడ్ పాల్గొన్నారు. శత శాతం ఉత్తీర్ణత సాధించాలి డీఈఓ రాధాకిషన్ పాపన్నపేట(మెదక్): పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణత సాథించాలని జిల్లా విద్యాశాఖాధికారి రాధాకిషన్ అన్నారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని కుర్తివాడ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులు ప్రాక్టీస్ టెస్ట్ ఎలా రాస్తున్నారో పరిశీలించారు. వచ్చే నెలలో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, మిగిలిన కొన్ని రోజులు ముఖ్యమైనవని చెప్పారు. సమయాన్ని వృథా చేయకుండా చదవాలని సూచించారు. ఉపాధ్యాయులు ప్రణాళిక ప్రకారం విద్యార్థులను సమాయత్తం చేయాలని కోరారు. ఆరవ తరగతి విద్యార్థులతో పాఠాలు చదివించారు. అనంతరం పాఠశాల రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట ఏఎంఓ సుదర్శన మూర్తి, హెచ్ఎం శ్రీనివాస్ రావు ఉన్నారు. -
పదిలో ఉత్తీర్ణతశాతం పెంచాలి
జెడ్పీ సీఈఓ ఎల్లయ్య కొల్చారం(నర్సాపూర్): పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అన్నారు. మంగళవారం మండలంలోని రంగంపేట ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ప్రధానోపాధ్యాయుడు ఉపేందర్ రెడ్డి, ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థులు పరీక్షలు అంటే భయం లేకుండా పూర్తి సన్నద్ధం చేయాలని సూచించారు. పాఠశాలలోని సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక్కడి పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న సిబ్బందిని అభినందించారు. ప్రత్యేక వంటశాల లేకపోవడంపై మధ్యాహ్న భోజన సిబ్బంది సీఈఓ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయమే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పీడీ శ్రీధర్ రెడ్డి ఉన్నారు. -
బ్యాంక్ లింకేజీ లక్ష్యాన్ని సాధించండి
వెల్దుర్తి(తూప్రాన్): బ్యాంక్ లింకేజీ కింద అర్హులైన స్వయం సహాయక సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలని డీఆర్డీఓ శ్రీనివాసరావు ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం వెల్దుర్తి మండల సమైఖ్య కార్యాలయంలో నిర్వహించిన వీవోఏల రివ్యూ మీటింగ్కు ఆయన హాజరై పలు సలహాలు, సూచనలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బ్యాంకు లింకేజీ టార్గెట్ 130 శాతం చేయాలని, బ్యాంకు లింకేజీ ఎన్పీఏని 0.5 శాతానికి తగ్గించాలని సూచించారు. సీ్త్ర నిధి టార్గెట్ అచీవ్మెంట్ 130 శాతం చేయాలని, సీ్త్ర నిధి ఎన్పీఏని 0.5 శాతానికి తగ్గించాలన్నారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రతీ మహిళా ఒక్కొ మొక్క నాటాలని వివరించారు. కార్యక్రమంలో సీ్త్రనిధి ఆర్ఎం గంగారాం, ఏపీఎం శంకరయ్య, సీసీలు సత్యం, యాదగిరి, కిషన్, రజిత, సీ్త్రనిధి ఏఎం కరుణాకర్, వీవోఏలు పాల్గొన్నారు.డీఆర్డీఓ శ్రీనివాసరావు -
సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలి
మెదక్ మున్సిపాలిటీ: ప్రతి ఒక్కరూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి సిబ్బందికి సూచించారు. సోమ వారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నూతనంగా నియామకమైన రెండో బ్యాచ్ సిబ్బంది శిక్షణ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 30 ఏళ్ల పోలీస్ డిపార్ట్మెంట్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని వివరించారు. జిల్లాలో పగలు, రాత్రి సమయాల్లో జరిగిన దొంగతనాల్లో పోయిన డబ్బు కంటే ఆన్లైన్ మోసాలతో పోగొట్టుకున్న డబ్బే ఎక్కువన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నత విద్య అభ్యసించిన వారే కాబట్టి, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించి నేర రహిత జిల్లాగా మార్చాలన్నారు. అంతకుముందు జిల్లాస్థాయి ప్రజా వాణి నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బీజేపీకి గుణపాఠం తప్పదు గజ్వేల్: అమెరికా కొత్త ఆంక్షల వల్ల ఇబ్బందిపడుతున్న భారతీయులకు ప్రధాని మోదీ అండగా నిలవాలని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి డిమాండ్ చేశారు. సోమ వారం గజ్వేల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అమెరికా అంశంపై స్పందించాలన్నారు. సీఎం రేవంత్రెడ్డి మాదిరిగా దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ డిమాండ్ చేస్తుండగా, బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై కులం, మతం పేరిట విమర్శలు చేయడం తగదన్నా రు. రాహుల్గాంధీ కుటుంబం దేశం కోసం చేసిన త్యాగాలు ప్రజలందరికీ తెలుసునని అభిప్రాయపడ్డారు. బీజేపీ అసంబద్ద విధానాలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. -
బగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు
శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రంలోని బగలాముఖి అమ్మవారి శక్తి పీఠం ద్వితీయ వార్షికోత్సవం ఆలయ వ్యవస్థాపకులు వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో సోమవారం వైభవంగా నిర్వహించారు. 116 కలశాల గంగాజలం, పసుపునీటితో అమ్మవారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవాని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్రెడ్డి పూజలో పాల్గొన్నారు. అమ్మవారి ఆలయం ఇక్కడ నిర్మించడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. పూజా కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
హెల్ప్డెస్క్కు ఫిర్యాదుల వెల్లువ
మెదక్ కలెక్టరేట్: హెల్ప్డెస్క్ ద్వారా నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు 68 వినతులు సమర్పించారు. అందులో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్ల కోసం అధికంగా ఉన్నాయి. నకిలీ పట్టాతో భూమి కబ్జా.. తాతల కాలం నుంచి కాస్తులో ఉండి పట్టా కలిగిన ఆరెకరాల భూమిని, మా గ్రామానికి చెందిన కొందరు నకిలీ పట్టా పాస్ పుస్తకాలు సృష్టించి కబ్జాకు పాల్పడుతున్నారని కౌడిపల్లి మండలం మహ్మద్నగర్కు చెందిన వడ్ల అంజయ్య హెల్ప్డెస్క్లో ఫిర్యాదు చేశారు. ఆరేళ్లుగా అధికారులు, కోర్టులు, పోలీసుల చుట్టూ తిరుగుతున్న న్యాయం జరగడం లేదని వాపోయారు. రాజకీయ పలుకుబడి, ఆర్థిక బలంతో మా కుటుంబాన్ని వేధిస్తున్నారని.. పొలం వద్దకు వెళ్తే దౌర్జన్యం చేస్తూ చంపుతామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై న కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని కోరారు. -
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి
● ప్రజల అభిప్రాయం ఇదే.. ● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డిరామాయంపేట(మెదక్): కేసీఆర్ మళ్లీ సీఎం కా వాలని ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి అన్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా సోమవారం రామాయంపేటలో 72 కిలోల కేక్ను కట్ చేసి మాట్లాడారు. అధికార పార్టీ అభివృద్ధిని మరిచిందని, సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో అన్నివర్గాల వారు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. పూటకో మాట మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు ప్రజలను మోసగిస్తున్నారని మండిపడ్డారు. రైతులు, ప్రజలు ధైర్యంగా ఉండాలని.. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని భరోసా ఇచ్చారు. అభివృద్ధి కుంటుపడిందని, రాష్ట్ర ప్రభుత్వం ఎంతమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ జితేందర్గౌడ్, బీఆర్ఎస్ యూత్ విభాగం మండలాధ్యక్షుడు ఉమా మహేశ్వర్, సహకార సంఘం చైర్మన్ బాదె చంద్రం, నాయకులు కొండల్రెడ్డి, అహ్మద్, హస్నొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ను కలిసిన పద్మారెడ్డి దంపతులు మెదక్ మున్సిపాలిటీ: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా సోమవారం ఎరవ్రల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఆయనను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి దంపతులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ వైస్చైర్మన్ మల్లికార్జున్గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్లు బట్టి జగపతి, కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. -
ట్రామా ‘కేర్’ ఏదీ?
సెంటర్ ఏర్పాటులో తీవ్ర జాప్యం రామాయంపేట(మెదక్): రామాయంపేటలో ట్రామా కేర్ సెంటర్ ప్రతిపాదనలకే పరిమితమైంది. జాతీయ రహదారులు, జిల్లా శివారులో ఉన్న పట్టణ ఆస్పత్రుల్లో సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించినా అమలుకు నోచుకోవడం లేదు. రామాయంపేట మీదుగా జాతీయ రహదారి– 47తో పాటు నూతనంగా నిర్మిస్తున్న 765 డీజీ విస్తరించి ఉన్నాయి. రామాయంపేట పోలీస్ సర్కిల్ పరిధిలో చేగుంట, చిన్నశంకరంపేట, రామాయంపేట, నార్సింగి, నిజాంపేట, నార్సింగి మండలాలున్నాయి. వీటిలో రామాయంపేట, నార్సింగి, చేగుంట మండలాలు జాతీయ రహదారి 47పై ఉన్నాయి. ఈ రహదారిపై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. దీంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బాధితులను వైద్య సేవల కోసం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలిస్తున్నారు. అయితే అక్కడ సరైన వైద్య సేవలు అందక ఇబ్బంది పడుతున్నారు. ఆర్థోపెడిక్ సేవలు అందుబాటులో లేకపోవడంతో క్షత్రగాత్రులను 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అక్కడ సకాలంలో వైద్య సేవలు అందక మధ్యలోనే చాలా మంది మృత్యువాత పడుతున్నారు. అయితే ట్రామా కేర్ సెంటర్లలో ప్రమాద బాధితులకు సత్వరమే శస్త్ర చికిత్స చేయడానికి వీలుగా అన్ని విభాగాలకు సంబంధించిన నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉంటారు. అలాగే ఆస్పత్రికి ప్రత్యేకంగా అంబులెన్స్ సదుపాయం ఉంటుంది. ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు కోసం అధికారులు పలుమార్లు ప్రతిపాదనలు పంపినా మంజూరు రాలేదు. ఇటీవల వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో సైతం ఈ అంశం ప్రస్తావించారు. ఇదే విషయమై జిల్లా ఆస్పత్రిల కోఆర్డినేటర్ డాక్టర్ శివదయాళ్ను వివరణ కోరగా .. రామాయంపేటలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు అవసరమని, ఇందుకోసం గతంలోనే ప్రతిపాదనలు పంపామని తెలిపారు. సెంటర్ ఏర్పాటైతే రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షత్రగాత్రులకు సకాలంలో వైద్య సేవలు అందే అవకాశం ఉంటుందన్నారు. -
నాణ్యతలో రాజీ పడొద్దు
MýSÌñæMýStÆŠḥæÆ>çßæ$ÌŒ Æ>gŒæమెదక్జోన్: ‘మాత’కు అరకొర అహారం శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ రాహుల్రాజ్ స్పందించారు. సోమవారం ఎంసీహెచ్ను తనిఖీ చేశారు. పీడీయాట్రిక్, ఐసీవార్డు, గైనిక్ ఆపరేషన్ వార్డులతో పాటు ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. నాణ్యమైన భోజనం అందుతుందా..? అడిగి బాలింతలను అడిగి తెలుసుకున్నారు. క్యాంటిన్లో అహార పదార్థాలను పరిశీలించారు. నాణ్యతలో రాజీ పడొద్దని.. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం అందజేయాలని నిర్వాహకులను ఆదేశించారు. అనంతరం వైద్యులతో కలిసి ఆస్పత్రిలో భోజనం చేశారు. కలెక్టర్ వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ శివదయాల్, ఆర్ఎంఓ షర్మిల, ప్రిన్సిపాల్ రవీంద్రకుమార్, వైద్యులు ఉన్నారు. సేవాలాల్ జీవితం ఆదర్శం మెదక్ మున్సిపాలిటీ: బంజారా సమాజానికి సద్గురువు సంత్ సేవాలాల్ మహారాజ్ అని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. సోమవారం ఉదయం పట్టణంలోని సంత్ సేవాలాల్ మహారాజ్ మందిరంలో నిర్వహించిన పూజలో పాల్గొని మాట్లాడారు. సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని బంజారా సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టేలా వేడు కలు నిర్వహించడం శుభ పరిణామం అన్నా రు. సమాజ హితం కోసం ఆదర్శవంతమైన జీవి తం గడిపిన సంత్ సేవాలాల్ మహారాజ్ సేవల ను కొనియాడారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ అధికారి నీలిమ తదితరులు పాల్గొన్నారు. -
నరేందర్రెడ్డిని ఆదరించండి
నర్సాపూర్ రూరల్: కాంగ్రెస్ బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్రెడ్డిని గెలిపించాలని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసినిరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యావంతుడైన నరేందర్రెడ్డిని కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉంచిందన్నారు. పూటకో పార్టీ మారే వ్యక్తికి పట్టభద్రులు ఓటు వేసి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 52 వేల మందికి ఉద్యోగాలు కల్పించడంతో పాటు 72 వేల మందికి పదోన్నతులు కల్పించిందన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మకయ్యాయని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చింతల కరుణాకర్రెడ్డి, శ్రీనివాస్గుప్తా, కృష్ణ, మణిదీప్, సుధీర్గౌడ్, హకీం, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
అరణ్య రోదన!
మంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025పచ్చని అందాలు పంచిన అడవులు ఆగ్నికి ఆహుతవుతున్నాయి. వేసవి వచ్చిందంటే ఆకులు రాల్చి, మోడుబారి కనిపిస్తాయి. ఈ సమయంలో మానవ తప్పిదమా..? లేక ఇతర కారణాలు ఏవో కాని ఏదో ఒక చోట అడవి దగ్ధమౌతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 17 చోట్ల మంటలు చెలరేగి 30 ఎకరాలు కాలి బూడిదయ్యాయి. ఫైర్లైన్స్ అంతంత మాత్రంగానే ఉండడం.. ఆశాఖ అధికారుల పట్టింపులేని తనంతో తీవ్ర నష్టం జరుగుతుంది. అగ్నికి ఆహుతవుతున్న అడవులుమెదక్జోన్: జిల్లావ్యాప్తంగా 58 వేల హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. అటవీ చట్టం ప్రకారం భూ భాగానికి 33 శాతం అడవులు ఉంటేనే సకాలంలో వర్షాలు కురవటంతో పాటు వాతావరణ సమతుల్యత బాగుంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా జిల్లాలో 4 లక్షల పైచిలుకు ఎకరాల భూములకు గానూ కేవలం 24 శాతం మాత్రమే అడవులు ఉన్నాయి. వీటికి సరైన రక్షణ కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా దృష్టి సారించడం లేదు. గతేడాది 207 ఎకరాల్లో దగ్ధం జిల్లాలోని అడవిని ఆరు రేంజ్లుగా (మెదక్, తూప్రాన్, రామాయంపేట, కౌడిపల్లి, పెద్దశంకరంపేట, నర్సాపూర్) విభజించారు. వీటి పరిధిలో 58 వేల హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉండగా.. 604 కిలోమీటర్ల పొడవు ఫైర్లైన్స్ ఉన్నాయి. ఏటా ఫిబ్రవరి రాగానే ఫైర్లైన్స్ వేస్తే అడవులకు రక్షణగా ఉంటుంది. కానీ ప్రభుత్వం నుంచి చెప్పుకోదగిన నిధులు విడుదల కాకపోవడంతో సిబ్బంది పూర్తిస్థాయిలో ఫైర్లైన్స్ వేయడం లేదు. దీంతో ఏటా వేసవిలో అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి. అడవుల మధ్యలో ఉన్న రహదారుల వెంట ఆకులు రాలిపోగా, అటుగా వెళ్లేవారు బీడీ, చుట్ట, సిగరేట్ కాల్చి రోడ్డు పక్కన పడేయడంతో ఎండిపోయిన ఆకులకు అగ్గి అంటుకొని మంటలు వ్యాపిస్తున్నాయి. గతేడాది జిల్లావ్యాప్తంగా 135 చోట్ల మంటలు అంటుకొని సుమారు 207 ఎకరాల్లో ఫారెస్ట్ కాలిపోయిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 17 చోట్ల మంటలు వ్యాపించి 30 ఎకరాల్లో దగ్ధం అయింది. వేసవి వచ్చిందంటే జిల్లాలో నిత్యం ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఏటా అడవులు అగ్నికి ఆహుతి కావడంతో విస్తరించాల్సిన అడవులు అంతరించి పోతున్నాయి. మంటలో అడవులు కాలిపోయినప్పుడు చిన్నచిన్న మొక్కలు పూర్తిగా కాలి బూడదవుతున్నాయి. ఫలితంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. న్యూస్రీల్ బూడిదవుతున్న పచ్చని చెట్లు జిల్లాలో 58 వేల హెక్టార్లలో విస్తరణ ఫైర్లైన్స్ అంతంతే.. జిల్లావ్యాప్తంగా 604 కిలోమీటర్ల పొడవునా ఫైర్లైన్స్ వేయాల్సి ఉంది. అయితే గతేడాది కేవలం 14 కిలో మీటర్లలో ఫైర్లైన్ వేసేందుకు రూ. 1.50 లక్షల నిధులు విడుదల అయ్యాయి. ఇంకా 590 కిలోమీటర్ల ఫైర్లైన్ గాలికి వదిలేశారు. అడవుల రక్షణ కోసం సరైన నిధులు విడుదల కావడం లేదని సంబంధిత అధికారి ఒకరు చెప్పారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుని అడవుల రక్షించాలని పలువురు కోరుతున్నారు. -
పకడ్బందీగా డిజిటల్ సర్వే
నర్సాపూర్ రూరల్: డిజిటల్ పంట సర్వే పకడ్బందీగా చేపట్టాలని నర్సాపూర్ వ్యవసాయ శాఖ ఏడీ సంధ్యారాణి ఏఈఓలకు సూచించారు. సోమవారం నర్సాపూర్ డివిజన్ పరిధిలోని నర్సాపూర్, తూప్రాన్, మనోహరాబాద్ శివ్వంపేట మండలాల్లో కొనసాగుతున్న డిజిటల్ పంట సర్వే నమోదును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నర్సాపూర్ మండలంలో 6,947 ఎకరా ల్లో డిజిటల్ సర్వే పూర్తయిందని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసా య అధికారిణి దీపిక, ఏఈఓ చంద్రవేణి, రైతులు పాల్గొన్నారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం చిన్నశంకరంపేట(మెదక్)/శివ్వంపేట(నర్సాపూర్): మండలంలోని జంగరాయి సబ్స్టేషన్ పరిధిలో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ ఏఈ దినకర్ తెలిపారు. వెల్దుర్తి 132 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో మరమ్మతులు చేపట్టనున్నట్లు చెప్పారు. దీంతో జంగరాయి, చందాపూర్, ఎర్రగుంట తండాలో నేడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుందన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు. అలాగే పాంబండ 33/11 కేవీ సబ్స్టేషన్లో మరమ్మతుల కారణంగా పాంబండ, పోతులబొగూడ, ఉసిరికపల్లి, బీమ్లతండాలో నేడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ సాయికుమార్ తెలిపారు. కేసీఆర్ను కలిసిన ఎమ్మెల్యే సునీతారెడ్డి నర్సాపూర్ రూరల్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సోమవారం సాయంత్రం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి తన కుమారులు శ్రీనివాస్రెడ్డి, శశిధర్రెడ్డితో కలిశారు. ఈసందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అవగాహనతోనే క్షయ దూరం చేగుంట(తూప్రాన్): క్షయ నివారణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని డీఎంహెచ్ఓ శ్రీరామ్ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన టీబీ నిర్ధారణ పరీక్ష కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా గ్రా మాల్లోని ప్రజలకు వంద రోజుల టీబీ కార్యక్రమంపై అవగాహన పెంపొందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. 170 మందికి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ నవీన్, చేగుంట, నార్సింగి మండలాల ఆరోగ్య కేంద్రాల సిబ్బంది, ఆశావర్కర్లు పాల్గొన్నారు. ‘పార్టీలకతీతంగా పోరాడుదాం’నర్సాపూర్ రూరల్: ప్యారానగర్లోని పచ్చని అడవిలో ఏర్పాటు చేస్తున్న డంపుయార్డ్ను ఎత్తేసే వరకు పార్టీలకతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నర్సాపూర్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలిపి మాట్లాడారు. డంపుయార్డ్ ఏర్పాటుతో ఐదు మండలాల ప్రజలకు ముప్పు ఉందన్నారు. నర్సాపూర్ రాయరావు చెరువు, ఆయకట్టు, హత్నూర, కొల్చారం మండలాల్లోని మంజీరా నది కలుషితం అయ్యే ప్రమాదం ఉందన్నారు. డంపుయార్డ్ ఎత్తేసే వరకు వివిధవర్గాలు పోరాటం చేయాలన్నారు. దీనికి పూర్తిస్థాయి మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు. రిలే నిరాహార దీక్షకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీయాదవ్ సైతం మద్దతు పలికారు. కార్యక్రమంలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్తో పాటు ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
భయం వీడి పరీక్షలకు సిద్ధం కావాలి
డీఈఓ రాధాకిషన్కౌడిపల్లి(నర్సాపూర్): విద్యార్థులు భయం వీడి పరీక్షలకు సిద్ధం కావాలని డీఈఓ రాధాకిషన్ అన్నా రు. సోమవారం మండలంలోని వెల్మకన్న, కొట్టాల పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థు ల్లో నమ్మకం, మనోధైర్యం నింపేందుకు ప్రస్తుతం ప్రాక్టీస్, ఫ్రీ ఫైనల్ టెస్ట్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. జిల్లాలో ఈఏడాది 10,300 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారని వివరించారు. మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట ఎంఈఓ బాలరాజు, హెచ్ఎం సరోజ, ఉపాధ్యాయులు ఉన్నారు. -
హెల్ప్డెస్క్ ద్వారా వినతుల స్వీకరణ
మెదక్ కలెక్టరేట్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో హెల్ప్డెస్క్ ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని కలెక్టర్ రాహుల్రాజ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నట్లు తెలిపారు. ప్రజలు తమ దరఖాస్తులను హెల్ప్డెస్క్లో అందజేయాలని సూచించారు. మల్లన్న జాతరకు రండి చేగుంట(తూప్రాన్): మండలంలోని ఇబ్రహీంపూర్ మల్లన్న జాతరకు రావాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్కు హైదరాబాద్లో ఆదివారం నాయకులు ఆహ్వానపత్రిక అందజేశారు. ఈనెల 23న భ్రమరాంబ సహిత మల్లికార్జునస్వామి సప్తమ వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నవీన్, ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. డంప్యార్డ్కు వ్యతిరేకంగా పోరాటం నర్సాపూర్: ప్యారానగర్లో నిర్మిస్తున్న డంప్యార్డుకు వ్యతిరేకంగా రోజుకో కార్యక్రమం చేపట్టాలని జేఏసీ నిర్ణయించింది. ఆదివారం మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు సమావేశమై చర్చించారు. సోమవారం నుంచి డంప్యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ పార్టీలకతీతంగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజలు, రైతులకు అవగాహన కల్పించి నిరసనలో పాల్గొనే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమావేశంలో ఆయా పార్టీల నాయకులు రాజేందర్, శ్రీధర్గుప్తా, భిక్షపతి, శ్రీశైలంయాదవ్, రమణారావు, బుచ్చెష్యాదవ్, శ్రీనివాస్గుప్తా, రాంచందర్, యాదగిరి, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. దేశానికి మోదీ పాలన అవసరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్ రామాయంపేట(మెదక్): దేశానికి మోదీ పాలన అవసరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అ భ్యర్థి అంజిరెడ్డికి మద్దతుగా ఆదివారం రామాయంపేటలో ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ పాలన పట్ల ప్రపంచదేశాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయని కొనియాడారు. అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, రాష్ట్ర కా ర్య వర్గ సభ్యుడు సిద్దరాంలు, పట్టణ అధ్యక్షుడు అవినాశ్రెడ్డి, మండలాధ్యక్షుడు నవీన్గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి దిలీప్, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముగిసిన స్కౌట్స్, గైడ్స్ శిక్షణ మెదక్ కలెక్టరేట్: మెదక్ అవుట్ డోర్ స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహించిన స్కౌట్స్, గైడ్స్ శిక్షణ శిబిరం ఆదివారం ముగిసినట్లు జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రధాన కార్యదర్శి ఇప్ప రాజేందర్ తెలిపారు. ఇందులో మొత్తం 36 మంది స్కౌట్ మాస్టర్స్, 19 మంది గైడ్ కెప్టెన్లు శిక్షణ పొందినట్లు చెప్పారు. అనంతరం వారు తమ పాఠశాలలో స్కౌట్ కార్యక్రమాలు పిల్లలకు నేర్పిస్తారని విరించారు. కార్యక్రమంలో శిక్షకులు మోహన్రావు, గట్టు వెంకట రమణమ్మ, రవికిరణ్ చారి, మహిపాల్, శివకుమార్, రాగేంద్ర, సంధ్య, కమల పాల్గొన్నారు. -
హాల్టింగ్ ఎప్పుడో!
మిర్జాపల్లిలో ఆగని ఎక్స్ప్రెస్ రైళ్లు ● ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని మిర్జాపల్లి రైల్వేస్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం ఎప్పుడు కల్పిస్తారోనని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. అప్పటి రైల్వే జీఎం సికింద్రాబాద్– నిజామాబాద్ రైల్వే మార్గంలో ప్రయాణించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ విషయమై స్పష్టత వస్తుందని ప్రజలు భావించారు. వినతిపత్రాలు స్వీకరించారే గాని ఎటువంటి హామీ ఇవ్వకపోవటంతో నిరుత్సాహానికి గురయ్యారు. నేటికీ ఎక్స్ప్రెస్ రైళ్లు మిర్జాపల్లిలో ఆగకుండా పరుగులు తీస్తున్నాయి. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా మెదక్ ఎంపీ రఘునందన్రావును కలిసిన బీజేపీ నాయకులు అజంతా ఎక్స్ప్రెస్ హాల్టింగ్కు సహకరించాలని వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ను కలిసి విన్నవించారు. గతంలో అజంతా, జైపూర్, అజ్మీర్ ఎక్స్ప్రెస్ రైళ్లకు సికింద్రాబాద్– నిజామాబాద్ మార్గంలో బొల్లారం, మిర్జాపల్లి, కామారెడ్డి రైల్వేస్టేషన్లలో మాత్రమే హాల్టింగ్ ఉండేవి. ఉద్యోగస్తులు, పుణ్యక్షేత్రాలకు వెళ్లేవారు వినియోగించుకునేవారు. ప్రస్తుతం ఈ రైళ్లు మిర్జాపల్లిలో ఆగడం లేదు. మరోవైపు కొత్తగా వచ్చిన రాయలసీమ, విశాఖ ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు మరికొన్ని వీక్లీ ఎక్స్ప్రెస్లు ఈ రైల్వేస్టేషన్ మీదుగా వెళ్తున్నప్పటికీ హాల్టింగ్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నశంకరంపేట– మిర్జాపల్లి రోడ్డులో అనేక పరిశ్రమలు నెలకొల్పారు. నిత్యం ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రయాణికుల సౌకర్యం కోసం అజంతా ఎక్స్ప్రెస్తో పాటు నూతనంగా మెదక్ వరకు పొడిగించనున్న వెంకటాద్రి ఎక్స్ప్రెస్కు మిర్జాపల్లిలో హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని పలువురు కోరుతున్నారు. -
‘మాత’కు అరకొర ఆహారం
మెనూ ఇలా.. ఉదయం అల్పాహారం పులిహోరా, కిచిడి, ఉప్మా, చట్నీ (300 గ్రాములు) పాలు 100– 150 మిల్లీ గ్రా.. 3 బ్రెడ్స్ రెండు ఇడ్లీ సాంబారు, చట్నీ లేదా పొంగలి మధ్యాహ్న భోజనం అన్నం, 6 చపాతీలు ఒక్కోటి(30 గ్రా) అన్నం (450 గ్రా) ఆకుకూర పప్పు (100 గ్రా), ఆకుకూర 50 (గ్రా) సాంబారు (150 గ్రా) ఉడికించిన గుడ్డు, పెరుగు లేదామజ్జిగ (200 మిల్లీ గ్రా) అరటి పండు లేదా కాలానుగుణంగాలభించే పండు 1 రాత్రి భోజనం అన్నం 450 (గ్రా) లేదా6 చపాతీలు (30 గ్రాములు) ఒక్కోటి ఆకుకూర పప్పు (50 గ్రా) ఒక కూరగాయ(100 గ్రా) సాంబారు (150 గ్రా) ఉడికించిన గుడ్డు ఒకటి, పెరుగు లేదామజ్జిగ 200 (మిల్లీ గ్రా)● ఎంసీహెచ్లో అమలు కాని మెనూ ● పట్టించుకోని ఉన్నతాధికారులు ● ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నకాంట్రాక్టర్ మెదక్జోన్: మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో అరకొర ఆహారం అందిస్తున్నారు. పట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం మెనూ రూపొందించగా.. ఇక్కడ మాత్రం అలాంటివి పాటించడం లేదు. చపాతీలు, పెరుగు ఇవ్వ డం లేదు. రోజుకు రెండు కోడి గుడ్లు పెట్టాల్సి ఉండగా.. ఒకే గుడ్డుతో సరిపెడుతున్నారు. వైద్యులకు ఒక రకం.. గర్భిణులు, బాలింతలకు మరోరకం భోజనం పెడుతున్నారు. ఇదంతా అధికారులకు తెలి సినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోని పిల్లికొటాల్లో ఉన్న మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి జిల్లాతో పాటు కామారెడ్డి నుంచి ప్రసవం కోసం వందలాది మంది గర్భిణులు వస్తుంటారు. నిబంధనల ప్రకారం వీరికి, వైద్యులకు ఒకే రకమైన భోజనం తయారు చేయాలి. అయితే ఆదివారం వైద్యులకు ఒక రకం భోజనం తయారు చేసిన వంట నిర్వాహకులు, గర్భిణులు, బాలింతలకు మరో రకం తయారు చేశారు. వైద్యులకు అన్నంతో పాటు దొండకాయ కూర, ముల్లంగి ఫ్రై, పప్పు కూర వండగా.. బాలింతలు, గర్భిణులకు క్యాబేజీ పప్పు, నీళ్ల చారు తయారు చేశారు. రాత్రి భోజనంలో గుడ్డు, చపాతీ, పెరుగు లేదా మజ్జిగ ఇవ్వాలి. కానీ అవేవి ఇవ్వడం లేదు. కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. -
పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం
గజ్వేల్: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. ఆదివారం గజ్వేల్ మండలం బెజుగామ గ్రామానికి చెందిన యువత కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. కులగణన సర్వే చరిత్రాత్మకమని చెప్పారు. ఎన్నోఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఎస్సీల వర్గీకరణను సైతం కాంగ్రెస్ పూర్తి చేస్తున్నదని అన్నారు. కాంగ్రెస్ తీసుకుంటున్న నిర్ణయాలు విశేష ప్రజాదరణ పొందుతుండగా, ప్రతిపక్షాలకు మింగుడు పడటం లేదన్నారు. కాంగ్రెస్ నేతలు శివారెడ్డి, మల్లేశంగౌడ్ల అధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. కార్యక్రమంలో మార్కెట్ కమీటీ వైస్ చైర్మన్ సర్ధార్ఖాన్, నాయకులు రామలుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
వచ్చేది మన ప్రభుత్వమే
బీఆర్ఎస్ నాయకులతో కేటీఆర్ రామాయంపేట(మెదక్): రానున్న రోజులు మనవే.. కలిసికట్టుగా పనిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెలుతూ రామాయంపేట శివారులోని ఓ హోటల్ వద్ద కొద్దిసేపు ఆగారు. ఆయనకు బీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అధైర్యపడొద్దని, వచ్చేది మన ప్రభుత్వమేనని భరోసా ఇచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ఆధ్వర్యంలో కలిసి మెలిసి పనిచేయాలని సూచించారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర నాయకుడు దేవేందర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ జితేందర్గౌడ్, సహకార సంఘం చైర్మన్ బాదె చంద్రం, ఇతర నాయకులు ఉన్నారు. -
భోజనం రుచికరంగా ఉందా..?
మెదక్జోన్: జిల్లాలోని అన్ని సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాల్లో మెనూ పకడ్బందీగా అమలు చేయడం హర్షనీయమని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కూరగాయలు, ఇతర సామగ్రిని పరిశీలించి విద్యార్థినులతో మాట్లాడారు. భోజనం రుచికరంగా ఉందా.. మెనూ ప్రకారం పెడుతున్నారా..? అని అడిగి తెలుసుకున్నారు. పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. విద్యా నైపుణ్యాలు మెరుగుపడుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. సమయానికి ఆహారం, నిద్ర అవసరమని అప్పుడే ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. కలెక్టర్ వెంట అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు. వివరాలివ్వని వారికి మళ్లీ కులగణన హవేళిఘణాపూర్(మెదక్): సమగ్ర కుటుంబ సర్వేలో వివరాలు నమోదు చేయించుకోని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఆదివారం మెదక్ ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలన కేంద్రాన్ని తనిఖీ చేసి మాట్లాడారు. సమగ్ర ఇంటింటి సర్వేలో వివరాలు నమోదు చేసుకొని వారు ప్రజాపాలన కేంద్రాల్లో సమాచారం అందజేయాలని సూచించారు. సందేహాలుంటే టోల్ ఫ్రీ నంబర్ 040– 21111111కు ఫోన్ చేయవచ్చన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ రఘు, సిబ్బంది సాయికుమార్, సంబంధిత పంచాయతీ సెక్రటరీలు తదితరులు ఉన్నారు.విద్యార్థినులతో కలెక్టర్ రాహుల్రాజ్ -
బర్డ్ ఫ్లూ దెబ్బతో పౌల్ట్రీ పరిశ్రమ విలవిల్లాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సొంతంగా పరిశ్రమను నడుపుకుంటున్నవారు తీవ్రంగా నష్టపోయారు. వీరంతా మళ్లీ కొత్తగా కోళ్ల ఉత్పత్తిని తిరిగి ప్రారంభించాలా? వద్దా? అనే డైలామాలో పడ్డారు. మరోవైపు ఇంటిగ్రేషన్ రైతులకు కూడా
గజ్వేల్: పౌల్ట్రీ రంగాన్ని తరుచూ ఏదో అంశం కుదిపేస్తూనే ఉంది. తాజాగా బర్డ్ఫ్లూ ప్రచారంతో ఈ పరిశ్రమకు గట్టి దెబ్బే తగలింది. ఉమ్మడి మెదక్ జిల్లా(సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్)లో వ్యవసాయ రంగం తర్వాత రెండో అతిపెద్ద పరిశ్రమగా పౌల్ట్రీ వెలుగొందుతోంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఉత్పత్తులను ఈ ప్రాంతం అందిస్తున్నది. పౌల్ట్రీపై ప్రతి నెలా వందల కోట్ల రూపాయల మేర లావాదేవీలు సాగుతున్నాయి. ఎంతోమంది రైతులు దశాబ్దాలుగా సొంతంగా పరిశ్రమను నిర్వహిస్తున్నారు. పౌల్ట్రీనే తమ జీవితంగా మలుచుకున్నారు. కంపెనీల మాయాజాలం ఇంటిగ్రేషన్ కంపెనీల మాయాజాలంతో సొంతంగా పౌల్ట్రీ పరిశ్రమను నిర్వహిస్తున్న రైతులను కుంగదీస్తున్నది. రైతు నుంచి తక్కువ ధరకు కోళ్లను కొనుగోలు చేస్తున్న కంపెనీలు బహిరంగ మార్కెట్లో ధరలు పెంచి అమ్ముకుంటున్నాయి. ఇకపోతే జిల్లాలో వేలాది మంది రైతులు సుగుణ, వెంకటేశ్వర, డైమాండ్, జాప్నవి, జానకీ, ఎస్ఆర్, స్నేహా, విమల తదితర ఇంటిగ్రేషన్ సంస్థల భాగస్వామ్యంతో పౌల్ట్రీ పరిశ్రమ నడుపుతున్నారు. ఈ సంస్థలతో పరిశ్రమను నడుపుకోవాలనుకుంటే రైతులు షెడ్, లేబర్, కరెంట్, నీరు వంటి మౌలిక వసతులను కల్పించాల్సి ఉంటుంది. దీనికి ఒక్కో కోడిపై కిలోకు రూ.5–6కుపైగా చెల్లిస్తాయి. నిర్వహణ బాగుంటే మరో 50పైసలు అదనంగా చెల్లిస్తారు. ఇదిలాఉంటే ఇంటిగ్రేటెడ్ సంస్థల ఒప్పందం ప్రకారం ఉత్పాదక వ్యయం భారీగా పెరిగితే మాత్రం రైతులు నష్టాలు భరించాల్సి ఉంటుంది. 5శాతం కోళ్లకంటే ఎక్కువగా మృత్యువాతపడితే నష్టాలను రైతులే భరించాలి. విద్యుత్ ఛార్జీల రూపేణా 5వేల కోడిపిల్లల సామర్థ్యం కలిగిన షెడ్కు 45రోజులకు రూ.5వేలపైనే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. వీటన్నింటినీ మినహాయిస్తే ఈ సంస్థల భాగస్వామ్యంతో కోళ్లను పెంచుతున్న రైతులకూ మిగులుతున్నది అంతంతమాత్రమే. ఫౌల్ట్రీ రంగంలో వరుసగా వస్తున్న నష్టాలను నియంత్రించడానికి రైతులకు కరెంట్, దాణాలో సబ్సిడీ ఇవ్వాలనే డిమాండ్ ఎన్నోఏళ్లుగా ప్రభుత్వం ముందు ఉన్నది. కానీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం వెలువడటంలేదు.డైలమాలో పౌల్ట్రీ రైతులు బర్డ్ ఫ్లూ దెబ్బతో విలవిల ఉత్పత్తుల తరలింపులోనూ తీవ్ర జాప్యం ఉమ్మడి మెదక్ జిల్లాలో దుస్థితి తెలుగు రాష్ట్రాల కోళ్ల ఉత్పత్తుల్లోసింహభాగం ఇక్కడే ఒక్కో కోడిపై రూ.195కుపైగా ఖర్చు.. సాధారణంగా కోడి పిల్లలను 45రోజులు పెంచుతారు. చిక్స్ రూ.45, దాణాకు (కోడి పెరిగేంతవరకు) దాణాకు రూ.140, ఇతర ఖర్చులు మరో రూ. 10కి పైగా ఖర్చు అవుతున్నది. ఇలా లెక్కన ఒక్కో కోడిపిల్లను ఉత్పత్తి చేయడానికి అన్నీ కలుపుకొని రూ.195కిపైగా వరకు ఖర్చవుతున్నది. సుమారు రెండు కిలోలకుపైగా బరువుండే లైవ్ బర్డ్స్ ధర రూ.220కి పైగా పలికితే నష్టాలు ఉండవు. కానీ ప్రస్తుతం బర్డ్ఫ్లూ నేపథ్యంలో లైవ్ బర్డ్ ధర రైతుల నుంచి తీసుకెళ్లే కంపెనీలు కిలోకు రూ.52 మాత్రమే చెల్లిస్తున్నాయి. అంటే రెండు కిలోల బరువుంటే లైవ్ బర్డ్కు రూ.104మాత్రమే ధర దక్కుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో సొంతంగా పరిశ్రమను నడుపుకునేవారు లక్షల్లో నష్టాలు చవిచూస్తున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారంతా ప్రస్తుతం కొత్త కోడి పిల్లల ఉత్పత్తిని ఆపేశారు. -
తూప్రాన్లో తీవ్ర ఉద్రిక్తత
తూప్రాన్: తూప్రాన్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చేగుంట మండలంలో సీఆర్పీలుగా విధులు నిర్వర్తిస్తున్న రమేశ్నాయక్, శ్రీనివాస్ శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. మృతదేహాలను తూప్రాన్ ప్రభుత్వాసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. శనివారం ఉదయం జిల్లాలోని సీఆర్పీలు, మృతుల కుటుంబ సభ్యులు పెద్దసంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 20 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని ఆస్పత్రి గేటు వద్ద బైఠాయించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ వెంకట్రెడ్డి, సీఐ రంగాకృష్ణ, ఎస్ఐ శివానందం సిబ్బందితో చేరుకోగా.. ఆందోళనకారులకు పోలీసులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని వెల్దుర్తి పోలీస్స్టేషన్కు తరలించారు. ఉద్రిక్తత మధ్య పోస్టుమార్డం నిర్వహించిన మృతదేహాలను చేగుంట మండలంలోని వారి స్వగ్రామాలకు తరలించారు. సీఆర్పీల మృతిపై ఆందోళన -
విద్యార్థుల పురోగతికి డిజిటల్ లెర్నింగ్
● బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు ● వర్గల్ పూలే మహిళా డిగ్రీ కళాశాలలో డిజిటల్ ల్యాబ్ వర్గల్(గజ్వేల్): డిజిటల్ లెర్నింగ్ విధానంలో పురోగతి సాధించేలా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు అన్నారు. శనివారం వర్గల్ పూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ ల్యాబ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చి విద్యార్థులకు భవిష్యత్లో మరిన్ని ఉన్నత ఉద్యోగాలు కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. డిజిటల్ రంగంలో వస్తున్న మార్పులతో మన జీవనశైలి మరింత ఆధునికంగా మారనుందని, విద్యార్థులు ఈ దిశగా విద్యను అభ్యసించాలని సూచించారు. డిజిటల్ లెర్నింగ్ కోసం ఫ్యూర్ సంస్థ(పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్) సహాయం అభినందనీయమన్నారు. ప్యూర్ సంస్థ సీఈఓ డాక్టర్ శైలా తాల్లూరి డిజిటల్ ల్యాబ్ కోసం 20 ల్యాప్టాప్లను అందించి.విద్యార్థులతో యూత్ హబ్లను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు సామాజిక, నాయకత్వ నైపుణ్యాల అభివృద్ధికి, అంతర్జాతీయ స్థాయిలో నెట్వర్కింగ్ను ప్రోత్సహించేందుకు ఇవి దోహదపడతాయని పేర్కొన్నారు. డిజిటల్ రంగంలో విప్లవాత్మక మార్పులను గమనిస్తూ విద్యార్థులకు ఎప్పటికప్పుడు తమను తాము అప్డేట్ చేసుకోవాలని సూచించారు. -
గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్
చిన్నశంకరంపేట(మెదక్)/పాపన్నపేట: గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని కామారం తండాలో సేవాలాల్ విగ్రహ ప్రతిష్టాపన కా ర్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గిరిజనులతో కలిసి నృత్యం చేసి సందడి చేశారు. కార్యక్రమంలో మోహన్నాయక్, రవినాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాన సత్యనారాయణ, మాజీ సర్పంచ్లు రాజిరెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నార్సింగి శివారులో గల సేవాలాల్ ఆలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ధర్మ సంస్థాపన కోసం సేవాలాల్ నిరంతరం కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో ముంగి దేవగిరి మహరాజ్ పాల్గొని పూజలు చేశారు.మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ -
సీహెచ్సీలో ప్రసవాల సంఖ్య పెంచాలి
కలెక్టర్ రాహుల్రాజ్కౌడిపల్లి(నర్సాపూర్): సీహెచ్సీలో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ రాహుల్రాజ్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం కౌడిపల్లి పీహెచ్సీ, సీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఓపీ, మందులు, ల్యాబ్, ఫార్మసీ, పరిసరాలను పరిశీలించారు. వైద్య సిబ్బంది రిజిస్టర్ను తనిఖీ చేశారు. చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వెళ్లి పలకరించి వైద్యసేవలపై ఆరా తీశారు. అలాగే సీహెచ్సీ నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో కంటే పీహెచ్సీ, సీహెచ్సీలో వైద్య సేవలు బాగున్నాయని కొనియాడారు. సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కాగా సీహెచ్సీలో నెలకు ఎన్ని ప్రసవాలు అవుతున్నాయని డాక్టర్ను ప్రశ్నించారు. రెండు, మూడు అవుతున్నాయని చెప్పడంతో ప్రసవాల సంఖ్య పెంచాలని ఆదేశించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. మందుల కొరతలేకుండా చూసుకోవాలని.. మార్చి చివరి నాటికి సీహెచ్ సీ భవనం పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఫోన్లో ఆదేశించారు. కార్యక్రమంలో వైద్యులు శ్రీకాంత్, ఫెర్నజ్, మహిమా, హెడ్నర్స్ నాగమణి, సీహెచ్ఓ ఎలిజబెత్రాణి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
సంతోషంగా ఉంది
నేను 2008లో ఎస్జీటీలో 1,380 ర్యాంకు సాధించాను. అయితే మాకు పోస్టింగ్ ఇచ్చే సమయంలో వివిధ కారణాలతో అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీలు ఇవ్వలేదు. 17 ఏళ్ల అనంతరం ఉద్యో గం లభించడం సంతోషంగా ఉంది. నాకు ధూళ్మిట్ట మండలం బెక్కల్ పాఠశాలను కేటాయించారు. – స్వప్న, 2008 డీఎస్సీ అభ్యర్థి ఇప్పటికై నా గుర్తించారు బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ ఉద్యోగం ఇవ్వకపోవడం సరికాదు. అప్పుడే మాకు రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చి ఉంటే సర్వీస్ పిరియడ్ పెరిగేది. ఇన్ని సంవత్సరాల తర్వాత అయిన ప్రభుత్వం స్పందించడం సంతోషంగా ఉంది. నాకు కోహెడ మండలం శ్రీరాములపల్లి పాఠశాలను కేటాయించారు. – మాధవి, 2008 అభ్యర్థి రెగ్యులర్ ఉద్యోగం ఇస్తే బాగుండేది 2008 డీఎస్సీలో నాకు ఎస్జీటీలో 484 ర్యాంకు వచ్చింది. కాని పోస్టింగ్ ఇవ్వలేదు. ఇప్పటి వరకు ప్రైవేట్ పాఠశాలలో బోధిస్తున్నాను. ఇప్పటికై నా ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్దతిన కాకుండా రెగ్యులర్ ఉద్యోగం ఇస్తే బాగుండేది. నాకు బెజ్జంకి మండలం మల్లంచెరువు పాఠశాలను కేటాయించారు. – ప్రమోద్, 2008 డీఎస్సీ అభ్యర్థి -
విద్యార్థులు మత్తుకు దూరంగా ఉండాలి
కౌడిపల్లి(నర్సాపూర్): విద్యార్థులు డ్రగ్స్, గంజాయి ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఉమ్మడి మెదక్ జిల్లా యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ డీఎస్పీ పుష్పన్కుమార్ అన్నారు. శనివారం మండలంలోని తునికి వద్ద గల ఎంజేపీ బీసీ గురుకుల కళాశాలలో డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ హరిబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. కొన్ని చోట్ల విద్యార్థులకు గంజాయి చాక్లెట్లు అలవాటు చేసి డబ్బు లు వసూలు చేస్తున్నారని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో యువత కొకై న్కు బానిస అవుతున్నారని చెప్పారు. ఎక్కడైన డ్రగ్స్, గంజాయి వాడుతున్నట్లు తెలిస్తే 1908కు ఫోన్చేసి చెప్పాలన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ సీఐ రాము, ఎస్ఐ రంజిత్రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేటి నుంచి మరోసారి కులగణన సర్వే మెదక్ కలెక్టరేట్ జిల్లాలో నేటి నుంచి ఈనెల 28వ వరకు మరోసారి సామాజిక ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే నిర్వహిస్తున్నా మని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. శనివారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో గూగుల్ మీట్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమగ్ర సర్వేలో పాల్గొనని వారి కోసం ఈ అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డితో కలిసి రోడ్డు ప్రమాదాల నివారణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైవేపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రమాద సూచికలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. {ç³fË$ MóSïÜBÆŠḥ´ë˯]l¯]l$ కోరుకుంటున్నారు నర్సాపూర్: రాష్ట్రంలో రామరాజ్యం స్థాపించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను మళ్లీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. ఈనెల 17వ తేదీ కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని బీఆర్ఎస్ అధిష్టానం రాష్ట్రంలో వారం రోజుల పాటు పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించిందని తెలిపారు. వృక్షోత్సవం కార్యక్రమంలో భాగంగా శనివారం పార్టీ నిర్ణయానికి అనుగుణంగా తన క్యాంపు కార్యాలయం వద్ద మొక్కలు నాటినట్లు వివరించారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శేఖర్, చంద్రాగౌడ్, మన్సూర్, సత్యంగౌడ్, భిక్షపతి, షేక్హుస్సేన్, నర్సింగ్రావు, బాల్రెడ్డి, వెంకటేష్, భిక్షపతిగౌడ్, ఎల్లం తదితరులు పాల్గొన్నారు. డంప్యార్డ్ రద్దు చేయాలి సంగారెడ్డి ఎడ్యుకేషన్: ప్రజాభిప్రాయానికి వ్యతిరేకమైన ప్యారానగర్ డంప్యార్డ్ను రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు డు చుక్కా రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్లో శనివారం జరిగిన సీపీఎం నాయకుల జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పర్యావరణానికి నష్టం కలిగే విధంగా ప్యారానగర్ డంపింగ్ యార్డ్ నిర్మాణం చేపట్టడం సరైంది కాదన్నారు. జనావాసాలకు దూరంగా పర్యావరణానికి నష్టం లేనటువంటి ప్రాంతాలను ప్రభుత్వం ఎందుకు పరిశీలించడం లేదని ప్రశ్నించారు. అర్హులైన పేదలందరికీ ఆరు గ్యా రంటీలను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ప్రజలను సమీకరించి పోరాటాలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. -
డ్రగ్స్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు
కలెక్టర్ రాహుల్రాజ్, ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డిమెదక్జోన్: యువత డ్రగ్స్, గంజాయిలాంటి మ త్తు పదార్థాల బారిన పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్రాజ్, ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్లో మత్తు పదార్థాల నియంత్రణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. యువతకు మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. డ్రగ్స్ నిర్మూలనకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రతి నెల సమావేశం నిర్వహించి యాంటీ డ్రగ్ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పటిష్టంగా నిరంతర తనిఖీలు చేస్తుందన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 17 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 9 కేజీల మత్తు పదార్థాలను సీజ్ చేశామని వివరించారు. అదే విధంగా ప్రతి మూడవ బుధవారం జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన వివరించారు. -
17 ఏళ్ల కల సాకారం
నెరవేరిన 2008 డీఎస్సీ అభ్యర్థుల కల ● సుదీర్ఘ నిరీక్షణకు తెర● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 184 మంది నియామకంమెదక్జోన్/ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 17 ఏళ్ల పోరాటానికి తెరపడింది. 2008లో ఉమ్మడి ఏపీలో డీఎస్సీ నిర్వహించిన అప్పటి ప్రభుత్వం, ఎస్జీటీ ఉద్యోగాలను డీఈడీ, బీఈడీ అభ్యర్థులతో 70: 30తో భర్తీ చేసే విధంగా ప్రణాళికా రూపొందించింది. అయితే డీఈడీ చేసిన అభ్యర్థులు ఎస్జీటీ ఉద్యోగాలు పూర్తిగా మాకే ఇవ్వాలని డిమాండ్ చేయగా, నాడు వారితోనే ఉద్యోగాలు భర్తీ చేసింది. కాగా అప్పటికే అప్పటికే ధృవపత్రాల పరిశీలన పూర్తి చేసుకున్న బీఈడీ అభ్యర్థులు తమకు ఎస్జీటీలో అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా కోర్టును సైతం ఆశ్రయించారు. 17 ఏళ్ల అనంతరం కోర్టు తీర్పు ఆధారంగా ప్రభుత్వం వారికి కాంట్రాక్ట్ పద్దతిలో ఎస్జీటీ ఉద్యోగాలు కేటాయించింది. నాడు ఉమ్మడి మెదక్ జిల్లాలో 292 మంది బీఈడీ అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారు. శనివారం సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి నియామక పత్రాలు అందజేశారు. 292 అభ్యర్థులు గాను 184 మంది హాజరయ్యారు. వీరు ప్రతి నెల రూ. 31,040 వేతనంగా పొందనున్నారు. జీవితంలో తమకు ఉద్యోగం వస్తుందో రాదో అని ఇన్ని రోజులు బాధలో ఉన్న అభ్యర్థుల సుదీర్ఘ ఎదురుచూపులకు తెరపడింది. అలాగే జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ కానున్నాయి. మెదక్ జిల్లావ్యాప్తంగా 1,907 ఎస్జీటీ పోస్టులకు గాను ప్రస్తుతం 1,667 మంది విధుల్లో ఉన్నారు. ప్రస్తుతం 64 మంది విధుల్లో చేరుతుండడంతో ఇంకా 176 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
ఎమ్మెల్సీ బరి.. పార్టీల గురి
● ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీజేపీ ● ప్రచారం జోరు పెంచిన అభ్యర్థులు ● పట్టభద్రుల ఎమ్మెల్సీకి 56, ఉపాధ్యాయకు 15 మంది పోటీ ఉదయం, సాయంత్రం ప్రచారం పాఠశాలలో తరగతులు కొనసాగుతున్న సమయాల్లో అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించొద్దని ఎన్నికల సంఘం నిబంధన పెట్టింది. దీంతో అభ్యర్థులు ఉదయం, సాయంత్రం సమయాల్లో ఉపాధ్యాయ ఓటర్లను కలిసి తమకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరుతున్నారు. అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు సమ్మేళనాలు నిర్వహిస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు. మేనిఫెస్టోలు సైతం ప్రకటిస్తున్నారు. సాయంత్రం గెట్ టు గెదర్ నిర్విహిహంచి దావత్లతో మచ్చిక చేసుకుంటున్నారు. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈనెల 27వ తేదీన పోలింగ్ జరగనుండటం.. ప్రచారానికి మరో 10 రోజులే గడువు ఉండడంతో అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీకి 56 మంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 15 మంది పోటీ చేస్తున్నారు. సాక్షి, సిద్దిపేట: పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ నుంచి డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి, కాంగ్రెస్ నుంచి నరేందర్రెడ్డి, బహుజన సమాజ్ పార్టీ నుంచి ప్రసన్న హరికృష్ణ, ఇండిపెండెంట్ అభ్యర్థిగా యాదగిరి శేఖర్రావు, దేవునూరి రవీందర్తో పాటు మరో 51 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బీజేపీ నుంచి మల్క కొమురయ్య, పీఆర్టీయూ నుంచి వంగ మహేందర్రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, ప్రైవేట్ స్కూల్ టీచర్స్ మద్దతుతో జగ్గు మల్లారెడ్డితో పాటు 11 మంది బరిలో నిలిచారు. శనివారం హుస్నాబాద్లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ పాల్గొన్నారు. సిద్దిపేటలో బీజేపీ నాయకులతో ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ సమావేశం నిర్వహించి ప్రచారం తీరును అడిగి తెలుసుకున్నారు. 25 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జి బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్ర నాయకత్వం జిల్లాల వారీగా ఇన్చార్జిలను ప్రకటించింది. టీచర్స్ ఎమ్మెల్సీకి రంగారెడ్డి అర్బన్ అధ్యక్షుడు ఎస్. మల్లారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన నాయకుడు బాణాల లక్ష్మారెడ్డిని నియమించింది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నాయకులకు బాధ్యతలు అప్పగించింది. స్థానిక నాయకులకు 25 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించారు. ప్రతి ఓటరును నాలుగు సార్లు కలిసి పోలింగ్ బూత్ వరకు తీసుకువచ్చే బాధ్యత వీరిదే. కాంగ్రెస్ పార్టీ ప్రతి 50 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని, నియోజకర్గ వారీగా ఇన్చార్జిలను నియమించింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంగ మహేందర్రెడ్డి సైతం పీఆర్టీయూ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. గత ఆరు నెలల నుంచే వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు పలు సంఘాలు మద్దతు ప్రకటించి ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఎక్కువ ఓట్లు ఉన్న ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తూ మద్దతు కూడగడుతున్నారు. -
కాలినడక కాలచక్రం
ఒకప్పుడు ఎంతదూరమైనా బడికి కాలినడకనో సైకిళ్లపైనో వెళ్లొచ్చేవారు. ఇప్పుడు ఆటో రిక్షాలు, బస్సులు, సొంత వాహనాల్లో వెళ్తున్నారు. పుస్తకాలను ఒకప్పుడు వస్త్రాలతో లేదా గోనెసంచిలతో కుట్టిన బ్యాగుల్లోనో, సిల్వర్ బాక్స్ల్లోనో బడికి తీసుకెళ్లేవారు. కానీ, ఇప్పుడు అనేక ఆకర్షణీయమైన స్కూల్ బ్యాగుల్లో తీసుకెళ్తున్నారు. గ్రౌండ్లో ఆటల దగ్గర్నుంచి మొబైల్లోనే ఆటలాడుకునే దశకు వచ్చింది పరిస్థితి. విద్యార్థులు బడికి వెళ్లేక్రమంలో కాలక్రమేణా వచ్చిన మార్పులపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.8లో -
క్షణికావేశం.. మరణ శాసనం
సమస్య వచ్చినప్పుడు మన అనుకునే వారితో చర్చించి పరిష్కరించుకునే మార్గంపై దృష్టి సారించాలి. ఒంటరిగా ఉంటే మానసిక ఆందోళనకు గురై మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది. సానుకూల ఆలోచనలపై ఆసక్తి పెంచుకోవాలి. ఎదుర్కొనే సమస్యలు తాత్కాలికమని గుర్తించాలి. సరైన ఆహారం తీసుకొని, వ్యాయామం చేయాలి. గత విజయాలను గుర్తు చేసుకోవాలి. మనోవేదనకు గురైతే మానసిక వైద్య నిపుణుల సహాయం తీసుకోవాలి. పెంటాగౌడ్, వైద్యుడు, మెదక్మెదక్ మున్సిపాలిటీ: అనారోగ్యం, ప్రేమ విఫలం, కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, ఆర్థిక ఇబ్బందులు ఇతర కారణాలతో పలువురు క్షణికావేశానికి గురై తనువు చాలిస్తున్నారు. మానసిక ఒత్తిడి అధిగమించే విషయంలో, భావోద్వేగాలు నియంత్రణ లేక ఇక బతకలేమని నిర్ణయించుకొని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న బలవన్మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గతేడాది మొత్తం 365 రోజులు ఉండగా, 362 మంది ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర ఆందోళనకు గురిచేసే విషయం. ఈ ఏడాది జనవరిలో జిల్లావ్యాప్తంగా 21 మంది తనువు చాలించారు. సమస్య ఏదైనా.. సందర్భం ఏమైనా నేటి తరం యువతతో పాటు కూలీలు, వ్యాపారులు, విద్యార్థులు ఒక్క నిమిషం ఆలోచిస్తే సమస్య తీరుతుందన్న ఆలోచన మరిచి క్షణికావేశానికి గురై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఇటీవల మెదక్ పట్టణానికి చెందిన మల్లికార్జున రమేష్ వ్యాపారంలో అప్పులు పెరిగిపోవడంతో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. ఏళ్ల తరబడి వ్యాపా రం చేస్తూ వంద మందికిపైగా ఉపాధి కల్పించిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం వ్యాపారులను ఆందోళనకు గురిచేసింది. ఈనెల 10వ తేదీన చేగుంట మండలం కర్నాల్పల్లికి చెందిన ఓ వ్యక్తి అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడు. 11వ తేదీన నర్సాపూర్ మండలం చిన్నచింతకుంటకు చెందిన విద్యార్థిని చదువుకోవడం ఇష్టం లేక ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈనెల 10న శివ్వంపేట మండలం చిన్నగొట్టిమక్లకు చెందిన వ్యక్తి కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. -
● మండుటెండల్లో పరవళ్లుతొక్కుతున్న చెక్డ్యాంలు ● 50 వేల ఎకరాలకుఅందనున్న సాగునీరు ● అన్నదాతల్లో హర్షాతిరేకాలు
కాళేశ్వరం జలాలతో హల్దీ ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతోంది. మండుటెండల్లోనూ చెక్డ్యాంలు జలకళతో ఉట్టిపడుతున్నాయి. ప్రాజెక్టు పరిధిలో సుమారు 50 వేల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. వేసవిలో సాగు నీటికి ఎలాంటి దిగులు లేదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మెదక్జోన్: జిల్లాలోని తూప్రాన్, మాసాయిపేట, వెల్దుర్తి, చిన్నశంకరంపేట, కొల్చారం, మెదక్, హవేళిఘణాపూర్ మండలాల పరిధిలో సుమారు 60 కిలోమీటర్ల పొడవునా హల్దీ ప్రాజెక్టు పారుతుంది. దీనిపై గత ప్రభుత్వ హయాంలో 12 చెక్ డ్యాంలు నిర్మించారు. గోదావరి జలాలను కాళేశ్వరం నుంచి వయా కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ ద్వారా గత రెండేళ్లుగా హల్దీలోకి వదులుతున్నారు. దీంతో ప్రాజెక్టు పరిధిలో సుమారు 50 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. అలాగే ప్రాజెక్టు నుంచి ఎటూ మూడు కిలోమీటర్ల మేర భూగర్భజలాలు పెరిగి అడుగంటిన బోర్లలో సైతం నీరు పుష్కలంగా వస్తాయని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఏటా రెండు పంటలు.. కాళేశ్వరం నీటితో హల్దీ ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో ఏడు మండలాల పరిధిలోని రైతులు ప్రాజెక్టులో మోటార్లు బిగించి 2 నుంచి 3 కిలో మీటర్ల పొడవునా పైపులైన్లు వేసుకున్నారు. ప్రస్తుతం బోరుబావి తవ్వాలంటే కనీసం రూ. 2 నుంచి రూ. 2.50 లక్షల ఖర్చు అవుతుంది. అదే కిలోమీటర్ మేర పైపులైన్ వేయాలంటే రూ. 50 వేలు మాత్రమే అవుతుండడంతో రైతులు దీనికే ప్రాధాన్యం ఇస్తున్నారు. వేసవిలో ఒక్కసారి కాళేశ్వరం జలాలు హల్దీలోకి వదిలితే వానాకాలం వచ్చే వరకు నీరు ఉంటుంది. దీంతో ప్రాజెక్టు పరిధిలోని ఏడు మండలాల రైతులు ఏటా రెండు పంటలు వరి సాగు చేపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ యాసంగిలో 2.90 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా.. ప్రాజెక్టు పరిధిలో 50 వేల ఎకరాలు సాగవుతున్నాయి. -
ఫోన్, టీవీకి దూరంగా ఉండండి
కలెక్టర్ రాహుల్రాజ్హవేళిఘణాపూర్(మెదక్): పరీక్షల వేళ విద్యార్థులు టీవీ, ఫోన్కు దూరంగా ఉండాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని బూర్గుపల్లి జెడ్పీ హైస్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష్యా న్ని ఎంచుకొని బాగా చదవి తల్లిదండ్రులు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించి చదువుకునే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. అనంతరం మధ్యా హ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వందశాతం ఉత్తీర్ణత సాధించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సందేహాలుంటే నివృత్తి చేయా లని ఆదేశించారు. ఆయన వెంట ఉపాధ్యాయులు ఉన్నారు. -
గుమ్మడిదలను మరో లగచర్ల చేయొద్దు
● డంప్యార్డ్ ఆలోచనఉపసంహరించుకోండి ● మాజీ మంత్రి హరీశ్రావుజిన్నారం(పటాన్చెరు): గుమ్మడిదలను మరో లగచర్ల చేయొద్దని, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని డంప్యార్డ్ ఏర్పాటు ఆలోచనను విరమించుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మ ంత్రి హరీశ్రావు ప్రభుత్వానికి సూచించారు. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని నల్లవల్లి గ్రామంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో శుక్రవారం పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి ప్రజాపాలన పేరుతో ఎమర్జెన్సీని తెచ్చారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చని పంట పొలాల మధ్య డంప్యార్డ్ చిచ్చు పెట్టిందని మండిపడ్డారు. ఈ సమస్యపై అసెంబ్లీ వేదికగా ఈ ప్రాంత ప్రజల తరఫున పోరాడుతామని హామీ ఇచ్చారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం అధికారులు వెంటనే పనులను నిలిపివేయాలని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్రావు పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో అన్నివర్గాలకు సమన్యాయం
రామాయంపేట(మెదక్): కాంగ్రెస్లో అన్నివర్గాలకు సమన్యాయం జరుగుతుందని డీసీసీ అ ధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ అన్నారు. శుక్రవారం పట్టణంలో బీఆర్ఎస్ నాయకుడు సరాపు యాదగిరి, పార్టీ పట్టణ అధ్యక్షుడు నాగరాజు, నాయకులు చింతల యాదగిరి, శ్యాంతో పాటు నిజాంపేట మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్లో చేరగా ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ.. మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కృషి చేస్తున్నారని కొని యాడారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ.. తాము పార్టీలకతీతంగా అభివృద్ధికి పాటు పడుతున్నామని అన్నారు. తనకు మెదక్ జిల్లా రాజకీయ బిక్ష పెట్టిందన్నారు. సొంత నిధులతో కార్యకర్తలను కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. అంతకుముందు పట్టణంలో నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి, పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రామచందర్గౌడ్, జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు యుగంధర్రావు, నిజాంపేట, హవేళీఘణాపూర్ మండలాల పార్టీ అధ్యక్షులు నసీరుద్దీన్, శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేశ్రెడ్డి, నాయకులు అమరసేనారెడ్డి, అరుణ, ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ -
విద్యార్థి జీవితంలో ‘పది’ కీలకం
డీఈఓ రాధాకిషన్ చిన్నశంకరంపేట(మెదక్): విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలక మలుపని డీఈఓ రాధాకిషన్ అన్నారు. శుక్రవారం మండలంలోని మడూర్, మిర్జాపల్లి జెడ్పీ పాఠశాలను తనిఖీ చేశారు. ఈసందర్భగా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ఉన్నత విద్యకు పదో తరగతి ఒక బేస్గా నిలుస్తుందన్నారు. ఇక్కడ పునాది పడితేనే ఇంటర్, డిగ్రీలో సునాయాసంగా గట్టెక్కగలుగుతారన్నారు. సబ్జెక్ట్పై పట్టు సాధించిన విద్యార్థులే మెరుగైన గ్రేడ్ సాధించగలరని తెలిపారు. మెరుగైన ఫలితాల కోసం 36 రోజులు ఏకాగ్రతతో కష్టపడి చదవాలన్నారు. ఉదయం, సాయంత్రం చదవగలిగేతేనే పాఠ్యంశం మనసులో నిలిచిపోతుందని వివరించారు. ఈసందర్భంగా హెచ్ఎం రవీందర్రెడ్డికి పలు సూచనలు చేశారు. అంతకుముందు మిర్జాపల్లి జెడ్పీ పాఠశాలను తనిఖీ చేశారు. కరాటేలో ప్రతిభ కనబర్చి గోల్డ్మోడల్ సాధించిన విద్యార్థి రేణుక, రజిత పతకం పొందిన కావ్య, అనూషను అభినందించారు. ఆయన వెంట ఏఎంఓ సుదర్శన్, ఎంఈఓ పుష్పవేణి ఉన్నారు. -
రోడ్లపై కోతులకు ఆహారం వేయొద్దు
డీఎఫ్ఓ జోజి నర్సాపూర్ రూరల్: రోడ్లపై కోతులకు ఆహారం వేయొద్దని డీఎఫ్ఓ జోజి జంతు ప్రేమికులకు సూచించారు. శుక్రవారం జిల్లా అటవీశాఖ, వూన్హాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నర్సాపూర్ అర్బన్ పార్క్ ఆవరణలో ఏర్పాటు చేసిన కోతుల ఆహార సేకరణ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. వచ్చే వానాకాలంలో కోతుల ఆహారం కోసం 22 వేలకుపైగా పండ్ల మొక్కల పెంపకం చేపట్టనున్నట్లు తెలిపారు. రోడ్లపై కోతులకు ఆహారం వేసే వారంతా అర్బన్పార్క్ వద్ద ఏర్పాటు చేస్తున్న ఆహార సేకరణ కేంద్రంలో అందజేయాలని సూచించారు. రోడ్లు, జనావాసాలకు దూరంగా కోతులకు ఆహారం ఏర్పాటు చేసి మనుషులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నదే తమ లక్ష్యం అన్నారు. ఇక్కడ విజయవంతం అయితే మిగితా ప్రాంతాల్లో అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్యారనగర్లో ఏర్పాటు చేస్తున్న డంప్యార్డ్తో జంతువులకు ఇబ్బంది తలెత్తకుండా 12 మీటర్ల ఎత్తులో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. డంప్యార్డ్తో నర్సాపూర్ రాయరావు చెరువులోకి వచ్చే నీరు కలుషితమయే ప్రమాదం ఉందని విలేకరులు ప్రశ్నించగా.. ప్రభు త్వ ఆదేశాలతో కొనసాగుతున్నందున దానిపై ఏమి మాట్లాడలేమని బదులిచ్చారు. కార్యక్రమంలో వూన్హాండ్స్ ఫౌండేషన్ డైరెక్టర్ పరమేశ్వరి, ఎఫ్ఆర్ఓ అరవింద్, సెక్షన్ ఆఫీసర్ సాయిరాం పాల్గొన్నారు. -
బాధ్యులను కఠినంగాశిక్షించాలి: ఎమ్మార్పీఎస్
మెదక్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలోని విజయ డెయిరీలో జరిగిన రూ. 24 లక్షల స్కాంలో దళితుడిని బలిపశువు చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. గత నెల 11వ తేదీన విజయ డెయిరీలో దుర్గాప్రసాద్తో పాటు అతడి తల్లిదండ్రులను చిత్రహింసలకు గురిచేశారని వాపోయారు. తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా మెదక్ టౌన్ పోలీసులు చిత్రహింసలు పెట్టి బల వంతంగా ఒప్పించారని తెలిపారు. పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజ్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్, పద్మారావు, గట్టయ్య, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
పేట పోలీస్స్టేషన్ తనిఖీ
పెద్దశంకరంపేట(మెదక్): పెద్దశంకరంపేట పోలీస్స్టేషన్ను మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా కేసులకు సంబంధించి పలు రికార్డులను పరిశీలించారు. నేరాలకు సంబంధించిన కేసులను త్వరగా పరిష్కరించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. దొంగతనాలు జరగకుండా పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఐ శంకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన శివ్వంపేట(నర్సాపూర్): ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలను శుక్రవారం ఆర్డీఓ మహిపాల్ పరిశీలించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు సంబంధించి శివ్వంపేట ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయనున్న రెండు పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్, నీటి వసతితో పాటు ఇతర మౌలిక వసతులు కల్పించాలని సిబ్బందికి సూచించారు. మండలవ్యాప్తంగా పట్టభద్రులు 571, ఉపాధ్యాయ ఓటర్లు 47 మంది ఉన్నారని చెప్పారు. ఆయనతో పాటు తహసీల్దార్ కమలాద్రి, ఉప తహసీల్దార్ షఫీయోద్దీన్ తదితరులు ఉన్నారు. డంప్యార్డ్కు వ్యతిరేకంగా పోస్ట్కార్డు ఉద్యమం నర్సాపూర్ రూరల్: ప్యారానగర్లో ఏర్పాటు చేస్తున్న డంప్యార్డుకు వ్యతిరేకంగా లోక్సత్తా ఉద్యమ సంస్థ జిల్లా కన్వీనర్ నాగేందర్గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం నర్సాపూర్ బస్టాండ్లో పోస్ట్కార్డు ఉద్యమం చేపట్టారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు మల్లేష్, నాగరాజు, నర్సమ్మ, రైతు రక్షణ సమితి సభ్యుడు చంద్రశేఖర్ పాల్గొని సంతకాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దట్టమైన అటవీ ప్రాంతంలో డంప్యార్డ్ ఏర్పాటు చేస్తే పర్యావరణ కాలుష్యంతో పాటు నర్సాపూర్ రాయరావు చెరువు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. జంతువులు, మనుషులు రోగాల బారిన పడే అవకాశం ఉంటుందన్నారు. సీఎం రేవంత్రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులకు విన్నవించేందుకు పోస్ట్కార్డు ఉద్యమం చేపడుతున్నట్లు తెలిపారు. ఐటీఐఆర్కు జగ్గారెడ్డి అర్థం చెప్పాలి మెదక్ ఎంపీ రఘునందన్రావు ఎద్దేవా సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : రాష్ట్రానికి ఐటీఐఆర్ మంజూరు చేయాలన్న కాంగ్రెస్ నేత జగ్గారెడ్డికి అసలు ఐటీఐఆర్ అంటే అర్థం చెప్పాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు ఎద్దేవా చేశారు. ప్రధాని మన్మోహన్సింగ్ హాయాంలో వచ్చిన ఐటీఐఆర్పై జగ్గారెడ్డికి కనీసం అవగాహన కూడా లేదన్నారు. కందిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సదాశివపేట మండలంలోని ఎమ్మారెఫ్ ఫ్యాక్టరీ యాజమాన్యం సుమారు 400 మంది కార్మికులను ఉన్నపళంగా ఉద్యోగాల్లోంచి తొలగించిందని, ఇదేమని ప్రశ్నిస్తున్న కార్మికులను పోలీసులతో దౌర్జన్యానికి పాల్పడుతోందన్నారు. జీతాలు పెంచాలని అడిగినందుకు వారి ఉద్యోగాలను తొలగించిందని, దీనిపై కార్మిక శాఖ అధికారులు కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటనల్లో రూ. వేల కోట్లు పెట్టుబడులు తెచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తామని ప్రకటిస్తున్న రేవంత్ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల్లో ఉద్యోగాలను తొలగిస్తే కనీ సం స్పందించకపోవడం శోచనీయమన్నారు. రికార్డులు పరిశీలిస్తున్న డీఎస్పీ ప్రసన్నకుమార్ -
ప్రజలకు భరోసా కల్పించండి
మెదక్ మున్సిపాలిటీ: ఎన్నో సమస్యలతో పోలీస్స్టేషన్కు వచ్చే ప్రజలకు మేమున్నామని భరోసా కల్పించాలని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి సిబ్బందికి సూచించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నూతనంగా ఉద్యోగంలో చేరిన పోలీస్ సిబ్బందికి రెండు రోజులుగా శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోలీస్స్టేషన్కు వివిధ రకాల అభ్యర్థనలు, ఫిర్యాదులు, సమాచారం, సహాయం కోసం ప్రజలు వస్తుంటారని తెలిపారు. ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించాలన్నారు. ప్రతి పౌరుడికి సమన్యాయం జరిగేటట్లు చూడాలన్నారు. ప్రజలకు సత్వర న్యాయం జరగడానికి సాంకేతిక వనరులు వినియోగించుకోవాలని చెప్పారు. విధుల్లో మంచి ప్రతిభ కనబరిచి ప్రజల మన్ననలు పొందాలన్నారు. ఆదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో డీసీఆర్బీ ఇన్స్పెక్టర్లు మధుసూదన్గౌడ్, అనిల్, సిబ్బంది పాల్గొన్నారు.ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి -
అభాగ్యులకు ‘వాత్సల్యం’
మెదక్ కలెక్టరేట్: అనాథ పిల్లల సంరక్షణకు ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. మిషన్ వాత్సల్య పథకంతో భరోసా కల్పిస్తున్నాయి. ఎంతో మంది అభాగ్యులు తల్లి, తండ్రిని కోల్పోయి ఆవేదన చెందుతున్నారు. అయినవారు లేక, బంధువులు ఆదుకోక అవస్థలు పడుతున్నారు. అలాంటి పిల్లలకు ఉన్నత చదువులు చెప్పిస్తున్నారు. వారు ప్రయోజకులుగా ఎదిగేందుకు నెలకు రూ. 4 వేలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. 2022లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టగా.. జిల్లాలో ప్రస్తుతం 102 మంది లబ్ధిపొందుతున్నారు. ప్రస్తుతం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హులు.. అర్హతలు తల్లి లేదా తండ్రి, ఇద్దరిని కోల్పోయిన వారు, విడాకులు తీసుకున్న దంపతుల పిల్లలు, తల్లిదండ్రులు కోల్పోయి ఇతర కుటుంబాల్లో నివసిస్తున్న వారు, ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న వారి పిల్లలు, ఆర్థికంగా, శారీరకంగా బలహీనులై, తమ బిడ్డలను పెంచలేని, ప్రకృతి వైపరీత్యాల బాధితుల పిల్లలు, బాల కార్మికులు, బాల్యవివాహ బాధితులు, ఎయిడ్స్ బాధితుల పిల్లలు, అంగవైకల్యం, అక్రమ రవాణాకు గురైన వారు, ఇంటి నుంచి తప్పిపోయిన పిల్లలు, బాల యాచకులు, పీఎం కేర్ ఫర్ చిల్డ్రన్ పథకం మంజూరైన పిల్లలు, కోవిడ్– 19తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు పథకం పొందడానికి అర్హులు. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు రూ. 72 వేలు, పట్టణ ప్రాంతాల్లోని పిల్లల కుటుంబ వార్షికాదాయం రూ. 96 వేలకు మించి ఉండకూడదు. తప్పనిసరిగా ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఈ పథకానికి కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు అందజేస్తుంది. దరఖాస్తులను కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు సమయంలో విద్యార్థికి సంబంధించిన పలు ధృవీకరణ పత్రాలతో పాటు వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్, సంరక్షకులతో కూడిన జాయింట్ అకౌంట్ వివరాలు అందజే నెలకు రూ. 4 వేలు అందజేత ఎంపికై న విద్యార్థులకు నెలకు రూ. 4 వేల చొప్పున 18 ఏళ్ల వయసు వచ్చే వరకు భృతి అందజేస్తారు. పిల్లలు 30 రోజులకు మించి బడికి హాజరుకాకపోతే ఈ పథకం నిలిపివేస్తారు. అయితే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల విషయంలో మాత్రం మినహాయింపు ఉంటుంది. అలాగే ఈ పథకానికి ఎంపికై న పిల్లలు భవిష్యత్లో ఏదైనా హాస్టల్లో చేరితే అప్పటి నుంచి ఈ పథకం నిలిపివేస్తారు. నిరంతర ప్రక్రియ మిషన్ వాత్సల్య పథకం దరఖాస్తులు నిరంతర ప్రక్రియ. జిల్లాలో 152 మంది వరకు లబ్ధి పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం 102 మంది విద్యార్థులకు ఈ పథకం కింద భరోసా కల్పిస్తున్నాం. రెసిడెన్షియల్ హాస్టళ్లలో చేరినవారు, 18 ఏళ్లు నిండిన విద్యార్థులు ఈ పథకం నుంచి వెళ్లిపోతారు. ఆస్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తాం. – కరుణశీల, జిల్లా బాలల సంరక్షణ అధికారిణి జిల్లాలో 102 మందికి భరోసా కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ -
బీఆర్ఎస్ నేతలవి మొసలి కన్నీరు
నర్సాపూర్: డంప్యార్డు ఏర్పాటును పెద్ద సమస్యగా చూపి బీఆర్ఎస్ పబ్బం గడుపుకోవాలని చూస్తుందని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ ఆరోపించారు. బుధవారం కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రజలను కులాలు, మతాలు, ప్రాంతాలుగా విభజించే కుట్ర చేస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. డంప్యార్డు సమస్యను మంత్రుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీశ్రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అబద్దాలు చెప్పి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్యారానగర్ డంప్యార్డు, కులగణనపై వారికి మాట్లాడే హక్కు లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే డంప్యార్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. అనాడు సునీతారెడ్డి బీఆర్ఎస్లో ఉన్నారని, ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డిని కలిసి సమస్యను వివరించి డంప్యార్డును ఇతర ప్రాంతాలకు తరలించేందుకు తమ వంతుగా కృషి చేస్తామని చెప్పారు. సమావేశంలో నాయకులు మల్లేష్, శ్రీనివాస్గుప్తా, చిన్న ఆంజిగౌడ్, మహేష్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, రవిగౌడ్, రషీద్, అజ్మ త్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ -
ఉద్యోగం చేస్తారా.. ఇంటికి పోతారా?
ఉపాధ్యాయులపై డీఈఓ సీరియస్రేగోడ్(మెదక్): ఉద్యోగం చేయాలని ఉందా.. ఇంటికి పోతారా..? అంటూ డీఈఓ రాధాకిషన్ ఉపా ధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలు, ఎంఆర్సీ కార్యాలయాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా రేగోడ్లోని ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కాంప్లెక్స్ సమావేశంలో మాట్లాడారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదన్నారు. సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. పనిచేయని వారిని గుర్తించి చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఉన్నత పాఠశాల హెచ్ఎంపై ఫిర్యాదు వచ్చిందని, అందరికీ ఆదర్శంగా ఉండాల్సింది పోయి.. నిర్లక్ష్య ంగా వ్యవహరిస్తే ఎలాగని ప్రశ్నించారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని, ఇలాగైతే స్కూల్ ఉంచుదామా..? ఎత్తేద్దామా అని అడిగారు. సంగమేశ్వర తండాలో బడి మూతపడిందని గతంలో ‘సాక్షి’లో వచ్చిన పలు కథనాలపై డీఈఓ స్పందించారు. ఆ పాఠశాల ఉపాధ్యాయురాలు రెండేళ్లుగా డిప్యూటేషన్పై వెళ్లారని, రెండేళ్లు దాటితే వేతనం నిలిపివేస్తామని చెప్పారు. త్వరలోనే పాఠశాలను ప్రారంభిస్తామన్నారు. మోడల్ స్కూల్ వసతి గృహాన్ని సైతం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించి బాలికలకు వసతి కల్పిస్తామని తెలిపారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు భోజనం వడ్డించారు. -
మహిళల భద్రతకే షీటీమ్స్
మెదక్ మున్సిపాలిటీ: మహిళలు మౌనం వీడి నిర్భయంగా ముందుకు రావాలని అదనపు ఎస్పీ మ హేందర్ పిలుపునిచ్చారు. బుధవారం రాష్ట్ర ఉమెన్ సేఫ్టీవింగ్ ద్వారా నిర్వహించిన ఆన్లైన్ కౌన్సెలింగ్కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. షీటీం ఆధ్వర్యంలో 72 మంది ఈవ్ టీజర్స్కు ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహించినట్లు చెప్పారు. ఇందులో 13 మంది మైనర్లు, 59 మంది యుక్త వయసు వారు ఉన్నారని తెలిపారు. షీ టీమ్స్ ఎల్లవేళలా అందుబా టులో ఉండి సేవలు అందిస్తాయన్నారు. షీటీం ఫిర్యాదులు, క్యూఆర్ కోడ్ గురించి వివరించారు. అన్ని బస్టాండ్లు, సినిమా హాళ్లు, స్కూళ్లు, కళాశాలలు, కార్యాలయాలు, రద్దీ ప్రాంతాల్లో షీటీం నంబర్లు, క్యూఆర్ కోడ్లతో కూడిన పోస్టర్లు ఉంటాయని తెలిపారు. మహిళలు అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలని సూచించారు. అలాగే వా ట్సాప్ నంబర్ 8712657963లో ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో గంగాధర్, బాల నర్సింలు, కానిస్టేబుళ్లు ప్రమీల, విజయ్, గంగమణి, స్వరూప, విజయరాణి తదితరులు పాల్గొన్నారు.అదనపు ఎస్పీ మహేందర్ -
ఎన్నికలకు సన్నద్ధం కావాలి
అదనపు కలెక్టర్ నగేష్ మెదక్ కలెక్టరేట్: సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని అ దనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో రిటర్ని ంగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, డీఎల్పీఓలకు మొదటి దశ శిక్షణ కా ర్యక్రమం నిర్వహించగా.. అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో 492 సర్పంచ్, 190 ఎంపీటీసీ, 21 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నట్లు చెప్పారు. ఎన్నికల కోసం ముందస్తుగానే అన్నిరకాల ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావులేకుండా ముందుకుసాగాలని సూచించారు. నోటిఫికేషన్ జారీ చేసి మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్ల ప్రక్రియను చేపట్టాల్సి వస్తుందని తెలిపారు. తదుపరి అన్నిరకాల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. బ్యాలెట్ పేపర్ను అభ్యర్థుల పేర్లపై తెలుగు అక్షర మాల క్రమపద్ధతిలో ముద్రించాల్సి ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఎంపీడీఓలు, ఎంపీఓలు, డీఎల్పీఓలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలి
హవేళిఘణాపూర్(మెదక్): ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు మరింత మెరుగుపర్చాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందని డీఎంహెచ్ఓ శ్రీరామ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని సర్ధన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా వంద రోజుల టీబీ ప్రోగ్రాం, 30 ఏళ్లు పైబడిన వారిలో రోగ నిర్ధారణ, గర్భిణులకు చికిత్స, దీర్ఘకాలిక రోగాలు.. భవిష్యత్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. రాబోయే రోజుల్లో ఇలాగే సేవలందిస్తూ జిల్లాలోని పీహెచ్సీలకు ఆదర్శంగా నిలవాలని కొనియాడారు. అలాగే ఆస్పత్రికి వస్తున్న ఆస్పత్రి అభివృద్ధి నిధుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డాక్టర్ వినయ్, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు. అడవిలో అగ్ని ప్రమాదం రామాయంపేట(మెదక్): మండలంలోని అక్కన్నపేట అటవీ ప్రాంతంలో బుధవారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న రేంజ్ అటవీ అధికారి విద్యాసాగర్ తన సిబ్బందితో వెళ్లి మంటలను ఆర్పి వేయించారు. సకాలంలో మంటలు ఆర్పకపోతే అట వీ ప్రాంతానికి నష్టం వాటిల్లేదన్నారు. పలువురు బీడీలు, సిగరెట్లు తాగుతూ నిర్లక్ష్యంగా పారవేస్తుండడంతో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. మీసేవ కేంద్రాల తనిఖీ మెదక్ కలెక్టరేట్: మీసేవ కేంద్రాల నిర్వాహకులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఈడీఎం సందీప్ సూచించారు. బుధవారం జిల్లాలోని పలు మీసేవ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలక్ట్రానిక్ సర్వీస్ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని మీసేవ కేంద్రాలను తనిఖీ చేసినట్లు చెప్పారు. కేంద్రాలు సమర్థవంతంగా పనిచేసేందుకు తగు సూచనలు చేసినట్లు తెలిపారు. ప్రజల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయకుండా నిబంధనల ప్రకారం సేవలందించాలని సూ చించారు. ఆయన వెంట కార్యాలయ సిబ్బంది శశికాంత్ పాల్గొన్నారు. దుర్గమ్మకు పల్లకీ సేవ పాపన్నపేట(మెదక్): ఏడుపాయల దుర్గమ్మకు బుధవారం సాయంత్రం పల్లకీ సేవ నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరించుకొని యాగశాల లో అర్చకులు చండీయాగం చేశారు. సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఉత్సవ విగ్రహాన్ని పూలమాలలతో అలంకరించి పల్లకీలో ఊరేగించారు. ఇద్దరి బైండోవర్ మనోహరాబాద్ (తూప్రాన్): అక్రమంగా మట్టి తరలిస్తున్న ఇద్దరిని బుధవారం తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్ఐ సుభాష్గౌడ్ తెలిపారు. కూచారం గ్రామానికి చెందిన గోవర్ధన్రెడ్డితో పాటు అంజనేయులు పలుమా ర్లు మట్టిని అక్రమంగా తరలిస్తూ పట్టుబడగా.. కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. అయినా మానుకోకపోవడంతో బైండోవర్ చేసినట్లు వివరించారు. -
కాంగ్రెస్కు ఓట్లడిగే హక్కులేదు
వెల్దుర్తి(తూప్రాన్)/రామాయంపేట(మెదక్): పథకాల పేరుతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లడిగే నైతిక హక్కు లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విష్ణువర్దన్రెడ్డి అన్నారు. పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయం వద్ద బుధవారం నిర్వహించిన సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారంపై చర్చించా రు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కొమురయ్యను, పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేలా నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు దాసు, జిల్లా నాయకుడు శ్రీనివాస్గౌడ్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే రామాయంపేట పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మల్లేశ్గౌడ్ పాల్గొని మాట్లాడారు. ప్రతి వంద మంది పట్టభద్రులకు ఒక ఇన్చార్జిని నియమించుకుంటే ప్రచారం సాఫీగా సాగుతుందని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాగి రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, పార్టీ పట్టణ అధ్యక్షుడు అవినాశ్రెడ్డి, మండలశాఖ అధ్యక్షుడు నవీన్గౌడ్ పాల్గొన్నారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్ -
వేసవిలో అంతరాయం లేని విద్యుత్
కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్ కలెక్టరేట్: వేసవిలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. బుధవారం రాత్రి విద్యుత్శాఖ రూరల్ జోన్ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి, జిల్లా ఎస్ఈ శంకర్ కలెక్టర్ను కలిసి వేసవి విద్యుత్ ప్రణాళికపై సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలో కొత్త విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు, విద్యుత్ అంతరాయం లేకుండా రూపొందిస్తున్న సమ్మర్ యాక్షన్ ప్లాన్పై వివరించారు. అంతకుముందు జిల్లా విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో ఎస్ఈ, చీఫ్ ఇంజనీర్ జిల్లాలోని డీఈలు, ఏడీఈలు, ఏఈలతో సమావేశం నిర్వహించారు. మంగళవారం ఒకే రోజు 7.88 మిలియన్ యూనిట్లు (ఎంయూ) విద్యుత్ వినియోగం జరిగినప్పటికీ పూర్తిస్థాయిలో అందించామన్నారు. అదేవిధంగా జిల్లాలకు 90 ఎంయూ విద్యుత్ను సైతం సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మెదక్ పట్టణంతో పాటు మండలంలోని బాలానగర్లో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు చీఫ్ ఇంజనీర్ బాలస్వామి తెలిపారు. -
మమ్మల్నే కొనసాగించండి
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో... రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కొన్ని రోజుల్లోనే ఈ ఎన్నికల నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ డీసీసీబీ, పీఏసీఎస్ల పాలకవర్గం పదవీకాలం విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లుగా ఉన్న నాయకులు కీలక పాత్ర పోషిస్తుంటారు. ఈ స్థానిక ఎన్నికల నేపథ్యంలో తమను కొనసాగిస్తే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకోసం కృషి చేస్తామనే అభిప్రాయాన్ని పీఏసీఎస్ల చైర్మన్లు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వ నిర్ణయం త్వరలోనే రానుందని సహకార వర్గాలు పేర్కొంటున్నాయి.● పదవులు కాపాడుకునేందుకు డీసీసీబీ చైర్మన్ల ముమ్మర యత్నాలు ● అనధికారికంగా పాలకవర్గాల భేటీలు ● పీఏసీఎస్ చైర్మన్ల సంతకాలతో తీర్మానాలు ● మంత్రి తుమ్మలను కలిసిన 8 జిల్లాల డీసీసీబీల చైర్మన్లు ● ‘స్థానిక’ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో డీసీసీబీ (జిల్లా కేంద్ర సహకార బ్యాంకు)ల పాలకవర్గాల పదవీకాలం రెండో రోజుల్లో ముగియనుంది. దీంతో తమ పదవులను కాపాడుకునేందుకు ఆయా డీసీసీబీ చైర్మన్లు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును కలిసిన ఎనిమిది ఉమ్మడి జిల్లాల డీసీసీబీల చైర్మన్లు... తమ పదవీకాలాన్ని పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. తాజాగా బుధవారం పలు జిల్లాలో డీసీసీబీ పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళనాలపేరుతో సమావేశాలు నిర్వహించాయి. తమ పదవీకాలాన్ని పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరుతూ అనధికారిక తీర్మానాలు చేశాయి. ఈ తీర్మానాలపై ఆయా ఉమ్మడి జిల్లాల్లో ఉన్న అన్ని పీఏసీఎస్ (ప్రాథమిక సహకార సంఘాల) చైర్మన్లతో సంతకాల సేకరణ చేయడం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో డీసీసీబీ పాలకవర్గం సర్వసభ్య సమావేశాలు నిర్వహించేందుకు వీలు లేదు. దీంతో అనధికారికంగా సమావేశాన్ని నిర్వహించి ఈ మేరకు తీర్మానాలు చేశారు. డీసీసీబీలతోపాటు, పీఏసీఎస్ల పాలకవర్గం పదవీకాలం ఈనెల 15తో ముగుస్తున్న విషయం విదితమే. మేమంతా కాంగ్రెస్ వాళ్లమే... ఉమ్మడి జిల్లాల వారీగా రాష్ట్రంలో మొత్తం తొమ్మిది (హైదరాబాద్ మినహా) డీసీసీబీలున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక డీసీసీబీల్లో జరిగిన ఆర్థిక అవకతవకలపై విచారణ చేపడతామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఈ తొమ్మిది డీసీసీబీ చైర్మన్లలో ఎనిమిది డీసీసీబీల చైర్మన్లు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఒక్క కరీంనగర్ డీసీసీబీ చైర్మన్ రవీందర్రావు మాత్రమే ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్లో కొనసాగుతున్న రవీందర్రావును కొన్ని నెలల క్రితం టెస్కాబ్ చైర్మన్ పదవి నుంచి అవిశ్వాస తీర్మానం పెట్టి తొలగించిన విషయం విదితమే. ప్రస్తుతం కాంగ్రెస్లో కొనసాగుతున్న ఈ ఎనిమిది డీసీసీబీ చైర్మన్లు తామంతా తమ పదవీకాలాన్ని పొడిగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళతానని మంత్రి తుమ్మల హామీ ఇచ్చినట్లు డీసీసీబీ చైర్మన్లు చెబుతున్నారు. మమ్మల్ని కూడా కొనసాగించండి.. పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం)ల పాలకవర్గాల పదవీకాలం కూడా ఈనెల 15తోనే ముగుస్తుంది. దీంతో తమ పదవీకాలాన్ని కూడా కొనసాగించాలని ఆయా పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు కోరుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 920 పీఏసీఎస్లు ఉండగా.. బీఆర్ఎస్ సర్కారు హాయాంలో తొంభై శాతం పీఏసీఎస్ల చైర్మన్లు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న చైర్మన్ల సంఖ్య సుమారు 585 చేరినట్లు అనధికారిక అంచనా. దీంతో తాము కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నామని తమ పదవీకాలాన్ని కూడా కొనసాగించాలని పీఏసీఎస్ చైర్మన్లు కోరుతున్నారు. -
ఆర్టిజన్ కార్మికులకు కన్వర్షన్ ఇవ్వాలి
మెదక్ కలెక్టరేట్: జిల్లా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు కన్వర్షన్ ఇవ్వాలని టీవీఏసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఈశ్వర్రావు డిమాండ్ చేశారు. ఈ నెల 3న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రారంభమైన ఆర్టిజన్ కన్వర్షన్ యాత్ర మంగళవారం మెదక్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా మెదక్ జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట జేఏసీ జిల్లా చైర్మన్ స్వామి అధ్యక్షతన ఆర్టిజన్ కార్మికుల సమస్యలపై చర్చించేందుకు సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ఈశ్వర్రావు మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ పోస్టులకు కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్హతను బట్టి పోస్టులని ఇవ్వాలన్నారు. ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఎన్నికలకు ముందు నిర్వహించిన పాదయాత్రలో సమస్యలు పరిష్కరిస్తామని కార్మికులకు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సమస్యను సీఎం రేవంత్రెడ్డి, విద్యుత్శాఖ మేనేజ్మెంట్ దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20వేల మంది ఆర్టీజన్ కార్మికులు ఉన్నట్లు తెలిపారు. కన్వర్షన్ యాత్రకు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహేందర్రెడ్డి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వీజీఆర్, రాష్ట్ర కోకన్వీనర్ తిరుపతి, రాష్ట్ర సహాయ కార్యదర్శి చంద్రరెడ్డి, సిద్దిపేట జిల్లా చైర్మన్ సధాకర్, మెదక్ కన్వీనర్ దుర్గేశ్, సంగారెడ్డి జిల్లా చైర్మన్ రాములు, నాయకులు సందీప్, జైపాల్ తదితరులు పాల్గొన్నారు. టీవీఏసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఈశ్వర్రావు విద్యార్హతలను బట్టి పోస్టులివ్వాలి -
పీఓలు, ఏపీఓలే కీలకం
మెదక్ కలెక్టరేట్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో పీఓలు, ఏపీఓలే కీలకమని, పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. ఈ నెల 27న జరగనున్న మెదక్, నిజామాబాద్ ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం, ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు జరగనున్నాయి. మంగళవారం మెదక్ సమీకృత కలెక్టరేట్లో ఎన్నికల విధులలో పాల్గొన్న పీఓలు, ఏపీఓలు, సెక్టార్, నోడల్ అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల నిర్వహణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల పోలింగ్ నిర్వహణపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 11,953 మంది పట్టభద్రుల ఓటర్లు ఉండగా, 22 పోలింగ్ కేంద్రాలు, 1,281 మంది ఉపాధ్యాయ ఓటర్ల ఉండగా 21 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ ఎన్నికల విధులు నిర్వహించేందుకు 43 మంది పీఓలు, 43 మంది ఏపీఓలకు విధులు కేటాయించినట్లు తెలిపారు. పురుషుల, మహిళా ఓటర్ల సంఖ్యను తప్పక నమోదు చేసుకోవాలన్నారు. మాక్ పోలింగ్ ఉండదు సాధారణ ఎన్నికల మాదిరి మాక్ పోలింగ్ ఉండదని, ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. ఏజెంట్ల సమక్షంలో పోలింగ్ బాక్స్ ఓపెన్ చేసి చూపించాలన్నారు. దానిని వీడియో చిత్రీకరణ చేయాలని, తర్వాత ఆ బాక్సును సీల్ వేసిన తర్వాత పోలింగ్ ప్రారంభించాలని తెలిపారు. ఓటర్లు పేరులో తప్పులు ఉంటే, ఏదేని గుర్తింపు కార్డు ఆధారంగా ధ్రువీకరణ తర్వాత ఓటు హక్కుకు అనుమతించాలని కోరారు. టెండర్, చాలెంజ్ ఓట్లు ఏవైనా నమోదైతే పోలింగ్ అధికారులకు ఇచ్చే ప్రత్యేక మైన ఎన్వలప్లలో భద్రపరచాలన్నారు.జిల్లాలో 43 పోలింగ్ కేంద్రాలు 11,953 మంది పట్టభద్రుల ఓటర్లు 1281 మంది ఉపాధ్యాయ ఓటర్లు అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ నగేష్ 13 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎన్నికల విధుల్లో పాల్గొనే పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు ఇతర ఎన్నికల సిబ్బందికి ఈ నెల 13వరకు కలెక్టర్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కుకు అవకాశం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. అధికారులు పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీవో రమాదేవి, తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి, నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాసాచారి, జిల్లా సైన్స్అధికారి రాజిరెడ్డి పాల్గొన్నారు. -
కుస్తీ మే సవాల్
తలపడుతున్న మల్లయోధులుటేక్మాల్ మండలం వెల్పుగొండలో తుంబురేశ్వర స్వామి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకలో భాగంగా మంగళవారం ఉదయం రుద్రాభిషేకం, పుష్పార్చన, బిల్వార్చన, ఆకులపూజ, పాదుకాపూజ నిర్వహించారు. మధ్యాహ్నం భక్తజన సందోహం మధ్య కుస్తీపోటీలను నిర్వహించారు. కొబ్బరికాయ కుస్తీని మొదలుకొని.. కడియం కుస్తీ వరకు హోరాహోరీగా సాగాయి. చిన్నారుల కుస్తీ పోటీ అందరిని ఆకట్టుకుంది. డప్పుల దరువుకు అనుగుణంగా కుస్తీలు కొనసాగాయి. ఈ పోటీలకు ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల మల్లయోధులు పాల్గొన్నారు. చివరి కుస్తీలో కామారెడ్డి జిల్లా అంతాపూర్కు చెందిన గంగాదర్ ఇద్దరిపై గెలుపొందారు. విజేతకు కడియాన్ని, గ్రామస్తులు ఐదు తులాల వెండి కడియంతో పాటు నగదును అందించారు. అనంతరం రాత్రి వేళల్లో పల్లకిసేవ, రథోత్సవం, భజన కార్యక్రమాలు నిర్వహించారు. టేక్మాల్(మెదక్): -
భక్తులకు ఇబ్బందులు కల్గించొద్దు
ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి పాపన్నపేట(మెదక్): ఏడుపాయల జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ రాజశేఖర్ రెడ్డి, పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్గౌడ్తో కలసి ఏడుపాయల్లోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. ఆలయం వద్ద భక్తులకు ఇబ్బంది కలుగకుండా అన్నీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సీసీ కెమెరాలు సరిగ్గా పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రసాదం కౌంటర్ వద్ద తొక్కిసలాట జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాజగోపురం వరకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని, పోతంషెట్పల్లి, నాగ్సాన్పల్లి వైపు ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా జాగ్రత్త వహించాలన్నారు. బస్సులు ఆపేందుకు సరైన ప్లాట్ఫాంలు ఏర్పాటు చేయాలన్నారు. ఘనపురం ఆనకట్టపై బారికేడ్లు ఏర్పాటు చేసి.. బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు.లెప్రసీపై వంద రోజుల అవగాహన కార్యక్రమంజిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరాం రామాయంపేట(మెదక్): వైద్యులు, సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరాం సూచించారు. మంగళవారం ఆయన మండలంలోని ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. లెప్రసీ వ్యాధికి సంబంధించి వంద రోజుల అవగాహన కార్యక్రమం కొనసాగుతోందని, అనుమానం ఉన్నవారికి టెస్టింగ్కు పంపుతున్నామని పేర్కొన్నారు. ప్రతి రోజూ ఆస్పత్రికి ఎంతమంది బీపీ, షుగర్ రోగులు వస్తున్నారని, వారు ఆసుపత్రి నుంచే మాత్రలు తీసుకెళుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీదే విజయం నర్సాపూర్: ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థుల విజయం ఖాయ మని ఆ పార్టీ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మల్లేష్గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. రెండు ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా మని చెప్పారు. పార్టీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్యల విజయానికి కార్యకర్తలంతా సమష్టి కృషితో పని చేయాలని చెప్పారు. కాగా బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన మల్లేష్గౌడ్ను పలువురు నాయకులు మంగళవారం సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అంగన్వాడీ కేంద్రంసందర్శన నిజాంపేట(మెదక్): నిజాంపేట మండల పరిధిలోని రజాక్పల్లిలో అంగన్వాడీ కేంద్రాన్ని మంగళవారం మహిళా శిశువు సంక్షేమ శాఖ జిల్లా అధికారి హైమావతి సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. పిల్లల ఎత్తులు, బరువులు అడిగి తెలుసుకున్నారు. అలాగే గర్భిణిలు,, బాలింతలకు గర్భస్థ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాలింతలకు పోషకాహారం, పిల్లలకు పాలు పట్టే విధానం గురించి వివరించారు. నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ భవనం గురించి డీఈతో ఆరా తీశారు. కార్యక్రమంలో రామాయంపేట ప్రాజెక్టు సీడీపీఓ స్వరూప, నిజాంపేట సెక్టర్ సూపర్వైజర్, ఐసీపీఎస్ సిబ్బంది మధుకర్ తదితరులు పాల్గొన్నారు. -
4
అండర్పాస్లు● అటవీశాఖ నిర్ణయం ● వన్యప్రాణులు ఎక్కువగాసంచరించే ప్రాంతాల గుర్తింపు ● త్వరలో కేంద్రానికి ప్రతిపాదనలుఅటవీ ప్రాంతంలోని ఎన్హెచ్లపై నిర్మాణం రామాయంపేట(మెదక్): ఇటీవల రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురై చిరుత మృతి చెందిన ఘటన తర్వాత అటవీ శాఖ మేల్కొంది. అటవీప్రాంతం గుండా వెళ్లే జాతీయ రహదారులపై వన్యప్రాణుల సంరక్షణకు ఆ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని రెండు జాతీయ రహదార్లపై అండర్పాస్లు నిర్మించాలని నిర్ణయించింది. వన్యప్రాణుల సంరక్షణ కోసం ఎంపిక చేసిన స్థలాల్లో వాటిని నిర్మించనున్నారు. ఇప్పటికే వన్యప్రాణులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఇటీవల కేంద్ర అటవీశాఖ, రోడ్డు, భవనాల శాఖ, స్థానిక అటవీ అధికారులు రామాయంపేట, మెదక్ మధ్య అటవీప్రాంతంలో సర్వే నిర్వహించారు. ఎక్కడికక్కడ అండర్పాసులు నిర్మించాలనే విషయంపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆ ప్రతిపాదనలను త్వరలో కేంద్రానికి పంపించనున్నారు. రెండు జాతీయ రహదార్లపై... జిల్లాలోని 44వ నంబర్ జాతీయ రహదారి తూప్రాన్, చేగుంట, రామాయంపేట మండలాల మీదుగా వెళ్తుంది. మెదక్ నుంచి రామాయంపేట మీదుగా సిద్దిపేట వరకు మరో నూతన జాతీయ రహదారి (765డీజీ)ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. జాతీయ రహదారి 44పై మూడు కిలోమీటర్లు, మరో రహదారి 765 డీజీపై మెదక్–రామాయంపేట మధ్య నాలుగున్నర కిలోమీటర్ల మేర అటవీప్రాంతం విస్తరించి ఉంది. ఈ మేరకు రామాయంపేట–మెదక్ మధ్య అక్కన్నపేట, తొనిగండ్ల, పాతూర్, నార్సింగి మండల పరిధిలోని వల్లూర్ ప్లాంటేషన్ వద్ద రహదార్లపై అండర్పాస్లను నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణకే జాతీయ రహదార్లపై అటవీ ప్రాంతాల వద్ద వన్యప్రాణులు రోడ్డును దాటే క్రమంలో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. చిరుత మృతి ఘటనలు పునరావృతం కాకుండా అండర్పాసుల నిర్మాణానికిగాను ప్రయత్నిస్తున్నాం. – జోజి, జిల్లా అటవీ అధికారి