Nizamabad District Latest News
-
మాదకద్రవ్యాల నిరోధానికి సమష్టి కృషి
● కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య ● జిల్లా స్థాయి కమిటీ సమావేశంనిజామాబాద్ అర్బన్: మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై గట్టి ని ఘా కొనసాగించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయిచైతన్య ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టిన చర్యలపై చర్చించి, వాటి నిరోధానికి అవలంబించా ల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్, సీపీ దిశా నిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. పోలీ స్, ఎకై ్సజ్, రవాణా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కమిటీగా ఏర్పడి పక్కాగా కృషి చేయాలన్నారు. గర్భిణులు కల్తీ కల్లు బారిన పడకుండా అంగన్వాడీ కార్యకర్తల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలను రవాణా, విక్రయిస్తున్న వారిని, వినియోగిస్తున్న వారిని పక్కాగా గుర్తిస్తూ నిఘా కొనసాగిస్తున్నామని అన్నారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేశామని, ఇకపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, ఆర్డీవో రాజేంద్ర కుమార్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, డీఈవో అశో క్, డీటీసీ దుర్గాప్రమీల తదితరులు పాల్గొన్నారు. -
24న న్యాయవాద సహకార సొసైటీ ఎన్నికలు
నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ జిల్లా న్యాయవాద పరస్పర సహకార సొసైటీకి 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను నూతన కార్యవర్గం కోసం ఏప్రిల్ 24న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల అధికారులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్, పులి జైపాల్ తెలిపారు. ఈసందర్భంగా మంగళవారం ఎన్నికల ప్రక్రియ వివరాలను వారు వెల్లడించారు. మొత్తం 12 మంది డైరెక్టర్లకు గాను నిజామాబాద్కు చెందిన 4 నాలుగు డైరెక్టర్ పోస్ట్ల ఎన్నికకు నామినేషన్ పత్రాల స్వీకరణ ఏప్రిల్ 15, 16 తేదీలలో నిర్వహిస్తామన్నారు. 17న నామినేషన్ పరిశీలన, 20 లోపు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం ఉంటుందని అదేరోజు సాయంత్రం 5 గంటలకు అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారన్నారు. 24న ఎన్నికలు నిర్వహించి, అదేరోజు పూర్తిస్థాయి సొసైటీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలోని సహకార సొసైటీ న్యాయవాద సభ్యులందరూ ఈ ఎన్నికల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా వారు విజ్ఞప్తి చేశారు. -
క్రైం కార్నర్
హత్యాయత్నం కేసులో ఒకరికి పదేళ్ల జైలు నిజామాబాద్ లీగల్: నగరంలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం చేసిన నిందితుడికి నిజామాబాద్ మూడవ అదనపు జిల్లా జడ్జి దుర్గాప్రసాద్ పదేళ్ల జైలు శిక్ష, రూ.పదివేల జరిమావా విధించాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంటు వసంత్ తెలిపిన వివరాలు ఇలా.. నిజామాబాద్లోని సాయినగర్కు చెందిన లింగంపల్లి మహేష్, బొడిగం సంతోష్ స్నేహితులు. తన పిల్లలు మూగవారని మహేశ్ అనడంతో, అతడిపై సంతోష్ పగ పెంచుకున్నాడు. ఈక్రమంలో 2025 మార్చి 4న మహేశ్, తన బంధువు నాగరాజుతో కలిసి బయటకు వెళ్లగా, సంతోష్ వారివద్దకు వచ్చి కత్తితో మహేశ్పై దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. బాధితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకొని కోర్టుకు తరలించారు. జడ్జి కేసును విచారించి సంతోష్కు హత్యాయత్నం కింద పదేళ్ల జైలు శిక్ష, రూ.పదివేల జరిమానా విధించారు. మరో ముగ్గురికి ఐదేళ్లు.. నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ ఐదో టౌన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులపై హత్యాయత్నం కేసులో ముగ్గురు వ్యక్తులకు నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు జడ్జి సాయిసుధ ఐదేళ్ల జైలు శిక్ష, వంద రూపాయల జరిమానా విధించారు. వివరాలు ఇలా.. నగరంలోని హష్మి కాలనీలో నివాసం ఉంటున్న షేక్ నసీర్కు, సయ్యద్ అబ్దుల్ రిజ్వాన్కు కొంత కాలంగా గొడవలు జరుగుతుండేవి. 29 జూన్ 2020న ఇరువురి మధ్య గొడవ జరుగగా నసీర్పై రిజ్వాన్, అతని తమ్ముడు రెహన్, మహ్మద్ అజార్ దాడి చేసి, కత్తితో గాయపరిచారు. స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా ప్రాణాపాయం తప్పింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఐదో టౌన్ పోలీసులు రిజ్వాన్, రెహాన్, అజార్పై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోర్టులో జడ్జి విచారణ చేపట్టి నిందితులకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, వంద రూపాయల జరిమానా విధించారు. కులం పేరుతో దూషించిన ముగ్గురికి ఏడాది.. నిజామాబాద్ లీగల్: ఓ వ్యక్తిని కులం పేరుతో దూషించిన ముగ్గురికి నిజామాబాద్ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి తూముకుంట శ్రీనివాస్ ఏడాది జైలు శిక్ష, రూ.4500 జరిమానా విధించారు. ఎస్సీ, ఎస్టీ కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దయాకర్ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా.. కామారెడ్డి జిల్లా శాబ్దీపూర్కు చెందిన మాలోత్ బాలు నాయక్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ కోర్సు పూర్తిచేసి, కామారెడ్డిలో దేవి ఐకేర్ పేరుతో క్లీనిక్ నడుపుతున్నాడు. లియో ఆప్టికల్స్ యజమాని సోమ్మన్నగారి నర్సింహులు తన పక్కనే బాలు నాయక్ క్లీనిక్ నడపడం ఇష్టం లేక తరుచు గొడవపడేవాడు. 2022 ఏప్రిల్ 13న బాలు నాయక్ రోడ్డుపై నడుచుకుంటు వెళ్తుండగా, నర్సింహులు అతని అనుచరులు కులం పేరుతో దూషించడంతోపాటు క్లీనిక్ను మూసేయాలని కరెంటు కట్ చేసేందుకు యత్నించారు. 15న నర్సింహులు, శ్యాం, రాజు కత్తితో బెదిరించారు. 19న క్లీనిక్పై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దీంతో బాలునాయక్ కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు నిందితులను పట్టుకొని, కోర్టులో హాజరుపర్చారు. జడ్జి విచారణ చేపట్టి ముగ్గురు నిందితులు నర్సింహులు, శ్యాం, రాజుకు ఏడాది జైలు శిక్షతోపాటు, రూ.4,500 జరిమానా విధించారు. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన ఏఎస్సై కామారెడ్డి పోలీసు లైజన్ ఆఫీసర్ రాజేశ్వర్, కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్ను ఉన్నతాధికారులు అభినందించారు. -
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేయాలి
నిజామాబాద్ అర్బన్: రోడ్డు ప్రమాదాల నియంత్ర ణ కోసం కృషి చేయాలని, ఇందుకోసం విస్తృత స్థా యిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు దిశానిర్దేశం చేశారు. నగరంలోని కలెక్టరేట్లో మంగళవారం కలెక్టర్ అ ధ్యక్షతన రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్ర తి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటి స్తే, ప్రమాదాలకు ఆస్కారం ఉండదని అన్నారు. ఈ దిశగా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో పా టు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా చైతన్యపర్చేందుకు కృషి చేయాలన్నారు. తరుచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న 55 బ్లాక్ స్పాట్ ప్రాంతాల గురించి, ప్రమాదాలకు గల కారణాలపై సమావేశంలో చర్చించి పలు సూచనలు చేశారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత ఇసుక లోడ్తో కూడిన వాహనాలు తిరగకుండా నిఘా ఉంచాలన్నారు. స్కూల్ బస్సుల తని ఖీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, ప్రతి వాహనం తగిన ఫిట్నెస్ కలిగి ఉండాలన్నారు. వరి కోతల సమయంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోందని, దీని ని దృష్టిలో పెట్టుకొని ఓవర్ లోడ్తో వెళ్లే వాహనా లను నియంత్రించేలా కార్యాచరణ అమలు చేయాలన్నారు. ఎక్కడ ప్రమాదం జరిగినా, అందుకు గల కారణాలపై పూర్తిస్థాయిలో పరిశీలన జరపాలని, త ద్వారా అలాంటి చోట్ల మరోమారు ప్రమాదాలు జ రుగకుండా నియంత్రణ చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. అధికారులు అంకితభావంతో కృషి చేస్తూ నిజామాబాద్ను రోడ్డు ప్రమాద ర హిత జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, ఆర్డీవో రాజేంద్ర కుమార్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, డీఈవో అశోక్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దుర్గా ప్రమీల, డీటీవో ఉమా మహేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, హర్ష, నేషనల్ హైవే అథారిటీ, ఆర్అండ్బీ, రవాణా శాఖ, ఆర్టీసీ, పంచాయతీ రాజ్, విద్యుత్, వైద్యారోగ్యం, మున్సిపల్ తదితర శాఖల అధికారులతోపాటు రోడ్ సేఫ్టీ కమిటీ సభ్యులు, రెడ్క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు. అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి కలెక్టరేట్లో రోడ్డు భద్రతా కమిటీ సమావేశం -
ఏళ్లు గడుస్తున్నా రికవరీ ఇంకెప్పుడు చేస్తారు?
మాక్లూర్: మాక్లూర్ సొసైటీ పాలకవర్గం, అందులో పని చేసే కార్యదర్శులు, సిబ్బంది కలిసి సొంతానికి వాడుకున్న రూ. 3కోట్ల 24లక్షల డబ్బును ఏళ్లు గడుస్తున్నా ఇంకెప్పుడు రికవరీ చేస్తారని రైతులు అధికారులను నిలదీశారు. సొసైటీ కార్యాలయానికి తాళం వేసి ధర్నా చేపట్టారు. మండల కేంద్రంలోని మాక్లూర్ సొసైటీ ప్రాంగణంలో మంగళవారం క్లస్టర్ అధికారి స్వప్న అధ్యక్షతన 84వ మహాజన సభ నిర్వహించారు. సొసైటీకి సంబంధించి జమఖర్చులను కార్యదర్శి రతన్ చదివి వినిపించారు. మొదటగా ఎవరు ఎంత బకాయి ఉన్నారనేది చదివి వినిపించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పనిచేసిన కల్లెడికి చెందిన సంతోష్ అనే కార్యదర్శిపై రూ.1కోటి 20లక్షల బకాయి ఉండటమేమిటని అధికారులను నిలదీశారు. ఇలా గత రెండు, మూడు పాలకవర్గాలు కలిసి ఇంత పెద్దమొత్తంలో అవినీతికి పాల్పడితే.. అధికారులుగా మీరేం చేశారని క్లస్టర్ అధికారి స్వప్న, పర్సన్ ఇన్చార్జి చైర్మన్ ఫిరోజ్ ఖాన్లను ప్రశ్నించారు. వాటిని రికవరీ చేసేవరకు ఈ సమావేశాలు వద్దంటూ వాదనకు దిగారు. కొందరు సొంతానికి వాడుకున్న రూ.3 కోట్ల 24 లక్షలను తప్పకుండ రికవరీ చేస్తామని, అందుకు ఒక ప్రొసీజర్ ఉంటుందని క్లస్టర్ అధికారి స్వప్న తెలిపారు. తరచూ ఇదే మాట చెబుతున్నారు కానీ, చేసిందేమిలేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభను వాకౌట్ చేశారు. సొసైటీ ప్రధాన గేటు వద్దకు వెళ్లి తాళం వేసి అక్కడ కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సొసైటీ పరిధిలోని అన్ని గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. మాక్లూర్ సొసైటీ మహాజనసభలో అధికారులను నిలదీసిన రైతులు కార్యాలయానికి తాళం వేసి, ధర్నా రూ.3కోట్ల 24 లక్షలను వెంటనే రికవరీ చేయాలని డిమాండ్ -
ఐదేళ్లలోపు పిల్లల మరణాలను తగ్గించాలి
సుభాష్నగర్: జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లల మరణాలను తగ్గించేందుకు వైద్యాధికారులు, సిబ్బంది కృషి చేయాలని డీఎంహెచ్వో బీ రాజ శ్రీ పేర్కొన్నారు. కార్యాలయంలో ఐదేళ్లలోపు పిల్లల మరణాలపై ఆమె మంగళవారం సమీక్ష నిర్వహించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ వైద్యాధికారులు, వైద్య సిబ్బంది మెడికల్ నాలెడ్జిని పెంచుకుంటూ వైద్య సేవలను అందించాలన్నారు. సీ్త్రలు, చిన్నపిల్లల్లో ప్రమాదకర లక్షణాలను ముందే గుర్తించాలని, బాలింతలను నిరంతరం కలుస్తూ ఆరోగ్యస్థితిని పర్యవేక్షించాలన్నారు. తల్లిపాల ప్రాముఖ్యతపై వివరించాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, పిల్లల ప్రాణాలను కాపాడే బాధ్యత తీసుకోవాలన్నారు. పిల్లల వైద్య నిపుణులు నిరూప్ రెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలపై దృష్టి సారించాలని, అనుబంధ ఆహారం, తల్లి పాలు, చెవి, ముక్కులో నూనె వేయడంతో కలిగే అనర్థాలను వివరించారు. సీ్త్ర వైద్యనిపుణులు రోహిణి మాట్లాడుతూ గర్భిణులకు 5 లేదా 6 గ్రాముల హెచ్బీ ఉంటే వారి పట్ల ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ ఐరన్ సుక్రోజ్, న్యూట్రిషన్ అందించాలన్నారు. సమావేశంలో డీఐవో ఎం అశోక్, అనస్తటిస్ట్ సుజయ్ కుమార్, డిప్యూటీ డీఎంహెచ్వోలు అశ్విని, సమత, పీవోఎంసీహెచ్ శ్వేత, సీడీపీవోలు తదితరులు పాల్గొన్నారు. క్షయ రహిత నిజామాబాద్గా తీర్చిదిద్దాలి క్షయ రహిత నిజామాబాద్గా తీర్చిదిద్దడమే అందరి లక్ష్యమని డీఎంహెచ్వో రాజ శ్రీ తెలిపారు. టీబీఎంబీఏ 2.0 కార్యక్రమంపై మెడికల్ ఆఫీసర్లు, ఎంఎల్హెచ్పీలకు మంగళవారం శిక్షణనిచ్చారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో టీబీ నిర్మూలన లక్ష్యంగా ఆరోగ్య సిబ్బంది సమర్థవంతంగా పని చేయాలన్నారు. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు రెండో విడత ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలోభాగంగా జీవనశైలి వ్యాధులపై నిర్ధారణ పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తారని తెలిపారు. ఏప్రిల్ 6 నుంచి 11 వరకూ జాతి ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో కీటక జనీత వ్యా ధుల ప్రోగ్రాం అధికారి వినయ్ కుమార్, జిల్లా టీబీ అధికారి దేవి నాగేశ్వరి, మెడికల్ ఆఫీసర్ అవంతి, ఆరోగ్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.● సీ్త్రలు, చిన్నపిల్లల్లో ప్రమాదకర లక్షణాలను ముందే గుర్తించాలి ● అధికారులతో డీఎంహెచ్వో రాజశ్రీ సమీక్ష -
ప్రణాళికతో పుష్కరాల పనులు చేపట్టాలి
రెంజల్(బోధన్): వచ్చే సంవత్సరం నిర్వహించే గోదావరి పుష్కరాలను విజయవంతం చేసేందుకు అధికారులు ప్రణాళికతో పనులు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గతంలో జరిగిన పుష్కరాల్లో చోటు చేసుకున్న తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమ పుష్కరక్షేత్రాన్ని మంగళవారం సంబంధిత శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ సందర్శించారు. అంతకుముందు పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్అండ్బీ డివిజన్ స్థాయి అధికారులతో గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులకు అవసరమైన అన్ని రకాల పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. వారం రోజుల క్రితం ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డితో కలిసి క్షేత్రాన్ని సందర్శించిన సమయంలో అధికారులకు వివరించిన పనులు ఏ మేరకు పూర్తయ్యాయనే విషయాన్ని క్షేత్రస్థాయిలో గుర్తించి ఆయా శాఖల అధికారులు చేపట్టిన పనుల వివరాలను ఆరా తీశారు. త్రివేణి సంగమ పుష్కరక్షేత్రానికి పర్వదినాలతోపాటు ప్రతి శుక్ర, ఆదివారాలు భక్తులు వస్తారని, పుష్కరాల సమయంలో లక్షల్లో వచ్చే అవకాశం ఉంటుందన్నారు. పనులు దీర్ఘకాలం నిలిచేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఘాట్కు వచ్చే మార్గాలలో రహదారుల మరమ్మతులు, వంతెనల నిర్మాణ పనులు, రోడ్ల విస్తరణ పనులపై పురోగతి సాధించాలన్నారు. వీఐపీలు వచ్చే అవకాశం ఉన్నందున హెలిప్యాడ్ను నిర్మించాలన్నారు. వాహనాల పార్కింగ్, మరుగుదొడ్లు, తాత్కాలిక గదులు, భక్తులు బస చేసేందుకు వీలుగా తగిన వసతి, షామియానాలు వంటి సౌకర్యాలు చేయాలన్నారు. ఘాట్ల వద్ద ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, స్థానిక సర్పంచ్ గయాసొద్దీన్, తహసీల్దార్ శ్రావణ్కుమార్, ఎంపీడీవో కమలాకర్, పీఆర్ డీఈ వెంకటేశ్వర్రావ్ తదితరులు ఉన్నారు. భక్తులకు ఇబ్బందులు రానీయొద్దు రహదారులను గుర్తించి పనులు ప్రారంభించండి అధికారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం కందకుర్తి త్రివేణి సంగమ పుష్కరక్షేత్రం పరిశీలన -
పరిశోధక విద్యార్థికి డాక్టరేట్
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ వృక్షశా స్త్ర విభాగం పరిశోధక విద్యార్థి దాసరి రఘు డాక్టరేట్ సాధించారు. తెయూ ప్రొ ఫెసర్ విద్యావర్థిని పర్యవేక్షణలో ఎన్హాన్స్మెంట్స్ ఆఫ్ క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్ యీల్డ్, వయాబిలిటీ అండ్ లో జర్మినేషన్ రేట్ ఇన్ క్లియోమ్ విస్కోసా అండ్ క్లియోమ్ గైనండ్రా బై అప్లికేషన్ ఆఫ్ బ్రాస్సినోస్టిరైడ్స్’ అనే అంశంపై రఘు పరిశోధన పూర్తి చేసి సిద్ధాంత గ్రంథం సమర్పించారు. మంగళవారం ఎక్స్టర్నల్ ఎగ్జామినర్గా కేంద్రియ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ రాహుల్కుమార్ పరిశోధకుడిని పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. వృక్షశాస్త్ర విభాగాధిపతి హలీమ్ ఖాన్, తెయూ సైన్స్ డీన్ సంపత్ కుమార్, బీవోఎస్ చైర్పర్సన్ అరుణ, అధ్యాపకులు శ్రీనివాస్, జలంధర్, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. నిజామాబాద్ లీగల్: నగరంలో మంగళవారం నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2025–26 సంవత్సరానికి గాను న్యాయవాదుల సావనీర్ను జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి ఆవిష్కరించారు. ఈసందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. గత సంవత్సర కాలంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు, న్యాయవాదుల వివరాలతో రూపొందించిన సావనీర్ ఓ జ్ఞాపకంగా నిలిచిపోతుందని అన్నారు. సావనీర్ కమిటి అధ్యక్షుడు అమిడాల సుదర్శన్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మామిళ్ల సాయిరెడ్డి, మాణిక్ రాజు, ఉపాధ్యక్షుడు రెంజర్ల సురేష్, సభ్యులు ప్రవీణ, అజీతా రెడ్డి, ఇంతియాజ్, ఆరెట్టి నారాయణ పాల్గొన్నారు. సుభాష్నగర్: హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లాకేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో నిర్వహించే శోభాయాత్ర, ర్యాలీలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పోలీస్ యంత్రాంగం చర్యలు చేపట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఒక ప్రకటనలో కోరారు. ఈమేరకు డీజీపీకి ఆయన లేఖ రాశారు. ఇందూరు పోలీస్ యంత్రాంగం వివిధ నిబంధనలను సాకుగా చూపుతూ ర్యాలీలను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాంతిభద్రతలను పర్యవేక్షించాలన్నారు. ర్యాలీలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో సాగేందుకు తగిన బందోబస్తు ఏర్పాటు చేసేలా స్థానిక పోలీసులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని దినేష్ పటేల్ కులాచారి డీజీపీని కోరారు. -
అన్నదాతకు అకాల దెబ్బ
2,559 ఎకరాల్లో పంట నష్టం● జిల్లాలో 14 మండలాల్లో నష్టపోయిన 2,209 మంది రైతులు ● నిజామాబాద్ మార్కెట్లో తడిసిపోయిన పసుపు కుప్పలు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా 14 మండలాల్లో 2,209 మంది రైతులకు చెందిన 2,559 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో వరి పంటకు అత్యధికంగా నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, మామిడి, బొప్పాయి పంటలు కొన్నచోట్ల దెబ్బతిన్నాయి. మరోవైపు నిజామాబాద్ మార్కెట్ యార్డులో రైతులు విక్రయించేందుకు తీసుకొచ్చిన పసుపు కుప్పలు తడిసిపోయాయి. ఉదయం నుంచి గంజ్లో 27,800 బస్తాల పసుపును రైతులు విక్రయించారు. పసుపు అధికంగా రావడంతో మరుసటి రోజు మంగళవారం తూకం వేయాల్సి ఉంది. కానీ అంతలోనే భారీ ఈదురుగాలులతో వర్షం కురిసింది. గాలులకు పసుపు కుప్పలపై కప్పిన టార్పాలిన్లు ఎగిరిపోయాయి. తూకం వేసే సమయంలో తడిసిన పసుపు పంట నుంచి తరుగు తీయొద్దని రైతులు కోరుతున్నారు. కాగా తడిసిన పసుపును ఎండబెట్టిన తర్వాత తూకం వేయాలని, తరుగు తీసి రైతులను నష్టపర్చవద్దని నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి వ్యాపారులను ఆదేశించారు. తరుగు తీసినట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ● ఆర్మూర్ పట్టణం, మండలంలో పలు గ్రామాల్లో చేతికొచ్చిన మొక్కజొన్న దెబ్బతింది. మామిడి కాయలు నేలరాలాయి. మండల వ్యవసాయాధికారి హరికృష్ణ పిప్రి, ఫత్తేపూర్ గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంట నష్టం వివరాలను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. మాక్లూర్ మండలం చిక్కిలి, గుంజిలి, కొత్తపల్లి గ్రామాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసిపోయింది. మరికొన్ని చోట్ల కోతకు వచ్చిన వరి పంట నేలవాలింది. తడిసిన ధాన్యం ఆరబెట్టుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. నేలవాలిన వరిలో కంకులు రాలిపోతాయని రైతులు వాపోతున్నారు. సింగంపల్లి, వల్లభాపూర్, కొత్తపల్లి, చిన్నాపూర్ ప్రాంతాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. ● కమ్మర్పల్లి మండలం ఉప్పులూరు గ్రామంలో నువ్వుల పంట నేలకొరిగింది. కల్లాల్లో పసుపు కొమ్ములు తడిసిపోయాయి. ఇక ఎడపల్లి, రెంజల్ మండలాల్లోని పలు చోట్ల, ఎడపల్లి మండలం జాకోరాలో స్వల్ప విస్తీర్ణంలో వరి పంట నేలకొరిగింది. కొన్ని చోట్ల నూర్పిడి చేసిన ధాన్యం తడవకుండా చేసుకునేందుకు రైతులు అగచాట్లు పడ్డారు. ఎడపల్లిలో నేలవాలిన వరి పైరుమండలాల వారీగా పంట నష్టం వివరాలు -
ముగిసిన ‘ఇంటర్’ మూల్యాంకనం
ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని ఖిల్లా వద్ద గల ఇంటర్మీడియట్ కార్యాల యంలో ఇంటర్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం క్యాంపు మంగళవారం ముగిసింది. ఈసందర్భంగా ప్రభుత్వ అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సయ్య మాట్లాడుతూ.. జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణ, మూ ల్యాంకనం విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. క్యాంపులో 3.45 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం కోసం కేటాయించారని,వాటిని పకడ్బందీగా,విజయంతంగా ఎలాంటి ఇబ్బందులు, తప్పులు దొర్లకుండా నిర్వహించడంతో ఇంటర్ విద్య పరీక్షల విభాగం నుంచి కూడా ప్రశంసించడం గర్వకారణమన్నారు. మూల్యాంకనం విజయవంతంగా పూర్తి చేయడంతో జిల్లా ప్రిన్సిపాళ్లకు, అధ్యాపకులకు డీఐఈవో కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం డీఐఈవో రవికుమార్ను ఆధ్యాపకులు సన్మానం చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు జాఫర్, ప్రధాన కార్యదర్శి నారాయణ తదితరులు ఉన్నారు. బోధన్ కోర్టులో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు బోధన్టౌన్(బోధన్): బోధన్ కోర్టు ఆవరణతోపాటు పరిసర ప్రాంతాల్లో మంగళవారం డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా కోర్టు ఆవరణతో పాటు పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించినట్లు బృంద ప్రతినిధులు తెలిపారు. -
నిజామాబాద్
రికవరీ ఇంకెప్పుడు.. మాక్లూర్ సొసైటీ పాలకవర్గం, సిబ్బంది వాడుకున్న డబ్బును ఇంకెప్పుడు రికవరీ చేస్తారని రైతులు అధికారులను నిలదీశారు. బుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026– 8లో uనిజామాబాద్ మార్కెట్ యార్డులోని పసుపు కుప్పల వద్ద నీటిని తొలగిస్తున్న మహిళా రైతు అకాల వర్షం అన్నదాతను తీవ్రంగా దెబ్బతీసింది. పంట చేతికొచ్చిన సమయంలో తీరని నష్టం కలిగించింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో వరి, మొక్కజొన్న, నువ్వు పంట నేలవాలింది. మామిడికాయలు రాలిపోగా, కల్లాల్లోని పసుపు తడిసి ముద్దయ్యింది. రోడ్ల పక్కన చెట్లు విరిగిపడ్డాయి. -
విద్యార్థులకు కార్పొరేట్ వల
ఖలీల్వాడి: జిల్లాలో కార్పొరేట్ విద్యా సంస్థలు కొన్ని అనుమతి లేకుండానే అడ్మిషన్ల దందాకు తెరలేపాయి. రంగు రంగుల బ్రోచర్లు, ప్రధాన కూడళ్ల వద్ద హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. సీబీఎస్ఈ పేరిట అందినకాడికి దోచుకుంటున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాలల వ్యవహారాన్ని అడ్డుకోవడంలో జిల్లా విద్యాశాఖ విఫలమవుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తనిఖీలు చేయకుండా కార్యాలయాలకే పరిమితమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. రూ.లక్షల్లో ఫీజులు.. తల్లిదండ్రులు తాము పడ్డ కష్టాలు పిల్లలు పడకూడదని ఆలోచిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకొని అందినకాడికి దోచుకునేందుకు కార్పొరేట్ స్కూళ్లు సిద్ధమవుతున్నాయి. స్కూల్ స్థాయి నుంచే ఐఐటీ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నామని చెబుతున్న యాజమాన్యాలు రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. వేలల్లో ఒకరిద్దరికి వచ్చే ర్యాంకులను చూపి మాయమాటలతో తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. నిజమే అని నమ్మిన చాలా మంది తల్లిదండ్రులు స్థిరాస్తులను అమ్ముకొని, అప్పులు చేసి మరీ విద్యార్థులను కార్పొరేట్ స్కూళ్లలో చేరుస్తున్నారు. కలెక్టర్ దృష్టి సారిస్తేనే.. నిజామాబాద్ నగరంతోపాటు జిల్లాలో కార్పొరేట్ స్కూళ్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. నగరంలో ఐదు స్కూళ్లకే సీబీఎస్ఈ అనుమతులు ఉన్నాయి. నిబంధనల ప్రకారం స్కూళ్ల అనుమతులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని, డీఈవో నుంచి అనుమతి పొందిన తర్వాత సీబీఎస్ఈ అనుమతి తీసుకోవా ల్సి ఉంటుంది. కానీ అలాంటివేమీ పట్టించుకోకుండా నేరుగా సీబీఎస్ఈ, డీజీ, ఇంటర్నేషనల్ పేరిట స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇంత జరుగుతు న్నా సంబంధిత మండల విద్యాశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కలెక్టర్ దృష్టి సారించి అనుమతి లేని స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. నజరానా.. టార్గెట్లు..కార్పొరేట్ స్కూల్పై చర్యలు తీసుకోవాలి నిజామాబాద్ రూరల్లో నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ సీబీఎస్ఈకి ప్రభుత్వ అనుమతి లే దు. మోసపూరిత ప్రకటనలతో విద్యార్థుల నుంచి లక్షలాది రూ పాయలు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల విషయంలో జిల్లా విద్యాశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కలెక్టర్ జోక్యం చేసుకొని అనుమతి లేని స్కూల్పై చర్యలు తీసుకోవాలి. – జన్నారపు రాజేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, పీడీఎస్యూఎంఈవోతో నోటీసులిస్తాం.. నగరంతోపాటు జిల్లాలోని ప్రయివేట్, కార్పొరేట్ స్కూళ్లకు ఎంఈవో ద్వారా నోటీసులు అందిస్తున్నాం. కేశాపూర్లోని నారాయణ స్కూల్కు నోటీసులు ఇవ్వాలని ఎంఈవోను ఆదేశించా. అనుమతులు తీసుకున్న తర్వాత, స్కూల్స్ ప్రారంభంలోనే అడ్మిషన్లు తీసుకోవాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. – పార్శి అశోక్, డీఈవో, నిజామాబాద్ అనుమతులు లేకుండానే అడ్మిషన్ల దందా విద్యార్థుల ఇళ్లకు పీఆర్వోలు, టీచర్లు ఆఫర్ల పేరిట తల్లిదండ్రులకు ఎర ఆకర్షించేలా ఫ్లెక్సీలు, హోర్డింగుల ఏర్పాటు చోద్యం చూస్తున్న విద్యాశాఖ అనుమతిలేని స్కూళ్ల బోర్డులు పెట్టాలి.. అనుమతులు లేని పాఠశాలల వద్ద విద్యాశాఖ అధికారులు ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేయాలి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మోసపోకుండా ఉంటారు. అనుమతులు లేకుండా ప్రచారం నిర్వహిస్తున్న కార్పొరేట్ స్కూళ్ల బోర్డులను వెంటనే తొలిగించేలా అఽధికారులు చర్యలు తీసుకోవాలి. – భట్టు వేణురాజ్, ఎన్ఎస్యూఐ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిఅధికారుల నిర్లక్ష్యమే.. అనుమతిలేని కార్పొరేట్ పాఠశాలలు విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నాయి. సీబీఎస్ఈ, ఇంటర్నేషనల్ స్కూళ్ల పేరిట తల్లిదండ్రులను మోసం చేసి, అధిక ఫీజులు గుంజుతున్నాయి. విద్యాశాఖ అధికారులు వాటిని అదుపు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. – రాచకొండ విఘ్నేష్, ఎస్ఎఫ్ఐ, జిల్లా ప్రధానకార్యదర్శి, నిజామాబాద్విద్యా సంవత్సరం ముగియక మునుపే కార్పొరేట్ యాజమాన్యాలు అడ్మిషన్లు చేపడుతున్నాయి. పీఆర్వోలు, టీచర్లను నగరంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల ఇళ్లకు పంపుతున్నారు. తల్లిదండ్రులకు మాయమాటలు చెప్తూ డిస్కౌంట్ల పేరిట అడ్మిషన్లు చేస్తున్నారు. ఒక్క విద్యార్థిని స్కూల్లో చేర్పిస్తే పీఆర్వోకు రూ. వెయ్యి నుంచి రూ. 5 వేల చొప్పున నజరానాగా చెల్లిస్తున్నాయి. మరోవైపు సంబంధిత స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు, బోధనేతర సిబ్బంది తప్పకుండా 20 వరకు అడ్మిషన్లు తీసుకురావాలని యాజమాన్యాలు టార్గెట్లు విధించినట్లు సమాచారం. దీంతో టీచర్లు ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థుల ఇళ్ల బాట పడుతున్నారు. -
వయోజన విద్య పరీక్ష కేంద్రం తనిఖీ
వేల్పూర్: మండలంలోని అంక్సాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ఉల్లాస్ వయోజన విద్య పరీక్ష కేంద్రాన్ని జిల్లా ప్రాజెక్టు అధికారిణి సంధ్యారాణి పరిశీలించారు. వయోజన విద్యనభ్యసించి పరీక్ష రాస్తున్న వయోజన మహిళలతో మాట్లాడారు. చదువుకు వయసుతో సంబంధం లేదని, ఎప్పుడైనా చదువుకోవచ్చన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉండే నిరక్ష్యరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా మార్చాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వయోజన విద్య కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చిందన్నారు. ఏపీఎం మాణిక్యం, సీసీలు సాయన్న, వెన్నమురళి, వీవోఏలు సుమలత, లత, రూప, స్వరూప, మహిళలు పాల్గొన్నారు. హోరాహోరీగా మల్లయోధుల పోరు నిజాంసాగర్(జుక్కల్): మత్తడి పోచమ్మ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మహమ్మద్ నగర్ మండలం నర్వలో మల్లయోధుల కుస్తీ పోటీలు హోరాహోరీగా సాగాయి. పొరుగు రాష్ట్రాల మల్లయోధులు తరలిరావడంతో పోటీలు రసవత్తరంగా సాగాయి. గ్రామానికి చెందిన ముప్పిడి రాంప్రసాద్ గుప్తా తన తండ్రి రాములు జ్ఞాపకార్థం 5 తులాల వెండి కడియాన్ని ఆఖరి కుస్తీ మల్లయోధుడికి బహూకరించారు. డీసీసీ జిల్లా కార్యదర్శి గొట్టం నర్సింలు, ఉప సర్పంచ్ చింతల దుర్గానరేశ్ గుప్తా, నాయకులు గొల్ల గోపాల్, గంగారాం, మల్లయ్య, తదితరులున్నారు. ఎల్లారెడ్డిరూరల్: అల్మాజీపూర్లో ఆదివారం కుస్తీ పోటీలు నిర్వహించారు. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా కుస్తీ పోటీలను నిర్వహించినట్లు సర్పంచ్ దేవదత్తు తెలిపారు. కొబ్బరికాయ కుస్తీ నుంచి రెండున్నర తులాల వెండి కడియం వరకు కుస్తీ పోటీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. లింగంపేట(ఎల్లారెడ్డి): భవానిపేట, బాణాపూర్ గ్రామాల్లో ఆదివారం శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా కుస్తీ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. కుస్తీ పోటీల్లో మల్లయోధులు హోరాహోరీగా తలపడ్డారు. గెలుపొందిన వారికి సర్పంచ్, ఆలయ కమిటీ సభ్యులు నగదు బహుమతులు అందజేశారు. -
ఐస్క్రీం బండ్లకు ప్రవేశం లేదు
● గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ధర్మోరా గ్రామస్తులు మాక్లూర్: తమ గ్రామంలోకి ఐస్క్రీం బండ్లకు ప్రవేశం లేదంటూ ధర్మోరా గ్రామస్తులు పేర్కొన్నా రు. ఈమేరకు మండలంలోని ధర్మోరా గ్రామంలో ఆదివారం గ్రామస్తులందరు కలిసి సర్పంచ్ పందిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మా ఊరిలోనికి ఐస్క్రీం అటోలకు ప్రవేశం లేదని గ్రామానికి రెండు వైపులా ఫ్లెక్సీలు పెట్టారు. అటోలలో వచ్చి నాసిరకం ఐస్క్రీంలు అమ్మడంతో వాటిని తిన్న చిన్నారుల ఆరోగ్యాలు చెడిపోతున్నాయన్న ఉద్ధేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు. ఎవరైన గ్రామంలోకి వచ్చి ఐస్క్రీంలు విక్రయిస్తే రూ.5వేల జరిమానా విధించనున్నట్లు తెలిపారు. అనంతరం ఐస్క్రీంలు తింటే చిన్న పిల్లలకు వచ్చే జబ్బుల విషయమై గ్రామంలో అవగాహన కల్పించారు. ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
మాతృభాష పరిరక్షణకు కృషి చేయాలి
● పంపా సాహితీ పీఠం కవి సమ్మేళనంలో వక్తలు బోధన్: మాతృభాష తెలుగు పరిరక్షణకు కవులు, రచయితలు, తెలుగు భాష ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని వక్తలు అన్నారు. బోధన్లోని ఉషోదయ జూనియర్ కళాశాలలో ఆదివారం పంపా సాహితీ పీఠం ఆధ్వర్యంలో ఉగాదిని పురస్కరించుకొని కవి సమ్మేళనం నిర్వహించారు. జ్యోతి ప్ర జ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సమ్మేళానికి వచ్చిన కవులు, రచయితలు తమ స్వీయ కవితలను వినిపించారు. నిర్వాహకులు కవులకు శాలువా, జ్ఞాపిక అందించి ఘనంగా సన్మానించారు. రచయిత తొగర్ల సురేశ్ రచించిన మెరుపు తీగలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కొడాలి కిషోర్, ఉషోదయ, విద్యా వికాస్ విద్యా సంస్థల అధిపతులు సూర్యప్రకాశ్, శ్రీనివాస్రావు, ప్రత్యేక ద్వితీయశ్రేణి న్యాయమూర్తి అబ్బరాజు శేషతల్పసాయి, బోధన్, పోతంగల్ ఎంఈవో నాగయ్య, లోల శంకర్, విశ్రాంత ఉద్యోగుల సంఘం డివిజన్ అధ్యక్షుడురాజేశ్వర్రావు విచ్చేశారు. పంపాసాహితి పీఠం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పురాణే అజయ్కుమార్, ప్రభాకర్, ప్రతినిధులు,స భ్యులు, కవులు మొగిలిస్వామిరాజ్, పబ్బమురళి, కాట్రగడ్డ భారతి, అమరావతి,డాక్టర్ గంధం విజయలక్ష్మి, శ్రీదారం గంగాధర్, మార్కొండ సాయిలు,తొగర్ల సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
ప్రమాదవశాత్తు జొన్న పంట దగ్ధం సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని భూంపల్లి గ్రామంలో ఆదివారం ప్రమాదవశాత్తు జొన్న పంట దగ్ధమైనట్లు బాధితుడు సుంకరి గంగయ్య తెలిపారు. గంగయ్యకు చెందిన రెండెకరాల జొన్న పంట చేతికొచ్చే సమయంలో అగ్ని ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. ప్రమాదానికి గురైన జొన్న పంటను ఆర్ఐ సంతోష్ పరిశీలించి పంచనామ నిర్వహించారు. రెండు ఎకరాల్లో సుమారు రూ.లక్షా 50వేల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. రామాలయంలో హుండీ చోరీ మాక్లూర్: మండల కేంద్రంలోని రామాలయం హుండీని శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీ చేసి, అందులోని నగదు అపహరించుకపోయారు. మరుసటి రోజు ఆలయ కమిటీ సభ్యులు చోరీని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాక్లూర్ పోలీసులు వెంటనే ఆలయ సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను తనిఖీ చేయగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. కుక్క దాడిలో నలుగురికి గాయాలు రుద్రూర్: పోతంగల్ మండలం కల్లూర్ గ్రామంలో ఆదివారం ఓ కుక్క దాడి చేయగా నలుగురు గాయపడినట్లు స్థానికులు తెలిపారు. బాధితులను వెంటనే చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో బోధన్ ఆస్పత్రికి తరలించినట్టు వారు తెలిపారు. బోధన్టౌన్(బోధన్): పట్టణంలోని గోషాల రోడ్డులో గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసునమోదు చేసినట్లు పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపారు. శనివారం రాత్రి పట్టణంలోని గోషాల రోడ్డులో ముగ్గురు అనుమానితులు గంజాయి సేవిస్తున్నారని సమాచారం అందడంతో పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లారు. వారిని అదుపులోకి తీసుకొని చెక్ చేయగా అందులో సాజిమ్ మంజుర్, నాగారం నరసింహా అనే ఇద్దరు గంజాయి సేవించినట్లు తేలిందన్నారు. దీంతో వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
నిరంతర విద్యుత్ సరఫరానే లక్ష్యం
● లోడ్ పెరిగే ప్రాంతాల్లో నూతన ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు ● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ పీవీ రాజేశ్వర్రావు సుభాష్నగర్: వేసవికాలంలో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను నిరంతరాయంగా అందించడమే లక్ష్యంగా ఉన్నట్లు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ పీవీ రాజేశ్వర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని డిసెంబర్ నుంచే అప్రమత్తమయ్యామని, ఏ విపత్తు ఎదురైనా సరఫరాను నిరంతరాయంగా అందించడానికి చర్యలు చేపట్టామన్నారు.ఇప్పటివరకు లోడ్ పెరిగే ప్రాంతాల్లో అంచనా మేరకు నూతనంగా 342 ట్రాన్స్ఫార్మర్లను ఏ ర్పాటు చేశామన్నారు. ఉపకేంద్రాల సామర్థ్యం పెంచేలా 2 సబ్స్టేషన్లు, 17 పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామ ర్థ్యం పెంచి అందుబాటులోకి తెచ్చామన్నారు. అందుబాటులో ఇంటర్ లింకింగ్.. వినియోగదారులకు నిరంతర సరఫరా అందించాలనే ఉద్దేశంతో ఇంటర్ లింకింగ్ వ్యవస్థను తీసుకొచ్చామని రాజేశ్వర్రావు అన్నారు. ఇప్పటివరకు 34 చోట్ల ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందిస్తున్నామన్నారు. అత్యవసర పరిస్థితులు ఎదురైనా, ఏదైనా ఉపకేంద్రంలో సమస్య తలెత్తినా.. ఆ పరిధిలో అంతరాయం ఏర్పడినా.. పరిష్కారమయ్యే వరకు మరో కేంద్రం నుంచి సరఫరా పునరుద్దరించేందుకు ఇంటర్ లింకింగ్ వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఒకదానికి ఒకటి అనుసంధానం చేస్తూ, ప్రస్తుతం 137 కిలోమీటర్లకు పైగా పనులు పూర్తి చేశామన్నారు. అలాగే వినియోగదారులకు ఏ అవసరమొచ్చినా కార్యాలయాల బాటపట్టకుండా ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ వాట్సాప్ చాట్బాట్, విద్యుత్ ప్రజావాణి, 1912 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. -
ఊరి కోసం రూ.10 లక్షల విరాళం
వేల్పూర్: మండలంలోని మోతె గ్రామానికి ఆదివారం అదే గ్రామానికి చెందిన అల్లపుల్ల గంగారెడ్డి ఆయన తండ్రి ఏలేటి అల్లపుల్ల రాజులు స్మారకార్థం రూ. 10 లక్షలు విరాళం ప్రకటించారు. వీటిలో ఇప్పటికే సుమారు మూడున్నర లక్షల రూపాయల పనులు పూర్తికాగా, ఆరున్నర లక్షలతో చేపట్టే పనులను గుర్తించారు. అందులో భాగంగా స్థానిక వేంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో ఆదివారం భవానీమాత మండపం నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయనను సర్పంచ్ దొల్లరమేశ్రెడ్డి, ఉపసర్పంచ్ పరంజ్యోతి, వార్డు సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో భవానీయూత్ సభ్యులు పాల్గొన్నారు. -
నాగమడుగు ఎత్తిపోతలపై అధ్యయనం
● పనులను పరిశీలించిన ఐఐటీ రూర్కీ శాస్త్రవేత్తలు నిజాంసాగర్(జుక్కల్): మంజీరా నదిపై నిర్మిస్తున్న నాగమడుగు ఎత్తిపోతల పనుల పూర్తి, భూముల ముంపు నివారణపై నిపుణుల బృందం నివేదికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఆదివారం ఒడ్డేపల్లి శివారులో ఉన్న నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులను సెంట్రల్ డిజైన్ ఆర్గనైజింగ్ ఎస్ఈ జహీర్తో పాటు ఐఐటీ రూర్కీ శాస్త్రవేత్తల బృందం ఇంజినీర్లు పరిశీలించారు. ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులతో వందల ఎకరాల భూములు ముంపునకు గురవుతుండటంతో పాటు రైతుల ఆందోళనలు, నష్టపరిహారం చెల్లింపులు తదితర విషయాల గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు నిపుణుల బృందాన్ని పంపింది. అంతేకాకుండా రీడిజైనింగ్ కోసం ప్రభుత్వం రూ.30 లక్షలు మంజూరు చేయడంతో ఇంజినీర్లు పనులను పరిశీలించి ప్రభుత్వాని నివేదిక ఇవ్వనున్నట్లు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజింగ్ ఎస్ఈ జహీర్ తెలిపారు. బాన్సువాడ నీటిపారుదలశాఖ ఎస్ఈ దక్షిణామూర్తి, ఈఈలు సాలోమాన్, చంద్రశేఖర్, డిప్యూటీ ఈఈలు, ఏఈలు, ఇంజినీర్లు ఉన్నారు. -
అత్తను చంపిన కోడలు
● బంగారు ఆభరణాలు అపహరణ ● నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని సీతాయిపల్లిలో వృద్ధురాలైన అత్తను కోడలు హత్య చేసి, ఆమె మెడలోని బంగారు ఆభరణాలను అపహరించింది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు ఇలా.. సీతాయిపల్లి గ్రామానికి చెందిన కావటి రుక్మవ్వ(73)కు ముగ్గురు కొడుకులు, కుమార్తె ఉండగా, వారికి వివాహాలు జరిగాయి. కొన్నేళ్ల క్రితం మొదటి ఇద్దరు కొడుకులు మృతిచెందగా, చిన్న కుమారుడు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు. గ్రామంలో రుక్మవ్వ, మొదటి ఇద్దరు కోడళ్లు వేర్వేరుగా జీవనం సాగిస్తున్నారు. రుక్మవ్వకు కొన్నిరోజులుగా రెండో కోడలు కోటవ్వతో గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో శనివారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న అత్తపై రెండో కోడలు రాయితో బలంగా కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా, మెడలోని బంగారు గుండ్లు, చెవి కమ్మలను కోటవ్వ అపహరించింది. అనంతరం సహజ మరణంగా బంధువులు, గ్రామస్తులను నమ్మించింది. సాయంత్రం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా, తలకు గాయం ఉన్నట్లు బంధువులు గుర్తించి, కోటవ్వను నిలదీశారు. తానే హత్య చేసినట్లు ఆమె ఒప్పుకోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, ఎస్సై ఆంజనేయులు పరిశీలించారు. మృతురాలి కుమార్తె కిష్టవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని, అపహరించిన ఆభరణాలను రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. మోపాల్: ఆర్టీసీ బస్సు కండక్టర్పై ఓ ప్రయాణికుడు దాడి చేసిన ఘటన మోపాల్ మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. గన్నారం గ్రామానికి చెందిన తెడ్డు సురేష్ ఆదివారం నిజామాబాద్ బస్టాండ్కు వచ్చాడు. నర్సింగ్పల్లిలోని తన సోదరి ఇంటికి వెళ్లేందుకు చద్మల్ వైపు వెళ్తున్న బస్సు ఎక్కాడు. నర్సింగ్పల్లి శివారులోకి బస్సు రాగానే ఆపాలని అతడు గొడవకు దిగాడు. బస్టాప్ దగ్గరే ఉంది.. అక్కడే ఆపుతానని కండక్టర్ చెప్పినా విన్పించుకోలేదు. సురేష్తో వచ్చిన మరో వ్యక్తి నడిపి బాబయ్య కండక్టర్, డ్రైవర్ను దూషిస్తూ బస్సును అడ్డుకున్నారు. మాటామాటా పెరగడంతో అప్పటికే కోపోద్రిక్తుడైన సురేష్ బస్సు ఆగిన వెంటనే కర్రతో కండక్టర్ను చితకబాదాడు. దీంతో కండక్టర్ హన్మంతు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై సుస్మిత తెలిపారు. -
దరఖాస్తుల ఆహ్వానం
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్ఎస్ఈటీఐ) ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కోసం మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి టైలరింగ్ కోర్సు (31 రోజు లు), బ్యూటీపార్లర్ (35 రోజులు), ఏప్రిల్ 10 నుంచి మగ్గం వర్క్ (31 రోజులు) కోర్సులు ప్రారంభమవుతాయన్నారు. ఉచిత శిక్షణతో పాటు ఉచిత భోజన సదుపాయం, హాస్టల్ వసతి కల్పిస్తారని తెలిపారు. శిక్షణ అనంతరం ధ్రువీకరణ పత్రం, టూల్ కిట్స్ అందిస్తామన్నారు. 19 నుంచి 45 సంవత్సరాల వయస్సులోపు మహిళలు అర్హులన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంతవాసులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆసక్తి గలవారు తమ ఆధార్కార్డు, రేషన్కార్డు, 10వ తరగతి ధ్రువీకరణ పత్రం, ఐదు పాస్పోర్టు సైజ్ ఫోటోలు, బ్యాంకు ఖా తా జిరాక్స్ వెంట తెచ్చుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం డిచ్పల్లిలోని ఘన్పూర్ రోడ్లోగల వెలుగు ఆఫీస్పక్కన ఉన్న ఎస్బీఐ శిక్షణ కేంద్రంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు సంప్రదించాలన్నారు. లేదా 08461–295428ను సంప్రదించవచ్చన్నారు. రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలకు ఎంపిక మోపాల్: ఉమ్మడి జిల్లాస్థాయి కుస్తీ పోటీల్లో పలువురు ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పీఈటీ దేవేందర్ తెలిపారు. మండలంలోని మంచిప్పలో ఆదివారం నిజామా బాద్ ఉమ్మడి జిల్లాల అండర్–20 కుస్తీ పోటీ లు నిర్వహించగా 20 మంది క్రీడాకారులు హాజరయ్యారు. హోరాహోరీగా పోటీలు జరుగగా, విజేతలను పీఈటీ అభినందించారు. గె లుపొందిన క్రీడాకారులు ఏప్రిల్ 2న కామారెడ్డి లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న క్రీ డాకారులు, బాలుర విభాగంలో లక్ష్మణ్ (57 కే జీలు), మణికంఠ (55 కేజీ), యోగేష్ (60 కే జీ), జగదీష్ (55 కేజీ), కృష్ణ (70 కేజీ), బాలికల విభాగంలో.. సోనియా (50 కేజీ), సఫి యా (72 కేజీ), ప్రీతి రాజ్ (68 కేజీ) ఉన్నారు. వర్ని: మోస్రా మండల కేంద్రంలోనీ సీతారామ ఆలయంలో శనివారం రాత్రి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వాదం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. -
సిరికొండ రేంజ్లోకి పెద్దపులి
● జినిగాల బీట్లో సంచారం ● పాదముద్రలను గుర్తించిన అధికారులు సిరికొండ: జిల్లా సరిహద్దులోని అటవీప్రాంతంలో కొద్ది రోజుల క్రితం సంచరించి హడలెత్తించిన పెద్దపులి.. ఇప్పుడు సిరికొండ రేంజ్లోకి వచ్చింది. జినిగాల బీట్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. ఆర్మూర్ ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ భవాని శంకర్, సిరికొండ, కమ్మర్పల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి నర్సింగ్రావు, రవీందర్ తమ సిబ్బందితో జినిగాల అటవీ ప్రాంతంలో ఆదివారం పర్యటించారు. పెద్దపులి పాదముద్రలను గుర్తించినట్లు వారు తెలిపారు. అటవీ ప్రాంతాలకు ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్మూర్ ఎఫ్డీవో సూచించారు. తెల్లవారు జామున, పొద్దు పోయే ముందు, రాత్రి వేళలో అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని అన్నారు. పశువులను మేత కోసం అటవీప్రాంతంలోకి తీసుకెళ్లొద్దని, అడవికి సమీపంలో వ్యవసాయ భూములు ఉన్న రైతులు పంట పొలాల వద్ద విద్యుత్ కంచెలను అమర్చవద్దని అన్నారు. పెద్దపులి పశువులు, జంతువులను చంపితే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. పెద్దపులి దాడిలో చనిపోయిన పశువులకు అటవీ శాఖ ద్వారా పరిహరం చెల్లిస్తామని ఆయన తెలిపారు. పెద్దపులికి ఎలాంటి హాని తలపెట్టొద్దని, పులిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని ఆయన అన్నారు. గస్తీలో సిరికొండ డీఆర్వో గంగారాం, సిరికొండ, కమ్మర్పల్లి రేంజ్ల సిబ్బంది పాల్గొన్నారు. -
యువత సన్మార్గంలో నడవాలి
● మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి ● సీపీ సాయిచైతన్య నిజామాబాద్ రూరల్: యువత సన్మార్గంలో నడిచినప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుందని కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయిచైతన్య పేర్కొన్నారు. నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తాలో ఆదివారం రూరల్ పోలీసులు నిర్వహించిన 2కే రన్ను సీపీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువతే దేశానికి భవిష్యత్తు అని అన్నారు. సామర్థ్యాన్ని సరైన దారిలో వినియోగిస్తే యువత మాత్రమే కాదు, సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. ఇటీవల యువతలో చెడు అలవాట్లు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచి మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, గురువులు చెప్పే మంచి మాటలు వినాలని, సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని అన్నారు. అనంతరం 2కే రన్లో ప్రతిభ కనబర్చిన వారికి సీపీ సాయిచైతన్య బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ(అడ్మిన్) బస్వా రెడ్డి, ఏసీపీ ప్రకాశ్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు ఎండీ షరీఫ్ , ఆనంద్ సాగర్, వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. -
పిచ్చికుక్కల దాడిలో ఐదుగురికి గాయాలు
దోమకొండ: మండల కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో శనివారం సాయంత్రం పిచ్చికుక్క దాడిలో పలువురికి గాయాలైయ్యాయి. కాలనీకి చెందిన ముద్దసాని కనకయ్య, బ్రహ్మయ్యగారి వెంకవ్వ, జంగం లిల్లీ, సాయవ్వతోపాటు మరో చిన్నారిపై కుక్కలు దాడిచేసినట్లు కాలనీవాసులు తెలిపారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పది రోజుల క్రితం ఇదేవిధంగా పలువురు చిన్నారులపై పిచ్చికుక్క దాడి చేయగా, వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తరచు కుక్కల దాడితో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. స్కూటీ దహనం ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్లో గట్టడి శ్రీనివాస్ చెందిన స్కూటీని శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేశారు. శ్రీనివాస్ రోజూ మాదిరిగా తన స్కూటీని రాత్రి ఇంటి ఆవరణలో ఉంచి లోనికి వెళ్లిపోయాడు. కాగ అర్ధరాత్రి స్కూటీ దహనం అవుతున్న విషయాన్ని చుట్టుపక్కలవారు గమనించి అతడికి తెలిపారు. వెంటనే మంటలను ఆర్పడానికి వారు ప్రయత్నించినా అప్పటికే వాహనం పూర్తిగా కాలిపోయింది. ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. -
ఎంపీగా ఉన్నప్పుడు ఏంచేశావ్?
సుభాష్నగర్: కల్వకుంట్ల కవిత ఎంపీగా ఉన్నప్పు డు నిజామాబాద్కు ఏం చేశావు? మూతపడిన షుగ ర్ ఫ్యాక్టరీలను తెరిపించావా.. ఆర్వోబీలు తెచ్చావా... అంటూ బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దంపల్లి జ్యోతి ప్రశ్నించారు. అభివృద్ధిని గాలికి వదిలేసి, లి క్కర్ స్కామ్లో వందలు, వేల కోట్లు గడించింది వా స్తవం కాదా? అంటూ ఆరోపించారు. నగరంలో ని బీజేపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జ్యోతి మాట్లాడారు. నిజామాబాద్ వచ్చి తాను తెలంగాణ ఆడబిడ్డను, నిజామాబాద్ కోడలిని అని కవిత చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం ఇందూరుకు వచ్చినప్పుడు, రాజకీయ అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆమెకు తాను ఆడబిడ్డను, కోడలిని అన్న విషయం గుర్తుకువస్తుందన్నారు. ఎంపీ అర్వింద్ గురించి కవిత మా ట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. జిల్లాలో ఎంపీ అర్వింద్ 10 ఆర్వోబీలు, ఆర్యూబీలు మంజూరు చేయించారని, వాటిలో ఇప్పటికే మూడు పూ ర్తికాగా, మిగితావి నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. సీఎం రేవంత్ ఇచ్చిన పైసలు తీసుకొని కొత్త పార్టీ పెడతానని చెప్పులు అరిగేలా తిరుగుతున్నావన్నా రు. ఏప్రిల్ 25న పెట్టబోయే కొత్త పార్టీకి ‘లిక్కర్ పార్టీ‘ అని పేరు పెట్టుకుంటే సెట్ అవుతుందన్నా రు. కార్పొరేటర్లు ఇప్పకాయల సుమిత్ర దేవి, చింత ప్రసున్నారెడ్డి, కల్పే అర్చన, రేవతి న్నారు. అభివృద్ధిని గాలికి వదిలేసి, లిక్కర్ స్కామ్లో రూ.కోట్లు గడించావు కల్వకుంట్ల కవితపై బీజేపీ మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతి ఆరోపణలు -
క్రైం కార్నర్
జక్రాన్పల్లి: మండలంలోని మునిపల్లి గ్రామ శివారులోగల 63వ నెంబర్ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. జాతీయ రహదారిపై శనివారం వేకువజామున ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వెళ్లే మార్గంలో గుర్తుతెలియని వ్యక్తిని వాహనం ఢీకొట్టినట్లు తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, వయస్సు సుమారు 50 నుంచి 60 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. తెల్లని మాసిన షర్ట్, నల్లని ప్యాంట్ వేసుకున్నాడని తెలిపారు. మృతదేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు జక్రాన్పల్లి పోలీస్స్టేషన్లో లేదా సెల్నెంబర్ 8712659853, 8712359742ను సంప్రదించాలన్నారు. కామారెడ్డి అర్బన్: కామారెడ్డి పట్టణ పరిధిలోని లింగాపూర్ చెరువులో గుర్తుతెలియని మహిళా మృతదేహం లభ్యమైనట్లు దేవునిపల్లి పోలీసులు శనివారంం తెలిపారు. చెరువులో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మహిళ వయస్సు సుమారు 35–40 ఏళ్ల మధ్య ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఎవరైనా మృతురాలిని గుర్తిస్తే దేవునిపల్లి పోలీసులను సంప్రదించాలన్నారు. ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. భీంగల్ మండలం చెంగాల్ గ్రామానికి చెందిన ముందెల రాజేశ్వర్(51)ఈనెల 24న ఆర్మూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం అడ్మిట్ అయ్యాడు. తన కుడి కాలుకు ఇన్ఫెక్షన్ కావడంతో వేలును తొలగించాలని వైద్యులు తెలిపారు. దీంతో అతడు భయపడి ఆస్పత్రి నుంచి ఈనెల 27న ఉదయం ఎవరికి చెప్పకుండ వెళ్లిపోయాడు. అనంతరం పెర్కిట్లోని విశ్వబ్రాహ్మణ సంఘ భవనం సమీపంలో ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. నిజామాబాద్అర్బన్: నగరంలోని గాయత్రీనగర్లో వ్యభిచార గృహాలపై సీసీఎస్ పోలీసులు దాడి చేశారు. ఇద్దరు విటులను, ఇద్దరు విటురాలను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.5690 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని నాలుగోటౌన్ పోలీసులకు అప్పగించారు. నిజామాబాద్అర్బన్: నగరంలోని సారంగాపూర్లో పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని పట్టుకున్నారు. అలాగే వారి వద్ద నుంచి ఏడు సెల్ ఫోన్లు, రూ.5300 నగదు స్వాధీనం చేసుకున్నారు. -
క్యాంపస్ కబర్లు..
ముగిసిన ఖో–ఖో శిక్షణ శిబిరం తెయూ(డిచ్పల్లి):తెలంగాణ యూనివర్సిటీలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న వర్సిటీ మహిళల ఖో–ఖో శిక్షణ శిబిరం శనివారం ముగిసినట్లు స్పోర్ట్స్ డైరెక్టర్ బాలకిషన్ తెలిపారు. ఈసందర్బంగా బాలకిషన్ మాట్లాడుతూ.. క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ శిక్షణ శిబిరం చాల ఉపయోగపడిందని తెలిపారు. వర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ బీఆర్ నేత, వివిధ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. 30న ఎయిడ్స్పై అవగాహన సదస్సు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) సెల్ ఆధ్వర్యంలో ఈనెల 30న హెచ్ఐవి/ఎయిడ్స్పై (రెడ్ రిబ్బన్ క్లబ్) అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అపర్ణ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల్లో హెచ్ఐవి/ఎయిడ్స్ వ్యాధిపై అపోహలను తొలగించడం, సామాజిక ముద్రను తగ్గించడం, ఆరోగ్యకరమైన జీవన విధానాల ప్రాముఖ్యతను సదస్సులో వివరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల ఫార్మకాలజీ విభాగం ఇన్చార్జి హెచ్వోడీ మురళీ కృష్ణ్ణ ప్రధాన వక్తగా పాల్గొంటారని ఆమె తెలిపారు. ఏప్రిల్ 4 నుంచి ఇంటిగ్రేటెడ్ పీజీ సెమిస్టర్ పరీక్షలు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల (అప్లయిడ్ ఎకనామిక్స్, ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ)కు సంబంధించి 8, 10వ సెమిస్టర్ రెగ్యులర్ /బ్యాక్లాగ్ థియరీ పరీక్షలు ఏప్రిల్ 4 నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్ సంపత్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 16 వరకు పరీక్షలు కొనసాగుతాయన్నారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలని ఆయన సూచించారు. కుర్ర మోహన్కు డాక్టరేట్ తెయూ(డిచ్పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయం ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగం పరిశోధక విద్యార్థి కుర్ర మోహన్ డాక్టరేట్ సాధించారు. వర్సిటీ ప్రొఫెసర్ బోయపాటి శిరీష పర్యవేక్షణలో ‘ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రియల్ వ్యర్థాల నిర్మూలన–ఆర్గానిక్ సింథసిస్ కోసం సమర్థవంతమైన రంధ్రాలు గల ట్రాన్సిషన్ మెటల్ ఆకై ్సడ్ ఆధారిత కాటలిటిక్ వ్యవస్థల తార్కిక రూపకల్పన’ అనే అంశంపై మోహన్ పరిశోధన పూర్తి చేసి సిద్ధాంతగ్రంథం సమర్పించారు. శనివారం తెయూలో నిర్వహించిన మౌఖిక పరీక్షకు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్గా కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ జ్యోతి వ్యవహరించారు. పరిశోధకుడిని పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. సైన్స్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ కె.సంపత్ కుమార్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగం అధ్యాపకులు వాసం చంద్రశేఖర్, మావురపు సత్యనారాయణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెయూలో పుస్తకావిష్కరణ తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో శనివారం సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ముద్రించిన ‘సంచార జాతులు – సమగ్ర సర్వే’ అనే పుస్తకాన్ని వీసీ యాదగిరిరావు ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంచార, విముక్త జాతుల జీ వన విధానం, సామాజిక పరిస్థితులు, అభివృద్ధి అవకాశాలపై సమగ్ర అధ్యయనాన్ని ఈ పు స్తకం ద్వారా తెలుసుకునే అవకాశం లభిస్తుందన్నారు. సంచార జాతులపై సర్వే నిర్వహించడం,వారి జీవన స్థితిగతులపై అధ్యయనం చేసిన సామాజిక సమరసత వేదిక ప్రతినిధుల ను అభినందించారు. వేదిక సభ్యులు అమృత్ చారి,అశోక్, శివ,పృథ్వీ, సమీర్, మోహన్, మనోజ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఇందూరు యువత’ సేవలు అభినందనీయం
నిజామాబాద్ రూరల్: ఇందూరు యువత స్వచ్ఛంద సేవాసంస్థ చేస్తున్న సమాజ సేవలు అభినందనీయమని సీపీ సాయిచైతన్య అన్నారు. యువత సైతం ఇలాంటి సేవాకార్యక్రమంల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సుభాష్ నగర్లోని పెన్షనర్స్ భవన్లో సంస్థ ఆధ్వర్యంలో శనివారం అన్నదాన సేవ తత్పరత–2026 పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమాన్ని సీపీ ముఖ్య అతిథిగా హా జరై, జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగాఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. డీసీఎస్వో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. సంస్థ సేవలు అమోగమన్నారు. సంస్థ ఆ ధ్వర్యంలో ఈనెల 28 నుంచి నెల రోజులపాటు అ నాథ వృద్ధులకు సపర్య సేవలు అందించనుండగా, కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులకు జ్ఞాపికలు అందజేశారు. సంస్థ ప్రతినిధులు మద్దుకూరి సాయిబాబు, బాలకిషన్, గంగాధర్, సుజాత రెడ్డి, విజయనంద్, యువి ఫౌండేషన్ ఫౌండర్ సుజన్ కుమార్, హన్మండ్లు, దర్శనం రాజు, కనకన్న, సుధాకర్, రఘు రాములు, సంతోష్, రాజ్కమార్ తదితరులు పాల్గొన్నారు. -
నాగారం.. పొగమయం
నగరంలోని డంపింగ్ యార్డు నుంచి వచ్చే దట్టమైన పొగ, దుర్వాసనతో నాగారం 300 క్వార్టర్స్ ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. డంపింగ్యార్డులో మంటలు అంటుకొని పెద్ద ఎత్తున దుర్వాసనతో పొగ వ్యాపిస్తుందని కాలనీవాసులు వాపోతున్నారు. దీంతో రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వేసవికాలంలో ఇదే దుస్థితి ఉంటుందని, అయినా సిబ్బంది ఫైరింజన్లు తెప్పించకుండా మున్సిపల్ కార్మికులతో మంటలను ఆర్పుతున్నారని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
బాధిత కుటుంబానికి పరామర్శ
నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండలంలోని మాజీ జెడ్పీటీసీ మచ్చ నారాగౌడ్ ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. బాధిత కుటుంబాన్ని శనివారం టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్కుమార్గౌడ్ పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. నారాగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఆత్మీయ మిత్రుడిని కోల్పోయానని విచారం వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుడు నాగేష్రెడ్డి, మానాల మోహన్రెడ్డి, బాడ్సి శేఖర్గౌడ్, బొబ్బిలి రామకృష్ణ, దయాకర్గౌడ్, సర్పంచ్ మీసాల లక్ష్మినారాయణ, కుద్దూస్ పాల్గొన్నారు. -
బడ్జెట్ రూ.341.71 కోట్లు
ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026ఙ– IIలో uసుభాష్నగర్: నిజామాబాద్ నగరపాలక సంస్థ (ఎన్ఎంసీ) 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన రూ.341.71 కోట్ల బడ్జెట్ కౌన్సిల్ ఆమో దం పొందింది. శనివారం నగర పాలక సంస్థ స మావేశ మందిరంలో మేయర్ కూరగాయల ఉమా రాణి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశా రు. సమావేశానికి ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలె క్టర్ ఇలా త్రిపాఠి, ఎన్ఎంసీ కమిషనర్ దిలీప్కుమా ర్ హాజరయ్యారు. 2026–27 సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదిత బడ్జెట్తోపాటు 2025–26 సవరించిన అంచనా బడ్జెట్ను సమావేశంలో ప్రవేశపెట్టగా, కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. 2026 ఏప్రిల్ 1 నాటికి ప్రారంభ నిల్వ రూ. 94.71 కోట్లు, 2026–27 సవరణ అంచనా ఆదా యం రూ.147.63 కోట్లు కలుపుకొని మొత్తం రూ. 231.88 కోట్లు బడ్జెట్లో పొందుపర్చారు. ఈ సంవత్సరపు ప్రణాళిక, ప్రణాళికేతర గ్రాంట్ల ద్వారా రూ. 99.37 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచ నా వేశారు. మొత్తం అంచనా వ్యయం రూ.341.71 కోట్ల బడ్జెట్ పద్దులో పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు పెద్దపీట వేస్తూ నిధులను సమర్థవంతంగా వినియోగించి నిజామాబాద్ను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని నగర మేయర్ కూరగాయల ఉమారాణి పేర్కొన్నారు. ప్రతి డివిజన్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఆస్తి పన్ను బకాయిల వసూళ్లకు అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ముందుకు సాగి లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం వాటిల్లకుండా, జవాబుదారీగా వ్యవహరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. కార్పొరేటర్లు ప్రస్తావించే ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అంకితభావంతో కృషి చేయాలన్నారు. డివిజన్లలో నెలకొన్న సమస్యలపై చర్చించి, పరిష్కారం చూపేందుకు వీలుగా నెల రోజులలోపే మేయర్ అనుమతితో నగర పాలక సంస్థ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలన్నారు. కార్పొరేషన్కు ఆదాయ వనరులను పెంపొందించుకునేందుకు వీలుగా ప్లాట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తులను క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా పారదర్శకంగా పరిష్కరిస్తూ అర్హత కలిగిన వారికి అనుమతులు మంజూరు చేయాలన్నారు. సానిటేషన్ సిబ్బంది పనితీరును నిశితంగా పరిశీలించాలని కమిషనర్కు సూచించారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది హాజరును ఫేషియల్ రికగ్నేషన్ విధానం ద్వారా అమలు చేయాలని ఆదేశించారు. కాగా అంతకుముందు మాజీ కార్పొరేటర్, ప్రస్తుత కార్పొరేటర్ పంచరెడ్డి అనిత భర్త పంచరెడ్డి సురేశ్ అకాల మరణం పట్ల కౌన్సిల్ సంతాపం వ్యక్తం చేయాలని కార్పొరేటర్ న్యాలం సునీత ప్రతిపాదించగా, కౌన్సిల్ రెండు నిమిషాలు మౌనం పాటించింది. సమావేశంలో డిప్యూటీ మేయర్ సల్మా తహసీన్, బీజేపీ ఫ్లోర్లీడర్ వీరమాచినేని ప్రమోద్కుమార్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.కార్పొరేటర్లుగా ఎన్నికై న తర్వాత మొదటి బడ్జెట్ సమావేశం కావడంతో పలువురు తమ తమ డివిజన్లలో నెలకొన్న సమస్యలను ప్రస్తావించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ ఇలా త్రిపాఠి సానుకూలంగా స్పందించారు.నగర పాలక సంస్థలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు పెద్ద స్కాం అని, దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. నగరంలో రెవెన్యూ పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉందని, ప్రతి పార్టీ కార్పొరేటర్ ఇందుకు సహకరిస్తామన్నారు. ఇంకా రూ.100 కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలుస్తుందన్నారు. కొన్ని ప్రాంతాల్లో పన్నుల్లో చాలా తేడా ఉందని, వాటిని సవరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా నగరపాలక సంస్థ ఉద్యోగులకు, సిబ్బందికి కార్పొరేటర్లు అంటే విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. సమస్యలపై సంప్రదిస్తే స్పందించడం లేదని సమావేశం దృష్టికి తెచ్చారు. ఎన్నికల వరకే రాజకీయాలు పరిమితమని, నిజామాబాద్ నగర అభివృద్ధే ధ్యేయంగా పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా కృషి చేద్దామని ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ పిలుపునిచ్చారు. నగరానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరగా, సానుకూలంగా స్పందించారని అన్నారు. అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులో అన్ని డివిజన్లకు సమ ప్రాధాన్యత ఇవ్వాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఎవరికీ అన్యాయం జరగకుండా ఉండేందుకు ముసాయిదా మాస్టర్ ప్లాన్లో ఏవైనా సవరణలు చేయాల్సి ఉంటే కార్పొరేటర్లతో భేటీ నిర్వహించాలని సూచించారు. నగరంలో రోడ్లు, డ్రెయినేజీ, తాగునీరు, స్ట్రీట్లైట్లు వంటి మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చాలన్నారు. ఎన్ఎంసీ కౌన్సిల్ ఆమోదం ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం : నగర మేయర్ ప్రతి డివిజన్కు సమ ప్రాధాన్యత ఇవ్వాలి : ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ జీతభత్యాల స్కాంపై వివరణ ఇవ్వాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ డిమాండ్ -
కేసుల సత్వర పరిష్కారానికే లోక్ అదాలత్
● మొదటి అడిషనల్ జిల్లా జడ్జి హరీష నిజామాబాద్ లీగల్: పట్టు విడుపు ధోరణితోనే కేసుల సత్వర ప రిష్కారానికి అవకాశం ఉందని, కక్షిదారులు లోక్ అదాలత్ను వి నియోగించుకొని కేసులు పరిష్కరించుకోవాలని నిజామాబాద్ ఫస్ట్ అడిషనల్ జడ్జి హరీష పేర్కొన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాధికార సంస్థలో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి సాయిసుధ, మూడో అడిషనల్ జిల్లా జడ్జి డి దుర్గాప్రసాద్, అడిషనల్ కలెక్టర్ కిరణ్కుమార్, డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి పాల్గొన్నా రు. ఈ సందర్భంగా మొదటి అడిషనల్ జిల్లా జడ్జి హరీష మాట్లాడుతూ కక్షిదారులు తమ కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ చక్కటి మార్గమని, దీంతో సమయంతోపాటు ధనం ఆదా అవుతుందని అన్నారు. మూడో అడిషనల్ జిల్లా జడ్జి డి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ జీవితంలో ముందుకు వెళ్లాలంటే ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలుసుకోవాలని సూచించారు. ఐదో స్థానంలో జిల్లా.. లోక్ అదాలత్లో జిల్లా ఐదో స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా 27,723 కేసులను పరిష్కరించారు. సివిల్ కేసులు 85, వెహికిల్ ప్రమాద కేసులు 71, సైబర్ క్రైమ్ కేసులు 76 ఉన్నాయి. యాక్సిడెంట్ కేసుల్లో రూ.6,33,52,500 పరిహారం అందజేశా రు. 77 సైబర్ క్రైమ్ కేసుల్లో రూ.7, 79, 709 లను, 33 బ్యాంకు కేసుల్లో రూ.22 లక్షల 46 వేల 400లను రికవరీ చేశారు. -
‘సీ్త్రనిధి’లో స్టేట్ ఫస్ట్
డొంకేశ్వర్(ఆర్మూర్):ఎస్హెచ్జీ మహిళలకు 2024 –25వ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి మించి రుణాలిచ్చి వాటిని రికవరీ చేయడంలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ని లిచింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో జరిగిన 13వ వార్షిక మహాసభలో మంత్రి సీతక్క, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ చేతుల మీదుగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సా యాగౌడ్ అవార్డును అందుకున్నారు. 2024–25 సంవత్సరంలో జిల్లాకు రూ.216 కోట్ల లక్ష్యం ఉండగా రూ.216 కోట్ల రుణాలను ఎస్హెచ్జీ సభ్యులకు అందజేశారు. అలాగే తిరిగి 94 శాతం రుణాలను రికవరీ చేశారు. వరుసగా గత పదేళ్లుగా నిజామాబాద్ జిల్లాకే రాష్ట్రంలో మొదటిస్థానం రావడం సంతోషంగా ఉందని డీఆర్డీవో సాయా గౌడ్ అన్నారు. రాష్ట్రంలో ఉత్తమ మండలం అవార్డు కూడా జిల్లాలోని కమ్మర్పల్లికే దక్కినట్లు వెల్లడించారు. డీఆర్డీవో వెంట సీ్త్రనిధి ఆర్ఎం రామ్దాస్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు హేమలత ఉన్నారు.● అవార్డు అందుకున్న డీఆర్డీవో సాయాగౌడ్ -
పకడ్బందీగా పది పరీక్షలు
ఆర్మూర్/ఖలీల్వాడి : జిల్లాలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. కలెక్టర్ శనివారం జిల్లా కేంద్రంలోని బ్లూమింగ్ బర్డ్స్ స్కూల్, ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలు, సీసీ కెమెరాల వ్యవస్థను పరిశీలించారు. బ్లూమింగ్ బర్డ్స్ స్కూల్లో పలు లోపాలను గుర్తించిన కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్కు ఆస్కారం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని డీఈవోను ఆదేశించారు. తక్షణమే స్కూల్ను సందర్శించి లోపాలను చక్కదిద్దాలని సూచించారు. విద్యార్థులు దగ్గర దగ్గరగా కూర్చుండి పరీక్షలు రాస్తున్నారని, మరో ఐదు అదనపు గదులను పరీక్షల నిర్వహణ కోసం వినియోగించాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసేలా చూడాలన్నారు. పరీక్షలు పూర్తయ్యేంత వరకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు సత్యకుమారి, ఎస్.వెంకట్రామ్ రెడ్డి ఉన్నారు. 46 మంది గైర్హాజరు పదో తరగతి వార్షిక పరీక్షలకు 46 మంది గైర్హాజరైనట్లు డీఈవో పార్శి అశోక్కుమార్ శనివారం తెలిపారు. శనివారం నిర్వహించిన గణితం పరీక్షకు 24,390 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. కలెక్టర్ రెండు, డీఈవో ఆరు, ఫ్లయింగ్ స్క్వాడ్ 37, ఏసీజీ ఈ ఒక పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్, ఆర్మూర్లో పరీక్ష కేంద్రాల తనిఖీ సీఎస్కు షోకాజ్ నోటీసులివ్వాలని డీఈవోకు ఆదేశం -
నేటి తరానికి ఆదర్శమూర్తి శ్రీరాముడు
● నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి ● బోర్గాం(పి) చౌరస్తాలో ‘ధర్మ రక్ష సేనా’ శోభాయాత్ర ప్రారంభం మోపాల్(నిజామాబాద్రూరల్): ఆదర్శమూర్తి శ్రీరాముడిని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. నగరశివారులోని బోర్గాం(పి)లో ధర్మ రక్షణ సేనా ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం శోభాయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మేయర్ ఉమారాణి–రమేష్ కార్యక్రమానికి హాజరై జెండా ఊపి, టెంకాయ కొట్టి శోభాయాత్రను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ ఆధ్యాత్మికతను అలవరుచుకొని సన్మార్గంలో నడవాలని సూచించారు. కార్పొరేటర్లు వీరమాచినేని ప్రమోద్కుమార్, యాదాల నరేష్, నాయకులు ఈగ రమేష్రెడ్డి, రఘు, సుభాష్, కాంగ్రెస్ ఫిషర్మెన్ జిల్లా చైర్మన్ బోర్గాం శ్రీనివాస్, హన్మండ్లు, అనిల్రెడ్డి, అశోక్, లింగన్న, ధర్మరక్ష సేన నాయకులు సోమరాజు ఋషి, తదితరులు పాల్గొన్నారు. పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం డిచ్పల్లి: డిచ్పల్లి ఖిల్లా రామాలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఎమ్మెల్యే భూపతిరెడ్డి పా ల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బాసర టెంపుల్ టూరిజంలో భాగంగా డిచ్పల్లి ఖిల్లా రామాలయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే మండలంలోని అమృతాపూర్ గ్రామంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, తారాచంద్నాయక్, ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, సర్పంచ్ ఫోరం జిల్లా అధ్యక్షులు మునిపల్లి చిన్న సాయిరెడ్డి, ఆలయకమిటీ చైర్మన్ జంగం శాంతయ్య, సర్పంచ్ యాదగిరి, రాంచందర్గౌడ్, దర్మాగౌడ్, శ్యాంసన్, అంబర్సింగ్, బాగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర సహకారంతో రూ.10కోట్ల నిధులు తీసుకువస్తా..
● అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా నిజామాబాద్ రూరల్: ఖిల్లా రామాలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందే లా చూస్తానని, రూ.10కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అ న్నారు. జిల్లా కేంద్రంలోని ఖి ల్లా రామాలయంలో నిర్వ హించిన సీతారాముల కల్యాణంలో ఆయన సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి రాజకీయాలు పక్కన పెట్టి కలిసికట్టుగా ముందుకెళ్లాలన్నారు. రామాలయానికి రోప్వే తెచ్చేందుకు కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్పొరేటర్లు కల్పే అర్చనా చిరంజీవి, బంటు ప్రీతి ప్రవీ ణ్, జ్యోతి మురళి, నాయకులు ఇల్లెందుల ప్రభాకర్, కృష్ణ పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
మోపాల్: మండలంలోని సిర్పూర్ గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏఎస్సై నాగభూషణం తెలిపారు. వివరాలు ఇలా.. సిర్పూర్ గ్రామానికి చెందిన పార్వతి లక్ష్మణ్ (68) రెండు నెలలుగా ఛాతి నొప్పి, ఇతర అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు. భార్య లేనికారణంగా కొన్నిరోజులుగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. అనారోగ్య కారణాలు, ఒంటరి జీవితంతో అతడు జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఉదయం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కొడుకు మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లాకేంద్ర ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై తెలిపారు. ఎల్లారెడ్డి: పట్టణంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. వివరాలు ఇలా.. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన అన్నారం యాదగిరి(53) భార్య నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. అప్పటినుంచి అతడు మద్యానికి బానిసయ్యాడు. గురువారం యాదగిరి మద్యం తాగి ఇంటికి వచ్చి, డబ్బులు కావాలని కుటుంబసభ్యులతో గొడవపడ్డాడు. దీంతో ఆయనను ఇద్దరు కుమారులు మందలించడంతో అతడు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. శుక్రవారం ఎల్లారెడ్డి పెద్దచెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి పెద్దకుమారుడు మణికంఠచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. నిజామాబాద్ అర్బన్: నగర శివారులోని సారంగాపూర్ ప్రధాన రోడ్డులోగల పెట్రోల్ బంక్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు 6వ టౌన్ పోలీస్స్టేషన్ ఎస్సై వెంకట్రావు శుక్రవారం తెలిపారు. బంక్ వద్ద వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్సై ఘటన స్థలానికి వెళ్లి, విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పరిశీలించగా, అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. నిజామాబాద్ అర్బన్: నగరంలోని రైల్వేస్టేషన్ ప్రాంతంలో ఓ బైక్ చోరీకి గురైనట్లు ఒకటవ టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. సాయిప్రసాద్ అనే వ్యక్తి శుక్రవారం తన బైక్ను రైల్వే స్టేషన్ ఆవరణలో పార్కింగ్చేసి స్టేషన్లోకి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత అతడు తిరిగి వచ్చేసరికి బైక్ కనిపించలేదన్నారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
ఖిల్లా రామాలయ అభివృద్ధికి కృషి
● టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ● వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని ఖిల్లా రామాలయం అభివృద్ధికి కృషి చేస్తానని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శుక్రవారం ఖిల్లా రామాలయంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేడుకల్లో మహేశ్ కుమార్ గౌడ్ దంపతులు, నిజామాబాద్ మేయర్ ఉమారాణి, రమేష్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతంరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మహేష్ కుమార్ మాట్లాడుతూ.. రూ.1కోటితో ఆలయ ప్రాంగణంలో కల్యాణ మండపం, రూ.50లక్షల నిధులతో ఆలయం వరకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. ఆలయం పరిధిలోని దాదాపు 65 ఎకరాల దేవుడి మాణ్యం భూమిని ఆలయానికి చెందేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సుభాష్నగర్లో ఉన్న రామాలయంను ఆయన సతీసమేతంగా దర్శించుకొని, పూజలు నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, సరళ మహేంధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శోభ నవీన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టువస్త్రాలు అందజేసిన కవిత దంపతులు నిజామాబాద్ రూరల్: జిల్లాకేంద్రంలోని ఖిల్లా రామాలయం (రఘునాథ ఆలయం)లో జరిగిన సీతారాముల కల్యాణోత్సవంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత–దేవనపల్లి అనిల్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివార్లకు వారు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేసి, పూజలు నిర్వహించారు. -
శోభాయాత్రలో డీజేకు అనుమతి నిరాకరణ
● స్వయంగా వాహనాన్ని నడిపిన ఎమ్మెల్యే ధన్పాల్ సుభాష్నగర్: నగరంలోని హమాల్వాడి సంతోషి మాత (సాయిబాబా) ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీరామ నవమిని పురస్కరించుకొని శోభాయాత్ర నిర్వహించారు. కానీ డీజేకు అనుమతి లేదని పోలీసులు డీజే వాహనాన్ని అడ్డుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ పోలీసులతో మాట్లాడారు. అయినా వారు వినకపోవడంతో స్వయంగా ఎమ్మెల్యేనే డీజే వాహనాన్ని నడిపారు. దగ్గరుండి శోభాయాత్రను ముందుకు నడిపించారు. -
ధరలు పెరిగాయి
మెనూ తగ్గింది..సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కమర్షియల్ గ్యాస్ కొరత నేపథ్యంలో జిల్లాలోని హోటళ్లలో ఆహార పదార్థాల పరిమాణం తగ్గిస్తుండడంతో పాటు ధరలు రూ.10 నుంచి రూ.20 వరకు పెంచేశారు. గ్యాస్ కొరతను సాకుగా చూపించి అదనపు చార్జీలు వసూలు చేయొద్దని, ధరలు పెంచొద్దని కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (సీసీపీఏ) ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. సీసీపీఏ జిల్లా అధికారిగా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ ఇవేవీ తమకు సంబంధం లేదన్నట్లు హోటళ్ల వారు ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచుతుండడం గమనార్హం. ఆహార పదార్థాలకు సంబంధించి పలువురు హోటల్స్ నిర్వాహకులు ఐటమ్స్ తగ్గించారు. కొన్ని హోటల్స్లో దోశ లాంటి టిఫిన్స్ చేయడం లేదు. కాంబో ప్యాక్ టిఫిన్స్ ఇవ్వడం లేదు. సింగిల్ ఐటమ్స్ మీద సైతం ధరలు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. ధరలు పెరగడంతో వినియోగదారులు హోటల్స్కు రావడం తగ్గించారు. దీంతో నిజామాబాద్ నగరంలో 50 వరకు చిన్న హోటల్స్ మూతపడ్డాయి. ఇలా మూసేసిన హోటల్స్లో ఎక్కువగా సింగిల్ సిలిండర్లు ఉన్నవి కావడం గమనార్హం. ఇదిలా ఉండగా కొందరు గ్యాస్ డీలర్లు పెద్ద పెద్ద హోటల్స్కు బ్లాక్లో లిసిండర్లు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా గురువారం నగరంలోని ఓ గ్యాస్ ఏజెన్సీ వద్ద 15 రోజుల క్రితం బుక్ చేసుకున్న గృహ వినియోగదారులు ఆందోళన చేశారు. తాము గ్యాస్ బుక్ చేసుకుంటే ఇవ్వకపోగా డెలివరీ అయినట్లు మాత్రం మెసేజ్ వచ్చిందని పలువురు గొడవ చేశారు. ఇది లా ఉండగా సరిహద్దు మహారాష్ట్ర నుంచి బ్లాక్లో గ్యాస్ తెచ్చుకుంటున్నవారు సైతం ఉన్నారు. గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్, ప్రభుత్వం పాఠశాలల్లో వంటకు గ్యాస్ సమస్య లేకుండా కలెక్టర్ ఇలా త్రిపాఠి తగిన చర్యలు తీసుకున్నారు. దీంతో వాటిల్లో ఇబ్బందులు లేవు. అయితే ప్రైవేటు పాఠశాలలకు సంబంధించిన హాస్టల్స్లో గ్యాస్ కొరతతో కట్టెలతో వంట చేయిస్తున్నారు. నిజామాబాద్ నగరంలో ఆయా పాఠశాలల్లో కట్టెల పొయ్యితో వంట చేసేందుకు వెనుకాడుతున్న వంట మాస్టర్లు గైర్హాజరు అవుతున్నారు. దీంతో హాస్టల్ విద్యార్థులకు ఐటమ్స్ తగ్గించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. వంట మనుషులు రాకపోవడంతో ఆయా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇదిలా ఉండగా పెట్రోలు, డీజిల్ విషయంలో ప్రజల్లో చాలావరకు అవగాహన వచ్చింది. ఫ్యూయల్కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవని నిర్ధారణకు వచ్చిన జనం బంకుల వద్ద బారులు తీరడం మానేశారు. కొన్ని రకాల టిఫిన్స్ను తగ్గించిన హోటల్స్ నిర్వాహకులు గ్యాస్ కొరత ఉందంటూ రూ.10 నుంచి రూ.20 వరకు పెంపుదల సింగిల్ సిలిండర్లు ఉన్న చిన్న హోటల్స్ మూసివేత ప్రైవేటు పాఠశాలల హాస్టల్స్ నిర్వహణలో అవస్థలు గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలకు గ్యాస్ సమస్య లేకుండా కలెక్టర్ చర్యలు గృహ వినియోగ గ్యాస్ బ్లాక్లో అమ్ముకుంటున్న డీలర్లు ? ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్న వినియోగదారులు డొమెస్టిక్ సిలిండర్ సమస్యలుంటే చర్యలు తీసుకుంటాం : డీఎస్వో -
అమ్మకు పరీక్ష
● అక్షరాస్యతలో జిల్లా వెనుకంజ ● జిల్లాలో 6.70 లక్షల మంది నిరక్షరాస్యులు ● 29న ఎన్ఐవోఎస్ ఎగ్జామ్ఖలీల్వాడి : నిరక్షరాస్యులుగా ఉన్న మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఉల్లాస్’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దానిని రాష్ట్ర ప్రభుత్వం ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం పేరిట చదువు రాని వారికి చదువు నేర్పించేందుకు శ్రీకారం చుట్టింది. జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లోని మహిళా సంఘాల సభ్యులతో కాలనీలు, వార్డుల్లో నిరక్షరాస్యులను గుర్తించి వారికి అక్షరాలు నేర్పించారు. గతేడాది అక్టోబర్ 27న ప్రారంభమైన కార్యక్రమం 150 రోజులు కొనసాగింది. అయితే, ఉల్లాస్ కార్యక్రమంతో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. కాగా, ఈ నెల 29న చదువుకున్న వారికి అధికారులు ఎస్ఐవోఎస్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఫలితాలు అంతంత మాత్రమే.. అక్షరాస్యతలో జిల్లా వెనుకబడే ఉన్నట్లు 2011 గణాంకాలు చెబుతున్నాయి. అక్షర్యాసతను పెంపొందించడానికి ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నా సత్ఫలితాలివ్వడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ● జిల్లాలో 2,63,544మంది పురుషులు, 4,07,042 మంది మహిళలు రాయడం, అక్షరాలు గుర్తించని వారు ఉన్నారని వయోజన విద్య అధికారులు చెబుతున్నారు. జిల్లాలో నిరక్షరాస్యులు లేకుండా చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. మహిళా సంఘాల సభ్యులు నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పించారు. పరీక్షకు 29,943 మంది హాజరవుతారు. – పురుషోత్తం, డీడీ, వయోజన విద్యాశాఖ అక్షరాస్యత వివరాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా అధికారులు స్వచ్ఛందంగా చదువు చెప్పే మహిళా సంఘాల సభ్యులను గుర్తించారు. వారికి ఎలాంటి గౌవర వేతనం లేదు. దీంతో మహిళా సంఘాల సభ్యులు అంతగా స్పందించనట్లు తెలుస్తోంది. జిల్లాలో అక్షర వికాసం ద్వారా 59,049 మంది విద్యనభ్యసించారు. అయితే, వీరిలో 29,943 మంది ఎన్ఐవోఎస్ పరీక్ష రాయనున్నారు. నిర్ణీత తేదీన ప్రతి గ్రా మ పంచాయతీ కార్యాలయాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్ష నిర్వ హిస్తున్నట్లు వయోజన శాఖ అధికారులు తెలిపారు. మహిళలు తమకు అనుకూలంగా ఉన్న సమయంలో 3 గంటలపాటు పరీక్ష రాయాల్సి ఉంటుంది. అనంతరం వారికి సర్టిఫికెట్లను అందజేయనున్నారు. -
నేడు మున్సిపల్ కౌన్సిల్ తొలి సమావేశం
సుభాష్నగర్: నిజామాబాద్ నగర పాలక సంస్థ తొలి సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసినట్లు నగర మేయర్ కూరగాయల ఉమారాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీ 2026–27 సంవత్సరం ముసాయిదా అంచనా బడ్జెట్, 2025–26 సంవత్సరపు సవరణ బడ్జెట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశానికి సభ్యులందరూ సకాలంలో హాజరుకావాలని ఆమె కోరారు. కాగా, మున్సిపల్ కార్పొరేషన్ తొలి సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ హాజరుకానున్నారు. కేశవ స్ఫూర్తి మందిర గృహ ప్రవేశం రెంజల్: కందకుర్తిలో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాప కులు డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గేవార్ స్ఫూర్తి మందిరాన్ని శుక్రవారం లాంఛనగా ప్రారంభించారు. హెడ్గేవార్ పూర్వీకులు నివసించిన ప్రదేశంలో రూ. 30 కోట్లతో ఈ నిర్మాణాన్ని చేపట్టారు. పనులు తుది దశకు చేరుకున్నా యి. శుక్రవారం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సంఘ్ అఖిల భారత వనవాసీ మార్గదర్శక్ సోమయాజులు ఈ స్ఫూర్తి మందిరంలో గృహప్రవేశం చేశారు. వచ్చేనెలలో ఆర్ఎస్ఎస్ చీఫ్ రాక వచ్చే నెల 11న ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్ కందకుర్తికి రానున్నారని సంఘ్ ప్రతినిధులు తెలిపారు. హెడ్గేవార్ స్ఫూర్తి మందిర ప్రారంభోత్సవంలో ఆయన తోపాటు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. గృహ ప్రవేశ కార్యక్రమంలో కేశవ సేవా సమితి ప్రతినిధులు సుధాకర్రెడ్డి, మల్లికార్జున్, శ్రీధర్రెడ్డి, వాసు పాల్గొన్నారు. నిజాంసాగర్ నీరు విడుదల నిజాంసాగర్: యాసంగి పంటల సాగు అవసరాల కోసం శుక్రవారం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశారు. ఇప్పటివరకు నాలుగు విడతల్లో నీరందించారు. శుక్రవారం ఐదో విడత నీటి విడుదల ప్రారంభమైంది. ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు 1,200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నామని నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. ‘ఉపాధి భద్రత కల్పించాలి’ కామారెడ్డి టౌన్ : వ్యవసాయ కూలీలకు ఉపాధి భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకేఎంఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం కామారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చొద్దని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ ఎన్నిక ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎం.కృష్ణ (నారాయణపేట్), ప్రధాన కార్యదర్శిగా పి.రామకృష్ణ (నిజామాబాద్), కోశాధికారిగా జి.కిషన్ (నిజామాబాద్), ఉపాధ్యక్షులుగా నాయిని రాజు(ఇల్లందు), ఎం వీరన్న (మహబూబాబాద్), కె.గంగాధర్(నిజామాబాద్), సహాయ కార్యదర్శులుగా ఎ.సలీం, బందెల వెంకయ్య, జాటోత్ కృష్ణ ఎన్నికయ్యారు. సమావేశంలో నాయకులు బి.కిశో ర్, రమేష్, ఎస్.కిశోర్, జి.ప్రభాకర్, కె.రాకేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల కోసమే కొత్త పార్టీ
● ఆవిర్భావ సభకు తరలిరండి ● అన్నివర్గాలకూ ఆహ్వానం ● తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిజామాబాద్ అర్బన్: ప్రజల కోసం పనిచేసేందుకే కొత్త పార్టీ పెడుతున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఏప్రిల్ 25న జరిగే పార్టీ ఆవిర్భావ సభకు సబ్బండవర్ణాలు తరలిరావాలని ఆమె ఆహ్వానించారు. నగరంలోని జాగృతి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడారు. తెలంగాణ వచ్చిన 12 ఏళ్ల తర్వాత కూడా నీళ్లు, నిధులు, నియామకాలను సంపూర్ణంగా సాధించుకోలేకపోవటం బాధాకరమన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, ఆ తర్వాత రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కూడా మౌలిక సదుపాయాల కోసం పోరాటం చేసే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం అయ్యే వరకు ఒకలా, అయిన తర్వాత మరోలా ప్రవర్తించటం రాజకీయ ఒరవడిగా మారిందని విమర్శించారు. ఇచ్చిన మాట అమలు చేయకపోయినా సరే ప్రజలు పట్టించుకోరన్న ధైర్యం రాజకీయ నాయకుల్లో ఉందన్నారు. ఆ విధానం పోవాలంటే ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరముందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, కార్మికులు తదితర అన్నివర్గాల కోసం జాగృతి గత 20 సంవత్సరాలుగా పనిచేసిందని కవిత గుర్తుచేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 350 మంది రైతులకు జాగృతి సంస్థ తరఫున నాలుగేళ్లపాటు నెలకు రూ. 2500 పెన్షన్ ఇచ్చామని వెల్లడించారు. నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో నిజామాబాద్–పెద్దపల్లి రైల్వే లైన్ను మూడేళ్లలో పూర్తి చేయించానని పేర్కొన్నారు. నిజామాబాద్ వేదికగా పుట్టిన ఏ ఆలోచన అయినా సక్సెస్ అయ్యిందని, పార్టీ ఆలోచన కూడా కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కోడలిగా తనకు ఇందూరు ప్రజల ఆశీర్వాదం కావాలన్నారు. తెలంగాణ సోయి లేకపోవటంతోనే బీఆర్ఎస్ ఆదరణ కోల్పోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరే వరకు పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో జాగృతి నాయకులు శ్రీనివాస్గౌడ్, ఎనుగందుల మురళి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
మానవతాసదన్ పిల్లలకు ల్యాప్టాప్లు
డిచ్పల్లి: మండల కేంద్రంలోని మానవతా సదన్ పిల్లలకు అగుమెంట్ గోల్డ్ ఫర్ ఆల్ సహకారంతో పద్మపాణి సొసైటీ ఫర్ హ్యూమన్ ఎక్స్లెన్స్ స్వచ్ఛంద సంస్థ ల్యాప్టాప్లు, స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేసింది. గురువారం కలెక్టర్ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు, సదన్లో ఉంటూ చదువుతున్న 70 మంది బాలబాలికలకు స్కూల్ బ్యాగులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంస్థ ప్రతినిధులు సీఎస్ఆర్ నిధులను జిల్లాకు ఉపయోగించడం అభినందనీయమన్నారు. అనంతరం మానవతా సదన్ విద్యార్థులు తయారుచేసిన ఆర్ట్ ఫ్రేమ్ను కలెక్టర్కు అందజేశారు. కార్యక్రమంలో డీఈవో అశోక్కుమార్, పద్మపాణి సంస్థ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, అగుమెంట్ గోల్డ్ ఫర్ ఆల్ కంపెనీ జనరల్ మేనేజర్ సామ్యూల్ రాజ్, అసిస్టెంట్ మేనేజర్ కాశీనాథ్, మానవతా సదన్ లైజన్ ఆఫీసర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి: కమ్మర్పల్లి వ్య వసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో వివిధ అ భివృద్ధి పనుల కోసం ప్ర భుత్వం రూ. 1.57 కోట్లు మంజూరు చేసినట్లు చైర్మన్ నర్సయ్య తెలిపారు. మా ర్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ నర్సయ్య అధ్యక్షతన గురువారం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. 2026–27 సంవత్సరానికి బడ్జెట్ అంచనాలను రూపొందించారు. మార్కెట్ యార్డులో చేపట్టాల్సిన పనులపై చర్చించారు. నిధుల మంజూరు చేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నా గేశ్వర్ రావుకు, కృషి చేసిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. సూపర్వైజర్ రాజు మార్కెట్ కమిటీ మూడు నెలల ఆదాయ, వ్యయాలను చదివి వినిపించగా, సభ్యులు ఆమోదించారు. కార్యదర్శి మెర్సీ, వైస్ చైర్మన్ సుంకెట బుచ్చన్న, మార్కెట్ కమిటీ సభ్యులు మహిపాల్, లింగారెడ్డి, నవీద్, శ్రీనివాస్, జీవన్, ముత్తెన్న పాల్గొన్నారు. డిచ్పల్లి: మండలంలోని నడిపల్లి తండాకు చెందిన బట్టు వినోద్, భార్య కవిత గురువారం ఉదయం గుర్తు తెలియని మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఎస్సై మహమ్మద్ ఆరీఫ్ తెలిపారు. బట్టు బలరాం కొడుకు వినోద్ నాలుగు సంవత్సరాల క్రితం అదే తండాకు చెందిన బదావత్ గేమ్య వద్ద ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేశాడు. ఈ ప్లాట్ విషయంలో కొంతకాలంగా గేమ్య కుటుంబంతో గొడవ జరుగుతోంది. వినోద్ ఈ ప్లాట్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. బుధవారం రాత్రి బట్టు వినోద్కు సంబంధించిన ఆవు బదావత్ నాందేవ్ ప్లాట్లోకి వెళ్లింది. దీంతో నాందేవ్ అతని భార్య, ఇద్దరు కొడుకులు, కోడలు వెళ్లి వినోద్, కవితలతో గొడవ పెట్టు కున్నారు. తిరిగి గురువారం ఉదయం మళ్లీ గొడవ పెట్టుకోవడంతో మనస్థా పానికి గురైన వినోద్ అతని భార్య కవిత గుర్తు తెలియని మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. గమనించిన కుటుంబీకులు వెంటనే వారిని నిజా మాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే, వారు తీసుకున్న మందు ఏమిటన్నదీ తెలియకపోవడంతో వైద్యులు సరైన చికిత్స అందించలేపోతున్నారని కుటుంబీకులు తెలిపారు. ప్రస్తుతం దంపతుల పరిస్థి తి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వినోద్ తండ్రి బలరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
తైబజార్ వేలం రూ. 26.34 లక్షలు
బోధన్టౌన్(బోధన్): బోధన్ బల్దియా తైబజార్ను రూ. 26 లక్షల 34 వేలకు ఖలీం బేగ్ దక్కించుకున్నారు. బల్దియా కార్యాలయంలో 2026–2027 ఆర్థిక సంవత్సరానికి గురువారం తైబజార్ వేలం నిర్వహించారు. వేలం పాటలో 27 మంది పాల్గొనగా ఖలీంబేగ్ అందరి కంటే ఎక్కువ రూ. 26 లక్షల 34 వేలకు తైబజార్ను దక్కించుకున్నాడని మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ తెలిపారు. గతంలో తైబజార్కు రూ. 23.45 లక్షలు వచ్చాయి. జంతు వధశాలకు రూ. 10.60 లక్షలు బల్దియా పరిధిలోని జంతు వధశాలకు నిర్వహించిన వేలంలో 13 మంది పా ల్గొనగా సయ్య ద్ షెహజాన్ ఖాద్రీ రూ. 10 లక్షల 60 వేలకు దక్కించుకున్నాడు. జంతు వధశాలకు గతంలో రూ. 4 లక్షల 52 వేల ఆదాయం వచ్చిందని కమిషనర్ తెలిపారు. వేలంలో మున్సిపల్ మేనేజర్ సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
‘పరిశోధనా ఫలాలు సామాన్యులకు అందాలి’
తెయూ(డిచ్పల్లి): పరిశోధనా ఫలాలు సామాన్యులకు అందినప్పుడే వాటికి సార్థకత లభిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ యరగర్ల శ్రీనివాసరావు పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న ‘ఇన్నోవేషన్స్ ఇన్ మెడిసినల్ కెమిస్ట్రీ (ఐఎంసీ–2026)’ జాతీయ సదస్సు గురువారం ముగిసింది. సదస్సుకు ముఖ్యవక్తగా హాజరైన శ్రీనివాసరావు మాట్లాడుతూ సస్టెయినబుల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ సింథసిస్, బయో–యాక్టివ్ మాలిక్యూల్స్ అభివృద్ధిలో ఇమినో కీటోన్స్ ప్రాధాన్యత వహిస్తాయన్నారు. న్యూఢిల్లీ జేఎన్యూ ప్రొఫెసర్ డాక్టర్ రాజు చౌహాన్ సహజ ఉత్పత్తుల స్టీరియోసెలెక్టివ్ సింథసిస్ పద్ధతులు, ఫార్మాస్యూటికల్ రంగంలో వాటి ప్రాధాన్యతను వివరించారు. తెయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి మాట్లాడుతూ విద్యార్థులు యువ శాస్త్రవేత్తలుగా ఎదిగి నూతన ఆవిష్కరణలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కన్వీనర్ సాయిలు, కో–కన్వీనర్ నాగరాజు, ఆర్గనైజింగ్ సెక్రెటరీలు నాగరాజ్, బాలకిషన్, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బోధన్: హైదరాబాద్కు చెందిన వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్, వసుంధర విజ్ఞాన వికాస మండలి జాతీయస్థాయి పుర స్కారాలను జిల్లావాసులు అందుకున్నారు. సాలూర గ్రామానికి చెందిన రైతు కేజీ గంగారం పుడమిపుత్ర, పట్టణ కేంద్రానికి చెందిన ప్రముఖ కరాటే మాస్టర్ మల్లెపూల పల్లవి ఝాన్సీ లక్ష్మిబాయి శౌర్యం, చిత్రకారణి అవంతి బాపుచిత్ర కళారత్న పురస్కారాలను గురువారం రవీంద్రభారతిలో నిర్వాహకులు అందజేశారు. నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అసోసియేషన్ అధ్యక్షుడిగా నీలకంఠరావు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శికి జరిగిన ఎన్నికల్లో ఆవుల నారాయణ మల్లయ్య, ఎన్.సుభాష్ రెడ్డి విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు అమిడాల సుదర్శన్, మెట్టు నరేశ్ కుమార్ ప్రకటించారు. అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీగా మానస, ట్రెజరర్గా మధుసూదన్ గౌడ్, లైబ్రరి సెక్రెటరి పుణ్యరాజ్, స్పోర్ట్స్ అండ్ కల్చరర్ సెక్రెటరీగా గణేష్, లేడి రిప్రజెంటీవ్ ఝాన్సీరాణి, కార్యవర్గసభ్యులుగా దిలీప్, కవిత, రవిబాబు, సుధీర్, అనూష, అపూర్వ, జమీల్ అహ్మద్ జహీర్ అహ్మద్, ఎండీ ఖాలీద్, మహ్మద్ అబ్దుల్ జీషన్ ఎన్నికయ్యారు. -
పార్టీలో కష్టపడిన వారికే పదవులు
● నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ సుభాష్నగర్: కాంగ్రెస్లో కష్టపడ్డ వారికి మాత్రమే పదవులు వస్తాయని నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నా రు. కమిటీలో అవకాశం రాని వారిని పార్టీ తప్ప కుండా గుర్తిస్తుందని తెలిపారు. నగరంలోని కాంగ్రెస్ భవన్లో నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గసభ్యులుగా నియమితులైన సభ్యులకు రామకృష్ణ గురువారం నియామకపత్రాలు అందజేశారు. కార్యక్రమానికి నుడా చైర్మన్ కేశ వే ణు, సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, జావి ద్ అక్రమ్ హాజరయ్యారు. అనంతరం బొబ్బిలి రా మకృష్ణ మాట్లాడుతూ పార్టీలో పదవులు పొందిన వారు కాంగ్రెస్ బలోపేతం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎవరైనా పదవిని దుర్వినియోగం చేసినట్లయితే క్రమశిక్షణాచర్యలు తప్పవని అన్నా రు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అ ర్బన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపించి అధిష్టానానికి బహుమతి ఇవ్వాలని ఆకాంక్షించారు. కార్యవర్గంలోని ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులు, ప్రధాన కార్యదర్శులను పలు డివిజన్లకు ఇన్చార్జీలుగా నియమిస్తామని, ఎవరి డివిజన్లో వారే డివిజన్ అధ్యక్షులు, డివిజన్ కమిటీలను నియమించుకోవాలని సూచించారు. నూతనంగా నియమితులైన కార్యవర్గసభ్యులకు త్వరలోనే పీసీసీ ఆధ్వర్యంలో శిక్షణ ఉంటుందని, శిక్షణకు ప్రతిఒక్కరూ హాజరుకావాలని తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పదవి నుంచి తొలగిస్తామన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు. -
ఇరిగేషన్ పనులు పూర్తి చేయండి
వేల్పూర్/కమ్మర్పల్లి: బాల్కొండ నియోజకవర్గం పరిధిలో పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభ జీరో అవర్లో ఆయన మాట్లాడారు. ఇరిగేషన్కు సంబంధించిన ప్యాకేజీ 21, చిట్టాపూర్, ఫత్తేపూర్, సుర్బిర్యాల్ లిఫ్ట్ సమస్యలను సభలో లేవనెత్తారు. కాళేశ్వరం ప్యాకేజీ 20, 21, 21ఏ ద్వారా జిల్లాలో రెండు లక్షల ఎకరాకలకు నీరందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం పనులు చేపట్టిందన్నారు. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలకు సంబంధించిన లిఫ్ట్లు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 20 శాతం పూర్తికాగా, రెండున్నరేళ్లుగా పనులు నిలిచిపోయాయన్నారు. -
ఐటీని విస్తరించాలి
సుభాష్నగర్: రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాల్లో ఐటీని విస్తరించాలని నిజామాబాద్ అర్బ న్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కోరారు. ఐటీ, మున్సిపల్ అంశాలపై అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. గత ప్రభు త్వ హయాంలో నిజామాబాద్లో నిర్మించిన ఐటీ హబ్ నిరాదరణకు గురవుతోందన్నారు. అలాగే నగరంలోని రామర్తి, బొందెం చెరువులతోపాటు పూలాంగ్ వాగు సగానికి పై గా కబ్జా అవుతోందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రెండు చోట్ల ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు చేయాలని, ఫుట్పాత్ కబ్జాలపై దృష్టి సారించాలన్నారు. మాస్టర్ ప్లాన్ అమలు చేస్తే కబ్జాలను అరికట్టే అవకాశం ఉంటుందన్నారు. -
రేవంత్రెడ్డిపై అసత్య ఆరోపణలు సరికాదు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్తూ సీఎం రేవంత్రెడ్డి పై, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్హౌస్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్లో సుదీర్ఘ కాలం రాజకీయ జీవితం సాగించిన జీవన్రెడ్డి.. పార్టీని వీడి వెళ్తుండడంతో జాలితోపాటు బాధ కలుగుతోందన్నారు. తన అవసరాల కోసం పార్టీని వీడుతున్న ఆయన.. ఒకరిద్దరిపై అభాండాలు వేయాలని నిర్ణయించుకున్నారని విమర్శించారు. కేసీఆర్ రాక్షస పాలనకు వ్యతిరేకంగా పోరాడి ఇందిరమ్మ ప్రజాపాలనకు తిరిగి నాంది పలికిన రేవంత్రెడ్డి మీద పసలేని ఆరోపణలు చేయడం అసంబద్ధమన్నారు. రేవంత్రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకుని జీవన్రెడ్డికి గత ఎన్నికల్లో లోక్సభ టిక్కెట్ ఇచ్చేలా ఏఐసీసీని ఒప్పించార ని తెలిపారు. పార్టీ కోసం కష్టపడుతున్న తాము సైతం ప్రస్తుతం జగిత్యాల నియోజకవర్గం మాదిరి సమస్యను ఎదుర్కొంటున్నామని, అయినప్పటికీ కలిసి ప్రయా ణం చేస్తూ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తున్నామనే విషయం అందరికీ తెలుసన్నారు. ఇవన్నీ తెలిసినప్పటికీ జీవన్రెడ్డి గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా నిలబడి బాల్కొండ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోకి మానాల మోహ న్రెడ్డి, ఈరవత్రి అనిల్ రావొద్దని చెప్పిన విషయం మరు వొద్దన్నారు. బహుశా ఆరోజు బతుకొచ్చినోళ్లకు ఇంట్లో పుట్టిన వాళ్లన్న విషయం గుర్తురాలేదా అని మానాల ప్ర శ్నించారు. ఆరోజు తమ ఇబ్బంది గుర్తించి ఉంటే తాము గర్వపడేవాళ్లమన్నారు. నాడు తాము ఎదుర్కొన్న సమస్య విషయంలో ఒకలా వ్యవహరించి, నేడు అదే సమస్య మీకు ఎదురయ్యేసరికి మరోలా మాట్లాడడం జీవన్రెడ్డి వయసుకు, విజ్ఞతకు వదిలేస్తున్నామన్నారు. టికెట్ ఇవ్వకున్నా వేం నరేందర్రెడ్డి కాంగ్రెస్ ఉన్నతి, అభివృద్ధి కోసం పని చేశారన్నారు. సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్భూపాల్, జిల్లా ఫిషరీస్ చైర్మన్ బోర్గాం శ్రీనివాస్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్, జగన్, సుమన్, సాయి, భాస్కర్ పాల్గొన్నారు. జీవన్రెడ్డి విజ్ఞతతో మాట్లాడాలి.. గౌరవాన్ని తగ్గించుకోవద్దు కేసీఆర్ రాక్షస పాలనపై నిరంతర పోరాటం చేసిన వ్యక్తి రేవంత్ వేం నరేందర్రెడ్డి చేసిన సేవలకు గుర్తింపుగానే రాజ్యసభ సభ్యత్వం రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి -
ఆయిల్పామ్ సాగు లాభదాయకం
● ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది ● పంటకు కోతులు, పశువుల బెడద ఉండదు ● కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్ అర్బన్: ఆయిల్పామ్ సాగు ఎంతో లాభదాయకమని, రైతులను పంట సాగు దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా రైతాంగం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయిల్పామ్కు కోతులు, పశువుల బెడద వంటివి ఉండవని, తక్కువ ఖర్చుతో సుదీర్ఘ కాలంపాటు సుమారు దిగుబడి పొందవచ్చని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెనన్స్ హాలులో గురువారం వ్యవసాయ, ఉద్యానవన, సహకార శాఖల అధికారులు, ఆయిల్ పామ్ నర్సరీని నిర్వహిస్తున్న ప్రీ–యునిక్ కంపెనీ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆయిల్ పామ్ సాగు పురోగతిపై క్లస్టర్ల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో రైతులను ప్రోత్సహిస్తూ జిల్లాలో ఈ ఏడాది 7 వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్పామ్ సాగయ్యేలా అంకితభావంతో పని చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆయిల్పామ్ సాగు చేపట్టేలా విస్తృత స్థాయిలో అవ గాహన కల్పించాలని, క్షేత్రస్థాయి అధ్యయన యాత్రల ద్వారా వారి లో నమ్మకాన్ని పెంపొందించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, మద్దతు ధర, సుదీర్ఘ కాలంపాటు ఏటేటా సమకూరే రాబడి, అంతర పంటల సాగుకు ఉన్న అవకాశాలు తదితర అంశాలను వివరించాలన్నారు. జిల్లాలో త్వరలోనే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుందని, దీని కోసం అనువైన స్థలాన్ని పరిశీలిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 2022–23 సంవత్సరం నుంచి ఆయిల్ పామ్ సాగుకు శ్రీకారం చుట్టగా, ఇప్పటివరకు 2375 మంది రైతులు 6164 ఎకరాల విస్తీర్ణంలో పంటను సాగు చేస్తున్నారని వివరించారు. సుమారు 1476 ఎకరాలలో ఆయిల్ పామ్ గెలలు కోతకు వచ్చాయని, తద్వారా రైతుల ఖాతాల్లో రూ.2.50 కోట్లు జమయ్యాయని తెలిపారు. అంకాపూర్ లో మార గంగారెడ్డి, కోటగిరి మండలం ఎత్తొండలో ఎం.రమాదేవి, అర్గుల్లో మధుసూధన్రెడ్డి, కొప్పర్గ గంగారాం తదితరలు ఇప్పటికే ఆయిల్ పామ్ సాగు ద్వారా లాభాలు పొందుతున్నారన్నారు. ఆయిల్ పామ్ సాగుకు సరిపడా మొక్కలు అందుబాటులో ఉన్నాయని, ఒక్కో మొక్క ధర 193 రూపాయలు కాగా.. రైతులు కేవలం రూ.20 లు చెల్లిస్తే, ప్రభుత్వం రూ.173 సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. అలాగే పంట సాగు కోసం నాలుగేళ్లపాటు ఎకరానికి రూ.4,200 చొప్పున ఆర్ధిక తోడ్పాటును, డ్రిప్ ఇరిగేషన్ కోసం ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, ఇతరులకు 90 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారులు జె.గోవిందు, వీరస్వామి, సహకార అధికారి శ్రీనివాస్ రావు, ప్రీ యునిక్ కంపెనీ ఏరియా మేనేజర్ సాయికిరణ్, ఉద్యానవన, వ్యవసాయ అధికారులు, ఏవోలు, ఏఈవోలు పాల్గొన్నారు. -
అవసరానికి మించి..
అతి జాగ్రత్త్త.. అతి కొనుగోళ్లుసాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : పెట్రోల్, డీజిల్, గృహ వినియోగ గ్యాస్ పుష్కలంగా ఉందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ ప్రజలు అవసరానికి మించి కొనుగోలు చేస్తుండడంతో సమస్య ఉత్పన్నమవుతోంది. కొరత వస్తుందనే వదంతుల నేపథ్యంలో అతిజాగ్రత్త పడుతున్న ప్రజలు.. ఇంధనం, గ్యాస్ ను అతిగా కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదనుగా జిల్లాలో కొందరు డీలర్లు కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో బంక్ల వద్ద, గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు భారీగా బారులు తీరుతున్నారు. పెట్రోల్, డీజిల్ విషయానికి వస్తే అత్యధికమంది అవసరానికి మించి కొనుగోలు చేస్తున్నారు. కొందరైతే ఏకంగా ప్లాస్టిక్ టిన్నుల్లో నింపుకుంటున్నారు. దీంతో జిల్లాలో సాధారణానికి మించి విక్రయాలు జరుగుతున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల చెబుతున్నారు. కొందరు గ్యాస్ డీలర్లు మాత్రం ఇదే అదనుగా ఇష్టం వచ్చినట్లు రీఫిల్లింగ్ దందా చేస్తున్నారు. బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు రెండువారాలు దాటినప్పటికీ డెలివరీ చేయకుండా బ్లాక్ మార్కెట్లో కమర్షియల్ వినియోగదారులకు రీ ఫిల్లింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అత్యవసరమైన గృహ వినియోగదారుల వద్ద నుంచి రూ.2,500 నుంచి రూ.3,500 వరకు వసూలు చేసిన డీలర్లు సైతం ఉండడం గమనార్హం.పెట్రోల్, డీజిల్, గ్యాస్ వినియోగదారు లు అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు. అ పోహలు పెట్టుకుని అవసరానికి మించి ఫ్యూయల్ కొనుగోలు చేయొద్దు. ఇ లా చేయడంతో అత్యవసర వినియోగదారులకు సమస్యలు తప్పవు. ముందు జాగ్రత్త అనుకుంటూ భారీగా కొనుగోళ్లు చేసి నిల్వ చేసుకుంటే ఉపయోగం లేదు. అది ప్రమాదం కూడా. – నల్ల దినేష్రెడ్డి, తెలంగాణ పెట్రో డీలర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పెట్రోల్, డీజిల్ కొరత వదంతులను నమ్మొద్దు. కలెక్టర్ ఇలా త్రిపాఠి నేతృత్వంలో నిరంతరం పరిస్థితిని సమీక్షి స్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 211 పెట్రో ల్ బంకుల్లో నిరంతరం పెట్రోల్, డీజిల్ అమ్మకాలు సాగుతున్నాయి. కృత్రిమ కొర త సృష్టించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదు. గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకుంటాం. – శ్రీకాంత్రెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి పెట్రోల్ కొరతపై సోషల్ మీడియాలో ప్రచారం, వదంతులను నమ్మొద్దు. పెట్రోల్, డీజిల్ కోసం గంటలపాటు వేచి చూడొద్దు. అదనంగా క్యాన్లు, బాటిళ్లులో నింపి నిల్వ చేసుకుంటే వేసవికాలంలో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంచామని ప్రకటనలు చేస్తూనే ఉన్నాయి. – కవిత రాజు, హెచ్పీ పెట్రోల్ బంక్ యజమాని రెండు, మూడు రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ కొరత అంటూ ప్రచారం జరుగుతోంది. కానీ ఎక్కడికి వెళ్లినా బంకుల్లో పెట్రోల్, డీజిల్ దొరుకుతోంది. తప్పు డు ప్రచారాన్ని వాహనదారులు నమ్మొ ద్దు. ప్రతి రోజూ అవసరం మేరకు నా వాహనంలో పెట్రోల్ కొట్టిస్తున్నా. పెట్రోల్, డీజిల్పై వస్తున్న వదంతులను నమ్మొద్దు. ప్రమాదకరమైన ఇంధనాన్ని ఇళ్లలో నిల్వ చేసుకోవద్దు. – బాలేరావు వేణుగోపాల్, వాహనదారుడు, నిజామాబాద్ అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లు బంకుల వద్ద బారులు ఇదే అదనుగా కృత్రిమ కొరత అదనపు వసూళ్లకు తెరలేపిన కొందరు గ్యాస్ డీలర్లు -
ఓటరు జాబితా సవరణపై శిక్షణ
డిచ్పల్లి: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)– 2026 పై బూత్ లెవెల్ అధికారులకు బుధవారం డిచ్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్ శిక్షణనిచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బీఎల్వోలు నిర్వర్తించవలసిన విధులు, ఎన్యుమరేషన్ ఫారం నింపాల్సిన విధానం, క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన ధృవీకరణ పత్రాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్ల సహకారంతో ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా నిర్వహించాలని ఆర్డీవో ఆదేశించారు. తహసీల్దార్ సతీష్రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్, ఆర్ఐ లు సంతోష్, భూపతిప్రభు, పర్యవేక్షకులు, బీఎల్వోలు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్పై బీఎల్వోలకు శిక్షణ మోపాల్: మండలకేంద్రంలోని రైతు వేదికలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై బీఎల్ఓలు, సూపర్వైజర్లు, జీపీవోలకు బుధవారం తహసీల్దార్ ఎన్ రేఖ, ట్రైనీ ఆఫీసర్ ప్రవీణ్రెడ్డి శిక్షణనిచ్చారు. పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యంగా బీఎల్ఓలు పని చేయాలని, ఇందుకోసం రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్ల సహకారం తీసుకోవాలని తహసీల్దార్ రేఖ సూచించారు.ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. -
ఎన్నికల అధికారుల నియామకం
నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ జిల్లా న్యాయవాదుల సహకార సొసైటీకి 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను నూతన డైరెక్టర్స్, కార్యవర్గం ఎన్నికకుగాను ఎన్నికల అధికారులుగా మల్లెపూల జగన్ మోహన్ గౌడ్, పులి జైపాల్ లను నియమించారు. సొసైటీ అధ్యక్షుడు కే. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ గౌడ్ వీరికి నియామాక పత్రాలను అందజేశారు. ఎన్నికల నిర్వహణ విధివిధానాలను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారని వారు తెలిపారు. సొసైటీలో మొత్తం 12 మంది డైరెక్టర్లు ఉన్నారని అందులో నలుగురి పదవికాలం ఏప్రిల్ నెలతో ముగుస్తున్నందున వాటికి ఎన్నికలు నిర్వహిస్తారు. -
సంక్షిప్తం
బీఎస్పీ నిజామాబాద్ పార్లమెంట్ ఇన్చార్జిగా నీరడి లక్ష్మణ్ నిజామాబాద్ రూరల్: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) పార్లమెంట్ ఇన్చార్జిగా డాక్టర్ నీరడి లక్ష్మణ్ను నియమించారు. బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆదేశాల మేరకు ముఖ్య సెక్టార్ ప్రభారి అతార్ సింగ్ రావు , మరొక ముఖ్య సెక్టార్ ప్రభారి సురేష్ ఆర్య ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్, కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ముదిరాజ్ల సూచనల మేరకు నిజామాబాద్ పార్లమెంట్ ఇన్చార్జిగా డాక్టర్ నీరడి లక్ష్మణ్ బుధవారం నియమించారు. పార్టీ ఆశయాలను గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు పనిచేస్తానని లక్ష్మణ్ పేర్కొన్నారు. అంత్యక్రియలకు ఆర్థిక సహాయం నిజామాబాద్ రూరల్: నగరంలోని కోటగల్లి ప్రాంతానికి చెందిన అర్జన్ ఈనెల 16న రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మరణించాడు. భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు.శ్రీలక్ష్మీచేయూత సే వా సమితి వారు విరాళాలు సేకరించి రూ.12,000 నగదు, రూ.3,000 కిరాణ సామగ్రిని కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో అధ్యక్షులు బంగారి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు లక్ష్మన్, శ్రీనివాస్, యాదగిరి, రవీందర్లు పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత సిరికొండ : మండలంలోని గడుకోలుకి చెందిన నిమ్మ రాజుల చిన్న ఎడ్డన్నకు సీఎంఆర్ఎఫ్ చెక్కును బీజెపీ ఓబీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతకుంట రామస్వామి బుధవారం అందజేశారు.అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సహకారంతో లక్షా ఇరవై అయిదు వేల చెక్కు మంజూరైందని ఆయన తెలిపారు. దివ్యాంగుల క్షేమం కోసం పడిపూజ రెంజల్(బోధన్): దివ్యాంగుల క్షేమం కోరుతు స్నేహ సొసైటీ వ్యవస్థాపకుడు సిద్దయ్య పడిపూజ, హనుమాన్ స్వాములకు నీలా క్యాంపులో బుధవారం మండల భిక్షను ఏర్పాటు చేశారు. స్వాముల ఆశీర్వాదంతో శారీరక, మానసిక దివ్యాంగులు కోలుకోవాలని ఆకాంక్షించారు. ఐదేళ్లుగా ఆయన హనుమాన్ స్వాములకు మండల బిక్షను ఏర్పాటు చేస్తున్నారు. పలువురు గురుస్వాములు ఆశీర్వదించారు. -
సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
సిరికొండ : మండలంలోని కొండాపూర్ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్ నాయకులు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూపతిరెడ్డి రూ.20 లక్షల నిధులను మంజూరు చేశారని తెలిపారు. నిధులను మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు, డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నల్ల బుచ్చన్న, శ్రీధర్, ఆకుల జగన్, చంద్రగౌడ్, ఫారుక్, సాల్మన్, ఇసాక్, నరేష్, రవీందర్ గౌడ్, బాల గంగారం తదితరులు పాల్గొన్నారు. మోపాల్: మండలంలోని బాడ్సిలో పోలీస్శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈసందర్భంగా పాఠశాల విద్యార్థులు గ్రామంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎస్ఐ జాడె సుస్మిత మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించాలని, మైనర్లు వాహనాలు నడపవద్దని తెలిపారు. వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లకూడదని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ పరమేశ్వర్, ఉపాధ్యాయులు వెంకట నారాయణ, రాజేందర్రెడ్డి, చంద్రకళ, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు. ధర్పల్లి: ప్రజాపాలనలో కార్యక్రమంలో భాగంగా ఇందల్వాయికి చెందిన అగ్నిమాపక సిబ్బంది మండల కేంద్రంలోని నిహారిక చిల్డ్రన్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదాల నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సును బుధవారం కల్పించారు. అగ్ని ప్రమాదాలు సంభవించి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, వాటిని ఆర్పే విధానాన్ని హాస్పిటల్ సిబ్బందికి వివరించారు. అగ్నిమాపక సిబ్బంది, హాస్పిటల్ యజమాన్యం నరేందర్ చందర్, వైద్యురాలు నిహారిక తదితరులు పాల్గొన్నారు. సిరికొండ : గ్రామపంచాయతీ అనుమతి లేకుండా గ్రామంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని సర్పంచ్ మల్లెల సాయిచరణ్ తాపీ మేసీ్త్రలకు సూచించారు. సిరికొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో తాపీ మేసీ్త్రలతో సర్పంచ్ సమావేశం బుధవారం నిర్వహించారు. సర్పంచ్ మాట్లాడుతూ నూతన ఇళ్లు, ప్రహరీ గోడలు గ్రామపంచాయతీ అనుమతి ఉంటేనే నిర్మించాలని తెలిపారు. మెట్లు రోడ్లపైకి డ్రెయినేజీలపైకి వచ్చేలా నిర్మించకూడదని తెలిపారు. అనుమతి లేకుండా నిర్మించిన వాటిని కూల్చివేస్తామని సూచించారు. సమావేశంలో ఉప సర్పంచ్ గ్యామా శోభన్, పంచాయతీ కార్యదర్శి వినీల్, వార్డు సభ్యులు శంకర్, తాపీ మేసీ్త్రలు పాల్గొన్నారు. -
భద్రాచలానికి గోటి తలంబ్రాలు
నిజామాబాద్ రూరల్: భద్రాచల రాములవారి కల్యాణానికి నగరంలోని కోటగల్లి హనుమాన్ దేవాలయం నుంచి శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు గోటి తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా బుధవారం నిజామాబాద్, వివిధ గ్రామాల నుంచి భక్తులు పంపించిన గోటి తలంబ్రాలను రామకోటి రామరాజుకు అందాయి. రామరాజు మాట్లాడు తూ.. భద్రాచలం వెళ్లలేక పోయిన భక్తులు తాము ఒలిచిన తలంబ్రాలు రామయ్య కల్యాణనికి చేరవేయడం సంతోషంగా ఉందని అన్నారు. -
హిందూ సమ్మేళనం ఆహ్వానపత్రిక ఆవిష్కరణ
సుభాష్నగర్: నగరంలోని శ్రీనివాస్నగర్ కాలనీలో హనుమాన్ మందిరంలో ఏప్రిల్ 14న నిర్వహించే హిందూ సమ్మేళనం ఆహ్వాన పత్రికను ఆర్ఎస్ఎస్ నగర కార్యవాహ అర్గుల సత్యం బుధవారం రాత్రి ఆవిష్కరించారు. ఈసందర్భంగా అర్గుల సత్యం మాట్లాడుతూ హైందవ చైతన్యమే భారత సంక్షేమమని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో సమ్మేళనం నిర్వహణ కమిటీ అధ్యక్షుడు పొల్కం శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి కొల్లూరు అశోక్కుమార్, ప్రతినిధులు రాజశేఖర్రెడ్డి, బిల్లా నవీన్, నల్లా అశోక్, ప్రవీణ్రెడ్డి, హనుమంత్రెడ్డి, గణేష్, విఠల్సుమన్, తదితరులు పాల్గొన్నారు. -
భగవద్గీత చాలా గొప్పది
● ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్ కాపర్తి గురుచరణం ● భగవద్గీత ఆన్లైన్ పరీక్ష విజేతలకు బహుమతుల అందజేత నిజామాబాద్ రూరల్: భగవద్గీత చాలా గొప్పదని ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్ కాపర్తి గురుచరణం అన్నారు. బుధవారం రాత్రి కేసీఆర్ కాలనీలోని ప్రైవేట్ గార్డెన్లో అంతర్జాతీయ ఇస్కాన్ కృష్ణ చైతన్యసమితి ఆధ్వర్యంలో ఇందూరు కంఠేశ్వర్ ప్రతినిధులు డిసెంబర్ నెలలో భగవద్గీతపై నిర్వహించిన ఆన్లైన్ పరీక్షలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రపంచం మొత్తం అశాంతి దిశగా యుద్ధాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణుడు భారతదేశంలో పుట్టడం మనం చేసుకున్న పుణ్యమని కంఠేశ్వర్ ఇస్కాన్ ప్రతినిధి రామానందరాయ్ ప్రభూజీ అన్నారు. ఆన్లైన్లో నిర్వహించిన పోటీల్లో జిల్లా నుంచి మొత్తం 12వేల మంది వివిధ పాఠశాలల నుంచి పాల్గొన్నారని అన్నారు. విజేతలు శివామ్ష, స్నేహిత్, ప్రవీణ్, అక్షయ్కు బహుమతులు అందజేశారు. అంతకు ముందు యువతీయువకులు కృష్ణుని పాటలపై నిర్వహించిన నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో వేణుగోపాల్, మదాసు స్వామియాదవ్, కంఠేశ్వర్ ఇస్కాన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన
ధర్పల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఆదేశాల మేరకు రెడ్ రిబ్బన్ క్లబ్, ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ఎయిడ్స్ నిర్మూలన అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన, పోస్టర్ ప్రదర్శన పోటీలను నిర్వహించారు. మొదటి, రెండవ స్థానంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక అవుతారని కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ శ్రీరామ్, అధ్యాపకులు ప్రభాకర్, శ్రీనివాసరెడ్డి, రవిరాజ్, కుమారస్వామి, రామచందర్ తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రత్యేక శిబిరాలు
రుద్రూర్: మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్వో సమత అన్నారు. పోతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవా రం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జనరల్ హస్సిటల్కు చెందిన స్పెషలిస్ట్ వైద్యులు శిభిరంలో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందు లు పంపిణీ చేశారు. ఈ శిబిరాన్ని సమత సంద ర్శించారు.జిల్లా వైద్య నిపుణులు వినూత్న, శ్రీని వాస్, పూనమ్, గౌతమి, మౌనిక, క్రాంతి, పీహెచ్సీ వైద్యుడు అలీముద్దీన్, తదితరులు పాల్గొన్నారు. -
పెన్షన్ వ్యాలిడేషన్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి
నిజామాబాద్ రూరల్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పెన్షన్ వ్యాలిడేషన్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం నగరంలోని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఎదుట వారు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్ కే. రామ్మోహన్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2026 జనవరి ఒకటికి ముందు తర్వాత పదవీ విరమణ పొందిన వారిని విభజిస్తూ వర్గీకరణ చేయడం ద్వారా 7 వ వేతన సవరణ సంఘం ప్రయోజనాలను పరిమితం చేయాలనే ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెన్షనర్ల సంఘ నాయకులు ప్రతాప్ రెడ్డి, హుస్సేన్, బాల దుర్గయ్య, గంగాధర్, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నాయకులు లావు వీరయ్య, చంద్రశేఖర్, డి లక్ష్మీనారాయణ, పుష్పవల్లి,మస్తాన్ వలి, తదితరులు పాల్గొన్నారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన పెన్షన్ వ్యాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలని బుధవారం విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పండరినాథ్ ఆధ్వర్యంలో పెన్షనర్ల భవనం ముందు విశ్రాంత ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్కు వెళ్లి ఏవో ప్రశాంత్కు వినతిపత్రం అందజేశారు. అధ్యక్షులు పండరినాథ్ మాట్లాడారు. జిల్లా కార్యదర్శి గంగా కిషన్, ఫైనాన్స్ కార్యదర్శి రవీందర్ రెడ్డి, స్వామిదాస్, గౌరవ అధ్యక్షులు భుజాగౌడ్, అడ్వైజర్ సాయిలు, తాలూకా అధ్యక్ష కార్యదర్శులు జగత్రెడ్డి, దయాకర్ రావు, ఫైనాన్స్ కార్యదర్శి గంగాధర్, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
‘ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ’ చైర్పర్సన్ డాక్టర్ కవితారెడ్డికి సన్మానం
సుభాష్నగర్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ) గవర్నింగ్ కౌన్సిల్ చైర్పర్సన్గా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కవితారెడ్డిని మాజీ కార్పొరేటర్ ఎం.డీ సాబేర్ అలీ ఆధ్వర్యంలో ఫులాంగ్ కాలనీవాసులు బుధవారం సన్మానించారు. భవిష్యత్లో రాజకీయంగా మరిన్ని పదవులు అలంకరించాలని సాబేర్ అలీ ఆకాంక్షించారు. జిల్లాలో సీనియర్ వైద్యురాలైన కవితారెడ్డికి ఈ అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్యేలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఎం.డీ అహ్మద్, నాయకులు హకీల్ అహ్మద్, టి శ్రీనివాస్, గురు దత్త, అంబం మురళీ, మసూద్, ఇజాజ్, అసద్ హందాన్, జావిద్, రషీద్, అన్వర్ బేగ్, ఫారూఖ్, తదితరులు పాల్గొన్నారు. జక్రాన్పల్లి : మండలంలోని తొర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంఈవో శ్రీనివాస్ను గ్రామ ప్రజా ప్రతినిధులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఘనంగా సన్మానించారు. గ్రామ సర్పంచ్ పద్మ నాగరాజ్, ఉప సర్పంచ్ తెడ్డు మైపాల్, పాఠశాల చైర్మన్ గంగ జమునమనోహర్, మండల పీఆర్టీయూ అధ్యక్షులు గోపి, ప్రధాన కార్యదర్శి రవీణ్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఎర్రోళ్ల గంగాధర్, కార్యదర్శి చిక్కాల భూమేశ్వర్లు ఎంఈవో శ్రీనివాస్కు పూల మాలలు వేసి శాలువా కప్పి సత్కరించారు. -
ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలి
● విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి ● ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని హామీడిచ్పల్లి: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని, దీంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. మండలంలోని సుద్దులం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ విశ్వరూప అభయ వీరాంజనేయ, శ్రీ ధ్యానఆంజనేయ స్వామి విజయ గణపతి విగ్రహ ప్రతిష్ఠాన మహోత్సవ వేడుకల్లో బుధవారం ఎమ్మెల్యే పాల్గొన్నారు. హనుమద్దీక్షా పీఠాధిపతులు పూజ్య దుర్గాప్రసాద్ స్వామి పర్యవేక్షణలో వేదపండితులు నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ.. గ్రామస్తులు ఐక్యంగా ఉండి ఆలయం నిర్మాణం, విగ్రహావిష్కరణ చేపట్టడం అభినందనీయమన్నారు. ఆలయ ప్రాంగణంలో కల్యాణ మండపం నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, రూరల్ సర్పంచుల ఫోరం అధ్యక్షులు గొట్టిపాటి వాసుబాబు, సర్పంచ్ తేనేటి హేమలత లక్ష్మణ్రెడ్డి, పార్టీ నాయకులు రాంచందర్గౌడ్, శ్యాంసన్, ధర్మాగౌడ్, మాజీ ఎంపీపీ నర్సయ్య, నర్సారెడ్డి, సురేందర్రెడ్డి, అంబర్సింగ్, గంగారెడ్డి, బాలరాజు, వెంకటేశ్, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి వేడుకలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం జిల్లాలో ప్రసిద్ది చెందిన డిచ్పల్లి ఖిల్లా రామాలయంలో శుక్రవారం జరిగే శ్రీరామనవమి వేడుకలకు హాజరు కావాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డిని ఆలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య ఆహ్వానించారు. ఈ మేరకు బుధవారం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. మాజీ సర్పంచ్ బూస సుదర్శన్, డీసీసీ ఉపాధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వాసుబాబు తదితరులున్నారు. గడ్డి చుట్టే యంత్రం ప్రారంభం ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించిన ఎండుగడ్డి చుట్టే యంత్రం (బేలర్) ను బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ప్రారంభించారు. డిచ్పల్లి మండలం కొరట్పల్లి గ్రామ రైతు పార్వతి గంగాధర్ ఈ గడ్డి చుట్టే యంత్రాన్ని కొనుగోలు చేశారు. బుధవారం రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆ యంత్రాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీ కార్యదర్శి డాక్టర్ జహూర్, నాయకులు శ్రీనివాస్, బాలగంగాధర్, మోహన్, శంకర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ధర్పల్లికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు ధర్పల్లి : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి వచ్చిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ధర్పల్లికి కేటాయించినందుకు ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిని ధర్పల్లి మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, సన్మానించి కృతజ్ఞతలను తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆర్మూర్ బాలరాజ్, సర్పంచ్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మహేందర్ , నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
జెడ్పీ పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం
సుభాష్నగర్: రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కమిటీ సభ్యులందరం కలిసికట్టుగా పనిచేసి జెడ్పీపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని డీసీసీ అధ్యక్షుడు కాట్పల్లి నగేశ్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. బుధవారం నగరంలోని కాంగ్రెస్భవన్లో ఇటీవల నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులకు ఆయన నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ జిల్లా కమిటీలో అన్ని వర్గాల నాయకులకు జాతీయ, రాష్ట్ర నాయకత్వం ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే.. ప్రతిపక్ష పార్టీల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేందుకు కమిటీ సిద్ధంగా ఉందన్నారు. పార్టీ కోసం నిబద్ధతతో పని చేసిన వారికి గుర్తింపు ఉంటుందని, ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని తెలిపారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్స్విప్ సాధించడం పక్కా అని, సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ సూచనల మేరకే జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించామని, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి నాయకత్వంలో పార్టీ మరింత ఉత్సాహంతో ముందుకెళ్తుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గడ్డం భక్తవత్సలం, కౌడపు శరత్, గొల్ల ఎర్రన్న, ప్రవీణ్కుమార్ గౌడ్, జయ లలిత, పైస ఎల్లయ్య, పవన్కుమార్, ముస్కు వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కమిటీలో అన్నివర్గాలకూ ప్రాధాన్యత పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతాం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కాట్పల్లి నగేశ్రెడ్డి -
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
తెయూ(డిచ్పల్లి): సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎం యాదగిరి సూచించారు. పత్రికా స మాచార కార్యాలయం(పీబీఐ) హైదరాబాద్ ఆధ్వర్యంలో తెయూలో బుధవారం ‘సైబర్ హైజీన్ ప్రాక్టీ సెస్’ పై నిర్వహించిన వర్క్షాప్నకు రిజిస్ట్రార్ హాజరై మాట్లాడారు. విద్యార్థులు, మీడియా ప్రతినిధుల్లో సురక్షిత డిజిటల్ వినియోగంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల డిజిటల్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో యూనివర్సిటీలు సైబర్ నేరాల నివారణలో ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయని తెలిపారు. పీఐబీ హైదరాబాద్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్ మాట్లాడుతూ.. ఈ వర్క్షాప్ విద్యార్థులు, మీడియాను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన తొలి హైబ్రిడ్ కార్యక్రమమన్నారు. సైబర్ హైజీన్ అంటే కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, నెట్వర్క్లను బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో ఉపయోగించడమని వివరించారు. నిజామాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. నిత్యం జరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో గతేడాది సుమారు రూ.1,600 కోట్లు, నిజామాబాద్ జిల్లాలో 2024లో రూ.16 లక్షలు, 2025 లో రూ.19 లక్షలు మోసం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాంబాబు, అధ్యాపకులు ఎన్ స్వామి, అసిస్టెంట్ డైరెక్టర్ జీ కోటేశ్వరరావు, ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శివచరణ్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. -
రామాలయంలో ప్రత్యేక పూజలు
నిజామాబాద్ రూరల్: నగరంలోని సుభాష్నగర్లో ఉన్న రామాలయ బ్రహ్మోత్సవాలు రెండో రోజు బుధవారం ఉదయం 7 గంటలకు నిత్యారాధన, యాగశాల ప్రవేశం, ద్వారతోరణ, వాస్తు, సోమ, సుదర్శన, కుంభస్థాపన, అగ్నిప్రతిష్ట, వాస్తు హోమం, గరుడ ప్రతిష్ట, ధ్వజారోహణం, బలిహరణం, అరగింపు, తీర్థ గోష్టి కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో ఆలయ చైర్పర్సన్ సరళామహేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి శోభ నవీన్రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్రెడ్డి, భక్తులు పాల్గొన్నారు. మాచారెడ్డిలో.. మాచారెడ్డి: మండలంలోని పోలంపల్లి శాంతానంద తపోవన ఆశ్రమంలోని రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం విశ్వశాంతి మహా యజ్ఞాన్ని నిర్వహించారు. లోక కళ్యాణార్థం విశేషాలు నిర్వహించినట్లు నిర్వాహకుడు స్వామి తెలిపారు. ఆలయ ధర్మకర్త రాజమౌళి గుప్తా దంపతులు, గ్రామస్తులు ఉన్నారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న ఎంఈడీ 3వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు బుధవారం ముగిసినట్లు అకడమిక్ ఆడిట్సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 29 మందికి 27 మంది హాజరు కాగా ఇద్దరు గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. ● సీపీ సాయిచైతన్య నిజామాబాద్ అర్బన్: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కమిషనరేట్ పరిధిలోని పెండింగ్ నాన్ బెయిలెబుల్ వారెంట్లను తగ్గించినట్లు సీపీ సాయిచైతన్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో గత కొన్ని రోజుల నుంచి పెండింగ్లో ఉన్న ఎన్బీడబ్ల్యూ కేసుల సంఖ్యను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారిపై ఉన్న ఎన్బీడబ్ల్యూకు సంబంధించి 3 కేసుల్లో లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో పరారీలో ఉన్న 9 మందిని, ఇతర జిల్లాల్లోని నలుగురు నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. నాలుగు రోజుల్లో మొత్తం 105 కేసులను పరిష్కరించామని, పాత 55 కేసుల్లో ఎన్బీడబ్ల్యూ వారెంట్లను క్లియర్ చేసినట్లు పేర్కొన్నారు. -
క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు వర్ని: మండల కేంద్రంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జలాల్పూర్ గ్రామానికి చెందిన గుండ్ల నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. వీక్లీ మార్కెట్ నుంచి తన టీవీఎస్ ఎక్సెల్ పై వస్తున్న నారాయణకు వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 సిబ్బంది బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. మూల మలుపుల వద్ద పండ్ల దుకాణాలు, మిర్చి బండ్లు ఉండడం వల్ల వాహనాలు కనబడక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పటిక, బెల్లం పట్టివేతధర్పల్లి: మండలంలోని దుబ్బా క గ్రామంలో టాస్క్ఫోర్స్ అధికారులు కిరాణా దుకాణాల్లో మంగళవారం రాత్రి దాడులు నిర్వహించారు. అధికారుల దాడుల్లో వినాయక కిరాణా దుకాణంలో 90 కిలోల బెల్లం, 70 కిలోల పటికను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుకాణ యజమాని గోసికొండ ప్రశాంత్పై కేసు నమోదు చేసి తహసీల్దార్ శాంత ఎదుట బైండోవర్ చేసినట్లు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ విశాల్ బుధవారం తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా గుడుంబాను తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నాటుబాంబు కలకలం! ● అడ్లూర్ ఎల్లారెడ్డి శివారులో గేదెకు తీవ్ర గాయాలు ● వేటగాళ్ల పనే అంటున్న గ్రామస్తులు సదాశివనగర్: అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ శివారులో నాటు బాంబు కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తు లు వన్యప్రాణులను పట్టుకోవడం కోసం తవుడులో నాటు బాంబును పెట్టారు. మేత మేసుకుంటూ వెళ్లిన అడ్లూర్ ఎల్లారెడ్డిలోని కుమ్మరి శ్రీనివాస్కు చెందిన గేదె.. ఆ తవుడును తినగా నాటు బాంబు పేలి తీవ్రంగా గాయపడింది. బాధితుడు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై తెలిపారు. -
తీరు మార్చుకోకపోతే సస్పెన్షన్లకు వెనుకాడబోం
● కలెక్టర్ ఇలా త్రిపాఠి ● ఎస్ఐఆర్పై శిక్షణకు గైర్హాజరైన బీఎల్వోలపై ఆగ్రహం నిజామాబాద్ అర్బన్: తీరు మార్చుకోకపోతే మూకుమ్మడి సస్పెన్షన్లకు సైతం వెనుకాడేది లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి బీఎల్వోలకు హెచ్చరించారు. ఎస్ఐఆర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై నిర్వహించిన శిక్షణకు గైర్హాజరు కావడంపై మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో బుధవారం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అయితే, పలువురు బీఎల్వోలు శిక్షణకు హాజరుకాకపోవడాన్ని గమనించిన కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గైర్హాజరైన బీఎల్వోలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై తప్పనిసరిగా కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ తరహా నిర్లక్ష్యం కారణంగానే ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం చాలా వెనుకబడి ఉందన్నారు. బీఎల్వోలు శిక్షణకు గైర్హాజరైతే మీరేం చేస్తున్నారంటూ సూపర్వైజర్లపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం బీఎల్వోలు నిర్వర్తించాల్సిన విధులు, ఎస్ఐఆర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన ధ్రువీకరణ పత్రాలు తదితర అంశాలపై మాస్టర్ ట్రైనర్లు జ్ఞానేశ్వర్, సంతోష్ కుమార్ అవగాహన కల్పించారు. నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ రవీంద్ర సాగర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, సౌత్, నార్త్ తహసీల్దార్లు శ్రీధర్, విజయ్కాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి కనిపించేలా అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. లక్ష్య సాధనకు కృషి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై ఎంపీడీవోలు, హౌసింగ్ ఏఈలతో కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష జరిపారు. మండలాల వారీగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు, ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణాలలో వెనుకంజలో ఉన్న ఆయా మండలాల అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల తర్వాత మళ్లీ తాను సమీక్ష చేస్తానని, తప్పనిసరిగా పురోగతి కనిపించాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో సాయాగౌడ్, హౌసింగ్ ఇంచార్జి పీడీ గంగాధర్, ఈఈ నివర్తి, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, హౌసింగ్ ఏఈలు పాల్గొన్నారు. -
సాంకేతిక విద్యను సద్వినియోగం చేసుకోవాలి
నవీపేట: ఆధునిక కంప్యూటర్ యుగంలో సాంకేతిక విద్యను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి సూచించారు. నవీపేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలను తెలుసుకున్నారు. కళాశాల వెనుక ప్రాంతంలో రూ.కోట్ల వ్యయంతో నిర్మించినప్పటికీ వృథాగా ఉన్న హాస్టల్ భవనాన్ని సందర్శించి, వినియోగంలోకి తేవాలని అధికారులకు సూచించారు. అనంతరం సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ.. నవీపేటలోని కళాశాలపై విస్తృత ప్రచారం కల్పించాలని, వచ్చే ఏడాది అదనంగా రొబొటిక్స్, కంప్యూటర్ సైన్స్లను అందిస్తామని పేర్కొన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు మంజూరైన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేస్తామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కల్తీ ఆహార పదార్థాలపై అధికారులు నిఘా ఏర్పాటు చేయాలని, కల్తీ చేసే వ్యక్తులను కఠినంగా శిక్షించాలని సూచించారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్, అధికారులు, నాయకులు తదితరులు ఉన్నారు. నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు కల్తీ పదార్థాల తయారీపై నిఘా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి కలెక్టర్తో కలిసి నవీపేట పాలిటెక్నిక్ కళాశాల తనిఖీ -
పరుగులు పెట్టిస్తున్న ప్రచారం
నిజామాబాద్అర్బన్: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా పెట్రోల్, గ్యాస్ కొరత వస్తుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగడంతో వినియోగదారులు బంకులు, గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు పెడుతున్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి నుంచి వాహనదారులు పెట్రోల్ బంకుల్లో బారులు తీరారు. వాహనాల ట్యాంకులు ఫుల్ చేయించుకోవడంతోపాటు క్యాన్లు, బాటిళ్లలు నింపుకున్నారు. కొరత లేదని అధికారులు ఎంత చెబుతున్నా బుధవారం రాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. చాలా పెట్రోల్ బంకుల్లో మధ్యాహ్నం రెండు గంటలకే స్టాక్ అయిపోయింది. సోషల్ మీడియాలో వదంతుల కారణంగా వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. బుధవారం ఉదయం నుంచే గ్యాస్ ఏజెన్సీల ఎదుట వినియోగదారులు బారులు తీరారు. కొరత లేదంటున్న అధికారులు సోషల్ మీడియాలో వదంతుల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని జిల్లాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతలేదని, సరఫరా కూడా సక్రమంగానే ఉందని అధికారులు అంటున్నారు. వదంతులను నమ్మొద్దని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. బంకుల వద్ద పరిమితికి మించి కొనుగోలు చేయడం మంచిది కాదని సూచించారు. వదంతులు సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెట్రోల్, గ్యాస్ కొరత అంటూ వదంతులు మంగళవారం రాత్రి నుంచి పెట్రోల్ బంకుల్లో బారులు గంటల్లో పెట్రోల్ స్టాక్ ఖాళీ గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు తీసిన వినియోగదారులు అనవసరంగా కొనుగోలు చేశారు బుధవారం ఉదయం నుంచే చాలామంది వాహనదారు లు వచ్చారు. కొరత ఉందంటూ అధికంగా పెట్రోలు కొ నుగోలు చేశారు. కొందరు బాటిళ్లలో తీసుకెళ్లారు. రో జూలాగే అందుబాటులో ఉందని, కొరత లేదని ఎంత చెప్పినా వినలేదు. మధ్యాహ్నం వరకే బంక్ ఖాళీ అయ్యింది. – భూమయ్య, పెట్రోల్ బంక్ సిబ్బంది -
శనగ రైతుల సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తాం
● పూర్తిస్థాయి కొనుగోళ్ల కోసం రెండు రోజుల్లో అనుమతి వచ్చే అవకాశం ● మార్క్ఫెడ్ డీఎం మహేశ్కుమార్ బోధన్: శనగ కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం ప్రభుత్వానికి నివేదిస్తామని, ఈ మేరకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నామని మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ మహేశ్కుమార్ అన్నారు. ‘శనగ రైతులకు సెగ’ శీర్షికన ఈనెల 25వ తేదీన ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. సాలూర, కల్దుర్కిలోని కొనుగోలు కేంద్రాలతోపాటు బోధన్ సొసైటీ పరిధిలోని మావందికుర్దూలోని కొనుగోలు కేంద్రాన్ని మార్క్ఫెడ్ డీఎం బుధవారం సందర్శించారు. కొనుగోళ్ల తీరును పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు ఏమైనా ఉన్నాయని ఆరా తీశారు. ఎకరాకు 7 క్వింటాళ్ల వరకే శనగలు కొనుగోలు చేయాలనే నిబంధన కారణంగా ఇబ్బందులు పడుతున్నామని, సేకరణ పరిమితిని 10 క్వింటాళ్లకు పెంచాలని రైతులు కోరగా, సమస్యను వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని డీఎం అన్నారు. జిల్లాలో లక్షా 40వేల క్వింటాళ్ల శనగ దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ నివేదించిందన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తొలుత 24 వేల 850 క్వింటాళ్ల శనగల కొనుగోలుకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. మిగిలిన శనగ నిల్వలను కొనుగోలు కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపించామని, మరో రెండు రోజుల్లో అనుమతి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. డీఎం వెంట బోధన్ సొసైటీ సీఈవో ఉమాకాంత్, ఉద్యోగులు, ఆయా గ్రామాల రైతులు ఉన్నారు. -
నిజామాబాద్
అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం నేటి నుంచి పసుపు క్రయవిక్రయాలు బంద్ గ్రామంలో ఐస్ క్రీమ్ విక్రయాలను నిషేధించాలని ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఐస్క్రీమ్ బండ్లను గ్రామంలోకి రానీయకుండా ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ మేరకు పంచాయతీ పాలకవర్గ మద్దతుతో సర్పంచ్ పోగుల అనిత ప్రత్యేకంగా వాల్పోస్టర్లను తయారు చేయించి గ్రామ ఎంట్రన్స్, ఊరిలో ఏర్పాటు చేయించారు. తమ గ్రామంలో ఐస్ క్రీమ్లు, కుల్ఫీల అమ్మకం నిషేధమని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారికి రూ.5వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. – ఇందల్వాయి గురువారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2026‘ఒక్క ఇల్లూ ఇవ్వలేదు..’ సుభాష్నగర్: తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలలో నిజామాబాద్ నగరంలో పేదలకు ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఇవ్వడం లేదని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం ఇందిరమ్మ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై మాట్లాడారు. నాగారం ప్రాంతంలో 396 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి నాలుగున్నరేళ్లు గడిచిందని గుర్తు చేశారు. ఆ ఇళ్లు వృథాగా ఉంటుండటంతో తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయని తెలిపారు. అనేకసార్లు మంత్రులకు విన్నవించగా మరమ్మతుల కోసం రూ.1.25 కోట్లు విడుదల చేసినప్పటికీ ఇళ్లు మాత్రం కేటాయించలేదన్నారు. కలెక్టరేట్ సమీపంలో 200 డబుల్ ఇళ్ల పనులు 80 శాతం అయ్యాయని, మరో రూ.2 కోట్లు మంజూరు చేస్తే పూర్తవుతాయన్నారు. పశువులకు టీకాలు వేయించాలి నిజామాబాద్ అర్బన్: పశువులకు తప్పకుండా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వే యించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించా రు. వేసవిలో ఆవులు, గేదెలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం లక్ష్యంగా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కా ర్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతులను కలెక్టర్ బుధవారం తన ఛాంబర్లో ఆవిష్కరించారు. పాడి రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి టీ కా లు వేసేందుకు ఏర్పాటు చేసిన మొబైల్ వా హనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గాలి కుంటు వ్యాధితో పశువుల్లో పాల దిగుబడి తగ్గడం, బరువు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయని, టీకాలు వేయించడం ద్వా రా పశువుల ఆరోగ్యాన్ని సంరక్షించవచ్చన్నా రు. గ్రామాలకు వచ్చే పశువైద్య బృందాలకు పశుపోషకులు సహకరించాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలి సుభాష్నగర్: మార్కెట్యార్డులో గొడవ లు, వివాదాలు లేకుండా వ్యాపారం చేయా లని, ప్రతిఒక్కరూ శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని పోలీస్ కమిషనర్ సా యిచైతన్య కోరారు. నగరంలోని వ్యవసాయ మార్కెట్యార్డు శ్రద్ధానంద్ గంజ్లో పసుపు రైతులు, వ్యాపారులతో సీపీ బుధవారం స మావేశమయ్యారు. గంజ్లో రైతులకు కల్పి స్తున్న సదుపాయాల వివరాలను అడిగి తె లుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజ్లో తప్పుడు తూకా లు, మధ్యవర్తుల మోసాలు జరగకుండా జా గ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మార్కెట్ యార్డ్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు సహకరించాలని కోరారు. సెక్యూరిటీ సిబ్బంది అన్ని గేట్ల వద్ద 24గంటల పాటు నిఘా పటిష్ట పర్చాలని, సీసీ కెమెరాలు ఏ ర్పాటు చేయాలని, అనుమతి లేని వారిని లోనికి రానివ్వొద్దన్నారు. అనుమానాస్పద ఘటన సమయంలో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆయ న వెంట మూడో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై హరిబాబు, పసుపు రైతులు ఉన్నారు. ప్రమాదాల నివారణలో కన్వెక్స్ మిర్రర్ల పాత్ర కీలకం సుభాష్నగర్: రోడ్డు ప్రమాదాల నివారణలో కన్వెక్స్ మిర్రర్ల పాత్ర కీలకమని డీటీవో ఉ మా మహేశ్వర్ పేర్కొన్నారు. ఆర్టీసీ డిపో–1లోని బస్సులను ఆయన బుధవా రం పరిశీలించారు. బస్సుల్లో అమర్చిన కన్వెక్స్ మిర్రర్ల పనితీరును పర్యవేక్షించారు. అనంతరం డీటీవో మాట్లాడుతూ డ్రైవర్లకు బస్సు వెనక, పక్క దృశ్యాలను కన్వెక్స్ మి ర్రర్లు అందిస్తాయని అన్నారు. బస్సుల సాంకేతిక స్థితి, బ్రేక్ వ్యవస్థ, డ్రైవర్ క్యాబిన్, అత్యవసర భద్రతా పరికరాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. డిపో–1 మే నేజర్ ఆనంద్ మాట్లాడుతూ డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించేలా చర్యలు చేపడుతామన్నారు. మరో నాలుగునియోజకవర్గాలు!సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో అంతటా అదే చర్చ సాగుతోంది. లోక్సభ, శాసనసభ నియోజకవర్గాలను 50 శాతం మేరకు పెంచనున్నట్లు సంకేతాలు వస్తుండడంతో రాష్ట్రంలో శాసనసభ స్థానాలు 119 నుంచి 182కు, లోక్సభ స్థానాలు 17 నుంచి 26కు పెరుగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న 9 అసెంబ్లీ సీట్లు 13కు పెరగనున్నట్లు అంచనా. 2011 జనాభా లెక్కల ప్రకారం నిజామాబాద్ జిల్లాలో జనాభా 15,71,022, కామారెడ్డి జిల్లాలో 9,72,625 ఉంది. ఇక గత ఎన్నికల(2023) లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 20,06,494 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 9,58,718 మంది, మహిళా ఓటర్లు 10,47,674 మంది, ఇతరులు 102 మంది ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడం విశేషం. దీంతో మహిళా కోటా శాసనసభ స్థానాలు సైతం ఉమ్మడి జిల్లా నుంచి గణనీయంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో పలువురు నాయకులతోపాటు మహిళా నాయకురాలు సైతం చట్టసభలో ప్రాతినిధ్యంకోసం లెక్కలు వేసుకుంటున్నారు. జనగణన, కులగణన తరువాత వెంటనే నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధం చేస్తుండడంతో అన్నివర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం చూసినప్పటికీ, తాజాగా నిర్వహించే జనాభా లెక్కలు, కులగణన మేరకు చూస్తే నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న 5 శాసనసభ సీట్లు 8కి పెరిగే అవకాశాలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో ఒక శాసనసభ సీటు పెరిగే అవకాశం ఉంది. జనాభా ఎక్కువగా ఉన్న నిజామాబాద్ జిల్లా కేంద్రం, చుట్టుపక్కల ప్రాంతాలను బట్టి నిజామాబాద్ అర్బన్ పరిధిలో నిజామాబాద్ నార్త్, నిజామాబాద్ సౌత్ నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. శాసనసభ నియోజకవర్గాలన్నీ ఒకే జిల్లా పరిధిలో ఉండనున్న నేపథ్యంలో ప్రస్తుతం బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్న నిజామాబాద్ జిల్లాలోని వర్ని, రుద్రూర్, మోస్రా, చందూర్, కోటగిరి, పొతంగల్ మండలాలను సైతం నిజామాబాద్ జిల్లాలోని నియోజకవర్గాల్లో సర్దుబాటు చేయనున్నారు. దీంతో ఈ మండలాలు బోధన్ నియోజకవర్గం పరిధిలోకి కలుపనున్నారు. ఈ నేపథ్యంలో బోధన్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న ఎడపల్లి, నవీపేట, రెంజల్ మండలాలను మరో నియోజకవర్గంలో కలిపే అవకాశాలున్నాయి. అలాగే కొత్తగా భీమ్గల్, నందిపేట, నిజామాబాద్ రూరల్ స్థానంలో డిచ్పల్లి ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక కామారెడ్డి జిల్లాలో దోమకొండ నియోజకవర్గం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ● నిజామాబాద్ నార్త్: నిజామాబాద్ నార్త్, ఎడపల్లి మండలాలు, విలీన గ్రామాలు ● నిజామాబాద్ సౌత్: నిజామాబాద్ సౌత్, నిజామాబాద్ రూరల్, మోపాల్, మోస్రా ● డిచ్పల్లి: డిచ్పల్లి, జక్రాన్పల్లి, ఇందల్వాయి ● భీమ్గల్: భీమ్గల్, సిరికొండ, ధర్పల్లి, వేల్పూర్ ● బాల్కొండ: బాల్కొండ, మెండోరా, ముప్కాల్, మోర్తాడ్, ఏర్గట్ల, కమ్మర్పల్లి ● ఆర్మూర్: ఆర్మూర్, ఆలూర్, డొంకేశ్వర్ ● నందిపేట: నందిపేట, నవీపేట, రెంజల్, మాక్లూర్ ● బోధన్: బోధన్, సాలూర, వర్ని, చందూర్, రుద్రూర్, పొతంగల్, కోటగిరి ● బాన్సువాడ: బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, మహ్మద్నగర్, నిజాంసాగర్ ● జుక్కల్: జుక్కల్, బిచ్కుంద, మద్నూర్, పెద్దకొడప్గల్, పిట్లం, డోంగ్లి ● ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, తాడ్వాయి, గాంధారి ● కామారెడ్డి: కామారెడ్డి, సదాశివనగర్, రాజంపేట ● దోమకొండ: దోమకొండ, భిక్కనూరు, బీబీపేట, మాచారెడ్డి, పాల్వంచ, రామారెడ్డి డిచ్పల్లి: సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ పెడితే ప్రతిపక్షాలు సాకులు చెబుతూ వాకౌట్ చేయడం విడ్డూరంగా ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్ అన్నివర్గాల వారికి సముచిత ప్రాధాన్యం ఇస్తుందని, ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ అని అన్నారు. డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రంలో తెల్ల రేషన్కార్డులు ఉన్న వారందరికీ రూ.5 లక్షల బీమా అమలు చేయడం చారిత్రకంగా నిలిచిపోతుందన్నారు. ధర్పల్లి మండలంలో 6 ఎకరాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కేంద్రం నుంచి నిధులు రాకుండా బీజేపీ ఎంపీలు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. కాంగ్రెస్ చేపడుతున్న అభివృద్ధిని బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వాసుబాబు, సర్పంచ్ తేనేటి హేమలతలక్ష్మణ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.డొంకేశ్వర్(ఆర్మూర్): యుద్ధ పరిస్థితుల కారణంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందని ఓ వైపు వాహనదారులు ఆందోళన చెందుతూ పెట్రోల్ బంక్లకు పరుగులు తీస్తుండగా.. ఎలక్ట్రిక్ వాహనదారులు మాత్రం ఏ చింతా లేకుండా రయ్రయ్మని దూసుకెళ్తున్నారు. పెట్రోల్ ధరలు పెరిగినా, కొరత ఏర్పడినా తమకు ఎలాంటి టెన్షన్ లేదంటున్నారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 100 కిలో మీటర్లు తిరుగు తామని, డబ్బులు కూడా ఆదా అవుతున్నాయని ఆనందంగా చెబుతున్నారు. ఇప్పటికే ప్రతి గ్రామంలో, పట్టణంలో ఎలక్ట్రిక్ స్కూటీల సంఖ్య పెరుగుతోంది. ధరలు కూడా రూ.40 వేల నుంచి అందుబాటులో ఉండడంతో ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు, విద్యార్థులు కొనుగోలు చేస్తున్నారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు కంపెనీలు ఆఫర్లు, వారంటీలు ఇస్తున్నాయి. ఇంధన ధరలు, కొరతకు చార్జింగ్తో నడిచే వాహనాలు మంచి ప్రత్యామ్నాయంగా మారాయని చెప్పొచ్చు. ఉమ్మడి జిల్లాలో ఓటర్లు (2023)మహిళా కోటాలో 33 శాతం సీట్లు ఇవ్వనున్న నేపథ్యంలో రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 182కి పెరిగితే 60 సీట్లు మహిళలకు రిజర్వ్ కానున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి జి ల్లా నుంచి శాసనసభలో మహిళల ప్రాతినిథ్యం గణనీయంగానే ఉండే అవకాశాలున్నాయి. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సుభాష్నగర్: శ్రీరామనవమి సందర్భంగా మర్చంట్ అసోసియేషన్ వారి విజ్ఞప్తి మేరకు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం నుంచి మూడు రోజులపాటు పసుపు క్రయవిక్రయాలు నిలిపేస్తున్నామని సెలక్షన్ గ్రేడ్ సెక్రెటరీ అపర్ణ బుధవారం తెలిపారు. 26వ తేదీన తూకాలు మాత్రమే జరుగుతాయని, పసుపు బీట్ చేపట్టబోమన్నారు. 26 నుంచి 28వరకు జనరల్ బీట్లు మాత్రమే నిర్వహిస్తామని, రైతులు గమనించి మార్కెట్ కమిటీకి సహకరించాలని ఆమె కోరారు. ఎలక్ట్రిక్ బండిపై హాయిహాయిగా పెట్రోల్ ధరలు, కొరత కష్టాలకు చెక్ ఉమ్మడి జిల్లాలో 9 నుంచి 13కు పెరగనున్న శాసనసభ స్థానాలు నిజామాబాద్ జిల్లాలో 5 నుంచి 8కి.. కామారెడ్డి జిల్లాలో 4 నుంచి 5కు.. ఉమ్మడి జిల్లాలో పెరగనున్న మహిళల కోటా 2011 జనాభా లెక్కల ప్రకారం నిజామాబాద్లో 15,71,022.. కామారెడ్డిలో 9,72,625 మంది జనాభా ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లే అధికం పునర్విభజనపై అన్నివర్గాల్లో జోరుగా చర్చనియోజకవర్గాల పునర్విభజన చేపడితే శాసనసభా స్థానాల స్వరూపం ఈవిధంగా ఉండే అవకాశాలు ఉన్నాయని వివిధ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి..సామాన్యులకు ఇదే బెస్ట్.. చార్జింగ్ వాహనాలు సామా న్య ప్రజలకు ఊరట కలిగిస్తున్నాయి. పెట్రోల్ వాహనాల్లో ఎక్కువ ధర కలిగిన ఇంధనాన్ని నింపుకొని ప్ర యాణించడం ఆర్థికంగా ఇ బ్బందే. తక్కువ ధరలో లభిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటీలను కొనుగోలు చేసి చార్జింగ్ పెట్టుకుని అతి తక్కు వ ఖర్చుతో దూర ప్రయాణం సైతం చేయొచ్చు. పెట్రోల్ ధరలు పెరిగినా, కొరత ఏర్పడిన ఇలాంటి సమయాల్లో ఈవీ వాహనాలు చాలా బెటర్. – భీమ్నాయక్, నికాల్పూర్, డొంకేశ్వర్ మండలం -
సమాజ క్షేమమే ఔషధ పరమావధి
● వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు తెయూ(డిచ్పల్లి): ఔషధాల తయారీ సమాజ క్షేమమే పరమావధిగా కొనసాగాలని తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ టీ యాదగిరిరావు పేర్కొన్నారు. తెయూ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘ఇన్నోవేషన్స్ ఇన్ మెడిసినల్ కెమిస్ట్రీ’ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సును వీసీ యాదగిరిరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఔషధ తయారీలో రసాయన శాస్త్ర ప్రాముఖ్యత ఎంతో గొప్పదన్నారు. యువ శాస్త్రవేత్తలు నిబద్ధతతో తమ లక్ష్యాలను సాధించి భారత్ ఇప్పటికే సాధించిన ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. సదస్సులో ముఖ్యవక్తగా హాజరైన అరబిందో ఫార్మసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సురేశ్ మాట్లాడుతూ.. యువ శాస్త్రవేత్తలు జనరిక్ మెడిసిన్ పై లోతైన పరిశోధనలు చేసి వాటిని పేద ప్రజలకు మరింత దగ్గర చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డాక్టర్ లింగయ్య నాగారపు, డాక్టర్ శంకరయ్య, కన్వీనర్ సాయిలు, కో కన్వీనర్ డీ నాగరాజు, ఆర్గనైజింగ్ సెక్రెటరీస్ ఏ నాగరాజు, బాలకిషన్, అధ్యాపకులు గంగా కిషన్, రాజేశ్వరి, డేనియల్, సురేశ్, నాగేశ్వరరావు, నాగేంద్రబాబు, సునీత, శర్మ, శ్రీకాంత్, వివిధ విభాగాల ఆచార్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
హామీలు నెరవేర్చరా..
ఆర్మూర్: రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షా అభియాన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని, ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు, నిరసనలు ఉధృతం చేస్తున్నారు. 18 ఏళ్లుగా పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేదని, నల్ల బ్యాడ్జీలతో నిరసనలు చేపడుతూ, ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. నిరసనలో భాగంగా గురువారం చలో అసెంబ్లీ కా ర్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనైనా తమ కష్టాలు తీరుతాయని తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొని పదేళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో వేచి చూసిన సమగ్ర శిక్ష ఉద్యోగులను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్దపు మాటలతో మోసం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 19,350 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు 2023 సెప్టెంబర్లో సమ్మెకు కూర్చోగా ప్రతిపక్ష నాయకుడి హోదాలో హన్మకొండలోని దీక్షా శిబిరాన్ని సందర్శించిన రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సమస్యను పరిష్కరిస్తానని హా మీ ఇచ్చి.. తీరా అధికారంలోకి వచ్చినా సమస్యల పరిష్కారానికి పూనుకోకపోవడంతో సమగ్ర శిక్ష ఉద్యోగులు ఏడాది క్రితం రోడ్డెక్కి నెల రోజుల పాటు సమ్మె బాట పట్టారు. తమ విధులను బహిష్కరించి సమ్మె చేస్తుంటే వారితో సీఎం రేవంత్రెడ్డి చర్చించకపోగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం సాధ్యపడదంటూ మాట మార్చారు. మరో వైపు సమగ్ర శిక్ష ఉద్యోగులకు మద్దతుగా వారి వెంటే ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీలు గుప్పించిన ఉపాధ్యాయ సంఘాలు నాటి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి మొఖం చాటేశారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం తమ సర్వీసును రెగ్యులరైజ్ చేయలేని పరిస్థితి ఉంటే పదేళ్ల నుంచి సుప్రీం కోర్టు పలుమార్లు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించినా ఎందుకు కాతరు చేయడం లేదంటూ వారు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభించే వరకు సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తమకు పే స్కేల్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, హిమాచల్ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యా శాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేశారు. ఈ ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేసి మమ్మల్ని సైతం విద్యా శాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలి. – రాజు, జిల్లా అధ్యక్షుడు, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం కేజీబీవీ బోధనేతర,బోధన సిబ్బంది 599 మంది,యూఆర్ఎస్, బోధనేతర సిబ్బంది 10, డీపీవో సిబ్బంది 9, ఎంఐఎస్ సమన్వయకర్తలు 22, సీసీవోలు 29, సీఆర్పీలు 94, ఐఈఆర్పీలు 35, మెసెంజర్లు 19, పీటీఐలు 88, సీజీవీలు 19 మొత్తం 924 మంది ఉన్నారు. కేజీబీవీ బోధనేతర, బోధన సిబ్బంది 480 మంది, యూఆర్ఎస్, బోధనేతర సిబ్బంది 10, డీపీవో సిబ్బంది 7, ఎంఐఎస్ సమన్వయకర్తలు 22, సీసీవోలు 22, సీఆర్పీలు 76, ఐఈఆర్పీలు 26, మెసెంజర్లు 18, పీటీఐలు 71, సీజీవీలు 18, మొత్తం 750 మంది ఉన్నారు. సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్ మాట ఇచ్చి పదేళ్లు పట్టించుకోని కేసీఆర్.. అధికారం రాగానే మాట మార్చిన సీఎం రేవంత్రెడ్డి నేడు చలో అసెంబ్లీకి శ్రీకారం చుట్టిన ఉద్యోగులు -
గ్రంథాలయాల అభివృద్ధికి కృషి
ఖలీల్వాడి: జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు జిల్లా గ్రంథాలయా ల సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో మంగళవారం జిల్లా గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. 2026–27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. అనంతరం రాజిరెడ్డి మాట్లాడుతూ.. ఈ ఆర్థి క సంవత్సరంలో గ్రంథాలయాల అభివృద్ధి కి రూ. 6.44 కోట్లకు పైగా ఖర్చు చేసేందుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. జిల్లా కేంద్ర గ్రంథాలయ నూతన భవన నిర్మాణానికి రూ.4కోట్లు, నందిపేట్, సిరికొండ లైబ్రరీలకు సొంత భవనాల నిర్మాణానికి రూ.44 లక్షల నుంచి రూ.45 లక్షల తో ఆమోదించినట్లు తెలిపారు. సాలూరలో శాఖా గ్రంథాల యం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపుతా మన్నారు. డిచ్పల్లి, వెల్మల్లలో టాయిలెట్స్ నిర్మాణం చేపట్టేందుకు ఆమోదించినట్లు చె ప్పారు. నూతన పుస్తకాల కొనుగోలు కోసం రూ.8 లక్షలు ఖర్చు చేయాలని నిర్ణయించామన్నారు. సంస్థ కార్యదర్శి బుగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలి సుభాష్నగర్: ప్రభుత్వం ప్రవేశపెట్టి న ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించా లని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం ఆయన పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చినప్ర భుత్వం.. బడ్జెట్లో భారీగా నిధులను తగ్గించిందన్నారు. బడ్జెట్లో నిధుల కేటాయింపును తగ్గించారని, ఇప్పటి వరకు విడుదల చేసింది రూ.300 కోట్లు మాత్రమేనన్నారు. ఉచిత బస్సు పథకం కారణంగా నష్టపోతున్న వే లాది మంది ఆటో డ్రైవర్లను ఆదుకుంటామ ని ప్రకటించిన ప్రభుత్వం.. ఈ బడ్జెట్లో వారికి మొండి చేయి చూపించిందన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలన్నారు. ఎస్సీ సంక్షేమానికి గత సంవత్సరంలో రూ.40 వేల కోట్లు నిధు లు కేటాయించ గా ఈసారి రూ.11 వేలకు పరిమితం చేయ డం దారుణమన్నారు. ప్రస్తుత బడ్జెట్ నిరా శ కలిగించిందని తక్షణమే సవరణ చేయా లని ధన్పాల్ అసెంబ్లీలో పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి నిజామాబాద్ అర్బన్ : రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రోడ్డు భద్రత కార్యక్రమాలను ముమ్మరం చేయాలన్నారు. రోడ్డు ఆ క్రమణలను తొలగించాలన్నారు. అటవీ ప్రాంతాల్లో అవసరానికి అనుగుణంగా రిఫ్లె క్టర్లు, ప్రమాద సూచికలు ఏర్పాటు చేయా ల ని సూచించారు. అదనపు డీసీపీ బస్వారె డ్డి, రవాణ శాఖాధికారి ఉమా మహేశ్వర రా వు, ఆర్టీసీ డీఎం ఆనంద్, ఏసీపీలు పాల్గొన్నారు. -
వేసవిలో అప్రమత్తంగా ఉండండి
నిజామాబాద్ అర్బన్: వేసవిలో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని, వడదెబ్బ బారిన పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఎండల తీవ్రత, చేపట్టాల్సిన జాగ్రత్త చర్యలపై ఆయా శాఖల వారీగా అధికారులకు బాధ్యతలను పురమాయిస్తూ కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైద్యారోగ్య, ఉపాధిహామీ, పర్యావరణ, పంచాయతీరాజ్, కార్మిక తదితర శాఖలు వడదెబ్బ నివారణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, తన నేతృత్వంలో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీని సైతం ఏర్పా టు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వడదెబ్బ నివా రణ కోసం పాటించాల్సిన పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేయాలని డీఎంహెచ్వో రాజశ్రీని ఆదేశించారు. ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు ఇవీ.. ● ప్రజలు, కార్మికులు భారీ ఉష్ణోగ్రతల కారణంగా వడగాడ్పులకులోనై ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ● లేబర్ అడ్డాలు, పని ప్రదేశాలను గుర్తించి తాగునీరు అందుబాటులో ఉంచాలి. ● బస్తీ దవాఖానాలు, పీహెచ్సీ, సీహెచ్సీల్లో రెట్టింపు స్థాయిలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను నిల్వ చేయాలి. ● ప్రతి ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ సెంటర్లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉండాలి. ● గురుకులాలు, వసతిగృహాల్లో ఎండ తీవ్రతపై అవగాహన కల్పించాలి. ● ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో ప్ర జలు ఇళ్ల నుంచి బయటికి రాకుండా చూడాలి. అత్యవసర సమయంలో బయటికి వచ్చే వారికి జాగ్రత్తు తీసుకునేలా అవగా హన కల్పించాలి. ● ఆరోగ్య సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రజలకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలి. ● ప్రధానంగా వ్యవసాయ, ఉపాధి కూలీలు, వివిధ పరిశ్రమలలో పని చేసే వారు, భవన నిర్మాణ రంగ కార్మికులు తదితరులకు తగి న సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలి. ● ఉపాధి పనులు కొనసాగుతున్న ప్రదేశాల్లో టెంట్లు ఏర్పాటు చేయాలి. కూలీలు తమ వెంబడి తాగునీరు తెచ్చుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బ బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలి జాగ్రత్తలను వివరిస్తూ కరపత్రాలను పంచండి ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 20 మందికి తీవ్ర గాయాలు
● రుద్రూర్లో ఘటన ● ఘటనాస్థలాన్ని పరిశీలించిన సీపీ సాయిచైతన్య ● బోధన్, నిజామాబాద్ ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు వైద్య చికిత్స రుద్రూర్ వద్ద రోడ్డు ప్రమాదంలో దెబ్బతిన్న లారీ రుద్రూర్ : మండల కేంద్రంలోని జవహర్నగర్ కా లనీ వద్ద మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో 20 మందికి తీవ్రగా యాలయ్యాయి. బస్సు, లారీ డ్రైవర్లు, 18 మంది ప్రయాణికులు ఉన్నారు. మరి కొందరికి స్వల్ప గా యాలయ్యాయి. బస్సులో మొత్తం 31 మంది ప్ర యాణికులు ఉన్నారు. బోధన్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఎదురుగా వస్తున్న డస్ట్ లోడ్ లారీని ఢీకొట్టింది. రెండు వాహనాల ముందు భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఎస్సై సాయన్న ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్లలో బోధన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన లారీ కుర్నాపల్లి క్రషర్ నుంచి స్టోన్ డస్ట్ను పోతంగల్ మండలం పీఎస్ఆర్ నగర్లో ఇంటిగ్రెటేడ్ స్కూల్ నిర్మాణానికి తీసుకెళుతున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటన స్థలాన్ని పోలీసు కమిషనర్ పి సాయి చైతన్య పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. సీపీ వెంట బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయబాబు, రుద్రూర్ ఎస్సై సాయన్న, ఆర్టీసీ డీఎం, పోలీస్, ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు. క్షతగాత్రులకు సీపీ పరామర్శ బోధన్టౌన్/నిజామాబాద్అర్బన్: బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో గాయపడి బోధన్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీపీ సాయి చైతన్య పరా మర్శించారు. మెరుగైన వైద్య సేవ లు అందించాలని వైద్యులకు సూ చించారు. ప్రమాదంలో ఓ చిన్నారి, మరో ఇద్దరి తలలకు గాయాలయ్యాయి. ఇద్దరు మహిళల ముఖాలకు గాయాలు కాగా దంతాలు దెబ్బతిన్నాయి. లారీ డ్రైవర్ కాలికి గాయం కాగా అంబులెన్స్లోనే చికిత్స అందించా రు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ బాలాగౌడ్తోపాటు మరో నలుగురికి చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి మెరుగ్గానే ఉందని ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. దెబ్బతిన్న ఆర్టీసీ బస్పు శనగ రైతులకు సెగ బోధన్రూరల్: జిల్లాలో శనగ దిగుబడికి, కొను గోళ్లకు పొంతన లేకపోవడంతో రైతులు ఆందోళ న చెందుతున్నారు. దీనికితోడు శనగలను విక్ర యించేందుకు తీసుకొచ్చే రైతులకు పట్టాపాస్ పుస్తకంతోపాటు బయోమెట్రిక్ తప్పనిసరి అంటుండడంతో కౌలు రైతులు కొనుగోలు కేంద్రాల కు వెళ్లలేని స్థితి నెలకొంది. ఎన్నో ఆశలతో శనగ సాగు చేసిన రైతులను కష్టాలు వెంటాడుతున్నా యి. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభం కాగా, అక్కడ అమలవుతున్న నిబంధనలను రైతులను అయోమయానికి గురిచేస్తు న్నాయి. ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు దిగుబడి రాగా, రైతుల నుంచి ఎకరాకు 7 క్వింటాళ్ల కొనుగోలుకు మాత్రమే అనుమతించారు. యాసంగి సీజన్లో జిల్లాలో 14వేల ఎకరాలకుపైగా భూమిలో రైతులు శనగ సాగు చేశారు. వాతావరణం అనుకూలించడంతో ఎకరాకు 9 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ప్ర భుత్వం రెండు, మూడు రోజుల క్రితం మార్కె ఫెడ్ ఆధ్వర్యంలో బోధన్, కల్దుర్కి, నీలా, హున్సా, సాలూర, పొతంగల్, జాకోరా సొసైటీ ల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. ఒక్కో రైతు నుంచి ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్ర మే కొనుగోలు చేస్తున్నారు. మిగిలిని శనగలను తాము ఎక్కడ అమ్ముకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. బయోమెట్రిక్ కారణంగా కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సేకరించేది కొంతే..! సాగు, దిగుబడి అంచనా ప్రకారం రైతుల నుంచి ఎకరాకు 10 క్వింటాళ్ల శనగలను కొనుగోలు చేయాలని నాఫెడ్కు వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. నాఫెడ్, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మార్కెఫెడ్ సొసైటీల ఆధ్వర్యంలో కొనుగోళ్లు ప్రారంభించింది. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం లక్ష క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అయితే 25 వేల క్వింటాళ్ల సేకరణకు అనుమతి వచ్చిందని మార్కెఫెడ్ అధికారులు చెబుతున్నారు. మిగతా పంట దిగుబడి ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లా యాంత్రంగం, ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించి క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకోవాలని, పూర్తి పంట దిగుబడిని కొనుగోలు చేయాలని శనగ రైతులు కోరుతున్నారు. బోధన్ మండలం కల్దుర్కిలో శనగలను కాంటా చేస్తున్న కొనుగోలు కేంద్రం నిర్వాహకులుపూర్తిస్థాయి కొనుగోలుకు చర్యలు కొనుగోలు కేంద్రాల్లో రక్షేత స్థాయిలో తలెత్తున్న సమస్యలు మా దృష్టికి వచ్చాయి. రైతుల సమస్యలను ప్రభుత్వం, అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం జిల్లాలో 25 వేల క్వింటాళ్ల శనగ సేకరణకు అనుమతులు వచ్చాయి. లక్ష క్వింటాలు సేకరణకు అనుమతులు ఇవ్వాలని ప్రతిపాదనలు అందించాం. అనుమతులు రాగానే రైతులకు ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో శనగలు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – మహేశ్కుమార్, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ జిల్లాలో లక్ష క్వింటాళ్లకు పైగానే పంట దిగుబడి 25వేల క్వింటాళ్ల సేకరణకే అనుమతి బయోమెట్రిక్ కారణంగా కౌలు రైతులకు ఇబ్బందులు వెంటాడుతున్న కష్టాలు -
వన్యప్రాణుల దాహార్తికి నీటి వసతులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందు కు గాను ప్రభుత్వం రూ.1.6 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుత వేసవి నేపథ్యంలో వన్యప్రాణులకు నీటి సౌకర్యం కల్పించేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిధులు కేటాయించింది. జిల్లా అటవీ శాఖకు మొదటి విడత గా రూ.1.6 కోట్లు ఇచ్చింది. ఏప్రిల్ నెలలో ఈ నిధులను వినియోగించనున్నారు. వచ్చే మే, జూన్ నెలలకు సంబంధించి మరో విడత లోని ధులను ఇవ్వనున్నారు. ఈ నిధులతో జిల్లాలో ని అడవుల్లో సహజ నీటి వనరులు ఎండిపోయిన చోట కృత్రిమ నీటి సౌకర్యం కల్పించనున్నారు. జిల్లాలో ఆర్మూర్, కమ్మర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, నిజామాబాద్ నార్త్, నిజామాబా ద్ సౌత్, వర్ని అటవీ రేంజ్లు ఉన్నాయి. అన్ని రేంజ్లలో కలిపి 86,871.45 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. సాధారణంగా చలికాలం, వర్షాకాలంలో అడవుల్లో నీటి వనరు లు పుష్కలంగా ఉంటాయి. వేసవి కాలంలోనే నీటి ఎద్దడి నెలకొంటుంది. దీంతో వన్యప్రాణులు దాహం తీర్చుకునేందుకు ఇబ్బందులు పడుతుంటాయి. ఈ క్రమంలో నీటి కో సం జనావాసాల్లోకి వచ్చి మృత్యువాత పడుతుంటా యి. ఇలాంటి పరిస్థితిని నివారించేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అడవుల్లో ప్రతి 9 చదరపు కిలోమీట ర్లకు ఒకటి చొప్పున 180 చోట్ల సిమెంటుతో సాసర్ పిట్లను అటవీ శాఖ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అట వీ సిబ్బంది ఆయా సాసర్ పిట్లను శుభ్రం చేసి ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. ఇందుకోసం వాచర్లను నియమించారు. ఒక్కో సాసర్ పిట్లో సుమారు 700 నుంచి 2,500 లీటర్ల వరకు నీరు నిల్వ ఉంటుంది. నీటి కుంటలు, చెలిమలు, పర్క్యులేషన్ ట్యాంకుల్లోనూ నీటి ని పట్టి ఉంచుతారు. వర్షాలు కురిసే వరకు వారానికి ఒకసారి నీటిని నింపాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ● సహజ నీటి వనరులు, విద్యుత్ సౌకర్యం లేని అటవీ ప్రాంతాల్లో సోలార్ శక్తితో పని చేసే బో రు బావులు ఏర్పాటు చేసి నిరంతరం నీటి కుంటలు నిండేలా అటవీ శాఖ చూస్తోంది. అలాగే నీటి కుంటల వద్ద జంతువుల కదలికలను గమ నించేందుకు అటవీ అధికారులు ట్రాప్ కెమెరా లు అమర్చారు. వీటి ద్వారా చిరుతలు, ఎలుగు బంట్లు, జింకలు, ఇతర వన్యప్రాణులు నీరు తాగుతు న్న దృశ్యాలను అధికారులు రికార్డు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు నీటి నిల్వల గురించి తనిఖీ చేస్తున్నారు.అన్ని చర్యలు చేపడుతున్నాం వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంరక్షణ కో సం అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకు న్నాం. జంతువుల దాహార్తిని తీర్చేందుకు ప్రభు త్వం నిధులు విడుదల చేసింది. వన్యప్రాణులు నీటి కోసం రోడ్లపైకి, జనసంచార ప్రాంతాల్లోకి రాకుండా ఉండేందుకు అడవుల్లోనే కుంటలు, సాసర్ పిట్లలో నీటిని నింపి ఉంచుతున్నాం. వికాస్మీనా, జిల్లా అటవీ అధికారి రూ.1.6 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం జిల్లాలో 86,871.45 హెక్టార్ల అటవీ ప్రాంతం ఇప్పటికే 180 చోట్ల సాసర్ పిట్ల ఏర్పాటు -
దివ్యాంగులను విస్మరిస్తున్న ప్రభుత్వం
సుభాష్నగర్: దివ్యాంగులను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తుందని, వారికి ఇచ్చిన హామీలను సీఎం రేవంత్రెడ్డి వెంటనే నెరవేర్చాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. అన్ ఎంప్లాయిడ్ డిసేబుల్డ్ అసోసియేషన్ ఆఫ్ యూత్ చేపట్టిన ‘చలో అసెంబ్లీ ముట్టడి’ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ఈక్రమంలో మంగళవారం వారిని అసెంబ్లీ ముందు పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్, రామారావు పటేల్తో కలిసి గన్పార్క్ అమరవీరుల పార్క్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ధన్పాల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని, పెన్షన్ రూ.6వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీల అమలు ఎలాగో పూర్తి స్థాయిలో జరగడం లేదు, కనీసం వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. -
క్షయ రహిత సమాజమే లక్ష్యం
● డీఎంహెచ్వో రాజశ్రీ ● జీజీహెచ్లో టీబీ ముక్త్ భారత్ అభియాన్ 2.0 ప్రారంభం సుభాష్నగర్: క్షయ రహిత సమాజమే లక్ష్యంగా అందరం పని చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణి రాజశ్రీ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఏడో అంతస్తులో ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్షయ అంటువ్యాధి అయినప్పటికీ.. పూర్తిగా నయమయ్యే వ్యాధి అని, సరైన సమయంలో పరీక్షలు చేయించుకుని, వైద్యుల సూచనల ప్రకారం పూర్తి చికిత్స తీసుకుంటే వ్యాధిని జయించవచ్చన్నారు. ప్రభుత్వం క్షయ నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని, అయినప్పటికీ ప్రజల సహకారం లేకుండా ఈ లక్ష్యం సాధ్యం కాదని అన్నారు. క్షయ లక్షణాలను గుర్తించాలని, దగ్గు రెండు వారాలకుపైగా ఉంటే వెంటనే సమీప వైద్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. క్షయ రోగులను వివక్ష లేకుండా ఆదరించి వారికి మానసిక ధైర్యం ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. ‘ఎస్! వీ కెన్ ఎండ్ టీబీ’అనే థీమ్ను అందరం ఆచరణలో పెట్టాలని, ప్రతిఒక్కరూ తమ బాధ్యతగా భావించి క్షయ నిర్మూలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ 2.0 కా ర్యక్రమాన్ని డీఎంహెచ్వో జీజీహెచ్లో ప్రారంభించారు. క్రమం తప్పకుండా మందులు వాడి టీబీని జయించిన ఇద్దరు టీబీ చాంపియన్లను సన్మానించారు. డీటీసీవో డాక్టర్ దేవినాగేశ్వరి, జీజీహెచ్ సూ పరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్రావు, పల్మనాలజీ హెచ్వోడీ ప్రశాంత్, డిప్యూటీ డీఎంహెచ్వో అశ్వినీ, వైద్యులు వెంకన్న, అవంతి, రవిగౌడ్, లక్ష్మణ్, నరేశ్, వెంకటేశ్వర్లు, మెడికల్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ధాన్యం సేకరణ సజావుగా కొనసాగాలి
● రైతులకు ఇబ్బందులు తలెత్తకూడదు ● అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సుభాష్నగర్: యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆదేశించారు. రబీ వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో మంగళవారం ఆయా శాఖల అధికారులతో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈవోలు, ఐకేపీ సీసీలు, మెప్మా ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు ఎక్కడ కూడా ఏ దశలోనూ ఇబ్బందులు పడకుండా ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. జిల్లాలో యాసంగిలో 4.27 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారన్నారు. సుమారు 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా వేయగా, 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 669 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీ బ్యాగులను అన్ని కేంద్రాలకు సమకూరుస్తామని, 2.25 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం అవుతాయని అంచనా వేశామని అన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో రైతులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ప్రతిరోజూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ కొనుగోళ్ల ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ చేయాలని, ఏమైనా సమస్యలు గమనించిన వెంటనే వాటిని పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటదివెంటనే రైస్ మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. నిర్లక్ష్యానికి తావిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డీఎస్వో శ్రీకాంత్రెడ్డి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. -
పరిశోధనలపై యువత ఆసక్తి చూపాలి
ఖలీల్వాడి: నేటి యువత పరిశోధనల వైపు ఆసక్తి చూపాలని, తద్వారా ఉ న్నత శిఖరాలను అధిరోహించవచ్చని సఫల ఆర్గానిక్స్ లిమిటెడ్ వ్యవస్థాపకు లు, శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ క ళాశాలలో మంగళవారం రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘నిర్మాణం నుంచి పునర్నిర్మాణం వరకు రసాయన శాస్త్రం: నూతన సంశ్లేషణను సమాజ స్థిరత్వంతో అనుసంధానం‘ అనే అంశంపై ఒక రోజు జాతీయ సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎల్లారెడ్డి మాట్లాడుతూ.. రసాయన శాస్త్రం అభ్యసించినవారు ఉన్నతంగానే ఎదిగుతారని తెలిపారు. ప్రి న్సిపల్ రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు లోతైన అవగాహన, పరి శోధన అనుభవం కలిగించుటకు ఈ విద్యా సంవత్సరంలో 5 జాతీయ సద స్సులు నిర్వహించామన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచా ర్య దేవలపల్లి రామాచారి, ఐఐసీటీ హైదరాబాద్కు చెందిన సుధాకర్, తెయూ ప్రొఫెసర్ కాశీనాథ్, నాందేడ్ ప్రొఫెసర్ పట్వారీ, సాయిలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 61 పరిశోధన ప త్రాలు సమర్పించారు. దాదాపు 300 మంది రీసెర్చ్ స్కాలర్లు, విద్యా ర్థులు పాల్గొని, పేపర్ ప్రెజెంటేషన్, పోస్టర్ ప్రెజెంటేషన్, సైన్స్ఫేర్లను నిర్వహించారు. సదస్సు కన్వీనర్ రంగరత్నం, రాజేష్, అధ్యాపకులు ర మణ, రంజిత్, రాము, హనుమాండ్లు, చంద్రకళ, శ్రీవర్ష, దండు స్వామి, రామస్వామి, రామ్ కిషన్, ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
కంటిచూపును జాగ్రత్తగా కాపాడుకోవాలి..
సుభాష్నగర్ : శరీర అవయవాలలో అత్యంత ప్రధానమైన కంటి చూపును ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నా రు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో బోర్గాం(పి) జెడ్పీహెచ్ఎస్లో జిల్లా అంధ త్వ నివారణ సంస్థ ద్వారా దృష్టి లోపంతో బాధపడుతున్న విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దా లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా విచ్చేసి బాలబాలికలకు కంటి అద్దాలు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఇదివరకు తాను కూడా దృష్టి లోపంతో ఇబ్బందిపడ్డానని, తగిన వ్యాయామాలు, సరైన ఆహారపు అలవాట్లతో ఆ సమస్యను అధిగమించానని వెల్లడించారు. కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించేందుకు వీలుగా జిల్లాలో సుమారు 70 వే ల మంది వరకు విద్యార్థులకు నేత్ర పరీక్షలు చే యాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటికే 41 వేల మందికి కంటి పరీక్షలు పూర్తయ్యాయన్నారు. కంటి సంబంధిత సమస్యలకు సంబంధించిన అంశాలపై విద్యార్థులకు పలు ప్రశ్నలు వేస్తూ, సరైన సమాధానాలు చెప్పిన వా రికి కలెక్టర్ బహుమతులు అందజేశారు. క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకు ని టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగస్వాము లం అవుతామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో క లెక్టర్ మొక్కలు నాటారు.డీఎంహెచ్వో రాజశ్రీ, డిప్యూటీ డీఎంహెచ్వో అశ్విని, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి అశోక్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ పీవో సుజాత, మెడికల్ ఆఫీసర్ అజ్మల్, హెచ్ఎం శంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నాణ్యమైన వైద్యసేవలు అందించాలి
● ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకాన్ని పెంచాలి ● కలెక్టర్ ఇలా త్రిపాఠి బోధన్టౌన్(బోధన్) : ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యసేవలు అందించాలని, ప్రజలకు ఆస్పత్రులపై నమ్మకం కలిగించాలని కలెక్టర్ ఇలా త్రిపా ఠి అన్నారు. బోధన్లోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిని మంగళవారం కలెక్టర్ సందర్శించారు. ఆనంతరం వైద్యాధికారులతోపాటు వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆస్పత్రిలో నెలకొన్న ఇబ్బందులను గురించి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి లో పూర్తిగా వసతులు కల్నించేలా చర్యలు చేపడు తామని, వైద్య సేవలను పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు. గైనకాలజిస్టును నియమించడానికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులు సోకకముందే జాగ్రత్తలు తీసుకోవాలని, మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాల ని ఆదేశించారు. ఆస్పత్రిలో అవసరమైన మౌలిక స దుపాయాలను, వైద్యులను, వైద్య సిబ్బందిని సమకూరుస్తామని, నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని, వైద్య సేవల్లో లోపాలు ఉంటే ఉపేక్షించేది లేదని సూచించారు. ఆస్పత్రుల సమన్వయ కర్త శ్రీనివాస్ ప్రసాద్, వైద్యులు రాహుల్ ఉన్నారు. -
రుణాల రికార్డ్
డొంకేశ్వర్(ఆర్మూర్): మహిళా సంఘాలకు లక్ష్యానికి మించి బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వడంతోపాటు రికవరీ చేయడంలో నిజామాబాద్ జిల్లా టాప్లో నిలిచింది. రెండు రోజుల క్రితం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో డీఆర్డీవో సాయాగౌడ్ను ప్రశంసించిన రాష్ట్ర సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్.. వార్షిక టార్గెట్ రూ.1,228కోట్ల పంపిణీని దాటి అదనంగా రూ.109 కోట్లు పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు. మిగతా జిల్లాలు నిజామాబాద్ జిల్లాను ఆదర్శంగా తీసుకుని తమ లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. ఏర్గట్ల, మాక్లూర్, ఎడపల్లి, జక్రాన్పల్లి, ఆర్మూర్, కమ్మర్పల్లి, నందిపేట్, రెంజల్, వేల్పూర్, సిరికొండ, ముప్కాల్, మోపాల్, నవీపేట్, డిచ్పల్లి, మోర్తాడ్, వర్ని, భీమ్గల్, బాల్కొండ మండలాలు రుణాల పంపిణీలో వంద శాతాన్ని చేరుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగియక ముందే.. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.1,228 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను 19,969 మహిళా సంఘాలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆర్థిక సంవత్సరం (మార్చి) ముగింపునకు వారం రోజులు ఉండగానే టార్గెట్ను దాటి రూ.1,332 కోట్ల రుణాలను 16వేల సంఘాల వరకు అందజేసి రాష్ట్రస్థాయిలో జిల్లా ఐదో స్థానంలో ఉంది. బ్యాంకుల సహకారంతో ఐకేపీ అధికారులు సమన్వయం చేసుకుని ప్రతి సంఘానికి రుణాలివ్వడంతో టార్గెట్ను సులభంగా సాధించారు. మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను పాడి పరిశ్రమ, చిన్న తరహా వ్యాపారాలు, కుట్టు మిషన్లు, ఇతర కుటీర పరిశ్రమల స్థాపనకు ఉపయోగించుకొని ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. అలాగే తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తూ క్రమశిక్షణ పాటిస్తున్నారు. తద్వారా జిల్లాలో రికవరీ శాతం మెరుగ్గా ఉంది. ఈనాటికి జిల్లా వ్యాప్తంగా 0.38 శాతం మాత్రమే బకాయిలు ఉండడం విశేషం. కాగా ఇది రికార్డు స్థాయి అని చెప్పొచ్చు. ప్రణాళికతోనే సాధ్యమైంది... ఐకేపీ అధికారులు, సిబ్బంది కలిసి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లడం వల్లే ఈ ఘనత సాధ్యమైంది. మహిళా సంఘాలకు లక్ష్యానికి మించి రుణాలు ఇవ్వడం, ఎన్పీఏ బకాయిలు లేకపోవడం సంతోషంగా ఉంది. ఇదే స్పూర్తితో మున్ముందు కూడా లక్ష్యాలను దాటి రుణాలు అందజేస్తాం. – సాయాగౌడ్, డీఆర్డీవో, నిజామాబాద్పంపిణీ.. రికవరీలో నిజామాబాద్ భేష్ వార్షిక లక్ష్యానికి మించి మహిళా సంఘాలకు రుణాలిచ్చిన అధికారులు డీఆర్డీవోను ప్రశంసించిన సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ -
రైతు భరోసా పేరుతో ప్రభుత్వ మోసం
సుభాష్నగర్: రైతు భరోసా పేరుతో తెలంగాణ రైతాంగాన్ని మళ్లీ మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకం మొదలుపెట్టిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఒక ప్రకటనలో విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడే రైతు భరోసా గుర్తొస్తుందా అని ప్రశ్నించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ముందు రైతుల భావోద్వేగాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. వరంగల్ డిక్లరేషన్లో రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్.. కేవలం రూ.12వేలకే పరిమితమైందని విమర్శించారు. రైతు భరోసాను ఇప్పటికే నాలుగు విడతల్లో రైతులకు ఎగ్గొట్టిన విషయాన్ని అన్నదాతలు మర్చిపోరని, సరైన సమయంలోనే కాంగ్రెస్కు కర్రుకాల్చి వాత పెడతారని తెలిపారు. కాంగ్రెస్ చేస్తుంది రైతు సంక్షేమం కాదని, ఇది పక్కా రాజకీయ మోసమన్నారు. ప్రభుత్వం ఇకనైనా పబ్లిసిటీ నాటకాన్ని కట్టి పెట్టి.. రైతుల అవసరాలపై రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు పూర్తి డబ్బులను ఒకేసారి జమ చేయాలని, లేకుంటే రైతాంగం పక్షాన బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు. -
ఆధునిక వ్యవసాయంలో బ్రాసినో స్టెరాయిడ్స్ కీలకపాత్ర
తెయూ(డిచ్పల్లి): ఆధునిక వ్యవసాయంలో బ్రాసినో స్టెరాయిడ్స్ కీలకపాత్ర పోషిస్తాయని ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత ఆచా ర్యులు సీతారాంరావు పేర్కొన్నారు. సోమవా రం తెలంగాణ యూనివర్సిటీ వక్షశాస్త్ర విభా గం ఆధ్వర్యంలో ‘ఆధునిక వ్యవసాయంలో బ్రాసినో స్టెరాయిడ్స్ పాత్ర’ అనే అంశంపై ప్రొఫెసర్ సీతారాం రావు ఆహ్వానిత ఉపన్యా సం చేశారు. అధిక పంట దిగుబడికి, ప్రతికూల వాతావరణ పరిస్థితులలో బ్రాసినో స్టెరాయిడ్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. తక్కువ మోతాదులో బ్రాసినో స్టెరాయిడ్స్ ప్రభావవంతంగా పనిచేయడంతో ఆర్థికపరంగా, పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయని వివరించారు. కార్యక్రమంలో బోటనీ విభాగాధిపతి అబ్దుల్ హలీం ఖాన్, బీవోఎస్ చైర్పర్సన్ అరుణ, అధ్యాపకులు విద్యావర్థిని, శ్రీనివాస్, జలందర్, విద్యార్థులు పాల్గొన్నారు. సతీశ్కు డాక్టరేట్ తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ బోటనీ (వృక్షశాస్త్ర) విభాగంలో పరిశోధక విద్యార్థి సతీశ్ డాక్టరేట్ సాధించారు. ప్రొఫెసర్ విద్యావర్థిని పర్యవేక్షణలో ‘సోలానం జాన్తోకర్పం యొక్క పెరుగుదల – దిగుబడిపై బ్రాసీనోస్టెరాయిడ్స్ –సాలిసిలిక్ యాసిడ్ ప్రభావం’ అనే అంశంపై సతీశ్ పరిశోధన పూర్తి చేసి సిద్ధాంత గ్రంథం సమర్పించారు. సోమవారం తెయూ సైన్స్ కళాశాల సెమినార్ హాల్లో నిర్వహించిన ఓపెన్ వైవావోస్కు ఉస్మానియా యూనివర్సిటీ బోటనీ విభాగం ప్రొఫెసర్ సీతారాంరావు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్గా వ్యవహరించారు. సతీశ్ను పలు ప్రశ్నలు అడిగారు. సమాధానాలు రాబట్టి డాక్టరేట్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో తెయూ బోటనీ బీవోఎస్ చైర్పర్సన్ అరుణ, విభాగాధిపతి మహ మ్మద్ అలీంఖాన్, సైన్స్ డీన్, కంట్రోలర్ సంపత్ కుమార్, విద్యావర్థిని, అధ్యాపకులు శ్రీనివాస్, జలంధర్, పరిశోధకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సుభాష్నగర్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ) గవర్నింగ్ కౌన్సిల్ చైర్పర్సన్గా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కవితారెడ్డిని నగర మేయర్ ఉమారాణి రమేశ్ సోమవారం సన్మానించారు. ప్రజా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ రంగాల్లో కవితారెడ్డి నాయకత్వం మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తుందని మేయర్ విశ్వాసం వ్యక్తంచేశారు. రెడ్డి సంక్షేమ సంఘం.. ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కవితారెడ్డిని సోమవారం రెడ్డి సంక్షేమ సంఘం (369) అధ్యక్షుడు గాదారి సంజీవ్రెడ్డి ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి మోతే నవీన్ రెడ్డి, కోశాధికారి అరికెల శ్రీకాంత్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు వినోద్ రెడ్డి, సలహాదారులు నాగిరెడ్డి, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
విద్యుత్షాక్తో ఒకరి మృతి దోమకొండ: మండలంలోని లింగుపల్లి గ్రామానికి చెందిన రాకుల శంకర్ (43) సోమవారం విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు. గ్రామంలో ప్రయివేట్ కరెంట్ హెల్పర్గా పనిచేసే శంకర్ గ్రామంలోని ఇందిరమ్మ ఇంటికి విద్యుత్ వైర్ల కనెక్షన్ ఇచ్చే ప్రయత్నంలో విద్యుత్ స్థంభం నుంచి కిందపడ్డాడు. సీసీ రోడ్డుపై పడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. గ్రామస్థులు వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే శంకర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య నాగమణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి కుమారుడు రంజిత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. గాయపడిన మహిళ ..రుద్రూర్: పోతంగల్ రైస్మిల్లులో పనిచేస్తూ గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై సునీల్ తెలిపారు. కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రేణి మొగులవ్వ (40) గత నెల 15న రైస్మిల్లులో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు మిషన్ బెల్ట్ చుట్టుకొని గాయపడింది. చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని గాంధీ అస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ 21న రాత్రి మృతి చెందింది. సోమవారం కోటగిరి తహసీల్దార్ గంగాధర్ సమక్షంలో కొత్తపల్లి గ్రామంలో వైద్యులు పోస్టుమార్టం ని ర్వహించారు. మృతురాలి భర్త రేణి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై సునీల్ తెలిపారు. ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని మహిళ .. నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని బైపాస్ రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు ఎస్హెచ్వో శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు బైపాస్ రోడ్డులో ఉన్న బాగారెడ్డి నర్సరీ వద్ద గుర్తు తెలియని మహిళను ఢీకొట్టింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్హెచ్వో పేర్కొన్నారు. బస్సును స్టేషన్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలికి సంబంధించిన బంధువులు ఉంటే తమను సంప్రదించాలని పేర్కొన్నారు. -
కాపీయింగ్కు అవకాశం ఇవ్వొద్దు
● కలెక్టర్ ఇలా త్రిపాఠి ● ఎస్సెస్సీ పరీక్ష కేంద్రాల తనిఖీ ఖలీల్వాడి: పదో తరగతి పరీక్షల్లో కాపీయింగ్కు అవకాశం ఇవ్వొద్దని, ఒకవేళ కాపీయింగ్కు ఆస్కారం ఇస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని మానిక్భవన్, నలంద హైస్కూల్లోని పరీక్ష కేంద్రాలను ఆమె సోమవారం తనిఖీ చేశారు. విద్యార్థులు, సిబ్బంది హాజరుకు సంబంధించిన వివరాలను సీఎస్ను అడిగి తెలుసుకున్నారు. నిబంధనల ప్రకారం, నిర్ణీత సమయంలో ప్రశ్నాపత్రాలను తెరిచారా? అని అడిగారు. సీసీ కెమెరా రికార్డింగ్ నడుమ ప్రశ్నాపత్రాల బండిళ్ల సీళ్లు తెరవాలని సూచించారు. అనంతరం సీసీ ఫుటేజీలను పరిశీలించి నిబంధనలు పాటించారా? లేదా? అని నిర్ధారణ చేసుకున్నారు. హాల్లోకి సిబ్బంది ఎవరైనా సెల్ఫోన్లతో వచ్చారా? అని కలెక్టర్ పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని సూచించారు. పరీక్షలు ముగిసేంత వరకు అప్రమత్తతతో, పకడ్బందీగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రశ్నాపత్రాలను తప్పనిసరిగా తగిన పోలీసు బందోబస్తు మధ్య కేంద్రాలకు తరలించాలని తెలిపారు. కలెక్టర్ వెంట పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు శంకర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. 49 మంది గైర్హాజరు పదో తరగతి వార్షిక పరీక్షలకు సోమవారం 49 మంది గైర్హాజరైనట్లు డీఈవో పార్శి అశోక్కుమార్ సోమవారం తెలిపారు. మూడో రోజు ఇంగ్లిష్ పరీక్షకు 24,395కు 24,346 మంది హాజరైనట్లు తెలిపారు. 144 పరీక్ష కేంద్రాల్లోని రెండు సెంటర్లను కలెక్టర్, తొమ్మిది డీఈవో, 38 ప్లయింగ్ స్క్వాడ్, మూడు కేంద్రాలలో ఏసీజీఈ తనిఖీలు చేపట్టారు. -
పోలీస్ ప్రజావాణికి 45 ఫిర్యాదులు
నిజామాబాద్ అర్బన్: పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణి కార్యక్రమానికి 45 ఫిర్యాదులు వచ్చాయి. సీపీ సాయి చైతన్య బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సత్వరమే సమస్యలు పరిష్కరించాలని, సంబంధిత పోలీస్స్టేషన్ అధికారులను ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా తమ సమస్యలను వివరించాలని సూచించారు. నిజామాబాద్అర్బన్: నగరంలోని ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను పోలీసులు తిరిగి బాధితులకు అప్పగించారు. 18 మంది బాధితులకు 18 సెల్ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా సీఐ రఘుపతి మాట్లాడుతూ ప్రజలు తమ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. తద్వారా వాటిని గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ కార్యక్రమంలో భాగంగా ‘సైబర్ హైజీన్ ప్రాక్టీసెస్’ పై ఈ నెల 25న వర్క్షాప్ నిర్వహించనున్నారు. తెలంగాణ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్, బిజినెస్ మేనేజ్మెంట్ సెమినార్ హాల్లో ఉదయం 10 గంటలకు వర్క్షాప్ ప్రారంభమవుతుందని ప్రోగ్రాం డైరెక్టర్ రాంబాబు సోమవా రం ఒక ప్రకటనలో తెలిపారు. డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాల నుంచి వ్యక్తిగత సమాచారం రక్షణకు అవసరమైన జాగ్రత్తలు, సురక్షిత ఆన్లైన్ వినియోగం, పాస్వర్డ్ భద్రత, ఫిషింగ్ మోసాలు వంటి అంశాలపై నిపుణులు సూచనలు అందిస్తారని పేర్కొన్నారు. వర్క్షాప్లో పాల్గొనే వారికి క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు, అధ్యాపకులు వర్క్షాప్కు హాజరుకావాలని కోరారు. హామీలను అమలు చేయాలి నిజామాబాద్అర్బన్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని నిరసిస్తూ బీజేపీ నాయకులు సోమవారం కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు. పోలీసులు ముందస్తుగా ప్రధాన నాయకులను అరెస్టు చేయడంతో జిల్లా అధ్యక్షుడితోపాటు పలువురు కలెక్టరేట్కు చేరుకొని ప్రధాన గేటు వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు. అనంతరం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రమోద్ కుమార్, పాలెపురాజు, జ్యోతి, వేణు, అనిల్, ఓంసింగ్, రాజన్న, చింత ప్రసూనారెడ్డి, బొబ్బిలి వేణు తదితరులు పాల్గొన్నారు. సుభాష్నగర్: నగరంలోని శ్రద్ధానంద్ గంజ్లో రైతు సరుకును సంరక్షించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కమీషన్ ఏజెంట్ లైసెన్స్ను మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ఆదేశాల మేరకు తాత్కాలికంగా రద్దు చేసినట్లు సెలక్షన్ గ్రేడ్ సెక్రెటరీ అపర్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏడు రోజులపాటు సదరు కమీషన్ ఏజెంట్ మార్కెట్లో వ్యాపార లావాదేవీలను నిలిపివేశామన్నారు. వ్యాపారులు రైతులు తెచ్చిన సరుకును తూకమయ్యే వరకు జాగ్రత్తతో కాపాడాల్సిన బాధ్యత ఉంటుందని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కమీషన్ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ● రూ.15 వేలు జరిమానా విధించిన కామారెడ్డి కోర్టు కామారెడ్డి క్రైం: బాలికపై లైంగిక దాడికి యత్నించిన నిందితునికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ కామారెడ్డి కోర్టు తీర్పు వెల్లడించింది. వివరాలిలా ఉన్నాయి. ఎల్లారెడ్డి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక 2021 మార్చి 21న పాఠశాలకు సెలవు ఉండటంతో ఇంటిదగ్గరే ఉంది. చాకలి లక్ష్మణ్ అనే వ్యక్తి బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించాడు. బలవంతంగా తన ఇంటికి తీసుకువెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. ఎవరికై నా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. బాలిక ద్వారా విషయం తెలియడంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్లోనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అప్పటి నుంచి కేసు కోర్టు పరిశీలనలో ఉంది. సాక్ష్యాలను పరిశీలించిన జిల్లా జడ్జి సీహెచ్వీఆర్ఆర్ వరప్రసాద్ నేరం రుజువు కావడంతో నిందితునికి 20 సంవత్సరాల కఠిన జైలు శిక్ష, రూ.15 వేలు జరిమానా విధిస్తూ సోమవారం తీర్పునిచ్చారు. కేసును సరైన పద్ధతిలో విచారించిన, కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టిన పీపీ శేషు, పోలీసులను ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు. బ్లాక్ సిలిండర్ల గుట్టురట్టు ● ఒక్క సిలిండర్ను రెండుగా మారుస్తున్న వైనం ● ఆటో, 16 సిలిండర్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు బాన్సువాడ రూరల్: ఒక్క సిలిండర్ గ్యాస్ను రెండుగా, రెండు సిలిండర్ల గ్యాస్ను మూడు సిలిండర్లలోకి మారు స్తున్న బ్లాక్ మార్కెట్ దందా వెలుగులోకి వచ్చింది. సోమ వారం నిజాంసాగర్కు చెందిన వీరభద్ర హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ ఆటోలో కొంతమంది బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీకి వెళ్లే రోడ్డులో ఓ ప్రత్యేక పరికరం ద్వారా ఒక సిలిండర్ గ్యాస్ను రెండింటిలోకి మారుస్తూ కనిపించారు. అలా మార్చిన సిలిండర్లను బ్లాక్లో రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు విక్రయిస్తుండటాన్ని స్థానికులు గమనించడంతో ఆ వ్యక్తులు పారిపోయారు. కాగా, ఎక్కడ దొరికిపోతామనే భయంతో ఆటోను వేగంగా నడిపి ఓ టీవీఎస్ ఎక్సెల్ను ఢీకొట్టారు. అనంతరం ఆటోను వదిలి అక్కడి నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 16 సిలిండర్లతో కూడిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. -
మహిమాన్వితం.. సుభాష్నగర్ శ్రీ రామాలయం
● జిల్లాలో ప్రాముఖ్యత గల దేవాలయం ● నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ● 27న కల్యాణం, 28న రథోత్సవంనిజామాబాద్ రూరల్: జిల్లాలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటిగా నిలుస్తోంది నగరంలోని సుభాష్నగర్ శ్రీరామాలయం. ఈ ఆలయంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణ సమేతుడై భక్తులకు దర్శనమిస్తారు. నిత్య పూజలు, ప్రత్యేక హోమాలు, అభిషేకాలతో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. ప్రధానంగా శ్రీరామనవమి వేడుకలు ఈ ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ నెల 24 నుంచి రామాలయ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 30 వరకు జరిగే విశేష పూజలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్పర్సన్ సరళామహేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి శోభానవీన్రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఉత్సవ కార్యక్రమాలు ఇలా.. 24 మంగళవారం ఉదయం 7 గంటలకు నిత్యారాధన, ధృవమూర్తులకు స్నపన తిరుమంజనం, పంచామృతాభిషేకం, సాయంత్రం 5 గంటలకు నిత్యారాధన, విష్ణు సహస్రనామ పారాయణం, అఖండ దీపారాధన తదితర పూజలు నిర్వహిస్తారు. 25 బుధవారం ఉదయం 7 గంటలకు నిత్యారాధన, యాగశాల ప్రవేశం, ద్వారతోరణ, వాస్తు, సోమ, సుదర్శన, కుంభస్థాపన, అగ్నిప్రతిష్ట, వాస్తు హోమం, గరుడ ప్రతిష్ట, ధ్వజారోహణం(గరుడ వివాహము) బలిహరణం ఉంటుంది. 26 గురువారం 7 గంటలకు నిత్యారాధన, అవాహిత దేవతాపూజ, నిత్యహోమములు, సాయంత్రం 5 గంటలకు నిత్యాహోమం, పారాయణములు, మూల మంత్ర హోమం, ఆరగింపు, బలిహరణం, మంగళాశాసన తీర్థగోష్టి, ఉలుకపూజ(కొట్నం పుణ్యాహవాచనం) నిర్వహిస్తారు. 27న ఉదయం 7 గంటలకు నిత్యారాధన, అవాహిత దేవతాపూజ, నిత్యహోమం, పారాయణములు, 9 గంటలకు ఎదుర్కోలు, శ్రీ సీతారాముల కల్యాణం, సాయంత్రం నిత్యారాధన, నిత్యహోమం విశేష పూజలు ఉంటాయి. 28న ఉదయం 7 గంటలకు నిత్య పూజలతోపాటు సాయంత్రం రథోత్సవం ఉంటుంది. 29న దోపు ఉత్సవం, చక్రతీర్థం, గరుఢధ్వజ అవరోహణం, ఏకాంతసేవ, 30న స్వామివారికి మహా సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు. -
ఏఐతో ఔషధ రంగంలో అపార అవకాశాలు
తెయూ(డిచ్పల్లి): ఔషధ రంగంలో కృత్రిమ మేధ ను ఉపయోగించుకొని మరిన్ని ఎక్కువగా ఔషధ ఆవిష్కరణలు సాధించవచ్చని ఐఐటీ హైదరాబాద్ బయోటెక్నాలజీ విభాగం డీన్ ప్రొఫెసర్ నరహరి శాస్త్రి పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘అడ్వాన్సెస్ ఇన్ కెమికల్ బయాలజీ – నవెల్ థెరప్యూటిక్స్’ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజు ల జాతీయ సదస్సు సోమవారం ప్రారంభమైంది. సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొన్న నరహరి శాస్త్రి మాట్లాడుతూ సాంకేతికతలు ఔషధ ఆవిష్కరణను వేగవంతం చేయడంలో, డేటా విశ్లేషణలో, వ్యక్తిగత వైద్యంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. విజ్ఞానశాస్త్ర అభివృద్ధి కోసం ఏఐను వివేకంతో ఉపయోగించుకోవాలని సూచించారు.తెయూ నుంచి కొంతమంది విద్యార్థులను ఇంటర్న్షిప్కు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. చీఫ్ ప్యాట్రన్గా వ్యవహరించిన తెయూ వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు మాట్లాడుతూ ఆరోగ్యరంగ అభివృద్ధికి కెమికల్ బయాలజీ కీలకమన్నారు. ముఖ్యంగా పరిశోధనలకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. సీఎస్ఐఆర్–ఐఐసీటీ (హైదరాబాద్) చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సురేశ్బాబు మాట్లాడుతూ.. దైనందిన జీవింతో సంప్రదాయ వైద్యం ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. మూలికా ఔషధాలలో జరిగే కల్తీ ఉత్పత్తులను ఎలా గుర్తించాలనే విషయాలపై అవగాహన కల్పించారు. సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ అడెపు రాజు మాట్లాడుతూ కెమికల్ బయాలజీ ఆధారిత పరిశోధనలపై విద్యార్థులు దృష్టి సారించాలని సూచించారు. సదస్సుకు ఆర్గనైజింగ్ సెక్రెటరీగా డాక్టర్ సత్యనారాయణ, ఆర్గనైజింగ్ చైర్పర్సన్గా డాక్టర్ శిరీష బోయపాటి, కన్వీనర్గా డాక్టర్ వాసం చంద్రశేఖర్ వ్యవహరించారు. సదస్సులో వివిధ యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థల నుంచి వచ్చిన విద్యార్థులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, వర్సిటీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ సదస్సులో ప్రముఖ శాస్త్రవేత్తలు -
54 ఏళ్ల తర్వాత..
నిజామాబాద్ రూరల్: నగరంలోని ఆర్యసమాజంలో రాధాకృష్ణ పాఠశాల 1972–73 ఏడో తరగతి మొదటి బ్యాచ్ విద్యార్థులు స్వర్ణోత్సవాలు ఆదివారం నిర్వహించారు. 54 సంవత్సరాల తర్వాత విద్యార్థులందరూ ఒక్కచోట కలిశారు. సమ్మేళనంలో విద్యార్థుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో రాధాకృష్ణ పాఠశాల అధ్యక్షుడు సూర్యప్రకాష్, కార్యదర్శి నా రాయణ, ప్రధానోపాధ్యాయులు సునీత, పాత ప్రధానోపాధ్యాయులు ఎంపీ రాజులు, ఉపాధ్యాయులు శంకర్ను సన్మానించారు. సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు -
గల్ఫ్ బోర్డు కావాల్సిందే..
● యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో మరింత బలపడుతున్న డిమాండ్ ● భారత ప్రభుత్వం ఆ దిశగా ముందుకెళ్లాలంటున్న వలస కార్మికులు ● గల్ఫ్లో భద్రతపై సాగుతున్న చర్చప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయలేదు నేను 15 రోజుల క్రితం దుబాయ్ నుంచి వచ్చాను. గత ఆదివారం మా కజిన్ అక్కడి నుంచి వచ్చాడు. యుద్ధం నేపథ్యంలో భారతీయులను తరలించేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయలేదు. రెగ్యులర్గా వచ్చే విమానాల్లోనే సొంత ఖర్చులతో తిరిగి వస్తున్నారు. అమెరికా దుందుడుకు వైఖరి కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది. – సుతారి సత్యం, గల్ఫ్ రిటర్నీసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వలస కార్మికుల సంక్షేమానికి సంబంధించిన డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి సుమారు 15 లక్షల మందికి పైగా కార్మికులు గల్ఫ్, ఇజ్రాయిల్ దేశాలకు వలస వెళ్లారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి 3 లక్షల మంది వరకు ఆయా దేశాల్లో పనిచేస్తున్నారు. వసల కార్మికుల వీరి సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా యుద్ధం నెలకొనడంతో గల్ఫ్లో భద్రత విషయమై మరోసారి చర్చ జరుగుతోంది. యుద్ధానికి ఐదు రోజులు విరామం ఇస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించినప్పటికీ పూర్తిగా అనుమానాలు తొలగిపోలేదు. ఇదిలా ఉండగా పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో తాజాగా సోమవారం పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడారు. యుద్ధం కారణంగా ప్రపంచంపై తీవ్ర ప్రభావం ఉందని, భారత్కు ఈ యుద్ధం ఎన్నో సవాళ్లు తీసుకొచ్చిందని మోదీ అన్నారు. గల్ఫ్లో కోటి మంది భారతీయులు ఉన్నారని, వారిని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. భారతీయుల కోసం హెల్ప్లైన్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే 3.75 లక్షల మందిని సురక్షితంగా భారత్కు తరలించినట్లు ప్రధాని పేర్కొన్నారు. అదేవిధంగా ఇరానన్ నుంచి వెయ్యి మందిని తరలించామన్నారు. ప్రతిరోజూ పశ్చిమాసియాలోని దేశాల అధ్యక్షులతో మాట్లాడుతున్నానని మోదీ పేర్కొన్నారు. యుద్ధం ఆపేందుకు తనవంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అయితే గల్ఫ్లో పనిచేస్తున్న కార్మికుల కోసం కేంద్రప్రభుత్వం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇజ్రాయిల్లోని భారత ఎంబసీ సక్రమంగా స్పందించడంలేదని పలువురు అంటున్నారు. టోల్ఫ్రీ నంబర్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంలో ఆలస్యం అయిందని పలువురు గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. -
రైల్వే ప్రాజెక్టులపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలి
సుభాష్నగర్: ఉత్తర తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టులపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఆయన కలిసి విన్నవించారు. నిజామాబాద్ జంక్షన్లో పిట్లైన్, కోచింగ్ డిపో ఏర్పాటు, పలు రైళ్ల పొడిగింపు, పెండింగ్లో ఉన్న ప్రతిపాదనలకు ఆమోదం వంటి అంశాలు ప్రాంతీయ అభివృద్ధికి ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా నవీపేట్, ఇందల్వాయి వద్ద ఆర్వోబీలు, డిచ్పల్లి, అక్కన్నపేట వద్ద ఆర్యూబీ నిర్మాణాల ప్రక్రియను వేగవంతం చేయాలని, జానకంపేట్ వద్ద ఆర్యూబీ, రైళ్ల పొడిగింపు, నిజామాబాద్, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్ మీదుగా తిరుపతికి రైళ్లు, నిజామాబాద్ మీదుగా వందే భారత్ ట్రైన్లను త్వరితగతిన అమలు చేయాలని కోరారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని ఎంపీ అర్వింద్ రైల్వే మంత్రిని కోరారు. తన విన్నపం మేరకు ఎడపల్లి వద్ద ఆర్వోబీ, డిచ్పల్లిలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఆర్మూర్ – ఆదిలాబాద్ రైల్వేలైన్ పనులు మంజూరు చేయడంపై రైల్వే మంత్రికి ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. విద్యాశాఖ అధికారిణిపై కలెక్టర్ సీరియస్! ఖలీల్వాడి: జిల్లా విద్యాశాఖలో పని చేస్తున్న అధికారిణిపై కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్ అయినట్లు తెలిసింది. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల వివరాలను కలెక్టర్ అడగగా.. సూపరింటెండెంట్ తన వద్ద వివరాలు లేవని సమాధానమిచ్చారు. ఎవరికి సమాచారం ఉంటుందని ప్రశ్నించిన కలెక్టర్.. ఓ ఉన్నతాధికారిణిని పిలిపించి వివరాలు అడగగా ఆమె చెప్పకపోవడంతో అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వివరాలు తెలియకుంటే ఇక్కడ ఎందుకు ఉన్నారు.. వెళ్లిపోండి అంటూ కలెక్టర్ మండిపడ్డినట్లు సమాచారం. -
సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి
జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న సీపీ సాయిచైతన్య నిజామాబాద్ అర్బన్: స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ప్రతిరోజూ స్మరించుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల ప్రాణత్యాగానికి గుర్తుగా కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వశాఖ మేరా యువ భారత్ ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ మైదానంలో సీపీ జెండా ఊపి ప్రారంభించారు. ప్రాణ త్యాగానికి మించిన గొప్ప త్యాగం మరోటి ఉండదని, వేలాది మంది దేశంకోసం తమ ప్రాణాలను విడిచారన్నారు. జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్, మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ, సిబ్బంది పాల్గొన్నారు. -
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు
నిజామాబాద్అర్బన్: విధులను నిర్లక్ష్యం చేస్తే సస్పెన్షన్తోనే సరిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. ప్రజావాణి అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షల సందర్భంగా ఇటీవల ఓ ఎస్జీటీ వ్యవహరించిన తీరును కలెక్టర్ ప్రస్తావించారు. బాధ్యతాయుతమైన విధుల్లో కొనసాగుతూ, విద్యార్థుల భవిష్యత్కు నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించడం శోచనీయమని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్తో పాటు సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. ప్రతి నివాస ప్రాంతానికి ప్రజల అవసరాలకు సరిపడా శుద్ధ జలాలు సరఫరా అయ్యేలా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. అవసరమైన చోట్ల చిన్నచిన్న మరమ్మతులను వెంటనే చేయించాలని, పైప్ లైన్ లీకేజీలను యుద్ధప్రాతిపదికన నివారించాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చే స్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో స్పష్టమైన పురోగతి సాధించేలా చొరవ చూపాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసుకునేలా లబ్దిదారులను ప్రోత్స హించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, డీఆర్డీవో సాయాగౌడ్, ఆర్డీవో రాజేంద్ర కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. సస్పెన్షన్తో సరిపెట్టేది లేదు.. ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణలో అవకతవకలకు తావివ్వొద్దు ప్రతి ఇంటికీ శుద్ధ జలాలు అందించండి సమీక్ష సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ట్రిపుల్ ఐటీ ప్రవేశానికి వేళాయే..
● మే 10 వరకు దరఖాస్తులకు గడువు ● సెలెక్షన్ లిస్టు మే 30.. జూన్ 5న కౌన్సెలింగ్ ● పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు సువర్ణావకాశం కమ్మర్పల్లి: రాజీవ్ గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్టీయూకేటీ) పరిధి బాసర ట్రిపుల్ ఐటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆరేళ్ల బీటెక్ సమీకృత కోర్సులో చేరేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ట్రిపుల్ ఐటీలో 85 శాతం సీట్లు స్థానికంగా, 15 శాతం మెరిట్ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు కేటాయించారు. జీపీఏ ఆధారంగా అడ్మిషన్లు.. పదో తరగతిలో మార్కుల ఆధారంగా మెరిట్ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తారు. నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారి జీపీఏకు 0.4 డిప్రెవేషన్ స్కోరును అదనంగా కలుపుతారు. ఆర్జీయూకేటీ గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదించిన ప్రకారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుకు నాలుగు మార్కుల చొప్పున కలుపుతారు. ప్రవేశాల షెడ్యూల్ ఈ నెల 18 నుంచి మే 10 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నారు. దివ్యాంగులు, సైనిక ఉద్యోగుల పిల్లలు, ఎన్సీసీ, స్పోర్ట్స్,గ్లోబల్ కేటగిరికి చెందినవారికి మే 20 వరకు ద రఖాస్తు చేసుకోవచ్చు. మే 30న ఎంపికై న విద్యార్థుల జాబి తా ప్రకటించి, జూన్ 5న తొలి విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అర్హతలు.. విద్యార్థులు తొలి ప్రయత్నంలో 2026–ఎస్సెస్సీ, తత్సమాన పరీక్షలో రెగ్యులర్గా ఉత్తీర్ణులై ఉండాలి. 31.12.2026 నాటికి 18 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 21 ఏళ్లు నిండకూడదు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6, బీసీ(ఏ) 7, బీసీ(బీ) 10, బీసీ(సీ) 1, బీసీ(డీ) 7, బీసీ(ఈ)లకు 4 శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది. దరఖాస్తు ఇలా.. అభ్యర్థులు ఈ సేవ, మీ సేవ, టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా ఆర్జీయూకేటీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ. 500, ఎస్సీ, ఎస్టీలకు రూ. 450, వేరే రాష్ట్రాల వారు రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువసార్లు దరఖాస్తు చేసుకుంటే చివరగా చేసుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకుంటారు. దివ్యాంగులకు 3 శాతం, సైనికోద్యో గుల పిల్లలకు 2, ఎన్సీసీలో ఒక శాతం, స్పోర్ట్స్ కోటా కింద 0.5 శాతం సీట్లను భర్తీ చేస్తారు. 33.33 శాతం సీట్లను సమాంతరంగా బాలికలకు కేటాయిస్తారు. జత చేయాల్సిన పత్రాలు.. దరఖాస్తు రశీదు, పదో తరగతి హాల్ టికెట్, మార్కుల లిస్టు, నివాసం, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల కుల ధ్రువీకరణ పత్రాలు, దివ్యాంగులైతే వైకల్య నిర్ధారణ పత్రాలు, సైనికో ద్యోగుల పిల్లలు సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రం, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. ఫీజులు ఇలా.. రాష్ట్ర పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఏడాదికి రూ. 36 వేల ఫీజు చెల్లించాలి. ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులైన వారు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రవేశ సమయంలో ఆరోగ్య బీమా, ఇతరాలకు సంబంధించి రూ. 3,500 ఇతరులకు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.3,000 చెల్లించాలి. క్యాషన్ (దీనిని తిరిగి ఇస్తారు) డిపాజిట్ కింద ఏ కేటగిరీ అభ్యర్థులైనా రూ. 2,000 చెల్లించాలి. ఎంపికై న విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యాలతోపాటు రెండు జతల యూనిఫాం, షూ, ల్యాప్టాప్, ఇతర సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తారు. -
దేశాన్ని సుస్థిరంగా ఉంచడానికే బీజేపీ కృషి
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారతదేశాన్ని సుస్థిరంగా ఉంచడానికి బీజేపీ కృషి చేస్తోందని పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. మండల కేంద్రంలోని ఎస్పీఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో ఆదివారం పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ్ ప్రశిక్షణ మహాభియాన్ కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతుల ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి దినేష్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరై, శిక్షణ తరగతులను ప్రారంభించారు. అంతకుముందు పార్టీ జెండాను ఆవిష్కరించి, మాట్లాడారు. పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని క్షేత్ర స్థాయిలో బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యుద్ధ వాతావరణం నెలకొన్న సందర్భంగా నరేంద్ర మోదీ ముందుచూపుతో దేశానికి ఎలాంటి విపత్తు రాకుండా ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకున్నాడన్నారు. రానున్న స్థానికసంస్థల ఎన్నికల్లో విజయం సాధించడానికి ఈ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయన్నారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కార్యకర్తలకు ఎల్లప్పుడు అందుబాటులో అండగా ఉంటున్నారని తెలిపారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక అసెంబ్లీ స్థానాలు గెలిచి బీజేపీ అధికారం చేపట్టే దిశగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో పార్టీ పటిష్టంగా ఉందన్నారు. జాతీయ పసుపుబోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, జిల్లా ఇన్చార్జి మురళీధర్గౌడ్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంకర్ లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు, కార్పొరేటర్ ప్రమోద్, మాజీ ఎంపీపీ గద్దె భూమన్న, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పానుగంటి సతీష్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు చంద్రకాంత్, నాయకులు చౌకి లక్ష్మణ్, రవిగౌడ్, నక్క రాజేశ్వర్, నాయిడి రాజన్న, కేపీరెడ్డి, సురేష్, విఠల్, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
జాతరకు వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల ● చీనూర్లో తాళం వేసిన ఇంట్లో చోరీ నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలకేంద్రం గోపాల్పేటలో జరుగుతున్న జాతర ఉత్సవాలకు వెళ్లొచ్చేసరికి దొంగలు ఓ ఇల్లును గుల్ల చేశారు. నాగిరెడ్డిపేట మండలం చీనూర్ గ్రామానికి చెందిన బోయిని సురేష్ శనివారం రాత్రి తన ఇంటికి తాళం వేసి గోపాల్పేటలో జరుగుతున్న నల్లపోచమ్మ జాతరకు వెళ్లాడు. ఆదివారం వేకువజామున సురేష్ తన ఇంటికి వచ్చే చూసేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండడాన్ని గుర్తించాడు. వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాతాళం పగులగొట్టి ఉంది. బీరువాలోని 6మాసాల బంగారు కమ్మలు, 9తులాల వెండి కాళ్లపట్టీలు, 5తులాల వెండి కడియాలు, 2తులాల చేతి ఉంగరాలతోపాటు రూ.20వేల నగదును గుర్తుతెలియని వ్యక్తులు అపహారించుకుపోయినట్లు తెలిపాడు. ఈమేరకు నాగిరెడ్డిపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. ఎస్సై భార్గవ్గౌడ్ ఘటనస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గోపాల్పేటలో శనివారం రాత్రి జరిగిన జాతరలో ఓ బైక్ అపహారణకు గురైంది. లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డికి చెందిన పోతరాజు బాబు తన ఫ్యాషన్ప్రో బైక్పై కుటుంబసభ్యులతో కలిసి గోపాల్పేట జాతరకు వచ్చాడు. కాగా తన బైక్ను రోడ్డు పక్కన గల పెట్రోల్బంకు పక్కన పార్క్చేసి ఉత్సవాలను చూసేందుకు ఆలయం వద్దకు వెళ్లాడు. కాగా ఆదివారం వేకువజామున రాజు పెట్రోల్బంకు వచ్చిచూడగా తన బైక్ కనిపించలేదు. దీంతో తన బైక్ను గుర్తుతెలియని వ్యక్తులు అపహారించుకుపోయాలని పేర్కొంటూ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపారు. -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
వేల్పూర్: మండలంలోని మోతె హైస్కూలులో 2001–02 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈసందర్భంగా చిన్ననాటి మిత్రులందరూ ఏళ్ల తర్వాత మళ్లీ ఒక్కచోట కలవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకుంటూ ఆనాటి తీపి గుర్తులను నెమరు వేసుకున్నారు. అనంతరం నాడు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను కార్యక్రమానికి ఆహ్వానించి సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, విందులతో ఆనందంగా గడిపారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారులపై కుక్కల దాడి
దోమకొండ: మండలంలోని చింతమాన్పల్లి గ్రామంలో ఆదివారం ఇద్దరు చిన్నారులపై కుక్కలు దాడి చేయగా, వారు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు హర్షిని, జాహ్నవిల తల్లిదండ్రులు తమ ఇంటి దగ్గరలోని ఖాళీ స్థలంలో మొక్కజొన్న కంకులకు ఒలుస్తున్నారు. దీంతో వీరు ఇంటి నుంచి ఆడుకుంటూ తమ తల్లిదండ్రుల వద్దకు వెళుతుండగా, కుక్కలు రోడ్డుపై వెంటపడి వీరిని తీవ్రంగా గాయపర్చాయి. హర్షినికి కంటిపై తీవ్ర గాయాలు కాగా, జాహ్నవికి కాలుపై గాయాలైయ్యాయి. దీనిని గమనించిన వీరి తండ్రి నారం యశ్వంత్ వెంటనే చికిత్స కోసం ముందుగా కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని నీలోఫల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి బాగానే ఉందని గ్రామస్తులు తెలిపారు. కాగా చిన్నారులను గాయపర్చిన కుక్కలను గ్రామస్తులు కర్రలతో దాడి చేసి చంపివేశారు. రోజురోజుకు గ్రామల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని వీటి నివారణకు అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముబారక్ నగర్కు చెందిన అటకారి సాగర్ ఈ నెల 20 నుంచి కనబడుట లేదని రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్ తెలిపారు. జిల్లాకేంద్రంలో పని ఉందని చెప్పి అతడు వెళ్లాడని ఇప్పటికీ తిరిగి రాలేదని అన్నారు. అప్పల బాధతో సాగర్ ఎక్కడికై న వెళ్లి ఉండవచ్చని అతని భార్య అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో వివరించారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని మర్కల్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై ఆదివారం దాడి చేసి పేకాడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి రూ.13,910, 4బైక్లు, 5సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈసందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గ్రామాల్లో ఎక్కడైన పేకాట ఆడుతున్నట్లు తెలిస్తే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. -
హిందూ ధర్మ రక్షణకు ఐక్యంగా ముందుకెళ్లాలి
బోధన్: హిందూ ధర్మం, సంస్కృతి పరిరక్షణకు ఐక్యంగా ముందుకెళ్లాలని కామారెడ్డి జిల్లా బిచ్కుంద సంస్థాన మఠాధిపతి షట్స్థల బ్రహ్మ సద్గురు సోమలింగ శివాచార్య మహాస్వామిజీ అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా పట్టణంలోని గంజ్ రోడ్లో గల రాధాకృష్ణ మందిరం (సాయిబాబా ఆలయం) ప్రాంగణంలో ఆదివారం హిందూ సమ్మేళనం నిర్వహించారు. స్వామీజీ ముఖ్య అథితిగా విచ్చేసి, ప్రవచనాలు చేశారు. చిరుప్రాయం నుంచే తమ పిల్లలను ఆధ్యాత్మిక మార్గంలో నడిచే విధంగా చూడాలన్నారు. ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ సహ చాలక్ పాలేటి వెంకట్రావు, ఆర్య వైదిక ధర్మప్రచారక్ ఉత్తూరు పద్మ మాట్లాడుతూ.. హిందూ బంధువులందరూ ధర్మ రక్షణకు ఐక్యతను, సమరసతను చాటాలన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రస్థానం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హిందూ సమ్మేళన కార్యక్రమం కొనసాగుతున్నాయని వెంకటరావు తెలిపారు. విశ్రాంత తహసీల్దార్ మురహరి, కమిటి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
చికెన్ ధరలు!
రికార్డ్ స్థాయికి● కిలో ధర రూ.400కు చేరువలో.. ● సామాన్యుడు కొనలేని పరిస్థితి డొంకేశ్వర్(ఆర్మూర్): చికెన్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా నిలకడగా ఉన్న ధరలు ఒక్కసారిగా పెరగడంతో మాంసాహార ప్రియులు కొనలేకపోతున్నారు. మొన్నటి వరకు కిలో చికెన్ రూ.200 ఉండగా, ప్రస్తుతం రూ.390వరకు పెరిగి రూ.400కు చేరువలో ఉంది. బాయిలర్ లైవ్ కోడి రూ.220 వరకు ఉంది. గడిచిన పదేళ్లలో ఇదే రికార్డు స్థాయి ధర కాగా.. సామాన్యులు కొనేందుకు రాకపోవడంతో చికెన్ సెంటర్లు వెలవెలబోతున్నాయి. వేసవి తాపం పెరగడంతో ఫారాల్లో కోళ్ల మరణాల రేటు పెరిగిందని, మార్కెట్కు సరఫరా గణనీయంగా తగ్గినట్లు చికెన్ సెంటర్ల నిర్వాహకులు అంటున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా కోళ్లు సరిగ్గా మేత తినక ఆశించిన స్థాయిలో బరువు పెరగడం లేదని, సాధారణంగా 2.5కేజీలు ఉండాల్సిన కోడి ప్రస్తుతం 1.5కేజీల వరకే ఉంటోందని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. అలాగే రంజాన్ మాసం కావడంతో చికెన్కు డిమాండ్ విపరీతంగా పెరిగిందని చెప్పొచ్చు. ఇటు మటన్ ధరలు కూడా కిలో రూ.800 నుంచి రూ.1,000 ఉండగా... చికెన్ ధర కిలో రూ.400 వరకు చేరువ కావడంతో సామాన్యులు, మాంసాహార ప్రియులు ఆదివారం వస్తే చాలు కొనేందుకు జంకుతున్నారు. కోడి గుడ్ల ధరలు (ఒక్కటి రూ.5) మాత్రం అందుబాటులో ఉన్నాయి. ఇంతటి ధర ఎప్పుడూ చూడలేదు చికెన్ ధరలు ఇంతలా పెరగడం నేను ఎప్పుడూ చూడలేదు. కిలో రూ.200 ఉంటేనే సామాన్యులు ఆలోచించి కొన్నారు. ఇప్పుడు కిలో రూ.400 వరకు చేరడంతో అసలు కొనడం లేదు. దీంతో చికెన్ సెంటర్లకు గిరాకీ తగ్గింది. ఇప్పట్లో చికెన్ ధరలు తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. – సుంకరి నాగరాజు, చికెన్ సెంటర్ నిర్వాహకుడు, డొంకేశ్వర్ -
పైళ్లెన నెలకే.. అనంతలోకాలకు..
క్రైం కార్నర్● కవలల దినోత్సవం రోజునే ఒక్కటైన జంట కవలలు ● అనుమానాస్పదస్థితిలో ఒకరు మృతి మాచారెడ్డి: కవల జంటల పెళ్లితో ఆ ఇంట్లో వెల్లివిరిసిన ఆనందం ఒక్కసారిగా ఆవిరైంది. వివాహం జరిగిన నెలకే అన్నదమ్ముల్లో ఒకరు అనుకోని పరిస్థితుల్లో మృత్యువాతపడడంతో రెండు కుటుంబాల్లో పెను విషాదం అలుముకుంది. వివరాలు ఇ లా.. మండలంలోని ఘన్పూర్(ఎం) గ్రామానికి చెందిన కవలలైన విజయ్కుమార్, వినయ్కుమా ర్ల వివాహం గత నెల 22న తాడ్వాయి మండలం దేమెకలాన్ గ్రామానికి చెందిన కవలలైన అక్కా చెల్లెళ్లతో పెళ్లి జరిగింది. కవలల దినోత్సవం నాడే వారి వివాహం జరగడంతో సామాజిక మాధ్యమాల్లోనూ వారు వైరల్ అ య్యారు. ఇదిలా ఉండగా కవలల్లో చిన్నవాడైన వినయ్కుమార్ (31) శుక్రవా రం రాజన్న సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట మండ లం ఎగువ మానేరులో శవమై కనిపించాడు. ప్రమా దవశాత్తు అందులో పడి ఉంటాడని భావిస్తున్నారు. విషాదంలో కుటుంబం.. చిన్నతనంలో తండ్రిని కోల్పోయిన గడ్డు పరిస్థితుల్లో తల్లి సుజాత అన్నీ తానై ఐదుగురు పిల్లల్ని(నలుగురు కుమారులు, ఒక కూతురు) చదివించింది. సోదరులు చదువులో ముందు వరుసలో ఉంటూ ఉద్యోగాలు సాధించారు. అమ్మాయిని చదివించి పెళ్లి చేశారు. తర్వాత కవలలైన విజయ్కుమార్, వినయ్కుమార్ల వివాహం జరిపించేందుకు కవలలైన అక్కాచెల్లెల్లను వెదికి పెళ్లి చేశారు. ఎంతో ఆనందంగా ఉన్న ఆ ఇంట్లో వినయ్ మృతితో ఇప్పుడు తీరని వేధన మిగిలింది. హృదయవిధారకంగా మారిన ఆ ఇంటి పరిస్థితులను చూసిన గ్రామస్తులు, బంధువులు కంటతడిపెట్టారు. శనివారం ఘన్పూర్(ఎం) గ్రామంలో జరిగిన అంత్యక్రియల్లో వందలాది మంది పాల్గొన్నారు. -
ఆపన్న హస్తం అందించరూ!
ఆర్మూర్: పట్టణానికి చెందిన ఓ మహిళ బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వెంటనే ఆమె కు సర్జరీ చేయాలని, అందుకు రూ.25లక్షల వర కు అవసరం అవుతాయంటూ వైద్యులు పేర్కొనడంతో నిరుపేదలైన బాధితురాలి కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దాతలు స్పందించి, సహాయం అందించాలని వారు వేడుకుంటున్నా రు. వివరాలు ఇలా.. ఆర్మూర్లోని రాజారాం నగర్కు చెందిన మాదాస్తు హేమలతకు భర్త జగన్, కుమారుడు, కూతురు ఉన్నారు. ఉగాది పర్వదినం రోజు హేమలత తలనొప్పితో ఇంటి ఆవరణలో పడిపోయింది. వెంటనే ఆ కుటుంబ సభ్యులు ఆర్మూర్లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, మెరుగైన చికిత్స కోసం జిల్లాకేంద్రానికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ వైద్యులు పరీక్షించి ఆమె తలలోని మూడు నరాలలో బ్లడ్ క్లాట్ అవుతుందని వెంటనే హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. దీంతో హేమలతను సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి జాయిన్ చేశారు. వైద్యులు పరీక్షించి వెంటనే బ్రెయిన్ సర్జరీ చేయాలని, సుమారు రూ.25 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. దీంతో ఆ నిరుపేద కుటుంబం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. ఆర్థిక సాయం చేయాలంటూ దాతల కోసం బాధిత కుటుంబీకులు ఎదురుచూస్తున్నారు. సహాయం చేయదలచిన వారు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అకౌంట్ నంబర్: 05122320000771, ఐఎఫ్సీ:హెచ్డీఎఫ్సీ0000512కి డబ్బులు పంపవచ్చు. లేదా 8074755223 నంబర్కు ఫోన్ పే చేయాలని బాధిత కుటుంబీకులు వేడుకుంటున్నారు. ఆర్మూర్కు చెందిన మహిళకు బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ కోసం రూ.25లక్షలు అవసరం దాతల కోసం కుటుంబీకుల ఎదురుచూపులు -
పటిష్ట బందోబస్తు
నిజామాబాద్ అర్బన్: జిల్లాలో రంజాన్ పండుగను శనివారం ముస్లింలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈద్గాల వద్ద వారు ప్రత్యేక ప్రార్థలు నిర్వహించగా, పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. నగరంలోని ఖిల్లా ఈద్గాను సీపీ సాయిచైతన్య పరిశీలించారు. ముస్లింలు ప్రత్యేక ప్రార్థన లు చేసే ప్రాంతం వద్ద బందోబస్తును పరిశీలించారు. సీపీ మాట్లాడుతూ.. రంజాన్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, భారీగా పోలీసు బలగాలను మోహరించామన్నారు. అంతకుముందు నగరంలోని ముస్లింలకు అర్బన్ ఎమ్మె ల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మేయర్ ఉమారాణిలు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. -
రేకులపల్లిలో దొంగల బీభత్సం
● తాళం వేసిన ఇళ్లల్లో చోరీ ధర్పల్లి: మండలంలోని రేకులపల్లి గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలో తాళం వేసి ఉన్న ఆరు ఇళ్లల్లో గుర్తుతెలియని దుండగులు చోరబడగా, మూడిళ్లలో చోరీకి పాల్పడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామంలో గుర్తుతెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి ప్రవేశించి, తాళం వేసి ఉన్న ఆరు ఇళ్ల తాళాలను పగులగొట్టారు. మూడు ఇళ్లలో చోరీ చేశారు. శనివారం ఉదయం ఆయా ఇళ్ల తలుపులు తెరిచి ఉండటాన్ని స్థానికులు గమనించి బాధిత కుటుంబాలకు సమాచారం అందించారు. వెంటనే బాధిత కుటుంబాలు ఇళ్లకు చేరుకొగా, ఇంట్లోని వస్తువులు చిందరవందరగా కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. బాధితులు పోలీసుల ఫిర్యాదు చేయడంతో ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై శ్రీనివాస్ చోరీ జరిగిన తీరును పరిశీలించారు. మూడు ఇళ్లలో కలిసి రెండున్నర తులాల బంగారు ఆభరణాలతోపాటు కొంత నగదును ఎత్తుకెళ్లినట్లు ఎస్సై తెలిపారు. మరో మూడు ఇళ్లలో చోరీకి ప్రయత్నించిన ఎలాంటి వస్తువులు పోలేవని ఎస్సై పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. ఒకరు ధ్వంసం.. మరొకరు చోరీ బోధన్టౌన్(బోధన్): పట్టణంలోని గోషాల రోడ్డులో పార్కింగ్ చేసిన కారులోనుంచి శుక్రవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు రూ.3లక్షల నగదు చోరీకి పాల్పడిన విషయం విధితమే. ఈ ఘటన దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో రికార్డవగా, శనివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చోరీకి పాల్పడింది ఇద్దరు వ్యక్తులుగా తెలుస్తోంది. మొదట ఒక వ్యక్తి హెల్మెట్ ధరించి, బైక్పై వచ్చి కారు అద్దాలను ధ్వంసం చేసి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి మరో గుర్తుతెలియని వ్యక్తి కారు వద్దకు వచ్చి కారులోని నగదు అపహరించారు. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా.. ఇద్దరు వ్యక్తులు చోరీకి పాల్పడ్డారని, ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టామని తెలిపారు. పేకాడుతున్న ఆరుగురి అరెస్టు నవీపేట: మండలంలోని జగ్గారావ్ ఫారమ్ గ్రామ శివారులోగల పేకాట స్థావరంపై శనివారం సాయంత్రం దాడి చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. పేకాడుతున్న ఆరుగురిని పట్టుకున్నట్లు వివరించారు. అలాగే వారి వద్ద నుంచి రూ. 3090 నగదు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. -
జాతరకు వచ్చి ..
● పోచారం శివారులోని కాలువలో మునిగి ఒకరి మృతి నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలకేంద్రం గోపాల్పేటలో జరిగే జాతరకు వచ్చిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు పోచారం ప్రధానకాలువలో మునిగి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మెదక్ జిల్లా హావేలి ఘన్పూర్ మండలం తిమ్మాయిపల్లికి చెందిన శగారి శ్రీధర్గౌడ్(33) అనే వ్యక్తి శుక్రవారం గోపాల్పేటలో జరుగుతున్న జాతరకు వెళ్తున్నాని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. రాత్రయినా అతను ఇంటికి చేరకపోవడంతో కుటుంబసభ్యులు ఫోన్చేయగా ఫోన్ స్విచ్ఛాప్ వచ్చింది. కాగా మండలంలోని పోచారం గ్రామశివారులోగల పోచారం ప్రధానకావలువ మెట్లపై మొబైల్ఫోన్ ఉన్నట్లు గ్రామస్తులు నాగిరెడ్డిపేట పోలీసులకు శనివారం సమాచారం ఇచ్చారు. ఇదేసమయంలో విషయం తెలుసుకున్న శంకర్గౌడ్ కుటుంబసభ్యులు పోచారం ప్రధానకాలువ వద్దకు చేరుకొని అతని కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డి ఫైర్స్టేషన్కు సమాచారం ఇవ్వగా ఫైర్సిబ్బంది పోచారం చేరుకొని ప్రధానకాలువలో గాలించి శ్రీధర్గౌడ్ మృతదేహాన్ని వెలికితీశారు. జాతరకు వచ్చిన శ్రీధర్గౌడ్ పోచారం వద్దనున్న ప్రధానకాలువలో ప్రమాదశాత్తు కాలుజారి నీటిలోపడి మృతిచెందినట్లు పేర్కొన్నారు. ఈమేరకు మృతుడి తల్లి భూదేవి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపారు. ఇరువర్గాల ఘర్షణ.. 20 మందిపై కేసు వర్ని: పొలం విషయంలో ఇరు వర్గాల వారు ఘర్షణ పడగా, 20 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ధాపూర్ కోకల్దాస్ తండాకు చెందిన హరిలాల్, షంశేరావులు పొలం తమదంటే తమదంటూ కొన్ని సంవత్సరాలుగా ఘర్షణ పడుతుండగా, వివాదం కోర్టులో నడుస్తోంది. ఇదిలా ఉండగా శనివారం పొలం విషయంలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. దీంతో ఇరువర్గాల ఫిర్యాదు మేరకు సుమారు 20 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలు సదాశివ నగర్(ఎల్లారెడ్డి): మండలకేంద్రం శివారులోని 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. మండలంలోని కల్వరాల్ గ్రామానికి చెందిన ఓ ముస్లిం కుటుంబం శనివారం ఆటోలో కామారెడ్డికి బయలుదేరింది. సదాశివనగర్ శివారులోని హైవేపై వారి ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. -
గురుకులాలకు గూడు కరువు
మోర్తాడ్(బాల్కొండ): వెనుకబడిన తరగతుల వి ద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలకు సొంత భవనాల ని ర్మాణం కలగానే మిగిలిపోనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీ గురుకుల పాఠశాలలకు సొంత భవనాలను నిర్మించే అంశంపై ప్రభుత్వం ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు. కాగా, కొత్తగా ఒక్కో నియోజకవర్గానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు, భవనాల నిర్మాణంపైనే ప్రభుత్వం స్పష్ట త ఇచ్చింది. బీసీ గురుకుల పాఠశాలల కోసం 2024–25 బడ్జెట్లో రూ.1,546 కోట్లు కేటాయించి నా ఎక్కడ కూడా నిర్మాణాలను చేపట్టలేదు. స్థల సే కరణ జరుపకపోవడంతో అద్దె భవనాల్లోనే వాటిని కొనసాగిస్తున్నారు. జిల్లాలో మోర్తాడ్, ఎడపల్లి, ఆ ర్మూర్, బాల్కొండ, కుద్వాన్పూర్, బోధన్, శ్రీరాంపూర్, చీమన్పల్లి, నిజామాబాద్లలో బాలుర, బా లికలకు వేర్వేరుగా పాఠశాలలను నిర్వహిస్తున్నారు. 2017–18 విద్యా సంవత్సరంలో బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించగా ఎక్కడ కూడా సొంత భవనాలు లేకపోవడం గమనార్హం. బీఆర్ఎస్ ప్రభు త్వం బీసీ గురుకుల పాఠశాలల ప్రారంభానికి చూి పన ఆసక్తి భవనాల నిర్మాణంపై దృష్టి సారించలే దు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భవనాల నిర్మాణం కోసం నిధులు కేటాయించినా అడుగులు మాత్రం ముందుకు పడలేదు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏ ర్పాటును తెరపైకి తీసుకురావడంతో గురుకుల పాఠశాలలకు సొంత భవనాల నిర్మాణం మరుగునపడినట్లేనా అనే సందేహం నెలకొంది. బడ్జెట్లో నిధులు కేటాయించని రాష్ట్ర ప్రభుత్వం పాత పాఠశాలల ఊసెత్తక.. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుపై ప్రస్తావన గతంలో బీసీ గురుకులాల కోసం నిధులు కేటాయించినా భవన నిర్మాణాలకు పడని అడుగులు -
ఇక రాజీవ్ యువ వికాసమే..
మోర్తాడ్(బాల్కొండ): నిరుద్యోగ యువతకు స్వ యం ఉపాధి కోసం రూపొందించిన రాజీవ్ యువ వికాసం పథకానికి ఎట్టకేలకు నిధుల కేటాయింపు జరిగింది. డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.6 వేల కోట్లను రాజీవ్ యువ వికాసం పథకానికి కేటాయించడంతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నా యి. నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందు కు రాజీవ్ యువ వికాసం పథకానికి 2025లో ప్రభు త్వం భారీ మొత్తంలో దరఖాస్తులను స్వీకరించింది. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొ రేషన్లకు జిల్లాలో 58 వేలకు పైగా దరఖాస్తులు అందాయి. ఆయా సామాజిక వర్గాల వారికి కార్పొ రేషన్ల ద్వారా రాయితీ రుణాలను రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున అందించేందుకు ప్రభుత్వం తొ లుత నిర్ణయించింది. అయితే, అప్పట్లో నిధుల కే టాయింపులు లేకపోవడం, ఇతర సాంకేతిక కారణాలతో పథకం అమలుకు బ్రేక్ పడింది. చిన్న రుణాలకు వంద శాతం రాయితీ... ఈ పథకం ద్వారా రూ.50 వేల వరకు వందశాతం, రూ. లక్ష వరకు ఇచ్చే రుణానికి 90 శాతం, రూ.2 లక్షల వరకు రుణాలకు 80 శాతం, రూ.4 లక్షల వర కు రుణాలకు 70 శాతం రాయితీని ప్రకటించారు. బ్యాంకు లింకేజీ ద్వారానే రుణాలను అందించాలని నిర్ణయించగా రుణ ప్రక్రియ పూర్తి కాగానే రాయితీ సొమ్మును అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అనేక మంది రూ.4 లక్షల వరకు రుణం కావాలని దరఖాస్తులు అందించారు. నిధులు లేకపోవడంతో పథకం అమలు ముందుకు సాగలేదు. తాజాగా రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించడంతో రాజీవ్ వికాసం రాయితీ రుణాలు అందుతాయని యువత ధీమా వ్యక్తం చేస్తున్నారు. పథకానికి బడ్జెట్లో రూ.6 వేల కోట్ల నిధుల కేటాయింపు నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం అందనున్న రుణాలు జిల్లాలో 58 వేలకు పైగా దరఖాస్తుదారులు -
అధ్యయనం.. ఆయన జీవితం
● మన చరిత్ర మూలాలు మనకు తెలియకపోతే మన భవిష్యత్తు శూన్యంగా మిగిలిపోతుంది. చరిత్ర అనేక పాఠాలు, గుణపాఠాలను నేర్పిస్తుంది. భారతీయుల మధ్య ఐక్యత లేని కారణంగా విదేశీయులు మన దేశం మీద దండయాత్రలు చేసి, దేశాన్ని బానిసత్వంలోకి నెట్టేశారు. మళ్లీ భారతీయులంతా ఏకమై పోరాటాలు చేస్తే తప్ప స్వాతంత్రం లభించలేదు. ఆ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకపోతే భవిష్యత్తులో మళ్లీ మనం పరాయి పాలనలోకి వెళ్లడం ఖాయం. భారతీయులందరూ అసత్య అంశాలను కాకుండా వాస్తవ చరిత్రను చదువుకోవాలి. ● స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోవడానికి ప్రధాన కారణం భారతీయులు తమదైన వాస్తవ చరిత్ర తెలుసుకోకపోవడమే. ప్రపంచానికి వస్త్రాలు కట్టుకోవడం తెలియనప్పుడే భారతీయులు వజ్ర వైఢూర్యాలతో కూడిన ఆభరణాలను ధరించారు. వేల సంవత్సరాలుగా చెక్కుచెదరని రాతి నిర్మాణాలు చేశారు. మరుగుదొడ్ల నుంచి మొదలుపెట్టి అంతరిక్ష అధ్యయనం వరకు ప్రతి విషయంలోనూ భారతీయులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే విశేష జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. కానీ, విదేశీ దు రాక్రమణలు, దాడుల్లో ధ్వంసమైన చరిత్ర కారణంగా తమ మూలాలను మర్చిపోయారు. వివిధ వేదికల్లో యాదవరావుకు సత్కారాలు నేను యువకుడిగా ఉన్నప్పటి నుంచి చరిత్ర కోసం నా యొక్క సగం జీతాన్ని ఖర్చు చేయడం మొదలుపెట్టాను. ఈ విషయంలో నా భార్య చేసిన సహకారం గొప్పది. నా ఇద్దరు కుమారులు డాక్టర్ అమృతరావు, ఆనంద్ చరిత్ర పరిశోధన వ్యాసావళి పేరుతో నేను రాసిన మొట్టమొదటి పుస్తకానికి రచన సహకారం అందించారు. కుటుంబ సభ్యుల సహకారంతోనే పదివేలకు పైగా చరిత్ర పుస్తకాలను సేకరించగలిగాను. ఈ పుస్తకాలను కోటగల్లీలోని అశ్మక చరిత్ర గ్రంథాలయానికి ఉచితంగా అందజేశాను. తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్, ఇతిహాస సంకలన సమితి, మహారాష్ట్ర ఇతిహాస్ పరిషత్ లాంటి వివిధ చరిత్ర అధ్యయన సంస్థలలో క్రియాశీలక సభ్యుడిగా పనిచేస్తున్నా. ఆయా సంస్థలు నిర్వహించే వార్షిక కార్యక్రమాలు, అన్ని సెమినార్లలో కచ్చితంగా పాల్గొంటున్నా. ప్రస్తుతం నా వయస్సు 95 సంవత్సరాలు. నా చిన్నతనంలో బ్రిటిష్ ప్రభుత్వ దురాగతాలను, యువకుడిగా ఉన్నప్పుడు నిజాం పాలనలో రజాకార్ల అకృత్యాలను స్వయంగా కళ్లతో చూశాను. వాళ్ల దమనకాండతో నా తల్లిదండ్రులు చాలా భయపడేవారు. భారతీయులు దేశం గురించిన పరాక్రమవంతమైన చరిత్రను తెలుసుకోకపోవడమే ఇలాంటి దుస్థితికి ప్రధాన కారణమని అర్థమైంది. దీంతో చరిత్ర అధ్యయనం చేయడంతోపాటు ఇందూరు ప్రాంతానికి సంబంధించి వాస్తవిక చారిత్రక విషయాలను ఆధారాలతో సహా నిరూపించి భవిష్యత్ తరాలకు అందించాలనే లక్ష్యంతో నా జీవితాన్ని అంకితం చేసి పని చేస్తున్నా. ఇందూరు చరిత్రపై ఇతిహాస సంకలన సమితి ద్వారా చాలా అనేక విషయాలు వెలుగులోకి తెచ్చే అవకాశం కలిగింది. భారతీయ చరిత్రకు ఆధారమైన దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, గ్రంథాలయాలు, గురుకులాలను, మన దేశ జీవన విధాన శైలిని, కుటుంబ వ్యవస్థను నిర్వీర్యం చేయడంలో సఫలీకృతులయ్యారు. పాఠ్యపుస్తకాల్లోనూ అసత్యాలతో కూడిన చరిత్ర చొప్పించారు. ఎంతోమంది పరాక్రమవంతులైన మహారాజులు, చక్రవర్తులను పిరికిపందలుగా, విదేశీ దురాక్రమణదారులను మహా గొప్ప ప్రజాపాలకులుగా తప్పుడు చరిత్రను రాసి తరతరాలుగా మన మెదళ్లలో అసత్యాలను నింపుతూ వచ్చారు. అలాంటి వాటి నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ఇప్పుడు కొన్ని విశేష ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘ఇతిహాస సంకలన సమితి’ చరిత్ర కోసమే పుట్టి, చరిత్ర కోసమే పునరంకితమైన ఒక జాతీయవాద చరిత్ర అధ్యయన సంస్థ. ‘నమూలం లిఖతే కించిత్’. ఆధారాలు లేకుండా దేనినీ రాయకూడదనే ఏకై క సూత్రం ఆధారంగా సుమారు 50 ఏళ్లుగా, దేశంలోని అనేక మరుగున పడిపోయిన చారిత్రక విశేషాలను ఆధారాలతో సహా గుర్తించి నేటి తరానికి అందించడంలో విశేష కృషి చేస్తోంది. సరస్వతి నది పూర్తి అస్తిత్వాన్ని అధ్యయనం చేసి, ఆ నదిని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత కూడా ఇతిహాస సంకలన సమితికే దక్కుతుంది. ఇందూరు జిల్లాలో చరిత్ర పరిరక్షణ కోసం ఇతిహాస సంకలన సమితి నిర్విరామంగా పనిచేస్తోంది. 5 సంవత్సరాలుగా సుమారు 50కి పైగా కార్యక్రమాలు నిర్వహించింది. ప్రస్తుతం ఇందూరు జిల్లా సమగ్ర చరిత్ర అనే పుస్తకాన్ని నిర్మించే పనిలో ఉంది. ఇందూరు జిల్లాకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఇందూరు ప్రాంతం మహనీయుల ద్వారా పరిపాలించబడింది. జిల్లాలోని కందకుర్తి గ్రామంలో స్వయంగా శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో పర్యటించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అలాగే ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ పూర్వీకుల గ్రామం కందకుర్తి అనే విషయం అత్యంత ప్రాచుర్యం పొందాల్సిన అంశం. ఇక గోదావరి, మంజీర, హరిద్ర నదుల త్రివేణి సంగమ ప్రాంతం కావడం గర్వకారణం. కందకుర్తిలో ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేశవ స్మృతి మందిరాన్ని నిర్మిస్తున్నారు. యువత చరిత్రను చదవాలి. అందులోని మంచి చెడు రెండింటినీ వేర్వేరుగా అర్థం చేసుకోవాలి. చరిత్ర నేర్పిన పాఠాలను, ఆనాటి పరిస్థితులను అధ్యయనం చేయాలి. చరిత్ర అంటే బోరింగ్ సబ్జెక్ట్ అనే భావన నుంచి నేటితరాలు బయటకు రావాలి. చరిత్ర లేకుంటే అస్తిత్వమే ఉండదు. స్వాతంత్ర సమరయోధుడిగా అనేక అవార్డులు, సత్కారాలు, గవర్నర్ చేతుల మీదుగా విశేష పురస్కారాలు, పురావస్తు పరిశోధన శాఖ నుంచి పలు అవార్డులు అందుకున్నా. చరిత్రను నేటితరం వ్యక్తుల నుంచి రాబోయే తరం యువతకు అందజేయాలి. ఇదే నా జీవితాశయం. ఇందూరు చరిత్రను ప్రపంచానికి తెలియజెప్పేందుకు జీవితాంతం కృషి అంబేడ్కర్ చెప్పిన మాటను పుణికిపుచ్చుకున్న కందకుర్తి యాదవరావు బ్రిటిష్ దురాగతాలు, రజాకార్ల అకృత్యాలను కళ్లతో చూశా.. నిజమైన చరిత్ర నేటి, భావితరాలకు తెలియాలి ‘సాక్షి’ ఇంటర్వ్యూలో కందకుర్తి యాదవరావు -
పేదలను నట్టేట ముంచేలా రాష్ట్ర బడ్జెట్
నిజామాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పేదలను నట్టేట ముంచి, సకల జనులనూ నిరాశలో నెట్టేసేలా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్పై ఆయన శనివారం నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మాట్లాడారు. ఆరు గ్యారంటీల పేరిట గద్దెనెక్కి.. రైతుల్ని, గల్ఫ్ బాధితుల్ని నట్టేట ముంచారని ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. బడ్జెట్లో గల్ఫ్ బాధితులకు చిల్లిగవ్వ కేటాయించకపోవడం వారికి ద్రోహం చేయడమేనన్నారు. సీఎం రేవంత్రెడ్డి రూ.300 కోట్లు వెచ్చించి మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించలేరా అని నిలదీశారు. మూసీ రివర్కు రూ. 1,500 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఎందుకు కేటాయించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర పిలుపుమేరకు ఈనెల 23న ఉదయం కలెక్టరేట్ ముట్టడి చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి జిల్లాలోని పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొతన్కార్ లక్ష్మీనారాయణ, ఓంసింగ్ నాయ క్, పుట్ట వీరేందర్, బొబ్బిలి వేణు, ఇందూర్ సుధా, గడ్డం రాజు, అంబదాస్ రావు, ఆనంద్, విజయ్, కృష్ణ, బుల్లెట్ శీను తదితరులు పాల్గొన్నారు. ఆరు గ్యారంటీలను పాతరేసిన కాంగ్రెస్ ప్రభుత్వం 23న కలెక్టరేట్ను ముట్టడిస్తాం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి -
హత్య రాజకీయాలను కాంగ్రెస్ సహించదు
ఇందల్వాయి: హత్య రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ సహించదని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అ న్నారు. కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి హ త్య కేసులో నిష్పక్షపాతంగా వి చారణ జరిగేలా చూస్తామని, అతడి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటూ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఇటీవల హత్యకు గురైన ఇమ్మడి గోపి కుటుంబాన్ని ఎమ్మెల్యే భూపతి రెడ్డి డీసీసీ అధ్యక్షుడు నాగేశ్రెడ్డితో కలిసి శనివారం పరామర్శించారు. ఇమ్మడి గోపి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇమ్మడి గోపి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు. ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, సీనియర్ నాయకుడు మునిపల్లి సాయిరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, అమృతపూర్ గంగాధర్ గౌడ్, చింతల కిషన్ నాయకులు పాల్గొన్నారు.● ఇమ్మడి గోపి కుటుంబానికి న్యాయం చేస్తాం ● బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు -
సరికొత్తగా సర్కారు విద్య
ఖలీల్వాడి: రాష్ట్ర బడ్జెట్లో యంగ్ ఇండియా, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఏటీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ తదితర సౌకర్యాలు కల్పించనుండటంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించి బకాయిలకు నిధుల కేటాయింపుల ప్రస్తావన లేకపోవడంపై పెదవి విరుస్తున్నారు. నాలుగు స్కూళ్లకు స్థల సేకరణ పూర్తి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన స్థల సేకరణ కూడా పూర్తి చేశారు. ఒక్కో పాఠశాలకు రూ.200 కోట్ల చొప్పున ఐదు పాఠశాలలకు రూ. వెయ్యి కోట్లు కేటాయించనున్నారు. నిజామాబాద్ రూరల్లో మల్కాపూర్, బోధన్ నియోజకవర్గంలో బెల్లాల్, ఆర్మూర్ నియోజకవర్గంలో అంకాపూర్, బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్లో స్థలం సేకరించగా, నిజామాబాద్ అర్బన్లో స్థల పరిశీలన జరుగుతోంది. జిల్లాలోని ఐదు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో చదువుతున్న 812 మంది విద్యార్థులకు నెలకు రూ.2 వేల చొప్పున స్కాలర్షిప్ అందనున్నది. అంతేకాకుండా ఇందల్వాయి, ఆర్మూర్, వర్నిలో కొత్తగా ఏటీసీలను ఏర్పాటు చేయనున్నారు. నిజామాబాద్, నందిపేట్ పాలిటెక్నిక్ కళాశాలలను ఏటీసీలుగా ఉన్నతీకరించి కొత్త కోర్సులు ప్రారంభించనున్నారు. అదే విధంగా జిల్లాలోని 33 ప్రభుత్వ పాఠశాలలు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా మారనున్నాయి. బకాయిలపై ప్రస్తావన కరువు.. బడ్జెట్లో స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించిన బకాయిలపై ప్రస్తావన రాకపోవడంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు నిరాశ చెందాయి. జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ కళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా సుమారు రూ.200 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. బెస్ట్ అవైలెబుల్ స్కూళ్లకు సుమారు రూ.50 కోట్ల వరకు ప్రభుత్వం బకాయి పడింది. కేటాయింపులు పెంచాలి.. విద్యారంగానికి కేవలం 26,674 కోట్లు (8.2 శాతం) మాత్రమే కేటాయించటం వి ద్యారంగాన్ని విస్మరించడ మే. విద్యా కమిషన్ సూచించిన 18 శాతం నిధుల ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. వి ద్యారంగ అభివృద్ధికి బడ్జెట్లో 20 శాతం నిధులు కేటాయించాలి. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రూ.8500 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. దీనిపై ప్రస్తావన లేదు. – జన్నారపు రాజేశ్వర్, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి, నిజామాబాద్ నిధులు సరిపోవు ప్రభుత్వ బడులు, సంక్షేమ హాస్టళ్లు, జూనియర్ కాలేజీ లు, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీ స్థాయిలలో అభివృద్ధికి ఈ నిధులు ఏమాత్రం స రిపోదు. ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసేలా ప్రభుత్వం విద్యా రంగంపై దృష్టి పెట్టలేదు. – రఘురాం నాయక్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, నిజామాబాద్జిల్లాలో 769 ప్రాథమిక, 132 ప్రాథమికోన్నత, 255 ఉన్నత పాఠశాలలు ఉండగా, వా టిలో లక్షా 90 వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ కొత్తగా బ్రేక్ ఫా స్ట్ పథకాన్ని అమలు చేయనున్నారు. ఉద యం వేళలో రాగి జావ లేదా అల్పాహారాన్ని అందించేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. మరోవైపు కొత్తగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనున్నారు. ఈ పథకం ద్వారా జిల్లాలోని 16 ప్రభుత్వ కళాశాలలు, 71 ప్రభుత్వ సెక్టార్ కళాశాలల్లోని 36,969 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్ చదివే విద్యార్థుల సంఖ్య పెరుగనున్నది. బ్రేక్ఫాస్ట్.. మధ్యాహ్న భోజనం జిల్లాకు ఐదు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా మారనున్న 33 బడులు ప్రీప్రైమరీ నుంచి ఇంటర్ వరకు అల్పాహారం ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు -
ఒకరి అదృశ్యం
రుద్రూర్: పొతంగల్ మండలం జల్లపల్లి ఫారంకు చెందిన రసూల్ ఖాన్ అనే వ్యక్తి అదృశ్యమైనట్లు కోటగిరి ఎస్సై సునీల్ శుక్రవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రసూల్ ఖాన్ ఈ నెల 18న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. రసూల్ ఖాన్ కుమారుడు కై ఫ్ ఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రుద్రూర్: పొతంగల్ మండలం కల్లూరు గ్రామంలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను శుక్రవారం తెల్లవారు జామున పట్టుకున్నట్లు ఎస్సై సునీల్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించిన పోలీసులకు గ్రామంలో కొందరు అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించి ట్రాక్టర్లను పోలీస్స్టేషన్ తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కాపర్ కాయిల్స్ చోరీ నిజామాబాద్ రూరల్: మోపాల్ మండలంలోని సిర్పూర్ శివారులో దుండగులు పంట పొలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి కాపర్ కాయిల్స్ను దొంగిలించారని ఎస్సై సుస్మిత శుక్రవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వెలుమ మహిపాల్ వ్యవసాయ క్షేత్రంలో దుండగులు గురువారం రాత్రి ట్రాన్స్ఫార్మర్ నుంచి కాపర్ కాయిల్స్ను చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై సుస్మిత ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలి
ఆర్మూర్టౌన్: రంజన్ పండుగ సందర్భంగా పార్కింగ్ ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని పోలీస్ అధికారులకు జిల్లా పోలీస్ కమిషనర్ సాయిచైతన్య సూచించారు. ఈద్గా ప్రాంతాల్లో ముస్లింలు సామూహిక ప్రార్థనలు దృష్టిలో ఉంచుకొని శుక్రవారం ఆర్మూర్ శివారు నిజామాబాద్ రోడ్డులో గల ఈద్గా ప్రాంతాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ట్రాఫిక్, పార్కింగ్, భద్రతపై నిర్వాహకులతో అధికారులు చర్చించారు. ప్రత్యేక ప్రార్థన కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
● కామారెడ్డి జిల్లావాసిగా గుర్తింపు గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టులో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్పూర్కు చెందిన దుంపటి వినయ్కుమార్(32)గా గుర్తించారు. మానేరులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. కాగా, మృతుడికి నెల రోజుల క్రితమే వివాహమైనట్లు తెలుస్తోంది. గత నెల కవలల దినోత్సవం రోజున పెళ్లయినట్లు సమాచారం. కరెంట్ షాక్తో రైతుకు గాయాలు మాచారెడ్డి: విద్యుదాఘాతంతో ఓ రైతుకు గాయాలైన ఘటన మండలంలోని గోగుబండ తండాలో శుక్రవారం చోటు చేసుకుంది. మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన లక్ష్మీపురం స్వామిదాస్ అనే రైతు తన పంట పొలంలో తిరుగుతుండగా విద్యుత్తు వైర్లు తగిలి గాయాలయ్యాయి. పక్క చేనులో ఉన్న మరో రైతు స్వామిదాస్ను గమనించి కుటుంబ సభ్యులు, 108 సిబ్బందికి సమాచారం అందించాడు. అంబులెన్స్ సిబ్బంది నరేశ్, ప్రణీత్ ప్రథమ చికిత్స నిర్వహించి కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలోని హుస్నాబాద్ కాలనీలో ఉన్న ప్రజ్ఞా ఒలంపియాడ్ హైస్కూల్లో స్లాబ్ పెచ్చులూడి విద్యార్థికి గాయాలయ్యాయి. ఆర్మూర్ మండలంలోని ఫత్తేపూర్ గ్రామానికి చెందిన హిమదీపక్ అనే విద్యార్థి ఆర్మూర్ ప్రజ్ఞ ఒలంపియాడ్ పాఠశాలలో యూకేజీ విద్యనభ్యసిస్తున్నాడు. శుక్రవారం ఆకస్మత్తుగా పాఠశాల భవంతి స్లాబ్ పెచ్చులూడి విద్యార్థిపై పడడంతో తలకు తీవ్రగాయమైంది. దీంతో ఆర్మూర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. -
రాష్ట్ర బడ్జెట్పై భిన్నాభిప్రాయాలు
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క విద్యారంగానికి రూ. 26,674 కోట్లు కేటాయించడం హర్షనీయం. మాధ్యమిక విద్యకు రూ.21,231 కోట్లు, ఉన్నత విద్యకు రూ.5,443 కోట్లు కేటాయించారు. సీఎం ఓవర్సీస్ ఎంప్లాయీమెంట్ స్కీం ను 2026–27 అకడమిక్ ఇయర్ నుంచి అమలు చేస్తామని ప్రకటించడం హర్షనీయం. – టీ సంపత్, అసిస్టెంట్ ప్రొఫెసర్, తెయూ నిజామాబాద్ రూరల్/ ఖలీల్వాడి/ తెయూ(డిచ్పల్లి): రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో శుక్రవారం రూ. 3,24,234 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ భవిష్యత్తు అభివృద్ధికి బా టలు వేసేలా ఉందని కొందరు పేర్కొనగా మరికొందరు అంకెల గారడిగా, ప్రజలను నిరాశపరిచేదిగా ఉందని అన్నారు. విద్య,వైద్య, కార్మిక శాఖలకు అధిక నిధులు కేటాయించలేదని పలువురు తమ అభిప్రాయాలను సాక్షితో పంచుకున్నారు.ప్రభుత్వం రూ.3,24, 234 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టింది. వ్య వసాయ అభివృద్ధి కో సం రూ. 23,179 కో ట్లు, రైతు భరోసాకు రూ. 18వేల కోట్లు కేటాయించి రైతు సంక్షేమ ప్రభుత్వంగా నిలిచింది. – బొబ్బిలి రామకృష్ణ, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బడ్జెట్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు నగదు రహిత వైద్య సదుపాయాన్ని అందించే ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం సంతోషకరం. సీఎంకు కృతజ్ఞతలు. – పండరినాథ్, ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బడ్జెట్లో మైనారిటీలకు అరకొరగా నిధులను కేటాయించడం దురదృష్టకరం. మైనారిటీ డిక్లరేషన్లో పేర్కొన్న ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. – ఎండీ యాకుబ్ పాషా, మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కార్మికుల సంక్షేమానికి అన్యాయం జరిగింది. పెద్దగా కేటాయింపులు చేపట్టలేదు. జిల్లా అభివృద్ధికి బడ్జెట్లో నిధుల కేటాయింపు పెంచకపోవడం బాధాకరం. – వై ఓమయ్య, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి -
శుభోదయం పాఠశాలలకు ఇక్కట్లు
● నిలిచిన నిధులు ● మెరుగైన సేవలకు దివ్యాంగులు దూరం ధర్పల్లి: ప్రత్యేక అవసరాల పిల్లలకు నిపుణులతో చదువు చెబుతూనే చికిత్సలు చేయించడం, వారిని మానసికంగా దృఢపర్చడంలో శుభోదయం పాఠశాలలది కీలకపాత్ర. ప్రస్తుతం ఈ పాఠశాలలు నిధులు లేక సతమతం అవుతున్నాయి. ఉమ్మడి రాష్ర ప్రభుత్వ హయాంలో 2006లో డీఆర్డీవో అధికారులు జిల్లాలో ఐదు శుభోదయం దివ్యాంగుల పాఠశాలలను ఏర్పాటు చేశారు. డీఆర్డీవో సెర్చ్ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) నిధులతోనే వీటి నిర్వహణ కొనసాగేది. కొవిడ్ అనంతరం వీటికి నిధులు కేటాయించడం లేదు. దీంతో దివ్యాంగ పిల్లల కనీస అవసరాలు మెరుగుపర్చడం కష్టంగా మారింది. ఐదు మండలాలు ఎంపిక.. నిజామాబాద్ జిల్లాలో ధర్పల్లి, డిచ్పల్లి, జక్రాన్పల్లి, సిరికొండ, భీంగల్ మండలాల్లో శుభోదయం దివ్యాంగుల పాఠశాలలను ఏర్పాటు చేశారు. వీటిల్లో 5 నుంచి 60 ఏళ్ల దివ్యాంగుల వరకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సెర్చ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక వాహనంతో మండలంలోని ఆయా గ్రామాలకు వెళ్లి దివ్యాంగ పిల్లలను పాఠశాలకు తీసుకొచ్చేవారు. ఈ కేంద్రాల్లో అంగవైకల్యం, మానసిక స్థితి సరిగా లేనివారు, దృష్టిలోపం, పక్షవాతం వచ్చిన వారికి శిక్షణ ఇస్తారు. దివ్యాంగులు ఎవరి సాయం లేకుండా వారి పనులు వారు చేసుకునేలా రోజు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ వంటివి చేయిస్తారు. శారీరక లోపాలను బట్టి తమ పనులు తాము చేసుకునేలా నిపుణులతో సాధన చేయించేవారు. మధ్యాహ్నం భోజనం పెట్టేవారు. ఇలా ప్రతినెలా ఒక్కో పాఠశాల నిర్వహణకు సుమారు రూ.40 వేల నుంచి 60వేల వరకు నిధులు కేటాయించేవారు. తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి పిల్లల్లో ఎదుగుదలను వివరించే వారు. కానీ కొవిడ్ పరిస్థితులతో 2021 నుంచి వీటి నిర్వహణకు సెర్చ్ నిధులు కేటాయించడం లేదు. దీంతో వాహన సేవలు నిలిచిపోయాయి. ప్రతి రోజు ధర్పల్లి మండల కేంద్రంలోని పాఠశాలకు 25 నుంచి 30 మంది దివ్యాంగులు వచ్చేవారు. కొవిడ్ సమయం నుంచి నిధుల ఆగిపోవడంతో ఈ కేంద్రాలకు ఆయా గ్రామాల నుంచి వచ్చే దివ్యాంగులు రావడం లేదు. ప్రస్తుతం పాఠశాల ఉన్న గ్రామంలోని వారు మాత్రమే కేంద్రాలకు వస్తున్నారు. ప్రస్తుతం ప్రయాణ సౌకర్యం లేకపోవడంతో వారానికి ఒకరోజు పిల్లల ఇంటి వద్దకు వెళ్లి శిక్షణ ఇస్తున్నారు. మరోవైపు కేంద్రాలకు వచ్చే పిల్లలకు తమ సొంత డబ్బులతోనే మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు సిబ్బంది పేర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రయాణ చార్జీలతో పాటు మధ్యాహ్న భోజనానికి నిధులు విడుదల చేస్తే చాలామంది దివ్యాంగులకు మేలు జరుగుతుందని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
నాణ్యమైన భోజనం అందించాలి
మాక్లూర్: విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించాలని, వంట గదిలో ఆహార పదార్థాలు కలుషితం కాకుండా జాగ్రత్త పడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. శుక్రవారం మాక్లూర్ మండలం దా స్నగర్ వద్ద ఉన్న మహాత్మా జ్యోతిబాఫూలే బాలిక ల గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తని ఖీ చేశారు. వంట గదితోపాటు తరగతి గదులను పరిశీలించారు. రోజువారీ వ్యర్థాలను ఎక్కడికి తరలిస్తున్నారనేది తెలుసుకొని వెంటనే సంబంధిత అ ధికారులకు ఫోన్ చేసి చెత్తను తీసుకెళ్లే వాహనాన్ని రోజూ పాఠశాలకు పంపించాలని ఆదేశించారు. వంటకు తాజా కూరగాయలు, బ్రాండెడ్ సరుకులు మాత్రమే వాడాలని, ఈ విషయంలో కక్కుర్తి చూపితే సహించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు పుష్టిగా భోజనం చేసి ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువు, క్రీడలు ఇతర అంశాలపై చక్కగా దృష్టిపెట్టగలుగుతారని అన్నారు. వైద్య శిబిరం సందర్శన ప్రజాపాలనలో భాగంగా ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాల ప్రాంగణంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన ఆరోగ్య శిబిరాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించి బాలికలకు అందిస్తున్న వైద్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా విద్యార్థులు వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. చక్కని ఆరోగ్యం కోసం తాజా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. గురుకులంలో ఉండే విద్యార్థులు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వెంటనే ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఒత్తిడికి గురి కాకుండా వార్షిక పరీక్షలను ఆత్మవిశ్వాసంతో రాయాలన్నారు. బయటి వ్యక్తులు ఎవరూ పాఠశాలలోనికి రాకుండా గట్టి పర్యవేక్షణ చేయాల ని ప్రిన్సిపల్ స్వప్నను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్వో రాజశ్రీ, డిప్యూటీ డీఎంహెచ్వో శ్వేత, వైద్యులు సందీప్, శశిధర్, అరవింద్ ఉన్నారు. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా చూడాలి బ్రాండెడ్ సరుకులు వాడాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి మహాత్మా జ్యోతిబాఫూలే పాఠశాల తనిఖీ -
ప్రజలకు ఒరిగేది శూన్యం
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రజలకు ఉపయోగపడే స్కీమ్లకు సరైన కేటాయింపులు లేవు. అవినీతి అవకాశాలు ఉన్న ప్రాజెక్టులకు భారీ నిధులు కేటాయించారు. ఈ బడ్జెట్ పూర్తిగా డొల్ల బడ్జెట్, గోల్మాల్ బడ్జెట్. అంకెల గారడీతో పేద ప్రజలు, మహిళలు, నిరుద్యోగులను పూర్తిగా వంచించిన బడ్జెట్గా ఉంది. గత సంవత్సరం బడ్జెట్ అంచనాలను ఈ ప్రభుత్వం అందుకోలేక పూర్తిగా విఫలమైందని ఇప్పటికే స్పష్టమైంది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలులో ఈ బడ్జెట్ వాస్తవికతకు దూరంగా ఉంది. రైతుభరోసా ఇప్పటి వరకు మూడు పంటలకు ఎగ్గొట్టారు. ప్రభుత్వానికి భూములపై ఉన్న ప్రేమ.. ప్రజలకు ఇచ్చిన హామీలపై లేదు. ఆచరణకు సాధ్యం కాని రాజీవ్ యువ వికాసా నికి ప్రతి సంవత్సరం కేటాయింపులు చేస్తూ వస్తున్నారు. – వేముల ప్రశాంత్రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే -
ప్రజా అనుకూల బడ్జెట్
రాష్ట్ర బడ్జెట్ రైతులకు, ప్రజలకు అనుకూలంగా ఉండటంతోపాటు సమగ్రాభివృద్ధికి దోహదపడుతుంది. మైనారిటీల సంక్షేమానికి రూ.3,769 కోట్లు కేటాయించడం హర్షణీయం. గతేడాదితో పోలిస్తే రూ.178 కోట్ల పెరుగుదల ఉండటం, మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను సూచిస్తుంది. మైనారిటీ మహిళలకు 10,000 కుట్టు యంత్రాల పంపిణీ, 4,655 మంది మైనారిటీ యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ వంటి కార్యక్రమాలు ఆర్థిక స్వావలంబనను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. – షబ్బీర్ అలీ, ప్రభుత్వ సలహాదారు -
అన్ని రంగాలను విస్మరించిన బడ్జెట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని రంగాలను విస్మరించినట్లే ఉంది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా అంకెల గారడీ ప్రదర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సమయం వృథా చేస్తున్నారు. మహిళలు, దివ్యాంగులకు పెంచుతామన్న పింఛను మాటే తీయలేదు. రెండేళ్లుగా సీడీపీ నిధులు ఇవ్వలేదు. ప్రస్తుత బడ్జెట్ పేపర్పై గ్రాండ్గా ఉంది. గ్రౌండ్లో మాత్రం బ్లాంక్గానే ఉంది. – ధన్పాల్ సూర్యనారాయణ, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే -
ఇప్పుడు సస్పెన్షన్.. తర్వాత తొలగింపు!
తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సూ చనల మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో డీ ఈవో అశోక్ శుక్రవారం సీఎస్, డీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో పాటించాల్సిన నిబంధనలు వివరించారు. ● పరీక్ష కేంద్రాల్లో క్లర్కులుగా ఇతర సబ్జెక్టు టీచర్లను నియమించొద్దు. జూనియర్ అసిస్టెంట్లను నియమించుకోవాలి. ● క్లర్క్లు, రిజర్వ్ ఇన్విజిలేటర్లు సీసీ కెమెరా పర్యవేక్షణలో మాత్రమే కూర్చొని ఉండాలి. విద్యార్థుల దగ్గర, కారిడార్లలో తిరగరాదు. ● హాల్టికెట్ నంబర్లను ప్రశ్నాపత్రంలోని అన్ని పేజీలపై తప్పనిసరిగా రాయించాలి. ● ఇంగ్లిష్ పరీక్షలో పార్ట్–ఏ, పార్ట్–బీ ఆన్సర్ బుక్స్ను ఉదయం 9.30 గంటలకు కట్టించాలి. ● ప్రయివేట్ స్కూల్ సిబ్బంది పరీక్షా కేంద్రాలలో లేదా పరిసర ప్రాంతాలలో ఉండొద్దు. ● సీఎస్, డీవోతోపాటు సెంటర్లో విధులు నిర్వర్తించే ప్రతి ఒక్కరి మొబైల్ ట్రాకింగ్ జరుగుతుంది. అందరి ఫోన్లు సెంటర్లోకి తీసుకురాకుండా నిషేధం విధించారు. ● ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ ట్రాకింగ్ జరుగుతుంది. ● ప్రతి ఎగ్జామినేషన్ సిబ్బంది రోజువారీగా డిక్లరేషన్ ఇవ్వాలి. చీఫ్ సూపరింటెండెంట్ డిక్లరేషన్ రిజిస్టర్ను నిర్వహించాలి. ● ప్రతి సెంటర్లో క్లాక్ రూమ్ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.ఖలీల్వాడి: జిల్లాలోని ఆలూర్, మెండోరాలో పదో తరగతి హిందీ, తెలుగు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రం వాట్సాప్ ద్వారా బయటకు వెళ్లడంతో ఏడుగురు టీచర్లను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే, శాఖాపరమైన విచారణ జరిపి వారిని విధుల నుంచి తొలిగించేందుకు పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ నుంచి పలు సూచనలు వచ్చినట్లు తెలిసింది. ఆలూర్ ఘటనకు సంబంధించి నలుగురు టీచర్లపై ఆర్మూర్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కాగా మెండోరా పరీక్ష కేంద్రంలో మాస్కాపీయింగ్కు సహకరించిన ముగ్గురు టీచర్లపై కేసు నమోదు కాలేదు. శాఖాపరమైన చర్యల్లో భాగంగా సస్పెండ్ చేశారు. అయితే, భవిష్యత్తులో మాస్ కాపీయింగ్ జరగకుండా ఉండేందుకు విద్యాశాఖ కొత్త చట్టం రూపొందిస్తున్నట్లు తెలిసింది. కాపీయింగ్కు సహకరించిన వారిని సర్వీస్ నుంచి తొలగించేలా నిబంధన తీసుకురానున్నట్లు సమాచారం. ఆరు నెలలపాటు సస్పెన్షన్? మాస్ కాపీయింగ్ ఘటనలో ఏడుగురు ఉద్యోగులపై కొనసాగుతున్న సస్పెషన్ ఎత్తివేతకు తనను కలువొద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉపాధ్యాయ సంఘాల నేతలకు సూచించినట్లు తెలిసింది. దీంతో సదరు టీచర్లపై ఆరునెలలపాటు సస్పెన్షన్ కొనసాగుతుందని విద్యాశాఖలో చర్చ జరుగుతోంది. ఆబ్జెక్టీవ్ ప్రశ్నలకు జవాబులు.. జిల్లాలో పదో తరగతి పరీక్షలకు ప్రయివేట్ పాఠశాలకు చెందిన 10 వేలకు పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈ పరీక్ష కేంద్రాలకు వెళ్లే సీఎస్, డీవోలతోపాటు ఇన్విజిలేటర్లను పాఠశాలల యాజమాన్యాలు మచ్చిక చేసుకుంటున్నాయి. విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచుకోవడానికి ఆబ్జెక్టీవ్ ప్రశ్నలకు జవాబులు అందించేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ప్రయివేట్ పాఠశాలల్లో నిర్వహించే కేంద్రాలపై అధికారులు దృష్టి సారించాలని విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు. నిబంధనలు పాటించాలి పదో తరగతి పరీక్షల్లో మాస్కాపీయింగ్ నేపథ్యంలో.. ఆర్మూర్లో కేసు నమోదు.. మెండోరాలో సైలెంట్ చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లతో డీఈవో సమీక్ష అమల్లోకి మొబైల్ ట్రాకింగ్ విధానం సస్పెండ్ అయిన టీచర్ల కోసం రావొద్దని కలెక్టర్ స్పష్టం -
పాత బడ్జెట్నే కొత్తగా చదివారు..
రాష్ట్ర బడ్జెట్ పూర్తిగా నిస్సారంగా ఉంది. ఇందూరు జిల్లాకు పూర్తి అన్యాయం చేశారు. జిల్లాకు గుండు సున్నా అన్నట్లుగా బడ్జెట్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసింది. మహిళలకు, యువతకు ఇస్తామని చెప్పిన పథకాల ఊసే లేదు. ప్రతి కుటుంబానికి ఈ ప్రభుత్వం రూ.3 లక్షల బాకీ ఉంది. ఇక సీఎం చెప్పిన నిజామాబాద్ రింగ్ రోడ్డు ఊసేలేకుండా పోయింది. నిజాంషుగర్స్, సారంగాపూర్ సహకార చక్కెర ఫ్యాక్టరీ ప్రస్తావనే లేదు. ఇది అందరినీ మోసం చేసే బడ్జెట్. – కులాచారి దినేశ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు -
ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలి
● ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి ● సీపీ సాయిచైతన్య ● మోపాల్ పీఎస్ తనిఖీ నిజామాబాద్ రూరల్: ప్రజలతో మరింత స్నేహపూర్వకంగా మెలగాలని కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య పేర్కొన్నారు. మోపాల్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సీపీ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డుల నిర్వహణ, ఫిర్యాదుల పరిష్కారం, భద్రతా చర్యలు, సిబ్బంది పనితీరును సమీక్షించారు. అనంతరం సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. మండలంలో శాంతి భద్రతలను కట్టుదిట్టంగా నిర్వహిస్తూ, ప్రజల విశ్వాసాన్ని పెంపొందించేలా పని చేయాలని ఆదేశించారు. అనంతరం స్టేషన్కు సంబంధించిన వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సీపీ వెంట నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ సురేశ్ కుమార్, ఎస్సై జెడ్ సుస్మిత, సిబ్బంది ఉన్నారు. -
విమానాశ్రయం ఊసేలేదు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ను శుక్రవారం ప్రవేశపెట్టారు. బడ్జెట్కు సంబంధించి జిల్లావాసులు ఎదురుచూసిన జక్రాన్పల్లి విమానాశ్రయం ఊసే లేకపోవడంతో నిరాశ నెలకొంది. వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల గురించి ప్రస్తావించి జక్రాన్పల్లి విమానాశ్రయాన్ని పట్టించుకోకపోవడం ఏమిటంటూ విమర్శలు వస్తున్నాయి. ఇక కీలకమైన నిజాంషుగర్స్ విషయమై బడ్జెట్లో ప్రస్తావించలేదు. జిల్లాలో చెరుకు పండించేలా రైతులను ప్రోత్సహించే దిశగా ప్రణాళికలు చేస్తే బాగుండేదని పలువురు అంటున్నా రు. ఇక ఉత్తర తెలంగాణలోనే కీలకమైన శ్రీరాంసాగర్ జలాశయంలో పూడికతీత విషయమై పట్టించుకోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ● ఇటీవల జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించిన నిజామాబాద్ చుట్టూ రింగ్రోడ్డు ఏర్పాటు విషయమై బడ్జెట్లో ప్రస్తావించలేదంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. ఇందూరు నగర సుందరీకరణ విషయమై నిధులు కేటాయించలేదంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద బడ్జెట్ విషయమై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. అధికార కాంగ్రెస్ నేతలు అన్నివర్గాల సంక్షేమ, అభివృద్ధి బడ్జెట్ అంటూ చెబుతుండగా, విపక్ష నాయకులు మాత్రం నిరాశజనక బడ్జెట్ అంటూ విమర్శలు చేస్తున్నారు. నిజాం షుగర్స్ ప్రస్తావన కరువు శ్రీరాంసాగర్ పూడికతీతపై పట్టింపే లేదు ఇందూరు రింగ్ రోడ్డునూ బడ్జెట్లో చూపలేదు రాష్ట్ర బడ్జెట్పై వివిధ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు అన్నివర్గాలకు మేలు చేసే బడ్జెట్ అంటున్న అధికార కాంగ్రెస్ నేతలు నిరాశాజనక బడ్జెట్ అని విపక్షాల విమర్శలు -
జిల్లాలో రెండు భారీ చోరీలు
● ఆలూర్లో 10 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు అపహరణ ● బోధన్లో సినీ ఫక్కీలో దొంగతనంఆర్మూర్టౌన్: ఆలూర్ మండల కేంద్రంలో భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఇంట్లో చొరబడిన దొంగలు 10 తులాల బంగారం, రూ.2 లక్షల నగదును అపహరించారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. ఆలూర్ మండల కేంద్రానికి చెందిన త లారి జమున ఈ నెల 15న ఇంటికి తాళం వేసి జుక్కల్లో ఉంటున్న తన చిన్న కుమారుడు ఇంటికి వెళ్లింది. కాగా, శుక్రవారం ఉదయం ఇంటి తలుపు లు తెరిచి ఉండటాన్ని గమనించిన కాలనీవాసులు జమునకు సమాచారం అందించారు. హుటాహుటిన ఆలూర్కు చేరుకున్న జమున ఇంట్లోని వస్తువులు చిందరవందరగా కనిపించడంతో ఆందోళనకు గురైంది. దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువాను ధ్వంసం చేసి బంగారు ఆభరణాలతోపాటు నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ చోరీ జరిగిన తీరును పరిశీలించారు. గురువారం రాత్రి దొంగలు ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడి ఉంటారని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.కారు అద్దాలు ధ్వంసం చేసి రూ.3 లక్షలు.. బోధన్టౌన్(బోధన్): కారు అద్దాలు పగులగొట్టి రూ.3 లక్షలు చోరీ చేసిన ఘటన బోధన్ పట్టణంలోని గోశాల రోడ్డులో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం. సాలూర మండలంలోని జాడీ జమాల్పూర్ గ్రామానికి చెందిన హరిబాబు భూమి కొనుగోలు కోసం చెల్లించాల్సిన డబ్బులను డ్రా చేసుకోవడానికి రాకాసీపేట్లోని కెనరా బ్యాంక్కు వెళ్లాడు. బ్యాంకులోకి వెళ్లి రూ. 3 లక్షలు డ్రా చేసి తిరిగి గోశాల రోడ్డులోని యూనియన్ బ్యాంక్ ఎదుట కారును పార్కు చేశాడు. డ్రా చేసిన రూ. 3 లక్షలు కారులో పెట్టి, మరికొన్ని డబ్బులు డ్రా చేసుకోవాడనికి యూనియన్ బ్యాంకులోకి వెళ్లి తిరిగి కారు వద్దకు వచ్చాడు. కారు అద్దాలు పగిలి ఉండటంతోపాటు అందులోని రూ. 3 లక్షలు కనిపించక పోవడంతో బాధితుడు ఆందోళనకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పట్టణ సీఐ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకట నారాయణ వెల్లడించారు.ఆలూర్లో చోరీ జరిగిన స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ బోధన్ పట్టణంలోని గోశాల రోడ్లో కారును పరిశీలిస్తున్న సీఐ వెంకట నారాయణ -
బడుగు బలహీనవర్గాల బడ్జెట్
నిజామాబాద్ రూరల్: ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్లేందుకు ఈ బడ్జెట్ నిదర్శనం. విద్యా, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీట వేశారు. ఇది పూర్తిగా బడుగు, బలహీనవర్గాల బడ్జెట్. వ్యవసాయానికి రూ.23,179 కోట్లు కేటాయించి రైతు సంక్షేమమే తమ ధ్యేయమని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇందిరమ్మ జీవిత బీమా పథకం హర్షణీయం. 119 నియోజకవర్గాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరు చేయడం అభినందనీయం. – కాటిపల్లి నగేశ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు -
లీకేజీనా? మాస్ కాపీయింగా?
● అరగంటలోనే పదో తరగతి ప్రశ్నపత్రం బయటకు.. ● తొమ్మిది మంది టీచర్ల సస్పెన్షన్ ● వంద శాతం రిజల్ట్ కోసమే వ్యవహారం ఖలీల్వాడి: పదో తరగతి పరీక్ష మొదలైన అర గంటలోనే జిల్లాలో ప్రశ్నపత్రం బయటకు రావడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. బుధవారం జరిగిన తెలుగు, హిందీ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాలను సెంటర్లో పనిచేసే సిబ్బంది వాట్సాప్ ద్వారా బయటికి పంపించి సమాధానాలు తెప్పించారు. ప్రశ్నపత్రం కాస్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో విషయం తెలిసిన విద్యాశాఖ అధికారులు ఘటనకు సంబంధించిన తొమ్మిది మంది సిబ్బందిపై వేటు వేశారు. అయితే, ఇదంతా పదో తరగతి పరీక్షల్లో వందశాతం రిజల్ట్, ఉన్నత కళాశాలల్లో సీట్ల కోసమే జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిబంధనలు కఠినమైనా పేపర్ బయటికి.. జిల్లాలోని 642 ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు చెందిన 24,361 మంది, ఏడుగురు ప్రయివేట్ విద్యార్థులు 144 కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్నారు. కేంద్రాల్లో పనిచేసే సిబ్బందితోపాటు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, తనిఖీలకు వెళ్లే సిబ్బందికి సైతం సెల్ఫోన్ల వినియోగానికి అనుమతి లేదు. ఇంత పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల ఆదేశాలున్నా.. ప్రశ్నపత్రం బయటికి వెళ్లడం, సమాధానాలు రావడం అనుమానాలకు తావిస్తోంది. సెంటర్లోని సిబ్బంది ప్రశ్నపత్రాన్ని బయట వ్యక్తులకు అందించారా? లేక టీచర్ల ఫోన్లకే పంపించారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ప్రశ్నపత్రాన్ని బయటకు పంపిన వారితోపాటు బయట ఫోన్కు వెళ్లిన వ్యక్తులపై సైతం విద్యాశాఖ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీనిపై ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ చేపడుతున్నట్లు సమాచారం. పరస్పర సహకారం పదో తరగతిలో ప్రభుత్వ, ప్రయివేట్, గురుకుల, మోడల్, కేజీబీవీ పాఠశాల్లో 100 శాతం ఉత్తీర్ణత కోసం అక్కడ పనిచేసే సిబ్బంది ద్వారా మాస్కాపీయింగ్కు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రయివేటు పాఠశాలలు ఉత్తీర్ణత శాతం, గ్రేడ్లను ప్రచారం చేసుకునేందుకు పరీక్ష కేంద్రానికి సంబంధించిన పాఠశాల వారితో పరస్పర సహకారం తీసుకుంటున్నట్లు సమాచారం. కొన్ని ప్రభుత్వ పాఠశాలలు ట్రిపుల్ ఐటీ సీట్ల కోసం మాస్ కాపీయింగ్ చేయిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు మారుమూల ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాలపై సరైన నిఘా లేకపోవడంతో అక్కడ మాస్కాపీయింగ్ జరిగేందుకు ఆస్కారం ఉంటోంది. తనిఖీ చేసే బృందాలు సైతం ముందస్తు సమాచారం అందించడంతో విద్యార్థుల వద్ద చిట్టీలు దొరక్కుండా అక్కడి సిబ్బంది జాగ్రత్తలు పడుతున్నట్లు సమాచారం. అయితే, మాస్ కాపీయింగ్ వ్యవహారంతో మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆగ్రహం పదో తరగతి పరీక్షలో పేపర్ బయటికి రావడంపై కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. డీఈవో అశోక్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో సోమవారం జరిగే పరీక్షకు విద్యాశాఖ పకడ్బందీ చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. ఇద్దరు టీచర్లపై సస్పెషన్ ఎత్తివేతఖలీల్వాడి: పదో తరగతి పరీక్షల్లో భాగంగా బోధన్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్లో ప్రశ్నపత్రం వైరల్ అయిన ఘటనలో ఇద్దరు టీచర్లపై సస్పెన్షన్ ఎత్తివేసినట్లు డీఈవో పార్శి అశోక్ తెలిపారు. గురువారం అధికారుల విచారణలో అవాస్తవమని తేలిందన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్ అయిన పెంటాకలాన్ జడ్పీ హైస్కూల్ టీచర్ వేణు, కల్దుర్కి జడ్పీ హైస్కూల్ టీచర్ శివానందరావుపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసినట్లు పేర్కొన్నారు. ప్రశ్నపత్రం లీక్ కాలేదు డీఈవో అశోక్ కుమార్ ప్రకటన మాల్ ప్రాక్టీస్ కోసం ప్రయత్నించారని వెల్లడిఖలీల్వాడి: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఈ నెల 18న జరిగిన హిందీ, తెలుగు పరీక్ష పేపర్లు లీక్ కాలేదని డీఈవో పార్శి అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం మధ్యా హ్నం 12.15 గంటలకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ద్వారా బోధన్ పరిధిలో తెలుగు ప్రశ్నపత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు సమాచారం అందినట్లు పేర్కొన్నారు. దీంతో సంబంధిత అధికారులైన బోధన్ ఎంఈవో, ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందితో విచారణ చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. మధ్యాహ్నం 1.30 గంటలకు డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ నుంచి ఫోన్ ద్వారా సమాచారం రావడంతో సంబంధిత అధికారుల విచారణ నివేదికను కలెక్టర్కు అందించినట్లు తెలిపారు. వారి ఆదేశాల మేరకు ఘటనకు సంబంధించిన సిబ్బందిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. జడ్పీ హైస్కూల్ ఆలూరు, మెండోరా సెంటర్లో పేపర్ లీకేజీ కాదని, అక్కడ పనిచేస్తున్న కొంతమంది ఇన్విజిలేటర్లు మాల్ప్రాక్టీసు కోసం ప్రయత్నాలు చేశారని విచారణలో తేలిందన్నారు. దీంతో వారిని సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. రెండు సెంటర్లలో జరిగిన ప్రక్రియ పేపర్ లీకేజీ కాదని, వాళ్లు మాల్ ప్రాక్టీస్ చేసేందుకు చేసిన ప్రయత్నంగా నిర్ధారించినట్లు తెలిపారు. -
కొంగొత్త ఆశలతో..
– ఘనంగా ఉగాది వేడుకలు – ప్రత్యేక పూజలు.. పంచాంగ శ్రవణాలు కొంగొత్త ఆశలతో శ్రీ పరాభవ నామ సంవత్సరానికి జిల్లా ప్రజలు స్వాగతం పలికారు. గురువారం ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. ప్రధాన ఆలయాలు, కూడళ్లు, వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాల్లో పంచాంగ శ్రవణాలు నిర్వహించారు. అనంతరం ఉగాది పచ్చడి వితరణ చేశారు. ఉగాదిని పురస్కరించుకొని జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన కుస్తీ పోటీలు, జడకొప్పులాటలు అలరించాయి. -
క్రైం కార్నర్
బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందినట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. వివరాలు ఇలా.. సంగారెడ్డి జిల్లా కల్హెర్ మండలం బీబీపేటకు చెందిన పల్లపు రవి(26) కొన్నేళ్లుగా బాన్సువాడలోని దాల్మల్గుట్టలో నివాసం ఉంటున్నాడు. బుధవారం రాత్రి పని నిమిత్తం అతడు తాడ్కోల్ రోడ్డు నుంచి గౌలీగూడ వైపు ఎక్స్ఎల్పై బయలుదేరాడు. రోడ్డు దాటుతుండగా బొలెరో వాహనం అతివేగంగా వచ్చి అతడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో రవికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. బోధన్రూరల్: సాలూర శివారులోని మంజీర నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్నట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి గురువారం తెలిపారు. పట్టుబడిన ట్రాక్టర్ను బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఆయన వివరించారు. నిజామాబాద్ రూరల్: మద్యం తాగి ఆటో నడిపిన వ్యక్తిపై డ్రంకెన్డ్రైవ్ కేసు నమోదు చేసినట్లు మోపాల్ ఎస్సై సుష్మిత గురువారం తెలిపారు. సిర్పూర్ తండాకు చెందిన సురేష్ అనే యువకుడు ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకొని, మద్యం మత్తులో నిజామబాద్ వైపు బయలుదేరాడు. మోపాల్ శివారులో పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా ఆటో డ్రైవర్ సురేష్ ఆటో నిలుపకుండా అతివేగంగా నడపడంతో ఏఎస్సైకి గాయమైంది. వెంటనే పోలీసులు ఆటో డ్రైవర్ను వెంబడించగా అతను మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. అలాగే ప్రయాణికులతో, పోలీసు వారిపై తిరగబడ్డాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు ఆమె తెలిపారు. నిజామాబాద్ అర్బన్: నగరంలోని కుమార్గల్లిలో చోరీకి యత్నించిన ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకొని, పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా.. నగరానికి చెందిన గంగాప్రసాద్ అనే వ్యక్తి బుధవారం రాత్రి కుమార్గల్లిలోని ఓ ఇంటిలో చోరీకి యత్నించాడు. ఈక్రమంలో ఇంట్లోని వృద్ధురాలు అతడిని చూసి కేకలు వేసింది. వెంటనే స్థానికులు అప్రమత్తమై, అతడిని పట్టుకున్నారు. అనంతరం ఒకటోటౌన్ పోలీసులకు అప్పగించారు. నిందితుడు పాత నేరస్తుడని, కేసు నమోదు చేసినట్లు ఒకటవ టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. -
ల్యాబ్ టెక్నీషియన్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
నిజామాబాద్ రూరల్:పారామెడికల్ ల్యాబ్ టెక్నీషి యన్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, వారిని ఆర్థికంగా ఆదుకోవాలని పీఎంఎల్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలో గురువారం జరిగిన జిల్లా ల్యాబ్ టెక్నీషియన్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా వీరయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోజురోజుకు ల్యాబ్ టెక్నీ షియన్లకు గుర్తింపే లేకుండ పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అయినా పారామెడికల్ రంగానికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి నిధులు కేటాయించి ల్యాబ్ టెక్నీషియన్లకు ఆర్థిక భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజులలో రాష్ట్రవ్యాప్తంగా ఎల్టీ మిత్రులను ఏకం చేసి వారి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం నిజామాబాద్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సన్నీ, కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ఇంతియాజ్, ఉపాధ్యక్షుడిగా శివ, ప్రధాన కార్యదర్శిగా ప్రశాంత్, కోశాధికారిగా కవిత, సహాయ కార్యదర్శిగా కళ్యాణ్, రఘు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా రాము, వంశీ ఎన్ని కయ్యారు. రవీందర్, తలారి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. భిక్కనూరు: మండల కేంద్రం సమీపంలోని ఫామ్హౌజ్లో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సంబురాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ఇంద్రకరణ్రెడ్డి, గ్రంథాలయసంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు భీమ్రెడ్డి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీతోపాటు యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు ఇలియాస్కు ఉగాది పచ్చడిని అందజేసి సత్కరించారు. ఈ సందర్బంగా షబ్బీర్అలీ మాట్లాడుతూ.. తెలుగు నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. -
రానున్నది హిందూ శతాబ్దమే
నిజామాబాద్ రూరల్: ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న ఉగాది కార్యక్రమం నవభారత నిర్మాణానికి నాందిగా భావిస్తున్నట్లు ఆర్ఎస్ఎస్ ఇందూరు విభాగ్ ప్రచారక్ నర్రా వెంకట శివకుమార్ తెలిపారు. రానున్నది హిందూ శతాబ్దమేనని ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని బస్వ గార్డెన్లో గురువారం ఆర్ఎస్ఎస్ ఇందూరు నగర శాఖ ఆధ్వర్యంలో ఉగాది మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ప్రధాన వక్తగా విచ్చేసి, మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులైన డాక్టర్ హెడ్గేవార్ జన్మదినం ఉగాది రోజే కావడం స్వయంసేవకులకు ఎంతో ప్రత్యేకమని తెలిపారు. హిందువులు జరుపుకునే ప్రతి పండుగలు ఒక విశేషమైన సందేశాన్ని ఇస్తాయని ఉగాది కూడా నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటూ రాబోయే సంవత్సర కాలం పాటు జీవితంలో ఎదురయ్యే కష్టాలు, సుఖాలు, బాధలు, దుఃఖాలను సమదృష్టితో చూడగలిగే మానసిక స్థితిని నిర్మాణం చేయడం కోసమే ఉగాది పచ్చడిని ఆరు రుచుల సమ్మేళనంగా తయారుచేసి స్వీకరిస్తామని అన్నారు. జనవరి 1 నూతన సంవత్సరం కాదని ఉగాది మాత్రమే నూతన సంవత్సరమని భారతీయులందరూ గ్రహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకృతికి హాని కలిగే విధంగా ఎలాంటి పనులు చేయవద్దని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించాలన్నారు. సమాజంలో పరివర్తన రావాలనే ఆర్ఎస్ఎస్ నిరంతరం కృషి చేస్తోందన్నారు. దేశాధినేతల మధ్య ఆధిపత్య పోరు కారణంగానే యుద్ధాలు జరుగుతున్నాయని, మాట్లాడుకుంటే పరిష్కారం కాని సమస్యలు ఏవి ఉండవని తెలిపారు. అందుకే ఆర్ఎస్ఎస్ కుటుంబ స్థాయి నుంచి మొదలుపెట్టి దేశం మొత్తంలో కలిసి మాట్లాడుకోవడం, కలిసి ఆలోచించడం, కలిసి చర్చించడం వంటి సంస్కారాలను సమాజంలో నింపేందుకు కృషి చేస్తోందని తెలిపారు. దేశంలో మెజారిటీలు హిందువులు కాబట్టే ఇతర మతాల ప్రజలు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారని అది హిందుత్వం యొక్క స్ఫూర్తి అని స్పష్టం చేశారు. ఈ శతాబ్ది సందర్భంగా హిందూ సమాజం మొత్తాన్ని ధర్మ మార్గం వైపు నడిపించడం కోసం ఏకత్రిత సూత్రంపై నిలబెట్టడం కోసం జన జాగరణ, హిందూ సమ్మేళనాల పేరుతో దేశవ్యాప్తంగా ప్రతి బస్తీలో కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మె ల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నగర కార్యవాహ అర్గుల సత్యం, సహకార్యవాహలు సుమిత్ కుమార్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఉగాదే నూతన సంవత్సరం.. జనవరి 1 కాదు ఆర్ఎస్ఎస్ ఇందూరు విభాగ్ ప్రచారక్ నర్రా వెంకట శివకుమార్ నగరంలో ఘనంగా ఆర్ఎస్ఎస్ ఉగాది ఉత్సవం -
కాంగ్రెస్ కార్యవర్గ సభ్యుల నియామకం
● జిల్లాకు 89 మంది, నగర కార్పొరేషన్కు 33 మందికి అవకాశం ● ఉత్తర్వులు జారీ చేసిన టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్గౌడ్ నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ జిల్లాతోపాటు, నగర కార్పొరేషన్కు కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు నియమితులయ్యారు. ఈమేరకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 89 మందితో అదేవిధంగా కార్పొరేషన్కు 33 మందితో కార్యవర్గంను ప్రకటించారు. జిల్లా కమిటీ.. ఉపాధ్యక్షులు: వెంకట్రెడ్డి, గ్యాదరి గోపి, చాట్ల నరేశ్, ఎలాల శ్రీనివాస్, మేక వీరాజు, వేంపల్లి రత్నాకర్గౌడ్, మోహినుద్దీన్ పాషా, రజితయాదవ్, కూరపాటి గంగాధర్, తారాచంద్నాయక్, ఆర్మూర్ చిన్నబాలరాజు, కౌడప్ శరత్కుమార్ నియ మితులయ్యారు. కోశాధికారి: గడ్డం భక్తవత్సలం. అధికార ప్రతినిధులు: మురళిధర్, గంగాధర్, రమేశ్, గోరకంటి లింగన్న నియమితులయ్యారు. జనరల్ సెక్రెటరీలు: ప్రవీణ్కుమార్గౌడ్, మీర్ మాజిద్, పస్క నర్సయ్య, గోపాల్ నగేశ్, గంగారెడ్డి, మగ్గిడి ముత్యంరెడ్డి, సోం రాజేందర్, ఏలేటి మోహన్, ఆడెం గంగాప్రసాద్, కర్కె ఆశోక్, గంధపు పవన్, అరవింద్రెడ్డి, అనంపల్లి ఎల్లయ్య, గోవర్ధన్రెడ్డి, రామ్మోహన్, రాజేంద్రకుమార్గౌడ్, భాస్కర్రెడ్డి, శ్రీనివాస్, అప్పాల రాజన్న, ఈరన్న, గంగారెడ్డి, జయలలిత, రవి, పైస ఎల్లయ్య. సెక్రెటరీలు: లలిత, ప్రవీణ్, మీసాల రవికుమార్, సంజీవ్, షన్, మహేందర్, రాజేశ్వర్, దేవిదాస్గౌడ్, భీమ్నాయక్, సాయినాథ్గౌడ్, మీసాల రవికుమార్, నోముల శ్రీనివాస్, ఆకుల రమేశ్, మహ్మమద్ యూనీస్, గంగారెడ్డి, నడ్పి భోజాగౌడ్, గంగానర్సయ్య, సంజీవ్యాదవ్, మహ్మద్ సాదుల్లా, వెంకయ్యగారి రవి, కల్పన, మురళి, గణేష్, గోపాల్, లావణ్య, పత్తిరాము, పిట్ల రాము, బీజన్ బీ, హనుమంతు గైక్వాడ్, విఠల్రెడ్డి, ఆశోక్, మహ్మద్ ఇబ్రహీంఖాన్, మిరాజా ఖాజా బేగ్, సాయిలు, లింగం, సాదుల్లా, సుజాత, జహీర్ అహ్మద్, జైడీ చిన్నరెడ్డి, కేతావత్ మోహన్నాయక్, కిరణ్, గంగాధర్, సుధాకర్, మహేంధర్, నవీన్గౌడ్, కరుణాకర్, సాయికుమార్, సుభాష్. కార్పొరేషన్ కమిటీ.. ఉపాధ్యక్షులు: అంతరెడ్డి విజయ్ పాల్రెడ్డి, సయ్యద్ సలీం కోర్వ రాజేంద్రప్రసాద్. ప్రధాన కార్యదర్శులు: జిల్లెల రమేష్, కస్తూరి గంగరాజు , ధర్మారం అవీన్, సర్దార్ నరేంధర్ సింగ్, సయ్యద్ హర్షద్, బాత్నతే శంకర్, కుంచెపు నగేష్. కోశాధికారి: సకినాల శివప్రసాద్ . అధికార ప్రతినిధులు: మల్యాల గోవర్ధన్, మొహమ్మద్ జియా అహ్మద్ కార్యదర్శులు: మంతెన సంపత్, పత్తి శోభన్ కుమార్, గజింగ్ ప్రవీణ్, డండోట్కర్ వినోద్, షేక్ అఫ్సర్, ఆకుల వెంకటేష్ (రాజు), సడక్ శేఖర్ రెడ్డి, ఉప్పరి స్వప్న, పడకంటి సంతోష్, స్వప్న మడుపు, గోవింద రాజులు, దుడ్డు సందీప్, మీనా శర్మ, మొహమ్మెద్ అయూబ్. కార్యనిర్వాహక సభ్యులు: జాయిద్ బిన్ హందాన్, తిప్రిక రాజ్ గగన్, ఇమ్రాన్ అహ్మద్, నేరెళ్ల సాయికుమార్ గౌడ్, మదివర్ సాయి బసవ, అబ్దుల్ వహీద్ పాషా. -
అవినీతిపరులకు పరాభవం తప్పదు
నిజామాబాద్ రూరల్: అవినీతిపరులు, అక్రమాలు, అధర్మానికి పాల్పడే వారికి ఈ ఏడాది పరాభవం తప్పదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు. జిల్లా కేంద్రంలోని కిషన్గంజ్లో గల ఆర్యవైశ్య సంఘం (పట్టణ) ఆధ్వర్యంలో గురువారం ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై, మాట్లాడారు. పంచాంగ శ్రవణం వినడానికి దాదాపు 52 సంవత్సరాలుగా వైశ్య సంఘానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సనాతన ధర్మం ఆచార వ్యవహారాలు పాటించడంలో వైశ్యులు ముందుంటారని కొనియాడారు. కేవలం హిందూ సంస్కృతిని పాటించడమే కాకుండా అందరిని ఏకం చేయడంలో వైశ్యుల పాత్ర కీలకమన్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం జనవరి 1 నూతన సంవత్సర కాదని, ఉగాదినే కొత్త సంవత్సరమని తెలిపారు. యువత పోకడలకు పోకుండా ఉగాదిని నూతన సంవత్సరంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం పంచాంగ శ్రవణం చేసిన వేద పండితులు బ్రహ్మశ్రీ వేలేటి గౌరీ శంకర్ శర్మ ను సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ 18వ డివిజన్ కార్పొరేటర్ పసునూరి రాము, 34 డివిజన్ కార్పొరేటర్ బంటు ప్రవీణ్ (పండు), ఆర్యవైశ్య సంఘం (పట్టణ) అధ్యక్షుడు ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా, ప్రధాన కార్యదర్శి ఇల్లెందుల ప్రభాకర్ గుప్తా, కోశాధికారి గాలి నాగరాజు గుప్తా, కన్వీనర్లు లాబిశెట్టి శ్రీనివాస్ గుప్తా, పార్శి మారుతి గుప్తా, సుధాకర్ గుప్తా, రాజా ప్రతాప్ గుప్తా, నేతి మోహన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు -
ఘనంగా బండ్ల ఊరేగింపు
● పలు చోట్ల అమ్మవారికి బోనాలు ● ఆలయాల్లో భక్తుల రద్దీ కామారెడ్డి జిల్లాకేంద్రంతోపాటు జిల్లావ్యాప్తంగా గురువారం ఉగాది పండుగ సందర్భంగా ఎడ్లబండ్లు, ట్రాక్టర్లను ప్రజలు ఆలయాల చుట్టూ తిప్పారు. పలు చోట్ల పోచమ్మ ఆమ్మవారికి బోనాలు తీసి భక్తులు మొక్కులు చెల్లించారు. నాగిరెడ్డిపేట మండలకేంద్రం గోపాల్పేటలో నల్లపోచమ్మ జాతర ఉత్సవాలు ఉగా ది రోజూ ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు, ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి ఆధ్వర్యంలో నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట, గాంధారి, తాడ్వాయి మండలాల పోలీసులు బందోబస్తు నిర్వహించారు. –సాక్షి, నెట్వర్క్ -
మేకల సంత వేలం రూ. కోటీ 2 లక్షలు
● రికార్డు స్థాయిలో ఆదాయం ● వాయిదా పడిన కూరగాయలు, సులభ్ కాంప్లెక్స్ల వేలం నవీపేట: నవీపేట జీపీ పరిధిలో కొనసాగే మేకల సంతకు బుధవారం నిర్వహించిన వేలానికి రికార్డు స్థాయిలో రూ. కోటీ 2 లక్షల ఆదాయం వచ్చింది. సంత వేలంలో పాల్గొనేందుకు 159 మంది ఔత్సాహికులు రూ. లక్ష చొప్పున డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొన్నారు. సర్పంచ్ కేఎల్వీ రేఖ రాజేందర్గౌడ్, ఉప సర్పంచ్ నవీన్రాజ్, జీపీ పాలకవర్గం ఆధ్వర్యంలో వేలాన్ని నిర్వహించారు. గతేడాది ఈ సంతకు రూ. 61 లక్షల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది గణనీయంగా రూ. 41 లక్షల అదనపు ఆదాయం వచ్చింది. పాత గుత్తేదారు సిరాజుద్దీన్ రూ. కోటీ 2 లక్షలకు వేలాన్ని దక్కించుకున్నారు. అలాగే వారాంతపు కూరగాయలు, సులభ్ కాంప్లెక్సులకు నిర్వహించాల్సిన వేలం వాయిదా పడింది. పాడైన ఇనుప సామగ్రి, ఫర్నీచర్కు వేలం నిర్వహించగా రూ. 1,40,000 ఆదాయం వచ్చింది. వాయిదా పడిన వారాంతపు కూరగాయల సంత, సులభ్ కాంప్లెక్స్లకు మళ్లీ వేలం నిర్వహిస్తామని జీపీ కార్యదర్శి రవీందర్నాయక్ తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానం ● కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇందల్వాయి: ఇందల్వాయి ఏకలవ్య గురుకులంలో ఖాళీగా ఉన్న పోస్టులను తాత్కాలిక పద్ధతిన అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. పీజీటీ కెమిస్ట్రీ (01), సైకాలజీ కౌన్సిలర్ (01), ఎంబీఏ రిటైలర్ (01), గార్డెనర్ (01), మెస్ హెల్పర్ (01), స్లీపింగ్ అండ్ శానిటేషన్ (02) పోస్టులకు ఈ నెల 20 నుంచి 25 తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. బీబీపూర్ తండాలోని ఈఎంఆర్ఎస్ గురుకులంలో దరఖాస్తులు అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు 9492357892, 9696623631 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
నిజామాబాద్
జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీఎస్సెస్సీ ప్రశ్నాపత్రం లీక్● అంగీకారం తెలిపిన సీఎం రేవంత్రెడ్డి ● నిర్మాణం కోసం స్థల పరిశీలన ● వ్యవసాయంతోపాటు పారిశ్రామిక అభివృద్ధితో మేలు: సుదర్శన్రెడ్డి గురువారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2026సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వ్యవసాయ రంగంలో ముందంజలో ఉన్న జిల్లాలో అనుబంధ పరిశ్రమల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెరిగేలా రైతులను అధికారు లు, ప్రజాప్రతినిదులు ప్రోత్సహిస్తుండగా, పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే అంగీకరించారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి అ వసరమైన స్థలాన్ని సేకరించేందుకు కసరత్తు ప్రారంభమైంది. ఇందులో భాగంగా మాక్లూర్ మండలంలో ని గుత్ప శివారులో ప్రభుత్వ స్థలాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా తో కలిసి సుదర్శన్రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయాధారిత పరిశ్రమల ఏర్పాటుతో రైతుల కు మరింత మేలు కలుగుతుందన్నారు. జిల్లా రైతులు ప్రస్తుతం 7వేల ఎకరాల్లో పామాయిల్ పంటను సాగు చేస్తున్నారని, మరో రెండేళ్లలో ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నారు. మరింతమంది రైతులు ఆయిల్పామ్ సాగువైపు మళ్లుతున్నారన్నారు. జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సీఎం రేవంత్రెడ్డి అంగీకరించారని తెలిపారు. స్థలాన్ని ఖరారు చేయాల్సి ఉందన్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటైతే జిల్లాలో మరింతమంది రైతులు పామాయిల్ సాగుకు మొగ్గుచూపుతారన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల అవసరాలకు అనుగుణంగా 75 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్పామ్ సాగు చేయాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం పది శాతం విస్తీర్ణం లోపే పంట సాగు చేస్తున్నారన్నారు. దీంతో ఇతర దేశాల నుంచి వంట నూనెలు భారీగా దిగుమతి చేసుకోవాల్సి వస్తోందన్నారు. స్థానికంగా ఆయిల్పామ్ను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తే రైతులు అధిక లాభాలు ఆర్జించడంతోపాటు ప్రజల అవసరాలు సైతం తక్కువ ఖర్చుతోనే తీరుతాయన్నారు. పామాయిల్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలతో కూడిన ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఇన్పుట్ సబ్సిడీ రైతు ఖాతాలో జమ అవుతోందన్నారు. ఆయిల్పామ్ మొక్కలకు అయ్యే వ్యయంలో అధిక మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోందని, పంట దిగుబడి విక్రయం, ధర విషయంలో రైతులకు ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. మొక్కలు అందించిన కంపెనీలే, బోర్డు ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు పంట దిగుబడిని కొనుగోలు చేస్తాయన్నారు. ఎకరానికి సుమారు పది టన్నుల వరకు పామాయిల్ గెలల దిగుబడి వస్తుందని సుదర్శన్రెడ్డి తెలిపారు. అంతర పంటలను సైతం సాగు చేసుకుని రైతులు లాభాలు రెట్టింపు చేసుకోవచ్చన్నారు. ఎకరానికి కనీసం రూ.2 లక్షల ఆదాయం ఆర్జించొచ్చన్నారు. స్థలాన్ని పరిశీలించిన అనంతరం సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలని అధికారులను సుదర్శన్రెడ్డి ఆదేశించారు. స్థల నిర్దారణ అయిన వెంటనే పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. సుదర్శన్రెడ్డి వెంట రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్రెడ్డి, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ్రెడ్డి తదితరులు ఉన్నారు.ఖలీల్వాడి/పెర్కిట్: పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ ఘటన కలకలంరేపింది. ఆలూర్, బోధన్, మెండోరాలోని సెంటర్ల నుంచి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, హిందీ ప్రశ్నాపత్రాలను లీక్ చేశారు. బుధవారం పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికి ప్రశ్నాపత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆలూర్లో బయటి వ్యక్తులు జవాబులను రాసి పరీక్ష కేంద్రంలోకి పంపినట్లు తెలిసింది. ప్రశ్నాపత్రాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వెంటనే డీఈవో అశోక్కుమార్ ఆయా సెంటర్లకు వెళ్లి విచారణ చేపట్టారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు ఆలూర్ సెంటర్ సిబ్బంది రాజేందర్, విజయ్కుమార్, సాగర్, ఉమేందర్, మెండోరా సిబ్బంది మమత, రవీందర్, భూపతి, బోధన్ సిబ్బంది వేణు, శివానందరావులను సస్పెండ్ చేసినట్లు డీఈవో తెలిపారు. సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన సెకండ్ లాంగ్వేజ్ పేపర్ ఆలూర్, బోధన్, మెండోరాలో ఘటన తొమ్మిది మంది సస్పెన్షన్ -
వడగళ్ల వాన.. 1,520 ఎకరాల్లో పంట నష్టం
● సాలూర, రుద్రూర్, వర్ని, పొతంగల్ మండలాల్లో దెబ్బతిన్న పంటలు డొంకేశ్వర్/రుద్రూర్/వర్ని: జిల్లాలో మంగళవారం సాయంత్రం కురిసిన వడగళ్ల వానకు బోధన్ డివిజన్ పరిధిలో 1,520 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. వడగళ్ల ధాటికి వరి గింజలు నేలరాలాయి. మొక్కజొన్న పంట అడ్డంగా పడిపోయింది. సాలూర, పొతంగల్ మండలం కొల్లూర్, హెగ్డొలి, దొమలెడ్గి, టాక్లీ గ్రామాల్లో మొక్కజొన్న, రుద్రూర్ మండలం చిక్కడపల్లి, రాణంపల్లి, అంబం(ఆర్), కొందాపూర్, రుద్రూర్, అక్బర్నగర్లతోపాటు వివిధ గ్రామాల శివార్లలో వరికి నష్టం వాటిల్లింది. వర్ని మండలం తగిలేపల్లి, పాత వర్నిలో వడగల్లు కురిశాయి. వ్యవసాయ శాఖ బుధవారం పంట నష్టం లెక్కలను సేకరించగా.. మొత్తం 891మంది రైతులను బాధితులుగా గుర్తించారు. అంచనా నివేదికను వ్యవసాయాధికారులు కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపించారు. అత్యధికంగా వరి 1,110 ఎకరాలు, మొక్క జొన్న 110 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు డీఏవో వీరాస్వామి వెల్లడించారు. రుద్రూర్ 980 సాలూర 360వర్ని 130 పొతంగల్ 50మండలాల వారీగా పంటనష్టం (ఎకరాల్లో..) -
విద్యార్థులకు బెటాలియన్ పోలీసుల చేయూత
కాసర్లకు ధర్మనిధి పురస్కారం నిజామాబాద్ రూరల్: జిల్లాకు చెందిన కవి కాసర్ల నరేష్ రావు తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ధర్మనిధి పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాద్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రా రావు చేతుల మీదు ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. పరిషత్ అధ్యక్షుడు శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి చెన్నయ్య, కవులు తిరుమల శ్రీనివాసాచార్య, గోపగాని రవీందర్, తుమ్మల దేవారావు, మంత్రి రామారావు, డాక్టర్ కమలాకర శర్మ, సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
25న తైబజార్ వేలం
ఆర్మూర్టౌన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని వారంతపు సంత, రోజువారి తైబజార్కు ఈనెల 25న వేలంపాటను మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి, మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు నిర్వహించనున్నట్లు మున్సిపల్ ఆర్వో ఉమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. వారపు సంత (అంగడి), రోజువారి తైబజార్ కాంట్రాక్టు 01–04–2026 నుంచి 31–03–2027 వరకు ఇచ్చేందుకు నిర్ణయించడమైందన్నారు. వేలంలో పాల్గొనేవారు ఈనెల 17 నుంచి 24 వరకు మున్సిపల్ కమిషనర్ పేరు మీద రూ.5లక్షల డీడీ తీసి అందజేయాలన్నారు. వేలంపాటకు సంబంధించిన నిబంధనలు నోటీసు బోర్డుపై ఉన్నాయన్నారు. ఖలీల్వాడి : జిల్లాలో నేటి నుంచి ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం అవుతుందని, సంబంధిత సబ్జెక్టుల అధ్యాపకులు వెంటనే రిపోర్టు చేయాలని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, అన్ని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ వారి కళాశాల లాగిన్లలో అధ్యాపకుల అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇంటర్ బోర్డు నిక్షిప్తం చేసిందన్నారు. మూల్యాంకన విధులు ఉన్న ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, హిస్టరీ సబ్జెక్టు అధ్యాపకులను రిలీవ్ చేయాలని, ఎవరైనా రిలీవ్ చేయని ప్రిన్సిపాల్స్, ప్రైవేటు యాజమాన్యంపై ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఖలీల్వాడి: ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనంలో విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులకు రానున్న ఉగాది, రంజాన్ పండుగలకు మూల్యాంకనంలో ‘నో వర్క్ నో పే‘ అమలు చేయాలని ప్రభుత్వ అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సయ్య, ఇతర ప్రతినిధులు కోరారు. ఈమేరకు వారు జిల్లా ఇంటర్ విద్య అధికారి రవి కుమార్కు, హైదరాబాద్ నుంచి వచ్చిన ఇంటర్ విద్య పర్యవేక్షకులకు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. వినతి పత్రాన్ని వెంటనే ఇంటర్ బోర్డు కమిషనర్కు, పరీక్షల నిర్వహణ విభాగానికి పంపిస్తామని జిల్లా ఇంటర్ విద్యా అధికారి, పర్యవేక్షకులు తెలియజేశారు. నిజామాద్ రూరల్: ఏప్రిల్ 2న హనుమాన్ జ న్మోత్సవం సందర్భంగా నిర్వహించనున్న శో భాయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ విశ్వహిందూపరిషత్ ప్రతినిధులు కోరారు. ఈమేర కు వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు దినేష్ ఠాకూర్ మంగళవారం నగరంలోని సీపీ సాయిచైతన్య ను ఆయన చాంబర్లో కలిసి, వినతిపత్రం అందజేశారు. ఇందూరు నగరంతోపాటు, అర్మూ ర్, బోధన్లలో హనుమాన్ శోభాయాత్ర ని ర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే అడిషనల్ డీజీపీ బస్వారెడ్డిని కలిసి మెమోరాండం ఇ చ్చారు. వీహెచ్పీ ప్రతినిధులు తమ్మలా కృష్ణ, గాజుల దయానంద్, ధాత్రిక రమేష్, దాసరి సాయి ప్రసాద్, అనిల్ కధం, రామ్ ప్రసాద్ చటర్జీ, నాంపల్లి శేఖర్, బాసొల్లా నీకేష్, గజానన్ పాల్గొన్నారు. నవోదయ ఫలితాల్లో జిల్లా టాపర్ లేక్షణ డొంకేశ్వర్(ఆర్మూర్): నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాలు మంగళవారం వెలువడగా.. డొంకేశ్వర్ మండలం జీజీ నడ్కుడకు చెందిన రాజారాం లేక్షణ 95శాతం మార్కులతో జిల్లా టాపర్గా నిలిచింది. నూత్పల్లిలోని సాయి ప్రసన్న పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న లేక్షణ ఇటీవల నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష రాసింది. ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు రావడంతో తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులు లేక్షణను అభినందిస్తున్నారు. -
ఎండకు ఎదురెళ్లొద్దు!
● వేసవికాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం ● ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యనిపుణులునిజామాబాద్ రూరల్: వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఇంతటి ఎండల్లో తి రిగితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంద ని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. హీట్ స్ట్రోక్తో పాటు విరేచనాలు (డయేరియా), పచ్చ కామెర్లు (జాండిస్) వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కు వగా ఉంటుందని తెలిపారు. వేసవి కాలంలో చిన్న జాగ్రత్తలతోనే పెద్ద ఆరోగ్య సమస్యలను నివారించ వచ్చని సూచిస్తున్నారు. ఈనేపథ్యంలో ఎండాకా లంలో ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని పేర్కొంటూ.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూ చనలు తెలియజేశారు. ● రోజుకు కనీసం 3–4 లీటర్ల నీరు తాగాలి. ● శుభ్రమైన, మరిగించిన లేదా ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే ఉపయోగించాలి. ● చిన్నపిల్లలు గర్భిణులు, బాలింతలు ఎండలో బయటకు వెళ్లరాదు. ● బయటకు వెళ్తే తలకు టోపి (క్యాప్/టవల్) ఉపయోగించాలి. ● ఉదయం 8 గంటల నుంచి 11 గంటలలోపు ఇంట్లోకి చేరుకుకోవాలి. ● మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు బయట తిరగకుండా ఉండాలి. ● సాయంత్రం 4గంటల తరువాతనే బయటకు వెళ్లడం శ్రేయస్కరం. ● తేలికపాటి, పలుచని, తెల్లని దుస్తులు ధరించాలి. ● కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవాలు ఎక్కువ తీసుకోవాలి. ● బయట ఆహారం, అపరిశుభ్రమై న ఆహారం తీసుకోవడం పూర్తిగా నివారించాలి. ● చేతులు తరచూ కడుక్కోవాలి, పరిశుభ్రత పాటించాలి. ● పిల్లలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ● వాంతులు, విరేచనాలు, జ్వరం లేదా కళ్లు/చర్మం పసుపు రంగులో మారడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ● ఉదయం అత్యవసర సమయంలో బయటకు వెళ్తే గొడుగు తప్పని సరిగావాడాలి.ఎండాకాలంలో జాగ్రత్తలు పాటిస్తే సంపూర్ణ అరోగ్యం అభిస్తుంది. ముఖ్యంగా ఎండాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వడదెబ్బ తగిలితే వెంటనే దగ్గర్లో ఉన్న వైద్యుడిని సంప్రదించాలి. ఓఆర్ఎస్ ద్రావణంతోపాటు మజ్జిగ, నిమ్మరసాలు, శీతల పానియాలు తాగాలి. ఎండలో ఎక్కవగా తిరుగకుడదు. –ఆనంద్ మాలు, జనరల్ ఫిజీషియన్, మెడికవర్ హాస్పిటల్స్, నిజామాబాద్ -
రాతిగోడపై రావిచెట్టు
దరఖాస్తుల ఆహ్వానం డిచ్పల్లి: మండలంలోని ఘన్పూర్ గ్రామ పంచాయతీ భవనంలో ఉన్న సెట్విన్ (యూత్ సర్వీస్ డిపార్ట్మెంట్) ఆధ్వర్యంలో కంప్యూటర్, టైలరింగ్లో శిక్షణ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సెంటర్ కోఆర్డినేటర్ అబ్రార్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఆధార్, ఎస్సెస్సీ జిరాక్స్తోపాటు, ఫొటోలతో దరఖాస్తులను సెట్విన్ కార్యాలయంలో అందజేయాలని కోరారు. ఎంఎస్ ఆఫీస్, డీటీపీ కోర్సులకు మూడు నెలలకు రూ.12,00 లు, టాలీ కోర్సుకు మూడు నెలలకు రూ.1,600లు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని కో–ఆర్డినేటర్ తెలిపారు. అలాగే టైలరింగ్ మూడు నెలలకు రూ.1600 లు ఫీజు చెల్లించాలన్నారు. కోర్సు పూర్తయిన తర్వాత పరీక్ష నిర్వహించి ప్రభుత్వ సర్టిఫికెట్ ఇస్తారని తెలిపారు. మరిన్ని వివరాలకు 89858 64424, 97000 07149ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. -
జాబ్మేళాకు అపూర్వ స్పందన
కొనసాగుతున్న ఎంఈడీ పరీక్షలు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఎంఈడీ 3వ సెమిస్టర్ రెగ్యులర్ థీయరీ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 29 మంది విద్యార్థులకు గానూ 28 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. ఘనంగా మహిళా దినోత్సవం తెయూ(డిచ్పల్లి): తెలంగాణ వర్సిటీలో మంగళవా రం తెయూ ఉమెన్ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వీసీ యాదగిరిరావు ము ఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మహిళా చైత న్యం గ్రామాల నుంచే మొదలవ్వాలన్నారు. రిజిస్ట్రా ర్ యాదగిరి మాట్లాడుతూ.. సీ్త్ర, పురుషులు పరస్ప ర సహకారంతో ముందుకెళ్లినప్పుడే మంచి అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఉమెన్ సెల్ డైరెక్టర్ భ్ర మరాంభిక, ప్రిన్సిపాల్స్ రాంబాబు, సీహెచ్ ఆరతి, ప్రసన్నరాణి తదితరులు పాల్గొన్నారు. లైబ్రరీకి పుస్తకాల అందజేత తెయూ(డిచ్పల్లి): తెయూకు మంగళవారం డాక్టర్ విభూది వెంకటేశ్వర్లు రచించిన బేడ (బుడగ) జంగం ఇంగ్లీష్ వర్షన్ పుస్తకాలను అందజేశారు. నల్గొండ జిల్లా దిండి మండలానికి చెందిన డాక్టర్ వెంకటేశ్వర్లు ప్రస్తుతం పీఎంఆర్ లా కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన బహూకరించిన పుస్తకాలను తెయూ తెలుగు అధ్యయనశాఖ ప్రొఫెసర్ పి.కనకయ్య, లక్ష్మణ చక్రవర్తి యూనివర్సిటీ లైబ్రేరియన్కు అందజేశారు. 25న ‘సైబర్ హైజీన్ ప్రాక్టీసెస్’పై సదస్సు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో ఈ నెల 25న ‘సైబర్ హైజీన్ ప్రాక్టీసెస్’ అవగాహన స దస్సు నిర్వహించనున్నట్లు తెయూ వీసీ యాదగిరిరావు అన్నారు. సదస్సును విద్యార్థులు సద్వినియో గం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా మంగళవారం వీసీ తన చాంబర్లో రిజిస్ట్రార్ యాదగిరితో కలిసి సదస్సు బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. సదస్సును కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ వర్సిటీ సమన్వయంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘వార్తాలాప్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ అవగాహన స దస్సు ఉదయం 10 గంటలకు వర్సిటీ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కళాశాల సెమినార్ లో ప్రారంభమవుతుందన్నారు. వర్సిటీ హాస్టల్స్ తనిఖీ తెయూ(డిచ్పల్లి): తెయూ మెయిన్ క్యాంపస్లోని హాస్టళ్లను మంగళవారం వీసీ యాదగిరిరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల తో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. హా స్టళ్లలో పరిశుభ్రతను మరింత మెరుగుపరచాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం నిరంతరం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రార్ యాదగిరి, కంట్రోలర్ సంపత్కుమార్, ప్రిన్సిపాల్ రాంబాబు, హాస్టల్స్ చీఫ్ వార్డెన్ రవీందర్రెడ్డిలతో కలిసి వీసీ భోజనం చేశారు. వార్డెన్లు గంగాకిషన్, కిరణ్, కేర్టేకర్లు క్రాంతి, డిగంబర్ ఉన్నారు. -
కొత్త పట్టాదారులకూ భరోసా
డొంకేశ్వర్(ఆర్మూర్): రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు మరో తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ నాటికి కొత్త పట్టా పాస్పుస్తకాలు పొందిన రైతులు కూడా ‘రైతు భరోసా’ పథకం కింద పంట పెట్టుబడి సాయం పొందేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం తగిన పత్రాలతో స్థానిక రైతు వేదికల్లో ఏఈవోలకు ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించింది. ఈ నిర్ణయంతో జిల్లాలో మరికొంత మంది రైతులు లబ్ధి పొందనున్నారు. కటాఫ్ తేదీ ప్రకారం జిల్లాలో కొత్త పట్టాదారు పుస్తకాలు పొందిన వారు 4,616 మంది ఉన్నట్లుగా వ్యవసాయ శాఖ వెల్లడించింది. అయితే యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులు మార్చి 22వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. పాత రైతులతోపాటు కొత్త రైతులకు కూడా పెట్టుబడి సాయం అందనుంది. ఎకరానికి రూ.6వేల చొప్పున ప్రభుత్వం ఇవ్వనుంది. కొత్త పట్టాలు పొందిన రైతులు దరఖాస్తు చేసుకునేలా వ్యవసాయాధికారులు వాట్సాప్ గ్రూపుల్లో, స్టేటస్ల ద్వారా సమాచారాన్ని చేరవేస్తున్నారు. రైతు భరోసా నిధులను ప్రభుత్వం చివరిసారిగా వానాకాలం–2025లో ఇవ్వగా జిల్లాలో 2.72లక్షల మంది రైతులకు రూ.316.63కోట్లు ఖర్చు చేసింది. అర్హతలు.. అవసరమైన పత్రాలు ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకు కొత్త పట్టా పాసుబుక్ పొందిన వారు అర్హులు పట్టా పాస్బుక్ ఉండి ఇప్పటి వరకు రైతు భరోసా పొందని రైతులు రైతు భరోసా అప్లికేషన్ ఫారం పట్టాదార్ పాస్పుస్తకం జిరాక్స్ రైతు ఆధార్కార్డు బ్యాంకు ఖాతా జిరాక్స్ రైతు మొబైల్ నంబర్ సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని కటాఫ్ తేదీ వరకు కొత్త పట్టాపా స్ పుస్తకాలు పొందిన రైతులు సద్వినియోగం చేసుకోవాలి. యాసంగికి సంబంధించిన రైతు భరోసా డబ్బులు రావాలంటే కొత్త రైతులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాల్సిందే. రైతుల్లో వేదికల్లో ఏఈవోలను, ఏవోలను సంప్రదిస్తే వారు మరిన్ని వివరాలు తెలుపుతారు. – గోసుల వీరాస్వామి, జిల్లా వ్యవసాయాధికారి ఫిబ్రవరి 28 నాటికి పాస్పుస్తకాలు పొందిన వారికి అవకాశం దరఖాస్తుకు ఈ నెల 25వ తేదీ వరకు గడువు లబ్ధి పొందనున్న 4,616 మంది రైతులు! -
నామినేటెడ్ ఆశలు
● ఈ నెలలో పదవుల పంపిణీ పూర్తి చేసే అవకాశాలు ● తాజాగా డాక్టర్ కవితారెడ్డికి దక్కిన రాష్ట్ర కార్పొరేషన్ పదవి ● అలర్ట్ అయిన ఆశావహులు.. హైదరాబాద్లో మకాం ● నాయకులను, శ్రేణులను మూడు కేటగిరీలుగా విభజించినట్లు వార్తలు ● ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ దక్కే చాన్స్! సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నామినేటెడ్ పదవులను పూర్తిస్థాయిలో పంపిణీ చేసేందుకు ఈ నెలలో కాంగ్రెస్ నాయకత్వం రంగం సిద్ధం చేస్తుండడంతో జిల్లాకు చెందిన ఆశావహులు మరింత అలర్ట్ అయ్యారు. పదవులు ఆశిస్తున్న నాయకులు హైదరాబాద్లో మకాం వేసి తమ స్థాయిలో ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కీలక పదవుల్లో ఉన్నవారిని కలిసి తమకు పదవులు కేటాయించేలా చూడాలని అడుగుతున్నారు. పూర్తిగా హైదరాబాద్లోనే ఆయా ఆశావహులు చక్కర్లు కొడుతున్నారు. కాగా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షినటరాజన్ శ్రేణులను మూడు కేటగిరీలుగా విభజించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు, కార్యకర్తల్లో దీనిపై చర్చ జరుగుతోంది. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారు, గత శాసనసభ ఎన్నికలకు ముందు వచ్చినవారు, పార్టీ అధికారంలోకి వచ్చినవారు అనే మూడు కేటగిరీలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో మూడు కేటగిరీల వారు ఆయా లెక్కల ఆధారంగా ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఇప్పటికే పదవుల కోసం రెండేళ్లకు పైగా ఎదురు చూస్తున్న నాయకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు మీనాక్షిపార్టీ అధినాయకత్వానికి నివేదిక సైతం ఇవ్వడం గమనార్హం. ఇక జిల్లా నుంచి పీసీసీ అధ్యక్షుడుగా మహేశ్గౌడ్ ఉండడంతో ఆశావహుల నుంచి ఆయనపై ఒత్తిడి ఎక్కువగా ఉంది. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న డాక్టర్ కవితారెడ్డికి జిల్లా నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్పర్సన్గా నామినేటెడ్ పదవి కేటాయించడంతో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇదే క్రమంలో మిగిలిన ఆశావహులకు సైతం పదవుల పంపిణీ చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా కొందరు ఎమ్మెల్యేలకు సైతం కీలక కార్పొరేషన్ పదవులు ఇ వ్వనున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ రూరల్ ఎ మ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డికి కీలకమైన ఆర్టీసీ చైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు జిల్లా పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. కాగా జిల్లాల వారీగా నామినేటెడ్ పదవులు ఎవరికి ఇవ్వాలనే విషయమై ఇప్పటికే జాబితా రూపొందించినట్లు సమాచారం. ఇందులో యువ నాయకులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. రేసులో..మాజీ డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి మరోసారి ఆ పదవిని ఆశిస్తున్నారు. సహకార పదవులు సైతం నామినేటెడ్ పద్దతిలో ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనిపై భారీ చర్చ నడుస్తోంది. డీసీసీ పీఠం ఆశించి విఫలమైన సీనియర్ నాయకుడు మార చంద్రమోహన్రెడ్డి రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవి రేసులో ఉన్నారు. అదేవిధంగా మరో సీనియర్ నాయకుడు బాడ్సి శేఖర్గౌడ్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి రేసులో ఉన్నారు. శేఖర్గౌడ్కు గీత కార్మిక కార్పొరేషన్ పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. మాజీ డీసీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, పురణ్రెడ్డి సైతం నామినేటెడ్ రేసులో ఉన్నారు. మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, బాస వేణుగోపాల్యాదవ్, వెల్మ భాస్కర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, కాటిపల్లి నరేందర్రెడ్డి, నరాల రత్నాకర్ పదవుల రేసులో ఉన్నారు. గత ఎన్నికల్లో జుక్కల్ ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించి భంగపడిన రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ సైతం రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. నామినేటెడ్ పదవుల నియామకానికి అధిష్టానం కసరత్తు చేస్తోందనే వార్తల నేపథ్యంలో ఆశావహులు ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే నాయకులు, కార్యకర్తలను అధిష్టానం మూడు కేటగిరీలుగా విభజించిట్లు సమాచారం. ముందు నుంచి పార్టీలో ఉన్నవారు, అసెంబ్లీ ఎలక్షన్స్కు ముందు వచ్చిన వారు, పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేరిన వారి పేర్లతో జాబితాలు చేసినట్లు తెలిసింది. -
ఉద్రిక్తంగా మారిన బల్దియా ముట్టడి
● సొమ్మసిల్లిన మున్సిపల్ మహిళా కార్మికులు ● సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిజామాబాద్ రూరల్: సమస్యలను పరిష్కరించాలని, కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులు(సీఐజీ)లను య థావిధిగా కొనసాగించాలని, ఏజెన్సీలను రద్దుచేసి, కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాలని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు డిమాండ్ చేశా రు. సమస్యల పరిష్కారం కోసం టీయూసీఐ, ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మంగళవారం చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. కార్మికులు, డ్రైవర్లు పాత మున్సిపల్ కార్యాలయం నుంచి కోర్టు చౌరస్తా నుంచి కార్పొరేషన్ కార్యా ల యం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా వచ్చిన కార్మికులను పోలీసులు మున్సిపల్ కార్యాలయంలోకి రానివ్వకపోవడంతో ఒక్కసారిగా చొచ్చు కు వెళ్లారు. అనంతరం కమిషనర్ చాంబర్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీ యూసీ ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేశ్బాబు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఓమయ్య, డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడారు. ఉగా ది, రంజాన్ పండుగల నేపథ్యంలో బుధవారం సా యంత్రంలోగా కార్మికులకు జీతాలు ఇవ్వాలన్నారు. అ వుట్సోర్సింగ్ కార్మికులందరికీ యూనిఫామ్, స బ్బులు, నూనెలు, రక్షణ పరికరాలు ఇవ్వా లని, చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ స భ్యులకి ఉద్యోగ అవకాశం ఇవ్వడంలో కొర్రీలు పెట్టడం మానుకోవాలన్నారు. కేటగిరీల వారీగా ఇ తర మున్సిపల్ కార్పొరేషన్లలో ఇస్తున్నట్లు వేతనా లు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐలలో తప్పులను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. సమస్యలను 14 రోజుల్లో పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్తామన్నారు. మున్సిపల్ కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ కమిషనర్ రవీందర్సాగర్కు వినతిపత్రం అందజేశారు. ధర్నా కొనసాగుతున్న క్ర మంలో తోపులాట చోటుచేసుకోవడంతో మాధవి, పార్వతి అనే మహిళా కార్మికులు సొమ్మసిల్లి పడిపోయారు. తోటి కార్మికులు వారిని వెంటనే అంబులెన్స్లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు భూపతి, రాజేశ్వర్, కిరణ్, గోవర్ధన్, రవి, శివకుమార్, భానుచందర్, మహేశ్, యాదమ్మ, లక్ష్మి, శైలజ, మున్సిపల్ కార్మికులు, డ్రైవర్లు టీయూసీఐ జిల్లా నాయకులు కిరణ్, లింగం, ఏఐటీయూసీ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.


