-
TG: మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురి మృతి
సాక్షి, నాగర్కర్నూల్: మట్టిమిద్ కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడిన ఘటన జిల్లాలోని వనపట్లలో చోటు చేసుకుంది. వర్షం కారణంగా తడిచిన మట్టి ఇంటి మిద్దె, గోడ ఒక్కసారిగా కూలిపోయాయి. నిద్రిస్తున్న ఆ కుటుంబం మీద పడ్డాయి. ఘటనలో గొడుగు పద్మ (26), ఆమె ఇద్దరు కూతుర్లు పప్పి(6) , వసంత (6) , కొడుకు (10) నెలలు విక్కీ కన్నుమూశారు. తండ్రి భాస్కర్(28)కు గాయాలు కావడంతో చికిత్స కోసం జిల్లాస్పత్రికి తరలించారు. ముగ్గురు బిడ్డలతో తల్లి ఊహించిన ప్రమాదంలో చనిపోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. -
బీఎస్పీ గూటికి మందా
అలంపూర్: లోక్సభ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. పోటీయే ప్రధానం అన్నట్టుగా కొందరు ఉన్న పార్టీని వదిలి.. మరో పార్టీ కండువా కప్పుకొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘కారు’ దిగిన మాజీ ఎంపీ మందా జగన్నాథం.. ఆ తర్వాత ‘చెయ్యి’ అందుకున్నారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానానికి పోటీచేసే అవకాశం కల్పిస్తారని ఆశించగా, పార్టీ అధిష్టానం మరొకరికి టికెట్ కేటాయించింది. ఈనేపథ్యంలో మందా జగన్నాథం కాంగ్రెస్ పార్టీని వీడుతారనే ప్రచారం జోరుగా సాగింది. ఎట్టకేలకు ఆయన కాంగ్రెస్ను వీడి ఏనుగెక్కారు. బుధవారం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మందా ప్రభాకర్ ఆధ్వర్యంలో పార్టీ అధినేత్రి మాయావతిని రాజస్థాన్లో కలిసి, పార్టీ కండువా కప్పుకొన్నారు. 1996లో రాజకీయాల్లోకి ఆరంగేట్రం.. మాజీ ఎంపీ మందా జగన్నాథం 1996లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. వైద్య వృత్తిలో కొనసాగిన ఆయన.. ఆ తర్వాత అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి 4 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 1996, 1999, 2004 ఎన్నికల్లో టీడీపీ తరఫున, 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి 4వ సారి లోక్సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ● బీఎస్పీలో చేరిన మందా జగన్నాథం నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో నిలవనున్నారు. 2014లో బీఆర్ఎస్ నుంచి ఇదే స్థానం నుంచి పోటీచేసి ఓటమి చెందారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో పోటీచేసే అవకాశం దక్కలేదు. 2023 అక్టోబర్ వరకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి పనిచేసిన ఆయన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. కాగా.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో బీఎస్పీ గూటికి చేరారు. కాగా, అలంపూర్ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతలు ఈ సారి నాగర్కర్నూల్ స్థానం నుంచి పోటీపడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్ధిగా అలంపూర్కు చెందిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బరిలో ఉండగా.. కొండేరుకు చెందిన మందా జగన్నాథం బీఎస్పీ నుంచి బరిలో నిలుస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బీఎస్పీని వీడి బీఆర్ఎస్ నుంచి బరిలో నిలవగా.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, అక్కడి నుంచి బీఎస్పీలో చేరిన మందా జగన్నాథం పోటీలో ఉండనుండటం కొసమెరుపు. మాయవతి సమక్షంలో ఏనుగు పార్టీలో చేరిన మాజీ ఎంపీ జగన్నాథం నాగర్కర్నూల్ పార్లమెంట్ బరిలో నిలిచే అవకాశం -
ఎండలే ఎండలు..
అచ్చంపేట: ఈ వేసవిలో ఎండలు మళ్లీ పెరుగుతున్నాయి. వాతావరణ శాఖ ముందుస్తుగానే హెచ్చరించినట్లు భానుడు భగభగ మండుతున్నాడు. బుధవారం 43 డిగ్రీల ఉష్ణోగ్రతులు నమోదు కావడం విశేషం. కోడేరులో అత్యధికంగా 43 డిగ్రీలు, అత్యల్పంగా అమ్రాబాద్ మండలం వట్టువర్లపల్లిలో 38.4గా నమోదైంది. 28 డిగ్రీలు నమోదైతేనే ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి కానున్నారు. సగటున గరిష్ట ఉష్ణోగ్రత 43.6 డిగ్రీలకు చేరువైంది. కనిష్ట ఉష్ణోగ్రత సైతం సగటు 28.5 డిగ్రీలకు చేరింది. కల్వకుర్తి, బిజినేపల్లిలో 42.4, అచ్చంపేట మండలం ఐనోలు, వెల్దండలో 41.9, పెద్దకొత్తపల్లి మండలం చెన్నపురావుపల్లి, అచ్చంపేటలో 41.6, నాగర్కర్నూల్ మండలం తూడుకుర్తిలో 41.4, కొల్లాపూర్లో 41.1, వెల్దండ మండలం బొల్లంపల్లి, లింగాలలో 40.8, వంగూరు మండలం కిష్టంపల్లి, చారకొండ మండలం సిరసనగండ్ల, పెంట్లవెల్లి మండలం జట్ర్పోల్లో 40.7, తిమ్మాజీపేట, ఉప్పునుంతల మండలం వెల్టూర్లో 40.5, పదర మండలం వంకేశ్వరంలో 40.3, కల్వకుర్తి మండలం తోటపల్లి, బల్మూర్ మండలం కొండనాగుల, తెలకపల్లి మండలం పెద్దూరులో 40.2, నాగర్కర్నూల్లో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
ప్రక్రియ షురూ..
నేటి నుంచి లోక్సభ ఎన్నికల నామినేషన్లు నామినేషన్ల స్వీకరణకు చివరి తేది ఏప్రిల్ 25 ఉపసంహరణకు చివరి తేది ఏప్రిల్ 29 పోలింగ్ తేది : మే 13ఎన్నికల ఫలితాలు: జూన్ 4సాక్షి, నాగర్కర్నూల్: లోక్సభ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. గురువారం నుంచే అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించనున్నారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో లోక్సభ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నెల 25 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించనుండగా.. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండనుంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తాము నామినేషన్ వేసేందుకు ముహూర్తాలను ఖరారు చేసుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు తమ అభ్యర్థుల నామినేషన్ సందర్భంగా జాతీయ, రాష్ట్ర స్థాయి ముఖ్య నేతల హాజరు, భారీ ర్యాలీలతో నామినేషన్ వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. బడా నేతలు హాజరు.. ముహూర్త బలం దృష్టిలో ఉంచుకుని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఈ నెల 19, 23, 24, 25 తేదీల్లో నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నాగర్కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఈ నెల 19న మొదటి సెట్టు నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నిరంజన్రెడ్డి హాజరవుతారని తెలుస్తోంది. అలాగే ఈ నెల 24న పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీతో మరోసారి నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఆ రోజున బీఆర్ఎస్ ముఖ్య నేతలు హరీశ్రావు హాజరవుతారని సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి ఈ నెల 23న నామినేషన్ వేసేందుకు సిద్ధం అవుతున్నారు. నామినేషన్ రోజున పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని పార్టీ నేతలు భావిస్తున్నారు. బీజేపీ తమ అభ్యర్థుల నామినేషన్ల ఘట్టానికి జాతీయ స్థాయి నేతలు, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను రంగంలోకి దింపనుంది. ఈ నెల 25న బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ప్రసాద్ నామినేషన్ పత్రాలను దాఖలు చేయనుండగా.. నామినేషన్ కార్యక్రమానికి గుజరాత్ సీఎం భూపేంద్రపటేల్ హాజరుకానున్నారని సమాచారం. ఈ మేరకు భారీ ర్యాలీలు, అనంతరం ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశాలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఖరారైన ప్రధాన పార్టీ అభ్యర్థుల ముహూర్తాలు పార్టీల బడా నేతల హాజరు ఈ నెల 25 వరకు స్వీకరణ ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు -
ఆర్డీటీ సంస్థకు ఆర్థిక సాయం
మన్ననూర్: అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజలకు ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ.. ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ రూ.లక్ష విరాళం అందజేశారు. అమ్రాబాద్ మండలం మన్ననూర్లో పదేళ్లుగా ఆర్డీటీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చెంచులకు ఉచితంగా, ఇతరులకు 20 శాతం రుసుంతో ప్రతి నిత్యం అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నారు. ‘స్పందించు సాయం అందించు’ (ఇండియా ఫర్ ఇండియా) అనే కార్యక్రమంతో నల్లమలలో ఈ సంస్థ ఆధ్వర్యంలో విస్తృతంగా సేవలందిస్తున్నారు. వీరి సేవా కార్యక్రమాలకు స్పందించిన ఎమ్మెల్యే.. ఆర్డీటీ ఆస్పత్రి వైద్యుడు సైఫుల్లాఖాన్తో పాటూ సిబ్బందిని తన ఇంటి వద్దకు పిలిపించుకుని నాణ్యతకు సంబంధించి వైద్యపరమైన సూచనలు సలహాలతో పాటూ చెక్కు రూపంలో ఈ విరాళం అందజేశారు. ఆర్డీటీ సంస్థ చేస్తున్న సేవలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీటీ సంస్థ ఏటీఎల్ రామ్మోహన్, రాధమ్మ, అచ్చయ్య, భాస్కర్, రాజేష్, అంజనమ్మ తదితరులు పాల్గొన్నారు. అగ్నిమాపక శాఖ అనుమతులు తప్పనిసరి నాగర్కర్నూల్ క్రైం: ఆస్పత్రులు, సినిమా థియేటర్లతో పాటు పెద్ద భవనాలకు అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని నాగర్కర్నూల్ ఫైర్ ఆఫీసర్ కృష్ణమూర్తి తెలియజేశారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాదాలు వెంటనే అదుపు చేసేందుకు అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అగ్నిమాపకశాఖ నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. ఫైర్ సిబ్బంది కురుమూర్తి, నాగేష్, శ్రీనివాస్రెడ్డి, జగన్మోహన్, మహమూద్ పాల్గొన్నారు. -
ఎండలోనే ఉపాధి
●టెంట్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూలీలు గ్రామ పంచాయతీల ద్వారా ఏర్పాట్లు.. జిల్లాలోని ఉపాధి కూలీలకు ఆయా గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో తాగునీరు, నీడ వసతి కల్పించాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు సైతం ఆయా శాఖల అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పనిప్రదేశాల్లో కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో పరిశీలించి కూలీలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. – చిన్న ఓబులేసు, జిల్లా గ్రామీణ అభివృద్ధిశాఖ అధికారి సాక్షి, నాగర్కర్నూల్: వేసవి నేపథ్యంలో వ్యవసాయ పనులు లేక జిల్లా వ్యాప్తంగా కూలీలకు ఉపాధి సన్నగిల్లింది. దీంతో ప్రధానంగా ప్రభుత్వం కల్పించే ఉపాధి హామీ పథకంపైనే పెద్ద సంఖ్యలో కూలీలు ఆశలు పెట్టుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న కూలీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సాధారణ రోజుల్లో జిల్లావ్యాప్తంగా రోజుకు 20 వేల లోపు మాత్రమే కూలీలు హాజరయ్యే పరిస్థితి ఉండగా.. వేసవిలో మాత్రం గత మంగళవారం ఒక్కరోజునే జిల్లా వ్యాప్తంగా 45,597 మంది ఉపాధి కూలీలు హాజరయ్యారు. రానున్న వారం రోజుల్లో ఉపాధి హామీ పనులను ఆశ్రయించే వారి సంఖ్య మరింత పెరుగనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో కీలకంగా మారిన ఉపాధి హామీ పనుల్లో చాలాచోట్ల కనీస సౌకర్యాలు కూడా కరువవడంతో ఉపాధి కూలీలకు ఎండదెబ్బ తప్పడం లేదు. సౌకర్యాలు కరువు.. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీల్లో ఉపాధిహామీ పనులు కొనసాగుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే పగటి ఉష్టోగ్రతలు 43 డిగ్రీలకు చేరుకోవడంతో ఎండలో పనిచేసే కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. చాలాచోట్ల కూలీలకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా కరువైంది. కూలీలు సొంతంగా తెచ్చుకున్న నీళ్ల బాటిళ్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మండుటెండలో పనిచేసే కూలీలకు వడదెబ్బ తగలకుండా, విశ్రాంతి కోసం టెంటు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ఎక్కడా అలాంటి ఏర్పాట్లు కన్పించడం లేదు. స్పందించని అధికారులు.. ఉపాధి హామీ పథకం కింద పని కల్పించే ప్రదేశాల్లో ఆయా గ్రామపంచాయతీల ద్వారా తాగునీటి ఏర్పాట్లు కల్పించాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో కూలీకి కనీసం రెండు లీటర్ల చొప్పున పంచాయతీలే సురక్షిత తాగునీటిని అందించే ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. అయితే జిల్లాలో చాలాచోట్ల గ్రామపంచాయతీల అధికారులు, సిబ్బంది కూలీలకు తాగునీటి సౌకర్యం కల్పించడం లేదు. ఉదయం 9 గంటలకే ఎండ వేడిమి పెరుగుతుండటంతో ఉపాధి కూలీలు అల్లాడుతున్నారు. వేసవి ముగిసే వరకు తాగునీరు, టెంటు సౌకర్యాలను కల్పించాలని, వేతనాలను వెంటనే అందజేయాలని కోరుతున్నారు. జాబ్కార్డుల సంఖ్య 1,91,767 ఈ ఏడాదిలో పనికల్పించిన కూలీల సంఖ్య 1,73,064 మంది పని ప్రదేశాల్లో కరువైన సౌకర్యాలు నీడ, తాగునీటి ఏర్పాట్లకు కదలని పంచాయతీ యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా నిత్యం 45 వేలకు పైగా కూలీల హాజరు ఏజెన్సీల్లో అమలుకాని ‘ప్రత్యేక’ ప్యాకేజీ జిల్లాలోని నల్లమల పరిసర ప్రాంతాల్లోని ఏజెన్సీ గ్రామాలు, చెంచుపెంటల్లోని చెంచులకు ప్రధానంగా ఉపాధి హామీ పథకం ద్వారానే ఆదాయం పొందుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు గతంలో ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ అమలు చేసి అదనపు వేతనం, భత్యం చెల్లించేది. ఇప్పుడు అదనపు చెల్లింపులు నిలిచిపోవడంతో పాటు పదిహేను రోజుల్లోగా అందాల్సిన వేతనం సైతం మరింత ఆలస్యం అవుతోందని చెబుతున్నారు. అటవీ ప్రాంతంలోని చెంచులకు నిరంతరం పని కల్పించడంతో పాటు వేతనం సైతం త్వరగా అందించాలని కోరుతున్నారు. -
జగదభిరాముడి కల్యాణం.. జగమంతా ఆనందం
కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ అభ్యర్థులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, భరత్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు బాలరాజు, జైపాల్యాదవ్, ఆచారిసిర్సనగండ్లలో మాంగళ్యధారణ ఘట్టం నిర్వహిస్తున్న అర్చకులు చారకొండ: అపర భద్రాద్రిగా విరాజిల్లుతున్న సిర్సనగండ్ల క్షేత్రంలో జగదానంద కారకుడు, జగదాభిరాముడు కల్యాణ వేడుక...బుధవారం కనులపండువగా సాగింది. దేవదేవుడి కల్యాణవైభోగాన్ని.. కనులారా వీక్షించి భక్తజనం పులకించారు. ఉదయం 10 గంటలకు వేదమంత్రోచ్ఛారణలు, మేళతాళాలు, భక్తుల జయజయ ద్వానాల మధ్య కల్యాణమూర్తులను ఊరేగింపుగా కల్యాణవేదిక వద్దకు తీసుకురాగా.. ఆలయ చైర్మన్ డేరం రామశర్మ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు జిలకర్ర బెల్లం, మాంగళ్యధారణ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. లోకమంతా వేయికళ్లతో ఎదురుచూసిన అభిజిత్ లగ్నంలో సీతమ్మ మెడలో రామయ్య మాంగళ్యధారణ చేశారు. వేలాది సంఖ్యలో తరలివచ్చిన భక్తుల రామనామస్మరణ మధ్య ఆ జగదభిరాముడు జానకమ్మను మనువాడాడు. రాముడు దోసిట తలంబ్రాలు నీలపురాసులుగా జానకి దోసిట తలంబ్రాలు మణిమాణిక్యాలై సాక్ష్యాత్కరించిన వేళ.. సిర్సనగండ్ల క్షేత్రం భక్తి పారవశ్యంతో ఓలలాడింది. ఈ సందర్భంగా జైశ్రీరాం నినాదాలు మార్మోగాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. వీఐపీ తాకిడితో పాటు ఎండలు ఎక్కువగా ఉండడంతో భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. కల్యాణోత్సవానికి దాదాపు 30 వేల మందికి పైగా భక్తులు హజరైనట్లు దేవస్థాన చైర్మన్, ఈఓ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. నయనానందంగా సాగిన రాములోరి కల్యాణం జనసంద్రంగా మారిన సిర్సనగండ్ల క్షేత్రం మార్మోగిన జైశ్రీరామ్ నినాదాలు -
‘ప్రజల సంక్షేమం మోదీతోనే సాధ్యం’
నాగర్కర్నూల్: దేశ అభివృద్ధి, భద్రతతో పాటు, ప్రజల సంక్షేమం మోదీతోనే సాధ్యమని ప్రజలు భావిస్తున్నారని బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ అన్నారు. బుధవారం నెల్లికొండ మార్కెట్యార్డ్ సమీపంలో పార్లమెంట్ ఎన్నికల కోసం నూతన బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం నాగర్కర్నూల్ పార్లమెంట్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ జక్కా రఘునందన్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరులతో మాట్లాడారు. విద్యావంతుడిగా, యువకుడిగా తనపై నమ్మకం ఉంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించడమే కాకుండా, గెలిపించుకునేందుకు మోదీ మొదటి సమావేశం నాగర్కర్నూల్లో ఏర్పాటు చేశారని చెప్పారు. తన గెలుపునకు కృషి చేస్తే ఐటీ కారిడార్, స్కిల్ డెవలప్మెంట్ తోపాటు ఉపాధి కల్పనకు కృషి చేస్తానని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. 400 సీట్ల పైన బీజేపీ గెలిస్తే దేశ భద్రతకు మరిన్ని చట్టాలు చేయవచ్చన్నారు. నేను బానిస సంకెళ్లను తెంచుకుని బీజేపీలో చేరితే మరో నాయకుడు మాత్రం ఆ బానిస సంకెళ్లలోకి వెళ్లారని అన్నారు. పదేళ్లలో యువకులకు ఉపాధి విస్మరించినందుకే బీఆర్ఎస్ను సాగనంపారన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు, వనపర్తి జెడ్పీచైర్మన్ లోక్నాథ్ రెడ్డి, అశోక్ రెడ్డి, రాజవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు సమ్మేళన సమావేశం గురువారం పట్టణంలోని తీగల వెంకటస్వామి కన్వెన్షన్లో నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ బూత్ కమిటీల సమ్మేళన సమావేశం నిర్వహించనున్నట్లు విభావరి అశోక్ రెడ్డి తెలియజేశారు. -
No Headline
సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవంలో ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులతో పాటు మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, భరత్ప్రసాద్, బీజేపీ నేత ఆచారి తదితర ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సీఐ విష్ణువర్ధన్రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్తో పాటు పలువురు ఎస్ఐలు పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. సిర్సనగండ్లకు చెందిన రాచమళ్ల నర్సింహ కుటుంబసభ్యులు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం, రాంపురం గ్రామానికి చెందిన చిలుకాని బాల్రెడ్డి, వెంకటమ్మ జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. భారతిసిమెంట్, ఇతర సేవా సంస్థల ద్వారా తాగునీటి వసతి, మజ్జిగ అందజేశారు. కాగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల ప్రజాప్రతినిధులు, ఎంపీ అభ్యర్థులు, నాయకులు ఒకే వేదికపై కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. -
కొల్లాపూర్ చైర్పర్సన్పై నెగ్గిన అవిశ్వాసం
కొల్లాపూర్: బీఆర్ఎస్కు చెందిన కొల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ రఘుప్రోలు విజయలక్ష్మిపై కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. మంగళవారం పట్టణంలోని నూతన గ్రంథాలయ భవనంలో అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించారు. రిటర్నింగ్ అధికారిగా కల్వకుర్తి ఆర్డీఓ శ్రీను వ్యవహరించారు. ఎక్స్అఫీషియో సభ్యులైన స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు ఓటింగ్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించగా.. ఎమ్మెల్యే, ఎంపీలు హాజరు కాలేదు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. చైర్పర్సన్ విజయలక్ష్మిపై కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఆర్డీఓ చదివి, సభ్యులను ఓటింగ్ కోరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లతో పాటు, ఎమ్మెల్సీ చెయ్యి ఎత్తి అవిశ్వాసానికి మద్దతు పలికారు. దీంతో రెండింట మూడొంతుల మెజార్టీ ప్రకారం అవిశ్వాసం నెగ్గినట్లు అధికారులు ప్రకటించారు. త్వరలోనే నూతన మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక తేదీని ప్రకటిస్తామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కౌన్సిలర్లందరిని చైర్పర్సన్ కలుపుకొని పోయి ఉంటే బాగుండేదని.. అలా చేయకపోవడం వల్లే కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టాల్సి వచ్చిందన్నారు. స్థానిక ఎమ్మె ల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు సూచన మేరకు త్వరలోనే కొత్త చైర్పర్సన్ ఎన్నిక ఉంటుందని తెలిపారు. చైర్పర్సన్ ఎన్నిక, అవిశ్వాసంలోనూ ఎమ్మెల్సీ ఓటు.. మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకు 2020 జనవరిలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు తొమ్మిది స్థానాల్లో, జూపల్లి కృష్ణారావు మద్దతుదారులు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున పోటీచేసి 11 స్థానాల్లో గెలిచారు. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటర్లుగా పాల్గొన్నారు. వారి ఓట్లతో బీఆర్ఎస్కు చెందిన రఘుప్రోలు విజయలక్ష్మి చైర్పర్సన్గా, మహిమూదాబేగం వైస్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహిమూదాబేగం కాంగ్రెస్ పార్టీలో చేరారు. చైర్పర్సన్ విజయలక్ష్మికి పదవి కట్టబెట్టడం, దిగిపోవడం రెండింటిలోనూ ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి ఓటు వేయడం విశేషం. మున్సిపల్ చైర్పర్సన్ పదవి కోల్పోయిన విజయలక్ష్మి అవిశ్వాస ఓటింగ్కు హాజరైన ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి గైర్హాజరైన బీఆర్ఎస్ కౌన్సిలర్లు -
పార్లమెంట్లో ప్రజావాణి వినిపిస్తా
నాగర్కర్నూల్/నాగర్కర్నూల్రూరల్/వనపర్తిటౌన్/ఖిల్లాఘనపురం: తనను ఆశీర్వదించి ఎంపీగా గెలిపిస్తే.. ఢిల్లీలో ఈప్రాంత ప్రజల వాణి వినిపిస్తానని నాగర్కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. మంగళవారం నాగర్కర్నూల్ జెడ్పీ మైదానంలో మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్, అంబేడ్కర్ చౌరస్తాలలో హ మాలీ సంఘం నాయకులను కలిసి ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం రాజకీయ ఐక్యవేదిక సదస్సులో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని దళితవాడ, రాజీవ్చౌక్, కాశీంనగర్లో మాజీ మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి కార్నర్ మీటింగ్, ఖిల్లాఘనపురంలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆయా సమావేశాల్లో ఆర్ఎస్పీ మా ట్లాడుతూ మహనీయుల ఆశయసాధన, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన ఏడేళ్ల సర్వీస్కు ఫుల్స్టాప్ పెట్టి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ప్రభుత్వంతో కొట్లాడి ఎర్ర బస్సు నుంచి ఎయిర్ బస్సు సౌకర్యం కల్పిస్తానని చెప్పారు. విద్యార్థుల కోసం కొత్త పథకాలు తీసుకురావడమే కాకుండా, వారిలో నైపుణ్యాలు పెంపొందించేందుకు కృషి చేస్తానన్నా రు. గతంలో ఇక్కడ ఎంపీలుగా గెలిచిన నాయకులు ఎలాంటి సేవలు అందించారో ప్రజలందరికీ తెలుసన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరిగిన 223 రోజు ల్లో కేవలం 6 నిమిషాలు మాత్రమే మాట్లాడిన ఎంపీ కొడుకు బీజేపీ అభ్యర్థి అని ఎద్దేవా చేశారు. గతంలో రెండు సార్లు ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి ఈప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు. నాగర్కర్నూల్ ఎంపీగా తనను గెలిపిస్తే, ఈ ప్రాంతాన్ని ప్రపంచ పటంలో నిలుపుతానని హామీ ఇచ్చారు. ● కొనుగోలు కేంద్రాలకు కనీసం గన్నీబ్యాగులు అందించలేని పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందన్నారు. మాయమాటలు చెప్పి, ఓట్లు దండుకోవడం కాంగ్రెస్కు వెన్నెతో పెట్టిన విద్య అని అన్నారు. కేసీఆర్ హయాంలో ఖిల్లాఘనపురం మండలానికి సాగునీరందించే పనులను ఒక్క ఏడాదిలోనే పూర్తిచేసినట్లు వివరించారు. విద్యావేత్త ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను ఎంపీగా గెలిపించుకోవడం బాధ్యతగా భావించాలని కోరారు. సమావేశాల్లో అభిలాష్రా వు, ప్రత్యూష, ఎంపీపీ కృష్ణానాయక్, జెడ్పీటీసీ సామ్యానాయక్, గ్రంథాలయ చైర్మన్ లక్ష్మయ్య, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురు మూర్తి, లక్ష్మారెడ్డి, కృష్ణయ్య, మంగి విజయ్, ప్రదీ ప్, ఐతోల్ లక్ష్మయ్య, భాస్కర్గౌడ్, గంగాధర్, కరణ్ లాల్, రాంనర్సయ్య, గంగ, రాము పాల్గొన్నారు. నాగర్కర్నూల్లో మాట్లాడుతున్న ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ -
అనన్య.. ప్రతిభ
సివిల్స్లో ఆలిండియా 3వ ర్యాంకు సాధించిన పాలమూరు బిడ్డ బుధవారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024వివరాలు IIలో uఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి అమ్రాబాద్/అచ్చంపేట రూరల్: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ పిలుపునిచ్చారు. పదర మండలం రాయలగండి తండా సమీపంలో మంగళవారం అమ్రాబాద్, పదర మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి, అధికారంలో రావడం ఖాయమన్నారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి, మల్లు రవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో ఆయా మండలాల అధ్యక్షులు రామలింగయ్యయాదవ్, హరినారాయణగౌడ్ ఉన్నారు. ● అచ్చంపేట మండలంలోని పల్కపల్లిలో ఎమ్మెల్యే వంశీకృష్ణ మార్నింగ్వాక్ నిర్వహించి, సమస్యలను తెలుసుకున్నారు. త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట గోపాల్రెడ్డి, సంతోష్రెడ్డి, హరీష్, యాదయ్య, వెంకటేష్ ఉన్నారు. క్రీడలతో మానసిక వికాసం నాగర్కర్నూల్ క్రైం: క్రీడలతో మానసిక వికాసంతో పాటు శారీరక దారుఢ్యం పెంపొందుతుందని డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన టెన్నిస్ కోర్టును మంగళవారం కలెక్టర్ ఉదయ్కుమార్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్తో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా డీఐజీ మాట్లాడుతూ నిత్యం విధి నిర్వహణలో ఒత్తిడికి గురయ్యే పోలీసులకు క్రీడలు అవసరమన్నారు. ప్రతి మనిషి జీవితంలో క్రీడలు భాగం కావాలని సూచించారు. ఎస్సీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్కు క్రీడలపై ఎంతో ఆసక్తి ఉందని.. ఈనేపథ్యంలోనే టెన్నిస్ కోర్టు ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రామేశ్వర్ పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన ఉప్పునుంతల: మండలంలోని వెల్టూరు, చాకలి గుడిసెలు, అయ్యవారిపల్లి, తండా, సూర్యతండా, ఫిరట్వానిపల్లి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను మంగళవారం సెక్టోరియల్ అధికారి జ్ఞానేశ్వర్రెడ్డి పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ర్యాంప్ సౌకర్యం, పోలింగ్ సిబ్బందికి ఫర్నిచర్ తదితర సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ● తాత దిశానిర్దేశంతోసివిల్స్ వైపు అడుగులు ● సొంతంగా ప్రిపరేషన్..మొదటి ప్రయత్నంలోనే విజయం ● సొంతూరు పొన్నకల్..బాల్యమంతా మహబూబ్నగర్లోనే.. మహబూబ్నగర్ ఎడ్యుకేషన్/ అడ్డాకుల: యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో పాలమూరు బిడ్డ సత్తాచాటింది. సివిల్స్– 2023 ఫలితాల్లో జిల్లాకేంద్రానికి చెందిన దోనూరు అనన్యరెడ్డి జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. ఆమె ఒక సాధారణ కుటుంబంలో జన్మించి సివిల్స్లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చడం పట్ల కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఐఏఎస్ కావాలన్న ఆశయం ఉన్న ఆమె బాల్యమంతా మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోనే గడిచింది. ఆమె ఐఏఎస్ కావాలన్న కలలకు స్ఫూర్తినిచ్చింది తాత కృష్ణారెడ్డి ఆయన సలహాలు, సూచనలతో చిన్నప్పటి నుంచి సివిల్సే లక్ష్యంగా చదువుకున్నట్లు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఎలాంటి శిక్షణ లేకుండా.. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ జాతీయస్థాయిలో మూడో ర్యాంకు సాధించింది. ఇంటర్ ప్రారంభం నుంచే.. అనన్య ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు మహబూబ్నగర్లోని గీతం పాఠశాలలో చదివారు. ఎస్సెస్సీలో మంచి గ్రేడింగ్తో ఉత్తీర్ణత సాధించింది. ఇంటర్ ప్రారంభం నుంచి ఐఏఎస్ వైపు అడుగులు పడ్డాయి. దీంతో ఆమెను హైదరాబాద్లోని నారాయణ ఐఏఎస్ అకాడమీలో చేర్చారు. ఇంటర్ పూర్తయ్యాక ఢిలీల్లోని మిరిండా హౌస్ కళాశాలలో ఏబీ (బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్)లో చేరారు. డిగ్రీ పూర్తయ్యాక 2020 నుంచి పూర్తిస్థాయిలో సివిల్స్ ప్రిపరేషన్పై దృష్టిపెట్టారు. ఢిల్లీలోనే పీజీ చదువుతూ సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సివిల్స్లో ఆప్షనల్ సబ్జెక్టులుగా ఆంత్రపాలజీని ఎంపిక చేసుకున్నారు. ఈ ఒక్క ఆంత్రపాలజీ కోసం ఆన్లైన్లోనే శిక్షణ తీసుకున్నారు. దీంతో మిగతా సబ్జెక్టులు అన్ని కూడా సొంత ప్రిపరేషన్తో ముందుకు సాగారు. ప్రతిరోజు 12 నుంచి 14 గంటల పాటు సిద్ధమయ్యాయని చెప్పారు. సొంత ప్రిపరేషన్ సివిల్స్కు సిద్ధమయ్యే క్ర మంలో అనన్యరెడ్డి సొంత ప్రిపరేషన్పైనే ఎక్కు వగా దృష్టిపెట్టారు. ప్రతి రోజు 12 గంటల నుంచి 14 గంటలపాటు చదువుకునేవారు. సబ్జెక్టులో ప్రతి అంశాన్ని నోట్గా రాసుకునే అలవాటు ఉండటంతో శిక్షణ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. చాలా సులువుగా లక్ష్యాన్ని చేరు కుని ప్రణాళిక ప్రకారం నిర్దేశిత సమయంలో సిలబస్ను పూర్తిచేసే విధంగా ఆమె ప్రిపరేషన్ కొనసాగించారు. సివిల్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలకు హాజరయ్యే క్రమంలో సీనియర్ల సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడినట్లు అనన్యరెడ్డి చెప్పారు. మెకానికల్ ఇంజినీర్కు 627వ ర్యాంక్ వెల్దండ: సివిల్స్ ఫలితాల్లో నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని చెదురుపల్లి ఉమ్మడి పంచాయతీ పోషమ్మగడ్డతండాకు వడ్తావత్ యశ్వంత్నాయక్ జాతీయ స్థాయిలో 627వ ర్యాంకుతో సత్తాచాటారు. తండాకు చెందిన ఉమాపతి, పద్మ దంపతుల మొదటి కుమారుడు యశ్వంత్. ఇతను ఇంటర్మీడియట్ నారాయణ కళాశాలలో, ఐఐటీ మద్రాస్లో మెకానికల్ ఇంజినీయక్ పూర్తిచేశారు. తర్వాత సివిల్స్ సాధించడమే లక్ష్యంగా చదివి.. రెండోసారి ప్రయత్నంలో మెరుగైన ర్యాంకు సాధించాడు. తమ కుమారుడు సివిల్స్ సాధించడంతో తల్లిదండ్రులు పద్మ, ఉమాపతి హర్షం వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థి సివిల్స్లో ర్యాంక్ సాధించడంతో తండావాసులు, బంధువులు అభినందించారు. న్యూస్రీల్పొన్నకల్లో సంబరాలు అనన్యరెడ్డి యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. పొన్నకల్వాసికి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు రావడంతో కుటుంబసభ్యులు, బంధువులు అనన్యరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అనన్యరెడ్డి తండ్రి సురేష్రెడ్డి గ్రామంలో కొన్నాళ్లపాటు వ్యవసాయం చేశారు. 20 ఏళ్ల కిందట ఇద్దరు కుమార్తెల చదువుల కోసం మహబూబ్నగర్ వెళ్లి స్థిరపడ్డాడు. అక్కడే వ్యాపారాలు చేస్తూ కుమార్తెలను చదివించారు. -
అటవీ సంరక్షణ కోసమే నిబంధనలు
మన్ననూర్: అటవీ, వన్యప్రాణుల సంరక్షణను దృష్టిలో ఉంచుకొని సలేశ్వరం జాతరలో అటవీ శాఖ నిబంధనలు అమలు చేస్తున్నట్లు ఐటీడీఏ ఇన్చార్జి పీఓ, డీఎఫ్ఓ రోహిత్రెడ్డి అన్నారు. మంగళవారం మన్ననూర్లోని ఈసీ సెంటర్లో విలేకరులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లమల అటవీ ప్రాంతంలో చెంచుల ఆరాధ్య క్షేత్రాలు 25 వరకు ఉన్నాయని.. చెంచుల ఆచార వ్యవహారాల ప్రకారం జాతరలు నిర్వహించుకునేందుకు అటవీ శాఖ ఎంత మాత్రం ఆటంకం కలిగించదన్నారు. భక్తులు దేవుడిని చూడవద్దని అనడం లేదని.. క్రమశిక్షణ పాటిస్తూ పద్ధతిగా ఉండాలన్నదే అటవీశాఖ ఉద్దేశమని అన్నారు. ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే సలేశ్వరం జాతరకు వచ్చే భక్తులు అటవీ పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకం, చుట్ట, బీడీ, సిగరేట్ కాల్చడాన్ని పూర్తిగా నిషేధించినట్లు చెప్పారు. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడే వారు, వృద్ధులు, బాలింతలు, చిన్నారులు సలేశ్వరం ఉత్సవాలకు దూరంగా ఉండాలని కోరారు. భక్తులకు అన్నివిధాలా సహకరించేందుకు అటవీశాఖ తరఫున 200 మంది సిబ్బందిని కేటాయించడంతో పాటు మరో 100 మంది వలంటీర్లను నియమిస్తున్నట్లు తెలిపారు. అచ్చంపేట డీఎస్పీ ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. చెంచులకు రుణాలు.. సలేశ్వరం జాతరలో దుకాణాల ఏర్పాటు కోసం అప్పాపూర్, రాంపూర్ తదితర పెంటల్లోని చెంచులకు ఐటీడీఏ తరఫున రూ. 20వేల వరకు రుణాలు మంజూరు చేస్తున్నట్లు ఐటీడీఏ పీఓ, డీఎఫ్ఓ రోహిత్రెడ్డి తెలిపారు. జాతరలో కొబ్బరికాయలు, పూజా సామగ్రిని చెంచులు మాత్రమే విక్రయించేవిధంగా అనుమతులు ఇవ్వడంతో పాటు రుణాలు అందిస్తున్నట్లు వివరించారు. సమావేశంలో ఎఫ్ఆర్ఓ ఈశ్వర్, శ్వేత తదితరులు ఉన్నారు. డీఎఫ్ఓ రోహిత్రెడ్డి సలేశ్వరం క్షేత్రానికి ప్రత్యేక ప్యాకేజీ..పర్యాటకులు, భక్తులు ఏడాదిలో 9 నెలల పాటు సలేశ్వరం క్షేత్రాన్ని దర్శించుకునేందుకు అటవీ శాఖ ద్వారా అవకాశం కల్పిస్తున్నట్లు డీఎఫ్ఓ తెలిపారు. ప్రత్యేక వాహనంలో 100 మంది చొప్పున టూర్ ఏర్పాటుచేసి, అటవీ పరిసర ప్రాంతాలతో పాటు సహజ ప్రకృతి ప్రదేశాలు, వన్యప్రాణులను వీక్షించేందుకు మే మొదటి వారం నుంచి టూర్ ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుత ప్రతికూల వాతావరణంలో భక్తులు పెద్ద ఎత్తున సలేశ్వరం ఉత్సవాలకు తరలివచ్చి, ఇబ్బందులు పడవద్దని తెలిపారు. -
గర్వకారణం..
మా కుటుంబానికి చెంది న దోనూరు అనన్యరెడ్డి యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించడం చాలా గర్వంగా ఉంది. ఆమె తండ్రి సురేష్రెడ్డి తన ఇద్దరు కుమార్తెల చదువుల కోసం గ్రా మాన్ని వదిలి మహబూబ్నగర్లో స్థిరపడ్డా రు. తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన అనన్యరెడ్డికి శుభాకాంక్షలు. – దోనూరు నాగార్జున్రెడ్డి, ఎంపీపీ, పొన్నకల్ గ్రామం జాతీయస్థాయిలో గుర్తింపు యూపీఎస్సీ ఫలితాల్లో దోనూరు అనన్యరెడ్డి జా తీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించి పొన్నకల్కు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చింది. చదువులో రాణించి ఉన్నత స్థాయి ఉద్యోగానికి ఎంపికవడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. పట్టుదలతో చదువుకుంటే ఉన్నత స్థాయికి చేరొచ్చని నిరూపించింది. – దోనూరు విజయకుమార్రెడ్డి, పొన్నకల్ -
మెరిసిన ఆత్మకూర్ ఆణిముత్యం
సివిల్స్లో 278 ర్యాంకుసాధించిన ఎహ్తేదా ముఫస్సీర్ ఆత్మకూర్: యూపీఎస్సీ ఫలితాల్లో ఆత్మకూర్కు చెందిన ఎహ్తేదా ముఫస్సీర్ ప్రతిభచాటింది. ఎలాంటి కోచింగ్ లేకుండానే ఆలిండియా 278 ర్యాంకు సాధించి ఐఏఎస్కు ఎంపికై ంది. ఆత్మకూర్కు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు సయ్యద్ఖాసిం కుమారుడు ఇబ్రహిం ఖలీల్కు ఇద్దరు కుమార్తెలు రుఫియా, ఎహ్తేదా ముఫస్సీర్, కుమారుడు సయ్యద్ తఫస్సూల్ ఉన్నారు. రెండో కుమార్తె ఎహ్తేదా ముఫస్సీర్ పదో తరగతి వరకు మహబూబ్నగర్లోని ఆకృతి పాఠశాలలో చదివి 2014లో 10/10 గ్రేడ్ను సాధించిన ఆమె.. ఇంటర్ బైపీసీ సిరి కళాశాలలో పూర్తి చేసి 987 మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. అనంతరం ఢిల్లీలోని లేడి శ్రీరాం కళాశాలలో పొలిటికల్ సైన్స్ డిగ్రీ విద్యను 2020లో పూర్తి చేసింది. తర్వాత సోదరి రుఫియాతో కలిసి ఎహ్తేదా ముఫస్సీర్ ఇంట్లోనే సివిల్స్కు ప్రిపేర్ అయ్యి.. 2023లో నిర్వహించిన యూపీఎస్సీ పరీక్షలకు హాజరైంది. ఈ క్రమంలో మంగళవారం విడుదలైన ఫలితాల్లో జాతీయ స్థాయిలో 278 ర్యాంకు సాధించగా.. ఆమె సోదరి రుఫియా ఫలితాల్లో స్వల్ప తేడాతో వెనకబడిపోయింది. ఎహ్తేదా అత్యుతమ ర్యాంకు సాధించడంతో ఆత్మకూర్లో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తాతయ్యే స్ఫూర్తి.. ‘మా తాతయ్య సయ్యద్ఖాసీం రిటైర్డు ఉపాధ్యాయుడు. తాను, తన కుమారులు ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగుతున్నామని.. మీరు ఇంకా గొప్పస్థాయిలో కలెక్టర్ కావాలని తరచుగా చెప్పేవారు.’ అని ఎహ్తేదా చెప్పారు. దీంతో పదో తరగతి నుంచే గట్టిగా నిర్ణయించుకొని సివిల్స్ వైపు అడుగులు వేశానని పేర్కొన్నారు. 278 ర్యాంకు రావడంతో మా తాతయ్య కల సాకారమైందని ఆనందం వ్యక్తం చేశారు. పేదలకు అండగా నిలబడలన్నదే తన లక్ష్యం అని వివరించారు. ● -
తాగునీటి ఎద్దడి తలెత్తనివ్వొద్దు
కొల్లాపూర్: వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని మిషన్ భగీరథ అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు. సోమవారం ఆయన నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల కలెక్టర్లు ఉదయ్కుమార్, తేజస్ నందలాల్, అదనపు కలెక్టర్లు కుమార్ దీపక్, సంచిత్ గంగ్వార్తో కలిసి ఎల్లూరు సమీపంలోని మిషన్ భగీరథ పంప్హౌజ్, కృష్ణానదిలో బ్యాక్ వాటర్ను పరిశీలించారు. నల్లమల అటవీ ప్రాంతంలో ఉండే కోతిగుండు వద్దకు వెళ్లి, అక్కడి నుంచి బ్యాక్ వాటర్ లెవల్స్, నీటి ప్రవాహం చూశారు. మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డి, సీఈ చెన్నారెడ్డితో వారు మాట్లాడారు. ప్రస్తుత వాటర్ లెవెల్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. వేసవి ముగిసే వరకు తాగునీటి అవసరాలకు 2.4 టీఎంసీ నీళ్లు అవసరమవుతాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్వాటర్లో తెలంగాణ ప్రభుత్వం తాగునీటి అవసరాలకు వినియోగించుకునేందుకు 5 టీఎంసీల మేరకు నీటి నిల్వలు ఉన్నాయని చెప్పారు. బ్యాక్ వాటర్ లెవల్స్ రెగ్యులర్గా పర్యవేక్షించాలని కలెక్టర్లకు సూచించారు. తాగునీటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వం సమీక్షిస్తోందని, ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే పరిష్కారానికి అవసరమైన నివేదిక తమకు అందించాలన్నారు. వారి వెంట మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటరమణ, ఈఈ సుధాకర్సింగ్, డీఈ అంజాద్పాష తదితరులున్నారు. -
పేటలో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మించాలి
పేట మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని, కోయిల్సాగర్ బ్యాక్వాటర్ నుంచి కోయిలకొండ మండలం గణపతిరాయ చెరువు నింపాలని సీఎం రేవంత్రెడ్డిని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి కోరారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో తనకిచ్చిన మెజార్టీ కంటే రెండింతలు ఎక్కువ వంశీచంద్రెడ్డికి ఇచ్చి గెలిపించాలి. ● దమ్మున్న నాయకుడు రేవంత్రెడ్డి ప్రచారం ఇక్కడి నుంచి ప్రారంభించడం కాంగ్రెస్ విజయానికి నాంది పలుకుతుందని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేకాధికార ప్రతినిధి, మాజీ ఎంపీ జితేందర్రెడ్డి పేర్కొన్నారు. చేనేత పరిశ్రమల ఏర్పాటును, సైనిక్ స్కూల్ను గత ప్రభుత్వం రద్దు చేసిందని, వంశీ గెలిచిన తర్వాత ఈ ప్రాంతానికి సైనిక్ స్కూల్ మంజూరు చేయిస్తామన్నారు. ● ముదిరాజ్ల చిరకాల కోరిక అయిన బీసీ–డీ నుంచి బీసీ–ఏ మార్చేందుకు సీఎం రేవంత్రెడ్డి హామీ ఇవ్వడంపై ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ ఎక్కడ? మాయమాటలతో మందకృష్ణను బుట్టలో వేసుకొని.. ఎస్సీ వర్గీకరణ చేస్తామంటున్న బీజేపీ మేనిఫెస్టోలో ఈ విషయం ఎక్కడ ఉందో చెప్పాలని, ఏఐసీసీ కార్యదర్వి సంపత్కుమార్ పేర్కొన్నారు. ఇంకో పార్టీ బీఆర్ఎస్ పాతాళానికి పోయిందన్నారు. రేవంత్ చేసే పనులు చూసి దేశ ప్రజలు మెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. పాలమూరుకు జాతీయ హోదా తెచ్చారా? మోదీని ప్రధాని చేయాలని.. రేవంత్రెడ్డిని ఓడగొట్టాలని ఇక్కడి బీజేపీ అభ్యర్థి అనుకుంటున్నారు. పదేళ్ల నుంచి మోదీ ప్రధానిగా ఉన్నారు కదా.. ఏ రోజైనా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్కు జాతీయ హోదా అడిగారా.. నిధులు తెచ్చారా అని రేవంత్ ప్రశ్నించారు. ముదిరాజ్లను బీసీ–డీ నుంచి ఏ గ్రూప్లో మార్చడానికి, మాదిగ బిడ్డల ఏబీసీడీ వర్గీకరణ గురించి అడిగారా.. మహబూబ్నగర్–రాయచూర్ రోడ్డు ఎందుకు పడావ్ పడింది.. మక్తల్–నారాయణపేట ఎత్తిపోతల పథకానికి జాతీయ నిధులు ఏమైనా తెచ్చారా అని మండిపడ్డారు. పాలమూరును ఎండబెట్టి.. లక్షలాదిగా వలసలు పోతుంటే ఒక్క రోజు పట్టించుకోలేదని.. అయినా బీజేపీకి ఓటు వేయాలి.. రేవంత్ను ఓడగొట్టాలని అంటున్నారని ధ్వజమెత్తారు. బలహీనపర్చాలనే ఉద్దేశంతోనే.. కాంగ్రెస్ వచ్చిన 100 రోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాం.. 30వేల ఉద్యోగాలు ఇచ్చాం.. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇంటికి ఉచిత కరెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇచ్చాం.. ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం.. ఇందుకు రేవంత్ను ఓడగొట్టాలా అని ప్రశ్నించారు. తనతో పాటు మంత్రివర్గ సహచరులు రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారని. రాత్రి, పగలు కష్టపడుతున్నామని వివరించారు. బూర్గుల రామకృష్ణారావు తర్వాత తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ పాలమూరు నుంచి మీ బిడ్డ సీఎం అయితే ఎందుకు ఓర్వడం లేదని.. మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే హక్కు మాకు లేదా అని ప్రశ్నించారు. రేవంత్రెడ్డిని బలహీనపరచాలనే ఉద్దేశంతో అరుణమ్మ బీఆర్ఎస్తో కుమ్మక్కయ్యారని విమర్శలు గుప్పించారు. మహబూబ్నగర్ బీఆర్ఎస్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి ఐదేళ్లు ఎక్కడిపోయారని ప్రశ్నించారు. అమరచింత బీఆర్ఎస్ జెడ్పీటీసీ సరోజ, నర్వ జెడ్పీటీసీ జ్యోతిలు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేశారు. సభలో ఎమ్మెల్యేలు మధుసూదన్రెడ్డి, యెన్నం శ్రీనివాస్రెడ్డి, అనిరుధ్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వీర్లపల్లి శంకర్, జెడ్పీ చైర్పర్సన్లు వనజ, స్వర్ణసుధాకర్, సరిత, మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డి, టీపీసీసీ కల్లుగీత కార్మిక రాష్ట్ర చైర్మన్ కేశం నాగరాజుగౌడ్ పాల్గొన్నారు. -
వేడుకలకు ముస్తాబైన సిర్సనగండ్ల
చారకొండ: మండలంలోని సిర్సనగండ్లలో వెలసిన సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా మొదటి రోజు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సీతారామచంద్రాస్వామి మాసకల్యాణం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అలాగే బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణోత్సవం, హనుమత్ వాహన సేవ, గురువారం చిన్న రఽథం(చిన్నతేరు), శుక్రవారం గరుడసేవ, శనివారం రాత్రి బ్రహ్మోత్సవం (పెద్ద రథం), ఆదివారం జగసేవ, దీపోత్సవం, సోమవారం చక్రతీర్థం, ఏకాంత సేవ, ద్వాదశ ఆరాధన తదితర కార్యక్రమాలు ఉంటాయని ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ శ్రీనివాస్రెడ్డి చెప్పారు. స్వా మివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. 200 మందితో బందోబస్తు బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 200 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, 18 మంది ఎస్ఐలు, 27 మంది ఏఎస్ఐలు, హెడ్కానిస్టేబుళ్లు, మహిళా పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తారని సీఐ విష్ణువర్ధన్రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. ● బ్రహ్మోత్సవాలకు ఇతర ప్రాంతాలను తరలివచ్చే వేలాది మంది భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించనుంది. ఇందుకోసం కల్వకుర్తి, దేవరకొండ, ఇబ్రహింపట్నం, షాద్నగర్, నాగర్కర్నూల్ ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి. ఎస్పీ పరిశీలన సిర్సనగండ్లలో నిర్వహించే సీతారాముల కల్యాణానికి, బ్రహ్మోత్సవాలకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. సోమవారం ఆయన ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ రామశర్మ, అర్చకులు ఎస్పీతోపాటు కల్వకుర్తి డీఎస్సీ వెంకటేశ్వర్లును శాలువాతో సన్మానించారు. అనంతరం ఆలయ పాలకవర్గం భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు, విద్యుత్, నీటి సౌకర్యం, భక్తులు కల్యాణ వేడుకలో సంబంధిత విషయాలను అడిగి తెలుసుకున్నారు. నేటినుంచి సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం -
జాతీయ హోదా అడిగావా..: వంశీచంద్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ దగ్గరకు వెళ్లి ఈ ప్రాంతానికి ఒక్క రూపాయి తెచ్చావా.. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగావా.. కృష్ణా– వికారాబాద్ రైల్వే లైన్పై విన్నవించావా.. ఇవన్నీ అడగకుండా కేవలం బీజేపీలో జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి కావాలని మోదీని అడుక్కున్న దొరసానివి నువ్వు. ఎన్నికలు వచ్చినప్పుడు నాది నారాయణపేట అంటున్నావ్.. పేట బిడ్డవైతే సైనిక్ స్కూల్ పోతుంటే ఎందుకు ఆపలేదు.. ధన్వాడ బిడ్డవని చెబుతవ్.. ధన్వాడ చెరువును మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు నింపలేదు. కేవలం ఓట్ల కోసమే మాట్లాడుతున్నావ్ తప్ప.. ఈ ప్రాంత అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు. పద్మశాలీలకు పెద్దఎత్తున టెక్స్టైల్ పార్కు రావాలన్నా.. ప్రతి గ్రామంలో రోడ్లు కావాలన్నా.. పేటలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మించాలన్నా.. హస్తం గుర్తుకు ఓటు వేసి ఎంపీగా గెలిపించండి అని ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి విన్నవించారు. -
భూగర్భ కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలు
దోమలపెంట: టీఎస్ జెన్కో పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ విద్యుత్ కేంద్రంలో జాతీయ అగ్నిమాపక వారోత్సవాలను కేంద్రం సీఈ సూర్యనారాయణ సోమవారం ప్రారంభించారు. తొలిరోజు అగ్ని ప్రమాద నివారణకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన బ్యానర్లు, ఫైర్ ఫైటింగ్ పరికరాలు ప్రదర్శించి కేంద్రంలో ఉన్న ఫైర్స్టేషన్ను పరిశీలించారు. మొత్తం 7 రోజులపాటు ఒక్కొక్క రోజు అగ్నిప్రమాద నివారణకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్లో అగ్నిప్రమాద నివారణపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఈ (ఓఅండ్ఎం) ఆదినారాయణ, సేఫ్టీ అధికారి డీఈ శ్రీకుమార్గౌడ్, ఎస్పీఎఫ్ ఆర్ఐ సూర్యరావు, ఏడీఈ రాము, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మల్లికార్జున, ఫైర్, (ఓఅండ్ఎం) సిబ్బంది పాల్గొన్నారు. అగ్నిప్రమాదాలపై అప్రమత్తత అవసరం నాగర్కర్నూల్ క్రైం: అగ్ని ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చుట్టుపక్కల ప్రమాదాలు జరిగితే సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల ప్రాణ, ఆస్తినష్టం నివారించవచ్చని జిల్లా అగ్నిమాపక శాఖాధికారి కృష్ణ్ణమూర్తి అన్నారు. ఈ నెల 14 నుంచి జిల్లాలో నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ కాలనీలో అగ్నిప్రమాదాల నివారణపై ప్రయోగాత్మక ప్రదర్శన ద్వారా చూపించారు. ఈ సందర్భంగా అగ్ని రాజుకుంటే ఏవిధంగా నష్ట నివారణ చర్యలు చేపట్టాలి.. మంటలను ఏ విధంగా అదుపులోకి తీసుకురావాలో అవగాహన కల్పించారు. అనంతరం అగ్నిమాపక శాఖాధికారి మాట్లాడుతూ వేసవి దృష్ట్యా దుకాణాలు, ఇళ్లలో విద్యుత్ వాడకం పెరుగుతుందని, దీంతో షార్ట్సర్క్యూట్ ఏర్పడి నిప్పు రాజుకోవడం, మంటలు చెలరేగడం జరుగుతాయన్నారు. నిమిషాల వ్యవధిలో మంటలు వ్యాపించి భారీ స్థాయిలో నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, ఈ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన ప్రాథమిక చర్యలను వారోత్సవాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. -
పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి
నాగర్కర్నూల్: వేసవి సెలవులు ముగిసేలోగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కావాల్సిన మౌలిక వసతుల పనులు పూర్తిచేయాలని కలెక్టర్ ఉదయ్కుమార్ అన్నారు. కొత్తగా ఏర్పాటైన అమ్మ ఆదర్శ కమిటీల ఏర్పాటు, పనులు చేయించే విధానంపై సోమవారం కలెక్టరేట్లో డీఈఓ, ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 839 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ఏర్పాటు ద్వారా మంజూరైన పనులన్నింటికీ అంచనాలు రూపొందించాలన్నారు. కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలల్లో తాగునీరు, తరగతి గదుల్లో బ్లాక్ బోర్డు, కిటికీలు, తలుపులు, ఫ్యాన్లు, సీసీ కెమెరాల ఏర్పాట్లతోపాటు చిన్నపాటి మరమ్మతు, టాయిలెట్లు, విద్యుత్ సరఫరా తదితర పనులను స్థానికంగానే పూర్తి చేయించాలన్నారు. ప్రతి పాఠశాలకు రూ.25 వేల చొప్పున విడుదల చేసిన నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయా పనులన్నీ వేసవి సెలవుల కంటే ముందుగానే పూర్తిచేసేలా చూడాలన్నారు. ప్రతి పని మొదలు పెట్టే ముందు.. పూర్తయిన తర్వాత ఫొటోలను సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సీఎంఆర్ బియ్యం అప్పగించాలి ప్రభుత్వానికి సీఎంఆర్ బియ్యాన్ని మిల్లర్లు వెంటనే అప్పగించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ సీతారామారావు చాంబర్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ ఎఫ్సీఐకి 47 వేల మె.ట., బియ్యాన్ని మిల్లర్లు నిర్ణీత గడువులోగా అందించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రీవెన్స్కు 7 ఫిర్యాదులు నాగర్కర్నూల్ క్రైం: పోలీస్ ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషిచేయాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 7 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ చెప్పారు. 21 నుంచి క్రికెట్ ఉచిత శిక్షణ శిబిరం నాగర్కర్నూల్: జిల్లాకేంద్రం నల్లవెల్లిలోని నాగర్కర్నూల్ క్రికెట్ అకాడమీ మైదానంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలరోజులపాటు ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు శిక్షణ ఇన్చార్జ్లు మొహమ్మద్ మోసిన్, సతీష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు ఈ నెల 18 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం సెల్ నం.98854 01701, 89193 86105లను సంప్రదించాలని సూచించారు. ఈ నెల 21న ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభమవుతుందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం నాగర్కర్నూల్ రూరల్: దేశంలో బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతుందని, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నదని కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్వెస్లీ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో సామాజిక, తెలంగాణ గిరిజన, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ప్రజా సాంస్కృతిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ బలహీన వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి దేశ ప్రజలకు అనుకూలమైనది రూపొందించారన్నారు. అలాంటి రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే ప్రక్రియను బీజేపీ ప్రభుత్వం వేగవంతం చేస్తుందన్నారు. -
కాంగ్రెస్ సర్కార్ను నిద్రలేపేందుకే జలదీక్ష
గద్వాల రూరల్: నడిగడ్డ ప్రాంత ప్రజల గొంతు తడపడానికి, ఎన్నికల సమయంలో మోసపూరితమైన ఆరు గ్యారెంటీ హామీలిచ్చి నాలుగు నెలలైనా వాటి ఊసు మర్చిపోయి మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ సర్కార్ను నిద్రలేపడానికి జలదీక్ష చేస్తున్నట్లు మాజీ మంత్రి తన్నీర్ హరీశ్రావు ధ్వజమెత్తారు. సోమవారం గద్వాలలో ఎమెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తలపెట్టిన ఒకరోజు జలదీక్ష కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన హరీశ్రావు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఒక్కరోజు కూడా సాగునీరు, తాగునీటికి ఇబ్బందులు తలెత్తలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే నీటి కరువు వచ్చిందని, ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, సర్కారు దవాఖానాలో మందులు లేవని, కేసీఆర్ కిట్లు లేవని మండిపడ్డారు. పంటలు ఎండిపోయి రైతులు విలవిల్లాడుతుంటే మరోవైపు మంత్రులు, ముఖ్యమంత్రి క్రికెట్ మ్యాచ్లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకనవుతా.. నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ తనకు ఓటేసి గెలిపిస్తే పార్లమెంటులో రైతులు, కూలీలు, అన్ని వర్గాల ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకనవుతానని అన్నారు. బీజేపీ పార్టీకి ఓటేస్తే రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందన్నారు. రైతుల పంటలు ఎండుతుంటే నేరుగా వెళ్లి వారికి న్యాయం చేయాలంటూ గొంతెత్తిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గద్వాల ప్రజలు తెలివైన వారని, తమకోసం నిలబడే బండ్ల కృష్ణమోహన్రెడ్డి లాంటి నాయకుడిని గెలిపించుకున్నారని అన్నారు. నిత్యం ప్రజల కోసం కష్టపడుతూ ప్రజాసమస్యలపై పోరాటం చేసే నాయకుడు అని, ఇప్పుడు నీటిసమస్య వస్తే జలదీక్ష చేసి కాంగ్రెస్ సర్కారు మెడలు వంచి నీళ్లను తీసుకొచ్చేలా కృషి చేస్తున్నారన్నారు. గొంతెండుతున్నా పట్టించుకోరా.. ఎన్నికల సమయంలో కర్ణాటక నుంచి నాయకులు వచ్చి ఇక్కడ డబ్బులు పంచి కృష్ణమోహన్రెడ్డిని ఓడించాలని చూసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రజల గొంతెండుతుంటే ఎందుకు వారితో మాట్లాడి నీరు ఇప్పించలేకపోతున్నార ని హరీశ్రావు ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలపై సీఎం రేవంత్రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ఎద్దేవా చేశారు. హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్.ప్రవీణ్కుమార్కు ఓటు వేయాలని అన్నారు. అలాగే, రైతులకు గొడ్డలి పెట్టు వంటి నల్లచట్టాలు తీసుకొచ్చిన ఘనత బీజేపీకే దక్కుతుందని, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా అన్యాయం చేసింది ఆ పార్టీయేనని, ఇప్పుడు ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారన్నారు. తనతోపాటు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి ప్రా జెక్టుల వద్ద నిద్రపోయి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టులను పూర్తిచేయించామని, ఉమ్మడి పాలమూరు జిల్లాలో 6.50లక్షల ఎకరాలకు సాగునీటిని అందించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందున్నారు. పంటలు ఎండుతుంటే సీఎం, మంత్రులు క్రికెట్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.. జలదీక్షలో మాజీ మంత్రితన్నీరు హరీశ్రావు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతాం : ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి రాజకీయాలు పక్కన పెట్టి ఆదుకోవాలి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలు పక్కనపెట్టి నడిగడ్డ ప్రజల గొంతును తడిపేలా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నారాయణపూర్ డ్యాం నుంచి 5టీఎంసీల నీటిని తీసుకురావాలని డిమాండ్ చేశారు. అందుకే తాను జలదీక్ష చేపట్టినట్లు తెలిపారు. నిత్యం ప్రజల కోసం పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని హెచ్చరించారు. అనంతరం మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు.. దీక్ష చేపట్టి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మె ల్యే విజయుడు, గడ్డం కృష్ణారెడ్డి, నాగర్దొడ్డి వెంకట్రాములు, అభిలాష్రావ్, ప్రతాప్గౌడ్, నాగిరెడ్డి, శ్రీనివాసులు, విజయ్, రాజశేఖర్, రాజారెడ్డి, హనుమంతు, గోవిందు, నవీన్కుమార్రెడ్డి, మహబూబ్, కురుమన్న పాల్గొన్నారు. -
అంతా మీ చేతుల్లోనే..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/నారాయణపేట: ‘కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. అందరూ ఏకమయ్యారు. ఎమ్మెల్యే ఎన్నికల కంటే కష్టపడాలి. లోక్సభ ఎన్నికలు జరిగిన మరుక్షణం స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. మీరు ఊళ్లలో పట్టు సడలిస్తే.. రేపు ఎవరో ఒకరు మోపు అయి వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీలుగా వస్తారు. అప్పు మీకు తలనొప్పి.. ఖర్చు మోపైడెతది. ఎంపీ ఎన్నికలు అయిన వెంటనే స్థానిక ఎన్నికలు పెట్టి.. మిమ్మల్ని గెలిపించుకుంటాం. పార్టీ కోసం పని చేసే వారిని గుర్తు పెట్టుకుంటాం. మీ త్యాగాలు గుర్తుపెట్టుకుని అవకాశాలు కల్పించడమే కాదు.. గెలిపించుకుని తీరుతాం. మీ శ్రమ ఉరికే పోదు.’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపారు. నారాయణపేట జిల్లా వేదికగా సోమవారం ఆయన పార్లమెంట్ ఎన్నికల ప్రచార శంఖారావం పూరించారు. ఈ మేరకు క్రీడా మైదానంలో నిర్వహించిన జనజాతర సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసి పేదలను ఆదుకునే బాధ్యతను మీ చేతుల్లోనే పెడతామని.. నాగర్కర్నూల్, మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానాలు గెలవాలని పిలుపునిచ్చారు. ‘నా పాలమూరులో తప్పు జరిగితే జాతీయ స్థాయిలో చెప్పుకునే పరిస్థితే ఉండదు.. మీరు అండగా ఉండి ఆశీర్వదిస్తే 14 అసెంబ్లీ స్థానాల్లో 12 గెలిచాం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామన్నారు. ‘నేను మీ బిడ్డను.. మీరు పెట్టిన చెట్టు వృక్షమైంది.. దాన్ని నరికేందుకు ఢిల్లీ నుంచి ఒకరు, ఫామ్హౌస్ నుంచి ఒకరు వస్తున్నారు. అంతా మీ చేతుల్లోనే ఉంది. మహబూబ్నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలి’ అని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి నారాయణపేట జనజాతర సభలోముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విపక్షాలపై ఫైర్.. సెంటిమెంట్ అస్త్రం -
కాంగ్రెస్తోనే అన్నివర్గాల అభ్యున్నతి
నాగర్కర్నూల్రూరల్: కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల అభ్యున్నతి సాధ్యమవుతుందని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి, ఎంపీ అభ్యర్థి డా.మల్లు రవి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు రూ.500లకే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే దిశగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, మరో ఐదు గార్యంటీలు అమలవుతాయని తెలిపారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
మోసపూరిత హామీలతో అధికారంలోకి..
ఉప్పునుంతల/ వంగూరు: మోసపూరితమైన ఆరు గ్యారంటీల హామీతో రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి ఆదివారం ఉప్పునుంతలలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పి రాజ్యాంగ నిర్మాతకు అరుదైన గౌరవం కల్పిస్తే.. నేటి పాలకులు ఆ మహనీయుడి జయంతి రోజున కనీసం విగ్రహానికి పూలమాల వేయకుండా అవమానించడం తగదన్నారు. మహిళలకు సమాన హక్కులు కల్పించడానికి పార్లమెంట్లో హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెడితే, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుందని విమర్శించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు తిరిగి కోరుకుంటున్నారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులైనా ఎన్నికల హామీలను నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఇసుక, మైనింగ్ దందా వంటి మార్పు వచ్చిందే తప్ప.. పేదల సంక్షేమం, అభివృద్ధి విషయంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్కుమార్రెడ్డి, సోషల్ మీడియా సమన్వయకర్త అభిలాష్రావు, పీఏసీఎస్ చైర్మన్ సత్తు భూపాల్రావు, మండల పార్టీ అధ్యక్షుడు కొత్త రవీందర్రావు, కట్టా గోపాల్రెడ్డి పాల్గొన్నారు. ప్రజా సమస్యలు ప్రస్తావిస్తా.. తనను ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్లో పాలమూరు సమస్యలను ప్రస్తావిస్తానని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. వంగూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలో బీజేపీతో పెద్ద ప్రమాదం ఉందని ఆ పార్టీని ఈ ఎన్నికల్లో గెలిపిస్తే భారత రాజ్యాంగాన్ని సైతం మార్చి పేదలకు అన్యాయం చేస్తారన్నారు. సీఎం రేవంత్రెడ్డి తనకు టీఎస్పీఎస్సీ పదవి ఇస్తానన్నా తాను ప్రజల మధ్యలో ఉండాలన్న ఉద్దేశంతో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీలో చేరానన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్