ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడికి అస్వస్థత
హైదరాబాద్ : మాజీ మంత్రి, కాంగ్రెస్ సభ్యుడు కొత్తపల్లి సుబ్బారాయుడు గురువారం అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు నిమ్స్కు తరలించారు. కొత్తపల్లికు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన ఆరోగ్యంపై వివరాలు వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు.