breaking news
muggler
-
ఫోన్ ఎత్తుకెళ్లిన దొంగతో ప్రేమలో పడింది
ఆ దొంగ తొలుత ఆమె ఫోన్ ఎత్తుకెళ్లాడు. తరువాత ఆమె హృదయాన్ని దోచుకున్నాడు. ఒక బ్రెజిలియన్ యువతి తనను దోచుకున్న దొంగతో ప్రేమలో పడ్డానని వెల్లడించిన నేపధ్యంలో దొంగతనానికి కొత్త అర్థం వచ్చినట్లయ్యింది. ఇప్పుడు వీరిద్దరూ ఎవరూ విడదీయలేని జంటగా మారిపోయారు. ఆన్లైన్లో షేర్ అయిన ఈ జంటకు సంబధించిన వీడియోకు 2,32 వేలకుపైగా వీక్షణలు దక్కాయి. ఈ వీడియోలో ఈ జంట తమ ప్రేమ కథను వివరించారు. ‘ఆరోజు నేను.. అతను నివసించే వీధిలో నడుస్తున్నాను. అప్పుడు నా ఫోన్ చోరీ జరిగింది’ అని అంటూ ఇమాన్యులా బ్రెజిల్లో జరిగిన ఒక మీడియా సమావేశంలో తమ మొదటి కలయిక గురించి వివరించింది. మనసు మార్చుకున్నదొంగ ఆ రోజు దొంగ తన ఫోన్ను ఎలా తీసుకున్నాడో ఆమె గుర్తుచేసుకుంది. అతను ఆరోజు దోపిడీకి పాల్పడ్డాడని తెలిపింది. అయితే ఇది మరొకరి ఫోన్ నంబర్ను తెలుసుకునే మార్గం అని పేర్కొంది. అప్పటి వరకూ తనకు తెలియని జాకర్(దొంగ) మనసు మార్చుకున్నాడని ఇమాన్యులా చెప్పింది. తరువాత జాకర్ మాట్లాడుతూ తనకు గర్ల్ఫ్రెండ్ లేకపోవడంతో ఇబ్బందిగా అనిపించింది. ఆ సమస్యకు ఊహించని విధంగా పరిష్కారం దొరికింది అంటూ తమ మొదటి కలయికను జాకర్ గుర్తు చేసుకున్నాడు. ఆ ఫోనులో తాను ఆమె ఫోటోను చూసినప్పుడు, ఆమె అందానికి ఫిదా అయ్యాను. ప్రతిరోజూ ఆమెను చూడాలనుకున్నాను. ఆమె ఫోను దొంగిలించినందుకు చింతించాను అని అన్నాడు. ఒక రిపోర్టర్ మాట్లాడుతూ ‘మీరు తొలుత ఆమె ఫోన్ను దొంగిలించారు. తరువాత ఆమె హృదయాన్ని దొంగిలించారు’ అని అన్నాడు. కాగా ప్రేమలో పడినవారిద్దరూ రెండేళ్లుగా డేటింగ్లో ఉన్నారు. వీరి వ్యవహారంపై తల్లిదండ్రుల స్పందన ఏమిటో ఇంతవరకూ తెలియరాలేదు. వీరిద్దరి ప్రేమ కథపై ట్విట్టర్ వ్యాఖ్యానాలు లెక్కకు మించి ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘ఇది బ్రెజిల్లో మాత్రమే సాధ్యం’ అని ఒకరు పేర్కొనగా ‘ప్రేమ ఏదైనా సాధించగలదు’ అని మరొకరు చమత్కరించారు. ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న సీరియల్ కిల్లర్స్ రిచర్డ్ రామిరేజ్, జాన్ వేన్ గేసీ వంటి నేరస్తులకు పలువురుస్త్రీలు ఆకర్షితులయ్యారు. అంటే నేరాలకు ఆకర్షణకు సంబంధం లేదని నిపుణులు అంటున్నారు. 2015లో సెక్యూరిటీల మోసం కేసులో అరెస్టయిన ఫార్మా బ్రో మార్టిన్ ష్క్రెలీతో ప్రేమలో పడిన బ్లూమ్బెర్గ్ రిపోర్టర్ క్రిస్టీ స్మిత్ తన భర్తకు విడాకులు ఇచ్చి అతనితో ఉంటోందనే వార్తలు వినిపించాయి. ఇది కూడా చదవండి: పోలీసు నిర్లక్ష్యంతోనే జాహ్నవి మృతి?.. ఆలస్యంగా ఆధారాలు వెలుగులోకి.. É só no Brasil mesmo….kkkkkkkkkkk. pic.twitter.com/EmrqKfUzZM — Milton Neves (@Miltonneves) July 21, 2023 -
లారీడ్రయివర్ నుంచి స్మగ్లర్ దాకా...
వెంకటరెడ్డి ఎర్రచందనం స్మగ్లర్ వద్ద లారీ డ్రైవర్గా చేరాడు. అక్రమ మార్గాలన్నీ తెలుసుకుని కోట్లకు పడగలెత్తాడు. సొంతంగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ 32 ఏళ్లుగా అటవీ, పోలీసు అధికారులకు చెమటలు పట్టించాడు. చివరకు రేణిగుంటలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రదక్షిణ చేస్తూ పోలీసులకు శనివారం అడ్డంగా దొరికిపోయాడు. సాక్షి, తిరుపతి/మంగళం: అటవీ, పోలీసు అధికారులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న ఎర్రచందనం స్మగ్లర్ వెంకటరెడ్డి శనివారం ఎట్టకేలకు పట్టుబడ్డాడు. లారీ క్లీనర్గా జీవితం ప్రారంభించి స్మగ్లర్గా మారిన అతని అక్రమ వ్యవహారాలకు సంబంధించిన వివరాలను అటవీ అధికారులు వెల్లడించారు. మండల కేంద్రమైన ఎర్రావారిపాళానికి చెం దిన తిమ్మసముద్రం రామిరెడ్డికి వెంకటరెడ్డి, వెంకటశివరామిరెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి కుమారులు. వెంకటరెడ్డి, వెంకటశివరామిరెడ్డి రేణిగుంటలోనే కాపురం ఉంటున్నారు. 30 ఏళ్ల క్రితం ఒక్కొక్కరికి రెండెకరాల వ్యవసాయ భూమి ఉండేది. తొలుత లారీ క్లీనర్గా జీవితాన్ని ప్రారంభించిన వెంకటరెడ్డి తిరువళ్లూరుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ నాయుడు వద్ద డ్రైవర్గా చేరాడు. రెండేళ్లపాటు లారీ డ్రైవర్గా పనిచేశాడు. అతని వేతనంగా ఒక్కో ట్రిప్పునకు రూ.50వేలు తీసుకునేవాడు. బ్రహ్మంగారిమఠం, కోడూరు, కడప, ఆళ్లగడ్డ, నం ద్యాల, తలకోన, భాకరాపేట ప్రాంతాల నుంచి ఎర్రచందనం చెట్లను నరికి అక్రమంగా తరలించేవాడు. అడవిలో నరి కిన ఎర్రచందనం దుంగలను కర్నూలులోని ఓ గోదాములో దాచేవారు. అక్కడి నుంచి ఢిల్లీకి చేరవేసేవారు. చెన్నైలోని రెడ్హిల్స్కు చెందిన మణి, సత్యవేడుకు చెందిన మురళి సహకారంతో అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు చేరవేసేవారు. అలా ఎర్రచందనం రవాణాకు అన్ని మార్గాలు తెలుసుకున్న వెంకటరెడ్డి కొంతకాలానికి తానే స్మగ్లర్గా అవతారమెత్తాడు. రేణిగుంటలోని శ్రీవెంకటేశ్వరస్వామి గుడిలో శనివారం పూజలు చేస్తూ పట్టుబడ్డాడు. కోట్లకు పడగలెత్తిన వెంకటరెడ్డి కుటుంబం స్మగ్లర్గా అవతారమెత్తిన వెంకటరెడ్డి కుటుంబం కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించింది. రేణిగుంట, తిరుపతి, ఎర్రావారిపాళెం, కర్నూలు, కడప ప్రాంతాల్లో భవ నాలు, అపార్ట్మెంట్లు నిర్మించినట్లు తెలుస్తోంది. వెంకటరెడ్డి పేరుపై రూ.100 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. అతని సోదరులకు కూడా రూ.50 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఎర్రచందనం అక్రమరవాణా సా గిస్తూనే తాజాగా హైదరాబాద్లో బిల్డర్ అవతారమెత్తినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. ఎర్రావారిపాళెం నుం చి ఢిల్లీ దాకా ఎర్రచందనం అక్రమరవాణాను విస్తరించినట్లు వెల్లడించాడు. ఈ అక్రమరవాణాలో ఎవరెవరు ఉన్నారు? ఎంత మంది ఉన్నారు? ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారే కీలక సమాచారం సైతం పోలీసులకు వెంకటరెడ్డి వివరిం చినట్లు విశ్వసనీయ సమాచారం.