breaking news
Nasum Ahmed
-
గర్జించిన బంగ్లాదేశ్ పులులు.. బిత్తరపోయిన మాజీ ఛాంపియన్లు
స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో (Bangladesh vs West Indies) బంగ్లాదేశ్ (Bangladesh) పులులు గర్జించాయి. మూడు మ్యాచ్ల ఈ సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకున్నాయి. ఢాకా వేదికగా ఇవాళ (అక్టోబర్ 23) జరిగిన సిరీస్ డిసైడర్లో ఆతిథ్య జట్టు 179 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో బంగ్లా ఆటగాళ్లు అన్ని విభాగాల్లో చెలరేగారు. వీరి గర్జనకు మాజీ ప్రపంచ ఛాంపియన్లు బిత్తరపోయారు.తొలుత బ్యాటింగ్కు దిగి భారీ స్కోర్ చేసిన బంగ్లాదేశ్.. బౌలింగ్లో ప్రత్యర్దిని ఉక్కిరిబిక్కిరి చేసింది. బంగ్లా బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలింది. బంగ్లా బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగి విండీస్ బ్యాటర్ల భరతం పట్టారు.ఈ సిరీస్లోని తొలి వన్డేలోనూ బంగ్లాదేశ్ బౌలర్లు ఇదే రీతిలో చెలరేగిపోయారు. ఆ మ్యాచ్లో స్వల్ప స్కోర్ చేసినా విండీస్ను ఇంకా తక్కువ స్కోర్కే కట్టడి చేశారు. రెండో వన్డేలోనూ ఇదే ప్రదర్శనను కొనసాగించారు. అయితే ఈసారి విండీస్ బ్యాటర్లు కాస్త ప్రతిఘటించడంతో మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్లో విండీస్ గెలుపొందింది.మూడో వన్డే విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఓపెనర్లు సైఫ్ హసన్ (80), సౌమ్య సర్కార్ (91) సెంచరీలకు చేరువగా వచ్చి ఔటయ్యారు. మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేసిన తౌహిద్ హృదోయ్ (28), నజ్ముల్ హసన్ షాంటో (44) కూడా పర్వాలేదనిపించారు.అయితే ఆతర్వాత వచ్చిన వారు పెద్దగా రాణించకపోవడంతో బంగ్లాదేశ్ భారీ స్కోర్ చేయలేకపోయింది. ఓ దశలో సునాయాసంగా 350 పరుగులు చేస్తుందనుకున్న జట్టు మిడిలార్డర్ వైఫల్యం కారణంగా 300లోపే పరిమితమైంది.తొలుత తడబడిన విండీస్ బౌలర్లు ఆఖర్లో అనూహ్యంగా పుంజుకొని బంగ్లాను 300లోపే కట్టడి చేశారు. అకీల్ హోసేన్ 4, అలిక్ అథనాజ్ 2, రోస్టన్ ఛేజ్, మోటీ తలో వికెట్ తీసి, బంగ్లాను భారీ స్కోర్ చేయకుండా నియంత్రించారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చిన ఆ జట్టు 30.1 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. బంగ్లా బౌలర్లు నసుమ్ అహ్మద్, రిషద్ హొసేన్ తలో 3, మెహిది హసన్, తన్వీర్ ఇస్లాం చెరో 2 వికెట్లు తీసి విండీస్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు.కాగా, ఇరు జట్ల ఈ నెల 27 నుంచి మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ అక్టోబర్ 27, 29, 31 తేదీల్లో చట్టోగ్రామ్ వేదికగా జరుగుతుంది. చదవండి: తప్పక గెలవాల్సిన మ్యాచ్లో స్మృతి మంధన సూపర్ సెంచరీ -
పసికూనను చిత్తు చేసి.. టీ20 సిరీస్ కైవసం
నెదర్లాండ్స్తో రెండో టీ20 మ్యాచ్లో బంగ్లాదేశ్ (BAN vs NED T20I) ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో లిటన్ దాస్ బృందం చిత్తు చేసింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది.కాగా ఆసియా కప్-2025 (Asia Cup) సన్నాహకాల్లో భాగంగా బంగ్లాదేశ్ సొంతగడ్డపై నెదర్లాండ్స్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో శనివారం జరిగిన తొలి మ్యాచ్లో ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచిన బంగ్లా జట్టు.. తాజాగా రెండో టీ20లోనూ సత్తా చాటింది.103 పరుగులకే ఆలౌట్సెల్హైట్ వేదికగా సోమవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన నెదర్లాండ్స్ ఆతిథ్య జట్టు బౌలర్ల ధాటికి కుప్పకూలింది. 17.3 ఓవర్లలో కేవలం 103 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.ఓపెనర్లలో మాక్ ఒడౌడ్ (8) విఫలం కాగా.. విక్రమ్జిత్ సింగ్ (24) ఫర్వాలేదనిపించాడు. ఇక వన్డౌన్లో వచ్చిన తేజ నిడమానూరు డకౌట్ కాగా.. ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన కెప్టెన్ చార్ల్స్ ఎడ్వర్డ్స్ (9), షారిజ్ అహ్మద్ (12), నోవా క్రోస్ (2), సికందర్ జుల్ఫికర్ (2) కూడా చేతులెత్తేశారు.మూడు వికెట్లతో సత్తా చాటిన నసూమ్కైల్ క్లెన్ (4) కూడా విఫలం కాగా.. ఆఖర్లో ఆర్యన్ దత్ 24 బంతుల్లో 30 పరుగులు చేసి డచ్ జట్టు ఇన్నింగ్స్లో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఇక బంగ్లా బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ నసూమ్ అహ్మద్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ తలా రెండు వికెట్లు కూల్చారు.తాంజిద్ హసన్ తమీమ్ అర్ధ శతకంమిగిలిన వారిలో మెహదీ హసన్, తాంజిమ్ హసన్ సకీబ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ మరోసారి దుమ్మురేపింది. 13.1 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయి 104 పరుగులు సాధించింది. ఓపెనర్లలో పర్వేజ్ హొసేన్ ఇమాన్ 23 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. తాంజిద్ హసన్ తమీమ్ అర్ధ శతకంతో సత్తా చాటాడు.మొత్తంగా 40 బంతులు ఎదుర్కొన్న తాంజిద్.. నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 54 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా కెప్టెన్ లిటన్ దాస్ (18 బంతుల్లో 18 నాటౌట్) నిలవగా.. ఫోర్తో తాంజిద్ బంగ్లా విజయాన్ని ఖరారు చేశాడు. ఇక నెదర్లాండ్స్ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించిన నసూమ్ అహ్మద్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. బంగ్లాదేశ్- నెదర్లాండ్స్ మధ్య నామమాత్రపు మూడో టీ20కి బుధవారం (సెప్టెంబరు 3) షెడ్యూల్ ఖరారైంది.చదవండి: IND vs PAK: నేను.. రోహిత్ ఘోరంగా ఢీకొట్టుకున్నాం.. ఆరోజు ధోని ఫైర్: కోహ్లి


