Nandyal District Latest News
-
బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
కర్నూలు(సెంట్రల్): కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం(బార్ అసోసియేషన్) నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా పి.హరినాథ్చౌదరి, వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 856 మంది ఓటర్లు ఉండగా 767 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్ష స్థానం కోసం పోటీ పడిన పి.హరినాథ్చౌదరి తన సమీప ప్రత్యర్థి బి.మురళీమోహన్పై 92 ఓట్లతో గెలుపొందారు. ప్రధాన కార్యదర్శి స్థానానికి జరిగిన పోటీలోఎం. వెంకటేశ్వర్లు తన ప్రత్యర్థి ఎం.ఆంజనేయులుపై 76 ఓట్లతో విజయం సాధించారు. జాయింట్ సెక్రటరీ స్థానానికి పోటీ చేసిన ఎం. బాలసుబ్రమణ్యం తన ప్రత్యర్థి బీకే నాగారుజుపై 411 ఓట్లతో గెలిచారు. లైబ్రరీ సెక్రటరీ స్థానానికి పోటీలో ఉన్న పి.చంద్రశేఖర్ తన ప్రత్యర్థి సంపత్పై భారీ ఓట్లతో విజయం సాధించారు. ఉపాధ్యక్ష, కోశాధికారి, క్రీడా కార్యదర్శి మహిళాప్రతినిధి స్థానాలకు త్రివిక్రమ్, గౌతంమానె, బెస్త సుధాకర్, కె. అరుణలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గెలుపొందిన వారికి ఎన్నికల అధికారులు జి.విజయకుమార్, కె.రంగనాథ్,సి. ప్రభాకరరెడ్డి డిక్లరేషన్ పత్రాలను అందజేశారు. అధ్యక్ష, కార్యదర్శులుగా హరినాథ్, వెంకటేశ్వర్లు -
చెక్కుచెదరని ప్రజాభిమానం
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి కర్నూలు (టౌన్): ఎన్ని కుయుక్తులకు పాల్పడినా వైఎస్సార్సీపీపై ప్రజాభిమానం చెక్కుచెదరలేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి అన్నా రు. జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడిగా ఏక గ్రీవంగా ఎన్నికై న మదర్థాన్ ఇలియాస్ ఖాన్, జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి కలిసి గురువారం సాయంత్రం కర్నూలు గిప్సన్ కాలనీలో ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డిని కలిశారు. శాలువా కప్పి సన్మానించారు. గెలుపొందిన జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యున్ని ఎస్వీ సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ.. ‘కూటమి’ నేతలు ఎన్ని కు ట్రలు చేయాలని చూసినా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలిచారన్నారు. విజయంలో కీలకంగా వ్యవహరించిన పత్తికొండ మాజీ ఎ మ్మెల్యే కంగాటి శ్రీదేవి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. -
భృంగివాహనంపై మల్లన్న
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో గురువారం ఉగాది మహోత్సవాలను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ నెల 31 వరకు ఐదు రోజుల పాటు ఉత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని కన్నడ భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. శ్రీశైల భ్రామరి మహాలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వగా, భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి భృంగివాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ నిర్వహణలో భాగంగా దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, స్థానాచార్యులు, అర్చకస్వాములు, వేదపండితులు, అధికారులు సంప్రదాయబద్ధంగా ఆలయప్రాంగాణంలోని స్వామివార్ల యాగశాల ప్రవేశం చేశారు. లోకక్షేమాన్ని కాంక్షిస్తూ ఉత్సవ సంకల్పాన్ని పఠించారు. ఈ సందర్భంగా చండీశ్వరునికి ప్రత్యేకంగా పూజాదికాలు నిర్వహించారు, అనంతరం కంకణాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అధికారులు, అర్చకస్వాములు ధరించారు. రుత్వికులకు దీక్షావస్త్రాలను అందజేశారు. అమ్మవారి ఆలయంలో విశేష కుంకుమార్చనలు, నవావరణార్చన పూజలను జరిపించారు. అనంతరం ఉగాది మహోత్సవాలకు అంకురార్పణ చేశారు. మహాలక్ష్మీ అలంకారంలో భ్రామరి ఉగాది మహోత్సవాల్లో భాగంగా మొదటిరోజు శ్రీశైల భ్రమరాంబాదేవి మహాలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చతుర్బుజాలు కలిగిన దేవి పై రెండు చేతులలో పద్మాలను, కింది చేతులలో కుడివైపున అభయహస్తం, ఎడమవైపున వరముద్రతో దర్శనం ఇచ్చారు. మహాలక్ష్మీ స్వరూపాన్ని దర్శించడం వల్ల శత్రుబాధలు నివారించబడి, సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. కనుల పండువగా భృంగివాహన సేవ ఉగాది మహోత్సవాల్లో భాగంగా శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామికి భృంగివాహనసేవ నిర్వహించారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను భృంగివాహనంపై ఆశీనులను చేసి అలంకార మండపంలో పూజాదికాలు నిర్వహించారు. భృంగీవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను దర్శిస్తే పాపాలు హరించబడుతాయని భక్తుల విశ్వాసం. అనంతరం ప్రత్యేక అలంకీకృతులైన అమ్మవారికి, వాహనాధీశులైన స్వామిఅమ్మవార్లకు గ్రామ పురవీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు. శ్రీశైలంలో నేడు ఉత్సవాల్లో రెండో రోజు శుక్రవారం భ్రమరాంబాదేవికి మహాదుర్గ అలంకారం, భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివార్లకు కైలాసవాహనసేవ, అనంతరం గ్రామోత్సవం నిర్వహిస్తారు.శాస్త్రోక్తంగా ప్రారంభమైన ఉగాది మహోత్సవాలు ఐదు రోజుల పాటు నిర్వహణ మహాలక్ష్మీ అలంకారంలో శ్రీశైల భ్రామరి శ్రీగిరి క్షేత్రానికి పోటెత్తిన కన్నడ భక్తులు -
‘అవుకు’లో తగ్గిన నీటిమట్టం
అవుకు: రిజర్వాయర్లో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. సామర్థ్యం 4.168 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.67 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎస్సార్బీసీ నుంచి అవుకు రిజార్వయర్కు 450 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. సాగునీటి కోసం ఎస్సార్బీసీ 13వ బ్లాక్ కాలువకు 380 క్యూసెక్కుల వదులుతున్నారు. పాలేరు, తిమ్మరాజు చెరువుల నుంచి 60 క్యూసెక్కుల నీరు అవుట్ ఫ్లో ఉంది. పంటల సాగుకు సరిపడా నీరు అందుతోందని ఎస్ఆర్బీసీ ఈఈ సురేష్ బాబు తెలిపారు. హుండీ ఆదాయం రూ. 39.23 లక్షలు మహానంది: హుండీల్లో కానుకలు లెక్కించగా మహానందీశ్వరస్వామికి రూ. 39.23లక్షలు ఆదాయం వచ్చినట్లు ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానిక అభిషేక మండపంలో గురువారం శ్రీ కామేశ్వరీదేవి, శ్రీ మహానందీశ్వరస్వామి వార్లతో పాటు అన్నప్రసాదం, గోసంరక్షణ విభాగాల్లోని హుండీ కానుకలను లెక్కించారు. ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ హరిచంద్రారెడ్డి, ఏఈఓ ఎరమల మధు, సూపరింటెండెంట్లు అంబటి శశిధర్రెడ్డి, దేవిక, ఇన్స్పెక్టర్లు నాగమల్లయ్య, సుబ్బారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఉచిత డీఎస్సీ శిక్షణకు రెండో జాబితా నంద్యాల(అర్బన్): మెగా డీఎస్సీ ఫ్రీ కోచింగ్కు దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సంబంధించి రెండో జాబితా విడుదలైందని జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారిణి చింతామణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల వివరాలు వెబ్పోర్టల్ https:// mdfc. apcfss. in లోతెలుసుకోవచ్చన్నారు. ఉచిత డీఎస్సీ కోసం శిక్షణ సంస్థలను అభ్యర్థులు తమ లాగిన్లో ఎంపిక చేసుకోవాలని పేర్కొన్నారు. మొదటి జాబితాలో ఎంపికై న అభ్యర్థుల శిక్షణ సంస్థలను మార్పు చేసుకునేందుకు అనుమతి లేదని తెలిపారు. ‘ప్రభుత్వ ఇఫ్తార్ విందును బహిష్కరిద్దాం’నంద్యాల(వ్యవసాయం): రంజాన్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ విందును ముస్లింలు బహిష్కరించాలని నంద్యాల ముస్లిం జేఏసీ నాయకులు కన్వీనర్ అబ్దుల్లా మౌలానా, అబ్దుల్ సమాద్ అన్నారు. స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గురువారం వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్లుపై టీడీపీ ప్రభుత్వం అభ్యంతరం చెప్పలేదని, నిరసనగా ఇఫ్తార్ విందును బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అబులైజ్, బాబాఫకృద్దీన్, ఇజస్ హుస్సేన్, మస్తానుఖాన్బాషా, మునీర్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. 29న ఇఫ్తార్ విందు నంద్యాల(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నంద్యాల టౌన్హాల్లో ఈనెల 29న సాయంత్రం 6గంటలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిణి సబిహాపర్వీన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. జిల్లా పరిషత్, మండల పరిషత్ పరిధిలో ఖాళీగా ఉన్న అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. జెడ్పీ, కృష్ణగిరి కోఆప్షన్ సభ్యులుగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. నిత్యం ప్రజ
● ఎదురులేని ఫ్యాన్● నాలుగు స్థానాల్లోను వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయం ● జెడ్పీ కోఆప్షన్ సభ్యునిగా ఎం. ఇలియాజ్ఖాన్ ● జెడ్పీ చైర్మన్తో పాటు 37 మంది జెడ్పీటీసీ సభ్యులు హాజరు ● వెల్దుర్తి, తుగ్గలి ఎంపీపీలుగా దేశాయి లక్ష్మిదేవమ్మ, రాచపాటి రామాంజినమ్మ ● కృష్ణగిరి కోఆప్షన్ సభ్యునిగా షేక్ చిన్న షాలు తుగ్గలిలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న నూతన ఎంపీపీ, వైఎస్సార్సీపీ నాయకులుకర్నూలు(అర్బన్): జిల్లాలోని స్థానిక సంస్థల్లో ఏర్పడిన నాలుగు ఖాళీలకు గురువారం నిర్వహించిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. జిల్లా పరిషత్, కృష్ణగిరి కోఆప్షన్ సభ్యులతో పాటు తుగ్గలి, వెల్దుర్తి ఎంపీపీ స్థానాలకు, జిల్లాలోని ఐదు గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్ స్థానాలకు ఎన్నికలను నిర్వహించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటలను చోటు చేసుకోకుండా, ఆయా ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తును నిర్వహించారు. జెడ్పీ, కృష్ణగిరి కోఆప్షన్ సభ్యులతో పాటు తుగ్గలి, వెల్దుర్తి మండల పరిషత్తుల్లో వైఎస్సార్సీపీకి విశేషమైన బలం ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధించారు. జెడ్పీ కోఆప్షన్ సభ్యునిగా మదర్ఖాన్ ఇలియాజ్ ఖాన్ జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యునిగా శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడుకు చెందిన మదర్ఖాన్ ఇలియాజ్ ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన అభ్యర్థిత్వాన్ని వెలుగోడు జెడ్పీటీసీ అమీరున్బీ ప్రతిపాదించగా, మహానంది జెడ్పీటీసీ కేవీఆఆర్ మహేశ్వరరెడ్డి బలపరిచారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 10 గంటల్లోపు నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయ్యింది. జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డితో కలిపి 37 మంది జెడ్పీటీసీ సభ్యులు హాజరై ఇలాయాజ్ఖాన్కు మద్దతు ప్రకటించారు. ఇలియాజ్ఖాన్ నామినేషన్ను స్క్రూటినీ చేసిన అనంతరం వాలీడ్ నామినేషన్గా డిక్లేర్ చేసి జిల్లా కలెక్టర్ పీ రంజిత్బాషా ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు. జెడ్పీ కోఆప్షన్ సభ్యునిగా ఇలాయాజ్ఖాన్ను ప్రకటించి డిక్లరేషన్ ఫారం అందించి ప్రమాణ స్వీకారం కూడా చేయించారు. జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఏకగ్రీవంగా తుగ్గలి, వెల్దుర్తి ఎంపీపీలు తుగ్గలి మండల పరిషత్ అధ్యక్షురాలిగా మండలంలోని శభాష్పురం ఎంపీటీసీ సభ్యురాలుగా రాచపాటి రామాంజినమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలో మొత్తం 17 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా, ఒకరు గైర్హాజరు కాగా మిగిలిన వారంతా రామాంజనమ్మ అభ్యర్థిత్వానికి మద్దతుగా చేతులెత్తి తమ అంగీకారాన్ని తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, హెచ్ఎన్ఎస్ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అజయ్కుమార్ ఆమెను ఎంపీపీగా డిక్లేర్ చేసి ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. అలాగే వెల్దుర్తి మండలంలో మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీటీసీలు ఎంపీపీ ఎన్నికకు గైర్హాజరయ్యారు. మిగిలిన 14 మంది వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు ఏకగ్రీవంగా ఎల్ నగరం ఎంపీటీసీ దేశాయి లక్ష్మిదేవమ్మను ఎంపీపీగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కే తులసీదేవి ఎంపీపీగా ఎన్నికై న లక్ష్మిదేవమ్మకు ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. కృష్ణగిరి కోఆప్షన్ సభ్యునిగా వైఎస్సార్సీపీ మద్దతుదారుడు చిన్నషాలును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి, సెట్కూరు సీఈఓ డా.కే వేణుగోపాల్ ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. ఐదు పంచాయతీల్లో ఉప సర్పంచుల ఎన్నిక... జిల్లాలోని ఐదు గ్రామ పంచాయతీల్లో జరిగిన ఎన్నికల్లో సభ్యులు.. ఉప సర్పంచులను ఎన్నుకున్నారు. ఓర్వకల్లు మండలం గుట్టపాడు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా లక్ష్మమ్మ, ఆలూరు మండలం మొలగవెళ్లి ఉప సర్పంచ్గా గరక షాకీరా, కర్నూలు మండలం సుంకేసుల ఉప సర్పంచ్గా వడ్డే నీలమ్మ, వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లి ఉప సర్పంచ్గా ఎం రామాంజనేయులు, దేవనకొండ మండలం వెలమకూరు ఉప సర్పంచ్గా ఉప్పర సరస్వతిని ఎన్నుకున్నారు. -
మేలైన యాజమాన్య పద్ధతులతో నాణ్యమైన దిగుబడి
కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి సాగులో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉందని.. రైతులు అధిక దిగుబడి, నాణ్యతను పెంపొందించుకోవడంతో పాటు నిల్వ పద్ధతులపై అవగాహన కలిగి ఉండాలని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్, ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ ఉమాదేవి తెలిపారు. మంగళవారం ఉద్యానశాఖ ఉల్లి సాగులో మేలైన యాజమాన్య పద్ధతులపై రైతులకు కర్నూలులోని ఉద్యానభవన్లో శిక్షణ, చర్చా కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లా ఉద్యాన అధికారి పి.రామంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీఎంఐపీ పీడీ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ఏటా 5.40 లక్షల టన్నుల ఉల్లి ఉత్పత్తి అవుతోందన్నారు. అవగాహనతో సాగు చేపడితే నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని, నాణ్యత బాగుంటే గిట్టుబాటు ధరలు లభిస్తాయన్నారు. ● జిల్లా ఉద్యాన అధికారి పి.రామాంజనేయులు మాట్లాడుతూ ఉల్లి సాగులో ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ● మార్కెటింగ్ శాఖ ఏడీ నారాయణమూర్తి మాట్లాడుతూ పండించిన పంటను బాటీ ఆరబెట్టి గ్రేడింగ్ చేసుకొని మార్కెట్కు తీసుకొస్తే గిటుబాటు ధర లభించే అవకాశం ఉంటుందన్నారు. ● ఏపీఎంఐపీ అదనపు పీడీ రాజాకృష్ణారెడ్డి మాట్లాడుతూ సూక్ష్మ సేద్యం ద్వారా తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో ఉల్లి సాగు చేసుకోవచ్చని, ఎరువుల వినియోగం కూడా తక్కువగా ఉంటుందని తెలిపారు. ● మహానంది వైఎస్ఆర్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త ఠాగూర్నాయక్ మాట్లాడుతూ ఉల్లి సాగులో మేలైన యాజమాన్య పద్దతులను వివరించారు. -
పల్లె పుష్కరిణిలుగా చెరువుల అభివృద్ధి
కర్నూలు(అగ్రికల్చర్): ఉపాధి నిధులతో గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులను ‘పల్లె పుష్కరిణిలు’గా అభివృద్ధి చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు జిల్లాలో 31 పల్లె పుష్కరిణిలను గుర్తించారు. ఒక ఎకరా నుంచి ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులను.. కనీసం వెయ్యి జనాభా కలిగిన గ్రామాల్లో మాత్రమే ఈ పనులు చేపట్టాల్సి ఉంది. ప్రతి మండలంలో ఒకటి లేదా రెండు చెరువులను మొదటి విడతలో పైలెట్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయనున్నారు. గ్రామ పంచాయతీలు, దేవాలయ కమిటీలు, గ్రామ ప్రజల సమ్మతితో మాత్రమే కోనేర్లను అభివృద్ధి చేయాలని గ్రామీణాభివృద్ది శాఖ ఆదేశించింది. జాతీయ స్థాయిలో జిల్లా క్రీడాకారుల సత్తా కర్నూలు (టౌన్): జిల్లాకు చెందిన 51 మంది క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటారని జిల్లా వృత్తి విద్యా శాఖాధికారి పరమేశ్వర రెడ్డి తెలిపారు. స్కూల్గేమ్స్ ఫెడరేషన్ జాతీయ స్థాయి పోటీల్లో రాణించిన జిల్లా క్రీడాకారులకు మంగళవారం ఆర్ఐఓ గురువయ్యశెట్టితో కలిసి ఆయన పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేసి, సత్కరించారు. కార్యక్రమంలో కేవీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ సుంకన్న, లాలప్ప, అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి హర్షవర్దన్ పాల్గొన్నారు. తేనెటీగల పెంపకంతో ఆర్థికాభివృద్ధి కొత్తపల్లి: తేనెటీగల పెంపకంతో ఆర్థికాభివృద్ధి చెందాలని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఎం.జాన్సన్, ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కేజీ నాయక్ గిరిజనులకు సూచించారు. మంగళవారం మండలంలోని పాలెంచెరువు గూడెంలో గిరిజనులకు తేనెటీగల పెంపకంపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, నేషనల్ హానీ బీ బోర్డ్ సంయుక్తంగా పాలెంచెరువు గ్రామానికి చెందిన 25 మంది గిరిజన రైతులకు శాసీ్త్రయ పద్ధతిలో తేనెటీగలను పెంచి, తేనెను తయారు చేసుకునే విధానంపై ఏడు రోజుల శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ, సర్పంచు మశమ్మ, జెడ్పీటీసీ సోమల సుధాకర్ రెడ్డి, శాస్త్రవేత్తలు కె.అశోక్ కుమార్, కె.మోహన్, విష్ణువర్ధన్, ఎం.శివరామకృష్ణ పాల్గొన్నారు. -
‘బోసి నవ్వుల’ బంధం!
చిరునవ్వు చిందిస్తూ..ఆ మహాత్ముని బోసినవ్వు ఆ చిన్నారిని ఆకట్టుకుంది. విగ్రహంలోని అమాయకత్వంతో ఆ పసిహృదయం మాట కలిపింది. మచ్చలేని మహనీయుడికి అంటుకున్న మరకలను ఆ ‘తెల్లని’ మనసు తుడిచేసింది. ఆ చిక్కని చిరునవ్వుని తన చిట్టి చేతులతో తడమటం తాతా మనవడి బంధాన్ని గుర్తుచేసింది. ( మంగళవారం ఉదయం కర్నూలు పెద్దాసుపత్రిలోని చిన్నపిల్లల విభాగంలో మహాత్మాగాంధీ విగ్రహంతో ఓ బాలుడి ఆత్మీయత అక్కడున్న వారందరిలో నవ్వులు పూయించింది. ) – ఫొటోలు: డి.హుస్సేన్, సాక్షి ఫొటోగ్రాఫర్ -
నీటి ఎద్దడి తలెత్తకుండా ఎస్ఎస్ ట్యాంకులను నింపండి
కర్నూలు (అర్బన్): జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టులకు ఏప్రిల్ 14వ తేదీ వరకు నీటి సరఫరా జరుగుతున్నందున ప్రస్తుత వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఎస్ఎస్ ట్యాంకులన్నిటినీ నింపుకోవాలని జిల్లాపరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి కోరారు. మంగళవారం సాయంత్రం స్థానిక జెడ్పీ మినీ సమావేశ భవనంలో తాగునీటి ఎద్దడి, జెడ్పీ నిధులతో చేపట్టిన వివిధ పనుల పురోగతిపై ఆయన పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ తాగునీటి సరఫరా పథకాలకు ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ను సరఫరా చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీల్లో నీటి వృథాను అరికట్టేందుకు పైప్లైన్ల లీకేజీలను వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుత వేసవిలో నీటి ఎద్దడి తలెత్తే మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లను ఆదేశించారు. జిల్లాపరిషత్ నిధుల ద్వారా మంజూరైన ఎస్సీ, ఎస్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖలకు మంజూరు చేసిన ఈఎంఎఫ్ పనులను వెంటనే చేపట్టి జూలై నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నారు. సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ పనులకు సంబంధించి ఐసీడీఎస్ అధికారులను సమన్వయం చేసుకుని పంచాయతీరాజ్ ఇంజనీర్లు పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ కర్నూలు, నంద్యాల ఎస్ఈలు బి.నాగేశ్వరరావు, సీహెచ్ మనోహర్, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. జిల్లాపరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి -
మల్లన్న సేవలో కర్ణాటక రాష్ట్ర గవర్నర్
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను కర్ణాటక రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లట్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. మంగళవారం మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన కర్టాటక గవర్నర్కు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, వేదపండితులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అమ్మవారి ఆలయం వద్దగల ఆశీర్వచన మండపంలో గవర్నర్కు వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. దేవస్థాన ఈఓ స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూ ప్రసాదాలను, జ్ఞాపికను అందించి సత్కరించారు. -
‘కూటమి’ తంత్రం.. అందని యంత్రం
కర్నూలు(అగ్రికల్చర్): రైతుల సంక్షేమానికి, వ్యవసాయ అభివృద్ధికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పలు పథకాలు అమలు చేయగా.. ప్రస్తుత ప్రభుత్వం ఉన్న పథకాలను నీరుగారుస్తోంది. గత ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా యాంత్రీకరణతో పాటు అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేశారు. కూటమి ప్రభుత్వం మాత్రం సిఫారస్సులకు లోబడే యంత్రీకరణ అమలు చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. టీడీపీకి చెందిన వారికే ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారని ప్రజలే చెబుతున్నారు. టీడీపీ వారికే యంత్రాలు వ్యక్తిగత వ్యవసాయ యంత్రాల పంపిణీలో టీడీపీ నేతల సిఫార్సులకే వ్యవసాయ శాఖ అఽధికారులు పెద్దపీట వేస్తున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో వ్యవసాయ శాఖ.. రైతులకు వ్యక్తిగతంగా వ్యవసాయ యంత్ర పరికరాలు సబ్సిడీపై పంపిణీ చేస్తోంది. కేంద్రప్రభుత్వ నిధులు 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వ నిధులు 40 శాతం నిధులు అందిస్తోంది. కర్నూలు జిల్లాలో రూ.రూ.2.87 కోట్లతో 1,660 యంత్రపరికరాలు, నంద్యాల జిల్లాలో రూ.2.85 కోట్లతో 1,635 యంత్రపరికరాలు సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. కర్నూలు జిల్లాకు బ్యాటరీ స్ప్రేయర్లు 250, థైవాన్ స్ప్రేయర్లు 600, ట్రాక్టర్ ఆపరేటెడ్ స్ప్రేయర్లు 7, ట్రాక్టర్ డ్రాన్ ఇంప్లిమెంట్స్ 740, రోటావేటర్లు 28, పవర్ వీడర్లు 17, బ్రస్కట్టర్లు 13, పవర్ టిల్లర్లు 5 ప్రకారం పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఒక్కటి కూడా ఇవ్వకుండా... నంద్యాల జిల్లాలో థైవాన్ స్ప్రేయర్లు 575 కేటాయించగా.. మిగిలినవన్నీ.. కర్నూలు జిల్లాతో సమానంగా కేటాయించారు. ఒక్కో మండలంలో 30 నుంచి 50 గ్రామాలు ఉంటాయి. బ్యాటరీ స్ప్రేయర్లు, థైవాన్ స్ప్రేయర్లు గ్రామానికి కనీసం ఒక్కటి కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. రోటా వేటర్లు మండలానికి ఒక్కటి ప్రకారమే కేటాయించారు. పవర్ టిల్లర్లు, బ్రస్కట్టర్లు, పవర్ వీడర్లు అతి తక్కువగా ఉండటంతో టీడీపీ నేతల ప్రాబల్యం ఉన్న మండలాలకే కేటాయించారు. వ్యక్తిగత యంత్ర పరికరాలు సరఫరా చేసేందుకు దాదాపు 50 కంపెనీలను గుర్తించింది. బ్యాటరీ స్ప్రేయర్లకు రూ.1000, థైవాన్ స్ప్రేయర్లకు రూ.8000 నుంచి 10 వేల వరకు, ట్రాక్టర్ డ్రాన్ ఇంప్లిమెంట్స్కు కంపెనీని బట్టి గరిష్టంగా రూ,35 వేల వరకు, రోటావేటర్కు రూ.46 వేలు, పవర్ వీడర్లకు రూ.30 వేల నుంచి 40 వేల వరకు, బ్రస్కట్టర్లకు రూ.25 వేల నుంచి రూ.44 వేలు, పవర్ టిల్లరుకు లక్ష నుంచి రూ.1.20 లక్షల వరకు సబ్సిడీ ఉంటుంది. ఇంప్లిమెంట్స్ అతి తక్కువగా ఉండటంతో కూటమి నేతల సిఫార్సుల పర్వం జోరుగా సాగుతోంది. వారు ఎవ్వరికి చెబితే వారికే ఇస్తామని వ్యవసాయ అధికారులు స్పష్టం చేస్తున్నారు. టీడీపీ నేతలు చెప్పిన వారికే వ్యవసాయ యంత్ర పరికరాలు -
ఎస్డీఆర్ఎఫ్ సేవలకు కమాండెంట్ అభినందన
కర్నూలు: కర్నూలు ఏపీఎస్పీ రెండో పటాలం ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సేవలను కమాండెంట్ దీపిక పాటిల్ అభినందించి సత్కరించారు. ఈనెల 16న విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన వెంకటరత్నం (80) వచ్చి ప్రమాదవశాత్తూ ప్రకాశం బ్యారేజీ సమీపంలో కెనాల్లో పడిపోయాడు. అదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న రెండో బెటాలియన్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆర్ఎస్ఐ మహేంద్ర నాయక్, శివ, పద్మనాభం, సుదర్శన్ రెడ్డి, హుసేన్, నాగన్న, సత్యనారాయణ తదితరులు పడవ సాయంతో వృద్ధుడిని కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అందుకు గాను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సేవలను అభినందిస్తూ మంగళవారం కమాండెంట్ దీపిక పాటిల్ తన కార్యాలయంలో ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో అదనపు కమాండెంట్ నాగేంద్ర రావు, ఎస్డీఆర్ఎఫ్ డీఎస్పీ సుధాకర్ రెడ్డి, ఆర్ఐ సాయికుమార్ పాల్గొన్నారు. -
శ్రీమద్దిలేటయ్య హుండీ ఆదాయం రూ.39.66 లక్షలు
బేతంచెర్ల: వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 39.66 లక్షలు వచ్చింది. స్వామి, అమ్మవార్లకు భక్తులు సమర్పించిన కానుకలు, ముడుపుల హుండీ లెక్కింపు మంగళవారం దేవదాయశాఖ అధికారి జనార్దన, ఆలయ ఈఓ రామాంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించారు. 58 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపు ద్వారా ఆలయానికి రూ. 39,66,066 నగదు, 47 గ్రాముల బంగారు, 1.300 కిలోల వెండి వచ్చింది. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ రామ్ మోహన్ రావు, మహిళా భక్తులు, వేదపండితులు, అర్చకులు పాల్గొన్నారు. 30 నుంచి చౌడేశ్వరిదేవి జ్యోతి ఉత్సవాలు బనగానపల్లె: నందవరంలో వెలసిన చౌడేశ్వరిదేవి అమ్మవారు జ్యోతి మహోత్సవాలు ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు ఏప్రిల్ 5వ తేదీ వరకు అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 30వ తేదీ సాయంత్రం ఉత్సవాలకు అంకురార్పణ, పంచాంగ శ్రవనం, పన్నేరపు బండ్లు తిప్పుట, ప్రాకార రథోత్సవం, 31న శ్రీదేవి భూదేవి సమేత చేన్నకేశవస్వామి కల్యాణోత్సవం, ఏప్రిల్ 1న ఉదయం అమ్మవారికి కుంకుమార్చన, సాయంత్రం అమ్మవారి రాయబార మహోత్సవం, 2న అభయహస్త సేవా సమితి ధర్మవరం వారిచే అన్నమయ్య సంకీర్తన చౌడేశ్వరిదేవి జ్యోతి మహోత్సవం, అర్ధరాత్రి నుంచి భాస్కరయ్య ఆచారిచే అమ్మవారికి దిష్టి చుక్క పెట్టుట, 3న సాయంత్రం రథోత్సవం, 4న తిరుగు రథోత్సవం, 5న వసంతోత్సవం నిర్వహించనున్నారు. ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారని, ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఆలయ ఉప కమిషనర్ కామేశ్వరమ్మ మంగళవారం తెలిపారు. తెల్లవారుజాము నుంచే మహానందీశ్వరుడి దర్శనం మహానంది: ఉగాది ఉత్సవాల సందర్భంగా మహానందీశ్వరుడి దర్శనానికి వచ్చే కన్నడ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచే దర్శనం కల్పిస్తున్నట్లు ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ ఆలయ తలుపులు తెల్లవారుజామున 3.30 గంటలకే తెరిచి స్వామి వారికి అభిషేకం, పూజల అనంతరం 4.10 గంటలకు హారతులు ప్రారంభించి 4.30 గంటల నుంచి భక్తులకు ద ర్శనం కల్పిస్తామన్నారు. అర్చకులతో పాటు ప్రధాన కౌంటర్ల సిబ్బంది అందరూ నిర్ణీత సమయానికి హాజరు కావాలని ఆదేశించారు. ఏప్రిల్ 1 వరకు ఎండుమిర్చి, వాము క్రయవిక్రయాలు బంద్ కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 1 వరకు ఎండుమిర్చి, వాము క్రయవిక్రయాలు నిలిపివేస్తున్నట్లు మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున అకౌంట్స్ను క్లోజ్ చేసుకోవాల్సి ఉందని.. వాము, ఎండుమిర్చి క్రయవిక్రయాలు చేపట్టలేమని వ్యాపారస్తుల అసోషియేషన్ చెప్పినందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని, కమీషన్ ఏజెంట్లు కూడా ఆయా సరుకులను తెప్పించరాదని సూచించారు. -
ఎన్నికలకు ముందు సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండేవిధంగా ఇసుక పాలసీ తీసుకొస్తామన్న పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక అంటూ ఆర్భాటం చేశారు. ఉచితం అటుంచితే అధిక ధరకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. టీడీపీ నేతలు ఇసుక వ్యాపారులుగా అవతారమెత్తి ప్
● ఇసుక వ్యాపారులుగా టీడీపీ నేతలు ● ఆళ్లగడ్డలో పేరుకే స్టాక్ పాయింట్ ● జమ్మలమడుగు నుంచి పెద్దముడియం మీదుగా అక్రమంగా తరలింపు ● ట్రాక్టర్కు రూ. 2 వేలు అదనం ● ఓ ప్రజాప్రతినిధి భర్త కనుసన్నల్లో దందారోజుకు రూ. లక్షల్లో అక్రమ ఆదాయం నియోజకవర్గ వ్యాప్తంగా ఇసుక కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక కావాలంటే తప్పనిసరిగా టీడీపీ నాయకులను ఆశ్రయించాల్సిందే. ట్రాక్టర్ ఇసుకకు అదనంగా రూ.2 వేలు ఇస్తేనే సరఫరా చేస్తున్నారు. చాగలమర్రి, రుద్రవరం, ఆళ్లగడ్డ, దొర్నిపాడు, ఉయ్యాలవాడ, శిరివెళ్ల మండలాలకు ప్రతి రోజు 120 నుంచి 150 ట్రాక్టర్ల ఇసుక సరఫరా అవుతోంది. రోజుకు కేవలం ఇసుక ద్వారానే అక్రమంగా రూ.3 లక్షలు సంపాదిస్తున్నారు. ఈ మొత్తం అంతా స్థానిక ప్రజాప్రతినిధి భర్త జేబులోకి వెళ్తోందని ప్రచారం జరుగుతోంది. ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతున్నా పోలీసు, రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడడకపోవడం గమనార్హం. సాక్షి, నంద్యాల: కూటమి నేతలకు ఇసుక కాసులు కురిపిస్తోంది. పేరుకే ఉచిత ఇసుక.. కానీ, కాసులిస్తే కానీ టన్ను ఇసుక దొరకని పరిస్థితి. ప్రభుత్వం ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఇసుక స్టాక్ పాయింట్లను మూసేసి అక్రమార్జనకు తెరలేపారు. అక్రమ మార్గంలో ఇసుకను తరలిస్తూ రూ. కోట్లు కూడబెడుతున్నారు. ఇప్పటికే పెరిగిన ఖర్చులతో నిర్మాణ రంగం కుదేలయింది. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కో ట్రాక్టర్ మీద రూ.2 వేలు వసూలు చేస్తూ మరింత భారం మోపుతున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గానికి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నుంచి ఇసుకను తరలిస్తున్నారు. పెద్దముడియం మీదుగా ఆళ్లగడ్డకు... ఇక్కడి నుంచి రుద్రవరం, దొర్నిపాడు, ఉయ్యాలవాడ, శిరివెళ్ల, చాగలమర్రి మండలాలకు వెళ్తోంది. ప్రతి రోజు రాత్రి మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య అక్రమ రవాణా సాగుతోంది. ఇసుక కావాలనుకున్న వారు టీడీపీ నాయకులను సంప్రదిస్తే వారే ఇసుక తెప్పిస్తున్నారు. నాలుగు టన్నుల ఇసుక ట్రాక్టర్ రవాణా ఖర్చులతో కలిపి రూ.3500కు విక్రయించాల్సి ఉండగా.. టీడీపీ నాయకుల అక్రమ వసూళ్లతో ఇసుక ట్రాక్టర్ రూ.6 వేల వరకు పలుకుతోంది. అక్రమ దందాతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నా జిల్లా ఇసుక కమిటీ చైర్ పర్సన్గా ఉన్న కలెక్టర్ రాజకుమారి గణియా ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. స్టాక్ పాయింట్ తెరిస్తే ఒట్టు.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రజలకు అందుబాటులోనే ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేశారు. పట్టణంలోని మార్కెట్ యార్డ్లో ఇసుక నిల్వ ఉంచి కావాల్సిన వారు సులువుగా బుక్ చేసుకుని తీసుకుని వెళ్లే సౌలభ్యం ఉండేది. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుకను ప్రధాన ఆదాయ వనరుగా మలుచుకున్నారు. స్థానికంగా ఇసుక లభ్యత లేకపోవడం వీరికి కలిసొచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టాక్ పాయింట్ను ఇప్పటి వరకు తెరవలేదు. గత నవంబర్లో ఇసుక స్టాక్ యార్డ్లకు టెండర్లు పిలిచి అదే నెలలో డీలర్ లైసెన్స్లను ఖరారు చేశారు. ప్రభుత్వం నిర్ణయించింది రూ.719 మాత్రమే... రాష్ట్ర ప్రభుత్వం టన్ను ఇసుక ధర రూ.719 చొప్పున నిర్ణయించింది. ఇసుక ఎవరికి కావాలన్నా అధికారికంగా ఈ ధర చెల్లించి తీసుకెళ్లవచ్చు. కానీ, ఆళ్లగడ్డలో మాత్రం పేరుకే ఇసుక స్టాక్ పాయింట్ ఉంది. అక్కడికి వెళ్లి చూస్తే ఇసుక ఉండదు.. ఇసుక స్టాక్ పాయింట్ ఎప్పుడూ మూత వేసి ఉంచుతున్నారు. పట్టణానికి 4 కిలో మీటర్ల దూరంలో పాలసాగరం వద్ద ఏర్పాటు చేశారు. స్టాక్ యార్డ్ ఏర్పాటై నాలుగు నెలలవుతున్నా ప్రజలకు స్టాక్ యార్డ్ ఎక్కడ ఉందో తెలియదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
నీళ్లిచ్చి పంటలను కాపాడండి
శిరివెళ్ల: రబీలో సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు ఆందోళన బాట పట్టారు. ఎండిపోతున్న పంటలకు నీళ్లిచ్చి ఆదుకోవాలంటూ మంగళవారం శిరివెళ్ల, యర్రగుంట్ల, కోటపాడు, గోవిందపల్లె, కామినేనిపల్లె, వెంకటాపురం రైతులు కేసీ కెనాల్ వద్ద ధర్నా చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు కేసీలో నీరు పుష్కలంగా ఉన్నా మార్చి మొదటి వారం నుంచి నీటి ప్రవాహం తగ్గిపోయింది. ఈ క్రమంలో వారబందీ క్రమంలో పొలాలకు నీటిని విడుదల చేసేలా అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు 16వ లాక్ కింద పొలాలకు ఐదు రోజులు, 17, 18, 19 లాక్ కింది పొలాలకు ఐదు రోజుల మేర వంతులను నిర్ణయించి నీటిని వదిలారు. 16వ లాక్ కింద పొలాలకు ఈ నెల 18వ తేదీ వరకు నీరు ఇచ్చారు. తర్వాత 23వ తేదీ వరకు కింది లాక్ల పొలాలకు వంతుల మేరకు నీరు ఇచ్చారు. అయితే 24వ తేదీ నుంచి 16 లాక్ పొలాలలకు నీరు ఇవ్వాల్సి ఉండగా మంగళవారం మధ్నాహ్నం ఒంటి గంట తర్వాత శిరివెళ్ల, యర్రగుంట్ల, గోవిందపల్లె సబ్ చానళ్లకు అధికారులు నీటిని నిలుపుదల చేశారు. దీంతో రైతులు ఆగ్రహంతో ప్రధాన కాల్వ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. ఒప్పందం ప్రకారం ఈనెల 30వ తేదీ వరకు నీటిని ఇవ్వక పోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో వెంకటాపురానికి చెందిన రైతులు తిరుపతిరెడ్డి, గోవిందపల్లెకు చెందిన శ్రీనివాసులు, నాగరాజు, సుబ్బారెడ్డి, నరసింహులు, వీరారెడ్డిపల్లెకు చెందిన రాజశేఖరరెడ్డి, వజ్రాల వేణుగోపాలరెడ్డి, మహేశ్వరరెడ్డి, కోటపాడుకు చెందిన చిలకల బిజ్జి తిమ్మయ్య, వెంకట సుబ్బయ్య, సూర్య నారాయణరెడ్డి, కామినేపల్లెకు చెందిన ఈశ్వర్, లక్కా పౌల్, సాలరాజు పాల్గొన్నారు. కేసీ కెనాల్ 16వ లాక్ వద్ద రైతుల ఆందోళన అధికారులు మాట తప్పారని మండిపాటు -
ఉగాది ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో గురువారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఉగాది మహోత్సవాల నేపథ్యంలో దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులకు సేదతీరేందుకు పలుచోట్ల చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. బసవవనం, బాలగణేశవనం, శివదీక్షా శిబిరాలు, రుద్రాక్షవనం, ఆలయ మాడవీధులు, మల్లమ్మ కన్నీరు, పలు ఆరుబయలు ప్రదేశాల్లో చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. అలాగే కాలినడకన వచ్చే మార్గంలో నాగలూటి, దామర్లగుంట, పెచ్చెర్వు, కై లాసద్వారం, హఠకేశ్వరం పలుచోట్ల చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. కాలిబాటలోని నాగలూటి, పెద్దచెరువు, కై లాసద్వారం మొదలైనచోట్ల జనరేటర్లను ఏర్పాటు చేసి తాత్కాలిక విద్యుద్దీకరణ ఏర్పాటు చేశారు. రోజు రోజుకు పెరుగుతున్న కన్నడ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నీటిసరఫరాకు అవసరమైన చర్యలు చేపట్టారు. రోజుకు 1.36 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. భీమునికొలను–కై లాసద్వారం వద్ద 1000 లీటర్ల సామర్థ్యం కలిగిన 6 సింటెక్స్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు ఇలా.. ● దేవస్థానం అన్నదాన భవనంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. క్యూలైన్లలో వేచిఉన్న భక్తులకు నిరంతరం అల్పాహారాన్ని అందిస్తున్నారు. అలాగే కై లాసద్వారం, సాక్షిగణపతి, హఠకేశ్వరం, క్షేత్రపరిధిలోని పలుచోట్ల కన్నడ భక్తబృందాలు చేస్తున్న అన్నదాన కార్యక్రమాలకు దేవస్థానం సహకారం అందిస్తోంది. ● జిల్లా వైద్యశాఖ సహకారంతో దేవస్థాన వైద్యశాల, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ద్వారా నిరంతరం వైద్యసేవలు అందిస్తున్నారు. కై లాసద్వారం, హఠకేశ్వరం, క్యూకాంప్లెక్స్, ఆలయ మహాద్వారం మొదలైనచోట్ల తాత్కాలిక వైద్యశిబిరాలు. ● ఆర్టీసీ బస్టాండ్ వెనుకభాగం, యజ్ఞవాటిక, ఔటర్రింగ్రోడ్డు, గణేశ సదనం ఎదురుగా, హెలిప్యాడ్ వద్ద, దేవస్థానం ఆగమ పాఠశాల పలుచోట్ల వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. ● పారిశుద్ధ్య పనులకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మాదిరిగానే సిబ్బందిని నియమించారు. క్షేత్రపరిధిలోని 500 శాశ్వత మరుగుదొడ్లు, పలుచోట్ల తాత్కాలిక మరుగుదొడ్లు అందు బాటులో ఉంచారు. శ్రీగిరికి భారీగా చేరుకుంటున్న కన్నడ భక్తులు ఆరుబయలు ప్రదేశాల్లో తాత్కాలిక వసతి పాదయాత్ర భక్తుల కోసం భీమునికొలను వరకు తాగునీటి సరఫరా -
దేవుడా ఇవేమి తిప్పలు
గోస్పాడు: పింఛన్దారుల్లో అనర్హుల ఏరివేత అంటూ దివ్యాంగ లబ్ధిదారులను కూటమి ప్రభుత్వం కష్టాల పాలుజేసింది. ఎన్నో ఏళ్లుగా పింఛన్ పొందుతున్న వారికి వైద్య పరీక్షలు అంటూ ఆందోళనకు గురి చేస్తోంది. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ప్రత్యేక సదరం క్యాంప్ నిర్వహణ దారి తప్పుతోంది. బేతంచెర్ల మండలం హెచ్. కొట్టాల, ముద్దవరం గ్రామాలకు చెందిన దివ్యాంగులకు ఈనెల 25వ తేదీన నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగే సదరం క్యాంపుకు వెళ్లాలని సంబంధిత సచివాలయ సిబ్బంది ఈనెల 7వ తేదీన నోటీసులు ఇచ్చారు. వారి సూచన మేరకు దివ్యాంగులు మంగళవాం నంద్యాల ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ ఎవరిని అడిగినా క్యాంపు నిర్వహణపై సమాధానం లేకపోగా ఒక్కొ క్కరూ ఒకలా చెబుతుండటంతో ఆందోళన చెందారు. చివరకు తేదీ మార్చారని తెలుసుకుని అధికారుల తీరుపై మండిపడ్డారు. సచివాలయ సిబ్బంది క్యాంపులు నిర్వహిస్తున్న విషయాన్ని కూడా పూర్తిస్థాయిలో తెలియకుండానే తమ లాంటి వారికి నోటీసులు ఇచ్చి పంపడం ఏమిటని బాధపడ్డారు. దివ్యాంగులమైన తాము ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసాలతో ఇక్కడికి వచ్చాక క్యాంపు నిర్వహించకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఈ విషయంపై డీఆర్డీఏ పీడీ శ్రీధర్రెడ్డిని వివరణ కోరగా సదరం క్యాంపు మొదట్లో ప్రతి వారం మంగళ, బుధ, గురువారాల్లో నిర్వహించే వార మని, ఇటీవల షెడ్యూల్ మార్పు చేసి బుధ, గురు, శుక్రవారాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నా రు. కాగా మంగళవారం నంద్యాలకు చేరుకునన్న దివ్యాంగులకు మళ్లీ ఎప్పుడు రావాలో తెలియక పోవడంతో అయోమయంలో పడ్డారు. ప్రత్యేక సదరం శిబిరానికి హాజరు కావాలంటే సచివాలయ సిబ్బంది ఇచ్చే నోటీసులతో వస్తేనే ఇక్కడి వైద్యులు వికలత్వ ధ్రువీకణ పత్రాలు ఇస్తారు. దీంతో దివ్యాంగులు దిక్కుతోచక తిరుగు ప్రయాణమయ్యారు. దివ్యాంగ పింఛన్దారులకు కష్టాలు 25న వైద్య పరీక్షలకు హాజరు కావాలని నోటీసులు తీరా వచ్చాక తేదీ మార్చామంటున్న అధికారులు -
వైఎస్సార్సీపీ నాయకులపై దాడి
జూపాడుబంగ్లా: టీడీపీ నాయకుల దాడిలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి, పి.లింగాపురం సర్పంచ్ నాగార్జునరెడ్డి, అతని తండ్రి, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని లింగాపురంలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాలు.. 80బన్నూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 769ఐ, 769జే లలో ఉన్న 21.50 ఎకరాల పొలాన్ని మంగళవారం అధికారులు సర్వే చేసేందుకు ఉపక్రమించారు. నాగార్జునరెడ్డి అతని తండ్రి రాజ్కుమార్రెడ్డి, చిన్నాన్న తిరుమలేశ్వరరెడ్డి, పి.లింగాపురం గ్రామానికి చెందిన కొంత మంది గ్రామస్తులు అక్కడికి చేరుకుని పొలం తమ పూర్వీకులని, సర్వే నిలిపివేయాలని కోరారు. విషయం తెలుసుకున్న జూపాడుబంగ్లాకు చెందిన టీడీపీ నాయకుడు జంగాల పెద్దన్న, అతని కుమారుడు మోతె వెంకటయ్య, సోదరుడు శేఖర్, మరికొంత మంది పొలం వద్దకు చేరుకుని 17 ఏళ్లుగా పొలాన్ని తాము సాగుచేసుకుంటూ ఉన్నామని, ఇప్పుడొచ్చి పొలం తమదంటే ఎలాగంటూ నాగార్జునరెడ్డిని నిలదీశారు. ఈక్రమంలో మాటామాటా పెరగడంతో టీడీపీ నాయకులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నాగార్జునరెడ్డి, రాజ్కుమార్రెడ్డి, తిరుమలేశ్వరరెడ్డి, రవి తలలకు రక్త గాయాలయ్యాయి. బాధితులు పోలీసుస్టేషన్కు చేరుకోవటంతో పోలీసులు వారిని చికిత్సనిమిత్తం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈసందర్భంగా నాగార్జునరెడ్డి మాట్లాడుతూ జంగాల పెద్దన్న, మోతె వెంకటయ్య, జంగాల శేఖర్, శంకరయ్య, వెంకటమ్మ మరికొంత మంది కర్రలు, కొడవళ్లు, కత్తులతో తమపై దాడిచేరన్నారు. కాగా వైఎస్సార్సీపీ నాయకులపై దాడిచేసిన టీడీపీ నాయకులు కూడా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయటం గమనార్హం. పొలం విషయంలో ఘర్షణ నలుగురికి రక్త గాయాలు -
అదుపు తప్పితే కాలువలోకే!
పిల్లిగుండ్ల, నెరుడుప్పల రహదారిలోని జీడీపీ కూడి కాలువ కల్వర్టు పూర్తిగా కుంగిపోయింది. దీంతో పాటు రక్షణ గోడ కూడా లేదు. వాహనదారులు ఏ మాత్రం ఆదమరిచినా కాలువలో పడిపోయే అవకాశం ఉంది. ఈ రహదారి మీదుగా పిల్లిగుండ్ల, ఒంటెడుదిన్నె, నెరుడుప్పల, ఎర్రబాడు, దేవనకొండ మండలం కేంద్రంతో పాటు ఆయా గ్రామాలకు వెళ్తుంటారు. అయితే ఆ కాలువ దగ్గర రోడ్డు మలుపు ఉండడం, కల్వర్టుకు రక్షణ గోడ లేకపోవడంతో ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. పైగా కల్వర్టు పూర్తిగా కుంగిపోయింది. అలాగే కల్వర్టు కింద, పక్కన గట్టు పూర్తిగా దెబ్బతినడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని వాహనదారులు భయందోళనకు గురవుతున్నారు. రాత్రి సమయంలో అయితే వాహనదారులు భయపడుతూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు స్పందించి కుడి కాలువకు నూతన కల్వర్టుతో పాటు రక్షణ గోడ నిర్మించాలని, దెబ్బతిన్న కాలువ గట్టుకు మరమ్మతులు చేయించాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు. – గోనెగండ్ల -
ముగిసిన మంగళ మహోత్సవం
మంత్రాలయం: శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీమన్ న్యాయసుధా మంగళ మహోత్సవం సోమవారం ముగిసింది. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల నేతృత్వంలో రెండు రోజుల పాటు ఈ ఉత్సవం నిర్వహించారు. వివిధ మఠాధిపతులు సమక్షంలో శ్రీమన్ న్యాయసుధా గ్రంఽథంపై తర్క , సారాంశ ఘోష్టి జరిపారు. మహోత్సవంలో ఉత్తమ ప్రతిభ చాటిన ఎనిమిది మంది విద్యార్థులకు ప్రశంసా పత్రం, అవార్డులు ప్రదానం చేశారు. అంతకు ముందు ఊంజల మంటపంలో రాఘవేంద్రుల విరాట్కు పీఠాధిపతులు విశేష పూజలు చేపట్టారు. వేడుకలో వ్యాసరాజ మఠం పీఠాధిపతి విద్యాశ్రీషా తీర్థులు, శ్రీపాదరాజ మఠం పీఠాధిపతి సుజయనిధి తీర్థులు, కృష్ణాపుర మఠం పీఠాధిపతి విద్యాసాగర తీర్థులు, కనియూరు మఠం పీఠాధిపతి విద్యావల్లభతీర్థులు, శిరూర్ మఠం పీఠాధిపతి వేదవర్ధన తీర్థులు, అధమారు మఠం పీఠాధిపతి ఈషాప్రియ తీర్థులు, బందరకెరె మఠం పీఠాధిపతి విద్ద్యేశ తీర్థులు , కన్వమఠం పీఠాదిపతి విద్యాకన్వ విరాజ తీర్థులు, బాలఘర్ మఠం పీఠాధిపతి అక్షోభ్య రామ ప్రియ తీర్థులు , చిత్తాపూర్ మఠం పీఠాధిపతి విద్ద్యేంద్ర తీర్థులు, ఉడిపి మఠం పీఠాధిపతులు బన్నంజే రాఘవేంద్ర తీర్థులు, వామన తీర్థులు పాల్గొన్నారు. -
పదో తరగతి విద్యార్థికి బ్రెయిన్ స్ట్రోక్
● ఇప్పటికే ఒక ఆపరేషన్ చేసిన వైద్యులు ● వర్తించని ఎన్టీఆర్ వైద్యసేవ ● ఆదుకోవాలంటున్నతల్లిదండ్రులు కర్నూలు(హాస్పిటల్): ఆ విద్యార్థి ఎన్నో ఆశలతో పదో తరగతి పరీక్షలకు సిద్ధమయ్యాడు. కొన్ని పరీక్షలు కూడా రాశాడు. సోమవారం జరగాల్సిన పరీక్ష కోసం పాఠశాలకు వెళ్లి తిరిగి వచ్చి ఇంట్లో కుప్పకూలిపోయాడు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది వెంటనే కుమారుడిని కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. విద్యార్థికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని, రూ.10లక్షల దాకా ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో దాతల కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. వివరాలు.. పాములపాడు మండలం ఎర్రగూడూరు గ్రామానికి చెందిన వెంకట నాగయ్య, జి.పరిమళలు తమ కుమారుడైన జి. రిషికేష్ చదువు కోసం కర్నూలు నగరంలోని టెలికాంనగర్లో నివాసం ఉంటున్నారు. నంద్యాల చెక్పోస్టు ప్రాంతంలోని ఒక స్కూల్లో జి. రిషికేష్,, 10వ తరగతి చదువుతున్నాడు. కర్నూలు నగరంలోని ఒక సెంటర్లో ఈ నెల 17వ తేదీ నుంచి పరీక్షలు రాస్తున్నాడు. మధ్యాహ్నం భోజనం చేసి సోమవారం పరీక్షకు సిద్ధం కావాల్సి ఉందని చదువుతున్న పాఠశాలకు వెళ్లిపోయాడు. సాయంత్రం వరకు అక్కడే చదువుకుని ఏడు గంటలకు ఇంటికి వస్తూనే తనకు విపరీతమైన తలనొప్పి వస్తోందని తల్లిదండ్రులకు చెబుతూ అలాగే మంచంపై వాలిపోయాడు. కొద్దిసేపటికి చూసే సరికి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే తల్లిదండ్రులు కుమారున్ని కర్నూలు నగరంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆ బాలుని మెదడులో నరం వాచి చిట్లిపోయినట్లు గుర్తించారు. వెంటనే అదేరోజు రాత్రి ఆపరేషన్ చేసి మెదడులో లీకై న రక్తాన్ని తొలగించారు. త్వరలో మరో ఆపరేషన్కు సిద్ధంగా ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు. అయినా ఇప్పుడే ఏమీ చెప్పలేమని, ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు. చికిత్సకు ఎన్టీఆర్ వైద్యసేవ వర్తించదని, ఇందుకోసం రూ.10లక్షల దాకా ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో పేదలైన తాము అంత డబ్బు ఎక్కడ నుంచి తీసుకురావాలని, దాతలు స్పందించి తన కుమారున్ని ఆదుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
కోర్టు స్టేను అమలు చేయాలి
● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి కల్లూరు: మండలంలోని కె. మార్కాపురం, తడకనపల్లె గ్రామాలకు సంబంధించిన రేషన్ షాపులకు సంబంధించి కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ అమలు చేయాలని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి కోరారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ నవ్యకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ అమలు చేయకుండా కొందరు అధికారులు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. కాటసాని వెంట రేషన్ డీలర్లు, గ్రామ నాయకులు ఉన్నారు. -
క్యాంపస్ సెలక్షన్లో ఎంపిక కాలేదని..
● ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య ప్యాపిలి: తన కలలు నెరవేరడం లేదనే బెంగతో ఓ ఐఐటీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్యాపిలి మండలం ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన సుధాకర్, సుధారాణి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు మరమేసి అరుణ్ కుమార్ (23) పంజాబ్లోని రోపర్ యూనివర్సిటీలో ఐఐటీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. సెమిస్టర్ పరీక్షల్లో ఒక్క సబ్జెక్టు బ్యాక్లాగ్లో ఉండటంతో ఇటీవల జరిగిన క్యాంపస్ సెలక్షన్లో ఎంపిక కాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అరుణ్ కుమార్ తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తన ముఖం ఎలా చూపించాలని తరచూ స్నేహితులతో చెప్పి బాధపడేవాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఈ నెల 15న పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో చేరుకున్నాడు. గమనించిన తోటి మిత్రులు పంజాబ్లో ఓ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. కాగా పరిస్థితి విషమించడంతో ఆరుణ్ కుమార్ శనివారం రాత్రి మృతి చెందాడు. దీంతో అతడి మృతదేహాన్ని సోమవారం స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. చెట్టంత కొడుకు విగతజీవిగా మారడంతో ఆ యువకుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
హత్య కేసులో నిందితుల అరెస్ట్
● రిమాండుకు ఆదేశించిన కోర్టు బండిఆత్మకూరు: వైఎస్సార్సీపీ కార్యకర్త నంద్యాల సుధాకర్రెడ్డి హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఏఎస్పీ కార్యాలయంలో సోమ వారం నిందితులను చూపించారు. ఈ సందర్భంగా నంద్యాల ఏఎస్పీ మంద జావళి మాట్లాడుతూ.. లింగాపురం గ్రామంలో కొన్నేళ్ల నుంచి నంద్యాల సుధాకర్రెడ్డికి, అదే గ్రామానికి చెందిన మాల గుర్రాల రామస్వామికి స్థలం విషయంలో గొడవ ఉండేదన్నారు. స్థలాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో రామస్వామి అతని కుమారులు.. నంద్యాల సుధాకర్రెడ్డిని కిరాతంగా హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులతో తేలిందన్నారు. నిందితులైన గుర్రాల రామస్వామి, అతని కుమారులు గుర్రాల శివన్న, గుర్రాల తిరుపాలు, గుర్రాల లక్ష్మన్నలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండుకు ఆదేశించినట్లు ఏఎస్పీ తెలిపారు. నిందుతులను అరెస్ట్ చేసిన సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ జగన్మోహన్, మహానంది ఎస్ఐ రామ్మోహన్రెడ్డితో పోలీస్ సిబ్బందిని అభినందించారు. ప్రజలకు సదుపాయాలు కల్పించరా? కర్నూలు (టౌన్): చిన్నపాటి సమస్యలపై నెలల తరబడి తిరగాల్సి వస్తోంది. అయినా సమస్యలు పరిష్కారం కావడం లేదు. పన్నులు చెల్లించే ప్రజలకు సదుపాయాలు కల్పించరా? అని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకుడు పుల్లారెడ్డి ప్రశ్నించారు. సోమవారం స్థానిక నగరపాలక సంస్థ ఎదుట ఆ సంఘం ఆధ్వర్యంలో వివిధ కాలనీలకు చెందిన ప్రజలతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ కాలనీ, రిచ్మండ్ కాలనీ, శాంతినగర్ కాలనీలలో సదుపాయాలు కల్పించాలన్నారు. టెలికాం నగర్, బాలాజీనగర్ పార్కు, సుందరయ్య పార్కులను అభివృద్ధి చేయాలన్నారు. ఖాళీ స్థలాలను సంరక్షించి అభివృద్ధి చేయాలని, శివారు కాలనీలలో 100 మినీ వాహనాలను ఏర్పాటు చేసి ఇంటింటి చెత్త సేకరించాలని డిమాండ్ చేశారు. అనంతరం మేయర్ బీవై రామయ్యకు, కమిషనర్ రవీంద్రబాబుకు వినతిపత్రాలు అందజేశారు. -
మహానందిలో కన్నడిగుల అవస్థలు
మహానంది: ఉగాది ఉత్సవాలకు శ్రీగిరికి చేరుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో మహానందీశ్వరుడిని దర్శించుకునేందుకు మహానందికి తరలివస్తున్నా రు. స్థానిక రుద్రగుండం, బ్రహ్మగుండం, విష్ణుగుండం కోనేరుల్లో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుంటున్నారు. కాగా ఆలయ ప్రాంగణంలో సరైన వసతులు లేకపోగా, గదులు తీసుకోవడానికి ఆర్థిక స్థోమత లేని భక్తులు చేసేదేమిలేక ఆలయం ముందు భాగంలో, సుపథ మండపాల్లో సేద తీరుతున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వచ్చే పేద భక్తులకు అధికారులు వసతి కల్పించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నారు. -
అర్జీలు పరిష్కరించండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలాల నుంచి 203 మంది అర్జీలు వచ్చా యి. కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డీఆర్ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను నాణ్యతతో పరిష్కరించడంతో పాటు ఫిర్యాదుదారుల నుంచి అభిప్రాయా లు సేకరించాలన్నారు. ఉపాధి పనులు కల్పించండి ఉపాధి కూలీలకు పనులు కల్పించడంలో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేతన దారులకు పను లు కల్పించడంలో ఎంపీడీఓలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పట్టణాలలో ఉన్న ప్రధాన కూడళ్ల వద్ద చలువ పందిళ్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. -
శ్రీగిరి మల్లన్నా.. శరణు..శరణు!
శ్రీగిరికి చేరువైన పాదయాత్ర భక్తులుకన్నడ భక్తుల శివనామస్మరణతో శ్రీశైల క్షేత్రం మారుమోగుతోంది. ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తండోపతండాలుగా శ్రీగిరి చేరుకుంటున్నారు. నల్లమల మీదుగా పాదయాత్ర చేసుకుంటూ కై లాస ద్వారం చేరుకుని మల్లన్న చెంతకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. వేలాది మంది భక్తులు పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల దర్శనానికి బారులుదీరుతున్నారు. కన్నడ భక్తులు మల్లన్న ను స్పర్శ దర్శనం చేసుకునేందుకు ఎంతో ఆరాట పడతారు. అందులో స్వామి వారి స్పర్శ దర్శనానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో కన్నడ భక్తుల సౌకర్యార్థం ఈ నెల 26వ తేదీ వరకు మల్లన్న స్పర్శ దర్శనానికి అనుమతి కల్పించారు. అయితే మరో రెండు రోజుల్లో ముగిస్తుండడంతో కన్నడ భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. అంతేకాకుండా క్షేత్రంలో భక్తులు పెరగడంతో మొబైల్ ఫోన్ సిగ్నల్స్ పని చేయడం లేదు. దీంతో భక్తులు సమాచారంతెలుసుకోక అవస్థలు పడుతున్నారు. – శ్రీశైలంటెంపుల్ -
పాల సేకరణ ధర పెంపు
నంద్యాల(అర్బన్): పాల సేకరణ ధరను పెంచి నట్లు విజయ డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పాల ఉత్పత్తి దారుల పరస్పర సహాయ సహకార సమితి ఈ నిర్ణయం తీసుకుందన్నారు. కేజీ వెన్న శాతం ప్రకారం గేదె పాలు లీటరుపై రూ.1.20 నుంచి రూ.2, ఆవు పాలు లీటరుపై రూపాయి పెంచామన్నారు. మార్చి 16వ తేదీ నుంచే ఈ ధర అమల్లోకి వచ్చిందన్నారు. పాడి రైతులకు పశు పోషణకు సంబంధించి అన్ని ధరలు పెరిగినందున పాల సేకరణ ధరను పెంచుతూ నిర్ణ యం తీసుకున్నామన్నారు. ఈ అవకాశాన్ని పాల ఉత్పత్తి దారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ధరలు కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో పాలు పోస్తున్న రైతులంద రికీ వర్తిస్తాయన్నారు. టోల్గేట్ల టెండర్లో రూ. 1.68 కోట్ల ఆదాయం మహానంది: మహానంది క్షేత్రంలో టోల్గేట్ల నిర్వహణకు ఏర్పాటు చేసిన టెండర్ల ద్వారా దేవస్థానానికి రూ. 1.68 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహానందిలోని పోచా బ్రహ్మానందరెడ్డి డార్మెటరీ భవనంలో సోమవారం బహిరంగ, సీల్డు టెండర్లు నిర్వహించారు. మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ బి.నాగభూపాల్రెడ్డి రూ. 1,68,00,003తో నిర్వహణ బాధ్యతలను దక్కించుకున్నారు. ఇదే టోల్గేట్లకు గత ఏడాది రూ. 1.71 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది పోటీ అంతగా లేకపోవడంతో ఆశించిన మేరకు ఆదాయం లభించలేదు. టోల్గేట్ల నిర్వహణతో పాటు ఆలయ ప్రాంగణంలో ఉన్న ఎనిమిది ఖాళీ ప్లాట్లకు జరిగిన బహిరంగ వేలాల్లో నెలకు రూ. 44,300 ఆదాయం వచ్చినట్లు చెప్పారు. మరుగుదొడ్ల నిర్వహణ, ఇతర అంశాలకు ఎవరూ ముందుకు రాకపోవడంతో వాయిదా పడ్డాయి. కార్యక్రమంలో ఏఈఓ ఎరమ ల మధు, ఆలయ సూపరింటెండెంట్ అంబటి శశిధర్రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు నాగమల్లయ్య, సుబ్బారెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. క్షయవ్యాధిపై అవగాహన కల్పించాలి గోస్పాడు: క్షయవ్యాధిపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని డీఎంఅండ్హెచ్ఓ వెంకటరమణ అన్నారు. నంద్యాల పట్టణంలోని సర్వజ న ఆసుపత్రి ఆవరణంలోని మీటింగ్ హాల్లో సోమవారం ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా క్షయ నివారణ అధికారి శార దాబాయి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ జ్వరం, దగ్గు రెండు వారాలకు మించి ఉన్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. టీబీ నియంత్ర ణను, నివారణ చర్యలు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో విద్యార్థులకు ఎస్ఏ, క్విజ్ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ఫర్మార్మేషన్ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. 15 మంది టీబీ బాధితులకు రెడ్క్రాస్, మదర్సొసైటీ సహకారంతో ఫుడ్ బాక్సెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ కాంతరావునాయక్, డీసీహెచ్ఎస్ డాక్టర్ జఫరుల్లా, వైద్యాధికారులు తేజశ్వని, పీటర్ వినయ్, సిబ్బంది పాల్గొన్నారు. ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ శ్రీశైలం: నల్లమల ఘాట్ రోడ్డులో సోమవారం ట్రాఫిక్ జామ్ ఏర్పడి భక్తులు అవస్థలు పడ్డారు. శ్రీశైలం–దోర్నాల మధ్యలో ఉన్న తుమ్మల బయలు సమీపంలో రోడ్డుకు అడ్డంగా చెట్టు పడిపోవడంతో సుమారు 5 కిలోమీటర్ల వరకు అటు ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో భక్తు లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘన స్థలానికి చేరుకుని కూలిన చెట్టును పక్కకు తొలగించడంతో వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. -
క్రికెట్ బెట్టింగ్ జోలికెళితే కఠిన చర్యలు
బొమ్మలసత్రం: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ అమాయకులను మోసం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సోమవారం హెచ్చరించారు. ఈ సందర్బంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐపీఎల్ క్రికెట్ 2025 నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ బృందాలతో నిఘా పెంచామన్నారు. అమాయకుల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఎవరైనా డబ్బు ఆశ చూపించి క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడినా, నిర్వహించినా, ప్రోత్సహించినా ఉపేక్షించబోమన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను గమనిస్తూ ఉండాలన్నారు. బెట్టింగులకు పాల్పడుతున్నట్లు గుర్తిస్తే వారికి నచ్చచెప్పి ఆ ఊబిలో నుండి బయటకు తీసుకురావాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిస్తే డయల్ 100/112కు సమాచారమివ్వాలన్నారు. సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. పీజీఆర్ఎస్లో 62 ఫిర్యాదులు స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అదిరాజ్సింగ్రాణా ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 62 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో సమస్యలు తెలిపేందుకు జిల్లాలోని నలుమూలల నుంచి వినతులు అందాయన్నారు. వారి సమస్యలకు స్పందించి ఆయా స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి కొన్ని సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపామన్నారు. పీజీఆర్ఎస్ ద్వారా అందిన ఫిర్యాదులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని వాటిని పునరావృతం కాకుండా చూ డాలని అధికారులను ఆదేశించామన్నారు. జిల్లా పోలీ స్ కార్యాలయంలో ఫిర్యాదులు ఇచ్చే వారు సుదూర ప్రాంతాల నుంచి రానవసరం లేకుండా స్థానిక పోలీస్టేషన్లలో వినతులు ఇచ్చి పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ మందా జావళి, అడిషనల్ ఎస్పీ యుగంధర్బాబు పాల్గొన్నారు. -
ప్రమాదవశాత్తూ విద్యార్థి మృతి
కొలిమిగుండ్ల: గొర్విమానుపల్లె గ్రామంలో సోమవారం ప్రమాదవశాత్తూ ఓ విద్యార్థి మృతి చెందాడు. సీఐ రమేష్బాబు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఆవుల బ్రహ్మయ్య, పార్వతి దంపతులు కుమారుడు విరాట్ యాదవ్ (13) గ్రామంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్నాడు. సోమవారం ఇంటి వద్ద ఉన్న కుళాయికి నీళ్లు వస్తుండటంతో మోటర్ సాయంతో పట్టుకున్నారు. ఆ తర్వాత విరాట్ విద్యుత్ బోర్డులో నుంచి మోటర్కు చెందిన ప్లగ్ బయటకు తీస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇంటి ముందున్న సీసీ రోడ్డుపై పడ్డాడు. ఈ క్రమంలో బాలుడి తలకు తీవ్ర గాయమైంది. చికిత్స కోసం కుటుంబ సభ్యులు తుమ్మలపెంట సమీపంలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరికి చెందిన ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుమారుడి మృతితో తల్లిదండ్రుల రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. -
గత ప్రభుత్వంలో రూ.50 వేలు అందింది
జగనన్న పాలనలో వాహన మిత్ర పథకం ద్వారా ఏడాదికి రూ.10 వేలు చొప్పున సాయం అందించారు. అయిదేళ్లలో రూ.50 వేలు అందుకున్నాను. ఈ డబ్బులు ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్, మరమ్మతులకు ఉపయోగపడేవి. ప్రస్తుత ప్రభుత్వంలో మాకు ఎలాంటి సాయం అందలేదు. సూపర్ సిక్స్ పథకాలతో పాటు హామీలన్నీ సీఎం చంద్రబాబు అమలు చేసి పేదలకు న్యాయం చేయాలి. – ప్రవీణ్, దేవనగర్, నంద్యాల చెప్పిన తేదీకి ఇచ్చేవారు గత ప్రభుత్వంలో వాహన మిత్ర పథకం ద్వారా చెప్పిన తేదీకి రూ.10 వేలు అందించారు. కేవలం ఆటో నడుపుకుంటూ వచ్చే ఆదాయం ద్వారానే కుటుంబాన్ని పోషించుకుంటున్న మాకు ఈ డబ్బులు ఎంతగానో ఉపయోగపడేవి. కూటమి అధికారంలోకా వస్తే రూ.15 వేలు ఇస్తామని ఇప్పటి వరకు ఇవ్వలేదు. అంఏడాదవుతున్నా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేదు. – లోకేష్, హరిజనవాడ, నంద్యాల● -
27 నుంచి ఉగాది ఉత్సవాలు
● శ్రీశైలానికి భారీగా చేరుకుంటున్న కన్నడ భక్తులు ● భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేపట్టిన దేవస్ధానం శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం మహా క్షేత్రంలో ఈనెల 27వ తేదీ నుంచి ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఐదు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో పాల్గొనేందుకు కన్నడిగులు వేలాది మంది తరలివస్తున్నారు. ఈనెల 31వ తేదీ వరకు జరిగే మహోత్సవాల్లో ప్రతిరోజు స్వామి అమ్మవార్లకు విశేష వాహన సేవ నిర్వహిస్తారు. అలాగే కన్నుల పండువగా గ్రామోత్స వం సైతం నిర్వహించనున్నారు. ఉగాది మహోత్సవాల్లో వీరాచారా విన్యాసాలు, పంచాంగ శ్రవణం, స్వామి అమ్మవార్లకు రథోత్సవం తదితర కార్యక్రమాలు ప్రధానమైనవి. కన్నడ భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్థానం ఈనెల 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి స్పర్శ దర్శనానికి అనుమతించారు. విడతల వారీగా నిర్దిష్ట వేళలలో, 10 రోజులపాటు కన్నడ భక్తులు మల్లన్నను స్పర్శ దర్శనం చేసుకునేందుకు దేవస్ధానం అధికారులు ఏర్పాట్లు చేశారు. మహోత్సవాల ను పురస్కరించుకుని కన్నడిగుల సౌకర్యార్థం, శ్రీశైల దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు కల్పించిన సౌకర్యాలను యథావిధిగా ఉగాది మహోత్సవాలకు అమలు చేస్తోంది. భక్తులకు ఉచిత, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనంతో పాటు మల్లన్న స్పర్శ రూ.500 టికెట్ కౌంటర్ సైతం ఏర్పాటు చేసింది. భక్తులకు సౌకర్యవంతమైన స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశామని ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. కన్నడ భక్తులు దేవస్థానానికి సహకరించేలా శ్రీశైల జగద్గురు పీఠాధిపతి వారి ప్రసంగ వీడియోని ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ప్రసారం చేస్తున్నామన్నారు. -
సాయం నిలిచి.. కష్టాలు రయ్ రయ్!
● రవాణా రంగం కార్మికులకు కూటమి మొండి చేయి ● ఎన్నికల ముందు ఏటా రూ.15 వేల హామీ ● పది నెలలు అవుతున్నా ఊసే లేదు ● గత వైఎస్సార్సీపీ హయాంలో వాహనమిత్ర ద్వారా ఏటా రూ. 10 వేల సాయం నంద్యాల(న్యూటౌన్): ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వడం, అధికారం వచ్చిన తర్వాత వాటిని అటకెక్కించడం టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడుకి పరిపాటిగా మారింది. ప్రజలను పదేపదే మోసం చేయడంలో తనకు తానే సాటి అని ప్రతీసారి నిరూపించుకుంటు న్నారు. 2014లో ఆరు వందలకు పైచిలుకు హామీలు ఇచ్చి, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి అన్ని వర్గాలకు మోసం చేశారు. 2024లోనూ అదే రీతిలో హామీలు ఇచ్చి తనదైన తీరులో ఎగనామం పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, హెవీ లైసెన్స్ కలిగిన లారీ, టిప్పర్ డ్రైవర్లకు ఏటా రూ.15 వేలు ఆర్థిక సహాయం అందిస్తామని, సంక్షేమ బోర్డు ఏర్పాటు, ప్రమాద బీమా, ఆరోగ్యబీమా, డ్రైవర్ల పిల్లలకు విద్యా రుణాలు, తదితర హామీలను మేనిఫెస్టోలో పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి పదినెలలు గడిచిపోతున్నా వీటిలో ఏ హామీ కార్య రూపం దాల్చలేదు. తాజా గా ప్రవేశపెట్టిన 2025–26. వార్షిక బడ్జెట్లో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం పథకానికి రూపాయి కూడా కేటాయించ లేదు. సంక్షేమ బోర్డు, ఇతర హామీలను పరిగణనలోకి తీసుకోలేదు. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం ఇవ్వాల్సిందేనని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం సాయం అందించక పోగా అధికారంలోకి వచ్చిన రోజు నుంచే రకరకాల పేర్లతో ఆపరాధ రుసుములు విధిస్తూ తమపై బాదుడు మొదలు పెట్టారని ఆటో కార్మికులు మండిపడుతున్నారు. ఐదేళ్లలో రూ. 8.89 కోట్లు 2019MýS$ Ð]l¬…§ýl$ {糆{糄ýS ¯ól™èlV> OÐðlG‹Ü fVýS¯ŒS-Ððl*-çß毌SÆð‡yìlz ´ë§ýlĶæ*{™èl ^ólçÜ$¢¯]l² çÜÐ]l$Ķæ$…ÌZ BĶæ$°² BsZ {OyðlÐ]lÆý‡$Ï MýSÍíÜ çÜÐ]l$çÜÅ-ÌS¯]l$ ^ðl糚-MýS$-¯é²Æý‡$. A«¨-M>-Æý‡…-ÌZMìS Ð]lõÜ¢ Ý÷…™èl…V> BsZ E¯]l²-Ðé-Ç™ø ´ër$ sêÅMîSÞ {OyðlÐ]l-Æý‡ÏMýS$ Hyé-¨MìS Æý‡*.10 ÐólË$ CÝë¢Ð]l$° B çÜÐ]l$Ķæ$…ÌZ fVýS¯]l¯]l² Ð]l*r C^éaÆý‡$. 2019ÌZ A«¨M>-Æý‡…-ÌZMìS Ð]l_a¯]l Ððl…r¯ól Ðéçßæ-¯]l-Ñ${™èl ç³£ýlMýS… õ³Æý‡$™ø Æý‡*.10 ÐólÌS BÇ-®MýS ÝëĶæ$… A…¨…-^éÆý‡$. AƇ$$-§ólâýæÏ ´ër$ Hsê D BǦMýS ÝëĶæ$… A…¨çÜ*¢ Ð]l^éaÆý‡$. D yýlº$¾-ÌS¯]l$ BsZ Ð]l$Æý‡-Ð]l$Ã-™èl$Ë$, C¯]l*ÞÆð‡¯ŒæÞ,-ె¯ŒSÞ, íœsñæ²‹Ü çÜÇtíœ-MðSsŒæ Ð]l…sìæ Ðésìæ MøçÜ… Eç³-Äñæ*-W…-^èl$-MýS$¯ól ÐéÆý‡$. ¯]l…§éÅÌS hÌêÏÌZ Ðéçßæ¯]l Ñ${™èl ç³£ýlMýS… §éÓÆ> 2019 ¯]l$…_ 2023 Ð]lÆý‡MýS$ §é§éç³# 8,892 Ð]l$…¨ ÌS¼-®-§é-Æý‡$-ÌSMýS$ Æý‡*.8.89 Mør$Ï ÝëĶæ*°² A…¨…-^éÆý‡$. కూటమి మేనిఫెస్టోలో ఇలా.. బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ, టిప్పర్ డ్రైవర్లకు ఏటా రూ. 15 వేలు ఆర్థిక సాయం. డ్రైవర్ సాధికార సంస్థ ఏర్పాటు చేసి అన్ని వర్గాల డ్రైవర్లకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు, డ్రైవర్లను ఓనర్లు చేసే లక్ష్యంతో వాహన కొనుగోళ్లకు రూ. 4 లక్షల వరకు పొందే రుణాలపై 5 శాతం పైబడిన వడ్డీ సబ్సిడీ. -
తూతూమంత్రంగా ట్రాన్స్ఫార్మర్లు, ఇతర మెటీరియల్
గత తొమ్మిది నెలల్లో ఇదీ పరిస్థితి.. విడుదల డివిజన్ ఏడాది చేసిన కాలంగా విద్యుత్ నిరీక్షిస్తున్న కనెక్షన్లు రైతుల సంఖ్య 341 ఆదోని 3,766 310 కర్నూలు టౌన్ 1,220 351 ఎమ్మిగనూరు 2,656 179 నంద్యాల 2,427 164 ఆత్మకూరు 867 129 డోన్ 1,357 1,474 మొత్తం 12,293విద్యుత్ కనెక్షన్లకు గ్రహణం ● తొమ్మిది నెలలు గడుస్తున్నా మంజూరులో జాప్యం ● ఇప్పటి వరకు ఇచ్చిన కనెక్షన్లు 1,474 ● ఉమ్మడి జిల్లాలో 12,293 రైతుల నిరీక్షణ ● ఏడాది క్రితం డబ్బు చెల్లించినా నోరు మెదపని అధికారులు మాకు ఐదెకరాల భూమి ఉంది. రెండు బోర్లు ఉన్నాయి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం ఏడాది క్రితం విద్యుత్ మా వాటా కింద రూ.18,600 చెల్లించాం. ఇప్పటి వరకు కనెక్షన్ ఇవ్వలేదు. పోల్స్, మెటీరియల్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. అదిగో ఇదిగో అని తిప్పిపంపుతున్నారు. బోర్లలో నీళ్లున్నా ఉపయోగించుకోలేకపోతున్నాం. – కమ్మరి చిన్న రంగస్వామి, జిల్లేడుబుడకల గ్రామం, దేవనకొండ మండలం మాకు ఎనిమిది ఎకరాల భూమి ఉంది. రెండు బోర్లు వేయించాం. 2023 డిసెంబర్లో విద్యుత్ కనెక్షన్ కోసం రైతు వాటాగా రూ.80 వేలు చెల్లించాం. ఇప్పటికి ఏడాది గడిచిపోయినా కనీసం పోల్స్ కూడా ఇవ్వలేదు. నీళ్లు ఉన్నా కనెక్షన్ ఇవ్వకపోవడంతో భూములను ఖాళీగా ఉంచుకున్నాం. డోన్లోని డీఇ, ఏడీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం. – ధర్మవరం సుబ్బరాయుడు, ఓబులదేవరపల్లి గ్రామం, ప్యాపిలి మండలం కర్నూలు(అగ్రికల్చర్): వర్షాధారం కింద పంటల సాగు గాలిలో దీపంగా మారింది. బావులు, బోర్లలోని అంతంతమాత్రం నీటితో పంటలు పండించుకోవాలని ఆశించిన రైతులకు నిరాశే మిగులుతోంది. వ్యవసాయ విద్యుత్ పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతోంది. కొత్త విద్యుత్ కనెక్షన్ల కోసం వేలాది మంది రైతులు డబ్బు చెల్లించి కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు. విద్యుత్ కనెక్షన్ ఇస్తే బోర్ల కింద కూరగాయల పంటలు, ఆరుతడి పంటలు సాగు చేసుకోవచ్చనే ఉద్దేశంతో రైతులు ఉన్నారు. అయితే కనెక్షన్ల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోంది. విద్యుత్ అధికారులు వేసిన ఎస్టిమేట్ల ప్రకారం డబ్బులు చెల్లించినప్పటికీ 12,293 మంది రైతులు కనెక్షన్ ఎప్పుడిస్తారో తెలియక విద్యుత్ అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. తొమ్మిది నెలల్లో 1,474 కనెక్షన్లు కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు తొమ్మిది నెలలు పూర్తవుతోంది. ఈ మధ్య కాలంలో ఇచ్చిన కనెక్షన్లు 1,474 మాత్రమే. కర్నూలు జిల్లాలో 1,002, నంద్యాల జిల్లాలో 472 మాత్రమే విడుదలయ్యాయి. నిబంధనల ప్రకారం సీనియారిటీకి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నా.. టీడీపీ నేతల జోక్యంతో అర్హులకు అన్యాయం జరుగుతోందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఎలాంటి పనులు చేయరాదని బహిరంగంగా చెప్పడంతో కిందిస్థాయి టీడీపీ నేతలు మరింత చెలరేగిపోతున్నారు. పేరుకుపోతున్న దరఖాస్తులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు వేలాది రూపాయలు చెల్లించారు. ఉమ్మడి జిల్లాలో 12,293 మంది రైతులు తమ వాటా మొత్తం చెల్లించి కనెక్షన్ల కోసం నిరీక్షిస్తున్నారు. కర్నూలు జిల్లాలో 7,642, నంద్యాల జిల్లాలో 4,651 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్లో ఉండిపోయాయి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులు మరో 6వేల మంది ఉన్నారు. ఈ రైతులకు సంబంధించి విద్యుత్ అధికారులు ఎస్టిమేట్లు వేసి డిమాండ్ నోటీసులు ఇస్తే తమ వాటా సొమ్ము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వ్యవసాయ విద్యుత్పై అలసత్వం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ట్రాన్స్పార్మర్లు కాలిపోతే దక్కులేదు కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు మెటీరియల్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇదే సమయంలో పాత కనెక్షన్లకు సంబంధించి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే వెంటనే ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వ్యవసాయానికి అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. నాటి ప్రభుత్వ ఆదేశాల మేరకు దళారీల ప్రమేయం లేకుండా.. రైతుల నుంచి ఒక్క రూపాయి వసూలు చేయకుండా ట్రాన్స్ఫార్మర్లను సరఫరా చేసి ఏర్పాటు చేయడం విశేషం. నిబంధనల ప్రకారం ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినప్పుడు కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు 24 గంటల సమయం ఉంటుంది. ఇప్పుడు వారం రోజులు దాటినా ట్రాన్స్ఫార్మర్లు సరఫరా చేయలేని పరిస్థితి. మే చివరికి పూర్తి చేస్తాం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు ప్రక్రియ మొదలైంది. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 1,474 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు విడుదల చేశాం. ఇంకా 12,293 కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. మే నెల చివరికి పూర్తి చేస్తాం. సీనియారిటీ ప్రకారం కనెక్షన్లు ఇస్తాం. – ఉమాపతి, ఎస్ఇ, విద్యుత్ శాఖ, కర్నూలు జిల్లా ఈ చిత్రం మద్దికెర మండలం బసినేపల్లి గ్రామంలోనిది. బోర్లలో నీళ్లు పడినా రైతులుపంటలు పండించుకోలేని పరిస్థితి. ఆరేడుగురు రైతులు 14–15 నెలల క్రితం బోర్లు వేయించుకున్నారు. బోర్లలో ఆశాజనకంగా నీళ్లు పడ్డాయి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ఏడాది క్రితం దరఖాస్తు చేసుకున్నారు. విద్యుత్ అధికారులు ఎస్టిమేట్లు వేశారు. రైతులు తమ వాటా మొత్తాన్ని డీడీ తీశారు. ఆ మేరకు పోల్ సరఫరా చేసి నాటారు. ఇతర మెటీరియల్ ఇవ్వకపోవడంతో నీళ్లున్నా విద్యుత్ కనెక్షన్ లేక భూములను ఖాళీగా ఉంచుకున్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి ట్రాన్స్ఫార్మర్లతో పాటు కండక్టర్, కేబుల్ కొరత ఉంది. 2024 జూలై 25 నాటి వరకు పెండింగ్లో ఉన్న వాటికి ట్రాన్స్ఫార్మర్లు సరఫరా అయ్యాయి. పెండింగ్లో ఉన్న మొత్తం కనెక్షన్లకు ఇంకా 1,900 ట్రాన్స్ఫార్మర్లు అవసరం. ఈ ట్రాన్స్ఫార్మర్లు ఎప్పటికి వస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. 2వేల కిలోమీటర్లకు కండక్టర్, కేబుల్ అవసరం కాగా.. ఇందుకోసం రైతులు తగిన మొత్తాన్ని చెల్లించారు. అయితే సరఫరా చేయడంలో ప్రభుత్వం చేతులెత్తేస్తోంది. -
వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
జూపాడుబంగ్లా: శ్రీశైలం క్షేత్రానికి పాదయాత్రతో వెళ్లే భక్తులు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ వెంకటరమణ అన్నారు. మండ్లెంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆదివారం ఆయన తనిఖీ చేశారు. వైద్య శిబిరాలకు కేటాయించిన సిబ్బంది అప్రమత్తంగా ఉండి భక్తులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని సూచించారు. తీవ్ర అస్వస్థతకు గురైన భక్తులు వస్తే ఆసుపత్రికి తరలించాలని సూచించారు. పాదయాత్ర భక్తులు వైద్య శిబిరాలను సద్విని యోగం చేసుకోవాలన్నారు. మధ్యాహ్న సమయంలో పాదయాత్రకు విరామం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం జిల్లాలో బ్రాహ్మణకొట్కూరు, మండ్లెం, నందికొట్కూరు, ఆత్మకూరు, వెంకటాపురం, గూడెం, పెద్ద చెరువు ప్రాంతాలతో పాటు పలుచోట్ల 13 వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం జూపాడుబంగ్లా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. ఆయన వెంట డాక్టర్ యశశ్విని తదితరులు ఉన్నారు. శ్రీశైలానికి పోటెత్తిన కన్నడిగులు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల క్షేత్రానికి కన్నడ భక్తులు పోటెత్తారు. కర్ణాటక, మహారాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. కన్నడ భక్తులతో శ్రీగిరి క్షేత్రం నిండిపోయింది. ఆదివారం శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. వేకువజామున్నే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి బారులు తీరారు. కన్నడ భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. కన్నడ భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగాణం మారుమోగుతుంది. ఈ నెల 27వ తేదీ నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని కన్నడ భక్తుల సౌకర్యార్థం ఈ నెల 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు విడతల వారీగా మల్లన్న స్పర్శదర్శనాన్ని కల్పిస్తున్నారు. దీంతో కన్నడ భక్తులు మల్లన్న స్పర్శదర్శనం చేసుకునేందుకు బారులు తీరుతున్నారు. అయితే స్పర్శదర్శనం టికెట్టు ఇచ్చేందుకు కౌంటర్లు పెంచా లని పలువురు భక్తులు డిమాండ్ చేస్తున్నారు. -
పరీక్షల నిర్వహణ భారమాయె!
● ‘పది’ పరీక్షలకు అరకొర బడ్జెట్ ● ఒక్కో విద్యార్థికి ఇస్తున్నది రూ.10 మాత్రమే ● ఆవేదనలో పరీక్షల నిర్వహణ యంత్రాంగం ● పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లపై భారం నంద్యాల(న్యూటౌన్): పదో తరగతి పరీక్షల నిర్వహణకు కూటమి ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఎందుకూ సరిపోవడం లేదు. అదనపు నిధుల కోసం ఉపాధ్యాయ సంఘాలు చేసిన వినతిపై ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. దీంతో పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ల (సీఎస్) జేబులకు చిల్లు పడుతోంది. పదో తరగతి పరీక్షల నిర్వహణకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. 2018లో ఒక్కో విద్యార్థికి కంటింజెంట్ చార్జ్ కింద రూ.5.50లు మాత్రమే ప్రభుత్వం చెల్లించేది. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పెరిగిన ధరలను అప్పటి సీఎం వైఎస్ జగన్ దృష్టిలో ఉంచుకుని కరోనా విపత్కర పరిస్థితిలోనూ 2020, 2021, 2023లో కంటింజెంట్ చార్జీ రూ.5.50 నుంచి రూ.8కు పెంచారు. 2024లో రూ.10కు పెంచారు. ప్రస్తుతం అదే చార్జీలనే కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోంది. పెరిగిన ధరలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణకు ఈ నిధులు సరిపోక అదనపు మొత్తాన్ని సీఎస్లు భరిస్తున్నారు. అరకొర నిధులతో సతమతం పోలీసు స్టేషన్లల్లో భద్రపరిచిన ప్రశ్న పత్రాలను పరీక్ష కేంద్రాలకు తరలించేందుకు, పరీక్షల అనంతరం జవాబు పత్రాలను తపాలా కార్యాలయానికి తరలించేందుకు రవాణా ఖర్చులు, కొవ్వొత్తులు, దారం, లక్క, స్టాప్లర్లు, స్కెచ్ పెన్నులు, గమ్, వైట్నర్ తదితర స్టేషనరీ కొనుగోలు తడిసి మోపెడవుతోంది. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంల జవాబు పత్రాల కోసం వేర్వేరు సంచులను వాడుతున్నారు. ఒక్కో సంచి కోసం రెండు నుంచి మూడు మీటర్ల వరకు వస్త్రాన్ని వాడాల్సి వస్తోంది. దీంతో పరీక్షల నిర్వహణకు సంబంధించి కంటింజెంట్ చార్జీలను పెంచాలని కూటమి ప్రభుత్వానికి పలుమార్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. అయినా ప్రభుత్వం స్పందించలేదు. సాధారణంగా ఒక పరీక్ష కేంద్రంలో 100 మంది విద్యార్థులుంటే ప్రస్తుతం పరీక్ష నిర్వహణ కింద ఇస్తున్న ఒక్కొ విద్యార్థికి రూ.10 చొప్పున ఇస్తుండటంతో కేవలం రూ.వెయ్యి మాత్రమే అందుతుంది. ప్రస్తుత ధరలతో పోల్చుకుంటే అన్ని ఖర్చులు కలిపితే రూ.5వేలకు పైగా అవుతుంది. దీంతో ప్రభుత్వం చెల్లించిన రూ.వెయ్యి పోను మిగిలిన రూ.4 వేలను సీఎస్లే భరించాల్సి వస్తోంది. సీఎస్, డీఓలకు అరకొర భృతి... ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారిని నియమించారు. 240 మంది విద్యార్థులకు మించి ఉన్న కేంద్రానికి అదనంగా డీఓలు ఉంటున్నారు. సీఎస్లు, డీఓలు, కస్టోడియన్లు, ఇన్విజిలేటర్లకు రూ.150 నుంచి రూ.200ల భృతి కేటాయించాలన్న డిమాండ్ను సైతం ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణకు పెద్దగా తేడా లేకపోయినప్పటికీ ఇంటర్ పరీక్షలకు సంబంధించిన ఇన్విజిలేటర్లకు రూ.150 చెల్లిస్తుండగా పదో తరగతి పరీక్షల ఇన్విజిలేటర్లకు కేవలం రూ.33 మాత్రమే చెల్లిస్తున్నారు. వాటర్ బాయ్కి రూ.17లు, అటెండర్కు రూ.20లు చొప్పున భృతి చెల్లిస్తున్నారు. అరకొర భృతి చెల్లింపులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ముమ్మరంగా ఇంటర్ మూల్యాంకనం
నంద్యాల(న్యూటౌన్): ఇంటర్మీడియెట్ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. నంద్యాల ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల పరీక్షలు ముగియడంతో అధ్యాపకులు పూర్తి స్థాయిలో మూల్యాంకనం ప్రక్రియకు హాజరవుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి నంద్యాల జిల్లాకు సుమారుగా 2,01,066 జవాబు పత్రాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ముందుగా ఈ నెల 7వ తేదీ నాటికి సంస్కృతం పేపర్లు జిల్లాకు చేరుకున్నాయి. అప్పుడే మూల్యాంకనాన్ని ప్రారంభించినా ఈ నెల 22వ తేదీకి పూర్తిస్థాయిలో పేపర్లు చేరుకోవటంతో శనివారం నుంచి ఊపందుకుంది. ప్రస్తుతం ఇంగ్లిష్, మ్యాథ్స్, సంస్కృతం, హిందీ, ఫిజికల్స్, తెలుగు, సివిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ సబ్జెక్టులకు సంబంధించిన పేపర్లు జిల్లాకు చేరుకున్నాయి. మరో ఒకటి, రెండు రోజుల్లో కామర్స్, బాటనీ, జువాలజీ, పేపర్లు రానున్నాయి. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా 432 మంది అధ్యాపకులు అధికారులకు రిపోర్ట్ చేశారు. అందులో భాగంగా సంస్కృతం 12, తెలుగు–57, ఇంగ్లిష్–86, హిందీ–6, మ్యాథ్స్–84, సివిక్స్–32 చొప్పున బోర్డులను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బోర్డులో ఒక చీఫ్ ఎగ్జామినార్, ఐదుగురు అసిస్టెంట్ ఎగ్జామినర్లతో పాటుగా ఒక స్కూట్నీజర్ ఉంటారు. అదేవిధంగా ఈ నెలలో మరో మూడు దఫాల్లో మరి కొంతమంది అధ్యాపకులు ఈ మూల్యాంకనంలో పాల్గొననున్నారు. అధ్యాపకులను స్పాటుకు పంపించాలి స్పాట్ వాల్యూయేషన్ విధులకు నియమించిన అధ్యాపకులను కళాశాల ప్రిన్సిపాళ్లు రిలీవ్ చేసి పంపించాలి. ఇప్పటికే స్పాట్ పూర్తిస్థాయిలో ప్రారంభమైంది. ఏప్రిల్ మొదటి వారం వరకూ ఈ మూల్యాంకనం ప్రక్రియ కొనసాగనుంది. కళాశాల ప్రాంగణంలో ఉన్న సదుపాయాలు, పేపర్ల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకులను రెండు మూడు దఫాలుగా హాజరయ్యే విధంగా ఏర్పాటు చేశాం. – సునీత, డీఐఈఓ, నంద్యాల జిల్లాకు చేరుకున్న 2,01,066 జవాబు పత్రాలు రిపోర్ట్ చేసిన 432 మంది అధ్యాపకులు -
ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి
తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలవారికి పింఛన్లు ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. పదినెలలు గడస్తున్నా ఇప్పటి వరకు ఆ హామీ అమలు కాలేదు. ఇప్పటి వరకు 50 ఏళ్ల పింఛన్ రాకపోగా నాకు 60 ఏళ్ల వయస్సు వచ్చింది. కనీసం వృద్ధాప్య పింఛన్కు దరఖాస్తు చేసుకుందామనుకున్నా కొత్త పింఛన్లు ఇవ్వడం లేదు. – నాగయ్య, కోవెలకుంట్ల ఇంకెన్నాళ్లు కాలయాపన వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుని దాదాపు రెండేళ్లు కావస్తోంది. నా భర్త నాగరాజుకు ప్రతి నెల వృద్ధాప్య పింఛన్ వచ్చేది. అనారోగ్యంతో మృతి చెందగా భర్త పింఛన్ భార్యకు వస్తుందన్నారు. గత ఏడాది జనవరి నెలలోనే పింఛన్ రావాల్సి ఉంది. వివిధ కారణాలతో ఆ నెలలో రాకపోగా తర్వాత ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారిపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చినా ఇప్పటి వరకు పింఛన్ అందలేదు. పింఛన్ మంజూరు చేసి అధికారులు ఆదుకోవాలి. – లీలావతమ్మ, కోవెలకుంట్ల పేదలకు ఆసరాగా నిలవాలి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం 50 ఏళ్ల నుంచి 59 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్లు మంజూరు చేయాలి. ఈ వయస్సులో వివిధ రోగాలతో బాధపడుతూ ఎంతో మంది వ్యవసాయ, ఉపాధి పనులు చేయలేకపోతున్నారు. అలాంటి వారికి ప్రతినెలా వచ్చే 4 వేల రూపాయలు ఎంతో ఆసరాగా ఉంటుంది. 50 ఏళ్లు వయస్సు నిండి పింఛన్ వస్తుందని ఎదురు చూస్తున్నాను. – దేవరత్నం, అవుకు -
ఎన్నికల ముందు ఎన్నో అమలు కాని హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు సంక్షేమ పథకాల విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. పది నెలలు కావస్తున్నా ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను దగా చేస్తోంది. తమ ప్రభుత్వం అధికారంలోకి
కోవెలకుంట్ల: అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు 20 లక్షల ఉద్యోగాలు/ నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి, స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాది కూ. 15 వేలు, అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏడాదికి రూ. 20 వేలు పెట్టుబడి సాయం, 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల్లోపు వయస్సు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ. 1500 ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల సరఫరా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమంటూ కూటమి నేతలు హామీ ఇచ్చారు. వీటిలో ఉచిత గ్యాస్ సిలిండర్ హామీని అరకొరగా అమలు చేసి చేతులు దులుపుకుంది. సూపర్సిక్స్ హామీలు అటుంచితే 50 ఏళ్లకు పింఛన్ అందుతుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆశపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి జిల్లాలోని 29 మండలాల పరిధిలో 2.22 లక్షల మంది పింఛన్ దారులున్నారు. పింఛన్లకు అర్హత ఉండి మరో 4,500 మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గడిచిన పది నెలల కాలంలో వివిధ కారణాలు సాకు చూపి దాదాపు 7 వేల పింఛన్లు తొలగించారు. జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో 50 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల్లోపు వయస్సు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు దాదాపు 2 లక్షల మంది ఉన్నట్లు ప్రాథమిక అంచనా. వీరంతా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆహార అలవాట్ల కారణంగా 50 ఏళ్లకే ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. బీపీ, షుగర్, కాళ్లనొప్పులు, తదితర దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయి. దీర్ఘకాలిక వ్యాధులతో వ్యవసాయ, ఉపాధి పనులు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం నెలకు రూ. 4 వేలు పింఛన్ వస్తే కుటుంబ పోషణ, మందులకు ఆసరాగా ఉంటుందని భావించిన వారికి నిరాశే మిగిలింది. ఒకవైపు పనులు చేతకాక, మరోవైపు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. 50 ఏళ్ల వారికి పింఛన్లు ఎప్పుడిస్తారని అర్హత ఉన్న వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కొత్త పింఛన్ల ఊసే లేదు 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్ల ప్రస్తావననే పక్కన పెట్టింది. గత ఏడాది జనవరి నెల నుంచి ఎన్నికల కోడ్ వచ్చే నాటికి జిల్లాలో 4,500 మంది వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, చేనేత, తదితర పింఛన్లకోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి గత ఏడాది జూన్ నెలలో కొత్త పింఛన్లు అందాల్సి ఉంది. వీరందరూ 14 నెలల నుంచి పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. పింఛన్ వస్తుందని ఆశగా గత పది నెలల నుంచి సచివాలయాల వద్ద వెళ్లి అడిగితే కొత్త పింఛన్లు విడుదల కాలేదని సిబ్బంది చెబుతుండటంతో ఉసురుమంటూ వెనుదిరుగుతున్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారే కాకుండా గత ఏడాది జూన్ నెల నుంచి పింఛన ్లకోసం అర్హత ఉండి దరఖాస్తు చేసుకునేందుకు వందల మంది ఉన్నారు. డిసెంబర్ నెల నుంచి కొత్త పింఛన్దారులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు సచివాలయల్లో పింఛన్ దరఖాస్తు వెబ్సైట్ ఓపెన్ కాకపోవడం గమనార్హం. ప్రస్తుతం పింఛన్ పొందుతూ అనారోగ్యం, వివిధ కారణాలతో పింఛన్ లబ్ధిదారుడు మృతి చెందితే అలాంటి పింఛన్లు మాత్రమే ఆ మరుసటి నెల ఇస్తున్నారు. గత జనవరి నుంచి మార్చి నెల వరకు ఇలాంటి పింఛన్ల కోసం వందల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నా వాటిని పరిగణలోకి తీసుకోకపోవడం విచారకరం. జగనన్న పాలనలో ఇలా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న విప్లవాత్మక మార్పులు చేపట్టారు. గ్రామ సచివాలయ, వలంటీర్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు ఠంచన్గా అందాయి. మొదట్లో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఒకటి, రెండు నెలల్లో పింఛన్ చేతికందేది. తర్వాత ఏటా జూలై నుంచి డిసెంబర్ వరకు పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారికి జనవరి నెలలో, జనవరి నుంచి జూన్ నెల వరకు దరఖాస్తు చేసుకున్న వారికి జూలై నెలలో కొత్త పింఛన్లు మంజూరు చేసి పేదలను ఆదుకుంది. 50 ఏళ్లకే పింఛన్ అమలులో కూటమి ప్రభుత్వం కాలయాపన పది నెలలు అవుతున్నా కార్యాచరణ అంటూ జాప్యం జిల్లాలో 2 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఎదురుచూపు వృద్ధాప్య, వితంతు కొత్త పింఛన్ల ఊసేలేదుసూపర్ సిక్స్కు నిధుల్లేవ్జిల్లాలో ఇదీ పరిస్థితి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి పింఛన్ల సంఖ్య: 2.22 లక్షలు ఇప్పటి వరకు కోత పెట్టినవి: 7 వేలు కొత్త పింఛన్ల దరఖాస్తుల సంఖ్య: 4,500 జిల్లాలో 50 నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్న వారు: 2 లక్షల మంది -
నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జి.రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు అందజేయాలన్నారు. ఉదయం 9.30 గంటల ప్రారంభమయ్యే కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ హాజరు కావాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయి లో నిర్వహించే కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వెలుగోడు ఎస్ఐపై బదిలీ వేటు వెలుగోడు: పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వెలుగోడు ఎస్ఐ విష్ణు నారాయణపై బదిలీ వేటు పడింది. ఆయనను తిరుపతికి బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల వేల్పనూరు – పెసరవాయి పంట పొలాల్లో పేకాట స్థావరంపై దాడి చేసిన సమయంలో రూ. 5 లక్షలు స్వాధీనం కాగా.. రూ. 12 వేలు చూపించారని ఆరోపణలు వచ్చాయి. అలాగే రెండు నెలల క్రితం స్టేషన్కు వచ్చిన గిరిజన సంఘం నాయకుల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంపై వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసారు.ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ చేయడంతో అక్రమాలు వెలుగు చూడటంతో తిరుపతికి బదిలీ చేసినట్లు తెలుస్తోంది. అక్షరం నేర్పకుండానే.. నంద్యాల(న్యూటౌన్): ఉల్లాస్ కార్యక్రమం కింద స్వయం సహాయక సంఘాల్లో నిరక్షరాస్యులకు అక్షరం నేర్పించకుండానే పరీక్ష నిర్వహించారు. ఎంపిక చేసిన కేంద్రాల్లో అక్షర జ్ఞానాన్ని నేర్పించే కార్యక్రమాన్ని వయోజన విద్యకు చెందిన సూపర్వైజర్లు పర్యవేక్షణ చేయాలి. కానీ వారు జిల్లా కేంద్రానికి పరిమితమై పర్యవేక్షణ చేయలేకపోవడంతో మెజార్టీ కేంద్రాల్లో అక్షరాలు నేర్చుకోలేదు. కొన్ని కేంద్రాల్లో స్వచ్ఛందంగా పొదుపు సంఘాల్లోని చదువుకున్న వారు అక్షరాలను నేర్పించినా...అది సంతకాల వరకే పరిమితం అయ్యింది. జిల్లాలో 670 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా 26,785 మందికి గాను 23,861 మంది హాజరయ్యారు. 2,924 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. మెజార్టీ కేంద్రాల్లో డీఆర్ డీఓ గుర్తించిన నిరక్షరాస్య మహిళలు కాకుండా వారి పిల్లలు, అప్పటికే చదువుకున్న వారితో పరీ క్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల పరీ క్షలు నిర్వహించకుండానే పరీక్షలు రాసినట్లు సంతకాలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. పాణ్యంలో ఓ పరీక్ష కేంద్రాన్ని వయోజన విద్య ఉప సంచాలకులు చంద్రశేఖర్రెడ్డి పరిశీలించారు. పెండింగ్ ప్రాజెక్టుల కోసం పోరాటం ఉద్ధృతం నంద్యాల(అర్బన్): రాయలసీమ సాగునీటి పెండింగ్ ప్రాజెక్టుల కోసం పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆత్మకూరు రవీంద్రనాథ్ అధ్యక్షతన నూనెపల్లె అమ్మవారి శాలలో వైశ్య ప్రముఖులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజలు, రైతుల ఆకాంక్షలను గౌరవించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. గాలేరు నగరి, హంద్రీనీవా, కేఆర్ఎండీ ఏర్పాటు, సాగునీటి జలాల గురించి ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సిద్దేశ్వరం అలుగు 9వ వార్షికోత్సవానికి 2 లక్షల మందితో ర్యాలీగా వెళ్లి సీమ రైతులకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు వైఎన్రెడ్డి, వైశ్య ప్రముఖులు అయ్యపుశెట్టి సుబ్రమణ్యం, శేషయ్య, గెలివి రామకృష్ణ పాల్గొన్నారు. -
బ్యాంకుల్లోనూ పలుచబడిన జనం
ఒకప్పుడు బ్యాంకులకు వెళ్తే అక్కడ పనిపూర్తి చేసుకుని తిరిగి రావడానికి గంట నుంచి రెండు గంటల సమయం పట్టేది. కోవిడ్ తర్వాత ఈ పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. అప్పటి వరకు వివిధ రకాల పథకాల సొమ్ము అకౌంట్లో ప్రభుత్వం వేస్తే దానిని తీసుకోవడానికై నా బ్యాంకులకు, ఏటీఎంలకు వెళ్లేవారు. ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ కారణంగా డబ్బు ఎలా వస్తుందో, ఎలా పోతుందో కూడా తెలుసుకోలేకపోతున్నారు. దాదాపుగా అన్ని చోట్లా ఏటీఎంలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రుణాలను సైతం బ్యాంకు యాప్ల ద్వారానే నిమిషాల్లో తీసుకునే సౌలభ్యం వచ్చింది. కేవలం కరెంట్ బ్యాంకు ఖాతాలు ఉన్న కొద్ది మంది వ్యాపారులు మాత్రమే పెద్ద మొత్తంలో డబ్బులు వేయడానికి, డ్రా చేయడానికి మాత్రమే బ్యాంకులకు వెళ్తుండటం గమనార్హం. ఖాతాల్లో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి, అనుమానాలు తీర్చుకోవడానికి మాత్రమే బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. -
శ్రీశైల దేవస్థానానికి భారీగా విరాళాలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానానికి పలువు రు భక్తులు భారీగా విరాళాలు సమర్పించారు. శనివారం రంగారెడ్డి జిల్లా బాలాపూర్కు చెంది న కనకదుర్గ అన్నప్రసాద వితరణకు రూ.2,00,232 విరాళాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి స్వాములకు అందజేశారు. అలాగే నెల్లూరుకు చెందిన బి.పల్లవి ప్రాణధాన ట్రస్ట్ కు రూ.1,00,011, గో సంరక్షణనిధి పథకానికి బి.మౌనిక రూ.1,00,011, అన్నప్రసాద వితరణకు యామిని సురేష్ రెడ్డి రూ.1,00,011, బసిరెడ్డి శ్రీనివాసరెడ్డి రూ.1,00,011, గో సంరక్షణ నిధి పథకానికి బసిరెడ్డి సాయిచరణ్ రూ.1,00,011 విరాళాన్ని అందజేశారు. ఆయా విరాళాలను క్యూలైన్ల సహాయ కార్యనిర్వహణాధికారి స్వాములుకు అందజేశారు. విరాళాలు అందించిన దాతలకు దేవస్థానం తరుఫున స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాల ను, జ్ఞాపికలను అందించి సత్కరించారు. కస్తూర్బాలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల (న్యూటౌన్): జిల్లాలోని 27 కస్తూర్బా బాలికల విద్యాలయాల్లో 6వ తరగతి, ఇంటర్ మొదటి సంవతస్రం ప్రవేశాలకు దరఖాసులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష అదనపు సమన్వయకర్త నాగసువర్చల శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరానికి ఆన్లైన్ ద్వారా ఈనెల 22 నుంచి వచ్చే నెల 11వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఆమె తెలిపారు. అలాగే 7, 8, 9, 10, సెకండ్ ఇంటర్ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్ల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. https://apkgbv. apcfss.in వెబ్సైట్ ద్వారా వచ్చిన దరఖా స్తులను మాత్రమే ప్రవేశాల నిమిత్తం పరిగణలోకి తీసుకుంటామన్నారు. మరింత సమాచారం కోసం నంద్యాల వైఎస్సార్నగర్లో ఉన్న కేజీబీవీ ప్రిన్సిపాల్ను సంప్రదించాలన్నారు. ‘పది’ తెలుగు –2 పరీక్షకు 99.77 శాతం హాజరు నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో శనివారం జరిగిన తెలుగు పేపర్–2 పరీక్షకు 99.77 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలో 66 పరీక్ష కేంద్రాల్లో 3,552 మంది విద్యార్థులకు గాను 3,544 మంది హాజరు కాగా 8 మంది విద్యార్థులు మాత్రమే గైర్హాజరయ్యారు. జిల్లాలో ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు 17 పరీక్ష కేంద్రాలను, ఆరు పరీక్ష కేంద్రాలను డీఈఓ జనార్దన్రెడ్డి తనిఖీ చేశారు. సమస్యాత్మక కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేసి పరీక్షలు సజా వుగా నిర్వహిస్తున్నట్లు డీఈఓ తెలిపారు. ఎవరై నా మాస్ కాపీయింగ్కు పాల్పడితే చర్యలు తప్ప వని హెచ్చరించారు. గస్తీ పోలీసులకు రేడియం జాకెట్ల పంపిణీ బొమ్మలసత్రం: జిల్లాలో రాత్రివేళ గస్తీ నిర్వహించే పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ అదిరాజ్సింగ్రాణా శనివారం రేడియం జాకెట్లను పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ బ్లూకోట్ సిబ్బంది నిరంతరం ప్రజల కోసం రహదారులపై విధులు నిర్వహిస్తుంటారన్నారు. వాహనాల ద్వారా ఎలాంటి ముప్పు వాటిళ్లకుండా ఉండేందుకు ఇవి రక్షణ కల్పిస్తాయని వివరించారు. క్యూఆర్టీ సిబ్బందికి గ్రీన్కోట్స్, క్లూస్టీమ్కు ఎల్లో కోట్లను పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ జావళి ఆల్ఫోన్స్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్బాబు పాల్గొన్నారు. -
నీటి కుంటలను నిర్మించుకోండి
మహానంది: పొలాల్లో నీటి కుంటలు నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి రైతులకు సూచించారు. శనివారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా గాజులపల్లె సమీపంలోని ఆంజనేయపురం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు తమ పంట పొలాల్లో నీటి కుంటలను ఏర్పాటు చేసుకొని పంటలకు అవసరమయ్యే నీటిని సమకూర్చుకోవాలని సూచించారు. జిల్లాలో 3 వేల వరకు నీటి కుంటలు ఏర్పాటు చేసే దిశగా లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు. ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీలు ఎండ తీవ్రతను దష్టిలో ఉదయం 11 గంటల లోపు పనులు ముగించుకోవాలన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్ల సూచనల మేరకు ఉపాధి హామీ పనులు సక్రమంగా పూర్తి చేసిన వారికి రోజుకు మూడు వందల రూపాయల వరకు వేతనం వస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకట సుబ్బయ్య, ఎంపీడీఓ మహమ్మద్ దౌలా, ఈఓఆర్డీ నాగేంద్రుడు, ఏపీఓ మనోహర్, పంచాయతీ కార్యదర్శి ఇర్ఫాన్, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి -
చిల్లర కొరత తీరింది
మాది జనరల్ స్టోర్. రూ.10 నుంచి రూ.5వేల వరకు వివిధ రకాల వస్తువులు విక్రయిస్తాం. వీటిని కొనుగోలు చేసేందుకు ప్రతిరోజూ ఎంతో మంది వస్తుంటారు. ఈ క్రమంలో చిల్లర కొరత బాగా ఎదురయ్యేది. ముఖ్యంగా రూ.10, రూ.20 నోట్ల కొరత కారణంగా ఇబ్బంది పడేవాళ్లం. డిజిటల్ పేమెంట్స్ రాకతో చిల్లర సమస్య తీరింది. 90 శాతం మంది వీటి ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. – జి.రాజశేఖర్, వ్యాపారి, కర్నూలు 80 శాతం పైగా డిజిటల్ పేమెంట్సే.. మాకు హోటల్, కంప్యూటర్ విడిభాగాల వ్యాపారాలు ఉన్నాయి. కోవిడ్కు ముందు ఎక్కువగా లావాదేవీలన్నీ నగదు రూపంలో జరిగేవి. కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు. 80 నుంచి 90 శాతం వీటినే వినియోగిస్తున్నారు. ఫలితంగా మాకు కూడా ప్రతిరోజూ బ్యాంకుకు వెళ్లి డబ్బులు జమ చేసే శ్రమలేదు. మా వద్ద పనిచేసే ఉద్యోగులకు మాత్రం వారి సౌలభ్యం కోసం నగదు రూపంలో జీతం ఇస్తున్నాం. – భూమా కిశోర్, వ్యాపారి, కర్నూలు ఎంత ఖర్చు చేస్తున్నామో తెలియట్లేదు గతంలో డబ్బు చేతిలో ఉంటే చూసి ఖర్చు పెట్టేవారం. నగదు రూపంలో డబ్బులు ఉండటం వల్ల దేనికెంత ఖర్చు చేస్తున్నామో తెలిసేది. కానీ ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్స్ కావడంతో ఎంత ఖర్చు చేస్తున్నామో అర్థంకాని పరిస్థితి. తెలియకుండానే నెలలో 20 నుంచి 30 శాతం ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాం. – సాయిరామ్, ప్రభుత్వ ఉద్యోగి, కర్నూలు -
నష్టం మిగిల్చిన అకాల వర్షం
కోవెలకుంట్ల/దొర్నిపాడు/ఉయ్యాలవాడ: ఉదయం నుంచి భానుడు విశ్వరూపం ప్రదర్శించగా.. సాయంత్రం ఒక్క సారిగా వరుణుడు ఇక తన వంతు అన్నట్లుగా విరుచకపడ్డాడు. అప్పటి వరకు భగభగమన్న సూర్యుడు మబ్బుల చాటుగా వెళ్లగా ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. జిల్లాలో శనివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు చోట్ల వడగండ్ల వాన పడింది. అకాల వర్షం రైతులకు అపార నష్టం మిగిల్చింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా పంట కోతలు పూర్తయి కల్లాల్లో మిరప, పొగాకు, మొక్కజొన్నలు దిగుబడులు ఆరబెట్టారు. ఈ క్రమంలో వర్షం పడటంతో దిగుబడులను కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడ్డారు. కోవెలకుంట్ల వ్యవసాయ సబ్ డివిజన్లో వర్షం కారణంగా మొక్కజొన్న, మిరప దిగుబడులు తడిచిపోయాయి. దిగుబడులు తడవకుండా కప్పినా పట్టలపై నీరు నిలిచి తడిచి పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పందిర్లపై ఆరబెట్టిన పొగాకు తోరణాలు తడి చి ముద్దయ్యాయి. కోవెలకుంట్లలోని పలు వీధులు జలమయమయ్యాయి. అకాల వర్షం వేసవి నుంచి ఉపశమనం కల్గించినా రైతులకు నష్టం చేకూర్చింది. కోవెలకుంట్ల – జమ్మలమడుగు ఆర్అండ్బీ ప్రధాన రహదారిలో మాయలూరు బస్టాండు సమీపంలో రెండు భారీ వృక్షాలు నేలకూలాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం తడిచిన పంట దిగుబడులు నష్టపోయిన రైతులు -
లెక్కలేకుండా ఖర్చు పెట్టేస్తున్నారు
ఆన్లైన్ లావాదేవీల కారణంగా బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యేవరకు మనం ఎంత ఖర్చు పెట్టామో తెలియని పరిస్థితి. దీనికితోడు ఏ వస్తువును ఎంతకు కొనుగోలు చేస్తున్నారో కూడా తెలియకుండా, బేరమాడకుండా కొనేస్తున్నారు. సాధారణంగా మనం కిరాణా దుకాణానికి వెళ్తే సరుకులకు దేనికి ఎంత బిల్లు వేశాడో చూస్తాము. కానీ డిజిటల్ పేమెంట్స్ కారణంగా ఇవేమీ పట్టించుకోవడం లేదు. షాపువారు ఎంత చెబితే అంత చెల్లించి వచ్చేస్తున్నారు. దీనివల్ల డబ్బు విలువ చాలా మందికి తెలియకుండా పోతోంది. ముఖ్యంగా ఈ తరం యువతకు అస్సలు తెలియడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
పెరిగిన అనవసర ఖర్చు
● ధర తెలుసుకోవడం దాదాపుగా మానేశారు ● రూ.5 మొదలు వేల రూపాయల లావాదేవీలు ఆన్లైన్లోనే.. ● తలకిందులవుతున్న ఫ్యామిలీ బడ్జెట్ ● ఎంత సంపాదిస్తున్నా ఇట్టే అయిపోతుందనే భావన ● కోవిడ్ తర్వాత అన్నీ డిజిటల్ చెల్లింపులే.. ● చిల్లర కొరత నేపథ్యంలోనూ మారిన తీరు● ఆదోనికి చెందిన నాగేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. చిరుద్యోగమే అయినా 20 ఏళ్లకు పైగా సీనియారిటీ ఉండటంతో జీతం రూ.లక్షకు పైగా వస్తోంది. మొదట్లో తాను ఖర్చుచేసిన ప్రతిదీ ఓ పుస్తకంలో రాసుకునే అలవాటు ఉండేది. అన్ని ఖర్చులు పోను నెలకు 30శాతం దాకా మిగిలేది. కానీ ఇటీవల డిజిటల్ అకౌంట్లో ఖర్చు పెడుతూ లెక్క రాసుకోవడం మానేశాడు. నెల తిరిగేసరికి బ్యాంకు ఖాతా ఖాళీ అవుతోంది. ఎందుకిలా అని ప్రశ్నించుకుంటే ఆన్లైన్లో తెలియకుండానే తానే ఖర్చు చేస్తున్నట్లు తెలుసుకున్నాడు.● కర్నూలు నగరంలోని ఎ.క్యాంపునకు చెందిన వెంకట్ ఓ ప్రైవేటు కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. ఆయన జీతం నెలకు రూ.60వేలు. వచ్చిన జీతంతో ఇంట్లోని నలుగురు కుటుంబసభ్యులతో హాయిగా జీవిస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో నెలాఖరుకు అకౌంట్లో డబ్బులన్నీ అయిపోయినట్లు గమనిస్తున్నాడు. ఇంత డబ్బు ఏమైందని పరిశీలిస్తే అదంతా డిజిటల్ పేమెంట్స్ ద్వారా తానే ఖర్చు చేసినట్లు నిర్ధారించుకున్నాడు. కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో ప్రస్తుతం అన్ని రకాల వ్యాపారాలు ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్ ద్వారానే సాగుతున్నాయి. ఒకప్పుడు ఫోన్ పే, గూగుల్ పే లాంటివి ఉపయోగించాలంటే భయపడే జనం ఇప్పుడు అవలీలగా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఎంతగా అంటే రూ.5 నుంచి వేల రూపాయల వరకు ఆన్లైన్లోనే చెల్లింపులు చేస్తున్నారు. ఏదైనా కొనుగోలు చేసినా, ఎవరికై నా డబ్బు పంపాలన్నా, అప్పు ఇవ్వాలన్నా, తీసుకున్న రుణం తీర్చాలన్నా, ఇతర ఎలాంటి లావాదేవీలైనా సరే డిజిటల్ పేమెంట్ తప్పనిసరి అవుతోంది. ఎంత ఖర్చు పెడుతున్నారో తెలియనంతగా వీటి వినియోగం ఉంటోంది. అయితే పెట్టే ఖర్చు మొత్తం బ్యాంకు ఖాతా ద్వారానే జరుగుతోంది. దీన్నిబట్టి ఎవరికి ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎంత ఏఏ ఖాతాలకు మళ్లిస్తున్నారు, ఎవరెవరికి చెల్లిస్తున్నారు, వీరికి ఎవరి నుంచి డబ్బులు వస్తున్నాయనే విషయాలన్నీ బ్యాంకుల వారికి తెలిసిపోతోంది. అది చిన్న మొత్తమైనా, పెద్ద మొత్తమైనా సరే అన్ని వివరాలు ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా మనకు తెలియకుండానే బ్యాంకులకు/ప్రభుత్వానికి చెప్పేస్తున్నాయన్న మాట. కోవిడ్ తర్వాత ఊపందుకున్న పేమెంట్స్ డిజిటల్ పేమెంట్స్ రూపంలో పదేళ్ల క్రితం డెబిట్, క్రెడిట్కార్డులు, గిఫ్ట్కార్డులు వచ్చాయి. కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసి వాటిని వ్యాపార దుకాణాల్లో స్క్రాచ్ చేసి డబ్బులు చెల్లించేవారు. కొంత కాలం తర్వాత ఇవే కార్డుల ద్వారా ఆన్లైన్లోనే వస్తువులను కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. కోవిడ్ అనంతరం వ్యాపార లావాదేవీల్లో మరింత సరళతరం వచ్చింది. అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్ల ద్వారా జనం డబ్బు చెల్లించడం, తీసుకోవడం ప్రారంభించారు. కోవిడ్ కారణంగా డబ్బుల మార్పిడి వల్ల ఎక్కడ వైరస్ అంటుకుంటుందోనని భయపడి ఈ పేమెంట్స్కు అలవాటు పడ్డారు. ఎంతగా అంటే రూ.5ల కొనుగోలుకు సైతం ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారు. మొదట్లో ఇలా డబ్బులు తీసుకోవడానికి ఇష్టపడని వ్యాపారులు సైతం క్రమంగా అంగీకరించక తప్పని పరిస్థితి. చిల్లర కొరత కారణంగా కూడా డిజిటల్ పేమెంట్స్ ఊపందుకున్నాయి. డబ్బులు ఏట్లో పారేసినా లెక్క పెట్టి పారేయాలన్నది పెద్దల మాట. అంటే చేతితో డబ్బులు లెక్క పెట్టి పారేస్తూ ఉంటే దాని విలువ తెలుస్తుందని భావన. అలాగే మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయినీ ఏదైనా పుస్తకంలో రాసుకుంటే నెల చివరలో దేనికెంత ఖర్చు పెట్టాము.. ఎక్కడ అనవసరంగా ఖర్చు చేస్తున్నాము.. ఏ ఖర్చులు తగ్గించుకోవాలి.. ఎక్కడ మిగిలించాలనే విషయాలు తెలుస్తాయి. దీన్ని బట్టే ఫ్యామిలీ బడ్జెట్ రూపొందించుకోవచ్చు. కానీ ఇటీవల డిజిటల్ పేమెంట్స్, ఆన్లైన్ కొనుగోళ్ల పుణ్యమా అని ఎంత డబ్బు వస్తున్నా ఇట్టే అయిపోతోంది. లెక్క పెట్టకుండా ఖర్చు చేయడం వల్లే ఈ సమస్య వస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. -
కష్టపడి పనిచేస్తే లక్ష్యం చేరుకోవచ్చు
కర్నూలు సిటీ: న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ లక్ష్యాలను చేరుకోవాలంటే కష్టపడి పనిచేయాలని రాష్ట్ర హైకోర్టు జడ్జి, జిల్లా పోర్ట్ ఫోలియో జడ్జి జస్టిస్ బి.ఎస్ భానుమతి అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన న్యాయవాద సంఘం వార్షికోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాకు చారిత్రాత్మక పేరుందని, ఈ జిల్లా నుంచి చాలా మంది ఉన్నత న్యాయమూర్తులుగా రాణించారన్నారు. న్యాయపరంగా జిల్లా అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని హామీనిచ్చారు. ● హైకోర్టు జడ్జి జస్టిస్ కె. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. తాను ఈ జిల్లాకు చెందిన వాడినని, జిల్లా గురించి తనకు మంచి అవగహన ఉందన్నారు. కక్షిదారులకు న్యాయవాదులు అందుబాటులో ఉండి పని చేస్తే విజయాలు సొంతం అవుతాయన్నారు. ● జస్టిస్ ఎన్.హరినాథ్ మాట్లాడుతూ.. న్యాయవాదులు స్థానికంగానే కాకుండా అన్ని ప్రాంతాల్లో తిరిగి న్యాయ సేవలను కక్షిదారులకు అందించాలన్నారు. న్యాయవాది పనితనంపై ఆధారపడి కక్షిదారులకు న్యాయం అందుతుందన్నారు. ● న్యాయమూర్తి జస్టిస్ ఎ.హరినాథశర్మ మాట్లాడుతూ తాత్కాలిక ఆదాయానికి ఆశపడకుండా జూనియర్ న్యాయవాదులు పని చేస్తే భవిష్యత్తులో అభివృద్ధి వైపు వెళ్తారన్నారు. ప్రస్తుతం న్యాయవాదులు సాంకేతికతను అందిపుచ్చుకొని వృత్తిలో నైపుణ్యం పొందాలన్నారు. ● న్యాయవాద సంఘం వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన న్యాయమూర్తులకు, న్యాయవాదులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి, బార్ కౌన్సిల్ సభ్యులు పి.రవిగువేరా, బార్ అధ్యక్ష, కార్యదర్శులు బి. కృష్ణమూర్తి, బి.ఎస్ రవికాంత్, ప్రసాద్, సీనియర్ న్యాయవాదులు సి.నాగేంద్రనాథ్, ఎ.రామసుబ్బారెడ్డి, శివరామయ్య, జోగయ్య శర్మ, వై.జయరాజ్, ప్రభుత్వ న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు జడ్జి భానుమతి -
చిన్నారుల ఆరోగ్యం దేశానికి సౌభాగ్యం
గోస్పాడు: చిన్నారుల ఆరోగ్యం దేశానికి సౌభాగ్యమని డీఎంహెచ్ఓ వెంకటరమణ అన్నారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా చిన్నారుల రవాణా సౌకర్యార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాన్ని శుక్రవారం డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంచార చికిత్స క్యాంపుల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రాల చిన్నారులకు, పాఠశాల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందిస్తారన్నారు. పుట్టుకతో వచ్చే నాలుగు రకాల వ్యాధులను గుర్తించి నంద్యాల జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న డైస్ కేంద్రం, స్థానిక ఆసుపత్రులకు వైద్యులు రెఫర్ చేసి మెరుగైన వైద్య సేవలు అందిస్తారన్నారు. అనంతరం ప్రపంచ డౌస్ సిండ్రోమ్ అవగాహన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి, చిన్న పిల్లల వైద్య నిపుణులు అరుణజ్యోతి మాట్లాడుతూ.. జన్ను లోపంతో అటిజం, మెంటల్ రిటార్డినేషన్, హృదయ సంబంధ, మాట్లాడలేకపోవడం, నరాల సంబంధిత అవయవలోపాలు వంటి సమస్యలతో జన్మిస్తారన్నారు. ఈ పిల్లలకు సరైన సమయంలో సకాలంలో చికిత్స అందిస్తే మెరుగైన ఫలితం ఉంటుందన్నారు. -
ఉగాది మహోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహా క్షేత్రంలో ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే ఉగాది మహోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు తెలిపారు. కైలాస ద్వారం, హఠకేశ్వరం, సాక్షి గణపతి వద్ద చేపట్టిన ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ పాదయాత్రగా వచ్చే భక్తులు కైలాసద్వారం వద్ద సేద తీరేందుకు వీలుగా విశాలమైన తాత్కాలిక షెడ్డు ఏర్పాటు చేశామన్నారు. అక్కడి నుంచి భీమునికొలను వరకు తాత్కాలిక పైప్ లైన్ ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నామన్నారు. ఈ మార్గంలో ఆరు చోట్ల 1000 లీటర్ల సామర్థ్యం ఉన్న ఆరు సింటెక్స్ ట్యాంకులు ఏర్పాటు చేశామన్నారు. కై లాసద్వారం వద్ద తగినంత పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి చెత్తా చెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలని దేవస్థానం పారిశుద్ధ్య విభాగం అధికారులను ఆదేశించారు. కాలిబాటలో ఏర్పాట్ల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఈఓ వెంట ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లు మురళీబాలకృష్ణ, నరసింహారెడ్డి, పారి శుద్ధ్య విభాగపు సహాయ కార్యనిర్వహణాధికారి బి. మల్లికార్జునరెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీరు పీవీ సుబ్బారెడ్డి, సంబంధిత సహాయ ఇంజినీర్లు, తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఈఓ శ్రీనివాసరావు -
మహిళలు, చిన్నారులపై నేరాలు అరికట్టాలి
బొమ్మలసత్రం: మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అదిరాజ్సింగ్రాణా పోలీసు అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలోని సమావేశ భవనంలో జిల్లా అధికారులతో ఎస్పీ సమీక్ష నిర్వహించారు. నేరా ల నియంత్రణకు పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. ఆధునిక సాంకేతికను ఉపయోగించి మిస్సింగ్ కేసులు, తీవ్రమైన నేరాలకు పాల్పడిన నిందితులను గుర్తించాలన్నారు. అనుమానాస్పద మృతి కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేసి కేసును ఛేదించాలని ఆదేశించారు. ఎన్డీపీఎస్, పోక్సో కేసుల్లో నిందితులపై రౌడీషీట్లు తెరవాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ యుగంధర్బాబు, డీఎస్పీలు జావలి ఆల్ఫోన్స్, ప్రమోద్, రామాంజినాయక్, రాజసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కీచక ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు ప్యాపిలి: ఏనుగుమర్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్ బొజ్జన్నపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకట రామిరెడ్డి తెలిపారు. విద్యార్థినుల పట్ల బొజ్జన్న అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో గురువారం విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలలో ఆందోళన చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమో దు చేసినట్లు ప్యాపిలి పోలీసులు తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలి కొత్తపల్లి: నూతన సాంకేతిక పద్ధతులతో దళిత రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ హెడ్ జి.ధనలక్ష్మీ అన్నారు. శుక్రవారం కొక్కెరంచ గ్రామంలో సర్పంచు విష్ణువర్ధన్ రెడ్డి, ఏఓ కె.మహేష్లతో కలసి కృషి విజ్ఞాన కేంద్రం యాగంటిపల్లె వారి ఆధ్వర్యంలో జాతీయ వ్యవ సాయ పరిశోధన యాజమాన్య సంస్థ(నార్మ్) హైదరాబాద్ వారు దళిత రైతులకు టార్పాలిన్, వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షెడ్యూల్ కులాల ఉపప్రణాళిక పథకంలో భాగంగా టార్పాలిన్, సూక్ష్మపోషకాలు రైతుల వారీగా రెండు వందల మందికి, రోటవేటర్, తొమ్మిది చెక్కల గొర్రు, శ్రేడ్డర్, థైవాన్ స్ప్రెయర్ పంపులు, పారలు, ఇతర వ్యవసాయ పరికరాలను గ్రూపుల వారీగా పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో జాతీయ వ్యవసాయ పరిశోధ యాజమాన్య సంస్థ (నార్మ్) శాస్త్రవేత్తలు బాలకృష్ణన్, నిర్మల, సొసైటీ అడ్మినిస్ట్రేటివ్ అధికారి సరేష్ కుమార్, కేవీకే శాస్త్రవేత్తలు రమణయ్య, కృష్ణమూర్తి, ఆదినారాయణ, రవిగౌడ్, రైతులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(న్యూటౌన్): మహాత్మా జ్యోతిరావు పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఇంటర్మీడియెట్, 5వ తరగతి, బ్యాక్లాగ్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గురుకుల పాఠశాల నంద్యాల జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ ఫ్లోరమ్మ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 15వ తేదీ నుండి 25వ తేదీ వరకు దరఖాస్తులను https:// mjpapbcwreis.apcfss.inలో నమోదు చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం 9866559668, 9440725929 నంబర్లను సంప్రదించాలన్నారు. ఉపాధ్యాయుడి సస్పెన్షన్ నంద్యాల: ప్యాపిలి మండలం ఏనుగుమర్రి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సాంఘికశాస్త్ర స్కూల్ అసిస్టెంట్ ఎం. బొజ్జన్నను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విధుల నిర్వహణలో తీవ్ర అలసత్వం వహించడమే కాకుండా విద్యార్థినులపై అసభ్యంగా, దురుసుగా ప్రవర్తించినట్లు మండల విద్యాశాఖ అధికారి, డిప్యూటీ విద్యాశాఖ అధికారి నివేదిక అందించారన్నారు. విద్యా ర్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు రాతపూర్వకంగా కూడా ఫిర్యాదు చేసినట్లు నివేదికలో పొందుపరిచారని పేర్కొన్నారు. ఉపాధ్యాయు ల నీతి, నియమావళి (ఆర్టీఈ ఏసీటీ సెక్షన్–17)ని ఉల్లంఘించినట్లు నిర్ధారణ అయి నందున ఉపాధ్యాయుడు ఎం.బొజ్జన్నను స స్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఇఫ్తార్ విందులో సామరస్యం బేతంచెర్ల: హిందువులు, ముస్లింలు కలసి మెలసి ఉంటున్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లింలకు హిందువులు ఇఫ్తార్ విందు ఇచ్చారు. బేతంచర్ల పట్టణంలోని షాదీఖానాలో శివ గురుస్వామి బుగ్గన మహేశ్వర్రెడ్డి, మాలధారులు సుబ్బారెడ్డి, జయరాముడు, వెంకటేశ్వర్లు గురువారం ముస్లింలకు ఇఫ్తార్ విందును వడ్డించారు. వారిని మతసామరస్య చైతన్య వేదిక అధ్యక్ష, కార్యదర్శులు నూర్ అహ్మద్ , మహమ్మద్ గౌస్, జయంత్ గౌడ్, షాలీబేగ్ అభినందించారు. ఆసుపత్రిలో చేరిన గిరిజన బాలుడు ఆత్మకూరు: మెరుగైన వైద్యం కోసం గిరిజన బాలుడు పులిచెర్ల నాగన్న నంద్యాలలోని జీఎస్ఆర్ ఆసుపత్రిలో గురువారం చేశారు. ఆత్మకూరు పట్టణంలోని వెంగళరెడ్డి నగర్ కాలనీకి చెందిన ఈ బాలుడు ఇటీవల మిద్దె నుంచి కింద పడ్డాడు. కాలు విరగడంతో మంచానికే పరిమితం అయ్యారు. ఈ బాలుడి దుస్థితిపై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ కావడంతో నంద్యాల జిల్లా కలెక్టర్ స్పందించారు. ఆ బాలుడికి సత్వర వైద్యం అందించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం బైర్లూటి వైద్యాధికారి పవన్కుమార్ సిబ్బందితో బాలుడి ఇంటి వద్దకు వెళ్లి పరిస్థితిని సమీక్షించి 108 వాహనాన్ని పిలిపించి స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తీసుకెళ్లి వైద్యం అందించారు. అక్కడి నుంచి నంద్యాలలోని జీఎస్ఆర్ ఆసుపత్రిలో చేర్పించి తగిన చికిత్సలు అందించారు. ఆరోగ్యశ్రీ కింద బాలుడికి ఆపరేషన్ చేయించడం కోసం అడ్మిట్ చేశామని వారు తెలిపారు. -
దేవదాయ శాఖ ఈఓల పవర్కు ‘చెక్’
కర్నూలు కల్చరల్: దేవదాయ శాఖకు సంబంధించిన ఆలయాలు, సంస్థలకు చెందిన నిధులు దుర్వినియోగం కాకుండా ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇకపై ప్రతి ఫిక్స్డ్ డిపాజిట్ ఈఓతో పాటు సంబంధిత దేవదాయశాఖ అధికారితో కలిపి సంయుక్త పేరిట ఉండాలనే మార్గదర్శకాలను జారీ చేశారు. ఆలయాలకు చెందిన ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) నిధులను కొందరు ఈఓలు గుట్టుచప్పుడు కాకుండా తీసుకుని సొంతంగా వాడుకుంటున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఇద్దరు ఈఓలు వారి పరిధిలోని దేవాలయాల ఎఫ్డీలను స్వాహా చేశారు. వారిపై కేసులు పెట్టి సస్పెండ్ చేశారు తప్ప నిధులు రీకవరీ చేయడంలో జాప్యం చేస్తున్నారు. ఎఫ్డీలు స్వాహా కావడంతో మేల్కొన్న దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఈఓల పరిధిలో ఉన్న ఆలయాల్లోని ఫిక్స్డ్ డిపాజిట్లను గ్రూప్ల వారీగా తనిఖీ చేయించారు. దీనికి సైతం కొందరు ఈఓలు సహకరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఒక్కొక్కరు, వైఎస్సార్ కడప జిల్లాలో ఇద్దరు ఈఓలు వారి ఆలయాల ఎఫ్డీల పరిశీలనకు సహకరించడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి ఫిక్స్డ్ డిపాజిట్ ఈఓతో పాటు సంబంధిత దేవదాయశాఖ అధికారితో కలిపి సంయుక్త పేరిట ఉండాలనే ఆదేశాలు ఇచ్చారు. కమిషనర్ ఆదేశాలు పాటించాలి కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో ని ఈఓలు నలుగురు ఇంకా వారికి సంబంధించిన గ్రూప్ టెంపుల్స్ ఎఫ్డీల ఫైల్స్ను చూపించడం లే దు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశాం. దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలి. – పి. గురుప్రసాద్, డిప్యూటీ కమిషనర్, దేవాదాయ శాఖ ఈఓ, జిల్లా దేవదాయ శాఖ అధికారి పేరిట ఫిక్స్డ్ డిపాజిట్లు -
పిల్లలను బావులు, నదుల వైపు పంపకూడదు
పాఠశాలలకు సెలవులొస్తున్నాయంటే పిల్లల ఆనందానికి అవధులు ఉండవు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం మంది పిల్లలు వేసవికాలంలో బావులు, కుంటలు, చెరువుల్లో ఈత కొట్టేందుకు మక్కువ చూపిస్తారు. అవి లోతు ఎక్కువగా ఉంటాయన్న అవగాహన ఉండదు. ఈత రాదనే ఆలోచన రాదు. ఈ కారణంగానే ఈతకు వెళ్లిన పిల్లలు నీట మునిగి ఊపిరాడక మృత్యువాత పడుతున్నారు. సెలవుల్లో పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. పాఠశాలల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల రోజువారీ కార్యక్రమాలను గమనిస్తుండాలి. – డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి, చిన్న పిల్లల వైద్యనిపుణుడు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, కోవెలకుంట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి సెలవుల్లో పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలి. నది, బావులు, కుంటల్లో ఈతకు వెళ్లకుండా గమనిస్తుండాలి. ఒక వేళ ఈత కొట్టాలని పిల్లలు మారం చేస్తే సాధ్యమై నంత వరకు ఆ ఆలోచన నుంచి వారిని మళ్లించాలి. అవసరమైతే వారితో పాటు పెద్దలు కూడా వెళ్లాలి. ఈతకు బదులు ఇంటి పరిసర ప్రాంతాల్లో ఆడుకునే ఆటలవైపు దృష్టి మళ్లేలా అవగాహన కల్పించాలి. – జీవీ సుబ్బారెడ్డి, రిటైర్డ్ హెచ్ఎం, కోవెలకుంట్ల క్రీడలతో పాటు ఈత నేర్పించాలి ప్లిలలకు వేసవి సెలవుల్లో క్రీడలతోపాటు ఈతలో శిక్షణ ఇప్పించాలి. విద్యార్థులకు చాలా మంది ఈత రాక ప్రమాదాల బారిన పడి మృత్యువాత చెందుతున్నారు. ఈత వచ్చిన వారి సమక్షంలో పిల్లలకు ఈత నేర్పించాలి. చెరువులో, నీటి కుంటల లోతు తెలియకుండా దిగవద్దు. డైవ్ చేయకూడదు. ఈత నేర్చుకునేవారు తప్పనిసరిగా లైఫ్ జాకెట్లను ధరించాలి. అలసట వచ్చేంత వరకు ఎక్కువ దూరం ఈత కొట్టరాదు. – ఉపేంద్ర, పీఈటీ, కోవెలకుంట్ల -
పిన్నాపురంలో భారీగా భూ అవకతవకలు
పాణ్యం: సోలార్ పరిశ్రమ విస్తరిస్తున్న నేపథ్యంలో పాణ్యం మండలం పిన్నాపురం గ్రామంలో భారీగా భూ అవకతవకలు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. పిన్నాపురం గ్రామ బాధిత రైతులతో కలసి గురువారం రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ నరేంద్రనాథ్రెడ్డి దృష్టికి సమస్యలు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. పిన్నాపురం గ్రామంలోని సర్వే నంబర్ 217లో మూడు ఎకరాల సాగు భూమి ఉందన్నారు. ఈ సర్వే నంబర్లోని భూమిని పొలూరు పెద్ద వెంకటస్వామి, పొలూరు తిమ్మనాయుడు, పొలూరు పెద్ద ఆంజనేయులు, పొలూరు చిన్నమ్మ, పొలూరు వెంకటమ్మ, పొలూరు సుబ్బమ్మలు వారసత్వంగా సాగు చేస్తున్నారన్నారు. వీరికి పట్టాదారు పాస్పుస్తకాలు ఉన్నాయని తెలిపారు. సోలార్ పరిశ్రమ ఏర్పాటు చేసేవారు.. ఒక్కో రైతుకు రూ. 50వేలు చెక్కును పరిహారం కింద అందించారన్నారు. అయితే ఇదే గ్రామానికి చెందిన శీలం వెంటకరమణ అనే వ్యక్తికి 1.90 సెంట్లు భూమిలో సాగులో ఉన్నట్లు ఎంజాయిమెంట్ సర్టిఫికెట్ ఇచ్చారన్నారు. ఈ సర్టిఫికెట్తో శీలం వెంకటరమణ సోలార్ పనులకు అడ్డుపడడమే కాకుండా పొలం నాదంటూ అధికారులకు అధికారి పార్టీ నాయకులతో ఫోన్ చేయించారన్నారు. అధికారులను, బాధిత రైతులను బెదిరిస్తున్నారన్నారు. వందేళ్లుగా అనుభవంలో ఉన్న వ్యక్తులను అధికార పార్టీ అండతో బెదిరించడం దారుణమన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి అన్ని రికార్డులు చూసిన బాధిత రైతులకు న్యాయం చేయాలని తహసీల్దార్ను కోరారు. కందికాయపల్లె గ్రామంలో ప్రభుత్వ భూమిని కబ్జాచేసేందుకు సిద్ధపడ్డారని రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్త వ్యక్తులకు ఇష్టానుసారంగా సర్టిపికెట్లు జారీ చేసే అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ చేసిన రైతులకు న్యాయం చేస్తామని తహసీల్దార్ నరేంద్రనాథ్రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి వెంట జెట్పీటీసీ మాజీ సభ్యులు సద్దల సూర్యనారాయణరెడ్డి, మండల అధ్యక్షులు కరుణాకర్రెడ్డి, సత్యాలు, రామచంద్రుడు, కో–ఆప్షన్ సభ్యులు జాకీర్ ఉసేన్, ఎల్లక్రిష్ణయ్య, గౌడ్, టైలర్బాషా, వెంకటరమణ, స్వామి , బాలిరెడ్డి ఉన్నారు. వందేళ్ల నుంచి సాగులో ఉన్న వారిని కాదని కొత్తవారికి సర్వే రిపోర్టు వెంటనే చర్యలు తీసుకోవాలి రైతులతో కలిసి తహసీల్దార్ను కలిసిన కాటసాని -
విహారయాత్రలో విషాదం
● పాతాళగంగలో స్నానానికి వెళ్లి యువకుడి మృతి ● మృతుడు కరీంనగర్ జిల్లా జమ్మికుంట వాసి శ్రీశైలం: స్నేహితులతో కలిసి స్నానానికి వెళ్లిన యువకుడు హఠాత్తుగా నీటిలో మునిగి మృతి చెందాడు. శ్రీశైలం వన్ టౌన్ పోలీసులు కథనం మేరకు.. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట గ్రామానికి చెందిన సీహెచ్ సాయితేజ(18) ఐదుగురు స్నేహితులతో కలిసి శ్రీశైలానికి విహారయాత్రగా వచ్చాడు. పాతాళగంగలో స్నానాలు చేస్తుండగా సాయితేజ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. అక్కడ మత్స్యకారులు సాయితేజ మృతదేహాన్ని నీటిలోంచి బయటికి తీసుకువచ్చి పోలీసులకు సమాచారం అందజేశారు. హైదరాబాద్లోని కులీ కుతుబ్షా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో సాయితేజ పాలిటెక్నిక్ చదువుతున్నారని వారి స్నేహితులు తెలిపారు. విహారయాత్రగా శ్రీశైలానికి వచ్చి స్నేహితుడు ప్రాణాలు కోల్పోవడంతో వారు తీవ్ర విషాదానికి లోనయ్యారు. సమాచారాన్ని వారి బంధువులకు తెలియజేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
టీడీపీ నేతలా.. మజాకా
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్రబ్యాంకు అధికారులపై టీడీపీ నాయకులు జులం ప్రదర్శిస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ తమ వాళ్లకే దక్కాలని, మళ్లీ టెండర్లు పిలవాలని, లేదా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఏదో ఒకటి తమ వాళ్లకే ఇవ్వాల్సిందేనని ఏకంగా సీఈవో చాంబరులోకి చొచ్చుకెళ్లి రభస సృష్టించారు. జిల్లా సహకార కేంద్రబ్యాంకు అధికారులు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కోసం ఇటీవల టెండర్లు పిలిచారు. టెండరుదారుల సమక్షంలోనే గురువారం టెండర్లు ఓపెన్ చేశారు. ఐదుగురు టెండర్లు వేయగా.. టెక్నికల్ బిడ్లో ఇద్దరికి మాత్రమే అర్హత లభించింది. పైనాన్సియల్ బిడ్లో ఎవ్వరు తక్కువ సర్వీస్ చార్జీలతో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని నిర్వహిస్తామని కోట్ చేసి ఉంటారో వారికే టెండరు ఖరారు చేస్తారు. డీసీసీబీలో జీవీఎల్ మ్యాన్ పవర్ సప్లయి ఏజెన్సీస్ సర్వీస్ చార్జీ కేవలం 2 శాతం మాత్రమే కోట్ చేసింది. మరో ఏజెన్సీ 8 శాతం సర్వీస్ చార్జీలను కోట్ చేసింది. దీంతో డీసీసీబీ అధికారులు జీవీఎల్ సంస్థకే టెండరు ఖరారు చేశారు. డీసీసీబీలో 106 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీరందరూ ఈ సంస్థ తరుఫున పని చేస్తారు. ఈ సంస్థ మూడు నాలుగేళ్లుగా పని చేస్తోంది. ఎలాంటి రిమార్కులు లేవు. టెండర్లు పిలిచే ముందు ఈ సంస్థను కూడా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నుంచి తప్పించారు. తాజాగా పిలిచిన టెండర్ల ద్వారా అతి తక్కువ సర్వీస్ చార్జీ కోట్ చేయడం ద్వారా ద్వారా మళ్లీ దక్కించుకున్నారు. జీవీఎల్ సంస్థపై వైఎస్సార్సీపీ ముద్ర వేసిన నందికొట్కూరు, పాణ్యం ఎమ్మెల్యే వర్గీయులు బ్యాంకు అధికారులపై అక్కసు వెల్లగక్కుతున్నారు. పథకం ప్రకారం జీవీఎల్కే టెండరు దక్కే విధంగా చేశారని ఆక్రోశం వ్యక్తం చేశారు. కాగా పాలక వర్గాలు ఉంటే వాళ్లు చెప్పిన సంస్థను ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం పాలక వర్గాలు లేవు. జాయింట్ కలెక్టర్ నవ్య అఫీషియల్ పర్సన్ ఇన్చార్జ్గా కొనసాగుతున్నారు. ఈ సమయంలో పారాదర్శకంగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని టెండరు ద్వారా ఎంపిక చేశారు. దీనిని టీడీపీ నేతలు జీర్ణించుకోలేక అధికారులపై జులుం ప్రదర్శిస్తున్నరనే విమర్శలు ఉన్నాయి. టీడీపీ నేతల చేసిన రభసను బ్యాంకు అధికారులు మూడవ పట్టణ పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. డీసీసీబీలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ టెండర్లపై రభస అతి తక్కువ సర్వీస్ చార్జీ కోట్ చేసిన జీవీఎల్కు సంస్థకు ఖరారు తమ వారికే ఏజెన్సీ దక్కాలని టీడీపీ నేతల పట్టు -
హెచ్చరిక బోర్డులు ఏవీ..
నదులు, వాగులు, వంకల్లో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. తుంగభద్ర, హంద్రీ, కుందూ నదులు, వాగుల్లో ఇసుక కొల్లగొట్టడంతో పలు చోట్ల పెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఈ గుంతల్లో నీరు నిల్వడంతో ఈత కొట్టేందుకు వెళ్లిన పిల్లలకు లోతు తెలియక ప్రమాదాల బారిన పడుతున్నారు. పలు బావుల్లో పూడిక ఉండటం, ఎత్తైన చోటు నుంచి దూకినప్పుడు పూడికలో కూరుకపోయి చనిపోతున్నారు. అయితే ఇలాంటి ప్రదేశాల వద్ద ఎవరూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. -
అడవి తల్లి చల్లగా ఉండాలని..
● ఐస్క్రీమ్ పుల్లపై 90 సూక్ష్మ చిత్రాలు ఆవిష్కరణ ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ ఐస్క్రీమ్ పుల్లపై 90 సూక్ష్మ చిత్రాలు గీచి అబ్బుర పరిచారు. మైక్రో పెన్ను, బ్రష్తో పోస్టర్ కలర్స్ ద్వారా ఐస్క్రీమ్ పుల్లపై 3 గంటలు శ్రమించి 90 సూక్ష్మ చిత్రాలు వేశారు. చిత్రంలో అడవిలో చెట్లు లేక వన్యప్రాణులు అలమటించిపోయే వేదన, వారి వేదనను వనదేవతకు మొరపెట్టుకోవడం, వన దేవత కన్నీరు పెట్టడం, చెట్లు, నీరు లేక వన్యప్రాణులు విలవిలలాడుతుండటం, ఎండిపోయిన చెట్లు, జంతు కళేబరాలు, నరికివేసిన చెట్లు, తదితరాలతో పాటు జంతువులు, ఖడ్గమృగాలు, నెమళ్లు, కొంగలు, పక్షులు, చేపలు, తాబేళ్లు, తదితర వన్యప్రాణులను సూక్ష్మ చిత్రాల్లో చూపించారు. – నంద్యాల(అర్బన్) -
పశువైద్యానికి ‘పరీక్ష’!
కర్నూలు(అగ్రికల్చర్): బహుళార్థ పశువైద్యశాల.. కర్నూలు నగరంతో పాటు జిల్లాలోని మూగజీవుల పాలిట వరం. ఏరియా పశువైద్యశాలలు, వెటర్నరీ డిస్పెన్సరీల్లో చేతులెత్తేసిన కేసులకు ఇక్కడి వైద్యులు మెరుగైన వైద్యం అందించడంతో పాటు శస్త్ర చికిత్సలు చేస్తూ ప్రాణం పోస్తున్నారు. అత్యవసర వైద్యం కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూగజీవులను కొండారెడ్డిబురుజు సమీపంలోని బహుళార్ధ పశువైద్యశాల కు తీసుకొస్తారు. గత వైఎస్ఆర్సీపీ పాలనలో వైద్య సేవల్లో ఎలాంటి లోపం లేకుండా అందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆసుపత్రి నిర్వహణ అటకెక్కింది. అధునాతన యంత్ర పరికరాలు మరుగునపడటంతో వైద్య సేవలు అధ్వాన్నమయ్యాయి. గతంలో యజమానులకు ఒక్క రూ పాయి ఖర్చు లేకుండా వైద్య సేవలు అందించారు. నేడు వైద్య సేవలు మినహాయిస్తే.. పరీక్షలు, మందు లు ఇతరత్రాలన్నీ బయటకే రాస్తుండటం గమనార్హం. సేవలు నిర్వీర్యం ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక బహుళార్ధ పశువైద్య శాల ఉంది. ఒక డీడీ పోస్టు, రెండు ఏడీ పోస్టులు, రెండు వెటర్నరీ అసిస్టెంటు సర్జన్ పోస్టులు ఉన్నాయి. సిబ్బంది పూర్తి స్థాయిలో ఉన్నారు. ప్రధానమైన సమస్య చికిత్సకు ఏది అవసరమైన బయటికి వెళ్లి తెచ్చుకోవాల్సిందే. సాంకేతిక సమస్యల కారణంతో సేవలను నిర్వీ ర్యం చేసినట్లు తెలుస్తోంది. డిజిటల్ ఎక్స్రే యూనిట్ ఉన్నా.. కొన్ని నెలలుగా పూర్తిగా మరుగున పడిపోయింది. ఎక్స్రే మిషన్ దుమ్మూ, ధూళితో నిండిపోయింది. రక్తం, యూరిన్ పరీక్షలను కూడా బయటికే పంపుతున్నారు. ఎక్స్రే కోసం గాంధీనగర్కు.. రక్త, యూరిన్ పరీక్షలకు గాయత్రీ ఎస్టేటుకు వెళ్లాల్సి వస్తోంది. అరకొరగా మందులు ప్రస్తుతం ఆసుపత్రిలో రెండు, మూడు మందులు ఇస్తే.. మరో రెండు, మూడు బయటికి రాస్తున్నారు. ఆసుపత్రిలో సేవలు గాడితప్పినా పశువైద్యశాల డీడీ, జిల్లా పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ పట్టించుకున్న దాఖలాలు లేవు. కాస్త చొరవ తీసుకుంటే అన్ని రకాల వైద్య సేవలు బయటకు పంపకుండానే అందించే అవకాశం ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం గమనార్హం. ఆసుపత్రికి ప్రతి రోజు కుక్కలు, పిల్లులు, పందులు ఇతర పశువులను 130 వరకు తెస్తుంటారు. ఇందులో 10 శాతం వాటికి ఎక్స్రే అవసరం అవుతుంది. మరో 10 శాతం వాటికి రక్త, పేడ పరీక్షలు నిర్వహిస్తారు. ఎక్స్రే తీయడానికి రూ.800–రూ.1000 వరకు ఖర్చు అవుతుంది. పరీక్షలకు మరో రూ.1000 వరకు వెచ్చించాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని చూస్తే ఆసుపత్రి అధికారులు రైతులపై ఏ స్థాయిలో ఆర్థిక భారం మోపుతున్నారో స్పష్టమవుతోంది. కుక్కలు, పిల్లులకు ఉచితంగా టీకాలు వేయాల్సి ఉన్నా.. వాటిని కూడా బయటకే రాస్తుండటం విమర్శలకు తావిస్తోంది. మరుగున పడిన ప్రతిపాదనలు బహుళార్ధ పశువైద్యశాలను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్పు చేయాలనే ప్రతిపాదన ఉంది. ఇందులో భాగంగానే రూ.4 కోట్లతో అన్ని రకాల సదుపాయాలతో జి+3 అంతస్తుల భవనాన్ని నాబార్డు నిధులతో నిర్మించారు. 24 గంటలు మూగ జీవులకు వైద్య సేవలు అందించే విధంగా డాక్టర్లను కూడా పెంచాలనే ప్రతిపాదన ఉంది. ఈ ప్రతిపాదనలు మరుగున పడిపోగా.. స్థాయికి తగినట్లుగా కూడా సేవలు అందించకపోవడం గమనార్హం. మెరుగైన వైద్య సేవలే అందిస్తున్నాం బహుళార్ధ పశువైద్యశాలలో మెరుగైన వైద్య సేవలే అందిస్తున్నాం. డిజిటల్ ఎక్స్రే యూనిట్లో సాంకేతిక సమస్యలు ఏర్పడటంతో కొంత అంతరాయం కలిగింది. ఇతర పరీక్షల కోసం శాంపిల్స్ తీసి వ్యాధి నిర్ధారణ కేంద్రానికి పంపుతున్నాం. అక్కడ చేయని వాటిని బయటకు పంపుతున్నాం. – డాక్టర్ హేమంత్కుమార్, డిప్యూటీ డైరెక్టర్, బహుళార్ధ పశువైద్యశాల, కర్నూలు అన్నీ బయటికే రాస్తున్నారు దాదాపు పది నెలల ఒంగోలు జాతి కోడెదూడ కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉంది. మేత కూడా తినడం లేదు. స్థానిక పశువైద్యలలో చూపించినా ఫలితం లేకపోయింది. మెరుగైన వైద్యం కోసం కర్నూలు బహుళార్ధ పశువైద్యశాలకు తీసుకొచ్చాం. డాక్టర్లు వైద్య సేవలు బాగా అందిస్తున్నా మందులు, సూదులు, పరీక్షలు అన్నింటినీ బయటికే రాశారు. దీనివల్ల ఖర్చు ఎక్కువగానే వచ్చింది. – నారాయణ, మిట్టకందాల, పాములపాడు మండలం బహుళార్ధ పశువైద్య శాలలో అరకొర సేవలు మూగజీవాలకు పరీక్షలన్నీ బయటికే పశువులను ఎక్కడెక్కడో తిప్పాల్సిన పరిస్థితి వేధిస్తున్న మందుల కొరత చికిత్సకోసం యజమానుల జేబులు ఖాళీ మూలనపడిన అధునాతన యంత్రాలు -
కొందరికే ‘మాతృత్వ వందన’ం
గోస్పాడు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన (పీఎంఎంవీవై) జిల్లాలో కొంత మంది గర్భిణులకే అందుతోంది. ఈ పథకానికి సంబంధించిన మొత్తం సొమ్ము (రూ.6వేలు) ఆయా గర్భిణులకు సకాలంలో అందడం లేదు. ప్రభుత్వం అందించే సొమ్ము ఎప్పుడొస్తుందో అధికారులకే తెలియని పరిస్థితి నెలకొంది. ఈ పథకాన్ని 2010లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజన (ఐజీఎంఎస్ వై)గా ప్రారంభించింది. ఈ పథకాన్ని 2016లో ప్రధానమంత్రి మాతత్వ వందన యోజనగా ప్రధాని నరేంద్రమోదీ మార్పు చేశారు. ఈ పథకం మరింత మందికి లబ్ధి చేకూరాలని ఉద్దేశంతో కొన్ని మార్పులు చేసిన తర్వాత అమల్లోకి తీసుకువచ్చారు. పీఎంఎంవీవై ద్వారా అందించే నగదు.. గర్భిణులు, బాలింతల్లో మెరుగైన ఆరోగ్య కల్పనకు, నవజాత శిశు సంరక్షణకు, వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. రిజిస్ట్రేషన్ ఇలా.. జిల్లాలో 29 మండలాలు ఉండగా 52 పీహెచ్సీలు, 16 అర్బన్ హెల్త్సెంటర్లు, 11 సీహెచ్సీలు, రెండు ఏరియా, జిల్లా ఆసుపత్రి పరిధిలో మొత్తం 59,133 మంది గర్భిణులు రెండేళ్లలో నమోదయ్యారు. వారిలో 11,204 మంది గర్భిణులు పీఎంఎంవీవై కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2023 ఏప్రిల్ నుంచి 2025 వరకు 3,666 మందికి మాత్రమే వారికి పీఎంఎంవీవై కింద నగదు అందినట్లు వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. మొదటి కాన్పులో ఆడ, మగ ఎవరో ఒకరు జన్మించినా, రెండో కాన్పులో కేవలం ఆడబిడ్డ మాత్రమే జన్మించిన వారు మాత్రమే పీఎంఎంవీవైకు అర్హులు. రెండు కాన్పులకు మించి ప్రసవాలు చేసుకునే వారికి అనర్హులు. గర్భం దాల్చిన మూడు నెలల్లోపు మాతృత్వ వందన పథకానికి వార్డు, గ్రామ సచివాలయంలోని వెల్నెస్ సెంటర్లో పేరును నమోదు చేయించుకోవాల్సి ఉంది. అయితే గర్భిణుల నమోదు ప్రక్రియ ఒకలా ఉండటుండగా ఈ పథకానికి మాత్రం కొందరు మాత్రమే అర్హత సాధిస్తున్నారు. విడతల వారీగా నగదు చెల్లింపు ● గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం పూర్తయ్యే లోపు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహంగా విడతల వారీగా రూ.ఐదు వేలు చెల్లిస్తుంది. ● గర్భిణికి మూడు నెలలలోపు మొదట రూ. రెండు వేలు బ్యాంకు ఖాతాలో జమవుతుంది. ● ఆరునెలల పాటు క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణ తీసుకున్న గర్భిణికి ప్రసవం అయిన 14వ వారం రూ. మూడు వేలు అందనుంది. ● రెండోకాన్పులో ఆడబిడ్డ పుట్టిన వారికి మాత్రం విడతల వారీగా కాకుండా ఒకేసారి రూ. ఆరు వేలు అందించనున్నారు. ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం ప్రతి నెలా గర్భిణులకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నాం. నిర్ణీత సమయంలో గర్భిణుల వివరాల నమోదు చేసుకుని పథకం లబ్ధిని పొందేలా వైద్యసిబ్బంది చర్యలు చేపడుతున్నారు. ఆరోగ్య సిబ్బందికి, అంగన్వాడీలకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ చేసిన గర్భిణులకు మాత్రమే డబ్బులు జమ అవుతాయి. – వెంకటరమణ, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాదికారి సంవత్సరం నమోదు అయిన రిజిస్ట్రేషన్ చేసిన నగదు జమైన గర్భిణులు గర్భిణులు వారి సంఖ్య 2023-24 31,011 8,409 3,585 2024-25 28,122 2,795 81 జిల్లాలో 11,204 మంది గర్భిణుల రిజిస్ట్రేషన్ 3,666 మందికి మాత్రమే పీఎంఎంవీవై నగదు జమ -
అనుమతి లేని బోట్లు నడిపితే చర్యలు
పగిడ్యాల: కృష్ణా నదిలో అనుమతి లేని బోట్లు నడిపితే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ శివరాముడు హెచ్చరించారు. ‘నిబంధనలు నీట ముంచి.. ప్రయాణికుల రక్షణ మరిచి’ అన్న శీర్షికను గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై తహసీల్దార్ స్పందించారు. ఉదయం పోలీస్, రెవెన్యూ సిబ్బందితో కలసి మూర్వకొండ ఘాట్ను పరిశీలించి ఘాట్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణానది బ్యాక్వాటర్లో ఎలాంటి ఇంజిన్ బోట్లు తిప్పరాదని ఆదేశించారు. ఫోర్ట్ అధికారులు జారీ చేసి న బోటుకు ఫిట్నెస్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, బోట్ లైసెన్స్ తెచ్చుకోవాలన్నారు. బోట్లు తిప్పకుండా ప్రతి రోజు మూర్వకొండ ఘాట్ వద్ద రెవెన్యూ అసిస్టెంట్లకు బందోబస్తు విధులు వేస్తామన్నారు. తహసీల్దార్ వెంట రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీరంగారెడ్డి, వీఆర్వో వెంకటస్వామి, పోలీసు సిబ్బంది, రెవెన్యూ అసిస్టెంట్లు ఉన్నారు. ఆదర్శ పాఠశాల ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(న్యూటౌన్): ఆదర్శ పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాలకు ఈనెల 31వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.150, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.75 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తు సమర్పించేందుకు www. cse.ap.gov.in, www.apms. apcfss.in వెబ్సైట్ సంప్రదించాలి. ఆరో తరగతిలో ప్రవేశానికి గతేడాది మాదిరిగానే పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న మోడల్ స్కూల్లోనే ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. మెరిట్ లిస్ట్ ఆధారంగా రోస్టర్ ప్రకారం సీట్లను కేటాయించనున్నారు. ఏప్రిల్ 27న మెరిట్ లిస్ట్, అదే రోజు సెలక్షన్ లిస్ట్ను సైతం వెల్లడిస్తారు. ఏప్రిల్ 30న సర్టిఫికెట్ల పరిశీలనతో పాటు కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా, రిజర్వేషన్ రూల్స్ ప్రకారం సీట్లు కేటాయిస్తారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి. పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ జనార్దన్రెడ్డి తెలిపారు. ఈ పాఠశాలల్లో ఒక్కసారి సీటు దక్కితే ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకూ చదువుకోవచ్చాన్నారు. యువకుడిపై పోక్సో కేసు నమోదు జూపాడబంగ్లా: 16 ఏళ్ల బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించి మోసగించిన యువకునిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ లక్ష్మీ నారాయణ గురువారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు.. భాస్కరాపురం గ్రామానికి చెందిన ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో బిజినెస్ కరస్పాండెంట్గా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత్ జూపాడుబంగ్లా జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న ఓ బాలికను ప్రేమిస్తున్నాను, పెళ్లిచేసుకొంటానని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన బాలిక చివరకు మోసపోయింది. పెళ్లి చేసుకోకుండా మొహం చాటేయడంతో బాలిక జూపాడుబంగ్లా పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు ప్రశాంత్పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రైతు ఇంట మెరిసిన ఆణిముత్యాలు
● ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ముగ్గురు కుమారులు ● చిన్నారులకు ఉచితంగా బోధన చేస్తున్న రైతు బేతంచెర్ల: ఆ రైతుకు చదువు అంటే ఎంతో ఇష్టం. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత చదువుకు దూరమయ్యాడు. అయితే వ్యవసాయం చేస్తూనే తన కలను కుమారులతో సాకారం చేసుకున్నాడు. ముగ్గురు కొడుకులను బాగా చదివించడంతో వారు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. తన బిడ్డల్లానే గ్రామంలో చిన్నారులు కూడా శ్రద్ధగా చదువుకుని ప్రయోజకులు కావాలని ఆకాంక్షిస్తూ సాయంత్రం వేళ ఉచితంగా విద్యను బోధిస్తున్నాడు. ఎంబాయి గ్రామం పాడి పంటలకు ప్రసిద్ధి. ఆ గ్రామంలో ఈడిగ వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరమ్మ దంపతులది సాధారణ వ్యవసాయ కుటుంబం. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని దగ్గరగా చూసిన ముగ్గురు కుమారులు పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించారు. పెద్ద కుమారుడు తులసీ రామ్ గౌడ్ డిగ్రీలో బీజెడ్సీ పూర్తి చేసి 2014లో ఎయిర్ ఫోర్స్లో మెడికల్ అసిస్టెంట్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం బెంగళూరులో పని చేస్తున్నారు. రెండవ కుమారుడు బెనర్జీ గౌడ్ వెటర్నరీలో డిప్లొమో పూర్తి చేసి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అనిమల్ హస్బెండరీగా ఎంపికయ్యారు. కొలుములపల్లె సచివాలయంలో పని చేస్తూ.. ఇటీవల వెటర్నరీ అసిస్టెంట్గా పదోన్నతి పొంది ముద్దవరంలో విధులు నిర్వహిస్తున్నారు. చిన్న కుమారుడు తరుణ్కుమార్ గౌడ్ 2019లో అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. ఇటీవల కళాశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మాణిక్యరావు చేతుల మీదుగా డాక్టర్ పట్టా అందుకున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రభుత్వ కొలువులు సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పట్టుదలతో సాధించారు నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను. ఆర్థిక పరిస్ధితుల కారణంగా ఉన్నత చదువులకు వెళ్లలేక గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ పిల్లలను బాగా చదివించాలనుకున్నా. వారు కూడా పట్టుదలతో చదివి ప్రయోజకులయ్యారు. చిన్నప్పటి నుంచి పిల్లలు పాఠశాలకు వెళ్లి వచ్చిన తరువాత బోధన ఆంశాలపై చర్చించి, సందేహాలను నివృత్తి చేసేవాడిని. మా పెద్ద కుమారుడు తులసీరామ్ గౌడ్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం సాధించిన తరువాత తమ అన్నను ఇద్దరు తమ్ములు ఆదర్శంగా తీసుకుని ఉద్యోగాలు సాధించారు. నా కొడుకుల మాదిరిగానే గ్రామంలోని చిన్నారులు కూడా బాగా చదువుకోవాలని నా వంతుగా సాయంత్రం వేళలో ఉచితంగా బోధన చేస్తున్నాను. – వెంకటేశ్వర్లు గౌడు, ఎంబాయి -
ప్రజల రక్షణ మరిచి !
నిబంధనలు నీట ముంచి.. పగిడ్యాల: శ్రీశైలం బ్యాక్వాటర్లో ఇంజిన్ బోటులో ప్రయాణికుల తరలింపును అడ్డుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించినా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. మూర్వకొండ ఘాట్, అర్లపా డు ఘాట్ నిర్వాహకులకు అధికార పార్టీ నేతల అండదండలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతు న్నారు. కృష్ణానదికి ఇరువైపులా బంధువర్గాలు ఉన్న ప్రజలు ఆయా ప్రాంతాలకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే వ్యవప్రయసాలు కావడంతో చాలా మంది ఇంజిన్ బోట్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఘాట్ నిర్వాహకులు కెపాసిటీకి మించి ప్రయాణికులను పడవలో తర లిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కనీసం లైఫ్ జాకెట్లు లేకుండా ప్రయాణికులను పంపుతున్నారు. మూడు నెలలుగా కొనసాగుతున్న అనధికారిక ఇంజిన్ బోటు ప్రయాణంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఘాట్ నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఇంజిన్ బోట్లలో కెపాసిటీకి మించి 25 నుంచి 30 మంది ప్రయాణికులను తరలించడమే కా కుండా బైక్లను అందులో తరలించి ఒక్కొక్కరి నుంచి రూ. 200ల ప్రకారం వసూలు చేస్తున్నారు. 2007 జన వరి 18న ఇదే మూర్వకొండ ఘాట్ నుంచి సింగోటం జాతరకు నాటు పడవలో వెళ్తూ 60 మంది జల సమా ధి అయిన ఘటన నేటికి కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అయినా కాలం చెల్లిన ఫిట్నెస్ లేని ఇంజిన్ బోట్లపై ప్రయాణికులు భయం భయంగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ అనుమతి (లైసెన్స్) లేకపోయినప్పటికీ అధికార పార్టీ ఎమ్మెల్యే వర్గీయుల కనుసన్నల్లో అనధికార ప్రయాణానికి పచ్చ జెండా ఊపడంతో ఘాట్ నిర్వాహకులకు కాసుల పంట పండుతోంది. ఈ విషయమై తహసీల్దార్ శివరాముడును వివరణ కోర గా.. ఇంజిన్ బోటు ప్రయాణానికి ఎలాంటి అను మతి ఇవ్వలేదని విచారించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. -
అటవీ సంరక్షణకు చర్యలు
రుద్రవరం: అటవీ సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెలిమ రేంజ్ పెద్దకంబలూరు సెక్షన్ అధికారి కిషోర్ తెలిపారు. బుధవారం ఆయన ఎఫ్బీఓ రామారావుతో కలిసి పెద్దకంబలూరు వంతెన వద్ద గేటు ఏర్పాటు చేశారు. ఈ విషయంపై వారు మాట్లాడుతూ తెలుగుగంగ ప్రధాన కాల్వ నిర్మించే సమయంలో అటు వైపు గ్రామాల ప్రజల అవసరాల నిమిత్తం పెద్దకంబలూరు వద్ద వంతెన ఏర్పాటు చేశారు. దీంతో ఆ గ్రామంతో పాటు అప్పనపల్లె, పందిర్లపల్లె తదితర గ్రామాల ప్రజలు ఆ వంతెన మీదుగా లోపలికి వెళ్లి పశువులను మేపుకొని తిరిగొచ్చేవారు. అయితే, కొందరు దుండగులు ఆ దారిన అడవిలోనికి వెళ్లి నేరానికి పాల్పడుతున్నట్లు తమ దృష్టికి రావడంతో ఉన్నతాధికారుల అనుమతులు తీసుకోని అడవిలోకి రాక పోకలు నిషేధిస్తూ గేటు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.త్వరలో తెలుగుగంగ ప్రధాన కాల్వ కట్టపై ఓ బేస్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారుల అనుమతులిచ్చారన్నారు. బేస్ క్యాంప్ ఏర్పాటు అయితే నల్లమల అటవీ సంరక్షణకు మరింత మంది సిబ్బంది అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. -
దైవ దర్శనానికి వెళ్తూ..
జూపాడుబంగ్లా/కొత్తపల్లి: సప్తనదుల సంగమేశ్వరంలో వెలిసిన సంగమేశ్వరుడి దర్శనానికి వెళ్లిన ఓ యువకుడు కృష్ణానదిలో మునిగి మృత్యువాత పడ్డాడు. మండ్లెం గ్రామానికి చెందిన పోతులరాజు మద్దిలేటి, బాలావతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దవాడైన సందీప్కుమార్బాబు తిరుపతిలోని ఐఎఫ్ ఎఫ్టీ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రికి ఆరోగ్యం బాగోలేదని చూసేందుకు నాలుగు రోజుల క్రితం స్వగ్రామానికి చేరుకున్నాడు. కాగా బుధవారం తన మిత్రుడు తంగడంచ గ్రామానికి చెందిన శివకుమార్తో కలిసి బైక్పై సప్తనదుల సంగమేశ్వరాలయానికి వెళ్లారు. నదిలో స్నానం చేసిన అనంతరం ఆలయ అర్చకుడు తగ్గిన కృష్ణా జలాల్లో నడుచుకొంటూ ఆలయం వద్దకు వెళ్లి పూజలు చేసి రావటాన్ని గమ నించారు. వారు కూడా ఆలయం వద్దకు వెళ్లి స్వామిని దర్శించుకునేందుకు కృష్ణాజలాల్లో నడుచుకొంటూ వెళ్లసాగారు. కొద్దిదూరం వెళ్లాక శివకుమార్ తన వద్ద ఉన్న సెల్ఫోన్ ఒడ్డుపై పెట్టివస్తానని బయటకు వచ్చాడు. సందీప్కుమార్బాబు ఒక్కడే నీళ్లల్లో నడుచుకుంటూ ఆలయం వద్దకు వెళ్లాడు. ఆలయం సమీపిస్తుండగానే అక్కడ లోతైన గుంతలోని పూడికలో కూరుకపోయి మునిగిపోయాడు. శివకుమార్ గమనించి కేకలు వేయటంతో సమీపంలోని మత్స్యకారులు పుట్టిల్లో వెళ్లి నీట మునిగిన సందీప్కుమార్బాబును ఒడ్డుకు చేర్చారు. కాగా అప్పటికే అతను మృతిచెందాడు. సమాచారం అందుకన్న యువకుడి తల్లిదండ్రులు సంగమేశ్వరానికి చేరుకుని విలపించారు. సమాచారం అందుకున్న కొత్తపల్లి ఎస్ఐ ఎం.కేశవ సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి బాబాయి బుజ్జన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్ఐ తెలిపారు. పేకాటరాయుళ్ల అరెస్ట్ సంజామల: మండల పరిధిలోని మంగపల్లె గ్రామంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని ఎస్ఐ రమణయ్య బుధవారం అరెస్ట్ చేశారు. గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు రైల్వే ట్రాక్ సమీపంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం రావడంతో సిబ్బందితో కలసి దాడి చేసి పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.3150 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
పెద్దాయనా.. మన్నించు !
సంజీవయ్య జయంతి ఉత్సవాలకు రూ.3 లక్షలు ● ఫిబ్రవరి 14న ఘనంగా నిర్వహించిన జిల్లా అధికార యంత్రాంగం ● నేటికీ నయాపైసా విదల్చని ప్రభుత్వం కర్నూలు(అర్బన్): దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి నిర్వహణకు సంబంధించిన వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేటికీ విడుదల చేయకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంజీవయ్య సొంత జిల్లా అయిన కర్నూలులో ఆయన జయంతిని అంగరంగ వైభవంగా అధికారికంగా రాష్ట్ర స్థాయి పండుగ నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే స్టేట్ హెడ్ క్వార్టర్స్తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ.లక్ష, సంజీవయ్య సొంత జిల్లా కర్నూలుకు రూ.3 లక్షల నిధులు కేటాయిస్తున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరి 10న రాష్ట్ర ప్రభుత్వం జీఓ 2 విడుదల చేసింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం స్థానిక నంద్యాల చెక్పోస్టు సమీపంలో దామో దరం సంజీవయ్య విగ్రహం ఉన్న ప్రాంతంలో జయంతి వేడుకలను ఫిబ్రవరి 14న ఘనంగా నిర్వహించారు. నేడో రేపో నిధులు విడుదలైన వెంటనే చెల్లించవచ్చనే ధైర్యంతో సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన పలువురు అధికారులు సప్లయర్స్ షాపు, పూల దుకాణాలు, కిరాణ తదితర షాపుల్లో అప్పులు చేసి జయంతిని ఘనంగా చేశారు. జయంతి నిర్వహించి నెల రోజులు గడచిపోయినా, ప్రభుత్వం నుంచి నేటికీ నయాపైసా విడుదల కాకపోవడంతో అప్పులు ఇచ్చిన షాపుల వారికి ముఖాలు చూపించలేక, అపద్దాలు చెప్పలేక పలువురు అధికారులు ముఖం చాటేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా షాపుల యజమానులు సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండటం గమనార్హం. -
27న ‘స్థానిక’ ఖాళీల భర్తీకి ఎన్నికలు
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్, మండల పరిషత్తుల్లో ఖాళీగా ఉన్న కోఆప్షన్ సభ్యులు, ఎంపీపీ పదవుల భర్తీకి ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు వెలుగోడుకు చెందిన సయ్యద్ సులేమాన్ గత ఏడాది మార్చి 28న, క్రిష్ణగిరి మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు షేక్ షాలీసాహెబ్ ఈ ఏడాది జనవరి 1న మృతి చెందారన్నారు. అదేవిధంగా వెల్దుర్తి, తుగ్గలి మండల పరిషత్ అధ్యక్షులు బి.శారద, ఆదెమ్మ వ్యక్తిగత కారణాలతో 2024 మార్చి 29న తమ పదవులకు రాజీనామా చేశారన్నారు. ఈ నేపథ్యంలో ఖాళీ ఏర్పడిన నాలుగు పోస్టులకు ఎన్నికలను నిర్వహించునున్నామన్నారు. ఇందుకు సంబంధించి ఈ నెల 23న నోటీసులు జారీ చేస్తామని, ఆ రోజు నుంచి కోఆప్షన్ సభ్యుల స్థానాలకు 27వ తేది ఉదయం 10 గంటల వరకు, ఎంపీపీ స్థానాలకు ఉదయం 11 గంటల వరకు నామినేషన్లు దాఖాలు చేసుకోవచ్చన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన అనంతరం యథావిధిగా నామినేషన్ల ఉపసంహరణ, బరిలో ఉన్న వారి జాబితాలను ప్రకటిస్తామన్నారు. అదే రోజున మధ్యాహ్నం 1 గంటకు జెడ్పీలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి కోఆప్షన్ సభ్యున్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. అలాగే మండల పరిషత్ కార్యాలయాల్లో కూడా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఎంపీపీ, కోఆప్షన్ సభ్యున్ని ఎన్నుకుంటారన్నారు. ఆరు గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచులకు.. జిల్లాలోని ఆరు గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచు స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. దేవనకొండ మండలం వెలమకూరు, పత్తికొండ మండలం జూటూరు, ఓర్వకల్ మండలం గుట్టపాడు, కర్నూలు మండలం సుంకేసుల, ఆలూరు మండలం మొలగవెళ్లి, వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచు ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలిపారు. 27న ఉదయం 11 గంటలకు ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నికలను నిర్వహిస్తామన్నారు. ఖాళీగా మూడు జెడ్పీటీసీ స్థానాలు .... జిల్లా పరిషత్లో కూడా మూడు జెడ్పీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కల్లూరు జెడ్పీటీసీ వి.ప్రభాకర్రెడ్డి 2023 అక్టోబర్ 20న మృతి చెందారు. చిప్పగిరి జెడ్పీటీసీగా ఉన్న బి.విరుపాక్షి ఆలూరు ఎమ్మెల్యేగా ఎన్నికవడం వల్ల తన జెడ్పీటీసీ పదవికి 2024 జూన్ 14న రాజీనామా చేశారు. ప్యాపిలి జెడ్పీటీసీగా ఉన్న బోరెడ్డి శ్రీరాంరెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడి ఈ నెల 10న మరణించారు. ఈ మూడు స్థానాలతో పాటు జిల్లాలో ఖాళీగా ఉన్న సర్పంచు, ఎంపీటీసీ, వార్డు సభ్యుల స్థానాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. -
ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహిస్తున్నట్లు డీఈఓ జనార్దన్రెడ్డి తెలిపారు. జిల్లాలో 130 పరీక్ష కేంద్రాల్లో బుధవారం హిందీ పరీక్ష నిర్వహించగా 24,785 మందికి గాను 24,418 మంది విద్యార్థులు (98.51శాతం) హాజరయ్యారని పేర్కొన్నారు. మొత్తం 367 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 16 పరీక్ష కేంద్రాలను ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు పరిశీలించాయన్నారు. ఎస్పీజీ స్కూల్ పక్కన ఉన్న ఎస్పీజీ జూనియర్ కళాశాలలోకి పరీక్ష కేంద్రాన్ని బుధవారం మార్పు చేసినట్లు డీఈఓ తెలిపారు. జిల్లాలో తొమ్మిది పరీక్ష కేంద్రాల్లో 509మంది విద్యార్థులకు గాను 454 మంది విద్యార్థులు (88.41శాతం) పదోతరగతి ఓపెన్ ఆంగ్లం పరీక్షకు హాజరయ్యారన్నారు. మొత్తం 59మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. పన్నుల ఆదాయం రూ.10.43 కోట్లుచాగలమర్రి: నంద్యాల జిల్లాలోని 489 గ్రామ పంచాయితీలకు పన్నుల రూపంలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.10.43 కోట్ల ఆదాయం సమకూరిందని జిల్లా పంచాయతీ అధికారి జమివుల్లా తెలిపారు. చాగలమర్రిలోని ఐదు సచివాలయాలు, పంచాయతీ కార్యాలయాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. 15వ ఆర్థిక ప్రణాళిక సంఘం ద్వారా జిల్లాలోని 489 పంచాయితీలకు రూ.28.00 కోట్లు వచ్చాయని, ఈ నిధులను వివిధ పనులకు వినియోగించాల్సి ఉందన్నారు. పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతులు చేపట్టారని, పది రోజుల్లో ఆ శాఖలో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేస్తారని తెలిపారు. జిల్లాలో ఐదు ‘శక్తి’ బృందాలు బొమ్మలసత్రం: మహిళల రక్షణ కోసం జిల్లా లో ఐదు శక్తి బృందాలను ఏర్పాటు చేశామని, బృంద సభ్యులు నిత్యం పనిచేస్తారని ఎస్పీ అదిరాజ్సింగ్రాణా తెలిపారు. తన కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న మహిళలు, బాలికల రక్షణ కోసమే శక్తి యాప్ను అందుబాటులోకి తెచ్చారని, మొబైల్ ఫోన్లలో ఈ యాప్ వినియోగించుకోవాలన్నారు. మహిళలు ఏదైనా ఆపదలో ఉంటే 112 నంబరుకు గానీ ఎస్వోఎస్ బటన్నుకు నొక్కితే వెంటనే పోలీసులు వారిని సమీపిస్తారన్నారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతున్న కేంద్రాల వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు వార్డు మహిళా పోలీసులను నియమించామన్నారు. దివ్యాంగ విద్యార్థినికి ప్రత్యేక డెస్క్ పగిడ్యాల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న పడమర ప్రాతకోటకు చెందిన దివ్యాంగురాలైన విద్యార్థిని రాజేశ్వరికి గ్రౌండ్ ఫ్లోర్లోనే ప్రత్యేక డెస్క్ను ఏర్పాటు చేశారు. ‘‘అధికారులూ.. కనిపిస్తోందా’’ అని మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన వార్తకు అధికారులు ఈ మేరకు స్పందించారు. పదో తరగతి పరీక్షలు రాసే దివ్యాంగులకు విధిగా గ్రౌండ్ఫ్లోర్నే అధికారులు కేటాయించాల్సి ఉండగా.. దివ్యాంగురాలైన విద్యార్థిని రాజేశ్వరికి మొదటి ఫ్లోర్లో పరీక్ష గది కేటాయించారు. కుమార్తెను ఆ ఫ్లోర్కు చేర్చడానికి తల్లి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తల్లి కష్టంపై ‘సాక్షి’ దినపత్రికలో వార్త రావడంతో బుధవారం హిందీ పరీక్ష రాసేందుకు వెళ్లిన దివ్యాంగురాలైన విద్యార్థిని రాజేశ్వరికి గ్రౌండ్ ఫ్లోర్లోనే ప్రత్యేక డెస్క్ను ఏర్పాటు చేశారు. -
చంద్రబాబు ప్రభుత్వం అందించిన సాయం : 0 గత ఐదేళ్లల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించిన సాయం : రూ 1,385.51 కోట్లు
పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలి గతంలో నాకు ఏటా రూ. 13,500 చొప్పున మూడు విడతల్లో నా ఖాతాలో డబ్బులు జమ అయ్యేవి. ఈ ప్రభుత్వ హయాంలో ఇప్పటికి వానకారు, ఎండకారు ముగుస్తున్నా ప్రభుత్వం ఇస్తామన్న రూ. 20 వేలలో నయాపైసా వేయలేదు. తక్షణమే పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలి. – డక్క పెద్ద చెన్నయ్య, క్రిష్టిపాడు రైతులకు మళ్లీ కష్టాలు రైతులకు మళ్లీ సాగు కష్టాలు దాపురించాయి. ఏడాది అవుతున్నా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్న రూ. 20 వేల పెట్టుబడి సాయంలో నయాపైసా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం రెండు విడతల్లో రూ. 4 వేలు అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ పెట్టుబడి సాయంపై స్పందించక పోవడం సిగ్గుచేటు. – లింగారెడ్డి, ఓబులంపల్లె వైఎస్సార్సీపీ హయాంలో ఇలా.. గత ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిచ్చి ‘ వైఎస్సార్ రైతు భరోసా’’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసింది. రైతన్నలు ఎవరి వద్ద చేయి చాచి అప్పులు అడిగే పరిస్థితి లేకుండా ఖరీఫ్, రబీ సీజన్ల ప్రారంభంలోనే ఆర్థిక సహాయం వారి ఖాతాల్లో జమ చేసింది. జిల్లాలో సుమారు 2.34 లక్షల మంది అర్హులైన రైతులకు ప్రతి ఏటా సుమారు రూ. 316.25 కోట్లు చొప్పున ఐదేళ్లు ఏటా మూడు విడతలుగా అందించిన సాయంతో రైతులు సాగును పండుగలా చేసుకున్నారు. అన్నదాతలు పెట్టుబడి కోసం దళారులను ఆశ్రయించి అప్పుల ఊబిలో చిక్కుకోకూడదని రైతుభరోసా సాయం అందించి ఐదేళ్లు ఆదుకుంది. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ కింద ప్రభుత్వం ప్రతి ఏటా ముడు విడుతల్లో రూ. 13,500 సాయాన్ని అందించింది. రూ. 7500 మే నెలలో, రూ 4. వేలు అక్టోబర్లో, మిగిలిన రూ. 2 వేలు జనవరిలో జమ చేయడం జరిగింది. భూ యజమానులకు మాత్రమే పీఎం కిసాన్ కింద కేంద్రం మూడు విడుతల్లో రూ 6వేల చొప్పున జమ చేసేది. ఎలాంటి భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు దేవదాయ, అటవీ, వక్ఫ తదితర ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న , కౌలుదారులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ఏటా రూ.13,500 చొప్పున అందజేస్తూ అండగా నిలిచింది. సన్నచిన్నకారు రైతులకు ఈ సాయం ఎంతో ఉపయోగపడేది. -
లాభాల బాట పట్టించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం
నష్టాల ఊబిలో చిక్కుకున్న డీసీసీబీకి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఊపిరిపోసింది. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు కేడీసీసీబీ రుణాలు పంపిణీ చేసే ఏర్పాటు చేసింది. కస్టమ్స్ హయరింగ్ సెంటర్లు, మల్టీపర్పస్ గోదాముల నిర్మాణాలకు డీసీసీబీ రుణాలు అందచేసింది. గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా బ్యాంకు లోనింగ్ భారీగా పెరిగింది. వైఎస్ఆర్సీపీ హయాంలో దశాబ్దాల నాటి నష్టాలను అధిగమించి నికర లాభాల్లోకి వచ్చింది. 2022–23, 2023–24 సంవత్సరాల్లో రికార్డు స్థాయిలో ఏకంగా రూ.10కోట్ల లాభం ఆర్జించగా.. సభ్యులైన పీఏసీఎస్లకు రూ.4 కోట్లు డివిడెండ్ ఇచ్చింది. రాయలసీమ జిల్లాల్లోనే అత్యధిక టర్నోవర్ కలిగిన బ్యాంకుగా రెండేళ్లు వరుస అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం. ● నికర లాభాల్లోకి వచ్చిన కేడీసీసీబీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన మొదటి ఏడాదిలోపే మళ్లీ నష్టాల్లోకి వచ్చి బలహీనమైన బ్యాంకుగా రికార్డు నమోదు చేసుకోవడం ఆందోళన కలిగించే విషయం. గతంలో ఎప్పుడూ లేని విధంగా 2024–25లో రుణాల పంపిణీ నామమాత్రంగా చేపట్టారు. పీఏసీఎస్ల కంప్యూటరీకరణ పేరుతో రైతులకు అవసరమైన రుణాల పంపిణీ విషయంలో కనీస చొరవ కరువైంది. ఇదే సమయంలో బకాయిలు పేరుకుపోవడంతో బ్యాంకు మళ్లీ నష్టాల బాట పట్టింది. -
రూ.330 కోట్లకు చేరుతున్న నిరర్ధక ఆస్తులు
రైతుల మెడపై జప్తుల కత్తి ● నష్టాల బాటన కేడీసీసీ బ్యాంకు ● కూటమి ప్రభుత్వ పాలనలో మళ్లీ చీకటి రోజులు ● ఇప్పటికే 90 మంది రైతుల ఆస్తులు స్వాధీనం ● 800 మంది ఆస్తుల వేలానికి రంగం సిద్ధం ● రికవరీ పేరిట రైతుల ఆత్మాభిమానంతో ఆటలు ● వైఎస్సార్సీపీ పాలనలో కేడీసీసీబీ లాభాల బాట ● నేడు నిరర్థక ఆస్తులే రూ.330 కోట్లు బైక్ను జప్తు చేశారు చిప్పగిరి మండలం రామదుర్గం గ్రామానికి చెందిన ఒక మహిళ 2014లో దీర్ఘకాలిక రుణం కింద డెయిరీ లోన్ తీసుకున్నారు. కంతుల ప్రకారం కొంత మొత్తం కూడా చెల్లించారు. అసలు రూ.2.70 లక్షలు, అయితే ఇప్పుడు ఈ మహిళ చెల్లించాల్సిన మొత్తం వడ్డీతో కలిపి రూ.7 లక్షలు దాటింది. ఇటీవల గ్రామానికి వెళ్లిన రికవరీ టీమ్ ఈ మహిళ కుటుంబానికి చెందిన బైకును జప్తు చేసి సొసైటీకి తరలించింది. మహిళ తాకట్టు పెట్టిన స్థిరాస్తులను వేలంలో విక్రయించేందుకు రంగం సిద్ధం చేసింది. వడ్డీ రూ.20 లక్షలు చిప్పగిరి మండలం ఏరూరు గ్రామానికి చెందిన ఒక రైతు 2021లో కర్షక జ్యోతి కింద రూ.25 లక్షలు, దీర్ఘకాలిక రుణం కింద గొర్రెల పెంపకానికి రూ.15 లక్షల ప్రకారం మొత్తం రూ.40 లక్షల రుణం తీసుకున్నారు. వివిధ కారణాల వల్ల రుణాలను చెల్లించలేదు. నాలుగేళ్లలో వడ్డీ రూ.20 లక్షలు అయింది. మొత్తం రూ.60 లక్షలు చెల్లించాలని, లేకపోతే ఆస్తులు వేలం వేస్తామని నోటీసు జారీ చేశారు. ఇటీవల గ్రామానికి వెళ్లిన ప్రత్యేక టీమ్ రైతుకు చెందిన ట్రాక్టరును జప్తు చేసి బెల్డోణలోని పీఏసీఎస్కు స్వాధీనం చేశారు. కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(కేడీసీసీబీ) బకాయిలను రాబట్టుకునేందుకు రైతుల మెడపై జప్తుల కత్తి పెట్టింది. కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు డీసీసీబీ రైతుల జీవితాలతో చెలగాటమాడుతోంది. రైతాంగాన్ని 2024–25లో అధిక వర్షాలు, అనావృష్టి పరిస్థితులు కోలుకోలేని దెబ్బతీశాయి. అంతంతమాత్రం పండిన పంటలకు కూడా గిట్టుబాటు ధరలు లేక నష్టాలను మూటకట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లా సహకార కేంద్రబ్యాంకు రైతుల ఆస్తులు స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచే రైతుల ఆస్తుల వేలానికి చర్యలను వేగవంతం చే యడం గమనార్హం. రుణాల రికవరీకి వెళ్లిన అధికారులు ఏది కనిపిస్తే దానిని స్వాధీనం చేసుకుంటుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 90 మంది రైతుల ఆస్తుల స్వాధీనం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వత డీసీసీబీ జప్తుల తీవ్రత మొదలైంది. 2014–15 నుంచి 2018–19 వరకున్న టీడీపీ ప్రభుత్వంలో వరుస కరువు రైతులను నిలువునా ముంచింది. పంటలు పండక రైతులు అల్లాడుతుంటే అప్పట్లో కూడా జప్తుల పర్వం కొనసాగింది. నాడు ఆస్తులను వేలం వేయడంతో పాటు రైతుల ఇళ్లలోని చరాస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మళ్లీ నాటి పరిస్థితులే పునరావృతం అవుతున్నాయి. 2024 జూన్ 12న కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. నాటి నుంచి నేటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో 90 మంది రైతుల ఆస్తులను డీసీసీబీతో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు స్వాధీనం చేసుకున్నాయి. 2024–25లో మొత్తం 800 మంది రైతుల ఆస్తులు వేలం వేయడం, స్వాధీనం చేసుకోవాలనేది లక్ష్యంగా తెలుస్తోంది. ఈ నెల చివరిలోపు రైతుల ఆస్తుల వేలానికి ముమ్మర కసరత్తు జరుగుతోంది. డీసీసీబీలో ప్రధానంగా ఆలూరు బ్రాంచీలో బకాయిలు అత్యధికంగా ఉన్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో ఆలూరు ప్రాంతంలోని 18 మంది రైతుల ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి రంగం సిద్ధమైంది. ముమ్మరంగా చరాస్తుల జప్తు బకాయిలను రాబట్టుకునేందుకు ముందుగా రైతులకు సంబంధించిన చరాస్తులను జప్తు చేయాలని జాయింట్ కలెక్టర్, డీసీసీబీ పర్సన్ ఇన్చార్జి చైర్మన్ నవ్య స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. చరాస్తుల జప్తు తర్వాత స్థిరాస్తుల వేలానికి శ్రీకారం చుట్టాలని ఆదేశించారు. జప్తులు, వేలంపాట, రికవరీలపై జేసీ ప్రతి రోజు డీసీసీబీ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నారు. దీంతో అధికారులు జప్తుల పర్వాన్ని వేగవంతం చేయడం గమనార్హం. ఇప్పటికే ఆలూరు బ్రాంచి పరిధిలోని చిప్పగిరి మండలం ఏరూరు గ్రామంలో ట్రాక్టరు, బైకు.. కుందనగుర్తి గ్రామంలో ఒక బైకు, రామదుర్గం గ్రామంలో రెండు బైకులను జప్తు చేసినట్లు స్పష్టమవుతోంది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నిరర్థక ఆస్తులు కొండలా పెరిగిపోతున్నాయి. 2024 ఏప్రిల్ నెలలో రూ.193 కోట్ల నిరర్ధక ఆస్తులు ఉన్నాయి. ఈ నెల 15 నాటికి నిరర్థక ఆస్తులు రూ.267 కోట్లకు చేరుకోగా.. మార్చి చివరి నాటికి రూ.330 కోట్లకు చేరనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆలూరు, డోన్, ఆదోని, పత్తికొండ, కృష్ణానగర్, కోడుమూరు, కోవెలకుంట్ల, నందికొట్కూరు, వెలుగోడు, ఆత్మకూరు బ్రాంచీల్లో నిరర్థక ఆస్తులు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
యువకుడిఅనుమానాస్పద మృతి
బొమ్మలసత్రం: నంద్యాల పట్టణంలో ఓ యువకుడు మంగళవారం అనుమానా స్పదంగా మృతి చెందాడు. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక ఎంఎస్ నగర్ వీధికి చెందిన వెంకటేష్ శుభకార్యాల కు వంటల కాంట్రాక్ట్ ఒప్పుకుని కుటుంబాన్ని పోషించేవాడు. వెంకటే ష్ టీచర్స్ కాలనీలో ఉంటున్న వాణి అనే యువతిని ప్రేమించి పెద్దల అంగీకారంతో గతేడాది డిసెంబర్ 31వ తేదీన వివాహం చేసుకున్నాడు. సంసారం సాఫీగా సాగుతున్న నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వెంకటేష్ బెడ్రూమ్లోకి వెళ్లి నిద్రపోయాడు. కొన్ని గంటల తర్వాత భార్య వెళ్లి చూడగా అతను అపస్మారక స్థితిలో కనిపించాడు. మెడకు గాయమైనట్లు గుర్తించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. అయితే అప్పటికే వెంకటేష్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతికి కారణాలు విచారణలో తెలుస్తాయన్నారు. రెండు బైక్లు ఢీకొని.. ● వృద్ధుడి మృతి ● యువకుడికి తీవ్ర గాయాలు పత్తికొండ రూరల్: అతి వేగం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. టిఫిన్ చేసేందుకు హోటల్ వెళ్లిన వృద్ధుడు తిరిగిరాని లోకాలకు చేరాడు. పత్తికొండ పట్టణంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందగా, మరో యువకు డు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక దాసరి వీధిలో బోయ హనుమన్న, తిమ్మక్కలు నివాసముంటున్నారు. వారి కుమారుడు భార్యా పిల్లలతో బతుకుదెరువుకు గుంటూరు వలస వెళ్లారు. ఇంటి వద్ద వున్న తిమ్మక్క మంగళవారం మిరపకాయలు తెంపేందుకు కూలికి వెళ్లగా.. హనుమన్న టిఫిన్ చేసేందుకు టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనంపై ప్రభుత్వ బీసీ హాస్టల్ సమీపంలోని ప్రధాన రోడ్డు పక్కనే ఉన్న హోటల్కు వెళ్లాడు. టిఫిన్ చేసిన తర్వాత ఇంటికి వచ్చేందుకు వాహనాన్ని తీస్తుండగా పత్తికొండకు చెందిన కూరగాయల వ్యాపారి అభిరాం పల్సర్ బైక్తో వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా కోలు కోలేక వృద్ధుడు మృతి చెందాడు. యువకుడు అభి రాం చికిత్స పొందుతున్నాడు. భర్త మృతితో భార్య తిమ్మక్క రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. -
అన్నదానం పేరుతో అక్రమ వసూళ్లు
● కాశినాయన ఆశ్రమమంటూ విరాళాల సేకరణ ● రాజమండ్రి పోలీసులకు చిక్కిన వెలుగోడు ముఠా ఆత్మకూరురూరల్: అన్నదానం పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠా పోలీసులకు పట్టుబడింది. వెలుగోడు మండలానికి చెందిన నిందితులు కర్ణాటక, తమిళనాడుతో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రా ల్లో కాశిరెడ్డి నాయన పేరిట నిత్యాన్నదానం చేస్తున్నామని, శ్రీశైలంలో ఒక వసతి గృహం నిర్మిస్తున్నామని నమ్మబలుకుతూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న విషయాన్ని రాజమండ్రి పోలీసులు బట్టబయలు చేశారు. వెలుగోడు మండల కేంద్రంలో నివసించే శంకర్ అనే వ్యక్తి శంకర్ రెడ్డి, భవనం రమణారెడ్డి అనే పేర్లతో చెలామణి అవుతూ దాదాపు లక్షలాది రూపాయలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇతను అతని కులస్తులను కొందరిని తన ముఠాలో చేర్పించుకుని ఖరీదైన దుస్తులు, వేషధారణతో వాహనాల్లో తిరుగుతూ పలు ప్రాంతాల్లో విరాళాలు సేకరించారు. వీరు రెండు రోజుల క్రితం రాజమండ్రిలో తాము ఆత్మకూరు మండలం నల్లకాల్వ గ్రామంలో వైఎస్సార్ స్మృతివనం సమీపంలో కాశిరెడ్డి నాయనం ఆశ్రమం ఏర్పాటు చేశామని, అక్కడ నిత్యాన్నదానం జరుగుతుందని చెబుతూ.. చందాలు వసూలు చేసే యత్నం చేశారు. వీరి పోకడ గమనించిన రాజమండ్రికి చెందిన త్రినాథరెడ్డి అనే వ్యక్తి ఈ ముఠాను పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. ఇంతకు ముందు నంద్యాల ఎస్పీగా పని చేసిన రఘువీరారెడ్డి అక్కడ ఉండడంతో ఆయన ఈ విషయంపై విచారణ జరిపించారు. దీంతో శంకర్ ముఠా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తేలడంతో వారిపై కేసు నమోదు చేశారు. వారి వద్ద ఉన్న రసీదు పుస్తకాలు, డిజిటల్ లావాదేవీలను పరిశీలిస్తే ఈ మధ్య కాలంలోనే రూ. 20 లక్షలకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. శంకర్ ముఠాలో వెలుగోడు మండలం రేగడగూడూరు గ్రామానికి చెందిన వారు కూడా ఇద్దరు ఉన్నట్లు తెలిసింది. నల్లకాల్వలో కాశిరెడ్డి నాయన ఆశ్రమం ఉన్న విషయం నిజమే అయినప్పటికీ ఈ ఆశ్రమ నిర్వాహకులు వేరే వారు కావడం గమనార్హం. ఇందులో వారు ప్రచారం చేసుకుంటున్నంత స్థాయిలో అన్నదాన కార్యక్రమాలు జరగడం లేదు. -
సూర్య @ 42.7 డిగ్రీలు
కర్నూలు(అగ్రికల్చర్): మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో రాష్ట్రంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒకవైపు సుర్రుమంటున్న ఎండలు, మరోవైపు వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే ఎండల నుంచి ప్రజలకు కొంతైనా ఉపశమనం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ఏ మాత్రం చొరవ తీసుకోవడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్న ఐదేళ్లు కర్నూలు నగరంలోని ప్రధాన కూడళ్లలో చలువ పందిళ్లు ఏర్పాటు చేసింది. 2024లో ఫిబ్రవరి నెల చివరి నాటికే చలువ పందిళ్లు ఏర్పాటు అయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చలువ పందిళ్లు, చలి వేంద్రాల జాడ కనిపించడం లేదు. బండిఆత్మకూరు మండలంలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత... రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే నమోదు అవుతున్నాయి. బండి ఆత్మకూరు మండలం పెద్ద దేవళాపురం గ్రామంలో 42.7 డిగ్రీలు, కల్లూరులో 42.6, చాగలమర్రిలో 42.4 డిగ్రీలు, గోస్పాడులో 41.9, దొర్నిపాడులో 41.7, ఆత్మకూరులో 41.5, కొత్తపల్లిలో 41.4, కోడుమూరులో41.2, కోసిగిలో 41.2, పెద్దకడు బూరులో 41.1 కర్నూలులో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత లు నమోదైంది. సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీల అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా యి. రానున్న రోజుల్లో వడగాల్పులు, ఉష్ణోగ్రతల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. మార్చి నెలలో నే ఉష్ణోగ్రతలు గతంలో ఎపుడూ లేని విధంగా 44 డిగ్రీలను అధిగమించే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచిస్తున్నారు. పెద్ద దేవళాపురంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కల్లూరులో 42.6 డిగ్రీలు నమోదు వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి -
లాహిరి లాహిరి లాహిరిలో..
పుష్కరిణిలో మిరుమిట్లు గొలిపే వెలుగుల్లో ప్రహ్లాదవరదుడి తెప్పోత్సవం ఆళ్లగడ్డ: లాహిరి లాహిరి లాహిరిలో... ఓహో జగమే ఊయలగా.. అంటూ ప్రహ్లాదవరదుడు ఉభయ దేవేరులతో పడవలో మూడు రోజులగా అంగరంగ వైభవంగా జరిగిన తెప్పోత్సవం మంగళవారం రాత్రి కనులపండువలా ముగిసింది. ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీప్రహ్లాదవరద స్వాములను పల్లకీలో అధిష్టింపజేసి మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం కోనేటి వరకు తొడ్కొని వచ్చారు. ఉభయ దేవేరులతో స్వామి తెప్పను అధిరోహించిన అనంతరం పండితుల పూజలు చేశారు. అనంతరం సుమారు గంటపాటు తెప్పోత్సవం సాగింది. నారసింహ స్వామి కీర్తనలు భక్తి పారవశ్యంతో ఆలపిస్తుండగా.. ప్రహ్లాదవరదస్వామి ఉభయ దేవేరులతో తెప్పపై ఊరేగారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కోనేటి చుట్టూ చేరుకుని తెప్పోత్సవాన్ని తిలకించారు. వైభవోపేతంగా ముగిసిన లక్ష్మీనృసింహస్వామి తెప్పోత్సవం -
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
కర్నూలు: ఖైదీలు సత్ప్రవర్తనతో శిక్షను పూర్తి చేసి గౌరవప్రదమైన జీవితం గడపాలని న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి, కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సూచించారు. మంగళవారం కర్నూలు శివారులోని పురుషుల కేంద్ర కారాగారం, మహిళా కారాగారాలను వారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖైదీలకు న్యాయవాదులు లేకుంటే ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామన్నారు. ఖైదీలకు అందించే ఆహారం, రేషన్తో పాటు ఆరోగ్యం గురించి తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. ఖైదీలను కోర్టు వాయిదాలకు కచ్చితంగా హాజరుపరచాలని జైలు అధికారులను ఆదేశించారు. ఏవైనా సమస్యలుంటే కర్నూలు న్యాయ సేవాధికార సంస్థను, లేదంటే లీగల్ సర్వీసెస్ హెల్ప్లైన్ నెంబర్ 15100ను సంప్రదించాలని సూచించారు. కొందరు ఖైదీలు బెయిల్ మంజూరైనప్పటికీ జామీనుదారులు లేక జైలులోనే ఉంటున్నామని జిల్లా జడ్జి దృష్టికి తీసుకురాగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈవీఎం గోడౌన్ల పరిశీలన నంద్యాల: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నంద్యాల పట్టణం టెక్కె మార్కెట్యార్డులోని ఈవీఎం గోడౌన్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌన్లకు వేసిన సీళ్లను, ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించామన్నారు. పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం పర్యవేక్షణ రిజిష్టర్లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. కలెక్టర్ వెంట డీఆర్ఓ రామునాయక్, ఆర్డీఓ విశ్వనాథ్, నంద్యాల తహసీల్దార్ ప్రియదర్శిని, ఎన్నికల విభాగపు తహసీల్దార్ జయప్రసాద్ పాల్గొన్నారు. బనగానపల్లె డిగ్రీ కళాశాలకు ఏ గ్రేడ్ బనగానపల్లె రూరల్: బనగానపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఏ గ్రేడ్ సర్టిఫికెట్ వచ్చిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. లలిత తెలిపారు. నంద్యాల పీఎస్సీ అండ్ కెవీఎస్సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఎస్ పార్వతి, నందికొట్కూరు డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఝాన్సీరాణి.. మంగళవారం కళాశాలను పరిశీలించినట్లు తెలిపారు. అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పనితీరును పరిశీలించి సమావేశం నిర్వహించారన్నారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఏ గ్రేడ్ సర్టిఫికెట్ అకాడమిక్ అధికారులు ప్రదానం చేసినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(అర్బన్): మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సీ్త్ర శిశు అభివృద్ధి మహిళా సాధికారత అధికారిణి లీలావతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్ట్టైం, ఔట్సోర్సింగ్ విధానాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారని పేర్కొన్నారు. అర్హులైన వారు ఈనెల 20 నుంచి 29వ తేదీలోగా దరఖాస్తులను డబరాల మసీదు దగ్గరలోని శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ http://nandyal.ap.gov.in పరిశీలించాలన్నారు. -
‘గోరుకల్లు’ నిర్వహణ అస్తవ్యస్తం
పాణ్యం: రాష్ట్ర ప్రభుత్వం అరకొర నిధులు కేటాయించడంతో గోరుకల్లు జలాశయ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. జలాశయంలో ఎక్కడ చూసినా కంపచెట్లు, బండ్పై లోతైన గోతలు పడ్డాయి. ప్రధానంగా జంగిల్ క్లియరెన్స్, గ్యాలరీలో పనులు, బండ్పై గోతులు పూడ్చడం, గట్లకు మరమ్మతులు, గేట్లకు సంబధించి సాంకేతిక పనులు చేయాల్సి ఉంది. జలాశయ కట్ట బండ్కు సంబంధించి రివ్యూట్మెంట్ జారి పోవడంతో గత ప్రభుత్వం యుద్ధప్రాదిపదికన కోటి రూపాయలతో పనులు చేయించింది. నీటినిల్వకు ఇబ్బంది లేకుండా చేసింది. అయితే కూటమి ప్రభుత్వం రాయలసీమకు తలమానికంగా ఉన్న గోరుకల్లు జలాశయానికి ఆరకొర నిధులు కేటాయించడంతో నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. ఈ విషయంపై గోరుకల్లు జలాశయ ఈఈ సుభకుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం రూ. 65లక్షల నిధులు కేటాయించిందన్నారు. ఈ నిధులతో గ్యాలరీలో కొంత మేర జంగిల్ క్లియరెన్స్, గేట్లుకు మరమ్మతులు, ఇతర పనులు చేయాల్సి ఉందని చెప్పారు. -
పొలం పారదు.. పంట పండదు!
శిరివెళ్ల: కేసీ కెనాల్ రైతులకు సాగు నీటి బెంగ పట్టింది. ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధిలో కేసీ కెనాల్, తెలుగు గంగ కాల్వల కింద 7,513 హెక్టార్లలో వరి సాగు కావాల్సి ఉంది. అయితే 11,258 హెక్టార్లలో పంట వేశారు. ఎకరానికి రూ. 40 వేల నుంచి రూ. 45 వేల వరకు పెట్టుబడి పెట్టారు. ఫిబ్రవరిలో మూడు రోజుల పాటు నీరు రాలేదు. మార్చి నెలలో అదే పరిస్థితి ఉండటంతో రైతులు అందరూ వెళ్లి అధికారులతో చర్చించారు. మార్చి చివరి వరకు పుల్కలంగా నీరు ఇవ్వలేవని అధికారులు చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు. కేసీ కెనాల్లో 16వ లాక్ కింద వంతుల ప్రకారం ఈ నెల 9న నీటిని నిలిపి వేశారు. వంతుల ప్రకారం నీరిస్తే చివరి ఆయకట్టు అందదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీ 21,22 లాక్ల కింద ఉన్న వరి చేనులకు నీరు అందకపోవడంతో ఎండిపోతున్నాయి. పెట్టుబడికి భారీగా డబ్బు ఖర్చు చేశామని, నీరు రాకపోవడంతో పంట పండబోదని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వంతుల ప్రకారమే నీరు కేసీ కెనాల్ కింద వేసిన పంటల రక్షణకు వంతుల ప్రకారం నీటిని ఇస్తాం. 16, 17 లాక్ల కింద పైరుకు నీటిని వదిలాం. వస్తున్న నీటిని పొదుపుగా వాడుకోవాలని రైతులను కోరుతున్నాం. – ప్రతాప్, కేసీ కెనాల్ ఈఈ కేసీ కెనాల్ రైతులకు కన్నీటి కష్టం -
ప్రశాంతంగా ఏఎన్ఎంల పదోన్నతి కౌన్సెలింగ్
కర్నూలు(హాస్పిటల్): సచివాలయాల్లో పనిచేసే ఏఎన్ఎం–3లకు ఎంపీహెచ్ఏ–ఎఫ్గా పదోన్నతి కల్పించా రు. ఈ మేరకు వీరికి కర్నూలు మెడికల్ కాలేజీలో కౌన్సెలింగ్ నిర్వహించి స్థానాలు కేటాయించారు. కౌన్సెలింగ్లో స్థానం పొందిన వారికి డీఎంహెచ్వో డాక్టర్ శాంతికళ, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు ఆర్డర్ కాపీలు అందజేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో 172 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. డీఎంహెచ్ఓతో పాటు ఏవో అరుణ, సూపరింటెండెంట్ పి. శ్రీనివాసుల కౌన్సెలింగ్ నిర్వహించి స్థానాలు కేటాయించారు. -
దివ్యాంగులకు యూడీఐడీ
శాశ్వత ఐడీ తప్పనిసరి దివ్యాంగులకు ఇప్పటి వరకు సదరం సర్టిఫికెట్లు జారీ చేసేవారు. అయితే ఇకపై శాశ్వతంగా ఆధార్కార్డు తరహాలో కేంద్ర ప్రభుత్వం యూడీఐడీను ప్రవేశపెట్టింది. దివ్యాంగులకు రానున్న రోజుల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అందాలన్నా ఈ కార్డు తప్పనిసరి కానుంది. దివ్యాంగులు ఆన్లైన్లో నమోదు చేసుకొని ఈ కార్డును పొందితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. – రయిస్ ఫాతిమా, ఏడీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ కర్నూలు(అర్బన్): దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, ఇతరత్రా సేవలకు సదరం స్థానంలో యూడీఐడీ (యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డు )ని అందించనుంది. దివ్యాంగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే చేయూత, ఇతర ప్రయోజనాలకు ఇప్పటి వరకు సదరం సర్టిఫికెట్ తప్పనిసరి. దీని కోసం దివ్యాంగులు గ్రామ సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో సదరం శ్లాట్ బుక్ చేసుకుంటే ప్రభుత్వం నిర్దేశించిన వైద్య శిబిరంలో వైద్యులు వైకల్య నిర్ధారణ అనంతరం సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సదరం సర్టిఫికెట్లకు స్వస్తి పలికింది. ఆ స్థానంలో యూడీఐడీని పొందేందుకు స్వాలంబన్కార్డు.జీఓవీ.ఇన్ (https://swavlambancard. gov.in) అనే వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో దివ్యాంగులు నేరుగా ఇంటి వద్ద నుంచే ఫోన్, ఇంటర్నెట్ సెంటర్, మీ సేవా కేంద్రాల నుంచి కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సులభతరంగా సేవలు ... కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన యూడీఐడీ పోర్టల్ వల్ల సేవలు చాలా సులభతరం కానున్నాయి. ఇకపై సదరం శిబిరాల కోసం మీ సేవతో పాటు యూడీఐడీ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి సదరం శిబిరాలకు సంబంధించి ఎప్పుడు హాజరు కావాలనే సమాచారం దివ్యాంగుల ఫోన్ నెంబర్కు సంక్షిప్త సందేశం రూపంలో వస్తుంది. దివ్యాంగులు ఆన్లైన్లో దరఖాస్తు చేసే సమయంలో ఎలాంటి తప్పులు, అక్షరదోషాలు లేకుండా చూసుకోవాలి. ఇప్పటి వరకు ఐదు రకాల వైకల్యం ఉన్న వారికే మీ సేవ ద్వారా సదరం శిబిరాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. ఇక యూడీఐడీ పోర్టల్లో 21 రకాల వైకల్యాలను చేర్చారు. తలసేమి యా, ఆటిజం, యాసిడ్ బాధితులు, న్యూరో సంబంధిత బాధితులు కూడా సదరం శిబిరాల కోసం యూడీ ఐడీ పోర్టల్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. సదరం శిబిరంలో వైకల్య నిర్ధారణ పూర్తయిన అనంతరం సర్టిఫికెట్లను స్మార్ట్ కార్డు రూపంలో పోస్టల్శాఖ ద్వారా ఇంటికే పంపించనున్నారు. ఈ కార్డు ద్వారా చేయూత పింఛన్లతో పాటు ఇతర పలు సంక్షేమ ప్రయోజనాలకు దేశ వ్యాప్తంగా చెల్లుబాటు కానుంది. యూనిక్ డిజేబులిటీ ఐడీ కార్డులను ఆన్లైన్ నుంచే డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. ఇప్పటి వరకు ఉన్న సదరం సర్టిఫికెట్లు మన రాష్ట్రంలో మాత్రమే చెల్లుబాటు అయ్యేవి. ఇలా దరఖాస్తు చేసుకోండి ... ఆన్లైన్లో స్వాలంబన్కార్డు.జీఓవీ.ఇన్ వెబ్సైట్ను సందర్శించాలి. అప్లయ్ బటన్పై క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి కొన్ని సూచనలు ఉంటాయి. వాటిని పూర్తిగా చదివి అర్థం చేసుకొని తరువాత అంగీకరిస్తు సబ్మిట్ క్లిక్ చేస్తే దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది. దివ్యాంగులు వారికి చెందిన పూర్తి సమాచారాన్ని అక్కడ అడిగిన విధంగా నమోదు చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతుంది. వైద్య పరీక్షల అనంతరం వెబ్సైట్లో అర్జీల స్టేటస్ను నిత్యం పరిశీలించుకోవచ్చు. కొత్త పోర్టల్ను అందుబాటులోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం 21 రకాల సేవలు సులువుగా పొందే అవకాశం -
దశల వారీగా 24 గంటల విద్యుత్
కొత్తపల్లి: ఎలాంటి కోతలు లేకుండా గ్రామాలకు దశల వారీగా ప్రతి రోజూ 24 గంటలు కరెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ జిల్లా ఎస్ఈ సుధాకర్ కుమార్ తెలిపారు. కొత్తపల్లి మండలం గోకవరం విద్యుత్ సబ్స్టేషన్లో త్రీఫేజ్ చార్జింగ్ యూనిట్ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ఆర్డీఎస్ఎస్ (రీవ్యాప్ట్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్) స్కీంతో జిల్లాలో 249 ఫీడర్లకు దశల వారీగా 24 గంటలు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా ఇవ్వనున్నామన్నారు. జిల్లా విద్యుత్ శాఖ ఈఈ శ్రీనివాసులు, ఆత్మకూరు ఈఈ జయశంకర్, ఆత్మకూరు, నంద్యాల డీఈఈలు రామసుబ్రమణ్యం, రంగస్వామి పాల్గొన్నారు. వైభవంగా సుయతీంద్రతీర్థుల పూర్వారాధన మంత్రాలయం: నవ మంత్రాలయ శిల్పి, రాఘవేంద్రస్వామి మఠం పూర్వపు పీఠాధిపతి సుయతీంద్రతీర్థులు పూర్వారాధన వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో మంగళవారం వేకువ జామున సుప్రభాత సేవతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత పీఠాధిపతి గురువులైన సుయతీంద్రతీర్థుల వేడుకలు శాస్త్రోక్తంగా చేపట్టారు. ముందుగా స్వామిజీ మూల బృందావనానికి నిర్మల్య విసర్జన గావించి పుష్ప, పంచామృతాభిషేకం చేపట్టి ప్రత్యేక పూలతో విశేష అలంకరణ గావించారు. వేడుకల్లో భాగంగా యాగ మంటపంలో సుయతీంద్రతీర్థుల ప్రశస్థితి భక్తులకు ప్రవచించారు. -
ఎవరు న్యాయం చేస్తారు?
మాకు తల్లిదండ్రుల నుంచి వచ్చిన పొలం ఆస్తిగా ఉంది. రికార్డుల ప్రకారం అడంగల్లో వారసత్వం ఉండగా వన్బీలో దానం కింద నమోదు అయి ఉంది. మాకు వారత్వం ఆస్తిగా మార్చాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. 2023లో వన్బీలో వారసత్వం ఉండగా 2025లో అదే ఆస్తి దానం కింద వన్బీలో నమోదు అయి ఉంది. ఈ రికార్డులన్నీ మాకు తెలియకుండానే అధికారులు మార్పు చేస్తున్నారు. మాకు ఎవరు న్యాయం చేస్తారు. –కురువ రామలింగడు, యాపదిన్నె, డోన్ మండలం -
అసౌకర్యాల మధ్యనే పది పరీక్షలు
నంద్యాల(న్యూటౌన్)/చాగలమర్రి/బొమ్మలసత్రం/డోన్ టౌన్: పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. పలుచోట్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు కొన్ని తప్పిదాలు చేశారు. మొదటి రోజు తెలుగుకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 130 కేంద్రాల్లో 24,907 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉంది. అయితే 24,512మంది విద్యార్థులు పరీక్ష రాయగా 394 మంది గైర్హాజరయ్యారు. ఆళ్లగడ్డ, శిరివెళ్ల, నంద్యాలతో పాటు 20 పరీక్ష కేంద్రాలను స్టేట్ అబ్జర్వర్ అబ్రహం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాస్ కాపీయింగ్ జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రం మార్పు నంద్యాల పట్టణంలోని ఎస్పీజీ పరీక్ష కేంద్రంలో లైట్లు, ఫ్యాన్లు లేవని విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం ఉదయం డీఈఓ జనార్దన్రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీఈఓ స్పందిస్తూ బుధవారం జరిగే పరీక్షకు కేంద్రాన్ని పక్కనున్న ఎస్పీజీ జూనియర్ కళాశాలలోకి మారుస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతృప్తి చెందారు. అరగంట ఆలస్యంగా ప్రశ్నపత్రం పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించాల్సి ఉంది. అయితే చాగలమర్రి ఓరియంటల్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉదయం 9.30 గంటలకు ఇవ్వాల్సిన ప్రశ్న పత్రాన్ని అరగంట ఆలస్యంగా 10.00 గంటలకు ఇచ్చినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. తెలుగు ప్రశ్నపత్రాలు పాత, కొత్త సిలబస్ ప్రకారం వచ్చాయని, వాటిని గుర్తించి వేరు చేయడంతో 10 నిమిషాలు ఆలస్యం అయ్యిందని పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ తెలిపారు. ముగ్గురికి షోకాజ్ నోటీసులు నంద్యాల ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఒక విద్యార్థికి జీరోవన్టీ కాకుండా జీరోత్రీటీ ప్రశ్నపత్రం ఇచ్చారు. దీంతో ఆ విద్యార్థి ఆ పరీక్షనే రాశారు. తప్పుడు ప్రశ్నపత్రం ఇచ్చిన ఇన్విజిలేటర్, చీఫ్ డిపార్టుమెంటల్, డిపార్టుమెంటల్ ఆఫీసర్లకు ముగ్గురికి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు డీఈఓ తెలిపారు. ఇన్విజిలేటర్ను రిలీవ్ చేశామన్నారు. పోలీస్ భద్రత పరిశీలన పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ అదిరాజ్సింగ్ రాణా తెలిపారు. నంద్యాల ఎస్పీజీ హైస్కూల్ పరీక్ష కేంద్రం వద్ద పోలీస్ భద్రతను ఆయన పరిశీలించారు. విద్యార్థులు నిర్దేశించిన సమయంలో కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు. ఎస్పీతో పాటు సీఐలు కంబగిరిరాముడు, మోహన్రెడ్డి తదితరులు ఉన్నారు. ఎండలో విద్యార్థులు డోన్ బాలికల హైస్కూల్ల్లో పదోతరగతి పరీక్షలు జరుగుతున్నాయి. స్కూల్ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభించాల్సి ఉంది. అయితే విద్యార్థినులు 12 గంటలకే వచ్చారు. స్కూల్ గేట్లు మధ్యాహ్నం 12.45 గంటల వరకు తెరవక పోవడంతో రోడ్డుపై ఎండలో నిలుచోవాల్సి వచ్చింది. -
కందిపప్పు ఇవ్వలేదు
మార్చి నెలకు సంబంధించి బియ్యం, చక్కెర మాత్రమే సరఫరా చేశారు. కందిపప్పు ఇవ్వలేదు. గతంలో వీటితోపాటు జొన్నలు, రాగులు, తదితర నిత్యావసరాలు అందించారు. కందిపప్పు, ఇతర నిత్యావసరాలు అందకపోవడంతో బయటి మార్కెట్లో అధిక ధర పెట్టి కొనుగోలు చేయడం భారంగా మారింది. – రఘు, కార్డుదారుడు, కోవెలకుంట్ల రంజాన్ తోఫా ఇవ్వాలి గతంలో రంజాన్ పండుగకు గోధుమపిండి, చక్కెర, సేమియాలు, ఆయిల్. నెయ్యితో కూడిన తోఫా ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఎలాంటి తోఫాలు ఇవ్వడం లేదు. ఈ నెల 31వ తేదీన రంజాన్ పండుగ ఉంది. పండుగను దృష్టిలో ఉంచుకుని గతంలో మాదిరిగానే రంజాన్ తోఫా ద్వారా సరుకులు అందజేయాలి. – దస్తగిరి, కార్డుదారుడు, కోవెలకుంట్ల -
పండుగలు ఉన్నా.. ప‘రేషాన్’
2014 నుంచి 2019వ సంవత్సరాల మధ్య కాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం హిందువుల ముఖ్య పండుగలతోపాటు రంజాన్ పండుగకు పండుగ తోఫా పేరుతో వివిధ రకాల నిత్యావసర సరుకులు సరఫరా చేసింది. 2024 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ 10 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క పండుగకు తోఫాలు పంపిణీ చేయలేదు. గతంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని కార్డుదారులైన ముస్లిం కుటుంబాలకు గోధుమపిండి, చక్కెర, సేమియా, ఆయిల్, నెయ్యితో కూడిన తోఫా అందజేసింది. ఈ నెల 31వ తేదీన రంజాన్ పండుగ ఉండటంతో ఇప్పటి వరకు రంజాన్ తోఫా ఊసే లేకపోవడంతో ముస్లింలు పెదవి విరుస్తున్నారు. రేషన్ షాపుల ద్వారా బియ్యం, చక్కెర తప్ప ఇతర సరుకులు ఇవ్వకపోగా రంజాన్ పండుగకు ఎలాంటి సరుకులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంజాన్ తోఫా ఒట్టిదేనా..కోవెలకుంట్ల: పేదల సంక్షేమాన్ని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రతి నెలా అందించే రేషన్ సరుకుల్లో భారీగా కోత పెడుతోంది. కార్డుదారులకు అన్ని రకాల సరుకులు అందడం లేదు. రేషన్ షాపుల్లో బియ్యం, చక్కెర తప్ప మిగిలిన నిత్యావసరాలు పంపిణీ కావడం లేదు. ఈ నెల హిందువులకు, ముస్లింలకు పెద్ద పండుగలు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వంలో కనీస స్పందన కరువైంది. ప్రజలకు బియ్యం, చక్కెర మినహా మిగిలిన ఏ ఒక్క నిత్యావసర సరుకులు అందలేదు. జిల్లాలోని కోవెలకుంట్ల, బనగానపల్లె, ఆళ్లగడ్డ, డోన్, ఆత్మకూరు, శ్రీశైలం, రుద్రవరం, నందికొట్కూరు, నంద్యాల, ప్యాపిలి మండలాల్లో ఎంఎల్ఎస్ పాయింట్లు ఉన్నాయి. ఆయా ఎంఎల్ఎస్ పాయింట్ల పరిధిలో 1,204 రేషన్ షాపులు ఉండగా 351 ఎండీయూ వాహనాల ద్వారా ప్రతి నెలా ప్రజా పంపిణీ కొనసాగుతోంది. జిల్లాలో 5.33 లక్షల రేషన్కార్డులకు సంబంధించి ప్రతి నెలా 71,074 క్వింటాళ్ల బియ్యం, 2,666 క్వింటాళ్ల చక్కెర సరఫరా చేస్తున్నారు. పండుగలు ఎలా జరుపుకోవాలి? జిల్లాలో మార్చి నెలకు సంబంధించి కార్డుదారులకు బియ్యం, చక్కెరతోనే సరిపెట్టారు. కందిబేడలకు మార్కెట్లో ధర పెరగడంతోపాటు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో సబ్సిడీపై అందించకుండా కోత పెట్టినట్లు తెలుస్తోంది. మార్కెట్లో కందిపప్పు కిలో రూ. 150 ధర పలుకుతుండటంతో పేద, సామాన్య ప్రజలుకు కొనడం భారంగా మారింది. ఈ నెలలో కార్డుదారులకు కందిపప్పు పంపిణీ చేయకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరులో హిందువులకు ఉగాది పండుగ ఉంది. అలాగే ముస్లింలకు పవిత్ర రంజాన్ పండుగ వస్తోంది. పండుగల నేపథ్యంలో సైతం ప్రభుత్వం కందిపప్పు, ఇతర నిత్యావసర సరుకులు ఇవ్వలేదు. పండుగలు ఎలా జరుపుకోవాలని ఆందోళన చెందుతున్నారు. ఎండీయూ వాహనాలేవీ? గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ సరఫరా చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎండీయూ వాహనాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో కొందరు ఆపరేటర్లు విధుల నుంచి తప్పుకోవడం, కొన్ని గ్రామాల్లో ఆపరేటర్లను బలవంతంగా తొలగించారు. ఎండీయూ వాహనాలు లేని గ్రామాల్లో డీలర్లు ఇళ్ల వద్ద ప్రజా పంపిణీని కొనసాగిస్తున్నారు. గతంలో ఇంటి వద్దనే సరుకులు అందేవని, ప్రస్తుతం డీలర్ల ఇంటి వద్దకు వెళ్లి సరుకులు తెచ్చుకోవాల్సి వస్తోందని కార్డుదారులు వాపోతున్నారు. మరికొన్ని వాహనాలు మరమ్మతులకు గురికావడంతో ఎండీయూ వాహనాల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ఒకవైపు సరుకుల్లో కోత, మరోవైపు సరుకులు సక్రమంగా ఇంటికి సరఫరా కాక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు బియ్యం, చక్కెరతోపాటు కందిపప్పు, జొన్నలు, రాగులు, తదితర నిత్యావసర సరుకులు కార్డుదారుల ఇళ్లవద్దనే సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. త్వరలో సరఫరా చేస్తాం కోవెలకుంట్ల స్టాక్ పాయింట్కు మార్చి నెలకు సంబంధించి కందిపప్పు కొంత మేర సరఫరా అయింది. ఈ నెల 20 తర్వాత పూర్తిస్థాయిలో అందుతుంది. కంది పప్పు వచ్చిన వెంటనే కార్డుదారులకు పంపిణీ చేస్తాం. – నాగేశ్వరరెడ్డి, సీఎస్ డీటీ, కోవెలకుంట్ల రేషన్ సరుకుల్లో భారీ కోత కార్డుదారులకు అందని కందిపప్పు ఇంటి వద్దకు రాని ఎండీయూ వాహనాలు ఇప్పటి వరకు రంజాన్ తోఫా ఊసేలేదు ఉగాది పండుగ వస్తున్నా అందని నిత్యావసరాలు ప్రజలకు తప్పని తిప్పలు -
అర్జీలన్నింటినీ పరిష్కరిస్తున్నాం
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వస్తున్న అర్జీలన్నింటినీ పరిష్కరిస్తున్నాం. అర్జీలు పరిష్కారం కావడం లేదన్నది అవాస్తవం. ఎన్ని సమస్యలు వచ్చాయి.. ఎన్ని పరిష్కారమయ్యాయి.. రికార్డులో చూస్తే తెలిసిపోతుంది. భూ సమస్యలు కొంత ఆలస్యమైనా పరిష్కరిస్తున్నాం. కొన్ని అర్జీలు మళ్లీ వస్తున్నాయి. వాటి పరిష్కారానికి గడువు 30 రోజులు, 14 రోజుల వరకు ఉంటుంది. ఆ గడువు ముగియకుండానే కొందరు మళ్లీ అర్జీలు ఇస్తున్నారు. పీజీఆర్ఎస్లో వస్తున్న సమస్యలను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పని చేసేలా కింది స్థాయి అధికారులను ఆదేశిస్తున్నాం. –జి.రాజకుమారి, జిల్లా కలెక్టర్, నంద్యాల -
చర్యలు తీసుకోవాలని అర్జీ
ఈ చిత్రంలో కనిపిస్తున్న ఇద్దరు వృద్ధుల పేర్లు సాలమ్మ, పుష్పవతి. సొంత అక్కాచెల్లెళ్లు. వీరిది పాణ్యం మండలం భూపనపాడు గ్రామం. వీరి తల్లిదండ్రులు భూపనపాడు గ్రామంలో రెండెకరాల భూమిని ఇతరుల నుంచి కొనుగోలు చేశారు. అప్పటికే ఆభూమిని వీరి సోదరుడి కుమారుడు సురేష్ అభుభవిస్తున్నాడు. అక్కాచెల్లెళ్లు కోర్టును ఆశ్రయిస్తే .. రెండెకెరాల భూమిని ముగ్గురికి పంపకాలు చేసింది. ఈప్రకారం పాణ్యం రెవెన్యూ అధికారులు ఆన్లైన్లో పేర్లు చేర్చి పాస్బుక్లు మంజూరు చేశారు. ప్రస్తుతం ఇద్దరు వృద్ధులు పొలం సాగు కోసం వెళితే ‘‘ఇక్కడ మీభూమి లేదు’’ అంటూ సోదరుడి కుమారుడు బెరిదింపులకు పాల్పడుతున్నాడు. తమను ఇబ్బందులకు గురి చేస్తున్న వారితో పాటు వారికి సహకరిస్తున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని అర్జీలు ఇచ్చారు. -
కన్న ప్రేమకు ‘పరీక్ష’
ఉయ్యాలవాడ: కన్న తల్లి ప్రేమ వెలకట్టలేనిది. పిల్లాడి మానసిక స్థితి ఎలా ఉన్నా ఆ తల్లికి అతనిలో రాజకుమారుడే కనిపిస్తాడు. సోమవారం నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షలకు మానసిక వికలాంగుడైన కుమారుడిని ఓ తల్లి భుజానికెత్తుకొని పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చిన తీరు ప్రతి ఒక్కరినీ హృదయాలను ద్రవింపజేసింది. దొర్నిపాడు మండలం క్రిష్టిపాడు గ్రామానికి చెందిన మారెన్నగారి బాలపుల్లయ్య, దేవి దంపతుల కుమారుడు దిలీప్ కుమార్ పుట్టుకతోనే మానసిక వికలాంగుడు. 1 నుంచి 8వ తరగతి వరకు స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే విద్యనభ్యసించాడు. అనంతరం సొంత గ్రామానికి సమీపంలో వున్న ఉయ్యాలవాడ మండలం హరివరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9, 10 తరగతులు చదువుతున్నాడు. సోమవారం నుంచి ప్రారంభమైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను రాయించేందుకు కుమారుడి తల్లి ఆటోలో పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చింది. అక్కడి నుంచి భుజానికెత్తుకొని కేంద్రంలోకి తీసుకెళ్లింది. కుమారుడు ప్రశ్నలకు జవాబులు చెబుతుండగా స్రైబ్ సలీమ్ రాస్తున్నట్లు తల్లి దేవి వివరించింది. కుమారుడి భవిష్యత్ కోసం తల్లి తపనను చూసి పరీక్ష రాసేందుకు వచ్చిన మిగిలిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనంద బాష్పాలు కార్చారు. -
మిర్చి రైతుకు దక్కని భరోసా
● కాయకుళ్లుతో భారీగా పెరిగిన పెట్టుబడి వ్యయం ● ఎకరాకు రూ.1.50 లక్షల వరకు ఖర్చులు ● సగటు దిగుబడి 15 క్వింటాళ్లకే పరిమితం ● ఇందులోనూ 30–40 శాతం తాలు కాయలు ● నేడు మిర్చికి లభిస్తున్న ధర రూ.10 వేలలోపే -
క్వింటాకు రూ.10 వేల వరకే ధర
గత ఏడాది పండించిన మిర్చి ఇప్పటికీ గోదాముల్లో ఉంది. ఈ సారి 3.50 ఎకరాల్లో మిర్చి సాగు చేశాం. ఎకరాకు పెట్టుబడి వ్యయం రూ.1.50 లక్షల వరకు వస్తోంది. ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చి ధర కనీసం రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు లభిస్తేనే గిట్టుబాటు అవుతుంది. ప్రస్తుతం ఇప్పటి వరకు 60 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇందులో 20 క్వింటాళ్లు తాలు కాయలే. ప్రస్తుతం దళారీలు క్వింటా రూ.10 వేల చొప్పున అడుగుతున్నారు. ఈ ధరతో అమ్ముకుంటే పెట్టుబడి కూడా దక్కదనే భయంతో ఏసీ గోదాముల్లో నిల్వ చేశాం. – ఎర్ర చిన్న సతీష్, బసలదొడ్డి, పెద్దకడుబూరు మండలం -
గరుడ వాహనంపై ఊరేగిన ప్రహ్లాదవరదుడు
ఆళ్లగడ్డ: అశేష భక్తుల గోవింద నామస్మరణ మధ్య ప్రహ్లాదవరదుడు గరుడ వాహనంపై ఊరేగారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారు జాము వరకు ఈ కార్యక్రమం సాగింది. అహోబిలేశుడి బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన ఘట్టం గరుడసేవ (గరుడోత్సవం). బ్రహ్మోత్సవాలు మొదలైనప్పటి నుంచి స్వామి వారికి జరిగే ప్రత్యేక కార్యక్రమాలు, అలంకరణలు, ఉత్సవాలు ఒక ఎత్తైతే చివరి రోజు నిర్వహించే గరుడోత్సవం ఓ ఎత్తు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కుబడులు చెల్లించుకోవడం ఆనవాయితీ. దీంతో శనివారం నుంచే దిగువ అహోబిలం భక్త జనసందోహంతో కిటకిటలాడింది. ఉదయం ఉత్సవమూర్తులను కోనేరు దగ్గరకు తోడ్కొని వెళ్లి తీర్థవారి చక్రస్నానం, సాయంత్రం ద్వాదశారాధనం, రాత్రి పుష్పయాగం నిర్వహించారు. అర్ధరాత్రి అనంతరం శ్రీ ప్రహ్లాదవరదుడు వజ్రవైడూర్యాలు , బంగారు అభరణాలు ధరించి గరుడ వాహనాన్ని అధిష్టించి తిరువీధుల్లో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. పండుగలా లక్ష్మీనృసింహస్వామి తెప్పోత్సవం భూదేవి లక్ష్మీసమేతుడైన ప్రహ్లాదవరద స్వామి తెప్పోత్సవం దిగువ అహోబిలం కోనేరులో ఆదివారం కనులపండువగా సాగింది. ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై కొలువుంచి మాడ వీధుల్లో ఊరేగింపుగా కోనేటి వరకు తీసుకొచ్చారు. అక్కడ వేదపండితుల పూజలు అందుకున్న ప్రహ్లాదవరద స్వామి ఉభయ దేవేరులతో తెప్పను అధిరోహించి విహరించారు. గంటపాటు సాగిన ఈ కార్యక్రమాన్ని భక్తులు తిలకించి పరవశించారు. భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగిన దిగువ అహోబిలం వైభవంగా లక్ష్మీనృసింహస్వామి తెప్పోత్సవం -
‘సర్వే’జనా.. ఆందోళన
గోస్పాడు: సంపద సృష్టిస్తాం.. సంక్షేమ పథకాలు అందిస్తాం’ అంటూ ఎన్నికలు ముందు ఆర్భాటాలు పలికిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సంక్షేమాన్ని విస్మరించారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కొన్నింటిని నిలిపివేయడంతో పాటు మరికొన్ని పథకాల్లో లబ్ధిదారులకు కోత పెట్టారు. సామాజిక పింఛన్లలో వృద్ధుల పింఛన్లు ఇప్పటికే కొన్ని నిలిపివేయగా, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు, దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్లకు కూడా కోత వేసే దిశగా సర్కారు ఇప్పటికే ప్రత్యేకంగా సదరం క్యాంపుల పేరుతో వైద్యపరీక్షలు చేపడుతోంది. ఈ క్రమంలోనే చడీచప్పుడూ లేకుండా పీ – 4 సర్వే నిర్వహిస్తుండటం ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది. ఈ సర్వేతో భవిష్యత్తులో ఏమైనా పథకాలు అమలు చేస్తే తాము అనర్హులుగా ప్రకటిస్తారేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 6.05 లక్షల కుటుంబాలు నివసిస్తుండగా, వారిలో 80 శాతం 4,56,786 లక్షల కుటుంబాలకు సర్వే చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 4,55,815 కుటుంబాలను సర్వే (99.79 శాతం) చేయడంతో పూర్తి చేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఫోన్, టీవీ, ఏసీ, ఇతర గృహోపకరణాలు, బైకులు, ఇళ్ల స్వరూపం, రేకులా, స్లాబా, బ్యాంక్ అకౌంట్ వివరాలు అంటూ 27 రకాల ప్రశ్నల్ని సంధించి సమాధానాలను నమోదు చేసి ఆపై ప్రజల మొబైల్కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి పీ–4 సర్వే నిర్వహిస్తుండటం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి వారి అభ్యున్నతికి కృషిచేయడమే సర్వే ముఖ్య ఉద్దేశమని పైకి చెబుతున్నప్పటికీ సర్వేపై ప్రజలకు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. తప్పనిసరిగా నమోదు చేయాల్సిందే.. సర్వేలో సిబ్బంది పొందుపరిచే అంశాలన్నీ ప్రస్తుత జీవనశైలిలో భాగమైనవే. స్మార్ట్ఫోన్లు, బైకులు వంటివి ఉన్నాయా ఇలాంటి ప్రశ్నలు ఉండటంతో సంక్షేమ పథకాల్లో కోతపడుతుందనే ఆందోళనతో ప్రజలెవరైనా సర్వేకు నిరాకరిస్తే, వారి పేర్లను సైతం నమోదు చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీతో కలవరానికి గురిచేస్తోంది. అలాంటి వివరాలు నమోదు చేసినప్పుడు కూడా బయోమెట్రిక్ ద్వారా ధ్రువీకరించాలని చెప్పడంతో అనుమానాలు బలపడుతున్నాయి. సంపాదనపరుల జాబితాలో వ్యవసాయ కూలీలు, పెన్షనర్ల పేర్లు కూడా చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సర్వేగుట్టు వారికే ఎరుకని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏసీ ఉన్నా ధనికులేనా... జిల్లాలో 5.34 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులున్నాయి. కొత్త రేషన్ కార్డుల కోసం మరికొన్ని వేల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. వీరందరినీ దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలుగానే పరిగణించాల్సి ఉంది. అయితే అప్పో సప్పో చేసి, నెలవారీ వాయిదాల పద్ధతిలోనో, లేక మరే ఇతర పద్ధతుల్లోనో ప్రజలు వారి వారి ఇళ్లలో ఏసీలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ సదరు వివరాలను ప్రభుత్వ రికార్డుల్లో సిబ్బంది నమోదు చేస్తున్నారు. ఇలాచేస్తే తమకు సంక్షేమ పథకాలు ఆగిపోతాయనే ఆందోళన మధ్యతరగతి ప్రజల్లో నెలకొంది . నాడు సంక్షేమ పండుగ.. ప్రస్తుతం అన్నింటికీ పాతరే... ఊరూరా పీ–4 సర్వే చేపట్టిన కూటమి ప్రభుత్వం ఇళ్లలో ఉండే వస్తువుల వివరాలు నమోదు సంక్షేమ పథకాల కోత పడుతుందని ప్రజల అనుమానం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నవరత్నాల పేరిట అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్ల ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించారు. కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సంక్షేమం పూర్తిగా అటకెక్కింది. ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునే వ్యూహంలో భాగంగా చంద్రబాబు నేతత్వంలోని కూటమి నాయకులు ప్రజలకు ఇబ్బడిమొబ్బడిగా హామీలిచ్చారు. అధికారంలోకి వస్తూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటమార్చారు. పెన్షన్ రూ.వెయ్యి పెంచామని గొప్పలు చెప్పకుంటున్న ప్రభుత్వం విచారణ పేరుతో వేలాది పెన్షన్లను తొలగిస్తున్నారని ఇప్పటికే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పీ–4 సర్వే చేపట్టడం కూడా ఇందులో భాగమేననే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. సందేహాలు ఎన్నో... కుటుంబ సభ్యుల పేరుతో వ్యవసాయ భూమి ఎంత ఉంది, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని సొంత గృహాలున్నాయి, నాలుగు చక్రాల వాహనాలు ఏమైనా ఉన్నాయా, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారా, ఇన్కం ట్యాక్స్ ఏమైనా చెల్లిస్తున్నారా, నెలకు విద్యుత్ వినియోగం ఎంత, తదితర వివరాలను కూడా సచివాలయ సిబ్బంది సేకరిస్తున్నారు. ఎక్కువభాగం ఆదాయానికి సంబంధించిన ప్రశ్నలే ఉండటం పలు సందేహాలకు తావిస్తోంది. అపోహలు వద్దు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి వారి అభ్యున్నతికి కృషి చేయడమే పీ–4 సర్వే ముఖ్య ఉద్దేశం. జిల్లా లో ఇప్పటికే ప్రభుత్వం నిర్దేంచిన మేరకు సర్వే దాదాపుగా పూర్తి చేశాం. గ్రామసభల ద్వారా సర్వే జాబితాను ప్రజలకు తెలియజేసేలా ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు యథావిధిగా కొనసాగుతాయి. ఇందులో ఎలాంటి అపోహలకు తావు లేదు. –శివారెడ్డి, డీఎల్డీఓ, నంద్యాల -
షుగర్ వ్యాధి బారిన పడకుండా ఒక్కొక్కరు ఒక్కో ఆరోగ్య సూత్రాన్ని పాటిస్తుంటారు. ఒకరు రైస్ తినకూడదంటారు.. ఇంకొకరు నడక మంచిదంటారు.. ఒక వయస్సుకు వచ్చిన తర్వాత వ్యాధి బారిన పడటం ఒక ఎత్తయితే, రాకుండా జాగ్రత్త పడటం ఇంకొక ఎత్తు. మరి పుట్టుకతోనే ఈ వ్యాధి తోడుగా వస
కథనం.● కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీకి చెందిన యువకునికి పుట్టుకతోనే షుగర్ వ్యాధి వచ్చింది. వైద్యులు పరిశీలించి టైప్–1 డయాబెటిస్గా నిర్ధారించారు. అప్పటి నుంచి ఇన్సులిన్ను ఇంజెక్షన్ రూపంలో అందిస్తున్నారు. ప్రస్తుతం ఇతని వయస్సు 30 ఏళ్లు. రోజూ ఇంజెక్షన్ వేయించుకోవాలంటే బాధగా ఉంటోందని, కానీ బతకాలంటే తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. స్వీట్లు అంటే ఇష్టమని, కానీ తింటే పరిస్థితి దారుణంగా ఉంటుందని వాపోతున్నాడు.కోవిడ్ తర్వాత పెరిగిన కేసులు కోవిడ్–19 అనంతరం టైప్–1 డయాబెటిస్ రోగుల సంఖ్య పెరిగింది. గతంలో డయాబెటిస్ రోగులు 5 శాతం ఉండగా ఇప్పుడు 10శాతానికి చేరుకుంది. కోవిడ్ వైరస్ నేరుగా బీటా కణాలపై దాడి చేయడమే ఇందుకు కారణం. ఈ కారణంగా కోవిడ్కు గురైన వారికి జన్మించే పిల్లల్లో టైప్–1 డయాబెటీస్ ఎక్కువగా కనిపిస్తోంది. – డాక్టర్ పి.శ్రీనివాసులు, ఎండోక్రైనాలజీ హెచ్వోడి, జీజీహెచ్, కర్నూలు ఇన్సులిన్తో మాత్రమే చికిత్స చిన్నపిల్లల్లో వచ్చే టైప్–1 డయాబెటిస్కు ఇన్సులిన్తో మాత్రమే చికిత్స అందుబాటులో ఉంది. ఆయాసం, కడుపునొప్పి, వాంతులు లక్షణాలతో చిన్నపిల్లలను ఆసుపత్రికి తీసుకొస్తారు. అన్నిరకాల పరీక్షలు నిర్వహించి డయాబెటిస్ నిర్ధారణ అయ్యాక చికిత్స ప్రారంభిస్తాం. ఈ పిల్లలకు ఇన్సులిన్తో పాటు ఆహార నియమావళి తప్పనిసరి. – డాక్టర్ ఎం.మల్లికార్జున, అసోసియేట్ ప్రొఫెసర్, పీడియాట్రిక్స్, జీజీహెచ్, కర్నూలు● పగిడ్యాల: మండలంలోని పాత ముచ్చుమర్రి గ్రామానికి చెందిన మల్లయ్య, మానస దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు వెంకట ఉమామహేష్, రెండవ కుమారుడు లిఖిత్. 9 నెలల వయస్సు కలిగిన లిఖిత్కు పుట్టుకతోనే చక్కెర వ్యాధి తోడుగా వచ్చింది. తరచూ అపస్మారక స్థితికి చేరుకోవడం గమనించి కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రిలో సుమారు రూ.3లక్షలకు పైగా ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. షుగర్ లెవెల్స్ గుర్తించేందుకు మిషన్ తెచ్చుకుని వారానికోసారి ఇన్సులిన్ ఇంజెక్షన్ వేయించాల్సిన పరిస్థితి. నెలకు సుమారు రూ.5వేల దాకా ఖర్చవుతోందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కర్నూలు(హాస్పిటల్): పేరులో తియ్యదనం దాచుకున్న మహమ్మారి మధుమేహం. ఇది పెద్దలనే కాదు.. చిన్నారులనూ వదలని పరిస్థితి. పుట్టుకతోనే తోడుగా వచ్చి జీవించినంత కాలం వేధిస్తోంది. అందరిలా జీవించాలంటే రోజూ సూదిపోటుతో ఇన్సులిన్ మందు వేసుకోవడం తప్పనిసరి. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నబిడ్డలను తల్లిదండ్రులే స్వయంగా ఇంజెక్షన్ ద్వారా ఇన్సులిన్ ఇవ్వడం వారికీ నరకంతో సమానం. ఇలాంటి బాధితుల సంఖ్య సమాజంలో రోజురోజుకూ పెరుగుతోంది. శరీరంలోని క్లోమగ్రంధిలో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ గ్రంధిలో ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే కణాలను(బీటా కణాలు) వ్యక్తుల రోగనిరోధక వ్యవస్థ నాశనం చేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీన్ని టైప్–1 మధుమేహం(డయాబెటిస్) అంటారు. సాధారణంగా పిల్లలు, యువకుల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు బీటా కణాలను రోగినిరోధక వ్యవస్థ నిర్వీర్యం చేయడం కాకుండా క్లోమగ్రంధికి ఏదైనా వ్యాధి సోకినప్పుడు లేదా గాయం అయినప్పుడు బీటా కణాలు నిర్వీర్యం అవుతాయి. దీనిబారిన పడిన వారికి క్రమం తప్పకుండా ఇన్సులిన్ను ఇంజెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది కొంత మందికి జన్యుపరంగా కూడా రావచ్చు. మరికొంత మందికి పలు రకాల వైరల్ వ్యాధులు, ఇతర ప్రమాదకర అనారోగ్యాల కారణంగా కూడా ఈ పరిస్థితి ఎదురవ్వొచ్చు. అంతేకానీ ఆహారం, జీవనశైలి అలవాట్లు టైప్–1 డయాబెటిస్కు కారణం కావు. ప్రభుత్వాసుపత్రుల్లో అరకొర ఇన్సులిన్ ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్సతో పాటు ఇన్సులిన్ను ఉచితంగా అందించాల్సి ఉంది. అయితే గత 10 నెలలుగా వీరికి అరకొరగా ఇన్సులిన్ ఇస్తున్నారు. కేవలం కర్నూలు, నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలల్లో మాత్రమే అధికారులు స్థానికంగా కొనుగోలు చేసి ఇన్సులిన్ను కొద్దిమొత్తంలో అందజేస్తున్నారు. ఏరియా ఆసుపత్రులు, సీహెచ్సీలు, పీహెచ్సీల్లో ఇన్సులిన్ అందుబాటులో ఉండటం లేదు. దీంతో చాలా మంది మెడికల్ షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో చిన్నారికి వ్యాధి తీవ్రతను బట్టి నెలకు రెండు నుంచి నాలుగు ఇన్సులిన్ ఇంజెక్షన్లు అవసరం. పెరుగుతున్న చికిత్స వ్యయం మెడికల్షాపుల్లో ఒక్కో ఇన్సులిన్ ఖరీదు రూ.180 వరకు ఉంటోంది. ఈ మేరకు ప్రతి చిన్నారికి నెలకు రూ.600 నుంచి రూ.800 వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రులతో పాటు ప్రైవేటు క్లినిక్లు, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యుల వద్ద చికిత్స తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఆధునిక వైద్యవిధానాల మేరకు వారికి నొప్పి తక్కువగా ఉండే ఇన్సులిన్ పెన్నుల ద్వారా ఇంజెక్షన్ చేస్తున్నారు. వీటి ఖరీదు సాధారణ ఇన్సులిన్తో పోలిస్తే రెట్టింపుగా ఉంటుంది. లక్షణాలుచిన్నారుల్లో ‘తియ్యని’ బాధ పుట్టుకతోనే తోడవుతున్న షుగర్ వ్యాధి కోవిడ్ తర్వాత పెరిగిన టైప్–1 రోగులు వంశపారంపర్యం, పలు రకాల ఇన్ఫెక్షన్లు కారణం ఇన్సులిన్ తీసుకోవడం తప్పనిసరి పెరిగిన చికిత్స వ్యయంతో సతమతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో 50లక్షల వరకు జనాభా ఉంటుంది. ఇందులో 15 నుంచి 20 శాతం వరకు మధుమేహ బాధితులు. వీరిలో టైప్–2 మధుమేహ బాధితులు 90 శాతం కాగా.. టైప్–1 బాధితులు 10 శాతం పైనే. ఈ లెక్కన 7.50లక్షల నుంచి 10లక్షల వరకు మధుమేహ బాధితులు ఉండగా.. 75వేల నుంచి లక్ష దాకా చిన్నారులు ఉంటున్నారు. టైప్–1 డయాబెటిస్ లక్షణాలు బయటపడటానికి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పట్టవచ్చు. విపరీతమైన దాహం, తిన్న తర్వాత కూడా బాగా ఆకలివేయడం, నోరు తడి ఆరిపోవడం. కడుపునొప్పి, వాంతులు, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లడం. ఊహించని విధంగా బరువు తగ్గిపోవడం, అలసట, కంటిచూపు తగ్గిపోవడం. శ్వాస తీసుకోవడానికి ఎక్కువ కష్టపడటం, తరచుగా చర్మ, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు. మూడ్ మారిపోవడం, నిద్రలో మూత్రవిసర్జన చేయడం. -
స్వచ్ఛాంధ్రలో భాగస్వాములవ్వాలి
నంద్యాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పిలుపునిచ్చారు. శనివారం నంద్యాల పట్టణంలోని చిన్న చెరువు కట్ట వద్ద స్వర్ణాధ్ర–స్వచ్ఛాంధ్ర ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతినెల మూడో శనివారం చేపట్టే ఈ కార్యక్రమంతో రాష్ట్రం పరిశుభ్రంగా మారుతుందన్నారు. ఇంటి పరిసరాలతో పాటు పని చేసే ప్రదేశాలు, మన ఆలోచన లు కూడా పరిశుభ్రంగా ఉండాలని ఆయన సూచించారు. ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం– పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడం’ అనే థీమ్పై ప్రజల్లో అవగాహన కల్పించి ప్లాస్టిక్ రహిత సమాజంగా తీర్చిదిద్దాలన్నారు. అంతకుముందు చెరువుగట్టుపై ఆయన మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రజలందరి చేత స్వర్ణాధ్ర–స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో స్వర్ణాధ్ర–స్వచ్ఛాంధ్ర జిల్లా ఇన్చార్జి, స్పెషల్ అధికారి నివాస్, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నీసా, మున్సిపల్ కమిషనర్ నిరంజన్రెడ్డి, ఆర్డీఓ విశ్వనాథ్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ -
వైభవోపేతం.. గరుడోత్సవం
ఆళ్లగడ్డ: ఎగువ అహోబిలంలో వెలసిన ఉగ్ర నరసింహస్వామి గరుడోత్సం అంగరంగ వైభవంగా సాగింది. ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత ఉగ్ర నరసింహస్వామిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహుడు విశేష అలంకరణ గావించిన గరుడ వాహనాన్ని అధిష్టించి విద్వాంసుల మంగళకరమైన వాయిద్యాలు, వేద పండితుల మంత్ర పఠనములు.. భక్తుల గోవింద నామస్మరణల నడుమ అట్టహాసంగా ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. ఈ గరుడ మహోత్సవం శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారు జామువరకు కొనసాగాయి. ఎగువ అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం చేపట్టారు. శాస్త్రోక్తంగా తీర్థవారి చక్రస్నానం.. అహోబిల బ్రహ్మత్సోవాల ముగింపు సందర్భంగా దిగువ అహోబిలంలో ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా తీర్థవారి చక్రస్నానం నిర్వహించారు. ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాముల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి 108 కళశాలతో తిరుమంజనం నిర్వహించారు. అనంతరం సుదర్శనమూర్తికి, నిత్య అభిషేక ఉత్సవమూర్తికి కోనేరులో శాస్త్రోక్తంగా తీర్థవారి చక్రస్నానం చేయించారు. అర్చకులు, వేదపండితులు, ఆలయ అధికారులు, సిబ్బంది, వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ద్వాదశ ఆరాధనం, పుష్పయాగం వేడుక శనివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. తేజోమయం ఉగ్రనరసింహుడి దర్శనం శాస్త్రోక్తంగా ముగిసిన ఎగువ అహోబిలేశుడి బ్రహ్మోత్సవాలు -
మౌలిక వసతుల కల్పనకు కృషి
ఉయ్యాలవాడ: జిల్లాలో ముస్లింలకు సంబంధించిన ఈద్గా, మసీదులు, శ్మశాన వాటికల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారిణి సబిహా పర్వీన్ అన్నారు. శనివారం మండల కేంద్రమైన ఉయ్యాలవాడలో ఆమె పర్యటించారు. పరిశుభ్రత పనులను పరిశీలించా రు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని శుభ్రతలో ఆదర్శంగా తీర్చిదిద్దాలని తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు, ఈఓపీఆర్డీ వెంకటేశ్వరరావును ఆదేశించారు. అనంతరం గ్రామంలో మైనార్టీల సమస్యలపై ఆరా తీశారు. ఈద్గాకు ప్రహరీలేదని, అలాగే రంజాన్, బక్రీద్ పండుగల సమయంలో నమాజ్కు అక్కడికి వెళ్లేందుకు గ్రామం నుంచి రహదారి సౌకర్యం లేదని మండల కోఆప్షన్ మెంబర్ అమీర్ అహమ్మద్, మత పెద్దలు రెడ్డిపల్లె బాషా, హుసేనయ్య, చిన్న మౌలా లి ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్, ఆర్డబ్యూఎస్ ఏఈలు వెంకటయ్య, ఫణీత్ క్రిష్ణ, వీఆర్ఓ లక్ష్మీనారాయణరెడ్డి, పంచాయతీ కార్యదర్శి జయరామిరెడ్డి, సర్పంచ్ మేకల ఓబులేష్ తదితరులు పాల్గొన్నారు. -
అహోబిలేశుడి సేవలో..
ఆళ్లగడ్డ: అహోబిల లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ శనివారం దర్శించుకున్నారు. అహోబిలం చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాద ల్లో భాగంగా ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం దిగువ అహోబిలం క్షేత్రాల్లోని శ్రీ లక్మీనరసింహస్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అహోబిలం మఠం చేరుకుని పీఠాధిపతి శ్రీ రంగరాజ యతీంద్ర మహాదేశి కన్ ఆశ్వీరాదం తీసుకున్నారు. అర్చకులు స్వామివార్ల శేషవస్త్రం, ప్రసాదాలు అందజేసి వేదశ్వీరచనాలు అందించారు.రేపటి నుంచి ‘పది’ పరీక్షలు నంద్యాల(న్యూటౌన్): పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈనెల 17వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు డీఈఓ జనార్దన్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 25,542 మంది విద్యార్థులు 130 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే నెల 1వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయన్నారు. 581 మంది ఓపెన్ స్కూల్ పది విద్యార్థుల కోసం తొమ్మిది కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కాగా హాల్ టికెట్పై నంద్యాల ఎస్బీఐ కాలనీలోని నారాయణ స్కూల్ అని తప్పుగా పడిందని, దానిని పద్మా వతినగర్ నారాయణ స్కూల్ చిరునామాగా భావించాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు ఈ మార్పును విద్యార్థులకు తెలియజేయాలన్నారు. చేపల పెంపకంతో స్వయం ఉపాధి కర్నూలు(అగ్రికల్చర్): స్వయం ఉపాధిలో రాణించేందుకు చేపల పెంపకం చక్కటి అవకాశమని మత్స్యశాఖ కమిషనర్ రాంశంకర్నాయక్ తెలిపారు. శనివారం ఆయన కర్నూలు, సుంకేసుల డ్యామ్, గాజులదిన్నె ప్రాజెక్టుల్లో పర్యటించారు. కర్నూలు మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో 2024–25 సంవత్సరానికి సంబంధించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతిని సమీక్షించారు. జిల్లా ప్రగతిని జిల్లా మత్స్యశాఖ అధికారి శ్యామల కమిషనర్కు వివరించారు. కర్నూలు పాత బస్టాండు సమీపంలోని చేపల మార్కెట్ను తనిఖీ చేశారు. బంగారుపేట లోని దేశీయ మత్స్య శిక్షణా కేంద్రం(ఐఎఫ్టీసీ) లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నేడు మార్కెట్లో చేపలకు విశేషమైన డిమాండ్ ఉందని, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద చేపల మార్కెటింగ్కు అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పొదుపు మహిళల అను సంధానంతో చేపల ఉత్పత్తిని పెంచడం, వినియోగాన్ని విస్తృతం చేయనున్నట్లుగా పేర్కొన్నారు. పరీక్షలు ముగిశాయోచ్ ! నంద్యాల(న్యూటౌన్): ఇంటర్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. గురువారం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, శనివారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ముగిశాయి. చివరి రోజు జరిగిన కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షకు 11,660 మందికి గాను 11,346 మంది హాజరు కాగా 314 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు ముగిసిన అనంతరం కేంద్రాల వద్ద విద్యార్థులు సందడి చేశారు. చాలా రోజులుగా జిల్లా కేంద్రంలోని అద్దె గదులు, రెసిడెన్షియల్ కళాశాలలు, హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు ఆనందంగా ఇంటికి బయలుదేరారు. -
శ్రీగిరి భద్రతపై సమీక్ష
శ్రీశైలంటెంపుల్: ‘సాక్షి’ దిన పత్రికలో శనివారం ‘భగవంతుడా.. ఇదేమి భద్రతా’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు స్పందించారు. దేవ స్థాన భద్రతా విషయాలపై సమగ్ర పరిశీలన చేయాలని దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నరసింహారెడ్డిని ఈఓ ఆదేశించారు. ఈ మేరకు ఆయన క్యూలైన్ల వద్దకు చేరుకుని.. క్యూలైన్ ఏఈఓ, పర్యవేక్షకులు, భద్రతా పరికరాల పర్యవేక్షణ చేపట్టే ఇంజినీర్లు, సెక్యూరిటీ సూపర్ వైజర్ల తో సమీక్షించారు. మెటల్డోర్ ఫ్రేమ్ డిటెక్టర్లు కొన్ని పనిచేయడం లేదని, హ్యాండ్ డిటెక్టర్లు ఉన్నా.. వినియోగించేందుకు సిబ్బంది తక్కువ ఉన్నారని గుర్తించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భద్రతా ఏర్పాట్లు మరింత మెరుగుపరుస్తామన్నారు. లగేజ్ స్కానర్లు సైతం వినియోగంలోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. -
శనగ రైతుకు ‘ధరా’ఘాతం
ప్రభుత్వం ఆదుకోవాలి ఈ ఏడాది శనగ సాగు కలసి రాలేదు. తెగుళ్లు, తుఫాన్ ప్రభావంతో దిగుబడులు తగ్గాయి. మార్కెట్లో ధర లేకపోవడంతో దిగుబడులు అమ్ముకోలేని పరిస్థితులు తలెత్తాయి. జేజే–11 రకానికి రూ. 9 వేలు, తెల్లశనగకు రూ. 10 వేలు ధర కల్పించి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంట ఉత్పత్తులను విక్రయించి ఆదుకోవాలి. – గోవిందరెడ్డి, రైతు, గుంజలపాడు మార్కెట్లో ధర లేదు 12 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని సొంత పొలంతో కలసి 20 ఎకరాకు శనగ పంట సాగు చేశాను. వాతావరణం అనుకూలించక దిగుబడులు తగ్గిపోయాయి. తెల్ల శనగలో ఎకరాకు 5 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాలేదు. ప్రస్తుత మార్కెట్లో క్వింటా రూ. 6,500 ధర పలుకుతోంది. ఈ ధరకు అమ్ముకోలేక పంట ఉత్పత్తులను గోదాములో భఽద్రపరుచుకున్నాను. – అబ్రహం, రైతు, కంపమల్లగతేడాది ఇలా.. గత ఏడాది రబీ సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురియకపోవడంతో శనగసాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఎకరాకు రూ. 20 వేల వరకు పెట్టుబడి పెట్టారు. ఎకరాకు 3 నుంచి ఐదు క్వింటాళ్లలోపే దిగుబడులు వచ్చాయి. జేజే–11 రకం క్వింటా రూ. 8,500, ఫూలేజి రకం రూ. 10 వేల వరకు ధర పలకడంతో దిగు బడులు తగ్గినా మద్దతు ధరతో విక్రయించి నష్టాల ఊబి నుంచి గట్టెక్కారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఐదేళ్లపాటు పంట ఉత్పత్తులను కొనుగోలు చేసింది. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల ఊసే ఎత్తకపోవడంతో దిగుబడులు గోదాములకే పరిమితయ్యాయి. శనగకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ● ఈ ఏడాది లభించని గిట్టుబాటు ధర ● శనగల బస్తాలతో గోదాములు ఫుల్ ● కొనుగోలు కేంద్రాల ఊసెత్తని రాష్ట్ర ప్రభుత్వం ● గతేడాది దిగుబడులు తగ్గినా గిట్టుబాటు ధరలు ● ఈ ఏడాది ధర లేదని రైతుల ఆవేదన కోవెలకుంట్ల: ఆరుగాలం కష్టించి పండించిన పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర లభించడం లేదు. రైతుల రెక్కల కష్టానికి కనీస విలువ ఇచ్చేవారు కరువయ్యారు. ఈ ఏడాది శనగ రైతులకు నష్టాలే మిగిలాయి. నంద్యాల జిల్లాలోని 29 మండలాల పరిధిలో 1.70 లక్షల ఎకరాల్లో శనగ సాగు చేయాల్సి ఉంది. అయితే ఈ ఏడాది 1.72 లక్షల ఎకరాల్లో రైతులు జేజే–11, ఫూలేజి రకాలకు చెందిన శనగ పంట సాగుచేశారు. కోవెలకుంట్ల, సంజామల, అవుకు, కొలిమిగుండ్ల, ఉయ్యాలవాడ, దొర్నిపాడు మండలాల్లో 93 వేల ఎకరాల్లో పంట సాగైంది. వర్షాభావ పరిస్థితులు, వివిధ దశల్లో తెగుళ్లు.. దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపాయి. అరకొరగా పంట అందినా.. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పిండంలో విఫలం అయ్యింది. ఇప్పుడున్న మార్కెట్ ధరకు విక్రయిస్తే పెట్టుబడులు కూడా రావని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుల దిగాలు విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపు నివారణ.. తదితర పెట్టుబడుల రూపంలో ఎకరా శనగ సాగుకు రైతులు రూ. 20 వేలు వెచ్చించారు. కౌలు రూపంలో అదనంగా మరో రూ.15 వేలు భారం పడింది. వాతావరణం అనుకూలించక పోవడం.. ఫూలేజి(తెల్లశనగ) రకం పైరును వేరుకుళ్లు (ఎండు తెగులు) ఆశించి పైరులో మొక్కలు ఎండిపోయాయి. తెగులుకు తోడు గత నవంబర్, డిసెంబర్ నెలల్లో తుపాన్ల ప్రభావంతో కురిసిన వర్షాలు, అధిక తేమ కారణంగా పైరు దెబ్బతినింది. వేలాది రూపా యలు పెట్టుబడులు వెచ్చింగా అధిక వర్షాలు, తెగుళ్ల కారణంగా దెబ్బతిని రైతులు నష్టాల ఊబిలో కూరకపోయారు. ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగు బడులు వస్తాయనుకుంటే జేజే– 11 రకానికి చెందిన శనగలో ఎకరాకు 5 క్వింటాళ్లలోపు, పూలేజి రకంలో 4 క్వింటాళ్ల దిగుబడులు మాత్రమే వచ్చాయి. దిగుబడులు అంతంత మాత్రంగానే రావడం, మార్కెట్లో ధర లేకపోవడంతో శనగ రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చలేక, దిగుబడులు నిల్వ ఉంచుకునేందుకు బాడుగ రూపంలో అదనపు భారం పడుతుండటంతో అన్నదాతలు దిగాలు చెందుతున్నారు. గోదాముల్లో శనగ బస్తాలు జేజే–11 రకం క్వింటా రూ. 5,500, ఫూలేజి రకం రూ. 6,500 మాత్రమే ధర ఉంది. ఈ ధరకు విక్రయించలేక పంట ఉత్పత్తులను గోదాములకు తరలించి భద్ర పరుచుకుంటున్నారు. జిల్లాలో దాదాపు 150 గోదాములు ఉన్నాయి. ఒక్కో గోదాములో 80 వేల బస్తాల నుంచి లక్ష బస్తాలు నిల్వ ఉంచవచ్చు. ఉత్పత్తులు భద్రపరుచుకునే రైతులు ఒక్కో బస్తాకు ఏడాది రూ. 100 ప్రకారం బాడుగ చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే అన్ని గోదాములు శనగ బస్తాల నిల్వతో నిండిపోయాయి. మరికొందరు ఇళ్లలోనే పంట ఉత్పత్తులను భద్రపరుచుకున్నారు. కొనుగోలు కేంద్రాల ప్రతిపాదన లేదు ఈ ఏడాది శనగ పంట ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రైతులు ప్రస్తుత మార్కె ట్ ధర ప్రకారం దిగుబడులను విక్రయించుకోవచ్చు. ఫూలేజి (తెల్లరకం)కి ప్రభుత్వ మద్దతు ధర ఉండదు. మార్కెట్ ధరల ప్రకారం అమ్మకాలుజరుపుకోవాలి. – నిరంజన్, మండల వ్యవసాయాధికారి, కోవెలకుంట్ల శనగల ధరలు ఇలా.. రకం గతేడాది ప్రస్తుతం ఉన్న ధర ధర జేజే–11 రూ.8,500 రూ.5,500 ఫూలేజి రూ.10,000 రూ.6,500 -
హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్న మంత్రి బీసీ
కోవెలకుంట్ల: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి బీసీ జనార్దన్రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేసి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నా రని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు. కోవెలకుంట్ల మండలం కంప మల్లకు చెందిన వైఎస్సార్సీపీ నేత లోకేశ్వరరెడ్డి కుటుంబంపై టీడీపీ గూండాల దాడి చేశారు. లోకేశ్వరరెడ్డి తీవ్రంగా గాయపడి నంద్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని గురువారం ఉదయం ఆసుపత్రికి చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితులను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ అభివృద్ధి, మౌలిక వసతులు కల్పించాలని టీడీపీ వర్గీయులు మంత్రి బీసీ వద్దకు వెళితే ముందుగా వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు చేయండంటూ ప్రోత్సహిస్తుండటం విడ్డూరమన్నారు. టీడీపీ నేతల అధికార దాహం తీరిందని, రక్తదాహం తీరలేదని, అందుకే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్త లపై దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండకూదనే ఉద్దేశంతో రాబోయే రోజుల్లో ఆ పార్టీకి ఏజెంట్లు కూడా లేకుండా చేయాలనే తలంపుతో ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని మండి పడ్డారు. వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తాం.. కంపమల్లలో వైఎస్సార్సీపీ నేత కుటుంబంపై జరిగిన దాడి సంఘటనను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని కాటసాని తెలిపారు. లోకేశ్వరరెడ్డి కుటుంబానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. రైతు కుటుంబాలతో ప్రశాంతంగా ఉన్న కంపమల్లలో టీడీపీ నాయకులు అలజడులు సృష్టించి భయానక వాతావరణం కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో లోకేశ్వరరెడ్డి కుటుంబాన్ని అంతమొందిస్తే తమకు అడ్డు ఉండదని గ్రామానికి చెందిన చిన్న సుబ్బారెడ్డి, ఆయన కుమారుడు లక్ష్మీ నారాయణరెడ్డి, మరికొందరు దాడికి తెగబడ్డారని పేర్కొన్నారు. గతంలో కూడా లోకేశ్వరరెడ్డిపై హత్యాయత్నం జరిగిందని, ఆ కేసు ఇప్పటికి నడుస్తోందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కూటమి పార్టీ అధికారంలోకి రాగానే ఆ కుటుంబంపై కక్ష మరింత పెంచుకున్నారన్నారు. కుటుంబసభ్యులు ఎవరూ ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఇంటి పక్కన కాల్వ తీసి మట్టిని అడ్డంగా పోశారన్నారు. ఈ విషయాన్ని అప్పట్లో కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లోకేశ్వరరెడ్డి కుటుంబంపై దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాటసానితోపాటు వైఎస్సార్సీపీ నాయకులు సిద్ధంరెడ్డి రాంమోహన్రెడ్డి, జిల్లెల్ల శంకర్రెడ్డి, వెలగటూరు సర్పంచ్ ఎల్వీ సుధాకర్రెడ్డి, భీమిరెడ్డి ప్రతాప్రెడ్డి, భీమునిపాడు అనిల్కుమార్రెడ్డి, ప్రతాప్రెడ్డి, వీరారెడ్డి, ఎల్ఐసీ రామసుబ్బారెడ్డి, మల్లు హరినాథరెడ్డి, గుంజలపాడు రామసుబ్బారెడ్డి, తదితరులు లోకేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పచ్చని గ్రామాల్లో చిచ్చు పెడుతున్నారు కంపమల్ల ఘటనను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తాం లోకేశ్వరరెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి -
అధికారం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలని కూటమి నేతలు బరితెగిస్తున్నారు. ఇసుక, మట్టి, బియ్యం దందాను వదలడం లేదు. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. గుడి, బడి తేడా లేకుండా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. చివరకు చిరు వ్యాపారులను సైతం వేధిస
● అహోబిలం దేవస్థానాన్నీ వదలని టీడీపీ నాయకులు ● అడుగడుగునా అక్రమ వసూళ్లు ● ఒక్కో దుకాణానికి రూ.10 వేల చొప్పున చెల్లించిన చిరు వ్యాపారులు ● సుమారు 110 దుకాణాల నుంచి రూ.11 లక్షల మేర దోపిడీ ● టోల్గేట్ పేరుతో భక్తుల నుంచి అధిక వసూళ్లు ● అక్రమ వసూళ్లన్నీ ఓ ప్రజాప్రతినిధి భర్త ఖాతాలోకి ? భారీగా టోల్ వసూలు కేవలం రూ.19 లక్షలకే టోల్ గేట్ దక్కించుకున్న నిర్వాహకులు ఈ మేరకు వాహనదారులకు మినహా యింపు ఇవ్వాల్సి ఉంది. కానీ, కూటమి నాయకులు అధికార అండదండలతో ఇష్టానుసారం టోల్ వసూలు చేస్తున్నారు. భారీ వాహనాలు, బస్సులు, లారీలు, ట్రాక్టర్లు, టెంపో ట్రావెల్స్కు ఒక్కోదానికి రూ.100.. కార్లు, జీపులకు రూ.75, ఆటోలకు రూ.40, తోపుడుబండ్లకు రూ.30 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు. కానీ, వాహనంతో సంబంధం లేకుండా వాహనదారులను విపరీతంగా బాదేస్తున్నారు. కారు, బస్సు, ట్రాక్టర్తో సంబంధం లేకుండా ప్రతీ వాహనానికి రూ.150 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే పది మంది మనుషులను పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని భక్తులు వాపోతున్నారు. టోల్ గేట్ వద్ద రేట్ల పట్టికను ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. పక్కన పెట్టేశారు. ఇంత జరుగుతున్నా పంచాయతీ కార్యదర్శి తనకేమీ పట్టనట్లు వ్యహరిస్తుండడం గమనార్హం. ఓ వైపు అంగరంగ వైభవంగా అహోబిలేశు డిని బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా.. మరో వైపు కూటమి నేతలు గుట్టుగా వసూళ్లకు పాల్పడుతు న్నారు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందే ఏర్పాట్లలోనూ అక్రమాలకు పాల్పడిన నేతలు ఇప్పుడు అటు భక్తులు, ఇటు చిరు వ్యాపారులను దోచుకుంటున్నారు. కళ్ల ముందే అక్రమ తంతు సాగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి అహోబిలేళుడి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. స్వామి వారిని కనులారా తిలకించి మొక్కులు చెల్లించుకుంటారు. ఉత్సవాల్లో భాగంగా అహోబిలం క్షేత్రానికి సుమారుగా మూడు లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా. ఈ క్రమంలో కూటమి నేతలు వసూళ్ల అంగడి తెరిచారు. ఉత్సవాల సందర్భంగా దిగువ అహోబిలంలో దుకాణాలు ఏర్పాటు చేస్తారు. ఏటా దుకాణానికి చాలా తక్కువ మొత్తంలో చెల్లించి వ్యాపారం చేసుకుని అంతో ఇంతో సంపాదించుకునే వారు. గతేడాది వీటి ద్వారా ఆలయానికి కేవలం రూ.26 వేలు మాత్రమే ఆదాయం వచ్చింది. అయితే టీడీపీ నాయకుల కన్ను ఈ దుకాణాల పడింది. ఆలయానికి రూ.48 వేలు ఇచ్చేసి దుకాణాల దారుల నుంచి తాము వసూలు చేసుకుంటామని ఆదేశాలు ఇచ్చుకున్నారు. ఏపీ టూరిజం అతిథి భవనం, టీటీడీ సత్రం, పాత సచివాలయం, బీగాల ఆంజనేయస్వామి ఆలయం వద్ద సుమారుగా 110 మంది దుకాణాలు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. చిరు వ్యాపారుల వద్ద నుంచి అడుగుకు రూ.వెయ్యి చొప్పున వసూలు చేశారు. ఒక్కో దుకాణాన్ని పది అడుగుల మేర స్థలం మార్కు వేసి రూ. 10 వేలు ముక్కుపిండి మరీ వసూలు చేశారు. మొత్తంగా 110 షాపులకు రూ.11 లక్షల మేర డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. ఈ డబ్బంతా స్థానిక ప్రజాప్రతినిధి భర్త జేబులోకి వెళుతోందని గ్రామ టీడీపీ నాయకులే చర్చించుకుంటున్నారు. డబ్బులు ఇవ్వకపోవడంతో దాడి స్వామి ఉత్సవాల సందర్భంగా పిల్లలు ఆడుకునేందుకు ఓ వ్యక్తి చిన్న ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకుంటే దీన్ని వదల్లేదు. తమకు రూ.40 వేలు ఇచ్చిన తర్వాతే ఎగ్జిబిషన్ పెట్టుకోవాలని స్థానిక నేత ఒకరు హుకుం జారీ చేశారు. మొదటి విడతలో రూ.10 వేలు తీసుకున్నాడు. మిగిలిన మొత్తం ఇచ్చేందుకు ఆలస్యమవడంతో అతన్ని చితకబాదారు. తమకు డబ్బులు ఇవ్వకుండా ఇక్కడి నుంచి ఒక్క అడుగు బయటికి వెళ్లలేవని బెదిరించడంతో భయభ్రాంతులకు గురైన బాధితుడు మిగిలిన మొత్తాన్ని ఇచ్చి బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు. పంచాయతీ ఆదాయానికి గండి అహోబిలం పంచాయతీ ఆదాయానికి టీడీపీ నాయకులు గండి కొడుతున్నారు. ఆలయానికి వెళ్లేందుకు గ్రామం వెలుపల టోల్ గేట్ ఏర్పాటు చేశారు. ఏటా వేలంలో పాడుకోవాల్సి ఉంది. ఎవరు ఎక్కువ మొత్తానికి పాడుకుంటే వారికే టోల్ గేట్ నిర్వహణ ఇస్తారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2023–24లో ఏడాది పాటు టోల్ గేట్ వసూళ్ల కోసం వేలం నిర్వహిస్తే గోర్ల సుబ్బారావు అనే వ్యక్తి రూ.41 లక్షలకు పాడుకున్నాడు. ఈ మొత్తాన్ని పంచాయతీకి జమ చేశాడు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2024–25కు సంబంధించి వేలం పాట నిర్వహిస్తే కేవలం ఒక్కరే వేలంలో పాల్గొన్నాడు. ఇతరులను ఎవరినీ లోనికి కూడా అనుమతించకుండా డోర్లు వేసి మరీ పాట దక్కించుకున్నాడు. ఏడాదికి కేవలం రూ.19 లక్షలకే చింతలపల్లి నవీన్ అనే వ్యక్తి పాడుకున్నాడు. పంచాయతీకి ఏడాదికి రూ.22 లక్షల ఆదాయానికి గండి కొట్టారు. వచ్చే నాలుగేళ్లు ఈ తంతు ఇలానే కొనసాగనుంది. -
క్రీడలపై కూటమి నేతల దుష్ప్రచారం సిగ్గుచేటు
నందికొట్కూరు: ఆడుదాం ఆంధ్ర క్రీడల్లో ఒకరేమో రూ.300 కోట్ల స్కామ్ అంటారు, మరొకరేమో రూ.400 కోట్ల స్కామ్ అని నోటికొచ్చినట్లు మాట్లాడటం చూస్తే వాళ్ల ఆరోపణల్లో నిజం లేదనే విషయం తెలుస్తోందని రాష్ట్ర శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. బుధవారం ఆయన నంద్యాల జిల్లా నందికొట్కూరులో విలేకరులు అడిగిన ప్రశ్నలకు పైవిధంగా సమాధానమిచ్చారు. తెలుగు దేశం పార్టీ ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు నోటికి వచ్చినట్లు ఆడుదాం ఆంధ్ర క్రీడల్లో స్కామ్ జరిగినట్లు దుష్ప్రచారం చేయడం సిగ్గు చేటన్నారు. క్రీడల శాఖ మంత్రి ఆడుదాం ఆంధ్రకు బడ్జెట్లో రూ.119 కోట్లు కేటాయించినట్లు అసెంబ్లీలో చెబుతుంటే ఆరోపణలు చేసేవారికి వినిపించకపోవడం శోచనీయమన్నారు. ఎన్నికల ముందు రాష్ట్రమంతా చంద్రబాబు, భువనేశ్వరి కన్నీటితో ప్రచారం చేసి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి పది నెలలైనా మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం లేదన్నారు. నాలుగేళ్ల వరకూ జగనన్న పాలనపై ఇదే విమర్శలు చేసుకుంటూ ఒక్కపథకం కూడా అమలు చేయకుండా కాలం గడపటమే చంద్రబాబు నైజమన్నారు. రైతు భరోసా, తల్లికి వందనం ఇవ్వాలని ప్రజలు అడుగుతుంటే ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమంగా కేసులు బనాయించడం తగదని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15వేల సచివాలయాలకు రూ.38 కోట్లతో క్రీడా కిట్లను పంపిణీ చేశామని గుర్తు చేశారు. గత జగనన్న పాలనలో సచివాలయాలలో 1.30 లక్షల ఉద్యోగాలు ఇస్తే కూటమి నేతలకు కనిపించకపోవడం విడ్డూరమన్నారు. -
ఇళ్ల నిర్మాణాలకు అదనపు ఆర్థిక సాయం
కర్నూలు(సెంట్రల్): ఎన్టీఆర్ కాలనీల్లో(జగనన్న కాలనీలు) నిర్మాణాల్లోని ఇళ్లకు అదనంగా ఆర్థిక సాయం మంజూరైనట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా తెలిపారు. 2024 డిసెంబర్ 10వ తేదీ నాటికి నిర్మాణంలో ఉండి మధ్యలో నిలిచిపోయిన ఇళ్లకు అదనపు సాయం వర్తిస్తుందన్నారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలకు ప్ర స్తుతం రూ.1.80 లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు. ప్ర స్తుతం ఈ మొత్తానికి అదనంగా ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు మంజూరవుతుందన్నారు. జిల్లాకు గత ప్రభుత్వంలో 39 వేల గృహాలు మంజూరు కాగా, 22,590 గృహాలు ఇప్పటికే పూర్తయ్యాయన్నారు.ఇళ్లు లేని వారికి పట్టణా ల్లో రెండుసెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలాలను ఇచ్చేందుకు దరఖాస్తులను స్వీరిస్తున్నామని, ఇప్పటి వరకు జిల్లాలో 39 వేల అర్జీలు వచ్చినట్లు తెలిపారు. విలేకరుల సమావేశ ంలో హౌసింగ్ పీడీ అజయ్కుమార్ పాల్గొన్నారు. రైతు విశిష్ట గుర్తింపు కార్డుతో ప్రయోజనాలు నంద్యాల(అర్బన్): భూమి గల ప్రతి రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య కార్డు పొందితే ప్రభుత్వ పథకాలు నేరుగా అందుతాయని జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ అన్నారు. నంద్యాల మండలం రాయమాల్పురం గ్రామంలో బుధవారం ఏఓ ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన పొలం పిలుస్తోంది కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులకు వ్యక్తిగతంగా వ్యవసాయ, యాంత్రికీకరణ పరికరాలు మంజూరు చేసిందన్నారు. ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏడీఏ రాజశేఖర్, ఏఈఓ మనోహర్, రైతు సేవా కేంద్రం సిబ్బంది కిరణ్కుమార్, రైతులు పాల్గొన్నారు. -
మూత్ర సమస్యలుంటే నిర్లక్ష్యం చేయొద్దు
చాలా మంది మూత్రసమస్యలను నిర్లక్ష్యం చేస్తుంటారు. కొన్నిసార్లు అవి సాధారణమే అయినా ఒక్కోసారి అది ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్య గా మారుతుంది. ముఖం ఉబ్బరం, మూత్రంపోయినప్పుడు చురుకు, మంట, ఎరుపు రంగు లో మూత్రం రావడం, మూత్రం సరిగ్గా రాకపోవడం, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం, చిన్న వయస్సులోనే రక్తపోటు లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. –డాక్టర్ పీఎల్. వెంకట పక్కిరెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, నెఫ్రాలజి విభాగం, జీజీహెచ్, కర్నూలు నేడు వైద్యవిజ్ఞాన సదస్సు అంతర్జాతీయ కిడ్నీ దినో త్సవాన్ని పురస్కరించుకు ని నేడు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఓల్డ్ క్లినికల్ లెక్చర్ గ్యాలరీలో వైద్యవిజ్ఞాన సదస్సు నిర్వహించనున్నాము. లూపస్ నెఫ్రైటిస్ కరెంట్ ట్రీట్మెంట్ అండ్ వే ఫార్వర్డ్ అనే అంశంపై హైదరాబాద్కు చెందిన సీనియర్ నెఫ్రాలజిస్టు డాక్టర్ ఎ. శశికిరన్ ప్రసంగిస్తారు. ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు ప్రారంభిస్తారు. –డాక్టర్ ఎస్. అనంత్, ఇన్చార్జ్ హెచ్ఓడీ, నెఫ్రాలజి విభాగం, జీజీహెచ్, కర్నూలు ● -
యాపదిన్నె సర్పంచ్పై కేసు నమోదు
డోన్ టౌన్: డోన్ మండలం యాపదిన్నె గ్రామానికి చెందిన తెలుగుదేశం సర్పంచ్ రామిరెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. వాటర్ షెడ్ పనుల్లో తనకు ప్రాధాన్యత ఎందుకు ఇవ్వరని మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో వాటర్ షెడ్ ఏపీఓ విజేత,ఎంపీడీఓ వెంకటేశ్వరరెడ్డి విధులకు ఆటంకం కల్గించి అసభ్య పదజాలంతో దూషించిన విషయం తెలిసిందే. దీనిపై సదరు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామిరెడ్డిపై కేసు నమోదు చేసి చేసి రిమాండ్కు పంపతున్నట్లు బుధవారం సీఐ ఇంతియాజ్బాషా తెలిపారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి అవుకు: మండల పరిధిలోని చెన్నంపల్లె గ్రామంలో విద్యుత్ షాక్కు గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేతంచర్ల మండలం బలపాలపల్లె గ్రామానికి చెందిన చిన్న తిమ్మిగాళ్ల వేణుగోపాల్ (37) భార్యాపిల్లలతో సహా గత రెండేళ్లుగా అవుకులో నివాసం ఉంటూ గౌండ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం చెన్నంపల్లె గ్రామంలో ఓ ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా స్లాబ్ను కూలుస్తుండగా ప్రమాదవశాత్తు పైన ఉన్న కరెంట్ తీగలు తగిలి కిందపడ్డాడు. దీంతో 108 అంబులెన్స్ ఈఎంటీ జనార్దన్ రెడ్డి అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య చిన్న తిమ్మగాళ్ల ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ క్రిష్ణయ్య తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు సంతానం. రంగాపురం జెడ్పీ హైస్కూలు విద్యార్థిని ఆత్మహత్య బేతంచెర్ల: మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపురం జెడ్పీ హైస్కూలో 10 వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల మేరకు గ్రామానికి చెందిన తిరుమలేశ్వరెడ్డి, లావణ్య దంపతుల పెద్ద కుమార్తె మధు లత(15) గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతోంది. కుటుంబ సమస్యలో మరే కారణం చేతనో ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో బుధవారం ఉదయం ఫ్యానుకు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బయటకు వెళ్లిన తల్లి లావణ్య ఇంటికి వచ్చి చూసి వెంటనే వేలాడుతున్న కుమార్తెను కిందికి దింపి చూడగా అప్పటికే మృతి చెందింది. మరో 5 రోజుల్లో పబ్లిక్ పరీక్షలకు హాజరు కావలసిన విద్యార్థిని మృతి పట్ల తోటి విద్యార్థులు కన్నీరు, మున్నీరుగా విలపించారు. హెచ్ఎం మల్లికార్జున, ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు. -
24 గంటల్లో భవన నిర్మాణాలకు అనుమతులు
● టౌన్ ప్లానింగ్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ విజయభాస్కర్ కర్నూలు (టౌన్): పట్టణాల్లో భవనాల అనుమతులకు సంబంధించి 24 గంటల వ్యవధిలో అనుమతులు మంజూరు చేస్తున్నట్లు టౌన్ ప్లానింగ్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ విజయభాస్కర్ అన్నారు. బుధవారం స్థానిక నగర పాలక సంస్థ నూతన కౌన్సిల్ హాలులో జిల్లాలోని మున్సిపాల్టీల పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు, లైసెన్సు ఇంజినీర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ భవన నిర్మాణాలకు అనుమతుల్లో జాప్యాన్ని నిరోధిస్తూ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. దీని ప్రకారం దరఖాస్తును పోర్టల్లో అప్లోడ్ చేసిన గంటల వ్యవధిలోనే అనుమతులు పొంది పనులు ప్రారంభించవచ్చన్నారు. అక్యుపెన్సీ సర్టిఫికెట్ సైతం పొందవచ్చని చెప్పారు. అయితే, నిర్మాణానికి సర్వే రిపోర్టు, స్థలం విలువ ఆధారిత సర్టిఫికెట్ తప్పనిసరిగా పొందుపరచాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఆకస్మిక తనిఖీల్లో అనుమతులను రద్దు చేస్తామన్నారు. టెక్నికల్ పర్సన్లు తప్పులు చేస్తే వారి లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిటీ ప్లానర్ ప్రదీప్కుమార్, డిప్యూటీ సిటీ ప్లానర్ శోభన్ బాబు, డీటీసీపీ శశిలత, నంద్యాల అసిస్టెంట్ సిటీ ప్లానర్ మూర్తి, టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది, వార్డు ప్లానింగ్ రెగ్యులేషన్ అధికారులు ఎల్టీపీలు పాల్గొన్నారు. -
జీవనశైలితో కిడ్నీ కుదేల్!
● పెరుగుతున్న కిడ్నీ వ్యాధి బాధితులు ● 10 నుంచి 17 శాతానికి పెరిగిన రోగుల సంఖ్య ● బీపీ, షుగర్తోనే కిడ్నీకి ఇబ్బంది ● కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి నెలా 1300 మందికి డయాలసిస్ ● 30 ఏళ్ల లోపు బీపీ వస్తే కిడ్నీ సమస్యలు ఉన్నట్లు అనుమానం ● నేడు వరల్డ్ కిడ్నీ డే మానవశరీరంలో గుప్పెడంత పరిమాణంలో ఉండే కిడ్నీలు రక్తాన్ని వడపోసి, మలిన పదార్థాలను వేరుచేసి వాటిని మూత్రం ద్వారా విసర్జిస్తాయి. దేహంలో నీటి శాతాన్ని అవసరమైన పరిమాణంలో క్రమబద్ధంగా ఉంచి ఎక్కువైన నీటిని బయటకు పంపిస్తాయి. లవణ పరిమాణాన్ని, రక్తపోటును క్రమబద్ధీకరిస్తాయి. ఇలా మనిషి ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషించే ఈ అవయవం పనితీరు మందగించి అది విఫలమవ్వడం ఆరంభమైతే దానిని పూర్తిగా నయం చేయడం కష్టం. అయితే, ప్రస్తుతం మారిన మనిషి జీవన శైలి ఆ పరిస్థితిని తీసుకొస్తుంది. అవగాహన లేమితో కిడ్నీ సంబంధ వ్యాధులు పెరిగిపోతున్నాయి. నేడు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ప్రత్యేకం కథనం. ఆరేళ్లలో కిడ్నీ రోగుల వివరాలు కర్నూలు(హాస్పిటల్): నిరంతరం పనిచేసే కిడ్నీలను జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా తీవ్ర నష్ట జరుగుతుంది. కొన్నిసార్లు ప్రాణాల మీదకు వస్తుంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని నెఫ్రాలజి విభాగంలో ప్రతి వారం సోమ నుంచి శుక్రవారం వరకు ఓపీ చూస్తారు. ఇక్కడ గత జనవరి నెల 665 ఓపీ, 138 ఐపీ, ఫిబ్రవరిలో 450 ఓపీ, 137 ఐపీ రోగులు చేరి చికిత్స పొందారు. ఈ విభాగంలో సగటున ప్రతి నెలా 1300 మంది దాకా కిడ్నీ బాధితులకు డయాలసిస్ చేస్తున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు నలుగురికి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించి విజయవంతం చేశారు. ఈ ఆసుపత్రితో పాటు నగరంలోని పలు నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ(వైద్యసేవ) ద్వారా ఉచితంగా డయాలసిస్, పలు రకాల ఆపరేషన్లు ఉచితంగా నిర్వహిస్తున్నారు. పిల్లలు, పెద్దల్లో కిడ్నీ వ్యాధులు చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చే జన్యుపరమైన వ్యాధులు, ఇన్ఫెక్షన్ వల్ల మూత్రపిండాల వ్యాధులు కలుగుతాయి. పుట్టుకతో వచ్చే జన్యుపరమైన వ్యాధుల వల్ల పిల్లలు ఎదుగుదల లేకపోవడం, మూత్రం ఎక్కువగా, తక్కువగా పోవడం, కాళ్లు, చేతులు వంకర్లు పోవడం వంటివి జరుగుతాయి. ఇన్ఫెక్షన్తో వచ్చే వ్యాధుల వల్ల పిల్లలకు మూత్రం ఎరుపు రంగులో రావడం, కాళ్లవాపులు రావడం, ఒళ్లు దద్దుర్లు రావడం వంటివి జరుగుతాయి. పెద్దల్లో రక్తపోటు, మధుమేహం, మూత్రపిండాల ఇన్ఫెక్షన్ వల్ల సాధారణంగా మూత్రపిండాలు చెడిపోతాయి. ఈ వ్యాధులు ఉన్న వాళ్లు మూత్రపిండాల వైద్యుల పర్యవేక్షణలో ఉండటం మంచిది. కిడ్నీలు పాడయ్యేందుకు కారణాలు బీపీ, షుగర్, ఉబ్బు కామెర్లు, అధిక మొత్తంలో నొప్పుల మాత్రలు వాడటం, కిడ్నీల్లో రాళ్లు, జన్యుపరంగా పుట్టుకతో వచ్చే వ్యాధులు, మూత్రకోశ, మూత్రనాళ వ్యాధులు, వాంతులు, విరేచనాలు, పాముకాటు, మలేరియా, పచ్చకామెర్లు, లెప్టోస్పైరా, గర్భం సమయంలో మూత్రం ఇన్ఫెక్షన్, రక్తపోటు రావడం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. సంవత్సరం ఓపీ ఐపీ రోగుల సంఖ్య రోగుల సంఖ్య 2019 9,034 1,830 2020 2,640 630 2021 1,546 1,010 2022 5,228 1,337 2023 5,575 1,493 2024 6,943 1,771కిడ్నీ జబ్బుల లక్షణాలు నిస్సత్తువ, వాంతి వచ్చినట్లు ఉండటం, ఆకలి లేకపోవడం, దురద, ఒళ్లునొప్పులు, మూత్రం ఎక్కువగా పోవడం, అతి తక్కువగా పోవడం, రాత్రిపూట మూత్రం ఎక్కువగా పోవడం, శరీర వాపు, చిన్నపిల్లల్లో మూత్రం ఎర్రగా రావడం, ఒళ్లు దద్దుర్లు, చిన్నపిల్లల్లో ఎదుగుదల లేకపోవడం, కాళ్లు వంకరలు పోవడం, అధిక రక్తపోటు. వ్యాధి లక్షణాలను బట్టి చికిత్స మూత్రపిండాలకు వచ్చిన వ్యాధి లక్షణాలు, దాని తీవ్రతను బట్టి వైద్యులు రకరకాల చికిత్సలను చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని వ్యాధులు ఆహార నియమావళి పాటించి మందులు తీసుకుని తగ్గించుకోవచ్చు. కొన్ని వ్యాధుల్లో డయాలసిస్, కిడ్నీ మార్పిడి అవసరం రావచ్చు. –డాక్టర్ ఎం. శ్రీధరశర్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్, నెఫ్రాలజి విభాగం, జీజీహెచ్, కర్నూలు -
ప్రజల జీవితాల్లో వెలుగు వైఎస్సార్సీపీ
● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి బొమ్మలసత్రం: ప్రజల జీవితాల్లో వెలుగు నింపి వారికి ఎల్లప్పుడూ అండగా నిలిచే పార్టీ వైఎస్సార్సీపీ అని ఆ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం నంద్యాలలోని జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాటసాని రాంభూపాల్రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గపు ఇన్చార్జ్ సుధీర్కుమార్.. పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ పాలనాకాలంలో కులమతాలకు అతీతంగా, పార్టీలకు సంబంధం లేకుండా అర్హత కలిగిన ప్రతి పేదవారికి పథకాలు అందజేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను ఎలా వంచిస్తున్నారో అందరూ గమనిస్తున్నారన్నారు. ‘కూటమి’ నేతలకు రానున్న రోజుల్లో ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారన్నారు. పేద విద్యార్థుల మెడికల్ విద్య కల సాకారానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో 17 కొత్త కాలేజీలు తీసుకొస్తే ఆ కాలేజీలను నిర్వీర్యం చేయాలని కూటమి ప్రభుత్వం చూడటం అవివేకమన్నా రు. సీనియర్ నేత కల్లూరి రామలింగారెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సూర్యనారాయణరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పాంషావలీ, రాష్ట్ర మహిళా జోనల్ ప్రసిడెంట్ శ్వేతారెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు డాక్టర్ శశికళారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లి రైతు కంట కన్నీరు!
మార్కెట్లో వ్యాపారుల ఇష్టారాజ్యం ● కొన్ని లాట్లకు ధర కోట్ చేయని వైనం ● నాణ్యత సాకుగా చూపి అన్యాయం ● విధిలేక ఎంతోకొంతకు అమ్ముకుంటున్న రైతులు మూడు రోజులైనా కొనే దిక్కులేదు ఈ నెల 9న రాత్రి 100 ప్యాకెట్ల ఉల్లిని కర్నూలు మార్కెట్కు తీసుకొచ్చాం. నాణ్య త కూడా బాగుంది. సోమవారం టెండరు కు పెట్టారు. వ్యాపారులెవ్వరూ టెండరు వేయలేదు. మంగళవారం కూడా టెండరుకు పెట్టారు. అయినా వ్యాపారులు స్పందించలేదు. మార్కెట్కు ఉల్లి గడ్డలు తీసుకరావడానికి దాదాపు రూ.7వేల నుంచి రూ.8వేలు ఖర్చయింది. వెనక్కి తీసుకపోవాలంటే మళ్లీ అదే స్థాయిలో ఖర్చు వస్తుంది. టెండరు వేయకపోతే అనామతుపై అతి తక్కువ ధరకు విక్రయించుకోవాల్సిందే. – దేవేంద్ర ఆచారి, గువ్వలదొడ్డి గ్రామం, ఎమ్మిగనూరు మండలం మార్కెట్లో రైతులకు తీరని అన్యాయం ఎకరాకు రూ.30 వేల వరకు ఖర్చు పెట్టి ఉల్లి సాగు చేశాం. 60 ప్యాకెట్ల దిగుబడి వచ్చింది. ఎంతో వ్యయ ప్రయాసలతో కర్నూలు మార్కెట్కు తీసుకొచ్చి మంగళవారం టెండరుకు పెట్టాం. ఉల్లి నాణ్యత సంతృప్తికరంగానేనే ఉంది. కానీ వ్యాపారులు టెండరు వేయలేదు. అలాగని సరుకును వెనక్కు తీసుకుపోలేం. మార్కెట్లో రైతులకు తీరని అన్యాయం జరుగుతోంది. ఏదో ఒక ధరకు అమ్ముకుపోయే పరిస్థితి కల్పిస్తున్నారు. – సుంకులమ్మ, చిట్యాల గ్రామం, క్రిష్ణగిరి మండలం కర్నూలు(అగ్రికల్చర్): పంట దిగుబడులను గిట్టుబాటు ధరతో అమ్ముకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి రైతులు వ్యయ ప్రయాసలకోర్చి కర్నూ లు మార్కెట్కు చేరుకుంటున్నారు. సరుకు మార్కెట్లోకి ప్రవేశించే సమయంలోనే లాట్ నెంబర్ అలాట్ అవుతుంది. పంట నాణ్యతను బట్టి వ్యాపారులు ఈ–నామ్లో ఆన్లైన్ టెండరు ద్వారా ఏదో ఒక ధర కోట్ చేయాల్సి ఉంది. ఎక్కువ ధర కోట్ చేసిన వారికి ఆ లాట్ దక్కుతుంది. రైతు ఆ ధరకు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మరుసటి రోజు మళ్లీ టెండరుకు పెట్టుకోవచ్చు. కానీ మార్కెట్లో కొన్ని లాట్లకు వ్యాపారులు అస్సలు టెండరు వేయరు. ప్రధానంగా ఉల్లిగడ్డల విషయంలో ప్రతి రోజు 20 నుంచి 30 లాట్లకు వ్యాపారులు టెండరు వేయని పరిస్థితి. ఈ కారణంగా రైతులు రోజుల తరబడి మార్కెట్లోనే ఉండాల్సి వస్తోంది. వ్యాపారులు సిండికేట్గా మారి కొన్ని లాట్లకు ధర కోట్ చేయరనే ప్రచారం జరుగుతోంది. టెండరు వేయకపోతే రైతు లు ఏదో ఒక ధరకు అమ్ముకుంటారని, అప్పుడు నాణ్యత బాగోలేదని చెబితే తక్కువ ధరతో లాట్ను దక్కించుకోవచ్చనే కుట్ర కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి రోజు 20 నుంచి 30 మంది రైతులు అనామతుపై నామమాత్రపు ధరకు అమ్ముకొని కన్నీళ్లతో ఇంటిముఖం పడుతుండటం గమనార్హం. -
టైలరింగ్లో ఉచిత శిక్షణ
కర్నూలు(అగ్రికల్చర్):బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ, ఈబీసీ, కమ్మ, రెడ్డి, క్షత్రియ, వైశ్య, బ్రా హ్మణ, కాపు (బలిజ) కులాలకు చెందిన మహి ళలకు టైలరింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాకీర్హుసేన్ తెలిపారు. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు మహిళలందరు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన బుధవారం ఒక ప్రకటన లో వెల్లడించారు. శిక్షణ అనంతరం ఉచితంగా కట్టు మిషన్లు కూడా ఇస్తామ ని చెప్పారు. ఆసక్తి గ ల మహిళలు ఈ నెల 22వ తేదీ వరకు సచివాలయాలు, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో ఆన్లైన్లో దరఖాస్తుచేసుకోవాలని సూచించారు. వేటగాళ్ల ఉచ్చుకు దుప్పి బలి ఆత్మకూరురూరల్: ఆత్మకూరు అటవీ డివిజన్లో వేటగాళ్ల దురాగతాలకు అంతులేకుండా పోతోంది. బుధవారం బైర్లూటీ రేంజ్లోని పెద్దఅనంతాపురం సెక్షన్ అటవీ ప్రాంతంలో ఏకంగా వర్లుపోతుగా పిలిచే ఒక భారీ మగ దుప్పిని ఉచ్చులు వేసి చంపేశారు. సుమారు 60 కేజీలకు పైగానే బరువు ఉండే దుప్పి మాంసాన్ని నిల్వ చేసేందుకు ఎండ బెట్టారు. దుప్పి వధ సమాచారం తెలిసి బుధవారం అటవీ సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లగా వేటగాళ్ల అక్కడి నుంచి పరారయ్యరు. అటవీ అధికారులు అక్కడ ఉన్న మాంసాన్ని స్వాధీనం చేసుకుని దుప్పి వధపై పీఓఆర్ నమోదు చేసి వేటగాళ్ల కోసం గాలింపు చేపట్టారు. నిందితులను తప్పక అదుపులోకి తీసుకుని కఠిన శిక్ష పడేలా చేస్తామని రేంజర్ కృష్ణ ప్రసాద్ తెలిపారు. -
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని 53 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయని డీవీఈవో సునీత తెలిపారు. బుధవారం రెండోసంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షకు 12,285 మందికి గాను 11,932 మంది హాజరు కాగా 353 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ పరిశీలిస్తున్నట్లు ఆమె తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు పరిచామన్నారు. మాస్ కాపీయింగ్కు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పుట్టెడు దుఃఖంలో పరీక్షఆళ్లగడ్డ: కంటికి రెప్పలా కాపాడిన తండ్రి మృతి చెందడంతో ఆ విద్యార్థిని పుట్టెడు దుఃఖమే మిగిలింది. ‘ నాన్న ఇక రారని.. తనను బాగా చూసుకునే వారు ఎవరు’ అని ఏడుస్తూనే ఆ బాలిక పరీక్ష కేంద్రానికి వచ్చారు. ‘బాగా చదువుకోవాలి’ అని తండ్రి చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటూ పరీక్ష రాశారు. ఈ విషాదకర ఘటన బుధవారం ఆళ్లగడ్డ పట్టణంలో చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ బస్టాండు సమీపంలోని నాగేశ్వరరావు (48) కుమార్తె పద్మావతి.. స్థానిక వైపీపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అనారోగ్యంతో నాగేశ్వరావు మంగళవారం రాత్రి మృతి చెందాడు. రాత్రంతా తండ్రి మృతదేహం వద్ద కన్నీటి పర్యంతమైన పద్మావతి బుధవారం ఉదయాన్నే పరీక్ష కేంద్రానికి హాజరయ్యారు. తండ్రిని గుర్తు చేసుకుంటూనే పరీక్షను పూర్తి చేశారు. అనంతరం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సెట్కూరు సీఈఓగా వేణుగోపాల్ కర్నూలు(హాస్పిటల్): జిల్లా యువజన సంక్షేమ శాఖ(సెట్కూరు) సీఈఓగా డాక్టర్ కె.వేణుగోపాల్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఆయన ఇన్ఛార్జి సీఈఓగా వ్యవహరిస్తున్న పి.దీప్తి నుంచి బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈయన గతంలో కోవెలకుంట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్గా విధులు నిర్వహించారు. ఆదోని కేసులో పోసాని విడుదల కర్నూలు: సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఆదోని మూడో పట్టణ పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో మంగళవారం బెయిల్ వచ్చిన విషయం విదితమే. బుధవారం కోర్టులో జామీను పత్రాలు దాఖలు చేసి విడుదల ఉత్తర్వులు జిల్లా జైలుకు చేరకముందే గుంటూరు నుంచి సీఐడీ పోలీసులు కర్నూలు చేరుకున్నారు. పిటీ వారెంటుపై మధ్యాహ్నం 12 గంటలకు కర్నూలు జిల్లా జైలు నుంచి పోసానిని తరలించనిట్లు జైలు అధికారులు పోసాని న్యాయవాదులకు తెలిపారు. ఆదోని కేసులో విడుదల ఉత్తర్వులు జైలు అధికారులకు అందించారు. -
సాధారణ కాన్పులో బాలభీముడు జననం
కోడుమూరు రూరల్: స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఓ మహిళకు సాధారణ కాన్పులో 4.25 కిలోల బరువు గల పండంటి మగ శిశువు మంగళవారం రాత్రి జన్మించాడు. కోడుమూరు మండలం వర్కూరు గ్రామానికి చెందిన సులోచన ప్రసవ నొప్పులతో మంగళవారం స్థానిక ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. ఆరోగ్య పరీక్షలు చేసిన గైనకాలజిస్ట్ పుష్పలత సాధారణ కాన్పు చేశారు. సహజంగా అప్పుడే పుట్టిన పిల్లలు రెండున్నర కిలోల నుంచి మూడున్నర కిలోల బరువు ఉంటారని ఈ బిడ్డ 4.25 కిలోలు ఉండటం అది కూడా సాధారణ కాన్పులో జన్మించడం విశేషమని వైద్యాధికారి డా.నాగరాజు తెలిపారు. సులోచనకు ఇది నాలుగో కాన్పు. అన్ని కూడా నార్మల్ డెలివరీలు కావడం గమనార్హం. ముగ్గురు అమ్మాయిల తర్వాత కుమారుడు జన్మించడం పట్ల సులోచన, నారాయణ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. -
ఎమ్మెల్యే చెబితేనే కమిటీలో స్థానం
● తేల్చి చెప్పిన వాటర్షెడ్ అధికారిణి ● వాగ్వాదానికి దిగిన యాపదిన్నె సర్పంచ్ డోన్: వాటర్షెడ్ పనుల్లో రాజకీయ జోక్యం పెరిగిపోతుంది. కోట్లాది రూపాయల పనులను పారదర్శకంగా చేపట్టేందుకు ఏర్పాటు చేయాల్సిన కమిటీల్లో ఎమ్మెల్యే సూచించిన వారికే ప్రాధాన్యత ఉంటుందని ఏకంగా అధికారులు చెబుతుండటం గమనార్హం. ఈ విషయంలో మంగళవారం డోన్ ఎంపీడీఓ కార్యాలయంలో వాటర్షెడ్ అధికారిణి విజేత, యాపదిన్నె సర్పంచ్ రామిరెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వాటర్ షెడ్ కమిటీలో టీడీపీ కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాల గురించి తాము అమరావతికి వెళ్లి లిఖితపూర్వకంగా సీఎం చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేశామన్నారు. పార్టీని నమ్ముకుని తాము అన్నివిధాలా నష్టపోయామని, సర్పంచ్ ఎన్నికల్లో గెలిచి పేరు నిలబెడితే తమను ప్రజల ముందు హేళన చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో కొందరు అధికారులు జోక్యం చేసుకొని ఏదైనా ఉంటే ఎమ్మెల్యేతో మాట్లాడుకోవాలని సర్దిచెప్పి పంపడం గమనార్హం. అయితే తన పట్ల అమర్యాదగా మాట్లాడిన సర్పంచ్పై కలెక్టర్, డ్వామా పీడీకి ఫిర్యాదు చేస్తున్నట్లు వాటర్షెడ్ అధికారిణి విజేత తెలిపారు. -
గృహ నిర్మాణాలకు అదనపు సాయం
● ఎస్సీలు, బీసీలకు రూ.50 వేల చొప్పున, ఎస్టీలకు రూ. 75 వేలు ● గృహ నిర్మాణాల ప్రగతిపై సమీక్షంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: జిల్లాలో అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గృహ నిర్మాణాల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, బీసీ, ఎస్టీ, పీవీటీజీలకు గృహాలు మంజూరై నిర్మాణాలు వివిధ దశల్లో ఉంటే వాటిని పూర్తి చేయడానికి అదనపు ఆర్థిక సహాయం అందించేందుకు అనుమతిస్తూ జీఓఆర్టీ నంబర్ 9 ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ప్రస్తుత యూనిట్ విలువ రూ.1.80 లక్షలకు అదనంగా ఎస్సీ, బీసీలకు రూ. 50 వేల చొప్పున, ఎస్టీలకు రూ.75 వేలు, పీవీటీజీలకు రూ.లక్ష చొప్పున అదనపు సాయం అందిస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు స్వయం సహాయక సంఘాల సభ్యులు రూ.35 వేల నుంచి రూ.లక్ష వరకు రుణం పొందవచ్చన్నారు. ప్రజా ప్రతినిధులకు కూడా ఈ అంశాన్ని తెలియజేసి విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ ఎంపీడీఓలను, హౌసింగ్ ఏఈలకు సూచించారు. జిల్లాలో మే నెలాఖరు నాటికి 7,069 గృహాలు పూర్తి చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న 17,347 పొజిషన్ సర్టిఫికెట్ల జారీకి సంబంధించి తహసీల్దార్లతో మాట్లాడి క్లియర్ చేసుకోవాలన్నారు. పీఎం జన్మన్ కింద ఆత్మకూరు, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, పాణ్యంలోని చెంచుగూడేలో 527 గృహాలు నిర్మించాల్సి ఉందని అందుకు యూనిట్ విలువ రూ.2.29 లక్షలకు అదనంగా మరో రూ.లక్ష సాయం అందుతుందన్నారు. పూర్తి చేసిన నిర్మాణాలకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు జనరేట్ చేస్తే చెల్లింపులు జరుగుతాయన్నారు. సమావేశంలో హౌసింగ్ ఈఈ హరిహర గోపాల్, డ్వామా పీడీ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. -
కుంభోత్సవానికి కొబ్బరికాయల సమర్పణ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి వచ్చే నెల 15వ తేదీన కుంభోత్సవం నిర్వహించనున్నా రు. అమ్మవారికి సాత్వికబలి నిర్వహించేందుకు కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు మొదలైనవి సమర్పిస్తారు. కుంభోత్సవం రోజున సీ్త్ర వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టం. కాగా ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే ప్రతి మంగళవారం, శుక్ర వారం రోజుల్లో అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించడం అనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఆలయ ఉద్యోగి మంగళవారం కొబ్బరికాయలు సమర్పించారు. అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి, పసుపు, కుంకుమలతో వాటికి పూజాలు జరిపారు. అనంతరం అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పించారు. చౌడేశ్వరిదేవి హుండీ ఆదాయం రూ. 25.93 లక్షలు బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయ హుండీ లెక్కింపు ద్వారా రూ.25.93 లక్షల ఆదాయం లభించింది. గత ఏడాది నవంబర్ నుంచి ఇప్ప టి వరకు భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించారు. రూ.25,93,789 నగదు, 37.25 గ్రాముల బంగారు, కిలోన్నర వెండి వచ్చిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణాధికారి హరిశ్చంద్రారెడ్డి, ఏపీజీబీ బ్యాంకు సిబ్బంది, ఆళ్లగడ్డ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. 660 మంది విద్యార్థులు గైర్హాజరు నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలకు 660 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 53 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు జనరల్ విద్యార్థులు 15,110 మందికి గాను 14,563 మంది విద్యార్థులు హాజరు కాగా 547 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ పరీక్షకు 1,494 మందికి గాను 1,381 మంది హాజరు కాగా 113 మంది గైర్హాజరయ్యారు. మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్గా రంగనాథరావు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్గా వి.వి.రంగనాథరావు నియమితులయ్యారు. ఈయన నెల్లూరు జిల్లాలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఇటీవలనే ప్రభుత్వం డిప్యూటీ డైరెక్టర్గా పదోన్నతి కల్పించి కర్నూలుకు బదిలీ చేసింది. నంద్యాల లో అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్న శ్యామల కర్నూలులో మూడేళ్లకుపైగా పూర్తి అదనపు బాధ్యతలతో జేడీగా పనిచేశారు. జిల్లా విభజన తర్వాత ఎఫ్ఏసీపై ఇక్కడే డీడీగా పనిచేస్తున్నారు. కర్నూలు డీడీ పోస్టు ఖాళీగా ఉండటంతో ఈ స్థానంలో రంగనాథరావును నియమి స్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈయన రెండు, మూడు రోజుల్లో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు ఇక్కడ జేడీ, డీడీ హోదాలో పనిచేసిన శ్యామల నంద్యాలలో ఏడీగానే కొనసాగనున్నారు. -
యువనేస్తం.. నిలువునా మోసం
ఉద్దేశపూర్వకంగా బకాయిలు పేద విద్యార్థులను దూరం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఫీజు బకాయిలు పెడుతుంది. కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. వసతి దీవెన, విద్యాదీవెన నిలిపి వేసి డిగ్రీ, ఇంజనీరింగ్, డాక్టర్ చదువుల కలలను నీరుగార్చే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది. – ఎంఆర్ నాయక్, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి, నంద్యాల పేద విద్యార్థులకు అన్యాయం కూటమి ప్రభుత్వం మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో పెట్టి పేద విద్యార్థులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తోంది. ఫీజు కట్టకపోవడంతో కాలేజీల నుంచి విద్యార్థులను పరీక్షలు రాయించకుండా వెళ్లగొడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో చదువులు మధ్యలో ఆగిపోతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోంఇ. – నాగరాముడు, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, నంద్యాల విద్యా వ్యవస్థను నీరుగారుస్తోంది కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నీరుగారుస్తోంది. మళ్లీ ఐదేళ్లు కష్టాలను చవి చూడాల్సి వస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులు ఫీజులు చెల్లించాలంటే ఇబ్బందిగా మారుతుంది. ప్రభుత్వం ఇప్పటి కైనా దిగి వచ్చి విద్యార్థులకు న్యాయం చేయాలి. – రాజు, విద్యార్థి సంఘం అధ్యక్షుడు, నంద్యాలనంద్యాల: గత ఐదేళ్ల పాటు నిశ్చితంగా ఉన్న విద్యారంగం నేడు కూటమి ప్రభుత్వంలో ఒడిదుడుకులకు గురవుతోంది. మళ్లీ గత టీడీపీ పాలనలోని కష్టాలను చవి చూడాల్సి వస్తుందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పేరుతో విద్యార్థులకు ఆర్థికంగా ఆదుకుంటూ వచ్చింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ పథకాలకు పేర్లు మార్చి చేతులెత్తేసింది. ఏటా చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెనపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. పేద మధ్య తరగతి వర్గాలకు చెందిన తల్లిదండ్రులకు రూ. వేలకు వేలు ఫీజు చెల్లించడం ఇబ్బందిగా మారింది. కూటమి ప్రభుత్వం ఫీజు చెల్లింపులో ఎలాంటి స్పష్టత ఇవ్వక పోవడంతో డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చేస్తున్న విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో దాదాపు 38 వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, కాపు, క్రిస్టియన్ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి కూటమి ప్రభుత్వం మూడు విడతలుగా దాదాపు రూ.73 కోట్లు బకాయి పడింది. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థుల ఉన్నత విద్యకు ఎలాంటి ఆటంకం కల్పించబోమని, ఎప్పటికప్పుడు ఫీజులను విడుదల చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి నా ఫీజు బకాయిలపై దృష్టి సారించడం లేదు. జగనన్న పాలనలో ఇలా.. గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశ పెట్టిన సమయంలో బీసీ, ఈబీసీ, మైనార్టీ, కాపు విద్యార్థుల ఇంజినీరింగ్ విద్యకు ఏడాదికి రూ.35వేలు మాత్రమే విడుదలయ్యేవి. కానీ కొన్ని పెద్ద కళాశాలల్లో (గ్రేడ్–1) ఇంజినీరింగ్ ఫీజు ఏడాదికి రూ.60వేల నుంచి రూ. 80వేల వరకు ఉంది. ఆయా కళాశాలల్లో చదువుతున్న సంబంధిత సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వం విడుదల చేసే రూ.35 వేలను మినహాయించి మిగిలిన ఫీజు వారి తల్లిదండ్రులే చెల్లించాల్సి వచ్చే ది. ఈ ఆర్థిక భారాన్ని కూడా తొలగించేందుకు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని పెంచాలని నిర్ణయం తీసుకుని అమలు చేశారు. జగనన్న విద్యాదీవెన పేరుతో ఆయా విశ్వవిద్యాలయాలు నిర్ణయించిన ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో గ్రేడ్–1 కళాశాలల్లో అనేక మంది విద్యార్థులు ఇంజినీరింగ్ తదితర కోర్సులను ఎలాంటి ఆర్థిక భారం లేకుండా పూర్తి చేసి కుటుంబాలకు ఆసరాగా నిలిచారు. ఐదేళ్ల జిల్లాలో జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద రూ.498.50 కోట్లు తల్లుల ఖాతాల్లో జమ చేశారు. బకాయిలు చెల్లించిన జగన్ సర్కార్.. గత టీడీపీ ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను కూడా వైఎస్సార్సీపీ ప్రభు త్వం 2019–20 విద్యా సంవత్సరంలో విడుదలయ్యా యి. వసతి దీవెన పథకం ద్వారా ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు రూ.23 వేలు అందించింది. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో వైద్య రంగానికి పెద్దపీట వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు నిర్మాణాలను కూడా ప్రారంభించారు. అందులో భాగంగానే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆదోని, నంద్యాల ప్రాంతాల్లో మెడికల్ కళాశాలల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. నంద్యాలలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభం కాగా, ఆదోనిలో చురుగ్గా జరుగుతున్న మెడికల్ కళాశాల నిర్మాణాలకు కూటమి ప్రభుత్వం మోకాలడ్డువేసింది. కరువు ప్రాంతమైన ఆదోనిలో మెడికల్ కళాశాల నిర్మాణానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో దాదాపు 80 శాతం నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. మిగిలిన 20 శాతం పనులు పూర్తియితే ఈ ఏడాది 150 సీట్లతో కళాశాల ప్రారంభయ్యేది. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిర్మాణాలకు బ్రేకులు వేసింది. దీంతో ఆదోని మెడికల్ కళాశాల కలగానే మిగిలిపోయింది. పైపెచ్చు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏర్పాటైన మెడికల్ కళాశాలలను ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేందుకు తీసుకున్న నిర్ణయం పట్ల పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వైద్య విద్యకు మోకాలడ్డు నారా లోకేష్ నోరు విప్పాలి విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ యువగళం పాదయాత్రలో ఫీజురీయింబర్స్మెంట్పై ఇచ్చిన హామీలు ఇంత వరకు నోరు విప్పడం లేదు. పెండింగ్లో నిధులను మంజూరు చేసే విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తే సహించేది లేదు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడతాం. – సురేష్యాదవ్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు, నంద్యాలరూ.2,142,16 కోట్లు అమలు చేయకపోతే ఏడాది నష్టం 5,95,045 జిల్లాలోని గృహాల సంఖ్య రూ.178.51 కోట్లు నెలకు రూ.3వేల చొప్పున చెల్లించాల్సిన నిరుద్యోగ భృతినేడు వైఎస్సార్సీపీ యువత పోరు విద్యార్థులకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈనెల 12వ తేదీన వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో యువత పోరు నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా అద్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి తెలిపారు. ఫీజు బకాయిలు వెంటనే చెల్లించకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. విద్యార్థులతో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టనున్నామన్నారు. కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం విద్యార్థుల సమస్యలపై కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తామన్నారు. చంద్రబాబుకు నిరుద్యోగులను మోసం చేయడం ఆనవాయితీగా మారింది. 2014లో కూడా ఇంటికో ఉద్యోగం ఇస్తానని, అప్పట్లో రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హామీని చెత్తబుట్టలో పడేశారు. 2019 ఎన్నిలకు ముందు రాజకీయ లబ్ధి కోసం 2018 అక్టోబర్ నుంచి నెలకు రూ.వెయ్యి కొంతమందికి మాత్రమే నిరుద్యోగ భృతి వేసి చేతులుదులుపుకున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు ఇస్తానని, ఉద్యోగం ఇచ్చే వరకూ ‘యువనేస్తం’ పేరిట నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఈ లెక్కన జిల్లాలో నెలకు రూ.178.51 కోట్లు ఇవ్వాలి. ‘కూటమి’ మాటలు నమ్మి ఉద్యోగాలపై ఆశతో కోచింగ్ సెంటర్లకు వెళ్లే విద్యార్థులకు ప్రతి నెలా వేల రూపాయలు ఖర్చవుతోంది. ప్రభుత్వం భృతి ఇవ్వకపోవడంతో వారిపై భారీగా ఆర్థిక భారం పడుతోంది. ఓ వైపు ఉద్యోగాల నోటిఫికేషన్లు లేవు. మరో వైపు భృతి లేకపోవడంతో నిరుద్యోగులు ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. -
నల్లమలలో కార్చిచ్చు
కొత్తపల్లి: ముసలిమడుగు సమీపంలో ఉన్న నల్లమల అడవికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. సోమవారం రాత్రంతా అడవిలో మంటలు కనిపించడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందారు. మంగళవారం ఉదయం కూడా అడవిలో మంటలతో పాటు పొగ ఎగజిమ్ముతూనే ఉంది. గాలి ఏ దిశకు వీస్తుందో అటువైపుగా ఉవ్వెత్తున మంటలు ఎగసి పడుతున్నాయి. బర్రెలు మేపుకునేందుకు గానీ, వంట కట్టెల కోసం గానీ ఎవ్వరిని అటవీలోకి వెళ్లకుండా ఫారెస్ట్ అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నప్పటికీ మంటలు ఎలా చెలరేగాయోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి
పత్తికొండ రూరల్/ఆస్పరి: రోడ్డు ప్రమాదంలో పందికోన గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త పందుల బాలరాజు (34) మృతి చెందారు. వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో బాలరాజు చురుగ్గా పాల్గొనేవాడు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఉన్న అభిమానంతో ముగ్గురు సంతానంలో పెద్దకుమార్తె పేరు షర్మిల, చిన్నకుమారుడి పేరు జగన్ అని పెట్టుకున్నారు. ఆస్పరి మండలం కై రుప్పల సమీపంలో ఆదివారం దేవరకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఆటోలో వస్తూ అదుపుతప్పి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ను ఢీకొట్టాడు. చికిత్స నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. బాలరాజు మృతితో భార్య సరోజ, బంధువులు బోరున విలపించారు. మృతి వార్త తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి సోమవారం ప్రభుత్వాసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
చాగలమర్రిలో దంపతులపై దాడి
చాగలమర్రి: మండల కేంద్రమైన చాగలమర్రిలోని మంగలి వీధిలో షేక్ బీబీ, మహబూబ్బాషా దంపతులపై అదే కాలనీకి చెందిన వారు దాడి చేశారు. సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే..మహబూబ్బాషా ఇంటి ఎదురుగా తాజు, తాహెర్ అనే వ్యక్తులు నివసిస్తారు. ఇళ్ల ముందు వాహనాలు నిలిపే విషయంలో ఇరుకుటుంబాల మధ్య గొడవ ఉంది. ఈ క్రమంలో సోమవారం తాజు, తాహెర్ మరికొంత మంది మహబూబ్బాషా దంపతుల ఇంటిపైకి వెళ్లి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బీబీతో పాటు భర్తను స్థానిక ఓ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులపై దాడి విషయం తెలుసుకున్న కుమార్తె అబీదా, బంధువు ఇనాయతుల్లా పరామర్శించేందుకు ప్రొద్దుటూరు నుంచి ఆసుపత్రికి వచ్చారు. నిందితులు మరో పదిమందితో కలిసి అక్కడికి చేరుకొని వారిపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఆళ్లగడ్డ రూరల్ సీఐ మురళీధర్రెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే తీవ్రంగా గాయపడిన షేక్ బీబీని వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం ప్రొద్దుటూరుకు తరలించినట్లు కుటుంబీకులు తెలిపారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగం పేరిట మోసం
● ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు కర్నూలు: హైదరాబాద్లో బిందు కన్సల్టెన్సీ పేరిట సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అశ్విని, సాయికృష్ణ, హిమబిందు కలసి రూ.60 వేలు తీసుకుని మోసం చేశారని కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రమేష్కుమార్ రెడ్డి ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారు. కర్నూలు టూటౌన్ పక్కనున్న క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. పీజీఆర్ఎస్కు మొత్తం 122 ఫిర్యాదులు రాగా.. వీటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన పరిష్కారం చూపుతామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా కూడా పాల్గొని వినతులను స్వీకరించారు. -
టీడీపీ డీలరా.. మజాకా..!
పగిడ్యాల: పేద ప్రజలకు చౌకదుకాణాల ద్వారా ఉచితంగా సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం పంపిణీలో డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కార్డుదారుల వేలిముద్రలను తీసుకుని బియ్యం వేయకుండా మోసం చేసిన వైనం పడమర ప్రాతకోట గ్రామం 21వ షాపు పరిధిలో వెలుగు చూసింది. గత జగనన్న ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ ఇంటింటికి పంపిణీ చేయగా.. కూటమి ప్రభుత్వం అధికార పార్టీ నేతలను డీలర్లు మార్చి పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తోంది. ఇందుకు పడమర ప్రాతకోట 21వ షాపు నిర్వాకుడే నిదర్శనం. ఈ షాపు పరిధిలో 709 కార్డులు ఉన్నా యి. ప్రతి నెల ఏఏవై కార్ుడ్సకు 13.30 క్వింటాళ్లు, తెల్లరేషన్కార్డులకు 90.50 క్వింటాళ్లు కాగా క్లోజింగ్ బ్యాలెన్స్ (సీబీ) పోగా ఓపెనింగ్ బ్యాలెన్స్ 55.84 క్వింటాళ్లు సరాఫరా చేస్తున్నామని సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ నివేదిక అందజేశారు. కార్డుదారులకు టోకరా కొట్టేందుకే ఎండీయూ వాహన డ్రైవర్తో బయోమెట్రిక్ మిషన్ ఆన్ చేయించుకుని డీల ర్లే స్వయంగా కార్డుదారుల థంబ్ తీసుకుని బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘ప్రభుత్వం మాది మేము బియ్యం పంచుకుంటాం.. కేవలం థంబ్ వేయించి పోండి’ అంటూ ఎండీయూ డ్రైవర్లపై డీలర్లు పెత్తనం చెలాయిస్తున్నట్లు సమాచారం. అందుకే ఫిబ్రవరి నెలకు సంబంధించి బియ్యం కోటా తక్కువ వచ్చిందని మార్చి నెలలో రెండు నెలల బియ్యం ఒకేసారి వేస్తానని కార్డుదారుల వేలిముద్రలు తీసుకుని దాదాపు 80 ప్యాకెట్ల బియ్యాన్ని డీలర్ మాయం చేసినట్లు సమాచారం. ఎక్కువగా 20 కేజీలు, 25 కేజీలు, 35 కేజీలు కలిగిన కార్డుదారుల వ్రేలిముద్రలను తీసుకుని బియ్యం వేయనట్లు తెలుస్తోంది. పేదల నోటి కాడి బియ్యాన్ని పక్కదారి పట్టించిన అధికార పార్టీ డీలర్పై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. బియ్యం వేయకుండానే వేలిముద్రలు తీసుకున్నాడు పోయిన నెలలో నా కార్డుకు బియ్యం వేసి మా కొడుకుల కార్డులకు బియ్యం వేయలేదు. వేలిముద్రలు తీసుకున్నావ్ కదా అని అడిగితే వచ్చే నెలలో వేస్తానని చెప్పినాడు. ఈనెల బండి ఇంకా రాలేదు. – హజరాంబీ, పడమర ప్రాతకోట 5 కేజీలు, 10 కేజీల కార్డులకు మాత్రమే వేశారు కార్డులో ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఉన్న వాళ్లకు మాత్రమే 5 కేజీలు, 10, 15 కేజీల బియ్యం వేశారు. 20, 25, 30 కేజీల ఉన్న వారికి ఇవ్వలేదు. నా కొడు కు తలారి అయినా బియ్యం వేయలేదు. ముస్లిం కాలనీలో చాలా మందికి వేయలేదు. రెండు నెలల బియ్యం వేస్తానని వ్రేలిముద్రలు వేయించుకున్నాడు. – మొల్ల జైబున్బీ,పడమర ప్రాతకోట నా దృష్టికి రాలేదు పడమర ప్రాతకోటలోని 21వ షాపు డీలర్ బియ్యం సరిగా పంపిణీ చేయని విషయం నా దృష్టికి రాలేదు. మార్చి నెల కోటా బియ్యం పంపిణీ జరుగుతోంది. ఆర్ఐతో విచారణ చేయించి రెండు నెలల బియ్యం వేసేలా చర్యలు తీసుకుంటాం. – శివరాముడు, తహసీల్దార్, పగిడ్యాల వినియోగదారుల థంబ్ తీసుకుని రేషన్ ఇవ్వని వైనం ఫిబ్రవరి నెలలో దాదాపు 80 బస్తాల బియ్యం మాయం లబోదిబోమంటున్న కార్డుదారులు -
రాళ్ల ట్రాక్టర్ బోల్తా పడి బాలుడి మృతి
పాములపాడు: మండలంలోని చెలిమల గ్రామ సమీపంలో రాళ్ల ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. లింగాల గ్రామానికి చెందిన మోహన్రావు కుమారుడు జస్వంత్ (17) 9వ తరగతి చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం పని మీద పాములపాడుకు వచ్చిన జస్వంత్ తిరుగు ప్రయాణంలో స్వగ్రామానికి వెళ్తున్న రాళ్ల లోడు ట్రాక్టర్ ఎక్కాడు. మార్గమధ్యలో చెలిమిల గ్రామ సమీపంలో ఎద్దుల వంక వాగు వద్ద ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో రాళ్లపై కూర్చున్న బాలుడు జస్వంత్పై రాళ్లుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో బాలుడు సంగీత రాజు క్షేమంగా బయటపడ్డాడు. ప్రస్తుతం డ్రైవర్ స్వాములు పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని ప్రమాద వివరాలు సేకరించారు. అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య కొలిమిగుండ్ల: నందిపాడుకు చెందిన గుండ్ర గుర్రప్ప(48) అప్పుల బాధతో సోమవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్ఐ బాబా ప్రకృద్దీన్ తెలిపారు. గుర్రప్ప నాపరాళ్ల వ్యాపారం చేస్తూ నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. కుమారుడు చదువు, కుమార్తె వివాహం కోసం ఫైనాన్స్ సంస్థల వద్ద రూ.9లక్షలు అప్పు చేశాడు. ఇందులో రూ.3 లక్షలు వాయిదాల రూపంలో చెల్లించాడు. మిగిలిన బకాయి చెల్లించే అవకాశం లేక ఆర్థిక సమస్యలతో సతమతమయ్యాడు. దీతో మనస్తాపం చెంది తిమ్మనాయినపేట జంక్షన్ సమీపంలోని పొలంలోకి వెళ్లి శనగ మాత్రలు మింగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికులు గుర్తించి తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. చెట్టుపై నుంచి కిందపడి యువకుడి మృతి ఆదోని అర్బన్: పెద్దకడబూరు మండలం నెమలికల్లు గ్రామానికి చెందిన అల్తాఫ్(26) అనే యువకుడు చెట్టుపై నుంచి కిందపడి సోమవారం మృతిచెందాడు. బంధువులు తెలిపిన వివరాలు మేరకు .. ఉదయం పొలంలోని టెంకాయ చెట్టు ఎక్కి టెంకాయలను తెంపుతుండగా అకస్మాత్తుగా పై నుంచి కింద పడ్డాడు. కిందకు పడిన యువకుడిని వెంటనే స్థానికులు ఆదోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే అల్తాఫ్ మృతిచెందాడు. మృతుడికి భార్య సునీత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడు వలస వెళ్లి ఇటీవలే గ్రామానికి చేరుకున్నాడు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతో రోదనలు మిన్నంటాయి. -
శాసీ్త్రయ పద్ధతులతో పాడిపరిశ్రమ లాభసాటి
కర్నూలు(అగ్రికల్చర్): శాసీ్త్రయ పద్ధతులను అవలంబిస్తే పాడిపరిశ్రమను లాభసాటిగా మార్చుకోవచ్చని ఆర్ఏహెచ్టీసీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కె.సుధాకర్రెడ్డి తెలిపారు. కర్నూలు కొండారెడ్డిబురుజు సమీపంలోని బహుళార్ధ పశువైద్యశాల ప్రాంగణంలోని ట్రైనింగ్ సెంటర్లో పాడిరైతులకు 3 రోజుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా వాణిజ్య సరళిలో పాడిపశువుల పెంపకం అనే అంశంపై సోమవారం శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పాడి రైతులనుద్దేశించి ఏడీ డాక్టర్ సుధాకర్రెడ్డి మాట్లాడుతూ ప్రధానంగా పాడిపశువుల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏడాది పొడవునా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఆసక్తి ఉన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ అరుణశ్రీ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు అంతంత మాత్రమే కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వాము ధర ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ రైతులకు అంతంతమాత్రం ధర లభిస్తోంది. సోమవారం మార్కెట్కు 254 మంది రైతులు 802 క్వింటాళ్ల వాము తెచ్చారు. గరిష్ట ధర రూ.28,888 ఉన్నట్లు ప్రకటించినప్పటికి.. దాదాపు 240 మంది రైతులకు అంతంతమాత్రం ధరే లభించింది. సగటు ధర రూ.12,399 పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. ● ఉల్లి ధరలు పడిపోయాయి. మార్కెట్కు ఉల్లి 2,873 క్వింటాళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.517, గరిష్ట ధర రూ.1537 లభించగా... సగటు ధర రూ.1,187 నమోదైంది. మిర్చికి గరిష్టంగా రూ.12769 లభించింది. సగటు ధర కేవలం రూ.8,720 మాత్రమే నమోదైంది. మార్కెట్కు 1,768 క్వింటాళ్ల కందులు వచ్చాయి. కనిష్ట ధర రూ.3,100, గరిష్ట ధర రూ.7,158 లభించగా.. సగటు ధర రూ.6,909 మాత్రమే పలికింది. ట్రాక్టర్ డ్రైవర్ దుర్మరణం ● బస్సును ఢీకొన్న ట్రాక్టర్ వెల్దుర్తి: ఆర్టీసీ బస్సును ట్రాక్టర్ ఢీకొట్టడంతో ట్రాక్టర్ డ్రైవర్ యశ్వంత్ (23) మృతిచెందారు. ఈ దుర్ఘటన వెల్దుర్తి సమీపంలోని హైవే 44పై సోమవారం చోటుచేసుకుంది. ఉదయం 6గంటల సమయంలో కర్నూలు నుంచి అనంతపురం వైపు ఏపీఎస్ ఆర్టీసీ కర్నూలు డిపో అల్ట్రా డీలక్స్ బస్సు వెళ్తోంది. అదే సమయంలో పసుపుల నుంచి వెల్దుర్తికి సొప్పలోడు కోసమని ట్రాక్టరు వస్తోంది. బస్సును పక్కనుంచి ఢీకొనడంతో ట్రాక్టరు ట్రాలీతో విడిపోయి రహదారిపై బోల్తాపడింది. బస్సు డివైడర్ పైకెక్కి, ముందు టైర్లు పగిలిపోయి ఆగిపోయింది. బస్సు పాక్షికంగా ధ్వంసమైంది. ఈ ఘటనలో పసుపులకు చెందిన ట్రాక్టరు డ్రైవర్ యశ్వంత్ మృతిచెందారు. ట్రాక్టర్ క్లీనర్ అదే గ్రామానికి చెందిన సంజీవ్ గాయపడ్డాడు. బస్సు డ్రైవర్, 39 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైవే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం వెల్దుర్తి ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. -
ఏపీఎస్పీ రెండవ పటాలంలో బదిలీలకు గ్రీన్సిగ్నల్
మేనేజర్, స్టోర్ ఎన్సీఓ పోస్టులకు భారీ పోటీ ప్రతి కంపెనీలో ఒక మేనేజర్, స్టోర్ ఎన్సీఓ ఉంటాడు. ఆయా పోస్టులను దక్కించుకునేందుకు సిబ్బంది పోటీ పడుతున్నారు. నిబంధనల ప్రకారం ఆయా పోస్టుల్లో విధులు నిర్వహించాలంటే అందుకు సంబంధించిన శిక్షణ తప్పనిసరి. గతంలో ఇదే విధులు నిర్వహించిన వారికి మళ్లీ నియమించకూడదనే నిబంధన కూడా ఉంది. అయితే కొందరు రెండోసారి కూడా ఆయా పోస్టుల్లో పనిచేశారు. కర్నూలు: ఏపీఎస్పీ కర్నూలు రెండో పటాలంలో సిబ్బంది బదిలీలకు రంగం సిద్ధమైంది. నూతన కమాండెంట్ బాధ్యతలు చేపట్టిన దీపిక పాటిల్ ఆదేశాల మేరకు బదిలీల జాబితా సిద్ధమైనట్లు సిబ్బందిలో చర్చ జరుగుతోంది. గత నెల 25న కమాండెంట్ సంబంధిత కంపెనీ ఆర్ఐలకు(ఆఫీసర్ కమాండింగ్) బదిలీలకు సంబంధించిన మెమో (ఉత్తర్వులు) ఇచ్చా రు. బెటాలియన్లో తొమ్మిది కంపెనీలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఏళ్ల తరబడి బయటి కంపెనీల్లో పనిచేసిన వారిని హెడ్ క్వార్టర్కు బదిలీ చేయాల్సి ఉంది. మొత్తం పటాలంలో దాదాపు 1100 మంది సిబ్బంది ఉన్నారు. టర్న్ ప్రకారం ప్రతి ఒక్కరికీ హెడ్ క్వార్టర్లో విధులు నిర్వహించేలా అవకాశం కల్పించాలి. ఇందుకు అనుగుణంగా కమాండెంట్ చర్యలు చేపట్టడంతో ఫెవికాల్ వీరులు పైరవీలు ముమ్మరం చేసినట్లు చర్చ జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో బదిలీల జాబితా వెలువడే అవకాశం ఉన్నట్లు తెలు స్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది ఆఫీసర్ కమాండెంట్లు చేతివాటం ప్రదర్శించి బదిలీల జాబితా తయారీలో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని, జాబితాను సమగ్రంగా పరిశీలించి ఏళ్ల తరబడి బయటి కంపెనీలో పనిచేస్తున్న వారికి కమాండెంట్ న్యాయం చేస్తారనే ఆశాభావం సిబ్బందిలో వ్యక్తమవుతోంది. వీరు ఫెవికాల్ వీరులు ● స్టోర్ ఎన్సీఓగా ఎమ్టీ గ్రూప్లో హెడ్ కానిస్టేబుల్ రంగసామిరెడ్డి 15 ఏళ్లుగా కొనసాగుతున్నారు. దీపిక పాటిల్ కమాండెంట్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సిబ్బంది సమస్యలపై దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా రంగసామిరెడ్డిపై పలువురు సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీంతో అతడి స్థానంలో బాల హుసేన్ (హెచ్సీ 817)ను నియమించారు. అవమానంగా భావించిన రంగసామిరెడ్డి ద్వితీయ శ్రేణి అధికారి సహాయంతో సిక్ లీవ్లో వెళ్లారు. ఇందుకు ఓ అధికారికి పి–క్యాప్ స్టిక్ కానుకగా బహుకరించినట్లు సిబ్బందిలో చర్చ జరుగుతోంది. ఈయన ఏఎంటీఓ ద్వారా హెడ్ క్వార్టర్లోనే కొనసాగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ● సమరసింహారెడ్డి (కళ్యాణ మండపం నిర్వహణ) 20 ఏళ్లుగా హెడ్ క్వార్టర్లోనే కొనసాగుతున్నారు. ● తిరుమల్రెడ్డి 30 ఏళ్లుగా ట్రైనింగ్ గ్రూప్లోనూ, బందె నవాజ్ 20 ఏళ్లుగా బెటాలియన్ హాస్పిటల్లో, హెడ్ కానిస్టేబుల్ మౌలాలి పదేళ్లుగా హాస్పిటల్ విధులు, టైలరింగ్ గ్రూప్లో 15 ఏళ్లుగా జిలానీ బాషాతో పాటు మరో పది మంది దాకా వివిధ గ్రూపుల్లో హెడ్ క్వార్టర్లో విధులు నిర్వహిస్తుండటం వల్ల బయటి కంపెనీల్లో పనిచేసేవారికి అవకాశం దక్కడం లేదని సిబ్బంది వాపోతున్నారు. ● అసిస్టెంట్ కమాండెంట్ల దగ్గర విధులు నిర్వహించే పీఏలు కూడా ఏళ్ల తరబడి హెడ్ క్వార్టర్లోనే కొనసాగుతున్నట్లు సిబ్బందిలో చర్చ జరుగుతోంది. ● కానిస్టేబుల్ కిరణ్ 20 ఏళ్లుగా అసిస్టెంట్ కమాండెంట్ దగ్గర పనిచేస్తున్నారు. ● విశ్వనాథ్ రెడ్డి ట్రెజరీలో ఎనిమిదేళ్లుగా హెడ్ క్వార్టర్లోనే ఉంటున్నారు. ● డీఎస్పీలు ఎస్ఎం బాషా దగ్గర హుసేనయ్య, రమణ దగ్గర రియాజ్, రవికిరణ్ దగ్గర రాజు కొన్నేళ్లుగా సీట్లకు అతుక్కుని విధులు నిర్వహిస్తున్నారు. ● హెడ్ కానిస్టేబుల్ విశ్వనాథ్ రెడ్డి కూడా అసిస్టెంట్ కమాండెంట్, గతంలో కమాండెంట్ దగ్గర విధులు నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్గా విధుల్లో చేరినప్పటి నుంచి హెడ్ క్వార్టర్లోనే కొనసాగుతుండటంతో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బదిలీలకు రూ.లక్షల్లో వసూలు నచ్చిన చోటుకు పంపేందుకు, ఉన్న చోటనే కొనసాగించేందుకు ఉద్యోగుల నుంచి గతంలో మామూళ్లు వసూలు చేశారని ఫిర్యాదుల నేపథ్యంలో పదవీ విరమణ పొందిన ఓ ఉన్నతాధికారిపై విచారణ జరిగింది. పదవీ విరమణకు ఒక రోజు ముందు బదిలీల పేరుతో ఇద్దరు అధికారులు చక్రం తిప్పి ముడుపులు వసూలు చేశారు. వివిధ హోదాల్లో ఉన్న వంద మందికి స్థానచలనం కల్పించి గత కమాండెంట్ రూ.లక్షల్లో దండుకున్నారు. ఈ తరహా బదిలీలపై సిబ్బంది నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో డీఐజీ రాజకుమారి ఆదేశాల మేరకు 16వ బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాస్ గతంలో విచారణ జరిపి ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. అయితే చర్య ప్రశ్నార్థకంగా మారినట్లు తెలుస్తోంది. మార్గదర్శకాలతో మెమో జారీ చేసిన కమాండెంట్ అర్హుల జాబితాను సిద్ధం చేసిన కంపెనీ ఆర్ఐలు -
‘యువత పోరు’కు తరలిరండి
బనగానపల్లె: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన జిల్లా కేంద్రమైన నంద్యాలలో చేపడుతున్న యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రా రెడ్డి కోరారు. బనగానపల్లెలోని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహం వద్ద ఆదివారం యువత పోరుబాట పోస్టర్లను ఆవిష్కరించారు. విలేకరులతో పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, లేదంటే ప్రతి నెలా రూ.3వేల చొప్పున భృతి ఇస్తామని టీడీపీ నేతలు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.7,200 కోట్లు ఖర్చు చేయాల్సి ఉన్నా.. గత బడ్జెట్లో కేటాయింపులు లేవన్నారు. ఈ ఏడాది కూడా ఒక పైసా కేటాయించకపోవడం అత్యంత శోచనీయమన్నారు. ఫీజులు కట్టకపోవడంతో కాలేజీల నుంచి పేద విద్యార్థులను బయటకు పంపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్ పథకాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిందని గుర్తు చేశారు. ● మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ హయాంలో 17 కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటయ్యాయన్నారు. వీటిలో ఐదు కళాశాలల్లో తరగతులు ప్రారంభం అయ్యాయని, కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్పరం చేసేందుకు యత్నిస్తోందన్నారు. నాడు– నేడు పనులు అటకెక్కాయని, విద్యార్థుల చదువులకు అడుగడుగునా ఆటంకాలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిట్టగా పేరుపొందారన్నారు. ● ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రా రెడ్డి మాట్లాడుతూ.. విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అన్నారు. విద్యాదీవెన, వసతిదీవెన పథకాలకే రూ. 18 వేల కోట్ల వరకు ఖర్చు చేసినట్లు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వసతి దీవెన, విద్యాదీవెన పథకాలు నిలిపివేయడంతో పేదల చదువుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. యువత పోరు కార్యక్రమానికి విద్యార్థులు భారీగా తరలిరావాలన్నారు. ● విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సురేష్ యాదవ్, నియోజకవర్గ అధ్యక్షుడు పూజారి శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ జనార్దన్రెడ్డి, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకుడు అబ్దుల్ఖైర్, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి సిద్ధంరెడ్డి రామ్మోహన్రెడ్డి, నాయకులు అంబటి రవికుమార్రెడ్డి, శంకర్రెడ్డి పాల్గొన్నారు. -
అయినా.. ప్రయోజనం లేదు
గ్రామాల్లో చెత్త సేకరిస్తున్నారు కానీ ప్రయో జనం లేకుండా పోతోంది. ఆ చెత్తను రోడ్ల వెంటనే విడిచి పెడుతున్నారు. కుక్కలు, పందులు వ్యర్థాలను తీసుకొచ్చి ఇళ్ల ముందు పడేస్తున్నాయి. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. – చాకలి నాగలక్షమ్మ, మహదేవపురం చెత్త సంపద కేంద్రాలనుపట్టించుకునే వారు లేరు గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడంతో పారిశుద్ధ్యంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. కొన్ని గ్రామాల్లో రహదారుల వెంట వెళ్లాలంటే కూడా ఇబ్బందిగా ఉంది. చెత్త సంపద కేంద్రాలు పని చేయడం లేదు. అధికారులు ర్యాలీలు, సదస్సులు నిర్వహించడంతో పాటు సంపద కేంద్రాలను పని చేసేలా చర్యలు తీసుకోవాలి. – గడ్డం చంద్రశేఖర్రెడ్డి, ఆళ్లగడ్డ వినియోగంలోకి తీసుకువస్తాం గ్రీన్ వెహికిల్స్ ద్వారా గ్రామాల్లో చెత్తను ఎప్పటికప్పుడు సేకరించి డంపింగ్కు తరలిస్తున్నాం. మరమ్మతులకు గురైన కేంద్రాలకు త్వరలో వినియోగంలోకి తీసుకు వస్తాం. చెత్తకు నిప్పు పెట్టకుండా అవగాహన కల్పిస్తాం. చెత్త సంపద తయారీ కేంద్రాలతో పంచాయతీలకు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటాం. – అశ్విన్, ఈవోపీఆర్డీ, ఆళ్లగడ్డ -
నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
నంద్యాల: కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం చేపట్టి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ సమస్యలు ఉన్న వారు వినతులు అందజేయాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉదయం 9.30 గంటలకు జిల్లా అధికారులందరూ హాజరు కావాలన్నారు. టీబీ డ్యాంలో 25.5 టీఎంసీలు హొళగుంద: కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు సాగు, తాగునీరునందిస్తూ వరదాయినిగా ఉన్న తుంగభద్ర జలాశయంలో ఆదివారం 25.547 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్ఫ్లో జీరో క్యూసెక్కులు కాగా.. 10,041 కూసెక్కుల నీటిని వివిధ కాల్వకు వదులుతున్నారు. ఎల్లెల్సీకి మార్చి నెలాఖరు వరకు నీటిని విడుదల చేస్తామని టీబీ బోర్డు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అయితే డ్యాంలో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉండటంతో ఏప్రిల్ 15 వరకు కొనసాగే అవకాశం ఉంది. సీసీఐ కేంద్రాలపై విజి‘లెన్స్’ ఆదోని అర్బన్: పట్టణంలోని సీసీఐ కేంద్రాల్లో శనివారం సాయంత్రం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎన్డీబీఎల్, ధారశ్రీ పరిశ్రమల్లో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాల్లో దూదిబేళ్లను, జిన్నింగ్ నడిచే విధానాన్ని, రికార్డులను కర్నూలు విజిలెన్స్ ఎస్పీ చౌడేశ్వరి, ఏఓ విశ్వనాథ్ తనిఖీ చేశారు. స్థానిక సీసీఐ అధికారి భరత్ను, మార్కెట్యార్డు సెక్రటరీ రామ్మోహన్రెడ్డిలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. నదుల పూడ్చివేతను ఆపాలి కర్నూలు(సెంట్రల్): నగరంలోని హంద్రీ, తుంగభద్ర నదుల పూడ్చివేతను అధికారులు ఆపాలని తుంగభద్ర, హంద్రీ, కేసీ కెనాల్ పరిరక్షణ కమిటీ సభ్యులు కోరారు. ఆదివారం వారు నదుల్లో పూడ్చిన ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ కమిటీ కన్వీనర్ బస్తిపాటి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నదులను పూడ్చి రోడ్ల విస్తరణ, నగర సుందరీకరణ పనులు చేపట్టడం భావ్యం కాదన్నారు. ఇటీవల తుంగభద్ర, హంద్రీ నదుల్లో పలు చోట్ల మట్టితో నింపేయడం సరికాదన్నారు. నదుల పరిరక్షణ కు పాటు పడాల్సిన అధికారులు దగ్గరుండి మరీ పనులు చేయించడం దారుణమన్నారు. ‘పది’ విద్యార్థులకుఉచిత బస్సు ప్రయాణంకర్నూలు సిటీ: పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించనున్నట్లు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ కె.సుధారాణి తెలిపారు. ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకు జరుగనున్న పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు బస్సుల్లో హాల్ టికెట్ చూపితే ఉచితంగా ప్రయాణం చేయవచ్చునన్నారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో నివాస ప్రాంతం నుంచి పరీక్ష కేంద్రాలకు, పరీక్ష కేంద్రాల నుంచి నివాసానికి చేరుకునేందుకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిర్దేశించిన సమయానికి కేంద్రాలకు చేరుకునేందుకు పరీక్ష సమయంలో మాత్రమే బస్సు సౌకర్యం ఉంటుందన్నారు. ఒక వేళ ఏ కారణం చేతనైన పరీక్షను రద్దు చేస్తే పరీక్ష నిర్వహించిన రోజు సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. -
శేష శైలావాసా.. అహోబిలేశా!
● వైభవోపేతం అహోబిలేశుడి బ్రహ్మోత్సవం ● శేషవాహనంపై దర్శనమిచ్చిన ప్రహ్లాదవరదుడు ● శరభ ప్రభ వాహనంపై ఊరేగిన జ్వాలా నరసింహుడుఆళ్లగడ్డ: ప్రహ్లాదవరదుడు చిన్ని కృష్ణుడయ్యాడు. ఆదిశేషునిని వాహనంగా చేసుకుని నవనీత కృష్ణావతారంలో మాడ వీధుల్లో ఉభయ దేవేరులతో కలసి విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. నెమలి పింఛం, ప్లిలనగ్రోవితో కృష్ణుడి రూపంలో భక్తులను మంత్రముగ్దులను చేశారు. అహోబిలంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు దిగువ అహోబిలంలో ఆదివారం ఉదయం ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదుడిని యాగశాలలో కొలువుంచి పట్టు వస్త్రాలతో అలంకరించి కొలువుంచారు. అనంతరం వివిధ స్వర్ణాభరణాలు ధరించిన ప్రహ్లాదవరదుడు విశేషంగా ముస్తాబైన ఉభయ దేవేరులతో తొమ్మిది తలల శేషవాహనం అధిష్టించి మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులను యాగశాలలో కొలువుంచి పంచామృతాలతో అభిషేకించి తిరుమంజనం నిర్వహించి అద్దాల మండపంలో కొలువుంచారు. రాత్రి శ్రీ ప్రహ్లాదరవదస్వామి చంద్రప్రభ వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. ఎగువ అహోబిలంలో.. ఉత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో కొలువైన జ్వాలా నరసింహస్వామి ఆదివారం శరభ వాహనాన్ని అధిష్టించి భక్తులను అనుగ్రహించారు. ఉదయం నిత్య పూజల అనంతరం ఉత్సవ మూర్తులైన జ్వాలా నరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి ఉత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. రాత్రి స్వామి వారు శరభ వాహనంపై కొలువు కాగా గ్రామోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఎగువ అహోబిలంలో పొన్నుచెట్టువాహన సేవ, దిగువ అహోబిలంలో మోహిని అలంకారం, మధ్యాహ్నం అభిషేకం, రాత్రి శరభ వాహన సేవలు ఉంటాయి. -
బహుళ ప్రయోజనాల లక్ష్యంతో నెలకొల్పి న చెత్త సంపద కేంద్రాల్లో నిర్లక్ష్యం పేరుకుపోయింది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం.. గ్రామాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యం నీరుగారిపోయింది. ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమం ర్యాలీలు, ప్రత
ఆళ్లగడ్డ: కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో చెత్త సంపద తయారీ కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. రూ.కోట్లు పెట్టి నిర్మించిన షెడ్లు దిష్టి బొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. జిల్లాలో 28 మండలాల పరిధిలో 488 గ్రామ పంచాయతీలు ఉండగా 363 పంచాయతీల్లో చెత్త నుంచి సంపద తయారీ చేసే కేంద్రాలు నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటికి గ్రామీణ ఉపాధిహామీ నిధుల నుంచి సుమారు రూ 33.12 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించినట్లు సమాచారం. చెత్త సేకరణకు జనాభా ప్రాతిపదికన కార్మికులను నియమించారు. పంచాయతీలకు ట్రాక్టర్లు, ఆటోలు, రిక్షాలను ఏర్పాటు చేశారు. కార్మికులకు నెలకు రూ. 6 వేల వేతనంతో పాటు వాహనాల డీజిల్కు ఖర్చు చేస్తున్నారు. ఇంటింటా రెండు చెత్త బుట్టలు చొప్పున పంపిణీ చేశారు. క్షేత్రస్థాయిలో గ్రామ కార్యదర్శులు, మండల అధికారులు వాటి నిర్వహణ పట్టించుకోక పోవడంతో ఇలా నెలలా కోట్లాది రూపాయలు ఖర్చు అవుతున్నా ఏ ఒక్క కేంద్రంలో కిలో ఎరువు తయారు చేసిన దాఖలాల్లేవు. ఇప్పటికై నా అధికారులు సమన్వయంతో దృష్టి సారిస్తే చెత్తతో సంపద తయారు చేయాలన్న పరమార్థానికి అర్థం.. పంచాయతీలకు ఆదాయం.. ప్రజలకు ఆరోగ్యం చేకూరుతాయని ప్రజలు కోరుకుటున్నారు. ముక్కు మూసుకుని ర్యాలీలు.. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజా ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. పారిశుద్ధ్య కార్యక్రమాలపై అధికారులు, ప్రజా ప్రతినిధులు నిత్యం పర్యవేక్షించాలి. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడాలని ప్రతి మూడో శనివారం ప్రతి గ్రామంలో విద్యార్థులతో ర్యాలీలు, అనంతరం ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. అయితే అధికారులు, పాలకులు కేవలం ప్రతిజ్ఞకే పరిమితమవుతున్నారు తప్పా.. వారు ర్యాలీ చేసే సమయంలో రహదారుల వెంట చెత్త కుప్పల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రీన్ అంబాసిడర్లను తొలగించి టీడీపీ కార్యకర్తలను నియమించుకుంది. దీంతో అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిడి వస్తుందన్న భయంతో తమ ఎందుకులేనని అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్వచ్ఛ లక్ష్యం.. ఆచరణ శూన్యం పారిశుద్ధ్యం పనులు ప్రతిజ్ఞకే పరిమితం మూలన పడిన చెత్త సంపద కేంద్రాలు గ్రీన్ అంబాసిడర్లకు సక్రమంగా అందని వేతనం పేరుకు పోతున్న చెత్తకుప్పలు -
‘స్కానింగ్’ కష్టాలు
● గర్భిణులకు తప్పని తిప్పలు ● నంద్యాల జిల్లా ఆసుపత్రిలో రేడియాలజిస్టులు కరువు ● పట్టించుకోని అధికారులుగోస్పాడు: జిల్లా ఆసుపత్రిలో స్కానింగ్ సెంటరు తలుపులు తెరచుకోవడం లేదు. దీంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నంద్యాల జిల్లా ఆసుపత్రికి జిల్లా ప్రజలతో పాటు అత్యవసర పరిస్థితుల్లో సమీప జిల్లాలైన వైఎస్సార్, ప్రకాశం సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. ప్రతిరోజు 1,100 నుంచి 1,300 మందితో ఓపీ రద్దీగా కనిపిస్తుంది. ప్రతిరోజు ఇక్కడికి గర్భిణులు, బాలింతలు 70 మందికి పైగా చికిత్స పొందేందుకు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వీరితోపాటు అత్యవసర వైద్య సేవలు పొందేందుకు వచ్చే వారికి కూడా కొన్ని సందర్భాలలో వ్యాధి నిర్ధారణకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు చేయించాలని అక్కడి వైద్యులు సూచిస్తుంటారు. అయితే గర్భిణులు, బాలింతలుతోపాటు రోగాలతో వచ్చే పేద ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇదీ సమస్య.. జిల్లా ఆసుపత్రిలో ముగ్గురు సీనియర్ రెసిడెంట్లు, ఒకరు అసోసియేట్, ఒక అసిస్టెంటు ప్రొఫెసర్ ఉండాలి. ప్రస్తుతం ఒక్కరూ కూడా పనిచేసేవారు లేరని స్థానిక వైద్యాధికారులు చెబుతున్నారు. గతంలో కొంతకాలం పాటు సీనియర్ రెసిడెంట్ సేవలందించేవారు. ప్రస్తుతం ఎవరూ లేక నెలలు గడుస్తుంది. దీంతో అవసరమైన సందర్భాలలో మాత్రమే తప్పని పరిస్థితులలో స్కానింగ్ పరీక్షలకు రాయాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ● అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలను ప్రతిరోజూ వందకు పైగా చేయించాల్సి ఉంది. అయితే స్కానింగ్ కేంద్రంలో రేడియాలజిస్టులు లేదు. దీంతో వైద్యుల సూచన మేరకు పేదవారు ఉసూరుమంటూ పట్టణంలోని ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. వందలాది రూపాయలను ఖర్చుచేస్తూ చేతిలో ఉన్న అరకొర సొమ్మును కాజేసుకొని అవస్థలు పడుతున్నారు. దోపిడీ ఇలా.. ఒక్కో స్కానింగ్కు రూ.700 నుంచి రూ.వెయ్యి వరకు ఖర్చుచేయాల్సి వస్తుంది. ఒక్కో స్కానింగ్ సెంటరులో ఒక్కో విధంగా ప్రజల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రోజుకు వంద మందికి పైగా స్కానింగ్లకు వెళ్లాల్సి వస్తుండటంతో పట్టణంలోని ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లను రోగులు ఆశ్రయిస్తున్నారు. దీంతో పేదప్రజల అవసరాలను ఆసరా చేసుకున్న కొన్ని స్కానింగ్ సెంటర్లు దోపిడీ చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. స్కానింగ్ సెంటర్లలో ఇష్టారాజ్యంగా తీసుకునే ఫీజుల్లో వ్యత్యాసం జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఉన్నతాధికారులకు నివేదించాం ఆసుపత్రిలో రేడియాలజిస్టుల కొరతగా ఉంది. జిల్లా ఆసుపత్రికి రోగుల సంఖ్య అధికంగానే ఉంటుంది. వ్యాధి నిర్ధారణకు కొన్ని సమయాల్లో తప్పనిసరిగా స్కానింగ్ పరీక్షలు అవసరమవుతుంది. అలాంటి సమయాల్లో పేషెంటుకు స్కానింగు పరీక్ష చేయించుకోవాలని సూచిస్తుంటాం. ఇక్కడ స్కానింగ్ పరికరాలు అందుబాటులో ఉన్నా సిబ్బంది లేక ఇబ్బందిగా ఉంది. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించాలని కోరాం. – డాక్టర్ జిలానీ, ఇన్చార్జి సూపరింటెండెంట్, జిల్లా ఆసుపత్రి, నంద్యాల -
మద్దిలేటయ్యకు ఒక్క రోజు ఆదాయం రూ.3.28 లక్షలు
బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం శివార్లో వెలసిన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీలక్ష్మీ మద్దిలేటి నరసింహస్వామికి శనివారం రూ.3,28,415 ఆదాయం వచ్చినట్లు ఉప కమిషనర్, ఆలయ ఈఓ రామాంజనేయులు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 461 మంది గైర్హాజరు నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని 53 పరీక్ష కేంద్రాల్లో శనివారం నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 461 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ సునిత తెలిపారు. మ్యాథ్స్, జువాలజీ, హిస్టరీ పరీక్షకు 13,862 మందికి గాను 13,401 మంది హాజ రు కాగా 461 మంది గైర్హాజరయ్యారన్నారు. అలాగే ఒకేషనల్ పరీక్షకు 1,497 మందికి గాను 1,383 మంది హాజరు కాగా 114 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. పట్టణంలోని బాలికల మహిళా కళాశాల, బాలికల ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాలను పరిశీలించామన్నారు. విద్యార్థులకు నీటి సమస్య తలెత్తితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పొట్టేళ్లు అ‘ధర’ హో.. కోడుమూరు రూరల్: బర్డ్ఫ్లూ నేపథ్యంలో చాలామంది ప్రజలు చికెన్ను వదిలేసి మటన్ వైపు మొగ్గు చూపుతున్నారు. రంజాన్ నెల ప్రారంభం కావడంతో పొట్టేళ్లకు గిరాకీ పెరిగింది. చిన్న సైజు పొట్టేలు ధర కూడా రూ.10వేలకు పైనే పలుకుతోంది. శనివారం కోడుమూరులో జరిగిన సంతలో ఒక్కో పొట్టేలు సైజును బట్టి రూ.10వేల నుంచి రూ.20వేలకు పైగా పలికింది. పొట్టేళ్ల ధరలు భారీగా ఉన్నప్పటికీ ప్రజలు కొనేందుకు ఎగబడ్డారు. -
లోక్ అదాలత్తో సత్వర న్యాయం
నంద్యాల(వ్యవసాయం): లోక్ అదాలత్తో కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని మూడవ అదనపు జిల్లా జడ్జి, లోక్ అదాలత్ చైర్మన్ వాసు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి రాధారాణి, ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ జడ్జి లక్ష్మి అన్నారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కోర్టు ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక్ అదాలత్ కార్యక్రమంలో నంద్యాల పరిధిలో అత్యధిక సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయన్నారు. ఎస్టీసీ కేసులు 694, సీసీ కేసులు 66, సివిల్ కేసులు 27, ఎంసీ 2, డీవీసీ 2, ఎన్ఐయాక్ట్ 16, ఎకై ్సజ్ 101, ఎంవీఓపీ 39, అడ్మిషన్ కేసులు 74, ఈపీ 15 కేసులు చొప్పున మొత్తం 1,021 కేసులు పరిష్కారం కావడంతో పాటు పలు కేసుల్లో కక్షిదారులకు రూ.3.76 కోట్ల పరిహారం అందించామన్నారు. చిన్న చిన్న సమస్యలకు న్యాయస్థానాలను ఆశ్రయించకుండా లోక్ అదాలత్కు వెళ్తే సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. రాజీ కాగల కేసుల పరిష్కారం కోసం న్యాయవాదులు, పోలీసులు ఎంతో కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. కుటుంబ కలహాల వలన భార్యాభర్తలు కోర్టును ఆశ్రయిస్తే పిల్లల భవిష్యత్తు దెబ్బ తింటుందన్నారు. కార్యక్రమంలో ఏజీపీ జగన్మోహన్ రెడ్డి, వివేకానందరెడ్డి, పీపీ శ్రీనివాసులు, రావినూతల దుర్గాప్రసాద్, విజయశేఖర్రెడ్డి, భూపని వెంకటేశ్వర్లు, అడ్డగాళ్ల వెంకటేశ్వర్లు, ఓబుల్ రెడ్డి, చంద్రశేఖర్ తదితర సీనియర్, జూనియర్ లోక్అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి, ఉమామహేశ్వరి పాల్గొన్నారు. పది వేల కేసుల పరిష్కారం కర్నూలు (టౌన్): జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో పది వేలకు పైగా కేసులు పరిష్కారం జరిగినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 22 చోట్ల జాతీయ లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు చేసి కక్షిదారుల కేసులు పరిష్కారం చేసినట్లు చెప్పారు. కర్నూలులో 5 బెంచీలు ఏర్పాటు చేసి న్యాయమూర్తులు జి.భూపాల్ రెడ్డి, లక్ష్మిరాజ్యం, జ్యోత్స్నాదేవి, ఎం.సరోజనమ్మ, విశ్రాంత న్యాయమూర్తి లక్ష్మినరసింహారెడ్డి 4,500 కేసులు పరిష్కారం చేశారన్నారు. నంద్యాలలో 1,021, ఆదోనిలో 432, ఆళ్లగడ్డలో 554, ఆలూరులో 291, ఆత్మకూరులో 319, బనగానపల్లెలో 714, డోన్లో 630, కోవెలకుంట్లలో 402, నందికొట్కూరులో 266, పత్తికొండలో 427, ఎమ్మిగనూరులో458 కేసులు పరిష్కారం చేసినట్లు తెలిపారు. -
సర్దుబాటు పేరిట భారం తగదు
రెండు మూడేళ్ల క్రితం వినియోగించిన కరెంటుకు కూడా ఇప్పుడు సర్దుబాటు పేరుతో భారం వేయడం తగదు. మే ము ఫిబ్రవరిలో 96 యూనిట్ల కరెంటు మాత్రమే వా డాము. ఇందుకు చార్జీ రూ.206, ఫిక్స్డ్ చార్జి రూ.10, కస్టమర్ చార్జీ రూ.40 మాత్రమే చెల్లించా ల్సి ఉంది. అయితే రూ.520 బిల్లు ఇచ్చారు. 2022–23 సంవత్సరాల్లో వాడిన ప్రతి యూనిట్కు నిబంధనల ప్రకారం బిల్లు చెల్లించాం. ఇప్పుడు మళ్లీ అదనపు చార్జీలు వసూలు చేయడం దారుణం. – గోవిందరాజులు, రాంపురం, తుగ్గలి మండలం చార్జీలు పెంచమని మోసగించారు కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నారు. మేము 135 యూనిట్ల విద్యుత్ వాడాము. ఇందుకు రూ.477 చార్జి, ఫిక్స్డ్ చార్జి రూ.10, కస్టమర్ చార్జి రూ.40తో కలిపి చెల్లించాల్సి ఉంది. అయితే 2022 బకాయి అని రూ.103, 2023 బకాయి అని రూ.57, తాజా వాడకానికి సంబంధించి రూ.33.50, సర్చార్జి రూ.25, ట్రూ అప్ చార్జి రూ.52 భారం వేశారు. మొత్తం 830 బిల్లు చెల్లించాల్సి వచ్చింది. వాడిన వినియోగానికి ఇది రెట్టింపు. – సగిలే కృష్ణారెడ్డి, లింగాపురం, బండిఆత్మకూరు ● -
ముట్టుకుంటే షాక్
● విద్యుత్ వినియోగదారుల నిలువు దోపిడీ ● 2022, 2023, 2025 సంవత్సరాల్లో వాడిన విద్యుత్కు ప్రతి యూనిట్పై 40పైసల వడ్డింపు ● ట్రూ అప్ చార్జీలతో మరో అదనపు భారం ● బిల్లులను చూసి బెంబేలెత్తుతున్న ప్రజలు కర్నూలు(అగ్రికల్చర్): వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యుత్ చార్జీలపై టీడీపీ, జనసేనలు చేసిన దుష్ప్రచారం అంతాఇంతా కాదు. అడ్డుగోలుగా చార్జీలు పెంచి మోయలేని భారం వేస్తున్నారని ప్రజలను నమ్మించి ఎన్నికల్లో లబ్ధి పొందడం తెలిసిందే. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వి నియోగదారులపై విద్యుత్ చార్జీల భారం మోపం, చార్జీలు తగ్గిస్తాం తప్ప పెంచబోమనే ప్రచారాన్ని ఊదరగొట్టారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొమ్మిది నెలల్లోనే విద్యుత్ వినియోగదారులు చుక్కలు చూస్తున్నారు. సామాన్య ప్రజలు మొదలు అన్ని వర్గాల వారిపై మోపిన విద్యుత్ చార్జీల భారం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మొదటి ఏడాదిలోనే విద్యుత్ చార్జీల భారం ఈ స్థాయిలో ఉంటే, రానున్న నాలుగేళ్లలో పరిస్థితి ఊహించుకుంటేనే షాక్ కొడుతోంది. ప్రతి నెలా క్రమం తప్పకుండా విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నా.. ఒక్కరోజు ఆలస్యమైతే చాలు సర్చార్జీ పేరిట జరిమానా విధిస్తున్నారు. మళ్లీ సర్దుబాటు తదితర పేర్లతో 2022, 2023 సంవత్సరాల్లో వినియోగించిన విద్యుత్కు కూడా నేడు చార్జీ వేస్తుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వ ‘షాక్’ ఇలా వినియోగదారుడు ఒక నెలలో 125 యూనిట్లు వినియోగిస్తే మొదటి మూడు శ్లాబ్ల ప్రకారం బిల్లు రూ.417 వస్తుంది. దీనికి కస్టమర్ చార్జీ రూ.45, ఫిక్స్డ్ చార్జీ రూ.20, ఈడీ చార్జీ రూ.7.50 వసూలు చేస్తారు. అన్నీ కలిపి 125 యూనిట్లకు చెల్లించాల్సిన బిల్లు రూ.489.5 మాత్రమే. ఇదే 125 యూనిట్లకు కూటమి ప్రభుత్వం వసూలు చేస్తున్న మొత్తం రూ.850. అంటే బిల్లుపై అదనంగా రూ.361 భారం మోపుతోంది. విద్యుత్ వినియోగం పెరిగే కొద్దీ భారం తడిచి మోపెడవుతుంది. భారం ఇలా పడుతోంది.. విద్యుత్ చార్జీల భారం వివిధ రూపాల్లో పడుతోంది. 2022, 2023, 2025 సంవత్సరాలకు సంబంధించి సర్దుబాటు పేరుతో ఎఫ్పీపీసీఏ వసూలు చేస్తున్నారు. ఆయా సంవత్సరాల్లో నెల వారీగా వినియోగించిన యూనిట్లపై 40 పైసల ప్రకారం భారం పడుతోంది. ఎలక్ట్రిసిటీ డ్యూటీ, ట్రూ అప్ చార్జీలు కూడా వసూలు చేస్తున్నారు. ప్రజలను ఈ చార్జీలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సగటున ప్రతినెలా రూ.95కోట్లకు పైనే భారం సంక్షేమ పథకాల ఊసే లేకపోవడం వల్ల ప్రజల్లో నగదు సర్క్యులేషన్ గణనీయంగా తగ్గిపోయింది. మళ్లీ పేదరికం పురుడుపోసుకుంటోంది. ఇప్పటికే ఎన్నికల హామీలను పక్కనపెట్టిన ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ చార్జీల పేరిట అదనపు భారం మోపుతోంది. ఉమ్మడి జిల్లాలో 15.85 లక్షల గృహ విద్యుత్ కలెక్షన్లు ఉన్నాయి. ఈ లెక్కన ఒక్కో కనెక్షన్కు సగటున రూ.600 అదనపు భారం లెక్కకట్టినా ప్రతి నెలా రూ.95కోట్లకు పైనే ముక్కుపిండి వసూలు చేస్తుండటం గమనార్హం. రూ.542 అదనపు బిల్లు ఫిబ్రవరి నెలలో 145 యూనిట్లు వినియోగించాం. విద్యుత్ చార్జీ రూ.537 వచ్చింది. ఫిక్స్డ్ చార్జీ రూ.50, కస్టమర్ చార్జీ రూ.50 వేశారు. మామూలుగా అయితే రూ.637 బిల్లు చెల్లించాల్సి ఉంది. అయితే 2022 సంవత్సరం ఫిబ్రవరి నెలకు సంబంధించి ఎఫ్పీపీసీఏ రూ.307.07, 2023 సంవత్సరం ఫిబ్రవరి నెల ఎఫ్పీపీసీఏ రూ.166.20, 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల ఎఫ్పీపీసీఏ రూ.59.60, ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూ.8.70 ప్రకారం అదనపు భారం పడింది. మొత్తంగా వచ్చిన బిల్లు రూ.1,179. – బి.నాగలక్ష్మి, కర్నూలు -
హనుమంత వాహనంపై అహోబిలేశుని వైభవం
ఆళ్లగడ్డ: అహోబిలేశుడు శనివారం ఎగువలో శేష, చంద్రప్రభ వాహనాల్లో, దిగువలో శ్రీ యోగానృసింహ గరుడ విమానం, హనుమంత వాహనాలపై ఉభయ దేవేరులతో కలసి మందస్మిత దరహాస వీచికలతో దర్శనమిచ్చారు. భక్తుల గోవింద నామస్మరణతో నల్లమల పులకించి పోయింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు శనివారం ఎగువ అహోబిలంలో శ్రీ జ్వాలా నరసింహస్వామి శేష వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ జ్వాలా నారసింహ స్వామిఅమ్మవార్లకు నిత్య పూజల్లో భాగంగా తెల్లవారు జామున మేలుకొలుపు వేద మంత్రోచ్ఛారణలతో అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం విశేష పుష్పాలంకరణ గావించిన శేష వాహనంపై ఉభయ దేవేరులతో కొలువైన జ్వాలా నరసింహుడు మంగళ వాయిద్యాలతో మాడ వీధుల్లో వివహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు పంచామృతాభిషేకం నిర్వహించారు. రాత్రి జ్వాలా నారసింహుడు చంద్రప్రభ వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. దిగువ అహోబిలంలో.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజైన శనివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వామి శ్రీ యోగానృసింహ గరుడ విమానంపై కొలువై విహరించారు. అంతకు ముందు ఉత్సవ మూర్తులు శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను యాగశాలలో కొలువుంచి జలాభిషేకం నిర్వహించారు. అనంతరం నూతన పట్టువస్త్రాలు, వజ్ర, వైడూర్యాలు పొదిగిన బంగారు అభరణాలతో ప్రత్యేకంగా ముస్తాబైన ప్రహ్లాదవరదుడు ఉభయ దేవేరులతో శ్రీ యోగనృసింహ గరుడ విమానం వాహనం అధిరోహించారు. మాడ వీధుల్లో స్వామి అమ్మవార్లు వైభవో పేతంగా ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. మధ్యాహ్నం పంచామృతాభిషేకం, జలాభిషేకం నిర్వహించి స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన అద్దాల మండపంలో కొలువుంచారు. రాత్రి శ్రీ ప్రహ్లాదరవదస్వామి హనుమంతు వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. అహోబిలంలో నేడు.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో ఆదివారం ఉదయం ఉత్సవం, మధ్యాహ్నం అభిషేకం, రాత్రి శరభ వాహన సేవ, దిగువ అహోబిలంలో ఉదయం శేషవాహన సేవ, మధ్యాహ్నం అభిషేకం, రాత్రి చంద్రప్రభ వాహన సేవ నిర్వహించనున్నారు. -
స్వయంశక్తితో రాణించాలి
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కలెక్టర్, ఎంపీ తదితరులునంద్యాల: మహిళలు స్వయం శక్తితో ఎదిగి సాధికారత దిశగా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీ బైరెడ్డి శబరి, కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్, యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ నరసింహారావు తదితరులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలకు సమాన హక్కులు, వేతనాలు, ఓటు తదితర అంశాలపై ప్రపంచ పోరాటాల నేపథ్యంలోనే భాగంగా ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామిక వేత్త వచ్చి దేశ, రాష్ట్ర భవిష్యత్తుకు పునాదులు వేయాలన్నారు. ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు అత్యున్నత స్థానం కల్పించి వారికి చేయూతనిచ్చేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. అంతకు ముందు ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, మహిళా సంఘాల చేతివృత్తుల వస్తువుల ప్రదర్శనశాలలను కలెక్టర్ ఎంపీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక, సంప్రదాయ నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. జిల్లా కలెక్టర్ రాజకుమారి -
అహోబిలంలో బీ – ట్యాక్స్ మీ ఘనత
ఆళ్లగడ్డ: ఎక్కడి నుంచో ఓ వ్యక్తిని ఇక్కడికి తీసుకొచ్చి బీ– ట్యాక్స్ వసూలు చేస్తున్న ఘనత మీదంటూ ఎమ్మెల్యే అఖిలప్రియపై ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి మండిపడ్డారు. అహోబిలం క్షేత్రం ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో బహిరంగ చర్చకు సిద్ధమా.. అని సవాల్ విసిరారు. శనివారం ఆయన అహోబిలం చేరుకుని బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అహోబిల క్షేత్రం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని, అంతా తమ టీడీపీ పాలనలోనే జరిగిందని ఎమ్మెల్యే మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఆమె మంత్రిగా ఉన్న సమయంలో క్షేత్రంలో కనీసం ఒక్క రోడ్డు అయినా వేశారా అని ప్రశ్నించారు. ఆళ్లగడ్డ నుంచి అహోబిలం వరకు బీటీ రోడ్డు, మాడ వీధుల్లో సీసీ రోడ్లు అన్ని తమ ప్రభుత్వంలో వేసినవే అని గుర్తు చేశారు. సొంత పార్టీ కార్యకర్తలను సైతం రాబంధుల్లా పీక్కు తింటుండటంతో చెప్పుకోలేక సిగ్గుతో తలదించుకుంటున్నారన్నారు. నాడు తిరుమల లడ్డూపై రాద్దాంతం చేసి నేడు అహోబిలేశుడికి వారం రోజుల పాటు నైవేద్యం దూరం చేసిన చరిత్ర వారేదన్నారు. చివరకు బ్రహ్మోత్సవాల సందర్భంగా పందిళ్లు వేసే వారితో కూడా కమీషన్లు నొక్కడం అందరికీ తెలుసునన్నారు. మాన్యం భూముల వేలం పాట నిధులు ఏడాదైనా దేవస్థానానికి ఎందుకు చెల్లించ లేదన్నారు. టోల్గేట్ను ఎంతకు అమ్ముకున్నారు.. ఆ డబ్బులు ఎవరు తింటున్నారో స్థానికులు ఆలోచన చేయాలన్నారు. టీడీపీ నేతల అక్రమాలను వెలుగులోకి తెస్తున్న విలేకరులను బెదిరించాలని చూడటం సరికాదన్నారు. విలేకరులను భయపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. అహోబిలేశుని పార్వేట పల్లకీ ఎలా వెళ్లాలి అన్నది కూడా మీరు నిర్ణయిస్తారా అని ప్రశ్నించారు. అనాదిగా వస్తున్న ఆచారాలను సైతం పాటించకపోవడం విడ్డూరమన్నారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ నాయకులు భూమా కిషోర్రెడ్డి, గంధం రాఘవరెడ్డి, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు నాసారి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. మంత్రిగా ఉండి ఒక్క రోడ్డు కూడా వేయలేక పోయావు వారం రోజులు దేవుడికి నైవేద్యం దూరం చేసినది మీరు కాదా? ఎమ్మెల్యే అఖిలప్రియపై మండిపడిన మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి -
ఉపాధి చూపండి.. సారా మానుకుంటాం!
కర్నూలు : ‘‘ఉపాధి చూపండి.. సారా తయారీ మా నుకుంటాం’’ అంటూ కర్నూలు బంగారుపేటలో నివాసముంటున్న నీలిషికారీల మహిళలు ఎకై ్సజ్ అధికారులను నిలదీశారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నవోదయం 2.0 పేరుతో బంగారుపేటలో అవగాహన సదస్సు నిర్వహించేందుకు ఎకై ్సజ్ అధికారులు ఏర్పాట్లు చేశారు. నోడల్ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు రాజశేఖర్ గౌడ్, రామకృష్ణారెడ్డి తదితరులు శుక్రవారం కార్యక్రమానికి హాజరయ్యా రు. ఈ సందర్భంగా సభలో డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి మాట్లాడుతుండగా.. నీలిషికారీ మహిళలు ఒక్కసారిగా లేచి తాము ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పుకొచ్చారు. ‘‘కొన్నేళ్ల నుంచి నీలి షికారీలుగా జీవనం సాగిస్తున్నాం.. ఎస్టీలుగా గుర్తించాలని కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. చాలా మందికి ఆధార్ కార్డులు లేవు. కులం సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం లేదు’’ అని చెప్పారు. ‘ఉపాధి చూపండి.. సారా మానుకుంటాం’ అంటూ మహిళలు నిలదీయడంతో సదస్సులో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. నీలిషికారీ మహిళల నుంచి చుక్కెదురు కావడంతో సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తామంటూ అధికారులు హామీ ఇచ్చారు. దీంతో నీలిషికారీ మహిళలు శాంతించారు. నాటుసారాతో అనర్థాలను అధికారులు వివరించి.. సారా తయారీని మానుకుంటామంటూ మహిళల చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సీఐలు చంద్రహాస్, రాజేంద్రప్రసాద్, జయరాం నాయుడు, మెప్మా, ఐసీడీఎస్ తదితర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. బంగారుపేటలో ఎకై ్సజ్ అధికారులను నిలదీసిన షికారీలు -
గవర్నర్ను కలసిన ఆర్యూ వీసీ
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వి.వి.బసరావు శుక్రవారం రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్, వర్సిటీ చాన్సలర్ ఎస్.అబ్దుల్ నజీర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్యూ అభివృద్ధికి రాజ్భవన్ సహాయ సహకారాలు ఉంటాయని గవర్నర్ హామీ ఇచ్చినట్లు వీసీ పేర్కొన్నారు. వర్సిటీలో విద్యా ప్రమాణాలు మెరుగు పరచడంపై దృష్టి సారించాలని సూచించారన్నారు. విద్యా రంగంలో ఉమ్మడి జిల్లాను ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేయాల్సిందిగా సూచించారని పేర్కొన్నారు. ముగిసిన వాదనలు కర్నూలు(టౌన్): సినీ నటుడు పోసాని కృష్ణమురళీకి సంబంధించి బెయిల్ పిటిషన్ వాదనలు శుక్రవారం ఆదోని కోర్టులో ముగిసాయి. కర్నూలు జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న పోసానికి బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు సువర్ణ రెడ్డి వేసిన పిటిషన్పై కోర్టులో వాదనలు జరిగాయి. ప్రాసిక్యూషన్ తరపున ఆదోని సీనియర్ ఏపీపీ వాదించారు. సుదీర్ఘంగా రెండు గంటల పాటు ఇరువురి వాదనలు సాగాయి. బెయిల్ పిటిషన్కు సంబంధించి కోర్టు తీర్పును రిజర్వు చేసింది. అలాగే పోలీసు కస్టడీకి సంబంధించి సోమవారం ఉత్తర్వులు జారీ చేస్తామని మొదటి అదనపు జ్యుడీషిషల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ అపర్ణా వెల్లడించారు. ఉచిత శిక్షణ దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(అర్బన్): డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి లక్ష్మిదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ, ఈబీసీ కేటగిరిలకు చెందిన అభ్యర్థులు ఈనెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. టెట్ అర్హత సాధించిన అభ్యర్థులు సొంత జిల్లాలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లా నంద్యాలలో దరఖాస్తులు పొందిన వారు స్థానిక బొమ్మలసత్రం వద్ద ఉన్న ఓల్డ్ బీఎస్ఎన్ఎల్ క్వార్టర్స్ సీ బ్లాక్లో అందజేయాలన్నారు. అక్రమణను అడ్డుకున్న మహిళలు సంజామల: పేరుసోముల గ్రామంలో టీడీపీ నాయకులు ఆక్రమణను స్థానిక మహిళలు అడ్డుకున్నారు. శ్మశాన వాటిక రస్తా ఆక్రమణకు గురవుతుందని దాదాపు రెండు నెలల నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొందరు తహసీల్దార్, కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసినా చర్యలు తీసుకోలేదు. శ్మశాన వాటిక స్థలంలో శుక్రవారం ప్రహరీ నిర్మిస్తున్నారని తెలుసుకున్న మహిళలు అక్కడికి చేరుకుని కూల్చివేశారు. అనంతరం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కంబగిరి ఆధ్వర్యంలో మహిళలు తహసీల్దార్ అనిల్ కుమార్కు వినతి పత్రాన్ని అందించారు. ఆక్రమణదారుల నుంచి శ్మశాన వాటిక స్థలాన్ని రక్షించాలని కోరారు. -
సంక్షేమానికి ‘కూటమి’ ఎగనామం
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి కర్నూలు(టౌన్): ‘సూపర్సిక్స్’ పేరిట మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఎగనామం పెట్టిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. ‘సూపర్సిక్స్’ హామీల అమలుపై క్యాలెండర్ విడుదల చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లోని తన చాంబర్లో శుక్రవారం విలేకరులతో ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడారు. బడ్జెట్ ప్రసంగం అంతా అంకెల గారడీ తప్ప ఏమీ లేదన్నారు. ఉచిత ఆర్టీసీ బస్సు విషయంలోనూ చంద్రబాబు సర్కార్ మొండిచెయ్యి చూపిందన్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలంటే బడ్జెట్లో రూ.79 వేల కోట్లు కేటాయించాల్సి ఉందని, అయితే మొదటి బడ్జెట్లో రూ.7,282 కోట్లు, ఈ ఏడాది రూ.16,200 కోట్లు కేటాయించిందన్నారు. అసెంబ్లీలో గవర్నర్తో అబద్ధాలు చెప్పించడం చంద్రబాబు సర్కార్కే దక్కుతుందన్నారు. ఇంగ్లిషులో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో చదివితే తెలుగులో మాత్రం ఉద్యోగాల కల్పన చేస్తున్నట్లు ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని విమర్శించే అర్హత కూటమి ప్రభుత్వానికి లేదన్నారు. మూడు ఆత్మలు ఘోషిస్తున్నాయి రాష్ట్రంలో టీడీపీ పాలనతో మూడు ఆత్మలు ఘోషిస్తున్నాయని, ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ తెలుసుకోవాలని ఎస్వీ మోహన్రెడ్డి అన్నారు. వెన్నుపోటుకు బలైన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, హరికృష్ణ, నారా రామ్మూర్తి నాయుడుల ఆత్మలు ఘోషిస్తున్నాయన్నారు. ప్రశ్నించే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను వేధించడం, భయభ్రాంతులకు గురిచేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. గ్రామాల్లో తిరిగే కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలను మహిళలు, రైతులు చొక్కా పట్టుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. -
సార్.. బూటకపు హామీలు నమ్మి మోసపోయాం
డోన్: గత ఎన్నికల సమయంలో కూటమి నాయకుల బూటకపు వాగ్దానాలు నమ్మి మోసపోయామని పలువురు మహిళలు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డితో వాపోయారు. స్థానిక పాతపేట శ్రీరాముల దేవాలయం సమీపంలో నివసిస్తున్న వంట మాస్టర్ కుమ్మరి నాగరాజు ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను శుక్రవారం రాత్రి మాజీ మంత్రి బుగ్గన పరామర్శించారు. వైఎస్సార్సీపీతో పాటు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని మృతుని కుటుంబ సభ్యులకు ఆయన హామీ ఇచ్చారు. అనంతరం తిరిగి బయలుదేరుతున్న మాజీ మంత్రితో కొందరు మహిళలు తమ గోడును వెల్లబోసుకున్నారు. కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా తమను వంచించిందన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. తొమ్మిది నెలలు గడిచినా ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, ప్రతి ఆడ పిల్లకు ప్రతినెలా రూ.1,500, అన్నదాత సుఖీభవా ఇవ్వలేదని బుగ్గన దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబును నమ్మి ఇప్పుడు ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసం ప్రజలకు అర్థమైందని, 2029 ఎన్నికల్లో తిరిగి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని, అప్పటి వరకు ఓపిక పట్టాలని మహిళలకు భరోసా కల్పించారు. ఆయన వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ జాకీర్ హుస్సేన్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కురుకుందు హరి, వలంటీర్ విభాగం జిల్లా అధ్యక్షుడు పోస్టు ప్రసాద్, యువజన విభాగం అధ్యక్షుడు ఆర్ఈ రాజవర్దన్, కౌన్సిలర్లు కటికె వేణు, కురుకుందు పద్మావతి, కో ఆప్షన్ సభ్యులు కుమ్మరి రాజు తదితరులు ఉన్నారు. మాజీ మంత్రి బుగ్గనతో వాపోయిన మహిళలు -
ప్రేమ‘జంట’గా.. హృదయం బరువెక్కగా!
బొమ్మలసత్రం: బేతంచర్ల మండలం బుగ్గానిపల్లె తండాకు చెందిన రాజేష్నాయుడు, మాధురిబాయి ఎదురెదురు ఇళ్లలో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ ఒకే ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. మూడు రోజుల క్రితం ఇద్దరూ కనిపించకుండా పోయా రు. దీంతో ఇరువురి కుటుంబ సభ్యులు ఆరా తీస్తే విషయం బయటపడింది. మాధురిబాయి తండ్రి ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఆయన విన్నపం మేరకు త్రీటౌన్ పోలీసులు బుధవారం రాత్రి ప్రేమ జంటను స్టేషన్కు రప్పించారు. అయితే ఇరువురూ ఇష్టపూర్వకంగా వెళ్లినట్లు రాత పూర్వకంగా అంగీకరించారు. గురువారం ఉదయం తిరిగి ఇరువురి తరపు బంధువులు స్టేషన్లో పంచాయితీ పెట్టినా ఫలితం లేకపోయింది. ఈ విషయమై శుక్రవారం ఉదయం గ్రామంలో యువకుడి ఇంటి ముందు తమ కుమార్తెను మోసం చేసి పెళ్లిచేసుకున్నాడని యువతి కుటుంబ సభ్యులు గగ్గోలు పెట్టారు. సమాచారం తెలుసుకున్న సీఐ వెంకటేశ్వరరావు సిబ్బందితో అక్కడికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. టూటౌన్ పోలీస్టేషన్లో మూడో రోజు.. ఇదిలా ఉండగా గ్రామం నుంచి పంచాయితీ కోసం వచ్చిన ఇరువురి కుటుంబాలను పోలీసులు టూటౌన్కు రప్పించారు. అక్కడ సీఐ ఇస్మాయిల్, త్రీటౌన్ సీఐ కంబగిరిరాముడు కలిసి ప్రేమ జంటను పెద్దల ఎదుట నిలబెట్టారు. యువతి తను ప్రేమించిన యువకుడితోనే వెళ్లిపోతానని తెగేసి చెప్పడంతో యువతి తండ్రి కన్నీళ్లు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. బీటెక్ విద్యార్థుల ప్రేమ ‘పంచాయితీ’ మూడు రోజులుగా పోలీసుస్టేషన్ చుట్టూ ఇరు కుటుంబాలు అమ్మాయికి నచ్చజెప్పేందుకు తండ్రి కన్నీటి పర్యంతం అబ్బాయితోనే ఉంటానని తేల్చిచెప్పిన యువతి బరువెక్కిన హృదయంతో వెనుతిరిగిన తండ్రి మూడు రోజులుగా ఆ తండ్రి వేదన వర్ణనాతీతం. కంటికి రెప్పలా చూసుకున్న కుమార్తె నిన్న మొన్న పరిచయమైన ప్రేమకునితోనే ఉంటానని చెప్పడం ఆ హృదయాన్ని కలచివేసింది. కాళ్లావేళ్లా పడినా.. వాళ్లతో వీళ్లతో చెప్పించినా.. కుమార్తె మనసు కరగకపోవడంతో ఆ తల్లిదండ్రుల మనసు గాయపడింది. ప్రేమించడం తప్పుకాదు.. పెళ్లి చేసుకోవడం నేరం అంతకన్నా కాదు. కానీ పెద్దలను ఒప్పించి చేసుకున్నప్పుడే ఆ ప్రేమకు పరిపూర్ణత చేకూరుతుంది. ఇటీవల కాలంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎన్నో జంటలు చిన్న చిన్న వివాదాలతో ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లడం చూస్తే.. ఏ తల్లిదండ్రులకై నా ప్రేమ పెళ్లి గుండెను బరువెక్కించక మానదు. తెలిసీ తెలియని వయస్సులో ప్రేమలో పడటం.. జీవితంలో స్థిరపడకుండానే పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవడం తమ విజయంగా భావించడం యువతకు పరిపాటిగా మా రింది. ఏ తల్లిదండ్రులైనా తమ కుమార్తె సంతోషాన్నే కోరుకుంటారు. ఆడ..పిల్ల అయినప్పటికీ ఆ గజ్జెల సవ్వడితో మురిసిపోతారు. ఇలాంటి అమ్మానాన్నలు.. ప్రేమ వాకిట్లో కానివాళ్లుగా మారిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. -
ఆరేళ్ల కుమార్తెతో తండ్రి అదృశ్యం
కోవెలకుంట్ల: పట్టణంలోని ఆటో నగర్లో నివా సం ఉంటున్న ఓ వ్యక్తి తన ఆరేళ్ల కుమార్తెతో సహా అదృశ్యమయ్యాడు. శుక్రవారం ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. ఉయ్యాలవాడకు చెందిన ఉసేన్బాబుకు వైఎస్సార్ జిల్లా మైలవరం మండలం పొన్నంపల్లెకు చెందిన దస్తగిరమ్మతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఆరేళ్ల కుమార్తె ధాత్రి ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి ఉసేన్బాబు కోవెలకుంట్లలో స్థిరపడి దుర్గా ఫొటో స్టూడియోలో పనిచేస్తుండగా భార్య వ్యవసాయ పనులకు వెళుతూ కుటుంబాన్ని పో షించుకుంటున్నారు. ఈ నెల 3వ తేదీన ఉదయం దస్తగిరిమ్మ కూలీ పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చే సరికి భర్త, కుమార్తె కన్పించలేదు. చుట్టుపక్కల, బంధువుల ఇళ్ల వద్ద విచారించినా ఆచూకీ లభ్యం కాలేదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఆందోళనతో పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రతికూల పరిస్థితులతో పోరాడి...
ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా జిల్లా ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ పోతుల శ్రీదేవి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘ మాది మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లా పార్వతీపురం. నాన్న పోతుల నరసయ్య పోలీసు శాఖలో ఇన్స్పెక్టర్గా పనిచేశారు. అమ్మ పోతుల శాంతమ్మ. 1998లో నాకు 16 ఏళ్ల వయస్సులో నాన్న మరణించారు. నేను పెద్ద కుమార్తెను. నాకు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. నాన్న నాకు ఎప్పుడూ స్ఫూర్తినిచ్చేవారు. భయాన్ని ఎదుర్కొని.. వైఫల్యాన్ని విజయానికి మెట్టుగా మల్చుకోవాలని సూచించారు. నాన్న మరణం తర్వాత కారుణ్య నియామకం కింద ఉద్యోగం వచ్చినప్పటికీ అమ్మ ఆ ఉద్యోగాన్ని తిరస్కరించారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కోచింగ్ లేకుండానే నేను గ్రూప్–1లో ర్యాంకు సాధించాను. మొదట పార్వతీపురం జిల్లాలో ని జియ్యమ్మవలసలో విధులు నిర్వహించి ఉత్తమ ఎంపీడీఓ అవార్డు అందుకున్నా. విధులు నిర్వహిస్తూనే గ్రూప్–1లో ర్యాంకు సాధించి ఎకై ్సజ్ శాఖలో అసిస్టెంట్ సూపరింటెండెంట్గా ఎంపికయ్యాను. నా విజయానికి తండ్రి నరసయ్య, భర్త నరేంద్ర కుమార్ రాజు కారణం. మాకు ఇద్దరు పిల్లలు సంతానం. నువేశ్ నంద 8వ తరగతి, దిమాహి 4వ తరగతి చదువుతున్నారు. 2011లో మహబూబ్ నగర్లో విధులు నిర్వహించేటప్పుడు బెస్ట్ ఏఈఎస్ అవార్డు అందుకున్నాను.’’ – కర్నూలు భర్త ప్రోత్సాహంతోనే డీఎఫ్ఓగా.. కర్నూలు జిల్లా అటవీ శాఖ అధికారి పి.శ్యామల జన్మస్థలం అనంతపురం జిల్లా కల్యాణదుర్గం. తల్లిదండ్రులు శకుంతల, తిమ్మరాయప్ప. వీరి మొదటి కుమార్తె అయిన శ్యామల ఎస్కే యూనివర్సిటీలో బాటనీలో పీజీ పూర్తి చేసి గోల్డ్మెడల్ సాధించారు. ఈమె 2004లో అటవీ శాఖలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్కు ఎంపికై అనంతపురంలోనే ఉద్యోగంలో చేరారు. 2006లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. 2023 మార్చి నుంచి కర్నూలు డీఎఫ్ఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘భర్త ప్రోత్సాహంతో నేను ఈ స్థాయికి వచ్చాను. కుటుంబంలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన ఉండకూడదు. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం చాలా అవసరం’ అని డీఎఫ్ఓ శ్యామల పేర్కొన్నారు. – కర్నూలు కల్చరల్ -
సాయం.. ‘తులసీ’ వ్రతం
‘‘ సమాజంలోని అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి.. అవసరమైన సందర్భాల్లో సహాయ సహకారాలు అందించాలి.. ఇందుకు మహిళలు ముందుండాలి’’ అని అంటున్నారు ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే తులసీదేవి. తమది ఉన్నత కుటుంబమైనా, కొన్ని పరిస్థితులతో బాల్యంలో పలు కష్టాలను చవిచూడాల్సి వచ్చిందని, అమ్మ నేర్పిన క్రమశిక్షణ, చదువుపై ఆమెకున్న శ్రద్ధ, పట్టుదలే తమను ఇంతవాళ్లను చేశాయని ఆమె పేర్కొన్నారు. ‘‘ అమ్మ, నాన్న ప్రాథమిక విద్యతోనే చదువు ఆపేసినా, నన్ను, అన్నను ఉన్నత విద్యావంతులను చేశారు. నాకున్న ఇద్దరు సంతానాన్ని అమ్మ వద్దే ఉంచి చదివించాం. బాబు నిఖిల్, పాప ప్రీతి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. మా వారు కే మల్లికార్జునరెడ్డి హైదరాబాద్లో ఓ మల్టీనేషనల్ కంపెనీలో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఉద్యోగంలో నిజాయితీ ముఖ్యం.’’ అని ఆమె అన్నారు. – కర్నూలు(అర్బన్) -
వ్యవసాయం.. ‘లక్ష్మి’ కటాక్షం
ప్రకృతి వ్యవసాయంలో గూడూరుకు చెందిన మహిళ రైతు జి. లక్ష్మీదేవి అద్భుతంగా రాణిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో గణనీయమైన నికరాదాయాన్ని పొందుతున్నారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘ మాకు 10 ఎకరాల భూమి ఉంది. ఇందులో నాలుగు ఎకరాల్లో ఐదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. ఏటీఎం నమూనాలో ఒక ఎకరాలో అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నాం. పెట్టుబడి కోసం రూ.15 వేలు ఖర్చు చేయగా.. రూ.లక్షకుపైగా ఆదాయం వచ్చింది. మిగిలిన మూడు ఎకరాల్లో వివిధ పంటలు వేస్తున్నాం. మా పంటల సాగును ప్రత్యేక బృందాలు వచ్చి అధ్యయనం చేశాయి. పంటలను పరిశీలించి జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి కూడా అభినందించారు.’’ – కర్నూలు(అగ్రికల్చర్) -
వైకల్యాన్ని అధిగమించి...
చదువుకు, ఉద్యోగానికి వైకల్యం అడ్డురాదని ఆమె నిరూపించారు. రెండు కాళ్లు లేకపోయినా ఆత్మవిశ్వాసంతో బీఎస్సీ, బీఈడీ పూర్తి చేశారు. సచివాలయ మహిళా పోలీస్ ఉద్యోగం సాధించి.. సేవలు అందిస్తున్నారు. సంజామల మండలం వెంకటసుబ్బయ్య, మహేశ్వరి దంపతుల కుమార్తె సువర్ణ విజయ గాథ ఆమె మాటల్లోనే... ‘‘మా తండ్రి విద్యుత్ సబ్స్టేషన్లో లైన్మెన్గా పనిచేస్తూ నాతోపాటు తమ్ముడు సురేష్, చెల్లెలు సుమిత్రను ఉన్నత చదువులు చదివించారు. ప్రస్తుతం లైన్మెన్గా రిటైర్డ్ అయి కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. పుట్టిన ఏడాదికే పోలియో సోకి నా రెండు కాళ్లు చచ్చుబడ్డాయి. అప్పటి నుంచి రెండు కర్రల సాయంతో నడక సాగిస్తున్నాను. కాళ్లు లేకపోయినా మనోధైర్యంతో బీఎస్సీ, బీఈడీ పూర్తి చేశాను. 2019లో గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసుగా ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం సంజామల మండలంలోని ముక్కమల్ల గ్రామ సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాను’’. – కోవెలకుంట్ల ● విభిన్న రంగాల్లో రాణిస్తున్న మహిళలు ● ఇతరుల ఎదుగుదలలోనూ సహకారం ● నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంలాలన..పాలన.. ఓర్పు.. నేర్పు.. పట్టుదల.. క్రమశిక్షణ.. వీరత్వం.. ధీరత్వం.. సహనం.. సౌశీల్యం.. వీటి ప్రతి రూపమే మహిళ.. ప్రాచీన కాలం నుంచి నేటి డిజిటల్ ఆధునిక కాలం వరకు సీ్త్ర లేకపోతే పురుషునికి ఎదుగుదల ఉండదని నిరూపితమైతూనే ఉంది. ప్రస్తుతం సీ్త్ర చైతన్యాన్ని శక్తి సామర్థ్యాలను గమనించిన పురుషులు ఆమె ఎదుగుదలను అంగీకరిస్తూ ప్రోత్సహిస్తున్నాడన్నది అక్షర సత్యం. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో పలు రంగాల్లో రాణిస్తున్న మహిళామణుల విజయ గాథలు ఇవీ.. -
347 మంది విద్యార్థులు గైర్హాజరు
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం మ్యాథ్స్, బోట ని, సివిక్స్ పరీక్షకు 347 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 53 పరీక్ష కేంద్రాల్లో 12,534 మంది విద్యార్థులకు గాను 12,187 మంది హాజరయ్యారు. ఒకేషనల్ పరీక్షకు 1,052 మందికి గాను 1,003 మంది హాజరు కాగా 49 మంది గైర్హాజరయ్యారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించామని డీఐఈఓ సునీత తెలిపారు. ఎలాంటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మాస్ కాపీయింగ్కు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్ష కేంద్రాలను తరచుగా ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ పరిశీలిస్తున్నట్లు తెలిపారు. -
జగమేలు నాయకా.. జగదానంద కారకా
ఆళ్లగడ్డ: అహోబిలేశుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు శుక్రవారం దిగువ అహోబిలంలో ప్రహ్లాదవరద స్వామి హంస వాహనంపై కొలువై భక్తులను కనువిందు చేశారు. వేకువ జామునే నిత్యపూజల అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకాలంకరణలో ఉన్న హంస వాహనాన్ని అధిష్టించిన ప్రహ్లాదవరదుడు మాడ వీధుల్లో విహరించారు. అహో బిల మఠం చేరుకున్న హంసవాహానదీశుడైన అహోబిలేశునికి మఠం పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ ప్రత్యేక పూజలు చేపట్టారు. మధ్యాహ్నం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను యాగశాలలో కొలువుంచి పట్టు పీతాంబరాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. రాత్రి సూర్యప్రభ వాహనంపై కొలువైన ప్రహ్లాదవరదుడు భక్తులను కునువిందు చేశారు. భక్త హనుమంత .. తనువు పులకింత ఎగువ అహోబిల క్షేత్రంలో కొలువైన జ్వాలా నరసింహుడు హనుమంత వాహనంపై వివహరించారు. త్రేతాయుగం నాటి శ్రీరాముడిని తానేనంటూ భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శుక్రవారం రాత్రి అనన్య భక్తుడైన హనుమంతు వాహన సేవలో స్వామివారు కోదండరామ అలంకరణలో భక్తులను కటాక్షించారు. కృతయుగంలో వేంకటేశ్వరుడిగా, త్రేతాయుగంలో శ్రీరాముడిగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా, కలియుగంలో అహోబిలేశుడిగా స్వామి అవతరించారనే సందేశాన్ని చాటుతూ మాడవీధుల్లో హనుమంత వాహనసేవ.. రామరాజ్య వైభవాన్ని సాక్షాత్కరింపజేసింది. హంస, సూర్యప్రభ వాహనాలపై దర్శనమిచ్చిన ప్రహ్లాదవరదుడు