Nizamabad District Latest News
-
డాక్యుమెంట్కో ధర.. వసూళ్లకు దళారి
● కాసులు కురిపిస్తున్న రిజిస్ట్రేషన్లు ● ఇప్పటి వరకు ఏసీబీకి చిక్కిన డీఆర్.. ఐదుగురు సబ్ రిజిస్ట్రార్లు ఖలీల్వాడి: డాక్యుమెంట్ను బట్టి ధర.. డబ్బులు వసూలు చేసేందుకు దళారి.. ఇదీ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కొనసాగుతున్న ట్రెండ్. రిజిస్ట్రేషన్ అంటేనే కాసుల పంట అనే స్థాయికి పరిస్థితి చేరింది. చిన్నచిన్న తప్పులను కప్పిపుచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునేందుకు ఆస్తుల కొనుగోలు, అమ్మకందారులు ఖర్చుకు వెనుకడుగు వేయడం లేదు. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కాసుల పంట పండుతోంది. ఇళ్లు, ఇంటిస్థలాలకు రిజిస్ట్రేషన్లు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం తహ సీల్ కార్యాలయాల్లో చేస్తుండగా, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇళ్లు, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇళ్ల స్థలాలకు డీటీసీపీ అప్రూవల్, నాలా కన్వర్షన్ తప్పనిసరిగా ఉండాలి. వాటికే రిజిస్ట్రేషన్ చేయా ల్సి ఉంటుంది. అలాకాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యవసాయభూములు కొనుగోలు చేసి వాటిని వెంచర్లుగా మార్చి స్థానిక డాక్యుమెంట్ రైటర్లు లేదా రిజిస్ట్రేషన్ అధికారులతో ఒప్పందం చేసుకుని రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఫేక్ రిజిస్ట్రేషన్ లకు డాక్యుమెంట్ను బట్టి ధర నిర్ణయిస్తున్నారు. పాత ఇళ్లకు జీపీలు, కార్పొరేషన్, మున్సిపాలిటీల నుంచి ఓనర్ షిప్ సర్టిఫికెట్ తీసు కుని చేయించుకుంటున్నారు. కుటుంబ సభ్యులు బతికి ఉంటే వాటికి సంబంధించిన వివరాలు పెట్టాల్సి ఉంటుంది. లేనిపక్షంలో డెత్ సర్టిఫికెట్తోపాటు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జతచేసి ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేనిపక్షంలో ఆ ఇంట్లోని పెద్ద ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సబ్ రిజిస్ట్రార్లు నిర్ణయించిన ప్రకారం డబ్బులు చెల్లిస్తే ఓకే.. లేదంటే కొర్రీలు పెడతారు. వసూళ్లు ఇలా.. సబ్ రిజిస్ట్రార్ వద్దకు వచ్చిన డ్యాకుమెంట్ను బట్టి ధరను నిర్ణయిస్తారు. ఆ మొత్తాన్ని డాక్యుమెంట్ రైటర్ ద్వారా లేదా దళారి ద్వారా తీసుకుంటారు. డ్యాకుమెంట్ రైటర్ల వద్ద సబ్ రిజిస్ట్రార్ ప్రతి శనివారం రిజిస్ట్రేషన్లకు సంబంధించి డబ్బులు వసూలు చేసుకుంటారనే ప్రచారం ఉంది. జిల్లాలో ఏసీబీకి చిక్కినవారు.. ఇప్పటి వరకు జిల్లా రిజిస్ట్రార్(డీఆర్)తోపాటు ఐదుగురు సబ్ రిజిస్ట్రార్లు ఏసీబీకి చిక్కారు. 2016లో నిజామాబాద్ రిజిస్ట్రర్ మోహన్ ఏసీబీకి చిక్కగా ఆ తరువాత సబ్రిజిస్ట్రార్లు సతీశ్, శ్రీనాథ్, శ్రీధర్, ఆనంద్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. తాజాగా నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రర్–2 శ్రీరామరాజు ఏసీబీకి చిక్కారు. ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్, స్వీపర్ఖలీల్వాడి: నిజామాబాద్ జిల్లా రిజిస్ట్రార్ కార్యా లయంలోని అర్బన్ సబ్ రిజిస్ట్రార్–2 శ్రీరామరాజు, స్వీపర్ రంగ్సింగ్ వెంకట్రావులు లంచం తీ సుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. అయితే లంచం ఇచ్చిన బాధితుడి వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం బాధితుడు సోమవారం ఉదయం 11.50 గంటలకు సబ్రిజిస్ట్రార్ చెన్నమాధవేణి శ్రీరామరాజు వద్దకు వెళ్లగా నే డాక్యుమెంట్ను కౌంటర్లో, లంచం డబ్బులు స్వీపర్ రంగ్సింగ్ వెంకట్రావుకు ఇవ్వాలని చెప్పా రు. బాధితుడు డాక్యుమెంట్లను కౌంటర్లో ఇచ్చి అనంతరం స్వీపర్ వెంకట్రావును కలిశారు. బాధితుడిని స్వీపర్ వెంకట్రావు కార్యాలయ అధికారులు భోజనం చేసే గదిలోకి తీసుకువెళ్లి రూ.10 వేలు తీసుకుని జేబులో పెట్టుకొగానే అప్పటికే మాటువేసిన ఏసీబీ అధికారులు పట్టు కున్నారు. ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయడానికి సబ్రిజిస్ట్రార్–2 శ్రీరామరాజు డబ్బులు డిమాండ్ చేయడంతో కెమికల్ పూసిన రూ.10 వేలు ఇచ్చినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. స్వీపర్ వెంకట్రావును పట్టుకున్న అనంతరం విచారణ జరిపి సబ్రిజిస్ట్రార్–2 శ్రీరామరాజును అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇద్దరిని హైదరాబాద్లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. కాగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని సబ్రిజిస్ట్రార్–2 శ్రీరా మరాజు ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలిసింది. ఏసీబీ దాడుల సందర్భంగా కార్యాలయంలో రెండుగంటల పాటు రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. వెయిటింగ్ హాల్ నుంచే సబ్రిజిస్ట్రార్–1 రిజిస్ట్రేషన్లు చేశారు. శ్రీరామరాజు ఆదిలాబాద్ జిల్లా బోథ్ నుంచి నిజామాబాద్కు బదిలీపై వచ్చారు. మొదట్లో డాక్యుమెంట్ రైటర్లతో వివాదం జరిగింది. రిజిస్ట్రే షన్లో ఇబ్బందులకు గురి చేస్తున్నారని గత నవంబర్లో డాక్యు మెంట్ రైటర్లు ధర్నా చేశారు. గతంలో రామరాజు నిర్మల్ జిల్లా భైంసాలో పని చేస్తున్న సమయంలో ఇల్లీగల్ డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్ చేశారనే ఆరోపణలు ఆదిలాబాద్కు బదిలీ చేసినట్లు తెలిసింది. అక్కడ రామరాజును సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్కు రూ. 10 వేలు తీసుకుంటుండగా పట్టివేత -
మోదీ పాలనలో రాష్ట్రానికి అన్యాయం జరగదు
సుభాష్నగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన లో తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరగదని, రా ష్ట్రంలోని ప్రాజెక్టులకు కిషన్రెడ్డి అడ్డుపడుతున్నారన డం సరికాదని ఎంపీ అ ర్వింద్ ధర్మపురి పేర్కొన్నా రు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. సీఎం కార్యాలయ అధికారులను ప్రాజెక్టుల డీపీఆర్లతో పంపించాలని, తాను కిషన్రెడ్డిని వెంట తీసుకువస్తానని, వెంటనే ఎక్కడ అడ్డుపడ్డారో తేలిపోతుందని సవాల్ విసిరారు. ప్రధాని మోదీకి అన్ని రాష్ట్రాలు సమానమేనని తెలిపారు. మూసీ ప్రక్షాళన డీపీఆర్ తప్పులతడకగా ఉందని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి పనికిమాలిన రాజకీయాలు మానుకోవాలని, కల్లబొల్లి కబుర్లు చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 15 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, మహిళలు చీపుర్లు పట్టుకుని కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జాతీయస్థాయి పసుపు బోర్డు ఏర్పాటులో తాను కీలకపాత్ర పోషించానని, రెగ్యులర్గా కేంద్రం నుంచి జరిగే అభివృద్ధిని చేయలేమా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి పనికిమాలిన రాజకీయాలు మానుకోవాలి ఎంపీ అర్వింద్ ధర్మపురి -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం ఉత్కంఠ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠను కలిగిస్తోంది. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఆలస్యంగా అయినా ఫలితం తేలింది. ఇక కీలకమైన పట్టభద్రుల ఓట్ల లెక్కింపు మాత్రం యంత్రాంగానికి పెద్ద టాస్క్ అవుతోంది. ఇదిలా ఉండగా ఉపాధ్యాయులు, పట్టభద్రులకు సంబంధించి చెల్లని ఓట్ల సంఖ్య భారీగా ఉండడం గమనార్హం. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఓట్లు మొత్తం 3,55,159 ఉన్నాయి. ఇందులో 2.50 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి. లెక్కింపు మొదలుపెట్టిన రోజైన సోమవారం రాత్రికి 1 లక్ష ఓట్లను చెల్లిన ఓట్లు, చెల్లని ఓట్లుగా విభజన చేశారు. ఇంకా 1.5 లక్షల పోలైన ఓట్లను చెల్లిన, చెల్లని ఓట్లుగా విభజన చేయాల్సి ఉంది. ఇప్పటివరకు విభజన చేసిన 1 లక్ష ఓట్లలో 8 వేలకు పైగా చెల్లని ఓట్లు ఉండడం గమనార్హం. మిగిలిన 1.5 లక్షల ఓట్లలో చెల్లని ఓట్ల సంఖ్య భారీగా ఉండనున్నట్లు తెలుస్తోంది. నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 42 శాసనసభ సెగ్మెంట్ల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులు, వాటిలోని బ్యాలెట్ పేపర్లను కట్టలుగా కట్టడం, విభజన చేసేందుకే చాలా సమయం తీసుకుంటోంది. పైగా అభ్యర్థుల సంఖ్య భారీగా ఉంది. మొత్తం 56 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో జంబో బ్యాలెట్ పేపర్ తప్పనిసరి అయింది. పైగా ఓట్లు ప్రాధాన్యత క్రమంలో వేసే పరిస్థితి నేపథ్యంలో ప్రతి బ్యాలెట్ పేపర్ను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన ఆవశ్యకత ఉంది. పైగా ప్రాధాన్యత ఓట్లు వేసే క్రమంలో సింగిల్ డిజిట్లో, అభ్యర్థి పేరు పక్కన ఉన్న బాక్సులో మాత్రమే అంకెలు వేయాలి. ఎంతమందికి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ మధ్యలో ఏదేని అంకె వేయని పక్షంలో సదరు ఓటు చెల్లకుండా పోతుంది. టిక్కు మార్కులు, ముద్రలు తదితరాలు వేసినా ఓటు చెల్లదు. ఈ క్రమంలో ప్రతి బ్యాలెట్ పేపర్ను చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంది. ఇక మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలకపోతే రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత ద్వారా తేల్చాలంటే ఎలిమినేషన్ రౌండ్ లెక్కింపు తప్పనిసరి. దీంతో పూర్తి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం మరో రెండు రోజులు పట్టనున్నట్లు తెలుస్తోంది. మల్క కొమురయ్య గెలుపు సంబురాలు.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్లు మొత్తం 27,088 ఉండగా ఇందులో 24వేలకు పైగా ఓట్లు నమోదయ్యాయి. సోమవారం రాత్రి ఫలితం తేలింది. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. -
చెరువు ఆక్రమణపై ఏడాదిన్నరగా ఫిర్యాదు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : గ్రామం, మండలం, డివిజన్ స్థాయిలను దాటి కలెక్టరేట్ వరకు సామాన్యులు తమ సమస్యలను విన్నవించుకుంటున్నా రు. అయితే కలెక్టరేట్ వరకు సమస్యలను తీసుకొచ్చినప్పటికీ పరిష్కారం దిశగా ఒక్క అడుగూ ముందుకు పడని అర్జీలే ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో ఇంకెక్కడికి వెళ్లాలో తెలియక బాధితులు ఇదే కలెక్టరేట్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇలా తిరుగుతున్నవారిలో పేదలు, నిరక్షరాస్యుల నుంచి విద్యాధికులు సైతం అధికంగా ఉంటున్నారు. కలెక్టరేట్ నుంచి ఆయా విభాగాలకు ఎండార్స్ చేసిన సమస్యల విషయమై యంత్రాంగం ఏమాత్రం పట్టింపు లేకుండా వ్యవహరిస్తోందని, ఈ అంశాలపై సమీక్ష ఉండకపోవడంతో పరిష్కారానికి నోచుకోవడం లేదని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు దిక్కుతోచక కన్నీరు పెడుతున్నారు. ఇక కలెక్టరేట్లో ప్రజావాణికి వచ్చే సమస్యల్లో సామాజిక అంశాలైన చెరువులు, ప్రభుత్వ భూముల కబ్జాలు, ఇతర ప్రజోపయోగ అర్జీలు అనేకసార్లు వస్తున్నప్పటికీ పట్టింపు లేని పరిస్థితి. ప్రజలకు పాలన మరింత చేరువ చేసి సమస్యలను వేగంగా పరిష్కారించేందుకు చిన్న జిల్లాలు, మండలాలు, గ్రామాలు విభజన చేసినప్పటికీ ఫలితం లేదని సామాన్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా సోమవారం ‘సాక్షి’ పరిశీలనలో ప్రజావాణికి వచ్చిన అర్జీల్లో కొన్ని.. డిచ్పల్లి మండలం ఘన్పూర్లోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కళాశాలలో తాము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని, అక్కడ చదువుతున్న కొందరు విద్యార్థులు తరగతులు జరుగుతున్న సమయంలో గోడ దూకి వచ్చి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తమకు ఆహారం నాణ్యత లేకుండా పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సెలవులకు ఇళ్లకు వెళ్లి తిరిగి ఒక్కరోజు ఆలస్యంగా వస్తే రూ.500 జరిమానా పేరిట వసూలు చేస్తున్నారని తెలిపారు. కెమిస్ట్రీ లెక్చరర్ సిలబస్ను సక్రమంగా బోధించడం లేదని, పైగా అధికంగా సెలవులు పెడుతున్నట్లు పేర్కొన్నారు. ఇంకా రెండు చాప్టర్లు బోధించలేదని వివరించారు. దీంతో బోర్డు ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతామనే భయం నెలకొందన్నారు. తమ సమస్యల విషయమై వాటి పరిష్కారం కోసం తమ పక్షాన మాట్లాడిన ఇంగ్లిష్ లెక్చరర్ను ప్రిన్సిపల్ బదిలీ చేయించినట్లు ఫిర్యాదులో వివరించారు. పదేళ్లుగా పింఛన్ కోసం..నిజామాబాద్లోని ఎల్లమ్మగుట్ట ప్రాంతానికి చెందిన రొడ్డ మణెమ్మ భర్త 2013లో మరణించాడు. అప్పటినుంచి మణెమ్మ వితంతు పింఛన్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతోంది. ప్రస్తుతం ఈమెకు 76 సంవత్సరాలు. వృద్ధాప్య పింఛన్ కోసం కూడా గతంలో దరఖాస్తు చేసుకుంది. అయినా రెండింటిలో ఏ రకమైన పింఛను అందడం లేదు. గత పదేళ్లలో మున్సిపల్, కలెక్టరేట్లో చాలాసార్లు దరఖాస్తు చేస్తూనే ఉంది. ఫలితం మాత్రం లేదు. కుటుంబ సభ్యులు రేషన్కార్డులో తన పేరు లేకపోవడంతో యాడ్ చేసేందుకు దరఖాస్తు చేసుకోగా సాంకేతిక సమస్యలున్నట్లు అధికారులు తెలిపినట్లు వాపోయింది. తాజాగా మళ్లీ కలెక్టర్కు అర్జీ పెట్టుకుంది. ఈసారి కూడా పరిశీలిస్తామని అధికారులు చెప్పడం గమనార్హం. ఎడపల్లి మండలంలోని మంగళ్పహాడ్ సమీపంలోని 70 ఎకరాల రాయకుంట చెరువును కొందరు ఆక్రమించారని రాజు అనే వ్యక్తి మరోసారి తాజాగా ఫిర్యాదు చేశాడు. ఈ చెరువుతోపాటు గొలుసుకట్టు చెరువుగా ఉన్న కొత్తకుంట చెరువును సైతం ఆక్రమించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. గంగపుత్రులకు ఉపాధినిచ్చే ఈ చెరువులను ఆక్రమించిన విషయమై ఏడాదిన్నరగా చాలాసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ కబ్జాదారులకు కనీసం నోటీసులు సైతం ఇవ్వలేదని ఫిర్యాదుదారుడు తెలిపాడు. భారీ చెరువు చిన్న కుంట మాదిరిగా చిక్కిపోయిందని వివరించాడు. -
పసుపుబోర్డు కార్యదర్శి బాధ్యతల స్వీకరణ
సుభాష్నగర్: జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి భవానీశ్రీ నగరంలోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో చైర్మన్ పల్లె గంగారెడ్డి సమక్షంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో బోర్డు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మానసిక ఒత్తిడికి గురికావొద్దు ● ఇంటర్ విద్యాధికారి రవికుమార్ సూచన నిజామాబాద్ అర్బన్: ఈనెల 5 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికావొద్దని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్ ఒక ప్రకటనలో సూచించారు. సెంటర్లలో అన్ని సౌకర్యాలు ఉంటాయని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని పేర్కొన్నారు. ప్రైవేటు కళాశాలల్లో ఎవరికై నా హాల్ టికెట్ ఇవ్వని పక్షంలో ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరుకావొచ్చని, హాల్ టికెట్ పైన ప్రిన్సిపాల్ సంతకం, కళాశాల ముద్ర అవసరం లేదని స్పష్టం చేశారు. ఇంటర్ పరీక్షల నిర్వహణలో పటిష్టమైన బందోబస్తుతోపాటు ప్రతి క్షణం నిబద్ధతతో పనిచేసే ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారని, బయట ఎలాంటి పుకార్లు వ్యాపించినా నమ్మొద్దన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. ఎయిడ్స్ పరీక్షలకు ‘అంబులెన్స్’ నిజామాబాద్ నాగారం: ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలకు అంబులెన్స్ సేవలను వినియోగించుకోవాలని డీఎంహెచ్వో డాక్టర్ బి.రాజశ్రీ సూచించారు. జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ యూనిట్ ఆధ్వర్యంలో పనిచేసే అంబులెన్స్ సేవలను సోమవారం ఆమె ప్రారంభించారు. అనంతరం డీఎంహెచ్వో మాట్లాడుతూ జిల్లాలో హెచ్ఐవీ ఎయిడ్స్ అధికంగా ప్రబలడానికి అవకాశం ఉన్న హైరిస్క్ ప్రాంతాల్లో ముందుగా ఈ అంబులెన్స్ సేవలను ప్రణాళికా ప్రకారం నిర్వహిస్తారన్నారు. ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలు, చికిత్స, కౌన్సెలింగ్, ఐఈసీ తదితర వాటిపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. అంబులెన్స్లో ఒక ల్యాబ్ టెక్నీషియన్, కౌన్సిలర్తోపాటు ఏరియా ఎయిడ్స్ విభాగ సిబ్బంది, ఏఎన్ఎం, ఆశ కార్యకర్త ఉంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీపీఎం సుధాకర్, సీపీవో మోయిజ్, నవీన్, స్రవంతి, రాజేందర్, నాగరాజు పాల్గొన్నారు. -
పరిష్కారం లేని ప్రజావాణి!
ప్రజాసమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి ఫలితం ఇవ్వడం లేదనే అభిప్రాయం సర్వత్రావ్యక్తమవుతోంది. ఒక్కో అర్జీదారు పదులసార్లు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నా వారి సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడం ‘ప్రజావాణి’ పనితీరును ఎత్తిచూపుతోంది. వ్యక్తిగత ఫిర్యాదులను పక్కన పెడితే.. సామాజిక అంశాలపై అందుతున్న ఫిర్యాదులూ పరిష్కారానికి నోచుకోవడం లేదు. నిజామాబాద్అర్బన్ /ఎడపల్లి(బోధన్): కలెక్ట రేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పోలీసులపైనే ఫిర్యాదులు అందాయి. నిజామాబాద్ నగరంలోని బడాబజార్కు చెందిన హరీశ్ తన ఫిర్యాదులో పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. సీసీఆర్బీ సీఐ సతీశ్, ఐదో టౌన్ ఎస్సై గంగాధర్, ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ సదానందం, డీసీపీ బస్వారెడ్డి నుంచి తనకు ముప్పు ఉందని, తనపై చైన్స్నాచింగ్ అంటూ తప్పుడు కేసు నమోదు చేశారని ఫిర్యా దు చేశాడు. అధికారులు న్యాయం చేయాలని కోరాడు. అదేవిధంగా బోధన్ రూరల్ సీఐ విజయ్బాబుపై చర్యలు తీసుకోవాలని రెంజల్ మండలం దూపల్లికి చెందిన బోయ భాగ్య ఫిర్యాదు చేసింది. గతనెల 13న లక్ష్మీ నరసింహ స్వామి జాతర బ్రహ్మోత్సవాల్లో తన పర్సు పోవడంతో పోలీస్ అవుట్ పోస్టులో ఫిర్యాదు చేశానని, అక్కడే ఉన్న సీఐ విజయ్బాబు నా మాట వినిపించుకోకుండా లాఠీతో కొట్టాడని పేర్కొంది. దీనిపై ఎడపల్లి పోలీస్ స్టేషన్లో, బోధన్ ఏసీపీ, ఇన్చార్జి సీపీకి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కొడుకు, కోడలు అన్నం పెట్టడం లేదని సావెల్కు చెందిన నర్సయ్య ఫిర్యాదు చేశాడు. 12 ఇసాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, భూమి తీసుకున్న తరువాత కూడా తనను పట్టించుకోవడం లేద న్నాడు. కొడుకు, కోడలు పట్టించుకోకపోవడంతో గుడి వద్ద బిచ్చమెత్తుకుంటున్నానని ఫకీరాబాద్కు చెందిన గుడ్డి ముత్తెమ్మ తన ఫిర్యాదులో పేర్కొంది. భర్త చనిపోయిన నాటి నుంచి ఒంటరిగా ఉంటున్నానని తెలిపింది. వర్ని మండల కేంద్రంలోని సత్యనారాయణపురంలో రామాల యం వెనుక చేపట్టిన ఓ ప్రార్థనా మందిరం అక్ర మ నిర్మాణాన్ని అడ్డుకోవాలని హిందూ సంఘా ల ఐక్యవేదిక నాయకులు ఫిర్యాదు చేశారు. గతంలో హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ మళ్లీ నిర్మా ణం చేపడుతున్నారని పేర్కొన్నారు. నిర్మాణాని కి అనుమతులు, రిజిస్ట్రేషన్ లేదన్నారు. ప్రజావాణిలో మొత్తం 62 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యా దులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్, డీపీవో శ్రీనివాస్, నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్రెడ్డి అర్జీలను స్వీకరించారు. ● ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా సమస్యలు యథాతథం ● తక్షణ పరిష్కారంపై యంత్రాంగం నిర్లక్ష్యం ● సామాజిక సమస్యల పరిష్కారాన్నీ పట్టించుకోని వైనం పోలీసుల నుంచి ప్రాణహాని ప్రజావాణిలో వెల్లువెత్తిన ఫిర్యాదులు కొడుకు, కోడలు పట్టించుకోవడం లేదు.. బిచ్చమెత్తుకుంటున్నానని ఓ తల్లి ఆవేదన సమస్యల పరిష్కారానికి ఆదేశించిన కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు -
టీచర్ స్థానంలో కమలం పాగా!
● తొలి ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచిన మల్క కొమురయ్య ● కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ ఓటర్ల విభజనసాక్షిప్రతినిధి,కరీంనగర్: నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ టీచర్ నియోజవర్గం కమలం వశమైంది. తొలిప్రాధాన్యం ఓట్లతోనే మల్క కొమురయ్య టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో విజయం సాధించారు. నల్గొండ టీచర్ ఎన్నికల ఫలితాలు సాయంత్రానికే వచ్చేసినా.. కరీంనగర్ టీచర్ ఎన్నికల లెక్కింపు సాయంత్రానికి మొదలవడం గమనార్హం. కౌంటింగ్ ప్రారంభించిన రెండు గంటల్లోనే ఫలితం తేలింది. టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 27,088 ఓట్లకు గాను 25,041 ఓట్లు పోల్ అవగా.. అందులో 24,144 చెల్లుబాటు అయ్యాయి. 897 ఓట్లు చెల్లలేదు. దీంతో గెలుపు కోటా ఓట్లు 12,073గా నిర్ధారించారు. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు 12,959, వంగ మహేందర్రెడ్డికి 7,182, అశోక్కుమార్కు 2,621, కూర రఘోత్తంరెడ్డికి 428 ఓట్లు వచ్చాయి. బండి అభినందనలు రాత్రి 10.20 గంటల సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కౌంటింగ్ సెంటర్ వద్దకు వచ్చి మల్క కొమురయ్యను అభినందించారు. ఇది చారిత్రక విజయమని, ఈ తీర్పు టీచర్లకు, మోదీకి అంకితమని అన్నారు. ఉదయం 8 నుంచి.. సోమవారం ఉదయం నుంచి గ్రాడ్యుయేట్ ఓట్ల వడపోత కొనసాగుతూనే ఉంది. ఉదయం 8 గంటలకు మొదలు పెట్టిన ఎన్నికల లెక్కింపు, చెల్లని, చెల్లిన ఓట్ల విభజనపై రాత్రి 9గంటలు దాటేవరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. అప్పటి వరకూ దాదాపు లక్ష ఓట్లను వడబోయగా అందులో 92,000 చెల్లుబాటు అయ్యాయని, 8,000 ఓట్లు చెల్లలేదని, మిగిలిన 1.5 లక్షల ఓట్ల వడబోత మంగళవారం మధ్యాహ్నం వరకు పూర్తవుతుందని అధికారులు ప్రకటించారు. లెక్కింపు ప్ర క్రియ మందకొడిగా సాగడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలైన ఓట్లలో కొందరు 01, 02 అని వేసిన వారి ఓట్లు పరిగణనలోకి తీసుకోవాలని పట్టభద్రుల స్థానానికి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డి ఆర్వోకు వినతిపత్రం ఇచ్చారు. -
చివరాయకట్టుకు నీరందేలా చర్యలు
నిజామాబాద్ అర్బన్: చివరాఆయకట్టు వరకు సా గు నీరందేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాల ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. యాసంగి పంటలకు సాగునీటి సరఫరా, నీటి పారుదల శాఖ పనితీరుపై సోమవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. యాసంగి పంటలకు వచ్చే పది రోజులు కీలకమని, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సాగు రంగానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. రిజర్వాయర్లలో అవసరం మేర నీరు అందుబాటులో ఉందని, ప్రతి నీటి చుక్కనూ పూర్తిస్థాయి లో వినియోగించుకుంటూ చివరాయకట్టు వరకు నీరందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గురుకులాలపై.. గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో తనిఖీల తరువాత పరిస్థితుల్లో మార్పు వచ్చిందని, పిల్లలకు అందించే ఆహార నాణ్యత పెరిగిందని, కామన్ మెనూ డైట్ పక్కాగా అమలు అవుతోందని సీఎస్ శాంతికుమారి అన్నారు. సింగిల్ యూసెజ్ ప్లాస్టిక్ నిషేధంలో ప్రజలను భాగస్వామ్యం చేయాల న్నా రు. కలెక్టర్ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, అధికారులు పాల్గొన్నారు. రానున్న 10 రోజులు అప్రమత్తంగా ఉండాలి వీసీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి -
అంతర్జాతీయస్థాయికి పసుపు ఉత్పత్తులు
జక్రాన్పల్లి/కమ్మర్పల్లి: పసుపు ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని జాతీయ పసుపు బోర్డు కార్యద్శరి ఎన్ భవానీశ్రీ అన్నారు. జక్రాన్పల్లి మండలంలోని మనోహరాబాద్లో పసుపు రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన (జేఎంకేపీఎం)పసుపు పరిశ్రమతోపాటు, కమ్మర్పల్లిలోని పసుపు పరిశోధన కేంద్రాన్ని బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డితోపాటు భవానీశ్రీ సందర్శించారు. పరిశోధన కేంద్రంలో సాగైన పసుపు రకాలను పరిశీలించి, వాటి గురించి వివరాలు, నాణ్య త, కుర్కుమిన్, దిగుబడి, వ్యయం తదితర అంశాలతో పాటు ఏయే అంశాలపై పరిశోధన సా గుతోందనే విషయాలను శాస్త్రవేత్త మహేందర్ను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లో పసుపు ధర లభ్యతపై చర్చించారు. జాతీయస్థాయిలో ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాలు ఉన్నాయని, వాటన్నింటినీ ఇప్పటి వరకు స్పైసెస్ బోర్డు ద్వారా ఎగుమతి చేసుకుంటూ వచ్చామన్నారు. అయితే ప్రస్తుతం పసుపులో ఎంత పొటెన్షియల్ ఉందని, జాతీయ స్థాయిలో ఎలా మార్కెటింగ్ చేసుకోవాలనే దానిని పరిశీలిస్తున్నామ న్నారు. పసుపులో పొటెన్షియల్ పెంచుకుని మార్కెటింగ్, బ్రాండింగ్, గ్రేడింగ్ ఎలా చేసుకోవచ్చనే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలిపారు. పసుపును అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. వారివెంట పసుపు రైతుల ఉత్పత్తిదారుల సంఘం డైరెక్టర్లు తిరుపతిరెడ్డి, సంతోష్రెడ్డి, నూతికాడి భోజన్న, శ్రీనివాస్రెడ్డి, నవీన్రెడ్డి, అనిల్కుమార్ ఉన్నారు. -
త్వరలో గల్ఫ్ అమరుల సంస్మరణ సభ
మోర్తాడ్(బాల్కొండ): గల్ఫ్ దేశాల్లో మరణించిన వారిని స్మరిస్తూ ప్రత్యేక సభను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. మృతి చెందిన వలస కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా మంజూరు చేసిన నేపథ్యంలో వారితో సహపంక్తి భోజనం చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి సుముఖత వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు అధికారంలోకి వచ్చిన తర్వాత వారికోసం ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ విప్ ఈరవత్రి అనిల్, టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డిల విజ్ఞప్తి మేరకు గల్ఫ్ మృతుల కుటుంబాలతో సమావేశానికి సీఎం ఆమోదం తెలిపారు. ఈ నెలలోనే ప్రజాభవన్ వేదికగా గల్ఫ్ అమరుల సంస్మరణ సభ నిర్వహించనున్నారు. సీఎం అంగీకరించడం గొప్ప విషయం గల్ఫ్ అమరుల సంస్మరణ సభతోపాటు, ఎక్స్గ్రేషి యా అందుకున్న కుటుంబాలతో సహపంక్తి భోజ నాలకు సీఎం రేవంత్రెడ్డి అంగీకరించడం గొప్ప విషయం. గల్ఫ్ కార్మికులు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండడంతోనే మెజారిటీ ఓట్లు వచ్చాయన్న విషయాన్ని సీఎంకు వివరించాం. – ఈరవత్రి అనిల్, టీజీఎండీసీ చైర్మన్ మృతుల కుటుంబాలతో సహపంక్తి భోజనం చేయనున్న సీఎం రేవంత్రెడ్డి రూ.5లక్షల ఎక్స్గ్రేషియా అందించిన నేపథ్యంలో కార్యక్రమానికి శ్రీకారం -
పంటలు గట్టెక్కేనా?
నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1.25 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవుతోంది. పంటకు అవసరమైన నీటి కోసం ఇప్పటికే మూడు విడతల్లో నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం నాలుగో విడత కొనసాగుతోంది. ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు రోజూ 2,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఈ నీరు డిస్ట్రిబ్యూటరీల చివరి వరకు అందకపోవడంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయి. దీంతో చివరి ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటి కోసం అధికారుల నిర్బంధం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు. కానీ ప్రధాన కాలువ పరిధిలోని వర్ని, చందూర్, జాకోరా, రుద్రూర్, కోటగిరి, బోధన్ ప్రాంతాల్లోని పొలాలకు నీళ్లు రావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. ఎగువన ఉన్న రైతులు ఎక్కువ నీటిని వినియోగించుకుంటుండడంతో ఈ పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది. కాలువకు నీటి విడుదలను పెంచాలని రైతులు కోరుతున్నారు. కాగా పంటలకు నీరు అందడం లేదంటూ ఇటీవల బోధన్ ప్రాంత రైతులు నీటిపారుదల శాఖ అధికారులను నిర్బంధించారు. అలాగే నీరందక పంటలు ఎండిపోతున్న విషయాన్ని బీ ర్కూర్, వర్ని ప్రాంత రైతులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన పోచారం.. రాత్రి వేళలో కాలువలపై పర్యటించి, పరిస్థితిని అధికారులతో సమీక్షించారు. చివరి ఆయకట్టు వరకు నీరందేలా చూ డాలని సూచించారు. డి–26 ఉప కాలువ కింద ఎక్కువ విస్తీర్ణంలో ఆయకట్టు ఉందని, చివరి ఆయకట్ట వరకు నీరు వెళ్లాలంటే కనీసం 3 ఫీట్లు తగ్గకుండా ఉప కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. అలాగే బోధన్ ఎమ్మెల్యే సైతం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించి, అధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నందున చివరి ఆయకట్టు గట్టెక్కేవరకు నీటిని విడుదల చేయాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టు నీరు వృథా కాకుండా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. రాత్రి వేళ తనిఖీలు ఆయకట్టు ప్రాంత రైతుల ఆందోళనల నేపథ్యంలో జిల్లా నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్, ఎస్ఈ రాజశేఖర్, ఈఈ సోలోమాన్, డిప్యూటీ ఈఈ, ఏఈలు, వర్క్ఇన్స్పెక్టర్లు, లస్కర్లు రాత్రి వేళలో ప్రధాన కాలువను తనిఖీ చేస్తున్నారు. నిజాంసాగర్, మహమ్మద్నగర్, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, వర్ని, చందూర్, జాకోరా, రుద్రూర్, కోటగిరి, బోధన్ మండలాల్లో ఆయా డివిజన్ల అధికారులు కాలువలను సందర్శించి, నీరు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగవుతున్న వరి నిజాంసాగర్నుంచి కొనసాగుతున్న నీటి విడుదల చివరి ఆయకట్టుకు నీరందడం లేదని రైతుల ఆందోళన అర్ధరాత్రి తనిఖీలు చేస్తున్న నేతలు, అధికారులు పంటలు గట్టెక్కిస్తామంటూ భరోసా కల్పించే యత్నం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు విడతల వారీగా నీటి విడుదల కొనసాగుతోంది. అయితే చివరి ఆయకట్టుకు నీరందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదుకోవాలని ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. దీంతో ప్రజాప్రతినిధులు, అధికారులు కాలువలను పరిశీలిస్తూ రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మూడు విడతల్లో 6 టీఎంసీలు.. ఆయకట్టుకు నీరందించేందుకు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు. 10 రోజులు ఆన్, ఆఫ్ పద్ధతిలో నీటి విడుదల కొనసాగుతోంది. డిసెంబర్ 13 న నీటి విడుదల ప్రారంభమైంది. ఇప్పటివరకు మూడు విడతల్లో 6 టీఎంసీల నీటిని ప్రధాన కాలువ ద్వారా ఆయకట్టుకు అందించారు. ప్రస్తుతం నాలుగో విడత నీటి విడుదల కొనసాగుతోంది. నాలుగో విడతలో ఇప్పటివరకు 1.481 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా నీటిని తరలిస్తున్నారు నిజాంసాగర్ ప్రధాన కాలువకు ఒక పక్కన మోటార్లు ఏర్పాటు చేసి అక్రమంగా నీటిని తరలిస్తున్నారు. బాన్సువాడ, వర్ని, జాకోరా, చందూర్, రుద్రూర్ అక్రమంగా నీటిని తోడేస్తున్నారు. సుమారు 20 వేల ఎకరాలకు అక్రమంగా నీటిని తరలించుకుపోతున్నారు. దీంతో డిస్ట్రిబ్యూటరీల చివరి వరకు నీరందడం లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తాం. – శ్రీనివాస్, జిల్లా నీటిపారుదలశాఖ సీఈ -
వేర్వేరు చోట్ల నలుగురి ఆత్మహత్య
రెంజల్(బోధన్): రెంజల్ మండలం తాడ్బిలోలి గ్రామానికి చెందిన జంగం నవీన్ (36) జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. సోమవారం ఇంటి నుంచి వెళ్లిన నవీన్ గ్రామ సమీపంలోని పొలంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతదేహాన్ని గుర్తించిన రైతులు కుటుంబీకులకు సమాచారం అందించారు. అక్క శోభ ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూడు సంవత్సరాలుగా భార్యకు దూరమైన నవీన్ మద్యానికి బానిస కావడంతో ఆరోగ్యం క్షిణించి మతిస్థిమితం కోల్పోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్లోని జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. అనారోగ్యంతో వృద్ధురాలు..కమ్మర్పల్లి: అనారోగ్యంతో బాధపడుతూ ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై అనిల్రెడ్డి తెలిపిన ప్రకారం.. కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన జల్లెండ్ల మల్లు(64) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమిసంహారక మందు తాగి ఆత్యహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మరణించింది. మృతురాలి కొడుకు అనిల్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అప్పుల బాధతో ఒకరు..లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రానికి చెందిన సాకలి మెత్కు సాయిలు(45) సోమవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. సాయిలు ఇటీవల కూతురు పెళ్లి చేయగా అప్పులు పెరిగిపోయా యి. దీంతో మద్యానికి బానిసైన సాయిలు తన చే ను వద్ద ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. మృతుడి భార్య యశోద ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. రైలు కిందపడి గుర్తు తెలియని యువకుడు.. కామారెడ్డి క్రైం: రైలు కిందపడి గుర్తుతెలియని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలో సోమవారం జరిగింది. వి వరాలిలా ఉన్నాయి. వేకువజామున 1 గంటల ప్రాంతంలో రైల్వేస్టేషన్ యార్డు వద్ద పట్టాలపై ఓ గుర్తుతెలియని యువకుడి మృతదేహం పడి ఉండడాన్ని రైల్వే పోలీసులు గుర్తించి విచారణ చేపట్టారు. మృతుడి వయస్సు 25–30ఏళ్ల మధ్య ఉంటుందని, ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుడు నలుపు రంగు కార్గో ప్యాంటు, తెలుపు రంగు టీషర్ట్ ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. మృతుడి ఆనవాళ్లు తెలిసిన వారు ఎవరైనా ఉంటే కామారెడ్డి రైల్వే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. -
చేనేత సంఘాన్ని సందర్శించిన అధికారులు
రుద్రూర్: మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘాన్ని హ్యాండ్లూవ్్సు అండ్ టెక్స్టైల్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ బి.వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ హేమలత సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా సంఘంలో పనిచేస్తున్న కార్మికుల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికుల కోసం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. తెలంగాణ నేతన్న పొదుపు పథకంలో భాగంగా చేనేత, అనుబంధ కార్మికులు వారి వేతనాల నుంచి నెలవారీగా 8శాతం కాంట్రిబ్యూషన్ చేస్తే ప్రభుత్వం రెండింతలు జమ చేస్తుందన్నారు. గతంలో మూడేళ్ల వరకు పొదుపుల వ్యవధి ఉండగా, ప్రభుత్వం రెండేళ్లకు తగ్గించిందని తెలిపారు. కార్యక్రమంలో సీడీఈలు ఎస్. నరేందర్, ఎస్. వేణు, చేనేత సంఘం అధ్యక్షుడు మోత్కురి నారాయణ, సంఘం మేనేజర్ ఈర్వ నాగరాజు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. వర్సిటీ అడిషనల్ కంట్రోలర్గా సంపత్ తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూని వర్సిటీ అడిషనల్ కంట్రోలర్ (కాన్ఫిడెన్షియల్)గా అసిస్టెంట్ ప్రొఫెసర్ టి.సంపత్ నియమితులయ్యారు. వీసీ ప్రొఫెసర్ టి.యాద గిరిరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి సోమవారం నియామక ఉత్తర్వులను అందజేశారు. గత దశాబ్ద కాలంగా ఎకనామిక్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా సంపత్ సేవలందిస్తున్నారు. తనపై నమ్మకంతో అడిషనల్ కంట్రోలర్గా నియమించిన వీసీ, రిజిస్ట్రార్లకు సంపత్ కృతజ్ఞతలు తెలిపారు. రేపు ప్రయోగాల ప్రదర్శన సదస్సు తెయూ(డిచ్పల్లి): జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 5న జీవ సాంకేతిక శాస్త్ర ప్రయోగాల ప్రదర్శన సద స్సు నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ డాక్టర్ ప్రసన్నశీల తెలిపారు. సదస్సుకు సంబంధించిన బ్రోచర్ను వీసీ ప్రొఫెసర్ టి.యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి సోమవా రం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రసన్న శీల మాట్లాడుతూ సదస్సుకు తెయూ పరిధి లోని అనుబంధ కళాశాలల విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. జీవ సాంకేతిక శాస్త్ర ప్ర యోగ పద్ధతులు,అందుకు ఉపయోగించే పరికరాలపై అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. విద్యార్థులు సదస్సును సద్వినియోగం చేసుకోవాలని వీసీ, రిజిస్ట్రార్లు సూచించారు. కార్యక్రమంలో సదస్సు కోకన్వీనర్ కిరణ్మయి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ శ్రేణుల సంబరాలు
సుభాష్నగర్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బీజేపీ, తపస్ బలపర్చిన అభ్యర్థి మల్క కొమరయ్య గెలుపుతో బీజేపీ శ్రేణులు జిల్లా కేంద్రంలో సోమవారం సంబరాలు నిర్వహించాయి. జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి ఆధ్వర్యంలో నగరంలోని నిఖిల్సాయి చౌరస్తాలో టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. అంతకుముందు పార్టీ కార్యాలయం నుంచి నిఖిల్సాయి చౌరస్తా వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం దినేశ్ పటేల్ కులాచారి మాట్లాడుతూ యూనియన్లకు అతీతంగా మోదీ నాయకత్వంపై విశ్వాసంతో ఉపాధ్యాయులు మల్క కొమరయ్యకు ఓట్లు వేసి గెలిపించారని తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిపించి చరిత్ర సృష్టించారన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కూడా బీజేపీ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు కొండా ఆశన్న, పద్మారెడ్డి, గంగోనె గంగాధర్, ఇప్పకాయల కిశోర్, దొంతుల రవి, జగన్, తదితరులు పాల్గొన్నారు. -
ఆస్తి కోసం తండ్రిపై దాడి
● చికిత్స పొందుతూ మృతి లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని శెట్పల్లి గ్రామానికి చెందిన వల్లకాటి లింగం(48) చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. గత నెల 17న రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తన తండ్రి లింగంను కొట్టినట్లు కొడుకు శేఖర్ డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని లింగంను నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఘటనపై కొడుకు శేఖర్ చెప్పే మాటలకు పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో తానే ఆస్తి కోసం తండ్రిని గాయపర్చినట్లు ఒప్పుకున్నాడు. శేఖర్ కొంతకాలం నుంచి తండ్రికి దూరంగా హైదరాబాద్లో ఉంటుండగా, లింగం శెట్పల్లిలో నివసిస్తున్నాడు. కొద్దిరోజులుగా శేఖర్ ఆస్తి కోసం తండ్రితో గొడవపడుతున్నట్లు తెలిపారు. 15 రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన లింగం సోమవారం మృతి చెందినట్లు పేర్కొన్నారు. శేఖర్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఇద్దరిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు మోపాల్: మండల కేంద్రంలో సోమవారం ని ర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపారు. మద్యం తాగి బైక్ నడుపుతున్న ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. సరైన ధ్రువపత్రాలు లేకుండా ద్విచక్రవాహనాలు నడిపిస్తున్న 23 మందికి జరిమానా విధించినట్లు ఎస్సై తెలి పారు. ఆయన వెంట ఏఎస్సై రమేశ్బాబు, హెచ్సీ గంగాధర్, కానిస్టేబుళ్లు ఉన్నారు. -
ఇష్టంతో చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలి
డీఈవో అశోక్ మోపాల్(నిజామాబాద్రూరల్): విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఉద్బోధించారు. నగర శివారులోని బోర్గాం(పి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదోతరగతి విద్యార్థులకు మోటివేషన్ తరగతులను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ బోర్గాం(పి) జెడ్పీహెచ్ఎస్ అంటే జిల్లాలో ప్రత్యేక స్థానం ఉంటుందని, 194 మంది విద్యార్థులు పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. విద్యార్థులు కష్టపడి ప్రణాళిక ప్రకారం చదివితే మంచి గ్రేడ్ సాధించవచ్చని పేర్కొన్నారు. పాఠ్యాంశాల్లో సందేహాలుంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. మోటివేటర్ గంగాప్రసాద్ మాట్లాడుతూ పరీక్షలంటే భయం వీడాలని తెలిపారు. చదివిన అంశాలు ఈజీగా గుర్తు పెట్టుకునేలా సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం శంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
ఇనుప చువ్వల కోసం వెళ్లి ఒకరి మృతి నందిపేట్(ఆర్మూర్): ఇనుప చువ్వల కోసం చెరువులోకి దిగిన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించాడు. నందిపేట ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన నాగం రవి(52) వృత్తిరీత్యా గోడలకు సున్నాలు వేస్తుంటాడు. ఆదివారం సాయంత్రం నందిపేట బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఊర చెరువులో వినాయక విగ్రహాల ఇనుప చువ్వల కోసం దిగాడు. ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. మృతుడి తండ్రి నాగం రాజన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ .. ఎల్లారెడ్డి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ సోమవారం మృతి చెందినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ గ్రామ శివారులో శనివారం రాత్రి కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో పూల్సింగ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే ప్రమాదంలో గాయపడిహైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వరూప(32) సోమవారం మరణించినట్లు ఎస్సై పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి ఏడాది జైలు కమ్మర్పల్లి: మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో ఓవ్యక్తికి ఏడాది జైలు శిక్షతోపాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ ఆర్మూర్ కోర్టు ప్రథమశ్రేణి న్యాయమూర్తి నెల్లి సరళరాణి తీర్పు వెలువరించారు. కమ్మర్పల్లి ఎస్సై అనిల్రెడ్డి తెలిపిన ప్రకారం.. ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని మండల కేంద్రానికి చెందిన తుదిగేన దేవేందర్పై 2019లో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. విచారణ అనంతరం పోలీసులు నిందితుడిపై కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన ప్రథమశ్రేణి న్యాయమూర్తి నెల్లి సరళరాణి సోమవారం తీర్పు వెలువరించారు. సాక్ష్యాలను ప్రవేశపెట్టడంలో కీలకపాత్ర పోషించిన కోర్టు కానిస్టేబుల్ రాజును ఎస్సై అనిల్రెడ్డి అభినందించారు. -
ఆర్అండ్బీ అస్తవ్యస్తం
నిజామాబాద్నాగారం: ఉన్నతాధికారి నుంచి సబ్ డివిజన్ వరకు పోస్టులు ఖాళీగా ఉండడంతో రోడ్లు, భవనాల శాఖలో పరిస్థితి అధ్వానంగా మారింది. ముఖ్యమైన పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ), నిజామాబాద్ డివిజన్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్(ఈఈ) పో స్టులతోపాటు డిప్యూటీ ఈఈ, ఆయా సబ్ డివిజన్ లలో ఏఈ పోస్టులు ఖాళీగా ఉండడంతో సెక్షన్ కార్యాలయాల్లో పాలన అస్త్యవస్తంగా మారింది. జిల్లాకు రాని ఇన్చార్జి ఎస్ఈ ఉమ్మడి నిజామాబాద్ (నిజామాబాద్, కామారెడ్డి) ఆర్అండ్బీ ఎస్ఈ పోస్టు ఖాళీగా ఉంది. గతంలో ఎస్ఈగా విధులు నిర్వర్తించిన హన్మంత్రావు మూడు నెలల కిందటే సీఈగా పదోన్నతి, ఉద్యోగ విరమణ పొందిన విషయం తెలిసిందే. దీంతో సంగారెడ్డి జిల్లా ఆర్అండ్బీ సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ) వసంత్నాయక్కు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. అయితే ఆయన నెలకు ఒక్కసారి కూడా జిల్లాకు వచ్చేందుకు ఇష్టపడడం లేదని శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఫైళ్లపై సంతకాలు అవసరం ఉంటే తామే సంగారెడ్డికి వెళ్లాల్సి వస్తోందని అంటున్నారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలో ఐదు సబ్ డివిజన్లు ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, బాల్కొండ ఉన్నాయి. ఆర్అండ్బీ ద్వారానే రోడ్ల విస్తరణ, అభివృద్ధి, బ్రిడ్జీ నిర్మాణం తదితర పనులు కొనసాగుతున్నాయి. పర్యవేక్షించాల్సిన ముఖ్య అధికారి పోస్టు మాత్రం ఖాళీగా ఉంది. పాలన అస్తవ్యస్తం ఆర్ అండ్ బీలో నెలల తరబడి కీలక పోస్టులు ఖాళీగా ఉండడంతో పాలన అస్తవ్యస్తంగా మారుతోంది. ఎస్ఈ లేకపోగా, నిజామాబాద్ డివిజన్ ఈఈ సైతం ఇన్చార్జి కొనసాగుతున్నారు. సబ్ డివిజన్లో ఏఈలు సరిపడా సంఖ్యలో లేకపోవడంతో పనులు మూడు అడుగుల ముందుకు.. ఆరు అడుగులు వెనక్కి అన్నచందంగా మారింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఖాళీలను భర్తీ చేయాలని అటు శాఖ సిబ్బంది, ఇటు ప్రజలు కోరుతున్నారు.ఫీల్డ్ అనుభవం లేని ఈఈకి బాధ్యతలు.. ఎస్ఈ నుంచి ఈఈ వరకు ఇన్చార్జీలే.. నెలకోసారైనా జిల్లా ముఖం చూడని అధికారి ఉన్నతాధికారి సంతకం కోసం సంగారెడ్డికి పరుగులు సబ్ డివిజన్కు ఒక్కరే ఏఈ పనులపై పర్యవేక్షణ కరువు ఖాళీలు భర్తీ అయ్యేనా..?నిజామాబాద్ డివిజన్ పరిధిలో బాల్కొండ, ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ ఐదు సబ్ డివిజన్ కార్యాలయాలున్నాయి. ఒక్కో సబ్ డివిజన్కు డిప్యూటీ ఈఈతోపాటు ముగ్గురు ఏఈలు ఉండాలి. కానీ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. బాల్కొండ సబ్ డివిజన్కు డిప్యూటీ ఈఈ లేకపోవడంతో ఆర్మూర్ సబ్ డివిజన్ డిప్యూటీ ఈఈకి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఒక్కో సబ్ డివిజన్లో ఒక్కో ఏఈ మాత్రమే ఉండడంతో తమపై పని భారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు చేయాల్సిన పనులు ఒక్కరే చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. ఐదు సబ్డివిజన్లను పర్యవేక్షించాల్సిన ఈఈ పోస్టు గత నెల 28న ఖాళీ అయ్యింది. ఇది వరకు ఈఈగా విధులు నిర్వర్తించిన సురేశ్ పదవీవిరమణ పొందగా, సర్కిల్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ డిప్యూటీ ఈఈ శ్రీమాన్ ఇన్చార్జి బాధ్యతలు తీసుకున్నారు. ఏళ్ల తరబడి విధులు నిర్వర్తించిన అనుభవం ఆయనకు ఉన్నప్పటికీ ఫీల్డ్ అనుభవం లేదు. -
మహాలక్ష్మికి సాయమేదీ..?
మోర్తాడ్(బాల్కొండ): మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన సరిత బీడీ కార్మికురాలు. ఆమెకు పీఎఫ్ ఉన్నా గతంలో విధించిన కటాఫ్ తేదీ నిబంధన కారణంగా ఆసరా పథకం కింద జీవన భృతి అందడం లేదు. జీవనభృతికి నోచుకోకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మహాలక్ష్మి సాయం రూ.2,500 అందుతుందనే ఆశతో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుంది. ఇప్పటి వరకు సరితకు మహాలక్ష్మి సాయం అందలేదు. ఇది ఒక్క సరితకు ఎదురైన సమస్య కాదు. జిల్లా వ్యాప్తంగా 3,55,347 మంది మహాలక్ష్మి సాయం కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు. తాము అధికారంలోకి రాగానే అర్హులైన గృహిణులకు ప్రతి నెలా రూ.2,500 చొప్పున మహాలక్ష్మి పథకం కింద సాయం అందిస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొంది. అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో ఆరు గ్యారంటీల అమలు కోసం నిధులను కేటాయించినప్పటికీ.. తమకు మహాలక్ష్మి సాయం అందించడం మరిచిపోయారని మహిళలు అంటున్నారు. బడ్జెట్లో నిధులు.. రాష్ట్ర ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.53,196 కోట్లను మేనిఫెస్టోలో ప్రధానమైన ఆరు పథకాల కోసం కేటాయించారు. నిధుల కేటాయింపుపై ప్రకటన చేసినా మహాలక్ష్మి సాయం పథకం విధివిధానాలను రూపొందించకపోవడంతో అనేక మంది మహిళలకు నిరాశే మిగిలింది. ఎలాంటి పింఛన్లు పొందని పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన మహిళలు ప్రతి నెలా రూ.2,500 సాయం చేతికి అందితే ఎంతో ఆసరాగా ఉంటుందని భావిస్తున్నారు. బడ్జెట్ సమావేశాలు దగ్గరపడుతున్నా గతంలో ప్రక టించిన పథకాల అమలుపై నిర్లక్ష్యం సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం స్పందించి మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సాయం అందించాలని మహిళలు కోరుతున్నారు. మహిళా దినోత్సవం రోజునైనా... ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ రోజున మహిళలకు సీఎం రేవంత్రెడ్డి శుభవార్త చెబుతారని మంత్రివర్గ సహచరులు ప్రకటిస్తున్నా రు. ఈ నేపథ్యంలో ‘మహాలక్ష్మి’పై ప్రకటన చేసి చేయూతనందించాలని మహిళలు కోరుతున్నారు. జిల్లాలో 3,55,347 దరఖాస్తులు గ్యారంటీలకు నిధులు కేటాయించినా అమలుకు నోచుకోని వైనం -
నిలకడగా నీటిమట్టం
బాల్కొండ: మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నీరు ఎస్సారెస్పీకి చేరింది. దీంతో ఆదివారం ప్రాజెక్టు నీటిమట్టం నిలకడగా ఉంది. కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతున్నప్పటికీ ప్రాజెక్టు నీటిమట్టం తగ్గలేదు. సుప్రీం తీర్పు ప్రకా రం బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి 0.6 టీఎంసీల నీటిని ఎ స్సారెస్పీకి వదిలారు. మరోవైపు కాకతీయ కాలువ ద్వారా 3 వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 600, లక్ష్మి కాలువ ద్వారా 250, గుత్ప లిఫ్ట్ ద్వారా 270, అలీసాగర్ లిఫ్ట్ ద్వారా 472, ముంపు గ్రామాల లిఫ్ట్ల ద్వారా 312 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆవిరి రూపంలో 479 క్యూసె క్కుల నీరు పోతుండగా, మిషన్ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5టీఎంసీలు) అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి 1075.00(32.8టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి చేరిన బాబ్లీ నీరు కాలువల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల -
నేడు ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
నిజామాబాద్అర్బన్: ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లను సోమవారం లెక్కించనున్నారు. గత నెల 27వ తేదీన పోలింగ్ నిర్వహించగా.. జిల్లాలో పట్టభద్ర ఓటర్లు 31,574 మందికిగాను 24,388 మంది ఓటు వేయగా, 77.24 శాతం పోలింగ్ నమోదైంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 3,751 మంది ఓటర్లకుగాను 3,468 మంది ఓటు హక్కును వినియోగించుకోగా, 92.46 శాతం పోలింగ్ నమోదైంది. ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ బరిలో 15 మంది, పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో 56 మంది ఉన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో ఓట్లు లెక్కించనున్నారు. ప్రాధాన్యత క్రమంలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇదిలా ఉండగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో ఉన్న జాతీయ పార్టీల అభ్యర్థులతోపాటు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో ఉన్న యూనియన్ల మద్దతుదారుల గెలుపుపై జిల్లాలో చర్చలు మొదలయ్యాయి. తమ మద్దతుదారు విజ యం తథ్యమని, తమకే అనుకూలంగా ఫలితాలు వస్తాయంటూ ఆయా పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓటమిపాలవుతారో తెలుసుకునేందుకు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వేచిచూడాల్సిందే. గెలుపోటములపై మొదలైన చర్చలు ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం -
28
ఆన్లైన్లోనూ చెల్లించొచ్చు రోజులునిజామాబాద్ కార్పొరేషన్ పన్ను వసూలు లక్ష్యం వసూలు సాధ్యమేనా..? కార్పొరేషన్ పరిధిలో ఆస్తి, ఇంటి, నీటిపన్నుతోపాటు ఇతర పన్ను వసూలు చేయాల్సి ఉంది. మొత్తం రూ.90 కోట్లు అవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం రూ.28కోట్ల వరకు మాత్రమే వసూలయ్యాయి. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మిగిలి ఉన్న 28 రోజుల్లో రూ.62 కోట్లు వసూలు సాధ్యమేనా.. అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత నెల రోజులుగా డిప్యూటీ కమిషనర్ రాజేంద్రకుమార్ పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. రెవెన్యూ సిబ్బందితోపాటు తాను కూడా వసూళ్లు చేపడుతున్నారు. ఆన్లైన్లో కూడా చెల్లించొచ్చు పన్ను మొత్తాన్ని సంబంధించిన బిల్ కలెక్టర్కు నేరుగా చెల్లించి రసీదు పొందాలి. లేదా బల్దియా కార్యాలయంలో, మీసేవా కేంద్రాల్లో, ఆన్లైన్లో కూడా చెల్లించొచ్చు. నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో భారీ మొత్తంలో పన్ను వసూలు చేయాల్సి ఉంది. మొత్తం రూ.90కోట్లు వసూలు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు దాదాపు రూ.28 కోట్లు వసూలయ్యాయి. అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా నగరవాసులు సకాలంలో పన్ను చెల్లించకపోవడంతో పెద్ద మొత్తంలో వసూలు కావాల్సి ఉంది. కార్పొరేషన్ కమిషనర్ దిలీప్కుమార్ పన్ను వసూళ్ల కోసం ప్రత్యేక టీములను రంగంలోకి దించారు. మొత్తం ఐదు సర్కిళ్లకు ఐదుగురు నోడల్ ఆఫీసర్లను నియమించారు. ప్రత్యేక టీములు ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పన్ను వసూళ్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాయి. కమిషనర్తోపాటు డిప్యూటీ కమిషనర్ రాజేంద్రకుమార్ క్షేత్రస్థాయికి వెళ్లి పర్యవేక్షిస్తున్నారు. రెవెన్యూ సిబ్బందితో కలిసి దుకాణాలు, షాపింగ్మాల్స్ను తనిఖీ చేస్తున్నారు. మాట వినని వారికి చెందిన దుకాణాలను సీజ్ చేస్తున్నారు. మున్సిపల్ కాంప్లెక్స్ అద్దెలే ఎక్కువ కార్పొరేషన్కు చెందిన అద్దె దుకాణాలు (మడిగెలు) సుమారు 500 ఉన్నాయి. కొన్నేళ్లుగా ఈ దుకాణాలను కొందరు గుత్తాధిపత్యం చేసుకుని నిర్వహిస్తున్నారు. బల్దియాకు చెల్లించేది కేవలం రూ.11,500 మాత్రమే. వీరిలో చాలా మంది తమ దుకాణాలను సబ్–లీజ్కు ఇచ్చారు. వారి వద్ద రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు అద్దె వసూలు చేస్తున్నారు. కానీ, బల్దియాకు చెల్లించాల్సిన అద్దెలు మాత్రం చెల్లించడం లేదు. కొందరు 2018 నుంచి అద్దెలు చెల్లించనివారు సైతం ఉన్నారు. మున్సిపల్ కాంప్లెక్స్ దుకాణాలు.. కార్పొరేషన్కు చెందిన మడిగెల్లో ఓ పార్టీ కార్యాలయంతోపాటు చర్మవ్యాధుల నిపుణుల ఆస్పత్రులు, బిర్యానీ హోటళ్లు, మెడికళ్లు, మొబైల్ దుకాణాలు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, ఇతర వ్యాపారాలున్నాయి. ప్రతిరోజూ కస్టమర్లతో కిటకిటలాడే ఆ మడిగెలకు సంబంధించి అద్దెలు చెల్లించడంలో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోంది. వీరికి కొందరు బల్దియా ఉద్యోగులే సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో కమిషనర్ దిలీప్కుమార్ నేరుగా రంగంలోకి దిగారు. రెవెన్యూ సిబ్బందితో కలిసి పన్ను వసూలుకు వెళ్లడంతోపాటు చెల్లించని వారి దుకాణాలను సీజ్ చేస్తున్నారు. గత రెండు రోజుల్లో ఆరు దుకాణాలను సీజ్ చేశారు. ఒకే రోజు రూ.30లక్షల వరకు వసూలు చేసి మరో రూ.20లక్షలకు చెక్కులు తీసుకున్నారు. 62ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న తరుణంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు పన్ను వసూలు పెద్ద సవాల్గా మారింది. కేవలం 28 రోజుల వ్యవధిలో సుమారు రూ.62కోట్లు వసూలు చేయాల్సి ఉంది. కమిషనర్, డిప్యూటీ కమిషనర్తోపాటు రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో పన్ను వసూలు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా కమర్షియల్ కాంప్లెక్స్ల యజమానులు, స్టార్ హోటళ్లు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లు, షాపింగ్ మాల్స్, థియేటర్స్, ఫంక్షన్హాళ్లు తదితర వాటికి సంబంధించి పెద్ద మొత్తంలో పన్ను బకాయిలున్నాయి. వీటి వసూలు అధికారులకు కత్తిమీద సాములా మారింది. రూ.90 కోట్లకు వసూలైంది రూ.28 కోట్లు పన్ను చెల్లించని బడా వ్యాపారులు పేరుకుపోయిన మున్సిపల్ కాంప్లెక్స్ అద్దెలు జోరందుకోని పన్ను వసూళ్లు రంగంలోకి కమిషనర్ దిలీప్కుమార్ పన్ను చెల్లించి సహకరించాలి నిజామాబాద్ నగర వాసులు తాము చెల్లించాల్సిన ఆస్తి, నీటి పన్ను సకాలంలో చెల్లించాలి. మార్చి 31వ తేదీ వరకు ఎదురుచూడడం సరికాదు. కొందరు కోర్టుకు వెళ్లి తప్పించునే ప్రయత్నం చేస్తున్నారు. కేసులున్నా అద్దెలు చెల్లించాల్సిందే. నోటీసులిచ్చినా స్పందించకుంటే దుకాణాలను సీజ్ చేయక తప్పదు. – ఎస్.దిలీప్కుమార్, మున్సిపల్ కమిషనర్ -
దేగాంలో యువకుడిపై కత్తిపోట్లు
ఆర్మూర్టౌన్: ఆలూర్ మండలం దేగాం గ్రామంలో ఆదివారం ఐనార్ల నాగరాజు అనే యువకుడిపై గ్రామానికి చెందిన కొందరు పాత కక్షలతో పదునైన ఆయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. బాధితుని తండ్రి గంగరాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దేగాంకు చెందిన గంగరాజు, అతని సోదరునికి గ్రామానికి చెందిన దగ్గరి బంధువులతో రెండేళ్ల క్రితం గొడవలు ఏర్పడ్డాయి. ఇరువర్గాల గొడవ కుల పంచాయితీకి రాగా గంగరాజు కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారు. ఈ విషయమై అతను పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా గంగరాజు కుటుంబంపై దగ్గరి బంధువులకు విద్వేషం ఇప్పటికి కొనసాగుతోంది. గంగరాజు సోదరుడు ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ క్రమంలో ఆదివారం గంగరాజు కుమారుడు నాగరాజు పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా లక్ష్మీ నరసింహ ఆలయం వద్ద బంధువులైన శ్రీకాంత్, శ్రీధర్, క్రాంతి, అయినార్ల అశోక్, అయినార్ల శేఖర్, శ్రీలత, బద్దెమ్మలతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అందరూ నాగరాజును ఆయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అలాగే నాగరాజుపై దాడి చేసిన వారు సైతం గాయపడ్డారు. తీవ్ర గాయాలపాలైన నాగరాజును తండ్రి గంగరాజు ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. నాగరాజుకు చికిత్సలు చేస్తున్న సమయంలో ఘర్షణలో గాయపడ్డవారు సైతం ఆస్పత్రికి వచ్చారు. మళ్లీ వారు నాగరాజుపై దాడి చేయడానికి యత్నించారు. ఆస్పత్రిలో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో వైద్య సిబ్బంది భయబ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని నాగరాజును మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. కాగా ఎస్హెచ్వో సత్య నారాయణగౌడ్ మాట్లాడుతూ ఘర్షణపై విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. -
రాష్ట్రస్థాయి బేస్బాల్ పోటీల్లో జిల్లా జట్టు ప్రతిభ
నిజామాబాద్నాగారం: రాష్ట్రస్థాయి సబ్జూనియర్ బేస్బాల్ పోటీల్లో జిల్లా బాలికల జట్టు ప్రథమ స్థానంలో నిలువగా, బాలుర జట్టు తృతీయస్థానంలో నిలిచింది. ఫిబ్రవరి 28 నుంచి ఈ నెల 2 వరకు సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన పోటీల్లో జిల్లా బాలికల జట్టు ప్రథమ స్థానంలో, బాలుర జట్టు తృతీయ స్థానంలో గెలుపొందినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్ మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్ తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహకులు విజేత జట్లకు ట్రోఫీలను అందజేశారు. జట్లకు కోచ్ మేనేజర్లుగా నరేశ్, అనికేత్, సంతోష్, సాయి కుమార్ వ్యవహరించారు. -
సేంద్రియ ఎరువుకు పెరిగిన డిమాండ్
బాల్కొండ: సేంద్రియ ఎరువులకు డిమాండ్ బాగా పెరిగింది. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు రావడంతో రైతులు అనేక పద్ధతులు అవలంభిస్తూ పంటలను సాగు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే రైతులు సేంద్రియ ఎరువులతో పంటలను సాగు చేస్తున్నారు. గొర్రెల, మేకల పేడనే అధికంగా వినియోగిస్తున్నారు. ఒక్క లారీ ఎరువు ధర రూ. 36 వేలు పలుకుతోంది. ఎకరం భూమికి కనీసం రెండు లారీల ఎరువును వేయాలని రైతులు అంటున్నారు. దీంతో పాటు నల్ల మట్టి, రసాయన ఎరువులు కూడా వినియోగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సేంద్రియ ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటడంపై అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పోషకాలు ఎక్కువగా ఉండటంతోనే.. గొర్రెల, మేకల పేడలో పోషకాలు ఎక్కువగా ఉండటంతోనే డిమాండ్ ఉంటుందని వ్యవసాయ అధికారులు అంటున్నారు. ప్రధానంగా వెచ్చదనం ఎక్కువగా ఉంటుంది. దీంతో తేమ శాతం ఎక్కువగా ఉన్న నేలల్లో ఈ ఎరువు మంచిగా పని చేస్తుంది. పసుపు భూమిలో ఉండే పంట కావడంతో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో పంటకు దుంపకుళ్లు సోకే ప్రమాదం ఉంటుంది. గొర్రెల, మేకల పేడను ఎక్కువగా వినియోగిస్తే వెచ్చదనం ఎక్కువగా ఉండటం వలన తేమ శాతం ఎక్కువగా ఉండదు. ఈ ఎరువులో ప్రధాన, సూక్ష్మ పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో ధర అధికంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. సేంద్రియ ఎరువును సబ్సిడీపై ప్రభుత్వం సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒక్క లారీ ఎరువు ధర రూ. 36 వేలు ధరలు ఎక్కువగా అయ్యాయి సేంద్రియ ఎరువుల ధరలు ఎక్కువగా అయ్యాయి. లారీ ఎరువు రూ. 36 వేలు పలుకుతుంది. పసుపు పంటను సాగు చేసేందుకు వీటిని తప్పకుండా పోయాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం సేంద్రియ ఎరువులను సబ్సిడీపై సరఫరా చేయాలి. – గంగారెడ్డి, రైతు, కొత్తపల్లి -
క్రైం కార్నర్
మూడు ఇళ్లలో చోరీ తాడ్వాయి: మండల కేంద్రంతోపాటు బ్రాహ్మణపల్లి గ్రామంలో శనివారం రాత్రి తాళం వేసిన మూడు ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్వాయికి చెందిన బాయికాడి శరత్ శనివారం తన ఇంటికి తాళం వేసి వేరే గ్రామానికి వెళ్లాడు. ఇంటికి తాళం ఉండడంతో దుండగులు ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. రూ. ఐదు వేల నగదు, నాలుగున్నర తులాల బంగారం, పది తులాల వెండిపట్ట గొలుసులు చోరీకి గురయ్యాయి. అదేవిధంగా పక్కనే ఉన్న గడ్డల సావిత్రి ఇంటికి సైతం తాళం వేసి ఉండడంతో దుండగులు చోరీకి పాల్పడ్డారు. రూ. 18వేల నగదు, మూడు మాసాల బంగారు మాటీలు, రెండుమాసాల ఉంగరం చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. తాడ్వాయికి చెందిన సుర్కంటి ప్రతాపరెడ్డి తనబైక్ను ప్రతిరోజు మాదిరిగానే తన ఇంటి ఎదుట రాత్రి ఉంచి పడుకున్నాడు. ఉదయం లేచి చూసే సరికి దుండగులు బైక్ను దొంగిలించినట్లు తెలిపారు. అలాగే మండలంలోని బ్రాహ్మణపల్లికి చెందిన కుర్మతిరుపతికి చెందిన ఇంట్లో చోరీ జరిగిందని గ్రామస్తులు తెలిపారు. రూ. 18లక్షల నగదును చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలాలకు చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
పన్నెండు మందికి ఎక్స్గ్రేషియా మంజూరు
● రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సిరికొండ: గల్ఫ్లో మృతి చెందిన నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన పన్నెండు మంది మృతుల కుటుంబాలకు రూ. ఐదు లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా మంజూరైనట్లు రూరల్ ఎమ్మెల్యే రేకుల్పల్లి భూపతిరెడ్డి తెలిపారు. సిరికొండ మండలంలోని రావుట్లలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గల్ఫ్లోని వివిధ దేశాల్లో నియోజకవర్గానికి చెందిన 15 వేల ఉపాధి కోసం వలస వెళ్లారని తెలిపారు. అక్కడ అసువులు బాసిన మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం చెప్పినట్లుగా నష్టపరిహారం మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో చెప్పినట్లుగా గల్ఫ్ అడ్వయిజరీ బోర్డు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపా రు. కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ తెలంగాణ అభివృద్ధికి పాటుపడకుండా సీఎం రేవంత్రెడ్డిపై విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు నిధుల గురించి ప్రధానిని నిలదీయాలని, తెలంగాణ అభివృద్ధికి నిధుల కోసం పార్లమెంట్ ఎదుట ధర్నా చేయాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్కోల్ భాస్కర్రెడ్డి, ఎర్రన్న, చందర్నాయక్, బాకారం రవి, రాజారెడ్డి, గంగాధర్, సంతోష్, మల్లేశ్యాదవ్, సామే ల్, సంతోష్నాయక్, రమేశ్, ప్రసాద్, లింగం, శ్రీనివాస్, బడాల మహిపాల్, గంగారెడ్డి, దాసు, భాస్కర్, బన్నాజీ తదితరులు పాల్గొన్నారు. -
అ‘పూర్వ’ సమ్మేళనం
పెర్కిట్/ ధర్పల్లి: ఆలూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2002–03 సంవత్సరానికి చెందిన పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అందరూ ఒకే చోట చేరడంతో సంతోషం వ్యక్తం చేశారు. నాటి జ్ఞాపకాలను నెమ రు వేసుకున్నారు. గురువులను సన్మానించా రు. ధర్పల్లి మండలం హోన్నాజీపేట్లోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1999–2000కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన నిర్వహించారు. చిన్ననాటి జ్ఞాపకాలను గు ర్తు చేసుకున్నారు. గురువులను సన్మానించారు. -
ఎట్టకేలకు ఎక్స్గ్రేషియా చెల్లింపు
మోర్తాడ్: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. గల్ఫ్ దేశాల్లో మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన మాటను సీఎం రేవంత్రెడ్డి నిలబెట్టుకున్నారు. హైదరాబాద్లో శనివారం నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా సొమ్మును ఖాతాల్లో జమ చేయాలని సంబంధిత అధికారుల ను ఆదేశించారు. దీంతో బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని 28, కామారెడ్డి జిల్లాలోని నాలుగు కుటుంబాలకు సాయం అందింది. జిల్లాకు రూ.1.75 కోట్లు కేటాయించారు. అంటే 35 కుటుంబాలకు సాయం అందనుంది. ఏడాది కాలంగా గల్ఫ్ దేశాల్లో మరణించిన వారిలో జిల్లా వాసులే ఎక్కువ మంది ఉండటం గమనార్హం. ఇప్పటి వరకు దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేసిన 28 కుటుంబాలకు సాయం సొమ్ము జమ చేశారు. కేటాయించిన నిధుల్లో మరో ఏడు కుటుంబాలకు సాయం అందించడానికి దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాల్సి ఉంది. ఆలస్యంగానైనా గల్ఫ్ మృతుల కుటుంబాలకు సాయం అందించడంతో వలస కార్మికుల సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 28, కామారెడ్డిలో నాలుగు కుటుంబాలకు అందిన సాయం కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబాలు రుణపడి ఉంటాం గల్ఫ్ దేశాల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ. ఐదు లక్షల చొప్పున సాయం అందించడంతో సీఎం రేవంత్రెడ్డికి రుణపడి ఉంటాం. గల్ఫ్ మృతుల్లో అత్యధికులకు ఈ సాయం ఎంతో ఉపయోగపడుతుంది. వైఎస్సార్ తర్వాత ఇంతటి సాయం అందించిన ఘనత సీఎం రేవంత్రెడ్డి కావడం విశేషం. – మంద భీంరెడ్డి, టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గల్ఫ్ వలసదారులకు ఎంతో మేలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు అమలయ్యాయి. ఇందులో గల్ఫ్ మృతుల కుటుంబాలకు సాయం అందించడం ఎంతో ప్రధానమైనది. ఇక్కడ ఉపాధి లేక గల్ఫ్కు వలస వెళ్లిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవడం గొప్ప విషయం. – తక్కూరి సతీశ్, కాంగ్రెస్ నాయకులు, మోర్తాడ్ -
రంజాన్ ఉపవాస దీక్షలు షురూ
నిజామాబాద్ రూరల్: ముస్లిములకు పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. శనివారం సాయంత్రం నెలవంక దర్శనం ఇచ్చింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి ముస్లిములు నెల రోజుల పాటు రంజాన్ ఉపవాస దీక్షలను చేపట్టనున్నారు. శనివారం సాయంత్రం దేశవ్యాప్తంగా నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైనట్లు మతపెద్దలు తెలిపారు. ప్రార్థనల కోసం ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మసీదులు ముస్తాబయ్యాయి. జిల్లా కేంద్రంలోని అన్ని మసీదులు ముస్లిములతో సందడిగా మారాయి. రంజాన్ పండుగ ప్రారంభాన్ని పురస్కరించుకొని మసీదుల్లో ఇషా నమాజ్ తర్వాత తరవీహ్ (రంజాన్ ప్రత్యేక నమాజు)ను ఆచరిస్తారు. రంజాన్ సందర్భంగా ముస్లిం ఇమామ్(మత గురువు)లు ప్రత్యేక నమాజులలో భాగంగా ఖురాన్ పారాయణాన్ని మొదలుపెడతారు. ఉపవాసాలు ముగించేందుకు ఇఫ్తార్కు అవసరమైన ఖర్జూరాలు, పండ్లు విక్రయించేందుకు పలుచోట్ల దుకాణాలు వెలిశాయి. -
పన్నెండు మందికి ఎక్స్గ్రేషియా మంజూరు
● రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సిరికొండ: గల్ఫ్లో మృతి చెందిన నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన పన్నెండు మంది మృతుల కుటుంబాలకు రూ. ఐదు లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా మంజూరైనట్లు రూరల్ ఎమ్మెల్యే రేకుల్పల్లి భూపతిరెడ్డి తెలిపారు. సిరికొండ మండలంలోని రావుట్లలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గల్ఫ్లోని వివిధ దేశాల్లో నియోజకవర్గానికి చెందిన 15 వేల ఉపాధి కోసం వలస వెళ్లారని తెలిపారు. అక్కడ అసువులు బాసిన మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం చెప్పినట్లుగా నష్టపరిహారం మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో చెప్పినట్లుగా గల్ఫ్ అడ్వయిజరీ బోర్డు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపా రు. కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ తెలంగాణ అభివృద్ధికి పాటుపడకుండా సీఎం రేవంత్రెడ్డిపై విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు నిధుల గురించి ప్రధానిని నిలదీయాలని, తెలంగాణ అభివృద్ధికి నిధుల కోసం పార్లమెంట్ ఎదుట ధర్నా చేయాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్కోల్ భాస్కర్రెడ్డి, ఎర్రన్న, చందర్నాయక్, బాకారం రవి, రాజారెడ్డి, గంగాధర్, సంతోష్, మల్లేశ్యాదవ్, సామే ల్, సంతోష్నాయక్, రమేశ్, ప్రసాద్, లింగం, శ్రీనివాస్, బడాల మహిపాల్, గంగారెడ్డి, దాసు, భాస్కర్, బన్నాజీ తదితరులు పాల్గొన్నారు. -
దుద్దిళ్ల శ్రీపాదరావు సేవలు మరువలేనివి
ఖలీల్వాడి: మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు సేవలు మరువలేనివని అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కమిషనరేట్ కార్యాలయంలో ఆయన జయంతి కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి అదనపు డీసీపీ పూలమాల వేసి నివాళులు అర్పించారు. 1999లో మహదేవపూర్ మండలం అన్నారంలో నక్సలైట్లు ఆయనను హత్య చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన నాడు రాష్ట్రాన్ని కుదిపేసిందన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ(ఏఆర్) రాంచందర్ రావు, ఆఫీస్ సూపరింటెండెంట్ శంకర్, ఆర్ఐ(వెల్ఫేర్) శ్రీనివాస్, పోలీస్ కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. వ్యక్తి నిర్మాణ కర్మాగారమే సంఘ శాఖ ● ఆర్ఎస్ఎస్ విభాగ్ భౌతిక్ ప్రముఖ్ కృష్ణశాస్త్రి విజయభాస్కర్ సుభాష్నగర్: హిందూ సమాజంలోని వ్యక్తుల్లో సంస్కారాలను నిర్మాణం చేసి తద్వారా దేశభక్తులుగా, సమాజ సంరక్షకులుగా తయారు చేసే కర్మాగారమే సంఘ శాఖ అని ఆర్ఎస్ఎస్ విభాగ్ భౌతిక్ ప్రముఖ్ కృష్ణశాస్త్రి విజయ భాస్కర్ పేర్కొన్నారు. కోటగల్లిలోని పద్మశాలీ హైస్కూల్లో పరుశురామ ప్రభాత్ శాఖ వార్షికోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన కృష్ణశాస్త్రి విజయభాస్కర్ మాట్లాడుతూ కార్యకర్తల వికాసానికి సంఘ శాఖ తోడ్పాటునందిస్తుందని, శాఖ ద్వారా స్వయంసేవకుల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం ఏర్పడతాయని తెలిపారు. ఆటాపాటల వ్యక్తిలో క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందించడమే సంఘ శాఖ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. విత్తనం మహావృక్షంగా మారినట్లే, సంఘ శాఖ కూడా హిందూ సమాజానికి పునాది రాయి లాంటిదని, సంఘ శాఖల ద్వారానే హిందూ సమాజం చైతన్యవంతమైందని తెలిపారు. ఈ సందర్భంగా స్వయం సేవకులు నిర్వహించిన సంచలన్, శారీరక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో నగర కార్యవాహ అరుగుల సత్యం, సహ కార్యవాహలు సుమిత్, వెంకటేశ్, భద్రయ్య, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. -
మరమ్మతులతో మరింత పాడైన రోడ్డు
గాంధారి(ఎల్లారెడ్డి): మరమ్మతుల పేరుతో గాంధారి–బాన్సువాడ ప్రధాన రహదారిని మరింత చెడగొట్టారు. రోడ్డు పాడైపోయి అక్కడక్కడా గుంతలు ఏర్పడ్డాయి. రోడ్డుకు వారం రోజుల క్రితం విచిత్రమైన మరమ్మతులు చేశారు. దీంతో ప్రయాణికులకు మరింత ఇబ్బంది కలుగుతోంది. మరమ్మతుల్లో భాగంగా చిన్నగా ఉన్న గుంతలను పొక్లెయిన్తో మరింత వెడల్పు, లోతు తీశారు. గుంతల్లో దొడ్డు కంకర వేసి వదిలేశారు. దీంతో వాహన రాకపోకలకు వేసిన కంకర, బాగున్న తారు రోడ్డుపై కొంత, పక్కలకు కొంత ఎగిరిపోయింది. రోడ్డుపై కంకర ముక్కల కారణంగా పలు ద్విచక్ర వాహనా లు అదుపు తప్పి పడిపోతున్నాయి. పెద్ద వాహ నాలు వెళ్లినప్పుడు కంకర ముక్కలు ఎగిరి పక్కను న్న వారికి తగులుతున్నాయి. మొత్తం కంకర ఎగిరిపోయిన చోట పొక్లెయిన్తో తీసిన గుంతలు లోతు కావడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. సంబంధిత అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
చివరి ఆయకట్టు వరకు నీరందించాలి
రెంజల్: చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించేందుకు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఆదివారం రెంజల్ మండలంలోని తాడ్బిలోలి, బోర్గాం, రెంజల్ గ్రామాలను సందర్శించి రైతులతో సాగు నీటి అవసరాలపై ముచ్చటించారు. అలీసాగర్ ద్వారా విడుదల చేస్తున్న నీటిని వృథా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పంటలు ఎండకుండా నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు న్యాయం జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటూ, కాల్వలపై పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఆయా గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రైతులు సుదర్శన్రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బోర్గాం రైతులకు కందకుర్తి ఎత్తిపోతల ద్వారా నీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మండలంలోనే చక్కెర ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని తెలిపారు. రైతులు చెరుకు పంట సాగుకు ముందుకు రావాలని సూచించారు. ఎన్నికల్లో సమర్థులను ఎన్నుకోవాలి స్థానిక సంస్థలకు నిర్వహించే ఎన్నికల్లో సమర్థులెన వారినే ఎన్నుకునాలని ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి రైతులకు సూచించారు. వారిచ్చే డబ్బులకు ఆశపడితే గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. అనంతరం తాడ్బిలోలిలో బాధిత కుటుంబానికి రూ. 2.50 లక్షల ఎల్వోసీని అందజేశారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, పార్టీ మండల అధ్యక్షుడు మొబిన్ఖాన్, నాగభూషణంరెడ్డి, సాయారెడ్డి, మొయినొద్దీన్, సాయిబాబాగౌడ్, జావీద్, నితిన్, మర్ల రమేశ్, కుర్మె శ్రీనివాస్, కిరణ్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు. పంట భూములకు నీరందిస్తాం నవీపేట: నిజాంసాగర్ చివరి ఆయకట్టు భూముల కు పుష్కలంగా సాగు నీరందిస్తామని బోధన్ ఎమ్మె ల్యే సుదర్శన్రెడ్డి అన్నారు. నవీపేట, జన్నెపల్లి శివారులోని పంట భూములను పరిశీలించారు. వి డతల వారీగా వస్తున్న అలీసాగర్ ఎత్తి పోతల నీటి ని పంట భూములకు వాడుకోవాలని సూచించారు. ఆయన వెంట నాయకులు శ్రీనివాస్గౌడ్, మహిపాల్రెడ్డి, సాయారెడ్డి, భగవాన్, గోపాల్, సంజీవ్రెడ్డి, సురేశ్, గౌరురాజు తదితరులు ఉన్నారు. మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి -
హలధారికి ఆధునిక అండ
సిరికొండ: అధునాతన యంత్రాల వినియోగంతో పంటల సాగు తీరు మారుతోంది. కాలానికి అనుగుణంగా అన్నదాతలు ఆధునిక పద్ధతులను అవలంబిస్తున్నారు. పంటలకు పురుగు మందులను పిచికారీ చేసేందుకు గతంలో చేతిపంపులనే వినియోగించేది. క్రమంగా చార్జింగ్, పెట్రోల్తో నడిచే స్ప్రే పంపులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం డ్రోన్ స్ప్రే యంత్రాలను పురుగు మందుల పిచికారీకి వినియోగిస్తున్నారు. మండలంలోని గడ్కోల్, నర్సింగ్పల్లి గ్రామాలకు చెందిన పలువురు డ్రోన్లను కొనుగోలు చేసి స్ప్రే చేసేందుకు అద్దెకు ఇస్తున్నారు. ఒక్క డ్రోన్ కొనుగోలుకు ఆరు లక్షల వరకు ఖర్చవుతోంది. గతంలో పెట్రోల్ పంపుల ద్వారా ఎకరం పొలానికి స్ప్రే చేసేందుకు గంటల తరబడి సమయం పట్టేది. ప్రస్తుతం అరగంట వ్యవధిలోనే ఎకరం పొలానికి డ్రోన్ ద్వారా మందుల పిచికారీ పూర్తవుతుండడం విశేషం. ● సాగులో సాంకేతిక విప్లవం ● పురుగు మందుల పిచికారీకి డ్రోన్ స్ప్రేయర్ వినియోగం -
సాలూర లిఫ్ట్ ఇరిగేషన్లో దొంగల బీభత్సం
బోధన్రూరల్: సాలూర మండలంలోని మంజీర నది ఒడ్డున ఉన్న సాలూర లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద దొంగలు భీభత్సం సృష్టించారు. ఎస్సై మచ్చేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సాలూర లిఫ్ట్ ఇరిగేషన్లో శనివారం అర్ధరాత్రి ట్రాన్స్ఫార్మర్ను దొంగిలించేందుకు ఎనిమిది మంది గుర్తు తెలియని దుండగులు విఫలయత్నం చేశారు. అక్కడే ఉన్న ఆపరేటర్ లక్ష్మణ్, వాచ్మన్ నర్సయ్య కేకలు వేయడంతో వారిపై దొంగలు దాడికి పాల్పడ్డారు. ఆపరేటర్, వాచ్మన్లను అక్కడే ఉన్న గదిలో బంధించారు. ఆపరేటర్ లక్ష్మణ్ సెల్ఫోన్ను లాక్కొని అక్కడి నుంచి పరారీ అయ్యారు. ఈ ఘటనపై ఆదివారం లిఫ్ట్ ఇరిగేషన్ అధికారి బస్వంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాస్తు చేస్తున్నట్లు ఎస్సై మచ్చేందర్ రెడ్డి పేర్కొన్నారు. -
మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్య
పిట్లం: మద్యానికి బానిసైన ఓ యువకుడు పురుగుల ముందు సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన పిట్లం మండలంలోని కోమటి చెరువు తండాలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కోమటి చెరువు తండాకు చెందిన రమావత్ అనిల్ (22) వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో జీవితంమీద విరక్తితో శనివారం రాత్రి పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి తులసిరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
మాచారెడ్డి : మండలంలోని లచ్చాపేట గ్రామశివారులో ఓ మహిళ విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. మాచారెడ్డి ఎస్సై అనిల్ తెలిపిన వివరాలు ఇలా.. గజ్యానాయక్ తండాకు చెందిన లావుడ్యా పొరాలి (45) సొంత పనిపై లచ్చాపేట నుంచి కాలినడకన తిరిగి వస్తుండగా రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దేశాయిపేటకు చెందిన జక్కుల దేవేందర్ పొలం చుట్టూ అడవి పందుల కోసం అమర్చిన కరెంటు వైర్లు తగిలాయి. దీంతో పొరాలి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. ఘటన స్థలాన్ని ఏఎస్పీ చైతన్యరెడ్డి, రూరల్ సీఐ రామన్ శనివారం పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ట్రాక్టర్ పైనుంచి పడి యువకుడు ..ఎడపల్లి(బోధన్): ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామానికి చెందిన శ్రీకాంత్(23) ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పైనుంచి పడి మృతి చెందినట్లు ఎస్సై వంశీచందర్రెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు ఇలా.. శనివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో జాన్కంపేట్ శివారులో ట్రాక్టర్ డ్రైవర్ సిరివెని రవి అటుగా వెళ్తుండగా శ్రీకాంత్ లిఫ్ట్ అడిగి ఎక్కినట్లు తెలిపారు. ఆకస్మాత్తుగా ట్రాక్టర్ మీది నుంచి కిందపడడంతో అక్కడిక్కడే మృతి చెందాడన్నారు. మృతుడి తల్లి సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కమ్మర్పల్లిలో దొంగల బీభత్సం
కమ్మర్పల్లి: కమ్మర్పల్లి మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. రెండిళ్లలో చోరీకి పాల్పడి నగదు, బంగారం అపహరించుకుపోయారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మినుముల గంగాధర్ సొంతింట్లో ఒక గదికి తాళం వేసి పక్క గదిలో పడుకున్నాడు. పక్క గది తాళం పగులగొట్టి దుండగులు లోపలికి ప్రవేశించారు. బీరువాలోని రూ. 5 లక్షల నగదుతోపాటు, 5 గ్రాముల బంగారం, 12 తులాల వెండి నగలు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి 2 గంటలకు ఇంటి ఎదుట నిలిపి ఉంచిన ఎలక్ట్రిక్ బైక్ హార్న్ మోగడంతో గంగాధర్ నిద్రలేచి తలుపు తెరవబోగా, బయటి నుంచి గొళ్లెం పెట్టి ఉండడంతో తెరుచుకోలేదు. తెలిసిన వారికి ఫోన్ చేయడంతో వారు గంగాధర్ ఇంటికి చేరుకోగానే దొంగలు పరారయ్యారు. కాగా, ఎంఈవో ఆఫీస్ సమీపంలోని వాన్కార్ శ్రీనివాస్ ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. శ్రీనివాస్ కొంతకాలంగా సొంతింట్లో కాకుండా సమీపంలో అద్దెకు ఉంటున్నాడు. శనివారం మధ్యాహ్నం శ్రీనివాస్ భార్య సొంతింటికి వెళ్లగా తాళం పగులగొట్టి ఉండడంతో దొంగతనం వెలుగు చూసింది. దుండగులు బీరువా తెరిచి అందులోని రూ. 20 వేల నగదు, 5 గ్రాముల బంగారం అపహరించుకుపోయారు. బాధితుల సమాచారం మేరకు ఎస్సై అనిల్రెడ్డి ఘటనా స్థలాలకు చేరుకొని వివరాలు సేకరించారు. క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలను సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. కిష్టాపూర్లో.. బాన్సువాడ : బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన నార్లపల్లి భూమయ్య ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. పది రోజుల క్రితం భూమయ్య అనారోగ్యం కారణంగా చికిత్స నిమిత్తం హైదరాబాద్కు వెళ్లాడు. శనివారం ఇంటికి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని నగదు, బంగారం కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. రెండిళ్లలో చోరీ రూ.5.20 లక్షల నగదు, తులం బంగారం, వెండి అపహరణ -
వర్సిటీ మైనారిటీ సెల్ డైరెక్టర్గా అబ్దుల్ ఖవి
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ మైనారిటీ సెల్ డైరెక్టర్గా డాక్టర్ మ హ్మద్ అబ్దుల్ ఖవి ని యమితులయ్యారు. తెయూ వైస్చాన్స్ల ర్ ప్రొఫెసర్ టి.యాదగిరి రావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి శనివారం అబ్దుల్ ఖవికి నియామక ఉత్తర్వులు అందజేశారు. గత పది సంవత్సరాలుగా ఆయన ఉర్దూ విభాగంలో అధ్యాపకుడిగా సేవలందిస్తున్నారు. తనపై నమ్మకంతో ౖమైనారిటీ సెల్ డైరెక్టర్గా నియమించిన వీసీ, రిజిస్ట్రార్లకు అబ్దుల్ ఖవి కృతజ్ఞతలు తెలిపారు. ఇందూరు కవులకు ఘన సత్కారం నిజామాబాద్ రూరల్: నగరానికి చెందిన ప్రముఖ కవులు డాక్టర్ గణపతి, అశోక్ శర్మ, డాక్టర్ కాసర్ల నరేశ్ రావు, డాక్టర్ కన్యాల ప్రసాద్, చింతల శ్రీనివాస్ గుప్తను నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ సరస్వతి కళాపీఠం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సత్కరించారు. బాసర ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు, ప్రముఖ కళాకారుడు రఘు ఉద్యోగ విరమణ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ప్రత్యేకంగా కవులు, కళాకారులను సన్మానించారు. ఈ సందర్భంగా కవులకు సరస్వతీపుత్ర అనే బిరుదును ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. డీఎంను కలిసిన రేషన్డీలర్లు సుభాష్నగర్: సివిల్ సప్లయ్ డీఎంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్రెడ్డిని జిల్లా రేషన్ డీ లర్లు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీఎంకు శాలువా, పుష్పగు చ్ఛం అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు అతిమేల నాగేశ్, గౌరవాధ్యక్షుడు పోల్కంగంగాకిషన్,ప్రధాన కార్యదర్శి పార్థ సారథి, నగర కార్యదర్శి ప్రవీణ్ యాదవ్, సంయుక్త కార్యదర్శి కిరణ్కుమార్, రాజారాం, రవి, రమేశ్, రవీంద్ర, రఘు తదితరులు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్ బోధన్: బోధన్ మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశామని కమిషనర్ వెంకటనారాయణ శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తుదారులు ఏవైనా సందేహాలుంటే హెల్ప్ డెస్క్లో సంప్రదించి ని వృత్తి చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్ర భుత్వం అనధికారిక లేవుట్లు, ప్లాట్లు క్రమబద్ధీకరించేందుకు ఎల్ఆర్ఎస్ అమలు చేస్తోందని పేర్కొన్నారు. 2020లో దరఖాస్తు చేసు కున్న వారు ఈ నెల 31 వరకు క్రమబద్ధీకరణ ఫీజు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ లభిస్తుందని అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం తా జాగా జీవో నంబర్ 28 ద్వారా ఆదేశాలు ఇ చ్చిందని తెలిపారు. ఈ అవకాశాన్ని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. వివరాలకు హెల్ప్డెస్క్ నంబర్ 63017 07191ను సంప్రదించాలని సూచించారు. -
చైన్స్నాచర్ అరెస్టు
బిచ్కుంద(జుక్కల్): ఆర్టీసీ బస్టాండ్లో మహిళా ప్రయాణికులనే టార్గెట్గా చేసుకొని ఆరు నెలలుగా చైన్స్నాచింగ్కు పాల్పడుతున్న నిందితురాలిని బిచ్కుంద పోలీసులు పట్టుకున్నారు. బిచ్కుంద స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నరేశ్ వివరాలు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం ఔరాద్ తాలూకా, కమల్నగర్ గ్రామానికి చెందిన శాంతాబాయి కొన్ని నెలల నుంచి బస్టాండ్లో రద్దీగా ఉన్న బస్సులో ఎక్కుతున్న మహిళల మెడలో నుంచి బంగారు నగలు అపహరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు గోడమీది సాయవ్వ, గాండ్ల సాయవ్వ, దొమటి శకుంతల, సాయవ్వ తమ బంగారు నగలు పోయాయని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కొన్నినెలల నుంచి బిచ్కుంద బస్టాండ్లో నిఘా పెట్టారు. శనివారం బస్టాండ్లో చోరీకి పాల్పడుతున్న శాంతాబాయిని పోలీసులు పట్టుకున్నారు. విచారణలో నలుగురు ప్రయాణికుల నగలు అపహరించినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. శాంతాబాయి నుంచి 5 తులాల బంగారం స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు సీఐ వివరించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సిబ్బంది మహ్మద్ నదీమ్ను అదనపు ఎస్పీ నరసింహారెడ్డి అభినందించినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్సై మోహన్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ● 5 తులాల బంగారం స్వాధీనం ● రిమాండ్కు తరలింపు -
గౌరవ వేతనం అందేదెప్పుడు?
మోర్తాడ్(బాల్కొండ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర సర్వేలో పాల్గొన్న సిబ్బందికి ఇప్పటికీ గౌరవ వేతనం అందలేదు. సర్వే అనంతరం ఈ ప్రక్రియలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి గౌరవ వేతనం(అలవెన్సులను) అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నెలలు గడుస్తున్నా డబ్బులు ఖాతాల్లో జమ కాకపోవడంతో ఎన్యుమరేటర్లు, పరిశీలన జరిపిన సూపర్వైజర్లు, ఆన్లైన్లో వివరాలను నమోదు చేసిన ఆపరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిధుల కొరతనే కారణమా? జిల్లాలో సర్వే నిర్వహించిన వారికి భత్యం చెల్లించడానికి రూ.3,93,20,000లను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా ప్లానింగ్ కార్యాలయం ద్వారా సర్వేలో పాల్గొన్న వారికి భత్యం జమ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థుల ఖాతాల నంబర్లను సేకరించి నెలలు గడచినా ఒక్కరికి కూడా నయాపైసా జమ కాలేదు. జిల్లా ప్లానింగ్ అధికారులను అభ్యర్థులు వాకబు చేస్తే ట్రెజరీకి బిల్లులు చేసి పంపించామని ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే భత్యం సొమ్ము జమ అవుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఆర్థిక శాఖ వద్ద నిధుల కొరత తీవ్రంగా ఉండటంతోనే టోకెన్లు జారీ చేసినా భత్యం సొమ్ము జమ కావడానికి సమయం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమైతుంది. ప్రభుత్వం స్పందించి సమగ్ర సర్వేలో పాల్గొన్న సిబ్బందికి డబ్బులు జమ చేయాలని పలువురు కోరుతున్నారు.ఖాతా నంబర్లు పంపించాం..సమగ్ర సర్వేలో పాల్గొన్న ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, ఆన్లైన్లో వివరాలు నమోదు చేసిన కంప్యూటర్ ఆపరేటర్ల బ్యాంకు ఖాతా నంబర్లను చీఫ్ ప్లానింగ్ కార్యాలయానికి పంపించాం. ఖాతా నంబర్లు పంపించడంతో మా బాధ్యత తీరిపోయింది. అక్కడి నుంచి డబ్బులు జమ కావాల్సి ఉంది. ఇంకా మాకు ఎలాంటి సమాచారం లేదు. – తిరుమల, ఎంపీడీవో, మోర్తాడ్ జిల్లాలో 3500 మంది ఎన్యుమరేటర్లు.. జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాలు, పట్టణాల్లో కుటుంబాల వారీగా వివరాలను నమోదు చేయడానికి 3,500ల మంది ఎన్యుమరేటర్లను నియమించారు. సర్వే ఎలా కొనసాగుతుందో పరిశీలించడానికి 360 మందిని సూపర్వైజర్లుగా నియమించారు. ఎన్యుమరేటర్లకు రూ.10వేల చొప్పున, సూపర్వైజర్లకు రూ.12వేల అలవెన్సును అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సర్వే నిర్వహించిన ఎన్యుమరేటర్లకే కంప్యూటర్ ఆపరేటర్లతో ఆన్లైన్లో వివరాలను నమోదు చేయించే బాధ్యత అప్పగించారు. అవుట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్లతోపాటు మీసేవ నిర్వాహకులు, కొందరు విద్యార్థులను ఆన్లైన్లో వివరాల నమోదు కోసం వినియోగించారు. వీరికి ఒక్కో కుటుంబ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడానికి రూ.50 చొప్పున చెల్లిస్తామని అధికార యంత్రాంగం వెల్లడించింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి రుసుం చెల్లించలేదు. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు అలవెన్స్లను జమ చేయడానికి ఖాతా నంబర్లను గతంలోనే మండల పరిషత్, మున్సిపల్ అధికారుల ద్వారా సేకరించారు. భత్యం చెల్లింపులో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకూడదనే ఉద్దేశ్యంతో సర్వేలో పాల్గొన్న వారి ఖాతా నంబర్లను ప్రభుత్వం సేకరించింది. సమగ్ర సర్వే ముగిసి నెలలు గడుస్తున్నా విడుదల కాని నిధులు సిబ్బందికి తప్పని నిరీక్షణ -
సాగునీటి సమస్య తలెత్తితే మీరే బాధ్యులు
ఎరువులు అందుబాటులో ఉంచాలి యాసంగి సీజన్లో ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ హనుమంతు ఆదేశించారు. గతేడాది రబీలో 63 వేల మెట్రిక్ టన్నుల ఎరువులను వినియోగించగా, ఈసారి 77 వేల మెట్రి క్ టన్నులకు డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు. జిల్లా రైతుల అవసరాలకు సరిపడా స్టాక్ను ముందుగానే తెప్పించుకుని అన్ని ప్రాంతాల రైతులకు అందుబాటు ఉండేలా చూడాలన్నారు.బోధన్: జిల్లాలో ఎక్కడైనా సాగు నీటి సమస్య ఉత్పన్నతమైతే సంబంధిత శాఖ అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామని జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. సాగు నీటి సరఫరా ను సక్రమంగా పర్యవేక్షించకుండా అలసత్యాన్ని ప్ర దర్శిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. బో ధన్ పట్టణంలోని నీటిపారుదల శాఖ అతిథి గృహంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతోతో కలిసి డివిజన్ స్థాయి నీటిపారుదల, రెవెన్యూ, వ్యవసాయశాఖల అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టులు, చెరువులు, కాలువల కింద ఆయకట్టు పరిధిలోని పంటల పరిస్థితి, అందుబాటులో ఉన్న నీటి వనరుల వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రధాన జలాశయాలైన శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులతోపాటు చెరువుల్లో నీటి నిల్వలు ఎక్కువగానే ఉన్నాయన్నారు. ఎక్కడా పంటలకు సాగు నీరందించే విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. ఎగువ ప్రాంతాల్లో నీటి చౌర్యం జరగకుండా నిఘా పెట్టాలన్నారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, ఎక్కడైనా సాగు నీటి సరఫరా కు ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉంటే ముందుగానే స మస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలనిన్నారు. రానున్న నెలన్నర రోజులపాటు సాగు నీటి పంపిణీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ ఉన్నతాధికారులకు సూచించారు. పన్ను వసూళ్లను వేగవంతం చేయాలి ఆర్థిక సంవత్సరం ముగింపు వరకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలతోపాటు ఇతర సంస్థల నుంచి రా వాల్సిన ఆస్తి పన్ను వసూళ్లను వేగవంతం చేయా లని కలెక్టర్ సూచించారు. వంద శాతం పన్ను వసూలయ్యేలా ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పెద్ద మొత్తంలో పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉన్న వారికి నోటీసులు జారీ చేయాలని, అయినప్పటికీ స్పందించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సంబంధిత అధికారులకు స్పష్టం చేసిన కలెక్టర్ హనుమంతు బోధన్ ఇరిగేషన్ గెస్ట్హౌస్లో సమీక్ష సమావేశం నీటి చౌర్యంపై నిఘాపెట్టాలని ఆదేశం -
సదరం శిబిరాల్లో సదుపాయాలు కల్పించాలి
కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు బోధన్: సదరం శిబిరాల్లో వైక్యల నిర్ధారణ కోసం వచ్చే వారికి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సదరం సేవలను సులభతరం చేస్తూ ఇటీవల కొత్తగా యూనిక్ డిజెబిలిటీ ఐడీ (యూడీఐడీ) పోర్టల్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై శనివారం సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు చేశారు. బోధన్ సబ్ కలెక్టర్ చాంబర్ నుంచి వీసీలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశమై మాట్లాడారు. సదరం సర్టిఫికెట్ల కోసం ఇక నుంచి యూడీఐడీ పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేసుకునేలా చూడాలని సూచించారు. దరఖాస్తుదారులకు సదరం శిబిరానికి ఎప్పుడు హాజరుకావాలనేది ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందుతుందని తెలిపారు. దరఖాస్తు సమయంలో అక్షర దోషాలు, ఇతర తప్పులకు ఆస్కారం లేకుండా మీ సేవ నిర్వాహకులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఇప్పటి వరకు ఐదు రకాల కేటగిరీల వారికే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేదని, కొత్తగా రూపొందించిన యూడీఐడీ పోర్టల్లో 21 రకాల కేటగిరీలను చేర్చారని కలెక్టర్ వెల్లడించారు. సదరం సర్టిఫికెట్లను స్మార్ట్కార్డు రూపంలో పోస్టల్ శాఖ ద్వారా ఇంటికి పంపిస్తారని తెలిపారు. చేయూత పెన్షన్తోపాటు ఇతర సంక్షేమ పథకాల కోసం సదరం స్మార్ట్ కార్డు చెల్లుబాటవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్డీవో సాయాగౌడ్, డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
6 నుంచి రైల్వేగేట్ మూసివేత
ఎడపల్లి(బోధన్): అండర్ పాస్ నిర్మించనున్న నేపథ్యంలో ఎడపల్లి మండలంలోని బషీర్ఫారం రైల్వే గేటును ఈ నెల 6 నుంచి మూసి వేయనున్నట్లు సికింద్రాబాద్ డివిజన్ రైల్వే ఇంజినీర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎడపల్లి తహసీల్, పోలీస్స్టేషన్, మండలంలోని పోచారం గ్రామ పంచాయతీ కార్యదర్శికి రైల్వే అధికారులు ముందస్తుగా నోటీ సులు అందించారు. గతంలో రైల్వేగే టును మూసి వేయడంతో తాము ఇబ్బందులు పడ్డామని, ప్రస్తుతం అండర్ పాస్ నిర్మా ణం పేరుతో మళ్లీ గేటును మూసివేస్తున్నా రని పోచారం గ్రామస్తులు అంటున్నారు. డెమో రైలు రద్దు ఖలీల్వాడి: రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనుల నేపథ్యంలో కాచిగూడ – నిజామాబాద్ మ ధ్య నడిచే డెమో రైలును రద్దు చేసినట్లు దక్షి ణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెలాఖరు వరకు (77601/77602) డెమో ౖరైలు రాక పోకలు రద్దు చేశామని, ప్రయాణికులు గమనించాలని సీపీఆర్వో శ్రీధర్ కోరారు.అంకితభావంతో పని చేయాలి బోధన్: వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు అన్నారు. సాలూర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా విభాగాలను పరిశీలించారు. రోగులతో మా ట్లాడి వైద్య సేవల వివరాలను తెలుసుకున్నారు. ఔషధ నిల్వలు, సిబ్బంది హాజరు రి జిస్టర్లను తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రు లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందించే వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఆయన అ న్నారు. శిథిలావస్థకు చేరిన ఆరోగ్య కేంద్రం పాత భవనాన్ని పరిశీలించి కొత్త భవనం మంజూరు వివరాలను మెడికల్ ఆఫీసర్ డా క్టర్ రాజ్కుమార్ను అడిగి తెలుసుకున్నారు. తలుపు బిగింపు బాల్కొండ: ముప్కాల్ లోని అద్దె భవనంలో కొ నసాగుతున్న కేజీబీవీ లోని మూత్రశాలలకు బొంతలు కట్టిన వైనంపై ‘సాక్షి’లో ‘బొంతలే.. తలుపులు’ శీర్షికన కథనం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. ప్రధాన ద్వారానికి తలుపు బిగించారు. తలుపు బిగించడంపై హర్షం వ్యక్తం చేసిన విద్యార్థినులు నూతన భవన నిర్మాణ పనులను కూడా వెంటనే పూర్తి చేయించాలని కోరారు. డిగ్రీ, పీజీలో ప్రవేశాలకు అవకాశం నిజామాబాద్అర్బన్: ప్రొఫెసర్ రామ్రెడ్డి దూరవిద్యా కేంద్రంలో 2024–25 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు అవకాశం కల్పించినట్లు కో ఆర్డినేటర్ రాము ఒక ప్రక టనలో తెలిపారు. డిగ్రీ, పీజీలో డిప్లొమా కోర్సుల్లో రెండో దఫా ప్రవేశాలకు అవకాశం ఉందని, ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 99126 70252 నంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. -
నిజామాబాద్
వాతావరణం ఉదయం ఈదురు గాలులు వీస్తాయి. క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఉక్కపోతగా ఉంటుంది. రాత్రి చలి తీవ్రత తక్కువగా ఉంటుంది.గౌరవ వేతనం అందేదెన్నడు? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర సర్వేలో పాల్గొన్న సిబ్బందికి ఇప్పటి వరకు గౌరవ వేతనం అందలేదు. ఆదివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2025– 8లో uకూచిపూడి నాట్యంతో అలరిస్తున్న నాట్య గురువు సరోజ ప్రియదర్శిణి (ఫైల్)నాట్యంపై మమకారం.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉన్నత శిఖరాలకు ఎదిగారు. ముచ్చటైన హావభావాలతో నాట్యం చేస్తూ మంత్రముగ్ధుల్ని చేస్తారు. అపారమైన ప్రతిభ గల వీరంతా ఆదర్శవంతమైన నాట్య గురువులుగా రాణిస్తున్నారు. ప్రాచీన కళకు ప్రాణం పోస్తూ.. చిన్నారులను నాట్యమయూరాలుగా తీర్చిదిద్దున్నారు. తాము నేర్చుకున్న సంప్రదాయ కళకు ప్రాంతీయ రంగు పులుమకుండా కూచిపూడి, పేరిణి నాట్యం, జానపద నృత్య రీతులను చిన్నారులకు నేర్పిస్తున్నారు ఆర్మూర్కు చెందిన బాశెట్టి మృణాళిని, సరోజ ప్రియదర్శిణి, జయలక్ష్మిలు. కళామతల్లి సేవలో ఉంటూ వీరి శిష్యులను రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేస్తున్న నాట్యగురువులపై ప్రత్యేక కథనం.. – ఆర్మూర్ విజయవాడకు చెందిన వెంకట రమణమ్మ, సాంబశివ శర్మల కూతురు సరోజ ప్రి యదర్శిణి తన 6వ ఏట నుంచే గురువులు పార్వతీశం, శంకర్ వద్ద ఫోక్ డ్యాన్స్ నేర్చుకుంది. 11వ ఏట నుంచి క్లాసికల్ డ్యాన్స్ను నేర్చుకోవాలనే తపనతో శైలజారెడ్డి, వేదాంతం రాధేశ్యాంల వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకోవడం ప్రారంభించింది. 13 ఏళ్ల చిరుప్రాయంలో అరంగేట్రం చేసి ఇక వెనక్కి తిరిగి చూడలేదు. 22 ఏళ్లలో దేశ, విదేశాల్లో 500 పైగా నాట్య ప్రదర్శనలతో వందల సంఖ్యలో అవార్డులను కై వసం చేసుకున్నారు. హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతి చేతుల మీదుగా ఆస్థాన నర్తకి, జాతీయ స్థాయిలో నాట్య విజ్ఞాన్ అవార్డు, కళాపీఠం వారి కళాభూషణ్ అవార్డులు ఆమె నాట్య నైపుణ్యానికి అందిన మచ్చుతునకలు. 2008లో వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామానికి చెందిన సుధీర్ శర్మతో వివాహం జరగడంతో ఇద్దరు పిల్లలు శివరామకృష్ణ, ప్రోక్షితతో కలిసి ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో స్థిరపడ్డారు. 2012లో నిజామాబాద్ కేంద్రంలోని జ్ఞాన సరస్వతీ సంగీత, నృత్య పాఠశాలలో నాట్య గురువు దేవులపల్లి ప్రశాంత్ వద్ద శిష్యరికం చేసి కూచిపూడిలో డిప్లొమా పూర్తి చేశారు. అదే ఏడాది మామిడిపల్లిలో భారతి నృత్యనికేతన్ (కీర్తన నృత్యనికేతన్)ను స్థాపించారు. కూచిపూడి లాంటి సంప్రదాయ నృత్యాలను చిన్నారులు నేర్చుకోవడంతో వారిలో సనాతన సంస్కృతి, సంప్రదాయాలు అలవడుతాయని తెలుపుతున్నారు. ఆర్మూర్ పట్టణంలోని బాశెట్టి మహిపాల్, లక్ష్మి సంతానమైన బాశెట్టి మృణాళిని ఏడేళ్ల ప్రాయం నుంచే నాట్యంపై మక్కువ కనబర్చారు. 2015 లో హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఆంధ్ర నాట్యంలో పోస్ట్ గ్రా డ్యుయేషన్, కూచిపూడిలో డిప్లొమా పూర్తి చేశా రు. నాట్య గురువు డాక్టర్ సువర్చల వద్ద శిష్యరికం చేసి నిష్ణాతురాలిగా మారారు. సుమారు 600 పైగా ప్రదర్శనలు ఇచ్చి అవార్డులను కై వసం చేసుకున్నారు. 20 ఏళ్లుగా ఆర్మూర్లోని నటరాజ నృత్యనికేతన్లో సుమారు వెయ్యి మందికి పైగా చి న్నారులకు కూచిపూడి, ఆంధ్రనాట్యం, పేరిణి నా ట్యం, జానపద నృత్య రీ తులను నేర్పించారు. కూతురు సాయిశృతిని సైతం నృత్య కళాకారిణిగా తీర్చిదిద్దారు. 2024 సెప్టెంబర్లో కల్చరల్ అండ్ ఆర్ట్స్ విభాగంలో ఆమె అందిస్తున్న సేవలను గుర్తించిన వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ గౌరవ డాక్టరేట్తో సత్కరించింది.కళా పోషకుడు మాడవేడి.. ఎంతటి కళలైనా సరే పోషకులు లేని పక్షంలో మరుగున పడిపోతా యి. కాగా ఆర్మూర్ పట్టణానికి చెందిన విశ్రాంత ఉ పాధ్యాయుడు, రాష్ట్రపతి అవా ర్డు గ్రహీత మాడవేడి నారాయణ కళామతల్లి పోషకుడిగా కొనసాగుతూ అందరి మన్ననలు పొందుతు న్నారు. 2001 సంవత్సరంలో ఆర్మూర్ పట్టణంలో నటరాజ నృత్యనికేత న్ను స్థాపించి 2005లో రిజిస్ట్రేషన్ చేయించారు. నాటి నుంచి పలువురు నాట్య గురువుల సహకారంతో చిందు, కూచిపూడి, ఆంధ్ర నాట్యం, పేరిణి నాట్యం, జానపద నృత్య రీతులను నేర్పి స్తూ సంప్రదాయ కళలను అంపశయ్యపైకి వెళ్లకుండా కాపాడుతున్నారు. అంతరించిపోతున్న చిందుకళను ప్రోత్సహించి ఇందిరాగాంధీ హయాంలో ఢిల్లీలో ప్రదర్శనలిప్పించిన ఘనత నారాయణది. ఆయన స్థాపించిన నటరాజ నృత్యనికేతన్లో వెయ్యికి పైగా చిన్నారులు సంప్రదాయ నృత్యరీతులను నేర్చుకోవడం విశేషం. కాకతీయుల నాటి పేరిణి నాట్యం కాకతీయ చక్రవర్తుల కాలంలో యుద్ధ సన్నాహక నృత్య విశేషంగా మొదలైందీ పేరిణి నృత్యం. ఇతర శాసీ్త్రయ నృత్యాలకన్నా విశిష్టత కలిగింది. జయపసేనాని మొదలుకొని ఈ నాట్య శైలితో రామప్ప ఆలయ అంతర విగ్రహాలు అలంకరిచబడటం వరకు పేరిణి నృత్య వికాసంలో ప్రతీది విశిష్టాంశమే. ఆ తర్వాత కనుమరుగైపోయిన పేరిణి నృత్యం నటరాజ రామకృష్ణ సారథ్యంలో పునర్వైభవం సంతరించుకున్నది. తెలంగాణలో పేరిణి నృత్యం నవశక్తిగా ఊపిరిపోసుకుంటోంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ శాసీ్త్రయ నృత్య రీతి అయిన పేరిణి ద్వితీయ శ్రేణి నృత్య రీతిగానే మిగిలిపోయింది. ప్రస్తుతం రాష్ట్ర శాసీ్త్రయ నృత్యరీతి అయిన పేరిణి తాండవానికి తెలంగా ణ ఆలయ ఆస్థానాలల్లో లాస్య నర్తనరీతిని కూ డా కలుపుకొని పేరిణి నాట్యంగా రూపుదిద్దుకుంది. చిన్నారుల్లో తపన ఉండాలి పేరిణి, ఆంధ్ర నాట్యం, కూచిపూడి లాంటి సంప్రదాయ నృత్యాలను చిన్నారులు నేర్చుకోవడంతో ఏకాగ్రత పెరిగి చదువుల్లో సైతం రాణిస్తున్నారు. లాభాపేక్ష లేకుండా కళామతల్లి సేవలో తరించడం మానసికానందాన్నిస్తోంది. కూచిపూడిని ఆదరిస్తూ తమ పిల్లలకు నేర్పించడానికి తల్లిదండ్రులు సైతం ఆసక్తి చూపడం ఆనందంగా ఉంది. చిన్నారుల్లో నేర్చుకోవాలనే తపన ఉన్నా పేరిణి నాట్య కళాశాలలు అందుబాటులో లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో కళాకారులకు గుర్తింపు రావడం లేదు. ఇలాంటి వారికి ప్రభుత్వ పాఠ్యశాలలో పేరిణి నాట్యాన్ని చేరిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. – జయలక్ష్మి, సీనియర్ నాట్య గురువు, నిజామాబాద్న్యూస్రీల్వెయ్యికి పైగా శిష్యులుబాశెట్టి మృణాళిని, నాట్య గురువు, ఆర్మూర్ -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
కామారెడ్డి క్రైం: జిల్లాకేంద్రానికి సమీపంలోని చిన్న మల్లారెడ్డి క్రాస్ రోడ్డు వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో రోడ్డు దాటుతుండగా అటుగా వచ్చిన కారు ఢీకొనడంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చిన్న మల్లారెడ్డికి చెందిన నలుగురు, లింగంపేట మండలం శెట్టిపల్లి సంగారెడ్డికి చెందిన మరో వ్యక్తి గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. తాడ్వాయిలో అగ్ని ప్రమాదం తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి మండల కేంద్రంలో శనివారం అ గ్ని ప్రమాదం సంభవించినట్లు గ్రామస్తులు తెలి పారు. రూప అనే మహిళ అద్దె ఇంట్లో ఉంటూ శబరిమాత ఆశ్రమం వద్ద ప్యాలాల దుకాణం నడుపుతూ జీవిస్తోంది. శనివారం ఎక్కడి నుంచో వచ్చిన నిప్పురవ్వలు ఇంటిపై పడడంతో ప్లాస్టిక్ తాటిపత్రికి ని ప్పంటుకుందని తెలిపారు. ఇంట్లో మంటలు వ్యా పించడంతో బియ్యం, బట్టలు, ప్యాలాలు, సర్టిఫికెట్లతోపాటు, రెండువేల నగదు కాలిబూడిదైనట్లు పేర్కొన్నారు. అగ్నిప్రమాదంలో సుమారు 25వేల ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితురాలు తెలిపింది. ప్రభుత్వం తనను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతోంది. బోధన్లో షార్ట్సర్క్యూట్తో..బోధన్: పట్టణంలోని 29వ వార్డు శివాలయం వీధిలో వెండి సాయిలు అనే వ్యక్తి పెంకుటింట్లో శనివారం షార్ట్సర్క్యూట్తో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో విలువైన పత్రాలు, కొంత నగదు పాక్షికంగా కాలిపోయాయని, సుమారు రూ.లక్ష వరకు ఆస్తినష్టం వాట్లిలిందని బాధితులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. -
క్రైం కార్నర్
కారును ఢీకొన్న లారీ ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ గ్రామ శివారులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగిరెడ్డిపేట మండలంలోని రాఘవపల్లి తండాకు చెందిన పూల్సింగ్ (39) తన భార్య సునీత, చెల్లెళ్లు శోభ, వినీతతో కలిసి శనివారం కామారెడ్డిలో చదువుతున్న పిల్లల దగ్గరికి కారులో వెళ్లారు. అనంతరం స్వగ్రామానికి బయల్దేరారు. అదే సమయంలో నారాయణ్ఖేడ్కు చెందిన బంధువులు పూల్సింగ్కు ఫోన్ చేయగా, వారిని ఎల్లారెడ్డిలో ఎక్కించుకొని రాఘవపల్లితండాకు వెళ్తున్నారు. మాచాపూర్ శివారులో హైదరాబాద్ నుంచి హర్యానాకు వెళ్తున్న లారీ, కారును బలంగా ఢీకొట్టడంతో పూల్సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో నారాయణ్ఖేడ్కు చెందిన తల్లి స్వరూప, కూతురు చిట్టి తలకు తీవ్రగాయాలవ్వడంతో హైదరాబాద్కు తరలించారు. జ్యోతి, శోభ, వినీత, సునీతలను ఎల్లారెడ్డిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఒకరి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం మరో నలుగురికి గాయాలు -
ప్రాణం ఖరీదు రూ.4.50 లక్షలు!
ఖలీల్వాడి: కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండే యువకుడి ప్రాణానికి వెలకట్టినట్లు ప్రచారం జరుగుతోంది. వివరాలు ఇలా.. నగరంలోని ఆరోటౌన్ పరిధిలోని జ్యూమ్ స్విమ్మింగ్పూల్లో ఫిబ్రవరి 26న నిజాంకాలనీకి చెందిన సయ్యద్ అశ్రఫ్(22) మృతి చెందాడు. ఈత నేర్చుకునేందుకు అశ్రఫ్ స్విమ్మింగ్పూల్కు వెళ్లగా.. కోచ్ అందుబాటులో లేకుండానే ఈతకు అనుమతించారు. దీంతో నీట మునిగి అశ్రఫ్ మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, స్విమ్మింగ్ పూల్ను తెరిపించుకునేందుకు యాజమాన్యం స్థానికంగా ఉండే ఓ పార్టీ నాయకులను ఆశ్రయించింది. కేసు విత్డ్రా చేసుకుంటే నష్టపరిహారం అందిస్తామని నేతలు మృతుడి కుటుంబానికి చెప్పినట్లు సమాచారం. స్విమ్మింగ్పూల్ యజమానితో అదే ప్రాంతంలోని ఓ ఫంక్షన్హాల్లో బేరసారాలు మొదలు పెట్టారు. చివరికి నిండు ప్రాణం ఖరీదు రూ.4.50 లక్షలుగా పార్టీ నాయకులు వెలకట్టారు. రాజీలో భాగంగా మృతుడి కుటుంబానికి మొదట రూ. 2లక్షలు, కేసు విత్డ్రా సమయంలో మిగితా రూ.2.50లక్షలు చెల్లించాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇదంతా ఎన్నికల కోసమేనా! కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజల సమక్షంలో ఉండేందుకు సదరు పార్టీ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇటీవల ఓ భూ వివాదంలో సదరు పార్టీకి చెందిన నేతలు ఓ అధికారితో వాగ్వాదానికి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. పంచాయితీల్లో సదరు పార్టీ నేతలు తలదూర్చుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ నిండు ప్రాణానికి వెలకట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై సౌత్ సీఐ సురేశ్ కుమార్ను వివరణ కోరగా సయ్యద్ అశ్రఫ్ మృతిపై కేసు నమోదు చేశామని, స్విమ్మింగ్పూల్ మూసివేత కోసం కార్పొరేషన్ అధికారులకు లేఖ అందించినట్లు తెలిపారు. అశ్రఫ్ ప్రాణానికి ఖరీదు కట్టినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. గత నెల 26న స్విమ్మింగ్పూల్లో పడి యువకుడి మృతి రాజీ కుదిర్చిన రాజకీయ నేతలు మొదట రూ.2 లక్షలు.. కేసు విత్డ్రా రోజు రూ.2.50 లక్షలు చెల్లించేలా డీల్ -
ప్రతి గుంటకు నీరందాలి
● పంటలు గట్టెక్కేలా చర్యలు తీసుకోండి ● ఇరిగేషన్ అధికారులతో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డినిజాంసాగర్: నిజాంసాగర్ ప్రధాన కాలువ పరిధిలోని ప్రతి గుంటకు సాగు నీరు అందించి, పంటలు గట్టెక్కేలా చూడాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి ఉమ్మడి జిల్లా నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. గుల్దస్తా రెస్ట్ హౌస్లో ఉమ్మడి జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖ సీఈలు శ్రీనివాస్, మధుసూదన్, ఎస్ఈలు, డీఈఈలు, ఏఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయన్నారు. చివరి ఆయకట్టు గట్టెక్కేవరకు నీటిని విడుదల చేయాలన్నారు. ప్రాజెక్టు నీరు వృథా కాకుండా అధికారులు పర్యవేక్షించాలన్నారు. అలీసాగర్ రిజర్వాయర్ వరకు 1.25 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్న పంటలను పూర్తిస్థాయిలో గట్టెక్కిస్తామని, నీటి కోసం రైతులు ఆందోళన చెందకుండా అధికారులకు సహకరించాలని కోరారు. సమావేశంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, నిజాంసాగర్ నీటిపారుదలశాఖ ఈఈ సోలోమాన్ తదితరులు పాల్గొన్నారు. చివరాయకట్టు వరకు నీరు బోధన్/ఎడపల్లి: నిజాంసాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు ప్రాంతమైన డి–28 కాలువ కింద పంటలకు నీరందించేందుకు చర్యలు చేపట్టామని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్రెడ్డి తెలిపారు. సాలూర మండలంలోని సాలూర క్యాంప్, జాడిజమాల్పూర్, బోధన్ మండలంలోని పెగడాపల్లి గ్రామాల శివారులో డి–28/14 కాలువలో నీటి పారకం, పంటల పరిస్థితిని, ఎడపల్లి మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు డి–46 కాలువ ఆయకట్టును శనివారం ఆయన పరిశీలించారు. ఆయాగ్రామాల్లో రైతులతో మాట్లాడారు. వరి, మొక్కజొన్న, ఇతర పంటలు చేతికొచ్చే దశలో ఎండిపోకుండా నీరందించేందుకు నీటిపారుదల శాఖ అధికారులను అప్రమత్తం చేశామన్నారు. అలీసాగర్ ఎత్తిపోతల పథకం కింద 53 వేల ఎకరాలు, నిజాంసాగర్ డి–46 కాలువ కింద 12 వేల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. నీటిని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు, నీరు వృథా పోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నీటి సరఫరా గడువు ఈ నెల 3తో ముగియనుందని, మరి కొన్ని రోజులు పెంచాలని రైతులు ఎమ్మెల్యేను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్యే వెంట వ్యవసాయ శాఖ కమిషన్ స భ్యుడు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు నాగేశ్వర్రావు, అల్లె రమేశ్, చిద్రపు అశోక్, నరేందర్రెడ్డి, సుందర్రాజ్ తదితరులు ఉన్నారు. -
గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా
● తప్పిన భారీ ప్రమాదం నిజామాబాద్ రూరల్: నగర శివారులోని సారంగాపూర్ సమీపంలో నిండు గ్యాస్తో ఉన్న సిలిండర్లను తరలిస్తున్న లారీ శనివారం సాయంత్రం బోల్తాపడింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..హైదరాబాద్ నుంచి సారంగాపూర్ డెయిరీఫాం వద్ద ఉండే గోదాముకు ఓ లారీ నిండు సిలిండర్లను తరలిస్తోంది. తాజ్దాబా వద్ద మూలమలుపునకు రాగానే ఒక్కసారిగా లారీ బోల్తాపడింది. దీంతో సిలిండర్లన్నీ కిందపడిపోగా.. ఆ శబ్దానికి స్థానికులు భయబ్రాంతులకు లోనయ్యారు. సిలిండర్లు ఎక్కడ పేలుతాయోనని భయపడ్డారు. విషయం తెలుసుకున్న ఆరోటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గ్యాస్ సిలిండర్లను అక్కడి నుంచి తరలించారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. -
దిమ్మ తిరిగే దిగుబడి!
డొంకేశ్వర్(ఆర్మూర్): తనకున్న ఎకరం భూమిలోనే పసుపు సాగు చేస్తున్న రైతు గోక నారాయణ అద్భుత దిగుబడులు సాధిస్తున్నాడు. డొంకేశ్వర్ మండల కేంద్రానికి చెందిన నారాయణ గత ఆరేళ్లుగా పసుపు సాగు చేస్తున్నాడు. నేల స్వభావమో, ఎరువుల పనితమో లేదా రైతు చేతి గుణమో తెలియదు కానీ.. ఎకరానికి పన్నెండు ట్రాక్టర్ల పసుపు దిగుబడి వస్తోంది. అన్ని పద్ధతులు పాటించి సాగు చేస్తేనే కష్టం మీద ఎకరానికి ఎనిమిది ట్రాక్టర్ల దిగుబడి (25 నుంచి 30 క్వింటాళ్లు) వస్తుంది. అలాంటిది గోక నారాయణకు ఎకరానికి పన్నెండు ట్రాక్టర్ల (దాదాపు 40 క్వింటాళ్లు) దిగుబడి రావడం ఆశ్చర్యపరిచే విషయమే. వరుసగా గత ఆరేళ్లుగా ఇదే దిగుబడిని రావడం తనను కూడా ఆశ్చర్యాన్ని గురిచేస్తోందని సదరు రైతు పేర్కొంటున్నాడు. అందరిలాగే తను కూడా పశువులు, గొర్ల ఎరువు ఉపయోగించడంతోపాటు డ్రిప్ ద్వారా పదిహేను రోజులకోసారి నత్రజని, పొటాష్, పాస్పరస్ అందిస్తానని ‘సాక్షి’కి తెలిపారు. ప్రతి ఏటా సాంగ్లి మార్కెట్కు వెళ్లి పసుపు దిగుబడిని విక్రయిస్తున్నట్లు చెప్పాడు. ఎకరానికి 12 ట్రాక్టర్ల పసుపు ఆదర్శంగా నిలుస్తున్న డొంకేశ్వర్ రైతు గోక నారాయణ ఆశ్చర్యపోతున్న తోటి రైతులు -
నేడు బాబ్లీ గేట్ల ఎత్తివేత
● దిగువకు 0.6 టీఎంసీల నీటి విడుదల బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం శనివారం ఎత్తనున్నారు. సుప్రీం ఆదేశాల మేరకు బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను ప్రతి సంవత్సరం జూలై 1న ఎత్తి అక్టోబర్ 28న మూసివేయాలి. అనంతరం ఎగువ ప్రాంతాల్లోని అక్కడక్కడా గుంతల్లో నిలిచిన నీటికి బదులుగా 0.6 టీఎంసీల నీటిని మార్చి 1న బాబ్లీ నుంచి ఎస్సారెస్పీకి వదలాలని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొంది. ఆ తీర్పు ప్రకారం బాబ్లీ గేట్లు తెరిచి 0.6 టీఎంసీల నీటిని దిగువకు వదులుతారు. దీంతో ఎస్సారెస్పీ ఎగువ ప్రాంతంలో గోదావరికి జలకళ రానుండగా, ప్రాజెక్టులోకి అంతగా నీరు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్ట్లో కొంతమేర నీరుంది. ఏటా మార్చి 1న గేట్లు ఎత్తితే 0.2 టీఎంసీల నీరు మాత్రమే వచ్చి చేరుతుంది. కాగా, 0.6 టీఎంసీల కోటా పూర్తికాగానే గేట్లను మూసివేయనున్నారు. నీటి విడుదల పర్యవేక్షణలో ఎస్సారెస్పీ తరఫున ఈఈ చక్రపాణి పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు ఖలీల్వాడి: ఈ నెల 5 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్ఎస్ 163 సెక్షన్ అమలులో ఉంటుందని ఇన్చార్జి సీపీ సింధు శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష సెంటర్ నుంచి 100 మీటర్ల మేర ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సెక్షన్ అమలులో ఉంటుందన్నా రు. పరీక్ష కేంద్రాల వద్ద షాపులు మూసి వేయాలని పేర్కొన్నారు. జాతీయ పసుపు బోర్డు కార్యదర్శిగా భవానిశ్రీ సుభాష్నగర్: జాతీయ పసుపు బో ర్డు కార్యదర్శిగా ఎన్ భవానిశ్రీని నియమిస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ డిప్యూటీ డైరెక్టర్ అరుణ్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. భవానిశ్రీ 2017వ బ్యాచ్ నాగాలాండ్ రాష్ట్ర కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారిణి. భవానిశ్రీ , సుగంధ ద్రవ్యాల బోర్డు డైరెక్టర్ (పరిశోధన) డాక్టర్ ఎబీ రెమాశ్రీ కలిసి సుగంధ ద్రవ్యాల బోర్డు, జాతీయ పసుపు బోర్డు మధ్య కార్యకలాపాలను సమన్వయం చేస్తారు. నియామకం తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కళాశాల అకడమిక్ కోఆర్డినేటర్గా సువర్చల నియమితులయ్యారు. వీసీ యాదగిరిరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ యాదగిరి శుక్రవారం నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు సువర్చలకు ఎడ్యుకేషన్ కాలేజ్ ప్రిన్సిపల్ సాయిలు ఉత్తర్వులను అందజేశారు. -
శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి
నిజామాబాద్నాగారం: నిత్య జీవన శైలిలో సైన్స్ చాలా ముఖ్యమైందని, విద్యార్థి దశ నుంచి శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ స్వచ్ఛంద సంస్థ దివ్యాంగుల పాఠశాలలో శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి డీఈవో ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే సైన్స్ పట్ల పరిశోధనలు చేసినప్పుడు వారి మెదడులో శాసీ్త్రయ దృక్పథం అలవడుతుందన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సోలార్ విద్యుత్ ప్రయోగం, జల విద్యుత్ ప్రయోగం, మానవ శ్వాస వ్యవస్థ ఇతర ప్రయోగాలు చూసి సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా సైన్స్ అధికారి గంగా కిషన్, సిద్దయ్య, జ్యోతి, రాజేశ్వరి, నర్ర రామారావు, సీడీపీవో సౌందర్య, విజయానందరావు తదితరులు పాల్గొన్నారు. -
మేరు సంఘ సమస్యలను అసెంబ్లీలో ప్రశ్నిస్తా
నిజామాబాద్నాగారం: మేరు సంఘ సమస్యలను అసెంబ్లీలో ప్రశ్నిస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం జాతీయ టైలర్స్ డే సందర్భంగా ఆదర్శనగర్ మేరు టైలర్స్ అసోసియేషన్ సభ్యులు స్థానిక మేరు సంఘంలో టైలర్స్ డే నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించే విధంగా విశ్వకర్మ యోజన పథకం తీసుకురావడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా కుల వృత్తులు చేసుకునేవారికి చేయూతగా పని నైపుణ్యాన్ని పెంపొందించే శిక్షణ తరగతులు, శిక్షణ సమయంలో రూ. 500 ఉపకారవేతనం ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగకిషన్, జిల్లా అధ్యక్షుడు సోమహనుమంతరావు, దశరథం, గడుగు రోహిత్, ఎర్రం సుధీర్, మేరు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. టైలరింగ్తో ఆర్థికంగా అభివృద్ధి నిజామాబాద్ రూరల్:టైలరింగ్తో మహిళలు ఆర్థి కంగా అభివృద్ధి చెందవచ్చని కపిల మహిళా సొసై టీ అధ్యక్షురాలు టి గోపిక అన్నారు. శుక్రవారం కపి ల మహిళ సంఘం ఆధ్వర్యంలో నగరంలోని సుభాష్నగర్లో టైలరింగ్ డేను ఘనంగా నిర్వహించారు. గత 30 ఏళ్లుగా మహిళలకు టైలరింగ్పై శిక్ష ణ ఇస్తూ అందరికి ఆదర్శవంతగా గోపిక నిలుస్తోందని సొసైటీ సభ్యులు వివరించారు. అనంతరం గో పికను సొసైటీ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో కళావతి,స్వాతి,శ్వేత,నాగమణి, రాధ, ప్రవళిక, సందీప, మేఘన, సుమ, చంద్రిక, మానస, సారిక, సుష్మ, రజిత శ్రీ, తదితరులు పాల్గొన్నారు. ధర్పల్లిలో.. ధర్పల్లి: మండల కేంద్రంలో మేర కులస్తులు ప్రపంచ టైలర్స్డేను ఘనంగా నిర్వహించారు. పలువురు దర్జీలను సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆర్మూర్ బాలరాజ్, రెబ్బ కిషన్, శ్రావణ్, శ్రీనివాస్, సతీశ్, సంతోష్, సందీప్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఘనంగా టైలర్స్ డే -
మహిళలకు ఆర్థిక అక్షరాస్యత అవసరం
నిజామాబాద్అర్బన్: మహిళలకు ఆర్థిక అక్షరాస్యత ఎంతో అవసరమని అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ సూచించారు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా ‘పొదుపు చేసే మహిళా సాధిస్తుంది ఘనత’ అనే అంశంపై లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లో మహిళా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు డబ్బులను పొదుపు చేసుకునేందుకు బడ్జెట్ రూపొందించుకోవాలని, అనవసర ఖర్చులను తగ్గించాలని సూచించారు. వ్యాపార లావాదేవీల ద్వారా లాభాలు ఆర్జించడమే కాకుండా, ఆర్థికపరమైన నిర్వహణ అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. సురక్షితమైన పొదుపు మార్గాలను ఎంచుకోవాలని హితవుపలికారు. ప్రైవేట్ సంస్థలు, వ్యక్తుల నుంచి రుణాలు తీసుకుంటే అధిక వడ్డీలు చెల్లించాల్సి వస్తుందని, దీంతో ఆర్థికంగా నష్టం కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వం మహిళా సంఘాలకు అందిస్తున్న తోడ్పాటును పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని ఆర్థిక పురోగతి సాధించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించే గోడప్రతులను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో సాయాగౌడ్, లీడ్ బ్యాంకు మేనేజర్ అశోక్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ -
ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
నిజామాబాద్ రూరల్: నగరంలోని 13వ డివిజన్ సారంగాపూర్లో నీటి కొరత తీర్చాలంటూ మహిళలు రోడ్డెక్కారు. నిజామాబాద్– బోధన్ ప్రధాన రహదారిపై శుక్రవారం ఖాళీ బిందెలు పట్టుకొని రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ నెలరోజులుగా తాగునీటి సరఫరా సరిగా జరగడం లేదని, నీటి సరఫరా చేసే బోరు మోటార్లు తరచూ పాడైపోతున్నాయని పేర్కొన్నారు. తాగునీటి ఇబ్బందులు తీర్చాలంటూ అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా స్పందన కరువైందని తెలిపారు. నెలరోజుల క్రితం సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని సారంగాపూర్ వాసి అక్బర్ నవాజుద్దీన్, వడ్డెర కాలనీ వాసి పల్లెపు యాదేశ్ ఆరోపించారు. రాస్తారోకోతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ సారంగాపూర్ చేరుకొని తాగునీటి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో మహిళలు ఆందోళన విరమించారు. సారంగాపూర్లో రాస్తారోకో నెల రోజులుగా తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నామని ఆవేదన -
తెలుగు/హిందీ/ఇంగ్లిష్
వెండితెరఉషా ప్రసాద్ మల్టీప్లెక్స్ (గీతా ఏషియన్) స్క్రీన్–1 ఛావా(హిందీ)–11.00.4.40,7.30, 10.20 – అగత్యా(తెలుగు)–1.40 స్క్రీన్–2 అగత్యా(తెలుగు)–11.00, 4.40 మజాకా(తెలుగు)–1.45, 7.35, 10.30 స్క్రీన్–3 గార్డ్(తెలుగు)–10.50 రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్(తెలుగు)–1.40, 7.30 శబ్దం(తెలుగు)–4.40, 10.20 పీవీఆర్ మల్టీప్లెక్స్ (వేణు మాల్) స్క్రీన్–1 ఛావా(హిందీ)–10.05 మజాకా(తెలుగు)–1.25 టర్న్ ఆఫ్ది డ్రాగన్(తెలుగు)–4.30, 7.40, 10.50 స్క్రీన్–2 మజాకా –10.00,4.15 రిటర్న్ ఆఫ్ది డ్రాగన్(తెలుగు)–1.05 ఛావా(హిందీ)–7.20, 10.40 స్క్రీన్–3 రిటర్న్ ఆఫ్ది డ్రాగన్(తెలుగు)–9.40 ఛావా(హిందీ)–12.50 తండేల్(తెలుగు)–4.10, 10.20 మజాకా(తెలుగు)–7.15 స్క్రీన్ –4 ఓయ్(తెలుగు)–10.05 జాబిలమ్మ నీకు అంత కోపమా(తెలుగు)–1.30 ఛావా(హిందీ)–4.20 సంక్రాంతికి వస్తున్నాం(తెలుగు)– 7.40 మజాకా(తెలుగు)–10.40 లలితామహల్ తండేల్(తెలుగు) దేవి మజాకా(తెలుగు) నటరాజ్ ఛావా(హిందీ) విజయ్ సంక్రాంతికి వస్తున్నాం (తెలుగు) -
బురదలో పడి రైతు మృతి
రుద్రూర్: మండలకేంద్రంలో ఓ రైతు పొలం గట్టుపై వెళుతుండగా ప్రమాదవశాత్తు బురదలో పడి మృతిచెందినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన కాడరి సాయినాథ్ (38) అనే రైతు గురువారం మధ్యాహ్నం పొలం వద్దకు వెళ్లాడు. గట్టుపై నడుచు కుంటు వెళుతుండగా అకస్మత్తుగా బురదలో పడిపోయాడు. వెంటనే స్థానికులు అతడిని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం చికిత్స నిమిత్తం బోధన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతుడి భార్య అర్చన శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ఫిట్స్ రావడంతో కాలువలో పడి ఒకరు.. నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ గ్రామంలో ఓ వ్యక్తికి ఫిట్స్ రావడంతో ప్రమాదవశాత్తు పంట కాలువలో పడి మృతిచెందినట్లు రూరల్ ఎస్హెచ్వో ఆరీఫ్ తెలిపారు. వివరాలు ఇలా.. శ్రీనగర్ గ్రామానికి చెందిన చండీ కృష్ణ(37) వ్యవసాయ కూలీగా జీవనం సాగించేవాడు. రోజువారి మాదిరిగా శుక్రవారం అతడు స్థానిక పంటపొలాలకు వెళ్లగా, ఫిట్స్ రావడంతో పక్కనే ఉన్న కాలువలో పడి, మృతిచెందాడు. అతడిని స్థానికులు గమనించి పోలీసులకు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నెలాఖరు వరకు ఓటీఎస్కు గడువు
సుభాష్నగర్: నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులోని ఖాతాదారులైన రైతుల సౌకర్యార్థం ఏకకాల పరిష్కార పథకం (ఓటీఎస్)కు ఈ నెల 31 వరకు గడువు ఉన్నట్లు ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి తెలిపారు. నగరంలోని ఎన్డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయ న మీడియాతో మాట్లాడారు. రెండున్నరేళ్లుగా దీర్ఘ కాలిక రుణాల చెల్లింపు, కాలపరిమితి ముగిసిన రుణాల చెల్లింపు కోసం డీసీసీబీలో ఓటీఎస్ను తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఈ స్కీమ్లో భాగంగా వాయిదా మీరిన వడ్డీలో 40 శాతం రాయితీ, అపరా ధ వడ్డీలో వందశాతం రాయితీ వెసులుబాటు క ల్పించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సొసైటీల ద్వారా బట్వాడా చేసిన దీర్ఘకాలిక రుణాలు, డీసీసీ బీ ద్వారా బట్వాడా చేసిన నాన్ ఫామ్ సెక్టార్, స్వ యం సహాయక సంఘాలు, జాయింట్ లయబిలిటీ గ్రూప్లు, దీర్ఘకాలిక మార్ట్గేజ్ రుణాలకు వర్తింపజేస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు సొసైటీ, ఎన్డీసీసీబీ శాఖలో సంప్రదించాలన్నారు. ఓటీఎస్ను నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని డీసీసీబీ ఖాతాదారులు, సొసైటీ సభ్యులు సద్వినియోగం చేసుకొని రుణ విముక్తులు కావాలని ఆయన కోరారు. యూరియా కొరత లేదు జిల్లాలో యూరియా కొరత ఎక్కడా లేదని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చైర్మన్ రమేశ్రెడ్డి పేర్కొన్నారు. యూరియాను పొదుపుగా వాడుకోవాలని, సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సమావేశంలో బ్యాంకు వైస్ చైర్మన్ నల్ల చంద్రశేఖర్రెడ్డి, డైరెక్టర్ లింగయ్య పాల్గొన్నారు. రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి యూరియాను పొదుపుగా వాడుకోవాలి ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి -
అధికారుల నిర్బంధం
సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు నీటిపారుదల శాఖ అధికారులను నిర్బంధించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలై వారం రోజులైనా అధికారుల పర్యవేక్షణ లోపంతో పొలాలకు నీళ్లందడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న నీటిపారుదల శాఖ డీఈ భూమన్న, ఏఈ సత్యనారాయణ శుక్రవారం సాలూర మండలంలోని సాలూర క్యాంప్ గ్రామ పంచాయతీ ఆఫీసు వద్ద రైతులతో సమావేశమై నీటి సమస్యపై చర్చించారు. అధికారుల రాకను తెలుసుకొని సాలూర క్యాంప్, జాడిజమాల్పూర్, ఫత్తేపూర్ గ్రామాల రైతులు తరలివచ్చారు. అధికారులతో వాగ్వాదానికి దిగిన రైతులు పంచాయతీ ఆఫీసులో వారిని నిర్బంధించారు. సమాచారం తెలుసుకున్న ఏఈ శృతి (కాలువ పర్యవేక్షకురాలు), బోధన్ రూరల్ సీఐ విజయబాబు, ఎస్సై మచ్చేందర్ సాలూర క్యాంప్నకు చేరుకొని రైతులతో మాట్లాడారు. అనంతరం అధికారులను విడిపించి, రైతులతో కలిసి కాలువలో నీటి పారకం పరిస్థితిని పరిశీలించారు. -
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
మాక్లూర్: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హను మంతు సూచించారు. మాక్లూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న చికిత్సలు, నిర్వహిస్తున్న రక్త పరీక్షలపై వైద్యుడు సయ్యద్ అజ్మత్ హైమద్ను అడిగి తెలుసుకున్నారు. రోజువారీ రిజిస్టర్ తనిఖీ చేసి, పీహెచ్సీలో ఉన్న ఔషధాలపై ఆరా తీశారు. ఒక్కోరోజు ఎంతమందికి బీపీ, డయాబెటిక్ పరీక్షలు చేస్తున్నారని వైద్యుడిని అడిగారు. వ్యాక్సినేషన్ గదిని సందర్శించి వ్యాక్సిన్లు, స్టోర్ గదిలోని మందుల గడువు తేదీలను పరిశీలించారు. ఆస్పత్రి పరిసరాలను రెండు రోజులకోసారి శుభ్రం చేయించాలని ఎంపీవో శ్రీనివాస్ను ఆదేశించారు. అనంతరం ఎలియానాయక్ తండాలో ఉన్న బాలికల మినీ గురుకుల పాఠశాలను సందర్శించారు. వంట గది, భోజనశాలను పరిశీలించి సరుకుల నాణ్యత తెలుసుకున్నారు. నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీచేశారు. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కలెక్టర్ వెంట డిప్యూటీ తహసీల్దార్ పద్మలత, గురుకుల పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ విద్యారాణి ఉన్నారు. కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు మాక్లూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ బాలికల మినీ గురుకులాన్ని సందర్శించిన కలెక్టర్ -
నిజామాబాద్
వాతావరణం ఉదయం ఈదురు గాలులు వీస్తాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఉక్కపోతగా ఉంటుంది. అజ్ఞాతంలో ఐదుగురు!ఉమ్మడి జిల్లాలో మావోయిస్టు పార్టీకి ఉనికి లేకపోయినా పలువురు ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.శనివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2025– 8లో uసాలూర మండలం జాడిజమాల్పూర్ గ్రామ శివారులో నీళ్లు అందక నెర్రెలుబారిన పొలంబోధన్: నిజాంసాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. బోధన్ ఉమ్మడి మండలంలోని డీ–28/14 కాలువ కింద చేతికొచ్చిన పంటలకు నీటి గండం ఏర్పడింది. నీళ్లందక పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీ–28 కాలువ వర్ని మండలంలోని తగెలేపల్లి గ్రామ శివారులో ప్రారంభమవుతుంది. బోధన్ మండలంలోని పెంటాకుర్దు క్యాంప్ మీదుగా సా లూర మండలంలోని సాలంపాడ్ క్యాంప్, సాలంపాడ్, కుమ్మన్పల్లి, కొప్పర్తి క్యాంప్, సాలూర క్యాంప్, ఫత్తేపూర్, జాడిజమాల్పూర్ వరకు కాలువ విస్తరించి ఉంది. కాలువ కింద 11 వేల ఎకరాల ఆయకట్టులో వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలను రైతులు సాగు చేశారు. ప్రస్తుతం వరి, మొ క్కజొన్న పంటలు చేతికొస్తున్నాయి. ప్రాజెక్టు నుంచి ఫిబ్రవరి 21న నాలుగో విడత నీటి విడుదల ప్రారంభం కాగా, ఇప్పటి వరకు కాలువకు నీళ్లు రావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. మరో రెండు రోజుల్లో నీటి సరఫరా గడువు ముగియనుండడంతో ఇంకా పది రోజులపాటు నీటి విడుదల పొడిగించాలని కోరుతున్నారు. కాలువకు 450 క్యూసెక్కుల పరిమాణానికి తగ్గకుండా నీటిని సరఫరా చేస్తేనే పంటలు బతుకుతాయని చెబుతున్నారు. కాగా, రెండ్రోజులుగా 435 క్యూసెక్కుల నీళ్లు వదిలామని అధికారులు చెబుతుండగా, 250 నుంచి 350 క్యూసెక్కులకు మించి కాలువకు నీళ్లు సరఫరా కావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. దీంతో సాలూర క్యాంప్, ఫత్తేపూర్, జాడిజమాల్పూర్ గ్రామాలకు చెందిన వేలాది ఎకరాల పంటలు ఎండిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాడిజమాల్ గ్రామ శివారులోని సుమారు 500 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలకు నీరందక నేల నెర్రెలు బారడం గమనార్హం. సాలూర క్యాంప్ జీపీలో అధికారులను నిర్బంధించిన గదికి తాళం వేస్తున్న రైతులుసాలూర క్యాంప్ జీపీ ఆవరణలో రైతులతో చర్చిస్తున్న ఇరిగేషన్ శాఖ అధికారులున్యూస్రీల్ ఎండుతున్న పొలాలు సాలూర క్యాంప్, ఫత్తేపూర్, జాడిజమాల్పూర్ గ్రామాల రైతుల ఆందోళన వారం క్రితమే నిజాంసాగర్ నుంచి నీటి విడుదల కాలువల్లో కనిపించని నీటి తడులు -
వేసవిలోనూ నిరంతర విద్యుత్
సుభాష్నగర్: వేసవిలోనూ నాణ్యమైన విద్యుత్ను నిరంతరాయంగా అందించడమే లక్ష్యంగా ఎన్పీడీసీఎల్ పని చేస్తుందని ఎస్ఈ రాపల్లి రవీందర్ అన్నారు. నగరంలోని డీ–2 సెక్షన్ తిలక్గార్డెన్ సబ్స్టేషన్లోగల పవర్ ట్రాన్స్ఫార్మర్ను 8.0 ఎంవీఏ నుంచి 12.5 ఎంవీఏగా మార్చి అమర్చారు. ఈసందర్భంగా శుక్రవారం నూతన ఎంవీఏను ఆయన ప్రారంభించి మాట్లాడారు. తిలక్గార్డెన్ సబ్స్టేషన్లో రెండు 8.0 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయని, అందులో ఒక 8.0 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను రూ.1.50 కోట్లతో 12.5 ఎంవీఏగా మార్చామని తెలిపారు. పట్టణ ప్రజలకు సబ్స్టేషన్లో అంతరాయం ఏర్పడితే మరో సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అందించడానికి 12.5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ అమర్చామన్నారు. డీఈ ఎం శ్రీనివాస్రావు, డీఈఎంఆర్టీ వెంకటరమణ, టౌన్–2 ఏడీఈ ప్రసాద్రెడ్డి, ఏడీఈలు చంద్రశేఖర్, వీరేశం, నటరాజ్, తోట రాజశేఖర్, ఏఈలు జాకీర్అలీ, రాజేందర్రెడ్డి, సాయిలు, దుర్గా ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన నిజామాబాద్అర్బన్: నగరంలోని కోటగల్లి ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం శాస్త్రము–ఆరోగ్యము అనే అంశంపై జిల్లా వైద్య శాఖ హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేశ్వర్లు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోగాలు దరి చేరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కార్యక్రమంలో హెచ్ఎం రామచందర్ గైక్వాడ్, ఉపాధ్యాయులు దయానంద్, సౌందర్య, మమత, విద్యార్థులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు
● ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలు ● పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి ● 57 సెంటర్లు, 36,222 మంది విద్యార్థులు ● 5 నుంచి ఇంటర్ పరీక్షలు షురూ ● ‘సాక్షి’తో ఇంటర్ విద్యాధికారి రవికుమార్ ప్రశ్న: పరీక్షల ఏర్పాట్లు ఎంత వరకు వచ్చాయి? జవాబు: పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం సిబ్బంది, అధికారులకు శిక్షణ ఇస్తున్నాం. ఈ ఏడాది జిల్లాలో 57 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాం. అన్ని కేంద్రాల్లో ఏర్పాట్లను పర్యవేక్షించాలని సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేశాం. ● పరీక్షలు రాసే విద్యార్థులెందరు? ● ఈ ఏడాది జిల్లాలో 57 కేంద్రాల్లో 36,222 మంది పరీక్షలు రాయనున్నారు. మొదటి సంవత్సరం జనరల్ 15,053 మంది, ఒకేషనల్ 2,736 మంది, మొత్తం 17,789 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. రెండో సంవత్సరంలో జనరల్ రెగ్యులర్ 13,944 మంది, ప్రైవేట్ 2,128 మంది, ఒకేషనల్ 2,042 మంది, ప్రైవేట్గా 319 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ● ఎంతమంది సిబ్బంది, అధికారులను నియమించారు ● 57 పరీక్ష కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లను నియమించాం. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 8 మంది సిట్టింగ్ స్క్వాడ్లు, ఒక హైపవర్ కమిటీని ఏర్పాటు చేశాం. వీటితోపాటు జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ ముగ్గురు సభ్యులను ఏర్పాటు చేసింది. ● ‘ప్రైవేట్’కు అనుకూలంగా సిబ్బందిని నియమించినట్లు ఆరోపణలు ఉన్నాయి? ● పరీక్ష కేంద్రాలు, అధికారులు, సిబ్బందిని రాష్ట్ర ఉన్నతాధికారులు మాత్రమే నియమిస్తారు. మా చేతుల్లో ఏమీ లేదు. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లోని విద్యార్థులకు సొంత కళాశాలలో కాకుండా ఇతర సెంటర్లను కేటాయిస్తాం. ఇన్విజిలేటర్లు, సబ్జెక్టు లెక్చరర్లు కూడా వేర్వేరుగా ఉంటారు. అవసరమైన మేరకు మాత్రమే ప్రైవేట్ టీచర్లను కేటాయిస్తాం. ఎ క్కడా ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వలేదు. ● సెల్ఫోన్ల అడ్డుకట్టకు తీసుకుంటున్న చర్యలు ఏమిటీ? ● పరీక్షల నిర్వహణలో సెల్ఫోన్ల వ్యవహారం తర చూ వివాదాలకు దారితీస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఇంటర్ పరీక్షలను మరింత లోతుగా పరిశీలన చేసి సెల్ఫోన్ల నిషేధం పక్కాగా అమలు చే స్తాం. సెంటర్లో ఎవరికీ సెల్ఫోన్ వినియోగించే అ నుమతి లేదు. దీనిపై పకడ్బందీగా వ్యవహరిస్తాం. ● మౌలిక సదుపాయాలు కల్పించారా? ● 16 ప్రభుత్వ కళాశాలలు, 2 ఎయిడెడ్, 7 మాడల్ స్కూళ్లు, 26 ప్రైవేట్ కళాశాలలు, 2 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, 2 తెలంగాణ మైనారిటీ జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బీసీ వెల్ఫేర్ కళాశాలలో సెంటర్లు ఏర్పాటు చేశాం. కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యం, బెంచీలు తదితర వసతులు సదుపాయాలు కల్పించాం.మాస్కాపీయింగ్ నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? పరీక్షల్లో మాస్కాపీయింగ్ జరుగకుండా పకడ్బందీగా వ్యవహరిస్తున్నాం. ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. ప్రశ్నపత్రాల సరఫరా కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే కొనసాగుతుంది. ప్రత్యేక బృందాలు ఎప్పటికప్పుడు పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తాయి. సెంటర్లోకి వచ్చే ముందే విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తాం. ‘ఇంటర్ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. ప్రతి సెంటర్లో సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తాం. తప్పిదాలకు ఆస్కారం లేకుండా.. సెంటర్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం.’ అని చెబుతున్నారు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్. ఈ నెల 5 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్ వార్షిక పరీక్షలపై శుక్రవారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించారు. – నిజామాబాద్అర్బన్ -
కదిలిన అధికారులు
సాలూర క్యాంప్, జాడిజమాల్పూర్, ఫత్తేపూర్ గ్రామాల రైతుల ఆందోళనకు నీటిపారుదల శాఖ, జిల్లా అధికార యంత్రాంగం కదలింది. శుక్రవా రం సాయంత్రం నీటిపారుదల శాఖ నిజామాబా ద్ యూనిట్ సీఈ మధుసూదన్రావు, ఎస్ఈ బద్రీనారాయణ, డివిజన్ డీఈ భూమన్న, ఏఈలు సత్యనారాయణ, శృతి, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయబాబు రైతులతో కలిసి కాలువలో నీటిపారకం పరిస్థితిని పరిశీలించారు. వర్ని మండలంలోని తగిలేపల్లి గ్రామ శి వారులోని డీ–28 మెయిన్ కెనాల్, బోధన్, సా లూర మండలంలోని కాలువ వెంట పర్యటించా రు. కాలువపై అనధికారికంగా కొందరు రైతులు ఏర్పాటు చేసుకున్న కరెంట్ మోటార్ల తొలగింపునకు చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. రాత్రి బాన్సువాడ డివిజన్ సీఈ శ్రీనివాస్, ఈఈ రాజశేఖర్ క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్న ట్లు అధికారులు తెలిపారు. అధికారుల వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగేశ్వర్రావు, మందర్న రవి, సొసైటీ చైర్మన్ అల్లె జనార్దన్, సా లూర క్యాంప్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్రావు ఉ న్నారు. మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాలతో అధికారులు దిద్దుబాటు చర్యలు ఉపక్రమించినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. డీ–28 కాలువలో నీటిపారకం పరిశీలన -
ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు
నిజామాబాద్అర్బన్: ఇంటర్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని, ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశామని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రవికుమార్ అన్నారు. నగరంలోని ఖిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఆయన ఇంటర్ పరీక్షల నిర్వహణపై సూపరింటెండెంట్లు, డిపార్టమెంటల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ఖచ్చితంగా నియమ నిబంధనలను పాటిస్తూ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు సిద్ధం కావాలన్నారు. జిల్లాలో 57 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పోలీస్ స్టేషన్ నుంచి ప్రశ్నాపత్రాల బండిల్లను పోలీసు బందోబస్తుతో తీసుకువెళ్లిన తర్వాత పరీక్ష కేంద్రంలో ఖచ్చితంగా సీసీ కెమెరాల ముందు మాత్రమే విప్పాల్సి ఉంటుందన్నారు. పరీక్షలు పూర్తయిన వెంటనే సమీపంలోని పోస్ట్ఆఫీస్లలో జవాబు పత్రాల బండల్లను నిక్షిప్తం చేయాలని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించిన సిబ్బంది, ఉద్యోగులపై ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఉద యం 8.15 నుంచి విద్యార్థులను అనుమతిస్తారని, 9గంటలకు గేట్ మూసివేస్తారని తెలిపారు. -
కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలి
నిజామాబాద్నాగారం: కేంద్ర ప్రభుత్వం వెంటనే కులగణన చేపట్టాలని బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాస రాజేశ్వర్ అ న్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో గోపిక, శ్రీనివాస్, రాజేంద్రసాగర్, అమరిక, నాగమణి, భారతి, దేవరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ సిరికొండ: మండలంలోని తూంపల్లిలో ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ సభ్యులు పరీక్ష ప్యాడ్లను అందజేశారు. పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో ప్యాడ్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈవో రాములు, ఫౌండేషన్ చైర్మన్ అయినాల శ్రీకాంత్, సభ్యులు యశ్వంత్, ప్రశాంత్, బాలరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వైభవంగా ఆలయ వార్షికోత్సవం సిరికొండ: మండలంలోని తాళ్లరామడుగులో ఉన్న రామాలయంలో తొమ్మిదో వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో పురోహితులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అన్నదానం చేశారు. జాదూ రంగనాథ్కు అవార్డు నిజామాబాద్ రూరల్: జిల్లా సీనియర్ మెజీషియన్ జాదూ యుగందర్ రంగనాథ్కు సర్కార్ మెమోరియల్ అవార్డు లభించింది. ప్రఖ్యాత ఇంద్రజాలికుడు పి.సి. సర్కార్ జయంతిని పురస్కరించుకొని గురువారం రాత్రి హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ సహకారంతో ఆర్కేస్ వండర్ వరల్డ్, తెలంగాణ మ్యాజిక్ ఆకాడమి సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ ఇంద్రజాలికుల వేడుకల్లో హైకోర్టు న్యాయమూర్తి సూరెపల్లి నంద, మ్యాజిక్ స్టార్ బోసుల చేతులమీదుగా రంగనాథ్ అవార్డును అందుకున్నారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు. ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని రంగనాథ్ అన్నారు. కంట్రోలర్, ప్రిన్సిపాల్కు సన్మానం తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె సంపత్కుమార్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్ను శుక్రవారం వర్సిటీ నాన్ టీచింగ్ సిబ్బంది సన్మానించారు. ఇరువురిని వేర్వేరుగా శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయాగౌడ్ మాట్లాడుతూ.. వర్సిటీ అభివృద్ధిలో నాన్ టీచింగ్ సిబ్బంది, బోధనా సిబ్బందితో కలిసి సమన్వయంతో పని చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అకౌంటెంట్ భాస్కర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు బాగా చదవాలి నిజామాబాద్అర్బన్: విద్యార్థులు బాగా చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని నిశిత కళా శాల చైర్మన్ నిఖిల్ అన్నారు. నగరంలోని నిశిత డిగ్రీ కళాశాలలో డాటా సైన్స్ చదువుతున్న ప్ర థమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యా ర్థులు గెట్ టు గెదర్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. విద్యార్థులు ఆట, పాటలతో అందరిని అలరించారు. కార్యక్రమంలో వినయ్కుమార్, రాజు, డాక్టర్ ఓంషేక్, స్వప్న, మధుసూదనచారి, అధ్యాపకులు పాల్గొన్నారు. పరీక్ష అట్టల పంపిణీ డిచ్పల్లి: మండలంలోని ధర్మారం(బి)లో ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాల పదోతరగతి విద్యార్థులకు శుక్రవారం టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ ఆ ధ్వర్యంలో శుక్రవారం పెన్నులు, పరీక్ష అట్టలను పంపిణీ చేశారు. టాటా ఏఐఏ డైరెక్టర్ భరణి, సాయినాథ్, శ్యామ్ ప్రసాద్, హబీబ్, ప్రసాద్రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నేడు బాబ్లీ గేట్ల ఎత్తివేత
● దిగువకు 0.6 టీఎంసీల నీటి విడుదల బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం శనివారం ఎత్తనున్నారు. సుప్రీం ఆదేశాల మేరకు బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను ప్రతి సంవత్సరం జూలై 1న ఎత్తి అక్టోబర్ 28న మూసివేయాలి. అనంతరం ఎగువ ప్రాంతాల్లోని అక్కడక్కడా గుంతల్లో నిలిచిన నీటికి బదులుగా 0.6 టీఎంసీల నీటిని మార్చి 1న బాబ్లీ నుంచి ఎస్సారెస్పీకి వదలాలని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొంది. ఆ తీర్పు ప్రకారం బాబ్లీ గేట్లు తెరిచి 0.6 టీఎంసీల నీటిని దిగువకు వదులుతారు. దీంతో ఎస్సారెస్పీ ఎగువ ప్రాంతంలో గోదావరికి జలకళ రానుండగా, ప్రాజెక్టులోకి అంతగా నీరు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్ట్లో కొంతమేర నీరుంది. ఏటా మార్చి 1న గేట్లు ఎత్తితే 0.2 టీఎంసీల నీరు మాత్రమే వచ్చి చేరుతుంది. కాగా, 0.6 టీఎంసీల కోటా పూర్తికాగానే గేట్లను మూసివేయనున్నారు. నీటి విడుదల పర్యవేక్షణలో ఎస్సారెస్పీ తరఫున ఈఈ చక్రపాణి పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు ఖలీల్వాడి: ఈ నెల 5 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్ఎస్ 163 సెక్షన్ అమలులో ఉంటుందని ఇన్చార్జి సీపీ సింధు శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష సెంటర్ నుంచి 100 మీటర్ల మేర ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సెక్షన్ అమలులో ఉంటుందన్నా రు. పరీక్ష కేంద్రాల వద్ద షాపులు మూసి వేయాలని పేర్కొన్నారు. జాతీయ పసుపు బోర్డు కార్యదర్శిగా భవానిశ్రీ సుభాష్నగర్: జాతీయ పసుపు బో ర్డు కార్యదర్శిగా ఎన్ భవానిశ్రీని నియమిస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ డిప్యూటీ డైరెక్టర్ అరుణ్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. భవానిశ్రీ 2017వ బ్యాచ్ నాగాలాండ్ రాష్ట్ర కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారిణి. భవానిశ్రీ , సుగంధ ద్రవ్యాల బోర్డు డైరెక్టర్ (పరిశోధన) డాక్టర్ ఎబీ రెమాశ్రీ కలిసి సుగంధ ద్రవ్యాల బోర్డు, జాతీయ పసుపు బోర్డు మధ్య కార్యకలాపాలను సమన్వయం చేస్తారు. నియామకం తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కళాశాల అకడమిక్ కోఆర్డినేటర్గా సువర్చల నియమితులయ్యారు. వీసీ యాదగిరిరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ యాదగిరి శుక్రవారం నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు సువర్చలకు ఎడ్యుకేషన్ కాలేజ్ ప్రిన్సిపల్ సాయిలు ఉత్తర్వులను అందజేశారు. -
ప్రమాదకరంగా మూల మలుపులు
ధర్పల్లి: నిత్యం వాహనదారుల రాకపోకలతో రద్దీగా ఉండే రోడ్లు మూల మలుపులతో ప్రమాదంగా మారాయి. గత ప్రభుత్వం రోడ్డుకు ఇరువైపులా హరితహారంలో భాగంగా పెట్టిన చెట్లు రోడ్డు సగభాగం వరకు విస్తరించాయి. దీంతో వాహనదారులు మూల మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. అంతేకాకుండా మూలమలుపుల వద్ద సూచిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి మండలంలోని హోన్నాజీపేట్, వాడి గ్రామానికి వెళ్లే మార్గంలో పలుచోట్ల మూలమలుపులు ఉన్నాయి. చెట్లు, ముళ్ల పొదలు ఏపుగా పెరిగిన చోట మూల మలుపు కనిపించని పరిస్థితి నెలకొంది. సిరికొండ మండలం గడ్కోల్, తూంపల్లి, కొండాపూర్, పాకాల, గడ్డమీద తండా, ధర్పల్లి మండలం కర్నల్ తండా, నడిమి తండా, కొట్టల్పల్లి, హోన్నాజీపేట్ పలు గ్రామాల నుంచి వందలాది వాహనదారులు నిత్యం ధర్పల్లి మండల కేంద్రం పాటు జిల్లా కేంద్రానికి రాకపోకలు ఈ మార్గం గుండానే కొనసాగిస్తారు. గడ్కోల్ నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లే మార్గంలో హోన్నాజీపేట్ పెద్దమ్మ ఆలయం, వాడి గ్రామం వద్ద మూడు ప్రమాదకర మూలమలుపులు ఉన్నాయి. ఇక్కడ మూలమలుపుల వద్ద సూచిక బోర్డులు లేకపోవడంతో పాటు రోడ్డుకు ఇరువైపులా చెట్లు భారీగా పెరిగాయి. దీంతో వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలకు గురై ఆస్పత్రి పాలవుతున్నారు. ఈ మూల మలుపుల వద్ద గతంలో వాహనాలు ఢీకొని గాయపడ్డ పలువురు మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. మూల మలుపుల వద్ద వాహనదారులకు రోడ్డు స్పష్టంగా కనిపించేలా చెట్ల కొమ్మలు, ముళ్ళ పొదలు తొలగించి, అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది. అలాగే వేగ నియంత్రణకు రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. ఇకనైనా అధికారులు స్పందించి ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్లు సూచిక బోర్డులు కరువు పట్టించుకోని అధికారులు ఇబ్బందుల్లో వాహనదారులు చెట్ల కొమ్మలు తొలగించాలి మూల మలుపుల వద్ద వాహనదారులు ప్రమాదాలకు గురై ఇప్పటికే పలువురు మంచానికే పరిమితమయ్యారు. మూల మలుపుల వద్ద ఉన్న చెట్ల కొమ్మలు, పొదలను వెంటనే తొలగించారు. అధికారులు చొరవ తీసుకొని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి. – తిరుపతి, వాహనదారుడు, కార్నల్ తండా -
నాసిరకం సరుకులు వాడొద్దు
మాక్లూర్: విద్యార్థులకు అందించే భోజనంలో నాసిరకం సరుకులు వాడొద్దని సంయుక్త కలెక్టర్ అంకిత్కుమార్ సూచించారు. మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. కొన్ని గదులు అపరిశుభ్రంగా ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు వండిపెడుతున్న సరుకులు నాణ్యంగా ఉండాలన్నారు. విద్యార్థులు గత సంవత్సరం కంటే ఈసారి మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. ఎంపీవో శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక నిజామాబాద్ రూరల్: నగరంలోని కలెక్టర్రేట్లోగల డీఆర్డీఏ కార్యాలయంలో శుక్రవారం ఎంపీడీవోల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎ న్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా గంగు సంతో ష్కుమార్, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసరావు, కోశాధికారిగా శ్రీరామ్ నారాయణ, ఉపాధ్యక్షులు–1గా నీలావతి, ఉపాధ్యక్షులు–2గా రాములు నాయక్, జాయింట్ సెక్రెటరీగా వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా నాగ్నాథ్, పబ్లిసిటీ సెక్రెటరీగా సతీష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా బాలకిషన్, శంకర్, తిరుమల, రాజా శ్రీనివాస్ ఏ కగ్రీవంగా ఎన్నికయ్యారు. జెడ్పీ సీఈవో సాయా గౌడ్, అధికారులు పాల్గొన్నారు. ఉద్యోగులకు పదవీ విరమణ తప్పదుఖలీల్వాడి: ఉద్యోగులకు పదవీ విరమణ తప్ప దని డీసీపీ(అడ్మిన్) బస్వారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సీపీ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ శాఖలో పదవీ విరమణ చేసిన నిజామాబాద్ రూరల్ ఏఎస్సై యేముల వెంకయ్య, రుద్రూర్ పీఎస్ హెడ్కానిస్టేబుల్ కోల విఠల్ను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో ఎంతో పనిఒత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్కు లేకుండా పదవీ విరమణ చేయడం ఎంతో గొ ప్ప విషయమన్నారు. ఆఫీస్ సూపరింటెండెంట్ శంకర్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ శ్రీనివాస్రా వు, సిబ్బంది సతీష్, శ్రీనివాస్, తిరుపతి, పా షా తదితరులు ఉన్నారు. రసవత్తరంగా కుస్తీ పోటీలు లింగంపేట(ఎల్లారెడ్డి): కొర్పోల్ గ్రామంలోని హరిహర దేవాలయం వద్ద శుక్రవారం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించా రు. ఈ సందర్భంగా టెంకాయ కుస్తీ నుంచి మూడు తులాల వెండి కడెం వరకు కుస్తీ పోటీ లు పెట్టారు. పోటీల్లో గెలుపొందిన కుస్తీ వీరు లకు నగదు బహుమతులు అందజేశారు. ఈ పోటీలు ఆద్యంతం రసవత్తరంగా సాగాయి. గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భా స్కర్, కాళీదాస్, ఏగొండ, రవి, లక్ష్మణ్, రాము లు, సత్యం తదితరులు పాల్గొన్నారు. -
అజ్ఞాతంలో ఐదుగురు!
● సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన లింబయ్యగారి వెంకట్రెడ్డి 1999 నుంచి అజ్ఞాతంలో ఉంటున్నాడు. ఆయన ఎక్కడ పనిచేస్తున్నాడన్నది పోలీసులకు తెలియదు. కాగా అతడిపై లక్ష రూపాయల రివార్డు ఉంది. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/కామారెడ్డి క్రైం : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు సీపీఐ(ఎంఎల్) పీపుల్స్వార్ నక్సల్స్ కార్యకలాపాలు జోరుగా సాగేవి. కొన్ని ప్రాంతాల్లో సమాంతర పాలన కొనసాగింది. 1990 నుంచి 2000 మధ్య కాలంలో జిల్లాలో ఆ పార్టీ కార్యకలాపాలు జోరుగా సాగాయి. నక్సలైట్ ఉద్యమం సీరియస్గా కొనసాగిన కాలంలో ఉమ్మడి జిల్లాలో చాలా మంది అజ్ఞాతంలో పనిచేశారు. కా మారెడ్డి ఏరియా దళం, ఎల్లారెడ్డి ఏరియా దళం, సి ర్నాపల్లి ఏరియా దళం, బాన్సువాడ ఏరియా దళం, సిరిసిల్ల ఏరియా దళాలు పనిచేసేవి. అయితే అప్ప టి ప్రభుత్వాలు విధించిన తీవ్ర నిర్భందంతో చాలా మంది లొంగిపోయారు. అలాగే అరెస్టులు, ఎన్కౌంటర్లతో జిల్లాలో ఆ పార్టీ తీవ్రంగా దెబ్బతింది. ఉ మ్మడి జిల్లాకు చెందిన అజ్ఞాత నక్సల్స్తో పాటు మి లిటెంట్లు, సానుభూతిపరులు 125 మంది వరకు ఎ న్కౌంటర్లలో చనిపోయారు. వందలాది మంది అరె స్టయ్యారు. అలాగే చాలా మంది లొంగిపోయారు. మావోయిస్ట్ పార్టీగా అవతరించాక.. 2004లో సీపీఐ(ఎంఎల్), పీపుల్స్వార్ తదితర పార్టీలు విలీనమై మావోయిస్టు పార్టీగా అవతరించింది. కాగా మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించిన సమయంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన గంగుల వెంకటస్వామి అలియాస్ రమేశ్ నాయకత్వంలో పార్టీ కార్యకలాపాలు జోరుగానే సాగాయి. ప్రభుత్వంతో చర్చల ప్రక్రియ కొనసాగుతున్నపుడు ఊరూరుకు సాయుధ నక్సల్స్ వెళ్లి సభలు, సమావేశాలు నిర్వహించారు. అదే సమయంలో మానాల వద్ద జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు చనిపోయారు. దీంతో జిల్లాలో మావోయిస్టు పార్టీ గట్టి దెబ్బ తగిలింది. అనంతర పరిణామాల నేపథ్యంలో జిల్లాకు చెందిన వారిని పార్టీ ఇతర రాష్ట్రాలకు పంపించింది. దీంతో జిల్లాలో ఆ పార్టీ ఉనికి లేకుండాపోయింది. కామారెడ్డి జిల్లాలో మావోయిస్టు పార్టీ ఉనికి లేకపోయినా.. ఈ ప్రాంతానికి చెందిన పలువురు మాత్రం ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇస్రోజీవాడికి చెందిన లోకేటి చందర్ అలియాస్ స్వామితోపాటు అతడి కుమారుడు, కూతురు కూడా దండకారణ్యంలోనే ఉంటూ వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఆరెపల్లికి చెందిన ఎర్రగొల్ల రవి అలియాస్ దినేశ్తోపాటు అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన లింబయ్యగారి వెంకట్రెడ్డి కూడా అజ్ఞాతంలో ఉన్నారు. వీరంతా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసులు సూచిస్తున్నారు. దండకారణ్యంలో పనిచేస్తున్న జిల్లా మావోయిస్టులు స్వామితో పాటు ఆయన కొడుకు, కూతురుదీ అడవిబాటే విప్లవోద్యమంలో ఎర్రగొల్ల రవి, లింబయ్యగారి వెంకట్రెడ్డి లొంగిపోవాలని సూచిస్తున్న పోలీసులు -
జనజీవన స్రవంతిలో కలవాలి..
మావోయిస్టు నక్సలైట్ ఉద్యమంలో జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులు ఉన్నట్లు ఎస్పీ సింధు శర్మ వెల్లడించారు. కొత్తగూడెం భద్రాద్రి, ఛత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నక్సలైట్లు శుక్రవారం ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతలేమితో, ఇతర అనేక కారణాలతో బలహీనపడిందని పేర్కొన్నారు. ఛత్తీస్గడ్లో చాలా మంది మావోయిస్టులు, మిలీషియా సభ్యులు, సానుభూతి పరులు పార్టీని వదిలేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని లొంగిపోయిన మావోయిస్ట్ల ద్వారా తెలిసిందన్నారు. జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులు అజ్ఞాతంలో ఉన్నారన్నారు. వారు కూడా లొంగిపోతే పునరావాసం కల్పిస్తామని పేర్కొన్నారు. వారు స్వతంత్రంగా జీవించడానికి అన్ని రకాలుగా సాయం చేస్తామన్నారు. -
స్వచ్ఛ సర్వేక్షణ్పై అవగాహన
నిజామాబాద్ సిటీ: నగరంలోని కంఠేశ్వర్లోగల మెప్మా కార్యాలయంలో ఆర్పీలకు, డ్వాక్రా సంఘాల సభ్యులకు శుక్రవారం స్వచ్ఛ సర్వేక్షణ్పై మున్సిపల్ ప్రాజెక్టు అధికారి చిదుర రమేష్ అవగాహన కల్పించారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా సిటీజన్ ఫీడ్బ్యాక్ నమోదుతోపాటు పలు అంశాలపై అవగాహన కల్పించారు. మొబైల్ యాప్లో ప్రశ్నావళిని పూరించే విధానం గురించి వివరించారు. నగరంలోని ప్రతి పౌరుడు ఈ ప్రశ్నావళిని పూర్తిచేయాలని, దీంతో నగరానికి ర్యాంక్ ఇవ్వనున్నట్లు తెలిపారు. నగరవాసులు తమకు అందుతున్న సేవలను యాప్లో ఫీడ్బ్యాక్ ఇవ్వాలని సూచించారు. -
నగరంలో ఒకరి ఆత్మహత్య
ఖలీల్వాడి: నగరంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. వివరాలు ఇలా.. నగరంలోని పూసలగల్లీకి చెందిన బద్దూరి లక్ష్మణ్(41) గతేడాది కాలంగా కాళ్లకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. ఎంతకీ వ్యాధి నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెందాడు. ఈక్రమంలో శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళ అదృశ్యం మాక్లూర్: మండలంలోని చిక్లి గ్రామానికి చెందిన వివాహిత కారం సుజాత అదృశ్యమైనట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. గత నెల 15న భర్త కారం నవీన్తో ఆమె గొడవ పడి ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా వెళ్లిపోయింది. ఇప్పటికీ ఆమె ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు ఎంతవెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె భర్త పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఇసుక లారీ పట్టివేత మాచారెడ్డి: పాల్వంచ మండలంలోని మర్రి వద్ద అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై అనిల్ మాట్లాడుతూ.. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని పట్టుకుని సీజ్ చేశామన్నారు. ఒక ఇసుక ట్రాక్టర్ను కూడా పట్టుకుని కేసు నమోదు చేశామన్నారు. ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవన్నారు. అడవుల్లో ఇసుక డంపులు రామారెడ్డి: మండలంలోని రెడ్డిపేట, మద్దికుంట, సింగరాయపల్లి అటవీ ప్రాంతంలో భారీగా ఇసుక డంపులు కలకలం సృష్టించాయి. ఇసుక డంపులకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. యథేచ్ఛగా అటవీ ప్రాంతంలో నుంచి అక్రమార్కులు ఇసుక తవ్వకాలు చేస్తున్నా ఫారెస్ట్, రెవెన్యూ, పోలీసు అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక తీసుకొచ్చేందుకు అటవీ ప్రాంతంలో ఉన్న చెట్లను నరికి వేసినా ఆటవీశాఖ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. వెంటనే ఇసుక అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్అర్బన్: కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. ఈనెల 5 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో శుక్రవారం సాయంత్రం సీఎస్ వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఈసందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఎలాంటి పొరపాట్లకు, కాపీయింగ్కు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో సాఫీగా పరీక్షలను నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ఫోన్లను అనుమతించకూడదని, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఇన్విజిలేటర్లతోపాటు కేంద్రాలను తనిఖీ చేసేందుకు వెళ్లే అధికారులు సైతం ఫోన్లు తీసుకెళ్లకూడదని ఆదేశించారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతనే లోనికి అనుమతించాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ, గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులకు కీలక సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాలకు ప్రశ్నాపత్రాలు తీసుకురావడం మొదలుకుని, పరీక్షలు ముగిసిన మీదట ఆన్సర్ షీట్లను నిర్ణీత పాయింట్కు తరలించేవరకు ఎంతో జాగ్రత్తగా ఉండాలన్నారు. పరీక్షలు ప్రారంభం కావడానికి ముందే కేంద్రాలను సందర్శించి తాగునీటి వసతి, సరిపడా ఫర్నీచర్, టాయిలెట్స్ వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా లేవా అన్నది పరిశీలించాలని తహసీల్దార్లకు సూచించారు. పరీక్ష సమయాలకు అనుగుణంగా రవాణా సదుపాయం అందుబాటులో ఉండేలా బస్సులు నడిపించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని ట్రాన్స్కో ఎస్ఈ రవీందర్కు సూచించారు. విద్యార్థుల సౌకర్యార్థం కంట్రోల్రూం ఏర్పాటు చేసి, వార్షిక పరీక్షలకు సంబంధించి వారికి ఏవైనా సమస్యలు, సందేహాలు ఉంటే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డీఐఈవోను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, అదనపు డీసీపీ బస్వారెడ్డి, డీఐఈవో రవికుమార్, నగర మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు సెల్ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించొద్దు వీసీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష పాల్గొన్న జిల్లా అధికార యంత్రాంగం -
కొందరికే ‘ఇందిరమ్మ’ సాయం
● మోర్తాడ్ మండలం గాండ్లపేట్కు చెందిన దైడి అమ్మాయి, ముద్దం ఎల్లమ్మలకు వ్యవసాయ భూమి లేదు. వీరిద్దరూ వ్యవసాయ పనులతోపాటు ఉపాధి హామీ పథకం కింద పనులు చేసి జీవిస్తున్నారు. భూమి లేని కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకం కింద ఏడాదికి రూ.12వేలను రెండు విడతల్లో అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈక్రమంలో అమ్మాయి, ఎల్లమ్మలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి లబ్ధిదారులుగా ఎంపికై నా తొలి విడతలో జమ కావాల్సిన రూ.6వేలు ఖాతాలోకి చేరలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో భరోసా సొమ్ముకు బ్రేక్ పడింది. అమ్మాయి, ఎల్లమ్మల మాదిరిగానే చాలా మంది వ్యవసాయ కూలీలు భరోసా డబ్బుల కోసం కొన్నిరోజులు ఓపిక పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.మోర్తాడ్(బాల్కొండ): గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకానికి శ్రీకారం చుట్టింది. మొదటిరోజు జిల్లావ్యాప్తంగా మండలానికో గ్రామాన్ని పథకానికి ఎంపిక చేసింది. అందులో భాగంగా జిల్లాలోని 31 గ్రామాల్లో 1,675 మంది లబ్ధిదారుల ఖాతాలకు రూ.కోటీ 50వేలను విడుదల చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి జిల్లా వ్యాప్తంగా మొత్తం 38,802 మందిని అర్హులుగా గుర్తించారు. వీరి కోసం ఒక్కో విడతలో రూ.23,28,12,000 మంజూరు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 1,675 మందికే ఆత్మీయ భరోసా సొమ్ము జమ చేయగా ఇంకా 37,127 మందికి రూ.22,27,62,000 నిధులను కేటాయించాల్సి ఉంది. కాగా, మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ అమలు లేని జిల్లాలకు ఆత్మీయ భరోసా నిధులను విడుదల చేయడం గమనార్హం.ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని తీసుకొచ్చింది. దీంతో నిధుల విడుదలకు కోడ్ అడ్డుకాకపోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ముగియగా, ఓట్ల లెక్కింపు సోమవారం జరగనుంది. దీంతో ఎన్నికల కోడ్ తొలగిపోయేందుకు మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది. కోడ్ ఎత్తివేసిన తర్వాతే ఆత్మీయ భరోసా సొమ్ము జమపై స్పష్టత రానుంది. ఈ విషయమై జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏం చెప్పలేమని వెల్లడించారు.కోడ్ ఎత్తివేసిన తర్వాతే స్పష్టత.. మొదట మండలంలో ఒకే గ్రామానికి ఆత్మీయ భరోసా నిధులు ఎన్నికల కోడ్తో మిగతా లబ్ధిదారులకు బ్రేక్ కోడ్ లేని జిల్లాల్లో అర్హుల ఖాతాల్లో జమ -
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
సుభాష్నగర్: నగరంలోని 33/11 కేవీ తిలక్గార్డెన్ సబ్స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని టౌన్–2 ఏడీఈ ఆర్ ప్రసాద్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సబ్స్టేషన్లోని 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ స్థానంలో కొత్తగా 12.5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. మార్చి 1న బైక్ సైక్లింగ్ జిల్లా జట్ల ఎంపికలు నిజామాబాద్నాగారం: నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్లో మార్చి 1న మౌంటెన్ బైక్ సైక్లింగ్ పోటీలకు జిల్లాస్థాయి జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు నిజామాబాద్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ కార్యదర్శి విజయ్కాంత్రావు ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 7 నుంచి 9వరకు హైదరాబాద్లో జరుగనున్న 9వ రాష్ట్రస్థాయి మౌంటెన్ బైక్సైక్లింగ్ పోటీలకు జిల్లా జట్లను ఎంపిక చేయడానికి ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలు అండర్ 14, 16 ,18 బాలురు, బాలికలు, పురుషులు, మహిళలు విభాగంలో చేపడతామన్నారు. ఆసక్తి ఉన్న వారు సంబంధిత ధ్రువపత్రాలతో ఉదయం ఏడు గంటలకు రిపోర్టు చేయాలన్నారు. మరిన్ని వివరాలకు 99128 83331ను సంప్రదించాలన్నారు. తూం తలుపులు తెరిచేదెట్లా? బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటి సరాఫరా చేసే ప్రధాన కాలువకే కాదు.. ఉప కాలువలకు కూడా తూం తలుపులు ఎత్తడానికి లష్కరులకు తిప్పలు తప్పడం లేదు. తూం తలుపులు ఎత్తడానికి ఎలక్ట్రానిక్ విధానం ఏర్పాటు చేసినా పనిచేయక పోవడంతో తలుపులు పైకి రావడం లేదు. దీంతో లష్కర్లు నిత్యం చేతులతో తిప్పుతూ తలుపులను ఎత్తుతున్నారు. గురువారం ముప్కాల్ మండలం కొత్తపల్లి శివారులో లక్ష్మి కాలువ డీ–4 తలుపులు ఎత్తడానికి లష్కరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి తలుపులను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. -
ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం
పోలింగ్ సరళి ఇలా.. ముబారక్నగర్లోని పోలింగ్ సెంటర్లో ఓటు వేసేందుకు క్యూలో ఉన్న ఓటర్లుపోలింగ్ ఓటేసిన శాతం ఓటేసిన శాతం సమయం పట్టభద్రులు టీచర్లు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 3,011 9.5 599 15.97 మధ్యాహ్నం 12 వరకు 8,665 27.44 1,580 42.12 మధ్యాహ్నం 2 వరకు 15,766 49.93 2,484 66.22 సాయంత్రం 4 వరకు 24,388 77.24 3,468 92.46ఉపాధ్యాయులదే పైచేయి నిజామాబాద్అర్బన్: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శాతంలో పట్టభద్రుల కన్నా ఉపాధ్యాయులదే అధికంగా నమోదైంది. జిల్లా వ్యాప్తంగా మూడు డివిజన్లలో పట్టభద్రుల పోలింగ్ 77.24 శాతం నమోదుకాగా, ఉపాధ్యాయులు 92.46 శాతం మంది ఓట్లు వేశారు. పట్టభద్రుల ఓటింగ్లో పురుషులు 15,663 మంది, మహిళలు 8,725 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపాధ్యాయుల్లో పురుషులు 2135 మంది, మహిళలు 1333 మంది ఓటేశారు. జిల్లాలో మొత్తం పట్టభద్ర ఓటర్లు 31,574 మంది ఉండగా 24,388 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి జిల్లాలో 3,751 మంది ఓటర్లు ఉండగా 3,468 మంది ఓటు వేశారు.సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జిల్లాలోని 48 పోలింగ్ కేంద్రాల్లో పట్టభద్రులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో మొత్తం పట్టభద్రుల ఓట్లు 31,574 ఉండగా 24,388 మంది ఓటేశారు. ఉపాధ్యాయ ఓటర్లు మొత్తం 3,751 మంది ఉండగా 3,468 మంది ఓట్లేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు 33 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు జిల్లా కేంద్రంలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో ఓటుహక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ముబారక్నగర్ పోలింగ్ బూత్ వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేశ్ కాషాయ కండువా వేసుకోవడంపై పోలీసులు అభ్యంతరం తెలిపారు. ఈ విషయమై స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. నిర్మల హృదయ పాఠశాలతోపాటు ముబారక్నగర్లోని పోలింగ్ కేంద్రంలో వీల్చైర్లు లేకపోవడంతో దివ్యాంగులు ఇబ్బందిపడ్డారు. పాలిటెక్నిక్ కళాశాల పోలింగ్ కేంద్రంలో చిన్నబాబును ఎత్తుకొని ఓటేసేందుకు వచ్చిన ఓ మహిళను పోలీసులు అడ్డుకోవడంతో ఆమె ఓటు వేయకుండానే వెనుదిరిగింది.ఆరు సెంటర్లలో వంద శాతం పోలింగ్నిజామాబాద్అర్బన్ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎ న్నికలకు సంబంధించి జిల్లాలోని ఆరు పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం ఓటింగ్ నమోదైంది. సి రికొండ పోలింగ్ కేంద్రంలో మొత్తం 25మంది, రెంజల్లో 13మంది, చందూర్లో 17మంది, పోతంగల్లో 12మంది, రుద్రూరు పోలింగ్ కేంద్రంలో 49మంది, బాల్కొండ పోలింగ్ కేంద్రంలో 28 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. డిచ్పల్లి సెంటర్లో 97.56 శాతం ఓటింగ్ నమోదైంది. అతి తక్కువగా మోస్రా పోలింగ్ కేంద్రంలో 75 శాతం పోలింగ్ నమోదైంది. ఓటేసిన పట్టభద్రులు 24,388.. ఓటింగ్ శాతం 77.24 నమోదు టీచర్ల ఎమ్మెల్సీకి పోలైన ఓట్లు 3,468.. ఓటింగ్ శాతం 92.46 నమోదు సౌకర్యాల కరువుతో ఇబ్బందిపడ్డ వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్ -
కొత్త కోర్సులుంటేనే అనుమతి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో గత నాలుగు సంవత్సరాల డిగ్రీ ప్రవేశాల వివరాలుడిగ్రీలో సమూల మార్పులు? ● ప్రాజెక్టు వర్క్ ఉండేలా కొత్త సిలబస్ ● ఈ ఏడాది పలు కళాశాలలకు అనుమతి కష్టమే.. ● కనుమరుగు కానున్న దోస్త్..!విద్యా అందుబాటులో డిగ్రీలో చేరిన మిగిలిన సంవత్సరం సీట్లు విద్యార్థులు సీట్లు 2021–22 34,370 17,960 16,410 2022–23 26,980 14,564 12,416 2023–24 33,630 14,046 19,584 2024–25 33,830 12,764 21,764తెయూ(డిచ్పల్లి): డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ ఈ ఏడాది సమగ్రంగా మారబోతోంది. ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్)’ తెరమరుగు కానుంది. దాని స్థానంలో పాత పద్ధతిలోనే కాలేజీలు సొంతంగా అడ్మిషన్లు చేపట్టబోతున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఉన్నత విద్యామండలి కసరత్తు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు సమాచారం. ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే డిగ్రీ ప్రవేశాల విధి విధానాలను ఖరారు చేయనున్నారు. అయితే కోర్సుల ఏర్పాటు, అనుమతులు విద్యామండలి అధీనంలోనే ఉంటాయని, ఏయే కోర్సులకు, ఏయే కాలేజీలకు అనుమతించాలనేది మండలి నిర్ణయిస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో సుమారు 15 డిగ్రీ కాలేజీలకు అనుమతి రద్దయ్యే అవకాశాలున్నాయి. కొత్త విధి విధానాలు వచ్చిన తర్వాత అందుకు తగిన విధంగా కోర్సులు ఉంటే తప్ప కాలేజీలకు అనుమతి లభించడం కష్టమని అధికారులు పేర్కొంటున్నారు. డిగ్రీ సీట్లకు కోత తెయూ పరిధిలో ప్రస్తుతం 74 డిగ్రీ కాలేజీలు ఉన్నా యి. అందులో 13 ప్రభుత్వ, 54 ప్రైవేటు, ఎయిడె డ్, రెసిడెన్షియల్ (గురుకులాలు) డిగ్రీ కాలేజీల్లో కలిపి సుమారు 34,500 సీట్లు ఉన్నాయి. అయితే కొన్నేళ్లుగా డిగ్రీ ప్రవేశాలు 40 నుంచి 50 శాతానికి మించడం లేదు. ముఖ్యంగా ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో 30 శాతం మాత్రమే సీట్లు భర్తీ అవుతున్నాయి. గ్రా మీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో అయితే ఇది 25 శాత మే. నిజానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇంట ర్ ఉత్తీర్ణత సాధించిన వారంతా డిగ్రీలో చేరినా ఇంకా సీట్లు మిగిలిపోయే పరిస్థితి. ఇలా విద్యార్థులు తక్కువ, సీట్లు ఎక్కువ ఉండటంపై ఉన్నత విద్యా మండలి ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని డిగ్రీకాలేజీల్లో భర్తీ అవుతున్న సీట్లలో సగానికిపైగా సీట్లు కొత్త కోర్సులకు సంబంధించినవే ఉంటున్నాయి. బీకాం ఫైనాన్స్, కంప్యూటర్స్ వంటి కాంబినేషన్ సబ్జెక్టులకు డిమాండ్ ఉంది. ఆ తర్వాత స్థానంలో బీఎస్సీ కంప్యూటర్స్, లైఫ్సైన్స్ కోర్సులకు ప్రాధాన్యమిస్తున్నారు. కానీ ఈ కోర్సులు అన్ని కాలేజీలలో లేవు. అధిక సంఖ్యలోని కాలేజీల్లో ఇప్పటికీ సాధారణ డిగ్రీ కోర్సులే ఉన్నాయి. కాంబినేషన్ కోర్సులు ఎక్కువ భాగం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కాలేజీల్లోనే ఉంటున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని యూజీసీ, ఉన్నత విద్యా మండలి డిజైన్ చేసిన కోర్సులను అందుబాటులోకి తెచ్చిన కాలేజీలకే అనుమతివ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో తెయూ పరిధిలో సైతం దాదాపు 16 వేల సీట్లు తగ్గిపోయే అవకాశాలున్నట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి.కొత్త సిలబస్ అందుబాటులోకి.. ఉన్నత విద్యామండలి 2025–26 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలో కొత్త సిలబస్ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. సాధారణ డిగ్రీలో కంప్యూటర్ కోర్సులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి సబ్జెక్టులను అందుబాటులోకి తేనుంది. ఈ దిశగా నిపుణులు సిలబస్ను రూపొందించారు. దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలను కాలేజీలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో ఈ కోర్సులను బోధించేందుకు నిపుణులైన అధ్యాపకులు అవసరం. కొత్త సిలబస్లో తరగతి గదిలో బోధనతో సమానంగా నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రెండో ఏడాది నుంచే ప్రాజెక్టు వర్క్ ప్రవేశపెడుతున్నారు. ఏఐ కోర్సు తీసుకునే విద్యార్థులు ఏదైనా ప్రముఖ కంపెనీ తోడ్పాటుతో సొంతంగా సరికొత్త ప్రాజెక్టు చేయాల్సి ఉంటుంది. రెండో ఏడాది మినీ ప్రాజెక్టు, మూడో ఏడాది పెద్ద ప్రాజెక్టును చేపట్టాలి. దీనికోసం కాలేజీలు కొన్ని సంస్థలతో భాగస్వామ్య ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఎంవోయూ ఉన్న కాలేజీలకు మాత్రమే ఈసారి అనుబంధ గుర్తింపు ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి భావిస్తున్నట్టు తెలిసింది. ఇంటర్ పరీక్షలు పూర్తయ్యేలోగా ఈ మార్పులపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు.