Nandyal District Latest News
-
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీ–4 సర్వే
నంద్యాల: పేదరిక నిర్మూలనే లక్ష్యంగా గ్రామాల్లో సచివాలయ సిబ్బందితో పీ–4 సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎంపీడీఓలను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పీ–4 సర్వే ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర– 2047 విజన్లో భాగంగా పేదరిక నిర్మూలనకు పీ–4 (ప్రభుత్వ– ప్రైవేటు– ప్రజల భాగస్వామ్య) సర్వే ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించాలన్నారు. జీరో పావర్టీ, ఉద్యోగాల సృష్టి, నైపుణ్యత పెంపు, రైతు సాధికారత, తాగునీటి రక్షణ, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్వచ్ఛ ఏపీ, మానవ వనరుల వినియోగం, శక్తి వనరుల నిర్వహణ, సాంకేతిక జ్ఞానం పెంపు తదితర పది సూత్రాల అనుసంధానంతో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి ప్రతి సచివాలయంలో పది సూత్రాల పట్టికను అతికించాలన్నారు. అట్టడుగు స్థాయిలో ఉన్న అతి నిరుపేదల జాబితాలు తయారు చేయాలన్నారు. పీ–4 సర్వే మార్చి 2వ తేదీలోగా పూర్తి చేసి నివేదికలు అందచేయాలన్నారు. ప్రధానంగా తండాలు, చెంచు కాలనీలు, మురికివాడల్లో నివసిస్తున్న అట్టడుగు స్థాయి కుటుంబాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో సీపీఓ వేణుగోపాల్, డీఎల్డీఓ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. లేబర్ బడ్జెట్ లక్ష్యాన్ని అధిగమించండి జిల్లాలో లేబర్ బడ్జెట్ లకా్ష్య్న్ని అధిగమించేందుకు ఏపీడీలు, ఎంపీడీఓలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపాధి హామీ లక్ష్యాల ప్రగతిపై సమీక్షించారు. డ్వామా ఇన్చార్జి పీడీ వెంకటసుబ్బయ్యతో కలిసి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ కింద వేతనదారులకు పనులు కల్పించి, పెండింగ్లో ఉన్న 12 లక్షల పని దినాలను మార్చి 31వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. నేడు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు కర్నూలు(అర్బన్): జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వుల మేరకు గురువారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో నిర్వహించే ఈ సమా వేశాల్లో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాంఘి క సంక్షేమం, విద్య, వైద్యం, మహిళాభివృద్ధి – శిశు సంక్షేమం, పనులు – ఆర్థిక ప్రణాళిక తదితర శాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్ష చేస్తారన్నారు. ఈ నేపథ్యంలోనే వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు తమకు కేటాయించిన సమయానికి ఆయా స్థాయీ సంఘ సమావేశాలకు హాజరు కావాలని సీఈఓ కోరారు. కృష్ణమ్మను వీడుతున్న సంగమేశ్వరుడు కొత్తపల్లి: ప్రాచీన సంగమేశ్వరాలయం మరి కొద్ది రోజుల్లో పూర్తిగా జలాధివాసం వీడనుంది. గతేడాది జూలై నెల చివర్లో ఈ ఆలయం కృష్ణాజలాల్లో మునిగింది. ప్రస్తుతం శ్రీశైల జలాశయం నీటిమట్టం తగ్గుతుండటంతో ఏడు నెలల పాటు జాలాధివాసంలో ఉన్న ఈ ఆలయ గోపురాలు బయటపడ్డాయి. బుధవారం నాటికి శ్రీశైలం డ్యామ్లో నీటి మట్టం 850 అడుగులకు చేరడంతో ప్రాచీన ఆలయం ప్రహరీ బయట పడింది. -
స్కూటర్ మంజూరైందంటూ మోసం ..!
మద్దికెర: ‘మేము కర్నూలు నుంచి మాట్లాడుతున్నాం. గవర్నమెంట్ మీకు స్కూటర్ మంజూరు చేసింది. కొంత మొత్తం చెల్లిస్తే మీకు కేటాయిస్తాం’ అంటూ దివ్యాంగులను నమ్మించి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మద్దికెర గ్రామానికి చెందిన దివ్యాంగులు రామకృష్ణ, శ్రీలక్ష్మి, ఆదిలక్ష్మి మరో ఇద్దరికి 9642076467, 6364506562 నంబర్ల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. ‘మీకు ప్రభుత్వం త్రిచక్ర వాహనం మంజూరు చేసింది. కొంత మొత్తం చెల్లిస్తే మీ ఇంటికి స్కూటీ వస్తుంద’ని మూడు రోజుల క్రితం నమ్మించారు. వారి మాటలను నమ్మి ముగ్గురు దివ్యాంగులు మొత్తం రూ. 20 వేలు ఫోన్ పే చేశారు. ఆ తర్వాత రోజు నుంచి ఆ నంబర్లకు ఫోన్ చేసినా ఎటువంటి సమాధానం లేకపోవడంతో మోసపోయామని తెలుసుకుని బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దివ్యాంగులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వీరాంజి, అంజనేయులు, మల్లికార్జున కోరారు. -
కొనసాగుతున్న ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు
నంద్యాల(న్యూటౌన్): పట్టణంలో ఇంటర్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం అన్ని కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు డీఐఈఓ సునీత తెలిపారు. ఉదయం జరిగిన ప్రాక్టికల్ పరీక్షకు 152 మందికి గాను 148 మంది హాజరు కాగా నలుగురు గైర్హాజరయ్యారన్నారు. అలాగే, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 151 మందికి గాను 140మంది హాజరు కాగా 11 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. -
మల్లన్నకు పట్టువస్త్రాలు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. బుధవారం శ్రీకాళహస్తి దేవస్థాన ఉప కార్యనిర్వహణాధికారి ఎన్.ఆర్.కృష్ణారెడ్డి, ప్రధానార్చకులు సంబంధం గురుకుల్, అర్చకులు, వేదపండితులు, సిబ్బంది పట్టువస్త్రాలతో శ్రీశైలం చేరుకున్నారు. ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి శ్రీశైల దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు, అధికారులు, అర్చకులు శ్రీకాళహస్తి దేవస్థాన అధికారులకు స్వాగతం పలికారు. అనంతరం శ్రీకాళహస్తి దేవస్థాన అధికారులు, వైదిక సిబ్బంది మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి, వస్త్ర సమర్పణ చేశారు. -
బ్రహ్మోత్సవాలకుపటిష్ట భద్రత
శ్రీశైలంటెంపుల్/ శ్రీశైలం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. బుధవారం శ్రీశైలంలో ఆయన భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ క్యూలు, ఆలయ పరిసరాలు, శివస్వాముల ప్రత్యేక క్యూలైన్, స్నాన ఘట్టాలు, రథ మండపం, కమాండ్ కంట్రోల్ రూం, శ్రీశైలం డ్యాం, ఘాట్రోడ్డు మొదలైన ప్రదేశాల్లో పర్యటించి భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆయన వెంట నంద్యాల అడిషనల్ ఎస్పీ యుగంధర్బాబు, ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్, శ్రీశైలం సీఐ ప్రసాదరావు, చంద్రబాబు, సురేష్కుమార్రెడ్డి, దేవస్థాన ఈఈ మురళీ పాల్గొన్నారు. శివ భక్తుల సౌకర్యార్థం 22 వైద్య శిబిరాలు గోస్పాడు: శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీశైల మల్లన్న భక్తుల సౌకర్యార్థం 22 వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు డీఎంహెచ్ఓ వెంకటరమణ తెలిపారు. స్థానిక కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బ్రాహ్మణ కొట్కూరు నుంచి శ్రీశైలం వరకు ఈ శిబిరాలు ఉంటాయన్నారు. పాదయాత్ర భక్తులు ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే సమీపంలోని శిబిరంలో ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చునన్నారు. అధిక ధర యూరియా విక్రయిస్తే చర్యలు బనగానపల్లె రూరల్: ఫర్టిలైజర్ షాపుల్లో యూరియా అధిక ధరలకు విక్రయిస్తే సంబంధిత దుకాణాదారుడిపై చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ హెచ్చరించారు. బుధవారం మండలంలోని యాగంటిపల్లె గ్రామంలో మండల వ్యవసాయాధికారి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రైతు సేవా కేంద్రంలో రైతులతో సమావేశమై మాట్లాడారు. యూరియాతో పాటు అన్ని రకాల ఎరువులను డీలర్లు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే విక్రయించాలన్నారు. ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే తమకు సమాచారం ఇవ్వాలని రైతులకు సూచించారు. జిల్లాలో యూరియా కొరత లేదని చెప్పారు. అంతకు ముందు పశువైద్యులు డాక్టర్ బ్రహ్మనందరెడ్డి పశువుల్లో వచ్చే వ్యాధులు, వాటి నివారణ చర్యలను వివరించారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారి రఘువరణ్, వ్యవసాయాధికారి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు నంద్యాల(అర్బన్): పట్టణంలోని ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. హోల్ డీలర్ల వద్ద నుంచి కాకుండా వేరే జిల్లాల నుంచి ఎరువులు తెప్పించుకొని అమ్ముతున్నారన్న సమాచారంతో విజిలెన్స్ వ్యవసాయ అధికారి విశ్వనాథ్ పర్యవేక్షణలో స్థానిక సంతోష్రెడ్డి ఏజెన్సీస్కి వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఈ దుకాణంలో 16ః16ః16 రకానికి చెందిన రూ.1,85,625 విలువ గల 135 బస్తాలను సీజ్ చేశారు. అదే విధంగా బాలాజీ కాంప్లెక్స్లోని సంజీవరెడ్డి ఏజెన్సీస్లో యూరియా గరిష్ట చిల్లర ధర కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారన్న సమాచారం మేరకు రూ.16,523 విలువ గల 62 బస్తాలను సీజ్ చేశారు. అనంతరం విజిలెన్స్ వ్యవసాయాధికారి విశ్వనాథ్ మాట్లాడుతూ ప్రతి డీలర్ ఎఫ్సీఓ ప్రకారం వ్యాపారాలు చేయాలని లేనిపక్షంలో డీలర్ల లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు, విజిలెన్స్ కానిస్టేబుల్ ప్రవీణ్కుమార్ ఉన్నారు. -
మిరపపంట రైతన్నల కంట్లో కారం కొట్టింది. ఎన్నో ఆశలతో పంట సాగు చేయగా చీడపీడల ఆశించి దిగుబడులపై దెబ్బ కొట్టాయి. అడపా దడపా వచ్చిన దిగుబడులకు కూడా ఆశించిన స్థాయిలో ధర లేక పోవడంతో రైతన్నలు దిగులు చెందుతున్నారు. వేలకు వేలు అప్పులు తెచ్చి పురుగు మందులు పిచికారీ చే
సమష్టిగా ఆర్యూ అభివృద్ధికి కృషి ● నూతన వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ వెంకట బసవరావు కర్నూలు కల్చరల్: సమష్టిగా రాయలసీమ యూనివర్సిటీని అభివృద్ధి చేద్దామని వర్సిటీ వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ వి. వెంకట బసవ రావు అన్నారు. బుధవారం వీసీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ ఎన్టీకే నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ విజయకుమార్ నాయుడు, వర్సిటీ సైన్స్, ఆర్ట్స్ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఆచార్య సీవీ కృష్ణారెడ్డి, ఆచార్య ఎన్.నరసింహులు, డీన్ ఆప్ ఎగ్గామినేషన్స్ ఆచార్య పీవీ సుందరానంద్, రీసర్స్ డైరెక్టర్ ఆచార్య సి. విశ్వనాథరెడ్డి, డీన్ ఆఫ్ అకడమిక్ అఫైర్స్ ఆచార్య ఆర్. భరత్కుమార్ ఆర్యూసీఈ ప్రిన్సిపాల్ డాక్టర్ హరి ప్రసాద్ రెడ్డి తదితరులు నూతన వీసీని కలిసి బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ రాబోయే మూడేళ్లలో విశ్వవిద్యాలయం అభివృద్ధికి పారదర్శకంగా ఉంటూ శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. వర్సిటీలో జరిగే ప్రతి విషయాన్ని సమాజం గమనిస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించాలన్నారు. అకడమిక్ క్యాలండర్ను తప్పనిసరిగా పాటించాలన్నారు. వర్సిటీ ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. చాపిరేవుల సమీపంలో మిర్చి దిగుబడిని ఆరబెట్టన దృశ్యం -
సకల దేవతలూ.. రారండి!
● శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం ● యాగశాలలో ప్రత్యేక పూజలు ● ఘనంగా ధ్వజారోహణ ● నేడు భృంగివాహనసేవశ్రీశైలంటెంపుల్: శ్రీశైల మల్లన్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలూ.. రారండంటూ దేవస్థాన అధికారులు, ఆలయ అర్చకులు ఆహ్వానం పలికారు. బ్రహ్మోత్సవాలకు సారథ్యం వహించాల్సిందిగా బ్రహ్మ దేవుడిని, స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవంలో కన్యాదానం చేసేందుకు మహావిష్ణువును రావాలని ఆహ్వానించారు. పరమశివుడి వాహనమైన నందిని చిత్రీకరించిన ధ్వజపటాన్ని ఆవిష్కరించారు. శ్రీశైలంలో మల్లన్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఆగమశాస్త్రానుసారంగా ఉత్సవ ప్రారంభ పూజలు జరిపారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, అర్చకులు, వేదపండితులు, అధికారులు సంప్రదాయబద్ధంగా ఆలయ ప్రాంగణంలోని స్వామివార్ల యాగశాల ప్రవేశం చేశారు. వేదపండితులు చతుర్వేదపారాయణలు చేశారు. లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ బ్రహ్మోత్సవ సంకల్పాన్ని అర్చకులు పఠించారు. తరువాత పుణ్యాహవచనం, చండీశ్వరపూజ జరిపించారు. అనంతరం కంకణాలకు శాస్త్రోక్తంగా పూజాదికాలు జరిపి కార్యనిర్వహణాధికారి కంకణాన్ని ధరించారు. అనంతరం బ్రహ్మోత్సవ క్రతువులకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. 7గంటలకు ధ్వజారోహణ, భేరిపూజ కార్యక్రమాలు నిర్వహించి సకల దేవతలకు ఆహ్వాన సూచికగా ధ్వజాపటాన్ని ఆవిష్కరించారు. నేడు భృంగివాహనసేవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి భృంగివాహనసేవలో భక్తులకు దర్శనమిస్తారు. గ్రామోత్సవం నిర్వహిస్తారు. -
స్కూటర్ మంజూరైందంటూ మోసం ..!
మద్దికెర: ‘మేము కర్నూలు నుంచి మాట్లాడుతున్నాం. గవర్నమెంట్ మీకు స్కూటర్ మంజూరు చేసింది. కొంత మొత్తం చెల్లిస్తే మీకు కేటాయిస్తాం’ అంటూ దివ్యాంగులను నమ్మించి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మద్దికెర గ్రామానికి చెందిన దివ్యాంగులు రామకృష్ణ, శ్రీలక్ష్మి, ఆదిలక్ష్మి మరో ఇద్దరికి 9642076467, 6364506562 నంబర్ల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. ‘మీకు ప్రభుత్వం త్రిచక్ర వాహనం మంజూరు చేసింది. కొంత మొత్తం చెల్లిస్తే మీ ఇంటికి స్కూటీ వస్తుంద’ని మూడు రోజుల క్రితం నమ్మించారు. వారి మాటలను నమ్మి ముగ్గురు దివ్యాంగులు మొత్తం రూ. 20 వేలు ఫోన్ పే చేశారు. ఆ తర్వాత రోజు నుంచి ఆ నంబర్లకు ఫోన్ చేసినా ఎటువంటి సమాధానం లేకపోవడంతో మోసపోయామని తెలుసుకుని బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దివ్యాంగులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వీరాంజి, అంజనేయులు, మల్లికార్జున కోరారు. -
బీసీ కులగణనపై నేడు రౌండ్ టేబుల్ సమావేశం
కర్నూలు(అర్బన్): రాష్ట్రంలో బీసీ కులగణనపై ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటలకు స్థానిక బీసీ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ నక్కలమిట్ట శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కులగణనతో పాటు రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన మేధావులు, బీసీ సంఘాల నాయకులు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల్లోని బీసీ నేతలు పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరు కావాలని కోరారు. -
కర్నూలు వ్యవసాయ మార్కెట్ ధరలు (క్వింటాల్కు రూ.లలో)
పంట కనిష్టం గరిష్టం వేరుశెనగ 2,222 7,077 పొద్దుతిరుగుడు 5,029 5,029 ఆముదం 5,659 5,805 వాము 2,001 25,140 ఉల్లి 680 2,821 ఎండుమిర్చీ 3,469 13,301 శనగలు 2,100 5,916 కందులు 2,000 7,478 మొక్కజొన్న 2,110 2,241 మినుములు 6,509 7,911 కొర్రలు 2,300 2,891 సోయాచిక్కుడు 1,463 3,909 సజ్జలు 2,111 2,189ఫోన్ నం : 08518–257204, 257661 -
అరకొర యూరియా.. అన్నదాత అవస్థలు
రైతులు పండించిన పంటలకు మార్కెట్లో మద్దతు ధర రావడం లేదు. వ్యవసాయ సీజన్కు కనీసం పెట్టుబడి సాయం కూడా అందడం లేదు. అవసరమైన ఎరువులు ఇవ్వడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. రైతు సేవా కేంద్రాలకు అరకొర యూరియా ఇస్తోంది. దీంతో ప్రైవేటు దుకాణాల వద్దకు వెళ్లి అన్నదాతలు అదనపు ధర చెల్లించి యూరియా తీసుకోవాల్సి వస్తోంది. రుద్రవరం మండల పరిధిలోని కోటకొండ రైతు సేవా కేంద్రానికి స్వల్పంగా 260 యూరియా బస్తాలు వచ్చాయి. అక్కడికి బుధవారం రైతులకు భారీగా తరలిరాగా.. ఒక్కొక్కరికి కేవలం మూడు బస్తాలు ఇచ్చారు. ఖరీఫ్లో తీవ్రంగా నష్టపోయామని, రబీలో వరి, మినుము, మొక్కజొన్న వేసినా యూరియా స్వల్పంగా ఇచ్చారని రైతులు అసహనం వ్యక్తం చేశారు. – రుద్రవరం -
ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం
పత్తికొండ రూరల్: ఉద్యాన పంటల సాగుపై ఆసక్తి ఉన్న రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తాయని ఉద్యానవన శాఖ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ ఉమాదేవి అన్నారు. పత్తికొండ రైతు సేవా కేంద్రంలో బుధవారం రైతులకు ఉద్యాన పంటల సాగు, ప్రోత్సాహకాలు తదితర అంశాలపై అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉమాదేవి మాట్లాడుతూ పండ్లతోటలు ఉన్న రైతులకు ప్యాక్ హౌస్కు రూ.2 లక్షలు, పాంఫౌండ్ నిర్మాణానికి రూ.75 వేలు, ఉల్లి నిల్వ గోడౌన్కు రూ.80 వేలు సబ్సిడీ ఉంటుందన్నారు. అనంతరం సూక్ష్మ సేద్య పథకం గురించి వివరించారు. బిందు సేద్యానికి ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం రాయితీ వస్తుందన్నారు. బీసీ రైతులకు 90శాతం సబ్సిడీతో పరికరాలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారులు దస్తగిరి, జయరామిరెడ్డి, నాగసునీల్, ఖాజాహుసేన్, డీలర్లు పాల్గొన్నారు. అహోబిలేశుడి సేవలో.. ఆళ్లగడ్డ: అహోబిల లక్ష్మీ నరసింహస్వామి వార్లను ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ రామ్సింగ్ బుధవారం దర్శించుకున్నారు. అహోబిలం చేరుకున్న ఆయనకు ప్రధానార్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. అనంతరం ఎగువ, దిగువ అహోబిలం క్షేత్రాల్లోని స్వామ, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆయనకు స్వామివార్ల శేషవస్త్రం, ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట నంద్యాల ఈఈ శ్రీనిసారెడ్డి, ఆళ్లగడ్డ డీఈఈ రవికాంత్చౌదరి ఉన్నారు. మాతృ మరణాల శాతం తగ్గించాలి కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో మాతృ మరణాల శాతం తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వో డాక్టర్ పి. శాంతికళ అన్నారు. బుధవారం ఆమె తన చాంబర్లో మాతృమరణాలపై సమీక్ష నిర్వహించారు. కల్లూరు, నన్నూరు, హుసేనాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో సంభవించిన మూడు మాతృమరణాలపై ఆమె వివరాలు సేకరించారు. క్షేత్రస్థాయిలోని సిబ్బంది ఆశా, ఆరోగ్య కార్యకర్త, వైద్యాధికారులు గర్భిణులను గుర్తించి వారికి సకాలంలో వైద్యసేవలు అందించినట్లయితే తల్లుల మరణాల శాతం తగ్గించవచ్చన్నారు. ఒకవేళ హైరిస్క్ గర్భిణులను గుర్తించి సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ఏరియా ఆసుపత్రులు, ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స అందించాలన్నారు. సమావేశంలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల గైనకాలజీ హెచ్వోడి డాక్టర్ పద్మజ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్గర్ సుగుణ, డాక్టర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. -
శాశ్వత లోక్ అదాలత్లో విద్యార్థికి న్యాయం
కర్నూలు(సెంట్రల్): శాశ్వత లోక్ అదాలత్ను ఆశ్రయించిన విద్యార్థికి న్యాయం జరిగిందని ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు ఎం.వెంకట హరినాథ్ తెలిపారు. నంద్యాలకు చెందిన పి.వంశీ అనే విద్యార్థి 2022లో ఆర్జీఎం కాలేజీలో ఇంజినీరింగ్ చేరాడు. అయితే అతను 6 నెలలు మాత్రమే కాలేజీకి వచ్చి కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ప్రైవేట్ ఉద్యోగంలో చేరేందుకు యత్నించాడు. అయితే కళాశాలలోనే టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లు ఉండడంతో యాజమాన్యం నాలుగు సంవత్సరాలకు సంబంధించిన రూ.3 లక్షలు కడితే తప్ప సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పారు. అతను శాశ్వత లోక్ అదాలత్ను ఆశ్రయించాడు. ఈ కేసులో ప్రతివాది ఆర్జీఎం కళాశాలకు శాశ్వత లోక్ అదాలత్ జిల్లా అధ్యక్షుడు ఎం.వెంకట హరినాథ్, సభ్యులు శివశంకర్రెడ్డి, రాజుబాబుల ఆధ్వర్యంలో బెంచ్ నోటీసులు ఇచ్చి రాజీకుదర్చాయి. దీంతో బుధవారం పి.వంశీకి సర్టిఫికెట్లను ఇచ్చారు. -
మైనింగ్ యజమానులపై జీఎస్టీ భారం
కొలిమిగుండ్ల: నాపరాతి గనుల యజమానులపై జీఎస్టీ రూపంలో మరో భారం పడుతుంది. ఇప్పటికే ఈ పరిశ్రమ నష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. తాజాగా మూడేళ్ల నుంచి బకాయి ఉన్న జీఎస్టీ చెల్లించాలని యజమానులకు కర్నూలులోని జీఎస్టీ కార్యాలయం నుంచి నోటీసులు అందుతున్నాయి. నాపరాతి గనుల తవ్వకాల కోసం లీజు అనుమతి, మైనింగ్ ప్లాన్, ఎన్విరాల్మెంట్ క్లియరెన్స్ (ఈసీ) ఉన్న యజమానులు బనగానపల్లె నియోజకవర్గ వ్యాప్తంగా 40 మంది ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీరికి మాత్రమే ఆన్లైన్లో రాయల్టీలు మంజూరు చేస్తుంది. నియోజకవర్గంలో చాలా మందికి లీజులు ఉన్నప్పటికి ఈసీ, మైనింగ్ ప్లాన్ లేదనే కారణంతో ఆన్లైన్ రాయల్టీలు నిలుపదల చేసింది. 2020–21–2021–22–2022–23 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి జీఎస్టీ బకాయిలు చెల్లించాలని యజమానులకు పోస్టల్ ద్వారా నోటీసులు పంపుతున్నారు. అంకిరెడ్డిపల్లెకు చెందిన మైనింగ్ యజమాని కొప్పుల చంద్రశేఖర్రెడ్డి రూ.3.64 లక్షలు బకాయి చెల్లించాలని ఇటీవలనే నోటీసు పంపించారు. మిగిలిన యజమానులకు ఒక్కొక్కరికి నోటీసులు అందుతున్నాయి. నాపరాళ్లు వెలికి తీసి రవాణా చేసేందుకు ఆన్లైన్ రాయల్టీలు పొందాల్సి ఉంటుంది. ప్రతి రాయల్టీపై యజమానులు రాష్ట్ర ప్రభుత్వానికి సీనరేజ్, డీఎంఎఫ్ తదితర పన్నులు చెల్లిస్తుంటారు. కానీ జీఎస్టీ ఎప్పటికప్పుడు వాటితో పాటే వసూలు చేయకుండా పెండింగ్ పెట్టి ఒకే సారి లక్షల్లో చెల్లించాలని చెప్పడంతో యజమానులకు దిక్కుతోచడం లేదు. గత మూడేళ్ల నుంచి నిమ్మకుండి ఆర్థిక సంవత్సరం ముగిసే సమయంలో వసూలు చేసేందుకు సెంట్రల్ జీఎస్టీ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తుంది. పోటీ ప్రపంచంలో నాపరాళ్ల పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా ఉన్న తరుణంలో మళ్లీ జీఎస్టీ రూపంలో యజమానులపై పిడుగు పడటంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత మూడేళ్ల బకాయిలు చెల్లించాలని నోటీసులు సర్కారు నిర్ణయంతో నాపరాళ్ల పరిశమ్ర మనుగడపై తీవ్ర ప్రభావం -
రైతన్నల పరిస్థితి దుర్భరం
పాణ్యం: దేశానికి అన్నంపెట్టే రైతన్నల పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో దుర్భరంగా మారిందని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాల్సిన కూటమి సర్కారు చోద్యం చూస్తోందని మండిపడ్డారు. బుధవారం తమ్మరాజుపల్లె కొండలపై వెలసిన కొండ మల్లేశ్వరస్వామి ఆలయంలో ఆయన పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాటసాని మాట్లాడుతూ రైతును గతంలో ఎన్నడూ లేని విధంగా దళారీల చేతికి అప్పగించారన్నారు. దీంతో వారు అడిగిన ధరకే పంట ఉత్పత్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. అధికారంలోకి వచ్చి 9 నెలలవుతున్నా కూటమి సర్కారు రైతుకు పైసా సాయం చేయలేదని మండిపడ్డారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 20 వేలు ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటించి నేటికీ అమలు చేయకుండా రైతులను చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఉండేదని, ఏటా పంటపెట్టుబడికి రైతు భరోసా పథకం కింద సాయం అందేదని చెప్పారు. ఇప్పుడు సాయం దేవుడెరుగు కనీసం రైతుల గోడు కూడా బాబు సర్కారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీల అమలుకు రైతుల పక్షాన వైఎస్సార్సీపీ పోరాడుతుందని చెప్పారు. ఏ పంటకు మద్దతు ధర లేదు కూటమి సర్కారు పట్టనట్టు వ్యవహరిస్తోంది వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని -
వైభవంగా స్వాతి వేడుకలు
ఆళ్లగడ్డ: అహోబిలం క్షేత్ర పరిధిలో కొలువైన నవనారసింహ క్షేత్రాలు భక్త జనసంద్రంగా మారాయి. స్వామి జన్మనక్షత్రమైన స్వాతి వేడుకలను పురస్కరించుకుని బుధవారం భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. గోవింద నామస్మరణతో నల్లమల పులకించి పోయింది. దిగువ అహోబిలంలో ఏర్పాటు చేసిన యాగశాలలో ఉత్సవమూర్తులైన శ్రీ పావన లక్ష్మీనృసింహస్వామిని, సుదర్శనమూర్తులను దేవాలయం ప్రధాన ద్వారం ఎదురుగా యాగశాలలో కొలువుంచి పంచామృతాలతో అభిషేకించారు. నవకలశాలతో తిరుమంజనం నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తులను నూతన పట్టుపీతాంబరాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం వేద పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీ స్వాతి, శ్రీసుదర్శన హోమాలు వైభవోపేతంగా నిర్వహించారు. పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలు ప్రధానార్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మద్దిలేటిస్వామి ఆలయంలో..బేతంచెర్ల: మండల పరిధిలోని వైష్ణవ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో మాఘ మాసాన్ని పురస్కరించుకొని స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి వేడుకలను బుధవారం వైభవంగా నిర్వహించారు. ఉప కమిషనర్, ఆలయ ఈఓ రామాంజనేయులు ఆధ్వర్యంలో వేదపండితులు జ్వాలాచక్రవర్తి శ్రీదేవి, భూదేవి సమేతుడైన మద్దిలేటి నరసింహస్వామికి సుప్రభాత సేవ, విశ్వక్సేనారాధన, వాసు దేవ పుణ్యహవచనం, సుదర్శన హోమం, నవ కలశ స్నపనం, నరసింహ హోమం, పంచామృత సహిత విశేష ద్రవ్య తిరుమంజనం, ధన్వంతరి మూల మంత్ర జపం చేశారు. తర్వాత అలంకార ప్రియుడైన స్వామి వారికి సహస్రదీపాలంకరణ సేవ నిర్వహించారు. ఆలయ మాడ వీధుల్లో గోవింద నామస్మరణలు, మంగళవాయిద్యాల మధ్యన రమణీయంగా ఊరేగింపు చేపట్టారు. -
సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. వామపక్షాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్దేశాయ్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. మునెప్ప మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ను సవరించైనా ఆంధ్రప్రదేశ్కు నిధులు కేటాయించాలన్నారు. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే జోన్ల కోసం నిధులను సాధించడంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. కడప స్టీలు ప్లాంటు కోసం నిధులను రాబట్టడంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కర్నూలు జిల్లా సమగ్రాభివృద్ధికి రూ.10 వేల కోట్లను కేటాయించాలన్నారు. జిల్లా పశ్చిమ ప్రాంతంలోని వలసల నివారణకు వెంటనే పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు. వామపక్ష పార్టీల నాయకులు రాజశేఖర్, రామకృష్ణారెడ్డి, రాముడు, విజయ్, షరీప్, అబ్దుల్దేశాయ్, రామకృష్ణ పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా -
త్రివిక్రమ వర్మకు నివాళి
అవుకు: గుండెపోటుతో సోమవారం రాత్రి మృతిచెందిన రాజవంశీయుడు నంద్యాల త్రివిక్రమ వర్మ అంత్యక్రియలు బుధవారం అవుకులో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి అవుకులోని రాజుగారి స్వగృహానికి చేరుకుని వర్మ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అవుకు సామ్రాజ్యాన్ని పాలించే కాలంలో వారి పూర్వీకులు అవుకుకు ఎనలేని సేవలనందించారని గుర్తుచేశారు. అనంతరం త్రివిక్రమ వర్మ భార్య భాగవతి, కుమారుడు అభినాష్ ప్రశాంత్ వర్మలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధైర్య పడొద్దని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకుడు పండ్ల వాయునందన గౌడ్, బలిజ సంఘం నాయకుడు రామన్న, గ్యాంగ్ దస్తగిరి పాల్గొన్నారు. -
యూరియా పంపిణీలో విఫలం
రైతులకు అవసరం మేరకు యూరియాను పంపిణీ చేయడంలో కూటమి సర్కారు విఫలమైందని పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని విమర్శించారు. అధికారపార్టీ నాయకులు, కొందరు దళారులు యూరియా కొరత సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారని, బస్తాపై రూ.150–200 అదనంగా వసూలు చేస్తున్నారని చెప్పారు. దీంతో సామాన్య రైతులకు యూరియా కొనుగోలు భారమైందన్నారు. ఇప్పటికై నా సర్కారు స్పందించి రైతులకు అవసరం మేరకు యూరియా అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ జెట్పీటీసీ సభ్యుడు సద్దల సూర్యనారాయణరెడ్డి, నంద్యాల జిల్లా పంచాయతీ రాజ్ అధ్యక్షడు రామలక్ష్మీయ్య, పిన్నాపురం సర్పంచ్ ఎల్లక్రిష్ణయ్య , కందికాయపల్లె సర్పంచ్ రామచంద్రుడు, శేషారెడ్డి, బాలిరెడ్డి, శేషు, రామకిట్టు, జయచంద్రారెడ్డి, శేషయ్య, చందమామబాబు, సుమంత్రెడ్డి, అమర్నాఽథ్రెడ్డి , గగ్గటూరు శ్రీనివాసరెడ్డి,సత్యాలు, వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు. -
మందుబాబులకు జరిమానా
కర్నూలు: రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ తనిఖీలు విస్తృతం చేశారు. ఇందులో భాగంగా మూడవ పట్టణ పోలీసులు 20 మంది మందుబాబులను బుధవారం అరెస్టు చేసి జేఎఫ్సీఎం కోర్టులో హాజరుపరిచారు. డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన ఐదుగురికి ఒక్కొక్కరికి రూ.3,500, ఓపెన్ డ్రింకింగ్లో పట్టుబడిన 15 మందికి ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్పై జిల్లా వ్యాప్తంగా నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని, మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్షతో పాటు వాహనం సీజ్ చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు. కేసీ కెనాల్లో యువకుని మృతదేహం గడివేముల: కరిమద్దెల గ్రామ సమీపంలోని కేసీ కెనాల్లో గుర్తుతెలియని యువకుని మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్ఐ నాగార్జున రెడ్డి బుధవారం తెలిపారు. యువకుడికి 30 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉంటుందని, బ్రౌన్ కలర్ టీ షర్టు, బ్లూ కలర్ ప్యాంటు ధరించారన్నారు. యువకుని పేరు, వివరాలు వెల్లడి కాలేదని చెప్పారు. వీఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వరకట్న వేధింపుల కేసులో జైలు శిక్ష కోవెలకుంట్ల: వరకట్న వేధింపుల కేసులో న్యాయస్థానం ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి బుధవారం తెలిపారు. కోవెలకుంట్ల పట్టణానికి చెందిన షేక్ అస్మా కౌసబ్ను అదనపుకట్నం కోసం వేధింపులకు గురి చేస్తుండటంతో 2020లో భర్త షేక్ జుబేర్ అక్రమ్, అత్త షేక్ ఫర్హద్ దుల్హాన్పై ఫిర్యాదు చేసింది. స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వరకట్నం కోసమే వేధించినట్లు సాక్ష్యాలు రుజువు కావడంతో న్యాయమూర్తి అబ్దుల్ రహిమాన్ ఇరువురి నిందితులకు ఏడాది జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ. 2,500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణంవెల్దుర్తి: రోడ్డు ప్రమాదంలో మద్దయ్య(40) అనే రైతు బుధవారం మృతి చెందారు. బోయినపల్లి గ్రామానికి చెందిన ఈయన పొగాకు బేళ్లను అమ్మేందుకు మోటారు సైకిల్పై ఓర్వకల్లుకు వెళ్లారు. తిరిగి మోటారు సైకిల్పై వస్తుండగా కలుగొట్ల గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో రైతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మద్దయ్యకు భార్య వెంకటేశ్వరమ్మ, ఇద్దరు సంతానం ఉన్నారు. వలస కూలీ మృతి కౌతాళం: జీవనోపాధి కోసం కుటుంబంతో సహా గుంటూరు జిల్లాకు వెళ్లిన వలస కూలి బుధవారం మృతి చెందారు. మృతుని బంధువులు తెలిపిన వివరాల మేరకు.. కౌతాళం మండలం సుళేకేరి గ్రామానికి చెందిన నగేష్(28)కు గ్రామంలో పనులు దొరకలేదు. గత నెలలో కుటుంబంతో సహా గుంటూరు జిల్లాకు వలస వెళ్లాడు. అక్కడ మిర్చి కోత పనులకు వెళుతూ కుటుంబంతో జీవనం కొనసాగించేవాడు. బుధవారం పనులకు ట్రాక్టర్లో వెళుతుండగా ప్రమాదవశత్తు ట్రాలీపై నుంచి నగేష్ కిందకు పడిపోయాడు. తోటి కూలీలు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఊరుకాని ఊరికి పొట్టకూటి కోసం వలస వస్తే ఇలా జరిగిందని భార్య మహేశ్వరమ్మ రోదిస్తున్న తీరు అందరిని కలిచి వేస్తున్నది. నగేష్కు ఒక కుమార్తె ఉన్నారు. గంజాయి, సారాపై నిఘా ఆత్మకూరు: శ్రీశైల పరిసరాల్లో గంజాయి, నాటుసారా, లిక్కర్ అమ్మకాలపై నిఘా ఉంచామని నంద్యాల అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రాముడు అన్నారు. ఆత్మకూరు పట్టణంలోని ఎకై ్సజ్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భక్తులు శ్రీశైలేశుడిని భక్తిశ్రద్ధలతో దర్శించుకోవాలని చెప్పారు. ఎక్కడైనా మద్యం, గంజాయి, నాటుసారా విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే తమకు ఎకై ్సజ్ కంట్రోల్ రూమ్ సెల్ 93909 43271 కు సమాచారం అందించాలని చెప్పారు. ఉత్సవాల నేపథ్యంలో ఈనెల 19వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆత్మకూరు ఎకై ్సజ్ సీఐ కిషోర్, సిబ్బంది పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నాయకుడిపై దాడి
కృష్ణగిరి: మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు సురేంద్రకుమార్ (సుభాష్)పై ఇదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు దామోదర్నాయుడు దాడికి పాల్పడ్డాడు. గ్రామస్తులు, బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. బుధవారం మధ్యాహ్నం సుభాష్ తన బైక్పై మరో వ్యక్తితో కలిసి వెల్దుర్తికి వెళ్తుండగా కృష్ణగిరి పోలీస్స్టేషన్ వెళ్లే రహదారి వద్ద దామోదర్నాయుడు సుభాష్ బైక్ నిలిపి దాడికి పాల్పడ్డాడు. వెంటనే అతను ఆత్మ రక్షణ కోసం ఎదురుదాడికి దిగగా.. ఇంతలో టీడీపీకి చెందిన మరో వ్యక్తి అడివయ్య రాళ్లతో సుభాష్పై దాడి చేశాడు. ఈ ఘటనలో ఇరువురికి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు వచ్చి ఇద్దరిని పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. గతేడాది కూటమి పార్టీ గెలిచిన వెంటనే ఇదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అధికారపార్టీ నాయకులు దాడికి పాల్పడ్డారు. -
ఎగ్జిబిషన్ ఏర్పాటుకు బహిరంగ వేలం
మహానంది: మహానందిలోని టీటీడీ కల్యాణ మండపం ఆవరణలో జెయింట్ వీల్, ఎగ్జిబిషన్ ఏర్పాటు కోసం మంగళవారం బహిరంగ వేలం నిర్వహించారు. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, ఏఈఓ ఎరమల మధు, సూపరింటెండెంట్ అంబటి శశిధర్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేలంలో ఐదుగురు డిపాజిట్లు చెల్లించి పోటీ పడ్డారు. దేవస్థానం పాట రూ. 3.50 లక్షల నుంచి మొదలుకాగా గోపవరం గ్రామానికి చెందిన చంద్రుడు (చంద్ర) రూ. 5.15 లక్షలతో హెచ్చుపాటదారుడిగా నిలిచి దక్కించుకున్నారు. గత ఏడాది రూ. 3.50లక్షలు వచ్చిందని, ఈ ఏడాది అదనంగా రూ. 1.65 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఈఓ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శవమై తేలాడు మద్దికెర: అదృశ్యమైన మద్దికెర గ్రామానికి చెందిన బోగోలు తిరుమలరెడ్డి (45) సోమవారం శవమై తేలాడు. వివరాల్లోకి వెళితే.. తిరుమలరెడ్డి పిల్లల చదువుకోసం గుంతకల్లులో నివాసం ఉంటున్నాడు. బుగ్గ సమీపంలోని వ్యవసాయతోటలో పనులతో పాటు సొంతంగా యూట్యూబ్ చానెల్ పెట్టి వార్తలు సేకరిస్తూ జీవనం చేస్తున్నాడు. రోజు మాదిరిగానే తోటకు వస్తూ అదృశ్యమయ్యాడు. కాలువ వద్ద స్కూటర్, సెల్ఫోన్ పడి వుండడంతో పోలీసులు ఆచూకీ కోసం కాలువలో వెతికినా ఫలితం కనబడలేదు. అయితే మంగళవారం మధ్యాహ్నం శవమై తేలడంతో పోస్టుమార్టుం నిమిత్తం గుంతకల్లుకు తరలించారు. ఉప కారాగారం ఆకస్మిక తనిఖీ ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ ఉపకారాగారాన్ని ఐదో అదనపు జిల్లా జడ్జి మురళీకృష్ణ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కారాగారంలోని వసతులు, సౌకర్యాలను పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ముద్దాయిలకు ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామన్నారు. జైలులో ఏమైనా సమస్యలుంటే లీగల్ ఎయిడ్ క్లినిక్లోని న్యాయవాది ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. లేదంటే ఆన్లైన్ నెంబర్ 15100 కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ముఖ్యంగా సత్ప్రవర్తనతో మెలగాలని ఖైదీలకు సూచించారు. కార్యక్రమంలో జైలు ఇన్చార్జ్ సూపరింటెండెంట్ యోగేష్కుమార్ పాల్గొన్నారు. -
రైతు కన్నీరు పెట్టిన రాజ్యం బాగుపడదు
కర్నూలు(అగ్రికల్చర్): పంటలకు మద్దతు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫల మైందని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి విమర్శించారు. గిట్టు బాటు ధర లేక మిర్చి రైతులు అల్లాడుతున్నా పాలకుల్లో చలనం లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. రైతులు కన్నీరు పెట్టిన రాజ్యం బాగుపడదన్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో విక్ర యాలు లేకుండా నిల్వ ఉన్న మిర్చి దిగుబడులను మంగళవారం కాటసాని పరిశీలించారు. మిర్చి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. పెట్టుబడి వ్యయం ఎంత వచ్చింది.. దిగుబడి ఎలా ఉంది.. మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయనే దానిపై రైతులతో చర్చించారు. మిర్చి రైతులు తమ ఆందోళనను కాటసానికి వివరించి కన్నీరుమున్నీరయ్యారు. ఎకరాకు పెట్టుబడి వ్యయం రూ.లక్ష వరకు వస్తోందని, దిగుబడి 20 క్వింటాళ్ల వరకు వస్తున్నా.. క్వింటాకు రూ.10 వేల వరకు మాత్రమే ధర లభిస్తోందని, పెట్టుబడి కూడా దక్కడం లేదని వివరించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ... వైఎస్సార్ సీపీ హయాంలో ప్రతి పంటకు మద్దతు ధర కల్పించామన్నారు. మద్దతు కంటే ధరలు తగ్గిన ప్పుడు రైతులు నష్టపోకుండా ఆర్బీకేల వారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. అప్పట్లో మిర్చి ధర రూ.50 వేలకుపైగా పలికిందని, నేడు కనీసం రూ.10 వేలు కూడా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పంటను రైతులు అమ్ముకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. మిర్చి ధర అట్టడుగుకు పడిపోయినా.. ప్రభుత్వం చొరవ తీసుకొని ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. న్యాయం కోసం అన్నదాతలతో కలసి ఉద్యమిస్తామని పేర్కొన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు ఆర్బీకేల్లోనే అందుబాటులో ఉంచిందన్నారు. కూటమి ప్రభుత్వం ఆర్బీకేలకు ఉరివేస్తోందని మండిపడ్డారు. అనంతరం మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మితో సమావేశమై మిర్చి ధరలు పడిపోవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాపారులు సిండికేట్ కాకుండా పోటీ తత్వంతో కొనుగోలు చేయాలని సూచించారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. మద్దతు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి -
రైతుల సమక్షంలోనే భూ రీసర్వే
రుద్రవరం: రైతుల సమక్షంలోనే భూ రీసర్వే చేయాలని అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ రెవెన్యూ ఆదేశించారు. బీరవోలులో సాగుతున్న భూ రీసర్వే పనులను మంగళవారం ఆయన పరిశీలించా రు. భూమి చుట్టుపక్కల రైతులకు నోటీసులు అందజేసి వారి సమక్షంలోనే రీసర్వే చేయాలన్నారు. రైతుల చెప్పిన వివరాల మేరకే మార్పులు, చేర్పులు చేయా లని, సరిహద్దు స్థిరీకరణ, స్టోన్ ప్లాంటేషన్ పనులు పూర్తి చేయాలన్నారు. జేసీ వెంట సర్వే, ల్యాండ్ ఏడీ జయరాజు, తహసీల్దార్ మల్లికార్జునరావు ఉన్నారు. -
శివరాత్రికి అదనపు బస్సులు
మహానంది: ఆలయానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు బస్సులు ఏర్పాటు చేస్తామని నంద్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ గంగాధర్ తెలిపారు. మహానందిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పురస్కరించుకుని నంద్యాల నుంచి మహానంది పుణ్యక్షేత్రానికి ప్రతి పదినిమిషాలకు ఒక బస్సు తిరుగుతుందన్నారు. మొత్తం 25 బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గాజులపల్లె రైల్వేస్టేషన్ నుంచి మహానందికి ఆర్టీసీ బస్సులు తిప్పుతామన్నారు. నంద్యాల బస్టాండ్లో మహానంది బస్సుల కోసం ఐదు ఫ్లాట్ఫామ్లు కేటాయించామని, అవసరమైతే మరిన్ని పెంచుతామన్నారు. విజయవాడకు బోయలకుంట్ల పూలు శిరివెళ్ల: తాను పదేళ్లుగా నర్సరీని నిర్వహిస్తున్నానని, బోయలకుంట్ల గ్రామం నుంచి పూలను విజయవాడ మార్కెట్కు పంపిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారికి రైతు జింకల నారాయణ తెలిపారు. మహదేవపురం, బోయలకుంట్లలో ఉద్యాన పంటల సాగును మంగళవారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మహదేవపురంలో అరటి పంటల సాగును పరిశీలించి, అక్కడి రైతులతో మాట్లాడారు. అనంతరం బోయలకుంట్లలో నర్సరినీ పరిశీలించి, రైతు జింకల నారాయణతో మాట్లాడారు. వరితోపాటు ఉద్యాన పంటలను సాగు చేస్తున్నానని రైతు తెలిపారు. ఉద్యానవన శాఖ అధికారి దివ్య, రైతు సేవా కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు. భక్తులకు సకల సౌకర్యాలు మహానంది: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానందికి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని అధికారులను నంద్యాల ఆర్డీఓ విశ్వనాఽథ్ ఆదేశించారు. మహానందిలోని పోచా బ్రహ్మానందరెడ్డి డార్మెటరీ భవనంలో అన్ని శాఖల అధికారులతో మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ విశ్వనాఽథ్ మాట్లాడుతూ.. భక్తుల కాలక్షేపానికి అవసరమైన సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. రోడ్లపై ఎక్కడైనా పందులు కనిపిస్తే పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఆలయ, పంచాయతీ పరిధిలోని అన్ని వీధిలైట్లు వెలగాలని ఆదేశించారు. నంద్యాల ఏఎస్సీ జావళి ఆల్ఫోన్స్ మాట్లాడుతూ.. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వంద మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఉంటుందన్నారు. వాహనాల పార్కింగ్ ప్రదేశాల వద్ద అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఉత్సవాల చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్, డిప్యూటీ కమిషనర్ ఎం.రామాంజనేయులు, మహానంది ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి , ఆలయ ఏఈఓ ఎరమల మధు, సూపరింటెండెంట్ అంబటి శశిధర్రెడ్డి, తహసీల్దార్ రమాదేవి, సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎకై ్సజ్ సీఐ కృష్ణమూర్తి, ఎస్ఐ రామ్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నట్లుండి జ్వరం వస్తుంది. క్రమంగా తల నుంచి పాదాల వరకు నరాలు చచ్చుబడిపోయి కాళ్లూ, చేతులు పడిపోతాయి. కొందరికి ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. దీనినే గులియన్ బ్యారీ సిండ్రోమ్ (జీబీ సిండ్రోమ్) వ్యాధి అంటారు. ఈ వ్యాధి ప్రస్తుతం జిల్లా వాసులను కలవర పెడు
వ్యాధి లక్షణాలు ● కండరాలు బలహీనంగా మారతాయి. ● కాళ్ల నుంచి మెదడు వైపునకు జలదరించినట్లు అనిపిస్తుంది. ● నరాలకు చెందిన మైలిన్ పొర పాడై నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. తిమ్మిర్లు వస్తాయి, కాళ్లు, చేతులు చచ్చుబడిపోవ డం, నడవలేకపోతుంటారు. ● మాట్లాడేటప్పుడు, నడిచేటప్పుడు బ్యాలెన్స్ ఉండదు. ● గుండె స్పందన రేటు పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. ● నడిచేటప్పుడు విపరీతమైన అలసటకు గురవుతారు. ● జీర్ణశక్తి తీవ్రంగా దెబ్బతింటుంది. ● కొన్నిసార్లు ఊపిరితీసుకునే కండరాలు బలహీనపడతాయి. ఊపిరితిత్తులకు సంబ ంధించి పార్శ్వ న్యూమోథొరాక్స్ వస్తుంది. ● ఈ కారణంగా ఊపిరితీసుకోలేక రోగి మరణించే అవకాశం ఉంటుంది ఏడాదిలో 21 మందికి చికిత్స చేశాం జీజీహెచ్లోని న్యూరాలజీ విభాగంలో గత యేడాది కాలంలో 21 మంది జీబీ సిండ్రోమ్ బాధితులకు చికిత్స అందించాం. ఒక్క గత జనవరి మాసంలో ముగ్గురికి వైద్యమందించాం. ఇలాంటి వారికి వ్యాధి లక్షణాలను బట్టి చికిత్స అందించడంతో పాటు ప్లాస్మాథెరపి లేదా ఇమ్యునోగ్లోబ్లిన్స్ చికిత్స అందజేస్తున్నాం. ఇమ్యున్లోగ్లోబిన్స్ ఇంజెక్షన్లు ఐదు రోజుల పాటు ఇవ్వడం వల్ల వ్యాధి పెరగకుండా నియంత్రిస్తుంది. దీనివల్ల రోగి త్వరగా కోలుకుంటాడు. – డాక్టర్ సి.శ్రీనివాసులు, హెచ్వోడీ, న్యూరాలజీ విభాగం, జీజీహెచ్ కర్నూలు స్థానికంగా ఇమ్యునోగ్లోబిన్స్ కొంటున్నాం ఆసుపత్రికి వచ్చే జీబీ సిండ్రోమ్ కేసులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చికిత్స అందిస్తున్నాం. వారు మందులు, వ్యాధినిర్ధారణ పరీక్షలకు బయటకు వెళ్లాల్సిన పనిలేకుండా అన్నీ మేము అందిస్తున్నాం. ముఖ్యంగా అత్యంత ఖరీదైన ఇమ్యునోగ్లోబిన్స్ ఇంజెక్షన్లు గతంలో సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి సరఫరా అయ్యేవి. కొన్ని నెలలుగా వాటి సరఫరా లేకపోవడంతో ఉన్నతాధికారుల అనుమతితో స్థానికంగా కొనుగోలు చేసి రోగులకు అందిస్తున్నాం. దీనివల్ల రోగులు త్వరగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. – డాక్టర్ కె. వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్, జీజీహెచ్, కర్నూలు కర్నూలు(హాస్పిటల్): దేశాన్ని కలవరపెడుతున్న జీబీ సిండ్రోమ్ వ్యాధికి సంబంధించిన కేసులు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ప్రతి నెలా రెండు, మూడు వస్తూనే ఉన్నాయి. గతేడాది జనవరి నుంచి గత నెల జనవరి వరకు 48 మంది రోగులు ఈ వ్యాధితో చికిత్స పొందారు. ఈ ఆసుపత్రికి కర్నూలు జిల్లాతో పాటు నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, ప్రకాశం జిల్లాలతో పాటు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి చికిత్స కోసం వస్తున్నారు. వీరిలో జీబీ సిండ్రోమ్తో బాధపడే వారూ ఉన్నారు. పక్షవాతం వలే ఈ వ్యాధితో బాధపడేవారు త్వరగా కోలుకునే పరిస్థితి ఉండదు. అందుకే ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఈ రోగులను చేర్చుకోవడం లేదు. ఎక్కువ శాతం ప్రభుత్వ ఆసుపత్రికే రెఫర్ చేస్తున్నారు. ఈ కారణంగా ఆసుపత్రిలోని చిన్నపిల్లల విభాగం, న్యూరాలజీ విభాగం, జనరల్ మెడిసిన్ విభాగాల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యాధికి ఖరీదైన ఇమ్యునోగ్లోబిన్స్ ఇంజెక్షన్లు వాడాల్సి ఉంటుంది. వీటి ఖరీదు ఒక్కోటి రూ.11వేల నుంచి రూ.15వేల వరకు ఉన్నాయి. వీటిని జీబీ సిండ్రోమ్తో పాటు తలసీమియా, తీవ్ర వైరల్ ఇన్ఫెక్షన్లతో బాధపడే వారికి ఇస్తారు. ఆయా రోగుల పరిస్థితిని బట్టి ఐదు రోజుల పాటు ఇస్తారు. పేదరోగుల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా గత ప్రభుత్వం వీటిని సెంట్రల్ డ్రగ్ స్టోర్ల నుంచి ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేసేది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటి సరఫరా నిలిపివేసింది. ఆసుపత్రి అధికారులు మందులు కావాలని పలుమార్లు ఇండెంట్ పెడుతున్నా స్పందన లేదు. దీంతో స్థానికంగా మందులను కొనుగోలు చేసి రోగులకు అందిస్తున్నారు. ఈ మేరకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రతి నెలా 20 నుంచి 25 మందికి ఈ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ఈ ఇంజెక్షన్తో పాటు ప్లాస్మాపెరోసిస్ చికిత్స చేస్తారు. మొత్తంగా జీబీ సిండ్రోమ్ వచ్చిన రోగికి చికిత్స చేయాలంటే రూ.5లక్షల నుంచి రూ.10లక్షల దాకా ఖర్చు అవుతుందని వైద్యుల అంచనా. జీబీ సిండ్రోమ్కు పరీక్షలేవి? కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జీబీ సిండ్రోమ్ వ్యాధిని నిర్ధారించే పరీక్షలు ఏవీ చేయడం లేదు. కేవలం వ్యాధి లక్షణాలను బట్టి వైద్యులు చికిత్స అంది స్తున్నారు. వాస్తవంగా ఈ వ్యాధి నిర్ధారణకు ఈఎన్ఎంజీ, ఎన్సీఎస్ పరీక్షలు చేయాల్సి ఉంది. ఇవి చాలా ఖరీదైనవి. ఎక్కువగా పేదరోగులు చికిత్స కోసం వస్తుండటంతో పరీక్షలకు రాయకుండా లక్షణాలను బట్టి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇది ఇమ్యునులాజికల్ ఇమ్మీడియట్ డిజార్డర్గా వైద్యులు పరిగణిస్తారు. మన శరీరంలో ఉండే రక్షణ వ్యవస్థ (వ్యాధినిరోధక శక్తి) శత్రుకణాలుగా భ్రమపడి సొంత వ్యాధి నిరోధక శక్తిని కలిగించే కణాలపై దాడి చేయడం వల్లే ఈ వ్యాధి సోకుతోంది. ఈ కారణంగా మన వ్యాధి నిరోధక వ్యవస్థ దెబ్బతింటోంది. నాడీ వ్యవస్థపై దాడి చేయడానికి జీబీ సిండ్రోమ్ ప్రేరేపిస్తుంది. ఈ కారణంగా పక్షవాతానికి గురవుతున్నారు. ఇది రావడానికి ఎక్కువగా ఇన్ఫెక్షన్లు లేదా కారణం లేకుండా కూడా వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధిలో ఐదు గ్రేడ్లు ఉంటాయి. మొదటి గ్రేడ్లో రోగులు సాధారణంగా నడుస్తారు. రెండో గ్రేడ్లో ఎవ్వరైనా పట్టుకుంటేనే నడవగలుగుతారు. మూడో గ్రేడ్లో పట్టుకున్నా నడవలేరు. నాలుగో గ్రేడ్లో బెడ్కే పరిమితమై ఉంటారు. ఐదో గ్రేడ్లో ఆసుపత్రిలోని వెంటిలేటర్పై ఉంటారు. ఆరోగ్రేడ్లో మరణిస్తారని వైద్యులు తెలిపారు. కోవిడ్ అనంతరం పెరిగిన కేసులు జీబీ సిండ్రోమ్ వ్యాధిగ్రస్తులు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు గతంలో అరుదుగా చికిత్స కోసం వచ్చేవారు. కానీ కోవిడ్–19 అనంతరం వైరస్ లేదా వ్యాక్సిన్ వల్ల ఈ కేసుల సంఖ్య పెరిగినట్లు వైద్యులు గుర్తించారు. ఉత్తర భారత దేశంలో ఇలాంటి కేసులు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. చండీఘర్లోని పీజీఐ వారు ఇందుకు సంబంధించిన స్టడీస్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని వైద్యులు చెబుతున్నారు. గత జనవరి నెల 18వ తేదీన కర్నూలు నగరంలోని కల్లూరు ప్రాంతానికి చెందిన ఐదేళ్ల బాలుడు జీబీ సిండ్రోమ్ లక్షణాలు కనిపించాయి. అతన్ని తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అదే నెల 20వ తేదీన చిన్నపిల్లల విభాగంలో చేర్పించారు. వైద్యులు మెరుగైన వైద్యం అందించడంతో బాలుడు కోలుకున్నాడు. మండల కేంద్రమైన గూడూరులోని కాప స్ట్రీట్కు చెందిన మూడేళ్ల బాలుడికి గత నవంబర్ 27వ తేదీన జీబీ సిండ్రోమ్ లక్షణాలు కనిపించడంతో అదే నెల 30వ తేదీన తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు చిన్నారికి సకాలంలో వైద్యం అందించడంతో కోలుకుని క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. జీబీ సిండ్రోమ్ అంటే.. గత ఏడాది నుంచి జీజీహెచ్లో 48 మందికి చికిత్స వీరి చికిత్సలో ఇమ్యునోగ్లోబిన్స్ ఇంజెక్షన్లు కీలకం మూడు నెలలుగా ఆగిపోయిన ఇంజెక్షన్ల సరఫరా స్థానికంగా కొనుగోలు చేస్తున్న పెద్దాసుపత్రి అధికారులు వ్యాధి పట్ల భయం అవసరం లేదంటున్న వైద్యులు -
ఖైదీలను కోర్టు వాయిదాలకు కచ్చితంగా హాజరుపరచాలి
కర్నూలు: జైలులో ఉన్న ఖైదీలను కోర్టు వాయిదాలకు కచ్చితంగా హాజరుపర్చాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సూచించారు. కర్నూలు పురుషుల కేంద్ర కారాగారం, మహిళా కారాగారాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలు ఖైదీలకు ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్స్ గురించి వివరించారు. ఇందులో ఒక అడ్వకేటు, పారా లీగల్ వలంటీర్ ఉంటారని, వారు ఖైదీలకు న్యాయ సహాయాలు అందిస్తారని తెలిపారు. సత్ప్రవర్తనతో ఖైదీలు జైలు శిక్షను పూర్తి చేసుకోవాలని సూచించారు. ఖైదీలకు ఎవరికై నా న్యాయవాదులు లేకుంటే ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఖైదీలకు అందించే ఆహారాన్ని, వారి ఆరోగ్యంపై తీసుకుంటున్న చర్యల గురించి పరిశీలించి అడిగి తెలుసుకున్నారు. ఖైదీలను కోర్టు వాయిదాలకు కచ్చితంగా హాజరుపరచాలని ఆదేశించారు. ఏవైనా సమస్యలుంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చన్నారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100పై ఖైదీలకు అవగాహన కల్పించారు. జైలు అధికారులతో పాటు న్యాయవాది శివరాం కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి -
భూమి కొనుగోలు అక్రమాలను వెలికితీస్తాం
కర్నూలు(అర్బన్): జిల్లాలోని ఆదోని మండలం చిన్న గోనేహాల్, చిన్న హరివాణం గ్రామాల్లో 2018– 2019లో భూమి లేని నిరుపేద దళితుల కోసం ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన భూములపై సమగ్ర విచారణ జరిపిస్తామని ఏపీ మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయకుమార్ అన్నారు. ఈ రెండు గ్రామాల్లో 76 మంది లబ్ధిదారులకు రూ.4.65 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన 76.52 ఎకరాల భూములను ఇప్పటి వరకు ఒక్క దళిత కుటుంబానికి కూడా అందించలేదనే విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఇందులో ఎవరెవరి పాత్ర ఎంత ఉందనేది తేల్చి అర్హులైన లబ్ధిదారులందరికి న్యాయం జరిగేందుకు కృషి చేస్తామన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపడుతున్నామని, అలాగే షాపింగ్ కాంప్లెక్స్ల స్థితిగతులను కూడా పరిశీలించి, అవసరమైన ప్రాంతాల్లో రిపేర్లు చేపట్టనున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ యువతకు మెరుగైన స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను కూడా ఖచ్చితంగా ఆయా సామాజిక వర్గాల కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు వెచ్చించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో మాల, మాదిగ కార్పొరేషన్ల డైరెక్టర్లు పోతురాజు రవికుమార్, ధరూరు జేమ్స్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె. తులసీదేవి పాల్గొన్నారు. నిరుపేద దళితులకు న్యాయం చేసేందుకు చర్యలు ఏపీ మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయకుమార్ -
బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. సమన్వయ సమావేశాలను నిర్వహించి ఆయా విభాగాలు చేపట్టే పనులపై దిశానిర్దేశం చేశామన్నారు. రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడా రు. వివరాలు ఈఓ మాటల్లో.. ● గతేడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 11 రోజులు నిర్వహించగా 5.76లక్షల మంది భక్తులు తరలివచ్చారు. ఈ ఏడాది మొత్తం 11 రోజుల్లో 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశాం. భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు బుధవారం నుంచి మార్చి1వ తేదీ వరకు ఉభయ దేవాలయాల్లో అన్ని ఆర్జితసేవలను రద్దు చేశాం. అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నాం. ● జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశాం. బుధవారం నుంచి ఈ నెల 23వ తేదీ వరకు మాత్రమే విడతల వారీగా నిర్దిష్ట వేళల్లో మాత్రమే మల్లన్న స్పర్శదర్శనం కల్పిస్తాం. ● వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లులకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశాం. ఉచిత కంపార్ట్మెంట్లలో, క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరం తాగునీరు, అల్పాహారం, బిస్కెట్లు, పాలు పంపిణీ చేస్తాం. ● ఆగమ శాస్త్రానుసారంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తాం. స్వామివారి పాగాలంకరణ కార్యక్రమం ప్రత్యేకంగా ఉంటుంది. రథోత్సవం, తెప్పోత్సవం వైభవోపేతంగా నిర్వహిస్తాం. ● గతేడాది బ్రహ్మోత్సవాల్లో 30.5 లక్షల లడ్డూ ప్రసాదాలను భక్తులు కొనుగోలు చేశారు. ఈ ఏడాది 35 లక్షల లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేస్తున్నాం. అన్న దానం భవనం పక్కన 15 లడ్డూ కౌంటర్లు ఉన్నాయి. లడ్డూ ప్రసాదం స్టాక్ పాయింట్ పక్కన ఐ దు, టూరిస్టు బస్టాండ్ వద్ద రెండు కౌంటర్లు పనిచేస్తాయి. ఈ ఏడాది అదనంగా సెంట్రల్ రిసెప్షన్ ఆఫీసు వద్ద లడ్డూ ప్రసాదాల కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. ● క్షేత్రంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. మొత్తం 10 ప్రదేశాల్లోని 25 ఎకరాల్లో కారు పార్కింగ్, 14 ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఆర్టీసీ బస్సులకు పార్కింగ్ ఏర్పాటు చేశాం. పార్కింగ్ ప్రదేశాల నుంచి దేవస్థానం ఉచితంగా 10 బస్సులను నడపుతోంది. ● మంచినీటికి ఇబ్బందులు లేకుండా క్షేత్ర పరిధిలో వివిధ ప్రదేశాల్లో 30 స్టోరేజ్ ట్యాంకులు, 34 ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశాం. కాలినడక మార్గంలో భీమునికొలను మార్గం వరకు పైప్లైన్ ఏర్పాటు చేసి తాగునీటిని సరఫరా చేస్తున్నాం. అలాగే వెంకటాపురం, పెద్దచెరువు, నాగలూటి, కై లాసద్వారం వద్ద ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నాం. ● దాతల సహకారంతో అటవీమార్గంలో అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. కై లాసద్వారం వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు సీఆర్వో ఆఫీసు వద్ద లడ్డూ కౌంటర్ పార్కింగ్ ప్రాంతాల నుంచి 10 బస్సులతో ఉచిత ప్రయాణం నేటి నుంచి మార్చి 1 వరకు అలంకార దర్శనం శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు -
సుగాలి ప్రీతి కేసును నీరుగార్చే యత్నం
కర్నూలు (టౌన్): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పదోతరగతి దళిత విద్యార్థిని సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసును రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శశికళ మండిపడ్డారు. మంగళవారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే సుగాలిప్రీతి హత్యకు గురైందన్నారు. దోషులను కాపాడేందుకు చంద్రబాబు ఈ కేసును పక్కదారి పట్టిస్తున్నారన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి ఆయనకు లేదన్నారు. అందుకే సీబీఐ నుంచి తప్పించి విచారణను రాష్ట్ర ప్రభత్వం చేపట్టే విధంగా రఘరామరాజు అనే వ్యక్తి ద్వారా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయించారని ఆరోపించారు. వైఎస్ జగన్ 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే సుగాలి ప్రీతి కుటుంబానికి రూ. 8 లక్షలు ఆర్థిక సహయం, 5 ఎకరాల భూమి, ఇంటి కోసం 5 సెంట్ల స్థలం ఇచ్చారన్నారు. అంతేకాకుండా కేసు దర్యాప్తు వేగవంతం చేసి దోషులను కఠినంగా శిక్షించాలని సీబీఐకు అప్పగించారన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం ఈ కేసును నిర్వీర్యం చేసేందుకు కుయుక్తులకు పాల్పడుతుందన్నారు. హత్య జరిగిన రెండేళ్ల వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని, 2017 సంవత్సరం ఆగస్టు నెలలో ఫోరెన్సిక్ వైద్యులు డాక్టర్ శంకర్ స్పష్టంగా పోస్టు మార్టం నివేదికలో బాలికపై అత్యాచారం, హత్య జరిగినట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారన్నారు. అప్పట్లో కట్టమంచి రామలింగారెడ్డి కుటుంబ సభ్యులపై ఎస్సీ, ఎస్టీ కేసు, పోక్స్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారన్నారు. అయితే, 23 రోజుల వ్యవధిలోనే వారు బెయిల్పై బయటకు వచ్చారన్నారు. పాలన చేత కాక డైవర్షన్ పాలిటిక్స్ సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తూ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని శశికళ విమర్శించారు. జగనన్న హయాంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారని చెప్పారు. చంద్రబాబు రూ.73 వేల కోట్లు అప్పులు చేసి ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్పాలనకు త్వరలో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కూటమి నాయకులు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి అక్రమ సంపాదనే ధ్యేయంగా లిక్కర్, ఇసుక, పేకాట క్లబ్ల నిర్వహణలో బీజీగా ఉన్నారన్నారు. సమావేశంలో పార్టీ నాయకురాలు కల్లా నాగ వేణి రెడ్డి, పార్టీ నగర అధ్యక్షురాలు మంగమ్మ, రాఽధికమ్మ తదితరులు పాల్గొన్నారు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి సర్కారుకు లేదు యూటర్న్పై పవన్ కళ్యాణ్ స్పందించాలి మహిళలకు భద్రత కల్పించడంలో హోం మంత్రి విఫలం వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శశికళ నాడు శిక్షిస్తానన్న పవన్ కళ్యాణ్ స్పందించాలి సుగాలి ప్రీతి కేసులో దోషులను శిక్షించే వరకు వదిలేది లేదని, వారిని తొక్కిపెట్టి నారా తీస్తానని ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాడు పెద్ద పెద్ద మాటలు చెప్పి ఇప్పుడు నోరు మెదపడం లేదని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి బాధిత కుటుంబానికి న్యాయం చేయలేకపోతే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి రోజు ఎక్కడో ఒక చోట మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎనిమిది నెలల కాలంలో 78 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయన్నారు. హోమంత్రి అనిత మహిళలకు రక్షణ కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. -
పోతిరెడ్డిపాడు నుంచి నీటి సరఫరా బంద్
● గేట్లను మూసివేసిన అధికారులు జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ పది గేట్లను పూర్తిగా మూసివేసి నీటి సరఫరాను బంద్ చేశారు. శ్రీశైలం జలాశయంలో 841 అడుగుల నీటిమట్టం చేరుకునే వరకు పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి దిగువ ప్రాంతాలకు నీటిని సరఫరా చేసుకొనే అవకాశాలున్నాయి. అయితే అధికారులు పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ గేట్లు మూసివేసి ముందస్తుగానే నీటిసరఫరాను బంద్ చేయటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గేట్లు తెరచి ఉంచితే 2,500 క్యూసెక్కుల నుంచి 3,000 క్యూసెక్కుల వరకు దిగువకు నీటిని సరఫరా చేసుకొనే అవకాశాలున్నాయి. అధికారులు గేట్లు మూసివేసి నీటివిడుదలను నిలిపివేయటం వెనుక ఆంతర్యమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 850.50 , పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ వద్ద 849.50 అడుగుల నీటిమట్టం ఉంది. జూన్ తర్వాతే నీరు విడుదల ఈ వ్యవసాయ సీజన్కు మంగళవారంతో పోతిరెడ్డిపాడు నుంచి నీటిసరఫరా ముగిసినట్లే. 2025 జూన్ తర్వాత వర్షాలు సమృద్ధిగా కురిస్తే పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి నీరు విడుదల చేసుకొనే అవకాశాలు ఉంటాయి. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి 2024 జూలై 27న ఎస్సారెమ్సీలోకి నీరు విడుదల చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 211.4419 టీఎంసీల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. -
రూ.11,972 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక
నంద్యాల: నాబార్డ్ ద్వారా 2025–26 సంవత్సరానికి సంబంధించి పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ కింద 11,972 కోట్ల వార్షిక రుణ ప్రణాళికను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆవిష్కరించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ పథకాల రుణ మంజూరు పై సంబంధిత అధికారులు, బ్యాంకర్లతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన రుణాల మంజూరులో కొంతమేర ప్రగతి సాధించారన్నారు. పెండింగ్లో ఉన్న లక్ష్యాన్ని మార్చి 15వ తేదీలోగా పూర్తి చేయాలని బ్యాంకర్లను సూచించారు. చేతివృత్తుల వారికి శిక్షణ ఇస్తున్నామని, వారందరికీ బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను గడువులోపు సాధించాలన్నారు. వెనుకబడిన వర్గాల శ్రేయస్సు కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రుణాలను అందించాలన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ నరసింహారావు, నాబార్డు డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ సుబ్బారెడ్డి, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రవీంద్ర కుమార్, స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ సూర్య ప్రకాష్, కెనరా బ్యాంక్ రీజనల్ హెడ్ సుశాంత్ కుమార్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ పి.వెంకటరమణ, కేడీసీసీ బ్యాంక్ రీజనల్ మేనేజర్ విజయ్ కుమార్, డీఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నంద్యాలలో రెడ్క్రాస్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ నంద్యాల(అర్బన్): అత్యవసర వైద్య చికిత్సల కోసం నంద్యాల జిల్లా కేంద్రానికి వచ్చే వారి కోసం త్వరలో రెడ్ క్రాస్ ద్వారా కూడా రక్తం అందుబాటులో ఉంచనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. స్థానిక కేసీ కెనాల్ కాంపౌండ్లోని మైనర్ ఇరిగేషన్ కార్యాలయ సమూహంలో ఏర్పాటు చేయబోయే రెడ్క్రాస్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ భవనాన్ని కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ దస్తగిరి, ట్రెజరర్ నాగేశ్వరరావు, వైస్ చైర్మన్ మారుతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఇలకై లాసంలో బ్రహ్మోత్సవాలకు వేళాయె
శ్రీశైలంటెంపుల్: ఇలకై లాసమైన శ్రీశైల మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. 11 రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగే ఈ వేడుకలకు బుధవారం అంకురార్పణ జరుగనుంది. ఉదయం యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవ క్రతువులు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జునస్వామికి విశేష అర్చనలు, మహాశక్తి స్వరూపిణి అయిన భ్రమరాంబాదేవికి ప్రత్యేక పూజలు, స్వామి అమ్మవార్లకు వివిధ వాహనసేవలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని పలు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఉభయ దేవాలయాలను వివిధ రకాల పుష్పాలతో, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. అలాగే ప్రధాన ఆలయానికి ఎదురుగా, క్షేత్ర పరిధిలో ముఖ్యమైన కూడళ్లలో స్వామి అమ్మవార్ల చిత్రపటాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉదయం 9 గంటలకు అంకురార్పణ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో ఉత్సవాల క్రతువులు ప్రారంభమవుతాయి. వేద స్వస్తి, శివసంకల్పం, గణపతిపూజ, పుణ్యాహవాచనం, చండీశ్వరపూజ, కంకణపూజ, దీక్షాకంకణ ధారణ, అఖండ దీపారాధన, వాస్తుపూజ, వాస్తుహోమం, మండపారాధన, రుద్రకలశ స్థాపన, పంచావరణార్చనలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు జరుపుతారు. అలాగే సాయంత్రం 5.30 గంటలకు సాయంకాలార్చనలు, అగ్ని ప్రతిష్టాపన, అంకురార్పణ నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు భేరిపూజ, భేరీతాడనం, సకలదేవతాహ్వనపూర్వక ధ్వజారోహణ, ధ్వజపట అవిష్కరణ నిర్వహించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. పట్టువస్త్రాలు సమర్పించనున్న శ్రీకాళహస్తి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బుధవారం సాయంత్రం శ్రీకాళహస్తిశ్వరస్వామి దేవస్థానం భ్రమరాంబామల్లికార్జున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనుంది. సంప్రదాయాన్ని అనుసరించి ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామిఅమ్మవార్లకు సమర్పిస్తారు. నేటి నుంచి 11 రోజులు శ్రీశైల మల్లన్నకు విశేష వాహనసేవలు, గ్రామోత్సవం 26న పాగాలంకరణ, కల్యాణోత్సవం మొదటి రోజు శ్రీకాళహస్తి దేవస్థానం వారిచే పట్టువస్త్రాల సమర్పణ -
నిందితుల అరెస్ట్
అవుకు: దాడి కేసులో ముగ్గురు నిందితులను బనగానపల్లె పోలీసులు అరెస్టు చేశారు.బాధితులు, పోలీసులు తెలిపిన ప్రకారం .. కల్లూరు మండలం దూపాడుకు చెందిన కీర్తన(30) భర్త మల్లికార్జున, తండ్రి నాగరాజు ఈ నెల 8వ తేదీన అవుకు మండలం రామాపురం గ్రామంలో సమీప బంధువు హనుమంతరావు మృతి చెందడంతో చూడటానికి వచ్చారు. అంతకుముందే దూపాడు గ్రామానికి చెందిన కేశవరావు, రామక్రిష్ణ, రామరాజు అనే వ్యక్తులకు వీరికి గొడవలు ఉండేవి. దీనిని మనసులో పెట్టుకొని కీర్తన, మల్లికార్జున, నాగరాజులపై రామాపురంలో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కీర్తనను అవుకు ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక ఈ నెల 16వ తేదీన మృతి చెందింది. మృతురాలి భర్త మల్లికార్జున ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
గ్రూపు–2 మెయిన్స్ పరీక్షకు 30 కేంద్రాలు
కర్నూలు(సెంట్రల్): ఈనెల 23వ తేదీన జరిగే గ్రూపు–2 మెయిన్స్ పరీక్షకు జిల్లాలో 30 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 9,993 మంది పరీక్ష రాయనున్నారు. జేసీ బి.నవ్యను కో ఆర్డినేట్ అధికారిగా ఏపీపీఎస్సీ నియమించింది. అభ్యర్థులకు సూచనలు ఇవీ.. ● పరీక్ష రాసే వారు 15 నిమిషాల ముందే కేంద్రాలకు చేరుకోవాలి. ఆ తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. ● తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. ● ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 3 నుంచి 5.30గంటల వరకు పేపర్–2 పరీక్ష నిర్వహిస్తారు. ● హాల్ టికెట్పై అభ్యర్థి ఫొటో సరిగ్గా కనిపించకపోయినా, చిన్నదైనా, అస్పష్టంగా ఉన్నా దానిపై గెజిటెడ్ అధికారితో సంతకం చేయించాలి. మూడు పాస్ ఫొటోలు తీసుకెళ్లాలి. ● పరీక్ష కేంద్రంలోకి టాబ్లెట్లు, ఐప్యాడ్లు, రైటింగ్ ప్యాడ్లు, హ్యాండ్ బ్యాగులు, ఏదైనా పేపర్లు , పుస్తకాలు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్, డిజిటల్ వాచ్లు, క్యాలికులేటర్లను అనుమతించరు. అనలాగ్ మణికట్టు గడియారాలను కూడా అనుమతించరు. ● బ్లాక్, బ్లూ బాల్ పెన్నులను వాడాలి. పెన్సిల్ను ఉపయోగించరాదు. ● అంధత్వం, రెండు చేతులు లేని వారు, సెరిబ్రల్ పాల్సీ విభాగంలో బెంచ్ మార్కు వైకల్యం ఉన్న వారు కోరుకుంటే లేఖరి/రీడర్/ల్యాబ్ సహాయకులను నియమించుకోవచ్చు. ● గ్రూపు–2 మెయిన్స్ పరీక్షకు వచ్చే అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయడం కోసం కలెక్టరేట్లో హెల్ప్డెస్కును ఏర్పాటు చేశారు. ఇది ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరక అందుబాటులో ఉంటుంది. సందేహాలకు 08518–277305కు ఫోన్ చేయవచ్చని జేసీ డాక్టర్ బి.నవ్య తెలిపారు. -
విశేష వాహనసేవలు ఇలా..
● 20న భృంగి వాహనసేవ ● 21న హంస వాహనసేవ ● 22న మయూర వాహనసేవ ● 23న రావణ వాహనసేవ ● 24న స్వామి అమ్మవార్లకు పుష్ప పల్లకీసేవ ● 25న గజ వాహన సేవ ● 26న ప్రభోత్సవం, నందివాహనసేవ, రాత్రి 10గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, కల్యాణోత్సవం ● 27న స్వామిఅమ్మవార్లకు రథోత్సవం, తెప్పోత్సవం. ● 28న బ్రహ్మోత్సవాలకు పూర్ణాహుతి. సాయంత్రం ధ్వజావరోహణ ● మార్చి 1న అశ్వ వాహనసేవ, పుషోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ -
ట్రాక్టర్ కింద పడి వ్యక్తి దుర్మరణం
కోవెలకుంట్ల: పట్టణంలోని గుంజలపాడు రహదారిలో సుంకులమ్మ గుడి సమీపంలోని కొత్త కాలనీలో మంగళవారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. కోవెలకుంట్ల ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. సంజామల మండలం నట్లకొత్తూరుకు చెందిన ఉప్పలూరు వెంకటసుబ్బారెడ్డి (41) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కాలనీలో రోడ్డు వేసేందుకు పట్టణ శివారులోని కుందూనది ఒడ్డున ఉన్న బెలుకురాళ్లను ట్రాక్టర్ ద్వారా తరలిస్తున్నాడు. రాళ్లట్రాలీని అన్లోడ్ చేసే క్రమంలో కిందకు దిగి ట్రాలీ డోర్ తీస్తుండగా ట్రాక్టర్ లోతట్టు ప్రాంతంలో ఉండటంతో వెనక్కు కదిలింది. ట్రాక్టర్ను ఆపేందుకు వచ్చే క్రమంలో ప్రమాదశాత్తు ట్రాక్టర్ టైరు కింద పడటంతో తల నుజ్జునుజ్జు అయి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతుడికి భార్య శారద, కుమారుడు సోమేశ్వరరెడ్డి ఉన్నారు. ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
రాజ కుటుంబీకుడు మృతి
అవుకు: అవుకును పాలించిన రాజుల కుటుంబానికి చెందిన నంద్యాల త్రివిక్రమ వర్మ (64) గుండెపోటుతో మృతి చెందాడు. ఈయన సోమవారం రాత్రి ఇంట్లో ఉండగా హఠాత్తుగా కిందపడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అవుకు సీహెచ్సీకి తరలించగా డాక్టర్లు పరిశీలించి గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈయనకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. రాజకుటుంబీకుడు మరణ వార్త తెలియగానే అవుకు ఎంపీపీ చల్లా రాజశేఖర్ రెడ్డి, వైఎస్సార్సీపీ ముఖ్య నాయకుడు చల్లా విఘ్నేశ్వర్ రెడ్డి, చల్లా విజయభాస్కర్ రెడ్డి, చల్లా రఘునాథ్ రెడ్డి, పోతిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
కారు ఢీకొని మహిళ దుర్మరణం
ఓర్వకల్లు: మండలంలోని చెన్నంశెట్టిపల్లె మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బేతంచెర్ల మండలం బుగ్గానిపల్లెకు చెందిన షేక్ చిన్న ఉసేన్సాహెబ్ కుమారుడు షేక్షావలి, అతని భార్య షేక్ మహబూబ్బీ(45) అనే భార్యాభర్తలు ఇద్దరు మంగళవారం ఉదయం సొంత పనిమీద బైక్పై ఓర్వకల్లు వెళ్లారు. పని ముగించుకొని సాయంత్రం స్వగ్రామానికి తిరిగి వెళుతుండగా మార్గంమధ్యలో చెన్నంశెట్టిపల్లె క్రాస్ రోడ్డు వద్ద బేతంచెర్ల నుంచి నంద్యాల వైపునకు వెళుతున్న తెలంగాణాకు చెందిన కారు వేగంగా వచ్చి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహబూబ్బీ బైక్పై నుంచి కింద పడడంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదతీరును పరిశీలించారు. మృతురాలి భర్త షేక్షావలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సునీల్ కుమార్ తెలిపారు. -
ప్రాక్టికల్ పరీక్షలకు 39 మంది గైర్హాజరు
నంద్యాల(న్యూటౌన్): ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు మంగళవారం 39 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈఓ సునీత తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షకు 976 మందికి గాను 960 మంది హాజరు కాగా 16 మంది గైర్హాజరయ్యారన్నారు. మధ్యాహ్నం జరిగిన ప్రాక్టికల్ పరీక్షకు 915 మందికి గాను 892 మంది హాజరు కాగా 23 మంది గైర్హాజరైనట్లు ఆమె తెలిపారు. అన్ని కేంద్రాల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పరీక్షలు జరిగాయన్నారు. గడ్డివాములు దగ్ధం కర్నూలు: మండలపరిధిలోని పంచలింగాల గ్రామంలో ఐదు గడ్డివాములు కాలిబూడిదయ్యాయి. గ్రామ శివారులో మహిమాకర్, బాబు, దావీదు, సంజన్న, గాయన్న తదితరులకు చెందిన కల్లందొడ్లు పక్కపక్కనే ఉన్నాయి. మంగళవారం మధ్యాహ్నం గడ్డివాములో నుంచి పొగ రాసుకుని పెద్దగా మంటలు చెలరేగడంతో గ్రామస్తులు అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకునేసరికి గడ్డివాములు కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది నీళ్లు చల్లి మంటలను పక్క కల్లందొడ్లకు వ్యాపించకుండా అదుపు చేశారు. -
ఉపాధ్యాయ ప్రమోషన్లకు కసరత్తు!
● సీనియారిటీ జాబితాను సిద్ధం చేస్తున్న విద్యాశాఖ ● ఉమ్మడి జిల్లాలో 9,500మంది ఉపాధ్యాయులు ● ఆన్లైన్లో వివరాల నమోదులో సమస్యలునంద్యాల(న్యూటౌన్): రాష్ట్రంలో ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలను సిద్ధం చేసేందుకు విద్యా శాఖ కసరత్తు ప్రారంభించింది. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలన్నా, డీఎస్సీ పరీక్షలు నిర్వహించాలన్నా ప్రస్తుతం పని చేస్తున్న టీచర్ల సర్వీసు వివరాలు, వారి సీనియార్టీ, రోస్టర్ పాయింట్లు వంటి పలు అంశాలు ముడిపడి ఉంటాయి. అయితే, ఈ విషయంలో అధికారులకు పూర్తిస్థాయిలో స్పష్టత లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను రాష్ట్ర విద్యా శాఖ అధికారులు మరోసారి సిద్ధం చేసేందుకు కసరత్తు చేపట్టారు. ఈ ప్రక్రియ మూడు రోజుల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని కర్నూలు డీఈఓ కార్యాలయంలో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. 2,206 ప్రభుత్వ పాఠశాలలు ఉమ్మడి కర్నూలు జిల్లాను పరిగణనలోకి తీసుకుని సీనియారిటీ జాబితాను తయారు చేస్తున్నారు. జిల్లాలో 2,886 ప్రాథమిక, 954 ప్రాథమి కోన్నత, 287 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో వివిధ కేడర్లలో పని చేస్తున్న ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలను తయారు చేసే పనిలో డీఈఓ కార్యాలయాల సిబ్బంది నిమగ్నమయ్యారు. సీనియార్టీ జాబితా తయారీ ఇలా.. ఉమ్మడి జిల్లాలో 2002వ సంవత్సరం డీఎస్సీ నుంచి 2019వ సంవత్సరం డీఎస్సీ వరకు కేడర్ వారీగా సీనియార్టీ జాబితాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఉపాధ్యాయుల నుంచి వారి విద్యార్హత, డీఎస్సీ పోటీ పరీక్షలో లభించిన మార్కులు తదితర వివరాలను ఎంఈఓలు సేకరించి డీఈఓ కార్యాలయానికి పంపుతున్నారు. వీటిని ప్రత్యేక బృందాలు రికార్డుల ఆధారంగా పరిశీలిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో పదోన్నతుల జాబితాపై కసరత్తు పూర్తవుతుందని నంద్యాల డీఈఓ జనార్దన్రెడ్డి తెలిపారు. -
పనులు దక్కాలంటే ‘బి’ ట్యాక్స్ కట్టాల్సిందే
ఎక్కడైనా అభివృద్ధి పనులు చేపట్టాలంటే టెండర్లు పిలిచి ఎవరు తక్కువ కోట్ చేస్తే వారికి పనులు అప్పగిస్తారు. అయితే అహోబిలంలో అందుకు విరుద్ధంగా ఎవరు ఎక్కువగా ‘బి’ ట్యాక్స్ కట్టి వస్తే వారికి వారు అడిగినంత ధరకు పనులు అప్పగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముగ్గురు ఆలయ ఉన్నతాధికారులు స్థానిక టీడీపీ నేతలను పక్కన పెట్టి పనులు చేసేందుకు వచ్చే కాంట్రాక్టర్లను నేరుగా నియోజకవర్గ అధికారపార్టీ నేత దగ్గరకు తీసుకు పోయి అక్కడ పనులను బట్టి 30 నుంచి 50 శాతం కమీషన్ ఇచ్చేలా ఒప్పందం చేసుకుంటున్నట్లు ఆ పార్టీ శ్రేణులే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. అయితే ఈ ‘బి’ ట్యాక్స్లో ఆలయ అధికారులకు వస్తున్న వాటో ఎంతో తెలియడం లేదని చెబుతున్నారు. కాగా మరి కొందరు తమ ఉద్యోగాలను కాపాడుకునేందుకు గుడి ఆదాయం మొత్తం అధికార పార్టీ నేతకు దోచిపెట్టేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఏ కొమ్మ రెమ్మనో!
అది జీనేపల్లె ఎస్సీ కాలనీ. ఆదివారం తెల్లవారుజామున అప్పుడ ప్పుడే జనం నిద్ర లేచి పనుల్లోకి వెళ్తున్నారు. చర్చి సమీపంలోని ఖాళీ ప్రదేశంలో ఓ శిశువు ఏడుపు వినిపించడంతో స్థానిక మహిళలు వెళ్లి చూశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆడ శిశువును అక్కడ వదిలేసినట్లు గుర్తించారు. శిశువు శరీరంపై రక్తపు మరకలు ఉండటంతో అప్పుడే పుట్టిన బిడ్డగా నిర్ధారించారు. గ్రామ ఆశా కార్యకర్తలు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో యర్రగుంట్ల పీహెచ్సీ సీహెచ్ఓ నాగార్జునరెడ్డి గ్రామానికి చేరుకుని శిశువును పరిశీలించారు. వెంటనే 108లో నంద్యాల వైద్యశాలకు తరలించారు. వైద్య పరీక్షలు అనంతరం శిశువును నంద్యాలలోని శిశు గృహం సిబ్బందికి అప్పగించారు. – శిరివెళ్ల నవ మాసాలు గర్భంలో నన్ను భద్రంగా చూసుకుంటే సంతోష పడితిని.. కానీ ప్రపంచానికి అనాథగా పరిచయం చేస్తావునుకోలేదు. పుట్టిన క్షణమే నీ వెచ్చని ఒడిలో లాలిస్తావని ఆనందపడితిని.. కానీ రక్తపు మరకలు ఆరక ముందే తల్లి ప్రేమకు దూరం చేస్తావనుకోలేదు. భూమి మీదికి చేరగానే మీ బంధుత్వాన్ని చూపిస్తావని సంబరపడితిని.. కానీ బతికుండగానే కన్నపేగును తెంచుకుంటావనుకోలేదు. ఆడ బిడ్డగా పుట్టాననో, లేక ఏ కష్టమొచ్చి నన్ను దూరం చేసుకున్నావో తెలియదు.. ఆ దేవుడి దయతో నేను క్షేమమే అమ్మా! -
భూ సంరక్షణకురూ.2.70 కోట్లు మంజూరు
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖ భూసంరక్షణ విభాగానికి నిధులు విడుదల అయ్యాయి. ఉమ్మడి జిల్లాకు రూ.2.70 కోట్లు మంజూరు కాగా.. ప్రస్తుతం రూ.1.34 కోట్లు విడుదల అయ్యాయి. కర్నూలు జిల్లాకు రూ.1.50 కోట్లు మంజూరు కాగా.. మొదటి విడత కింద రూ.74.53 లక్షలు మంజూరు అయ్యాయి. నంద్యాల జిల్లాకు రూ.1.20 కోట్లు మంజూరు కాగా మొదటి విడతలో రూ.59.60 లక్షలు విడుదల అయ్యాయి. ఈ నిధుల్లో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం భరిస్తాయి. ఆర్కేవీవై కింద వర్షాధార ప్రాంతం (ఆర్ఏడీ) అభివృద్ధికి ఈ నిధులు వినియోగిస్తున్నట్లుగా భూసంరక్షణ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. వ్యవసాయంలో రైతుల సామర్ాధ్యలను పెంచడం, భూమి అభివృద్ది తదితర వాటికి ఈ నిధులు వినియోగించడం జరుగుతుందన్నారు. కర్నూలు డివిజన్ కల్లూరు మండలం బొల్లవరం, కే.మార్కాపురం గ్రామాలు, ఆదోని డివిజన్లో బైచిగేరి, బసలదొడ్డి గ్రామాలు, నంద్యాల జిల్లా డోన్ మండలం యు.కొత్తపల్లి, ఎర్రగుంట్ల గ్రామాల్లో ఆర్ఏడీ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఒక రైతుకు ఆర్కేవీవై కింద రూ.30 వేల విలువ ఇన్పుట్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయా గ్రామాల్లో రైతుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. -
టీచర్లను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు
నంద్యాల(న్యూటౌన్): క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాల పేరుతో టీచర్లను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని ఏపీటీఎఫ్ రాష్ట్ర సభ్యులు సాంబశివుడు, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నగిరి శ్రీనివాసులు అన్నారు. ఆదివారం స్థానిక ఆ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంస్కరణల పేరుతో ప్రాథమికోన్నత పాఠశాలల వ్యవస్థ లేకుండా చేయడం దుర్మార్గమైన విధానమన్నారు. ఉన్నతాధికారులు ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్లస్టర్ సమావేశాలు నిర్వహించాలన్నారు. ఏదైనా ఇబ్బందులు జరిగితే విద్యాశాఖ ఉన్నతాధికారులే బాధ్యత వహించాలన్నారు. సమావేశంలో ఏపీటీఎఫ్ నాయకులు మాధవస్వామి, రవి, పుల్లయ్య, నగిరి వెంకటేశ్వర్లు, మునిస్వామి, పవన్కుమార్, తదితరులు పాల్గొన్నారు. నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నంద్యాల: కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 గంటలకు జిల్లాధికారులందరూ హాజరు కావాలన్నారు. అలాగే జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, నియోజకవర్గ, మండల స్థాయిల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. శ్రీగిరిలో భక్తుల రద్దీ శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి మల్లన్న దర్శనానికి బారులు దీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. ఆన్లైన్ ద్వారా టికెట్లు పొందిన పలువురు భక్తులు మల్లికార్జున స్వామివారిని స్పర్శదర్శనం చేసుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. క్షేత్ర పురవీధులు భక్తులతో కళకళలాడాయి. మల్లన్నకు నృత్యనీరాజనం శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథం కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆలయ దక్షిణ మాఢవీధిలోని నిత్యకళావేదికపై విజయవాడకు చెందిన నర్తన డ్యాన్స్ అకాడమీ వారి సంప్రదాయ నృత్యప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో గణపతి ప్రార్థన, శివాష్టకం, శివోహం, అంబాపరాకులు, శంకర శ్రీగిరివాసా తదితర గీతాలకు, అష్టకాలకు.. భవ్యసత్యశ్రీ, భవ్య, లహరి, అలకనంద తదితరులు నృత్యం ప్రదర్శించారు. -
అధిక ధర చెల్లించి తెచ్చుకున్నాం
యూరియా కోసం అనేక ఇబ్బందులు పడుతున్నాం. మాకు సొంత భూమి 5 ఎకరాలు ఉండగా.. 20 ఎకరాలు కౌలుకు తీసుకున్నాం. మొత్తం వరి సాగు చేశాం. ప్రస్తుతం వరి పొట్ట, కంకిదశలో ఉంది. యూరియా వాడితే బాగా వస్తుంది. కాని ఎక్కడా యూరియా బస్తా కూడా లభ్యం కావడం లేదు. చివరికి నందికొట్కూరులో బస్తా రూ.380 ప్రకారం తెచ్చుకున్నాం. బస్తాకు రూ.400 ఇస్తామన్నా లభించడం లేదు. కొంతమంది మాత్రం అవసరమైన స్థాయిలో తెచ్చుకుంటున్నారు. అదే స్థాయిలో సామాన్య రైతులకు అందని పరిస్ధితి ఉంది. యూరియా బంగారం అయింది. రానున్న రోజుల్లో బస్తా రూ.500 ప్రకారం అమ్ముతారనే ఆందోళన ఉంది. – మురళీకృష్ణ, రైతు, బండి ఆత్మకూరు సాగు పెరగడంతోనే యూరియా కొరత నంద్యాల జిల్లాలో రబీలో వరిసాగు భారీగా పెరిగింది. సాధారణ సాగు కంటే దాదాపు 15 వేల హెక్టార్లు అధికంగా వరి సాగు అవుతోంది. దీంతో కొరత తీవ్రమైంది. నిబంధనల ప్రకారం ఎకరాకు రెండు.. రెండున్నర బస్తాల వరకు మాత్రమే యూరియా ఇవ్వాల్సి ఉంది. కాని చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. 14 టన్నుల యూరియా 15 మంది రైతులు తీసుకున్నట్లు సమాచారం ఉంది. వీరికి భూములు ఉన్నా యా లేదా అనే దానిని చూస్తున్నాం. మరి కొద్ది రోజుల్లో 3,000 టన్నుల యూరియా వస్తుంది. అప్పుడు కొరత నుంచి బయటపడతాం. – మురళీకృష్ణ, డీఏఓ, నంద్యాల -
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు రబీ సాగు 2,45,466 హెక్టార్లు
అవసరమైన యూరియా 1,47,279 టన్నులు ● అధికారపార్టీ నేతల చేతుల్లో యూరియా ● అనుకూలమైన వారికి, టీడీపీ కార్యకర్తలకే పంపిణీ ● వైఎస్సార్సీపీ ముద్రతో సామాన్య రైతులకు మొండిచేయి ● నంద్యాల జిల్లాలో 14 టన్నుల యూరియా కేవలం 15 మందికే పంపిణీ ● ప్రశ్నించే వారిపై కేసులతో వేధింపులు ● యూరియా సరఫరాలో కూటమి ప్రభుత్వం విఫలం ప్రభుత్వ సరఫరా చేసింది 61,985 టన్నులు మాత్రమేఇక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైతు పేరు చిన్న పుల్లయ్య. బండిఆత్మకూరు మండలం చిన్నదేవళాపురం. ఇతను 16 ఎకరాల్లో వరిసాగు చేశాడు. ఈనెల 14వ తేదీన రైతు భరోసా కేంద్రం వద్ద యూరియా కోసం వెళ్లి క్యూలో నిలబడ్డాడు. టీడీపీకి చెందిన కొందరు నేరుగా వెళ్లి ఎరువులు తీసుకుంటుండడంతో ఇదేమి న్యాయమని ప్రశ్నించగా దాడి చేశారు. తరువాత వారే పోలీసులకు ఫిర్యాదు చేసి పుల్లయ్యపై కేసు పెట్టించారు. అరెస్టు చేసేందుకు పోలీసులు ఏకంగా గ్రామానికి వెళ్లారు. పొలంలో ఉన్న పుల్లయ్యకు ఈ విషయం తెలిసి తీవ్ర ఆందోళనకు గురై పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.కర్నూలు(అగ్రికల్చర్)/బండిఆత్మకూరు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో రబీ సాధారణ సాగు 2,82,247 హెక్టార్లు కాగా ఇందులో కర్నూలు జిల్లాలో 1,10,386, నంద్యాల జిల్లాలో 1,71,861 హెక్టార్లు. ఇప్పటి వరకు ఈ రెండు జిల్లాలో 2,45,466 హెక్టార్లు సాగైంది. కేసీ కెనాల్, తెలుగు గంగ కాల్వలకు నీరు సమృద్ధిగా వస్తుండటంతో నంద్యాల జిల్లాలో 1,61187 హెక్టార్లలో పంటలు వేశారు. ఇందులో వరి సాధారణ సాగు 27,908 హెక్టార్లు ఉండగా.. ఇప్పటికే 34,940 హెక్టార్లలో సాగు అయింది. అంటే 7 వేల హెక్టార్లకుపైగా అదనంగా సాగు అయింది. మరో ఆరేడు వేల హెక్టార్లలో సాగు అయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ సాగు విస్తీర్ణాన్ని అంచనా వేయడంలో వ్యవసాయ యంత్రాంగం విఫలమైంది. దీనికితోడు డిమాండ్కు అనుగుణంగా యూరియా సరఫరా చేయడంలో కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. అంతంత మాత్రంగానే యూరియా సరఫరా నంద్యాల జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి 63,911 టన్నుల యూరియా వచ్చింది. అయితే, 53,417 టన్నుల యూరియా అమ్మకాలు జరిగాయి. రబీ సీజన్కు సంబంధించి యూరియా ఓపెనింగ్ బ్యాలెన్స్ 10 వేల టన్నులు ఉంది. ప్రస్తుతం నంద్యాల జిల్లాకు 37,483 టన్నులు మాత్రమే వచ్చింది. ఓపెనింగ్ బ్యాలెన్స్తో కలిపితే రబీ సీజన్కు మొత్తం 47 వేల టన్నుల యూనియా వచ్చినట్లు అవుతోంది. అయితే, నీటిపారుదల సదుపాయం ఉండటంతో ఇక్కడ సాధారణం కంటే 15 వేల హెక్టార్ల వరకు ఎక్కువగా పంట సాగు అవుతోంది. దీనిని అధికారులు అంచనా వేయకపోవడంతో బండిఆత్మకూరు, వెలుగోడు, నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు, శిరువెళ్ల, కోవెలకుంట్ల, అవుకు మండలాల్లో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. హైజాక్ చేస్తున్న అధికార పార్టీ నేతలు యూరియా కొరతను టీడీపీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రస్తుతం నంద్యాల జిల్లాకు వచ్చే యూరియాలో 50 శాతం మార్క్ఫెడ్కు, మిగిలిన 50 శాతం ప్రైవేటు డీలర్లకు ఇస్తున్నారు. మార్క్ఫెడ్ నుంచి రైతుసేవా కేంద్రాలు, పీఏసీఎస్లకు వెలుతున్న యూరియా మొత్తాన్ని టీడీపీ నేతలే హైజాక్ చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 45 కిలోల బస్తా ధర రూ.267 ఉండగా.. టీడీపీ నేతలు తమ కంట్రోల్లో ఉంచుకొని రూ.400 వరకు అమ్మకాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితి ప్రధానంగా బండిఆత్మకూరు, వెలుగోడు, మహానంది, ఆత్మకూరు మండలాల్లో ఎక్కువగా ఉంది. డిమాండ్ ఉన్నప్పుడు మార్క్ఫెడ్ ప్రైవేటు డీలర్లకు యూరియా ఇవ్వరాదు. అయితే రాజకీయంగా ఒత్తిడి చేసి మార్క్ఫెడ్ నుంచి ప్రైవేట్ డీలర్లకు కూడా యూరియా ఇస్తున్నారు. తర్వాత ఆ ఎరువు కూడా టీడీపీ నేతల పరం అవుతోంది. కర్నూలు జిల్లాకు అరకొరనే... జిల్లాలో నీటిపారుదల సదుపాయం అంతంతమాత్రంగా ఉండటంతో లేట్ రబీ సీజన్ కింద వరి సాగు తక్కువగా ఉంది. హాలహర్వి, కౌతాళం, హొళగుంద, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పెద్దకడబూరు తదితర మండలాల్లో ఎల్లెల్సీ కింద వరి సాగు ఉంది. జిల్లాలో 84,279 హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. 29,517 టన్నుల యూరియా అవసరం కాగా 24.502 వేల టన్నులు వచ్చింది. ప్రస్తుతం జిల్లాలోని ప్రైవేట్ డీలర్ల దగ్గర యూరియా లభించని పరిస్థితి. మార్క్ఫెడ్లో కూడా 500 టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. ఆదోని, ఎమ్మిగనూరు, పెద్దకడబూరు, కౌతాళం, మంత్రాలయం ప్రాంతాల్లో బస్తా యూరియా ధర రూ.350 పైనే అమ్మకాలు సాగిస్తున్నారు. పీఏసీఎస్లు, రైతు సేవా కేంద్రాల ద్వారా కూడా అధిక ధరలకు విక్రయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో కొందరు రైతులు కర్ణాటకకు వెళ్లి తెచ్చుకుంటున్నట్లు సమాచారం. అధికార పార్టీ బరితెగింపు14టన్నుల యూరియా 15 మందికే... నంద్యాల జిల్లాలోని ఒక ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి నాలుగైదు రోజుల క్రితం 30 టన్నుల యూరియా ఇచ్చారు. ఇందులో 14 టన్నులు 15 మందికే పంపిణీ అయింది. ఈ యూరియా పొందిన వారికి భూములు కూడా పెద్దగా లేవు. ప్రస్తుతం సాగు చేస్తున్న దాఖలాలు కూడా లేవు. డిమాండ్కు తగ్గ సప్లై లేని సమయంలో 14 టన్నుల యూరియా 15 మంది టీడీపీ నేతల వశం కావడం పలు విమర్శలు తావు ఇస్తోంది. ఇదిలా ఉంటే నంద్యాల జిల్లాలో ఒకే ఒక్క ర్యాక్ పాయింట్ ఉండగా అక్కడ టీడీపీ నేతలే ఉంటున్నారు. దీనిని బట్టి ర్యాక్ పాయింట్ మొదలు గ్రామస్థాయి వరకు పచ్చపార్టీ నేతలదే పెత్తనం సాగుతుందని చెప్పవచ్చు. -
అహోబిలేశా.. నీవైనా చెప్పవా!
ఓ సామాన్య కుటుంబంలో ఏదైనా శుభకార్యముందంటే సుమారు నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్ల హడావుడి కనిపిస్తుంది. అటువంటిది దేవదేవుడైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎంత హడావుడి ఉండాలి. అయితే, అహోబిల మహాక్షేత్రంలో ఆ ఊసే కనిపించడం లేదు. మరో 12 రోజుల్లో ఉత్సవాలు సైతం ప్రారంభమవుతాయి. ఏర్పాట్లు మాత్రం ఇంకా మొదలే కాలేదు. ఈ విషయంలో అధికారులు, మఠం ప్రతినిధులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.● మరో 12 రోజుల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం ● ఏర్పాట్లు చేయడంలో దేవస్థానం అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ● ఇంకా పూర్తికాని టెండర్ ప్రాసెస్ ● ఒక్కో పనికి 40 శాతం నుంచి 50 శాతం ‘బి’ ట్యాక్స్ అడుగుతున్న వైనం ● ముందుకురాని కాంట్రాక్టర్లు -
కేఎంసీ మానవతా విలువలు నేర్పింది
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కళాశాల ఎంతో మందికి మానవతా విలువలు నేర్పిందని రిటైర్డ్ డీజీపీ డాక్టర్ డీటీ నాయక్ అన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం(అలుమ్ని) ఆధ్వర్యంలో రెండురోజుల పాటు నిర్వహించే నిరంతర వైద్యవిజ్ఞాన సదస్సు, అలుమ్ని మీట్ శనివారం కళాశాలలో ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హాజరైన కేఎంసీ పూర్వ విద్యార్థి డాక్టర్ డీటీ నాయక్ మాట్లాడుతూ తాను ఈ జిల్లాకు చెందినవాడినేనని, అందుకే ఈ ప్రాంతమంటే తనకు ప్రత్యేక అభిమానముందన్నారు. త్యాగమంటే ఈ ప్రాంతం వారిదేనన్నారు. ఏకంగా రాజధానినే ఈ ప్రాంతం త్యాగం చేసిందని, అందుకే ప్రతిఫలంగా కేఎంసీ దక్కిందన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారని, ఎక్కడికి వెళ్లినా కేఎంసీ పేరు వినిపిస్తుందని తెలిపారు. మాజీ ఎంపీ డాక్టర్ ఎంవీ మైసూ రా రెడ్డి మాట్లాడుతూ తాను నాలుగు దశాబ్దాల క్రితం 1966 బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థిగా ఈ కాలేజీలో చదివాననన్నారు. అప్పట్లో వైద్యవిద్యార్థి సంఘం నాయకునిగా తాను ఎన్నికై నట్లు గుర్తు చేసుకున్నారు. ● అమెరికాలో స్థిరపడిన పూర్వ విద్యార్థి, గైనకాలజిస్టు డాక్టర్ గురురాజ మాట్లాడుతూ ఈ కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు సహకరించాలని, ఒక్కరు ఇవ్వడం మొదలు పెడితే అందరూ ముందుకు వస్తారని సూచించారు. అనంతరం దేశ, విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులచే నిరంతర వైద్య విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు డీఎంహెచ్వో డాక్టర్ పి. శాంతికళ, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ బి.కుమారస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ డీజీపీ డాక్టర్ డీటీ నాయక్ అట్టహాసంగా అలుమ్ని మీట్ ప్రారంభం -
శ్రీశైలంలో పార్కింగ్ ఏర్పాట్లు
● ఏపీ, టీజీ, కర్ణాటక ఆర్టీసీ బస్సులకు ప్రత్యేకంగా బస్టాండ్ శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు. భక్తులు వేలాది వాహనాల్లో బ్రహ్మోత్సవాలకు తరలివస్తారు. వాహనాల పార్కింగ్ కోసం క్షేత్ర పరిధిలో మొత్తం 25 ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. హెలిప్యాడ్, వాసవి విహార్ పక్కన, ఆగమ పాఠశాల ఎదురుగా, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, గణేశసదన్ ఎదురుగా, విభూతిమఠం పార్కింగ్ ఏరియా, ఫిల్టర్బెడ్, గణేశసదనం పక్కన, మల్లమ్మ కన్నీరు వద్ద, గురుసదన్ ఎదురుగా తదితర ప్రదేశాలలో మొత్తం 25 ఎకరాల్లో 5,050 వాహనాలు పార్కింగ్ చేసుకునే వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు ప్రాంగణాలను తీర్చిదిద్దారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు వెంట కూడా ప్రైవేట్ ఆర్టీసీ బస్సులు నిలుపుకునే వెసలుబాటు కల్పించారు. మొత్తం 13.80 ఎకరాల్లో 4,640 ఆర్టీసీ బస్సులు నిలుపుకోవచ్చు. కార్లు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్బస్సులు నిలుపుకునే ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యం కల్పించారు. అలాగే తాత్కాలిక టాయిలెట్స్, తాత్కాలిక వసతి పొందేందుకు షామియానాలు, స్నానమాచరించేందుకు అవసరమైన నీటి కొళాయిలు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు పార్కింగ్ల వద్ద సమాచార కేంద్రాలను, క్షేత్ర పరిధిలో ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్లాలో భక్తులకు తెలిసే విధంగా సూచికబోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. -
ఐకమత్యంతో నగరాభివృద్ధికి పాటుపడదాం
కర్నూలు (టౌన్): ‘నగర పాలక సంస్థ ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. పాలకవర్గ సభ్యులందరూ ఐకమత్యంతో నగరాభివృద్ధికి పాటుపడదాం’ అని వైఎస్సార్సీపీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి పిలుపు నిచ్చారు. శనివారం సాయంత్రం గుత్తి పెట్రోల్ బంకు సమీపంలోని ఓ హోటల్లో ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు, మాజీ జిల్లా అధ్యక్షు రాలు సిట్రా సత్యనారాయణమ్మ కలిసి కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో సుదీర్ఘంగా పలు సమస్యలపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు, నగర మేయర్, డిప్యూటీ మేయర్లు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, కార్పొ రేటర్లతో ప్రత్యేక సమావేశం కానున్నారని వెల్లడించారు. ఈ సమావేశంలో రాజకీయ అంశాలు, నగరాభివృద్ధి, అధికార పార్టీ కుట్రలు, కుతాంత్రాల ను దీటుగా ఎదుర్కోవడంపై చర్చించనున్నట్లు తెలి పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కర్నూ లు నగరంలో నాలుగేళ్లుగా రూ. 720 కోట్లతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపించామన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో నగరంలో అభివృద్ధి పనులు అటకెక్కాయన్నారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం కింద ఆయా వార్డుల్లో రూ.34 కోట్లతో చేపట్టాల్సిన 160 పనులను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ఇంకా ఏడాది పాటు వైఎస్సార్సీపీ పాలకవర్గానికి గడువు ఉందని, అందరూ కలిసి కట్టుగా పనిచేసి ప్రజలకు అండగా నిలుద్దామన్నారు. సమావేశంలో నగరపాలక వర్గ సంస్థ స్టాండింగ్ కమిటీ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. 18న మాజీ సీఎం జగన్తో పాలక వర్గ సభ్యుల భేటీ వైఎస్సార్సీపీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు ఎస్వీ, కాటసాని -
కోళ్లు, గుడ్ల సరఫరా నిలిపివేత
నందవరం: బర్డ్ఫ్లూ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో కోళ్లు, గుడ్ల సరఫరాను నిలిపివేసినట్లు వెటర్నరీ డాక్టర్ వరలక్ష్మి, ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. నాగలదిన్నె గ్రామంలోని ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టులో శనివారం వాహనా ల తనిఖీ చేపట్టారు. ఎమ్మిగనూరు నుంచి ఎలాంటి అనుమతులు లేని 30 వేల గుడ్లతో వచ్చి బొలెరో వాహనాన్ని తనిఖీ చేసి వెనక్కి పంపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతానికి సరఫరా చేయాలంటే తప్పనిసరిగా ఉన్నతాధికారుల అనుమతి పత్రాలు చూపించాలన్నారు. ఎలాంటి అనుమతులు లేని గుడ్లు, కోళ్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు వెటర్నరీ డాక్టర్ వెల్లడించారు. తనిఖీలో వెటర్నరీ అసిస్టెంట్ సుధాకర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
పేరుకుపోతున్న గుడ్ల నిల్వలు
బర్డ్ఫ్లూ వెలుగు చూసిన తర్వాత గుడ్ల వినియోగం భారీగా పడిపోయింది. జనవరి నెల చివరి వరకు 100 గుడ్ల ధర రూ.500 పైబడి ఉంది. బర్డ్ఫ్లూ ప్రచారం మొదలైన తర్వాత గుడ్లకు డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది. కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో గుడ్ల ఫారాలు ఉన్నాయి. ఇక్కడి ఫారంలో రెండు లక్షల కోళ్లు ఉన్నాయి. రోజుకు 40 వేల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. గుడ్లను అడిగే వారు లేరు. బాగా ఉడికించి తినే అవకాశం ఉన్నప్పటికీ వినియోగదారులు భయపడుతుండటంతో డిమాండ్ పడిపోయింది. నేడు 100 గుడ్ల ధర రైతు దగ్గర రూ.370కి పడిపోయింది. జిల్లా నుంచి గుడ్లు బయటికి వెళ్లకుండా చెక్పోస్టులు పెట్టడంతో నిల్వలు పేరుకపోతున్నాయి. -
ధర పడిపోతోంది
మా గ్రామంలో 40 మంది రైతులు పౌల్ట్రీపై ఆధారపడి ఉన్నారు. మేం ప్రతి బ్యాచ్లో 5 వేల కోళ్లు పెంచుతాం. ఇవి 40 రోజుల్లో అమ్మకం కావాలి. బర్డ్ఫ్లూ కారణంగా కోడి లైవ్ కిలో ధర రూ.87కు పడిపోయింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా నష్టాలు వస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కోళ్లలో ఎలాంటి బర్డ్ఫ్లూ లేదు. ప్రభుత్వం చొరవ తీసుకొని రైతులకు న్యాయం చేయాలి. చికెన్, గుడ్ల వినియోగం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలి. – మధు, తులశాపురం, కర్నూలు మండలం పరిహారం ఇవ్వాలి బర్డ్ఫ్లూతో కోలుకోలేని విధంగా నష్టపోయాం. మా దగ్గర 10 వేల కోళ్లు ఉన్నాయి. కిలో లైవ్పై దాదాపు రూ.50 వరకు నష్టం వస్తోంది. ఈ ప్రకారం మాకు 8 లక్షల రూపాయల నష్టం వస్తోంది. కంపెనీలు చికెన్ ధరను గంట గంటకు తగ్గిస్తున్నాయి. బర్డ్ఫ్లూతో నష్టపోతున్న రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. నష్టపోయిన రైతులకు తగిన పరిహారం ఇవ్వాలి. చికెన్, గుడ్లు తినడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని ప్రచారం చేయాలి. – చంద్రశేఖర్రెడ్డి, జి.సింగవరం, కర్నూలు మండలం కోలుకోలేని దెబ్బ బర్డ్ఫ్లూ ప్రభావంతో పౌల్ట్రీ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ తగిలింది. నంద్యాల జిల్లాలో ఈ ప్రభావం ఏమాత్రం లేకపోయినా కంపెనీలు ధర తగ్గించాయి. పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వచ్చింది. మేం కొన్నేళ్లుగా పౌల్ట్రీ రంగంలో రాణిస్తున్నాం. ప్రస్తుతం ఐదు వేలకు పైగా కోళ్లు ఉన్నాయి. చికెన్కు డిమాండ్ తగ్గింది. ధరలు తగ్గాయి. ప్రభుత్వం చొరవ తీసుకుని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. – రవికుమార్, కరివేముల, జూపాడుబంగ్లా మండలం -
కేఎంసీ మానవతా విలువలు నేర్పింది
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కళాశాల ఎంతో మందికి మానవతా విలువలు నేర్పిందని రిటైర్డ్ డీజీపీ డాక్టర్ డీటీ నాయక్ అన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం(అలుమ్ని) ఆధ్వర్యంలో రెండురోజుల పాటు నిర్వహించే నిరంతర వైద్యవిజ్ఞాన సదస్సు, అలుమ్ని మీట్ శనివారం కళాశాలలో ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హాజరైన కేఎంసీ పూర్వ విద్యార్థి డాక్టర్ డీటీ నాయక్ మాట్లాడుతూ తాను ఈ జిల్లాకు చెందినవాడినేనని, అందుకే ఈ ప్రాంతమంటే తనకు ప్రత్యేక అభిమానముందన్నారు. త్యాగమంటే ఈ ప్రాంతం వారిదేనన్నారు. ఏకంగా రాజధానినే ఈ ప్రాంతం త్యాగం చేసిందని, అందుకే ప్రతిఫలంగా కేఎంసీ దక్కిందన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారని, ఎక్కడికి వెళ్లినా కేఎంసీ పేరు వినిపిస్తుందని తెలిపారు. మాజీ ఎంపీ డాక్టర్ ఎంవీ మైసూ రా రెడ్డి మాట్లాడుతూ తాను నాలుగు దశాబ్దాల క్రితం 1966 బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థిగా ఈ కాలేజీలో చదివాననన్నారు. అప్పట్లో వైద్యవిద్యార్థి సంఘం నాయకునిగా తాను ఎన్నికై నట్లు గుర్తు చేసుకున్నారు. ● అమెరికాలో స్థిరపడిన పూర్వ విద్యార్థి, గైనకాలజిస్టు డాక్టర్ గురురాజ మాట్లాడుతూ ఈ కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు సహకరించాలని, ఒక్కరు ఇవ్వడం మొదలు పెడితే అందరూ ముందుకు వస్తారని సూచించారు. అనంతరం దేశ, విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులచే నిరంతర వైద్య విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు డీఎంహెచ్వో డాక్టర్ పి. శాంతికళ, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ బి.కుమారస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ డీజీపీ డాక్టర్ డీటీ నాయక్ అట్టహాసంగా అలుమ్ని మీట్ ప్రారంభం -
ప్రాణాలతో చెలగాటమాడితే సహించం
బొమ్మలసత్రం: వైఎస్సార్సీపీ కార్యకర్తల ప్రాణాలతో టీడీపీ నాయకులు చెలగాటమాడితే ఇకపై సహించేదిలేదని శ్రీశైలం మాజీ ఎమ్యెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, నంద్యాల మాజీ ఎమ్యెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి హెచ్చరించారు. నంద్యాల డీఎస్పీ మందా జావళి ఆల్ఫోన్స్ను శనివారం ఆమె కార్యాలయంలో కలిసి టీడీపీ నాయకుల అరాచకాల గురించి వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోకూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తున్నారన్నారు. బాధితులపైనే తిరిగి తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారన్నారు. బండిఆత్మకూరు మండలం చిన్నదేవళాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త పుల్లయ్యను టీడీపీ నాయకుడు రామలింగారెడ్డి తీవ్రంగా వేధించారని తెలిపారు. ఇది తట్టుకోలేని పుల్లయ్య తన సెల్ఫోన్తో సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో ప్రాణాపాయస్థితితో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ నేతల ఒత్తిళ్లతో యూరియా కొరతతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని బండిఆత్మకూరు ఎస్ఐ తప్పుడు కేసు నమోదు చేయడం దారుణమన్నారు. ఈ విషయంపై జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేయాలని కోరామన్నారు. మసీదుపురం గ్రామంలో ఉన్న టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి దాడులు చేశారని, తిరిగి బాధితులపైనే తప్పుడు కేసులు నమోదు చేయటం సరైందికాదన్నారు. నంద్యాల మండలం రాయమాల్పురం గ్రామంలో టీడీపీ నాయకుల దాడి హేయమైన చర్యగా అభివర్ణించారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడితే ఇక సహించేది లేదని హెచ్చరించారు. శాంతిభద్రతలపై పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే తాము రహదారులపైకి వచ్చి నిరసనలు తెలపాల్సి వస్తుందని పేర్కొన్నారు. మాజీ ఎమ్యెల్యేలతో పాటు నాయకులు దేశం సుధాకర్రెడ్డి, గన్ని కరీమ్, సోమశేఖర్రెడ్డి, పార్థుడు, రాయమాల్పురం బాషా, మహబూబ్, న్యాయవాది కృష్ణారెడ్డి ఉన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం మాజీ ఎమ్యెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి -
అపరిశుభ్రతపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం
మహానంది: ‘పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోతే ఎలా? అధికారులు, పంచాయతీ సిబ్బంది పర్యవేక్షించడం లేదా?’ అంటూ నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజులపల్లె గ్రామంలో శనివారం స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాజులపల్లెలోని హోటళ్ల వద్ద పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై కలెక్టర్ ఆగ్రహం చెందారు. వ్యాపారులకు అవగాహన కల్పించి చెత్తబుట్టలు ఏర్పాటు చేయాల్సిన అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించారు. ● గాజులపల్లెలోని పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న పద్మశివ డాబాలో తనిఖీ నిమిత్తం వెళ్లిన జిల్లా కలెక్టర్ పరిసరాలు సరిగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రూ.లక్ష జరిమానా విధించాలని మండల పరిషత్ కార్యాలయ అధికారులను ఆదేశించారు. డాబా పరిసరాలన్నింటిని శుభ్రంగా ఉండేలా చూడాలని, అపరిశుభ్రంగా ఉన్న వస్తువులన్నింటినీ పడేశారు. మానవత్వం చాటుకున్న జిల్లా కలెక్టర్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు యువకులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి జిల్లా కలెక్టర్ రాజకుమారి మానవత్వం చాటుకున్నారు. బోయిలకుంట్ల గ్రామానికి చెందిన హరి, రాజా నంద్యాలకు బైక్పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో గాయపడ్డారు. అయ్యలూరు వెళ్తున్న కలెక్టర్ రాజకుమారి వారిని చూసి కారు ఆపి చలించారు. వెంటనే వారిద్దరిని స్థానికంగా ఉన్న ఓ వాహనంలో చికిత్స నిమిత్తం గాజులపల్లెలోని ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ మానవత్వాన్ని చూసి స్థానికులు అభినందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, ఈఓఆర్డీ నాగేంద్ర, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నంద్యాల పొగాకు–2 రకం సాగుతో మంచి దిగుబడులు
నంద్యాల(అర్బన్): నంద్యాల పొగాకు–2 రకం పొగాకు సాగుతో అధిక దిగుబడులు సాధించవచ్చని రాజమండ్రి ఐసీఏఆర్ కేంద్రీయ పొగాకు పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్ శేషుమాధవ్ తెలిపారు. అఖిల భారత సమన్వయ పథకం పరిశోధనల్లో భాగంగా స్థానిక ఆర్ఏఆర్ఎస్లో సాగవుతున్న నంద్యాల పొగాకు–1, 2 రకాలను శనివారం ఏడీఆర్ జాన్సన్, పొగాకు శాస్త్రవేత్తలు పుల్లిబాయి, సతీష్బాబుతో కలిసి డైరెక్టర్ శేషుమాధవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల పొగాకు–1, 2 బీడీ రకాలు ఇదివరకే ఆర్ఏఆర్ఎస్ నుంచి విడుదలయ్యాయన్నారు. పొగాకు–2 రకం దిగుబడి మామూలు రకాలతో పోల్చి చూస్తే అధిక దిగుబడి నమోదవుతుంది కాబట్టి రైతులు నంద్యాల–2 రకాన్ని సాగు చేయాలన్నారు. 20 నుంచి ‘నైపుణ్య’ శిక్షణ నంద్యాల(న్యూటౌన్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వెబ్ డెవలపర్, డొమిస్టిక్ డేటా ఎంట్రీలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డొమెస్టిక్ డేటా ఎంట్రీ కోర్స్కు ఇంటర్, ఆపై చదివిన వారు, వెబ్ డెవలపర్ కోర్సుకు డిగ్రీ లేదా బీటెక్లో కంప్యూటర్ చదివిన వారు అర్హులన్నారు. కోర్సు పూర్తి చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపుతో కూడా సర్టిఫికెట్ ఇస్తామన్నారు. శిక్షణ అనంతరం ఆయా కంపెనీలలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. అర్హులైన యువతీ యువకులు రిజిస్టర్ చేయించుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం 8297812530 నంబరును సంప్రదించాలన్నారు. జిల్లాలో 107 క్లస్టర్ పాఠశాలలు నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని 29 మండలాల్లో 107 క్లస్టర్ పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్రెడ్డి, సర్వశిక్ష అభియాన్ జిల్లా అడిషనల్ కో ఆర్డినేటర్ ప్రేమాంత కుమార్, జిల్లా సెక్టోరియల్ అధికారి జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఉపాధ్యాయులకు శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. క్లస్టర్ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సదుపాయాలు కల్పించామన్నారు. ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాల మెరుగుదల, చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం చాపిరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంఈఓ–2 శివరాంప్రసాద్, ఉపాధ్యాయులు సుబ్బారెడ్డి, శ్రీనివాసులు, సుధాకర్, హైమావతి, పాఠశాల హెచ్ఎంలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మేలుజాతి దూడల ప్రదర్శన డోన్: సీసంగుంతల గ్రామంలో మేలు జాతి గేదె, ఆవు దూడల ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనను ఉమ్మడి కర్నూలు జిల్లా పశువైద్యశాఖ కార్యనిర్వాహక ముఖ్య అధికారి డాక్టర్ రాజశేఖర్ పరిశీలించారు. ప్రాంతీయ పశువైద్యశాల వైద్యు లు డాక్టర్ నాగరాజు, శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ.. మేలుజాతి పాడి పశువులకు కృత్రిమ గర్భధారణతో పశుపోషకులు లబ్ధి పొందవచ్చన్నారు. ఈతకు ఈతకు మధ్య దూరం తగ్గించాలన్నారు. పాడిరైతులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. పశువైద్యు లు ఉసేన్బాషా, డాక్టర్ హరీష్, డాక్టర్ భాను, డాక్టర్ సాయికీర్తి పాల్గొన్నారు. బాలల్లో నేర స్వభావాన్ని నియంత్రించాలి కర్నూలు: బాల నేరస్తుల్లో ఉండే నేర స్వభావాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించి వారికి కౌన్సెలింగ్, విద్యాబోధన ద్వారా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి కబర్ధి అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కబర్ధి, కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి శనివారం జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్లో బాలుల న్యాయ చట్టం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కర్నూలు డీసీపీఓ శారద, నంద్యాల డీసీపీఓ స్వప్న ప్రియదర్శిని, జేజేబీ మెంబర్లు మాధవి, సునిత పాల్గొన్నారు. -
లెనోవా ల్యాప్ట్యాప్స్ షోరూం ప్రారంభం
కర్నూలు (టౌన్): నగరంలోని స్థానిక అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్లో శుక్రవారం సాయంత్రం లెనోవా అథరైజ్డ్ కంపెనీ ల్యాప్ట్యాప్స్ షోరూం ప్రారంభమైంది. మాజీ రాజ్య సభ సభ్యులు టీజీ వెంకటేష్ అతిథిగా హాజరై ఈ షోరూంను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో సాఫ్ట్వేర్ రంగం దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. కంప్యూటర్లు, ల్యాప్ట్యాప్స్, డెస్క్టాప్స్, ట్యాబ్స్ ప్రాధాన్యత ఎంతో పెరిగిందన్నారు. జేఎం కంప్యూటర్స్ సంస్థ అధినేత షేక్ అబ్దుల్ నబీ, షేక్ షాకీర్ బాషా మాట్లాడుతూ కంప్యూటర్ రంగంలో 23 సంవత్సరాల అనుభవం ఉందని, తమ లెనోవా షోరూంలో లాప్ట్యాప్స్తో పాటు గేమింగ్ లాప్ట్యాప్స్, మానిటర్స్, ట్యాబ్స్ అన్ని రకాల నాణ్యమైన ఉత్పత్తులు ఆన్లైన్ ధరల కన్నా 5 శాతం తక్కువకు అందిస్తున్నట్లు చెప్పారు. షోరూంలో సర్వీస్ సెంటర్ ఉందని, మూడేళ్ల వారంటీ ఫ్రీ సర్వీసు ఇస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో ఆ సంస్థ ప్రతినిధులు పరదేశ్, కార్తీక్, జస్ప్రీత్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
వెలుగోడు వీఆర్ఓ మృతి
బండ ఆత్మకూరు: మండల పరిధిలోని నారాయణాపురం గ్రామానికి చెందిన వెలుగోడు వీఆర్వో ఎండూరి.అనంతసే నా రెడ్డి (60 ) శనివారం సాయంత్రం మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన హైదరా బాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివా రం కోలుకోలేక మృతి చెందాడు. మృతుడికి భార్య సత్యాదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న శ్రీ శైలం మాజీ శాసన సభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి మృతుడి కుటుంబ సభ్యులను ఫోనులో పరామర్శించారు. గూడ్స్ రైలు కింద పడి.. డోన్ టౌన్: పట్టణ సమీపంలోని కొత్తబుగ్గ వద్ద గూడ్స్ రైలు కింద పడి కోట్లవారిపల్లెకి చెందిన చిన్నన్న(85) అనే వృద్ధుడు మరణించాడు. గూడ్స్ రైలు గార్డు సమాచారంతో రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడు కోట్లవారి పల్లెకి చెందిన చిన్నన్నగా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఆత్మహత్యనా అనే కోణంలో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వివాహిత బలవన్మరణం బనగానపల్లె రూరల్: మండలం పరిధిలోని యనకండ్ల గ్రామానికి చెందిన టి. శివమ్మ(35)అనే వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు స్థానికులు తెలిపిన మేరకు.. యనకండ్ల గ్రామానికి చెందిన బాలుడు,శివమ్మ దంపతులు కూలీ పనులు చేసుకొని జీవిస్తున్నారు. అయితే, కుటుంబంలో నెలకొన్న సమస్యల కారణంగా ఇంట్లో ఎవరులేని సమయంలో ఆమె సిలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కుటుంబసభ్యుల ఫిర్యాదుతో బనగానపల్లె పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం
వెల్దుర్తి: సూక్ష్మ, ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందిస్తున్నాయని ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఉమాదేవి అన్నారు. శనివారం ఆమె మండల కేంద్రంలో పీఎమ్ఎఫ్ఎమ్ఈ స్కీం కింద ఏర్పాటు చేసుకున్న దాల్ మిల్, మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లను పరిశీలించారు. లబ్ధిదారులతో మార్కెటింగ్ అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయం, పాడి, మత్స్య సంపదలకు అనుబంధంగా ఆహార ఉత్పత్తి పరిశ్రమల ఏర్పాటుతో అనేక మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. 18 నుంచి 55 ఏళ్లలోపు వారికి సబ్సిడీతోపాటు యూనిట్ కాస్ట్లో కేవ లం 10 శాతం పెట్టుబడితో బ్యాంకుల ద్వారా 90 శాతం రుణ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఇంటింటి ఫీవర్ సర్వే కర్నూలు(హాస్పిటల్): బాతులకు బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో కర్నూలు నగరంలోని ఎన్ఆర్ పేటలోని ఒక కిలోమీటర్ పరిధిలో వైద్య ఆరోగ్యశాఖ వైద్య సిబ్బంది శనివారం ఇంటింటి ఫీవర్ సర్వే చేపట్టింది. ఎన్ఆర్ పేటలోని 47, 47ఏ, 48 వార్డుల్లోని 89 గృహాల్లో 320 మందికి ఎనిమిది బృందాలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ నాగప్రసాద్ బాబు మాట్లాడుతూ ఇప్పటి వరకు నిర్వహించిన సర్వేలో జ్వర లక్షణాలు కలిగిన వారు లేరన్నారు. -
హోరాహోరీగా పోలీసు క్రీడాపోటీలు
పాణ్యం: నంద్యాల జిల్లా పోలీసు క్రీడా పోటీలు హోరాహోరీగా సాగాయి. నెరవాడ మెట్ట వద్ద ఉన్న ఆర్జీఎం ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన క్రికెట్ ఫైనల్ పోటీల్లో శనివారం ఆత్మకూరు డివిజన్పై నంద్యాల ఏఆర్ డివిజన్ జట్టు విజయం సాధించింది. విజేత జట్టుకు ఏఆర్ ఆడిషినల్ ఎస్పీ చంద్రబాబు, ఏఆర్ డీఎస్పీ రాజసింహరెడ్డి, సీఐ చాంద్బాషా, మంజునాథ తదితరులు ప్రత్యేకంగా అభినందించారు. బాలుడి మృతదేహం లభ్యం పత్తికొండ రూరల్: మండల పరిధిలోని పందికోన గ్రామ సమీపంలో గల్లంతైన బాలుడు తులసీగౌడు(12) మృతదేహం శనివారం లభ్యమైంది. డోన్కు చెందిన దామోదర్గౌడు, రాజేశ్వరి దంపతుల కుమారుడైన తులసీగౌడ్ రెండు రోజుల క్రితం ప్రమాదవశాత్తు హంద్రీవాగులో పడి గల్లంతైన సంగతి తెలిసిందే. బాలుడి ఆచూకీ కోసం ఏపీఎస్డీఆర్ఎఫ్కు చెందిన 15 మంది సిబ్బంది శుక్రవారం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో మృతదేహం కొట్టుకుని పోయి శనివారం మద్దికెర మండలం హంప గ్రామ సమీపంలోని వాగులో తేలింది. గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
వేసవిలో తాగునీటి సమస్య తలెత్తనివ్వొద్దు
గోనెగండ్ల: వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ) డీఈ విజయ్కుమార్ను జిల్లా కలెక్టర్ రంజిత్బాషా ఆదేశించారు. శనివారం మండలంలోని జీడీపీని కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఎన్ని టీఎంసీల నీరు ఉంది.. ఎన్ని ఎకరాల ఆయకట్టు ఉంది, హెచ్ఎన్ఎస్ నుంచి ప్రాజెక్టుకు వచ్చే నీరు తదితర వివరాలను డీఈని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, ఏఈ మహమ్మద్ ఆలీ, తహసీల్దార్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. రేపు ఉద్యోగ మేళా కోడుమూరు రూరల్: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 17వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆనంజ్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఎస్సీ ఆపై విద్యార్హత కలిగిన యువతీయువకులు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హాజరయ్యే వారు వెంట విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకోవాలని సూచించారు. -
డ్రైవర్లు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి
కర్నూలు (సిటీ): బస్సు డ్రైవర్లు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డీటీసీ ఎస్.శాంతకుమారి, ఆర్టీఓ ఎల్ భరత్ చౌహాన్, ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్, ఎంవీఐ కె.రవీంద్ర కుమార్ సూచించారు. కర్నూలు 1,2 డిపో మేనేజర్ల ఆధ్వర్యంలో శనివారం కర్నూలు–2 డిపో గ్యారేజ్లో రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడారు. ప్రతి డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. అలాగే రోడ్డుపై ఉన్న సూచనల బోర్డులను గమనించి, ఇతర వాహనదారులకు ఇబ్బంది లేకుండా డ్రైవింగ్ చేయాలన్నారు. అనంతరం కర్నూలు రీజియన్లో ప్రమాద రహిత డ్రైవర్లను ప్రోత్సాహక బహుమతులు అందజేసి సన్మానించారు. -
హామీల అమలులో చంద్రబాబు విఫలం
ఆలూరు: ఎన్నికల హామీలను అమలు చేయడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేంద్రరెడ్డి విమర్శించారు. ఆలూరులోని ఓ హోటల్లో ఆయన శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. అధికారం కోసం ఎన్నికల ముందు కూటమి నాయకులు అనేక హామీలు ఇచ్చారన్నారు. ప్రజలు నమ్మి ఓటేసి గెలిపించాక వాటిని అమలు చేయకపోగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేదని సాకులు చెబుతున్నారన్నారు. తొలి నుంచి ప్రజలను మోసం చేయడం బాబు నైజమన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట ఇస్తే తప్పరని, అందుకు ఆయన ఐదేళ్ల పాలనే నిదర్శనమన్నారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత ఆయనదని చెప్పారు. సచివాలయ, ఆర్బీకేల ద్వారా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని వైఎస్ జగన్ తీసుకొచ్చారన్నారు. నేడు వాటిని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు.ప్రశ్నించే వారిపై దాడులు, కేసులతో బెదిరిస్తోందని చెప్పారు. అన్యాయంగా వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేస్తుందని..కూటమి అరాచక పాలనను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. సమావేశంలో దేవనకొండ మండలం సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు అరుణకుమార్, అలిగేరు గ్రామ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, ఎల్లార్తి అశోక్రెడ్డి కొత్తకాపు శేషాద్రిరెడ్డి, మోహిద్దీన్, రాఘవేంద్రరెడ్డి, రంగస్వామి, మల్లికార్జునరెడ్డి, తిక్కన్న, ప్రకాష్రెడ్డి ,రామాంజనేయులు, ప్రవీణ్, పులి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేంద్రరెడ్డి -
ఆత్మకూరులో 18న జాబ్మేళా
ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఈనెల 18వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు. జాబ్మేళాకు సంబంధించిన వాల్ పోస్టర్లను స్థానిక కళాశాలలో వారు శనివారం వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ జాబ్మేళాకు ఐదు ప్రయివేట్ కంపెనీలు (అరబిందో ఫార్మసీ, గ్రీటెక్ ఇండస్ట్రీస్ ప్రయివేట్ లిమిటెడ్, రాయ్స్ డైరెక్ట్ సర్వీసెస్, టాటా కాపిటర్, నవత రోడ్ ట్రాన్స్పోర్ట్) పాల్గొంటాయన్నారు. ఈ జాబ్మేళాలలో పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, బీటెక్ మెకానికల్, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు 6303244165, 7673902328 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. -
జనరిక్ మెడికల్ షాపులకు దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(అర్బన్): 2024–25 సంవత్సరం జిల్లాలోని బీసీ, ఈబీసీ, కమ్మ,రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ కార్పొరేషన్లకు సంబంధించిన లబ్ధిదారులు బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటుకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం కార్యనిర్వాహక సంచాలకులు జాకీర్హుసేన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దుకాణాల ఏర్పాటుకు 21సంవత్సరాల నుంచి 60ఏళ్ల వయస్సు వారు అర్హులని, తెల్లరేషన్కార్డు, కులధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు కలిగి ఉండాలని చెప్పారు. బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ సర్టిఫికెట్లు కావాలని చెప్పారు. అర్హత ఉన్న వారు వెబ్సైట్ https://apobmms.apcfss.inలో నమోదు చేసుకోవాలన్నారు. -
వీర జవాన్లు..మీకు జోహార్లు
పుల్వామా దాడిలో అసువులు బాసిన భారత వీర జవాన్లకు శుక్రవారం ఆత్మకూరు మండలం బైర్లూటీగూడెం గిరిజన పాఠశాలలో విద్యార్థులు నివాళులర్పించారు. మహిళా పోలీసు మైమున్నీసాబేగం ఆధ్వర్యంలో అమరవీరుల చిత్రపటాలను ప్రదర్శించారు. ఆరేళ్ల క్రితం 2019 ఫిబ్రవరి 14వ తేదీన దేశ సరిహద్దులోని జమ్మూకాశ్మీర్ పుల్వామా జిల్లాలో భారత సైనికుల వాహనంపై ఉగ్రదాడి జరగడంతో 40 మంది జవాన్లు మృతి చెందారని, ఇది చాలా బాధాకర సంఘటన అని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. వీరజవాన్లకు నివాళులర్పించిన వారిలో ఏపీటీడబ్ల్యూఆర్ స్కూల్ యాజమాన్య,ం సర్పంచ్ గురవమ్మ, ఆర్.శివశంకర్నాయక్ పాల్గొన్నారు. –ఆత్మకూరు -
జాగ్రత్తలు ఇవీ..
బర్డ్ఫ్లూ నియంత్రణలో పశుసంవర్ధకశాఖ అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కర్నూలులో పది రోజుల క్రితం ఉన్నట్టుండి 15 బాతులు మృతిచెందాయి. బర్డ్ఫ్లూ లక్షణాలు కనిపించాయి. రక్త నమూనాలు, శీరం తదితర శ్యాంపుల్ సేకరించి భోపాల్లోని హైసెక్యూరిటీ ల్యాబ్కు పంపి మౌనంగా ఉండిపోయారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోళ్లు పెద్ద ఎత్తున మరణించినప్పటికీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధికారులు చర్యలు తీసుకోలేదు. ‘బర్డ్ఫ్లూ’ వెలుగు చూడటంతో ప్రజలు భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.● కర్నూలులో ఈనెల 3,4 తేదీల్లో బాతులు మృతి ● ఆలస్యంగా స్పందించిన పశుసంవర్ధకశాఖ అధికారులు ● రెడ్జోన్లో చికెన్, గుడ్ల అమ్మకాల నిషేధం ● 35 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ల ఏర్పాటు ● జిల్లాలోని కోళ్ల ఫారాల్లో తనిఖీలు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా కేంద్రమైన కర్నూలులో బర్డ్ఫ్లూతో బాతులు మృతిచెందడం కలకలం రేపింది. అధికారుల్లో హడావుడి మొదలైంది. పశుసంవర్ధక శాఖతో పాటు రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖలు కూడా రంగంలోకి దిగాయి. బయో సెక్యూరిటీ మెజర్స్ అమలుపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. అంతర్ రాష్ట్ర చెక్పోస్టుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కోళ్లు, బాతులు, ఇతర జాతి పక్షులు జిల్లాలోకి రవాణా కాకుండా నిఘా పెంచారు. పశు వైద్యాధికారులతో కర్నూలు డివిజన్లో 14, ఆదోని డివిజన్లో 21 ప్రకారం మొత్తం 35 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లు ఏర్పాటయ్యాయి. కనిపించని మందులు బర్డ్ఫ్లూతో బాతులు మృతిచెందడంతో కర్నూలులోని ఎన్ఆర్పేట చుట్టూ కిలోమీటరు పరిధిని రెడ్ అలర్ట్ జోన్గా అధికారులు ప్రకటించారు. ఈ ప్రాంతంలో కోళ్లు, గుడ్ల అమ్మకాలపై నిషేధం విధించారు. ఎన్ఆర్ పేటకే ఐదు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లు ఏర్పాటయ్యా యి. ఈ టీమ్ల్లోని పశువైద్య అధికారులు ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. దుకాణాల్లో కోళ్లు, గుడ్లు అనేవి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం చేశారు. అయితే పది రోజుల క్రితమే బాతులు బర్డ్ఫ్లూతో మృతి చెందాయి కదా.. అది ఏ స్థాయికి విస్తరించిందో అన్న భయాందోళనలు ప్రజల ను వెంటాడుతున్నాయి. బర్డ్ఫ్లూ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి మందులు సరఫరా చేయలేదు. అయితే ఓ ప్రజా ప్రతినిధి నివాసంలోనే బాతులు మృతి చెందాయనే ప్రచారం జరుగుతోంది. తనిఖీలు ముమ్మరం కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఎనిమిది కోళ్లఫారాలు ఉన్నాయి. వగరూరు, వెల్దుర్తి, కోడుమూరు మండలం ప్యాలకుర్తి, కృష్ణగిరి మండలం కోయిలకొండ, కర్నూలు మండలం గార్గేయపురం, దేవనకొండ మండలం నేలతలమర్రి, కుంకనూరు, దేవనకొండలో ఈ ఫారాలు ఉన్నాయి. వీటిల్లో 5,84,911 కోళ్లు ఉన్నాయి. కోళ్లఫారాలను ర్యాపిడ్ రెస్పాన్స్ బృంద సభ్యులు తనిఖీలు చేశారు. అనుమానాస్పద స్థితిలో కోళ్లు మృతిచెందితే వెంటనే సమాచారం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. కాగా.. కర్నూలులో ‘బర్డ్ఫ్లూ’ వెలుగు చూడటంతో ఒక్కసారిగా చికెన్, గుడ్ల అమ్మకాలు 50 శాతంపైగా పడిపోయినట్లు తెలుస్తోంది.● బర్డ్ప్లూ వెలుగు చూడటంతో జిల్లా యంత్రాంగం బయో సెక్యూటరీ మెజర్స్పై దృష్టి సారించింది. ● కోళ్ల ఫారాల్లోకి ప్రజలను అనుమతించరు. ● కోళ్ల ఫారాల నిర్వాహకులు, డాక్టర్లు సైతం డెటాల్ నీళ్లలో కాళ్లు ముంచి వెళ్లాలి. ● పశువైద్యులు ఒక ఫారాన్ని తనిఖీ చేసిన తర్వాత మరో ఫారానికి వెళ్లరాదు. ● చికెన్, గుడ్లను 100 డిగ్రీల టెంపరేచర్లో ఉడికించి తినాలి. ● కోళ్లు, బాతులు, ఇతర జాతి పక్షులు మృతి చెందితే పశువైద్యులకు సమాచారం ఇవ్వాలి. ● పెరటి కోళ్ల పెంపకందారులు అధికారుల సూచనలు పాటించాలి. ● షెడ్డులో, పెరట్లో కోళ్ల ఆరోగ్యంలో తేడాలు ఎక్కువ శాతం ఉంటే పశువైద్య అధికారులకు సమాచారం ఇవ్వాలి. ● కోడి మాంసం, గుడ్లను తిన్న వారికి జలుబు, దగ్గు, కండరాల నొప్పులు, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చమటలు పట్టడం, వాంతులు విరేచనాలు అవడం వంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ను సంప్రదించాలి. ● మనుషుల నుంచి మనుషులకు బర్డ్ప్లూ వ్యాధి వ్యాప్తి చెందదు. కోళ్లలో బర్డ్ఫ్లూ లక్షణాలు ఇవీ.. ముక్కు, కళ్ల వెంబడి నీరు కారుతుంది. మెడ వాల్చడం, నీరసంగా ఉండడం కనిపిస్త్తుంది. మచ్చలు ఏర్పడటం, విరేచనాలు ఎక్కువ కావడం గమనించవచ్చు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు 24–48 గంటలలో కోళ్లు మృతిచెందుతాయి. -
కళ్లను అశ్రద్ధ చేయొద్దు
● విద్యార్థులతో మంత్రి ఎన్ఎండీ ఫరూక్ నంద్యాల: విద్యార్థులు కళ్లను అశ్రద్ధ చేయరాదని, ఎక్కువగా సెల్ఫోన్లు చూడకూడదని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ సూచించారు. శుక్రవారం నంద్యాల క్రాంతినగర్లోని ఏపీ మోడల్ స్కూల్లో విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులందరికీ ప్రభుత్వం కంటి పరీక్షలు నిర్వహించి లోపాలు ఉన్న విద్యార్థులకు ఉచితంగా అద్దాలు అందజేస్తుందన్నారు. అయితే, చిన్నవయస్సులోనే విద్యార్థుల చూపు మందగిస్తుండటం బాధాకరమన్నారు. ప్రతి ఒక్కరూ కంటి చూపును పెంచుకోవడంపై దృష్టి సారించాలన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ విద్యార్థులు కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలని, ఫాస్ట్ ఫుడ్కు దూరంగా ఉండి ఏ విటమిన్ గల ఆహార పదార్థాలు, ఆకుకూరలు, పప్పు దినుసులు, గుడ్లు, పాలు, పండ్లు, చేపలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. ఏపీ మోడల్ స్కూల్లో కంటి సమస్యలు ఉన్న 44 మంది విద్యార్థులకు కంటి అద్దాలు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఆటపాటల్లో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ వెంకటరమణ, డాక్టర్ మాధవీలత, జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ సిసీలియా తదితరులు పాల్గొన్నారు. -
తాగు..ఊగు!
ప్రభుత్వ మద్యం దుకాణాల నిర్వాహణను తొలగిస్తూ కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల చేతికి దుకాణాలు అప్పజెప్పినప్పటి నుంచి ఎకై ్సజ్ అధికారులకు కాసుల వర్షం కురుస్తుంది. దుకాణాల ఏర్పాటు నుంచి నేటి వరకూ మామూళ్లతోనే కొందరు అధికారులు పబ్బం గడుపుతున్నారు. వైన్షాప్ల యజమానుల నుంచి లైసెన్స్ ఆక్టివేషన్ పేరుతో ఒక్కో నిర్వాహకుని నుంచి రూ.1 లక్ష వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇవే కాకుండా ఒక్కో వైన్షాప్ నుంచి ప్ర తి నెల రూ. 45 వేలు వసూలు చేస్తున్నారు. ఇక బార్ యజమానుల నుంచి ఎస్టీఎప్ అధికారుల పేరుతో ప్రతి నెల రూ. 12 వేలు, డీటీఎప్ అధికారుల పేరుతో రూ. 15 వేలు లోకల్ ఎకై ్సజ్ పోలీస్టేషన్కు రూ. 30 వేల మేర వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇవే కాకుండా బార్, వైన్ షాప్ల పరిధిలోని పోలీస్టేషన్లకు రూ. 12 వేలు ప్రతి నెల ముట్టజెప్పాలి. ఇలా మామూళ్లు అందటంతోనే అధికారు లు వైన్షాప్ల వైపు కన్నెత్తి చూడటంలేదనే విమర్శలు న్నాయి. బొమ్మలసత్రం: సామాన్యుడిని ఆర్థికంగా చిన్నాభిన్నం చేసే, సామాజికంగా అనేక సమస్యలు తెచ్చి పెట్టే మద్యాన్ని జనానికి దూరంగా ఉంచాలని గత ప్రభుత్వం ఆలోచించింది. ఇందుకు తగ్గట్టుగానే జనావాసాలకు దూరంగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. ప్రైవేట్ దుకాణాల వారు లాభాపేక్షతో పేదలను పిండుకుంటారన్న ఆలోచనతో సొంతంగా దుకాణాలు నడిపింది. నిర్ణీత వేళల్లో మాత్రమే మద్యం అందుబాటులో ఉంచేలా చేయడంతో పాటు గ్రామాల్లో ఎక్కడా బెల్టు షాపులు లేకుండా చేసింది. నాటుసారా వ్యాపారులపై పీడీయాక్ట్ నమోదు చేసి వారు ఆ దందాను స్వస్తిపలికేలా చేసింది. ఇలాంటి చర్యలతో తమ భర్తలు మద్యం మానేస్తున్నారని కొందరు, నాటుసారా జోలికి వెళ్లకుండా ఆరోగ్యంగా ఉన్నారని ఇంకొందరు పేదింటి మహిళలు నాడు సంతోషం వ్యక్తం చేసేవారు. ఎనిమిదినెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది. మద్యాన్ని ఏరులై పారిస్తోంది. ఆదాయం కోసం ఎక్కడ పడితే అక్కడ వైన్షాపుల ఏర్పాటుకు లైసెన్స్ జారీ చేసింది. దీంతో జిల్లాలో ప్రస్తుతం కల్లుగీత కార్మికులకు కేటాయించిన 11 మద్యం దుకాణాలతో కలుపుకొని 116 వైన్షాపులు, 22 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇందులో అత్యధిక మద్యం దుకాణాలు కూటమి నాయకులు, వారి అనుచరుల చేతిలోనే ఉన్నాయి. బార్లను తలపిస్తున్న వైన్షాపులు నిబంధనల ప్రకారం వైన్షాపుల వద్ద మద్యం సేవించరాదు. కేవలం అక్కడ మద్యం కొనుగోలు చేసి తీసుకెళ్లాలి. అయితే, ఈ దుకాణాల వద్దే నిర్వాహకులు మద్యం తాగేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వాటర్ ప్యాకెట్లు, స్నాక్స్ కూడా అక్కడే విక్రయిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని ప్రాంతాల్లో వైన్షాప్ల వద్ద ఈ తతంగం నడుస్తున్నా అధికారులు కన్నెత్తి చూడటంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దిక్కుతోచని స్థితిలో బార్యజమానులు గత ప్రభుత్వంలో ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద మద్యం సేవించ కుండా గట్టి చర్యలు తీసుకుంది. వైన్షాప్ల వద్ద మద్యం సేవించినా లేదా బెల్టుషాపులు నిర్వహించిన పోలీసులు కఠిన చర్యలు తీసుకునే వారు. జిల్లాలో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకురావాలన్నా పోలీసుల చర్యలకు భయపడి మిన్నకుండి పోయేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆదాయం కోసం వైన్షాప్ల సంఖ్యను అమాంతం పెంచటమే కాకుండా కూటమి నేతలతో బెల్టు షాపులు నెలకొల్పింది. ఇవే కాకుండా గత ప్రభుత్వ చర్యలతో కనిపించకుండా పోయినా నాటుసారాను తిరిగి తీసుకొచ్చారు. ఊర్లలో ఎక్కడ పడితే అక్కడ నాటుసారా తయారు చేసి విక్రయాలు చేపట్టారు. ఈ కల్తీ సారా తాగి కొందరు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. జిల్లా కేంద్రంలో ఎకై ్సజ్ అధికారులు వారి కార్యాలయాలకు వెళ్లే దారిలో వైన్షాపులున్నాయి. అక్కడ ఆ దుకాణాల నిర్వాహకులు ఏర్పాట్లు చేసి బాహాటంగా మద్యం తాగిస్తున్నారు. ఇలా ఎక్కడ పడితే అక్కడ మద్యం, నాటుసారా లభించడం, తాగేందుకు అవకాశం కల్పించడంతో బార్లకు వెళ్లి మద్యం తాగే వారి సంఖ్య తగ్గిపోయింది. దీంతో వ్యాపారం లేక ఏం చేయాలో తెలియక వాటి యజమానులు దిక్కులు చూస్తున్నారు. వైన్షాప్ల వద్ద మద్యం తాగితే చర్యలు కొందరు వైన్షాపుల యజమా నులు దుకాణాల వద్ద మద్యం తాగిస్తున్నారని ఫిర్యాదులు వస్తు న్నాయి. అలాంటి దుకాణాలపై చర్యలు తీసుకుంటాం. వైన్షాప్ల వద్ద మద్యం తాగించటంతో పాటు వాటర్ ప్యా కెట్లు, స్నాక్స్ విక్రయాలు చట్టరీత్య నేరం. అలాంటి దుకాణాలపై చర్యలు తీసుకుంటాం. – కృష్ణమూర్తి, ఎకై ్సజ్ సీఐ, నంద్యాలమామూళ్ల మత్తులో ఎకై ్సజ్ అధికారులు జిల్లాలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు నిబంధనలు బేఖాతరు బార్లను తలపిస్తున్న వైన్షాప్లు అక్కడే వాటర్ ప్యాకెట్లు, స్నాక్స్ అమ్మకాలు మామూళ్ల మత్తులో ఎకై ్సజ్ అధికారులు -
ఫుడ్ సెఫ్టీ అధికారుల దాడులు
బనగానపల్లె రూరల్: పట్టణంలోని మార్కెట్యార్డు ఆవరణలో తెల్లజొన్నలకు రసాయన మందులు కలిపి పచ్చజొన్నలుగా మార్పు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో జిల్లా ఫుడ్సెఫ్టీ అధికారులు షేక్ ఖాసీంవలి, వెంకటరాముడు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. మార్కెట్యార్డు ఆవరణలో ఉంచిన పచ్చజొన్నల నాణ్యతను పరిశీలించి, పరీక్షల నిమిత్తం శాంపిల్స్ సేకరించారు. రిపోర్టు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని వెల్లడించారు. కల్తీ జరిగినట్లు భావించే జొన్నలు శ్రీ లక్ష్మీ వెంకటరాఘవేంద్ర ట్రెడర్స్కు చెందినవిగా గుర్తించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్యార్డు ఇన్చార్జ్ కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు. రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలి నంద్యాల(న్యూటౌన్): వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్యారెడ్డి సూచించారు. శుక్రవారం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా నంద్యాల ద్విచక్ర వాహన డీలర్లు, రాయలసీమ ఎక్స్ప్రెస్ ప్రైవేటు లిమిటెడ్ చాపిరేవుల టోల్ప్లాజా (జాతీయ రహదారుల సంస్థ) ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో హెల్మెంట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను ద్విచక్ర వాహన చోదకులకు వివరిస్తూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ద్విచక్రవాహనాలు నడుపుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు కార్యక్రమంలో నంద్యాల ట్రాఫిక్ పోలీసు సిబ్బంది, టోల్ప్లాజా ప్రాజెక్టు మేనేజర్ మధన్మోహన్, రూట్ మేనేజర్ సర్వీస్రెడ్డి, పారామెడికల్స్, అంబులెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆందోళన అవసరం లేదు
బర్డ్ప్లూ నిర్ధారణ అయినప్పటికీ జిల్లా ప్రజలు ఆందోళన చెందాల్సి న అవసరం లేదు. రెడ్ జోన్గా గుర్తించిన కర్నూలులోని ఎన్ఆర్ పేటలో చికెన్, గుడ్ల అమ్మకాలను బంద్ చేశాం. మిగిలిన ప్రాంతాల్లో చికెన్, గుడ్లను తినవచ్చు. అయితే 100 డిగ్రీల వేడిలో ఉడికించి తినాలి. 50 డిగ్రీల్లో ఉడికిస్తే వైరస్ మొత్తం చనిపోతుంది. 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికిస్తే ఎలాంటి ప్రమాదం లేదు. పాజిటివ్ కేసు వచ్చినందున బయో సెక్యూరిటీ మెజర్స్ను పాటిస్తున్నాం. కోళ్లు, బాతులు మృతిచెందితే అధికారులకు సమాచారం ఇవ్వాలి. –జి.శ్రీనివాస్, జాయింట్ డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ -
నాణ్యత పాటించకపోతే చర్యలు
మహానంది: విద్యార్థినులకు వండే ఆహార పదార్థాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖా ధికారి జనార్దన్రెడ్డి హెచ్చరించారు. తిమ్మాపురంలోని కేజీబీవీలో ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులు తీసుకునే రాగిజావ, అల్పాహారం పరిశీలించారు. వారితో పాటే కలిసి అల్పాహారం తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వంటగదితో పాటు వంట పాత్రలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యా శాఖ విడుదల చేసిన 100 రోజుల ప్రణాళికను తప్పకుండా పాటించాలన్నారు. పదవ తరగతి విద్యార్థుల స్టడీ అవర్ను పరిశీలించి ఉపాధ్యాయులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. మహానందీశ్వరుడి సన్నిధిలో .. మహానంది: డీఆర్డీఓ శ్రీనిధి రాష్ట్ర మేనేజింగ్ డైరెక్టర్ హరిప్రసాద్ శుక్రవారం మహానందిలో పూజలు నిర్వహించారు. మహానందీశ్వరస్వామి దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ ఇన్స్పెక్టర్ శ్రీశైలం శ్రీనివాసులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకుని పూజలు చేశారు. దర్శనం తర్వాత స్థానిక అలంకార మండపంలో వేదపండితులు స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు చేశారు. ముమ్మరంగా రైతుల రిజిస్ట్రేషన్ ● నంద్యాల జిల్లాలో 35,598 నమోదు కర్నూలు(అగ్రికల్చర్): కేంద్రప్రభుత్వం దేశ వ్యాప్తంగా రైతులకు ఆధార్ తరహాలో 11 అంకెల తో కూడిన ప్రత్యేక నెంబరును కేటాయించే ప్రక్రియ ఊపందుకుంది. కర్నూలు, నంద్యాల జిల్లాలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పోర్టల్ (ఏపీఎఫ్ఆర్)లో రైతులను రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. కర్నూలు జిల్లాలో 2,52,624 మంది రైతులు ఉండగా...రైతు సేవా కేంద్రాల ఇన్చార్జీలు 39,373 మందిని ఎన్రోల్మెంటు చేశారు. నంద్యాల జిల్లాలో 2,03,291 మంది రైతులు ఉండగా.. 35,598 మంది రైతులను నమోదు చేశారు. ఆధార్లో పేర్ల వివరాలు, ఆర్వోఆర్లోని వివరాలు 80 శాతం వరకు సరిపోతే రైతు సేవా కేంద్రం ఇన్చార్జి పరిధిలోనే 11 అంకెల యూనిక్ ఐడీ నెంబరు జారీ అవుతోంది. ఆధార్, ఆర్వోఆర్లోని వివరాలు 80 శాతం వరకు సరిపోకపోతే అటువంటి వాటిని వీఆర్వో లాగిన్కు అప్లోడ్ చేస్తారు. వీఆర్వోలు రెవెన్యూ రికార్డులు, ఆర్వోఆర్లోని వివరాలు పరిశీలిస్తారు. ఆర్వోఆర్ వివరాల్లో తేడాలు ఉంటే వెబ్ల్యాండ్లో సరిచేస్తారు. ఆ తర్వాతనే యూనిక్ ఐడీ వస్తుంది. కర్నూలు జిల్లాలో 29,441 మంది, నంద్యాల జిల్లాలో 25,237 మంది రైతుల ఆధార్ వివరాలతో ఆర్వోఆర్ వివరాల్లో తేడాలు ఉండటంతో వీఆర్వో లాగిన్కు పంపారు. రైతులు సంబంధిత రైతు సేవా కేంద్రాల ఇన్చార్జీలను సంప్రదించి ఏపీఎఫ్ఆర్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి సూచించారు. -
అనుసరణీయులు సంజీవయ్య
నంద్యాల: పేదల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ దామోదరం సంజీవయ్య అనుసరణీయులని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. శుక్రవారం సంజీవయ్య జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్ఓ రాము నాయక్, దళిత సంఘాల నాయకుల పాల్గొన్న ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ సంజీవయ్య దళిత కుటుంబంలో జన్మించి రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయాల్లో రాణించి ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. పేద ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి అమలుకు కృషి చేశారని కొనియాడారు. జిల్లాలో గాజులదిన్నె ప్రాజెక్టు, వరదరాజస్వామి గుడి ప్రాజెక్టులకు రూపకల్పన చేసి సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా చేశారన్నారు. కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. నీతి, నిజాయితీ, స్వశక్తితో ఉన్నత పదవులను అధిరోహించి స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా ప్రజల గుండెల్లో నిలిచారన్నారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత దళితుల హక్కుల కోసం పోరాడిన తొలి వ్యక్తి దామోదరం సంజీవయ్య అని కొనియాడారు. అంతకుముందు దళిత సంఘాల నాయకులు దళితుల సంక్షేమం కోసం సంజీవయ్య అందించిన సేవలను వివరించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రవికాంత్ బాబు, కాసన్న, రమేష్ నాయక్, బాల నాగన్న, మురళీ, దళిత సంఘాల నాయకులు కొమ్ము పాలెం శ్రీనివాస్, సతీష్ కుమార్, దండు వీరయ్య, చిటికెల సలోమి, సఫాయి కర్మచార కమిటీ సభ్యులు చెన్నమ్మ, మహేశ్వరమ్మ, రవికుమార్ పాల్గొన్నారు. దామోదరం సంజీవయ్య జయంతి వేడుకల్లో కలెక్టర్ -
ఇళ్ల మధ్య మద్యం దుకాణం వద్దు
● అడ్డుకున్న జూపాడుబంగ్లా ప్రజలు జూపాడుబంగ్లా: నివాసగృహాల మధ్యన మద్యం దుకాణాలు వద్దని, ఊరికి దూరంగా ఏర్పాటు చేయించాలని జూపాడుబంగ్లాలో గురువారం ప్రజలు అడ్డుకున్నారు. నూతన దుకాణ ప్రారంభాన్ని అడ్డుకుని కర్నూలు–గుంటూరు (కేజీ) రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ.. కేజీ రోడ్డు పక్కన బైరెడ్డినగర్ కాలనీలోని నివాస గృహాల మధ్యన మద్యం దుకాణం ఏర్పాటు చేయటం ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. పాత మద్యం దుకాణం కాసానగర్కాలనీకి వెళ్లేదారి పక్కనే ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఎకై ్సజ్శాఖ, పోలీసులు, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకొని గ్రామానికి దూరంగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేయించాలన్నారు. కేజీ రోడ్డుపై ప్రజలు చేపట్టిన ఆందోళనతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. విషయం తెలుసుకున్న బ్రాహ్మణకొట్కూరు ఎస్ఐ తిరుపాలు అక్కడికి చేరుకొని తహసీల్దార్తో మాట్లాడారు. గ్రామస్తులకు ఇబ్బందిలేకుండా మద్యం దుకాణాలను ఏర్పాటు చేయిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. రెండు మద్యం దుకాణాలను గ్రామానికి దూరంగా ఏర్పాటు చేయించాలని ప్రజలు తహసీల్దార్ చంద్రశేఖర్నాయక్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన నివేదికలు సమర్పించాలని వీఆర్వోలను ఆదేశించారు. -
దారి పొడవునా జంగిల్ క్లియరెన్స్ చేయాలి
శ్రీశైలం క్షేత్రానికి వెంకటాపురం నుంచి పాదయాత్ర కొనసాగించే భక్తులకు ఇబ్బంది లేకుండా కనీసం దారిలో గుచ్చుకునే రాళ్లనైనా తొలగించేందుకు అటవీశాఖ, శ్రీశైలం దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలి. ఏటా భక్తుల కోసం నామమాత్రంగా కొన్ని పనులు చేసి చేతులు దులుపుకోవడం సరికాదు. తప్పనిసరిగా రహదారి వెంట ఇరువైపులా కంప చెట్లను, వెదురుబొంగులను, మొనదేలిన రాళ్లను తొలగించాలి. – విశ్వంభర మద్దుల రమణారెడ్డి, శివస్వామి, ఆత్మకూరు తాగు నీరు ఏర్పాటు చేయాలి యేటేటా శ్రీశైలం మహా క్షేత్రానికి లక్షలాదిగా తరలివెళ్లే శివస్వాములు, భక్తులకు తప్పనిసరిగా అధికారులు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి. ఇప్పటికే నాగలూటి చెంచుగూడెం, పెచ్చెరువు, నాగలూటి వీరభద్రస్వామి క్షేత్రం వద్ద బోర్లు చెడిపోయాయి. అధికారులు స్పందించి మరమ్మతులు చేయడమేగాకుండా ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక చోట తాగునీరు ఏర్పాటు చేయాలి. సాదుల మఠం, సీతమ్మబావి, భీమునికొలను వరకు భక్తులకు నీటి సౌకర్యం కల్పించాలి. – సంజీవరెడ్డి, శివస్వామి, సిద్ధపల్లి గ్రామం -
మహిళపై దాడి కేసులో నలుగురికి ఐదేళ్లు జైలు
ఆళ్లగడ్డ: మహిళపై దాడి చేసిన నలుగురుకి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4 వేల చొప్పున జరిమానా విధిస్తూ ఆళ్లగడ్డ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. రూరల్ సీఐ మురళీధర్రెడ్డి తెలిపిన వివరాలు.. అశోక్ తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని కోరినందుకు మండల కేంద్రం చాగలమర్రికి చెందిన ముత్యాలపాడు మహబూబ్బీపై 2016 మే 16న చాగలమర్రి మండలం పెద్ద బోధనం గ్రామానికి చెందిన గడ్డ కిశోర్, గజ్జల బాలయ్య, లక్ష్మీదేవి, టంగుటూరి అశోక్ దాడి చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చాగలమర్రి పోలీసులు నిందులను అరెస్ట్ చేసి కోర్టులు చార్జ్షీట్ దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో నిందితులకు ఐదేళ్ల జైలుశిక్షతోపాటు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించిందని సీఐ తెలిపారు. -
అట్టహాసంగా గార్ధబాల పోటీలు
నంద్యాల వ్యవసాయం: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న జంబులాపరమేశ్వరి ఆలయ తిరునాల సందర్భంగా గురువారం గార్ధబాల పోటీలు(120 కేజీల ఇసుక బస్తాల విభాగం) అట్టహాసంగా నిర్వహించారు. నంద్యాల, ఆళ్లగడ్డ, రుద్రవరం, చాగలమర్రి, వెలుగోడు, ఆత్మకూరు, మహానంది మండలాల గార్ధబాలలు పోటీలో పాల్గొన్నాయి. ఆలయ ప్రధాన కార్యదర్శి గాండ్ల జగన్మోహన్ పోటీలను ప్రారంభించారు. మొదటి బహుమతి వేల్పనూరు ఎల్లా నాగయ్య గార్ధబం, రెండవ బహుమతి పెద్దవంగళికి పెద్దపాములేటి గార్ధబం, మూడవ బహుమతి మిట్టపల్లి పెద్ద గురువయ్య గార్ధబం సాధించి వరుసగా రూ.10 వేలు, రూ.8 వేలు, రూ.6 వేల నగదు బహుమతులు గెలుచుకున్నాయి. పోటీలో పాల్గొన్న గార్ధబం -
ప్రాంతీయ శిక్షణా కేంద్రంలో అగ్నిప్రమాదం
కర్నూలు(హాస్పిటల్): వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం పక్కనున్న ప్రాంతీయ శిక్షణా కేంద్రం(మేల్) ఆవరణలో అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం మధ్యాహ్న భోజనం వేళ కార్యాలయ ఆవరణలో నిలిపి ఉన్న పాతవాహనాల వద్ద మంటలు చెలరేగాయి. ప్రమాదంలో స్క్రాబ్లో ఉంచిన(కాలపరిమితి ముగిసిన) మూడు జీపులు, ఒక అంబులెన్స్ కాలిపోయాయి. ఈ వాహనాలను 2018లో జిల్లా ఇమ్యునైజేషన్ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు అక్కడ ఉన్న పాత వాహనాలను ప్రాంతీయ శిక్షణ కేంద్రం ఆవరణకు తరలించారు. మధ్యాహ్నం వేళలో ఎండతీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ఎవరైనా మూత్రవిసర్జనకు వెళ్లి సిగరెట్ ముక్కను ఆర్పకుండా పారవేయడంతో ప్రమాదం జరిగి ఉంటుందని ఉద్యోగులు భావిస్తున్నారు. హంద్రీనీవా కాలువలో బాలుడి గల్లంతు పత్తికొండ రూరల్: మండల పరిధిలోని హంద్రీనీవా కాలువలో గురువారం 12 ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు. డోన్కు చెందిన దామోదర్గౌడు, రాజేశ్వరి దంపతులు కుమారుడు తులసీగౌడ్తో కలిసి గత శుక్రవారం గ్రామంలో జరిగిన ఆలయాల ప్రారంభోత్సవానికి వచ్చారు. గురువారం ఉదయం గ్రామ సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్దకు వెళ్లిన తులసీగౌడ్ కాళ్లు శుభ్రం చేసుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ జారి నీటిలో పడిపోయాడు. గమనించిన చుట్టుపక్కల వారు గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని అధికారులకు విషయం చేరవేశారు. ఫైర్ స్టేషన్ ఎస్ఐ దినకర్బాబు సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సాయంత్రమైనా ఆచూకీ లభించలేదు. సీఐ జయన్న గ్రామస్తులతో విచారణ చేపట్టారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం ● మరొకరికి గాయాలు పాణ్యం: మండల పరిధిలోని సుగాలిమెట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయాలపాలైనట్లు ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి తెలిపారు. పాణ్యం చెంచు కాలనీకి చెందిన తోట ఆంజనేయులు (26), సోదరుడు లక్ష్మన్న తమ్మరాజుపల్లె నుంచి బైక్పై పాణ్యం బయలుదేరారు. సుగాలిమెట్ట వద్ద ఎరువుల ట్రాక్టర్ రాంగ్ రూట్లో వస్తూ బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందగా లక్ష్మన్న తీవ్రగాయాలపాయ్యాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నంద్యాలకు తరలించారు. మృతుడికి భార్య చిందులు, ముగ్గురు కుమారులు ఉన్నారు. హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.