Nizamabad District News
-
ఆరోగ్య ఉపకేంద్రాలకు సొంత భవనాలు కరువు
నిజామాబాద్ రూరల్: రూరల్ మండలంలోని చాలా గ్రామాల్లో ఆరోగ ఉపకేంద్రాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో 19 గ్రామాలు ఉండగా కేవలం మల్లారం, తిర్మన్పల్లి గ్రామాల్లో ఆరోగ్య ఉపకేంద్రాలకు సొంత భవనా లు ఉన్నాయి. మిగిలిన గ్రామాల్లో ఏఎంఎంలు, సెకండ్ ఏఎన్ఎంలు గ్రామాల్లోని పంచాయతీ భవనాల్లో ప్రజలకు చికిత్సలు, మందులు అందిస్తున్నారు. దీంతో ఆరోగ్యఉపకేంద్రాలు లేని గ్రామాల్లో ప్రజలు వైద్యం, మందుల కోసం నిత్యం అవస్థలు పడుతున్నారు. గుండారంలో నిలిచిన పనులు.. మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ అయిన గుండారం గ్రామంలో ఆరోగ్య ఉపకేంద్రానికి స్థలం కేటాయించి నాలుగేళ్లు అవుతుంది. అప్పట్లోనే భవ న నిర్మాణం కోసం పనులు ప్రారంభించగా, కాంట్రాక్టర్ పనులను అర్ధంతరంగా నిలిపివేశారు. అ సంపూర్తి పనుల కారణంగా ప్రస్తుతం జీపీ భవనంలోని ప్రత్యేక గదిలో వైద్య సిబ్బంది ప్రజలకు సేవ లు అందిస్తున్నారు. మండలం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా గ్రామాలకు ఆరోగ్య ఉపకేంద్రాలు లేకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గ్రామాల్లో ఆరోగ్య ఉపకేంద్రాలకు సొంత భవనాలు నిర్మించి, వైద్య సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు. రూరల్ మండలంలో 19 గ్రామాలుండగా కేవలం రెండు గ్రామాల్లోనే ఏర్పాటు మిగిలిన గ్రామాల్లో జీపీ కార్యాలయాల్లో వైద్యసేవలు నిర్వహిస్తున్న సిబ్బంది ఇబ్బందులు పడుతున్నాం.. మా గ్రామంలో ఇప్పడి వరకు ఎలాంటి ఆరోగ్య ఉప కేంద్రం లేదు. గ్రామంలో ఉన్న గర్భిణులు, బాలింతలు, చిన్నారులు వైద్య సేవల కోసం గుండారం గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రానికి వెళుతుంటారు. గ్రామంలో ఆరోగ్య కేంద్రం లేకపోవడంతో ప్రజలు సమీప గ్రామాలకు ఇబ్బందులు పడుతూ వెళ్లాల్సి వస్తోంది. –అంజలి, మల్కాపూర్ (ఏ) అధికారులు స్పందించాలి.. గ్రామంలో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రానికి దాదాపు మల్కాపూర్(ఏ), అనంతగిరి, సమీప గ్రామాలకు చెందిన గర్భిణులు, బాలింతలతోపాటు రోగులు వస్తూంటారు. గతంలో ఆరోగ్య ఉప కేంద్రం పంచాయతీ కార్యాలయంపై ఉండేది. రోగులకు ఇబ్బందికరంగా ఉండటంతో కింది గదికి మార్చాం. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. –ఒంటెల శంకర్రెడ్డి, మాజీ ఉపర్పంచ్, గుండారం -
సమ్మె పోస్టర్ల ఆవిష్కరణ
నిజామాబాద్ సిటీ: నగర ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లాకేంద్రంలోని ఖిల్లా చౌరస్తా వద్ద సార్వత్రిక సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు కటారి రాములు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాహనాల డ్రైవర్లను కఠినంగా శిక్షించే హిట్ అండ్ రన్ సెక్షన్ 106(1(2)ను రద్దుచేయాలన్నారు. ఈ ప్రమాదాల్లో డ్రైవర్లకు 10 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.7 లక్షల జరిమానా విధించే సెక్షన్లను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. రవాణారంగ కార్మికులను అదుకోవడం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. నాయకులు సయ్యద్ రఫీయుద్దిన్, సయ్యద్ ఇర్ఫాన్, షేక్ జావిద్, షేక్ మసూద్, షేక్ మజీద్ పాల్గొన్నారు. -
పంచశీల బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి
నిజామాబాద్నాగారం: నగరంలోని బురుడుగల్లీలో ఇటీవల పంచశీల జెండా గద్దె, సంఘం బోర్డును మున్సిపల్, పోలీస్ సిబ్బంది కూల్చివేశారని వెంటనే మళ్లీ ఏర్పాటు చేయాలని దళిత కళ్యాణ సమితి అధ్యక్షుడు పింకి పాయక్రావు అన్నారు. నగరంలోని ప్రెస్క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గద్దెకు అనుమతి ఉండగా, వేరే వ్యక్తులు అకారణంగా కాషాయ జెండా గద్దెను ఏర్పాటు చేశారన్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా తొలగించారన్నారు. ఇటీవల అర్ధరాత్రి మున్సిపల్ అధికారులు, సిబ్బంది మా జెండాను, గద్దెను తొలగించారన్నారు. వెంటనే జెండా గద్దెను నిర్మించకుంటే ఆందోళనలు చేస్తామన్నారు. నాయకులు బంగారు సాయిలు, మోహన్, భీమ్ ఆర్మీ అజయ్, విజయ్ పాల్గొన్నారు. పెన్షనర్ల సదస్సును జయప్రదం చేయండి నిజామాబాద్నాగారం: నగరంలోని పెన్షనర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ భవన్లో ఆదివారం నిర్వహించనున్న పెన్షనర్ల జిల్లాస్థాయి సదస్సును జయప్రదం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల నాయకులు, ఎంప్లాయీస్ స్టడీ సర్కిల్ జిల్లా కన్వీనర్ రాంమోహన్రావు అన్నారు. నగరంలోని సంఘ కార్యలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు ఈవీఎల్ నారాయణ, లావు వీరయ్య, లక్ష్మీనారాయణ, రాధా కిషన్, తదితరులు ఉన్నారు. నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం నిజామాబాద్నాగారం: నగరంలోని వినాయక్నగర్ పద్మజ్యోతి పద్మశాలి సంఘం 49వ తర్పా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం రాత్రి జరిగింది. కార్యక్రమానికి జిల్లా పద్మశాలి సంఘం గౌరవాధ్యక్షుడు దీకొండ యాదగిరి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పద్మశాలీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందేందుకు సంఘాల బాధ్యులు కృషి చేయాలన్నారు. అనంతరం సంఘం అధ్యక్ష, కార్యదర్శులు అంకం రాజేందర్, గజం సుదర్శన్, కోశాధికారి సుప్పాల వెంకట లక్ష్మణ్తోపాటు ఇతర కార్యవర్గ సభ్యులతో నగర సంఘం అధ్యక్షుడు గుజ్జేటి వెంకటనర్సయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా ప్రతినిధులు పుల్గం హన్మాండ్లు, గుడ్ల భూమేశ్వర్, బత్తుల భుమయ్య, కొట్టూరి హన్మండ్లు, పాము రాకేష్, బొమ్మెర సాయన్న, పెంట నారాయణ, కట్ట వరప్రసాద్, గడ్డం సురేష్, బత్తుల మురళి, రెగోండ మెహన్కూమార్, పెంట అంబదాస్, అడిచర్ల మధుసూదన్ పాల్గొన్నారు. పీవీ రావుకు ఘన నివాళి నిజామాబాద్నాగారం:మాలమహానాడు వ్యవ స్థాపకుడు పీవీరావు జయంతిని సంఘ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా నగరంలోని పూలాంగ్చౌరస్తాలో ఆయన చిత్రపటానికి మాలమహానాడు నాయకులు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. మాల మహానాడు ప్రతినిధులు గైని గంగారాం, సక్కి విజయ్ కుమార్, సక్కి ప్రభంజన్, సుంకరి విజయ, సక్కి చంద్రశేఖర్, గైని విద్యాసాగర్, మగ్గిడి దేవరాజ్, ప్రశాంత్, బేగరి శోభన్, దండు అనిల్, సుంకరి మల్లేష్, సంధ్య, మంజుల, లావణ్య, గంగామణి పాల్గొన్నారు. ధర్పల్లిలో ఆరోగ్య శిబిరం ధర్పల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా వైద్యులు పలువురికి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరం ఉన్నవారికి మందులను పంపిణీ చేశారు. వైద్యులు శివశంకర్, శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు. -
పనిభారం తగ్గించాలి
నిజామాబాద్ సిటీ: జిల్లా కేంద్రంలోని విద్యుత్ భవనంలో ఉద్యోగులకు పనిభారం తగ్గించాలని,ఆర్టి జన్ ఉద్యోగులకు 8 గంటల పనిగంటలు కల్పించా లని సీఐటీయూ కార్యదర్శి నూర్జహాన్ కోరారు. స మస్యను విద్యుత్ అధికారులకు విన్నవించగా అంగీకరించినట్లు ఆమె తెలిపారు.జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.ఆర్టిజన్ ఉద్యోగుల పనిభారం తగ్గించాలని,8 గంటల పని కల్పించాలని అ ధికారులను కోరామని, దానికి వారు అంగీకరించి సర్క్యూలర్ జారీచేశారన్నారు.అన్ని డివిజన్, సబ్ డివిజన్ సెక్షన్లలో కూడా ఈ సర్క్యూలర్ను అమలుచేయాలన్నారు.నాయకులు నరేష్, గంగాధర్, ము రళి, మహేష్,రాజు, రవీందర్, నవీన్ పాల్గొన్నారు. -
ప్రారంభమైన పచ్చళ్ల సీజన్
● మామిడికాయలు, ఇతర దినుసుల కొనుగోళ్లలో ప్రజలు బిజీ●● ఏడాదికి సరిపడా తయారీకి ఏర్పాట్లుబాన్సువాడ : వేసవి కాలంలో ఏ గ్రామంలో చూసిన మామిడి కాయల సుగంధం, పచ్చడి తయారీ, వడియాల సన్నాహాలతో సందడి నెలకొంటుంది. ఆహార పదార్థాలు మాత్రమే కాదు సంప్రదాయం, కుటుంబ బంధాలు, గ్రామీణ సంస్కృతి సజీవ చిహ్నాలు. పచ్చళ్లు ఆహార సంస్కృతిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. రుచిని పెంచడమే కాక ఆహారాన్ని సంరక్షించే సంప్రదాయ పద్ధతిగా కూడా పని చేస్తాయి. గ్రామీణ ప్రాంతాలు, గిరిజన గ్రామాల్లో ఆవకాయ పచ్చడి లేని ఇల్లు ఉండదంటే ఆశ్చర్యం కలగక మానదు. బెల్లం ఆవకాయ, మెంతి ఆవకాయ, పులిహోర ఆవకాయ వంటి రకాలు ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. ఈ ప్రక్రియలో కుటుంబ సభ్యులందరూ పాల్గొనడం, పాత తరం నుంచి కొత్త తరానికి జ్ఞానాన్ని అందించడం వంటివి సాంస్కృతిక సంబంధాలను బలపరుస్తాయి. పచ్చడి తయారీ విధానం.. ● గట్టిగా, పుల్లగా ఉన్న పచ్చి మామిడి కాయలను ఎంచుకుని లోపల టెంకలు తీసి ముక్కలుగా కోయాలి. ● ఆవపిండి, ఎండుమిరపకాయల కారం, ఉప్పు, మెంతిపొడి, నువ్వుల నూనె వంటి ప్రధాన పదార్థాలు కలిపేందుకు సిద్ధం చేసుకోవాలి. కొన్ని రకాల్లో బెల్లం, వెల్లుల్లి కూడా కలుపుతారు. ● ఆ తరువాత జాడీలో కారం మిశ్రమాన్ని మామిడి ముక్కలతో పొరలు, పొరలుగా అమర్చి, పైన నూనె పోస్తారు. ఇది పచ్చడిని పాడవకుండా సంరక్షిస్తుంది. ● 34 రోజులపాటు గాలిచొరబడకుండా మూత పెట్టి ఉంచిన తర్వాత తినడానికి తయారవుతుంది. కొన్ని రకాలు ఎండబెట్టి దీర్ఘకాల నిల్వకు సిద్ధం చేస్తారు. ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. మామిడి పచ్చడిలు రుచికరమైనవే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. వీటిని మితంగా తీసుకోవడం ముఖ్యం. పచ్చి మామిడిలో పొటాషియం, ఇతర ఖనిజాల వల్ల వేసవిలో డీహైడ్రేషన్, జీర్ణక్రియను మెరుగుపర్చుకోవడం, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తాయి. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడతాయి. జీలకర్ర జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయ పడుతుంది.బంధాలను బలపరుస్తుంది ప్రతి సంవత్సరం వేసవిలో మామిడి పచ్చడి చేయడం ఒక పండుగలా ఉంటుంది. కుటుంబ సభ్యులందరం కలిసి తయారీలో పాల్గొంటాం.ఏడాది పొడవునా రుచిని ఇస్తుంది. అలాగే మా కుటుంబ బంధాలను కూడా బలపరుస్తుంది. –పుష్పలత, శేట్లూరు గ్రామం -
‘లూపస్’పై అవగాహన అవసరం
నిజామాబాద్ నాగారం: శరీరంలోని అన్ని భాగాలను ప్రభావితం చేసే ‘లూపస్’ వ్యాధిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని వైద్యులు సూచించా రు. ప్రపంచ లూపస్ దినోత్సవం సందర్భంగా శని వారం ఐఎంఏ, నిజామాబాద్ రుమటాలజీ అండ్ ఆర్థరైటిస్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. వినాయక్నగర్లోని హనుమాన్ జంక్షన్ నుంచి రుమటాలజీ అండ్ ఆర్థరైటిస్ సెంట ర్ వరకు రన్ కొనసాగింది. అనంతరం చర్మవ్యాధి నిపుణురాలు గ్రీష్మ మాట్లాడుతూ లూపస్ వ్యాధి కళ్లు, మెదడు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, రక్త నాళాలు తదితర ఏ భాగాన్ని అయినా ప్రభా వితం చేస్తుందన్నారు. అన్ని అవయవాలపై దాడి చేస్తుందని తెలిపారు. ఐఎంఏ అధ్యక్షుడు డా అజ్జ శ్రీనివాస్, కోశాధికారి డా. రాజేందర్ మాట్లాడుతూ లూపస్ వ్యాధి నివారణకు రుమటాలజిస్టును సంప్రదించి సూచించిన మందులు వాడాలన్నారు. డాక్టర్ జీ రవి కిరణ్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, మంచి నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం తదితర మంచి జీవనశైలిని అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు జీవన్ రావు , శ్రీశైలం, పీబీ కృష్ణమూర్తి, దామోదర్ రావు, ద్వారకానాథ్, గాంధీ తదితరులు పాల్గొన్నారు. నగరంలో 2కే రన్ -
నల్లమట్టి లారీ బోల్తా
నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండలంలోని విజయనగరం గ్రామం వద్ద నల్లమట్టిని తరలిస్తున్న లారీ బోల్తా పడింది. నిర్మల్ జిల్లా పంచగూడ గ్రామ సమీపంలోని గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి ఆర్మూర్ పరిసర ప్రాంతాలకు నల్లమట్టిని తరలిస్తుండగా భారీ లారీ విజయనగరం గ్రామ సమీపంలోని కల్వర్టు వద్ద బోల్తా పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రోడ్డుపై నుంచి లారీతోపాటు నల్లమట్టిని తొలగించడంతో రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. ఈత చెట్లు దగ్ధం రుద్రూర్: మండలంలోని రాణంపల్లి శివారులో శనివారం మధ్యాహ్నం ఈత చెట్లు దగ్ధమయ్యాయి. సమీప పొలంలో నుంచి వచ్చిన మంటలతో 40 ఈత చెట్లు కాలిపోయినట్టు బాధితులు తెలిపారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని బాధితులు అధికారులను కోరారు. -
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
సుభాష్నగర్: నగరంలోని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం పలు బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంఆర్ఎఫ్ ద్వారా 49 మందికి రూ.11,95,000 విలువైన చెక్కులను అందజేశామని తెలిపారు. ఈ కార్య క్రమంలో నాయకులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, ఆకుల శ్రీనివాస్, మాస్టర్ శంకర్, సాయివర్ధన్, హరీష్రెడ్డి, పంచరెడ్డి శ్రీధర్, ఇప్పకాయల కిషోర్, పల్నాటి కార్తీక్, మండలాల అధ్యక్షులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. -
కలెక్టర్ చెప్పినా కరుణించరా?
బాల్కొండ: రహదారిపై కిలోమీటర్ల మేర ఉన్న ధాన్యం బస్తాలను రెండ్రోజుల్లో తరలించాలని సాక్షాత్తు జిల్లా పాలనాధికారి ఆదేశించినా అధికారుల్లో చలనం లేదు. ముప్కాల్ మండలం వెంచిర్యాల్ గ్రామశివారులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రెండు రోజుల క్రితం కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు పరిశీలించారు. జాతీయ రహదారి 44 నల్లూర్ చౌరస్తా నుంచి పెద్ద వాగు వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర రోడ్డుపై ధాన్యం బస్తాలు, వడ్ల కుప్పలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కారణాలు చెప్పకుండా రెండ్రోజుల్లో బస్తాలను తరలించాలని అధికారులను ఆదేశించారు. కానీ, పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంలా ఉంది. తూకం వేసి నెల రోజులు దాటుతున్నా ధాన్యం బస్తాలు తరలించక పోవడంతో రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. స్వయంగా కలెక్టరే పరిస్థితిని గమనించి అధికారులను ఆదేఽశించినా ప్రయోజనం లేకపోవడంతో నిట్టూరుస్తున్నారు. మరోవైపు నెలల తరబడి ధాన్యం తూకం వేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిత్యం గాలివాన కురుస్తుండడంతో ధాన్యం కుప్పలపై ముళ్లకంపలు వేస్తున్నారు. అధికారులు స్పందించి కొనుగోళ్లు వేగవంతం చేసి, ధాన్యం బస్తాలను తరలించాలని వేడుకుంటున్నారు. పెద్దవాగు రోడ్డుపై ధాన్యం బస్తాలు రెండు రోజుల్లో తరలించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఇప్పటికీ కదలని ధాన్యం బస్తాలు నెల రోజులవుతోంది.. పెద్దవాగు రోడ్డుపై ధాన్యం ఆరబెట్టి కుప్పలు చేసి నెల రోజులు గడుస్తోంది. ఇప్పటి వరకు బస్తాలు నింపి కాంటా వేయలేదు. ధాన్యం నింపిన బస్తాలను మిల్లుకు తరలించలేదు. కలెక్టర్ చెప్పినా పట్టించుకోవడం లేదు. – గంగారెడ్డి, రైతు, నాగంపేట్ -
వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
జక్రాన్పల్లి: వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జక్రాన్పల్లి ఎంఈవో శ్రీనివాస్ అన్నారు. జక్రాన్పల్లి జెడ్పీహెచ్ఎస్లో శనివారం వేసవిశిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. శిబిరంలో నృత్యం, చిత్రలేఖనం, కరాటే, యోగా, కంప్యూటర్ కోర్సులలో ప్రత్యేక శిక్షణను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల 24వరకు శిక్షణ కొనసాగుతుందన్నారు. హెచ్ఎంలు లింగన్న, శ్రీనివాస్రెడ్డి, ముత్యంరెడ్డి, రాజు, సత్యనారాయణ, పద్మావతి, పీఆర్టీయూ ప్రతినిధులు గోపి, అశోక్ పాల్గొన్నారు. సిరికొండలో.. సిరికొండ: మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో వేసవి శిక్షణ శిబిరాన్ని ఎంఈవో రాములు శనివారం ప్రారంభించారు. ఈ శిబిరం ఈ నెల 25 వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. నృత్యం, కరాటే, యోగా, ఎంబ్రాయిడరీ లాంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. నగరంలో.. నిజామాబాద్ రూరల్: నగరంలోని రామకృష్ణ విద్యాలయంలో వేసవి శిక్షణ శిబిరం శనివారం ముగిసింది. శిబిరంలో యోగా, చెస్, భగవద్గ్గీత పారాయణం, కంఠస్థ విషయాలు నేర్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లను అంజేశారు. నిర్వాహకులు ఎస్ఎన్ చారి, హెచ్ఎం శశిరేఖ శ్రీనివాస్, కరస్పాండెంట్ సముద్రాల మధుసూదనాచారి, మాధురి తదితరులు పాల్గొన్నారు. -
తల్లి చేపా.. లేదు చిల్లి గవ్వ
బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువన ఉన్న జాతీయ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రానికి అవసరమయ్యే తల్లి చేపల సేకరణ నిధుల్లేక ఆగిపోయింది. సీజన్ ముగింపునకు వస్తున్నా ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతోనే తల్లి చేపల సేకరణ ప్రక్రియ ప్రారంభంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ కేంద్రానికి 5 కోట్ల చేప పిల్లలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. జిల్లాలోని చెరువులు, ప్రాజెక్ట్లకు ఇక్కడి నుంచే చేపపిల్లలను సరఫరా చేయొచ్చు. కానీ, పాలకులకు టెండర్ ద్వారా దిగుమతి చేసుకునే చేపపిల్లలపై ఉన్న శ్రద్ధ ఇక్కడి ఉత్పత్తి కేంద్రంపై ఉండదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కమీషన్ల కోసమే అటు వైపు మొగ్గు చూపుతారనే ఆరోపణలున్నాయి. మెయింటెనెన్స్కు నిధులు చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో మెయింటెనెన్స్ కో సం ప్రభుత్వం రూ.1.5 లక్షలు మంజూరు చేసింది. దీంతో పైపులైన్, సిమెంట్ కుండీల్లో మైనర్ మ రమ్మతులు చేపడుతున్నారు. మరిన్ని నిధులు మంజూరు చేస్తే నీటి కొరత లేకుండా సమస్యలను పరి ష్కరించుకోవచ్చుని అధికారులు చెబుతున్నారు. మంజూరు కాని నిధులు మొదలుకాని చేపల సేకరణ ముగుస్తోన్న సీజన్ రెండు టన్నులు అవసరం చేప పిల్లల ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా మొదట చెరువుల నుంచి తల్లి చేపలను దిగుమతి చేసుకుంటారు. ఈ కేంద్రానికి 2 టన్నుల తల్లి చేపలు అవసరం ఉంటుంది. దీంతో కిలోకు రూ. 100 చొప్పున మత్స్యకారుల నుంచి రెండు టన్నుల తల్లి చేపలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అందుకు రూ. 2 లక్షలు, రవాణా ఖర్చులు రూ.50 వేలు, తల్లి చేపల పోషణ(దాణా)కు రూ. 2 లక్షలు అవసరం ఉంటుంది. మే రెండో వారం నుంచే తల్లి చేపల సేకరణ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. దీంతో తల్లి చేపల కొనుగోలుపై మత్స్యశాఖ అధికారులు సందిగ్ధంలో పడ్డారు. గతేడాది సైతం నిధుల కేటాయింపులో నిర్లక్ష్యంతో చేప పిల్లల ఉత్పత్తి ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో పాతిక శాతం కూడా చేప పిల్లలను ఉత్పత్తి చేయలేదు. ఉన్నతాధికారులకు నివేదించా.. తల్లి చేపల సేకరణ కోసం ఉన్నతాధికారులకు నివేదించాను. నిధులు మంజూరు చేయాలని కోరాం. వారం రోజుల్లో తల్లి చేపల సేకరణ చేపట్టాలి. – దామోదర్, ఎఫ్డీవో, పోచంపాడ్ -
కాలువ లైనింగ్కు మరమ్మతులు చేపట్టరూ!
బాల్కొండ: శ్రీరాంసాగర్ప్రాజెక్ట్ నుంచి ఆయకట్టుకు నీరు సరఫరా చేసే కాకతీయ కాలువ లైనింగ్ ధ్వంసమై, అధ్వానంగా మారింది. కాలువ నీటి సామర్థ్యం 9 వేల క్యూసెక్కులు కాగా ప్రస్తుతం 6వేల క్యూసెక్కుల కంటే ఎక్కువ నీటిని వదిలే పరిస్థితి లేకుండాపోయింది. అలాగే చివరి ఆయకట్టు వరకు నీరు అందడం లేదు. ధ్వంసమైన లైనింగ్కు యాసంగి సీజన్ ప్రారంభంలో మరమ్మతులు చేపడుతామని అధికారులు పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు చేపట్టలేదు. మరమ్మతుల కోసం గత ప్రభుత్వ హయాం నుంచి అధికారులు ఏటా ప్రతిపాదనలు పంపిస్తున్నారు. కానీ నిధులు మంజూరు కావడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కనీసం లైనింగ్ ధ్వంసమైన ప్రదేశంలోనైనా మరమ్మతులు చేపట్టాలని, కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని రైతులు కోరుతున్నారు.ప్రతిపాదనలు పంపించాం కాకతీయ కాలువ లైనింగ్ మరమ్మతుల కోసం రూ.2.5కోట్ల అంచనాతో ప్రభుత్వానికి తాజాగా ప్రతి పాదనలు పంపించాం. మంజూరు కాగానే టెండర్ ప్రక్రియ ప్రారంభిస్తాం. ఈ ఏడాది చేసే పరిస్థితి లేదు. – రఘుపతి, డిప్యూటీఈఈ, కాకతీయ కాలువ -
గర్విస్తున్న తల్లి
యుద్ధంలో కొడుకు.. దేశ సరిహద్దుల్లో అడవిమామిడిపల్లి యువకులు ● ప్రస్తుతం యుద్ధక్షేత్రంలో గ్రామానికి చెందిన ఎనిమిది మంది జవాన్లు ● గత 24 ఏళ్లలో 22 మంది ఆర్మీలోకి.. ● ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సైనికుల తల్లుల మనోభావాలు ● నేడు వరల్డ్ మదర్స్ డేసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో జిల్లాలోని అడవిమామిడిపల్లి గ్రామం గురించి జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వ్యవసాయం ప్రధానంగా ఉన్న ఈ గ్రామం నుంచి ప్రస్తుతం దేశ సరిహద్దుల్లో 8 మంది జవాన్లు వి ధులు నిర్వహిస్తున్నారు. ఈ వ్యవసాయ కుటుంబాల నుంచే దేశసేవ కోసం యువకులు వెళుతుండడం విశేషంగా చెప్పుకోవాలి. ప్రాణాలు పణంగా పెట్టి సరిహద్దుల్లో పనిచేస్తున్న ఈ యువకులను చూసి తాము గర్వపడుతున్నామని ఈ జవాన్ల కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు. దేశరక్షణలో తమ గ్రామం నుంచి సైనికులు ఉండడం గర్వకారణమంటున్నారు. తమ గ్రామానికే కాకుండా జిల్లాకు సైతం యువకులు పేరు తెస్తున్నారంటున్నారు. అడవిమామిడిపల్లి గ్రామం నుంచి గత 24 ఏళ్ల కాలంలో 22 మంది యువకులు ఆర్మీ, ఐటీబీపీ (ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్) దళాల్లోకి వెళ్లారు. మొత్తం ఉత్తర తెలంగాణలోనే ఈ ఊరి ప్రత్యేకతను చాటుతున్నారు. దీంతో ఈ గ్రామాన్ని ‘జైహింద్ మామిడిపల్లి’ అని కూడా పిలుచుకుంటున్నారు. ఈ ఊరిలోకి అడుగుపెట్టగానే స్వామి వి వేకానంద విగ్రహం కనిపిస్తుంది. అనంతరం ఊరి మధ్యలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం, తరువాత మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాలు దర్శనమిస్తాయి. దేశభక్తి స్ఫూర్తిగా విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తమ గ్రామ యువకుల ప్రాణాలను పణంగా పెట్టి దేశరక్షణ విధులకు పంపించడం పట్ల వారి తల్లిదండ్రులకు పాదాభివందనాలని గ్రామస్తులు చెబుతున్నా రు. జై జవాన్.. జై కిసాన్ స్ఫూర్తిని చాటుతున్న ఈ గ్రామం జిల్లాలోనే ప్రత్యేకత చాటుకుంటోంది. అవసరమైతే తాము సైతం యుద్ధరంగంలోకి దిగుతామని ఈ గ్రామానికి చెందిన రిటైర్ అయిన సైనికులు చెబుతున్నారు. రిటైరయ్యాక తాము వ్యవసాయం చేస్తున్నామని, ప్రభుత్వం పిలిస్తే తక్షణమే సరిహద్దులకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాజీ సైనికులు చెబుతుండడం మరింత స్ఫూర్తిని రగిలిస్తోంది. -
అప్రమత్తంగా ఉండాలి
● డీఎస్పీ విఠల్ రెడ్డి నస్రుల్లాబాద్(బాన్సువాడ): పోలీసులు విధు ల్లో అప్రమత్తంగా ఉండాలని బాన్సువాడ డీఎ స్పీ విఠల్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్ను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ డయల్ 100కు ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీసులు స్పందించాలన్నారు. సైబర్ క్రైంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట పీఎస్సై అరుణ్ కుమార్, సిబ్బంది శ్రీనివాస్, రాము, సరిత తదితరులు ఉన్నారు. గ్యాస్ సిలిండర్ లీక్ నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని తాండూర్ గ్రామంలోని ఓ ఇంట్లో వంటగ్యాస్ సిలిండర్ లీకై న ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. తాండూర్కు చెందిన వృద్ధ దంపతులు దుర్గం రాములు, పెంటమ్మ ఇంట్లో సాయంత్రం గ్యాస్ సిలిండర్పై వంట చేస్తుండగా ఆకస్మికంగా గ్యాస్పైపు లీకై మంటలు వచ్చాయి. భయపడిన వృద్ధదంపతులు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి మండుతున్న గ్యాస్ సిలిండర్ను బయటికి తీసుకొచ్చారు. అనంతరం మంటలను ఆర్పివేయడంతో ప్రాణాపాయం తప్పింది. అసభ్యకర పోస్టింగ్పై ఫిర్యాదు నవీపేట: మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్ చేయడంపై బీజేపీ నాయకులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధాని, కేంద్ర హోం మంత్రి, పలు రాష్ట్రాల సీఎంల చిత్రాలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. ఫొటో వైరల్ కావడంతో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు బూనాది ప్రవీన్, సందీప్, అజయ్, దినేశ్, రాహుల్ ఫిర్యాదు చేశారు. ప్రైవేటు ఆస్పత్రిలో నర్సు మృతి నిజామాబాద్ నాగారం: జిల్లా కేంద్రంలోని మనోరమ ఆస్పత్రిలో ఓ నర్సు మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా డోంగ్లికి చెందిన శిల్ప నగరంలోని మనోరమ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. శుక్రవారం రాత్రి శిల్ప విధులకు హాజరుకాగా, జ్వరంతో బాధపడుతూ రాత్రి అదే ఆస్పత్రిలో నిద్రపోయింది. తెల్లవారుజామున తోటి నర్సులు, సిబ్బంది నిద్ర లేపే ప్రయత్నం చేయగా చలనం లేకపోవడంతో వైద్యులు పరీక్షించి శిల్ప మృతి చెందినట్లు గుర్తించారు. స్థానిక ఒకటో టౌన్ పోలీసులు ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. -
సమయం దొరికే ఫోన్లో మాట్లాడుతున్నాడు
పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో నా కుమారుడు సాయికుమార్ పాల్గొనటం గర్వంగా అ న్పిస్తుంది. ఇంకో వైపు ఎ ప్పుడు ఏం జరుగుతుందోనని భయంగా ఉంటుంది. రోజూ యుద్ధంలో ఏం జరుగుతుంద నేది టీవీ చూస్తునే ఉంటాను. నా కుమారుడు సమయం దొరికినప్పుడు ఫోన్లో మాట్లాడుతాడు. అక్కడ అంతా బాగానే ఉందని చెప్పు తాడు. ఏది ఏమైన యుద్ధంలో పాల్గొనటం నా కుమారుడు సాయికుమార్కు లభించిన అదృష్టంగా అనుకుంటాను. – జయ (ఆర్మీ మ్యాన్ సాయికుమార్ తల్లి) -
ప్రశాంతంగా టీజీఆర్జేసీ
నిజామాబాద్అర్బన్: తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ప్రవేశానికి శనివారం జిల్లా కేంద్రంలో టీజీఆర్జేసీ పరీక్ష నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా 31 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 7,483 మంది విద్యార్థులకు 6,564 మంది హాజరుకాగా, 919 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. చురుగ్గా సాగుతున్న చెక్డ్యాం పనులు సిరికొండ: మండలంలోని గడ్కోల్ శివారులో కప్పలవాగుపై నిర్మిస్తున్న చెక్ డ్యాం పనులు చురుగ్గా సాగుతున్నాయి. చెక్డ్యాం నిర్మాణ పనులకు నీటి పారుదల శాఖ ద్వారా రూ.2.46 కోట్ల నిధులు మంజూరయ్యాయి. పనులకు గత నెల 4న ఎమ్మెల్యే భూపతిరెడ్డి శంకుస్థాపన చేశారు. పనులను ప్రారంభించిన కాంట్రాక్టర్ పనులను ము మ్మరంగా చేపడుతున్నారు. వాగు అడుగు భాగం నుంచి ర్యాఫ్ట్ పనులు భూమిపై భా గం వరకు చేపట్టారు. మరో 30 మీటర్ల మేర పనులు చేపట్టాల్సి ఉంది. కప్పలవాగుపై చెక్డ్యాం నిర్మాణం పూర్తయితే భూగర్బ జలాలు పెరిగే అవకాశం ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. దంచికొట్టిన వాన ● తడిసి ముద్దయిన ధాన్యం బాల్కొండ: బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల పరిధిలో శనివారం రాత్రి అకాలవర్షం దంచి కొట్టింది. దీంతో కల్లాల్లో ఉన్న సజ్జలు, నువ్వులు, కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం తడిసి ముద్దయింది. సుమారు 40 నిమిషాలపాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉరుములు, మెరుపులతో వాన కురవడంతో ప్రజలు భయాందోళన చెందారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు మాచారెడ్డి : చుక్కాపూర్లోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కొనసాగు తున్నాయి. శనివారం ఉదయం సేవాకాలం శాంతిపాఠం నిర్వహించారు. అనంతరం ద్వారతోరణ పూజలు, మూలమంత్ర హవనం, ఉత్సవ మూర్తులకు పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కమలాకర్రెడ్డి, ఈవో శ్రీధర్రావ్, డైరెక్టర్లు లక్ష్మీరాజం, రాజిరెడ్డి, ఆంజనేయులు, బాల్రెడ్డి, ఆలయ సిబ్బంది సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నియామకం జక్రాన్పల్లి: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్ఆర్ఐ పాలసీ సలహామండలి సభ్యుడిగా కలిగోట్ గ్రామానికి చెందిన సత్యంగౌడ్(దుబాయ్)నియమితులయ్యారు. ఈసందర్భంగా దుబాయ్లో ఉంటున్న ఎన్నారైలు శనివారం సత్యంగౌడ్ను కలిసి, సత్కరించారు. విజయ్రెడ్డి, నర్స య్య, మద్దుల శ్రీనివాస్, రమేష్, కాశాగౌడ్, మచ్చెంధర్, మోహన్, కొట్టాల శ్రీనివాస్, చిన్ని, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా కీర్తిని ప్రపంచానికి చాటిన సౌమ్య
నిజామాబాద్నాగారం: జిల్లాకు చెందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రతిభ చాటుతూ జిల్లా కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటుతున్నారని, ఫుట్బాల్ క్రీడాకారిణి గుగులోత్ సౌమ్య మరింత చాటిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కొనియాడారు. జిల్లా కేంద్రంలోని గీతా భవనంలో శనివారం నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్ జట్టులో స్థానం పదిలం చేసుకున్న గుగులోత్ సౌమ్యకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ హాజరై ఆమెను అభినందిస్తూ సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందించేందుకు తాను జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులుతో కలిసి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, ఉపాధ్యక్షుడు భక్తవత్సలం మాట్లాడుతూ.. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా జిల్లాకు ప్రత్యేక క్రీడామైదానంతోపాటు కోచ్లు, వసతులు లేక క్రీడాకారులు ఇక్కట్లకు గురవుతున్నారన్నారు. కోచ్ నాగరాజు, నిఖత్ జరీనా, భూమ్రెడ్డి సంజీవరెడ్డి, అబ్బన్న, రమే్శ , ఉమర్, సురేశ్, జావీద్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరె కటికలు రాజకీయాల్లో ఎదగాలి
నిజామాబాద్నాగారం: ఆరె కటికలు రాజకీయ అవకాశాలను ఒడిసి పట్టుకుని ఎదగాలని ఆరె కటిక రాష్ట్ర ట్రస్టు చైర్మన్ గౌలికార్ నర్సింగరావు పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగర ఆరె కటిక సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం శుక్రవారం రాత్రి జరిగింది. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఆరెకటికలు వ్యూహాత్మక వైఖరితో ముందుకు సాగాలన్నారు. రాజకీయాధికారం అన్ని సమస్యలకు పరిష్కారమన్నారు. అనంతరం నూతన అధ్యక్షుడు జమాల్పూర్ రమేష్ మాట్లాడుతూ.. ఆరె కటికల ఆత్మ గౌరవం పెరిగే విధంగా పనిచేస్తానని అన్నారు. రాష్ట్ర నాయకులు రవిలాల్, మురళీధర్, జితేందర్, సంజయ్రాజ్, నాగోజి, నెహ్రూ బియ్యకర్, బిల్లి శంకర్, గాంధీ, మోహన్లాల్, శివ చరణ్, ఆంకార్ మహేష్, శంకర్, పిల్లి శ్రీకాంత్, లక్ష్మణ్, రవి, ఆనంద్, శ్రీనివాస్, రాజేష్, జమాల్పూర్ గణేష్, రాజశేఖర్ ఉన్నారు. నగర ప్రధాన కార్యదర్శిగా న్యంతాబాద్ అశోక్, కోశాధికారిగా మిర్యాలకర్ ఓం ప్రకాష్, గౌరవ అధ్యక్షుడిగా ఆంకార్ రాజారామ్ ప్రమాణస్వీకారం చేశారు. -
ఎకో టూరిజంతో ముంపు గ్రామాల అభివృద్ధి
డొంకేశ్వర్(ఆర్మూర్): ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో ఎకో టూరిజం ఏర్పాటైతే ముంపు గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అటవీ శాఖ అధికారులు, స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు అన్నారు. వాచ్ టవర్లు, రిసార్ట్ల కోసం స్థల సేకరణ నేపథ్యంలో శనివారం డొంకేశ్వర్ మండలంలోని చిన్నయానం గ్రామస్తులతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. చిన్నయానం, జీజీ నడ్కుడ, గాదేపల్లి గ్రామస్తులు సహకరిస్తే ఎకో టూరిజం ఏర్పాటు త్వరగా జరుగుతుందన్నారు. వాచ్ టవర్ల కోసం ఎకరం వరకు స్థలాన్ని ఇవ్వాలని కోరారు. టూరిజంతో స్థానికంగా ఉపాధి లభిస్తుందని, ఉద్యోగ అవకాశాల్లో గ్రామస్తులకే మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. భూముల ధరలు కూడా పెరుగుతాయని, అన్ని విధాలుగా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. త్వరలోనే చిన్నయానంలో ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరిస్తామని, ఏమైనా సమస్యలుంటే గ్రామస్తులు తెలియజేయాలని సూచించారు. డిప్యూటీ ఎఫ్ఆర్వో, బీట్ ఆఫీసర్ సుశీల్, గాదేపల్లి మాజీ సర్పంచ్ నక్కల భూమేశ్, మాజీ ఎంపీటీసీ చిన్నారెడ్డి పాల్గొన్నారు. -
పత్రికా స్వేచ్ఛపై దాడి సిగ్గుచేటు
ఆర్మూర్టౌన్/బోధన్: నిజాలను నిర్భయంగా రా స్తున్న ‘సాక్షి’ దినపత్రికను అణగదొక్కేందుకు ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జర్నలిస్టులు అన్నారు. ధనంజయ్రెడ్డి ఇంట్లో పోలీసుల సోదాలను నిరసిస్తూ శనివారం ఆర్మూర్, బోధన్ పట్టణాల్లో జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపి అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. ఆర్మూర్లో జర్నలిస్టు యూనియన్ ఫర్ స్టేట్ ఆఫ్ తె లంగాణ జిల్లా అధ్యక్షుడు నరసింహచారి, సాక్షి దినపత్రిక బ్యూరో ఇన్చార్జి భద్రారెడ్డి, బోధన్లో ప్రింట్ మీడియా జర్నలిస్ట్ సంఘాల నాయకులు తేళ్ల రవికుమార్, లింటూరి లక్ష్మణ్ మాట్లాడారు. సాక్షి ఎడిటర్ ధనంజయ్రెడ్డి ఇంటిపై ఏపీ రాష్ట్ర పోలీసుల దాడి, సోదాలను ఏపీ కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగానే పరిగణిస్తామని అన్నారు. ప త్రికా స్వేచ్ఛను కాపాడుకుందామని, ధనంజయ్రెడ్డిపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని అన్నా రు. ఏ ప్రభుత్వానికై నా అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని పోలీసులు గుర్తించాలని, ఏపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని హితవు పలికారు. లేని పక్షంలో భవిష్యత్లో పెద్ద ఎ త్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఆర్మూర్లో జర్నలిస్టులు సురేశ్, వెంకట్, క్రాంతి, రాజేశ్, శేఖర్, భూమేశ్, సాగర్, పోశెట్టి, బోధన్లో బండారి సాయిలు, ఉమాకాంత్, ఖుర్షిద్, న ల్వాల విజయ్, సూర్య ప్రకాశ్, రాము, తారాచంద్, కారం స్వామి, రమేశ్, జగన్, కడికే శివ, రాజేశ్, అ శోక్, రాజేశ్వర్, అంజి, నవీన్, దిలీప్, నాగభూషణం, అఫ్రోజ్, సాక్షి బోధన్ ఆర్సీ ఇంచార్జీ గడ్డం గంగులు, సాక్షి టీవీ రిపోర్టర్ తోకల రవి, గణేశ్, నల్వాల క్రిష్ణ, శ్రీనివాస్, అనిల్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఏపీలోని కూటమి ప్రభుత్వానివి కక్ష సాధింపు చర్యలు సాక్షి ఎడిటర్పై ధనంజయరెడ్డి ఇంటిపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం నిరసన కార్యక్రమాల్లో జర్నలిస్టులు -
కలిసొచ్చిన సీడ్ సాగు
మోర్తాడ్(బాల్కొండ): విత్తనోత్పత్తి కోసం వరి సీడ్ సాగు చేయించిన విత్తన కంపెనీలు రైతులకు ఎక్కువ ధర చెల్లించి వారిని ప్రోత్సహించాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా ఎక్కువ ధరను కల్పించి రైతులకు మేలు చేశాయి. యాసంగి సీజన్లో సాగు చేసిన సన్నాలకు క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ధాన్యానికి క్వింటాల్కు రూ.2,400 ధర ప్రకటించిన కంపెనీలు ప్రభుత్వం బోనస్ను ప్రకటించడంతో అదనంగా రూ.500 చెల్లిస్తున్నాయి. అంటే సీడ్ విత్తనం సాగు చేసిన రైతులకు ఒక్కో క్వింటాల్కు రూ.2,900 ధర లభిస్తోంది. సీడ్ కంపెనీలు గ్రామాల్లో తమ ఏజెంట్లను నియమించుకుని వారి మధ్యవర్తిత్వంతో రైతులతో బైబ్యాక్ ఒప్పందాలను చేసుకున్నాయి. వర్షాకాలంలో సన్న రకాలు సాగు చేసేందుకు అవకాశం ఉండటంతో సీడ్ రకం సాగులోనూ సన్నాలకే ప్రాధాన్యత ఇచ్చారు. బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల పరిధిలోని వివిధ మండలాల్లో దాదాపు 4వేల ఎకరాల్లో విత్తన కంపెనీల కోసం వరి ధాన్యాన్ని రైతులు సాగు చేశారని అంచనా. పది కంపెనీల వరకూ తమ విత్తనోత్పత్తి కార్యక్రమం కోసం సీడ్ను సాగు చేయించాయి. ఒక్కో ఎకరానికి 25 క్వింటాళ్ల నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి లభించింది. ఇదిలా ఉండగా సీడ్ రకం సాగులో కంపెనీలు సూచించిన ప్రకారం రైతులు మెళకువలు పాటించారు. ఫలితంగానే దిగుబడి పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మద్దతు ధరతో పోలిస్తే ఎక్కువే చెల్లించిన కంపెనీలు వర్షాకాలం సీజన్ కోసం సాగు చేయించిన ప్రైవేట్ కంపెనీలు సన్నాలకు బోనస్ ప్రకటించిన ప్రభుత్వం ధర పెంచిన కంపెనీలు ధర ఎక్కువ వస్తుందనే సీడ్ రకం సాగు చేశాం ధర ఎక్కువగా వస్తుందనే సీడ్ రకం వరిని సాగు చే శాం. సీడ్ రకం వరి సాగులో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ధర ఎక్కువ చెల్లించడంతో రైతులకు మే లు జరిగింది. సీడ్ కంపెనీలు మరింత ధర పెంచితే సాగు విస్తీర్ణం ఇంకా పెరిగే అవకాశముంటుంది. – మాదాం నర్సయ్య, రైతు, తొర్తి -
నాటుడెందుకు.. నరుకుడెందుకు..!
డిచ్పల్లి: హరితహారం పేరిట ప్రతి ఏడాది వివిధ విభాగాల ఆధ్వర్యంలో మొక్కలు నాటుతున్నారు. అవెన్యూ ప్లాంటేషన్ పేరిట ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్, ఇతర ప్రధాన రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటుతారు. మొక్కలు పెరిగి చెట్లుగా మారిన తర్వాత అవి విద్యుత్ తీగలకు తగులుతున్నాయని చెబుతూ విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది ప్రతి ఏటా వేసవి కాలంలో చెట్లను నరికివేస్తున్నారు. తీగలకు తగులుతున్న కొమ్మలను నరికివేయకుండా చెట్ల కాండం వరకు నరికి వేస్తున్నారు. దీంతో అవి తిరిగి పెరగడానికి చాలా సమయం పడుతోంది. డిచ్పల్లి–నిజామాబాద్ ప్రధాన రహదారిపై, డిచ్పల్లి మండల కేంద్రంతో పాటు నడిపల్లి, బర్ధిపూర్, ధర్మారం(బి) గ్రామాల శివారులో విద్యుత్ తీగల కింద ఉన్నాయనే పేరిట విద్యుత్ శాఖ సిబ్బంది వందలాది మొక్కలను నరికివేస్తున్నారు. దీనిపై అటవీశాఖ సిబ్బంది ఎంపీడీవోతో పాటు సంబంధిత జీపీల్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అసలు మొక్కలు నాటే సమయంలోనే విద్యుత్ తీగల కింద కాకుండా కొంచెం అవతలి వైపు నాటితే బాగుంటుందని, కానీ లెక్కల్లో మొక్కలు చూపాలనే ఆత్రంతో ఇష్టారీతిన నాటుతున్నారని విద్యుత్ శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. ఆయా శాఖల అధికారుల మధ్య సమన్వయం కొరవడి ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇకనైనా మొక్కలు నాటే సమయంలో ఇలాంటి పరిస్థితులు రాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. హరితహారంలో నాటిన మొక్కలు విద్యుత్ తీగలకు తగులుతున్నాయని నరికేస్తున్న వైనం -
సైనికులకు అండగా నిలుద్దాం
నిజామాబాద్ రూరల్: మన దేశానికి, పాకిస్థాన్కు మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత సైనికులకు అండగా నిలుద్దామని సినీనటి పూనమ్ కౌర్ అన్నారు. నగరంలోని నాందేవాడ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని శుక్రవారం ఆమె సందర్శించారు. ఈసందర్భంగా పూనమ్కౌర్ మాట్లాడుతూ.. ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు భారత సైనికులు తమ ప్రాణాలు లెక్క చేయకుండా యుద్ధంలో పోరాడుతున్నారని ఇటువంటి సైనికులకు మనమంతా మద్దతు తెలుపుతూ అండగా నిలవాలన్నారు. గతంలో తాను పాకిస్తాన్ దేశంలో పర్యటించి అక్కడ శివాలయంలో పూజలు చేశానన్నారు. అనంతరం చిన్నారి ప్రదర్శించిన నాట్యం అలరించింది. బ్రహ్మకుమారి ఐశ్వర్య, నాందేవాడ సెంటర్ నిర్వాహకురాలు సునీత బహేంజీ తదితరులున్నారు. -
నెట్బాల్ రాష్ట్రస్థాయి టోర్నీకి జిల్లా జట్ల ఎంపిక
నిజామాబాద్నాగారం: నెట్బాల్ రాష్ట్రస్థాయి టోర్నీకి జిల్లా బాలబాలికల జట్లను ఎంపిక చేశారు. జిల్లా నెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్ రూరల్ మండలంలోని తిర్మన్పల్లి ప్రభుత్వ జెడ్పీ హైస్కూల్లో అండర్–16 విభాగం బాలబాలికల ఎంపికలు నిర్వహించారు. ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేయగా, వారు ఈ నెల 15 నుంచి 18 వరకు జనగామ జరిగే రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొనున్నారు. కార్యక్రమంలో నెట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ రావు జనరల్ సెక్రెటరీ ఏ రమేశ్, పీఈటీలు గంగాధర్, నాగరాజ్, రమేశ్ గౌడ్, కుమార్, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. బాలుర జట్టు: జీ యశ్వంత్, జీ సామ్రాట్, వనితేజ్, వరుణ్ తేజ్, భువన్ తేజ్, ఎస్ విజయ్, టీ భరత్ కుమార్, వై అమర్, టీ మహేశ్, పీ నిఖిల్, టీ సంపత్, జీ స్పృహన్. స్టాండ్ బైగా పీ శేఖర్, స్వరాజ్ గౌడ్, సాత్విక్, నితిన్. బాలికల జట్టు : ఈ నయన శ్రీ, బీ అక్షయ, బీ సింధు, బీ మహిమ, కే నందిని, ఎం శ్రీహర్షిత, జీ నేహా, పీ లేయ, ఈ మృణాళిని, పీ అక్షయ, బీ గాయత్రి, కే మేఘన. స్టాండ్ బైగా జీ గీత. ఎం మహేశ్వరి, వీ శృతి, వీ సంధ్య, ఎస్ వైష్ణవి, ఎం రిషిత. దరఖాస్తుల ఆహ్వానంనిజామాబాద్అర్బన్: జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక రంగాల పనితీరును మెరుగుపర్చేందుకు జిల్లా పరిశ్రమల కేంద్రంలో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తునట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం తెలిపారు. పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులు, ఆసక్తి ఉన్నవారు మే 10లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు www.nimsme.gov.in వెబ్ సైట్ ను సంప్రదించాలని, మరిన్ని వివరాల కోసం జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సురేష్కుమార్, సెల్ నంబర్ 9640909831ను సంప్రదించాలని సూచించారు. -
ఆటో బోల్తాపడి ఆరుగురికి గాయాలు
ఎల్లారెడ్డి: బైక్ను తప్పించబోయి ఆటో బోల్తాపడటంతో ఆటోలోని ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. ఎల్లారెడ్డిలో ప్రయాణికులను ఎక్కించుకొని ఓ ఆటో రుద్రారం బయలుదేరింది. పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకు ఎదుట ఆటోకు ఎక్సెల్ వాహనం అడ్డురావడంతో దానిని తప్పించబోయి బ్రేక్ వేయడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నిజాంసాగర్కు చెందిన రజిత, సుమలత, ఎల్లారెడ్డి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన సంగవ్వ, మల్కాపూర్ గ్రామానికి చెందిన శేర్ల చంద్రయ్య, శకుంతల, లక్ష్మీలకు గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. క్షత గాత్రులను మున్సిపల్ మాజీ చైర్మన్ కుడుముల సత్యనారాయణ పరామర్శించారు. బైక్ అదుపుతప్పి ముగ్గురికి.. మద్నూర్(జుక్కల్): మండలంలోని మేనూర్ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం బైక్ అదుపు తప్పడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. పిట్లం నుంచి మద్నూర్ వైపు బైక్పై ముగ్గురు వ్యక్తులు బయలుదేరారు. మేనూర్ వద్ద వారి బైక్ అదుపు తప్పడంతో డివైడర్కు ఢీకొన్నారు. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వారిని మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
అశ్రునయనాలతో అంత్యక్రియలు
● పాల్వంచలో గ్రేహౌండ్స్ జవాన్కు అంతిమ వీడ్కోలు ● నివాళులర్పించిన మంత్రి పొన్నం, షబ్బీర్, మదన్మోహన్ ● అధికార లాంఛనాలతో అంత్యక్రియలుకామారెడ్డి క్రైం/మాచారెడ్డి : నక్సల్స్ అమర్చిన మందుపాతరకు బలైన గ్రేహౌండ్స్ జవాన్ వడ్ల శ్రీధర్ అంత్యక్రియలు శుక్రవారం పాల్వంచ మండల కేంద్రంలో అధికార లాంఛనాలతో జరిగాయి. పాల్వంచ గ్రామస్తులే కాక చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు తరలివచ్చి జవాన్కు కన్నీటి వీడ్కోలు పలికారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర ఆధ్వర్యంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు, కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి తదితరులు శ్రీధర్ మృతదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. మంత్రి పొన్నం బాధిత కుటుంబాన్ని ఓదార్చిన అనంతరం ఆయన మాట్లాడారు. పెళ్లయిన 8 నెలలకే శ్రీధర్ మృతి చెందడం బాధాకరం అన్నారు. బాధి త కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందన్నారు. మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.2.17 కో ట్లతో పాటు 300 గజాల స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని పేర్కొన్నారు. శ్రీధర్ ఆత్మశాంతి కోసం పాల్వంచ గ్రామస్తులు శుక్రవారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన చిత్ర పటం వద్ద కొవ్వొత్తులు ఉంచి నివాళులర్పించారు. -
నగరంలో నేడు 2కే రన్
నిజామాబాద్నాగారం: నగరంలో శనివారం వరల్డ్ లూపస్ డే సందర్భంగా రుమటాలజిస్ట్ గ్రీష్మ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించనున్నారు. ఖలీల్వాడిలోని నిజామాబాద్ రుమటాలజీ, ఆర్థరైటీస్ సెంటర్ ఆస్పత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు మాట్లాడారు. కీళ్లవాతం(ఆర్థరైటీస్)లో లూపస్ అనేది ప్రమాదకరమైనదన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు 2కే రన్ నిర్వహిస్తున్నామన్నారు. లూపస్ అనేది ప్రాణాంతకమైనది కాకున్నప్పటికీ రోగనిరోధక శక్తిని దెబ్బ తీస్తుందని, పర్యావసనంగా అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. 2కే రన్కు ముఖ్య అతిథులుగా ఐఎంఏ అధ్యక్షుడు అజ్జ శ్రీనివాస్, సెక్రెటరీ విక్రమ్ రెడ్డి, ట్రెజరర్ రాజేందర్, వైద్యులు హాజరవుతారని, నగర ప్రముఖులు, ప్రజలు పాల్గొనాలని కోరారు. -
గుప్పుమంటున్న గాంజా
● బానిసలుగా మారుతున్న యువకులు ● నగరంలో ముగ్గురు గంజాయి కింగ్లు ● దాడులు చేస్తున్నా తగ్గని సప్లైదారులు ● మైనర్లతో అమ్మకాలుఖలీల్వాడి: జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది. గుట్టుగా రవాణా అవుతోంది. పల్లెల్లో యువకులు కొందరు మత్తుకు బానిసలుగా మారారు. గంజా యి పీల్చడానికి అలవాటు పడి గమ్మత్తులో ఊగుతున్నారు. దీంతో కుటుంబాలు ఛిన్నాభిన్నమైపోతున్నాయి. పోలీసులు, ఎౖక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా అక్ర మ దందాకు అడ్డుకట్ట పడడం లేదు. స్మగర్లు గంజాయిని వివిధ రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతంలో డంప్ చేస్తున్నట్లు పోలీసులు, ఎకై ్సజ్ వర్గాలు గుర్తించాయి. అవసరం మేరకు నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల వంటి ప్రాంతాలకు తరలిస్తూ విక్రయిస్తున్నారు. మైనర్లతో విక్రయాలు.. టీ పాయింట్లు, ఖాళీ ప్రదేశాలు, గ్రామ శివారు ప్రాంతాలే అడ్డాగా గంజాయి దందా నడుస్తోంది. చాక్లెట్ ప్యాకెట్లు, లిక్విడ్ రూపంలో తయారు చేసి గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు సాగిస్తున్నారు. నగరంలో గంజాయిని ముగ్గురు వ్యక్తులు అమ్మకాలు సాగిస్తున్నట్లు పోలీసులు, ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. వీరిలో ఒకరిపై పీడీయాక్ట్ నమోదు చేశారు. మరొకరు ఇటీవల జైలు నుంచి బయటికి వచ్చినట్లు తెలిసింది. ఇంకొకరు మైనర్ల ద్వారా గంజాయి అమ్మకాలు సాగిస్తున్నాడు. నెల రోజుల క్రితం ముగ్గురు బాలురు గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడగా, వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. కాగా, ఓ బాలుడు మాత్రం తీరు మార్చుకోకుండా గంజాయి విక్రయిస్తూ కత్తులను వెంటబెట్టుకొని తిరుగుతున్నట్లు సమాచారం. ఆ బాలుడిని పట్టుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేయగా పరారైనట్లు తెలిసింది. ఏప్రిల్ 21న నవీపేట్ మండలం యంచ వద్ద కారులో రవాణా చేస్తున్న 30.250 కిలోల ఎండు గంజాయిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పట్టుకున్నారు. రూ.6 లక్షల విలువజేసే గంజాయిని స్వాధీనం చేసుకొని ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. ఫిబ్రవరి 11న నిజాంసాగర్ మండలం మాగి చౌరస్తా వద్ద 90.630 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకొని ముగ్గురిని పట్టుకున్నారు. కర్ణాటక నుంచి మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. గంజాయి విలువ రూ.22.50 లక్షల ఉంటుంది.నిఘా పెట్టాం గంజాయి సరఫరా, విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టాం. నగరంలో కొంతమంది మైనర్లను అడ్డుపె ట్టుకొని గంజాయి అమ్మకాలు సాగిస్తున్నారు. మైనర్లపై కూడా కేసులు నమోదు చేస్తాం. యువత గంజాయికి దూరంగా ఉండాలి. గంజాయి అమ్మకాలు, వినియోగంపై సమాచారం అందిస్తే వివరాలను గోప్యంగా ఉంచుతాం. – స్వప్న, జిల్లా ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్చార్జి ఏఈఎస్ -
భానుడి ఎఫెక్ట్
నిజామాబాద్గృహజ్యోతికికానరాని గ్రామీణ క్రీడలు పిల్లలు గ్రామీణ క్రీడలకు దూరమవుతున్నారు. శారీరకంగా, మానసికంగా తీర్చిదిద్దే క్రీడలను వదిలి సెల్ఫోన్లకు బానిసలవుతున్నారు.శనివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2025– 10లో uగృహజ్యోతి.. ఈ పథకం ద్వారా 200 యూనిట్లలోపు విద్యుత్ను వినియోగించేవారికి జీరో బిల్లు వర్తిస్తుంది. వేసవి నేపథ్యంలో ఎండవేడిమి నుంచి ఉపశమనం కోసం ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు వినియోగిస్తుండడంతో విద్యుత్ వినియోగం 200 యూనిట్లు దాటుతోంది. దీంతో చాలా మంది లబ్ధిదారులు ఈ పథకానికి దూరమవుతున్నారు. పెరిగిన విద్యుత్ వినియోగం..వేసవిలో రాష్ట్రంలోనే జిల్లా లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చిలో సగటు ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల నుంచి 40 వరకు నమోదు కాగా, ఏప్రిల్లో 42 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. ఎండ వేడిమికి వడగాల్పులు తోడుకావడంతో జిల్లాలో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగింది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం, చల్లదనం కోసం జోరుగా కూలర్లు వినియోగిస్తున్నారు. గతేడాది ఏప్రిల్లో 200 మిలియన్ యూనిట్ల వినియోగం కాగా, ఈసారి అంతకు మించి వినియోగించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. వినియోగం పెరగడంతో గృహజ్యోతి లబ్ధిదారుల ఇళ్లలో 200 యూనిట్ల పరిధి దాటుతోంది. సుభాష్నగర్: పేదలకు ఉచిత విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహజ్యోతిపై భానుడి ప్రభావం పడింది. రోజురోజుకూ పెరుగుతున్న ఎండ తీవ్రతకు విద్యుత్ వినియోగం పెరిగి మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. ఫ్యాన్లు, కూలర్ల వినియోగంతో ఏప్రిల్ నెలలో 62వేల కుటుంబాలు గృహజ్యోతి లబ్ధికి దూరమయ్యాయి. జిల్లాలో నివాసగృహాలకు 4.80 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రభుత్వం 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే పేదల కోసం గృహజ్యోతి పథకాన్ని తీసుకొచ్చింది. జిల్లా వ్యాప్తంగా 2.81 లక్షల కనెక్షన్లకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ కేటగిరీలో యూనిట్ ధర సాధారణంగా 1 నుంచి 50 యూనిట్ల వరకు రూ.1.95, 51 నుంచి 100 యూనిట్ల వరకు రూ.3.10, 101 నుంచి 200 యూనిట్ల వరకు రూ.4.80, 200 యూనిట్లు దాటితే రూ.5.10 చొప్పున బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 200 యూనిట్లు దాటిన వారికి రూ.వెయ్యికి పైగా బిల్లులు వస్తున్నాయి. న్యూస్రీల్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు పెరిగిన కూలర్లు, ఫ్యాన్ల వినియోగం పరిధి దాటుతున్న విద్యుత్ యూనిట్లు ఉచిత విద్యుత్ పథకానికి 62వేల కుటుంబాల దూరం 200 యూనిట్లు దాటితే వర్తించదు విద్యుత్ వినియోగం 200 యూనిట్లు దాటితే గృహజ్యోతి పథకం వర్తించదు. ఎండల తీవ్రతతో విద్యుత్ వినియోగం పెరిగింది. ఏప్రిల్లో 62 వేల కుటుంబాలు ఈ పథకానికి దూరంకాగా, 2.19 లక్షల కుటుంబాలకు మాత్రమే గృహజ్యోతి వర్తించింది. – రాపెల్లి రవీందర్, ఎస్ఈ, ఎన్పీడీసీఎల్ -
ఆపరేషన్ సిందూర్ విజయవంతానికి పూజలు
సుభాష్నగర్: పాకిస్తాన్పై భారత్ ఘన విజయం సాధించి ఉగ్రవాదుల నెత్తుటితో భరతమాతకు వీర తిలకం దిద్దడమే ఆపరేషన్ సిందూర్ అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. యుద్ధంలో భారత సైన్యానికి, భూ భాగానికి, ప్రజలకు ఎలాంటి నష్టం జరగకూడదని, ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని బీజేపీ నగరశాఖ ఆధ్వర్యంలో నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో శుక్రవారం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత సైన్యం తలచుకుంటే పాకిస్తాన్ను ప్రపంచపటంలో లేకుండా చేస్తుందని హెచ్చరించారు. ప్రపంచ దేశా లు సైతం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, భారత్కు మద్దతిస్తున్నాయన్నారు. ప్రపంచదేశాలు భారత్ను ప్రశంసిస్తుంటే.. కొందరు మనవాళ్లే కించపర్చడం బాధాకరమని, వారిపై దేశద్రోహం కేసు పెట్టి కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, నారాయణ యాదవ్, కొండా ఆశన్న, ప్రభాకర్, మఠం పవన్, పల్నాటి కార్తీక్, కార్యకర్తలు పాల్గొన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ -
మందుల్లేవు.. వైద్యులు రారు
● నిజామాబాద్ నగరానికి చెందిన గంగవ్వ(58) ఈనెల 8వ తేదీన తన కొడుకుతో కలిసి కంఠేశ్వర్ ప్రాంతంలోని ఈఎస్ఐ ఆస్పత్రికి బీపీ మందుల కోసం వచ్చింది. అక్కడి సిబ్బంది మందులు లేవని చెప్పడంతో వెనుదిరిగి వెళ్లిపోయింది. నిజామాబాద్నాగారం: ఆరోగ్యభద్రతను ఇస్తాయనుకున్న ఈఎస్ఐ ఆస్పత్రులు మందులు లేక, టైమ్ కి వైద్యులు రాక వెలవెలబోతున్నాయి. ఉమ్మడి జిల్లా(నిజామాబాద్, కామారెడ్డి)కు సంబంధించి ఈఎస్ఐ ఆస్పత్రులు రెండు నిజామాబాద్ నగరంలోని రేడియోస్టేషన్ ప్రాంతంలో, కంఠేశ్వర్లో ఉ న్నాయి. అయితే సంఘటిత, అసంఘటిత కార్మికులు, జీతాల్లో ఈఎస్ఐ కట్ అయ్యే చిన్నచిన్న ఉ ద్యోగులు వైద్య సేవలందక ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని నెలలుగా ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందులు ఉండడం లేదని, వైద్యులు ఇలా వచ్చి అలా వెళ్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ తదితర దూర ప్రాంతాల నుంచి వస్తున్నవారు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వశాఖల్లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగు లు సుమారు 2వేల మందికిపైగానే ఉన్నారు. వీరి తోపాటు ప్రైవేట్ సంస్థల్లో ఆయా రంగాల్లో చిరుద్యోగులు, కార్మికులు సుమారు 13వేల వరకు ఉ న్నారు. న్యాల్కల్రోడ్లో ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రిలో 10వేల కార్డులు ఉండగా, ప్రతినిత్యం 80మందికిపైగా చికిత్స కోసం వస్తుండగా, కంఠేశ్వర్ ప్రాంతంలో ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రుల్లో 5వేలకు పైన కార్డు లు ఉన్నాయి. ఇక్కడికి ప్రతిరోజూ 50 మందికి పైగా రోగులు వస్తున్నారు. లంచ్కి వెళ్తే అటే.. ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు వైద్యులు, సిబ్బంది కచ్చితంగా అందుబాటులో ఉండి రోగులకు వైద్య సేవలు అందించాలి. కానీ ఉ దయం వస్తున్న వారు లంచ్కి వెళ్తే మళ్లీ రావడం లేదు. ఎక్స్రే, ఈసీజీ, ల్యాబ్ల నిర్వహణను పట్టించుకునే వారు లేరు. బీపీ బిళ్లలూ ఉండవు.. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందుల కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా బీపీ, థైరాయిడ్, కొలస్ట్రాల్ తది తర మందులు లేవు. చిన్న పిల్లలకు సంబంధించిన మందులు సైతం ఉండడం లేదు. కేవలం జ్వరం, నొప్పుల మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఫార్మసిస్టులు చెబుతున్నారు. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో అడుగడుగునా ఇబ్బందులు రోగులకు తప్పని ఇక్కట్లు ఇలా వచ్చి అలా వెళ్తున్న వైద్యులు పట్టించుకోని ఉన్నతాధికారులు కామారెడ్డికి చెందిన రమేశ్ అనారోగ్యంతో బాధపడుతూ న్యాల్కల్ రోడ్లోని ఈఎస్ఐ ఆస్పత్రికి గురువారం వచ్చాడు. వైద్యులు లేకపోవడంతో ఏం చేయాలో తెలియక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లిపోయాడు. పర్యవేక్షణ లేదు రెండు ఈఎస్ఐ ఆస్పత్రులపై పర్యవేక్షణ లేకుండా పోయింది. రెండు ఆస్పత్రులను కలెక్టర్ ఒక సారి సందర్శిస్తే ఇక్కడి పరిస్థితి, అందుతున్న వైద్య సేవ ల వివరాలు తెలుస్తాయని రోగులు అంటున్నారు. -
నిరసన గళమెత్తిన జర్నలిస్టులు
నిజామాబాద్అర్బన్: ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డిపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, సెర్చ్ వారెంట్ లేకుండా ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించడం సరైంది కాదని జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనంజయరెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లాలోని అన్ని జర్నలిస్టు సంఘాల నాయకులు కలెక్టరేట్ ఎదుట సుమారు రెండు గంటలపాటు నిరసన తెలిపాయి. ‘జర్నలిస్టుల ఐక్యత వర్ధ్ధిల్లాలి.. ఎడిటర్ ధనంజయరెడ్డికి న్యాయం జరగాలి..’ అంటూ నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను మానుకోవాలన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్రనాయకుడు జమాల్పూర్ గణేశ్ మా ట్లాడుతూ.. పత్రికా స్వేచ్ఛను, హక్కులను ప్ర భుత్వాలు హరించడం సరికాదన్నారు.మీడియా పై దౌర్జన్యాలు కొనసాగితే ఊరుకునే ప్రసక్తే లేద ని స్పష్టం చేశారు. ఐజేయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొబ్బిలి నర్స య్య మాట్లాడుతూ.. సా క్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిపై పోలీసుల దాడులను ఖండిస్తున్నామన్నారు. ఇలాగే కొనసాగితే జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు. నిజామాబాద్ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి దినపత్రికపై దౌర్జన్యం కొనసాగిస్తోందని, అధికార బలంతో అణగదొక్కా లని చూస్తోందని విమర్శించారు. ఎడిటర్ ధనంజయరెడ్డిపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఐజే యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రమోద్గౌడ్, నాయకుడు రవికుమార్, నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ మండే మోహన్, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకుడు ఆశనారాయ ణ తదితరులు ప్రసంగించారు. అనంతరం కలె క్టరేట్ ప్రవేశ మార్గం నుంచి నిరసన ప్రదర్శనగా వెళ్లి అదనపు కలెక్టర్ అంకిత్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు ధనుంజయ్, ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి అంగల రామ్చందర్, సదానంద్, పంచరెడ్డి శ్రీ కాంత్, దేవల్ రవిబాబు, ఇంగుశ్రీనివాస్, ఉమామహేశ్వర్, కొక్క రవి, ఆంజనేయులు, జాన్సన్, సురేశ్, సాక్షి బ్యూరో ఇన్చార్జి భద్రారెడ్డి, ఎడిషన్ ఇన్చార్జి ప్రభాకర్, సాక్షి టీవీ వీడియో జర్నలిస్ట్ సాయికిరణ్, నిజామాబాద్ ఆర్సీ ఇన్చార్జి సంజీవ్, రూరల్ ఆర్సీ ఇన్చార్జి మురళి తదితరులు పాల్గొన్నారు. ‘సాక్షి’ ఎడిటర్పై అక్రమ కేసులు ఎత్తివేయాలి కలెక్టరేట్ ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన -
వేర్వేరు కారణాలతో ఇద్దరి ఆత్మహత్య
ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపిన వివరాలు ఇలా.. సిద్దిపేట్ జిల్లా సూర్యపేట గ్రామానికి చెందిన బండి బిక్షపతి(65) కొన్ని సంవత్సరాలుగా అంకాపూర్లో కూలీ పనిచేస్తు జీవనం సాగిస్తున్నాడు. కాగ రోజూ మాదిరిగానే శుక్రవారం ఉదయం కూలీ పనికి వెళుతున్నాంటూ ఇంట్లో నుంచి వెళ్లాడు. కాగ వ్యవసాయ క్షేత్రంలోనే భిక్షపతి చెట్టుకు ఉరి వేసుకొని, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి భార్య ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. పిట్లం మండలంలో.. పిట్లం(జుక్కల్): మద్యానికి బానిసై తాగిన మైకంలో ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని రాంపూర్ గ్రామంలో చొటుచేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాలు ఇలా.. రాంపూర్ గ్రామానికి చెందిన కమ్మరి రాజు (33) గత కొంతకాలం నుంచి మద్యానికి బానిసయ్యాడు. గురువారం రాత్రి తాగిన మైకంలో ఇంట్లో దూలానికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య సరోజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి బాన్సువాడ రూరల్: మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. బాన్సువాడ పట్టణానికి చెందిన గూడ సంతోష్ కుమార్(45) గురువారం రాత్రి బైక్పై బయలుదేరాడు. బాన్సువాడ–బీర్కూర్ రహదారిపై కొల్లూర్ రైస్మిల్ సమీపంలో అతడికి మరో బైక్ ఎదురుగా రావడంతో రెండు బైక్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో సంతోష్కు తీవ్రగాయాలు కావడంతో ఘటన స్థలంలోనే మృతి చెందాడు. బాన్సువాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి అదృశ్యం ఎల్లారెడ్డిరూరల్: మండల కేంద్రానికి చెందిన షేక్ సలీం(28) అనే యువకుడు అదృశ్యమైనట్లు ఏఎస్సై సిద్ధిఖీ శుక్రవారం తెలిపారు. ఈనెల 4న ఇంటి నుంచి వెళ్లిన సలీం ఇంతవరకు తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
బైక్ చోరీల కేసులో నిందితుడి అరెస్టు
మోపాల్(నిజామాబాద్రూరల్): చెడు వ్యసనాలకు బానిసై చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై యాదగిరిగౌడ్, సీఐ సురేష్ తెలిపారు. మోపాల్ పోలీస్స్టేషన్లో శుక్రవారం వారు కేసు వివరాలను వెల్లడించారు. జిల్లాకేంద్రంలోని వివేకానంద కాలనీకి చెందిన భూమిగారి నవీన్, తల్లి రాజేశ్వరితో కలిసి నివాసం ఉంటున్నాడు. కూలీ పని చేసుకునే క్రమంలో చెడు వ్యసనాలకు బానిసై ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడేవాడు. పలు కేసుల్లో గతంలో జైలు జీవితం గడిపాడు. జైలు నుంచి బయటకు వచ్చిన అతడు కొన్ని నెలలుగా బతుకుదెరువు కోసం ఆటో నడుపుకుంటున్నాడు. కానీ ఆదాయం సరిపోకపోవడంతో మళ్లీ దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈనెల 5న రోటరీనగర్లో బైక్ చోరీ చేసి, అదేరాత్రి మంచిప్ప శివారులోగల గండి మైసమ్మ ఆలయంలో, ముదక్పల్లిలోని సూదులమ్మ ఆలయంలో చోరీకి పాల్పడ్డాడు. అలాగే ఇంటి ఆవరణలో పెట్టిన బైక్ను చోరీ చేశాడు. బైక్లను శుక్రవారం తరలిస్తున్న క్రమంలో మోపాల్ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, నేరాలను ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ సురేష్ తెలిపారు. ఏఎస్సై రమేష్బాబు, సిబ్బంది దూప్సింగ్, తదితరులు పాల్గొన్నారు. -
‘సాక్షి’పై కక్ష సాధింపు సరికాదు
ఎల్లారెడ్డి: సాక్షి దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్ర భుత్వం కక్ష పూరితంగా వ్యవహరించడం స రికాదని జర్నలిస్టులు పేర్కొన్నారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిపై ఏపీ పోలీసుల దాడిని శుక్రవారం ఎల్లారెడ్డి జర్నలిస్టులు ఖండించారు. నిజాలను బయట పెడుతున్న సా క్షి పత్రికపై తెలుగుదేశం ప్రభుత్వం కక్ష సా ధింపు చర్యలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. అనంతరం ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాల యంలో ఇన్చార్జి ఏవో చంద్రశేఖర్కు వినతిపత్రం సమర్పించారు. ఎన్యూజే జాతీ య ఉపాధ్యక్షులు రాజేందర్నాథ్, జర్నలిస్టులు రామప్ప, మహేష్, సిద్దు, యశ్వంత్ పవార్, సంగ్రాం, నాగేశ్వర్రావు, శ్రీనివాస్, రాజ్కుమార్, శివకుమార్ పాల్గొన్నారు. -
డ్రంకన్డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు
రుద్రూర్: మండల కేంద్రంలో నాలుగు రోజుల క్రితం పోలీసులు డ్రంకన్డ్రైవ్, వాహనాల తనిఖీలు చేపట్టారు. బొప్పపూర్ గ్రామానికి చెందిన సాయిలు, రానంపల్లి గ్రామానికి చెందిన వీరేశంలు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. శుక్రవారం వారిని కోర్టులో హాజరుపరచగా జడ్జి ఒకరికి మూడురోజుల జైలు, మరొకరికి రెండు రోజుల జైలుశిక్షతోపాటు రూ.1000 జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు. సిలిండర్ లీకై మంటలు నందిపేట్(ఆర్మూర్): మండల కేంద్రంలోని రాజనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న గందం గంగామణి ఇంట్లో శుక్రవారం సిలిండర్ నుంచి గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. వెంటనే స్థానికులు స్పందించి మంటలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఇంట్లో మంటలు వ్యాపించడంతో విలువైన సామగ్రి, నిత్యవసర సరుకులు కాలిపోయాయి. విద్యుత్ షాక్తో ఆవు మృతి రాజంపేట: మండలంలోని షేర్ శంకర్ తండాలో విద్యుత్ షాక్తో ఓ ఆవు మృతి చెందింది. తండాలోని రైతు కాట్రోత్ సురేందర్కు చెందిన ఆవు శుక్రవారం ఉదయం గ్రామ శివారులో మేతకు వెళ్లగా సమీపంలోని విద్యుత్ వైర్ల కర్ర విరిగిపడగా, కర్రకు కట్టిన విద్యుత్ తీగలు ఆవుపై పడటంతో షాక్తో మృతిచెందింది. సుమారు రూ. 50వేల వరకు నష్టపోయానని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరాడు. హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదుకామారెడ్డి క్రైం/సదాశివనగర్(ఎల్లారెడ్డి): పాత గొడవలను మనసులో పెట్టుకుని వ్యక్తిని హత్య చేసిన నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ కామారెడ్డి కోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించింది. వివరాలు ఇలా.. సదాశివనగర్ మండలం మర్కల్ వద్ద జాతీయ రహదారి పక్కన కల్వర్టు కింద 2020 జూలై 13న ఓ మృతదేహం ఉందని సమాచారం రావడంతో పోలీసులు విచారణ జరిపి మృతుడిని సదాశివనగర్కు చెందిన మాడల సతీష్గా గుర్తించారు. అతనికి, అదే గ్రామానికి చెందిన గోల్కొండ రవి కుమార్కు మధ్య గొడవలు ఉండేవి. సతీష్ తరచుగా రవి కుమార్ను, అతని కుటంబ సభ్యులను తిడుతుండేవాడు. దీంతో అతడిని ఎలాగైనా చంపాలని రవి నిర్ణయించుకున్నాడు. అదే సంవత్సరం జులై 10న రవి ఆర్మూర్ దాకా వెళ్లి వద్దామని అతడిని నమ్మించాడు. సదాశివనగర్ మండల కేంద్రం శివారులోని కామారెడ్డి వైపునకు వెళ్తున్న మార్గమధ్యలో రహదారిపై ఉన్న కల్వర్డు వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టి ఆ తర్వాత వంతెన పైనుంచి కిందికి తోసి వేశాడు. దీంతో సతీష్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే రవీందర్ కల్వర్టు కిందికి వెళ్లి గాయాలతో కొట్టుకుంటున్న సతీష్ను రాయితో తలపై కొట్టి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. నేరం రుజువు కావడంతో జిల్లా న్యాయమూర్తి సీహెచ్ వీఆర్ఆర్ వరప్రసాద్ నిందితుడికి జీవిత ఖైదుతోపాటు, రూ.2వేల జరిమానా విధిస్తు తీర్పు ఇచ్చారు. అప్పటి సదాశివనగర్ సీఐం వెంకట్, ఎస్సై జగడం నరేశ్, ప్రస్తుత సీఐ సంతో ష్కుమార్, ఎస్సై రంజీత్లను ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు. -
గంజాయిపై ఉక్కు పాదం మోపండి
బాల్కొండ: గంజాయిపై ఉక్కు పాదం మోపాలని సీపీ సాయి చైతన్య పోలీసు సిబ్బందికి సూచించా రు. బాల్కొండ, ముప్కాల్, మెండోరా పోలీస్ స్టేషన్లను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. క్రైం రేట్ వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయిపై ఉక్కు పాదం మో పేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీస్ స్టేషన్లలో 5ఎస్ విధానం తప్పకుండా అ మలు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కు చర్యలు చేపట్టాలని, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సైబర్ నేరాలపై మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. సీపీ వెంట బాల్కొండ, ముప్కాల్, మెండోరా ఎస్సైలు నరేశ్, రజనీకాంత్, అర్ఫాత్, సిబ్బంది ఉన్నారు. -
‘మీ సేవ’ సమస్యలను పరిష్కరించాలి
నిజామాబాద్ సిటీ: సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లాలోని మీ సేవ కేంద్రాల ఆపరేటర్లు, అసోసియేషన్ సభ్యులు మంత్రి శ్రీధర్బాబును కోరారు. శుక్రవారం హైదరాబాద్లో మంత్రిని ఆయన చాంబర్లో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. సమస్యలను విన్న మంత్రి శ్రీధర్బాబు సానుకూలంగా స్పందించారని అసోసియేషన్ నాయకుడు లక్ష్మీనారాయణ తెలిపారు. మంత్రిని కలిసినవారిలో జీవన్ ప్రసాద్, కె.నారాయణ, మహ్మద్ నాసిర్ అహ్మద్, చింత రాజు, కొత్తపల్లి కిరణ్, జి శ్రీకాంత్, సాగర్బాబు, సీహెచ్ వేణు ఉన్నారు.శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి డిచ్పల్లి: మండలంలోని అన్ని ప్రభుత్వ, గురుకుల, మోడల్, కేజీబీవీ పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 12 నుంచి 26వ వరకు వేసవి ఉచిత శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు ఎంఈవో ఈఎల్ఎన్ శ్రీనివాస్రెడ్డి శుక్రవారం తెలిపారు. నృత్యం, సంగీతం, ఆర్ట్ అండ్ క్రాప్ట్ విభాగాల్లో శిక్షణ తరగతులు ప్రతి రోజు ఉదయం 8 నుంచి 12గంటల వరకు నిర్వహిస్తారని అన్నారు. మండల కేంద్రంలోని మానవత సదన్లో శిక్షణ తరగతులు ఉంటాయన్నా రు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంఈవో కోరారు. కొండాపూర్లో పోలీసు కళాజాత సిరికొండ: మండలంలోని కొండాపూర్లో పోలీ సు కళా బృందం ఆధ్వర్యంలో కళాజాతను శు క్రవారం నిర్వహించారు. రోడ్డు భద్రత నియ మాలు, సైబర్ నేరాలు, మత్తు పదార్థాలు, మూఢ నమ్మకాలు లాంటి అంశాలపై కళాకారు లు నాటికలు, పాటల రూపంలో అవగాహన కల్పించారు. ఎస్సై ఎల్ రామ్ మాట్లాడుతూ.. గ్రామాల్లో దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలు ఎంతో కీలకమని అని అన్నారు. , ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసు కోవాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ నిజామాబాద్ నాగారం: నిజామాబాద్ పట్టణ పద్మశాలి సంఘం ఎన్నికలు ఈ నెల 25న స్థా నిక పద్మశాలి ఉన్నత పాఠశాలలో జరగనున్నా యి. శుక్రవారం నుంచి ఆదివారం వరకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేయనున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమి టీ ప్యానెల్ సభ్యులు ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను మార్కండేయ మందిరంలో అందజేశారు. ఎన్నికల అధికారిగా అడ్వకేట్ గంగా ప్రసాద్ వ్యవహరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఎస్సార్ సత్యపాల్, అమృతపురం గంగాధర్, బిల్ల మహేశ్, మదన్మోహన్, సిలివేరి గణేశ్ పాల్గొన్నారు. సీపీఎం నాయకుల సమావేశం నిజామాబాద్ సిటీ: సామ్రాజ్యవాద కాంక్షనే జర్మన్ పాలకుడు హిట్లర్ లక్ష్యమని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్బాబు అన్నారు. నగరంలోని నాందేవ్వాడలో ఉన్న పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రష్యా సైన్యం చేతిలో జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ ఓటమి చెంది 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో నా యకులు నూర్జహాన్, శంకర్ గౌడ్, సుజాత, న న్నేసాబ్, సురేశ్, సిర్పలింగం, నర్సయ్య, అనిత శంషుద్దీన్, దినేశ్, సతీశ్, రాజు పాల్గొన్నారు. వేసవి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి జక్రాన్పల్లి: మండలంలోని కలిగోట్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన క్రీడా అధికారి ముత్తెన్న సూచించారు. శుక్రవారం కలిగోట్లో నిర్వహిస్తున్న వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర, జాతీయ స్థా యికి ఎంపికయ్యేలా శిక్షణలో మెళకువలు నే ర్పాలన్నారు. అనంతరం క్రీడాకారులకు వాలీబాల్, నెట్లను అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం పురుషోత్తమచారి, సువర్ణ, వీడీసీ సభ్యులు, పీఈటీ యాదగిరి పాల్గొన్నారు. ఆర్థికసాయం అందజేత నిజామాబాద్ రూరల్: మండలంలోని ఆకుల కొండూర్కు చెందిన ఆకాశ్ మృతి చెందడంతో బాధిత కుటుంబానికి అన్వేషణ యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు అన్వేష్ అందించిన రూ. రెండు లక్షల ఆర్థికసాయాన్ని అతని మిత్రులు శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో మా జీ సర్పంచ్ అశోక్, గ్రామస్తులు పాల్గొన్నారు. సమ్మె పోస్టర్ల ఆవిష్కరణ నిజామాబాద్ సిటీ: కేంద్రం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 20న దేశవ్యాప్తంగా చేపట్టే సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ కోరారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. నాయకులు శంకర్ గౌడ్, సింగిరెడ్డి చంద్రరెడ్డి, నరేశ్, గంగాధర్, ప్రభాకర్, మురళి, థామస్, మహేశ్ పాల్గొన్నారు. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు
నిజామాబాద్నాగారం: స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అడిషనల్ కలెక్టర్ అంకిత్, డీఎంహెచ్వో రాజశ్రీ అన్నారు. నగరంలోని అడిషనల్ కలెక్టర్ చాంబర్లో శుక్రవారం పీసీ అండ్ పీఎన్టీటీ యాక్టుపై ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సందర్బంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ.. జిల్లాలో కొత్తగా మూడు స్కానింగ్ కేంద్రాలకు అనుమతి, రెండు స్కానింగ్ కేంద్రాలకు రెన్యూవల్ చేశామన్నారు. బోధన్ డివిజన్లో ఒక స్కానింగ్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ అనుమతితో మూసివేసినట్లు తెలిపారు. ప్రతి డివిజన్ పరిధిలో తనిఖీ బృందాలు ఒక్కొక్కటి చొప్పున, జిల్లా కేంద్రంలో అదనంగా మరో నాలుగు బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏసీపీ సయ్యద్ మస్తాన్ అలీ, కృష్ణ, న్యాయవాది సయ్యద్ ఇర్షద్బుకారి, ఏన్జీవో లింబాద్రి, ప్రోగ్రాం అధికారి సుప్రియ పాల్గొన్నారు. -
పేరుకే క్రీడా ప్రాంగణాలు
● కానరాని వసతులు.. నిర్వహణ అస్తవ్యస్తం ● ఇబ్బందిపడుతున్న క్రీడాకారులు ● పట్టించుకోని అధికారులు డిచ్పల్లి: పల్లెల్లో క్రీడాకారులను తీర్చిదిద్దడానికి గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన గ్రామీణ క్రీడా ప్రాంగణాలు బోర్డులకే పరిమితమయ్యాయి. ఇప్పటి వరకు ఒక్క క్రీడాప్రాంగణం అభివృద్ధికి నోచుకోలేదు. పల్లె ప్రగతిలో భాగంగా ఈ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాల్లో స్థలం కొరతతో ఊరు బయట ప్రాంతాల్లో, ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో, మరికొన్ని చోట్ల ఇరిగేషన్ శాఖ భూముల్లో బోర్డులు పెట్టి ఇదే క్రీడా ప్రాంగణం అంటూ అధికారులు చేతులు దులుపుకొన్నారు. ప్రాంగణాల్లో ఖో–ఖో, కబడ్డీ, వాలీబాల్ ఆటలకు సంబంధించిన కోర్టులను ఏర్పాటు చేశారు. అయితే అవి ఇప్పుడు కానరాకుండా పోయాయి. కేవలం ఇనుప బార్లు మాత్రమే మిగిలాయి. గత జనవరిలో నిర్వహించిన సీఎం కప్ నిర్వహణలో కూడా గ్రామీణ క్రీడా ప్రాంగణాలను పట్టించుకోలేదు. భవిష్యత్తులో పట్టించుకుంటారనే నమ్మకం కూడా లేదని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రీడా సామగ్రి కరువు గ్రామీణ క్రీడా ప్రాంగణాల్లో కనీసం ఇప్పటి వరకు క్రీడా సామగ్రి కూడా ఏర్పాటు చేయలేదు. కొన్ని గ్రామాల్లో తూతూ మంత్రంగా క్రికెట్, వాలీబాల్ కిట్లు, టెన్నికాయిట్ రింగ్స్ సరఫరా చేశారు. కానీ పలు గ్రామాల్లో వాటిని ఎవరు వినియోగిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ప్రాంగణంలో క్రీడా కోర్టులు ఏర్పాటు చేయక పోవడంతోపాటు క్రీడలు ఆడేవారు లేకపోవడంతో పలు గ్రామాల్లో పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. క్రీడా సామగ్రిని సరఫరా చేయాలని యువకులు రోజుల తరబడి డిమాండ్ చేస్తున్నా పట్టించుకునే వారే లేకుండపోయారు. క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేసి కనీసం సరిహద్దులు ఏర్పాటు చేయాలని యువకులు కోరుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే క్రీడా సామగ్రిని సరఫరా చేయడంతో పాటు ప్రాంగణాలను అభివృద్ధి చేయాలని క్రీడాకారులు కోరుతున్నారు. -
చెత్త రహిత డివిజన్లుగా మార్చాలి
నిజామాబాద్ సిటీ: కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్య పనులను వేగవంతం చేయాలని, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ అధికారులు, సిబ్బందికి సూచించారు. శుక్రవారం బల్దియా కార్యాలయంలో పారిశుధ్య సూపర్వైజర్, ఇన్స్పెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో చెత్త సేకరణ, చెత్త తొలగింపులో అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవన్నారు. చెత్త తొలగింపులో మైక్రో ప్లానింగ్ చేయాలన్నారు. నగరంలో ఎక్కువ పారిశుధ్య సమస్యలు ఉన్న ఆరు డివిజన్లను తీసుకుని చెత్త రహిత డివిజన్లుగా మారుద్దామని సూచించారు. వీటిని గుర్తించి ప్రత్యేక టీమ్ల ద్వారా చెత్త లేకుండా చూడాలన్నారు. నగరంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, చిన్న పిల్లలపై దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రతి రోజు కుక్కలను పట్టే సిబ్బంది విధులు నిర్వహించాలని, కుక్కలను పట్టి ఏబీసీ సెంటర్కు తరలించాలని ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ జయకుమార్, శానిటరీ సూపర్వైజర్ సాజిద్ అలీ, శానిటరీ ఇన్స్పెక్టర్లు షాదుల్లా, శ్రీకాంత్, సునీల్, మహిపాల్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పారిశుధ్య పనులు వేగవంతం చేయాలి మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ -
వన మహోత్సవానికి సన్నద్ధం
● 22 నర్సరీల్లో మొక్కల పెంపకం ● ఎండల నుంచి రక్షణకు గ్రీన్ షెడ్ నెట్ల ఏర్పాటు ధర్పల్లి: పల్లెల్లో పచ్చదనం పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి ఏడాది మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కార్యచరణ రూపొందించారు. గత ప్రభుత్వం హరితహారం పేరుతో నాటిన మొక్కలు పెరిగి చెట్లుగా ఎదగడంతో గ్రామాల్లో పచ్చదనం కనువిందు చేస్తోంది. పల్లెల్లో, రహదారుల వెంట నాటిన మొక్కలు నీడనిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రస్తుత ప్రభుత్వం వన మహోత్సవం పేరుతో మొక్కలను నాటుతున్నారు. నర్సరీలో మొక్కల పెంపకం ప్రక్రియ గతేడాది అక్టోబర్ నుంచే ప్రారంభించారు. వానాకాలం ప్రారంభం కాగానే వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. దానికి సరిపడా మొక్కలను నర్సరీల్లో సిద్ధం చేస్తున్నారు. 1.76 లక్షల మొక్కలు లక్ష్యం ధర్పల్లి మండలంలో ఈ ఏడాది వర్షాకాలంలో 1లక్ష 76 వేల మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. 22 జీపీల్లో మొక్కలు పెంచేందుకు 22 నర్సరీలను ఏర్పాటు చేశారు. ఒక్కో నర్సరీలో 8 వేల మొక్కల చొప్పున మండలంలో మొత్తం 1లక్ష76 వేల మొక్కలను గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నర్సరీలో పెంచుతున్నారు. నర్సరీలో మొక్కల సంరక్షణకు అధికారులు ప్రతి నర్సరీలో వన సేవకులను నియమించారు. మొక్కలకు ఉదయం, సాయంత్రం వేళల్లో మొక్కలకు నీరందిస్తున్నారు. ఎండవేడికి మొక్కలు చనిపోకుండా ప్రతి నర్సరీలో గ్రీన్ షెడ్ నెట్లను ఏర్పాటు చేశారు. నర్సరీలో పెంచుతున్న మొక్కలను ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, కార్యదర్శులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాటి సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నారు. జూన్ నెలలో ప్రభుత్వం నిర్వహించే వన మహోత్సవంలో మొక్కలను నాటనున్నారు. ఇళ్లల్లో పెంచేందుకు వీలుగా.. గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలో ఇళ్లల్లో పెంచేందుకు వీలుగా గులాబీ, మల్లె, జామ, దానిమ్మ, వేప, తులసి ఉసిరి, నిమ్మ, బొప్పాయి, అల్లనేరేడు, ఆకాశమల్లి వంటి 20 రకాల ఉపయోగ మొక్కలతో పాటు ఇతర ప్రదేశాల్లో నాటేందుకు ఈత, తాటి మొక్కలను, రైతులకు ఉపయోగపడే మొక్కలను సైతం వన మహోత్సవంలో నాటేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ నర్సరీలో మొక్కలు ఎదగడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం. వనమహోత్సవ కార్యక్రమానికి సరిపడా మొక్కలను నర్సరీ లో పెంచుతున్నాం. వర్షాలు ప్రారంభం కాగానే గ్రామాల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళికను సిద్ధం చేశాం. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు చర్యలు చేపడతాం. – బాలకృష్ణ, ఎంపీడీవో, ధర్పల్లి -
పీజీహెచ్ఎంల సమస్యలు పరిష్కరించాలి
నిజామాబాద్అర్బన్: ప్రభుత్వం పీజీహెచ్ఎంల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పీజీహెచ్ఎం అసోసియేషన్ నాయకులు శుక్రవా రం డీఈవోకు వినతిప త్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో నిర్వహించే ఉపాధ్యాయు ల శిక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక స్థాయి హెచ్ఎంలకు జిల్లా స్థాయి లో పీజీహెచ్ఎంలకు నిర్వహించే విధంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించాలన్నారు. అలాగే నూతన విద్యా సంవత్సరంలో నిర్వహించే కాంప్లెక్స్ స మావేశాల్లో పీజీహెచ్ఎంలకు కార్యదర్శి హోదా ఇవ్వాలన్నారు. ప్రాథమిక స్థా యిలో పర్యవేక్షణ కోసం అన్ని అర్హతలు ఉన్న పీజీహెచ్ఎంలకు మండల మాడల్ అధికారులుగా నియమించాలని డిమాండ్ చేశారు. పీజీహెచ్ఎంలు రచ్చ మురళి, ప్రశాంత్ రెడ్డి, సురేశ్రెడ్డి, నరేశ్, సందీప్ పాల్గొన్నారు. -
పంటపై రసాయన మందుల వాడకాన్ని నియంత్రించాలి
జక్రాన్పల్లి: పంటలపై రసాయన మందుల వాడకాన్ని నియంత్రించాలని వరి పరిశోధన స్థానం రుద్రూర్ కీటక శాస్త్రవేత్త సాయిచరణ్ సూచించారు. శుక్రవారం జక్రాన్పల్లి రైతు వేదికలో రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు యూరియాను సిఫారసు చేసిన మోతాదులోనే వినియోగించాలన్నారు. ఎక్కువగా వాడకం వల్ల పంటరసం పీల్చే పురుగులు, ఇతర వ్యాధులకు గురవుతుందని తెలిపారు. రైతులు విత్తన, పురుగుల మందులను కొన్నప్పుడు తప్పనిసరిగా రసీదు పొందాలన్నారు. ఎప్పటికప్పుడు పంట మార్పిడి చేసుకోవాలన్నారు. అందుబాటులో ఉన్న ఆధునిక పద్ధతులు ఉపయోగిస్తూ ఎక్కువ దిగుబడులు సాధించాలన్నారు. కార్యక్రమంలో ఏవో దేవిక, కోటపాటి నర్సింహానాయుడు, తిరుపతిరెడ్డి, ఏఈవోలు శ్రీకాంత్, శివప్రసాద్, శంకర్, సుభాష్య, రైతులు పాల్గొన్నారు. వ్యవసాయానికి విజ్ఞానాన్ని జోడిస్తేనే లాభాలు ఇందల్వాయి: మండలంలోని ఎల్లారెడ్డిపల్లె జీపీలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అనే కార్యక్రమాన్ని వ్యవసాయ అధికారులు శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో ఆదర్శ రైతులు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. వ్యవసాయంలో విజ్ఞానంతో కూడుకున్న అధునాతన పద్ధతులు రైతులు అవలంబించాలని, అందుకు క్రిమిసంహారక మందులు, రసాయనిక ఎరువులు తక్కువగా వాడాలని సూచించారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాల మేరకు యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడులు పొందాలన్నారు. కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం కో–ఆర్డినేటర్ డాక్టర్ టి అంజయ్య, నిజామాబాద్ రూరల్ ఏడీఏ ప్రదీప్ కుమార్, ఆహార శాస్త్రవేత్త అమల, మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు. -
దివ్యాంగులకు వీల్చైర్ల పంపిణీ
నిజామాబాద్నాగారం: రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని మారుతినగర్లో ఉన్న స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో దివ్యాంగులకు వీల్ చైర్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు లోక రమణరెడ్డి హాజరై మాట్లాడారు. స్నేహ సొసైటీ, రోటరీ క్లబ్ లాంటి సంస్థలు కష్టాల్లో ఉన్న వ్యక్తులను, దివ్యాంగులను గుర్తించి వారికి సేవ చేయడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ జేమ్స్ అధ్యక్షులు పద్మ శ్రీనివాస్, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, గౌరీ శంకర్, జ్యోతి, రంజిత్ సింగ్ చౌహన్, చంద్రశేఖర్, దివ్యాంగులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ధైర్యానికి నిలువెత్తు రూపం మహారాణా ప్రతాప్
సుభాష్నగర్: ధైర్యానికి, శౌర్యానికి, దేశభక్తికి నిలువెత్తు రూపం మహారాణా ప్రతాప్ అని, మొఘలుల నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాడిన భరతమాత ముద్దుబిడ్డ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కొనియాడారు. శుక్రవారం నగరంలోని ఎల్లమ్మగుట్టచౌరస్తాలో బొందిల రజక సంఘం ఆధ్వర్యంలో మహారాణా ప్రతాప్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా మహారాణా ప్రతాప్ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ధన్పాల్ మాట్లాడుతూ.. మహారాణా ప్రతాప్ సింగ్ విదేశీయులకుసైతం స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. అమెరికాపై రెండు దశాబ్దాల సుదీర్ఘపోరాటం తర్వాత విజయం సాధించిన వియత్నాం దేశాధ్యక్షుడు తమ గెలుపునకు మహారాణా ప్రతాప్ సింగ్ ప్రేరణదాయకమని పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. వియత్నాం విదేశాంగశాఖ మంత్రి దేశ పర్యటనకు వచ్చినప్పుడు ఉదయపూర్లో రాణా ప్రతాప్ సమాధిని దర్శించుకుని, అక్కడి నుంచి పిడికెడు మట్టిని తీసుకెళ్లి ఈ దేశ వీరత్వం మా దేశానికి కూడా అవసరముందని చెప్పారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు న్యాలం రాజు, రజక సంఘం నాయకులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ -
శాఖల మధ్య సమన్వయ లోపం..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ వన్యమృగాలకు డెత్ స్పాట్గా మారింది. దట్టమైన అటవీ ప్రాంతంలో మూగజీవాల రక్షణకు ఫారెస్ట్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడంలేదు. ముఖ్యంగా సాసర్ పిట్ల నిర్వహణ, వాటి ఏర్పాటులో అలసత్వం వన్యమృగాల పాలిట శాపంగా మారింది. దీనికితోడు అటవీ ప్రాంతంలో రైల్వేశాఖ, జాతీయ రహదారుల విభాగం అండర్ పాస్ల నిర్మాణం చేపట్టకపోవడంతో వన్యప్రాణులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నాయి. తాజాగా ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని చంద్రాయన్పల్లి శివారు 44వ నెంబర్ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని రెండేళ్ల వయస్సుగల చిరుత మృత్యువాత పడింది. ఈఘటనతో హైవేలు, రైల్వేట్రాక్ల వద్ద అండర్పాస్ల నిర్మాణం అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాకు ఇందల్వాయి రేంజ్ సదాశివనగర్, సిరికొండ రేంజ్కు మాచారెడ్డి మండలాలను కలుపుతూ అడవులున్నాయి. హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వెళ్లే 44వ నంబర్ జాతీయ రహదారి, సికింద్రాబాద్ నుంచి ముంబయి వెళ్లే రైల్వే ట్రాక్ ఈ అటవీ ప్రాంతం గుండా వెళ్తుంది. వేసవిలో అటవీ ప్రాంతంలో తాగునీటి కొరత ఏర్పడుతుంది. వాగులు, వంకలు, చెలిమెలు ఎండిపోతాయి. తద్వారా వన్యప్రాణులు దాహార్తిని తీర్చుకునేందుకు అటవీ ప్రాంతం నుంచి బయటికి వస్తుంటాయి. నీటి కోసం వెతుకుతూ హైవేలు, రైల్వేట్రాక్లు దాటుతుంటాయి. ఈ క్రమంలో రాత్రివేళల్లో చిరుతలు సహా ఇతర వన్యప్రాణులు, మృగాలు ప్రమాదాల బారిన పడుతున్నాయి. కొన్నిసార్లు మృతి చెందుతున్నాయి. నేషనల్ హైవే అధికారులను సంప్రదిస్తున్నాం.. ఇందల్వాయి, సదాశివనగర్ మధ్యలోగల నేషనల్ హైవే రహదారిపై చిరుతలు, ఇతర వన్య ప్రాణులు ప్రమాదాలకు ఎక్కువగా గురై మరణిస్తున్న విషయాన్ని నేషనల్ హైవే అథారిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. రహదారికి ఇరువైపులా ఫెన్సింగ్ వేయాలని, అలాగే రహదారి కింద అండర్ పాస్ బ్రిడ్జిలు నిర్మించాలని కోరాం. ఇలా చేస్తే వన్యప్రాణుల ప్రాణాలకు ముప్పు ఉండదని వివరించాం. నేషనల్ హైవే అథారిటీ సానుకూలంగా స్పందించారు. – వికాస్ మీనా, జిల్లా అటవీశాఖ అధికారి అటవీ ప్రాంతంలో వన్యమృగాల సంరక్షణకు అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. తద్వారా మూగజీవాల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. వీటి సంరక్షణ కోసం అటవీశాఖ, రైల్వేశాఖ, జాతీయరహదారుల విభాగం సమన్వయంతో చర్యలు చేపట్టాల్సి ఉంది. వీరి మధ్య సమన్వయ లోపం కారణంగా పనులు కార్యరూపం దాల్చడంలేదు. ముఖ్యంగా రైల్వేట్రాక్, జాతీయ రహదారులకు అండర్ పాస్ల నిర్మాణం చేపడితే ఈ ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది. కాగా ఈ విషయమై హైవే ఈఈ మల్లారెడ్డిని వివరణ కోరగా స్పందించలేదు. ● 2018 జనవరిలో రైలు ఢీకొనడంతో సిర్నాపల్లి అటవీ ప్రాంతంలో చిరుత మృతి. ● 2019 మేలో రూప్లానాయక్ తండా వద్ద జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో చిరుత మృతి. ● 2023 ఫిబ్రవరిలో చంద్రాయన్పల్లి అటవీ ప్రాంతంలో జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందిన చిరుత. ● తాజాగా 2025 మే 7న చంద్రాయన్పల్లి జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృత్యువాత. తాజాగా రోడ్డు ప్రమాదంలో చిరుత మృత్యువాత కనిపించని సంరక్షణ చర్యలు అండర్పాస్లు లేక తరచూ ప్రమాదాలు కొరవడిన రైల్వే, హైవే, అటవీ అధికారుల సమన్వయం -
ఎల్ఆర్ఎస్తో బల్దియాకు రూ.34.70 కోట్లు
తిరస్కరణకు కారణాలివే..నిజామాబాద్ సిటీ: లేఅవుట్ రెగ్యులేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్)తో ప్రభుత్వానికి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.34.70 కోట్ల ఆదాయం స మకూరింది. మొత్తం 33,793 దరఖాస్తులు రాగా అందులో 9,258 మంది ఫీజును చెల్లించారు. ఎల్ఆర్ఎస్ ద్వారా జీహెచ్ఎంసీ మినహా ఇతర మున్సిపాలిటీల్లో నిజామాబాద్ 8వ స్థానంలో నిలిచింది. రెండుసార్లు గడువు పొడిగింపు.. నాన్ లేఅవుట్ ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు గత ప్రభుత్వం 2016లో ఎల్ఆర్ఎస్ స్కీంను ప్రవేశపెట్టింది. కాగా, ప్రస్తుత ప్రభుత్వం సైతం స్కీంను ప్రవేశపెట్టి రెండు సార్లు గడువు పొడిగించింది. మొదట మార్చి 31 వరకు ఫీజుల చెల్లింపునకు అవకాశమివ్వగా, చివరగా ఈ నెల 3వరకు గడువిచ్చింది. కార్పొరేషన్ పరిధిలో ఎల్ఆర్ఎస్కు మొత్తం 33,793 మంది దరఖాస్తు చేసుకోగా, 9,258 మంది ఫీజును చెల్లించారు. వారిలో 5,372 మంది దరఖాస్తులు పరిశీలించి సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన వారికి అధికారులు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఇంకా 3,886 మందికి చెందిన దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. మొత్తం 33,793 దరఖాస్తులు 5,372 మందికి ప్రొసీడింగ్స్ గడువు ముగిసినట్లే ఎల్ఆర్ఎస్ స్కీం కోసం ప్ర భుత్వం ఇచ్చిన గడువు ఈ నెల 3తో ముగిసింది. సమ యం పొడిగించారని వస్తు న్న వార్తల్లో వాస్తవం లేదు. ఇప్పటి వరకు వచ్చిన దర ఖాస్తులను పరిశీలించి అన్ని ధ్రువీకరణ పత్రాలున్నవారికి ప్రొసీడింగ్స్ ఇచ్చాం. కొంతమందివి పెండింగ్లో ఉన్నాయి. సరైన పత్రాలు లేని, ప్రభుత్వ ని బంధనలకు విరుద్ధంగా ఉన్నవాటికి అనుమతివ్వలేదు. – తేరాల శ్రీనివాస్, అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారిఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరివి తిరస్కరణకు గురయ్యాయి. సరైన డాక్యుమెంట్లు లేకపోవడం, ప్లాట్ నాలాలు, మోరీల పక్కనే ఉండటం, ప్రభుత్వ స్థలంలో ప్లాట్లు ఉండటం, కోర్టు కేసుల్లో ఉన్న భూములు, మాస్టర్ ప్లాన్లోకి వచ్చే భూములు, పార్కు స్థలాలు, సరైన ఫీజు చెల్లించని వారి దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లు అధికారులు తెలిపారు. -
పెళ్లయిన తొమ్మిది నెలలకే..
మాచారెడ్డి : కామారెడ్డి జిల్లా పాల్వంచ మండ ల కేంద్రానికి చెందిన గ్రే హౌండ్స్ విభాగంలో ప నిచేస్తున్న కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ (30) ములు గు జిల్లా పేరూరు పోలీ సు స్టేషన్ పరిధి వాజేడు ఏరియాలో గురువా రం ఉదయం నక్సలైట్లుమందుపాతర పేల్చడంతో ప్రాణాలు కోల్పోయాడు. కామారెడ్డిలో డిగ్రీ పూర్తి చేసిన తరువాత 2020లో టీఎస్పీఎస్సీ పరీక్ష రాసి తొలి ప్రయత్నంలోనే ఏడో బెటాలియన్లో కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. అక్కడే శిక్షణ పూర్తి చేసుకున్న శ్రీధర్ రెండేళ్ల కిందట గ్రే హౌండ్స్ విభాగంలోకి వెళ్లాడు. హైదరాబాద్ కేంద్రంగా గ్రేహౌండ్స్ విభాగంలో పనిచేస్తున్నా డు. తల్లి లక్ష్మి, భార్య శ్రీవాణితో కలిసి అక్కడే ఉంటూ విధులకు హాజరవుతున్నాడు. నక్సల్స్ ఏరివేతలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ చేపట్టాయి. గ్రేహౌండ్స్ బృందంతో కలిసి కూంబింగ్ నిర్వహిస్తుండగా నక్స ల్స్ మందుపాతర పేల్చడంతో శ్రీధర్ మృతిచెందినట్టు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించా రు. కాగా శ్రీధర్కు 2024 ఆగస్టు 22న వివాహ మైంది. ఏడాది గడవకముందే శ్రీధర్ ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్తులు కంటతడిపెట్టారు. శ్రీధర్ తండ్రి గంగారాం కొన్నేళ్ల కిందట అనారోగ్యంతో చనిపోయాడు. పోలీసులు అందించిన సమాచారంతో శ్రీధర్ కుటుంబ సభ్యులు, గ్రా మస్తులు వరంగల్కు తరలివెళ్లారు. అక్కడ పోలీ సు అధికారులు శ్రీధర్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహం రాత్రి వరకు పాల్వంచకు చేరుకుంది.● నక్సల్స్ చేతిలో బలైన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ● పాల్వంచ మండల కేంద్రంలో విషాదం -
ముగిసిన యూనిసెఫ్ బృందం క్షేత్ర పర్యటన
నిజామాబాద్ నాగారం: జిల్లాలో యూనిసెఫ్ బృందం పర్యటన ముగిసింది. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయాన్ని గురువారం సందర్శించి పలు విషయాలపై చర్చించారు. యూనిసెఫ్ బృందం సభ్యులు న్యూట్రిషన్ స్పెషలిస్టు డాక్టర్ ఖ్యాతి తివారి, న్యూట్రిషన్ ఆఫీసర్ రేషా నికుంజ దేశాయి, నరసింహారావులు డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ తుకారం రాథోడ్తో సమీక్షించారు. మొదటిరోజు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తిర్మన్పల్లి, గన్నారం గ్రామాల్లో పర్యటించి పోషకాహార లోపంతో బాధపడే చిన్నారులకు అందించే సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇందల్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఆరోగ్య ఉప కేంద్రాల పనితీరును మెచ్చుకున్నారు. కార్యక్రమంలో భాగంగా వచ్చే నెలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులకు సామ్ మామ్ చిల్డ్రన్స్కు అందించే స్పెషల్ సప్లమెంటరీ ఫీడింగ్పై శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపరింటెండెంట్ ఇందిరా, న్యూట్రిషన్ విభాగం అధికారి రాంబాబు హాజరయ్యారు. మెనూ ప్రకారం భోజనం అందించాలి బోధన్టౌన్(బోధన్): నిర్దేశిత మెనూ ప్రకారం రోగులకు భోజనాన్ని అందించాలని జిల్లా డైట్ టాస్క్ఫోర్స్ బృందం అధికారులు సూచించారు. బోధన్లోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో జిల్లా డైట్ టాస్క్ఫోర్స్ బృందం గురువారం భోజనాన్ని తనిఖీ చేసింది. వంట గదితోపాటు కూరగాయలను పరిశీలించారు. వైద్యం కోసం వచ్చి అడ్మిట్ ఉన్న రోగులకు అందిస్తున్న భోజన మెనూ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోగుల వద్దకు వెళ్లి నాణ్యమైన భోజనం అందిస్తున్నారా అని వాకబు చేశారు. తనిఖీల్లో డాక్టర్ వెంకటేశ్, పోగ్రాం అధికారి నారాయణ, సిబ్బంది ఉన్నారు. బ్యాంకు లింకేజీలో జిల్లాకు ఉత్తమ అవార్డు ● మంత్రి సీతక్క చేతుల మీదుగా అవార్డు అందుకున్న డీఆర్డీవో డొంకేశ్వర్(ఆర్మూర్): మహిళా సంఘాలకు లక్ష్యానికి మించి బ్యాంకు లింకేజీ రుణాలు అందజేసినందుకు నిజామాబాద్ జిల్లాకు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు లభించింది. హైదరాబాద్లో గురువారం జరిగిన నూతన వార్షిక ప్రణాళిక ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి సీతక్క చేతుల మీదుగా డీఆర్డీవో సాయాగౌడ్ అవార్డును అందుకున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు రూ.1228.71 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యం ఉండగా, ఇప్పటి వరకు 16,060 మహిళా సంఘాలకు రూ.1320.73 కోట్ల రుణాలను (107.49 శాతం) అందించారు. డీపీఎం నీలిమాకు ఉత్తమ ఎంప్లాయీ అవార్డు కూడా వచ్చింది. రూ.30వేలకు చేరువలో ఆమ్చూర్ సుభాష్నగర్ : నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్యార్డులో ఆమ్చూర్ ధర అమాంతం పెరిగి రూ.30 వేలకు చేరుకుంది. గురువారం క్వింటాలుకు రూ.29,500 పలికి ఈ సీజన్లో అత్యధిక ధరగా నమోదైంది. బుధవారం వరకు రూ.25 వేలకు దిగువన పలికిన ఆమ్చూర్ ఏకంగా రూ.5వేలు పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. మార్కెట్యార్డుకు గురువారం 223 క్వింటాళ్ల పంట వచ్చింది. జిల్లాతోపాటు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, మహబూబ్నగర్, కామారెడ్డి, ఇతర జిల్లాల నుంచి ఆమ్చూర్ను శ్రద్ధానంద్ గంజ్కు తీసుకొస్తారు. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా నిజామాబాద్ మార్కెట్ యార్డులోనే ఆమ్చూర్ పంట క్రయవిక్రయాలు జరుగుతాయి. -
వచ్చే నెల 14న జాతీయ లోక్అదాలత్
ఖలీల్వాడి: జిల్లా వ్యాప్తంగా జూన్ 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యా యసేవాధికార సంస్థ చైర్ పర్సన్ జీవీఎన్ భరతలక్ష్మి కోరారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని సమావేశపు హాల్లో అదనపు జిల్లా జడ్జి హరీష, న్యాయసే వా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ భాస్కర్ రావులతో కలిసి గురువారం బీమా కంపెనీల స్టాండింగ్ కౌన్సిల్స్, అధికారులు, న్యాయవాదులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ యాక్సిడెంట్ కేసులలో నష్టపరిహారంపై బీమా కంపెనీలు, న్యా యవాదులు పరిష్కారించుకోవాలని, అందుకు స హాయ సహకారం అందిస్తామన్నారు. లోక్ అదాలత్లో రాజీపద్ధతిన అవార్డులు అందుకున్న దావాలలో బీమా కంపెనీల ద్వారా త్వరితగతిన నష్టపరిహార డబ్బులను కోర్టులో డిపాజిట్ చేయిస్తామని తెలిపారు. బాధితులకు చేరితే వారి ఆర్థిక అవసరాలకు పనికొస్తుందన్నారు. సమావేశంలో ప్రభుత్వ బీమా కంపెనీల న్యాయవాదులు గోవర్ధన్, ఆనంద్ రెడ్డి, అంకిత, గణేశ్ దేశ్పాండే, ఎంవీ నరసింహారావు, వీ భాస్కర్, ఆర్ మోహన్, సదానంద్ గౌడ్, న్యాయవాదులు రఘువీర్ భూపాల్, రవీందర్, మహేశ్, కృష్ణారెడ్డి, శ్రీనివాస్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ లాలూ వంకదోథ్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. బీమా కంపెనీలు, న్యాయవాదులు సహకరించాలి జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి -
ఏదీ.. వ్యవసాయ యాంత్రీకరణ!
ఇందల్వాయి(నిజామాబాద్ రూరల్): సాగులో యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభు త్వం పునరుద్ధరించిన వ్యవసాయ యాంత్రీకరణ ప థకం జాడ తెలియడం లేదు. వ్యవసాయంలో యంత్రాల వినియోగాన్ని పెంచి అన్నదాతలకు కూలీల ఖర్చు భారాన్ని, సమయాన్ని ఆదా చేయాలనే ఉద్దే శంతో ప్రవేశపెట్టిన ఈ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. మార్చి చివరి వారంలో ప్రారంభించిన ఈ పథకానికి సరైన విధి విధానాలు లేక ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం మహిళా రైతులకు పెద్దపీ ట వేస్తూ సాగుకు ఉపయోగపడే యంత్రాలను రా యితీపై అందజేసేందుకు మార్చి నెలాఖరుకల్లా ద రఖాస్తులు స్వీకరించి లబ్ధిదారులను ఎంపిక చేయా లని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే సంబంధిత శాఖ అధికారులు ఈ పథకంపై సరైన ప్ర చారం చేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విధి విధానాలు లేక ముందుకు సాగని పథకం జిల్లాకు రూ.117.84 లక్షలు మంజూరు నెల రోజులైనా పూర్తికాని లబ్ధిదారుల ఎంపికనిరుపయోగంగా బడ్జెట్ వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు అత్యధికంగా 534 పరికరాలు అందించేందుకు రూ.117.84 లక్షలు బడ్జెట్ కేటాయించింది. పథకంపై ప్రచారం, అవగాహన లేకపోవడంతో చాలా మంది ఆశావహులు, అర్హులు దరఖాస్తులు చేసుకోలేదు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా కేవలం 50 పైగా మాత్రమే దరఖాస్తులు రావడాన్ని చూస్తే రైతులకు ఈ పథకంపై ఎంతమేరకు అవగాహన కల్పించారో తెలుస్తోంది. మరోవైపు ఈ పథకాన్ని ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో ప్రకటించడంతో గత ఆర్థిక సంవత్సర నిధులు ఈ సంవత్సరానికి క్యారీ ఓవర్ కావట్లేదని అధికారులు చెబుతున్నారు. సాంకేతిక కారణాలతో వచ్చిన దరఖాస్తులు కూడా ఆన్లైన్ కావట్లేదని, నిధులు క్యారీ ఓవర్ పూర్తయి ఆన్లైన్ ప్రక్రియ సజావుగా సాగితేనే లబ్ధిదారులను ఎంపిక చేసి పథకాన్ని అమలు చేసేందుకు వీలవుతుందని చెబుతున్నారు. మొత్తం మీద ఈ పథకం అమలుపై స్తబ్ధత నెలకొందని సంబంధిత శాఖ అధికారులు చెప్పడం విశేషం. -
ఎండలతో జీవాలకు ముప్పు
డొంకేశ్వర్(ఆర్మూర్): తీవ్రమైన ఎండలతో పాటు వడగాలుల ప్రభావంతో ప్రజలతోపాటు మూగ జీవాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనుషులకు ఎండదెబ్బ తలుగుతోంది. అలాంటిది బయట మేతకోసం సంచరించే పశువు లు, గొర్రెలు, మేకలతో పాటు పక్షులు ఎంత అల్లాడుతున్నాయో చెప్పనక్కర్లేదు. మండుతున్న ఎండల బారినుంచి మూగ జీవాలను ఏ విధంగా కాపాడుకోవాలో గురువారం పశుసంవర్ధక శాఖ జిల్లా ఇ న్చార్జి అధికారి రోహిత్ రెడ్డి ‘సాక్షి’కి వివరించారు. ● గొర్రెలు, మేకలు, గేదెలు, ఆవులను ఎక్కువగా ఎండలో తిప్పకూడదు. వీలైనంత వరకు చల్లని ప్రాంతాల్లో, నీడపట్టున ఉంచాలి. ఇంటి వద్ద రేకుల షెడ్డు ఉన్న వారు పైన వరిగడ్డి ఉంచితే వేడి ప్రభావం తక్కువగా ఉంటుంది. వీలైతే ఫ్యాన్లు కూడా పెట్టుకోవాలి. ● మేతను ఎక్కువగా ఇంటి వద్దే అందించేలా ఏర్పాట్లు చేసుకోవాలి. బయటకు తీసుకెళ్లడం తప్పనిసరైతే, ఉదయం 6 నుంచి 10 గంటల్లోపు తీసుకెళ్లాలి. మళ్లీ సాయంత్రం 5 దాటిన తర్వాత మరోసారి మేతకు తీసుకెళ్లాలి. ● వేసవిలో పశువులు ఎక్కువ మొతాదులో నీటిని తాగుతాయి. వాటికి సరిపడా చల్లని, శుభ్రమైన నీటిని అందించాలి. ఒక్కో గేదె 50 లీటర్ల నీళ్లు తాగేలా చూడాలి. మేత, దానా పచ్చి రూపంలో అందిస్తే బాగుటుంది. ● జంతు ప్రేమికులు వారి ఇళ్లలో పెంచుకునే కుక్కలు, పిల్లుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఎల్లప్పుడు నీడ పట్టున ఉంచి క్రమం తప్పకుండా ఆహారం, నీటిని అందించాలి. పక్షుల కోసం ఇంటి బయట గిన్నెలు, పాత్రల్లో నీటిని పోసి ఉంచాలి. ● ఒకవేళ పశువులు, గొర్రెలు, మేకలు, పెంపుడు కుక్కలు ఎండ ప్రభావానికి, ఎండదెబ్బకు గురైతే వాటి శరీరం వేడిగా, పొడిబారి ఉంటుంది. వెంటనే తడిబట్టతో తుడవాలి, లేదా కప్పి ఉంచాలి. ● జీవాల ఆరోగ్యం క్షీణిస్తే వెంటనే స్థానిక పశువైద్య అధికారులకు సమాచారం అందించాలి. వారు వెంటనే వచ్చి చికిత్స అందిస్తారు. పశువులు, గొర్రెలను నీడపట్టున ఉంచాలి ఉదయం, సాయంత్రం వేళల్లో మేతకు తీసుకెళ్లడం మేలు పశు పెంపకందారులకు పశుసంవర్ధక శాఖ జిల్లా ఇన్చార్జి రోహిత్రెడ్డి సూచన -
మార్పులు, చేర్పులకే ప్రాధాన్యం
మోర్తాడ్(బాల్కొండ): కొత్త రేషన్ కార్డుల జారీ కోసం చేపట్టిన సర్వే నత్తనడకన సాగుతుంది. పాత కార్డులలో పేర్లు చేర్చడం, ఏవైనా మార్పు లు చేర్పులు చేయడం కోసం వచ్చిన దరఖాస్తులకే ప్రభుత్వ యంత్రాంగం ప్రాధాన్యత ఇస్తుంది. రేషన్కార్డులు పొందడానికి అర్హులై ఉండి ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న వారికి కొంతకాలం ఎదురు చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎంపిక చేసిన గ్రామాల్లోనే.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రకటనలు చేస్తున్నా ఆచరణలో మాత్రం ముందుకుసాగడం లేదు. గడచిన గణతంత్ర దినోత్సవం రోజున జిల్లాలో ఎంపిక చేసిన 31 గ్రామాలలోనే కొత్త రేషన్ కార్డుల జారీ చేశారు. మిగిలిన గ్రామాలలో కార్డులను జారీ చేయాల్సి ఉండగా సర్వే నిర్వహించాలని అధికారులను ప్రభుత్వం నిర్దేశించింది. ప్రజాపాలనలోనూ, మీ సేవా కేంద్రాల్లో ఆన్లైన్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి వెళ్లి అధికారులు సర్వే నిర్వహించనున్నారు. రెవెన్యూ విభాగంలోని జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ సిబ్బంది నుంచి ఇతర హోదాల ఉద్యోగుల వరకూ ఇంటింటి సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఈ సర్వేలో తొలి ప్రాధాన్యతగా కార్డులలో అదనపు పేర్లు నమోదు చేయడం తప్పా మరే ఇతర అంశాలను లెక్కలోకి తీసుకోవడం లేదు. పెండింగ్లో 77వేలకు పైగా దరఖాస్తులు దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి రేషన్ కార్డులలో కుటుంబ సభ్యులను చేర్చడం చేయలేదు. మరణించిన వారి పేర్లు తొలగించినా పు ట్టిన వారి పేర్లు చేర్చడం, పెళ్లి చేసుకుని అత్తారింటికి వచ్చిన యువతుల పేర్లు నమోదు చే యడం, ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు, దే శాలకు వలస వెళ్లిన వారి పేర్లు తొలగించగా వా రిని మళ్లి చేర్చడం అసలే జరుగలేదు. అలా పే ర్లు నమోదు చేయాలని వచ్చిన దరఖాస్తులు జి ల్లా వ్యాప్తంగా 77,758 వరకూ పెండింగ్లో ఉ న్నాయి. పౌర సరఫరాల శాఖ వెబ్పోర్టల్ బ్లాక్ చేసి ఉండటంతో ఇంకా అనేక మంది ద రఖాస్తు చేసుకోవాలని ఆసక్తి చూపినా వారికి ఇ టీవలనే పేర్ల నమోదుకు అవకాశం ఏర్పడింది. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న దరఖాస్తులు ప రిష్కరించడానికి ఇప్పుడు మార్గం సుమగమైంది. నత్తనడకన సాగుతున్న కొత్త రేషన్ కార్డుల సర్వే నూతన కార్డుల జారీకి తీవ్ర జాప్యం కొత్త కార్డుల కోసం 80వేలకు పైగా దరఖాస్తులు.. కొత్తగా కార్డులు కావాలని జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలనలో 81,148 కుటుంబాల నుంచి ఆర్జీలు అధికారులకు అందాయి. జనవరి 26న తొలి విడతగా 1066 కుటుంబాలకు కొత్త కార్డులను అధికారులు, ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. మరో 80వేలకు మించి దరఖాస్తులను పరిశీలించి కొత్త కా ర్డులను జారీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం రే షన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయడం, సంక్షేమ పథకాల అమలుకు రేష న్ కార్డు ప్రామాణికం కావడంతో కార్డులు లేనివారు భారీగా దరఖాస్తు చేస్తున్నారు. జారీ చేసే కార్డుల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశా లు అందాయి. అనర్హులకు కార్డులు జారీ చే స్తే ఉద్యోగులను ఇంటికి పంపిస్తామని హెచ్చరికలు సైతం జారీ చేశారు. అనర్హులకు కార్డులు జారీ చేయకూడదనే నిబంధన పాటించడం మంచిదే కానీ అర్హులైన వారికి మాత్రం కార్డులను జారీ చేయడంలో జాప్యం వద్దనే అభిప్రాయం వ్యక్తం అవు తుంది. సర్వే కొనసాగుతుంది.. రేషన్ కార్డులలో మార్పులు, చేర్పులు, కొత్త కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులకు సంబంధించి సర్వే కొనసాగుతుంది. తొలి విడతగా మార్పులు చేర్పులపై ఉద్యోగులు వివరాలను సేకరిస్తున్నారు. కొత్త కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన కూడా త్వరలో పూర్తి చేస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. – కృష్ణ, తహసీల్దార్, మోర్తాడ్ -
సహకార వ్యవస్థ ముఖ్యమైంది
డొంకేశ్వర్(ఆర్మూర్): సొసైటీలో సహకార సంఘాల వ్యవస్థ, పాత్ర ముఖ్యమైనదిగా మారిందని డీసీవో శ్రీనివాస్ రావు అన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని పురస్కరించుకొని గురువారం నగరంలోని సుభాష్నగర్ ప్రభుత్వ ఉద్యోగుల హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ భవనంలో సమావేశం నిర్వహించారు. డీసీవో ముఖ్య అతిథిగా హాజరై, సహకార చట్టం, పాలనపై సభ్యులకు అవగాహన కల్పించారు. సొసైటీ సభ్యులు శంకర్రెడ్డి, దత్తాత్రేయ, ప్రభాకర్రెడ్డి, జగత్రెడ్డి, కోటేశ్వర్ రావు పాల్గొన్నారు. మండుటెండలోనూ పచ్చగా పంటపొలాలు డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లా వ్యాప్తంగా వరికోతలు దాదాపు పూర్తయ్యాయి. పంటను అమ్ముకుని రైతులంతా ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు. కానీ డొంకేశ్వర్ మండలంలో గోదావరి శివారు ప్రాంతాల్లో కోతకు రాని పొలాలు ఇంకా ఉన్నాయి. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ తగ్గడంతో రైతులు ఇటీవల వరిసాగు చేశారు. మండు వేసవిలో కూడా పచ్చదనంతో పొలాలు కళకళలాడుతున్నాయి. పొట్టదశలో ఉన్న వరికి రైతులు కష్టపడి నీటిని అందిస్తున్నారు. మండుటెండల్లోనూ పచ్చని పొలాల ను చూసి స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. -
పత్రికా స్వేచ్ఛకు గొడ్డలి పెట్టు
కామారెడ్డి టౌన్: ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ధ నుంజయ్రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసుల వేధింపులను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో జ ర్నలిస్టులు గురువారం నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టర్ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్నాయక్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మున్సిపల్ కా ర్యాలయం ప్రాంతంలో ఉన్న అంబేడ్కర్ విగ్ర హం వద్ద కొవ్వొత్తులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ప్రజల పక్షాన వార్తలు రాస్తున్న ‘సాక్షి’ దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం సిగ్గుచేటని సీనియర్ జర్నలిస్టులు వేణుగోపాలచారి, రజనీకాంత్, శ్రీనివాస్ తదితరులు మండిపడ్డారు. సాక్షి ఎడిటర్పై దాడి, అక్రమ కేసులు, ఆయన ఇంట్లో సోదాలు ప్రత్రికా స్వేచ్ఛకు గొడ్డలి పెట్టుఅని అన్నారు. కక్షపూరిత మైన చర్యలను మానుకోనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. జర్నలిస్టులు పట్నం శ్రీనివాస్, శ్రీనివాస్రెడ్డి, ఆబీద్, అ ర్షద్, వెంకటేశ్, రాజేశ్, రమేశ్, సంగరాజు, అన్వ ర్, ప్రభు, సురేశ్, కౌసర్, హరీశ్ పాల్గొన్నారు.లైసెన్స్డ్ ల్యాండ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం నిజామాబాద్ అర్బన్: లైసెన్స్డ్ ల్యాండ్ సర్వేయర్ల శిక్షణకు ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మీ సేవా కేంద్రాల్లో ఈ నెల 17లోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భూ భారతి చట్టం అమలులో భాగంగా సర్వే, ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో అర్హత కలిగిన సర్వేయర్లు సరిపడా సంఖ్యలో లేనందున, 2025–26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను ఎంపిక చేసి, వారికి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. లైసెన్సు సర్వేయర్గా ఎంపికై న వారు నెలకు సుమారు రూ.30 వేలకు పైగా ఆదాయం పొందేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ సూచించారు. లైసెన్స్ సర్వేయర్గా ఎంపికై న వారికి జిల్లా కేంద్రంలో ఈ నెల 26 నుంచి జూలై 26 వరకు శిక్షణ అందిస్తామన్నారు. అనంతరం నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి లైసెన్స్ ఇస్తామన్నారు. శిక్షణ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 17.05.2025 నాటికి ఓసీ, బీసీలు అయితే 18 నుంచి 35 సంవత్సరాల లోపు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 18 నుంచి 40 సంవత్సరాల లోపు వయస్సు, ఇంటర్, డిప్లొమా సివిల్ ట్రేడ్, వొకేషనల్, నిర్దేశిత కోర్సులు చదివిన వారు అర్హులని తెలిపారు. శిక్షణ కోసం ఓసీ అభ్యర్థులు రూ. 10 వేలు, బీసీలు రూ. 5 వేలు, ఎస్సీ/ఎస్టీలు రూ. 2,500 రుసుము చెల్లించాలని పేర్కొన్నారు. ● ‘సాక్షి‘ ఎడిటర్ ధనుంజయ్రెడ్డిపై ఏపీ ప్రభుత్వం వేధింపులు ● కామారెడ్డిలో జర్నలిస్టుల నిరసన -
భారత సైన్యానికి అభినందనలు
డిచ్పల్లి: ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపి, ఉగ్రవాదులను హతమార్చిన భారత సైన్యానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి అభినందనలు తెలిపారు. ఈ దాడిని ప్రపంచ దేశాలతోపాటు భారత్లోని ముస్లిం మతపెద్దలు సమర్థించడం అభినందనీయమన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కాశ్మీర్లోని పహల్గాంలో హిందువులను ఉగ్రవాదులు దారుణంగా చంపారన్నారు. ఈ ఘటనపై ప్రతీకారంగా పాకిస్తాన్లో ఉగ్రవాదులను మట్టుబెట్టి భారతదేశ జెండాను, భారతదేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల నలుమూలల గర్వించేలా చేశారని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ లాంటి దేశాలకు ఇది కనువిప్పు కావాలన్నారు. ఏ దేశంలో కూడా ఉగ్రవాదంతో ప్రజల జీవితాలు బాగుపడిన దాఖలాలు లేవన్నారు. భారత సైన్యాన్ని, ప్రధాని మోదీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రకాంత్, బీజేవైం జిల్లా అధ్యక్షుడు పానుగంటి సతీష్రెడ్డి, నాయకులు శ్యాంరావు, గంగారెడ్డి, బాలయ్య, లక్ష్మణ్, విఠల్, పరుశురాం, వినోద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
నల్ల మట్టి మోతాదు మించొద్దు
బాల్కొండ: భూసారం పెంచడం కోసం రైతులు నల్లమట్టిని విచ్చలవిడిగా పంట భూముల్లో వేస్తున్నారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో చెరువులు, ప్రాజెక్టుల్లో నీరు తగ్గుముఖం పట్టి నల్ల మట్టి వస్తోంది. ప్రధానంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నిలిచే ప్రాంతం నుంచి అధికంగా నల్లమట్టి లభిస్తుంది. ఈక్రమంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని భావించి రైతులు నల్ల మట్టిని తరలిస్తున్నారు. ఎకరానికి 60 నుంచి 75 టన్నుల నల్ల మట్టిని వేస్తున్నారు. ఒక డంపర్ 12వేల ధర పెట్టి ఎకరంలో మూడు డంపర్ల నల్ల మట్టిని వేస్తున్నారు. దీంతో రైతులకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది. కానీ ఎక్కువగా నల్ల మట్టి వేయడంతో నేలకు నష్టం కలుగుతుందని బాల్కొండ ఏవో బద్దం లావణ్య హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా పసుపు పంటను సాగు చేసే నేలల్లోనే ఎక్కువగా నల్ల మట్టిని వేస్తున్నారు. నేల రకాలను బట్టి నల్లమట్టి గుణం మారుతుందంటున్నారు. ● నల్ల మట్టి ఎక్కువ వేయడం వలన నేలలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో పసుపు పంటకు దుంపకుళ్లు సోకే ప్రమాదం ఉంటుంది. ● ఎకరానికి 20–25 టన్నులు మాత్రమే నల్ల మట్టి వేసుకోవాలి. ● నల్లమట్టి ఎక్కువ కావడం వలన నేల దిబ్బ పారుతుంది. దీంతో పంట వేర్లు లోపలికి వెళ్లకుండా అడ్డు పడుతుంది. ● నల్ల మట్టి అధికంగా ఉండటంతో కలుపు మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. ● పొలాల్లో నీటి పారుదల సరిగా ఉండదు. నీరు నిల్వ ఉండటం వల్ల పంట అంతటికి అందకుండా పోతుంది. ● నల్లమట్టి వేసిన నేలల్లో కొన్ని మొక్కలు సరిగ్గా పెరగవు. ● భూమి సారవంతం కూడ తగ్గిపోయే ప్రమాదం ఉంది. ● ప్రధానంగా నల్లమట్టి పత్తి సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఇతర పంటలకు అంతగా అనుకూలమైంది కాదు. పంట భూమిలో విచ్చలవిడిగ వేస్తున్న అన్నదాతలు మోతాదు కంటే ఎక్కువగా వేస్తే తిప్పలు తప్పవంటున్న అధికారులు -
ప్రభుత్వ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పెంచాలి
నిజామాబాద్అర్బన్: ప్రభుత్వ విద్యా సంస్థల్లో అడ్మిషన్లను భారీగా పెంచడానికి అందరూ సమన్వయంతో కృషి చేయాలని అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. నగరంలోని కలెక్టరేట్లో గురువారం మధ్యాహ్నం జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలలు, బడుల్లో అడ్మిషన్లను పెంచడంతోపాటు, రానున్న సప్లమెంటరీ పరీక్షలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని హెచ్ఎం, ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలను సాధించేందుకు కృషి చేయడం జరిగిందన్నారు. ఫలితాల సాధనలో 90 రోజుల ప్రణాళికలను అమలు చేశామని అలాగే ప్రస్తుత సప్లిమెంటరీ పరీక్షలకు 15 రోజుల ప్రణాళిక ద్వారా 100 శాతం ఫలితాలను సాధించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. కొన్ని గ్రామాలకు ఇప్పటికీ ఆర్టీసీ బస్ సౌకర్యం లేదని, మారుమూల గ్రామీణ ప్రాంతాలకు బస్సులు నడిపినట్లయితే అడ్మిషన్ల సంఖ్య పెరుగుతుందన్నారు. ప్రభుత్వ అనుమతి లేని కళాశాలలో విద్యార్థులను చేర్పించవద్దని విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. జిల్లావిద్యాశాఖ అధికారి అశోక్, ఆర్టీసీ అధికారులు, ఫైర్ ఆఫీసర్, ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టల్ సంబంధిత అధికారులు, జిల్లా ఇంటర్ విద్య పరీక్ష నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, రజియుద్దీన్ అస్లాం తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంత్రెడ్డి వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం
కమ్మర్పల్లి: సీఎం రేవంత్రెడ్డిపై బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి ఆరోపించారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో గురువారం ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థికంగా దివాలా చేసి, మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రశాంత్రెడ్డి ఎప్పుడు మాట్లాడినా ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప, సలహాలు సూచనలు ఇచ్చింది లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, ఇతర అన్ని వ్యవస్థలను బీఆర్ఎస్ నిర్వీర్యం చేసిందన్నారు. దానిని కాంగ్రెస్ ప్రభుత్వం సరిచేస్తూ ముందుకు వెళ్తుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం అవుతున్నప్పుడు మంత్రులుగా ఉన్న హరీష్రావు, ప్రశాంత్రెడ్డి ఎందుకు బాధ్యత తీసుకోలేదని ప్రశ్నించారు. ఆయనకు ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం ఏ విషయంలో విఫలమైందో చెప్పాలనుకుంటే చర్చకు వేదిక నిర్ణయించి తెలుపాలన్నారు. అందుకు తాము సిద్దంగా ఉన్నామని మానాల సవాలు విసిరారు. ఎన్ఎస్యూఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, కమ్మర్పల్లి ఏఎంసీ చైర్మన్ పాలెం నర్సయ్య, వైస్చైర్మన్ భూచయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకెట రవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగాప్రసాద్, కిసాన్సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు పడిగెల ప్రవీణ్, మల్లయ్య, సుంకెట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కామారెడ్డి విద్యార్థే!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా నియమితులైన ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్ జి.చంద్రశేఖర్రెడ్డి కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పూర్వ విద్యార్థి. ఆయన 1982 –85 లో ఇక్కడ బీఎస్సీ ఫా రెస్ట్రీ కోర్సు చదివారు. కళాశాల అలుమ్నికి పలుమార్లు హాజరయ్యారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బోర్గావ్ గ్రామానికి చెందిన చంద్రశేఖర్రెడ్డి.. అప్పట్లో కామారెడ్డిలో స్నేహితులతో కలిసి అద్దె ఇంట్లో ఉంటూ బీఎస్సీ ఫారెస్ట్రీ పూర్తి చేశారు. కా మారెడ్డిలో ఆయనకు చాలామంది మిత్రులున్నారు. డిగ్రీ పూర్తయ్యాక ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి లైఫ్ సైన్సెస్ లో పీజీ చేశారు. 1991లో ఐఎఫ్ఎస్ అధికారిగా ఎంపికై వివిధ ప్రాంతాల్లో పనిచేశారు.నేడు జిల్లాస్థాయి చెస్ ఎంపిక పోటీలు నిజామాబాద్నాగారం: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ – 7, 9, 11 బాలబాలికల విభాగంలో జిల్లాస్థాయి ఎంపిక పోటీలను నగరంలోని అభ్యాస స్కూల్లో బుధవారం నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకుల రమేశ్, ఆరుట్ల రమేశ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 2018 జనవరి 1 తరువాత జన్మించిన వారు అండర్ – 7 విభాగంలో, 2016 జనవరి 1 తరువాత జన్మించిన వారు అండర్ – 9 విభాగంలో, 2014 జనవరి 1 తరువాత జన్మించిన వారు అండర్ – 11 విభాగంలో ఎంపిక పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని వివరించారు. మరిన్ని వివరాలకు 94400 07004 నంబర్ను సంప్రదించాలని సూచించారు. ఎంఎల్హెచ్పీలకు బ్రిడ్జి కోర్సు ప్రారంభం నిజామాబాద్ నాగారం: నిజామాబాద్, కా మారెడ్డి జిల్లాల్లో నూతనంగా నియామకమైన ఎంఎల్హెచ్పీ లకు మూడు నెలల బ్రిడ్జి కోర్సును జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ బి రాజశ్రీ మంగళవారం ప్రా రంభించారు. ఆమె మాట్లాడుతూ.. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఎంఎల్హెచ్పీ లకు వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, మాతా శిశు సంరక్షణ, జాతీయ వ్యా ధి నిరోధక టీకాల కార్యక్రమం, ప్రజారో గ్యం కుటుంబ సంక్షేమం, జీవనశైలి వ్యాధు లు, ప్రజారోగ్య పరిరక్షణ, ఆరోగ్య కార్యక్రమాల ఆన్లైన్ ఎంట్రీ, పీసీపీఎన్డీటీ, జాతీయ ఆరోగ్య మిషన్ అంశాలపై మూడు నెలలు పాటు శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగే శి క్షణ కార్యక్రమానికి ఎంపికై న ఎంఎల్హెచ్పీ లు క్రమం తప్పకుండా హాజరుకావాలన్నా రు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రాజు, డీహెచ్ఈ వేణుగోపాల్ పాల్గొన్నారు. వరల్డ్ యూనివర్సిటీ చాంపియన్ షిప్నకు ఎంపికనిజామాబాద్ నాగారం: ఆల్ ఇండియా యూనివర్సిటీ సెలక్షన్ ట్రయల్స్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ చాంపియన్ షిప్ స్విమ్మింగ్ పోటీలకు జిల్లాకు చెందిన రిత్విక ఎంపికై ంది. గత నెల 24, 25 తేదీల్లో కర్నాటక రాష్ట్రంలో నిర్వహించిన ఆల్ ఇండియా యూనివర్సిటీ స్విమ్మింగ్ పోటీల్లో రిత్విక ఉత్తమ ప్రతిభ కనబర్చి 50 మీటర్ల బెస్ట్ స్ట్రోక్ స్విమ్మింగ్లో బంగారు పతకం సాధించింది. దేశం తరఫున వరల్డ్ యూనివర్సిటీ చాంపియన్షిప్ – 2025 పోటీలకు ఎంపికై న రిత్విక జర్మనీ దేశంలోని బెర్లిన్ నగరంలో జులై 16 నుంచి 27వ తేదీ వరకు జరగను న్న పోటీల్లో పాల్గొననుంది.రిత్వికను మెదక్ ఎంపీ రఘునందన్రావు, నిజామాబాద్ అ ర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ అఽ ద్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, కార్యదర్శి ఉమే శ్, ఉపాధ్యక్షులు జి మహిపాల్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గడీల శ్రీరాములు, కార్యవర్గ సభ్యులు కర్నాటక శ్రీనివాస్, శ్యాంసుందర్రెడ్డి, లక్ష్మీనారాయణ, ముత్యాల శ్రీనివాస్, రాగిణి తదితరులు అభినందించారు. -
ఔషధ గుణాల తాటిముంజ
ఔషధ గుణాలు కలిగి ఉన్న తాటిముంజల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. 63వ నంబర్ జాతీయ రహదారికి ఇరువైపులా గీత కార్మికుల కుటుంబాలకు చెందిన మహిళలు ముంజలు విక్రయిస్తున్నారు. డజన్ ముంజల ధర రూ.వంద పలుకుతోంది. తాటి కల్లు తరహాలోనే ముంజలకు సైతం ఔషధ గుణాలు ఉంటాయని మన పూర్వీకులతోపాటు వైద్యులు సైతం పేర్కొంటున్నారు. మానవ శరీరంలోని టాక్సిన్ను వదిలించుకోవడానికి తాటి ముంజలు సహాయ పడతాయని, శరీర సహజ ఉష్ణోగ్రత నిర్వహణకు సహాయపడుతాయంటున్నారు. బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి తాటిముంజలు చక్కని ఫలహారం. ఆటలమ్మ వంటివి సోకినప్పుడు శరీరంపై ఏర్పడే పుండ్లపై తాటి ముంజల నీటిని పట్టిస్తే దురద తగ్గి అవి త్వరగా మానిపోతాయి. కొన్ని ప్రాంతాల్లో తాటి ముంజలతో శీతల పానీయాలను కూడా తయారు చేస్తారు. తమిళనాడులో తాటిముంజల పానీయాన్ని ‘ఎలనీర్ నుంగు’ అంటారు. – ఆర్మూర్పుష్కలంగా విటమిన్లు, ఖనిజ లవణాలు మూడు తాటి ముంజలు తింటే ఒక కొబ్బరి బొండం తాగినంత ఫలితం ఉంటుంది.లేత తాటి ముంజల్లో దాదాపు ఎనభై శాతానికి పైగా నీరే ఉంటుంది. వీటిలో విటమి న్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. తాటి ముంజలు వేడిమి నుంచి సైతం రక్షణ కల్పిస్తాయి. 100 గ్రాముల ముంజల్లో 43 కేలరీలు ఉంటాయి. – డాక్టర్ రమేశ్, డిప్యూటీ డీఎంహెచ్వో, ఆర్మూర్ -
మోడిఫైడ్ న్యూసెన్స్
మోడిఫైడ్ సైలెన్సర్లను వాడటం చట్ట విరుద్ధమని తెలిసినా వాహనదారులు వెనక్కి తగ్గడం లేదు. బండి రిజస్ట్రేషన్ పూర్తయ్యే వరకు అంతా నిబంధనల ప్రకారం ఉంటున్నా ఆ తరువాత రోడ్లపైకి వచ్చేసరికి పరిస్థితి మారుతోంది. తమకు నచ్చిన రీతిలో సౌండ్ వచ్చేలా మోడిఫైడ్ సైలెన్సర్లను వాహనాలకు ఏర్పాటు చేసుకుంటూ న్యూసెన్స్ చేస్తున్నారు. సుమారు 45 రోజుల వ్యవధిలో జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు 460 మోడిఫైడ్ సైలెన్సర్లను తొలగించి ధ్వంసం చేయడం శబ్ద కాలుష్యం తీవ్రతకు అద్దం పడుతోంది. భారీ శబ్దాల కారణంగా కర్ణభేరికి రంధ్రం పడే అవకాశం ఉంటుంది. సాధారణంగా శబ్దం 55 డెసిబెల్స్(డీబీ) కన్నా అధికంగా ఉంటే శబ్ద కా లుష్యం ఏర్పడుతుంది. రద్దీ ప్రాంతాల్లో 55 నుంచి 90 డెసిబెల్స్ ఉంటుంది. పరిశ్రమలు ఉండే ప్రాంతాల్లో 95 డెసిబెల్స్ కన్నా అధికంగా ఉంటుంది. శబ్ద కాలుష్యంతో మానసిక స మస్యలతోపాటు హైబీపీ, గుండెజబ్బులూ వ స్తాయి. చెవి వెనుకభాగం నరాలు దెబ్బతిన డంతో ప్రతిధ్వనులు వినిపిస్తాయి. వినికిడి శక్తి తగ్గిపోతుంది. శబ్దకాలుష్యం నివారణ చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఖలీల్వాడి: రయ్యుమని పక్క నుంచి దూసుకెళ్లే ద్విచక్ర వాహనాలు చేసే శబ్దానికి గుండెలు అదురుతున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంతోపాటు గ్రా మీణ ప్రాంతాల్లో యువకులు బైక్లకు అధిక శబ్దం వచ్చే మోడిఫైడ్ సైలెన్సర్లు ఏర్పాటు చేస్తూ ప్రజల ను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అసలే ఇరుకుగా ఉండే నిజామాబాద్ నగర రోడ్లపై ట్రాఫిక్ స్తంభించిన సమయంలో మోడిఫైడ్ సైలెన్సర్లు, హారన్ల గోల అంతా ఇంతా కాదు. వాయు, శబ్ద కాలుష్యంతో ప్రజలు విసుగెత్తిపోతున్నారు. ఖరీదైన ద్విచక్ర వాహనాలకే ఎక్కువగా మోడిఫైడ్ సైలెన్సర్లు, హారన్లు ఏర్పాటు చేయిస్తున్నారు. పోలీసులు జరిమానా విధిస్తున్నా యువతలో ఎలాంటి మార్పు రావడం లేదు. నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ ఏడాది మార్చి 6వ తేదీన 240 సైలెన్సర్లను, ఏప్రిల్ 18వ తేదీన 220 సెలెన్సర్లను నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో రోడ్డు రోలర్తో తొక్కించారు. నెలన్నర వ్యవధిలోనే 460 సెలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు ధ్వంసం చేశారు. ఆర్టీఏ ఆఫీస్లో అంతా ఓకే.. ఆర్టీఏ ఆఫీసులో వాహనం రిజిస్ట్రేషన్ పూర్తయ్యే వరకు కంపెనీ నుంచి వచ్చిన సైలెన్సర్లను ఉంచుతున్న వాహనదారులు ఆ తరువాత రూ.18 వేల నుంచి రూ.25 వేల వరకు వెచ్చించి మోడిఫైడ్ సైలెన్సర్లను ఏర్పాటు చేయించుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తూ మోడిఫైడ్ సైలెన్సర్లను తొలగిస్తున్నప్పటికీ మండల స్థాయిలో స్థానిక పోలీసులు కఠినంగా వ్యవహరించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫలితం ప్రశాంతంగా ఉండే పల్లెల్లో సైతం మోడిఫైడ్ సైలెన్సర్ల శబ్దానికి ప్రజలు హడలెత్తుతున్నారు. ఈ ప్రాంతాల్లో హారన్ కొట్టొద్దన్నా.. రోడ్డు పై ప్రయాణించే సమయంలో ఎదురుగా ఏదైనా వాహనం వస్తేనే హారన్ కొట్టాలి. పాఠశాల లు, కోర్టులు, పోలీస్స్టేషన్, ప్రార్థనాలయాలు, ఆ స్పత్రులు ఉన్న ప్రాంతాల్లో హారన్ కొట్టడం పూర్తిగా నిషేధం. సరైన అవగాహన లేక ఎవరూ పాటించ టం లేదు. వేడుకలు, ర్యాలీల సమయాల్లో హారన్ లు, సైలెన్సర్ల శబ్దంతో యువత హడలెత్తిస్తున్నారు. శబ్ద కాలుష్యంతో సమస్యలెన్నో..45 రోజుల్లో 460 సైలెన్సర్ల తొలగింపు.. ధ్వంసం వాహనదారులకు జరిమానా రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక మారుస్తున్న వైనం కఠినంగా వ్యవహరిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఆటో మొబైల్స్కు నోటీసులు ఇస్తాం శబ్ద కాలుష్యం చేసే సైలెన్సర్లు అమ్మే ఆటో మొబైల్స్ కు నోటీసులు ఇస్తాం. నగ రంలోని రోడ్లపై రాత్రివేళ్లలో అధిక శబ్దం చేసే వాహనాల తో యువకులు తిరుగుతున్నారు. సీపీ సాయిచైతన్య ఆదేశాల మేర కు ఆప రేషన్ ఛబుత్రా నిర్వహిస్తాం. రాత్రివేళల్లో ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేస్తాం. ప్రజలకు ఇబ్బందు లు కలిగించే శబ్దాలు చేస్తే చర్యలు తీసుకుంటాం. – ప్రసాద్, ట్రాఫిక్ సీఐ, నిజామాబాద్ -
పూడిక తొలగింపుపై ఆశలు
బాల్కొండ: రాష్ట్రంలో పెద్ద ప్రాజెక్ట్లు అయిన శ్రీరాంసాగర్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ల్లో పూడిక తొలిగిస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి రెండు రోజుల క్రితం దేవాదుల ప్రాజెక్ట్ సందర్శన సందర్భంగా ప్రకటించారు. దీంతో ఎస్సారెస్పీలో పూడిక తొలగింపుపై ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురించాయి. ఎస్సారెస్పీని నాలుగు నెలల క్రితం సందర్శించిన సమయంలో కూడా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అంతర్జాతీయ సాంకేతికతతో పూడిక తొలిగిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ప్రాజెక్ట్లో 11.2 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండగా, పూడిక తొలిగించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి పూడిక తొలగిస్తే ప్రస్తుతంతో పోలిస్తే నీటి నిల్వ సామర్థ్యం అదనంగా 31.5 టీఎంసీల వరకు పెరిగే అవకాశం ఉంది. ఎగువ నుంచి ప్రతి ఏడాది వందల టీఎంసీల ఇన్ఫ్లో వస్తున్నా పూడిక కారణంగా నీటి నిల్వ సామర్థ్యం తగ్గడంతో దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ సీజన్లోనే పూడిక తొలిగింపు చర్యలు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. పూడిక ఇలా.. ఎస్సారెస్పీ నిర్మాణం పూర్తయిన 1978లో నీటి నిల్వ సామర్థ్యం 112 టీఎంసీలుగా నేషనల్ హైడ్రోగ్రాఫిక్ సర్వే నిర్ధారించింది. ఆ తరువాత 1994లో ఏపీఈఆర్ఎల్ (ఆంధ్ర ప్రదేశ్ ఇంజినీరింగ్ లేబరేటీస్ సంస్థ) 90 టీఎంసీలకు నీటి నిల్వ సామర్థ్యం పడిపోయినట్లు తెలిపింది. తరువాత 2014 – 15లో బెంగళూర్కు చెందిన సంస్థ సర్వే చేపట్టి నీటి నిల్వ సామర్థ్యం 70 టీఎంసీలకు పడిపోయినట్లు స్పష్టం చేసింది. కానీ ప్రాజెక్ట్ అధికారులు ఆ లెక్కను కొట్టి పారేశారు. 2023లో చేపట్టిన మరో సంస్థ సర్వే ప్రకారం నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలకు పడిపోయినట్లు తేల్చారు. మంత్రి ప్రకటించిన విధంగా పూడిక తొలగిస్తే 31.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని, వెంటనే ఆ దిశగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఎస్సారెస్పీ, నాగార్జున సాగర్లో పూడిక తొలిగిస్తామన్న మంత్రి ఉత్తమ్ పెరగనున్న నీటి నిలువ సామర్థ్యం -
నాణ్యమైన విత్తనాలను వినియోగించాలి
మోర్తాడ్: పంటల సాగులో నాణ్యమైన విత్తనాలనే వినియోగించాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట్ అన్వేష్రెడ్డి రైతులకు సూచించారు. తమ సంస్థ ఉత్పత్తి చేసిన విత్తనాలను వినియోగిస్తే ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు. మంగళవారం భీమ్గల్ మండలం ముచ్కూర్లో నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పంటల సాగులో రసాయనాలను వినియోగించే విధానానికి స్వస్తి పలకాలని సూచించారు. భూసారం దెబ్బతినకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. విత్తనాలు కొనుగోలు చేసిన సమయంలో తప్పకుండా రసీదు తీసుకోవాలని, అనేక ప్రైవేట్ కంపెనీలు రైతులకు నాణ్యత లేని విత్తనాలను అంటగట్టి నట్టేటా ముంచుతున్నాయని ఆరోపించారు. శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను స్వీకరించి పంటల సాగు లో మెరుగైన విధానాలను అవలంబించాలని కోరారు. కార్యక్రమంలో జేడీఏ సాయికృష్ణ, ఏవో లావణ్య, శాస్త్రవేత్తలు శ్రీలత, దినేశ్, కాంగ్రెస్ నాయకులు బొదిరె స్వామి, కుంట రమేశ్, కన్నె సురేందర్, కొరడి రాజు, అనంతరావు, బంగ్లా దేవేందర్, గంగారెడ్డి, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి.. మోపాల్(నిజామాబాద్రూరల్): వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలను పాటించి లాభాలు గడించాలని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ రైతులకు సూచించారు. ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలోభాగంగా రుద్రూర్ చెరుకు, వరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు మంగళవారం మండలంలోని సిర్పూర్లో అవగాహనాసదస్సు నిర్వహించారు. ఏవో సౌమ్య, శాస్త్రవేత్తలు సౌందర్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ కె వెంకట్రెడ్డి రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్గౌడ్, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు. -
వేసవి తాపం.. జ్యూస్లతో ఉపశమనం
నిజామాబాద్ రూరల్: రోజు రోజుకూ ఎడలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఉపశమనం కోసం ప్రజలు శీతల పానియాల వైపు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పండ్ల దుకాణాలు, జ్యూస్ సెంటర్ల వద్ద రద్దీ పెరుగుతోంది. సపోట, మామిడి, యాపిల్, పైనాపిల్, ద్రాక్ష, కర్భూజ తదితర జ్యూస్లను ప్రజలు సేవిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ప్రధానంగా ఖలీల్వాడీ, గాంధీచౌక్, గంజ్ రోడ్, సుభాష్నగర్, వినాయక్నగర్, పులాంగ్, గాయత్రీనగర్, రాజరాజేంద్ర చౌరస్తా, కోర్టు చౌరస్తా, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో జ్యూస్ పాయింట్లు, చెరుకు రసాల దుకాణాలను ఏర్పాటు చేశారు. ఒక్కో రకం జ్యూస్ రూ.20 ల నుంచి రూ.50 ల వరకు విక్రయిస్తున్నారు. కాగా, వేసవి నేపథ్యంలో కొబ్బరి బొండాలకూ డిమాండ్ ఉంది. ఒక్కో కొబ్బరి బొండం ధర రూ.80 పలుకుతోంది. అత్యవసర పని నిమిత్తం జిల్లా కేంద్రానికి వచ్చేవారితోపాటు నగర ప్రజలు వడదెబ్బ తగలకుండా ఉండేందుకు కొబ్బరినీరు, పండ్ల రసాలు సేవిస్తున్నారు. ఎండ వేడి తట్టుకోలేక పండ్ల రసాలను సేవిస్తున్న జనం రోజుకో బొండం తాగుతా.. నేను రోజుకో కొబ్బరి బొండం తాగుతా. దీంతో శరీరం డీహైడ్రేషన్కు లోనుకాదు. అలాగే వడదెబ్బ తగలకుండా ఉండేందుకు పండ్ల రసాలను తాగుతాం. – షాదుల్లా, నగరవాసి -
సీఎం తన వైఖరి మార్చుకోవాలి
నిజామాబాద్ అర్బన్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులపై చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని వెంటనే తన వైఖరి మా ర్చుకోవాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పీఆర్టీయూ భవన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు జమ చేసుకున్న జీపీఎఫ్ డబ్బులను వెంటనే విడుదల చేయాలన్నారు. సరెండర్ బిల్లులు, మెడికల్ రియింబర్స్మెంట్ బిల్లులు, సప్లిమెంటరీ బిల్లులు గత రెండు సంవత్సరాల నుంచి రావడం లేదని, దీంతో అనేకమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వెంటనే పెండింగ్ డీఏలను అని మంజూరు చేయాలన్నారు. జిల్లా ప్రతినిధులు కిషన్, గంట అశోక్, శ్రీనివాస్, సాయిరెడ్డి, నగే ష్రెడ్డి, గోపి, హరిప్రసాద్, రవినాయక్, లక్ష్మణ్సాయి, నరేష్, మైఖేల్, మోహన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
బీఈడీ, బీపెడ్ ఫలితాలు విడుదల
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరిలో జరిగిన బీఈడీ, బీపెడ్ 1, 3వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను వర్సిటీ వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి మంగళవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి సంపత్కుమార్, ఆడిట్సెల్ డైరక్టర్ ఘంటా చంద్రశేఖర్, అడిషనల్ కంట్రోలర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఫలితాల వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ www. telanganauniversity. ac. in ను సంప్రదించాలని కంట్రోలర్ సంపత్కుమార్ సూచించారు. 14 నుంచి డిగ్రీ పరీక్షలు ప్రారంభం తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పరీక్షలు ఈ నెల 14నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ సంపత్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ రెగ్యులర్ 2, 4, 6వ సెమిస్టర్, బ్యాక్లాగ్ 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు 32 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ పరీక్షలకు 11,617 మంది విద్యార్థులు హాజరవుతారని ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ను సంప్రదించాలని ఆయన సూచించారు. -
నీటిని ఒడిసి పట్టి.. కరువును జయించి..
మోర్తాడ్(బాల్కొండ): మోర్తాడ్ మండలం దోన్పా ల్ గ్రామం కరువును జయించి, పుష్కల నీటి వనరులతో ఆదర్శంగా నిలుస్తోంది. వేసవిలోనూ గ్రామంలోని బోర్లు సమృద్ధిగా భూగర్భ జలాల ఉండటంతో నీటి కొరత లేకుండా పోయింది. 2002కు ముందు.. దోన్పాల్ పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామం. 2002కు ముందు ఎలాంటి సమగ్ర నీటి సంరక్షణ చర్యలు తీసుకోక పోవడంతో నవంబర్, డిసెంబర్లోనే నీటి కొరత ఛాయలు కనిపించేవి. రైతులు తమ యాసంగి పంటలను గట్టెక్కించుకోలేక తీవ్రంగా నష్టపోయేవారు. గ్రామం చుట్టూ అడవి ఉన్నా వర్షపు నీటిని సంరక్షించుకునే చర్యలు లేకపోవడంతో బోర్లు ఎత్తిపోయేవి. వర్షాకాలం వచ్చే వరకూ నీటి కోసం రైతులు, గ్రామస్థులు ఎదిరి చూసే పరిస్థితి ఉండేది. ఎంపీడీవో ఆంజనేయులు విశేష కృషి.. గ్రామంలోని కరువు దుస్థితిని అప్పట్లో మోర్తాడ్ ఎంపీడీవోగా పని చేసిన ఆంజనేయులు చూసి స్పందించారు. ఉన్నతాధికారులకు దోన్పాల్లోని నీటి సమస్యను విన్నవించడంతో అప్పట్లోనే కందకాలను తవ్వించారు. ఊట కుంటలను ఏర్పాటు చేశారు. బోర్ల వద్ద రీచార్జి చర్యలు తీసుకోవడం, ఇంకుడు గుంతలపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి చర్యలతో దోన్పాల్ను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అప్పట్లో తీసుకున్న చర్యలతో గ్రామంలో కరువు జాడలు అసలే లేవు. 2015లో ఏర్పడిన తీవ్ర కరువు పరస్థితిలోనూ గ్రామంలోని రైతాంగం తమ పంటలను గట్టెక్కించుకోగలిగారు. ప్రతి వేసవిలో చెరువు ఎండిపోయినా భూగర్బ జలాలు సమృద్ధిగా ఉండి నీటి కొరత అనేది లేకుండా పోయింది. అటవీ ప్రాంతంలో తవ్విన కందకాల వల్ల నీరు నిల్వ ఉండి వన్య ప్రాణులకు వేసవిలోనూ తాగునీరు దొరుకుతుంది. ఈసారి వర్షాపాతం తక్కువగా ఉండటంతోనే కుంటలు, కందకాలలో నీరు తక్కువగా ఉందని, లేకుంటే ఎప్పుడు నిండు కుండలా ఉండేవని గ్రామస్తులు తెలిపారు. పదుల సంఖ్యలో కందకాలు, ఊట కుంటలు తవ్వించడంతో నీటి సంరక్షణ చర్యలు సజావుగా సాగుతున్నాయి. ఆదర్శంగా నిలిచిన దోన్పాల్ సమగ్ర నీటి సంరక్షణ చర్యలతో 2002 నుంచి కనిపించని కరువు ఛాయలు వేసవిలోనూ సమృద్ధిగా భూగర్భ జలాలు -
నగరంలో పోలీసుల తనిఖీలు
ఖలీల్వాడి: నగరంలోని ధర్మపురి హిల్స్లో మంగళవారం రాత్రి ఆరో టౌన్ పోలీసులు క మ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్లో భాగంగా త నిఖీలు నిర్వహించారు. అనుమానితుల ఇళ్ల ను, రౌడీషీటర్ల ఇళ్లను చెక్ చేశారు. వాహనాలకు సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు, వితౌట్ నెంబర్ ప్లేట్లు లేని 26 ఆటోలు, 42 మోటార్ సైకిళ్లను సీజ్ చేశారు. అనంతరం నిజామాబా ద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కాలనీలో అనుమానాస్పదంగా ఎవరైనా తిరుగుతున్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. యువత చెడు వ్యసనాల కు దూరంగా ఉండాలన్నారు. సీఐలు సురేష్ కుమార్, రఘుపతి, శ్రీనివాసరాజు, శ్రీనివా స్, విమెన్ పీఎస్ సీఐ శ్రీలత, డిచ్ పల్లి సీఐ మల్లేష్, ధర్పల్లి సీఐ భిక్షపతి, ఎస్సైలు, సి బ్బంది పాల్గొన్నారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి
నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండలం కుద్వాన్పూర్ గ్రామ శివారులోని ఎల్లమ్మ గుట్ట ప్రాంతంలో ఆటో బోల్తా పడి ఓ వృద్ధుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామానికి చెందిన గోక అశోక్ తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం నందిపేట మండలంలోని కుద్వాన్పూర్ ఎల్లమ్మ ఆలయానికి మొక్కు తీర్చుకోవడానికి వచ్చాడు. దర్శనం చేసుకున్న అనంతరం తిరిగి ఇంటికి బయలుదేరగా ఎల్లమ్మ గుట్ట పైనుంచి ఆటో కిందికి దిగుతుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఆటో ప్రయాణిస్తున్న గోక సాయన్న (65), మమత, నితిన్, లక్ష్మిప్రసన్నలకు గాయాలు కాగా వారిని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గోక సాయన్న మృతి చెందాడు. మృతుడి కొడుకు గోక అశోక్ ఫిర్యాదు మేరకు ఆటోడ్రైవర్ గట్టు సత్యనారాయణపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.పిట్లం మండలంలో..పిట్లం(జుక్కల్): బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని రాంపూర్ గ్రామ శివారులోని పిట్లం–బాన్సువాడ రహదారిపై చోటు చేసుకుంది. పిట్లం ఎస్సై రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మానూర్ గ్రామానికి చెందిన సౌదర్పల్లి యాదగిరి (34) తన బైక్పై సోమవారం రాత్రి అంకోల్ తండా నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యలో మండలంలోని రాంపూర్ గ్రామ శివారులో బైక్ అదుపుతప్పడంతో యాదగిరి కిందమీద పడి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతుడి తల్లి విట్టవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.వర్ని మండలంలో..వర్ని: వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవూరు–చందూరు గ్రామాల మధ్య సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గంగారాం (60) అక్కడికక్కడే మృతి చెందినట్లు వర్ని మహేష్ వెల్లడించారు. రోడ్డుపై వెళ్తున్న గంగారాంను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.డొంకేశ్వర్ మండలంలో..డొంకేశ్వర్(ఆర్మూర్): మండలంలోని అన్నారం మాజీ గ్రామ సర్పంచ్ మంగ్లారం పోశన్న (47) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నికాల్పూర్లో సోమవారం జరిగిన బంధువుల ఫంక్షన్కు పోశన్న వెళ్లాడు. రాత్రి స్కూటీపై తిరిగి ఇంటికి బయలుదేరాడు. అన్నారం గ్రామ శివారులోకి రాగానే మూల మలుపు వద్ద స్కూటీ అదుపుతప్పడంతో కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య సాయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. అంత్యక్రియలు బుధవారం స్వగ్రామంలో జరగనున్నాయి.ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలుప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత చెందారు. ఆటో అదుపుతప్పి నందిపేట మండలంలో ఓ వృద్ధుడు, బైక్ అదుపుతప్పి పిట్లం మండలంలో ఓ యువకుడు, డొంకేశ్వర్ మండలంలోఒకరు చనిపోయారు. వర్ని మండలంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరుమృతిచెందారు. -
ఆర్మూర్లో సినీనటి నేహాశెట్టి సందడి
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ పట్టణంలో మంగళవారం డీజే టిల్లు సినిమా ఫేమ్ నేహా శెట్టి సందడి చేశారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో ఎల్వీఆర్ షాపింగ్ మాల్ను మంగళవారం సినీనటి నేహాశెట్టి, కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా నేహా శెట్టితో సెల్ఫీలు తీసుకోవడానికి అభిమానులు ఎగబడ్డారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, నాయకులు పండిత్ పవన్, ఎల్వీఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి బాల్కొండ: రైతులు రెవెన్యూ సదస్సులను స ద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. భూసమస్యల సత్వర పరిష్కారం కోసమే భూ భారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెండోరా మండల కేంద్రంలో, మండలంలోని బుస్సాపూర్లో మంగళవారం పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ సదస్సులను పరిశీలించి, మాట్లాడారు. భూభారతి చట్టం ద్వారా పల్లెల్లో భూ సమస్యలు వెంటనే పరిష్కరించబడుతాయన్నారు. రైతులు రెవెన్యూ సదస్సులో చేసుకున్న దరఖాస్తులకు వెంటనే పరిష్కారం లభిస్తుందన్నారు. సదస్సులో హెల్ప్డెస్క్, జనరల్ హెల్ప్డెస్క్ పనితీరును పరిశీలించారు. ఆర్మూర్ ఆర్డీవో రాజుగౌడ్, మెండోరా తహసీల్దార్ సంతోష్రెడ్డి, వేల్పూర్ మార్కెట్కమిటీ చైర్మన్ ముత్యంరెడ్డి, రైతులు తదితరులు ఉన్నారు. -
భూ సమస్యలు లేని పల్లెలుగా తీర్చిదిద్దుకోవాలి
బాల్కొండ: భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలను పరిష్కరించుకుని గ్రామాలను భూ సమస్యలు లేని పల్లెలుగా తీర్చిదిద్దుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. భూ భారతి అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలన్నారు. భూ భార తి పైలట్ ప్రాజెక్ట్గా అమలవుతున్న మెండోరా మండలం చాకిర్యాల, కొడిచర్ల గ్రామాల్లో సోమవా రం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. కలెక్టర్ హనుమంతు ఆయా గ్రామాల రైతులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న భూ సమస్యలను తెలుసుకున్నారు. భూ భారతిపై అవగాహన కల్పించి, వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. రైతులకు భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టం అమలు చేస్తోందని, ప్రభుత్వ ఆదేశాల మే రకు మెండోరా మండలాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. రెవెన్యూ సదస్సుల్లో భూ రికార్డుల తప్పులు, విస్తీర్ణంలో హెచ్చు, తగ్గు లు, వారసత్వ భూములు, సర్వే నంబర్ల మిస్సింగ్, పట్టా పాస్ పుస్తకాలు లేక పోవడం , ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసు లు, హద్దుల నిర్ధారణ, పార్ట్ –బీ కింద చేర్చిన భూ ముల తదితర దరఖాస్తులను స్వీకరిస్తారని తెలిపా రు. దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలించాలని తహసీల్దార్లకు సూచించారు. రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్డెస్క్, జనరల్ డెస్క్లను పనితీరును కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజు, వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తింటి ముత్యంరెడ్డి, సావెల్ సహకార సంఘం చైర్మన్ మచ్చర్ల రాజారెడ్డి, తహసీల్దార్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకే భూ భారతి కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు పైలట్ మండలం మెండోరాలో రెవెన్యూ సదస్సులు ప్రారంభం -
ఈజిప్టుకు ఇందూరు పసుపు
జక్రాన్పల్లి: పసుపును ‘ఇందూరు పసుపు’ బ్రాండ్ పేరుతో ఈజిప్ట్ దేశానికి ఎగుమతి చేస్తామని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. మండలంలోని మనోహరాబాద్లో పసుపు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందూరు పసుపు తయారీ పరిశ్రమను ఎంపీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్న పుసుపు పరి శ్రమ జిల్లాకే తలమానికమని అన్నారు. రైతులే స్వ యంగా పసుపు ఆధారిత పరిశ్రమ ఏర్పాటు చేసు కోవడం అభినందనీయమన్నారు. ఈ పరిశ్రమలో పసుపు ఆయిల్ సైతం తీయనున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్పీవోల కోసం కేటాయిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని, రైతు ఉ త్పత్తిదారుల సంఘాల ద్వారా పరిశ్రమలు ఏర్పా టు చేస్తే భారీగా రాయితీలు అందజేస్తుందని తెలిపారు. ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేలు రాకేశ్రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, పసుపు బో ర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, కార్యదర్శి భవానీశ్రీ, భూ దాత హిమగిరిరావు, పసుపు ఉత్పత్తిదారుల సంఘం డైరెక్టర్లు తిరుపతిరెడ్డి, సంతోష్ రెడ్డి, పుప్పాల నగేశ్, వెల్మ సంతోష్రెడ్డి, భోజన్న, గంగారెడ్డి, శ్రీ ను, రాజ్లక్పతిరెడ్డి, సురేశ్, రైతులు పాల్గొన్నారు. రైతులు ఏర్పాటు చేసుకున్న పరిశ్రమ జిల్లాకే తలమానికం ఎంపీ ధర్మపురి అర్వింద్ మనోహరాబాద్లో పసుపు పరిశ్రమ ప్రారంభం బోధన్లో పాకిస్తానీలు.. హిందూ రాష్ట్ర ఏర్పాటు పునాది ఇందూరు గడ్డ అని, ఇక్కడి నుంచే హిందూ రాజ్యస్థాపన ప్రా రంభమవుతుందని అర్వింద్ మీడియాతో మా ట్లాడుతూ అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా బోధన్లో ఒకే ఇంటి నంబర్పై 42 పాస్పోర్టులు జారీ అయ్యాయన్నారు. బోధన్లో పాకిస్తానీలతోపాటు బంగ్లాదేశీలు ఉన్నారని ఆ రోపించారు. తక్షణమే వారిని వెనక్కి పంపాలని డిమాండ్ చేశారు. పాకిస్తానీలు వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించినప్పటికీ కాంగ్రెస్ పాలిత ప్రాంతాల నుంచి వెళ్లిపోవడం లేదన్నారు. కేంద్రం ఉ గ్రవాదులకు త్వరలో గట్టి జవాబిస్త్తుందన్నారు. -
జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు!
సిరికొండ/మోర్తాడ్ : జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం స్వల్పంగా భూమి కంపించిందని ప్రజలు తెలిపారు. సిరికొండ మండల కేంద్రంతోపాటు మైలారం, నర్సింగ్పల్లి , చీమన్ పల్లి, చిన్నవాల్గోట్, రావుట్ల, కుర్దుల్పేట్, హుస్సేన్నగర్, మోర్తాడ్, కమ్మర్పల్లి, భీమ్గల్, మెండోరా మండల కేంద్రాల్లో స్వల్పంగా భూమి కంపించినట్లు తెలిపారు. భయాందోళనతో ఇళ్లలో నుంచి బయటికి వచ్చామని పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితం భీమ్గల్, మెండోరా మండలాల్లో భూమి కంపించిన విషయం తెలిసిందే. కామారెడ్డి జిల్లాలో.. కామారెడ్డి అర్బన్/మాచారెడ్డి: కామారెడ్డి పట్టణంతోపాటు మాచారెడ్డి మండలం సోమారంపేటలో భూ కంపించిందని ప్రజలు తెలిపారు. భూమిలో నుంచి పెద్దగా శబ్దాలు రావడంతో భయంతో ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశామన్నారు. -
యూనిట్లు ఏర్పాటయ్యేనా ?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో జిల్లాలోని నందిపేట మండలం లక్కంపల్లి వద్ద సెజ్ (ప్రత్యేక ఆర్థిక మండలి) ఏర్పాటు చేశారు. వ్యవసాయ రంగంలో ముందంజలో ఉన్న జి ల్లాలో పంట ఉత్పత్తులకు అదనపు విలువ జోడించి అంతర్జాతీయ ఎగుమతులను ప్రోత్సహించే లక్ష్యంతో 2009లో వైఎస్ఆర్ దీనికి రూపకల్పన చేశారు. వ్యవసాయ అనుబంధ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించి స్థానికంగా ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు గాను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా 429 ఎకరాలు కేటాయించారు. వైఎస్ఆర్ మరణం తరువాత అప్పటి మంత్రి పొ ద్దుటూరి సుదర్శన్రెడ్డి దీని కోసం రూ.50 కోట్లు కేంద్రం నుంచి మంజూరు చేయించారు. అప్పటి కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్పవార్ సహకారంతో ఈ నిధులు తీసుకొచ్చారు. ప్రహరీతోపాటు రోడ్లు నిర్మించారు. స్మార్ట్ ఆగ్రో కర్క్యుమిన్ యూనిట్తో పాటు కొన్ని గోదాములు నెలకొల్పారు. అయితే తెలంగాణ ఏర్పాటు తరువాత గత పదకొండేళ్లలో ఈ సెజ్లోకి ఒక్క యూనిట్ రాకపోవడం గమనార్హం. దేశంలోనే పేరెన్నిక గన్న పతంజలి సంస్థ 2017లో ఇందులో యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు రాగా అప్పటి స్థానిక ఎమ్మెల్యే పర్సంటేజీలు అడగడంతో వెనక్కు వెళ్లినట్లు తెలిసింది. ఇదేవిధంగా మరికొందరు పెట్టుబడిదారులు సైతం వెనక్కు వెళ్లిపోయారు. దీంతో సదరు అప్పటి ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఇదే అవకాశంగా భావించి 200 ఎకరాల కబ్జాకు రంగం సిద్ధం చేశాడని ఆరోపణలు మిన్నంటాయి. ఈ క్రమంలో ఇందులో ఉన్న గుట్టను సైతం టీఎస్ఐఐసీ నిబంధనలకు విరుద్ధంగా తవ్వించి తన అనుచరుల ద్వారా మొరం అమ్మించాడని విమర్శలు సైతం వచ్చాయి. లక్కంపల్లి స్మార్ట్ ఆగ్రో ఫుడ్ పార్క్ లోని గోదాములు200 ఎకరాల్లో కేసీఆర్ టౌన్షిప్ పేరిట 5,058 ప్లాట్లకు లేఅవుట్.. 2009లో రూపకల్పన.. 429 ఎకరాల కేటాయింపు ఇప్పటివరకు యూనిట్లు నెలకొల్పని పరిస్థితి వ్యవసాయ అనుబంధ యూనిట్లు ఏర్పాటు చేయాలంటున్న ఔత్సాహికులురెండు వందల ఎకరాల సెజ్ భూములను కబ్జా చేసి అందులో 5,058 ప్లాట్లు వేసేలా లేఅవుట్ ప్లాన్ తయారు చేయడం గమనార్హం. ఇందులో బ్లాక్–1లో 2,715 ప్లాట్లు, బ్లాక్–2లో 2,343 ప్లాట్లు ఉండేలా వెంచర్ ప్లాన్ రూపొందించడం ప్రత్యేకం. ఈ అక్రమ వ్యవహారాలపై ప్రశ్నించిన వ్యక్తులపై అక్రమంగా అప్పటి ఎమ్మెల్యే కేసులు పెట్టించాడని చెబుతారు. ఒక వ్యక్తిపై అట్రాసిటీ, మరో నలుగురిపై ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించినట్లు అక్రమంగా కేసులు నమోదు చేయించడం విశేషం. సెజ్ భూముల్లో అక్రమంగా లేఅవుట్ చేసేందుకు సహకరించిన అప్పటి పంచాయతీ కార్యదర్శి రమేశ్ ద్వారా ప్రశ్నించిన నలుగురు వ్యక్తులపై విధులకు ఆటంకపరిచారనే నెపంతో అక్రమంగా కేసులు పెట్టడం గమనార్హం. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని స్ట్రీమ్లైన్ చేసి వ్యవసాయ అనుబంధ యూనిట్లు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రోత్సహించి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని జౌత్సాహికులు కోరుతున్నారు. -
జక్రాన్పల్లి ఎయిర్పోర్టు కలేనా?
జక్రాన్పల్లి: జిల్లాలో ఎయిర్పోర్టు ఏర్పాటు కలగానే మిగిలిపోయేలా ఉంది. దీనికి కేంద్ర కమిటీ సభ్యు లు ఇచ్చిన నివేదిక బలాన్ని చేకూరుస్తోంది. జక్రాన్పల్లి మండలంలోని మనోహరాబాద్, జక్రాన్పల్లి, కొలిప్యాక్, తొర్లికొండ, అర్గుల్ గ్రామాల పరిధిలో సుమారు 1663 ఎకరాల అసైన్డ్, పట్టా భూములను ప్రభుత్వం ఎయిర్పోర్టు స్థాపనం కోసం సిద్ధం చేసింది. జిల్లాకు 2009లో వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎన్ రాజశేఖర్రెడ్డి జక్రాన్పల్లిలో ఎయిర్పోర్టు స్థాపిస్తామని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి పలు దఫాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సర్వేలు నిర్వహించాయి. ప్రతిపాదిత స్థలాన్ని వి మాశ్రయానికి అనుకూలంగా సిద్ధం చేసి ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఇటీవల పర్యటించిన ఎయిర్పోర్టు అథారిటీ కమిటీ సభ్యులు తేల్చి చెప్పారు. ఎయిర్పోర్టు స్థాపనపై రాష్ట్ర ప్రభుత్వంతో పునఃసమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. దానికనుగుణంగా కేంద్ర వైమానిక శాఖ ఎన్ శ్రీనివాసరావు, మల్లికా జయరాజ్, శైలేశ్ దఖానేతో కూడిన బృందాన్ని కమిటీ సభ్యులుగా ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులు ఈ ఏడాది ఏప్రిల్ 23 నుంచి 25 వరకు క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ఈ కమిటీ రిపోర్టు ప్రకారం విమానాశ్రయ స్థలంలో మసీదు, నీటి వనరులు, విద్యుత్ స్తంభాలు, కొన్ని నివాస ప్రాంతాలు, కొండ శిఖర వ్యాసార్థంలో అడ్డంకులు ఉన్నాయని తేల్చింది. ఈ అంశాలను టెక్నో ఎకనామిక్ వయబిలిటీ రిపోర్టులో సైతం ప్రస్తావించామని తెలిపింది. అందు లో పేర్కొన్న విధంగా భారత వైమానిక దళస్థలం, భూసేకరణ, భౌతిక అడ్డంకులకు సంబంధించిన సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయని నివేదిక అందజేసింది. కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అడ్డంకులు లేని భూమిని ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కమిటీ తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం పంపాల్సిన రిపోర్టులను పంపకుండా, అనువైవ భూములను ఎంపిక చేసి ఇవ్వకుండా తాత్సారం చేస్తోందని ప్రజలు విమర్శిస్తున్నారు. -
నెలాఖరు వరకు సెర్ప్ బదిలీలు
డొంకేశ్వర్(ఆర్మూర్): గ్రామీణాభివృద్ధి శాఖలో పని చేస్తున్న సెర్ప్ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగులందరికీ (వంద శాతం) బదిలీలు చేయాలని నిర్ణ యించింది. ఈ మేరకు జీవో నం.250 జారీ చే యడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నా రు. జిల్లాలో అన్ని కేడర్లు కలిపి మొ త్తం 215 మంది పని చేస్తున్నారు. ఇందులో ఏపీడీ, డీపీఎం, సీసీలు, అడ్మిన్ అసిస్టెంట్లు, అ టెండర్లు, డ్రైవర్లు ఉన్నారు. సెర్ప్లో బదిలీలు లేక దాదా పు పదేళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఉద్యోగు లు ఒకే ప్రాంతం, ఒకే సీటులో పని చేస్తున్నా రు. దీంతో కొంతమందికి అవినీతి చేసేందుకు అవకాశం ఏర్పడింది. ప్రాంతంపై పట్టు సాధించి ఎవరికీ చిక్కకుండా తెలివిగా అవినీతికి పాల్పడుతున్నారు. అలాంటి ఉద్యోగులకు తా ము విధులు నిర్వర్తిస్తున్ని ప్రాంతా న్ని వదిలి వెళ్లేందుకు మనసు ఒప్పడం లేదు. మరికొంత మందికి ఒకే చోట పని చేయడం, దూర ప్రాంతాల్లో విధులుకు వెళ్లి రావడం ఇబ్బందికరంగా మారింది. అలాంటి వారు బదిలీలు ఎప్పుడొస్తాయా అని ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం.. జీవో జారీ త్వరలో గైడ్లైన్స్ విడుదల జిల్లాలో 215మంది ఉద్యోగులుసీనియారిటీ జాబితా.. ఉద్యోగుల బదిలీలను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సెర్ప్ రాష్ట్ర శాఖ భావిస్తోంది. ఇందుకు విధివిధానాలను కూడా రూ పొందించడంతోపాటు ఉద్యోగుల సీనియారిటీ జాబితాను రెడీ చేస్తోంది. నూరుశాతం బదిలీలు చేపట్టనుండడంతో ఉద్యోగులంద రూ బదిలీ కానున్నారు. ఏపీడీ, డీపీఎంలకు రాష్ట్ర స్థాయిలో, ఏపీఎంలకు జోనల్ స్థాయి లో, సీసీలు, ఇతర సిబ్బందికి జిల్లా స్థాయిలో బదిలీలు చేయనున్నారు. అయితే బదిలీలను ఏ విధంగా చేయాలనేదానిపై సెర్ప్ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాలని ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఏ విధంగా చేస్తారనే దానిపై ఈ వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బదిలీల నేపథ్యంలో కొంతమంది ఉద్యోగులకు కోరుకున్న స్థానాలకు బదిలీ అయ్యేందుకు ఇప్పటి నుంచే పైరవీలు మొదలుపెట్టారు. ఉద్యోగ సంఘ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. గైడ్లైన్స్ రావాలి సెర్ప్ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఇటీవల జీవో విడుదల చేసింది. వారంలో గైడ్లైన్స్ వచ్చే అవకాశాలున్నాయి. గైడ్లైన్స్ ప్రకారం నెలాఖరు నాటికి బదిలీలు పూర్తి చేస్తారని తెలుస్తోంది. బదిలీలు పారదర్శకంగా జరుగుతాయి. – సాయాగౌడ్, డీఆర్డీవో -
అర్జీలను పెండింగ్లో ఉంచొద్దు
నిజామాబాద్అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 117 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అదనపు కలెక్టర్లతోపాటు జడ్పీ సీఈవో సాయాగౌడ్, నిజామాబాద్ ఇన్చార్జి ఆర్డీవో స్రవంతిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు అధికారులను ఆదేశించారు. అందాల పోటీలు రద్దు చేయాలి హైదరాబాద్లో నిర్వహించే మిస్వరల్డ్ 72వ పోటీలను రద్దు చేయాలని పీవోడబ్ల్యూ, ఐద్వా ఆధ్వర్యంలో జిల్లా అధికారులకు ప్రజావాణిలో విన్నవించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంపిణీ చేశారు. సీ్త్ర ఆత్మగౌరవాన్ని భంగపరిచేలా ఉన్న ఈ పోటీలను నిర్వహించొద్దన్నారు. కార్యక్రమంలో పీవోడబ్ల్యూ కార్యదర్శి సంధ్య, ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత, అరుణ్, ఎస్ఎఫ్ఐ నాయకులు రాజు, అనిత, లక్ష్మి, సంజన, అమూల్య, మంజుల, కీర్తి తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్ ప్రజావాణికి 117 ఫిర్యాదులు గృహజ్యోతి అమలు కావడం లేదు నాకు గృహజ్యోతి పథకం అమలు కావడం లేదు. ప్రతి నెలా 200 యూనిట్ల కంటే తక్కువగానే విద్యుత్ వినియోగిస్తున్నాను. గృహజ్యోతి కోసం అధికారులకు విన్నవించినా అధికారులు స్పందించడం లేదు. – బాదావత్ గంగారాం, మద్దెపల్లి -
ఐక్యరాజ్యసమితికి ఎన్డీసీసీబీ కృతజ్ఞతలు
సుభాష్నగర్: ఐక్యరాజ్యసమితి 2025వ సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించడంపై హర్షం వ్యక్తంచేస్తూ ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని ఉమ్మడి జిల్లా డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో చైర్మన్ అధ్యక్షతన సోమవారం పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేశ్ రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘాలు సభ్యుల ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయన్నారు. ఎన్డీసీసీబీకి పూర్వవైభవం తీసుకొచ్చే నిర్ణయాలు కఠినంగా అమలు చేస్తున్నామని, ఇందులో పాలకవర్గం, సభ్యులు, రైతుల సహకారం మరువలేనిదన్నారు. ప్రధానంగా బ్యాంకు ఎన్పీఏ తగ్గించేందుకు అందరి సహకారం కావాలని కోరారు. అనంతరం ఎన్డీసీసీబీ ప్రత్యేకంగా పాలకవర్గసభ్యులు, అధికారులు, సిబ్బందికి తయారు చేసిన టోపీలను అందజేశారు. సమావేశంలో వైస్ చైర్మన్ నల్ల చంద్రశేఖర్రెడ్డి, డీసీవో శ్రీనివాస్రావు, డైరెక్టర్లు, బ్యాంకు సీఈవో నాగభూషణం వందే, నాబార్డు డీడీఎం, టీజీక్యాబ్, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. -
కాకతీయ విద్యార్థులకు ఎమ్మెల్యే అభినందన
నిజామాబాద్ అర్బన్: పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయి ఉత్తమ మార్కులు సాధించిన కాకతీయ ఒలంపియాడ్ విద్యార్థులను మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సోమవారం తన నివాసంలో ఘనంగా సన్మానించారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు క్రితి, నితీష్, అఖిల్, కృతి, సాయి శ్రేయస్, వర్షిని, కౌశిక్ ప్రసాద్ ఎమ్మెల్యేను కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ ఏటా ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లా పేరును నిలబెట్టాలన్నారు. రాష్ట్రస్థాయి ఉత్త మ మార్కులు రావడం గర్వకారణం అన్నారు. జి ల్లాలో పాఠశాల విద్యను మరింత బలోపేతం చేస్తా మని పేర్కొన్నారు. 36 ఏళ్లుగా విద్య వ్యవస్థలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న కాకతీయ విద్యాసంస్థలు మరింత పేరుప్రతిష్టలు సాధించాలన్నారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, కాకతీయ కళాశాల డైరెక్టర్ రజినీకాంత్, ప్రిన్సిపాల్ ఫరీదుద్దీన్, చంద్రశేఖర్, ఫణీంద్ర, మౌనిక, రాష్ట్రస్థాయి ఉత్తమ మార్కులు సాధించిన క్రితి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
ఉబ్బసంతో ఉక్కిరిబిక్కిరి
జిల్లాలో ఆస్తమా బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఆస్తమా వాయునాళాలకు సంబంధించిన వ్యాధి. నాళాలకు వాపు రావడంతో జిగురుగా ఉండే పదార్థం(శ్లేష్మం) తయారవుతుంది. దీంతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. దుమ్ము, పుష్పాల దూళి, గాలి కాలుష్యం, పరిశ్రమల నుంచి విడుదలయ్యే రసాయనాలు, చల్లటి, పొడి గాలులు ఆస్తమా బారిన పడేందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కొంతమందిలో ఆస్తమా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. గుర్తించండి ఇలా.. సాధారణ పనులు, వ్యాయామం చేయడంలో ఇబ్బందులు ఏర్పడుతాయి. ఛాతి బిగపట్టినట్లు ఉంటుంది. విపరీతంగా దగ్గు వస్తుంది. నడిచినా, మెట్లెక్కినా త్వరగా అలసిపోతారు. వ్యాధిగ్రస్తులకు జాగ్రత్తలు.. పొగ తాగడం మానేయాలి. ఇతరులు తాగితే దూ రంగా ఉండాలి. దుమ్ము, ధూళి, చల్లని ప్రదేశాల్లో సంచరించొద్దు. పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి. విటమిన్ ‘డి’ సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. ఏం తినాలి? ఏం తినొద్దు? విటమిన్ ‘ఏ’ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి.ప్రధానంగా క్యారెట్లు, పాలకూర, చిలగడదుంప, చేప, పాల ఉత్పత్తులు, గుడ్లు తినాలి. మాంసం, చీజ్, ఐస్క్రీమ్, పాలకొవ్వు వంటి సంతృప్త ఆమ్లాలను నివారించాలి. వీటితో వాపు పెరిగి ఇబ్బందులు కలుగుతాయి. కొబ్బరి నూనె, పామ్ఆయిల్తో చేసిన ఆహారంతో ఆస్తమా పెరిగే అవకాశం ఉంటుంది. వాతావరణంలోని అలర్జీ కలిగించే పదార్థాల కారణంగానో.. వంశపారంపర్యంగానో వచ్చే ఉబ్బసం(ఆస్తమా) వ్యాధి మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఊపిరి తీసుకోవడం కష్టతరమవుతోంది. దీంతో రోజూవారీ జీవితం ప్రభావితమవుతోంది. దీనికి శాశ్వత పరిష్కారం లేనప్పటికీ.. సమర్థవంతమైన చికిత్స, మందుల వాడకంతో సంతృప్తికరంగా జీవించొచ్చని ప్రముఖ పల్మనాలజిస్టు రాజేంద్రప్రసాద్ తెలిపారు. నేడు ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. – నిజామాబాద్ నాగారం జాగ్రత్తలు పాటిస్తే ఉపశమనం నేడు ప్రపంచ ఆస్తమా దినోత్సవం భయపడొద్దు.. ఆస్తమా అనేది దీర్ఘకాలిక వ్యాధి. భయపడాల్సిన అవసరం లేదు. వైద్యుల సలహాలు, సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార నియమాలు పాటిస్తే వ్యాధిని తరిమికొట్టవచ్చు. వైద్యులు సూచించిన మందులతోపాటు ఇన్హెలర్ వాడాలి. ధూమపానానికి దూరంగా ఉండాలి. దుమ్ము, ధూళి, చల్లని ప్రదేశాల్లో తిరుగొద్దు. – డాక్టర్ బొద్దుల రాజేంద్రప్రసాద్, ప్రముఖ పల్మనాలజిస్ట్ -
ఫేక్ కాల్ చేసిన ఒకరి రిమాండ్
ఖలీల్వాడి: నగరంలోని రైల్వేస్టేషన్లో బాంబు పెట్టినట్లు ఫేక్ కాల్ చేసిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. ఈ నెల 2న రాత్రి 7.41 గంటలకు రైల్వే స్టేషన్లో బాంబు పెట్టినట్లు డయల్ 100కు కాల్ వచ్చిందన్నారు. వెంటనే డాగ్ స్క్వాడ్, బీడీ టీం, సిబ్బందితో కలిసి రైల్వేస్టేషన్లో అన్ని ప్రాంతాలను పరిశీలించి ఫేక్ కాల్గా గుర్తించామన్నారు. డయల్ 100కి కాల్ చేసిన వ్యక్తిని రంగారెడ్డి జిల్లా కీసర మండలం అంకిరెడ్డిపల్లికి చెందిన శ్రీమంత్ గౌడ్గా గుర్తించి, పట్టుకున్నట్లు తెలిపారు. వ్యక్తిగత సమస్యలుండడంతో ప్రజలను భయాందోళనకు గురిచేసి హింసను ప్రేరేపించాలని దురుద్దేశంతో కాల్ చేశానని విచారణలో వెల్లడైందన్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించామన్నారు. వామ్మో.. ఎంత పెద్ద పాము రుద్రూర్: మండలంలోని చిక్కడపల్లి గ్రామ శివారులో ఉపాఽ ది పనులు చేస్తున్న ప్రదేశంలో సోమవారం తాటి జెర్రి పాము ప్రత్యక్షమైంది. పామును చూ సిన ఉపాధి కూలీలు భయాందోళనకు గురయ్యారు. హన్మ య్య అనే వ్యక్తి చాకచాక్యంగా పామును చంపివేయడంతో అంతా ఊపీరిపీల్చుకున్నారు. పాము పొడవు పది ఫీట్ల వరకు ఉంటుందని ఉపాధి కూలి సాయన్న తెలిపారు. -
చోరీ కేసులో ఒకరి అరెస్ట్
● బంగారం, వెండి స్వాధీనం బాన్సువాడ : బాన్సువాడలో జరిగిన చోరీ కేసులో ఒకరిని అరెస్ట్ చేసినట్లు సీఐ అశోక్ తెలిపారు. గత నెల 19న పట్టణంలోని సంగమేశ్వర కాలనీకి చెందిన చెనంగారి లక్ష్మి ఇంటికి తాళం వేసి అత్త సా యవ్వ, ఆడబిడ్డ రాణిలతో కలిసి ఇంటిపైన నిద్రించారు. బోర్లం క్యాంపు తండాకు చెందిన నేనావత్ ఈశ్వర్ తాళం పగులగొట్టి ఇంట్లో ఉన్న బంగారు నగలు, వెండి, నగదును ఎత్తుకెళ్లాడు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని గాంధీచౌక్లో ఈశ్వర్ అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు పట్టుకొని విచారించడంతో తానే దొంగతనం చేసి నట్లు ఒప్పుకున్నాడన్నారు. నిందితుడి నుంచి 6 తులాల బంగారం, 86 తులాల వెండి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు. ఈశ్వర్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. కేసులో చాకచక్యంగా పనిచేసిన కానిస్టేబుల్ అశోక్ హోంగార్డు హేమాద్రిని సీఐ అభినందించారు. -
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
నిజామాబాద్ అర్బన్/ మోపాల్ : నగరంలోని వర్ని రోడ్ శ్రీ పద్మశాలి ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం నిర్వహించారు. పదో తరగతి 2005–2006 బ్యాచ్ విద్యా ర్థులు గురువులను ఘనంగా సన్మానించారు. మో పాల్ మండలంలోని బాడ్సి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2009–10లో పదోతరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్ర మం ఘనంగా నిర్వహించారు. 15 ఏళ్ల తర్వాత కలుసుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆత్మీ యంగా పలుకరించుకొని, తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటాపాటలతో రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు వీడియో కాల్స్ ద్వారా ఈ వేడుకలో పాల్గొన్నారు. -
నేటి నుంచి భూ భారతి రెవెన్యూ సదస్సులు
నిజామాబాద్అర్బన్: ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం అమలులో భాగంగా పైలట్ ప్రాతిపదికన జిల్లాలోని మెండోరా మండలాన్ని ఎంపిక చేసినట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు తెలిపారు. సదస్సుల నిర్వహణ కోసం రెండు రెవెన్యూ బృందాలను నియమించామని పేర్కొన్నారు. ఈ బృందాలు షెడ్యూల్ను అనుసరిస్తూ ఆయా గ్రామాలలో ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటూ భూ సంబంధిత సమస్యలపై రైతులు, ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రతి రోజు ఒక్కో బృందం ఒక గ్రామం చొప్పున రోజుకు రెండు గ్రామాలలో సదస్సులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని వివరించారు. అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి సహకారం అందించేందుకు వీలుగా హెల్ప్డెస్క్ బృందాలు, దరఖాస్తులను వెంటదివెంట పరిశీలన జరిపేలా వెరిఫికేషన్ బృందాలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నెల 5న చాకిర్యాల, కొడిచెర్ల గ్రామాలలోని ప్రాథమిక పాఠశాలల్లో భూ భారతి రెవెన్యూ సదస్సులు జరుగుతాయని వివరించారు. 6న బుస్సాపూర్, మెండోరా గ్రామాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో, 7న వెల్గటూర్ జడ్పీ హైస్కూల్, సావెల్ గ్రామ పంచాయతీలలో, 8న దూదిగాం సీఎస్ఐ స్కూల్, సోన్పేట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. భూ సమస్యలు ఉన్న రైతులు, ప్రజలు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. పైలట్ మండలంగా మెండోరా ఎంపిక రెండు రెవెన్యూ బృందాల నియామకం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సదస్సులు కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు వెల్లడి -
భగీరథుని స్ఫూర్తితో ముందుకు సాగాలి
జ్యోతిప్రజ్వలన చేస్తున్న అదనపు కలెక్టర్ కిరణ్కుమార్నిజామాబాద్అర్బన్: కష్టమైన కార్యం సాధించాలంటే భగీరథుని స్ఫూర్తితో ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పేర్కొన్నారు. శ్రీ భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివా రం కలెక్టరేట్లో నిర్వహించారు. వేడుకలకు హాజరైన అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ భగీరథుడు ఘోర తపస్సు ద్వారా ఆకాశ గంగను భూమికి తె చ్చాడని పురాణ ఇతిహాసాలలో పేర్కొనబడిందని గుర్తుచేశారు. మహనీయుల స్ఫూర్తితో సమాజ హి తానికి పాటుపడేందుకు వీలుగా ప్రభుత్వం జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. మహనీయుల ఆలోచనా విధానాలతో ముందుకు సాగితే సమాజం సత్వర అభివృద్ధి సాధించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. బీసీ సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారిణి స్రవంతి, సహాయ అధికారి నర్స య్య, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ ఘనంగా భగీరథ మహర్షి జయంతి -
నీట్ పరీక్ష కేంద్రాల పరిశీలన
ఖలీల్వాడి: నగరంలోని ప్రభుత్వ పాలిటెక్ని క్ కాలేజీ, గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీల్లో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష కేంద్రాలను సీపీ సాయి చైతన్య సందర్శించారు. కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు, పరీక్ష సరళి పరిశీలించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ నీట్ పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు రాసిన జవాబుపత్రాలు స్ట్రాంగ్ రూమ్కు చేరే వరకు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. సీపీ వెంట ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, పీజీ బ్లాక్ ఇన్చార్జి డిప్యూటీ డాక్టర్ కే రంజిత, ఎస్సై హరిబాబు తదితరులు ఉన్నారు. -
అకాల వర్షంతో రైతన్న ఆగమాగం
కామారెడ్డి టౌన్/భిక్కనూరు/దోమకొండ/తాడ్వాయి/గాంధారి/లింగంపేట/రాజంపేట/బీబీపేట: కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలలో ఆదివారం అకాల వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాలలో రై తులు ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. కొన్నిచోట్ల వడ్లు కొట్టుకుపోయాయి. జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్లో వడ్లు ఆరబెట్టిన రైతులు.. వర్షం రాకతో ఆగమయ్యారు. కామారెడ్డి పట్టణంలో గంట పాటు కురిసిన వర్షంతో రోడ్లపై నీరు చేరింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మాచారెడ్డి, రాజంపేట తదితర మండలాల్లో వడగళ్లు కురి శాయి. భిక్కనూరు, దోమకొండ మండలాల్లోని పలు గ్రామాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కోతకు వచ్చిన వరి పంట నేలవాలింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. లింగంపేట మండలంలోని భవా నీపేట, జల్దిపల్లి, రాంపూర్, ముంబోజీపేట, గాంధారి మండలంలోని పలు గ్రామాలలో, తాడ్వాయి మండలకేంద్రంతోపాటు కరడ్పల్లి, కన్కల్, దేమికలాన్, కృష్ణాజీవాడి, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో బలమైన గాలులతో కూడిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి. మామిడి కాయ లు రాలిపోయాయి. మొక్కజొన్న నేలవాలింది. వడ్ల ను వెంటవెంటనే తూకం వేసి, రైస్మిల్లులకు తరలించకపోవడంతో నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుజాల్పూర్లో పిడుగుపాటు కలకలం అకాల వర్షం ఐదుగురి ప్రాణాల మీదికి తెచ్చింది. బీబీపేట మండలంలోని తుజాల్పూర్కు చెందిన గోప వివేక్, కలకుంట్ల రాజు, గోప కవిత, గోప హేమలత, గోప రంజిత్ వర్షం వస్తుండడంతో వడ్లను కుప్పచేసి చెట్టుకిందికి చేరారు. ఆ చెట్టుపై పిడుగుపడింది. దీనిని గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కామారెడ్డిరూరల్ : కామారెడ్డి మండలంలోని చిన్నమల్లారెడ్డి, పాతరాజంపేట్, సరంపల్లి, క్యాసంపల్లి, దేవునిపల్లి, లింగాపూర్, నర్సన్నపల్లి, చిన్నమల్లారెడ్డి పరిధిలోని గురు రాఘవేంద్ర కాలనీలలో వడగండ్లు కురిశాయి. కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యం వడగళ్లతో ఇతర పంటలకూ నష్టం పిడుగుపాటుతో ఇద్దరి పరిస్థితి విషమం -
తొలి పసుపు పరిశ్రమ!
డొంకేశ్వర్(ఆర్మూర్) : రాష్ట్రంలోనే తొలిసారిగా రైతులే స్వయంగా జక్రాన్పల్లి మండలం మనోహరాబాద్లో నెలకొల్పిన పసుపు పరిశ్రమ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ సోమవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. ఇందుకు ‘రైతు ఉత్పత్తిదారుల సంఘం’ అన్ని ఏర్పాట్లు చేసింది. ఎంపీతో పాటు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, పసుపు బోర్డు కార్యదర్శి భవానీ శ్రీ, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ, జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతును ఆహ్వానించారు. రెండేళ్లు శ్రమించిన తర్వాత పసుపు పరిశ్రమను ఎట్టకేలకు ప్రారంభించుకోవడం పై ఎఫ్పీవో సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పండించిన పసుపు పంటను మార్కెట్కు వెళ్లి విక్రయించడానికి రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో స్వయంగా పసుపు క్లస్టర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. పంటను పండించి దానికి రేటు కట్టి విదేశాలకు ఎగుమతి చేయాలని భావించారు. అనుకున్నట్లుగానే జక్రాన్పల్లి, మనోహరాబాద్, కలిగోట్, పడకల్, మైలారం గ్రామాల నుంచి 600 మంది రైతులు పోగయ్యారు. జేఎంకేపీఎం పేరుతో మనోహరాబాద్లో అర ఎకరం స్థలాన్ని ఎంపిక చేసి సొంతగా పసుపు పరిశ్రమ కోసం 2023లో పనులు ప్రారంభించారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ ఆత్మ నిర్భర్ పథకం కింద రుణసాయం పొందారు. పసుపు ఉడకబెట్టే, పాలిష్ చేసే, గ్రేడింగ్ చేసే, పసుపు ఆకులతో ఆయిల్ తీసే యంత్రాలను కొనుగోలు చేశారు. గోదాములు నిర్మించుకున్నారు. ప్రారంభోత్సవానికి అంతా సిద్ధం చేసుకుని ఉత్పత్తులు ఎగుమతి చేయడానికి ఒప్పందాలను చేసుకున్నారు. మొదటి సారిగా ‘ఇందూరు పసుపు’ బ్రాండ్ పేరుతో ఆర్మూర్ పసుపు పొడిని ఈజిప్టు దేశానికి ఎగుమతి చేయనున్నారు. ఏడాదిలో రూ.100 కోట్లు, ఐదేళ్లలో రూ.500 కోట్ల టర్నోవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రైతు ఉత్పత్తిదారుల సంఘం బాధ్యుడు పాట్కూరి తిరుపతి రెడ్డి వెల్లడించారు. మార్కెటింగ్ను విస్తృతం చేస్తామని పసుపు పంట ఉత్పత్తులే కాకుండా భవిష్యత్తులో ఇతర పంటలను కూడా ఎగుమతి చేయాలని ఆలోచన చేస్తున్నామన్నారు. మనోహరాబాద్లో నేడు ప్రారంభించనున్న ఎంపీ అర్వింద్ 600 మంది రైతులు కలిసి సొంతంగా ఏర్పాటు చేసుకున్న యూనిట్ పసుపు ఉడకబెట్టే, పాలిష్ చేసే, గ్రేడింగ్ చేసే, పసుపు ఆకులతో ఆయిల్ తీసే యంత్రాల కొనుగోలు, గోదాముల నిర్మాణం ‘ఇందూరు పసుపు’ బ్రాండ్ పేరుతో ఈజిప్టు దేశానికి పసుపు పొడి ఎగుమతి -
అర్హుల జాబితా జల్లెడ
మోర్తాడ్(బాల్కొండ): ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఇంటి నిర్మాణ సాయం అందుకునేవారిలో పక్కాగా అర్హులే ఉండాలనే ఉద్దేశంతో అధికారుల బృందం మరోమారు సర్వే చేపట్టింది. మొదట ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని అధికారులు స్వయంగా కలిసి అర్హత ఉందో లేదా అని తేల్చేందుకు సాంకేతికత సాయంతో సర్వే నిర్వహించారు. అధికారులు సిద్ధం చేసిన అర్హుల జాబితాలను ఇందిరమ్మ కమిటీలు పరిశీలించి లబ్ధి పొందేవారిని ఎంపిక చేశారు. కాగా, ఇందిరమ్మ కమిటీలో ఎక్కువగా అధికార పార్టీ నియమించిన వారే సభ్యులుగా ఉండటంతో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా సాగిందో లేదో అనే సందేహంతో మరోమారు సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించింది. కమిటీ సిద్ధం చేసిన తుది జాబితాలోనూ అనర్హులుంటే వారిని తొలగించాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మండల స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు, పట్టణాలలో మున్సిపల్ ఉద్యోగులు సర్వే నిర్వహిస్తూ అర్హుల కోసం జల్లెడ పడుతున్నారు. కాగా, వితంతువులు, దివ్యాంగులు, పూరి గుడిసెలో ఉన్నవారు, ప్రమాదవశాత్తు ఇళ్లు కోల్పోయిన వారికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం సూచించగా అవే మార్గదర్శకాలను అధికారులు అనుసరిస్తున్నారు. నిర్మాణంపై అవగాహన.. అర్హులైన వారు ఇందిరమ్మ ఇంటి సాయం అందుకునేందుకు పాటించాల్సిన మార్గదర్శకాలను అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగులకు ఇచ్చిన యాప్లో ఇంటి నిర్మాణ విస్తీర్ణం పక్కాగా లెక్క కట్టే నైపుణ్యం ఉంది. దీంతో 400 చదరపు అడుగులకు తక్కువ కాకుండా 600 చదరపు అడుగులకు ఎక్కువ కాకుండా ఇంటి నిర్మాణం చేపట్టాలని సూచిస్తున్నారు. తొలి విడతలో కొందరు ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించడంతో వారికి బిల్లు మంజూరు సాధ్యం కాలేదు. కసరత్తు చేస్తున్నాం ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేసిన వారిలో ఎవరైనా అనర్హులుంటే వారి పేర్లను తొలగిస్తున్నాం. పక్కాగా అర్హులైన వారికే ఇందిరమ్మ ఇంటి నిర్మాణ సాయం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏ ఒక్క అనర్హునికి పథకం వర్తింపజేయడం జరుగదు. – తిరుమల, ఎంపీడీవో, మోర్తాడ్మంజూరు నామమాత్రమే.. ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకుంటే రూ.5 లక్షల సాయం అందిస్తామని ప్రభుత్వం వెల్లడించిన విషయం విదితమే. 2024–25 ఆర్థిక సంవత్సరానికి జిల్లా మొత్తంలో ఎంపిక చేసిన 31 గ్రామాలలో కేవలం 2,762 మందికే సాంకేతిక ఆమోదం తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల నిర్మాణానికి సాయం అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. అర్బన్ నియోజకవర్గంతో సహా మిగిలిన అన్ని చోట్లా మరో 16వేలకు పైగా ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చి దశల వారీగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. కాగా, గృహ నిర్మాణసంస్థలో ఉద్యోగుల కొరత కారణంగా ఇళ్ల నిర్మాణానికి సాంకేతిక ఆమోదం తెలిపినా గ్రౌండింగ్తోపాటు ఇంటి నిర్మాణ దశల వారి పరిశీలన అత్యంత కష్టతరంగా మారింది. పేదలకే ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తించేలా చర్యలు అనర్హుల తొలగింపునకు మరోమారు సర్వే నిర్వహిస్తున్న అధికారుల బృందం క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ కమిటీలు ఫైనల్ చేసిన జాబితాల పరిశీలన -
నీట్ పరీక్షకు 3,298 మంది హాజరు
నిజామాబాద్అర్బన్: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా అధికారులు ఎనిమిది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 11 నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరిగింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,398 మంది అభ్యర్థులకు 3,298 మంది పరీక్షకు హాజరుకాగా, 100 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. సెంటర్ నిర్వాహకులు అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించారు. నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో ముగ్గురు అభ్యర్థులు, బోధన్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముగ్గురు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించలేదు. జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాల వద్ద పరీక్ష నిర్వహణ అధికారులు, పోలీసు సిబ్బంది మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. విద్యార్థులను తనిఖీలు చేయాలని పరీక్షల నిర్వహణ అధికారులు పోలీసులకు తెలిపారు. తనిఖీలు చేసే బాధ్యత తమది కాదని కేవలం సెక్యూరిటీ మాత్రమే తమదని పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. సెంటర్ల వారీగా హాజరైన అభ్యర్థుల వివరాలు నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో 720 మంది అభ్యర్థులకు 705 మంది హాజరుకాగా, 15 మంది గైర్హాజరయ్యారు. తెలంగాణ యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కళాశాల కేంద్రంలో 456 మంది అభ్యర్థులకు 438 మంది హాజరు కాగా 18 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ కేంద్రంలో 384 మంది అభ్యర్థులకు 374 మంది హాజరుకాగా 10 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. బోధన్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 432 మంది అభ్యర్థులకు 420 మంది హాజరుకాగా, 12 మంది గైర్హాజరయ్యారు. బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 432 మంది అభ్యర్థులకు 422 మంది పరీక్ష రాయగా, 10 మంది హాజరుకాలేదు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో 384 మంది అభ్యర్థులకు 373 మంది హాజరుకాగా, 11 మంది గైర్హాజరయ్యారు. నాగారంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో 312 మందికి గాను 304 మంది పరీక్ష రాయగా, 8 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాలలో 278 మంది అభ్యర్థులకు 262 మంది హాజరుకాగా, 16 మంది గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. రెండు కేంద్రాల్లో ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులు లోనికి అనుమతించని అధికారులు -
ఒలింపిక్ సంఘ భవన స్థలాన్ని కాపాడుకుంటాం
నిజామాబాద్నాగారం: ఒలింపిక్ సంఘ భవన స్థ లం కోసం కేటాయించిన స్థలాన్ని కాపాడుకుంటా మని సంఘం జిల్లా కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య అ న్నారు. ఆదివారం నగరంలోని ముబారక్నగర్లో ఉన్న ఒలంపిక్ సంఘ భవన స్థలాన్ని సభ్యులతో కలిసి పరిశీలించారు. 2010లో గత ప్రభుత్వం ఖలీల్వాడిలో ఉన్న స్టేడియం స్థలానికి బదులు ముబారక్నగర్లో 7ఎకరాల35 గుంటల స్థలంతో పాటు పక్కనే ఉన్న 700 గజాల స్థలాన్ని సంఘ భవనం కోసం కేటాయించిందని అన్నారు. ఈ స్థలంలో గ తంలో మంత్రి ఉన్న సుదర్శన్రెడ్డి మంజూరు చేసిన రూ. 15 లక్షల నిధులతో బేస్మెంట్, పిల్లర్ల వరకు పనులు చేపట్టినట్లు తెలిపారు. కొందరు భూకబ్జాదారులు స్థలాన్ని తమదంటు ఆక్రమణలకు పాల్ప డుతున్నారని అన్నారు. ఎవరైనా స్థలాన్ని కబ్జా చే యాలని చూస్తే సహించేది లేదన్నారు. సభ్యులు భూమారెడ్డి, సంజీవరెడ్డి, వెంకటేశ్వర్లు, అబ్బన్న, ఎ గ్జిక్యూటివ్ సభ్యులు జావేద్, రమేశ్ పాల్గొన్నారు. -
ధాన్యం తూకం.. అంతా మోసం..
బాల్కొండ: ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో చేపట్టిన ధాన్యం తూకంలో మోసానికి పాల్పడుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముప్కాల్ మండలం కొత్తపల్లిలో వేంపల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో రైతులను మోసం చేస్తూ తూకం వే స్తున్నారు. నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రంలో ఒక్కో బస్తా 41.5 కేజీలకు తూకం వేయాలి. ఇందులో 500 గ్రాములు బస్తా బరువు, ఒక కిలో కడ్తాగా పేర్కొంటూ అధికారులు నిబంధనలు తయారు చేశారు. కానీ ఇక్కడ అధనంగా 600 గ్రా ములు తూకమేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు మద్దతు ధర దేవుడెరుగు కా నీ కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న మోసాలతో రైతులు సతమతమవుతున్నారు. అసలే హమాలీలు లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబ డి కాంటాలు కావడం లేదు. దీంతో తేమ శాతం త గ్గి ధాన్యం తూకంలో అనేక తేడాలు వస్తున్నాయి. దానికి తోడు ఇలా ఎక్కువ తూకం వేయడంపై అ న్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల ప్రకారం తూకం చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. 41.5 కేజీలకు బదులు 42.1 కేజీల తూకం వేస్తున్న నిర్వాహకులు తీవ్రంగా నష్టపోతున్న రైతులు ఎక్కువ తూకం వేస్తున్నారు. కొనుగోలు కేంద్రంలో బస్తాను 42.100 కేజీలకు తూకం చేస్తున్నారు. ఎక్కువ తూకం వేయడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం. ఎండకాలం కావడంతో రోజులోనే తేమ శాతం తగ్గిపోతుంది. అయిన ఎక్కువగా తూకం చేస్తున్నారు. అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాల్లో మోసాలను అరికట్టాలి. – చందు, రైతు, కొత్తపల్లి -
బైరాపూర్లో ఒకరి ఆత్మహత్య
మోపాల్: మండలంలోని బైరాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెంది న లకావత్ ప్రసాద్ (33) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆరేళ్లుగా అతడు తలనొప్పితో బాధపడుతున్నాడు. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా, చికిత్స లు చేయించుకున్న నొప్పి నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెందాడు. ఈక్రమంలో శనివారం రాత్రి అతడు పురుగుల మందు తాగాడు. ఆదివా రం మధ్యాహ్నం కడుపు నొప్పి రావడంతో కుటుంబసభ్యులకు పురుగుల మందు తాగానని చెప్పాడు. వెంటనే వారు అతడిని నగరంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ప్రసాద్ భార్య సవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. అడ్లూర్ ఎల్లారెడ్డిలో వివాహిత.. సదాశివ నగర్(ఎల్లారెడ్డి): మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పా ల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. అ డ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన మాందాపురం మంజుల (30)కు పాల్వంచ మండలం భవానిపేట గ్రామానికి చెందిన బాలకిషన్తో 9ఏళ్ల క్రితం వివా హం జరిగింది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నా రు. కొన్నిరోజుల నుంచి వారి కుటుంబంలో తరచు గొడవలు జరుగగా, మంజుల చెయ్యి విరిగింది. దీంతో ఆమె పుట్టింటికి వచ్చింది. మంజుల తన భ ర్త, అత్తమామలతో ఇటీవల ఫోన్లో మాట్లాడగా వా రు నువ్వు ఇక్కడికి వస్తే మేము చనిపోతాం అని చె ప్పడంతో మనస్తాపం చెందింది. దీంతో ఆమె పుట్టినింట్లోనే చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతికి కారకులైన భర్త, అత్త, మామలపై చర్యలు తీసుకోవాలని మృతురాలి సోదరుడు ఫి ర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. -
వీడీసీలపై చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్నాగారం: గ్రామాల్లో వీడీసీల ఆగడాలపై అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇప్పటికై నా స్పందించి ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ కోయడ నరసింహులు గౌడ్ అన్నారు. నగరంలోని సంఘం జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ గ్రామాలలో వీడీసీల కబంధ హస్తాలలో సాంఘిక బహిష్కరణలు ఈతవనం దగ్ధాలు, బెదిరింపులు ఆగకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వం వెంటనే వీడీసీలను నిషేధించాలని వారి ఆగడాలను అరికట్టాలన్నారు. వీడీసీలపై బహుజన, వృత్తి, ప్రజా సంఘాలు అన్నీ కలిసి ఉద్యమాలు, పోరాటాలు చేయాలన్నారు. తాళ్ల రాంపూర్లో గౌడ గీత కుటుంబాల బహిష్కరణ, ఈతవనం దగ్ధం, గౌడ మహిళకు ఆలయంలో అవమానం ఘటన అనంతరం చెంగల్ కల్దుర్కి తగ్గేల్లి తదితర మండలాల్లో వేలాది ఈత వనాలను దగ్ధం చేయడం సరికాదన్నారు. అలాగే అంకాపూర్, కోటా ఆర్మూర్ గంగాసాగర్, మాక్లూరు బోర్గాంలలో వీడీసీలు బహిష్కరణలు, బెదిరింపులకు పాల్పడుతుండటం మాత్రం ఆగడం లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం వీడీసీలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, దగ్ధమైన ఈతవనాలకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. వీడీసీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కల్లు గీత కార్మిక సంఘం జిల్లా నాయకులు శ్రీరాంగౌడ్, శేఖర్ గౌడ్, కిషన్ గౌడ్, తాళ్ల శ్రీనివాసగౌడ్లు ఉన్నారు. -
పోలీసులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
ఖలీల్వాడి: పోలీసు సిబ్బంది ఎల్లప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సీపీ సాయిచైతన్న అన్నారు. సిబ్బంది విధి నిర్వహణలో ఉండటంతో తమ ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని, తమ ఆరోగ్యంతోపాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిజామాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ హాల్లో ఆదివారం పోలీస్శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర కంటి ఆస్పత్రి సౌజన్యంతో‘ ఉచిత కంటి పరీక్షల శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులలో కంటి వ్యాధులు ఎంతో వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. వ్యాధుల భారీన పడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు పాటిస్తే ఎంతో మంచిదన్నారు. ప్రతి ఒక్కరు పౌష్టిక ఆహారం తీసుకోవాలని తెలిపారు. పోలీసులు ఉచిత కంటి పరీక్షలు సద్వినియోగం చేసుకువాలని, ప్రతి ఒక్కరూ 6 నెలలకు ఒక్కసారి కంటి పరీక్షలు తప్పనిసరిగ్గా చేయించుకోవాలన్నారు. అనంతరం వైద్యులు 450 మంది సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ప్రొబేషనర్ ఐపీఎస్ సాయికిరణ్, అదనపు డీసీపీ(ఏఆర్) రామచందర్ రావు, ఏసీపీలు శ్రీనివాస్, మస్తాన్ అలీ, రిజర్వు సీఐ శేఖర్బాబు, సతీష్, సరళ తదితరులు పాల్గొన్నారు. -
నూతన కార్యవర్గం ఎన్నిక
నిజామాబాద్నాగారం: నగరంలో ఆదివారం జిమ్నాస్టిక్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రాష్ట్ర జి మ్నాస్టిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సో మేశ్వర్, ఎలక్షన్ ఆఫీసర్ గోపిరెడ్డి, రాష్ట్ర అబ్జర్వ ర్ ముస్తఫా, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అ బ్జర్వర్ భూమారెడ్డి, జిల్లా యువజన క్రీడా అ థారిటీ అబ్జర్వర్ ఆర్చరీ కోచ్ మురళి పాల్గొని జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జి ల్లా అధ్యక్షుడిగా ఏలేటి కిరణ్ రెడ్డి, ప్రధాన కా ర్యదర్శిగా స్వామి కుమార్, కోశాధికారిగా చంద్రశేఖర్, వైస్ ప్రెసిడెంట్గా ప్రశాంత్, హర్దీప్, విజయ్, వేణురాజ్, జాయింట్ సెక్రెటరీ లుగా బుచ్చన్న, సురేష్ రెడ్డి, ప్రవీణ్,దేవేందర్, ఈసీ మెంబర్స్గా రాజేశ్వర్,మురళి, ప్రకాష్, సంధ్య, రాకేష్, రాజకుమార్, మణి తేజ, శ్రీకాంత్లు ఎన్నికయ్యారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి ఇందల్వాయి: దొంగతనాల నివారణకు గ్రామస్తులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని డిచ్పల్లి సీఐ మల్లేశ్ అన్నారు. శనివారం అర్ధరాత్రి ఇందల్వాయిలో తాళం వేసి ఉన్న రెండిళ్లలో దొంగలు పడి రూ.70వేల నగదు, 13 తులాల వెండి గొలుసులు, 2 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. బాధితులు జగ్గ జమున, నర్సింగ్ గంగాదాస్ ఫిర్యాదు మేరకు ఇందల్వాయి ఎస్సై సందీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం ఇందల్వాయి గ్రామాన్ని సందర్శించిన సీఐ, ఎస్సై లు గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామస్తులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు బృందాలుగా ఏర్పడి రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించాలని సూచించారు. గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. పోలీసు సిబ్బంది, గ్రామస్తులు ఉన్నారు. అప్రమత్తతతోనే విద్యుత్ ప్రమాదాల నివారణ సిరికొండ: అప్రమత్తతతోనే విద్యుత్ ప్రమాదాలను నివారించవచ్చని ట్రాన్స్కో డిచ్పల్లి ఏడీఈ శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలో విద్యుత్ భద్రతా వారోత్సవాలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఈ మాట్లాడుతూ.. సిబ్బంది విధుల్లో భద్రతా నియమాలు పాటించి సంస్థను జీరో ప్రమాదాల స్థాయికి తీసుకురావాలన్నారు. విద్యుత్ ప్రసారంలో ఏవైనా సమస్యలు తలెత్తితే వినియోగదారులు స్వంతంగా మరమ్మతులు చేపట్టకుండా సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. ఇతర నియమాలపై అవగాహన కల్పించారు. సిరికొండ సెక్షన్ ఏఈ చంద్రశేఖర్, సబ్ ఇంజినీర్ గంగారాం, లైన్ ఇన్స్పెక్టర్లు బాలచంద్రం, రాములు, లైన్మన్ జగన్, సుభాష్, సిబ్బంది, వినియోగదారులు తది తరులు పాల్గొన్నారు. -
రైతు ఉత్పత్తిదారుల సంఘాల కాలపరిమితి పెంచాలి
నిజామాబాద్ సిటీ: అభివృద్ధి చెందుతున్న రైతు ఉత్పత్తిదారుల సంఘాల కాలపరిమితిని పెంచాలని రైతు సంఘాల నాయకులు కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సాయినగర్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు నాయకుడు ఆకుల పాపయ్య మాట్లాడుతూ.. దేశంలోనే రైతు ఉత్పత్తిదారుల సంఘాలను మరింత బలోపేతం చేయడానికి తగిన నిధులు కేటాయించాలని కోరారు. రైతులు నాణ్యమైన ఉత్పత్తులను సరసమైన ధరలకు వినియోగదారులకు అందించేందుకుగాను స్టాల్స్ ఏర్పాటు చేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మాణించారు. సమావేశంలో రైతు నాయకులు కొండల్ సాయారెడ్డి, వేల్పూర్ భూమయ్య, కొట్టే గంగాధర్, కిష్ణాగౌడ్, మమ్మాయి రాజన్న, పద్మ, పెంటయ్య, ఎఫ్పీవోల చైర్మన్లు వినయ్కుమార్, సిరికొండ శ్రీనివాస్, పృధ్వీరాజ్, శంకర్, హన్మాండ్లు, పుష్ప, గోపాల్ పాల్గొన్నారు. -
బోధన్లో కార్డన్ సెర్చ్
బోధన్టౌన్: పట్టణంలోని బస్వతారక్నగర్ కాలనీలో శుక్రవారం ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలోని ప్రతి ఇంట్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేని వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ.. కార్డన్ సెర్చ్లో భాగంగా కాలనీలో నిర్వహించిన తనిఖీల్లో ఎలాంటి అనుమతి పత్రాలు లేని 110 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు, ఒక కారుతో పాటు ఒకే ఇంట్లో 35 మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రజలు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. కొత్తగా వచ్చిన వ్యక్తులకు ఆశ్రయం కల్పించరాదని, కాలనీల్లో ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సీఐలు వెంకట నారాయణ, విజయ్ బాబు, కృష్ణ, ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
నిజామాబాద్అర్బన్: ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రణాళికను రూపొందించి ప్రత్యేక తరగతులను నిర్వహించాలని ఇంటర్ బోర్డు ప్రత్యేక అధికారి ఒడ్డెన్న అన్నారు. ఇంటర్ విద్యాశాఖ ఉన్నతాధికారులు ఒడ్డెన్నను జిల్లా ప్రత్యేక అధికారిగా నియమించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి కార్యాలయంలో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఒడ్డెన్న మాట్లాడుతూ.. ఇంటర్ ఫెయిల్ అయిన ప్రతి విద్యార్థి పాస్ కావడానికి అవసరమైన విషయ పరిజ్ఞానాన్ని బోధించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రత్యక్ష లేదా ఆన్లైన్ తరగతులు నిర్వహించాలన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల హాజరు, తరగతుల నిర్వహణపై సమీక్ష నిర్వహించి నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రవికుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులు కళాశాలకు హాజరై ఫెయిల్ అయిన విద్యార్థుల జాబితా సేకరించి వారందరూ తరగతులకు హాజరయ్యేలా ప్రిన్సిపాల్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అలాగే పదో తరగతి పాసైన విద్యార్థుల జాబితాను సేకరించి ప్రత్యక్షంగా విద్యార్థులను కలుస్తూ వారిని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్పించేందుకు ప్రణాళికను రూపొందించాలని అన్నారు. జిల్లా అకడమిక్ సెల్ ఆర్గనైజర్ నరసయ్య, ప్రిన్సిపాల్లు తదితరులు పాల్గొన్నారు. -
రైతుల వివరాలు అప్డేట్ చేయాలి
● కోదండరెడ్డికి ఎన్డీసీసీబీ చైర్మన్ రమేశ్రెడ్డి వినతి సుభాష్నగర్ : ఉ మ్మడి జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతుల వివరాలు, మిస్సింగ్ డేటాను రుణమాఫీ పోర్టల్లో అప్డేట్ అయ్యేలా చూడాలని ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి కోరారు. రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని హైదరాబాద్లోని తన కార్యాలయంలో శుక్రవారం రమేశ్ రెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి జిల్లాల్లోని సొసైటీల్లో సీబీలో నమోదు చేయని కారణంగా రుణమాఫీ వర్తించలేదని, ఆ రైతుల వివరాలను పోర్టల్లో అప్డేట్ చేసి రుణాలు మాఫీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. సానుకూలంగా స్పందించిన చైర్మన్ కోదండరెడ్డి విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరగా రుణమాఫీ అమలయ్యేలా చూస్తామని హామీనిచ్చారన్నారు. అంతకుముందు కోదండరెడ్డిని శాలువాతో సత్కరించారు. సమావేశంలో రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులు, టీజీసీఏబీ ఎండీ కృష్ణారావు పాల్గొన్నారు. ఎప్సెట్ రాసి తిరిగి వస్తూ అనంతలోకాలకు.. ● రోడ్డు ప్రమాదంలో ఇద్దరు నిర్మల్ జిల్లావాసులు మృతి జక్రాన్పల్లి: జక్రాన్పల్లి మండలంలోని అర్గు ల్ శివారులోని 44వ నంబర్ జాతీయ రహ దారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెళ్లు అక్కడికక్కడే మృతి చెందా రు. జక్రాన్పల్లి ఎస్సై ఎండీ మాలిక్ రహమాన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని లోతర్య తండాకు చెందిన బానవత్ మంజుల(19), బానవత్ అశ్విని(17) శుక్రవారం ఎప్సెట్ రాసేందుకు కారులో హైదరాబాద్ వెళ్లారు. పరీక్ష రాసి తిరిగి వస్తుండగా.. అర్గుల్ శివారులోని జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న అక్కా చెల్లెళ్లు మంజుల, బానవత్ అశ్విని అక్కడికక్కడే మృతి చెందారు. కారును నడుపుతున్న జాదవ్ హంసరాజుకు కాలు, చేయి విరిగాయి. అతడిని ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై తెలిపారు. పిల్లలు సెల్ఫోన్లకు బానిస కావొద్దు ఖలీల్వాడి : పిల్లలు సెల్ఫోన్లకు దూరంగా ఉండాలని, బానిస కావొద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరతలక్ష్మి అన్నారు. నగరంలోని ఆర్బీవీఆర్ఆర్లో విద్యార్థినులకు పోలీస్శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్ శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో జిల్లా జడ్జి పాల్గొని మాట్లాడారు. సెల్ఫోన్లతో మంచి, చెడు రెండు ఉంటాయన్నారు. సెల్ఫోన్లను మంచికి ఉపయోగించాలని, చెడు వైపు ఎక్కువగా ప్రభావితం కావొద్దన్నారు. పిల్లలు తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలన్నారు. ఇతరులతో ఎలా ఉండాలో పిల్లలకు తల్లిదండ్రులు స్పష్టంగా చెప్పాలన్నారు. విద్యార్థినులు చదువుకునేటప్పుడు ఈవ్టీజింగ్ ఇబ్బందులు ఎదుర్కొంటారని, అలాంటి వాటిని ఎలా ఎదుర్కోవాలనే విషయాలను సమ్మర్క్యాంప్లో నేర్చుకోవడం గొప్పవిషయమన్నారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది : సీపీ సమ్మర్ క్యాంప్ ద్వారా బాలికలకు ఆత్మస్థై ర్యం పెరుగుతుందని సీపీ సాయిచైతన్య అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థిని అపాయం జరిగితే స్పందించాలన్నారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశమని, ఈ శిబిరం ద్వారా కొత్త నైపుణ్యాలను నేర్చుకున్నారన్నారు. అనంతరం శిక్షణ పొందిన వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రొబేషనరీ ఐపీఎస్ సాయికిరణ్, నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ సురేశ్ కుమార్, రిటైర్డ్ సీఐ కిషన్, తైక్వాండో ట్రెయినర్ మనోజ్, జేసీఐ సభ్యులు విజయానంద్, ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ సభ్యులు మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అ‘పూర్వ’ సమ్మేళనం
మోపాల్: మోపాల్ మండలం ముదక్పల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 2001–02 సంవత్సరంలో పదోతరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. 23 ఏళ్ల తర్వాత విద్యార్థులందరూ ఒకే చేరడంతో సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేణుగోపాల్, పోతన్న, అరుణ్కుమార్ శర్మ, సత్యనారాయణ, శోభ, పూర్వ విద్యార్థులు జగదీశ్రెడ్డి, వినోద్, మల్లయ్య, నరేశ్, డాక్టర్ భాస్కర్, రాంచందర్, అంజమ్మ, స్వప్న, హంసలత, మంజుల తదితరులు పాల్గొన్నారు. శ్రీనగర్లో.. రుద్రూర్: వర్ని మండలం శ్రీనగర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల హైస్కూల్ 1999–2000కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు శుక్రవారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. చిన్న నాటి మిత్రులు అందరూ ఒకే చోట చేరడంతో సంతోషం వ్యక్తం చేశారు. నాటి గురువులను ఘనంగా సన్మానించారు. -
‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల
తెయూ(డిచ్పల్లి): డిగ్రీ ప్రవేశాలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి శుక్రవారం ‘దోస్త్’ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ) 2025–26 నోటిఫికేషన్ను విడుదల చేసింది. మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాలకు అవకాశం కల్పించింది. ఈ సారి దోస్త్ ప్రక్రియను రద్దు చేసి ఇంటర్ మార్కుల ఆధారంగా డిగ్రీలో ప్రవేశాలు కల్పించాలని మొదట ఉన్నత విద్యామండలి అధికారులు భావించారు. అయితే చివరకు ఆలస్యంగా శుక్రవారం దోస్త్ నోటిఫికేషన్ను ఉన్నత విద్యామండలి చైర్మన్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి విడుదల చేశారు. గతేడాది మాదిరిగానే ఈ సారి విద్యార్థికి ఇష్టమైన సబ్జెక్టును ఎంచుకునేందుకు వీలు కల్పించే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. గతేడాది సున్నా అడ్మిషన్లు జరిగిన 82 కళాశాలలకు ఈ సారి అనుబంధ గుర్తింపు ఇవ్వకూడదని అధికారులు నిర్ణయించారు. కొత్త కోర్సులు ప్రారంభించాలనుకునే కాలేజీల సీట్లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. డిగ్రీలో విద్యాప్రమాణాల పెంపు, సిలబస్ మార్పుపై నాలుగు నెలలుగా మండలి తీవ్రంగా కృషి చేస్తోంది. వర్సిటీల వీసీలు, విద్యారంగ నిపుణులతో సిలబస్ మార్పుపై మండలి చైర్మన్ చర్చలు జరిపారు. ఈ ఏడాది నుంచే కొత్త సిలబస్ అమలులోకి తెస్తామని తెలిపారు. అయితే దీనికి విద్యాశాఖ ఇంతవరకూ ఆమోదం తెలుపకపోవడంతో సిలబస్ మార్పుపై సందేహాలు నెలకొన్నాయి. రాష్ట్రంలోని ఏ విశ్వవిద్యాలయంలోనైనా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, జేఎన్టీయూ, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా మరియు శిక్షణ మండలి(టీఎస్బీటీఈటీ) డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దోస్త్ సింగిల్ విండో ద్వారా సేవలను అందిస్తోంది. విద్యార్థులు ఎవరి సహాయం లేకుండా స్వయంగా తమ డిగ్రీ అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్లో పేర్కొంది. దోస్త్ వెబ్సైట్ https:// dost. cgg. gov. in ద్వారా విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. తెయూ పరిధిలో 69 కళాశాలలు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ డిగ్రీ (ప్రభుత్వ 15, ప్రభుత్వ అటానమస్ 5, ప్రైవేటు 49) కళాశాలలు మొత్తం 69 ఉన్నాయి. ఈ కళాశాలల్లో మొత్తం 33,830 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే గతేడాది కేవలం 12,764 సీట్లు(37.73 శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ సారి కూడా 40 శాతం లోపే సీట్లు భర్తీ అయ్యే అవకాశం ఉంది. మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాలు తెయూ పరిధిలో 33,830 సీట్లు మొదటి విడత: మే 3 నుంచి 21వరకు మొదటి విడతగా దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. మే 10నుంచి 22వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. మే 29న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. రెండవ విడత: మే 30 నుంచి జూన్ 8వరకు దరఖాస్తుల స్వీకరణ. మే 30 నుంచి జూన్ 9వరకు వె బ్ ఆప్షన్లు. జూన్ 13న సీట్ల కేటాయింపు ఉంటుంది. మూడవ విడత: జూన్ 13 నుంచి 19వరకు దరఖాస్తుల స్వీకరణ. జూన్ 13 నుంచి 19వరకు వెబ్ ఆప్షన్లు. జూన్ 23న సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్ 30 నుంచి డిగ్రీ కళాశాలల్లో తరగతులు ప్రారంభం. -
బాకీ డబ్బులు అడిగినందుకే హత్య
కామారెడ్డి క్రైం: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని సరంపల్లి శివారులో వద్ద రెండు రోజుల క్రితం జరిగిన ఓ మహిళ హత్య కేసును 48 గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. గతంలో అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినందుకే నిందితుడు ఆమెను హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. హత్యకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర వివరాలు వెల్లడించారు. నర్సన్నపల్లి గ్రామానికి చెందిన కవిత(44) బుధవారం సాయంత్రం వ్యవసాయ పొలానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె భర్త గంగారెడ్డి, కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా చెట్టుకు ఉరేసుకొని కనిపించింది. మృతురాలు ఒంటిపై ఆభరణాలు లేకపోవడంతో దుండగులు ఆమెను హత్య చేసి ఉంటారని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్జానం, ఆధారాలతో నిందితుడిని పాత నేరస్తుడు జంగంపల్లి మహేశ్గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. ఏడాది క్రితం నిందితుడు భిక్కనూర్ పీఎస్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడు. ఆ కేసులో జైలులో ఉన్న అతడికి బెయిల్ మంజూరు చేయించడానికి గాను అతడి కుటుంబ సభ్యులు ఈ కేసులో మృతురాలైన చిదుర కవిత వద్ద రూ.లక్ష అప్పు తీసుకున్నారు. మహేశ్ నెల రోజుల క్రితం బెయిల్ పై బయటకు వచ్చాడు. తన వద్ద తీసుకున్న రూ.లక్ష తిరిగి ఇవ్వాలని కవిత పలుమార్లు మహేశ్ను అడగడంతో ఆమెను చంపేస్తే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదని భావించిన అతను పథకం ప్రకారం బుధవారం సాయంత్రం వ్యవసాయ క్షేత్రం దగ్గరకు వస్తే డబ్బులు ఇచ్చేస్తానని చెప్పి నమ్మించాడు. ఒంటరిగా ఉన్న కవితపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. ఆపై చీరతో మెడకు ఉరి బిగించి హత్య చేసి మృతురాలి ఒంటిపై ఉన్న ఆభరణాలు ఎత్తుకెళ్లాడని ఎస్పీ వివరించారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. 48 గంటల్లోనే కేసును చేధించడంలో విశేషంగా కృషి చేసిన కామారెడ్డి రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్సై రాజు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. నర్సన్నపల్లి మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్ చంద్ర -
టైరు పేలి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు
కామారెడ్డి క్రైం: దేవునిపల్లి శివారులో ఉన్న దేవి విహార్ వద్ద ఎల్లారెడ్డి–కామారెడ్డి ప్రధాన రహదారిపై శుక్రవారం సాయంత్రం ఓ కారు ప్రమాదానికి గురైంది. టైరు పేలడంతో రోడ్డు పక్కన ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీ కొన్నది. కారు రోడ్డు కిందకు చెట్ల పొదల్లోకి దూసుకుపోగా విద్యుత్ స్తంభం విరిగిపోయింది. తాడ్వాయిలో ట్రాన్స్కో సబ్ ఇంజినీర్గా పని చేస్తున్న శివతేజ కారు నడిపిస్తున్నారు. ప్రమాదంలో అతడికి గాయాలు కాగా స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం సంభవించినప్పుడు సమీపం నుంచి ఎలాంటి వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. గుండారం మాజీ ఎంపీటీసీకి రిమాండ్ రాజంపేట: మండలంలోని గుండారం మాజీ ఎంపీటీసీ హజీ నాయక్ను శుక్రవారం రిమాండ్కు తరిలించినట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. గత నెల నడిమి తండాకు చెందినన హజీనాయక్ గ్రామంలోని గొడవలను సృష్టించడం, తండాలో జరిగే గొడవలపై కేసులు పెట్టిన వారిపై దాడి చేసినందుకుగాను బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. కోర్టు అనుమతి మేరకు రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. -
భూ భారతి పకడ్బందీగా అమలు చేయాలి
నిజామాబాద్అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, నీట్ పరీక్ష ఏర్పాట్లపై కలెక్టర్లులు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏప్రిల్ 17 నుంచి 30 వరకు రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో నిర్వహించిన మాదిరిగానే ఈ నెల 5 నుంచి 20 వరకు 28 జిల్లాల్లోని 28 మండలాల్లో పైలట్ ప్రాతిపదికన రెవెన్యూ సదస్సులను నిర్వహించాలని సూచించారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను ఈ నెల 31వరకు పరిష్కరించాలని, పరిష్కారం కాని వాటికి ఎందుకు పరిష్కరించడం లేదనే విషయాన్ని లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు. ప్రభుత్వ భూముల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డులలో నమోదు చేయాలని, అసైన్డ్ ల్యాండ్లకు సంబంధించి పొజిషన్ మీద ఉండి పట్టా లేనివారు, పట్టా ఉండి పొజిషన్ మీద లేనివారి వివరాలను సేకరించాలని సూచించారు. కాగా, భూభారతి నూతన చట్టంపై రాష్ట్రంలో 605 మండలాలకు గాను ఇప్పటివరకు 590 మండలాల్లో అవగాహన సదస్సులను నిర్వహించడం జరిగిందని, 85,527 మంది పౌరులు, 1,62,577 మంది రైతులు అవగాహన సదస్సులలో పాల్గొన్నారని మంత్రి వివరించారు. లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేయాలి.. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఎంపికలో అత్యంత పేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకూడదని స్పష్టం చేశారు. 400 చదరపు అడుగులకు తగ్గకుండా, 600 చదరపు అడుగులకు మించకుండా ఇంటి నిర్మాణం చేపట్టేలా చూడాలన్నారు. వీసీలో సీపీ సాయిచైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.నీట్కు పటిష్ట ఏర్పాట్లు.. ఈ నెల 4న జరగనున్న నీట్ పరీక్షకు పట్టిష్ట ఏర్పాట్లు చేయాలని మంత్రి పొంగులేటి అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. జిల్లాలో 3,398 మంది పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. 5 నుంచి ఎంపిక చేసిన మండలాల్లో రెవెన్యూ సదస్సులు ఇందిరమ్మ ఇళ్లు 600 చదరపు అడుగులకు మించొద్దు రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ -
ఎవరి జాబితా వారిదే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఆర్మూర్ నియోజకవర్గంలో రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఎవరికివారే అన్నట్లుగా అధికార కాంగ్రెస్, నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే ప్రత్యేకంగా జాబితాలు పంపుతున్నారు. ఇరు పార్టీల నుంచి వేర్వేరుగా జాబితాలు వస్తుండడంతో అధికారులు పరేషాన్ అవుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్రెడ్డి ద్వారా ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ద్వారా బీజేపీ నాయకులు ఎవరికి వారే తమకు నచ్చినవిధంగా లబ్ధిదారుల పేర్లతో జాబితాలు పంపిస్తుండడంతో ఈ నియోజకవర్గంలో ప్రత్యేక వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో అధికారులు ఎవరి జాబితాలను ఫైనల్ చేయాలో అనే విషయమై తేల్చుకోలేకపోతున్నారు. ఇటు చూస్తే అధికార పార్టీ ఇన్చార్జి వినయ్రెడ్డి, అటు చూస్తే ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి మధ్య అధికారులు నలిగిపోతున్నారు. అసలే రాకేశ్ రెడ్డి బహిరంగంగా, మీడియా ముఖంగా కడిగిపారేసే రకం కావడంతో అధికారులు ఆగమాగం అవుతున్నారు. దీంతో చేసేదేమీ లేక వచ్చిన జాబితాల్లోని పేర్లను కాదనకుండా కంప్యూటర్లో నమోదు చేస్తున్నారు. అభివృద్ధి పనుల్లోనూ.. ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తులు చేసుకునే విషయంలోనూ ఈ నియోజకవర్గంలో ప్రజలు ఎవరిని కలవాలనే విషయమై గందరగోళానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డితోపాటు వినయ్రెడ్డిలను కలుస్తూ దరఖాస్తులు ఇస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో అభివృద్ధి పనుల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గ్రామాల్లోని ఆయా పార్టీల నాయకులు ఎమ్మెల్యే, వినయ్రెడ్డిలను కలిసి ఎవరికి వారుగా ప్రతిపాదనలు తయారు చేసి పంపుతున్నారు. ఈ ప్రతిపాదనల్లో వేటికి ప్రాధాన్యం ఇవ్వాలో అనే విషయమై అధికారులు కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉండాల్సి వస్తోంది. మరోవైపు పోలీసులు సైతం పరేషాన్ అవుతున్నారు. కొన్నిసార్లు ఒకే కేసు విషయమై ఇరుపార్టీల నాయకులు వేర్వేరు వర్గాల తరఫున ఫోన్ చేస్తే ఇబ్బందులు పడుతున్నారు. అధికార పార్టీ తరఫున వచ్చిన వారికి అనుకూలంగా వ్యవహరిస్తే ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి వర్గీయుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయని, సందర్భాన్ని బట్టి ఎదుటి వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తే అధికార పార్టీ బడా నేతల ఆగ్రహానికి గురవుతున్నామని వాపోతున్నారు. రాజీవ్ యువ వికాసానికి.. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ సీఎంఆర్ఎఫ్ విషయంలోనూ ఇదే పరిస్థితి -
నెల రోజులుగా సెంటర్లోనే..
మాక్లూర్: కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలను రైస్మిల్లుకు తరలించడంలో జాప్యం ఏర్పడుతోంది. ఒక్కో సెంటర్లో పక్షం నుంచి నెల రోజుల తరబడి బస్తాలు ఉంటున్నాయి. మాక్లూర్ మండలం అమ్రాద్ సొసైటీ పరిధిలోని అమ్రాద్ తండాలో తూకం వేసిన బస్తాలను తరలించకపోవడంతో విసుగెత్తిన గోవింద్ అనే రైతు ధాన్యం బస్తాలపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టుకుంటానని ఆవేదన వ్యక్తం చేశాడు. తనతోపాటు తండాకు చెందిన ఏ ఒక్క రైతు ధాన్యం బస్తాలను మిల్లుకు తరలించలేదని, నెల రోజులుగా ఎండకు ఎండి తాల్చుకుపోతున్నాయని వాపోయాడు. సొసైటీ చైర్మన్ ఎనుగంటి శంకర్గౌడ్కు ఫోన్ చేస్తే లారీలు, లేబర్ల కొరత ఉందని సమాధానం ఇస్తున్నాడని తెలిపారు. సొసైటీ సీఈవో గంగారాం ఫోన్ స్విచ్ఛాఫ్ పెట్టుకుంటున్నాడని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. లారీల కొరతతో గ్రామాల్లోని ట్రాక్టర్లను అద్దెకు తీసుకొని వడ్లను మిల్లుకు తరలిస్తున్నా. అమ్రాద్తండాలో జాప్యం జరిగింది. అక్కడి ధాన్యం కూడా మిల్లుకు తరలించే ఏర్పాట్లు చేస్తానని సీఈవో గంగారాం వివరించారు. -
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
ఆర్ఎస్ఈటీఐ డైరెక్టర్ రవికుమార్ డిచ్పల్లి: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత నుంచి ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆర్ఎస్ఈటీఐ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ(ఆర్ఎస్ఈటీఐ) నూతన డైరెక్టర్గా ఎం రవికుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సంస్థ డైరక్టర్గా పని చేసిన సుంకం శ్రీనివాస్ ఏప్రిల్ 30న పదవీ విమరణ పొందారు. ఆయన స్థానంలో ఎస్బీఐ ఉన్నతాధికారులు రవికుమార్ను నియమించారు. బాధ్యతలు స్వీకరించి న అనంతరం రవికుమార్ మాట్లాడుతూ.. ఎలక్ట్రీషియన్(30రోజులు), సీసీటీవీ ఇన్స్టాలేషన్(13 రోజులు) ఫొటో అండ్ వీడియోగ్రఫీ (30 రోజులు) కోర్సులలో పురుషులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల 3 నుంచి 20వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని గ్రామీణ ప్రాంతానికి చెందిన 19 నుంచి 40 ఏళ్ల లోపు వయసు కలిగిన యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసువాలని కోరారు. ఆధార్కార్డు, రేషన్ కార్డు, పదో తరగతి ధ్రువీకరణ పత్రం, ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు డిచ్పల్లిలో ఉన్న ఎస్బీఐ శిక్షణ కేంద్రంలో సందర్శించాలని, 08461–295428 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
ఈవీఎం గోడౌన్ పరిశీలన
నిజామాబాద్ అర్బన్: నగరంలోని వినాయక్నగర్లో ఉన్న ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం పరిశీలించారు. గోడౌన్కు వేసిన సీళ్లను, పోలీసు బందోబస్తు తీరును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈవీఎంల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉంటూ, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, విజయేందర్ తదితరులు ఉన్నారు. దరఖాస్తుల ఆహ్వానం సిరికొండ: మండల కేంద్రంలోని పీఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ గడ్డం రాజేశ్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఒక్కో గ్రూపులో 40 సీట్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈనెల 5 నుంచి 20వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదో తరగతిలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుందని అన్నారు. యూడీఐడీ పోర్టల్లో సదరం సేవలు డొంకేశ్వర్/ నిజామాబాద్ అర్బన్: దివ్యాంగులు సదరం కోసం యూడీఐడీ పోర్టల్లోనే స్లాట్ బుక్ చేసుకోవాలని డీఆర్డీవో సాయాగౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శుక్రవారం కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు అందించే సర్వీసులపై కొత్తగా రూపొందించిన యూడీఐడీ పోర్టల్పై గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భగా డీఆర్డీవో మాట్లాడుతూ.. యూడీఐడీలో 21 రకాల కేటగిరీలు ఉన్నాయని, ఇక మీదట సదరం కోసం యూడీఐడీలోనే స్లాట్ నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందుకు దివ్యాంగులు తమ ఆధార్ కార్డును మీసేవ కేంద్రాలకు తప్పనిసరిగా తీసుకెళ్లాలని కోరారు. సొంతగా మొబైల్ ఫోన్లో కూడా చేసుకోవచ్చన్నారు. ఇదివరకు సదరం సర్టిఫికెట్ కలిగి కాలపరిమితి ముగిసిన వారు యూడీఐడీలోనే రెన్యూవల్ చేసుకోవాలన్నారు. మీ–సేవ నిర్వాహకులకు ఈ నెల 5న దీనిపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. డీపీఎం రాచయ్య, ఏపీఎం ఉమా కిరణ్, సీడీపీవో సౌందర్య, ట్రైనర్ స్రవంతి, దివ్యాంగుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత మద్నూర్(జుక్కల్): డోంగ్లీ మండలంలోని సిర్పూర్ శివారులో ఉన్న మంజీర నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ను శుక్రవారం పట్టుకున్నట్లు ఆర్ఐ సాయిబాబా తెలిపారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అనంతరం రెవెన్యూ సిబ్బందితో కలిసి ట్రాక్టర్ను మద్నూర్ పీఎస్కు తరలించినట్లు తెలిపారు. ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
సన్నాలకు దిక్కెవరు?
● మోర్తాడ్కు చెందిన రైతు మెండె దాసు తన పొలంలో పండించిన సన్నరకం వరి ధా న్యం 50 క్వింటాళ్లను స్థానికంగా ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రానికి తరలించాడు. 15 రోజులవుతున్నా ఆ ధాన్యాన్ని మిల్లుకు తరలించలేకపోతున్నారు. ఇదేమిటని రైతు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ప్రశ్నిస్తే మిల్లర్లు సన్నరకాలను తీసుకోవడం లేదనే సమాధానం వచ్చింది. ఇది ఒక్క రైతు మెండె దాసుకు ఎదురైన చేదు అనుభవమే కాదు. సన్నరకం వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించిన ఎంతో మంది రైతులకు తప్పనిఇబ్బంది. మోర్తాడ్(బాల్కొండ) : సన్నరకం వడ్లు పండించిన రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొనుగోలు కేంద్రాల నుంచి వెళ్లిన ధాన్యాన్ని మిల్లర్లు తీసుకునేందుకు ససేమిరా అంటున్నారు. ఖరీఫ్ సీజన్లో సన్న రకం ధాన్యం క్వింటాలుకు ప్రభుత్వం రూ.500 ల బోనస్ ఇవ్వడంతో యాసంగిలోనూ అదే ఉత్సాహంతో రైతులు సన్నరకాలు సాగు చేశారు. అయితే, యాసంగి సీజన్లో పండించిన సన్నరకం వడ్లను మిల్లింగ్ చేస్తే ఎక్కువ శాతం నూక వస్తుందనే కారణంతో మిల్లర్లు వెనుకడుగు వేస్తున్నారు. ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకంతో ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా రైతులు 70శాతానికి పైగా సన్నరకాలను సాగు చేశారు. కాగా, మోర్తాడ్, ఏర్గట్ల, కమ్మర్పల్లి, భీమ్గల్, వేల్పూర్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా తదితర మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ప్రస్తుతం సన్నరకం వడ్లు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితి సన్నరకాలను సేకరించే విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని అధికార యంత్రాంగం చెబుతోంది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం సన్నరకాలను కొనుగోలు చేయలేక నిర్వాహకులు చేతులు ఎత్తివేసిన పరిస్థితి కనిపిస్తోంది. మోర్తాడ్ సహకార సంఘం ఆధ్వర్యంలో సేకరించిన సన్నరకం వరి ధాన్యాన్ని వేల్పూర్ మండలం పచ్చలనడ్కుడ రైస్మిల్లుకు ఇటీవల తరలించారు. అక్కడ యజమాని సన్నరకం వడ్లను దించుకోకపోవడంతో సహకార సంఘం ఉద్యోగులు అంకాపూర్ మిల్లుకు తరలించారు. ఇదే విషయాన్ని అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్తే సన్నరకాలను కచ్చితంగా దించుకుంటారని, ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు. అధికారులు చెప్పే మాటలకు క్షేత్రస్థాయి పరిస్థితులు విరుద్ధంగా ఉండడం గమనార్హం. ఉన్నతాధికారులు స్పందించి సన్నరకాలను మిల్లర్లు సేకరించేలా పక్కాగా ఆదేశాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. వడ్లు దించుకోవడానికి అంగీకరించని మిల్లర్లు దొడ్డు రకాలే తీసుకుంటామని స్పష్టం చేస్తున్న వైనం రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం -
అనారోగ్యంతో మహిళ..
ఆర్మూర్టౌన్: ఆరోగ్య సమస్యలు భరించలేని ఓ మహిళ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆర్మూర్ మండలం చేపూర్లో చోటు చేసుకుంది. ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. చేపూర్కు చెందిన ముత్యాల సుష్మ(47) అనే మహిళ ఆరోగ్య సమస్యలతో బాధ పడుతోంది. ఇటీవల ఆస్పత్రిలో చూయించినా నయం కాకపోవడంతో మనస్తాపానికి గురై బుధవారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబీకులు హైదరాబాద్కు తరలించగా అర్ధరాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
భారత్ సమ్మిట్ విజయంలో సుధాకర్ పాత్ర కీలకం
నిజామాబాద్ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన భారత్ సమ్మిట్ విజయవంతంలో జిల్లాకు చెందిన యువకుడు ప్రధాన పాత్ర పోషించాడు. ప్రపంచ దేశాల్లోని పారిశ్రామిక వేత్తలు హాజరైన ఈ సమ్మిట్లో పెట్టుబడులే లక్ష్యంగా సెమినార్లు నిర్వహించారు. వీటిని జిల్లాకు చెందిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూకె చాప్టర్ ఉపాధ్యక్షుడు రంగుల సుధాకర్ గౌడ్ కీలకంగా వ్యవహరించారు. ప్రపంచ వ్యాప్తంగా వంద దేశాలకు పైగా ప్రతినిధులు పాల్గొన్న ఈ సమ్మిట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్, మంత్రివర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సమ్మిట్లో ప్రపంచస్థాయి నాయకులకు పవర్ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా సుధాకర్ గౌడ్ వివరించారు. దేశంలో ఇతర రాష్ట్రాల కంటే హైదరాబాద్ ఎంతో సురక్షితమని, తెలంగాణ పెట్టుబడుల ఖజానా అని వివరించారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధుల ప్రతిరోజు షెడ్యూల్తోపాటు పలు అంశాలను విదేశీయులకు వివరించారు. సుధాకర్గౌడ్ను రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డిలు ప్రశంసించారు. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి పర్యటించిన యూకే పర్యటన సైతం పర్యవేక్షించారు. సుధాకర్గౌడ్ సామర్థ్యాన్ని తెలిసిన సీఎం రేవంత్రెడ్డి ఆయనకు భారత్ సమ్మిట్ నిర్వహణలో కీలక బాధ్యతలు అప్పగించారు. సమ్మిట్ విజయవంతం కావడంతో సుధాకర్గౌడ్ను సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ అభినందించారు. విదేశీయులకు పెట్టుబడులపై వివరించిన యువకుడు సీఎం యూకే టూర్లో స్వయంగా పర్యవేక్షణ -
కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
సుభాష్నగర్: రాష్ట్రంలోని కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో కార్మికుల కోసం మరిన్ని పథకాలు అమల్జేస్తామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి పేర్కొన్నారు. గురువారం మే డే సందర్భంగా నగరంలోని శ్రద్ధానంద్గంజ్లోగల మార్కెట్కమిటీ మీటింగ్ హాల్లో హమాలీ, దడువాయి, చాటా కార్మికులకు చైర్మన్ ముప్ప గంగారెడ్డితో కలిసి ఆయన దుస్తులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ.. మే డే అంటేనే కార్మికులు తమ సమస్యలపై గొంతెత్తే దినమన్నారు. గంజ్లో పని చేసే కార్మికులందరికీ లైసెన్సులు, ఇన్సూరెన్స్ పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపారు. ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్ ప్రారంభం.. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ మార్కెట్యార్డులో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను చైర్మన్ ముప్ప గంగారెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు తక్కువ ధరకు నాణ్యమైన భోజనం, టిఫిన్లు, చాయ్ వంటివి అందించడానికి క్యాంటీన్ను ప్రారంభించామన్నారు. ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ తారాచంద్, డీసీసీబీ డైరెక్టర్ గోర్కంటి లింగన్న, మార్కెట్ డైరెక్టర్లు, మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మే డే సందర్భంగా మార్కెట్ యార్డులో కార్మికులకు దుస్తుల పంపిణీ -
ప్రభుత్వ పాఠశాలల్లో కొరవడిన నాణ్యమైన విద్య
నిజామాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన కొరవడింది. దీనికి నిదర్శనమే బుధవారం వెలువడిన పదో తరగతి ఫలితాలు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందాలన్నా, మంచి ఫలితాలు రావాలన్నా బోధన ఎంత ముఖ్యమో.. పర్యవేక్షణ కూడా అంతే ముఖ్యం. విద్యావ్యవస్థలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే ‘పది’ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు వెనుకబడ్డాయని చెప్పొచ్చు. జిల్లా కేంద్రంలో పరీక్షల నిర్వహణ పకడ్బందీగా జరిగిందని జిల్లా అధికారులు పేర్కొంటున్నా మెరుగైన ఫలితాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టిసారించకపోవడమే అతి తక్కువ ఉత్తీర్ణత నమోదైందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. నార్త్, సౌత్ మండలాల్లో తక్కువ.. నార్త్ మండలంలో 248 మంది పరీక్ష రాయగా 215 మంది విద్యార్థులు పాసయ్యారు. ఇందులో అర్సపల్లి ప్రభుత్వ పాఠశాలలో 32 మందికి 25 మంది, కుమార్గల్లి పాఠశాలలో 19 మందికి 15 మంది, ఖలీల్వాడి పాఠశాలలో 79 మందికి 65 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. సౌత్ మండలంలో 361 మంది పరీక్ష రాయగా 240 మంది విద్యార్థులు పాసయ్యారు. కోటగల్లి శంకర్ భవన్ పాఠశాలలో 107 మందికి 61 మంది విద్యార్థులే పాసయ్యారు. వాటర్ ట్యాంక్ ఉన్నత పాఠశాలలో 21 మందికి 13 మంది, కసాబ్గల్లి పాఠశాలలో 135 మందికి 93 మంది, ఖిల్లా ప్రభుత్వ పాఠశాలలో 62 మందికి 45 మంది విద్యార్థులు పాసయ్యారు. జిల్లా వ్యాప్తంగా 766 మంది విద్యార్థులు ఫెయిల్ అయితే అందులో నార్త్, సౌత్ మండలంలో 154 మంది విద్యార్థులు ఉన్నారు. నార్త్, సౌత్ మండలాల్లో విద్యావ్యవస్థ గాడితప్పింది. ఇక్కడ జిల్లా కేంద్రం కావడంతో ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఇక్కడే ఉన్నారు. వారు సంఘాల పేరిట ప్రతి రోజు నిరసన కార్యక్రమాలు, సభ్యత్వాల నమోదు వంటి కార్యక్రమాలు చేపడుతూ పాఠశాలలకు డుమ్మాలు కొడుతున్నారు. గైర్హాజరును అరికట్టేందుకు ఉన్నతాధికారులు కూడా దృష్టిసారించకపోవడం విద్యావ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. తరచూ విద్యార్థి సంఘాల తరగతుల బహిష్కరణ కూడా దీనికి కొందరు ఉపాధ్యాయ సంఘం నాయకులు వత్తాసు పలుకుతుండడంతో పాఠశాలల్లో నాణ్యమైన బోధన కొరవడుతోంది. సరైన విద్యాబోధన చేపట్టకపోవడంతోనే విద్యార్థులు చాలా మంది ఉత్తీర్ణులు కాలేదని పలువురు పేర్కొంటున్నారు. ఇందుకు నిదర్శనమే ‘పది’ ఫలితాలు నార్త్, సౌత్ మండలాల్లో 154 మంది విద్యార్థులు ఫెయిల్పరిశీలన చేస్తాం నార్త్, సౌత్ మండలాల్లో ఫలితాలు తక్కువ రావడంపై పరిశీలన చేస్తాం. మెరుగైన ఫలితాలు వచ్చేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఈ మండలాల్లో మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తాం. మెరుగైన ఫలితాల కోసం ప్రణాళిక రూపొందిస్తాం. – అశోక్, డీఈవో -
వేర్వేరు కారణాలతో పలువురి ఆత్మహత్య
కామారెడ్డి క్రైం: వేధింపులకు మరో నిండు ప్రాణం బలైంది. తరచూ భర్త వేధించడంతో ఓ వివాహిత భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలానికి చెందిన పసుపులేటి సాయి అనే వ్యక్తికి అదే మండలానికి చెందిన పూజిత(20)తో తొమ్మిది నెలల క్రితం వివాహం జరిగింది. కొంత కాలంగా సాయి కామారెడ్డి సమీపం లోని ఎంఎస్ఎన్ ఫార్మా కంపనీలో ఉద్యోగం చేస్తూ తన భార్యతో కలిసి అశోక్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. కొద్ది రోజులుగా సాయి మరో మహిళతో నిత్యం ఫోన్లో మాట్లాడుతున్నాడనే విషయంలో భార్యా భర్తల మధ్య గొడవ జరుగుతోంది. దీంతో పాటు పెళ్లి సమయంలో ఒప్పుకున్న అర ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేయించాలని సాయి తన భార్యతో తరచూ గొడవపడుతూ వేధింపులకు గురి చేసేవాడు. బుధవారం రాత్రి కూడా వారిద్దరి మధ్య గొడవ జరిగినట్లు కుటుంబీకులు తెలిపారు. దీంతో భర్త వేధింపులు తాళలేక మనస్థాపానికి గురైన పూజిత గురువారం ఉదయం వారు నివాసం ఉంటున్న రెండు అంతస్తుల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పట్టణ ఎస్హెచ్వో చంద్రశేఖర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. భర్త వేధింపులతోనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి కృష్ణారావు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. జీవితంపై విరక్తితో ఒకరు..రుద్రూర్: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి జీవితంపై విరక్తితో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సునీల్ గురువారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. కోటగిరి పీఎస్ పరిధిలోని పొతంగల్ మండలం సోంపూర్ గ్రామానికి చెందిన సీతాపులే సంజీవ్(42) మద్యానికి బానిసయ్యాడు. దీంతో జీవితంపై విరక్తితో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. కుమార్తె కాపురంలో కలహాలు రావడంతో..మోర్తాడ్: కుమార్తె కాపురంలో కలతలు రావడంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మోర్తాడ్లో చేసుకుంది. ఎస్సై విక్రమ్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. మోర్తాడ్కు చెందిన కట్టెకోల్ల గోపి(51) వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని కుమార్తె ప్రేమ వివాహం చేసుకోగా ఆమె కాపురంలో సమస్యలు తలెత్తాయి. దీంతో తండ్రి వద్ద ఉంటోంది. మరోవైపు కాలికి ఏర్పడిన గాయం మధుమేహం వ్యాధితో తగ్గకపోవడంతో జీవితంపై విరక్తితో గోపి బుధవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య మానస ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.ఆర్మూర్లో మరొకరు..ఆర్మూర్టౌన్: పెర్కిట్కు చెందిన సయ్యద్ జాఫర్(42) అనే వ్యక్తి జీవితంపై విరక్తితో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ గురువారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. జాఫర్ కొన్ని రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో జీవితంపై విరక్తితో బుధవారం రాత్రి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
చేపలున్నాయా? లేవా?
బాల్కొండ: అనాధిగా కుల వృత్తినే నమ్ముకుని ఎస్సారెస్పీలో చేపల వేట కొనసాగిస్తున్న మత్స్యకారులకు చేపలు దొరకక ఉపాధి కోల్పోతున్నారు. దీంతో మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో నిత్యం 5వేల కుటుంబాల మత్స్యకారులు చేపల వేటను సాగిస్తారు. ప్రస్తుతం ప్రాజెక్ట్లో నీరు తగ్గుముకం పట్టింది. దీంతో చేపల కోసం వేట సాగిస్తున్న మత్స్యకారులకు చేపలు దొరకక నిరాశే మిగులుతోంది. ఈ ఏడాది 31లక్షల చేప పిల్లలు.. ఎస్సారెస్పీలో ప్రభుత్వం ఉచితంగా ఏటా 62 లక్షల చేప పిల్లలను వదులుతుంది. కానీ ప్రస్తుత సంవత్సరం 31 లక్షల చేప పిల్లలను మాత్రమే వదిలారు. వీటితోపాటు ప్రాజెక్ట్లో స్వయంగా చేపలు చేప పిల్లల ఉత్పత్తిని చేస్తాయి. అయినా చేపల వేట ప్రస్తుతం అంతంతా మాత్రంగానే ఉంది. దీంతో ప్రాజెక్ట్లో అసలు చేపలు ఉన్నాయా.. లేదా అంటూ మత్స్యకారులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 5 గంటలకే మత్స్యకారులు ప్రాజెక్ట్లో చేపల వేట కోసం వాలుతున్నారు. మధ్యాహ్నం వరకు ప్రాజెక్ట్లో తెప్పలపై సంచరిస్తూ వలలు వేస్తున్నారు. అయినా చేపలు చిక్కడం లేదంటున్నారు. పడితే షికారి లేదంటే బికారీ అన్నట్లుగా పరిస్థితి ఉందంటున్నారు. ఒక్కో రోజు ఖర్చులకు డబ్బులు రాని దుస్థితి ఉందంటున్నారు. వేట సాగకుంటే పూట గడవని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎస్సారెస్పీలో గతంలో అనేక నాసిరకం చేప పిల్లలను వదలడంతోనే చేపలు లేకుండా పోయాయనే విమర్శలు వినవస్తున్నాయి. నీరు తగ్గుముకం పట్టిన సందర్భంలో కూడ చేపలు చిక్కకుంటే నీరు నిండుగా ఉన్నప్పుడూ పరిస్థితి ఎంటాని జాలర్లు ఆందోళన చెందుతున్నారు. వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదల సమయం, వరద కాలువ ద్వారా నీటి విడుదల సమయంలో ఎక్కువ మొత్తంలో చేపలు వెళ్లిపోతున్నాయంటున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి ఆదుకోవాలని మత్స్యకారులు వేడుకుంటున్నారు. ఎస్సారెస్పీలో జాలర్లకు చిక్కని మత్స్యసంపద కుల వృత్తిని నమ్ముకున్న మత్స్యకారులకు వేట సాగక ఇబ్బందులుకుల వృత్తినే నమ్ముకున్నాం.. తాతా ముత్తాతల నుంచి కుల వృత్తినే నమ్ముకుని బతుకుతున్నాం. చేపల వేట సాగక ఇంట్లో పూడ గడవడం లేదు. ప్రభుత్వం ఇతర పనులను కల్పించి మత్స్యకారులను ఆదుకోవాలి. ఎండ కాలంలో ఇలాంటి పరిస్థితి ఉంటే ఎట్లా బతుకుతాం. – సాయిలు, మత్స్యకారుడు, బాల్కొండచేపలు చిక్కడం లేదు.. ప్రాజెక్ట్లో చేపలు చిక్కడం లేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, రాత్రిల్లో కూడ వేటాడుతున్నాం. కాని చేపలు రావడం లేదు. దీంతో ఖర్చులు కూడ మీదనే పడుతున్నాయి. చేపలు ఉన్నాయో లేదో తెలియడం లేదు. – భాస్కర్, మత్స్యకారుడు, రెంజర్ల -
గుర్తు తెలియని మహిళ మృతదేహం గుర్తింపు
మోపాల్: మండలంలోని కాల్పోల్, పూర్వ వర్ని మండలంలోని తిమ్మాపూర్ అటవీ శివారులో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గురువారం రాత్రి గుర్తించారు. గుర్తు తెలియని మహిళ తునికాకు సేకరణకు వచ్చి దారితప్పిపోయి ఉండవచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు. మూడు, నాలుగు రోజుల కిందటే మహిళ మృతిచెంది ఉంటుందని స్థానికులు పేర్కొన్నారు. ఈ విషయమై స్థానికులు పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. కేసు విషయమై మోపాల్ ఎస్సై యాదగిరిని వివరణ కోరగా మహిళ మృతదేహంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని శుక్రవారం ఘటన స్థలాన్ని పరిశీలిస్తామని తెలిపారు. మృతదేహం మోపాల్ శివారు, పాత వర్ని శివారు ప్రాంతమ అనేది తెలియాల్సి ఉంది. ఇసుక వేలంతో రూ.51వేల ఆదాయంమోర్తాడ్: భీమ్గల్ మండలం బెజ్జోరా వాగు నుంచి ఇసుకను తవ్వి అక్రమంగా నిలువ చేయగా వాటిని ఇటీవల రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. గురువారం వాటికి వేలం నిర్వహించగా రూ.51వేల ఆదాయం లభించింది. బెజ్జోరా శివారులోని వాగు నుంచి తరలించి డంప్ చేసిన 25 ట్రాక్టర్ల ఇసుకకు తహసీల్దార్ మహమ్మద్ షబ్బీర్ వేలం నిర్వహించారు. ఏడుగురు వ్యాపారులు వేలంలో పాల్గొనగా బాబాపూర్కు చెందిన సమీర్ ఇసుక టెండర్ను దక్కించుకున్నాడు. కేసులో వృద్ధురాలిని విచారించిన జడ్జిఖలీల్వాడి: అదనపు కట్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధురాలిని నిజామాబాద్ రెండవ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ శ్రీనివాస్రావు గురువారం కోర్టు ఆవరణలో ఉన్న ఆమె వద్దకు వచ్చి విచారించారు. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని శివాజీనగర్కు చెందిన ఓ మహిళ పలువురిపై వేధింపులు, అదనపు కట్నం పేరిట కోర్టులో కేసు వేశారు. విచారణలో భాగంగా నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలు అనసూయను జడ్జి ఆమె వద్దకు వచ్చి విచ్చారించి వివరాలు తెలుసుకున్నారు. -
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత
ఇందల్వాయి: మండలంలోని లింగాపూర్ వాగు నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను గురువారం పట్టుకొని పీఎస్కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. పాటితండాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో వెంటనే వాగులో తనిఖీలు చేపట్టి వారిని పట్టుకున్నట్లు చెప్పారు. గ్రామాల్లో ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మోపాల్లో..మోపాల్: మండలంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న బదావత్ మోహన్కు చెందిన ట్రాక్టర్ను పట్టుకున్నట్లు ఎస్సై యాదగిరిగౌడ్ గురువారం తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారని సమాచారం రావడంతో ట్రాక్టర్ను పట్టుకొని పీఎస్కు తరలించినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం.. ఆయిల్ చోరీనవీపేట: మండలంలోని నిజాంపూర్ ఎత్తిపోతల పథకానికి చెందిన ట్రాన్స్ఫార్మర్ను దుండగులు బుధవారం రాత్రి ధ్వంసం చేసినట్లు ఎస్సై వినయ్ గురువారం తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి అందులోని కాపర్ కాయిల్స్, ఆయిల్ను ఎత్తు కెళ్లారని పేర్కొన్నారు. రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతిమాక్లూర్: గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన మాక్లూర్ మండలం వెంకటాపూర్లో శివారులో చోటు చేసుకుంది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆలూర్ మండలం ఢీకంపల్లి గ్రామానికి చెందిన తంబాకు గౌరి(44), తంబాకు సాయిలు భార్యాభర్తలు. వీరు బోధన్ మండలం అమ్దాపూర్లో గురువారం నిర్వహించిన బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి బైక్పై వస్తుండగా వెంకటాపూర్ శివారులో ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొన్నది. ఈ ఘటనలో గౌరి పై నుంచి వాహనం వెళ్లడంతో ఆమె ఘటన స్థలిలోనే మృతి చెందింది. సాయిలుకు హెల్మెట్ ఉండడంతో స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గతంలోనే ఈ రోడ్డు గుండా అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ‘సాక్షి’ పలుమార్లు కథనాలు ప్రచురించింది. అధికారుల్లో మాత్రం స్పందన కరువవుతోంది. ఈ రోడ్డు గుండా అనేక మూలమలుపులు ఉన్నాయి. కనీసం సూచిక బోర్డులు సైతం లేకపోవడంతో పలువురు వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పేకాట స్థావరంపై దాడిసిరికొండ: మండలంలోని చిన్నవాల్గోట్ శివారులో పేకాట స్థావరంపై దాడి చేసి ఏడుగురిని గురువారం పట్టుకున్నట్లు ఎస్సై ఎల్ రామ్ తెలిపారు. వారి నుంచి రూ. 5,250 నగదు, ఐదు బైకులు, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రతిభ స్ఫూర్తిదాయకం
తెయూ(డిచ్పల్లి): గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రతిభ స్ఫూర్తిదాయకమని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎం యాదగిరి పేర్కొన్నారు. తె యూ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగంలో 8వ సె మిస్టర్ చదువుతున్న సింగని సాయివర్ధన్, కాను గుల విశ్వేశ్వరి సమ్మర్ ఫెలోషిప్కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గురువారం ఇద్దరు విద్యార్థులను రిజిస్ట్రార్ ప్రత్యేకంగా అభినందించారు. సాయివర్ధ న్ బెంగుళూరులోని ఇస్రో అనుసంధాన ఆస్ట్రోఫిజి క్స్ లేబొరేటరీలో అంతరిక్ష శాస్త్రంలో పరిశోధనకు ఎంపిక కావడం వర్సిటీకి గర్వకారణమన్నారు. విశ్వేశ్వరి హెచ్సీయూలో ప్రాసెస్ కెమిస్ట్రీలో పరిశోధనకు ఎంపిక కావడం గర్వకారణమన్నారు. విద్యా ర్థులను ప్రోత్సహిస్తున్న ఫార్మాస్యూటికల్ విభాగ అధ్యాపకులను రిజిస్ట్రార్ అభినందించారు. కార్యక్రమంలో అధ్యాపకులు వాసం చంద్రశేఖర్, పీఆర్వో పున్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
నేడు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక
సుభాష్నగర్ : నగరంలోని డీ–4 సెక్షన్ కా ర్యాలయంలో శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్)–2ను ఏర్పా టు చేసినట్లు డీఈ శ్రీనివాస్రావు, ఏడీఈ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. బో ర్గాం(పీ), వినాయక్నగర్, నాగారం సెక్షన్ల కు చెందిన వినియోగదారులు విద్యుత్ స మస్యలుంటే ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు. ప్రధానంగా బిల్లింగ్, లైన్ల మరమ్మ తులు, ఇతరత్రా విద్యుత్ సమస్యలపై సీజీఆర్ఎఫ్–2లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీజీఆర్ఎఫ్–2 చైర్మన్ ఎరుకల నారాయణ, కమిటీ సభ్యులు సలంద్ర రామకృష్ణ, లకావత్ కిషన్, సీజీఆర్ఎఫ్ ఫోర్త్ మెంబర్ మర్రిపల్లి రాజాగౌడ్ పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. 10 శాతం రాయితీ ● ఆర్టీసీ డీలక్స్ బస్సు ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ఖలీల్వాడి : నిజామా బాద్ నుంచి వరంగల్ కు డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే వారికి బేసిక్ టికెట్ చార్జీపై 10 శాతం రాయితీ ఇ స్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం జ్యోత్స్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రాయితీ డీలక్స్ బస్సులకు వర్తిస్తుందని, ప్రయాణికులకు ఉన్నత స్థాయి ప్రయాణాన్ని మరింత అందుబాటులో ఉంచడానికి ఆఫర్ ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ ఆ ఫర్ను ఉపయోగించుకొని టికెట్పై 10 శాతం తగ్గింపు చార్జీతో సౌకర్యవంతమైన ప్రయాణం చేయాలని ఆర్ఎం తెలిపారు. పథకాలు సద్వినియోగం చేసుకోవాలి ● జిల్లా జడ్జి భరతలక్ష్మి ఖలీల్వాడి: ప్రభుత్వం అమలు చేసే పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ జీవీఎన్ భరతలక్ష్మి సూచించారు. మేడే సందర్భంగా జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాసదన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని, వాటిని కార్మికుల దరికి చేర్చాలన్నారు. కార్మికుల కష్టానికి తగిన ప్రతిఫలం అందాలన్నారు. అదనపు జిల్లా జడ్జిలు ఆశాలత, హరీష మాట్లాడుతూ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్మిక ప్రయోజనాల కోసం కృషి చేస్తోందన్నారు. కార్మికులకు చట్టాలపై అవగాహన కల్పిస్తామని, అవసరమైన సహకారం అందిస్తామని న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ భాస్కర్ రావు తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిల్ల సాయారెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్రాజు, జిల్లా కార్మిక శాఖ అధికారి యోహాన్, సంస్థ పర్యవేక్షకురాలు శైలజారెడ్డి, కార్మికులు పాల్గొన్నారు. -
నర్సరీల నిర్వహణపై నిర్లక్ష్యం వద్దు
మోపాల్(నిజామాబాద్రూరల్): గ్రామాల్లోని నర్సరీల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యం వహించొద్దని, ఎండవేడిమి దృష్ట్యా మొక్కలకు ప్రతిరోజూ నీరు పట్టాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) శ్రీనివాస్రావు ఆదేశించారు. మోపాల్ మండలంలోని ముదక్పల్లి గ్రామపంచాయతీలో గురువారం ఆయన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో పారిశుధ్యం, ఇంటింటి చెత్త సేకరణ తదితర వివరాలను పంచాయతీ కార్యదర్శి సురేశ్ను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని నర్సరీ, వైకుంఠ ధామాన్ని పరిశీలించారు. అనంతరం డీపీవో మాట్లాడుతూ గ్రామాల్లో పరిసరాలను శుభ్రంగా ఉంచేలా చూడాలని, ప్రతిరోజూ ఇంటింటి నుంచి చెత్త సేకరణ చేపట్టాలన్నారు. పంచాయతీ రికార్డులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని, తప్పుడు వివరాలు నమోదు చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. ఆయన వెంట ఎంపీవో కిరణ్కుమార్, కార్యదర్శులు సురేశ్, వెంకటేశ్, మృదుల, పద్మజ, కారోబార్ శ్రీనివాస్ ఉన్నారు. ప్రతిరోజూ చెత్త సేకరణ చేపట్టాలి జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్రావు -
ప్రణాళికతో చదివా..
రాష్ట్రస్థాయి ఉత్తమ మార్కులు సాధించా..నిజామాబాద్ అర్బన్ : ‘పదో తరగతి ప్రారంభంలోనే ఉత్తమ మార్కులు సాధించాలని నిర్ణయించుకున్నా. పాఠశాలలో టీచర్లు బోధించిన పాఠాలను ఎప్పటికప్పుడు చదివా. దీంతో అనుకున్న దానికంటే ఎక్కువ మార్కులు సాధించా’ అని చెబుతోందీ రాష్ట్రస్థాయి ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థిని క్రితి. కాకతీయ ఒలంపియాడ్ పాఠశాలలో చదివిన ఆమె.. 596/600 రాష్ట్రస్థాయి మార్కులతో జిల్లా పేరును నిలబెట్టింది. ఆమె.. తన సక్సెస్ మంత్రాన్ని ‘సాక్షి’తో పంచుకుంది. తల్లిదండ్రుల స్ఫూర్తిగా.. భవిష్యత్తులో మంచి డాక్టర్ను కావాలన్నది నా కల. ప్రస్తుతం మా నాన్న డాక్టర్ కృష్ణ (ఈఎన్టీ), తల్లి సృజన డెంటల్ సర్జన్గా పనిచేస్తున్నారు. వీరి అడుగుజాడల్లోనే డాక్టర్ కావాలనుకున్నాను. వైద్యసేవలు అందించడం ఎంతో ఆనందాన్నిస్తుంది. అందుకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా చదివి డాక్టర్నవుతా. మెరుగైన విద్యాబోధన కాకతీయ ఒలంపియాడ్ పా ఠశాలలో విద్యార్థులకు ప్రత్యే క విద్యాబోధన అమలు చేస్తున్నాం. విద్యార్థుల మేథస్సు కు అనుగుణంగా చదివించాం. ఐఐటీ, నీట్, పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని పాఠశాల స్థాయిలోనే వారికి మెరుగైన విద్యను బోధిస్తున్నాం. ప్రత్యేక విద్యాబోధనతోనే క్రితి రాష్ట్రస్థాయి ఉత్తమ మార్కు లు సాధించింది. మా పాఠశాల నుంచి 580 కి పైబడి మార్కులు సాధించినవారు 30 మంది ఉండడం ఎంతో గర్వకారణం. – తేజస్విని, డైరెక్టర్, కాకతీయ ఒలంపియాడ్ పాఠశాలవెన్నుతట్టి ప్రోత్సహించారు నా చదువు విషయంలో తల్లిదండ్రుల సహకారం మరువలేనిది. ఎలా చదవాలి, ఒత్తిడి లేకుండా ఉండడం, సులభంగా అర్థమయ్యేలా పద్ధతులను వివరించారు. ప్రతి సబ్జెక్టుపై మొదట భయాన్ని తొలగించాలని తల్లిదండ్రులు చెప్పడంతో తేలికగా చదివాను. తక్కువ మార్కులు వచ్చినా వెన్నుతట్టి ప్రోత్సహించారు. శ్రద్ధ పెట్టి చదివితే మంచి మార్కులు సాధిస్తావని మోటివేట్ చేశారు. ‘రివిజన్ చేశా.. నోట్స్ రాసుకున్నా’రోజూ పాఠశాలకు వెళ్లగానే ఆరు సబ్జెక్టులకు సంబంధించి టీచర్లు పాఠాలు బోధించేవారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయా సబ్జెక్టులను రివిజన్ చేస్తూ, ప్రతి అంశంపై నోట్స్ రూపొందించుకున్నాను. మరుసటి రోజు పాఠశాలలో నిర్వహించే పరీక్షలను సులభంగా రాసేదానిని. టీచర్లు బోధించిన అంశాన్ని పరిశీలన చేసుకోవడం, చదవడం అలవాటుగా మార్చుకున్నాను. దీంతో ప్రతి సబ్జెక్టుపై పట్టు పెరిగింది. కొన్నిసార్లు సమ్మెటీవ్ పరీక్షల్లో అనుకోకుండా మార్కులు తగ్గేవి. అయినా ఒత్తిడికి లోనుకాకుండా రోజువారీ చదువును కొనసాగించాను. వార్షిక పరీక్షల్లో 590 మార్కులు సాధిస్తానని అనుకున్నా, కానీ 596 వచ్చాయి. అనుకున్న వాటికంటే ఎక్కువ మార్కులు రావడం ఎంతో సంతోషాన్నిచ్చింది. భవిష్యత్తులో మంచి డాక్టర్ నవుతా.. పదో తరగతి స్టేట్ టాపర్ క్రితి -
దాహార్తి తీర్చే చలివేంద్రాలు
వినాయక్నగర్లో శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్ సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన చలివేంద్రం ● నిబద్ధతతో నిర్వహణ ● ఏళ్ల తరబడి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్న సంఘాలు వేసవిలో చలివేంద్రాల ఏర్పాటు ప్రస్తుతంతో పోలిస్తే గతంలో ఎక్కువగా ఉండేది. మారిన పరిస్థితుల నేపథ్యంలో రానురాను వీటి సంఖ్య తగ్గుతూ వస్తోంది. అయితే కొన్ని సంఘాలు, సంస్థలు మాత్రం నిజామాబాద్ నగరంలో ఏళ్లతరబడి క్రమం తప్పకుండా చలివేంద్రాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. కొన్ని సంస్థలు 30 ఏళ్లుగా, మరికొన్ని సంఘాలు గత పదేళ్ల నుంచి వీటిని ఏర్పాటు చేస్తున్నాయి. అయితే ఏదో ఏర్పాటు చేశామన్నట్లుగా కాకుండా వీటి నిర్వహణ, పరిశుభ్రత పాటించే విషయంలోనూ పక్కాగా వ్యవహరిస్తూ పూర్తి నిబద్ధత పాటిస్తున్నారు. నగరంలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ సేవాసమితి ఆధ్వర్యంలో గత పదేళ్లుగా నిర్వహిస్తున్న చలివేంద్రాలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి దాహార్తిని తీరుస్తున్నాయి. వచ్చే ఏడాది చలివేంద్రాల సంఖ్య మరింతగా పెంచనున్నట్లు శివాజీ సేవాసమితి అధ్యక్షుడు లక్ష్మణ్రావు తెలిపారు. అలాగే నగరంలో మార్వాడి యువమంచ్, రాజస్తానీ బ్రాహ్మణ సమాజ్, టీఎన్జీవోస్ తదితర సంఘాలు క్రమం తప్పకుండా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ వస్తున్నాయి. సనాతన ధర్మ నిజామాబాద్ ఆధ్వర్యంలో నీళ్లతో పాటు మజ్జిగను సైతం అందిస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ -
రేవంత్ రెడ్డి అవుట్ సోర్సింగ్ సీఎం
నిజామాబాద్అర్బన్: సీఎం రేవంత్ రెడ్డి అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి అని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి విమర్శించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్రెడ్డి ఆర్ఎస్ఎస్కు చెందిన వ్యక్తి అని, తెలంగాణ బద్ధవ్యతిరేకి అయిన చంద్రబాబుకు శిష్యుడని పేర్కొన్నారు. రేవంత్రెడ్డికి తెలంగాణ అభివృద్ధిపై దృష్టి లేదని, తన కుటుంబం బాగుకోసమే పాటుపడుతున్నాడని ఆరోపించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను చూసి రేవంత్రెడ్డి మైండ్బ్లాక్ అయిందన్నారు. తెలంగాణ సాధించిన కేసీఆర్పై రేవంత్రెడ్డి విమర్శలు చేయడం సరికాదన్నారు. టీడీపీని తెలంగాణలో సమాధి చేసిన నీవు కాంగ్రెస్ను కూడా సమాధి చేసేపనిలో ఉన్నావని పేర్కొన్నారు. దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడమంటే మళ్లీ తెలంగాణను ఆంధ్రాలో కలపడమేనని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్, రాంకిషన్ రావు, సత్య ప్రకాశ్, సుజిత్సింగ్ ఠాకూర్, పూజ నరేందర్, పోల సుధాకర్, సుంకరి రవి, రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ శంకర్, వెల్మల్ రాజన్న, మోహన్, రజనీష్, ఫయీం ఖురేషి, శేఖర్ రాజా, మహేశ్, నవీన్, సూర్య, సురేశ్ సన్నీ, రవి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి విమర్శ -
జనగణన, కులగణన చారిత్రాత్మక నిర్ణయం
సుభాష్నగర్: కేంద్ర ప్రభుత్వం జనగణన, కుల గణన చేపడతామని ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పే ర్కొన్నారు. కేంద్రమంత్రివర్గ నిర్ణయంపై హర్షం వ్యక్తంచేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నగరంలోని నిఖిల్సాయి చౌరస్తాలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఎంపీ అర్వింద్ చిత్రపటాలకు గురువారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జనగణన, కులగణనతో దేశంలోని అన్నివర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. కేంద్రం నిర్ణయానికి ప్రజలు, మేధావులు హర్షం వ్యక్తం చేస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం ఈ విజయం తమదే అంటూ గొప్పులు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. 60 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ కులగణన ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే కులగణన, జనగణనలో ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉండే భారతీయులందరూ భాగస్వాములు కావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు గోపిడి స్రవంతిరెడ్డి, న్యాలం రాజు, మాదాసు స్వామి యాదవ్, నాగోళ్ల లక్ష్మీనారాయణ, పద్మారెడ్డి, నాగరాజు, గంగోనె సంతోష్, పంచరెడ్డి ప్రవళిక, పల్నాటి కార్తీక్, పుట్ట వీరేందర్ తదితరులు పాల్గొన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ -
మహిళా సంఘాలకే స్కూల్ యూనిఫాంల బాధ్యత
మోర్తాడ్(బాల్కొండ): పాఠశాలల పున:ప్రారంభంలోపు సర్కారు బడిలో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాంలను అందించేందుకు అటు విద్యా శాఖ, ఇటు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ చర్యలు తీసుకుంటున్నాయి. మహిళా సంఘాలకు ఉపాధి కల్పించడంతోపాటు విద్యార్థులకు సకాలంలో యూనిఫాంలను అందించేలా చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాల ల్లో 2024–25 విద్యా సంవత్సరం ముగిసే నాటికి ఉన్న విద్యార్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకొని 47,016 మంది బాలురు, 54,442 మంది బాలికలకు రెండు జతల యూనిఫాంలను కుట్టించనున్నారు. విద్యాశాఖ ఇప్పటికే క్లాత్ను అప్పగించగా, సెర్ప్ ఉద్యోగులు మండలాల వారీగా టైలరింగ్ చేసే తమ సంఘాల సభ్యులకు పంపిణీ చేశారు. ఒక్కో జత యూనిఫాంను కుట్టేందుకు రూ.75 చొప్పున కూలి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఒక్కో జతకు రూ.50 కూలి చెల్లించగా, కూలి గిట్టుబాటు కావడం లేదని మహిళా సంఘాల సభ్యులు సర్కారుకు విన్నవించారు. దీంతో ప్రభుత్వం స్పందించి రూ.25 చొప్పున కూలిని పెంచింది. గత సంవత్సరమే కూలి పెంచగా ఈ ఏడాది కూడా అంతే మొత్తం కూలి చెల్లించనున్నారు. కాగా, మహిళా సంఘాలకు ఉపాధి కల్పించే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా కూలి ధర పెంచితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక్కో జతకు రూ.75 చొప్పున కూలి యూనిఫాం క్లాత్ అప్పగించిన అధికారులు జూన్ 1వ తేదీలోపు కుట్టించాలని నిర్ణయం సకాలంలో అందిస్తాం.. విద్యార్థులకు సకాలంలో యూనిఫాంలను అందించేందుకు సలహాలు అందించాం. మహిళా సంఘాల సభ్యులు ఉత్సాహంతో యూనిఫాంలు కుట్టేందుకు ముందుకొచ్చారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా పాఠశాలల పున:ప్రారంభానికి ముందే యూనిఫాంలను అప్పగిస్తాం. – సాయాగౌడ్, పీడీ, సెర్ప్ -
రాహుల్గాంధీ సూచనతోనే కేంద్రం ప్రకటన
నిజామాబాద్ సిటీ: జనగణనతోపాటు కుల గణనను కూడా చేపడతామన్న కేంద్ర ప్రకటన అభినందనీయమని, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్గాంధీ ఆలోచనను కేంద్రం స్వీకరించిందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. దేశమంతా కులగణన చేపట్టాలని రాహుల్గాంధీ పార్లమెంట్లో పలుమార్లు ప్రస్తావించారని గుర్తుచేశారు. సీఎం రేవంత్రెడ్డి తెలంగాణలో కులగణనను విజయవంతంగా చేసి ఆదర్శంగా నిలిచారన్నారు. కులగణన అవసరమేలేదని మాట్లాడిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇప్పుడు ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ రాహుల్గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకున్నారన్నారు. దేశమంతా కులగణన చేయడం కాంగ్రెస్ విజయమన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజారెడ్డి, నాయకులు జావిద్ అక్రమ్, నరాల రత్నాకర్, కెతావత్ యాదగిరి, విపుల్ గౌడ్, నరేందర్ గౌడ్, సేవాదల్ సంతోష్, సాయి కిరణ్, శివ పాల్గొన్నారు. తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా నిలిచింది దేశమంతా కులగణన అభినందనీయం డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి -
5.74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
నిజామాబాద్అర్బన్: జిల్లాలో ఇప్పటి వరకు 5.74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ ప్రక్రి య కొనసాగుతోందని కలెక్టర్ రాజీవ్గాంధీ హను మంతు పేర్కొన్నారు. యాసంగి ధాన్యం సేకరణపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్తో కలిసి మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు బుధవారం వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిపై మంత్రులకు కలెక్టర్ వివరించారు. జిల్లాలో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకొని, కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటికే 5.34 లక్షల మెట్రిక్ ట న్నులు సన్న ధాన్యం, 40వేల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం సేకరించామని తెలిపారు. మే చివరి వారం నాటికి లక్ష్యం మేరకు ధాన్యం కొనుగోలు చే సేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 700 ల పైచిలుకు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరుగుతోందన్నారు. రైస్ మిల్లుల వద్ద, కొనుగోలు కేంద్రాలలో తరుగు పేరిట కోతలు అమలు చేయకుండా పక్కాగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల నుంచి వెంటవెంటనే ధాన్యం తరలించేలా సరిపడా సంఖ్యలో లారీలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఈసారి యాసంగిలో దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో వరి సాగు అయ్యిందని అన్నారు. ధాన్యం అమ్మకం విషయంలో రైతులు ఇ బ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు. అకాల వర్షాలతో ధాన్యం నిల్వలు తడిసిపోకుండా వాతావరణ పరిస్థితులపై క్షేత్రస్థాయి అధికారులు, సి బ్బంది ముందస్తుగానే రైతులకు తెలియజేస్తూ అప్రమత్తం చేయాలన్నారు. సాఫీగా కొనుగోళ్లు పూర్త య్యేలా అధికారులు అంకిత భావంతో కృషి చేయా లని హితవు పలికారు. వీసీలో డీఆర్డీవో సాయా గౌడ్, డీఏవో వాజిద్ హుస్సేన్, డీఎస్వో అరవింద్ రెడ్డి, డీసీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు వెల్లడి వీసీలో మంత్రులు ఉత్తమ్కుమార్, తుమ్మల నాగేశ్వర్ రావు సమీక్ష -
వంద మీటర్లు దాటితే జీతం కట్
నిజామాబాద్నాగారం: ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జీజీహెచ్లో హాజరు నమోదు చేసుకొని విధులకు డుమ్మా కొడదామనుకునే వారి ఆటలు ఇక చెల్లవు. ఆలస్యంగా డ్యూటీలకు వస్తూ ఠంఛనుగా జీతాలు పొందడానికి వీలుపడదు. నేటి నుంచి కొత్త హాజరు విధానం మొదలవుతోంది. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) ఏఈబీఏఎస్ (ఆధార్ ఎనబుల్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్)ను తీసుకొచ్చింది. మే 1 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయగా.. జిల్లాలో కొత్త హాజరు విధానానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అందరికీ ఫేస్మార్క్ తప్పనిసరి.. నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల, జీజీహెచ్లో విధులు నిర్వహిస్తున్న ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, కాంట్రాక్టు తదితర వైద్యులు ఎవరైనా సరే ఫేస్ మార్క్ అటెండెన్సు వేసుకోవాల్సిందే. గత రెండేళ్లు బయోమెట్రిక్ విధానం అమలు చేయగా, చాలా మంది వైద్యులు అటెండెన్సు వేసుకొని బయటకు వెళ్లడం సాధారణమైంది. ప్రధానంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యులు, సొంత ఆస్పత్రులున్న వైద్యులు వచ్చామా...పోయామా అన్నట్లు వ్యవహరిస్తున్నారని మిగతా వైద్యులు, ఉద్యోగులు చర్చించుకోవడం గమనార్హం. ఇలాంటి వ్యవహారాలకు చెక్ పెడుతూ ఎన్ఎంసీ ఫేస్మార్క్ అటెండెన్స్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా, కొత్త విధానంతో వయస్సు రీత్యా వేలిముద్రలు రాక ఇబ్బంది పడుతున్న వైద్యులకు ప్రయోజనం కలుగనుంది. అందరికీ వర్తింపు.. వైద్యులందరూ కచ్చితంగా తమ మొబైల్ ఫోన్లలో (ఏఈబీఏఎస్) ఫేస్మార్క్ అటెండెన్సు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందే. ఈ యాప్ జీజీహెచ్, మెడికల్ కళాశాలకు 100మీటర్ల పరిధిలోనే పని చేస్తుంది. 100 మీటర్ల దాటితే ఫేస్మార్కు కట్ అవుతుంది. దీంతో ప్రతి నిత్యం గంట, నిమిషాల చొప్పున కూడా జీతాల్లో కోత విధించనున్నారు. దీంతో నిత్యం నిర్ణీత వేళల్లో అందుబాటులో ఉండి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎన్ఎంసీ ఆదేశాల మేరకు మెడికల్ కాలేజ్, జీజీహెచ్లో ప్రత్యేకంగా డివైజ్ను ఏర్పాటు చేయనున్నారు. ఫోన్ ద్వారా వీలు కాకుంటే డివైజ్లో ఫేస్మార్కుతో అటెండెన్సు వేసుకొని విధులు నిర్వర్తించే వెసులుబాటు కల్పించారు. సిబ్బంది వివరాలు ఇలా.. వైద్యులకు ఫేస్మార్క్ హాజరు విధానం నేటి నుంచి అమల్లోకి.. మెడికల్ కాలేజీ, జీజీహెచ్లో ‘ఏఈబీఏఎస్’ ప్రత్యేక యాప్, డివైజ్ల ఏర్పాటు ఢిల్లీ నుంచి మానిటరింగ్ నేటి నుంచి దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాల, జీజీహెచ్లలో విధులు నిర్వర్తించే ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్, వైద్యులందరూ కచ్చితంగా ఫేస్మార్కు అటెండెన్సు వేసుకోవాలి. ఢిల్లీలోని ఎన్ఎంసీ మానిటరింగ్ చేస్తుంది. సమయ పాలనతోపాటు నియమ నిబంధనలు పాటించాలి. లేకపోతే జీతాల్లో కోత పడుతుంది. – డాక్టర్ శివప్రసాద్, ప్రిన్సిపాల్, మెడికల్ కాలేజీ -
బాలికలదే హవా..
పదిలోనూసంవత్సరం పరీక్షరాసినవారు ఉత్తీర్ణులైనవారు ఉత్తీర్ణత శాతం 2021-22 22,243 20,651 92.84 2022-23 21,592 18,810 87.12 2023-24 21,588 20,486 93.72 2024-25 22,694 21,928 96.62 బాలికలు 97.26 శాతం, బాలురు 95.99 శాతం ఉత్తీర్ణత ● జిల్లా వ్యాప్తంగా 96.62 శాతం ఉత్తీర్ణత ● రాష్ట్రంలో 16వ స్థానం ● 336 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో వందశాతం పాస్ ● ప్రైవేట్లోనూ ఫలితాల జోరు యాజమాన్యాల వారీగా ఉత్తీర్ణత వివరాలు -
నగదు, ఆభరణాల కోసమే మహిళ హత్య
కామారెడ్డి క్రైం: లింగంపేట మండల కేంద్రంలో ఈనెల 23న వెలుగు చూసిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఒంటరిగా నివసిస్తున్న మహిళ వద్దనున్న నగదు, ఆభరణాల కోసమే నిందితుడు హత్య చేసినుట్లు పోలీసుల విచారణలో తేలింది. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్చంద్ర వివరాలు వెల్లడించారు. లింగంపేటకు చెందిన లక్ష్మి(45) ఒంటరిగా ఉంటూ స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఆమె భర్త ప్రభాకర్ గతంలో అనారోగ్యంతో మృతి చెందగా కుమార్తె శిరీషకు వివాహం జరిగి హైదరాబాద్లో ఉంటుంది. ఇటీవల ఆమెకు కన్నాపూర్ గ్రామానికి చెందిన మరో కూలీ గారబోయిన శ్రీకాంత్తో పరిచయం ఏర్పడింది. ఈనెల 20న శ్రీకాంత్ ఆమె ఇంటికి వెళ్లగా, ఆమె ఇంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలపై కన్నేశాడు. ఎవరూ లేనిది చూసి చీరతో మెడకు ఉరివేసి హతమార్చాడు. అనంతరం మృతురాలి సెల్ఫోన్ తీసుకుని, ఇంటికి ఓ తాళం బిగించి, ఆభరణాలు, నగదుతో ఉడాయించాడు. ఆమె కుమార్తె ఫోన్ చేయగా లేపకపోవడంతో ఇంటి పక్కింటివారిని సంప్రదించింది. వారు ఇంటికి వెళ్లగా దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా సాంకేతిక పరిజ్ఞానం సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతడిని బుధవారం లింగంపేట వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడు గతంలో ఘట్కేసర్ పీఎస్ పరిధిలో కూడా ఇలాంటి హత్యకే పాల్పడ్డాడని, పలుమార్లు జైలుకు సైతం వెళ్లి వచ్చాడని, అతడిపై మొత్తం 9కేసులు ఉన్నాయని ఎస్పీ వివరించారు. కేసు చేధనలో విశేషంగా కృషి చేసిన ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస రావు, సీఐ రవీందర్ నాయక్, ఎస్సై వెంకట్ రావు, సిబ్బంది మురళి, జవ్వి నాయక్, శ్రీనివాస్ లను అభినందించారు. లింగంపేట మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్చంద్ర -
ప్రయివేట్లోనూ ఫలితాల జోరు..
నిజామాబాద్అర్బన్: జిల్లాలోని ప్రయివేట్ పాఠశాలు పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చాయి. జిల్లా కేంద్రంలోని కాకతీయ ఒలంపియడ్ పాఠశాల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు. ఎస్.క్రితి 596, నితేశ్ 591, అఖిల్ 590, డి.కృతి 587, సాయిశ్రేయస్ 586, జి.వర్షిణి 586, కౌశిక్ప్రసాద్ 585, సిద్ధిఖి 585, గౌతమ్ 585, జశ్వంత్ 584, అస్సాగౌర్ 583, ఎస్.భవాని 582, జె.యోచన 582, బి.అక్షర 581, కె.సహస్ర 580 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆశోక్ విద్యార్థుల అభినందన కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులను సన్మానించారు. పాఠశాల డైరెక్టర్ రామోజీరావ్, డైరెక్టర్ తేజస్విని, ప్రిన్సిపల్ తదితరులున్నారు. నగరంలోని రవి పబ్లిక్ పాఠశాల విద్యార్థులు ప్రద్నుమ 563, దీపిక 561, విఘ్నేష్ 560, జోషు 555, విహారిక 553, సన్నిత 552 మార్కులు సాధించారు. పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. విజయ్ పబ్లిక్ స్కూల్.. నగరంలోని ముబారక్నగర్ విజయ్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు 188 మంది పరీక్షలకు హాజరుకాగా వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. విద్యార్థులు ఇషిత 588, యూనిస్ సోషన్ 587, తనుశ్రీ 586 మార్కులు సాధించారు. నలంద పాఠశాల.. నలంద పాఠశాల విద్యార్థిని కె.లాస్య 559 మార్కులు సాధించింది. ఎస్.మనోజ్ 557 మార్కులు సాధించారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ మురళీకృష్ణ అభినందించారు. విశ్వవికాస్ పాఠశాల.. నగరంలోని విశ్వవికాస్ పాఠశాల విద్యార్థిని కె.నందిని 575 మార్కులు , సాయికృష్ణ 574, వర్షిక్ 564 , యశశ్వి 563, సహస్ర 551 మార్కులు సాధించారు. ఉత్తమ మార్కులు సాధించినవారిని పాఠశాల ప్రిన్సిపల్ సుస్మిత అభినందించారు. విశ్వభారతి విద్యాలయం.. విశ్వభారతి పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. తేజస్వి 557 మార్కులు , ప్రవళిక 546 మార్కులు సాధించారు. పాఠశాల కరస్పాండెంట్ శ్యాంసుందర్రెడ్డి ఉత్తమ విద్యార్థులను అభినందించారు. వాసు ఉన్నత పాఠశాల.. నగరంలోని వాసు ఉన్నత పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. శృతిక 581, వర్ష 546, నవ్య 545 మార్కులు సాధించారు. పాఠశాల కరస్పాండెంట్ వాసు విద్యార్థులను అభినందించారు. సెయింట్ జేవియర్స్ పాఠశాల.. సెయింట్ జేవియర్స్ పాఠశాల విద్యార్థిని సాత్విక 581 మార్కులు సాధించింది. మనోజ్ఞ 560, శృతిక 558, మధురిమ 538 మార్కులు సాధించారు. వీరి ని పాఠశాల ప్రిన్సిపల్ లతాగౌడ్ అభినందించారు. -
కార్మికుల బతుకుల్లో కానరాని కాంతులు
ఆర్మూర్: కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ శాఖను ఏర్పాటు చేసినా వారి బతుకులు మారడం లేదు. కార్మికుల పక్షాన పోరాటాలు చేయడానికి అనేక యూనియన్లు పుట్టుకొచ్చినా, ఉద్యమాలు చేసినా వారి జీవితాల్లో కాంతులు నిండటం లేదు. కనీసం ఉద్యమంలో పాల్గొని సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలోనైనా తమ బతుకులు మారేనా అని కార్మికులు పదకొండేళ్లుగా ఆశ గా ఎదురు చూస్తూనే ఉండాల్సిన దుస్థితి నెలకొంది. మే 1న ప్రపంచ వ్యాప్తంగా కార్మిక దినోత్సవా న్ని ఘనంగా జరుపుకుంటున్నా కార్మికుల బతుకులు చీకటిలో మగ్గిపోతున్నాయనేది అక్షర సత్యం. జీపీ కార్మికుల వెట్టి చాకిరీ.. జిల్లాలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు వెట్టి చాకిరీ చేస్తున్నారు. అనేక మంది కార్మికులకు చాలీచాలని జీతాలతో పొట్ట గడవడం కష్టంగా ఉంది. పంచాయతీల ఆదాయం, పన్నుల వసూళ్లతో సంబంధం లేకుండా వేతనాలను చెల్లించాలని కార్మికులు ఉద్యమాలు చేసిన ఫలితంగా ఇటీవల కాలంలో వీరికి వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. కానీ మూడు, నాలుగు నెలల వేతనం పెండింగ్లో ఉంచి వేతనాల చెల్లింపు చేయడంతో కార్మికులు ఇక్కట్లు పడుతున్నారు. బీడీ కార్మికులకు చేతి నిండా పని కరువు.. జిల్లాలో వ్యవసాయం తరువాత ఎక్కువ మంది బీడీ పరిశ్రమను నమ్ముకొని జీవిస్తున్నారు. పీఎఫ్ ఉన్న బీడీ కార్మికులకు వెయ్యి బీడీలు చుడితే రూ. 250 కూలీ, పీఎఫ్ లేని వారికి రూ.270 లభిస్తున్నా యాజమాన్యాలు అనుసరిస్తున్న తీరుతో చేతి నిండా పని లేకుండా పోయింది. బీడీలు చుట్టేందుకు కార్మికులు ముందుకు వచ్చినా వర్దీ బీడీల వల్ల వె య్యి బీడీలకు సంగం కూలీ తీసుకోవాల్సి వస్తోంది. యాజమాన్యాలు బీడీ కార్మికుల కడుపును కొడుతు న్నా కార్మిక శాఖ గాని, యూనియన్లు గాని చేసింది ఏమి లేదు. మరోవైపు పారిశుధ్య కార్మికులు, బీ డీ కార్మికుల వేతనాలకంటే ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల పరిస్థితి బాగుంది. కూలీలకు పని సమయం తక్కువగా ఉన్నా, రోజు కూలీ లభిస్తుండడంతో పనులు భేషుగ్గా ఉన్నాయని పలువురు అ భిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు స్పందించి కార్మికులకు సరైన ఉపాధి, సకాలంలో వేతనాలు అందించాలని పలువురు కోరుతున్నారు. యూనియన్లు ఉన్నా.. పోరాటాలు చేసినా మారని జీవితాలు నేడు కార్మికుల దినోత్సవం ‘మేడే’ -
చోరీకి పాల్పడ్డ మహిళ రిమాండ్
సిరికొండ: మండల కేంద్రంలో ఇటీవల చోరీకి పాల్పడ్డ మహిళను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని ఎస్సై రామ్ బుధవారం తెలిపారు. సిరికొండలో కిరాయికి ఉంటున్న తిరుపతి ఏప్రిల్ 28న ఇంటికి తాళం వేసి శుభకార్యానికి వెళ్లాడు. తిరిగివచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉండటంతో, బంగారం, నగదు చోరీ అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ధర్పల్లి సీఐ భిక్షపతి ఆధ్వర్యంలో విచారణ చేసి చోరీకి పాల్పడ్డ మహిళను గుర్తించి పట్టుకున్నట్లు తెలిపారు. నిందితురాలిపై సుమారు ఇప్పటికే 16 కేసులు ఉన్నాయని ఎస్సై తెలిపారు. షార్ట్సర్క్యూట్తో దుకాణం దగ్ధం నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలం గాలీపూర్ గ్రామంలో బుధవారం మధ్యాహ్నం షార్ట్సర్క్యూట్తో కిరాణం దుకాణం పూర్తిగా దగ్ధమైంది. గ్రా మానికి చెందిన గంజి రాజు కిరాణం దుకాణంలో బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కిరాణ సామగ్రి తగలబడటంతోపాటు నగదు పూర్తిగా అగ్నికి అహుతి అయ్యాయి. స్థానికులు గమనించి బిందెలతో నీటిని తీసుకువచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో దుకాణం పూర్తిగా కాలిబూడిదయింది. ఈ ప్రమాదంలో రూ. 2 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలిసింది. -
వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని నల్లమడుగు పెద్ద తండాకు చెందిన ఓ యువతి రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు తండావాసులు తెలిపారు. వివరాలు ఇలా..తండాకు చెందిన అర్చన(19) అనే ఇంటర్ విద్యార్థిని మంగళవారం సోదరుడు అరవింద్తో కలిసి ఈఏపీసెట్ పరీక్ష రాశారు. బుధవారం ఉదయం అరవింద్, అర్చన ఇద్దరు కలిసి బైక్పై హైదరాబాద్ నుంచి స్వగ్రామం నల్లమడుగు పెద్ద తండాకు బయలుదేరారు. మేడ్చల్ రింగ్ రోడ్డు సమీపంలో వీరి బైక్ను ఓ లారీ వెనుక నుంచి వచ్చిన ఢీకొట్టింది. ఈ ఘటనలో అర్చన అక్కడికక్కడే మృతి చెందగా, అరవింద్కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. రైలు ఢీకొని వృద్ధురాలు.. డిచ్పల్లి: డిచ్పల్లి రైల్వేస్టేషన్ వద్ద పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయరెడ్డి బుధవారం తెలిపారు. వివరాలు ఇలా.. డిచ్పల్లి మండలం దూస్గాం గ్రామానికి చెందిన రాయ సాయవ్వ (65) బుధవారం ఉదయం డిచ్పల్లి రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు దాటుతుండగా అప్పుడే వేగంగా వచ్చిన ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈఘటనలో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. నిజామాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్ చందన్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. దాబా పైనుంచి పడి యువకుడు.. డిచ్పల్లి: మండలంలోని డిచ్పల్లి రైల్వేస్టేషన్ ప్రాంతంలో ఓ యువకుడు దాబా పైనుంచి కింద పడి మృతిచెందాడు. ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపిన వివరా లు ఇలా.. డిచ్పల్లి రైల్వేస్టేషన్ ప్రాంతంలో నివసించే షేక్ అజహర్ (29) పెయింటర్గా పని చేస్తూ, మద్యానికి బానిసగా మారాడు. దీంతో అతడి భా ర్య కొన్ని నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మద్యం మత్తులో ఉ న్న అజహర్ తమ ఇంటి దాబా పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కుటుంబీకులు జి ల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడి త ల్లి తస్లీమ్బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వ్యాన్ కింద పడి బాలుడు.. సిరికొండ: మండలంలోని ము షీర్నగర్ గ్రామంలో డీజే బా క్సుల వ్యాను కింద పడి ఓ బా లుడు మృతి చెందినట్లు ఎస్సై రామ్ బుధవారం తెలిపారు. గ్రామానికి చెందిన మాలావత్ బాలు కుమారుడు జగదీష్(13), గణేష్ అనే వ్యక్తి తో కలిసి వ్యానులో మంగళవారం రాత్రి డీజే బా క్సులు తీసుకురావడానికి వెళ్లాడు. గణేష్ వాహనా న్ని అజాగ్రత్తగా నడపడంతో వ్యాను వెనుక బాక్సులపైన కూర్చున్న జగదీష్ కింద పడిపోయాడు. అతడి తలపై నుంచి వాహనం వెళ్లడంతో జగదీష్ అక్కడిక్కడే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
భూభారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
జక్రాన్పల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం ద్వారా పెండింగ్లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులు పరిష్కారం కానున్నాయని, రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో బుధవారం భూభారతిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ రైతులకు చట్టంలోని అంశాలను వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సమస్యలు పరిష్కరించి రైతులకు వారి భూములపై పూర్తి భరోసా అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం–2025 తెచ్చిందని తెలిపారు. సివిల్ కోర్టుకు వెళ్లే అవసరం లేకుండా జిల్లా స్థాయిలోనే భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు రెవెన్యూ డివిజనల్ అధికారికి, కలెక్టర్కు అధికారాలు కల్పించారని అన్నారు. ఇదివరకటి తరహాలోనే రెవెన్యూ కోర్టులను పునరుద్ధరించారని తెలిపారు. భవిష్యత్తులో భూ సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశ్యంతో భూమికి భూదార్ సంఖ్య కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనివల్ల భూ ఆక్రమణలకు అడ్డుకట్ట పడుతుందని అన్నారు. భూ హక్కుల రికార్డుల్లో ఏమైనా తప్పులు ఉంటే, భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిజామాబాద్ ఇన్చార్జి ఆర్డీవో స్రవంతి, ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, తహసీల్దార్ కిరణ్మయి, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ సాయిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ దత్తాద్రి, ఏవో దేవిక, ఆర్ఐ ప్రవీణ్ పాల్గొన్నారు. సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జక్రాన్పల్లిలో రైతులకు అవగాహన సదస్సు -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఆర్మూర్: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారికి ఇళ్లు అద్దెకు ఇచ్చే సమయంలో జాగ్రత్తలు పాటిస్తూ అద్దెకు ఇవ్వాలని ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి సాయికిరణ్ సూచించారు. పట్టణంలోని కమలానెహ్రూ కాలనీ, టీచర్స్ కాలనీల్లో బుధవారం తెల్లవారు జామున కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐలు సత్యనారాయణ, శ్రీధర్రెడ్డి, తొమ్మిది మంది ఎస్సైలు తమ 110 మంది పోలీసు బలగాలతో ఆయా కాలనీని జల్లెడ పట్టారు. ప్రతీ ఇంటిలో సోదాలు నిర్వహిస్తూ 9మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 10 బైక్లను, రెండు ఆటోలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. -
పది ఫలితాల్లో కేజీబీవీల సత్తా
ఆర్మూర్: బాలికా విద్యను ప్రోత్సహించడంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో విద్యార్థినులు పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబర్చారు. జిల్లా వ్యాప్తంగా 19 కేజీబీవీల్లో వంద శాతం ఫలితాలను సాధించి కేజీబీవీ రికార్డులను తిరగరాసారు. నిజామాబాద్ జిల్లాలోని 27 కేజీబీవీలను తెలంగాణ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ నార్త్, సౌత్ కేజీబీవీల్లో 8వ తరగతి వరకు మాత్రమే ఉండటంతో మిగిలిన 25 కేజీబీవీల్లో ఈ విద్యా సంవత్సరం 1,020 మంది బాలికలు పదో తరగతి పరీక్షలు రాయగా అందులో 1,001 మంది ఉత్తీర్ణత సాధించగా 19 మంది విద్యార్థినులు ఫెయిల్ అయ్యారు. దీంతో జిల్లా వ్యాప్తంగా కేజీబీవీల్లో 98.13 శాతం ఉత్తీర్ణత నమోదైందని డీఈవో అశోక్, సెక్టోరల్ ఆఫీసర్ (జీసీడీవో) భాగ్యలక్ష్మి తెలిపారు. టాపర్ మార్కులు 577.. ఆర్మూర్, బాల్కొండ, భీమ్గల్, ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, జక్రాన్పల్లి, కమ్మర్పల్లి, మాక్లూర్, మెండోరా, మోర్తాడ్, మోపాల్, ముప్కాల్, నవీపేట్, నిజామాబాద్, రుద్రూర్, సిరికొండ, వేల్పూర్, ఏర్గట్ల కేజీబీవీల్లో బాలికలు వంద శాతం ఉత్తీర్ణతను సాధించారు. రుద్రూర్ పాఠశాల విద్యార్థిని గోగుర్ల శివాణి 577 మార్కులు సాధించి టాపర్గా నిలిచింది. కాగా నందిపేట కేజీబీవీలో 80.64 శాతం ఫలితాలతో చివరి స్థానంలో నిలిచింది. ఈ పాఠశాలలో 31 మంది విద్యార్థినిలు పరీక్ష రాయగా 25 మంది పాస్ అయ్యారు. జిల్లా వ్యాప్తంగా 25 విద్యాలయాల్లో కలిపి 98.13 శాతం ఉత్తీర్ణత వచ్చే ఏడాది వంద శాతం ఫలితాలు సాధిస్తాం జిల్లాలోని కేజీబీవీ విద్యార్థినులు పదో తరగతి పరీక్షల్లో చక్కని ఫలితాలను సాధించారు. రానున్న విద్యా సంవత్సరంలో కేజీబీవీలపై ప్రత్యేక దృష్టి సారించి, వందశాతం ఉత్తీర్ణత సాధించే దిశగా చర్యలు తీసుకుంటాం. జిల్లా కలెక్టర్, డీఈవో సూచన మేరకు ఇప్పటికే అందుకు తగిన ప్రణాళికను సిద్ధం చేసుకున్నాం. – భాగ్యలక్ష్మి, సెక్టోరల్ ఆఫీసర్, నిజామాబాద్ -
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తాం
జక్రాన్పల్లి: అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు. మంగళవారం జక్రాన్పల్లి మండలం జక్రాన్పల్లి, కొలిప్యాక్, తొర్లికొండ, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన కొలిప్యాక్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. త్వరలోనే అర్హులకు ఫ్యామిలీ డిజిటల్ కార్డులను అందజేస్తామన్నారు. దేశంలోనే పేద ప్రజలకు సన్న బియ్యం అందజేస్తూ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ అని అన్నారు. రాజీవ్ వికాసం పథకం ద్వారా నిరుద్యోగ యువతకు సబ్సిడీ అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. జక్రాన్పల్లిలో విమానాశ్రయం స్థాపన కోసం తమ విలువైన పట్టా భూములను ఇవ్వబోమని వివిధ గ్రామాల రైతులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమాల్లో ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, కొలిప్యాక్ సొసైటీ మాజీ చైర్మన్ భాస్కర్రెడ్డి, మద్దుల రమేశ్, ఆర్మూర్ గంగారెడ్డి, నర్సారెడ్డి, చిన్న సాయి రెడ్డి, గడ్డం గంగారెడ్డి, కాటిపల్లి నర్సారెడ్డి, నిట్ శేఖర్, శ్రీనివాస్ గౌడ్, కనక రవి, మాదరి స్వామి తదితరులు పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి -
ధ్వంసమైన కాజ్వేలపై పట్టింపేది?
జక్రాన్పల్లి : మండలంలోని పలు గ్రామాల్లో ధ్వంసమైన కాజ్వేలపై అధికారుల స్పందన కరువైంది. దీంతో గ్రామాల ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జక్రాన్పల్లి మండలంలోని పడకల్ పెద్దమ్మ వాగుపై ఉన్న కాజ్వే, మనోహరాబాద్ వాగుపై ఉన్న కాజ్వేలు గతేడాది కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయాయి. దీంతో వాగుకు అటువైపు వ్యవసాయ పొలాలు ఉన్న రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల యాసంగి సమయంలో రెండు కిలోమీటర్ల దూరం నుంచి తిరిగి వచ్చి పంటలను సాగు చేసుకున్నారు. కానీ పంటలకు అవసరమైన ఎరువులు చల్లుకోవడానికి మందులను తరలించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు రైతులు జొన్న, మొక్కజొన్న పంటలు వేసుకున్నారు. ప్రస్తుతం కోత దశలో ఉన్న పంటల వద్దకు కోత కోయడానికి యంత్రాలు రాకపోవడంతో ఇబ్బందులు ఎదురొంటున్నారు. గతేడాది పడకల్ పెద్ద చెరువు తెగిపోవడంతో కింది భాగంలో ఉన్న పడకల్ పెద్దమ్మ వాగుపై ఉన్న కాజ్వే, మనోహరాబాద్ వాగుపై ఉన్న కాజ్వేలు ధ్వంసమయ్యాయి. దీంతో రెండు గ్రామాల రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. ఇదే వాగుపై దగ్గరలో కొత్తగా బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. దీంతో రైతుల పంట పొలాలకు వెళ్లడానికి రెండు కిలోమీటర్ల దూరం నుంచి తిరిగి రావాల్సి వస్తోంది. దీంతో వ్యయ ప్రయాసలను ఎదుర్కొవాల్సి వస్తోంది. ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించి వాగుపై కాజ్వే నిర్మించాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు. ఇబ్బందుల్లో రైతులు, గ్రామస్తులు పట్టించుకోని అధికారులు -
కార్మికుల సేవతోనే ఆస్పత్రికి మంచిపేరు
నిజామాబాద్నాగారం: జీజీహెచ్లో నిర్వహించే కార్మికుల సేవతోనే ఆస్పత్రికి మంచిపేరు వస్తుందని జీజీహెచ్ సూపరిండెంట్ శ్రీనివాస్ అన్నారు. మేడేను పురస్కరించుకొని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం ఉత్తమ కార్మికులకు జ్ఞాపికలు అందజేశారు. జీజీహెచ్లో విధులు నిర్వహించే సిబ్బంది మేడే స్ఫూర్తితో మరింత ఉత్సాహంగా పనిచేసి ఆస్పత్రిని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని అన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య, డిప్యూటీ సూపరింటెండెంట్ తిరుపతిరావు, ఏడీ రాజశేఖర్, నర్సింగ్ గ్రేడ్–2 సూపరింటెండెంట్ చంద్రకళ, నాయకులు హైమద్బేగం, స్వరూప, భారతి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇబ్బందులు పడుతున్నాం
పడకల్ శివారులోని పెద్ద మ్మ వాగుపై ఉన్న కాజ్వే ధ్వంసం కావడంతో వాగు దాటడానికి ఇబ్బందులు ప డుతున్నాం. వరి పంటకు మందులు చల్లుకుందామంటే బైక్పై యూరియా బస్తాలను వేసుకుని వాగు దా టడం కష్టంగా మారింది. అదేవిధంగా వ్యవసాయ యంత్రాలు వాగు దాటి రావడానికి ఇబ్బందులు ప డుతున్నారు. – లాడే సంజీవ్, రైతు, పడకల్ 24 క్యారెట్స్ 98,500 22 క్యారెట్స్ 90,925 వెండి(కిలో) 1,02,000 – నిజామాబాద్ బిజినెస్బంగారం ధరలు (10గ్రాములు) -
అసమానతలు లేని సమాజం కోసం..
మోపాల్: మీనయ్య అమరత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని అసమానతలు లేని సమాజం కోసం పోరాడాలని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య పిలుపునిచ్చారు. మంగళవారం నగరశివారులోని బోర్గాం(పి)లో మండల నాయకుడు మీనయ్య సంస్మరణ సభ నిర్వహించారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం యుద్ధం ప్రకటించిందని, దీనిని అందరూ ఖండించాలని కోరారు. శ్రామిక నగర్ గుడిసెవాసుల పట్టాల కోసం మీనయ్య పోరాడారని గుర్తుచేశారు. అంతకుముందు మీనయ్య చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున్, నాగభూషణం, యాదన్న, పరుచూరి శ్రీధర్, నీలం సాయిబాబా, చిన్నయ్య, వనమాల సత్యం, రమేశ్, భాస్కర్, భుజేందర్, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
కార్మికులకు మేడే సెలవు ఇవ్వాలి
నిజామాబాద్ సిటీ: అన్ని రంగాల కార్మికులకు మేడే రోజున సెలవు అమలు చేయాలని టీయూసీఐ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ముస్కె సుధాకర్ మాట్లాడుతూ.. కార్మికులు సంఘటితం కాకుండా కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక విధానాలను కార్మికలోకం తి ప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు వెంకన్న, రాజేశ్వర్, సాయన్న, ఇంతియాజ్, ధర్మపురి, కిషన్, గంగన్న, లక్ష్మీనారాయణ, నర్సింగరావు, గంగాధర్ పాల్గొన్నారు. బయోటెక్నాలజీ విద్యార్థులకు అభినందన తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ బయోటెక్నాలజీ విభాగంలో మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రత్యూష, పవన్ ఇండియ న్ అకాడమీ ఆఫ్ సైన్స్ సంస్థ నుంచి సమ్మర్ రీసెర్చ్ ఫెలోషిప్ కు ఎంపిక కావడం అభినందనీయమని వీసీ టి యాదగిరిరావు పేర్కొన్నా రు. ప్రత్యూష నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాంట్ రీసెర్చ్ సెంటర్, న్యూఢిల్లీలో పరిశోధనలు చేయనున్నారని, పవన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో పరిశోధనలు చేస్తారని విభాగాధిపతి ప్రసన్నశీల తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ప్రత్యూషను వీసీ ప్రత్యేకంగా అభినందించారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉచితంగా యోగా మ్యాట్స్ పంపిణీ సుభాష్నగర్: నగరంలోని సుభాష్నగర్లో ఉన్న దయానంద్ యోగా కేంద్రంలో అక్షిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిల్లలకు ఉచితంగా యోగా మ్యాట్స్ను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్షిత ఫౌండేషన్ చైర్మన్, సామాజికవేత్త సన్నీ కుమార్ మాట్లాడుతూ.. సమాజంలో ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా చాలా ముఖ్యమని అన్నారు. ప్రతిఒక్కరూ సేవాతత్వాన్ని అలవర్చుకోవాలని, పేదలకు సాయం చేయడమే అక్షిత ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. కార్యక్రమంలో యోగా గురువు రాంచందర్, ఆర్చరీ కోచ్ ఎం మురళీ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ భద్రత కల్పించాలి
సుభాష్నగర్: రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీల్లో పని చేస్తున్న పార్ట్ టైం లె క్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని సంఘం అధ్యక్షురాలు ప్రసన్న కోరా రు. ఈ మేరకు మంగళవారం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రసన్న మాట్లాడుతూ.. పార్ట్ టైం లెక్చరర్ల డిమాండ్ల సాధనకు ఎనిమిది రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇటీవ ల జారీ చేసిన జీవో నంబర్ 21లో సైతం తమకు కనీస ప్రాధాన్యత ఇవ్వకపోవడం బాధకరమన్నారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే వా రికి హామీ ఇచ్చారు. సంఘం ప్రతినిధులు రఘువీర్, గంగాధర్ పాల్గొన్నారు. జగన్మోహన్రెడ్డికి ఘన నివాళి నిజామాబాద్అర్బన్: భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుంచి విముక్తి చేయడంలో ఏబీవీపీ నాయకుడు జగన్మోహన్రెడ్డి చేసిన కృషి మరువలేనిదని ఏబీవీపీ ఇందూరు విభాగ్ కై రి శశిధర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కవిత కాంప్లెక్స్లో జగన్మోహన్రెడ్డి వర్ధంతిని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు వెంకటకృష్ణ, దుర్గా దాస్, ప్రేమ్ వాసు, విష్ణు, సాత్విక్, ఈశ్వర్, సన్నీ, అభినవ్, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఉగ్రవాదుల దాడి కిరాతకం
నిజామాబాద్నాగారం: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు చేసిన దాడులు అత్యంత కిరాతకమైనదని పలు ప్రజా సంఘాల నాయకులు అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని పలు చోట్ల మంగళవారం నివాళులు అర్పించారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో నిజామాబాద్ పేపర్ బాయ్స్– ఏజెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దాడిలో అమరులకు శాంతి కలగాలంటు కొవ్వొత్తులతో నివాళి అర్పించి మౌనం పాటించారు. కార్యక్రమంలో వనమాల సత్యం, రణం రవీందర్ గౌడ్, ఏజెంట్లు, సభ్యులు పాల్గొన్నారు. గాజుల్పేట్లో రామరక్ష స్తోత్ర పారాయణం నిజామాబాద్ రూరల్: నగరంలోని గాజుల్పేట్లో వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేద బ్రాహ్మణులు సామూహిక పంచ సూక్త రామరక్ష స్తోత్ర పారాయణాన్ని మంగళవారం పఠించారు. కార్యక్రమంలో ప్రమోద్ వట్టల్ వార్, దత్తు శాస్త్రి, మనోహర శాస్త్రి, న్యాలం శ్రీనివాస్, ప్రమోద్ హర్గే గంగాధర్, చంద్ర శేఖర్ శర్మ, శ్రీధర్, వైర్కగర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
వీడీసీలను కట్టడి చేయండి
ఆర్మూర్: గ్రామాల్లో రాజ్యాంగానికి వ్యతిరేకంగా సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్న గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)లను కట్టడి చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. వీడీసీలకు కుల వృత్తిదారులు వెట్టి చాకిరీ చేసే దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మూర్లో మంగళవారం బీసీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో వీడీసీల ఆగడాలను నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉన్న అన్ని కులాలపై వీడీసీలు పెత్తనం చెలాయిస్తూ కుల వృత్తులను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. తాళ్లరాంపూర్లో గౌడ కులస్తుల మీదనే కాకుండా జిల్లాలోని నాగంపేట్, మెండోర, పల్లికొండ, చేంగల్ తదితర గ్రామాల్లో యాదవులు, గంగపుత్రులు, రజక, ముదిరాజ్ తదితర కుల వృత్తులపై సైతం వీడీసీల ఆగడాలు కొనసాగుతున్నాయన్నారు. ఆయా కులవృత్తిదారుల నుంచి లక్షల రూపాయలు బలవంతంగా వసూలు చేస్తున్నారన్నారు. ఇకపై బీసీ కులాల జేఏసీ ఈ ఆగడాలను నియంత్రించడంలో పోరాటం చేస్తుందన్నారు. అనంతరం ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్కు గ్రామాభివృద్ధి కమిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు. బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం యాదవ్, ఆర్మూర్ జేఏసీ అధ్యక్షులు నరసింహ చారి, వివిధ కుల సంఘాల ప్రతినిధులు బిజ్జు దత్తాద్రి, దేగం యాదగౌడ్, బస్సాపూర్ శంకర్, మహిపాల్ యాదవ్, బీఎస్ఎన్ఎల్ రాజన్న, రాజమల్లు యాదవ్, స్వామి యాదవ్, భుమన్న యాదవ్, గూపన్ పల్లి శంకర్, బట్టు నరేందర్, లక్ష్మి నర్సయ్య, రవినాథ్, పల్లికొండ నర్సయ్య, వేల్పూర్ శ్రీనివాస్ గౌడ్, సుదర్శన్, రామగౌడ్, గంగాధర్, చందు, గంగాధర్, నర్సింగ్, రమేష్, శంకర్ గౌడ్ పాల్గొన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆర్మూర్లో బీసీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ -
గోశాలకు ఆవుల తరలింపు
రామారెడ్డి: కరీంనగర్ జిల్లా నుంచి మూడు చిన్న టాటా ఏస్ వాహనాల్లో 16కు పైగా ఆవులను మంగళవారం మండుటెండలో తూప్రాన్ తరలిస్తుండగా మాచారెడ్డి పోలీసులు పట్టుకొని మద్దికుంటలోని గోశాలకు తరలించారు. ఈ ఆవులను తూప్రాన్ సంతలో రైతులకు అమ్మడానికి తీసుకెళ్తున్నట్టుగా సమాచారం. కానీ ఆవులకు కనీస వసతులు కల్పించకుండా ఒక్కో వాహనంలో ఆరు ఆవులను ఎండలో తరలిస్తుండడంతో అవి విలవిలకొట్టుకోవడాన్ని పోలీసులు గమనించి అడ్డుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసి, ఆవులను మద్దికుంట గోశాలకు తరలించారు. దొంగల ముఠా సభ్యుల అరెస్టు ఇందల్వాయి: వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన దొంగల ముఠాలోని ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందల్వాయి పోలీస్స్టేషన్లో మంగళవారం ఎస్సై సందీప్, డిచ్పల్లి సీఐ మల్లేశ్ వివరాలు వెల్లడించారు. గన్నారం ఎక్స్ రోడ్ దగ్గర పోలీసులు మంగళవారం ఉదయం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు కారులో అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పట్టుకొని, విచారించారు. వారం రోజుల కిందట ఇందల్వాయి మండలంలో జరిగిన వరుస దొంగతనాలు, జక్రాన్పల్లి మండలం పడకల్ల్లో జరిగిన దొంగతనాలకు, భిక్కనూరులోని బస్వాపూర్లో జరిగిన దొంగతనాలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో చందుర్తి, కోనారావుపేటల్లో చోరీలకు పాల్పడిన దొంగల ముఠాలోని సభ్యులుగా గుర్తించారు. నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో సుమారు పది కేసులలో నిందితులుగా ఉన్నారన్నారు. వారి వద్ద నుంచి రెండు కార్లు, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. రోడ్డు ఆక్రమణల తొలగింపు ఖలీల్వాడి: నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా, న్యాల్కల్ ప్రాంతాలలో రోడ్డు వరకు ఉన్న షెడ్లు, ఆక్రమణలను మంగళవారం ట్రాఫిక్ ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో తొలగించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ట్రాఫిక్కు అంతరాయం కలిగించేలా ఆక్రమణలు ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. దుకాణదారులు నగర ప్రజలకు ఇబ్బందులు లేకుండా వ్యాపారాలు నిర్వహించుకోవాలని తెలిపారు. ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు.