-
No Headline
● వ్యవసాయ రంగానికి జగన్ సర్కార్ పెద్దపీట ● బ్యాంకుల ద్వారా విస్తృతంగా రుణాలు ● టీడీపీ హయాంలో కన్నా రెట్టింపు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ● చంద్రబాబు హయాంలో వరికి రూ. 25 వేలు రుణపరిమితి ● వైఎస్సార్సీపీ పాలనలో రూ. 43 వేలు ● అన్ని పంటలకు పెరిగిన రుణ పరిమితి ● ఏటా రూ. 13,500 పెట్టుబడి సాయం -
రూ. 55 వేలు పంట రుణం తీసుకున్నాను
రబీసీజన్లో 1.50 ఎకరాల పొలంలో పప్పుశనగ సాగు చేశాను. గ్రామంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో పెట్టుబడి కోసం పంట రుణానికి దరఖాస్తు చేసుకున్నాను. బ్యాంకు అధికారులు రూ. 55 వేలు పంట రుణం ఇచ్చారు. ఆ రుణంతో విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు కొనుగోలు చేసి వ్యవసాయానికి వినియోగించున్నాను. – రవికుమార్రెడ్డి, రైతు, ఉయ్యాలవాడ పెట్టుబడికి భయమే లేదు నాకున్న రెండు ఎకరాల పొలంతో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని ఏటా జొన్న, పప్పుశనగ పంటలు సాగు చేస్తున్నాను. గతంలో పెట్టుబడుల కోసం ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేయాల్సి వచ్చేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏటా రూ. 13,500 పెట్టుబడిసాయం, బ్యాంకుల ద్వారా రుణాలు అంద జేస్తుండటంతో ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేయాల్సిన అవసరం తప్పింది. – సుబ్బరాయుడు, రైతు, కోవెలకుంట్ల -
ఫరూక్.. పరేషాన్ !
● నంద్యాల టీడీపీలో నేతల మధ్య కుదరని సయోధ్య ● ఫరూక్ నామినేషన్కు డుమ్మా కొట్టిన భూమా బ్రహ్మానందరెడ్డి ● చివరకు సాదాసీదాగా టీడీపీ అభ్యర్థి నామినేషన్ ● స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని బ్రహ్మంపై అనుచరుల ఒత్తిడి నంద్యాల: నంద్యాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మధ్య మధ్య ఉన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఫరూక్ నామినేషన్కు రావాలని ఫరూక్ తనయుడు ఫిరోజ్ స్వయంగా భూమా బ్రహ్మం ఇంటికి వెళ్లి పిలిచినా గైర్హాజరు కావడంతో టీడీపీలో గందరగోళం నెలకొంది. 2019 ఎన్నికల నుంచినంద్యాల టీడీపీ ఇన్చార్జ్గా ఉన్న భూమా బ్రహ్మానందరెడ్డిని టీడీపీ అధిష్టానం ఇటీవల తప్పించి మాజీ మంత్రి ఫరూక్ను ఇన్చార్జ్గా నియమించింది. అప్పటి నుంచి వీరి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. కేవలం ఇన్చార్జ్గా మాత్రమే నియమించామని, టీడీపీ అభ్యర్థులను ప్రకటించలేదని, అధిష్టానం చెప్పడంతో భూమా బ్రహ్మానందరెడ్డి కొన్ని రోజులు టికెట్ తనకే వస్తుందన్న భావనతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. అయితే చివరకు పార్టీ టికెట్ కూడా ఫరూక్కు ఇవ్వడంతో బ్రహ్మం టీడీపీ అధిష్టానంపై అలకబూనారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి లోకేష్లతో పాటు నారా భువనేశ్వరి సైతం ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు చేశారు. టీడీపీ పెద్దల సమక్షంలో రాజీ అయినట్లు ఫొటోలు దిగారే తప్ప ఇంత వరకు భూమా బ్రహ్మానందరెడ్డి ఫరూక్కు ఓటు వేయాలని ఎక్కడ చెప్పకపోవడంతో పాటు, ఫరూక్ ప్రచారాల్లో సైతం పాల్గొన లేదు. శుక్రవారం ఫరూక్ నామినేషన్కు రావాలని ఫరూక్ తనయుడు ఫిరోజ్ స్వయంగా భూమా బ్రహ్మం ఇంటికి వెళ్లి పిలిచినా గైర్హాజరు కావడంతో ఫరూక్కు షాక్ తగిలింది. మొదట కార్యకర్తలతో భారీగా వెళ్లి నామినేషన్ వేయాలనుకున్న ఫరూక్ చివరకు బ్రహ్మం రాకపోవడంతో సాదాసీదాగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. -
రెండో రోజు ఆరు నామినేషన్లు
● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు నంద్యాల: నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రెండో రోజు శుక్రవారం నంద్యాల జిల్లాలోని శ్రీశైలం, నందికొట్కూరు, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆరుగురు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకు సమర్పించారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి, ఆళ్లగడ్డ, డోన్, బనగానపల్లె అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. శ్రీశైలం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తరపున శిల్పా చక్రపాణిరెడ్డి ఒకసెట్, జైభారత్ నేషనల్ పార్టీ తరపున సయ్యద్ మహమ్మద్ సికిందర్బాషా, నందికొట్కూరు నియోజకవర్గానికి మూడు నామినేషన్లు రాగా ఇందులో బహుజన సమాజ్ పార్టీ తరఫున గద్దల లాజర్, ప్రజాబంధ్ పార్టీ ఇండియా అభ్యర్థిగా పల్లె నాగరాజు, జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ తరపున వెంకటేశ్వర్లు నామినేషన్లు వేశారు. నంద్యాల నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్ఎండీ ఫరూక్ నామినేషన్ దాఖలు చేశారు. -
కామేశ్వరీదేవికి వెండి కాసుల హారం
మహానంది: మహానందిలో కొలువైన శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి మహానందికి చెందిన రిటైర్డ్ వీఆర్ఓ సత్యనారాయణ దంపతులు శుక్రవారం వెండి కాసుల హారం అందించారు. ఈ మేరకు వారు కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకుని ముందుగా పూజలు నిర్వహించారు. అనంతరం డొనేషన్ కౌంటర్ వద్దకు చేరుకుని ఏఈఓ యర్రమల మధు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శశిధర్రెడ్డికి హారం అందించారు. 59 గ్రాముల బరువు ఉందని, వెండి కాసుల హారానికి బంగారు పూత వేయించినట్లు దాతలు చెప్పారు. హోమ్ ఓటింగ్ దరఖాస్తుకు 22 వరకు గడువు కోవెలకుంట్ల: 85 సంవత్సరాలు వయస్సు పైబడిన వృద్ధులు, అంగవైకల్యం కలిగిన వ్యక్తులు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇంటి వద్ద నుంచే ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. ఇందుకోసం ఆయా కేటగిరిలకు చెందిన ఓటర్లు ఫారం–12డీని సమర్పించాల్సి ఉంది. పూర్తి వివరాలతో నింపిన ఫారాన్ని ఈ నెల 22వ తేదీలోపు రిటర్నింగ్ అధికారులకు అందజేయాలని ఎన్నికల అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 25న గురుకుల ప్రవేశ పరీక్ష నంద్యాల(న్యూటౌన్): ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో 2024–25 విద్యాసంవత్సరం ప్రవేశానికి ఈనెల 25వ తేదీన పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి నరసింహరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5, 6, 7, 8 తరగతులకు ఏపీఆర్ఎస్ Cat–2024 ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, కళాశాలలకు ఏపీఆర్జేసీ, డీసీసెట్ – 2024 మధ్యాహ్నం 2.30గంటల నుండి 5గంటల వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షకు సంబంధించిన అభ్యర్థులు హాల్టికెట్లను https://aprs.apcfss.in వెబ్సైట్లో ఉంచామన్నారు. అభ్యర్థులు ఐడీతో పాటు పుట్టిన తేదీ ద్వారా హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలన్నారు. నేడు ‘ఏకలవ్య’ పరీక్ష కర్నూలు(అర్బన్): రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న ఏకలవ్వ మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష బీ క్యాంప్లోని ఏపీ గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో శనివారం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఏ లక్ష్మిగుర్రప్ప తెలిపారు. జిల్లాకు చెందిన విద్యార్థులకు సౌలభ్యంగా ఉంటుందని ఇక్కడ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా పాఠశాలల్లో 7, 8, 9 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకు కూడా ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారన్నారు. మిగిలిన సీట్లలో ప్రవేశం పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకొని ప్రవేశ పరీక్షకు హాజరు కావాలన్నారు. ప్రవేశ పరీక్ష ఉదయం 11.30 గంటల నుంచి 1.30 గంటల వరకు జరుగుతుందని, ఎండలు అధికంగా ఉన్నందున పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 10 గంటలకంతా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. శాస్త్రోక్తంగా చౌడేశ్వరిదేవి పల్లకీ సేవ బనగానపల్లె: నందవరం గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారికి శుక్రవారం శాస్త్రోక్తంగా పల్లకీ సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో కుంకుమార్చన అభిషేకం తదితర పూజలు జరిగాయి. సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అందంగా ముస్తాబు చేసి పల్లకీలో ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా పల్లకీ సేవ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు. -
నంద్యాల జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు
కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. శుక్రవారం డోన్, బనగానపల్లె మండలాల్లో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గోస్పాడులో 45, ఆత్మకూరులో 44.2, ఆళ్లగడ్డలో 44.2, బండిఆత్మకూరులో 44.2 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ఉష్ణోగ్రతల తీవ్రత కాస్త తగ్గింది. కర్నూలులో 42.5, మంత్రాలయంలో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వెల్దుర్తి, సి.బెళగల్, గూడూరు, కల్లూరు, కోడుమూరు, కోసిగి, కర్నూలు మండలాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా.. ఉమ్మడి జిల్లాలోరెండు, మూడు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. -
ప్యాపిలిలో టీడీపీకి భారీ షాక్
ప్యాపిలి: మండలంలో అసలే అంతంతమాత్రంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి క్యాడర్ దూరమవుతుండటంతో కుదేలవుతోంది. వరుస షాకులతో ఆ పార్టీ నేతలు, నియోజకవర్గ నాయకులు నిశ్చేష్టులై చూస్తు న్నారు. శుక్రవారం ప్రచారం నిమిత్తం ప్యాపిలికి వచ్చిన ఆర్థికశాఖ మంత్రి బుగ్గన సమక్షంలో ఏకంగా టీడీపీకి మద్దుతు ఇస్తున్న 500 కుటుంబాలు ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరాయి. ఇటీవల టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి చేరిన పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, రజనీ రెడ్డి, భూశెట్టి చిన్న సుంకయ్య ఆధ్వర్యంలో ప్యాపిలి, కలచట్ల, ఎస్.రంగాపురం, ఎర్రగుంట్లపల్లి తదితర గ్రామాల నుంచి టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పార్టీలో చేరిన వారికి వైఎస్సార్సీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కలచట్ల నుంచి రమేశ్, రామాంజి, నాగేశ్వరరావు తదితరులతో పాటు 200 కుటుంబాలు, ప్యాపిలి నుంచి ముక్కెల్ల వెంకటరాముడు, కమలాకర్, గణేశ్, మహేశ్, తరుణ్, భాస్కర్, శంకర్, వెంకటేశ్ తదితరులతో పాటు 100 కుటుంబాలు, 50 మంది మహిళలు, కలచట్ల, ఎస్.రంగాపురం, ఎర్రగుంట్లపల్లి తదితర గ్రామాల నుంచి తులసిరెడ్డి, రంగమునిరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి తదితరులతో పాటు 150 కుటుంబాలు వైఎస్సార్సీపీలోకి చేరాయి. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ వైఎస్సార్సీపీలోకి చేరిన నాయకులు, కార్యకర్తలకు ఎళ్లవేళలా అండగా ఉంటానన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్న కార్యకర్తలు మాట్లాడుతూ ప్యాపిలి మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి వైఎస్సార్సీపీలోకి చేరినట్లు తెలిపారు. పార్టీలకతీతంగా జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి పార్టీ మారినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా పని చేస్తామని వారు స్పష్టం చేశారు. టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన 500 కుటుంబాలు -
ప్రధాన పంటల గరిష్ట రుణ పరిమితి ఇలా
పంట 2018లో 2024లో (ఎకరాకు రూ.) (ఎకరాకు రూ.) వరి 18,000 43,000 వేరుశనగ 18,000 38,000 జొన్న 12,000 25,000 మొక్కజొన్న 16,000 33,000 కంది 12,000 20,000 పప్పుశనగ 20,000 34,000 పత్తి 31,000 42,000 పచ్చిమిరప 49,000 76,000 ఎండుమిరప 66,000 1 లక్ష మల్బరీ 55,000 1.05 లక్షలు టమాట 55,000 90,000 ఉల్లి 30,000 44,000 కరివేపాకు 35,000 47,000 అరటి 55,000 1.20 లక్షలు దానిమ్మ 56,000 97,000 కర్భూజ 35,000 55,000 ద్రాక్ష 80,000 లక్ష మామిడి 25,000 38,000 చెరకు 38,000 45,000 -
ఏటా పెట్టుబడిసాయం..
కోవెలకుంట్ల: వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిన వైఎస్సార్సీపీ సర్కార్ అన్నదాతకు అన్ని విధాలా అండగా నిలుస్తోంది. విత్తనం మొదలుకొని పంట ఉత్పత్తుల కొనుగోలు వరకు అడుగడుగునా తోడుగా ఉంటోంది. అన్నదాత సంక్షేమమే లక్ష్యంగా రైతులకు అనేక పథకాలు అమలు చేస్తోంది. పంటల సాగుకు పెట్టుబడి కోసం ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేసి అవస్థలు పడకుండా రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఏటా రూ.13,500 నగదు, బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తోంది. గత టీడీపీ సర్కార్ హయాంలో ఉన్న దానికన్నా గరిష్ట రుణపరిమితి గణనీయంగా పెంచి రైతులకు చేయూత నిస్తోంది. నంద్యాల జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఏటా ఖరీఫ్ సీజన్లో 2.28 లక్షల హెక్టార్లు, రబీ సీజన్లో 1.14 లక్షల హెక్టార్లలో రైతులు వరి, పత్తి, మినుము, మొక్కజొన్న, జొన్న, పప్పుశనగ, పెసర, పొగాకు, కంది, ఉల్లి, వేరుశనగ, మిరపతోపాటు ఉదాన్యవన పంటలైన మామిడి, సపోట, చీని, ద్రాక్ష, అరటి, తదితర పంటలు సాగు చేస్తున్నారు. పెరిగిన రుణపరిమితి ఇలా 2019 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులకు బ్యాంకుల ద్వారా అందించే పంటరుణాలకు సంబంధించి స్కేల్ఆఫ్ ఫైనాన్స్ పెరిగేలా చర్యలు చేపట్టింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఆధ్వర్యంలో నాబార్డు, లీడ్బ్యాంకు, ప్రధాన బ్యాంకర్లు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ (డీఎల్డీసీ) సమావేశమై వాస్తవ పరిస్థితులపై చర్చించి రుణపరిమితి ప్రతిపాదనలు తయారు చేస్తారు. ఆ ప్రతిపాదనలను రాష్ట్ర సాంకేతిక కమిటీ (ఎస్ఎల్టీసీ)కి పంపించి రుణపరిమితి ఖరారు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో ఈ ప్రక్రియ తూతూ మంత్రంగా చేపట్టి రైతులకు అరకొరగా రుణాలు ఇచ్చేవారు. దీని వల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం కలిగేది కాదు. అయితే 2019 తర్వాత రైతులకు మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా పంట రుణ సదుపాయం కల్పిస్తూ వస్తోంది. 2018లో వరి సాగుకు బ్యాంకుల ద్వారా ఎకరాకు గరిష్టంగా రూ. 18 వేలు రుణం ఇవ్వగా ప్రస్తుత వైఎస్సార్సీపీ హయాంలో రూ. 43 వేలు అందజేస్తున్నారు. వేరుశనగకు రూ. 18 వేలు ఇవ్వగా ఆ మొత్తాన్ని రూ. 38 వేలకు పెంచడం గమనార్హం. ఇలా వివిధ ప్రధాన పంటలకు రుణపరిమితిని భారీగా పెంచారు. ఏప్రిల్ నెల నుంచి ఆగస్టు వరకు రైతులు పంట రుణాల రెన్యువల్స్, కొత్త రుణాల కోసం బ్యాంకులను వినియోగించుకుంటూ పంట రుణాలు పొందుతున్నారు. భీమునిపాడులోని రైతు భరోసా కేంద్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఏటా వివిధ పంటల సాగుకు రైతులు ఇబ్బందులు పడకుండా ఖరీఫ్ సీజన్కు ముందే రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడిసాయం అందిస్తోంది. జూన్లోనే మొదటి విడతలో వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిషాన్ కింద రూ. 7,500, అక్టోబర్లో రూ. 4 వేలు, జనవరి నెలలో రూ. 2వేల చొప్పున అందజే స్తోంది. పెట్టుబడి సాయంతోపాటు గ్రామ సచివాలయాలకు అనుగుణంగా జిల్లాలో 394 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాలు, కల్తీలేని ఎరువులు, ఆయా పంటల్లో అధిక దిగుబడులు సాధించేందుకు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం అందజేస్తోంది. మరోవైపు వివిధ బ్యాంకుల ద్వారా పంట రుణాల రెన్యువల్, కొత్తగా పంట రుణాల పంపిణీకి ప్రాధాన్యత కల్పించింది. పంట పెట్టుబడులు, ఆయా పంటల్లో వస్తున్న దిగుబడులను బేరీజు వేసుకుని గరిష్ట రుణపరిమితి(స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) ఖరారు చేసి రైతులకు మేలు చేస్తోంది. -
చైతన్య సెల్ఫీ
ప్రతి ఓటు విలువైనదని.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని దృఢమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్లో స్వీప్ యాక్టివిటీలలో భాగంగా ఓటు సెల్ఫి పాయింట్ను ఏర్పాటు చేశారు. ఓటు హక్కు వినియోగంపై సంతకాల ప్రచార భారీ ఫ్లెక్సీని కలెక్టర్ ప్రారంభించారు. లోక్సభ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాధారణ ఎన్నికలలో ఎలాంటి బెదిరింపులు, ప్రలోభాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. – నంద్యాల -
ఆత్మగౌరవం లేని చోట పని చేయలేం
విజయం మీదే..నంద్యాల(సిటీ): ‘పదేళ్లు జెండా మోసినా ప్రయోజనం లేదు. ఆత్మగౌరవం లేని చోట పని చేయలేం. కనీసం పొత్తు ధర్మం పాటించని టీడీపీ వెంట నడవలేము’ అంటూ జనసేన నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో నంద్యాలలో కూటమికి భారీ షాక్ తగిలింది. జనసేన పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ స్టేట్ సెక్రటరీ, నంద్యాల నియోజకవర్గ ఇన్చార్జ్ విశ్వనాథ్తో పాటు ఆ పార్టీ నేతలు సాయి, అమర్నాథ్రెడ్డి, రాము, చాంద్ బాషా, అశోక్, షఫీలతో పాటు సుమారుగా 300 మంది గురువారం వైఎస్సార్సీపీలో చేరారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పారవి చంద్రకిశోర్రెడ్డి వారిని సాదరంగా ఆహ్వానించారు. నంద్యాల పట్టణ అభివృద్ధి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి నాయకత్వ లక్షణాలకు ఆకర్షితులై వైఎస్సార్సీపీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవి మాట్లాడుతూ నంద్యాల పట్టణానికి టీడీపీ నాయకులు ఏమైనా చేసింది ఉందా.. అని ప్రశ్నించారు. కేవలం ఇతరులపై బురదజల్లే రాజకీయం చేస్తూ ప్రజలను మభ్యపెట్టే వ్యాఖ్యలు సరికావన్నారు. గత సంవత్సరంలో 221 రోజుల పాటు నిత్యం ప్రతి గడపకూ వెళ్లి వారి కష్టసుఖాలను తాను తెలుసుకున్నానన్నారు. నంద్యాలను జిల్లా కేంద్రంగా, మెడికల్ కళాశాల, రోడ్లు, ఉర్దూ జూనియర్ కళాశాల ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో అభివృద్ధి ఈ కొద్ది సంవత్సరాలలో జరిగిందన్నారు. టీడీపీ అభ్యర్థి ఫారూఖ్ వివిధ శాఖలలో పని చేసి నంద్యాలకు ఏం చేశారో చెప్పుకోగలరా అంటూ ఎద్దేవా చేశారు. అనంతరం వైఎస్సార్సీపీలో చేరిన నంద్యాల నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ విశ్వనాథ్ మాట్లాడుతూ నిత్యం ప్రజలలో ఉంటూ వారికి సేవ చేస్తున్న నాయకుని వెంట నడవడం కూడా హర్షించదగ్గ విషయమన్నారు. గత పది సంవత్సరాలుగా జనసేన పార్టీ జెండా మోసినా ఎలాంటి పొత్తు ధర్మం లేకుండా టీడీపీ నాయకులు తమపై చిన్న చూపు చూశారన్నారు. పార్టీ కోసం నిత్యం పని చేసినా సముచిత గౌరవం దక్కలేదన్నారు. కనీసం ప్రచారం చేద్దామని అడిగినా నంద్యాల టీడీపీ నాయకులు కనీసం తమకు ప్రాధాన్యత కల్పించలేదన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న వైఎస్సార్సీపీ పార్టీ నాయకుడు శిల్పారవి వెంట నడవడమే ఉత్తమమని పార్టీని వీడి నేడు వైఎస్సార్సీపీలో చేరడం జరిగిందన్నారు. నాయకుడంటే ప్రజలలో తిరిగి వారి సమస్యలను తెలుసుకోవాలన్నారు. తాను ఎలాంటి లబ్ధికోసం పార్టీలో చేరలేదన్నారు. యువతకు జగన్మోహన్రెడ్డి, ఇక్కడ శిల్పా రవిచంద్ర కిశోర్రెడ్డి ఆదర్శమన్నారు. అనంతరం పలువురు జనసేన నాయకులకు ఎమ్మెల్యే పార్టీ కండువాలను కప్పి సాదరంగా వైఎస్సార్ కుటుంబంలోకి ఆహ్వానించారు. వైఎస్సార్సీపీలో పనిచేసే వారికి తప్పనిసరిగా సమాన గౌరవం ఉంటుందన్నారు. డోన్లో గురువారం ఇంటింటి ప్రచారం ప్రారంభించిన వైఎస్సార్సీపీ అభ్యర్థి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులు పడుతూ స్వాగతం పలికారు. ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని, అమలు చేసిన సంక్షేమ పథకాలను మంత్రి వివరిస్తూ వైఎస్సార్సీపీకి పట్టం కట్టాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జనసేనను వీడిన పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ స్టేట్ సెక్రటరీ వైఎస్సార్సీపీలో చేరిన 300 మంది జనసేన శ్రేణులు సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్రెడ్డి -
ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన విద్య
నందికొట్కూరు: ప్రభుత్వ కళాశాలల్లో మెరుౖగైన విద్య అందుతుందని రాయలసీమ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ సుధీర్ ప్రేమ్ కుమార్ అన్నారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన గ్రంథాలయ భవనం, సమావేశం భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయం మహోన్నత సమాజ నిర్మాణానికి పునాదులన్నారు. విద్యార్థులు గ్రంథాలయాలను ఉపయోగించుకుని మేధస్సును పెంపొందించుకోవాలన్నారు. రుసా నిధులతో నూతన భవనాలను నిర్మించడం జరిగిందని స్పష్టం చేశారు. అనంతరం ప్రొఫెసర్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. సునీత, అధ్యాపకులు డాక్టర్ ఎం. అన్వర్ హుసేన్, గ్రంథాలయ అధికారి రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక్కటైన 21 జంటలు కౌతాళం: మదిరె గ్రామంలోని ఉటగనూరు తాత మఠంలో గురువారం 21 జంటలు ఒక్కటయ్యాయి. మఠం ధర్మకర్త పంపారెడ్డి తాత, గ్రామస్తుల ఆధ్వర్యంలో సామూహిక వివాహలను నిర్వహించారు. ఈ సందర్భంగా పంపారెడ్డి తాత మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా దాతల సహకారంతో సామూహిక వివాహాలను జరిపించామన్నారు. నూతన వధువరులను వివిధ పార్టీల నేతలు అంక్షితలతో ఆశీర్వదించారు. ఈ జంటలకు దాతలు ఉచితంగా మంగళ సూత్రాలు, కాలిమెట్లను అందించారు. నగదు స్వాధీనం శిరివెళ్ల: కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై గురువారం శిరివెళ్ల మెట్ట వద్ద వాహనాల తనిఖీలో పోలీసులు నగదు స్వాధీనం చేసుకున్నారు. గోవిందపల్లె నుంచి బైక్పై వస్తున్న వెంకటాపురానికి చెందిన రైతు వెలుగొండయ్య వద్ద రూ. 1.70 లక్షలు గుర్తించి స్వాధీనం చేసుకున్నా మని ఎస్ఐ సురేష్ తెలిపారు. నగదు ఎక్కడిది అన్న కోణంలో విచారణ చేస్తున్నామన్నారు. కందులు రూ.11,309 కర్నూలు(అగ్రికల్చర్): కందుల ధర జోరుమీద ఉంది. రోజురోజుకు ధర పురోగమనంలో ఉండటం రైతులకు ఆనందాన్ని కలిగిస్తోంది. గురువారం కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు 27 మంది రైతులు 116 క్వింటాళ్ల కందులు తీసుకొచ్చారు. కందుల కొనుగోలుకు వ్యాపారులు పోటీ పడ్డారు. కనిష్ట ధర రూ.2,056, గరిష్ట ధర రూ.11,309 లభించింది. కందుల సగటు ధర కూడా రూ.11,309 నమోదైంది. దాదాపు అన్ని లాట్లకు ధర రూ.11 వేలపైనే లభించడం విశేషం. -
అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని జాగ్రత్తగా లెక్క కట్టండి
నంద్యాల: పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చును ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాల మేరకు పక్కాగా నమోదు చేయాలని పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎస్.మణికందన్, ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్ అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకులు కిరణ్ తొట్టుపురం అశోకన్, శ్రీశైలం, నందికొట్కూరు, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకులు టికారాం మీనాలు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆయా నియోజకవర్గాల సహాయ ఎన్నికల, సహాయ వ్యయ పరిశీలకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొన్నారు. అలాగే కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, పార్టీలు ఖర్చు పెట్టే ఎన్నికల వ్యయాన్ని పరిశీలించి నమోదు చేసేందుకు సహాయ వ్యయ పరిశీలకులు చురుకుగా, సమర్ధవంతంగా విధులు నిర్వహించాలన్నారు. వ్యయ నిర్వహణ రిజిస్టర్లు పక్కాగా నిర్వహించుటకు ప్రణాళిక రూపొందించుకుని రోజువారీ నివేదికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ, వీఎస్టీ, వీవీటి, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు చురుకుగా పనిచేసి అభ్యర్థుల ఖర్చు వివరాలను జాగ్రత్తగా లెక్కకట్టాలని సూచించారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్లు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, నామినేషన్ల ప్రక్రియ తదితర అంశాలన్నింటిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల వ్యయ పరిశీలకులకు వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఇప్పటి వరకు రూ.4.73 కోట్ల విలువైన నగదు, లిక్కర్, ఇతర వస్తువులను సీజ్ చేశామన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు -
22న ఎమ్మెల్యే కాటసాని నామినేషన్
● మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా 9 నామినేషన్లు ● నంద్యాల పార్లమెంట్కు ఇద్దరు, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏడుగురు అభ్యర్థుల నామినేషన్ ● శ్రీశైలం స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థి ఒకసెట్, టీడీపీ అభ్యర్థి రెండు సెట్లు దాఖలు ● భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ వేసిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిప్రచార రథంపై నుంచి అభివాదం చేస్తున్న ఎమ్మెల్యే శిల్పా, చిత్రంలో ఎంపీ అభ్యర్థి పోచా, ఎమ్మెల్యే శిల్పా రవి, బుడ్డా శేషారెడ్డి తదితరులునంద్యాల: సార్వత్రిక ఎన్నికల ఘట్టం ప్రారంభమైంది. గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో జిల్లాలో ఒక పార్లమెంట్ స్థానానికి, ఆరు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల అధికారులు నామినేషన్లు స్వీకరించారు. పార్లమెంట్ స్థానానికి నంద్యాల కలెక్టర్రేట్లో, అసెంబ్లీ స్థానాలకు ఆయా నియోజకవర్గాల తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్ల స్వీకరణ సందర్భంగా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీయించారు. నామినేషన్ కేంద్రంలోకి అనుమతి ఉన్న నాయకులను మాత్రమే లోపలికి పంపించారు. గురువారం నంద్యాల పార్లమెంట్కు ఇద్దరు, జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏడుగురు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సంబంధించిన రిటర్నింగ్ అధికారులకు అందజేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. నంద్యాల పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మహమ్మద్ అతుల్లాఖాన్ ఒకసెట్, బహుజన సమాజ్ పార్టీ తరపున చిన్న మౌలాలి ఒకసెట్ నామినేషన్ దాఖలు చేశారు. జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏడుగురు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. శ్రీశైలం నియోజకవర్గ అసెంబ్లీకి వైఎస్సార్సీపీ తరఫున శిల్పాచక్రపాణిరెడ్డి ఒక సెట్, జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ సి.నాగేశ్వరరావు ఒకసెట్, టీడీపీ అభ్యర్థులుగా బుడ్డా రాజశేఖర్రెడ్డి ఒకసెట్, బుడ్డా శైలజా ఒకసెట్ నామినేషన్లు దాఖలు చేశారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి స్వతంత్ర అభ్యర్థులుగా విష్ణువర్ధన్రెడ్డి, బి.శ్రావణకుమార్ చెరో ఒక సెట్ నామినేషన్లు దాఖలు చేయగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున షేక్మహమ్మద్ ఫాజిల్ ఒక సెట్ దాఖలు చేశారు. అట్టహాసంగా శిల్పా నామినేషన్ శ్రీశైలం నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా శిల్పాచక్రపాణిరెడ్డి గురువారం ఉదయం 11.10 గంటలకు ఆత్మకూరులో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా ప్రచార వాహనంపై శిల్పాచక్రపాణిరెడ్డి, నంద్యాల ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడ్డా శేషారెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ పరిశీలకులు హబీబుల్లా, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులతో కలిసి భారీ ర్యాలీగా పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి కొత్త బస్టాండు మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. నామినేషన్ అనంతరం వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పాచక్రపాణిరెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం నియోజకవర్గంలోని నలుమూలల నుంచి స్వచ్ఛందంగా నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ‘మీ కుటుంబంలో మంచి జరిగి ఉంటేనే ఓటు వేయండి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్భయంగా ఓట్లు అడుగుతున్నారంటే ప్రజలకు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే తమ ధైర్యమన్నారు. చంద్రబాబు నాయుడు ఓట్ల కోసం ఎన్ని హామీలు అయినా ఇస్తారని, ఆయన దొంగ హామీలను ప్రజలు నమ్మే స్థితిలో నేడు లేరన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబుకు, కూటమి నాయకులకు ప్రజలు గుర్తు వస్తారని, చంద్రబాబు, పవన్కళ్యాణ్, పురందేశ్వరిలు ప్రజలను మభ్య పెట్టేందుకు చూస్తున్నారని, వారిని నమ్మవద్దన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99శాతం నెరవేర్చిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కిందని, మాట ఇస్తే 100శాతం అమలు చేసి తీరుతామన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా పోచా బ్రహ్మానందరెడ్డిని, ఎమ్మెల్యేగా శిల్పా చక్రపాణిరెడ్డి అయిన తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. మొదటి రోజు ప్రశాంతం శ్రీశైలం నియోజకవర్గ స్థానానికి వైఎస్సార్సీపీ, టీడీపికి చెందిన ఇద్దరు అభ్యర్థులు గురువారం నామినేషన్లు దాఖలు చేస్తుండటంతో పోలీసులు ఆత్మకూరులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరుపార్టీల అభ్యర్థులు భారీ ర్యాలీతో నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చినా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్తగా చర్యలు తీసుకు న్నారు. దీంతో ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఉదయం 11 గంటల తర్వాత వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పాచక్రపాణిరెడ్డి, మధ్యాహ్నం 2 గంటల తర్వాత టీడీపీ అభ్యర్థులు బి.రాజశేఖర్రెడ్డి, బి.శైలజ నామినేషన్లు దాఖలు చేయడానికి వేర్వేరుగా సమయం ఇచ్చి నామినేషన్లు వేయించడంతో అంతా ప్రశాంతంగా ముగిసింది.నాలుగు నియోజకవర్గాల్లో నిల్.. జిల్లాలోని ఆరు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ జరగగా అందులో నాలుగు అసెంబ్లీ స్థానాలకు గురువారం ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేయలేదు. జిల్లాలోని ఆళ్లగడ్డ, నందికొట్కూరు, బనగానపల్లె, డోన్ అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. పాణ్యం: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పాణ్యం నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఈనెల 22వ తేదీన నామినేషన్ వేయనున్నారు. ఉదయం 9 గంటలకు ఎమ్మె ల్యే స్వగృహం నుంచి ర్యాలీ ప్రారంభమై కర్నూలు కలెక్టరేట్ వరకు సాగుతుంది. పాణ్యం ఈఆర్ఓ కార్యాలయంలో నామినేష్ పత్రాలను దాఖలు చేస్తారు. నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ నేతలు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జూన్ 1న కళాశాలలు పునఃప్రారంభం
నంద్యాల(న్యూటౌన్): జూనియర్ కళాశాలలు జూన్ 1వ తేదీన పునఃప్రారంభం కానున్నాయి. అదే రోజు నుంచి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు సైతం మొదలుకానున్నాయి. ఈ మేరకు తాజాగా ఇంటర్మీడియెట్ బోర్డు 2024–25 నూతన విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక క్యాలెండర్, షెడ్యూల్ విడుదల చేసింది. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి జూనియర్ కళాశాలలు 222 రోజులు పనిచేయనున్నాయి. 2025 మార్చి 31 ఆఖరి పనిదినంగా, ఏప్రిల్ 1 నుంచి 2025 జూన్ ఒకటి వరకు వేసవి సెలవులను ప్రకటించారు. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా సాంస్కృతిక వారోత్సవాలను అక్టోబర్ ఆఖరివారంలో నిర్వహించాలని, స్పోర్ట్స్ వారోత్సవాలను నవంబర్ ఆఖరివారంలో నిర్వహించాలని, అలాగే సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫెయిర్ను 2025 జనవరి 8, 9 తేదీల్లో నిర్వహించాలని క్యాలెండర్లో పేర్కొన్నారు. 2020 మార్చిలో విజృంభించిన కరోనా వైరస్ (కోవిడ్)తో అస్తవ్యస్తమైన విద్యావ్యవస్థ ప్రభుత్వ పకడ్బందీ చర్యలతో రెండేళ్ల నుంచి పూర్తిస్థాయిలో గాడిలో పడింది. ఈ ఏడాది 2024లో యథావిధిగా జూన్ 1వ తేదీన కళాశాలలు పునః ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 139 జూనియర్ కళాశాలలు ఉండగా, ఇందులో 57 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం ఇప్పటికే అధికారుల ఆదేశానుసారం క్యాంపెయినింగ్ నిర్వహించారు. కళాశాలలకు సమీప ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు అడ్మిషన్ డ్రైవ్స్ నిర్వహించారు. ప్రభుత్వ కళాశాలల్లో నాడు–నేడు కార్యక్రమం ద్వారా అందుబాటులో ఉన్న వసతులు, సౌకర్యాలు, ల్యాబ్లు, డిజిటల్ విద్య, ఐఎఫ్పీ ప్యానెల్స్ ద్వారా బోధన, అధ్యాపకుల పనితీరు, బోధన విధానాలు, ఇంటర్ విద్యతో లభిస్తున్న భవిష్యత్ అవకాశాలను తెలియజేసి ఆకర్షితులను చేశారు. ఈ ఏడాది ప్రభుత్వ కళాశాలల్లో గణనీయంగా అడ్మిషన్లు జరిపేలా అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. 2024–25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ బోర్డు వార్షిక క్యాలెండర్ పక్కాగా అమలు చేస్తామని ఆర్ఐఓ గురువయ్యశెట్టి తెలిపారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం విద్యార్థులకు పరీక్షల నిర్వహణ, సెలవులు ప్రకటిం చడం జరుగుతుందన్నారు. -
ఆ శిలాఫలకాలకు కోడ్ వర్తించదు
నంద్యాల(సిటీ): సార్వత్రిక ఎన్నికల కోడ్ కంటే ముందే అభివృద్ధి పనుల్లో భాగంగా నిర్మించిన శిలాఫకాలకు ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) నిబంధనలు వర్తించవని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి గురువారం తెలిపారు. ఎంసీసీ అమలులో ఉన్నప్పు డు లబ్ధిదారులకు పంపిణీ చేయదలచిన లబ్ధికార్డులు, ప్రతిష్టించిన శిలాఫలకాలపై సీఎంలు, మంత్రులు, ఇతర రాజకీయ నాయకుల ముఖ చిత్రాలు వెలువరించడం చట్టరీత్యా నిషేధమన్నారు. జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ కుమార్రెడ్డి ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ముద్రించే విద్యుత్ బిల్లులు, నీటి పన్ను రశీదు తదితర వాటిపై ఎలాంటి రాజకీయ పార్టీల గుర్తులు, ఫొటోలు, సందేశాలు లేకుండా చర్యలు చేపట్టామన్నారు. -
పెరిగిన భగభగలు
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో భానుడి భగభగలు పెరిగిపోయాయి. వడగాడ్పుల తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గురువారం మంత్రాలయంలో అత్యధికంగా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు జిల్లాలోని ఐదు మండలాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలులో 44 డీగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల జిల్లాలో ఎండలు, వడగాడ్పుల తీవ్రత రి కార్డు స్థాయికి చేరుతోంది. ఈ జిల్లాలో 8 మండలాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బనగానపల్లి, డోన్, రుద్రవరం మండలాల్లో 45.6 డిగ్రీలు, ఆళ్లగడ్డలో 45.4, మిడుతూరులో 45.2 ఆత్మకూరు, బండిఆత్మకూరుల్లో 45.1, గోస్పాడులో 45.0 డిగ్రీల ప్రకారం నమోదయ్యాయి. నందికొట్కూరులో 44.5, మహానందిలో 44.4, సంజామలలో 44.3, పాణ్యంలో 44.2 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 46 నుంచి 48 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని, వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. నంద్యాల జిల్లాలో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు -
No Headline
● నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం ● జిల్లాలో ఒక పార్లమెంట్, ఆరు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ● అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో హెల్ప్ డెస్క్ల ఏర్పాటు ● మొదటి రోజే శ్రీశైలం సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి నామినేషన్ ● ఇక ఊపందుకోనున్న ప్రచారం నంద్యాల/ఆళ్లగడ్డ: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రధాన ఘట్టం గురువారం నుంచి మొదలు కానుంది. జిల్లాలో జరగనున్న ఒక పార్లమెంట్, ఆరు అసెంబ్లీ స్థానాలకు ఈనెల 18వ తేదీన నోటిఫికేషన్ విడుదలకానుంది. అదే రోజు నుంచి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 21వ తేదీ ఆదివారం కావడంతో ఆ రోజు నామినేషన్లు స్వీకరించరు. 26న నామినేషన్ల పరిశీలన చేసి, 29వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు అవకాశం ఇస్తారు. 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. పార్లమెంట్కు సంబంధించి కలెక్టరేట్లో, అసెంబ్లీకి సంబంధించి ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు. పాణ్యం అసెంబ్లీకి సంబంధించి కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని జేసీ చాంబర్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు ఏర్పాటు చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ, పోలీసు, నోడల్ ఆఫీసర్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్ధులు ఎన్నికల కమిషన్ నియమావళిని, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ఇందులో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసేవారికి ఉండాల్సిన అర్హతలపై ఎన్నికల కమిషన్ దిశా నిర్దేశం చేసింది. అలాగే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు సువిధ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎన్నికల షెడ్యూల్ మార్చి 16వ తేదీన విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో నాలుగో విడతలో ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంది. దీంతో 58 రోజులపాటు సమయం దొరికింది. అందులో ఇప్పటికే 32 రోజులు గడిచిపోయాయి. ఈ క్రమంలో మిగిలిన 26 రోజుల్లో ఎన్నికల నామినేషన్లు, స్క్రూటీని, నామినేషన్ల ఉపసంహరణ, పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా, పోలింగ్ తదితర ప్రక్రియలు ముగుస్తాయి. నామినేషన్కు అర్హతలు ఇవే.. ● అభ్యర్థికి నామినేషన్ దాఖలు చేసే రోజుకు 25 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. ● రాష్ట్రంలో ఏదైనా ఓ నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి. ● పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులైతే నలుగురు, స్వతంత్రంగా పోటీ చేసే అభ్యర్థులను 10 మంది ఓటర్లు బలపర్చాలి. బలపరిచే వారు అదే నియోజకవర్గానికి చెందిన ఓటర్లు అయి ఉండాలి. ● నామినేషన్ దాఖలు చేయడానికి 48 గంటలకు ముందు అభ్యర్థులు తప్పనిసరిగా తమ పేరిట ఏదైనా గుర్తింపు పొందిన బ్యాంకులో ఖాతా తెరవాలి. ఆ ఖాతా ద్వారానే తమ ఎన్నికల ప్రచా రానికి, ఇతర అవసరాలకు వెచ్చించిన సొమ్ముకు సంబంధించి లావాదేవీలు నిర్వహించాలి. నామినేషన్ దాఖలు ఇలా.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి సువిధ యాప్ ద్వారా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత హార్డ్ కాపీలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేయాలి. ● నామినేషన్ హార్డ్ కాఫీలు అందజేసే సమయంలో ఆర్వో చాంబర్లోకి అభ్యర్థితో పాటు ఐదుగురిని మాత్రమే అనుమతిస్తారు. ● అభ్యర్థులు తమ ఒరిజనల్ బీ– ఫారమ్, ఏ – ఫారమ్లను నామినేషన్ గడువు ముగిసే రోజు మధ్యాహ్నం మూడు గంటల్లోపు అందజేయవచ్చు. ● అభ్యర్థులు రెండు (ఒకటి స్టాంప్ సైజ్, మరొకటి పాస్పోర్ట్ సైజ్) ఫొటోలతో పాటు తన ఓటరు కార్డు, బలపరిచే వారి గుర్తింపు కార్డు నామినేషన్తో పాటు అందజేయాలి. ● ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అభ్యర్థి తన సంతకం ఉండే విధానాన్ని విధిగా తెలియజేయాలి. ● బ్యాలెట్ యూనిట్లో తన పేరు ఎలా ముద్రించాలో వివరించి చెప్పాలి. ● ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఏవైనా క్రిమినల్ కేసులు ఉంటే వాటిని మూడు దినపత్రికల్లో ప్రకటన ద్వారా బహిర్గతం చేయాలి. అందుకు అయ్యే ఖర్చును లెక్క చూపాలి. ● ఎన్నికల నామినేషన్ కేంద్రాల్లో అనువజ్ఞులైన అధికారులతో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఏవైనా సందేహాలుంటే అక్కడ నివృత్తి చేసుకోవచ్చు. డిపాజిట్ ఎంత అంటే.. ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసే సాధారణ (ఓసీ, బీసీ) అభ్యర్థులు రూ. 25 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ. 12,500 డిపాజిట్ చెల్లించాలి. ఎమ్మెల్యేగా పోటీ చేసే సాధారణ అభ్యర్థులు రూ. 10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 5 వేల చొప్పున డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రజలకు తెలిసేలా.. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్ల దాఖలు సమయంలో అధికారులకు సమర్పించే వివరాలను ప్రజలకు తెలిసేలా ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు. నకలును ప్రజలు కోరితే వాటిని ఉచితంగానే అధికారులు అందజేస్తారు. రోజూ మధ్యాహ్నం 3 గంటల అనంతరం ఆ రోజు వచ్చిన నామినేషన్లపై అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఎన్నికల కమిషన్కు తెలియజేస్తారు. నామినేషన్లను, అఫిడవిట్లను ఎప్పటికప్పుడు ఆన్లైన్లోనూ నోటీసు బోర్డులోనూ ప్రజల పరిశీలనకు ఉంచుతారు. నామినేషన్ దాఖలు పారదర్శకంగా ఉండేందుకు సంపూర్ణంగా వీడియో తీయిస్తారు. నియమావళి పాటించాల్సిందే.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నియమావళిని, నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలి. అభ్యర్థి నామినేషన్ల పత్రాల్లోని ప్రతి అంశాన్ని ఎన్నికల కమిషన్ పక్కాగా పరిశీలిస్తుంది. ఇందులో ఏమాత్రం పొరపాటు, తప్పు జరిగినా ఏమాత్రం ఉపేక్షించకుండా చెల్లుబాటు కాలేదని ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదన్న ఉద్దేశంతో కొందరు డమ్మీ సెట్ దాఖలు చేయనున్నారు. మొత్తం మీద ఒక్కో అభ్యర్థి నాలుగు సెట్లు నామినేషన్లు దాఖలు చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది.నామినేషన్ కేంద్రాలు, రిటర్నింగ్ అధికారుల వివరాలు.. నియోజకవర్గం నామినేషన్ దాఖలు చేసే కేంద్రం రిటర్నింగ్ ఆఫీసర్ ఫోన్ నంబర్ నంద్యాల తహసీల్దార్ కార్యాలయం, నంద్యాల రాహుల్కుమార్రెడ్డి, జేసీ, నంద్యాల 8522030888 శ్రీశైలం తహసీల్దార్ కార్యాలయం, ఆత్మకూరు సుధారాణి, డిప్యూటీ కలెక్టర్, నంద్యాల 9989925007 బనగానపల్లె తహసీల్దార్ కార్యాలయం, బనగానపల్లె ఎస్.కామేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్, నంద్యాల 8978882804 ఆళ్లగడ్డ తహసీల్దార్ కార్యాలయం, ఆళ్లగడ్డ మల్లికార్జునరెడ్డి, ఆర్డీఓ, నంద్యాల 8333989000 డోన్ ఆర్డీఓ కార్యాలయం, డోన్ మహేశ్వరరెడ్డి, ఆర్డీఓ, డోన్ 7815959530 నందికొట్కూరు తహసీల్దార్ కార్యాలయం, నందికొట్కూరు ఎం.దాసు, ఆర్డీఓ, ఆత్మకూరు 7815959529 నోటిఫికేషన్లో ముఖ్యమైన తేదీలు నామినేషన్ల ప్రారంభం – ఏప్రిల్ 18 చివరి తేదీ – ఏప్రిల్ 25 పరిశీలన – ఏప్రిల్ 26 ఉపసంహరణ చివరి తేదీ – ఏప్రిల్ 29 పోలింగ్ – మే 13 ఓట్ల లెక్కింపు – జూన్ 04 2024 సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టానికి కౌంట్ డౌన్ మొదలైంది. మరో కొన్ని గంటల్లో అంటే గురువారం 11 గంటల నుంచి సార్వత్రిక సమరానికి కీలక అడుగు పడనుంది. నోటిఫికేషన్ విడుదలతో పాటు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా మొదలవుతుంది. దీంతో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. నంద్యాల పార్లమెంట్ స్థానంతో పాటు ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. తొలిరోజు దశమి, ఆ తర్వాత ఏకాదశి రెండూ మంచి రోజులు కావడంతో తొలి రెండు రోజుల్లో అధికశాతం మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. -
ముమ్మరంగా వాహనాల తనిఖీ
డోన్ టౌన్: సార్వత్రిక ఎన్నికలను దృష్ట్టిలో ఉంచుకొని పట్టణ సమీపంలో జాతీయ రహదారిపై వెలసిన శ్రీదత్తాత్రేయ స్వామి గుడ్డి సమీపంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద బుధవారం పోలీసులు వాహనాల తనిఖీ ముమ్మరంగా చేపట్టారు. రూరల్ ఎస్ఐ సుధాకర్ రెడ్డి, ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారి డీఈ సురేష్ ఆధ్వర్యంలో వాహనాలను క్షణ్ణంగా పరిశీలించారు. హోం ఓటింగ్ కోసం నేటి నుంచి విచారణ కర్నూలు(సెంట్రల్): కేంద్ర ఎన్నికల సంఘం వయో వృద్ధులు(80 ఏళ్లు దాటిన వారు), దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి హోం ఓటింగ్ సదుపాయాన్ని కల్పించింది. ఈనేపథ్యంలో ఏప్రిల్ 18 నుంచి 21వ తేదీ వరకు బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్ఓ) ఇంటింటా తిరిగి హోం ఓటింగ్కు అర్హులైన ఓటర్లను గుర్తిస్తారు. వారిని కలసి హోం ఓటింగ్ ఆప్షన్ తీసుకుంటారా లేదంటే పోలింగ్ కేంద్రంలో ఓటు వేస్తారా అన్న విషయాలను సేకరిస్తారు. -
ప్రజలు కోట్లను తరిమికొడతారు
● ఎక్కడా సీటు లేక డోన్కు వచ్చాడు ● సొంతూరు లద్దగిరికి రోడ్డు వేసుకోలేని వ్యక్తి డోన్కు రోడ్లు వేశారట ● నా వెంట వస్తే అభివృద్ధిని చూపిస్తా ● టీడీపీని ప్రజలు నమ్మరు ● మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి బేతంచెర్ల: సీనియర్ నాయకుడని చెప్పుకునే టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాష్రెడ్డికి ఆలూరు సీటు ఇవ్వలేమంటే, ఎమ్మిగనూరు కుదరదంటే, ఆదోనిలో సాధ్యపడదంటే, కర్నూలులో కాదంటే.. చివరకు డోన్కు వచ్చాడని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఫ్యాక్షన్ రాజకీయాలు చేసిన కోట్లను ప్రజలు డోన్ నుంచి తరిమేస్తారన్నారు. బుధవారం పట్టణంలోని షిర్డీ సాయి కల్యాణ మండపంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడారు. నియోజకవర్గంలో గ్రామాల పేర్లు కూడా తెలియని నాయకులు డోన్లో అభివృద్ధి ఏదీ అని అడుగుతున్నారన్నారు. తన వెంట వస్తే దగ్గరుండి అభివృద్ధిని చూపిస్తానన్నారు. కేంద్ర మంత్రిగా, ఎంపీగా ఉన్నత పదవులు అనుభవించిన కోట్ల తన సొంత గ్రామం లద్దగిరికి రోడ్డు వేసుకోలేదని, అలాంటి వ్యక్తి డోన్లో రోడ్లు వేశారంటే ప్రజలు ఎలా నమ్ముతారన్నారు. కేంద్ర రైల్వే మంత్రిగా కోచ్ ఫ్యాక్టరీ కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. వర్ష పాతం ఆధారంగా బేతంచెర్ల మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటిస్తే ప్రతిపక్షాలకు కడుపుమంట ఎందుకన్నారు. మాది చేతల ప్రభుత్వం.. టీడీపీది అబద్దాల ప్రభుత్వమైతే వైఎస్సార్సీపీది సంక్షేమ ప్రభుత్వమన్నారు. అర్హతనే ప్రమాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. 2014లో ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదన్నారు. మహాలక్ష్మి పథకం పేరుతో పుట్టిన ప్రతి ఆడ బిడ్డకు రూ. 25 వేలిస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ఏడాదికి 12 సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క సిలిండర్ కూడా ఇవ్వలేదన్నారు. విద్యార్థులకు బసుపాసులు ఇవ్వాలన్నా రాయితీలతో ఆర్టీసీ నష్టపొతుందని మనసులో మాట పుస్తకం ద్వారా తన మనస్సులో మాట చెప్పారన్నారు. గతంలో పింఛన్లు, డీ పట్టాలు దగ్గర నుంచి ఏ ప్రభుత్వ సేవ అందాలన్నా జన్మభూమి కమిటీల ద్వారా లంచాలు తీసుకున్న చరిత్ర టీడీపీది అన్నారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైఎస్ జగన్ మోహన్రెడ్డి 99 శాతం అమలు చేశారన్నారు. రాష్ట్రంలో పులివెందుల తర్వాత అభివృద్ధి చెందిన ప్రాంతం డోన్ నియోజకవర్గం అన్నారు. ప్రజల ఆశీర్వాదంతోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దానన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో డోన్ అభ్యర్థిగా తనను, నంద్యాల ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని మంత్రి బుగ్గన అన్నారు. కార్యక్రమంలో మంత్రి బుగ్గన తనయుడు అర్జున్ రెడ్డి, వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
కలిసికట్టుగా పని చేద్దాం
వెలుగోడు: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలని ఆ పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సూచించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బుధవారం వేల్పనూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి బుడ్డా శేషారెడ్డితో రామసుబ్బారెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి, నియోజకవర్గ ఎన్నికల అబ్జర్వర్ హబీబుల్లా సమావేశమయ్యారు. పార్టీ నేతలు ఐక్యతతో ఎన్నికల్లో కలిసి పని చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి బుడ్డా వెంగల్రెడ్డికి వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉండేవన్నారు. వైఎస్ఆర్ మరణాంతరం బుడ్డా శేషారెడ్డి వైఎస్ జగన్ వెంట నడుస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు ఎంతో కృషి చేశారన్నారు. శ్రీశైలంలో నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి 2019 కంటే ఈసారి అత్యధిక మెజారిటీతో శిల్పా చక్రపాణిరెడ్డిని, నంద్యాల ఎంపీగా పోచా బ్రహ్మానందరెడ్డిలను గెలిపించేందుకు కృషి చేయాలని నేతలుకు సూచించారు. మరింత బలం.. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి బుడ్డా శేషారెడ్డితో కలిసి పని చేయడంతో నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి మరింత బలం చేకూరుతుందని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు. 1989 నుంచి బుడ్డా కుటుంబంతో తనకు అవినాభావ సంబంధం ఉందని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుడ్డా శేషారెడ్డిని కలిసి ముందుకు వెళ్తామన్నారు. బుడ్డాను కలుపుకొని ఎన్నికల్లో పని చేసి మళ్లీ నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగురవేస్తామన్నారు. టీడీపీని ఓడించేందుకు అందరం ఐక్యంగా పని చేస్తామన్నారు. నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలందరం కలిసి కట్టుగా పని చేస్తామని చెప్పారు. సీఎం ఆదేశాలను ధిక్కరించలేదు.. పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఆదేశాలను తాను ఎప్పుడూ ధిక్కరించలేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి బుడ్డా శేషారెడ్డి అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆశయాల కోసం మళ్లీ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు శ్రీశైలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం సమన్వయంతో పని చేస్తామన్నారు. రాజకీయాల్లో పది మందికి సాయం చేయాలన్నది మా తండ్రి బుడ్డా వెంగళ్రెడ్డి నుంచి నేర్చుకున్నానని, ఆ దిశగానే తాను పని చేస్తున్నానని చెప్పారు. చక్రపాణిరెడ్డికి విజయానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. గురువారం శిల్పా నామినేషన్ కార్యక్రమంలో అందరం పాల్గొని విజయవంతం చేస్తామని చెప్పారు. వైఎస్ఆర్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి -
మంచి ముహూర్తం చూసుకుని..
నామినేషన్ల హడావిడి నేటి నుంచి 25వ తేదీ వరకు కొనసాగనుంది. బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు పండితులు, గురువులు, స్వామీజీలను ఆశ్రయించి ముహుర్తాలను నిర్ణయించుకుంటున్నారు. పంచాంగం ప్రకారం చూస్తే ఈ నెల 18, 19, 22, 23, 24 తేదీల్లో మంచి ముహుర్తాలున్నట్లు పండితులు పేర్కొంటున్నారు. కొందరు సెంటిమెంట్తో పాటు వారాలకు ప్రాధాన్యతనిస్తూ అందుకు అనుగుణంగా శుభగడియల్లో ముహూర్తాలను నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మొదటి రోజు ఈనెల 18వ తేదీన శ్రీశైలం నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి గురువారం ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేయనున్నారు. ఈనెల 22వ తేదీన పాణ్యం వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్రెడ్డి, 23వ తేదీ నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి, 24వ తేదీన ఆళ్లగడ్డ వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి గంగుల బిజేంద్రారెడ్డి, నందికొట్కూరు అసెంబ్లీ వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ దారా సుధీర్, బనగానపల్లె వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి, నంద్యాల పార్లమెంట్ వైఎస్సార్సీపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. -
జంబులా పరమేశ్వరికి వెండి హారం బహూకరణ
నంద్యాల(వ్యవసాయం): పట్టణ శివారులోని జంబులాపరమేశ్వరి అమ్మవారికి ఓ దాత వెండి హారాన్ని బహూకరించారు. పట్టణానికి చెందిన తాలికోట సుశీలమ్మ కుమారుడు జంబులయ్య మంగళవారం రూ. 1.75 లక్షల విలువైన 2.25 కేజీల వెండి హారాన్ని ఆలయ నిర్వాహకులు గాండ్ల రాజేశ్వరి, జగన్కు అందజేశారు. కార్యక్రమంలో బాలాజీ, నాగరాజు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 23న అరుణాచలానికి ప్రత్యేక బస్సు సర్వీసు నంద్యాలటౌన్: నంద్యాల నుంచి అరుణాచల క్షేత్రానికి ఈ నెల 23వ తేదీన ప్రత్యేక సూపర్ లగ్జరీ సర్వీసు ఏర్పాటు చేశామని నంద్యాల ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ మద్దిలేటి నాయుడు తెలిపారు. మంగళ వారం స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ సర్వీసు మంగళవారం ఉదయం 7.30 గంటలకు నంద్యాల నుంచి బయలుదేరి కాణిపాకం మీదుగా రాత్రికి అరుణాచలం చేరుకుంటుందన్నారు. మరుసటి రోజు బుధవారం సాయంత్రం అరుణాచలం నుంచి బస్సు బయలుదేరి వేలూరు మీదుగా నంద్యాల చేరుకుంటుందన్నారు. కాణిపాకం, వేలూరు స్వర్ణదేవాలయాల్లో ప్రయాణికులు భక్తులు దర్శనం చేసుకోవడానికి వీలుగా బస్సును ఆయా క్షేత్రాల్లో నిలుపుతామన్నారు. ఈ సర్వీసుకు చెందిన టికెట్లను బస్టాండ్ లోని రిజర్వేషన్ కౌంటర్, apsrtc online.inలో బుక్ చేసుకోవచ్చని సూచించారు. రంగనాథుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం జూపాడుబంగ్లా: తర్తూరులో వెలసిన శ్రీ లక్ష్మీరంగనాథస్వామి వారి బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. పది రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా మొద టి రోజు పూలచపురం కార్యక్రమంలో భాగంగా స్వామివారిని పెళ్లికుమారునిగా అర్చకులు ముస్తాబు చేశారు. శ్రీలక్ష్మీదేవి అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. స్వామి, అమ్మవార్ల మూల, ఉత్సవ విగ్రహాలకు పంచామృతాభిషేకం, కుంకుమార్చన, విశేష పూజలు నిర్వహించారు. సంప్రదాయంలో భాగంగా జూపాడుబంగ్లా తహసీల్దారు బాబూ రాజేంద్రప్రసాద్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామివారు తర్తూరులో పెళ్లికుమారునిగా ముస్తాబు అయిన అనంతరం ఇక్కడ పదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తర్తూరులో స్వామివారికి కల్యాణం నిర్వహించకపోవడం ప్రత్యేకం. బ్రహ్మోత్సవాల అనంతరం శ్రీరంగనాథస్వామివారు తర్తూరు నుంచి నెల్లూరు జిల్లాల్లోని శ్రీరంగాపురంలో జరిగే కల్యాణ వేడుకలకు తరలివెళ్తారని అర్చకులు తెలిపారు. అక్కడ శ్రీమహాలక్ష్మితో రంగనాథస్వామి వారికి కల్యాణ వేడుకలను వైభోవంగా నిర్వహిస్తారు. నేడు సింహ వాహనసేవ తర్తూరు బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారికి సింహవాహనసేవ నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ ఎడి.వెంకటరమణ తెలిపారు. 23న రథోత్సవం, 24న పారువేట నిర్వహిస్తారు. -
నామినేషన్ల ప్రక్రియలో నిబంధనలు పాటించాలి
నంద్యాల: సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియలో ఎన్నికల నిబంధనలను తు.చా తప్పక పాటించాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్లో జిల్లా ఎన్నికల అధికారి డా.కె. శ్రీనివాసులు నామినేషన్ల ప్రక్రియ, ఎన్నికల సంసిద్ధతపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందన్నారు. నామినేషన్లు వేసే అభ్యర్థులు అఫిడవిట్ 26 ఏలో వున్న వర్తించే, వర్తించని కాలమ్లలో వివరాలన్నింటిని తప్పక పూరించాలన్నారు. అభ్యర్థులు నామినేషన్ల దాఖలకు 13 రకాల డాక్యుమెంట్లను తీసుకురావాలని, అన్ని సక్రమంగా ఉంటే నామినేషన్లను అనుమతిస్తామన్నారు. ఈనెల 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ సెలవు దినాలలో నామినేషన్ స్వీకరించబడదన్నారు. పార్లమెంటరీ నియోజకవర్గం కోసం ఫారం–2ఏ, అసెంబ్లీ నియోజకవర్గం కోసం ఫారం–2బి సమర్పించాలన్నారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసామన్నారు. నామినేషన్ వేసే ముందు రోజు నుండే అభ్యర్థి ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ ఖాతాను ప్రారంభించాల్సి ఉంటుందన్నారు. ఆ అకౌంట్ నుండే బ్యాంకు లావాదేవీలు జరపాలన్నారు. జిల్లా వ్యాప్తంగా రూ.3,01,99,221 నగదు, రూ. 8,42,637 విలు వైన 40,064.72 లీటర్ల సారా, రూ.9,822 విలువైన 2,186 గ్రాముల మాదకద్రవ్యాలు, రూ.4,12,631 విలువైన 6,177.57 గ్రాముల ఆభరణాలు, రూ.8,51, 406 విలువైన ఇతర వస్తువులను వెరసి మొత్తం రూ. 4,54,06,518లను సీజ్ చేయడం జరిగిందన్నారు. చిత్తశుద్ధితో ఎన్నికల విధులు నిర్వహించాలి నందికొట్కూరు: సార్వత్రిక ఎన్నికల్లో పీఓలు, ఏపీఓలు, సిబ్బంది చిత్తశుద్ధితో వ్యవహరించాలని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాసులు ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఓలకు, ఏపీఓలకు నిర్వహించిన రెండోవ రోజు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. మే నెల13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పీఓల బాధ్యత అత్యంత కీలకమన్నారు. ఎన్నికల్లో అందరూ అప్రమత్తంగా ఉండాలని రీ పోలింగ్కు అవకాశం లేకుండా చిత్తశుద్ధితో విధులు నిర్వర్థించాలని సూచించారు. పోలింగ్ రోజు ఉదయం 5 గంటలకు పోలింగ్ బూత్లో పూర్తి ఏర్పాట్లు చేసుకుని 5. 30 గంటలకే మాక్ పోలింగ్ నిర్వహించాలన్నారు. పీఓలు ఎన్నికల కమిషన్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని చెప్పారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభించాలన్నారు. పోలింగ్ ఏజెంట్లుగా వలంటీర్లు ఉండకూడదని తెలిపారు. వలంటీర్లు రాజీనామా చేసిన వలంటీర్లకు సబంధించి బీఎల్ఓ, ఎంపీడీఓ ధ్రువీకరించిన తరువాత ఏజెంట్లుగా పెట్టుకోవచ్చన్నారు. సర్పంచులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు కూడా పోలింగ్ ఏజెంట్లుగా ఉండవచ్చని స్పష్టం చేశారు. వీవీ ప్యాట్లను ఖాళీ చేసి, ఈవీఎంలను రీసెట్ చేయాలన్నారు. ఈయన వెంట ఆర్వో దాసు, తహసీల్దార్లు, తదితరులు ఉన్నారు. ఈనెల 18వ తేదీ నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాసులు -
పెరిగిన వడగాడ్పులు
● గోస్పాడులో 44.3, నందికొట్కూరులో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత ప్రాంతం ఉష్ణోగ్రత గోస్పాడు 44.3 నందికొట్కూరు 44.2 చాగలమర్రి 43.9 బండిఆత్మకూరు 43.8 కొత్తపల్లి 43.7 మహానంది 43.6 పాణ్యం 43.5 డోన్ 43.5 బనగానపల్లె 43.5 ఆత్మకూరు 43.4 గూడూరు 43.1 కర్నూలు 43.0 మంత్రాలయం 42.7 కౌతాళం 42.5 హొళగుంద 42.4కర్నూలు(అగ్రికల్చర్): ఉష్ణోగ్రతలు రోజురోజుకు అధికమవుతున్నాయి. రాష్ట్రంలోనే ఎండల తీవ్రత ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. మధ్యాహ్నం 11 గంటలకు మొదలైన ఎండలు, వడగాడ్పుల తీవ్రత సాయంత్రం వరకు కొనసాగుతోంది. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కూడా వడగాడ్పులు ఉండటం గమనార్హం. రానున్న రోజుల్లో ఎండలు, వడగాడ్పుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 46 నుంచి 48 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
16, 17 తేదీల్లో జూనియర్ ఇంటర్లో ప్రవేశానికి కౌన్సెలింగ్
రేపు బాస్కెట్బాల్ జిల్లా జట్ల ఎంపిక
వరంగల్ పార్లమెంట్ పరిధిలో 2009 నుంచి 2024 వరకు నమోదైన ఓట్లు, పోలింగ్ శాతం...
పథకాలు పారదర్శకంగా అందించాలి
No Headline
రైతులు ధైర్యంగా ఉండాలి
వరంగల్ స్ట్రాంగ్రూంకు ఈవీఎంలు
వాతావరణం
ఓటుకు దూరంగా..
రేవణ్ణ అరెస్ట్ వెనుక కుట్ర: కుమార
తప్పక చదవండి
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
Advertisement