MIM
-
GHMC మేయర్ Vs MIM ఎమ్మెల్సీ.. అధికారుల్లో టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: నగరంలో జీహెచ్ఎంసీ మేయర్ వర్సెస్ ఎంఐఎం ఎమ్మెల్సీ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. చికెన్, మటన్ షాపులు విషయంలో వీరిద్దరి మధ్య కోల్డ్వార్ నడుస్తోంది. ప్రస్తుతం మేయర్ వర్సెస్ ఎంఐఎం ఎమ్మెల్సీ వ్యవహారం జీహెచ్ఎంసీలో హాట్ టాఫిక్ అంశంగా మారింది.వివరాల ప్రకారం..‘కలుషిత, అపరిశుభ్రమైన, నాణ్యత లేని నాన్వెజ్ విక్రయాలు జరుపుతూ చికెన్ మార్కెట్ నిర్వాహకులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. భరించలేని దుర్వాసన, ఎలుకల సంచారం.. తక్షణమే చికెన్ మార్కెట్ను సీజ్ చేయండి’.. ఈ నెల 22న కోఠిలోని మోతీ మార్కెట్లో ఆకస్మిక పర్యటన సందర్భంగా మేయర్ అధికారులకు చేసిన ఆదేశాలివి.. మేయర్ ఆదేశాల మేరకు చికెన్ సెంటర్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి సీజ్ చేసే ప్రయత్నం చేశారు.మరోవైపు.. మేయర్ ఆదేశాలు ఇచ్చి 24 గంటలు గడవక ముందే ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మిర్జా రహమత్ బేగ్ సీజ్ చేసిన చికెన్, మటన్ షాపులు తెరవకపోతే ఉద్యోగాలు పోతాయంటూ ఫుడ్ సేఫ్టీ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇంకోసారి తమ దుకాణాలపై దాడులు చేస్తే చర్యలు తప్పవంటూ మందలించారు. మేయర్ ఆదేశాలు డోంట్కేర్..ఇంట్లో ఎలుకలు ఉన్నాయని, ఇంటిని సీజ్ చేసుకుంటామా? అంటూ ఎమ్మెల్సీ బేగ్ మేయర్ తనిఖీల తీరును ఎండగట్టారు.దీంతో, మేయర్ వర్సెస్ ఎంఐఎం ఎమ్మెల్సీ వ్యవహారం జీహెచ్ఎంసీలో హాట్ టాఫిక్ అంశంగా మారింది. మేయర్ తీరుపై ఎంఐఎం ప్రజాప్రతినిధులు గుర్రుగా ఉన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో ఎంఐఎం పార్టీకి చెందిన నాయకుడి క్యాంటీన్ విషయంలోనూ మేయర్ తరచూ జోక్యం చేసుకుంటున్నారన్న చర్చ జరుగుతున్న క్రమంలో ఎమ్మెల్సీ బేగ్ మేయర్ ఆదేశాలకు ధీటుగా నిలబడి విమర్శలు గుప్పిస్తుండడంపై అటు అధికారుల్లో, ఇటు కార్పొరేటర్లలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. -
ఎంఐఎం కేన్సర్లాంటిది
నిజామాబాద్ సిటీ: ఎంఐఎం పార్టీ దేశానికి కేన్సర్ వ్యాధి వంటిద ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. ఆదివా రం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా దానితో అంటకాగడం ఎంఐఎంకు అలవాటుగా మారిందని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎంఐఎంకు భయపడుతోందని ఎద్దేవా చేశారు. హైడ్రా పాతబస్తీలో అక్రమ కట్టడా లను ఎందుకు కూల్చటం లేదని ప్రశ్నించారు.వక్ఫ్బోర్డు చట్టంలో అనేక లొసుగులున్నా యని, వాటిని సవరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేని మాజీ మంత్రి కేటీఆర్.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర చేయాలనుకుంటున్నారో ప్రజ లకు చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తే ప్రజలు ఆయనకు చీపుర్లు, చెప్పులతో స్వాగతం పలికి నిలదీయాలని పిలుపునిచ్చారు. -
MIM MLA Vs ఫిరోజ్ఖాన్.. అసిఫ్నగర్లో ఉద్రిక్తత
హైదరాబాద్: హైదరాబాద్ ఆసిఫ్నగర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్, ఎంఐఎం నేతల మధ్య ఘర్షణ జరిగింది. నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్, కాంగ్రెస్ నేత ఫిరోజ్ఖాన్ అనుచరుల మధ్య గొడవ జరిగింది. బ్యాంకు కాలనీలో రహదారి పనుల పరిశీలనకు కాంగ్రెస్ నేత ఫిరోజ్ఖాన్పై వచ్చారు. ఈ క్రమంలో ఫిరోజ్ఖాన్పై మాజిద్ హుస్సేన్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరు నేతల కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలను అదుపు చేశారు. -
జీహెచ్ఎంసీ ఆఫీసు కూల్చేస్తారా?: ఎంపీ అసద్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ‘హైడ్రా’ కూల్చివేతల అంశం హాట్ టాపిక్గా మారింది. డిజిటల్ కార్డుల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్రెడ్డి ఇటీవల హైదరాబాద్ కట్టడాల కూల్చివేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.కూల్చివేతలపై అసదుద్దీన్ ఓవైసీ మరోసారి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్టీఎల్లో కట్టారు.. కూల్చేస్తారా? అని ప్రశించారు. నెక్లెస్ రోడ్డు కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది తొలగిస్తారా? జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం,సెక్రటేరియట్లు, ప్రముఖుల ఘాట్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి వాటిని కూల్చేస్తారా? అంటూ అసదుద్దీన్ ప్రశ్నించారు. దీంతో, అసద్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. -
మా టార్గెట్ పాతబస్తీ...
నయీంనగర్ (హనుమకొండ): ‘మా టార్గెట్ పాతబస్తీ. ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మార్చాలని పోరాడుతున్నాం... ఎంఐఎం ఆనవాళ్లు లేకుండా చేస్తాం. పాతబస్తీని కైవసం చేసుకోవడమే బీజేపీ లక్ష్యం’అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. సంఘ విద్రోహులకు అడ్డాగా మారిన పాతబస్తీని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామనే విషయాన్ని మైనారిటీ మోర్చా నాయకులంతా ముస్లింలకు వివరించాలని సూచించారు. హనుమకొండలో శనివారం జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అబద్ధాలు, మోసాలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ను మించిపోయిందన్నారు. ‘వెయ్యి ఎకరాల్లో జూ ఏర్పాటు చేస్తారట. మరో వెయ్యి ఎకరాల్లో హెల్త్ హబ్ ఏర్పాటు చేస్తారట. వేలాది ఎకరాల్లో ఫోర్త్ సిటీని నిర్మిస్తారట. అసలు ఉన్న భూములన్నీ కేసీఆర్ అమ్ముకున్నడు... మరి ఈ ప్రభుత్వం యాడ నుండి తీసుకొస్తది.?’అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో బీజేపీ కార్యకర్తలపై చేసిన అరాచకాలను మర్చిపోలేమని, బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈపాటికే కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేసే వాళ్లమని చెప్పారు. రాక్షస పార్టీ బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని, ఇదంతా కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారమన్నారు. కాంగ్రెస్లోనే బీఆర్ఎస్ విలీనం ఖాయమని, మాట ముచ్చట కూడా పూర్తయ్యిందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. -
హైడ్రాపై అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో ‘హైడ్రా’కూల్చివేత అంశం హాట్ టాపిగ్గా మారింది. కట్టడాల కూల్చివేతలపై ప్రతిపక్ష నేతలు మండిపడతున్నారు. తాజాగా హైడ్రాపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఫాతిమా ఓవైసీ కాలేజీని కూల్చేస్తారన్న వార్తలపై అక్బరుద్దీన్ స్పందించారు. నాపై బుల్లెట్ల వర్షం కురిపించండి. కత్తులతో దాడి చేయండి. కానీ నేను పేదల విద్యాభివృద్ధి కృషికి అడ్డుపడకండి అని’ అక్బరుద్దీన్ కోరారు. -
‘ఎంఐఎం’ అంటే గోడ మీద పిల్లి.. బండి సంజయ్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్. రాష్ట్రంలో ఎంఐఎం గోడ మీద పిల్లిలాంటిది.. ఎవరు అధికారంలో ఉంటే వారి చెంతకు చేరుతుంది అంటూ ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో అక్బరుద్దీన్ ఒకవేళ అక్కడి నుంచి పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాకుండా చేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు.కాగా, బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆదివారం చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో అందరూ ఆనందంగా ఉండాలి. కొన్ని ప్రాంతాల్లో బోనాలను అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూడాలి. గత పాలకులు ఇదే తరహాలో చేస్తే ఏమైందో అందరూ చూశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే అమ్మవారి టెంపుల్ను గోల్డెన్ టెంపుల్గా మార్తుస్తామన్నారు. నేను హిందువుల తరపున పక్కా మాట్లాడుతా. అలా అని వేరే మతానికి వ్యతిరేకం కాదు.ఇదే సమయంలో తెలంగాణ రాజకీయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ గోడ మీద పిల్లిలాంటిది. ఎవరు అధికారంలో ఉంటే వారి పార్టీ పక్కన చేరుతారు. అధికారంపోగానే వారితో సంబంధాలు తెంపేసుకుంటారు. అక్బరుద్దీన్ను డిప్యూటీ సీఎం చేస్తా అని రేవంత్ రెడ్డి అంటున్నారు. రేవంత్, అక్బరుద్దీన్ అన్నదమ్ములయ్యారు. దమ్ముంటే అక్బరుద్దీన్ కొడంగల్ నుంచి పోటీ చేయాలి. ఒకవేళ ఆయన అక్కడ పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాకుండా చేస్తాం అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
డిప్యూటీ సీఎం చేస్తా..! అక్బరుద్దీన్కు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్
సాక్షి, హైదరాబాద్: ఓల్డ్ సిటీ అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. అభివృద్ధి చేయకపోను ఓల్డ్ సిటీ వాసులను దొంగలుగా చిత్రీకరిస్తున్నారంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలో పాతబస్తీకి మెట్రో విషయంలో ఇరువురి మధ్య మాటల యుద్ధ జరిగింది. పాతబస్తీలో కరెంటు బిల్లుల వసూళ్ల కోసం ఆదాని సంస్థకు అప్పగించారు. కేవలం పాతబస్తీని ఎందుకు సెలెక్ట్ చేశారు?. సీఎం నియోజకవర్గం కొడంగల్, ఉత్తమ్కుమార్రెడ్డి నియోజకవర్గం, శ్రీధర్ బాబు నియోజకవర్గం ఎందుకు పైలెట్ ప్రాజెక్టుగా పరిగణలోకి తీసుకోలేదంటూ అక్బరుద్దీన్ ప్రశ్నించారు.అక్భరుద్దీన్ ప్రశ్నకు సీఎం రేవంత్రెడ్డి సమాధానమిస్తూ.. మెట్రో విషయంలో పాతబస్తీని గత ప్రభుత్వం మోసం చేసిందని.. ఎట్టి పరిస్థితుల్లో పాతబస్తీలో మెట్రో నిర్మిస్తామని రేవంత్ అన్నారు. అది ఓల్డ్సీటీ కాదు.. ఒరిజినల్ సిటీ. రెండో విడత మెట్రో విస్తరణపై బీఆర్ఎస్ కాకి లెక్కలు చెప్పింది. పాతబస్తీలో మెట్రో నిర్మాణం చేపట్టాలని ఎల్అండ్ టీకి చెప్పాం. లేదంటే చర్లపల్లి, చంచల్గూడ జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పానని రేవంత్ అన్నారు.‘‘కాంగ్రెస్ బీ ఫామ్పై అక్బరుద్దీన్ పోటీ చేస్తే కొడంగల్లో గెలిపించే బాధ్యత నాది.. డిప్యూటీ సీఎంను చేసి పక్కనే కూర్చోబెట్టుకుంటా’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్గా.. మజ్లిస్ పార్టీలో తాను సంతోషంగానే ఉన్నానని.. పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. చివరి శ్వాస వరకు ఎంఐఎం పార్టీలోనే కొనసాగుతానంటూ అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. -
Lok Sabha Election 2024: బీజేపీ.. కాంగ్రెస్కు చెరో '8'
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో 8 స్థానాల్లో విజయం సాధించాయి. హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని ఎంఐఎం నిలుపుకొంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఒక్క స్థానాన్ని కూడా సాధించలేకపోయింది. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీల తరఫున మొత్తం 9 మంది సిట్టింగ్ ఎంపీలు పోటీచేయగా.. వారిలో ఐదుగురు ఓటమి పాలయ్యారు. ఓడినవారిలో నామా నాగేశ్వర్రావు, మాలోతు కవిత, రంజిత్రెడ్డి, మన్నె శ్రీనివాస్రెడ్డి, బీబీ పాటిల్ ఉన్నారు. అసదుద్దీన్, కిషన్రెడ్డి, బండి సంజయ్, అరవింద్ మాత్రమే తమ సీట్లను నిలుపుకొన్నారు. ఇక ఈసారి 8 మంది తొలిసారి ఎంపీగా గెలిచి రాష్ట్రం నుంచి లోక్సభలో అడుగుపెట్టబోతున్నారు. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పట్టు.. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దక్షిణ తెలంగాణ ప్రాంతంలో తన పట్టును నిలుపుకోగా.. ఉత్తర తెలంగాణలో బీజేపీ సత్తా చాటింది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఉన్న మొత్తం 5 లోక్సభ సీట్లనూ కాంగ్రెస్ గెలుచుకుంది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని నాలుగు లోక్సభ స్థానాల్లో బీజేపీ మూడింటిని గెలుచుకుని ఆ ప్రాంతాల్లో ఆధిపత్యం చాటింది. హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి ఎంఐఎం అధినేత, సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వరుసగా ఐదోసారి విజయం సాధించడంతో పాత నగరంపై ఆ పార్టీ పట్టు నిలుపుకొంది. ఉమ్మడి మహబూబ్నగర్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో రెండేసి చొప్పున మొత్తం ఆరు లోక్సభ సీట్లు ఉండగా.. కాంగ్రెస్, బీజేపీ చెరో మూడు సీట్లను దక్కించుకున్నాయి. అదీ ప్రతి జిల్లాలో చెరో సీటు సాధించడం గమనార్హం. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని రెండు సీట్లనూ బీజేపీ కైవసం చేసుకుంది. పట్టుపెంచుకున్న ఇరు పార్టీలు.. 2019 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 4 స్థానాలను గెలిచిన బీజేపీ.. ఈసారి తన బలాన్ని 8 సీట్లకు పెంచుకుంది. కాంగ్రెస్ కూడా 3 సీట్ల నుంర్టీచి 8 సీట్లకు బలాన్ని పెంచుకుంది. గత ఎన్నికల్లో 9 సీట్లు గెలిచిన బీఆర్ఎస్ ఈసారి ఖాతా తెరవలేకపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి.. ఆ ఎన్నికల్లో కేవలం 8 అసెంబ్లీ స్థానాలే గెలిచిన బీజేపీ లోక్సభ ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చి సమ ఉజ్జీగా నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలను గెలుచుకున్న బీఆర్ఎస్ ఒక్క లోక్సభ సీటు గెలవలేదు. గత, ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు వచ్చిన సీట్లివీ.. పార్టీ 2014 2019 2024 కాంగ్రెస్ 2 3 8 బీజేపీ 1 4 8 ఎంఐఎం 1 1 1 బీఆర్ఎస్ 11 9 0 నల్లగొండ: రికార్డు స్థాయి మెజారిటీ నల్లగొండ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ తమ పట్టు నిలుపుకొంది. కౌంటింగ్ ఆద్యంతం ఆ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్రెడ్డి స్పష్టమైన ఆధిక్యత చూపారు. చివరికి ఏకంగా రికార్డు స్థాయిలో 5,59,906 ఓట్ల మెజారిటీ సాధించారు. తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి రెండో స్థానంలో నిలిచారు. భువనగిరి: అంతా తొలిసారి ఎంపీలే.. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో తమకు ఉన్న పట్టును కాంగ్రెస్ పార్టీ మరోసారి నిలుపుకొంది. భువనగిరి లోక్సభ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి సమీప బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్పై 2,22,170 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కిరణ్కుమార్రెడ్డి తొలిసారి లోక్సభలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సెగ్మెంట్లో ఇంతకు ముందు ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా తొలిసారిగా ఎంపీలు అయినవారే కావడం విశేషం. నాగర్ కర్నూల్: మళ్లీ ‘చేతి’కి.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూల్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి 94,414 ఓట్ల మెజారిటీతో సమీప బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్పై గెలుపొందారు. మల్లు రవి 1991, 1998 ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఎంపీగా గెలవడం గమనార్హం. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత విజయం సాధించారు. ఇక ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. పెద్దపల్లి: మళ్లీ కాంగ్రెస్ ఖాతాలోకి.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ తిరిగి చేజిక్కించుకుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 1,31,364 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్పై విజయం సాధించారు. కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) మనవడు, చెన్నూర్ ఎమ్మెల్యే జి.వివేక్ తనయుడే గడ్డం వంశీకృష్ణ. ఈయన తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ అయ్యారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మూడోస్థానానికి పరిమితం అయ్యారు. వరంగల్: పార్టీ మారి పోటీచేసినా.. 2009లో జరిగిన పునర్విభజనలో వరంగల్ లోక్సభ నియోజకవర్గం ఏర్పాటైంది. 2009లో కాంగ్రెస్ గెలవగా తర్వాత వరుసగా బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. మళ్లీ ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ అభ్యర్ధి, మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య గెలిచారు. ఆమె బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్పై 2,20,339 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో కావ్యకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. కానీ ఆమె కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. అరూరి రమేష్ కూడా ఎన్నికల ముందే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి పోటీ చేయడం గమనార్హం. మహబూబాబాద్: సెగ్మెంట్ చరిత్రలో అధిక మెజారిటీ మహబూబాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పి.బలరాంనాయక్ 3,49,165 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మాలోతు కవితపై విజయం సాధించారు. 1957 నుంచీ కొనసాగిన మానుకోట పాత పార్లమెంట్ స్థానంలోగానీ, 2009 తర్వాత కొత్తగా ఏర్పడిన మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలోగానీ.. ఇదే అత్యధిక మెజారిటీ కావడం గమనార్హం. 2009లో కాంగ్రెస్ తరఫున ఇదే లోక్సభ స్థానం నుంచి గెలిచిన బలరాంనాయక్ కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2014, 2019 ఎంపీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన.. ఈసారి మళ్లీ గెలిచారు. ఖమ్మం: ఆద్యంతం కాంగ్రెస్ ఆధిక్యమే.. తొలి రౌండ్ నుంచి చివరిదాకా కాంగ్రెస్ ఆధిక్యమే కొనసాగింది. చివరికి 4,67,847 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి విజయం సాధించారు. ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వియ్యంకుడు కావడం గమనార్హం. బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్రావు రెండో స్థానంలో నిలిచారు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో 1952 నుంచి ఇప్పటివరకు జరిగిన 18 ఎన్నికల్లో.. ప్రస్తుతం రామసహాయం రఘురాంరెడ్డి సాధించిన మెజారిటీయే రికార్డు. ఇక్కడ బీజేపీ ఓటు బ్యాంక్ పెంచుకుంది. ఇక్కడ 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికి 20,488 ఓట్లే రాగా.. ఈసారి ఆ పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు 1,18,636 ఓట్లు సాధించారు. జహీరాబాద్: ఇక్కడా హస్తం హవా ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని జహీరాబాద్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ 46,174 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్ధి/సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్పై విజయం సాధించారు. సురేశ్ షెట్కార్ ఇదే సెగ్మెంట్ నుంచి 2009లో ఎంపీగా గెలిచారు. ఇక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ అయిన బీబీ పాటిల్ ఎన్నికల ముందే బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున బరిలోకి దిగారు. రెండు జాతీయ పార్టీల అభ్యర్థుల మధ్య గట్టిపోటీనే జరిగింది. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్ మూడో స్థానంలో నిలిచారు. నిజామాబాద్: పోటాపోటీ మధ్య కమలానికి.. ఇందూరు గడ్డపై మళ్లీ కాషాయ జెండా రెపరెపలాడింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ కొనసాగిన నిజామాబాద్ లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డిపై 1,09,241 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నిజామాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకుగాను.. అరవింద్కు బాల్కొండ, ఆర్మూర్, కోరుట్ల, నిజామాబాద్ రూరల్లలో ఆధిక్యత వచ్చింది. జీవన్రెడ్డికి జగిత్యాల, నిజామాబాద్ అర్బన్, బోధన్ సెగ్మెంట్లలో ఆధిక్యత వచ్చింది. కరీంనగర్: పట్టు పెంచుకున్న జాతీయ పార్టీలు తొలి నుంచీ బీఆర్ఎస్కు ఆయువుపట్టుగా ఉన్న కరీంనగర్ లోక్సభ స్థానంలో జాతీయ పార్టీలు పట్టుపెంచుకున్నాయి. ఇక్కడ 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 4,98,276 ఓట్లు, బీఆర్ఎస్కు 4,08,768 ఓట్లు, కాంగ్రెస్కు 1,79,258 ఓట్లు రాగా.. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 5,85,116 ఓట్లతో విజయం సాధించారు. క్రితంసారితో పోలిస్తే 86,840 ఓట్లు పెరిగాయి. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు 3,59,907 ఓట్లు తెచ్చుకున్నారు. అంటే కాంగ్రెస్కు 1,80,649 ఓట్లు అదనంగా వచ్చాయి. ఈసారి బీఆర్ఎస్కు 2,82,163 ఓట్లు వచ్చాయి. 1.25 లక్షలకుపైగా ఓట్లు తగ్గాయి. మహబూబ్నగర్: కౌంటింగ్ ఆద్యంతం ఉత్కంఠ మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి మధ్య విజయం దోబూచులాడింది. చివరికి డీకే అరుణ 4,500 ఓట్ల స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. గతంలో రాష్ట్ర మంత్రిగా వ్యవహరించిన డీకే అరుణ లోక్సభకు ఎన్నికవడం ఇదే తొలిసారి. అయితే ఈ లోక్సభ ఎన్నికలో సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ స్థానం పరిధిలో కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడం చర్చనీయాంశంగా మారింది. మల్కాజిగిరి: దేశంలోనే పెద్ద సెగ్మెంట్.. తొలిసారి బీజేపీ విజయం దేశంలోనే అత్యధిక ఓట్లున్న లోక్సభ సెగ్మెంట్ మల్కాజిగిరిలో తొలిసారి కాషాయ జెండా ఎగిరింది. ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ సమీప కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్రెడ్డిపై 3,91,475 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. బీఆర్ఎస్లో ప్రముఖ నేతగా కొనసాగి, రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేసిన ఈటల తొలిసారి ఎంపీ అయ్యారు. చేవెళ్ల: కొండా వశం చేవెళ్ల లోక్సభ సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి ఘన విజయం సాధించారు. ఆయన 2014లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరఫున ఎంపీగా గెలిచారు. 2019లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఇక ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరి పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమైంది. చేవెళ్ల సెగ్మెంట్లో ఏకంగా 43 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మెదక్: గులాబీ కంచుకోటలో కమలం బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచీ కంచుకోటగా ఉన్న మెదక్లో బీజేపీ విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు 39,139 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్పై గెలిచారు. ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసిన రఘునందన్రావు తొలిసారిగా ఎంపీ అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి కంటే సుమారు 35 వేల ఓట్లు తక్కువగా వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఆదిలాబాద్: మళ్లీ కమలమే! ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో కమలం పార్టీ మళ్లీ వికసించింది. ఆ పార్టీ అభ్యర్థి గొడం నగేశ్.. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణపై 90,652 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014లో బీఆర్ఎస్ తరఫున ఎంపీగా గెలిచిన ఆయన.. ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. బీఆర్ఎస్ ఇక్కడ కూడా మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడ కౌంటింగ్ తొలుత ఉత్కంఠగా సాగింది. బీజేపీ అభ్యర్థి తొలి నుంచీ ఆధిక్యంలో ఉన్నా.. కొన్ని రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి స్వల్ప ఆధిక్యత సాధించారు. చివరికి నగేశ్ గెలిచారు. హైదరాబాద్: ఐదోసారి లోక్సభకు అసదుద్దీన్ హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వరుసగా ఐదోసారి విజయం సాధించారు. ఆయన సమీప బీజేపీ అభ్యర్థి కె.మాధవీలతపై 3,38,087 ఓట్ల మెజారిటీ సాధించారు. ఎన్నికల్లో తన ప్రచార, వ్యవహార శైలితో జాతీయ మీడియాను కూడా ఆకర్షించిన మాధవీలత ఊహించిన స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయ్యారు. 2019లో 2.82 లక్షల ఓట్ల మెజారిటీతో అసదుద్దీన్ గెలవగా.. మెజారిటీ మరో 50వేలకుపైగా పెరిగింది. సికింద్రాబాద్: ఓట్లు మరింత పెంచుకున్న బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్లో బీజేపీ తన ఓట్లశాతాన్ని మరింత పెంచుకుంది. బీజేపీ నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్పై 49,944 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గత లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్లో బీజేపీకి 42.05 శాతం ఓట్లురాగా.. ఈసారి 45.15శాతం వచ్చాయి. -
మాధవీలత ఓడిపోలేదు.. చిత్తుగా ఓడించిందెవరు?
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణపై ఢిల్లీ పెద్దలు పెట్టిన ఫోకస్ మొత్తానికి ఫలించింది. 17 లోక్సభ స్థానాల్లో బీజేపీ ఎనిమిది సీట్లలో గెలుపొంది తన విజయం శాతాన్ని మెరుగుపర్చుకుంది. అయితే గెలుపు సంగతి పక్కనపెడితే హాట్ టాపిక్గా మారిన హైదరాబాద్ ఎంపీ సీటులో మాత్రం ఘోర ఓటమిని చవిచూసింది.ఎంఐఎం కంచుకోట అయిన హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకునేందుకు బీజేపీ పెద్ద ప్లానే చేసింది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కొంపెళ్ల మాధవీలతను ఎంచుకుంది. తద్వారా ఎంఐఎం అడ్డాలో నారీశక్తిని అస్త్రంగా ప్రయోగించినట్లు సంకేతాలు పంపింది. కానీ, ఆ వ్యూహం కాషాయ పార్టీకి ప్రతికూలంగా మారరి బెడిసి కొట్టింది. విరించి హాస్పిటల్స్ ఛైర్ పర్సన్గా ఉన్న మాధవీలత.. హిందుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. హిందుత్వం, భారతీయ సంస్కృతిపై అనర్గళంగా మాట్లాడగలిగే మాధవీలత.. రెండేళ్లుగా పాతబస్తీ వేదికగా గోశాలతో పాటు భారీ యజ్ఞశాల ఏర్పాటు చేసి హిందూ వైదిక కార్యక్రమాలు సైతం నిర్వహించారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని.. పాతబస్తీలో కాషాయ జెండా ఎగరేయాలన్న లక్ష్యంతో మాధవీలతను బీజేపీ అధిష్ఠానం బరిలోకి దింపింది.ఇక అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచే మాధవీలత మీడియాకు ఎక్కడం ప్రారంభించారు. పతంగి పార్టీని లక్ష్యంగా చేసుకుని ఆమె చిత్రవిచిత్రమైన చేష్టలకు దిగారు. ఆ విన్యాసాలతో సోషల్ మీడియాకు ఎక్కిన ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ కూడా నడిచింది. ఇదంతా ఓటర్లకు చిరాకు తెప్పించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే హిందుత్వ ఎజెండాతో సాగిన ఆమె ప్రచారంలో నగరంలోని ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ను భాగం చేయకపోవడమూ పెద్ద మైనస్గా మారింది. మరోవైపు పోలింగ్ టైంలో హిజాబ్లు తొలగించి మరీ ఓటర్లను పరిశీలించడం జాతీయ మీడియాకు ఎక్కి.. వివాదాస్పదంగా మారింది కూడా.కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు.. మొత్తంగా ఎన్నికల వేళ ఆమె చేసిన హడావుడి ఏమాత్రం సహకరించకపోగా, బీజేపీ అభ్యర్థి హోదాతో నవ్వుల పాలు అయ్యిందనేది విశ్లేషకుల మాట.హైదరాబాద్ ఎంపీగా ఎంఐఎం అధినేత, అసదుద్దీన్ ఒవైసీ 3.35 లక్షల భారీ మెజారిటీతో మాధవీలతపై ఘనవిజయం సాధించారు. -
హైదరాబాద్లో అసదుద్దీన్ ఘన విజయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎంఐఎం మరోసారి ఘన విజయం సాధించింది. 3.38 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో మాధవీ లతపై గెలుపొందారు. దీంతో ఆయన ఈ స్థానంలో 5వసారి విజయం సాధించారు. ఇక్కడ బీజేపీ నుంచి పోటీచేసిన కొంపెల్లి మాధవీలత, బీఆర్ఎస్ పార్టీ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ మహ్మద్ వలీవుల్లా సమీర్ ఓటమిపాలు అయ్యారు. -
15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అమరావతి అభ్యర్థి (సిట్టింగ్ ఎంపీ) నవనీత్ కౌర్.. గతంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడిన మాటలు ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలకు, ఎంఐఎం అధినేత, హైదరాబాద్ లోక్సభ మజ్లిస్ అభ్యర్ధి అసదుద్దీన్ ఒవైసీ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. పాతబస్తీలో బీజేపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన నవనీత్ కౌర్.. దాదాపు పన్నెండేళ్ల కిందట అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ‘పోలీసులు 15 నిమిషాలు పక్కకు తప్పుకుంటే లెక్కలు సరిచేస్తామని చిన్నోడు అన్నాడని, కానీ వాళ్లకు 15 నిమిషాలేమో..మాకు 15 సెకన్లు చాలు..’అంటూ వ్యాఖ్యానించారు. కాగా గురువారం పాతబస్తీలో ఎన్నికల ప్రచారం చేస్తున్న అసద్ వద్ద.. నవనీత్ కౌర్ వాఖ్యలను మీడియా ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ఆయన తీవ్రంగా స్పందించారు. దమ్ముంటే చేసి చూపించండి ‘నరేంద్ర మోదీజీ 15 సెకన్లు కాదు.. గంట.. 15 గంటలు సమయం ఇవ్వండి.. అధికారం మీ చేతిలో ఉంది...ముస్లింలను ఏం చేస్తారో చేయండి.. మీలో మానవత్వం మిగిలి ఉందా? లేదా? అని మేము కూడా చూడాలని అనుకుంటున్నాం..అంతా మీదే.. అధికారం మీదే అయినప్పుడు ఎవరు ఆపుతున్నారు? మేం భయపడేది లేదు.. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం... దుమ్ముంటే చేసి చూపించాలి..’అంటూ అసదుద్దీన్ సవాల్ చేశారు. హైదరాబాద్ ప్రజలు పశువులు కాదు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు హైదరాబాద్ను ఎంఐఎంకు లీజుకు ఇచ్చాయంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై కూడా అసదుద్దీన్ స్పందించారు. హైదరాబాద్ ప్రజలు పశువులు కాదని, వారు పౌరులని, రాజకీయ పార్టీల ఆస్తులు కాదని వ్యాఖ్యానించారు. నలభై ఏళ్లుగా హైదరాబాద్ హిందుత్వ దుష్ట భావజాలాన్ని ఓడిస్తూ ఎంఐఎంకు అప్పగిస్తోందన్నారు. హిందుత్వం మళ్లీ ఓడిపోతుందని చెప్పారు. ముస్లింలను ద్వేషించడమే ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానమని, అందుకే మరోమారు బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. -
హైకమాండ్ ఆదేశిస్తే అసదుద్దీన్ గెలుపుకోసం పనిచేస్తా -ఫిరోజ్ ఖాన్
-
ఆరు గ్యారంటీల అమలుకు రూ.2.15 లక్షల కోట్లు కావాలి: అక్బరుద్దీన్
సాక్షి, హైదరాబాద్: ‘ఆరు గ్యారంటీల అమలుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పథకాల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ఈ పథకాలకు నిధులు ఏ విధంగా సమకూరుస్తారో ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉంది’అని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బడ్జెట్పై శాసనసభలో బుధవారం జరిగిన చర్చలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ ఇప్పటికే రెండు పథకాలు అమలు చేయడం అభినందనీయమేనన్నారు. మిగతా నాలుగు పథకాలు వందరోజుల్లో అమలు చేయాలని చెప్పారు. ఈ ఆరు పథకాలకు బడ్జెట్లో రూ.53,196 కోట్లు కేటాయించారు..రాష్ట్ర ఆర్థిక రాబడి రూ. 2,74,185.7 కోట్లు, ఖర్చు 2,75,890.69 కోట్లుగా బడ్జెట్లో అంచనా వేశారు. రాష్ట్ర రాబడులు, అప్పులకు చెల్లించే వడ్డీలు, నెలవారీ చెల్లింపులకు మధ్య పొంతన కుదరడం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆరు గ్యారంటీలు, ఐదు డిక్లరేషన్లు, 300 హామీలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. బీపీఎల్ కుటుంబాలకు మహాలక్ష్మి పథకం అమలు చేయాలంటే ఏడాదికి రూ.26,990 కోట్లు కావాలని, గ్యాస్ సిలిండర్కు రూ.2,699.70 కోట్లు, ఉచిత బస్సు పథకానికి రూ.3,600 కోట్లు, కౌలు రైతులకు రూ. 23,160.8 కోట్లు, మన్రేగా కింద 32 లక్షల వ్యవసాయ కూలీలు ఉంటారని, వీరికి ఏడాది రూ.3,840 కోట్లు, వరికి రూ. 500 చొప్పున బోనస్ ఇస్తే ఏడాదికి రూ.7500 కోట్లు, పంటరుణాలకు రూ.36 వేల కోట్లు కావాలని చెప్పారు. గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు ఏడాదికి రూ.4800 కోట్లు, అంబేడ్కర్ ఆర్థికచేయూత పథకానికి నిధులెన్నో చెప్పలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఆర్థిక చేయూతకు రూ.25 వేల కోట్లు, యువభరోసా, విద్యాభరోసా కార్డు అమలుకు రూ.38,894.22 కోట్లు, విద్యాజ్యోతి పథకానికి రూ.6,476 కోట్లు.. ఇంకా పింఛన్ల పెంపు ఇతర హామీలకు ఇలా కలిపి మొత్తం రూ.2,15,568.54 కోట్లు కావాలని, ఈ నిధులు ఎలా సమకూరుస్తారో చెప్పాలన్నారు. కొన్నేళ్లుగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ డబ్బులు పెండింగ్లో ఉంచారని, దీనివల్ల కాలేజీల్లో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ధరణి స్థానంలో భూమాత తెచ్చేందుకు నియమించిన నిపుణుల కమిటీ ఎప్పటిలోగా నివేదిక ఇస్తుందో చెప్పాలన్నారు. బడ్జెట్లో మైనార్టీలకు కేటాయింపులు నిరాశ పరిచాయని, ముస్లిం మైనార్టీ సంస్థలకు మంజూరైన నిధులు దారి మళ్లడంపై విచారణ జరిపించాలని, రాష్ట్రానికే ఆదాయం తెచ్చి పెడుతున్న హైదరాబాద్ అభివృద్ధికి బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీకి ఇవ్వాల్సిన నిధులు సరిగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేసవి తీవ్రంగా ఉంటుందనే సంకేతాలు వస్తున్నాయని, గోదావరి, కృష్ణా జలాలు కూడా అడుగంటిపోయే ప్రమాదముందని, రంజాన్ మాసం సమీపిస్తున్నందున పాతబస్తీలో తాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. ఈ సమస్యపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ అసెంబ్లీ సమావేశాల తర్వాత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. కేసీఆర్ నల్లగొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: బాలూనాయక్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా సాగు,తాగునీటి ఇబ్బంది కలిగించినందుకు మాజీ సీఎం కేసీఆర్ నల్లగొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలూనాయక్ డిమాండ్ చేశారు. అన్ని విభాగాలను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించదని, దీనిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ విమర్శలు చేస్తోందన్నారు. ఎన్నికల ముందే కేసీఆర్కు దళితులు గుర్తుకొస్తారని, అంబేడ్కర్కు కనీసం నివాళులు అర్పించని సీఎంగా కేసీఆరే మిగిలిపోతారన్నారు. -
ఎంబీటీతో ఎంఐఎంకు చెక్
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ ఇత్తేహదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం)కు మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ)తో చెక్ పెట్టే దిశలో అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలిగిన ఎంఐఎంను కట్టడి చేసేందుకు ముల్లును ముల్లుతోనే తీసే వ్యూహంలో భాగంగా ఎంబీటీతో కలిసి వెళ్లాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ కొన్ని సమీకరణల నేపథ్యంలో ఇది సాధ్యం కాలేదని, ఇప్పుడు ఆ ప్రతిపాదన అమల్లోకి వచ్చేలా రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే రానున్న లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని ఎంబీటీకి కేటాయించాలనే ప్రతిపాదన అధిష్టానం పెద్దల వరకు చేరింది. అంతకంటే ముందే జాతీయ స్థాయిలోని ఇండియా కూటమిలో ఎంబీటీని చేర్చుకోవాలని, తద్వారా ఎంఐఎంకు దీటుగా ఎంబీటీని దేశ స్థాయిలో ప్రోత్సహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. కూటమి సమావేశాల్లో ఎంబీటీని భాగస్వామిని చేయడంతో పాటు ఎన్నికల ప్రచార సభలకు ఆహా్వనించడం ద్వారా ఎంఐఎం ద్వారా బీజేపీకి కలుగుతున్న లబ్ధి, ఆ రెండు పార్టీల దోస్తీని ముస్లిం మైనార్టీలకు అర్థమయ్యేలా పాతబస్తీ పార్టీ అయిన ఎంబీటీతోనే చెప్పించాలనేది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. ‘బస్తీ’మే సవాల్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కాంగ్రెస్తో కలిసి పనిచేసిన ఎంఐఎం రాష్ట్ర ఏర్పాటు తర్వాత మారిన రాజకీయ సమీకరణల దృష్ట్యా కాంగ్రెస్కు కొరకరాని కొయ్యగా తయారయింది. పాతబస్తీలో తనకున్న బలాన్ని, బలగాన్ని వేదికగా చేసుకుని అన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తూ నిలబడింది. దాదాపు పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు మిత్రపక్షంగా వ్యవహరించిన ఎంఐఎం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పంథాను కొనసాగిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందూ ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పట్ల ఎంఐఎం వైఖరిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కు అదనపు బలంగా, తమకు వైరిపక్షంగా మారిన ఎంఐఎంకు చెక్ పెట్టాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించుకుంది. పార్లమెంటు ఎన్నికలు మొదలుకుని ఇక ముందు జరిగే అన్ని ఎన్నికల్లోనూ పాతబస్తీలో ఒవైసీ సేనకు సవాల్ విసిరేందుకు సిద్ధమవుతోంది. అసెంబ్లీ అంచనాలతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని రెండు నియోజకవర్గాల్లో ఎంబీటీ (యాకుత్పుర), కాంగ్రెస్ (నాంపల్లి) ఢీ అంటే ఢీ అనేలా ఎంఐఎంతో తలపడ్డాయి. చాలా తక్కువ తేడాతో ఓడిపోయాయి. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కిన నేపథ్యంలో ఎంబీటీని ముందుంచడం ద్వారా ఆ రెండింటితో పాటు మిగిలిన ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీల ఓట్లను కొల్లగొట్టవచ్చనే అంచనాల్లో కాంగ్రెస్ నాయకులున్నారు. ఈ ప్రయత్నంలోనే విజయం సాధిస్తామని, ఒకవేళ లోక్సభ ఎన్నికల్లో ఎంఐఎంను కొంతమేర నిలువరించగలిగినా, జీహెచ్ఎంసీ ఎన్నికల సమయానికి మరింత సమర్థవంతంగా ఎంఐఎంను ఢీ కొట్టగలుగుతామనేది అటు ఎంబీ టీ, ఇటు కాంగ్రెస్ల భావనగా కనిపిస్తోంది. ఈ విషయమై కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతూ ‘అధికారంలో ఉన్నప్పుడే ఎంఐఎంను కట్టడి చేయగలం. ఇందుకు ఎంబీటీని వేదికగా చేసుకుని ముందుకెళితే మంచి ఫలితాలు రాబట్టగలుగుతాం. లోక్సభ ఎన్నికలే కాదు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ మా రెండు పార్టీలు అవగాహనతో వెళ్లడం ఖాయంగానే కనిపిస్తోంది.’అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఆ ఎన్నికలకు ముందే వాస్తవానికి, ఎంబీటీతో పొత్తుపై అసెంబ్లీ ఎన్నికలకు ముందే చర్చలు జరిగాయి. అప్పట్లో ఏఐసీసీ పరిశీలకురాలిగా వచ్చిన ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ, ఎంబీటీ నేత అంజదుల్లాఖాన్ రెండు, మూడుసార్లు భేటీ అయి చర్చలు కూడా జరిపారు. కానీ, కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరిగిన చర్చల అనంతరం అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఎంబీటీతో స్నేహం నష్టం చేస్తుందనే భావనతో వెనక్కు తగ్గినట్టు తెలిసింది. ఇప్పుడు ఇదే స్నేహం ద్వారా ఎంఐఎంకు చెక్ పెట్టే దిశలో ముందుకెళుతోంది. ఇందుకు ఎంబీటీ నేత అంజదుల్లాఖాన్ కూడా సుముఖంగా ఉన్నారు. పాతబస్తీలోని కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ సానుభూతిపరులు కూడా ఈ ప్రతిపాదనను స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే సమయానికి ఈ రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచింది..
‘పాలమూరు’లో కాంగ్రెస్ హవా.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్ విజయభేరి మోగించింది. మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో 12 గెలుపొంది సత్తా చాటింది. బీఆర్ఎస్ అభ్యర్థులు కేవలం రెండు స్థానాలకే పరిమితమయ్యారు. మహబూబ్నగర్, వనపర్తి నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డికి చుక్కెదురైంది. దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి జీఎమ్మార్ మధ్య రౌండ్ రౌండ్కూ హోరాహోరీ పోరు కొనసాగింది. రౌండ్రౌండ్కు ఉత్కంఠగా సాగిన లెక్కింపులో చివరి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి జి.మధుసూదన్రెడ్డికి 907 ఓట్ల మెజార్టీ రాగా.. పోస్టల్ బ్యాలెట్తో కలుపుకుని మొత్తం 1,392 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించారు. తొలిసారిగా 9 మంది.. ఉమ్మడి పాలమూరులో తొమ్మిది మంది తొలిసారి గా శాసనసభలో అడుగుపెట్టనున్నారు. కాంగ్రెస్కు సంబంధించి జడ్చర్ల, దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, షాద్నగర్, నాగర్కర్నూల్, కల్వకుర్తి, వనపర్తి అభ్యర్థులు జనంపల్లి అనిరు«ద్రెడ్డి, జి.మధుసూదన్రెడ్డి, పర్ణికారెడ్డి, వాకిటి శ్రీహరి, వీర్లపల్లి శంకర్, కూచుకుళ్ల రాజే శ్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డితో పాటు బీఆర్ఎస్ అలంపూర్ అభ్యర్థి విజయుడు తొలిసారిగా విజయం సాధించారు. ఇందులో అందరూ యువతే కావడం విశేషం. వనపర్తిలో గలాటా.. వనపర్తిలో చిట్యాల శివారులోని మార్కెట్ యార్డు గోదాంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్ నుంచి వెనుతిరిగి వెళ్తున్న మంత్రి నిరంజన్రెడ్డి కారు అద్దాలను కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేయడంతో దుమారం చెలరేగింది. పోలీసులు వారిని చెదరగొట్టి మంత్రిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకోకు దిగడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. రోడ్డుపైనే సుమారు గంటన్నర సేపు ఆందోళనకు దిగగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులకు వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. మంత్రులకు తప్పని ఓటమి.. మహబూబ్నగర్లో మంత్రి బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్గౌడ్పై కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్రెడ్డి 18,738 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అదేవిధంగా వనపర్తిలో మంత్రి నిరంజన్రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి తూడి మేఘారెడ్డి 25,320 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఒక్కటి మినహా. అన్నింటా హస్తం ఉమ్మడి నల్లగొండ జిల్లా సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలకుగాను 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, ఒక్క సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి జగదీ‹Ùరెడ్డి గెలుపొందారు. మిగతా నియోజకవర్గాలైన నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, నకిరేకల్లో వేముల వీరేశం, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, దేవరకొండలో నేనావత్ బాలునాయక్, నాగార్జునసాగర్ లో కుందూరు జయవీర్రెడ్డి, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి, తుంగతుర్తి లో మందుల సామేల్, హుజూర్నగర్లో నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి, కోదాడలో నలమాద పద్మావతిరెడ్డి, ఆలేరులో బీర్ల అయిలయ్య, భువనగిరిలో అనిల్కుమార్రెడ్డి గెలుపొందారు. ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్ ఆధిక్యం.. 2018 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10స్థానాల్లో బీఆర్ఎస్ గెలు పొందగా, రెండు స్థానాల్లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఈసారి అంతకుమించి 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే, ఒకే ఒక్క స్థానంలో బీఆర్ఎస్ గెలుపొందింది. ప్రస్తుత విజయంతో కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాలో తిరుగులేని పార్టీగా తమ పట్టును సాధించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులంతా తమ ప్రత్యర్థులైన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులపైనే ఈ విజయాన్ని సాధించారు. ప్రతి అభ్యర్థికి భారీ మెజారిటీని ఇచ్చి ఓటర్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వైపు నిలిచారు. ఈ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు అధిక్యాన్ని కనబరచడం విశేషం. గిరిజన ఖిల్లాలో‘కమలం’ బోణీ! ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓటర్లు విభిన్న తీర్పు ఇచ్చారు. తొలిసారిగా ఈ ప్రాంతం నుంచి నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపి కొత్త రికార్డు సృష్టించారు. ఈ ప్రాంతం నుంచి కమలనాథులు శాసనసభకు ఎన్నికకావడం ఇదే తొలిసారి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది స్థానాల్లో ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూర్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. 2019 ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీగా సోయం బాపూరావు బీజేపీ నుంచి గెలిచి సంచలనం సృష్టించారు. తాజాగా ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించి ఇక్కడి ఓటర్లు అనూహ్య తీర్పునిచ్చారు. బీఆర్ఎస్పై అదే దెబ్బ.. గిరిజనుల రిజర్వేషన్లు 6 నుంచి పది శాతం పెంచుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆదివాసీ, గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్(అటవీ భూమి హక్కు పత్రాలు) 48వేల మందికి లక్ష ఎకరాల అటవీ భూములపై హక్కులు కల్పించారు. కానీ ఇవేమీ బీఆర్ఎస్కు ఫలితం ఇవ్వలేకపోయాయి. ఆదివాసీ లంబాడా మధ్య వైరం, గిరిజనేతరులకు ఏజెన్సీ సమస్యలు బీఆర్ఎస్ను దెబ్బతీశాయి. మూడు ఎస్టీ స్థానాల్లో ఆసిఫాబాద్, బోథ్లో బీఆర్ఎస్ అభ్యర్థులు కోవ లక్ష్మి అనిల్ జాదవ్ గెలుపొందగా, ఖానాపూర్లో కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు గెలిచారు. నిర్మల్ నుంచి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఆదిలాబాద్లో మాజీ మంత్రి జోగు రామన్న, మంచిర్యాలలో నడిపెల్లి దివాకర్రావు, సిర్పూర్లో కోనేరు కోనప్ప, బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య, చెన్నూరులో బాల్క సుమన్ ఘోర ఓటమి పాలయ్యారు. కేటీఆర్ స్నేహితుడైన భూక్యా జాన్సన్నాయక్ ఖానాపూర్లో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు గెలుపొందారు. మొదటి నుంచి ఈ స్థానంలో త్రికోణ పోటీగా ఉంది. బీజేపీ నుంచి మాజీ ఎంపీ, సీనియర్ నాయకులు రమేశ్రాథోడ్, ఇటు జాన్సన్ నాయక్, వెడ్మ బొజ్జు బరిలో ఉండగా, చివరకు ఆదివాసీ నాయకుడికే పట్టం కట్టారు. ఇక్కడ 1984లో మాజీ మంత్రి కోటా్నక భీంరావు కాంగ్రెస్ నుంచి గెలవగా, మళ్లీ 40ఏళ్ళ తర్వాత ఓ ఆదివాసీకి విజయం వరించింది. ఓరుగల్లులో కాంగ్రెస్ హోరు సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మూడోసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓరుగల్లులో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 10 చోట్ల గెలిచి అనూహ్య ఫలితాలను రికార్డు చేయగా, బీఆర్ఎస్ రెండు స్థానాలకే పరిమితమైంది. రాజకీయ ఉద్దండులుగా పేరొందిన నాయకులు, వరుస విజయాలను నమోదు చేసిన నేతలు కాంగ్రెస్ అభ్యర్థుల చేతిలో ఓటమిపాలయ్యారు. వరంగల్ పశ్చిమనుంచి బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్పై కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందర్రెడ్డి, తూర్పులో బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్రావుపై కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ, పరకాలలో బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాశ్రెడ్డి, వర్ధన్నపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్పై కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు విజయం సాధించారు. అదేవిధంగా భూపాలపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు, ములుగులో బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిపై కాంగ్రెస్ నుంచి ములుగు సీతక్క గెలుపొందారు. నర్సంపేటనుంచి బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి, పాలకుర్తిలో మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్రావుపై కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్వినిరెడ్డి, మహబూబాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్నాయక్పై కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మురళీనాయక్, డోర్నకల్లో రెడ్యానాయక్పై కాంగ్రెస్ అభ్యర్థి రాంచంద్రునాయక్ విజయం సాధించారు. జనగామలో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి, స్టేషన్ఘన్పూర్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇందిరపై బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి గెలుపొందారు. విలక్షణం.. ఇందూరు తీర్పు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి ఇందూరు జిల్లా మరోసారి విలక్షణ తీర్పు తో తన ప్రత్యేకతను చాటుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ముఖా ముఖి పోరు జరగగా ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోరు జరిగింది. దీంతో నిజామాబాద్ జిల్లాలోని ఉన్న 9 స్థానాలకు గాను కాంగ్రెస్ 4, బీజేపీ 3, బీఆర్ఎస్ 2 చోట్ల విజయం సాధించాయి. సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పోటీపడిన కామారెడ్డి నుంచి బీజేపీ అభ్యర్థిగా కాటిపల్లి వెంకటరమణారెడ్డి జెయింట్ కిల్లర్ రేంజ్లో విజయం సాధించారు. నిజామాబాద్ అర్బన్ నుంచి బీజేపీ అభ్యర్థులుగా ధన్పాల్ సూర్యనారాయణగుప్తా, ఆర్మూర్ నుంచి పైడి రాకేష్రెడ్డి విజయం సాధించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ బోధన్, నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డి, జుక్కల్ స్థానాల్లో గెలిచింది. ప్రస్తుతం భూపతిరెడ్డి 21,963 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఎల్లారెడ్డి నుంచి మదన్మోహన్రావు ప్రస్తుతం 24,001 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మదన్మోహన్ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసి కేవలం 6వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక బోధన్ నుంచి గెలిచిన మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మినహా నిజామాబాద్ రూరల్ నుంచి విజయం సాధించిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డి, ఎల్లారెడ్డి నుంచి గెలుపొందిన మదన్మోహన్రావు, జుక్కల్ నుంచి గెలిచిన లక్ష్మీకాంతరావు సైతం శాసనసభలో తొలిసారి అడుగుపెట్టనున్నారు. మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి కేవలం 3,062 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో గెలుపొందారు. 1999, 2004, 2009లో బోధన్ నుంచి గెలిచిన సుదర్శన్రెడ్డి వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి కేబినెట్లలో పనిచేశారు. 2014, 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్పై పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం షకీల్పై విజయం సాధించారు. పోచారం వరుసగా 5వ సారి, ప్రశాంత్రెడ్డి వరుసగా 3వ సారి విజయంబాన్సువాడ నుంచి బీఆర్ఎస్ తరపున గెలుపొందిన పోచారం శ్రీనివాసరెడ్డి తన రాజకీయ జీవితంలో 8 సార్లు పోటీ చేసి 7 సార్లు గెలుపొందగా, 2009, 2011(ఉప ఎన్నిక), 2014, 2018, 2023లలో వరుసగా 5 సార్లు విజయం సాధించడం గమనార్హం. స్పీకర్గా పనిచేసిన వారు తదుపరి ఎన్నికల్లో ఓటమి చెందుతారన్న సెంటిమెంట్ను పోచారం బ్రేక్ చేశారు. పోచారం 23,464 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇక బాల్కొండ నుంచి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి 2014, 2018, 2023లో వరుసగా మూడుసార్లు గెలు పొందారు. ప్రశాంత్రెడ్డి కేవలం 4,533ఓట్లతో గెలుపొందారు. నిజామాబాద్ రూరల్ నుంచి ఆర్టీసీ చైర్మన్ బాజి రెడ్డి గోవర్ధన్ ప్రస్తు తం 21,963 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. -
బీఆర్ఎస్ కే ఎంఐఎం మద్దతు..
-
మలక్పేటలో మళ్లీ మజ్లిస్ ?
దిల్సుఖ్నగర్/చంచల్గూడ: ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాతంగా ముగిశాయి. మలక్పేట నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు రణరంగంలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యలో నెలకొంది. గత మూడు పర్యాయాల నుంచి ఎంఐఎం సిట్టింగ్ సీటు కావడంతో ఈసారి కూడా అభ్యర్థి అహ్మద్ బలాలా నాలుగోసారి విజయం నమోదు చేస్తానని గట్టి నమ్మకంతో ఉన్నాడు. మైనార్టీ ఓట్లు, అభివృద్ధి, హిందువుల ఓట్లపై నమ్మకం పెట్టుకున్న బలాలా మెజార్టీ పెంచుకోవడంపై దృష్టి సారించాడు. బీజేపీ అభ్యర్థి ప్రాంతానికి చెందిన పలు కుల సంఘాలు ఎంఐఎం అభ్యర్థికి మద్దతు పలకడం గమనర్హం. బీజేపీ మేకపోతు గాంభీర్యం... ఇక బీజేపీ పార్టీ విషయానికి వస్తే ఈసారి ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తుంది. కానీ ఆశించిన స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయామని సొంత పార్టీ నాయకులే చెబుతున్నారు. గెలుస్తామనే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ రెండో స్థానం వచ్చినా పర్వాలేదని క్యాడర్ ఆశిస్తోంది. బీజేపీ సీటుకై ప్రస్తుత అభ్యరి్థతో పాటు సైదాబాద్ కార్పొరేటర్ భర్త కొత్తకాపు రవీందర్రెడ్డి సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేసి ఎన్నికల ప్రచారం సాధనాలను కూడా సిద్ధం చేసుకున్నాడు. ఆఖరి నిమిషంలో సీటు సంరెడ్డి సురేందర్రెడ్డిని వరించడంతో రవీందర్రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఎన్నికల మెనేజ్మెంట్లో దిట్ట అయిన రవీందర్రెడ్డికి సీటు ఇస్తే ఎంఐఎం ఎమ్మెల్యే సీటుకు గురి పెట్టడం ఖా యమని బీజేపీ క్యాడర్లో గట్టిగా ఉండే. ఒక వేళ రవీందర్రెడ్డికి సీటు కేటాయిస్తే ఇబ్బంది కలగవచ్చని సిట్టింగ్ ఎమ్మెల్యే అహ్మద్ బలాలా సైతం తర్జనభర్జన పడ్డాడు. మలక్పేటలో చాలా మంది సీనియర్ నేతల తో పా టు ఇద్దరు సిట్టింగ్ కార్పొరేటర్లు ఉన్నప్పటికీ ఎవరికీ ఎన్నికల కీలక బాధ్యతలు అప్పగించకుండా అభ్యర్థి అన్నీ తానై వ్యవహరించడం తో బీజేపీ క్యాడర్ గందరగోళానికి గురైంది. మైనార్టీ ఓట్లు గెలిపిస్తాయని కాంగ్రెస్.. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే రియల్టర్ వ్యాపారి షేక్ అక్బర్ కూడా మైనార్టీ ఓట్లపై ఆశలు పెట్టుకున్నాడు. టీడీపీ పోటీలో లేకపోవడంతో ఆ పార్టీ ఓట్లతో పాటు కాంగ్రెస్ ఓటు బ్యాంకుతో గట్టెకొచ్చని ధృడ నమ్మకంతో ఉన్నాడు. ఎంఐఎం, బీఆర్ఎస్ మధ్య స్నేహపూర్వక పోటీ ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి తనకు విజయం సాధించి పెడతాయని గులాబీ పార్టీ అభ్యర్థి తీగల అజిత్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. డిసెంబర్ 3వ తేదీన విజయం ఎవరిని వరిస్తుందో వేసి చూద్దాం. -
కేసీఆర్ లక్ష్యం కేటీఆర్ను సీఎం చేయడమే!: అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం 1200 మంది బలిదానంతో ఏర్పడితే.. ఈ పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతి తప్ప మరేం చేయలేదని బీజేపీ అగ్రనేత అమిత్ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శనివారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. మిగులు ఆదాయం ఉన్న ఈ రాష్ట్రం బీఆర్ఎస్ పాలనలో దివాలా తీసింది. ఈ పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. ఉద్యోగాలు భర్తీ చేయలేదు. లక్ష రుణమాఫీ చేయలేదు. నిరుద్యోగ భృతికి యువత నోచుకోలేదు. కేజీ టూ పీజీ ఉచిత విద్య గాలికి వదిలేశారు. ప్రతీ జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి హామీ నెరవేరలేదు. గ్రానైట్ కుంభకోణంలో వందల కోట్ల అవినీతి జరిగింది. సెప్టెంబర్ 17 నిర్వహణపై మాట ఇచ్చి తప్పారు. స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. తెలంగాణలో పేదలు, రైతులు, విద్యార్థులు నిరాశలో ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని మార్చాలని బలంగా అనుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం.. ఈ మూడు ఒక్కటే. ఎన్నికల ముందు వేర్వేరు కండువాలతో వస్తారు.. ఎన్నికలయ్యాక కలిసిపోతారు. కాంగ్రెస్కు ఓటేసినా.. బీఆర్ఎస్, ఎంఐఎంలకు ఓటేసినట్లే. బీజేపీ పాలనలో అవినీతి ఉండదు. గత తొమ్మిదేళ్లలో బీజేపీ నెరవేర్చిన హామీలను చూడండి. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా మతపరమైన రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం. బీజేపీ అధికారంలోకి వచ్చాక ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తాం. బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తాం. విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తాం. డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ ఎన్నికలు తెలంగాణకు చాలా కీలకం. మీ ఓటు మీ ఎమ్మెల్యేను ఎన్నుకోవడం కోసం మాత్రమే కాదు.. భారత దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని గుర్తించాలి అని తెలంగాణ ఓటర్లను అమిత్ షా కోరారు. హలాల్ బ్యాన్పై నిషేధం తీసుకోలేదు హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం విధించేందుకు కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హైదరాబాద్లో మీడియా ప్రతినిధులతో అమిత్ షా మాట్లాడుతూ.. ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. కొల్లాపూర్లో మాట్లాడుతూ.. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో బీజేపీ ప్రచార సభలో అమిత్ షా మాట్లాడుతూ.. వాల్మీకి బోయలను కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక నిర్వాసితులకు పరిహారం, భూమి ఇస్తాం. మాదిగ రిజర్వేషన్ సమస్యకు పరిష్కారం చూపిస్తాం. బీజేపీ చెప్పిన ప్రకారం.. హమీలన్నీ నెరవేరుస్తాం. కేటీఆర్ను సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యం. కేసీఆర్కు యువతపై ప్రేమ లేదు. ఆయన ప్రేమంతా కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయడంపైనే. కాంగ్రెస్కు ఓటేసి గెలిపిస్తే.. వాళ్లు బీఆర్ఎస్కు అమ్ముడుపోయారు. ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపిస్తే.. వాళ్లు రేపు బీఆర్ఎస్లోకే వెళ్తారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తాం. కేసీఆర్ ప్రభుత్వంలో పేపర్ లీకేజీ కారకులపై చర్యలు తీసుకుంటాం. -
మజ్లిస్ కంచుకోటలో పాగా కోసం బీజేపీ, కాంగ్రెస్ పోటీ
హైదరాబాద్: చార్మినార్ నియోజకవర్గంలో నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని విస్తృతం చేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు మజ్లిస్ పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మజ్లిస్ పారీ్టకి చారి్మనార్ నియోజకవర్గం కంచుకోటగా ఉంది. ఈసారి జరిగే ఎన్నికల్లో మజ్లిస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు అటు బీజేపీ..ఇటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మజ్లిస్ పారీ్టకి ధీటుగా తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మేయర్ మీర్ జులీ్ఫకర్ అలీ ఎన్నికల బరిలో ఉండగా..బీజేపీ నుంచి మెఘారాణి, కాంగ్రెస్ పార్టీ నుంచి మహ్మద్ ముజీబుల్లా షరీఫ్ పోటీ చేస్తున్నారు. అన్ని డివిజన్లలో మజ్లిస్ కార్పొరేటర్లు.. ఈసారి చార్మినార్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్కు టికెట్ లభించ లేదు. ఆయన స్థానంలో మాజీ మేయర్ మీర్ జులీ్ఫకర్ అలీకి స్థానం దక్కింది. స్థానికంగా నివాసం ఉండడంతో పాటు గత అనుభవం దృష్ట్యా ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. చారి్మనార్ నియోజకవర్గంలోని ఘాన్సీబజార్, పత్తర్గట్టి, మొఘల్పురా, పురానాపూల్, శాలిబండ తదితర ఐదు డివిజన్లలో మజ్లిస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లుగా కొనసాగుతున్నారు. ఈ డివిజన్ల పరిధిలోని ఓటర్లందరినీ సంబంధిత కార్పొరేటర్లు క్రమం తప్పకుండా కలుస్తూ ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకే ఓటు వేయాలని కోరుతున్నారు. ఘాన్సీబజార్ నుంచి .. నియోజకవర్గంలోని ఇరువర్గాల ఓటర్లను తమకు మద్దతుగా చేసుకోవడంలో బీజేపీ అభ్యర్థి మెఘారాణి అహరి్నషలు కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో బీజేపీకి ఘాన్సీబజార్ డివిజన్ అండగా ఉంది. ఇక్కడ బీజేపీ నాయకురాళ్లు, కార్యకర్తలు, నాయకులు కొనసాగుతున్నారు. డివిజన్లోని అన్ని ప్రాంతాల్లో తమకే ఓట్లు పడే విధంగా నిరంతరం శ్రమిస్తున్నారు. కాగా, ఇదే డివిజన్లో కొంత మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు పురానాపూల్ డివిజన్లో సైతం ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం.. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన టీపీసీసీ కార్యదర్శి మహ్మద్ ముజీబుల్లా షరీఫ్ అన్ని స్థాయిల నాయకులను, కార్యకర్తలను పొగేసి తన గెలుపు కోసం ప్రయతి్నస్తున్నారు. నియోజకవర్గంలోని మత పెద్దలతో పాటు స్థానిక నాయకులను కలిసి వారి మద్దతు తీసుకున్నారు. ఇప్పటికే టీటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలీ మస్కతీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఉనికి కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్.. బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ సలావుద్దీన్ లోధీ ప్రచారంలో దూసుకుపోతున్నప్పటికీ.. మజ్లిస్తో లోపాయికారి ఒప్పందం ఉండడంతో చారి్మనార్లో తమ పార్టీ ఉనికి కోల్పోకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థితో స్థానికంగా కొంత మంది సీనియర్ నాయ కులు, కార్యకర్తలతో మనస్పర్థలు కొనసాగుతున్నాయి. ఏకంగా అభ్యరి్థని మార్చాలంటూ సమావేశాలు నిర్వహించి పార్టీ అధిష్టానానికి ఫిర్యా దులు చేశారు. వీటన్నింటిని పక్కన పెట్టిన ఆయన పాదయాత్రలు, బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ ఈ ఎన్నికల్లో తనకే ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. -
హిందువులు ఓటుబ్యాంకుగా మారాలి
నిర్మల్: రాష్ట్రంలో 12 శాతం మంది ఓట్లను బీఆర్ఎస్, ఎంఐఎం నమ్ముకున్నాయని, కాంగ్రెస్ మతపెద్దలను నమ్ముకుందని, ఇక హిందువులు ఓటు బ్యాంకుగా మారి సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో ముధోల్ నియోజకవర్గ అభ్యర్థి రామారావు పటేల్ తరఫున శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు బండి సంజయ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను చూసి జనం నవ్వుకుంటున్నారని, వాళ్ల మేనిఫెస్టో చెల్లని రూపాయని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ ఇచ్చే హామీలకు విలువ లేదని కొట్టిపారేశారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ 1,400 మందిని బలితీసుకుందని, నాటి బీజేపీ నేత సుష్మాస్వరాజ్ పార్లమెంటులో పోరాడిన తర్వాతే అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని సంజయ్ గుర్తుచేశారు. భైంసాను మైసాగా మారుస్తాం.. బీజేపీ అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం భైంసాను మైసాగా మారుస్తామని, ముధోల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామని బండి సంజయ్ తెలిపారు. నాందేడ్ నుంచి భైంసా–నిర్మల్ మీదుగా మంచిర్యాల వరకు రైల్వేలైన్ వేయిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర నిధులతో భైంసాలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ముధోల్లో గత ఎన్నికల సభకు వచ్చిన కేసీఆర్ మళ్లీ ఐదేళ్ల తర్వాత ఎన్నికల సభకే వచ్చారని, నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. భైంసాలో ఎంఐఎం గూండాలు చేసిన అరాచకాలు కళ్లముందు ఇంకా మెదులుతున్నాయని... అల్లర్ల బాధితులందరికీ న్యాయం చేస్తామన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో చోటుచేసుకున్న విద్యార్థుల ఆత్మహత్యలను దాచిపెట్టింది ఎవరని ప్రశ్నించారు. ముస్లిం సమాజం ఆలోచించాలి... ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఓట్ల కోసమే మీ వద్దకు వస్తున్నారు. టోపీలు పెట్టుకొని నమాజ్ పేరుతో మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ముస్లిం సమాజం ఒక్కసారి ఆలోచించాలి. మోదీ ప్రభుత్వం వచ్చాక దేశంలో ఎక్కడా అల్లర్లు జరగలేదు. ఎక్కడా మతకలహాలు జరగలేదు’అని బండి సంజయ్ గుర్తుచేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మితే మోసపోతారని హెచ్చరించారు. టవర్ సర్కిల్ వద్దకు రా... కరీంనగర్టౌన్: ‘ముస్లిం ఓట్ల కోసం సిగ్గులేకుండా టోపీ పెట్టుకుని మసీదుల్లోకి వెళ్లి నమాజ్ చేస్తున్న గంగుల, కేసీఆర్లు నిజమైన హిందువులైతే ఒవైసీ సోదరులను హనుమాన్ ఆలయానికి తీసుకొచ్చి చాలీసా చదివించే దమ్ముందా?’అంటూ బండి సంజయ్ మరోసారి సవాల్ విసిరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తనను అవినీతిపరుడినంటూ గంగుల చేసిన ఆరోపణలపైనా తీవ్రంగా స్పందించారు. ‘నేను ఎటువంటివాడనో కరీంనగర్ ప్రజలకు తెలుసు. నేను నోరు విప్పితే నువ్వు, కేసీఆర్ బిస్తర్ సర్దుకుని రాష్ట్రం విడిచిపోతారు జాగ్రత్త’అంటూ హెచ్చరించారు. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే రాష్ట్రానికి కేసీఆర్, కరీంనగర్కు గంగుల కమలాకర్ చేసిందేమీ లేదన్నారు. గంగుల.. కేసీఆర్ను ఒప్పించి కరీంనగర్కు ఎన్ని నిధులు తెచ్చారో సమాధానం చెప్పాలన్నారు. టవర్ సర్కిల్ వద్దకు రా.. స్మార్ట్సిటీ నిధులు ఎవరు ఇచ్చారో తేల్చుకుందాం’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగులకు టిక్కెట్ ఇవ్వకపోతే దారుస్సలాం వెళ్లి మోకరిల్లితే ఎంఐఎం సాయంతో టిక్కెట్ తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. -
గోషామహల్, జూబ్లీహిల్స్ పోటీపై ఎంఐఎం ఆంతర్యం ఏమిటి?
హైదరాబాద్: ముస్లిం గొంతును వినిపించే ఆల్ ఇండియా మజ్లిస్–ఏ– ఇత్తేహదుల్ ముస్లిమీన్న్ (ఏఐఎంఐఎం) పార్టీ ‘గోషామహల్ –జూబ్లీహిల్స్’ అసెంబ్లీ స్థానాలపై వ్యవహరిస్తున్న తీరు ముస్లిం సామాజిక వర్గంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పాతబస్తీ పరిధిలోకి వచ్చే గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి, కరడుగట్టిన హిందుత్వవాది రాజాసింగ్పై పోటీకి దిగకపోవడం, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి, భారత క్రికెట్ దిగ్గజం అజహరుద్దీన్పై పోటీకి దింపడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ‘రెండింటి అపవాదు’ తలనొప్పిగా తయారై మజ్లిస్ ఆత్మరక్షణలో పడింది. ఇప్పటికే ఒకవైపు కాంగ్రెస్ విమర్శలు, బీజేపీ సవాళ్లు ఎదురవతుండగా, సొంత పార్టీలో సైతం తీవ్ర అసంతృప్తి నివురుగప్పిన నిప్పుగా మారింది. గోషామహల్, జూబ్లీహిల్స్ స్థానాలపై మజ్లిస్ అధిష్టానం తీరును తప్పుబడుతూ ఆ పార్టీ మాజీ కార్పొరేటర్ ఖాజా బిలాల్ రాజీనామా చేశారు. ఏకంగా మజ్లిస్ లక్ష్యం గోషామహల్లో రాజాసింగ్ను గెలిపించడమా? జూబ్లీహిల్స్లో అజహరుద్దీన్ను ఓడించడమా? అంటూ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి ప్రశ్నలు సంధిస్తూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేయడం మరింత చర్చనీంశంగా మారంది. మజ్లిస్ పార్టీ అగ్ర నేతలు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిసూ ఎన్నికల ప్రచారం, సభలు సమావేశాల్లో మునిగిపోయారు. గోషామహల్పై ఆంతర్యమేమిటో? ఈసారి కూడా గోషామహల్ అసెంబ్లీ స్ధానంలో ఎంఐఎం పోటీకి దిగలేదు. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 82 వేల మందికిపైనే ఓటర్లు ఉండగా, అందులో 79 వేల వరకు పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. అయినప్పటికీ ఎన్నికల బరిలో దిగకపోవడానికి ఆంత్యరేమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్టుకోవడమే తమ లక్ష్యంగా పేర్కొనే మజ్లిస్ గోషామహల్ నియోజకవర్గంలో ఎందుకు అడ్డుకోవడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే ప్రశ్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేవనెత్తారు. గతంలో మహరాజ్ గంజ్లో ఉన్న నియోజకవర్గం పునర్విభజనలో భాగంగా గోషామహల్గా రూపాంతరం చెందింది. ► 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, ఆ తర్వాత వరుసగా రెండు పర్యాయాలుగా బీజేపీ గెలుపొందింది. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి గోషామహల్ సెగ్మెంట్ వస్తున్నప్పటికి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీకి దూరంగా ఉంటుంది. రాజకీయ మిత్ర పక్షం కావడంతో గతంలో కాంగ్రెస్కు, ఆ తర్వాత బీఆర్ఎస్కు మద్దతు ఇస్తూ వస్తోంది. అయితే.. ఇక్కడి నుంచి వరుసగా రెండు పర్యాయాలు బీజేపీ పక్షానా గెలుపొందిన రాజాసింగ్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీ నుంచి సస్పెండయ్యారు. కానీ టికెట్ల ప్రకటనకు ముందు సస్పెన్షన్ ఎత్తివేస్తూ రాజాసింగ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. ► ఇస్లాంపై విషం చిమ్ముతున్న రాజాసింగ్ను ఓడిస్తామని మజ్లిస్ ప్రకటించింది. ఈ నియోజవర్గంలోని ఆరు డివిజన్లలో రెండింటికి మజ్లిస్ పాతినిధ్యం వహిస్తోంది. మిగతా డివిజన్లలో సైతం పట్టు ఉంది. దీంతో పోటీ చేసేందుకు మజ్లిస్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పలువురు నేతలు ముందుకు వచ్చారు. కానీ.. బీఆర్ఎస్ అభ్యర్థికి సహకరించేందుకు మజ్లిస్ పోటీలో దిగకపోవడాన్ని పార్టీతో పాటు ముస్లిం వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ► ముస్లిం సామాజిక వర్గం గర్వించ దగ్గ భారత క్రికెట్ దిగ్గజం అజహరుద్దీన్ ఓటమే లక్ష్యంగా మజ్లిస్ ఎన్నికల బరిలో దిగిందా? అనే ప్రశ్నకు సమాధానం అవుననే వస్తోంది. గతంలో జూబ్లీహిల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల బరిలో దిగని మజ్లిస్ ఈసారి దిగడాన్ని ముస్లిం వర్గాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ► ఈ నియోజకవర్గంలో 1.20 లక్షల మందికి పైగా మైనారిటీ ఓటర్లు ఉన్నారు. గత రెండు పర్యాయాల క్రితం మజ్లిస్ పార్టీ పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. గత ఎన్నికల్లో పోటీ చేయకుండా టీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యేకు మద్దతు ప్రకటించింది. ఈసారి మిత్ర పక్షమైన బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంపై పోటీ దిగింది. కేవలం కాంగ్రెస్ అభ్యర్థి, ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అజహరుద్దీన్ను ఓడించేందుకు మజ్లిస్ ఎన్నికల బరిలో దిగడాన్ని మింగుడుపడని అంశంగా తయారైంది. దీంతో మజ్లిస్ తీరుతో ముస్లిం ఓటర్లు దూరమయ్యే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది. -
అగ్నిప్రమాదంపై ఫిరోజ్ ఖాన్ మాటల్లో..!
-
ఆ రెండింటిపై వ్యూహమేంటి?
హైదరాబాద్ అధికార పక్షం దోస్తీ కోసం పాతబస్తీకే పరిమితమై ఎన్నికల బరిలో దిగే మజ్లిస్ పార్టీ ఈసారి అదనంగా మరో రెండు స్థానాల్లో అభ్యర్థులను పోటీలోకి దింపడం వెనుక వ్యూహమేంటి? గెలుపు కోసమా? మిత్ర పక్షమైన బీఆర్ఎస్కు లాభం చేకూర్చేందుకా? అనే చర్చ సర్వత్రా సాగుతోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలైన జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ స్థానాల్లో ఎన్నికల బరిలో దిగింది. జూబ్లీహిల్స్ స్థానానికి షేక్పేట కార్పొరేటర్ మహ్మద్ రషీద్, రాజేంద్రనగర్ స్థానానికి లంగర్హౌజ్ మాజీ కార్పొరేటర్ బి.రవియాదవ్ అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. రెండు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన తర్వాత మజ్లిస్ వ్యూహంపై ముస్లిం మేధావి వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పక్షాన మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ ఎన్నికల బరిలో దిగారు. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో రాజకీయాలకు అతీతంగా ముస్లిం మైనారిటీలు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదు. మజ్లిస్ అభ్యర్థి రంగంలోకి దింపిన కారణంగా మైనారిటీ ఓట్లు చీలిపోయే ప్రమాదం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో పరోక్షంగా అధికార బీఆర్ఎస్ కాని బీజేపీ కాని లాభపడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. -
కారుకు...నో ఎంట్రీ
రాష్ట్ర సాధన లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇప్పటివరకు నాలుగు పర్యాయాలు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసింది. ప్రస్తుతం ఐదో పర్యాయం భారత్ రాష్ట్ర సమితి పేరిట శాసనసభ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004, 2009 ఎన్నికల్లో ఇతర పార్టీలతో ఎన్నికల అవగాహన కుదుర్చుకుని పోటీ చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర అవతరణ నేపథ్యంలో 2014లోనూ ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చింది. ఇలా వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చినా నేటికీ కొన్ని సెగ్మెంట్లలో మాత్రం పట్టు సాధించలేకపోతోంది. కొరకరాని కొయ్యలుగా మిగిలిన ఆ సెగ్మెంట్లపై ఇప్పుడు సీరియస్గా దృష్టి సారించిన బీఆర్ఎస్ ఇతర పార్టీలకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా ఈసారైనా పాగా వేయాలని భావిస్తోంది. నేటికీ గెలుపు తీరాలకు చేరని నియోజకవర్గాలివే.. ఉమ్మడిఖమ్మం జిల్లాలోని భద్రాచలం, అశ్వారావుపేట, సత్తుపల్లి, వైరా, మధిర, ఇల్లెందు, పినపాక నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందలేదు. వీటితో పాటు హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్పురా, యాకుత్పురా, చాంద్రాయణగుట్ట, చార్మినార్, గోషామహల్, కార్వాన్, నాంపల్లి, మలక్పేట, ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ పాగా వేయలేకపోయింది. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత విపక్ష పార్టీలకు చెందిన అశ్వారావుపేట, సత్తుపల్లి, వైరా, ఇల్లందు, పినపాక, ఎల్బీనగర్, మహేశ్వరం ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. వీరిలో వైరా ఎమ్మెల్యే రాములునాయక్ మినహా మిగతా ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎన్నికలో బీఆర్ఎస్ నుంచే బరిలోకి దిగుతున్నారు. ♦ 2004లో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంల కూటమితో బీఆర్ఎస్ ఎన్నికల అవగాహన కుదుర్చుకుంది. ♦ 2009లో టీడీపీ, సీపీఐలతో కూడిన మహాకూటమితో బీఆర్ఎస్ ఎన్నికల అవగాహన కుదుర్చుకుంది ♦ 2014, 2018లో రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో 119 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసింది. ఆయా చోట్ల ఇలా... 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 17 చోట్ల ఇప్పటివరకు బీఆర్ఎస్ పట్టు సాధించలేకపోయింది. మరో 39 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు కేవలం ఒక్కసారే గెలుపొందగా, 37 నియోజకవర్గాల్లో రెండేసి పర్యాయాలు విజయం సాధించారు. మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు 26 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపుతీరాలకు చేరారు. 2001 నుంచి జరిగిన సాధారణ, ఉప ఎన్నికల గణాంకాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే బీఆర్ఎస్ అభ్యర్థులు సిద్దిపేటలో అత్యధికంగా ఎనిమిది పర్యాయాలు, హుజూరాబాద్లో ఆరు పర్యాయాలు, వరంగల్ పశ్చిమలో ఐదుసార్లు గెలుపొందారు. పాతబస్తీలో ఎంఐఎంతో దోస్తీ హైదరాబాద్తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో 29 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. హైదరాబాద్లోని పాతబస్తీలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఉద్యమ కాలంలో పాతబస్తీలో పరిమిత సీట్లలో పోటీ చేసినా 2014, 2018 ఎన్నికల్లో మాత్రం అన్ని సీట్లలో అభ్యర్థులను బరిలోకి దింపింది. అయితే మజ్లిస్ పార్టీతో మిత్రబంధం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ పాతబస్తీలో బీఆర్ఎస్ స్నేహపూర్వక పోటీ పేరిట నామమాత్ర పోటీకి పరిమితమవుతోంది. అక్కడ ఈసారీ నామమాత్రపు పోటీనే? ప్రస్తుతం ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు స్థానాలతో పాటు ఆ పార్టీ బలంగా ఉన్న మరో రెండు సీట్లు నాంపల్లి, గోషామహల్లో ఈసారి కూడా బీఆర్ఎస్ నామమాత్ర పోటీకీ పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సుమారు రెండున్నర నెలల క్రితమే హైదరాబాద్ పాత బస్తీలోని ఏడు స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించినా, వారికి ఇప్పటికీ బీ ఫారాలు ఇవ్వలేదు. మరోవైపు నాంపల్లి, గోషామహల్ అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ నేటికీ ఖరారు చేయలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాపై చిక్కని పట్టు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా బీఆర్ఎస్కు పట్టు చిక్కడం లేదు. 2014లో కొత్తగూడెంలో మాత్రమే పార్టీ అభ్యర్థి జలగం వెంకట్రావు ఒక్కరే గెలుపొందారు. పాలేరుకు జరిగిన ఉపఎన్నికలో టీఆర్ఎస్ తరఫున తుమ్మల నాగేశ్వరరావు గెలవడంతో పార్టీ బలం రెండుకు చేరింది. ఆ తర్వాత చేరికల ద్వారా బలపడే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గూటికి చేరుకున్నా 2018లో జరిగిన ఎన్నికల్లోనూ ఒక్క ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రమే విజయం సాధ్యమైంది. చేరికల వ్యూహంతో మరోమారు కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని లోటును పూడ్చుకునేందుకు కేసీఆర్ ప్రయత్నించారు. అయితే చేరికల వ్యూహం వికటించి ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లితో పాటు ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్నగర్ నియోజకవర్గాల్లో చేరికల ద్వారా బలపడేందుకు అనుసరించిన వ్యూహం 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్కు సానుకూల ఫలితాన్ని ఇచ్చిందనే చెప్పాలి. -కల్వల మల్లికార్జున్రెడ్డి -
ఈసారైనా వ్యూహం ఫలించేనా?
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో పాగా వేసేందుకు మజ్లిస్–బచావో –తహరిక్ (ఎంబీటీ) పార్టీ వ్యూహత్మకంగా అడుగులేస్తోంది. మూడు దశాబ్దాల కిందటి వైభవం కోసం పడరాని పాట్లు పడుతోంది. రాజకీయ శత్రుపక్షమైన ఆల్ ఇండియా మజ్లిస్ ఏ–ఇత్తేహదుల్ ముస్లిమీ(ఏఐఎంఐఎం)ను మట్టి కరిపించడమే లక్ష్యంగా శక్తియుక్తులను ఒడ్డుతోంది. మజ్లిస్ తరహాలో నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైనా ఎన్నికలలో ఆ పారీ్టకి పరాభవం తప్పడం లేదు. ఎప్పటి మాదిరిగా పార్టీ సీనియర్ బాధ్యులను కాకుండా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విద్యావంతులైన యువతకు పెద్ద పీట వేసి కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనైనా పాగా వేయాలని యోచిస్తోంది. ప్రధానంగా మజ్లిస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు పాతబసీలో అక్షరాస్యత, అభివృద్దిపై ఫోకస్ పెట్టి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఎంబీటీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా ముస్లిం సామాజికవర్గంలో మార్పు కోసం ఎన్నికల బరిలో దిగేందుకు విద్యావంతులైన యువకులు ముందుకు రావాలని పిలుపునిస్తోంది. ముఖ్యంగా ఐటీ, ఇంజనీరింగ్, మెడికల్ రంగాలకు చెందిన యువత ముందుకు వచ్చి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే వరకు వ్యవస్థను సరిదిద్దలేమని పేర్కొంటోంది. పోటీకి ఆసక్తిగల అభ్యర్థులు పాతబస్తీ చంచల్గూడలోని ఎంబీటీ ప్రధాన కార్యాలయంలో సంప్రదించాలని సూచిస్తోంది. పట్టు వదలకుండా.. పాతబస్తీలో మజ్లిస్ పార్టీని దెబ్బతీసి గట్టెక్కేందుకు ఎంబీటీ పట్టు వదలని విక్రమార్కునిలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. గతంలో పార్టీ ప్రాతినిధ్యం వహించిన చాంద్రాయణగుట్ట, యాకుత్పురా అసెంబ్లీ స్థానాలు దక్కించుకునేందుకు వరుసగా ఎన్నికల్లో ప్రయతి్నస్తూ విఫలమవుతోంది. మూడు దశాబ్దాల క్రితం అప్పటి ఎఐఎంఐఎం అధినేత సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీతో ఏర్పడ్డ విభేదాలతో అమానుల్లాఖాన్ నాయకత్వంలో 1993లో ఏర్పడిన మజ్లిస్–బచావ్ తహరీక్ (ఎంబీటీ) 1994లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తొలి విజయం సాధించింది. మజ్లిస్ కంచు కోటలైన చాంద్రాయణగుట్ట, యాకుత్పురా అసెంబ్లీ స్థానాల్లో ఎంబీటీ విజయకేతనం ఎగురవేసింది. అయితే 1999 ఎన్నికల్లో ఎంబీటీ తన బలాన్ని నిలుపుకోలేకపోయింది. రాజకీయ పరిస్థితులు తారుమారయ్యాయి. పార్టీ అధినేత అమానుల్లా ఖాన్ వరుసగా ఐదు పర్యాయాలు విజయం సాధించిన చాంద్రాయణగుట్ట నుంచి ఓటమి చవిచూడక తప్పలేదు. మరోవైపు ముంతాజ్ అహ్మద్ఖాన్, విరాసత్ రసూల్ ఖాన్ కూడా ఎంఐఎం గూటికి చేరారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చాంద్రాయణ గుట్ట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి క్రమంగా అమానుల్లాఖా¯న్ పెద్ద కుమారుడు ఖయ్యూంఖాన్, యాకుత్పురా నుంచి ఫర్హాతుల్లా ఖాన్, మిగతా నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు బరిలో దిగి గట్టిపోటీ ఇచ్చినప్పటికీ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చాంద్రాయణగుట్ట సెగ్మెంట్పై ఆశలు వదలుకొని యాకుత్పురాపై దృష్టి సారించినా..అక్కడా పరాభవం తప్పలేదు. అయితే ఈసారి సరికొత్త వ్యూహంతో విద్యావంతులైన యువతను రంగంలోని దింపాలని మరోమారు ఎంబీటీ గెలుపు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. -
దశాబ్దాలుగా ఆ పార్టీదే హవా
హైదరాబాద్: నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ప్రాచీన నగరం హైదరాబాద్. ఇక్కడ హిందూ, ముస్లింలు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా జీవనం సాగిస్తుంటారు. హైదరాబాద్ పాతనగరం, కొత్త నగరం రాజకీయ పరిస్థితికి భిన్నంగా ఉంటుంది. పాతబస్తీలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయాల ‘ఒరవడే’ వేరు. మేనిఫెస్టోలు, ప్రచార ఆర్భాటాలు ఇక్కడ నడవవు. బలమైన ముస్లిం, హిందుత్వ సామాజిక ఎజెండాలే ఇక్కడి పార్టీల ‘జెండా’లవుతాయి. ‘మజ్లిస్’గా అందరి నోళ్లలో నానే ఆల్ ఇండియా మజ్లిస్–ఎ–ఇత్తేహదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం).. పాతబస్తీ నియోజకవర్గాలపై చెరగని ముద్ర వేసుకుంది. మత రాజకీయాలే ఇక్కడి ఎన్నికల ఫలితాలను శాసిస్తాయి. హిందూ, ముస్లిం ఎజెండాలతో ఇక్కడ మజ్లిస్, బీజేపీ రాజకీయంగా తలపడుతున్నా.. ఫలితం మాత్రం వన్ సైడ్గా ఉంటోంది. దశాబ్దాలుగా ఇక్కడ పట్టు కోసం బీజేపీ, బీఆర్ఎస్ పోటీ పడుతూనే ఉన్నాయి. మజ్లిస్కు కంచుకోటలే.. పాతబస్తీలోని గోషామహల్ మినహా మిగిలిన చార్మినార్, యాకుత్పురా, బహదూర్పురా, కార్వాన్, చాంద్రాయణగుట్ట, నాంపల్లి, మలక్పేట అసెంబ్లీ నియోజవర్గాలు మజ్లిస్కు కంచు కోటలే. ఇక్కడ దశాబ్దాలుగా మజ్లిస్ తిరుగులేని శక్తిగా రాజకీయాలను శాసిస్తోంది. ఈ ఎన్నికల్లోనూ ఆ పార్టీ తిరిగి పట్టు నిలుపుకోవడం దాదాపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా బీజేపీ హిందుత్వ ఎజెండాతో మజ్లిస్ కంచుకోటను బద్దలు కొట్టి పాగా వేసేందుకు ప్రయతి్నస్తూనే ఉంది. మజ్లిస్ నుంచి చీలి సొంత కుంపటి పెట్టుకున్న ఎంబీటీ కూడా ఢీ అంటూ సర్వశక్తులూ ఒడ్డుతోంది. అయినప్పటికీ ప్రతీ ఎన్నికల్లో నామమాత్ర ప్రభావమే చూపుడం సర్వసాధారణమైంది. వాస్తవంగా ఈ నియోజకవర్గాల్లో ముస్లింల ఓట్లు అధికం. అధికారంలో ఉన్న పార్టీ.. ప్రతి ఎన్నికల వేళ స్నేహపూర్వక పోటీ పేరుతో బలహీన అభ్యర్థులను రంగంలోకి దింపడం మజ్లిస్కు కలిసివస్తోంది. పదేళ్ల ముందు కాంగ్రెస్తో, ఆ తర్వాత బీఆర్ఎస్తో మజ్లిస్ దోస్తీ కొనసాగిస్తోంది. కార్వాన్లో కౌసర్ మజ్లిస్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ హ్యాట్రిక్ కోసం తహతహలాడుతున్నారు. మరోసారి కౌసర్ బరిలో దిగే అవకాశాలున్నాయి. మజ్లిస్కు గట్టి ఓటు బ్యాంకు ఉన్నా.. హిందుత్వ ఎజెండా కూడా బలంగానే ఉంది.. ఆ వర్గం ఓట్లన్నీ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పారీ్టల మధ్య చీలిపోవడం మజ్లిస్కు కలిసివస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ కృష్ణయ్య అభ్యరి్థత్వాన్ని ఖరారు చేయగా, కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. బలమైన బలాల.. మలక్పేట నియోజకవర్గంలో ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన మజ్లిస్ మరోసారి పచ్చ జెండా ఎగురవేసేందుకు సిద్ధంగా కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ బలాల తిరిగి రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. బీజేపీకి సంస్థాగతంగా బలంగానే ఉన్నప్పటికీ బలమైన అభ్యర్థి రంగలోకి దిగితే తప్ప మజ్లిస్ను ఢీ కొట్టడం అసాధ్యమని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పరిస్థితి అంతంత మాత్రమే. బీఆర్ఎస్ తీగల అజితా రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయగా.. కాంగ్రెస్, బీజీపీలు తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. డబుల్ ధమాకా కోసం చాంద్రాయణగుట్ట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మజ్లిస్ ద్వితీయ అగ్రనేత అక్బరుద్దీన్ ఒవైసీ డబుల్ హ్యాట్రిక్ లాంఛనమే. ఈ నియోజకవర్గం ఆది నుంచి మజ్లిస్కు కంచుకోట. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా గట్టి పోటీనిచ్చే పరిస్థితి కనిపించదు. ఎంబీటీ సైతం గతంలో తలపడి ఆశలు వదులుకుంది. రికార్డు స్థాయి మెజార్టీతో వన్సైడ్ ఫలితం ఈ నియోజకవర్గం ప్రత్యేకత. ఇప్పటికే బీఆర్ఎస్ సీతారాం రెడ్డి అభ్యరి్థత్వాన్ని ఖరారు చేసి రంగలోకి దింపగా, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఖరారు కాలేదు. ‘చార్మినార్’ ఆవిర్భావం నుంచీ ఆధిపత్యం.. చార్మినార్ నియోజకవర్గం మజ్లిస్కు అనుకూలం. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి మజ్లిస్ ఆధిపత్యమే కొనసాగుతోంది. ప్రస్తుతం సీనియర్ శాసన సభ్యుడు ముంతాజ్ అహ్మద్ఖాన్ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐదు పర్యాయాలు యాకుత్పురా నుంచి గత పర్యాయం చారి్మనార్ నుంచి ఆయన ఎన్నికయ్యారు. ఈసారి ఆయన పోటీకి దూరంగా ఉండే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఆయన పోటీకి దూరంగా ఉంటే ఆయన స్థానంలో మజ్లిస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ కుమారుడు నూరుద్దీన్ను బరిలో దింపాలని పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఇబ్రాహీం లోడి అభ్యరి్థత్వాన్ని ఖరారు చేయగా, కాంగ్రెస్, బీజేపీ ప్రకటించాల్సి ఉంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పరిస్థితి అంతంత మాత్రమే. ముస్లిం ఓట్లు అధికంగా ఉండటంతో పాటు హిందుత్వ వాదం కూడా బలంగా ఉంది. మజ్లిస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ముస్లిం ఓట్లను చీల్చుకుంటే.. తాము లబ్ధి పొందవచ్చని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని యోచిస్తోంది. బహదూర్పురాలో దశాబ్దాలుగా.. బహదూర్పురా నియోజకవర్గంలో దశాబ్దాలుగా మజ్లిస్ ప్రాతినిధ్యమే. ఇక్కడ మౌజం ఖాన్ సీనియర్ ఎమ్మెల్యే. వయసు రీత్యా మరోసారి ఆయనకు టికెట్ దక్కడం అనుమానమే అన్న ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో కొత్త అభ్యర్ధి బరిలో దిగే అవకాశాలు లేకపోలేదు. మజ్లిస్ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంది. ప్రతీసారి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీ దిగినా.. ప్రభావం నామమాత్రమే. ఆయా రాజకీయ పక్షాలు సైతం ముస్లిం అభ్యర్థులను రంగంలోకి దింపినా.. పోటీ మాత్రం మజ్లిస్కు దరిదాపుల్లో కనిపించదు. భారీ మెజార్టీతో వార్వైన్సైడ్గా ఉంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అలీ బక్రీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీ పార్టీల ప్రకటించాల్సి ఉంది. అయితే ఆయా పార్టీల నుంచి టికెట కోసం పోటీ తీవ్రంగానే ఉంది. అంతా అనుకూలమే యాకుత్పురా అసెంబ్లీ నియోజకవర్గం మజ్లిస్కు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. గత ఎన్నికల్లో మజ్లిస్ను ఢీకొట్టేందకు ఎంబీటీ శతవిధాలా ప్రయత్నించి విఫలమైంది. బీజేపీకి ఇక్కడ తన వర్గం ఓట్లపై పట్టుంది. కానీ, మజ్లిస్కు గట్టి పోటీ ఇవ్వలేకపోతోంది. గత ఎన్నికల్లో సీనియర్ ఎమ్మెలే అహ్మద్ పాషా ఖాద్రీ పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఈసారి తిరిగి పోటీ చేయడం అనుమానమే. మరో అభ్యర్థి రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. బీఆర్ఎస్ సామ సుందర్ రెడ్డి అభ్యర్థితాన్ని ఖరారు చేయగా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయలేదు. నాంపల్లిలో నువ్వా.. నేనా..? నాంపల్లి నియోజకవర్గంలో గట్టి పోటీ ఎదుర్కొని మజ్లిస్ బయటపడుతూ వస్తోంది. జాఫర్ హుస్సే మేరాజ్ రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఈసారి అభ్యర్థి మార్పు ఉంటుందని ప్రచారం సాగుతోంది. మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్ పోటీలో దిగే అవకాశాలున్నాయి. మజ్లిస్ చేతిలో మూడు పర్యాయాలు ఓటమి చవి చూసిన ఫిరోజ్ ఖాన్ ఈసారి కూడా కాంగ్రెస్ నుంచి బరిలో దిగే అవకాశాలున్నాయి. అధికార బీఆర్ఎస్తో పాటు బీజేపీ సైతం తమ అభ్యర్థులను ఇప్పటివరకు ప్రకటించలేదు. -
పార్టీలు కాదు.. ప్రైవేటు కంపెనీలు!
కుటుంబ సభ్యులు ఓనర్లు..బయటివారు అటెండర్లు! తెలంగాణలోని రెండు కుటుంబ పాలిత పార్టీలది ఒకటే ఫార్ములా.. అవినీతి, కమీషన్లు..అంతా కుటుంబం కోసం, కుటుంబం ద్వారా, కుటుంబానికి చెందిన (పార్టీ బై ద ఫ్యామిలీ,ఫర్ ద ఫ్యామిలీ, టు ద ఫ్యామిలీ) అన్నట్టుగా ఆ పార్టీల తీరు ఉంది. అవి పార్టీలు కాదు.. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా నడిపిస్తున్నారు. వాటిలో ప్రెసిడెంట్లు, సీఈవోలు, డైరెక్టర్, జనరల్ మేనేజర్లు, చీఫ్ మేనేజర్లు, అంతా కుటుంబ సభ్యులే. సహాయకులుగా ఉండే అటెండర్లు, సపోర్ట్ స్టాఫ్గానే బయటి వ్యక్తులు ఉంటారు. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీలకు చరమగీతం పాడి.. బీజేపీని గెలిపించాల్సిన అవసరం ఉంది. ఢిల్లీలో ఓ అన్న ఉన్నాడు.. తెలంగాణ రాణీ రుద్రమ వంటి వీరవనితలు పుట్టిన భూమి. ఇటీవల ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల బిల్లుతో చట్టసభల్లో మహిళల గొంతు మరింతగా వినిపించబోతోంది. మహిళలు మోదీ చేతులను బలోపేతం చేస్తే.. మోదీ మహిళా శక్తిని బలోపేతం చేస్తున్నాడు.. తెలంగాణలోని అక్కాచెల్లెళ్లకు ఢిల్లీలో ఒక అన్న (మోదీ) ఉన్న విషయాన్ని మర్చిపోవద్దు. మహిళల కోసం ఆత్మ గౌరవ గృహాలు, ముద్రా యోజన, పీఎం ఆవాస్ యోజన, ఉచిత గ్యాస్ కనెక్షన్లు వంటివి తెచ్చి వారి జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చాం. మహబూబ్నగర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో అభివృద్ధి జరగకుండా రెండు కుటుంబ పాలిత పార్టీలు అడ్డుకుంటున్నాయని.. అవి ప్రజాస్వామ్యాన్ని కుటుంబస్వామ్యంగా మా ర్చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. బీఆర్ఎస్, ఎంఐఎంలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. వాటికి ప్రజల సంక్షేమం కంటే కుటుంబ ప్రయోజనాలే ప్రధానంగా మారిపోయాయని మండిపడ్డా రు. తెలంగాణ సర్కార్ కారు స్టీరింగ్ మరొకరి చే తుల్లో ఉందని.. దీనిని బట్టి ఈ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో అర్థమవుతుందని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పరివార వాద పార్టీలకు చరమగీతం పాడాలని.. ప్రజల జీవితాలను ఎలా మెరుగుపర్చాలి, ఎలా అభివృద్ధి చేయాలని నిరంతరం ఆలోచించే బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆదివారం పాలమూరు ప్రజాగర్జన సభలో మోదీ మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం చేసిన సాయం, పథకాలను ప్రస్తావిస్తూనే.. బీఆర్ఎస్పై ఘాటుగా విమర్శలు గుప్పించారు. సభలో మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టులు కేవలం అవినీతి, అక్రమాల కోసమే. ఇటీవల ప్రాజెక్టులకు ప్రారం¿ోత్సవాల పేరిట ఆర్భాటాలు, హంగామా చేశారు. కానీ వాటిలోంచి రైతులకు నీళ్లు మాత్రం రాలేదు. ఇలా ప్రాజెక్టుల పేరుతో రైతులను దోపిడీ చేస్తున్నారు. రైతు పథకాలను కొందరు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. తప్పుడు హామీలతో మోసం చేస్తున్నారు. రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి గాలికి వదిలేశారు. ఎందరో రైతుల మరణానికి కారణం అయ్యారు. పసుపు బోర్డు, గిరిజన వర్సిటీతో ఎంతో మేలు కేంద్రం ఇప్పటిదాకా తెలంగాణలో అమలుచేసిన అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ఇప్పుడు పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ, ఇతర ప్రాజెక్టులతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అభివృద్ధి కొత్త శిఖరాలకు చేరుకుంటుంది. ములుగులో రూ.900 కోట్లతో సమ్మక్క–సారలమ్మ కేంద్రీయ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. నిజానికి మేం గిరిజన వర్సిటీని ఐదేళ్ల కిందటే నెలకొల్పాలని ప్రయత్నిస్తే.. రాష్ట్రంలోని అవినీతి ప్రభుత్వం దానికి భూమి ఇచ్చేందుకు ఐదేళ్లు పట్టింది. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజనుల పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతోంది. మేం పసుపు రైతుల కష్టాలను గుర్తించి, వారిని ఆదుకోవడానికి పసుపు బోర్డు ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పటికే సుగంధ ద్రవ్యాల బోర్డు ఉండగా.. ప్రత్యేకంగా పసుపు కోసం నేషనల్ టర్మరిక్ బోర్డు ఏర్పాటుతో తెలంగాణ ప్రజలు, రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. ఎగుమతులకు వాల్యూ అడిషన్గా పనికొస్తుంది. రూ.27వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేశాం కేంద్ర ప్రభుత్వం రైతుల కష్టాన్ని గుర్తించి గిట్టుబాటు ధర కల్పించి ధాన్యం కొనుగోలు చేస్తోంది. 2014లో కాంగ్రెస్ హయాంలో రూ.3,400 కోట్లతో ధాన్యం కొనుగోలు చేస్తే.. మేం అధికారంలోకి వచ్చాక ఒక్క ఏడాదిలోనే రూ.27 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశాం. అన్నదాతలకు గౌరవం కల్పించాం. రాష్ట్రంలో మూతపడిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని రైతుల కోసం తెరిచాం. ఇప్పుడు రూ.13,500 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. ఈ సభకు వచ్చిన వారిని ఉత్సాహాన్ని చూస్తుంటే ఇక్కడి ప్రభుత్వానికి నిద్ర పట్టదు. తెలంగాణ అభివృద్ధికి తోడుగా.. బీజేపీ తెలంగాణ ప్రజల జీవితాలను మరింత ఉజ్వలం చేసేందుకు, అభివృద్ధి మార్గాన నడిపించేందుకు కంకణబద్ధమై ఉంది. 2014 నాటికి తెలంగాణలో రూ.2,500 కిలోమీటర్ల పొడవున మాత్రమే జాతీయ రహదారులు ఉంటే.. మేం వచ్చాక తొమ్మిదేళ్లలో వాటిని రెండింతలు చేశాం. వీటివల్ల చిన్న గ్రామాల నుంచి పెద్ద పట్టణాల దాకా రవాణా స దుపాయాలు పెరిగి.. ఉద్యోగులు, రైతులు, మహిళలు, వివిధ వర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరింది. తెలంగాణకు చెందిన బిద్రీ ఆర్ట్ (కళంకారీ)కు సంబంధించిన వస్తువును ఇటీవల దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి కానుకగా ఇచ్చాను. దాంతో అది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. మోదీ గ్యారంటీలపై భరోసా తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో మహిళలు, రైతులు, ఇతర వర్గాల ప్రజల్లో మోదీ గ్యారంటీలపై భరోసా కనిపిస్తోంది. మోదీ ఏదైనా గ్యారంటీ ఇస్తే దానిని కచ్చితంగా చేసి తీరుతారని ప్రజలు నమ్ముతున్నారు. రాష్ట్రంలో అవినీతి రహిత, నిజాయతీతో కూడిన పారదర్శక ప్రభుత్వం కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఈ సభకు హాజరైన ప్రజల్లో కనిపిస్తున్న ఉత్సాహం, ఉత్తేజం చూస్తుంటే.. తెలంగాణ ప్రజలు ప్రభుత్వాన్ని మార్చాలనే సంకల్పంతో ఉన్నట్టు స్ప ష్టం అవుతోంది. తెలంగాణలో మార్పు కచ్చితం. అది బీజేపీతో మాత్రమే సాధ్యం. గత నాలుగేళ్లలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని బలోపేతం చేశారు. రాబోయే ఎన్నికల్లోనూ బీజేపీని గెలిపించి అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరుతున్నా..’’అని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. 1.30కి రాక.. 5.30కి తిరుగు ప్రయాణం శంషాబాద్: ప్రధాని మోదీ పాలమూరు పర్యటన నిమిత్తం ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు మంత్రి తల సాని శ్రీనివాస్యాదవ్, ప్రభుత్వ సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీకుమార్ తదితరులు స్వాగతం పలికారు. తర్వాత ప్రధాని ప్రత్యేక హెలికాప్టర్లో మహబూబ్నగర్కు వెళ్లారు. అక్కడి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం హెలికాప్టర్లో శంషాబాద్కు చేరుకున్నారు. సాయంత్రం 5.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగుప్రయాణం అయ్యారు. -
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆఫీస్ ముందు MIM నేతల బైక్ ర్యాలీ
-
మహిళా బిల్లును వ్యతిరేకించిన MIM
-
సోనియా గాంధీ అంటే అభిమానం, గౌరవం: విజయశాంతి కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పొలిటికల్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న క్రమంలో బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అంటే తనను అభిమానం, గౌరవమని అన్నారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే, విజయశాంతి ట్విట్టర్ వేదికగా..‘ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే అని, సయామీ ట్విన్స్ అని ఎప్పటి నుంచో నేను నిరంతరం చెబుతున్న మాటని నిన్న రాహుల్ గాంధీ గారు కూడా బహిరంగ సభలో చెప్పడం ఎంతైనా సమంజసం అంటూ మండిపడ్డారు రాములమ్మ. అయితే, మిగతా ఎక్కడో రాష్ట్రాలలో ఎంఐఎం, కాంగ్రెస్ను ఓడించడానికి ప్రయత్నిస్తున్నదనే వ్యాఖ్యానం పూర్తిగా అయోమయ అంశం, అర్థం కాని విషయం కూడా అంటూ చురకలు అంటించారు. ఎంఐఎం, బీఆరెస్ ఒక్కటే అని, సయామీ ట్విన్స్ అని ఎప్పటి నుంచో నేను నిరంతరం చెబుతున్న మాటని ఈ రోజు రాహుల్ గాంధీ గారు కూడా బహిరంగ సభలో చెప్పడం ఎంతైనా సమంజసం. అయితే, మిగతా ఎక్కడో రాష్ట్రాలలో ఎంఐఎం, కాంగ్రెస్ను ఓడించడానికి ప్రయత్నిస్తున్నదనే వ్యాఖ్యానం పూర్తిగా అయోమయ అంశం, అర్థం కాని… pic.twitter.com/TdySxpX4dJ — VIJAYASHANTHI (@vijayashanthi_m) September 17, 2023 ఇదే సమయంలో ‘అంటే దేశంలోని అనేక రాష్ట్రాలలో ఎంఐఎం ప్రేరేపిత ఓట్లు కాంగ్రెస్కు రాకపోవడం వల్లనే బీజేపీ గెలుస్తున్నదా? కాంగ్రెస్ ఓడిపోతున్నదా? అని నిలదీశారు. ఆ విధంగా కాంగ్రెస్ దేశంలోని అనేక రాష్ట్రాలలో గెలవలేని పరిస్థితులు ఉన్నాయా? కాబట్టి, ఎంఐఎం లేకుండా దేశంలో ఎక్కడా కూడా గెలవడం సాధ్యం కాదేమో అని కాంగ్రెస్ అభిప్రాయమా? అని ప్రశ్నించారు. ఒక్క మాటలో, దేశమంతటా ప్రోద్బలిత వర్గాలను కాంగ్రెస్ కన్నా ఎక్కువగా ఎంఐఎం మరింత ప్రభావితం చెయ్యగలుగుతున్నదా? అని పేర్కొన్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సోనియా గాంధీ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరం తప్పక అభిమానంతోనే చూస్తాం, రాజకీయాలకు అతీతంగా గౌరవిస్తాం’ అని ఆమె కామెంట్ చేశారు. ఇది కూడా చదవండి: వచ్చే నెలలో తెలంగాణకు ప్రధాని మోదీ? -
ఢిల్లీ నుంచి గల్లీ వరకు తెలంగాణ ఎందుకంత కీలకం?
-
రెండు వేల మందిని ఊచకోత కోశారు: కిషన్ రెడ్డి
-
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు వేర్వేరుగానే: కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలతోపాటే రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఉంటాయనే భ్రమల్లో ఎవరూ ఉండొద్దని.. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు వేర్వేరుగానే జరుగుతాయని స్పష్టం చేశారు. కేసీఆర్ను, బీఆర్ఎస్ను ఓడించాలనే కసి, పట్టుదల బీజేపీ నాయకులు, కార్య కర్తల్లో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. బీఆర్ఎస్తో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి ఎలాంటి పొత్తు ఉండబోదని చెప్పారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాల యంలో జరిగిన బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతల సమావేశంలో కిషన్రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్–బీజేపీ మధ్య స్నేహం లేదని, ఉండబోదని.. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటేనని క్షేత్రస్థాయిలో ప్రచారం చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీలో మార్పు కనిపిస్తోంది.. గతంలో తాను ఉమ్మడి ఏపీ బీజేపీ ఇన్చార్జిగా ఉన్నప్పటికి, ఇప్పుడున్న పార్టీకి ఎంతో మార్పు కనిపిస్తోందని రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్చార్జి, ఎంపీ ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. బీఆర్ఎస్పై పోరాడి కచ్చితంగా గెలుపొందాలనే పట్టుదల బీజేపీ శ్రేణుల్లో కనిపిస్తోందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కావని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారని.. ఈ విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. వివిధ అంశాలపై ఆందోళనలు, నిరసనలు పదాధికారుల భేటీలో తీసుకున్న నిర్ణయాల మేర కు.. సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయ నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ నెల 11న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తారు. నిరుద్యోగుల సమస్యలపై ఈ నెల 13న ఉదయం 11 గంటల నుంచి 14న ఉదయం వరకు 24 గంటల పాటు ఇందిరా పార్క్ దగ్గర నిరసన దీక్ష చేపడతారు. 15వ తేదీన తెలంగాణ సాయుధ పోరాట వీరులను స్మరిస్తూ అన్ని మండల కేంద్రాల్లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తారు. అదే రోజున కిషన్రెడ్డి నాయకత్వంలో సికింద్రాబాద్ క్లాక్ టవర్ నుండి పరకాల అమరధామం వరకు బైక్ ర్యాలీ చేపట్టి.. అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈనెల 17న ఉదయం హైదరాబాద్ విమోచన దినో త్సవం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పోలింగ్బూ త్ కేంద్రాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ఆ రోజున పరేడ్ గ్రౌండ్స్లో అమిత్ షా ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం, బహిరంగ సభ నిర్వహి స్తారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు చేపడతారు. ఈ భేటీలో పార్టీ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, డీకే అరుణ, మురళీధర్రావు, ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి, ఏపీ జితేందర్రెడ్డి, ఎం.రవీంద్రనాయక్, బూర నర్సయ్యగౌడ్, జి. విజయరామారావు, కొండా విశ్వేశ్వర్రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, దుగ్యాల ప్రదీప్కుమార్, బంగారు శ్రుతి తదితరులు పాల్గొన్నారు. మూడు రథయాత్రలు.. మోదీ సభ.. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఈ నెల 26, 27, 28 తేదీల్లో రాష్ట్రంలో మూడు వైపుల నుంచి మూడు జోన్లుగా రథయాత్ర (బస్సుయాత్ర)లను ప్రారంభించాలని బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో నిర్ణయించారు. కొమురంభీం పేరిట బాసర నుంచి హైదరాబాద్ వరకు (ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో) ఒక యాత్ర.. కృష్ణా యాత్ర పేరిట సోమశిల నుంచి హైదరాబాద్ వరకు (ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలు) మరో యాత్ర.. గోదావరి పేరిట భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు (ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలు) మరోయాత్రను ప్రారంభించనున్నారు. ఈ మూడు యాత్రలు కూడా చివరిలో రంగారెడ్డి మీదుగా హైదరాబాద్కు చేరుకుంటాయి. మొత్తం 19 రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల పొడవున ఈ రథయాత్రలు సాగనున్నాయి. రాష్ట్ర ముఖ్య నేతలైన కిషన్రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ లేదా బండి సంజయ్ల ఆధ్వర్యంలో ఇవి సాగే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ 14న హైదరాబాద్లో ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభతో ఈ యాత్రలను ముగించాలని పదాధికారుల భేటీలో నిర్ణయించారు. -
TS Election 2023: బీఆర్ఎస్కు ‘డబుల్ బెడ్రూం’ బెడద!
నిజామాబాద్: గతంలో డిచ్పల్లి పేరిట ఉండగా ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంగా మారింది. డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామానికి చెందిన మండవ వెంకటేశ్వరరావు ఇక్కడి నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడు సార్లు మంత్రిగా, ఒకసారి ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్గా ఆయన పని చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చిన ఉప ఎన్నికల్లో మండవ వెంకటేశ్వరరావుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి ఆకుల లలిత విజయం సాధించి 10 నెలల పాటు ఎమ్మెల్యేగా పని చేయడం చెప్పుకోదగ్గ విషయం. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువ. ఆర్ఎస్ఎస్, హిందూత్వ ప్రభావం బాగానే ఉంటుంది. కాలేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 21, 22 ప్యాకేజీ, మంచిప్ప ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తామని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. కానీ ఆ హామీ నెరవేరలేదు. మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణం వల్ల ఆ గ్రామంతో పాటు బైరాపూర్, అమ్రాబాద్ గ్రామ పంచాయతీల పరిధిలోని 8 తండాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. డిచ్పల్లి మండలం బీబీపూర్ తండ వద్ద మాత్రమే 50 మందికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చారు. మిగిలిన మండలాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల జాడే లేదు. రైతులు ధరణి సమస్యలపై ఆగ్రహంగా ఉన్నారు. గల్ఫ్ కార్మికులు సుమారు 33వేల మంది వరకు ఉంటారు. వారి కుటుంబ సభ్యులను లెక్కేస్తే 90వేల వరకు ఉంటారు. జక్రాన్పల్లి ఎయిర్పోర్టు ఏర్పాటు లో జాప్యం, గల్ఫ్ కార్మికులతో పాటు సమస్యలు ఎన్నికలపై ప్రభావితం చూపే అవకాశాలుంటాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీల్లో 2లక్షల పంట రుణమాఫీ, రూ. 500 లకే సిలిండర్, నిరుద్యోగ భృతి తదితర హామీలు గ్రామాల్లో చర్చనీయాంశంగా ఉన్నాయి. రాజకీయపరంగా బీఆర్ఎస్ నేతల అసమ్మతి, కాంగ్రెస్, బీజేపీలో నాయకుల మధ్య అంతర్గత విబేధాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపనున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు: బీఆర్ఎస్: ► సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీ : ► మాజీ ఎమ్మెల్సీలు డాక్టర్ భూపతిరెడ్డి ► అరికెల నర్సారెడ్డి ► నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాటిపల్లి నగేష్రెడ్డి బీజేపీ: ► మాజీ జెడ్పీటీసీ దినేష్కుమార్ వృత్తిపరంగా ఓటర్లు: రైతులు ఎక్కువగా ఉంటారు.. లంబాడా గిరిజనులు కూడా ఎక్కువగానే ఉంటారు. మతం/కులం పరంగా ఓటర్లు: ► బీసీ ఓటర్లు : మున్నూరుకాపులు 40 వేలు ► యాదవులు/గొల్లకుర్మలు 15వేలు ► పద్మశాలీలు 19వేలు, ముదిరాజ్లు 20వేలు ► ఎస్సీలు : 28 వేలు, ఎస్టీలు 22వేలు ► క్రిస్టియన్లు : 10వేలు ► ముస్లీం మైనార్టీలు :15 వేలు భౌగోళిక పరిస్థితులు.. జిల్లాలోనే ప్రసద్ధి చెందిన డిచ్పల్లి ఖిల్లా రామాలయం, రామడుగు ప్రాజెక్టు, తెలంగాణ యూనివర్సిటీ, సారంగపూర్ హనుమాన్ ఆలయం, ఇందల్వాయి రామాలయం, సిరికొండ లొంక రామేశ్వరాలయం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఈ నియోజకవర్గం చుట్టూ సరిహద్దులుగా 8 నియోజకవర్గాలు ఉన్నాయి. సిరికొండ, ఇందల్వాయి, మోపాల్, డిచ్పల్లి, రూరల్ మండలాల్లో అటవీ ప్రాంతం ఉంది. రాజకీయపరమైన అంశాలు.. బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో కన్ఫాం అయ్యింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తన కుమారుడు ధర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ మోహన్ రెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబెట్టాలని ప్రయత్నించారు. కానీ అధిష్టానం మాత్రం బాజిరెడ్డికే మరోసారి టికెట్ కట్టబెట్టింది. ఇక కాంగ్రెస్కు చెందిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డిపై ప్రజల్లో సానుభూతి ఉంది. ఈసారి ఆయనకే కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తుందని భావిస్తున్నారు. మరోవైపు తన మేనల్లుడు, ప్రముఖ సినీహీరో నితిన్ అండతో ఏఎంసీ మాజీ చైర్మన్ కాటిపల్లి నగేష్రెడ్డి కాంగ్రెస్ టికెట్ తెచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరికి తోడు మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు సహకారంతో పార్టీ టికెట్ కోసం యత్నిస్తున్నారు. -
కమ్యూనిస్టులకు కేసీఆర్ పంగనామాలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో పొత్తు ఖాయమైంది కాబట్టే కమ్యూనిస్టులకు కేసీఆర్ పంగనామాలు పెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘మునుగోడులో కమ్యూనిస్టులతో కలిసిన సందర్భంలో వారితో పొత్తు పెట్టుకుని బీజేపీ, కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయంగా పోటీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. కానీ ఢిల్లీ వెళ్లి మోదీని కలిసిన కేసీఆర్ అమిత్షాతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకే కమ్యూనిస్టులను కరివేపాకులా వాడుకుని వదిలేశారు’అని చెప్పారు. బుధవారం గాం«దీభవన్లో మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ తన అనుచరులతో కలిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, బీజేపీతో ఒప్పందం మేరకే కమ్యూనిస్టుల కు సీట్లు ఇవ్వకుండా ఏకపక్షంగా కేసీఆర్ అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారని అన్నారు. తెలంగాణ సాధనలో కీలకపాత్ర పోషించిన చంద్రశేఖర్ కాంగ్రెస్లోకి రావడం సంతోషకరమని, ఆయనకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందని చెప్పారు. సాగర్ కట్టమీద చర్చిద్దాం వస్తారా? కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారని, చరిత్ర తిరిగేసి చూస్తే కాంగ్రెస్ ఏం చేసిందో బీఆర్ఎస్ నేతలకు అర్థమవుతుందని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్ట మీద కూర్చుని చర్చిద్దాం వస్తారా? అని బీఆర్ఎస్ నేతలకు ఆయన సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తే.. కేసీఆర్ 7,500 కోట్లకు తెగనమ్ముకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తే కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్షకోట్లు మింగాడని, కాంగ్రెస్ హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తే, డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో పేద ప్రజల ఓట్లను దండుకునేందుకు వారిని కేసీఆర్ మోసం చేస్తున్నారని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిన చోట తాము ఓట్లు అడగబోమని, ఇందిరమ్మ ఇళ్లు కట్టిన చోట్ల బీఆర్ఎస్ ఓట్లు అడగకుండా ఉంటారా అని రేవంత్ సవాల్ విసిరారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ బొందలగడ్డ అయిందని విమర్శించారు. కామారెడ్డికి గోదావరి నీళ్లు తెచ్చిన తర్వాతే కేసీఆర్ అక్కడ పోటీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటేనన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని, రూ.5 లక్షల వరకు పేదల వైద్య ఖర్చులను ఆరోగ్యశ్రీ ద్వారా భరిస్తామని, రూ.500కే గ్యాస్ సిలెండర్ ఇస్తామని, ప్రతి పేద వ్యక్తి ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల సాయం అందిస్తామని పునరుద్ఘాటించారు. ఈనెల 26న చేవెళ్లలో జరిగే బహిరంగసభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. -
‘హైదరాబాద్లోని మొత్తం 29 స్థానాల్లో బీఆర్ఎస్, మజ్లిసే గెలుపు’
సాక్షి, హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మజ్లిస్, తాము కలిసి ఉమ్మడి హైదరాబాద్ జిల్లాల్లోని మొత్తం 29 స్థానాల్లో ఇరవై తొమ్మిది తామే గెలుస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్, మజ్లిస్ గెలుస్తాయి కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా మొత్తం 17 ఎంపీ స్థానాల్లోనూ విజయం సాధిస్తాయని తెలిపారు. 2014 నుంచి ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీ మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉందని సీఎం పేర్కొన్నారు. ఇప్పుడు కూడా తమ మధ్య స్నేహం అలాగే కొనసాగుతుందని పేర్కొన్నారు. అలాగే మిత్రపక్షాలను కూడా కలుపుకొని ముందుకు వెళ్తామని చెప్పారు. మరింత ఉజ్వలమైన తెలంగాణ సాధన కోసంప్రజల ఆశీర్వాదం కావాలని కోరారు. బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థులను మనస్పూర్తిగా స్వీకరించి, అందర్నీ గెలిపించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. చదవండి: Kavitha : కూతురు కవిత విషయంలో కేసీఆర్ వ్యూహమేంటీ? -
మజ్లిస్ సెక్యులర్ ఎలానో కేసీఆర్ చెప్పాలి: కిషన్రెడ్డి డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: పచ్చి మతోన్మాద మజ్లిస్ పార్టీతో స్నేహం చేస్తూ ఏ రకంగా తమది సెక్యులర్ పక్షమో సీఎం కేసీఆర్ చెప్పాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ జి.కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ మజ్లిస్ తమ మిత్రపక్షం అని, తమది సెక్యులర్ పక్షం అన్నారని గుర్తు చేశారు. తమకు 15 నిమిషాలు సమయం ఇస్తే దేశంలో 100 కోట్ల హిందువుల సంగతి చూస్తామని ప్రకటించిన మజ్లిస్ పార్టీ ఎలా సెక్యులర్ పార్టీ అయ్యిందని కిషన్రెడ్డి ప్రశ్నించారు. పాత బస్తీలో అల్లర్లకు కారణమైన మజ్లిస్తో కేసీఆర్ ఎలా అంటకాగుతున్నారని నిలదీశారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్కు ఓటేస్తే కాంగ్రెస్కు ఓటేసినట్లేనని, కాంగ్రెస్కు ఓటేస్తే బీఆర్ఎస్కు ఓటేసినట్లేనన్నారు. ఈ రెండు పార్టీలకు ఓటేయడం అంటే మజ్లిస్కు జై కొట్టినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. పైకి తిట్టుకుంటూ కనిపిస్తున్నా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయకారి అవగాహన ఉందన్నారు. రెండు పారీ్టల మధ్య మజ్లిస్ సమన్వయం చేస్తోందని, అనుసంధానకర్తగా పనిచేస్తోందని విమర్శించారు. తెలంగాణలో ఈ మూడు పార్టీల నాటకాలను ప్రజలు అర్థం చేసుకోవాలని, వారి మాటలకు మోసపోవద్దని సూచించారు. ఆ మూడు పార్టీలు ఒకే లైన్లోనే.. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ ఒకే లైన్లో మాట్లాడుతున్నాయని కిషన్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలిపోవాలని, తద్వారా కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలన్న కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మొన్న కేటీఆర్ మాట్లాడుతూ కేంద్రంలో సంకీర్ణం వస్తుందని... అందులో బీఆర్ఎస్ చేరుతుందని అనడం ద్వారా ఆ రెండు పారీ్టలు ఒకటే అని చెప్పకనే చెప్పారని అన్నారు. వచ్చేది తమ ప్రభుత్వమే అని కేటీఆర్ పగటి కలలు కంటున్నారని కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు. పార్లమెంట్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పారీ్టలు కలిసి చేస్తున్న ధర్నాలు, ఒకరికి ఒకరు చేసుకుంటున్న సహాయం తెలంగాణ ప్రజలు చూస్తున్నారని, అన్ని విషయాలను గమనిస్తున్నారని తెలిపారు. గాంధీ భవన్కు, తెలంగాణ భవన్కు దగ్గరి సంబంధాలు కాంగ్రెస్ పార్టీ తరుపున 2014లో 22 మంది గెలిస్తే 15 మంది, 2019లో 19 గెలిస్తే 12 మంది వెళ్లి బీఆర్ఎస్లో కలిశారని.. కనీసం రాజీనామా కూడా చేయకుండా మంత్రులుగా కొనసాగుతున్నారని కిషన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకే తాను ముక్కలని.. గాంధీ భవన్కు, తెలంగాణ భవన్కు దగ్గరి సంబంధాలు ఉన్నాయని స్పష్టమైందని కేంద్రమంత్రి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు, పథకాల కోసం సీఎం కేసీఆర్కు 40కి పైగా లేఖలు రాస్తే, ఏ ఒక్కదానిపై కూడా స్పందించలేదని, అలాంటి వ్యక్తి కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం సిగ్గు చేటని కిషన్రెడ్డి అన్నారు. రాహుల్వి దుందుడుకు మాటలు మణిపూర్లో భారతమాతను హత్య చేశారంటూ రాహుల్గాంధీ అవగాహన లేని దుందుడుకు మాటలు మాట్లాడారని కిషన్రెడ్డి విమర్శించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా కాంగ్రెస్ భారత్ను అగౌరవపరిచే విధంగా, అస్థిరపరిచే విధంగా మాట్లాడటాన్ని దేశ ప్రజలు క్షమించరన్నారు. సూర్య చంద్రులు ఉన్నంత వరకు భారతమాతను ఎవరూ హత్య చేయలేరని.. రాహుల్ మాటలను దేశ ప్రజలు ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. విమర్శ రాజకీయంగా ఉండాలే తప్ప ఇలా దేశాన్ని అగౌరవ పరిచేలా మాట్లాడడం తగదని రాహుల్గాం«దీకి కిషన్రెడ్డి సూచించారు. -
ఆ 3 పార్టీలూ ఒక్కటే
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటే. ఈ మూడు కుటుంబ పార్టీలే. వాటి డీఎన్ఏ కూడా ఒకటే. అందుకే ఆ మూడు పార్టీలు యూనిఫామ్ సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరస్మృతి)ను వ్యతిరేకిస్తున్నాయి. ముస్లిం మహిళలకు హక్కులు వద్దంటున్నాయి..’అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి మండిపడ్డారు. ‘ఈ మూడు పార్టీలు ఒకే గూటి పక్షులు. గతంలో పొత్తు పెట్టుకున్నాయి. ఇందులో ఎవరికి ఓటేసినా బీఆర్ఎస్కు వేసినట్లే..’అని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో మహా ర్యాలీ నిర్వహించారు. అనంతరం క్లాక్టవర్ చౌరస్తాలో నిర్వహించిన బహిరంగసభలో, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో కిషన్రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కలిసి ఉద్దేశపూర్వకంగా బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు. బీజేపీ ఏ పార్టీతో కలవలేదని, భవిష్యత్తులో కూడా కలవబోదని చెప్పారు. ప్రజలను మోసం చేసిన చరిత్ర సీఎం కేసీఆర్దని, గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కా రని ధ్వజమెత్తారు. కుటుంబాల చేతుల్లో అధికారం ఉంటే దేశం బాగుపడదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయం ఖాయమని చెప్పారు. ఇప్పటికీ వైఎస్ హయాంలోని రేషన్ కార్డులే.. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్కార్డులే తప్ప.. తెలంగాణలో కొత్తవి రాలేదని కిషన్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పేదలకు రేషన్ కార్డులివ్వాలనే సోయి కేసీఆర్ సర్కారుకు లేదని విమర్శించారు. గత ఎన్నికలకు ముందు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక మోసం చేశారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్కు ఓటేస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి.. వెన్నుపోటు పొడిచారన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, రైతులకు ఎరువులు ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల జీవితాల్లో నిప్పులు పోశారని, టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని, దళితబంధు స్కీంను అమ్ముకుంటున్నారని, బీసీ బంధు పేరిట ఆ వర్గాలను మభ్యపెడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ఆట కట్టించాలి.. దేశంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో నాలుగు కోట్లకు పైగా ఇళ్లు కట్టించామని, తెలంగాణలోనూ ఇళ్లు కట్టించాలని కోరినా ఇక్కడి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని కిషన్రెడ్డి పేర్కొన్నారు. తొమ్మిదేళ్లుగా పేదలకు ఇళ్లు లేవు కానీ.. ప్రజాధనం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ముఖ్యమంత్రి రాజభవనాన్ని కట్టుకున్నారని ఆరోపించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీయించడమే కాకుండా లిక్కర్ తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణను దోచుకుంటున్న బీఆర్ఎస్ ఆట కట్టించాల్సిన అవసరముందని అన్నారు. నియంత పాలనను అంతమొందిస్తాం: డీకే అరుణ తెలంగాణలో నియంతపాలన అంతమయ్యే దాకా బీజేపీ నిద్రపోదని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షు రాలు డీకే అరుణ అన్నారు. ఈ ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్లు ఇచ్చే వరకూ వదలబోమని, కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వకుంటే బీజేపీ అధికారంలోకి వచ్చాక తామే ఇస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలతో మూడు ముక్కలాట ఆడుతున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలది ముక్కోణపు ప్రేమకథ అని... ఈ మూడు పార్టీలూ కలిసి తెలంగాణ ప్రజల జీవితాలతో మూడు ముక్కలాట ఆడుతున్నా యని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణలో ఆ మూడు పార్టీలు నాటకాలు ఆడు తూ అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేస్తు న్నాయని విమర్శించారు. తెలంగాణలో ఎన్ని కలకు ముందు లేదా తర్వాత కలిసి ప్రయాణం చేసే ఈ మూడు పార్టీల మధ్య ముక్కోణపు ప్రేమ కథ నడుస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు ఆయా పార్టీల అసలు స్వరూ పం తెలిసిపోయిందని, అందుకే బీజేపీకి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందన్నారు. శనివారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ (మల్కాజ్గిరి), నేతలు జైపాల్ రెడ్డి (జహీరాబాద్), లక్ష్మారెడ్డి (రంగారెడ్డి) కాషా య కండువా కప్పుకున్నారు. కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ ఛుగ్, ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో ఈ నలుగురు నాయకులకు పార్టీ సభ్యత్వ రశీదు అందించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా పనిచేసిన వారు బీజేపీలో చేరారని... మరిన్ని చేరికలు ఉండేలా కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళతామన్నారు. జిట్టా ఆరోపణలకు స్పందించను ఏ రోజు కూడా బీజేపీ, బీఆర్ఎస్తో కలిసి పనిచేయలేదని.. భవిష్యత్తులోనూ పనిచేయ బోదని కిషన్రెడ్డి స్పష్టంచేశారు. బీఆర్ఎస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ పనిచే స్తుందన్నారు. కాగా జిట్టా బాలకృష్ణారెడ్డి ఇచ్చే సర్టిఫికెట్ తనకు అవసరం లేదని.. అతను చేసే ఆరోపణలపై జవాబు చెప్పాల్సిన అవసరం కూడా లేదని కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. బీజే పీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్ మాట్లాడుతూ, 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వెళ్ళారని, అందుకే ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పట్ల నమ్మకం పోయిందన్నారు. త్వరలోనే కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి లభిస్తుందన్నారు. చైతన్యంలేని రాహుల్ నేతృత్వంలో ఎలా పనిచేస్తాం బీజేపీ కండువా కప్పుకున్న అనంతరం మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి మాట్లాడుతూ, ఇన్నేళ్లలో కనీసం 50 సార్లు రాహుల్ గాంధీని కలిసినా... కనీసం తనను గుర్తుపట్టలే రన్నారు. రాజకీయ చైతన్యం లేని రాహుల్గాంధీలాంటి నేత నేతృత్వంలో ఎవరైనా ఎలా పని చేస్తారని ప్రశ్నించారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు బీజేపీలో ఉన్నారని... డూప్లికేట్లు, అన్ని పార్టీలు తిరిగొచ్చిన నేతలు, మిక్స్డ్ పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని రంగారెడ్డి వ్యాఖ్యానించారు. -
మూడు కుటుంబ పార్టీలు.. అవినీతి పార్టీలే: కిషన్ రెడ్డి
-
తెలంగాణ పాలిటిక్స్లో బిగ్ ట్విస్ట్.. బీఆర్ఎస్కు ఎఫెక్ట్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పొలిటికల్ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక, ఇప్పటి వరకు దోస్తీలుగా ఉన్న బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య మాటల వార్ నడుస్తోంది. ఇదే క్రమంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్కు డెరెక్ట్గా వార్నింగ్ ఇస్తూ కామెంట్స్ చేశారు. దీనికి షకీల్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. మరోవైపు.. అసెంబ్లీలో కూడా అక్బరుద్దీన్ ఒవైసీ.. తెలంగాణ సర్కార్ తీరుపై విరుచుకుపడ్డారు. పాతబస్తీ అభివృద్ధి, మెట్రో సేవలపై అసెంబ్లీ వేదికగా పలు ప్రశ్నలు సంధిస్తూ అధికార పార్టీపై ఫుల్ ఫైరయ్యారు. దీంతో, రంగంలోకి దిగిన కేటీఆర్.. ఎంఐఎంకు కౌంటర్ ఇస్తూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. మొన్న నిజామాబాద్లో అసదుద్దీన్ చేసిన కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారాయి. ఒవైసీ మాట్లాడుతూ.. తెలంగాణలో అన్ని స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తుంది. అంతేకాదు.. దళిత బంధులా.. ముస్లిం బంధు ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. కారు స్టీరింగ్ తమ చేతిలో ఉందనే వాళ్లు దీనిని గమనించాలని సూచించారు. ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని హైదరాబాద్ లోక్సభ స్థానంలో ప్రజల ఆదరణతో తామే మళ్లీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, వచ్చే ఎన్నికల్లో తాము ఏ పార్టీతో జట్టు కడతామన్నది ఎన్నికలనాటికి చెబుతామని అనడం కీలకంగా మారింది. అయితే, బీఆర్ఎస్పై ఎంఐఎం ఆరోపణల నేపథ్యంలో మజ్లిస్ పార్టీ ప్లాన్ మార్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్కు కాకుండా కాంగ్రెస్కు చేరువయ్యేందకు మజ్లిస్ నేతలు ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో, వచ్చే ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: తెలంగాణలో భిన్నంగా ఓటరు నాడి.. ఆ పార్టీకే మెజారిటీ సీట్లు! -
బోధన్ BRS, MIMల మధ్య పెరుగుతోన్న దూరం
-
కేసీఆర్ హింసించే పులకేశి: బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), రాష్ట్ర నిఘా వర్గాలు సంయుక్తంగా హైదరాబాద్లో మంగళవారం చేపట్టిన ఆపరేషన్లో ఐదుగురు హిజ్బూ ఉత్ తహరీర్ (హెచ్యూటీ) సంస్థ ఉగ్రవాద అనుమానితులు చిక్కారు. ఈ మాడ్యుల్కు సూత్రధారిగా ఉన్న మహ్మద్ సలీం.. ఓ మెడికల్ కాలేజీలో డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేస్తుండగా, పట్టుబడినవారిలో ఒక దంత వైద్యుడు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండటం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా బండి సంజయ్ మాట్లాడుతూ.. పాతబస్తీ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది. ఉగ్రనేత ఒవైసీ కుటుంబానికి చెందిన దక్కన్ కాలేజీలో హెచ్వోడీగా పనిచేస్తున్నాడు. టెర్రరిస్టులకు సపోర్టు చేస్తానని గతంలో ఒవైసీ ప్రకటించారు. ఉగ్రవాదులకు, రోహింగ్యాలకు మజ్లిస్ ఆశ్రయమిస్తోంది. ఆరుగురు ఉగ్రవాదులు హైదరాబాద్లో పట్టుబడ్డారు. ఐఎస్ఐ లాంటి సంస్థలకు పాతబస్తీలో షెల్టర్ ఇస్తున్నారు. అధికారం కాపాడుకోవాలనే తప్ప.. దేశ భద్రతపై బీఆర్ఎస్కు చిత్తశుద్ధి లేదు. అనంతగిరిలో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏకైక లక్ష్యం అధికారమే. శాంతిభద్రతలపై ఒక్క సమీక్ష కూడా కేసీఆర్ చేయడం లేదు. ఉగ్రవాదుల కదలికలపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించాలి. భాగ్యనగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కేసీఆర్ హింసించే పులకేశి. మేం సర్జికల్ స్టైక్ చేస్తామని చాలా మంది ఓవర్గా మాట్లాడారు. అందులో ట్విట్టర్ టిల్లు కూడా ఉన్నారు. ఓట్ల కోసమే అని ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఏం జరిగింది అని ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తిని సీఎం కేసీఆర్ సలహాదారుగా తీసుకున్నారు. పంచాయతీ సెక్రటరీలను ప్రభుత్వం బెదిరిస్తోంది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: ‘సోమేష్ కుమార్ను నియమించి అందుకే..’ -
కొత్త సచివాలయం వారి ప్రేమకు చిహ్నం: బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయంపై మరోసారి విమర్శలు గుప్పించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఎంఐఎం, బీఆర్ఎస్ ప్రేమకు చిహ్నమే ఈ కొత్త సచివాలయ డిజైన్ అని సెటైర్లు వేశారు. వీరి ప్రేమకు కాంగ్రెస్, కమ్యూనిస్టులు రాయబారులు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొత్త సచివాలయాన్ని కూలగొడతానని తానెప్పుడూ అనలేదని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణలో మరో ఐదు నెలల్లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని వ్యాఖ్యానించారు. కేసీఆర్కు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. రోజూ కేసీఆర్ ఆఫీస్కు వస్తారా?: ఈటల రాజేందర్ కరీంనగర్: నూతన సచివాలయం ప్రారంభంపై బీజేపీ నేత ఈటల రాజేందర్ మాట్లాడుతూ, కొత్త సచివాలయం కట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మూడు, నాలుగు నెలలపాటు రోజు ఆఫీస్కు వస్తారా? అని ప్రశ్నించారు. ఇతర నాయకుల ఆనవాళ్లు లేకుండా చేయడానికి, కేసీఆర్ ప్రతిష్ట కోసమే కొత్త సచివాలయాన్ని నిర్మించారని విమర్శించారు.తొమ్మిది సంవత్సరాలుగా తెలంగాణలో పాలన అస్తవ్యస్థమైందని ధ్వజమెత్తారు. కొత్త సచివాలయంలో అయినా పాలన బాగుపడాలని ఆశిస్తున్నాన్నట్లు తెలిపారు. చదవండి: కొంతమంది పిచ్చి కూతలు కూశారు: సీఎం కేసీఆర్ -
సీబీఐ దర్యాప్తు జరిపించాలి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని పాతబస్తీలో ఎలాంటి ఆధారాల్లేకుండా జారీచేసిన 27 వేల జనన, 4 వేల మరణ ధ్రువీకరణ పత్రాలతోపాటు రేషన్, ఓటర్ కార్డులపై వెంటనే సమగ్ర దర్యాప్తు చేయించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యానికి, జీహెచ్ఎంసీలో పేరుకుపోయిన అవినీతికి ఈ ఉదంతం నిదర్శనమన్నారు. ఇందుకు నైతిక బాధ్యత వహించి సీఎం కేసీఆర్ పదవికి రాజీనామా చేయాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పెద్దలు, ఎంఐఎం నేతల హస్తం లేనిదే ఇంత భారీగా సర్టిఫికెట్ల జారీకి అవకాశం లేదని.. అందువల్ల దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తూతూమంత్రంగా విచారణ జరిపి కిందిస్థాయి సిబ్బంది, అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవాలని చూస్తోందని ఆరోపించారు. జీహెచ్ఎంసీ పరిధిలో వేలాదిగా సర్టిఫికెట్ల జారీ ఆందోళన కలిగించే అంశమన్నారు. దేశంలో అల్లర్లకు ఉగ్ర కుట్ర.. జీహెచ్ఎంసీ జారీచేసిన బర్త్ సర్టిఫికెట్లతో పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఉగ్రవాదులు పాస్పోర్టులు పొంది హైదరాబాద్ కేంద్రంగా దేశంలో అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ‘ఓట్లు, సీట్ల కోసం పాతబస్తీని ఎంఐఎంకు కేసీఆర్ ధారాదత్తం చేశాడు. ఎంఐఎం చెప్పినట్లు ఆడుతున్నాడు. మా అనుమతి లేకుండా పాతబస్తీలోకి అడుగుపెట్టే దమ్ముందా? అని అనడంతోపాటు 15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరికి చంపుతామని ఒవైసీ సోదరులు సవాల్ విసిరినా నోరు మెదపని చేతగాని దద్దమ్మ కేసీఆర్’అని మండిపడ్డారు. టీఆర్ఎస్, ఎంఐఎం ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో అల్లర్లకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. పాతబస్తీ మొత్తం జల్లెడపడితే లక్షల్లో ఇలాంటి సర్టిఫికెట్లు మరిన్ని బయటపడే అవకాశం ఉందన్నారు. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అంశాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, పార్టీ కార్పొరేటర్లు, నాయకులతో కలసి వాస్తవాలు వెలుగులోకి వచ్చేదాకా ఉద్యమిస్తామన్నారు. -
హైదరాబాద్ ‘స్థానిక’ ఎమ్మెల్సీగా మీర్జా రహ్మత్బేగ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా స్థానికసంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎంఐఎం పార్టీకి చెందిన మీర్జా రహ్మత్బేగ్ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎ.ప్రియాంక.. మీర్జా రహ్మత్బేగ్ ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ ఎన్నికకు నామినేషన్ వేసిన మరో అభ్యర్థి మహ్మద్ రహీంఖాన్ నామినేషన్ను అధికారులు తిరస్కరించడంతో బరిలో మిగిలిన ఏకైక అభ్యర్థి మీర్జా రహ్మత్బేగ్ గెలిచినట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిందని అధికారులు వెల్లడించారు. -
తెలంగాణలో బీజేపీ ఓటమి ఖాయం: ఒవైసీ
-
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీర్జా రెహ్మత్ బేగ్
-
హైదరాబాద్ పాతబస్తీలో బీజేపీ, ఎంఐఎం నేతల మధ్య ఘర్షణ
-
'హైదరాబాద్లో డ్రగ్స్ కల్చర్ పెరుగుతోంది.. రూ.కోట్లలో వ్యాపారం'
హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ కల్చర్ పెరుగుతోందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. నగరంలో కోట్ల రూపాయల డ్రగ్స్ వ్యాపారం జరుగుతోందన్నారు. వీటిని అరికట్టడంలో నార్కోటిక్స్ పూర్తిగా విఫలమైందన్నారు. నగరంలో యువత మత్తుపదార్థాలతో పెడదారి పడుతోందని, మత్తుకు అలవాటు పడటం సీరియస్ అంశమని అన్నారు. ఫార్మసీ స్టోర్లలో డాక్టర్ చిట్టీ లేకుండా డ్రగ్స్ ఇవ్వకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే కాగ్ నివేదికను అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టలేదని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. బడ్జెట్ సమావేశాలు 20 రోజులు నిర్వహించాల్సిందని అన్నారు. 2014-18 మధ్య 126 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగితే 2018 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 67 రోజులు మాత్రమే సమావేశాలు జరిగాయని గుర్తు చేశారు. చదవండి: తెలంగాణ: ‘కోటి కుటుంబాలు ఉంటే.. కోటి 53 లక్షల వాహనాలు’ -
ట్రాఫిక్ చలాన్లతో పోలీసులు వేధిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో పోలీసులు వాహనదారులను ట్రాఫిక్ చలాన్లతో వేధిస్తున్నారని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ శాసనసభలో ఆరోపించారు. శనివారం బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ట్రాఫిక్ పోలీసులు ఎక్కడో చాటుగా ఉండి ఫొటోలు తీసి, చలాన్లు వేస్తున్నారని తెలిపారు. కృష్ణానదీ జలాల పంపిణీ సమస్య పరిష్కారానికి అన్ని పార్టీలతో చర్చించాలని సూచించారు. వర్షాలొస్తే కుంటలు ఉప్పొంగి పాత బస్తీలో చాలా ప్రాంతాలు జలమయమతున్నాయని, ఈ నేపథ్యంలో జలాశయాలకు మరమ్మతులు చేయాలని కోరారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు వివిధ బోర్డుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీలో మైనార్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఆరోగ్య శ్రీ కార్డులను కార్పొరేట్ ఆసుపత్రుల్లో అనుమతించడం లేదని, ఈ పథకం కింద చికిత్సలకు నిధులు పెంచాలని కోరారు. వివి ధ కారణాలతో తొలగించిన హోంగార్డులను మానవీయకోణంలో తిరిగితీసుకోవాలన్నారు. -
అవగాహనతోనే బీఆర్ఎస్, ఎంఐఎం అలజడి
సికింద్రాబాద్: బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు సయోధ్య కుదుర్చుకుని.. తెలంగాణ రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నాయని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జీ.కిషన్రెడ్డి ఆరోపించారు. సీతాఫల్మండిలో శనివారం సికింద్రాబాద్ నియోజకవర్గ బీజేపీ బూత్కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా కిషన్రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దామని సీఎంతోపాటు బీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్న గొప్పల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. కేవలం ఐటీ సంస్థలున్న ప్రాంతాలు మాత్రమే భాగ్యనగరం కాదని, సికింద్రాబాద్, హైదరాబాద్ నగరాల్లోని సమస్యలు ఆయా ప్రాంతాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని కంటోన్మెంట్ సివిల్ ఏరియాలను రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని మున్సిపాలిటీల్లో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభమైందని కిషన్రెడ్డి చెప్పారు. ఇందుకోసం ఆయా రాష్ట్రాల అభిప్రాయం సేకరించేందుకు కమిటీలు వేశామన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారని చెప్పారు. దేశవ్యాప్తంగా కంటోన్మెంట్ బోర్డులున్న అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు సేకరించాక.. కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలో కొనసాగుతున్న సివిల్ ఏరియాలను మున్సిపాలిటీల్లో విలీనం చేసే బిల్లును రూపొందించి పార్లమెంట్లో ఆమోదిస్తామన్నారు. అప్పటి వరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పాలకమండలికి ఎన్నికలు జరిగే అవకాశం లేదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. -
ముందు బైక్... వెనకాల కాన్వాయ్.. అభిమానిని చూసి ఆగిన ఎంపీ
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ మంగళవారం మధ్యాహ్నం బంజారాహిల్స్ రోడ్ నెం. 12 మీదుగా బైక్పై వెళుతుండగా రోడ్డు పక్క నుంచి ఎన్బీటీ నగర్ బస్తీకి చెందిన అభిమాని కనిపించాడు. దీంతో వెనుకాల కాన్వాయ్తో పాటు తన బైక్ను కూడా రోడ్డు పక్కన ఆపి అతడిని పలకరించారు. బైక్పై దూసుకెళ్తున్న అసదుద్దీన్ ఒవైసీ ఒక్కసారిగా బుల్లెట్ బండి దిగి రోడ్డుపై వెళుతున్న ఎన్బీటీ నగర్కు చెందిన శివకుమార్ను గుర్తు పట్టిన అసద్ ఆగడమే కాకుండా కుశలప్రశ్నలు వేశారు. అతడి తండ్రి ఒవైసీ పోటీ చేసినప్పుడు తాను బూత్ ఏజెంట్గా ఉండేవాడినని ఈ సందర్భంగా శివకుమార్ గుర్తు చేసుకున్నారు. స్వయంగా అసద్ బుల్లెట్ దిగి తనను పలకరించడంపట్ల శివకుమార్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ దృశ్యాన్ని అక్కడున్న వారంతా తమ సెల్ఫోన్లలో బంధించారు. (క్లిక్ చేయండి: ఫోర్జరీ కేసులో టీటీడీపీ ప్రధాన కార్యదర్శి జీవీజీ నాయుడు అరెస్ట్) -
ఎంఐఎం కనుసన్నల్లో పీఎఫ్ఐ.. ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్
నాగోలు/లింగోజిగూడ: హిందువుల తలలు నరికి చంపుతున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) తెలంగాణలో బాంబులు పేల్చి విధ్వంసం సృష్టించేందుకు కుట్ర చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చెప్పారు. ఎంఐఎం నేతల కనుసన్నల్లోనే ఆ సంస్థ పనిచేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో పీఎఫ్ఐ విస్తరించడానికి టీఆర్ఎస్సే కారణమని, ఆ పార్టీ నేతలు కొంతమంది చందాలిచ్చి పెంచి పోషిస్తున్నారని అన్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా బుధవారం ఎల్బీనగర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న బండికి.. నాగోలు చౌరస్తా వద్ద స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 100 రోజుల పాదయాత్ర పూర్తయిన సందర్భంగా గజమాలతో సత్కరించారు. గొర్రెపిల్లను బహూకరించారు. కాగా నాగోలు, కొత్తపేట డివిజన్ మోహన్నగర్, చైతన్యపురిలో ఆయన ప్రసంగించారు. సీఎంకు సోయి ఎందుకు లేదు? పీఎఫ్ఐకి చెందిన సంస్థలపై ఎన్ఐఏ దాడులు చేసేంతవరకు సీఎం కేసీఆర్కు సోయి ఎందుకు లేదని సంజయ్ ప్రశ్నించారు. యూపీకి చెందిన ఓ ముఠా బిహార్లో బాంబులు తయారు చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను పేల్చేందుకు కుట్ర చేసిందని చెప్పారు. 2040 నాటికి భారత్ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకు పీఎఫ్ఐ కుట్ర చేస్తోందని అన్నారు. ఎంఐఎం ఆగడాలను అడ్డుకునేది బీజేపీ మాత్రమే అని పేర్కొన్నారు. హిందూ సమాజ సంఘటితమే బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు. క్వారంటైన్కు కేసీఆర్ కుటుంబం ఏ స్కాం చూసినా కేసీఆర్ కుటుంబానిదే పాత్ర ఉంటోందని సంజయ్ అన్నారు. కొడుకు, బిడ్డ తప్పు చేసినా జైల్లో పెడతానన్న సీఎం.. లిక్కర్ స్కాంపై నోరెందుకు మెదపట్లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల కష్టాలను గాలికి వదిలేసి దేశ రాజకీయాలంటూ తిరుగుతున్నాడని విమర్శించారు. సీబీఐ, ఈడీ దాడులు చూసి ఆయన కుటుంబం క్వారంటైన్కు వెళుతోందని ఎద్దేవా చేశారు. బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్రావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్జీ తదితరులు పాల్గొన్నారు. నేటితో ముగియనున్న ‘బండి’ నాలుగో విడత యాత్ర పెద్దఅంబర్పేటలో బహిరంగ సభ.. ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి రాక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నాలుగోవిడత ప్రజా సంగ్రామ యాత్ర గురువారం ముగియనుంది. పెద్దఅంబర్పేట మున్సి పాలిటీలో నిర్వహిస్తున్న ముగింపు బహిరంగ సభలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. బండి సంజయ్ గతేడాది ఆగస్టు 28న చార్మినార్ నుంచి మొదలు పెట్టిన పాదయాత్ర ఇప్పటివరకు మొత్తం నాలుగు విడతలుగా సాగింది. 4విడతల్లో 102 రోజుల పాటు 48 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 1,250కి.మీ. మేర యాత్ర సాగింది. భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి నుంచి ప్రారంభం.. బండి సంజయ్ మొదటివిడత పాదయాత్రను హైదరాబాద్ పాతబస్తీ భాగ్య లక్ష్మి అమ్మవారి గుడి నుంచి ప్రారంభించారు. పాతబస్తీతో పాటు హైదరాబాద్ మహానగరంలో, ఇతర చోట్ల వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తారు. రెండో విడతలో ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని సమస్యలను ప్రస్తావించారు. మూడో విడతలో ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాల పరిధిలో యాత్ర సాగింది. మల్కాజ్గిరి లోక్సభస్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజ వకవర్గాలు, అలాగే ఇబ్రహీంపట్నం శాసనసభా నియోజక వర్గంలో సాగిన నాలుగో విడతలో హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని రోడ్లు, డ్రైనేజీలు, పరిశ్రమల కాలుష్యం, డంపింగ్ యార్డు.. వంటి సమస్యలపై గళం ఎత్తారు. టీఆర్ఎస్ వైఫల్యాలు ఎండగట్టేందుకే మొగ్గు.. పాదయాత్ర సభల్లో బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా, జి.కిషన్రెడ్డి సహా పలువురు కేంద్రమంత్రులు, బండి సంజయ్ టీఆర్ఎస్ పాలనా వైఫల్యాలను ఎండగట్టడానికి ప్రాధాన్యతనిచ్చారు. కేసీఆర్ హామీల అమల్లో వైఫల్యాలు, కేసీఆర్ కుటుంబ పాలన, నియంతృత్వ విధానాలపై విమర్శలు ఎక్కుపెట్టారు. కాగా, నెలలో 20 రోజుల పాటే పాదయాత్ర చేపట్టాలని, మిగతా పది రోజులు హైదరా బాద్లో ఉంటూ పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని రాష్ట్ర నాయకులను జాతీయ నాయకత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మొత్తం 8 విడతల్లో వంద అసెంబ్లీ స్థానాల్లో పాదయాత్ర పూర్తి చేయాలని నిర్ణయించారు. ఐదో విడత యాత్రను అక్టోబర్ 8–10 తేదీల మధ్య మొదలు పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. -
‘తెలంగాణ చరిత్ర గొప్పది.. సెప్టెంబర్ 17 గురించి నేటి తరానికి తెలియాలి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సెప్టెంబర్ 17వ తేదీ చుట్టూ రాజకీయం నడుస్తోంది. తెలంగాణ విమోచన దినోత్సవంపై అధికార టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మధ్య మాటల వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ ప్రారంభించారు. కాగా, గ్రౌండ్లో నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమకారుల ఫొటోలతో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగానే జరుపుకోవాలి. తెలంగాణ చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలా ఉండగా.. కేంద్రం తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఏడాది పాటు జరపాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా, ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం విచ్చేయనున్నారు. మరోవైపు.. టీఆర్ఎస్, ఎంఐఎం మాత్రం సెప్టెంబర్ 17ను తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చింది. ఇది కూడా చదవండి: 16న హైదరాబాద్కు అమిత్షా -
అమిత్ షాకు లేఖ రాసిన ఒవైసీ.. సెప్టెంబర్ 17న ఏం జరగబోతోంది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ లేఖలు రాశారు. లేఖల్లో సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యత దినంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఎంఐఎం చీఫ్ ఒవైసీ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు. కాబట్టి సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యత దినంగా నిర్వహించాలి. 17వ తేదీన పాతబస్తీలో తిరంగాయాత్ర, బహిరంగ సభ నిర్వహిస్తాము. ఈ కార్యక్రమంలో మా పార్టీ ఎమ్మెల్యేలందరూ పాల్గొంటారు. తెలంగాణ విమోచనం కోసం హిందువులు, ముస్లింలు కలిసి పోరాడారు అని వ్యాఖ్యానించారు. ఇది కూడా చదవండి: పాలిటిక్స్లో ట్విస్టులు.. బీజేపీ బిగ్ ప్లాన్! -
ఆరెస్సెస్కు సపోర్టుగా దీదీ వ్యాఖ్యలు.. ఒవైసీ గరం!
బెంగాల్ రాజకీయాలు అనగానే బీజేపీ వర్సెస్ సీఎం మమతా బెనర్జీ అన్నట్టుగా ఉంటాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి రెండు పార్టీల మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. అయితే, ఈ క్రమంలో సీఎం మమత.. ఆరెస్సెస్పై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ మమతకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. అయితే, సీఎం మమతా బెనర్జీ ఇటీవల ఆరెస్సెస్పై మాట్లాడుతూ గతంలో ఉన్నంత చెడ్డగా లేదని అన్నారు. కాగా, ఆమె వ్యాఖ్యలపై తాజాగా ఎంఐఎం చీఫ్ అసద్దుద్దీన్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. అసద్ స్పందిస్తూ.. ఆరెస్సెస్ హిందూ రాజ్యాన్ని కాంక్షిస్తుందన్నారు. ఆరెస్సెస్ చరిత్రంతా ముస్లిం వ్యతిరేకతే కనిపిస్తుందన్నారు. ఆరెస్సెస్పై వ్యాఖ్యలపై మమతా బెనర్జీ నిజాయితీని, నిలకడ ధోరణిని టీఎంసీ ముస్లిం నేతలు ప్రశంసిస్తారని పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే మమత 2003లో ఆరెస్సెస్పై చేసిన వ్యాఖ్యలను సైతం గుర్తు చేశారు. 2003లో ఆరెస్సెస్ను దేశభక్తులుగా కీర్తించారని, ఆరెస్సెస్లో ఇప్పటికీ చాలా మంది మంచివారున్నారని, వారు బీజేపీకి మద్దతివ్వబోరని మమత చెప్పినట్టు ఒవైసీ తెలిపారు. దీంతో, ఆరెస్సెస్ మమతా బెనర్జీని దుర్గగా అభివర్ణించారని చెప్పుకొచ్చారు. ఇక, మమత వ్యాఖ్యలపై బెంగాల్ ఇమాం అసోసియేషనన్ చీఫ్ మహ్మద్ యాహ్య కూడా స్పందిస్తూ 20 కోట్ల మంది ముస్లింలు మమతా బెనర్జీని సెక్యులర్ నేతగా భావిస్తున్నరని తెలిపారు. కానీ, అనూహ్యంగా ఆమె ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని స్పష్టం చేశారు. In 2003 too Mamata had called RSS “patriots”. In turn RSS had called her “Durga”. RSS wants Hindu Rashtra. Its history is full of anti-Muslim hate crime. She’d defended BJP govt in Parliament after Gujarat pogrom. Hope TMC’s “Muslim faces” praise her for her honesty & consistency https://t.co/45LKZ7aI4s — Asaduddin Owaisi (@asadowaisi) September 1, 2022 ఇది కూడా చదవండి: బీజేపీ హై కమాండ్కు రాజాసింగ్ భార్య లేఖ.. ఏమన్నారంటే? -
మజ్లీస్కోటలో పాగా వేసేది ఎవరు? అక్బరుద్దీన్తో పోటీ అంత కఠినమా?
హైదరాబాద్ పాతబస్తీ రాజకీయాలు మారుతాయా? మజ్లీస్కోటను ఎవరైనా ఢీకొట్టగలరా? మజ్లీస్కు దూరమైన కాంగ్రెస్ వ్యూహమేంటి? మిత్రపక్షానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్అభ్యర్థులు బరిలో దిగుతారా? కమలదళం చార్మినార్ పై జెండా ఎగురవేస్తుందా? వచ్చే ఎన్నికల నాటికి పాతబస్తీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న ఒరిజినల్ హైదరాబాద్ నగరాన్ని ఇప్పుడు పాతబస్తీ అని పిలుస్తున్నారు. నలు దిక్కులా విస్తరించిన మహా నగరానికి గుండెకాయలాంటి పాతబస్తీలో దశాబ్దాలుగా మజ్లీస్పార్టీ పాగా వేసింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏడు లేదా 8 స్థానాలు మజ్లిస్ పార్టీ గెలుస్తోంది. వచ్చే ఎన్నికలకు కూడా అసదుద్దీన్ నాయకత్వంలోని ఎంఐఎం రెడీగా ఉంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇప్పుడు తమ ఎమ్మెల్యేలున్న ఏడు స్థానాలు మావే అంటున్నారు ఎంఐఎం నేతలు. చార్మినార్, యాకుత్పుర , చంద్రాయణ గుట్ట, నాంపల్లి, కార్వాన్, బహదూర్ పుర, మలక్ పేట్ నియోజకవర్గాలు ఎంఐఎం పార్టీకి కంచుకోటలు. ఈ సెగ్మెంట్లలో మరో పార్టీ గెలవాలంటే బాగా శ్రమించాల్సిందే. ఈ సారి ఎలాగైనా తమ బలాన్ని చూపాలని బీజేపి, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి . నాంపల్లిలో టీఆర్ఎస్ నుంచి ఎవరంటే! నాంపల్లి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్అభ్యర్ది ఫిరోజ్ ఖాన్ మీద ఎంఐఎం అభ్యర్ది జాఫర్ హుస్సేన్ 9 వేల ఓట్ల మెజారిటితో గెలిచారు. ఈ సారి నాంపల్లి నుంచి ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. వచ్చే ఎన్నికల్లో కూడా ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ తరపున పోటీ చేసే అవకాశం ఉంది. బీజేపి నుంచి దేవర కరుణాకర్ మళ్ళీ పోటీ చేస్తారని తెలుస్తుంది. టిఆర్ఎస్ నుంచి ఆనంద్ కుమార్ పోటీలో ఉండొచ్చని సమాచారం. చార్మినార్లో టీఆర్ఎస్ నుంచి లోధి చార్మినార్నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బీజేపి అభ్యర్ది ఉమా మహేంద్రపై ఎంఐఎం అభ్యర్ధి ముంతాజ్ అహ్మద్ ఖాన్ 32 వేల మెజారిటితో గెలుపోందారు. ఎంఐఎం నుంచి ముంతాజ్ అహ్మద్ ఖాన్, టిఆర్ఎస్నుంచి మహ్మద్ సలాహుద్దీన్ లోధి, కాంగ్రేస్ నుంచి టీ పిసీసీ సెక్రటరి షేక్ ముజబ్, బీజేపి నుంచి ఉమా మహేంద్రలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. చాంద్రాయణ గుట్టలో అది అసాధ్యమా? చాంద్రాయణ గుట్ట సెగ్మెంట్ లో గత ఎన్నికల్లో బీజేపి అభ్యర్ది సయ్యద్ షాహెజాదిపై ఎంఐఎం అభ్యర్ది అక్బరుద్దిన్ ఓవైసీ 80 వేల ఓట్ల మెజారిటితో విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఎంఐఎం నుంచి అక్బరుద్దిన్ ఓవైసీ, బీజేపి నుంచి షాహెజాది, టిఆర్ఏస్ నుంచి సీతారామ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి బినోబైద్ మిస్త్రీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఒకప్పుడు ఎంబీటీకి పట్టున్న చాంద్రాయణగుట్టలో కూడా ఎంఐఎం పాతుకుపోయింది. ఇక్కడ అక్బరుద్దీన్ను ఓడించడం అసాధ్యమనే వాదన కూడా ఉంది. హజరి, యూసఫ్లలో ఒకరు పోటీలో పక్కా! కార్వాన్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బీజేపి అభ్యర్ది అమర్ సింగ్ పై ఎంఐఎం అభ్యర్ది కౌసర్ 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం నుంచి కౌసర్, బీజేపి నుంచి అమర్ సింగ్, టీఆర్ఎస్ నుంచి మహ్మద్ అల్ హజరి, అప్సర్ యూసఫ్ జాహిలలో ఓకరు పోటీ చేసే అవకాశం ఉది. (చదవండి: సీమాపాత్ర చేతిలో చిత్రహింసలకు గురైన సునీత.. చదువుకు సాయం అందిస్తానన్న కేటీఆర్) సంతోష్ కుమార్కు మరో అవకాశం? మలక్ పేట నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బీజేపి అభ్యర్ది ఆలె జితేంద్రపై ఎంఐఎం అభ్యర్ది బలాల 30 వేల మెజారిటితో గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం నుంచి బలాల, బీజేపి నుంచి ఆలె జితేంద్ర మరోసారి పోటీ పడనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి సంగిరెడ్డి , చెక్కిలోకర్ శ్రీనివాస్ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. టిఆర్ఏస్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన చావా సంతోష్ కుమార్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. యాకుత్ పురలో ఖాద్రితో పోటీకి దిగేది ఎవరో? యాకుత్ పుర నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టిఆర్ఎస్అభ్యర్ది సామ సుందర్ రావు పై 47 వేల ఓట్ల మెజారిటితో ఎంఐఎం అభ్యర్ది పాషా ఖాద్రి గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం నుంచి పాషా ఖాద్రీ, టిఆర్ఎస్ నుంచి సుందర్ రావు , బీజేపి నుంచి రూప్ రాజ్, కాంగ్రెస్ నుంచి రాజేందర్ రాజు, కోట్ల శ్రీనివాస్ టిక్కెట్ కోసం ట్రై చేస్తున్నారు . బహదూర్ పుర భారీ మెజారిటీతో ఎంఐఎం బహదూర్ పుర నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ది అలీ బక్రీ పై ఎంఐఎం అభ్యర్ది మోజం ఖాన్ 80 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం నుంచి మోజం ఖాన్, టిఆర్ఏస్ నుంచి అలీ బక్రీ , కాంగ్రెస్నుంచి కలీం బాబ, బీజేపి నుంచి అనీఫ్ అలీ టిక్కెట్ కోసం ట్రై చేస్తున్నారు. పాతబస్తీలోని 7 అసెంబ్లీ సీట్లపై బీజేపి, కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలకు పెద్దగా ఆశలు లేనప్పటికి అక్కడ గట్టి పోటీ ఇవ్వటం ద్వారా... ఇతర సీట్లపై దృష్టి పెట్టకుండా మజ్లిస్ను పాతబస్తికే పరిమితం చేయొచ్చని పార్టీలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో పాత బస్తిలో బోణీ కోట్టాలనే పట్టుదలనుకూడా ప్రదర్శిస్తున్నాయి. మజ్లిస్ మాత్రం ఈ 7 సీట్లతో పాటు రాజేంద్రనగర్ , జూబ్లిహిల్స్ సీట్లలో కూడా గెలిచేందుకు స్కెచ్ వేస్తోంది. దీంతో పాతబస్తీ రాజకీయం రసకందాయంలో పడింది. (చదవండి: మునుగోడులో బీజేపీకి బూస్ట్.. ‘ప్రజల తీర్పు చరిత్ర సృష్టిస్తుంది’) -
రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోము: హోం మంత్రి వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. మహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా పాతబస్తీలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ముస్లిం నేతల ఆందోళన నేపథ్యంలో పోలీసు బలగాలు పాతబస్తీలో మోహరించాయి. కాగా, రాజాసింగ్ వ్యాఖ్యలపై తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ స్పందించారు. హోం మంత్రి మహమూద్ అలీ తాజాగా మీడియాతో మాట్లడుతూ.. ‘‘శాంతియుత వాతావరణాన్ని బీజేపీ కలుషితం చేస్తోంది. రాజాసింగ్ వ్యాఖ్యలతో శాంతిభద్రతల సమస్య ఏర్పడింది. బీజేపీ రౌడీయిజం చేస్తే సహించేది లేదు. బీజేపీ అయినా.. ఎంఐఎం అయినా తప్పు చేస్తే ఎవరినీ వదిలేది లేదు’’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: రాజాసింగ్కు మరో షాక్ -
‘తెలంగాణను శ్రీలంకలా మారుస్తున్నారు’
సాక్షి, తెలంగాణ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. మరోవైపు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రపై సస్పెన్స్ కొనసాగుతుంది. హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్.. కేసీఆర్ సర్కార్పై మరోసారి విరుచుకుపడ్డారు. బండి సంజయ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన సీఎం కేసీఆర్.. శాంతి భద్రతల సమస్యను సృష్టించడం సిగ్గుచేటు. తెలంగాణను శ్రీలంకలా మార్చేస్తున్నారు. మేధావులు నిర్బంధాలను గమనించాలి. కేసీఆర్ కుటుంబ అవినీతిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రజల దృష్టి మళ్లించేందుకే టీఆర్ఎస్ గందరగోళం సృష్టిస్తోంది. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు టీఆర్ఎస్ కుట్ర చేస్తోంది. టీఆర్ఎస్, ఎంఐఎం కుట్రలను ప్రజలు గమనించాలి. మతవిద్వేషాలు రెచ్చగొడుతూ ఎంఐఎం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది. అన్ని మతాల వాళ్లు బాగుండాలని బీజేపీ కోరుకుంటుంది’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: ముడిచమురు ధర తగ్గినా పెట్రో ధరలు తగ్గించరా? -
మాటకు మాట
-
స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డికి ఎంఐఎం లేఖ
-
స్పీకర్కు ఎంఐఎం లేఖ.. రాజాసింగ్పై సంచలన కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డికి ఎంఐఎం లేఖ రాసింది. రాజాసింగ్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని పేర్కొంది. సెక్షన్ 41 సీఆర్పీసీ కింద నోటిస్ ఇవ్వలేదనే కారణంతోనే రాజాసింగ్కు బెయిల్ ఇచ్చారని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. చట్టప్రకారం మరోసారి రాజాసింగ్ను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చదవండి: Telangana: హీటెక్కిన స్టేట్..! హైదరాబాద్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ఉద్దేశంతోనే రాజాసింగ్ వీడియో విడుదల చేశారని అసదుద్దీన్ మండిపడ్డారు. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో హైదరాబాద్లో సాప్ట్వేర్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాజాసింగ్ను అరెస్ట్ చేసి వీడియో శాంపిల్ తీసుకోవాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. కాగా, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చెలరేగిన దుమారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా.. రాజాసింగ్పై సస్పెన్షన్ వేటు వేసింది బీజేపీ. మరోవైపు రాజాసింగ్ వ్యాఖ్యలపై పాతబస్తీలోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. నాటకీయ పరిణామాల తర్వాత మంగళవారం రాత్రి రాజాసింగ్కు బెయిల్ దక్కిన నేపథ్యంలో.. భారీగా యువత ఓల్డ్సిటీలో రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
మునుగోడు కోసం తెలంగాణను తగలబెడతారా?: అసదుద్దీన్ ఒవైసీ ఫైర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. మహ్మాద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో, మజ్లీస్ నేతల ఫిర్యాదులతో కేసు నమోదు చేసిన పోలీసులు రాజాసింగ్ను అరెస్ట్ చేశారు. పోలీసు వాహనంలో రాజాసింగ్ను స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రశాంతంగా ఉంది. శాంతి భద్రతలను విఘాతం కలిగించాలని బీజేపీ కుట్ర చేస్తోంది. బీజేపీ అధిష్టానం ఆదేశాలతోనే అలజడి సృష్టిస్తున్నారు. లౌకికవాదాన్ని వ్యతిరేకించడమే బీజేపీ విధానం. ఉప ఎన్నికల కోసం తెలంగాణను తగలబెడతారా?. ఇస్లామ్కు, మహ్మాద్ ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడటం బీజేపీకి పాలసీగా మారిపోయింది. రాజాసింగ్ విచారణను పోలీసులు రికార్డు చేయాలి’’ అని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: బీజేపీ నేతలు అరెస్ట్.. కిషన్ రెడ్డి స్పందన ఇదే.. -
ఇంత విధ్వంసానికి టీఆర్ఎస్ ఎంఐఎం కాంగ్రెస్ పార్టీలో కారణం
-
హత్యలు, అత్యాచారాలకు కేరాఫ్ టీఆర్ఎస్, ఎంఐఎం
జవహర్నగర్/కరీంనగర్ టౌన్: హత్యలకు, అత్యాచారాలకు కేరాఫ్గా టీఆర్ఎస్, ఎంఐఎం పనిచేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేళ్ల సేవ, సుపరిపాలనను పురస్కరించుకుని మేడ్చల్ జిల్లాలోని జవహర్నగర్ కార్పొరేషన్లో సోమవారం సాయంత్రం బహిరంగసభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సంజయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం, 9 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు, 3 కోట్ల మందికి ఇళ్లు కట్టించిందన్నారు. ‘కేసీఆర్ ధనిక తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారు. తెలంగాణలో ఆర్టీసీని అమ్ముకోవడానికి కుట్రపన్నుతున్నారు. తెలంగాణను మరో శ్రీలంకగా కేసీఆర్ మారుస్తారు. కుటుంబ పాలన ఇలాగే కొనసాగితే రాష్ట్రం బిచ్చమెత్తుకునే దుస్థితికి వస్తుంది’ అని సంజయ్ హెచ్చరించారు. జూబ్లీహిల్స్ గ్యాంగ్రేప్ నిందితులకు స్టార్ హోటల్లో విందులు చేయడంపై ధ్వజమెత్తారు. బీజేపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్రెడ్డి మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి ఏనాడు రాష్ట్ర సరిహద్దులు కూడా చూడలేదని, మేడ్చల్ నియోజకవర్గానికే పరిమితమయ్యారని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, మోహన్రెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు. గౌరవెల్లి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ పేరుతో పోలీసులు అర్ధరాత్రి పేదలపై దౌర్జన్యంగా ప్రవర్తించడాన్ని సంజయ్ ఒక ప్రకటనలో ఖండించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా, నిర్వాసితులను ఆదుకోకుండా ఏళ్ల తరబడి సమస్యను నాన్చుతూ కాలయాపన చేయడం అన్యాయమని మండిపడ్డారు. అర్ధరాత్రి దాడులు చేయడం ఆటవికమని, రజాకార్ల పాలనలో, బ్రిటిష్ పాలనలో కూడా ఇలాంటి అరాచకాలు చేయలేదేమోనన్నారు. మహిళలపై పోలీసులు అసభ్యంగా ప్రవర్తించడం దుర్మార్గమని, అర్ధరాత్రి వెళ్లి దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. -
టీఆర్ఎస్, ఎంఐఎం నేతలకు అడ్డూఅదుపు లేదు: రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ పాలనలో టీఆర్ఎస్, మజ్లిస్ నాయకులకు అడ్డు అదుపు లేకుండా పోయిందని బీజేఎల్పీ నేత టి.రాజాసింగ్ మండిపడ్డారు. తాము ఏం చేసినా చెల్లుతుందనే భావనతో అధికారిక వాహనాలను అడ్డాగా చేసుకుని, హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. జూబ్లీహిల్స్లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటనకు ప్రభుత్వ వాహనాన్ని ఉపయోగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మే 28న ఘటన జరిగితే, ఇంతవరకు వారిని అరెస్టు చేయకపోవడం, పూర్తి స్థాయిలో విచారణ జరపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. టీఆర్ఎస్, మజ్లిస్ పారీ్టలకు చెందిన ఎమ్మెల్యే, వక్ఫ్బోర్డ్ ఛైర్మన్, ప్రముఖుల కుమారులు ఈ కేసులో ఉన్నట్లు సీసీ టీవీ పుటేజీలు, వీడియోల్లో స్పష్టంగా కన్పిస్తున్నా ఇంకా చర్యలు తీసుకోకపోవడమేమిటని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించి నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. -
కలుగులోని ఎలుకలు బయటికొస్తున్నాయ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్పై రాష్ట్ర రైతాంగం సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించిందని, ఈ డిక్లరేషన్లో ప్రకటించిన తొమ్మిది ప్రధాన తీర్మానాలపై రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉత్సవాలు చేసుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్రెడ్డి చెప్పారు. వరంగల్ డిక్లరేషన్ సానుకూల ప్రభా వాన్ని చూపుతుండడంతో కలుగులో దాక్కున్న ఎలుకలు బయటకు వస్తున్నాయని, టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీపై దాడి చేస్తున్నాయని అన్నారు. రాహుల్ పర్యటనతో ఆ మూడు పార్టీల మధ్య ఉన్న చీకటి ఒప్పందం బయటపడిందని చెప్పారు. దుష్ట రాజకీయ త్రయాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందని వ్యాఖ్యానించారు. ఆదివారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేవంత్ మాట్లాడారు. నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్కుమార్గౌడ్, గీతారెడ్డి, అంజన్కుమార్ యాదవ్, ప్రచార కమిటీ కన్వీనర్ అజ్మతుల్లా హుస్సేన్, పార్టీ సీనియర్ నేత నాయిని రాజేందర్రెడ్డి పాల్గొన్నారు. కేటీఆర్కు ఆ అర్హత లేదు.. గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత రాష్ట్ర మంత్రి కేటీఆర్కు లేదని రేవంత్ అన్నారు. ప్రధానమంత్రిగా పనిచేసే అవకాశం పలుమార్లు వచ్చినప్పటికీ ఆ పదవిని త్యాగం చేసిన ఘనత వారిదని చెప్పారు. ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను అమలు చేయని ఘనత టీఆర్ఎస్కు దక్కుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో దళితుడిని సీఎంను చేస్తానని చెప్పిన టీఆర్ఎస్, ఆ పనిచేయకపోగా దళితుడైన భట్టి విక్రమార్క సీఎల్పీ నేతగా ఉండడంతో ఓర్వలేక కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలోకి కొనుగోలు చేశారని ఆరోపించారు. ఎవరూ అడగకపోయినా, పార్టీ పక్షాన హామీ ఇవ్వకపోయినా దళితులను సీఎంలుగా చేసిన చరిత్ర కాంగ్రెస్దని చెప్పారు. పారిపోయే చరిత్ర ఉన్నది కల్వకుంట్ల కుటుంబానికేనని, కేసీఆర్ సిద్దిపేట నుంచి కరీంనగర్ ఎంపీగా, ఆ తర్వాత మహబూబ్నగర్ ఎంపీగా, ఆ తర్వాత గజ్వేల్కు పారిపోయింది చరిత్ర కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ది చతురత..రాహుల్ టూరిస్టా? రాజకీయ ప్రత్యామ్నాయం అంటూ కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు వెళ్లి శరద్పవార్, స్టాలిన్, మమతా బెనర్జీలను కలిస్తే అది చతురత అవుతుంది.. అదే రాహుల్గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తే టూరిస్టు అవుతారా అని రేవంత్ ప్రశ్నించారు. రాహుల్గాంధీ ఈ దేశానికి కాబోయే ప్రధాని అని వ్యాఖ్యానించారు. అమరుల స్థూపం, యాదాద్రిపై విచారణ రూ.62 కోట్లతో ప్రారంభించిన అమరవీరుల స్థూపం నిర్మాణ అంచనాలను రూ.200 కోట్లకు పెంచారని, యాదాద్రి దేవస్థానం పేరుతో రూ.2 వేల కోట్లను దోచుకున్నారని పీసీసీ చీఫ్ ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ రెండింటిపై విచారణ జరిపించి దోషులను శిక్షిస్తామని చెప్పారు.100 రోజుల్లోనే అమరవీరుల స్థూపాన్ని అద్భుతంగా నిర్మిస్తామన్నారు. సినీనటుడు ప్రకాశ్రాజ్ స్థాయి ఏంటో మొన్నటి ‘మా’ఎన్నికల్లోనే తేలిపోయిందని వ్యాఖ్యానించారు. ఆ ముగ్గురిదీ ఒకే ఎజెండా: ఉత్తమ్ టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు ఒకే ఎజెండాతో ముందుకెళుతున్నాయనేందుకు రాహుల్ పర్యటనపై ఆయా పార్టీలు మాట్లాడిన మాటలే నిదర్శనమని ఉత్తమ్కుమార్రెడ్డి వ్యాఖ్యానించారు. ఎంఐఎం గురించి రాహుల్ ఒక్కమాట మాట్లాడకపోయినా అసదుద్దీన్ ఒవైసీ బీజేపీ ఏజెంట్గా విమర్శలు చేశారా అని ప్రశ్నించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏకకాలంలో రుణమాఫీ చేయడమే కాకుండా, రూ.2500కు క్వింటాల్ ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఘనత అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. అసదుద్దీన్ తీరు చూస్తుంటే బీజేపీకి బ్రోకరిజం చేస్తున్నట్టు అనిపిస్తోందని షబ్బీర్ అలీ విమర్శించారు. -
అవి గుంట నక్కల పార్టీలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘ఊట్కూర్ ప్రజలారా మీరంతా తెలంగాణ అంతటా తిరగండి. హిందువులకు జరిగిన అన్యాయాన్ని వివరించి అందరినీ ఏకం చేయండి. బీజేపీ అధికారంలోకి వచ్చాక పాతబస్తీ భాగ్యలక్ష్మీ ఆలయం, భైంసా, ఊట్కూర్ ప్రాంతాలను నేను దత్తత తీసుకుంటా. గాయపడ్డ తమ్ముళ్లకు ఉద్యోగాలిప్పించే బాధ్యత తీసుకుంటా’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజాసంగ్రామ యాత్ర బుధవారం మక్తల్ నియోజకవర్గంలో కొనసాగింది. రాత్రి ఊట్కూర్లో సంజయ్ మాట్లాడారు. తెలంగాణ చరిత్రలో ఊట్కూర్, భైంసా తమ్ముళ్ల వీరోచిత పోరాటాలు నిలిచిపోయేలా చేస్తామన్నారు. తెలంగాణ సమాజమంతా ఊట్కూర్ హిందువులకు జరిగిన అన్యాయాన్ని వినాలని, సెప్టెంబర్ 3ను బ్లాక్ డేగా ప్రకటిస్తున్నానని.. అధికారంలోకి వచ్చాక విజయోత్సవ సభలు నిర్వహిస్తామని వెల్లడించారు. నిజాం కాలంలో రజాకార్లు చేసిన అరాచకాలకు మించి.. కేసీఆర్ పాలనలో పోలీసులు ఊట్కూర్ హిందువులను, మహిళలను చిత్రహింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గణేశ్ ఉత్సవాలు చేసుకోవాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలా? అని మండిపడ్డారు. ‘బీజేపీని ఎదుర్కొనే దమ్ములేక కేసీఆర్ కాంగ్రెస్, ఎంఐఎంతో కుమ్కక్కైండు. కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలన్నీ గుంట నక్కల పార్టీలు. మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ సింహంలా సింగిల్గానే పోటీ చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తాం’ అని చెప్పారు. ఊట్కూర్ అభివృద్ధి కోసం తన ఎంపీ లాడ్స్నుంచి రూ.5 లక్షలు ఇస్తున్నానని, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు సైతం ఎంపీ లాడ్స్ నుంచి మరో రూ.5 లక్షలు ప్రకటించారన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా వచ్చే నెల 5న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, 14న హోంమంత్రి అమిత్ షా వస్తున్నారని చెప్పారు. బండి లేఖాస్త్రం ‘కేసీఆర్ సారూ.. మీ పార్టీ ఘనంగా జరుపుకొంటున్న 21వ ప్లీనరీ సందర్భంగా ప్రజల తరఫున మేము అడిగే 21 ప్రశ్నలకైనా సమాధానం చెప్పండి’.. అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రజా సంగ్రామయాత్ర నుంచి లేఖ సంధించారు. సమాధానాలు దాటవేస్తే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేని అసమర్థ ప్రభుత్వంగా ఒప్పుకుని.. ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. -
ఎంఐఎంతో జట్టు కట్టం: శివ సేన ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్రలో అధికార కూటమి ఎంవీఏ(మహా వికాస్ అగాధి)లోకి ఏఐఎంఐఎంకు ప్రవేశం ఉంటుందా? అనే ప్రశ్నకు శివసేన స్పందించింది. ఎట్టిపరిస్థితుల్లో ఎంఐఎంను ఎంవీఏ కూటమిలోకి రానివ్వమని, అలాంటి అవకాశాలు ఇంచు కూడా లేవని స్పష్టత ఇచ్చారు శివ సేన ఎంపీ(రాజ్యసభ) సంజయ్ రౌత్. ఎంఐఎం పొత్తు అంశంపై స్పందించే క్రమంలో రౌత్.. కాస్త కటువుగానే స్పందించారు. ఎంఐఎం పొత్తు పెట్టుకోవడం అంటే.. ఓ రోగాన్ని అంటగట్టుకోవడమే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఔరంగజేబు సమాధి ముందు మోకరిల్లి నమస్కరించే పార్టీతో మేం(శివ సేన) ఎలా పొత్తు పెట్టుకోగలం. దాని గురించి ఆలోచనే వద్దు. దాని గురించి ఆలోచించడం కూడా ఒక రోగమంతో సమానమే. శివ సేన.. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆదర్శాలను అనుసరిస్తుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు సంజయ్ రౌత్. ఇక ఎంఐఎం పార్టీకి బీజేపీతో రహస్య ఒప్పందం ఉందని, యూపీ ఎన్నికల్లో అది మరోసారి బయటపడిందని అన్నారాయన. అలాంటి పార్టీకి దూరంగా ఉండడమే మంచిదని భావిస్తున్నట్లు చెప్పారు సంజయ్ రౌత్. ఇక ఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్ ప్రతిపాదనపై ప్రశ్నించగా.. సంజయ్ రౌత్ స్పందించారు. మహారాష్ట్రలో మూడు పార్టీల ప్రభుత్వం(సేన, కాంగ్రెస్, ఎన్సీపీ) ఉంది. నాలుగో పార్టీకి అవకాశమే లేదు. ఆయన(ఇంతియాజ్ జలీల్ను ఉద్దేశిస్తూ) ఒక ఎంపీ. అందుకే ఢిల్లీలో కలుసుకున్నాం. అంతేతప్ప.. దానర్థం కూటమిలోకి ఆహ్వానిస్తామని కాదు అని తెలిపారు రౌత్. అంతకు ముందు ఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్ పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ నేతను కలిసినప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పాను. అయితే ఇది శివసేనకు ఆమోదయోగ్యం కాదని మాకు తెలుసు. మేము ప్రతిపాదన ఇచ్చాము కాబట్టి ఏమి జరుగుతుందో చూద్దాం అని ఇంతియాజ్ జలీల్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. పొత్తుల వ్యవహారంపై ప్రతిపక్ష నేత, మాజీ సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ స్పందించారు. పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలుపుతున్నాయని.. కానీ, దేశ ప్రజలు ప్రధాని మోదీ వెంటనే ఉన్నారని, రాబోయే రోజుల్లో గెలుపు బీజేపీదే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కూటమిపై స్పందిస్తూ.. ఎంత మంది వచ్చినా ఒక్కటేనని, ఎన్నికల్లో ఓడినప్పుడల్లా ఈవీఎం ఆరోపణలు చేసేవాళ్లు.. ఇప్పుడు ఎంఐఎంను ‘బీజేపీ బీ టీం’ అంటున్నారని, అలాంటి ఆరోపణలపై స్పందించాల్సిన అవసరమే లేదని ఫడ్నవీస్ పేర్కొన్నారు. -
హిజాబ్ ధరించిన మహిళ పీఎం అవుతారు!
లక్నో: హిజాబ్ ధరించిన మహిళ భారతదేశానికి ఏదో ఒక రోజు ప్రధానమంత్రి అవుతారని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జోస్యం చెప్పారు. ‘‘హిజాబ్, నిఖాబ్ ధరించిన మహిళలు కాలేజీలకు వెళ్తారు. జిల్లా కలెక్టర్లు, మేజిస్ట్రేట్లు, డాక్టర్లు అవుతారు. వ్యాపారవేత్తలుగా రాణిస్తారు. పెద్ద ఉద్యోగాలు చేస్తారు. చూడడానికి నేను బతికి ఉండకపోవచ్చు గానీ హిజాబ్ ధరించిన మహిళ ఏదో ఒక రోజు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతుంది. కావాలంటే నేను చెప్పింది రాసి పెట్టుకోండి. హిజాబ్ ధరిస్తానని బిడ్డలు కోరితే తల్లిదండ్రులు తప్పకుండా మద్దతిస్తారు. హిజాబ్ ధరించడానికి తల్లిదండ్రులు అనుమతి ఇచ్చిన తర్వాత ఇక ఎవరు ఆపుతారో చూద్దాం’’ అని ఒవైసీ పేర్కొన్నారు. యూపీలో మతతత్వానికి స్థానం లేదు హిజాబ్ విషయంలో అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దినేశ్ శర్మ స్పందించారు. రాష్ట్రంలో మతతత్వాన్ని పెంచిపోషించేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. సమాజ్వాదీ పార్టీకి ఎంఐఎం బి–టీమ్గా మారిపోయిందన్నారు. యూపీలో అభివృద్ధి అనే పరిమళం గుబాళిస్తోందని, ఇక్కడ మతతత్వం అనే కంపు వాసనకు స్థానం లేదని చెప్పారు. శాంతి భద్రతకు ఢోకా ఉండదు కర్ణాటకలో హిజాబ్ వివాదం నేపథ్యంలో మూసివేసిన పాఠశాలలు సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. 10వ తరగతి వరకు క్లాస్లు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పాఠశాలలు తెరుచుకున్నా రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లదని, సాధారణ పరిస్థితి కొనసాగుతుందని ముఖ్యమంత్రి బొమ్మై ఆశాభావం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లతో సుహృద్భావ సమావేశాలు నిర్వహించా లని ఆధికారులకు ఆదేశాలిచ్చినట్లు వెల్లడించారు. ప్రి–యూనివర్సిటీ కాలేజీలు, డిగ్రీ కాలేజీల పునఃప్రారంభంపై పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. హిజాబ్ వివాదం వెనుక కొన్ని సంఘాలు, విదేశీ శక్తుల హస్తం ఉందా? అన్నదానిపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు. -
ఎమ్ఐఎమ్ తో ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో టీఆర్ఎస్
-
టీఆర్ఎస్, ఎంఐఎం సఖ్యత: ఎప్పటివలెనె.. మమ అనిపించారు!
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకమండలికి సంబంధించి తొలి స్టాండింగ్ కమిటీ సమావేశం అజెండాలోని 20 అంశాలకుగాను 18 అంశాలకు ఆమోదం తెలిపింది. న్యాక్ ద్వారా నియమించిన ఔట్సోర్సింగ్ ఇంజినీర్ల పొడిగింపు అంశాన్ని మలి సమావేశానికి వాయిదా వేశారు. మిగతా 18 ఆమోదించారు. పారిశుద్ధ్యం కార్యక్రమాల గురించి ఎక్కువ మంది ప్రస్తావించడంతో, ఆ సమస్య పరిష్కారానికి సంబంధిత అడిషనల్ కమిషనర్తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు మేయర్ విజయలక్ష్మి హామీ ఇచ్చారు. పాలసీలకు సంబంధించిన కమిటీ అయినందున తగిన విధంగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని సభ్యులను కోరారు. మిస్సింగ్, లింకు రోడ్ల నిర్మాణాలకు, నాలాల మరమ్మతులకు అవసరమైన భూసేకరణల్లో కార్పొరేటర్లు సహకరించాలని కోరారు. సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆమోదించిన అంశాల్లో లీచెట్ ట్రీట్మెంట్, మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం, స్విమ్మింగ్పూల్ పనులు, యానిమల్ క్రెమెటోరియం, నాంపల్లి సరాయి వద్ద మహిళా యాత్రికులకు వసతిగృహం తదితరాలు ఉన్నాయి. -
ఎంఐఎం నేత హన్నుద్దీన్ మృతి
వెంగళరావునగర్/హైదరాబాద్: ఎంఐఎం సీనియర్ నాయకుడు షేక్ హన్నుద్దీన్ (56) మృతిచెందారు. గురు వారం అర్ధరాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మృతిచెందినట్లు అతడి మిత్రులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎల్లారెడ్డిగూడలో శుక్రవారం ఆయన మృతదేహాన్ని ఎమ్మెల్యేలు పాషా, మాగంటి, నాయకులు నగేష్, జాఫర్ తదితరులు సందర్శించి నివాళులరి్పంచారు. అనంతరం షేక్ హన్నుద్దీన్ అంత్యక్రియలు జరిగాయి. (చదవండి: జర చూస్కో! మాస్కు లేకుంటే 1000 పడుద్ది) -
మత విద్వేషాలను రెచ్చగొట్టే కుట్ర
కోల్కతా: ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొడుతోందని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతాబెనర్జీ ఆరోపించారు. 24 పరగణ జిల్లాలో శనివారం ఆమె పలు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ముస్లిం ఓట్లను చీల్చే బీజేపీ కుట్రలో పావులుగా మారొద్దని రాష్ట్రంలోని ముస్లింలకు మమత పిలుపునిచ్చారు. ‘బీజేపీ మద్దతుతో హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక పార్టీ, బెంగాల్లో ఆ పార్టీ మిత్రపక్షమైన మరో పార్టీ ముస్లిం ఓట్లను చీల్చాలని ప్రయత్నిస్తున్నాయి. వాటి కుయుక్తులను తిప్పికొట్టండి’ అని ఆమె పిలుపునిచ్చారు. అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఎంఐఎం, అబ్బాస్ సిద్ధిఖీల ఐఎస్ఎఫ్లను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో మమత చేసిన ఇదే తరహా వ్యాఖ్యలను ఎంఐఎం, ఐఎస్ఎఫ్ ఇప్పటికే తోసిపుచ్చాయి. ఐఎస్ఎఫ్ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి పోటీ చేస్తోంది. మతం పేరుతో బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని హిందువులను కూడా మమత కోరారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి, రాష్ట్రంలో ప్రశాంతతను దెబ్బతీయాలని బీజేపీ కోరుకుంటోందన్నారు. మీ ప్రాంతాల్లో బయటివారు కనిపిస్తే వారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తాను హిందుత్వాన్ని విశ్వసించే వ్యక్తినని మమత మరోసారి గుర్తు చేశారు. దళితుల ఇళ్లల్లో ఆ భోజనం చేస్తున్నామని ప్రచారం చేసుకుంటు న్నారని, అయితే ఆ భోజనాన్ని ఫైవ్ స్టార్ హోటళ్ల నుంచి తెప్పించుకుంటు న్నారని బీజేపీ నేతలపై ఆమె మండిపడ్డారు. తాను బ్రాహ్మణ మహిళను అని, అయితే, తనకు అన్ని సమయాల్లో సహాయకారిగా ఉండి, వంట చేసి పెట్టేది ఒక ఎస్సీ మహిళ అని వివరించారు. వీడియోపై వివాదం మమత వీల్ చెయిర్లో కూర్చుని గాయమైన తన కాలును పైకి, కిందకు కదిలిస్తున్నట్లు ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. సానుభూతి ద్వారా ఓట్లు పొందాలని మమత ఈ డ్రామాలు చేస్తున్నారని బీజేపీ విమర్శలు గుప్పించింది. మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని టీఎంసీ బదులిచ్చింది. -
బరిలో పీవీ కూతురు: మజ్లిస్ వెనకంజ
సాక్షి,సిటీబ్యూరో : ప్రధాన రాజకీయ పక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారిన హైదరాబాద్– మహబూబ్ నగర్–రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో మజ్లిస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందన్న విషయంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా మజ్లిస్ అధికారికంగా అభ్యర్థిని రంగంలోకి దింపలేదు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి 93 మంది పోటీ పడుతుండగా, ఓటర్లు ఐదు లక్షలకు పైగానే ఉన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా మైనారిటీ వర్గానికి చెందిన పట్టభద్రులు పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. అయితే మజ్లిస్ పార్టీ ఎన్నికల బరిలో లేని కారణంగా ఏదో ఒక అభ్యర్థికి సహకరించక తప్పదు. అయితే పార్టీపరంగా ఇప్పటి వరకూ ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో మజ్లిస్ కేడర్లో అయోమయం నెలకొంది. మైత్రి కొనసాగేనా.. అధికార టీఆర్ఎస్తో మజ్లిస్ పార్టీకి బలమైన మైత్రిబంధం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ బరిలో దిగని స్థానాల్లో టీఆర్ఎస్కు బాహాటంగా సహకరించింది. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీలో ఎవరికి వారు ఒంటరిగా పోటీ చేసినప్పటికీ అందరి ఊహలను తలకిందులు చేస్తూ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించి స్నేహ్నబంధాన్ని మరోసారి చాటింది. తాజాగా పట్టభద్రుల ఎన్నికల్లో మాత్రం అధికార పక్షానికి సహకరించే పరిస్థితి కనపించడం లేదు. పీవీ కూతురు కావడంతోనే.. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వంపై మజ్లిస్ పార్టీలో నిరాసక్తత వ్యక్తమవుతోంది. సురభివాణి దేవి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు కావడంతో మద్దతు విషయంపై మజ్లిస్ ఎటూ తేల్చుకోలేక పోతోంది. పీవీ ఆయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేతకు బాధ్యడని మజ్లిస్ పార్టీ ఆరోపిస్తూ వస్తోంది. అలాంటి వ్యక్తి తనయ అభ్యర్థిత్వాన్ని సమర్థించే ప్రసక్తే ఉండదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మైనార్టీ వర్గంలో కూడా పీవీపై కొంత వ్యతిరేకత ఉంది. దీంతో అధికార టీఆర్ఎస్కు మజ్లిస్ సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. చదవండి: టీఆర్ఎస్కు ఓటేస్తే చెప్పుకు వేసినట్లే.. -
అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
-
హైదరాబాద్పై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం లోక్సభలో మాట్లాడిన ఒవైసీ.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ను తన గుప్పిట్లోకి తీసుకునేందుకు కేంద్రపాలిత ప్రాంతంగా మార్చుతారని అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం భవిష్యత్లో ఇదే నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. అంతేకాకుండా చెన్నై, బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్, లక్నో నగరాలను.. యూటీలుగా మార్చే ప్రమాదం ఉందని ఆరోపించారు. ఇదే బీజేపీ మార్క్ పాలన అని, కశ్మీర్ విభజనే దీనికి ఉదాహరణ అని ఒవైసీ పేర్కొన్నారు. బీజేపీకి మద్దతిచ్చే పార్టీలు భవిష్యత్ పరిణామాలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కాగా లోక్సభ మొదటి విడత బడ్జెట్ సమావేశాలు శనివారం ముగిసిన విషయం తెలిసిందే. రెండో విడత సమావేశాలు తిరిగి మార్చి 8న ప్రారంభమై ఏప్రిల్ 8వ తేదీ వరకు జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాలు సాధారణంగా రెండు విడతలుగా జరుగుతాయి. మొదటి విడతలో పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించడం, బడ్జెట్ ప్రవేశం పెట్టడం ఉంటాయి. రెండో విడతలో వివిధ శాఖలకు గ్రాంట్ల డిమాండ్లపై సంబంధిత స్టాండింగ్ కమిటీల పరిశీలన ఉంటుంది. ఫైనాన్స్ బిల్లు, సంబంధిత గ్రాంట్ల డిమాండ్ల ఆమోదం వంటివి ఉంటాయి. కాగా, మొదటి విడత బడ్జెట్ సమావేశాలు 100% ఫలప్రదంగా ముగిశాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. జనవరి 29వ తేదీన ప్రారంభమైన ఈ సమావేశాలు నిర్ణీత 50 గంటల్లో 49 గంటలపాటు సభ్యుల కార్యకలాపాలు కొనసాగాయన్నారు. 43 నిమిషాలపాటు మాత్రం అంతరాయం కలిగిందని చెప్పారు. ఈ సమావేశాల్లో సభ్యులు 13 ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారన్నారు. బడ్జెట్ సమావేశాలు ముఖ్య అంశాలపై చర్చ కోసం అర్ధరాత్రి వరకు కొనసాగిన సందర్భాలున్నాయన్నారు. గ్రెటా టూల్కిట్: బెంగళూరు యువతి అరెస్ట్ -
ఇంకొంచెం కష్టపడితే.. గెలిచే వాళ్లం!
సాక్షి, హైదరాబాద్: ఎక్కడైనా గెలుపు, ఓటములు ఉంటాయి. గెలుపులోనూ చాలా చోట్ల ఒకటి, రెండో, మూడో స్థానాలుంటాయి. ఎన్నికల్లో మాత్రం ఒక్కటే గెలుపు. దానికి రెండు, మూడు స్థానాలంటూ ఉండవు. కానీ, రెండో స్థానంలో ఉన్నవారెవరైనా ఇంకొంచెం కష్టపడితే గెలిచే వారం అనుకోవడం సహజం. అలా బల్దియా ఎన్నికల్లో టీఆర్ఎస్ 67 సీట్లలో, బీజేపీ 78 సీట్లలో రెండో స్థానంలో నిలిచాయి. కాంగ్రెస్ ఒక్కచోట మాత్రమే రెండో స్థానంలో నిలిచింది. అది 94 స్థానాల్లో మూడో స్థానానికి దిగజారింది. ఇక టీడీపీ కనీసం రెండో స్థానంలో కూడా లేకుండా పోయింది. టీఆర్ఎస్ 2వ స్థానంలో ఉన్న డివిజన్లు ఇవీ. మోండా మార్కెట్, రామ్గోపాల్పేట, మల్కాజిగిరి, మౌలాలి, వినాయకనగర్, జీడిమెట్ల, మూసాపేట, గచ్చిబౌలి, ఎర్రగడ్డ, అమీర్పేట,జూబ్లీహిల్స్, కవాడిగూడ, గాంధీనగర్, భోలక్పూర్, రామ్నగర్, ముషీరాబాద్, ఆడిక్మెట్, బాగ్అంబర్పేట, నల్లకుంట, కాచిగూడ, హిమాయత్నగర్,గన్ఫౌండ్రి, అహ్మద్నగర్, గుడిమల్కాపూర్, నానల్నగర్, టోలిచౌకి, గోల్కొండ, మంగళ్హాట్, జియాగూడ, అత్తాపూర్, రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, శాస్త్రిపురం, సులేమాన్నగర్, కిషన్బాగ్, రామ్నాస్పురా, జహనుమా, గోషామహల్, బేగంబజార్, నవాబ్సాహెబ్కుంట, ఫలక్నుమా, బార్కాస్, కంచన్బాగ్, సంతోష్నగర్, ఐఎస్ సదన్, గౌలిపురా, తలాబ్చంచలం,పత్తర్గట్టి, రెయిన్బజార్, మూసారాంబాగ్, సైదాబాద్, గడ్డిఅన్నారం, చైతన్యపురి, కొత్తపేట, రామకృష్ణాపురం, సరూర్నగర్, లింగోజిగూడ,చంపాపేట, హస్తినాపురం, వనస్థలిపురం, బీఎన్రెడ్డి నగర్, హయత్నగర్, మన్సూరాబాద్, నాగోల్, ఉప్పల్, రామంతాపూర్, హబ్సిగూడ ఉన్నాయి. బీజేపీ 2వ స్థానంలో ఉన్న డివిజన్లు ఇవీ.. బేగంపేట, బన్సీలాల్పేట, బౌద్ధనగర్, సీతాఫల్మండి, మెట్టుగూడ, తార్నాక, అడ్డగుట్ట, గౌతమ్నగర్, ఈస్ట్ ఆనంద్బాగ్, వెంకటాపురం, అల్వాల్, మచ్చబొల్లారం, కుత్బుల్లాపూర్, సుభాష్నగర్, సూరారం,చింతల్, రంగారెడ్డినగర్, జగద్గిరిగుట్ట,ఆల్విన్కాలనీ, హైదర్నగర్, వీవీనగర్, కూకట్పల్లి, బాలానగర్, ఓల్డ్బోయిన్పల్లి, ఫతేనగర్, అల్లాపూర్, బాలాజీనగర్, కేపీహెచ్బీ కాలనీ, పటాన్చెరువు, రామచంద్రాపురం, భారతీనగర్, చందానగర్, హఫీజ్పేట, మియాపూర్, మాదాపూర్, శేరిలింగంపల్లి, కొండాపూర్, బోరబండ, రహ్మత్నగర్, సనత్నగర్, వెంగళ్రావునగర్, సోమాజిగూడ, యూసుఫ్గూడ, షేక్పేట, బంజారాహిల్స్, వెంకటేశ్వరకాలనీ, ఖైరతాబాద్, అంబర్పేట,గోల్నాక, మల్లేపల్లి, రెడ్హిల్స్, విజయనగర్కాలనీ, ఆసిఫ్నగర్, మెహదీపట్నం, లంగర్హౌస్, కార్వాన్, దత్తాత్రేయనగర్, దూద్బౌలి, పురానాపూల్, ఘాన్సీబజార్, శాలిబండ, జంగమ్మెట్, ఉప్పుగూడ, చాంద్రాయణగుట్ట, రియాసత్నగర్, కుర్మగూడ, లలితాబాగ్, మొఘల్పురా, డబీర్పురా, అక్బర్బాగ్, ఓల్డ్మలక్పేట, చిలుకానగర్, నాచారం, మల్లాపూర్, మీర్పేట హెచ్బీకాలనీ, చర్లపల్లి, డాక్టర్ ఏఎస్రావునగర్, కాప్రాలున్నాయి. అత్యధికంగా 15 వేల నుంచి 20 వేల ఓట్ల మెజార్టీ పొందిన అభ్యర్థులు 12 మంది ఉన్నారు. వారంతా ఎంఐఎం వాళ్లే కావడం విశేషం. 2వ స్థానం టీఆర్ఎస్ 67 బీజేపీ 78 ఎంఐఎం 1 కాంగ్రెస్ 1 ఇండిపెండెంట్లు 2 టీడీపీ 0 -
మాటల యుద్ధమే చేటు తెచ్చిందా?
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ ఎన్నికల బరిలో లేని డివిజన్లలో సంప్రదాయ ఓటు బ్యాంక్ సైలెంట్గా టీఆర్ఎస్ను దెబ్బతీసింది. మజ్లిస్పై మాటల దూకుడు కారుకు చేటు తెచ్చి పెట్టినట్లయింది. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు కమలనాథుల వశం కావడంతో పాతబస్తీలో కారు అడ్రస్ గల్లంతైంది. నగరంలోని ఇతర ప్రాంతాల్లో సైతం మజ్లిస్ సంప్రదాయ ఓట్ల ప్రభావం టీఆర్ఎస్పై పడింది. ముస్లిం గళంగా మారి పాతబస్తీ రాజకీయాలను శాసిస్తున్న ఎంఐఎం పార్టీ నగరంలోని ముస్లిం ప్రాబల్యమున్న ప్రాంతాల్లో సైతం సంప్రదాయ ఓటు బ్యాంక్ కలిగి ఉంది. గత ఆరేళ్లుగా అధికార టీఆర్ఎస్తో దోస్తానా కొనసాగుతున్నప్పటికీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి పొత్తులు, సీట్ల సర్దుబాటు లేకుండా స్నేహపూర్వక పోటీ పేరుతో బరిలో ఒంటరిగా దిగుతూ వస్తోంది. మజ్లిస్ బరిలో లేనిప్రాంతాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను బలపర్చడమే కాకుండా ఏకంగా ఓటు వేసి గెలిపించాలంటూ పార్టీ సంప్రదాయ ఓటర్లకు విజ్ఞప్తి చేయడం ఆనవాయితీగా మారింది. కానీ.. జీహెచ్ఎసీం ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్– మజ్లిస్ మధ్య మాటల యుద్ధం దోస్తీ కటీఫ్కు దారితీసి ఫలితాలపై ప్రభావం చూపినట్లయింది. ప్రాతినిధ్య సెగ్మెంట్లలో సైతం.. అసెంబ్లీ ప్రాతినిధ్యం గల సెగ్మెంట్లల్లోని కొన్ని డివిజన్లలో సైతం లోపాయికారీ ఒప్పందం కారణంగా ఎన్నికల బరికి దూరం ఉంటూ అధికార పక్షానికి సహకరిస్తూ రావడం మజ్లిస్ పార్టీ ఆనవాయితీ. మలక్పేట అసెంబ్లీ సెగ్మెంట్లోని సైదాబాద్, మూసారంబాగ్, యాకుత్పురాలోని ఐఎస్ సదన్ డివిజన్ల్లో మజ్లిస్ పార్టీ ఎన్నికల బరిలో దిగని కారణంగా టీఆర్ఎస్కు కలిసి వచ్చేది. అధిష్టానం ఆదేశాల మేరకు మజ్లిస్ కేడర్ కూడా బాహాటంగా టీఆర్ఎస్కు సహకరిస్తూ వచ్చేది. తాజా పరిణామాల దృష్ట్యా మజ్లిస్ కేడర్ టీఆర్ఎస్కు దూరం పాటించింది. మజ్లిస్ సంప్రదాయ ఓటర్లు కూడా మొగ్గుచూపకపోవడంతో మూడు సిట్టింగ్ స్థానాలు కమలం ఖాతాలో చేరడం టీఆర్ఎస్కు మింగుపడటంలేదు. కొంత పట్టున్న డివిజన్లల్లో.. మజ్లిస్ పార్టీకి జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్ ముషీరాబాద్, అంబర్పేట, ఎల్బీనగర్, సికింద్రాబాద్, పటాన్చెరూ అసెంబ్లీ సెగ్మెంట్లలో సైతం కొంత వరకు సంప్రదాయ ఓటుబ్యాంక్ ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ముషీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి రెండు చొప్పున మాత్రమే బరిలో దిగిన మజ్లిస్ తమ సంప్రదాయ ఓటు బ్యాంక్ను పదిలపర్చుకోగా, మిగతా డివిజన్ల విషయంలో అధికార పక్షంతో మైత్రి తెగిన కారణగా పార్టీ కేడర్కు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. ఆయా డివిజన్లలోని పార్టీ కేడర్ కూడా దూరం పాటించడంతో టీఆర్ఎస్కు నష్టం వాటిల్లినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
బల్దియా పీఠానికి దారేది?
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో హంగ్ రావడంతో మేయర్ పీఠం ఎవరికి, ఎలా దక్కుతుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బల్దియాలో అతిపెద్ద పారీ్టగా అవతరించిన టీఆర్ఎస్కు పీఠం దక్కించుకోవడానికి ఉన్న మార్గాలపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మేయర్ ఎన్నికకు మరో రెండు నెలల సమయం ఉందన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలతో ఈ ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ గ్రేటర్ కుర్చీని దక్కించుకునేందుకు మూడు మార్గాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఎంఐఎంతో అధికారిక పొత్తు మొదటిది కాగా, మేయర్ ఎన్నిక రోజున ఎంఐఎం గైర్హాజరు కావడం రెండో మార్గంగా కనిపిస్తోంది. ఇక, ఎంఐఎం కూడా మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తే బీజేపీ ఎలాగూ పోటీలో ఉంటుంది కనుక ఎక్స్అఫీషియో సభ్యుల సాయంతో ఎక్కువ ఓట్లు తెచ్చుకుని టీఆర్ఎస్ బల్దియా పీఠంపై కూర్చుంటుందని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి టీఆర్ఎస్కు మేయర్ పీఠం దక్కాలంటే మాత్రం ఎంఐఎం కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ఈ విషయంలో ఎలా ముందుకువెళ్లాలనే దానిపై టీఆర్ఎస్లో చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లు దీనిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గ్రేటర్ పీఠం దక్కుతుందన్న నమ్మకం ఉండటంతోనే భారతీనగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్రెడ్డికి ప్రగతిభవన్ నుంచి పిలుపు వచి్చందని తెలుస్తోంది. గ్రేటర్ పీఠం దక్కడం ఖాయమే అని, ఏ వ్యూహంతో దాన్ని దక్కించుకోవాలన్న దానిపై శనివారం మరింత స్పష్టత వస్తుందని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం లెక్క ఇదీ.. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లకు గాను నేరేడ్మెట్ మినహా మిగతా 149 డివిజన్ల ఫలితాలను ప్రకటించగా, టీఆర్ఎస్ 55 డివిజన్లలో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. జీహెచ్ఎంసీలో వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కలిపి మొత్తం 45 మంది ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉండగా, ఇందులో టీఆర్ఎస్కు 31 మంది బలం ఉంది. ఎక్స్అఫీషియో సభ్యులతో కలిపి జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో పాల్గొనే మొత్తం ఓటర్ల సంఖ్య 195. ఈ నేపథ్యంలో మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే ఏ పార్టీకి అయినా 98 మంది (మేజిక్ ఫిగర్) మద్దతు అవసరం ఉంటుంది. ఎక్స్అఫీíÙయో సభ్యులను కలిపితే టీఆర్ఎస్కు 86, బీజేపీకి 51, ఎంఐఎంకు 54, కాంగ్రెస్కు ముగ్గురు సభ్యుల బలం ఉంది. దీంతో అటు కమలనాథులకు, ఇటు కాంగ్రెస్కు మేయర్ పీఠం గెలుపొందే అవకాశం లేనే లేదు. -
జీహెచ్ఎంసీ ఎన్నికల విజేతలు వీరే
సాక్షి, హైదరాబాద్ : ఎట్టకేలకు ఉత్కంఠకు తెర పడింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ 56 డివిజన్లలో గెలుపొందింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీలు బల్దియా ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి వరుస ప్రభంజనాలు సృష్టించిన టీఆర్ఎస్ పార్టీ.. ఇటీవల కాలంలో కేంద్రంలోని బీజేపీ నుంచి కొంత పోటీని ఎదుర్కొంటోంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను 99 డివిజన్లను దక్కించుకున్న టీఆర్ఎస్.. రాష్ట్ర రాజకీయాల్లో పట్టును నిలుపుకోవడానికి శతవిధాలా ప్రయత్నించినా 56 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇటు పాతబస్తీలో ఎదురులేని ఎంఐఎం.. గత ఎన్నికల్లో గెలిచిన 44 స్థానాలను నిలుపుకుంది. ఇటు గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా పోటీ చేసిన 68 డివిజన్లకు గాను కేవలం 4 స్థానాల్లో గెలిచిన బీజేపీ ఈసారి అనూహ్యంగా రెండో స్థానం దక్కించుకుంది. 48 డివిజన్లలో విజయం సాధించింది. వార్డువిజేతలు పార్టీ 1 కాప్రా స్వర్ణరాజ్ టీఆర్ఎస్ 2 ఏఎస్ రావు నగర్ శిరీషా రెడ్డి కాంగ్రెస్ 3 చర్లపల్లి బొంతు శ్రీదేవి టీఆర్ఎస్ 4 మీర్పేట హెచ్బీ కాలనీ జె.ప్రభుదాస్ టీఆర్ఎస్ 5 మల్లాపూర్ దేవేందర్రెడ్డి టీఆర్ఎస్ 6 నాచారం శాంతి సాయిజన్ టీఆర్ఎస్ 7 చిలుకా నగర్ గోనె శైలజ బీజేపీ 8 హబ్సిగూడ కె.చేతన బీజేపీ 9 రామాంతపూర్ బండారు శ్రీవాణి బీజేపీ 10 ఉప్పల్ రజిత కాంగ్రెస్ 11 నాగోల్ సిహెచ్ అరుణ బీజేపీ 12 మన్సూరాబాద్ కొప్పుల నరసింహారెడ్డి బీజేపీ 13 హయత్నగర్ కళ్లెం నవజీవన్ రెడ్డి బీజేపీ 14 బీఎన్ రెడ్డి నగర్ ఎం లచ్చిరెడ్డి బీజేపీ 15 వనస్థలిపురం వెంకటేశ్వర్ రెడ్డి బీజేపీ 16 హస్తినాపురం సుజాతా నాయక్ బీజేపీ 17 చంపాపేట్ వంగ మధుసూదన్ రెడ్డి బీజేపీ 18 లింగోజీగూడ ఆకుల రమేష్బాబు బీజేపీ 19 సరూర్ నగర్ ఆకుల శ్రీవాణీ బీజేపీ 20 రామకృష్ణాపురం రాధ బీజేపీ 21 కొత్తపేట్ పవన్ కుమార్ బీజేపీ 22 చైతన్యపురి నర్సింహ గుప్తా బీజేపీ 23 గడ్డి అన్నారం ప్రేమ్ మహేశ్వర్రెడ్డి బీజేపీ 24 సైదాబాద్ కె అరుణ బీజేపీ 25 ముసారాంబాగ్ భాగ్యలక్ష్మిరెడ్డి బీజేపీ 26 ఓల్డ్ మలక్పేట్ జువేరియా ఫాతిమా ఎంఐఎం 27 అక్బర్బాగ్ మినాజుద్దీన్ ఎంఐఎం 28 అజాంపుర అయేషా జహాన్ ఎంఐఎం 29 చావని అబ్దుల్ సలాం షాహిద్ ఎంఐఎం 30 డబ్బీర్పురా అలందార్ హుస్సేన్ ఎంఐఎం 31 రైన్ బజార్ వసీ యుద్దీన్ ఎంఐఎం 32 పతర్ గట్టి సొహైల్ ఖాద్రి ఎంఐంఎం 33 మొఘల్పుర నసరీన్ సుల్తానా ఎంఐఎం 34 తలబ్ చంచలం డా.సమీనా ఎంఐఎం 35 గౌలీపురా ఏ. భాగ్యలక్ష్మీ బీజేపీ 36 లలితాబాగ్ ఆలీ షరీఫ్ ఎంఐఎం 37 కుర్మాగూడ మహాపర ఎంఐఎం 38 ఐఎస్ సదన్ జె. శ్వేత బీజేపీ 39 సంతోష్ నగర్ ముజఫర్ హుస్సేన్ ఎంఐఎం 40 రియాసత్ నగర్ ముస్తఫా బేగ్ ఎంఐఎం 41 కాంచనబాగ్ రేష్మాఫాతిమా ఎంఐఎం 42 బార్కాస్ షబానా బేగం ఎంఐఎం 43 చంద్రాయణగుట్ట అబ్దుల్ వాహబ్ ఎంఐఎం 44 ఉప్పుగూడ ఆబ్దాద్ ఎంఐఎం 45 జంగంమెట్ ఎంఐఎం 46 ఫలక్నుమా తారాభాయ్ ఎంఐఎం 47 నవాబ్ సాహెబ్ కుంట షిరీన్ ఖాతూన్ ఎంఐఎం 48 షహాలీబండ ముస్తఫా అలీ ఎంఐఎం 49 ఝాన్సీ బజార్ ఫర్విన్ సుల్తానా ఎంఐఎం 50 బేగంబజార్ జి. శంకర్ యాదవ్ బీజేపీ 51 గోషామహల్ లాల్ సింగ్ బీజేపీ 52 పురానాపూల్ రాజ్ మోహన్ ఎంఐఎం 53 దూద్ బౌలీ ఎండీ సలీమ్ ఎంఐఎం 54 జహానుమా అబ్దుల్ ముక్తదీర్ ఎంఐఎం 55 రాంనాస్తపుర అబ్దుల్ ఖదీర్ ఎంఐఎం 56 కిషన్బాగ్ హుస్సేనీ పాషా ఎంఐఎం 57 సులేమాన్ నగర్ అబిదా సుల్తానా ఎంఐఎం 58 శాస్త్రీపురం మహ్మద్ ముబిన్ ఎంఐఎం 59 మైలర్ దేవ్పల్లి తోకల శ్రీనివాసరెడ్డి బీజేపీ 60 రాజేంద్రనగర్ పి. అర్చన బీజేపీ 61 అత్తాపూర్ ఎం. సంగీత బీజేపీ 62 జియాగూడ బి.దర్శన్ బీజేపీ 63 మంగళ్హట్ ఎం. శశికళ బీజేపీ 64 దత్తాత్రేయ నగర్ జాకీర్ బాకరి ఎంఐఎం 65 కార్వాన్ ఎం. స్వామి యాదవ్ ఎంఐఎం 66 లంగర్ హౌస్ అమీనా బేగం ఎంఐఎం 67 గోల్కొండ సమీనా యాస్మిన్ ఎంఐఎం 68 టోలీచౌకీ అయేషా ఉమేరా ఎంఐఎం 69 ననల్ నగర్ నసిరుద్దీన్ ఎంఐఎం 70 మెహదీపట్నం మాజిద్ హుస్సేన్ ఎంఐఎం 71 గుడిమల్కాపూర్ కర్ణాకర్ బీజేపీ 72 అసిఫ్ నగర్ గౌసియా సుల్తానా ఎంఐఎం 73 విజయనగర్ కాలనీ బి.జబీన్ ఎంఐఎం 74 అహ్మద్ నగర్ రఫత్ సుల్తానా ఎంఐఎం 75 రెడ్ హిల్స్ సద్దియా మజ్హర్ ఎంఐఎం 76 మల్లేపల్లి యాస్మిన్బేగం ఎంఐఎం 77 జామ్బాగ్ రాకేశ్ జైస్వాల్ బీజేపీ 78 గన్ఫౌండ్రీ బి. సురేఖ బీజేపీ 79 హిమాయత్ నగర్ జి.ఎన్.వి. కె. మహాలక్ష్మి బీజేపీ 80 కాచిగూడ కె. ఉమారాణి బిజేపీ 81 నల్లకుంట వై.అమృత బీజేపీ 82 గోల్నాక దూసరి టీఆర్ఎస్ 83 అంబర్పేట్ విజయ్ కుమార్గౌడ్ టీఆర్ఎస్ 84 బాగ్ అంబర్పేట్ బి. పద్మ వెంకటరెడ్డి బీజేపీ 85 అడిక్మెట్ సునీత బీజేపీ 86 ముషీరాబాద్ ఎం.సుప్రియ బీజేపీ 87 రాంనగర్ కె.రవికుమార్ బీజేపీ 88 భోలక్పూర్ మహ్మద్ గౌసుద్దిన్ ఎంఐఎం 89 గాంధీనగర్ పావని బీజేపీ 90 కవాడిగూడ జి. రచన శ్రీ బీజేపీ 91 ఖైరతాబాద్ విజయా రెడ్డి టీఆర్ఎస్ 92 వెంకటేశ్వరా కాలనీ మన్నె కవితా రెడ్డి టీఆర్ఎస్ 93 బంజారహిల్స్ విజయలక్ష్మీ టీఆర్ఎస్ 94 షేక్పేట్ మహ్మద్ ఫరాజుద్దీన్ ఎంఐఎం 95 జూబ్లీహిల్స్ డి. వెంకటేష్ బీజేపీ 96 యూసఫ్గూడ రాజ్కుమార్ టీఆర్ఎస్ 97 సోమాజిగూడ వనం సంగీత టీఆర్ఎస్ 98 అమీర్పేట్ సరళ బీజేపీ 99 వెంగళరావు నగర్ జి. దేదిప్య టీఆర్ఎస్ 100 సనత్ నగర్ కొలను లక్ష్మి టీఆర్ఎస్ 101 ఎర్రగడ్డ షాహిన్ బేగం ఎంఐఎం 102 రహమత్ నగర్ సి.ఎన్ రెడ్డి టీఆర్ఎస్ 103 బోరబండ బాబా ఫసియుద్దీన్ టీఆర్ఎస్ 104 కొండాపూర్ హమీద్ పటేల్ టీఆర్ఎస్ 105 గచ్చిబౌలీ గంగాధర్ బీజేపీ 106 శేరిలింగంపల్లి రాగం నాగేందర్ టీఆర్ఎస్ 107 మాదాపూర్ జగదీశ్వర్ గౌడ్ టీఆర్ఎస్ 108 మియాపూర్ ఉప్పలపాటి శ్రీకాంత్ టీఆర్ఎస్ 109 హఫీజ్ పేట్ పూజితా జగదీశ్వర్ టీఆర్ఎస్ 110 చందానగర్ ఆర్.మంజుల టీఆర్ఎస్ 111 భారతీ నగర్ వి.సింధు ఆదర్శ్రెడ్డి టీఆర్ఎస్ 112 రామచంద్రాపురం పుష్ప నగేష్ యాదవ్ టీఆర్ఎస్ 113 పటాన్చెరువు కుమార్ యాదవ్ టీఆర్ఎస్ 114 కేపీహెచ్బీ కాలనీ మందడి శ్రీనివాసరావు టీఆర్ఎస్ 115 బాలాజీ నగర్ శిరీష టీఆర్ఎస్ 116 అల్లాపూర్ సబీహా బేగం టీఆర్ఎస్ 117 మూసాపేట్ కె. మహిందర్ బీజేపీ 118 ఫతే నగర్ పండాల సతీష్ గౌడ్ టీఆర్ఎస్ 119 ఓల్డ్ బోయన్ పల్లి ఎం. నర్సింహా యాదవ్ టీఆర్ఎస్ 120 బాలానగర్ ఆవుల రవీందర్రెడ్డి టీఆర్ఎస్ 121 కూకట్పల్లి జూపల్లి సత్యనారాయణ టీఆర్ఎస్ 122 వివేకానందనగర్ కాలనీ మాధవరం రోజాదేవి టీఆర్ఎస్ 123 హైదర్ నగర్ నార్నె శ్రీనివాసరావు టీఆర్ఎస్ 124 ఆల్వీన్ కాలనీ డి. వెంకటేష్గౌడ్ టీఆర్ఎస్ 125 గాజుల రామారం రావూరి శేషగిరి టీఆర్ఎస్ 126 జగద్గిరి గుట్ట కొలుకుల జగన్ టీఆర్ఎస్ 127 రంగారెడ్డి నగర్ విజయ్శేఖర్ గౌడ్ టీఆర్ఎస్ 128 చింతల్ రషీదా బేగం టీఆర్ఎస్ 129 సురారం మంత్రి సత్యనారాయణ టీఆర్ఎస్ 130 సుభాష్ నగర్ జి. హేమలత టీఆర్ఎస్ 131 కుత్బుల్లాపూర్ కూన పారిజాత గౌరీష్గౌడ్ టీఆర్ఎస్ 132 జీడిమెట్ల తారా చంద్ర రెడ్డి బీజేపీ 133 మచ్చ బొల్లారం ఇ.ఎస్.రాజ్ జితేంద్రనాథ్ టీఆర్ఎస్ 134 అల్వాల్ శాంతి శ్రీనివాస్రెడ్డి టీఆర్ఎస్ 135 వెంకటాపురం సబితా కిషోర్ టీఆర్ఎస్ 136 నేరేడ్మెట్ 137 వినాయక్ నగర్ రాజ్యలక్ష్మీ బీజేపీ 138 మౌలాలి ఫాతిమా టీఆర్ఎస్ 139 ఈస్ట్ ఆనంద్ బాగ్ ప్రేమ్ కుమార్ టీఆర్ఎస్ 140 మల్కాజ్ గిరి వి. శ్రవణ్ బీజేపీ 141 గౌతమ్ నగర్ మేకల సునీత టీఆర్ఎస్ 142 అడ్డగుట్ట ఎల్ ప్రసన్న లక్ష్మి టీఆర్ఎస్ 143 తార్నాక ఎం. శ్రీలత టీఆర్ఎస్ 144 మెట్టుగూడ రాసూరి సునీత టీఆర్ఎస్ 145 సీతాఫల్మండి సామల హేమ టీఆర్ఎస్ 146 భౌద్దనగర్ కంది శైలజ టీఆర్ఎస్ 147 బన్సీలాల్ పేట్ కుర్మా హేమలత టీఆర్ఎస్ 148 రాంగోపాల్ పేట్ సీహెచ్ సచిత్ర బీజేపీ 149 బేగంపేట్ టి. మహేశ్వరి టీఆర్ఎస్ 150 మోండా మార్కెట్ దీపిక బీజేపీ -
గ్రేటర్ వార్: నాడు-నేడు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాయి. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో మొత్తం 1,122 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. 2016లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 డివిజన్లను దక్కించుకున్న టీఆర్ఎస్.. పట్టును నిలుపుకోవడానికి శతవిధాలా ప్రయత్నించినా 56 స్థానాలతో సరిపెట్టుకుంది. నాడు-నేడు గెలిచిన పార్టీల వివరాలు... గెలిచిన పార్టీ వార్డు 2016 2020 1 కాప్రా టీఆర్ఎస్ టీఆర్ఎస్ 2 ఏఎస్రావు నగర్ టీఆర్ఎస్ కాంగ్రెస్ 3 చర్లపల్లి టీఆర్ఎస్ టీఆర్ఎస్ 4 మీర్పేట్ హెచ్బీ కాలనీ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 5 మల్లాపూర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 6 నాచారం కాంగ్రెస్ టీఆర్ఎస్ 7 చిలుకా నగర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 8 హబ్సీగూడ టీఆర్ఎస్ బీజేపీ 9 రామాంతపూర్ టీఆర్ఎస్ బీజేపీ 10 ఉప్పల్ టీఆర్ఎస్ కాంగ్రెస్ 11 నాగోల్ టీఆర్ఎస్ బీజేపీ 12 మన్సూరాబాద్ టీఆర్ఎస్ బీజేపీ 13 హయత్నగర్ టీఆర్ఎస్ బీజేపీ 14 బీఎన్ రెడ్డి నగర్ టీఆర్ఎస్ బీజేపీ 15 వనస్థలిపురం టీఆర్ఎస్ బీజేపీ 16 హస్తినాపురం టీఆర్ఎస్ బీజేపీ 17 చంపాపేట్ టీఆర్ఎస్ బీజేపీ 18 లింగోజీగూడ టీఆర్ఎస్ బీజేపీ 19 సరూర్ నగర్ టీఆర్ఎస్ బీజేపీ 20 రామకృష్ణాపురం బీజేపీ బీజేపీ 21 కొత్తపేట్ టీఆర్ఎస్ బీజేపీ 22 చైతన్యపురి టీఆర్ఎస్ బీజేపీ 23 గడ్డి అన్నారం టీఆర్ఎస్ బీజేపీ 24 సైదాబాద్ టీఆర్ఎస్ బీజేపీ 25 మూసారం బాగ్ టీఆర్ఎస్ బీజేపీ 26 ఓల్డ్ మలక్పేట్ ఎంఐఎం ఎంఐఎం 27 అక్బర్బాగ్ ఎంఐఎం ఎంఐఎం 28 అజాంపుర ఎంఐఎం ఎంఐఎం 29 చావని ఎంఐఎం ఎంఐఎం 30 డబీర్పురా ఎంఐఎం ఎంఐఎం 31 రైన్ బజార్ ఎంఐఎం ఎంఐఎం 32 పతర్ గట్టి ఎంఐఎం ఎంఐఎం 33 మొఘల్పుర ఎంఐఎం ఎంఐఎం 34 తలబ్ చంచలం ఎంఐఎం ఎంఐఎం 35 గౌలీపురా బీజేపీ బీజేపీ 36 లలితాబాగ్ ఎంఐఎం ఎంఐఎం 37 కుర్మగూడ ఎంఐఎం ఎంఐఎం 38 ఐఎస్ సదన్ టీఆర్ఎస్ బీజేపీ 39 సంతోష్ నగర్ ఎంఐఎం ఎంఐఎం 40 రియాసత్ నగర్ ఎంఐఎం ఎంఐఎం 41 కాంచనబాగ్ ఎంఐఎం ఎంఐఎం 42 బర్కాస్ ఎంఐఎం ఎంఐఎం 43 చంద్రాయణగుట్ట ఎంఐఎం ఎంఐఎం 44 ఉప్పుగూడ ఎంఐఎం ఎంఐఎం 45 జంగంమెట్ ఎంఐఎం ఎంఐఎం 46 ఫలక్నుమా ఎంఐఎం ఎంఐఎం 47 నవాబ్ సాహెబ్ కుంట ఎంఐఎం ఎంఐఎం 48 షహలీబండ ఎంఐఎం ఎంఐఎం 49 ఘాన్సీ బజార్ బీజేపీ ఎంఐఎం 50 బేగం బజార్ బీజేపీ బీజేపీ 51 గోషా మహల్ టీఆర్ఎస్ బీజేపీ 52 పురానాపూల్ ఎంఐఎం ఎంఐఎం 53 దూద్ బౌలీ ఎంఐఎం ఎంఐఎం 54 జహానుమా ఎంఐఎం ఎంఐఎం 55 రాంనాస్పుర ఎంఐఎం ఎంఐఎం 56 కిషన్బాగ్ ఎంఐఎం ఎంఐఎం 57 సులేమాన్ నగర్ ఎంఐఎం ఎంఐఎం 58 శాస్త్రీపురం ఎంఐఎం ఎంఐఎం 59 మైలర్ దేవ్పల్లి టీఆర్ఎస్ బీజేపీ 60 రాజేంద్ర నగర్ టీఆర్ఎస్ బీజేపీ 61 అత్తాపూర్ టీఆర్ఎస్ బీజేపీ 62 జియాగూడ టీఆర్ఎస్ బీజేపీ 63 మంగళ హట్ టీఆర్ఎస్ బీజేపీ 64 దత్తాత్రేయ నగర్ ఏఐఎంఐఎం ఎంఐఎం 65 ఖార్వాన్ ఎంఐఎం ఎంఐఎం 66 లంగర్ హౌస్ ఎంఐఎం ఎంఐఎం 67 గోల్కొండ ఎంఐఎం ఎంఐఎం 68 టోలీచౌకీ ఎంఐఎం ఎంఐఎం 69 నానల్ నగర్ ఎంఐఎం ఎంఐఎం 70 మెహదీపట్నం ఎంఐఎం ఎంఐఎం 71 గుడిమల్కాపూర్ టీఆర్ఎస్ బీజేపీ 72 అసిఫ్ నగర్ ఎంఐఎం ఎంఐఎం 73 విజయనగర్ కాలనీ ఎంఐఎం ఎంఐఎం 74 అహ్మద్ నగర్ ఎంఐఎం ఎంఐఎం 75 రెడ్ హిల్స్ ఎంఐఎం ఎంఐఎం 76 మల్లేపల్లి ఎంఐఎం ఎంఐఎం 77 జామ్బాగ్ ఎంఐఎం బీజేపీ 78 గన్ఫౌండ్రీ టీఆర్ఎస్ బీజేపీ 79 హిమాయత్ నగర్ టీఆర్ఎస్ బీజేపీ 80 కాచిగూడ టీఆర్ఎస్ బీజేపీ 81 నల్లకుంట టీఆర్ఎస్ బీజేపీ 82 గోల్నాక టీఆర్ఎస్ టీఆర్ఎస్ 83 అంబర్పేట్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 84 బాగ్ అంబర్పేట్ టీఆర్ఎస్ బీజేపీ 85 అడిక్మెట్ టీఆర్ఎస్ బీజేపీ 86 ముషీరాబాద్ టీఆర్ఎస్ బీజేపీ 87 రాంనగర్ టీఆర్ఎస్ బీజేపీ 88 భోలక్పూర్ ఎంఐఎం ఎంఐఎం 89 గాంధీనగర్ టీఆర్ఎస్ బీజేపీ 90 కవాడిగూడ టీఆర్ఎస్ బీజేపీ 91 ఖైరతాబాద్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 92 వెంకటేశ్వరా కాలనీ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 93 బంజారాహిల్స్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 94 షేక్పేట ఎంఐఎం ఎంఐఎం 95 జూబ్లీ హిల్స్ టీఆర్ఎస్ బీజేపీ 96 యూసఫ్ గూడ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 97 సోమాజీగూడ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 98 అమీర్పేట్ టీఆర్ఎస్ బీజేపీ 99 వెంగళరావు నగర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 100 సనత్ నగర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 101 ఎర్రగడ్డ ఎంఐఎం ఎంఐఎం 102 రహమత్ నగర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 103 బోరబండ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 104 కొండాపూర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 105 గచ్చిబౌలీ టీఆర్ఎస్ బీజేపీ 106 శేరిలింగంపల్లి టీఆర్ఎస్ టీఆర్ఎస్ 107 మాదాపూర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 108 మియాపూర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 109 హఫీజ్పేట్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 110 చందానగర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 111 భారతీ నగర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 112 రామచంద్రాపురం టీఆర్ఎస్ టీఆర్ఎస్ 113 పటాన్ చెరువు కాంగ్రెస్ టీఆర్ఎస్ 114 కేపీహెచ్బీ కాలనీ టీడీపీ టీఆర్ఎస్ 115 బాలాజీ నగర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 116 అల్లాపూర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 117 మూసాపేట్ టీఆర్ఎస్ బీజేపీ 118 ఫతే నగర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 119 ఓల్డ్ బోయన్ పల్లి టీఆర్ఎస్ టీఆర్ఎస్ 120 బాలానగర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 121 కూకట్పల్లి టీఆర్ఎస్ టీఆర్ఎస్ 122 వివేకానందనగర్ కాలనీ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 123 హైదర్ నగర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 124 ఆల్వీన్ కాలనీ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 125 గాజుల రామారం టీఆర్ఎస్ టీఆర్ఎస్ 126 జగద్గిరి గుట్ట టీఆర్ఎస్ టీఆర్ఎస్ 127 రంగారెడ్డి నగర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 128 చింతల్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 129 సురారం టీఆర్ఎస్ టీఆర్ఎస్ 130 సుభాష్ నగర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 131 కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 132 జీడిమెట్ల టీఆర్ఎస్ బీజేపీ 133 మచ్చ బొల్లారం టీఆర్ఎస్ టీఆర్ఎస్ 134 అల్వాల్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 135 వెంకటాపురం టీఆర్ఎస్ టీఆర్ఎస్ 136 నేరేడ్మెట్ టీఆర్ఎస్ 137 వినాయక్ నగర్ టీఆర్ఎస్ బీజేపీ 138 మౌలాలి టీఆర్ఎస్ బీజేపీ 139 ఈస్ట్ ఆనంద్ బాగ్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 140 మల్కాజ్ గిరి టీఆర్ఎస్ బీజేపీ 141 గౌతమ్ నగర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 142 అడ్డగుట్ట టీఆర్ఎస్ టీఆర్ఎస్ 143 తార్నాక టీఆర్ఎస్ టీఆర్ఎస్ 144 మెట్టుగూడ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 145 సీతాఫల్మండి టీఆర్ఎస్ టీఆర్ఎస్ 146 భౌద్దనగర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 147 బన్సీలాల్ పేట్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 148 రాంగోపాల్ పేట్ టీఆర్ఎస్ బీజేపీ 149 బేగంపేట్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 150 మోండా మార్కెట్ టీఆర్ఎస్ బీజేపీ -
హస్తం ఖేల్ఖతం.. మరోసారి సింగిల్ డిజిట్!
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీని హైదరాబాద్ ఓటర్లు మరోసారి తిరస్కరించారు. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. హస్తం పార్టీ కనీసం ప్రభావం చూపలేకపోయింది. కేవలం ఒక్క డివిజన్లో విజయం సాధించి.. మరో రెండు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం గ్రేటర్లో మరోసారి సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి నగరంలో విసృతంగా ప్రచారం చేసినప్పటికీ పెద్దగా ఓటర్లను ఆకట్టుకుకోలేకపోయారు. అయితే పలు డివిజన్లో మాత్రం టీఆర్ఎస్, బీజేపీకి గట్టిపోటీనిస్తోంది. ఇక దుబ్బాక విజయంతో ఒక్కసారే రేసులోకి వచ్చిన బీజేపీ.. కాంగ్రెస్ ఓట్లకు భారీగా గండికొట్టినట్లు కనిపిస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కాషాయదళం భారీగా ఓటింగ్ శాతాన్ని పెంచుకుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఆ పార్టీ అభ్యర్థులు 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. పలుచోట్ల అధికార టీఆర్ఎస్కు గట్టిపోటీనిచ్చింది. మరోవైపు హైదరాబాద్పై మజ్లీస్ మరోసారి పట్టునిలుపుకుంది. 28 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఇప్పటికే నాలుగు స్థానాల్లో విజయం నమోదు చేసింది. (మెజార్టీ డివిజన్లలో బీజేపీ ఆధిక్యం) రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. మొదట లెక్కించిన పోస్టల్ ఓట్లలో కాస్త వెనకబడ్డ అధికార టీఆర్ఎస్... బ్యాలెట్ ఓట్లలో జోరుపెంచింది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. టీఆర్ఎస్ 40 డివిజన్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ 20, ఎంఐఎం అభ్యర్థులు 16 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. మెహదీపట్నంలో ఎంఐఎం విజయం సాధించిన.. గ్రేటర్లో తొలి గెలుపును నమోదు చేసింది. అక్కడి నుంచి ఎంఐఎం అభ్యర్థి, మాజీ డిప్యూటీ మేయర్ మాజిద్ హుస్సేన్ విజయం సాధించారు. యూసఫ్గూడ (రాజ్కుమార్ పటేల్), మెట్టుగూడ (రాసూరి సునీత) డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మరోసారి గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ఎగిరే అవకాశం కనిపిస్తోంది. ఏఎస్రావు నగర్లో కాంగ్రెస్ (శిరీషారెడ్డి) గెలుపొంది.. గ్రేటర్లో ఖాతా తెరిచింది. పలుచోట్ల టీఆర్ఎస్-బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. మరికొన్ని డివిజన్లలో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు మజ్లీస్ సైతం మరోసారి తన పట్టునిలుపుకుంది. సిట్టింగ్ స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు. అయితే పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ ఆధిక్యం కనబర్చడం విశేషం. ఇక గ్రేటర్ ఫలితాల్లో గులాబీ పార్టీకి అనుకూలంగా తీర్పు వెలువడుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆపార్టీ అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ పరిధిలో టీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు. -
ఎగ్జిట్ పోల్స్: పుంజుకున్న బీజేపీ
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. ఓల్డ్ మలక్పేట్ రీపోలింగ్ ఉండటంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆలస్యమయిన సంగతి తెలిసిందే. ఇక గురువారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం అధికార టీఆర్ఎస్ పార్టీ మరోసారి సొంతంగా మేయర్ పీఠం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే దుబ్బాక విజయంతో బల్దియా ఎన్నికల్లో బీజేపీ జోరుగా ప్రచారం చేసింది. ఢీ అంటే ఢీ అన్నట్లు అధికార పార్టీపై విమర్శలు చేసింది. ఇక అమిత్ షా సహా పలువురు బీజేపీ ప్రముఖులతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేయించింది. ఈ అంశాలన్ని బీజేపికి అనుకూలించాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ ఫలితాల మేరకు టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఆరు శాతం ఓట్ల వ్యత్యాసం ఉండటం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే.. నగరంలో బీజేపీ సైలెంట్ వేవ్ కొనసాగిందని చెప్పవచ్చు. ఇక చాలా డివిజన్లలో త్రిముఖ పోరు కొనసాగింది. ఫలితంగా ఓట్లు చీలడంతో టీఆర్ఎస్కు కలిసి వచ్చింది. ఇక బీజేపీకి ఓటు బ్యాంకు భారీగా పెరిగినట్లు అర్థమవుతోంది. ఇది టీఆర్ఎస్కు ఆందోళన కలిగించే అంశంగా భావిస్తున్నారు విశ్లేషకులు. ఇక రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచిన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో హస్తం పార్టీ హవా కొనసాగింది. ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్.. సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్సభ పరిధిలో తేలిపోయింది. ఇక పాతబస్తీలో ఊహించనట్లుగానే మజ్లిస్ స్ట్రాంగ్గా నిలిచింది. ఇక ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మజ్లిస్ మొత్తం తాను పోటీ చేసిన 51 స్థానాల్లో 42 చోట్ల గెలిచే చాన్స్ ఉంది. ఇక తెలంగాణలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయిందని బల్దియా ఎన్నికలు మరోసారి నిరూపించాయి. నామమాత్రపు ఓట్లతో సైకిల్ మూలకు పడింది. (చదవండి: గ్రేటర్ ఎన్నికల్లో సెంచరీ కొడతాం..) ఇక సిట్టింగ్ కార్పొరేటర్లపై ప్రజల్లో భారీగా ఆగ్రహం ఉన్నట్లు ఓట్ల శాతాన్ని బట్టి అర్థమవుతోంది. అధికార పార్టీపై ఆగ్రహాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకోవడంలో బాగానే సక్సెస్ అయ్యిందని చెప్పవచ్చు. దాంతో బీజేపీ బల్దియాలో భారీగా ఓటు శాతాన్ని పెంచుకుంది. ఇక రాబోయే రోజుల్లో తెలంగాణలో భారీ రాజకీయ మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు గ్రేటర్ ఎన్నికలు రుజువు చేశాయి. ఇక టీఆర్ఎస్కు ప్రత్యామ్నయం బీజేపీ అనే భావన ప్రజల్లో బలంగానే నాటుకుపోనుంది. ఇక బీజేపీ ఇదే జోష్ కొనసాగిస్తే.. తెలంగాణలో పార్టీ పుంజుకునే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఎగ్జిట్ పోల్స్లో టీఆర్ఎస్కే మొగ్గు
-
జీహెచ్ఎంసీ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్కే పట్టం కట్టాయి. ఇప్పటివరకూ వచ్చిన ఎగ్జిట్పోల్స్లో అధికారి పార్టీదే హవా. గతంలో కంటే సీట్లు తగ్గుతున్నా.. టీఆర్ఎస్ సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఓట్ల శాతం మెరుగ్గా ఉన్నా సీట్లలో బీజేపీ వెనకబడే ఛాన్స్ ఉంది. ఇక మజ్లిస్ పార్టీ 40 కంటే ఎక్కువ సీట్లలో గెలవనుంది. కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు స్వల్ప ఆధిక్యత లభించే అవకాశం ఉంది. ‘పీపుల్స్ పల్స్’ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాల ప్రకారం.. టీఆర్ఎస్కు 68-78 స్థానాలు, బీజేపీకి 25-35, ఎంఐఎంకు 38-42 స్థానాలు, కాంగ్రెస్కు 1-5 స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి. టీఆర్ఎస్ మ్యాజిక్ ఫిగర్ (76)కు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం టీఆర్ఎస్, బీజేపీకి మధ్య 6 శాతం ఓట్ల వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో సైలెంట్ వేవ్ కన్పిస్తోంది. ఈ వేవ్ పనిచేస్తే బీజేపీ మరింత లాభపడే అవకాశం ఉంది. ఆరా సర్వేలో టీఆర్ఎస్కు సొంతంగా అధికారం (78) పీపుల్స్ పల్స్ సర్వేలో బీజేపీకి టీఆర్ఎస్కు 68 నుంచి 78 సీపీఎస్సర్వేలో టీఆర్ఎస్కు భారీ మెజార్టీ (82 నుంచి 96) ఆత్మసాక్షి సర్వేలో టీఆర్ఎస్కు భారీ సీట్లు (82 నుంచి 88) వెల్లడైన అన్ని సర్వేల్లోనూ టాప్గా కనిపిస్తోన్న టీఆర్ఎస్ శాంతి భద్రతల అంశంలో టీఆర్ఎస్కు మార్కులు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపిన మహిళలు, వృద్ధులు కరోనా విషయంలో 57%పైగా టీఆర్ఎస్కు అనుకూలం వరద సాయం విషయంలో 51% టీఆర్ఎస్కు వ్యతిరేకం డబుల్ బెడ్రూం అంశంలో 39% టీఆర్ఎస్కు వ్యతిరేకం డ్రైనేజీ వ్యవస్థ, రహదారులపై 44% టీఆర్ఎస్కు వ్యతిరేకం బీజేపీకి అనుకూలంగా యువత, నిరుద్యోగులు పాతబస్తీలో పట్టు కొనసాగించిన మజ్లిస్ పార్టీ 12 నుంచి 14 సీట్లలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ -
ఎంఐఎం టార్గెట్ 50!
సాక్షి, హైదరాబాద్ : పక్కా స్కెచ్తో గ్రేటర్ ఎన్నికల బరిలోకి దిగిన పతంగి పార్టీ.. తాను అనుకున్న సీట్లలో గెలిచి సత్తా చాటుతాననే అంచనాల్లో ఉంది. పరిస్థితులు అనుకూలిస్తే తన పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలనేది ఆ పార్టీ వ్యూహం. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో పోటీ పడే స్థానాల మొదలు ప్రచార పర్వంలోనూ తమదైన వ్యూహాలను ఎంఐఎం నేతలు అనుసరించారు. ఈసారి మజ్లిస్ పోటీ చేస్తున్న డివిజన్లు 51 మాత్రమే.. అందులో కచ్చితంగా 50 గెలిచి తీరాలన్నది టార్గెట్.. అందుకే గెలిచేందుకు ఎక్కువ అవకాశమున్న డివిజన్లనే ఎంపిక చేసుకుని మరీ అభ్యర్థులను నిలిపింది. పక్కా ప్రణాళికతో ప్రచారం సాగించిన ఆ పార్టీ.. సదరు డివిజన్లలో గెలుపుపై లెక్కలు వేసుకుంటోంది. గతంతో పోలిస్తే ఈసారి ఎంఐఎం కాస్త భిన్నంగా వ్యవహరించింది. జనంలో తనపై ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావివ్వకుండా వ్యవహరించటంతోపాటు ప్రచారంలో మాటలను కూడా సూటిగా సంధించింది. అధికార పార్టీతో అనుకూలంగా ఉంటుందన్న ముద్ర ఆ పార్టీపై బలంగా ఉంది. అది కొంతవరకు చేటు చేస్తుందేమోనన్న సంశయంతో ఈసారి తన ప్రచారశైలితో దానికి చాన్స్ లేకుండా చేసింది. టీఆర్ఎస్తో పొత్తు, అవగాహన ఏమాత్రం లేదని ప్రజలకు చెబుతూ వచ్చింది. అటు టీఆర్ఎస్ అన్నిచోట్లా పోటీ చేస్తుండటమే దీనికి నిదర్శనమనే వాదనను వినిపించింది. అక్కడితో ఆగకుండా అవకాశం దొరికినప్పుడల్లా టీఆర్ఎస్పై మాటల దాడి చేసింది. తాము తలుచుకుంటే రెండు నెలల్లోనే రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందన్న మాటలు ఆ పార్టీ ఎమ్మెల్యేల నుంచి వినవచ్చాయి. అంతేకాక టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను అనుభవం లేని వ్యక్తిగా పేర్కొనడం కూడా ఇందులో భాగమేనన్నది రాజకీయ విశ్లేషకుల మాట. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్–మజ్లిస్లు బాహాబాహీకి దిగాయి. అధికార పార్టీపై స్వయంగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీనే విరుచుకుపడ్డారు. ఆ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో చివరి వరకు తీవ్రంగా పోరాడారు. ఒక్క ఓటు కూడా తన నుంచి చీలి కారు గుర్తుకు పోకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఫలితం అనుకూలంగా రాలేదు. అయినప్పటికీ, ఇప్పుడు బల్దియా ఎన్నికల్లో దాదాపు అదే పంథాను మజ్లిస్ వ్యవహరించింది. తనకు పట్టున్న చోట టీఆర్ఎస్కు సందివ్వకుండా మాటల దాడితో ఉక్కిరిబిక్కిరి చేసింది. బీజేపీ విమర్శలే తమ అస్త్రాలుగా.. గతంతో పోలిస్తే తాజా ఎన్నికల్లో బీజేపీ చాలా దూకుడుగా వ్యవహరించింది. కొద్ది రోజుల క్రితమే జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో సాధించిన విజయంతో బీజేపీ ఊపు మీద ఉంది. ఫలితాలు ఎలా వస్తాయో గానీ ప్రచారంలో మాత్రం ఆ పార్టీ చాలా దూకుడుగా వ్యవహరించింది. దీన్ని మజ్లిస్ అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నించింది. బీజేపీ సంధించే విమర్శలను తన అస్త్రాలుగా మలుచుకునే ప్రయత్నం చేసింది. ఇటీవల బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వాడిన ‘పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్’ను వీలైనంత ఎక్కువగా వినియోగించుకునే ప్రయత్నం చేసింది. అసదుద్దీన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ప్రచారంలో దీన్ని బాగా వాడుకున్నారు. బీజేపీ దూకుడుకు కళ్లెం వేయాలంటే ‘తాము’ఏకతాటిపై ఉండాలంటూ మైనారిటీ ఓటర్లలోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పనిలోపనిగా, మైనార్టీయేతర ఓట్లు ఎక్కువగా ఉండే డివిజన్లలో బడుగు బలహీన వర్గాలకు మజ్లిస్ పార్టీ అండగా ఉంటుందన్న కోణంలో ప్రచారం చేశారు. ప్రధాని మోదీ నుంచి స్థానిక బీజేపీ అభ్యర్థి వరకు.. ఎవరినీ వదిలిపెట్టకుండా విమర్శలను సంధించారు. కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని పేర్కొంటూ, ఆ పార్టీ సంప్రదాయ ఓట్లకు కూడా మజ్లిస్ నేతలు గాలం వేశారు. చక్రం తిప్పే చాన్స్ కోసం.. జీహెచ్ఎంసీ గత కౌన్సిల్ టీఆర్ఎస్కు సొంతంగా 99 స్థానాలున్నాయి. దీంతో మేయర్ సీటును సొంతంగా ఆ పార్టీ సాధించుకుంది. కానీ అంతకుముందు కౌన్సిల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు రాకపోవటంతో మజ్లిస్ సాయం తీసుకుంది. దీంతో మేయర్ స్థానాన్ని కాంగ్రెస్తో కలసి మజ్లిస్ పంచుకుంది. ఇప్పుడు కూడా అలాంటి చాన్స్ వస్తే బాగుంటుందనేది ఆ పార్టీ నేతల మాటలను బట్టి తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదైనా కారణం చేత టీఆర్ఎస్కు తక్కువ సీట్లొస్తే తాను కింగ్మేకర్ కావచ్చన్నది ఆ పార్టీ నేతల భావన. అది జరగాలంటే కచ్చితంగా 50 స్థానాల్లో గెలిచి సత్తా నిరూపించుకోవాలని పార్టీ నాయకులు టార్గెట్గా పెట్టుకున్నారు. హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే గౌలీపురా, ఘాన్సీబజార్, బేగంబజార్లలో గత ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఈసారి ఆ రెండుచోట్లా పాగా వేయాలని మజ్లిస్ పట్టుదలతో ఉంది. అదెంత వరకు నెరవేరుతుందో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. -
‘అక్కడ పాగా వేసేది బీజేపీనే..’
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ ఎవరి సొత్తు కాదని.. అక్కడ బీజేపీ పాగా వేయబోతుందని తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ మేయర్ పీఠం.. మజ్లిస్ సపోర్ట్తోనే టీఆర్ఎస్ దక్కించుకుందన్నారు. ఆ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తున్నాయని ఆయన విమర్శించారు. (చదవండి: సారు, కారు.. పదహారు అన్నది ఎవరు?) రేపు (ఆదివారం) బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారని తెలిపారు. ఆయన ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారని, అక్కడి నుండి నేరుగా భాగ్యలక్షి అమ్మవారి ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడి నుండి వారసిగూడా వెళ్తారన్నారు. సీతాఫల్ మండి హనుమాన్ టెంపుల్ వరకు రోడ్ షో ఉంటుందని పేర్కొన్నారు. అక్కడి నుండి నేరుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని పార్టీ నాయకులతో జరిగే సమావేశంలో పాల్గొంటారన్నారని ఆయన తెలిపారు.(చదవండి: జీహెచ్ఎంసీ ఎన్నికలు: గడప దాటి వచ్చేవారెందరు..?) -
అక్బరుద్దీన్కు కేటీఆర్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల పోరులో పార్టీలు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో ప్రచారానికి తెర పడనున్న తరుణంలో టీఆర్ఎస్, ఎంఐఎం ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటున్నారు. టీఆర్ఎస్పై ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ట్విటర్లో మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘‘మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ పీవీ నరసింహారావు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గార్లపై ఈ రోజు మజ్లిస్ అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన అనుచితమైన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు. (మీ తోక ఎలా తొక్కాలో తెలుసు: అక్బరుద్దీన్) ఈ ఇద్దరు నాయకులూ తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులనీ, ఒకరు ప్రధానిగా, మరొకరు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారని కేటీఆర్ తెలిపారు. అటువంటి మహానాయకులపై అనుచిత వ్యాఖ్యలు గర్హనీయమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యాఖ్యలకు చోటులేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మరోవైపు గ్రేటర్ ఎన్నికల్లో తమ సత్తా చాటాలనీ బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ తరుణంలో సవాళ్లు, ప్రతి సవాళ్లతో ప్రచారపర్వం వాడివేడిగా కొనసాగుతోంది. అటు ఇప్పటివరకు మిత్ర పక్షాలుగా ఉన్న టీఆర్ఎస్, మజ్లీస్ మధ్య తాజా దుమారం మరింత సెగలు రేపుతోంది. కాగా తాము తలచుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రెండు నెలల్లో కూల్చేయగలమని ఎంఐఎంఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ వ్యాఖ్యలు ఇప్పటికే అగ్గి రాజేశాయి. దీనికితోడు తాజాగా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అంశంపై టీఆర్ఎస్పై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి దమ్ముంటే హుస్సేన్ సాగర్ వద్దున్న ఎన్టీఆర్, పీవీ నరసింహారావు ఘాట్లను కూల్చేయాలని సవాల్ విసిరారు. ఎంఐఎంతో పొత్తు లేదని కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన తమకు ఎవరి కింద బతకాల్సిన దుస్థితి లేదంటూ ఆగ్రహించారు. అంతేకాదు అసెంబ్లీలో తోకను తొక్కి టీఆర్ఎస్ను ఎలా నిలబెట్టాలో, ఎలా కూర్చోబెట్టాలో తమకు తెలుసంటూ ఘాటుగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గార్లపై ఈ రోజు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన అనుచితమైన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాను. 1/2 — KTR (@KTRTRS) November 25, 2020 ఈ ఇరువురు నాయకులు కూడా తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులు. ఒకరు ప్రధానిగా, మరొకరు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారు. అటువంటి మహానాయకులపై అనుచిత వ్యాఖ్యలు గర్హనీయం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యాఖ్యలకు చోటులేదు. 2/2 — KTR (@KTRTRS) November 25, 2020 -
షాడో టీమ్స్.. ఎత్తుకు.. పై ఎత్తులు!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలప్పుడు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వేసే ఎత్తులకు ప్రత్యర్థులు పైఎత్తులు వేయడం మూమాలే. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఈ ఎత్తుల్ని తెలుసుకోవడం కోసం జీహెచ్ఎంసీ కార్పొరేటర్ అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ఓ వైపు తాము ప్రచారం చేసుకోవడంతో పాటు ప్రత్యర్థులపై కన్నేసి ఉంచుతున్నారు. ప్రత్యర్థులతో పాటు రెబల్స్ పైనా దృష్టి పెడుతున్నారు. మరికొందరైతే ఇంకో అడుగు ముందుకు వేసి ‘కోవర్ట్ ఆపరేషన్లు’ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పోటాపోటీ చర్యల నేపథ్యంలో ఎలాంటి అపశృతులు, శాంతిభద్రతల సమస్యలు, ఉద్రిక్తతలకు తావు లేకుండా పోలీసులు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. లోగుట్టు కనిపెట్టడానికే.. ప్రతి పార్టీ అభ్యర్థి పోటీదారుడిని వీలైనన్ని ఎక్కువ కోణాల్లో దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం ప్రచారం, ఎవరిని కలుస్తున్నారనే అంశాలతో పాటు వారికి సంబంధించిన అడ్డాలపై పూర్తి సమాచారం సేకరించడంపై దృష్టి పెడుతున్నారు. ప్రలోభాలకు అవసరమైన సామగ్రి, మద్యం, నగదు సమీకరణ పూర్తయిందా? వాటిని ఆయా అభ్యర్థులు ఎక్కడ దాచి ఉంచుతున్నారు? ఆ కోణంలో వీరికి సహకరిస్తున్నది ఎవరు? అనే అంశాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటున్నారని తెలిసింది. ఈ వివరాలు తెలిస్తే పోలీసులకు, ఎన్నికల సంఘానికి పరోక్షంగా సమాచారం ఇచ్చి వారిని దెబ్బతీయాలన్నది వీరి వ్యూహం అనేది నిర్వివాదాంశం. ప్రతి కదలికనూ గమనిస్తూ... రాజకీయ పార్టీల అభ్యర్థుల మధ్య కార్పొరేటర్ సీట్ల కోసం ఏర్పడిన విపరీతమై పోటీయే ఇలా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించేలా చేస్తోంది. దీనికోసం ప్రతి ఒక్కరూ ఎదుటి పార్టీ, పోటీ అభ్యర్థులు ఏం చేస్తున్నారనేది తెలుసుకోవడంపై దృష్టిపెట్టారు. వారు ఎవరిని ఎలా కలుస్తున్నారు? ఏమి హామీలు ఇస్తున్నారు? ప్రలోభాల పర్వం మొదలైందా? తదితర అంశాలు స్పష్టంగా తెలిస్తేనే వాటిని దీటుగా తిప్పికొట్టడంతో పాటు ఓటర్లు వారి వైపు ఆకర్షితులు కాకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందనేది అభ్యర్థుల భావన. దీనికోసం వారు అందుబాటులో ఉన్న ఉన్ని అవకాశాలనూ వినియోగించుకుంటూ ప్రత్యర్థులు, రెబల్స్కు చెందిన ప్రతి కదలికనూ గమనిస్తున్నారు. నమ్మినవారికే ఆ బాధ్యతలు... తమ వ్యూహాన్ని అమలులో పెట్టేందుకు ప్రస్తుతం అభ్యర్థులకు అవకాశం లేదు. వారు ప్రచార హడావుడిలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వారు తమకు నమ్మినబంటుగా ఉండే తమ అనుచరులకు ఈ బాధ్యతల్ని అప్పగిస్తున్నారు. వీరు తమ అభ్యర్థి కోసం పని చేసినా, చేయకున్నా... ఎదుటి అభ్యర్థి ఏం చేస్తున్నాడనేది తెలుసుకోవడంపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరికొందరితో కలిసి షాడో టీమ్స్ మాదిరిగా పని చేస్తూ ఎప్పటికప్పుడు తమ వారికి అప్డేట్స్ అందిస్తున్నారు. నిత్యం పోటీదారుపై కన్నేసి ఉంచాల్సిన బాధ్యతల్ని ఈ షాడో టీమ్స్కు అప్పగిస్తున్నారని సమాచారం. ఆ ‘కుట్ర’లకూ తెగబడుతూ? తన వేగుగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి వెంట తిరిగే వ్యక్తిని అతడు గుర్తించకుండా అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే జరిగితే మొదటికే మోసం వస్తుందని కొత్తవారిని రంగంలోకి దింపితే వారికి స్థానిక రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఉండదు. వీటిని దృష్టిలో పెట్టుకున్న కొందరు అభ్యర్థులు ఏకంగా కోవర్ట్ ఆపరేషన్లు ప్రారంభించారు. పోటీదారుడి వెనుక తిరుగుతున్న, అతడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులకు వివిధ రకాలైన ఎరలు వేస్తున్నారని తెలిసింది. వారి నుంచే ప్రత్యర్థులు/రెబల్స్ సమాచారం సేకరిస్తున్నారని తెలిసింది. ఇలా కోవర్ట్ ఆపరేషన్లకు సహకరించే వారికి భారీగానే నజరానాలు ముడుతున్నాయని వినిపిస్తోంది. -
జీహెచ్ఎంసీ ఎన్నికలు: రచ్చ రంబోలా
సాక్షి, హైదరాబాద్: చలికాలంలోనూ మహానగరం రాజకీయ నాయకుల మాటల దాడులు, ప్రతిదాడులతో వేడెక్కుతోంది. గతానికి భిన్నంగా నగర ఓటర్లలో చీలిక తెచ్చే యత్నాలతో ప్రధాన పార్టీలు మాటల తూటాలు పేలుస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర్నుంచి అధికార టీఆర్ఎస్పై తనదైన శైలిలో దాడి చేస్తున్న బీజేపీ సర్జికల్ స్ట్రైక్స్ కామెంట్తో పెద్ద దుమారానికి తెర లేపింది, రాజకీయ అలజడిని సృష్టించింది. దీన్ని అధికార పార్టీ అస్త్రంగా మలుచుకుని రివర్స్ అటాక్కు దిగింది. కాంగ్రెస్ సైతం తానేం తక్కువ కాదని దూకుడు పెంచింది. మరోవైపు ఎంఐఎం సవాల్తో గొంతెత్తింది. కౌంటర్లు.. అటాక్లతో.. భాగ్యనగరం రంగస్థలమైంది. మాటల రణక్షేత్రంగా మారింది. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులకు అందనంత స్పీడ్తో దూసుకుపోతున్న టీఆర్ఎస్ బీజేపీపైనే ప్రధాన విమర్శలు ఎక్కుపెడుతోంది. గడచిన ఆరేళ్లలో కర్ఫ్యూ లేని నగరంగా.. ప్రపంచ దేశాల్లోనే అగ్రగామి నగరంగా హైదరాబాద్ ముందుకు వెళుతోందని, మరో ఐదేళ్లు అధికారం ఇస్తే నగర ప్రగతికి హద్దులువండవని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. బీజేపీకి పగ్గాలు అప్పగిస్తే అభివృద్ధి స్థానంలో అరాచకం, విధ్వంసం వస్తాయని.. నగర ప్రజలు అభివృద్ధి వైపా? అరాచకం వైపా? తేల్చే సమయం ఆసన్నమైందని పేర్కొంటున్నారు. పచ్చని హైదరాబాద్లో చిచ్చు పెడతారా?: టీఆర్ఎస్ ⇔ ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ కావాల్నా? రోజూ తెల్లారి లేస్తే పంచాయితీ పెట్టుకునే హైదరాబాద్ కావాల్నా? అభివృద్ధి కావాలా.. అరాచకం కావాలా? ⇔ గల్లీలో జరిగే ఎన్నికలకు ఢిల్లీ నుంచి దిగుతున్నారు. టీఆర్ఎస్ను చూస్తుంటే బీజేపీ పెద్దలకు భయమేస్తోంది. ముషీరాబాద్లో బీజేపీ, ఎంఐఎంలను కలిపి కొట్టాలి. ⇔ హైదరాబాద్పై సర్జికల్ స్ట్రైక్ చేస్తారా? పచ్చని హైదరాబాద్లో చిచ్చుపెడతారా? కొన్ని సీట్లు, ఓట్ల కోసం కోటిమంది హైదరాబాదీయులను బలితీసుకుంటారా? పచ్చని హైదరాబాద్ను పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలతో పోలుస్తారా? ధైర్యం టీఆర్ఎస్.. హైదరాబాద్పై సర్జికల్ స్ట్రైక్ చేస్తారా? పచ్చని హైదరాబాద్లో చిచ్చుపెడతారా? కొన్ని సీట్లు, ఓట్ల కోసం కోటిమంది హైదరాబాదీయులను బలితీసుకుంటారా? పచ్చని హైదరాబాద్ను పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలతో పోలుస్తారా? ధైర్యం ఉంటే పేదరికంపై, మత విద్వేషాలపై, నిరుద్యోగ సమస్యపై సర్జికల్ స్ట్రైక్స్ చేయండి. కమలం పార్టీ.. బీజేపీని గెలిపిస్తే పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తాం. పాతబస్తీలోని పాకిస్థానీలు, బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, బచ్చాగాళ్లు, బఫూన్ గాళ్లు ఓట్లు వేస్తున్నారు. వారిని రిమికొడతాం. హిందూస్థాన్ భాగ్యనగరం కావాలా? పాకిస్థాన్ భాగ్యనగర్ కావాలా? దేశభక్తి పార్టీ బీజేపీ కావాలా? దేశద్రోహి పార్టీలైన టీఆర్ఎస్, ఎంఐఎం కావాలా? కాంగ్రెస్.. టీఆర్ఎస్ మేనిఫెస్టో చెత్తబుట్టలో చిత్తు కాగితంలాంటిది. కరోనాతో ప్రజలు చనిపోతుంటే కేసీఆర్ ఫామ్హౌస్లో ఉన్నాడు. 100 ఏళ్ల తర్వాత పెద్ద ఎత్తున వరదలు వస్తే.. బాధితులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని టీఆర్ఎస్ నేతలు పందికొక్కుల్లా మేశారు. టీఆర్ఎస్, బీజేపీలది తెరచాటు దోస్తానా. ఎంఐఎం.. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ కాదు.. కమలనాథులు దమ్ముంటే భారత్సరిహద్దులో తిష్టవేసిన చైనా సైన్యంపై సర్జికల్ స్ట్రైక్ చేయాలి. టీఆర్ఎస్తో దోస్తీ లేదు ఇక ఫైటే. కేటీఆర్ ఒక చిలుక.. నిన్న కళ్లు తెరిచాడేమో ఎక్కువ మాట్లాడుతున్నాడు. మాకు కుర్చీలో కూర్చోబెట్టడం తెలుసు.. పడేయడమూ తెలుసు. -
టీఆర్ఎస్తో పొత్తు లేదు: అసదుద్దీన్ ఒవైసీ
-
ఎంఐఎంకు మేయర్ పదవి..
సాక్షి, కరీంనగర్: భాగ్యనగరంను ఎంఐఎంకు ధారాదత్తం చేసేందుకు అధికారి పార్టీ టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... దుబ్బాక ప్రజలు గుణపాఠం చెప్పినా టీఆర్ఎస్కు బుద్దిరాలేదని విమర్శించారు. ఎంఐఎంకు మేయర్ పదవి కట్టబెట్టేందుకు టీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకుందన్నారు. 63 డివిజన్లలో హిందువుల ఓట్లు తగ్గించి మైనార్టీ ఓట్లు పెంచారని చెప్పారు. ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసిందని తెలిపారు. అయితే ఎన్నికల సంఘం అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలి కానీ అలా జరగలేదన్నారు. (చదవండి: సంక్రాంతికి ‘జీహెచ్ఎంసీ’ గిఫ్ట్ ఇస్తారు..) రాష్ట్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్ చేతిలో కీలుబొమ్మగా మారిందని, ఎంఐఎం చెబితే టీఆర్ఎస్, టీఆర్ఎస్ చెబితే ఎన్నికల సంఘం వింటుందన్నారు. ఎంఐఎంకు మేయర్ పదవి దక్కుండా చూస్తామని, బీజేపీ 100 స్థానాల్లో గెలిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం, టీఆర్ఎస్ల నుంచి భాగ్యనగరాన్ని కాపాడుకుంటామని, బీహార్లో ఎంఐఎం 5 ఆసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడానికి సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం చేశారన్నారు. దేశవ్యాప్తంగా ఎంఐఎం విస్తరించేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, హిందువుల పండగల పట్ల ప్రభుత్వం వివక్షత చూపుతోంది ఆయన అన్నారు. దీపావళికి టపాసులు కాల్చకుండా నిషేధించడం హిందువుల పండగలను చూలకన చేయడమే అని బండి సంజయ్ పేర్కొన్నారు. (చదవండి: హైదరాబాద్ను ఏం చేద్దాం అనుకున్నారు..) -
బిహార్ ఎన్నికల్లో సత్తా చాటిన ఎంఐఎం
సాక్షి, హైదరాబాద్: బిహార్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ సత్తా చాటింది. ఐదు స్థానాలను కైవసం చేసుకోవటం ద్వారా తెలంగాణ బయటా కీలకంగా మారుతోందని చాటి చెప్పింది. 2015లో జరిగిన బిహార్ సార్వత్రిక ఎన్నికల్లో ఐదుచోట్ల తన అభ్యర్థులను బరిలో దింపి అదృష్టాన్ని పరీక్షించుకున్నా ఒక్క స్థానమూ దక్కలేదు. 2019లో కిషన్గంజ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే లోక్సభకు పోటీ చేయటంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి మజ్లిస్ గెలుపొందడం ద్వారా బిహార్లో బోణీ కొట్టింది. ఆ గెలుపు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తాజా ఎన్నికల్లో గ్రాండ్ డెమొక్రాటిక్ సెక్యులర్ ఫ్రంట్ (జీడీఎల్ఎఫ్)తో జత కట్టి 20 స్థానాల్లో అభ్యర్థులను నిలిపారు. ఇందులో ఐదుగురు గెలిచారు. అమోర్ నియోజకవర్గం నుంచి మజ్లిస్ పార్టీ బిహార్ రాష్ట్ర అధ్యక్షుడు అక్తరుల్ ఇమాన్ 49.75 శాతం ఓట్లు సాధించి గెలుపొందారు. మూడుచోట్ల గెలుపు అవకాశాలు ఉంటాయని ముందు నుంచీ పార్టీ నేతలు భావించారు. కానీ ఐదు సీట్లు రావటంతో ఆ పార్టీలో పండుగ వాతావరణం నెలకొంది. అయితే, 2019 ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కిషన్గంజ్లో ఓటమి చవిచూడటం గమనార్హం. మహారాష్ట్ర,ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో మాత్రం అడుగు పెట్టింది. పూర్తి ఫలితాల తర్వాతే మద్దతుపై నిర్ణయం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బిహార్ ఎన్నికల పూర్తిస్థాయి ఫలితాలు వెలువడిన అనంతరం ఏర్పడనున్న పరిస్థితులను బట్టి.. ఎవరికి మద్దతు ఇవ్వాలన్న విషయంపై తగిన నిర్ణయం తీసుకుంటామని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. సిమాంచల్ అభివృద్ధి కోసమే తమ పోరాటమని స్పష్టం చేశారు. మంగళవారం నగరంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన బిహార్లో ఎంఐఎం సాధించిన విజయం చాలా గొప్పదన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
మజ్లిస్ మాజీ ఎమ్మెల్యేపై కేసు..
సాక్షి, కరీంనగర్: మహారాష్ట్రకు చెందిన మజ్లిస్ పార్టీ(ఎంఐఎం) మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్ పై మంగళవారం కరీంనగర్లో కేసు నమోదైంది. గత ఫిబ్రవరిలో హిందువుల పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ నాయకులు విమర్శిస్తు పోలీసులను ఆశ్రయించారు. కాగా పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బీజేపీ నాయకులు, న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి కరీంనగర్ కోర్టులో ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదును స్వీకరించి న్యాయమూర్తి సాయిసుధ కేసు నమోదు చేసి విచారణ జరపాలని త్రీ టౌన్ పోలీసులను ఆదేశించారు. న్యాయమూర్తి ఆదేశంతో త్రీటౌన్ ఎస్ఐ రామ్, మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్ పై 121, 121-A, 124-A, 153, 153-A, 153-B, 295-A, 298, 505, 506 పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. -
కేసీఆర్ తీర్మానం : వ్యతిరేకించిన ఎంఐఎం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముద్దుబిడ్డ, భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంంత్రి కే చంద్రశేఖరరావు సంబంధిత తీర్మానాన్ని మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. దీనిపై అధికార పార్టీకి చెందిన సభ్యులతో పాటు, విపక్ష కాంగ్రెస్ సభ్యులు సైతం ప్రసంగించి తీర్మానానికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా దేశ ప్రధానిగా పీవీ చేసిన సేవలను కొనియాడారు. ఆయన సేవలను గుర్తించిన భారతరత్న పురస్కారం ఇవ్వాల్సిందేనని ముక్తకంఠంగా డిమాండ్ చేశారు. నూతన ఆర్థిక సంస్కరణల సృష్టికర్త పీవీ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ లభించాల్సిన గౌరవం దక్కలేదన్నారు. ఏడాది పాటు పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. (పీవీ నరసింహరావుకు భారతరత్న ఇవ్వాలి: కేసీఆర్) అయితే సీఎం ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని టీఆర్ఎస్ మిత్రపక్షమైన ఎంఐఎం వ్యతిరేకించడం గమనార్హం. పీవీకి భాతతరత్న ఇవ్వాలన్న తీర్మాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించిన మజ్జీస్ పార్టీ ఆ సమయంలో సభ నుంచి వాకౌట్ చేసింది. అయినప్పటికీ తీర్మాన్నీ సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేశారు. బుధవారం నుంచి అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు ప్రారంభం కానున్నాయి. -
భారత్ను హిందూదేశంగా మార్చే శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్ : భారతదేశాన్ని హిందూ దేశంలా మార్చే ప్రయత్నం జరుగుతోందని, అయోధ్యలో రామమందిరానికి భూమిపూజ జరిగిన తీరే దీనికి నిదర్శనమని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ప్రజాస్వామ్య, లౌకిక విధానానికి కట్టుబడి ఉంటానని ప్రధానమంత్రి హోదాలో ప్రమాణం చేసిన నరేంద్ర మోదీ ఇప్పుడు దాన్ని ఉల్లంఘించారన్నారు. వందల ఏళ్లనాటి మసీదును కూల్చి ఆ స్థలంలో రామ మందిరాన్ని నిర్మిస్తున్నట్టే కాశీ, మధుర సహా దేశంలోని పలు ప్రాంతాల్లో మసీదులను కూల్చే ప్రయత్నం కచ్చితంగా ప్రారం భమవుతుందన్నారు. బుధవారం సాయంత్రం ఆయన మజ్లిస్ పార్టీ ప్రధాన కార్యాలయం దారుసలాంలో విలేకరులతో మాట్లాడారు. నరేంద్రమోదీ ఏ ఒక్క మతానికీ ప్రధానమంత్రి కాదని, ఈ దేశానికి ఏ మతమంటూ లేనందున రామమందిరం భూమిపూజలో ఎలా పాల్గొంటారని ఆయన ప్రశ్నించారు. పైగా అయోధ్య రామమందిరం భారతదేశానికి సింబల్గా ఉంటుందనటం దారుణమన్నారు. రామమందిరం భూమిపూజ కోసం ప్రధాని ఓ వెండిరాయితో చేసిన శంకుస్థాపనను తాను భారత్ను హిందుత్వ దేశంగా మార్చే ప్రక్రియకు శంకుస్థాపనగా భావిస్తున్నట్టు వెల్లడించారు. భూమిపూజ జరిగిన ఆగస్టు 5ను ప్రధాని ఏకంగా పంద్రాగస్టుతో జోడిస్తూ మాట్లాడటం మరీ దారుణమన్నారు. 2 శతాబ్దాలపాటు పాలించిన ఆంగ్లేయులపై గెలుపునకు గుర్తుగా పంద్రాగస్టు నిర్వహిస్తున్నామని, మరి దేనిపై గెలుపుగా ఆగస్టు 5ను గుర్తుగా పేర్కొంటారని ప్రశ్నించారు. లౌకికవాదంపై హిందూత్వ విజయమా? అని ఎద్దేవా చేశారు. ప్రధాని పాల్గొన్న వేదికపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్భాగవత్ ఉండటమే దీనికి నిదర్శనమన్నారు. కొత్త భారత్ను ఆవిష్కరిస్తున్నట్టు ప్రధాని చెప్పడం వెనుక మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చే కుట్ర ఉన్నదని ఆరోపించారు. సెక్యులర్ పార్టీలుగా పేర్కొనే పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ భూమిపూజ జరిగిన రోజును సోదరభావానికి ప్రతీకగా పేర్కొనటం మరీ దారుణమన్నారు. 1992 వరకు నమాజ్ చేసిన ప్రాంతంలో, ముస్లింల సమాధులున్న చోట మందిరం నిర్మిస్తున్నారని, తానిప్పటికీ దాన్ని మసీదుగా భావిస్తున్నానని, భవిష్యత్తులోనూ అలాగే భావిస్తానన్నారు. సచివాలయంలో అదేచోట మసీదు నిర్మించాలి కొత్తగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయంలో మసీదు నిర్మాణంపై ముఖ్యమంత్రి తమకు డెడ్లైన్తో సహా స్పష్టమైన హామీ ఇవ్వాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు. పాత సచివాలయంలో మసీదు ఉన్న ప్రాంతంలోనే తిరిగి మసీదును నిర్మించాలన్నారు. ఇప్పటికే దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామని, త్వరలో ఆయనతో భేటీ కానున్నట్టు చెప్పారు. -
ఇక నటించనందుకు సంతోషం
సాక్షి, హైదరాబాద్: అయోధ్యలో రామమందిర నిర్మాణ అంశంపై కాంగ్రెస్ నటించనందుకు సంతోషమని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎద్దేవా చేశారు. అయోధ్య అంశంపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి సంకేతంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ మంగళవారం చేసిన ట్వీట్పై ఒవైసీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ హిందూత్వ భావజాలాన్ని స్వీకరించాలనుకుంటే ఫర్వాలేదని, కానీ, జాతీయ ఐక్యత, సాంస్కృతిక సమ్మేళనం, సోదరభావం లాంటి వ్యాఖ్యలెందుకని దుయ్యబట్టారు. చరిత్రాత్మక బాబ్రీ మసీదు కూల్చివేతకు కాంగ్రెస్ చేసిన కృషికి సిగ్గుపడవద్దు....గర్వపడమని ఎద్దేవా చేశారు. ఇప్పటికే అయోధ్య రామమందిర నిర్మాణ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిద్ధమవడంపై ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక వర్గానికి చెందిన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మోదీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. లౌకిక సూత్రానికి కట్టుబడి విధులు నిర్వర్తిస్తానంటూ రాజ్యాంగంపై ప్రమాణంచేసి దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారని, ఇప్పుడు ఆ ప్రమాణాన్ని ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ 6న ఓ క్రిమినల్స్ గుంపు ధ్వంసం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. లౌకికత్వం రాజ్యాంగంలో ముఖ్యభాగమని, దానిని అందరూ తప్పనిసరిగా గౌరవించాలని హితవు పలికారు. -
కేటీఆర్ ఫైర్.. 20 వేల జరిమానా
ఎర్రగడ్డ : ఎవరు ఇక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది...నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని చెప్పాం కదా...అయినా ఎందుకు ఏర్పాటు చేశారంటూ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రగడ్డ డివిజన్ పరిధిలోని సుల్తాన్నగర్బస్తీ ప్రాంతంలో శుక్రవారం మంత్రి కేటీఆర్ బస్తీ దవాఖానాను ప్రారంభించారు. ఇందుకోసం మద్యాహ్నం 12 గంటల సమయంలో అక్కడకు కేటీఆర్ కారు దిగగానే రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీని తొలగిస్తే తప్ప తాను బస్తీ దవాఖానాను ప్రారంభించేది లేదని అధికారులకు తెలిపారు. అప్పటికప్పుడు జీహెచ్ఎంసీ సర్కిల్–19 డీఎంసీ రమేష్ను, ఏఎంఓహెచ్ డాక్టర్ బిందును పిలిపించి వివరాలు తెలుసుకున్నారు. ఫ్లెక్సీని ఏర్పాటు చేయించిన స్థానిక కార్పొరేటర్ షహీన్ బేగంకు అప్పటికప్పుడు రూ.20 వేలు జరిమానాను విధించారు. ఇందుకు సంబంధించిన రసీదును అధికారులు కార్పొరేటర్కు అందజేశారు. అనంతరం మంత్రి కేటీఆర్ స్థానికంగా ఏర్పాటు చేసిన దవాఖానాను ప్రారంభించారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
బహదూర్పుర ఎమ్మెల్యేకు గుండెపోటు
సాక్షి, హైదరాబాద్ : బహదూర్పుర ఎమ్మెల్యే మొజంఖాన్కు గుండెపోటు వచ్చింది. దీంతో అతని కుటుంబ సభ్యులు హుటాహుటిన నానల్నగర్ ఆలివ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐసీయూలో ఉంచి మొజంఖాన్కు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బహదూర్పుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎంఐఎం శాసన సభ్యుడిగా మొజంఖాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
సీఏఏపై చర్చ.. బిల్లు పేపర్లు చించేసిన ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. సీఏఏను వ్యతిరేకిస్తూ సోమవారం తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రకటన చేశారు. దీంతో ఆగ్రహించిన రాజాసింగ్ పాస్ చేసిన బిల్లు పేపర్లను చించివేస్తూ నిరసన తెలిపారు. రాజాసింగ్ మాట్లాడుతున్న సమయంలో స్పీకర్ మైక్ కట్ చేయడంతో సభ నుంచి వెళ్లిపోయారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. కేవలం ఎంఐఎం దృష్టిలో మంచి మార్కులు తెచ్చుకునేందుకే సీఏఏకు టీఆర్ఎస్ వ్యతిరేకంగా తీర్మానం చేసిందని ధ్వజమెత్తారు. సీఏఏ వల్ల ఎవరికైనా అన్యాయం జరుగుతుందని నిరూపిస్తే రాజీనామా చేసి, తెలంగాణ నుంచి వెళ్లిపోతానని ప్రకటించారు. (దేశానికి ఈ చట్టం అవసరం లేదు: కేసీఆర్) సభలో ఎంఐఎం గంటసేపు మాట్లాడారని, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వరా అని రాజాసింగ్ ప్రశ్నించారు. ఈ చట్టం వల్ల దేశంలోని మైనార్టీలకు సమస్య లేదని అమిత్షా తెలిపారని అన్నారు. ఎంఐఎం పార్టీని ఖుషీ చేయాలనే కేసీఆర్ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. ఎంఐఎం ఏది చెబితే సీఎం అదే చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణలో కర్ఫ్యూ తరహాలో భయానక వాతావరణం సృష్టించి సమగ్ర కుటుంబ సర్వే చేయించారని విమర్శించారు. తెలంగాణ వివరాలు కేంద్రానికి వెళ్లవద్దని కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. (రాక్షసుల్లా తయారయ్యారు) ‘‘ముఖ్యమంత్రికి ఇంత కూడా తెలివి లేదా. ఎన్నార్సీపై ఇంకా నిర్ణయం కాలేదు. దానిపైన కూడా వ్యతిరేకిస్తూ తీర్మానం చేసారు. దేశం అనాథాశ్రమం కాదు.1985లో రాజీవ్ ప్రధానిగా ఉన్నప్పుడే ఎన్నార్సీ తెచ్చారు. సీఏఏ.. ఎన్పీఆర్.. ఎన్ఆర్సీకి సబంధం లేదు. ఎంఐఎంకు గులాంగిరి చేసే విధంగా సీఎం వ్యవహరిస్తున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలు తిరిగి ప్రజలకు వాస్తవాలు తెలియ జేస్తాం. ప్రజలపై ఒత్తిడి తీసుకు వచ్చి తీర్మానాన్ని ఉపసంహరించుకునేలా చేస్తాం. ఈ తీర్మానం ఫాల్తూ రిజల్యూషన్. ఇది ఎందుకు పనికి రాని తీర్మానం.’’ అని టీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
ఎంఐఎంను ఎందుకు కట్టడి చేయట్లేదు?
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పెరుగుతున్న ఆదరణ చూసి సహించలేక కుహనా మేధావులు, కుహన లౌకికవాదులు కడుపుమంటతో దేశ ప్రతిష్ఠను దిగజార్చేలా ఢిల్లీలో హింసాత్మక ఆందోళనలు సృష్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ ఆరోపించారు. బుధవారం మీడియాసమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ అల్లర్లను అదుపు చేసేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో పకడ్బందీ చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ఇక్కడ తెలంగాణలో మజ్లిస్ పార్టీ, ఎంఐఎం నేతలు సీఏఏకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ, ఓ వర్గంలో విష బీజాలు నాటుతుంటే సీఎం కేసీఆర్ వారిని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారని నిలదీశారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్, కమ్యూనిస్టులు, మోదీ వ్యతిరేక శక్తులు అల్లర్లకు కుట్ర పన్నాయన్నారు.ట్రంప్ పర్యటన సమయంలో ‘ఈశాన్య ఢిల్లీలో దాడులు జరగడానికి కారణమేంటి..? గత కొన్ని రోజులుగా ఆందోళన జరుపుతున్నా.. ట్రంప్ రాకతోనే వారి చేతుల్లోకి తుపాకులు ఎలా వచ్చాయి..? కాల్పులు జరపమని పోలీసులకు ఆదేశాలు రాలేదన్నారు. మరి ఈ కాల్పులు ఎవరు జరిపారు? ’ఈ ప్రశ్నలకు సమాధానం లేదని చెప్పారు. తెలంగాణలో సీఏఏకు మతం రంగు పులిమి ఎంఐఎం నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ప్రజల మధ్య విష బీజాలు నాటుతుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారు..? మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదు..?అని ప్రశ్నించారు. కిషన్రెడ్డి, జయశంకర్లకు విజ్ఞప్తి... టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రీస్కో నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజా గవిని, దివ్య తో పాటు మరొకరు ప్రేమ్ నాథ్ రామ్ నాథ్ మరణించడం పట్ల లక్ష్మణ్ దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. వారి మృతదేహాలను భారత్కు తెప్పించే విధంగా తగిన సహాయ సహకారాలు అందించవలసిందిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్లకు లక్ష్మణ్ ఫోన్లో కోరారు. -
ఏపీ ఉద్యోగులకు సీఎం జగన్ అండగా నిలిచారు: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: ఏపీలో ఉద్యోగులకు ఐఆర్ ఇచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారికి అండగా నిలిచారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ గురువారం తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఉద్యోగ సంఘాల నేతలు.. పదవులకు కక్కుర్తి పడి ఉద్యోగులను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగులను పణంగా పెట్టి పదవులు దక్కించుకున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బెదిరింపు చర్యలకు పాల్పడుతుందని అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కై సీఏఏ పై అనవసర రాద్దాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మార్చి 15 న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారని లక్ష్మణ్ వెల్లడించారు. -
ప్రధాని మోదీపై అసదుద్దీన్ ఒవైసీ ధ్వజం
కర్నూలు (ఓల్డ్సిటీ): ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగితే డబ్బు లేదని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. అస్సాంలో ఎన్పీఆర్ అమలు కోసం రూ. 65 వేల కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఎన్ఆర్సీ, ఎన్పీఆర్కు వ్యతిరేకంగా ఆదివారం రాత్రి కర్నూలులో లతీఫ్లావుబాలీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ముస్లింలను భారతదేశ పౌరులుగా చూస్తున్నామంటూ ఒకవైపు బహిరంగ సభల్లో చెబుతున్న మోదీ.. మరోవైపు వారిపై పరోక్షంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లింల కోసం ప్రవేశపెట్టిన 4 శాతం రిజర్వేషన్ కేసు సుప్రీం కోర్టులో త్వరలో విచారణకు రానుందని, ముస్లింల అభ్యున్నతికి ఉపకరించే ఆ బిల్లుపై మంచి న్యాయవాదులను పెట్టి వాదించాలని తాను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి, ఎంపీ విజయసాయిరెడ్డికి సూచించానని తెలిపారు. తన ప్రతిపాదనపై వారు సానుకూలత వ్యక్తం చేశారన్నారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెపుతున్నానని చెప్పారు. అలాగే ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా కేరళ తరహాలో తీర్మానం చేయాలని ముఖ్యమంత్రిని కోరతానన్నారు. కార్యక్రమంలో కర్నూలు శాసనసభ్యుడు హఫీజ్ఖాన్, జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు రహీముద్దీన్ అన్సారి, వివిధ దర్గాల అధిపతులు పాల్గొన్నారు. -
ఉత్కంఠ వీడింది; ఆ పార్టీలోకి ఇద్దరు జంప్..!
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ మేయర్ పదవిని దక్కించుకునేందుకు అధికార టీఆర్ఎస్కు మార్గం సుగమమైనట్టు తెలుస్తోంది. మొత్తం 60 డివిజన్లలో 13 స్థానాల్లో గెలుపొందిన టీఆర్ఎస్కు ఎంఐఎం (16) మద్దతు ఇవ్వనుంది. దీంతోపాటు కాంగ్రెస్ నుంచి గెలిచిన ఓ కార్పొరేటర్, మరో ఇండిపెండెంట్ కార్పొరేటర్ గులాబీ గూటికి చేరాడు. ఇక ఆరుగురు ఎక్స్ అఫిషియో సభ్యుల మద్దతుతో టీఆర్ఎస్ బలం 37కి చేరింది. 67 మంది సభ్యుల ఓట్లతో మేయర్ ఎన్నిక జరుగనుంది. మేయర్ పదవి దక్కాలంటే ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిసి సంఖ్యా బలం 34 ఉండాలి. 37 మంది సభ్యులతో గులాబీ పార్టీ ముందు వరుసలో ఉంది. మేయర్ పదవి టీఆర్ఎస్కు, డిప్యూటీ మేయర్ పదవి ఎంఐఎంకు కేటాయించేలా ఒప్పందం కుదిరినట్టు తెలిసింది. మేయర్ పీఠం కోసం ముగ్గురి మధ్య తీవ్ర పోటీ నెలకొనగా.. ఒకరి పేరును టీఆర్ఎస్ అధిష్టానం ఫైనల్ చేసినట్టు సమాచారం. (చదవండి : నిజామాబాద్ కార్పొరేషన్కు లైన్క్లియర్) ఇదిలాఉండగా... 28 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పక్షంగా బీజేపీ అవతరించిన్పటికీ సరిపడినంత మెజారిటీ దక్కలేదు. కాంగ్రెస్ రెండు డివిజన్లలో, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఈ నేపథ్యంలో.. మేయర్ కోసం కావాల్సిన మేజిక్ ఫిగర్ తమకు రాలేదని.. టీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుతో పాటు ఎక్స్అఫీషియా సభ్యులు ఓటింగ్ పరంగా కూడా గులాబీ పార్టీకే ఎక్కువ బలం ఉన్నందున తాము వెనక్కి తగ్గుతున్నామని ఎంపీ అరవింద్ ఆదివారం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం 11 గంటలకు కార్పొరేటర్ల ప్రమాణం, 12:30 నుంచి మేయర్ ఎన్నిక ప్రక్రియ, తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభ కానుంది. (చదవండి : 28 స్థానాలతో అతిపెద్ద పార్టీగా బీజేపీ) -
మోదీ ప్రభుత్వ విధానాలపై ఎంఐఎం ఫైర్
-
మేయర్ పీఠం వద్దు.. ప్రతిపక్షంలో ఉంటాం
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్పై నెలకొన్న ప్రతిష్టంభన వీడింది. తాము ప్రతిపక్షంలో కూర్చుంటామని స్థానిక బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆదివారం ప్రకటించారు. మేయర్ కోసం కావాల్సిన మేజిక్ ఫిగర్ తమకు రాలేదని అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుతో పాటు ఎక్స్అఫీషియా సభ్యులు ఓటింగ్ పరంగా కూడా టీఆర్ఎస్కు ఎక్కువ బలం ఉన్నందున తాము వెనక్కి తగ్గుతున్నామని అరవింద్ పేర్కొన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మేయర్ స్థానం ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠగా మారిన విషయం తెలిసిందే. మొత్తం 60 డివిజన్లలో 28 స్థానాల్లో గెలుపొంది బీజేపీ ఆధిక్యాన్ని సాధించింది. టీఆర్ఎస్కు 13 స్థానాలు దక్కగా, ఎంఐఎం 16, కాంగ్రెస్ రెండు, స్వతంత్ర అభ్యర్థి మరో డివిజన్లో గెలుపొందారు. దీంతో మేయర్ పీఠం కోసం ఉన్న అవకాశాలను పరిశీలించిన అరవింద్.. కష్టతరంగా మారటంతో ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధపడ్డారు. దీంతో టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి కార్పొషన్ మేయర్ను కైవసం చేసుకోనున్నాయి. దీని కోసం ఇప్పటికే ఇరుపార్టీల నేతలు మంతనాలు ప్రారంభించాయి. నిజామాబాద్లో మద్దతు ఇస్తే తమకు బోధన్ మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని ఎంఐఎం పట్టుపడుతున్నట్లు సమాచారం. (టీఆర్ఎస్తో ఎంఐఎం జతకట్టే అవకాశం!) ఆదివారం నిజామాబాద్లో ఏర్పాటు చేసిన మీడియాసమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అవినీతి అక్రమాలను అడ్డుకుని అభివృద్ధికి పాటు పడతామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారు. కేసీఆర్కు దమ్ముంటే సీఏఏను అడ్డుకుని తీరాలని సవాల్ విసిరారు. సీఏఏపై తీర్మానం చేసే హక్కు అసెంబ్లీకి లేదని, పార్లమెంట్ చేసిన చట్టాన్ని అందరూ ఆమోదించి తీరాలని అరవింద్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేశారని, ఆధారాలతో నిరూపిస్తే కేసీఆర్ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోందని, త్వరలోనే టీఆర్ఎస్ భూస్థాపితం కానుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ముగిసిన చరిత్ర అని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి 28 సీట్లు ఇచ్చిన నిజామాబాద్ ప్రజలకు అరవింద్ ధన్యవాదాలు తెలిపారు. -
ఇందూరు పీఠంపై వీడని ఉత్కంఠ..!
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మేయర్ స్థానం ఎవరికి దక్కుతుందనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి పీఠం దక్కుతుందా.. లేక ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ అధికారం కైవసం చేసుకుంటుందా? అన్న దానిపై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బల్దియాల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించగా, నిజామాబాద్ కార్పొరేషన్ ఫలితాలు ఇందుకు భిన్నంగా వచ్చాయి. టీఆర్ఎస్ ఇక్కడ మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొత్తం 60 డివిజన్లలో 28 స్థానాల్లో గెలుపొంది బీజేపీ ఆధిక్యాన్ని సాధించింది. టీఆర్ఎస్కు 13 స్థానాలు దక్కగా, ఎంఐఎం 16, కాంగ్రెస్ రెండు, స్వతంత్ర అభ్యర్థి మరో డివిజన్లో గెలుపొందారు. దీంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మద్దతిస్తే మాకేంటి..? అయితే, టీఆర్ఎస్, ఎంఐఎం (13+16) కలిసి ఎక్స్అఫీషియో సభ్యుల మద్దతుతో మేయర్ పీఠాన్ని అధికార పార్టీ దక్కించుకోవాలని చూస్తోంది. తమకు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం మద్దతుతో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ శనివారం హైదరాబాద్లో ప్రకటించారు. రేపు ఉదయం 11 గంటలకు కార్పొరేటర్ల ప్రమాణం, 12:30 నుంచి మేయర్ ఎన్నిక ప్రక్రియ, తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభ కానుంది. దీంతో మేజిక్ ఫిగర్కు స్వల్ప ఓట్ల తేడాతో నిజామాబాద్ పీఠం ఉత్కంఠ రేపుతోంది.అయితే నిజామాబాద్లో మద్దతు ఇస్తే తమకు బోధన్ మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని ఎంఐఎం పట్టుపడుతోంది. దీనితో పాటు ఎంఐఎం నుంచి మరికొన్ని ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. (షెహర్ కా షేర్) ఎక్స్అఫీషియో సభ్యుల మద్దతుతో.. జిల్లాలో టీఆర్ఎస్కు ఎక్స్అఫీషియో సభ్యుల సంఖ్య అదనపు బలంగా మారింది. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్గుప్తా, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్తో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డికి కూడా కార్పొరేషన్లో ఎక్స్అఫీషియో సభ్యులుగా కొనసాగే అవకాశం ఉంది. వీరికి తోడు జిల్లా ఎమ్మెల్సీలు వీజీ గౌడ్ (ఎమ్మెల్యే కోటా), ఆకుల లలిత (ఎమ్మెల్యే కోటా), రాజేశ్వర్రావు (గవర్నర్ కోటా) ఉన్నారు. ఎంఐఎం (16) సభ్యులకు తోడు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓట్లు కలిపితే టీఆర్ఎస్ బలం 35కు చేరుతుంది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను టీఆర్ఎస్ గానీ, ఎంఐఎం గానీ కైవసం చేసుకునే వీలుంటుంది. అయితే, మిత్రపక్షాల ఒప్పందంలో మేయర్ పదవి టీఆర్ఎస్కు దక్కుతుందా.. లేక ఎంఐఎంకు ఇస్తారా..? అన్న ఉత్కంఠ నెలకొంది. మేయర్ స్థానం ఎట్టిపరిస్థితుల్లోనూ టీఆర్ఎస్కే ఉంటుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పీఠం కోసం బీజేపీ యత్నాలు.. మరోవైపు, బీజేపీ కూడా మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంపై దృష్టి సారించింది. ఇండిపెండెంట్గా విజయం సాధించిన మరాఠి యమునా (బీజేపీ రెబల్), ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు కార్పొరేటర్లు బీజేపీతో జతకట్టిన పక్షంలో వీరి బలం 31 (28 +2+1)కు చేరుతుంది. ఎక్స్అఫీషియో సభ్యులుగా స్థానిక ఎంపీ ధర్మపురి అర్వింద్ ఓటుతో బీజేపీ బలం 32కు చేరుతుంది. అయినా ఎంఐఎం, టీఆర్ఎస్, ఎక్స్అఫీషియో సభ్యుల కంటే తక్కువ ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. అయితే, ఎలాగైనా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని బీజేపీ ధీమా వ్యక్తం చేసింది. -
సత్తా చాటిన మజ్లిస్
సాక్షి, హైదరాబాద్: పురపాలక ఎన్నికల్లో మజ్లిస్ సత్తా చాటింది. 2 పురపాలక సంఘాలను సొంతంగా కైవసం చేసుకున్న ఆ పార్టీ, అవకాశం వస్తే టీఆర్ఎస్తో కలిసి నిజామాబాద్ కార్పొరేషన్పై జెండా ఎగరేసే స్థా యిలో ఉంది. వెరసి పురపాలక సంఘాలకు సంబంధించి 69 వార్డులను, కార్పొరేషన్లకు సంబంధించి 17 డివిజన్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది. గత మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే సీట్ల సంఖ్య కొంత తగ్గినా.. అధ్యక్ష స్థానాలను ఎక్కువ కైవసం చేసుకోవటం ద్వారా ప్రస్తుత ఎన్నికల్లో సత్తా చాటుకున్నట్టయింది. గత మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించిన ఒకేఒక పురపాలక సంఘం భైంసా. ఈసారి స్పష్టమైన ఆధిక్యంతో దాన్ని నిలబెట్టుకుంది. అక్కడ 26 వార్డులుండగా మజ్లిస్ పార్టీ 15 చోట్ల విజయం సాధించి మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. కొత్తగా ఏర్పడ్డ నగర శివారులోని జల్పల్లి మున్సిపాలిటీలో 28 స్థానాలుండగా మజ్లిస్ 15 చోట్ల విజయం సాధించి చైర్మన్ కుర్చీని సొంతం చేసుకుంది. వీలైతే టీఆర్ఎస్తో మేయర్ పీఠాన్ని పంచుకునే యోచనలో ఉంది. అందుకోసం స్వయంగా ఆపార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం నిజామాబాద్లో హవా.. పుర ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగరేయాలని ఉవ్విళ్లూరిన బీజేపీ ఆశలకు గండి కొడుతూ మజ్లిస్ పార్టీ 16 డివి జన్లలో గెలిచి మేయర్ స్థానాన్ని సొంతం చేసుకునేందుకు బరిలో నిలిచింది. ఇక్కడ 28 చోట్ల గెలిచి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మేయర్ సీటును పొందాలంటే 31 స్థానాలు అవసరం. ఇక్కడ టీఆర్ఎస్ 13 స్థానాల్లో విజయం సాధించింది. 2 స్థానాల్లో కాంగ్రెస్, ఒక చోట స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. కాంగ్రెస్, స్వతంత్రులను తమవైపు తిప్పుకునేందుకు టీఆర్ఎస్–మజ్లిస్లు యత్నిస్తున్నాయి. అది సాధ్యమైతే ఈ కూటమి మేయర్ స్థానా న్ని సొంతం చేసుకుంటుంది. పనిచేయని సీఏఏ మంత్రం.. ఈసారి వీలైనన్ని వార్డులు దక్కించుకుని పురపాలికలను సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరిన మజ్లిస్కు ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదు. గత ఎన్నికల్లో ఒక్క భైంసాను మాత్రమే దక్కించుకుని ఆదిలాబాద్, తాండూరు, నిర్మల్లలో వైస్చైర్మన్ పదవులను చేజిక్కించుకుంది. ఈసారి కనీసం నాలుగైదు చైర్మన్ స్థానాలతోపాటు నిజామాబాద్ మేయర్ గిరీని సొంతం చేసుకోవాలని కలలుగన్నది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అసదుద్దీన్ ఒవైసీ ముమ్మర ప్రయత్నమే చేశారు. మున్సిపల్ ఎన్నికల వేళ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఆ పార్టీకి కలిసి వచ్చింది. దీంతో పార్టీకి బలం ఉన్న పట్టణాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసి కేంద్రం తీరుపై తీవ్ర విమర్శలు చేయటం ద్వారా మైనార్టీల ఓట్లను గంపగుత్తగా సాధించాలనుకున్నారు. ఆ వర్గం ఓట్లు చీలకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేశారు. కానీ కొంతవరకు ఆశాభంగమే ఎదురైంది. బోధన్లో 38 స్థానాలుంటే మజ్లిస్ కేవలం 11 చోట్ల విజయం సాధించింది. ఆదిలాబాద్లో 5 వార్డులే దక్కాయి. నిర్మల్ ఓటర్లు రెండు వార్డులే కట్టబెట్టి కంగు తినిపించారు. తాండూరు, నిజామాబాద్, వికారాబాద్, నారాయణ్ఖేడ్ ఓటర్లు కూడా నిరుత్సాహపరిచారు. -
నిజామాబాద్ : మున్సిపాలిటీలన్నీ ఆ పార్టీవే
సాక్షి, నిజామాబాద్ : మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని మొత్తం 6 మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీ స్పష్టమైన మెజారిటీ కనబర్చింది. బోధన్, ఆర్మూర్, భీంగల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీ విజయం సాధించింది. మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్లో 12 వార్డులకు 12 వార్డులను గెలిచి టీఆర్ఎస్ క్లీన్స్వీప్ చేసింది. -
ఉత్కంఠ పోరులో ఎంఐఎం విజయం
సాక్షి, నిర్మల్ : జిల్లాలోని భైంసా మున్సిపాలిటీలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం విజయం సాధించింది. ఎన్నికల ముందు తీవ్ర ఘర్షణలతో వార్తల్లో నిలిచిన భైంసాలో పుర పోరు ఉత్కంఠ భరితంగా సాగిన విషయం తెలిసిందే. విజయం కోసం ఎంఐఎం, బీజేపీ తీవ్రంగా పోటీపడ్డాయి. భైంసా మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డుల్లో ఎంఐఎం 15 గెలుపొందగా, బీజేపీ 9 స్థానాల్లో విజయం సాధించింది. స్వతంత్రులు రెండు వార్డులను సొంతం చేసుకున్నారు. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం కనీసం పోటీలో కూడా లేకుండా పోయాయి. గత ఎన్నికల్లోనూ భైంసా మున్సిపాలిటీలో సొంతం చేసుకున్న ఎంఐఎం మరోసారి అదే ఫలితాలను పునరావృతం చేసి పట్టునిలుపుకుంది. అయితే బీజేపీ మాత్రం ఈ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుని 9 వార్డుల్లో విజయం నమోదు చేసింది. (మున్సిపల్ ఎన్నికలు : కౌంటింగ్ అప్డేట్స్) మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బోణీ కారు జోరు.. తెలంగాణ భవన్లో సంబరాలు కాంగ్రెస్ కంచు కోటకు బీటలు కేటీఆర్కు షాకిచ్చిన స్వతంత్రులు కొడంగల్లో రేవంత్ రెడ్డికి షాక్ -
‘బీజేపీని చిత్తుగా ఓడించాలి’
సాక్షి, నిజామాబాద్: తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలవాలని చూస్తోందని.. బీజేపీని చిత్తుగా ఓడించాలని ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆయన జిల్లాలోని ఆర్మూర్లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్మూర్లో ఎంఐఎం పార్టీని ఐదు స్థానాల్లో గెలిపించాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో దళితులు, ఆదివాసులు సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా.. ఎంఐఎం పార్టీకీ ఓటు వేయాలన్నారు. నిజామాబాద్లో తన చెల్లి ఓడిపోవటం చాలా బాధాకరం అన్నారు. చదవండి: ‘ఎంఐఎం పోటీ చూస్తుందంటే అన్ని పార్టీలకు భయం’ మోదీ ప్రభుత్వం ప్రజల మధ్య రెచ్చగొట్టే ధోరణి మానుకోవాలని అసదుద్దీన్ హెచ్చరించారు. పార్లమెంట్లో ఎన్ఆర్సీ, సీఏఏ బిల్లు పత్రాలను చింపేశానని ఆయన తెలిపారు. దేశంలో రోజుకు 36 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అసదుద్దీన్ ఆవేదన వ్యక్త చేశారు. ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం 25 మంది ముస్లిం యువకులను పొట్టనబెట్టుకుందని ఆయన మండిపడ్డారు. యూపీలో ఇప్పటి వరకు 21 మంది ముస్లిం యువకుల పోస్ట్మార్టం రిపోర్టు ఇవ్వలేదని అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మోహన్ భాగవత్ ‘ఇద్దరి సంతానం చట్టం’ తేవాలని కేంద్రానికి సూచిస్తున్నారని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం దేశంలో ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమైందని అసదుద్దీన్ ధ్వజమెత్తారు. చదవండి: అసదుద్దీన్పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు -
నిజామాబాద్ ఎమ్మెల్యే నిస్సహాయుడు..
సాక్షి, నిజామాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నిప్పులు చెరిగారు. మిషన్ భగీరథ స్కీమ్ విఫలమైందని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కేసీఆర్, కేటీఆర్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారని ఆయన విమర్శించారు. లక్ష్మణ్ ఆదివారమిక్కడ ప్రెస్మీట్లో మాట్లాడుతూ..‘పేదలకు ప్రధాని ఆవాస్ యోజన కింద ఇచ్చిన నిధులను దారి మళ్లించారు. టీఆర్ఎస్ సర్కార్ పేదలకు ఇచ్చే అన్ని నిధులు దుర్వినియోగం చేసింది. నిజామాబాద్కు ఇచ్చిన అమృత్ పథకం, గ్రీన్ సిటీకి ఇచ్చిన నిధులు దుర్వినియోగం చేశారు. గత ఆరేళ్లలో ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు. నిజామాబాద్లో రూ.800 కోట్ల నిధులతో అభివృద్ధి చేశామని చెప్తున్నా, ఎక్కడా అది కనిపించడం లేదు. జాతీయ రహదారుల నిర్మాణం కేంద్రం చేపట్టింది. లక్కంపల్లిలో ఫుడ్ ప్రొసెసింగ్ ఫ్లాంట్ ఏర్పాటు చేశాం. నిజామాబాద్ మెడికల్ కళాశాలలో పీజీ సీట్లు పెంచాం.’ అని తెలిపారు. ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ కుట్రలు పన్నుతోందని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. రెండు పార్టీలు అంతర్గత ఒప్పందం చేసుకున్నాయని అన్నారు. ఎన్నార్సీ బిల్లు ఏ భారతీయ ముస్లింలకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. ఎంఐఎంకు భారతీయుల మీద ప్రేమలేదని, ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఎంఐఎం చేస్తున్న ఆందోళనలకు టీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం సిగ్గుచేటు అన్నారు. టీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీ అని, నిజామాబాద్ ఎమ్మెల్యే నిస్సహాయుడు, ఎంఐఎం చేతిలో కీలుబొమ్మ అంటూ విమర్శలు గుప్పించారు. -
‘ఎంఐఎం పోటీ చేస్తుందంటే అన్ని పార్టీలకు భయం’
సాక్షి, కామారెడ్డి: మజ్లిస్ పార్టీ ఒక్క హైదరాబాద్కే పరిమితం అయిందని ప్రచారం చేస్తున్నారని.. అది తప్పని మజ్లీస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తుందంటే అన్ని పార్టీలకు భయం పట్టుకుందన్నారు. ఎంఐఎం పార్టీ కామారెడ్డికి కొత్త కాదని.. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎంఐఎం అభ్యర్థులకు ఇబ్బంది లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రమంతా ఎంఐఎం పార్టీ విస్తరిస్తోందని ఆయన తెలిపారు. ఎన్ఆర్సీ నుంచి దేశాన్ని కాపాడుకోవాలని ఆయన పేర్కొన్నారు. దేశంలో బీజేపీ పాలన హిట్లర్ పాలనను తలపిస్తోందని అసదుద్దీన్ తీవ్రంగా మండిపడ్డారు. ముస్లింలకు తప్ప అందరికీ పొరసత్వం ఇస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్పీఆర్, ఎన్ఆర్సీపై అనేక అనుమానాలు ఉన్నాయిని ఎంపీ అసదుద్దీన్ అభిప్రాయపడ్డారు. చదవండి: అసదుద్దీన్పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు -
టీఆర్ఎస్కు ఓటేస్తే మజ్లిస్కు పడినట్టే..
సాక్షి, పాలమూరు: మహబూబ్నగర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపిస్తే.. మజ్లిస్ అభ్యర్థిని చైర్మన్ చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో, భూత్పూర్లో శుక్రవారం బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్ షోలో లక్ష్మణ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. హిందూ, మైనార్టీల మధ్య కేసీఆర్ తాకట్లు పెట్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నాడని ఆరోపించారు. పౌరసత్వ బిల్లుపై అనవసరపు రాద్దాంతం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కుట్రలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మరిచారని, రైతు బంధు ఆగిపోయిందని, రెండు పడక గదులు పడకేశాయని, యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామనే మాట కలగానే మిగిలిందని ఎద్దేవా చేశారు. స్వచ్ఛభారత్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ ఇస్తే సొంత పథకాలుగా మార్చి వినియోగించుకుంటున్నారన్నారని ఆరోపించారు. స్వప్రయోజనాల కోసమే కలెక్టరేట్ మార్పు : డీకే అరుణ మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ ఐదు జిల్లాలకు సరిపోయిన కలెక్టరేట్ను ప్రస్తుతం ఇక్కడి నుంచి మార్చే ప్రయత్నం చేస్తున్నారని దీని వెనుక అసలు కారణం ప్రజాప్రయోజనాలు కాదని అక్కడ ఉన్న నేతల భూముల ధరలు పెంచుకోవడం మాత్రమేనని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే పాత కలెక్టరేట్ను విద్యా ప్రాంగణంగా మారుస్తామని చెప్పారు. అదేవిధంగా మహబూబ్నగర్ మాజీ ఎంపీ జితేందర్రెడి మాట్లాడుతూ మహబూబ్నగర్ డబుల్ రైల్వే లైన్, పాస్పోర్టు కార్యాలయాలు, ఇతర పనులు అన్ని కేంద్ర నిధులతో జరుగుతున్నట్లు తెలిపారు. పాలమూరు పట్టణంలో చాలా అభివృద్ధి పనులు కేంద్రం నుంచి వచ్చే నిధులతో చేస్తున్నారని, దానిని ఈ ప్రభుత్వం వారి ఖాతాలో వేసుకోవాలని చూస్తుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, జిల్లా అధ్యక్షురాలు పద్మాజారెడ్డి, పడకుల బాలరాజు, శ్రీనివాస్రెడ్డి, రాజేందర్రెడ్డి,పొడపాటి చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
‘ప్రజలు రజాకార్ల పాలన చూడాల్సి వస్తుంది’
సాక్షి, భైంసా(అదిలాబాద్): భైంసాలో ఎంఐఎం పార్టీ గూండాలు సాగించిన హింసాకాండ అధికార పార్టీ టీఆర్ఎస్ అండదండలతోనే జరిగిందని ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు హింసాత్మక ఘటనలకు తెరతీశాయని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ది కోసం ఎంఐఎం అరాచకాలకు టీఆర్ఎస్ వంత పాడుతుందని విమర్శించారు. భైంసాలో మున్సిపాలిటీని ఎంఐఎంకు ఏకగ్రీవంగా కట్టబెట్టేందుకు టీఆర్ఎస్ పోటీ నుంచి తప్పనుకుని కుట్రలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే.. ప్రజలు రజాకార్ల పాలనను చూడాల్సి వస్తుందన్నారు. వీరోచిత పోరాటం, అమరుల ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో తిరిగి రజాకార్ల పాలన వచ్చే ముంపు పొంచి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామిక తెలంగాణ కావాలో... రజాకార్ల పాలనా కావాలో నిర్ణయించే అధికారం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. (చదవండి: తెల్లారినా అదే పరిస్థితి.. 144 సెక్షన్ విధింపు) భైంసాలో ఓ వర్గానికి చెందిన దుండగులు హిందువులకు చెందిన 18 ఇళ్లను దగ్ధం చేశారని, పెద్ద సంఖ్యలో ప్రజలను గాయపరిచారని మండిపడ్డారు. ఆస్తులను, వాహనాలను తగలబెట్టారని, దాడులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపైనా గూండాలు విరుచుకుపడ్డారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చన్నారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులపైనే ఎంఐఎం గుండాలు దాడులకు పాల్పడితే... శాంతి భద్రతలను ఎవరు పర్యవేక్షిస్తారో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భైంసా ఘటనలో పోలీసులు, నిఘా వర్గాలు పూర్తిగా విఫలమయ్యాయని, పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన పోలీసులు అప్రమత్తత పాటించలేదని విమర్శించారు. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడితే భయపడతామనుకుంటే పొరపాటని, దాడులను ప్రతిఘటిస్తూ.. ఎలాంటి ఉద్యమాలైనా చేపట్టానికి తాము సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ సవాలు విసిరారు. భైంసా ఘటనను వ్యతిరేకిస్తూ.. హిందూ సమాజం ఏకమై తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. భైంసాలో పోటీ నుంచి తప్పుకుని ఎంఐఎం పార్టీకి మున్సిపాలిటీని అప్పగించాలని చూస్తున్న టీఆర్ఎస్.. భవిష్యత్తులో అధికారం నుంచి తప్పుకుని ఎంఐఎంకు పాలనను అప్పగిస్తుందని ఎద్దేవా చేశారు. రాష్టంలో సాగుతున్న అరాచక పాలనపై టీఆర్ఎస్ నేతల శ్రేణులు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలని, అధినాయకత్వాన్ని ప్రశ్నించాలని ఆయన హితవు పలికారు. -
బ్రేకుల్లేని బస్సుల్లో పాకిస్తాన్కి పంపిస్తాం..
సాక్షి, వరంగల్ అర్బన్: సీఏఏను వ్యతిరేకించేవాళ్లంతా దేశ ద్రోహులేనని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌర సత్వ సవరణ చట్ట వ్యతిరేకులను బ్రేకుల్లేని బస్సులో పాకిస్థాన్కి పంపిస్తామంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. బుధవారం హన్మకొండ పబ్లిక్ గార్డెన్ వద్ద సీఏఏకు మద్దతుగా జాతీయ వాదుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బహిరంగ సభలో ఎంపీ సంజయ్ మాట్లాడుతూ...‘పచ్చ జెండాలతో ర్యాలీ తీసి ఈ ఓరుగల్లు గడ్డను అపవిత్రం చేశారు. మళ్లీ ఈ గడ్డను పవిత్రం చేయడానికే ఈ కాషాయం ర్యాలీ. వాస్తవాలను దాచి అవాస్తవాలను ప్రచారం చేస్తున్న మూర్ఖపు పార్టీల వల్లే ఈ ఆందోళనలు. సీసీఏ ఎవరికీ వ్యతిరేకం కాదు. పక్క దేశాలలో ఉన్న హిందూ శరణార్ధులు భారత భూభాగంలో నివసిస్తామంటే వారికి పౌరసత్వం ఇవ్వడానికే ఈ చట్టం తెచ్చాం. మహాత్మగాంధీ, నెహ్రులు చెప్పిన విధివిధానాలనే ఈ సీఏఏ చట్టంలో పొందుపరిచాం. 370 ఆర్టికల్, అయోధ్య తీర్పు వచ్చినప్పుడు ఎలాంటి ఆందోళనలు జరగలేదు. ఒక ప్రణాళిక ప్రకారం దేశంలో విచ్ఛిన్నం సృష్టించాలని కాంగ్రెస్, కమ్యూనిస్టులు చూస్తున్నారు. పార్లమెంట్లో పూర్తి చర్చ జరిగిన తర్వాతే ఈ చట్టం అమలులోకి వచ్చింది. ఇస్లామిక్ దేశాల నుంచి వస్తున్న పైసలతో ఈ ఉద్యమాలు చేస్తున్నారు. మీరు రాళ్లు వేస్తే..మేము బాంబులు వేస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్ లుంబినీ పార్కులో బాంబులు వేసిన వారికి పౌరసత్వం ఇవ్వాలా... సమాధానం చెప్పాలి? కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని తిరుపతికి వచ్చి మొక్కారు. ఇక ఎంఐఎం నేత పది నిమిషాల్లో హిందువులను ఖతం చేస్తానని చెప్పినప్పుడు ఎక్కడిపోయాడు కేసీఆర్. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓట్ల కోసం కేసీఆర్ నిజమైన హిందువు అని చెప్పడానికి సిగ్గు ఉండాలి. ఒవైసీ సోదరులు, కేసీఆర్ కుటుంబం చేస్తున్న కుట్రలు ఇక తెలంగాణలో సాగవు. మున్సిపాలిటీ ఎన్నికట్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే ఎంఐఎంకు వేసినట్లే’ అని వ్యాఖ్యలు చేశారు. సంబంధిత వార్తలు.. వీధుల్లోకి రావడం బాగుంది: దీపిక ఉనికి లేని వారే ‘పోరాటాలు’ చేస్తున్నారు ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా 10న మహా తిరంగా ర్యాలీ దుష్ట ఆలోచనలో భాగమే ఎన్నార్సీ అల్లర్లకు కాంగ్రెస్, ఆప్లే కారణం పౌరసత్వ చట్టానికి వక్రభాష్యాలేల? -
ఏసీపీని అడ్డుకున్న ఎమ్మెల్యే; తీవ్ర విమర్శలు
సాక్షి, హైదరాబాద్ : చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ఖాన్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విధుల్లో భాగంగా పాతబస్తీలోని శాలిబండలో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్న ఫలక్నుమా ఏసీపీ మహ్మద్ మజీద్ని ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్, ఎంఐఎం నేతలు సీఏఏ వంకతో అడ్డుకున్నారు. ప్రజలందరి ముందే ఎమ్మెల్యే ఏసీపీ మహ్మద్ మజీద్ని నిలదీశారు. దీంతో ఏసీపీ, సిబ్బంది చేసేదేం లేక తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. కాగా, పోలీసుల తీరుపైనా ప్రజలు మండిపడుతున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. తెలంగాణ పోలీసులకే తలవంపులు వచ్చాయని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. విధులకు ఆటంకం కలిగించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే పోలీసులు వెనుదిరిగారని ఎద్దేవా చేస్తున్నారు. -
కేసీఆర్ చెప్తే నా పదవికి రాజీనామా చేస్తా: లక్ష్మణ్
సాక్షి, నిజామాబాద్ : ముస్లిం పదం లేదని పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తున్నారంటే పాకిస్తాన్కు వత్తాసు పలుకుతున్నట్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రానంతరం ముస్లింలకు ప్రత్యేక దేశాలిచ్చినా.. హిందువుల మీద దాడి మాత్రం ఆపలేదని మండిపడ్డారు. నిజామాబాద్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశానికి లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ అర్వింద్, బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ హాజరయ్యారు. లక్ష్మణ్ మాట్లాడుతూ.. భారత్ నుంచి విడిపోయిన ప్రాంతాలు ఇస్లాం దేశాలుగా ఏర్పడితే మనది మాత్రం సెక్యులర్ దేశంగా మిగిలిందన్నారు. తెలంగాణ పేరుతో ఆనాడు ఆంధ్ర ఉద్యోగులు, ప్రజలపై దాడి చేసిన కేసీఆర్.. ఇప్పుడు దేశంలోని హిందువులపై దాడి చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆరా లేక ఓవైసీనా అని ప్రశ్నించారు. సీఏఏను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో కేసీఆర్ సమాధానం చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సరైన సమాధానం చెబితే బీజేపీ రాష్ట్ర పదవికి రాజీనామ చేస్తానని ప్రకటించారు. హిందుగాళ్లు, బొందుగాళ్లు అంటే కేసీఆర్కు పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బుద్ది చెప్పారని అన్నారు. భద్రాచలంలో రామునికి తలంబ్రాలు ఇవ్వలేని నువ్వు హిందువు ఎలా అవుతావని కేసీఆర్ను నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్షాలు కృష్ణార్జుల్లా దేశ రక్షణ కోసం పనిచేస్తున్నారని ప్రశంసించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయం బీజేపీదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. సమగ్ర కుటుంబ సర్వేతో అరాచకం సృష్టించిన కేసీఆర్.. ఇప్పుడు ఎన్పీఆర్ను ఎందుకు అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పాలని లక్ష్మణ్ ప్రశ్నించారు. అమెరికాలో చదివి రాజ్యాంగం మరిచిపోయారు నిజామాబాద్లో సభ పెడితే హైదరాబాద్లో కేసీఆర్ వణుకుతున్నారని బీజేపీ ఎంపీ దర్మపురి అర్వింద్ దుయ్యబట్టారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్ ముస్లింలకు మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఒవైసీ గడ్డం పీకీ కేసీఆర్కు పెడతా. ఏం పీకుదామని నిజామాబాద్కు వచ్చారో ఓవైసీ చెప్పాలి. కూతురు ఓడిపోయిందన్న బాధలో అసద్ను కేసీఆర్ మాటిమాటికీ నిజామాబాద్ పంపుతున్నారు. కేటీఆర్ అమెరికాలో చదివి రాజ్యాంగం మరిచిపోయారు. తెలంగాణలో బీజేపీ రోజురోజుకీ బలోపేతం అవుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 95 శాతం ఓట్లు వస్తాయి’’ అని వ్యాఖ్యానించారు. జిన్నా కాలం పోయింది గుర్తుంచుకో బీజేపీతో పెట్టుకుంటే ఎంఐఎం చనిపోతుందని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్ధర్ అన్నారు. పాకిస్తాన్ భారత్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుందని, ఒవైసీ దేశాన్ని ముక్కలు చేయాలని మతం పేరుతో రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. జిన్నా కాలం పోయిందని గుర్తుంచుకో ఒవైసీ అంటూ ధ్వజమెత్తారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం టీఆర్ఎస్, ఎంఐఎం పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. గతంలో ఈ బిల్లును తేవాలని చెప్పిన పార్టీలన్నీ ఇప్పుడు వ్యతిరేకించడం అన్యాయమన్నారు. దేశంలో ఉన్న పాకిస్తానీ, బంగ్లాదేశ్ ముస్లింలను కచ్చితంగా పంపిస్తామని తెలిపారు. బీజేపీ ఉన్నంత వరకు దేశ రక్షణ కోసం పనిచేస్తామని, తెలంగాణలో బీజేపీని గెలిపించాలని సునీల్ కోరారు. -
కేసీఆర్ను కలువబోతున్న ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)తోపాటు జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్)కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నడుం బిగించారు. ఈ విషయమై అసదుద్దీన్ నేతృత్వంలోని ఆలిండియా ముస్లిం యాక్షన్ కమిటీ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును నేడు (బుధవారం) కలువబోతోంది. ఈ మేరకు అసద్ నేతృత్వంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు, ముస్లిం మత పెద్దలు ప్రగతి భవన్కు చేరుకున్నారు. ప్రగతి భవన్లో వీరు సీఎం కేసీఆర్తో భేటీ అయి.. వినతిపత్రం ఇవ్వనున్నారు. రాజ్యాంగవిరుద్ధంగా ముస్లింలపై వివక్ష చూపేలా ఉన్న సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లను వ్యతిరేకించాలని, ఈ విషయంలో తమకు మద్దతుగా నిలువాలని వారు ముఖ్యమంత్రిని కోరే అవకాశముంది. ఎంపీ అసద్ వెంట మత పెద్దలు ముక్తీ అజీముద్దీన్, రియజుద్దీన్, గాయజుద్దీన్, ఖుబుల్ పాషా సూతరి, మౌలానా హాసన్ బిన్ హాల్ హుముమీ, నిస్సార్ హుస్సేన్ హైదర్ ఆగ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, అహ్మద్ పాషా ఖాద్రి తదితరులు ఉన్నారు. -
కేంద్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది: ఎంఐఎం
సాక్షి, మెట్టుగడ్డ(మహబూబ్నగర్) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సీఏఏ, ఎన్ఆర్సీపై ప్రజలకు తప్పుదోవ పట్టిస్తుందని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో మంగళవారం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. మతం, కులంతో సంబంధం లేకుండా అందరికీ ఈ దేశంలో సమానహక్కు రాజ్యాంగం కలి్పంచిందని తెలిపారు. కానీ మోదీ, అమిత్ షా నిరంకుశ పాలనతో చట్ట సవరణలు చేస్తున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్లో అమిత్ షా దేశంలో ఎన్ఆర్సీ అమలు చేసి తీరుతామని చెప్పినప్పటికీ, మోదీ ఢిల్లీ బహిరంగసభలో ఎన్ఆర్సీని అమలు చేసే ప్రసక్తే లేదని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం ఎన్పీఆర్ (జనగణన) పేరుతో ఎన్ఆర్సీని అమలు చేయడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. సీఏఏకి వ్యతిరేకంగా దేశంలో శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తున్న విద్యార్థులు, ప్రజలపై కాల్పులు జరిపి 18మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నారని మండిపడ్డారు. మత ప్రాతిపదికన తీసుకువచ్చిన ఈ చట్టాన్ని కుల, మతాలకతీకంగా వ్యతిరేకించాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేరళ తరహాలో తెలంగాణలో కూడా ఎన్పీఆర్పై స్టే విధించాలని కోరారు. అనంతరం వక్తలు మాట్లాడారు. సమావేశంలో జమాతే ఇస్లామి హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా హమీద్ మొహమ్మద్ ఖాన్, సయ్యద్ అబ్దుల్ రజాక్ షా ఖాద్రి, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, అబ్దుల్ హాదీ, జాకీర్, షఫీ ఉద్దీన్, సుజాత్ అలీ, ముస్లిం సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాలమూరులో భారీ బందోబస్తు మహబూబ్నగర్ క్రైం: పౌరసత్వ సవరణ చట్టంపై జిల్లాకేంద్రంలోని జెడ్పీ మైదానంలో ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నిర్వహించిన సభకు జిల్లా పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎస్పీ రెమా రాజేశ్వరి, ఏఎస్పీ వెంకటేశ్వర్లు స్వయంగా మైదానం పరిసర ప్రాంతాలను పర్యవేక్షించారు. సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ సభకు 320 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంట్లో ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ, డీఎస్పీలు, 20మంది సీఐలు, 50మంది ఎస్సైఐలు, 30మంది ఏఎస్సైఐలు, దాదాపు 220కిపైగా ఇతర కానిస్టేబుల్స్తో రెక్కీ నిర్వహించారు. పట్టణంలో ఉన్న మజీద్లు, ముఖ్య కూడళ్లు, రద్దీ ఏరియాల్లో పోలీసులు ప్రత్యేకంగా గస్తీ నిర్వహించారు. జెడ్పీ మైదానంలో జరిగిన సభకు పోలీసులు లోపలికి వెళ్లే ప్రతి వ్యక్తిని తనిఖీ చేసి పంపించారు. -
ప్రతి ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి
-
ప్రతి ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రతీ ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పిలుపు ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరజాబితా (ఎన్నార్సీ) చట్టాలంటే గాంధీజీ, అంబేద్కర్ ఆశయాలను అవమానించడమేనని ఆయన వ్యాఖ్యానించారు. సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఎంఐఎం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం దారుస్సలాంలో జరిగిన భారీ సభలో అసద్ ప్రసంగించారు. ఎన్నార్సీ వల్ల నష్టాలే తప్ప ప్రయోజనాలు ఏమీ ఉండవన్నారు. దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని చెప్పారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని శాంతియుతంగా ముందుకుతీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన అందరితో రాజ్యాంగ ప్రవేశిక చదివించిన అసద్.. జాతీయ గీతాలాపనతో సభ ముగించారు. -
కూల్చివేతపై కేసు ఎందుకు..?: ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: బాబ్రీ మసీదు చట్ట విరుద్ధమైతే కూల్చివేతపై కేసు ఎందుకు నడుస్తోంది, అద్వానీపై విచారణ ఎందుకు జరుగుతోందని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సూటిగా ప్రశ్నించారు. మిలాద్–ఉన్–నబీ సందర్భంగా శనివారం అర్ధ రాత్రి హైదరాబాద్లోని దారుస్సలాం మైదానంలో జరిగిన రహమతుల్–లిల్–అలామీన్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. బాబ్రీ మసీదు చట్టవిరుద్ధమైతే కూల్చివేతకు పాల్పడిన వారు భూమిని ఎలా పొందగలుగుతారని చెప్పారు. సాధారణంగా ఒకరి ఇంటిని కూల్చేసిన వ్యక్తికి అదే ఇల్లు మరలా ఎలా లభిస్తుందని దుయ్యబట్టారు. సుప్రీం కోర్టు తీర్పుపై రాజ్యాంగబద్ధంగా అభిప్రా యాన్ని వ్యక్తం చేసే హక్కు తమకు ఉందని గుర్తు చేశారు. బాబ్రీ మసీదుపై చట్టపరమైన హక్కు కోసం పోరాటం చేశామని, మసీదుకు ప్రత్యామ్నాయంగా 5ఎకరాల భూమి ఇవ్వ డం అవమానించడమేనన్నారు. సుప్రీంలో ముస్లింల పక్షాన ప్రాతినిధ్యం వహించిన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సభలో మజ్లిస్ ఎమ్మెల్యేలు, ఇస్లామిక్ స్కా లర్స్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
‘ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదు’
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. శుక్రవారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు గెలవగానే సరిపోదని ప్రజా సమస్యలను పరిష్కారించాలన్నారు. ధనం, మద్యం, అధికార బలంతో హుజూర్నగర్ ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచిందన్నారు. ఉప ఎన్నికలో రూ. యాభై కోట్లు ఖర్చు చేసి గెలిచినందువల్లే.. నిన్న ప్రెస్మీట్ పెట్టి కేసీఆర్ అహంకార ధోరణితో మాట్లాడారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ జాగీర్ కాదని, ఆర్టీసీని మూసివేస్తానంటే ఉరుకునేది లేదన్నారు. ఆర్టీసీ సంస్థ నష్టపోతుంటే.. ఎందుకు నష్ట నివారణ చర్యలు చేపట్టేలే ప్రజారవాణా వ్యవస్థ నష్టాల్లో ఉంటే.. లాభాల్లోకి తీసుకు రావడానికి రివ్యూ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు, విద్యార్థులు, రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోతుంటే రివ్యూ చేయని సీఎం కేసీఆర్, ఎన్నికలకు మాత్రం రివ్యూ చేస్తారని వ్యంగ్యంగా మాట్లాడారు. జ్వరాలు వచ్చి జనాలు ఇబ్బంది పడుతుంటే రివ్యూ చేయని మంత్రులు, ఎమ్మెల్యేలు హుజూర్ నగర్ ఎన్నికల్లో మాత్రం మొత్తం అక్కడే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఖమ్మంలో డెంగ్యూ జ్వరంతో మహిళా జడ్జీ చనిపోయిందని, జ్వరాలు ఎక్కువగా ఉన్నాయని స్వయంగా కోర్టు చెప్పినా.. కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎంఐఎం మోదీకి 'బీ' టీమ్: గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి హరియాణా, మహారాష్ట్రలో మంచి ఫలితాలు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. గుజరాత్లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మూడు సీట్లు గెలుచుకుందని ఆనందం వెల్లిబుచ్చారు. రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సత్ఫలితాలు వస్తాయని ఆశించారు. మహారాష్ట్రలో 44 స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం పార్టీ కేవలం 2 సీట్లే గెలిచి, మిగతా సీట్లలో బీజేపీ, శివసేనను గెలిపించిందన్నారు. ఎంఐఎం మోదీకి బీ టీమ్ అని, సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ ఓట్లు చీల్చి.. మతతత్వ పార్టీని ఎంఐఎం గెలిపించిందన్నారు. ముస్లిం ఓట్లను చీల్చడానికే ఎంఐఎం అభ్యర్థులను నిలపెట్టిందన్నారు. బీజేపీ మాదిరిగానే ఎంఐఎం కూడా మతతత్వ పార్టీనే. హైదరాబాద్లో పుట్టిన ఎంఐఎం పార్టీ, రాష్ట్రంలో ఎన్నడూ 44 సీట్లలో పోటీ చేయలేదు. మహారాష్ట్రలో మాత్రం 44 సీట్లు పోటీ చేయడం వెనుక ఉన్న అంతార్యం ఏమిటని ప్రశ్నించారు. ఆరెస్సెస్, బీజేపీ వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని హిందు, ముస్లిం ఓట్లను చీల్చుతుందని ఆరోపించారు. -
కాంగ్రెస్ పార్టీ దయతో బతకట్లేదు: ఒవైసీ
ముంబై : కాంగ్రెస్ పార్టీ దయతో ముస్లింలు భారత్లో జీవించడం లేదంటూ ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం, అల్లా దయతోనే 70 ఏళ్లుగా ఇక్కడ తాము బతుకుతున్నామని పేర్కొన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా భీవండి పశ్చిమ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థి తరఫున ఒవైసీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. ‘సముద్రంలో పడవ మునిగిపోతున్న సమయంలో కెప్టెన్ అనేవాడు అందరినీ కాపాడి తన గురించి తర్వాత ఆలోచిస్తాడు. కానీ కాంగ్రెస్ పార్టీకి కెప్టెన్గా ఉన్న రాహుల్ గాంధీ మాత్రం.. పార్టీ మునిగిపోతున్న వేళ అర్ధంతరంగా పారిపోయారు. ఇంకో విషయం ఇక్కడ మేమేమీ(ముస్లిం) కాంగ్రెస్ పార్టీ దయతో బతకడం లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్లే ఇక్కడ ఉన్నాం’ అని పేర్కొన్నారు. అదే విధంగా మోదీ సర్కారు తీరుపై కూడా ఒవైసీ విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ట్రిపుల్ తలాక్ చట్టం ముస్లిం మహిళల ప్రయోజనాలను కాలరాసే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలన అంటేనే చీకటి అని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో మరాఠాల మాదిరి ముస్లింలకు కూడా రిజర్వేషన్లు పొడగించాలని డిమాండ్ చేశారు. కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 21న జరగనున్న సంగతి తెలిసిందే. అదే నెల 24న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తూ దూకుడు పెంచాయి. ఇక మహారాష్ట్రతో పాటు హరియాణా అసెంబ్లీ ఎన్నికలు, దేశ వ్యాప్తంగా మరికొన్ని నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగనున్న విషయం విదితమే. -
పీఏసీ చైర్మన్గా అక్బరుద్దీన్ ఒవైసీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో ప్రజా పద్దులు (పీఏసీ) కమిటీ పదవి ఎంఐఎం పార్టీని వరించింది. ఆ పార్టీ శాసనసభ పక్షం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి పీఏసీ చైర్మన్ పదవి దక్కింది. అలాగే అంచనాల కమిటీ చైర్మన్గా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నియమితులయ్యారు. మరోవైపు ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. పది రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాలలో మూడు బిల్లులతో పాటు ఒక తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు. అనంతరం తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. కాగా పీఏసీ చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వడం అనేది సంప్రదాయం. అయితే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళ్లడంతో ఆ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. దీంతో ఏడుగురు సభ్యులు ఉన్న మజ్లిస్ పార్టీ... తమకు పీఏసీ పదవి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. -
కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి విముక్తి కావాలి..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పటాన్చెరులోని ఎస్వీఆర్ గార్డెన్లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి ప్రహ్లద్ జోషి, హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీజేపీకి భయపడే కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేశారని, తీసేస్తామని అనుకున్న మంత్రులను కూడా తీయలేదని విమర్శించారు. రాష్ట్రంలో విమోచన దినోత్సవాన్ని ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదని ప్రశ్నించారు. హైకోర్టు మొట్టికాయ వేసినా కేసీఆర్కు బుద్ది రాలేదని మండిపడ్డారు. మజ్లిస్ దాయ దక్షిణ్యాల మీద టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తోందని, బంగారు తెలంగాణను కేసీఆర్ బూడిద తెలంగాణగా, అప్పుల తెలంగాణగా మార్చారని లక్ష్మణ్ ఆరోపించారు. కారు.. సారు.. బారు.. ఇది రజాకార్ల సర్కారు అని ఎద్దేవా లక్ష్మణ్ చేశారు. అప్పనంగా కల్వకుంట్ల కుటుంబం అధికారం అనుభవిస్తోందని, ఈ కుటుంబం నుంచి రాష్టానికి విముక్తి కావాలని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని లక్ష్మణ్ సూచించారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ మజ్లిస్ చేతిలో కీలుబొమ్మగా మారిందని, రాష్ట్రంలో పరోక్షంగా ఎంఐఎం పార్టీనే పాలిస్తుందని ఆరోపించారు. నిజాం అడుగు జాడల్లో సీఎం కేసీఆర్ నడుస్తున్నారని, రజాకార్ల వారసత్వమే మజ్లిస్దని దుయ్యబట్టారు. తెలంగాణ విమోచన దినోత్సవ ఉత్సవాలు జరగాలంటే బీజేపీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పతనానికి ఈ విమోచన దినోత్సవ వేడుకలే ఆరంభమని కిషన్రెడ్డి తెలిపారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయ పార్టీ అని, కేంద్ర పథకాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం సహాకారం అందిచడం లేదని పేర్కొన్నారు. కేసీఆర్ ఎన్ని మంత్రివర్గ విస్తరణలు చేసినా టీఆర్ఎస్ పునాదులు కదలడం ఖాయమన్నారు. రాష్ట్రంలో త్రివర్ణ పతాకం ఎగరవేయడానికి ఎవరి అనుమతి అవసరం లేదని, ప్రభుత్వ కార్యాలయాలపై జెండా ఎగురవేయాల్సిందేనని తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలు,శ్రేణులు అధిక సంఖ్యలో హాజరైయ్యారు -
ఈ ముఖ్యమంత్రి మాటల వరకే..!
సాక్షి, సంగారెడ్డి: ఎంఐఎం చేతిలో టీఆర్ఎస్ ప్రభుత్వం కీలుబొమ్మలా మారిందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరు మాటల్లోనే... కానీ చేతల్లో కనిపించడం లేదని ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి దృష్టి అంతా కాళేశ్వరంపైనే ఉంది కానీ ఇప్పటివరకు ఒక్క ఎకరాకు కూడా నీరందించలేదని ఎద్దేవా చేశారు. కల్యాణ లక్ష్మి పథకానికి ఐదు నెలల నుంచి నిధులు మంజూరు చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా అవినీతి పేరుకుపోయి రాష్ట్ర పరిస్థితి అగమ్యగోచరంగా తయారయిందని.. దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. అదేవిధంగా సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా ప్రకటించాలని కోరారు. సంగారెడ్డి జిల్లాలోని 16 మండలాల్లో కరువు తాండవం చేస్తోందని, ఇందుకోసం తక్షణమే జిల్లాకు రూ.100 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్రం నిధులు విడుదల చేసినా వాటిని ప్రభుత్వం సక్రమంగా వినియోగించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ.. ఇప్పటికే ఈ ఎన్నికలపై ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసిందని గుర్తు చేశారు. టీఆర్ఎస్ వైఫల్యాలను గ్రామ స్థాయిలో తీసుకెళ్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని, బలమైన నాయకత్వం లేకపోవటంతో పార్టీలో విశ్వసనీయత లోపించిందని అభిప్రాయపడ్డారు. మైనారిటీల రక్షణ కోసం ట్రిపుల్ తలాక్ బిల్లు తీసుకొచ్చామన్నారు. గ్రామ స్థాయిలో బీజేపీ పార్టీ బలోపేతం అవుతుందని దత్తాత్రేయ ధీమా వ్యక్తం చేశారు. -
అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు
సాక్షి, కరీంనగర్: ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీపై కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. కోర్టు ఆదేశాలతో ఆయనపై సీఆర్పీసీ 153ఏ, 153బీ, 506, 156(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ సీఐ విజయ్ కుమార్ తెలిపారు. కాగా జూలై 24న కరీంనగర్లో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఒవైసీ మాట్లాడుతూ.. వివాదాస్పద రీతిలో వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు పలువురు పెద్ద ఎత్తున ఆందోళనలు, డిమాండ్ చేశారు. అయితే అక్బరుద్దీన్ ప్రసంగం రెచ్చగొట్టేలా లేదని వారం రోజుల క్రితం నగర సీపీ కమలాసన్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చారు. సీపీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. బీజేపీ నగర అధ్యక్షుడు, న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఒవైసీ వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని ఆయన కోర్టును కోరారు. దీంతో ఆయన పిటిషన్ను పరిశీలించిన కరీంనగర్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సాయిసుధ ఘటనపై విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారు. కోర్టు ఆదేశంతో క్రైమ్ నంబర్ 182/2019 ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టినట్టు త్రీటౌన్ పోలీసులు తెలిపారు. కాగా ఒవైసీ వ్యవహారం గతకొంత కాలంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. బీజేపీని కించపరిచే విధంగా, ముస్లింలను రెచ్చగొట్టేలా ఆయన మాట్లాడారని కమళం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనపై కేసు నమోదు కావడం ఆసక్తికరంగా మారింది. -
అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ, ఆరెస్సెస్లపై మజ్లిస్ పార్టీ శాసన సభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు ఎంతకైనా దిగజారుతాయని మండిపడ్డారు. గురువారం పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్లో హిందూ గాళ్ల రాజ్యం నడుస్తోందని, బొందు గాళ్ల రాజ్యం కాదన్నారు. హిందువుల యాత్రలపైన ఎంఐఎం కార్యకర్తలు దాడులకు పాల్పడేవారని, క్రికెట్లో టీమిండియా గెలిస్తే నల్లజెండా ఎగర వేసేవారని బండి సంజయ్ విమర్శించారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు లోపాయకారి ఒప్పందంలో భాగంగా హైదరాబాద్లో ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువుల అంతు చూస్తా అన్న పార్టీతో టీఆర్ఎస్ దోస్తీ కట్టిందని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో కాషాయ జెండా మాత్రమే ఎగరబోతోందని జోస్యం చెప్పారు. ఎంఐఎం ముస్లిం మహిళలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటే వారి బాగు కోసం ప్రధాని నరేంద్ర మోదీ ట్రిపుల్ తలాక్ని చట్ట బద్దం చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. దురదృష్టవశాత్తు మిమ్మల్ని ఎన్నుకున్నారు కరీంనగర్ సభలో అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు ప్రజలు ఎంఐఎం నేతలను ఎన్నుకున్నారని ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఏప్రిల్ 20 మీ ఇలాఖలో ఏం జరిగిందో గుర్తుకు లేదా అక్బరుద్దీన్? మీ వాళ్లు నీపై హత్యాయత్నం చేసి కిడ్నీలు, అవయవాలు అన్నీ డీలా అయ్యేలాగా చేసిన విషయం గుర్తుకు రాలేదా? మా హిందువులను ఏం చేస్తావ్. నీ బొంద చేస్తావ్. ముస్లిం పేరుతో మీ అన్నదమ్ములు ఇద్దరు పబ్బం గడుపుతున్నారు. ఎంఐఎం మత రాజకీయాలకు తెర తీస్తోంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఉండు.. లేదంటే నీ చికిత్స ఫెయిలై ఉన్న జీవితం పోగొట్టుకుంటావ్’అంటూ అరవింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: మజ్లిస్ పార్టీ శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం కరీంనగర్లో ఏర్పాటుచేసిన ఎంఐఎం సభలో కార్యకర్తలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. కరీంనగర్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి గెలవడం తనను ఆవేదనకు గురిచేసిందన్నారు. మూక దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారు నేరుగా స్వర్గానికి వెళ్తారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘నేను ఎన్ని రోజులు బతుకుతానో నాకు తెలియదు. నేను భయపడేది నా గురించి కాదు.. రాబోయే తరాల గురించి నా భయం. కరీంనగర్లో ఎంఐఎం నేత డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడు స్థానికంగా బీజేపీ అడ్రస్ కూడా లేదు. కానీ ఇప్పుడు ఏకంగా కరీంనగర్ ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. మజ్లిస్ గెలవలేదని బాధలేదు. బీజేపీ గెలిచిందని ఆవేదనగా ఉంది. మూక దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారు నేరుగా స్వర్గానికి వెళ్తారు. ఎవరైతే భయపెడతారో వారినే భయపెట్టిస్తారు. మజ్లిస్ మతతత్వ పార్టీ అని దుష్ప్రచారం చేస్తున్నారు. అలా చేసేవారు ఎవరో కాదు. గాడ్సేని పొగిడినవాళ్లే. గమ్యాన్ని ముద్దాడే భావోద్వేగాలంటే నాకు ఇష్టం’అంటూ అక్బరుద్దీన్ ప్రసంగించారు. -
తాండూరులో రాజకీయ వేడి
సాక్షి, తాండూరు: పట్టణంలో పురపోరు వేడెక్కుతోంది. మున్సిపల్ పరిధిలోని 36 వార్డుల్లో విజయావకాశాలున్న నాయకులకే టికెట్లు దక్కేలా ఆయా పార్టీల నేతలు ప్రణాళిక సిద్ధంచేశారు. అయితే టీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి వర్గీయులు.. చైర్మన్, కౌన్సిలర్ స్థానాలపై ఆశలు పెట్టుకున్నారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులంతా పట్నం మహేందర్రెడ్డి వర్గీయులుగా ఉన్నారు. ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న వారు ఈ సారి ఎలాగైనా టికెట్ దక్కించుకుని గెలవాలని కృతనిశ్చయంతో ఉన్నారు. అయితే నెల రోజుల క్రితం కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే రోహిత్రెడ్డి తన అనుచర గణానికి అధిక ప్రాధాన్యం కల్పించి.. పార్టీ తరఫున పోటీ చేయించేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చైర్మన్ పదవి బీసీ జనరల్కు వస్తే.. మాజీ కౌన్సిలర్లు సందల్ రాజుగౌడ్, పట్లోళ్ల నర్సింలు పోటీ పడే అవకాశం ఉంది. ఇందుకోసం ఇరువురూ లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరిలో ఒకరు పట్నం మనిషి కాగా మరొకరు పైలెట్ వర్గానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. దీంతో పార్టీ నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందో మరో వారం రోజుల్లో తేలిపోనుంది. కాంగ్రెస్కు కష్టకాలం.. తాండూరు మున్సిపాలిటీని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీకి ఈ సారి ఎన్నికల్లో ప్రతికూల వాతావరణం కనిపిస్తోంది. ఈ పార్టీకి చెందిన నేతలంతా గడిచిన ఏడాది కాలంలో ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోయారు. ఉన్న కొద్ది మంది కూడా వీరి బాటలో పయనించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో టీఆర్ఎస్ను తట్టుకుని కాంగ్రెస్ ఎన్నికల రేసులో నిలుస్తోందా..? లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే టికెట్ దక్కని ఆశావహులు తిరిగి సొంత పార్టీకి వచ్చే అవకాశాలు లేక పోలేవు. యంగ్ లీడర్స్కు అవకాశం దక్కేనా... తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో సీనియర్లను కాదని యంగ్లీడర్లకు అవకాశం దుక్కుతుందా..? లేదా..? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ పరిధిలోని యువత గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రోహిత్రెడ్డిని విజయతీరాలకు చేర్చారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని కొంత మంది యువకులు రెడీ అయ్యారు. అయితే ఇటీవల రోహిత్రెడ్డి కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్ లో చేరారు. ఫలితంగా కొత్త, పాత నాయకులతో కారు టీఆర్ఎస్ మరింత బలంగా కనిపిసోర్తంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటి చేసే అవకాశం యంగ్ లీడర్స్కు కల్పిస్తారా లేదా పార్టీలోని సీనియర్ నేతలకే టికెట్లు కట్టబడుతారా అనేది ఉత్కంఠగా మారింది. చాపకింద నీరులా బీజేపీ, ఎంఐఎం... మున్సిపల్ ఎన్నికల కోసం బీజేపీ, ఎంఐఎం చాపకింద నీరులా ముందుకు వెళ్తున్నాయి. మున్సిపల్ చైర్మన్ జనరల్కు రిజర్వ్ అయితే చైర్మన్ స్థానం కోసం నరుకుల నరేందర్గౌడ్ పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పట్టణంలోని ఆయా వార్డుల నుంచి బరిలో దిగాలనుకుంటున్నారు ఇప్పటి నుంచే ఏర్పాట్లలో మునిగి తేలునుతున్నారు. అంతే కాకుండా టీఆర్ఎస్ పార్టీలో టికెట్ దక్కని నాయకులను తమ వైపుకు తిప్పుకొని పోటీలో నిలపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎంఐఎం పార్టీ నేత ఎంఏ హాదీ మున్సిపల్ పరిధిలోని 36 వార్డుల్లో ఎలాంటి పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లేందుకు ఎత్తులు వేస్తున్నారు. -
తెలంగాణలో బీజేపీ బలపడలేదు
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ పాలన ఉన్నంతకాలం తెలంగాణలో పాగా వేయటం బీజేపీకి అసాధ్యమని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మోదీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, కేసీఆర్ లాంటి బలమైన ప్రాంతీయ పార్టీ అధినేతను ఢీకొనలేరని తేల్చి చెప్పారు. శనివారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. స్నేహభావంతో మెలిగే తత్వం ఉన్న తెలంగాణ ప్రజలు, విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలను ఆదరించరని, సంఘ్పరివార్ ఆలోచనలను తిప్పిగొడతారన్నారు. గత ఐదేళ్లుగా ముస్లింలు, బడుగు బలహీనవర్గాలు, గిరిజనుల విద్యకోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలతో నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దిన కేసీఆర్కు ప్రజలు అండగా ఉంటారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పార్టీ సభ్యత్వ నమోదు కోసం బీజేపీ అధినేత అమిత్షా తెలంగాణకు రావటం ఆ పార్టీ అంతర్గత విషయమని, దాన్ని పట్టించుకోనన్నారు. కానీ, తెలంగాణలో పాగా వేసే చర్యల్లో భాగంగానే అమిత్షా ప్రత్యేక దృష్టి సారించి తెలంగాణకు వచ్చినట్టయితే వారికి ఆశాభంగం తప్పదని ఆయన పేర్కొన్నారు. అత్యంత బలీయమైన శక్తిగా ప్రాంతీయ పార్టీలున్న ఒడిషా, తమిళనాడు, తెలంగాణలాంటి ప్రాంతాల్లో బీజేపీ ఎన్నటికీ విజయం సాధించలేదని, ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ కనుమరుగై ప్రాంతీయ పార్టీల హవా సాగుతోందన్నారు. గత ఎన్నికల్లో నాలుగు చోట్ల బీజేపీ గెలవటం ఆ పార్టీ బలంగా ఉండటం వల్ల కాదని, మూడు చోట్ల అతి విశ్వాసం, ఒక స్థానంలో సరైన అభ్యర్థి లేకపోవటం టీఆర్ఎస్ ఓటమికి కారణమని అసదుద్దీన్ పరోక్షంగా పేర్కొన్నారు. ఇక భారీ విజయంతో వచ్చిన అహంకారం బీజేపీలో స్పష్టంగా కనిపిస్తోందని, ఆ పార్టీ నేతలు రెచ్చిపోయి దాడులకు పాల్పడుతున్నారని అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఎమ్మెల్యే దాడికి పాల్పడటం, ఆయన మనుషులు తుపాకీతో రెచ్చిపోవటం ఇందులో భాగమేనన్నారు. అది మంచి పద్ధతి కాదంటూ ప్రధాని నరేంద్రమోదీ ఖండించిన వెంటనే ఆగ్రా వెళ్లే దారిలో ఓ ఎంపీ అనుచరులు టోల్ సిబ్బందిపై దాడికి పాల్పడటం ఆ పార్టీ నాయకుల వైఖరిని స్పష్టం చేస్తోందన్నారు. ఎన్నికల్లో సులభంగా రూ.50 లక్షలు ఖర్చు పెట్టే నేతలు, టోల్ వద్ద రూ.50 చెల్లించేందుకు మనసు ఒప్పదా అని ప్రశ్నించారు. సోమవారం జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మరోసారి ప్రధాని ‘ఈ తీరు నచ్చదు’అని అంటారంటూ ఎద్దేవా చేశారు. బడ్జెట్తో సామాన్యుని నడ్డి విరిచింది ఇక కేంద్ర బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచిందని, పేద ప్రజలపై ప్రేమ ఒలకబోసే మాటలు చెప్పే బీజేపీ ప్రభుత్వం బడ్జెట్లో వారిపై భారం మోపిందన్నారు. ఇప్పుడు పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల పేదలకు అశనిపాతమే అవుతుందన్నారు. ఆదాయపన్నుపై సర్ఛార్జి కూడా భారంగా మారుతుందన్నారు. మోదీ తరచూ చెప్పే నారీ శక్తి మాటలకు, బడ్జెట్లో మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని చూస్తే ఎక్కడా పొంతన కనిపించదని విమర్శించారు. న్యూస్ప్రింట్పై కస్టమ్ డ్యూటీ పెంపు, పుస్తకాల ధరలకు రెక్కలొచ్చే నిర్ణయాలు సరికాదని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం కోటి మంది ముస్లిం విద్యార్థులకు స్కాలర్షిప్స్ అంటూ ఘనంగా చెప్పుకునే మోదీ ప్రభుత్వం, వారికి అందించే ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్లో కోత పెట్టిందని విమర్శించారు. ఉద్యోగాల కల్పనకు సంబంధించి బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావనే లేదన్నారు. -
హైదరాబాద్కు చేరుకున్న అక్బరుద్దీన్
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యం కారణంగా లండన్లో చికిత్స పొందిన మజ్లిస్ పార్టీ శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్కు చేరుకున్నారు. రెండు నెలల క్రితం సౌదీ అరేబియాలోని మక్కాలో ఉమ్రా ప్రార్థనల కోసం ఆయన తన కుటుంబసభ్యులతో కలసి వెళ్లారు. అక్కడ అనారోగ్యానికి గురికావడంతో రెగ్యులర్ చెకప్ల నిమిత్తం వెళ్లే లండన్లోని ఓ ఆసుపత్రికి ప్రయాణమయ్యారు. వైద్య పరీక్షలు చేయించుకొని కుటుంబసభ్యులతో కలసి అక్కడే విశ్రాంతి తీసుకుంటూ రంజాన్ పండుగ కూడా జరుపుకున్నారు. ఇరవై రోజుల క్రితం అక్బరుద్దీన్ తీవ్రమైన కడుపునొప్పికి గురై వాంతులు చేసుకోవడంతో కుటుంబసభ్యులు అక్కడి ఆసుపత్రిలో చేర్పించారు. ఎనిమిదేళ్ల క్రితం చాంద్రాయణగుట్ట సమీపంలో జరిగిన దాడి నుంచి ఆయన త్రుటిలో ప్రాణాలతో బయటపడినా తీవ్ర గాయాల కారణంగా తరచూ కడుపునొప్పికి గురవుతున్నారు. మెరుగైన వైద్యం కోసం 3 నెలలకోసారి లండన్ ఆసుప్రతికి వెళ్లి చికిత్స చేయించుకొని వస్తున్నారు. ఈ క్రమంలో అక్బర్ త్వరగా కోలుకోవాలంటూ దేవుడిని ప్రార్థించాలని రంజాన్ సందర్భంగా దారుస్సలాంలో జరిగిన కార్యక్రమంలో మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్టీ శ్రేణులు, అభిమానులకు విజ్ఞప్తి చేయడంతో కార్యకర్తలు, అభిమానుల్లో కలకలం చెలరేగింది. అక్బరుద్దీన్ ఆరోగ్యం కోసం కార్యకర్తలు పెద్దఎత్తున ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎట్టకేలకు ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చారు. ఆయన రాక విషయం తెలుసుకొని మజ్లిస్ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని ఘనస్వాగతం పలికారు. -
డివిజన్ ఓటింగ్ పెట్టండి: అసదుద్దీన్
న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ బిల్లు శుక్రవారం పార్లమెంటు ముందు చర్చకు వచ్చింది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. దీన్ని మహిళల సాధికారిత, న్యాయానికి సంబంధించిన బిల్లుగా వర్ణించారు. అయితే బిల్లును తీసుకొచ్చిన మరుక్షణమే కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ దీన్ని వ్యతిరేకించారు. తలాక్ పద్ధతికి తాను వ్యతిరేకమేనని, అయితే దీన్ని నేరంగా పరిగణించడాన్ని మాత్రమే తాను వ్యతిరేకిస్తున్నానని అన్నారు. ఇతర మతాల్లో కూడా పురుషులు భార్యలను వదిలి వేస్తున్నారని పేర్కొన్నారు. బిల్లులో ఎలాంటి విధానపరమైన భద్రతలు లేవని దాన్ని స్టాండింగ్ కమిటీకి నివేదించాలని థరూర్ డిమాండ్ చేశారు. శశిథరూర్కు మద్దతిస్తూ కాంగ్రెస్ ఎంపీలు కూడా నినాదాలు చేశారు. ఎంఐఎం కూడా ఈ బిల్లును వ్యతిరేకించింది. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. ఈ బిల్లు రాజ్యంగ విరుద్ధమన్నారు. దీనిపై డివిజన్ ఓటింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. -
అక్బరుద్దీన్పై రేవంత్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ పార్టీ శాసనసభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఈమేరకు తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తమందరి ఆశీస్సులు అక్బరుద్దీన్పై ఉంటాయని, వెంటనే కోలుకుని తెలంగాణ ప్రజల సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తాలని పేర్కొన్నారు. కాగా తీవ్ర అనారోగ్యానికి గురైన ఒవైసీ రెగ్యులర్ వైద్య సేవల కోసం లండన్లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. గత రెండు రోజుల క్రితం అక్బరుద్దీన్ తిరిగి ఆకస్మికంగా వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పికి గురికావడంతో కుటుంబ సభ్యులు అక్కడి ఆసుపత్రిలో చేర్పించారు. -
అక్బరుద్దీన్ ఒవైసీకి తీవ్ర అనారోగ్యం
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ పార్టీ శాసనసభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర అనారోగ్యానికి గురై లండన్లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేరారు. ఆయనకు రెగ్యులర్గా వైద్య సేవలు అందించే వైద్య బృందం ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్నారు. గత పక్షం రోజులక్రితం రంజాన్ పర్వమాసం సందర్భంగా సౌదీ అరేబియాలోని మక్కాలో ఉమ్రా ప్రార్థనల కోసం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. ఉమ్రా ప్రార్థనల అనంతరం హైదరాబాద్కు తిరుగు ప్రయాణం సమయంలో అనారోగ్యానికి గురికావడంతో రెగ్యులర్ చెకప్కోసం వెళ్ళే లండన్లోని ఆసుపత్రికి ప్రయాణమయ్యారు. అక్కడి ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకొని కొద్దిరోజులుగా కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే ఉంటున్నారు. రంజాన్ కూడా అక్కడే జరుపుకున్నారు. కాగా, గత రెండు రోజుల క్రితం అక్బరుద్దీన్ తిరిగి ఆకస్మికంగా వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పికి గురికావడంతో కుటుంబ సభ్యులు అక్కడి ఆసుపత్రిలో చేర్పించారు. ఎనిమిదేళ్ల క్రితం చాంద్రాయణగుట్ట సమీపంలో అక్బరుద్దీన్పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే తీవ్ర గాయాలకు గురికావడంతో ఇప్పటికీ అక్బరుద్దీన్ కడుపు నొప్పితో బాధ పడుతూ ఉంటారు. మెరుగైన వైద్యం కోసం ప్రతి మూడు మాసాలకు ఒకసారి లండన్లోని ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకొని వస్తుంటారు. ఇటీవల లోక్సభ ఎన్నికల సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా తీవ్ర అనారోగ్యానికి గురై స్థానికంగా చికిత్స పొంది తిరిగి కోలుకున్నారు. తాజాగా తిరిగి అనారోగ్యానికి గురయ్యారు. కాగా, దారుస్సలేంలో జరిగిన ఈద్–మిలాప్ సందర్భంగా తన సోదరుడు అక్బరుద్దీన్ త్వరగా కోలుకోవాలంటూ దేవుడిని ప్రార్థించాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్టీ శ్రేణులు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. దీంతో అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యంపై ఆందోళన చెలరేగింది. అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యంకోసం పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. -
ఎంఐఎంకు ప్రధాన ప్రతిపక్ష హోదా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనం కావడంతో శాసనసభలో వివిధ రాజకీయ పక్షాల బలాబలాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. సీఎల్పీ విలీన ప్రక్రియకు స్పీకర్ ఆమోదం తెలపడంతో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం హోదాను కోల్పోయింది. 120 మంది శాసనసభ్యులు ఉన్న అసెంబ్లీలో కనీసం పది శాతం మంది ఎమ్మెల్యేలు కలిగి ఉన్న పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి కేవలం ఆరుగురు శాసనసభ్యుల మద్దతు మాత్రమే ఉంది. దీంతో ఏడుగురు ఎమ్మెల్యేలను కలిగిన ఏఐఎంఐఎం అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీలో పదో వంతు సభ్యుల బలం లేకున్నా.. రెండో అతిపెద్ద పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏడుగురు సభ్యులతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించే ఎంఐఎంకు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కే పక్షంలో.. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తారు. గులాబీ గూటికి మరో ఇద్దరు? కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం కేవలం ఆరుగురు సభ్యులు మాత్రమే ఉండగా, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా త్వరలో టీఆర్ఎస్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ జాబితాలో భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య పేరు ప్రధానంగా వినిపిస్తుండగా, మరో శాసనసభ్యుడు ఎవరనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్రెడ్డి టీఆర్ఎస్లో చేరతారని ప్రచారం సాగుతున్నా.. ఆయన చేరికపై పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విముఖతతో ఉన్నట్లు సమాచారం. ఇటీవల లోక్సభ ఎన్నికల అనంతరం తనను కలిసిన మెదక్ జిల్లా శాసనసభ్యులకు జయప్రకాశ్రెడ్డి చేరిక అంశంపై ఆయన స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. జయప్రకాశ్రెడ్డి చేరికపై తనకు, పార్టీ అధినేత కేసీఆర్కు ఆసక్తి లేదని వ్యాఖ్యానించినట్లు సమాచారం. కేబినెట్లోకి ఇద్దరు కాంగ్రెస్ నేతలు? కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికతో అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం భారీగా పెరుగుతుండగా.. చేరిక ఎమ్మెల్యేల్లో ఎవరికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే అంశంపై చర్చ జరుగుతోంది. వరుసగా రెండో పర్యాయం సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్.. మంత్రివర్గంలో 11 మందికి చోటు కల్పించారు. రాష్ట్ర కేబినెట్లో 16 మందికి అవకాశం ఉండగా.. మలి విడత విస్తరణలో మరికొంత మందికి చోటు దక్కనుంది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేల్లో కనీసం ఇద్దరికి చోటు దక్కుతుందని సమాచారం. వెనుక బెంచీలకే కాంగ్రెస్ పరిమితం కాంగ్రెస్ శాసనసభా పక్షం గుర్తింపు కోల్పోవడంతో ఆ పార్టీ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్కతో పాటు, మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలు వెనుక బెంచీలకు పరిమితం కానున్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలకు అధికార పార్టీ ఎమ్మెల్యేల సరసన అసెంబ్లీలో చోటు దక్కనుంది. అసెంబ్లీ చర్చల్లో సభ్యుల సంఖ్య ఆధారంగా కాంగ్రెస్కు దక్కే సమయం కూడా గణనీయంగా తగ్గనుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం టీడీపీ, బీజేపీకి కూడా అసెంబ్లీలో కేవలం ఒక్కో సభ్యుడు మాత్రమే ఉన్నారు. మరోవైపు అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఉన్న టీఆర్ఎస్.. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికతో మరింత బలం పెంచుకుంది. గతేడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను 88 చోట్ల టీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ తర్వాత ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున గెలుపొందిన కోరుకంటి చందర్, స్వతంత్ర అభ్యర్థి రాములు నాయక్, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య టీఆర్ఎస్లో చేరడంతో పార్టీ బలం 91కి పెరిగింది. కాంగ్రెస్కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ కండువా కప్పుకోవడంతో అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 103కి చేరింది. -
‘ఉగ్రవాదులకు ఒవైసీ ఆర్థిక సాయం’
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం అధినేత, స్థానిక ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఉగ్రవాదులకు అసదుద్దీన్ నిధులు మళ్లిస్తూ.. ఆర్థిక సహాయం చేస్తున్నారని ఆరోపించారు. ‘‘హైదరాబాద్ నగరంలో ఉగ్రమూలాలు ఉన్నాయనడానికి కారణం ఒవైసీనే. ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు వారికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్సభ పరిధిలో వివిధ దేశాలకు చెందిన ఏడు వేల ముస్లింలు నివశిస్తున్నారు. వారందరికీ ఆయనే ఆశ్రయం కల్పిస్తున్నారు. ఓల్డ్ సిటీలో ఒవైసీపై వ్యతిరేకంగా చాలా వరకు ఉంది. 2024లో హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని బీజేపీ సొంతం చేసుకోవడం ఖాయం. ఆయన ఓటమితోనే ఎంఐఎం కనుమరుగవుతుంది’’ అని అన్నారు. ముస్లిం ప్రజలకు ఒవైసీపై కన్నా.. ప్రధాని మోదీపైనే ఎక్కువ నమ్మకం కలిగి ఉన్నారని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో అక్రమంగా నివశిస్తున్న ముస్లింలను బయటికి పంపేందుకు ఎన్ఆర్సీ చట్టాన్ని ఇక్కడ కూడా అమలుచేయాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. కాగా ఉగ్రవాదులకు హైదరాబాద్ సేఫ్ జోన్ అంటూ కేంద్రమంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. హైదరాబాద్లో ఉగ్రమూలాలు ఉన్నాయంటూ కిషన్ రెడ్డి చేసిన కాంమెట్లను తాను ఏకభవిస్తానని రాజాసింగ్ స్పష్టం చేశారు. ఆయన ఆరోపణలపై పలు వర్గాల నుంచి విమర్శలు రాగా.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనను మందలించారు. మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయవద్దంటూ షా సూచించారు. అలాంటి వ్యాఖ్యలే ఈసారి రాజాసింగ్ చేశారు. -
ట్రాఫిక్ కానిస్టేబుల్గా మారిన ఎంపీ..!
సాక్షి, హైదరాబాద్ : ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్రాఫిక్ కానిస్టేబుల్గా మారారు. పాతబస్తీలోని ఫతే దర్వాజా చౌరస్తాలో వాహనాలు అడ్డదిడ్డంగా వెళ్లడంతో శుక్రవారం సాయంత్రం ట్రాఫిక్ జామ్ అయింది. అదేసమయంలో ఎంపీ అసదుద్దీన్ కూడా చార్మినార్ నుంచి మిస్రాజ్గంజ్వైపు వెళ్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఎంపీ వాహనదారులకు తగు సూచనలు చేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. స్వయంగా ఎంపీ కారు దిగి ట్రాఫిక్ క్లియర్ చేయడానికి పూనుకోవడంతో అక్కడున్న మిగతావారు ఆయనకు తోడుగా నిలిచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రంజాన్ మాసం కావడంతో ఫతే దర్వాజా చౌరస్తాలో రద్దీ ఎక్కువడా ఉంటుందని, వ్యాపారులు పెద్ద ఎత్తున రోడ్డుకు ఇరువైపులా చేరడంతో ఈ కష్టాలు తప్పవని స్థానికులు అంటున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నాలుగోసారి విజయం సాధించిన సంగతి తెలిసిందే. బీజేపీ పక్షాన పోటీ చేసిన భగవంత్రావుకు రెండోసారి ఓటమి తప్పలేదు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పట్టు పెంచిన మజ్లిస్
సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీ పరిధిలో వివిధ రాజకీయ పక్షాలకు ఓటు బ్యాంక్ మెరుగుపడినట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ శాతం తక్కువగా నమోదైనప్పటికీ పోలైన ఓట్లలో బీజేపీ మినహా ఆయా పార్టీలు తమ ఓటు బ్యాంక్ చేజారకుండా మరింత పెంచుకోగలిగాయి. లోక్సభ స్థానానికి ప్రధాన పక్షాలైన మజ్లిస్, బీజేపీ నుంచి పాత అభ్యర్థులు తలపడగా, కాంగ్రెస్, టీఆర్ఎస్ పక్షాలు కొత్త ముఖాలను బరిలో దింపాయి. మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీ పడగా పోలైన ఓట్లలో సగానికి పైగా ఓట్లను మజ్లిస్ పార్టీ దక్కించుకుంది. గత లోకసభ ఎన్నికల కంటే ఆరు శాతం అధికంగా మజ్లిస్ పార్టీకి ఓట్లు పెరగగా, బీజేపీ మాత్రం ఓట్లు పెంచుకోవడంలో సఫలీకృతం కాలేకపోయింది. గత ఎన్నికల కంటే 6.3 శాతం తక్కువగా ఓటింగ్ శాతం నమోదైంది. శాసనసభ ఎన్నికల కంటే మాత్రం ఓట్ల శాతం పెరిగినట్లయింది. కాంగ్రెస్ పార్టీకి ఐదేళ్ల పాత ఓటు బ్యాంకు మాత్రమే పునరావృత్తమైంది. టీఆర్ఎస్ కొంత మొరుగుపడింది. మజ్లిస్ పార్టీకి ఓటు బ్యాంక్ పెరిగినా మెజార్టీలో వెనుకబడింది. ఎన్నికల బరిలో ఇలా... హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి నాలుగోసారి సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విజయం సాధించగా, బీజేపీ పక్షాన పోటీ చేసిన భగవంత్రావుకు రెండోసారి ఓటమి తప్పలేదు. కాంగ్రెస్ పక్షాన బరిలోకి దిగిన ఫిరోజ్ఖాన్కు ఘోర పరాభవం తప్పలేదు. ఇప్పటికే ఆయన నాంపల్లి అసెంబ్లీ స్థానానికి మూడుసార్లు పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అధికార టీఆర్ఎస్ పక్షాన బరిలో దిగిన న్యాయవాది శ్రీకాంత్ గెలవలేకపోయినా ఓటు బ్యాంక్ను పెంచుకోగలిగారు. సెగ్మెంట్ వారిగా ఇలా... అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా పరిశీలిస్తే వివిధ రాజకీయ పక్షాలకు ఓటు బ్యాంక్ శాతం పెరిగినట్లు కనిపిస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీకి మలక్పేటలో 43.2 శాతం, కార్వాన్లో 53.2, చార్మినార్లో 53.7, చాంద్రాయణగట్టలో 68, యాకుత్పురాలో 49.3, బహదూర్పురాలో 75 శాతం ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి మలక్పేటలో 16.2 శాతం, కార్వాన్లో 22.7, గోషామహెల్లో 45.4, చార్మినార్లో 21.12, చాంద్రాయణగుట్టలో 10.8, యాకుత్పురాలో 11.8 శాతం, బహదూర్పురాలో 5.7 శాతం ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్కు నామమాత్రపు ఓట్ల పోలైనప్పటికి ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఓటు బ్యాంక్ మరికొంత మెరుగుపడినట్లు కనిపిస్తోంది. -
నాలుగు జెండాలాట
సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలో లోక్సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఈసారి ‘నాలుగు స్తంభాలాట’ కనిపించింది. గ్రేటర్పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ వేర్వేరు పార్టీలకు చెందిన అభ్యర్థులు గెలుపొందారు. హైదరాబాద్లో ఎంఐఎం, సికింద్రాబాద్లో బీజేపీ, మల్కాజిగిరిలో కాంగ్రెస్, చేవెళ్లలోటీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆద్యంతం అనేక మలుపులు తిరుగుతూ అందరినీ ఉత్కంఠకు గురి చేసింది. ముఖ్యంగా మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ స్థానాల్లో మెజారిటీ ఒక్క రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థిని వరిస్తే, మరో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చింది. మొత్తంగా చూస్తే హైదరాబాద్లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ, సికింద్రాబాద్లో బీజేపీ అభ్యర్థి జి.కిషన్రెడ్డి, మల్కాజిగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి ఎ.రేవంత్రెడ్డి, చేవెళ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ రంజిత్రెడ్డిలు లోక్సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. గడిచిన శాసనసభ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో నగర ఓటర్లు విభిన్న తీర్పునివ్వటం విశేషం. హైదరాబాద్ లోక్సభలో ఎంఐఎం సహజ ఓటు బ్యాంక్తోనే మళ్లీ విజయబావుటా ఎగరేయగా, శాసనసభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవని బీజేపీ, కాంగ్రెస్లు సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్సభ స్థానాల్లో మళ్లీ గత వైభవాన్ని సాధించాయి. 2014లో చేవెళ్ల లోక్సభ స్థానాన్ని గెలిచిన టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించి స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. లోక్సభకు ముగ్గురు కొత్తే... నగరం నుండి లోక్సభకు ఎన్నికైన నలుగురిలో ముగ్గురు కొత్తవారే. హైదరాబాద్ నుండి విజయం సాధించిన అసదుద్దీన్ ఇప్పటికే పలుమార్లు ఎన్నికవగా, సికింద్రాబాద్ స్థానం నుండి విజయం సాధించిన కిషన్రెడ్డి, మల్కాజిగిరి నుండి విజయం సాధించిన రేవంత్రెడ్డిలు లోక్సభకు కొత్తే. వీరిద్దరు ఎమ్మెల్యేలుగా పనిచేసినా ఎంపీగా పోటీ చేసిన తొలిసారే లోక్సభకు ఎన్నికయ్యారు. ఇక చేవెళ్లలో విజయం సాధించిన డాక్టర్ రంజిత్రెడ్డి రాజకీయాలకే పూర్తిగా కొత్త. మొత్తంగా చూస్తే మహానగర ప్రజలు నాలుగు లోక్సభ పరిధిలో నాలుగు పార్టీలు, నలుగురు విభిన్న వ్యక్తిత్వం కలిగిన వారిని లోక్సభకు పంపి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. -
టీఆర్ఎస్దే హవా
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ హవా కొనసాగుతుందని ఎగ్జిట్ పోల్స్ అం చనా వేశాయి. రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాలకుగాను ఆ పార్టీ అత్యధికంగా 15 సీట్లు గెలుచుకుంటుం దని ఆదివారం పలు జాతీయ చానళ్లు తమ సర్వేల ద్వారా తేల్చాయి. న్యూస్ఎక్స్–నేతా సర్వే ప్రకారం టీఆర్ఎస్కు 15 స్థానాలు రానున్నాయి. ఈ సర్వే ప్రకారం చూస్తే కాంగ్రెస్కు ఒక్క స్థానం వస్తుండగా ఎంఐఎం మరో సీటు గెలుచుకోనుంది. బీజేపీ ఖాతా తెరవడం లేదు. ఇండియా టుడే సర్వే ప్రకారం అయితే టీఆర్ఎస్కు 10–12 స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తుండగా కాంగ్రెస్కు 1–3 స్థానాలు, బీజేపీకీ అదే స్థాయిలో సీట్లు రావొచ్చని సర్వే అంచనా వేసింది. ఇక అన్ని జాతీయ చానళ్ల సర్వేల్లోనూ ఎంఐఎం తన ఒక్క స్థానాన్ని పదిలపరుచుకుంటుందని వెల్లడైంది. ఆ రెండు పార్టీల్లో ఉత్కంఠ... ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అన్ని సర్వేల్లో కాంగ్రెస్ కనీసం ఒక్క స్థానం గెలుచుకుంటుందని తేలింది. ఒక్క న్యూస్ఎక్స్–నేతా మినహా అన్నింటిలోనూ బీజేపీ ఒక్క స్థానం గెలుచుకోబోతోంది. దీంతో ఆ ఒక్క స్థానం ఏమిటనేది ఆ రెండు పార్టీల్లో ఉత్కంఠ కలిగిస్తోంది. మిగిలిన సర్వేల్లో ఆ రెండు పార్టీలకు మూడు స్థానాల వరకు వచ్చే అవకాశం ఉందని వెల్లడించడంతో అసలు ఎక్కడెక్కడ విజయావకాశాలు ఉన్నాయన్న దానిపై ఇరు పార్టీలు లెక్కలు మొదలుపెట్టాయి. కాంగ్రెస్ పార్టీ నల్లగొండ, భువనగిరి, చేవెళ్ల, ఖమ్మం, మల్కాజిగిరి స్థానాలపై ఆశలు పెట్టుకోగా బీజేపీ సికింద్రాబాద్, మహబూబ్నగర్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్లలో సానుకూల ఫలితాలు ఆశిస్తోంది. ఈ సర్వేల ప్రకారం కనీసం ఒకటి లేదా మూడు స్థానాలు గెలిచే అవకాశం ఆ రెండు పార్టీలకు ఉన్నా గెలుపు తీరం ఎక్కడ చేరుతుందన్నది మాత్రం ఈ నెల 23న తుది ఫలితాలు వెల్లడయ్యాక తేలనుంది. -
మజ్లిస్ వల్లే అంబర్పేటలో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ దుందుడుకు వైఖరితో అంబర్పేటలోని ఓ స్థలం విషయంలో ఉద్రిక్తత ఏర్పడిందని బీజేపీ సీనియర్ నేత కిషన్రెడ్డి ఆరోపించారు. ఎన్టీఆర్ హయాంలో అంబర్పేట్లో జరిగిన రోడ్డు వెడల్పులో పోయిన ఓ స్థలంలో ప్రార్థనా మందిరం ఉందంటూ ఎంఐఎం శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తోందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చే నంబర్ చౌరస్తా నుంచి శ్రీరమణ థియేటర్ చౌరస్తా వరకు ఉన్న ముస్లిం శ్మశాన వాటికకు ఇబ్బం ది కావద్దనే ఫ్లైఓవర్ తీసుకొచ్చామని తెలిపారు. మిగతా రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ప్రాపర్టీ కలిగిన 281 మందితో మాట్లాడి నష్టపరిహారంగా గజా నికి రూ.80 వేలు ఇప్పించినట్లు చెప్పారు. 2–2–468 నంబర్ ఇంటిలోని ముగ్గురు అన్నదమ్ములకు ఒక్కొక్కరికి రూ.84 లక్షల చొప్పు న.. రూ.2.5 కోట్ల పరిహారం చెల్లించి గత ఏప్రిల్లో ఆ ఇంటిని అధికారులు తొలగించా రన్నారు. మసీదు ఉంటే పరిహారం ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆ ఇల్లు ప్రైవేటు ఆస్తి అయినప్పటికీ ఎంఐఎం నేత ఖాద్రీ పోలీసులను అడ్డుపెట్టుకొని అక్కడ మసీదు కట్టారని అన్నారు. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశామని, టీఆర్ఎస్ కూడా తమ వైఖరేంటో చెప్పాలన్నారు. ఇదే అంశానికి సంబంధించి మంగళవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని స్థానిక కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలతో కలసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఈ అంశంపై విచారణ కమిటీ వేసి నివేదిక తెప్పించుకుంటామని సీఎస్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. -
టీఆర్ఎస్తో దోస్తానీ చేస్తే ఏదైనా చెయ్యొచ్చా?
సాక్షి, హైదరాబాద్ : అంబర్పేట్లోని జాతీయ రహదారిలో ఉన్న మజీద్ విషయంలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ ప్రశాంతతను, మత సామరస్యాన్ని మజ్లీస్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని బీజేపీ నేత కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం చేతగానితనం వల్లే ఈ సమస్య వచ్చిందని.. అక్కడ లేని మసీద్ను ఉన్నట్లు చూపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్తో దోస్తానీ చేస్తే ఏమైనా చెయ్యొచ్చా అని నిలదీశారు. దీనికి అధికార పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అక్కడి ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం 281 ప్రాపర్టీస్ను స్వాధీనం చేసుకున్నారని, 170మందికి పరిహారం ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. అది మసీద్ స్థలమని మజ్లీస్ ఆరోపిస్తున్న దానికి కూడా పరిహారం ఇవ్వడం జరిగిందన్నారు. ఆ ల్యాండ్ ఓనర్ కూడా డబ్బులు తీసుకున్నారని, 2018 ఫిబ్రవరిలో చెక్లు ఇచ్చామని, ముగ్గురు అన్నదమ్ములకు 2 కొట్ల 52లక్షలు చెల్లించామని తెలిపారు. గతేడాది ఏప్రిల్లోనే అక్కడ నిర్మాణాన్ని తొలగించామన్నారు. అది ప్రైవేట్ ప్రాపర్టీ అని, పోలీసులను పక్కన పెట్టుకుని ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే పాషా ఖాద్రి అక్కడ నమాజ్ చేశారని పేర్కొన్నారు. అన్నీ తెలిసిన పోలీస్ కమీషనర్ మజ్లీస్కు ఎందుకు వత్తాసు పలుకుతున్నారో చెప్పాలన్నారు. ఆ ల్యాండ్ ఓనర్లు కూడా అక్కడ మసీద్ లేదని ఫిర్యాదు చేశారని అన్నారు. ఒక్క ఎమ్ఐఎమ్ పార్టీ తప్పా మిగిలిన అన్ని పార్టీలు ఒక్క తాటిపై ఉన్నాయని తెలిపారు. హోం మినిష్టర్ మాట మార్చి.. మసీద్ నిర్మాణం చేస్తామని చెబుతున్నారు.. అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మసీద్ నిర్మాణానికి ఒప్పుకునేది లేదని.. దీనిపై ఫిర్యాదు చేసేందుకు సీఎస్ను కలుస్తామన్నారు. -
‘అక్కడ ఏ ప్రార్థనా మందిరం కట్టినా ఊరుకోం’
సాక్షి, హైదరాబాద్ : అంబర్పేట్ ఫ్లై ఓవర్ వివాదంపై బీజేపీ నాయకులు ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ అధ్వర్యంలో మంగళవారం హోం మంత్రిని కలిశారు. అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. అంబర్పేట్లో మా ఎమ్మెల్యేతో సీపీ, పోలీసులు దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. పాతబస్తీ నుంచి వచ్చిన ఓ వర్గం వారు అంబర్పేట్లో స్థానికులపై రాళ్లు రువ్వారని తెలిపారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం పొందిన తర్వాత మళ్లీ మజ్లిస్ నాయకులు, బయటి వ్యక్తులతో కలిసి అదే స్థలంలో ప్రార్థన చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఫ్లైఓవర్ నిర్మించడానికి కూల్చివేసిన స్థలంలో మళ్లీ గుంపులుగా నమాజ్ చేస్తే స్థానిక అంబర్ పేట్ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని లక్ష్మణ్ విమర్శించారు. ప్రభుత్వ స్థలంలో ఓ వర్గం వారు మందిరం కడుతుంటే పోలీసులు, ప్రభుత్వం ఏం చేస్తుందని లక్ష్మణ్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ అండ చూసుకునే.. ఎంఐఎం అరాచకాలకు పాల్పడుతుంది.. అందుకు పోలీసులు కూడా సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అంబర్పేటలో ఏ ప్రార్థన మందిరం కట్టినా ఊరుకోమని హెచ్చరించారు. తమ ఎమ్మెల్యేపై దాడి చేసిన సీపీ, పోలీసులతో పాటు.. పాషా ఖాద్రి, వక్ఫ్ చైర్మన్పై చర్యలు తీసుకోవాలని హోం మంత్రిని కోరినట్లు లక్ష్మణ్ తెలిపారు. -
ఎవరికి జిందాబాద్?
ఔరంగజేబు పేరుతో ఏర్పడిన ఔరంగాబాద్ చారిత్రక నగరంలో విజయావకాశాన్ని చేజిక్కించుకునేందుకు చాలా ఏళ్లుగా ఇక్కడ వేళ్లూనుకున్న శివసేనతో కాంగ్రెస్ తలపడబోతోంది. పురాతన కట్టడాలైన అజంతా ఎల్లోరా గుహలు ఈ నగరం చుట్టుపక్కల వ్యాపించి ఉంటాయి. దేశ విదేశాల నుంచి సందర్శించడానికి వచ్చే టూరిస్టులతో ఈ ప్రాంతం ఎల్లప్పుడూ కళకళలాడుతుంటుంది. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సందర్భంలో తప్ప దాదాపు అన్నిసార్లూ ఈ ప్రాంత ప్రజలు శివసేనకే పట్టం కట్టడం గమనార్హం. ఔరంగబాద్ లోక్సభ స్థానాన్ని 30 ఏళ్లుగా.. 1989 నుంచి శివసేన పార్టీ నిలబెట్టుకుంటూ వస్తోంది. 1998లో మాత్రం ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. ప్రస్తుతం ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది శివసేన సిట్టింగ్ ఎంపీ చంద్రకాంత్ బావూరావ్ ఖైరే. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పాటిల్ నితిన్ సురేష్పై లక్షా 62 వేల మెజారిటీతో చంద్రకాంత్ బావూరావ్ ఖైరే విజయం సాధించారు. ఈసారి సైతం శివసేన నుంచి ఆయనే బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఐదోసారీ బరిలో.. శివసేనకు బలమైన పునాదులున్న ఈ నియోజకవర్గంలో ఈసారి కూడా చంద్రకాంత్ బావూరావ్ ఖైరే గెలుపుని కైవసం చేసుకుంటే వరుసగా ఐదుసార్లు ఆయన విజయపరంపర కొనసాగినట్లవుతుంది. 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు విజయఢంకా మోగించిన చంద్రకాంత్కు ఈసారి ప్రజలు పట్టం కడతారా అనేది వేచి చూడాల్సి ఉంది. చంద్రకాంత్ పశ్చిమ ఔరంగాబాద్ నుంచి 1990 లోనూ, 1995లోనూ రెండుసార్లు శాసనసభకు కూడా ఎన్నికయ్యారు. శివసేన ప్రభుత్వంలో మహారాష్ట్రలో 1995 నుంచి 1999 వరకు క్యాబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా సుభాష్ జాంబాద్ ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ పార్లమెంటు స్థానానికి సుభాష్ జాంబాద్.. శివసేన అభ్యర్థి చంద్రకాంత్తో తలపడబోతున్నారు. గత ఎన్నికల్లో చంద్రకాంత్ ఖైరేకు 5,20,902 ఓట్లు వచ్చాయి. ఈయన ప్రత్యర్థి నితిన్ సురేష్ పాటిల్కి 3,58,902 వచ్చాయి. మూడో స్థానంలో ఉన్న బీఎస్పీ అభ్యర్థి 37,419 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈసారి ఈ స్థానం నుంచి కాంగెస్ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న సుభాష్ మానిక్ చంద్ జాంబాద్కు మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది. స్థానికంగా పలు సేవాకార్యక్రమాల్లో తరచూ పాల్గొంటూ ప్రజల నోళ్లలో నానుతోన్న సుభాష్ జాంబాద్ ఈసారి శివసేనకు గట్టిపోటీ ఇచ్చే బలమైన అభ్యర్థిగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎంఐఎం నుంచి పాత్రికేయుడు ఈసారి 23 ఏళ్ల పాత్రికేయ అనుభవం ఉన్న జర్నలిస్టు ఇంతియాజ్ జలీల్ ఔరంగాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఏఐఎంఐఎం తరఫున పోటీ చేస్తున్నారు. ఎన్డీ టీవీలో 12 ఏళ్లు, లోక్మత్లో 11 ఏళ్ల అనుభవం ఉన్న ఇంతియాజ్ జలీల్ 2014లోనే తొలిసారిగా రాజకీయ రంగప్రవేశం చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లోనే ఔరంగాబాద్ సెంట్రల్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. నిజానికి మహారాష్ట్రలోని ప్రకాశ్ అంబేడ్కర్ సారథ్యంలోని వంచిత్ బహుజన్ అఘాదీ పార్టీతో పొత్తుపెట్టుకొని ఔరంగాబాద్ లోక్సభ స్థానంలో పోటీ చేయాలని ఎంఐఎం తొలుత భావించింది. అయితే ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఔరంగాబాద్ అభ్యర్థిగా ఇంతియాజ్ జలీల్ను ఎంపిక చేశారు. దళితుల్లోనూ, ముస్లిం మైనారిటీల్లోనూ మంచి వ్యక్తిగా ఔరంగాబాద్లో ఇంతియాజ్కు గుర్తింపు ఉంది. తస్లీమాను అడ్డుకుని.. ప్రపంచ ప్రఖ్యాత అజంతా ఎల్లోరా గుహలను సందర్శించేందుకు 2017లో మహారాష్ట్ర వచ్చిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ను ఎయిర్ పోర్టులోనే అడ్డుకోవడంలో ఎంఐఎం నాయకుడు ఇంతియాజ్ జలీల్ది కీలక పాత్ర. ఎయిర్పోర్టు బయట తస్లీమా నస్రీన్కి వ్యతిరేకంగా ఎంఐఎం నిరసనకు దిగడంతో పోలీసులే ఆమెను మహారాష్ట్ర నుంచి తిప్పి పంపించి వేశారు. మొత్తంగా ఓ పక్క హిందుత్వ శివసేన, మరోవైపు ఇస్లాం నేపథ్య ఎంఐఎం, ఇంకోపక్క పోటాపోటీగా దూసుకొస్తోన్న కాంగ్రెస్ మధ్య ఈసారి ఔరంగాబాద్ లోక్సభ స్థానంలో పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఇంతియాజ్, చంద్రకాంత్, సుభాష్ జాంబాద్