breaking news
Nandyal District Latest News
-
పెద్ద హరివాణం.. రగిలిన ఉద్యమం
ఆదోని రూరల్: ఓ వైపు ఆదోని మండలంలో 16 గ్రామాల ప్రజలు ప్రత్యేక మండలం వద్దంటూ నెల రోజులుగా ఆందోళన చేస్తున్న తరుణంలో గెజిట్ ప్రకా రం పెద్ద హరివాణాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని గ్రామ స్తులు నిరసన బాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో అతి పెద్ద మండలమైన ఆదోనిని రెండు మండలాలుగా విభజిస్తూ పెద్దహరివాణం గ్రామా న్ని మండల కేంద్రంగా ప్రకటించింది. అయితే పెద్దహరివాణం మండలంలో విలీనానికి ప్రతిపాదించిన 16 గ్రామాల ప్రజలు నెల రోజులుగా ఆందోళనలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం వెనుకడుగు వేసి ఆదోని–1, ఆదోని–2గా ప్రకటించడంతో మంగళవారం పెద్దహరివాణం గ్రామ ప్రజలు కన్నెర్రజేశారు. తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని మంగళవారం గ్రామస్తుడు ఆది నారాయణరెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనకు సంఘీభావంగా గ్రామస్తులు ఆదోని – సిరుగుప్ప రహదారులను దిగ్బంధం చేసి రాకపోకలను నిలిపివేశారు. అలాగే టైర్లు, పాత వాహనాలను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. పెద్దహరివాణాన్ని మండల కేంద్రంగా ప్రకటించేంత వరకు పోరాడుతామని నినాదాలు చేశారు. -
ఈవీఎం గోదాముల పరిశీలన
నంద్యాల(అర్బన్): భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా పట్టణంలోని టెక్కె మార్కెట్ యార్డ్లో ఈవీఎంలను భద్రపరిచిన గోదాములను జిల్లా కలెక్టర్ రాజకుమారి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాముల వద్ద ఏర్పాటు చేసిన సీళ్లను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రతకు సంబంధించి చేపట్టిన రక్షణ చర్యలు, భద్రతా ప్రమాణాలు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకా రం సక్రమంగా అమలవుతున్నాయా లేదా అన్న విషయాన్ని ఆమె సమగ్రంగా సమీక్షించా రు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేసి తనిఖీలను అధికారికంగా నమోదు చేశా రు. ఈవీఎంల భద్రత అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, గోదాముల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్ వెంట డీఆర్ఓ రామునాయక్, ఆర్డీఓ విశ్వనాథ్, తహసీల్దార్ సత్య శ్రీనివాసులు, ఎలక్షన్ డీటీ మనో హర్, అలాగే రాజకీయ పార్టీల తరఫున ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి సయ్యద్ రియా జ్ బాషా, వైఎస్సార్సీపీ నుంచి సాయిరాం రెడ్డి, టీడీపీ నుంచి శివరామిరెడ్డి, బీజేపీ నుంచి చంద్రశేఖర్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి ప్రదీప్, సీపీఐ నుంచి నరసింహులు ఉన్నారు. వన్యప్రాణులతో పంట నష్టం వెలుగోడు: వన్యప్రాణుల కారణంగా పంట నష్టం ఎదుర్కొన్న రైతులకు అటవీ శాఖ నష్ట పరిహారం అందజేసింది. వెలుగోడు రేంజ్లో 36 మంది రైతులకు మొత్తం రూ.1,62,000 నష్టపరిహార చెక్కులు మంగళవారం పంపిణీ చేశారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్.జెడ్.ఏ. తాహెర్ చేతుల మీదుగా వెలుగోడు, నల్లకాల్వ గ్రామాలకు చెందిన రైతులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా తాహెర్ మాట్లాడుతూ.. వన్యప్రాణుల వల్ల పంట నష్టం జరిగితే వెంటనే అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు, వీఆర్వోలతో కలిసి తని ఖీ చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని తెలిపారు. వన్యప్రాణులను వేటాడటం లేదా హాని చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. వన్యప్రాణి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని, భవిష్యత్ తరాలకు జీవవైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ జయపాల్, అటవీ శాఖ అధికారులు గోపీ , టి.వెంకటేశ్వర్లు, రజాక్, బి.వెంకటేశ్వర్లు , గ్రామ పెద్దలు పాల్గొన్నారు. న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి తప్పనిసరి బొమ్మలసత్రం: న్యూ ఇయర్ వేడుకలకు తప్పనిసరిగా అనుమతి పొందాలని జిల్లా ఎస్పీ సునీల్షెరాన్ మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చ రించారు. జిల్లాలో 30 పోలీస్ యాక్టు అమలులో ఉన్నందున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలన్నారు. రాత్రి 10 గంటల తర్వాత డీజే, మ్యూజిక్ సిస్టమ్లను వినియోగించరాదని సూచి ంచారు. వేడుకలు నిర్వహించే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉండాలన్నారు. వాహనాల తనిఖీలు ముమ్మరంగా చేపట్టనున్న నేపథ్యంలో అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. వేడుకల్లో అశ్లీల నృత్యాలతో పాటు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. బస్టాండ్లలో మౌలిక వసతులు కల్పిస్తాం పత్తికొండ: ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్టాండ్లలో మౌలిక వసతులు కల్పిస్తామని ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరక్టర్ ద్వారకా తిరుమలరావు అన్నారు. మంగళవారం ఆయన పత్తికొండ ఆర్టీసీ బస్టాండ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటరామయ్య, ఆర్టీసీ ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం బస్డాండ్లో సమస్యలను ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. పత్తికొండ–ఎమ్మిగనూర్కు వెళ్తున్న పల్లె వెలుగు బస్సును ఎక్కి మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. పత్తికొండ పర్యటనకు విచ్చేసిన ఆర్టీసీ ఎండీని ప్రజా సంఘాల నాయకులు కలిసి పత్తికొండ నుంచి ఇతర ప్రాంతాలకు నూతన సర్వీసులను ఏర్పాటు చేయాలని వినతిపత్రాలు అందచేశారు. విజయవాడ, ప్రొ ద్దుటూరుకు నూతన సర్వీసులు నడపాలన్నారు. -
ప్రచారం లేక.. ఆశించిన స్థాయిలో రాక..!
● ప్రతి నెల చివరి మంగళవారం చెంచులకు ఉచిత స్పర్శదర్శనం ప్రారంభం ● అవగాహన కల్పిచండంలో అధికారుల విఫలం శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని చెంచులకు మల్లన్న ఉచిత స్పర్శదర్శనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ముందస్తుగా ప్రచారం నిర్వహించకపోవడంతో ఆశించిన స్థాయిలో చెంచులు రాలేకపోయారు. మంగళవారం చెంచు భక్తులు సంప్రదాయబద్ధంగా తప్పెట వాయిద్యాలతో, నృత్యాలు చేస్తూ దర్శనానికి వచ్చారు. ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పి.రమేష్నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు, సంబంధిత అధికారులు చెంచులకు ఆహ్వానం పలికారు. చెంచు భక్తులు ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణం చేసుకున్న తర్వాత మల్లన్న స్పర్శదర్శనం, భ్రమరాంబాదేవి దర్శనం చేయించారు. అలాగే అన్నప్రసాద వితరణ భవనంలో అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు. స్థానిక మేకలబండ, ఇతర గూడెలకు చెందిన చెంచు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 500 మందికి పైగా చెంచులు తరలివస్తారని చైర్మన్, అధికారులు అంచనా వేశారు. అయితే సరైన ప్రచారం లేక చెంచులు అశించిన స్థాయిలో రాలేదు. కేవలం 200 మంది వరకు మాత్రమే వచ్చి ఉంటారని సమాచారం. అనంతరం చైర్మన్ పి.రమేష్నాయుడు మాట్లాడుతూ.. శ్రీశైలక్షేత్ర సంస్కృతి సంప్రదాయాలలో చెంచు భక్తులకు ఎంతో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ప్రతి నెల చివరి మంగళవారం చెంచులకు ఉచిత మల్లన్న స్పర్శదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. -
భక్త కోటి ప్రణమిల్లి..
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం అహోబిలం క్షేత్రం భక్తులతో పోటెత్తింది. గోవింద నామ స్మరణ మారుమోగింది. ఆధ్యాత్మిక శోభతో అహోబిలం ఇల వైకుంఠాన్ని తల పించింది. తెల్లవారుజామున 4 గంటల నుంచే స్వామి వారిని దర్శించుకోవడాని కి భక్తులు క్యూలలో బారులుదీరారు. శ్రీదేవి, భూదేవి సహిత శ్రీప్రహ్లాదవరద స్వామిని ఉత్తరద్వారంలో దర్శనం చేసుకున్నారు. ప్రహ్లాదవరద స్వామి ప్రత్యే కంగా అలంకరించిన గరుడవాహనంపై కొలువై ఆలయ మాఢవీధుల్లో విహరించారు. స్వామి వారిని కనులారా దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. – దొర్నిపాడు -
లైఫ్ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయండి
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలోని సర్వీస్, ఫ్యామిలీ పెన్షన్దారులు జీవన ప్రమాణ పత్రాలు(లైఫ్ సర్టిఫికెట్లు) జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని జిల్లా ట్రెజరీ అధికారి రామచంద్రరావు తెలిపారు. కర్నూలు జిల్లాలో 17,440 మంది, నంద్యాల జిల్లాలో 10,925 మంది పెన్షనర్లు ఉన్నారన్నారు. మంగళవారం ఆయన విలేకర్లతో మట్లాడుతూ నవంబర్, డిసెంబర్ నెలల్లో సమర్పించిన జీవన్ ప్రమాణ్ పత్రాలు చెల్లుబాటు కావన్నారు. ఫిబ్రవరి నెల చివరిలోగా లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఏప్రిల్ 1న చెల్లించే మార్చి నెల పెన్షన్ నిలిచిపోతుందన్నారు. అనారోగ్యంతో నడువలేని పింఛనుదారులు ఉన్న ట్లు సమాచారం ఇస్తే సంబంధిత సబ్ ట్రెజరీ సిబ్బంది ఇంటివద్దకే వచ్చి జీవన్ ప్రమాణ్ పత్రాలు జారీ చేస్తారన్నారు. పీజీ థర్డ్ సెమిస్టర్ ఫలితాలు విడుదల కర్నూలు సిటీ: క్లస్టర్ యూనివర్సిటీ పీజీ 3వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను మంగళవారం ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ జి.శ్రీనివాస్, డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ కె.నాగరాజు శెట్టి విడుదల చేశారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ గత నెలలో మూడో సెమిస్టర్ పరీక్షల నిర్వహించామన్నారు. ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ విద్యార్థు లు 100 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. కార్యక్రమంలో డీన్ డాక్టర్ మహమ్మద్ వాహిద్, ఆర్థిక శాఖ అధ్యాపకులు డాక్టర్ ఎల్లా కృష్ణ, వాణిజ్య విభాగం అధ్యాపకులు డాక్టర్ దళవాయి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
5 లక్షల కుటుంబాలకు దెబ్బ
కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వస్తున్న వీబీజీ రామ్జీ వ్యవసాయ కూలీల జీవితాల్లో చిచ్చు పెట్టనుంది. ప్రజలను ఉపాధికి దూరం చేసే కొత్త పథకం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త పథకంతో కేంద్రం రాష్ట్రాలు భరించే వాటాను పెంచడాన్ని పరిశీలిస్తే.. ఇక పేదలు, వ్యవసాయ కూలీలు, సన్న, చిన్నకారు రైతుల ఉపాధి నిర్వీర్యం అయినట్టే కనిపిస్తోంది. అప్పులు చేయడంలో రాణిస్తున్న చంద్రబాబు సర్కార్ రామ్జీ ద్వారా చేపట్టే ఉపాధి పనులకు తమ వాటా ఎక్కడి నుంచి ఇస్తారనే చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే ఉపాధి కూలీలకు ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వని పరిస్థితి. పల్లెపండుగ కింద ఉపాధి నిధులతో చేపట్టిన పనులకు ఏప్రిల్ నుంచి ఎలాంటి చెల్లింపులు లేవు. కరువుపీడిత ప్రాంతాల్లో కర్నూలు జిల్లా మొదటిస్థానంలో ఉంటోంది. ఇక్కడ వ్యవసాయ కూలీలు ఎక్కువ. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లేకపోతే వలసలు ఇప్పుడున్న వాటితో పోలిస్తే మూడు రెట్లు అధికం కానున్నాయి. పేదలకు అన్నం పెట్టే ఈ పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 2007లో ఓర్వకల్ మండలంలో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్తో కలసి ప్రారంభించారు. నేడు చంద్రబాబు ప్రభుత్వం.. కేంద్రం పేదలను ఉపాధికి దూరం చేయనుండటం గమనార్హం. అప్పుల బాబుతో సాధ్యమేనా.. ఇప్పటి వరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లేబర్ కాంపోనెంటు కింద చేపడుతున్న పనులకు 100 శాతం వేజ్ కేంద్రం భరిస్తోంది. మెటీరియల్ కింద చేపట్టే పనులకు 90 శాతం కేంద్రం, 10 శాతం రాష్ట్రం వాటా ఉంటుంది. కొత్త చట్టం ప్రకారం లేబర్, మెటీరియల్ కాంపోనెంటు కింద చేపట్టే పనులకు 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం భరించాల్సి ఉంది. ఎన్ఆర్ఈజీఎస్ను పక్క న పెట్టి కొత్తగా అమలు చేస్తున్న వీబీజీ రామ్జీ కింద చేపట్టే లేబర్, మెటీరియల్ పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి చెందిన అకౌంట్కు రాష్ట్రం వాటాను విడుదల చేసిన తర్వాతనే నిధులు విడుదలవుతాయి. అప్పులతో నెట్టుకొస్తున్న చంద్రబాబు సర్కార్ తమ వాటా నిధులు అంత సులభంగా ఇచ్చే అవకాశం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. వ్యక్తిగత సబ్సిడీ రూ.2 లక్షల వరకే.. 2024–25 వరకు పండ్లతోటల అభివృద్ధిలో గరిష్టంగా ఐదు ఎకరాల వరకు పూర్తి సబ్సిడీ పొందే అవకాశం ఉండింది. సబ్సిడీ కింద రూ.5 లక్షలకు పైగా రైతులు పొందే వీలుండేది. మరోవైపు ఫాంపాండ్స్ వంటి వాటిని తవ్వుకోవడం ద్వారా కూడా సబ్సిడీలు పొందుతున్నారు. ఇప్పటి వరకు గరిష్టంగా రూ.10 లక్షల వరకు సబ్సిడీ లభిస్తోంది. అయితే ఉపాధి నిధులతో వ్యక్తిగత ఆస్తుల అభివృద్ధి(పండ్లతోటలు, ఫాంపాండ్స్ తదితరాలు) ద్వారా ఇస్తున్న సబ్సిడీని ప్రస్తుతం రూ.2 లక్షలకు పరిమితం చేశారు. ఈ మేరకు సాఫ్ట్వేర్లో మార్పులు కూడా జరిగిపోయాయి. కౌతాళం మండలం ఓబుళపురం నుంచి హైదరాబాదుకు వలస వెళ్తున్న కూలీలు (ఫైల్) పేరు మార్చి.. మట్టి కొట్టి నిలిచిపోయిన చెల్లింపులు ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకంలో కేంద్రానిదే పూర్తి అధికారం ఉన్నప్పటికీ లేబర్ కాంపోనెంటు కింద 2025 జూలై 22 నుంచి, మెటీరియల్ కాంపోనెంటు కింద ఏప్రిల్ 1 నుంచి చెల్లింపులు లేవు. కర్నూలు జిల్లాలో దాదాపు రూ.80 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.65 కోట్ల బకాయిలు ఉన్నాయి. చెల్లింపులు లేకపోవడంతో ఉపాధి పనులకు లేబర్ హాజరు తగ్గిపోయింది. మొదటి విడత పల్లెపండుగ పనులకు చెల్లింపులు ఏప్రిల్ నుంచి లేకపోవడంతో రెండవ విడత పల్లె పండుగను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పండ్లతోటలకు సంబంధించి ఏడాదిన్నర నుంచి నిర్వహణ చెల్లింపులు నిలిచిపోయాయి. మహాత్మాగాందీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కర్నూలు జిల్లాలో 2.75 లక్షల కుటుంబాలు, నంద్యాల జిల్లాలో 2.25 లక్షల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ఏటా ఈ కుటుంబాలకు 1.85 కోట్ల పని దినాలు కల్పిస్తున్నారు. కొత్తగా తెస్తున్న వీబీజీ రామ్జీ వల్ల ఉమ్మడి జిల్లాలో 5 లక్షల కుటుంబాలకు నష్టం కలిగే ప్రమాదం ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో 2025–26లో ఇప్పటి వరకు 100 రోజుల పని దినాలు పూర్తి చేసుకున్న కుటుంబాలు 3,100 మాత్రమే. ప్రస్తుతం కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలనేది నిబంధన. కొత్త పథకం ప్రకారం కుటుంబానికి 125 రోజులు పని కల్పిస్తారు. ఉపాధి పనులపై ఆధారపడిన వారికి ఇది కొంతమేర ఊరట కలిగిస్తుంది. అయితే రెక్కలు వంచి పని చేస్తే వేతనాలు అందుతాయా, లేదా అనేది ప్రశ్నార్థకం. -
కలవర పెడుతున్న పొగమంచు
● పూత దశలో పప్పుశనగ ● పొగమంచుతో పూత రాలిపోయే అవకాశం ● దిగుబడి తగ్గుతుందని రైతుల ఆందోళన కోవెలకుంట్ల: పప్పుశనగ రైతులను సాగు ఆరంభం నుంచే కష్టాలు వెంటాడుతున్నాయి. విత్తన సమయంలో మోంథా తుపాన్ వెంటాడుతుండగా ప్రస్తుతం పొగమంచు కలవర పెడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది జిల్లాలోని 29 మండలాల పరిధిలో 59,881 హెక్టార్లలో శనగ సాగు సాధారణ విస్తీర్ణం కాగా ఆయా మండలాల పరిధిలో 48,871 హెక్టార్లలో రైతులు జేజే–11, ఫూలేజి రకాలకు చెందిన శనగ పంట సాగు చేశారు. ఇందులో స్థానిక వ్యవసాయ సబ్ డివిజన్లోని సంజామల మండలంలో 9,435 హెక్టార్లు, కోవెలకుంట్ల మండలంలో 6,950, ఉయ్యాలవాడ మండలంలో 11,076, దొర్నిపాడు మండలంలో 3,011, కొలిమిగుండ్ల మండలంలో 3,820, అవుకు మండలంలో 1,068 హెక్టార్లలో సాగైంది. పస్తుతం ఆయా ప్రాంతాల్లో పైరు పూత దశలో ఉంది. ఈ ఏడాది చలి తీవ్రతకు తోడు ఇటీవల దట్టమైన పొగమంచు కురుస్తోంది. ఉదయం వేళల్లో పంట పొలాలను పొగమంచు కప్పేస్తుండటంతో శనగ రైతులకు శాపంగా మారింది. పూత దశలో పొగమంచు కురుస్తుండటంతో పూత రాలిపోయే ఆస్కారం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పైరు రెండు నెలల దశలో ఉండగా మరో నెల రోజుల్లో దిగుబడులు చేతికందనున్నాయి. పూత దశలో పొగమంచు కారణంగా పూత రాలిపోతే దిగుబడులపై తీవ్ర ప్రభా వం పడుతుందని రైతులు దిగాలు చెందుతున్నారు. మరో వారం రోజులపాటు పొగమంచు ఇలాగే కొనసాగితే దిగుబడులు తగ్గిపోతాయని వాపోతున్నారు. -
రోడ్డెక్కిన వేదన!
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ప్రతి సోమవారం ప్రజల అవస్థలకు ఈ దృశ్యం అద్దం పడుతోంది. గత ప్రభుత్వంలో ఎలాంటి సమస్య వచ్చినా గ్రామాల్లోనే సచివాలయంలో పరిష్కారం లభించేది. ఇప్పుడు ప్రతి చిన్న సమస్యకు ఎవరికి చెప్పుకోవాలో, ఎక్కడికి వెళ్లాలో తెలియక ప్రజలు కిలోమీటర్ల దూరం వ్యయప్రయాసలకోర్చి కలెక్టరేట్కు చేరుకుంటున్నారు. కలెక్టరేట్ ఆవరణలోనే కాకుండా ఇలా రోడ్డు మీదకు బారులు తీరి వినతిపత్రాలను రాసుకుంటున్న దృశ్యాలను చూస్తే టీడీపీ ప్రభుత్వంలో ప్రజలు ఏ స్థాయిలో సమస్యలను ఎదుర్కొంటున్నారో అర్థమవుతోంది. వినతులు ఇవ్వడమే కానీ, పరిష్కారం లభించక ప్రజలు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
ఆదోని జిల్లా సాధనకు అక్షర చైతన్యం
ఎమ్మిగనూరుటౌన్/నందవరం: జిల్లా పశ్చిమ ప్రాంతమైన ఆదోనిని జిల్లా చేసేందుకు గల ప్రాముఖ్యత, ప్రాంత సమస్యలను తెలియజేసేలా పట్టణానికి చెందిన తెలుగు ఉపాధ్యాయుడు కాకె వెంకటేశప్ప తన కుంచె నుండి గీసిన అక్షర చిత్రమిది. జిల్లాలోని అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ఆదోని డివిజన్ను జిల్లా కేంద్రంగా చేయాల్సిన అవశ్యకతను తెలియజేస్తూ ఆదోని అక్షరాల్లో ఆయన పొందుపరిచిన అంశాలు విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు ఆ ప్రాంత ప్రజల్లో చైతన్యం నింపుతున్నాయి. ‘ఆ’ అక్షరంలో పశ్చిమ ప్రాంతంలోని ప్రముఖ దైవ క్షేత్రాలు, ‘దో’ అక్షరంలో ఇక్కడి ప్రముఖ వ్యక్తులు, నైసర్గిక స్వరూపాలు, ఉత్పత్తులు, ‘ని’లో ప్రాంత సమస్యలు తెలియజేసేలా చిత్రం గీశారు. ఈ చిత్రం స్థానికుల్లో ఆదోని జిల్లా సాధనకు చైతన్యం నింపుతోంది. -
ముక్కోటి ఏకాదశికి ముస్తాబు
బేతంచెర్ల: ఉమ్మడి జిల్లాలో వైష్ణవ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని మంగళవారం స్వామి, అమ్మవార్లను భక్తులు ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునేలా ప్రత్యేక క్యూలైన్లు, తగిన ఏర్పాట్లు చేసినట్లు ఉప కమిషనర్, ఆలయ ఈఓ రామాంజనేయులు తెలిపారు. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని స్వామి, అమ్మవర్లాకు జరిపే శాంతి కల్యాణోత్సవాన్ని భక్తులు తిలకించేందుకు వేదికను రంగురంగుల షామియానాలు, పూలతో అలంకరించారు. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు సోమవారం విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచణం, స్వామి, అమ్మవార్లకు లక్ష తులసిదళార్చన, స్నపన తిరుమంజనం, సుదర్శన హోమం, బలిహరణం, మహానివేదన, మంత్ర పుష్ప సమర్పణం, తీర్థ ప్రసాద వినియోగం చేశారు. -
కేంద్ర నిధులపై మీ పెత్తనం ఏంటి?
కొలిమిగుండ్ల: గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధులపై మీ పెత్తనం ఏంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి ప్రశ్నించారు. సోమవారం బెలుం గుహల సందర్శనకు వచ్చిన కేంద్ర పంచాయతీరాజ్ జాయింట్ సెక్రటరీ రాజేష్కుమార్ సింగ్ను జిల్లా, రాష్ట్ర నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్ల పట్ల వివక్ష చూపుతూ కేంద్రం విడుదల చేసే నిధులను డైవర్ట్ చేస్తోందన్నారు. ఎనిమిది నెలల నుంచి పంచాయతీరాజ్ విభాగం నుంచి విడతల వారీగా ఉద్యమిస్తే నిధులను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిందన్నారు. ఈవిషయంలో కేంద్రం మొట్టికాయ వేస్తే దాదాపు రూ.64 కోట్లు వడ్డీ సహా స్థానిక సంస్థలకు జమ చేసిందని గుర్తు చేశారు. ఆ తర్వాత వచ్చే మార్చి నాటికి సర్పంచ్ల పదవీ కాలం ముగుస్తుండటంతో ఈ సర్పంచ్లతో ఎందుకు పనులు చేయించాలనే దురుద్దేశంతో నిధులు నిలిపేస్తూ సర్క్యులర్ ఇచ్చిందన్నారు.కేంద్రం నిధులను నిలబెట్టడా నికి, తొక్కి పెట్టడానికి మీరెవరు చంద్రబాబు, పవన్ కల్యాణ్ అని నిలదీశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులు చేయరాదని చెప్పడానికి మీకేం హక్కు ఉందని ప్రశ్నించారు. ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ విభాగానికి గుదిబండగా మారాడని విమర్శించారు. తక్షణమే ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు. సర్పంచ్ల సంఘం జిల్లా అధ్య క్షుడు లాయర్ మహేశ్వరరెడ్డి, పంచాయతీరాజ్ విభా గం జిల్లా అధ్యక్షుడు రామలక్ష్మయ్య, రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి అప్పిరెడ్డి గారి సురేష్రెడ్డి, జాయింట్ సెక్రటరీ రంగారెడ్డి, నంద్యాల, రాప్తాడు నియోజకవర్గాల అధ్య క్షులు మహేష్రెడ్డి, లోక్నాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు చాంద్బాషా తదితరులు వెంట ఉన్నారు. -
గంజాయి విక్రేతల అరెస్ట్
నందికొట్కూరు: గంజాయి విక్రయిస్తే రౌడీషీట్ ఓపెన్ చేయడం ఖాయమని టౌన్ సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని టౌన్ సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. స్థానిక రాయల్ గ్రీన్ సిటీ వెంచర్ వద్ద గంజాయి విక్రయిస్తున్న ఆత్మకూరు పట్టణం, దుద్యాల రోడ్డులోని పాత నవాజ్ కట్టకు చెందిన కావేటి నాగశేషాద్రి, నందికొట్కూరు వాల్మీక్ నగర్కు చెందిన షేక్ మసూద్, కుమ్మరి హరినాథ్, శాతనకోట గ్రామానికి చెందిన అనంత చిన్మయనంద గౌడ్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. కావేటి నాగశేషాద్రి నుంచి 20 గంజాయి ప్యాకెట్లు (750 గ్రాములు), రూ.3 వేలు నగదు, సెల్ఫోన్, షేక్ మసూద్ నుంచి 80 ప్యాకెట్లు (530 గ్రాములు) సెల్ఫోన్, కుమ్మరి హరినాథ్ నుంచి 50 ప్యాకెట్లు (300 గ్రాములు) సెల్ఫోన్, అనంత చిన్మయనందగౌడ్ నుంచి 80 ప్యాకెట్లు (520 గ్రాములు). సెల్ఫోన్ స్వాధీనం చేసుకునట్లు సీఐ తెలిపారు. సర్కిల్ పరిధిలో ఎవరైనా నిషేధిత మత్తు పదార్థాలు విక్రయిస్తే రౌడీషీట్ కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఎస్ఐ చంద్రశేఖర్, ఏఎస్ఐ రామచంద్ర, సిబ్బందితో కలిసి దాడులు చేసి గంజాయి విక్రేతలను పట్టుకున్నట్లు వెల్లడించారు. -
సైనికుల కుటుంబాలకు అండగా నిలుద్దాం
కర్నూలు(సెంట్రల్): దేశ రక్షణ కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి సేవలందిస్తున్న సైనికుల కుటుంబాలకు అండగా నిలవాలని కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లోని సుయన ఆడిటోరియంలో మెప్మా మహిళలు సేకరించిన రూ.2 లక్షలను సాయుధ దళాల సంక్షేమ నిధికి కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు మునిసిపాలిటీల్లోని పొదుపు మహిళలు తమవంతు సాయంగా రూ.2 లక్షలను సేకరించడం అభినందనీయమన్నారు. సైనిక కుటుంబాలను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మెప్మా పీడీ శ్రీనివాసులు, జిల్లా సైనిక సంక్షేమాధికారి రత్నరూత్, జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ టి.పద్మ పాల్గొన్నారు. శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం మల్లికార్జున సదన్ కౌంటర్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగిని సోమవారం ఈఓ ఎం.శ్రీనివాసరావు విధుల నుంచి తొలగించారు. అలాగే వసతి విభాగం ఇన్చార్జ్గా ఉన్న దేవస్థానం పీఆర్వో టీ.శ్రీనివాసరావుకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. గత శుక్రవారం మల్లికార్జున సదన్లో వసతి పొందేందుకు హిందీ భక్తులు రాగా వారి నుంచి డబ్బులు తీసుకుని దేవస్థానానికి జమ చేయకుండా కౌంటర్ ఉద్యోగి తన జేబులో వేసుకున్నాడు. ఈ విషయంపై ‘సాక్షి’ దినపత్రికలో ఈ నెల 26న ‘భక్తులకు బిల్లు ఇవ్వకుండా..’ అనే శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీంతో స్పందించిన ఈఓ ఘటనపై విచారణ చేయించారు. కౌంటర్ ఉద్యోగి అవినీతికి పాల్పడినట్లు నివేదిక అందడంతో అతన్ని విధుల నుంచి తొలగించారు. అలాగే వసతి విభాగం ఇన్చార్జ్ ఏఈఓగా ఉన్న పీఆర్వో టీ.శ్రీనివాసరావు విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించారని పేర్కొంటూ షోకాజ్ నోటీసు జారీ చేశారు. వారం రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.దేశ సేవలో భాగస్వాములు కావాలి కర్నూలు(హాస్పిటల్): దంత వైద్యులు వైద్యవృత్తిలోనే గాకుండా ఐఏఎస్, ఐపీఎస్ లాంటి జాతీయ స్థాయి ఉద్యోగాలు సాధించి దేశ సేవ చేయాలని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్ సూచించారు. నగర శివారులోని జి.పుల్లారెడ్డి దంత వైద్య కళాశాల 15వ స్నాతకోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. బీడీఎస్, ఎండీఎస్లో ఉత్తీర్ణత సాధించిన పట్టభద్రులకు వీసీ చేతుల మీదుగా సర్టిఫికెట్లు, మెడల్స్ ప్రదానం చేశారు. వీసీతో పాటు ప్రిన్సిపాల్ డాక్టర్ సంపతి నాగలక్ష్మిరెడ్డి మాట్లాడారు. విద్య ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని, వైద్యులు సమాజానికి ఉపయోగపడే విధంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలన్నారు. సెక్రటరీ పి.సుబ్బారెడ్డి, డైరెక్టర్ డాక్టర్ మురళీధర్రెడ్డి, డాక్టర్ దుగ్గినేని శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 2 నుంచి క్రికెట్ ఎంపిక పోటీలు కర్నూలు (టౌన్): స్థానిక స్పోర్ట్స్ అథారిటీ ఔట్డోర్ స్టేడియంలోని క్రికెట్ నెట్స్లో జనవరి 2, 3 తేదీల్లో అండర్– 14 బాలుర విభాగంలో ట్యాలెంట్ స్పాటింగ్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కె.దేవేంద్ర గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2011 సెప్టెంబర్ 1 తర్వాత జన్మించిన క్రీడాకారులు అర్హులని పేర్కొన్నా రు. క్రీడాకారులు జనన ఽధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో హాజరు కావాలన్నారు. -
బెలుం అందాలు అద్భుతం
కొలిమిగుండ్ల: వందల ఏళ్ల క్రితం భూమి లోపల ఏర్పడిన బెలుం గుహల సహజ అందాలు అద్భుతంగా ఉన్నాయని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ రాజేష్కుమార్సింగ్ కొనియాడారు. రాయలసీమ జిల్లాల్లోని చారిత్రక ప్రదేశాల సందర్శనార్థం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి బెలుం గుహలకు వచ్చారు. గుహల వద్దకు చేరుకున్న ఆయనకు మేనేజర్ కిషోర్, ఎంపీడీఓ దస్తగిరిబాబు, డిప్యూటీ ఎంపీడీఓ చంద్రమౌళీశ్వర గౌడ్ స్వాగతం పలికారు. అనంతరం గుహ లోపలికి చేరుకొని కోటిలింగాలు, వేయిపడగలు, మాయమందిరం తదితర ప్రదేశాలను తిలకించారు. గుహలోపల గంటకు పైగానే గడిపారు. గుహలు ఎప్పుడు ఏర్పడ్డాయి, వాటి ప్రాముఖ్యత తదితర విశేషాలను అడిగి తెలుసుకున్నారు. భూమి అంతర్భాగంలో ఇంత విశాలంగా అవతరించనందువల్లే బెలుం గుహలు ప్రపంచంలో గుర్తింపు పొందాయని చెప్పారు. గుహలను తిలకించడం ఆనందంగా ఉందన్నారు. అంతకు ముందు ఆయన వైఎస్సార్ కడప జిల్లాలోని గండికోటను పరిశీలించారు. బెలుం గుహల అనంతరం యాగంటి, మహానంది పుణ్యక్షేత్రాల దర్శనార్థం వెళ్లారు. -
ఈరన్నకు ప్రత్యేక పూజలు
కౌతాళం: మండల పరిధిలోని ఉరుకుంద గ్రామంలో వెలసిన ఈరన్న స్వామి దర్శనానికి సోమవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. దీంతో స్వామి క్షేత్రంలో భక్తులతో సందడి నెలకొంది. అర్చకులు స్వామి వారి మూలవిరాట్కు తెల్లవారు జామున సుప్రభాత సేవ, మహామంగళహారతి, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి ఫలపుష్పాలతో ఆలంకరించారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. కొందరు భక్తులు ఆలయ ఆవరణలో పిండి వంటలు వండి స్వామికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దరఖాస్తుల స్వీకరణ డోన్ టౌన్: ఉపాధి శిక్షణా శాఖ ఆధ్వర్యంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ నిర్వహించే ఏఐటీటీ జూలై – 2026 పరీక్షలకు ప్రైవేట్ అభ్యర్థులుగా హాజరగుటకు అర్హులైన వారిచే నేటి నుంచి జనవరి 28వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ కళాశాలల జిల్లా కన్వీనర్, డోన్ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ ప్రసాద్ రెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులకు 21 ఏళ్లు నిండి సంబంధిత ట్రేడ్లలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలని పేర్కొన్నారు. దరఖాస్తులను సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో పొందవచ్చని, ప్రవేశ రుసుం రూ.500 చెల్లించాల్సి ఉందన్నారు. మరిన్ని వివరాలకు ఐటీఐలలో సంప్రదించాలన్నారు. -
దొరకని ఆచూకీ.. ఆగని కన్నీళ్లు
● ఎస్సార్బీసీ కాల్వలో దూకిన తల్లీ బిడ్డల కోసం కొనసాగుతున్న గాలింపుగడివేముల: అయినవారి కోసం ఆర్తనాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇద్దరు పిల్లలతో ఎస్సార్బీసీ కాల్వలో దూకిన మహిళ కోసం బంధువులు, గ్రామస్తులు కాల్వ వెంట పండుతున్న బాధలు వర్ణణాతీతం. ఆదివారం ఒండుట్ల గ్రామానికి చెందిన బుగ్గానిపల్లె ఎల్లా లక్ష్మి (23), వైష్ణవి (3), సంగీత (మూడు నెలలు) గడివేముల మండలం మంచాలకట్ట గ్రామ సమీపంలో ఎస్సార్బీసీ కాల్వలోకి దూకిన విషయం తెలిసిందే. వారి కోసం సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు సహాయక బృందాలు గాలింపు చేపట్టారు. పాణ్యం సీఐ కిరణ్కుమార్రెడ్డి, ఎస్ఐ నాగార్జునరెడ్డి, నంద్యాల జిల్లా ఫైర్ సిబ్బంది చైతన్య కుమార్రెడ్డి, రాజేశ్వర్నాయక్, ఇస్మాయిల్, ఉశేన్సాహెబ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎస్సార్బీసీ కాల్వలో పుట్టిలు, ఇంజిన బొట్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. చుట్టు పక్కల గ్రామాల వారు, ఒండుట్ల గ్రామానికి చెందిన బంధువులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో ఎస్సార్బీసీ కాల్వ వద్దకు చేరుకున్నారు. తమవారిని త్వరగా కనిపెట్టాలని వారి కుటుంబసభ్యులు పడుతున్న యాతన అందరినీ కలిచివేస్తోంది. -
యాగంటిశ్వరుని హుండీ ఆదాయం లెక్కింపు
బనగానపల్లె రూరల్: యాగంటి క్షేత్రంలో వెలసిన ఉమా మహేశ్వరస్వామి దేవస్థానం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు కార్యక్రమం సోమవారం ఆలయ ఈఓ పాండు రంగారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం జరిగింది. హుండీల్లోని మొత్తం కానుకలను లెక్కించగా రూ.29,58,535 నగదు, 35 గ్రాముల బంగారు ఆభరణాలు, 160 గ్రాముల వెండి ఆభరణాలు వచ్చినట్లు ఈఓ పాండురంగారెడ్డి తెలిపారు. పర్యవేక్షణ అధికారి జనార్దన్, ఉపసర్పంచ్ బండి బ్రహ్మానందరెడ్డి, శ్రీరాములు, భరతుడు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. మహిళ ఆత్మహత్య దొర్నిపాడు: ఆళ్లగడ్డ మండలంలోని బాచేపల్లి గ్రామానికి చెందిన రామసుబ్బమ్మ (50) సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు రూరల్ ఎస్ఐ వరప్రసాద్ తెలిపారు. గత రెండు రోజులుగా కొడుకు ప్రతాప్ తల్లి పేరిట ఉన్న ఎకరం భూమిని తన పేరిట రాసివ్వాలని వేదిస్తున్నాడు. భూమిని రాసిస్తే తమ జీవనం ఎలా అని తల్లి వాదించేంది. ఈ విషయమై మనస్తాపానికి గురైన ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. -
విజయ డెయిరీలో ఖా‘కీచక’ రాజకీయం
నంద్యాల(అర్బన్): నంద్యాల విజయ డెయిరీలో టీడీపీ నాయకులు ఖా‘కీచక’ రాజకీయం చేస్తున్నారు. డెయిరీలో సోమవారం చాగలమర్రి మండలం ముత్యాలపాడు పాల సొసైటీ సభ్యులతో జరగాల్సిన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని పోలీసులతో అడ్డుకున్నారు. సమావేశానికి వెళ్లకుండా సభ్యులు పీపీ మధుసూదన్రెడ్డి, గంగుల విజయసింహారెడ్డిని హౌస్ అరెస్ట్లు చేశారు. భూమా విఖ్యాత్రెడ్డి కోసం పోలీసులను అడ్డు పెట్టుకొని తమను సమావేశానికి రాకుండా అడ్డుకున్నారని త్రిసభ్య కమిటీ సభ్యులు ఆరోపించారు. చూస్తూ ఊరుకోం.. హౌస్అరెస్ట్ చేసిన పీపీ మధుసూదన్రెడ్డిని ఆయన నివాస గృహంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి పరామర్శించారు. అనంతరం కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులను అడ్డుపెట్టుకొని భయపెట్టే రోజులు సాగబోవన్నారు. త్రిసభ్య కమిటీకి హాజరు కాకుండా సభ్యులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం తగదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, చట్టానికి విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా చూస్తూ ఊరుకోబోమన్నారు. బెదిరింపులకు దిగితే గట్టిగా సమాధానం చెబుతామన్నారు. కుటిల రాజకీయం పీపీ మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ.. భూమా విఖ్యాత్రెడ్డి ప్రైవేటు డెయిరీని స్థాపించి అక్రమంగా 2020లో డెయిరీ నుంచి రూ.1.20 కోట్లు అప్పు తీసుకొని తిరిగి చెల్లించలేదన్నారు. పాల సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న చక్రవర్తులపల్లె సొసైటీని 2024 డిసెంబర్లో డెయిరీ పాలక వర్గం రద్దు చేసిందన్నారు. డీఫాల్టర్ అయిన విఖ్యాత్కు ముత్యాలపాడు పాల సొసైటీలో సభ్యత్వం ఇవ్వడమే కాకుండా అధ్యక్షుడిగా ఎలా చేస్తారంటూ పాల సొసైటీ సభ్యులకు నోటీసులు ఇచ్చామన్నారు. తనకే నోటీసులు ఇచ్చారంటూ 20 రోజుల క్రితం డెయిరీ వద్దకు వచ్చి విఖ్యాత్ రభస చేయడం సరైంది కాదన్నారు. పాలకవర్గ సభ్యులతో సమావేశం నిర్వహిస్తున్నామని తెలిసి త్రిసభ్య కమిటీ సభ్యులమైన తనను, విజయసింహారెడ్డి, రమాకాంత్రెడ్డిలను హౌస్ అరెస్ట్ చేయడం కుటిల రాజకీయానికి నిదర్శనమన్నారు. పోలీసులను అడ్డు పెట్టుకొని టీడీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు మానుకోకపోతే గట్టిగా సమాధానం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మీల్ అమీర్, మాజీ జెడ్పీటీసీ సూర్యనారాయణరెడ్డి, దేశం సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సభ్యులను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు త్రిసభ్య కమిటీ సమావేశానికి వెళ్లకుండా అడ్డగింత చూస్తూ ఊరుకోమని వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహం -
వెండి కిరీటం బహూకరణ
వెలుగోడు: పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి ఒక కిలో బరువు గల వెండి కిరీటాన్ని డాక్టర్ కేవీ శేషపాణి దంపతులు సోమవారం బహూకరించారు. ఈ కిరీటాన్ని లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయ చైర్మన్ బళ్లాని వెంకట సత్యనారాయణకు అందజేశారు. వెండి కిరీటానికి పూజలు చేసి స్వామివారికి అలంకరించారు. ఆలయ కమిటీ సభ్యులు యాదాటి రవీంద్రుడు, బొగ్గరపు లక్ష్మీనారాయణ, రమణయ్య, ఎల్లాల సురేష్, నాగ పుల్లయ్య, ఎల్లాల కష్ణుడు, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. శ్రీశైలంలో భక్తుల రద్దీ శ్రీశైలంటెంపుల్: శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు సోమవారం మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. మూడు విడతలుగా పలువురు భక్తులు అన్లైన్ ద్వారా స్పర్శ దర్శనం టికెట్లు పొంది స్వామివారి స్పర్శదర్శనం చేశారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్ని కిటకిటలాడాయి. సచివాలయాల ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు కర్నూలు(టౌన్): నగరపాలక సంస్థ పరిధిలోని సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇన్చార్జి కమిషనర్ ఆర్జీవీ. క్రిష్ణ సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిర్ణీత గడువులోపు ఈ –కైవెసీ, బయోమెట్రిక్ చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించడంతో ఈ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల వ్యవధిలో సరైన సమాధానం తెలియజేయకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కత్తెర పురుగు విజృంభణ కర్నూలు(అగ్రికల్చర్): మొక్కజొన్న, జొన్న పంటలపై కత్తెర పురుగు విజృంభిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా రబీలో కత్తెర పురుగు సోకి తినేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్నూలు జిల్లాలో జొన్న 4,017 హెక్టార్లు, మొక్కజొన్న 7,426 హెక్టార్లలో.. నంద్యాల జిల్లాలో రెండు పంటలు 10 వేల హెక్టార్లకుపైగా సాగు చేశారు. అయితే కత్తెర పురుగు నివారణకు సరైన సలహాలు, సూచనలు ఇచ్చే వారు లేకపోవడంతో రైతులు పెస్టిసైడ్ డీలర్లను ఆశ్రయిస్తున్నారు. వారు ఇచ్చిన మందులు వాడుతూ నష్టపోతున్నారు. పురుగు ప్రభావంతో దిగుబడులు పడిపోయే ప్రమాదం ఏర్పడింది. విద్యుత్ సమస్యలను సత్వరం పరిష్కరించండి కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రదీప్కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్ భవన్లో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం ద్వారా వినియోగదారుల నుంచి ఫోన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలను సత్వరం పరిస్కరించి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని సంబంధిత ఈఈలు, డీఈఈలను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ వినియోగదారులకు అందుబాటులో ఉంటూ జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఈఈ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులను దగా చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
నంద్యాల(అర్బన్): రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి విమర్శించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ఉల్లి రైతులకు పరిహారం అందేలా ప్రభుత్వానికి నివేదికలు పంపాలని కోరుతూ సోమవారం పీజీఆర్ఎస్లో కలెక్టర్ రాజకుమారికి ఎమ్మెల్సీ ఇసాక్బాషా, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డితో కలిసి జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొక్కజొన్న క్వింటా రూ.2400తో కొనుగోలు చేస్తామని, కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు ప్రభుత్వం చెప్పినా నేటికీ ఏర్పాటు చేయలేదన్నారు. రైతులు దళారులకు క్వింటా రూ.1600 నుంచి రూ.1700తో అమ్ముకొని తీవ్రంగా నష్టపోయారన్నారు. రూ.28కోట్లు ఇవ్వాలి కడప, కర్నూలు జిల్లా రైతులు సాగు చేసిన ఉల్లి పంటకు పరిహారం అందించిన చంద్రబాబు ప్రభుత్వానికి నంద్యాల జిల్లా ఉల్లి రైతులు కనపడలేదా అని కాటసాని ప్రశ్నించారు. నంద్యాల జిల్లాలో 14వేల ఎకరాల్లో ఉల్లి సాగు అయ్యిందని, పంట నష్టపరిహారం కింద రూ.28కోట్లు రైతులకు రావాల్సి ఉందన్నారు. ఉల్లి రైతులకు నగదు జమ చేయకపోతే రైతుల పక్షాల పోరాటం చేయాల్సి ఉంటుందన్నారు. నిరాహార దీక్షలు చేస్తాం ఎమ్మెల్సీ ఇసాక్బాషా మాట్లాడుతూ.. రైతులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. నష్టపోయిన రైతులు ఎక్కడి వారికై నా పరిహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగాల భరత్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. నంద్యాల జిల్లా ఉల్లి రైతులకు రావాల్సిన రూ.28 కోట్ల పంట నష్టపరిహారం ప్రభుత్వం అందించకపోతే నిరహార దీక్షలు చేపడుతామన్నారు. వీరి వెంట పాణ్యం మాజీ జెడ్పీటీసీ సూర్యనారాయణరెడ్డి, గడివేముల జెడ్పీటీసీ సభ్యుడు చంద్రశేఖర్రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు సంఘం నాయకులు మహేశ్వరరెడ్డి ఉన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయాలి ఉల్లి రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి -
ఆసరా లేదు.. పింఛన్ ఇవ్వండి!
● జిల్లా కలెక్టర్కు అర్జీలు ఇచ్చిన వృద్ధులు, వితంతువులునంద్యాల: తనకు 62 ఏళ్ల వయస్సు ఉందని, ఎలాంటి ఆసరా లేదని, చిన్న పని కూడా చేయలేకపోతున్నానని, పింఛన్ ఇవ్వాలని ఆళ్లగడ్డ మండలం మెట్టపల్లె గ్రామానికి చెందిన కె. లక్ష్మీనరసయ్య అర్జీ ఇచ్చారు. తన భర్త అనారోగ్యంతో మృతి చెందారని, తనకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని ఆళ్లగడ్డ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన ఎం. ఓబులమ్మ వినతి పత్రం అందజేశారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ రాజకుమారి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అర్జీదారుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అధికారులు మరింత చొరవతో ప్రతి దరఖాస్తును నాణ్యతతో పాటు వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. రీ–ఓపెన్ అయిన దరఖాస్తులు, బియాండ్ ఎస్ఎల్ఏలో ఉన్న అర్జీలు, వీఐపీ గ్రీవెన్స్ లను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని వెంటనే పరిష్కరించాలన్నారు. పీజీఆర్ఎస్కు 151 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. -
గజవాహనంపై మద్దిలేటి స్వామి వైభవం
బేతంచెర్ల: ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను పురస్కరించుకొని ఆర్ఎస్ రంగాపురంలోని మద్దిలేటి స్వామి క్షేత్రంలో సోమవారం రాత్రి గజవాహన సేవ నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తుల మధ్య గజవాహనంపై స్వామిని క్షేత్ర పుర వీధుల్లో వైభవంగా ఊరేగించారు. వేడుకల్లో భాగంగా ప్రత్యేక మండపంలో మద్దిలేటి స్వామి ఉత్సవ మూర్తిని ప్రత్యేక అలంకారంలో కొలువుంచారు. సహస్రదీపాలంకరణ సేవ నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు పండితులు జ్వాలా చక్రవర్తి, కళ్యాణచక్రవర్తి పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణంలో గజవాహనంపై సత్యనారాయణ మూర్తి అలంకారంలో శ్రీ మద్దిలేటి నరసింహ స్వామిని కొలువుంచారు. భక్తజనం మధ్య మంగళవాయిద్యాలతో గజవాహనంపై ఊరేగింపు నిర్వహించారు. ఉపకమిషనర్ రామాంజనేయులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
బెలుం గుహలకు పర్యాటకుల తాకిడి
● రూ.1.30 లక్షల ఆదాయం కొలిమిగుండ్ల: భూగర్భంలో అవతరించిన బెలుం గుహల సహజ అందాలను తిలకించేందుకు పర్యాటకులు క్యూకట్టారు. ఆదివారం సెలవు దినం కావడంతో కర్ణాటకతో ఇతర ప్రాంతాల నుంచి యాత్రికులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గుహ లోపల పర్యాటకులతో రద్దీగా మారింది. గుహ లోపల ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అందాలను తిలకించి వాటి గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పర్యాటకులు ఎక్కువ మంది రావడంతో గుహలకు రూ.1.30 లక్షల మేర ఆదాయం సమకూరినట్లు సిబ్బంది తెలిపారు.నేడు కలెక్టరేట్ ఆవరణలో రెవెన్యూ క్లినిక్స్ ● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల(అర్బన్): జిల్లాలో ప్రజలు ఎదు ర్కొంటున్న వివిధ రెవె న్యూ సమస్యలకు త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ నెల 29వ తేదీన సోమవారం కలెక్టరేట్ ఆవరణలో జిల్లా స్థాయి రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలో ఏడు రెవెన్యూ క్లినిక్స్ ఏర్పాటు చేసి, ప్రజల నుంచి అర్జీలను నేరుగా స్వీకరించి నమోదు చేయడంతో పాటు, సమస్యల స్వరూపాన్ని బట్టి అక్కడికక్కడే పరిష్కార చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు హాజరై ప్రజలకు సేవలు అందిస్తారన్నారు. రెవెన్యూ, అడంగల్ సవరణలు, 22ఏ – చుక్కల భూముల క్రమబద్ధీకర ణ, అసైన్డ్ భూములు–భూ ఆక్రమణలు, రెవె న్యూ కోర్టు కేసులు, సర్వే–రీ సర్వే, దేవదాయ–వక్ఫ్ భూముల సమస్యలకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రజల అర్జీలకు వేగవంతమైన పరిష్కారం అందిస్తామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో ‘మీ ఇంటికి.. మీ డాక్టర్’ ● రెడ్క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహణ నంద్యాల(అర్బన్): జిల్లాలోని చెంచు గూడేల్లోని గిరిజనలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ‘మీ ఇంటికి మీ డాక్టర్’ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షురాలు రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, న్యూఢిల్లీకి చెందిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో అమలు చేయనుందన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు గవర్నర్ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించనున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టును మూడేళ్ల పాటు అమలు కానుందన్నారు. మొబైల్ హెల్త్ క్లినిక్ నిర్వహణ నిమిత్తం డాక్టర్, నర్స్, ఫార్మసిస్ట్, డ్రైవర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అర్హులైన వారు దరఖాస్తులను redcrossnandyal@gmail.com, redcrossap@gmail.comకు జనవరి 15లోపు పంపాలని సూచించారు. ఆదోని జిల్లా కోసం ఉద్యమం ఆదోని టౌన్: ఆదోని జిల్లా కోసం ఐక్యంగా ఉద్య మం చేస్తున్నామని జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు కృష్ణమూర్తిగౌడ్, వీరేష్, వీరేష్, రఘురామయ్య పేర్కొన్నారు. ఆదోని పట్టణంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 43వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదోనిని తక్షణమే జిల్లాగా ప్రకటించాలని, లేని పక్షంలో జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. నేడు డయల్ యువర్ ఎస్ఈ కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ భవన్లో సోమ వారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమా న్ని నిర్వహిస్తున్నట్లు సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆర్.ప్రదీప్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు తాము ఎదుర్కొ ంటున్న విద్యుత్ సమస్యలను 7382614308కు ఫోన్ చేసి చెప్పవచ్చన్నారు. -
శ్రీగిరి భక్తులకు ఆన్‘లైన్’కష్టాలు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం అధికారులు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్నా క్షేత్ర స్థాయిలో వెనకడుగు వేస్తున్నారు. శ్రీశైల దేవస్థానంలో గత మూడేళ్ల నుంచి అన్ని ఆర్జిత సేవలు పూర్తిగా ఆన్లైన్ ద్వారా మాత్రమే టికెట్స్ బుక్ చేసుకునే సదుపాయాన్ని ప్రవేశ పెట్టారు. దీంతో భక్తులు వారి ఇంటి నుంచే ఉభయ దేవాలయా ల్లో నిర్వహించే ఆర్జిత సేవలను దేవదాయ అధికారిక వెబ్ సైట్, శ్రీశైల దేవస్థాన అధికారిక వెబ్ సైట్ల ను వినియోగించుకుని టికెట్స్ బుక్ చేసుకుని, సేవ లు నిర్వహించుకుంటున్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత వాట్సాప్ గవర్నెస్ అంటూ మన మిత్ర (9552300009) వాట్సాప్ నంబర్ను ప్రవేశపెట్టింది. ఈ నంబర్కు ప్రజల నుంచి ప్రభుత్వం ఊహించిన స్పందన రాలేదు. దీంతో శ్రీశైల దేవస్థానం ప్రభుత్వ మెప్పు కోసం పాట్లు పడుతుందోనే విమర్శలు ఉన్నాయి. ఇందుకోసం దేవస్థాన ఈఓ ఆన్లైన్ సేవలపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి అధికారులకు మనమిత్ర వాట్సాప్ను భక్తులు విరివిరిగా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి త్వరితగతిన దర్శనం చేసుకునేలా వారికి ప్రత్యేక క్యూలు, లడ్డూ ప్రసాదాలు సైతం తీసుకునేందుకు కూడా ప్రత్యేక లైన్ ఏర్పాటు చేస్తున్నామని దేవస్థానం ప్రకటించింది. ఈ మేరకు క్షేత్ర పరిధిలో పలు చోట్ల ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకునేలా కియోస్క్లు, హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశా రు. ఆయా కేంద్రాల్లో శివసేవకులను ఏర్పాటు చేసి ఆన్లైన్లో బుక్ చేస్తున్నారు. గంటల తరబడి నిరీక్షణ.. ఓ వైపు ఆన్లైన్ బుకింగ్పై అవగాహన కల్పిస్తున్న దేవస్థానం అధికారులు ఆ మేరకు వసతులు కల్పించడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా రద్దీ రోజుల్లో కనీసం టైం స్లాట్ కూడా లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్ బుకింగ్ భక్తులకు ప్రత్యేక క్యూలైన్ ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. మన మిత్ర వాట్సాప్ నంబర్ ద్వారా భక్తులచే విస్తృతంగా ఆన్ లైన్లో టికెట్స్ బుక్ చేయ డం, దేవాదాయ శాఖ, శ్రీశైల దేవస్థాన అధికారిక వెబ్ సైట్లను వినియోగించుకుని ముందస్తుగా టిక్కె ట్లు బుక్ చేసుకున్న వారితో క్షేత్రంలో రద్దీ ఏర్పడింది. వరుస సెలవుల నేపథ్యంలో మల్లన్న దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో క్షేత్రంలో వసతి దొరక్క, దర్శనానికి గంటల తరబడి వేచి ఉండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆన్లైన్ భక్తులకు ప్రత్యేక క్యూలైన్ అని ప్రకటించినా.. అధికారు లు ఆ దిశగా ఏర్పాట్లు చేయకపోవడంతో క్షేత్రానికి వచ్చిన భక్తులు దేవస్థాన తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ మెప్పు కోసం భక్తులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నారు. శ్రీశైల వెబ్ సైట్, మన మిత్ర యాప్లో అధిక సంఖ్యలో బుకింగ్ రద్దీ రోజుల్లో కరెంట్ బుకింగ్లోనూ అదే పరిస్థితి టైం స్లాట్, ప్రత్యేక క్యూ లేక భక్తుల కష్టాలు -
నంద్యాల జిల్లాలో దయనీయం
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి నంద్యాల జిల్లాలో రియల్ ఎస్టేట్ పరిస్థితి దయనీయంగా మారింది. కొనేవారు లేక వ్యాపారులు అప్పులపాలవుతున్నారు. గతంలో రేట్లు భారీగా ఉన్న సమయంలో కొనుగోలు చేసిన తర్వాత అనుకోకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా రేట్లు భారీగా పతనమయ్యాయి. నంద్యాల పట్టణంలోని రైతు నగరంలో 2024కి ముందు ఎకరం రూ.6 కోట్ల వరకు విక్రయించారు. ప్రస్తుతం ఇదే ప్రాంతంలో రూ.3 కోట్లకు మించి ధర పలకడం లేదు. ప్రభుత్వ మెడికల్ కళాశాలకు కిలోమీటర్ దూరంలోనే ఈ ప్రాంతం ఉంది. ఏడాదిలో 50 శాతం రేట్లు పతనమవ్వడంతో దిక్కుతోచని పరిస్థితిల్లో వ్యాపారులు ఉన్నారు. ధరలు భారీగా పడడంతో అప్పుల్లో కూరుకుపోయిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకరు ఐపీ పెట్టి నంద్యాలను వదిలేసి వెళ్లిపోయారు. మరో ఇద్దరు వ్యాపారులు ఐపీ పెట్టే ఆలోచనలో ఉన్నారు. ● 2024–25కు సంబంధించి జిల్లాకు రూ.260.36 కోట్ల లక్ష్యంగా నిర్ణయిస్తే రూ.150.07 కోట్లు మాత్రమే సమకూరింది. రిజిస్ట్రేషన్ల ఆదాయం పెంచాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తుండడంతో రిజిస్ట్రార్లు ఆందోళనకు గురవుతున్నారు. ● గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2023–24లో రూ. 171.22 కోట్లు ఆదాయం వచ్చింది. ● ఒక్క ఏడాదిలోనే జిల్లాలో రూ. 21.05 కోట్ల ఆదాయం తగ్గింది. -
సంక్షోభంలో సర్కారు విద్య
నంద్యాల(న్యూటౌన్): సంస్కరణల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తుందని యూటీఎఫ్ రాష్ట్ర సహాయ అధ్యక్షుడు సురేష్కుమార్ విమర్శించారు. ఆదివారం స్థానిక నేషనల్ పీజీ కళాశాలలో యూటీఎఫ్ నాల్గవ జిల్లా జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగాన్నీ నిర్వీ ర్యం చేస్తుందన్నారు. ఉపాధ్యాయుడి బోధనా సమయాన్ని హరిస్తూ బోధనేతర కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నారన్నారు. వినూత్న పద్ధతులు అంటూ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం ఉపాధ్యాయులను వేధిస్తుందని విమర్శించారు. విద్యను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నుతుందన్నారు. కూటమి ప్రభు త్వం ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణే లక్ష్యమని అంటూ ప్రభుత్వ విద్యకు పాతర వేస్తుందని దుయ్యబట్టారు. జిల్లా యూటీఎఫ్ అధ్యక్ష పీవీ ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చాలన్నా రు. 2022 జూలై నుంచి 12వ పీఆర్సీని అమలు చేయాల్సినప్పటికీ రెండేళ్లు అవుతున్నా ఊసేలేదన్నారు. ఇప్పటి వరకు రూ.8500 కోట్లు మాత్రమే చెల్లించారని, మిగిలిన రూ.30 వేల కోట్లు చెల్లింపులపై స్పష్టత లేద న్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, యూటీఎఫ్ రాష్ట్ర సభ్యులు సుబ్బారెడ్డి, సుబ్బరాయుడు, సత్యప్రకాశం, ఐజ య్య, నాగస్వామి, నాయక్, సుజాత, బాబాఫకృద్దీన్, రామ్మోహన్, రామకృష్ణుడు, అరవిందకుమార్, దస్తగిరి, తదితరులు పాల్గొన్నారు. -
అప్పుల పాలయ్యాం
కర్నూలు, ఓర్వకల్లు, హుస్సేనాపురం, డోన్, కోడుమూరు తదితర ప్రాంతాల్లో వెంచర్లు వేసి నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా. ఏడాదికి దాదాపు రూ.25 కోట్ల వ్యాపారం జరిగేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రూ. లక్ష రూపాయలు కూడా చేతికి రావడం గగనమైంది. చేసిన అప్పులకు వడ్డీలు కొండలు పెరిగనట్లు పెరుగుతూ పోతున్నాయి. ఒక్క రకంగా చెప్పాలంటే దివాలా తీశాం. అయితే ఈ విషయం బయటకు చెప్పితే అప్పుదారులు మీద పడతారని తేలు కుట్టిన దొంగల్లాగా వ్యాపారంపై ఆశతో ఉన్నాం. – రామిరెడ్డి, కర్నూలు రెండున్నరేళ్ల క్రితం నూతన జిల్లా ఏర్పాటు సమయంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఆశాజనకంగా ఉంది. స్థలాలు, పొలాలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. కరోనా అనంతరం కూడా భూములకు ధరలు పలికాయి. గత ప్రభుత్వ హయాంలో సచివాలయాలు, జిల్లా కేంద్రాలు ఆసుపత్రుల ఏర్పాటుతో పాటు మూడు రాజధానులు అంటూ చేసిన ప్రచారాలతో రియల్ ఎస్టేట్ రంగం వెలిగి పోయింది. తాము పట్టుకున్నదంతా బంగారంలా కనిపించింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా అదే ఊపు ఉంటుందని భావించి మోసపోయాం. రూ. కోట్లు ఖర్చు పెట్టి కొన్న భూములు అమ్ముకోలేక భారీగా నష్టపోతున్నాం. – షేక్ షరీఫ్, రియల్టర్, విశ్వనగర్, నంద్యాల నిర్మాణ రంగం నిలిచి పోయింది. వారంలో రెండు మూడు రోజులు మాత్రమే పనులు దొరు కుతున్నాయి. ఇల్లు, భవన నిర్మాణాల పను ల వేగం తగ్గింది. రియ ల్ ఎస్టేట్ రంగం పుంజుకునేంత వరకు కార్మికులకు పనులు దొరికేలా లేవు. ఇల్లు గడవటం ఇబ్బందింగా మారింది. రెండేళ్ల క్రితం వరకు వారం రోజుల పాటు పనులు దొరికేవి. ఏడాది కాలంగా మూడు రోజుల పనితో సరి పెట్టుకోవాల్సి వస్తుంది. భవన నిర్మాణ కూలీలను ఆదుకోవాలి. – తిమ్మయ్య, భవన నిర్మాణ కార్మికుడు, నంద్యాల -
బోనోఫిక్స్ అక్రమంగా రవాణా చేస్తూ..
● పోలీసుల అదుపులో బాలుడు పాములపాడు: ఆత్మకూరు మండలం కరివేన గ్రామానికి చెందిన ఓ బాలుడు కర్నూలు నుంచి మత్తు పదార్థంగా వినియోగించే బోనోఫిక్స్ను అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. కరివేనకు చెందిన బాలుడు ఈనెల 27వ తేదీ రాత్రి మిత్రుడి (మైనర్)తో కలసి కర్నూలు నుంచి స్వగ్రామానికి బోనోఫిక్స్ను అక్రమంగా బైక్పై తరలిస్తూ మార్గమధ్యలో యర్రగూడూరు వద్ద నిలిచారు. స్థానిక సీపీడబ్ల్యూ స్కీం వద్ద మద్యం సేవిస్తుండగా అక్కడ విధులు నిర్వహిస్తున్న వాచ్మెన్ చాకలి వెంకటేశ్వర్లు వారిని గమనించి బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించవద్దని మందలించాడు. మత్తులో ఉన్న ఇద్దరు మైనర్లు ఆగ్రహంతో వాచ్మెన్పై దాడి చేసి గాయపరిచారు. వాచ్మెన్ కేకలు వేయడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకొని ఇద్దరిని పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడి వద్ద ఉన్న బ్యాగ్ను తనిఖీ చేయగా సుమారు 20కి పైగా బోనోఫిక్స్ ట్యూబ్లు ఉండటంతో అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఈ ప్రమాదకరమైన మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి తెస్తున్నాడు? ఎవరికీ ఇచ్చేందుకు వెళ్తున్నాడని విచారణ చేపట్టామన్నారు. మైనర్ కావడంతో మందలించి తల్లిదండ్రులకు అప్పగించామని, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఎస్ఐ తిరుపాలు తెలిపారు. -
నకిలీ వెబ్ సైట్ బారిన భక్తులు
ఆన్లైన్లో నకిలీ వెబ్సైట్ల బారిన పడి మల్లన్న భక్తులు మోసపోతూనే ఉన్నారు. తాజా గా ఉత్తరాది ప్రాంతానికి చెందిన గుజ్రాల్ అనే వ్యక్తి సైబర్నేరగాళ్ల బారినపడ్డాడు. శ్రీశైలం వచ్చే ముందుగానే అతను వసతి పొందేందుకు ఆన్లైన్లో ఆరా తీయగా సైబర్ నేరగాళ్లు అప్పటికే ఉంచిన నకిలీ మల్లికార్జున సదన్ పేరుతో ఉన్న లింక్ ను క్లిక్ చేసి మూడు గదులు బుక్ చేసుకున్నాడు. ఒక రూముకు రూ.1,750 చొప్పున మూడు రూములకు అద్దె, జీఎస్టీ కలిపి మొత్తం రూ.5,821 తన ఖాతా నుంచి జమ చేశాడు. శనివారం అతను కుటుంబీకులతో శ్రీశైలం వచ్చి మల్లికార్జున సదన్ వద్ద ఆన్లైన్లో బుక్ చేసుకున్న రశీదును చూపగా అది ఫేక్ అని తేలింది. దీంతో మోసపోయానని తెలుసుకుని లబోదిబోమన్నాడు. నెల క్రితం టూరిజం నకిలీ వెబ్ సైట్ పైన టూరిజం అధికారు లు తక్షణమే స్పందించి సదరు నకిలీ వెబ్ సైట్లను బ్లాక్ చేయించారు. కానీ దేవస్థానం అధికారులు మల్లికార్జున సదన్ అనే ఫేక్ వెబ్ సైట్ను ఎందుకు బ్లాక్ చేయించలేకపోతున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఎంతో భక్తిశ్రద్ధలతో శ్రీశైలానికి వస్తున్న భక్తులు నకిలీ వెబ్ సైట్లతో మోసపోవడం ఏంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వైభవంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ప్రారంభం
బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం శివార్లలో వెలసిన మద్దిలేటయ్య క్షేత్రంలో ఆదివారం ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఉద యం వేదపండితులు గోపూజ, స్వామివారికి విష్వక్సేనారాధన కోయిల్ ఆళ్వార్ తిరుమంజన పూజలు చేపట్టారు. సాయంత్రం రక్షాబంధనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, చతుస్థానార్చన, దీక్షా హోమం నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా మొదటి రోజు మద్దిలేటి నరసింహ స్వామి వారికి విశేష పుష్పాలంకరణతో పాటు సహస్ర దీపాలంకరణ సేవ, అష్టవిధ మహామంగళహారతి సేవ నిర్వహించారు. రాత్రి స్వామి వారు నారాయణ అవతారంలో సహస్ర దీపాలంకరణలో సేవలో భక్తులకు దర్శన మిచ్చారు. హనుమద్ వాహనంపై కొలువైన స్వామి వారు ఆలయ ఆవరణలో విహరించారు. -
విక్రాంత్ పాటిల్కు డీఐజీగా పదోన్నతి
కర్నూలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్ కు డీఐజీగా పదోన్నతి లభించింది. ఏపీ క్యాడర్కు చెందిన 16 మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఎస్పీగా ఉన్న విక్రాంత్ పాటిల్కు డీఐజీగా పదోన్నతి కల్పిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు వెలువడ్డాయి. 2026 జనవరి 1 నుంచి పదో న్నతి జీవో అమలులోకి వస్తుంది. అప్పటివరకు ఈయ న ఈ పదవిలోనే కొనసాగనున్నారు. 2012 ఐపీఎస్ అధికారి అయిన విక్రాంత్ పాటిల్ ఈ ఏడాది ఫిబ్రవరి 1న జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. బెటాలియన్స్, అనంతపురం డీఐజీగా ? ఏపీఎస్పీ బెటాలియన్స్ రేంజ్–2(కర్నూలు) డీఐజీ పోస్టు ప్రస్తుతం ఇన్చార్జ్ పాలనలో కొనసాగుతోంది. ఇక్కడ డీఐజీగా పనిచేసిన వెంకటేశ్వర్లు 2024 ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి గ్రేహౌండ్స్ డీఐజీ సీతారాం ఇన్చార్జిగా కొనసాగుతు న్నారు. ఆయన జనవరి 30న పదవీ విరమణ పొందనున్నారు. దీంతో విక్రాంత్కు బెటాలియన్స్ రేంజ్–2 డీఐజీగా, అనంతపురం రేంజ్ డీఐజీగా పోస్టింగ్ దక్కే అవకాశమున్నట్లు చర్చ జరుగుతోంది. అనంతపురం రేంజ్ డీఐజీగా ఉన్న షెమూషి ఐజీగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం కర్నూలు రెండో బెటాలియన్ కమాండెంట్గా ఎస్పీ సతీమణి దీపిక పాటిల్ విధులు నిర్వహిస్తున్నారు. స్పౌజ్ గ్రౌండ్ కింద విక్రాంత్ పాటిల్ను బెటాలియన్స్ డీఐజీగా నియమించే అవకాశముంది. ఆ నలుగురూ జిల్లాకు సుపరిచితులే జిల్లాలో పూర్వపు ఎస్పీలుగా పనిచేసిన శంకబ్రత బాగ్చి డీజీపీగా, గోపీనాథ్ జెట్టి, ఆదోని అదనపు ఎస్పీ గా పనిచేసిన డాక్టర్ షమూషి బాజ్పేయి, కర్నూలు రేంజ్ డీఐజీగా పనిచేసిన సెంథిల్ కుమార్లకు ఐజీలుగా పదోన్నతి లభించింది. ఈ నలుగురూ జిల్లాకు సుపరిచితులే. -
మద్దిలేటి క్షేత్రంలో భక్తుల రద్దీ
బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం శివారులో వెలసిన వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. పుష్య మాసంను పురస్కరించుకొని చిన్నారుల కేశఖండన స్వామి, అమ్మవార్ల దర్శనార్థం భారీగా భక్తులు వచ్చారు. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన నిర్వహించారు. స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజ చేశారు. శ్రీశైలం పాదయాత్ర మార్గం పరిశీలన ఆత్మకూరురూరల్: రానున్న మహాశివరాత్రి, ఉగాది పర్వదినాల సందర్భంగా నల్లమల గుండా శ్రీశైలానికి పాదయాత్ర ద్వారా వెళ్లే భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడంలో భాగంగా ఆత్మకూరు డీడీ విగ్నేష్ అపావ్ శనివారం మార్గ పరిశీలన చేశారు. వెంకటాపురం నుంచి ఆయన తన సిబ్బందితో కలసి పాదయాత్ర మార్గం వెంట పెచ్చెర్వు వరకు నడిచి వెళ్లారు. దారి వెంట పలు గూడేల్లో చెంచులతో మాట్లాడారు. వారికి అవసరమైన సదుపాయాలపై అవగాహన కల్పించారు. పెచ్చెర్వు చెంచు గూడెంలో అక్కడి యువకులతో కలసి తన సిబ్బందితో వాలీబాల్ ఆడారు. అనంతరం అక్కడి చెంచులతో ప్రత్యేకంగా సమావేశమై సూచనలు ఇచ్చి సలహాలు స్వీకరించారు. డీడీ వెంట ఎఫ్ఆర్వోలు ప్రణీత, కృష్ణప్రసాద్, అటవీ సిబ్బంది ఉన్నారు. గ్రామాల్లో ‘మొబైల్’ వైద్య పరీక్షలు గోస్పాడు: మొబైల్ ఐసీటీసీ వాహనంతో గ్రామాల్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. నంద్యాల డీఎంహెచ్ఓ కార్యాలయం ఆవరణలో శనివారం మొబైల్ ఐసీటీసీ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 104 వాహనంతో అనుసంధానం చేస్తూ గ్రామాల్లో హెచ్ఐవీ, సిఫిలిస్, టీబీ పరీక్షలు చేసేలా మొబైల్ వాహనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాలుగు నెలల కాలంలో ఈ సేవలు అందించనున్నట్లు చెప్పారు. అందుకు అనుగుణంగా సిబ్బంది ప్రణాళికలు తయారు చేయాలని, ఎయిడ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలన్నారు. జిల్లా లెప్రసీ ఎయిడ్స్ టీవీ అధికారి డాక్టర్ శారదాబాయి, డీసీహెచ్ఎస్ డాక్టర్ లలిత, అధికారులు అలీ హైదర్, సిబ్బంది పాల్గొన్నారు. పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి గడివేముల: పదో తరగతి విద్యార్థులకు వందరోజుల ప్రణాళికను కచ్చితంగా అమలు చేసి వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయులను నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ఆదేశించారు. గడివేముల మండలం గడిగరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను శనివారం తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఉన్నత పాఠశాల హెచ్ఎం చంద్రావతి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఐక్యంగా సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం
● హిందూ సమ్మేళనంలో వక్తలుహొళగుంద: ఐక్యంగా సనాతన ధర్మాన్ని కాపాడుకుందామని స్వాములు, ధార్మిక ఉపన్యాసకులు, వక్తలు పిలుపునిచ్చారు. హొళగుందలోని సిద్ధేశ్వరస్వామి ఆలయ ఆవరణలో జ్యోతి వెలిగించి శనివారం హిందూ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జగద్గురు శ్రీమరి కొట్టూరు దేశకరు స్వామి (శ్రీధరగడ్డ) హాజరయ్యారు. సమ్మేళనంలో తుముకూరుకు చెందిన ఎం, బాలచంద్ర, బెంగళూరుకు చెందిన హారిక మంజునాథ్, సురేంద్ర మాట్లాడారు. అన్ని మతాలు, ప్రాంతాలు బాగుండాలని కోరే ఏకై క దేశం భారతదేశమన్నారు. ఇందుకు ఇక్కడి ప్రజలు నమ్ముకున్న సనాతన ధర్మమే కారణమన్నారు. చత్రపతి శివాజీ, ఆయన తనయుడు చత్రపతి సంభాజీలాంటి మహానీయుతో నేడు సనాతన ధర్మం మనుగడలో ఉందన్నారు. సమ్మేళనంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
స్థలం కబ్జా చేసిన మంత్రి కుటుంబ సభ్యులు
● బాధితుల ఆవేదనబొమ్మలసత్రం: మంత్రి ఎన్ఎమ్డీ ఫరూక్ కుటుంబ సభ్యులు తమ స్థలాన్ని కబ్జాచేసి అక్రమంగా షెడ్లు నిర్మించారని, అధికారులు తమకు న్యాయం చేయాలని బాధితులు భవనాశి వాసు, నూర్బాషా , వెంకటన్న, బాబులాల్ వేడుకున్నారు. మంత్రి కుటుంబ సభ్యుల స్థలం 700 సర్వే నంబర్లో ఉండగా తప్పుడు దిశల ఆధారంగా పద్మావతినగర్లోని 706ఏ/9 సర్వే నంబర్ను చూపుతూ ఇదే తమ స్థలం అని చెప్పడం భావ్యం కాదన్నారు. సుప్రీంకోర్టు ఉత్త్తర్వుల మేరకు పద్మావతినగర్లోని ఈ స్థలానికి ఫరూక్ కుటుంబ సభ్యులు, భాధితులను సమక్షంలో మున్సిపల్, రెవెన్యూ అధికారులు శనివారం కొలతలు వేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. ఈ సర్వే నంబర్లో 1.16 ఎకరాలు ఉండగా అందులో 58 సెంట్లు కరీమ్బీ, 58 సెంట్లు అశాబీకి 1968లో తల్లి సారంబీ ద్వారా సంక్రమించిందన్నారు. వారి నుంచి తాము కొనుగోలు చేశామన్నారు. అయితే ఈ స్థలం తమదేనని మంత్రి కుటుంబ సభ్యులు అడ్డుపడుతుండటంతో సుప్రీం కోర్టుకు వెళ్లగా స్థలాన్ని తేల్చాలాని సర్వేయర్లకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. స్థల వివాదం కోర్టులో ఉండగా మంత్రి కుటుంబ సభ్యులు నిర్మాణాలు చేపట్టి అద్దెకు ఇవ్వడం సరైందికాదన్నారు. న్యాయశాఖ మంత్రి కుటుంబ సభ్యులే అన్యాయానికి పాల్పడితే తమ బాధ ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. -
రైతులకు కడ‘గండ్లు’
రుద్రవరం: తెలుగుగంగ ఉప ప్రధాన కాల్వకు పడిన గండ్లను అలాగే వదిలేయడంతో రైతులకు నష్టాలే మిగిలాయి. ఖరీఫ్లో చేతికొచ్చిన పంటను కోయకుండా పొలాల్లో వదిలేశారు. విత్తనం వేయాల్సిన పొలాలను బీళ్లుగా ఉంచుకున్నారు. రుద్రవరం మండల పరిధిలోని టి.లింగందిన్నె–ఆర్. నాగులవరం మధ్య 22వ బ్లాక్ తెలుగుగంగ ఉప ప్రధాన కాల్వకు 10మీటర్ల మేర గండి పడింది. టీజీపీ అధికారులు తూతూ మంత్రంగా ఐదు మట్టి సంచులు అడ్డుగా వేసి చేతులు దులుపుకున్నారు. ఆ మట్టి సంచులు కరిగిపోయి తిరిగి గండి ఏర్పడింది. దీంతో నీరంతా వరి పొలాలను ముంచెత్తింది. పంట కాలం పూర్తి అయినా కోతలు కోయించుకోలేక 60 ఎకరాల్లో వరిని అలాగే రైతులు వదిలేశారు. విత్తనం వేయాల్సిన పొలాలు అన్నీ జలమయం కావడంతో సేద్యాలు చేసుకోలేక అలాగే బీళ్లుగా వదిలేశారు. -
29న ‘రెవెన్యూ’ క్లినిక్స్
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల(అర్బన్): రెవెన్యూ సంబంధిత సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించాలనే ఉద్దేశంతో ఈ నెల 29వ తేదీ సోమవారం కలెక్టరేట్ ఆవరణలో జిల్లా స్థాయి రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలో మొత్తం ఏడు రెవెన్యూ క్లినిక్స్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ క్లినిక్స్లో ప్రజల నుంచి రెవెన్యూ సంబంధిత అర్జీలను స్వీకరించి, వాటిని నమోదు చేసి, సమస్యల స్వరూపాన్ని బట్టి అక్కడికక్కడే పరిష్కార చర్యలు చేపడతామన్నారు. ఇందుకోసం సంబంధిత విభాగాలకు చెందిన ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. శ్రీశైల క్షేత్రానికి ఒకే రోజు రూ.1.4 కోట్ల ఆదాయం శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానానికి ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా శుక్రవారం ఒక్క రోజురూ.1,46,94,825 ఆదాయం వచ్చిందని శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్నాయుడు, కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో స్పర్శదర్శనం, రూ. 300 అతి శీఘ్రదర్శనం, రూ. 150 శీఘ్రదర్శనం టికెట్లను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. మొత్తం 14 ఆర్జితసేవలకు సంబంధించిన టికెట్లు కూడా ఆనన్లైన్న్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మనమిత్ర వాట్సాప్ 9552300009 ద్వారా దర్శనం, ఆర్జితసేవలు పొందే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా శుక్రవారం దేవస్థానానికి రూ. 73,19,314, ఆఫ్లైన్ ద్వారా రూ.73,75,511 ఆదాయం వచ్చిందన్నారు. -
తిరుగు ప్రయాణం.. విషాదం
● ఆటోను ఢీకొన్న కారు ● ఇద్దరు మృతి ● మృతులు అనంతపురం జిల్లా వాసులు ప్యాపిలి: బంధువుల ఇంట్లో క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకుని స్వగ్రామానికి బయలుదేరిన వారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు గ్రామానికి చెందిన రాజేశ్ (32), నవీన్ (28) తమ కుటుంబాలతో కలసి క్రిస్మస్ వేడుకలకు ప్యాపిలిలో బంధువుల ఇంటికి వచ్చారు. క్రిస్మస్ వేడుకలను సంతోషంగా జరుపుకున్న అనంతరం శనివారం వారి స్వగ్రామానికి ఆటోలో బయలుదేరారు. పోతుదొడ్డి వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీ కొట్టింది. ఆటో పల్టీలు కొట్టడంతో అందులో ఉన్నవారంతా చెల్లాచెదురుగా పడిపోయారు. తీవ్రంగా గాయపడిన రాజేశ్, నవీన్ను చికిత్స నిమిత్తం అనంతపురం జిల్లా గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ప్రమాదంలో రాజేశ్ భార్య కళావతి, కుమార్తె వర్షిణి, నవీన్ భార్య స్వీటికి స్వల్ప గాయాలయ్యాయి. ఇంటి పెద్దలను కోల్పోవడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన భర్తల మరణాన్ని భార్యలు కళావతి, స్వీటి జీర్ణించుకోలేక పోతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన నవీన్, రాజేశ్ -
ఎందుకూ ఉపయోగపడటం లేదు
ఖరీఫ్లో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాం. రబీలో కూడా వేస్తున్నాం. ప్రభుత్వం సీసీఆర్సీ కార్డు కూడా మంజూరు చేసింది. అయితే కౌలుదారు ఆర్థిక చేయూతకు ఏమాత్రం తోడ్పడటం లేదు. అన్నదాత సుఖీభవ కూడా రాలేదు. బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడం లేదు. కనీసం కార్డుపైన యూరియా కూడా తీసుకోలేకపోతున్నాం. ప్రభుత్వం చొరవ తీసుకొని కౌలు రైతులకు అన్ని రకాల ప్రయోజనాలు వర్తింపజేయాలి. – ఉప్పరి కాశయ్య, బోయరేవుల గ్రామం, వెలుగోడు మండలం సీసీఆర్సీ కార్డులు పొందిన సాగుదారులకు రుణాలు ఇవ్వలేం. కర్నూలు మండలం పసుపల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా 366 మంది కౌలు రైతులకు రుణాలు పంపిణీ అయ్యాయి. ఇందులో 359 మంది రైతులు రుణాలు చెల్లించలేదు. మొత్తంగా రూ.144.18 లక్షలు నిరర్థక ఆస్తుల్లోకి వచ్చింది. అందువల్ల రుణాలు ఇవ్వలేకపోతున్నాం. – గత నవంబర్ 21న డీసీసీ/డీఎల్ఆర్సీ సమావేశంలో ఎల్డీఎం రామచంద్రరావు -
రౌడీషీటర్ తులసికుమార్ జిల్లా బహిష్కరణ
కర్నూలు: కర్నూలు నాలుగో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని శరీన్ నగర్లో నివాసముంటున్న కిరాయి హంతకుడు వడ్డె రామాంజినేయులు పెద్ద కుమారుడైన రౌడీషీటర్ వడ్డె తులసి కుమార్ (షీట్ నెం.389)పై జిల్లా కలెక్టర్ ఎ.సిరి జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతను ఐదు క్రిమినల్ కేసుల్లో నిందితుడు. పలుమార్లు జైలుకు వెళ్లినప్పటికీ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోగా రకరకాల కేసుల్లో పాల్గొంటున్నాడు. ఈ మేరకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రతిపాదనలతో క్రిమినల్ రికార్డులు పరిశీలించి కలెక్టర్ శనివారం ఇతనిపై జిల్లా బహిష్కరణ ఉత్తర్వు లు జారీ చేశారు. ఈయన తండ్రి వడ్డె రామాంజినేయులు అలియాస్ వడ్డె అంజి, అదే కాలనీలో నివాసముంటున్న పఠాన్ ఇమ్రాన్ ఖాన్పై కూడా ఈనెల 11న జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ కావడంతో జైలు జీవితం గడుపుతున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అలవాటు పడిన మరో 15 మంది పేర్లు కూడా జిల్లా బహిష్కరణ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. -
వేగంగా పాత గేట్ల తొలగింపు పనులు
హొళగుంద: తుంగభద్ర జలాశయంలో 33 పాత గేట్ల తొలగింపు పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనులు పూర్తవగానే నెలలో ఆరు గేట్ల ప్రకారంగా కుడి, ఎడమ, మద్య భాగాలలో మొత్తం మూడు బృందాలు 2026 మే నెల కల్లా 33 గేట్ల బిగింపు పనులు పూర్తి చేస్తారు. పనులకు వీలుగా డ్యాంలో నీటిని నదికి వదిలి నిల్వ సామర్థ్యాన్ని 40 టీఎంసీల వరకు తగ్గించారు. డ్యాంకు శనివారం ఇన్ఫ్లో నిలిచిపోయింది. జనవరి 10 లేదంటే మరి కొద్ది రోజులు మాత్రమే కాలువలకు నీటిని వదలనున్నారు. అనంతరం నీటి సరఫరా బంద్ చేయనున్నారు. ప్రస్తుతం దిగువ కాలువ 250 కి.మీ వద్ద 647 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. రూ.1.50లక్షలు పలికిన పొట్టేలు! కోసిగి: పందెం పొట్టేలు రూ.1.50 లక్షలు పలికింది. మండల కేంద్రం కోసిగిలోని శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ యజమాని గవిగట్టు నారాయణ, కృష్ణ ఈ ఏడాది దేవర ఉత్సవాల కోసం మార్చిలో రూ.40వేలకు ఓ పొట్టేలు కొని పెంచుకున్నారు. రోజూ లీటరు పాలు, 4 కోడిగుడ్లు, కేజీ ఉలువలను ఆహారంగా అందించారు. ఉత్సవాలు వచ్చే ఏడాదికి వాయిదా పడడంతో విక్రయించాలని నిర్ణయించుకోగా, మద్దికేర మండలం ఆగ్రహానికి చెందిన ఈరన్న అనే రైతు రూ.1.50లక్షలకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం దీని బరువు 120 కేజీలు. -
మహిళ అదృశ్యం
కృష్ణగిరి: కోయిలకొండ గ్రామానికి చెందిన బోయ కొసనాపల్లె లక్ష్మీదేవి(45) రెండు రోజుల నుంచి కనిపించడం లేదని ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు. గ్రామానికి చెందిన కొసనాపల్లె సుంకన్న, లక్ష్మీదేవి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అయితే గత కొంత కాలంగా లక్ష్మీదేవికి మానసికస్థితి సరిగాలేక గతంలో పలుమార్లు ఇంటి నుంచి చెప్పకుండా వెళ్లి తిరిగి వస్తుండేది. కానీ ఈ నెల 24న ఉదయం ఇంటి నుంచి బయలు దేరి డోన్కు చేరుకుని అక్కడి నుంచి బస్సులో కర్నూలు వైపు వెళ్లినట్లు కుటుంబీకులు తెలుసు కుని విచారించినా ఆచూకీ లభించలేదు. దీంతో భర్త సుంకన్న పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. 5.2 అడుగుల ఎత్తు, నలుపు రంగు ఉండి, ఇంటి నుంచి వెళ్లినప్పుడు వంకాయపూత కలర్ చీర, నెత్తిన తెల్ల టవాలు వేసుకుని వెళ్లిందన్నారు. ఎవరైనా గుర్తిస్తే వెల్దుర్తి సీఐ 9121101118, కృష్ణగిరి ఎస్ఐ 9121101117కు సమాచారం ఇవ్వాలన్నారు. ప్యాపిలిలో రెండిళ్లలో చోరీ ప్యాపిలి: పట్టణంలోని స్థానిక హుసేనాపురం వీధిలో గురువారం తెల్లవారుజామున రెండిళ్లలో చోరీ జరిగింది. పట్టణానికి చెందిన సూర్యనారాయణ రెడ్డి ఇంటి తాళాలు పగులగొట్టిన దుండగులు 2.5 తులాల బంగారు నగలు, 20 తులాల వెండి నగలు చోరీ చేశారు. ఇదే వీధిలో ఉంటున్న పెద్దయ్య ఇంట్లో చొర బడి అర తులం బంగారు, 10 తులాల వెండి అపహరించారు. సూర్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి కొద్ది రోజుల క్రితం కాశీకి వెళ్లాడు. గురువారం తిరిగి వచ్చిన ఆయ న ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెద్దయ్య కూడా కుటుంబ సభ్యులతో కలసి బంధువుల ఊరికి వెళ్లాడు. మరో రెండు ఇళ్లలోనూ దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ వెంకటరామిరెడ్డి, ఎస్ఐ నాగార్జున దొంగతనం జరిగిన ఇళ్లను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం కోడుమూరు రూరల్: కర్నూలు – కోడుమూరు రహదారిలో ప్యాలకుర్తి విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్యాలకుర్తి చెందిన గౌరయ్య కుమారుడు రెడ్డిపోగు యశ్వంత్ (27), సంగాల నాగేష్ క్రిస్మస్ సందర్భంగా బట్టలు కొనేందుకు కోడుమూరుకు బైక్పై బయలుదేరారు. ఇదే సమయంలో కర్ణాటక నుంచి శ్రీశైలం వైపు వెళ్తున్న కారు మార్గమధ్యలో ప్యాలకుర్తి విద్యుత్ సబ్స్టేషన్ వద్ద బైక్ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న యశ్వంత్, నాగేష్కు తీవ్ర గాయాలవ్వగా, చికిత్స నిమిత్తం కర్నూ లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక యశ్వంత్ మృతిచెందాడు. మృతుడికి ఇంకా వివాహం కాలేదు. కాగా క్రిస్మస్ పండుగ వేళ ప్యాలకుర్తి గ్రామానికి చెందిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, మరొక యువకుడు తీవ్రంగా గాయపడడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి తండ్రి గౌరయ్య ఫిర్యాదు మేరకు కోడుమూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిపై కత్తితో దాడి బొమ్మలసత్రం: మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడి కత్తితో దాడి చేసుకున్న సంఘటన గురువారం నంద్యాల పట్టణంలో చోటు చేసుకుంది. త్రీటౌన్ పోలీసులు తెలిసిన వివరాల మేరకు.. దేవనగర్కు చెందిన సుంకన్న, విజయ్ స్నేహితులు. ఇద్దరు కలిసి మధ్యాహ్నం మద్యం సేవించి మద్యం మత్తులో ఘర్షణ పడ్డా రు. ఈ క్రమంలో విజయ్ తన వద్ద ఉన్న కత్తితో సుంకన్నను కడుపులో పొడిచాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని స్థానికులు నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పో లీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
దక్షిణ భారత సైన్స్ ఫేర్కు జహీర్
ఆత్మకూరు: దక్షిణ భారత సైన్స్ ఫేర్కు ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి జహీర్ ఎంపిౖకై నట్లు హెచ్ఎం దేవానందన్ గురువారం తెలిపారు. విజయవాడలో ఈనెల 23 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి విద్యా ప్రదర్శనలో జహీర్ ఓవర్లోడ్ వార్నింగ్ అండ్ రిపోర్టింగ్ సిస్టం ఇన్ టూ వీలర్ (ద్విచక్ర వాహనాల్లో అధిక బరువును గుర్తించి హెచ్చరించే వ్యవస్థ) అనే నమూనాను ప్రదర్శించినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు జనవరి 19 నుంచి 26వ తేదీ వరకు హైదరాబాద్లో జరగనున్న దక్షిణ భారత సైన్స్ ఫేర్లో ప్రదర్శించడానికి ఎంపికై ందన్నారు. -
పంచాయతీ కార్యాలయంలో తరగతి గదులు
రుద్రవరం మండలంలోని చందలూరు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని తరగతి గదులుగా మార్చు కున్నారు. కొద్ది నెలల నుంచి ఇక్కడే తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో వంద మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. వారికి ఐదుగురు ఉపాధ్యాయులు చదువులు చెబుతున్నారు. ప్రాథమిక పాఠశాలకు ఐదు గదులు అవసరం కాగా కేవలం మూడు మాత్రమే ఉన్నాయి. అవి కూడా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించినవే. మిగిలిన రెండు తరగతులకు గదులు లేక పంచాయతీ కార్యాలయాన్ని వాడుకుంటున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పాఠశాలలో అదనపు తరగతి గదులు నిర్మించి తగిన వసతులు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. – రుద్రవరంపంచాయతీ కార్యాలయంలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్న దృశ్యం -
విద్యతోనే అభివృద్ధి సాధ్యం
కోర్టులో పోలీసుల తీరు సరికాదు ● జిల్లా జడ్జికి ఫిర్యాదు చేస్తాం ● నేడు విధులను బహిష్కరిస్తాం ● పత్తికొండ న్యాయవాదులు పత్తికొండ: కోర్టు హాల్లో పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని బార్ అసోసియేషన్ ఆధ్యక్షుడు మధుబాబు, సీనియర్ న్యాయవాదులు మైరాముడు, అమరావతి సత్యనారాయణ, నరసింహ ఆచారి అన్నారు. పత్తికొండ పట్టణంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో గురువారం న్యాయవాదులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా వారు మాట్లాడుతూ.. గంజాయి కేసులో నిందితునిగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడం కోసం కోర్టు హాల్లోకి పోలీసులు రావడం న్యాయస్థానాన్ని అవమానపరచడమేనన్నారు. పత్తికొండ, చిప్పగిరి ఎస్ఐలతో పాటు పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. కర్నూలు జిల్లా పరిధిలోని అన్ని కోర్టుల్లో విధులను శుక్రవారం న్యాయవాదులు బాయ్కాట్ చేస్తున్నట్లు తెలిపారు. పోలీసుల చర్యలు తీసుకోవాలని జిల్లా జడ్జికి పత్తికొండ న్యాయవాదులు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్శాఖ తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాదులు సురేంద్రకుమార్, మల్లికార్జున, కృష్ణయ్య, జఠంగిరాజు, నెట్టేకల్, లక్ష్మణస్వామినాయుడు, నాగలక్ష్మయ్య, వాసుదేవనాయుడు, శ్రీనువాసరెడ్డి, రజాక్ తదితరులు పాల్గొన్నారు. నేడు న్యాయవాదులు విధులకు దూరం కర్నూలు: కోర్టులోకి పోలీసులు అక్రమంగా ప్రవేశించి ఓ నిందితుడిని బలవంతంగా ఎత్తుకెళ్తూ న్యాయ వాదిని అవమాన పరిచిన ఘటనకు నిరసనగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు తమ విధులను బహిష్కరిస్తున్నట్లు కర్నూలు జిల్లా న్యాయ వాదుల సంఘం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. చిప్పగిరి, పత్తికొండ ఎస్ఐలపై కఠిన చర్యలు తీసుకోవాలని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు హరినాథ్ చౌదరి, వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మెంటార్లుగా జిల్లా, మండల స్థాయి అధికారులు కర్నూలు సిటీ: పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఉన్నత పాఠశాలలకు మెంటార్లుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా, మండల స్థాయి అధికారులను నియమించారు. జిల్లాలోని 361 ఉన్నత పాఠశాలలకు నియమించిన మెంటార్లతో నేటి(శుక్రవారం) ఉదయం 9.30 గంటలకు సునయన ఆడిటోరియంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.సుధాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పది పరీక్షల ఫలితాల పెంపునకు 100 రోజుల ప్రణాళికలో భాగంగా మెంటార్లకు కేటాయించిన పాఠశాలల్లో పునరావృత బోధన, పునశ్చరణ, సాధన పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారన్నారు. అదేవిధంగా పిల్లలను ప్రోత్సహించడం, క్రమ శిక్షణ పెంపొందించడం, పరీక్షలకు సన్నద్ధం చేస్తారన్నారు. కుక్కను తప్పించబోయి.. గోనెగండ్ల: అయ్యకొండ గ్రామ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గోనెగండ్లకు చెందిన గుల్ల మొరుసు నాగేష్(35), ప్రభుతో పాటు మరో ఇద్దరు దేవనకొండ మండలంలోని లక్కందిన్నె గ్రామంలో పెయింట్ పనులు చేసేందుకు బుధవారం ఉదయం బైకులపై వెళ్లారు. పనులు ముగించుకొని రాత్రి గోనెగండ్లకు బయలు దేరారు. నాగేష్, ప్రభు ఒక బైకుపై వస్తుండగా మార్గమధ్యలో గోనెగండ్ల మండలం అయ్యకొండ గ్రామ సమీపంలో రోడ్డుపై ఉన్న కుక్కను తప్పించబోయి అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడ్డారు. దీంతో నాగేష్ తలకు తీవ్ర గాయమైంది. ప్రభు ఎడమ కాలు విరిగింది. అటుగా వెళ్తున్న వాహనదారులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని గోనెగండ్ల ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నాగేష్ను కర్నూలు ఆస్పత్రికి, ప్రభును ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు. నాగేష్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ప్రభు ఎమ్మిగనూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడు నాగేష్కు భార్య సుశీల, నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. మృతిని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చిరంజీవి తెలిపారు. ఇంటి పెద్దదిక్కు చనిపోవడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరును చూసిన కాలనీ వాసులు కంటతడి పెట్టుకున్నారు. పట్టుబడిన మద్యం ధ్వంసం డోన్ టౌన్: రూరల్ పోలీ సు స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యా న్ని పోలీసులు ధ్వంసం చేశారు. ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారులతో కలిసి గురువారం పట్టణ సమీపంలో ధ్వంసం చేసినట్లు రూరల్ పోలీసు స్టేషన్ సీఐ సీఎం రాకేష్ తెలిపారు. ఇందులో 30 కేసులకు సంబంధించిన వాటిలో 90 ఎంఎల్ టెట్రా ప్యాకెట్లు 7,732, 526 క్వాటర్ బాటిళ్లు, 40 పుల్ బాటిళ్లతో పాటు 295 లీటర్ల నాటుసారా మొత్తం కలిపి దాదాపు 820.56 లీటర్ల అక్రమ మద్యాన్ని ధ్వంసం చేసినట్లు సీఐ తెలిపారు. అంతర్ జిల్లా దొంగల అరెస్ట్ బత్తలపల్లి: రద్దీగా ఉన్న ప్రదేశాలను ఎంచుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగలను అరెస్ట్ చేసినట్లు ధర్మవరం డీఎస్పీ హేమంత్కుమార్ తెలిపారు. బత్తలపల్లి పీఎస్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. బత్తలపల్లి మండలం కాటమకుంట గ్రామానికి చెందిన దొడ్డావుల ఆదిలక్ష్మి ఈ నెల 23న బత్తలపల్లిలో ధర్మవరం వెళ్లేందుకు బస్సు ఎక్కుతుండగా ఆమె బ్యాగులో నుంచి నాలుగు తులాల బంగారం గొలుసును దుండగులు అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీఐ ప్రభాకర్ నేతృత్వంలో బత్తలపల్లి ఎస్ఐ సోమశేఖర్, తాడిమర్రి ఎస్ఐ కృష్ణవేణి ఆధ్వర్యంలో బృందాలుగా విడిపోయి సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో పక్కా ఆధారాలతో కర్నూలు జిల్లా ఆదోని పట్టణ బైపాస్ రోడ్డులో ఉన్న భరత్నగర్లో నివాసముంట్ను కోటయ్య (డ్రైవర్), పిలీషా (క్లిప్పులు, హెయిర్ బ్యాండ్లు అమ్మకం), శాంతి (హోటల్లో కూలి)తో పాటు ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో నేరాన్ని అంగీకరించారు. వీరి నుంచి 12 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బాలలను జువైనల్ హోంకు అప్పగించి, నిందితులపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు. కర్నూలు(అర్బన్): విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కురువ సంఘం నేతలు అన్నారు. గురువారం నగర శివారుల్లోని శ్రీ భీర లింగేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఇటీవల పోలీస్, ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన ఉమ్మడి కర్నూలు జిల్లాలో కురువ సామాజిక వర్గానికి చెందిన వారి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలోనే 2026 నూతన సంవత్సర కేలండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పత్తికొండ శ్రీనివాసులు, ఎంకే రంగస్వామి, జిల్లా గొర్రెల మేకల సహకార సంఘం చైర్మన్ కేఏ శ్రీనివాసులు, కల్లూరు సింగిల్ విండో చైర్మన్ పర్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కురువలు తమ పిల్లల విద్యపై అధిక దృష్టిని సారించాలన్నారు. అలాగే రాజకీయంగా కూడా కురువలు రాణించాలన్నారు. రానున్న స్థానిక సంస్ఘల ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక స్థానాల్లో కురువలు పోటీ చేసి విజయం సాధించాలన్నారు. నూతనంగా ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. ముఖ్యంగా కురువలు ఐకమత్యంగా ఉండాలని, ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించుకోవచ్చన్నారు. భీర లింగేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో నిర్మిస్తున్న కళ్యాణ మండపాన్ని అన్ని హంగులతో పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షులు కే కిష్టన్న, దిశా కమిటీ సభ్యులు దేవశంకర్, కురువ కార్పొరేషన్ డైరెక్టర్ కే రామకృష్ణ, నాయకులు కేసీ నాగన్న, బీ రామకృష్ణ, మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీలీలమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం నేతలు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగాలు పొందిన వారికి భక్త కనకదాసు జ్ఞాపికలు అందించి ఘనంగా సన్మానించారు. -
భక్తులకు బిల్లు ఇవ్వకుండా..
● దేవస్థాన మల్లికార్జున సదన్ కౌంటర్ ఉద్యోగి నిర్వాకం శ్రీశైలంటెంపుల్: స్థానిక మల్లికార్జున సదన్ ఉద్యోగి దేవస్థానం ఆదాయానికి గండి కొట్టారు. ఉత్తరాఖాండ్కు చెందిన హిందీ భక్తులు కుటుంబ సమేతంగా శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనార్థం శ్రీశైలం వచ్చారు. వీరు బుధవారం రాత్రి వసతి కోసం మల్లికార్జున సదన్ వద్దకు వచ్చి డార్మెంటరీ కావాలని అడిగారు. కౌంటర్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి తన వక్రబుద్ధికి పని చెప్పాడు. డార్మెంటరీలో ఒక రోజుకు ఒక బెడ్ రుసుము రూ.250 చెల్లించాలి. ఈ లెక్కన వారి వద్ద నుంచి రూ.1,750 తీసుకోవాలి. అలాగే అడ్వాన్స్ సైతం తీసుకోవాలి, వారికి బిల్లు ఇవ్వాలి. అయితే ఆ కౌంటర్లో విధులు నిర్వహిస్తున్న సదరు ఉద్యోగి వారి వద్ద నుంచి రూ.2 వేలు తీసుకుని, బిల్లు ఇవ్వకుండా, ఆ డబ్బును తన జేబులోకి వేసుకున్నట్లు సమాచారం. హిందీ భక్తులు బెడ్ తీసుకుని రాత్రి నిద్రపోయి ఉదయం ఫ్రెష్అప్ కూడా అయ్యారు. రాత్రి కౌంటర్లో విధులు నిర్వహించిన వ్యక్తి గురువారం ఉద యం తన విధులు ముగించుకుని మరో ఉద్యోగికి విధులు అప్పగించారు. ఉదయం 10 గంటల సమయంలో డార్మెంటరీ తీసుకునేందుకు భక్తులు వచ్చా రు. ఖాళీగా ఉండడంతో డార్మెంటరీని బిల్లు కొట్టి ఇతర భక్తులకు ఇచ్చాడు. అయితే అక్కడికి వెళ్లి చూసే సరికి ఆ బెడ్ల మీద ఇతరులు ఉండడంతో కౌంటర్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో కంగుతిన్న కౌంటర్ సిబ్బంది విచారించగా రాత్రి విధులు నిర్వహించిన ఉద్యోగి బిల్లు కొట్టలేదని తెలిసింది. దీంతో వారిని బయటికి పంపించి, బిల్లు తీసుకున్న వారిని డార్మెంటరీలోకి అనుమతించారు. ఈ విషయం తెలుసుకున్న రాత్రి విధులు నిర్వహించిన కౌంటర్ ఉద్యోగి హుటాహుటిన మల్లికార్జున సదన్ వద్దకు చేరుకుని హింది భక్తులతో బతిమిలాడుకుని, తనపై ఫిర్యాదు చేయకుండా వారిని ఒప్పించి, వారి డబ్బులు తిరిగి చెల్లించినట్లు సమాచారం. అయితే వసతి విభాగంపై ఉన్నతాధికారి, వసతి విభాగపు అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
అడవిలోకి వెళ్లని పులి
● నదీతీర ప్రాంత గ్రామాల్లో అటవీ సిబ్బంది గస్తీఆత్మకూరురూరల్: నాగార్జునసాగర్ – శ్రీశైలం పెద్దపులుల అభయారణ్య పరిధిలోని ఆత్మకూరు డివిజన్ సంగమేశ్వరం ప్రాంతం నుంచి వచ్చిన పెద్దపులి కృష్ణా నదిని ఈదుతూ దాటి తెలంగాణాలోని అమ్రాబాద్ పులుల అభయారణ్యం వైపు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ పులి నదికి ఆవల సోమశిల తదితర గ్రామాల పరిధిలోని పొలాల్లో తిరుగుతున్నదని గుర్తించిన ఇరు రాష్ట్రాల అటవీ అధికారులు నదికి అటు, ఇటు గస్తీ ముమ్మరం చేశారు. కొల్లాపూర్ అటవీ రేంజ్, ఆత్మకూరు రేంజ్ అధికారులు టీంగా ఏర్పడి నదికి ఇరువైపులా ఉన్న గ్రామాల పరిధిలో ప్రజలను హెచ్చరిస్తూ తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుపుతున్నారు. కొత్తపల్లె మండలంలోని జానాల, సిద్దేశ్వరం, కొల్లాపూర్ మండలం సోమశిల, మంచాలకట్ట,మల్లేశ్వరం తదితర గ్రామలలో గురువారం అధికారులు, సిబ్బంది పర్యటించారు. -
జనవరి 2 నుంచి పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల(అర్బన్): రీసర్వే జరిగిన గ్రామాలకు సంబంధించిన రైతులకు జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే గ్రామసభల్లో పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా గ్రామాల్లో నిర్దేశించిన రోజున రెవెన్యూ అధికారులు గ్రామసభలు నిర్వహించి రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను అందజేస్తారని పేర్కొన్నారు. గతంలో పంపిణీ చేసిన భూ హక్కు పత్రాలను వెనక్కు ఇచ్చి కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను తీసుకోవాలని రైతులకు సూచించారు. కాగా, గ్రామసభల నిర్వహణ సమాచారాన్ని ముందుగానే రెవెన్యూ అధికారులు తెలియజేస్తారని, ఆ రోజున వెళ్లితే సరిపోతుందని ఆమె సూచించారు. కాలువలో జారి పడి చిన్నారి మృతి బండిఆత్మకూరు: కాలువలో పడి అజహా సిద్ధిఖి(4) అనే చిన్నారి మృతి చెందారు. బండిఆత్మకూరు మండలం చిన్నదేవళాపురం గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వలి, మాలన్బీ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె అయిన సిద్ధిఖా బుధవారం సాయంత్రం తన నానమ్మతో పాటు అంగడికి వెళ్లింది. తిరిగి వస్తూ తండ్రి వద్దకు వెళ్తానని చెప్పడంతో నానమ్మ సరే అని ఇంటికి వెళ్లింది. తండ్రి వద్దకు వెళ్లే క్రమంలో కాలువలో జారి పడి చిన్నారి నీటిలో కొట్టుకుని పోయింది. ఇంటి వద్ద చిన్నారి కనిపించకపోవడంతో కాలువ వెంట గాలించగా మృతదేహం కనిపించింది. కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వైఎస్సార్సీపీ కార్యకర్త కారుపై దాడి డోన్ టౌన్: పట్టణంలోని పాతపేటకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త రాజా కారు అద్దాలను గుర్తు తెలియని ఆరుగురు వ్యక్తులు రాళ్లతో బుధవారం అర్ధరాత్రి పగులగొట్టారు. స్థానికులు గమనించడంతో ‘చంపుతాం’ అని గట్టిగా కేకలువేస్తూ బైకులపై పరారయ్యారు. ఈ దాడి వెనుక టీడీపీ కార్యకర్తలు ఉండవచ్చు అని బాధితుడు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ నాయకులు దాడులు చేస్తూ భయాందోళన సృష్టిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కేసీ కెనాల్కు త్వరలో నీరు బంద్ జూపాడుబంగ్లా: హొస్పేట్లోని తుంగభద్ర డ్యాం నుంచి దిగువకు సాగునీటి సరఫరా నిలిపివేసిన నేపథ్యంలో మరో పక్షం రోజుల్లో కేసీ కాల్వకు సాగునీటి సరఫరా బంద్ అయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం సుంకేసుల జలాశయం నుంచి కేసీ కాల్వకు 2,500 క్యూసెక్కుల సాగునీటి సరఫరా కొనసాగుతున్నట్లు కాల్వ పర్యవేక్షణాధికారులు పేర్కొంటున్నారు. సుంకేసుల డ్యాం నుంచి 2,550 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు కేసీ కాల్వ ఏఈ శ్రీనివాసనాయక్ గురువారం తెలిపారు. లాకిన్స్లా వరకు 2,060 క్యూసెక్కుల నీరు చేరుతుందన్నారు. ఈ నీటిని నిప్పులవాగుకు 1,350 క్యూసెక్కులు, తూడిచెర్ల సబ్చానల్ కాల్వకు 655 క్యూసెక్కులు, అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కాల్వకు 55 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు ఏఈ తెలిపారు. ఎస్ఐలకు స్థానచలనం బొమ్మలసత్రం: నంద్యాల సబ్ డివిజన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ గురువారం ఎస్పీ సునీల్షెరాన్ ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాల వీఆర్లో ఉన్న ధనుంజయులును రేవనూరు పోలీసు స్టేషన్కు, రేవనూరులో విధులు నిర్వహిస్తున్న భూపాలుడును నందివర్గానికి, అక్కడ విధులు నిర్వహిస్తున్న వెంకటసుబ్బయ్యను నంద్యాల సీసీఎస్కు బదిలీ చేశారు. బ్రాహ్మణకొట్కూరులో విధులు నిర్వహిస్తున్న తిరుపాల్ను పాములపాడుకు, అవుకులో విధులు నిర్వహిస్తున్న రాజారెడ్డిని నంద్యాల త్రీటౌన్కు, అలాగే వీఆర్లో ఉన్న చంద్రశేఖర్రెడ్డిని నంద్యాల వన్టౌన్కు, నాగరాజును మహిళా పీఎస్కు, దాదాపీర్ను నంద్యాల డీఎస్బీకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
నంద్యాల శనగతో అధిక దిగుబడులు
నంద్యాల(అర్బన్): నంద్యాల గ్రాం 1267 శనగ రకంతో అధిగ దిగుబడులు సాధించవచ్చని ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ జాన్సన్ తెలిపారు. అఖిల భారత రబీ అపరాల(శనగ) సమన్వయ పథకం ప్రాజెక్టు కోర్డినేటర్ ఐకార్–ఐఐపీఆర్ కాన్పూరుకు చెందిన డాక్టర్ శైలేష్ త్రిపాటి రెండు రోజుల పర్యటనలో భాగంగా నంద్యాల ఆర్ఏఆర్ఎస్ను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏడీఆర్, శాస్త్రవేత్తలు నంద్యాలగ్రాం 1267 శనగ రకానికి సంబంధించిన వివరాలను శైలేష్ త్రిపాటికి వివరించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా 1,267 శనగ రకం సాగు చేసిన ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామానికి చెందిన నజీర్ పొలాన్ని సందర్శించారు. అనంతరం షెడ్యూల్ కులాల ఉప ప్రణాళికలో ఎంపికై న ఉప్పలపాడు గ్రామంలో నంద్యాలగ్రాం 667 ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలను సందర్శించి రైతలతో శనగ యాజమాన్య పద్ధతులపై చర్చించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు నీలిమ, మంజునాథ్, తదితరులు పాల్గొన్నారు. -
శ్రీమఠం.. భక్త జనసంద్రం
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన మంత్రాలయం గురువారం భక్తులతో కిక్కిరిసింది. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చిన భక్తులు తుంగభద్ర నదిలో పుణ్యసాన్నాలు ఆచరించారు. గ్రామ దేవత మంచాలమ్మకు ఉదయాన్నే అభిషేకం, కుంకుమ ఆర్చన, నైవేద్యం సమర్పించి మహామంగళ హారతి చేశారు. శ్రీరాఘవేంద్ర మూల బృందావనానికి నిత్య పూజలు చేశారు. కల్పతరు క్యూలైన్ , శ్రీ మఠం మధ్వ కారిడార్లో భక్తుల రద్దీ కొనసాగింది. శ్రీమఠం ప్రాంగణంలో భక్తుల మధ్య బంగారు పల్లకీలో ప్రహ్లాదరాయలు విహరించారు. -
మోహినీ రూపుడు.. ప్రహ్లాదవరదుడు
దొర్నిపాడు: దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాదవరదస్వామి మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆధ్యయనోత్సవాల్లో భాగంగా దిగువ అహోబిలంలో గురువారం పగల్పత్తు శాత్తుమొరై కార్యక్రమం నిర్వహించారు. ముందుగా స్వామివారిని బంగారు ఆభరణాలు, వజ్రవైడూర్యాలతో మోహినీ అలంకారంలో అలంకరించారు. అనంతరం పల్లకీలో కొలువుంచి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. వేద ప్రబంధ పారాయణం చేసిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామానుజన్, ఉభయదారులు వెంకటేష్, వనజ దంపతులు పాల్గొన్నారు. -
ఖైదీలకు ఉచిత న్యాయ సేవలు
నందికొట్కూరు: ఖైదీలందరికీ ఉచిత న్యాయవాది కల్పించే వెసులుబాటు ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి లీలా వెంకటశేషాద్రి అన్నారు. పట్టణంలోని సబ్జైల్ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. న్యాయవాదిని నియమించుకోలేని ఖైదీలకు ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామన్నారు. సబ్జైల్లో నెలకొన్న సమస్యలుంటే న్యాయవాదుల దృష్టికి తీసుకురావచ్చాన్నారు. ఆన్లైన్ నంబరు 15100కు తెలపవచ్చాన్నారు. శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్, సబ్జైల్ సూపరింటెండెంట్ రఘునాథరెడ్డి, మెడికల్ ఆఫీసర్ జక్కి, తదితరులు పాల్గొన్నారు. శ్రీమఠంలో సినీనటుడు రిషబ్శెట్టి మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్శెట్టి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. మండల కేంద్రంలో శ్రీమద్వ కారిడార్లో శ్రీ మఠం అధికారులు సంప్రదాయం ప్రకారం వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ దేవిని దర్శించుకుని కుంకుమార్చన చేసి మంగళ హారతి చేశారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వాముల మూలబృందవనాన్ని దర్శనం చేసుకున్నారు. రిషబ్ శెట్టి కుటుంబ సభ్యులను శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు ఆశీర్వదించి, శేషవస్రం, ఫల మంత్రాక్షితలు, పరిమళ ప్రసాదం, శ్రీ రాఘవేంద్రస్వామి జ్ఞాపిక అందజేశారు. -
400 క్వింటాళ్ల శనగ నిల్వలు
గత ఏడాది నుంచి శనగకు మార్కెట్లో గిట్టుబాటు ధర లేదు. క్వింటా రూ. 5 వేలు ధర దాటకపోవడంతో రెండేళ్ల నుంచి 400 బస్తాల దిగుబడులను గోదాములో భద్రపరుచుకున్నాను. ఈ ఏడాది రబీ సీజన్లో 60 ఎకరాల సొంత పొలంతోపాటు ఎకరా రూ. 18 వేలు కౌలు చెల్లించి మరో 30 ఎకరాలు కౌలుకు తీసుకుని 90 ఎకరాల్లో జేజే–11, పూలేజి, మరో రకానికి చెందిన శనగ పంట సాగు చేశాను. గత ఏడాది శనగలు అమ్ముడబోక, ఈ ఏడాది శనగసాగుకు పెట్టుబడుల కోసం అవస్థలు తప్పడం లేదు. – గోవిందరెడ్డి, రైతు, గుంజలపాడు, కోవెలకుంట్ల మండలం రెండేళ్ల నుంచి వివిధ రకాల పంట ఉత్పత్తులకు మార్కెట్లో ధర లేదు. ఈ ఏడాది రబీ సీజన్లో జొన్న, మినుము, పప్పుశనగ పంటలు సాగు చేశాను. ఆయా పంట దిగుబడులకు ధర అంతంత మాత్రంగానే ఉండగా వాటి నుంచి వచ్చే దినుసులకు మాత్రం మార్కెట్లో రెట్టింపు ధర పలుకుతోంది. రైతులు పండించిన పంట ఉత్పత్తులనే వ్యాపారులు జర్మినేషన్ చేసి వాటిని దినుసులుగా మార్చి మార్కెట్లో విక్రయిస్తుండటంతో రైతులకు నష్టం చేకూరుతుండగా వ్యాపారాలు లాభాలు గడిస్తున్నారు. – రాజేష్, రైతు, జోళదరాశి, కోవెలకుంట్ల మండలం -
భక్తులకు ఇబ్బంది లేకుండా వీధి కుక్కల నియంత్రణ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైలంలో భక్తులకు, స్థానికులకు ఇబ్బందులు లేకుండా కోతులు, వీధికుక్కల నియంత్రణ చేపడుతున్నట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో బుధవారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఈఓ మాట్లాడుతూ.. కోతుల బెడద లేకుండా ఉండేందుకు మోషన్–సెన్సార్ డిటరెంట్స్ టెక్నాలజీ (శబ్దాలు వచ్చే స్పీకర్లు) వినియోగించుకోవచ్చునన్నారు. ఇవి కోతులను భయపెట్టి దూరంగా ఉంచుతాయన్నారు. సమావేశంలో ఏపీ రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్ ప్రెసిడెంట్ లక్ష్మయ్య, వెటర్నరీ కౌన్సిల్ రిజిస్టార్ ఈశ్వరరావు, శ్రీవెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డా.జె.వి.రమణ పాల్గొన్నారు. అన్నప్రసాద వితరణకు రూ.3 లక్షల విరాళాలు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి పలువురు భక్తులు రూ.3లక్షల విరాళాలను అందించారు. బుధవారం విశాఖపట్నంకు చెందిన ఎన్.రామకృష్ణన్ రూ.లక్ష విరాళాన్ని ఏఈవో శ్రీనివాసులరెడ్డికి అందించారు. అలాగే కర్నూలుకు చెందిన ఎ.సుధేష్ణరాణి రూ.లక్ష విరాళాన్ని ఏఈవో సతీష్కు, గుంటూరుకు చెందిన చెరుకూరి సాయి వెంకట్ రూ.1,00,116 విరాళాన్ని పర్యవేక్షకులు కె.శివప్రసాద్కు అందజేశారు. విరాళాలు అందించిన దాతలకు దేవస్థాన అధికారులు స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూ ప్రసాదాలను, జ్ఞాపికలను అందించి సత్కరించారు. ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి నంద్యాల(వ్యవసాయం): విద్యార్థులు వినియోగదారుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ కార్తీక్ సూచించారు. జాతీయ వినియోగదారుల వారోత్సవాలు ముగింపు వేడుకలు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించారు. జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడు అమీర్బాషా అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే డిజిటల్ పాలన, ఈ ఫైలింగ్పై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం వక్తృత్వ వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. డీఎంహెచ్ఓ వెంకటరమణ, ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకటరాముడు, లీగల్ మెట్రాలజీ అధికారి జిలానీ బాషా, డీఈఓ జనార్దన్రెడ్డి, పౌర సరఫరాల శాఖ అధికారి రవిబాబు, డీటీఓ శివారెడ్డి పాల్గొన్నారు. ఆర్యూకు ఫోర్ స్టార్ రేటింగ్ కర్నూలు (కల్చరల్): ఆంధ్రప్రదే, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ–గవర్నెన్స్ సర్టిఫికేషన్తో పాటు ఐఎస్ఓ సర్టిఫికేషన్లో రాయలసీమ యూనివర్సిటీ 4 స్టార్ రేటింగ్ సాధించడంపై వర్సిటీ వైస్ చాన్స్లర్ ఆచార్య వి.వెంకట బసవరావు హర్షం వ్యక్తం చేశారు. ఐఎస్ఓ సర్టిఫికేషన్ సంస్థ హైమ్ సర్టిఫికేషన్ సంస్థ ప్రతినిధులు బుధవారం వర్సిటీ వీసీకి ఏడు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వర్సిటీకి సహకరించిన హైమ్ సర్టిఫికేషన్ ప్రతినిధి ఎ.శివయ్య బృందానికి ఆచార్య వెంకట బసవరావు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్టీకే నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయకుమార్ నాయుడు, వర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య సి.విశ్వనాథ రెడ్డి, ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య పీవీ సుందరానంద్, డీన్ ఆఫ్ అకడమిక్ అఫైర్స్ ఆచార్య సీవీ కృష్ణారెడ్డి, ఐక్యూఏసీ డైరెక్టర్ ఆచార్య ఆర్.భరత్ కుమార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఇళ్లలోనే పత్తి నిల్వలు
● రెండు నెలల క్రితం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ● ఇప్పటి వరకు కొనింది 5 లక్షల క్వింటాళ్లే కర్నూలు(అగ్రికల్చర్): రైతుల ఇళ్లలో పత్తి నిల్వలు పేరుకుపోతున్నాయి. గూడూరు మండలం పెంచికలపాడు గ్రామ సమీపంలో ఉన్న జిన్నింగ్ మిల్లులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది. తమ గ్రామంలోనే కొనుగోలు కేంద్రం ఉన్నా రైతులు పత్తి అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. ఈ గ్రామంలో ఇంటింటా పత్తి నిల్వలు పేరుకపోయాయి. మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి. అయితే సీసీఐ పత్తి ఎవరి నుంచి కొంటుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రెండు నెలలుగా సీసీఐ పత్తి కొంటోంది. ఇప్పటి వరకు 18,545 మంది నుంచి కొనుగోలు చేసిన పత్తి 5.67 లక్షల క్వింటాళ్లు మాత్రమే. మార్కెట్లో పత్తి ధరలు అతి తక్కువగా ఉండటం వల్ల రైతులు మద్దతు ధరతో అమ్ముకునేందుకే ఆసక్తి చూపుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా రైతుల దగ్గర 50 లక్షల క్వింటాళ్లకుపైగా పత్తి నిల్వలు ఉన్నాయి. ఈ పరిస్థితి చూస్తే సీసీఐ కొనుగోళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టమవుతోంది. -
అటవీ భూముల్లో మట్టి మాఫియా!
● వందలాది టిప్పర్లతో మట్టి రవాణా ● పట్టించుకోని అధికారులు బండిఆత్మకూరు: టీడీపీ నాయకులు మట్టి సైతం వదలడం లేదు. అక్రమార్జనకు అటవీ భూముల్లో సైతం అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారు. బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు, కడమలకాలువ గ్రామ శివార్లలోని తెలుగుగంగ ప్రధాన కాలువ వెంట ఉన్న అటవీ, సొసైటీ భూములు ఉన్నాయి. ఈ భూముల్లో ఇటుక తయారీకి సరిపడే ఎరమ్రట్టి ఉంది. ఈ మట్టిని కొల్లాగొట్టాలనే ఉద్దేశంతో టీడీపీ నాయకులు ఇటీవలే దందా మొదలు పెట్టారు. ఆయా గ్రామాల్లో ఉండే దళారులతో పేదలకు మాయమాటలు చెప్పి డబ్బు ఆశ చూపించారు. పేదలకు మాయమాటలు చెప్పి అక్రమ తవ్వకాలు జరపుతున్నారు. వందలాది ట్రిప్పుర్లతో రవాణా చేస్తున్నారు. ఈ వ్యవహారం అటవీ భూముల్లోనే కాకుండా తెలుగు గంగ ప్రధాన కాలువ వెంట కూడా సాగుతోంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా బుధవారం రాత్రి తెలుగుగంగ ప్రధాన కాలువపై ప్రొక్లెయిన్ను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
చిత్తశుద్ధి ఉంటే అహోబిలంలో ప్రమాణం చేయాలి
● ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డిచాగలమర్రి: అహోబిలంలో నవంబర్ 25న నిర్వహించిన తలనీలాల సేకరణ, టెంకాయల విక్రయాలకు సంబంధించి టెండరు దారులకు ఫారం ఇవ్వకుండా ఎవ్వ రి ఒత్తిడితో టెండరును రద్దు చేశారో విచారణ జరపాలని మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నా రు. ఈ విషయంలో తమకు సంబంధం లేదని చెబుతున్న ఎమ్మెల్యే అఖిలప్రియకు చిత్తశుద్థి ఉంటే అహోబిలం వచ్చి శ్రీలక్ష్మీనరసింహ స్వామిపై ప్రమాణం చేయాలన్నారు. ఆళ్లగడ్డలోని తన కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగుల బిజేంద్రారెడ్డి మాట్లాడుతూ.. గత 17 సంవత్సరాలుగా ఒకే వ్యక్తి టెండరు దక్కించుకుంటున్నారని ఎమ్మెల్యే చెప్పటం హస్యాస్పదంగా ఉందన్నారు. టెండరు రద్దు చేయడానికి ఎవరి వద్ద నుంచి ఫోన్లు వస్తున్నాయో సీఈఓ బయటపెట్టాలన్నారు. కరెంటు, డీజల్, పెట్రోల్ ధరలు తగ్గించాల్సింది పోయి అక్రమార్జన కోసం టెండరు ధరలు తగ్గిస్తున్నారని ఆరోపించారు. తక్కువకు కోడ్ చేసిన టెండర్లను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. -
నల్లమలలో పులి భద్రమేనా?
● అడవిలో కనిపించిన పులి పంజా ఉచ్చు ● అప్రమత్తమైన అటవీ అధికారులుఆత్మకూరురూరల్: నాగార్జునసాగర్ –శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం (ఎన్ఎస్టీఆర్)విస్తీర్ణంలో దేశంలోనే పెద్దది. రెండు తెలుగు రాష్ట్రాలలో 3,728 చ.కిమీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇటీవల గుండ్ల బ్రహ్మేశ్వరం వన్యప్రాణి అభయారణ్యాన్ని కూడా ఎన్ఎస్టీఆర్లో విలీనం చేయడంతో 1,194 చ.కిమీ అదనంగా చేరింది. ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో 87 పెద్ద పులులు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు నల్లమలలో పెద్దపులుల భద్రతపై అనుమానాలు కలిగిస్తున్నాయి. అడవిలో అక్రమార్కుల కారణంగా ఉచ్చులు పెరిగిపోతున్నాయి. మాంసాహారం కోసం పులి ఆహారమైన దుప్పులు, జింకలు, అడవి పందులను ఉచ్చులు పెట్టి చంపుతున్నారు. అప్పుడప్పుడు ఈ ఉచ్చులకు పెద్దపులులు చిక్కుకుని మరణించడం వంటి సంఘటనలు తరుచు జరుగుతున్నాయి. నాగలూటిలో టైగర్ జా ట్రాప్ లభ్యం ఇటీవల ఎన్ఎస్టీఆర్ పరిధిలోని ఆత్మకూరు అటవీ డివిజన్ లో నాగలూటి ప్రాంతంలో పెద్దపులులను బంధించేందుకు వాడే టైగర్ జా ట్రాప్ లభ్యమవడం అటు అటవీ అధికారులలోనూ, ఇటు వన్యప్రాణి ప్రేమికులలోను ఆందోళనకు కారణమైంది. ఇలాంటి ట్రాప్లు అంతర్జాతీయ స్మగ్లర్లు మాత్రమే వినియోగిస్తారన్న అనుమానాలున్నాయి. నల్లమలలో పులుల ప్రవర్ధనం స్మగ్లర్లను ఆకర్షించి ఉండవచ్చని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అనుమానితుల వివరాలు సేకరణ పులులను పట్టుకునేందుకు వినియోగించే జాట్రాప్ నల్లమలలో కనిపించడంతో అప్రత్తమైన అటవీ అధికారులు పలు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా అపరిచితుల సమాచారం కోసం అటవీ సమీప పట్టణాలలోని లాడ్జీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలకు ఆత్మకూరు పట్టణంలో ఒక లాడ్జి నుంచి మరో లాడ్జికి వారు వెళ్లేలోగా అక్కడ రిసెప్షన్లో ఉండాల్సిన రిజిస్టర్ మాయమైనట్లు గుర్తించారు. సీసీ కెమెరాలను పరిశీలించగా ఒక అగంతకుడు లాడ్జి రిసెప్షన్ వద్దకు వచ్చి అక్కడ అల్మారాలు వెతికి రిజిష్టర్ను తన చొక్కా లోపల పెట్టుకుని బయటకు వెళ్లడం కనిపించింది. అలా వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి గురించి అటవీ అఽధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల చిత్రమైన వేషధారణలో ఉన్న ఒక వ్యక్తి తరుచూ నంద్యాల అటవీ డివిజన్లో పలు చోట్ల కనిపించినట్లు అధికారులు గుర్తించారు. ఆ వ్యక్తి హిందీ మాత్రమే మాట్లాడుతూ కాస్త మతిస్థిమితం లేనట్టుగా ప్రవర్తిస్తున్నట్లు గుర్తించారు. అనుమానంతో అతన్ని ఎంతగా ప్రశ్నించినా ఎలాంటి సమాచారం అధికారులకు వెళ్లడి కాలేదు. దీంతో ఎన్ఎస్టీ ఆర్ ఫీల్డ్ డైరెక్టర్ విజయకుమార్ అనుమానితుడి వేలి ముద్రలను నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరోకు పంపించారు. అక్కడ నుంచి నివేదిక రావాల్సి ఉంది. సిబ్బంది కొరత మానవ మనుగడలో కీలకమైన పర్యావరణ సమతుల్యంలో పులి సంరక్షణకు సిబ్బంది కొరత తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. ఒక ఉమ్మడి జిల్లా పరిధిలో ఉండే ప్రాంతంలో ఎస్పీ కింద అన్ని రకాల పోలీస్ సిబ్బంది సుమారు 10 వేల వరకు ఉంటారు. అదే అటవీ శాఖ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం మూడు వేల లోపే ఉండడం గమనార్హం. పెద్దపులుల అభయారణ్యాలలో ప్రొటెక్షన్ వాచర్లపై ఆధార పడి ఉన్న సిబ్బందితోనే ఇబ్బంది పడుతూ అటవీ శాఖ పులి సంరక్షణకు పాటు పడుతోంది. కంటికి కనించని ప్రాంతాల్లో పన్నే ఉచ్చులను కనుక్కుని తొలగించడం వారికి కష్టసాధ్యమవుతోంది.నల్లమలలో వృద్ధి చెందుతున్న పులి సంతతి -
మారెమ్మ దేవాలయంలో చోరీ
గోనెగండ్ల: గంజిహళ్లి గ్రామ శివారులో ఉన్న అడివి మారెమ్మ దేవాలయంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకు పాల్పడ్డారు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గంజిహళ్లి, గోనెగండ్ల గ్రామా ల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్న ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగుల గొట్టి లోపలికి ప్రవేశించారు. హుండీలో ఉన్న నగదు, అమ్మవారి విగ్రహానికి ఉన్న వెండి కోర మీసాలు అపహరించారు. మంగళవారం ఉదయం భక్తులు పూజలు నిర్వహించడానికి వెళ్లగా చోరీ జరిగిందని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొంతకాలంగా గుడికి సమీపంలో ఆ గ్రామాలకు చెందిన కొందరు పేకాట ఆడుతున్నట్లు గ్రామస్తులు తెలి పారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. బాబోయ్ చిరుతలు...! మహానంది: నల్లమల అటవీ ప్రాంతాల్లో సమీపంలోని ఉన్న గాజులపల్లె, బసవాపురం పంట పొలాల్లో చిరుతల సంచారంతో రైతులు భ యాందోళన చెందుతున్నారు. పచ్చర్ల ఫీడర్లోని గాజులపల్లె గ్రామానికి చెందిన రైతు రంగస్వామిరెడ్డి పొలం సమీపంలో చిరుత సంచరించినట్లు పాదముద్రలు కనిపించాయి. గత కొద్ది రోజుల క్రితం గోవిందరెడ్డి పొలం దగ్గర చిరుతపులి కనిపించింది. పంట పొలాల సమీపంలో చిరుతలు సంచరిస్తుండటంతో రైతులు, కూలీలు ఒంటరిగా పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. నన్నూరు బ్యాంకులో చోరీకి విఫలయత్నం! ఓర్వకల్లు: మండలంలోని నన్నూరు గ్రామంలో ఉన్న ఆంధ్రపగతి గ్రామీణ బ్యాంక్లో చోరీకి విఫలయత్నం జరిగింది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు.. సోమవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఏపీజీబీ వెనుకాల ఉన్న ఖాళీ స్థలం నుంచి బ్యాంక్ గోడను పగుల గొట్టి లోపలికి ప్రవేశించారు. బ్యాంకులోపల నిర్మించిన బాత్రూంను పగులగొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా దానికి తాళం వేసి ఉండటంతో దిక్కుతోచక వెనక్కు వెళ్లినట్లు సీసీ ఫుటేజీలో నమోదైంది. మంగళవారం బ్యాంకుకు వచ్చిన అధికారులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు అనుమానిత వ్యక్తులను తీసుకెళ్లి విచారిస్తున్నట్లు సమాచారం. కేసీలో గుర్తు తెలియని మహిళ మృతదేహం పగిడ్యాల: ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని పడమర వనుములపాడు పగిడ్యాల గ్రామాల మధ్య కేసీ కాలువలో మంగళవారం గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించింది. మృతురాలు ఎర్రటి చీర, నల్లటి జాకెట్ ధరించి మరుగుజ్జుగా ఉండి సుమారు 50 ఏళ్లకు లోపే ఉంటుంది. కేసీ కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉండడం వలన దిగువ ప్రాంతానికి కొట్టుకుపోయింది. స్థానికుల సమాచారం మేరకు కేసీ కాలువ వెంట గాలించినా కని పించలేదని స్టేషన్ ఏఎస్ఐ శేషయ్య తెలిపారు. వైద్యులపై కేసు నమోదు దొర్నిపాడు: ఆళ్లగడ్డ సబ్ ట్రెజరీ కార్యాలయంలో రూ.1.16 కోట్ల నిధుల అవకతవకలు జరిగిన విషయంలో నలుగురు వైద్యాధికారులపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ వరప్రసాద్ తెలిపారు. సబ్ ట్రెజరీ అధికారి లక్ష్మీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాణి, బాబు, నాగమస్తాన్, నాగదాసయ్య, పీహెచ్సీ సీనియర్ అసిస్టెంట్ ఇంతియాజ్లపై కేసు నమోదు చేశామన్నారు. ఈ కుంభకోణం స్థానికంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. -
చెక్కుచెదరని వైభవం!
ఊరూరా క్రిస్మస్ సందడి మొదలైంది. క్రైస్తవులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ వేడుకకు చర్చీలు ముస్తాబయ్యాయి. క్రిస్మస్ స్టార్లు, రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో ఆకట్టుకుంటున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు చోట్ల వందల ఏళ్ల చరిత్ర కలిగిన చర్చీలు ఉన్నాయి. బ్రిటీషుల కాలంలో నిర్మించిన ఇవి నేటికీ చెక్కుచెదరకుండా ఠీవీగా దర్శనమిస్తున్నాయి. నిత్య ప్రార్థనలు, బైబిల్ పఠనాలతో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్నాయి. ఎంతో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రార్థన మందిరాల్లో క్రిస్మస్ వేడుకలకు సిద్ధమయ్యాయి. – ఆలూరు రూరల్/చిప్పగిరి/ మద్దికెర -
వైభవంగా గోవిందుడి కల్యాణోత్సవం
డోన్: పట్టణంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ప్రసన్న మండపంలో గోవిందుని కల్యాణ మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. గోవిందమాలదారుల ఆధ్వర్యంలో భక్తజనం మధ్య ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ శర్మ , నరసింహాచార్యులు గోదాదేవి శ్రీదేవిలతో గోవిందుడి కల్యాణ క్రతువు నిర్వహించారు. ప్రతి ఏటా మార్గశిర మాసంలో స్వామి పెళ్లి జరపడం ఆనవాయితీగా వస్తోంది. ధర్మకర్తలు పాతాళం సుబ్బారావు. రజినీ కుమారి, శ్రీని వాసరావు గోవింద మాల సమితి ఆధ్వర్యంలో అన్నదాన, ప్రసాద వితరణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. -
గుంతకల్లుకు మరో రైలు
డోన్ టౌన్: ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి నంద్యాల, డోన్ మీదుగా గుంతకల్లుకు కొత్త రైలు మంజూరైనట్లు రైల్వే అధికారులు తెలి పారు. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ప్రత్యేక చొరవతో ఈ ట్రైనుకు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారన్నారు. మార్కాపురంలో ప్రతి రోజు (ట్రైన్ నంబరు 57408) తెల్లవారు జామున 4.30 గంటలకు బయలుదేరి నంద్యాలకు ఉదయం 7.20 గంటలకు చేరుకుని, ఆ తర్వాత డోన్ మీదుగా గుంతకల్లుకు 10.30 గంటలకు చేరుకుంటుందన్నారు. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో (57407) గుంతకల్లులో సాయంత్రం 5.30 గంటలకు బయలుదే రి డోన్ మీదుగా నంద్యాలకు రాత్రి 8.30 గంటలకు చేరుకుని మార్కాపురానికి రాత్రి 10.30 గంటలకు చేరుకుంటుందని వివరించారు. పరివార దేవుళ్లకు పూజలు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీస్వామిఅమ్మవార్ల ఆలయ ప్రాంగణంలోని శనగల బసవన్నగా పేరుపొందిన నందీశ్వరునికి, శ్రీశైలక్షేత్రపాలకునిగా ప్రసిద్ధిగాంచిన శ్రీబయలు వీరభద్ర స్వామి వారికి మంగళవారం శాస్త్రోక్తంగా ఆలయ అధికారులు, అర్చకులు విశేషపూజలను నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రదోషకాల సమయంలో క్షేత్రపాలకుడైన వీరభద్రునికి, నందీశ్వరునికి పంచామృతాలతో అభిషేకాది అర్చనలను నిర్వహించారు. ఆరంభ పూజల్లో భాగంగా లోక క్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. అనంతరం ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగేందుకు గణపతి పూజను చేశారు. తరువాత నందీశ్వర స్వామికి నూతన వస్త్రసమర్పణ విశేషార్చనలను, నానపెట్టిన శనగలను, క్షేత్రపాలకునికి ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పించి కర్పూర నీరాజనాలు అర్పించారు. బాల్య వివాహాలు అనర్థదాయకం డోన్ టౌన్: బాల్య వివాహాలు అనర్థదాయకమని, వాటితో సమాజాభివృద్ధి వెనుకబడుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి అన్నారు. మంగళవారం పట్టణంలోని బాలికల హైస్కూల్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించినా, పెళ్లికి హాజరైనా చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు. బాల్య వివాహాల వలన బాలికలు విద్యకు దూరం కావడంతో పాటు అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. సమాజంలో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలనాన్నారు. ఎక్కడైనా ఇలాంటి వివాహాలు నిర్వహిస్తుంటే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన వయస్సు ప్రకారం బాలురకు 21, బాలికలకు 18 ఏళ్లు నిండాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ సీడీపీఓ శంషాద్బేగం, న్యాయవాది మాధవస్వామి, హెచ్ఎం మైమున్నీసా బేగం, సూపర్ వైజర్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. వామ్మో...కొండచిలువ మహానంది: బుక్కాపురం గ్రామంలో లక్ష్మీనరసమ్మ కుటుంబ సభ్యుల ఫామ్ హౌస్ వద్ద మంగళవారం కొండచిలువ కనిపించడంతో హడలిపోయారు. అయ్యన్న నగర్కు చెందిన స్నేక్ క్యాచర్ మోహన్కు సమాచారం అందించారు. అతను గ్రామానికి చేరుకుని సుమారు పది అడుగుల పొడవున్న కొండ చిలువను చాకచక్యంగా పట్టుకుని సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వదిలేశాడు. బీఈడీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఏప్రిల్ నెలలో జరిగిన బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేశారు. వర్సిటీ వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ వి.వెంకట బసరావు ఆదేశాల మేరకు ఫలితాలు ఫలితాలను విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. 2,474 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోగా 2,016 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. -
ఆహార విక్రయ వ్యాపారులకు జరిమానా
కర్నూలు(హాస్పిటల్): తినేందుకు పనికిరాని, నాణ్యతలేని ఆహారాలను విక్రయించినందుకు గాను పలువురు వ్యాపారులకు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కూర్మానాయకులు జరిమానా విధించారు. ఫుట్ సేఫ్టీ ఆఫీసర్ ఇటీవల ఆహార తనిఖీలు నిర్వహించి నమూనాలు సేకరించి ల్యాబోరేటరీకి పంపించారు. వాటి నివేదికల ఆధారంగా వ్యాపారులకు ఫైన్ వేశారు. ఇందులో కర్నూలులోని వెంకటరమణ కాలనీకి చెందిన శ్రీ సత్యసాయి ఏజెన్సీ వారికి రూ.50 వేలు, అమీన్ అబ్బాస్నగర్లోని శ్రీ కామధేను హోటల్ వారికి రూ. 25వేలు, పాత కంట్రోల్రూమ్ వద్ద మండి రెస్టారెంట్ వారికి రూ.50వేలు, మంత్రాలయంకు రూ.25వేలు, ఆదోనిలోని న్యూ సోనమ్ హిల్స్కు రూ.25 వేలు, ఎమ్మిగనూరులోని వ్యాపారికి రూ.10వేలు జరిమానా విఽధించారు. దీంతో పాటు వివిధ హోటల్స్లో కల్తీ వ్యాపారం చేస్తున్న వ్యాపారులపై వివిధ కోర్టుల్లో 12 కేసులు నమోదైనట్లు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజగోపాల్ తెలిపారు. రక్తదాతకు అభినందన కర్నూలు: రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడం లాంటిదని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న చిన్నసుంకన్న 50 సార్లు రక్తదానం చేసి ఆదర్శంగా నిలవడంతో జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఎస్పీ ఆయనను శాలువ, పూలమాలతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. అడిషనల్ ఎస్పీలు హుసేన్ పీరా, కృష్ణమోహన్, డీఎస్పీ బాబుప్రసాద్, టూటౌన్ సీఐ నాగరాజరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మహానందిలో షాపుల వేలాలు వాయిదా
మహానంది: మహానందిలోని షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న 17 షాపులకు సంబంధించిన బహిరంగ వేలాలు వాయిదా పడ్డాయి. మహానంది ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పోచా బ్రహ్మానందరెడ్డి డార్మెటరీ భవనంలో మంగళవారం బహిరంగ, సీల్డు టెండర్లు నిర్వహిచారు. దేవస్థానం ప్రాంగణంలోని షాపింగ్ కాంపెక్స్లో ఉన్న 17 షాపులకు వేలాలు జరగగా కొందరు స్థానిక వ్యాపారులు డిపాజిట్లు చెల్లించారు. అద్దెలు ఎక్కువగా ఉన్నాయని మొగ్గు చూపకపోవడంతో వాయిదా వేశారు. ఇదిలా ఉండగా జేఎస్డబ్ల్యూ వాటర్ప్లాంట్ ముందున్న రెండు ఖాళీస్థలాలను గతంలో అప్పటి అధికారులు గిరిజన , చెంచుల ఉత్పత్తుల విక్రయం కోసం కేటాయించారు. అయితే అధికారులు వాటికి నిర్వహించిన వేలాలు పోటాపోటీగా జరిగాయి. వీటిలో 43వ నెంబరుకు రూ. 30వేలు, 44 నెంబరు దుకాణానికి నెలకు రూ. 29వేలు ప్రకారం స్థానిక వ్యాపారులు వేలం పాడారు. అనుకున్నట్లే అయింది మహానంది షాపింగ్ కాంప్లెక్స్లోని షాపుల్లో దుకాణాలు నిర్వహిస్తున్న వారు ఇటీవల తిమ్మాపురం ఏపీ మోడల్ స్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్లో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డిని కలిశారు. అద్దెలు ఎక్కువగా ఉన్నాయని, తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఓ అధికార పార్టీ కీలక నేత రెండు మూడు సార్లు వాయిదా పడేలా చూడండి, తర్వాత మేం చేసేది చేస్తామని ఉచిత సలహా ఇచ్చినట్లు సమాచారం. దీంతో మంగళవారం నిర్వహించిన వేలాల్లో వ్యాపారులు అదే సూత్రం పాటించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా ఆలయ ఆదాయానికి అధికార పార్టీ నేతలు గండికొడుతుండటం ఎంత వరకు సమంజసమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి
ఆత్మకూరు: పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి యం.చింతామణి సూచించారు. మంగళవారం ఆత్మకూరు ప్రభుత్వ బాలికల వసతిగృహంలో జూపాడుబంగ్లా, పగిడ్యాల, మిడుతూరు వసతి గృహాల విద్యార్థిని, విద్యార్థులకు ప్రేరణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులందరూ పట్టుదలతో చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేందుకు కష్టపడి చదవాలన్నారు. ప్రతి విద్యార్థికి పదో తరగతి తొలి మెట్టు అని, పదిలో మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆత్మకూరు తాలూకా సహాయ సాంఘిక సంక్షేమ అధికారి బి.అంకన్న, వివిధ వసతి గృహాల సంక్షేమ అధికారులు అనితమ్మ, సుధారాణి, విజయ్, మహేష్, రాజారావు, రాజు, రవిలు పాల్గొన్నారు. -
గందరగోళంగా ఎన్సీడీ సర్వే!
కర్నూలు(హాస్పిటల్): జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా గత కొన్ని దశాబ్దాలుగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు గణనీయంగా పెరుగుతున్నారు. ఇందులో ప్రధానంగా బీపీ, షుగర్, థైరాయిడ్, గుండెజబ్బులు, పక్షవాతం, క్యాన్సర్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి జబ్బు ముందుగా గుర్తించి బాధితులకు చికిత్స అందించడమే గాక జీవనశైలిలో మార్పులు తీసుకొస్తే అటు వారికి, ఇటు సమాజానికి, దేశానికి మేలు జరుగుతుంది. ఈ ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం నాన్ కమ్యూనికబుల్ డిసీజ్(ఎన్సీడీ) సర్వేను ప్రారంభించింది. గత కొన్నేళ్లుగా ఈ సర్వే పూర్తిగాకుండానే అటకెక్కుతూ మళ్లీ మొదటికి వస్తోంది. కేంద్రం నుంచి వస్తున్న ఆదేశాలో లేక క్షేత్రస్థాయిలో సర్వే సరిగ్గా చేయడం లేదో అర్థం గాని పరిస్థితిల్లో తాజాగా ఎన్సీడీ 4.ఓ సర్వే కొనసాగుతోంది. సమాజంలో అంటువ్యాధికాని వ్యాధులు (నాన్ కమ్యూనకబుల్ డిసీజ్) అయిన బీపీ, షుగర్, క్యాన్సర్, గుండెజబ్బులు, పక్షవాతం వ్యాధిగ్రస్తులను ముందుగానే గుర్తించి వారికి సరైన వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్సీడీ 3.0 సర్వేను గత ఏడాది నవంబర్ 14న ప్రారంభించింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 75 ఆరోగ్య కేంద్రాలు, 672 సచివాలయాల పరిధిలో 18 ఏళ్లు దాటిన వారు 19,43,321 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 13,49,503 మందికి (69.4శాతం) స్క్రీనింగ్ చేశారు. వ్యాధి లక్షణాల మేరకు పీహెచ్సీలకు అక్కడ నుంచి సీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రులు, అక్కడ నుంచి జీజీహెచ్ కర్నూలుకు రెఫర్ చేసి వైద్యం అందించేలా చేశారు. క్యాన్సర్ లక్షణాలున్న వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు పరీక్షించి అనంతరం వ్యాధినిర్ధారణ కోసం కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు రెఫర్ చేస్తారు. వ్యాధినిర్ధారణ అయిన తర్వాత వారికి అవసరమైన వైద్యం అక్కడే అందిస్తారు. అధికంగా బీపీ, షుగర్ బాధితులే...! జిల్లాలో స్క్రీనింగ్ చేసిన 13,49,503 మందిలో 91,382 మందికి అధిక రక్తపోటు(బీపీ), 72,188 మందికి షుగర్(డయాబెటీస్), 4,231 మందికి నోటి క్యాన్సర్, 1,799 మందికి రొమ్ము క్యాన్సర్, 2,405 మందికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఉన్నట్లు అనుమానించి మెడికల్ ఆఫీసర్ వద్దకు రెఫర్ చేశారు. వారిలో ఇప్పటి వరకు కొందరిని మాత్రమే పరీక్షించారు. ఎన్సీడీ 3.ఓ ను పక్కన పడేసి! నాన్ కమ్యూనికబుల్ డిసీజ్(ఎన్సీడీ) 3.ఓ 75శాతం పూర్తయ్యేలోగా దానిని ప్రభుత్వం పక్కన పడేసి ఎన్సీడీ 4.ఓను ప్రారంభించింది. ఇందులో అధికంగా వివిధ రకాల క్యాన్సర్ కేసులతో పాటు కొత్తగా బీపీ, షుగర్ రోగులను గుర్తించేందుకు సర్వే ప్రారంభించారు. ఇలా ఒకే పనిని క్షేత్రస్థాయిలో పనిచేసే ఏఎన్ఎం లచే పదే పదే చేయిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. దీనివల్ల సర్వే నాణ్యత కూడా దెబ్బతింటోందని, కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం నీరుగారిపోతోందని పలువురు వైద్యాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదే పదే సర్వే పేరిట ఏఎన్ఎంలకు తిప్పలు ఒక్క సర్వే పూర్తిగా చేయనివ్వని వైనం లెక్కతేలని బీపీ, షుగర్, క్యాన్సర్ కేసుల వివరాలు -
విద్యుత్ సమస్యల పరిష్కారమే లక్ష్యం
● కరెంటోళ్ల జనబాట కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఎస్ఈకర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ ప్రదీప్కుమార్ అన్నారు.మంగళవారం ఆయన ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలో 37 సెక్షన్లు ఉండగా.. 26 గ్రామాలు, కర్నూలు నగరపాలక సంస్థ, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీల్లోని 11 వార్డుల్లో ఈ కార్యక్రమం జరిగింది. కల్లూరు మండలం ఓబులాపురం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఎస్ఈ పాల్గొని మాట్లాడారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. 11కేవీ, ఎల్టీ, వ్యవసాయ విద్యుత్ లైన్ల పరిశీలన, కిందకు వేలాడే విద్యుత్ తీగలను సరిచేయడం. వాలిపోయే స్థితిలో ఉన్న విద్యుత్ స్తంభాలను గుర్తించి.. మార్చడం, తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్సఫార్మర్ల దిమ్మెల ఎత్తును పెంచడం లేదా ఫెన్షింగ్ ఏర్పాటు తదితర సమస్యలను గుర్తించి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కర్నూలు టౌన్ ఈఈ శేషాద్రి, ఈఈ టెక్నికల్ మహేశ్వరరెడ్డి, కమర్షియల్ డీఈఈ విజయ బాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
క్యాన్సర్ కేసులపై ఎక్కువ దృష్టి సారించాం
క్యాన్సర్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఎన్సీడీ 4.ఓలో అధిక శాతం దీనిపైనే దృష్టి సారించాము. బీపీ, షుగర్ కేసులు గుర్తించడంతో పాటు క్యాన్సర్ కేసులను గుర్తించి వారిని చికిత్స నిమిత్తం స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు రెఫర్ చేస్తున్నాము. స్క్రీనింగ్ పక్కాగా ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్న 76 ప్రశ్నలను 26కు తగ్గించింది. దీనివల్ల ఏఎన్ఎంలపై పనిభారం తగ్గుతుంది. సర్వే కూడా నాణ్యతగా వస్తుంది. – డాక్టర్ మహేశ్వరప్రసాద్, ఎన్సీడీ అధికారి, కర్నూలు జిల్లా ● -
మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించండి
● ఆర్జేడీ శామ్యూల్వెలుగోడు/బండిఆత్మకూరు: మధ్యాహ్న భోజనంలో తప్పనిసరిగా నాణ్యత పాటించాలని విద్యాశాఖ ఆర్జేడీ శామ్యూల్ ఆదేశించారు. మంగళవారం వెలుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బండిఆత్మకూరు జిల్లా పరిషత్ హైస్కూల్, వీవర్స్ కాలనీలోని మోడల్ ప్రైమరీ స్కూల్ను ఆయన తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వెలుగోడులో ఆయన స్వయంగా మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి నాణ్య తను పరిశీలించారు. పదవ తరగతి విద్యార్థుల కోసం అమలవుతున్న వంద రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఆయన పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులను విడివిడిగా ప్రశ్నించి శిక్షణ పురోగతిని తెలుసుకున్నారు. పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు విద్యార్థులకు సమర్థవంతమైన బోధన అందించాలని, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. పాఠశాల నిర్వహణకు సంబంధించిన రికార్డులు, హాజరు పట్టికలు, అకడమిక్ రికార్డులను కూడా ఆర్జేడీ తనిఖీ చేశారు ఆయన వెంట డిప్యూటీ డీఈఓలు శంకర్ ప్రసాద్, వెంకటరామిరెడ్డి, మండల విద్యాధికారులు బ్రహ్మం నాయక్, నాగ బ్రహ్మయ్య, మోహన్ రెడ్డి, హెడ్ మాస్టర్ నూర్జహాన్, ఇన్చార్జ్ హెడ్మాస్టర్ మొయినుద్దీన్, ఉపాధ్యాయులు ఉన్నారు. -
మొబైల్ బుక్ కీపింగ్ వంద శాతం పూర్తి చేయాలి
నంద్యాల(న్యూటౌన్): స్వయం సహాయక సంఘాల మొబైల్ బుక్ కీపింగ్ ప్రతి నెలా వంద శాతం పూర్తి చేయాలని సెర్ప్ అడిషనల్ సీఈఓ శ్రీరాములు నాయుడు ఆదేశించారు. పట్టణంలోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో మంగళవారం డీఆర్డీఏ, వెలుగు సిబ్బందితో ఆయన పీడీ శ్రీధర్రెడ్డితో కలసి సమీక్ష నిర్వహించారు. సంస్థాగత నిర్మాణం, సంఘా లు, గ్రామ సంఘాలు, మండల సమాఖ్య సమావేశాలు సక్రమంగా నిర్వర్తించాలన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు ఫెషియల్ రికగ్నైజేషన్, జియో ఫెన్సింగ్పై సక్రమంగా పని చేయాలన్నారు. మన డబ్బులు.. మన లెక్కలో కార్యక్రమంలో ప్రతి సభ్యులు డేటాను ఆన్లైన్లో నమోదు చేయాలన్నా రు. ఐదారు సంఘాలకు ఎన్యుమరేటర్ను గుర్తించి సంఘ సభ్యులకు సీసీ సమక్షంలో బయోమెట్రిక్ అథంటికేషన్ చేయాలన్నారు. ఇప్పటి వరకు 30,687 సంఘాలకు గాను 14,716 సంఘాలకు హౌస్ ఓల్డ్ లవ్లీ హుడ్ ప్లాన్ తయారు చేయడం జరిగిందన్నారు. డిసెంబర్ నాటికి రూ.1,043 కోట్ల్ల లక్ష్యం కాగా కాగా ఇప్పటి వరకు రూ.909.94 కోట్లు ప్రగతి సాధించామన్నారు. సీ్త్రనిధి, రికవరీ, ఎస్సీ, ఎస్టీ సభ్యులకు సున్నావడ్డీ, మహిళా రైతుల సంఘాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డీపీఎంతో పాటు 29 మండలాల ఏపీఎంలు, సీసీలు, ఎల్జీసీలు తదితరులు పాల్గొన్నారు. -
ఎల్ఆర్ఎస్, బీపీఎస్లను వినియోగించుకోండి
కర్నూలు (టౌన్): జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలు, వెంచర్ల యజమానులు ఎల్ఆర్ఎస్ (లేఔట్ రెగ్యులేషన్ స్కీమ్), బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్)లను వినియోగించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక కొత్తబస్టాండ్ సమీపంలోని క్రెడాయ్ (కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఏస్టేట్, డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) కార్యాలయంలో కర్నూలు చాప్టర్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గడువులోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఇందుకు నిర్మాణాదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అక్రమంగా నిర్మించిన భవనాలు, అక్రమంగా వెలసిన లేఔట్లను క్రమబద్దీకరించుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్నారు. కార్యక్రమంలో క్రెడాయ్ చైర్మన్ గోరంట్ల రమణ, అధ్యక్షులు సురేష్ రెడ్డి, కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, కోశాధికారి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు (టౌన్): మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో ఈనెల 14 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ పోటీల్లో కర్నూలుకు చెందిన కరాటే క్రీడాకారులు పతకాలు సాధించడం గర్వ కారణమని జిల్లా ఒలింపిక్ సంఘం సీఈఓ విజయ్కుమార్, కార్యనిర్వహక కార్యదర్శి పి.సునీల్ కుమార్ అన్నారు. మంగళవారం వెంకటరమణ కాలనీలోని గుజ్జరియో కరాటే అకాడమీలో జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన యువన్ సాయి, అర్షియాకు మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. వారు మాట్లాడుతూ.. ప్రతి రోజు కరాటే సాధన చేస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. మాస్టర్ జగదీష్ కుమార్, జిల్లా కరాటే సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్, సీనియర్ కరాటే మాస్టర్ ఆరిఫ్ హుస్సేన్, గౌస్బాషా పాల్గొన్నారు. -
రాజ్యాంగ పరిరక్షణకు కదం తొక్కాలి
కర్నూలు(సెంట్రల్): రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి పౌరుడు ముందుకు రావాలని, కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ అంజిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఎస్టీయూ భవన్లో భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ముగింపు వారోత్సావాలను పురస్కరించుకొని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్.మునెప్ప అధ్యక్షతన వర్తమాన కాలంలో భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సవాళ్లు అన్న అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్కు ముఖ్య వక్తగా నాగార్జున వర్సిటీ ప్రొఫెసర్ హాజరై ప్రసంగించారు. ఎంతో మంది ప్రాణ త్యాగంతో సిద్ధంచిన స్వాతంత్రంతో ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భావించిన భారతదేశానికి బీజేపీ మతతత్వ విధానాలతో పెను ప్రమాదం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె.రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య మాట్లాడుతూ..బీజేపీ సర్కారు లౌకిక రాజ్యంగానికి విఘాతం కలిగిస్తుందన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ..లేబర్ కోడ్ల రద్దు కోసం కార్మిక సంఘాలు ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. కార్యకరమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి.రమేష్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లలితమ్మ, నంద్యాల జిల్లా ఏఐటీయూసీ అధ్యక్ష, కార్యదర్శులు వి.రఘురాం, మూర్తి, పి.సుంకయ్య, సీపీఐ నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి, నగర సహాయ కార్యదర్శులు పాల్గొన్నారు -
చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
నంద్యాల(న్యూటౌన్): విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఈఎస్సీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శైలేంద్రకుమార్ అన్నారు. నంద్యాల పట్టణంలోని ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న ఉమ్మడి జిల్లా రీజనల్ 28వ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమం మంగళవారం జరిగింది. బాలుర విభాగంలో వాలీబాల్ ఫైనల్ మ్యాచ్ నంద్యాల పాలిటెక్నిక్ కళాశాల, శ్రీశైలం మధ్య జరగగా నంద్యాల విజేతగా నిలిచింది. బాలికల విభాగంలో కేవీఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కర్నూలు), నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మధ్య జరగగా కేవీఎస్ఆర్ విజేతగా నిలిచింది. కబడ్డీ ఫైనల్లో బేతంచెర్లపై వాసవీ పాలిటెక్నిక్ కళాశాల (బనగానపల్లె), ఖోఖో బాలికల ఫైనల్లో కేవీఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గెలిచింది. బాలుర విభాగంలో ఓవరాల్ చాంపియన్షిప్ శ్రీశైలం దక్కించుకోగా బాలికల విభాగంలో చాంపియన్షిప్ రూపా బేతంచెర్ల నిలిచింది. బాలికల విభాగంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఓవరాల్ చాంపియన్షిప్ దక్కించుకుంది. పూర్వ విద్యార్థి రామమద్దయ్య, విభాగాధిపతులు రాజేష్, రమణప్రసాద్, రఘునాథరెడ్డి, సురేష్బాబు, విద్య హాజరై విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ మార్గరేట్ పాల్గొన్నారు. -
గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారిబండిఆత్మకూరు: చెంచుగూడేల్లోని గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు అధికారులు చర్య లు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా సూచించారు. మండలంలోని నెమళ్ల కుంట గిరిజన గూడాన్ని ఆమె మంగళవారం సందర్శించారు. చెంచుల జీవన విధానం, కుటుంబ పరిస్థితులు తదితర వివరాలపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 44 చెంచు గూడేల్లో 9 వేల మంది గిరిజనులు జీవిస్తున్నారన్నారు. వీరందరికి జీవనోపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెట్ సెంటర్లు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. వాటి ద్వారా పేపర్ ప్లేట్లు, జ్యూట్ బ్యాగ్లు, అగర్ వత్తుల తయారీ వంటి వాటిపై శిక్షణ ఇచ్చి జీవనోపాధి కల్పించనున్నామని తెలిపారు. చెంచులు సారా తయారీ, చెడు వ్యసనాల బారి నుంచి దూరం చేసేందుకు చర్య లు చేపడుతున్నామన్నారు. గూడేలకు ఆర్ఓ ప్లాంట్ల ద్వారా మంచి నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఉజ్వల పథకం కింద గూడెంలోని 40 కుటుంబాలకు గ్యాస్ స్టవ్లను అందజేశారు. కార్యక్రమంలో డీఎస్ఓ రవి బాబు, తహసీల్దార్ పద్మావతమ్మ, ఎంపీడీఓ గాయత్రి, పంచాయతీ రాజ్ ఈఈ నాగరాజు, డీఈ ఆయాజ్ బాషా తదితరులు పాల్గొన్నారు. -
నిరంతర సాధనతోనే క్రీడల్లో రాణింపు
నంద్యాల(న్యూటౌన్): క్రీడకారులు నిరంతర సాధనతోనే క్రీడల్లో రాణిస్తారని ఎస్వీయూ రీజి నల్ జాయింట్ డైరెక్టర్ నిర్మల్కుమార్ ప్రియ అన్నారు. సోమవారం నంద్యాల పట్టణంలోని ఈఎస్సీ పాలిటెక్నిక్ క్రీడా మైదానంలో కళాశాల ప్రిన్సిపాల్ శైలేంద్రకుమార్ ఆధ్వర్యంలో అట్టహాసంగా 28వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 2025–26 ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన నిర్మల్కుమార్ ప్రియ మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థులు ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో తోడ్పటమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు. పోటీల్లో ఏడు ప్రభుత్వ, ఐదు ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశా ల నుంచి 526 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు అన్సర్బాషా, జాయింట్ సెక్రటరీ రవికుమార్, పాలిటెక్నిక్ కళాశాల విభాగాధిపతులు రాజేష్, రమణప్రసాద్, రఘునాథరెడ్డి, సురేష్బాబు, విద్యా, మార్గరేట్లు పాల్గొన్నారు. వినియోగదారులహక్కులపై అవగాహన నంద్యాల(వ్యవసాయం): జాతీయ వినియోగదారుల వారోత్సవాల్లో భాగంగా సోమవారం నంద్యాల పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కేఎన్ఎం పాఠశాల నుంచి ర్యాలీని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రవి ప్రారంభించగా.. మెయిన్ బజార్, కల్పనాసెంటర్, గాంధీచౌక్ మీదుగా కొనసాగింది. అనంతరం జిల్లా వినియోగదారుల అధ్యక్షుడు అమీర్బాషా అధ్వర్యంలో 8, 9 తరగతి విద్యార్థులకు డిజిటల్ న్యాయ పాలన ద్వారా సమర్ధత, సత్వర పరిష్కారం అనే అంశంపై విద్యార్థులకు వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాణ్యం మోడల్ స్కూల్ పాణ్యం విద్యార్థులు సుధీర్తి, హారిక, చిన్న వంగళి జెడ్పీ పాఠశాల విద్యార్థిని శ్రీలక్ష్మి, స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థి మాధవి ప్రతిభ చాటి బహుమతులు అందుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అసదుల్లా, న్యాయ నిర్ణేతలు డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ సుబ్బారెడ్డి, శ్రీనివాసరెడ్డి, శేషఫణి, నాగేంద్ర, నీలకంఠమాచారి, తదితరులు పాల్గొన్నారు. ‘ఉపాధి హామీ’ని యథావిధిగా కొనసాగించాలి నంద్యాల(న్యూటౌన్): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని వామపక్ష పార్టీల నాయకులు మురళీధర్, బాబాఫకృద్దీన్, లక్ష్మణ్, మహమ్మద్గౌస్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. ఈ పథకానికి వీబీజీ రాంజీ అనే పేరు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాల య అధికారి సూర్యనారాయణకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు శ్రీనివాసులు, రామచంద్రుడు, నరసింహనాయక్, బాబాఫకృద్దీన్, శ్రీనివాసులు, తోటమద్దులు, వెంకటలింగం, పుల్లా నరసింహ, మౌలాలి, బాలవెంకట్ పాల్గొన్నారు. నంద్యాల(అర్బన్): ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం పీజీఆర్ఎస్ అనంతరం అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో జనవరి 15 నాటికి వంద శాతం ఈ–ఆఫీస్ అమలు చేయాలన్నారు. అలాగే పీ4 కార్యక్రమం ద్వారా బంగారు కుటుంబాలను గుర్తించి మార్గదర్శకులను మ్యా పింగ్ చేయాలన్నారు. ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధి కి ఐగాట్ కర్మయోగి వంటి శిక్షణా కార్యక్రమాలను విస్తృతంగా వినియోగించుకోవాలన్నారు. -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల(అర్బన్): ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి స్వీకరించే అర్జీల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వీడాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆమె నేరుగా అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించి, పారదర్శకతతో, అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా పరిష్కరించాలన్నారు. రీ–ఓపెన్ అయిన దరఖాస్తులు, బియాండ్ ఎస్ఎల్ఏలో ఉన్న అర్జీలు, వీఐపీ గ్రీవెన్స్లను అత్యంత ప్రాధాన్యంతో పరిష్కరించాలన్నారు. కార్యక్రమానికి 276 మంది తమ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
తెలుగు తమ్ముడా మజాకా!
జూపాడుబంగ్లా: పారుమంచాల గ్రామానికి చెందిన ఓ తెలుగు తమ్ముడు 3.95 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు పొలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నా పట్టించుకునే నాఽథుడే కరువయ్యాడు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఖలీముల్లాకు సర్వే నంబర్ 275లో 1.59 ఎకరాల పొలం ఉంది. అందులో రోడ్డు పోను 0.40 సెంట్ల పొలం మిగిలి ఉంది. రోడ్డులో పోయిన తన పొలానికి ప్రత్యామ్నాయంగా పక్కన్నే ఉన్న సర్వే నంబర్ 278 లోని 3.95 ఎకరాల పొలం తనకు కేటాయించాలని ఇటీవల పీజీఆర్ఎస్లో వినతి పత్రం ఇచ్చాడు. ఈ మేరకు ఈనెల 4వ తేదీన పొలాన్ని తహసీల్దార్ పరిశీలించారు. అనంతరం రెవెన్యూ రికార్డులను చూడగా ఆ పొలం ప్రభుత్వ పోరంబోకు స్థలం కావడంతో ఎవ్వరికీ కేటాయించటం కానీ, ఆన్లైన్లో ఎక్కించటం నేరమవుతుందని తేల్చి చెప్పారు. ఎవ్వరైనా ఆక్రమించినా చట్టపరంగా చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. అలాగే గ్రామపంచాయతీ తీర్మానం మేరకు ఆ భూమిని రజకుల దోబీఘాట్లకు కేటాయించినట్లు తెలి పారు. అయితే 20 రోజులు గడవకముందే ఖలీముల్లా సోమవారం జేసీబీలు, డోజర్ల సహాయంతో ఆ భూమిలో కంపచెట్లు తొలగించి చదును చేసి ఆక్రమించేశాడు. ఈ విషయాన్ని గ్రామసర్పంచ్ కుమారుడు దేవసహాయం తహసీల్దార్ చంద్రశేఖర్నాయక్కు ఫోన్ లో సమాచారం ఇవ్వగా.. తనకెవ్వరూ లిఖితపూర్వ కంగా ఫిర్యాదు చేయలేదని తహసీల్దార్ చెప్పేశారు. దీంతో వెంటనే దేవసహాయం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని ప్రజాసమస్యల పరిష్కార వేదికలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అప్పుడు స్పందించిన తహసీల్దార్ పారుమంచాల వీఆర్ఏకు ఫోన్చేసి 278 సర్వే నంబర్లో ఆక్రమణలను నిలిపివేయాలని ఆదేశించారు. అయితే అప్పటికే పొలంలోని కంపచెట్లను తొలగింపజేయటంతో పాటు పంట సాగుకు అనుకూలంగా మార్చేశారు. టీడీపీ నాయకుడు దర్జాగా పోరంబోకు స్థలాన్ని కబ్జా చేసినా అడ్డుకునేందుకు అధికారులు వెనుకడుగు వేయడం పట్ల గ్రామస్తులు విమర్శలు చేస్తున్నారు. 3.95 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమి దర్జాగా ఆక్రమణ యంత్రాలతో కంప చెట్లు తొలగించి పొలం చదును చేసిన వైనం అధికారులకు తెలిసినా చర్యలకు వెనకడుగు -
శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.4.89కోట్లు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానంలోని ఉభయ దేవాలయాలలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూపంలో రూ.4,89,38,741 లభించినట్లు దేవస్థానం డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఆర్.రమణమ్మ తెలిపారు. సోమవారం ఉభయ దేవాలయాల హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను చంద్రావతి కళ్యాణ మండపంలో లెక్కించారు. ఈ హుండీల రాబడిని భక్తులు గత 27 రోజులలో సమర్పించారు. అదేవిధంగా కొంత విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించినట్లు డీఈవో తెలి పారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమె రాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టారు. పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు. -
రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
జూపాడుబంగ్లా: రుణాలను సద్వినియోగం చేసుకొని రైతులు ఆర్థికాభివృద్ధి చెందాలని సెర్ప్ అడిషనల్ సీఈఓ శ్రీరాములునాయుడు అన్నారు. సోమవారం మండలకేంద్రమైన జూపాడుబంగ్లా వెలుగు కార్యాలయంలో ఎఫ్పీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎఫ్పీఓ సంఘాలు వ్యవసాయాధి అధికారుల నుంచి ఆధునిక వ్యవసాయ పద్ధతులు, రాయితీ విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ యంత్రపరికరాల వివరాలు తెలుసుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎఫ్పీఓ సంఘాల్లో రుణాలు తీసుకొని రైతులు వాటిని జీవనోపాధుల కోసం వినియోగించుకోవాలన్నారు. తద్వారా ఏడాదిలో మూడు, నాలుగు రకాల జీవనోపాధులు కల్పించుకోవటం ద్వారా ఆదాయ వనరులు మెరుగుపర్చుకోవాలని సూచించారు. రైతులకు మంచిచేయాలనే వారిని మాత్రమే బోర్డు ఆఫ్ డైరెక్టర్లుగా నియమించాలని ఏపీఎం, సీసీలను ఆదేశించారు. జూపాడుబంగ్లాలోని ఎఫ్పీఓ సంఘాల్లో ఆశించిన ఫలితాల్లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. 65 లక్షల నిధులు ఏమైనట్లు మూడేళ్ల క్రితం జూపాడుబంగ్లా వెలుగు కార్యాలయానికి మంజూరు చేసిన రూ.కోటి సీఐఎఫ్ నిధుల్లో రూ.65 లక్షల నిధులు ఏమయ్యాయని సెర్ప్ అదనపు సీఈఓ శ్రీరాములునాయుడు ఏపీఎం అంబమ్మ, సీసీలను ప్రశ్నించారు. పొదుపు సంఘాల వద్ద పెండింగ్లో ఉన్నాయని ఏపీఎం అంబమ్మ తెలుపగా రుణాల రికవరీ పెండింగ్ ఉంటే మహా అయితే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలుంటుంది.. కానీ రూ.65 లక్షలు పెండింగ్లో ఉన్నా యంటే.. ఏమి చేస్తున్నారని అడిషనల్ సీఈఓ ప్రశ్నించారు. పక్షం రోజుల్లోగా రూ.65 లక్షలు ఏమయ్యాయనే విషయమై లెక్కలు చూపాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీధర్రెడ్డి, సెర్ప్ స్టేట్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీరాములు, ఎఫ్పీఓ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, సీసీలు, వీఓఏలు, సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. -
తెలుగుదేశం పార్టీలో అధ్యక్షుల ఎంపిక ఆ పార్టీ నేతల్లో అగ్గిరాజేసింది. టీడీపీ కోసం శ్రమించిన వారికి కాకుండా వలస నేతలను అందలం ఎక్కించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధ్యక్షుల పేర్లు ఖరారైన తర్వాత స్థానిక నేతల ఒత్తిడితో చివరి నిమిషంలో మార్పులు చేయడంపై అస
సాక్షి ప్రతినిధి కర్నూలు: కర్నూలు, నంద్యాల టీడీపీ జిల్లా అధ్యక్షులుగా గుడిసె కృష్ణమ్మ, గౌరు చరితను, జిల్లా ప్రధాన కార్యదర్శులుగా నాగరాజు యాదవ్, ఎన్ఎండీ ఫిరోజ్ను ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ఈ ఎంపికపై టీడీపీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తొలుత కర్నూలు, నంద్యాల అధ్యక్షులుగా కర్నూలు నగర మైనార్టీ నేత వహీద్, డోన్ అసెంబ్లీ టిక్కెట్ ఆశించి భంగపడ్డ ధర్మవరం సుబ్బారెడ్డిలను అధిష్టానం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను టీడీపీ అధిష్టానం ఎంపిక చేసినట్లు ఓ జాబితా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ క్రమంలో పార్టీ నుంచి తమను అధ్యక్షులుగా ఎంపిక చేస్తున్నట్లు సమాచారం ఇచ్చారని, ఏ క్షణమైనా అధికారికంగా ప్రకటన ఉంటుందని తమ అనుచరులతో చెప్పుకు న్నారు. అయితే అధిష్టానం ఆదివారం ప్రకటించిన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల పేర్లు ఒక్కసారిగా పార్టీలో కలకలం రేపాయి. తొలుత నిర్ణయించిన పేర్ల స్థానంలో కొత్త పేర్లకు స్థానం లభించడం ఇది వరకు పేర్లున్న నేతలు, అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ ఇద్దరి ఒత్తిడితోనే ‘అధ్యక్షుల’ మార్పు కర్నూలు అధ్యక్షుడిగా వహీద్ నియామకాన్ని కర్నూలు నియోజకర్గానికి చెందిన కీలక ప్రజాప్రతినిధి ఒకరు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మైనార్టీ ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం కర్నూలు. ఈ క్రమంలో కర్నూలు అసెంబ్లీకి చెందిన మైనార్టీ నేతను అధ్యక్షుడిగా నియమిస్తే భవిష్యత్లో తమ రాజకీయ ప్రయాణానికి పోటీ అవుతారని ప్రజాప్రతినిధి భావించినట్లు తెలుస్తోంది. దీంతోనే వహీద్ను కాదని నాగరాజు యాదవ్ను అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నాగరాజు యాదవ్ను అధ్యక్షుడిగా నియమించేందుకు టీడీపీ అధిష్టానం ససేమిరా అన్నట్లు సమాచారం. చివరకు తిక్కారెడ్డిని అధ్యక్షుడిగా కొనసాగించాలని కూడా భావించినట్లు తెలుస్తోంది. అయితే కులసమీకరణాల నేపథ్యంలో చివరి నిమిషంలో గుడిసె కృష్ణమ్మ పేరును ఖరారు చేసి, నాగరాజు యాదవ్ను ప్రధాన కార్యదర్శిగా నియమించారు. టీడీపీలో పథకం ప్రకారమే మైనార్టీ నేతలను ఎదగకుండా కొందరు బడా నేతలు కుట్ర చేస్తున్నారని, ఈ అంశాన్ని ఇప్పటికై నా గ్రహించాలని మైనార్టీల్లో చర్చ జరుగుతోంది. ఓల్ట్సిటీలో సోమవారం ఏ టీకొట్టులోనైనా, నలుగురు గుమికూడినా ఇదే అంశంపై చర్చ జరగడం గమనార్హం. డోన్లోనూ అదే ఒత్తిడి ధర్మవరం సుబ్బారెడ్డిని చంద్రబాబు డోన్ అసెంబ్లీ అభ్యర్థిగా ఖరారు చేసి టిక్కెట్ ఇవ్వలేకపోయాడు. దీంతో సుబ్బారెడ్డిని అధ్యక్షుడిగా, మంత్రి ఫరూక్ కుమారుడు ఫిరోజ్ను ప్రధాన కార్యదర్శిగా నియమించాలని అధిష్టానం భావించింది. అయితే డోన్ నియోజకవర్గానికి చెందిన కీలక ప్రజాప్రతినిధి ఈ నియామకానికి అడ్డుపడినట్లు తెలుస్తోంది. సుబ్బారెడ్డిని నియమిస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని బెదిరించినట్లు సమాచారం. దీంతో అధిష్టానం చివరి నిమిషంలో గౌరు చరితను అధ్యక్షురాలిగా, ఫిరోజ్ను ప్రధాన కార్యదర్శిగా నియమించింది. పోయాం.. మోసంధర్మవరం సుబ్బారెడ్డి వహీద్ భగ్గుమంటున్న అనుచరులు ధర్మవరం సుబ్బారెడ్డి అనుచరుడు గండికోట రామసుబ్బయ్య ఆదివారం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్రెడ్డిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. టీడీపీ కోసం కష్టపడిన వారికే పదవులు ఇస్తామని లోకేశ్ చెప్పడంతో నమ్మి మార్కెట్యార్డు చైర్మన్ పదవికి దరఖాస్తు చేశామని, లేదు వలస వచ్చిన వారికే ఇస్తామంటే దరఖాస్తు చేసేవారం కాదన్నారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన రాజా నారాయణ మూర్తి సతీమణి రేణుకకు చైర్పర్సన్ పదవి కట్టబెట్టారు. దీనిపై ఎమ్మెల్యే వర్గీయులు నారాయణమూర్తి, సీమ సుధాకర్రెడ్డి ఇద్దరూ సోమవారం విలేకరుల సమావేశంలో రామసుబ్బయ్యపై విమర్శలు చేశారు. మార్కెట్యార్డు చైర్మన్ పదవి, మద్దిలేటిస్వామి ఆలయ చైర్మన్ పదవి ఇన్ని రోజులు భర్తీ చేయకుండా అడ్డుపడిందే సుబ్బారెడ్డి అని, ఇన్ని రోజులు మౌనంగా ఉండి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని విమర్శించారు. నిజానికి ధర్మవరం సుబ్బారెడ్డికి పదవి రాకుండా ‘కోట్ల’ అడ్డుపడటంతో సుబ్బారెడ్డి సూచనలతోనే రామసుబ్బయ్య తమ అక్కసును వెళ్లగక్కుతున్నారని డోన్ టీడీపీలో చర్చించుకుంటున్నారు. రేణుకతో పాటు గౌరు చరిత, నాగరాజు యాదవ్ కూడా టీడీపీకి వలస వచ్చిన నేతలే అని, వలసనేతల ఏలుబడిలో టీడీపీ నేతలు పని చేయాల్సిన దారుణ పరిస్థితులు ఉత్పన్నమయ్యాయనే వాదన వినిపిస్తోంది. ప్రజల్లో వ్యతిరేకతే కారణంఇదిలా ఉండగా తొలుత నిర్ణయించిన నేతలు కాకుండా స్థానిక నేతల ఒత్తిడితో ఏకంగా జిల్లా అధ్యక్షుల నియమాకంలో మార్పు చేయడంపై ఇతర రాజకీయపార్టీల్లోనూ ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. భారీ మెజార్టీతో అధికారంలో ఉన్నప్పటికీ ఒత్తిళ్లకు చంద్రబాబు, లోకేశ్ తలొగ్గి నిర్ణయాలు తీసుకుంటున్నారంటే ప్రభుత్వ తీరుపై ప్రజా వ్యతిరేకత ఉందనే విషయం వారికి బోధపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల కలెక్టర్ల సదస్సులో కూడా అంతా బావుందని మనం అనుకుంటున్నాం, కానీ ప్రజలు అలా అనుకోవడం లేదని స్వయంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ మాటలను లోతుగా విశ్లేషిస్తే తొలి ఏడాదిన్నరలోనే ప్రజావ్యతిరేకత స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారనే వాదన వినిపిస్తోంది. కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షుల ఎంపికపై కినుక మొదట తెరపైకి వహీద్, ధర్మవరం సుబ్బారెడ్డి పేర్లు స్థానిక ప్రజాప్రతినిధుల జోక్యంతో ఇద్దరికీ మొండిచేయి ఊహించని విధంగా గుడిసె కృష్ణమ్మ, గౌరు చరితకు చోటు వలస నేతలకు పదవులు కట్టబెట్టడంపై విమర్శలు సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ -
ప్రభుత్వం దృష్టికి గిరిజన ఉద్యోగుల సమస్యలు
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని గిరిజన ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ సభ్యులు పి.వెంకటప్ప అన్నారు. సోమవారం ఎస్బీఐ కాలనీలోని రామకృష్ణ పీజీ కళాశాల సెమినార్ హాల్లో గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగుల సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. అధికారులు ఎస్టీ వసతి గృహాల్లో విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పించాన్నారు. ఎస్టీ వసతి గృహాలలో గదుల సమస్య, మంచి నీటి సమస్య, మరుగుదొడ్లు వంటి సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. టీడీపీ కార్యక్రమంలా.. ఎస్టీల సమావేశంలా కాకుండా టీడీపీ కార్యక్రమంలా నిర్వహించారని గిరిజన నాయకులు రాజునాయక్, తిరుపాలు నాయక్, విక్రమసింహనాయక్లు విమ ర్శించారు. గిరిజన సంఘాల నాయకులను వేదిక పైకి ఆహ్వానించకపోవడంపై జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శివప్రసాద్ తీరును తప్పుబడుతూ కార్యక్రమాన్ని బాయ్కాట్ చేశామన్నారు. ఎస్టీ కమిషన్ సభ్యులు అధికారికంగా జిల్లాకు వస్తే మండల స్థాయి అధికారిని ఒక్కరిని కూడా కార్యక్రమానికి పిలువలేకపోవడం దారుణమన్నారు. ఐటీడీఏ లో జరుగుతున్న కోట్లాది రూపాయల అవినీతి బయ ట పడుతుందేమోనన్న ఉద్దేశంతోనే గిరిజన నాయకులకు సమావేశంలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. -
ఏసీబీ వలలో సీనియర్ అసిస్టెంట్
● రిటైర్డ్ మున్సిపల్ ఉద్యోగి నుంచి రూ. 35 వేల లంచం డిమాండ్డోన్ టౌన్: ఒక రిటైర్డు మున్సిపల్ ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటూ డోన్ సబ్ ట్రెజరీ సీనియర్ అసిస్టెంట్ లక్ష్మానాయక్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కర్నూలు ఏసీబీ డీఎస్పీ డి.సోమన్న తెలిపిన వివరాల మేరకు.. ఈ ఏడాది జూన్ 30వ తేదీన మున్సిపాల్టీలో రెవెన్యూ ఉద్యోగి సామరాజు ఉద్యోగ విరమణ పొందారు. రిటైర్డ్ బెనిఫిట్స్ కింద ప్రభు త్వం నుంచి రూ.33 లక్షలు రావాల్సి ఉంది. వాటి కోసం నాలుగు నెలులుగా డోన్ సబ్ ట్రెజరీ కార్యా లయం చుట్టూ తిరగుతున్నారు. అయితే ఈ డబ్బులు మంజూరు చేయడానికి కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ లక్ష్మానాయక్ రూ.40 వేలు డిమాండ్ చేశారు. ఇందుకు రూ.35 వేలు ఇస్తానని సామరాజు ఒప్పుకుని విషయం కర్నూలు ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు ఇచ్చిన సూచన ప్రకారం ఆయన సోమవారం ట్రెజరీకి వచ్చి లక్ష్మానాయక్ను కలిశారు. డబ్బులు చేతికి ఇవ్వకుండా కార్యాలయం ఎదుట ఉన్న చెట్టు తొర్ర వద్ద ఉంచాలని సూచించడంతో.. ఆ మేరకు అక్కడ రూ. 30 వేలు ఉంచి తిరిగి కార్యాలయంలోకి వెళ్లాడు. దూరం నుంచి మొత్తం గమనిస్తున్న ఏసీబీ అధికారులు కార్యాలయంలో సీని యర్ అసిస్టెంట్ను అదుపులోకి తీసుకున్నారు. చెట్టు తొర్ర వద్ద ఉంచిన నగదను స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు లక్ష్మానాయక్పై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ సోమన్న తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు కృష్ణయ్య, రాజా ప్రభాకర్, శ్రీనివాసులుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. 40 రోజుల్లో ఇద్దరు.. ఈ ఏడాది నవంబరు 11వ తేదీన స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ సునీల్ రాజా ఒక రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం విధితమే. తహసీల్దార్ కార్యాలయం, సబ్ ట్రెజరీ కార్యాలయం ఒకే ప్రహరీలో ఉన్నాయి. సోమ వారం సీనియర్ అసిస్టెంట్ దొరికిపోవడంతో రెవె న్యూశాఖ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. 40 రోజుల్లో మండలంలో ఇద్దరు అధికారులు ఏసీబీకి పట్టుబడటంతో తీవ్ర చర్చ జరుగుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత డోన్ ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెరిగి పోయందని ప్రజలు విమర్శిస్తున్నారు. పోలీసు పీజీఆర్ఎస్కు 94 అర్జీలు నంద్యాల(అర్బన్): పోలీసు పీజీఆర్ఎస్కు 94 అర్జీలు వచ్చాయని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి ఎస్పీ వినతులు స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ చేసి పరిష్కారానికి చొరవ చూపాలని పోలీసు అధికారులను ఆదేశించారు. చట్ట పరిధిలో ఉన్న అర్జీలను తక్షణమే పరిష్కరించాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్నారు. -
శ్రీశైలంలో భక్తుల రద్దీ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. మూడు విడతలుగా పలువురు భక్తులు ఆన్లైన్ ద్వారా స్పర్శ దర్శనం టికెట్లు పొంది స్వామివారి స్పర్శదర్శనం నిర్వహించుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్ని కిటకిటలాడాయి. పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాలి నంద్యాల(అర్బన్): ఇంటర్ విద్య కీలకమని, విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాలని జిల్లా సోషల్ వెల్ఫ్ర్ అధికారిణి చింతమణి సూచించారు. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆదివారం నంద్యాల, కోవెలకుంట్ల, నందికొట్కూరు ప్రాంతాలకు చెందిన విద్యార్థిఽనిలకు ప్రేరణ, శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా చింతమణి మాట్లాడుతూ.. ఏకాగ్రత ద్వారానే లక్ష్యలను సాధించవచ్చని, తద్వారా ఉజ్వల భవిష్యత్త్ పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఏఏఎస్ డబ్ల్యూఓ అబ్దుల్ జలీల్, అధ్యాపకులు శర్మ, రఘునాథ్రెడ్డి , వసతి గృహపర్యవేక్షకుల శంకరమ్మ, అమ్మనిబాయి, అంబటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ గోస్పాడు: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 15వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్సైట్లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9.30 గంటలకు అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. టీడీపీ నమ్ముకుంటే ముంచేశారు! డోన్: టీడీపీని నమ్ముకుంటే నట్టేట ముంచేశారని టీడీపీ ప్యాపిలి మాజీ కన్వీనర్ గండికోట రామ సుబ్బయ్య విమర్శించారు. తన కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో కష్ట నష్టాలు గురైన టీడీపీ కార్యకర్తల త్యాగాలను మరచి ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి నామినేటెడ్ పదవులు కేటాయిండం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఐదేళ్లు టీడీపీ మండల కన్వీనర్గా పని చేసిన తనను కాదని ఇటీవల కాలంలో ఇతర నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని ప్యాపిలి మండల ఇన్చార్జ్గా నియమించడాన్ని తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోట్ల సమీప బంధువులైన పత్తికొండ నియోజకవర్గానికి చెందిన ఎద్దులదొడ్డి ప్రభాకర్రెడ్డి పేరు ప్రస్తావించకుండానే ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి నామినేటెడ్ పదవులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లు నమ్మించి గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేశాడు. నేడు డయల్ యువర్ ఎస్ఈ కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ భవన్లో ఈ నెల 22వ తేదీన డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆర్.ప్రదీప్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలను ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు 7382614308 నంబర్కు ఫోన్ చేసి చెప్పవచ్చన్నారు. కాగా.. సోమవారం నిర్వహించాల్సిన డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లోతేటి శివశంకర్ తెలిపారు. -
జగనోత్సాహంతో..
డోన్ పట్టణంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాఽథ్ స్వగృహంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు, ఎంపీపీ రాజశేఖర్రెడ్డి, వైస్చైర్మన్ జాకీర్హుస్సేన్ ఆధ్వర్యంలో 500 మంది కార్యకర్తలు, నాయకులు రక్తదానం చేశారు. శిబిరం ప్రారంభం కాకముందే కార్యకర్తలు రక్తదానం చేసేందుకు బారులుదీరారు. మహిళలు సైతం రక్తదానం చేశారు. రైల్వేస్టేషన్ సమీపంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రక్త బంధువులై.. నందికొట్కూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ దారా సుధీర్ ఆధ్వర్యంలో కర్నూలు – గుంటూరు జాతీయ రహదారిపై ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్ద కార్యకర్తలు, అభిమానులు, నాయకు లు కేక్ కట్ చేశారు. ప్రభుత్వ వైద్యశాలలో బాలింతలు, గర్భిణులు, రోగులకు బ్రెడ్డు, పండ్లు పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయం వద్ద 101 మంది జగనన్న అభిమానులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా దారా సుధీర్ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల రూపకర్తగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు. తండ్రి వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా గత ఐదేళ్లలో జగనన్న సుపరి పాలన అందించారన్నారు. నాటి పథకాలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరన్నారు. ఊరూరా పండుగలా.. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జననేత పుట్టిన రోజును వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజలు పండుగలా నిర్వహించుకున్నారు. ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాఽథ్రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు బ్రెడ్డు పంపిణీ చేశారు. అనంతరం రక్తదాన శిబిరంలో యువకులు స్వచ్ఛదంగా రక్తదానం చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్రెడ్డి నివాసంలో కార్యకర్తలు కేక్కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. -
ఉపాధి హామీ చట్ట సవరణను ఉపసంహరించాలి
నంద్యాల(న్యూటౌన్): కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఉపాధి హామీ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బిల్లు ప్రతులను దహనం చేశారు. ఆదివారం చాపిరేవుల, పోలూరు గ్రామాల్లో జరిగిన నిరసన కార్యక్రమంలో నంద్యాల జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం. నరసింహ నాయక్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు కావడంతో జిల్లాలో సన్న, చిన్నకారు రైతుల బీడు భూములు సాగు చేసుకుంటున్నారన్నారు. వ్యవసాయ పనులు లేని సమయంలో కూలీల కుటుంబాలకు ఉపాధి పనులు దిక్కయ్యాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన వీబీజీ రామ్జీ బిల్లును వెంటనే ఉపసహరించాలన్నారు. కార్యక్రమంలో వ్యవసా య కార్మిక సంఘం జిల్లా నాయకులు కృష్ణ, చింతలయ్య, సుబ్బారాయుడు, సుబ్బారెడ్డి, జయన్న, శ్రీనివాస్ గౌడ్, తులసి రెడ్డి, రాజన్న, చంద్రమ్మ, రామ లచ్చమ్మ, పర్వీన్, జుబేదా, ఎం లక్ష్మ, సాల మ్మ, ఈశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు. -
సగరులు అన్ని రంగాల్లో రాణించాలి
ఎమ్మిగనూరుటౌన్: సగరులు (ఉప్పరులు) అన్నిరంగాల్లో రాణించాలని ఏపీ సగర కార్పొరేషన్ చైర్మన్ రంగేవల్లి వెంకటరమణ అన్నారు. ఆదివారం పట్టణంలో ని ఉప్పర కల్యాణ మండపంలో రాష్ట్ర సగర ఉపాధ్యా య, ఉద్యోగ, పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఇటీ వల ఉద్యోగ, ఉపాధ్యాయ కొలువులు సాధించిన ఉప్పర కులస్తులను సత్కరించారు. సమ్మేళన కార్యక్రమంలో పెనుగొండ డీఎస్పీ నరసింగప్ప, పల్నాడు జిల్లా డ్వామా పీడీ సిద్దలింగప్ప, శ్రీశైలం సగర సత్రం అధ్య క్షుడు కృష్ణయ్య, హైదరాబాద్ జేఎన్టీయూ ప్రొఫెసర్ జయలక్ష్మి, బద్వేల్ రిటైర్డ్ డీఎస్పీ వెంకట య్య, కేవీఆర్ కళాశాల ప్రొఫెసర్ పార్వతీదేవి, నాయ కులు ఏపీ వీరన్న, కృష్ణమూర్తి, రవీంద్ర పాల్గొన్నారు. -
రెండు చుక్కలతో నూరేళ్లు రక్షణ
● చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించండి ● జిల్లా కలెక్టర్ రాజకుమారి గోస్పాడు: చిన్నారులందరికీ రెండు పోలియో చుక్కలు వేయించి వారి బంగారు భవిష్యత్తుకు నిండు నూరేళ్లు రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. ఆదివారం నంద్యాల పట్టణం నూనెపల్లి ప్రాంతంలోని ఠాగూర్ పురపాలక ప్రాథమిక పాఠశాలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, రాష్ట్ర వైద్యశాఖ జాయింట్ డైరెక్టర్ దేవసాగర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలియో రహిత దేశంగా భారత్ నిలవాలన్నదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమన్నారు. పోలియో వ్యాధి మూడు రకాలుగా (టైప్–1, టైప్–2, టైప్–3) ఉంటుందని, ఇందులో టైప్–2, 3 రకాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పూర్తిగా నిర్మూలించబడినట్లు తెలిపారు. అయితే టైప్–1 రకం ఇప్పటికీ కొన్ని చుట్టుపక్కల దేశాల్లో కనిపిస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడా ది జిల్లాలో 2. 38 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. ప్రయాణాల్లో ఉన్న పిల్లల సౌకర్యార్థం బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్ ప్రాంతాలు తదితర ప్రాంతాల్లో 46 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రయాణాల్లో ఉన్న చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. జిల్లాలో 96 శాతం పూర్తి జిల్లాలో 96 శాతం పల్స్ పోలియో చుక్కలు వేసినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ వెంకటరమణ ఆదివారం తెలిపారు. జిల్లాలో 2,38,404 మంది 0–5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలి యో చుక్కలు వేయాల్సిన లక్ష్యం కాగా అందులో 2,28,356 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయగా 96 శాతం మందికి పూర్తయిందన్నారు. మిగిలిన చిన్నారులకు సోమ, మంగళ వారాల్లో వైద్య సిబ్బంది గ్రామాలలోని ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి
కర్నూలు: నగర శివారులోని గుత్తిరోడ్డులో ఉన్న ఎథీనా ప్రైవేటు పాఠశాలలో హాస్టల్లో ఉంటూ 9వ తరగతి చదువుతున్న మరెడ్డి వేదికరెడ్డి(14) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. శనివారం రాత్రి రెండు గంటల సమయంలో నిద్రలో మతిస్థిమితం లేకుండా ఉండటమే గాక బెడ్పై మూత్రవిసర్జన చేసుకోవడంతో తోటి విద్యార్థులు గమనించి హాస్టల్వార్డెన్కు తెలిపారు. అపస్మారకస్థితిలో ఉన్న బాలిక విషయం గురించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వైద్యచికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే బాలిక మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో బాలికను ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించి భద్రపరిచారు. బాలిక గతంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతుండేదని, తరచూ ఫిట్స్ కూడా వచ్చేదని తండ్రి అశోక్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులు 198 బీఎన్ఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదోని సెంట్రల్: పట్టణంలోని నెహ్రూమెమోరియల్ పురపాలక ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆదివారం 1993–1994వ సంవత్సరానికి చెందిన పదో తరగతి విద్యార్థులంతా 32 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. పాఠశాల్లో చిన్నతనంలో చేసిన అల్లరి చేష్టలు గుర్తు చేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన అలనాటి గురువులు రామృష్ణ, జయమ్మ, జనార్దన్లకు పాదాభివందనం చేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఫయాజ్, ఉపాధ్యాయులు రమేష్ నాయుడు, పూర్వ విద్యార్థులు స్వరూప్, గోనబావి గోపాల్, రంగారెడ్డి, రాజెంద్ర, వెంకటేష్, ఆశోక్ తదితరులు పాల్గొన్నారు. -
యాగంటిలో ఎస్పీ పూజలు
బనగానపల్లె రూరల్: యాగంటి క్షేత్రంలో వెలసిన శ్రీ ఉమామహేశ్వరస్వామిని కర్నూలు ఎస్పీ విక్రాంత్పాటిల్ దంతులు ఆదివారం దర్శించుకున్నారు. ఎస్పీ దంపతులకు ఆలయ అర్చకులు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఏక శిలా రూపంలో కొలువైన ఉమామహేశ్వర స్వామికి అభిషేకం, తదితర పూజలు చేశారు. పూజల అనంతరం ఎస్పీ దంపతులకు స్వామి వారి చిత్రపటంతో పాటు ప్రసాదాన్ని ఆలయ అర్చకులు అందజేశారు. బైక్ అదుపు తప్పి యువకుడి దుర్మరణం ఎమ్మిగనూరు రూరల్: మండల పరిఽధిలోని బోడబండ గ్రామం సమీపంలో ఆదివారం రాత్రి బైక్ అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఎమ్మిగనూరు రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని కోటేకల్ గ్రామానికి చెందిన మసీదపురం నరసింహులు కుమారుడు రామాంజనేయులు(25), మరో వ్యక్తి నరసప్ప వేర్వేరు బైక్లపై ఎమ్మిగనూరు వైపు వెళ్తున్నారు. వేగంగా వెళ్తూ అదుపుతప్పి రామాంజనేయులు కిందపడిపోయాడు. ఇతని వెనుకే వస్తున్న నరసప్ప కూడా తన బైక్ను అదుపు చేస్తూ కిందపడ్డాడు. ఈ ఘటనలో రామాంజనేయులకు తలకు బలమైన గాయం కావటంతో అక్కడిక్కడే మృతి చెందగా నరసప్పకు గాయాలయ్యాయి. మృతుడికి భార్య, ఒక పాప సంతానం ఉన్నట్లు బంధువులు తెలిపారు. గాయపడ్డ వ్యక్తిని చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలు
● బాలుర విభాగం విజేత బాపట్ల ● బాలికల విభాగం విజేత అనకాపల్లి కర్నూలు (టౌన్): స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి 44 వ షూటింగ్ బాల్ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. పురుషుల విభాగంలో బాపట్ల జిల్లా జట్టు మొదటి స్థానం, నెల్లూరు జిల్లా జట్టు రెండో స్థానం సాధించింది. బాలికల విభాగంలో అనకాపల్లి జిల్లా జట్టు మొదటి స్థానం, బాపట్ల జిల్లా జట్టు రెండో స్థానం సాధించింది. ముగింపు కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ సీఈఓ విజయ్కుమార్, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగమణి, ఒలింపిక్ సంఘం కార్య నిర్వహణ కార్యదర్శి సునీల్కుమార్, కార్పొరేటర్ లక్ష్మీకాంత రెడ్డి పాల్గొన్నారు. విజేతలకు మెడల్స్, కప్పులను అందజేసి అభినందించారు. జిల్లా షూటింగ్ బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి ఈశ్వర్నాయుడు, కేడీసీసీ మాజీ డైరెక్టర్ రమణా రెడ్డి పాల్గొన్నారు. -
ఆ‘ధారం’ తెగుతోంది!
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో చేనేత రంగం ఒక వెలుగు వెలిగింది. జగన్ సర్కారు చేపట్టిన చర్యలతో చేనేతను వదిలేసిన వారు కూడా మళ్లీ మగ్గం తిప్పారు. చంద్రబాబు సర్కారు ఏర్పాటై 18 నెలలు గడచింది. ఈ కాలంలోనే రెండు జాతీయ చేనేత దినోత్సవాలు జరిగాయి. వీటికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు చేనేత పరిశ్రమ అభివృద్ధికి, చేనేతకారుల సంక్షేమానికి ఎన్నో హామీలు గుప్పించారు. ముఖ్యమంత్రి మాటలు విన్న చేనేతకారులు మురిసిపోయారు. నెలలు గడచిపోతున్నా.. ఒక్క హామీ కూడా కార్యరూపం దాల్చకపోవడంతో డీలాపడిపోతున్నారు. మరోసారి బాబు మాటలు నమ్మి మోసపోయామని తలలుపట్టుకుంటున్నారు.కర్నూలు(అగ్రికల్చర్): కూటమి పాలనలో చేనేత పరిశ్రమ అభివృద్ధి పడకేసింది..చేనేతకారుల సంక్షేమం కొండెక్కింది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా చేనేతలకు చేకూరిన లబ్ధి శూన్యం. 2014–19 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అప్పట్లో కూడా ఎన్నో హామీలు ఇచ్చారు. కొన్నింటికి జీవోలు కూడా జారీ చేశారు. కాని ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. మళ్లీ అలాంటి పరిస్థితులే నేడు ఉత్పన్నమవుతుండటంతో చేనేతకారులు మగ్గం వదిలేసే పరిస్థితి ఏర్పడింది. టెక్స్టైల్ పార్క్ను వదిలేశారు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టెక్స్టైల్ పార్క్ నెలకొల్పాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. కాని అమలుకు నోచుకోవడం లేదు. ఈ ఏడాది ఆగస్టులో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు కోసం చేనేత, జౌళిశాఖల మంత్రి సవిత, పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీభరత్ భూమి పూజ చేశారు. భూమి పూజ చేయడంతోనే టెక్స్టైల్ పార్క్ వచ్చేసిందని టీడీపీ అనుకూల మీడియా, టీడీపీ నేతలు చేసిన హడావుడి అంతా, ఇంతా కాదు. అయితే ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇంతవరకు డీపీఆర్ కూడా సిద్ధం కాలేదు. టెక్స్టైల్ పార్క్ విషయంలో చంద్రబాబు సర్కార్ తీరును చూసి ముక్కున వేలేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఉచిత విద్యుత్ వట్టిదే ఉమ్మడి జిల్లాలో 4,705 కుటుంబాలు చేనేతపై ఆధారపడి ఉన్నాయి. 2024 ఎన్నికల సమయంలో చేనేతకు నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. 2024, 2025 సంవత్సరాల్లో జరిగిన జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో నెలకు చేనేత పరిశ్రమకు 200, పవర్ లూమ్కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ప్రకటించారు. కర్నూలు జిల్లాలో 2,457 చేనేత , ఒక పవర్ లూమ్, నంద్యాల జిల్లాలో 385 చేనేత, 73 పవర్ లూమ్స్కు ఉచిత విద్యుత్ ఇవ్వడం కోసం అధికార యంత్రాంగం ఏర్పట్లు కూడా చేసింది. కానీ ఉచిత విద్యుత్ హామీ 18 నెలలు గడచినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. మాటలే తప్ప చేతలు లేవనే విషయం నేడు చేనేత కుటుంబాలకు అర్థమైంది. ఆచరణలో కనిపించని రూ.25 వేల సాయం చెప్పింది చెప్పినట్లు చేయడం వైఎస్సార్సీపీ ఆధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకత. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించిన ఆయన చెప్పింది చెప్పినట్లు అమలు చేశారు. రెండేళ్లు కరోనాతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైన్పటికీ ఎక్కడా రాజీపడలేదు. ఈ పథకం కింద చేనేత మగ్గాలను అభివృద్ధి చేసుకోవడం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించుకొని మరింత సమర్థవంతంగా రాణించేందుకు వైఎస్సార్ నేతన్న నేస్తం కింద నెలకు రూ.2000 ప్రకారం ఏడాదికి రూ.24,000 చెల్లించింది. దీంతో ఒక్కో చేనేత కుటుంబానికి ఐదేళ్లలో రూ.1.20 లక్షలు ఆర్థిక లబ్ధి చేకూరింది. ఈ ఏడాది ఆగస్టు 7వ తేదీ జరిగిన జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.25 వేలు చెల్లిస్తామని ప్రకటించారు. చంద్రబాబు మాటలు విన్న చేనేతకారులు సంబరపడిపోయారు. నెలలు గడుస్తున్నా.. ఈ దిశగా చర్యలే లేకపోవడంతో నేడు ఉస్సు రు మంటున్నారు. చేనేతకార్మికుల ఆరోగ్య భద్రత కోసం బీమా పథకాన్ని అమలు చేస్తామని, చేనేతకు భారంగా మారిన జీఎస్టీని ఎత్తి వేస్తామని, ఇది సాధ్య కాకపోతే కట్టిన జీఎస్టీని వెనక్కు ఇస్తామని, చేనేత కార్మికులు ఇళ్ల నిర్మించుకుంటే మగ్గం ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా మామూలుగా ఇచ్చే రూ.4.30 లక్షలకు అదనంగా రూ.50 వేలు చెల్లిస్తామని, కార్మికుల ఆదాయాన్ని పెంచేలా సమగ్ర పాలసీని తెస్తామని.. ఇలా అనేక హామీలు ఇచ్చారు. ఇంతవరకు వాటిలో ఒక్క హామీ కూడా కార్యరూపం దాల్చలేదు. దీంతో చేనేతలు మగ్గాలు వదిలేసే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో దాదాపు 674 కుటుంబాలు మగ్గాలను వదిలేసినట్లుగా తెలుస్తోంది. దివాలా దిశగా ఆప్కోఉమ్మడి కర్నూలు జిల్లాలోని చేనేత సహకార సంఘాల నుంచే కాకుండా రాష్ట్రంలోని అన్ని చేనేత సహకార సంఘాలు ఉత్పత్తి చేసిన చేనేత వస్త్రాలను ఆప్కో కొనుగోలు చేసి మంగళగిరిలోని గోదాములో నిల్వ ఉంచుతుంది. అక్కడి నుంచి రాష్ట్రంలోని అన్ని షోరూములకు సరుకు సరఫరా అవుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత చేనేత సహకార సంఘాలు ఉత్పత్తి చేసిన వస్త్రాలను ఆప్కో కొనుగోలు చేయడం గణనీయంగా తగ్గింది. ఉమ్మడి జిల్లాలో కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు, ఆదోని, శ్రీశైలంలలో ఆప్కో షోరూములు ఉన్నాయి. ఏడాది కాలంగా వాటికి కొత్తస్టాక్ సరఫరా కాలేదు. ఆప్కోలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి వేతనాలు కూడా లేవు. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఆప్కో సిబ్బందికి వేతనాలు లేక అల్లాడుతున్నారు. ఆప్కో చరిత్రలో ఎప్పుడూ లేని పరిస్థితులు కనిపిస్తుండటంతో ఆప్కో ఏమవుతుందోనన్న ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. విషయం కర్నూలు నంద్యాల చేనేత సహకార సంఘాలు 13 30 పని చేస్తున్న సంఘాలు 3 4 సభ్యులు 350 120 వ్యక్తిగత మగ్గాలపై ఆధార 3,398 837 పడిన కుటుంబాలు మొత్తం చేనేత కుటుంబాలు 3748 957 కూటమి పాలనలో చేనేతలకు కష్టాలు భూమి పూజకే పరిమితమైన టెక్స్టైల్ పార్క్ అతీగతీలేని ఉచిత విద్యుత్, ఏటా రూ.25 వేలు సాయం 18 నెలల్లో ఒక్క కుటుంబానికి లబ్ధి కలిగితే ఒట్టు సంక్షోభంలో కూరుకుపోయిన ఆప్కో -
రాఘవేంద్రయా నమోస్తుతే!
మంత్రాలయం: చలిని లెక్క చేయకుండా ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక భక్తులు భారీగా ఆదివారం మంత్రాలయానికి తరలివచ్చారు. తుంగభద్ర నదిలో పుణ్యసాన్నాలు ఆచరించి గ్రామ దేవత మంచాలమ్మ దేవికి ఉదయాన్నే అభిషేకం, కుంకుమార్చన చేశారు. నైవేద్యం సమర్పించి మహామంగళ హారతి నిర్వహించారు. శ్రీరాఘవేంద్ర మూల బృందావనానికి నిత్య పూజలు చేశారు. కల్పతరు ప్రత్యేక స్టీలుతో ఏర్పాటు చేసిన క్యూలైనులో తుంగభద్ర నది దగ్గర నుంచి భక్తుల రద్దీ కొనసాగింది. శ్రీ మఠం మధ్వ కారిడార్లో భక్తులు పోటెత్తారు. పరిమళ ప్రసాదం కౌంటర్లలో, అన్నపూర్ణ భోజశాల దగ్గర రద్దీ కొనసాగింది. శ్రీమఠం ప్రాంగణంలో భక్తుల మధ్య బంగారు రథోత్సవంపై ప్రహ్లాదరాయులు విహరించారు. తుంగభద్ర నది దగ్గర సీఐ రామాంజులు బందోబస్తు పర్యవేక్షించారు. పడవ యజమానులతో భక్తులు పట్ల జాగ్రత వహించాలన్నారు. -
క్రీడలతో మానసికోల్లాసం
నంద్యాల (వ్యవసాయం): క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజ, ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి తంగమని, ప్రిన్సిపాల్ జూనియర్ సివి ల్ జడ్జి శ్రీనివాసులు అన్నా రు. ఆదివారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ సెక్రటరీ దాసరి చిన్న లింగమయ్య మాట్లా డుతూ క్రికెట్ పోటీలలో కోర్టు సిబ్బంది విన్నర్గా, న్యాయవాదుల గ్రూపు రన్నర్గా నిలిచిందన్నారు. ఇరు జట్లకు జడ్జీలు ట్రోఫీలు, నగదు బహుమతి అందజేశారు. అనంతరం బార్ అసోసియేషన్ కార్యాలయంలో క్రిస్మస్ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు హుస్సేన్బాషా, హరి ప్రసాద్ రెడ్డి, విజయ శేఖర్ రెడ్డి, సుబ్బరాయుడు, ఓబుల్ రెడ్డి, సౌజన్య, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
జనహితుడికి నీరాజనం..
శ్రీశైలం నియోజకవర్గంలో జగనన్న పుట్టిన రోజు వేడుకలు అంబరాన్ని తాకాయి. ఊరూరా అభిమానులు, పార్టీ నాయకులు కేకులు కట్ చేశారు. ఆత్మకూరు పట్టణంలో పార్టీ పట్టణ అధ్యక్షడు సయ్యద్మీర్, పట్టణ, మండల వైఎస్సార్ సీపీ మహిళా అధ్యక్షురాలు దర్గమ్మ, పార్వతి ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అలాగే వెలుగోడులో జిల్లా ఉపాధ్యక్షులు దేశం తిరుపంరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బుడ్డా శేషారెడ్డి ఆధ్వర్యంలో వేల్పనూరులోని అంకాల పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
గురజాడతో అభ్యుదయ సాహిత్యానికి బీజం
● అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణకర్నూలు కల్చరల్: తెలుగు సాహిత్యంలో అభ్యుదయ సాహిత్యం గురజాడతో ప్రారంభమైందని అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు. సాహిత్య అకాడమీ, అభ్యు దయ రచయితల సంఘం సంయుక్తంగా నగరంలోని సలాం ఖాన్ ఎస్టీయూ భవన్లో ఆదివారం 90 ఏళ్ల తెలుగు అభ్యుదయ సాహిత్యంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1933లో శ్రీశ్రీ రాసిన జయభేరి కవితతో తెలుగునాట అభ్యుదయ సాహిత్యం ప్రారంభమైందన్నారు. అనాటి నుంచి అభ్యుదయ సాహిత్య ఉద్యమం కొనసాగుతోందన్నారు. ఆరసం రాష్ట్ర అధ్యక్షుడు రాచపాళెం చంద్రశేశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అభ్యుదయ సాహిత్యం, మార్క్సిజం తాత్విక దృక్పథంతో వర్గ సంఘర్షణలు ప్రతిబింబిస్తుందని, పీడిత, కర్షక, కార్మిక జీవితాలను చిత్రిస్తోందన్నారు. సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యులు వల్లూరు శివప్రసాద్ మాట్లాడుతూ రచయితలు సామాజిక దృష్టికోణం నుంచి రచనలు కొనసాగించినప్పుడే అవి సమాజంలో ఎక్కువ కాలం నిలబడతాయన్నారు. అరసం జిల్లా అధ్యక్షులు కె.ప్రహ్లాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తెలంగాణ విమోచనోద్యమం – సాహిత్యం అనే అంశంపై ఎస్వీ సత్యనారాయణ, అభ్యుదయ సాహిత్య విమర్శ అంశంపై కరిమిండ్ల లావణ్య, అభ్యుదయ నవల అంశంపై కేపీ అశోక్కుమార్, అభ్యుదయ కథ అంశంపై ఎం.హరికిషన్, అభ్యుదయ నాటకం అంశంపై వి.వింధ్యావాహసినీ దేవి, అభ్యుదయ కవిత్వం అంశంపై కెంగార తాయప్పలు పత్ర సమర్పణలు చేశారు. కార్యక్రమంలో సాహిత్య అకాడమీ తరపున చంద్రశేఖర రాజు, అరసం జిల్లా కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకన్న, నగర ప్రధాన కార్యదర్శి ప్రమోద్ చక్రవర్తి పాల్గొన్నారు. -
గుండెపోటుతో ఎస్కేయూ విద్యార్థిని మృతి
రాప్తాడు రూరల్: ఎస్కేయూ విద్యార్థిని కాటెపోగు మాధుర్య (22) గుండెపోటుతో ఆదివారం ఉదయం మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం తర్తూరు గ్రామానికి చెందిన కాటెపోగు పాపన్నకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. చిన్న కుమార్తె మాధుర్య ఎస్కేయూ గోదావరి హాస్టల్లో ఉంటూ క్యాంపస్ కళాశాలలో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ చదువుతోంది. ఏడాదిన్నరగా చర్మవ్యాధితో బాధపడుతున్న ఆమె వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందింది. శనివారం స్వగ్రామంలోని ఓ ఆర్ఎంపీ వద్ద చూపించగా ఓ ఇంజక్షన్ వేశాడు. అనంతరం వర్సిటీకి బయలుదేరి వచ్చింది. ఆదివారం ఉదయం హాస్టల్ గదిలో అపస్మారకంగా పడి ఉండడంతో సర్వజనాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఇటుకలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా చర్మవ్యాధికి వైద్యులు సూచించిన మాత్రల డోస్ ఎక్కువైనందున గుండెనొప్పి లేదా, ఫిట్స్తో మృతిచెంది ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. -
నవరత్నాలు మెరిశాయి
మహిళలను మహారాణులుగా చూడాలని ఆకాంక్షించిన జగనన్న పలు సంక్షేమ పథకాల అమలు చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన నవరత్నాలు ప్రతి ఇంటా మెరుస్తున్నాయి. ఇందుకు పగిడ్యాల మండలం నెహ్రూనగర్ సయ్యద్ షబానా కుటుంబం నిదర్శనం. ఆమెది చాలా నిరుపేద కుటుంబం. భర్త సయ్యద్ బాషా గౌండా పని చేస్తాడు. వీరికి ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తుండగా 2019లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అమలు చేసిన వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాలు ఎంతో భరోసానిచ్చాయి. మొదటి సారి రూ. 1 లక్ష రుణంతో 10 గొర్రె పిల్లలు కొనుగోలు చేసి పెంపకం చేపట్టారు. ఇప్పటి వరకు 70 గొర్రెలు అయ్యాయి. వాటిలో కొన్ని విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు. సీ్త్రనిధి పథకం కింద రూ. 2 లక్షలు రుణం తీసుకొని ఇంటి వద్దనే కిరాణం అంగడి పెట్టారు. గొర్రెల పెంపకం, కిరాణం అంగడి ఆదాయం మొత్తం నెలకు సుమారు రూ.50 వేల వరకు వస్తుంది. అలాగే ఇంట్లోనే చీరల వ్యాపారం పెట్టారు. ఆమె భర్త గౌండ పని మానేసి కిరాణం అంగడి, చీరల వ్యాపారం, గొర్రెలను చూసుకుంటున్నారు. కుమారుడు సయ్యద్ సోహెల్ డిగ్రీ చదువుతున్నాడు. కుమార్తెకు వివాహం చేశారు. ‘జగన్ సారు పుణ్యమా అంటూ మాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా జీవనం సాగిస్తున్నాం. వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి. వైఎస్ జగనన్న వెయ్యేళ్లు వర్ధిల్లాలి’.. అంటూ సయ్యద్ షబానా చెబుతున్నారు. – నందికొట్కూరు -
కరువును తరిమి..
దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి రాయలసీమ రైతుల సంక్షే మం కోసం పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 15 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచుతూ పదిగేట్లతో నూతన హెడ్రెగ్యులేటర్ను నిర్మించారు. తండ్రి బాటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రాయలసీమలో కరువును తరిమేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకునేలా సంకల్పించారు. అందుకనుగుణంగా రూ.1,300 కోట్లతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి బానకచర్ల వరకు 16.5కిలో మీటర్ల మేర ఎస్సారెమ్సీ కాల్వ లైనింగ్ పనులు, 9కిలో మీటర్ల మేర ఎస్సారెమ్సీ కాల్వ సేఫ్టీవాల్ నిర్మాణం చేపట్టారు. ఎస్సారెమ్సీ లైనింగ్ పనులతో పాటు బానకచర్ల వద్ద ఎస్సార్బీసీ కాల్వపై నూతన హెడ్రెగ్యులేటర్ పూర్తయితే 80 వేల క్యూసెక్కుల నీటి విడుదలకు మార్గం సుగమనం అవుతుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమా అంటూ రాయలసీమ లోని పలు సాగునీటి ప్రాజెక్టుల ఆయకట్టు రైతులు రెండు కార్ల పంటలు సాగు చేస్తున్నారు. –జూపాడుబంగ్లా -
జగనన్న పాలన స్వర్ణయుగం
జిల్లాలో రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. ఎక్కడా కొనుగోలు కేంద్రాలు కనిపించడం లేదు. ఇటీవల తుపాన్తో దెబ్బతిన్న మహానంది మండలం అల్లినగరం అరటి రైతు బాల వెంకటరెడ్డిని కదిలిస్తే కన్నీళ్లు పెట్టాడు. కొన్నేళ్లుగా అరటి సాగు చేసినా ఎన్నడూ ఇంతలా నష్టపోలేదని చెప్పుకొచ్చాడు. ‘2023లో భారీ వర్షాలు కురవడంతో చెట్లన్నీ నేలకొరిగాయి. జగనన్న ప్రభుత్వం స్పందించి ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందించింది. గత ప్రభుత్వంలో గెల రూ.360 చొప్పున అమ్మితే ప్రస్తుతం గెల రూ.70 ధర పలుకుతోంది. దీంతో లక్షలాది రూపాయలు నష్టపోయాం. ఎకరాకు రూ.70 వేల వరకు నష్టాన్ని మూటగట్టుకున్నాం. అరటి గెల తెంచి అమ్మినా కూడా కూలీల ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదు. జగనన్న పాలన రైతులకు ఓ స్వర్ణయుగం. ప్రస్తుత చంద్రన్న ప్రభుత్వంలో రైతు కూలీగా మారే ధీన స్థితికి చేరుకున్నాడు. రైతన్నలను ఆ భగవంతుడే కాపాడాలి’. – ఆత్మకూరు -
రెండు చుక్కలు.. జీవితానికి వెలుగు
● నేడు పల్స్పోలియో కార్యక్రమం ● జిల్లాలో 2.38 లక్షల మంది చిన్నారుల గుర్తింపు గోస్పాడు: పిల్లల ఆరోగ్యం విషయంలో ముందు చూపు అవసరం. వారి ఆరోగ్యానికి టీకాలు ఎంతో కీలకం. అందులో భాగంగా రెండే రెండు చుక్కలు వారిని పోలియో బారిన పడకుండా చేస్తాయి. నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. శిశువులు పుట్టిన వెంటనే ఓరల్ పోలియో వ్యాక్సిన్ ను (ఓపీవీ) జీరో డోస్ ఇస్తారు. చిన్నారులకు అంగ వైకల్యం రాకుండా ఉండేందుకు దీన్ని వేస్తారు. అలాగే పిల్లలు పుట్టిన 24 గంటల లోపు హెపటైటిస్–బి జీరో డోస్, బీసీజీ, ఆ తర్వాత ఆరు, పది, 14 వారాలకు, ఆ తర్వాత వివిధ రకాల వ్యాక్సిన్లు వేస్తారు. ఇవన్నీ వారికి ప్రమాదకరమైన జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తాయి. జిల్లాలో ఐదేళ్ల లోపు ఉన్న 2,38,404 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యంగా అధికారులు గుర్తించారు. ఇందుకో 1313 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. పల్స్ పోలియోను పకడ్బందీగా నిర్వహించేందుకు 2,626 టీములను ఏర్పాటు చేశారు. 67 మొబైల్ టీమ్లు, 5,252 మంది సిబ్బంది పనిచేయనున్నారు. అధిక సంఖ్యలో ప్రజలు ఉండే ప్రదేశాలైన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు తదితర చోట్లకు 46 టీమ్లు వెళ్లి, అక్కడ ఉంటే చిన్నారులకు వాక్సిన్ వేస్తాయి. 26 హైరిస్కు ప్రాంతాలను గుర్తించారు. ఆదివారం వ్యాక్సినేషన్తో పాటు సోమ, మంగళ వారాల్లో మాపింగ్ కార్యక్రమంలో భాగంగా హైరిస్క్ ప్రాంతాలను మొబైల్ టీమ్లో కవర్ చేస్తాయని డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి, డాక్టర్ సుదర్శన్బాబు తెలిపారు. ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో 52 పీహెచ్సీలు, 16 యూపీహెచ్సీల పరిధిలో నిర్వహంచన్నట్లు వివరించారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. -
పకడ్బందీగా వంద రోజుల ప్రణాళిక అమలు
శిరివెళ్ల: పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు వంద రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని డీఈఓ జనార్దన్రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. శనివారం స్థానిక మోడల్ స్కూల్ను ఆయన తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థుల తో మాట్లాడారు. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పరీక్షలో వంద శాతం ఉత్తీర్ణత సాఽధించాలన్నారు. ప్రతి రోజు స్టడీ అవర్, స్లిప్ టెస్ట్ జరగాలన్నారు. వచ్చిన మార్కులను ఆన్లైన్ చేయాలని టీచర్లును ఆదేశించారు. గత ఏడాది పరీక్షలో తమ పాఠశాల 96 శాతం ఉత్తీర్ణత సాఽధించి మార్కులలో మండల టాపర్గా నిలి చిందిని ప్రిన్సిపాల్ ఇష్రత్బేగం డీఈఓతో చెప్పారు. ప్రస్తుతం పాఠశాలలో 97 మంది విద్యార్థుల్లో ఏ గ్రేడ్లో 17 మంది, బీ 45, సీలో 35 మంది ఉన్నారని వివరించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డీఈఓ ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆయన వెంట డిప్యూటీ డీఈఓ శంకరప్రసాదు ఉన్నారు. -
ఊరు మారింది..
గ్రామ పరిపాలనను మరింత బలోపేతం చేసేలా ప్రతి 5వేల జనాభా అవసరాలకు అనుగుణంగా జిల్లాలో 516 గ్రామ, వార్డు సచివాలయాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి అందుబాటులోకి తెచ్చారు. రెవెన్యూ పరమైన అన్ని సమస్యలను సత్వరమే పరిష్కరించేలా ఉద్యోగులను నియమించారు. అలాగే రైతుల కోసం రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటుచేసి భూసార పరీక్ష మొదలు, విత్తన ఎంపిక, పంట సంరక్షణ, ఎరువులు, క్రిమి సంహారక మందులు సబ్సిడీపై పంపిణీ చేశారు. విలేజ్ క్లినిక్ల ఏర్పాటుతో పాటు ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశ పెట్టి ఆరోగ్య ప్రదాతగా నిలిచారు. ఐదేళ్లలో పల్లెలు మారిపోయాయి. ప్రభుత్వ భవనాల ఏర్పాటు, స్థానికంగానే సేవలతో ప్రజలు ఎంతో ఆనందించారు. అభివృద్ధిని చూసి మురిసిపోయారు. అయితే టీడీపీ ప్రభుత్వంలో సచివాలయాలు, ఆర్బీకేలను నిర్వీర్యం చేసి మీ సేవా కేంద్రాలకు సేవలను ధారాదత్తం చేయడం గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సేవలందడం లేదు. – డోన్ గ్రామీణ ప్రాంతాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల ద్వారా సత్వర సేవలు అందించిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిదే. అధికారంలో ఉన్ననాళ్లు పేదల కోసమే పరితపించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్ని సేవలు ఒకేచోట లభించడం గొప్ప విషయం. ఇలాంటి అద్భుతమైన ఆలోచనలకు నాంది పలికిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. – చిరంజీవి, రైతు, దొరపల్లె గ్రామం, డోన్ మండలం -
జగన్తో సంక్షేమ విప్లవం
పేదల అభ్యున్నతి కోసం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకు చేర్చిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది. నాడు – నేడు ద్వారా విద్య, వైద్య రంగాల్లో పెనుమార్పులు తీసుకొచ్చి దేశం మన రాష్ట్రం వైపు చూసేలా అభివృద్ధి చేశారు. ప్రస్తుత టీడీపీ ప్రభు త్వం సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను రెండేళ్ల నుంచి వంచిస్తోంది. పంటలకు గిట్టుమాటు ధరలు లేక రోడ్లపై పడేయాల్సిన పరిస్థితి నెలకొంది. నేడు జగనన్న జన్మదినం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కేక్ కటింగ్లు, ర్యాలీలు, సేవా కార్యక్రమాలు చేపట్టాం. – కాటసాని రాంభూపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
ప్రభుత్వ మెడికల్ కాలేజీతో మాల కల సాకారమవుతోంది
నేను కర్నూలులోని ఓ ప్రైవేటు కంపెనీలో చిరుద్యోగిగా పని చేస్తున్నా. నా భార్య సమీనా సుల్తానాకు డాక్టర్ కావాలన్నది కల. పెళ్లయిన తర్వాత చదువుకునేందుకు ఆమెను ప్రోత్సహించా. రాత్రింబవళ్లు కష్టపడి చదివి నీట్కు ప్రిపేరైంది. ఈ ఏడాది నీట్ పరీక్ష రాయగా లక్ష ర్యాంకు రావడంతో సీటు వస్తుందో రాదోనని భయపడ్డాం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మెడికల్ కళాశాలల నిర్మాణం జరగడంతో సీట్లు పెరిగాయి. తెలిసిన వారి ద్వారా ఆరా తీస్తే నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు వస్తుందని చెప్పారు. దీంతో కౌన్సెలింగ్లో ఆప్షన్ ఇచ్చాం. అదృష్టవశాత్తు ఇక్కడే సీటు వచ్చింది. ఏ కేటగిరీలో సీటు రావడంతో ప్రభుత్వ ఫీజు రూ.15 వేలు చెల్లించాం. నా భార్య ఇక్కడే ఉంటూ చదువుకుంటోంది. చిన్న ఉద్యోగం చేసుకునే మా లాంటి వారికి ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వరంగా మారాయి. ప్రభుత్వ కాలేజీలు లేకుంటే ప్రైవేటు మెడికల్ కళాశాలలో ఏ కేటగిరీ సీటు రూ.2 లక్షలు అంట. దేవుడి దయ వల్ల సీటు రావడంతో మా ఇంట్లోనూ ఒకరు డాక్టర్ కాబోతున్నారు. – అబ్దుల్ నజీజ్, కర్నూలు -
పార్థసారథి.. ఆదోనిలో అభివృద్ధి ఎక్కడా?
● ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డిఆదోని టౌన్: ఆదోనిలో అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే పార్థసారథి పట్టణంలో ఎక్కడెక్కడా.. ఏమి చేశారో చూపించాలని వైఎస్సార్సీపీ ఆదోని ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన తన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ.. ఆదోనికి షాపింగ్ మాల్స్ తీసుకొచ్చాను.. అభివృద్ధి చేశాను.. ఉపాధి కల్పించానని.. చెప్పుకుంటున్న ఎమ్మెల్యేకు అభివృద్ధి అంటే అర్థం తెలుసా.. అని ప్రశ్నించారు. షాపింగ్మాల్స్తో స్థానిక చిన్నచిన్న వస్త్ర వ్యాపా రులు దుకాణాలను మూసుకునే పరిస్థితి నెలకొందన్నారు. షాపింగ్ మాల్స్లో పనిచేసే వారికి కూడా అతి తక్కువ జీతాలు ఉంటాయని, వారు ఆ జీతాలతో బతకలేని పరిస్థితి ఉందన్న విషయాన్ని పార్థసారథికి తెలియదా అని సూటిగా అడిగారు. బసాపురం ఎస్ఎస్ ట్యాంకు మరమ్మతులకు ఎమ్మెల్యే పార్థసారథి నిధులు మంజూరు చేయించానని గొప్ప లు చెప్పుకుంటున్నారన్నారు. అసలు బసాపురం ఎస్ఎస్ ట్యాంకు మరమ్మతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు మంజూరు కాలేదన్నారు. మున్సిపాలిటీకి 16 ఫైనాన్స్, జనరల్ ఫండ్స్ నిధులు వస్తాయని, మున్సిపాలిటీకి ఎమ్మెల్యే నిధులు తెప్పించిన దాఖలాలు కూడా లేవన్నారు. ఎమ్మెల్యేగా 18 నెలల్లో ఆదోని ప్రాంత అభివృద్ధికి ఏమి చేశారో ప్రజలకు చూపెట్టాలని హితవు పలికారు. ఎమ్మెల్యేను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఇకనైనా అబద్ధాలు చెప్పడం మానుకుని ఆదోని నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. -
ఇద్దరికి షోకాజ్ నోటీసు
జూపాడుబంగ్లా: స్థానిక కస్తూర్బా పాఠశాలలో విద్యార్థిని చితకబాదిన ఘటనలో ఎస్ఓ యశోద, టీచర్ ఇందిరకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అకడమిక్ మానిటరింగ్ అధికారిణి మాధవీలత తెలిపారు. పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థిని చితకబాదిన ఘటనపై శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా కలెక్టర్ రాజకుమారి, డీఈఓ జనార్దన్రెడ్డి స్పందించారు. విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని అకడమిక్ మానిటరింగ్ అధికారిణి మాధవీలత, ఎంఈఓ శ్రీనివాసులును ఆదేశించారు. ఈ మేరకు వారు పాఠశాలకు చేరుకుని ముందుగా బాధిత విద్యార్థిని హరిణిశ్రీతో మాట్లాడి శరీరంపై ఉన్న దెబ్బలను పరిశీలించారు. అనంతరం విద్యార్థిని చితకబాదిన తెలుగు టీచర్ ఇందిర, ఎస్ఓ యశోదతో కారణాలు తెలుసుకున్నారు. అయితే ఏఎంఓ విచారణలో వారు పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. దీంతో వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశా రు. అనంతరం ఏఎంఓ విలేకరులతో మాట్లాడుతూ నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. ఆమె వెంట ఏఎస్ఓ దస్తగిరి, సీఆర్పీ కిరణ్ ఉన్నారు. -
వేస్టేజీకి రాయల్టీ చెల్లించాలా?
● పాలిస్ బండల ఫ్యాక్టరీ, ట్రాక్టర్ యజమానులు వినూత్న నిరసనబనగానపల్లె రూరల్: పాలిస్ బండల ఫ్యాక్టరీ నుంచి వెలువడే వేస్టేజ్కి కూడా రాయల్టీ చెల్లించాలని రాయల్టీ చెక్పోస్ట్ సిబ్బంది ట్రాక్టర్లను నిలిపివేయడంతో ట్రాక్టర్ల యజమానులు, బ్రిక్స్ తయారీ అసోసియేషన్ సభ్యులు, పాలిస్ బండల ఫ్యాక్టరీ యజమానులు రోడ్డెక్కారు. శుక్రవారం సాయంత్రం బనగానపల్లె పట్టణంలోని యాగంటిపల్లె రహదారిలో సుధాకర్ ఇన్ఫ్రా సంస్థకు చెందిన చెక్పోస్టు వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వేస్టేజీకి రాయల్టీ చెల్లించాలని చెక్పోస్టు సిబ్బంది ట్రాక్టర్లను నిలిపివేయడంతో ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డుగా పెట్టి సుమారు గంట పాటు ఆందోళన చేశారు. బనగానపల్లె – గుత్తి ప్రధాన రహదారి కావడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పలువురు ట్రాక్టర్ యజమానులు మాట్లాడుతూ.. పాలీస్ బండల పరిశ్రమ నుంచి వచ్చే వేస్టేజీని ఫ్యాక్టరీకి దూరంగా పారబోస్తామన్నారు. అయితే ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేసిన రాయల్టీ చెక్పోస్ట్ సిబ్బంది టన్నుకు రూ.120 ప్రకారం చెల్లించాలని వాహనాలను అడ్డుకోవడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వేస్టేజీ మట్టికి రాయల్టీ ఉపసంహరించుకోవాలన్నా రు. అయితే చెక్పోస్టు అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో చెక్పోస్టు షెడ్ వద్ద వేస్టేజీని వదిలి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఎస్ఐ దుగ్గిరెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకొని నిరసన కారులతో చర్చించి ఆందోళన విరమింప చేశారు. -
పరిశ్రమ పేరుతో రూ.2 కోట్ల మోసం
ఆదోని అర్బన్: పరిశ్రమ ఏర్పాటు చేస్తానని కర్నూలుకు చెందిన వ్యక్తి దాదాపు రూ.2 కోట్లు మోసం చేశాడని సీఐ రామలింగమయ్య శుక్రవారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన భీమేష్, ధనలక్ష్మి పీవీసీ పైపులు పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. వారికి కర్నూలుకు చెందిన రిజ్వాన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. పరిశ్రమ ఏర్పా టు చేస్తానని అనుమతులు కూడా తీసుకొస్తాన ని చెప్పి 2023లో రూ.కోటి ఆ దంపతుల వద్ద ఆర్టీజీఎస్, నగదు రూపంలో తీసుకున్నారు. అంతేగాకుండా తమ తండ్రి వద్ద పరిశ్రమకు అవసరమైన మిషనరీలు కూడా ఉన్నాయని, మిషనరీలు కోసం రూ.90 లక్షలు ఇప్పించుకున్నట్లు తెలిపారు. అయితే కొంత మేర నిర్మాణం ప్రారంభించి ఆ తర్వాత పనులు ఆపినందుకు నిలదీస్తే రిజ్వాన్ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారని, జిల్లా ఎస్పీ ఆదోని త్రీటౌన్కు పంపించారని, బాధితులను విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. దాడి కేసులో వ్యక్తికి మూడేళ్ల జైలు ఆలూరు రూరల్: దాడి కేసులో ఆలూరు మండలం మొలగవల్లి గ్రామానికి చెందిన బోయ సుధాకర్ అనే వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధిస్తూ ఆదోని కోర్టు తీర్పు వెల్లడించింది. ఆలూరు ఎస్ఐ మన్మథ విజయ్ తెలిపిన వివరాలు.. మండలంలోని మొలగవల్లి గ్రామానికి చెందిన కురువ నౌనేపాటి, బోయ సుధాకర్ల మధ్య వ్యక్తి గత కారణాలతో గొడవలు ఉండేవి. ఇందులో భాగంగానే 2015లో బోయ సుధాకర్ ..నౌనేపాటిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చార్జీషీటు కోర్టులో దాఖలు చేశారన్నారు. పదేళ్ల విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో శుక్రవారం ఆదోని సీనియర్ సివిల్, అసిస్టెంట్ సెషన్స్ జడ్జి.. నిందితుడు సుధాకర్కు మూడేళ్లు జైలు శిక్ష, రూ.పది వేలు జరిమానా విధించినట్లు ఎస్ఐ తెలిపారు. దేవస్థాన వైద్యశాలకు ‘ఈసీజీ’ విరాళం శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న వైద్యశాలకు పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన బాలం సుధీర్ శుక్రవారం ఈసీజీ యంత్రాన్ని విరాళంగా అందజేశారు. వైద్యశాల జూనియర్ అసిస్టెంట్ చిన్నాకు దాత తరఫున దేవస్థాన మాజీ పర్యవేక్షకుడు మధుసూదన్రెడ్డి ఈ పరికరాన్ని అందజేశారు. స్థానిక భక్తులు, ప్రజల సౌకర్యార్థం దేవస్థానం అందిస్తున్న ఉచిత వైద్య సేవలకు ఈ యంత్రం ఎంతగానో దోహదపడుతుందని దాత పేర్కొన్నారు. ఆన్లైన్ ఉద్యోగాలంటూ టోకరా ● రూ. 6 లక్షలు మోసపోయిన యువకులు ఆదోని అర్బన్: పట్టణంలోని రాజరాజేశ్వరి కాలనీకి చెందిన నలుగురు వ్యక్తులు ఆన్లైన్లో ఉద్యోగాల కోసం రూ.6 లక్షలు మోసపోయారని వన్టౌన్ ఎస్ఐ సమీర్బాషా శుక్రవారం తెలపారు. ఎల్టీడబ్ల్యూ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన సాఫ్ట్వేర్ సంస్థలో ఆన్లైన్ ఉద్యోగాలు ఇస్తామంటూ విశాఖపట్నంకు చెందిన భానుప్రసాద్, లావణ్య ఆశ పెట్టారు. ఒక ఉద్యోగానికి ఒకటిన్నర లక్ష ఇస్తే ఉద్యోగం వస్తుందని ఆన్లైన్లో నమ్మ పలికారు. దీంతో రాజరాజేశ్వరి కాలనీకి చెందిన వీరేష్బాబుతో పాటు మరో ముగ్గురు ఒకటిన్నర లక్ష చొప్పున మొత్తం ఆరు లక్షలు ఆన్లైన్ ద్వారా వేశారు. 2024లో ఈ లావాదేవీలు జరిగాయని, తీరా ఉద్యోగం రాకపోవడంతో ఆన్లైన్లో, ఫోన్ ద్వారా సంప్రదించడంతో వారి ఆచూకీ తెలియకపోవడంతో మోసపోయామని తెలుసుకుని శుక్రవారం వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బయలు వీరభద్రస్వామికి విశేష పూజ శ్రీశైలంటెంపుల్: శ్రీశైలక్షేత్ర పాలకుడైన బయలు వీరభద్రస్వామికి శుక్రవారం అమావాస్య సందర్బంగా విశేషార్చన జరిపించారు. అమావాస్య రోజున భక్తులు పరోక్షసేవగా ఈ అర్చనను జరిపించుకునే అవకాశం దేవస్థానం కల్పించింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి 30 మంది భక్తులు పరోక్షసేవ ద్వారా ఈ విశేష పూజను జరిపించుకున్నారు. స్వామి ఆరాధన వలన గ్రహదోషాలు నివారించబడతాయని, అరిష్టాలన్నీ తొలగి పోతాయని, ఎంతటి క్లిష్ట సమస్యలైనా పరిష్కరించబడతాయని పండితులు తెలిపారు. -
ప్రకృతి స్నోయగాలు
మంచు చాటున ప్రకృతి అందాలు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఓ వైపు ఉదయాన్నే పొలం పనులు, ఉద్యోగాలపై బయటకు వెళ్లే వారే ఇబ్బందులు పడుతుండగా.. మరో వైపు మంచు దుప్పటి కప్పుకున్న ప్రకృతిలో అందాలు కనువిందు చేస్తున్నాయి. పచ్చని పైర్లపై కమ్ముకున్న పొగ మంచు, మంచు తెరల మాటున ప్రకాశించే భానుడు, అదే సమయంలో పట్టాలపై వేగంగా దూసుకెళ్తున్న రైలు, రహదారులపై లైట్ల వెలుతురులో వెళ్తున్న వాహనాలు.. ఇలా ఎన్నో దృశ్యాలు కనిపిస్తున్నాయి. – బేతంచెర్ల/గోనెగండ్ల గోనెగండ్లలో రహదారిని కమ్మేసిన మంచుపంట పొలాలను కమ్మేవేసిన పొగ మంచు -
ఫుడ్ ఇన్స్పెక్టర్ల విచారణ
నందికొట్కూరు: పట్టణంలోని బాలికల జిల్లా పరిషత్ హైస్కూల్లో చాక్లెట్ల కలకలంపై నంద్యాల, ఆత్మకూరు ఫుడ్ ఇన్స్పెక్టర్లు వెంకటరమణ, ఖాసీంవలి శుక్రవారం విచారణ చేపట్టారు. పాఠశాలలో గురువారం చాక్లెట్లు తిన్న బాలికలు అస్వస్థతకు గురికావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టారు. హెచ్ఎం సావిత్రిని చాక్లెట్ సంఘటన గురించి ఫుడ్ ఇన్స్పెక్టర్లు విచారించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలికలు ఇచ్చిన స్టేట్మెంట్ను రిపోర్టు తయారు చేసి జిల్లా కలెక్టర్కు, అధికారులకు నివేదిక అందిస్తామన్నారు. పాఠశాల ఆవరణలో విక్రయించిన చాక్లెట్లను ల్యాబ్కు పంపామన్నారు. కాలం చెల్లిన చిక్కీలు విద్యార్థులకు ఇస్తే చట్ట పరమైన చర్యలు వారిపై జిల్లా అధికారులు తీసుకుంటారని తెలిపారు. వీరి వెంట టౌన్ సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంఈఓ రామిరెడ్డి, ఎంఈఓ–2 శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. -
నంద్యాలలో 22, 23న స్పోర్ట్స్ మీట్
నంద్యాల(న్యూటౌన్): ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025–2026 (ఐపీఎస్జీఎం) ఈనెల 22, 23 తేదీల్లో నంద్యాల గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శైలేంద్ర కుమార్ తెలిపారు. శుక్రవారం వాల్పోస్టర్లను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. స్పోర్ట్స్ మీట్లో కర్నూలు నంద్యాల జిల్లాల నుంచి 7 ప్రభుత్వ, 5 ప్రైవేట్ పాలిటెక్నిక్స్ నుంచి 500 మంది క్రీడాకారులు పాల్గొననున్నారన్నారు. వివరాల కోసం మార్గరెట్ (9390405721), నాగరాజు (9885037114) సంప్రదించాలన్నారు. -
అభివృద్ధికి ఆదోని జిల్లా చేయాలి
● జేఏసీ నాయకుల నిరసనఎమ్మిగనూరుటౌన్: జిల్లాలోని అత్యంత వెనుకబడిన పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్లో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక దీక్షకు శుక్రవారం వారు సంఘీభావం తెలిపారు. అనంతరం శివ సర్కిల్లో రాస్తారోకో చేసి అక్కడే బైఠాయించారు. ఆదోని జిల్లా చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఐదు నియోజకవర్గాలు సంపూర్ణంగా అభివృద్ధి సాధించాలంటే ఆదోని జిల్లాగా ప్రకటించాలన్నారు. ఆర్డీఎస్ కుడి కాలువ, హంద్రీ–నీవా, గుండ్రేవుల, వేదావతి ప్రాజెక్ట్ల పనులు పూర్తి చేయాలని కోరారు. ఆదోని జిల్లాగా ప్రకటించడానికి అన్ని అర్హతలున్నాయన్నారు. సత్వరం ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్నారు. జేఏసీ నాయకులు గణేష్, సత్యన్న, రాజు, సత్యనారాయణరెడ్డి, ఆఫ్రిది, కృష్ణ, మహేంద్ర, ఖాజ, ఉదయ్, శేఖర్, నల్లారెడ్డి, రఘునాథ్ పాల్గొన్నారు. -
ఖలీల్.. వహ్వా!
కర్నూలు కల్చరల్: సంగీత సవ్వడులకు కాలు కదపడం.. మధురమైన సంగీతానికి మైమరిచిపోతుంటాం. అలాంటి సంగీత వాయిద్యాల్లో బుల్బుల్ తారా (ఎలక్ట్రికల్ బ్యాంజో) ఒకటి. గజల్, ఖవ్వాలి ప్రదర్శనల్లో ఆ పాటలకు బుల్బుల్ తారా వాయిద్యం నుంచే వెలువడే సవ్వడులు, వాయిద్య కారుడు తన చేతివేళ్లతో లయబద్దంగా వాయిద్యం తీగలను, బటన్స్ను మీటడంతో వచ్చే శబ్ధాలు మనసుకు వినసొంపును ఇస్తాయి. అయితే ఈ బులుబుల్ తారా వాయిద్య పరికరాలు కాలంతో పాటు కనుమరుగవుతున్నాయి. ఈ వాయిద్యాన్ని వాయించే వారిని వేళ్లపై లెక్కించ వచ్చు. అలాంటి వారిలో కర్నూల నగరానికి చెందిన బుల్ బుల్ తారా వాయిద్య కళాకారుడు షేక్ ఖలీల్ అహ్మద్. ఇతని కళా నైపుణ్యాన్ని గుర్తించి తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో శనివారం ప్రతిభా పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఈనేపథ్యంలో ఖలీల్ కళా ప్రస్థానం గురించి ఇలా.. వాయిద్యం తయారీలో దిట్ట.. స్వతహాగా కార్పెంటర్ అయిన ఖలీల్ తనకు ఎంతో ఇష్టమైన బుల్బుల్ తారా వాయిద్యాన్ని ఆయనే తయారు చేసుకుంటారు. పెద్ద పెద్ద సిటీల్లో మాత్రమే దొరికే ఈ వాయిద్యం ప్రారంభం ధర రూ. 20 వేలు. ఈయన వాయిద్యానికి సంబంధించిన పరికరాలను తెప్పించుకొని తనకు తీరిక ఉన్న సమయాల్లో రూ. 8 వేల లోపు ఖర్చుతో నెల రోజుల్లో తయారు చేసుకుంటారు. ఉమ్మడి జిల్లాల్లో ఈ వాయిద్యాన్ని వాయించడం, తయారు చేయడంలో ఖలీల్ ఒక్కరే ఉన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏకై క బుల్బుల్ వాయిద్య కళారుడు 16 ఏళ్ల వయస్సులో మొదలు పెట్టి 68 సంవత్సరాలుగా కొనసాగింపు వాయిద్యం తయారు చేసుకోవడంతో పాటు ప్రదర్శనల్లో మేటి ఖలీల్ కళా నైపుణ్యానికి గుర్తింపుగా ప్రతిభా పురస్కారం నేడు ప్రదానం చేయనున్న తెలుగు కళా సమితి -
కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీలు
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం మండలంలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. శుక్రవారం సున్నిపెంటలో కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీలు కాగా గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలకు చేరుకుంది. సాయంత్రం ఐదు గంటల నుంచే చలి ప్రభావం మొదలవుతుంది, ఉదయం పది గంటల వరకు చలి తీవ్రత తగ్గడం లేదు. రహదారిలో ఎదుటి వ్యక్తి కూడా కనబడని విధంగా మంచు తెరలు ఏర్పడుతున్నాయి. వృద్ధులు, పిల్లలు, మహిళలు ఇంటి ముంగిట చలిమంటలతో వెచ్చదనాన్ని పొందుతున్నారు. బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలి నంద్యాల(వ్యవసాయం): వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతి వస్తువు, సేవలకు బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని తూనికలు కొలతల శాఖ జిల్లా అధికారి జిలాని, ఇన్స్పెక్టర్ అనిత అన్నారు. నంద్యాల రైల్వే స్టేషన్లో శుక్రవారం ప్రయాణికులకు, వినియోగదారులకు అవగాహన కల్పించారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం పురస్కరించుకుని తూనికలు, కొలతల శాఖ, వినియోగదారుల సంఘాల సహకారంతో స్థానిక సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాలలో కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా సివిల్ సప్లై అధికారి రవిబాబు, జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడు అమీర్ బాషా, డిప్యూటీ తహసీల్దార్ శేఖర్ పాల్గొన్నారు. ఆన్లైన్ మోసాలపై అప్రమత్తత అవసరం ● ఎస్పీ సునీల్ షోరాన్ నంద్యాల: క్రిస్మస్, న్యూఇయర్ బహుమతులంటూ సైబర్ నేరగాళ్లు చేసే ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రజలకు ఎస్పీ సునీల్ షోరాన్ సూచించారు. ఎస్సీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నట్లు చెప్పారు. క్రిస్మస్, న్యూఇయర్ గిఫ్ట్లు అంటూ వాట్సాప్, ఈమెయిల్కు సందేశాల రూపంలో లింక్లు వస్తాయన్నారు. వాటిని చూసి మోసపోవద్దన్నారు. రూ.500 గిఫ్ట్కార్డును గెలుచుకోండి అంటూ లింక్ వస్తాయని వాటిని క్లిక్ చేయవద్దన్నారు. అలాగే ఏపీకే ఫైల్స్ను ఎలాంటి పరిస్థితిల్లో ఓపెన్ చేయవద్దన్నారు. పాన్కార్డు, ఆధార్ వంటి వాటి వివరాలు ఎవరితో పంచుకోవద్దన్నారు. ఫోన్ నంబర్ ఆధారంగా బ్యాంక్ ఖాతా ఖాళీ చేస్తారన్నారు. ఒకవేళ సైబర్ నేరానికి గురైతే వెంటనే సంబంధిత దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ హెల్ప్ లైన్ 1930కి ఫోన్ కాల్ చేయాలన్నారు. వైభవంగా తిరుచ్చి మహోత్సవం బేతంచెర్ల: శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి తిరుచ్చి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీల్లో కొలువుంచి ఆలయ మాడ వీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. పుష్పాలంకరణ పల్లకీలో భక్తులకు స్వామి దర్శనమిచ్చారు. ఆలయ మాజీ చైర్మన్ లక్ష్మిరెడ్డి, ఆలయ ఉపకమిషనర్ రామాంజనేయులు, వేదపండితులు కళ్యాణ చక్రవర్తి పాల్గొన్నారు. పన్నులు సకాలంలో వసూలు చేయాలి ఆదోని టౌన్: మున్సిపాలిటీకి వచ్చే పన్నులను సకాలంలో వసూలు చేయాలని మున్సిపల్ అధికారులను ఆ శాఖ రీజనల్ డైరెక్టర్ నాగరాజు ఆదేశించారు. ఆదోని సమీపంలోని సిరుగుప్ప బైపాస్ వద్ద ఉన్న డంపింగ్ యార్డును, అన్నా కాం్య టీన్ను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సి బ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. -
బాల్య వివాహాలు సాంఘిక దురాచారం
కర్నూలు: బాల్య వివాహాలు సాంఘిక దురాచారమని, అలాంటి వివాహాల వల్ల వారి జీవితాలు నాశనమవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జ.కబర్ధి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ ఆదేశాల మేరకు బాల్య వివాహాల నిర్మూలనకు వంద రోజుల జాతీయ ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బాల్య వివాహి రహిత భారత్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల కుటుంబాలతో పాటు పిల్లల భవిష్యత్తు కూడా నాశనమవుతుందన్నారు. 18 సంవత్సరాల్లోపు పెళ్లి చేసుకుంటే వారికి ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా గర్భవతి అయితే శిశువు గర్భంలోనే మరణించే అవకాశముందన్నారు. బాల్య వివాహాలు చేసుకుంటే ఎన్నో నష్టాలు ఉంటాయన్నారు. బాలల సహాయం కోసం విడుదల చేసిన పోస్టర్లను జిల్లాలోని ప్రతి పాఠశాలలో ప్రదర్శిస్తామన్నారు. సీ్త్ర శిశు సంక్షేమ శాఖ పీడీ విజయ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద, గేడ్–1 సూపర్వైజర్ రాజేశ్వరి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జుబేదాబేగం. లీగల్ ఎయిడ్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ఫీజు అందనంత దూరం!
పేద విద్యార్థులు ఉన్నత విద్యను పూర్తి చేసేందుకు ఫీజురీయింబర్స్మెంట్ అందడం లేదు. ఎప్పటికప్పుడు ఫీజులను విడుదల చేయడం లేదు. చదువులకు ఎలాంటి ఆటంకం కల్పించబోమని ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ఫీజు బకాయిలపై దృష్టి సారించకపోవడంపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కర్నూలు(అర్బన్): చంద్రబాబు ప్రభుత్వం ఫీజు బకాయిలపై నోరు మెదపకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని విద్యార్థులను పట్టిపీడిస్తున్నాయి. ప్రతి విద్యా సంవత్సరం నాలుగు విడతలుగా ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేయాల్సి ఉంది. అయితే 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి అదే ఏడాది మార్చి 2న మొదటి విడతగా జిల్లాలోని 35,618 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.23.95 కోట్లను అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం జమ చేసింది. మిగిలిన మూడు విడతల ఫీజును ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించిన మూడు విడతల బకాయిలతో పాటు 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులను బకాయి పెట్టింది. పేరుకుపోయిన రూ.84 కోట్ల బకాయిలు జిల్లాలోని దాదాపు 30 వేల మంది విద్యార్థుల్లో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులను మినిహాయిస్తే మిగిలిన 25 వేల మంది బీసీ, ఈబీసీ, మైనారిటీ, కాపు, క్రిస్టియన్ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి కూటమి ప్రభుత్వం మూడు విడతలుగా రూ.50 కోట్లు, 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు రూ.34 కోట్లను చెల్లించాల్సి ఉంది. పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం జిల్లాలో వైద్య విద్యకు సంబంధించి జీఎన్ఎం, పారా మెడికల్, బీఎస్సీ నర్సింగ్, డెంటల్, ఎంబీబీఎస్ తదితర కళాశాలలు 36 దాకా ఉన్నాయి. ఈ కళాశాలల్లో దాదాపు 1,500 మంది విద్యార్థులకు ఫీజులను చెల్లించాల్సి ఉంది. అయితే వీరికి కూడా 2023–24, 2024–25 విద్యా సంవత్సరాలకు సంబంధించి ఫీజులను ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. గత వైఎస్సార్సీసీ ప్రభుత్వం పక్కనున్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తూ అర్హత కలిగిన విద్యార్థులకు ఫీజులు విడుదల చేసింది. చంద్రబాబు ప్రభుత్వంలో పొరుగు రాష్ట్రాల్లో చదువుతున్న విద్యార్థులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీలను మినహాయించి మిగిలిన బీసీ, కాపు, ఈబీసీ, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ తదితర సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు కనీసం ఫీజుకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కూడా ఇంతవరకు ఆన్లైన్లో ఆప్షన్ ఇవ్వలేదు. ఐదేళ్లలో రూ.501.60 కోట్లు విడుదల ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ తదితర సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ.501.60 కోట్లను తల్లుల ఖాతాల్లో జమ చేశారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రభు త్వం బకాయి పడిన ఫీజులను విడుదల చేసేంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం. ఫీజు బకాయిలన్నింటినీ చెల్లిస్తామని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థి సంఘాలకు ఇచ్చిన హామీ నేటి వరకు నెరవేరలేదు. ఫీజులను విడుదల చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నందున కళాఽశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తీసుకువస్తున్నాయి. – కటారుకొండ సాయికుమార్, రాష్ట్ర కార్యదర్శి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలలో జాప్యం పేరుకుపోయిన బకాయిలు రూ.84 కోట్లు -
ఉరుకుందకు పోటెత్తిన భక్తులు
కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఉరుకుంద ఈరన్నస్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం అమావాస్య కావడంతో భక్తులు తమ ఇంటి ఇలవేల్పును దర్శంచుకోవాడానికి వేలాదిగా తరలివచ్చారు. క్షేత్ర పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజామున 4 గంటలకు అర్చకులు స్వామివారి మూలవిరాట్కు సుప్రభాతసేవ, మహామంగళహరతి, ఆకుపూజ, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం భక్తులను దర్శనానికి వదిలారు. భక్తుల సౌకార్యర్థం ఆదోని, ఎమ్మిగనూరు, కర్ణాటకలోని రాయచూరు, శిరుగుప్ప డిపో అధికారులు ప్రత్యేక బస్సులను నడిపారు. కౌతాళం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశా రు. అలాగే ఉరుకుందకు ఐదు కిలోమీటర్ల దూరంలో వెలసిన బుడుములదొడ్డి ఆంజనేయస్వామి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. తుంగభద్ర నది ఒడ్డున మేళిగనూరు గ్రామంలో వెలసిన రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
విఖ్యాత్ ఎంపిక నిబంధనలకు విరుద్ధం
● విజయ డెయిరీ చైర్మన్ జగన్మోహన్రెడ్డినంద్యాల(అర్బన్): చాగలమర్రి మండలం ముత్యాలపాడు పాల ఉత్పత్తి దారుల పరస్పర సహకార సంఘం అధ్యక్షునిగా భూమా విఖ్యాత్రెడ్డిని నిబంధనలకు విరుద్ధంగా ఎంపిక చేశారని నంద్యాల విజయ డెయిరీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ముత్యాలపాడు పాల సొసైటీ రికార్డులను మార్చి అర్హత లేకున్నా విఖ్యాత్ను డైరెక్టర్గా కో ఆప్షన్ చేసుకుని అధ్యక్షున్ని చేశారన్నారు. పాల సొసైటీలో సభ్యుడు కావాలంటే కనీసం 180 రోజుల పాటు 180 లీటర్ల పాలు సహకార సంఘానికి సరఫరా చేసి ఉండాలన్నారు. సహకార సంఘం జాబితాలో లేని విఖ్యాత్ను అధ్యక్షునిగా ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. దీనిపై లిఖిత పూర్వక సంజాయిషీ ఇవ్వాలని ముత్యాలపాడు సహకార సంఘం పాలకవర్గ సభ్యులైన మాబుస్వామి, ఓబులేసు, తిమ్మారెడ్డి, నాగన్న, రమణారెడ్డి, రాంపుల్లారెడ్డిలకు నోటీసులు ఇచ్చామన్నారు. విఖ్యాత్ మెంబర్షిప్ రద్దు డైరీ డబ్బులు తీసుకొని భూమా విఖ్యాత్రెడ్డి డీఫాల్టర్ అయ్యాడని జగన్మోహన్రెడ్డి గుర్తు చేశారు. యూనియన్కు తిరిగి డబ్బులు చెల్లించనందుకే చక్రవర్తుల పల్లె పాల సొసైటీ మెంబర్ షిప్ రద్దు చేశామన్నారు. అక్రమ మార్గంలో ముత్యాలపాడు సొసైటీ నుంచి అధ్యక్షుడినంటూ డెయిరీ వద్ద హంగామా చేస్తున్నారన్నారు. కర్నూలు మిల్క్ యూనియన్లో విఖ్యాత్ మెంబర్షిప్ రద్దుఅయిందన్నారు. ఆయనకు ఎక్కడా పోటీ చేసేందుకు అర్హత లేదన్నారు. -
గాంధీజీ అంటే ఎందుకు మీకంత ఈర్ష్య
కర్నూలు(సెంట్రల్): మహాత్మాగాంధీ అంటే మీకు ఎందుకంత ఈర్ష్య అని ప్రధానమంత్రి నరేంద్రమోదీని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి ఉన్న మహాత్మాగాంధీ పేరును తీసి వేయడం అన్యాయమన్నా రు. శుక్రవారం సీపీఐ నగర 17వ మహాసభలు కర్నూలులో నిర్వహించారు. స్థానిక సీపీఐ కార్యాల యం నుంచి సీక్యాంపు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీపీఐ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన కె.రామకృష్ణ మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన పార్టీలు సీపీఐ, కాంగ్రెస్ మాత్రమేనని.. అయితే స్వాతంత్ర పోరాటం చేయని బీజేపీ అధికారంలో ఉండడం అన్యాయమన్నారు. అధికారం ఉన్నా లేకున్నా కమ్యూనిస్టు పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్కు కొమ్ముకాస్తూ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నాయన్నారు. అందులో భాగంగా విశాఖ స్టీలు, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్నట్లు చెప్పారు. దేశంలో మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ అధికారంలో కొనసాగుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పరాభావం తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ విచ్చల విడిగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని, అరికట్టడంలో సీఎం విఫలమయ్యారని విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సీసీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.రామచంద్రయ్య, శేఖర్, రామాంజనేయులు, సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, జిల్లా సహాయ కార్యదర్శులు ఎన్,లెనిన్బాబు, ఎస్.మునెప్ప తదితరులు పాల్గొన్నారు. -
సైన్స్ ప్రాజెక్టులతో పర్యావరణ పరిరక్షణ
నంద్యాల(న్యూటౌన్): పర్యావరణ పరిరక్షణకు సైన్స్ ప్రాజెక్టులు ఎంతో ఉపయోగపడతాయని డీఈఓ జనార్దన్రెడ్డి, డిప్యూటీ డీఈఓ శంకర ప్రసాద్ అన్నారు. నంద్యాల పట్టణంలోని ఎస్పీజీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లా సైన్స్ ఫేర్ను నిర్వహించారు. వివిధ అంశాలపై 275 ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈసందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. సైన్సు ప్రాజెక్టులు తయారు చేసే విద్యార్థులు భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా రాణించే అవకాశం ఉందన్నారు. చక్కటి అంశాలతో ప్రాజెక్టులు రూపొందిచడంతో విద్యార్థులను అభినందించారు. సోలార్ శక్తి వినియోగంపై పాణ్యం మండలం పిన్నాపురం హైస్కూలు ఉపాధ్యాయుడు సమయోను ప్రదర్శించిన ప్రాజెక్టు, అలాగే వెంకటాపురం ఉపాధ్యాయురాలు వెంకటేశ్వరమ్మ ప్రదర్శించిన డోర్ లాక్ సిస్టం ప్రాజెక్టు రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికై నట్లు జిల్లా కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి తెలిపారు. ఈనెల 23, 24న విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయిలో సైన్స్ఫైర్ జరగనుంది. ప్రాజెక్టు పేరు విద్యార్థిపేరు పాఠశాల స్మార్ట్ అగ్రికల్చర్ పల్లవి నెరవాడ తడిపొడి చెత్త మాదియ ఆత్మకూరు వేరుచేయుట మినీ వాటర్ క్రీన్ శశిధర్ రుద్రవరం ఆంటీ స్లీప్ అలారం రోహిత్ బనగానపల్లె గణిత క్విజ్ పరికరం ద్రాక్షాయణి గోస్పాడు రియల్ టైం హెల్త్ కరీమూన్ శిరివెళ్ల మానిటర్ వాటర్ కన్జర్వేషన్ రేవతి బండిఆత్మకూరు -
పదవి పోయినా అదే వ్యామోహం!
డోన్: పదవి పోయినా ఆ వ్యామోహం పోదనే నానుడి డోన్ నియోజకవర్గ టీడీపీ నాయకులకు అక్షరాలా వర్తిస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్యాపిలికి చెందిన రాజా నారాయణమూర్తికి వ్యవసాయ మార్కెట్యార్డు చైర్మన్ పదవి దక్కింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన టీడీపీలో చేరారు. పదవీ కాలం ముగిసినా కూడా అదే కాంక్షతో తన సొంత వాహనంపై మార్కెట్యార్డు చైర్మన్ అనే పేరును తొలగించకుండా చక్కర్లు కొడుతున్నారు. ఇదిలా ఉండగా టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కోట్ల సూర్యప్రకాష్రెడ్డి రెండోసారి కూడా రాజా నారాయణమూర్తి పేరును మార్కెట్యార్డు చైర్మన్ పదవికి అధిష్టాన వర్గానికి సిఫారసు చేశారు. అయితే ధర్మవరం సుబ్బారెడ్డి దీనిని పూర్తిగా వ్యతిరేకించారు. -
నకిలీ ఆధార్తో అక్రమ రిజిస్ట్రేషన్
ఆదోని రూరల్: 23 ఏళ్ల క్రితం మృతి చెందిన వ్యక్తి పేరుపై నకిలీ ఆధార్ సృష్టించి అక్రమంగా స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంఘటన ఆదోనిలో వెలుగులోకి వచ్చింది. భార్య, భర్త పేర్లు ఒకేవిధంగా ఉండేవారిని గుర్తించి, వారి పేర్ల మీద తప్పుడు ధ్రువ పత్రాలు సృష్టించి భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన ఉదంతమిది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. మండిగిరి ప్రాంతానికి చెందిన మస్తాన్వలి, ఫాతిమా దంపతులు సర్వేనంబర్ 486/1లో ఆరు సెంట్ల స్థలాన్ని 1996లో (డాక్యుమెంట్ 873) ద్వారా కొనుగోలు చేసుకున్నారు. 2003 ఇంటి పెద్ద మస్తాన్వలి అనారోగ్యంతో మృతిచెందారు. అయితే కొందరు వ్యక్తులు మస్తాన్వలి, ఆయన భార్య ఫాతిమా పేర్లు కలిగిన డమ్మీ వ్యక్తులను సృష్టించి ప్లాటును అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆదోని పట్టణానికి చెందిన దీపి మస్తాన్వలి, దీపి ఫాతిమా పేర్ల వ్యక్తుల ఆధార్ కార్డులను సృష్టించి ఆ ప్లాటును రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కాగా మృతుడు మస్తాన్ వలి భార్య ఫాతి మాబీ, కుమార్తె గౌసియా, కుమారుడు షేక్షావలి గురువారం ఆదోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకుని ఈసీ తీశారు. దీంతో వారి ప్లాటు నంబర్ 36 ఇతరుల పేరు మీద బదిలీ అయినట్లు రికార్డుల్లో తేలింది. ఈ విషయంపై సబ్రిజిస్ట్రార్ సునంద దృష్టికి తీసుకెళ్లగా.. బాధితులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి, ఫిర్యాదు కాపీని తనకు అందిస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 23 ఏళ్ల క్రితం మృతిచెందిన వ్యక్తి పేరుపై డూప్లికేట్ ఆధార్ సృష్టించి భూమి రిజిస్ట్రేషన్ చేయడంపై పట్టణంలో చర్చ జరుగుతోంది. -
అయ్యో.. కుయ్యో.. మొర్రో !
ఎరుక్క పోయి ఓ శునకం మూతి డబ్బాలో ఇరుక్కుపోయింది. అప్పటికే ఆకలితో ఉన్న ఓ శునకానికి స్వీట్ల డబ్బా కనిపించింది. దీంతో వెంటనే మూతి డబ్బాలోకి పెట్టడంతో ఇరుక్కు పోయింది. ఈ ఘటన మండలంలోని క్రిష్టిపాడు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఇరుక్కున్న డబ్బాను స్థానికులు తొలగించేందుకు ప్రయత్నించినా పరుగులు తీసింది. కాసేపటికీ అలసిన శునకం నిద్రించేందుకు నీడకు చేరుకోగా.. పక్కనే ఉన్న వారు మెల్లగా వెళ్లి దాన్ని పట్టుకుని డబ్బాను తొలగించారు. హమ్మ య్యా.. అంటూ కుక్క పరుగులు పెడుతూ తన పిల్లల చెంతుకు చేరి పాలుపట్టింది. – దొర్నిపాడు -
శతాధిక వృద్ధురాలి మృతి
పాణ్యం: పాణ్యం గ్రామానికి చెందిన మాజీ మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు పీవీ జగన్నాథరావు తల్లి జనజకబాయి (104) గురువారం మృతి చెందింది. ఆమె భర్త పీవీ రామచంద్రరావు రైల్వే కాంట్రాక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఈ కుటుంబం కాంగ్రెస్లో చాలా ఏళ్ల పాటు కొనసాగింది. బెంగళూరులో చిన్న కుమారుడి వద్ద ఉన్న జనజకబాయి గురువారం అస్వస్థతకు గురై మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆమె మృతి పట్ల పలువురు నాయకులు, గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేశారు. ఏ కష్టం వచ్చిందో.. మహానంది: పెద్ద మని షినికి ఏ కష్టం వచ్చిందో తెలియదు. మహానందీశ్వరుడి దర్శనానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వచ్చి నల్లమల అడవిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మహానంది ఎస్ఐ రామ్మోహన్రెడ్డి తెలిపిన వివరాల మేరకు...అనంతపురం జిల్లా యల్లనూరు మండలం పెద్దమల్లెపల్లె గ్రామానికి చెందిన కంచన రామాంజనేయులు రెడ్డి బుధవా రం తన కుటుంబ సభ్యులకు చెప్పి మహానందికి చేరుకున్నాడు. కాగా గురువారం ఉదయం మహానంది ఆలయం వెనుక ఉన్న నల్లమల అడవిలోకి వెళ్లి నామాలతిప్ప సమీపంలో పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అటుగా వంట చెరుకు కోసం వెళ్లిన కొందరు గుర్తించి వెంటనే బయటికి తరలించారు. 108లో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బ యటపడ్డాడు.వృద్ధుడి కుమారులకు సమాచా రం అందించామని ఎస్ఐ వివరించారు. కాగా ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియరాలేదు. స్వర్ణ రథంపై ప్రహ్లాదరాయల విహారం మంత్రాలయం: శ్రీ మఠంలో గురువారం రాత్రి మంగళ వాయిద్యాల మధ్య బంగారు రథంపై ప్రహ్లాద రాయలు భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తుంగభద్ర నదిలో పుణ్యసాన్నాలు ఆచరించి ముందుగా గ్రామ దేవత మంచాలమ్మకు పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వలస కూలీ మృతి నందవరం: బతుకు దెరువు కోసం ఒడిసా రాష్ట్రం నుంచి వచ్చి ముగతి ఇట్టుకల బట్టిలో పని చేస్తున్న అనూర్ మాఘి(30) మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. గ్రామ సమీపంలోని ఎస్ఆర్ఐ ఇట్టుకల బట్టి వద్ద ఒడిసా రాష్ట్రం నువపాడ జిల్లా కిటిక గ్రామానికి చెందిన ఐదుగురు 15 రోజుల క్రితం పనిలో చేరారు. బుధవారం ఇట్టుకల బట్టిలో అనూర్ మాఘి క్రేన్ వద్ద పని చేస్తుడడంతో ఆకస్మాత్తుగా కింద పడిపోయాడు. వెంటనే స్థానికులు గమనించి ప్రభు త్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. గురువారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతుడు బావమరిది భువన ధ్రువ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ సుభాన్ తెలిపారు. -
విద్యార్థిని చితకబాదిన టీచర్
జూపాడుబంగ్లా: కస్తూర్బా పాఠశాలలో తెలుగు టీచర్ ఇందిర బెత్తంతో ఏడో తరగతి విద్యార్థిని హరిణీశ్రీని చితకబాదారు. విద్యార్థి ని తండ్రి సంతోష్కుమార్శర్మ గురువారం కుమార్తెను చూసేందుకు పాఠశాల వద్దకు వెళ్లగా విషయం తెలిసింది. వెంటనే ఆయన పాఠశాల ఎస్ఓ యశోద దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాడు. తాను పాఠశాలలో లేనని ఆమె తెలపటంతో తన బిడ్డను కొట్టిన తెలుగు టీచర్ ఇందిరకు ఫోన్చేసి నిలదీశారు. ఆమె పొంతనలేని సమాధానం చెప్పారని విద్యార్థిని తండ్రి సంతోష్కుమార్ శర్మ విలేకరుల ఎదుట వాపోయాడు. ఏడో తరగతి చదువుతున్న తన బిడ్డను ఎందుకు కొట్టాల్సి వచ్చిందన్న విషయం తనకు తెలియజేకుండా పాఠశాల ఎస్ఓ, తెలుగు టీచర్ ఇందిర నిర్లక్ష్యం చేశారన్నారు. టీచర్పై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయి కబడ్డీ శిక్షణకు ఇద్దరు ఎంపిక నంద్యాల(న్యూటౌన్): జాతీయ స్థాయి కబడ్డీ కోచింగ్ క్యాంపునకు బనగానపల్లెకు చెందిన హసీనా, ఎస్వీఆర్ కాలేజీ విద్యార్థిని అంకిత ఎంపికై నట్లు నంద్యాల జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు చింతలమోహన్రావు, కార్యదర్శి ఎం.సుబ్రమణ్యంలు గురువారం తెలిపారు. ఈనెల 25 నుంచి 28 వరకు బెంగాల్లో జరిగే జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో భాగంగా వైజాగ్లోని గాజువాకలో కోచింగ్ క్యాంపును నిర్వహిస్తున్నారు. 20 మంది శిక్షణకు ఎంపిక కాగా.. వారిలో ప్రతిభ చూపిన 14 మందిని జాతీయ జట్టుకు ఎంపిక చేసే అవకాశం ఉంటుందన్నారు. ఆవేదనకు లోనైన తల్లిదండ్రులు -
బాలికల హైస్కూల్లో చాక్లెట్ల కలకలం
● టీచర్కు, విద్యార్థినులకు అస్వస్థత ● విచారణ జరిపిన సీఐలు నందికొట్కూరు: పట్టణంలోని ప్రభుత్వ బాలికల హైస్కూల్లో చాక్లెట్ కలకలం రేపింది. మంగళవారం బాలికల హైస్కూల్లో ఒక టీచర్కు విద్యార్థినులు చాక్లెట్ ఇచ్చారు. బాలికలు ఇచ్చిన చాక్లెట్ తినడంతో టీచర్కు సాయంత్రం ఇంటి వద్ద వాంతులు కావడం, కళ్లు తిరిగాయి. గురువారం కొందరు విద్యార్థినులు అదే చాక్లెట్ తినడంతో కడుపు నొప్పి రావడం, కళ్లు తిరగడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ విషయంపై ఇన్చార్జ్ హెచ్ఎం ఖాజా హుసేన్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పిల్లలను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య చికిత్సలు చేయించారు. ఈ విషయం తెలుసుకున్న టౌన్ సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. స్కూల్లో తినుబండరాలు, చాక్లెట్లు విచ్చలవిడిగా విక్రయిస్తున్నా ఎందుకు చర్యలు చేపట్టలేదని ఎంఈఓ రామిరెడ్డిపై టౌన్ సీఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. తహసీల్దార్ శ్రీనివాసులు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. బాలికల హైస్కూల్కు రూరల్ సీఐ సుబ్రమణ్యం చేరుకుని వివరాలను తెలుసుకున్నారు. -
మహనీయుడు.. ఖాదర్లింగ స్వామి
కౌతాళం: తల్లి గర్భం నుంచే మహిమలు ప్రదర్శిస్తూ వేలాది మంది శిష్యులను కూడగట్టుకున్న గురువు ఖాదర్ లింగస్వామి. చరాచర జీవకోటి రాశులకే మూలమైన పరమేశ్వరుడినే మెప్పించిన ఓ ముస్లిం మహనీయుడు అని చరిత్ర చెబుతోంది. మండల కేంద్రమైన కౌతాళంలో వెలసిన ఖాదర్లింగ స్వామిని కులమతాలతీతకంగా భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు. ఈనెల 20వ తేదీన ఖాదర్లింగ స్వామి జయంతిని దర్గా నిర్వాహకులు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల భక్తులు తరలిరానున్నారు. పూర్వం కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ పట్టణంలో కొలువైన అమీనుద్దీన్ అలిఆలా షేర్ ఏ ఖుదా గురువు గారి వద్ద ఖాదర్లింగ స్వామి 12 సంవత్సరాలు శిష్యరికం చేశారు. గురువు ఆజ్ఞానుసారం మానవుల్లో మత మౌఢ్యాన్ని తొలగించి మతసామరాస్యాన్ని చాటేందుకు కర్ణాటక సరిహద్దులో ఉన్న కౌతాళానికి వచ్చారు. ఆయన మెడలో లింగాన్ని ధరించేవారు. దీనికి ఈ ప్రాంతంలో ఉన్న శైవమతస్తులు కొందరు అభ్యంతరం చెప్పారు. భగవంతుడు ఎవరి సొంతం కాదని పరమేశ్వరుని ప్రతీక అయిన లింగంపై ఎవరికీ హక్కు లేదని ఆయన వారితో వాదించారు. ఒకరోజు శైవమతస్తులను సమావేశ పరిచి వారి మేడలో ఉన్న లింగాలను బావిలో వేసి, వాటిని మరలా రప్పిస్తానని, అలా చేయలేని పక్షంలో గ్రామం వదలి వెళ్లడానికి సిద్ధమని, సాధించినచో తాను ప్రస్తుతం ఉన్న స్థలాన్ని శ్వాశతంగా ఉండడానికి ఇచ్చేయాలని ఒప్పందానికి వచ్చారు. ఈ ప్రయత్నంలో ఆయన శివున్ని మోప్పించి లింగాలను బావి నుంచి రప్పించారు. అప్పటి నుంచి గ్రామస్తులంతా మత సామరస్యంతో ఆయనను ఖాదర్లింగ స్వామిగా పూజించడం ఆరంభించారు. ఆయనకు ముగ్గురు భార్యలు, ఐదుగురు కుమారులు 321 సంవత్సరాల క్రితం ఆయన గ్రామంలోనే సమాధి అయ్యారు. ఆయన వంశస్తులు అయిన ప్రస్తుత ధర్మకర్త సయ్యద్ మున్నపాషా వుసేని చిష్తీ ట్రస్టీగా ఉన్నారు. ఖాదర్లింగ స్వామి జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల భక్తులు తరలిరానున్నారు. -
ఇద్దరు మహిళల అరెస్ట్
● పోలీసు అధికారులే టార్గెట్గా ఫొటోల మార్ఫింగ్ ● రెండు సెల్ఫోన్లు స్వాధీనం కోవెలకుంట్ల: పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని వారి ఫొటోలు మార్ఫింగ్ చేసి ఫేస్బుక్, ఇన్స్ర్ట్రాగాం అకౌంట్లలో పోస్టు చేస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయంలో గురువారం కొలిమిగుండ్ల సీఐ రమేష్బాబు అందించిన వివరాలకు మేరకు.. ఉయ్యాలవాడ మండలం మాయలూరుకు చెందిన బందెల స్పందన, ఆమె తల్లి బందెల మార్తమ్మ ప్రస్తుతం కోవెలకుంట్ల పట్టణంలోని గాంధీనగర్లో నివాసం ఉంటున్నారు. కొన్ని నెలల నుంచి వీరిద్దరూ ఫేస్బుక్, తదితర సోషల్ మీడియా అకౌంట్లను ప్రారంభించి కోవెలకుంట్ల, సంజామల, రేవనూరు, ఆళ్లగడ్డ పోలీస్స్టేసన్ల పరిధిల్లో గతంలో పనిచేసిన, ప్రస్తుతం పనిచేస్తున్న డ్రస్లో ఉన్న పోలీస్ అధికారుల ఫోటోలు తారుమారు చేసి వాటిల్లో పదే పదే పోస్టు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు గత సెప్టెంబర్ 7వ తేదీ, నవంబర్ 26వ తేదీన కోవెలకుంట్ల పోలీస్స్టేషన్లలో వీరిద్దరిపై రెండు కేసులు నమోదు చేశారు. అంతేకాక ఈ ఏడాది మే 6వ తేదీన కోవెలకుంట్ల పోలీస్స్టేషన్లో పోలీసుల విధులకు ఆటంకం కల్గించి దౌర్జన్యం చేయడంతో అప్పట్లో మరో కేసు నమోదైంది. ఆయా కేసుల్లో నిందితులుగా ఉన్న వీరిని కొలిమిగుండ్ల సీఐ తమ సిబ్బందితో అరెస్ట్ చేసి ఫొటోల మార్ఫింగ్కు వాడుతున్న రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళలు పదేపదే నేరాలకు అలవాటు పడి ఇప్పటికీ మూడు కేసుల్లో నిందితులుగా ఉండటంతో వీరిని జిల్లా బహిష్కరణ చేయాలని జిల్లా కలెక్టర్కు నివేదించినట్లు సీఐ వివరించారు. -
భక్తిశ్రద్ధలతో తిరుప్పావడ సేవ
నంద్యాల (వ్యవసాయం): స్థానిక సంజీనగర్ రామాలయంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామికి గురువారం ధనుర్మాసం సందర్భంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో తిరుప్పావడ సేవ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం స్వామివారి మూల విరాట్కు పంచామృత అభిషేకం, సహస్రనామార్చన పూజలు చేశారు. స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. పులిహోరను స్వామి ముందు రాశిగా పోసి శ్రీవారి ప్రతిబింభంగా తీర్చిదిద్ది, అప్పం, జిలేబీ, మినప వడలు, కూరగాయలు, ఫలాలతో సుందరంగా అలంకరించి, వేద మంత్రాలతో నివేదన ఇచ్చారు. అనంతరం స్వామివారికి మహామంగళ హారతులిచ్చి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. మధుర వాగ్వసంత డాక్టర్ దీవి హయగ్రీవచార్యులు తిరుప్పావడ సేవ విశిష్టతను భక్తులకు వివరించారు. కార్యక్రమంలో శ్రీకాంత్శర్మ, నటరాజ్ శర్మ, సముద్రాల సూరయ్య, శ్రీనివాసులు, మధుసూదన్, తదితరులు పాల్గొన్నారు. -
నత్తనడకన పత్తి కొనుగోళ్లు
కర్నూలు(అగ్రికల్చర్): మద్దతు ధరతో పత్తి కొనుగోళ్లకు డిమాండ్ ఉన్నప్పటికీ సీసీఐ మాత్రం నత్తనడకన కొనుగోళ్లు చేస్తుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో 7.02 లక్షల ఎకరాల్లో పత్తి సాగయింది. ఆదోని, ఎమ్మిగనూరు, పెంచికలపాడు, మంత్రాలయంలో 16 పత్తి జిన్నింగ్ మిల్లుల్లో మద్దతు ధరతో సీసీఐ పత్తి కొను గోలు చేస్తోంది. జిల్లాలో దాదాపు 70 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. దిగుబడు లు భారీగా ఉన్నప్పటికీ సీసీఐ కొనుగోళ్లలో వేగం పెంచకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు 49వేల ఎకరాల్లో పండించిన 4.89 లక్షల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసింది. కొనుగోళ్లు అందుబాటులో వచ్చే సమయానికే రైతులు దాదాపు 10 లక్షల క్వింటాళ్లు ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డు, ప్రయివేటు జిన్నింగ్ మిల్లుల్లో అమ్ముకున్నారు. రైతుల దగ్గర ఇంకా 5.3 లక్షల ఎకరాల్లో పండించిన 55 లక్షల క్వింటాళ్ల పత్తి నిల్వలు పేరుకపోయాయి. మద్దతు ధర రూ. 8100 ఉండగా.. మార్కెట్లో లభిస్తున్న ధర రూ.6వేల నుంచి రూ.6,800 వరకు మాత్రమే ఉంటోంది. కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు తేమ, రంగు విషయంలో కాస్త ఉదారంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సీసీఐ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మంత్రి అచ్చేన్నాయుడు అయితే 16–18 శాతం వరకు తేమ ఉన్నా అనుమతించాలని సీసీఐని ఆదేశించినట్లు ప్రకటించారు. కానీ సీసీ ఐ అధికారులు ఏ ఒక్కరి ఆదేశాలను పట్టించుకోని పరి స్థితి నెలకొంది. 12 శాతం కంటే తేమ ఉంటే నిర్దాక్షిణ ్యంగా వెనక్కు పంపుతుండటం గమనార్హం. తిరస్కరించిన పత్తిని దళారీలు కొని అదే పత్తిని మద్దతు ధరతో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. సీసీఐ అధికారులే ముడుపుల కోసం దళారీలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖాతాలకు జమకాని నగదు మద్దతు ధరతో పత్తి అమ్ముకున్న రైతులకు గత నెల 28 నుంచి నగదు జమ కావడం లేదు. వ్యవసాయ ఉత్పత్తులు చేతికి రావడంతోబ్యాంకర్లతోపా టు ప్రయివేటు వడ్డీ వ్యా పారులు రైతులపై రు ణాల వసూలుకు ఒత్తిడి చేస్తున్నా రు. అయితే ఇప్ప టి వరకు నగ దు జమ కాకపోవడంతో రైతులు సీసీఐ అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. -
ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్
● 2.5 కేజీల గంజాయి, మారుతి కారు స్వాధీనం నంద్యాల: పట్టణంలోని వైజంక్షన్ సమీపంలో ప్రథమనంది ఆలయ ఆర్చి వద్ద గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ మందా జావళి గురువారం తెలిపారు. ఏఎస్పీ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మహానంది మండలం బసాపురం గ్రామానికి చెందిన షేక్ మునీర్బాషా అరకు నుంచి గంజాయి కొనుగోలు చేసి మారుతి కారులో నంద్యాలకు తీసుకొని వచ్చారు. మునీర్బాషాకు వరుసకు తమ్ముడైన షేక్ మహమూబ్బాషాకు గంజాయిని ఇస్తుండగా ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు. వీరి వద్ద నుంచి 2.5 కేజీల గంజాయి, మారుతి కారు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిని నంద్యాల కోర్టులో హాజరు పరిచామన్నారు. -
మద్దతు ధరతో కందుల కొనుగోలు
కర్నూలు(అగ్రికల్చర్): ఈ ఏడాది రబీలో పండించిన కందులను మార్క్ఫెడ్ ద్వారా నేషనల్ కో–ఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మద్దతు ధరతో కొనుగోలు చేయనుంది. కర్నూలు జిల్లాలో 14,788 టన్నులు, నంద్యాల జిల్లాలో 25,875 క్వింటాళ్లు మద్దతు ధర రూ.8వేలతో కొనుగోలు చేయనుంది. నంద్యాల జిల్లాలో మినుములు కూడా 11,254 టన్నులు కొనుగోలు చేయనుంది. నేషనల్ కో–ఆపరేటివ్ కన్జూమర్స్ పెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కు మార్క్ఫెడ్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. మార్కెట్లోకి దాదాపు నెల రోజులుగా కందులు వస్తున్నాయి. మద్దతు ధరతో కొనుగోలు చేయడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది. మద్దతు ధర రూ.8వేలు ఉండగా.. మార్కెట్లో రైతులకు గరిష్టంగా రూ.7 వేల వరకే ధర లభిస్తోంది. దీంతో రైతులు నష్టపోతున్నారు. ఎట్టకేలకు నేషనల్ కో–ఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మద్దతు ధరతో కొనుగోళ్లు చేయనుండటంతో రైతులు ఊరట చెందుతున్నారు. జిల్లాలోని 16 మండలాల్లో కంది సాగు ఎక్కువగా ఉంది. ఈ మండలాల్లోని ఆర్బీకేల వారీగా కందులు కొనుగోలు చేయనున్నారు. కంది సాగు తక్కువగా ఉన్న మండలాల రైతులు పక్క మండలంలో అమ్ముకోవచ్చని మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ జి.రాజు తెలిపారు. ఖరీఫ్లో కంది సాగు చేసి ఈ–క్రాప్లో నమోదు చేసుకున్న రైతులు సంబంధిత ఆర్బీకేల్లో పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. -
ఇంటర్ పరీక్షల్లో మార్పులపై అవగాహన
నంద్యాల(న్యూటౌన్): ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో వచ్చిన మార్పులపై అధ్యాపకులకు గురువారం నంద్యాలలోని ఒక కాలేజీలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇంటర్మీడియట్ విద్యాధికారి శంకర్నాయక్,ఇంటర్మీడియెట్ బోర్డు వనరుల అధికా రి జయసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. జాతీయ విద్యావిధానాన్ని అనుసరించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. సంస్కరణలను విద్యార్థులకు వివరించి మంచి ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నా రు.లెక్చరర్లు బాలచంద్రుడు, కొండారెడ్డి, రఘునాథ రెడ్డి,సుకుమార్, అజీవలి,మద్దిలేటిస్వామి,హుసేన్రెడ్డి, దివాకర్, గోవిందనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పోటీ పరీక్షలు విద్యార్థులకు ఎంతో ఉపయోగం
కర్నూలు(అర్బన్): పోటీ పరీక్షలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫారూక్ షుబ్లీ అన్నారు. ఉర్దూ అకాడమీ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వ హించిన ఉర్దూ మహోత్సవ్ కార్యక్రమానికి ఆయన గురువారం హాజరై పోటీ పరీక్షల్లో విజేతలైన విద్యార్థినీ, విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో వివిధ అంశాలపై పోటీ పరీక్షలను నిర్వహించడం వల్ల విద్యార్థుల్లోని ప్రతిభను వెలుగులోకి తెచ్చిన వారమవుతామన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఐడీయల్ స్కూల్, యునానీ కళాశాలను సందర్శించారు. అలాగే ఉస్మానియా కళాశాలలో నిర్వహించిన ప్రపంచ అరబిక్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉర్దూ అకాడమీ డైరెక్టర్ గౌస్ పీర్, హజ్ కమిటీ డైరెక్టర్ మన్సూర్ అలీఖాన్, వక్ఫ్ కాంప్లెక్స్ కమిటీ ప్రెసిడెంట్ ఇబ్రహీం, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిణి సయ్యద్ సబీహా పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు శ్రీశైలం రానున్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్
శ్రీశైలం టెంపుల్: శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి దర్శనార్థం భారత ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేష్ కుమార్ శుక్రవారం శ్రీశైలం రానున్నారు. సాయంత్రం శ్రీశైలం చేరుకుని రాత్రి బస చేసి, శనివారం ఉదయం మల్లికార్జున స్వామికి అభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. చౌడేశ్వరిదేవి దీక్ష విరమణ బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలోని శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయంలో చౌడేశ్వరిదేవి దీక్షను 200 మంది భక్తులు గురువారం విరమించారు. ఇరుముడులతో అమ్మవారి భక్తిగీతాలు పాడుతూ అమ్మవారి ఆలయానికి వచ్చారు. ఆలయలో ఆవరణలో పూర్ణాహుతి అనంతరం మాలధారులు తమ దీక్షను విరమించారు. భక్తులకు దేవస్థానం తరఫున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ పాలక మండలి చైర్మన్ పీవీ కుమార్రెడ్డి, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. హోటళ్లు, సూపర్ మార్కెట్ల తనిఖీ నంద్యాల(వ్యవసాయం): జాతీయ వినియోగదారుల వారోత్సవాల్లో భాగంగా గురువారం నంద్యాలలోని హోటళ్లు, సూపర్మార్కెట్లను ఫుడ్సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వినియోగదారులకు నాణ్యమైన, నమ్మకమైన ఆహార పదార్థాలను అందించాలన్నారు. కొన్ని నమూనాలను సేకరించి హైదరాబాద్లోని ఫుడ్ ల్యాబొరేటరీకి పంపారు. ఫుడ్సేఫ్టీ అధికారి వెంకటరాముడు, తూనికల కొలతల అధికారి అనిత, జిల్లా వినియోగదారుల రక్షణ మండలి అధ్యక్షుడు అమీర్బాషా తదితరులు పాల్గొన్నారు. ‘టెట్’ వద్దంటూ ఉపాధ్యాయుల ధర్నా నంద్యాల(న్యూటౌన్): ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (టీచర్ ఎజిబిలిటీ టెస్ట్) వద్దంటూ కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీవీ ప్రసాద్, జిల్లా గౌరవాధ్యక్షుడు సుబ్బరాయుడు మాట్లాడారు. 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత కావాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నా రు. ఈ తీర్పులో సడలింపు కోసం రాష్ట్ర ప్రభు త్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ వేయాల ని డిమాండ్ చేశారు.ఉపాధ్యాయులను స్వేచ్ఛాయుత వాతావరణంలో బోధన చేసేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. యూటీఎఫ్ నాయ కులు కిశోర్, రామ్మోహన్, రామకృష్ణుడు, షమీమ్భాను, చెన్నమ్మ, ముర్తుజా,వలి, కాశీం, నరసింహారెడ్డి, అరవింద్ పాల్గొన్నారు. రేపటి నుంచి డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవాలు కర్నూలు సిటీ: ఏపీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో రేపటి(శనివారం) నుంచి డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి టి.శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించడంలో భాగంగా ఆర్టీసీలో పార్సిల్స్ ఇంటి వద్దకే చేరవేస్తామన్నారు. జిల్లా పరిధిలోని అన్ని ఆర్టీసీ బస్టాండ్ల కార్గో కౌంటర్ల ద్వారా రాష్ట్రంలోని 87 ముఖ్య పట్టణాలకు 50 కేజీల వరకు 10 కి.మీ పరిధిలో పార్సిల్స్ బుక్ చేసి త్వరితగతిన డోర్ డెలివరీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
శ్రీశైలంలో జూదం, మద్యం నిషేధం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైలంలో జూదం ఆడకూడదని, మద్యం తాగకూడదని, మాంసం తినకూడదని.. ఇవన్నీ నిషేధమని దేవస్థాన కార్యనిర్వహణాధికారిఎం.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏపీ దేవదాయ చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేవదాయ ధర్మదాయ శాఖ చట్టం 1987 ప్రకారం శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్యమత ప్రార్థనలు, ప్రచారాలు చేయకూడదన్నారు. అలాగే క్షేత్ర పరిధిలో, ఆలయ పరిసర ప్రాంతాల్లో దేవస్థాన అనుమతి లేకుండా వీడియోలు తీసి, డ్రోన్తో చిత్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం నేరమన్నారు. భక్తులు దేవస్థాన నియమాలు పాటిస్తూ సహకరించాలన్నారు. -
ఖైదీలను కోర్టు వాయిదాలకు హాజరుపరచాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి నంద్యాల(వ్యవసాయం): కోర్టు వాయిదాలకు ఖైదీలను కచ్చితంగా హాజరుపరచాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి అన్నారు. నంద్యాల స్పెషల్ సబ్ జైలును గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రితో కలసి ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలులో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఖైదీలకు ఎవరికై నా న్యాయవాదులు లేకుంటే ఉచితంగా నియమిస్తామన్నారు. అనారోగ్యంతో బాధ పడే వారికి, 70 ఏళ్లు వయస్సుపై బడిన ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. ప్రిజన్ లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్, క్లినిక్లో ఒక న్యాయవాది, ఒక ప్యారా లీగల్ వలంటీర్ ఉంటారని, వారు ఖైదీలకు న్యాయ సహాయాలు అందిస్తారని తెలిపారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100 పై ఖైదీలకు అవగాహన కల్పించారు. నంద్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసు, జైలు అధికారి గురుప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోర్టు భవనాల పరిశీలన నంద్యాల జిల్లా కోర్టు భవనాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి గురువారం సాయంత్రం పరిశీలించారు. కోర్టు ఆవరణలోని ఖాళీ స్థలాల ను పరిశీలించి సూచనలు చేశారు. అనంతరం జడ్జీల తో సమావేశం నిర్వహించారు. మూడో అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజ, ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జ్ తంగమని, రెండో అదనపు జిల్లా జడ్జి కిరణ్ ,ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు, స్పెషల్ క్లాస్ మేజిస్ట్రేట్ ఏసురత్నం, ఆర్డీఓ విశ్వనాథ్, తహసీల్దార్లు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ఇతరులకు శ్వాస ఇచ్చిన పావనీలత
కర్నూలుకు చెందిన పావనీలతకు నాలుగేళ్ల క్రితం భర్త శ్రీనివాసరెడ్డి కిడ్నీ సమస్యతో మృతి చెందాడు.. వీరికి ఒక కుమార్తె ఉంది. ఈ క్రమంలో ఉద్యోగం కోసం ఆమె హైదరాబాద్కు వెళ్లారు. ఆ ప్రయత్నాల్లో ఉండగా గత సంవత్సరం ఫిబ్రవరి 2న ఫిట్స్ రావడంతో మెదడు దెబ్బతినింది. ఆ మరుసటి రోజు ఆమెను కుటుంబసభ్యులు తీసుకొచ్చి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించగా వైద్యులు పరీక్షించి బ్రెయిన్డెడ్ అయినట్లు నిర్ధారించారు. జీవన్దాన్ ట్రస్ట్ సభ్యుల సూచన మేరకు కాలేయాన్ని, కిడ్నీలను, ఊపిరితిత్తులను సేకరించి అవసరమైన ఆసుపత్రులకు పంపించారు. -
భాగస్వాములు కావాలి
కర్నూలు(సెంట్రల్): ఎన్ఎస్ఎస్ వలంటీర్లు సమాజ సేవలో భాగస్వాములు కావాలని రాయలసీమ యూనివర్సిటీ వీసీ ఆచార్య వి.వెంకట బసవరావు పిలుపునిచ్చారు. బుధ వారం వర్సిటీకి చెందిన ఎన్ఎస్ఎస్ 4, 5 యూనిట్లు పి.రుద్రవరం, నూతనపల్లె గ్రామా ల్లో ఐదు రోజులపాటు నిర్వహించనున్న ప్రత్యేక క్యాంపులను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. యువత బాధ్యతాయుతంగా ఉన్నప్పుడు మంచి సమాజం ఏర్పడుతుందన్నారు. వారం రోజులపాటు గ్రామీ ణులతో మమేకం అయ్యి వారి సామాజిక రుగ్మతలను తెలుసుకోవాలని, మూఢ నమ్మకాలను వీడేలా ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఇంజినీరింగ్ కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ల ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ నాగచంద్రుడు, బీవీ శివప్రసాద రెడ్డిని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయకుమార్నాయుడు అభినందించారు. -
శ్రీశైలంలో సేవా పరిమళం
శ్రీశైలంటెంపుల్: వారంతా ఎక్కడి నుంచో వచ్చారు. భక్తులకు సేవ చేసేందుకు అసక్తి చూపుతున్నారు. కానుకల లెక్కింపులోను శివసేవకులు తమ సేవలను అందిస్తున్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ప్రతి రోజూ లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. వీరికి సేవలందించేందుకు వివిధ ప్రాంతాల నుంచి శివసేవకులు శ్రీశైలం చేరుకుంటారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకకు చెందిన పలువురు భక్తులు ముందుకు వస్తున్నారు. మహిళలే అధిక్యం శ్రీశైల మల్లన్న క్షేత్రానికి తరలివచ్చే భక్తులకు సేవలందించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు వస్తారు. శ్రీశైలంలో ప్రస్తుతం చీరాలకు చెందిన భ్రమరాంబికా సేవా సమితి, తెనాలికి చెందిన శ్రీగిరి సేవా సమితి, విజయవాడకు చెందిన జ్యోతిర్లింగ సేవా సమితి వారు భక్తులకు సేవలందిస్తున్నారు. రోజుకు మూడు షిఫ్ట్లలో సుమారు 700మంది శివసేవకులు సేవలందిస్తున్నారు. భక్తులకు సేవలందిస్తున్న శివసేవకుల్లో పురుషులు సుమారు 50మంది లోపు ఉంటారు, అత్యధికులు మహిళలే కావడం విశేషం. దేవస్థానం అందిస్తున్న సౌకర్యాలు శివసేవకులకు దేవస్థానం ఉచితంగా వసతి సౌకర్యాన్ని కల్పిస్తుంది. అలాగే అన్నదానం నుంచి మూడు పూటల టిఫిన్, భోజనం, రాత్రి అల్పాహారం అందిస్తున్నారు. శివసేవకులకు ఐదు రోజల పాటు విధులు చేస్తారు. విధులు ముగిసిన తరువాత వారికి ఉచితంగా మల్లన్న స్పర్శదర్శనం కల్పిస్తారు. రోజుకు 40మంది చొప్పున శివసేవకులకు ఉచితంగా మల్లన్న స్పర్శదర్శనం కల్పిస్తారు. హుండీ కౌంటింగ్లో పాల్గొన్న శివసేవకులకు ఒక్కోక్కరికి రెండు లడ్డూ ప్రసాదాలు ఉచితంగా అందజేస్తారు.సేవలు ఇలా.. క్యూలైన్లలో భక్తులకు తాగునీరు సరఫరా చేస్తారు. అమ్మవారి ఆలయం వెనుక భక్తులకు ప్రసాదం అందిస్తారు. దేవస్థానానికి విరాళాలు అందించిన దాతల కోసం లడ్డూ ప్రసాదం, కుంకుమ, విభూతి, కంకణాల ప్యాకింగ్ చేస్తారు. క్యూలైన్లలో భక్తులను నియంత్రిస్తారు. శ్రీశైలం ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేయనున్న మే ఐ హెల్ప్ యు డెస్క్లలో తదితర చోట్ల సేవలు అందిస్తున్నారు. దేవస్థానంలో సౌకర్యాలు బాగానే ఉన్నాయి. ఆలయం బయట ప్రాంతాలైన సాక్షిగణపతి, మల్లమ్మకన్నీరు తదితర ప్రాంతాలకు శివసేవకులు వెళ్లలేకపోతున్నారు. ఆటో చార్జీలు అదనంగా అడుగుతున్నారు. దేవస్థానం శివసేవకుల కోసం ఉచితంగా బస్సు సర్వీసును ఏర్పాటు చేస్తే బాగుంటుంది. వసతి సౌకర్యాలను కూడా కొంచెం మెరుగుపర్చాలి. – కె.రజిని, శివసేవకురాలు, మంచిర్యాల -
ఉచితంగా టెలికం నైపుణ్య శిక్షణా కోర్సులు
కర్నూలు(హాస్పిటల్): ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు, డిప్లొమా ఫైనలియర్ విద్యార్థులకు ఉచిత టెలికం స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ప్రారంభించినట్లు బీఎస్ఎన్ఎల్ కర్నూలు బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ జి.రమేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన(పీఎంకేవీవై) పథకం కింద ఉచిత నైపుణ్యాభివృద్ధి కోర్సులు అందిస్తున్నట్లు చెప్పారు. వైర్లెస్ టెక్నీషియన్, బ్రాడ్బాండ్ టెక్నీషియన్, ఆప్టికల్ ఫైబర్ టెక్నీషియన్, ఆప్టికల్ ఫైబర్ స్ప్లైసర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కోర్సులను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ప్రాక్టికల్, హ్యాండ్స్ ఆన్ శిక్షణను అందించడంతో పాటు ఉద్యోగ నియామక సహాయం కూడా కల్పిస్తాయన్నారు. శిక్షణా కార్యక్రమాలు హైదరాబాద్లో ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతాయన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.rttchyd.bsnl. co.in వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు ఈ నెల 19వ తేది ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆర్టీటీసీ కార్యాలయంలో ప్రత్యక్షంగా హాజరు కావాలని పేర్కొన్నారు. గుడ్డు చిన్నదైంది! పాములపాడు: సాధరణంగా కోడి గుడ్డు 40 నుంచి 45 గ్రాముల వరకు బరువు ఉంటుంది. పాములపాడుకు చెందిన బోగాల శేఖర్ అనే వ్యక్తి ఇంట్లో కోడిపెట్ట బుధవారం అతి చిన్న సైజులో గుడ్డు పెట్టింది. దాని బరువు 10గ్రాములు మాత్రమే ఉంది. జన్యులోపం కారణంగానే ఇలా చిన్న సైజు గుడ్లను అరుదుగా కోళ్లు పెడుతుంటాయని పశు వైద్య శాఖ సిబ్బంది తెలిపారు. రైల్లో నుంచి జారిపడి వ్యక్తి మృతి ఆదోని సెంట్రల్: రైల్లో నుంచి కిందకు దిగే సమయంలో జారి పడి ఓ వ్య క్తి మృతి చెందాడు. ఆదో ని డివిజన్ పరిధిలోని మంత్రాలయం రైల్వే స్టేష న్లో ప్లాట్ఫామ్ నంబర్. 2 వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ప్రయాణికుడి తలకు తీవ్ర గాయాలు కావడంతో జీఆర్పీ, అర్పీఎఫ్ సిబ్బంది స్పందించి 108 అంబులెన్స్లో ఎమ్మిగనూరు ఆసు పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయినట్లు రైల్వే పోలీ సు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శివరామయ్య తెలిపారు. మృతుడి పేరు దేవేంద్ర (40)అని, ఆధార్కార్డులో అడ్రస్ కర్టాటక రాష్ట్రం యాదగిరిలోని శా హపుర గ్రామం అని ఉందని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నేడు కోవెలకుంట్లలో విద్యుత్ అదాలత్ నంద్యాల(అర్బన్): విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకు గురువారం కోవెలకుంట్ల పట్టణంలోని విద్యుత్ కార్యాలయంలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ నంద్యాల డివిజన్ ఈఈ శ్రీనివాసరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి రిటైర్డు జడ్జి శ్రీనివాస ఆంజనేయమూర్తి అతిథిగా హాజరవుతుండగా స్వతంత్ర సభ్యులు విజయలక్ష్మి, మధుకుమార్ పాల్గొంటారన్నారు. దీర్ఘకాలిక సమస్యలున్న విద్యుత్ వినియోగదారులు ఫిర్యాదుల ద్వారా తెలియపరిస్తే పరిష్కారం చూపుతామని చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
ఆత్మకూరులో నాటు కోళ్ల దొంగలు!
ఆత్మకూరురూరల్: కోడి మాంసం అంటే మాంసాహార ప్రియులు లొట్టలేసుకుంటూ తింటారు. అది నాటు కోడి అయితే ఇక చెప్పనవసరం లేదు. దీంతో ఈ కోళ్లకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో బెడస జాతికి చెందిన కోళ్ల ధర వేలల్లో ఉంటుంది. దీంతో దొంగల కన్ను ఈ కోళ్లపై పడింది. గత కొన్ని రోజులుగా ఆత్మకూరు మండలంలోని కొట్టాల చెర్వు, కురుకుంద, వెంకటాపురం, క్రిష్ణాపురం, పాములపాడు మండలం మద్దూరు, బానకచర్ల తదితర గ్రామాల్లో కోళ్ల దొంగతనాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 200కు పైగా నాటుకోళ్లు మాయమయ్యాయని, ఒక్కో కోడి ధర రూ. 5 వేలు అనుకున్నా రూ. 10 లక్షలు విలువ చేస్తాయని బాధితులు చెబుతున్నారు. విలువైన కోళ్లు మాయమవుతుండటంతో కొందరు బాధితులు ఆత్మకూరు పోలీసులను కలిసి ఫిర్యాదు కూడా చేశారు. అయితే, కోళ్లే కదా అని పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మారుమూల అటవీ ప్రాంత గ్రామంలోని కొందరు యువకులు ఈ చోరీకి పాల్పడుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులు స్పందించి దొంగల బెడద నుంచి తమ కోళ్లను కాపాడాలని పెంపకందారులు కోరుతున్నారు. 200 కోళ్ళు చోరీ -
స్ఫూర్తిగా నిలిచిన సుజాత
నంద్యాల జిల్లా గుంతనాల గ్రామానికి చెందిన బొప్ప నాగేంద్రగౌడ్ కుమార్తె సుజాత(31) గోస్పాడు మండలం తేల్లపురి గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించేవారు. ఆమె గత మే 28న విధి నిర్వహణకు స్కూటీపై వెళ్తూ గోస్పాడు మండలం తెల్లపురి గ్రామంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తలకు తీవ్ర గాయమైన ఆమెకు నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేశారు. ఆమె కోలుకోలేక బ్రెయిన్ డెడ్ కావడంతో జీవన్దాన్ ట్రస్ట్ సభ్యుల అవగాహనతో కుటుంబసభ్యులు అవయవదానానికి ముందుకువచ్చారు. దీంతో ఆమె ఊపిరితిత్తులు, కిడ్నీలు, కళ్లు దానం చేశారు. -
సీనియర్ సిటిజన్లకు న్యాయ సేవలు
కర్నూలు (టౌన్): సీనియర్ సిటిజన్లు, పెన్షనర్లకు చట్టపరంగా సమస్యలు వస్తే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ టోల్ ఫ్రీ నంబర్ 15100 కు కాల్ చేస్తే వారికి ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి అన్నారు. బుధవారం స్థానిక సి.క్యాంపులోని టీజీవీ కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకరప్ప ఆధ్వర్యంలో పెన్షనర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. ఉద్యోగుల పెన్షన్ సౌకర్యంపై 1982 సంవత్సరం డిసెంబర్ 17న జస్టిస్ చంద్రచూడ్ ఇచ్చిన తీర్పుతో పెన్షనర్లకు భద్రత కలిగిందన్నారు. ఈ తీర్పు కోసం శ్రమించిన దివంగత డి.ఎన్.సకార జ్ఞాపకార్థం పెన్షనర్ల దినోత్సవం ప్రతి ఏటా డిసెంబర్ 17 న జరుపుకుంటున్నామన్నారు. జాయింట్ కలెక్టర్ నూరల్ ఖమర్ మాట్లాడుతూ.. విశ్రాంత ఉద్యోగుల సేవలు మరువలేనివన్నారు. విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ వారి హక్కు అన్నారు. ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ భాస్కర్ వర్మ, స్పెషల్ పోలీసు డీఎస్పీ మహబూబ్ బాషా, రిటైర్డు జాయింట్ కలెక్టర్ రామస్వామి, రాయపాటి శ్రీనివాసులు పాల్గొన్నారు. -
భద్రతా తనిఖీలు కీలకం
నంద్యాల: ముఖ్య కార్యక్రమాలు, పెద్ద సమావేశాలు నిర్వహించిన సమయంలో భద్రతా తనిఖీలు కీలకం అని ఎస్పీ సునీల్షెరాన్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం బాంబ్ డిస్పోజల్ టీం సంబంధించి రెండు రోజుల రిఫ్రెష్మెంట్ కోర్స్ను ఆయన ప్రారంభించారు. టీమ్ సభ్యులు ఆధునిక సాంకేతికతలను ఉపయోగించాలని, బాంబు డిటెక్షన్, డిస్పోజల్ పద్ధతులపై వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. అనుమానాస్పద వస్తువులు, బ్యాగులను తనిఖీ చేయాలన్నారు. స్నిఫర్ డాగ్స్, మెటల్ డిటెక్టర్లు, ఎక్స్–రే స్కానర్లతో రోప్ పార్టీలు ఏర్పాటు చేసి మార్గాలు, వేదికలను తనిఖీ చేయవచ్చన్నారు. రిజర్వ్ ఇన్స్పెక్టర్లు బాబు, మంజునాథ్ , సురేష్ బాబు, బాంబు డిటెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు. ఫిబ్రవరి 28లోగా లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలి నంద్యాల(అర్బన్): పెన్షన్దారులు జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28లోగా లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలని నంద్యాల ట్రెజరీశాఖ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ శ్రీనివాసులు కోరారు. అఖిల భారత పెన్షన్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక నిశాంత్ భవన్లో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లింగస్వామి అద్యక్షతన పెన్షన్ దారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పెన్షనర్ల దినోత్సవానికి కారకులైన దివంగత నాయకులు డీఎన్ నకరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే 90 ఏళ్లు పూర్తి చేసుకున్న పెన్షనర్లను సన్మానించారు. కార్యక్రమంలో ముఖ్య సలహాదారు కై ప సుబ్బరాయుడు, ట్రెజరర్ కాశీంవలి, డేవిడ్, డీకయ్య, పద్మనాగుడు, రంగనాథరావు, శ్యాముల్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలంలో జానపద గీతానికి యువతి డ్యాన్స్ శ్రీశైలం టెంపుల్: ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీశైలంలో అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పలువురు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల శ్రీశైలానికి వచ్చిన ఓ యువతి క్షేత్రంలోని సెంట్రల్ రిసెప్షన్ ఆఫీసు సమీపంలో జానపద గీతానికి నృత్యం చేస్తూ వీడియో తీసుకుంది. ఈ వీడియోను తన ఇన్స్ట్రాగాం ప్రొఫైల్లో రీల్స్గా అప్లోడ్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు, హిందూ సంఘాల నాయకులు, పలువురు భక్తులు యువతి తీరును తప్పుబడుతున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి గీతాలకు డ్యాన్స్లు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని విమర్శిస్తున్నారు. పది ఫలితాల్లో జిల్లాను ముందంజలో నిలపాలి చాగలమర్రి: పదో తరగతి ఫలితాల్లో జిల్లాను ముందంజలో నిలపాలని డీఈఓ జనార్ధన్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఆళ్ళగడ్డ పట్టణంలోని వైపిపిఎం ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖి చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజన సదుపాయాలతో పాటు తరగతి గదులలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పదవ తరగతి సిలబస్ పూర్తయిందని, ప్రస్తుతం రివిజన్ కొనసాగుతోందన్నారు. అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. డీఈఓ వెంట ఎంఈఓ శోభావివేకవతి, వ్యాయామ ఉపాధ్యాయులు రాణి, ఉపాధ్యాయ సిబ్బంది ఉన్నారు. ఫాస్ట్ బౌలర్ హేమంత్ నాయక్కు అభినందన ఆళ్లగడ్డ వైపిపిఎం ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి హేమంత్ నాయక్ అండర్–14 సౌత్ జోన్ పోటీలలో ఫాస్ట్ బౌలర్గా రాణించడం పట్ల డిఈఓ జనార్ధన్రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. రాబోవు రోజుల్లో మరింత మెరుగైన శిక్షణ ఇచ్చి జాతీయ స్థాయిలో రాణించే విధంగా ప్రోత్సహిస్తామని డీఈఓ తెలిపారు. -
తనూజారెడ్డి అవయవదానం
మద్దికెరకు చెందిన కాంట్రాక్టర్ శంకర్రెడ్డి, పద్మావతిల కుమార్తె తనూజారెడ్డి ఎం. ఫార్మసి పూర్తి చేశారు. 12 ఏళ్ల క్రితం వివాహమైన కొన్నాళ్లకు ఇంటి మిద్దైపె వాకింగ్ చేస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆమెకు ఫిట్స్ వచ్చాయి. వెంటనే ఆమెను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కొంత సమయం వరకు మెదడుకు ఆక్సీజన్ అందకపోవడంతో బ్రెయిన్డెడ్ అయ్యింది. 2014 డిసెంబర్ 18న ఆమె అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకు వచ్చారు. ఈ మేరకు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె అవయవాలను సేకరించి ఇతరులకు అమర్చారు. -
వేటగాళ్ల కోసం నల్లమల జల్లెడ
● ఏకకాలంలో అభయారణ్యం అంతా తనిఖీ చేస్తున్న అటవీ సిబ్బంది ఆత్మకూరురూరల్: నాగార్జునసాగర్ – శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం పరిధిలోని నాగలూటి రేంజ్ లో టైగర్ పా స్నేర్ ( పులి పంజా ఉచ్చు) కనిపించడంతో అటవీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎఫ్డీపీటీ విజయకుమార్ ఆదేశాలతో అభయారణ్యం పరిధిలో సిబ్బంది మంగళవారం ఉదయం నుంచి బుధవారం తెల్లవారుజామున వరకు యాన్టీ స్నేర్ డ్రయివ్ (ఉచ్చుల ఏరివేత)లో ముమ్మరంగా పాల్గొన్నారు. రుద్రవరం రేంజ్లో అడవిలోకి వెళ్లే గొర్ల, పశువుల కాపర్లను పూర్తిగా తనిఖీ చేసి పంపుతున్నారు. వారి వద్ద నుంచి 45 అగ్గి పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. గిద్దలూరు డివిజన్ పాపినేని పల్లె ,ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో సబ్ డీఎఫ్ఓ బబిత మంగళవారం రాత్రంతా అడవులను జల్లెడ పట్టి ఉచ్చుల ఏరివేత కార్యక్రమం చేపట్టారు. వన్యప్రాణులను వేటాడేందుకు యత్నించే వారిని పట్టుకుని కచ్చితంగా జైలుకు పంపుతామని ఎన్ఎస్టీఆర్ ప్రాజెక్ట్ టైగర్ ఫీల్డ్ డైరెక్టర్ విజయకుమార్ పేర్కొన్నారు. -
ఇతరుల జీవితాల్లో ఆమె భాగ్యవంతురాలు
నంద్యాల జిల్లా శ్రీశైలంలోని కొత్తపేటకు చెందిన భాగ్యమ్మ(50) భర్త సామేలు పదిహేనేళ్ల క్రితమే మరణించారు. అప్పటి నుంచి ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడిని ఆమె పెంచి ప్రయోజకులను చేశారు. గత అక్టోబర్ నెల 18వ తేదీ రాత్రి ఉన్నట్లుండి ఆమెకు ఫిట్స్ వచ్చి, మెదడులో రక్తస్రావం అయ్యింది. శ్రీశైలం దేవస్థానం ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి అనంతరం కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె అదే నెల 21న బ్రెయిన్ డెడ్ అయ్యింది. జీవన్దాన్ ట్రస్ట్ సభ్యుల సూచన మేరకు అవయవదానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకు వచ్చారు. దీంతో ఆమె ఒక కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులను సేకరించి అవసరమైన ఆసుపత్రులకు తరలించారు. తాను మరణించి కూడా ఇతరు జీవితాల్లో ఆమె వెలుగులు పంచింది. -
క్లస్టర్ యూనివర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదల
కర్నూలు సిటీ: క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ మూడు, ఐదవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను వర్సిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య డాక్టర్ వెంకట బసవరావు, రిజిస్ట్రార్ డాక్టర్ జి.శ్రీనివాస్లు బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్సిటీ అనుబంధంగా ఉన్న మూడు కాలేజీలకు చెందిన విద్యార్థులకు గత నెలలో పరీక్షలు నిర్వహించామన్నారు. ఇందులో మూడవ సెమిస్టర్ పరీక్షలకు 866 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 617 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. 71.25 ఉత్తీర్ణత శాతం నమోదైందన్నారు. ఐదవ సెమిస్టర్ పరీక్షలకు 804 మంది పరీక్షలకు హాజరు కాగా 709 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. కార్యక్రమంలో వర్సిటీ పరీక్షల విభాగం డీన్ డాక్టర్ నాగరాజు శెట్టి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ కె.బాల సుబ్రమణ్యం పాల్గొన్నారు. నేడు కర్నూలుకు ఏపీఎన్జీజీవోస్ నేతల రాక కర్నూలు(అగ్రికల్చర్): ఏపీఎన్జీజీఓస్ అసోసియేషన్ నాయకులు గురువారం కర్నూలుకు రానున్నారు. జిల్లా శాఖకు నూతన కార్యవర్గ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే రెండు గ్రూపుల మధ్య విభేదాలు ఉండటంతో ఎన్నికలు జరగని పరిస్థితి. ఈ నేపథ్యంలో జిల్లాకు అడ్హాక్ కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. 11 మందితో అడ్హాక్ కమిటీ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇప్పుడున్న ఎన్జీజీవోస్ నేతల్లో దాదాపుగా ఎవ్వరూ లేకుండా కొత్త వారితో కమిటీ ఏర్పాటు కానుంది. జిల్లాకు వస్తున్న రాష్ట్ర అసోసియేట్ ప్రసిడెంట్ దస్తగిరిరెడ్డి, వైఎస్ఆర్ కడప జిల్లా శాఖ అధ్యక్షుడు శ్రీనివాసులు అడ్హాక్ కమిటీని ప్రకటించనున్నారు. -
వైభవంగా గ్రామ దేవర
మంత్రాలయం రూరల్: మండల పరిధిలోని మంచాల లో బుధవారం గ్రామ దేవర వైభవంగా నిర్వహించారు. శ్రీమఠంలో వెలసిన మంచాలమ్మకు, గ్రా మా ల్లోని ఆలయాల్లో దుర్గదేవి మారికాంబ, సుంకలమ్మ, మారెమ్మకు మహిళలు పూర్ణ కుంభాలు సమర్పించారు. ఆలయాల్లో అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు చేసి, కుంకుమార్చన, మహా మంగళ హారతులు ఇచ్చారు. మంచాల పాత ఊరు, రాఘవేంద్ర నగ ర్, రామచంద్ర నగర్లో ఇంటింటా నైవేద్యం సమర్పించారు. శ్రీ మఠం దగ్గర భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీఐ రామాంజులు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. యువకులు పొట్టేలతో కేరింతలు కొడుతూ పోటీలు ఢీ కొడుతూ ఆనందించారు. దేవాలయం దగ్గర భక్తులు శ్రీమఠం ఆధ్వర్యంలో లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించారు. -
రాక్గార్డెన్లో సినిమా షూటింగ్
ఓర్వకల్లు: మండల కేంద్రం ఓర్వకల్లు సమీపంలోని రాక్గార్డెన్ (రాతివనం)లో బుధవారం సినిమా చిత్రీకరణ సందడి నెలకొంది. మెమోరి మేకర్స్ ప్రొడక్షన్ ఆధ్వర్వంలో రవికుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తెలుగు సినిమా షూటింగ్ను రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు యూనిట్ బృందం సభ్యులు తెలిపారు. అవినాస్, కబీర్ సింగ్, బెహర ప్రసాద్, ఆకాష్, స్నేహ హీరో, హీరోయిన్లతో మొదటి రోజు ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు చిత్ర బృందం తెలిపారు. టార్జాన్, ప్రకాష్ ఫైట్ మాస్టర్ల ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఇక్కడ షూటింగ్ జరుగుతుందని చిత్ర బృందం సభ్యులు పేర్కొన్నారు.


