Nirmal District Latest News
-
న్యాయనిర్ణేతగా ఎంపిక
భైంసాటౌన్: వుషూ అసోసియేషన్ ఆఽఫ్ ఇండియా ఆధ్వర్యంలో చండీగఢ్లోని యూ నివర్సిటీలో ఈనెల 22 నుంచి 27 వరకు ఆ లిండియా యూనివర్సి టీ వుషూ పోటీలు నిర్వహించనుండగా జాతీయస్థాయిలో 25 మంది గుర్తింపు పొందిన న్యాయనిర్ణేతలను ఎంపిక చేశారు. వీరిలో భైంసాకు చెందిన ఖేలో ఇండియా సెంటర్ కోచ్ శ్రీరాముల సా యికృష్ణ ఉన్నాడు. ఆమెచ్యూర్ వుషూ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అబ్దు ల్ ఒమర్ తనను న్యాయనిర్ణేతగా ప్రకటించి నట్లు సాయికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా సాయికృష్ణను పలువురు అభినందించారు. -
కార్మికుల సంక్షేమమే ధ్యేయం
నిర్మల్ఖిల్లా: భవననిర్మాణ రంగ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామని ప్రవాసీ మిత్ర కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల పేర్కొన్నా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో వీరి కోసం ప్రత్యేకంగా హెల్ప్డెస్క్ను ప్రా రంభించి మాట్లాడారు. జిల్లాలో భవన నిర్మాణ రంగంలో వేలాదిమంది పని చేస్తున్నా సంక్షేమ బోర్డులో సభ్యత్వానికి నోచుకోలేకపోవడం బాధాకరన్నా రు. గ్రామీణ కార్మికులు పంచాయతీ కార్యదర్శుల ధ్రువీకరణ, పట్టణ ప్రాంత కార్మికులకు వార్డు అ ధి కారుల ధ్రువీకరణపత్రాల సేకరణలో ఆసక్తి చూ ప డం లేదని తెలిపారు. ఆన్లైన్ నమోదుకు సర్వర్ జాప్యం సమస్య ఏర్పడుతోందని, ఈ నేపథ్యంలో తమ సంఘం తరఫున తగిన సహాయ సహకారాలు అందించి తాము కార్మికులుగా పేర్లు నమోదు చేస్తున్నామని చెప్పారు. కార్మిక శాఖ తరఫున జిల్లాలో స హాయ కార్మిక అధికారులుగా నిర్మల్, భైంసా ప్రాంతాల్లో ఇన్చార్జీలు ఉండడంతో కార్డుల జారీ, క్లెయిమ్ల పరిష్కారంలో ఏళ్లపాటు జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. ఇందుకోసం కార్యాలయాల చు ట్టూ తిరగలేక కార్మికులు విసిగిపోతున్నట్లు తమ సంఘం దృష్టికి వచ్చిందన్నారు. ప్రతీ భవన నిర్మాణరంగ కార్మికుడు ఈ–శ్రమ్ నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. కార్మిక సంక్షేమ బోర్డులో సభ్యత్వం ఉంటే ప్రమాద బీమా, వివా హ, ప్రసవ సమయాల్లో ప్రభుత్వం అందించే నగ దు తదితర పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చని పే ర్కొన్నారు. భవన నిర్మాణ రంగ కార్మికులు తమ కా ర్యాలయాన్ని గాని లేదా హెల్ప్ డెస్క్ను 82475 11415 నంబర్లో సంప్రదించాలని సూచించారు. భవన నిర్మాణ సంఘం సొసైటీ అధ్యక్షుడు మోహ న్, కార్యాలయ సమన్వయకర్త గీత, కార్మిక సంఘా ల నాయకులు లావణ్య, బాలయ్య, లక్ష్మీనారాయణ, భాషా, షేక్ హకీం, డేవిడ్, స్వామి పాల్గొన్నారు. -
‘బెంబర’లో చిరుత సంచారం
● భయం గుప్పిట్లో జనం ● పాదముద్రలు గుర్తించి కెమెరాలు అమర్చిన అధికారులు తానూరు: మండలంలోని బెంబర అటవీ ప్రాతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బెంబర గ్రామానికి చెందిన రైతు చుక్కబోట్ల సాయిలు బుధవారం దినమంతా ఆవులను మేపి పొలంలో కట్టేసి రాత్రికి ఇంటికి అన్నం తినేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో లేగదూడను చిరుత చంపి తిన్నది. గురువారం ఉద యం గమనించిన సాయిలు అటవీశాఖ అధికారుల కు సమాచారం ఇచ్చాడు. బీట్ అధికారి వేణుగోపా ల్ అక్కడికి చేరుకుని పాదముద్రలు పరిశీలించి చి రుత ఆనవాళ్లుగా గుర్తించారు. అటవీ ప్రాంతంలో కెమెరాలు ఏర్పాటు చేశారు. కాగా, బెంబర రైతులు పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. సిరాల శివారులోనూ..భైంసారూరల్: మండలంలోని సిరాల శివారులో చిరుత సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. శుక్రవారం భైంసా ఎఫ్ఆర్వో శంకర్ ఆధ్వర్యంలో సిబ్బంది సిరాలకు వెళ్లి వివరాలు సేకరించారు. గురువారం సాయంత్రం రైతు మహే శ్ గ్రామ శివారులోని తన మొక్కజొన్న చేనుకు నీటి తడి అందిస్తుండగా చిరుత కనిపించింది. భయపడ్డ అతడు ఊళ్లోకి వచ్చాడు. శుక్రవారం అధికారులు అతడితో చేను వద్దకు వెళ్లి చూడగా చిరుత పాదముద్రలు కనిపించాయి. పాదముద్రల కొలతలు తీసిన అటవీశాఖ అధికారులు చిరుతగా నిర్ధారించారు. సి రాల గుట్టల సమీపంలోనే చిరుతపులి ఉందన్న భ యం ఆ గ్రామ రైతులకు నిద్రలేకుండా చేస్తోంది. శు క్రవారం పంట చేల వద్దకు వెళ్లేందుకు వణికిపోయా రు. చిరుత సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భైంసా ఎఫ్ఆర్వో శంకర్ సూచించారు. -
బీజేపీ గెలుపునకు కృషి చేయాలి
భైంసాటౌన్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని ఎంపీ గోడం నగేశ్, ఎ మ్మెల్యే రామారావు పటేల్ సూచించారు. శుక్రవా రం పట్టణంలోని ఎస్ఎస్ కాటన్లో ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలోని బీ జేపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని ఓటర్లకు వి వరించి ఓట్లు అభ్యర్థించాలని సూచించారు. నాయకులు రాజేశ్బాబు, గంగాధర్, పడిపెల్లి గంగాధర్, గోపాల్సర్డా, సాయినాథ్, మల్లేశ్వర్ ఉన్నారు. బీజేపీతోనే మార్పు.. కుంటాల: బీజేపీతోనే మార్పు సాధ్యమని ఎంపీ గో డం నగేశ్, ఎమ్మెల్యే రామారావు పటేల్ పేర్కొన్నా రు. మండలంలోని కల్లూరు, కుంటాల గ్రామాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడా రు. బీజేపీ బలపరిచిన పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మె ల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్యను గెలిపించాలని కోరారు. ముధోల్ ఇన్చార్జి హరినాయక్, మాజీ ఎంపీపీ గజ్జారాం, నాయకులు సాయినాథ్, నారాయణరెడ్డి, వెంగల్రావు, అశోక్కుమార్, రమేశ్గౌడ్, గజేందర్, సాయి సూర్యవంశీ, శేఖర్రావు, నవీన్, రమణారావు, గోవర్ధన్ తదితరులున్నారు. పట్టభద్రుల భవిష్యత్ కోసం.. ముధోల్: పట్టభద్రుల భవిష్యత్ కోసం బీజేపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమురయ్యను గెలిపించాలని ఎంపీ గోడం నగేశ్ కోరారు. మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నిక ల ప్రచారం నిర్వహించగా ఎంపీ పాల్గొని మాట్లాడా రు. కార్యకర్తలు పార్టీని గెలిపించేలా ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. పార్టీ మండలా ధ్యక్షుడు కోరి పోతన్న, జిల్లా కౌన్సిల్ సభ్యుడు భూమేశ్, ముధోల్ తాలూకా కన్వీనర్ సాయినాథ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మీనర్సాగౌడ్, నాయకులు సంతోష్, పోతన్న తదితరులున్నారు. ● ఎంపీ గోడం నగేశ్ -
ఆర్జీయూకేటీలో అలరించిన నృత్యప్రదర్శన
బాసర: సైకాలజికల్ కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో బాసర ఆర్జీయూకేటీని శాతవాహన గ్రౌండ్లో పీ యూసీ ఫస్టియర్ విద్యార్థినులు నృత్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. సృజనాత్మకతతో ఎరోబిక్ వి న్యాసాలు, హిప్ హాప్, శాసీ్త్రయ నృత్యం, సంగీతా నికి వారి ఆధునిక నృత్యాలు క్రోడీకరించి ప్రదర్శించారు. ఆర్జీయూకేటీ లోగోను మానవహారంగా ప్ర దర్శించారు. వీసీ గోవర్ధన్, ప్రత్యేకాధికారి మురళీదర్శన్, ఏవో రణధీర్ సాగి, అసోసియేట్ డీన్, స్టూ డెంట్ వెల్ఫేర్ నాగరాజు, అసోసియేట్ డీన్ సైన్స్ హ్యుమానిటీస్ విఠల్ విదార్థులను ప్రోత్సహించా రు. కౌన్సిలర్ నాగలక్ష్మి, శ్రీలక్ష్మి తదితరులున్నారు. నృత్యం చేస్తున్న విద్యార్థినులు -
‘ఇంటిగ్రేటెడ్’కు శ్రీకారం
కై లాస్నగర్: నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శ్రీకారం చుట్టింది. ఒక్కో పాఠఽశాలలో 2,500 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు అన్ని సౌకర్యాలతో నాణ్యమైన విద్య అందించాలని సంకల్పించింది. ఇందుకోసం అసెంబ్లీ నియోజ కవర్గానికో పాఠశాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన స్థలాలను గుర్తించాల్సి ందిగా కలెక్టర్లను ఆదేశించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డు కమిషనర్, ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి కృష్ణ ఆదిత్య బుధవారం స్వయంగా ఆదిలాబాద్కు చేరుకున్నారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో స్థలాల ఎంపికపై సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. వారి ఆదేశాలకు అనుగుణంగా పది ని యోజకవర్గాల్లో ఆయా జల్లాల అధికారులు అవసరమైన స్థలాలను గుర్తించారు. వివరాలతో కూడిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించారు. రాష్ట్ర సర్కారు తదుపరి ఆదేశాలకు అనుగుణంగా పరిపాలన మంజూరు అనుమతులు లభించిన వెంటనే పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. రూ.200 కోట్లతో భవనాల నిర్మాణం పేద విద్యార్థులకు ఈ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు క్రీడలు, నైపుణ్యశిక్షణ అందించనున్నారు. ఉమ్మడి జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. నియోజకవర్గానికి ఒకటి చొప్పు న ఏర్పాటు చేయనున్నారు. తరగతి గదులు, వసతిగృహాలు, ఆట స్థలం వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఒక్కో పాఠశాలను 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. అత్యాధుని క హంగులతో భవన నిర్మాణాలు చేపట్టనున్నారు. రూ.200 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ నిర్మాణాలను వచ్చే రెండేళ్లలో పూర్తి చేసేలా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. అవసరమైన స్థలాలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు ఇప్పటికే ఎంపిక చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో స్థలాల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గుర్తించిన స్థలాల వివరాలు నియోజకవర్గం గుర్తించిన ప్రాంతం మండలం ఆదిలాబాద్ నిషాన్ఘాట్ ఆదిలాబాద్రూరల్ బోథ్ అడెగామ ఇచ్చోడ ఖానాపూర్ పులిమడుగు ఉట్నూర్ నిర్మల్ సిర్గాపూర్ దిలావర్పూర్ ఆసిఫాబాద్ ఇందాని వాంకిడి మంచిర్యాల రెబ్బెనపల్లి దండేపల్లి బెల్లంపల్లి గురుజాల బెల్లంపల్లి చెన్నూర్ సోమన్పల్లి చెన్నూర్ ముథోల్ భైంసా భైంసా సిర్పూర్ చెడ్వాయి పెంచికల్పేట్ ఇక యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున.. ఉమ్మడి జిల్లాలో 10 చోట్ల స్థలాల గుర్తింపు 2,500 మందికి విద్యనందించేలా వసతులు -
సబ్స్టేషన్ ఎదుట రైతుల ధర్నా
లోకేశ్వరం: వ్యవసాయానికి విద్యుత్ కోత విధిస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం మండలంలోని మన్మద్ సబ్స్టేషన్ ఎదుట రైతులు ధర్నా చేశారు. సబ్స్టేషన్ పరిధిలోని హవర్గ, మన్మద్, సాథ్గాం, ఎడ్ధూర్, పోట్పల్లి, బిలోలి గ్రామాలకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా ను ప్రతీరోజు రెండు గంటల పాటు నిలిపివేస్తున్నారని తెలిపారు. విషయం తెలుసుకున్న లోకేశ్వరం ఏఈ శివకుమార్ సబ్స్టేషన్కు చేరుకున్నారు. త్రీఫేజ్ సరఫరాలో ఎంత సమ యం అంతరాయమేర్పడితే అంత సమయం రాత్రివేళ సరఫరా చేస్తామని హామీ ఇవ్వగా రైతులు ఆందోళన విరమించారు. -
పరీక్షలకు సన్నద్ధం చేయాలి
మామడ: విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. శుక్రవారం మండలంలోని రాశిమెట్ల ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాల, సరుకులు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. పరిసరాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలని సూచించా రు. ఉపాధ్యాయులు, విద్యార్థులు వందశా తం హాజరయ్యేలా చూడాలని తెలిపారు. ప దో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి చదువులో వెనుకబడినవారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, అధికారులు, ఉపాధ్యాయులున్నారు. -
బాధితులకు అండగా ఉంటాం
పెంబి: అగ్ని ప్రమాద బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ పే ర్కొన్నారు. మండలంలోని రాయదారి గ్రామంలో షార్ట్ సర్క్యూట్తో ఇండ్లు కాలిపోగా బాధితులను శుక్రవారం పరామర్శించారు. దుస్తులు, నిత్యావసరాలు అందించారు. తక్షణసాయంగా బాధితుల ఖాతాల్లో శనివారం రూ.లక్ష జమ చేస్తామని తెలి పారు. బాధితులు యఽథాస్థితికి వచ్చేదాకా భోజనం అందించాలని, బస చేసేందుకు తగిన ఏర్పాట్లు చే యాలని అధికారులకు సూచించారు. ఇళ్ల మంజూ రుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు అ వసరమై వివరాలు సేకరించాలని తెలిపారు. అనంతరం బాధితులతో కలిసి అక్కడే భోజనం చేశారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్, డీఎస్వో కిరణ్కుమార్, తహసీల్దార్ లక్ష్మణ్, ఎంపీడీవో రమాకాంత్, సిబ్బంది ఉన్నారు. -
‘తాగునీటి సమస్య రానివ్వొద్దు’
నిర్మల్చైన్గేట్: వేసవిలో ప్రజలకు తాగునీటి సమ స్య రానివ్వొద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. నీటి పొదుపు, వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, పీహెచ్సీల్లో సరిపడా మందులు, ఓఆర్ఎస్ ప్యాకె ట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, జిల్లా అటవీశాఖ అధికారి నాగిని భాను, ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్రెడ్డి, జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్, డీఎంహెచ్వో రాజేందర్, జేఏవో అంజిప్రసాద్, డీసీహెచ్వో సురేశ్, కమిషనర్ జగదీశ్వర్గౌడ్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించాలిఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ అధికారులు, సిబ్బంది గురించి తెలుసుకున్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఎస్పీ జానకీ షర్మిల, అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవోలు రత్నకల్యాణి, కోమల్రెడ్డి, జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన సేవలందించాలి
నిర్మల్చైన్గేట్: గర్భిణులకు మెరుగైన సేవలందించాలని డీఎంహెచ్వో రాజేందర్ సూ చించారు. శుక్రవారం ఇంటిగ్రేటెడ్ హైరిస్క్ ప్రెగ్నెంట్ ట్రాకింగ్ మేనేజ్మెంట్పై జిల్లాలో ని మహిళా ఆరోగ్య సహాయకులకు ఒక్కరో జు శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక పెన్షనర్ సంఘ భవనంలో నిర్వహించారు. వైద్యులు అఖి ల, సంతోషిని ఆరోగ్య సహాయకులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మా ట్లాడుతూ.. అధిక ప్రమాద గర్భిణులను వెంటనే గుర్తించి అవసరమైన సేవలు సమయానుకూలంగా అందిస్తూ ఇబ్బంది లేకుండా ప్రసవమయ్యేలా చూడాలని సూచించారు. -
జిల్లాకు సీఎం
నిర్మల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లాకు రా నున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 24న పట్టభద్రులతో సమావేశం కానున్నా రు. నిర్మల్రూరల్ మండలం కొండాపూర్లో గల చంద్రశేఖర్ కన్వెన్షన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు పే ర్కొన్నారు. గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల ప్ర చారంలో భాగంగా నిర్మల్సభకు వచ్చిన ముఖ్య మంత్రి ఆ తర్వాత మళ్లీ జిల్లాకు రాలేదు. ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికే సీఎం జిల్లాకు రానుండటం గమనార్హం. మరోవైపు పట్టభద్రుల స్థానాన్ని దక్కించుకునేందుకు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు వర్గాలు, విబేధాలు పక్కనపెట్టి ఏకతాటిపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి పాల్గొనే సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి. బీజేపీ ప్రభావాన్ని తగ్గించేందుకే!రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసు కుంది. ఆదిలాబాద్–నిజామాబాద్–కరీంనగర్–మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల స్థానం అభ్యర్థిగా అల్ఫోర్స్ నరేందర్రెడ్డి బరిలో ఉన్నారు. ఆయనకు మద్దతుగా ఇప్పటికే కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఇ క జిల్లాలో మూడు నియోజకవర్గాలకు గాను ప్రధానమైన నిర్మల్, ముధోల్ రెండుచోట్ల బీజేపీ ఎమ్మెల్యేలున్నారు. ఖానాపూర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గానికి సంబంధించి నాలుగు మండలాలు మాత్రమే జిల్లాలో ఉన్నాయి. బీజేపీ ప్రభావం తగ్గించడంలో భాగంగా ముఖ్యమంత్రి రే వంత్రెడ్డి సమావేశం జిల్లాలో నిర్వహిస్తున్నట్లు తె లుస్తోంది. ఈ నెల 24న సోమవారం మధ్యాహ్నం 12గంటలకు కొండాపూర్లోని చంద్రశేఖర్ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్రెడ్డి పాల్గొననున్నారు. ఈ సమావేశాన్ని పట్టభద్రుల కోసమే నిర్వహిస్తున్నట్లు పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. చేతులు కలిపిన నేతలుఒకే పార్టీలో ఉంటున్నా.. ఎడమొహం పెడమొహంగా ఉన్న నేతలు ఒక్కతాటిపైకి వచ్చారు. కాంగ్రెస్ లో వర్గాలుగా విడిపోయినవారిని ఒకరకంగా ఎమ్మె ల్సీ ఎన్నికలు ఒక్కతాటిపైకి తీసుకువచ్చాయి. డీసీ సీ అధ్యక్షుడు శ్రీహరిరావు, మాజీమంత్రి అల్లో ల ఇంద్రకరణ్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పా ల గణేశ్చక్రవర్తి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అర్జుమంద్అలీ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి బుధవారం రాత్రి నిర్వహించిన సమావేశంలో ఒకే వేదికపైకి వచ్చారు. తాజాగా శుక్రవారం ని ర్వహించిన ప్రెస్మీట్లోనూ వారంతా కలిసే పాల్గొన్నారు. పార్టీ ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం కలిసి పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల ప్రచారానికే..ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్రెడ్డి రెండోసారి జిల్లాకు రానున్నారు. పార్ల మెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2024 మే 5న జిల్లాకేంద్రానికి వచ్చారు. పార్టీ అగ్రనేత రాహుల్గాంధీతో పాటు ఆయన కూడా బహిరంగసభలో పాల్గొన్నారు. దాదాపు పదినెలల తర్వాత సీఎం జిల్లాకు రానున్నారు. కానీ.. ఈసారి కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగానే వస్తుండటం గమనార్హం. ఎ మ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగానే కొండాపూర్లో సమావేశం కొనసాగనుంది. ముఖ్యమంత్రిగా రెండోసారి వస్తున్నా.. జిల్లాకు ఏం లాభం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడూ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఆయన జిల్లాకు వస్తుండగా ఎలాంటి అభివృద్ధి పనులకు అవకాశం లేదు. 24న నిర్మల్లో పట్టభద్రులతో సమావేశం కానున్న రేవంత్రెడ్డి నరేందర్రెడ్డి కోసం ప్రచారం సక్సెస్కు నాయకుల కసరత్తుసమావేశం విజయవంతం చేయండిఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 24న జిల్లాకు సీఎం రేవంత్రెడ్డి రానున్నారని డీ సీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు పేర్కొన్నా రు. కొండాపూర్లోని చంద్రశేఖర్ కన్వెన్షన్లో మధ్యాహ్నం 12గంటలకు నిర్వహించే సమావేశానికి పట్టభద్రులు తరలిరావాలని కోరారు. స్థా నిక మారుతీఇన్లో శుక్రవారం విత్తనాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్రెడ్డి, మాజీమంత్రి అ ల్లోల ఇంద్రకరణ్రెడ్డితో కలిసి విలేకరులతో మా ట్లాడారు. నిరుద్యోగుల పక్షాన పోరాడింది కాంగ్రెస్ ఒక్కటేనని, అందుకే రాష్ట్రంలో అధికారాన్ని కట్టబెట్టారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్లు ఇచ్చి, ఇప్పటివరకు 55వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఇ ప్పుడు ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్రెడ్డిని గెలిపించాలని కోరారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, విత్తనాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ అర్జుమంద్అలీ, ఏఎంసీ చైర్మన్లు భీంరెడ్డి, హాది, మున్సి పల్, గ్రంథాలయసంస్థ మాజీ చైర్మన్లు అప్పాల గణేశ్చక్రవర్తి, గండ్రత్ ఈశ్వర్, ఎర్రవోతు రా జేందర్, నాయకులు పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, ఎంబడి రాజేశ్వర్, నాందేడపు చిన్ను, అజర్, జునై ద్, రవి తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకులు మెరుగైన సేవలు అందించాలి
నిర్మల్చైన్గేట్: బ్యాంకులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కన్సాలిటేటివ్ కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఇప్పటి వరకు ప్రజలకు బ్యాంకులో అందజేసిన రుణాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ రుణాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. వెనుకబడిన తరగతుల ప్రజలకు, మహిళా స్వయం సహాయక సంఘాలకు, రైతులకు అందించే రుణాల మంజూరులో జాప్యం చేయొద్దని పేర్కొన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశం అనంతరం అదనపు కలెక్టర్ చేతుల మీదుగా జిల్లా పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ 2025–26 సంచికను ఆవిష్కరించారు. సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్గోపాల్, నాబార్డు డీడీఎం వీరభద్రుడు, డీఆర్డీవో విజయలక్ష్మి, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ రామారావు, ఆర్బీఐ ఎల్బీఓ దేవ్జిత్ బారువ, జిల్లా అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. -
జై భవాని.. జై శివాజీ..
నిర్మల్చైన్గేట్: ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా నిర్మల్ పట్టణం బుధవారం ‘జైభవానీ.. జై శివాజీ.. ఛత్రపతి శివాజీ మహరాజ్కీ జై..’ నినాదాలతో మార్మోగింది. శివాజీ సేవాసమితి ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియం నుంచి శివాజీచౌక్ వరకు భారీ బైక్ర్యాలీ నిర్వహించారు. బీజేఎల్పీనేత మహేశ్వర్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దేశం కోసం.. ధర్మం కోసం చివరి ఊపిరి వరకు పోరాడిన శివాజీ గొప్పతనం ముందుతరాలకూ తెలియజేయాలన్నారు. ముఖ్యవక్త గోసేవా ప్రాంతప్రముఖ్ వెంకటనివాస్ మాట్లాడుతూ హిందువులు సంఘటితంగా ఉంటేనే శివాజీ మహారాజ్ లక్ష్యాలు నెరవేరుతాయన్నారు. శివాజీ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మెడిసెమ్మె రాజు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. అంతకు ముందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి నిర్వహించారు. ర్యాలీ అనంతరం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న నాయులు, కార్యకర్తలు మాట్లాడుతున్న మహేశ్వర్రెడ్డి -
ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
● డీసీహెచ్ఎస్ సురేశ్భైంసాటౌన్: ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు మెరుగైన సేవలందించాలని డీసీహెచ్ఎస్ సురేశ్ అన్నారు. డీఎంహెచ్వో రాజేందర్తో కలిసి పట్ట ణంలోని ప్రభుత్వ ఏరియాస్పత్రిని బుధవారం తని ఖీ చేశారు. ఈ సందర్భంగా వార్డుల్లో తిరుగుతూ రోగులకు అందుతున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇటీవల ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లోని 5–12 తరగతుల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా, వారికి ఆప్తాల్మజిస్ట్ ఆధ్వర్యంలో ఏరియాస్పత్రిలో మరోమారు పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు ఆయన పరిశీలించి మాట్లాడారు. తెలంగాణ వైద్యవిధాన పరిషత్ అధికారుల ఆదేశాల మేరకు ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో దాదాపు 1,385 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించామని, వీరిలో అవసరమైనవారికి కంటి అద్దాలు, మందులు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్, వైద్యులతో సమావేశం నిర్వహించారు. సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని, వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. ఆర్థో, జనరల్ సంబంధ ఆపరేషన్ల సంఖ్య పెంచాలని, పారిశుధ్య నిర్వహణ సక్రమంగా ఉండాలని ఆదేశించారు. త్వరలోనే ఆస్పత్రిలో వాహనాల పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అవినాష్, ఏరియాస్పత్రి వైద్యుడు అనిల్ ఉన్నారు. -
సమీకృత గురుకులం నిర్మాణ స్థలం పరిశీలన
దిలావర్పూర్: మండలంలోని సిర్గాపూర్ గ్రా మంలోని సర్వే నంబర్ 664లోని భూమిని రాష్ట్ర కమిషనర్ కృష్ణ ఆదిత్య, కలెక్టర్ అభిలాష అభినవ్తో కలిసి బుధవారం పరిశీలించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల సమీకృత నిర్మాణం కోసం గ్రామంలో స్థలం ఎంపిక చేశారు. భవన నిర్మాణం పగడ్భందీగా చేపట్టాలంటూ కమిషనర్ కృష్ణ ఆది త్య సూచించారు. ఇందుకు కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని తెలిపా రు. వారివెంట అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకుమారి, ఆర్అండ్బీ ఈఈ అశోక్కుమార్, డీఐఈవో పరశురాం, డీఈ గంగాధర్, తహసీల్దార్ స్వాతి, ఏఈ తుకారాం, అధికారులు పాల్గొన్నారు. -
వంద శాతం పన్ను వసూలు చేయాలి
నిర్మల్చైన్గేట్: మున్సిపాలిటీల్లో పన్ను వసూలు వంద శాతం పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. నిర్మల్ పట్టణంలో వివిధ కాలనీలలో జరుగుతున్న పన్నుల వసూలు, వాణిజ్య లైసెన్సుల పునరుద్ధరణ ప్రక్రియను మున్సిపల్ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఆస్తి పన్నుతోసహా అన్ని రకాల పన్నులు సకాలంలో చెల్లించాలని వ్యా పారులకు సూచించారు. నిర్ణీత గడువులోగా వాణిజ్య లైసెన్సులు పునరుద్ధరించుకోవాలన్నారు. సకా లంలో పన్నులను చెల్లించని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంత రం దివ్యగార్డెన్ సమీపంలోని అర్బన్ పార్కును పరిశీలించి పార్కు అభివృద్ధికి సూచనలు చేశారు. ప్రజలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలన్నారు. సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించా రు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, డీఈ హరిభువణ్, అధికారులు ఉన్నారు. -
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
కుంటాల: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుంటాల విజయసాయి పాఠశాలలో రాష్ట్రస్థాయి అండర్–16 కబడ్డీ పోటీలు ఈనెల 12 నుంచి నిర్వహించారు. పోటీలు బుధవారం ముగిశాయి. ఈ పోటీల్లో 12 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈనెల 20 నుంచి 23 వరకు వికారాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి బర్కుంట సునీల్ పేర్కొన్నారు. ఎంపికై న జట్టును ప్రిన్సిపాల్ పంగెర స్వప్న సంతోష్, పీఈటీ రాథోడ్ అరవింద్, గ్రామ పెద్దలు దొనికెన వెంకటేశ్, తాటి శివ అభినందించారు. -
రితేశ్కు బీజేపీ పగ్గాలు
● జిల్లా అధ్యక్షుడిగా నియామకం ● వ్యతిరేకత ఉన్నా.. రాథోడ్కే మొగ్గు ● పార్టీపై పట్టు నిలుపుకున్న ఎమ్మెల్యేలు ● తొలిసారి జిల్లాయేతర నేతకు బాధ్యతనిర్మల్: మాజీ ఎంపీ, ఉమ్మడి జిల్లాలో సీనియర్నేత, దివంగత రాథోడ్ రమేశ్ తనయుడు రితేశ్ రాథోడ్కు నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి దక్కింది. ఈమేరకు పార్టీ రాష్ట్ర శాఖ అధికారికంగా ప్రకటించింది. కమలదళాధ్యక్ష ఆశావహుల్లో ఆయన పేరు ఉన్నప్పటికీ.. జిల్లా కానీ నాయకుడికి ఎలా ఇస్తారంటూ సీనియర్ నేతల నుంచి వ్యతిరేకత రావడంతో చివరి వరకూ రితేశ్కు ఇస్తారా.. లేదా అన్న డైలామా కొనసాగింది. కానీ.. జిల్లా నుంచి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలుపడంతోనే పార్టీ అధిష్టానం రాథోడ్ వైపే మొగ్గుచూపినట్లు కమలదళంలో చర్చనడుస్తోంది. మరోవైపు జిల్లా అధ్యక్ష పదవి ఆశించిన పలువురు సీనియర్ నేతలు ఈ నియామక ప్రకటనపై అధిష్టానాన్ని కలువనున్నట్లు తెలిసింది. రాథోడ్ రాజకీయ వారసుడిగా.. ఖానాపూర్ ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆదిలాబాద్ జెడ్పీచైర్మన్, ఎంపీగా చేసిన దివంగత నేత రాథోడ్ రమేశ్ రాజకీయ వారసుడిగా రితేశ్ రాథోడ్ కొనసాగుతున్నారు. తల్లి సుమన్బాయి కూడా ఖానాపూర్ ఎమ్మెల్యేగా చేశారు. తండ్రి ఉన్నప్పుడే రితేశ్ యువనేతగా బీజేపీలో కొనసాగారు. రాష్ట్ర ఎస్టీ మోర్చా నాయకుడిగా కొనసాగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ పాదయాత్ర ఇన్చార్జిగా వ్యవహరించారు. కర్ణాటక, మునుగోడు, హుజురాబాద్ ఎన్నికల్లో బాధ్యతలు తీసుకుని పనిచేశారు. మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ మరణానంతరం ఖానాపూర్ అసెంబ్లీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. సీనియర్ల వ్యతిరేకత.. బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి నియామకం ప్రహసనంగా సాగింది. పార్టీలో చాలామంది సీనియర్లు అధ్యక్ష పదవిని ఆశించారు. తామందరినీ కాదని రితేశ్కు పదవి ఇవ్వడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నేతకు జిల్లా అధ్యక్ష పదవి ఎలా ఇస్తారన్న ప్రశ్నను లేవనెత్తుతున్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని కేవలం నాలుగు మండలాలు మాత్రమే జిల్లాలో వస్తాయని, జిల్లాపై పట్టులేని నేతకు బాధ్యతలు ఇవ్వడం సరికాదని వాదిస్తున్నారు. ఇదే విషయాన్ని గురువారం జిల్లాకు రానున్న సీనియర్ నేత సునీల్బన్సల్ దృష్టికి తీసుకెళ్తామంటున్నారు. జిల్లా అధ్యక్షుడిగా రితేశ్ రాథోడ్ను నియమిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ప్రస్తుత అధ్యక్షుడు అంజుకుమార్రెడ్డి తెలిపారు. 15 నెలలపాటు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం తనకు దక్కిందన్నారు. రితేశ్కు అన్నివిధాలా సహకరిస్తామని పేర్కొన్నారు. -
అంగన్వాడీల ఉన్నతీకరణకు చర్యలు
నిర్మల్చైన్గేట్: అంగన్వాడీల ఉన్నతీకరణకు చర్యలు తీసుకుంటున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల అభివద్ధి, ఉన్నతీకరణ తదితర అంశాలపై సంక్షేమ శాఖ జేడీ హైదరాబాద్ నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో భాగంగా కలెక్టరేట్ నుంచి స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు అంగన్వాడీలను తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైన ప్రతీ అంగన్వాడీ కేంద్రంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో సీడీపీవో నాగలక్ష్మి, సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
తహసీల్దార్ కార్యాలయం తనిఖీ
లక్ష్మణచాంద:లక్ష్మణచాంద తహసీల్దార్ కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ కిశోర్కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. వివిధ సర్టిఫికెట్ల కోసం ప్రజలు దరఖాస్తు చేసుకున్న డ్యాష్ బోర్డును పరిశీలించి ఎప్పటికప్పుడు సర్టిఫికెట్లు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. మండలంలో అక్రమంగా జరుగుతున్న ఇసుక రవాణాను అరికట్టాలని తెలిపారు. ఎక్కడ ఇసుక అక్రమ రవాణా జరిగినా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటి వరకు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను తెలుసుకున్నారు. మొత్తం 1,950 దరఖాస్తులు రేషన్ కార్డుల కోసం వచ్చాయని తెలిపారు. ఆన్లైన్ చేయడం పూర్తయిందని తహసీల్దార్ జానకి తెలిపా రు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ అబ్దుల్ అజీజ్, ఆర్ఐ నరేందర్రెడ్డి కార్యాలయ సిబ్బంది ఉన్నారు. -
కష్టపడి చదివితేనే భవిష్యత్తు
● డీఈవో రామారావుసారంగపూర్: విద్యార్థులు కష్టపడి చదివితేనే బంగారు భవిష్యత్తు ఉంటుందని డీఈవో రామారావు అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను మంగళవారం సందర్శించారు. ఈసందర్భంగా పదో తరగతికి సమాయత్తమవుతున్న విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. సిలబస్, రివిజన్ తరగతులు, ప్రత్యేక తరగతుల నిర్వాహణ తదితర విషయాలను తెలుసుకున్నారు. ప్రత్యేక తరగతులకు ఏఒక్క విద్యార్థి కూడా గైర్హాజరు కావొద్దని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులు సైతం కష్టపడి చదివి మంచి జీపీఏ సాధించాలన్నారు. సీ గ్రేడ్ విద్యార్థులను ఏగ్రేడ్లోకి తీసుకురావడానికి ఉపాధ్యాయులు సైతం అంకితభావంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఇక భోజనం విషయంలో రాజీపడొద్దన్నారు. ప్రతీరోజు ఒక ఉపాధ్యాయుడు భోజనం వండే సమయంలో అందుబాటులో ఉండి మెనూ ప్రకారం రుచికరంగా అందేలా చూడాలని సూచించారు. అనంతరం ప్రతీ తరగతి గదికి వెళ్లి విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. ఆయన వెంట ఎంఈవో మధుసూదన్, హెచ్ఎం విజయ, ఉపాద్యాయులు ఉన్నారు. -
ప్రీ ఫైనల్కు ఓఎంఆర్..
● విద్యార్థులకు ముందస్తు అవగాహన ● జిల్లాలో 9,127 మందికి ప్రయోజనం లక్ష్మణచాంద:పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి. ప్రస్తుతం పాఠశాలల్లో విద్యార్థులకు రెండో గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. వార్షిక పరీక్షలకు ముందు విద్యార్థులకు ఓఎంఆర్పై అవగాహన కల్పించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈమేరకు ప్రీఫైనల్ పరీక్షలకు ఓఎంఆర్ విధానం అమలు చే యబోతోంది. ఓఎంఆర్పై అవగాహన లేకపోవడంతో చాలామంది విద్యార్థులు తప్పులు చేస్తున్నారు. పొరపాట్లను తగ్గించేందుకు ఈసారి ప్రీఫైనల్ పరీక్షలకు ఓఎంఆర్ విధానం అమలు చేయనుంది. 6 నుంచి ప్రీ ఫైనల్.. మార్చి 6 నుంచి జరిగే ప్రీ ఫైనల్ పరీక్షల సందర్భంగా ఓఎంఆర్ షీట్ వినియోగించనున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఓఎంఆర్ షీట్పై ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. మార్చి 21 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వివరాలు నమోదు చేయాలి.. పదో తరగతి పరీక్షల సమయంలో ప్రతీ విద్యార్థికి ఆన్సర్ షీట్తోపాటు ఓఎంఆర్ షీట్ ఇస్తారు. విద్యార్థికి సంబంధించిన వివరాలు అందులో ముద్రించి ఉంటాయి. వాటిని ప్రతీ విద్యార్థి తమ తమకు కేటాయించిన షీట్లో సరి చూసుకోవాలి. ఏమైనా తప్పులు ఉంటే వెంటనే ఇన్విజిలేటర్కు తెలియజేయాలి. అతను ఇచ్చే ఖాలీ ఓఎంఆర్ షీట్పై విద్యార్థి వివరాలు రాయాల్సి ఉంటుంది. జవాబులు రాసేందుకు తీసుకున్న అడిషనల్స్ సంఖ్య కూడా ఓఎంఆర్ షీట్పై రాయాల్సి ఉంటుంది. 47 కేంద్రాలు.. 9,127 మంది విద్యార్థులు.. ఈసారి పదో తరగతి వార్షిక పరీక్షల కోసం జిల్లాలో 47 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 235 ఉన్నత పాఠశాలకు చెందిన 9,127 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇందులో 4,442 బాలురు, 4,685 బాలికలు ఉన్నారు. -
ప్రయాణికులను గౌరవించాలి
నిర్మల్టౌన్: ప్రతీ ఆర్టీసీ ఉద్యోగి ప్రయాణికులను గౌరవించాలని ఆదిలాబాద్ రీజియన్ డిప్యూటీ ఆర్ఎం ప్రవీణ్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ప్రొజెక్టర్ ద్వారా ఉద్యోగులకు డ్యూటీలో ఉన్నప్పుడు పాటించాల్సిన నియమాలపై మంగళవారం తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల్లో నైపుణ్యాన్ని, సృజనాత్మకతను పెంపొందించడానికి ఈ క్లాసులు ఏర్పాటు చేశామన్నారు. ఉద్యోగులు ఈ సంస్థ నాది అని పనిచేయాలని, అప్పుడే మనం తృప్తి చెందుతామని సూచించారు. ఈ క్లాసులు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. డిపోలోని ప్రతీ ఉద్యోగి ఈ క్లాసులకు రావాలని తెలిపారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్, ఏఈ నవీన్కుమార్, ఉద్యోగులు పాల్గొన్నారు -
యూరియా కోసం ఆందోళన
ఖానాపూర్: పట్టణంలోని గ్రోమోర్ ఫర్టిలైజర్స్ వద్ద ఖానాపూర్, కడెం, పెంబి మండలాల రైతులు మంగళవారం ఆందోళన చేశారు. యూరియా కోసం వచ్చిన రైతులకు నిర్వాహకులు గంట గులికలు, ఇతర మందులు కొనుగోలు చేస్తేనే యూరియా ఇస్తామని బలవంతంగా కొనిపిస్తున్నారు. దీంతో రైతులు నిర్వాహకులను నిలదీశారు. అనంతరం స్థానిక వ్యవసాయ అధికారులకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై మండల వ్యవసాయ అధికారి జగదీశ్వర్ను వివరణ కోరగా.. రైతులు చెప్పిన వెంటనే ఎటువంటి ఇతర మందులు కొనుగోలు చేయకుండానే యూరియా ఇవ్వాలి నిర్వాహకులను ఆదేశించామన్నారు. ఈ విషయమై విచారణ చేసి తగు ఆదేశాలు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో రైతులు కల్మర్ రాజేశ్వర్, రాచర్ల శేఖర్, జోగు రాజేశ్వర్, బూక్య గోవింద్నాయక్, కుందూరి గంగాధర్, గాడ్పు రాజేందర్, కట్ల మహేశ్, కోమటిపెల్లి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
వేసవిలో తాగునీటి సమస్య తలెత్తొద్దు
● రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నిర్మల్చైన్గేట్:వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. హైదరాబాదులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీరు, విద్యుత్ వినియోగం, రైతుభరోసా, ఆహారభద్రత కార్డుల పరిశీలన, రబీ పంటలకుసాగు నీరు తదితర అంశాలపై చర్చించారు. గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలందరికీ నిరంతరం నీటిని అందించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. రబీ పంటలకు సాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. యూరియా కొరత లేకుండా చూడాలన్నారు. ప్రజాపాలనలో రేషన్ కార్డుల కొరకు వచ్చిన దరఖాస్తులలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ చేయాలని తెలిపారు. గురుకుల పాఠశాలలను జిల్లా అధికారులు సందర్శించి పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సాగు, తాగునటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యవసాయానికి విద్యుత్ కొరత రాకుండా చూస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. గురుకుల పాఠశాలల విద్యార్థుల కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలను సీఎస్కు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, ఇరిగేషన్ ఎస్ఈ రవీందర్, డీపీవో శ్రీనివాస్, వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, మిషన్ భగీరథ ఈఈ సందీప్, మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్గౌడ్, జాదవ్కృష్ణ, డీఎస్వో కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ముస్లింలను బీసీల్లో చేరిస్తే స్పందించరా?
● కేంద్రం నిధులపై చర్చకు సిద్ధమా? ● కేంద్ర మంత్రి బండి సంజయ్ ● మంచిర్యాలలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం సాక్షిప్రతినిధి, మంచిర్యాల/మంచిర్యాలటౌన్: ‘బీసీ లకు 42శాతం రిజర్వేషన్లు అని చెప్పి.. 10 శాతం ముస్లింలను కలిపితే బీసీలకు అన్యాయం జరిగిన ట్లు కాదా.. కాంగ్రెస్ నేతలు స్పందించరా..? బీసీల్లో ముస్లింలను కలిపితే కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదు. ..’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ‘రంజాన్కు ముస్లిం ఉద్యోగులందరికీ సాయంత్రం 4గంటలలోపే విధులు ముగించుకుని వెళ్లిపోవచ్చని మినహాయింపు ఇచ్చారు. అయ్యప్ప, హనుమాన్, భవానీ భక్తులు ఏం పాపం చేశారని.. కాంగ్రెస్లోని హిందువులారా.. మీలో నిజంగా హిందూ రక్తమే ప్రవహిస్తే సమాధానం చెప్పాలి..’అంటూ డిమాండ్ చేశారు. మంగళవారం మంచిర్యాల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. అంతకు ముందు పట్టణంలో కార్యకర్తలు, నాయకులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షు డు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు కే.వెంకటరమణారెడ్డి, పాల్వాయి హరీశ్బాబు, ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజ య్ మాట్లాడుతూ.. మూడుస్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఏ సర్వే చూసినా స్పష్టం చేస్తున్నాయని అన్నారు. కేంద్రం రూ.12.75లక్షల ట్యాక్స్ మినహా యింపు, పదేళ్లలో రూ.12 లక్షల కోట్లకుపైగా నిధులను తెలంగాణకు ఇచ్చిందన్నారు. కేంద్రం నిధులివ్వడం లేదని ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ బహిరంగ చర్చకు సిద్ధమా..? ఈ అంశాన్ని రెఫరెండంగా తీసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి రావాలని కాంగ్రెస్కు సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలనే ఆలోచనే ఆ పార్టీ ఎమ్మెల్యేలకు లేదన్నారు. సొంత కాలేజీ స్టాఫ్ను పట్టుకుని తిరుగుతున్నారని విమర్శించారు. మంచిర్యాలలో దాదాగిరి మంచిర్యాలలో కొందరు దాదాగిరి చేస్తున్నారని, ఆరు నెలల కంటే ఎక్కువ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే పరిస్థితి లేదని కేంద్రమంత్రి సంజయ్ అన్నారు. ప్రభుత్వంలో టాప్ 5లో ఉన్న వాళ్ల దోపిడీ, అవి నీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోందని, కమీషన్లకు కక్కుర్తిపడుతున్నారని విమర్శించారు. అవినీ తి జరుగుతుందడానికి సీఎం వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. 15శాతం కమీషన్లు ఇస్తే మాత్రం కాంట్రాక్టర్లకు అప్పటికప్పుడు బిల్లులు క్లియర్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ బీసీ కాదని ఆయన కులం గురించి అవాకులు పేలుతున్నారని, రాహు ల్ ఖాన్ గాంధీ తండ్రి పేరు ఏమిటి? ఫిరోజ్ఖాన్ గాంధీ...అసలు గాంధీ అని పేరు యాడ్ చేసుకుని గాంధీ పరువు తీస్తున్నారని విమర్శించారు. మహా త్మాగాంధీ ఆత్మ బాధపడుతోందని, ఫిరోజ్ఖాన్ గాంధీ కొడుకు, మనవడు ఏమైతరు? హిందువులైతే కానే కాదన్నారు. మీరు హిందువులేనా? మీలో హిందువు రక్తం ప్రవహిస్తుందా? అని ప్రశ్నించారు. నిరుద్యోగులు, ఉద్యోగుల పక్షాన పోరాడింది తామే అని, నిరుద్యోగులకు మోచేతికి బెల్లం రాసి నాకిచ్చి నంత పనిచేశారని అన్నారు. 2లక్షలకుపైగా ఖాళీలు ఉన్నాయని, ఓట్లకోసం వచ్చే కాంగ్రెస్ నేతలను గల్లా పట్టి నిలదీయాలని అన్నారు. కోడ్ లేని జిల్లాల్లో వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు.. అబద్ధాలు చెప్పి మోసం చేసి ఓట్లు దండుకోవడంలో కాంగ్రెసోళ్లు కేసీఆర్ను మించి పో యిర్రని తెలిపారు. ఇవన్నీ ప్రశ్నిస్తే హిందూ ముద్రవేస్తున్నారన్నారు. కాళేశ్వరం, డ్రగ్స్ కేసు, ఫార్ములా ఈ రేస్ స్కాం కేసులో ఇదిగో అరెస్ట్...అదిగో అరెస్ట్ అంటూ మీడియాలో వార్తలు రాయించుకుంటూ కాలయాపన చేయడం తప్ప కాంగ్రెస్ సాధించిందేమిటి అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ స్కాంలు ఢిల్లీలో ని కాంగ్రెస్ నేతలకు ఏటీఎంలాగా మారాయని, ఒక్కో స్కాం ఢిల్లీ పెద్దలకు రూ.వెయ్యి కోట్లకుపైగా పైసలు దండుకుంటున్నారని అన్నారు. -
ఇందిరమ్మకు ఇసుకెట్ల?
నిర్మల్● జిల్లాలో యథేచ్ఛగా అక్రమ రవాణా.. ● స్వర్ణ, కడెం, గోదావరిలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు ● అధికారులు దాడులు చేస్తున్నా లెక్కచేయని వైనం.. నిధుల్లేవ్..విధులకు రారు! గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన మొదలై ఏడాది గడిచింది. రెండు నుంచి మూడు గ్రామాలకో ప్రత్యేకాధికారిని నియమించారు. పనిభారంతతో పర్యవేక్షణ లోపించింది. బుధవారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20258లోu కొలాంగూడలో నాబార్డు డీడీఎం పర్యటన ఖానాపూర్: మండలంలోని కొలాంగూడ గ్రామంలో నాబార్డు డీడీఎం వీరభద్ర మంగళవారం పర్యటించారు. గ్రామానికి చెంది న ఆదివాసీ మహిళలతో సమావేశమై మహిళల జీవనోపాధులపై చర్చించారు. అవాల్ రూరల్ లైవ్లీ హుడ్ ఎంపవర్మెంట్ సొసైటీతోపాటు ఐకేపీ, నాబార్డు సహకారంతో మహిళలకు వెదురుతో అల్లికలు, తయారీపై అవగాహన కల్పించారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి చేపట్టిన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. అవాల్ రూరల్ లైవ్లీహుడ్ సీఈ వో బండారి రమేశ్, వీవోఏ బాదావత్ రవి, ఫీల్డ్ అసిస్టెంట్ పీర్య పాల్గొన్నారు. నిర్మల్:రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. జనవరి 26న ఈ పథకాన్ని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయింది. సొంత స్థలం ఉన్నవారి ఖాతాల్లో రూ.5 లక్షల చొప్పన జమ చేయనున్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఇసుక ఉచితంగా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అయితే.. జిల్లాలో సాగుతున్న ఇసుక దోపిడీతో ఇళ్ల నిర్మాణానికి కూడా దొరికే పరిస్థితి లేదు. జిల్లాలో నెల రోజుల వ్యవధిలో పోలీసు–రెవెన్యూ శాఖలు చేపట్టిన దాడుల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 221 టన్నుల ఇసుకను సీజ్ చేశారు. తాజాగా ఇసుక అక్రమ రవాణాపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడంతో జిల్లా అధికారులు దాడులు మరింత ఉధృతం చేశారు. అయినా.. జిల్లాలో అక్రమ దందా ఆగడం లేదు. కాళేశ్వరం, చెన్నూరు రీచ్ల నుంచి అనుమతులతో తీసుకువచ్చేది కొంతే.. జిల్లాలో గోదావరి, కడెం, స్వర్ణ, సుద్దవాగుల నుంచి కొల్లగొట్టేది కొండంత. స్వర్ణమ్మను చెరబట్టి.. శీతాకాలం సీజన్ వచ్చిందంటే చాలు.. స్వర్ణనదికి నరకమే. గోదావరికి ఉపనదిలా ఉన్న ఈ వాగు పొడవునా ఇసుక తవ్వకాలే. సారంగపూర్, నిర్మల్రూరల్, సోన్మండలాల్లోని చాలా గ్రామాల్లో ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. అధికారికంగా ఎలాంటి అనుమతులు లేకుండానే యంత్రాలు, ట్రాక్టర్లతో తరలించేస్తున్నారు. వీడీసీల ఆధ్వర్యంలో వేలం వేస్తున్నారు. వాటికి డబ్బులు కట్టినవాళ్లు దర్జాగా వాగుల్లో ఇసుకను తోడేస్తున్నారు. వర్షకాలం ముగిసి నీటి ప్రవాహాలు, చెక్డ్యామ్ల వద్ద నీటిమట్టం తగ్గగానే దందా జోరందుకుంటోంది. అక్కడే అనుమతి.. జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క ఇసుక రీచ్ కూడా లేదు. ఎందుకంటే.. ఆస్థాయిలో ఇక్కడ ఇసుక లభ్యత ఉండదు. అయినా ప్రమాదకరంగా అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారు. ఇక.. స్థానిక, అధికారిక అవసరాల కోసం మాత్రం జిల్లాలో నాలుగుచోట్ల తీసుకునేందుకు అనుమతిచ్చారు. భైంసా డివిజన్లోని సాథ్గాం, హద్గాం, పేండ్పల్లి, నిర్మల్ డివిజన్లో వెంగ్వాపేట్ గ్రామాల్లో మాత్రమే ఇసుకను తీసుకునేందుకు అధికారులు అనుమతిచ్చారు. కానీ.. చాలా గ్రామాల్లో వీడీసీలను అడ్డుపెట్టుకుని ఇసుక వ్యాపారులు వాగులు, నదులను కొల్లగొడుతున్నారు. గోదావరిలో నుంచి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్న ఇసుక నేడు బైక్ ర్యాలీ నిర్మల్టౌన్: ఛత్రపతి శివాజీ జయంతి పురస్కరించుకొని బుధవారం జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు శివాజీ సేవాసమితి జిల్లా సభ్యులు కోరారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్లో మంగళవారం మాట్లాడారు. ఈ ర్యాలీ స్థానిక ఎన్టీఆర్ స్టేడియం నుంచి సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై అంబేద్కర్ చౌక్ మీదుగా శివాజీ చౌక్కు చేరుకుంటుందని తెలిపారు. ర్యాలీ లో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, తెలంగాణ ప్రాంత గోసేవా ప్రముఖ్ వెంకట్ నివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో శివాజీ సేవాసమితి సభ్యులు మెడిసెమ్మ రాజు, మూర్తి ప్రభాకర్, సామనపల్లి రాఘవులు, బొడ్డు లక్ష్మణ్, గోజ్జా జనార్దన్, పొలిశెట్టి విలాస్, వెంకటపతి, సీతారాం పటేల్, కేఎస్.గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. న్యూస్రీల్చర్యలు తీసుకుంటున్నాం.. జిల్లాలో అనుమతి లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టడానికి లేదు. అనుమతి లేకుండా ఎక్కడ ఇసుక తవ్వకాలు చేపట్టినా చర్యలు చేపడతాం. ఇటీవల పట్టుకున్న ఇసుకను వేలం వేస్తున్నాం. – కిశోర్కుమార్, అడిషనల్ కలెక్టర్ కేసులు నమోదు చేస్తున్నాం.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇసుక అక్రమ రవాణాపై పోలీసుశాఖ సీరియస్గా చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేశాం. రాష్ట్రంలోనే అత్యధికంగా ఇసుక సీజ్ చేయించాం. – జానకీషర్మిల, ఎస్పీ కడెం, సుద్దవాగుల్లోనూ.. జిల్లాలో ప్రధాన జలవనరులైన కడెం, సుద్దవాగుల్లోనూ ఇసుకదందా సాగుతూనే ఉంది. సుద్దవాగుతో పోలిస్తే.. కడెంలోనే ఈ దోపిడీ ఎక్కువగా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. కడెం ప్రాజెక్టు బ్యాక్వాటర్లో నీటిమట్టం తగ్గగానే అటవీప్రాంతం నుంచే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఇక్కడా.. అధికారులు దృష్టిపెట్టినప్పుడు నిలిపేస్తూ.. మళ్లీ దందా యథావిధిగా సాగిస్తున్నారు. గోదావరి పొడవునా.. జిల్లాలో బాసర నుంచి దస్తురాబాద్ వరకు గోదావరి నది పరీవాహకం ఉంది. ప్రధానంగా సోన్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్, కడెం, దస్తురాబాద్ మండలాల్లో ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. మొన్నటి వరకు కడెం మండలం చిట్యాల, లింగాపూర్, బెల్లాల్ సమీపంలోని గోదావరిలో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగాయి. ఖానాపూర్ మండలం సోమార్పేట్, బీర్నంది, గాంధీనగర్ దగ్గర వాగుల్లోనూ ఇదే పరిస్థితి. దస్తురాబాద్ మండలం గొడిసిర్యాల, భూత్కూర్లలోనూ ఇసుక తవ్వకాలు కొనసాగుతుంటాయి. కమల్కోట్, మామడల్లోనూ ఇసుకదందా సాగుతోంది. ఇక అటవీ, పోలీసు, రెవెన్యూ అధికారులు దాడులు చేయడంతో తవ్వకాలు కొన్నిరోజులు ఆగాయి. తాజాగా దందా మళ్లీ జోరందుకుంది. -
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి
నిర్మల్చైన్గేట్: జిల్లాలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లాకు చేరుకున్న పోలింగ్ సామగ్రికి సంబంధించిన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. రూట్ ఆఫీసర్లు, పోలీస్ అధికారులతో కలిసి అన్ని పోలింగ్ కేంద్రాలకు చేరుకునే దారి, దూరం, పోలింగ్ కేంద్రానికి చేరుకునేందుకు పట్టే సమయం తదితర అంశాలను పరిశీలించాలని సూచించారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. అన్ని కేంద్రాల్లో దివ్యాంగ ఓటర్ల కోసం ర్యాంపు, వీల్ చైర్ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. పోలింగ్ సిబ్బంది సామగ్రి తరలింపునకు సంబంధించిన వాహనాలను సమకూర్చుకోవాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ఎన్నికల సిబ్బందికి మరోసారి శిక్షణ నిర్వహించి నమూనా ఎన్నికల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్ కుమార్, నిర్మల్, భైంసా ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్రెడ్డి, జెడ్పీసీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్, ఎకై ్స జ్ అధికారి ఎంఏ రజాక్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించాలి పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాను మరోసారి ప్రథమ స్థానంలో నిలుపాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. సోమవా రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సెస్సీ పరీక్షలపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల సంఖ్య, సిలబస్, ప్రత్యేక తరగతులు, సన్నద్ధత తదితర అంశాల గురించి పాఠశాలల వారీగా ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీ ఎస్వోలతో చర్చించి కీలక సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పరీక్షల నిర్వహణ, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు శాతం నివేదికల ను ఎప్పటికప్పుడు అందజేయాలని ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఈవో రామారావు, ఎంఈవోలు పాల్గొన్నారు. పీఎంశ్రీ నిధుల వినియోగంపై సమీక్ష పీఎంశ్రీ నిధుల వినియోగంపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ అభిలాష అభినవ్ సమీక్ష నిర్వహించారు. పీఎంశ్రీకి ఎంపికై న పాఠశాలలకు మంజూరైన నిధులు, ఇప్పటివరకు చేసిన ఖర్చు గురించి హెచ్ఎంలను అడిగి తెలుసుకున్నారు. పీఎంశ్రీ నిధుల వినియోగంపై అవగాహన కల్పించారు. ని ధులు సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. డీఈవో రామారావు తదితరులున్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష -
మాస్కాపీయింగ్ జరిగినట్లు కలెక్టర్కు గ్రామస్తుల ఫిర్యాదు
ఖానాపూర్: ఇటీవల భైంసాలో నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ పరీక్షల్లో మాస్కాపీయింగ్ జరిగినట్లు మస్కాపూర్ గ్రామస్తులు, విద్యార్థులు సోమవారం కలెక్టర్ అభిలాష అభినవ్కు కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. జిల్లావ్యాప్తంగా పరీక్ష నిర్వహించగా భైంసా పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసిన 61 మంది విద్యార్థులకే మెరిట్ వచ్చినట్లు ఆరోపించారు. మాస్కాపీయింగ్ జరిగినట్లు తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయని తెలిపారు. దీనిపై విచారణ చేపట్టి పరీక్షలు మళ్లీ నిర్వహించాలని మస్కాపూర్ జెడ్పీహెచ్ఎస్ తరపున కలెక్టర్ను కోరారు. రికార్డు నాట్యంలో చిన్నారులుభైంసాటౌన్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ శివారులోని సమతా స్ఫూ ర్తి కేంద్రంలో ఆదివారం రాత్రి సమతాకుంభ్–2025 పేరిట తృతీయ బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 3వేల మంది చిన్నారులతో నృత్య రూపకాలు ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలు ఇండియన్ వరల్డ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కు నమోదు చేశారు. రికార్డు స్థాయి నాట్య ప్రదర్శనలో భైంసా నుంచి శ్రీనయనం నృత్య కళానిలయానికి చెందిన 21 మంది చిన్నారులు పాల్గొన్నారు. వీరు నిర్వాహకుల నుంచి ప్రశంసాపత్రాలు అందుకున్నట్లు కళానిలయం శిక్షకురాలు రంగు సౌమ్య తెలిపా రు. వీరిని పలువురు అభినందించారు. -
అంగట్లో ఓటర్ల ఫోన్ నంబర్లు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకే మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలంటూ పట్టభద్రులు, టీచర్ల ఓటర్లకు నిత్యం పదుల సంఖ్యలో కాల్స్, మేసేజ్లు వస్తున్నాయి. కాల్ లిఫ్ట్ చేసే వరకూ ఫోన్లు మోగుతూనే ఉంటున్నాయి. ఒకరు ఇద్దరు కాదు లక్షలాది మంది ఓటర్ల ఫోన్ నంబర్లకు ఇలా ఫోన్లు వస్తున్నాయి. కొందరు చాటుగా ఫోన్ నంబర్లు తీసుకుని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడంతో నిత్యం ఓటర్లకు కాల్స్ వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లందరూ విద్యావంతులే. కానీ, వారికి తెలియకుండానే ఫోన్ నంబర్లు సేకరించి నేరుగా అభ్యర్థులు ఫోన్లు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఫోన్ నంబర్లనూ పైసలకు అమ్ముకోవడం గమనార్హం. ప్రైవేట్ వ్యక్తుల చేతిలో.. ఓటరు నమోదు సమయంలో ఎన్నికల సంఘం అధికార వెబ్సైట్, మాన్యువల్గా దరఖాస్తు చేసిన సమయంలో ఫోన్ నంబర్లను కూడా పేర్కొన్నారు. అలా అనేక మంది ఓటర్ల ఫోన్ నంబర్లు నిక్షిప్తమయ్యాయి. అయితే అధికార వెబ్సైట్లో నమోదు చేసిన వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచాలి. కానీ జిల్లాల్లో ఎన్నికల విభాగంలో పని చేస్తున్న కొందరు అధికారులు బయటకు ఇస్తున్నారు. బరిలో ఉన్న అభ్యర్థులు వివరాలు వాటిని కొనుగోలు చేసి వాడుకుంటున్నారు. ప్రచారం నుంచి సర్వేలదాకా పలు సంస్థలు, సోషల్మీడియా వేదికగా వాడుకుంటున్నాయి. చాలా మందికి ఒకటికి రెండుసార్లు ఫోన్లు చేస్తూ ఓటర్లకు చిరాకు తెప్పిస్తున్నారు. తక్కువ స మయంలో ఎక్కువ మందిని పలకరించేలా, నేరుగా ఫోన్ నంబర్లపైనే అభ్యర్థులు ఆధారపడుతున్నారు. లక్షలాది ఫోన్ నంబర్ల సేకరణ ఓట్ల కోసం లక్షలాది మంది ఓటర్ల వివరాలు సేకరించారు. ఎన్నికలు ముగిసినప్పటికీ వివిధ వ్యాపార ప్రకటనలు, ఇతరత్ర అవసరాల కోసం కూడా ఈ ఓటర్ల ఫోన్ నంబర్లు ఉపయోగించుకునే అవకాశం ఉంది. మహిళల ఫోన్ నంబర్లతోపాటు వారి సోషల్ మీడియా అకౌంట్లు లింకు ఉన్న వాటికి కూడా ప్రకటనలు పంపుతున్నారు. ఇలాంటి ఫోన్ కాల్స్తో సైబర్ నేరాలకు ఆస్కారం ఉంటుంది. అయితే కొందరు ఆ నంబర్ల నుంచి కాల్ రాగానే బ్లాక్ లేదా, స్పామ్గా రిపోర్టు చేస్తున్నారు. ఓటరు నమోదు సందర్భంగా లక్షలాది మందివి సేకరణ ఒక్కో పీడీఎఫ్ కాపీకి రూ.20 వేల నుంచి రూ.50 వేలు కొనుగోలు చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థులు ఓటర్లకు నిత్యం కాల్స్, మెసేజ్లు ‘నేను మీ ఎమ్మెల్సీ అభ్యర్థిని.. బ్యాలెట్ పేపర్లో నాది ఫలానా నంబర్. మీ పోలింగ్ బూత్ నంబర్ ఇదీ.. మీ మొదటి ప్రాధాన్యత ఓటు నాకే వేసి గెలిపించాలి’ ఇదీ మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ పట్టభద్రుడికి వచ్చిన ఫో న్. ఇలా అతడికి రోజూ పదుల సంఖ్యలో కా ల్స్ వస్తున్నాయి. కానీ, సదరు ఓటరు ఏ అభ్యర్థికీ తన ఫోన్ నంబర్ ఇవ్వలేదు. అయినా కా ల్స్ ఎలా వస్తున్నాయో అర్థం కాక తల పట్టుకుంటున్నాడు. టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులూ ఇదే తరహాలో ఫోన్లు, మెస్సేజ్లు చేస్తున్నారు. ‘మా వద్ద పట్టభద్రులు, టీచర్ ఓటర్ల పేర్లు, అడ్రస్, ఫోన్ నంబర్ సహా వివరాలు ఉన్నాయి. మీకు కావాలంటే చెప్పండి. రూ.30 వేలు ఇస్తే మీకు పీడీఎఫ్ కాపీ పంపుతాం’ అని ఓ స్వతంత్ర అభ్యర్థికి ఓ వ్యక్తి ఆఫర్ చేశాడు. ‘నేను అంత ఇవ్వలేను’ అని ఆ అభ్యర్థి చెబితే..‘రాజకీయ పార్టీల వాళ్లు మాకు ఒక్కో పీడీఎఫ్కు రూ.50 వేలు ఇచ్చారు. ఇప్పటికే వారందరూ ఓటర్లకు ఫోన్లు, మెసేజ్లు, వాట్సాప్లో సందేశాలు పంపుతున్నారు. మీరు కూడా అలాగే ప్రచారం చేసుకోవచ్చు’ అని సూచించాడు. -
విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు
జిల్లాలోని పలు గ్రామాల్లో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 9లోu ఒక్కో ప్రక్రియ ముగియడంతో.. గతేడాది ఫిబ్రవరి రెండున గ్రామపంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. ఆగస్టులో జిల్లా, మండల పరిషత్ పాలవర్గాల పదవీకాలం పూర్తయింది. ఆ తర్వాత పంచా యతీలు, పరిషత్లు పత్యేకాధికారుల పాలన కిందకు వెళ్లాయి. అనంతరం ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఒక్కో ప్రక్రియ పూర్తి చేస్తూ వచ్చింది. ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల సామగ్రి సమకూర్చుకోవడం, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం లాంటి ప్రక్రియ పూర్తిచేశారు. ఇవన్నీ చూసి ఎన్నికలే తరువాయి అన్నట్లు ఆశావహులు హడావుడి చేశారు. తాజాగా ప్రభుత్వ ప్రకటన వారిలో నైరాశ్యాన్ని నింపింది. -
విద్యార్థులకు కంటి పరీక్షలు
నిర్మల్చైన్గేట్: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సోమవారం విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. డీఎంహెచ్వో ధనరాజ్ మాట్లాడుతూ.. గతంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కంటి పరీక్షలు నిర్వహించి 1,385 మందికి కంటి లోపాలున్నట్టు గుర్తించినట్లు తెలిపారు. వారికి ఇప్పుడు నేత్ర వైద్యాధికారి ద్వారా కన్ఫర్మేషన్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ పరీక్షలు నిర్వహించి అద్దాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ గోపాల్, వైద్య విధాన పరిషత్ డీసీహెచ్ఎస్ సురేశ్, నేత్ర వైద్య నిపుణుడు ఇద్రిస్, పీవోసీహెచ్ఐ నయనారెడ్డి, ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
సోన్: పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించా రు. సోమవారం మండలంలోని లెఫ్ట్పోచంపాడ్ ప్ర భుత్వ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పా ఠశాల, కళాశాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్తో కలిసి ఆకస్మికంగా సందర్శించా రు. తరగతిగదిలో విద్యార్థులను పలు సబ్జెక్టుల్లో ప్ర శ్నలు అడిగి జవాబులు రాబట్టారు. పరీక్షలు సమీపిస్తున్నందున సమయాన్ని సరిగా వినియోగించుకుంటూ సిద్ధంకావాలని సూచించారు. 10జీపీఏ సాధించిన విద్యార్థులతో కలిసి భోజనం చేస్తానని హామీ ఇచ్చారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. డీఈవో రామారావు, ప్రిన్సిపాల్ ప్రశాంతి, తహసీ ల్దార్ మల్లేశ్, ఎంపీడీవో సురేశ్ తదితరులున్నారు. -
నిర్మల్
కూరగాయల ‘నగర్’ లోకేశ్వరం మండలం నగర్తండా వాసులు సీజన్తో సంబంధం లేకుండా కూరగాయలు సాగు చేస్తున్నారు. ఏడాది పొడవునా మంచి ఆదాయం గడిస్తున్నారు. మంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20259లోu నేటి నుంచి ‘పోస్ట్’ ఉద్యమంనిర్మల్చైన్గేట్: తెలంగాణ ఉద్యమకారుల కు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న జాప్యానికి నిరసనగా మంగళవారం నుంచి పోస్టుకార్డుల ఉద్య మం చేపట్టనున్నట్లు ఉమ్మడి జిల్లా చైర్మన్ కొట్టె శేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు కమిటీ ఏ ర్పాటు, ప్రతీ ఉద్యమకారునికి 250 చదరపు గజాల ఇంటి స్థలం, పెన్షన్, బస్సు ప్రయాణాల్లో రాయితీ, అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఉద్యమకారులకు ప్రత్యేక కార్పొరేషన్ తదితర డిమాండ్లతో పోస్టుకార్డుల ఉద్యమం చేపట్టినట్లు పే ర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతీ తెలంగాణ ఉద్యమకారుడు తమ ఆశలు, ఆకాంక్షలను సీఎం రేవంత్రెడ్డికి పోస్టుకార్డుల ద్వారా నివేదించాలని కోరారు. నిర్మల్చైన్గేట్: స్థానిక సంస్థల ఎన్నికలపై సందిగ్ధం నెలకొంది. ఓ వైపు ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సన్నద్ధమవుతుండగా.. మరోవైపు కులగణన రీసర్వే చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అయోమయం నెలకొంది. ఈనెల 15వ తేదీలోపు పరిషత్, ఆ తరువాత గ్రామపంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని అంతా భావించారు. అయి తే కులగణలో పాల్గొనని వారికోసం ఈనెల 16నుంచి 28వ తేదీ వరకు రీసర్వే చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ తరువాత బీసీ రిజర్వేషన్ల బిల్లుపై ప్రభుత్వ ప్రకటన, అసెంబ్లీలో బిల్లు పెట్ట డం, గవర్నర్ ఆమోదం ఇవన్నీ చూస్తుంటే.. ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశాలు లేవనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. తుది దశకు ఏర్పాట్లు మార్చి రెండో వారం నాటికి ప్రాదేశిక, సర్పంచ్ ఎ న్నికలు ముగించాలని ప్రభుత్వం మొదట భావించింది. అందుకు తగ్గట్లుగానే యంత్రాంగం ఎన్నిక ల ఏర్పాట్లలో తలమునకలైంది. ఇప్పటికే ఓటర్లు తుది జాబితాను ప్రదర్శించింది. అలాగే బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, నామినేషన్ పత్రాలు జిల్లాకు చేరాయి. రెండు రోజుల క్రితం పోలింగ్ కేంద్రాల ముసాయిదాను ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. కలెక్టర్, అధికారులు నేరుగా పో లింగ్ కేంద్రాలకు వెళ్లి పరిశీలిస్తున్నారు. మరోవైపు ఎన్నికల అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయడమే మిగిలి ఉంది. కాగా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎన్నికల బరిలో నిలువాలన్న ఆశావహుల్లోనూ నిరాశ నెలకొంది. ఊరించి.. ఉసూరుమనిపించి.. స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు అంతా సిద్ధమవడంతో కొద్ది రోజుల క్రితం జిల్లాలో రాజకీయ వాతా వరణం వేడెక్కింది. పంచాయతీల్లో తాము మద్దతు తెలిపిన వారిని గెలుపించుకోవడం, పార్టీ గుర్తులతో నిర్వహించే మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో బలనిరూపణ కోసం అన్ని పార్టీల నేతలు సవాల్గా తీసుకున్నారు. జిల్లాలో 400 గ్రామపంచాయతీలు, 18 జెడ్పీటీసీ స్థానాలు, 157 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. తొలుత ఎంపీ టీసీ, జెడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారనే ప్రచారం జరిగింది. దీంతో జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మె జారిటీ స్థానాలను దక్కించుకునేందుకు అధికార పార్టీ నాయకులు నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, ఆశావహులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా రావొచ్చంటూ నేతలు, కేడర్ దిశానిర్దేశం చేశారు. గ్రామపంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులుగా పోటీకి దిగాలని భావించినవారు ఎంత ఖర్చు చేయాలో ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చి ఇప్పటికే వనరులు సమకూర్చుకున్నారు. అలాగే స్థానికులతో మమేకం కావడం, యువత మద్దతు కూడగట్టుకోవడంపై దృష్టి సారించారు. తాజాగా ప్రభుత్వం మరోసారి కులగణనకు అవకాశం ఇవ్వడంతో వేడెక్కిన రాజకీయం చప్పున చల్లారింది. ఇప్పటికే నిర్వహించిన కులగణనలో కొందరు సర్వేలో పాల్గొనక పోవడంతో ఈనెల 28వ తేదీ వరకు మరోసారి కులగణన నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆన్లైన్ సర్వేతోపాటు టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఎంపీడీవో కార్యాలయంలో నమోదు చేసుకునేలా అవకాశం కల్పించారు. జిల్లాలోని పంచాయతీలు, పరిషత్లు గ్రామపంచాయతీలు: 400ఎంపీటీసీ స్థానాలు: 157జెడ్పీటీసీ స్థానాలు: 18పోలింగ్ కేంద్రాల సంఖ్య: 892ఓటర్ల సంఖ్య: 4,50,045 అభిప్రాయ సేకరణభైంసాటౌన్: పట్టణంలోని జీఆర్పీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తెలంగాణ రాష్ట్ర యువ వి కాసం బృందం సోమవారం సందర్శించింది. విద్యావ్యవస్థలో అభివృద్ధి చర్యలు, యు వతకు అందిస్తున్న ప్రోత్సాహంపై వివరా లు సేకరిస్తోంది. ఇందులో భాగంగా భైంసా డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు వసతులు, తరగతులు, విద్యాబోధన, డిజిటల్ తరగతుల నిర్వహణ తదితర కార్యక్రమాలపై ప్రి న్సిపాల్ బుచ్చయ్యను అడిగి తెలుసుకున్నా రు. విద్యార్థుల అభిప్రాయాలు సేకరించా రు. కార్యక్రమాన్ని వీడియో చిత్రీకరించారు. డైరెక్టర్ రామారావు, కెమెరామన్ మురళి, కె మెరా అసిస్టెంట్ కామేశ్, వలీ పాల్గొన్నారు. న్యూస్రీల్ 28 వరకు కొనసాగనున్న రీసర్వే బీసీ బిల్లు ఆమోదానికి ఆలస్యం ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం నిరాశ, నిస్పృహల్లో ఆశావహులు మండలం ఎంపీటీసీల పోలింగ్ ఓటర్ల సంఖ్య కేంద్రాలు సంఖ్య బాసర 6 31 15,720 భైంసా 11 67 33,886 దస్తురాబాద్ 5 24 12,968 దిలావర్పూర్ 6 34 18,708 కడెం–పెద్దూర్ 10 59 29,210 ఖానాపూర్ 8 48 23,655 కుభీర్ 14 86 40,666 కుంటాల 7 35 19,171 లక్ష్మణచాంద 9 49 24,475 లోకేశ్వరం 10 55 29,651 మామడ 9 52 26,099 ముధోల్ 10 53 28,719 నర్సాపూర్ (జి) 7 38 20,231 నిర్మల్ 7 45 22,756 పెంబి 5 32 10,985 సారంగపూర్ 14 77 39,549 సోన్ 8 43 21,935 తానూరు 11 64 31,751 ఓట్ల లెక్క తేలింది.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల సంఖ్య తేలింది. ఈ మేరకు సోమవారం జెడ్పీ సీఈవో గో వింద్ తుది ఓటరు జాబితాను విడుదల చేశారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనేది స్పష్టంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించనప్పటికీ.. ఎన్నికల సామగ్రి సమకూర్చుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా 892 పోలింగ్ కేంద్రాలను ప్రకటించారు. తుది జాబితా ప్రకారం 4,50,045 మంది ఓటర్లున్నారు.మార్చి నుంచి వరుసగా పరీక్షలు మార్చి 18నుంచి పదోతరగతి పరీక్షలు ప్రా రంభం కానున్నాయి. ఈ పరీక్షలు ముగియగా నే ప్రైమరీ, సెకండరీ స్కూల్ విద్యార్థులకు పరీ క్షలు మొదలవుతాయి. ఎన్నికల ప్రక్రియలో కీ లకమైన ఉపాధ్యాయులు పరీక్షల నిర్వహణలో బిజీగా ఉంటారు. ఈనెల కులగణన రీసర్వే పూర్తయిన తరువాత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఈ తరువాత అసెంబ్లీలో, గవర్నర్ చేత బిల్లు ఆమోదింపజేయాలి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పట్టే అవకాశముంది. మరోవైపు ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది. -
ఇంటర్నల్ మార్కుల పరిశీలన
నిర్మల్ఖిల్లా: జిల్లా కేంద్రంలోని రామ్నగర్ బా లికల ఆశ్రమోన్నత పాఠశాలలో సోమవారం పదోతరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల ను తనిఖీ బృందం సభ్యులు పరిశీలించారు. టీం లీడర్ దశరథ్, సభ్యుడు లక్ష్మణ్ ఉపాధ్యాయులకు సలహాలు, సూచనలు చేశారు. హెచ్ఎం తుకారాం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికకుంటాల: నిర్మల్ డిగ్రీ కళాశాల మైదానంలో ఈనెల 15న రాష్ట్రస్థాయి అండర్–14 అథ్లెటిక్స్ రన్నింగ్ పోటీలు నిర్వహించగా, మండల కేంద్రంలోని విజయసాయి పాఠశాలకు చెందిన ఐదో తరగతి విద్యార్థి జాదవ్ జలేందర్ ప్రతిభ కనబరిచి రెండో స్థానంలో నిలిచాడు. ఈనెల 18నుంచి 20వరకు హైదరాబాద్లోని గచ్చిబౌ లి స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో జలేందర్ పాల్గొననున్నట్లు ప్రిన్సిపాల్ స్వప్న, పీఈటీ రాథోడ్ అరవింద్ తెలిపారు. సోమవారం విద్యార్థిని అభినందించారు. ఇసుక వేలం నిర్మల్చైన్గేట్: ఇటీవల నిర్మల్ రూరల్ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పట్టుబడ్డ 35 ట్రాక్టర్ల ఇసుకకు సోమవారం మంజులాపూర్ సమీపంలో రెవెన్యూ అధికారుల సమక్షంలో వేలం నిర్వహించారు. వేలంలో షేక్ ముబీన్ రూ.64,700కు ఇసుకను దక్కించుకున్నాడు. తహసీల్దార్ సంతోష్కుమార్, ఆర్ఐ విజయ్కుమార్, ఎస్సై లింబాద్రి పాల్గొన్నారు. ‘కేంద్రానిది ప్రజావ్యతిరేక బడ్జెట్’ నిర్మల్చైన్గేట్: కేంద్ర ప్రభుత్వానిది ప్రజావ్యతిరేక బడ్జెట్ అని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.విలాస్ ఆరోపించారు. దీనిపై ఈ నెల 18, 19 తే దీల్లో వామపక్షాలు చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జి ల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో పార్టీ జిల్లా కౌన్సిల్ సమావేశం ఎస్.కై లాస్ అధ్యక్షతన సోమవారం నిర్వహించగా ముఖ్య అతిథులుగా విలాస్, జిల్లా సహాయ కార్యదర్శి ఉపాలి హాజరయ్యారు. విలాస్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పట్టభద్రుల అభ్యర్థి న రేందర్రెడ్డికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదు కు ఆదరణ పెరిగిందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లలో జరుగుతున్న అవకతవకలను నిరసిస్తూ త్వరలో కడెం, దస్తురాబాద్ మండలాల్లో ఆందోళనలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. స్కీమ్ వర్కర్స్ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాల ని, సివిల్ సప్లయ్ హమాలీల బకాయిలు, భవ న నిర్మాణ కార్మికులకు రూ.7,500 పెన్షన్ చె ల్లించాలని డిమాండ్ చేశారు. నాయకులు భూ క్యా రమేశ్, లక్ష్మణ్, సోమేశ్, బాదర్ ఉన్నారు. -
తెరపాఠం.. పరిపుష్టం
నిర్మల్ఖిల్లా: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వరంగ పాఠశాల విద్యకు పెద్దపీట వేస్తున్నాయి. ఈ క్ర మంలోనే కొన్నేళ్లుగా పాఠశాలల్లో మౌలిక వసతులు సమకూరుతున్నాయి. పాఠ్యాంశాల బోధనలో అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మన ఊరు–మన బడి, అమ్మ ఆదర్శ పాఠశాల, పీఎంశ్రీ లాంటి పథకాల అమలులో భాగంగా వివిధ రకాల సౌకర్యాలు కల్పించబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లాలోనూ అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులు అందుబాటులోకి తేవడంలో భాగంగా ప్రతీ బడికి మూడు చొప్పున అత్యంత వి లువైన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (ఐఎఫ్పీ) టీవీ లను 2023–24 విద్యాసంవత్సరం నుంచి విడతల వారీగా పంపిణీ చేస్తున్నారు. 8, 9, 10 తరగతుల్లో విద్యార్థులకు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో నాణ్య మైన రీతిలో పాఠ్యాంశాలు బోధించేందుకు వీటిని వినియోగిస్తున్నారు. తాజాగా వీటిని వినియోగించుకునేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇ చ్చారు. మరోవైపు కొన్ని పాఠశాలల్లో ఐఎఫ్పీలను పూర్తిస్థాయిలో వాడుకోలేకపోతున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా గుర్తించి ఇటీవల ప్రత్యేక కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఆమె అన్ని పాఠశాలల్లోని ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ బో ర్డుల ద్వారానే ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు పాఠాలు బోధించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. వినియోగంపై శిక్షణ రెండేళ్లుగా ఆయా పాఠశాలల్లో తెరపాఠాలు మొదలయ్యాయి. కొన్నిచోట్ల వీటి వినియోగంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి తీ సుకెళ్లారు. మరోవైపు అన్ని పాఠశాలలకు ఇంటర్నె ట్ వసతి లేకపోవడం కూడా అంతరాయానికి కారణమవుతోంది. ఉపాధ్యాయులందరికీ వీటి విని యోగంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో తా జాగా సబ్జెక్టుల వారీగా రెండు రోజులపాటు జిల్లావ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైస్కూళ్లలో బోధనకు ఐఎఫ్పీలు ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ అఽర్థవంత అభ్యసనకు తోడ్పాటు -
ఘనంగా సేవాలాల్ జయంతి
బాసర: బాసర ఆర్జీయూకేటీలో ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్, ఏవో రణధీర్ సాగి, పూజారి సంతోష్ మహరాజ్ పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ జీవితం ఆచరణీయమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బంజారా విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ సెల్ కన్వీనర్ డాక్టర్ అజయ్ రేవల్లి, కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ విజయ్కుమార్, శ్యాంబాబు, మోతీలాల్, బలరాంనాయక్, తులసీరామ్, శంకర్నాయక్, విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
చట్టం ఉన్నా..
మహిళలు పనిచేసే చోటే ఎక్కువగా లైంగిక వేధింపుల బారిన పడుతున్నారు. భారత రాజ్యాంగంలోని 14, 15 ఆర్టికల్స్ ప్రకారం లైంగిక వేధింపులు అనేవి సీ్త్ర ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేవి. ఈనేపథ్యంలోనే ‘పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధం, నిషేధ చట్టం–2013’ అమలులోకి తీసుకువచ్చారు. ● లైంగిక వేధింపులను నిరోధించడానికి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈ చట్టం పాటిస్తుంది. ● ఈ చట్టం ప్రకారం మహిళలు పనిచేసే చోట వారికి ఎదురయ్యే వేధింపులు, సమస్యలపై విచారించేందుకు ‘అంతర్గత ఫిర్యాదుల కమిటీ’ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ● ఇందులో వచ్చిన ఫిర్యాదులను 90రోజుల వ్యవధిలో కమిటీ విచారణ పూర్తిచేయాలి. ● చట్టం ప్రకారం ఈ విచారణ గోప్యంగా ఉంచాలి. ● ఒకవేళ ఎవరైనా బహిర్గత పరిస్తే అందుకు తగిన జరిమానా ఉంటుంది. ● విచారణ తర్వాత నివేదికను జిల్లా అధికారి (కలెక్టర్/సీ్త్ర శిశు సంక్షేమశాఖాధికారి)కి పంపించాలి. ● వారు 60రోజుల్లోపు దానిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ● జిల్లా అధికారి తమ జిల్లాలో ఈ కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ● బాధిత మహిళలు ఉచితంగా న్యాయసహాయం పొందడానికి సఖీ కేంద్రాలు సహకరించాలి. ● మహిళలతో పాటు 18ఏళ్లలోపు బాలికలపై లైంగిక వేధింపులు అరికట్టేందుకు ‘కాన్సిట్యూషన్ ఆఫ్ మల్టీ డిసిప్లినరీ టీమ్’ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ● కమిటీలు తరచూ సమావేశాలు ఏర్పాటు చేస్తూ.. చట్టాలపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. కానీ.. జిల్లాలో చట్టాలపై అవగాహన కల్పించిన దాఖలాలు లేవు. అప్పుడప్పుడు షీటీమ్లు విద్యాసంస్థల్లో అవగాహన కల్పిస్తున్నాయి. కానీ.. జిల్లాలో మహిళలు అధికసంఖ్యలో పనిచేసే చోట అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ)లను ఏర్పాటు చేయడం లేదు. ప్రభుత్వ శాఖలు, కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు, దుకాణాలు, ఇతర పనిప్రదేశాల్లో మహిళల కోసం ఇప్పటివరకు ఇలాంటి కమిటీలు వేయకపోవడంపై విమర్శలున్నాయి. -
అంగన్వాడీ కేంద్రాలకు నిధులు
● రూ.77.70 లక్షలు మంజూరు ● అప్గ్రెడ్ కానున్న 10 కేంద్రాలు ● 50 సెంటర్లలో తాగునీటి వసతి ● 170 మరుగుదొడ్ల నిర్మాణాలు నిర్మల్చైన్గేట్: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు మహర్దశ పట్టనుంది. 10 అంగన్వాడీ కేంద్రాలు, 50 సెంటర్లలో తాగునీటి వసతి కల్పించనున్నారు. 170 కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందుకు జిల్లా శిశు సంక్షేమశాఖ ద్వారా ప్రభుత్వం ఇటీవల రూ.77.70 లక్షలు మంజూరు చేసింది. ఈ పనులను సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్శాఖ ద్వారా చేపట్టనున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి వసతి లేకపోవడంతో విద్యార్థులతోపాటు టీచర్లు, ఆయాలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కరించేందుకు జిల్లాలోని 50 అంగన్వాడీ సెంటర్లలో తాగునీటి వసతి కల్పించనున్నారు. గతంలో కేంద్రాలకు మిషన్ భగీరథ పైపులైన్ నిర్మాణం చేపట్టినప్పటికీ నీరు రాని పరిస్థితి నెలకొంది. దీంతో ఒక్కో సెంటర్కు రూ.17వేల చొప్పున 50 సెంటర్ల కు తాగునీటి వసతి కల్పించడానికి రూ.8.50 లక్షలు ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వ, ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు సరై న మరుగుదొడ్లు లేవు. టీచర్లు, ఆయాలు, విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ విషయంపై దృష్టి సారించిన ప్రభుత్వం 170 టాయిలెట్స్ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ఒక్కోదానికి రూ.36వేలు కేటాయిస్తూ రూ.62.20 లక్షలు మంజూరు చేసింది. ఈ పనులు తర్వలో ప్రారంభించి పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. 10 మోడల్ కేంద్రాలకు..జిల్లాలోని అష్ట–1, బాసర–3, కుంసర, మాలేగం–1, సారంగపూర్–1, సోన్–3, న్యూ పోచంపాడు, లింగాపూర్, పెంబి–1, చింతాల్పేట్ అంగన్డీ కేంద్రాలను మోడల్గా తీర్చిదిద్దనున్నారు. ఈ మేరకు ఒక్కో కేంద్రానికి రూ.2లక్షల చొప్పున కేటాయించారు. ఈ 10 కేంద్రాలకు గతంలోనే మొదటి విడతగా ఒక్కోదానికి రూ.1.20 లక్షలు కేటాయించగా, రెండో విడత రూ.80వేలు మంజూరయ్యాయి. -
సమస్య పరిష్కారం
కాంగ్రెస్తోనే నిరుద్యోగ● ఏడాదిలోనే 53వేల ఉద్యోగాలిచ్చాం ● ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కమంత్రిని కలిసిన మహిళా రైతులు దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామ మహిళా రైతులు మంత్రి సీతక్కను కలిశారు. ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారంలో తమపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ విషయమై ఎస్పీ జానకీ షర్మిలను ఇటీవల కలిస్తే దురుసుగా వ్యవహరించారని సీతక్కకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయకుంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లను బహిష్కరిస్తామని హెచ్చరించారు. దీంతో వేణుగోపాలాచారి, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్రెడ్డి కలుగజేసుకుని వారికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. -
సబ్జెక్టులవారీగా శిక్షణ పూర్తి
పాఠ్యాంశాల బోధనలో విద్యార్థికి ఉపన్యాస పద్ధతిలో బోధించే కంటే ఫొటోలు, వీడియోలను ప్రదర్శిస్తూ బోధించడం ద్వారా సమగ్ర అవగాహన కలగడమే కాకుండా పూర్తిస్థాయిలో మనసులో ముద్రించబడుతుంది. తద్వారా నేర్చుకోవాల్సిన పాఠ్యాంశం కూడా సులువుగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా, కాంప్లెక్స్ స్థాయి శిక్షణ కార్యక్రమాలు చేపట్టారు. సైన్స్, గణితం, సాంఘిక శాస్త్రాలతోపాటు తెలుగు, ఇంగ్లిష్, హిందీ ఉపాధ్యాయులకు కూడా వీటి వినియోగంపై శిక్షణ ఇచ్చారు. భాషా సంబంధిత అంశాలు, సబ్జెక్టులన్నీ వీటి ద్వారానే బోధించాలని జిల్లా విద్యాశాఖాధికారులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో బ్లాక్ బోర్డుల స్థానంలో ఐఎఫ్సీ ప్యానెల్ బోర్డులే వినియోగించేలా చర్యలు చేపడుతున్నారు. సమగ్ర శిక్షా ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ వినియోగంపై ప్రతీ సబ్జెక్టులో మండలానికి ఇద్దరు ఉపాధ్యాయులకు జిల్లా స్థాయిలో శిక్షణ ఇచ్చారు. వీరు కాంప్లెక్స్ స్థాయిలో ఈ నెల 11, 12 తేదీల్లో సబ్జెక్టుల వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. -
నిర్మల్
ఆదర్శప్రాయుడు సేవాలాల్ సంత్ సేవాలాల్ మహరాజ్ ఆదర్శ ప్రాయుడని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క పేర్కొన్నా రు. బాసరలోని గోదావరి నది ఒడ్డున సేవాలాల్ జయంతిని ఘనంగా నిర్వహించారు.8లోuసోమవారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025గజ్జలమ్మ దేవికి పూజలుకుంటాల: మండల కేంద్రంలోని శ్రీగజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మీ అమ్మవార్ల ఆలయాల్లో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. మహారాష్ట్రలోని ముంబై, నాందేడ్, ధర్మాబాద్, బోకర్, ఇస్లాంపూర్ ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చారు. చిన్నారులతో బంగారం తు లాభారం వేయించారు. తలనీలాలు సమర్పించారు. బోనాలను నైవేద్యంగా సమర్పించి మొ క్కు తీర్చుకున్నారు. మండలంలోని ఓలా గ్రా మానికి చెందిన సింగిల్ విండో మాజీ డైరెక్టర్ కర్ల బక్కయ్య–అర్చన దంపతులు అమ్మవార్ల కు మూడున్నర మాసాల బంగారపు ముక్కుపుడక, బొట్టుబిళ్ల సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. వీరిని ఆలయ సమితి సభ్యులు సన్మానించారు. ఆలయ సమితి సభ్యుడు మేసినేని వెంకట్రావు, అర్చకుడు నగేశ్, జుట్టు అభిషేక్, సుధీర్, రాజు తదితరులు పాల్గొన్నారు.నిర్మల్: ‘తన ఫ్రెండ్స్తో పాటు సార్లందరూ బాగానే ఉన్నారు. కానీ..ఆ ఒక్క సార్ మాత్రమే మరోలా ఉ న్నాడు. అందరి దృష్టిలో మంచోడనే పేరుంది. తనతో ఆ సార్ మాట్లాడే మాటతీరు, అతడి ప్రవర్తన ఏమాత్రం బాగాలేదు. వ్యంగ్యంగా, కాస్త అసభ్యకరమైన రీతిలో మాట్లాడటం చేస్తున్నాడు. ఆమెలో తెలియని భయం. ఇదంతా ఇంట్లో వాళ్లకో.. స్నేహితులకో.. చెప్పడానికి ధైర్యం చాలడం లేదు. ఎక్కడ తనది.. తన కుటుంబానిది పరువు పోతుందోనన్న భయం. మరోవైపు ఎదిరించినా.. లేదా ఇలాగే మౌనంగా ఉన్నా ఇంకేం చేస్తాడోనన్న భయాందోళన.. వీటిమధ్య తనలో తానే కుమిలిపోతోంది.’ ఇలా.. ఒక్క ఈ విద్యార్థినికే కాదు.. రో జూ ఆటోలో ఉద్యోగానికి వెళ్తున్న ఓ ఉద్యోగిని ఆ ఆటోడ్రైవర్ వేధింపులను తట్టుకోలేక ఇబ్బంది పడుతోంది. ఓ పెద్ద దుకాణంలో పనిచేస్తున్న మరో యు వతి సదరు యజమాని నుంచి వేధింపులు ఎదుర్కొంటోంది. ఏకంగా ప్రభుత్వ కార్యాలయాల్లోనే వేధింపులకు గురవుతున్న ఉద్యోగినులూ ఉన్నారు. అడుగడుగునా అతివలకు అసభ్యకరమైన వేధింపులు, వ్యంగ్యమైన మాటలు, మింగేలా చూసే చూపులు తప్పడం లేదు. కానీ.. వారంతా తమలో తామే కుమిలి పోతున్నారు. ఇలాంటి వారి నుంచి కనీసం ఫిర్యాదు తీసుకోవడానికి జిల్లాలో ‘ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ’ (ఐసీసీ)లను ఏర్పాటు చేయలేదు. మహిళలు పనిచేసేచోట ఉండాల్సిన ‘అంతర్గత ఫిర్యాదుల కమిటీ’ల జాడ లేదు. జిల్లాలో వరుసగా ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నా.. అధికారుల పట్టింపు లేదన్న ఆరోపణలున్నాయి. వేధించని చోటెక్కడా..? అక్కడా, ఇక్కడా అని కాదు.. మహిళలపై ప్రతిచో టా లైంగిక వేధింపులు పెరుగుతుండటం ఆందోళనకరం. ప్రధానంగా జిల్లాలో ఇటీవలి కాలంలో ఇలాంటి వేధింపులు వేగంగా పెరుగుతున్నాయి. కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలన్న ఉద్దేశంతో వివిధ దుకాణాలు, హోటళ్లు, ప్రైవేట్ కార్యాలయాల్లో యువతులు, మహిళలు పనిచేస్తున్నారు. ఇలాంటి చోట్ల చాలామంది వివిధ రకాల వేధింపులకు గురవుతున్నారు. వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని డబ్బు ఆశ చూపుతూ లొంగదీసుకుంటున్న ఘటనలూ ఉన్నాయి. బయటకు వచ్చి చెప్పుకొంటే.. పరువుతో పాటు ఉన్న ఉపాధి పోతుందన్న భయం బాధితుల నోరు తెరువనివ్వడం లేదు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు, కెరిర్ గైడెన్స్ ఇవ్వాల్సిన అధ్యాపకులూ తమ స్టూడెంట్లపై కన్నేయడం, వేధించడం దారుణం. తానే ట్రాన్స్ఫర్ చేయించుకుని.. ఓ శాఖకు చెందిన ఉద్యోగిని ఓ అధికారి నుంచి వేధింపులను ఎదుర్కొన్నారు. సంబంధిత శాఖ పనిపైన కాకుండా పర్సనల్ విషయాలను మాట్లాడటం, చొరవ తీసుకోవడం చేశాడు. అవసరం లేకున్నా ఫోన్లు, మెసేజ్లు చేయడం కొనసాగించాడు. ఎంత చెప్పినా సదరు సారులో మార్పు రాకపోవడంతో బాధిత ఉద్యోగినే ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్లిపోయారు. గతంలోనూ ఓ స్థాయి అధికారి ఇదే తీరుగా తన కింది ఉద్యోగినితో ప్రవర్తించిన తీరు విచారణ వరకూ వెళ్లింది.న్యూస్రీల్బాధిత కుటుంబాలను ఆదుకోవాలినిర్మల్ రూరల్: మెదక్ జిల్లా చేగుంటలో సీఆ ర్పీలుగా పని చేస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రమేశ్, శ్రీనివాస్ కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మాదిగ అంబేడ్కర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బర్ల సాయినాథ్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25 లక్షల చొ ప్పున ఎక్స్్గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవా లని కోరారు. సీఆర్పీలు చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నారని, వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమండ్ చేశారు. మహిళలపై తరచూ వేధింపులు యువతులు, ఉద్యోగినులపైనా.. కుమిలిపోతున్న బాధిత సీ్త్రలు కనిపించని ఫిర్యాదు కమిటీలు సంబంధిత అధికారుల పట్టింపేది? -
పాడుబడిన ఇంట్లో మంటలు
నిర్మల్: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఉన్న ఓ పాడుబడిన ఇంట్లో శుక్రవారం రాత్రి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇల్లు రోడ్డుపక్కనే ఉండటం, సమాచారం వెంటనే అందడంతో అగ్నిమాపకశాఖ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలు అదుపు చేశారు. ప్రమాదం జరిగిన ఇంటికి సమీపంలో ఓ ప్రైవేటు ఆస్పత్రి, బ్యాంకు, ఓ హోటల్ ఉండటంతో స్థానికులు కంగారు పడ్డారు. ఇంట్లో చెలరేగిన మంటలతో ఆ ప్రాంతమంతా పొగ కమ్ముకుంది. ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఘటనాస్థలాన్ని ఏఎస్పీ రాజేశ్మీనా, ఎస్పీ జానకీ షర్మిల పరిశీలించారు. -
వసతులు కల్పించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో నిర్మల్చైన్గేట్: సమగ్ర శిక్ష, పీఎంశ్రీ నిధుల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అధికారులను ఆదేశించారు. హైదరాబాదు నుంచి కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలకు విడుదలైన నిధులు, చేపట్టిన పనులు, మిగిలి ఉన్న నిధులకు సంబంధించిన వివరాలు కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు మంజూరైన సమగ్ర శిక్ష, పీఎంశ్రీ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ, పాఠశాలల్లో సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పాఠశాలల్లో సివిల్ వర్క్స్, క్రీడా సామగ్రి, విద్యార్థులతో పలు కార్యక్రమాల నిర్వహణకు ఈ నిధులు వినియోగించాలన్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ పీఎం సమగ్ర శిక్ష నిధుల ద్వారా ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలల్లో పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు క్రీడోపకరణాలు, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించేలా ప్రత్యేక సామగ్రి కొనుగోలు చేయాలన్నారు. సమగ్ర శిక్ష, పీఎం శ్రీ నిధులు వినియోగిస్తూ పాఠశాలల్లో ప్రత్యేక దినోత్సవాలు ఘనంగా నిర్వహించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఈవో రామారావు, ఏఎస్సీ చైర్పర్సన్ లింబాద్రి, విద్యాశాఖ అధికారులు రాజేశ్వర్, వెంకటరమణ, శ్రావణి, నర్సయ్య, మహేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. అందరికీ ఆధార్ కార్డునిర్మల్చైన్గేట్: జిల్లాలో అందరికీ ఆధార్ కార్డు ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాదులోని ప్రాంతీయ ఆధార్ కార్యాలయ అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఆధార్ కేంద్రాల్లో సులువుగా ఆధార్ నమోదు, పేరు, చిరునామా తదితర వివరాలు మార్పులు, చేర్పులు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా కేంద్రంలోని బ్రహ్మపురిలోని ప్రధాన తపాలా కార్యాలయంలో పూర్తిస్థాయి ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులలో ఆధార్ సేవ కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రుల్లో శిశువులు జన్మించిన వెంటనే వారి తల్లిదండ్రుల నుంచి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు తీసుకుని శిశువులకు ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలన్నారు. త్వరలోనే ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి, ఆధార్ కార్డులలో తప్పుగా ముద్రించబడిన వివరాలను సరిచేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థుల ఆధార్ కార్డులలో తప్పులు ఉంటే వాటిని సరి చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, డీఈవో రామారావు, పోస్ట్ మాస్టర్ వెంకటరావు, డీటీడీవో అంబాజీ, సీడీపీవో నాగలక్ష్మి, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్గోపాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా -
సొసైటీ పాలకవర్గాల గడువు పెంపు
● మరో ఆరు నెలల వరకు అవకాశం కై లాస్నగర్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) పాలకవర్గాల గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈనెల 14తో పాలకవర్గాల గడువు ముగిసింది. దీంతో పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీల మాదిరిగానే సొసైటీల్లోనూ ప్రత్యేకాధికారుల పాలనను అమలు చేస్తారనే చర్చ సాగింది. అయితే తమ పదవీకాలం పొడిగించాలంటూ రాష్ట్రంలోని డీసీసీబీ చైర్మన్లు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి విన్నవించారు. వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం పీఏసీఎస్ పాలకవర్గాల పదవీకాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీసీసీబీ చైర్మన్లకు రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఉత్తర్వులు అందజేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లతో పాటు 77 సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్లు మరో ఆరు నెలల పాటు ఆయా పదవుల్లో కొనసాగనున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
నిర్మల్
పరిస్థితులు కథలై.. ఉద్యోగ రీత్యా ఎదురైన పరిస్థితులు, సమాజంలో జరుగుతున్న సంఘటనలు కథలుగా మార్చాడు జన్నారం మండల వాసి వాసు. పుస్తక రూపం ఇచ్చాడు. 8లోu శనివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025డిప్యూటీ సీఎంను కలిసిన మాజీ ఎమ్మెల్యే భైంసాటౌన్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ముధోల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బి.నారాయణ్రావు పటేల్ శుక్రవారం కలిశారు. కుల గణన, వర్గీకరణపై గాంధీభవన్లోని ప్రకాశం హాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం ఉండగా, ముధోల్ నుంచి ఆయన హాజరయ్యారు. కార్యక్రమ అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి ముధోల్ నియోజకవర్గం సమస్యలు వివరించినట్లు పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, ఎంపీలను కలిసినట్లు వెల్లడించారు. నిర్మల్: జిల్లాలో మిల్లర్ల మాయాజాలం ఆగడం లేదు. పేదలకు అందించే రేషన్ బియ్యం రెక్కలు కట్టుకుని ఎగిరిపోతున్నాయి. రేషన్ దుకాణాలు, లబ్ధిదారుల నుచి పీడీఎస్ బియ్యం సేకరించి.. అదే బియ్యాన్ని సీఎంఆర్గా అప్పగస్తున్నారు. సర్కారు ఇచ్చిన ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. పేదలకు అందించే బియ్యాన్ని తక్కువ ధరకు కొని, మళ్లీ ప్రభుత్వానికే ఎక్కువ ధరకు అమ్మే రైస్ రీసైక్లింగ్ దందా జోరుగా సాగుతూనే ఉంది. ఈ వ్యవహారంలో కొంతమంది అధికారులు, సిబ్బంది తీరుపైనా విమర్శలు ఉన్నాయి. కేసులు అవుతున్నా.. జిల్లాలో కేవలం ఐదారు నెలల్లోనే రైస్ మిల్లులపై దాదాపు 15 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఏడెనిమిది క్రిమినల్ కేసులు, రెవెన్యూ రికవరీ యాక్ట్ వరకూ వెళ్లాయి. అయినా.. జిల్లాలో రేషన్ రీసైక్లింగ్ దందా ఆగడం లేదు. జిల్లాలో 2022–23కు సంబంధించిన సీఎంఆర్ గడువు ముగిసినా సకాలంలో ఇవ్వనివి 32 డిఫాల్ట్ మిల్లులు గుర్తించగా, అందులో 23 మిల్లుల నుంచి బియ్యం రికవరీ చేశారు. మిగిలిన 9 మిల్లులు ఇప్పటికీ సీఎంఆర్ క్లియర్ చేయలేదు. వీటిపైనే కేసులు నమోదయ్యాయి. ఇందులో కొన్నింటికి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఆస్తుల వేలం నోటీసులు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. తనిఖీలపై అనుమానాలు.. రేషన్ బియ్యం రాష్ట్రాలు దాటుతున్నా.. అదే బియ్యం సన్నగా మారి జిల్లాలోకి వస్తున్నా.. ఎప్పుడో ఒకసారి మాత్రమే పట్టుబడుతున్నాయి. ఈనెల 7న భైంసాలో రోడ్డుప్రమాదం జరగడం వల్లే సదరు లారీలో 362 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ పట్టుబడింది. ఈ యాక్సిడెంట్ జరగకపోయి ఉంటే.. ఆ బియ్యం ఏదో ఒక రైస్ మిల్లుకు చేరేది. ఇదే ఘటనలో అనుమానంతో లక్ష్మణచాందలో రైస్ మిల్లులను తనిఖీ చేస్తే.. అక్కడ ఉండాల్సిన ధాన్యం లేకపోవడం జిల్లాలో రీసైక్లింగ్ దందా జోరుగా సాగుతోందన్న వాదనను బలపరుస్తోంది. మరోవైపు జిల్లా అధికారులు తాము ఇలాంటి వాటిపై సీరియస్గా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. ఇప్పటికే కేసులనూ నమోదు చేశామని, రికవరీ చేయనివారిపై క్రిమినల్కేసులు, ఆర్ఆర్యాక్ట్లనూ పెట్టేందుకూ సిద్ధమవుతున్నామని పేర్కొంటున్నారు. చర్యలు తీసుకుంటాం.. జిల్లాలో గడువు దాటినా సీఎంఆర్ లెక్కతేల్చని రైస్ మిల్లులపై ఇప్పటికే కేసులు నమోదు చేశాం. పలు మిల్లుల నుంచి రికవరీ చేపడుతున్నాం. 2023–24 ఖరీఫ్కు సంబంధించి 89 వేల మెట్రిక్ టన్నులు రికవరీ చేశాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నాం. – కిరణ్, డీఎస్వోపరీక్షిస్తే.. తెలిసిపోతుంది..! ఎప్పుడూ అంతే.. న్యూస్రీల్ పేదల బియ్యం.. పెద్దలకు ఆదాయం వరుసగా కేసులవుతున్నా.. మిల్లుల్లో ఆగని మోసాలు ఐదు నెలల్లో 15 కేసులు నమోదుమర ఆడించిన తర్వాత పౌరసరఫరాల కోసం మిల్లులు ఇచ్చే బియ్యాన్ని పరీక్ష చేసి తీసుకోవాలి. దీనిని ఎంఐటీ(మిక్స్డ్ ఇండికేటర్ టెస్ట్) అంటారు. ఈ పరీక్షలో పాత బియ్యమైతే ఎల్లో కలర్లో, తాజాగా మర ఆడించిన బియ్యమైతే అవకాడో గ్రీన్ కలర్లోకి మారుతాయి. ఇలాంటి పరీక్షలు చేసిన తర్వాతనే తాజాగా మర ఆడించిన బియ్యాన్ని పౌరసరఫరాలకు తీసుకోవాల్సి ఉంటుంది. బ్రోకెన్రైస్, తౌడుశాతం తదితర అంశాలు పరిశీలించాలి. ఈ పరీక్షలు చేస్తే ఆ ధాన్యం మిల్లింగ్ చేసిందా..! లేక రేషన్ బియ్యం సేకరించి సీఎంఆర్ పెట్టారా..! అనేది స్పష్టమవుతుంది. జిల్లాలో రీసైక్లింగ్ దందాను చూస్తుంటే.. ఈ పరీక్షలపైనా అనుమానాలు తలెత్తుతున్నాయి. నాణ్యమైన బియ్యాన్ని పక్కదారి పట్టించి, పాత రేషన్ బియ్యాన్నే అటూఇటు రీసైకిల్ చేస్తున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మర ఆడించి బియ్యం రూపంలో ఇవ్వడానికి ప్రభుత్వం రైస్మిల్లర్లకు అప్పగిస్తుంది. ఇందుకోసం వారికి ఇచ్చిన గడువులోపల ఇవ్వాలి. అలాగే కేటాయించిన ధాన్యంలో రారైస్ అయితే 67 శాతం, బాయిల్డ్ అయితే 68 శాతం బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. మిగితా కమీషన్ రూపంలో మిల్లర్లు తీసుకుంటారు. ప్రస్తుతం జిల్లాలో 2023–24 రబీకి సంబంధించి సీఎంఆర్ కొనసాగుతోంది. రైస్ మిల్లులకు 1.56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంఅందించారు. మొత్తం 1.05 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లులు అందించాలి. ఇప్పటి వరకు 31,500 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారు. ఇక సీఎంఆర్లో చాలామంది మిల్లర్లు ఏళ్లుగా చేతివాటాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. గడువును పట్టించుకోవడం లేదు. ఇచ్చిన ధాన్యాన్ని ఎక్కువ ధరకు అమ్ముకుంటూ.. రేషన్బియ్యాన్ని తక్కువధరకు కొనుగోలు చేస్తున్నారు. తిరిగి ఇదే బియ్యాన్ని సీఎంఆర్ కింద ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. తాజాగా భైంసాలో పట్టుబడ్డది కూడా సీఎంఆర్ కింద చూపేందుకు మిల్లులకు తరలుతున్న పీడీఎస్ బియ్యమే. -
68 మందికి ‘ఉపకారం’
లక్ష్మణచాంద: చదువులో ముందుండి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ పరీక్ష ఎంతో ఉపయోగకరంగా మారింది. ఏటా జాతీయస్థాయిలో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నారు. ఇందులో దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షలో అర్హత సాధించిన 5 వేల మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందనున్నాయి. జిల్లా నుంచి.. నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్కు జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు హాజరుకాగా ఇందులో నుంచి 68 మంది విద్యార్థులు అర్హత సాధించారు. అర్హత సాధించిన విద్యార్థులకు ఏటా రూ.12 వేల చొప్పున నాలుగేళ్లు ఉపకార వేతనం అందనుంది. నర్సాపూర్( జి) ఫస్ట్... నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ అర్హత పరీక్ష పరీక్షలో నర్సాపూర్ (జి)ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి 10 మంది విద్యార్థులు అర్హత సాధించారు. తర్వాత బోసి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు 8 మంది అర్హత సాధించి రెండవ స్థానంలో నిలిచారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ అర్హత పోటీలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చెందిన విద్యార్థులు మొత్తం 68 మంది అర్హత సాధించారు. దీంతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఎంఎంఎస్లో మెరిసిన జిల్లా విద్యార్థులు ఎంపికై న వారికి ఏడాదికి రూ.12 వేల చొప్పున స్కాలర్షిప్ పాఠశాలల వారీగా అర్హత సాధించిన విద్యార్థుల వివరాలు.. పాఠశాల విద్యార్థుల సంఖ్య నర్సాపూర్(జి) 10 బోసి 08 మస్కాపూర్ 05 ముధోల్ 05 ఆష్టా 05 కుంటాల మోడల్ స్కూల్ 05 లోకేశ్వరం 04 కామోల్ 04 దేహగాం 04 రాజురా 03 ఎడ్బిడ్ 03 మహగాం 02 ఓలా(ఉర్దూ) 02 మాలేగావ్ 02 తిమ్మాపూర్ 01 బోరిగాం 01 సోనారి 01 గడ్చాంద్ 01 పల్సి 01 లింబా(కే) 01సంతోషంగా ఉంది నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్నకు అర్హత సాధించడం సంతోషంగా ఉంది. దీంతో ఆర్థికంగా తల్లిదండ్రులపై భారం కొంత తగ్గించడం ఆనందంగా ఉంది. – కిలారి మధుప్రియ, నర్సాపూర్(జి) -
భరోసా @ 39.20%
● రెండెకరాల రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం ● 75,101 ఖాతాల్లో రూ.51.07 కోట్లు ● వారానికి ఎకరం పెంచుతూ నిధులు విడుదలఫిబ్రవరి 12 నాటికి రైతు భరోసా అందిన రైతుల వివరాలు రైతుల సంఖ్య 75,101ఇప్పటివరకు జమ అయిన సొమ్ము 51,07,39,232మండలం రైతులు జమైన డబ్బు భైంసా 5,341 3,95,67,076 కుభీర్ 5,552 4,45,02,278 కుంటాల 2,841 2,11,78,997 దస్తురాబాద్ 3,106 2,46,19,542 కడెం పెద్దుర్ 5,330 3,39,65,188 ఖానాపూర్ 4,855 2,95,21,348 పెంబి 1,963 2,00,29,710 బాసర 2,366 1,82,36,356 లోకేశ్వరం 5,276 3,56,25,347 ముధోల్ 4,245 2,93,20,472 తానూర్ 5,013 3,86,30,599 దిలావర్పూర్ 3,130 1,86,13,469 నర్సాపూర్(జి) 3,190 2,18,10,514 సారంగాపూర్ 5,536 3,14,71,027 సోన్ 3,631 2,06,41,402 లక్ష్మణచాంద 4,890 2,94,68,336 మామడ 3,874 2,42,36,728 నిర్మల్ రూరల్ 4,590 2,81,00,213 నిర్మల్ అర్బన్ 372 12,00,630నిర్మల్చైన్గేట్: రైతుల ఎదురు చూపులు ఎట్టకేలకు ఫలించాయి. ప్రజాప్రభుత్వం ఏర్పాటయిన ఏడాది తర్వాత జనవరి 26న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతుభరోసా పథకం ప్రారంభించారు. తొలుత మండలానికి ఓ రెవెన్యూ గ్రామం ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టు కింద 27న జిల్లా వ్యాప్తంగా 18 గ్రామాల రైతుల ఖాతాల్లో నగదు జమచేశారు. పైలట్ ప్రాజెక్టులో జిల్లా వ్యాప్తంగా 6,710 మంది రైతుల ఖాతాల్లో రూ.11.18 కోట్లు నగదు జమచేశారు. వారం గ్యాప్తో ఒక ఎకరం వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో భరోసా డబ్బులు వేయగా.. సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం జిల్లాలో రెండెకరాల వరకు సాగుభూమి కలిగిన రైతులకు సైతం రైతు భరోసా డబ్బులు విడుదల చేశారు. 39.20 శాతం పూర్తి రైతు ఖాతాల్లో ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు జమ చేస్తుండగా వారి సంఖ్యను బట్టి ఇప్పటి వరకు 39.20 శాతం పథకం పూర్తయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో మొత్తం రైతు భరోసాకు అర్హులైన రైతులు 1,91,570 మంది ఉండగా వీరికి 4,41,758 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఒక ఎకరం వరకు భూమి కలిగిన రైతులు 70,219 మంది లుండగా.. ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద జనవరి 27వ తేదీన 6,710 రైతులకు, రూ.10.56 కోట్లు జమ చేసింది. తాజాగా సోమవారం రెండెకరాల వరకు భూమి ఉన్న 68,391 మంది రైతులకు 41.07 కోట్లు జమచేశారు. మరో రెండు నెలలు..? పథకం ప్రారంభించిన తర్వాత ఒక్కో ఎకరా చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తోంది. ఎకరా, రెండు ఎకరాలకు నడుమ వారం రోజుల సమయం తీసుకుంటున్నారు. ఈ లెక్కన పది ఎకరాలు ఉన్న రైతులకు సాగు సాయం అందాలంటే మరో రెండు నెలల సమయం పడుతుందేమోనని రైతులు చర్చించుకుంటున్నారు. ఇదే జరిగితే వర్షాకాలం విత్తనాలు ప్రారంభించేనాటికి మొదటివిడత రైతు భరోసా పూర్తవుతుందని భావిస్తున్నారు. ఎకరం ఉన్నా రాలేదు.. నాకు ఒక ఎకరం భూమి ఉంది. అందులో పత్తి సాగు చేశాను. మూడు ఎకరాల దాక రైతు భరోసా వేశామంటున్నారు. మరీ నాకు ఎకరం భూమి ఉండే ఇప్పటి వరకు భరోసా డబ్బులు ఎందుకు జమకాలేదో తెలుస్తలేదు. – ఉట్ల కోటయ్య, చిన్న బేలాల్వచ్చే సీజన్పై సందేహాలు.. రాష్ట్రంలో కాంగ్రెస్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు దాటింది. గత యాసంగిలో మాత్రమే రైతుభరోసా నిధులు జమ చేశారు. గత ప్రభుత్వం సాగుకు యోగ్యంకాని భూములకూ రైతుబంధు ఇచ్చి నిధులు దుర్వినియోగం చేసిందని, తాము అర్హులకే ఇస్తామని ప్రస్తుతం ప్రభుత్వం పేర్కొంది. ఇందుకోసం కమిటీ నివేదిక, మార్గదర్శకాల రూపకల్పన పేరిట కాలయాపన చేసి గత ఖరీఫ్లో రైతు భరోసా ఇవ్వలేదు. ప్రస్తుతం యాసంగి సీజన్కు సంబంధించిన సాయాన్ని విడతలవారీగా జమచేస్తున్నారు. అయితే నిధుల కొరత ఎదుర్కొంటున్న సర్కారు.. వచ్చే ఖరీఫ్ సీజన్లో రైతుభరోసా ఇస్తుందా లేక గత ఖరీఫ్ తరహాలోనే చేస్తుందా అన్న అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. -
ప్రతీ కూలీకి పని
● డీఆర్డీవో విజయలక్ష్మి కుంటాల: ఉపాధి హామీపథకంలో ప్రతీ కూలీకి పని కల్పిస్తామని డీఆర్డీవో విజయలక్ష్మి తెలిపా రు. మండలంలోని దౌనెల్లి గ్రామాన్ని శుక్రవా రం సందర్శించారు. రాబోయే వేసవిలో నర్సరీ ల్లో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధిహామీ, ఐకేపీ సిబ్బందితో సమీ క్ష నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు వందరోజుల పని కల్పించాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. సమావేశంలో ఏపీవో గట్టుపల్లి నవీన్, ఏపీఎం అశోక్, సీసీ, టీఏలు, ఎఫ్ఏలు పాల్గొన్నారు. -
రిటర్నింగ్ ఆఫీసర్లదే కీలకపాత్ర
● కలెక్టర్ అభిలాష అభినవ్ ● ఎన్నికల విధులపై అవగాహననిర్మల్చైన్గేట్: త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో నామినేషన్ల స్వీకరణ నుంచి ఓట్ల లెక్కింపు వరకు రిటర్నింగ్ ఆఫీసర్లదే కీలకపాత్ర అని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఆర్వో, ఏఆర్వోల విధులు తదితర అంశాలపై రి టర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. రిటర్నింగ్ అధికారులకు మాస్టర్ ట్రైనర్లు ఎ న్నికల విధులపై అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రోజువారీగా దాఖలైన నామినేషన్ల వివరాలను గ్రామపంచా యతీ కార్యాలయాల నోటీస్ బోర్డుపై ఉంచాలని సూచించారు. అధికారులంతా సమన్వయంతో ప నిచేసి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, డీపీవో శ్రీనివాస్, మాస్టర్ ట్రైన ర్లు, రిటర్నింగ్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
‘గ్యారంటీల అమలులో విఫలం’
భైంసాటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలులో విఫలమైందని ముధోల్ ఎమ్మెల్యే రా మారావు పటేల్ ఆరోపించారు. గురువారం భైంసా పట్టణంలోని ఎస్ఎస్ కాటన్లో ఆయన పట్టణ, మండల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జీలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ స్థానాల పట్టభద్రులు, టీచ ర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. విద్యారంగ సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ప్రజలు బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. ఢిల్లీ ఎన్నికల విజయోత్సాహంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి (పట్టభద్రులు), మల్కా కొమురయ్య (టీచర్స్) విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ ఇన్చార్జీలు హరినాయక్, శివ చంద్రగిరి, బీజేపీ పటణాధ్యక్షుడు మల్లేశ్వర్, మండలాధ్యక్షురాలు సుష్మారెడ్డి, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. -
పక్కాగా పంటల గణన
నిర్మల్చైన్గేట్: పంటల నమోదులో కచ్చితత్వం కోసం రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వే చేపట్టింది. ప్రతీ వ్యవసాయ క్లస్టర్ పరిధిలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసి సర్వే నిర్వహిస్తోంది. ఏఈవోలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సర్వే పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే ఎండలు పెరుగుతుండటం, సర్వర్ మొరాయించడం లాంటివి ప్రక్రియకు ఆటంకంగా మారుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 79 వ్యవసాయ క్లస్టర్లుండగా డిజిటల్ క్రాప్ సర్వే కోసం వీటన్నింటినీ ఎంపిక చేశారు. పురుష ఏఈవోలున్న గ్రామాల్లో 2వేల ఎకరాలు, మహిళా ఏఈవోలున్న చోట 1,800 ఎకరాల్లో సర్వే చేయాలని నిర్దేశించారు. ఏటా చేపట్టే సాధారణ పంటల నమోదుతో పాటు డిజిటల్ క్రాప్ సర్వే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ను వినియోగిస్తున్నారు. ఫొటో తీసి.. అప్లోడ్ చేసి..ఏఈవో నేరుగా పంట చేల దగ్గరికి వెళ్లాలి. ప్రతీ సర్వే నంబర్లో సాగు చేసిన పంట ఫొటో తీసి అక్కడినుంచే యాప్లో అప్లోడ్ చేయాలి. ఎక్కడో ఉండి, ఎవరి పొలమో ఫొటో తీసి అప్లోడ్ చేయడం కుదరదు. సర్వే చేసే పొలం నుంచి సర్వే నంబర్ 25 మీటర్ల పరిధి వరకే యాప్ పనిచేస్తుంది. ఫిబ్రవరి 5వ తేదీన సర్వే ప్రారంభమైంది. ప్రారంభంలో యాప్ సరిగా పనిచేయకపోవడం, సర్వర్ బిజీ, నెట్వర్క్ సమస్యలతో సర్వే మందకొడిగా సాగింది. క్షేత్రస్థాయి నుంచి అందిన ఫిర్యాదుల మేరకు ఉన్నతాధికారులు సాంకేతిక సమస్యలను పరిష్కరించడంతో మూడు, నాలుగు రోజుల నుంచి సర్వే ఊపందుకుంది. జిల్లాలో మొత్తం 1,52,888 ఎకరాలను డిజిటల్ సర్వే చేయాల్సి ఉండగా ఇప్పటివరకు సుమారు 28,278 ఎకరాల్లో పూర్తిచేసి యాప్లో నమోదు చేశారు. ప్రతీ సర్వే నంబర్కు వెళ్లాల్సిందే..డిపార్ట్మెంట్ సమకూర్చిన ట్యాబ్స్తో సర్వే చేయడానికి ఏఈవోలు రంగంలోకి దిగారు. తమ వద్ద ఉన్న ట్యాబ్లలో యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు. ఈ యాప్లోనే క్లస్టర్ పరిధిలోని ఏయే సర్వే నంబర్లలో సర్వే చేయాలో వివరాలున్నాయి. అయితే ప్రతీ సర్వే నంబర్తోపాటు సబ్ సర్వే నంబర్ వద్దకు ఏఈవోలు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతీ సర్వే నంబర్లో 25 మీటర్లకు మించి దూరం ఉంటే వివరాలు చూపించడం లేదు. దీంతో ఏ ఒక్క సర్వే నంబర్ సమాచారం లేకున్నా అప్లోడ్ కాదు. ప్రతీ సర్వే నంబర్ వద్దకు ఏఈవోలు వెళ్తున్నారు. జిల్లాలో ముమ్మరంగా ప్రక్రియ ఏఈవోలకు లక్ష్యం విధింపు పంట కాలం వరకు గడువు 28,278 ఎకరాల్లో సర్వే పూర్తిరైతులు సహకరించాలి జిల్లా వ్యాప్తంగా డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. ఇది రైతులకు చాలా ఉపయోగపడుతుంది. రైతులు తాము పండించిన పంటలను అమ్ముకోవడానికి, పంటల బీమా, పరిహారం పొందడానికి ఉపకరిస్తుంది. సర్వేకోసం వస్తున్న విస్తరణాధికారులకు రైతులు సహకరించాలి. – అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి సర్వేతో రైతులకు మేలుడిజిటల్ క్రాప్ సర్వే రైతులకు ఎంతో ఉపయోగపడనుంది. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు బీమా పొందడానికి, పంట నష్టం అంచనా వేయడానికి దోహద పడుతుంది. రైతులు తాము పండించిన పంటలను మార్కెట్కు తీసుకువెళ్లి మద్దతు ధర పొందడానికీ ఉపయోగపడుతుంది. వానాకాలంలో డిజిటల్ క్రాప్ సర్వే చేయించుకోకపోవడంతో పత్తి అమ్ముకోవడానికి రైతులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. -
ఆదాయం ఘనం.. వసతులు శూన్యం
● సమస్యల నిలయం ఽభైంసా ఏఎంసీ ● ఆదాయమున్నా ఫలితం శూన్యం ● ఇతర మార్కెట్లకు రూ.19.24కోట్లు భైంసాటౌన్: భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే రెండో అతిపెద్ద మార్కెట్. భైంసాలోని ఏఎంసీకి ఏటా రూ.కోట్లలో ఆదాయం సమకూరుతోంది. రైతులు తమ పంట ఉత్పత్తులను స్థానిక మార్కెట్ యార్డులో విక్రయించడం ద్వారా మార్కెట్ కమిటీకి ఆదాయమూ వస్తోంది. అంతేగాకుండా జిన్నింగ్ మిల్లులు, రైస్మిల్లులు, ఏఎంసీ వ్యాపార సముదాయాలు, గోదాంల అద్దెల ద్వారా ఏటా రూ.కోట్లలోనే ఆదాయం సమకూరుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. రైతుల కోసం ఏర్పాటైన ఏఎంసీలో వారి అవసరాలకు అనుగుణంగా నిధులు వెచ్చించలేని దుస్థితి. స్థానిక రైతులు తమ పంటలను విక్రయించడం ద్వారా ఏఎంసీకి చేకూరుతున్న ఆదాయం ఇతర ప్రాంతాల్లోని మార్కెట్యార్డులకు తరలిపోతోంది. దీంతో ఇక్కడి ప్రాంత రైతులకు పూర్తిస్థాయిలో వసతులు కల్పించలేకపోతున్నారు. ఫలితంగా పంట విక్రయానికి భైంసా ఏఎంసీకి వచ్చే రైతులు అసౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్నారు. తరలిన రూ.19.24 కోట్లుభైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఏటా రూ.6కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. కాగా, ఇక్కడి ఏఎంసీ నిధులు ఇతర మార్కెట్లకు తరలిపోతుండటం విచారకరం. 2014 నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.19.24 కోట్లు ఇతర మార్కెట్లకు తరలిపోయాయి. 2014లో సిద్ధిపేట ఏఎంసీకి రూ.8 కోట్లు, 2016లో కుభీర్లోని ఏఎంసీకి రూ.1.50 కోట్లు, 2007లో సారంగపూర్ ఏఎంసీకి రూ.75లక్షలు, 2020లో ఖానాపూర్ ఏఎంసీకి రూ.29.42లక్షలు, కుభీర్ ఏఎంసీకి మరోసారి రూ.1.20 కోట్లు తరలిపోగా, రంగారెడ్డి జిల్లాలోని కోహెడ మార్కెట్కు రూ.6.50 కోట్లు, జగిత్యాలకు రూ.కోటి నిధులు తరలిపోయాయి. వసతులు లేక అవస్థలుభైంసా వ్యవసాయ మార్కెట్ పట్టణ కేంద్రం నడిబొడ్డున ఉంది. దీంతోపాటు ఏఎంసీకి చెందిన గ్రేన్యార్డు, మిర్చియార్డు, కాటన్యార్డు ఇలా వేర్వేరుగా ఉన్నాయి. అలాగే పట్టణం నడిబొడ్డున ఉండటం, ఈ మార్గంలో రద్దీ ఉండటంతో రైతులు తమ పంట ఉత్పత్తులు విక్రయానికి తెచ్చే క్రమంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మార్కెట్ను పట్టణానికి దూరంగా తరలించాలన్న డిమాండ్ వచ్చింది. అలాగే యార్డులో రైతులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేవు. ముఖ్యంగా ధర లేనప్పుడు పంట ఉత్పత్తులు నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజీ, గోదాంలు లేవు. వానాకాలంలో పంట ఉత్పత్తులు తడిసిపోకుండా ఉండేలా టార్పాలిన్లు అవసరానికి తగినన్నీ లేవు. తాగునీటి వసతి, ఆకలితో వచ్చే రైతులకు తక్కువ ధరకే భోజనం అందిస్తే ప్రయోజనం ఉంటుంది. మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా లేదు. రైతులు సేదదీరేందుకు విశ్రాంతి భవనమున్నా నిర్వహణ, వినియోగం లేక నిరుపయోగమైంది. ప్రతిపాదనలు పంపించాం భైంసా ఏఎంసీలో రైతులకు ఇబ్బంది లేకుండా చ ర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల రూ.8.41 కోట్ల తో పలు అభివృద్ధి పనులకు తీర్మానం చేశాం. గో దాముల్లో సీసీ ప్రహరీలు, సీసీ గ్రౌండ్లు, గోదాం, షెడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం. సంబంఽధిత శాఖ మంత్రిని కూడా కలిసి పనులకు నిధులు కేటాయించాలని కోరాం. – సింధే ఆనంద్రావు పటేల్, భైంసా ఏఎంసీ చైర్మన్రూ.8.41కోట్లతో ప్రతిపాదనలుభైంసా ఏఎంసీ పరిధిలోని పలుచోట్ల అభివృద్ధి పనులకు రూ.8.41కోట్లతో గతంలోనే తీర్మానం చేయగా, ప్రారంభం కాలేదు. దీంతో ఇటీవల నూతన పాలకవర్గం మరోసారి ప్రతిపాదనలు, తీర్మానం చేసింది. మాటేగాం, తానూరు, కామోల్, ముధోల్ గోదాముల్లో సీసీ ప్రహరీ, పంట ఉత్పత్తులు ఆరబోసేలా మైదానంలో సీసీ పనులు చేపట్టాల్సి ఉంది. రైతుల పంట ఉత్పత్తుల కొనుగోలు కోసం పట్టణంలోని కాటన్యార్డులోనే గోదాం నిర్మాణం, ఏఎంసీకి ఆదాయం చేకూరేలా కాటన్యార్డు లోనికి వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ఏఎంసీ చైర్మన్ ఆనంద్రావు పటేల్ సంబంధిత శాఖ మంత్రిని కలిసి విన్నవించారు. -
ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి
● నేర సమీక్షలో ఎస్పీ జానకీషర్మిల నిర్మల్టౌన్: ఇసుక, పీడీఎస్ బియ్యం అక్రమ రవా ణాను అరికట్టాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించా రు. పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి వీలైనంత త్వరగా చార్జ్షీట్ దాఖలు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీస్స్టేషన్లవారీగా పెండింగ్ కేసుల వివరాలు, కారణాలు తెలుసుకుని, త్వరగా పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్స్టేషన్ల పరిధిలో గ్రామ, నగరంలో వార్డుల సందర్శనలు పెరగాలని పేర్కొన్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తితే వెంటనే సమాచారం అందేలా చూసుకోవాలని తెలిపారు. రౌడీ షీటర్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. ట్రయల్స్కు వచ్చినప్పుడు కేసు తీవ్రతను బట్టి అవసరమైతే సబ్ డివిజన్ అధికారులూ కోర్టుకు వెళ్లి నిందితులకు శిక్ష పడేలా వ్యవహరించాలని తెలిపా రు. గంజాయిని అరికట్టాలని పేర్కొన్నారు. అనంత రం మరిన్ని మెరుగైన సేవలందించడానికి నూతన కంప్యూటర్లు, వెబ్ కెమెరాలను ఎస్సైలకు అందజేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఉపేంద్రరెడ్డి, భైంసా ఏఎస్పీ అవినాశ్కుమార్, నిర్మల్ ఏఎస్పీ రాజేశ్మీనా, ఇన్స్పెక్టర్లు ప్రవీణ్కుమార్, నైలు, గోపీనాథ్, ప్రేమ్కుమార్, మల్లేశ్, ఎస్సైలు, జిల్లా ముఖ్య కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
ఉత్తమ ఫలితాలు సాధించాలి
లక్ష్మణచాంద: విద్యార్థులు కష్టపడి చదివి ఉత్త మ ఫలితాలు సాధించాలని ఉమ్మడి జిల్లా ఎంజేపీ ఆర్సీవో గోపీచంద్ సూచించారు. గు రువారం మండలంలోని రాచాపూర్ గ్రా మంలోగల మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, కళాశాలను గోపీచంద్ సందర్శించారు. స్టోర్ రూంలోని స్టాక్తోపాటు రిజిష్టర్ ను పరిశీలించారు. విద్యార్థులకు సక్రమంగా స్టడీహవర్స్ నిర్వహించాలని సూచించారు. ఇ టీవలే భువనగిరిలో నిర్వహించిన రాక్కై ్ల మ్సింగ్ శిక్షణలో భాగంగా తొమ్మిదో తరగతి విద్యార్థి గోకుల్నాయక్ ప్రతిభ కనబరిచి ఉత్త మ గ్రేడ్ సాధించగా అతడికి శిక్షణ సర్టిఫికెట్ అందజేశారు. ప్రిన్సిపాల్ రాజు, మహేశ్, శ్రీకాంత్, సంతోష్, నిరోషా పాల్గొన్నారు. -
న్యూస్రీల్
నేడు నేత్ర వైద్యశిబిరం నిర్మల్చైన్గేట్: జిల్లా పెన్షనర్ల సంఘ భవనంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం గ్లోబల్ సూపర్ స్పెషాలిటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో కంటి వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంసీ లింగన్న గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. శిబిరంలో వైద్యులు కంటి పరీక్షలు నిర్వ హించి అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. 15న అథ్లెటిక్స్ పోటీలు నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో తెలంగాణ అథ్లెటి క్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 15న అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్న ట్లు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పద్మనాభంగౌడ్, సామ్యూల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అండర్–14 బాలబాలికలకు ట్రయథ్లాన్, 16, 18, 20 వయస్సుగలవారికి జంప్స్ త్రోస్, 400 మీటర్ల పరుగు పందెం పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గెలుపొందినవారు ఈ నెల 18, 19 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపా రు. ఆసక్తి గల క్రీడాకారులు ధ్రువీకరణ పత్రాలతో 15వ తేదీన ఉదయం రిపోర్టు చేయాలని, పూర్తి వివరాలకు 9440516634 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
సమస్యల పరిష్కారానికి కృషి
నిర్మల్టౌన్: కళాకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలంగాణ సాంస్కృతిక కళాసంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు పాట రాజశ్రీ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్లో మాట్లాడారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్లో నిర్వహించిన 12వ రాష్ట్ర స్థాయి సాంస్కృతిక వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కతజ్ఞతలు తెలిపారు. కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించేలా కృషి చేయాలని కోరారు. కళాకారుల సమస్యల పరిష్కారానికి తమవంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. త్వరలో జిల్లా కమిటీలను నియమిస్తామని చెప్పారు. ఆ మె వెంట రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పాట మహేశ్, జిల్లా అధ్యక్షుడు అష్టదిగంబర్, కళాకారులు పసుల రవి, మాడ సతీశ్, సాంస్కృతిక కళాసంస్థ సభ్యులు పాల్గొన్నారు. -
సరస్వతీ అమ్మవారికి రూ.కోటికి పైగా ఆదాయం
బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి హుండీని దేవస్థానం అధికారులు, భక్తుల ఆధ్వర్యంలో గురువారం లెక్కించారు. 79 రోజుల హుండీ ఆదాయం రూ.1,08,25,110, మిశ్రమ బంగారం 78 గ్రాములు, మిశ్రమ వెండి 4కిలోల 800 గ్రాములు, విదేశీ కరెన్సీ 36 నోట్లు వచ్చాయని ఆలయ ఈవో కే సుధాకర్రెడ్డి తెలిపారు. ఆలయ ఏఈవో సుదర్శన్గౌడ్, దేవస్థాన వైదిక పరిపాలన సిబ్బంది, యూబీఐ బ్యాంక్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, దేవస్థాన హోంగార్డ్స్, వాగ్దేవి సొసైటీ సభ్యులు, శివరామకృష్ణ సేవాసమితి రాజన్న సిరిసిల్ల భక్తులు పాల్గొన్నారు. -
ఆర్జీకేయూటీలో ముగిసిన వర్క్షాప్
బాసర: బాసర ఆర్జీయూకేటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం, టిహాన్ ఐఐటీ సహకారంతో ‘డ్రోన్స్ డిజైన్ ఫ్లై’ అంశంపై నిర్వహించిన ఐదురోజుల వర్క్షాప్ గురువారం ముగిసింది. వీసీ, ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్తో హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన 200 మంది విద్యార్థులు, అధ్యాపకులను అభినందించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ రాజలక్ష్మి, ఏవో రణధీర్, కోఆర్డినేటర్ డాక్టర్ నామని రాకేశ్, హెచ్వోడీ బావ్సింగ్, లక్ష్మణ్ ముత్యం, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
1104 యూనియన్ ఆవిర్భావ వేడుకలు
నిర్మల్చైన్గేట్: విద్యుత్ ఉద్యోగుల సంఘం 1104 ఆవిర్భావ వేడుకలను విద్యుత్ శాఖ కార్యాలయం ప్రాంగణంలో బుధవారం నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కల పోచయ్య యూనియన్ జెండా ఎగురవేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ 75 ఏళ్లుగా యూనియన్ కార్మికుల శ్రేయస్సుకు కృషి చేస్తోందన్నారు. కార్మికులు ప్రస్తుతం అనుభవిస్తున్న సౌకర్యాలన్నీ 1104 యూనియన్ పోరాడి సాధించినవే అని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కొడాలి వెంకటరమణ, కార్యదర్శి టి.మనోహర్స్వామి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోరిపెల్లి శ్రీనివాస్, జిల్లా సలహాదారు రేగుంట రాజేశ్వర్, డిస్కమ్ నాయకులు డి.రాజేశ్వర్రావు, ఎస్ఏ.రెహమాన్, రమాకాంత్, రఘు, మోహన్, నారాయణ్సింగ్, గోపి, అశోక్ పాల్గొన్నారు. -
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి
సారంగపూర్: ప్రతీ గ్రామం పచ్చదనంతో పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని జామ్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో బుధవారం స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో స్పెషల్ డ్రైవ్లో భాగంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతీ గ్రామంలోనూ ప్రజలు స్వచ్ఛందంగా తమ గ్రామం బాగుకోసం, స్వచ్ఛదనం కోసం స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకులంలో పంచాయతీ కార్మికులతోపాటు మండల అధికారులు, పాఠశాల సిబ్బందితో కలిసి పరిసరాలు శుభ్రం చేశామని అన్నారు. వారానికి రెండురోజులు కేటాయిస్తే పరిసరాలన్ని పరిశుభ్రంగా ఉండి ప్రజలు పూర్తి ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఎంపీడీవో లక్ష్మీకాంతరా వు, ఎంపీవో అజీజ్ఖాన్, ఏపీవో లక్ష్మారెడ్డి, పంచా యతీ కార్యదర్శి నరేశ్కుమార్, ప్రిన్సిపాల్ సంగీత, సిబ్బంది గోవర్ధన్, టీచింగ్ సిబ్బంది, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. -
కిక్ బాక్సింగ్లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ
నిర్మల్టౌన్: ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన నాలుగో అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీల్లో నిర్మల్ జిల్లాకు చెందిన అక్షయ, నాగలక్ష్మి పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. వరుసగా వెండి, కాంస్య పతకాలు సాధించారు. రాష్ట్ర జట్టును ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైదరాబాద్లో బుధవారం అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు, జనరల్ సెక్రెటరీ మహిపాల్, శిక్షకులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో.. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 8 నుంచి జరుగుతున్న తెలంగాణ రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో పట్టణంలోని రవి ఉన్నత పాఠశాల విద్యార్థి అనుముల శ్రీవైష్ణవి అండర్–13 బాలికల విభాగం సింగిల్స్, డబుల్స్లో ప్రతిభ కనబర్చింది. ప్రథమ స్థానంలో నిలిచింది. శ్రీవైష్ణవిని పాఠశాల ప్రిన్సిపాల్ రాణి, కరస్పాండెంట్ వెంకటేశ్వర్రావు అభినందించారు. -
దరిచేరనున్న కొలువు
● డీఎస్సీ–2008 బాధితులకు ఉద్యోగాలు ● హైకోర్టు ఉత్తర్వులతో వారంరోజుల్లో పోస్టింగు ● కాంట్రాక్టు ఎస్జీటీలుగా అవకాశం ● జిల్లాలో 15 మందికి న్యాయం..నిర్మల్ఖిల్లా: డీఎస్సీ–2008 నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు కాంట్రాక్టు విధానంలో ఎస్జీటీలుగా వారం రోజుల్లోగా నియామకాలు పూర్తి చేయాలని హైకోర్టు తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో జిల్లాలోని బాధిత అభ్యర్థుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నోటిఫికేషన్ అనంతరం తీసుకున్న నిర్ణయం మేరకు 30 శాతం పోస్టులు ప్రత్యేకంగా డీఈడీ అభ్యర్థులకు కేటాయించడంతో బీఈడీ అభ్యర్థులు నష్టపోయారు. మెరిట్ జాబితాలో ఉన్నా.. ఉద్యోగాలకు దూరమవడంతో కోర్టుల చుట్టూ తిరుగుతూ వస్తున్నారు. 16 ఏళ్ల న్యాయ పోరాటం.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు వీరందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపజేస్తూ కాంట్రాక్టు విధానంలో నియమించనున్నారు. అయితే వీరందరికీ సాధ్యమైనంత త్వరగా పోస్టింగ్ ఇవ్వాలని గతంలోనే హైకోర్టు స్పష్టం చేసినా వివిధ కారణాలతో జాప్యం జరుగుతూ వస్తోంది. సర్టిఫికెట్ల పరిశీలన.. ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన ఉమ్మడి జిల్లాల వారీగా పూర్తయింది. తాజాగా కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నియామకపు ఉత్తర్వులను వారం రోజుల్లో ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బాధిత అభ్యర్థులు కాంట్రాక్టు ఎస్జీటీలుగా నియామకం కానున్నారు.. జిల్లా నుంచి దాదాపు 15 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినప్పటికీ నూతన జిల్లాల వారీగానే పోస్టింగ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఎట్టకేలకు పోరాటం ఫలించడంతో అభ్యర్థులు గంగాధర్, ఇందూరు చంద్రశేఖర్, సుద్దాల రాజేశ్వర్, వినోద్, ప్రభ తదితరులు హర్ష వ్యక్తం చేస్తున్నారు. రెండురోజుల్లో జీవో.. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం బాధిత అభ్యర్థులకు న్యాయం చేకూరుస్తూ పోస్టింగులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల నియమావళితో సంబంధం లేకుండా రానున్న రెండు రోజుల్లోనే నియామక ప్రక్రియకు సంబంధించి ఉత్తర్వులు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఉద్యోగాలు ఇవ్వడం సంతోషం... డీఎస్సీ 2008లో వెలువడిన నోటిఫికేషన్ ద్వారా పోటీ పరీక్షలో ఎంపికై కౌన్సెలింగ్ సమయంలో ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల కారణంగా నష్టపోయాం. అప్పటి నుంచి సుప్రీంకోర్టు, హైకోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. మాకు అనుకూలంగా తీర్పులు వచ్చాయి. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం హర్షణీయం. – గంగాధర్,సుద్దాల రాజేశ్వర్, డీఎస్సీ–2008 బాధిత అభ్యర్ధులు -
నిర్మల్
సల్లంగ చూడు.. మల్లన్న గురువారం శ్రీ 13 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025ఆలయంలో కొలువైన మల్లన్న దేవుడు బోనాలతో ఊరేగింపుగా మల్లన్న ఆలయానికి వస్తున్న భక్తులు ఆలయం వెలుపల భక్తులు వెలిగించిన దీపాలు సమస్యలు విని.. పరిష్కారానికి ఆదేశించి.. ● భైంసా ‘ప్రజావాణి’లో ఎస్పీ జానకీషర్మిల భైంసాటౌన్: పట్టణంలోని సబ్ డివిజన్ కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల బుధవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని పలువురు ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు సావధానంగా విని చట్టరీత్యా పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతీ బుధవారం నిర్వహించే ప్రజావాణిలో ప్రజలు నిర్భయంగా, నేరుగా తనను కలిసి సమస్యలు విన్నవించవచ్చని తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుశాఖ కృషి చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్ కుమార్, ముధోల్ సీఐ మల్లేశ్, ఎస్సై అశోక్ ఉన్నారు. నిర్మల్ రూరల్ మండలం ముజ్గి గ్రామంలో బుధవారం మల్లన్న జాతర ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజులపాటు ఈ జాతర కొనసాగనుంది. సాయంత్రం వివిధ గ్రామాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో చల్ల కుండలతో పాదయాత్రగా వచ్చి స్వామివారికి పూజలు చేశారు. చల్ల నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిర్మల్, భైంసా, నిజామాబాద్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. కొందరు భక్తులు తులాభారం వేశారు. తలనీలాలు సమర్పించారు. డీసీసీ అధ్యక్షుడు కుచాడి శ్రీహరిరావు స్వామివారిని దర్శించుకున్నారు. గురువారం రథయాత్ర నిర్వహిస్తారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా నిర్మల్ రూరల్, దిలావర్పూర్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. – నిర్మల్ రూరల్ న్యూస్రీల్ -
● ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి
విద్యార్థుల ప్రగతిలో హెచ్ఎంల పాత్ర కీలకం నిర్మల్ రూరల్: విద్యార్థుల ప్రగతిలో ప్రధానోపాధ్యాయుల పాత్ర కీలకమని వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. డీఈవో కార్యాలయం నుండి వచ్చిన ఆదేశాలను తప్పక పాటించాలన్నారు. విద్యార్థుల ప్రగతికి ప్రధానోపాధ్యాయుల సేవలు తోడ్పడుతాయన్నారు. జిల్లాలో అపార్ నమోదు, యూడైస్ ప్లస్ వివరాల నమోదును పరిశీలించారు. మధ్యాహ్న భోజన నిర్వహణ, రిపోర్టుల నిర్వహణ, ఎల్ఐపీ తదితర వివరాల నమోదు వివరాలు తెలుసుకున్నారు. 10వ తరగతి ఫలితాలు, ఎఫ్ఎల్ఎన్ నిర్వహణ అంశాలపై చర్చించారు. పది ఫలితాల్లో జిల్లాను ఈసారి కూడా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని సూచించారు. డీఈవో రామారావు మాట్లాడుతూ.. ప్రధానోపాధ్యాయులు ప్రతీ పాఠశాలను సందర్శించి వివరాలను సజావుగా నమోదు చేయాలన్నారు. సమీక్షలో జిల్లా పరీక్షల సహాయ కమిషనర్ పద్మ, కోఆర్డినేటర్లు రాజేశ్వర్, నరసయ్య, ప్రవీణ్, లింబాద్రి పాల్గొన్నారు. హాజరైన ఉపాధ్యాయులు -
ఆర్జీయూకేటీలో చర్చాగోష్టి
బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని ఆర్జీయూకేటీలో ఇన్ఫ్యూజన్ టాక్స్ 2, మై విలేజ్ షో బృందం చర్చాగోష్టి కార్యక్రమం బుధవారం నిర్వహించారు. తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధ డిజిటల్ సృష్టికర్తలు, వ్యవస్థాపకులను ఒకచోట చేర్చిన ప్రేరణాత్మక కార్యక్రమని ఓఎస్డీ ప్రొఫెసర్ మురళిదర్శన్ అన్నా రు. ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్ ఆదేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. 2 వేల మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నా రు. బిగ్బాస్ ఫేమ్ గంగవ్వ, మైవిలేజ్ షో వ్యవస్థాపకుడు శ్రీకాంత్, కీలక సభ్యుడు చందు, ఇన్స్ట్రాగా మ్ ఇన్ఫ్లూయెన్సర్ స్టీఫెన్ భాను హాజరయ్యారు. సెషన్లో స్పీకర్లు తమ స్ఫూర్తిదాయకమైన కథలు, సవాళ్లు కంటెంట్ సృష్టి, వ్యవస్థాపకత, డిజిటల్ వృద్ధిపై విలువైన విషయాలను పంచుకున్నారు. ప్రశ్నోత్తరాల సెషన్ విద్యార్థులు అతిథులతో నేరుగా సంభాషించడానికి వీలు కల్పించి ఈవెంట్ను ఆకర్షణీయంగా మార్చారు.విద్యార్థులు కథ చెప్పడానికి ఉత్సాహం కనబర్చారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రణధీర్సాగి, డాక్టర్ రాకేశ్రెడ్డి, ఐఐఈడీ కోఆర్డినేటర్, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న గంగవ్వ -
ఎట్టకేలకు షురూ..!
● మీసేవ కేంద్రాల్లో కొత్త రేషన్కార్డులకు దరఖాస్తు ● తహసీల్దార్ కార్యాలయాల్లో పేర్ల తొలగింపు ● మార్పులు, చేర్పులకూ అవకాశం భైంసాటౌన్: రేషన్కార్డుల జారీ ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది. పదేళ్లుగా కొత్త రేషన్కార్డుల జారీ లేకపోవడం, పాతవాటిలో పేర్ల తొలగింపు, కొత్తగా పిల్లల చేర్పుపై ఎలాంటి దరఖాస్తులు స్వీకరించలేదు. కొత్తగా పెళ్లయిన జంటలకు రేషన్కార్డులు జారీ చేయలేదు. దీంతో ఎంతోమంది రేషన్కార్డుల్లో పిల్లల పేర్ల చేర్పు, కొత్తజంటలు కొత్త రేషన్కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా కొత్త రేషన్కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించినా, చాలామందికి కార్డులు జారీ కాలేదు. పేర్ల చేర్పు, తొలగింపులు కూడా జరుగలేదు. ఎట్టకేలకు మీసేవ కేంద్రాల్లో కొత్త రేషన్కార్డులతోపాటు మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. దీంతో ఇటు మీసేవ కేంద్రాలు, అటు తహసీల్దార్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. తహసీల్ కార్యాలయాల్లో తొలగింపు.. మీసేవ కేంద్రాల్లో కొత్త రేషన్కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. కొత్తగా పెళ్లయినవారు తమ తల్లిదండ్రులతో ఉన్న పాత కార్డులో పేర్ల తొలగింపు కోసం తహసీల్దార్ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. తహసీల్దార్ లాగిన్లో పేర్ల తొలగింపు చేస్తుండడంతో, ముందుగా పాత రేషన్కార్డులో పేర్లు తొలగింపజేసుకుంటున్నారు. అనంతరం మీసేవ కేంద్రాలకు వెళ్లి కొత్తగా రేషన్కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారు మీసేవలో దరఖాస్తు చేయాల్సిన అవసరంలేదని అధికారులు చెబుతున్నా.. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తుల కోసం బారులు తీరుతున్నారు. జిల్లాలో ప్రస్తుతమున్న రేషన్కార్డులు... అంత్యోదయ కార్డులు 12,827 తెల్లరేషన్ కార్డులు 1,09,601 మొత్తం కార్డులు 2,08,626 మొత్తం లబ్ధిదారులు 6,41,286 పేర్ల చేర్పునకూ ఆప్షన్.. కొత్త రేషన్కార్డుల జారీ, మార్పులు, చేర్పులకు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తుల ప్రక్రియ మొదలవడంతో ఎంతోమంది తమ పిల్లల పేర్ల చేర్పు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రభుత్వం తెల్లరేషన్ కార్డుదారులకు ఒక యూనిట్పై ఆరు కిలోల బియ్యం అందిస్తోంది. చాలామందికి పిల్లలు కలిగినా పేర్లు చేర్చకపోవడంతో బియ్యం అందుకోలేకపోయారు. ప్రస్తుతం పేర్ల చేర్పు కోసం ఆప్షన్ ఇవ్వడంతో పిల్లల ఆధార్ వివరాలతో మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. జారీ ఎప్పుడో...! కొత్త రేషన్కార్డుల దరఖాస్తులు స్వీకరిస్తున్నా.. కొత్త కార్డులు ఎప్పుడు జారీ అవుతాయో అన్న అనుమానాలు దరఖాస్తుదారుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు వార్డు సభల్లో, ప్రజాపాలన వేదికల్లో దరఖాస్తులు ఇచ్చినా, ఇటీవల ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టినా చాలామందికి కార్డులు జారీ కాలేదు. ప్రస్తుతం మీసేవలో దరఖాస్తుల స్వీకరణ మొదలైనా.. కార్డులు చేతికి ఎప్పుడొచ్చేనో అని పేర్కొంటున్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల లొల్లి!
● జిల్లాలో జోరందుకున్న ప్రచారం ● బీజేపీ అభ్యర్థులతో ప్రారంభం ● వేగం పెంచుతున్న హస్తం పార్టీ ● ‘సోషల్’గా వెళ్తున్న స్వతంత్రులు నిర్మల్: ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసిన మరుసటి రోజు నుంచే జిల్లాలో ప్రచారపర్వం జోరందుకుంది. నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఇక క్షేత్రస్థాయిలోకి వస్తున్నారు. జిల్లాలో బీజేపీ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమురయ్య సోమవారం ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పలు సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి పట్టభద్రుల అభ్యర్థిగా నామినేషన్ వేసిన అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వుట్కూరి నరేందర్రెడ్డి గత కొన్నినెలలుగా జిల్లాలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టభద్రుల స్థానానికి బీఎస్పీ నుంచి నామినేషన్ వేసిన పులి ప్రసన్న హరికృష్ణ, స్వతంత్రులుగా బరిలో దిగిన నంగె శ్రీనివాస్ తదితరులు ప్రధానంగా వాట్సప్, ఫేస్బుక్ తదితర సోషల్మీ డియా ద్వారా జిల్లాలోని పట్టభద్రులు, ఉపా ధ్యాయులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా ‘కమలం’ ప్రచారం నామినేషన్లు వేసిన మరుసటి రోజైన సోమవారం నుంచి జిల్లాలో బీజేపీ పట్టభద్రుల అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి, ఆ పార్టీ బలపర్చిన ఉపాధ్యాయ అభ్యర్థి మల్క కొమురయ్య ప్రచారం ప్రారంభించారు. జిల్లాలో నిర్మల్, ముధోల్ ఎమ్మెల్యేలు బీజేపీకి చెందిన వారే ఉండటంతో పాటు అభ్యర్థులిద్దరూ ఈ ప్రాంతానికి కొత్తవారు కావడంతో ఇక్కడి నుంచే ప్రచారాన్ని ప్రారంభించినట్లు చెబుతున్నారు. జిల్లాకేంద్రంలోని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి నివాసంలో సమావేశం నిర్వహించారు. అనంతరం వేర్వేరుగా పట్టభద్రులు, ఉపాధ్యాయులతో వారు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి మద్దతు కోరారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రణాళికతో కాంగ్రెస్.. నామినేషన్ల ఘట్టం చివరిదశ వరకూ తమ పార్టీ నుంచి పట్టభద్రుల అభ్యర్థి ఖరారు కాకపోవడంతో అధికార కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందునుంచీ సిద్ధంగా లేవు. చివరలో వుట్కూరి నరేందర్రెడ్డి నామినేషన్ వేయడంతో జిల్లా ప్రచారానికి సిద్ధమైంది. నామినేషన్ కార్యక్రమానికి జిల్లా నుంచీ భారీగా నాయకులు తరలివెళ్లారు. ఇక జిల్లాలో తమ ప్రచారం ఎలా ఉండాలి.. ఎలా పట్టభద్రులను ఆకట్టుకోవాలనే ప్లానింగ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. స్వతంత్రుల పోరు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులు బరిలో లేకపోవడంతో ఆ పార్టీ నేతలుగా ఉండి స్వతంత్రులుగా నామినేషన్ వేసిన వారిలో ఎవరికో ఒకరికి మద్దతు ఇవ్వచ్చని స్థానిక నాయకులు చెబుతున్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలంటేనే పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థుల ప్రభావమూ ఎక్కువగా ఉంటుంది. ఈసారి ఎన్నికల్లోనూ చాలామంది పట్టభద్రులు ప్రభావం చూపనున్నారు. ఇప్పటికే జిల్లా జనాల్లోకి వెళ్లిన ప్రసన్నహరికృష్ణ బీఎస్పీ నుంచి నామినేషన్ వేయడం గమనార్హం. ఈయనతో పాటు జిల్లాకు చెందిన స్వతంత్ర అభ్యర్థి నంగె శ్రీనివాస్ సోషల్ మీడియా ద్వారా పట్టభద్రులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దు
నిర్మల్ రూరల్: పదోతరగతి విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా పేర్కొన్నారు. టీ–శాట్ టీవీ చానెల్ ద్వారా యోగితారాణా పదో తరగతి విద్యార్థులకు పరీక్షలపై పలు సూచనలు చేశారు. మంగళవారం మంజులాపూర్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులతో కలిసి డీఈవో రామారావు ముఖాముఖి కార్యక్రమాన్ని వీక్షించారు. విద్యార్థులు అన్ని సబ్జెక్టులపై సాధన చేసి, ప్రశాంతంగా పరీక్షలు రాసి విజయం సాధించాలని సూచించారు. ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులు చదువుపై దృష్టి సారించేలా చూడాలని సూచించారు. ఆయా సబ్జెక్టుల రివిజన్ కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. స్లిప్ టెస్టులు, ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. కార్య క్రమంలో ప్రధానోపాధ్యాయురాలు పద్మ, జిల్లా పరీక్షల బోర్డు సహాయ కార్యదర్శి భానుమూర్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
బాసరలో త్రిపుర గవర్నర్ పూజలు
బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారిని మంగళవారం త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి దర్శించుకున్నారు. ముందుగా గవర్నర్తోపాటు ముధోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్ గోదావరినదిలో పుణ్యస్నానమాచరించారు. అనంతరం ఆలయానికి చేరుకోగా అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గవర్నర్ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అర్చకులు అమ్మవారి హారతి, తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఆలయ సమీపంలో ప్రతీ సంవత్సరం నిర్వహించే బ్రహ్మీ తీర్థంలో గవర్నర్ పాల్గొన్నారు. వీరి వెంట మాజీ సర్పంచ్ సతీశ్వర్రావు, ఆలయ అధికారులున్నారు. గవర్నర్కు సన్మానం భైంసాటౌన్: త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి సోమవారం రాత్రి పట్టణంలోని ఎమ్మెల్యే రామారావు పటేల్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. -
అన్నివర్గాలను వంచిస్తున్న కాంగ్రెస్
● బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి ● ఎమ్మెల్సీ అభ్యర్థులతో సమావేశంనిర్మల్ రూరల్: రాష్ట్రంలో 14 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చే సిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరో పించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ప ట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, టీచర్స్ ఎ మ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్యతో కలిసి పా ల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్వర్రెడ్డి మాట్లాడు తూ.. ఎన్నికలకు ముందు అనేక హామీలిచ్చి అధికా రంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. ఉద్యోగులను పే స్కేల్, పీఆర్సీ తదితర అంశాల్లో విఫలమైందని ఆరోపించారు. రి టైర్డయిన వారికి నెలలు గడిచినా బెనిఫిట్స్ ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. పెన్షనర్లనూ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్య మాట్లాడుతూ.. నిరుద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ముందుంటామని హామీ ఇచ్చారు. ముధోల్ ఎమ్మెల్యే రామారా వుపటేల్, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్రెడ్డి, నా యకులు సత్యనారాయణగౌడ్, అయ్యన్నగారి భూ మయ్య, మెడిసెమ్మ రాజు, సామ రాజేశ్వర్రెడ్డి, అ య్యన్నగారి రాజేందర్, కార్యకర్తలు, పట్టభద్రులు పాల్గొన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి నిర్మల్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉమ్మ డి ఆదిలాబాద్–నిజామాబాద్–కరీంనగర్–మెదక్ జిల్లాల బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ భవన్లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొమురయ్య మాట్లాడు తూ.. గత ప్రభుత్వాలు ఉపాధ్యాయులకు జీతా లు, పీఆర్సీ, డీఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా, వారి హక్కులను కాలరాశాయని ఆరోపించా రు. గత ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన 10వేల పీఎస్హెచ్ఎం పోస్టుల మంజూరుకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. జీవో 317 బాధితులకు న్యాయం చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి ని ర్లక్ష్య వైఖరి వహిస్తున్నారని విమర్శించారు. ప్రస్తు తం తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వల్లనేనని పేర్కొన్నారు. తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, జిల్లా అధ్యక్షుడు నవీన్, రాష్ట్ర నాయకులు శశికాంత్, రాజేశ్వర్, బీజేపీ నాయకుడు అయ్యన్నగారి భూమయ్య, పెన్షనర్ల సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు ఎంసీ లింగన్న తదితరులు పాల్గొన్నారు. -
ఒత్తిడికి చెక్.. టెలిమానస్
● అందుబాటులో టోల్ఫ్రీ నంబర్ ● ఇంటర్ విద్యార్థులకు ప్రయోజనం ● మానసిక నిపుణులతో సలహాలు ● ఉత్తమ ఫలితాల సాధనకు దోహదంలక్ష్మణచాంద: ఇంటర్ విద్యార్థుల సిలబస్ పూర్తయింది. ఇటీవలే మొదటి ప్రీఫైనల్ పరీక్షలు కూడా ముగిశాయి. ప్రయోగ పరీక్షలు కొనసాగుతున్నాయి. వార్షిక పరీక్షల సమయం దగ్గర పడుతోంది. గతేడాది కంటే ఈసారి మరింత మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు ఆయా కళాశాలల అధ్యాపకులు విద్యార్థులను అన్ని రకాలుగా తీర్చిదిద్దుతున్నారు. నిత్యం స్టడీ హవర్స్ నిర్వహిస్తూ విద్యార్థులకు వచ్చిన సందేహాలను వెంటవెంటనే నివృత్తి చేస్తున్నారు. అయితే కొందరిలో వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో పరీక్షలంటే భయం, ఆందోళన సర్వసాధారణం. పరీక్షల్లో పాస్ అవుతామో.. లేదోనని, తక్కువ మార్కులు వస్తాయేమోనని భయపడతారు. కొన్నిసార్లు ఆశించిన మార్కులు రాకపోతే ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. ఇలాంటి ఘటనలు గతంలో చూసిన కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల్లో పరీక్షలంటే నెలకొన్న భయాన్ని పోగొట్టి వారి మానసిక పరిస్థితిని మెరుగుపరిచి వారిలో మనోధైర్యం నింపేందుకు టెలిమానస్ అనే వినూత్న కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఇందుకు గాను టోల్ ఫ్రీ నంబర్ 14416ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన నేషనల్ టెలిమెంటల్ హెల్త్ ప్రోగ్రాం ఆఫ్ ఇండియాలో భాగంగా ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు. మానసిక స్థితి మెరుగుపరిచేందుకు.. టెలిమానస్ అనేది టెలిమెంటల్ హెల్త్ అసిస్టెన్స్ నే షనల్ టెలిమెంటల్ హెల్త్ ప్రోగ్రాం ఆఫ్ ఇండియా కార్యక్రమంలో ముఖ్యమైంది. పరీక్షల సమయంలో విద్యార్థుల్లో నెలకొన్న భయాన్ని పారదోలి విద్యార్థుల మానసిక స్థితిని మెరుగు పరచడం దీని ము ఖ్య ఉద్దేశం. పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనయ్యే విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరమైందని వైద్యశాఖ, మానసిక నిపుణులు చెబుతున్నారు. సద్వినియోగం చేసుకోవాలి టెలిమానస్ ఇంటర్ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంది. పరీక్షలంటే భయం, ఆందోళన ఉన్నవారు టోల్ ఫ్రీ నంబర్ 14416కు ఫోన్ చేస్తే వెంటనే శిక్షణ పొందిన మానసిక నిపుణులు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇస్తారు. వారిలోని భయాన్ని పోగొడతారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. – సురేశ్, మానసిక వైద్యనిపుణుడు అవగాహన కల్పిస్తే మేలు పరీక్షల సమయంలో ఒత్తిడికి గురయ్యే విద్యార్థులు టోల్ఫ్రీ నంబర్ 14416కు ఫోన్ చేసి తగిన సాయం పొందవచ్చు. ఈ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. ఫోన్ చేయగానే శిక్షణ పొందిన మానసిక నిపుణులు విద్యార్థుల సమస్యలను పూర్తిగా విని తగిన సలహాలు, సూచనలు ఇస్తారు. టెలిమానస్ కార్యక్రమంపై కళాశాలలో పోలీస్, వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తే వారికి మేలు చేకూరుతుందని పోషకులు భావిస్తున్నారు. -
ఇసుక తరలిస్తే చర్యలు
నిర్మల్టౌన్: ఇసుకను అక్రమంగా రవాణా చే స్తే చర్యలు తప్పవని ఎస్పీ జానకీ షర్మిల హె చ్చరించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గాజులపేట్, రాంనగర్, మంజులాపూర్ ప్రాంతాల్లో అక్రమ ఇసుక నిల్వలు, వే బిల్లులు పరి శీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ.. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందు కు ప్రత్యేక పోలీస్, స్పెషల్ టాస్క్ఫోర్స్ టీంల ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లా పరిధిలో 17 ఇసుక రీచ్లు, 35 ఇసుక నిల్వలున్నట్లు పే ర్కొన్నారు. అన్ని ప్రాంతాల్లో రెవెన్యూ అధికా రుల సహకారంతో అక్రమ ఇసుక నిల్వలను సీ జ్ చేస్తామని పేర్కొన్నారు. భైంసా ఏఎస్పీ అవినాష్, నిర్మల్ ఏఎస్పీ రాజేశ్ మీనా, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ప్రేమ్కుమార్, పట్టణ సీఐ ప్రవీణ్కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
భూ సమస్యల పరిష్కారానికి చర్యలు
నిర్మల్టౌన్: భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్శాఖలకు సంబంధింత భూసమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ‘స్పందన’ ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ జానకీ షర్మిలతో కలిసి పాల్గొన్నారు. జిల్లాలోని పలు రెవెన్యూ, పోలీస్ కేసులతో ముడిపడి ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీ అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి అధికారులకు సూచనలు చేశారు. స్పందన కార్యక్రమం ద్వారా పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ చెప్పారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఎస్పీ జానకీ షర్మిల మాట్లాడుతూ.. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి స్పందన కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజేశ్ మీనా, ఆర్డీవో రత్నకళ్యాణి, తహసీల్దార్ రాజు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి ఎమ్మెల్సీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. కలెక్టరేట్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విధులు, నిబంధనలు తదితర అంశాలపై ఎన్నికల అధికారులకు నిర్వహించిన శిక్షణలో పాల్గొన్నారు. మాస్టర్ ట్రైనర్లు ఎన్.రవి, లింబాద్రి ఎన్నికల ముందు, పోలింగ్, ఎన్నికల తర్వాత నిర్వహించాల్సిన విధులపై అధికారులకు శిక్షణ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రూట్, జోనల్ అధికారులు పోలింగ్ కేంద్రాల్లో ర్యాంప్, మరుగుదొడ్లు, విద్యుత్ తదితర వసతులను పరిశీలించాలని తెలిపారు. వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే సామగ్రిని జాగ్రత్తగా నిర్దేశిత ప్రదేశాలకు చేర్చాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్, నిర్మల్, భైంసా ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా కేంద్రంలో ‘స్పందన’ ఎన్నికల అధికారులకు శిక్షణ -
పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలి
● అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్నిర్మల్ఖిల్లా: జిల్లాలోని మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల ప్రత్యేక అధికారి ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మూడు మున్సిపాలిటీల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్తి, వాణిజ్య, నీటి, వ్యాపార ప్రకటనల పన్నుల వసూలును వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. పన్ను వసూలు లక్ష్యం, ఇప్పటి వరకు వసూలు చేసిన వివరాలను మున్సిపాలిటీల వారీగా అడిగి తెలుసుకున్నారు. అధిక మొత్తంలో పన్ను చెల్లించని వారి జాబితాను సిద్ధం చేసి, నోటీసులను జారీ చేయాలన్నారు. ప్రభుత్వ వాణిజ్య సముదాయాల అద్దెలు వసూలు చేయాలన్నారు. వాణిజ్య లైసెన్సుల పునరుద్ధరణ ప్రక్రియ కూడా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీల పరిధిలో నర్సరీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పట్టణాల్లో అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే జరిమానా విధించాలని తెలిపారు. ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలనుకున్న వారు ముందస్తుగా మున్సిపల్ అధికారుల అనుమతి తీసుకోవాలన్నారు. సమావేశంలో నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీల కమిషనర్లు జగదీశ్వర్గౌడ్, జాదవ్ కృష్ణ, రాజేశ్కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, డీఈలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
లోకేశ్వరం: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఐఈవో పరశురాం నాయక్ సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను డిస్ట్రిక్ ఎగ్జామినేషన్ కమిటీ (డీఈసీ) సభ్యులు సోమవారం పరిశీలించారు. ఈసందర్బంగా డీఐఈవో మాట్లాడుతూ ప్రతీ విద్యార్ధి ప్రాక్టికల్స్ చేసిన తీరు సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అవుతుందన్నారు. మాస్ కాపీయింగ్కు తావివ్వరాదన్నారు. విద్యార్థులకు కష్టపడి చదివి కళాశాలకు మంచిపేరు తేవాలని సూచించారు. ఆయన వెంట కమిటీ సభ్యులు సునీల్కుమార్, జాదవ్ రవికిరణ్, సుధాకర్రెడ్డి, నర్సయ్య, కళశాల ప్రిన్సిపాల్ గౌతమ్ ఉన్నారు. -
‘ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలి’
నిర్మల్చైన్గేట్: తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసిన ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా నాయకులు రంజిత్ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వర్గీకరణతో మాల, మాల ఉపకలాలు తీవ్ర అన్యాయం చేశారన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 విరుద్ధంగా ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టారని తెలిపారు. పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించిన తర్వాత దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ చేయాలన్నారు. నిరసనలో సమితి జిల్లా కన్వీనర్ కుంటోల్ల వెంకటస్వామి, జిల్లా కోకన్వీనర్లు పురుషోత్తం, అడిగ బోస్, డాక్టర్ ప్రభాకర్ సానే, అంబకంటి ముత్తన్న, బీఎస్ఐ జిల్లా అధ్యక్షుడు కొంత మురళీధర్, సమ్పెల్రా రత్నయ్య, దేవుళ్ల మధు, కప్పకంటి సురేశ్, సాద విజయ్, ఆకుల రమేశ్, పి.సతీశ్, తలారి రాజేశ్వర్, కోట సాయిబాబా, డి.సత్యనారాయణ, మాల సంఘం నాయకులు పాల్గొన్నారు. -
తీగలాగితే డొంక కదలింది..!
ఓ ప్రమాదం పీడీఎస్ బియ్యం దందా గుట్టు రట్టు చేసింది. బియ్యం అక్రమ రవాణా కేసులో పోలీసులు దర్యాప్తు చేయగా, రైస్మిల్కు ఉన్న లింకు బయటపడింది. దీంతో సదరు మిల్లుపై దాడిచేయగా, అప్పటికే మిల్లు నుంచి తరలించేందుకు సిద్ధంగా ఉన్న రెండు లారీల ధాన్యం గుర్తించారు. ఒక్క ప్రమాదంతో ఇటు పీడీఎస్ దందా, మరోవైపు వడ్ల అక్రమ రవాణా డొంక కదిలింది. ● పీడీఎస్ రైస్ దందా గుట్టు రట్టు చేసిన ప్రమాదం ● ధర్మాబాద్లో స్థావరంపై జిల్లా పోలీసుల దాడి.. ● లక్ష్మణచాంద రైస్మిల్కు తరలిస్తున్నట్లు గుర్తింపు ● వడ్లు తరలిస్తున్న రెండు మిల్లులపై కేసు ● భైంసాలో కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ జానకీ షర్మిలభైంసాటౌన్: ధర్మాబాద్ నుంచి తరలిస్తూ భైంసాలో పట్టుబడిన పీడీఎస్ బియ్యం ఘటనలో ఒకే దెబ్బకు రెండుపిట్టలు అన్నట్లు.. అటు పీడీఎస్ రాకెట్తోపాటు ఇటు రైస్మిల్లుకు ఉన్న లింక్ బయటపడింది. కేసు విచారణలో పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. ధర్మాబాద్కు చెందిన ఒకరు జిల్లాలో ఏజెంట్ల నుంచి బియ్యం సేకరించి, తిరిగి జిల్లాకే సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. పెద్దమొత్తంలో లారీలో బియ్యం తరలిస్తూ పట్టుబడడంతో దందాపై ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. ఆమె ఆదేశాలతో భైంసా ఏఎస్పీ అవినాష్కుమార్ కేసు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా నిర్మల్ ఏఎస్పీ రాజేశ్మీనాతో కలిసి ధర్మాబాద్లోని స్థావరంపై దాడి చేయగా, పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. పీడీఎస్ బియ్యం రైస్మిల్లుకు.. పీడీఎస్ బియ్యం పట్టుబడిన ఘటనలో ఎస్పీ జానకీ షర్మిల ప్రత్యేక దృష్టి సారించి రాకెట్ ఛేదించారు. అంతేగాక, టాస్క్ఫోర్స్ రాష్ట్ర అధికారులు సైతం రెండురోజులుగా జిల్లాలోనే తనిఖీలు చేపడుతున్నారు. లక్ష్మణచాందలో రెండు రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్ కేంద్రంగా సాగుతున్న పీడీఎస్ బియ్యం దందా గుట్టురట్టు చేసినట్లు ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల తెలిపారు. భైంసా పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం వివరాలు వెల్లడించారు. ధర్మాబాద్కు చెందిన రవూఫ్ అనే వ్యక్తి ఈనెల 8న ధర్మాబాద్ నుంచి లక్ష్మణచాందలోని ఓ రైస్మిల్కు 36 టన్నుల పీడీఎస్ బియ్యం లోడ్తో లారీ పంపించాడు. లారీ భైంసా పట్టణంలోకి చేరుకోగానే, నిర్మల్ చౌరస్తా వద్ద ఓ కారును ఢీకొంది. ఈ ఘటనతో సదరు లారీలో పీడీఎస్ బియ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బియ్యం స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఏఎస్పీ అవినాష్ కుమార్ ప్రత్యేకంగా దర్యాప్తు జరిపారు. ఇందులో భాగంగా నిర్మల్ ఏఎస్పీ రాజేశ్మీనాతో కలిసి మహారాష్ట్రలోని నాందేడ్ పోలీసుల సహకారంతో ధర్మాబాద్లో పీడీఎస్ రైస్ రాకెట్ స్థావరంపై దాడి చేశారు. జిల్లా నుంచి ధర్మాబాద్లోని సదరు స్థావరానికి తరలిస్తున్న మరో 6 టన్నుల బియ్యం బిద్రెల్లి వద్ద పట్టుకున్నారు. లక్ష్మణచాందలోని రైస్మిల్లులో తనిఖీ చేయగా, అప్పటికే అక్కడ రెండు ట్రక్కుల్లో ధాన్యం తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు గుర్తించి, సివిల్ సప్లయ్ అధికారులకు సమాచారమిచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కొన్ని కీలకమైన రికార్డులు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశామని, కీలక నిందితుడు రవూఫ్ పరారీలో ఉన్నాడని వెల్లడించారు. జిల్లాలో పీడీఎస్ బియ్యం దందా ఓ నెట్వర్క్లా పనిచేస్తోందని, జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ఏజెంట్ల ద్వారా బియ్యం సేకరించి రవూఫ్ లాంటివారు వాటిని రైస్మిల్లులకు పంపుతున్నట్లు గుర్తించామన్నారు. రైస్మిల్లర్లు, ఏజెంట్లు, ఇతరుల ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. సమావేశంలో ఏఎస్పీలు అవినాష్కుమార్, రాజేశ్మీనా ఉన్నారు. కేసు విచారణలో చురుగ్గా పనిచేసిన ముధోల్ సీఐతోపాటు ఎస్సైలు అశోక్, గణేశ్, శ్రీనివాస్, కానిస్టేబుళ్లు భీమేశ్, గగన్, విపుల్, తాహెర్, రాము, మురళి, శివ, అబుబాకర్, అంబాదాస్, అలీంను ఎస్పీ అభినందించారు. పీడీఎస్ వ్యాపారుల్లో భయం.. మిల్లర్లపై కేసు నమోదు చేయడంతో కొందరు రైస్మిల్లర్ల గుండెల్లో గుబులు మొదలైంది. ఓవైపు పోలీసులు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణపై దృష్టి పెట్టడం, మరోవైపు మిల్లుల్లో టాస్క్ఫోర్స్ అధికారుల తనిఖీలతో ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెల్లరేషన్కార్డుదారులకు రేషన్ షాపుల ద్వారా బియ్యం అందిస్తోంది. అయితే, చాలామంది వీటిని తినలేక అమ్ముకుంటున్నారు. దీంతో బియ్యం దందా నిర్వహకులు ఏజెంట్లతో గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి బియ్యం సేకరించి, మహారాష్ట్రకు తరలించి విక్రయించేవారు. ఇలా సేకరించిన బియ్యంను పెద్దమొత్తంలో పోగుచేసి, వాటిని సన్నబియ్యంగా మార్చి ప్రత్యేకసంచుల్లో ప్యాక్ చేసి జిల్లాకు తరలించి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జిల్లాలోని కొన్ని రైస్మిల్లులకు సైతం సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నారు. -
లక్ష్మీనరసింహుడి తెప్పోత్సవం
కడెం: మండలంలోని దిల్దార్నగర్, ఎలగడప, సారంగపూర్ సమీపంలోని అక్కకొండ లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మూడవ రోజు సోమవారం ఉదయం స్వామివారికి చందన మహోత్సవం.. సాయంత్రం సమీప గోదావరి నదిలో తెప్పోత్సవం నిర్వహించారు. కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గజ్జలమ్మ కల్యాణం కుంటాల: కుంటాల ఇలవేల్పు శ్రీగజ్జలమ్మదేవి ఆలయ ఐదో వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీగజ్జలమ్మదేవి కల్యాణం సోమవారం ఘనంగా నిర్వహించారు. వేదపండితులు శ్రీగురుమంచి చంద్రశేఖరశర్మ ఆధ్వర్యంలో ఉదయం నిత్యవిధి, యజ్ఞం, శ్రీగజ్జలమ్మ కల్యాణం జరిపించారు. సాయంత్రం రథోత్సవం, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో, దీక్షాపరులు నియమనిష్టలతో గజ్జలమ్మదేవిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. మాజీ ఎమ్మెల్యే నారాయణరావుపటేల్ అమ్మవారిని దర్శించుకున్నారు. వడ్ల లక్ష్మి–సత్తెయ్య, గంగాధర, నిహారిక–రాజు, సుజాత– శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.