breaking news
Nirmal District Latest News
-
గోడు చెప్పి.. గోస తీర్చమని..
నిర్మల్చైన్గేట్: ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న ప్రజావాణికి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం నిర్వహించిన ప్రజవాణికి భారీగా అర్జీలు వచ్చాయి. కలెక్టర్ అభిాష అభినవ్ స్వయంగా దరఖాస్తులు స్వీకరించారు. బాధితుల గోడు విన్నారు. దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, స్పందించాలన్నారు. ముఖ్యంగా మండలాల వారీగా పెండింగ్లో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కారం చూపాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో సంబంధిత శాఖలన్నీ పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజావాణికి విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించిన వినతులు ఎక్కువగా వచ్చాయి. పరిహారం అందించాలి ఐదు నెలల క్రితం ఎంపీపీఎస్ అంతర్నీ పాఠశాలలో చదువుతున్న నా కుమారుడిపై ప్రమాదవశాత్తు స్కూల్ గోడ కూలి గాయపడ్డాడు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అప్పట్లో అధికారులు పరిహారం కింద రూ.25 వేలు ఇస్తానని మాట ఇచ్చారు. నేటికీ ఆ పరిహారం అందలేదు. –రాజేశ్వర్, కుభీర్ సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేయాలి.. సీఎం రేవంత్రెడ్డి ఈనెల 16న జిల్లాకు రానున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారం, నివేదికలతో అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసి పూర్తి చేయించాలన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘అటల్ పెన్షన్ యోజన’ అమలులో జిల్లా 107 శాతం నమోదు సాధించినందుకు, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్గోపాల్ను కలెక్టర్ సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
మోములో చిరునవ్వు
బాల కార్మికులలక్ష్మణచాంద: బాలకార్మికులకు విముక్తి కల్పించేందుకు.. చిన్నారుల మోముల చిరునవ్వు చిందించేలా ప్రభుత్వం ఏటా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్ నిర్వహిస్తోంది. వివిధ కారణాల వల్ల చదువులకు దూరమై బాల కార్మికులుగా మారిన పిల్లలను గుర్తించి, వారిని పని నుండి విముక్తి చేసి, తల్లిదండ్రులకు విద్య ప్రాముఖ్యతను వివరించి, సమీప పాఠశాలల్లో చేర్చే లక్ష్యంతో ఈ కార్యక్రమం రూపొందింది. 20 మంది గుర్తింపు.. జనవరి 1 న ప్రారంభమైన కార్యక్రమంలో రెండు బృందాలు పనిచేస్తున్నాయి. ఒక్కో బృందంలో లేబర్ ఆఫీసర్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, పోలీస్ అధికారి, ఎన్జీవో ప్రతినిధి సహా ఐదుగురు సభ్యులు ఉన్నారు. ఒక బృందం భైంసా డివిజన్లో, మరొకటి నిర్మల్ డివిజన్లో తనిఖీలు చేపట్టింది. జనవరి 10వ తేదీనాటికి 20 మంది బాల కార్మికులను గుర్తించారు. వీరిలో నిర్మల్ డివిజన్లో రెండు కేసులు, బైంసా డివిజన్లో ఒక కేసు నమోదయ్యాయి. అందరినీ పాఠశాలల్లో చేర్చారు. ఈనెల 31 వరకు... ఆపరేషన్ స్మైల్ 12వ కార్యక్రమం ఈనెల 31 వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా వివిధ గ్రామాలను సందర్శిస్తూ బాల కార్మికులు ఎక్కడైనా పనిచేస్తున్నట్టయితే వారిని గుర్తించి పని నుంచి విముక్తులు చేసి బడిబాట పట్టేలా చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కలెక్టర్ అభిలాష అభినవ్, అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆదేశాల మేరకు జిల్లాలో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 20 మంది బాల కార్మికులను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాం. – దేవి మురళి, డీసీపీవో పకడ్బందీగా నిర్వహణ.. జిల్లాలో ఆపరేషన్ స్మైల్ 12వ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 1 ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈనెల 31 వరకు విస్తృతంగా సర్వే చేపట్టి బాల కార్మికులు పనిచేస్తే గుర్తించి వారిని సమీపంలోని పాఠశాలలో చేర్పిస్తున్నాం. – ఫైజాన్ అహ్మద్, అడిషనల్ కలెక్టర్ ఆరేళ్లలో గుర్తించిన బాలకార్మికుల వివరాలు... సంవత్సరం బాలికలు బాలురు మొత్తం 2020 62 72 134 2021 81 162 243 2022 55 83 138 2023 22 45 67 2024 9 71 80 2025 2 64 66 -
క్యాలెండర్ ఆవిష్కరణ
నిర్మల్టౌన్: నిర్మల్ జిల్లా కోర్టు ఆవరణంలో న్యాయవాద పరిషత్ రూపొందించిన 2026 సంవత్సరం క్యాలెండర్ను న్యాయవాదులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయవాద పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేర్ నరేందర్ మాట్లాడుతూ.. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి న్యాయవాద పరిషత్ పనిచేస్తుందన్నారు. అలాగే నిరుపేదలకు న్యాయ సేవలు అందించడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు గోవర్ధన్, అశోక్, శ్యాం సుందర్రెడ్డి, వీవీ.రమణారావు, కోమ్మోజి రమణ, మధుకర్, వంశీకృష్ణ, రాజేశ్వరరత్నం తదితరులు పాల్గొన్నారు. -
సదర్మాట్ సిద్ధం!
నిర్మల్సీఎం పర్యటన విజయవంతం చేయాలి నిర్మల్చైన్గేట్/మామడ: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈనెల 16న చేపట్టే నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల పర్యటనను విజయవంతం చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, కాంగ్రెస్ జిల్లా ఇన్చార్జి తాహెర్ బిన్ హమ్దాని అన్నారు. మామడ మండలం పొన్కల్ సదర్మాట్ బ్యారేజీని, జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సీఎం సభ కోసం స్థలాన్ని నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావుతో కలిసి సోమవారం పరిశీలించారు. మొదట సదర్మాట్ బ్యారేజ్ను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. ఇందులో జిల్లా ఇన్చార్జిలు చంద్రశేఖర్గౌడ్, రామ్భూపాల్, మాజీమంత్రి ఇంద్రకరణ్రెడ్డి, పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమన్ అలీ, మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్రెడ్డి పాల్గొన్నారు. నిర్మల్: జిల్లాను మరింత సస్యశ్యామలం చేసే దిశగా మరో అడుగు పడుతోంది. దాదాపు పదేళ్లపాటు గోదావరినదిపై మామడ మండలం పొన్కల్ వద్ద నిర్మాణం కొనసాగిన సదర్మాట్ బ్యారేజీ ఎట్టకేలకు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈనెల 16న బ్యారేజీని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జిల్లాకు రానున్నారు. అనంతరం నిర్మల్లో నిర్వహించనున్న బహిరంగసభలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రేవంత్రెడ్డి జిల్లాకు రానున్నారు. బ్యారేజీ ప్రారంభం, పబ్లిక్ మీటింగ్ రెండు కార్యక్రమాలూ ఉండడంతో జిల్లా ఉన్నతాధికారులతోపాటు కాంగ్రెస్ నాయకులూ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వైఎస్సార్ ప్రతిపాదన.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత ముఖ్యమంత్రి వై ఎస్.రాజశేఖరరెడ్డి వేసిన తొలిఅడుగు ఇప్పుడు తు దిదశకు చేరుకుంది. గోదావరిపై బ్యారేజీ నిర్మాణా నికి వైఎస్సార్ తన హయాంలో ప్రతిపాదనలు పూ ర్తిచేశారు. నీటినిల్వ కోసం చేపట్టిన ఈ బ్యారేజీ ప నులు 2016లోనే ప్రారంభమయ్యాయి. అధికారికంగా 2017లో అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీశ్రావు పనులు ప్రారంభించారు. దాదాపు రూ.520 కోట్ల వ్యయంతో పదేళ్లపాటు నిర్మాణ పనులు కొనసాగాయి. నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో 1,200 ఎకరాల ముంపు భూములు ఉండగా, 18 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో దీన్ని నిర్మించారు. పర్యటన ప్రతిష్టాత్మకంగా... ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి జిల్లాకు తొలిసారి రానుండటంతో అటు జిల్లా అధికారులు, ఇటు కాంగ్రెస్ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. బ్యారేజీ వద్ద పనులు పూర్తిచేయడం, ప్రారంభోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ అభిలాషఅభినవ్, ఎస్పీ జానకీషర్మిల, ఇరిగేషన్ అధికారులు సీరియస్గా దృష్టిపెట్టారు. ఇప్పటికే ఓసారి జిల్లా ఉన్నతాధికారులు పొన్కల్ వద్ద బ్యారేజీని పరిశీలించి వచ్చారు. మరోవైపు జిల్లాకేంద్రంలో బహిరంగసభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు శ్రమిస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడు బొజ్జుపటేల్, నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావు, మాజీమంత్రి ఇంద్రకరణ్రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ అర్జుమంద్అలీ, మున్సిపల్ మాజీచైర్మన్ గణేశ్చక్రవర్తి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్ తదితరులు బహిరంగ సభ స్థల పరిశీలన, ఏర్పాట్లపై సోమవారం పర్యవేక్షించారు. పొన్కల్ వద్ద ప్రారంభానికి సిద్ధంగా ఉన్న సదర్మాట్ బ్యారేజీ సీఎం ముందుకు డిమాండ్లు.. సదర్మాట్ బ్యారేజీకి సంబంధించి పలు డిమాండ్లను ముఖ్యమంత్రి ముందుకు తీసుకువచ్చేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. షెడ్యూల్ ఇలా.. ఈనెల 16న హైదరాబాద్ నుంచి సీఎం నేరుగా ఆది లాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు. అక్కడ చనాఖ–కొ రాట పంప్హౌస్ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం ఒంటిగంటకు పొన్కల్ చేరుకోనున్నా రు. సదర్మాట్ బ్యారేజీ ప్రారంభిస్తారు. 2 గంటలకు నిర్మల్ చేరుకుంటారు. మధ్యాహ్నం జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొంటారు. -
యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం పూర్తిచేయాలి
నిర్మల్చైన్గేట్: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్మాణం త్వరగా పూర్తి చే యాలని కలెక్టర్లను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ది వ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అల్లూరి లక్ష్మణ్కుమార్, సీఎస్ రామకష్ణారావుతో కలిసి వీడియో కా న్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలవారీగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి సంబంధించి స్థల సేకరణ, నిర్మాణ పనులు, తదితర అంశాలపై సమీక్షించారు. రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీలో ముందు వరుసలో ఉంచేలా ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతుందన్నారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు ఈ నిర్మాణాలపై సమీక్షిస్తూ ఉండాలన్నారు. ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో నిర్మాణ ప్రదేశాలకు వెళ్లి పర్యవేక్షించాలన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణ పనుల్లో తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి.. వీడియో కాన్ఫరెన్స్లో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. ఫొటో ఎలక్టరోల్స్ జాబితా, డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాలు, తదితర అంశాల వివరాలను సీఎస్కు జిల్లాల వారీగా కలెక్టర్లు వివరించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనబోయే అధికారులకు శిక్షణ ఇవ్వాలన్నారు. తగినంత మంది సిబ్బంది అందుబాటులో ఉన్నారో లేరో పరిశీలన చేసుకోవాలన్నారు. సామగ్రి సమకూర్చుకోవాలన్నారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, డీఈవో భోజన్న, నిర్మల్, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్గౌడ్, సుందర్సింగ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘పుర’ ఓటర్లు 1,69,285
భైంసాటౌన్: మున్సిపల్ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా వార్డుల వారీగా 2025 అక్టోబర్ 1వ తేదీ నాటి అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాను అనుసరించి రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాలను ఈ నెల 1న విడుదల చేశారు. 5వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కూడా సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 10న ఓటర్ల తుది జాబితాలను విడుదల చేయాల్సి ఉండగా, సవరణకు మరో రెండు రోజులు గడువు విధించారు. ఆ మేరకు అభ్యంతరాలు సవరించి సోమవారం ఓటరు తుది జాబితా విడుదల చేసేందుకు అధికారులు రోజంతా తలమునకలయ్యారు. నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో ఓటరు తుది జాబితాలు సాయంత్రానికే విడుదల చేయగా, భైంసాలో ఆలస్యంగా విడుదల చేశారు. తుది జాబితాలను మున్సిపల్ కార్యాలయాలతోపాటు ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. అలాగే పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ సైతం పూర్తి చేసి, 13న పోలింగ్ కేంద్రాల ముసాయిదా, 16న ఓటరు ఫొటోలతో కూడిన జాబితా వెలువరించనున్నారు. వార్డులవారీగా సవరణ... ఓటరు ముసాయిదా జాబితాలో ఎక్కువగా ఒక వార్డులోని ఓటర్లు మరోవార్డులో, ఒకే ఇంటి ఓటర్లు వేర్వేరు వార్డుల్లో.. ఇలా నిర్మల్, భైంసా, ఖానాపూర్ మూడు మున్సిపాలిటీల్లోనూ అభ్యంతరాలు కుప్పలుగా వచ్చాయి. దీంతో మున్సిపల్ అధికారులు వచ్చిన అభ్యంతరాలన్నింటిని క్షేత్రస్థాయిలో విచారించి సవరించారు. నిర్మల్ మున్సిపల్లో 501, భైంసాలో 114, ఖానాపూర్లో 580 అభ్యంతరాలు రాగా, వాటన్నింటినీ వార్డుల వారీగా పరిశీలించి ఓటర్లను సర్దుబాటు చేశారు. ఈ మేరకు తుది జాబితా రూపొందించి విడుదల చేశారు. మున్సిపాలిటీలవారీగా ఓటర్ల వివరాలిలా... పట్టణం వార్డులు మహిళలు పురుషులు ఇతరులు మొత్తం నిర్మల్ 42 50,824 47,362 18 98,204 భైంసా 26 25,623 25,486 09 53,118 ఖానాపూర్ 12 9,169 8,524 00 17,693 -
ఘనంగా వివేకానంద జయంతి
భైంసారూరల్: స్వామి వివేకానంద ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్కుమార్ అన్నారు. మండలంలోని కామోల్, ఇలేగాం, మహాగాం, వానల్పాడ్, సుంక్లితోపాటు పలు గ్రామాల్లో స్వామి వివేకానంద జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. వివేకానందుని విగ్రహానికి, చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువకులు, విద్యార్థులు స్వామి వివేకానంద చూపిన బాటలో పయనించాలన్నారు. సమాజ సేవపై యువతరం దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ చింత చిన్న య్య, డా.దామోదర్రెడ్డి, రామకృష్ణాగౌడ్, నగేశ్, ఆయా గ్రామాల సర్పంచులు, యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
ఉపాధి కల్పించాలి
నాకు ఇద్దరు కూమారులు. నా భర్త జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పపత్రిలో అటెండర్ గా పనిచేసేవాడు. అక్టోబర్ 29న విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా అక్కపూర్ గ్రామ రొడ్డు పైన గల ’సోయబీన్ కుప్పను ఢీకొని మరణించాడు. మా కుటుంబము దీన పరిస్థితిలోకి వెళ్లిది. గ్రామంలో ఆశ వర్కర్ పోస్టు ఖాళీగా ఉంది. నాకు ఇప్పించి ఆదుకోగలరు. – ద్యావతి హారిక, న్యూ వెల్మల్ విద్యుత్ స్తంభాలు తొలగించాలి నాకు సారంగాపూర్ మండలం చించోలి(బి) గ్రామంలో సర్వే నంబర్ 563/7/5 లో వ్యవసాయ భూమి ఉంది. నా వ్యవసాయ భూమిలో రెండు విద్యుత్ స్తంభాలు ఉన్నాయి. వీటి కారణంగా నేను వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నాను. అధికారులు స్పందించి విద్యుత్ స్తంభాలు తొలగించాలి. – బొడ్డు నరేశ్, చించోలి(బి) -
కల్యాణం.. కమనీయం
నిర్మల్టౌన్/ఖానాపూర్: జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో, ఖానాపూర్ వేంకటేశ్వరాలయంలో గోదాదేవి రంగనాథ కల్యాణం సోమవారం కనుల పండువగా నిర్వహించారు. వేద పండితులు ఆలయ ధర్మకర్తలు అల్లోల మురళీధర్రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణం జరిపించారు. స్వామికి పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేసి, నిత్య పూజలు అభిషేకాలు చేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని కల్యాణాన్ని తిలకించారు. ఇందులో ఆలయ గురుస్వామి మూర్తి, కోశాధికారి వేణుగోపాల్, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. -
అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి
● ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల నిర్మల్టౌన్: అర్జీదారుని సమస్యను పోలీసులు వెంటనే పరిష్కరించాలని, సామాన్యులకు అండగా ఉండాలని, ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఎస్పీ వారి సమస్యలు తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసుల సహాయం కావాలనుకునేవారు ఠణాలో నిర్భయంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడినా, సంఘ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. -
పిల్లల్లో దేశభక్తిని పెంచాలి
భైంసాటౌన్: తల్లిదండ్రులు పిల్లల్లో దేశభక్తిని పెంచాలని విద్యాభారతి దక్షిణమధ్య క్షేత్ర కార్యదర్శి లింగం సుధాకర్రెడ్డి సూచించారు. పట్టణంలోని కి సాన్గల్లి శ్రీసరస్వతి శిశుమందిర్లో ఆదివారం పూర్వవిద్యార్థుల మహా సమ్మేళనం నిర్వహించారు. 1696–2020 బ్యాచ్ల విద్యార్థులు పాల్గొన్నారు. కా ర్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు. సరస్వతి శిశుమందిరాల్లో విద్యార్థులకు చదువుతోపాటు క్ర మశిక్షణ, సదాచారం, దేశభక్తి భావం పెంపొందించేందుకు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. శిశు మందిరాలు లాభాపేక్ష లేకుండా పని చేస్తున్నాయని తెలిపారు. అంతకుముందు విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. సరస్వతి విద్యాపీఠం సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్, పూర్వ విద్యార్థి, దక్షిణమధ్య క్షేత్ర ప్రశిక్షణ్ ప్రముఖ్ రావుల సూర్యనారాయణ, ఐఆర్ఎస్ అధి కారి వడ్నప్ నిఖిల్, పూర్వ విద్యార్థి పరిషత్ సభ్యులు, పూర్వ ఆచార్యులు పాల్గొన్నారు. -
ముప్పై ఏళ్లకు కలిసిన మిత్రులు
నిర్మల్: ‘అరెరె.. ఎన్నేండ్లయితందిరా నిన్నుజూసి, ఎట్లుండేటోనివి ఎట్లయిపోయినవ్రా..!? అసలేంజేస్తున్నవ్, ఎట్లున్నవ్రా..’ అంటూ గట్టిగ ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ పలకరించుకున్నారు. ‘ఓయ్.. ఏంటే నువ్వు ఇలా మారిపోయావ్, అస్సలు నిన్ను గుర్తుపట్టలేదు తెలుసా..! బడి తర్వాత మళ్లీ అసలు నీ ముఖమే కనిపించలేదే..’ అంటూ ఆశ్చర్యం, ఆనందంతో ఆత్మీయతను పంచుకున్నారు. కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ఒక్కొక్కరుగా వస్తుంటే.. ఆ వేడుక ఆనందాల పండుగలా మారింది. కొంతమంది కళ్లల్లో నీళ్లసుడులనూ తీసుకొచ్చింది. జిల్లాకేంద్రంలోని బాగులవాడ సరస్వతీ శిశుమందిర్లో ఎప్పుడో 1994–95లో పదోతరగతి పూర్తిచేసుకున్న పూర్వవిద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. స్థానిక రెడ్డిగార్డెన్స్లో ముప్పయేళ్ల తర్వాత తొలిసారి పూర్వవిద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకున్నారు. విదేశాల నుంచీ వచ్చారు ఆస్ట్రేలియాలో ఉంటున్న రాంగోపాల్, ఉగాండాలో ఉన్న ప్రణీత్, యశోదా ఆస్పత్రిలో అంకాలజిస్ట్గా చేస్తున్న దయాకర్ లాంటి వాళ్లూ సమ్మేళనానికి హాజరయ్యారు. 1994–95లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈ బ్యాచ్ నుంచి మూడు స్టేట్ర్యాంక్లు రా వడం గమనార్హం. ఈ సందర్భంగా అంతా కలిసి భోజనాలు చేశారు. అప్పటి ప్రధానోపాధ్యాయుడు రావుల సూర్యనారాయణ, ఆచార్యులందరినీ ఘ నంగా సన్మానించారు. తమను కలిపిన శిశుమందిర్ పునర్నిర్మాణానికీ తమవంతుగా చేయూతనిచ్చేందుకు ముందుకువచ్చారు. -
నిర్మల్
ఆదివాసీల ఆత్మబంధువు.. ఆదివాసీల ఆత్మబంధువు హైమాన్డార్ఫ్ అని ఎంపీ గోడం నగేశ్ కొనియాడారు. జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో డార్ఫ్ దంపతుల వర్ధంతిని నిర్వహించారు. గజ్జలమ్మదేవికి పూజలు కుంటాల: కుంటాల ఇలవేల్పు శ్రీగజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయాల్లో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుడు శ్రీకాంత్ రామానుజదా స్ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం, అలంకరణ, అర్చన, హారతి, పల్లకీసేవ నిర్వహించగా భక్తులు అధికసంఖ్యలో హాజరయ్యారు. భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేశారు. తానూరు: జిల్లాలో పలువురు రైతులు ఉద్యాన పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. దిగుబడి, రాబడి లాభసాటిగా ఉండడం, ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుండడంతో క్రమంగా జిల్లాలో సాగువిస్తీర్ణం పెరుగుతోంది. ఏటా రైతులు వివిధ పంటలు సాగు చేసి ఏదో రకంగా నష్టపోతూ ఉన్నారు. దిగుబడులు రాక అప్పులపాలవుతున్నారు. దీంతో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం, ఉద్యానవనశాఖ ముందుకువచ్చింది. ఉద్యానవనశాఖ అధికారులు మల్చింగ్ ద్వారా పంటలు సాగు చేసేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మల్చింగ్ పద్ధతి ద్వారా పంటలు సాగు చేసిన రైతులకు ఉద్యానవనశాఖ 50 శాతం సబ్సిడీ ఇస్తోంది. మల్చింగ్ విధానంలో పంటలు సాగుచేస్తే పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గి దిగుబడులు ఎక్కువగా వస్తున్నాయి. మల్చింగ్ సాగు ప్రయోజనాలివే.. రైతులు మల్చింగ్ పద్ధతిలో పంటలు సాగు చేస్తే అ నేక ప్రయోజనాలున్నాయి. పంటలో కలుపు మొక్కలు పెరగవు. భూమిలోని తేమను మొక్కలకు అంది స్తుంది. మొక్కలు బలంగా నాటుకోవడానికి మ ల్చింగ్ షీట్లు ఎంతో ఉపకరిస్తాయి. మల్చింగ్ షీట్లను రైతులు వినియోగించుకోవడానికి ఆసక్తి చూ పుతుండడంతో ఈ షీట్లకు డిమండ్ బాగానే ఉంది. ఉద్యానవన శాఖ అధికారులు కూడా మల్చింగ్ షీట్లను విరివిగా అందించడానికి కృషిచేస్తున్నారు. ఈ ఏడాది కూడా మల్చింగ్ విధానంలో సాగు చేసే రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఖర్చు తక్కువ.. దిగుబడి ఎక్కువ జిల్లాలో గతేడాది 180మంది రైతులు మల్చింగ్ విధానంలో పండ్లతోటలు, కూరగాయలు, పుచ్చ సాగుచేస్తున్నారు. ఈ పద్ధతిలో సాగుచేసిన పంటలకు నీటి అవసరం చాలా తక్కువ. దీంతో పాటు కూలీల ఖర్చు కూడా మిగతా పంటలకంటే తక్కు వే. పంటలు సాగుచేసిన రైతులకు పెట్టుబడి తగ్గి దిగుబడి అధికంగా వస్తోంది. ఎకరాకు రూ.25వేలు ఖర్చుచేస్తే ఖర్చులు పోను రూ.70 వేలు మిగులుతున్నట్లు రైతులు చెబుతున్నారు. మల్చింగ్ పద్ధతి ద్వారా పండించిన కూరగాయలు, పుచ్చకాయలు ఇతర రాష్ట్రాలకూ సరఫరా చేస్తున్నారు. జిల్లాలో భైంసా డివిజన్లో ఎక్కువమంది రైతులు మల్చింగ్ విధానంలో పంటలు సాగుచేస్తున్నారు. -
రిజర్వేషన్.. టెన్షన్!
నిర్మల్: సంక్రాంతి పండుగ కాగానే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రానుందన్న ప్రచారం జోరందుకుంటోంది. ఓటర్ల జాబితా సోమవారం ఫైనల్ అవుతోంది. ఈ నేపథ్యంలో కౌన్సిలర్, చైర్మన్ బరిలో నిలువాలనుకునే ఆశావహుల్లో రిజర్వేషన్ టెన్షన్ కనిపిస్తోంది. నిన్నమొన్నటి దాకా ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, అభ్యంతరాల లొల్లిలో పడ్డ వారిలో ఇప్పుడు అసలు కలవరం మొదలైంది. తమ వార్డుల్లో రిజర్వేషన్ కలిసొస్తుందా.. లేదా.. అన్న పరేషాన్లో ఉన్నారు. ఇప్పటిదాకా పడ్డ కష్టమంతా వృథా కావొద్దంటే రిజర్వేషన్ కలిసి రావాలని కోరుకుంటున్నారు. కలిసి వస్తుందన్న నమ్మకంతో.. గతంలో వచ్చిన రిజర్వేషన్ల ఆధారంగా ఈసారి ఎలా వస్తాయోనన్న అంచనాలు వేసుకుంటున్నారు. ఒకట్రెండు వార్డులు మినహా దాదాపు అన్ని వార్డుల్లో అంచనా వేయొచ్చన్న నమ్మకంతో ఉన్నారు. కానీ.. మారిన ఓటరు జాబితా లెక్క.. రిజర్వేషన్లలోనూ ఏమైనా మార్పులు జరిగితే ఎలా? అన్నదే ఆశావహుల సందేహం. అలాగే.. తాము బరిలో దిగాలనుకున్న చోట మహిళల రిజర్వేషన్ వస్తే ఎలా..? భార్యనో.. అమ్మనో.. బరిలో దింపాల్సిందేనా? అన్న లెక్కలు వేసుకుంటున్నారు. జనరలో, మహిళనో మొ త్తం మీద తమకు కలిసి వస్తుందన్న నమ్మకంతోనే ఆశావహులంతా గల్లీల్లో తిరుగుతున్నారు. చైర్మన్ స్థానం ఏమొస్తుందో..! వార్డుల్లో పోటీచేసే ఆశావహుల టెన్షన్ ఒకెత్తయితే, చైర్మన్గా బరిలో దిగాలనుకుంటున్న వారి పరేషాన్ మరింత ఎక్కువగా ఉంటోంది. చాలా ఏళ్లుగా చైర్మన్ సీటుపై గురిపెట్టుకున్నా.. రిజర్వేషన్ కలిసిరాకపోతే మరో ఐదేళ్లదాకా వేచిచూడాల్సిందే. చైర్మన్గా గెలిస్తే.. ఐదేళ్లు పురపాలన అనుభవం సాధించడమే కాకుండా ఆ తర్వాత రాజకీయాల్లో మరోమెట్టు ఎదగడానికి అవకాశంగానూ భావిస్తుంటారు. అందుకే.. నిర్మల్, భైంసా, ఖానాపూర్ మూడు మున్సిపాలిటీల్లోనూ ప్రధాన పార్టీల నుంచి చైర్మన్ స్థానాలకు ఎవరు పోటీలో ఉన్నారన్న అంశంపైనే ఎక్కువగా చర్చ నడుస్తోంది. ఖరారైన తర్వాతనే.. ‘అన్నా.. మనం గెలువాలంటే గల్లీలో కొంతైనా ఖర్చు చేయాల్నే..’ అని అనుచరులు ఎంత ఒత్తిడి తీసుకువస్తున్నా.. చాలామంది ఆశావహులు జేబులో నుంచి రూపాయి కూడా తీయడం లేదు. రిజర్వేషన్లు ఖరారయ్యేదాకా పైసా ఖర్చు చేసేది లేదని చెబుతున్నారు. పక్కాగా తమకు అనుకూలంగా రిజర్వేషన్ వస్తుందన్న లెక్కలున్నచోట మాత్రం సంబంధిత ఆశావహులు కాలనీ అభివృద్ధి కోసమంటూ కాసులు ఖర్చు పెడుతున్నారు. సొంత డబ్బులతో గల్లీల్లో డ్రైనేజీలు కట్టించడం, రోడ్లకు మరమ్మతులు చేయించడం లాంటి పనులు చేస్తున్నారు. -
పాతవి పెంచలే.. కొత్తవి ఇయ్యలే
నిర్మల్చైన్గేట్: ఎన్నికల ప్రచారంలో భాగంగా చేయూత పథకం కింద కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ మొత్తాన్ని పెంచుతామన్న హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరిచేపోయింది. దీంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ఆశలు ఆవిరయ్యాయి. మరోవైపు 58 ఏళ్లు నిండిన అర్హులు ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చి నెలలు గడుస్తున్నా కొత్త పింఛన్ల ఊసేలేదు. పాతవి పెంచుతారని, కొత్తవి మంజూరు చేస్తారని.. ఎంతో ఆశగా ఎదురుచూసిన అర్హులకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపింది. నిరాశలో పింఛన్దారులు చేయూత పింఛన్ లబ్ధిదారులు రాష్ట్ర సర్కారు నిర్ణయం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. పింఛన్ మొత్తాన్ని పెంచకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. గద్దెనెక్కి రెండేళ్లు గడిచిపోయాయి. అయినా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు పింఛన్ల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్, బోధకాల బాధితులు, డయాలసిస్ పేషెంట్లకు నెలకు రూ.2,016 పింఛన్ను ప్రతినెలా అందించింది. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ మొత్తాన్ని రూ.నాలుగు వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. దివ్యాంగులకు రూ.ఆరువేలు చేస్తామని ప్రకటించింది. కానీ, అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా పింఛన్ల గురించి ఎలాంటి చర్చ జరగలేదు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచాలని లబ్ధిదారులు కోరుతున్నారు. జిల్లాలో మొత్తం 1,47,103 మంది పింఛన్ పొందుతున్నారు. వీరిలో 35,150 మంది వృద్ధులు, 36,326 మంది వితంతువులు, 10,055 మంది దివ్యాంగులు, 2,110 మంది ఒంటరి మహిళలున్నారు. వీరంతా పింఛన్ మొత్తాన్ని ఎప్పుడు పెంచుతారో? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. పెండింగ్లో 3,320 దరఖాస్తులు జిల్లాలోని 18 మండలాలు, మూడు మున్సిపాలిటీ ల పరిధిలో 3,320 మందికి పైగా వివిధ కేటగిరీల పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ప్రభుత్వం పెన్షన్ ఎప్పుడు మంజూరు చేస్తుందో తెలి యని పరిస్థితి. దరఖాస్తులపై అధికారులు విచారణ చేపట్టి అర్హులుగా గుర్తించి ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఇవే కాకుండా పరిశీలన పూర్తి కాని పెండింగ్ దరఖాస్తులు జిల్లా, మండల స్థాయిలో కోకొల్లలున్నాయి. కాగా, ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నవారికి ఎప్పుడు పింఛన్లు వస్తాయనే సమాచారం లేదని జిల్లా అధికారులు చెబుతున్నారు. పెంపు ఇప్పట్లో ఉండేనా? పింఛన్ల పెంపుపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత ఫిబ్రవరిలో జరిగిన శాసనసభ సమావేశాల్లో కూడా బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు, ప్రతిపాదనలు చేయలేదు. పింఛన్ల పెంపుపై మార్గదర్శకాలు కూడా విడుదల కాకపోవడంతో పెంపు ఇప్పట్లో ఉంటుందా..లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే సబ్సిడీపై గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాలపైనే ఎక్కువగా దృష్టి సారించింది. పింఛన్ల పెంపుపై అంతగా దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచాలని ప్రతిపక్షాలతోపాటు లబ్ధిదారులు, అర్హులు డిమాండ్ చేస్తున్నారు.జిల్లాలో పింఛన్ల వివరాలు మొత్తం పింఛన్లు 1,47,103 వద్ధాప్య.. 35,150 వితంతు 36,326 వికలాంగుల. 10,055 గీత కార్మికుల 274 పైలేరియా 223 డయాలసిస్ 122 ఒంటరి మహిళ 2,110 బీడీ కార్మికుల 62,062 -
పంట ఆశాజనకంగా ఉంది
ఉద్యానవనశాఖ ప్రోత్సాహంతో ఎకరంలో జామ సాగు చేసిన. 50శాతం సబ్సిడీ ఇచ్చి సహకరిస్తోంది. పంట దిగుబడి కూడా బాగుంది. దీంతో పెట్టుబడి పోను ప్రతీ పంటపై లాభం వస్తోంది. రైతులకు ఉద్యానవనశాఖ ద్వారా అందిస్తున్న ప్రోత్సాహం బాగుంది. – బద్రె సాయినాథ్, రైతు, తానూరు రైతులను ప్రోత్సహిస్తున్నాం ఉద్యానవనశాఖ ద్వారా రైతులకు ఎంతో ప్రోత్సాహం అందుతోంది. మల్చింగ్ షీట్ల ద్వారా ఉద్యానవన పంటలకు మేలు జరుగుతోంది. పండ్ల మొక్కలు పెంచడంతో రైతులు ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. ఉద్యానవనశాఖ స్కీంలను రైతులకు వివరిస్తున్నాం. ఈ ఏడాది రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. – జావిద్ పాషా, ఉద్యానవనశాఖ డివిజన్ అధికారి -
కేంద్ర పథకాలు ఇంటింటికీ చేరాలి
నిర్మల్చైన్గేట్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరేలా చూడాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన బూత్ నిర్మాణ అభియాన్, రాష్ట్ర కార్యశాలలో మాట్లాడారు. పార్టీ భవిష్యత్ విజయాలకు బూత్స్థాయి పటిష్టతే పునాది అన్నారు. ప్రతీ బూత్ను చైతన్యవంతమైన కార్యాచరణ కేంద్రంగా మార్చే లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహించామన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, బూత్ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేస్తూ పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు యాతాళం చిన్నారెడ్డి, నల్లా రవీందర్రెడ్డి, కరిపే విలాస్, జిల్లా కన్వీనర్ నల్లా రమేశ్, కోకన్వీనర్ మాదిరే శ్రీనివాస్, మమత, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు. -
నానమ్మ నేర్పింది..
నేను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నాను. సంక్రాంతికి సొంతూరికి వచ్చాను. ఇంటికి రావడంలో ఉన్న ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఈసారి మా నాన్నమ్మ ప్రత్యేకంగా సకినాలు ఎలా చేయాలో దగ్గరుండి నేర్పింది.. సంప్రదాయ పిండి వంటల్లోని రుచులకు మరేది సాటిరాదు. – బీఎస్.ప్రసన్న, ఎంబీబీఎస్, థర్డ్ ఇయర్, చించోలి(బి), సారంగాపూర్ మా శ్రీవారికి ప్రత్యేకంగా.. వృత్తిరీత్యా మావారు కువైట్ దేశంలో ఉంటున్నారు. ఏటా పండగకు ఇండియాకు వచ్చేవారు. ఈసారి కుదరకపోవడంతో ఇక్కడి పిండి వంటల్ని తనకోసం పంపిస్తున్నాను. తెలుగు వారికి సంక్రాంతి పండగ ప్రత్యేకం. ఇంటిల్లిపాది కలిసి పిండి వంటలు చేసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. – గోనె శిరీష, గృహిణి, నిర్మల్ -
గాంధీ పేరు తుడిచేయాలనే కుట్ర
నిర్మల్: పేదప్రజల గుండెల్లో నుంచి మహాత్మాగాంధీ పేరు తుడిచివేయాలనే బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఉపాధిహామీ పథకం పేరు మార్చిందని, ఆ పథకాన్ని నీరుగార్చేందుకే కొత్త చట్టాన్ని తీసుకువచ్చిందని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ ఆరోపించారు. జిల్లాకేంద్రంలో నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావుతో కలిసి శనివారం ప్రెస్మీట్ నిర్వహించారు. తాను, తన కుటుంబం కూడా మహాత్మగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకంలో కూలీలుగా పనిచేశామన్నారు. ఆ పథకం ఎంతోమంది పేదల కుటుంబాలకు అండగా నిలుస్తోందని తెలిపారు. పనిదినాలు పెంచడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, పథకాన్ని దెబ్బతీసి, పేదల పొట్ట కొట్టేందుకు కేంద్రం కొత్త చట్టంలో మార్పులు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్రం చేస్తున్న కుట్రలపై గ్రామస్థాయి నుంచి ఆందోళనలకు ఏఐసీసీ పిలుపునిచ్చిందన్నారు. ఈమేరకు జిల్లాలో ఈనెల 20 నుంచి గ్రామ, మండల, జిల్లాస్థాయిలో ఆందోళనలు చేపడతామని తెలిపారు. ఈ ఆందోళనల్లో పాల్గొనేందుకు జిల్లాకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షినటరాజన్ వస్తారని చెప్పారు. బీజేపీని తిప్పికొట్టాలి.. ఉపాధి పథకం కోసం 40 శాతం నిధులు చెల్లించడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని, దీనిపై బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి వ్యంగ్యంగా మాట్లాడడం సరికాదని బొజ్జు పటేల్ అన్నారు. సీఎం రేవంత్రెడ్డి మోదీని గద్దె దింపడానికి పోరాడుతున్నారని పేర్కొన్నారు. మత విద్వేషాలతో మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవాలనుకుంటున్న బీజేపీని ప్రజలు తిప్పికొట్టాలన్నారు. ఈనెల 16న సదర్మాట్ బ్యారేజీని ప్రారంభించేందుకు సీఎం రేవంత్రెడ్డి జిల్లాకు వస్తారని బొజ్జు పటేల్ తెలిపారు. సమావేశంలో గ్రంథాలయసంస్థ చైర్మన్ అర్జుమంద్అలీ, మార్కెట్ కమిటీ చైర్మన్లు భీంరెడ్డి, హాదీ, ఆనంద్రావు, మున్సిపల్ మాజీచైర్మన్ గణేశ్చక్రవర్తి, పీసీసీ ప్రధానకార్యదర్శి ఎంబడి రాజేశ్వర్, సీనియర్ నేతలు పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, కృష్ణవేణి, నాందేడపు చిన్ను, సమరసింహారెడ్డి, జునైద్ తదితరులు పాల్గొన్నారు. -
మృత్యు మాంజా!
నిర్మల్టౌన్: సంక్రాంతి పండుగ అనగానే రంగవల్లులు.. ఇళ్లలో పిండి వంటల ఘుమఘుమలు.. ఆ కాశంలో పతంగులు.. గుర్తొస్తాయి. ముగ్గులతో ఆడ పిల్లలు తమ కళానైపుణ్యం ప్రదర్శిస్తారు. ఇక పిండి వంటల తయారీలో మహిళలు బిజీగా గడుపుతారు. పిల్లలు, యువత పంగులు ఎగురవేస్తూ సందడి చేస్తారు. పోటీల్లో తమ గాలిపటం ఎత్తుకు ఎగరాలని, ప్రత్యర్థి పతంగిని పడగొట్టాలని చూస్తారు. ఈ క్రమంలోనే నిషేధిత చైనా మాంజా కొంటున్నారు. ఇది పక్షులు, జంతువులతోపాటు మనుషులకు కూడా ప్రాణాంతకంగా మారింది. పండగ సమయంలో గాలిపటాలకు కట్టి ఎగురవేయడంతో తర్వాత అవి చెట్ల కొమ్మలు, విద్యుత్ స్తంభాలకు వేలాడుతూ ప్రమాదకరంగా మారుతున్నాయి. రసాయనాలతో కూడిన దారం.. గాజుపొడి, ప్రమాదకర రసాయనాలతో తయారైన చైనా మాంజా తక్కువ ధరకు, రంగురంగుల్లో, అధిక బలంతో మార్కెట్లో ఆకర్షిస్తుంది. సాధారణ తాళ్ల దారాలతో పోల్చితే ధర తక్కువ కావడం వల్ల ప్రజలు ఎక్కువగా ఎంచుకుంటారు. కానీ ఇది పర్యావరణానికి, జీవాల పాలిట మృత్యు దారం. పోలీసులు కొనుగోలు, విక్రయంపై కఠిన చర్యలు తీసుకుంటున్నా విక్రయాలు ఆగడం లేదు. 2017లో నిషేధం.. 2017 రాష్ట్ర ప్రభుత్వం చైనా మాంజాపై నిషేధం విధించింది. 1998 పర్యావరణ చట్టం ప్రకారం అమ్మకం, కొనుగోలు చేస్తే ఏడేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తారు. రెండేళ్ల క్రితం మళ్లీ నిషేధం మరోమారు పునరుద్ధరించారు. అయినా మార్కెట్లలో గుట్టుగా విక్రయాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి జిల్లాకు సరఫరా జరుగుతోంది. లభాపేక్షతో.. వ్యాపారులకు ఒక మాంజాపై రూ.20 లాభం వస్తుంది. అక్రమ దిగుమతులతో పెద్ద లాభాలు సంపాదించే మధ్యవర్తులు ఉన్నారు. దీంతో వ్యాపారులు కూడా చైనా మాంజా విక్రయానికే మొగ్గు చూపుతున్నారు. డిమాండ్ ఉందని ప్రాణాపాయాలను పట్టించుకోకుండా అమ్మకాలు చేస్తున్నారు. పక్షులు, జంతువులు, మనుషులపై ప్రభావం.. చైనా మాంజా పతంగులు ఎగురవేస్తున్న సమయంలో ఎగురవేసే వారి చేతులకు, పక్షులకు తీవ్ర గాయాలు అవుతాయి. దారం చెట్లు, విద్యుత్ స్తంభాలకు చిక్కుకుని వేలాడుతూ ఎగిరే పక్షులను చంపతున్నాయి. ఇళ్లలలో తిరిగే కోతుల మెడకు చుట్టుకుని ఉసురు తీస్తున్నాయి. వాహనదారులు రోడ్లపై వెళ్తున్న సమయంలో గొంతులను కోస్తున్నాయి. ఖానాపూర్: పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఇమ్రాన్ కలెక్షన్స్ పేరుతో ఉన్న బట్టల షాపులో అక్రమంగా నిల్వ ఉంచిన 32 నిషేధిత చైనా మాంజాలను పట్టుకున్నట్లు ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు. దుకాణం యజమాని ఎండీ.అస్లాంపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
మంత్రి అజారుద్దీన్ను కలిసిన మైనార్టీ నాయకులు
బాసర: రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ను బాసర గ్రామానికి చెందిన మైనారిటీ నాయకులు ఎండీ.మొయినుద్దీ న్ఖాజీ ఆధ్వర్యంలో శనివారం కలిశారు. శుభాకంక్షలు తెలిపారు. మైనార్టీల అభివృద్ధికి సంబంధించిన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మైనార్టీలు విద్యలో ముందుండాలని సూచించారు. సమస్యలపై అధికారులతో చర్చిస్తానని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. మంత్రిని కలిసినవారిలో అజ్గర్, లాల్ మియ్యా, ఖలీల్ తదితరులు ఉన్నారు. -
ప్రత్యేక కాలువతో ఆయకట్టుకు జీవం
కడెం: మామడ మండలం పొన్కల్ వద్ద నిర్మించిన సదర్మాట్ బ్యారేజీ నుంచి ఖానాపూర్ మండలం మేడంపల్లి పాత సదర్మాట్ వరకు ప్రత్యేక కాలువ నిర్మించి సాగునీరు అందిస్తే ఆయకుట్టకు జీవం వస్తుదని చివరి వరకు సాగునీరు అందుతుందని ప్రత్యేక కాలువ సాధన కమిటీ అధ్యక్షుడు హపావత్ రాజేందర్ అన్నారు. ఆయకట్టు రైతులతో కలిసి మండల కేంద్రంలో శనివారం దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మండలంలోని కొత్త మద్దిపడగ, పాత మద్దిపడగ, పెద్దూర్, తండా, బదిల్దార్నగర్, ఎలగడప, లింగాపూర్, లక్ష్మిసాగర్, నచ్చన్ఎల్లాపూర్ తదితర గ్రామాల నుంచి రైతులు తరలివచ్చారు. ఖానాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేశ్, న్యాయవాదులు, ఉద్యమకారులు, పలు గ్రామాలకు చెందిన రైతులు దీక్షకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం స్పందించి కాలువ నిర్మాణానికి అనుమతి ఇచ్చి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులు పట్టించుకోకపోవడం లేదని తెలంగాణ తల్లి విగ్రహాకి రైతులు వినతిపత్రం అందజేశారు. -
సకినాలు కరకర..
అరిసెలు ఘుమఘుమనిర్మల్ఖిల్లా: సంక్రాంతి అంటేనే పల్లె పండుగ. ఇంటింటా పిండివంటలు ఘుమఘుమలు.. భోగి మంటల ఉల్లాసం.. జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి వంటలకే పరిమితం కాకుండా, ఉమ్మడి కుటుంబ సంస్కతి, ఇరుగుపొరుగు ఐక్యత, మహిళల శ్రమకు అద్దం పడుతున్నాయి. జిల్లాలోని ఉమ్మడి కుటుంబాల్లో సంక్రాంతి పండుగ ప్రత్యేకంగా కనిపిస్తోంది. అత్తమ్మలు, కోడళ్లు, మనుమలు, మనుమరాళ్లతో ఇళ్లలో పండుగ సందడి మొదలైంది. బంధువలంతా రావడంతో చాలా మంది పిండి వంటకాల తయారీ మొదలు పెట్టారు. కరకరలాడే సకినాలు, గారెలు.. రోరూరించే అరిసెలు, మురుకులు, తీపి వంటకాలతో గడప డగప ఘుమఘుమలాడుతోంది. ఒక రోజు ఒక ఇంట్లో, మరో రోజు పొరుగు ఇంట్లో అందరూ కలిసి పిండివంటలు తయారు చేస్తూ పల్లెల్లో కుంటుంబ ఐక్యత వెల్లివిరుస్తోంది. సంప్రదాయ వంటలు, కొత్త ప్రయోగాలు చక్కర్లు, బెల్లం పొంగల్, సున్నుండలు, బూరెలు, జంతికలు, మురుకులు వంటి వంటకాల సిద్ధమవుతున్నాయి. కొందరు తాతమ్మల కాలం రుచులను పునరుద్ధరిస్తుంటే, మరికొందరు కొత్త రుచులతో ప్రయోగిస్తున్నారు. బొబ్బట్లు, మురుకులు వంటివి ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. విదేశాల్లో ఉన్న ఉంటున్న జిల్లాకు చెందిన పలువురికి వారి కుటుంబ సభ్యులు పిండివంటలు పంపుతున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా ఉంటున్నవారికి ప్రత్యేక ప్యాకింగ్తో పంపుతున్నారు. దూరంగా ఉన్నా మా చేతి రుచి తినాలన్నదే వారి తపన. స్వగ్రామాల్లో సాఫ్ట్వేర్ నిపుణులు.. ఇక సంక్రాంతి పండుగకు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగులు స్వస్థలాలకు వస్తున్నారు. ఐటీ కంపెనీల ఒత్తిడి నుంచి విరామం పొంది అమ్మానాన్నలతో ఆనందంగా గడుపుతామంటున్నారు. అమ్మమ్మల అనుభవాలు, యువత ఉత్సాహం, పిల్లల కేరింతలు కలిసి ఆనంద వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ‘అమ్మ చేతి రుచి అసలైన సంక్రాంతి‘ అంటూ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. -
రోడ్డు భద్రత అందరి బాధ్యత
సారంగపూర్/నిర్మల్టౌన్: రోడ్డు భద్రతను అందరూ బాధ్యతగా భావించాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని జిల్లా సీనియర్ జడ్జి రాధిక అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా సారంగాపూర్ మండలం చించోలిబి క్రాస్రోడ్లోని మహాత్మా జ్యోతిబాపూలే బాలుర డిగ్రీ కళాశాల విద్యార్థులకు రోడ్డు భద్రతపై శుక్రవారం అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా నియమాలు అనుసరిస్తూ వాహనాలు నడిపితే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. అందరూ ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకోవడంతోపాటు వాటిని పాటించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ విజయ్కుమార్, ఏఎంవీఐలు రజినీకాంత్, అక్షయ్, రనాశ్రీ, అధ్యాపకులు పాల్గొన్నారు. -
నిర్మల్ ఉత్సవాలు విజయవంతం చేయాలి
నిర్మల్చైన్గేట్: జిల్లా శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేసి నిర్మల్ ఉత్సవాలు విజయవంతం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉత్సవాల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రజలు సైతం పెద్ద ఎత్తున నిర్మల్ ఉత్సవాల్లో పాల్గొనేలా ప్రచారం కల్పించాలన్నారు. నిర్మల్ జిల్లా చరిత్ర తెలియజెప్పేలా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈనెల 19 నుంచి 23 వరకు నిర్వహించే ఉత్సవాలకు ప్రొటోకాల్ పాటిస్తూ, ప్రజాప్రతినిధులను, ప్రముఖులను ఆహ్వానించాలన్నారు. సంతకాల బోర్డు, సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండ చర్యలు తీసుకోవాలన్నారు. పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా ప్రజల నుంచి స్వీకరించిన సూచనలను పరిశీలించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ)కిశోర్కుమార్, భైంసా సబ్కలెక్టర్ అజ్మీరా సంకేత్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, డీఈవో భోజన్న, డీవైఎస్వో శ్రీకాంత్రెడ్డి, సీపీవో జీవరత్నం, డీపీవో శ్రీనివాస్, డీఆర్డీవో విజయలక్ష్మి, డీఎంహెచ్వో రాజేందర్, అగ్నిమాపక అధికారి శివాజీ, ఉద్యానవన అధికారి రమణ పాల్గొన్నారు. -
గుర్రపు డెక్క.. యమ డేంజర్
నిర్మల్టౌన్: చెరువుల్లో గుర్రపు డెక్క ప్రాణాంతకంగా మారుతోంది. జిల్లా కేంద్రంలోని ధర్మసాగర్, కూరన్నపేట్, బంగల్పేట్, కదం చెరువులు గుర్రపు డెక్కతో పూర్తిగా నిండిపోయాయి. దీంతో పట్టణ శివారులోని చెరువుల్లోని నీటిని పశువులు కూడా తాగలేకపోతున్నాయి. గుర్రపుడెక్క కారణంగా చెరువుల పరిసరాలన్నీ దుర్గంధంగా మారుతున్నాయి. దోమలు, క్రిమి కీటకాలు పెరుగుతున్నాయి. స్థాని కులు కాలుష్యవ్యాప్తితో ఆందోళన చెందుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం.. గుర్రపు డెక్క వల్ల దోమలు పెరిగి మలేరియా, డెంగీ వ్యాధులు పెరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కూరన్నపేట్ చెరువులో గురువారం సాయంత్రం నీళ్లు తాగేందుకు దిగిన 70 గేదెలు గుర్రపు డెక్కలో చిక్కుకుని బయటకు రాలేక ఇబ్బంది పడ్డాయి. కాపరులు, యజమానులు శ్రమించి కష్టంగా బయటకు తీసుకువచ్చారు. అయితే అప్పటికే 9 గేదెలు ఊపిరాడక మృతిచెందాయి. ఇప్పటికై నా అధికారులు చెరువుల్లో గుర్రపు డెక్క తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. డ్రైనేజీ నీటి ప్రభావంతో.. పట్టణంలోని డ్రైనేజీ నీరు చెరువుల్లోకి పోతుండటంతో గుర్రపు డెక్క పెరుగుతోంది. నీటి నాణ్యత తగ్గడంతో ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్నాయి. చేపలు, జలజీవులు చనిపోతున్నాయి. చేపల పెంపకం, వేట కష్టమవుతోంది. నీటి సరఫరా ఆగిపోతోంది. గుర్రపు డెక్క మత్స్యకారులకు కూడా అడ్డంకిగా మారింది. చేపలు పట్టడం కష్టం అవతుందని పేర్కొంటున్నారు. గేదెల మృతిపై విచారణ.. నిర్మల్టౌన్ : కురన్నపేట్ చెరువు గుర్రపు డెక్కలో చిక్కుకుని గేదెలు మృతిచెందిన ఘటనపై ఆర్ఐ వెంకటరమణ శుక్రవారం విచారణ చేపట్టారు. చెరువు వద్దకు వచ్చిన గేదెల యజమానులతో మాట్లాడారు. మొత్తం 9 గేదెలు మృతిచెందినట్లు తెలిపా రు. గడ్డం శంకర్కు చెందిన రూ.1.40 లక్షల విలువ చేసే రెండు గేదెలు, ఆకుల లక్ష్మణ్కు చెందిన రూ.55 వేల విలువైన గేదె, రమేష్ చెందిన రూ.2.40 లక్షల విలువ చేసే మూడు గేదెలు, కుంటాల రాజుకు చెందిన రూ.55 వేల విలువ చేసే గేదెలు, కుమ్మరి పోశెట్టికి చెందిన రూ.60 వేల విలువ చేసే గేదె, శంకర్కు చెందిన రూ.70 వేల విలువ చేసే గేదె మృతిచెందినట్లు తెలిపారు. ఈమేరకు ఆర్ఐ పంచనామా చేశారు. బాధితులకు ప్రభుత్వ పరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. డ్రైనేజీ నీటితోనే ప్రమాదం డ్రైనేజీ నీరు చెరువుల్లోకి వదలడంతో జిల్లా కేంద్రంలోని చెరువులు ప్రమాదకరంగా మారాయి. డ్రైనేజీలు చెరువులో కలవకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి. గుర్రపు డెక్క పెరగడానికి కూడా ఈ డ్రైనేజీ నీరే కారణం. దీంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నీటిలో ఆక్సిజన్ పడిపోతోంది. – అనిల్, ఇరిగేషన్ ఈఈ -
క్షయపై అవగాహన ఉండాలి
సారంగపూర్: క్షయ వ్యాధిపై ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించాలని జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఎం.ప్రత్యూష అన్నారు. టీబీ ముక్త్భారత్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని చించోలి(బి) గ్రామంలో క్షయవ్యాధిపై శుక్రవారం అవగాహన కల్పించారు. వ్యాధి నిర్ధారణ శిబిరం నిర్వహించి 65 మందికి డిజిటల్ ఎక్స్రే తీయించారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం ఉన్నవారు టీబీపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, రాత్రిపూట చెమటలు పట్టడం, దగ్గినప్పుడు రక్తం పడడం, అలసట, నీరసం, గతంలో అనారోగ్య సమస్యలతో బాధపడినవారు ఛాతి నొప్పి, శరీరంలో ఏభాగంలోనైనా వాపు లాంటి లక్షణాలు కనిపిస్తే ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. తెమడ పరీక్ష, ఛాతి ఎక్స్రే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా చేయించుకోవాలని తెలిపారు. వ్యాధి నిర్ధారణ అయితే ఉచితంగా మందులు అందజేస్తారన్నారు. -
రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే
నిర్మల్టౌన్: కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిందని, రెండేళ్లలోనే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని బీఆర్ఎస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కొరిపెల్లి రాంకిషన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మద్దతులో పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను జిల్లా కేంద్రంలోని దివ్యగార్డెన్లో శుక్రవారం సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు గెలుపొందడం శుభ పరిణామమన్నారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో జిల్లాలో గులాబీ జెండా ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు దొంగ హామీలుగా మిగిలిపోతున్నాయని పేర్కొన్నారు. సర్పంచులు ప్రభుత్వ అవినీతిని ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, నాయకులు మహేశ్రెడ్డి, భూషణ్రెడ్డి, కృష్ణారెడ్డి, జీవన్రావు, నహీం, నజీర్, అక్రమ్, చిన్నారెడ్డి, అశోక్, సాయిరెడ్డి పాల్గొన్నారు. -
కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి
భైంసాటౌన్: గ్రామ పంచాయతీలకు వచ్చే అధిక శాతం నిధులు కేంద్రానివేనని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎస్ఎస్ కాటన్ ఫ్యాక్టరీలో బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమం శుక్రవారం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ఈటల, ఏలేటి హాజరై మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం నిధుల కోసమే సీఎం రేవంత్రెడ్డి పంచాయతీ ఎన్నికలు నిర్వహించారని తెలిపా రు. అయితే 20 రోజులు కావస్తున్నా సర్పంచులకు చెక్ పవర్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎన్ని కల హామీలు నెరవేర్చకుండా గారడీ మాటలతో కాలం వెల్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఏ రాష్ట్రంలోనైనా ఒక్కసారి అధికారంలోకి వస్తే వరుసగా 25ఏళ్లపాటు అధికారంలో ఉన్న చరిత్ర ఉందన్నారు. ముధోల్ నియోజకర్గంలో 103 సర్పంచ్ స్థానాలు ఏకపక్షంగా కై వసం చేసుకుందన్నారు. బీజేఎల్పీ ఉప నేత పాయల్ శంకర్, ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే రామారావు పటేల్, జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అనంతరం సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించారు. కార్యక్రమానికి ముందు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోపాల్ సర్దా మృతికి సంతాపంగా మౌనం పాటించారు. -
మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి
కడెం: మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని ఎ మ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు. కడెం ప్రా జెక్టులో శుక్రవారం చేప పిల్లలు విడుదల చేశా రు. ప్రాజెక్టులు, చెరువుల్లో ఉచిత చేప పిల్లల విడుదల చేస్తూ, మత్స్యకారులకు సబ్సిడీ వా హనాలు అందిస్తూ వారి సంక్షేమానికి రాష్ట్ర ప్ర భుత్వం కృషి చేస్తోందన్నారు. అనంతరం మండల కేంద్రంలో సీఎం కప్ ర్యాలీని ప్రారంభించారు. ఇందులో ఏఎంసీ చైర్మన్ భూషణ్, తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో సునీత, ఫిషరీస్ ఏడీ రాజనర్సయ్య, ఎఫ్డీవో విజయ్కిరణ్, స ర్పంచులు దీకొండ విజయ్, తిరుపతి, భీమేశ్, లక్ష్మి, ఎంఈవో షేక్హుస్సేన్, హెచ్ఎం శ్రీనివా స్రెడ్డి, పీడీ వెంకటరమణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లేశ్, నాయకులు పాల్గొన్నారు. -
నిర్మల్
ఈవీఎం గోదాం తనిఖీ నిర్మల్చైన్గేట్: కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం తనిఖీ చేశారు. రిజిస్టర్లను, సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు. పోలీసు సిబ్బంది నిరంతరం మెరుగైన భద్రత నిర్వహించాలన్నారు. అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, అధికారులు సర్ఫరాజ్, రాజశ్రీ ఉన్నారు. నిర్మల్: మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. దీంతో రాజకీయ పార్టీలూ సన్నద్ధమవుతున్నాయి. ఈసారి జిల్లాలో పురపోరు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఆచితూచి అడుగులేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్ నుంచి సీనియర్లతోపాటు గల్లీ లీడర్లూ కాంగ్రెస్, బీజేపీలో చేరారు. దీంతో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో సొంతపార్టీలోనే అభ్యర్థిత్వం కోసం ఆశావహుల మధ్య పోటాపోటీ వాతావరణం ఏర్పడింది. భైంసా, ఖానాపూర్తో పోలిస్తే.. నిర్మల్లో సీట్ల కోసం సిగపట్ల వరకూ పరిస్థితి వెళ్లేలా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వార్డుల్లో గెలిచేది, చైర్మన్ స్థానాన్ని గెలిపించేది ఎవరనే వేటలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. వార్డుల వారీగా రిజర్వేషన్లను అంచనా వేస్తూ గెలుపు గుర్రాలను ఎంపిక చేసే పనిలో పడ్డాయి. ఐదేళ్లలో మార్పులెన్నో.. ఐదేళ్లక్రితం మున్సిపోల్స్కు ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తోంది. ముందు నుంచీ జిల్లాలో మూడు మున్సిపాలిటీలు దేనికదే అన్నట్లుగా ఉన్నాయి. నిర్మల్లో గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్లతోపాటు బీజేపీ కూడా గట్టి పోటీనే ఇచ్చింది. ఖానాపూర్లో కాంగ్రెస్, బీజేపీలు అప్పటి అధికార బీఆర్ఎస్తో బలంగానే పోరాడాయి. ఇక భైంసాలో ఎంఐఎం పైచేయి సాధించినా ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ను కనుమరుగు చేస్తూ బీజేపీ గణనీయస్థానాలను సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ను సీనియర్లందరూ వీడారు. మాజీమంత్రి ఇంద్రకరణ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, రేఖానాయక్, అలాగే సీనియర్ నేతలు చాలామంది కాంగ్రెస్లో చేరారు. మరికొందరు బీజేపీలోకి వెళ్లారు. కిందిస్థాయి నేతలూ వారిబాటలోనే పార్టీలు మారారు. దీంతో మున్సిపాలిటీల్లోనూ రాజకీయ లెక్కలు మారిపోయాయి. జాబితా తయారీలో.. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా మరో రెండురోజుల్లో ఫైనల్ కానుంది. తదుపరి రిజర్వేషన్ల ప్రకటన రానుంది. అన్నీ సజావుగా పూర్తయితే సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్, ఫిబ్రవరిలో ఎన్నికలు అన్న ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలోనే పార్టీలు కూడా ఇప్పటి నుంచే వార్డులవారీగా ఎవరెవరు పోటీ పడుతున్నారు, ఎవరికి ఎంత బలముంది, ఎవరికి సీటిస్తే గెలుస్తారు.. ఇలా అన్నికోణాల్లో లెక్కలు వేస్తున్నాయి. జిల్లాకేంద్రంలో కాంగ్రెస్ పార్టీలోని ఓవర్గం ఇప్పటికే కొంతమంది ఆశావహులతో ఓ జాబితానూ సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీలో మాత్రం అభ్యర్థుల ప్రకటన ఎమ్మెల్యేలపైనే ఆధారపడి ఉన్నట్లు చెబుతున్నారు. ఖానాపూర్లో కొంత ప్రభావం చూపడం మినహా మిగిలిన రెండు బల్దియాల్లో బీఆర్ఎస్ అంత బలంగా లేదన్న వాదన వినిపిస్తోంది. ముందు నుంచీ తమపార్టీల్లో ఉన్న సీనియర్ నేతలతోపాటు బీఆర్ఎస్ నుంచి చేరిన నాయకులూ కౌన్సిలర్ టికెట్లు ఆశిస్తున్నారు. దీంతో కాంగ్రెస్, బీజేపీల్లో పోటీ వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు ఎమ్మెల్యేలు బీజేపీవాళ్లు గెలవడం, కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో ఈ రెండు పార్టీల నుంచే టికెట్లు ఆశించేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. జిల్లాకేంద్రంలో రెండు పార్టీల్లో ఒక్కో వార్డు నుంచి ముగ్గురు, నలుగురు ఆశావహులు ఉండటం గమనార్హం. -
అభ్యసన మెరుగుపడేలా ఎఫ్ఎల్ఎస్
నిర్మల్ఖిల్లా: పాఠశాల విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ(ఎఫ్ఎల్ఎ స్) జిల్లావ్యాప్తంగా అమలవుతోంది. 3వ తరగ తి విద్యార్థుల భాష(తెలుగు/ఆంగ్లం), గణిత సా మర్థ్యాలను పరీక్షించడం దీని ముఖ్య లక్ష్యం. వి ద్యార్థుల అభ్యసన స్థాయిని ప్రాథమిక స్థాయిలో నే మెరుగుపరచడానికి దీనిని రూపొందించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సన్నద్ధత జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. భాషా నైపుణ్యాలకు సంబంధించి సరళ పదాల గుర్తింపు, వాక్యాలు ధారాళంగా చదవడం, అర్థాలు చెప్పడం సాధన చేయిస్తున్నారు. గణిత నైపుణ్యాలకు సంబంధించి అంకెల గుర్తింపు, కూడిక, తీసివేతలు వంటి ప్రాథమిక కార్యకలాపాలు నేర్పుతున్నారు. రాత పరీక్షలతోపాటు ఆలోచనా ప్రక్రియను తెలుసుకునే ప్రశ్నలు ఎఫ్ఎల్ఎస్లో ఉంటాయి. దీంతో విద్యార్థుల్లో భయం తొలగడంతోపాటు ఉపాధ్యాయుల బోధనా పద్ధతులు మెరుగవుతాయి. భవిష్యత్ ప్రణాళిక.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం మూడో తరగతి వరకు చదవడం, రాయడం, లెక్కలు చేయడం నైపుణ్యాలు సాధించడం. ఎఫ్ఎల్ఎస్ ఫలితాల ఆధారంగా రానున్న విద్యా సంవత్సరంలో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. జిల్లా విద్యాశాఖ ఈ ఫలితాలను దిక్సూచిగా తీసుకుని మార్పులు తీసుకురానుంది. ఎన్సీఈఆర్టీ ఆదేశాలు.. ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలు పరిశీలించేందుకు ఎన్సీఈఆర్టీ ఆదేశాల మేరకు ఎఫ్ఎల్ఎస్ను ప్రారంభించారు. గతంలో జాతీయ సాధన సర్వే(ఎన్ఏఎస్)నిర్వహించగా, ఇప్పుడు ఈ కొత్త విధానం అమలులో ఉంది. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ, గణిత విషయాల్లో పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 26న రాష్ట్రవ్యాప్త పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 535 ప్రాథమిక, 87 ప్రాథమికోన్నత పాఠశాలల్లో మూడో తరగతి విద్యార్థులు పాల్గొంటారు. నమూనా పరీక్షలు.. విద్యార్థుల సంసిద్ధత కోసం మాక్ టెస్ట్లు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ చివరలో మొదటి దశ ని ర్వహించారు. జనవరి మూడో వారంలో రెండో దశ, ఫిబ్రవరి రెండో వారంలో మూడో దశ నిర్వహిస్తారు. ఈమేరకు రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇ చ్చారు. స్కూల్ కాంప్లెక్స్లలో ఉపాధ్యాయుల కు మార్గదర్శనం అందించారు. 190 పేజీల బి ట్బ్యాంక్ సాఫ్ట్కాపీలు పంపారు. ఈ సన్నాహాలతో లోపాలను గుర్తించి, తదుపరి సంవత్సరం అభ్యసన ప్రక్రియలు రూపొందిస్తారు. అభ్యసన సామర్థ్యాలు మెరుగుకు.. ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ పరీక్షల కోసం మూడో తరగతి విద్యార్థులకు ప్రత్యేక కార్యచరణ అమలు చేస్తూ సన్నద్ధం చేయాలని ఇది వరకే ఎంఈవోలు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులకు ఆదేశాలిచ్చాం. విద్యార్థులను ఆయా పాఠశాలల సబ్జెక్టు ఉపాధ్యాయులు సన్నద్ధం చేస్తున్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మరింత మెరుగుపడతాయి. – భోజన్న, డీఈవో -
‘సదర్మాట్’ పనులు త్వరగా పూర్తి చేయాలి
మామడ: పొన్కల్ సదర్మాట్ బ్యారేజీ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. గోదావరి వద్ద నిర్మాణంలో ఉన్న బ్యారేజీ ని ఎస్పీ జానకీషర్మిలతో కలిసి గురువారం సందర్శించారు. బ్యారేజీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు చేపట్టిన పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీ రహదారి పనులు పూర్తిచేయాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్ట ర్ కిశోర్కుమార్, అదనపు ఎస్పీ సాయికిరణ్, ఆర్డీ వో రత్నకళ్యాణి, తహసీల్దార్ శ్రీనివాస్రావు, నీటిపారుదలశాఖ, అర్అండ్బీ అధికారులు ఉన్నారు. -
ఇంటర్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
నిర్మల్చైన్గేట్: ఇంటర్ వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాటు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో కలుపుకుని 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రాల్లో 6,652 మంది ప్రథమ సంవత్సర, 6,473 మంది ద్వితీయ సంవత్సర పరీక్షలు రాయనున్నట్లు వివరించారు. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష, జవాబు పత్రాల తరలింపు సమయంలో తగిన భద్రతను ఏర్పాటు చేయాలన్నారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలను నిర్వహించాలన్నారు. పరీక్ష టైంలో పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాలలో జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడపాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో భా గస్వామ్యం అయ్యే అధికారులందరికీ శిక్షణను ఇ వ్వాలని తెలిపారు. మాస్ కాపీయింగ్కు తావు లే కుండా పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలన్నా రు. సమావేశంలో డీఐఈవో పరశురాం, డీఈవో భోజన్న, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
గ్రామాల్లో క్రీడా సంరంభం
నిర్మల్చైన్గేట్: జల్లాలోని పల్లెల్లో క్రీడా సందడి మొదలు కానుంది. ఈనెల 17 నుంచి ఫిబ్రవరి 14 వరకు సీఎం కప్ క్రీడాపోటీలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ’ప్రపంచ చాంపియన్’ నినాదంతో గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు నాలుగు దశల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గ్రామీణ యువతలో దాగిఉన్న ప్రతిభలను వెలికితీయడమే ఈ పోటీల లక్ష్యం. రాష్ట్ర క్రీడాసంస్థ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి షెడ్యూల్ విడుదల చేసింది. 44 అంశాల్లో పోటీలుఅథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, స్విమ్మింగ్, రెస్లింగ్, టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, షూటింగ్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, హాకీ, ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, సెపక్తక్రా, చెస్, బేస్బాల్, నెట్బాల్, కిక్బాక్సింగ్, సైక్లింగ్, రోయింగ్, స్క్వాష్ రాక్వెట్, కానోయింగ్–కయాకింగ్, వుషు, అత్యపత్య, పవర్లిఫ్టింగ్, సాఫ్ట్బాల్, తైక్వాండో, బిలియర్డ్స్–స్నూకర్, జూడో, కరాటే, యోగా, స్కేటింగ్, ఫెన్సింగ్, పికిల్బాల్, సెయిలింగ్, బాల్ బ్యాడ్మింటన్, మల్లకంబ్, పారా గేమ్స్, రిక్రియేషనల్ క్రీడల్లో పోటీలు జరుగుతాయి. టార్చ్ ర్యాలీ విజయవంతంపోటీల సన్నాహంలో భాగంగా గురువారం శివాజీ చౌక్ నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు నిర్వహించిన టార్చ్ ర్యాలీ విజయవంతమైంది. జిల్లా యువజన, క్రీడా అధికారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ ఫైజాన్ హైమద్ పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్..క్రీడాకారులుhttps://satg.telangana.gov. in వెబ్సైట్లో ఆన్లైన్గా పేరు నమోదు చేయాలి. సందేహాలు ఉంటే డీవైఎస్ఓ, పాఠశాల– కళాశాల ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయులు, పీడీలు, పీఈటీలను సంప్రదించవచ్చు. ఎంపీడీవోలు, ఎంఈవోల వద్ద కూడా సమాచారం అందుబాటులో ఉంది. గతేడాది విజయాలు2024 డిసెంబర్ నుంచి 2025 జనవరి 2 వరకు మొదటి సీఎం కప్ క్రీడలు నిర్వహించారు. జిల్లా క్రీడాకారులు 26 పతకాలు సాధించారు. 4 బంగారు, 8 రజతం, 14 కాంస్య పతకాలు. ఈ పోటీల విజేతలు ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు అర్హులవుతారు.పోటీల షెడ్యూల్ -
ప్రయోగం ఇక సాఫీగా
లక్ష్మణచాంద: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రాక్టికల్స్కు ఆటంకాలు తొలగాయి. ప్రాక్టికల్ పరీక్షలు సమీపిస్తున్నా ల్యాబ్కు నిధులు మంజూరు కాకపోవడంతో అధ్యాపకుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈమేరకు ఇంటర్ బోర్డుకు నివేదికలు పంపించారు. దీంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రయోగ పరీక్షల మెటీరియల్ కోసం ఒక్కో కళాశాలకు రూ.50 వేలు మంజూరు చేసింది. గతంలో ఒక్కో కళాశాలకు రూ.25 వేలు ఇవ్వగా నేడు దానిని రూ.50 వేలకు పెంచి మంజూరు చేసింది. జిల్లాలో ఇలా...జిల్లా వ్యాప్తంగా 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ప్రథమ సంవత్సరంలో జనరల్ విభాగంలో 2,198, ఒకేషనల్ విభాగంలో 3,94 మొత్తం 2592 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో జనరల్ విభాగంలో 1,856, ఒకేషనల్ విభాగంలో 396 మొత్తం 2252 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.13 కళాశాలలో ఒక్క కళాశాలకు రూ.50 వేల చొప్పున 13 కళాశాలలకు రూ.6,50,000 ప్రభుత్వం విడుదల చేసిందని ఇంటర్ అధికారులు తెలిపారు. కలెక్టర్ అనుమతి పొందిన తర్వాత ప్రయోగాల మెటీరియల్స్ కొనుగోలు చేయాల్సి ఉందని డీఐఈవో పరశురామ్ నాయక్ తెలిపారు. నిబంధనల మేరకు కొనుగోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రయోగశాలల మెటీరియల్స్ను ఇంటర్ బోర్డు సూచించిన నిబంధనల మేరకు కొనుగోలు చేయాలి. సైన్స్ అధ్యాపకులు కమిటీ తీర్మానం చేసి కలెక్టర్కు పంపాలి. కలెక్టర్ ఆమోదం తరువాత కొనుగోలు చేయాలి. – పరశురామ్ నాయక్, డీఐఈవో -
నిర్మల్
7నిర్మల్ పట్టణ సీఐగా నైలునిర్మల్టౌన్: నిర్మల్ పట్టణ సీఐగా ఎం.నైలు నియమితులయ్యారు. ప్రస్తుత సీఐ ప్రవీణ్కుమార్ భైంసా రూరల్ సీఐగా బదిలీ అయ్యారు. బైంసా రూరల్ సీఐగా పనిచేసిన నైలును నిర్మల్కు బదిలీ అయ్యారు. పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా తగ్గుతాయి. మంచు అధికంగా కురుస్తుంది. చలి తీవ్రత కొనసాగుతుంది. వసంత పంచమికి పట్టు వస్త్రాలు బాసర: వసంత పంచమికి శ్రీజ్ఞానసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి అమ్మవార్లతోపాటు వ్యాస మహర్షి, దత్తాత్రేయస్వామికి పట్టువస్త్రాలు తీసుకొస్తామని అఖిలభారత భక్త మార్కండేయ పద్మశాలీయ నిత్యాన్నసత్రం సభ్యులు తెలిపారు. ఈవో అంజనాదేవికి సత్రం అధ్యక్షుడు రాపోలు సుధాకర్, కార్యనిర్వాహక అధ్యక్షురాలు గొజ్జ రాజేశ్వరి, ధర్మకర్త కొక్కుల గంగాధర్, మేకల అశోక్ గురువారం వినతిపత్రం అందజేశారు. -
గోదావరి పుష్కరాలకు విస్తృతంగా ఏర్పాట్లు
బాసర: బాసరలో గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తామని భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్కుమార్ అన్నారు. పుష్కర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కేంద్రం బృందం గురువారం బాసరకు వచ్చింది. సబ్ కలెక్టర్తో కలిసి గోదావరి నది మొద టి, రెండో ఘాట్లను పరిశీలించింది. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సబ్ కలెక్టర్ కేంద్ర బృందానికి తెలిపారు. పంచాయతీరాజ్, ఇంజి నీరింగ్, ఆర్అండ్బీ అధికారులు సమన్వయం చేసుకుంటూ పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. భక్తుల రద్దీని అంచనా వేసుకుని సదుపాయాలు కల్పించేలా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కేంద్ర బృందం సభ్యులు ఆర్కిటిక్ జ్యోత్స్న, కుషాల్ గో యల్, బాసర ఆలయ ఈవో అంజనాదేవి, ఏఈ శ్యాంసుందర్, తహసీల్దార్ పవన్చంద్ర, ఆర్ఐ అభిమన్యు, ఆలయ సూపరింటెండెంట్ శివరాజ్, పీఆ ర్వో నారాయణ పటేల్, ఎస్సై నవనీత్రెడ్డి పాల్గొన్నారు. -
కరెంటు బండి.. కొందాం పదండి
నిర్మల్ఖిల్లా: జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి పెరుగుతోంది. దీంతో ఈవీ ట్రెండ్ పెరుగుతోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజీ ఇచ్చే వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా ఈ–వాహనాలు ఎక్కువగా కొంటున్నారు. ఈ నేపథ్యంలో పర్యావరణ పరి రక్షణకు తోడుగా ఇంధన వ్యయాన్ని తగ్గించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే వాటి ధరపై 20 శాతం రాయితీ ఇస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం ప్రోత్సాహకరంగా మారింది. 20 శాతం రాయితీ అమలులోకి వస్తే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు మరింత పుంజుకునే అవకాశముంది. అన్నిరకాలుగా ప్రయోజనం..ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకు 20 శాతం సబ్సిడీతో పెట్రోల్, డీజిల్ ఖర్చులను తగ్గిస్తుంది. ‘న్యూ ఈవీ పాలసీ’ జీవో 41 ప్రకారం రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీల మినహాయింపు ఇప్పటికే అమలులో ఉంది. తక్కువ నిర్వహణ ఖర్చు, పర్యావరణ సంరక్షణ, శబ్ద కాలుష్య నియంత్రణ ప్రయోజనాలు ఉంటాయి. జిల్లాలో వాహనాల ధోరణిగతంలో సైకిళ్లు ఆధారమైతే ఇప్పుడు ద్విచక్ర వాహనాలు అవసరం. నిర్మల్, బైంసా, ఖానాపూర్ డివి జన్లలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులు పాపులర్ అవుతున్నాయి. 2016 నుంచి రవాణా శాఖలో 5,300 ఈ–వాహనాల రిజిస్ట్రేషన్ జరిగింది. గంటకు 25 కి.మీ. కంటే తక్కువ వేగ వాహనాలకు రిజిస్ట్రేషన్ మినహాయింపు ఉంది. రాయితీ అమలోకి వస్తే ఈ–వాహనాల కొనుగోళ్లు వేగవంతం అవుతాయి. కాలుష్యరహితం.. గతంలో పెట్రోల్తో నడిచే బైక్ ఉండేది. దానిని అమ్మే సి ఎలక్ట్రిక్ చార్జింగ్ స్కూటీ ని తీసుకున్నాను. దీంతో పెట్రోల్ ఖర్చు తప్పింది. స్కూటీని తమ కుటుంబ సభ్యులందరూ కూడా సులభంగా నడుపుతున్నారు. ప్రతినెల దాదాపు రూ.3వేలకుపైగా అయ్యే ఖర్చు ప్రస్తుతం ఆదా అవుతుంది. పర్యావరణానికి హాని ఉండదు. – జె.చంద్రశేఖర్, న్యాయవాది, నిర్మల్ ఎంతో సౌకర్యవంతం.... గతంలో పెట్రోల్ బైక్ ఉండేది. ప్రతీరోజు సగటున రూ.150 పెట్రోల్ కోసం వెచ్చించాల్సి వచ్చేది. ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేసిన తర్వాత రెండు మూడు రోజులకు ఒకసారి చార్జింగ్ పెడుతున్నాను. పెట్రోలు ఖర్చు తప్పింది. డబ్బు ఆదా అవుతుంది. పర్యావరణ పరిరక్షణలో కూడా భాగస్వామి అయ్యాను. ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీ ఇవ్వడం శుభపరిణామం. – ఆర్.లక్ష్మణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, నిర్మల్ -
అల్పాహారంలో కోత
లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల ఉత్తమ ఫలితాల కోసం గత అక్టోబర్ నుంచి సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. అయితే అల్పాహారం లేకపోవటంపై ఫిర్యాదులు వచ్చాక ప్రభుత్వం స్పందించింది. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు 19 రోజులు అందించేలా ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ అయ్యాయి. ఒక్కో విద్యార్థికి రూ.15ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 కేటాయించారు. ఈ మొత్తంతో సాయంత్రం అల్పాహారం అందించాలి. ఈ చర్య విద్యార్థుల ఇబ్బందులను తగ్గించి చదువుకు దృష్టి పెడతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే 19 రోజుల మాత్రమే అల్పాహారం అందించడానికి పోషకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది 38 రోజులు అందించిన ప్రభుత్వం ఇప్పుడు 19 రోజులకు కుదించడం సరికాదంటున్నారు. మరిన్ని రోజులు అల్పాహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ముందుగా ప్రారంభించాలి ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు కేవలం 19 రోజులకు మాత్రమే అల్పాహారం అందించాలని నిర్ణయించడం సరికాదు. దీంతో తీవ్ర ఇబ్బంది ఎదురవుతుంది. ఫిబ్రవరి మొదటి వారం నుండే అల్పాహారం అందిస్తే మాకు మరింత మేలు జరుగుతుంది. – శ్రేష్ట పది విద్యార్థి, బాబాపూర్ పాఠశాలరుచికరమైన అల్పాహారం.. రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోల ఆదేశాల మేరకు ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం అందిస్తాం. రుచికరంగా, నాణ్యమైనదిగా అందేలా చూస్తాం. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలాగా ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలి. – భోజన్న, డీఈవో, నిర్మల్ ఉమ్మడి జిల్లాల్లో విద్యార్థుల సంఖ్యజిల్లా పాఠశాలల విద్యార్థులు సంఖ్య సంఖ్యనిర్మల్ 108 3,580 ఆదిలాబాద్ 100 3,324 కుమురం భీం 51 2,225 మంచిర్యాల 97 2,885 -
చదువుతోనే సాధికారత
మంచిర్యాలఅర్బన్: బాలికల విద్యను ప్రోత్సహించి సాధికారత దిశగా అడుగులు వేసేలా కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాలను ఏ ర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్మల్, మంచిర్యాల జిల్లాల కేజీ బీవీ ప్రత్యేక అధికారులు, మోడల్ హాస్టళ్ల వార్డెన్లకు జాతీయ విద్యా ప్రణాళిక, పరిపాలన సంస్థ(ఎన్ఐఈపీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజు గురువారం శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ కేజీబీవీల బలోపేతానికి శిక్షణ కార్యక్రమమని తెలిపా రు. సామర్థ్యాలను పెంపొందించుకుని ఉత్త మ ఫలితాలు సాధించేలా శ్రద్ధ వహించాలని అన్నారు. నాణ్యమైన విద్య అందించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశా రు. బాలిక విద్య ప్రాముఖ్యతపై ప్రదర్శించిన నాటికను ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కో–ఆర్డినేటర్లు వి జయలక్ష్మి, భరత్, సత్యనారాయణమూర్తి, చౌ దరి, నిర్మల్ జిల్లా కో–ఆర్డినేటర్లు నవీన జ్యో తి, అసిస్టెంట్ కో–ఆర్డినేటర్ రమాదేవి, మా స్టర్ ట్రైనర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
గడువులోపు ఫిర్యాదులు పరిష్కరించాలి
నిర్మల్చైన్గేట్: మున్సిపాలిటీ ఓటరు జాబితాలపై వచ్చిన అభ్యంతరాలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించా రు. జిల్లాలవారీగా ఓటరు జాబితాలపై వచ్చిన అ భ్యంతరాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆ మె మాట్లాడుతూ.. ఈనెల 12న వార్డులవారీగా ఫొ టో ఎలక్టోరల్ జాబితా, 13న డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాలను ప్రచురిస్తామని చెప్పారు. 16న తుది పోలింగ్ కేంద్రాల వివరాలు ప్రచురించి, పోలింగ్ కేంద్రాలవారీగా ఫొటో ఎలక్టోరల్ జాబితా ప్రచురిస్తామని తెలిపారు. అభ్యంతరాల ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. 2025కు సంబంధించి 3వ సప్లిమెంటరీ ఓటరు జాబితా నవంబర్ 15న విడుదలైందని తెలిపారు. దీని ప్రకారం పట్టణాల్లో వార్డులవారీగా డ్రాఫ్ట్ ఓటరు జాబితా జనవరి 1న విడుదల చేశామని పేర్కొన్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ మా ట్లాడుతూ.. ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరా ల ఫిర్యాదులను పరిష్కరిస్తున్నామని తెలిపారు. అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, నిర్మల్, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్గౌడ్, సుందర్సింగ్ ఉన్నారు. జిల్లాస్థాయి అటవీ కమిటీ సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అట వీ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లాలోని అటవీ, గిరిజన ప్రాంత ప్ర జలకు మెరుగైన రవాణా, విద్యుత్, తదితర మౌలిక సదుపాయాల కల్పన దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్, డీఎఫ్వో సుశాంత్ సుఖదేవ్ బోబడే, ఆర్డీవో రత్నకళ్యాణి, ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్ సుదర్శన్, హౌసింగ్ పీడీ రాజేశ్వర్, రెవెన్యూ, ఇంజినీరింగ్, విద్యుత్శాఖల అధికారులు, తహసీల్లార్లు ఉన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ
ఖానాపూర్: జిల్లా కేంద్రంలో ఇటీవల తెలంగా ణ మ్యాథమెటిక్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన గణిత ప్రతిభా పరీక్ష పోటీల్లో జిల్లాస్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన మస్కాపూర్ పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థి యశ్వంత్ రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచాడు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నిర్వహించి న పోటీల్లో 396మంది పాల్గొనగా యశ్వంత్ నాలుగో ర్యాంక్ సాధించినట్లు హెచ్ఎం శ్రీని వాస్ తెలిపారు. యశ్వంత్కు మార్గనిర్దేశం చేసి న టీచర్లు శ్రీనివాస్, ఫరాజ్ను గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. -
మరో చాన్స్
నిర్మల్చైన్గేట్: రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల ఆర్థిక భరోసాకు రెండు కొత్త పథకాలు ప్రవేశపెట్టింది. గతేడాది ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన, రేవంతన్నకా సహారా మిస్కిన్ కో లియే.. పథకాలను లాంఛనంగా ప్రారంభించింది. మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు, పేదలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాలకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా వీటిని అమలు చేయనుండగా రూ.30కోట్లు కేటాయించింది. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన.. జిల్లాలోని ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలైన మైనార్టీ (ముస్లిం, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ వర్గాలకు చెందిన) మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ పథకం ద్వారా రూ.50వేల వరకు ఆర్థికసాయం అందించనున్నారు. ము ఖ్యంగా ఫకీర్, దూదేకుల, వితంతువులు, ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. వీరంతా వ్యాపారం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి చేయూతనందిస్తారు. రుణం పొందిన మహిళలు చిన్నపాటి వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు. ఎన్నికల కోడ్తో నిలిచి.. ఈ పథకాలకు గతేడాది అక్టోబర్ 6వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించగా సెప్టెంబర్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం కోడ్ ముగియడంతో మైనార్టీల అభ్యర్థన మేరకు దరఖాస్తు గడువు పెంచారు. అర్హత గల మైనార్టీలు ttps:// tgobmms. cgg. gov. in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 10వరకు ఆన్లైన్ విధానంలో నమోదు చేసుకుని స్థానిక మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులు అందించాల్సి ఉంటుంది. జిల్లాలో 1,05,957 మంది మైనార్టీలున్నారు. ఇప్పటివరకు ఇందిరమ్మ మైనార్టీ మహిళా యువజన పథకానికి 1,170, రేవంతన్నకా సహారా మిస్కేనోకు 100 దరఖాస్తులు వచ్చాయి. ఇవీ అర్హతలు.. సద్వినియోగం చేసుకోండి జిల్లాలోని నిరుపేద ముస్లిం మైనార్టీలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం. ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాలను నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలి. పూర్తి వివరాలకు సమీకృత కలెక్టరేట్లోని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ కార్యాలయంలో సంప్రదించాలి. – ఆర్.మోహన్సింగ్, మైనార్టీ సంక్షేమశాఖ అధికారివందశాతం సబ్సిడీ రాష్ట్రంలోని నిరుపేద ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం ‘రేవంతన్నకా సహారా మిస్కిన్ కో లియే’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ముస్లిం మైనార్టీ వర్గాల్లోని నిరుపేదలైన ఫకీర్, దూదేకుల ఇతర అట్టడుగు వర్గాల ప్రజల ఆర్థికాభివృద్ధికి మోపెడ్లు, బైక్లు, ఈ–బైక్లు 100 శాతం సబ్సిడీపై అందించనున్నారు. ఇందులో భాగంగా ఒక్కొక్కరికి రూ.లక్ష వరకు గ్రాంట్ మంజూరు చేయనున్నారు. -
కేజీబీవీల్లో బాలికలకు మెరుగైన విద్య
మంచిర్యాలఅర్బన్: కేజీబీవీలు బాలికల విద్య కు నిలయాలని, భద్రతతోపాటు మెరుగైన వి ద్య అందిస్తున్నాయని డీఈవో యాదయ్య తెలి పారు. బుధవారం స్థానిక ప్రైవేట్ హోటల్లో మంచిర్యాల, నిర్మల్ జిల్లాల కేజీబీవీ ఎస్వోలు, మోడల్స్కూల్ గర్ల్స్ హాస్టల్స్ వార్డెన్లకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి ఫ లితాలు, ఆత్మవిశ్వాసాన్ని కల్పించడంలో కేజీబీ వీలు ముందు వరుసలో ఉన్నాయని తెలిపారు. కేజీబీవీల నిర్వహణ మరింత సమర్థవంతంగా చేయడం కోసమే రెసిడెన్షియల్ తరహా శిక్షణ అన్నారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష కో–ఆర్డినేటర్లు విజయలక్ష్మి, చౌదరి, సత్యనారాయణ మూర్తి, నిర్మల్ జిల్లా కో–ఆర్డినేటర్ నవీన జ్యో తి, అసిస్టెంట్ జెండర్ కో–ఆర్డినేటర్ రమాదే వి, మాస్టర్ ట్రైనర్ జ్యోతి, మంచిర్యాల, నిర్మల్ కేజీబీవీల ప్రత్యేక అధికారులు, మోడల్ స్కూ ల్ గర్ట్స్ హాస్టల్ కేర్ వార్డెన్లు పాల్గొన్నారు. -
బాధితులకు సత్వర న్యాయం చేయాలి
భైంసాటౌన్: పోలీస్స్టేషన్లను ఆశ్రయించే బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ జానకీ షర్మిల ఆదేశించారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా భైంసా సబ్ డివిజన్ పరిధిలోని పలు గ్రామాల నుంచి వచ్చిన 11మంది ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి ఎదుటే సంబంధిత పోలీస్స్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడి బాధితులకు చట్టపరంగా అవసరమైన సహాయాన్ని అందించాలని సూచించారు. అనంతరం భరోసా కేంద్రం చేస్తున్న కృషిని పరిశీలించారు. కుటుంబ సమస్యల పరిష్కారం కోసం కౌన్సిలింగ్ ద్వారా తిరిగి కలుసుకునేలా చేస్తున్నామని చెప్పారు. గత గ్రీవెన్స్లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కార స్థితి, పెండింగ్ ఫిర్యాదుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఏఎస్పీ రాజేశ్ మీనా ఉన్నారు. -
అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ
నిర్మల్చైన్గేట్: అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ అని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పే ర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ సంఘ భవనలో లూయిస్ బ్రెయిలీ 217వ జయంతిని మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లూయిస్ బ్రెయిలీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అ నంతరం జరిగిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. లూయిస్ బ్రెయిలీ భవిష్యత్ తరాల గురించి ఆలోచించి అంధ సమాజానికి సేవలందించాలని ఆలోచించారని కొనియాడారు. ఇది ఆయన నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సివిల్ జడ్జి రాధిక, నిర్మల్ మార్కె ట్ కమిటీ చైర్మన్ సోమ భీమారెడ్డి, రిటైర్డ్ పెన్షనర్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు లింగన్న పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి సైన్స్ఫెయిర్కు జిల్లా విద్యార్థులు
నిర్మల్ఖిల్లా: ఈ నెల 7నుంచి 9వరకు కామారెడ్డిలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సైన్స్ఫెయిర్, ఎగ్జిబిషన్కు జిల్లా నుంచి ఎంపికై న 55మంది ఇన్స్పెర్, సైన్స్ ఫెయిర్ ప్రాజెక్ట్లతో గైడ్ టీచర్, విద్యార్థులు బుధవారం వెళ్లారు. జిల్లా నుంచి 26 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపిక కాగా జిల్లా సైన్స్ అధికారి వినోద్కుమార్తో బృందం సభ్యులు బచ్చు శ్రీనివాస్, షేక్ రఫీక్ ఆధ్వర్యంలో 55మంది రాష్ట్రస్థాయి ప్రదర్శనకు బయలుదేరారు. విద్యార్థులు చక్కటి ప్రదర్శన కనబరిచి జిల్లాకు మంచి పేరు తేవాలని డీఈవో భోజన్న ఆకాంక్షించారు. -
అన్నదాతల పోరుబాట
నిర్మల్గోదావరికి మెస్రం వంశీయులు మెస్రం వంశీయులు కలమడుగు గోదావరినదికి చేరుకున్నారు. నాగోబా మహాపూజకు అవసరమైన పవిత్ర జలాలను హస్తినమడుగులో సేకరించి తిరుగుపయనమయ్యారు. విద్యార్థినికి సన్మానం నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో బాసర మండలం కిర్గుల్ (బీ) గ్రా మానికి చెందిన ముత్యాల మనోరంజని అండర్–17 కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికై ంది. దిలావర్పూర్ జెడ్పీహెచ్ఎస్లో తొమ్మిదోతరగతి చదువుతున్న మనోరంజ నిని బుధవారం ఎస్పీ జానకీ షర్మిల జిల్లా కేంద్రంలో సన్మానించారు. జాతీయస్థాయిలోనూ ఉత్తమ ప్రతిభ చాటాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఖానాపూర్/కడెం: సదర్మాట్ ప్రత్యేక కాలువ కోసం ఆయకట్టు రైతులు పోరుబాట పట్టారు. జిల్లాలోని మామడ మండలం పొన్కల్ సమీపంలో గోదావరినదిపై నిర్మించిన సదర్మాట్ బ్యారేజీ నుంచి ఖానాపూర్ మండలం మేడంపల్లి సదర్మాట్ పాత ఆనకట్ట వరకు ఏడు కిలోమీటర్ల మేర ప్రత్యేక కెనాల్ నిర్మించాలనే డిమాండ్ ఎన్నో ఏళ్లుగా ఉంది. సదర్మాట్ ప్రత్యేక కెనాల్ ఏర్పాటు చేస్తామని గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఖానాపూర్ బహిరంగ సభలో ప్రకటించారు. అయినా నేటికీ ప్రత్యేక కాలువ ఏర్పాటు దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రత్యేక కాలువ కోసం పాలకులు తగినచర్యలు చేపట్టకపోవడంతో సదర్మాట్ బ్యారేజీ ప్రారంభానికి సిద్ధమైన నేపథ్యంలో రైతులు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. గతంలో ఈ విషయమై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక గేటుతో పాటు ప్రత్యేక కాలువ ఏర్పాటు చేయాలని ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. సదర్మాట్ బ్యారేజీఖానాపూర్, కడెం మండలాల్లోని 13వేల ఎకరాలకు సదర్మాట్ ద్వారా సాగునీరందుతుంది. కాలువకు నీరు విడుదల చేసినా చివరి ఆయకట్టు వరకు సక్రమంగా చేరకపోవడంతో ఏటా పంటలు ఎండిపోయే దుస్థితి ఎదురవుతోంది. ఇటీవల నిర్మించిన మినీ బ్యారేజీకి 1.58 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం ఉంది. బ్యారేజీకి 55 గేట్లు ఏర్పాటు చేసినప్పటికీ ఆయకట్టుకు నీటిని విడుదల చేసేందుకు ప్రత్యేక గేటు ఏర్పాటు చేయలేదు. గేటు ఏర్పాటు చేయనప్పటికీ కనీసం ప్రత్యేక కాలువ ఏర్పాటు చేస్తేనైనా పంటలకు పుష్కలంగా సాగునీరందుతుందని రైతులు చెబుతున్నారు. కాలువ ఏర్పాటు చేయకపోతే గోదావరి నీరు వృథా అయ్యే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు. ఏటా ఎండుతున్న రైతన్నల పంటలు -
రోస్టర్ పాయింట్లతో మాలలకు నష్టం
నిర్మల్టౌన్: రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ బిల్లు, రోస్టర్ పాయింట్లతో మాలలకు తీవ్ర నష్టం జరిగిందని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని బుధవార్పేట్లో మాల సంక్షేమ సంఘ భవనంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోస్టర్ పాయింట్లతో మాలలకు తీవ్ర అన్యాయం జరిగిందని, మాల సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు దీనిపై స్పందించాలన్నారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో రోస్టర్ విధానంలోని లోపాలపై చర్చించాలని కోరుతూ.. మాల సామాజికవర్గం ఎదుర్కొంటున్న అన్యాయాలపై గళమెత్తిన ఎమ్మెల్యే నాగరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో జిల్లా నాయకులు కుంటోళ్ల స్వామి, ఎలమల రాజేశ్వర్, పురుషోత్తం, లక్ష్మణ్, దొంగరి లింగం, ఏలమల ముత్తన్న, గంగాధర్, ప్రభాకర్, బత్తుల చిన్నయ్య, తదితరులు పాల్గొన్నారు. -
ఫోన్ పోతే ఆందోళన వద్దు
నిర్మల్టౌన్: మొబైల్ ఫోన్ పోతే ఆందోళన చెందొద్దని, పోలీస్స్టేషన్లో లేదా మీ సేవ ద్వారా ఫిర్యాదు చెయ్యాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు.https://www.ceir.gov. in/ వెబ్ పోర్టల్ ద్వారా ఫోన్ ఆచూకీ తెలుసుకోవడం చాలా సులభమన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలువురు పోగొట్టుకున్న రూ.9.96 లక్షల విలువైన 83 ఫోన్లను జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో బాధితులకు మంగళవారం అందజేశారు. మార్కెట్లో చౌకగా వస్తుందని, సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనే ముందు సీఈఐఆర్ వెబ్సైట్లో ఆ ఫోన్ ఐఎంఈఐ నంబర్ నమోదు చేసి చెక్ చేసుకోవాలని సూచించారు. టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొత్తగా ప్రవేశ పెట్టిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటి రిజిస్టర్(సీఈఐఆర్) అప్లికేషన్ పోయిన ఫోన్ను వెతికి పెట్టడానికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,910 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించామని తెలిపారు. -
చైనా మాంజా ప్రమాదకరం
సారంగపూర్: సంక్రాంతి పండుగ సందర్భంగా ఎగురవేసే గాలిపటాలకు చైనా మాంజా వినియోగించడం ప్రమాదకరమని సారంగాపూర్ డిప్యూటీ రేంజ్ అధికారి నజీర్ఖాన్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు చైనా మాంజాతో కలిగే అనర్థాలను, ప్రమాదాలను వివరించారు. గాలి పటాలు ఎగురవేసేందుకు వినియోగించే చైనా మాంజా కనిపించని పదునైన కత్తిలాంటిదన్నారు. దీనిని గాజుముక్కలు, ఇంకా కొన్ని రసాయనాలు వినియోగించి తయారు చేయడంతో అది భూమిలో కలిసినా తొందరగా పాడవని లక్షణం కలిగి ఉంటుందని తెలిపారు. ద్విచక్రవాహనదారులు, అలాగే ఆకాశంలో స్వేచ్ఛగా విహరించే పక్షులకు ప్రాణాంతకంగా మారుతుందని తెలిపారు. గాలిపటాలు ఎగురవేసే సమయంలో రోడ్డుకు ఈదారం అడ్డుగా ఉంటే ఆదారిలో ప్రయాణించే ద్విచక్రవాహనచోదకుల మెడకు చుట్టుకుని ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. గాలి పటాలకు సాధారణ కాటన్ దారాన్ని మాత్రమే వినియోగించాలని సూచించారు. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తే సమీప పోలీస్టేషన్కు, లేదా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శంకర్, ఎఫ్ఎస్వో రషీద్, ఎఫ్బీఓలు సుజాత, వెన్నెల, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆమెకు ఎస్టీ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారు..
కుభీర్: మండలంలోని పల్సి గ్రామానికి చెందిన బీసీ మహిళ అయిన ద్యావరి సత్తెమ్మకు పంచాయతీ ఎన్నికల సమయంలో ఎస్టీ సర్టిఫికెట్ జారీ చేశారు. దీంతో సత్తెమ్మ సర్పంచ్గా పోటీచేసి విజయం సాధించారు. అయితే గ్రామానికి చెందిన కొందరు గిరిజనులు సత్తెమ్మకు ఎస్టీ సర్టిఫికెట్ జారీ చేయడంపై తహసీల్దార్ శివరాజ్ను నిలదీశారు. గ్రామంలో ఎస్టీ కుటుంబం ఒక్కటే ఉందని ఆందోళనకారులు తెలిపారు. సత్తెమ్మ ఎస్టీ కాదని, 2019 ఎన్నికల్లో ఆమె బీసీ రిజర్వుడు వార్డు నుంచి పోటీ చేసి గెలిచారని తెలిపారు. ఎస్కేఎస్లో కూడా బీసీ అని ఉందని తెలిపారు. సత్తెమ్మ ఎస్టీ సర్టిఫికెట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆధారాలతో కూడిన ఫిర్యాదును అందజేశారు. తహసీల్దార్ శివరాజ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో హడావుడిగా సర్టిఫికెట్లు జారీ చేశామన్నారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని గ్రామస్తులకు సూచించారు. దీంతో గ్రామస్తులు తాము కలెక్టర్తోపాటు, ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఫిర్యాదు చేసినవారిలో నాయకులు రాజు, పి.రవికుమార్, విలాస్, మాజీ ఎంపీటీసీ తోట రాములు ఉన్నారు. -
సర్కారు భూములు స్వాహా..!
ముధోల్ సీఐగా రవీందర్ ముధోల్ : ముధోల్ సీఐగా బి.రవీందర్ బాధ్యతలు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సీఐగా పనిచేసిన మల్లేశ్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నిర్మల్ నుంచి రవీందర్ ముధోల్కు బదిలీపై వచ్చారు. నూతన సీఐకి పోలీసులు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్తప్పులు లేని ఓటర్ జాబితా సిద్ధం చేయాలి నిర్మల్టౌన్: నిర్మల్ మున్సిపాలిటీలోని 42 వార్డుల్లో రూపొందించిన ముసాయిదా జాబితాలో తప్పులను సవరించి తప్పులు లేని తుది జాబితా సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులకు సూచించారు. మున్సిపల్ కార్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేశారు. కార్యాలయంలోని గదులను పరిశీలించారు. ఓటరు ముసాయిదా జాబితాలో ప్రజల నుంచి ఎన్ని అభ్యంతరాలు వచ్చాయి, వాటిని ఏ విధంగా పరిష్కరిస్తున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈనెల 10వ తేదీలోగా తుది జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్ ఉన్నారు. నిర్మల్: జిల్లాలో సర్కారు భూములు మాయమవుతున్నాయి. ఎకరాలకొద్దీ ఉన్న భూములన్నీ బడాబాబుల కబ్జాల్లోకి వెళ్లిపోతున్నాయి. పట్టణాల్లోనే కాదు.. పల్లెల్లోనూ అసైన్డ్, లావోణి, ప్రభుత్వ భూములను దొడ్డిదారిన చెరబడుతున్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు, పేదలకు ఇళ్లస్థలాల కోసం కేటాయిద్దామంటే ఎక్కడా ఎకరా స్థలం దొరకడం లేదు. సాక్షాత్తు జిల్లాకేంద్రంలోనే ప్రభుత్వ భూములు ఎకరాల కొద్దీ కబ్జారాయుళ్ల చేతుల్లోకి వెళ్లడం గమనార్హం. రాజకీయ అండదండలతో సర్కారు భూముల స్వాహాకార్యాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఏది చేద్దామన్నా.. భూమిలేదు.. జిల్లా ఏర్పడి పదేళ్లు కావస్తోంది. ఇప్పటికీ జిల్లాలో ఒక్క స్టేడియం కూడా లేదు. అందుకు స్థలం కూడా అందుబాటులో లేదు. పోనీ.. చిన్నగా ఇండోర్ స్టేడియం కట్టాలన్నా.. ప్రభుత్వ భూమి దొరకడం లేదు. సరైన స్థలం లేక.. మెడికల్, నర్సింగ్ కాలేజీలను గుట్టలపై కడుతున్నారంటే నిర్మల్లో దుస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కోర్టు సముదాయం కోసం జిల్లాకేంద్రానికి దూరంగా సారంగపూర్ మండలంలో భూమిపూజ చేశారు. ఎందుకంటే.. జిల్లాకేంద్రంలో ఎక్కడా కోర్టు భవనానికి సరిపడా స్థలం దొరకలేదు. ప్రస్తుత కలెక్టరేట్ కూడా స్థానికం సరిపడా భూమి లేకనే ఊరికి దూరంగా పోయిందన్న వాదన ఉంది. సర్కారు భూమి ఏమైంది...!? ప్రతీ జిల్లాలో సర్కారుకు ఎకరాల కొద్ది భూములు ఉన్నాయి. నిర్మల్లో మాత్రం కేవలం తహసీల్ ఆఫీస్లోని రికార్డుల్లో మాత్రమే ఆ భూములున్నాయి. క్షేత్రస్థాయికి వెళ్లి సదరు సర్వే నంబర్లను పరిశీలిస్తే.. ఎవరో ఒకరు కబ్జాలో ఉండటం విస్తుగొల్పుతోంది. జిల్లాకేంద్రంలో పెద్ద సర్వే నంబర్గా చెప్పే 1309 మొత్తం కబ్జా చేశారు. అసైన్డ్, లావోణి, శిఖం, వక్ఫ్, ఇనామ్, దేవాదాయ.. ఇలా ఏ భూమి సర్వేనంబర్ చెప్పినా.. ఎవరో ఒకరు కబ్జా చేయడమో.. తనవాళ్ల పేరిట పట్టా చేయించుకోవడమో కనిపిస్తోంది. పల్లెభూములనూ వదలడం లేదు.. నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాలు, మండలకేంద్రాల్లో అంటే భూములకు డిమాండ్ ఉందని కబ్జాలు చేశారనుకుందాం. కానీ.. జిల్లాలో పల్లెల భూములనూ కబ్జారాయుళ్లు వదలడం లేదు. గ్రామాల్లోని లావోణి, ప్రభుత్వ భూములను ఆక్రమిస్తూ గజం జాగా లేకుండా చేస్తున్నారు. చాలా గ్రామాల్లో ఇప్పటికే చెరువులు, కుంటల భూములను మాయం చేశారు. ఇప్పుడు లావోణి, ప్రభుత్వ భూములను పట్టాలు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈవారంలోనే సారంగపూర్ మండలం నుంచి రెండు గ్రామాలు, నిర్మల్రూరల్, లక్ష్మణచాంద, సోన్ మండలాల్లో ఒక్కో గ్రామం నుంచి కలెక్టర్, మండలాల అధికారులకు భూఆక్రమణలపై ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులను పరిశీలిస్తాం.. ప్రభుత్వానికి సంబంధించిన భూములను కబ్జా చేస్తున్నారంటూ వస్తున్న ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం. సంబంధిత మండల అధికారుల ద్వారా వి వరాలు తెలుసుకుని తగు చర్యలు తీసుకుంటాం. – కిశోర్కుమార్, అడిషనల్ కలెక్టర్ఊరి భూమి కోసం.. సారంగపూర్ తహసీల్దార్కు ఫిర్యాదు చేస్తున్న వీరంతా మండలంలోని తాండ్ర(జి) గ్రామస్తులు. ఎందుకిలా.. ఊరుఊరంతా వచ్చారు..! ఏం ఫిర్యాదు చేస్తున్నారు..!? అంటే.. గ్రామంలో క్రీడాప్రాంగణానికి కేటాయించిన ప్రభుత్వ భూమి(లావోణి)ని ఓ వ్యక్తి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఊరి అవసరాల కోసం ఉన్న ఆ కాస్త భూమిని కూడా కబ్జా చేస్తే ఎలా అంటూ తాండ్ర(జి) గ్రామస్తులంతా మండలాఫీసుకు వచ్చారు. తమ గ్రామ భూములను కాపాడాలని తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. -
ముందస్తుగా ఇంటర్ హాల్టికెట్లు
లక్ష్మణచాంద: ఇంటర్ బోర్డు విద్యార్థులకు శుభవార్త చెప్పింది. హాల్టికెట్లలో తప్పుల సవరణకు అవకాశం కల్పించింది. ఈమేరకు విద్యార్థుల తల్లిదండ్రులకు ముందస్తుగా హాల్ టికెట్లు పంపనున్నారు. ఈ హాల్ టికెట్లలో ఏమైనా తప్పులు ఉంటే వెంటనే ఆయా కళాశాల ప్రిన్సిపల్కు సమాచారం ఇచ్చి సరిచేసుకోవచ్చు. అన్ని వివరాలు సర్దుబాటు ఇంటర్ బోర్డు కల్పించిన ఈ అవకాశంతో ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థులు తమ పేరు, తండ్రి పేరు, ఇంటి పేరు, జెండర్, పుట్టిన తేదీ, గ్రూపు, మీడియం వంటి వివరాలను సరి చేసుకోవచ్చు. ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థుల తల్లిదండ్రులకు వాట్సాప్ ద్వారా ఇంటర్ బోర్డు అధికారులు మెసేజ్లు పంపారు. ఈ మెసేజ్లో విద్యార్థి 10వ తరగతి హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేస్తే ప్రీ హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన హాల్ టికెట్లో తప్పులు ఉంటే వెంటనే కళాశాల ప్రిన్సిపల్ ద్వారా జిల్లా నోడల్ అధికారికి పంపాలి. అక్కడి నుంచి ఇంటర్ బోర్డుకు సమాచారం చేర్చి తప్పులు సరిచేస్తారని అధికారులు తెలిపారు. జిల్లాలో 7,069 మందికి ప్రయోజనం జిల్లా 19 మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు 69 ఉన్నాయి. వీటిలో 7,069 మంది విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరం అభ్యసిస్తున్నారు. ఈ అవకాశంతో అందరూ ప్రయోజనం పొందనున్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్ బోర్డు అధికారులు సూచిస్తున్నారు. తొలగనున్న ఇబ్బందులు.. గతంలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులు మీడియం, గ్రూపు, పుట్టిన తేదీ, పేరు, తండ్రి పేరు వంటి వివరాలు సరిచేయాలంటే ఇంటర్ బోర్డుకు రుసుము చెల్లించాల్సి వచ్చేది. సరి చేయని విద్యార్థుల హాల్ టికెట్లలో తప్పులు రావడంతో నష్టపోయేవారు. ఇంటర్ పూర్తయిన తర్వాత బోర్డు చుట్టూ తిరగాల్సివచ్చేది. అవన్నీ తాజా అవకాశంతో తొలగనున్నాయి. విద్యార్థులు తమ వివరాలను జాగ్రత్తగా పరిశీలించి, తప్పులు ఉంటే ప్రిన్సిపాల్ ద్వారా జిల్లా ఇంటర్ నోడల్ అధికారి కార్యాలయానికి సమాచారం చేరవేయాలని అధికారులు పేర్కొన్నారు. జిల్లా సమాచారం... జిల్లాలో జూనియర్ కళాశాలలు 69 మొదటి సంవత్సరం విద్యార్థులు 7,069 -
గడువులోగా అభ్యంతరాలు సమర్పించాలి
నిర్మల్చైన్గేట్: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రూపొందించిన ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలను నిర్ణీత గడువులోగా సమర్పించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల పరిధిలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా తయారీ, అభ్యంతరాల స్వీకరణ, తుది జాబితా ప్రచురణ ప్రక్రియను వివరించారు. ఎన్నికల ప్రక్రియను పూర్తిస్థాయిలో పారదర్శకంగా, లోపాలు లేకుండా నిర్వహిస్తామన్నారు. మున్సిపాలిటీల వారీగా అభ్యంతరాలను సమీక్షించి, వాటిని నిబంధనల ప్రకారం పరిష్కరిస్తామన్నారు. ఈ నెల 9 వరకు అభ్యంతరాలు మున్సిపల్ కమిషనర్లకు లేదా జిల్లా అధికారులకు అందజేయాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10న పోలింగ్ స్టేషన్లవారీగా తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు, సమగ్ర ఓటరు జాబితా రూపొందించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. అంతకుముందు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటరు జాబితా, మ్యాపింగ్, వలస ఓటర్లు, చిరునామాలు తదితర అంశాలపై తమ అభ్యంతరాలు, సందేహాలను వ్యక్తం చేయగా అధికారులు నివృత్తి చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్గౌడ్, సుందర్ సింగ్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. నిర్మల్ ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి నిర్మల్ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లను ప్రారంభించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. నిర్మల్ ఉత్సవాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 19 నుంచి 23 వరకు నిర్మల్ ఉత్సవాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గతేడాది విజయవంతంగా నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందామని తెలిపారు. నిర్మల్ జిల్లా చరిత్ర, సాంస్కతిక వారసత్వాన్ని ఉత్సవాల వేదిక ద్వారా ప్రజలకు పరిచయం చేయగలిగామన్నారు. ఈ ఏడాది మరింత ఉత్సాహంతో, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్మల్ ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమాల నిర్వహణకు ఎన్టీఆర్ మినీ స్టేడియాన్ని సిద్ధం చేయాలని, సుందరీకరణ పనులు చేపట్టి మరుగుదొడ్లు, లైటింగ్ సదుపాయాలు కల్పించాలన్నారు. వాహనాల పార్కింగ్కు ప్రత్యేక స్థలం కేటాయించాలన్నారు. జిల్లాలోని పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఈవో భోజన్న, డీవైఎస్వో శ్రీకాంత్రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ నర్సయ్య, డీపీఆర్వో విష్ణువర్ధన్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, ఈడీఎం నదీమ్ పాల్గొన్నారు. -
గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు
బాసర: వచ్చే ఏడాది నిర్వహించే గోదావరి పుష్కరాల కోసం ప్రభుత్వం ఘాట్లు విస్తరించాలని నిర్ణయించింది. విస్తృతంగా ఏర్పాట్లు చేసేందుకు ఇప్పటినుంచి సన్నాహాలు చేపట్టారు. బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి పుష్కరాల సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఆ మేరకు స్నాన ఘాట్ల విస్తరణ, ప్రత్యేక సౌకర్యాల ఏర్పాటు, బారికేడింగ్, వాటర్ ప్రూఫ్ టెంట్లు, మహిళల కోసం ప్రత్యేక వసతులు కల్పించనున్నారు. ఈమేరకు తహసీల్దార్ పవన్చంద్ర, ఎంపీడీవో దేవేందర్రెడ్డి, ఎంపీవో గంగాసింగ్, గ్రామపంచాయతీ ఈవో ప్రసాద్గౌడ్ ఏర్పాట్లపై దృష్టి సారించారు. -
అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి
● ఎస్పీ జానకీషర్మిల నిర్మల్టౌన్: అర్జీదారుల నుంచి వచ్చిన సమస్యలను పోలీస్ అధికారులు వెంటనే పరిష్కరించాలని, సామాన్యులకు అండగా ఉండాలని ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల జిల్లా పోలీసులకు సూచించారు. కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలు తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సామాన్యులకు అండగా ఉండాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నాణ్యమైన పోలీసు వ్యవస్థను జిల్లా ప్రజలకు అందించడమే లక్ష్యమన్నారు. పోలీసుల సహాయం కావాలనుకునేవారు ఠాణాలో నిర్భయంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం తెలియజేయాలని సూచించారు. -
‘ప్రజా’ సమస్యలు పరిష్కరించాలి
నిర్మల్చైన్గేట్: ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వయంగా స్వీకరించారు. ముఖ్యంగా విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులు అధికంగా వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. శాఖలవారీగా ప్రణాళిక.. నూతన సంవత్సరంలో, శాఖలవారీగా ఏడాదిలో చేపట్టబోయే పనులకు సంబంధించి ప్రణాళికలు రూపొందించుకుని, లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయించాలని సూచించారు. మండల ప్రత్యేక అధికారులు ఇందుకు చొరవ చూపాలని పేర్కొన్నారు. ప్రభుత్వ వసతి గృహాలను ప్రత్యేక అధికారులు నిత్యం తనిఖీ చేయాలని తెలిపారు. పిల్లలకు వసతి గృహాల్లో కల్పిస్తున్న వసతులు, ఇతర వివరాలు ప్రత్యేకంగా రూపొందించిన యాప్లలో తప్పనిసరిగా పొందుపరచాలన్నారు. ప్రత్యేక అధికారులు వసతి గృహాలను తనిఖీ చేసినప్పుడు పదోతరగతి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ వారి అనుమానాలు, ఒత్తిడులను దూరం చేయాలన్నారు. జనవరి ఒకటి నుంచి ప్రారంభమైన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని ఈ నెల 31 తేదీ వరకు విజయవంతంగా కొనసాగించాలన్నారు. పోలీసు, కార్మిక, శిశు సంక్షేమ, తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, బాల కార్మికులను బంధ విముక్తులు చేయాలన్నారు. బాల కార్మికులను గుర్తిస్తే, 1098 బాలల సంరక్షణ హెల్ప్లైన్ నంబరుకు సమాచారం ఇచ్చేలా ప్రజల్లో అవగాహన కలిగించాలన్నారు. జిల్లాలో యూరియా పంపిణీలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే గోదావరి పుష్కరాలకు సంబంధించిన పుష్కర ఘాట్ల ఏర్పాట్ల గురించి, తహసీల్దార్లు నిర్దేశించిన ప్రొఫార్మాలో వివరాలు అందించాలన్నారు. అనంతరం ఎస్సీ విద్యార్థులకు అందించే ఉపకారవేతనాలకు సంబంధించి గోడ ప్రతులను ఆవిష్కరించారు. ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భూములు కోల్పోయినం.. ఆదుకోండి మేము మైసంపేట్(ధర్మజీపెట్) వాస్తవ్యులం. మాకు తాత ముత్తాతల నుంచి సంక్రమించిన రెవెన్యూ భూములు ఉన్నాయి. మా గ్రామచ్ని ఖాళీ చేయించడంతో మా పట్టాభుములు సాగుచేసుకోలేకపోతున్నాం. పంట వేస్తే వన్యప్రాణులు హానిచేస్తాయన్న భయం ఉంది. ప్రభుత్వం మైదానప్రాంతంలో భూమి ఇచ్చి ఆదుకోవాలి. – మైసం పెట్ (ధర్మజీపెట్) గ్రామస్తులు భీమన్నగుడి ఏర్పాటు చేయాలి.. మాది దిలావర్పూర్ మండలం మడేగాం గ్రామం. గతంలో మా ఊరికి భీమన్న దేవుని గుడి మంజూరు అయినట్టు అధికారులు తెలిపారు. కానీ ఇప్పటికీ గుడి నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. మా ఊరి భీమన్న గుడి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. – మడేగాం గ్రామస్తుడు -
తుది జాబితా
అభ్యంతరాలు పరిష్కరించాకే భైంసాటౌన్/నిర్మల్టౌన్/ ఖానాపూర్: ఓటరు ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా తెలపాలని భైంసా మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్, సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్, నిర్మల్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ సుందర్సింగ్ తెలిపారు. నిర్మల్, భైంసా మున్సిపల్ కార్యాలయాల్లో, ఖానాపూర్ ఎంపీడీవో కార్యాల యంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం వేర్వేరుగా సమావేశాలు నిర్వహించా రు. 2019 వార్డుల విభజన గెజిట్ ప్రకారమే ఓటరు ముసాయిదా జాబితా విడుదల చేశామన్నా రు. అభ్యంతరాలు ఉంటే మున్సిపల్ కార్యాలయంలోని గ్రీవెన్స్ విభాగంలో రాతపూర్వకంగా అందించాలన్నారు. ఇప్పటికే అభ్యంతరాల స్వీకరణ చేపట్టామ ని, క్షేత్రస్థాయిలో విచారణ సైతం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. వచ్చిన అభ్యంతరాలను గెజిట్తోపాటు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈనెల 10న ఓటరు తుది జాబితా ప్రకటిస్తామన్నారు. అనంతరం వివిధ రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. ఒక వార్డు ఓట్లు మరో వార్డులో నమోదు చేశారని మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేశ్చక్రవర్తి తెలిపారు. కొన్ని వార్డుల్లో కొందరి పేర్లు రెండు మూడుసార్లు నమోదు చేశారని వెల్లడించారు. అధికారుల అవగాహన లోపంతోనే గందరగోళం నెలకొందని ఆరోపించారు. జాబితా సవరించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో భైంసా డీఈఈ జాదవ్ సంతోష్, టీపీవో అనురాధ, తహసీల్దార్ ప్రవీణ్కుమార్, నాయకలు పాల్గొన్నారు. -
● ఎమ్మెల్యే పి.రామారావు పటేల్
వైద్య సమస్యలు పరిష్కరించాలి భైంసాటౌన్: ముధోల్ నియోజకవర్గంలో వైద్యరంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం తన వాణి వినిపించారు. భైంసాలో ఏరియా ఆస్పత్రిలో రెండు వెంటిలేటర్లు, 5 బేబీ వార్మ్ మెషీన్లు, మొబైల్ ఎక్స్రే వంటి ఆధునిక వైద్య పరికరాలున్నా.. వాటిని వినియోగంలోకి తేవడం లేదన్నారు. ఫలితంగా పేదలకు వైద్య సేవలందక, ప్రైవేట్కు వెళ్లి డబ్బులు వెచ్చిస్తున్నారని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ముధోల్లో 30 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచాయని, వెంటనే పూర్తి చేయాలన్నారు. బాసరకు 30 పడకల ఆస్పత్రి మంజూరు చేసినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. కుభీర్ పీహెచ్సీని 30 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేయాలని కోరారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని, బాసర ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టాలని విన్నవించారు. -
సమ సమాజ నిర్మాణంలో గురువులే కీలకం
నిర్మల్ రూరల్: సమ సమాజ నిర్మాణంలో గురువులే ముఖ్యమని, ఏ కాలంలోనైనా గురువుకు ప్రత్యామ్నాయం లేదని డీఈవో భోజన్న అన్నారు. డిసెంబర్లో ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులను డీఈఓ కార్యాలయంలో విద్యాశాఖ తరఫున సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడు తూ... ప్రస్తుత సమాజం గురువును చూసే దృష్టి కోణంలో మార్పు ఉందన్నారు. కానీ గురువుకు ఎప్పటికీ గౌరవం, ఆదరణ తగ్గదన్నారు. తాను డీఈవోగా ఎదగడానికి గురువులే కారణమని తెలిపారు. ఇందులో విద్యాశాఖ ఎస్ఓ లు, సమన్వయకర్తలు, వివిధ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్
నర్సాపూర్(జి): శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్ అన్నారు. మండలంలోని టెంబుర్ని గ్రామంలో సోమవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ధ్రువపత్రాలు సరిగా లేని 69 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరాలు, డ్రగ్స్ దుర్వినియోగం, రోడ్డు భద్రతా నియమాలు, డయల్ 100, సీసీ కెమెరాల ప్రాముఖ్యత వంటి విషయాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు, మోసాలకు లోనవకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. అనుమానాస్పద వ్యక్తుల కార్యకలాపాలు గమనించినప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాల ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. కార్యక్రమంలో నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ, స్థానిక ఎస్సై గణేశ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
పాక్పట్ల వీడీసీపై చర్య తీసుకోవాలి
నిర్మల్టౌన్: పాక్పట్ల వీడీసీ ఆగడాలు అరికట్టి వారిపై చర్యలు తీసుకోవాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్, వీడీసీ బాధితులు కోరారు. నిర్మల్ ప్రెస్ క్లబ్లో గ్రామం నుంచి బహిష్కరించిన నాలుగు దళిత కుటుంబాలతో కలిసి మాట్లాడారు. పాక్పట్ల గ్రామ శివారులో తమ తాత ముత్తాతల కాలం నుంచి తమ భూమిలో హనుమాన్ మందిరం ఉందన్నారు. అప్పటి వీడీసీ కోరిక మేరకు మందిర నిర్మాణానికి కూడా భూమి ఇచ్చామన్నారు. ఆ మందిరానికి వెళ్లడానికి మూడు ఫీట్ల దారి ఉండగా, 2014లో అప్పటి వీడీసీ సభ్యులు 9 ఫీట్ల దారి కావాలని అడిగారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న వీడీసీ సభ్యులు తమ అనుమతి లేకుండా 18 ఫీట్ల దారి తీశారని తెలిపారు. దీనిని అడ్డుకున్నందుకు తమనే దూషించారని, నాలుగు కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేశారని పేర్కొన్నారు. అంతేకాకుండా రూ.లక్ష జరిమానా కట్టాలని వేధిస్తున్నారని వివరించారు. గ్రామ బహిష్కరణ చేయడంతో గ్రామంలో ఎవరూ తమతో మాట్లాడడం లేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. అధికారులు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఇందులో బహిష్కరణకు గురైన బొర్ర శ్రీనివాస్, ముత్యం, గంగారం, నడిపి నర్సయ్య పాల్గొన్నారు. -
ఒక్కోరాయి పేర్చి.. రోడ్డుగా మార్చి..
పెంబి మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలు అయిన యాపలగూడ, రాంనగర్, వస్పల్లి, దోందారి, చాకిరేవు ప్రజలు మండల కేంద్రానికి చేరాలంటే వాగులు, ఒర్రెలు దాటాలి. ఎడ్ల బండ్లు, ద్విచక్ర వాహనాలు, కాలినడకన వెళ్తున్నారు. పంటలు అమ్ముకోవడానికి భారీ వాహనాలు తీసుకెళ్లడం కష్టం. దీనికి గిరిజనులంతా ఏకమై పరిష్కారం కనుగొన్నారు. ఎవరో వస్తారు ఏదో చేస్తారని చూడకుండా సొంత ఖర్చుతో రహదారి నిర్మించుకున్నారు. యాపలగూడ సమీపంలోని దోత్తి వాగులో ట్రాక్టర్లతో రాళ్లు పోశారు. తర్వాత ఒక్కోరాయి పేర్చి తాత్కాలిక రహదారి ఏర్పాటు చేసుకున్నారు. దోత్తి వాగుపై శాశ్వత వంతెన నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు. – పెంబి -
ఖానాపూర్కు డిగ్రీ కళాశాల కావాలి
ఖానాపూర్: ఖానాపూర్ పట్టణంతోపాటు నియోజకవర్గ పరిధిలోని విద్యారంగ సమస్యలను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సోమవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. నియోజకవర్గంలోని ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాల్లో ఏటా 2 వేల మంది విద్యార్థులు ఇంటర్ పూర్తి చేసుకుంటున్నారన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ఖానాపూర్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో చాలామంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని తెలిపారు. డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని కోరారు. ఖానాపూర్లోని మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, మహాత్మాజ్యోతిబాపూలే పాఠశాలకు సొంత భవనాలు మంజూరు చేయాలని విన్నవించారు. ఆదిలాబాద్ బీఈడీ కళాశాలలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలను నియమించాలన్నారు. సీఆర్టీలకు, దివ్యాంగ టీచర్లకు పేస్కేల్ అమలు చేయాలని విన్నవించారు. -
కుష్ఠు.. నియంత్రణ
నిర్మల్7భూకబ్జాను అడ్డుకోవాలి సారంగపూర్: మండల కేంద్రంలోని అంబేడ్కర్ కాలనీలో 142 నుంచి 147వరకు గల సర్వే నంబర్లలో ప్రభుత్వం పంపిణీ చేసిన నివేశఽ స్థలాలను కొంతమంది కబ్జా చేస్తున్నారని వా టిని పరిరక్షించాలని తహసీల్దార్ సంధ్యారాణికి కాలనీవాసులు సోమవారం వినతిపత్రం అందజేశారు. అయితే ఇదివరకే భూమిని పరిశీలించామని సదరు భూమిపై ఎవరికీ హక్కులు లేవని ఆభూమి ప్రభుత్వానిదేనని గుర్తించినట్లు తహసీల్దార్ తెలిపారు. సదరు భూమిని కబ్జా చేయకుండా తగిన చర్యలు చేపడుతామని తెలుపడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఎవరైనా భూమిని ఆక్రమిస్తే చట్టరీత్యా చెర్యలు తీసుకుంటామని బోర్డు ఏర్పాటు చేయించారు. అనంతరం ఇదివరకు గుడిసెలు వేసుకుని కబ్జాకు యత్నించిన వారికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీటీ రవీందర్, ఎంఆర్ఐ నర్సయ్య, జీపీవోలు, గ్రామపంచాయతీ సిబ్బంది పాలొన్నారు. నిర్మల్చైన్గేట్: జిల్లాలో కుష్ఠు విస్తరిస్తోంది. గతనెల 18 నుంచి 31 వనకు నిర్వహించిన సర్వేలో 444 మంది అనుమానితులను గుర్తించారు. వైద్య ఆరోగ్యశాఖ లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్(ఎల్సీడీసీ) సర్వేను నిర్వహించింది. ఆశ వర్కర్లు ఇంటింటికీ వెళ్లి శరీరంపై ఉన్న నల్ల, తెల్ల, గోధుమరంగు మచ్చలు, స్పర్శలేని మచ్చలను పరిశీలించారు. 444 మందికి లెప్రసీ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వారందరినీ పూర్తిస్థాయిలోపరీక్షలను నిర్వహించి ఎంతమందికి వ్యాధి ఉందో తేల్చనున్నారు. అయితే ఐదేళ్లుగా వ్యాధిగ్రస్తుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. బాధితులకు చికిత్స ఇలా.. జిల్లాలో ఉన్న కుష్ఠు వ్యాధి బాధితులకు బహుళ ఔషధ పద్దతిన (మల్టీ డ్రగ్ థెరఫీ–ఎండీటీ) చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 55 మంది వరకు వ్యాధిగ్రస్తులు ఉన్నారు. బాధితులకు జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఉన్న కుష్ఠు వ్యాధి విభాగంలో ఎండీటీ పద్ధతిన చికిత్స అందిస్తున్నారు. వ్యాధిని పూర్తిస్థాయిలో నిర్మూలించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2017 సంవత్సరం నుంచి ఎల్సీడీసీ సర్వే ద్వారా వ్యాధి లక్షణాలను ఉన్నవారిని గుర్తిస్తుంది. వ్యాధి నిర్ధారణ అయిన వారికి మల్టీడ్రగ్ థెరఫీ చికిత్స చేయిస్తోంది. సర్వేతో జిల్లాలో కుష్ణు బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. రానున్న రోజుల్లో జిల్లాను కుష్ఠు రహిత జిల్లాగా మార్చాలన్న లక్ష్యంగా వైద్య ఆరోగ్యశాఖ ముందుకు సాగుతోంది. కుష్ఠు లక్షణాలు.. కుష్ఠువ్యాధి అనేది మైక్రోబ్యాక్టీరియం లెప్రో అనే బ్యాక్టీరియాతో వచ్చే దీర్ఘకాలిక వ్యాధి. ఇది ప్రధానంగా ఏ వయసు వారికై నా సోకే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి నరాలు, చర్మం, ముక్కు ద్వారా ఎగువ శ్వాసనాళాలపై ప్రభావం చూపుతుంది. చర్మంపై ఎర్రని, గోధుమరంగు(పాలిపోయిన, స్పర్శలేని మచ్చలు) ఉంటే కుష్టువ్యాధి లక్షణాలుగా గుర్తించాలి. ఎల్సీడీసీ సర్వే వివరాలు సర్వే జరిగిన తేదీలు: 2025, మార్చి17 నుంచి 30 వరకు సర్వే చేసిన ఇళ్లు 1,82,343 పరీక్షలు నిర్వహించిన వారి సంఖ్య 7,93,731 అనుమానితులు 513 పాజిటివ్ తేలినవి 8 సర్వే జరిగిన తేదీలు: 2025, డిసెంబర్ 18 నుంచి 31 వరకు సర్వే చేసిన ఇళ్లు 20,782 పరీక్షలు నిర్వహించినవారి సంఖ్య 77,648 అనుమానితులు 444 పాజిటివ్గా తేలినవి 8 ప్రస్తుతం జిల్లాలో యాక్టివ్ కేసులు 55 క్రమం తప్పకుండా మందులు.. శరీరంపై ఎర్రని, తెల్లని, స్పర్శ లేని గోధుమరంగు మచ్చలు ఉంటే వైద్యారోగ్య శాఖ సిబ్బందికి చూపించాలి. వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే జిల్లా కేంద్రంలోని లెప్రసీ కేంద్రంలో ఉచిత చికిత్స చేయించుకోవాలి. క్రమంతప్పకుండా మందులు వాడాలి. – డాక్టర్ రాజేందర్, డీఎంహెచ్వో -
ఎంపీ సుడిగాలి పర్యటన
ఖానాపూర్: పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ సోమవారం సుడిగాలి పర్యటన చేశారు. రాజూరా, చందునాయక్తండా, సింగాపూర్, ఎక్బాల్పూర్, సుర్జాపూర్ గ్రామాల్లో జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్తో కలిసి పర్యటించారు. బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచులను సన్మానించారు. అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలో పలువురు నాయకులు బీజేపీలో చేరారు. కార్యక్రమాల్లో నాయకులు, సర్పంచులు ఆకుల శ్రీనివాస్, అంకం మహేందర్, పుప్పాల ఉపేందర్, కీర్తి మనోజ్, మల్లేశ్యాదవ్, బక్కశెట్టి వెంకట్రాములు, రెడ్డి లక్ష్మి, పెట్టెం రాద, హేమ్లానాయక్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
ముదిరాజ్లు రాజకీయంగా ఎదగాలి
నిర్మల్టౌన్: ముదిరాజ్లు రాజకీయంగా ఎదగాలని ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలో కొత్తగా ఎన్నికై న ముదిరాజ్ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించారు. ముది రాజ్లు శాసించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ముదిరాజ్లను బీసీ–ఏ గ్రూపులోకి మార్చడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాబోయే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ముదిరాజ్లు అధిక స్థానాల్లో గెలవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ సమన్వయ కమిటీ నాయకులు చొప్పరి శంకర్, మద్దెల సంతోష్, గుండ్లపల్లి శ్రీను, జగన్, బొజ్జ నారాయణ, శివయ్య, హరీశ్ తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీలకు స్పెషల్ ఫండ్
నిర్మల్చైన్గేట్: నిధులు లేక నీరసించిన పంచాయతీలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీపి కబురు అందించారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నేరుగా సర్పంచులకు అందిస్తామని ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్స్తో సంబంధం లేకుండా చిన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ఇస్తామన్నారు. సీఎం ప్రకటనతో కొత్తగా కొలువుదీరిన సర్పంచులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాలకవర్గాలు లేక.. పంచాయతీలకు రెండేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. పల్లెల్లో అభివృద్ధి కుంటుపడింది. చాలా గ్రామాలకు సరైన ఆదాయ వనరులు లేకపోవడంతో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. పాలకవర్గాలు కొలువుదీరాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి పంచాయతీల్లో నిధులు లేవు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలకు ఇచ్చిన విధంగానే పంచాయతీలకు సైతం సీఎం ఫండ్ నుంచి ప్రత్యేక అభివృద్ధి నిధులు ఇవ్వనున్నట్లు కొడంగల్ సభలో సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ నిధులు మంజూరైతే పంచాయతీల్లో అభివృద్ధి పనులకు అడుగుపడే అవకాశం ఉంది. ఎదురుచూస్తున్న సర్పంచులు.. జిల్లాలో పెద్ద పంచాయతీలు తప్ప మిగిలిన పంచాయతీల ఖజానాలో డబ్బులు లేవు. బాధ్యతలు చేపట్టే సమయంలో చాలా గ్రామాల్లో నిధులు లేకపోవడంతో సర్పంచులు పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడం, ఫర్నిచర్ కొనుగోలుకు కూడా సొంత డబ్బులు వెచ్చించారు. తాగునీటి పైప్లైన్ మరమ్మతులు, మోటార్ల నిర్వహణ, ట్రాక్టర్ల మరమ్మతుల కోసం నిధులు లేవు. ప్రత్యేక నిధులు వస్తే కొన్ని పనులు చేపట్టేందుకు అవకాశం ఉంది. ఈ నిధుల కోసం కొత్త సర్పంచులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రణాళికలు.. తీర్మానాలు ప్రత్యేక అభివృద్ధి నిధులతో పల్లెల్లో చేపట్టే పనులపై ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. ఇందు కోసం మూడు నెలల సమయం ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో అభివృద్ధి పనులపై సర్పంచులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కొత్త పాలకవర్గాలతో గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై చర్చించి తీర్మానాలు కూడా చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. జనాభా ప్రాతిపదికన గ్రామ పంచాయతీలు.. జనాభా గ్రామ పంచాయతీలు 500 లోపు 63 501–999లోపు 136 1000–1999లోపు 128 2000–2999 లోపు 46 3 వేలకుపైగా 27 -
కడెం ఆయకట్టు సస్యశ్యామలం
కడెం: యాసంగి పంటలకు సకాలంలో సాగునీరు అందించడంతో కడెం ఆయకట్టు సస్యశ్యామలం అవుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. కడెం ప్రాజెక్టు ఎడమ కాలువకు ఆదివారం సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు యాసంగి పంటలు వేసుకోవాలని సూచించారు. ప్రాజెక్టు మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.9.46 కోట్లు ఖర్చు చేసిందన్నారు. త్వరలో పూడిక తొలిగింపు పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. రోడ్డు మరమత్తులు చేపడతామని పేర్కొన్నారు. అనంతరం మండల కేంద్రంలో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ పనులను ప్రారంభించారు. మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన ఏఎంసీ డైరెక్టర్ లక్కవత్తుల నారాయణ సోదరుడు మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ భూషణ్, తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో సునీత, సర్పంచ్ దీకొండ విజయ్, ఉప సర్పంచ్ పిట్టల రాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లేశ్, ఇరిగేషన్, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు. సీఎం దృష్టికి ‘సదర్మాట్’ సమస్యలు.. ఖానాపూర్: సదర్మాట్ బ్యారేజీ నిర్మాణ పనులతోపాటు, ఆయకట్టు రైతుల సమస్యలను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. సదర్మాట్ ఆనకట్ట నుంచి యాసంగి పంటల సాగునీరు విడుదల చేశారు. రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. పడిగెల భూషణ్, మాజిద్, సత్యం, గుగ్లావత్ రాజునాయక్, దయానంద్, వెంకట్రాములు, ఆకుల వెంకాగౌడ్, జంగిలి శంకర్ పాల్గొన్నారు. -
పరాజయమే గురువు
నిర్మల్టౌన్: ఏటా సివిల్స్ కోసం లక్షల మంది ప్రిపేర్ అవుతారు. పరీక్షలకు హాజరవుతారు. కానీ, వందల మందికి మాత్రమే అవకాశం దక్కుతుంది. కొందరికి మొదటి ప్రయత్నంలోనే అవకాశం దక్కగా కొందరు మూడునాలుగుసార్లు ప్రయత్నిస్తారు. నిర్మల్ ఎస్డీపీవోగా నియమితులైన పత్తిపాక సాయికిరణ్ కూడా మూడో ప్రయత్నంలో ఐపీ ఎస్ సాధించారు. రెండుసార్లు ఓడినా కుంగిపోలేదు. ఓటమిని విజయానికి సోపానంగా మలు చుకుని విజయానికి బాటలు వేసుకున్నారు. 2023లో ఐపీఎస్గా ఎంపికయ్యారు. సాయికిరణ్ స్వగ్రామం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామం. ఈ నెల 25న నిర్మల్లో ఏఎస్పీగా చేరారు. సబ్ డివిజనల్ కార్యాలయంలో శనివారం ’సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘పరాజయం గురువు‘ అనే సూత్రాన్ని అమలు చేసిన సాయికిరణ్, కష్టపడి ప్రయత్నించినవారిని ఉత్తేజపరుస్తున్నారు. సివిల్స్ విఫలమైనా, పోలీస్ సర్వీస్లో బాధ్యతలు చేపట్టి సేవ చేయడం ఆయన ధైర్యానికి చిహ్నం. ఇలాంటి కథలు యువతకు కొత్త ఆశలు నింపుతాయి. సాయికిరణ్ ప్రస్థానం ఆయన మాటల్లో.. హైదరాబాద్లోని సీబీఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశా. తర్వాత కాలికట్ ఐఐఎంలో ఎంబీఏ చదివా.. సివిల్స్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగా. ఈ మేరకు సమయంతో నిమిత్తం లేకుండా.. రోజుకు 8 గంటలు చదువుకే కేటాయించా. అవగాహన పెంచుకుంటూ.. సివిల్స్ కు ప్రిపేర్ అయ్యాను. అత్యవసరం అనుకున్న సందర్భాల్లో శిక్షణ కేంద్రాలకు వెళ్లాను. అంతేకాకుండా అప్పటికే సివిల్స్లో విజయం సాధించిన వారిని సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకున్నాను. తొలిసారి సివిల్స్ రాసి ఫెయిల్ అయ్యాను. రెండో ప్రయత్నంలో 2 మార్కులతో తుది జాబితాలో చోటు కోల్పోయాను. అయినా నిరాశ చెందలేదు. ప్రయత్నాన్ని ఆపలేదు. మూడోసారి పట్టుదలతో ఇష్టంగా చదువుతూ.. ఎలాగైనా ర్యాంక్ సాధించాలనుకున్నా. ఈ ప్రయత్నంలో ప్రిలిమ్స్, మెయిన్స్తోపాటు, ఇంటర్వ్యూలోనూ విజయం సాధించి ఐపీఎస్గా ఎంపికయ్యాను. యువతకు మీరు ఇచ్చే సందేశం చదువుతున్నప్పుడు ప్రతీ విషయంపై ఒక ఒపీనియన్ ఏర్పర్చుకోవాలి. ఆలోచించి ప్రతీ విషయాన్ని చర్చించాలి. దానికి టైంలిమిట్ ఏం పెట్టుకోవద్దు. ఆన్లైన్ రిసోర్స్ను సద్వినియోగం చేసుకోవాలి. సిలబస్ను డివైడ్ చేసుకొని, ప్రణాళికతో ప్రిపేర్ కావాలి. ప్రీవియస్ పేపర్స్ను సమగ్రంగా అర్థం చేసుకుని, ఎలా ఎంతవరకు చదవాలని ఐడియా తెచ్చుకుని చదవాలి. గతంలో సివిల్స్ రాసిన సీనియర్ల సలహాలు, సపోర్టుతో తప్పులు సరి చేసుకోవాలి. అలాగే మొదటి ప్రయత్నంలో రాకపోయినా నిరాశ పడకుండా.. ముందుకు వెళ్లాలి. ఇవన్నీ అంకితభావంతో చేస్తే విజయం వరిస్తుంది. నిర్మల్ ప్రజలకు ఏం చెప్తారు? నిర్మల్లో ముఖ్యంగా యువత గంజాయి, సైబర్ క్రైమ్పై అవగాహన పెంచుకోవాలి. కుల మత భేదం లేకుండా అందరూ కలిసి ఒకటిగా ఉండాలి. చదువుకునే వయసులో తప్పటడుగులు వేసి వారి జీవితాలను పాడు చేసుకోవద్దు. నిర్మల్లో ప్రశాంత వాతావరణంలో ఉంచేందుకు ప్రయత్నిస్తాను. ఎవరికై నా ఏదైనా సమస్య వస్తే సంబంధిత పోలీస్ స్టేషన్లో సంప్రదించాలి. -
సత్వర న్యాయం అందాలి
నిర్మల్/సారంగపూర్: కోర్టుల్లో కేసులు పెండింగ్లో ఉండకుండా బాధితులకు సత్వర న్యాయం అందించేలా చూడాలని కోర్టుల బిల్డింగ్ కమిటీ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ అన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కె.సుజన, బిల్డింగ్ కమిటీ మెంబర్ జస్టిస్ నర్సింగ్రావు నందికొండలతో కలిసి, సారంగపూర్ మండలం మహిళాప్రాంగణం పక్కన నూతన కోర్టుల భవన సముదాయానికి ఆదివారం భూమి పూజ చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ లక్ష్మ ణ్ మాట్లాడుతూ చాలావిషయాలను న్యాయవ్యవస్థనే చూడాల్సి వస్తోందన్నారు. కోతులు, కుక్క ల వంటి సమస్యలనూ పట్టించుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. కొత్త కోర్టులు కావాలని కోరుకోవద్దని, కేసులు తగ్గుతూ చివరకు కోర్టులు మూసివేసే రోజులు రావాలని ఆకాంక్షించారు. జిల్లాలో మూడు ప్రధాన వ్యవస్థల్లో మహిళలు ఉండటం గర్వించదగ్గ విషయమన్నారు. కలెక్టర్గా అభిలాషఅభినవ్, జడ్జిగా శ్రీవాణి, ఎస్పీగా జానకీషర్మిల, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జీగానూ జస్టిస్ సుజన ఉండటం మహిళ ప్రగతి నిదర్శనమని వివరించారు. సంతోషకరమైన విషయం.. నిర్మల్లో నూతన కోర్టు భవనాల సముదాయ నిర్మాణ పనులు ప్రారంభించుకోవడం హర్షనీయమని జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజన అన్నారు. ముందుగా కోర్టు భవనాల నిర్మాణానికి సంబంధించిన భూమిపూజలో పాల్గొన్నారు. సహ న్యాయమూర్తులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. హైకోర్టు న్యాయమూర్తుల సహకారంతో.. జిల్లాలో ఇప్పటివరకు అరకొర వసతుల మధ్య కోర్టులు కొనసాగుతున్నాయని, నూతన భవనాల నిర్మాణానికి భూమిపూజ చేసుకోవడం సంతోషకరమైన విషయమని జిల్లా న్యాయమూర్తి శ్రీవాణి అన్నారు. హైకోర్టు న్యాయమూర్తుల సహకారంతోనే జిల్లాలో కోర్టు కాంప్లెక్స్ పూర్తవుతోందన్నారు. న్యాయవాదులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలి.. కోర్టు సముదాయ భవనం జిల్లాకేంద్రానికి కాస్త దూరంగా ఉన్నందున నూతన కోర్టు సముదాయానికి సమీపంలోనే న్యాయవాదులకూ ఇళ్లస్థలాలు కేటాయించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లూరి మల్లారెడ్డి కలెక్టర్ను కోరారు. కార్యక్రమంలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. న్యాయమూర్తులు ప్రశంసాపత్రాలను అందించారు. డీఎల్ఎస్ఏ జడ్జి రాధిక అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమాల్లో కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీషర్మిల, అడిషనల్ ఎస్పీలు సాయికిరణ్, రాజేశ్మీనా, ఉపేంద్రరెడ్డి, హైకోర్టు బార్అసోసియేషన్ అధ్యక్షుడు అన్ముల జగన్, నిర్మల్ బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. -
నిర్మల్
పొంచిఉన్న.. పొగమంచు అడవిలో వ్యూ లైన్స్ అడవుల్లో వన్యప్రాణులు రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. వన్యప్రాణులు మృతిచెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదాల నివారణకు వ్యూ లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ‘అడెల్లి’కి పోటెత్తిన భక్తులు సారంగపూర్: అడెల్లి శ్రీమహాపోచమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లాతోపాటు పొరుగు జిల్లాలైన నిజమాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్మల్: జిల్లా కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు రమేశ్ మూడురోజుల క్రితం ఉదయం ఎలక్ట్రిక్ స్కూటర్పై పాఠశాలకు బయలుదేరాడు. పొగమంచు కమ్ముకుని ఉండటంతో మెల్లగానే వెళ్తున్నాడు. మంజులాపూర్ దాటగానే వెనుక నుంచి మరో వాహనం వచ్చి ఢీకొట్టింది. దీంతో రమేశ్ కిందపడ్డాడు. అదృష్టవశాత్తు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. లేదంటే ప్రాణాలకే ప్రమాదంగా మారేది. ఈ ప్రమాదానికి పొగమంచే కారణం. ముందు వెళ్తున్న వాహనం కనిపించక ఇలా జరిగింది. ఐదు రోజులుగా జిల్లాను ఉదయం 10 గంటల వరకు పొగమంచు కమ్మేస్తోంది. దీంతో వాతావరణ శాఖ కూడా అలర్ట్ ప్రకటించింది. ప్రమాదాలతోపాటు అనారోగ్య సమస్యలూ పెరుగుతున్నాయి. బారెడు పొద్దెక్కినా.. వాతావరణ మార్పులతో కొన్నిరోజులుగా జిల్లా మంచుదుప్పటి కప్పుకున్నట్లుగా ఉంటోంది. ఉదయం 9 గంటలు దాటినా మంచుతెర తొలగిపోవడం లేదు. వేకువజామున ఎదురుగా ఉన్న వాహ నం కూడా కనిపించడం లేదు. జాతీయ రహదారులపై మసక వెలుతురుతో కూరగాయలు, పాలు తీసుకువచ్చేవారికి, ఆర్టీసీ, స్కూల్ బస్సులకు, భారీ వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. వృద్ధులకు ఇబ్బందులు.. చలికాలం చిన్నారులు, వృద్ధులకు కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ప్రధానంగా వృద్ధులకు పొగమంచు, చలి కారణంగా కఫం పెరుగుతుంది. ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ రవి, ఎండీ ఫిజీషియన్, నిర్మల్ పిల్లలను బయటకు పంపొద్దు.. ఈసీజన్లో ఇప్పటికే చలి కారణంగా చిన్నారులు జలుబు, దగ్గులతో ఇబ్బంది పడుతున్నారు. ఈ పొగమంచు వాతావరణం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. చిన్నపిల్లలను వీలైనంత వరకు బయటకు పంపించవద్దు. – డాక్టర్ స్వప్న, చిన్నపిల్లల వైద్యురాలు, నిర్మల్జాగ్రత్తలు తప్పనిసరి.. ‘ఆహా.. ఎంతబాగుంది. పచ్చని చెట్లు, చెరువులు, రోడ్లు అంతటా పొగమంచు కశ్మీరాన్ని తలపిస్తోంది కదా..’అని జిల్లావాసులు వేకువ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. కానీ.. ఆకట్టుకునే ఈ పొగమంచు ప్రమాదాల్లోనూ ముంచుతుంది. ఈ సీజన్లో ఇలాంటి వాతావరణంలో తగుజాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని అటు వైద్యులు, ఇటు అధికారులూ సూచిస్తున్నారు. -
చుట్టపు చూ‘పులే’..!
కోర్లోకి వెళ్లలేక.. కవ్వాల్ పులుల అభయారణ్యం పులుల ఆవాసంగా ఉంది. అన్ని అనుకూలతలున్న వందల ఎకరాల భూమి కోర్ పరిధిలోనే ఉంది. అయితే.. ఇప్పటికీ ఒక్క పులి కూడా ఆవాసమేర్పరుచుకోలేదు. ఏటా సీజన్లో అప్పుడప్పుడు వచ్చి వెళ్లడమే గాని పులులు ఇక్కడ స్థిరంగా ఉండడం లేదు. కోర్ ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. దీంతో అనేక సమస్యలు వస్తున్నాయి. అటవీ సమీపంలో భూములు ఉండడంతో స్థానికులకు కంటపడుతున్నాయి. మరోవైపు ప్రాణహిత, గోదావరి తీరాలతో పాటు వాగులు, వంకలు, దట్టమైన పొదల్లో ఉంటున్నాయి. అయితే.. ఇటీవల శ్రీరాంపూర్ ఆర్కే–8 పరిసర ప్రాంతంలో ఓ పులి కనిపించింది. భీమారం మండలం నరసింహాపురం బస్టాప్ సమీప వాగులో దాని పాదముద్రలను అటవీ అధికారులు గుర్తించారు. ఇదే తీరుగా నెలన్నరగా పులులు జిల్లాలో సంచరించాయి. గోదావరి తీరాలు, నీటి కుంటలు, వాగుల వెంట అడవుల్లో కలియదిరుగుతున్నాయి. అయితే.. ప్రాణహిత దాటి మహారాష్ట్ర నుంచి వస్తున్న పులులు జిల్లాలో స్థిర నివాసమేర్పరుచుకునే పరిస్థితులు కనిపించకపోవడంతో సుదూర ప్రాంతాలకు వెళ్తున్నాయి. కాగా, మళ్లీ ఆ పులులు తిరిగి జిల్లా అడవుల్లోకి వచ్చే అవకాశముందని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మహారాష్ట్ర నుంచి ఆవాసం, తోడు వెతుక్కుంటూ వచ్చిన వలస పులులు జిల్లాను విడిచివెళ్లాయి. ఇటీవల జిల్లా అడవుల్లోకి కొత్తగా వచ్చిన మూడు పులులు జిల్లా సరిహద్దులను దాటి పోయాయి. కొద్ది రోజులుగా చెన్నూరు, భీమారం, జైపూర్, శ్రీరాంపూర్ వరకు వచ్చిన ఓ మగ పులి పది రోజుల క్రితమే గోదావరి దాటి మంథని మీదుగా భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ వరకు వెళ్లింది. మరో పులి గోదావరి దాటి పెద్దపల్లి జిల్లాలో ప్రవేశించి మానేరు వాగు తీరం వెంబడి తిరుగుతోంది. సుల్తానాబాద్, కరీంనగర్ రూరల్, చొప్పదండి మండలాలు, పరిసర గ్రామ అటవీ ప్రాంతాల్లో సంచరిస్తోంది. ఇక జన్నారం డివిజన్లో సంచరించిన పులి ఇందన్పల్లి మీదుగా గోదావరి దాటి సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల సరిహద్దు అడవుల్లో తిరుగుతోంది. ఇలా.. కొత్తగా వచ్చిన మూడు పులులు ప్రస్తుతం జిల్లా దాటి వెళ్లిపోయాయి. ఈ పులులు మహారాష్ట్ర నుంచి తమ అనుకూల ఆవాసం కోసం వెతుక్కుంటూ వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుండడం గమనార్హం. మరోవైపు జిల్లాలోని లక్సెట్టిపేట, బెల్లంపల్లి డివిజన్ల మధ్య ర్యాలీ, గడ్పూర్, దేవాపూర్, తిర్యాణి అడవుల మధ్య మరో పులి సంచరిస్తోంది. అలాగే, వేమనపల్లి మండలం నీల్వాయి, ప్రాణహిత తీర అటవీ పరిసర ప్రాంతాల్లో మరో పులి తిరుగుతోంది. ఆవాసం, తోడు వెతుక్కుంటూ.. కొత్త పులులు జిల్లా అడవుల్లోకి ప్రవేశించగానే వాటి సంచారంపై అటవీ అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు వాటి కదలికలు తెలుసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం జిల్లా అడవుల్లో రెండు పులులు సంచరించిన విషయం తెలిసిందే. జిల్లాలో జాతీయ రహదారులు, బొగ్గు గనులు, ఓపెన్కాస్టులు, గోదావరి తీర ప్రాంతాలతో పాటు అడవుల్లో పులులు సంచరిస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి వలస వస్తున్న పులులకు ఇక్కడ అనుకూలమైతేనే ఆవాసం ఏర్పరుచుకుంటున్నాయి. ఇక్కడి అడవుల్లో పరిస్థితులు అనుకూలిస్తేనే కొంతకాలం ఉంటున్నాయి. లేకపోతే తిరిగి వెళ్లిపోతున్నాయి. ఈ క్రమంలో స్థానికులకు తారసపడుతున్నాయి. అలాగే, రైతుల పశువులపైనా దాడులు చేస్తున్నాయి. ఇటీవల సంచరించినవి రెండు మగ పులులుగా అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇవి తోడు కోసమే ఆడపులుల కోసం తిరుగుతున్నాయా? అనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు. ఏటా చలికాలంలో పులులు తోడు వెతుక్కునే అవకాశాలుంటాయని చెబుతున్నారు. -
ఖనాపూర్లో బీఆర్ఎస్ ఫిర్యాదు
ఖానాపూర్: పట్టణంలోని 12 వార్డుల్లోని బోగస్ ఓట్లను ఏరివేయాలని బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ కమిషనర్ సుందర్సింగ్కు ఫిర్యాదు చేశారు. నిబంధనలు పాటించకుండా అక్రమంగా ఓటర్లను చేర్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వినతిపత్రం ఇచ్చినవారిలో పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఖలీల్, ఖానాపూర్ మాజీ ఉపసర్పంచ్ సుమన్, నాయకులు సుమిత్, ఇర్ఫాన్, సతీశ్, వాహబ్, నసీర్, రవి, సొయబ్, రాజు, కళావతి, నవీన్ ఉన్నారు. -
అటవీ చట్టాలపై అవగాహన ఉండాలి
సారంగపూర్: అటవీ, వన్యప్రాణి సంరక్షణ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, వీటిని ఆచరణలో పెట్టేలా చూసుకోవాలని డెప్యూటీ రేంజ్ అధికారి నజీర్ఖాన్ అన్నారు. మండలంలోని జామ్ కేజీబీవీలో అటవీ, వన్యప్రాణి సంరక్షణ చట్టాలపై శనివారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతీ విద్యార్థి తప్పకుండా అటవీ సంరక్షణ, వణ్యప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వం రూపొందించిన వివిధ చట్టాలు తెలుసుకోవాలన్నారు. అడవుల సంరక్షణతో పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుందన్నారు. అడవులను రక్షించుకోవాలని తెలిపారు. అటవీ జంతువుల కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు రూపొందించిందన్నారు. కార్యక్రమంలో ఎస్ఓ అన్నపూర్ణ, ఎఫ్ఎస్ఓ రశీద్, ఎఫ్బీఓలు వెన్నెల, సుజాత, భూమేష్, గురుకులం సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
వ్యవసాయంలో డ్రోన్లపై అవగాహన
సారంగపూర్: మండలంలోని మలక్చించోలి గ్రామంలో ఆకిన్ అనలెటిక్స్ హైదరాబాద్ సేవాస్ఫూర్తి ఫౌండేషన్, జిల్లా వ్యవసాయ శా ఖల ఆధ్వర్యంలో డ్రోన్ ద్వారా పురుగుమందు ల పిచికారిపై రైతులకు శనివారం అవగాహన కల్పించారు. ఈసందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్, ఆకిన్ అనలెటిక్స్ చీఫ్ అకడమిక్ అధికారి రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరికరాల ప్రాముఖ్యత పెరిగిందన్నారు. డ్రోన్ ద్వారా ఎకరా పొలానికి 5 నుంచి 6 నిమిషాల వ్యవధిలో పురుగు మందులు, ఇతర మందులను పిచికారీ చేసుకునే సౌలభ్యం ఉందని తెలిపారు. రైతులు ఈ టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రాజెక్టు మేనేజర్ రత్నాకర్, డాక్టర్ రాజేంద్రప్రసాద్, మండల వ్యవసాయాధికారి వికార్అహ్మద్, స్థానిక సర్పంచ్ దాసరి విజయ, ఉపసర్పంచ్ జ్యోతి, వార్డు సభ్యుడు నవీన్ ఉన్నారు. -
● కట్టుబాట్లు, క్రమశిక్షణతో ముందుకు ● నాగోబాను స్మరిస్తూ ‘మెస్రం’ పాదయాత్ర ● గత నెల 30న కేస్లాపూర్లో ప్రారంభం ● హస్తినమడుగు దారిలో 145మంది వంశీయులు
పాదయాత్రలో మెస్రం వంశీయులు పూర్తిగా తెల్లని వస్త్రాలతోనే ముందుకు సాగుతారు. తలపాగా, చొక్కా, దోవతి/ప్యాంట్ అన్నీ శ్వేతవస్త్రాలే విని యోగిస్తారు. చెప్పులు లేకుండా రోజుకు 15 నుంచి 20 కిలోమీటర్లచొప్పున నడుస్తారు. ముందుగా నిర్దే శించిన ఎనిమిది గ్రామాల్లో మాత్రమే బస చేస్తారు. శాకాహారంతో కూడిన భోజనం స్వీకరిస్తారు. కల శం చేతబూనిన కటోడా పర్యవేక్షణలో, పర్దాన్ ముందుండగా వారిని మిగతా వారు అనుసరిస్తా రు. నాగోబాను స్మరిస్తూ అడుగులో అడుగేస్తారు. ఈ సారి ప్రధాన కటోడగా మెస్రం హన్మంతరావు, పర్దాన్గా దాదారావ్ వ్యవహరిస్తున్నారు. శనివారం డబోలి గ్రామానికి చేరుకున్నారు. -
ముసాయిదా మార్చాల్సిందే!
● ఈనెల 8 వరకూ అభ్యంతరాల స్వీకరణనిర్మల్: జిల్లాలో మూడు మున్సిపాలిటీల్లో ఓటరు ముసాయిదా జాబితాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని వార్డుల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల పేర్లే లేకపోవడం, వేరే వార్డులో రావడంపై మండిపడుతున్నారు. ఇదంతా కావాలనే చేశారంటూ పలు పార్టీల నాయకులు మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముసాయిదాలో ఓటర్ల మార్పుపై ఖానాపూర్లో బీఆర్ఎస్, నిర్మల్, భైంసాల్లో బీజేపీ నాయకులు ఫిర్యాదులు చేశారు. ఐదేళ్లక్రితం జాబితాకు ప్రస్తుత ఓటరులిస్టుకు ఏమాత్రం పొంతన లేదని ఆరోపించారు. మరోవైపు నాయకులు, ఆశావహులతోపాటు సామాన్య ఓటర్లూ తమ వార్డులు మారాయని, ఓట్లు రాలేవని మున్సిపాలిటీల్లో అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. ఎలా మారుతాయంటూ.. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల పరిధిలో ఓటు ఎక్కడ ఉన్నా.. పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ.. మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి సంబంధిత వార్డులోనే ఓటు ఉండాలి. అలా లేకపోవడం ఓటరు కన్నా.. పోటీచేసే ఆశావహులకు పెద్ద ఇబ్బందిగా మారుతుంది. తమ వార్డులో తమకు తెలిసినవారివి కాకుండా పక్కవార్డులు, గ్రామాల నుంచి ఓటర్లు ఉంటే తమకు ఓట్లు ఎలా వచ్చాయన్నదే వారి వాదన. నిర్మల్, ఖానాపూర్, భైంసాల్లో ముసాయిదాలో ఇదే జరిగింది. పక్క గ్రామాలతోపాటు భైంసాలోనైతే మహారాష్ట్రవాసుల ఓట్లూ ఉన్నట్లు అభ్యంతరాలు వస్తున్నాయి. మార్పులకు సన్నద్ధం.. మూడురోజులుగా ముసాయిదాపై వస్తున్న అభ్యంతరాలతో మున్సిపల్ అధికారులకు ఇప్పటికే ఓ స్పష్టత వచ్చింది. ఈమేరకు మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొంటున్నారు. కొన్నివార్డుల్లో ఏకంగా వందల్లో ఓట్లు పెరగడం, తగ్గడం, మార్పులు, చేర్పులు కావడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఇప్పటికే సంబంధిత అధికారులు మార్పులను చేపడుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ముసాయిదా జాబితాపై నిర్మల్లో 45, ఖానాపూర్లో 42, భైంసాలో 21 అభ్యంతరాలు వచ్చాయి. ఈనెల 8 వరకూ అభ్యంతరాలను స్వీకరించే అవకాశం ఉంది. 9న సరిచూసుకుని, 10న ఫైనల్ జాబితాను ప్రకటిస్తామని పేర్కొంటున్నారు. అభ్యంతరాలు పరిశీలిస్తున్నాం.. ఓటరు ముసాయిదాపై వస్తున్న అభ్యంతరాలను స్వీకరిస్తున్నాం. భారీగా అభ్యంతరాలు వస్తున్న వార్డులకు సంబంధించి ఇప్పటికే మార్పులు చేపడుతున్నాం. అభ్యంతరాలను సరిచూసుకున్న తర్వాతనే ఫైనల్ జాబితాలో పొందుపరుస్తాం. – జగదీశ్వర్గౌడ్, మున్సిపల్ కమిషనర్, నిర్మల్ -
నిబద్ధతతో విధులు నిర్వహించాలి
● ఎస్పీ జానకీషర్మిల నిర్మల్టౌన్: పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచేలా పోలీసులు విధులు మరింత నిబద్ధతతో నిర్వర్తించాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో ఏఆర్ కన్వర్షన్పై వచ్చిన 2013 బ్యాచ్ 7వ బెటాలియన్ కానిస్టేబుళ్లు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ నూతనంగా నియామకం పొందిన కానిస్టేబుళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, అంకిత భావం ముఖ్యమన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూ.. శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. -
మహిళా విద్యకు సావిత్రీబాయి పూలే కృషి
నిర్మల్చైన్గేట్: మహిళా విద్యకు సావిత్రీబాయి పూలే చేసిన సేవలు గొప్పవని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రీబాయి పూలే 195వ జయంతిని కలెక్టరేట్లో శనివారం ఘనంగా నిర్వహించారు. సావిత్రీబాయి పూలే చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయురాలు సావిత్రీబాయి పూలే అన్నారు. ఆంక్షలతో కూడిన నాటి సమాజంలోనూ తన భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో సావిత్రిబాయి చదువు నేర్చుకుని ఉపాధ్యాయురాలు అయ్యారని గుర్తు చేశారు. విద్యను అభ్యసిస్తేనే సీ్త్ర ఉన్నతి సాధ్యమవుతుందని గ్రహించిన సావిత్రిబాయి, సాటి మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో బాలికల పాఠశాలను ప్రారంభించారని వివరించారు. మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా కీర్తి గడించారన్నారు. అంటరానితనం, కులవివక్ష వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలనకు పూలే దంపతులు చేసిన పోరాటం, చూపిన తెగువ స్ఫూర్తిదాయకమన్నారు. జనవరి 3న మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమ గోడ ప్రతులు ఆవిష్కరించారు. టీజీఆర్ఎస్జేసీ సోఫీనగర్ విద్యార్థిని శ్రీజ తాను గీసిన కలెక్టర్ చిత్రపటాన్ని అందించారు. అంతర్జాతీయ ఆస్మిత ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపికైన కేజీవీబీ విద్యార్థిని నక్షత్రను అభినందించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రత్నకళ్యాణి, డీఈవో భోజన్న, బీసీ సంఘం నాయకులు డాక్టర్ ఉప్పు కృష్ణంరాజు, అధికారులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘం నాయకులు పాల్గొన్నారు. -
● నిర్మల్ చేరిన ఆధునిక ఇంజినీరింగ్ అద్భుతం ● జాకీలతో భవనం ఎత్తి తరలింపు
లిఫ్టింగ్.. షిఫ్టింగ్! నిర్మల్ఖిల్లా: నిర్మల్ పట్టణంలోని శాస్త్రినగర్లో ఓ ఇంటిని కూల్చకుండా 5 అడుగుల ఎత్తుకు లేపుతున్నారు. వర్షాకాలంలో వరద నీరు ఇంటిని ముంచెత్తుతుండడంతో యజమాని హర్యానా నుంచి నిపుణులను పిలిపించారు. హైడ్రాలిక్ జాక్లు, స్టీల్ ఫ్రేమ్లతో ఇంటిని లిఫ్ట్చేసే పనులు జరుగుతున్నాయి. భవన పునాదికి జాక్లు అమర్చి మిల్లీమీటర్ స్థాయిలో సమతుల్యత కాపాడుతూ పైకి ఎత్తుతున్నారు. గోడలు, స్తంభాలకు పగుళ్లు రాకుండా పరిశీలిస్తున్నారు. లిఫ్టింగ్లోముందుగా భవన నిర్మాణ బలాన్ని పరీక్షించి, లోపల ఉండే గోడలు, స్తంభాలు, ఫౌండేషన్ సామర్థ్యాన్ని ఇంజనీర్లు విశ్లేషించారు. తర్వాత దశలవారీ ఎత్తడం, షిఫ్టింగ్లో ట్రాక్లపై కదలిక, కొత్త పునాదిపై అమర్చడం, సేఫ్టీ టెస్టులు జరుగుతున్నాయి. పాత భవనాల చారిత్రక విలువను కాపాడుతూ వర్షాల ముప్పు నుంచి విముక్తి కల్పిస్తున్న ఈ సాంకేతికత జిల్లా కేంద్రాల్లోకి చేరడం గొప్ప పరిణామం. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇలాంటి పరిష్కారాలు పెరిగే అవకాశం ఉంది. స్థానికులు ‘ఇంటికి ప్రాణం పోసినట్టు‘ అంటూ ప్రశంసిస్తున్నారు. గతేడాది కురిసిన వర్షాలకు ఇల్లు మునిగిందని, మరో కాలనీలో తలదాచుకోవాల్సి వచ్చిందని యజమాని గుజ్జులవారి కిషన్ తెలిపారు. అందుకే ఐదు అడుగుల ఎత్తు పెంపునకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రూ.5 లక్షలతో ఇంటిని ఐదు అడుగులు పైకి ఎత్తినట్లు పేర్కొన్నారు. ‘ఏటా వర్షాకాలంలో ఇంట్లోకి వరద వస్తోంది. తమ కూతురు గర్భిణిగా ఉన్న సమయంలో ఇల్లు మునిగింది. అందుకే లిఫ్టింగ్ అవకాశం ఉందని తెలుసుకుని పనులు చేపట్టాం’ అని మరో ఇంటి యజమాని గంగిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. నేడు కోర్టు భవనానికి భూమిపూజ నిర్మల్ టౌన్: జిల్లా కేంద్రంలో ఫోక్సో, ఫ్యామిలీ కోర్టు భవన సముదాయం నిర్మాణానికి ఆదివారం భూమిపూజ చేయనున్నట్లు జిల్లా జడ్జి శ్రీవాణి తెలిపారు. హైకోర్టు జడ్జీలు సృజన, లక్ష్మణ్, నర్సింగ్రావుతోపాటు న్యాయవాదులు కార్యక్రమానికి హాజరవుతారని పేర్కొన్నారు. -
రేషన్ దుకాణాల తనిఖీ
ఖానాపూర్: పట్టణంలోని శాంతినగర్, విద్యానగర్, భర్కత్పుర్, అంబేడ్కర్నగర్, సుభాష్ నగర్తోపాటు మండలంలోని తర్లపాడ్ గ్రామానికి చెందిన రేషన్ దుకాణాలను టాస్క్ ఫోర్స్ డీఎస్పీ శేఖర్రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. ప్రతీ దుకాణాంలో లైసెన్స్, దుకాణం బోర్డులు అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీనెల సకాలంలో సరుకులు పంపిణీ చేయాలని సూచించారు. అన్ని కేంద్రాల్లో విధిగా శుభ్రత పాటించాలన్నారు. తనిఖీ సమయంలో మూసిఉన్న డీలర్లను హెచ్చరించారు. పలుచోట్ల 4 నుంచి 6 కిలోల బియ్యం తేడా వచ్చిందని డీలర్లు తెలిపారు. లబ్ధిదారులు బియ్యాన్ని అమ్ముకోవద్దని తెలిపారు. ఆయన వెంట ఇన్చార్జి ఎన్ఫోర్స్మెంట్ డీటీ కార్తీక్రెడ్డి ఉన్నారు. -
యూనివర్సిటీస్థాయి పోటీలకు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
బాసర: అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎంపికయ్యారు. ఆర్జీయూకేటీ విశ్వవిద్యాలయ స్థాయిలో నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీల్లో రాణించి జాతీయస్థాయికి అర్హత సాధించారు. ఈ పోటీలు ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి కేఎల్ యూనివర్సిటీలో జనవరి 3 నుంచి 6 వరకు నిర్వహిస్తారు. దేశంలోని ప్రము ఖ విశ్వవిద్యాలయాల క్రీడాకారులు ఇందులో పా ల్గొంటారు. జాతీయస్థాయికి ఎంపికై న యూనివర్సిటీ జట్టును ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ అభినందించారు. కార్యక్రమంలో, స్పోర్ట్స్ ఫ్యాకల్టీ ఇన్చార్జి రామకృష్ణ, ఫిజికల్ డైరెక్టర్స్ శ్యాంబాబు, రవికిరణ్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ వసంత, స్వప్న పాల్గొన్నారు. -
తప్పుల తడక!
‘మావార్డుకు ఏమాత్రం సంబంధంలేని 125 మంది ఓటర్లు వచ్చారు. వార్డులో ఉండాల్సిన 58 మందిని వేరే వార్డులో వేశారు. ఇలాగైతే ఎలా.. రేపు ఎన్నికల్లో ఇబ్బందిగా మారుతుంది. మొన్న పంచాయతీ ఎన్నికల్లో ఒకట్రెండు ఓట్లే గెలుపోటములను మార్చేశాయి. అధికారులు అభ్యంతరాలు తీసుకోవడమే కాకుండా పక్కాగా ఓటరు జాబితా ఉండేలా చూడాలి..’ అని జిల్లాకేంద్రంలోని ఓ వార్డు నుంచి పోటీచేసేందుకు సిద్ధమవుతున్న ఓ యువకుడి ఆవేదన. భైంసా పట్టణంలోని నాలుగో వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ చందూలాల్తోపాటు అతని కుటుంబీకులకు చెందిన దాదాపు మరో నాలుగు ఓట్లు ఏడో వార్డులో వేశారు. అంతేగాక, ఇదేవార్డులోని ఏపీనగర్కు చెందిన దాదాపు 292 మంది ఓటర్లను ఏడోవార్డులో వేసినట్లు గుర్తించారు. ఓవైసీనగర్, రాజీవ్నగర్, సుభాష్నగర్, శాస్త్రినగర్ కాలనీల ఓట్లు నాలుగోవార్డులో వేశారు. ఇదే వార్డులో నిజామాబాద్కు చెందిన అఫ్రోజ్ అనే ఓటరు పేరు ఉండడం విశేషం. కుంటాల మండలం ఓల, ముధోల్, టాక్లి, బీర్నంది, సోనాల, దేగాం, వాలేగాం, హథ్గాం గ్రామాల ఓటర్లు సైతం ఉన్నారు. ఏడో వార్డులో 1437 ఓట్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 600 ఓట్లు వేరే వార్డుల ఓట్లు ఉన్నట్లు ఆ వార్డు మాజీ కౌన్సిలర్ అనిత బాలాజీ తెలిపారు. నిర్మల్/భైంసాటౌన్: మున్సిపల్ అధికారులు విడుదల చేసిన ఓటరు ముసాయిదా జాబితా తప్పులతడకగా నెలకొంది. ఓ వార్డులోని ఓటర్లు మరో వార్డులో రాగా, కొన్ని వార్డుల్లో ఓ కాలనీకి చెందిన మొత్తం ఓట్లు వేరే వార్డులో పొందుపర్చినట్లు గుర్తించారు. ఇక, ఏకంగా ఇతర జిల్లా, ఇతర మున్సిపాలిటీల ఓటర్లు భైంసా పట్టణ ఓటరు ముసాయిదా జాబితాలో పొందుపర్చడం గమనార్హం. నిర్మల్, ఖా నాపూర్, భైంసా బల్దియాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఐదేళ్ల క్రితం తమవార్డులో ఉన్న ఓటర్లూ ఇతర వార్డులకు మార్చడంపై గల్లీనేతలు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. తమవార్డులకు సంబంధించి ఓటరు జాబితాలను చేతపట్టుకుని కూర్చున్నారు. జాబితాల్లో ఫొటోలు లేకపోవడంతో ఒక్కో ఓటరు పేరును సరిచూస్తున్నారు. అభ్యంతరం వ్యక్తంచేయాల్సిన వాటిని రాసి పెట్టుకుంటున్నారు. భారీగా మార్పులు, చేర్పులు..మున్సిపల్ ఓటరు ముసాయిదాల్లో మార్పులు చూ సి నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఐదేళ్లలో జాబితానే మారిపోయిందంటూ ఆరోపిస్తున్నారు. జాబితాలు చేతబట్టి..మున్సిపాలిటీలకు సంబంధించిన ఓటర్ జాబితా ముసాయిదా విడుదల కావడమే ఆలస్యం.. పోటీ చేయాలనుకునే ఆశావహులు తమ వార్డుల్లో ఉన్న ఓటర్ల పేర్లను గాలిస్తున్నారు. చాలా వార్డుల్లో పాత ఓటర్లు మారడం, కొత్త ఓటర్లు చేరడంతో కంగారు పడుతున్నారు. మార్పులు చేయాలంటూ అభ్యంతరాలు వ్యక్తంచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈనెల 4 వరకే అంటే.. కేవలం రెండురోజులే ముసాయిదాపై అభ్యంతరాలకు గడువు ఉండడంతో ఆశావహులు తమ అనుచరులందరికీ ఓటరు జాబితాల కాపీలను అప్పగించారు. ఒకటికి రెండుసార్లు సరిచూడటం, ఓటర్ల మార్పులను గుర్తించడం వంటి పనుల్లో వాళ్లు నిమగ్నమయ్యారు. తాము అనుకున్న దానికి భిన్నంగా ఓటరు ముసాయిదా రావడంతో ఖంగుతిన్న ఆశావహులు జాబితాలో మార్పులకు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. ఓటర్లూ చూసుకుంటున్నారు..తమ ఓటు ఏ గల్లీలో వచ్చిందోనని.. సాధారణ ఓటర్లూ ముసాయిదాను చెక్ చేసుకుంటున్నారు. మూడు మున్సిపాలిటీల్లో ఓటరు జాబితాల ముసాయిదాలను అందుబాటులో ఉంచారు. అక్కడ నేతలు, ఆశావహులతో పాటు సాధారణ ప్రజలూ వచ్చి తమ ఓటు ఉందా..లేదా.. అని గాలిస్తున్నారు. వార్డుల్లో మార్పులు, జాబితాలో పేర్లు లేకపోవడం తదితర విషయాలపై అభ్యంతరాలు తెలిపేందుకు వారూ సిద్ధమవుతున్నారు.బల్దియా ఓటర్లు.. 1,67,106జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు సంబంధించిన ఓటరు జాబితాల ముసాయిదాలను ఆయా మున్సిపల్ కమిషనర్లు విడుదల చేశా రు. నిర్మల్ మున్సిపాలిటీలో 42 వార్డుల్లో 98,295 మంది ఓటర్లు ఉండగా ఇందులో మహిళలు 50,878, పురుషులు 47,399, ఇతరులు 18మంది ఉన్నారు. భైంసాలో 26 వా ర్డుల్లో మొత్తం 51,118 మంది ఓటర్లలో మహిళలు 25,623, పురుషులు 25,486, ఇతరులు 9 మంది ఉన్నారు. ఖానాపూర్లో 12 వార్డుల్లో 17,693 మంది ఓటర్లుగానూ మహిళలు 9,169, పురుషులు 8,524 మంది ఓటర్లు ఉన్నారు. మూడు మున్సిపాలిటీల్లో కలిపి 1,67,106 మంది ఓటర్లు ఉన్నారు. -
సౌకర్యాలు కల్పించాలని జిల్లా ఇన్చార్జి మంత్రికి వినతి
నర్సాపూర్(జి): మండల కేంద్రంలోని 30 పడకల సామాజిక ఆస్పత్రిలో రెగ్యులర్ వైద్యులను నియమించాలని, సౌకర్యాలు మెరుగుపర్చాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎకై ్సజ్ శాఖ , జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు సర్పంచ్ ఇంద్రకరణ్ విన్నవించారు. హైదరాబాద్లోని మంత్రి కార్యాలయంలో శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. నిర్మల్, భైంసా పట్టణాలకు మధ్యలో ఉన్న నర్సాపూర్(జి) 61వ జాతీయ రహదారికి ఆనుకుని ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, క్షతగాత్రులను చికిత్స కోసం నిర్మల్, భైంసా ఆస్పత్రులకు తరలించడంతో వైద్యం ఆలస్యమవుతోందని వెల్లడించారు. 30 పడకల ఆస్పత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావు, నిర్మల్ ఏఎంసీ చైర్మన్ సోమ భీంరెడ్డి, నాయకులు ఉమామహేశ్వర్, అజీమ్, ఫారూక్ పాల్గొన్నారు. -
వుషూ క్రీడాకారులను అభినందించిన కలెక్టర్
నిర్మల్చైన్గేట్: వుషూ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన వూషూ ఫెడరేషన్ కప్ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబర్చిన జిల్లా విద్యార్థులను కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం కలెక్టరేట్లో అభినందించారు. విద్యార్థులకు పతకాలు అందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాక్షించా రు. విద్యార్థులు నర్వాడే రుద్ర, అబ్దుల్ రహ్మా న్, గోరా ఆనన్య డిసెంబర్ 24 నుంచి30వ తే దీ వరకు ఛత్తీస్గఢ్లో నిర్వహించిన పోటీల్లో కాంస్య పతకాలు సాధించారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీకాంత్రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ముక్కుతున్న దొడ్డు బియ్యం..!
భైంసాటౌన్: ప్రభుత్వం తెల్ల రేషన్కార్డు దారులకు గతేడాది ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. అంతకుముందు యూనిట్కు ఆరు కిలోల చొప్పున దొడ్డుబియ్యం అందించేది. అయితే, చాలామంది దొడ్డు బియ్యం తినకుండా విక్రయించుకునేవారు. దీంతో బియ్యం రీసైక్లింగ్ అయ్యేది. ఇది గుర్తించిన రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘పేదోడి కంచంలో సన్న బువ్వ’ పథకం కింద తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందిస్తోంది. దొడ్డు బియ్యం పంపిణీ నిలిచిపోవడంతో, ఎంఎల్ఎస్ పాయింట్లలో 364.643 మెట్రిక్ టన్నులు, ఎస్డబ్ల్యూసీ గోదాముల్లో 4338.431 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. దాదాపు పది నెలలకుపైగా బియ్యం సంచులు గోదాముల్లో నిల్వ ఉండడంతో ముక్కి పోయి బూజు పడుతున్నాయి. ప్రభుత్వం టెండర్ నిర్వహించేందుకు యత్నిస్తోందని, ప్రభుత్వం నుంచి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లయ్ డీఎం సుధాకర్ తెలిపారు. -
అంతర్జాతీయ పోటీలకు కేజీబీవీ విద్యార్థి
నిర్మల్ రూరల్: నిర్మల్ అర్బన్ కేజీబీవీ కళాశాలలో ఇంటర్ చదువుతున్న చాకలి నక్షత్ర కిక్ బాక్సింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి అంతర్జాతీయస్థాయి పోటీలకు ఎంపికైందని ఎస్వో సుజాత తెలిపారు. ఖేలో ఇండియా గేమ్స్లో భాగంగా ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన 65 కిలోల విభాగం పోటీల్లో నక్షత్ర ప్రతిభ కనబర్చి మూడోస్థానంలో నిలిచింది. కాంస్య పతకంతోపాటు రూ.4 వేల నగదు బహుమతి సాధించింది. మార్చి లో తమిళనాడులో నిర్వహించే అంతర్జాతీయ పోటీలకు ఎంపికై నట్లు ఎస్వో వివరించారు. ఉపాధ్యాయులు అభినందించారు. -
ప్రమాద రహితమే లక్ష్యంగా..
నిర్మల్టౌన్: దేశంలో డిజిటల్ పురోగతితోపాటు రోడ్లపై వాహనాలు విపరీతంగా పెరిగాయి. ప్రతీ వ్యక్తికి వాహనం అవసరంగా మారింది. కానీ అజా గ్రత్త, అతివేగంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా యువకులు ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నారు. మద్యం తాగి నడపడం, అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్తో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. 2025లో జిల్లాలో 568 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 154 మంది మరణించారు. 7,908 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. భద్రతా మాసోత్సవాలు ప్రారంభంప్రమాద రహితమే లక్ష్యంగా కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు జనవరి నెలను భద్రతా మాసంగా ప్రకటించాయి. శుక్రవా రం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మి ల, రవాణా శాఖ అధికారి దుర్గాప్రసాద్ మాసోత్స వ పోస్టర్లు ఆవిష్కరించారు. రవాణా కార్యాలయంలో సిబ్బందితో భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. జనవరి 31 వరకు అవగాహన.. రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా జనవరి 1 నుంచి 31 వరకు రవాణా–పోలీస్ శాఖలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాయి. జిల్లా–మండల కేంద్రాలు, జంక్షన్లు, పాఠశాలలు, కళాశాలల్లో ట్రాఫిక్ నియమాలు, మైనర్లు వాహనాలు నడపటం, డ్రంకెన్ డ్రైవింగ్పై ద్విచక్ర, ఆటో, కారు, లారీ డ్రైవర్లకు జాగ్రత్తలు చెబుతారు. ర్యాలీలు, సమావేశాలు ఏర్పాటు చేస్తారు.భద్రత ప్రతీ పౌరుని బాధ్యత రోడ్డు భద్రత పోలీసుల బాధ్యత మాత్రమే కాదు. ప్రతీ వాహనదారుడు, ప్రతీ పౌరుడు బాధ్యతగా వ్యవహరించినప్పుడే ప్రమాదాలు తగ్గుతాయి. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్, సిట్ బెల్ట్ పెట్టుకోకపోవడం కారణంగా జరుగుతున్నాయి. ఈ విషయంపై విద్యాసంస్థలు, గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడతాం. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ.. తమ ప్రాణాలతోపాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలి. – జానకీషర్మిల, ఎస్పీనిబంధనలు పాటించాలి జిల్లాలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఈనెల 1 నుంచి ప్రారంభమయ్యాయి. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. కారు నడిపే డ్రైవర్లు తప్పనిసరిగా సీట్బెల్ట్ పెట్టు కోవాలి. మద్యం తాగి, మొబైల్ మాట్లాడుతూ.. వాహనాలు నడపొద్దు, ఆటోలు, జీపుల్లో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లొద్దు. రోడ్డు భద్రత నిబంధనలు పాటించడం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చు. – దుర్గాప్రసాద్, జిల్లా రవాణా అధికారి -
కలెక్టర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు
నిర్మల్చైన్గేట్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కలెక్టర్ అభిలాష అభినవ్కు శుక్రవారం పలువురు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నోట్ పుస్తకాలు, పూల మొక్కలు, పుష్ప గుచ్ఛాలు అందించారు. కేక్లు కట్ చేశారు. పలు శాఖల, ఉద్యోగ సంఘాలకు చెందిన డైరీలు, క్యాలెండర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికా రులు, ఉద్యోగులు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అధికారులంతా ఉత్సాహంతో పనిచేస్తూ, జిల్లాను అన్నిరంగాలలో ముందు వరుసలో ఉంచాలన్నారు. కలెక్టర్కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, టీఎన్జీవో సంఘ నాయకులు, పలువురు మీడియా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కొత్తదనం కనిపించాలె..
నిర్మల్: 2026.. కొత్తసంవత్సరం.. కొంగొత్త ఆశలు.. సరికొత్త లక్ష్యాలు. కాలగమనంలో ఇలా ఎన్నో ఆంగ్ల సంవత్సరాలు మారినా.. ప్రతీసారి నయాసాల్ అంటే తెలియని ఉత్సాహం.. ఈ ఏడాదిలో కొత్తగా ఏదో సాధించేయాలన్న ఆరాటం.. ప్రతీ ఒక్కరిలో ఉంటుంది. అలాగే మన జిల్లాలోనూ మార్పులు తీసుకురావాలన్న ఆశలు కూడా అందరికీ ఉన్నట్లే పాలకులు, అధికారులకూ ఉంటాయి. జిల్లాను అన్నిరంగాల్లో సమప్రాధాన్యతతో అభివృద్ధి చేయాల్సిన గురుతర బాధ్యత వాళ్లపైనే ఉంటుంది. కొత్త ఏడాదిలో జిల్లాను అన్ని రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరమూ ఉంది. గతేడాదిలో కొన్నిరంగాల్లో దూసుకెళ్తే.. మరికొన్నింట్లో అంతంత మాత్రంగానే అభివృద్ధి కనిపించింది. గత లోపాలను అధిగమించి పురోభివృద్ధి వైపు పరుగులు పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ ఏడాదిలో ఇటీవలే గెలిచిన సర్పంచులతో పాటు స్థానిక సంస్థలకూ కొత్తపాలకవర్గాలు రానున్నాయి. ఈనేపథ్యంలో 2026లో జిల్లా కొత్తదనంతో ఉత్సాహంగా ముందుకు సాగాలని జిల్లావాసులు ఆకాంక్షిస్తున్నారు. అభివృద్ధికి అనుకూలం జిల్లాలో అభివృద్ధికి కావాల్సిన సానుకూల అంశాలు చాలా ఉన్నాయి. హైదరాబాద్–నాగ్పూర్ ప్రధా న మార్గమైన ఎన్హెచ్–44, మరోవైపు మహారాష్ట్రలోని కల్యాణ్ నుంచి పలు ప్రధాన నగరాల నుంచి జిల్లా మీదుగా జగిత్యాలవైపు వెళ్తున్న ఎన్హెచ్–61 రోడ్లకు కూడలిగా ఉంది. రోడ్డు, రవాణా విషయంలో ఇబ్బంది లేదు. ఈ నేపథ్యంలో ప్రజలు, రైతులకు ఇబ్బంది లేని, అలాగే అభివృద్ధికి ఉపయుక్తంగా ఉండే పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాల్సి న అవసరముందన్న వాదన కూడా ఉంది. విద్య, వైద్యం, వ్యవసాయం, అనుబంధ రంగాల్లో జిల్లా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రగతి సాధిస్తోంది. ఎప్పటి నుంచో ఆశిస్తున్న యూనివర్సిటీ, ఇంజినీరింగ్ కాలేజీలను జిల్లాకు తీసుకురావాల్సిన అవసరముంది. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలనూ జిల్లాకు తీసుకువస్తే ఉపాధి, ఉత్పత్తి పెరిగి రైతులకు మరింత లాభసాటిగా మారుతుంది. వేగం పెరగాలి బాసర నుంచి కడెం దాకా మొత్తం 19మండలాలతో నిర్మల్ జిల్లాగా ఏర్పడి పదేళ్లు కావస్తోంది. ఇప్పటి దాకా జిల్లా సాధించింది కొంతే. గతేడాదిలో పలు శాఖలు జాతీయస్థాయిలో జిల్లా అవార్డులు అందుకున్నా.. ఇంకా చాలారంగాల్లో పురోగతి అవసరం. కొత్త ఏడాదిలో అభివృద్ధిలో మరింత వేగం పుంజుకోవాలని జిల్లావాసులు ఆశిస్తున్నారు. మా రుమూల తండాలు, గూడేలకూ అభివృద్ధి ఫలాలు చేరాలి. ఇప్పటికీ జిల్లాలోని కడెం, పెంబి, ఖానాపూర్, సారంగపూర్, మామడ తదితర మండలాల్లోని గుట్ట, అటవీ ప్రాంతాల్లోని గ్రామాలు, తండాలు, గూడేలకు సరైన రోడ్డుమార్గాలు లేవు. చాలావరకు ఆదివాసీ గూడేల్లో కరెంట్ కూడా లేదన్న విషయాన్ని గుర్తించి, వారికి విద్యుత్ వెలుగులు అందించాల్సిన అవసరముంది. ఈ కొత్త సంవత్సరంలో సదర్మాట్ ప్రాజెక్ట్ అందుబాటులోకి రానుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద చేపట్టిన ప్యాకేజీల పనులను ఈ ఏడాదిలోనైనా వేగంగా పూర్తి చేసి, రైతాంగానికి మరింత దన్నుగా నిలవాలి. మనదైన ముద్ర ఉండాలి రాష్ట్రస్థాయిలో జిల్లా పేరు మార్మోగాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి జిల్లాలో రాజకీ య కేంద్రంగా ఉన్న నిర్మల్ ఇక ముందు రాష్ట్రస్థాయిలో తన పేరును చాటుకోవాలని జిల్లావాసులు తపిస్తున్నారు. ప్రధానంగా క్రీడారంగంలో జిల్లా చాలా వెనుకబడి ఉంది. ఇక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదగ గల క్రీడాకారులున్నా వారికి ప్రోత్సాహం కరువైంది. సరైన వసతులు లేక ఎంతోమంది క్రీడాకారులు వెలుగులోకి రాలేక ఆగిపోతున్నారు. నత్తనడకలో సాగుతున్న మినీస్టేడియాలను కొత్త ఏడాదిలో ప్రారంభించి క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వాలి. ప్రభుత్వ పథకాలను అమలు చేయడంతో పాటు అధికారులు వాటిని క్షేత్రస్థాయిలో వందశాతం అందేలా చూడాలని జిల్లాప్రజలు కోరుతున్నారు. ఇలా అన్ని రంగాల్లో.. అన్ని అంశాల్లో జిల్లా మేటిగా నిలవాలని ఆశిస్తున్నారు. ఇందుకు 2026 నుంచే ఆరంభం కావాలని ఆకాంక్షిస్తూ.. కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నారు. పర్యాటకంపై దృష్టి పెట్టాలి ఓరుగల్లును తలపించే నిర్మల్ గఢ్లు, రాంజీగోండు, గౌతమ బుద్ధుని శిష్యుల అడుగులు, మైమరిపించే కడెం ప్రాజెక్ట్ ప్రకృతి అందాలు, బాసర మొదలుకుని ఎన్నో ఆధ్యాత్మిక ప్రాంతాలు.. ఇలా పర్యాటక, చారిత్రక సొబగులను తనలో ఇముడ్చుకున్న జిల్లా మనది. దశాబ్దాల నాటి కట్టడాలు, అప్పటి నిర్మాణాలకు కొదవలేదిక్కడ. కేవలం ఉన్నవాటిని మెరుగులద్దుకుని అభివృద్ధి చేసుకుంటే సరిపోతుంది. గతంలో ప్రయత్నాలు చేసినా.. అవి మధ్యలోనే నిలిచిపోయాయి. కళ్లముందున్న ప్రకృతి అందాలు, కట్టడాలను అభివృద్ధి చేయాలని జిల్లావాసులు ఏళ్లుగా కోరుతూనే ఉన్నారు. ఇక ఈ కొత్త ఏడాదిలోనైనా జిల్లాలో పర్యాటక శోభ విరాజిల్లాలని ఆకాంక్షిస్తున్నారు. -
అన్నిరంగాల్లో అభివృద్ధే లక్ష్యం
గతేడాది పోలీసక్క, నారీశక్తి, టీమ్ శివంగి, గాంజాగస్తీలు చేపట్టాం. ఈ ఏడాదిలో ప్రధానంగా యువత పక్కదోవ పట్టకుండా ప్రత్యేక దృష్టి పెడతాం. గతేడాదిలో గంజాయి, మత్తుమందులపై సీరియస్గా వ్యవహరించాం. పెద్దమొత్తంలో గంజాయి పట్టుకోవడంతో పాటు మత్తుమందు ముఠాలనూ అరెస్ట్ చేశాం. డ్రగ్స్ తీసుకుని యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రాణాలూ తీసుకుంటున్నారు. కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. గాంజాగస్తీ ద్వారా యువత భవిష్యత్ను కాపాడాలన్న లక్ష్యంతో పోలీసుశాఖ పనిచేస్తోంది. డ్రంకెన్ డ్రైవ్పై సీరియస్ డ్రంకెన్ డ్రైవ్ కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొత్త సంవత్సరంలో దీనిపై సీరియస్గా దృష్టిపెడతాం. నిండు జీవితాలను నిలబెట్టేందుకు నిర్మల్ పోలీస్–మీపోలీస్ పేరిట మరిన్ని కార్యక్రమాలు చేపడతాం. శాంతిభద్రతలతో పాటు సైబర్, సామాజిక నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేలా కార్యక్రమాలు నిర్వహిస్తాం. ప్రజాభద్రతపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అర్హులందరికీ అందేలా కృషిచేస్తాం. గతేడాది బాలశక్తి, అ మ్మరక్షిత లాంటి వినూత్న కార్యక్రమాలను వి జయవంత చేశాం. జిల్లాకు జాతీయస్థాయిలో పేరురావడం సంతోషాన్నిచ్చింది. వివిధ రంగాల్లోనూ సాధించిన ప్రగతితో జాతీయస్థాయి పురస్కారాలు అందుకున్నాం. 2026 సంవత్స రంలోనూ కొత్త కార్యక్రమాలతో జిల్లా అభివృద్ధికి అన్ని రకాల పాటుపడతాం. ఈ ఏడాది వీటిపై ప్రత్యేకదృష్టి జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు పంపించాం. ఈ ఏడాది వాటిని అభివృద్ధి చేసి ప్రజలకు మంచి అనుభూతి ఇవ్వాలనుకుంటున్నాం. యువ త, విద్యార్థులకు కావాల్సి న క్రీడాభివృద్ధిలో భాగంగా కొత్త కార్యక్రమాలు, సైక్లింగ్ ర్యాలీ, టెన్నిస్కో ర్టులు ఏర్పాటు చేస్తాం. జిల్లాలో గతేడాది విజయవంతంగా నిర్వర్తించిన ‘నిర్మల్ ఉత్సవాలు’ జనవరిలోనే నిర్వహిస్తాం. జి ల్లాకేంద్రాన్ని సుందరీకరణ చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. ప్రభుత్వ కార్యక్రమాలన్నింటికీ జిల్లావాసుల సహకారం ఉండాలని కోరుతున్నాం. జిల్లావాసులకు కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది అందరికీ మంచి జరగాలని కోరుకున్నారు. కొత్తసంవత్సరం నేపథ్యంలో వారు ‘సాక్షి’తో ముచ్చటించారు. 2026లో చేపట్టనున్న పనులు, అనుకుంటున్న లక్ష్యాలు వారి మాటల్లోనే..అభిలాష అభినవ్, కలెక్టర్ -
ఆందోళన విరమణ
భైంసాటౌన్: పన్నెండు రోజులుగా ఆందోళన చేపట్టిన భైంసా మున్సిపల్ కార్మికులు బుధవారం విరమించారు. మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ అభిలాష అభినవ్ను కలిసి సమస్యలు విన్నవించారు. పరిష్కారానికి ఆమె హామీ ఇచ్చారు. జనవరి 1నుంచి మార్చి వరకు నెల కు రూ.2వేలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశా రు. ఏప్రిల్ 1నుంచి జీవో ప్రకారం వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని భైంసా మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో బుధవారం మున్సిపల్ అధికారులు కార్మికులకు ఉత్తర్వుల ప్రతి అందించారు. ఈ మేరకు కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ ఆందోళన విరమించారు. -
వుషూ పోటీల్లో ప్రతిభ
భైంసాటౌన్: ఛత్తీస్గఢ్లో వుషూ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గత నెల 24నుంచి 30వరకు నిర్వహించిన తొమ్మిదో జాతీయస్థాయి వుషూ పోటీల్లో జిల్లాలోని ఖేలో ఇండియా వుషూ కేంద్రం క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియ ర్ వుషూ ఫెడరేషన్ కప్ పోటీల్లో 12మంది పా ల్గొన్నారు. వీరిలో నర్వాడే రుద్ర, అబ్దుల్ రెహమాన్, గోరా అనన్య కాంస్య పతకాలు సాధించారు. వీరు వుషూ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈవో సోహైల్ అహ్మద్ చేతుల మీదుగా అందుకున్నట్లు వుషూ ఖేలో ఇండియా శిక్షణ కేంద్రం భైంసా ముఖ్య శిక్షకుడు శ్రీరాముల సాయికృష్ణ ఈ సందర్భంగా తెలిపారు. -
న్యూ జోష్..
ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని తాకాయి. 2025కు వీడ్కోలు.. 2026కు స్వాగతం అంటూ.. జనం బుధవారం అర్ధరాత్రి నుంచే కేక్లు కట్ చేశారు. పాత ఏడాది ముగింపు వేళ వీడ్కోలు పార్టీలు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన హోటళ్లు, ప్రధాన రహదారి వెంట స్టాళ్లు ఏర్పాటు చేసి రాత్రి వరకు నాన్వెజ్ స్నాక్స్, కేక్లు విక్రయించగా జనం ఎగబడి కొనుగోలు చేశారు. మద్యం ప్రియులతో వైన్స్షాపులు, బార్లు కిటకిటలాడాయి. చాలాచోట్ల డీజే పాటలు పెట్టుకుని పిల్లలు, యువత డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు పటాకులు కాల్చుతూ ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ.. కేరింతలు కొడుతూ డ్యాన్స్ చేశారు. అనంతరం కేక్లు కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. మరోవైపు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. – నిర్మల్టౌన్ -
నాణ్యమైన వైద్యం అందించాలి
నిర్మల్చైన్గేట్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేద ప్రజలకు కార్పొరేట్కు దీటుగా నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్యారోగ్య శాఖపై సమీక్షించారు. ఏడాదిగా జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రి, ప్రసూతి ఆస్పత్రి, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఉప కేంద్రాలు, అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు అందించిన వైద్యసేవల గురించి తెలుసుకున్నారు. ఇన్పేషెంట్, అవుట్ పేషెంట్ సేవలు, ఇతర సదుపాయాలు, ఆస్పత్రుల్లో కల్పించిన మౌలిక వసతులపై సమీక్షించారు. అనంతరం జిల్లా వైద్యకళాశాలపై క లెక్టర్ సమీక్ష నిర్వహించారు. వైద్యకళాశాలలో మొ దటి సంవత్సరం విద్యార్థులు 99 శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లోనూ మెరుగైన బోధన అందిస్తూ ఇలాంటి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. వైద్యకళాశాల, నర్సింగ్ కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పన పనులు పెండింగ్లో ఉంటే వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం గ్రామీణ ప్రజల కోసం వారి నివాస ప్రాంతాల్లోనే క్షయ వ్యాధిని గుర్తించే పోర్టబుల్ ఎక్స్రే యంత్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. యంత్రం పనితీరును అధికారులు కలెక్టర్కు వివరించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి రాజేందర్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, అధికారులు గోపాల్సింగ్, సరోజ, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. ‘పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తాం’ మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యమని కలెక్టర్ అభిలాష అభినవ్ పే ర్కొన్నారు. పోలింగ్ స్టేషన్ల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ ప్రక్రియపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీ ల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ స్టేషన్ల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితా జనవరి 1న సంబంధిత నోటీసు బోర్డులపై ప్రచురించనున్నట్లు తెలిపారు. జాబితాలో పేర్లు, చిరునామాలు లేదా ఇతర వివరాల్లో తప్పులు, అభ్యంతరాలుంటే నిబంధనల ప్రకారం సకాలంలో మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులకు తెలుపాలని సూచించారు. వారి ద్వారా వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తుది ఓటర్ల జాబితాను ఈ నెల 10న ప్రచురించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు, సమగ్ర ఓటర్ల జాబితా రూపొందించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహకారం అందించా లని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యా ణి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, వివిధ పార్టీల ప్రతినిధులు కోరిపల్లి శ్రావణ్రెడ్డి, అజంబిన్ యహీయా, రాము, సయ్యద్ హైదర్, నాందేడపు చిన్ను, భరత్విజయ్, మజార్, వినోద్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు. -
సంక్రాంతికి ‘భరోసా’!
నిర్మల్చైన్గేట్: జిల్లా రైతులకు రేవంత్రెడ్డి సర్కారు సంక్రాంతి కానుక ప్రకటించబోతోంది. యాసంగి సాగుకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా నిధులు వారి ఖాతాల్లో జమ చేయాలని ని ర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ, ఆర్థిక శాఖలు కసరత్తు చేస్తున్నాయి. ఇటీవలి సర్పంచ్ ఎన్నికల ఫ లితాలతో ఉత్సాహంగా ఉన్న ప్రభుత్వం.. రాబో యే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రైతులకు ఈ సాయాన్ని సకాలంలో అందించి సానుకూలతను మరింత పెంచుకోవాలని భావిస్తోంది. ఎన్నికల హామీ ఏమైంది? రైతులకు పెట్టబడి సాయం అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధుకు శ్రీకారం చుట్టింది. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా రైతులకు అండగా నిలిచింది. ఎకరా కు రూ.6వేల చొప్పున రెండు పంటలకు రూ.12వే ల పెట్టుబడి సాయం అందిస్తూ వచ్చింది. గత అ సెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే ఒ క్కో సీజన్కు ఎకరాకు రూ.7,500 ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. తీరా అధికారంలోకి వచ్చాక రైతుబంధు పేరును రైతు భరోసాగా మార్చి ఎకరాకు రూ.6వేలే ఇస్తోంది. పెరిగిన విత్తనాలు, ఎరువులు, పెట్టుబడితో రూ.6వేలు ఎటూ సరిపోవడం లేదు. ఈ ఖరీఫ్లో తొలుత ఎకరంలోపు ఆ తర్వాత ఎకరం, రెండెకరాలు, మూడు, నాలుగు, ఐదు ఆపైనా పరిమితి లేకుండా అందరికీ రైతు భరోసా అందించింది. పెట్టుబడి సాయం అందడంతో రైతులు ఖరీఫ్లో అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. అధిక వ ర్షాలతో పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయా రు. ఈసారి రబీ ఆదుకుంటుందని గంపెడాశతో ఉన్నారు. ఖరీఫ్లో పంటలు దెబ్బతిన్న కారణంగా చేతిలో చిల్లి గవ్వలేక పెట్టుబడి కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం రెండో విడత రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తే అప్పుల బాధ ఉండదని అభిప్రాయపడుతున్నారు. జిల్లా రైతులకు రూ.268.85కోట్లు! జిల్లాలో 1,88,597 మంది రైతులు పెట్టుబడి సాయానికి అర్హుత కలిగి ఉన్నారు. వీరందరికీ పెట్టుబడి సాయం కింద సుమారు రూ.268. 85 కోట్లు అవసరం ఉంది. ప్రభుత్వం ఈసారి పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. సాగులో ఉన్న భూములను కచ్చితంగా గుర్తించేందుకు వ్యవసాయశాఖ శాటిలైట్ సర్వేను ప్రాతిపదికగా తీసుకుంటోంది. వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఈ సర్వే విజయవంతమైంది. క్షేత్రస్థాయిలో ఏఈవోలు సాగు వివరాలు సేకరిస్తున్నారు. గతేడాది యాసంగి మాదిరిగానే ఈసారి కూడా అదే విస్తీర్ణంలో పంటలు సాగైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, సాగు లెక్కలతో సంబంధం లేకుండా సాగుకు యోగ్యమైన భూములన్నింటికీ సంక్రాంతిలోపే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ఖరీఫ్ రైతు భరోసా వివరాలు మండలం రైతుల సంఖ్య పొందిన సొమ్ము భైంసా 15,721 రూ.26,52,87,944 కుభీర్ 18,306 రూ.30,52,16,087 కుంటాల 8,186 రూ.13,18,81,741 దస్తూరాబాద్ 5,385 రూ.5,79,71,675 కడెం 11,750 రూ.14,24,94,612 ఖానాపూర్ 9,721 రూ.10,04,45,998 పెంబి 6,032 రూ.9,47,66,837 బాసర 6,793 రూ.11,35,78,013 లోకేశ్వరం 12,772 రూ.17,11,59,230 ముధోల్ 12,499 రూ.20,70,79,416 తానూర్ 15,588 రూ.26,40,92,246 దిలావర్పూర్ 6,962 రూ.9,28,60,943 నర్సాపూర్ (జీ) 7,487 రూ.10,23,01,284 సోన్ 7,577 రూ.8,55,12,709 లక్ష్మణచాంద 9,066 రూ.9,95,38,344 మామడ 10,947 రూ.14,80,91,078 నిర్మల్ రూరల్ 9,119 రూ.9,85,59,549 నిర్మల్ అర్బన్ 561 రూ.42,57,472 -
సదర్మాట్ త్వరగా పూర్తిచేయాలి
మామడ: సదర్మాట్ బ్యారేజీ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆ దేశించారు. పొన్కల్ గోదావరి వద్ద బ్యారేజీ పనులను మంగళవారం తనిఖీ చేశారు. నిర్మాణ పనుల వివరాలు అధికారులను అడిగి తె లుసుకున్నారు. మిగిలి ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. బ్యారేజీ విని యోగంలోకి వస్తే 18 వేల ఎకరాలకు సాగునీ రు అందుతుందని తెలిపారు. ఆయకట్టు రైతులకు అధికారులు బ్యారేజీ నిర్మాణం, ఆయక ట్టు వివరాలను మ్యాపుల ద్వారా వివరించా రు. స్థానిక రైతులతో కలెక్టర్ మాట్లాడి వివరా లు తెలుసుకున్నారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, తహసీల్దార్ శ్రీనివాస్రావు, ఎంపీడీవో సుశీల్రెడ్డి, నీటిపారుదలశాఖ అధికారులు ఉన్నారు. -
పెరిగిన కేసులు.. తగ్గిన నేరాలు
నిర్మల్/నిర్మల్టౌన్: జిల్లాలో గతేడాదితో పోలిస్తే 2025లో నేరాలు తగ్గినా కేసుల సంఖ్య మాత్రం పెరిగింది. ఈఏడాది రోడ్లు రక్తంతో తడిసిపోయాయి. గాంజాగస్తీ పేరిట చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలనిచ్చింది. ఇక పట్టపగలే చైన్స్నాచింగ్లు, చోరీలు జిల్లావాసులను కలవరపెట్టాయి. ఈఏడాది దొంగతనాలు భారీగా పెరిగాయి. చోరీ అయిన ఫోన్లను మాత్రం భారీగా పట్టుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే.. నెత్తురోడిన రోడ్లు.. ఈఏడాది జిల్లా రహదారులు రక్తమోడాయి. గతేడాది మొత్తం 390 ప్రమాదాల్లో 133 మంది చనిపోయారు. 2025లో ఏకంగా 568 రోడ్డుప్రమాదాలు జరిగాయి. అందులో ఏకంగా 154 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో చాలామంది మద్యం తాగి వాహనాలను నడపడంతో ప్రాణాలు కోల్పోయారు. గతేడాది 3,606 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కాగా, ఈఏడాది ఏకంగా 7,908 కేసులు నమోదుచేశారు. ప్రాణాలు కాపాడిన డయల్–100.. డయల్–100కు స్పందన పెరుగుతోంది. దీనివల్ల చాలామంది ప్రాణాలు కాపాడబడుతున్నాయి. ఈ సంవత్సరంలో మొత్తం 22,327 డయల్–100 కాల్స్ స్వీకరించారు. బాసర గోదావరి నది, జిల్లాకేంద్రంలోని చెరువుల్లో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లిన చాలామందిని డయల్–100ద్వారా వచ్చిన సమాచారంతో పోలీసులు రక్షించారు. సైబర్క్రైమ్పై అవగాహన.. ఈక్రమంలో 2023లో సైబర్ మోసాలపై 17 కేసులు కాగా, 2024లో 49 అయ్యాయి. ఈఏడాది 52కు పెరిగాయి. మాయమాటలతో ఈ కేసులన్నిటినీ కలి పి ఏకంగా రూ.3,90,93,168 కొట్టేశారు. ఇందులో కేసులు నమోదైన తర్వాత పోలీస్ శాఖ బ్యాంకర్ల సహకారంతో రూ.81,82,678 ఫ్రీజ్ చేయించారు. బాధితులకు రూ.30,27,035 తిరిగి ఇప్పించారు. కలవర పెట్టిన చైన్స్నాచింగ్లు, చోరీలు 2024, 2025లలో నమోదైన కేసుల వివరాలు.. కేసులు 2024 2025 మర్డర్లు 16 14 దొంగతనాలు 466 517 రేప్ కేసులు 39 41 కిడ్నాప్ కేసులు 34 41 అట్రాసిటీ 40 22 డ్రంక్ అండ్ డ్రైవ్ 3,606 7,908 రోడ్డుప్రమాదాలు 390 568 సైబర్ క్రైమ్ 49 52 ఆపరేషన్ స్మైల్ 136 123 సీఈఐఆర్ 1,081 1,806 ఈ–చలాన్ 1,47,968 1,80,429 జీవితఖైదు 07 02 -
టీ పోల్లో ఓటరు జాబితా
● ఎస్ఈసీ రాణి కుముదిని నిర్మల్చైన్గేట్: రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన టీ పోల్ నుంచి ఓటరు జాబితా డౌన్లోడ్ చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో హైదరాబాద్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఇందులో పాల్గొన్నారు. టీ పోల్ నుంచి ఓటర్ జాబితా డౌన్ లోడ్ చేసుకునే విధానంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చా రు. అనుమానాలు నివృత్తి చేశారు. రాష్ట్ర స్థాయిలో నోడల్ అధికారులు సహాయం చేస్తారన్నారు. ఈ జాబితా ఆధారంగా వార్డుల వారీగా కొత్త జాబితా సిద్ధం చేయాలన్నారు. బుధవారం సాయంత్రం 5 గంటలలోగా డ్రా ఫ్ట్ పబ్లికేషన్ చేసేందుకు పనులు చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో నిర్మల్, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్గౌడ్, సుందర్సింగ్ పాల్గొన్నారు. -
ఆర్జీయూకేటీలో అవగాహన సదస్సు
బాసర: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ)లో సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్(సీఐటీడీ) కరీంనగర్ విస్తరణ కేంద్రం సంయుక్తంగా ‘క్రాఫ్టింగ్ ది ఎంటర్ప్రెన్యూర్షిప్ మైండ్సెట్’ అనే అంశంతో అవగాహన సదసుస మంగళవారం నిర్వహించాయి. భారత ప్రభుత్వ ఎంఎస్ఎఈ మంత్రిత్వ శాఖ, డెవలప్మెంట్ కమిషనర్ సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో స్వయం ఉపాధి, ఆవిష్కరణలు, వ్యాపార ఆలోచనలపై దృష్టి సారించింది. నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ డెప్యూటీ డైరెక్టర్ అబ్దుల్ ఖాదర్ ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈ వ్యవస్థ, స్టార్టప్లకు అందే నిధులు, ఇంక్యుబేషన్ సౌకర్యాలు, సాంకేతిక సహాయం, మార్కెట్ అవకాశాల గురించి వివరించారు. పోటీతత్వ ప్రపంచంలో విజయం కోసం రిస్క్ తీసుకోవడం, నైపుణ్యాలు పెంపొందించుకోవడం అవసరమని తెలిపారు. వైస్ ఛాన్స్లర్ ప్రోత్సాహం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్ మాట్లాడుతూ, విద్యార్థులను ఉద్యోగ శోధకుల నుంచి ఉద్యోగ సృష్టికర్తలుగా మర్చడమే విశ్వవిద్యాలయ లక్ష్యమని తెలిపారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమాలకు అనుగుణంగా వ్యవస్థాపకతను అవలంబించాలని విద్యార్థులను ఉత్తేజపరిచారు. ఓఎస్డీ ప్రొఫెస్ మురళీదర్శన్ మాట్లాడుతూ విద్యా–పరిశ్రమల మధ్య అంతరాన్ని తణ్ణుపెట్టడంలో ఇటువంటి సహకారాలు కీలకమని ఉద్ఘాటించారు. సంస్థ స్థాపన, మూలధన సేకరణ, పారిశ్రామిక అనుభవాలపై దృష్టి సారించాలన్నారు. అసోసియేట్ డీన్ (ఇంజనీరింగ్) డాక్టర్ కె.మహేశ్ నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ ఎస్.విఠల్ (అసోసియేట్ డీన్, సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్), శేఖర్ శీలం (అసోసియేట్ డీన్, అకడమిక్స్), చరణ్ రెడ్డి (మెకానికల్ ఇంజనీరింగ్ హెడ్), రాహుల్ అన్పత్ (అసిస్టెంట్ ప్రొఫెసర్)తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ముగిసిన జిల్లాస్థాయి సైన్స్ఫేర్
నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో రెండు రోజులపాటు నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఫేర్, ఇన్స్పైర్ మానక్ పోటీలు మంగళవారం ముగిశాయి. చివరి రోజు ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి హాజరై విజేతలకు, రాష్ట్రస్థాయికి ఎంపికై న వారికి సర్టిఫికెట్లు, మెమొంటోలు అందజేశారు. జిల్లాస్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థులు వచ్చే నెల 7, 8 తేదీలలో కామారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఇందులో డీఈవో భోజన్న, సెక్టోరియల్ అధికారులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇన్స్పైర్ విభాగంలో రాష్ట్రస్థాయికి.. కులకర్ణి అరుణవ్(9వ, అల్ఫోర్స్ హైస్కూల్, నిర్మల్ ), రాథోడ్ కీర్తన (6వ, వాసవి హైస్కూల్, భైంసా), బైరి హర్షిక (9వ, పాత మద్దిపడగ హైస్కూల్ ), వంశీకృష్ణ (9వ, జెడ్పీహెచ్ఎస్, లింగాపూర్), జి.సునీత (9వ, ఖానాపూర్ ప్రభుత్వ పాఠశాల), పి.వంశీకృష్ణ (10వ, జెడ్పీహెచ్ఎస్, కోర్టికల్ బి), పల్లవి (7వ, జెడ్పీహెచ్ఎస్, బోసి), అశ్వంత్(9వ, జెడ్పీహెచ్ఎస్ బోసి), సంజీవని(7వ, ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్, నిర్మల్), కావేరి(8వ, జెడ్పీహెచ్ఎస్, కోతులుగాం), జోహార్ అంజుమ్(10వ, ప్రిన్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్, నిర్మల్), రక్షిత( 9వ, జెడ్పీహెచ్ఎస్, బీరవెల్లి) సెన్స్ఫేర్ పోటీల విజేతలు వీరే.. సీనియర్స్ విభాగంలో.. ఏ.రవి (10వ, జెడ్పీహెచ్ఎస్ పీచర), రామ్చరణ్ (10వ, జెడ్పీహెచ్ఎస్, లింగాపూర్), హర్ష మహేంద్ర(10వ, జెడ్పీహెచ్ఎస్, లింగాపూర్), విజయ్కుమార్(9వ జెడ్పీహెచ్ఎస్, వడ్యాల్), కె.నాగశ్రీ(8వ, ముధోల్ ఎంజేపీ), దివ్య(10వ, కుంటాల ఆదర్శ పాఠశాల), ముసిఫిరా మిరాజ్ (9వసెయింట్ థామస్ హైస్కూల్ నిర్మల్). జూనియర్స్ విభాగంలో.. అతిశయ (7వ, రవి హైస్కూల్ నిర్మల్ ), యశ్వంత్ (7వ, జెడ్పీహెచ్ఎస్, ముజిగి), షేక్ జయాన్ (8వ, హీరా మోడల్ స్కూల్ నిర్మల్), హసీబుద్దీన్ (8వ, వాసవి హైస్కూల్ నిర్మల్), జునేరా అంజుమ్(8వ, కుంటాల ఆదర్శ పాఠశాల), మదీనా(8వ, మొహమ్మద్ మహమ్మదీయ హైస్కూల్ నిర్మల్), శ్రేయ (8వ, సోఫీనగర్ గురుకుల పాఠశాల). -
ఎయిర్ ప్యూరిఫయర్ టవర్
మానవాళి ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య గాలి కాలుష్యం. దీనితో జీవరాశికి, పర్యావరణానికి హాని కలుగుతోంది. ఓజోన్ పొర సైతం దెబ్బ తింటుంది. ఈ గాలి కాలుష్యం ఎక్కువగా వాహనాల కారణంగా ఏర్పడుతుంది. దీనిని తగ్గించడానికి ఎయిర్ ప్యూరిఫయర్ టవర్ తయారు చేశారు. దీనిని ఎక్కువగా వాహనాలు తిరిగే ప్రదేశాలైన ట్రాఫిక్ సిగ్నల్ వద్ద లేదా ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయడం ద్వారా కాలుష్యం తగ్గించవచ్చు. ఓ అట్టముక్క, ఫైల్, ఎగ్జాస్ట్ ఫ్యాన్, బ్యాటరీ, ఫిల్టర్ కాటన్, కొబ్బరి పీచు తదితర పరికరాలతో దీనిని తయారు చేసి వివరించారు. – వైష్ణవి,( జడ్పీహెచ్ఎస్ ముధోల్) -
కిక్బాక్సింగ్లో మెరిసిన విద్యార్థిని
మామడ: చదువుతోపాటు క్రీడల్లోనూ నైపుణ్యాలు పెంచుకుని జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది మండలంలోని నల్దుర్తి గ్రామానికి చెందిన రేఖ–రమేశ్ దంపతుల కూతురు నక్షత్ర. జిల్లా కేంద్రంలోని కస్తూరి బాగాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కిక్బాక్సింగ్లో ప్రత్యేకంగా రాణిస్తుంది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో శనివారం జరిగిన ఖేలో ఇండియా కిక్బాక్సింగ్ వెస్ట్జోనల్ విభాగంలో మూడోస్థానంలో నిలిచి పతకం సాధించింది. 2024లో జార్కంఢ్, 2025లో మహారాష్ట్రలోని పూణేలో జరిగిన పోటీల్లో ప్రశంసాపత్రం అందుకుంది. ఖేలో ఇండియా పోటీల్లో బంగారు పతకం సాధించింది. దిలావర్పూర్ కేజీబీవీ విద్యార్థిని..దిలావర్పూర్: దిలావర్పూర్ కేజీబీవీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎం.అక్షయ కిక్ బాక్సింగ్ పోటీల్లో రెండో స్థానింలో నిలిచి వెండి పతకం గెలుచింది. ఎస్వో అపర్ణ అక్షయను అభినందించారు. -
అవసరం మేరకు యూరియా అందించాలి
నిర్మల్చైన్గేట్: రాష్ట్రంలో ప్రతీ రైతుకు పంటకు సరిపడా యూరియా తప్పనిసరిగా అందించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని, పంపిణీలో ఇబ్బందులు ఉండకూడదన్నారు. యూరియా బుకింగ్ కోసం, ఫర్టిలైజర్ బుకింగ్ అప్లికేషన్ త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. యూరియా పంపిణీలో ఇబ్బందులు ఉంటే రాష్ట్రస్థాయి హెల్ప్లైన్ నంబర్ 18005995779 ను సంప్రదించాలని సూచించారు. అనంతరం అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా కూడా యూరియా కొరత లేదని తెలిపారు. అందుబాటులో ఉన్న యూరియా మొత్తాన్ని, రైతుల అవసరాల మేరకు పంపిణీ చేయాలన్నారు.వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, ఉద్యానవన అధికారి రమణ పాల్గొన్నారు. -
వాటర్ వీల్తో విద్యుత్ ఉత్పత్తి
గతిశక్తి సహాయంతో కరెంటు ఉత్పత్తి చేసే విధానాన్ని వివరించారు. చిన్న తరహా పరిశ్రమలు, చిన్న కరెంటు గ్రిడ్లలో తక్కువ ఖర్చుతో కరెంటు ఉత్పత్తి చేసే విధానం ఆకట్టుకుంది. డీసీఎం, మోటార్ వాటర్ పంప్, ఎల్ఈడీ లైట్ పరికరాలతో కరెంటు ఉత్పత్తి చేసే విధానం వివరించారు. ఈ విధానం ద్వారా గృహ అవసరాల కోసం, పంట పొలాలు, చిన్నచిన్న కమ్యూనిటీలకు నీరు అందించవచ్చు. తక్కువ ఖర్చుతో ఎకో ఫ్రెండ్లీ ద్వారా గతిశక్తి ప్రయోగంతో విద్యుత్ తయారవుతుంది. – సాయిచరణ్, విఘ్నేష్(10వ తరగతి, మంజులాపూర్ హైస్కూల్) -
కొత్త ఆవిష్కరణలు చేయాలి
నిర్మల్ రూరల్: కొత్తకొత్త ఆవిష్కరణ చేస్తూ విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక సదస్సు(సైన్స్ఫేర్)ను డీఈవో భోజన్నతో కలిసి ప్రారంభించారు. సైన్స్ మన జీవితంలో భాగం అన్నారు. సైన్స్ వెనక సైంటిఫిక్ సూత్రం దాగిఉందన్నారు. వీటిని విద్యార్థులు గ్రహించి వినియోగించుకోవాలని సూచించారు. శాస్త్రవేత్తలు రూపొందించిన ప్రయోగాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. విద్యార్థులు దైనందిక జీవితంలో చేసే అంశాలపై ఆలోచన చేయాలన్నా రు. ఉపాధ్యాయులు, విద్యార్థులను ప్రయోగం వై పు తీసుకెళ్లాలని సూచించారు. విద్యార్థులలోని సృజనాత్మక నైపుణ్యాలను వెలికి తీయాలన్నారు. డీఈ వో భోజన్న మాట్లాడుతూ విద్యార్థులు మంచి ఆలో చన విధానం, క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలన్నారు. సైన్స్ఫేర్కు మొత్తం 843 ప్రదర్శనలు వచ్చాయన్నారు. ఇందులో 724 సైన్స్ ఫెయిర్ , 119 ఇన్స్పైర్కు వచ్చాయి. అనంతరం అదనపు కలెక్టర్, ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను పరిశీలించారు. ప్రారంభంలో సోఫీనగర్ గురుకులం, నిర్మల్ కేజీబీ వీ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి, జిల్లా సైన్స్ అధికారి వినోద్కుమార్, సెక్టోరియల్ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
డీ–28 మరమ్మతులకు వినతి
ఖానాపూర్: మండలంలోని రాజూరా, బావాపూర్(ఆర్), సింగాపూర్ గ్రామాల పరిధిలో సరస్వతి కాలువ డిస్టిబ్యూటరీ–28కు మరమ్మతులు చేపట్టాలని హైదరాబాద్ జలసౌధలో చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్కు విన్నవించారు. ఆయా గ్రామాల నాయకులు సీఈని సోమవారం కలిశారు. త్వరగా పనులు పూర్తిచేయించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో బాస చిన్నరాజేశ్వర్, పుప్పాల పవన్, ఎరికారి శంకర్, బొంగురాల ప్రభాకర్, పొలాస హరీశ్, పులి దేవర, చెవుల సాంబయ్య, ఎరికారి రెడ్డి, పటేల్ కండేరావు, తిరుపతి ఉన్నారు. -
ముక్కోటికి ముస్తాబు
నిర్మల్టౌన్: వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని జిల్లాలోని వైష్ణవాలయాలను అందంగా ముస్తాబు చేశారు. ఉదయం నుంచి భక్తులతో ఆలయాలు కిటకిటలాడనున్నాయి. పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున మంగళవారం ఉపవాసం ఉండి లక్ష్మీసమేతుడైన మహావిష్ణువుని భక్తితో పూజించి, రాత్రి జాగరణ చేస్తారు. ఈ మేరకు ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు, దేవాలయాలకు విద్యుత్ దీపాలు, పూలదండలతో అలంకరించారు. టెంట్లు వేసి మంచినీటి సౌకర్యం కల్పించారు. భక్తులకు సరిపడా లడ్డూ, పులిహోర ప్రసాదాలు సిద్ధం చేశారు. అంతేకాకుండా భక్తులకు ప్రత్యేక దర్శనం, సాధారణ దర్శన క్యూలైన్లను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని 450 ఏళ్ల నాటి చారిత్రక దేవరకోట శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆల య కమిటీ, దేవదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వారా దర్శనం ప్రారంభిస్తామని తెలిపారు. ఉదయం 7 గంటలకు స్వామివారికి తులసి అర్చన వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఏర్పాట్లు పూర్తి.. ఏటా ధనుర్మాసం ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తాం. ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ నాథుడి దర్శనానికి భక్తులు వేలాదిగా ఆలయానికి తరలివస్తారు. భక్తుల రద్దీకి అనుకూలంగా ఏర్పాట్లను చేశాం. వైకుంఠ దర్శనానికి క్యూలైన్లు ఏర్పాటు చేశాం. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం. –ఆమెడ శ్రీనివాస్, దేవరకోట లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ చైర్మన్ -
మిమిక్రీలో ప్రతిభ
లక్ష్మణచాంద: లక్ష్మణచాంద మండలం రాచాపూర్ మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాల విద్యార్థులు మిమిక్రీ పోటీల్లో ప్రతిభ కనబ ర్చారు. తెలంగాణ గురుకులాల సొసైటీ మిమిక్రీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేరెళ్ల మాధవ్ జ్ఞాపకార్థం హైదరాబాద్లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో పోటీలు నిర్వహించారు. ఇందులో రాచాపూర్ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యార్థులు అక్షయ్, శివకృష్ణ పాల్గొని ఉత్తమ ప్రదర్శన ఇచ్చారు. ప్రోత్సాహక బహుమతులు అందుకున్నారు. వీరికి ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి సర్టిఫికెట్లు అందచేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయుడు నాగరాజు పాల్గొన్నారు. -
నిర్మల్
స్వీయ జాగ్రత్తలే రక్షఅర్జీలు త్వరగా పరిష్కరించాలి నిర్మల్చైన్గేట్: ప్రజావాణికి వచ్చే అర్జీలను త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ముఖ్యంగా ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూసమస్యలపై దరఖాస్తులు సమర్పించారు. ఈ సందర్భంగా కిశోర్కుమార్ మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును పరిశీలించి, తక్షణమే స్పందించాలన్నారు. అనంతరం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2026– 27 విద్యా సంవత్సరానికి సంబంధించి, ఉమ్మడి ప్రవేశ పరీక్ష పోస్టర్ ఆవిష్కరించారు. ‘మీ డబ్బు మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా వివిధ జిల్లా శాఖలకు సంబంధించి నూతనంగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేసి, యాక్టివేట్ చేసిన నూతన బ్యాంకు ఖాతాలను ఎల్డీఎం.రామ్గోపాల్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులకు అందజేశారు. ప్రజావాణిలో ఆర్డీవో రత్నకళ్యాణి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రశ్న: ప్రభుత్వాస్పత్రిలో సౌకర్యాలు ఉన్నాయా? – వెంకన్న, కుభీర్ డీఎంహెచ్వో: అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి. రక్త పరీక్షలు చేసి వైద్య సేవలు అందిస్తున్నాం. పీహెచ్సీలు, సీహెచ్సీలలో వైద్యులను సంప్రదించి వైద్య సహాయం పొందవచ్చు. జీజీహెచ్లోనూ డాక్టర్లు అందుబాటులో ఉంటారు. నిర్మల్చైన్గేట్: ‘జిల్లాలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. ప్రజలు జాగ్రత్తలు పాటించకుంటే సీజనల్ వ్యాధులబారినపడే ప్రమాదం ఉంది. స్వీయ జాగ్రత్తలతోనే చలి నుంచి, సీజనల్ వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు’ అని డీఎంహెచ్వో రాజేందర్ అన్నారు. ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో జ్వరం, జలుబు, దగ్గు, న్యూమోనియా, సైనసైటిస్ తదితర వ్యాధులు వ్యాపిస్తున్నాయని చెప్పారు. జ్వరం, దగ్గు, జలుబు సమస్యలు వస్తే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంప్రదించాలని సూచించారు. ఆస్పత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సోమవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ఇన్లో ప్రజల సందేహాలు నివృత్తి చేశారు. ప్రశ్న: చలికాలంలో పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – సోమేష్, నిర్మల్ డీఎంహెచ్వో: పిల్లల్లో చలి, వేడిని తట్టుకునే శక్తి తక్కువ. చలిలో పిల్లల్ని బయటకు తీసుకెళ్లొద్దు. స్వెట్టర్లు వాడాలి. జలుబు, దగ్గు వంటివి వస్తే వైద్యులను సంప్రదించాలి. సొంత వైద్యం చేయొద్దు. ప్రశ్న: వృద్ధులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – సయ్యద్ ఖలీమ్, చాక్పల్లి డీఎంహెచ్వో: చలి, మంచు తగ్గేవరకు వృద్ధులు బయటకు వెళ్లకపోవడం మంచిది. ప్రొటీన్స్, పౌష్టికాహారం తీసుకోవాలి. స్వెట్జర్లు, దుప్పట్లు వినియోగించాలి. ఇప్పటికే ఏదేని జబ్బుకు సంబంధించి మందులు వాడుతుంటే క్రమం తప్పకుండా వేసుకోవాలి. ప్రశ్న: జలుగు, దగ్గు, గొంతునొప్పి తగ్గడం లేదు? – సురేశ్, కాల్వ డీఎంహెచ్వో: వాతావరణ పరిస్థితులు, చల్ల గాలులతో జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి వస్తుంది. ఇన్ఫెక్షన్తో కూడా తగ్గడం ఆలస్యమవుతుంది. రోజుల తరబడి తగ్గకుంటే వైద్యులను సంప్రదించాలి. ప్రశ్న: గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలి? – రాజేశ్వర్, లక్ష్మణచాంద డీఎంహెచ్వో: పీహెచ్సీలు, సబ్ సెంటర్ల ద్వారా వైద్యసేవలు అందుతున్నాయి. గ్రామాల్లో ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలతో ఇంటింటా ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. ప్రశ్న: ఆస్తమా రోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – రాజేశ్వర్, కుభీర్ డీఎంహెచ్వో: ఆస్తమా రోగులు చలిలో బయటకు రావొద్దు. తప్పనిసరైతే మందులు వెంట తీసుకెళ్లాలి. వేడిగా ఉన్న పౌష్టికాహారం తీసుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో ఉన్నారు. ప్రశ్న: చలికాలం ఏ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి? – అరుణ్, పెంబి డీఎంహెచ్వో: చలికాలం ప్రతీఒక్కరు జాగ్రత్తగానే ఉండాలి. ప్రత్యేకంగా ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్య, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులు ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి. ప్రశ్న: ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? – విశాల్, భాగ్యనగర్ డీఎంహెచ్వో: వేడి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. నిల్వ ఉన్నవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినవి, బయట దొరికే చిరుతిండి, కూల్ డ్రింక్స్, ఐస్క్రీంల జోలికి వెళ్లొద్దు. తగిన మోతాదులో నీటిని తీసుకోవాలి. లేదంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. మాంసాహారాన్ని తగ్గించి తాజా పండ్లు, ఆకు కూరలు, పీచు పదార్థాలు తీసుకోవాలి. ప్రశ్న: సీజనల్ వ్యాధుల నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? – వినోద్, కాండ్లీ డీఎంహెచ్వో: ప్రస్తుతం లెప్రసీ సర్వే కొనసాగుతోంది. సర్వేలో భాగంగా ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రస్తుతం అన్ని పీహెచ్సీలలో వైద్యులు ఉన్నారు. మందుల కొరత లేదు. సీజనల్ వ్యాధులకు మంచి వైద్యం అందిస్తున్నాం. ప్రభుత్వ వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రశ్న: ఆరోగ్యం రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? – సాయి, కౌట్ల డీఎంహెచ్వో: చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్స్ రాసుకోవాలి. చల్లగాలిలో తిరగొద్దు. దుమ్ము, ధూళికి దూరంగా ఉండాలి. రోజూ 6 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలి. వెచ్చటి దుస్తులు ధరించాలి. తల, చెవి భాగాలు మఫ్లర్తో కప్పి ఉంచాలి. -
9849653126
‘పొట్టేలు’కు గద్దర్ అవార్డు నిర్మల్టౌన్: 2024 అక్టోబర్ 25న విడుదలైన పొట్టేలు సినిమా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డుకు ఎంపికై నట్లు టీవీ, చలనచిత్ర కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు అడిచెర్ల రాజు అన్నారు. ఆదివారం ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడుతూ ఈ చిత్రం దర్శక రచయిత నిర్మల్ ముద్దుబిడ్డ సాహిత్గౌడ్ కావడం జిల్లాకు ఎంతో గర్వకారణమన్నారు. ఈ నెల 30న స్థానిక పెన్షనర్ సంఘ భవనంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో పురుషోత్తం రావు, ప్రభాకర్, కోటగిరి నరసయ్య, డాక్టర్ కత్తి కిరణ్, తదితరులు పాల్గొన్నారు. -
నిర్మల్
జాతర సమీపిస్తున్నా.. నాగోబా జాతర జనవరి 18న ప్రారంభం కానుంది. గడువు సమీపిస్తున్నా ఏర్పాట్లు ముందుకు సాగడం లేదు. అధికారుల సమన్వయ సమావేశం కూడా నిర్వహించలేదు.ఎన్నో కొత్త ఆశలతో సరిగ్గా పన్నెండు నెలలక్రితం 2025 ప్రారంభమైంది. ఎన్నో.. ఎన్నెన్నో సరికొత్త విషయాలు, సంఘటనలు, నియామకాలు, ముందడుగులు, ఉద్యమాలకు వేదికై ంది. ఒక్కోనెల ఒక్కో కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. రాజకీయం మొదలు క్రీడా, కళారంగాల వరకు ఈ ఏడాది ఎన్నో మార్పులను తీసుకొచ్చింది. – నిర్మల్ ఆ పార్టీలకు కొత్త సారథులు.. జిల్లా ఈ ఏడాది రాజకీయంగానూ పలుమార్పులకు వేదికై ంది. ప్రధానంగా 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిచిన బీజేపీ, ఒక ఎమ్మెల్యేను గెలుచుకున్న కాంగ్రెస్ బలపడ్డాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా రితేశ్రాథోడ్, నవంబర్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జుపటేల్ నియమితులయ్యారు. తొలిసారి పంచాయతీ ఎన్నికలనూ ఇదే ఏడాదిలో వారు ఎదుర్కొన్నారు. సిందూర.. సంబురం.. పాకిస్థాన్ ముష్కరమూకలు చేసిన పహల్గాం మారణహోమాన్ని జిల్లా ముక్తకంఠంతో వ్యతిరేకించింది. అనంతరం మనదేశం మే నెలలో చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. ఈ ఆపరేషన్ జరిగినన్ని రోజులూ ఊపిరి బిగబట్టి వార్తలను తెలుసుకుంది. విజయం తర్వాత గల్లీగల్లీలో పండుగలా జరుపుకుంది. ఆశల రైలుకు అడుగులు.. జిల్లా మీదుగా రైల్వేలైన్కు సంబంధించి ఈ ఏడాదిలో కీలక పరిణామం పూర్తయ్యింది. ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు మూడు జిల్లాలను కలుపుతూ 136.50 కిలోమీటర్ల లైన్ నిర్మాణానికి రూ.4,300 కోట్ల అంచనాతో డీపీఆర్ పూర్తి చేశారు. దీన్ని వెంటనే ఆమోదించాలని ఎంపీ నగేశ్ రైల్వేబోర్డు చైర్మన్ సతీశ్కుమార్ను కలిశారు. ఇదేనెలలో రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్రెడ్డి రైల్వేలైన్ నిర్మాణం చేపట్టాలని కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఏడాది జులైలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి తదితరులతో కలిసి బీజేఎల్పీనేత మహేశ్వర్రెడ్డి కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్ను కలిసి విన్నవించారు. ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ వస్తున్న పంచాయతీ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్లోనే ప్రశాంతంగా ముగిశాయి. దస్తురాబాద్ మండలం పెర్కపల్లి మినహా మొత్తం 399 పంచాయతీలకు కొత్త సర్పంచులు వచ్చారు. ఈనెల 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా మద్దతుదారులను గెలిపించుకున్నాయి. క్రీడలతో మానసికోల్లాసం నిర్మల్టౌన్: క్రీడలతోనే మానసిక ఉల్లాసం కలుగుతుందని వాకింగ్ అండ్ లాఫింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు నాలం శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం నిర్వహించిన క్రికెట్, వాలీబాల్ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు.వర్సిటీ కోసం ‘సాక్షి’ ప్రయత్నం.. ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు‘నిర్మల్ ఉత్సవాలు’ తెలంగాణలోని ప్రతీ జిల్లాలో ఆ జిల్లా పేరిట అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. నిర్మల్ జిల్లాగా ఏర్పడిన తొమ్మిదేళ్ల తర్వాత తొలిసారి కలెక్టర్ అభిలాష అభినవ్ ఈ ఏడాది జనవరి 5, 6, 7 తేదీల్లో ‘నిర్మల్ ఉత్సవాలు’ పేరిట ప్రారంభించారు. మూడురోజులు జనాల నుంచి విపరీతంగా స్పందన ఉండటంతో మరో రోజు అదనంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా చరిత్రనూ ప్రజల్లోకి తీసుకెళ్లారు.నేటి నుంచి ప్రజావాణి నిర్మల్చైన్గేట్: ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 29 నుంచి యధావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న కారణంగా ఇన్ని రోజులు వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి హాజరై నేరుగా తమ సమస్యలపై ఫిర్యాదులను అందజేయాలని సూచించారు. మౌంటెన్మ్యాన్.. ఐరన్మ్యాన్.. ఈ ఏడాది జిల్లాకు ఇద్దరు సూపర్మ్యాన్లు దొరికారు. గతంలో ఎవరెస్టును అధిరోహించిన జిల్లా కేంద్రానికి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ ముక్క సాయిప్రసాద్ జూన్లో ప్రపంచంలో ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్నీ అధిరోహించి మౌంటెన్మ్యాన్గా నిలిచారు. ఇక జిల్లా కేంద్రానికే చెందిన డాక్టర్ బీఎల్ఎన్ రెడ్డి గోవాలో నిర్వహించిన క్లిష్టమైన అరేబియా సముద్రంలో ఈత, సైక్లింగ్, మారథాన్ల ఈవెంట్ను విజయవంతంగా ముగించి ‘ఐరన్మ్యాన్’ టైటిల్ దక్కించుకున్నారు. జిల్లాలో జ్ఞానసరస్వతీ యూనివర్సిటీ సాధన ఉద్యమానికి ‘సాక్షి’ మీడియా బీజం వేసింది. ఈఏడాది ఆగస్టులో వివిధ వర్గాలు, మేధావులు, విద్యావంతులతో రౌండ్టేబుల్ సమావేశాలు నిర్వహించింది. ఈ కారణంగా జిల్లాలో ‘జ్ఞానసరస్వతీ విశ్వవిద్యాలయ సాధన సమితి’ ఏర్పడింది. డ్రగ్ ఫ్రీ నిర్మల్ దిశగా.. జిల్లాలో విపరీతంగా వ్యాపిస్తూ యువతను పట్టి పీడిస్తున్న గంజాయి భూతాన్ని తరిమేసేందుకు కలెక్టర్ అభిలాష అభినవ్వ్, ఎస్పీ జానకీ షర్మిల డ్రగ్ ఫ్రీ నిర్మల్ కోసం వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. ఇదే ఏడాది జిల్లాలో గంజాయితో పాటు మత్తు మందు సిరంజీలనూ ఉపయోగిస్తున్నట్లు తేలడం కలవరపర్చింది. ఆ ముఠానూ పోలీసులు పట్టుకున్నారు. దసరా పండుగ సమయంలో ఎస్పీ జానకీ షర్మిల వినూత్నంగా ప్రజల్లోకి వెళ్లి డ్రగ్స్, సైబర్ నేరాలు, తదితర సామాజిక అంశాలను వివరించేందుకు ‘కమ్యూనిటీ బతుకమ్మ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
‘ఉపాధి’కి ప్రయోజనం
నిర్మల్చైన్గేట్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. వీటిపై కూలీలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఉపాధి హామీ పథకం పేరును కేంద్రం వీబీజీ రాంజీ (వికసిత భారత్–గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్)గా మార్చడంతో పాటు ఇటీవల చట్టంగా అమలులోకి తెచ్చింది. దీనిపై అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించి పథకం ద్వారా చేపట్టే ప నులను ప్రజలకు వివరించనున్నారు. వారం వ్యవధిలోనే గ్రామసభలు పూర్తి చేసి పథకం పకడ్బందీగా అమలయ్యేందుకు చర్యలు తీసుకోనున్నారు. 125 రోజులకు పెంపు.. గతంలో ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఏడాదికి 100 రోజుల వరకు పని కల్పించేందుకు గ్యారంటీ ఉండగా ఇప్పుడు కేంద్రం ఈ పరిమితిని 125 రోజులకు పెంచింది. గతంలో ఇందుకు అయ్యే ఖర్చును కేంద్రమే భరించింది. ఇక నుంచి కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం ఖర్చు భరించాల్సి ఉంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న కూలీలకు 15 రోజుల్లోగా పని లభించకపోతే రోజూవారీ నిరుద్యోగభృతి చెల్లించేందుకు వీలు కల్పించారు. జిల్లాలోని 400 గ్రామ పంచాయతీల్లో ఈ పథకాన్ని అమలు చేస్తుండగా... మొత్తం 3.38 లక్షల మంది కూలీలుగా నమోదై ఉన్నారు. వీరిలో యాక్టివ్ కూలీలు 2.28 లక్షల వరకు ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు. పథకంలో కీలక మార్పులు.. ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వం మట్టి పనులను పూర్తిగా తొలగించింది. గతంలో ఎక్కువగా చెరువుల్లో పూడికతీత, కందకాల తవ్వకం వంటి పనులను చేపట్టేవారు. అయితే వీటిలో ఆశించినంత పని జరగలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. తాజాగా మారిన నిబంధనల మేరకు ఇకపై జలసంరక్షణ పనులకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. చెరువులు, కుంటల స్థిరీకరణ, భూగర్భ జలాలు పెంచే వాటర్ షెడ్లు, కాల్వల నిర్మాణం, నీటిబావుల తవ్వకం వంటి పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే గ్రామాల్లో చేపట్టిన పంచాయతీ, అంగన్వాడీ భవనాల నిర్మాణాలు ఇకపై కొనసాగించనున్నారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగే కాలంలో సుమారు 2 నెలల పాటు పథకం పనులను నిలిపివేయనున్నారు. వ్యవసాయ రంగంలో రైతులకు కూలీల కొరత తలెత్తకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టనున్నారు. ప్రతీ పనికి జియోట్యాగింగ్.. గ్రామసభలను నిర్వహించడంతో పాటు పనులకు సంబంధించిన ఫొటోలను జియోట్యాగింగ్ చేసి ఉపాధి హామీ పోర్టర్లో అప్లోడ్ చేయనున్నారు. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. జిల్లా వివరాలు మండలాలు : 18 గ్రామ పంచాయతీలు : 400 జాబ్ కార్డులు : 1.77 లక్షలు కూలీల సంఖ్య : 3.33 లక్షలు యాక్టివ్ జాబ్ కార్డులు : 1.30 లక్షలు యాక్టివ్ కూలీల సంఖ్య : 2.28 లక్షలుజలసంరక్షణకు ప్రాధాన్యం.. ఇకపై చేపట్టే పనుల్లో గ్రామీణ ప్రాంతాల్లోని నీటి వనరుల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తాగు, సాగునీటి వనరులను మెరుగుపర్చుకునేందుకు పనులు చేపట్టనున్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, రహదారుల నిర్మాణం, నీటివసతి, ప్రజల జీవనాన్ని మెరుగుపర్చే పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మంచినీటి రౖపైడ్లెన్లు, సాగునీటి కాల్వలు, పొలాల్లో పిల్లకాల్వల తవ్వకాలు చేపట్టేందుకు వీలుకలుగనుంది. ఉపాధి హామీ పనిస్థలంలో కూలీలు (ఫైల్) -
విద్యార్థులకు విజ్ఞానం.. సైన్స్ ప్రయోగం..
మామడ: విద్యార్థుల్లో సైన్స్పై ఆసక్తి, శాసీ్త్రయ దృక్పథం పెంపొందించడం, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏటా సైన్స్ ప్రదర్శనలు నిర్వహిస్తోంది. పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు ఇన్స్పైర్ ప్రాజెక్టులతోపాటు సైన్స్ ఎగ్జిబిషన్ను ఈ నెల 29, 30 తేదీల్లో నిర్మల్లోని సెయింట్ థామస్ పాఠశాలలో నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పాఠశాలలోని 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు జూనియర్, సీనియర్ విభాగాల్లో పాల్గొంటారు. 6 నుంచి 8వ తరగతి వరకు జూనియర్ విభాగం, 9, 10వ తరగతులు, ఇంటర్ వరకు చదువుతున్నవారు సీనియర్ (వైజ్ఞానిక) విభాగంలో పాల్గొనవచ్చు. జిల్లాలోని ప్రభుత్వ, కేజీబీవీ, స్థానిక సంస్థలు, ఆశ్రమ, ప్రైవేట్ యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిట్లు ప్రదర్శించే అవకాశం ఉంటుంది. ఇన్స్పైర్ అవార్డులకు ఎంపికై న జిల్లాలోని 119 ప్రాజెక్టులు మేళాలో ప్రదర్శించబడతాయి. ప్రతీ పాఠశాల నుంచి అయిదు ప్రాజెక్టులు ప్రదర్శించవచ్చు. ఇన్స్పైర్ ప్రాజెక్టులు ప్రదర్శించాలి జిల్లాలో 119 ప్రాజెక్టులు ఇన్స్పైర్కు ఎంపికయ్యాయి. ఎంపికై న ప్రాజెక్టులతోపాటు సైన్స్ఫేర్ ప్రాజెక్టులు విద్యార్థులు ప్రదర్శిస్తారు. సాంస్కృతిక విభాగాల్లో విద్యార్థులు పాల్గొని ప్రతిభను కనబర్చవచ్చు. – వినోద్కుమార్, జిల్లా సైన్స్ అధికారి సైన్స్పై ఆసక్తి పెంచేలా.. సైన్స్ఫేర్, ఇన్స్పైర్ వంటి సైన్స్ మేళాలతో విద్యార్థుల్లో సైన్స్పై మరింత ఆసక్తి పెరుగుతుంది. ప్రతీ పాఠశాల నుంచి విద్యార్థులు ప్రాజెక్టులను తయారు చేసి ప్రదర్శించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి. – భోజన్న, డీఈవో ప్రదర్శన అంశాలు.. అభివృద్ధి చెందిన, స్వయం సమృద్ధ దేశం కోసం సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితంతోపాటు మొత్తం 7 అంశాల్లో ప్రాజెక్టులు నిర్వహించబడతాయి. ’ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం’ అంశంపై సెమినార్ నిర్వహిస్తారు. 1. సుస్థిర వ్యవసాయం 2. వ్యర్థ పదార్థాల నిర్వహణ, ప్రత్యామ్నాయ మొక్కలు 3. హరిత శక్తి, పునరుత్పాదక శక్తి 4. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు 5. వినోదభరితమైన గణిత నమూనాలు 6. ఆరోగ్యం, పరిశుభ్రత 7. నీటి సంరక్షణ, నిర్వహణ -
నిబంధనల మేరకు నిర్మాణాలు చేపట్టాలి
● హౌసింగ్ పీడీ రాజేశ్వర్ లక్ష్మణచాంద: నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని హౌసింగ్ పీడీ రాజేశ్వర్ పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను శనివారం పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నాణ్యత, ప్రమాణాలు పాటించాలన్నారు. ఇంటి స్లాబ్ ఏరియా 800 స్క్వేర్ ఫీట్లకు మించరాదన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాధ,ఎంపీవో నసీరుద్దీన్, సర్పంచ్ ఓస కవిత, న్యూ కంజర్ సర్పంచ్ మోహన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
పిల్లలు పైలం
వైద్యుల సూచనలు నిర్మల్ఖిల్లా: జిల్లాలో రోజురోజుకూ చలి ప్రభావం పెరుగుతోంది. ఉదయం, సాయంత్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చల్లని వాతావరణంతో వైరస్లు విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు అధిక జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్య కేంద్రాల్లో రద్దీ వైరస్ల కారణంగా జిల్లాలో చిన్నారులు, వృద్ధులు జలుబు, దగ్గు, జ్వరంతో ఆస్పత్రులకు వెళ్తున్నారు. దీంతో వారం రోజులుగా ఆస్పత్రుల్లో రద్దీ పెరిగింది. తేమ ఎక్కువగా ఉన్న వాతావరణంలో వైరల్ ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. చలికి పిల్లల రోగనిరోధక శక్తి బలహీనపడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రైవేట్ క్లినిక్లలో చిన్నారుల తాకిడి పెరిగింది. వణికిస్తున్న చలి.. జిల్లాలో చలి వణికిస్తోంది. ముఖ్యంగా ఉదయం సగటు ఉష్ణోగ్రతలు 6 నుంచి 9 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. చల్లగాలులు వీస్తున్నాయి. దీంతో ఉదయం పాఠశాలలకు వెళ్లే చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నెలంతా చలి ప్రభావం ఉంది. దీంతో పిల్లల్లో సీజనల్ ఇన్ఫెక్షన్లు విస్తరిస్తున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. గాలి కాలుష్యం.. శీతల గాలులు తీవ్రమవుతున్న నేపథ్యంలో గాలిలో కాలుష్యం కూడా పెరుగుతోంది. దీంతో చిన్నారుల్లో దగ్గు, జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లు ఎక్కువయ్యాయి. 8 ఏళ్ల లోపు పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. పాఠశాలల్లో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. పాఠశాలల వేళల్లో మార్పు.. తీవ్ర చలి నేపథ్యంలో కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు శనివారం (డిసెంబర్ 20) నుంచి పాఠశాల పని వేళలు మారాయి. ఉదయం 9:40 నుంచి సాయంత్రం 4:30 వరకు స్కూళ్లు పనిచేస్తాయి. చిన్నారులు ఉదయ చలికి ఇబ్బంది పడకుండా ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి, వాతావరణ శాఖ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. -
ట్రిపుల్ ఐటీలో వీర్ బాల దివస్
బాసర: మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు బాసర ఆర్జీయూకేటీలో వీర్ బాల దివస్ వేడుకలు శుక్రవారం ఘనంగా మొదలయ్యాయి. వేడుకల్లో భాగంగా దేశ నిర్మాణంలో విద్యార్థుల సృజనాత్మకత, బాధ్యత, సామర్థ్యాన్ని చాటేందుకు వ్యాసరచన, వక్తృత్వం, చర్చాగోష్టి, క్విజ్, కవితల పోటీలు నిర్వహించారు. ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్ మాట్లాడుతూ వీర్ బాల దివస్ ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్ విఠల్, ఎస్.శేఖర్, దిల్ బహార్, సాంస్కృతిక శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె.రాములు, డాక్టర్ కాశన్న, శ్యామ్బాబు, నాగలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రజల మెప్పు పొందాలి
నిర్మల్: ఎన్నికల వరకే రాజకీయాలని, గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కొత్తగా ఎన్నికై న సర్పంచులకు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు దిశానిర్దేశం చేశారు. నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావు అధ్యక్షతన జిల్లాకేంద్రంలోని రెడ్డిగార్డెన్స్లో నిర్మల్ నియోజకవర్గ సర్పంచులకు శనివారం ఆత్మీయ సన్మానం నిర్వహించారు. మంత్రి సర్పంచులను సన్మానించి, శుభకాంక్షలు తెలి పారు. ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు గ్రామంలో పర్యటించాలని, సమస్యలు తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేయాలన్నారు. విధిగా గ్రామసభలు నిర్వహించాలని, అభివృద్ధి ప్రణాళికల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు ప్రజల ముందే జరగాలని తెలిపారు. హామీలు అమలు చేస్తున్నాం.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, పేదలకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల గురించి సర్పంచులు ప్రజలకు వివరించాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మొత్తం 1,551స్థానాల్లో కాంగ్రెస్ 820 స్థానాల్లో గెలిచిందని, బీఆర్ఎస్ 343, బీజేపీ 269, స్వతంత్రులు సుమారు 110 స్థానాల్లో విజయం సాధించారని వివరించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్, మాజీ మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, వేణుగోపాలచారి, డీసీసీ మాజీ అధ్యక్షుడు శ్రీహరిరావు మాట్లాడారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి నిర్మల్లో బీజేపీ 80 సర్పంచ్ స్థానాలను గెలిచిందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో కాంగ్రెస్సే అధిక స్థానాలు సాధించిందని, త్వరలో మరిన్ని పెరుగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ అర్జుమంద్అలీ, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దుర్గాభవాని, పీసీసీ బాధ్యులు ఎంబడి రాజేశ్వర్, సీనియర్ నాయకులు, కొత్త సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. -
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి
నిర్మల్ రూరల్: నిరుద్యోగులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ అలీ అన్నారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో ఇటీవల ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను శనివారం సన్మానించారు. జిల్లా గ్రంథాలయంలో చదువుకున్న 8 మంది అభ్యర్థులు గ్రూప్–2లో ఉద్యోగాలు సాధించారని తెలిపారు. వారిని శాలువాతో సత్కరించి అభినందించారు. నిరుద్యోగులు సమయం వృథా చేయకుండా కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలన్నారు. జిల్లా గ్రంథాలయంలో నిరుద్యోగుల కోసం అనేక రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, సదుపాయాలు కల్పించామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ చైర్మన్ జునేత్, మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ మతిన్, సమరసింహారెడ్డి, లైబ్రరీ అధికారి రాథోడ్ మోహన్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
టెట్ నుంచి మినహాయించాలి
నిర్మల్ రూరల్: ఇన్సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని ఈమేరకు కేంద్రం చట్ట సవరణ చేయాలని ఎస్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇటీవల ఎన్నికై న జుట్టు గజేందర్ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డిని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా గజేందర్ ఎమ్మెల్యేకు పలు విద్యావిషయక అంశాలను వివరించారు. తమ సంఘంలో జిల్లా నుంచి రాష్ట్ర పదవికి అవకాశం రావడం ఇదే తొలిసారని తెలిపారు. విద్యాహక్కు చట్టం అమలులోకి రాకముందు నియామకమైన ఉపాధ్యాయులు రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణత సాధించాలన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 వేల మంది ఇన్సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ సమస్యతో తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ సమస్యలపై ప్రత్యేకంగా సర్వీస్ రూల్స్, పెండింగ్ బిల్లులు, డీఏలు, పీఆర్సీ, సీపీఎస్ రద్దు వంటి అంశాలను శాసనసభలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యేను కలిసినవారిలో సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.భూమన్నయాదవ్, జె.లక్ష్మణ్, నా యకులు ఇర్ఫాన్ షేక్, వెంకటేశ్వరరావు, లక్ష్మీపతి, లింగయ్య, అజీజ్ తదితరులు ఉన్నారు. పోస్టర్లు విడుదల నిర్మల్ రూరల్: ఈనెల 28, 29 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి సమావేశం పోస్టర్లను టీఎస్ యూటీఎఫ్ నాయకులు జిల్లా కేంద్రంలో శనివారం విడుదల చేశారు. జనగాం జిల్లాలో జరిగే రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో ఉపాధ్యాయులు పాల్గొనాలని కోరారు. ఇందులో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దాసరి శంకర్, అశోక్, రాష్ట్ర కార్యదర్శి సత్యానంద్, లక్ష్మణరావు, రమేశ్, పరమేశ్వర్, రాజేశ్వర్, నాగయ్య, గోవర్ధన్, శివరాణి, ఫాసిల్, రమేశ్, అంబటి నారాయణ, నారాయణవర్మ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
లాభంలేని ఎవుసం
నిర్మల్కడ్తాల్ అయ్యప్ప ఆలయంలో ఎమ్మెల్యే పూజలు లక్ష్మణచాంద: సోన్ మండలం కడ్తాల్ గ్రామంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో శనివారం మండల పూజ నిర్వహించారు. బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దంపతులు పూజలో పాల్గొన్నారు. ఆలయ గురుస్వామి నర్సారెడ్డి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందజేశారు. అయ్యప్ప స్వామికి 41 రోజుల మండల కాలం(వృశ్చిక మాసం నుంచి ధనుర్మాసం వరకు) ముగింపు సందర్భంగా హరిహర పుత్రుడికి ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. స్వాములతో కలిసి ఎమ్మెల్యే భిక్షలో పాల్గొన్నారు. ఆయన వెంట బీజేపీ నాయకులు రావుల రాంనాథ్ ఉన్నారు. నిర్మల్: వ్యవసాయ ఆధారిత జిల్లా నిర్మల్. 80 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కానీ కొన్నేళ్లుగా ఎవుసం కలిసి రావడం లేదు. ఏటా రైతులు నష్టాలతోనే సాగుతున్నారు. ఈ ఏడాదీ సాగు అంత సాఫీగా సాగలేదు. రైతన్నకు అవసరమున్నప్పుడు రాని వాన, వద్దంటే పగబట్టినట్టే కురిసింది. తెల్లబంగారాన్ని నేలవాల్చింది. సోయాపంటను నీటముంచింది. పచ్చని పొలాల్లో ఇసుక మేటలేసింది. జిల్లాలోని 16 మండలాల్లో దాదాపు 12 వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. వరి, పత్తి, సోయా వంటి ప్రధాన పంటలు దెబ్బతిన్నాయి. తుపాన్ల, భారీవర్షాలకుతోడు దాదాపు సీజన్ అంతా గోదావరి ఉప్పొంగడంతో తీరప్రాంత మండలాల్లో పంటలు నీటమునిగాయి. ఇక కొత్తపంటగా సాగులోకి వచ్చిన ఆయిల్పామ్ ఈ ఏడాది కోతకు వచ్చింది. సాగుచేసిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేసింది. పంట సాగు విస్తీర్ణం పెంచడానికి మరింత భరోసానిచ్చింది. ముంచిన వానలు.. జిల్లాలో 2024–25 యాసంగి సీజన్లో మొత్తం 3,23,857 ఎకరాల్లో 1,77,066 మంది రైతులు పంటలు సాగు చేశారు. ఇక ఈఏడాది వర్షాకాలంలో 2,35,060 మంది రైతులు మొత్తం 4,37,897 ఎకరాల్లో పంటలు పండించారు. గతేడాది తీరునే ఈసారి కూడా ప్రకృతి వైపరీత్యాలు రైతన్నలను వెంటాడుతూ వచ్చాయి. ఖరీఫ్ సీజన్ మొదట్లో ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలకు 10,588 ఎకరాల్లో పంటనష్టం జరిగింది. అది మరిచిపోయేంత లోపే అక్టోబర్లో మోంథా తుపాన్ చుట్టుముట్టింది. వారాల తరబడి మబ్బుపట్టిన వాతావరణంతోపాటు కురిసిన వర్షాలకు జిల్లాలోని ఐదు మండలాల్లోని 36 గ్రామాల్లో 253 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇక పంట నష్టపరిహారం కింద ఆగస్టు వైపరీత్యాలకు సంబంధించి రూ.10.69 లక్షలు విడుదలయ్యాయి. మోంథా తుపాన్ బాధితులకు రూ.26 లక్షలు మంజూరయ్యాయి. పెరిగిన సోయా.. తగ్గిన పత్తి.. జిల్లాలో గతంతో పోలిస్తే పలు ప్రధాన పంటల సాగులో ఈ ఏడాది కొంత తేడాలు కనిపించాయి. జిల్లాలో అత్యధికగా సాగు పంటగా వరి కొనసాగింది. యాసంగిలో 1,24,243 ఎకరాల్లో, వానాకాలం 1,41,667 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. గతేడాది సోయాపంటను 1,05 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి 1.21 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. మరో ప్రధాన పంటగా ఉన్న పత్తి ఈఏడాది కొంత తగ్గింది. గతేడాది 1.60 లక్షల ఎకరాల్లో సాగుచేయగా, ఈసారి 1.45 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. రైతులు పత్తికి బదులుగా సోయాను నమ్ముకున్నారు. మిగతా మొక్కజొన్న, జొన్న, పసు పు పంటలు ఎప్పటి మోతాదులోనే సాగు చేశారు. వరదలతో పొలాల్లో ఇసుక మేటలు(ఫైల్) ఈఏడాది ప్రధాన పంటల సాగువివరాలు(ఎకరాల్లో).. పంటలు యాసంగి వానాకాలం వరి 1,24,243 1,41,938 సజ్జ 495 –– మొక్కజొన్న 98,723 16,163 జొన్న 41,033 10 సోయాబీన్ 59 1,21,693 పత్తి 57 1,51,265గోధుమ 543 –– శనగ 48,932 –– మినుములు 104 72 కంది 475 6,638 పెసర 0.39 87 నాలుగేళ్లక్రితం జిల్లాలోకి అడుగుపెట్టిన ఆయిల్పామ్ ఈ ఏడాది చేతికొచ్చింది. అనుమానాలను పటాపంచలు చేస్తూ మంచి దిగుబడితో కోతకొచ్చింది. జిల్లాలో మొత్తం 8,800 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేస్తున్నారు. ఇందులో ఈ ఏడాది 600 ఎకరాల్లో కొత్తగా సాగుచేశారు. మొత్తం 36 నెలల పంటయిన ఆయిల్పామ్ నాలుగేళ్ల క్రితం సాగు ప్రారంభించిన రైతులకు చేతికొచ్చింది. మొత్తం 1,300ఎకరాల్లో పంట కోతకు రాగా, ఒక్కో గెల ఐదు నుంచి 8 కేజీలు ఉంది. మున్ముందు వచ్చే గెలల బరువు 20 కేజీల వరకూ ఉండనుంది. టన్నుకు రూ.19 వేల ధర పలుకుతుండగా, ఈఏడాదిలో మొత్తం 249 టన్నులను కోతకోశారు. ఇందుకు సంబంధించి మొత్తం 158 మంది రైతుల ఖాతాల్లో కొనుగోలు చేసిన కంపెనీ రూ.54 లక్షల పైచిలుకు జమచేసింది. -
జీవో 252 సవరించాలి
నిర్మల్ టౌన్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 252ను సవరించాలని టీయూడబ్ల్యూజే 143 యూనియన్ సభ్యులు అన్నారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్లపై తీసుకువచ్చిన జీవోను సవరించాలని కోరుతూ.. కలెక్టరేట్లో శనివారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తూ.. ప్రభుత్వం అధికారంలోకి రాగానే నూతన అక్రిడిటేషన్ల జారీ కోసం జీవో 252 తీసుకురావడం అభినందనీయమన్నారు. అయితే ఈ జీవోలోని కొన్ని నిబంధనలతో ఇప్పటి వరకు అక్రిడిటేషన్లు కలిగిన దాదాపు 10 వేల మందికి నష్టం జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. డెస్క్ జర్నలిస్టులు, ఫీల్డ్ జర్నలిస్ట్ అన్న తేడా లేకుండా అందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం ఇచ్చినవారిలో యూనియన్ నా యకులు లక్ష్మీనారాయణ, రాంమహేశ్, మహేశ్రావు, అల్లం అశోక్, రాంపెల్లి నరేందర్, అత్తర్, రంజిత్, కార్తీక్, రాజు తదితరులు ఉన్నారు. -
సిరాల ఆయకట్టుకు సాగునీరు
భైంసారూరల్: యాసంగి పంటలకు సిరాల ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని ముధోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్ అన్నారు. సిరాల ప్రాజెక్టు కాలువ ద్వారా రబీ పంటకు సాగునీటిని శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్ల క్రితం భారీ వర్షాలకు ప్రాజెక్టు కట్ట తెగిపోవడంతో ప్రభుత్వాన్ని ఒప్పించి రూ.12 కోట్లతో పనులు పూర్తి చేయించామన్నారు. సిరాల ప్రాజెక్టు ద్వారా 600 ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. రైతులకు సాగునీరు అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుందన్నారు. నియోజకవర్గంలో ప్రతీ ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. చెరువుల నిర్మాణానికి, లిఫ్ట్ల పునఃప్రారంభానికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయించినట్లు వివరించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ అనిల్కుమార్, సిరాల, ఇలేగాం, దేగాం, చింతల్బోరి గ్రామాల సర్పంచులు కదం సునంద, సీరం రాజమణి, సీరం సుష్మారెడ్డి, పండిత్రావుపటేల్, మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్, నాయకులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీ విద్యార్థినికి ఎల్ఐసీ స్కాలర్షిప్
బాసర: ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉన్నత విద్యకు ఆర్థికసాయం అందించే ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్నకు బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని వీహెచ్.సాయి మైథిలి ఎంపికై ంది. ఈ స్కాలర్షిప్ 10వ/12వ తరగతిలో మంచి మార్కులు సాధించి, తక్కువ కుటుంబ ఆదాయం ఉన్న వారికి లభిస్తుంది. ఎల్ఐసీ ఉపకార వేతనానికి ఎంపికై న సాయి మైథిలిని ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్ అభినందించారు. కష్టపడి చదివి ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్ ఎస్.విఠల్, హిమబిందు, వినోద్ పాల్గొన్నారు. విద్యార్థిని అభినందిస్తున్న ఇన్చార్జి వీసీ గోవర్ధన్ -
‘మోడల్’ ఠాణాకు మోక్షమెప్పుడో!
లక్ష్మణచాంద: మండల కేంద్రంలో 2017లో ప్రారంభమైన మోడల్ పోలీస్ స్టేషన్ భవనం నిర్మాణం ప్రారంభించి ఏడేళ్లయినా పూర్తి కాలేదు. పురాతన భవనంలో ఇబ్బందులు పడుతూ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. నిర్మాణం నెమ్మదిగా కొనసాగుతోంది. పాత భవనం దెబ్బతినడంతో పోలీసులు కష్టాలు ఎదుర్కొన్నారు. దీంతో 2017లో అప్పటి ప్రభుత్వం రూ.72 లక్షలతో అన్ని సౌకర్యాలతో కూడిన నూతన భవనం మంజూరు చేసింది. మార్చి 8న పనులు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక సౌకర్యాలతో ప్లాన్.. కొత్త భవనంలో ఎస్సై గది, పోలీసుల విశ్రాంతి గదులు, మహిళా పోలీసులకు ప్రత్యేక గది, ఫిర్యాదు హాల్, రిసెప్షన్, రికార్డు గది, ఇంటర్నెట్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే కిటికీలు, విద్యుత్, డోర్లు, నీటి సౌకర్యాలు, పెయింటింగ్ పనులు ఇంకా పూర్తికాలేదు. నిధుల విడుదలలో జాప్యం.. భవన నిర్మాణానికి అవసరమైన నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో పనులు ఆలస్యమవుతున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. పాములు వచ్చే పాత భవనంలో భయం భయంగా విధులు నిర్వహిస్తున్నామని పేర్కొంటున్నారు. ఉన్నతాఽ దికారులు త్వరగా స్పందించి పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. నూతన భవనం పూర్తయితే ఇబ్బందులు తొలగుతాయని పేర్కొంటున్నారు. -
పది పరీక్షలకు 78 రోజులే!
లక్ష్మణచాంద: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 10వ తరగతి 90% సిలబస్ పూర్తయింది. గ్రామపంచాయతీ ఎన్నికల విధులతో ఉపాధ్యాయులు 15 రోజులు పాఠశాలలకు దూరంగా ఉండటంతో మిగిలిన 10% పెండింగ్గా ఉంది. వచ్చే మార్చి 14 నుంచి పరీక్షలు ప్రారంభం కావడంతో విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కలెక్టర్ సమీక్ష.. రెండు రోజుల క్రితం కలెక్టర్ అభిలాష అభినవ్, డీఈవో భోజన్న, మండల విద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల కారణంగా సిలబస్ పూర్తి కాలేదని తెలిపారు. దీంతో జనవరి 10లోపు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సిలబస్ పూర్తి తర్వాత అభ్యాస దీపికలు, వారాంత పరీక్షలు నిర్వహించాలని సూచించారు. 6,603 మంది విద్యార్థులు.. నిర్మల్ జిల్లాలో 168 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 6,603 మంది 10వ తరగతి విద్యార్థులు చదువుతున్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు ప్ర త్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. డిసెంబర్ చి వరికి పూర్తి సిలబస్ లక్ష్యంగా పని కొనసాగుతోంది. సాధనతోనే మేలు.... 1. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ విద్యార్థులు తమలో ఉన్న భయాన్ని వీడి, ఒత్తిడికి లోను కా కుండా గతంలోని మాదిరి ప్రశ్న పత్రాలను సాధన చేయడం వల్ల మేలు జరుగుతుందని విషయ నిపుణులు ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. 2. వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు ఇంటి వద్ద టీవీలకు, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. 3. ఈరోజు చదవాల్సిన పాఠ్యాంశాలను అదే రోజు చదువుకోవాలని ఉపాధ్యాయులు సూచించిన సూచనల మేరకు సన్నద్ధం కావాలి. 4. యోగా, ధ్యానం, వ్యాయామం వంటివి చేయడం వల్ల ఒత్తిడిని అధిగమించవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. జిల్లా సమాచారం... జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 168మొత్తం పదో తరగతి విద్యార్థులు 6,603 -
కూరగాయల సాగులో..
జిల్లాలోని నిర్మల్ రూరల్, దిలావర్పూర్ మండలాలకు చెందిన కొందరు రైతులు సంప్రదాయ పంటలకు భిన్నంగా కూరగాయల సాగుచేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటి వినియోగంతో బెండకాయ, వంకాయ, పచ్చిమిర్చి, టమాటా వంటి కూరగాయలు సాగుచేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కూరగాయలకు మంచి డిమాండ్ ఉంది. దీంతో పండించిన కూరగాయలను నేరుగా మార్కెట్లో విక్రయించి లాభాలు ఆర్జిస్తున్నారు. పాలకూర, మెంతి, క్యాబేజీ వంటి ఆకుకూరలతోపాటు కొందరు ఎకర భూమిలో కంది అంతర పంటగా కూరగాయలు సాగు చేస్తున్నారు. ఒక్కో రైతు నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేలు సంపాదిస్తున్నాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్ -
‘పర్యాటకం’ పరిహాసమేనా..!
● నీటిమూటలుగానే పాలకుల హామీలుపర్యాటకుల లేక బోసిపోతన్న కడెం ప్రాజెక్టు నిర్మల్: ‘నాన్నా.. టూడేస్ హాలీడేస్ ఉట్టిగనే గడిచిపోయాయి. ఈసారి ఎటూ తీసుకెళ్లలేదు. కనీసం బయటకూ వెళ్లలేదు నాన్నా..’అని బిడ్డ హాసిని అడుగుతుంటే.. నెలాఖరులో డబ్బులు లేక, మరోవైపు జిల్లాలో ఎలాంటి పర్యాటక ప్రదేశాలు లేక ఆ తండ్రి శ్రీనివాస్ సైలెంట్గా ఉండిపోయా డు. ఇలాంటి ఇబ్బందులు జిల్లాలో చాలా మంది తల్లిదండ్రులకు ఎదుర్కొంటున్నారు. ఇందుకు కార ణం జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయకపోవడమే. జిల్లాలో పర్యాటక అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వాలు దశాబ్దాలుగా చెబుతున్నప్పటికీ ఎలాంటి ముందడుగా పడడం లేదు. పక్కజిల్లాలకు వెళ్తున్నారు.. ఈ సీజన్లో క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతికి వ చ్చే సెలవుల్లో చాలామంది పిల్లలు పెద్దలు కలిసి ప్రశాంతమైన ప్రకృతిలో గడపాలని భావిస్తారు. కానీ.. కనీసం ఒకరోజు కుటుంబమంతా కలిసి ఆహ్లాదంగా గడపడానికి జిల్లాలో ఒక్కటంటే ఒక్క ప్రదేశం లేదు. ఉన్న ఒకట్రెండు పర్యాటక ప్రదేశాల్లోనూ కనీసం అభివృద్ధి కనిపించడం లేదు. చేసేది లేక.. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి పక్కజిల్లాలకు, హైదరాబాద్, గోవాలకు వెళ్తున్నారు. రెండురోజుల పాటు ఆహ్లాదంగా గడపడానికి రూ.వేలు ఖర్చుచేయాల్సి వస్తోందని వాపోతున్నారు. మంత్రిగారూ.. దృష్టిపెట్టాలి.. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రిగానూ ఉన్నారు. ఈనేపథ్యంలో జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని జిల్లావాసులు కోరుతున్నా రు. స్థానిక పాలకులు, అధికారులు ఇప్పటికి చాలా సార్లు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపుతున్నారే తప్ప.. వాటిని అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావ డం లేదన్న వాదనా ఉంది. జిల్లా పాలకులు, అధికారులు, ఇన్చార్జి మంత్రి కూడా పర్యాటకాభివృద్ధిపై దృష్టి పెట్టాలని విన్నవిస్తున్నారు. -
అభివృద్ధికి కట్టుబడి ఉంటాం
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో రూ.23 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ను రాష్ట్ర ఎకై ్సజ్, టూరిజం, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ఆ తర్వాత అభివృద్ధి విషయంలో రాజకీయ జోక్యాలు తీసుకురావద్దని అన్నారు. ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వే లైన్ సర్వే చేయిస్తున్నామని చెప్పారు. మంచిర్యాలకు గ్రీన్ఫీల్డ్ హైవే వస్తుందన్నారు. వైద్య విద్యకు అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతీ జిల్లాలో మెడికల్ కళాశాల మంజూరు చేస్తున్నామని తెలిపారు. రైతులు సహజసిద్ధమైన వ్యవసాయ పద్ధతులు అనుసరించాలన్నారు. రంగు మారిన సోయా కొనుగోలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. దేశంలోని ప్రతీ జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటుతో పాటు పీజీ సీట్లు పెంచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రధానమంత్రి సడక్ యోజన కింద జిల్లాలో అనేక గ్రామాలకు రోడ్లు వేశామని తెలిపారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి కేంద్రం రూ.120 కోట్లు కేటాయించిందని, రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లతో ఈ ఆస్పత్రిని నిర్మించిందని పేర్కొన్నారు. రాజకీయాలు స్నేహపూర్వకంగా ఉండాలని, గతంలో పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఐక్యరాజ్య సమితిలో జరిగిన సమావేశానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వాజ్పేయిని ప్రతినిధిగా పంపారని గుర్తు చేశారు. అయితే ప్రధానమంత్రి రామగుండంలో జరిగిన కార్యక్రమానికి హాజరైతే అప్పటి ముఖ్యమంత్రి హాజరు కాలేదని పేర్కొన్నారు. అలాంటి రాజకీయాలు మంచిది కాదని పేర్కొన్నారు. రైతులు సాగులో రసాయనాల వాడకం తగ్గించి సహజసిద్ధమైన వ్యవసాయం చేస్తే బాగుంటుందన్నారు. జిల్లాకు ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద రూ.5లక్షల వరకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నామని, జిల్లాలో 8లక్షల మందికి కార్డులు అందజేసినట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు సర్వే జరుగుతుందని తెలిపారు. మార్చి వరకు పత్తి కొనుగోళ్లు చేస్తామని రైతులు అధైర్య పడొద్దని పేర్కొన్నారు. జిల్లాకు ఎంత చేసినా తక్కువే..: మంత్రి జూపల్లి కృష్ణారావు వెనుకబడి ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు ఎంత చేసినా తక్కువేనని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రిమ్స్కు అవసరమైన వైద్యపోస్టులు మంజూరు చేసేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ ప్రైవేట్ ఆస్పత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేలా ఆరోగ్యశ్రీని రూ.5లక్షల నుంచి 10లక్షలకు పెంచినట్లు తెలిపారు. రూ.800 కోట్ల సీఎంఆర్ నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 6,956 స్టాఫ్ నర్సింగ్ పోస్టులను, 4,338 వైద్య పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. రిమ్స్లో ప్రతీ రోగికి నాణ్యమైన సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. త్వరగా ఎయిర్పోర్టు నిర్మాణం చేపడితే స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలతో పాటు జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. నియోజకవర్గానికి ఒక కల్చరల్ బిల్డింగ్ను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఎంపీ నగేశ్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్లు మాట్లాడారు. రిమ్స్తో పాటు ఉట్నూర్, బోథ్ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను భర్తీ చేయాలని, ఇచ్చోడ పీహెచ్సీని ఏరియా ఆస్పత్రిగా మార్చాలన్నారు. జన్నారంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, జిల్లా కేంద్రంలో ఎక్స్లెన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రత్యేక జీవో తీసుకొచ్చి వైద్యులకు రూ.5లక్షల వేతనం ఇచ్చి స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. రిమ్స్లో క్రిటికల్ కేర్ విభాగం ప్రారంభంతో అత్యవసర సేవలు మెరుగుపడతాయని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దండే విఠల్, కొమురయ్య, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా సీపీఐ నూరేళ్ల వేడుక
ఖానాపూర్: సోషలిజం స్థాపన కోసం బలమైన విప్లవ ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉందని సీపీఐఎంఎల్ మాస్లైన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి నంది రామయ్య అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమ శతాబ్ది వేడుకలు ఖానాపూర్ పట్టణంతోపాటు మండలంలోని బావపూర్, తర్లపాడు, జిలేడుకుంట, అ డవి సారంగాపూర్, పాత ఎల్లాపూర్, బీర్నంది, రంగపేట, చామనపల్లి, పాత తర్లపాడు, సతనపల్లి గ్రామాల్లో నిర్వహించారు. ఎర్ర జెండాలు ఆవిష్కరించారు. దేశంలో శ్రామిక పీడితవర్గాల విముక్తి కో సం సోషలిజం స్థాపన లక్ష్యంతో ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ గడిచిన 100 ఏళ్ల కాలంలో ప్రజల పక్షాన అనేక చరిత్రాత్మకమైన పోరాటాలు చేసిందని తెలి పారు. కార్యక్రమంలో జక్కుల రాజన్న, కూర్మ రాజన్న, పుసం లక్ష్మణ్, ఆత్రం భీంరావు, సోనేరావు, బీర్సావ్ గోరేబాయ్, మోహన్, మనోహర్, గంగారాం, శంకర్ పాల్గొన్నారు, చింతల్చాందలో.. లక్ష్మణచాంద్: మండలంలోని చింతల్చాంద గ్రామంలో సీపీఐ శతాబ్ది వేడుకలు నిర్వహించారు. జిల్లా నాయకుడు గంగన్న జెండా ఆవిష్కరణ చేశారు. శ్రామిక పీడిత వర్గాల విముక్తి కోసం, సోషలిజం స్థాపన లక్ష్యంతో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందన్నారు. 1925 డిసెంబర్ 26 నుండి 28 వరకు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగిన మహాసభలలో దాదాపు 500 మంది ప్రతినిధులు పాల్గొని భారత కమ్యూనిస్టు పార్టీని లాంఛనంగా స్థాపించారని తెలిపారు. కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.లక్ష్మి, రాజవ్వ, లక్ష్మణ్, చిన్న గంగన్న తదితరులు పాల్గొన్నారు. -
వీధి వ్యాపారులకు మరో వరం..!
భైంసాటౌన్: పట్టణాల్లో వీధి వ్యాపారులకు చిన్నపాటి రుణాలు అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగానే తొలుత రూ.10 వేల రుణం మొదలుకుని, రుణ వాయిదాలు సక్రమంగా చెల్లించిన వారికి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు అందించింది. దీంతో చాలామంది వీధి వ్యాపారులు ఫైనాన్స్ వ్యాపారులు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే బాధ తప్పింది. అలాగే స్వల్ప వడ్డీ, సకాలంలో రుణం చెల్లిస్తే, తిరిగి మరింత రుణం పెంచి అందించారు. ఫలితంగా వీధి వ్యాపారులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరింది. ఈసారి రూ.15 వేలు...తాజాగా పీఎం స్వనిధి కింద లోక కల్యాణ్ మేళా పథకం ప్రవేశపెట్టింది. పథకం పాతదే అయినా.. రుణ మొత్తం రూ.5 వేలు పెంచడంతోపాటు నూతనంగా మరింత మంది వీధి వ్యాపారులకు రుణాలు అందించాలని నిర్ణయించింది. ఈసారి కొత్తగా వీధి వ్యాపారులకు తొలుత యూనిట్కు రూ.15 వేలు అందించనున్నారు. గతంలో రూ.10 వేలు, రూ.20 వేలు పొంది సక్రమంగా చెల్లించిన వారికి రూ.25, రూ.50 వేలు అందించనున్నారు. ఐదేళ్లలో 3,500 యూనిట్లు లక్ష్యం..పీఎం స్వనిధి కింద ఈసారి జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో కొత్తగా 701 యూనిట్ల రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. 2025–26 ఆర్థిక సంవత్సరం నుంచి 2029–30 వరకు ఐదేళ్లలో 3,506 మంది వీధి వ్యాపారులకు రుణాలు అందించనున్నారు. సద్వినియోగం చేసుకోవాలి.. పీఎం స్వనిధి కింద వీధి వ్యాపారులకు రూ.15 వేల రుణం అందిస్తున్నాం. అర్హులైన వీధి వ్యాపారులు ఆధార్, పాన్, బ్యాంకు ఖాతా, ఇతర వివరాలతో మున్సిపల్ కార్యాలయంలో మెప్మా విభాగంలో సంప్రదించాలి. -
ఘనంగా వాజ్పేయి జయంతి
నిర్మల్ రూరల్/భైంసాటౌన్: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. నిర్మల్, ముధోలో ఎమ్మెల్యే కార్యాలయాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, రామారావుపటేల్ పాల్గొని వాజ్పేయికి నివాళులర్పించారు. వాజ్పేయి దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. దేశ భద్రత, అభివృద్ధిలో వాజ్పేయి తనదైన ముద్ర వేశారన్నారు. భైంసాలో ప్రజాట్రస్ట్ చైర్మన్ మోహన్రావు పటేల్ ఆధ్వర్యంలో దారాబ్జి ఫ్యాక్టరీలో వాజ్పేయి జయంతి నిర్వహించారు. సంతోషిమాత ఆలయ సమీపంలో నందు భయ్యా ఆధ్వర్యంలో వాజ్పేయి చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో నాయకులు మెడిసమ్మ రాజు,సాయి, అర్జున్, రాంశంకర్రెడ్డి, సాహెబ్రావ్, గంగా రెడ్డి, పద్మాకర్, విజయ్, నరేంద్రచారి, రంజి త్, భరత్, రాము, నారాయణ, విజయ్, చెన్న రాజేశ్వర్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
బస్సు కోసం ఆందోళన
సారంగపూర్: మండలంలోని కంకెట గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు వైకుంఠాపూర్–గొల్లమాడ రహదారిపై గు రువారం ఆందోళన చేపట్టారు. తమ గ్రామానికి కిలోమీటరు దూరం నుంచి వైకుంఠాపూర్ మీదుగా గొల్లమాడ గ్రామానికి ఆర్టీసీ బస్సు నిత్యం మూడుపూటలా వెళ్తుందన్నా రు. అదే బస్సును కంకెట వరకు నడపాలని డిమాండ్ చేశారు. రాత్రి వేళ బస్సు రాకపోవడంతో కిలోమీటరు దూరం వరకు చీకట్లో కాలినడకన గ్రామానికి చేరుకుంటున్నామన్నారు. సమస్యను పలుమార్లు నాయకులు, అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఆందోళనబాట పట్టామని తెలిపారు. ఆర్టీసీ అధికారులు స్పందించి తమ గ్రామాని కి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ విషయాన్ని ఆర్టీసీ డీఎం పండరికి సైతం ఫోన్ద్వారా సమాచారం ఇచ్చామన్నారు. స్పందించిన డీఎం బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. -
కంది.. పోయింది
ఈ చిత్రంలోని రైతు పేరు జరోల్ల గంగాధర్. తానూరు మండలం బోరిగాంకు చెందిన గంగాధర్.. తనకున్న నాలుగు ఎకరాల్లో వానాకాలం సోయా సాగుచేశాడు. అంతరపంటగా కంది వేశాడు. మొదట పంట ఆశాజనకంగా కనిపించింది. పుత, కాత దశకు వచ్చేసరికి తెగుళ్లు కారణంగా పంట నిలువుగా ఎండిపోయింది. మరోవైపు అటవీ జంతువుల బెడదతో ఉన్న పంట చేతికి అందకుండా పోయింది. నాలుగు ఎకరాల్లో కనీసం మూడు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తానూరు: ఈ ఏడాది అధిక వర్షాలతో పత్తి, సోయా పంటలు కోల్పోయిన రైతులు అంతర పంటగా వేసిన కందిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఏపుగా పెరిగిన పంట ఎండు తెగుళ్లు (ప్యూజేరియం), క్రిమికీటకాలు పూత దశలో సోకి 50 శాతం పంట నిలువుగా ఎండిపోయింది. అడవి జంతువుల దాడులతో చేతికొచ్చిన దిగుబడి కూడా పోయింది. 9 వేల ఎకరాల్లో సాగు..జిల్లా వ్యాప్తంగా 9 వేల ఎకరాల్లో పత్తి, సోయాలో అంతరపంటగా కంది వేశారు. భైంసా డివిజన్లో ఎక్కువగా సాగు జరిగింది. ఒక ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.15 వేల ఖర్చు చేశారు. సాధారణ ఎకరాకు 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి రావాలని, తెగుళ్లు, వన్యప్రాణుల కారణంగా 1 నుంచి 2 క్వింటాళ్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర లేక..గతేడాది క్వింటాల్కు రూ.7,500 మద్దతు ధర, ప్రైవేటు మార్కెట్లో రూ.8 వేల వరకు లభించాయి. ఈసారి మాత్రం రూ.7,500 కే పరిమితం కావడంతో సాగుకు చేసిన అప్పులు కూడా తీర్చే పరిస్థితి లేదని రైతులు పేర్కొంటున్నారు. క్వింటాల్కు రూ.9 వేల మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.తెగుళ్లతో పంట ఎండిపోయింది ఈ ఏడాది తొలుత కంది పంట బాగానే ఉంది. పూత, కాత దశలో ప్యూజేరియం ఎండు తెగులు సోకింది. పంట ఎక్కడికక్కడ ఎండిపోయింది. పగలు ఎండ, రాత్రి చలి తీవ్రత కారణంగా కూడా తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంది. తానూరు మండలంలో పంట నష్టం అధికంగా ఉంది. – అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి -
పాడి రైతులకు తోడ్పాటు
కుంటాల: పంటల్లా కాకుండా, పాడి పరిశ్రమ రైతులకు నిరంతర ఆదాయాన్ని అందిస్తోంది. భూమి లే ని కుటుంబాలకు కూడా ఇది ప్రధాన ఆధారంగా మారింది. ప్రభుత్వాలు ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు అనేక చర్యలు చేపట్టాయి. ఈ ప్రయత్నాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి. బల్క్ మిల్క్ పాయింట్..తెలంగాణ పాడి పరిశ్రమ సమాఖ్య ఆధ్వర్యంలో మండలంలోని కల్లూరులో రూర్బన్ నిధులతో రూ.40 లక్షలు ఖర్చుపెట్టి బల్క్ మిల్క్ కూలింగ్ పాయింట్ను ఇటీవల ప్రారంభించారు. భైంసా, లోకేశ్వరం, కుంటాల మండలాల నుంచి పాలు సేకరించి ఇక్కడికి తీసుకువస్తున్నారు. ఈ సౌకర్యంతో రైతులకు దూరభారం తగ్గుతుంది. పాల సేకరణ కేంద్రాల విస్తరణమండలంలో 12 పాల సేకరణ కేంద్రాలను ఏర్పా టు చేసి, వాటి నిర్వహణకు పాల మిత్రులను నియమించారు. గేదె పాలకు వెన్న శాతం బట్టి లీటర్కు రూ.42 నుంచి రూ.80 వరకు, ఆవు పాలకు రూ.36 నుంచి రూ.42 వరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రతీరోజు సుమారు 2 వేల లీటర్ల పాల సేకరణ జరుగుతోంది. రైతుల ఖాతాల్లో 15 రోజులకు ఒకసారి ఆన్లైన్లో డబ్బులు జమ చేస్తున్నారు. రోజువారీ ఆదాయం.. పాల ఉత్పత్తి రైతులకు రోజువారీ ఆదాయంగా మారింది. వివిధ గ్రామాల్లో రైతుల సౌకర్యార్థం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశాం. 15 రోజులకోసారి రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేస్తున్నాం. – డాక్టర్ నందకుమారి, డిప్యూటీ డైరెక్టర్, నిర్మల్, ఆదిలాబాద్ -
116 రోజులు 3.5 టీఎంసీల నీళ్లు
లక్ష్మణచాంద: వ్యవసాయ జిల్లాగా పేరున్న నిర్మల్ జిల్లాకు సాగు, తాగునీటికి వర ప్రదాయినిగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చెందిన సరస్వతి కాలువ ఉంది. ప్రాజెక్టు నుంచి యాసంగి పంటలకు ఈనెల 24 నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. వారబందీ పద్ధతిలో..సరస్వతి కాలువ ద్వారా నిర్మల్రూరల్, సోన్, లక్ష్మ ణచాంద, మామడ, ఖానాపూర్, పెంబి, దస్తురాబా ద్ మండలాలకు తాగు, సాగునీరు అందుతుంది. రెండో పంటకు వారబందీ పద్ధతిలో నీటిని విడుద ల చేస్తున్నారు. 8 రోజులు నీటిని విడుదల చేసి.. ఏడు రోజులు నిలిపివేయనున్నారు. 3.5 టీఎంసీలు...జిల్లాలోని ఏడు మండలాలకు సరస్వతి కాలువ ద్వారా రెండో పంటకు నిత్యం 300 క్యూసెక్కుల నీ టిని విడుదల చేస్తున్నారు. ఇలా ఈనెల 24 నుంచి విడుదలవుతున్న నీరు ఏప్రిల్ 18 వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. 116 రోజులు 3.5 టీఎంసీల నీటిని సరస్వతి కాలువ ద్వారా సాగు, తాగునీటి అవసరాలకు విడుదల చెయనున్నారు. 33,622 ఎకరాల ఆయకట్టు...జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల పరిధిలో మొ త్తం సరస్వతి కాలువ కింద 33,622 ఎకరాల ఆయకట్టు ఉంది. దీంతో యాసంగికి సరస్వతి కాలువ ద్వారా మీరు విడుదలవుతున్న నేపథ్యంలో 33,622 ఆయకట్టుకు సాగుకానుంది. అలాగే సరస్వతి కా లువ ద్వారా మండలంలోని వడ్యాల్ వద్ద ఎస్కేప్ కెనాల్ ద్వారా కనకాపూర్ వాగులోకి నీటిని విడుద ల చేసి సదర్మాట్కు తరలిస్తారు. దీనికింద మరో 13 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. -
గ్రామాల అభివృద్ధిపై ‘కొత్త’ ఆశలు
భైంసారూరల్: కొత్త సర్పంచులు కొలువుదీరారు. దీంతో ఇన్నాళ్లు నిలిచిపోయిన అభివృద్ధిపై ఆశలు చిగురించాయి. రెండేళ్లుగా ప్రజాప్రతినిధులు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు నిలిచిపోయాయి. గ్రామీణ అభివృద్ధి ఆగిపోయింది. పంచాయతీల తర్వాత పాలకుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. నిర్వహణలో లోపాలు..రెండేళ్లు పంచాయతీల నిర్వహణ గాడితప్పింది. చెత్త సేకరణ ట్రాక్టర్లు డీజిల్ లేక నిలిచాయి. ప్రకృతి వనాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. డ్రెయినేజీల నిర్వహణ లేక కంపుకొడుతున్నాయి. మురుగునీరు నిలిచి దోమలు, ఈగలు పెరిగాయి. ఈ సమస్యలు కొత్త నాయకులకు ప్రధాన సవాల్గా మారాయి. కార్యదర్శులకు తప్పిన భారంపంచాయతీ కార్యదర్శులు ఇంతకాలం పాలనను పర్యవేక్షించారు. అత్యవసర పనులకు నిధులు లేకపోవడంతో అప్పులు చేసి చేపట్టారు. కొత్త సర్పంచులు రావడంతో కార్యదర్శులపై భారం తప్పింది. అయితే పాత బిల్లుల చెల్లింపు, కొత్త పనుల మధ్య సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వం నిధుల విడుదల ఆధారంగా బిల్లులు చెల్లించే అవకాశం ఉంది. పరిష్కార మార్గాలు..కొత్త పాలకులు పారిశుధ్య నిర్వహణపై దృష్టి పె ట్టాలి. ఇంటింటా చెత్త సేకరణ, డంపింగ్ యార్డుల నిర్వహణ మెరుగుపర్చాలి. డ్రెయినేజీలు శుభ్రం చే యించాలి. ప్రభుత్వ పథకాలతో గ్రామాభివృద్ధికి ప్రణాళిక రూపొందించుకోవాలి. గ్రామసభలు క్ర మం తప్పకుండా నిర్వహించి ప్రజల సమస్యలు తె లుసుకోవాలి. ప్రజల ఆకాంక్ష మేరకు చర్యలు తీసుకుంటూ అభివృద్ధి దిశగా సాగాలి. ఈ వ్యూహంతో గ్రామాలు మెరుగైన పరిస్థితికి చేరుకుంటాయి. -
ఉప్పొంగిన భక్తిభావం
లోక రక్షకుడి జననం.. నిస్సీ ప్రార్థన మందిరంలో యేసయ్యను ఆరాధిస్తున్న యువతినిర్మల్టౌన్: కరుణామయుడు, లోక రక్షకుడు అయిన ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచే చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అర్ధరాత్రి కొవ్వొత్తులు వెలిగించి, కేక్లు కట్ చేశారు. పాస్టర్లు, బిషప్లు క్రీస్తు బోధనలు వినిపించారు. అనంతరం ప్రభువును స్తుతిస్తూ సామూహికంగా భక్తిగీతాలు ఆలపించారు. మత పెద్దలు క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలియజేశారు. పలు చర్చీల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నిర్మల్ సీఎస్ఐ చర్చిలో బిషప్ వ్యాస్ ధ్యానం అందించారు. వెంకటాపూర్లోని నిస్సీ చర్చిలో ఫాదర్ జయరాజ్ సందేశం ఇచ్చారు. గొల్లపేట్, సెయింట్ కాథలిక్, కర్మెల్ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. సీఎస్ఐ చర్చి వేడుకల్లో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేశారు. మత పెద్దలు ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. సోన్ మండలం మాదాపూర్ చర్చిలో కేక్ కట్ చేస్తున్న ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి క్రిస్మస్ సంబరాల్లో భాగంగా సీఎస్ఐ చర్చిలో కేక్ కట్ చేస్తున్న పాస్టర్స్నిర్మల్ సీఎస్ఐ చర్చిలో ప్రార్థనల్లో పాల్గొన్న క్రైస్తవులు -
నడిపించిన అభిమానం
భైంసారూరల్: ఎన్నికల్లో ఎవరైనా తమ నాయకుడు గెలవాలని ప్రచారం చేయడం, ఓటర్లను మభ్యపెట్టడం మాములే. కానీ తమ నాయకుడు గెలిస్తే మీ చెంతకు పాదయాత్రగా వస్తానని దేవుళ్లను మొక్కుకునే అభిమానులు కొందరే ఉంటారు. భైంసా రూరల్ మండలం మహాగాంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచు అభ్యర్థి రాజ్యలక్ష్మి గెలవాలని అనుచరులు, అభిమానులు అయ్యప్పను వేడుకున్నారు. ఫలితం దక్కడంతో సర్పంచు రాజ్యలక్ష్మి భర్త రాకేశ్కు విషయం చెప్పారు. దీంతో బుధవారం యువకులతోపాటు గ్రామస్తులు మహాగాం నుంచి ఏడు కిలోమీటర్లు పాదయాత్రగా భైంసాలోని అయ్యప్ప ఆలయానికి చేరుకున్నారు. అయ్యప్ప స్వామికి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. -
ఏఎంసీ వైస్చైర్మన్ రాజీనామా
సారంగపూర్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా హామీలు నెరవేర్చలేదని సారంగాపూర్ స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పదవికి లక్కడి శంకర్రెడ్డి బుధవారం రాజీనామా చేశారు. ఈమేరకు తన రాజీనామా పత్రాన్ని ఏఎంసీ కార్యదర్శి ధూమ్డానాయక్కు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి సైతం రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీని కలిసిన టీయూటీఎఫ్ నేతలు నిర్మల్ రూరల్: పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డిని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీయూటీఎఫ్)నాయకులు జిల్లా కేంద్రంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం శాసనమండలిలో తమ గళం వినిపించాలని కోరారు. విద్యారంగ సమస్యలు పెండింగ్లో ఉన్నాయని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎ.మురళీమనోహర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు తోడిశెట్టి రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. -
అడవుల సంరక్షణ అందరి బాధ్యత
సారంగపూర్: అడవులను రక్షించుకునే బాధ్యత అందరిపై ఉందని ఎఫ్ఆర్వో రామకృష్ణారావు అన్నారు. అడవి మధ్యలో ఉన్న మండలంలోని పెండల్ధరి గ్రామంలో అడవులు, అగ్ని ప్రమాదాలు, వన్యప్రాణుల పరిరక్షణపై ప్రభావం అనే విషయంపై ప్రజలకు బుధవారం అవగాహన కల్పించారు. అనంతరం గిరిజనులకు రగ్గులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా రామకృష్ణారావు మాట్లాడుతూ అడవుల్లో అగ్ని ప్రమాదాలకు పరోక్షంగా ప్రజలే కారణమన్నారు. బీడీలు, సిగరెట్లు కాల్చి వాటిని ఆర్పివేయకుండా పడేయడంతో అగ్ని ప్రమాదాలు సంభవించి దట్టమైన అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయని తెలిపారు. అటవీ ప్రాంతాలకు సమీపంలో వ్యవసాయ భూములు ఉన్న రైతులు వ్యర్థాలకు నిప్పు పెట్టడం కారణంగా కూడా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో నజీర్ఖాన్, ఎఫ్ఎస్వో రషీద్, ఎఫ్బీవోలు వెన్నెల, సుజాత తదితరులు ఉన్నారు. -
పండరీపూర్కు బయల్దేరిన బస్సు
నిర్మల్టౌన్: నిర్మల్ ఆర్టీసీ డిపో నుంచి గురుద్వారా, పండరీపూర్, తుల్జాభవాని ఆలయం వరకు ప్రత్యేక బస్సు బుధవారం బయల్దేరింది. ఈ సందర్భంగా డిపో మేనేజర్ పండరి బస్సుకు పూజ చేసి ప్రారంభించారు. మధ్యాహ్నం 1 గంటలకు బయలుదేరి నాందేడ్లోని గురుద్వార్ చేరుకొని, తెల్లవారు జామున పండరీపూర్కు చేరుకుంటుంది. అక్కడ విఠలేశ్వరుని దర్శించుకుని, అదే రోజు తుల్జ్జాభవాని అమ్మవారిని దర్శనం చేసుకుని, మరుసటి రోజు నిర్మల్ చేరుకుంటుంది. జనవరి 1న శబరిమలకు బస్సు నిర్మల్ ఆర్టీసీ డిపో నుంచి శబరిమలకు జనవరి 1న సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ పండరి బుధవారం తెలిపారు. ఈ బస్సు అరుణాచలం, పలని, శబరిమల, మధురై వరకు వెళ్తుందని పేర్కొన్నారు. మొత్తం ఈ టూర్ ఆరు రోజులు ఉంటుందని, ఒకరికి టికెట్ రూ.7,250గా నిర్ణయించినట్లు వెల్లడించారు. వివరాలకు 9959226003, 8328021517 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
నిర్మల్
వాతావరణం ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గుతాయి. పగలు కూడా చల్లగానే ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి చలి తీవ్రత పెరుగుతుంది. మంచు అధికంగా కురుస్తుంది. తగ్గుతున్న పత్తి ధరలు పత్తి ధరలు తగ్గుతున్నాయి. ధర పెరుగుతుందని నిల్వ చేసుకున్న రైతులు నిరాశ చెందుతున్నారు. ధరలు తగ్గడంతో కర్షకుల్లో ఆందోళన మొదలైంది. విద్యుత్ దీపాల వెలుగులో మెరిసిపోతున్న నిర్మల్ క్యాథలిక్ చర్చి నిర్మల్టౌన్: క్రైస్తవులకు అత్యంత ప్రియమైన క్రిస్మస్ పండుగ సందడి బుధవారం సాయంత్రం నుంచే మొదలైంది. నెల రోజులుగా సెమీ వేడుకలు జరుగుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి చర్చీలలో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కొత్త దుస్తుల్లో భక్తులు పిల్లలతో కలిసి చేరుకుని భక్తిగీతాలు ఆలపించారు. ప్రార్థనలు నిర్వహించారు. తెల్లవారుజాము వరకు బిషప్లు, పాస్టర్లు ఏసు బోధనలు వినిపించారు. కేక్ కటింగ్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. చర్చిల అలంకరణ.. చర్చిలను విద్యుత్ దీపాలు, రంగురంగుల ఆకృతులతో అద్భుతంగా అలంకరించారు. ఏసు జన్మకథకు సంబంధించిన ప్రతిరూపాలు, శాంతాక్లాస్ ఆకారాలు ప్రదర్శనలో ఉన్నాయి. ఎరుపు దుస్తుల్లో శాంతా క్లాస్ సందడి చేస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నారు. పురాతన సీఎస్ఐ చర్చి.. నిర్మల్ పట్టణం గాజులపేట్లోని సీఎస్ఐ చర్చి నిర్మాణం 1925లో ప్రారంభమైంది. 1930లో పూర్తయింది. దీనిని పీజేఎస్, అప్పదోరై నిర్మించారు. ఈ చర్చి 16 ఎకరాల ప్రాంగణంలో ఉంది. హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి మేసీ్త్రలు, ఇంగ్లండ్ నుంచి రంగుచిత్రాలు తెచ్చారు. గురువారం ఉదయం 9:30 నుంచి ప్రార్థనలు మొదలవుతాయి. అనంతరం బిషప్ వాస్య ధ్యానం జరుగుతాయి. తర్వాత కేక్ కటింగ్, స్వీట్ల పంపిణీ, అనాథ ఆశ్రమాలు, ఆస్పత్రుల్లో పండ్లు, బ్రెడ్ పంచుతారు. అతిపెద్ద నిస్సీ చర్చి వెంకటాపూర్ శివారులో 2021లో పూర్తయిన నిస్సీ చర్చి పట్టణంలోని అతిపెద్దది. 1995–2021 వరకు శాస్త్రినగర్లో ఉండేది. పాస్టర్ జయరాజ్ నేతృత్వంలో నిస్సి ట్రస్ట్ అనాథ పిల్లల చదువు, దుప్పట్లు, దుస్తులు అందిస్తోంది. గురువారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ప్రార్థనలు, గీతాలు, నృత్యాలు జరుగుతాయి. 26వ తేదీ నుంచి జనవరి 1 వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు. సెయింట్ థామస్, గొల్లపేట్ చర్చిలలో కూడా ప్రార్థనలు జరుగుతాయి. చరిత్రకు సాక్ష్యం సీఎస్ఐ చర్చి తెలంగాణలో రెండో పెద్ద చర్చి లక్సెట్టిపేట సీఎస్ఐ చర్చి. చారిత్రక కట్టడాలకు సజీవ సాక్ష్యం. చర్చి నిర్మించి 90 సంవత్సరాలు పూర్తయినా చెక్కు చెదరలేదు. -
సరస్వతి కాలువకు నీరు విడుదల
లక్ష్మణచాంద: జిల్లాలోని వివిధ మండలాల వ రప్రదాయిని అయిన ఎస్సారెస్పీ సరస్వతి కా లువకు అధికారులు బుధవారం నీటిని విడుద ల చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి సరస్వతి కాలువ ద్వారా నిర్మల్ జిల్లాలోని లక్ష్మ ణచాంద, నిర్మల్ రూరల్, మామడ, ఖానాపూర్, పెంబి, దస్తురాబాద్ మండలాలకు సాగునీ రు అందించేందుకు రబీ పంటకు ప్రాజెక్టు డీఈ నరేశ్ నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాతలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించా రు. సరస్వతి కాలువ ద్వారా సాగునీరు వారబందీ పద్ధతిలో విడుదలవుతుందని తెలిపారు. -
నోటాకు ఓటేశారు
నిర్మల్చైన్గేట్: ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో నోటాకు భారీగానే ఓట్లు పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా మూడు విడతల్లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 1,416 మంది తమకు సర్పంచ్ అభ్యర్థి నచ్చలేదని నోటాకు ఓటు వేశారు. మొత్తం 4,31,791 మంది ఓటర్లల్లో 3,57,513 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 74,278 మంది పోలింగ్కు దూరంగా ఉన్నారు. బ్యాలెట్ పద్ధతిలో నూతన మార్పు గతంలో మున్సిపల్, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా నోటా ప్రవేశపెట్టారు. ఈసారి పంచాయతీల్లో బ్యాలెట్ పేపర్ చివరలో ఈ గుర్తును ముద్రించారు. అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే తమ అసంతృప్తిని వ్యక్తీకరించే అవకాశం ఇప్పుడు ఓటర్ల చేతిలోకి వచ్చింది. ముధోల్ మండలంలో అత్యధికంగా 178 మంది ఓటర్లు తమకు సర్పంచ్ అభ్యర్థులు నచ్చలేదని ఓటు వేశారు. దస్తూరాబాద్లో కేవలం ఒక్కరు మాత్రమే సర్పంచ్ నచ్చలేదని నోటాకు ఓటేశారు. భారీగా చెల్లని ఓట్లు.. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో భారీగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. దీంతో చాలా మంది అభ్యర్థుల ఫలితాలు తారుమారయ్యాయి. ఈవీఎంలకు అలవాటైన ఓటర్లు బ్యాలెట్ పద్ధతిని మర్చిపోయారు. అభ్యర్థి పక్కన బాక్స్లో సరిగ్గా ముద్ర వేయలేకపోయారు. మూడు విడతల ఎన్నికల్లో మొత్తం 5,489 ఓట్లు చెల్లుబాటు కాలేదు. కుభీర్ మండలంలో అథ్యధికంగా 699 చెల్లని ఓట్లు పోలయ్యాయి. నర్సాపూర్(జి) మండలంలో అత్యల్పంగా 58 చెల్లని ఓట్లు పడ్డాయి. ఇవి ఎవరికీ లాభం లేకుండా పోయాయి. కొందరి గ్రామాల్లో గెలిచిన అభ్యర్థుల మెజారిటీని తగ్గాయి. కొన్ని గ్రామాల్లో గెలిచే అభ్యర్థిని ఓడిపోయేలా చేశాయి. మండలాలవారీగా నోటాకు వచ్చిన ఓటు, చెల్లుబాటు కాని ఓట్లు మండలం చెల్లుబాటు నోటాకు కాని ఓట్లు వచ్చిన ఓట్లు దస్తురాబాద్ 166 1 కడెం 405 100 ఖానాపూర్ 194 69 పెంబి 160 24 మామడ 337 86 లక్ష్మణచాంద 390 125 నిర్మల్ రూరల్ 310 56 సారంగాపూర్ 449 109 సోన్ 339 36 దిలావర్పూర్ 228 74 నర్సాపూర్(జి) 58 16 లోకేశ్వరం 487 88 కుంటాల 267 147 భైంసా 549 98 ముధోల్ 486 178 తానూర్ 531 85 బాసర 247 26 కుభీర్ 699 98 -
‘కడెం’ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
కడెం: ఉట్నూర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కడెం ప్రాజెక్టు అధికారులతో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు కాలువల మరమ్మతు, తదితర అంశాలను అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. యాసంగి పంటల కోసం కడెం, సదర్మాట్ ఆయకట్టు రైతాంగానికి సాగు నీరందించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. అటవీ అనుమతులు కాలువల మరమ్మతుల ఆంశాలను సీఎం రేవంత్రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు వేగవంతం చేస్తాం.... దస్తురాబాద్: గ్రామల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయని, రానున్న రోజుల్లో సంక్షేమ పథకాల అమలు వేగవంతం చేస్తామని బొజ్జు పటేల్ తెలిపారు. మండల కేంద్రంలో సర్పంచ్ వర్ధెల్లి గోపాల్ అభినందన సభలో మాట్లాడారు. నూతన పింఛన్, మరిన్ని ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి హామీ ఇచ్చారు. కొత్త సర్పంచులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో బి.అరుణ, ఎంపీవో రమేశ్రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గం మల్లేశ్, ఆయా గ్రామాల సర్పంచులు మహేశ్, నరేశ్, రాజేశ్, భూమేశ్, నరేశ్రెడ్డి, గంగన్న నాయకులు పాల్గొన్నారు. -
అద్దె.. ఇక వద్దు!
● కార్యాలయాలు గాలిస్తున్న పలు శాఖలునిర్మల్: పేరుకు ప్రభుత్వ కార్యాలయం, ఉండేది మాత్రం ప్రైవేటు భవనంలో.. నెలకు వేల రూపాయల ప్రజాధనాన్ని అద్దె రూపంలో ప్రభుత్వం చెల్లి స్తోంది. అందుబాటులో ప్రభుత్వ భవనాలు ఉ న్నా.. ప్రైవేటు మోజులో పలుశాఖలు ఏళ్లుగా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇకపై ఇలా ప్రజా ధనం వృథా చేయడం కుదరదు. ఈనెలాఖరు వర కు ప్రైవేటు భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలన్నీ అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనంలోకి షిఫ్ట్ కావాలంటూ ఆర్థికశాఖ స్పష్టం చేసింది. జనవరి నుంచి ఏరకంగానూ ప్రైవేటు భవనాలకు అద్దె చెల్లించడం కుదరదని తెలిపింది. దీంతో.. ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాల అధికారులు సొంత భవనాల వెతుకులాటలో పడ్డారు. తమకు అనుకూలంగా ఎక్కడైనా ప్రభుత్వ భవనం ఉందా..! అని చూస్తున్నారు. మరో నాలుగైదు రోజులైతే మళ్లీ కొత్త నెల ప్రారంభమవుతుంది. ఆలోపే భవనాలను చూసుకోవాల్సి ఉంటుంది. రూ.లక్షల్లో ప్రజాధనం వృథా.. జిల్లాలో ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉ న్నా.. పలు శాఖల కార్యాలయాలు ఇప్పటికీ ప్రై వే టు భవనాల్లో కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వం రాష్ట్రంలో అన్నిజిల్లాలో సమీకృత కార్యాలయాల భ వనాలను నిర్మించింది. జిల్లాలోనూ ఎల్ల పెల్లి శివా రులో 15 ఎకరాల్లో రూ.56 కోట్లతో నిర్మించారు. సమీకృత కలెక్టరేట్ కట్టిన తర్వాత చాలావరకు కా ర్యాలయాలు అందులోకే షిఫ్ట్ అయ్యాయి. కానీ కొ న్ని కార్యాలయాలు ఇప్పటికీ ప్రైవేటు భవనాల్లో కొ నసాగుతున్నాయి. సమీకృత భవనంలో కేటాయింపులు లేక కొన్ని, ఉన్నా వెళ్లకుండా మరికొన్ని వేల రూపాయల అద్దె చెల్లిస్తూ ఆగిపోయాయి. ప్రభుత్వ భవనాల వేట కొత్త ఏడాదిలో అద్దెను ఏరకంగానూ చెల్లించేది లేదని ఆర్థికశాఖ స్పష్టంగా చెప్పడంతో ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న శాఖలకు ‘షాక్’ తగిలినట్లయింది. ఉన్నపళంగా అధికారులు తమ సిబ్బందికి ఎక్కడెక్కడ ప్రభుత్వ భవనాలు ఖాళీగా ఉన్నాయో తెలుసుకోండని చెప్పారు. అలాగే కలెక్టర్, తదితర ఉన్నతాధికారులకు తమ పరిస్థితి వివరించారు. సమీకృత భవనంలో ఏమైనా ఖాళీలు ఉన్నాయా.. జిల్లా కేంద్రంలోనే ఏ శాఖ భవనమైనా ఖాళీగా ఉందా.. అని వెతుకుతున్నారు. ఈనెలాఖరులోపు ఎలాగైన కార్యాలయాలు ఖాళీ చేస్తామని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.జిల్లాలోనూ పలు శాఖలు.. జిల్లాకేంద్రంతోపాటు జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో పంచాయతీ, రెవెన్యూ, ట్రెజరీ తదితర శాఖల కార్యాలయాలు అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయి. రైతువేదికలు నిర్మించిన తర్వాత వ్యవసాయశాఖ ఆఫీసు కార్యకలాపాలు వాటి నుంచే నడిపిస్తున్నాయి. ఇక జిల్లాకేంద్రంలో ప్రధానంగా రిజిస్ట్రేషన్, వాణిజ్యపన్నులు, పేఅండ్ అకౌంట్స్, చైల్డ్ వెల్ఫేర్ తదితర కార్యాలయాలు ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో కొనసాగే చైల్డ్ప్రొటెక్షన్ ఆఫీస్ కూడా ప్రైవేటు భవనంలోనే కొనసాగిస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖకు స్థానిక దివ్యనగర్లో స్థలంతో కేటాయించారు. కానీ ఇక్కడ భవన నిర్మాణం అసంపూర్తిగా ఆగిపోయింది. జిల్లాలో అటవీ, ఇరిగేషన్ శాఖలు సొంతంగా భవనాలను నిర్మించుకున్నాయి. రెవెన్యూకు సంబంధించి జిల్లాకేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలోనే అర్బన్, రూరల్ తహసీల్ ఆఫీస్లు కొనసాగుతున్నాయి.


