breaking news
Nizamabad District News
-
కూలీల కొరత.. నిలిచిన కాంటా..
● ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సాగని పనులు ● బీహార్ నుంచి వచ్చే కూలీల సంఖ్య తగ్గిపోవడమే కారణం మోర్తాడ్(బాల్కొండ): ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూలీల కొరత వేధిస్తోంది. బీహార్ నుంచి రావాల్సిన కూలీలు పూర్తిస్థాయిలో రాకపోవడంతో ధాన్యం కొనుగోళ్లకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. స్థానికంగా ఉన్న హమాలీలతో ధాన్యం తూకం వేసే పరిస్థితి లేదు. మన రాష్ట్రంలో కూలీల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో కొన్నేళ్లుగా బీహార్ నుంచి వలస వచ్చే కూలీలపైనే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఆధారపడుతున్నారు. ఒకవేళ మిల్లర్లు ధాన్యంను తూకం వేయించినా వారు కూడా బీహార్ కూలీలపైనే ఆధారపడుతున్నారు. బీహార్ నుంచి కూలీలను తరలించడానికి ప్రతి గ్రామంలో మధ్యవర్తులు ఉన్నారు. కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్న సహకార సంఘాలు, సమాఖ్యల ప్రతినిధులు ఈ మధ్యవర్తులను ఆశ్రయించి వారి సహకారం కోరుతున్నారు. దసరా, దీపావళి తర్వాత బీహార్ వారికి ప్రత్యేక పండుగలు ఉండటంతో కూలీలు తరలిరావడానికి ఆటంకం ఏర్పడుతుందనే వాదన వినిపిస్తోంది. కొన్ని చోట్లనే అందుబాటులో.. జిల్లాలో సహకార సంఘాలు, మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో సుమారు 676 కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఇప్పటికే 550కిపైగా కొనుగోలు కేంద్రాలను అధికారికంగా ప్రారంభించారు. మిగిలిన కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కానీ కొన్ని కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం తూకం వేయడానికి కూలీలు ఉన్నారు. అనేక చోట్ల రెండు, మూడు రోజుల్లో కూలీలు వస్తారని, వారు రాగానే ధాన్యం తూకం వేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. ఒక్కో కాంటా నిర్వహించే చోట ఏడుగురు నుంచి 10 మంది వరకూ కూలీలు అవసరం. వారే ధాన్యం తూకం వేసి లారీల్లో లోడ్ చేస్తారు. ఇప్పటికే బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల పరిధిలో వరి కోతలు చివరి దశకు చేరుకున్నాయి. అక్కడ కొనుగోళ్లు పూర్తయితే అక్కడ పని చేస్తున్న కూలీలు బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు తరలివచ్చే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితులు బాగలేకపోవడంతో కూలీలు తొందరగా వస్తేనే ధాన్యం తూకం వేగంగా సాగుతుందని రైతులు చెబుతున్నారు.మోర్తాడ్లోని కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం కుప్పలు వరి కోతలు పూర్తి చేసి ధాన్యంను కుప్పగా పోసి వారం అవుతుంది. ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు. కానీ తూకం వేయడం లేదు. అదేమిటి అంటే కూలీలు రాలేరు అంటున్నారు. వాతావరణంలో మార్పుల వల్ల ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకున్నా ప్రయోజనం ఉండటం లేదు. తూకం వెంటనే వేయాలి. – గోపిడి సత్యనారాయణ, రైతు, మోర్తాడ్ కూలీలను రప్పించాలని మధ్యవర్తిని కోరాం. కానీ బీహార్లో పండుగ ఉందని, అందుకే వారు రావడం ఆలస్యమవుతుందని చెబుతున్నారు. కూలీల సంఖ్య తక్కువగా ఉండటంతో అన్ని చోట్ల తూకం ప్రారంభించలేకపోతున్నాం. కూలీల సంఖ్యను పెంచడానికి కృషి చేస్తున్నాం. రైతులు ఆందోళన చెందవద్దు. – కాశీరాం, సీఈవో, మోర్తాడ్ పీఏసీఎస్ -
మార్గం సుగమం..!
● ‘స్థానిక’ ఎన్నికల్లో సంతానం నిబంధన ఎత్తివేతకు మంత్రివర్గ ఆమోదం ● పోటీకి సిద్ధమవుతున్న ఆశావహులు ● ఆయా స్థానాల్లో పెరగనున్న పోటీ మోర్తాడ్(బాల్కొండ): పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేవారికి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం ఉండొద్దనే నిబంధన ఎత్తివేతకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపడంతో ఆశావహుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేవారికి పరిమితి సంతానం నిబంధనను గత ప్రభుత్వం ఎత్తివేసింది. పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో మాత్రం అదే నిబంధన అమలులో ఉండటంతో అనేక మంది ఔత్సాహికులు పోటీకి దూరమయ్యారు. జనాభా నియంత్రణ కోసం.. జనాభా నియంత్రణలో భాగంగా 1995లో అప్పటి టీడీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉండరాదనే నిబంధన అమలులోకి తీసుకొచ్చింది. 1995 జూన్ 1 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా అప్పటి ప్రభుత్వం చట్టం చేసింది. దీంతో 1995 జూన్ తర్వాత జరిగిన అన్ని స్థానిక సంస్థల, సహకార సంఘాల ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారు పోటీకి దూరమయ్యారు. తాజాగా ఆ నిబంధన ఎత్తివేయడం ఔత్సాహికులకు ఎంతో ఊరట కలిగించే విషయం. పెరగనున్న పోటీ.. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తే 545 సర్పంచ్ పదవులు, 5,022 వార్డు సభ్యుల స్థానాలు, 307 ఎంపీటీసీ, 31 జడ్పీటీసీ స్థానాలకు చాలా మంది పోటీ చేసే అవకాశం ఉంది. గతంలో పరిమిత సంతానం నిబంధనతో పోటీ తగ్గగా ఈసారి నిబంధన ఎత్తివేయడంతో స్థానికల్లో పోటీ పెరిగే అవకాశం ఉంది. చాలాకాలంగా అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారిలో ఉత్సాహం నెలకొంది. -
రమణీయ ప్రకృతి
నిర్వహణ భారంకమ్మర్పల్లి: పాఠశాల నిర్వహణ గ్రాంట్ల వ్యవహా రం ‘దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించ లేదు’ అన్న చందంగా మారింది. పాఠశాలలు ప్రారంభమైన ఐదు నెలలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజారు చేసినప్పటికీ విద్యాశాఖ అధికారుల అల సత్వం కారణంగా ప్రధానాపాధ్యాయుల ఖాతాల్లో ఇప్పటి వరకు డబ్బులు జమ కాలేదు. దీంతో చాక్పీస్లు కొందామన్నా పైసలు లేని పరిస్థితి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, చిన్నచిన్న మరమ్మతులను పట్టించుకోవడమే మరిచారు. జిల్లాలో ప్రస్తుతం 122 ప్రాథమిక, 633 ప్రాథమికోన్నత, 263 ఉన్నత పాఠశాలలు ఉండగా.. 1.04 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ విద్యాసంవత్సరం జిల్లాలో 3 వేల మంది విద్యార్థుల అడ్మిషన్లు అదనంగా పెరిగాయి. పాఠశాలల అభివద్దికి కృషిచేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. ఈ నెల 10న రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఉతర్వులు జారీ చేసినప్పటికీ విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇంకా నిధులు ప్రధానోపాధ్యాయుల ఖాతాలో జమకాలేదు. మరోపక్క 81 పాఠశాల కాంప్లెక్స్లకు రావలసిన రూ. 26.73 లక్షలు, అలాగే 33 ఎమ్మార్సీలకు రావలసిన రూ. 26.40 లక్షలు ఇంకా రాలేదు. ఎరుపు వర్ణంలోకి మారిన ఆకాశం.. ఆకుపచ్చ తివాచీ పరుచుకున్నట్లుగా ఉన్న నేల ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్దులను చేసింది. సూర్యాస్తమయం వేళ భూమ్యాకాశాలు చూపరులను ఆకట్టుకుంటుండగా పచ్చని చెట్లు సాక్షులుగా నిలిచినట్లు ఉన్న ఈ రమణీయ దృశ్యాన్ని డొంకేశ్వర్ శివారులో ‘సాక్షి’ ఆదివారం సాయంత్రం క్లిక్మనిపించింది. చల్లని సాయంకాలం ఆహ్లాదాన్ని నింపింది. – డొంకేశ్వర్(ఆర్మూర్) ఖర్చుల భారంపాఠశాలలకు నిధుల మంజూరు ఇలా.. ఇంకా విడుదల కాని పాఠశాల గ్రాంట్లు ఇబ్బందులు పడుతున్న ప్రధానోపాధ్యాయులు చాక్ పీస్ల కొనుగోలు.. పారిశుద్ధ్య నిర్వహణకు తిప్పలు కష్టమవుతోంది ప్రభుత్వ పాఠశాలకు వచ్చే నిధులు సకాలంలో రాక పాఠశాల నిర్వహణ కష్టమవుతోంది. పాఠశాల ప్రారంభమై ఐదు నెలలు గడిచినా మొదటి విడత నిధులు కూడా రాలేదు. ప్రభుత్వం నిధులను వెంటనే విడుదల చేయాలి. – సురేశ్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడునిధులను పెంచాలి ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలకు ఇస్తున్న నిధులు సరిపోవడం లేదు. విద్యార్థుల సంఖ్య పరంగా కాకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఏడాదికి రూ.50 వేలు కేటాయించాలి. విద్యార్థుల సంఖ్య 100 దాటితే లక్ష రూపాయలు కేటాయించాలి. – రచ్చ మురళి, పీఎస్హెచ్ఎంఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిపాఠశాల విద్యా సంవత్సరం సగం గడిచిపోనప్పటికీ మొదటి విడత గ్రాంట్ హెచ్ఎంల ఖా తాల్లో జమకాలేదు. దీంతో ప్రధానోపాధ్యాయులకు ఖర్చులు తలకు మించిన భారమవుతున్నా యి. సొంత డబ్బులు వెచ్చించి స్టేషనరీ, శానిటైజర్లు, చాక్పీస్లు, ఫినాయిల్ తదితర సామగ్రి కొనుగోలు చేస్తున్నారు. పాఠశాలల్లో చిన్న చిన్న మరమ్మతులకు నిధులు లేక ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొంది. అలాగే కాంప్లెక్స్ పాఠశాలలకు వచ్చే గ్రాంట్ రాక కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణ ప్రధానోపాధ్యాయులకు అదనపు ఆర్థిక భారంగా మారింది. అలాగే ఎమ్మార్సీలకు కూడా రావాల్సిన నిధులు రాక కంప్యూటర్ నిర్వహణ ఖర్చులు, విద్యుత్ బిల్లులు, గుండు సూది నుంచి తెల్ల కాగితాల వరకు కొనుగోలు ఖర్చులు ఎంఈవోలకు భారంగా మారాయి. -
కుండీల్లోనే ముగిసిన కథ!
● వంద రోజులు దాటినా పంపిణీకి నోచుకోని చేపపిల్లలు ● ఎన్ని బతికున్నాయో చెప్పలేమంటున్న అధికారులుబాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువన ఉన్న జాతీయ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో ప్రస్తుత సంవత్సరం ఉత్పత్తి చేసిన చేపపిల్లల పంపిణీ కథ కంచికే అన్నట్లుగా తయారైంది. చేపపిల్లలను ఉత్పత్తి చేసి వంద రోజులు దాటినా ఇప్పటి వరకు పంపిణీపై ఎలాంటి నిర్ణయం లేదు. ఈ ఏడాది కేవలం 54 లక్షల చేపపిల్లలను మాత్రమే ఉత్పత్తి చేసి కుండీల్లో నిల్వ ఉంచారు. అయితే, 20 రోజుల క్రితం కుండీల్లోని చేపపిల్లలు సగం మృత్యువాత పడినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎన్ని చేపపిల్లలు ఉన్నాయో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొందని అధికారులు చెపుతున్నారు. కుండీల్లో ఫంగస్ వచ్చి చనిపోయి ఉంటాయనే అనుమానం వ్య క్తం చేస్తున్నారు. సరైన సమయంలో పంపిణీ చేయకపోవడంతో ప్రభుత్వ సొమ్ము వృథాగానే పోయిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులకు నివేదిక చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో ప్రస్తుతం ఉత్పత్తి చేసిన చేపపిల్లల వయస్సు 100 రోజులు దాటింది. ఇప్పటి వరకు ఎన్ని ప్రాణంతో ఉన్నాయో చెప్పలేం. 54 లక్షల చేపపిల్లలను ఉత్పత్తి చేశాం. ప్రస్తుతం చేపపిల్లలను పంపిణీ చేసినా ప్రయోజనం ఉండదు. ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిపాం. – దామోదర్, మత్స్యఅభివృద్ధి అధికారి, శ్రీరాంసాగర్ -
దరఖాస్తుల ఆహ్వానం
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): మండలంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్ధ (ఆర్ఎస్ఈటీఐ) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీయువకులకు స్వయం ఉపాధి కోర్సులలో ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 3న సీసీ టీవీ ఇన్స్టాలేషన్ (13రోజులు), వెజిటబుల్ నర్సరీ (35రోజులు), పాపడ్, ఊరగాయల తయారీ (10 రోజులు), తేనెటీగల పెంపకం (20 రోజులు), పుట్టగొడుగుల పెంపకం (10 రోజులు), నవంబర్ 17న మగ్గం వర్క్ (31రోజులు), నవంబర్ 18న (టైలరింగ్ (31రోజులు), నవంబర్ 19న బ్యూటీపార్లర్ (35రోజులు) కోర్సుల్లో శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు ఉచిత భోజన, హాస్టల్ సదుపాయం ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం ధ్రువీకరణ పత్రం అందిస్తామన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలోని 19–45 సంవత్సరాల వయస్సు కలిగిన గ్రామీణ ప్రాంత యువతీయువకులు దరఖాస్తులకు అర్హులన్నారు. ఆసక్తిగల వారు తమ ఆధార్కార్డు, రేషన్కార్డు, 10వ తరగతి ధ్రువీకరణ పత్రం, ఐదు పాస్పోర్టు సైజ్ ఫొటోలు, బ్యాంకు ఖాతా జిరాక్స్ వెంట తెచ్చుకుని నేటినుంచి పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం డిచ్పల్లిలోని ఎస్బీఐ శిక్షణ కేంద్రంలో లేదా 08461–295428 నెంబరును సంప్రదించాలని ఆయన సూచించారు. ఆర్మూర్టౌన్: బీజేపీ కార్యాకర్తలు, నాయకులు పార్టీ అభివృద్ధి కోసం కృషిచేయాలని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లెగంగారెడ్డి అన్నారు. ఆర్మూర్లోని 16వ వార్డులో ఆదివారం ఆయన బీజేపీ నాయకులతో కలిసి పీఎం మన్కీబాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయ కేతనం ఎగురవేయ్యాలన్నారు. నాయకుడు భూపతిరెడ్డి, కంచెట్టి గంగాధర్, మందుల బాలు, సుంకరి రంగన్న, కలిగొట ప్రశాంత్, ఉదయ్గౌడ్ పాల్గొన్నారు. మాచారెడ్డి: పాల్వంచ మండలం ఫరీద్పేట శివారులో ఓ మహిళపై అత్యాచారం జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామ శివారులోని పత్తి చేనులో పనిచేస్తున్న 45 సంవత్సరాల మహిళపై ఆదివారం సాయంత్రం బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ కూలీ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు తీవ్ర రక్తస్రావమై, అస్వస్థతకు గురికావడంతో స్థానికులు గుర్తించి, చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్వగ్రామానికి చేరిన మృతదేహం
భిక్కనూరు: సౌత్ ఆఫ్రికాలో ఈనెల 20న మృతి చెందిన బత్తుల శ్రీనివాస్ మృతదేహం ఆదివారం భిక్కనూరుకు చేరుకుంది. బతుకుదెరువు కోసం ఇటీవల సౌత్ ఆఫ్రికాకు వెళ్లిన శ్రీనివాస్ కానరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబీకులు, బందుమిత్రుల రోదనలు మిన్నంటాయి. మృతదేహన్ని చూసిన వారందరూ కన్నీటి పర్యంతమయ్యారు. సాయంత్రం జరిగిన అంత్యక్రియల్లో ప్రజలు పాల్గొని శ్రీనివాస్కు కన్నీటి వీడ్కోలు పలికారు. పెద్దకొడప్గల్(జుక్కల్): మండలంలోని విఠల్వాడీ తండాకు చెందిన పవర్ సవితపై అనుమానంతో గురువారం రాత్రి భర్త పవర్ కిషన్ హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆదివారం నిందితుడు కిషన్ను పట్టుకొని, రిమాండ్కు తరలించినట్లు ఎస్సై అరుణ్ కుమార్, సీఐ రవికుమార్ తెలిపారు. పిట్లం(జుక్కల్): తండ్రికి సేవలు చేయలేక అడ్డు తొలగించుకున్నడో కొడుకు. మండలంలోని గౌ రారం తండాలో ఈ ఘటన వెలుగుచూసింది. వివరాలు ఇలా.. గౌరారం తండాకు చెందిన కేతావత్ వామన్ తన తండ్రి దశరథ్ (58)కు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కొంతకాలం నుంచి సపర్యలు చేస్తున్నాడు. తండ్రికి భోజనం పెట్టడం, బట్టలు ఉతకడం, స్నానం చేయించడం, మలమూత్ర విసర్జన ఎత్తిపోయడం వంటి పనులు అతడు భారంగా భావించాడు. దీంతో తండ్రికి సేవలు చేయలేక హతమార్చాలనుకున్నాడు. ఈనెల 24న రాత్రి తండ్రికి కల్లులో గుర్తుతెలియని పురుగుల మందు తాగించి, హత్యచేశాడు. అందరికి సాధారణ మృతిగా నమ్మించాడు. కానీ దశరథ్ చిన్న కొడుకు కేతావత్ శ్రీకాంత్ తండ్రి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వామన్ను పట్టుకొని విచారించగా, తానే తండ్రిని హత్య చేసినట్లు అంగీకరించాడు. పోలీసులు వామన్ను ఆదివారం అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. పెద్దకొడప్గల్(జుక్కల్): మండలంలోని అంజని గ్రామ శివారులో శనివారం రాత్రి పేకాడుతున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేసి, వారిని పట్టుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. వారి నుంచి రూ.12,750 నగదు, మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసినట్లు వివరించారు. బొమ్మా–బొరుసు ఆడుతున్న 8మంది.. లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని బాణాపూర్ గ్రామ శివారులో బొమ్మా, బొరుసు(చిత్తు,బొత్తు) ఆడుతున్న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై దీపక్కుమార్ ఆదివారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు బొమ్మా–బొరుసు కేంద్రంపై దాడి చేసి, వారిని పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 5 ద్విచక్ర వాహనాలు, 5 ఫోన్లు, రూ. 3400 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. డిచ్పల్లి: మండలంలోని నడిపల్లి గ్రామ శివారులోగల డిచ్పల్లి – నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి ఓ కారు అదుపుతప్పి సమీపంలోని పెట్రోల్ బంక్ దిమ్మెను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. కారు పెట్రోల్ పంపు లోపలికి వెళ్లివుంటే పెను ప్రమాదం సంభవించేదని, బంక్ దిమ్మె వద్దనే నిలిచిపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రమాదంపై బంకు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. -
కరెంట్షాక్తో యువ రైతు మృతి
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని ఆరేడ్ గ్రామంలో ఓ యువరైతు కరెంట్ షాక్తో మృతిచెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన గాండ్ల బసప్ప(38) అనే యువ రైతు ఆదివారం సాయంత్రం గ్రామశివారులోని పొలానికి వెళ్లాడు. నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో ఉన్న కరెంట్ మోటార్ ఆన్ కాకపోవడంతో కేబుల్ వైర్ పట్టుకొని ప్రాజెక్టు నీళ్లల్లోకి దిగాడు. కేబుల్ వైర్తోపాటు మోటార్ వద్దకు చేరుకున్న బసప్ప కరెంట్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు. బసప్ప తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు పొలం వద్దకు వెళ్లారు. అక్కడ అతడి కోసం గాలించగా కరెంట్ మోటార్ వద్ద నీటిలో అతడి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అనుమానాస్పదస్థితిలో ఒకరు.. రాజంపేట: మండలంలోని మూడుమామిళ్ల తండాలో ఒకరు అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. ఎస్సై రాజు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని శేర్శంకర్ తండా పరిధిలోని మూడుమామిళ్ల తండాకు చెందిన ముద్రిచ్చ లాల్య(38) ఆదివారం ఉదయం ఇంటి నిర్మాణ విషయంలో పక్కవారితో గొడవపడ్డాడు. అనంతరం తన ఇంట్లోకి వచ్చి నీరు తాగి, మళ్లీ బయటకు వెళ్లగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు అతడిని పరిశీలించగా అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. మృతుడి భార్య అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని ఎస్సై తెలిపారు. -
ఆధునిక హంగులతో అందమైన భవనం..
● రూ. 5.70 కోట్ల వ్యయంతో మాక్లూర్లో నిర్మాణం ● నేడు ప్రారంభించనున్న కలెక్టర్, ఎమ్మెల్యేమాక్లూర్: మండల కేంద్రంలో రూ.5 కోట్ల 70 లక్షలతో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాన్ని ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా ఈఈ ప్రతాప్, స్థానిక ఎంఈవో సత్యనారాయణ తో కలిసి జిల్లా విద్యాధికారి అశోక్ ఆదివారం నూతన భవనాన్ని పరిశీలించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై నూతన భవనాన్ని సోమవారం ప్రారంభించనున్నారు. భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 4 కోట్ల 70 లక్షలు మంజూరు చేయగా, మాక్లూర్ వాసి, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, ఆయన సొదరుడు మహేశ్గుప్తా కలిసి రూ.కోటి విరాళం అందజేశారు. మొత్తం రూ.5 కోట్ల 70 లక్షలతో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ నూతన భవనాన్ని నిర్మించారు. -
ప్రకృతి సేద్యంతోనే ఆరోగ్య భాగ్యం
బోధన్: ప్రకృతి సేద్యంతోనే సంపూర్ణ ఆరోగ్య భాగ్యం లభిస్తుందని ఆదర్శ రైతు కరుటూరి పాపారావు, పలువురు వక్తలు అన్నారు. ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో ఆదివారం పాపారావు తన సూర్యోదయ సహజ వ్యవసాయ క్షేత్రంలో సహజ వ్యవసాయ సాగు విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా పాపారావు మాట్లాడుతూ.. సేంద్రియ ఎరువులతో పండించిన ఆహార ఉత్పత్తుల ప్రాముఖ్యతను అవగాహన కల్పించేందుకు ప్రతిఏటా కార్తీక మాసంలో రైతులు, వినియోగదారులకు సదస్సులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తనకు వ్యాపార దృక్పథం లేదని, ఆరోగ్యమైన, నాణ్యమైన ఆహార ఉత్పత్తులపై అందరికి అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాన్నారు. అలాగే పశుసంవర్ధక శాఖ విశ్రాంత అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ నారాయణ రెడ్డి, ఆత్మా జిల్లా విశ్రాంత పీడీ రవీందర్, నందిపేట ఎంపీడీవో శ్రీనివాస్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ విశ్రాంత మేనేజర్ రాంగోపాల్ రెడ్డి, రైతు విఠల్రెడ్డి, ప్రసాద్తోపాలు పలువురు వక్తలు తమ అభిప్రాయాలను సదస్సులో వివరించారు. గోకృపామృతం, జీవామృతం సేంద్రియ ఎరువులు, వివిధ కషాయాలతో చేసే ప్రకృతి వ్యవసాయ సాగుపై రైతులు దృష్టిపెట్టాలన్నారు. పాపారావు ప్రకృతి వ్యవసాయం చేస్తు అందరికి ఆదర్శంగా నిలిచారని అభినందించారు. అంతకుముందు నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల్లోని వివిధ మండలాల నుంచి ప్రకృతి ప్రేమికులు, సేంద్రియ వ్యవసాయ సాగుదారులు, వినియోగదారులు అధిక సంఖ్యలో హాజరై, పాపారావు వ్యవసాయక్షేత్రాన్ని సందర్శించారు. -
తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం
నిజామాబాద్ అర్బన్: తెలంగాణ అంటేనే ఆ త్మగౌరవమని.. అవకాశం, అధికారం ఆత్మగౌరవమే తమ విధానమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం ఓ ప్రైవేట్ హోటల్లో ఆమె మీ డియాతో మాట్లాడారు. తెలంగాణలో అందరికీ మంచి జరగాలని ‘జనంబాట’ పట్టామన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావడమే ముఖ్యమని, అవసరమైతే రాజకీయపార్టీ పెడతామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేలే ఓడించారని ఆరోపించారు. ఆడబిడ్డలకు సీఎం రేవంత్రెడ్డి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ సమాన అవకాశాలు లేకుండా ప్రభుత్వం అణచివేస్తోందని, ఎన్నో సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ అధికారంలో వాటా కొన్ని వర్గాలే అనుభవిస్తున్నాయన్నారు. అధికారంలో మహిళల వాటా ఐదు శాతం కూడా లేదన్నారు. కీలక నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఎస్సీ, ఎస్టీ, యువత, మహిళలకు భాగస్వామ్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముంపు రైతులకు పరిహారం ఇవ్వాలి గోదావరి వరద ముంపు ప్రాంతమైన యంచ గ్రామం పరిధిలో పంట పొలాలను తాము పరిశీలించామని, అక్కడి పరిస్థితి దారుణంగా ఉందని కవిత అన్నారు. పంట నష్టపోయిన రైతులకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. నవీపేట మండలంలోని 5వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. మక్కలకు బోనస్ ఇస్తామని ప్రకటించి ఇవ్వడం లేదన్నారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడమే మక్కరైతులు పంట దిగుబడిని ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారన్నారు. అలాగే జిల్లాలో బీడీ కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు కొట్లాడాలన్నారు. సమావేశంలో జాగృతి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సామాజిక తెలంగాణ సాధన ద్వారానే అది సాధ్యం ఆడబిడ్డలకు సీఎం రేవంత్ అన్యాయం చేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్యేలే నన్ను ఓడించారు మీడియాతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత -
కానిస్టేబుళ్లకు పదోన్నతి
నిజామాబాద్ అర్బన్: పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు కానిస్టేబుళ్లకు హెడ్కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. వరప్రసాద్, సీహెచ్శేఖర్ (కమ్మర్పల్లి), శ్రీనివాస్(భీమ్గల్), కే యాదవ్(మాక్లూర్), ఎండీ ఆరిఫుద్దీన్(టూ టౌన్), చిన్నయ్య(కోటగి రి), జి శ్రీనివాస్రావు(నవీపేట), లింబాద్రి, రాంచందర్(రెంజల్), గణేశ్(నిజామాబాద్ రూరల్) ప్రమోషన్లు పొందినవారిలో ఉన్నారు. పదోన్నతి పొందిన వారిని జగిత్యాల జిల్లాకు కేటాయించారు. ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును నవంబర్ 4వ తేదీ వరకు పొడిగించినట్లు కంట్రోలర్ ప్రొఫెసర్ కే సంపత్కుమా ర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డి గ్రీ 1, 3, 5వ సెమిస్టర్ రెగ్యులర్, 2, 4, 6వ సెమిస్టర్ బ్యాక్లాగ్ (2021, 2022, 2023, 2024 బ్యాచ్)లకు చెందిన విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని ఆయన సూచించారు. రూ.100 అపరాధ రుసుముతో నవంబర్ 6వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం www. telanganauniversity.ac.in వెబ్సైట్ ను సంప్రదించాలని సూచించారు. రీవాల్యూయేషన్కు దరఖాస్తు చేసుకోండి..తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని 2021వ బ్యాచ్ బీఈడీ, బీపీఎడ్ 1, 2, 3, 4, 5, 6వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ థియ రీ పరీక్షల ఫలితాల రీవాల్యూయేషన్ కోసం నవంబర్ 3వ తేదీ వరకు దరఖాస్తు చేసు కోవాలని కంట్రోలర్ ప్రొఫెసర్ కే సంపత్కుమార్ సూచించారు. ఒక్కో పేపర్కు రూ.500, దరఖాస్తు పత్రానికి రూ.25 చెల్లించాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ www.telanganauniversity.ac.in ను సంప్రదించాలని సూచించారు. నింబాచల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కమ్మర్పల్లి(భీమ్గల్): జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భీమ్గల్ నింబాచలం(లింబాద్రి గుట్ట) బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్తీక మాసంలో 13 రోజులపాటు సాగనున్న బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు గుట్టపై నుంచి నంబి వంశస్తులు, గ్రామస్తులు మంగళ వాయిద్యాలు, మేళాతాళలతో గ్రామాలయానికి ఊరేగింపుగా వెళ్లారు. క్షేత్రదేవి చండికా దేవీ(పెద్దంగంటి ఎల్లమ్మతల్లి)కి పురోహితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి సారె సమర్పించారు. గ్రామ పెద్దలు, జాతర నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బెస్ట్ అటెండెన్స్ స్కూల్గా బెజ్జోర జెడ్పీహెచ్ఎస్ కమ్మర్పల్లి(భీమ్గల్): రాష్ట్రంలో ఉత్తమ హాజరు(అటెండెన్స్) పాఠశాలగా భీమ్గల్ మండలం బెజ్జోర జెడ్పీహెచ్ఎస్ నిలిచింది. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టంలో 2025–26 వి ద్యా సంవత్సరానికి గాను గెజిటెడ్ హెడ్మాస్టర్స్ విభాగంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు అధికంగా ఉండడంతో బెజ్జోర పాఠశాలను డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎంపిక చేశారు. ఆదివారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ అభివృద్ధి వనరుల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో బెజ్జోర జెడ్పీహెచ్ఎస్ గెజిటెడ్ హెచ్ఎం ఎండీ హఫీజొద్దీన్ను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్, ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి సన్మానించి ప్రశంసాపత్రం అందజేశారు. -
అటవీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించొద్దు
● తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితమోపాల్(నిజామాబాద్రూరల్): ఏళ్లుగా పోడు భూ ములు సాగు చేస్తున్న రైతుల పట్ల అటవీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించొద్దని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తె లంగాణ జాగృతి జనం బాటలో భాగంగా మండలంలోని వెంకట్రాంనాయక్ తండాలో ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు రామావత్ ప్రకాశ్ కు టుంబ సభ్యులను ఆదివారం ఆమె పరామర్శించారు. అంతకుముందు అటవీ అధికారులు ధ్వంసం చేసిన పంట భూమిని పరిశీలించారు. అలాగే బైరాపూర్ పో చమ్మ తల్లి, వెంకట్రాంనాయక్ తండాలోని జగదాంబ మాతా ఆలయంలో పూజలుచేశారు. గిరిజనులతో క లిసి నృత్యాలు చేశారు. అనంతరం కవిత మాట్లాడు తూ.. మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణం చేపట్టనప్పు డు పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలి కదా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంచిప్ప చుట్టుపక్కల ఉన్న రైతులను అటవీ అధికారులు ఇబ్బంది పెట్టకుండా కలెక్టర్ చర్యలు తీసుకోవాలన్నారు. నాయకులు శ్రీనివాస్ గౌడ్, నరేష్ నాయక్, ప్రేమ్దాస్, జలంధర్, ఇందల్ నాయక్, స్థానిక రైతు లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి పరామర్శ నిజామాబాద్ అర్బన్: అమరుడైన కానిస్టేబుల్ ప్రమో ద్ కుటుంబ సభ్యులను ఆదివారం నగరంలో కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ప్రమోద్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళ్లు అర్పించారు. అలాగే ప్రమో ద్ హత్య నిందితుడు రియాజ్ను పట్టుకునేక్రమంలో గాయపడిన ఆసిఫ్ను కవిత పరామర్శించారు. -
రామేశ్వర్పల్లిలో ఒకరి ఆత్మహత్య
భిక్కనూరు: మండలంలోని రామేశ్వర్పల్లిలో ఒకరు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. వివరాలు ఇలా.. రామేశ్వర్పల్లి గ్రామానికి చెందిన మల్లిని రమేష్ (35)కు అదే గ్రామానికి చెందిన అనిలతో పదహారేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల దంపతుల మధ్య గొడవలు జరగడంతో భార్య ముగ్గురు పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో రమేష్ తాగుడుకు బానిసగా మారాడు. ఈనెల 24న రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చి కొద్దిసేపు ఉండి మళ్లీ బయటకు వెళ్లి, తిరిగి రాలేడు. గ్రామంలోని ఆపారం చెరువులో ఓ వ్యక్తి మృతదేహం తేలడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడిని రమేష్గా గుర్తించి, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. భార్య కాపురానికి రాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది రమేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. -
గడ్డిమందు డబ్బాలో నీళ్లు పోసి తాగిన చిన్నారులు
● చికిత్స అందిస్తున్న వైద్యులు రాజంపేట:ఖాళీగా ఉన్న గడ్డిమందు డబ్బాలో చిన్నారులు నీళ్లు పోసి తాగిన ఘటన మండలంలోని అన్నారం తండాలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. తండాకు చెందిన సరోజ–వికాస్ దంపతుల కుమారుడ్ విగ్నేష్ (6), శ్రీను–లలిత దంపతుల కుమారులు ప్రజ్వల్(6), శ్రీజన్(4) ముగ్గురు కలిసి శనివారం ఇంటి ముందు ఆవరణలో ఆడుకుంటున్నారు. ఈక్రమంలో ఓ ఇంటి ముందు పంట పొలానికి సంబందించిన గడ్డిమందు ఖాళీ డబ్బాలు కనిపించాయి. దీంతో ముగ్గురు చిన్నారులు ఆ డబ్బాలను తీసుకొని వాటిలో నీటిని పోసి తాగారు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి, వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. నిజామాబాద్అర్బన్: నగరంలోని గంజ్ మార్కెట్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. గంజ్ మార్కెట్లోని గోల్డ్ షాపు వద్ద మహిళ మృతదేహం ఉండటంతో స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని, పరిశీలన చేశారు. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవని పోలీసులు తెలిపారు. ఆమె వయస్సు సుమారు 45–50 ఏళ్లు ఉంటాయన్నారు. మెరున్ కలర్ ప్లవర్స్ డిజైన్ సారీ, ఎరుపు రంగు స్వెటర్ ధరించిఉందన్నారు. ఎడమ చేయిపైన గంగమ్మ అని పచ్చబొట్టు ఉందన్నారు. మృతురాలి వివరాలు ఎవరికై న తెలిస్తే 87126 59714 నంబర్కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. -
బాగ్దాద్లో ప్రమాదవశాత్తు ఆలూర్ వాసి మృతి
పెర్కిట్(ఆర్మూర్): ఇరాక్ దేశ రాజధాని బాగ్దాద్లో ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో ఆలూర్ మండల కేంద్రానికి చెందిన ఒకరు మృతిచెందారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. ఆలూర్కు చెందిన కుర్మె బీజ చిన్న రాజేష్(45) ఉపాధి నిమిత్తం బాగ్దాద్లోని ఒక నిర్మాణ కంపెనీలో కొన్ని సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. కాగా గురువారం బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో క్రేన్ ప్రమాదవశాత్తు రాజేష్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న అతడి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి చేర్చేందుకు కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని ఆలూర్కు చెందిన నాయకులు కళ్లెం భోజారెడ్డి రాజేష్ సంప్రదించారు. మృతుడికి భార్య సునీత, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెర్కిట్లో యాచకుడు.. ఆర్మూర్టౌన్: పెర్కిట్లోని హైవే కూడలి వద్ద ఓ యాచకుడు ప్రమాదవశాత్తు మృతిచెందినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. వివరాలు ఇలా.. మామిడిపల్లికి చెందిన బెల్లంపల్లి శివ(48) అనే యాచకుడు కొన్ని సంవత్సరాలుగా కుటుంబానికి దూరంగా ఉంటూ ఆర్మూర్తోపాటు మామిడిపల్లి, పెర్కిట్ గ్రామాల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రాత్రి సమయంలో పెర్కిట్ హైవే కూడలిలోని సిమెంటు దిమ్మైపె నిద్రిస్తుండే వాడు. కాగా శుక్రవారం ఉదయం సిమెంటు దిమ్మె వద్ద మృతి చెంది ఉండటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడు ధరించిన టీషర్టు సిమెంటు దిమ్మెకు గల ఇనుప చువ్వకు తట్టుకుని గొంతుకు బిగుసుకుపోవడంతో మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి కుమారుడు విజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
ఐకేపీ సిబ్బందికి ఆడిట్పై అవగాహన
డొంకేశ్వర్(ఆర్మూర్): ఐకేపీ సిబ్బందికి శనివారం గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో ఆడిట్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్తోపాటు కామారెడ్డి, నిర్మల్ జిల్లాల ఐకేపీ ఉద్యోగులు హాజరయ్యారు. హైదరాబాద్ సెర్ప్ నుంచి వచ్చిన చీఫ్ ఆడిట్ ఆఫీసర్ ఎంవీ క్రిష్ణ సిబ్బందికి పలు అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామ సంఘం, మండల సమాఖ్య, జిల్లా సమాఖ్యకు ఏవిధంగా చేస్తే సంస్థల ఆర్థిక పరిస్థితి, రికవరీ, అడ్వాన్స్లు వస్తాయో వివరించారు. ఆడిట్లో వచ్చిన అభ్యంతరాలను డీఆర్డీవోకు ప్రతి నెలా పంపాలని సూచించారు. మూడు జిల్లాల డీఆర్డీవోలు సాయాగౌడ్, విజయలక్ష్మి, సురేంధర్, ఏపీడీ మధుసూదన్, ఫైనాన్స్ డీపీఎం కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మఠంరాళ్ల తండాలో ఆదిమానవుల ఆనవాళ్లు !
మీకు తెలుసా.. మాచారెడ్డి: మండలంలోని ఎల్లంపేట పరిధిలోని మఠంరాళ్ల తండాలో ఆదిమానవుల ఆనవాళ్లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా అందరినీ అబ్బురపరుస్తున్నాయి. గుహలో రాళ్లపై ఎరుపురంగులో చిత్రాలున్నాయి. ఈ తండా వాసి, కాకతీయ యూని వర్సిటీ పరిశోధక విద్యార్థి లింగం, మరో పరిశోధక విద్యార్థి జైనథ్కుమార్ ఈ రాతి చిత్రాలను చూసి బయటి ప్రపంచానికి పరిచయం చే శారు. అంతకుముందు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యుడైన కేపీఆర్ ఆ గుహ ను సందర్శించారు. గుహలో ఉన్న రాతిపనిము ట్లు, చిత్రాలను ఫోటోలు తీసుకువెళ్లారని స్థాని కులు తెలిపారు. అనంతరం కొత్త తెలంగాణ చ రిత్ర బృందం సభ్యులు రామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ, సహాయకుడు నాగరాజుతోపాటు కవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ శంకర్ లు ఆదిమానవులు వాడిన పాత రాతి యుగపు పనిముట్లను పరిశీలించారు. ప్రభుత్వం స్పందించి ఆదిమానవుల కాలం నాటి ఆనవాళ్లను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. -
38 బడులకు ఫైవ్స్టార్ రేటింగ్
కమ్మర్పల్లి: స్వచ్ఛతకు పెద్దపీట వేసేందుకు కేంద్రప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచి అవగాహన కా ర్యక్రమాలను ప్రోత్సహిస్తోంది. ఈక్రమంలో స్వచ్ఛతలో మెరుగ్గా ఉండే బడులకు ‘స్వచ్ఛ ఏవమ్ హరి త విద్యాలయ రేటింగ్(ఎస్హెచ్వీఆర్)’ పేరుతో ప్రోత్సాహకాలు అందించే కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం జిల్లా లోని సుమారు 1812 ప్రభుత్వ, ప్రయివేటు బడులు ఆన్లైన్ ప్రక్రియలో పాల్గొనగా, 38 పాఠశాలలు ఫైవ్స్టార్ రేటింగ్ సాధించాయి. 6 విభాగాలు.. 60 ప్రశ్నలు.. స్వచ్ఛతకు సంబంధించిన ఆరు అంశాలను పరిగణనలోకి తీసుకుని అందులోనుంచి 60 ప్రశ్నలను ఆన్లైన్ ప్రక్రియలో ప్రశ్నించారు. ప్రభుత్వ, ప్రయివేట్ బడుల హెచ్ఎంలు తాగునీరు, మరుగుదొడ్లు, చేతు ల శుభ్రత, బడి ఆవరణ శుభ్రత నిర్వహణ, ప్రవర్తన మార్పు, మంచి అలవాట్లు, విద్యార్థుల నడవడిక, ఎకో క్లబ్ ఏర్పాటు లాంటి ఆరు విభాగాల్లోని 60 ప్రశ్నలకు ఆన్లైన్ ద్వారా సమాధానాలు సమర్పించారు. ఇందుకు అవసరమైన ఫోటోలు అప్లో డ్ చేశారు. వాటిల్లో మెరుగ్గా ఉండే వాటికి మార్కు ల ఆధారంగా కేంద్రం వాటిని ఎంపిక చేసింది. జాతీయస్థాయిలో 200 పాఠశాలలు.. జిల్లాల్లో ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను ప్రత్యేక బృందం భౌతిక పరిశీలన చేసి ప్రతి జిల్లా నుంచి 8 పాఠశాలల(గ్రామీణ ప్రాంతం నుంచి ఆరు, పట్టణ ప్రాంతం నుంచి రెండు)ను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. ప్రతి రాష్ట్రం నుంచి 20 పాఠశాలలను జాతీయస్థాయికి ఎంపిక చేశారు. జాతీయ స్థాయిలో 200 పాఠశాలలను ఎంపిక చేసి అవార్డు అందజేస్తారు. జాతీయ స్థాయిలో ఎంపికై న పాఠశాలలకు దేశ రాజధాని ఢిల్లీలో అవార్డులను ప్రదానం చేస్తారు. రూ. 1లక్ష స్కూల్ గ్రాంట్గా ఇస్తారు. 200 ఉత్తమ పాఠశాల ప్రధానోపాధ్యాయులను జాతీయస్థాయి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు ఎక్స్పోజర్ విజిట్(క్షేత్ర సందర్శన)కు తీసుకెళ్తారు. కోనాపూర్ జెడ్పీహెచ్ఎస్ స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్లో కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఫైవ్ స్టార్ రేటింగ్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఎకో క్లబ్ సభ్యులు ప్రతిరోజు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచుతారు. ఉపాధ్యాయులు, గ్రామస్తుల నిరంతర సహకారంతో రేటింగ్ సాధ్యమైంది. రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎంపిక కావడానికి కృషి చేస్తున్నాం. – రామ్ప్రసాద్, హెచ్ఎం, జెడ్పీహెచ్ఎస్, కోనాపూర్ స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్ ద్వారా విద్యార్థుల్లో పర్యావరణం పట్ల పూర్తి అవగాహన పెరుగుతుంది. ఫోర్, త్రీ స్టార్ రేటింగ్ పొందిన పాఠశాలలు లోపాలను సవరించుకొని వచ్చే విద్యా సంవత్సరంలో ఫైవ్ స్టార్ రేటింగ్ రావడం కోసం కృషి చేయాలి. జిల్లాలో 1812 పాఠశాలలు ఆన్లైన్లో స్వీయమదింపు చేసుకోగా, 38 పాఠశాలకు ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చింది. – అశోక్, డీఈవో నిజామాబాద్ జిల్లాలో ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన బడులు ఇవే.. జెడ్పీహెచ్ఎస్ కోనాపూర్, గీతాంజలి హై స్కూల్ గోన్గొప్పుల, జెడ్పీహెచ్ఎస్ సుద్దపల్లి, ఎంపీపీఎస్ లింగాపూర్, ఎంపీయూపీఎస్ ఎంఎస్సీ ఫారం, ఎంపీపీఎస్ పత్తేపూర్, ఎంపీపీఎస్ మావండికలాన్, ఎంపీపీఎస్ వివతండా, ఎంపీపీఎస్ శాంతినగర్, కృషి హైస్కూల్ భీమ్గల్, జెడ్పీహెచ్ఎస్ దోన్కల్, జెడ్పీహెచ్ఎస్ కోమన్పల్లి, చైతన్య ఒకేషనల్ జూనియర్ కళాశాల బోధన్, లిటిల్ నేషనల్ స్కూల్ ఆర్మూర్, ఎంపీయూపీఎస్ అంబం(ఆర్), ప్రెసిడెన్సీ హైస్కూల్ నిజామాబాద్ నార్త్, విశ్వశాంతి విద్యానికేతన్ నిజామాబాద్, ఎంపీపీఎస్–గాంధీనగర్ సిర్నాపల్లి, కేజీబీవీ నందిపేట్, పీఎంశ్రీ టీజీడబ్ల్యూఆర్ఈఐఎస్ నిజామాబాద్, క్రిష్ణవేణి హైస్కూల్ భీమ్గల్, విజ్ఞాన్ హైస్కూల్ నిజామాబాద్, జెడ్పీహెచ్ఎస్ బోర్గాం(పి), జెడ్పీహెచ్ఎస్ మోస్రా, ఎంపీపీఎస్ జక్రాన్పల్లి, పీఎంశ్రీ టీజీఎంఎస్ ధర్పల్లి, పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ జానకంపేట్, ఎంపీపీఎస్ ఆరేపల్లి, ఎంపీపీఎస్ నవనాథపురం, ఎంపీపీఎస్ సుర్భిర్యాల్, నెహ్రూ యూపీఎస్ నిజామాబాద్, పీఎంశ్రీ టీజీఎంఎస్ సిరికొండ, శ్రీజాహ్నవి హైస్కూల్ బోధన్, వివేక్ యూపీఎస్ నిజామాబాద్ నార్త్, ఎంపీపీఎస్ చేంగల్, ఎంపీపీఎస్ మల్లాపూర్, ఎంపీపీఎస్ మినార్పల్లి, ఎంపీపీఎస్ ఏర్గట్ల. స్వచ్ఛతలో మెరుగైన ప్రభుత్వ, ప్రయివేట్ స్కూళ్లకు స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్ ప్రకటించిన కేంద్రం ఇటీవల ఆన్లైన్ ప్రక్రియలో పాల్గొన్న జిల్లాలోని 1812 పాఠశాలలు -
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ముస్తాపూర్ గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. వివరాలు ఇలా.. ఎల్లారెడ్డి మండలం లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన సాయిలు శనివారం బైక్పై కామారెడ్డికి బయలుదేరాడు. ముస్తాపూర్ శివారులో అతడి బైక్, లింగంపేట వైపునకు వస్తున్న కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సాయిలు కాలు విరిగినట్లు తెలిపారు. స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిజామాబాద్అర్బన్: నగరంలో వినాయక్నగర్లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. డిచ్పల్లి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఆకాష్ కొన్నిరోజులుగా వినాయక్నగర్లో అద్దెకు ఉంటున్నాడు. అతడు ఓ యువతితో ప్రేమ వ్యవహారం కొనసాగించడం, ప్రేమ విఫలం కావడంతో ఇంట్లో గొడవలు జరగాయి. దీంతో అతడు జీవితంపై విరక్తి చెంది, శనివారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కంటైనర్ బోల్తా డిచ్పల్లి: మండలంలోని ధర్మారం (బి) వద్ద ఓ కంటైనర్ డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి పార్సిళ్ల లోడ్తో కంటైనర్ నిజామాబాద్కు బయలుదేరింది. శనివారం తెల్లవారుజామున మండలంలోని ధర్మారం (బి) వద్ద డివైడర్ను ఢీకొని బోల్తాపడింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో డ్రైవర్కు స్వల్ప గాయాలు అయ్యాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపారు. -
రాష్ట్రంలో పాలన పడకేసింది
● తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత నందిపేట్ (ఆర్మూర్): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వ పాలన పడకేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మండలంలోని సీహెచ్ కొండూరు గ్రామంలోగల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం కవిత దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అకాల వర్షాలకు ధాన్యం తడిసి కొట్టుకుపోతున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. జిల్లాలో పండుతున్న పంటలపై పాలన అధికారికి అవగాహన లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తొలి ఆశీర్వాదం జిల్లా ప్రజలు ఇవ్వాలని ఉద్దేశంతో జనం బాట ఇక్కడి నుంచి ప్రారంభించానని పేర్కొన్నారు. మాజీ జెడ్పీటీసీ ఎర్రం యమున ముత్యం, మనోజ్ రావు, నాయుడు రామారావు తదితరులు పాల్గొన్నారు. కవితకు ఘన స్వాగతం.. డిచ్పల్లి: మండలంలో జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితకు శనివారం ఘన స్వాగతం లభించింది. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆమె ఇందల్వాయి టోల్ప్లాజా మీదుగా బయలుదేరి మధ్యాహ్నం బర్ధిపూర్ శివారులోని బైపాస్ రోడ్డు వద్దకు కవిత చేరుకున్నారు. జాగృతి మహిళా కార్యకర్తలు బతుకమ్మలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. యువకులు బైక్ ర్యాలీగా ముందు రాగా వాహనంలో ఆమె జిల్లా కేంద్రానికి తరలి వెళ్లారు. -
గోదావరిలోకి కొనసాగుతున్న నీటి విడుదల
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు కొనసాగుతుండటంతో ప్రాజెక్ట్ నుంచి వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదలను చేపడుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 22154 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ నుంచి 4 వరద గేట్ల ద్వారా 12500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. కాకతీయ కా లువ ద్వారా 4వేల క్యూసెక్కులు, ఎస్కెప్ గేట్ల ద్వారా 4వేల క్యూసెక్కులు, సరస్వతి కా లువ ద్వారా 650 క్యూసెక్కులు, లక్ష్మికాలువ ద్వారా 200 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 573 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ శనివారం పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు)అడుగులతో నిండుకుండలా ఉంది. డొంకేశ్వర్(ఆర్మూర్): మండలంలోని దత్తాపూర్లో రైతులు సాగు చేస్తున్న ఆర్డీఆర్–1200 రకం వరి పంటలను శనివారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశీలించారు. క్షేత్ర సందర్శనలో భాగంగా వారు గ్రామాన్ని సందర్శించి ‘నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా మాజీ సర్పంచ్ నాగరాజు సాగు చేసిన వరి పొలాన్ని పరిశీలించారు. ఆర్డీఆర్–1200 రకం వరి సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. వచ్చిన దిగుబడిని విత్తనాలుగా కూడా ఉపయోగించవచ్చన్నారు. రైతులు అడిగిన సందేహాలకు శాస్త్రవేత్తలు సమాధానాలిచ్చారు. శాస్త్రవేత్తలు రమ్య రాథోడ్, చంద్రకళ, ఎంఏవో మధుసూదన్, ఆదర్శరైతు చిన్న భూమన్న ఉన్నారు. నిజామాబాద్అర్బన్: అమరుడైన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని శనివారం బోఽ దన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని తెలిపారు. ఎవరైన పోలీసులపై దాడులు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. నుడా చైర్మన్ కేశవేణు, నాగేష్రెడ్డి, నరాల రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ ఒకరు..
జక్రాన్పల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. జక్రాన్పల్లి ఎ స్సై మాలిక్ రహమాన్ తెలిపిన వివరా లు ఇలా.. మండలంలోని అర్గుల్ గ్రా మానికి చెందిన ఆరెళ్ల కాశీరాం (60) ఈనెల 24న రాత్రి అర్గుల్ నుంచి హెచ్ పీ పెట్రోల్ పంపు వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈక్రమంలో వెనుక నుంచి వచ్చిన బైక్ కాశీరాంను ఢీకొట్టింది. ఈ ఘటనలో కాశీరాంకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆర్మూర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శనివారం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి కుమారుడు మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. బోధన్ పట్టణంలో.. బోధన్టౌన్(బోధన్): పట్టణంలోని ఓ వ్యక్తి ఇటీవల ఆత్మహత్యకు యత్నించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపిన వివరాలు ఇలా.. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన కవిలేశ్వర్ శివకృష్ణ (35) ఫోటో స్టూడియోతోపాటు మిల్క్ డెయిరీ, బేకరీ బిజినెస్ చేసేవాడు. వ్యాపారాల నిమిత్తం అతడు మిత్రు ల వద్ద, బంధువుల వద్ద అప్పులు చేశాడు. దీంతో అప్పులు చెల్లించలేక జీవితంపై విరక్తి చెంది అతడు గురువారం రాత్రి పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే భార్య సంధ్యారాణి గమనించి అతడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశామని సీఐ వెల్లడించారు. ఖాజాపూర్లో జీపీ కార్మికుడు.. బోధన్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన జీపీ కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా.. సాలూర మండలంలోని ఖాజాపూర్ గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ శేరే నాగ్నాథ్(39) శుక్రవారం రాత్రి రోడ్డుపై వెళ్తుండగా ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించుకునేక్రమంలో పక్కనున్న కాలువలో పడి గాయపడ్డాడు. వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మచ్చేందర్రెడ్డి తెలిపారు. అంత్యక్రియల కోసం గ్రామ పంచాయతీ నిధుల నుంచి రూ.10వేల నగదు సహాయాన్ని ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో మద్దిలేటి, పంచాయతీ కార్యదర్శి శైలజ మృతుడి కుటుంబ సభ్యులకు అందించారు. -
‘ఇందిరమ్మ ఇళ్ల’కు పూర్తి సహకారం అందిస్తాం
● బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి ● జైతాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు బోధన్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు పూర్తి సహకారం అందిస్తామని బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఇళ్లను శనివారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సబ్ కలెక్టర్ వికాస్మహతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తూ, ఐకేపీ, మెప్మా శాఖల ద్వారా రుణాలను మంజూరు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ తోడ్పాటును అందిపుచ్చుకుని ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిని పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. గ్రామంలో పది మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకున్నారని, మరో 60 ఇళ్ల నిర్మాణాలు స్లాబ్ దశలో ఉన్నాయని తెలిపారు. గ్రామ ఆరోగ్య ఉపకేంద్రానికి విద్యుత్ సౌకర్యం, మహిళా శక్తి భవనానికి టాయిలెట్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, గృహ నిర్మాణ శాఖ జిల్లా పీడీ పవన్ కుమార్, తహసీల్దార్ దత్తాద్రి, ఎంపీడీవో శంకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మత్తు పదార్థాల నిరోధానికి కృషి
నిజామాబాద్అర్బన్: మాదక ద్రవ్యాలు, మత్తు ప దార్థాల నిరోధానికి సమష్టిగా కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శనివారం కలెక్టర్ అధ్యక్షతన నషా ముక్త్ భారత్ అభియాన్ జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. సీపీ సాయి చైతన్య, సంబంధిత శాఖల జిల్లాస్థాయి అధికారులు, కమిటీ ప్రతినిధులు పాల్గొని, జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై చర్చించా రు. కలెక్టర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల రవాణా, వినియోగం పెనుసవాలుగా మారిందని అన్నారు. యువత, విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న మత్తు పదార్థాలు రవాణా, వినియోగం జరుగకుండా కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఇది కేవలం ప్రభుత్వ యంత్రాంగాల బాధ్యత అని భావించకుండా సమాజంలోని వివిధ వర్గాల వారందరూ మా దకద్రవ్యాల నిరోధానికి తమవంతు తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల రవాణా, వినియోగం గమనిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. టో ల్ ఫ్రీ నెంబర్ 14446కు కాల్ చేసి సమాచారం తెలుపవచ్చని సూచించారు. అనంతరం నషా ముక్త్ భా రత్ అభియాన్ ఐదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సామూహిక ప్రతిజ్ఞ కోసం రూపొందించిన క్యూఆర్ కోడ్ను విడుదల చేశారు. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారిణి రసూల్ బీ, డీఐఈవో రవికుమార్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి పాల్గొన్నారు. -
ఈ వంటలక్కలు
ట్రెండ్ సెట్టర్స్..ఫంక్షన్ ఏదైనా.. ఎన్ని వేల మందికై నా సరే.. మాంసాహారమైనా.. కూరగాయలైనా ఒంటిచేత్తో వండేస్తామంటూ ముందుకొస్తున్నారు వంటలక్కలు. కుటుంబ పోషణ కోసం పెట్టుబడి లేకుండా రెక్కల కష్టాన్ని నమ్ముకున్నారు. వంటలు చేస్తూ భోజనప్రియుల మన్ననలు పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్న ఆర్మూర్ అతివలపై ఆదివారం ప్రత్యేక కథనం.. ఫంక్షన్ హాల్లో వంటలు చేస్తున్న పెద్దగొండ పుష్పఆర్మూర్: పెళ్లి విందు.. పుట్టినరోజు పార్టీ.. శ్రీమంతం.. నామకరణ మహోత్సవం..గుళ్లలో సత్రాలు.. ఏదైనా సరే.. వంటలు రుచికరంగా ఉన్నాయని నలుగురూ అన్నారంటే ఆ ఫంక్షన్ సక్సెస్ అయినట్లే. నోరూరించే వంటకాలు చేయడంలో ఆర్మూర్ ప్రాంతానికి చెందిన మగవారు సిద్ధహస్తులుగా ఉండేవారు. క్రమంగా వారు కనుమరుగవుతున్నారు. అయితే, ఇటీవల పాకశాస్త్ర ప్రవీణ్యులుగా తెరపైకి వస్తున్నారు కొందరు ఆర్మూర్ మహిళలు. సర్వం పనులు.. గ్రూపులో ఇద్దరే ఆర్మూర్ ప్రాంతంలో సుమారు 40 మందికి పైగా మహిళలు వంటలు చేయడాన్ని స్వయం ఉపాధిగా ఎంచుకున్నారు. యాదృచ్ఛికంగా ఎవరికి వారే ఇద్దరు మహిళల చొప్పున 20 గ్రూపులు ఏర్పడ్డాయి. వండే వంటకాలు, భోజనం చేసే వారి సంఖ్య మేరకు ఇద్దరు మహిళలే ధర మాట్లాడుకొని ఫంక్షన్ హాళ్లు, ఇళ్లు, గుళ్లలో వంటలు చేస్తూ ఆత్మగౌరవంతో నిలుస్తున్నారు. వంటకం రుచి విషయంలో సైతం నలభీములను మించి పోతున్నారు. మగవారు వంట వాళ్లుగా వస్తే వారికి ఒక అసిస్టెంట్తోపాటు కూరగాయలు కోసేందుకు, వంట పాత్రలు శుభ్రం చేయడానికి, వడ్డించడానికి క్యాటరింగ్ వారు వేర్వేరుగా కూలీలను తీసుకొని రావడంతో ఫంక్షన్ చేసే వారికి ఆర్థిక భారమయ్యేది. ఈ జంట వంటలక్కలు మాత్రం తాము మాట్లాడుకున్న ధరలో వంట చేసేముందు పాత్రలను శుభ్రం చేయడం, కూరగాయలు కోసుకోవడం, వంట చేయడం, భోజనాలు పూర్తయిన తర్వాత పాత్రలను యథావిధిగా కడిగి వెళ్లడం, అవసరమైతే వడ్డించడం కూడా చేస్తున్నారు. తక్కువ ధరలో వంటలక్కల సేవలు అందుబాటులో ఉండటంతో అందరూ వీరినే సంప్రదిస్తున్నారు. వీరి సేవలు కేవలం ఆర్మూర్ ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా క్రమంగా విస్తరిస్తున్నాయి. చుట్టు పక్కల పట్టణాలు, గ్రామాలతోపాటు హైదరాబాద్లో స్థిరపడ్డ ఈ ప్రాంతం వారు సైతం తమ ఇళ్లలోని ఫంక్షన్లకు వంట చేసేందుకు వీరిని ప్రత్యేకంగా పిలిపించుకుంటున్నారు. కేవ లం మౌత్ పబ్లిసిటీ ద్వారా మాత్రమే వీరికి వంటల కాంట్రాక్టులు లభిస్తున్నాయి. పాలకుల నుంచి ఎలాంటి సహాయ, సహకారాలు అందకున్నా స్వశక్తితో ఉపాధి పొందుతూ శెభాష్ అనిపించుకుంటున్నారు. స్వశక్తితో స్వయం ఉపాధి ఫంక్షన్లలో వంటలు చేస్తూ రాణిస్తున్న అతివలు నలభీములను తలపించే వంటల రుచి పెద్ద వంటలన్నీ ఒంటి చేత్తో చక్కబెడుతూ.. -
నా ఓటమి ఓ కుట్ర..
నిజామాబాద్అర్బన్: ‘ఇరవై ఏళ్లుగా కేసీఆర్ కోసం.. టీఆర్ఎస్, బీఆర్ఎస్ కోసం పనిచేశా.. కుట్ర చేసి నన్ను బయటికి పంపారు. ఎంపీ ఎన్నికల్లో నా ఓటమి ఓ కుట్రనా? కాదా? నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించాలె. ఈ జిల్లా బిడ్డగా, కోడలిగా మీ ఆశీర్వాదం కోసం వచ్చా.. ఇది నా గడ్డ. ఎప్పటికై నా ఈ గడ్డలోనే కలిసిపోతా..’ అని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. శనివారం ‘జాగృతి జనంబాట’ కార్యక్రమంలో భాగంగా జిల్లాకు వచ్చిన ఆమెకు జాగృతి నాయకులు ఇందల్వాయి వద్ద ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని కవిత ఇంటి వరకు తెలంగాణ విద్యార్థఇ సంఘం నాయకుడు శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఇంటి వద్ద అభిమానులు, మహిళలనుద్దేశించి కవిత ప్రసంగించారు. అన్ని భావజాలాలకు మద్దతునిస్తూ ముందున్న జిల్లా మనదని, బీఆర్ఎస్ నుంచిమొదటిసారి నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ను గెలిపించారని గుర్తుచేశారు. మీ బిడ్డనైన తనను పార్లమెంట్కు పంపించారని, గతంలో బీఆర్ఎస్ పార్టీని దీవించి అన్ని సీట్లు గెలిపించారన్నారు. తాను బీ ఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏం చేయలేదని, కానీ కుట్ర చేసి బయటికి పంపించారని ఆవేదన వ్యక్తంచేశారు. రూ. 50 వేల పరిహారం ఇచ్చే వరకు ఉద్యమిస్తాం.. నవీపేట: గోదావరి తీర ప్రాంత ముంపు బాధిత రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ‘జాగృతి జనంబాట’ కార్యక్రమంలో భాగంగా నవీపేట మండలం యంచ గ్రామంలో శనివారం సాయంత్రం ముంపు రైతులతో ఆమె సమావేశమయ్యారు. అనంతరం కవిత మాట్లాడుతూ చేతికొచ్చిన పంట మునిగి నెలలు గడుస్తున్నప్పటికీ ఇంత వరకు ఎలాంటి పరిహార చెల్లింపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు, రైతులతోపాటు ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి ఇక్కడి రైతులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. 9 గ్రామాలలో 5 వేల ఎకరాలు నష్టపోతే అధికారులు తప్పుడు లెక్కలు చూపారని, కలెక్టర్ చొరవ తీసుకుని మరో సారి సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధిత రైతులకు రూ. 50 వేల పరిహారం చెల్లించేవరకు ఉద్యమిస్తామన్నారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆరోపించారు. అనంతరం రూ. 50 లక్షల ఎమ్మెల్సీ నిధులతో చేపట్టిన విఠలేశ్వరాలయం సీసీ రోడ్డును పరిశీలించి, ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీనాచారి, బీఆర్ఎస్ నాయకులు నర్సింగ్రావ్, న్యాలకంటి అబ్బన్న, దొంత ప్రవీణ్, లాలూయాదవ్, సంజీవ్, కృష్ణమోహన్రావ్, నాగారావ్, శ్యామ్, నరహరి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్లో మాట్లాడుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితయంచలో మాట్లాడుతున్న కల్వకుంట్ల కవితప్రభుత్వం సిగ్గుపడాలె.. రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు, హాస్టళ్లలోని విద్యార్థులను ఎలుకలు కొరకడం, విద్యార్థినులపై లైంగిక దాడులు జరుగుతున్నాయని కవిత ఆరోపించారు. విద్యార్థులకు కనీస భద్రత, ఆహారం పెట్టలేని రేవంత్రెడ్డి ప్రభుత్వం సిగ్గుపడాలని విమర్శించారు. సరైన విద్యా, వైద్యం, ఉద్యోగాలు అందించలేకపోతున్నారని అన్నారు. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి పరిస్థితి దయనీయంగా మారిందని, దీనిపై జిల్లాకు చెందిన పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్గౌడ్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇస్తామన్న రూ.2500 పెన్షన్ కోసం పిడికిలి బిగించి కొట్లాడుదామని పిలుపునిచ్చారు. గత 10 ఏళ్లలో కొంత సాధించుకున్నాం.. కానీ అమరవీరుల కుటుంబాలకు దక్కాల్సిన గౌరవం, న్యాయం దక్కలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి అమరవీరుడి కుటుంబానికి కోటి రూపాయలు వచ్చే వరకు ఉద్యమిస్తామన్నారు. జనంబాటలో భాగంగా మేధావులు, విద్యార్థులతో సహా అన్నివర్గాలతో మాట్లాడతానని తెలిపారు. కార్యక్రమంలో జాగృతి నాయకులు పాల్గొన్నారు. ఎప్పటికై నా ఈ గడ్డలోనే కలిసిపోతా.. కుట్ర చేసి బయటికి పంపారు.. మీ ఆశీర్వాదం కోసం వచ్చా.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ‘జాగృతి జనంబాట’ ప్రారంభం -
పొరపాట్లు లేకుండా ఎస్ఐఆర్ చేపట్టాలి
● రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిజామాబాద్అర్బన్: ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్, ఇతర అధికారులతో కలిసి శనివారం వీసీలో కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఈఆర్వోలతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ 2002 ఎలక్టోరల్ జాబితాతో నియోజకవర్గాల వారీగా 2025 ఎలక్టోరల్ జాబితా మ్యాపింగ్ చేసి 4 కేటగిరీలుగా విభజించినట్లు తెలిపారు. అన్ని కేటగిరీలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 కోట్ల 33 లక్షల ఓటర్లను మ్యాపింగ్ చేశామన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ బీఎల్వోలు, బీఎల్వో సూపర్వైజర్లకు శిక్షణ ఇస్తామని తెలిపారు. మొదట కేటగిరి ఏ ఓటరు జాబితాను బీఎల్వో యాప్ ద్వారా నిర్ధారించిన తర్వాత కేటగిరి సీ, డీలను కేటగిరి ‘ఏ’ కు లింక్ చేస్తామన్నారు. పొరపాట్లకు తావు లేకుండా, దశలవారీగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలో 50 శాతం మ్యాపింగ్ పూర్తయ్యిందని, ప్రతి రోజూ ఎస్ఐఆర్ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. వీసీలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, హౌసింగ్ పీడీ పవ న్ కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ధన్వా ల్, సిబ్బంది సాత్విక్, జితేందర్ పాల్గొన్నారు. -
75 వేలకుపైగా పశువులకు టీకాలు
● జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రోహిత్రెడ్డి మోపాల్(నిజామాబాద్రూరల్): జిల్లాలోని 1.80 లక్షల గేదెలు, ఆవులు, దూడలు, లేగలకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ కొనసాగుతోందని, ఇప్పటి వరకు 75 వేలకుపైగా పశువులకు టీకాలు వేసినట్లు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రోహిత్రెడ్డి పేర్కొన్నారు. మోపాల్ మండలం ముదక్పల్లిలో నిర్వహిస్తున్న గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోహిత్రెడ్డి మాట్లాడుతూ పాడి రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిజామాబాద్ను గాలికుంటువ్యాధి రహిత జిల్లాగా మార్చాలన్నారు. టీకాలతో పశువులు ఆరోగ్యంగా ఉండి పాల దిగుబడి, మాంసం దిగుబడి పెరుగుతుందన్నారు. టీ కాల పంపిణీ పూర్తిగా ఉచితమని, ఎవరైనా సిబ్బంది క్షేత్రస్థాయిలో డబ్బులు అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. నవంబర్ 14 వరకూ టీకాల పంపిణీ కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి శిరీష, లైవ్స్టాక్ అసిస్టెంట్ సురేశ్, గోపాలమిత్రలు రాజశేఖర్, రజనీకాంత్, సాయి తదితరులు పాల్గొన్నారు. మక్క కొనుగోలు పరిమితి పెంచండి ● ఎకరానికి 28 క్వింటాళ్ల కొనుగోలుకు అనుమతివ్వండి ● ప్రభుత్వానికి కలెక్టర్ లేఖ డొంకేశ్వర్(ఆర్మూర్): ఖరీఫ్లో పండించిన మొక్కజొన్న పంట కొనుగోలుపై విధించిన పరిమితిని ఎత్తివేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎకరానికి 28 క్వింటాళ్లు కొనేలా అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే, ప్రభుత్వ ఆదేశాలు త్వరగా వస్తే మక్క రైతులకు ఊరట కలుగనుంది. ఖరీఫ్ సీజన్లో రైతులు 52,093 ఎకరాల్లో మక్కను సాగు చేయగా 1.45 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. జిల్లాలో మక్కలు కొనుగోలు చేసే బాధ్యత మార్క్ఫెడ్కు అప్పగించగా ప్రభుత్వం ఇటీవల కొనుగోళ్లను ప్రారంభించింది. 32 సెంటర్లు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 2,500 మెట్రిక్ టన్నుల వరకు మక్కలను కొనుగోలు చేశారు. అయితే ఎకరానికి 18.5 క్వింటాళ్లు మాత్రమే రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. దీంతో రైతులు పండించిన పూర్తి పంటను అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎకరానికి 38–40 క్వింటాళ్ల మక్కలు ది గుబడి రాగా ప్రభుత్వం ఎకరానికి 18.5 క్వింటాళ్లే తీసుకోవడంతో మిగిలిన పంటను వ్యాపారులకు విక్రయించాల్సి వచ్చింది. ఈ సమస్యను రైతులు కలెక్టర్తోపాటు వ్యవసాయ, మార్క్ఫెడ్ అధికారుల దృష్టికి తె చ్చారు. సీలింగ్ లేకుండా పండించిన పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలని కోరారు. రైతుల మేలుకోరి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రభుత్వానికి లేఖ రాయడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం త్వర గా అనుమతివ్వాలని కోరుతున్నారు. -
వర్షం.. రైతు ఆగం
రెంజల్ శివారులో తడిసిన ధాన్యం కుప్ప నుంచి వర్షపు నీటిని తొలగిస్తున్న రైతులుఎడపల్లి మండలంలోని మంగల్పాడ్ శివారులో వడ్ల కుప్పల చుట్టూ వర్షపు నీరుబోధన్/ రెంజల్/ జక్రాన్పల్లి: చేతికొచ్చిన పంట విక్రయించే దశలో వర్షం రైతులను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. జిల్లాలోని బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో శనివారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. వరి నూర్పిళ్లు పూర్తి చేసుకొని ఖాళీ ప్రదేశాలు, కొనుగోలు కేంద్రాల ఆవరణలో ఆరబోసిన ధాన్యం పలుచోట్ల వర్షానికి తడిసింది. బోధన్, సాలూర, ఎడపల్లి, నవీపేట, రెంజల్ మండలాల్లో వర్షం కురిసింది. మూడు, నాలుగు రోజులుగా ఆరబెట్టిన ధాన్యం ఒక్క రోజులో తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జక్రాన్పల్లి మండలం మనోహరాబాద్, వివేక్నగర్, పడకల్ తండా తదితర గ్రామాల్లో వరి పంట నేలవాలింది. రోడ్లపై, కల్లాల్లో ఆరబోసిన మక్కలు, వడ్లు తడిసిముద్దయ్యాయి. తడిసిన ధాన్యం, మక్కలను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. తడిసిన వడ్లు, మక్కలు -
జూబ్లీహిల్స్ ప్రచారంలో జిల్లా నేతలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నవంబర్లో జరుగనున్న జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల ప్రచారం కోసం జిల్లాకు చెందిన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు తరలివెళ్లారు. జిల్లాలో పార్టీపరమైన, ఇతర ప్రైవేటు కార్యక్రమాలు ఉంటే హడావుడిగా వచ్చి వెళుతున్నారు. ప్రతిరోజూ అత్యధిక సమయం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో తమకు కేటాయించిన ప్రాంతాల్లోనే గడుపుతున్నారు. ఈ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పలువురు నాయకులకు ఆయా పార్టీల నాయకత్వాలు కీలకమైన బాధ్యతలు అప్పగించాయి. దీంతో సదరు జిల్లాకు చెందిన నాయకులంతా తీరిక లేకుండా జూబ్లీహిల్స్ ప్రచారపర్వంలో నిమగ్నమై ఉంటున్నారు. తమకు అప్పగించిన డివిజన్లలో, క్లస్టర్లలో కీలక నాయకులు తమ తమ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోటాపోటీ నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులైన జిల్లాకు చెందిన పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు. ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, భూపతిరెడ్డిలకు సైతం కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. వీరితో పాటు రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు మానాల మోహన్రెడ్డి, సుంకేట అన్వేష్రెడ్డి, తాహెర్బిన్ హాందాన్, నుడా చైర్మన్ కేశ వేణు సమన్వయకర్తలుగా పనిచేస్తున్నారు. అధిష్టానం అప్పగించిన ప్రాంతాల్లో బిజీబిజీగా.. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి పలువురు కీలక నాయకులు బీఆర్ఎస్ తరుఫున ప్రచారంలో జిల్లాకు చెందిన మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి జూబ్లీహిల్స్లో షేక్పేట డివిజన్ ఇన్చార్జిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు. ప్రశాంత్రెడ్డి ఆధ్వర్యంలో 9 మంది క్లస్టర్ ఇన్చార్జులు పనిచేస్తున్నారు. ఈ క్లస్టర్ ఇన్చార్జుల్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. అదేవిధంగా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు షకీల్, గణేశ్ గుప్తా, జీవన్రెడ్డి, సురేందర్ ఉన్నారు. షకీల్ భార్య ఆయేషా ఫాతిమా సైతం ప్రచారంలో ఉన్నారు. బీజేపీ నుంచి ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్సీలు చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమురయ్య స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు. జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ షేక్పేట డివిజన్లోని శక్తికేంద్రం సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. జిల్లా నుంచి మరికొందరు బీజేపీ నాయకులు సైతం జూబ్లీహిల్స్ ప్రచార పర్వంలోకి దిగనున్నారు. జిల్లాలోనూ జూబ్లీహిల్స్ ఎన్నికల విషయమై వివిధ వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. -
ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటాం
నిజామాబాద్అర్బన్: ఇటీవల నేరస్తుడు రియా జ్ చేతిలో హత్యకు గురైన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నా రు. నగరంలోని బాధిత కుటుంబాన్ని గురువా రం వారు పరామర్శించారు. కాంగ్రెస్ తరఫు న రూ.2లక్షలు అందించారు. ఈసందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయగలం కానీ, మానసికంగా జరిగిన గాయాన్ని ఎవరు పూడ్చలేదన్నారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు నివారించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. -
ఉపాధ్యాయుల లెర్నింగ్ టూర్!
● వినూత్న విద్యాబోధనపై అధ్యయనం ● ఐదు రోజుల పర్యటన ● 16 మంది దరఖాస్తు ● జిల్లా నుంచి ముగ్గురి ఎంపిక ఖలీల్వాడి: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను ప్రవేశపెట్టేందుకు మరో అడుగు ముందుకు వేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన నాణ్యతను పెంపొందించేలా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన హెడ్మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీలను, విద్యాశాఖ అధికారులను విదేశాలకు పంపించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ కన్వీనర్ డాక్టర్ నవీన్ నికోలస్ టీచర్లకు ఫారిన్ టూర్కు సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను ఇటీవల జారీ చేశారు. ‘గ్లోబల్ లెర్నింగ్ టూర్’ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 160 మందిని ఎంపిక చేసి నాలుగు బృందాలుగా విభజించి సింగపూర్, ఫిన్లాండ్, వియత్నాం, జపాన్ వంటి దేశాలకు నవంబర్లో పంపించనున్నారు. ఎంపికై న వారు ఆయా దేశాల్లో ఐదు రోజులు విద్యా విధానాలను ప్రత్యక్షంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీంతో తెలంగాణలో ఎడ్యుకేషన్లో సమూల మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు విద్యావేత్తలు భావిస్తున్నారు. జిల్లా నుంచి ముగ్గురిని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఇందులో ఒకరు ప్రధానోపాధ్యాయులు, మరొకరు స్కూల్ అసిస్టెంట్, ఇంకొకరు ఎస్జీటీ ఉంటారు. వీరి దరఖాస్తులను జిల్లా విద్యాశాఖ పరిశీలించి, జాబితాను సిద్ధం చేయనున్నట్లు తెలిసింది. నాలుగు దేశాల్లో.. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, జెడ్పీ హై స్కూళ్లు 1156 ఉండగా ఇందులో 5292 మంది హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు పని చేస్తున్నారు. ఎంపికై న వారు రాష్ట్రస్థాయి బృందంతో కలిసి జపాన్, ఫిన్లాండ్, సింగపూర్, వియత్నాం దేశాల్లో పర్యటించి అక్కడి బోధన విధానాలను అధ్యయనం చేయనున్నారు. ఎంపిక ఇలా.. బోధనలో కనీసం పదేళ్ల అనుభవం, 55 ఏళ్ల లోపు, పాస్పోర్టు కలిగి ఉన్నవారిని కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా సీనియర్ అధికారులు అర్హులైన ముగ్గురిని ఎంపిక చేస్తారు. ఎంపికయ్యే టీచర్లను వాళ్ల మూడేళ్ల పనితీరును జిల్లా కమిటీ పరిశీలిస్తుంది. అంతేకాకుండా ఈ ఎంపికయ్యే టీచర్లు విద్యార్థులను స్కూల్లో చేర్పించడానికి తీసుకున్న చొరవ, అభ్యసనకు సామర్థ్యం, వినూత్న బోధన పద్ధతులు, స్కూల్ అభివృద్ధి, ఇంగ్లిష్లో మాట్లాడటం, గతంలో పొందిన పురస్కారాలు కలిగిన టీచర్లను జిల్లా కమిటీ పరిగణలోకి తీసుకుంటుంది. కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ.. జిల్లా నుంచి ఫారిన్ లెర్నింగ్ టూర్కు బుధవారం చివరి తేదీ కావడంతో హెచ్ఎంలు ముగ్గురు, ఎస్జీటీలు ఇద్దరు, స్కూల్ అసిస్టెంట్లు పదకొండు మంది దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఇందులో ముగ్గురిని ఎంపిక చేస్తుంది.మూడు నెలలకు ఒకసారి టీచర్లను విదేశాలకు పంపిస్తే బాగుంటుంది. అక్కడి విద్యా విధానాన్ని ఇక్కడి పరిస్థితులకు అనుకూలంగా మల్చుకొని విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఫారిన్ లెర్నింగ్ టూర్ను ఏర్పాటును స్వాగతిస్తున్నాం. ఇది ప్రతి పాఠశాల నుంచి టీచర్లు వెళ్లే విధంగా ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుంది. – శ్రీకాంత్, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎంపికై న టీచర్లు ఫారిన్ విద్యా విధానాలు, అక్కడి బోధన పద్ధతులను ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా కొత్త విషయా లు తెలుసుకుంటారు. దీంతో ఇక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా వాటిని అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అనుగుణంగా విప్లవాత్మక మార్పులకు అవకాశం ఉంటుంది. – యానం విజయ్, ఎస్సీ, ఎస్టీ యూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు -
మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మద్యానికి బానిసైన ఓ యువకుడు జీవితంపై విరక్తితో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగిరెడ్డిపేట మండలం తాండూర్లో చోటు చేసుకుంది. ఎస్సై భార్గవ్గౌడ్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తాండూర్కు చెందిన దాకమొల్లి సంగయ్య, ఎల్లవ్వకు ఇద్దరు కుమారులు నాగరాజు, కుమార్(18) ఉన్నారు. పెద్దకుమారుడైన నాగరాజు హైదరాబాద్లో ఉంటుండగా చిన్నాకుమారుడు కుమార్ గ్రామంలో తల్లితండ్రులతో కలిసి ఉంటున్నాడు. కొంత కాలంగా కుమార్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో జీవితంపై విరక్తితో బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పసుపు రైతుల అభ్యున్నతికి విజ్ఞానయాత్రలు అవసరం
సుభాష్నగర్: పసుపు రైతుల అభ్యున్నతికి విజ్ఞానయాత్రలు ఎంతో అవసరమని జాతీయ పసుపు బో ర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదే శ్ రాష్ట్రంలోని గుంటూరు, నంద్యాల జిల్లాల నుంచి రైతులు పసుపు రైతుల నైపుణ్యాల అభివృద్ధిపై వి జ్ఞాన యాత్రలో భాగంగా నగరంలోని జాతీయ ప సుపు బోర్డు కార్యాలయాన్ని గురువారం సందర్శించారు.ఈ సందర్భంగా పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి రైతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యా రు.పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉత్పత్తి వ్యయం, మార్కెట్లో ధరల అస్థిరత, పంట సంరక్షణలో ఎదురయ్యే సవాళ్లు వంటి అంశా లపై చర్చించి, వాటికి సరైన పరిష్కార మార్గాలపై చర్చించారు. అనంతరం పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ.. పసుపు రైతుల సంక్షేమం కోసం బోర్డు నిరంతరం పని చేస్తుందన్నారు. శాసీ్త్రయ పద్ధతుల్లో పసు పు పంట ఉత్పత్తిని పెంచాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని తెలిపారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. పసుపు పరిశోధన కేంద్రం సందర్శన కమ్మర్పల్లి: మండల కేంద్రంలోని పసుపు పరిశోధన కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లోని స్పైస్ బోర్డు ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా మహానంది ప్రాంత రైతులు గురువారం సందర్శించారు. పరిశోధన స్థానంలో చేపడుతున్న పరిశోధనలు, పసుపు రకాలు, యంత్రాల గురించి రైతులకు పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మహేందర్ వివరించారు. పసుపు సాగు గురించి పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా రైతులకు వివరించారు. పసుపు రకాలు, కుర్కుమిన్ శాతం, దిగుబడి, పంట కాలపరిమితి, యాజమాన్య పద్ధతులను వివరించారు. సాగవుతున్న వివిధ రకాల పసుపు పంటలను, సాగుకు వినియోగించే యంత్రాలను పరిశీలించి, వాటి పనితీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు, సిబ్బంది, రైతులు ఉన్నారు. -
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి సుభాష్నగర్: జిల్లావ్యాప్తంగా వరి కోతలు ఊపందుకున్నాయని, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి సేకరణను వేగవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి డిమాండ్ చేశారు. గురువారం ఆయన కలెక్టర్కు లేఖ రాశారు. జిల్లాలో మొక్కుబడిగా కేంద్రాలను ప్రారంభించారని, చాలా కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ ఇంకా మొదలు కాలేదన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన రైతులను ప్రకృతి తీవ్రంగా కంటతడి పెట్టించిందని, అధిక వర్షాల ప్రభావంతో పంటకు కంకినల్లి, సుడిదోమ వంటి తెగుళ్లు సోకిందని తెలిపారు. ఈ తెగుళ్ల వల్ల పంట దిగుబడిపై ప్రభావం పడిందని రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్చేశారు. కోతలు పూర్తి చేసుకుని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నా.. కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో లారీలు, కూలీలు, గన్నీ సంచుల కొరత లేకుండా సరైన ఏర్పాట్లు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వేల్పూర్: మండలంలోని పడగల్ సొసైటీ చైర్మన్గా యాల్ల హన్మంత్రెడ్డి కొనసాగింపునకు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుతో గురువారం ఆయ న విధుల్లో చేరారు. సొసైటీ చైర్మన్ల పదవీకా లం మరో ఆరునెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా పడగల్ సొసైటీ చైర్మన్కు పొడిగింపు ఇవ్వలేదు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.రెండు వారాల క్రిత మే హైకోర్టు అందరు చైర్మన్లతోపాటు తన పదవీకాలం కూడా ఆరు నెలలు పొడిగిస్తూ ఉత్త ర్వు ఇచ్చిందని వెల్లడించారు. కానీ జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ హైకోర్టు ఉత్తర్వును ఒప్పుకుంటున్నట్లు గాని, తిరస్కరిస్తున్నట్లు గాని ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. దీంతో హైకోర్టు ఉత్తర్వు ఆధారంగా తానే స్వయంగా విధుల్లో చేరినట్లు విలేకరులకు వెల్లడించారు. నిజామాబాద్ నాగారం: నిజామాబాద్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎంపిక పోటీలను నగరంలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ప్రాంగణంలో గురువారం నిర్వహించినట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయ్కాంత్ రావు తెలిపారు. ప్రతిభ కనబర్చి న క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు త్వర లో పంపుతామన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఎస్ పాఠశాల ఫాదర్ జొయెస్ థామస్, జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి పవన్ కుమార్, మీసాల ప్రశాంత్, సైక్లింగ్ అసోసియేషన్ సభ్యులు అఫ్సర్, దుర్గా మల్లేశ్, గడ్డం రవి, నరేశ్, వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డిచ్పల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్ డిచ్పల్లిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం అడిషనల్ కమాండెంట్ సీహెచ్ సాంబశివరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల, విక్టరీ హైస్కూల్, విద్యా హైస్కూల్ విద్యార్థులకు ఆయుధాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ కేపీ శరత్కుమార్, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నిజామాబాద్, ఆర్మూర్ బోధన్ డివిజన్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు సీపీ సాయిచైతన్య గురువారం తెలిపారు. డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర అనే అంశంపై ఆరు నుంచి డిగ్రీ తరగతి విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించామన్నారు. పోటీల్లో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని ప్రతిభ చాటారు. కాంట్రాక్ట్ లెక్చరర్ అదృశ్యం కామారెడ్డి క్రైం: అప్పులు పెరగడంతో మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి తాను చనిపోవాలని అనుకుంటున్నానని ఇంట్లో లేఖ రాసి పెట్టి అదృశ్యమైన ఘటన జిల్లా కేంద్రంలోని ఎన్జీవోఎస్ కాలనీలో గురువారం వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. కాలనీకి చెందిన బోడ చంద్రశేఖర్ మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్గా పని చేస్తున్నాడు. ఈ నెల 3 న ఉదయం కూరగాయల మార్కెట్ కు వెళ్తున్నానని ఇంటి నుంచి బయటకు వెళ్లిన చంద్రశేఖర్ తిరిగి రాలేదు. మూడు రోజుల తర్వా త అతని పుస్తకంలో ఓ లేఖ ఉన్నట్లు గుర్తించారు. తల్లి కళావతి ఫిర్యాదు మేరకు పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యవసాయ కళాశాల జిల్లాకు వరం
● ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి సుభాష్నగర్: అన్నపూర్ణ జిల్లాగా పేరున్న నిజామాబాద్కు వ్యవసాయ కళాశాల వరమని, ఈ కళాశాల ఏర్పాటుతో వ్యవసాయ రంగానికి మరింత ఊతమిచ్చినట్లు అవుతోందని ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి పేర్కొన్నారు. జిల్లాకు వ్యవసాయశాఖ మంజూరు చేసినందుకుగాను రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును ఆయన గురువారం హైదరాబాద్లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రమేశ్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అందులోభాగంగానే జిల్లాకు వ్యవసాయ కళాశాలను మంజూరు చేసిందన్నారు. ఇప్పటికే జిల్లాలో అన్నదాతలు పండిస్తున్న పసుపు, వరి, సోయా, మొక్కజొన్న, ఎర్రజొన్నలు, తదితర పంటలు వేరే జిల్లాలు, రాష్ట్రాలతోపా టు ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా రైతులు, విద్యార్థులు రుణపడి ఉంటారని మంత్రికి తెలిపారు. -
కొనుగోలు కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలి
● ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే తహసీల్దార్లదే బాధ్యత ● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● జిల్లా అధికారులతో వీసీలో సమీక్షనిజామాబాద్అర్బన్ : జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే తహసీల్దార్లదే బాధ్యతని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల పనితీరుపై గురువారం ఆయన కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సబ్ కలెక్టర్లు, ఆర్డీవో, తహసీల్దార్లు, ఏపీఎంలు, ఏ వోలు, ఏఈవోలు, ఐకేపీ కేంద్రాల ఇన్చార్జులు వీసీ లో పాల్గొనగా, మోస్రా తహసీల్దార్ కార్యాలయం నుంచి వీసీలో ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడారు. ధా న్యం కొనుగోళ్ల కోసం జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తూ కలెక్టర్ను అభినందించారు. రుద్రూర్ మండలంలో కొన్ని కొనుగోలు కేంద్రాలకు రైస్మిల్లులతో అనుసంధానం చేయలే దని ప్రస్తావించగా, గురువారం టాగింగ్ చేశామని కలెక్టర్ తెలిపారు. ఈసందర్భంగా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. సంబంధిత శాఖలతో సమన్వయాన్ని పెంపొందించుకుని ధాన్యం విక్రయంలో రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ధాన్యం ఆరబెట్టుకునేందుకు వీలుగా అనువైన ఖాళీ స్థలాలను గుర్తించి రైతులకు తెలియజేయాలన్నారు. వచ్చే రెండ్రోజు ల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని నిర్దేశిత ప్రాంతాలలో ధా న్యం కొనుగోలు కేంద్రాలను తెరవాలని ఆదేశించా రు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆర్డీవో రాజేంద్రకుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, డీఎస్వో అరవింద్ రెడ్డి, సివిల్ సప్లయీస్ డీఎం శ్రీకాంత్రెడ్డి, మార్కెటింగ్ ఏడీ గంగుబాయి, డీసీవో శ్రీనివాస్, డీఏవో గోవిందు తదితరులు పాల్గొన్నారు. -
అంత్యక్రియలకు వెళ్తూ.. అనంత లోకాలకు
● రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్తకు తీవ్ర గాయాలు బాన్సువాడ: బంధువుల అంత్యక్రియలకు వెళ్తున్న దంపతులను వాహనం ఢీకొన్న ఘటనలో భార్య మృతి చెందగా భర్త తీవ్రగాయాలపాలైన ఘటన బీర్కూర్ మండలం రైతునగర్ వద్ద చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నస్రుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామానికి చెందిన మోత్కూర్ సాయాగౌడ్, శకుంతల(50) భార్యభర్తలు. బీర్కూర్ మండలం కిష్టాపూర్లో వారి బంధువు చనిపోతే అంత్యక్రియలకు ఎక్స్ఎల్ వాహనంపై బయలుదేరారు. మిర్జాపూర్ మీదుగా రైతునగర్ నుంచి కిష్టాపూర్కు వెళ్లే దారిలో రైతునగర్ వద్ద మలుపు దాటుతుండగా ఎదురుగా పొతంగల్ నుంచి బాన్సువాడ మార్కెట్కు వస్తున్న బొలెరో వాహనం ఢీకొన్నది. దీంతో సాయాగౌడ్కు, శకుంతలకు తీవ్ర గాయాలు కావడంతో బాన్సువాడ ఆస్పత్రికి స్థానికులు తరలిస్తుండగా మార్గమధ్యలో శకుంతల మృతి చెందింది. సాయాగౌడ్కు రెండు కాళ్లు విరగడంతో బాన్సువాడ ఆస్పత్రి వైద్యుల సూచన మేరకు నిజామాబాద్కు తరలించారు. ప్రస్తుతం సాయాగౌడ్ చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బీర్కూర్ పోలీసులు తెలిపారు. -
పెళ్లికి ముందే కల్యాణలక్ష్మి అందిస్తే బాగుంటుంది
నస్రుల్లాబాద్ : పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ముందే కల్యాణలక్ష్మి సాయం అందిస్తే బా గుంటుందని, తల్లిదండ్రులకు అప్పుల బా ధ తప్పుతుందని ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో లబ్ధిదారులకు పోచారం గురువారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పె ళ్లికి మందే కల్యాణలక్ష్మి చెక్కులు అందేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తాను తీసుకెళ్తానని, అధికారులు సైతం ఉ న్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూ చించారు. వర్ని మండలానికి చెందిన 40 మందికి, నస్రుల్లాబాద్ మండలానికి చెందిన 26 మందికి ఆయన చెక్కులను అందజేశా రు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజు, తహసీల్దార్ సువర్ణ, ఏఎంసీ చైర్మన్ శ్యామల, నాయకులు పెర్క శ్రీనివాస్, పాల్త్య విఠల్, రాము, ప్రతాప్, పు రం వెంకటి, కంది మల్లేశ్, మంగలి సాయి లు, సక్రు, పవన్గౌడ్, ప్రభాకర్రెడ్డి తదితరు లు పాల్గొన్నారు. పంట మొత్తాన్ని కొనుగోలు చేసేలా చూస్తాం డొంకేశ్వర్(ఆర్మూర్): రైతులు పండించిన మొక్కజొన్న పంటను పూర్తిగా కొనుగోలు చే సేలా ప్రభుత్వాన్ని కోరుతామని జిల్లా వ్యవసాయ అధికారి మేకల గోవిందు అన్నారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలోని మక్కల కొ నుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. నాణ్యమైన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూ చించారు. పూర్తి పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని ఎకరానికి 18 క్వింటా ళ్ల 50 కిలోలు మాత్రమే తీసుకుంటున్నారని రైతులు డీఏవో దృష్టికి తీసుకొచ్చారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఏవో మధుసూదన్ తదితరులు ఉన్నారు. బీజేపీ నేతల పరామర్శ.. సుభాష్నగర్: నగరంలోని అమరుడైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులను గురువారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి పరామర్శించారు. ప్రమోద్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబానికి అండగా ఉంటామని మానసిక ధైర్యాన్ని ఇచ్చారు. అంతకుముందు ప్రమోద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, నాయకులు బీఆర్ శివప్రసాద్, పద్మారెడ్డి, మాస్టర్ శంకర్, కలిగోట్ గంగాధర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేడు నగరానికి రానున్న డివిజనల్ రైల్వే మేనేజర్ నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ రైల్వే స్టేషన్కు శుక్రవారం రైల్వే డివిజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ వర్మ రానున్నారు. రైల్వే స్టేషన్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు జరుగుతున్న పనులపై విలేకరులతో సమావేశం నిర్వహించనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు (ఐపీఈ, ఐపీసీహెచ్) 7, 9వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఈ నెల 31 నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్ ప్రొఫెసర్ సంపత్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు తెలంగాణ యూనివర్సి టీ వెబ్సైట్ను సంప్రదించాలన్నారు. -
నియామకం సక్రమమేనా?
నిజామాబాద్నాగారం: ఆరోగ్య శ్రీ ట్రస్ట్లో ఇటీవల డిస్ట్రిక్ మేనేజర్ పోస్టును కనీస నిబంధనలు పాటించకుండా భర్తీ చేసినట్లు ఆరోపణ లు వస్తున్నాయి. నియామక తతంగాన్ని రహస్యంగా నడపడంతో పోస్టు భర్తీ సక్రమంగానే జరిగిందా అనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. మొదట రెండు.. తర్వాత నాలుగు.. నిజామాబాద్ డీఎం పోస్టు ఖాళీ ఉందని ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్లోని ఆరో గ్యశ్రీ ట్రస్ట్కు ఇద్దరు దరఖాస్తు చేసుకున్నారు. వారి లో అర్హత ఉన్న ఒకరితో పోస్టు భర్తీ చేయాలని నిజామాబాద్ కలెక్టరేట్కు ట్రస్ట్ నుంచి మే నెలలో ఆదేశా లు వచ్చాయి. అయితే కలెక్టరేట్లో పని చేసి రిటైర్డు అయిన ఉద్యోగి ఒకరు తనకు సంబంధించిన వారి కి పోస్టు ఇవ్వడానికి చక్రం తిప్పినట్లు సమాచారం. దీంతో భర్తీ ప్రక్రియను 5 నెలల వరకు పెండింగ్లో పెట్టి మరో రెండు దరఖాస్తులను తీసుకున్నారు. మొత్తం 4 దరఖాస్తులు ఉండగా, అభ్యర్థులకు కనీసం రాత పరీక్ష లేకుంటే, ఇంటర్వ్యూ అయినా చేపట్టి డిస్ట్రిక్ట్ కమిటీ నియామకం చేయాల్సి ఉంటుంది. కాగా ఎవ్వరిని కూడా పిలిచిన సందర్భాలు లేవు. ఏ విషయాలు పరిగణనలోకి తీసుకొని నియామకం పూర్తి చేశారో కూడా తెలియడంలేదని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా ఆరోగ్య శ్రీ ఇన్చార్జి కో–ఆర్డినేటర్ స్వప్నను ఫోన్లో సంప్రదించగా, డీఎం పోస్టును డిస్ట్రిక్ట్ కమి టీ ద్వారా కలెక్టరేట్లోనే భర్తీ చేశామన్నారు. ఏదైనా ఉంటే కలెక్టర్ సీసీతో మాట్లాడి చెబుతానన్నారు.● ఇటీవల ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో జిల్లా మేనేజర్ పోస్టు భర్తీ ● కనీస నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు -
తరుగు పేరిట దోచుకుంటుండ్రు
● కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్ మిల్లర్లపై రైతన్నల ఆగ్రహం ● కోటగిరిలో ప్రధాన రహదారిపై రాస్తారోకోరుద్రూర్ : ఆరుగాలం కష్టించి పండించిన పంటను తరుగు పేరుతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్ మిల్లర్లు దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోటగిరిలోని ప్రధాన రహదారిపై గురువారం రాస్తారోకో చేశారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ.. తరుగు పేరుతో రైతులను దోచుకోవడం సిగ్గు.. సిగ్గు... తరుగు లేకుండా వడ్లను కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. సుమారు రెండు గంటల పాటు ఆందోళన చేశారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఓ రైతు పురుగుల మందును తాగే యత్నం చేశారు. పోలీసులు వెంటనే మందు డబ్బా లాక్కున్నారు. ఎస్సై సునీల్ సమస్యను తహసీల్దార్ గంగాధర్కు వివరించగా, ఆయన వచ్చి రైతులతో మాట్లాడి సమస్య తెలుసుకున్నారు. రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో బస్తాకు 41 కిలోల ధాన్యం తూకం చేయాల్సి ఉండగా, ఆర కిలో తరుగు తీస్తున్నారని తెలిపారు. ధాన్యం లారీ రైస్మిల్కు పంపిన తరువాత ఉతార్ రావడం లేదని మళ్లీ అదనంగా తరుగు తీస్తామని ఇబ్బంది పెడుతున్నారన్నారు. త్వరలోనే రైస్ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రైతు నాయకులు తెళ్ల రవికుమార్, ఎముల నవీన్, అరవింద్, లక్ష్మణ్, శంకర్, సాయిలు, గంగాధర్, గంగాప్రసాద్ గౌడ్ పాల్గొన్నారు. -
జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి
నిజామాబాద్ సిటీ : జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుపుతున్నామని, పారిశ్రామికంగా, విద్య, వైద్య, క్రీడా, ఫార్మా, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం సహకారంతో జిల్లాకు కోట్లాది రూపాయల నిధులు తెస్తున్నామన్నారు. బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. కేంద్రం నిధు ల జాప్యంతోనే రైల్వే పనుల్లో ఆలస్యం జరుగుతోందని, వాస్తవాలు తెలుసుకునే తాను మాట్లాడానని, ఎంపీ అర్వింద్ ఈ విషయం గమనించాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీ మెజార్టీ.. రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి 50 వేల మెజార్టీతో గెలుస్తారని మహేశ్ గౌడ్ ధీ మా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్ర తిరోజు కాంగ్రెస్ పార్టీని, సీఎంను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. మంత్రుల మధ్య సమస్యలను పరిష్కరించామన్నారు. మళ్లీ జరిగే కేబినెట్ విస్తరణలో మైనారిటీలకు స్థానం కలిపిస్తామన్నారు. ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ జిల్లాకు రూ.518 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. గతంలో కవిత ఎంపీగా జిల్లాలో అభివృద్ధి పనులు చేయలేదని వి మర్శించారు. సమావేశంలో నుడా చైర్మన్ కేశవేణు, పీ సీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ ఉన్నారు. కేటీఆర్వి అవగాహన లేని మాటలు మంత్రుల మధ్య సమస్యలను పరిష్కరించాం కేబినెట్ విస్తరణలో మైనారిటీలకు అవకాశం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ -
మాక్లూర్ కేజీబీవీ తనిఖీ
మాక్లూర్: మాక్లూర్ మండల కేంద్రంలోని కేజీబీవీని గురువారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తనిఖీ చేశారు. వంట గదిలోని సరుకులను, విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన విద్యార్థినులతో మాట్లాడుతూ.. మెనూ ప్రకారం భోజనం అందుతుందా లేదా అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అక్కడే ఉన్న ఏఈ ఉదయ్ కిరణ్ను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం గొట్టిముక్కలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఇప్పటి వరకు రైతుల నుంచి ఎంత ధాన్యం సేకరించారని సంబంధిత అధికారిని అడుగగా సరైన సమాధానం లేకపోవటంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ శేఖర్, ఎంపీడీవో బ్రహ్మనందం తదితరులు ఉన్నారు.కోటగిరిలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులు -
వంద శాతంపై ప్రత్యేక దృష్టి
సుభాష్నగర్ : జిల్లాలో రైతులు పండిస్తున్న పంటల అమ్మకాలు, కొనుగోళ్ల ద్వారా ఈ ఏడాదికి (2025– 26) రూ.40.36 కోట్ల ఆదాయాన్ని మార్కెటింగ్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే గడిచిన ఆరు నె లల్లో నిర్దేశించుకున్న లక్ష్యంలో పావుశాతమే ఫీజు వసూలైంది. ఇప్పటికీ కేవలం రూ.11.20 కోట్లు మాత్రమే వసూలు కావడంపై జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా లోని వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా లక్ష్యా న్ని సాధించేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో ఏడు ఏఎంసీలు.. జిల్లాలో నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, వర్ని, క మ్మర్పల్లి, కోటగిరి, వేల్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో 12 చెక్పోస్టులు ఉన్నాయి. జిల్లాలోని పంటలను ఇతర జిల్లాలు, రాష్ట్రాల వ్యాపారులు, రైస్మిల్లర్లు కొనుగోలు చేసి తీసుకెళ్లే క్రమంలో మార్కెటింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పసుపు, వరి, సోయా, మక్క, కూరగాయ ల అమ్మకాలు, కొనుగోళ్లతోపాటు చెక్పోస్టుల ద్వారా మార్కెటింగ్శాఖకు ఆదాయం సమకూరుతోంది. అత్యధికంగా నిజామాబాద్ నుంచే.. రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్లలో నిజామాబాద్ వ్య వసాయ మార్కెట్ కమిటీ ఒకటి. జిల్లాకు నిర్దేశించుకున్న లక్ష్యంలోనూ సగానికిపైగా ఆ మార్కెట్దే. 2025–26వ సంవత్సరానికి జిల్లా వ్యాప్తంగా రూ. 40.36 కోట్ల మార్కెటింగ్ ఫీజు లక్ష్యం కాగా, అందు లో రూ.23.48 కోట్ల లక్ష్యాన్ని నిజామాబాద్ ఏఎంసీ పెట్టుకుంది. ప్రతి ఏడాది ఈ మార్కెట్ పరిధిలో సగటున 130 శాతం వరకు ఫీజు వసూలవుతోంది. సెప్టెంబర్ వరకు జిల్లాలో రూ.11.20 కోట్లు వసూ లు కాగా, అందులో రూ.9.97 కోట్లు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లోనే వసూలైంది. అలాగే సివిల్ సప్లయ్ కార్పొరేషన్ గత యాసంగి, వానాకాలం సీజన్తోపాటు అంతకుముందు యాసంగి సీజన్లో 50 శాతం మార్కెట్ ఫీజు రూ.30 కోట్ల వరకు మార్కెటింగ్శాఖకు బకాయిలు ఉన్నాయి. తనిఖీలు ముమ్మరం.. ప్రస్తుతం పంటల కోతల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో మార్కెట్ల పరిధిలోని చెక్పోస్టుల వద్ద అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. చెక్పోస్టుల నుంచి పంట ఉత్పత్తులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఇప్పటికే సెక్రెటరీలకు ఆదేశాలిచ్చారు. అయినా ధాన్యం కొనుగోళ్ల సీజన్, పసుపు సీజన్లోనే మార్కెట్ ఫీజు అధిక మొత్తంలో వసూలవుతుందని మార్కెటింగ్ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాలో మార్కెట్ కమిటీల ద్వారా నిర్దేశించుకున్న ల క్ష్యాన్ని వందశాతం పూర్తి చే సేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం. ప్రతియేటా 125 శాతం వరకు మార్కెటింగ్ ఫీజు వసూలవుతుంది. ఈ సంవత్సరం కూ డా లక్ష్యాన్ని చేరుకుంటాం. –గంగుబాయి, జిల్లా మార్కెటింగ్శాఖ అధికారినిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంజిల్లా మార్కెటింగ్ శాఖ ఈ ఏడాది ఫీజు వసూలు లక్ష్యాన్ని చేరేలా పకడ్బందీ చర్యలు చేపడుతోంది. రూ.40.36 కోట్ల ఫీజు లక్ష్యంగా ఉండగా, గత ఆరునెలల్లో పావుశాతం మాత్రమే ఫీజు వసూలైంది. దీంతో ఉన్నతాధికారులు టార్గెట్ సాధించేలా ఇప్పటికే ఏఎంసీల సెక్రెటరీలకు ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలోని ఏఎంసీల ఫీజుల టార్గెట్ రూ.40.36 కోట్లు ఆరు నెలల్లో పావుశాతం మాత్రమే వసూలు లక్ష్యం సాధనపై మార్కెటింగ్ శాఖ పకడ్బందీ చర్యలు -
కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటాం..
కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబీకు లకు ప్రభుత్వం, పోలీసు శాఖ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని, ధైర్యంగా ఉండాలని రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి భరోసా కల్పించా రు. నగరంలో పాత నేరస్తుడిని అరెస్టు చేసే క్రమంలో కానిస్టేబుల్ ప్రమోద్ హత్యకు గు రయ్యాడు. ప్రమోద్ కుటుంబీకులను డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం మల్టీ జోన్ ఐజీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తదితరులతో కలిసి వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆదేశాల మేరకు తాను వచ్చానని వారికి వెల్లడించారు. కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ హత్యకు గురైన ఘటన దురదృష్టకరమని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తపర్చా రు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ. కోటి ఎక్స్గ్రేషియాతో పాటు 300 గజాల ఇంటి స్థలం, పెన్షన్, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించిందని డీజీపీ గుర్తు చేశారు. -
పోలీసుల కాల్పుల్లో రియాజ్ హతం
బాణ సంచా కాల్చి..నిజామాబాద్ అర్బన్ : కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడైన పాత నేరస్తుడు షేక్ రియాజ్ సోమవారం పోలీసు కాల్పుల్లో మృతి చెందిన ఘటన జిల్లాలో సంచలనంగా ఘమారింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్, ఏఆర్ కానిస్టేబుల్ నుంచి తుపాకీ లాక్కొని ఫైర్ చేయడానికి ప్రయత్నించిన క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. నగరంలోని హస్మికాలనీకి చెందిన రియాజ్కు వాహనాల దొంగతనాలు, చైన్స్నాచింగ్లు చేయడం అలవాటు గా మారింది. అతనిపై 40 పైగా కేసులు నమోదు అయ్యాయి. పాత కేసుల విచారణలో భాగంగా సీసీఎస్ పోలీసులు రియాజ్ను అదుపులోకి తీసుకున్న తరువాత ఊహించని ఘటనలు చోటు చేసుకున్నాయి. సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను కత్తితో పొడిచి హత్యచేసి పారిపోయిన రియాజ్ కోసం ఎనిమిది ప్రత్యేక బృందాలు జల్లెడ పట్టాయి. సారంగపూర్ వద్ద అరెస్టు చేసి రియాజ్ను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి ఆవరణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రియాజ్కు ఆస్పత్రి భవనం నాలుగో అంతస్తులోని 407 గదిలో చికిత్స అందించారు. అనంతర పరిణామ ఘటనల్లో రియాజ్ పోలీసు కాల్పుల్లో మృతి చెందాడు. పంచనామా, పోస్టుమార్టం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృత దేహాన్ని అందించగా మంగళవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు అంత్యక్రియలు పూర్తయ్యే వరకు పకడ్బందీగా వ్యవహరించారు. రియాజ్ మృతి ఘటనకు సంబంధించి ఒకటో టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయింది. కామారెడ్డి జిల్లా పోలీస్శాఖ నుంచి ఒక డీఎస్పీని విచారణ అధికారిగా నియమించారు.రియాజ్ (ఫైల్)ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పోలీసుల కాల్పు ల్లో రియాజ్ మృతి ఘటనపై మానవ హక్కుల సంఘం స్పందించింది. మీడియా కథనాల ఆధారంగా కేసును సుమోటాగా స్వీకరించింది. నవంబర్ 24లోపు పూర్తి నివేదిక సమర్పించాలని రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.షేక్ రియాజ్ పోలీసు కాల్పుల్లో మరణించాడని తెలిసిన వెంటనే ప్రభుత్వ ఆస్పత్రి ముందు బీజేపీ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కొందరు బాణసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. మూడవ టౌన్, ఆర్మూర్ పోలీస్స్టేషన్, ఇతర ఠాణాల్లో పోలీసులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మరి కొందరు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మెడికల్ రిప్రంజెంటేటివ్ లు కానిస్టేబుల్ ప్రమోద్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఏఆర్ కానిస్టేబుల్ నుంచి తుపాకీ లాక్కున్న నిందితుడు ఫైర్ చేసేందుకు ప్రయత్నం.. ఎదురు కాల్పులు జరిపిన పోలీసులు హతుడిపై కానిస్టేబుల్ హత్య కేసు, గతంలో 40 పైగా చైన్ స్నాచింగ్, వాహనాల దొంగతనాల కేసులు సంచలనం రేపిన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఘటన ఆస్పతి ఎదుట, ఠాణాల్లో బాణ సంచా కాల్చి సంబరాలు -
దళారులదే దందా..!
బాల్కొండ : మద్దతు ధర ఇవ్వడంలో భాగంగా ప్రభుత్వం మక్క పంట కొనుగోలు కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చేయక పోవడంతో రైతులు త్రీవంగా నష్టపోతున్నారు. దళారులదే దందా సాగుతోంది. మెండోరా మండల కేంద్రంలో ఏకంగా దళారులే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి మక్కలను కొనుగోలు చేసి తీసుకొచ్చి కుప్పలు వేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదేవిధంగా నేరుగా మెండోరా మండల కేంద్రానికి మక్కలను తీసుకురావాలని రైతులకు సూచిస్తున్నారు. మక్కలు క్వింటాల్కు రూ. 2 వేలకు కొనుగోలు చేస్తున్నారు. మెండోరా మండల పరిధిలో సావెల్ సహకార సంఘం ఆధ్వర్యంలో ఒక్కటే కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రం ప్రారంభం కాలేదు. అసలు ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడ తెలియని పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో దళారులు రెచ్చి పోయి ఏకంగా మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. క్వింటాల్కు మద్దతు ధర కంటే రూ.400 తక్కువకు మక్కలను కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక పోవడంతో రైతులు దళారులకే విక్రయించుకుంటున్నారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం దళారులు కొనుగోలు చేసిన మక్కలను తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో రైతుల పేరిట విక్రయించే ప్రమాదం కూడ లేక పోలేదు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉన్నత అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేల చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. సకాలంలో ప్రారంభం కాని ప్రభుత్వ మక్క కొనుగోలు కేంద్రాలు మెండోరాలో దళారులే ఏర్పాటు చేసుకున్న వైనం మద్దతు ధర కంటే రూ.400 తక్కువకు కొనుగోలు తీవ్రంగా నష్ట పోతున్న రైతులు -
అమరుల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
నిజామాబాద్ అర్బన్ : తొమ్మిది మంది పోలీసు అమర వీరుల కుటుంబాలకు డీజీపీ శివధర్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూ పతిరెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిలతో కలిసి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని కమిషనరేట్ కార్యాలయంలో మంగళ వారం నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ మాట్లాడుతూ జిల్లాలో 1989 నుంచి ఇప్పటివరకు 18 మంది పోలీసులు అమరులయ్యారని తెలిపారు. వారిలో తొమ్మిది కుటుంబాలకు ఇందల్వాయి మండలం గన్నారం శివారులో 300 గజాల చొప్పున ఇంటి స్థలాలు అందించనున్న ట్లు డీజీపీ తెలిపారు. మిగతా తొమ్మిది కుటుంబాలు కూడా ముందుకు వస్తే, వారికి సైతం అదే ప్రాంతంలో ఇళ్ల స్థలాలు అందిస్తామన్నారు. ఈ మేరకు సంసిద్ధత తెలిపిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి పోలీసు శాఖ తరపున డీజీపీ కృతజ్ఞతలు తెలిపారు. అనేక కేసుల్లో నిందితుడైన కరుడుగట్టిన నేరస్తు డు రియాజ్ను పట్టుకునే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడిన సారంగాపూర్ యువకుడు స య్యద్ ఆసిఫ్కు పోలీసు శాఖలో హోంగార్డు ఉ ద్యోగం కల్పించాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రతిపాదించారు. దీనిపై డీజీపీ శివధర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే రాష్ట్ర పోలీ సు శాఖలో హోంగార్డు పోస్టుల భర్తీ కోసం ప్ర భుత్వం నోటిఫికేషన్ వెలువరించనుందని, స య్యద్ ఆసిఫ్కు హోంగార్డు ఉద్యోగం కల్పించే లా కృషి చేస్తామన్నారు. తొమ్మిది కుటుంబాలకు పంపిణీ చేసిన డీజీపీ శివధర్ రెడ్డి పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కలెక్టర్, ఐజీ, సీపీ -
వెలకట్టలేనివి
అమరుల త్యాగాలు● పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవంలో ఐజీ, కలెక్టర్, సీపీ ● విధి నిర్వహణలో అసువులు బాసిన అమర వీరులకు ఘన నివాళులు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డినిజామాబాద్ అర్బన్ : శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తూ అసువులు బాసిన పోలీసు అమర వీరుల త్యాగాలు వెలకట్టలేనివని, సమాజం ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటుందని మల్టీ జోన్ ఐజీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య అన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. పోలీసు అమర వీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పోలీసులు విధినిర్వహ ణలో ఎదురయ్యే అనేక సవాళ్లను తమ ప్రాణాలను పణంగా పెట్టి ధైర్యంగా ఎదుర్కొంటారన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కేంద్రంలో అసాంఘిక శక్తుల చేతిలో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ వీర మరణం పొందారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల త్యాగాలను వృథా కానివ్వమని, వారి స్ఫూర్తి తో మరింత బాధ్యతాయుతంగా శాంతి భద్రతల పరిరక్షణలో నిమగ్నం అవుతామన్నారు. కలెక్టర్ వి నయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల కు సంక్షేమ ఫలాలు సమర్థవంతంగా అందాలంటే శాంతిభద్రతలు నెలకొని ఉన్నప్పుడే సాధ్యపడు తుందన్నారు. పోలీసుల సేవలు, వారి త్యాగాలు మరువలేవని కొనియాడారు. పండుగలు, వీవీఐపీ ల పర్యటనల సందర్భంగా ఇలా ఏ రకంగా చూసి నా పోలీసులు అందిస్తున్న సేవలు అనితర సాధ్యమైనవని అన్నారు. మన దేశంలో, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉందన్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ అతి తక్కువ వ్యవధిలో చాకచక్యంగా సైబర్ నేరాలను ఛేదిస్తూ నేరస్తుల ఆటకట్టిస్తున్నారన్నారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ ఈ ఏడాది దేశవ్యాప్తంగా 191మంది పోలీసులు అమరులయ్యారని అన్నా రు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 1986 నుంచి ఇప్పటివరకు 18 మంది పోలీసులు అసాంఘిక శక్తులతో పోరాడుతూ అసువులు బాసారని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా తమ కర్తవ్య నిర్వహణలో ఎల్లవేళలా పోలీసులు ముందంజలో నిలుస్తున్నారని అన్నారు. అమరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లవేళలా చేదోడువాదోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లాలో విధి నిర్వహణలో అమరులైన పోలీసుల కుటుంబీకులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి
మోపాల్(నిజామాబాద్రూరల్): మండలంలోని కంజర్ గ్రామానికి చెందిన దొంతుల అరుణ్కుమార్ (రాజు) (41) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గ్రామస్తులు, నాలుగో టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామంలో అరుణ్కుమార్ కిరాణ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దీపావళి పండుగ కావడంతో సోమవారం ఉదయం బైక్పై సామగ్రి కోసం నిజామాబాద్కు బయలుదేరాడు. నగరంలోని హనుమాన్ జంక్షన్ వద్ద అతడు మూల మలుగుతుండగా, అదేసమయంలో మాధవనగర్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అరుణ్కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. నిర్లక్ష్యపు డ్రైవింగే కారణం! మాధవనగర్కు చెందిన యువకుడితోపాటు మరో ముగ్గురు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు, స్థానికులు పేర్కొంటున్నారు. కారులో ఉన్న నలుగురు పరారయ్యారు. మంగళవారం సాయంత్రానికి కూడా వారి ఆచూకీ లభించలేదని తెలిసింది. కాగా యువకుడు మృతికి కారణమైన వారిని కాపాడేందుకు పోలీస్స్టేషన్లోని ఓ కానిస్టేబుల్ ప్రయత్నిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా దీపావళి పండుగను సంతోషంగా జరుపుకోవాలని పూలు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన అరుణ్ మృతిచెందడంతో కుటుంబ పెద్దను కోల్పోయి కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడికి అనారోగ్యంతో ఉన్న తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మేడ్చల్లో మాచారెడ్డి మండల వాసి.. మాచారెడ్డి: మేడ్చల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాచారెడ్డి మండలం నెమ్లిగుట్ట తండాకు చెందిన భానోత్ శ్రీనివాస్ (33) మృతిచెందాడు. వివరాలు ఇలా.. శ్రీనివాస్ మేడ్చల్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. దీపావళి కోసం ఇంటికి వచ్చిన శ్రీనివాస్ మంగళవారం బైక్పై తిరిగి మేడ్చల్ బయలుదేరాడు. మేడ్చల్ సమీపంలో అతడిని మినీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్కు తీవ్ర గాయాలు కాావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చెరువులో పడి మహిళ.. ఎల్లారెడ్డి: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని సాతెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై మహేష్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని సాతెల్లి గ్రామానికి చెందిన పసుపుల పద్మ (43) ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. గ్రామశివారులోని చెరువులో మరుసటి రోజు ఆమె మృతహం తేలడంతో స్థానికులు గుర్తించి, పోలీసులకు సమచారాం అందించారు. పోలీసు లు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కాలకృత్యాల కోసం వెళ్లిన పద్మ చెరువులో జారి పడి ఈతరాక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పరామర్శించారు. ఫిట్స్తో చిన్నారి.. మోపాల్: మండలకేంద్రంలో ఐదు నెలల చిన్నారి ఫిట్స్తో మృతిచెందినట్లు ఎస్సై సుస్మిత తెలిపారు. వివరాలు ఇలా.. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మండలం, కూర్మల్ గూడ గ్రామం ఇంద్రానగర్ కాలనీకి చెందిన జంగం లక్ష్మీ–శ్రీరాములు దంపతులకు ఐదు నెలల చిన్నారి(సంధ్య) ఉంది. దంపతుల మధ్య గొడవల కారణంగా లక్ష్మీ చిన్నారితోపాటు రెండు నెలల క్రితమే మోపాల్లోని తన అన్న ఇంటికి వచ్చింది. చిన్నారి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈక్రమంలో మంగళవారం ఫిట్స్ రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మృతురాలి తల్లి లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో జరిగిన వివిధ ఘటనల్లో పలువురు మృతిచెందారు. వారిలో రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాత చెందగా, చెరువులో పడి ఓ మహిళ, ఫిట్స్తో ఓ చిన్నారి ప్రాణాలు విడిచారు. అలాగే సౌతాఫ్రికాలో భిక్కనూరుకు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మరణించారు. -
పైరవీలు.. ప్రదక్షిణలు..
● ఐకేపీలో ఇటీవల జరిగిన బదిలీలు ● అప్పుడే డిప్యుటేషన్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన పలువురు ఏపీఎంలు డొంకేశ్వర్(ఆర్మూర్): గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (ఐకేపీ)లో ఉద్యోగ బదిలీలు జరిగి రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే డిప్యుటేషన్ల కోసం సిబ్బంది ప్రయత్నాలు మొదలు పెట్టారు. కొన్ని రోజులుగా పలువురు ఏపీఎంలు తమదైన స్థాయిలో పైరవీలు చేయడంతోపాటు, నిత్యం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అలాగే డీఆర్డీవోపై సైతం ఒత్తిడి పెంచుతున్నారు. జిల్లా కార్యాలయానికి వచ్చేందుకు.. పదేళ్ల తర్వాత సెర్ప్ సీఈవో పారదర్శకంగా బదిలీలు చేసినందుకు హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగుల్లో కొందరు ఇప్పుడు జిల్లా కార్యాలయానికి వచ్చేందుకు పోటీ పడుతున్నారు. ఐతే, బదిలీలు జరిగిన తర్వాత మళ్లీ ఈ డిప్యుటేషన్లు ఏంటీ అని శాఖలోని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఐకేపీలో ఈ ఏడాది ఆగస్టు నెలలో డీపీఎంల నుంచి మొదలుకొని సీసీల దాకా ఉద్యోగ బదిలీలు జరిగాయి. సెర్ప్ సీఈవోనే సీనియార్టీ ప్రకారం జాబితాను జిల్లాకు పంపించి కలెక్టర్ అధ్యక్షతన స్థాన చలనం కలిగించారు. బదిలీలకు ఆప్షన్లు పెట్టుకుని ఇతర మండలాలకు వెళ్లిన ఏపీఎంలు ఇప్పుడు డిప్యుటేషన్లను ఆశించడం వెనక మతలబు ఏంటో తెలియడం లేదు. జిల్లా కార్యాలయంలో రెండు ఏపీఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ రెండు పోస్టుల్లో డిప్యుటేషన్పై వచ్చి పని చేయడానికి నాలుగురైదుగురు ఏపీఎంలు పోటీ పడుతున్నారు. మండలాల్లో పని చేసే సదరు ఏపీఎంలు జిల్లా స్థాయిలో ఎందుకు పని చేయాలని కోరుకుంటున్నారో అని శాఖలోని ఉద్యోగులు అనుకుంటున్నారు. డిప్యుటేషన్లకు అవకాశం కల్పిస్తే మిగతా ఉద్యోగులు కూడా వారికి అనుకూలంగా ఉన్న ప్రాంతాలకు బదిలీ చేయాలని డీఆర్డీవోను కోరుతామంటున్నారు. పైరవీలకు తలొగ్గి డిప్యుటేషన్లు వేస్తారా? లేదా ఫైలును తిరస్కరిస్తారా? అనేది డీఆర్డీవోపై ఆధారపడి ఉందంటున్నారు. జిల్లా కార్యాలయంలో రెండు ఏపీఎం పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఉద్యోగ బదిలీలు చేసినప్పుడు వీటిని భర్తీ చేయలేదు. డిప్యుటేషన్పై జిల్లా ఆఫీసులో పని చేస్తామని కొందరు ఏపీఎంలు దరఖాస్తు పెట్టుకున్నారు. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఐతే ఒకరిద్దరు సీసీలకు మాత్రం వారి సమస్యను పరిగణలోకి తీసుకుని నిబంధనల ప్రకారం మ్యూచ్వల్ బదిలీ చేయాలనుకుంటున్నాం. –సాయాగౌడ్, డీఆర్డీవో, నిజామాబాద్ -
ధాన్యం సేకరణలో జాప్యం చేయవద్దు
బోధన్: ధాన్యం సేకరణ ప్రక్రియలో జాప్యానికి చో టు ఇవ్వకుండా, ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు.కొనుగోళ్లు సాఫీగా కొనసాగేందుకు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంటూ పకడ్భందీగా పర్యవేక్షణ నిర్వహించాలని సూచించారు. సాలూర మండలంలోని సాలంపాడ్ క్యాంప్, బోధన్ మండలంలో ని పెగడాపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు.అనంతరం ఆయన రైతులతో మాట్లాడు తూ ఏమైనా ఇబ్బందులున్నాయా? అని ఆరా తీశా రు. కౌలు రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతోందని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతుల వివరాలు నమోదు చేసుకుని ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యాన్ని వెనువెంటనే తూకం వేయాలనిఆదేశించారు. రైస్మిల్లుల వద్ద ధాన్యం వేగంగా దిగుమతి అయ్యేలా చూడాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, డీఆర్డీవో సాయాగౌడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్, తహసీల్దార్ విఠల్, శశిభూషణ్ ,ఏవో సంతోష్, సొసైటీ చైర్మన్ గుణపాటి బ్రహ్మా రెడ్డి తదితరులు ఉన్నారు. అధికారులు అందుబాటులో ఉండి పర్యవేక్షించాలి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సాలంపాడ్ క్యాంప్, పెగడాపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన -
సౌతాఫ్రికాలో అనుమానాస్పద స్థితిలో భిక్కనూరు వాసి..
భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు సౌతాఫ్రికాలో అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన బత్తుల శ్రీనివాస్ (34) ఆరేళ్లుగా సౌతాఫ్రికా దేశంలో బోర్వెల్స్లో పనిచేస్తుండేవాడు. ఏడాదికి రెండు మూడు పర్యాయాలు స్వదేశానికి వెళ్లివస్తుండగా, ఈ ఏడాది జనవరిలో భిక్కనూరుకు వచ్చి ఏప్రిల్లో తిరిగి సౌతాఫ్రికాకు వెళ్లాడు. సౌతాఫ్రికాలోని జెలిజా పట్టణం సమీపంలో ఓ చెట్టుకు శ్రీనివాస్ వేలాడుతున్నట్లు ఉన్న ఫొటోలను అక్కడి వారు సోమవారం అతడి కుటుంబీకులకు పంపించారు. ఆదివారం కుటుంబీకులతో సంతోషంగా మాట్లాడిన శ్రీనివాస్ సోమవారం వేకువజామున ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరో శ్రీనివాస్ను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని శ్రీనివాస్ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. మంగళవారం సాయంత్రం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారని శుక్రవారం మృతదేహం ఇండియాకు చేరుకుంటుందని తెలుస్తోంది. మృతుడికి తండ్రి బలరాం, తల్లి లావణ్య భార్య నవనీత, కూతురు లాస్య కుమారుడు నిహాల్ ఉన్నారు. -
పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివి
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు వెలకట్టలేవని డిచ్పల్లిలోని ఏడో బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ సీహెచ్ సాంబశివరావు అన్నారు. బెటాలియన్లో మంగళవారం పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా బెటాలియన్లోని అమరవీరుల స్థూపం వద్ద అడిషనల్ కమాండెంట్, అసిస్టెంట్ కమాండెంట్లతోపాటు అమరవీరుల కుటుంబాల సభ్యులు, బెటాలియన్ సిబ్బంది పుష్పగుచ్ఛాలను ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అడిషనల్ కమాండెంట్ మాట్లాడుతూ.. విధినిర్వహణలో ఇప్పటివరకు ఏడో బెటాలియన్కు చెందిన 14 మంది పోలీసులు అమరులయ్యారని తెలిపారు. అమరులైన పోలీసులకు రెండు నిమిషాలపాటు మౌనం పాటించి నివాళులర్పించారు. అసిస్టెంట్ కమాండెంట్లు కేపీశరత్ కుమార్, కేపీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. విధులను పకడ్బందీగా నిర్వహించాలి నిజామాబాద్ నాగారం: క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది విధులను పకడ్బందీగా నిర్వహించాలని డీఎంహెచ్వో రాజశ్రీ అన్నారు. జిల్లాకేంద్రంలో మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని కీటక జనత వ్యాధుల నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్వో మా ట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు గృహ సందర్శన చేస్తూ జ్వరాల సర్వేను, లార్వా బ్రీడింగ్ సోర్సెస్ను, నీటి నిల్వలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నా రు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలన్నారు. నోడల్ అధికారులు, సభ్యులు ప్రణాళిక ప్రకారం పర్యవేక్షించాలన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లు సకాలంలో పీ హెచ్సీలకు చేరుకోవాలన్నారు. శాంపిల్స్ తీసుకోవడంపై జాగ్రత్తలను సూచించారు. జిల్లా కీ టక జనిత కార్యక్రమ అధికారి తుకారాం రా థోడ్, ఏఎంవో సలీం, తదితరులు ఉన్నారు. నిజామాబాద్నాగారం: నగరంలోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాల మైదానంలో ఈనెల 23న నిజామాబాద్ జిల్లా సైకిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఎంపికపోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయ్ కాంత్రావు ఒక ప్రకటనలో తెలిపారు. అండర్ 14, 16, 18, మెన్, ఉమెన్ వివిధ కేటగిరిలలో పోటీలు నిర్వహిస్తామన్నారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఉదయం 9 గంటలకు సొంత సైకిల్తో బోనాఫైడ్, ఆధార్ కార్డుతో రిపోర్ట్ చేయాలని అన్నారు. మరిన్ని వివరాలకు 98482 30207ను సంప్రదించాలని తెలిపారు. దళారులను ఆశ్రయించొద్దు కామారెడ్డి క్రైం: డ్రైవింగ్ లైసెన్స్లు, వాహనాలకు సంబంధించిన అన్ని రకాల పత్రాల కోసం దళారులను ఆశ్రయించొద్దని రవాణా శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్రెడ్డి సూచించారు. మంగగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడా రు. ఏ అవసరం ఉన్నా మీ సేవ, ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసు కుని నేరుగా కార్యాలయానికి వచ్చి అధికారులను సంప్రదించాలన్నారు. రవాణా శాఖ కా ర్యాలయంలో పారదర్శకంగా సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఎలాంటి అపోహలకు తా వు లేదని స్పష్టం చేశారు. ఇటీవల ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ‘సారథి’ అనే వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకుంటోందని, అదొక్కటి మాత్ర మే వాహనదారులకు ఇబ్బందికరంగా ఉందన్నారు. సమస్యను ఇదివరకే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని పేర్కొన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని, ప్రతి రోజూ ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గగంటల వరకు అందుబాటులో ఉంటానని తెలిపారు. -
వాలీబాల్ టోర్నమెంట్లో రన్నర్గా నిజామాబాద్
నిజామాబాద్నాగారం: రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ వాలీబాల్ టోర్నమెంట్లో జిల్లా బాలికల జట్టు రన్నర్గా నిలిచి ట్రోఫి కై వసం చేసుకున్నారు. మహబుబ్నగర్ జిల్లాలో నిర్వహించిన 69వ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి బాలికల వాలీబాల్ టోర్నమెంట్లో ఇటీవల జరిగిన సెమీఫైనల్లో నిజామాబాద్ బాలికల జ ట్టు ఖమ్మం జిల్లా జట్టుపై 2–0 తో గెలుపొంది ఫైనల్లో ప్రవేశించింది. అనంతరం ఫైనల్స్లో మహబూబ్నగర్తో తలపడి ఓటమి చెంది, రన్నర్గా నిలిచింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్రెడ్డి, విశిష్ట అతిథిగా విచ్చేసిన స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. ఈసందర్బంగా జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి నాగమణి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కోచ్, మేనేజర్ బాలయ్యకు, శ్రీనివాస్కు అభినందనలు తెలిపారు. -
రైతులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు
● సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం శ్రీకాంత్ కామారెడ్డి క్రైం: ‘సాక్షి’ దినపత్రికలో కాంటాలు, గన్నీ బ్యాగులు లేవు అనే శీర్షికతో ఆదివారం(ఈ నెల 19న) ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం శ్రీకాంత్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గాంధారి మండలంలో మొత్తం 38 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో వరి కోతలు ప్రారంభమైనా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఇంకా రావడం లేదని, 5 కేంద్రాలకు మాత్రమే ధాన్యం కుప్పలు వచ్చాయన్నారు. తేమ శాతం నిబంధనల ప్రకారంగా లేకపోవడంతో రైతులు ధా న్యాన్ని ఆరబెడుతున్నారని తెలిపారు. అందుకే కాంటా ప్రారంభం కాలేదన్నారు. 7 కేంద్రాలకు ధాన్యం రాకపోవడంతో గన్నీ బ్యాగులు పంపలేదన్నారు. తొందర్లోనే అన్ని కేంద్రాల్లో గన్నీ బ్యాగులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూస్తామన్నారు. -
రోడ్డు ప్రమాదంలో స్నేహితుడి మృతి.. తట్టుకోలేక ఆత్మహత్య
భిక్కనూరు: మండలంలో ని జంగంపల్లి గ్రామశివారులో జాతీయ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, తట్టుకోలేక స్నేహితుడు ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. ఎస్సై అంజనే యులు తెలిపిన వివరాలు ఇలా.. జంగంపల్లి గ్రామానికి చెందిన మంగలి పెద్ద నర్సింలు (60) సోమవారం గ్రామానికి చెందిన కొమ్మ భాస్కర్తో కలిసి, బైక్పై గ్రామంలోని శ్రీ కృష్ణమందిరానికి బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో వారు రోడ్డు దాటుతుండగా నిజామాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో వీరిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వా రిని కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా, నర్సింలును మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. ఇదిలా ఉండగా జంగంపల్లి గ్రామానికి చెందిన హరి భూమయ్య(58), మంగలి పెద్ద నర్సింలు ఇద్దరూ ప్రాణస్నేహితులు. నర్సింలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం హరి భూ మయ్యకు తెలిసి తీవ్ర మనోవేదనకు గురయ్యా డు. ఈక్రమంలో విపరీతంగా మద్యం తాగి, సో మవారం రాత్రి ఇంటికి వచ్చాడు. మళ్లీ మంగళ వారం ఉదయం కూడా విపరీతంగా మద్యం తాగడంతో భూమయ్యను భా ర్య గౌరవ్వ ప్రశ్నించింది. వెంటనే అతడు పొలం వ ద్దకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. అనంత రం పొలంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చే సుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించి, వివరాలు సేకరించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూ మయ్య స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. -
క్రైం కార్నర్
నస్రుల్లాబాద్(బాన్సువాడ): మండలంలోని అంకోల్ తండాలో ఓ వృద్ధురాలు హత్యకు గురైందని ఎస్సై రాఘవేందర్ తెలిపారు.వివరాలు ఇలా.. తండాకు చెందిన రాధిబాయి(65) సోమ వారం ఇంట్లో ఒక్కరే ఉ న్నారు.ఈక్రమంలో ఆమె ఒంటిపై ఉన్న వెండి నగలను కాజేయడానికి తండా కు చెందిన మెగావత్ సవాయి సింగ్ ఇంట్లోకి చొరబడ్డాడు. లోపలి నుంచి తలుపులు వేసి వృద్ధురాలిపై దాడి చేసి, ఒంటిపై ఉన్న వెండినగలు దోచుకొని పారిపోయాడు. వెంటనే స్థానికులు గుర్తించి కేకలు వేయడంతో దుండగుడు వారిని ఎవరికై న చెబితే మీ అందరిని చంపుతామని బెదిరించాడు. తలకు తీవ్రగాయమైన వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కొడుకు లాల్సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితుడు సవాయి సింగ్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు. వృద్ధురాలి ఆత్మహత్య మోపాల్: మండలంలోని ఎల్లమ్మకుంట గ్రామంలో ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై సుస్మిత తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన అంగోత్ సోనాబాయి (56) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుంది. ఆమెకు మద్యం తాగే అలవాటు ఉంది. ఈనెల 18న కొడుకు శ్రీరామ్ మద్యం తాగవద్దని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన సోనాబా యి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అనంతరం గ్రామ శివారులోని నీటికుంటలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఆమె మృతదేహం తేలడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచా రం అందించారు. కు టుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఎస్సారెస్పీకి 878 టీఎంసీల వరద
● ప్రాజెక్టు చరిత్రలో మూడో అత్యధికం ● 1983–84లో రికార్డు స్థాయిలో 1165 టీఎంసీలే ప్రథమం బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ప్రస్తుత సంవత్సరం ప్రాజెక్ట్ చరిత్రలోనే మూడో అత్యధిక వరద నీరు వచ్చి రికార్డును నెలకొల్పింది. 1983–84లో రికార్డు స్థాయిలో 1165 టీఎంసీలే ప్రథమస్థానంలో ఉండగా, 1988–89లో 912.95 టీఎంసీలతో రెండో స్థానంలో ఉంది. కాగా ప్రస్తుత సంవత్సరం (2025–26) 878 టీఎంసీల వరద నీరు వచ్చిచేరడంతో మూడో స్థానం సాధించింది. ఇదిలా ఉండగా ఎగువ ప్రాంతాల నుంచి గత నాలుగు రోజులుగా గోదావరి శాంతించింది. కనిష్టంగా 5464 క్యూసెక్కులకు వరద పడిపోయింది. మళ్లీ కొంత మేర పెరిగి9464 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. కాలువల ద్వారా ఆయకట్టుకు నీటి విడుదల కొనసాగుతుంది. మరో పక్షం రోజులు గడిస్తే ఖరీఫ్ సీజన్ పంటలకు నీటి సరఫరా నిలిపి వేస్తారు. ఇప్పటి వరకు కాలువల ద్వారా, గోదావరిలోకి మొత్తం 810 టీఎంసీల నీటిని వదిలారు. అధికంగా మహా వరద.. ప్రాజెక్టుకు గడిచిన పదేళ్లలో స్థానిక ఎగువ ప్రాంతాల నుంచే అధికంగా వరద నీరు వచ్చి చేరింది. కానీ ప్రస్తుత సంవత్సరం అధికంగా మహారాష్ట్ర ప్రాంతం నుంచే వరద నీరు వచ్చి చేరినట్లు ప్రాజెక్ట్ అధికారుల రికార్డులు తెలుపుతున్నాయి. ప్రస్తుత సంవత్సరం ప్రాజెక్ట్లోకి వచ్చిన 878 టీఎంసీల వరదలో 70 శాతం మేర నీరు మహారాష్ట్ర ప్రాంతం నుంచే వచ్చి చేరిందని రికార్డులు తెలుపుతున్నాయి. మరో వారం రోజులు గడిస్తే మహారాష్ట్ర ప్రాంతం నుంచి వచ్చే నీటికి బ్రేకులు పడుతాయి. అక్టోబర్ 28న బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను మూసి వేస్తారు. కొనసాగుతున్న నీటి విడుదల ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 5 వేల క్యూసెక్కులు, ఎస్కెప్ గేట్ల ద్వారా 3 వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, లక్ష్మి కాలువ ద్వారా 200 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 573 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు)తో నిండుకుండలా ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రస్తుత సంవత్సరం యాసంగీ సీజన్ ప్రారంభం వరకు కూడ ప్రాజెక్ట్ నిండుకుండల ఉండే అవకాశం ఉంది. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
వర్ని: మండలంలోని కూనిపూర్ గ్రామంలో తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరిగినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన గోవూరి సుజాత ఇటీవల ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లింది. మంగళవారం తిరిగి వచ్చేసరికి చోరీ జరిగినట్లు గుర్తించి, పోలీసులకు సమచారం అందించింది. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి వెనకాల తలుపులు పగలగొట్టి ఇంట్లో చొరబడి 4 తులాల బంగారు ఆభరణాలు, 6 తులాల వెండి ఆభరణాలు, రూ. 30వేల నగదును ఎత్తుకెళ్లినట్లు ఎస్సై తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. దుర్గామాత ఆలయంలో.. వర్ని: మండలంలోని అఫంధి ఫారం గ్రామంలోగల దుర్గామాత ఆలయంలో చోరీ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి హుండీని పగలగొట్టి నగదుతోపాటు 20 తులాల వెండి, 2 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు. -
ఫలించిన ప్రయత్నాలు
మోర్తాడ్(బాల్కొండ): అధికార, ప్రతిపక్ష పార్టీల నే తలు, అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. ఉపా ధి కోసం జోర్డాన్ వెళ్లి ఇబ్బందిపడుతున్న వలస కార్మికులు స్వదేశానికి వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఈ నెల 25వ తేదీలోగా రాష్ట్రానికి చెందిన 12 మంది ఇంటికి చేరనున్నారు. వివరాలు ఇలా.. ఏడాది క్రితం జోర్డాన్లోని వ్యవసాయ క్షేత్రాల్లో పని చేసేందుకు తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్, బి హార్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు వెళ్లారు. ఇందులో మన రాష్ట్రానికి చెందిన 12 మంది వలస కార్మికులు వారి గోడును వెళ్లబోసుకున్నారు. జోర్డా న్లో తాము పడుతున్న కష్టాలపై వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి, మాజీ మంత్రి హరీశ్రావుకు లేఖ రాశారు. మదద్ పోర్టల్లో కేసు నమోదు చేయించారు. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు జీఏడీ ఎన్నారై విభాగం ఐఏఎస్ అధికారులు సయ్యద్ అలీ ముర్తుజా, శివలింగయ్యలతోపాటు మాజీ మంత్రి హరీశ్రావు, రా జ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడారు. జోర్డాన్ రాజధాని అ మ్మాన్లోని భారత రాయబార కార్యాలయం అధికారులు మిల్లీనియం అగ్రికల్చర్ ఇన్వెస్టిమెంట్స్ కంపెనీలో ఉపాధి పొందుతున్న వలస కార్మికుల వద్ద కు వెళ్లారు. వారి వివరాలను నమోదు చేసుకొని జో ర్డాన్ విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరిపారు. ఒప్పందం ఉల్లంఘించినందుకు జరిమానా.. రెండేళ్లపాటు మిల్లీనియం అగ్రికల్చర్ ఇన్వెస్టిమెంట్స్ కంపెనీలో పనిచేసేందుకు వలస కార్మికులు జోర్డాన్కు వెళ్లే ముందు ఒప్పంద పత్రం రాసి ఇచ్చారు. ఏడాదికి ముందుగానే ఇంటికి వచ్చేస్తుండటంతో ఒప్పందం ప్రకారం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో కార్మికుడు కనీసం రూ.50వేల జరిమానాను కంపెనీకి చెల్లించాలి. కార్మికుల ఆర్థిక పరిస్థితి బాగులేకపోవడంతో మాజీ మంత్రి హరీశ్ రావు ఆర్థిక సాయం చేయడంతో కంపెనీకి 12 మంది కార్మికుల తరఫున జరిమానా చెల్లించారు. సొంతంగానే విమాన టిక్కెట్ను కొనుగోలు చేసుకొని ఇంటికి రావాల్సి ఉండటంతో హరీశ్రావు స్వయంగాా టిక్కెట్లను కొనుగోలు చేసి ఇస్తున్నారని సిద్దిపేట్ జిల్లా దుబ్బాకకు చెందిన పెండ్యాల మహేందర్ ‘సాక్షి’తో చెప్పారు. జోర్డాన్ నుంచి స్వదేశానికి రానున్న వలస కార్మికులు రాష్ట్రానికి చెందిన 12 మంది ఈనెల 25లోగా ఇంటికి చేరుకునే అవకాశం అధికార, ప్రతిపక్ష నేతల కృషితో వేగంగా స్పందించిన విదేశాంగ శాఖ ఊపిరి పీల్చుకుంటున్న బాధిత కుటుంబాలు -
సెమీస్కి చేరిన జిల్లా వాలీబాల్ జట్టు
నిజామాబాద్ నాగారం: మహబూబ్ నగర్ జిల్లాలో ఎస్జీఎఫ్ అండర్ 17 బాలికల రాష్ట్రస్థాయి వాలీబా ల్ టోర్నమెంట్ కొనసాగుతోంది. పోటీల్లో నిజామాబాద్ జట్టు సెమీస్కు చేరినట్లు సమాచారం. ఈసందర్భంగా క్రీడాకారులకు జిల్లా క్రీడల కార్యదర్శి నాగమణి ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. ‘సాగర్’ గేటు ఎత్తివేత నిజాంసాగర్(జుక్కల్): ఎగువ ప్రాంతాల నుంచి 7,048 క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్టు ఒక వర ద గేటును ఎత్తారు. వరద గేటు ద్వారా 4,048 క్యూ సెక్కుల నీటిని మంజీరా నదిలో వదులుతున్నామ ని ప్రాజెక్టు ఏఈ సాకేత్ తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8 టీఎంసీల)కు ప్రస్తుతం 1405 అడుగులు (17.8 టీఎంసీల) నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు. -
రెండు రోజుల్లో పేకాడుతున్న 81 మంది అరెస్ట్
● రూ. 85వేలు నగదు స్వాధీనం ● ఎస్పీ రాజేశ్ చంద్ర కామారెడ్డి క్రైం: కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గడిచిన రెండు రోజుల్లో చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో పేకాడుతున్న 81 మందిని అరెస్ట్ చేశామని ఎస్పీ రాజేశ్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. వారి వద్ద నుంచి రూ.85వేల నగదు, 41 సెల్ఫోన్లు, 9 బైక్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. పేకాడిన వారిపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశామన్నారు. పేకాట, చట్ట వ్యతిరేక కార్యకలపాలను సహించేది లేదన్నారు. దీపావళి నేపథ్యంలో పేకాటపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎవరైనా పేకాడితే పోలీస్ కంట్రోల్ రూం నెంబర్ 87126 86133కు గానీ, డయల్ 100కు గానీ ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. బట్టాపూర్లో.. మోర్తాడ్(బాల్కొండ): ఏర్గట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని బట్టాపూర్లో ఒక ఇంట్లో ఆదివారం పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై రాజేశ్వర్ ఆదివారం తెలిపారు. వారి వద్ద నుంచి రూ.1,01,280 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఐదు సెల్ఫోన్లు, 3 బైక్లను సైతం స్వాధీనం చేసుకున్నామన్నారు. -
నగరంలో దీపావళి సందడి
విక్రయానికి సిద్ధంగా ఉన్న లక్ష్మీదేవి ప్రతిమలునిజామాబాద్ నగర మార్కెట్లో దీపావళి సందడి నెలకొంది. జిల్లా ప్రజలు పండుగకు ఒకరోజు ముందుగానే ఆదివారం సామగ్రి కోసం తరలిరావడంతో నగరమంతా కిటకిటలాడింది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో, రోడ్ల పక్కన ప్రమిదలు, పూలు, పండ్లు, పూజా సామగ్రి, టపాసుల దుకాణాలను వ్యాపారులు పోటాపోటీగా ఏర్పాటు చేశారు. దీపావళి నేపథ్యంలో లక్ష్మీపూజకు కావాల్సిన అమ్మవారి చిత్రపటాలతోపాటు మట్టి ప్రతిమలు సైతం అందుబాటులో ఉన్నాయి. అలాగే టపాసులు అమ్మేందుకు దుకాణాదారులు నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్లో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. మిఠాయి దుకాణాల్లోనూ స్వీట్ల ఆర్డర్లు చాలానే వచ్చాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. దీంతో నగరంలో ఎక్కడ చూసిన పండుగ సామగ్రి కొనుగోళ్లతో దీపావళి శోభ సంతరించుకుంది. –నిజామాబాద్ రూరల్/సాక్షి ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
క్రైం కార్నర్
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. వివరాలు ఇలా.. తాడ్వాయికి చెందిన గాంధారి రమేష్ (40) ఈనెల 14న ఉదయం మొక్కజొన్న కొట్టడానికి వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. తిరిగి సాయంత్రం అతడు ఇంటికి రాగా, కొద్దిసేపటికే మళ్లీ బయటకు వెళ్లాడు. రాత్రయినా అతడు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. మరుసటి రోజు తాడ్వాయి బస్టాండ్ దగ్గర అతడు కిందపడి ఉండటంతో విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి నిజామాబాద్లోని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 18న సాయంత్రం రమేష్ మృతిచెందాడు. మృతుడికి భార్య ముత్తవ్వ, కూతుర్లు కీర్తన, శృతి ఉన్నారు. మృతుడి భార్య ముత్తవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. మోపాల్ మండలంలో మహిళ.. మోపాల్: మండలంలోని గుడి తండాలో శనివారం రాత్రి జరిగిన దాడి ఘటనలో ఓ మహిళ గాయపడగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై సుస్మిత తెలిపిన వివరాలు ఇలా.. తండాకు చెందిన రుదవత్ నీలాబాయి (41), భర్త వామన్ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు వినోద్, తన భార్యతో కలిసి గ్రామంలోనే ఆటో నడుపుకుంటున్నాడు. ఇటీవల వారి కుటుంబంలో కలహాలు నెలకొనగా, శనివారం రాత్రి వామన్, వినోద్ మధ్య గొడవ జరిగింది. ఇద్దరిని నీలాబాయి సముదాయించే ప్రయత్నం చేయగా కోపోద్రిక్తుడైన వామన్ ఆమె తలపై కర్రతో కొట్టాడు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందింది. కుమారుడు వినోద్ ఫిర్యాదు మేరకు వామన్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
పోలీసుల అదుపులో రియాజ్
నిజామాబాద్అర్బన్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యకేసులో నిందితుడైన పాతనేరస్తుడు రియాజ్ పోలీసులకు ఆదివారం చిక్కాడు. బైక్ చోరీ కేసులో శుక్రవారం రాత్రి అరెస్టు చేసి తీసుకొస్తుండగా కత్తితో దాడి చేసి కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసి పరారయ్యాడు. నిందితుడిని పట్టుకునేందుకు సీపీ సాయిచైతన్య ఎనిమిది బృందాలను రంగంలోకి దింపారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు సారంగాపూర్ ప్రాంతంలో ఓ లారీ విడిభాగమైన క్యాబిన్లో రియాజ్ దాక్కున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రత్యేక బృందాలు బైకులపై అక్కడికి చేరుకోగానే గమనించిన రియాజ్ పారిపోతుండగా పోలీసులు వెంబడించారు. అదే సమయంలో రియాజ్ను పట్టుకునేందుకు ఆసిఫ్ అనే యువకుడు ప్రయత్నించగా అతడిపై గాజు ముక్కతో దాడి చేశాడు. అప్పటికే పోలీస్ బృందాలు రియాజ్ను చుట్టుముట్టాయి. నిందితుడిని పట్టుకునే క్రమంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రియాజ్ను సారంగాపూర్ ప్రాంతంలో పోలీసులు ఎన్కౌంటర్ చేశారని ఆదివారం మధ్యాహ్నం వదంతులు వ్యాపించాయి. అయితే రియాజ్ తమ అదుపులోనే ఉన్నాడని, ఎన్కౌంటర్ చేయలేదని సీపీ సాయి చైతన్య ప్రకటన విడుదల చేయడంతో వదంతులకు పుల్స్టాప్ పడింది. రియాజ్ను అదుపులోకి తీసుకున్న సమయంలో అదే ప్రాంతంలో ఒకరు తీసిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అయ్యింది. నిందితుడి వద్ద కత్తి ఉందనే అనుమానంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అదుపులోకి తీసుకున్నారు. తుపాకులతో గురిపెట్టి నేలపై పడుకోబెట్టి, అనంతరం బేడీలు వేసి, తాళ్లతో కట్టేసి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం రాత్రి నుంచి 8 ప్రత్యేక బృందాలు రియాజ్ కోసం తీవ్రంగా గాలించాయి. నిందితుడు మొదట జిల్లా దాటినట్లు భావించినప్పటికీ సరిహద్దు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం నగరంలోనే ఉన్నట్లు నిర్దారణకు వచ్చా రు. రియాజ్ పాతనేరస్తుడు కావడంతో అతడు తరచూ తిరిగే ప్రాంతాలు, కలిసే వ్యక్తులపై పో లీసులు నిఘా సారించి ఫోన్ నంబర్ను ట్రేసింగ్లో పెట్టారు. కానీ రియాజ్ ఫోన్ ఉపయోగించకుండా చోరీ చేసిన బైకుతో పోలీసుల కన్నుగప్పి వివిధ ప్రాంతాలు తిరిగాడు. బర్కత్పురా లోని ఓ లాయర్ వద్దకు వెళ్లిన రియాజ్ అతడి ద్వారా లొంగిపోయేందుకు ప్రయత్నించినప్పటికీ సదరు లాయర్ సాయం చేసేందుకు నిరాకరించినట్లు సమాచారం. నిందితుడు రియాజ్కు దెబ్బలు తగలడంతో ప్రభుత్వ ఆస్పత్రిలోని ఖైదీలకు వైద్యం అందించే వార్డులో ఉంచారు. మొదట ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ప్రాథమిక చికిత్స చేశారు. ప్రస్తు తం రియాజ్ ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో గాయలపాలైన ఆసిఫ్ను పోలీసులు ప్రభు త్వ జనరల్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆసిఫ్ పరిస్థితి నిలకడగా ఉంది. సారంగాపూర్ ప్రాంతంలో పట్టుకున్న ప్రత్యేక బృందాలు అడ్డుకున్న స్థానిక యువకుడిపై కత్తితో దాడి చేసిన నిందితుడు వదంతులు నమ్మొద్దు : సీపీ సాయి చైతన్య -
జిల్లా ప్రజలకు కలెక్టర్ దీపావళి శుభాకాంక్షలు
నిజామాబాద్ అర్బన్: దీపావళి పండగను పురస్కరించుకొని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్ర జలందరి జీవితాల్లో కష్టాల కారుచీకట్లు తొ లగిపోయి, చిరుదివ్వెల వెలుగుల మాదిరి అనునిత్యం సుఖసంతోషాలతో విలసిల్లాల ని ఆకాంక్షించారు. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ఇంటిల్లిపాది ఆనందంగా దీపావళి వేడుకలను జరుపుకోవాలని అభిలషించారు. వైన్ షాపులకు దరఖాస్తు గడువు పెంపు నిజామాబాద్ అర్బన్ : వైన్షాపులకు నూత న లైసెన్సుల కేటాయింపు కోసం దరఖాస్తు గడువును పెంచినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18వ తేదీతో గడువు ముగిసినప్పటికీ ఆ రోజున బీసీ బంద్ కారణంగా చాలా మంది దరఖాస్తు చేసుకోలేకపోయారని, దీ నిని దృష్టిలో ఉంచుకుని 23వ తేదీ వరకు గడువును పొడించామని పేర్కొన్నారు. 27వ తేదీన భారతీగార్డెన్లో ఉదయం 11 గంటలకు లక్కీ డ్రా తీస్తామని తెలిపారు. 18వ తేదీ నాటికి మొత్తం 2633 దరఖాస్తులు అందగా, నిజామాబాద్ స్టేషన్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 908, బోధన్ 427, ఆర్మూర్ 572, భీమ్గల్ 355, మోర్తాడ్ స్టేషన్ పరిధిలో 366 దరఖాస్తులు అందాయని వివరించారు. 23న ఉమ్మడి జిల్లా ఖోఖో జట్ల ఎంపికలు నిజామాబాద్ నాగారం : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో ఈనెల 23న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సీనియర్ మెన్ అండ్ ఉమెన్ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ ప్రతినిధులు ఆదివారం తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు అదేరోజు గురువారం ఉదయం 9గంటలలోపు తమ సర్టిఫికెట్లు, జిరాక్స్లతోపాటు నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని ఆర్గనైజింగ్ సెక్రెటరీ నాగేశ్వరరావుకి రిపోర్ట్ చేయాలన్నారు. పోటీల్లో ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపిచనున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు క్రీడాకారులకు ఈనెల 25 నుంచి నవంబర్ 5 వరకు పిట్లంలో శిక్షణ శిబిరం నిర్వహిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 85559 96271, 94942 59901, 96762 69988 ను సంప్రదించాలన్నారు. ఎస్సారెస్పీలోకి స్వల్పంగా పెరిగిన వరద బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగు వ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో స్వల్పంగా పెరిగింది. క్రితం రోజు 5,654 క్యూసెక్కులు వ చ్చిన వరద ఆదివారం 9,654 క్యూసెక్కుల కు పెరిగింది. దీంతో ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 3 వేల క్యూసెక్కుల నీటి విడుదల ప్రారంభించారు. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 5 వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 650, లక్ష్మి కాలువ ద్వారా 200, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, ఆవిరి రూపంలో 573 క్యూసెక్కులు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి అంతేస్థాయి నీటిమట్టంతో ప్రాజెక్ట్ నిండుకుండలా ఉందని అధికారులు పేర్కొన్నారు. -
ఒక్కో ధర
కోటి వెలుగుల దీపావళిఒక్కో సర్వే నంబర్కులక్ష్మీదేవి చిత్రపటాలు..దీపెంతలు, బొమ్మలు కొనుగోలు చేస్తున్న మహిళలుమోర్తాడ్(బాల్కొండ): ఆర్మూర్ నుంచి కమ్మర్పల్లి శివారు వరకు నేషనల్ హైవే 63 విస్తరణ, అవసరం ఉన్న చోట్ల బైపాస్ రోడ్ల నిర్మాణానికి జిల్లాలో 83.895 హెక్టార్ల భూమి అవసరం ఉంటుందని అధికారులు గుర్తించారు. అయితే భూ సేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేసిన అధికారులు ఒక్కో సర్వే నంబర్ భూమికి ఒక్కో ధర నిర్ణయించారు. దొన్కల్ రెవెన్యూ శివార్లలోని 502/1ఎఫ్బీ సర్వే నంబర్లో ఎకరానికి రూ.1,14,31,384 ధరను, దాని పక్కనే ఉన్న 500/3 సర్వే నంబర్లోని భూమికి రూ.60,54,604 ధరను అవార్డుగా ప్రకటించారు. ఇదే వరుసలో ఉన్న 377/2ఏ సర్వే నంబర్కు మాత్రం రూ.10,91,240 పరిహారంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలాగే జాతీయ రహదారికి మరో వైపున ఉన్న 508/1సీ/1/2 సర్వే నంబర్ భూమికి రూ.60,54,600 పరిహారాన్ని నిర్ణయించారు. ఇదే వరుసలో ఉన్న 534/1ఏ/2 సర్వే నంబర్లోని భూమికి రూ.10,91,240 చొప్పున చెల్లిస్తామంటున్నారు. ఈ నిర్ణయంపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాము నష్టపోతున్న భూమికి ఒకే విధమైన పరిహారాన్ని చెల్లిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని అంటున్నారు. అయితే పరిహారం నిర్ణయించడంలో అధికారుల తీరు అనేక సందేహాలకు తావిస్తోందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భూమి నష్టపోయే రైతు నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు. పరిహారం నిర్ణయించే విషయంలో అధికారులు అసమానతలు ఎందుకు చూపారో అర్థం కావడం లేదు. వివక్ష సరికాదు. – సింగిరెడ్డి గంగారెడ్డి, రైతు, దొన్కల్ భూమిని నష్టపోతున్న రైతులకు పరిహారం చెల్లించే విష యంలో ప్రభుత్వం స్పందించాలి. లేకుండా పోరాటం చేస్తాం. ఎంతో విలువై న భూములను కోల్పోతున్నాం. – ఏనుగు కిరణ్, రైతు, దొన్కల్ కమ్మర్పల్లిలో ఒకలా.. జగిత్యాల్ జిల్లా సరిహద్దులో ఉన్న గండిహనుమాన్ మందిరం నుంచి కమ్మర్పల్లి శివారులోని పాటి హనుమాన్ మందిరం వరకు జాతీయ రహదారిని విస్తరించేందుకు ఇరువైపులా భూమిని సేకరిస్తున్నారు. ఇక్కడ ఒక్కో ఎకరానికి రూ.కోటికి తగ్గకుండా పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. దొన్కల్ వద్ద 40 ఎకరాల భూమిని రహదారికి ఇరువైపులా రైతులు నష్టపోతుండగా.. ఆ భూమి అంతా ఒకే వరుస క్రమంలో ఉందని, అలాంటప్పుడు పరిహారం ఒకేలా ఉండాలని రైతులు అంటున్నారు. పరిహారం చెల్లింపులో స్వల్ప తేడా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని, 90 శాతానికి మించి తేడా ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. అన్ని భూములకు ఒకే విధంగా పరిహారం చెల్లించకుంటే భూములు ఇచ్చేది లేదంటున్నారు. నేషనల్ హైవే 63 విస్తరణ.. భూములు నష్టపోతున్న రైతులకు పరిహారంలో తేడాలు ఒక ఎకరానికి రూ.1.14 కోట్లు.. పక్కనే ఉన్న మరో ఎకరానికి రూ.10.91 లక్షలు.. నిర్దిష్టమైన విధానం కరువు అధికారుల తీరుపై రైతుల నిరసన -
శనివారం రాత్రి చిక్కినట్టే చిక్కి..
రియాజ్ శనివారం రాత్రి పోలీసులకు చిక్కి నట్టే చిక్కి తప్పించుకున్నాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో బర్కత్పురాలో బైక్పై తి రుగుతున్న నిందితుడిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అ నంతరం పోలీసుల సూచనతో ఇద్దరు యు వకులు రియాజ్ను అనుసరించారు. బర్కత్పుర నుంచి ఆర్టీసీ బస్టాండ్ వ రకు, అనంతరం బస్టాండ్ వెనుక వైపు నుంచి మార్కెట్ యార్డు, అర్సపల్లి మీదుగా మ ళ్లీ సారంగాపూర్కు చేరుకున్నాడు. సారంగాపూర్ వద్ద కు రాగానే తనను అనుసరిస్తున్న యువకులను గమనించిన రియాజ్ కెనాల్ కట్ట వైపు వెళ్లాడు. అటు నుంచి నాలుగో టౌ న్ ఎస్సై శ్రీకాంత్, మరో ఇద్దరు బైక్పై రియాజ్ను వెంబడించారు. పోలీసులను చూసిన రి యాజ్ నిజాంసాగర్ కెనాల్ వైపు వేగంగా వెళ్లాడు. అనంతరం బైక్ పైనుంచి కాలువ లో దూకి, అక్కడి నుంచి పరారయ్యా డు. అదే సమయంలో పోలీసులు రియాజ్పై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. కానీ, కాలువలో దూకడంతో ఆచూకీ లభించలే దు. అదే ప్రాంతంలో ఆరు ప్రత్యేక బృందా లు తీవ్రంగా గాలించగా, చీకటి ఉండటంతో పోలీసులు గుర్తించలేకపోయారు. -
కొండంత అవినీతి.. గోరంత రికవరీ
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్) : గ్రామీణ ప్రాంత ప్రజలకు స్థానికంగానే ఉపాధి కల్పించాలనే ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) అక్రమార్కులకు వరంగా మారింది. ఫీల్డ్ అసిస్టెంట్ మొదలుకొని మండల అధికారుల వరకు అందినకాడికి దండుకుంటున్నారు. ఉపాధి పనుల్లో అక్రమాలను గుర్తిస్తున్న ఉన్నతాధికారులు అవినీతి సామ్మును తిరిగి రాబట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా అవినీతి కొండలా పెరిగిపోతోంది. ఏటా లక్షల్లో అవినీతి.. ప్రతి ఏడాది ఉపాధి సామాజిక తనిఖీ బృందాలు గ్రామాల్లో పర్యటించి ఆ ఏడాది కాలంలో చేపట్టిన పనులను పరిశీలిస్తాయి. గ్రామసభల్లోనే అక్రమాలను వెల్లడిస్తారు. అలాగే మండలస్థాయిలో నిర్వహించే సామాజిక తనిఖీ ప్రజావేదికలో గ్రామాల వారీగా జరిగిన అవినీతిని వెల్లడిస్తూ నివేదికను జిల్లా ఉపాధిహామీ అధికారులకు అందిస్తారు. అయితే అవినీతి సొమ్ము రికవరీ మాత్రం జరగడం లేదు. గత ఐదేళ్లలో రూ.6,57,08404 (రూ.6.57 కోట్లు) అవినీతి జరగగా, ఇంతవరకు కేవలం రూ.14,64,450 (రూ.14.64లక్షలు) సొమ్ము మాత్రమే రికవరీ చేయడం గమనార్హం. గత ఐదేళ్లలో 471 మంది అధికారులకు రూ.33.61 లక్షల జరిమానా విధించారు. అవినీతి సొమ్ము రికవరీ కోసం అయితే రెవెన్యూ రికవరీ యాక్ట్ను ప్రయోగించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమాలు జరుగుతున్నా.. చేయని పనులను చేసినట్లు చూయించి బిల్లులు డ్రా చేయడం, కూలీల హాజరులో అక్రమాలు ఇలా గ్రామ స్థాయిలో చాలామంది ఫీల్డ్ అసిస్టెంట్లు అవినీతికి పాల్పడుతున్నారు. అయితే సామాజిక తనిఖీ బృందాలు ప్రాథమిక నివేదికను ఉన్నతాధికారులకు అందించిన తర్వాత వారు పునఃపరిశీలించి అవినీతి సొమ్ము మొత్తాన్ని అమాంతం తగ్గించేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నిజామబాద్ డివిజన్లోని డిచ్పల్లి, జక్రాన్పల్లి మండలాల్లో ఉపాధి అక్రమాలపై సహ చట్టం ద్వారా వివరాలు అడిగినా అధికారులు ఇవ్వడం లేదు. జక్రాన్పల్లి మండలంలో లేబర్ పేమెంట్స్లో పనికి రాని వారికి, గ్రామంలో లేనివారికి సొమ్ము జమచేస్తూ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారు. ఇలా ప్రతి ఏడాది రూ.లక్షల్లో అవినీతి జరుగుతున్నా అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.ఆర్థిక గుర్తించిన అవినీతి రికవరీ జరిమానా పడిన జరిమానా/రికవరీ సంవత్సరం (రూ.లలో) (రూ.లలో) అధికారులు (రూ.లలో) 2020–21 4558373.00 351079.00 63 406078.00 2021–22 14635271.00 378604.00 108 436632.00 2022–23 21143839.00 461534.00 240 1121527.00 2023–24 14617319.00 54785.00 41 189188.00 2024–25 10753602.00 218448.00 19 1207805.00 మొత్తం 65708404.00 1464450.00 471 3361230.00అక్రమార్కులకే ‘ఉపాధి’ ఐదేళ్లలో జిల్లాలో రూ.6.57 కోట్ల అవినీతి సామాజిక తనిఖీల్లో వెలుగు చూస్తున్న అక్రమాలు రికవరీ చేయడంలో అధికారుల నిర్లక్ష్యం -
సాలూర ఎత్తిపోతలకు పూర్వవైభవం
బోధన్ : మంజీర నదిపై సాలూర గ్రామ శివారులో నిర్మించిన ఎత్తిపోతల పథకం ఎట్టకేలకు పునః ప్రా రంభమైంది. సొసైటీ చైర్మన్ అల్లె జనార్దన్, డైరెక్ట ర్లు, కమిటీ సభ్యులతో కలిసి ఎత్తిపోతల పథకం ని ర్వహణ కమిటీ చైర్మన్ శివకాంత్ పటేల్ ఆదివారం పథకం మోటార్లను ప్రారంభించి నీటిని విడుదల చేశారు. కమిటీ ప్రతినిధులు డిస్కో సాయిలు, ఇల్తె పు సాయన్న, గ్రామ పెద్దలు ఇల్తెపు శంకర్, గాండ్ల పెద్ద రాజేశ్వర్, కండెల సంజీవ్, ముట్టెన్ గంగా రాం, కేజీ గంగారాం రైతులు పాల్గొన్నారు. సామగ్రి చోరీతో మూతపడి.. ప్రతియేటా వర్షాకాలం ప్రారంభంలోనే మంజీర న దిలోకి నీటి ప్రవాహం ప్రారంభంకాగానే ఎత్తిపోత ల పథకం మోటార్లను ప్రారంభించి ఎత్తిపోసిన నీ టిని చెరువుల్లో నింపుకుని అవసరాల మేరకు పంట ల సాగుకు ఉపయోగించుకుంటారు, కానీ ప్రస్తుత సంవత్సరం ఎత్తిపోతల పథకం ప్రధాన పంప్హౌజ్లో ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డు, ఇతర సామగ్రిని గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించారు. దీంతో ని ర్వహణ కమిటీ వద్ద నిధులు లేక మరమ్మతులు చే పట్టకపోవడంతో పథకం నిరూపయోగంగా మారింది. రెండు నెలల క్రితం పథకం పునః ప్రారంభించేందుకు గ్రామ ప్రజాప్రతినిధులు, ఆయకట్టు రైతులు సమావేశమై చర్చించారు. నూతన కమిటీని ఎన్ను కొని, మరమ్మతుల ఖర్చును అంచనా వేశారు. సొ సైటీ చైర్మన్ అల్లె జనార్దన్, పలువురు రైతులు ఆర్థిక సహకారం అందించడంతో మరమ్మతులు చేపట్టా రు. పథకం పునః ప్రారంభంతో పంటల సాగుకు భరోసా ఏర్పడిందని రైతులు పేర్కొంటున్నారు. రైతులు చెల్లించాల్సిన పన్ను బకాయిలు సకాలంలో చెల్లించి సహకరించాలి. ఎత్తిపోతల పథకం ద్వారా పంటల సాగుకు నీరందించేందుకు ప్రయత్నాలు చేశాం. నిరంతరాయంగా ఎత్తిపోతల పథకం నిర్వహణకు ఆర్థిక వనరులు సమకూర్చుకుంటేనే సాధ్యమవుతుంది. – శివకాంత్ పటేల్, ఎత్తిపోతల పథకం నిర్వహణ కమిటీ చైర్మన్ -
ధ్రువపత్రాల భద్రతకు ‘డిజిలాకర్’
మీ కోసం.. సదాశివనగర్(ఎల్లారెడ్డి): ప్రయాణాలు ఇతర సందర్భాల్లో చాలా మంది ఉత్తీర్ణత, ఇతర విలువైన ధ్రువపత్రాలను మరిచిపోతున్నారు. ఒక్కోసారి పోగొట్టుకున్న పత్రాలను తిరిగి పొందడం కష్టంతో కూడుకున్న పని. ఇలాంటి పరిస్థితిని అధిగమిస్తూ ఎలాంటి ధ్రువపత్రాలనైనా భద్రంగా దాచుకునేలా కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అదే డిజిలాకర్. ● కాగిత రహిత పాలనను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రారంభించిన ఈ డిజిలాకర్ను విద్యార్థులు, నిరుద్యోగులే కాకుండా ప్రతి ఒక్కరూ విలువైన పత్రాలను దా చుకునేందుకు బ్యాంక్ లాకర్గా పనిచేస్తోంది. ● డిజిటల్ విధానంలో దాచుకున్న పత్రాలను ఎక్కడైనా, ఏ సమయంలోనైనా అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. ● ఇవి వాస్తవ ధ్రువీకరణ పత్రాల మాదిరే చట్టపరంగానూ చెల్లుబాటు అవుతాయి. ● లాకర్ సహాయంతో పంపించే ఈ పత్రాలను వాటి క్యూఆర్ కోడ్ లేదా డిజిటల్ సంతకాలతో నిర్ధారణ జరుగుతుంది. ● డిజిలాకర్ ఖాతాకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ● ఆధార్ కార్డు, దానితో అనుసంధానమైన ఫోన్ నంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ● అనంతరం ఓటీపీతో లాగిన్ అయితే మన ఆధార్పై లాకర్ తెరుచుకుంటుంది. ● డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలు, విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్, ఓటరు ఐడీ, పాన్కార్డు, పాస్పోర్టు, జనన ధ్రు వపత్రాలు, విద్యార్హత ఇలా అన్ని రకాల పత్రా లను స్కాన్ చేసుకొని భద్రపరుచుకోవచ్చు. ● ఒక్కొక్కరూ ఒక జీబీ వరకు డాటా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. -
స్కూటీని ఢీకొన్న లారీ
● రిటైర్డ్ వీఆర్వో దుర్మరణం కామారెడ్డి క్రైం: అదుపుతప్పిన లారీ స్కూటీని ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని పోలీస్స్టేషన్ ఎదురుగా శనివారం ఉదయం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీకి చెందిన రిటైర్డ్ వీఆర్వో జనార్దన్ రావు వ్యక్తిగత పనుల మీద స్కూటీపై వెళ్తున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ అదుపుతప్పి స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో జనార్దన్రావుకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు ఆయనను జనరల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందాడు. ఇసాయిపేటకు చెందిన ఆయన కొంతకాలంగా కుటుంబంతో కలిసి కామారెడ్డిలోని ఎన్జీవోస్ కాలనీలో స్థిరపడ్డారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని భవానీపేట గ్రామానికి చెందిన బ్యాగరి రాజయ్య(52) చేపలవేటకు వెళ్లి విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు ఎస్సై దీపక్కుమార్ తెలిపారు. గ్రామశివారులోని పెద్దవాగు మడుగులో శనివారం విద్యుత్ తీగల సహాయంతో చేపలను పట్టేందుకు స్టార్టర్ బాక్సులోని ఫ్యూజ్కు వైరు పెట్టి నీటిలో దిగుతున్న క్రమంలో షాక్ తగిలి రాజయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తులు మృతదేహాన్ని గుర్తించి మృతుడి సోదరి లక్ష్మికి సమాచారం ఇచ్చారు. లక్ష్మి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు.. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని పద్మాజివాడి గ్రామ శివారులోని స్ప్రింగ్ ఫీల్డ్స్ స్కూల్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. గాంధారి మండల కేంద్రానికి చెందిన కామెల్లి అరవింద్ స్వామి(29) సదాశివనగర్ మండల కేంద్రంలోని అత్తగారి ఇంటికి వచ్చి భార్యాపిల్లలను చూసి తిరిగి ద్విచక్ర వాహనంపై గాంధారికి వెళ్తున్నాడు. ముందు వెళ్తున్న కారును ఓవర్టేక్ చేసి వెళ్తూ ఎదురుగా వస్తున్న హైచర్ వ్యాన్ను ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన స్వామిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి తండ్రి నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. చికిత్స పొందుతూ మాజీ ఎంపీటీసీ.. ఇందల్వాయి: మండలంలోని తిర్మన్పల్లి మాజీ ఎంపీటీసీ జంగిడి లక్ష్మి(61) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. 15 రోజుల క్రితం లక్ష్మి పురుగుల మందు సేవించింది. విషయం తెలిసిన ఆమె చెల్లెలు వెంటనే అక్కను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లక్ష్మి శనివారం మృతి చెందారు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలైన జంగిడి లక్ష్మి మృతి పార్టీకి తీరని లోటని మండల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. -
నిర్లక్ష్యానికి తావిస్తే చర్యలు తప్పవు
● ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని సాధించాలి ● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్అర్బన్: జిల్లాలో నిర్దేశిత లక్ష్యం మేర కు ఆయిల్ పామ్ సాగు జరిగేలా అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 3,500 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యం కాగా, ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలన్నారు. కలెక్టరేట్లో శనివారం వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, ఆయిల్ పామ్ నర్సరీ నిర్వాహకులైన ప్రీ యునిక్ కంపెనీ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆయిల్ పామ్ సాగు పురోగతిపై క్లస్టర్ల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. లక్ష్య సాధనలో వెనుకబడి ఉన్న క్లస్టర్ల అధి కారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయి ల్ పామ్ సాగును ప్రోత్సహించడంలో విఫలమవుతున్న అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒప్పందానికి అనుగుణంగా కృషి చేయని పక్షంలో ప్రయివే టు కంపెనీపై కూడా చర్యలు తీసుకునే అంశాలను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో రైతు లు ఆయిల్ పామ్ సాగు చేపట్టేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని పదేపదే సూచిస్తున్నప్పటికీ ఎందుకు పురోగతి సాధించలేకపోతున్నారని ప్రశ్నించారు. సాగుకు ప్రస్తుత సమయం ఎంతో అనుకూలమని, రైతులను ప్రోత్సహించేందుకు ప్ర భుత్వం అందిస్తున్న రాయితీలు, మద్దతు ధర, సుధీర్ఘకాలంపాటు ఏటేటా సమకూరే రాబడి తదితర అంశాలను వివరించాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జె.గోవిందు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, ప్రీ యూనిక్ కంపెనీ ప్రతినిధులు, ఆయా క్లస్టర్ల ఉద్యా నవన శాఖ అధికారులు పాల్గొన్నారు. -
ఎస్హెచ్జీలకు మరిన్ని కొనుగోలు కేంద్రాలు
● సాఫీగా కొనుగోళ్లు చేపట్టడంతోనే.. ● యాసంగి కన్నా ఈ సారి 37 కేంద్రాలు అధికం మోర్తాడ్(బాల్కొండ):మహిళా సంఘాలకు వరి ధా న్యం కొనుగోలు బాధ్యతను విస్తృతం చేశారు. గత యాసంగి సీజన్న్కన్నా ఈసారి 37 కొనుగోలు కేంద్రాలను పెంచారు. జిల్లాలోని మహిళా సంఘాలు గతంలో 224 కేంద్రాల ద్వారా వరి ధాన్యాన్ని సేకరించాయి.అయితే జిల్లా వ్యాప్తంగా ఈసారి మొత్తం 676 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, అందులో మహిళా సమాఖ్యలకు 261 కేంద్రాలను అ ప్పగిస్తూ అధికార యంత్రాంగం నిర్ణయించింది. గ్రామ సమాఖ్యలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ వారిని వ్యాపార రంగం వైపు ప్రోత్సహించేందుకు ధాన్యం కొనుగోళ్లను అప్పగిస్తున్నారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలు ఇవ్వడ, వసూలు చేయడంతో ఆశించిన ప్రయోజనం చేకూ రడం లేదని ప్రభుత్వం భావిస్తోంది. వ్యాపారం వైపు మహిళల దృష్టిని మరలిస్తే వారు ఆర్థికంగా నిలదొక్కుకుంటారని గుర్తించిన ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలకు ప్రాధాన్యం కల్పించింది. మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాల ద్వారా మహిళలు విజయవంతంగా వరి ధాన్యాన్ని సేకరించాలి. లక్ష్యానికి అనుగుణంగా వడ్లు కొనుగోలు చేసి లాభాలు గడించాలి. మహిళా సంఘాలు బలపడితేనే సభ్యులకు ప్రయోజనం. – సాయాగౌడ్, పీడీ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ -
బోధన్ ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలో 422 దరఖాస్తులు
బోధన్టౌన్(బోధన్): బోధన్ ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయ పరిధిలోని 18 మద్యం దుకాణాలకు శనివారం రాత్రి 10 గంటల వరకు 422 దరఖాస్తులు వచ్చినట్లు సీఐ భాస్కర్రావ్ తెలిపారు. ఈ నెల 23న లక్కీడ్రా నిర్వహిస్తామని, డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభమవుతాయని సీఐ వెల్లడించారు. రాజంపేట: మండలంలోని పెద్దాయిపల్లి గ్రామ శివారులోని గుట్ట నుంచి మొరం అక్రమ రవాణా చేస్తున్న పలువురిపై కేసు నమోదు చేసి తొమ్మిది ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్సై రాజు శనివారం తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక, మొరం రవాణా చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజామాబాద్ రూరల్: భారత సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వినియోగదారులకు దీపావళి పండగ బొనాంజాను ప్రకటించిందని జిల్లా జీఎం వెంకటేశ్వర్లు తెలిపారు. ఒక్క రూపాయితోనే 30 రోజులపాటు అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్, రోజుకు 2జీబీ డేటా 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయ ని పేర్కొన్నారు. వచ్చే నెల 15వ తేదీ వరకు ఉచితంగా సిమ్కార్డు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్, వెబ్సైట్ ద్వారా రూ.100 అంతకంటే ఎక్కువ రీచార్జ్ చేసుకునే పది మందిని లక్కీ డిప్ ద్వారా ఎంచుకొని ఒక్కొక్కరికి 10 గ్రాముల సిల్వర్ కాయిన్ను బహుమతిగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని జీఎం కోరారు. సుభాష్నగర్: కానిస్టేబుల్ ప్రమోద్పై కత్తితో దాడి చేసి ప్రాణాలు తీసిన నిందితుడు రియాజ్పై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమోద్ మృతి పట్ల వారి కుటుంబసభ్యులకు సంతాపం ప్రకటించారు. కానిస్టేబుల్ హత్యపై మానాల దిగ్భ్రాంతి నిజామాబాద్ సిటీ: చోరీ కేసులో పోలీస్ స్టేషన్కు తీసుకువస్తున్న కానిస్టేబుల్ ప్రమోద్ను నిందితుడు రియాజ్ కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన తనను తీవ్రంగా దిగ్భ్రాంతికి గురిచేసిందని డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకా ర సంఘం లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి శ నివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటనకు కారకులను ఎ ట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని సీపీ సాయిచైతన్యను కోరారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
రెండేళ్లకు చిక్కాడు..
తాండూరు: హత్య చేసి పరారీలో ఉన్న నిందితుడిని రెండేళ్ల తర్వాత పోలీసులు పట్టుకున్నారు. వివరాలను డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, సీఐ నగేశ్ శనివారం విలేకరులకు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మన్సన్పల్లికి చెందిన ముడావత్ రవి(39) వ్యవసాయ పనులు చేస్తూ జీవించేవాడు. గ్రామ శివారులోని ఓ ఫామ్హౌస్లో పనిచేసే కామారెడ్డి జిల్లా మద్నూర్కు చెందిన బాలయ్య అలియాస్ బాలాజీతో ఇతనికి స్నేహం కుదిరింది. ఈ క్రమంలో పలుమార్లు మద్యం తాగేందుకు రవి వద్ద బాలాజీ రూ.2,050 అప్పుగా తీసుకున్నాడు. నెలలు గడుస్తున్నా తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో పలుమార్లు అడగగా, రవి తన పరువు తీస్తున్నాడని కక్షపెంచుకున్న బాలాజీ 2023 ఆగస్టు 12న మద్యం తాగుదామంటూ తాను పనిచేసే ఫామ్హౌస్ వద్దకు పిలిచాడు. అనంతరం పథకం ప్రకారం కత్తితో పొడిచి పారిపోయాడు. ఆస్పత్రి పాలైన బాధితుడు చికిత్స పొందుతూ ఆరు రోజుల తర్వాత మరణించాడు. దీంతో నిందితుడైన బాలాజీపై హత్య, అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. నాటి నుంచి హంతకుడి కోసం పోలీసులు వెతుకుతున్నా ఆచూకీ లభించలేదు. ఇటీవల మృతి చెందిన తన తల్లి అంత్యక్రియలకు సైతం రాలేదు. కొన్నాళ్లుగా అతని కుటుంబసభ్యుల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు, కాల్డాటా ఆధారంగా నిందితుడు సిద్దిపేటలోని తన సోదరుడు సంజీవ్ ఇంట్లో ఉన్నట్లు గుర్తించి, అక్కడికి వెళ్లి అరెస్టు చేశారు. హత్య అనంతరం చాలారోజులు మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా వీసాపూర్లో తలదాచుకున్నాడని విచారణలో వెల్లడైనట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించారు. కేసులో కీలకంగా పనిచేసిన పోలీసులు అంజాద్, శివకుమార్, మున్నయ్యను అభినందిస్తూ డీఎస్పీ రివార్డులు అందజేశారు. హంతకుడు మద్నూర్వాసి సిద్దిపేటలో అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్కు తరలింపు -
చిన్న నిర్లక్ష్యం.. భారీ మూల్యం
● ధాన్యం నూర్పిళ్లు, ఆరబోతలతో రోడ్డు ప్రమాదాలు ● గత అక్టోబర్లో జరిగిన ప్రమాదాల్లో 27 మంది మృతి ● అందులో ధాన్యం ఆరబోతలతో జరిగినవే ఎక్కువ ● పోలీసులు అవగాహన కల్పిస్తున్నా కనిపించని మార్పు కామారెడ్డి క్రైం: ఒక్కోసారి చిన్నపాటి నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రోడ్లపై ధాన్యం ఆరబోతలు, నూర్పిళ్ల విషయం కూడా అలాంటిదే. ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు సంబంధించిన విషయం కావడంతో అందరూ సర్దుకుపోతుంటారు. కాకపోతే రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పోలీసుశాఖ గుర్తు చేస్తోంది. రోడ్లపై ధాన్యం ఆరబోయడంతో రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ విలువైన ప్రాణా లను కాపాడుకోవాలని సూచిస్తున్నారు. గతేడాది జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే పోలీసులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినా మార్పు కనిపించడం లేదు. తాజాగా తాడ్వాయి మండలం చందాపూర్లో ఓ వ్యక్తి బైక్పై వెళ్తూ రోడ్డుపై ఆరబోసిన మక్కల కారణంగా అదుపుతప్పి కిందపడి మృత్యువాత పడ్డాడు. పోలీసుల ప్రత్యేక దృష్టి.. కామారెడ్డి జిల్లాలో ప్రతి సంవత్సరం అక్టోబర్ నాటికి వరి, మొక్కజొన్న, సోయాబీన్, పప్పు దినుసుల కోతలు పూర్తవుతాయి. చాలామంది వాటిని రహదారుల వెంట ఆరబోయడం, నూర్పిళ్లు చేస్తుంటారు. ఈ క్రమంలో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. కొంతకాలం క్రితం టేక్రియాల్ వద్ద ఓ రైతు వడ్లను రోడ్డు వెంట ఆరబోసి రాత్రిపూట రోడ్డు దాటే క్రమంలో వాహనం ఢీకొని మృతి చెందాడు. వాహనాలు అదుపుతప్పి పడిపోవడంతో సంభవించిన మరణాలు అనేకం. గత అక్టోబర్ నెలలో జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 27 మంది మృతి మృతి చెందగా, అందులో ధాన్యం ఆరబోతల కారణంగా దాదాపు 10 ప్రమాదాలు జరిగినట్లు భావిస్తున్నారు. దీంతో పోలీసులు ఈ వ్యవహారంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అందరి బాధ్యత.. రోడ్లపై ధాన్యం నూర్పిళ్లు, ఆరబోసే విషయంలో వాహనదారులే కాకుండా రైతులు సైతం ప్రమాదాల బారినపడిన ఘటనలు ఉన్నాయి. చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా జరిగే ప్రమాదాల్లో కుటుంబ పెద్ద దిక్కయిన వ్యక్తి ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంటుంది. అందుకే ధాన్యాన్ని రోడ్లపై కాకుండా గ్రామాల్లోని ఖాళీ స్థలాల్లో మాత్రమే ఆరబోయాలని రైతులకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రాణం తీసిన మక్కలు కుప్పను తప్పించబోయి బైక్ అదుపుతప్పి ఒకరు మృతి తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. మండలంలోని చందాపూర్ గ్రామానికి చెందిన పైడి చిన్నగంగారెడ్డి(52) బైక్పై తాడ్వాయిలోని చిన్న కూతురు వద్దకు వెళుతున్నాడు. మార్గమధ్యంలో రోడ్డపై ఉన్న మక్కల కుప్పను తప్పించబోయి అదుపుతప్పి బైక్పై నుంచి కిందపడడంతో గంగారెడ్డి తల, ముక్కుకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. గంగారెడ్డి పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గంగారెడ్డి మరణించాడు. మృతుడికి భార్య మల్లవ్వ, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మల్లవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్లపై ధాన్యం నూర్పిళ్లు, ఆర బోయడంతో ఏటా పలు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత. జీపీలు, రైతు సమితులు కేటాయించిన స్థలాల్లోనే పంట దిగుబడులను ఆరబోయాలి. విలువైన ప్రాణాలు రక్షించుకోవాలి. – రాజేశ్చంద్ర, ఎస్పీ, కామారెడ్డి -
సా..గుతున్న లిఫ్ట్ నిర్మాణ పనులు!
బాల్కొండ: బాల్కొండ మండలం చిట్టాపూర్, శ్రీరాంపూర్, ఆర్మూర్ మండలం సుర్బీర్యాల్, కోమన్పల్లి గ్రామాలకు చెందిన సుమారు 3500 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు చేపట్టిన ఎత్తిపోతల పనులు రెండేళ్లుగా కొనసాగుతున్నాయి. ఎస్సారెస్పీ బ్యాక్వాటర్ ఆధారంగా కోమన్పల్లి శివారులో పంపుహౌస్ నిర్మించి, సుర్బీర్యాల్, ఫత్తేపూర్, చిట్టాపూర్ వరకు పైపులైన్ ద్వారా నీటి సరఫరా చేపట్టాలని 2023 అక్టోబర్లో రూ. 149.52 కోట్ల నిధులను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. శంకుస్థాపన అనంతరం లిఫ్ట్ నిర్మాణ పనుల్లో భాగంగా కొద్దిమేర పైపులైన్ తవ్వకాలు, పైపులు వేయడం చేపట్టారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ వద్ద పంపుహౌస్, జాతీయ రహదారి పక్కన డీసీ (డిస్ట్రిబ్యూటర్ చాంబర్) పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. పైపులైన్ను పంట భూముల నుంచి వేస్తున్నారు. అయితే, వేసవిలో మాత్రమే పైపులైన్ కోసం తవ్వకాలు చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం యాసంగి పంటలను వేసేందుకు రైతులు నేలను సిద్ధం చేస్తున్నారు. దీంతో పైపులైన్ వేసే అవకాశం లేదు. ప్రస్తుతం కొనసాగుతున్న సిమెంట్ పనులు వేగంగా చేపడితే పంటలు చేతికొచ్చిన తర్వాత వెంటనే పైపులైన్ పనులు చేపట్టే అవకాశం ఉంటుంది. కానీ ఆ పనులు సైతం నత్తకు నడక నేర్పేలా సాగుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి లిఫ్ట్ పనులను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చిట్టాపూర్ ఎత్తిపోతల పథకం పైపులైన్ వేసేందుకు పంటలు అడ్డుగా ఉన్నాయి. పంటలు లేనిచోట పైపులైన్ పనులు చేపట్టాం. ఇప్పటి వరకు 1500 మీటర్ల వరకు పైపులైన్ వేశాం. ప్రస్తుతం డీసీ పనులు సాగుతున్నాయి. పనుల వేగవంతానికి చర్యలు తీసుకుంటాం. – సురేశ్, డిప్యూటీ ఈఈ, మైనర్ ఇరిగేషన్, బాల్కొండ ఎస్సారెస్పీ బ్యాక్వాటర్ ఆధారంగా నిర్మాణం రూ.149.52 కోట్ల నిధులు మంజూరు రెండేళ్లు గడిచినా కొనసాగుతున్న పనులు -
గురుకులాలపై ‘ప్రత్యేక’ గురి
ఖలీల్వాడి:సాంఘిక సంక్షేమ గురుకులాలపై ప్రభు త్వం ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్థుల, సిబ్బందితోపాటు వసతిగృహాల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాలకు 10 మంది ప్రత్యేకాధికారులను గురుకులాల సొసైటీ కార్యదర్శి కృష్ణ ఆదిత్య నియమించారు. ఉమ్మడి నిజామాబాద్కు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రమోద్ను కేటాయించారు. దీంతో 10 రోజుల క్రితం జిల్లాకు వచ్చిన ఆయన ఉమ్మడి జిల్లా పరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశమయ్యారు. కాలేజీల వారీగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల రక్షణ చర్యలతోపాటు మెనూ ప్రకారం భోజనం అందించడం, అద్దె బిల్లుల చెల్లింపు వంటి సమస్యల పరిష్కారానికి సూచనలు చేశారు. జిల్లాలో 11 సంక్షేమ గురుకులాలు.. జిల్లాలో 11 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాలలు ఉన్నాయి. అందులో 3 బాలుర, 6 బాలికల, రెండు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్ పాఠశాల, కళాశాలల్లో 5,761 మంది, డిగ్రీ కాలేజీల్లో 864 మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 267 మంది రెగ్యులర్ సిబ్బంది, 84 మంది పార్ట్ టైం, 59 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. ఉత్తీర్ణత శాతం పెంపునకు.. సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతో ప్రత్యేక తరగతుల నిర్వహణపై దృష్టిసారించారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కొత్త మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన నాణ్యమైన భోజనం అందించే దిశగా చర్యలు చేపట్టారు. మరోవైపు సిబ్బంది బకాయి వేతనాలను ఇటీవల మంజూరు చేయగా, అద్దె భవనాలకు సంబంధించిన బిల్లులు చెల్లించేందుకు వివరాలు సేకరించారు. ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్గా సోషల్ వెల్ఫేర్ డీడీ ప్రమోద్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి ఇప్పటికే ప్రిన్సిపాళ్లతో సమావేశం చదువుతోపాటు మెనూ అమలుకు కసరత్తు పదిరోజుల క్రితం ప్రిన్సిపాళ్లతో ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి రివ్యూ చేశారు. గురుకులాలకు సంబంధించిన పలు అంశాలపై నివేదిక తీసుకున్నారు. సమస్యలపై ఆరా తీశారు. సిబ్బందికి వేతనాలు మంజూరు చేశారు. పెండింగ్లో ఉన్న బిల్లులు త్వరలో విడుదల చేస్తామన్నారు. – పూర్ణచంద్రరావు, సోషల్ వెల్ఫేర్ జోనల్ అధికారి -
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
● కానిస్టేబుల్ ప్రమోద్కు కన్నీటి వీడ్కోలు ● నివాళులు అర్పించిన ఐజీ, సీపీ నిజామాబాద్అర్బన్ : సీసీఎస్ కానిస్టేబుల్ ప్ర మోద్ అంత్య క్రియలు నగరంలో శనివారం అ ధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. స్థానిక రైల్వే కమాన్ ప్రాంతంలోని బ్యాంకు కాలనీలో ని ఆయన నివాసం నుంచి శవ యాత్ర ప్రారంభమైంది. ఈ అంత్యక్రియలకు మల్టీజోన్– 1 నార్త్ తెలంగాణ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, సీపీ సా యి చైతన్య, పోలీస్ అధికారులు హాజరయ్యా రు. ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామ ని సీపీ పేర్కొన్నారు. ప్రమోద్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. శవ యాత్రలో పాడె మోశారు. ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నిందితుడు రియాజున్ త్వరలోనే పట్టుకుంటామన్నారు. శాంతి భద్రతల వి షయంలో ఉపేక్షించబోమన్నారు. కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటాం.. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. ఉదయం ప్రభుత్వ మెడికల్ కశాశాలలో మీడి యాతో మాట్లాడారు. నిందితుడు రియాజ్ను పట్టుకునేందుకు కానిస్టేబుల్ ప్రమోద్తో పాటు సీసీఐ ఎస్సై కూ డా ఉన్నారన్నారు. దురదృష్టవశాత్తు పోలీసు ఫ్యామిలీలో ఒక్కరు చనిపోవడం చాలా బా ధాకరమన్నారు. కానిస్టేబుల్ కుటుంబానికి ప్ర తి ఒక్కరు అండగా ఉండాలన్నారు. కొందరు ఘటనపై రాజకీయలు చేయడం తగదన్నారు.కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ను పట్టుకునేందుకు ఎనిమి ది పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. శుక్రవారం బాబన్సాహెబ్ పహాడ్ వద్ద కెనల్ కట్ట ప్రాంతంలో మొదట రియాజ్ను పట్టుకునేందుకు కానిస్టేబుల్ ప్రయత్నం చేశాడు. కెనాల్ కాల్వ గుండా పారిపోతున్న రియాజ్ను వెంబడించి పట్టుకున్నాడు. అనంతరం తన బైక్పై సీసీఎస్ ఎస్సై విఠల్ ఆధ్వర్యంలో అరెస్టు చేసి బైౖక్పై తీసుకువస్తున్నారు. ఈ సందర్భంలోనే రియాజ్ కానిస్టేబుల్ను పొడిచి హత్య చేశారు. ఇతను ఎక్కడికి పారిపోయాడు.. ఎలా పారిపోయాడు కోణంలో పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. నిందితుడు రియాజ్ సెల్ఫోన్ వదిలేసి మరో బైక్ ను దొంగిలించి పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటల వరకు నగరంలోనే ఉన్నట్లు పోలీసులకు సమాచారం. కొన్ని బృందాలు పట్టణంలో గాలింపు చర్యలు చేపడుతున్నాయి. మరికొన్ని బృందాలు రియాజ్ తరచుగా వెళ్లే ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని సీపీ సాయి చైతన్య అన్నారు. -
ధాన్యం తూకంలో తరుగు తీస్తే చర్యలు
● జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిరుద్రూర్ : ధాన్యం సేకరణలో అవకతవకలు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. రుద్రూర్, పోతంగల్, కోటగిరి మండలంలోని కొత్తపల్లి ధా న్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయన పరిశీలించారు. సేకరించిన ధాన్యం వివరాలు తెలు సుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. కొన్నిసార్లు తూకం వేయకుండానే ధా న్యం నింపి పంపిస్తున్నారని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో ప్రతి ధాన్యం బస్తాను తప్పని సరిగా కాంటా చేసిన తరువాతనే మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు కలెక్టర్ సూచించారు. తరుగు, కోతలను అమలు చేస్తే చర్య లు తీసుకుంటామన్నారు. కొనుగోలు కేంద్రాలకు సరిపడా గన్నీ బ్యాగులు కేటాయించాలని, వర్షాల కు ధాన్యం తడిసిపోకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. రైస్ మిల్లుల నుంచి ట్రక్ షీట్లు తెప్పించుకుని వేగంగా ట్యాబ్ ఎంట్రీలు చేయాలని, దీంతో సకాలంలో రైతులకు బిల్లుల చెల్లింపులు జరుగుతాయన్నారు. క్రాప్ బుకింగ్ జాబితాలో పేర్లు లేని రైతులు పంట సాగు చేస్తే క్షేత్ర స్థాయిలో పరిశీలించి సంబంధిత రైతులకు ధ్రువీకరణ పత్రాలు అందించాలని ఏఈవోలను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్కుమార్, జిల్లా సహకార అధికారి శ్రీనివాస్, తహసీల్దార్లు గంగాధర్, తారాబాయి, వ్యవసాయ అధికారులు సాయి కృష్ణ, రాజు, నిశిత ఉన్నారు. -
నిజామాబాద్
● నిరసనల్లో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీల నాయకులు ● ఆర్టీసీ బస్టాండ్ వద్ద బైఠాయింపు ● నగరంలో బైక్ ర్యాలీగురుకులాలపై ‘ప్రత్యేక’ గురి సాంఘిక సంక్షేమ గురుకులాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. ఆదివారం శ్రీ 19 శ్రీ అక్టోబర్ శ్రీ 2025– 10లో uనిర్మానుష్యంగా బస్టాండ్బీసీ బంద్నిజామాబాద్అర్బన్ : రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేర కు శనివారం జిల్లా వ్యాప్తంగా బంద్ విజయవంతమైంది. ఆర్మూర్, బోధన్, బాల్కొండ తదితర ప్రాంతాల్లో స్వచ్ఛందంగా వ్వాపారస్తులు, ప్రయివేటు పాఠశాలలు బంద్ పాటించారు. ఉదయం 3 గంటలకే బీసీ సంఘాల నాయకులు నిజామాబాద్ ఒకటవ, రెండవ డిపోల ముందు బైఠాయించారు . బస్సులను అడ్డుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ వామపక్షాల నాయకులు ఆర్టీసీ డిపో ముందు బైఠాయించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డి మాండ్ చేశారు. బీసీ సంఘల నాయకులు నగరంలో బైక్ర్యాలీ నిర్వహించారు. నగరంలో బస్స్టాండ్ నుంచి పాత కలెక్టరేట్, పూలాంగ్ చౌరస్తా బోర్గం(పి) వరకు, అక్కడి నుంచి ధర్న చౌక్ వరకు వచ్చా రు. అనంతరం నిర్వహించిన దీక్ష శిబిరంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. జిల్లా బీసీ సంక్షే మ సంఘం నాయకులు సుధాకర్, బుస్సా ఆంజనేయులు పాల్గొన్నారు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. న్యూ డెమోక్రసీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ద్వారక నగర్ నుంచి బస్టాండ్ రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆకుల పాపయ్య మాట్లాడుతూ బీసీలు అత్యధిక జనాభా ఉండి కూడా రిజర్వేషన్ ఫలాలను అందుకోలేకపోతున్నారన్నారు. తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బంద్లో జిల్లా అధ్యక్షుడు మల్లాని శివ మాదిగ పాల్గొని మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ నాయకులు బంధ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బోరం్గ(పి)లో మాది గ కుల సంఘాలు, బీసీ సంఘాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో బంద్ కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ పాల్గొన్నారు. దిష్టిబొమ్మ దహనం సీపీఐ ఎమ్మెల్సీ మాస్లైన్ ప్రజాపంథా నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. వనమాల కృష్ణ పాల్గొన్నారు. నుడా చైర్మన్ కేశ వేణు, నరాల రత్నాకర్, కాంగ్రెస్ పా ర్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, బీఎల్పీ రాష్ట్ర పార్టీ అధ్యక్షు డు దండి వెంకట్, మహిళా రాష్ట్ర నాయకురాలు సబ్బని లత, మాల మహానాడు నాయకులు గైని గంగారం, దేవిదాస్, సుధాకర్, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు అవంతి రావు, ప్రజా హక్కుల సంఘం నాయకులు భాస్కర్, పీడీఎస్యూ నాయకు లు గణేష్, ఆంజనేయులు, గంగకిషన్ పాల్గొన్నారు.బంద్లో భాగంగా బీసీల కులాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పాత కలెక్టరేట్ వద్ద నిరసన చేశారు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎస్ఎస్ఆర్ విద్యాసంస్ధల అదినేత మా రయ్యగౌడు, బీఆర్ఎస్ నాయకుడు దాదాన్నగా రి విఠల్రావు పాల్గొన్నారు. పోతన్కర్ లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో ఈ నిరసన చేశారు. -
నాలుగో స్తంభానికి పొంచివున్న ప్రమాదం
పత్రిక స్వేచ్ఛను కాపాడాలిఏపీలోని కూటమి ప్ర భు త్వం అక్రమ కేసులతో జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేయడం సరి కాదు. ఇది సాక్షి పత్రికపై దాడి మాత్రమే కాదు రాజ్యాంగంపై దాడిగా పరిగణిస్తున్నాం.పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. – మానాల మోహన్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార సంఘం లిమిటెడ్ చైర్మన్ ‘సాక్షి’ దినపత్రిక, ఎడిటర్ ధనంజయ రెడ్డిపై ఏపీలోని కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి వేధించడాన్ని ప్రజాస్వామిక వాదులు, ప్రజాప్రతినిధులు, పలు రాజకీయ పార్టీల నేతలు ఖండించారు. పత్రికపై దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. వాస్తవాలు వెలుగులోకి తెస్తూ.. ప్రజలను అప్రమత్తం చేస్తున్న ‘సాక్షి’ వంటి ప్రజామోదం పొందిన పత్రికను ఇబ్బందుల పాలు చేస్తే ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు. ఏపీలోని కూటమి ప్రభుత్వాల వంటి వాటితో నాలుగో స్తంభానికి ప్రమాదం పొంచివుందన్నారు. – నిజామాబాద్ సిటీ ‘సాక్షి’ పై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణిస్తున్నాం ఏపీలోని కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధుల మనోభిప్రాయాలు -
ప్రజా సంక్షేమాన్ని వదిలేసి కక్ష సాధింపు చర్యలు
ఏపీలోని చంద్రబాబు సర్కార్ పత్రికా స్వేచ్ఛపై దాడికి పాల్పడుతోంది. ఉద్దేశపూర్వకంగానే సాక్షి మీడియాపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఇది పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడి. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం నిజాలు రాస్తున్న సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై అక్రమ కేసులు, విచారణ పేరుతో వేధించడం, పత్రిక కార్యాలయంలో పోలీసులు హంగామా సృష్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. – జి ప్రమోద్ గౌడ్, స్టేట్ కౌన్సిల్ మెంబర్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ -
కాంటాలు ఇంకెప్పుడో..
నందిపేట్(ఆర్మూర్) : జిల్లాలో వరికోతలు ప్రారంభమై నెలరోజులవుతోంది. అధికారులు వివిధ ప్రాంతాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా.. ఇప్పటి వరకు కొనుగోలు మాత్రం చేయడం లేదు. కోత కోసిన ధాన్యాన్ని చాలా గ్రామాల్లో రైతులు కొనుగోలు కేంద్రాల వద్దకు తరలించి ఆరబెడుతున్నారు. ఇలా ఆయా గ్రామాల్లో ధాన్యం రాశులు కుప్పలు తెప్పలుగా పేరుకు పోతున్నాయి. మరోవైపు ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించడంతో వరి కొనుగోళ్లు ఎప్పుడెప్పుడా అని రైతులు ఎదురు చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 4,36,695 ఎకరాలలో వరి సాగు చేశారు. జిల్లాలో 677 కొనుగోలు కేంద్రాల ద్వారా 8.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పాటికే సగం వరకు కేంద్రాలను పీఏసీఎస్, ఐకేపీ, మోప్మా, ఐసీడీఎంఎస్, ఎఫ్డీవో ల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. నామ మాత్రంగా ప్రారంభమైన కొనుగోలు కేంద్రాలు నెల నుంచి సాగుతున్న వరికోతలు ధాన్యం తరలించి కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు మరోవైపు వెంటాడుతున్న వరుణుడి భయం -
నిజాలు రాస్తే వేధింపులా..!
‘సాక్షి’పై అక్రమ కేసులను ఎత్తి వేయాలి● నినదించిన జర్నలిస్టు, వామపక్ష, విద్యార్థి, సంఘాల ప్రతినిధులు ● జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ, ధర్నా నిజామాబాద్లోని ధర్నాచౌక్లో నిరసనలో పాల్గొన్న ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు, జర్నలిస్టులు(803) ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నిరంకుశ పాలన కొనసాగుతోంది. గతంలోనే చంద్రబాబు ప్రపంచ బ్యాంకు జీతగాడు అని మేమే వ్యతిరేకించాం. ప్రజా పాలనను పక్కనపెట్టి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నాడు. కొన్నేళ్లుగా ఇదే విధానం కొనసాగుతోంది. పత్రికలపై కక్షపూరిత చర్యలు సిగ్గుచేటు, అక్రమ కేసులు బనాయించడం, ఎదుటి వారిని బెదిరించడం అలవాటుగా మార్చుకున్నాడు. తక్షణమే సాక్షి మీడియాపై పెట్టిన కేసులను వెనక్కు తీసుకోవాలి. ఇతర మీడియాలు కూడా సాక్షికి మద్దతుగా నిలవాలి. మీడియాపై ఎవరు కేసులు నమోదు చేసినా, కక్షపూరిత చర్యలకు పాల్పడినా అందరూ ఒక్కటై కలిసికట్టుగా ఎదుర్కోవాలి. మీడియాకు మేము అండగా ఉంటాం. –వి. ప్రభాకర్, సీపీఐ (ఎంఎల్)మాస్లైన్ ప్రజాపంథ రాష్ట్ర నాయకుడుసాక్షి మీడియా నిజాలు రాస్తే చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించింది. ఇది ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. మీడియాను తన గుప్పిట్లో పెట్టుకుని అరాచకాలు సష్టించాలని చంద్రబాబు చూస్తున్నాడు. దీనికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. –ముస్కు సుధాకర్, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శినిజామాబాద్అర్బన్ : ‘సాక్షి’ దిన పత్రికపై, ఎడిటర్ ఆర్. ధనంజయ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో శుక్రవారం జర్నలిస్టు సంఘాలు, వామపక్ష సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. సంఘాల ప్రతినిధులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని, మీడియా లేకుంటే ప్రజల హక్కులు హరించుకుపోతాయన్నారు. అలాంటి మీడియాపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఎండగట్టారు. మొదట ఎన్టీఆర్ చౌరస్తా నుంచి కోర్టు చౌరస్తా వరకు, తిరిగి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు ధర్నా చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వా మ్యానికి సంకెళ్లు వేస్తోంది. కక్షపూరితమైన విధానాలు కొన సాగిస్తోంది. తన తప్పులను వెలికి తీసేందుకు ప్రయత్నించే వారిని అక్రమంగా నిర్బంధిస్తున్నారు. పత్రిక విలేకరులపై కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేయడమంటే దారుణం. ప్రజాస్వామ్యంలో మీడియాకు స్వేచ్ఛ లేకుంటే ప్రజలు ఎలా బతికేది. –ఖైసర్, కాంగ్రెస్ జిల్లా నాయకుడు చంద్రబాబు పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని తుద ముట్టించాలని ప్రయ త్నం చేస్తున్నాడు. తన తప్పుల ను వెలికి తీసే వారి పై అక్రమ కేసులు బనాయించడం, అధికా రాన్ని అడ్డుపెట్టుకొని నిరంకుశత్వంతో ప్రజలను, పత్రిక విలేకరులను ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదు. దీనిపై తక్షణమే ప్రభుత్వం వెనక్కు తగ్గాలి. –సుజాత, ఐద్వా జిల్లా కార్యదర్శి అక్రమ కేసులు బనాయించి పోలీసులతో నిర్బంధించడం, జర్నలిస్టుల ఇండ్లలో తనిఖీలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేయడం ఏమాత్రం సరైనది కాదు. అనుకూలమైన వార్తలు రాయాలంటూ బెదిరించడం, మీడియాను తొక్కి పెట్టాలని ప్రయత్నాలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం. –వనమాల కృష్ణ, సీపీఐ (ఎంఎల్)మాస్లైన్ ప్రజాపంఽథ రాష్ట్ర నాయకులు -
సీఎంకు సుదర్శన్రెడ్డి కృతజ్ఞతలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాకు వ్యవ సాయ కళాశాల మంజూరు చేయడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞ్ఞతలు తెలిపారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. రెవెన్యూ సిబ్బంది బదిలీ నిజామాబాద్ అర్బన్: రెవెన్యూశాఖలోని తొమ్మిది మంది సిబ్బందిని బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈనెల 15న ప్రచురితమైన ‘రేషన్కార్డుల్లో భారీ అక్రమాలు’ కథనంపై అధికారులు స్పందించారు. వివిధ మండలాల్లో అనర్హులకు రేషన్కార్డులు మంజూరు చేశారని రెవెన్యూ సిబ్బందిని వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు. పసుపు రైతుల సంక్షేమానికి కృషి ● జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి సుభాష్నగర్: పసుపు రైతుల సంక్షేమం కో సం జాతీయ పసుపు బోర్డు ఎల్లప్పుడూ పని చేస్తుందని బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అ న్నారు. వరంగల్, ఏపీలోని అరకు జిల్లా పా డేరు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన పలువురు రైతులు శుక్రవారం నగరంలోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని సందర్శించారు. పల్లె గంగారెడ్డి వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యా రు. పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉత్పత్తి వ్యయం, మార్కెట్లో ధరల అస్థిరత, పంట సంరక్షణలో ఎదురయ్యే సవాళ్లు వంటి అంశాలపై పరిష్కార మార్గాలను చర్చించారు. పాఠశాలకు రూ.50 వేల విరాళం మోపాల్ : మోర్తాడ్ మండలంలోని సిర్పూర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు దూస లక్ష్మణ్ విద్యా ఆశయం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున రూ.50 వేల ఆర్థిక సాయాన్ని శుక్రవారం ప్రధానోపాధ్యాయులు వి సత్యనారాయణకు అందజేశారు. ఈసందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ పాఠశాలలో రెండు సంవత్సరాలుగా జరుగుతున్న వివిధ విద్య అభివృద్ధి పనులు గమనించి ఆర్థికసాయాన్ని అందజేశారని తెలిపారు. అనంతరం సంస్థ ప్రతినిధులు దూస దాసు, ఆరు గొండ దయానంద్ మాట్లాడుతూ విద్యా ర్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గెలుచుకున్న బహుమతులను గుర్తించి, వారి ప్రతిభా పాటవాలను మరింత ప్రోత్సహించేలా ఈ విద్యానిధిని అందించినట్లు పేర్కొన్నారు. తెలుగు ఉపాధ్యాయులు డాక్టర్ కాసర్ల నరేష్రావు చొరవతో పాఠశాల అవసరాలను గుర్తించి ఈ నిధిని అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్యామల, మోహన్, అక్బర్ బాషా, డాక్టర్ శ్రీనివాస్ హజారే, లలిత, విద్యార్థులు పాల్గొన్నారు. -
మెజార్టీ అభిప్రాయానికి ప్రాధాన్యత
● డీసీసీ అధ్యక్షుని ఎన్నిపై పార్టీ జిల్లా పరిశీలకుడు రిజ్వాన్ అర్షద్ ● డిచ్పల్లిలో రూరల్ బ్లాక్ కాంగ్రెస్ స్థాయి సమావేశండిచ్పల్లి(నిజామాబాద్రూరల్) : మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం, కాంగ్రెస్ పార్టీకి విధేయులై అందరినీ కలుపుకొని పోయే వారికే జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష ప దవి దక్కుతుందని పార్టీ జిల్లా పరిశీలకుడు, కర్ణాట క ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్ష ఎన్నికలపై ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం డిచ్పల్లి మండల కేంద్రంలోని కేఎన్ఆర్ గార్డెన్స్లో నిర్వహించిన నిజామాబాద్ రూరల్ బ్లాక్ కాంగ్రెస్ స్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడా రు. కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలని అధినేతలు రాహుల్గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే ఆలోచనల మేర కు డీసీసీ అధ్యక్షుడి నియామకం కోసం గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతి కార్యకర్త, నాయకుల అభిప్రాయాన్ని సేకరిస్తున్నామని తెలి పారు. పార్టీకోసం ఎళ్లవేళలా కష్టపడే వారు, పార్టీని వీడకుండా 10 సంవత్సరాలకు పైగా క్రియాశీలకంగా పని చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో అధిక ఎంపీలను గెలిపించుకుని రాహల్గాంధీని ప్రధానిగా చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
ఒమన్లో చిక్కుకున్న సిద్దపల్లి వాసి
మోర్తాడ్(బాల్కొండ): గల్ఫ్ దేశం ఒమన్లో చిక్కుకున్న తన తండ్రిని స్వగ్రామానికి రప్పించాలని కూతురు కోరింది. ఈమేరకు హైదరాబాద్లో శుక్రవారం నిర్వహించిన ప్ర వాసీ ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. వివరా లు ఇలా.. భీమ్గల్ మండలం సిద్ధపల్లికి చెందిన భోజ సురేష్ను ధర్పల్లికి చెందిన ఏజెంట్ ఒకరు ఆ గష్టులో ఒమన్కు పంపించాడు. అక్కడ ఒక కార్యాలయంలో క్లీనింగ్ విభాగంలో పని కల్పిస్తానని నమ్మించి, సురేష్ వద్ద రూ.90వేలు తీసుకున్నాడు. తీరా ఒమాన్ వెళ్లిన తర్వాత యాంకూల్ పట్టణానికి సమీపంలోని ఒక గ్రామంలోని వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. అక్కడ ఉన్న గొర్రెల మందకు కాపరిగా పని చేయాలని సూచించారు. తనకు చెప్పి న పని కాకుండా, ఎడారిలో గొర్రెలకు కాపలాగా ఉండటంతో అతడు నిత్యం చాలా ఇబ్బంది పడుతున్నాడు. తాను ఇక్కడ ఉండలేనని సురేష్ తన కుటుంబ సభ్యులతో గోడు వెళ్లబోసుకున్నాడు. ఇటీవల సురేష్ తల్లి చనిపోగా, అతని భార్య అనారోగ్యంతో బాధపడుతుంది. దీంతో తన తండ్రిని ఎలాగైనా ఇంటికి రప్పించాలని కోరుతూ బాధితుడి కూతురు తేజశ్రీ ప్రవాసీ ప్రజావాణిలో అధికారి జగదీష్ పటేల్కు, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రధాన కార్యదర్శి సురేంద్రనాథ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. ఏజెంట్ చేతిలో మోసపోయిన సురేష్కు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. క్లీనింగ్ విభాగంలో ఉపాధి అంటూ గొర్రెల కాపరిగా పనికి పురమాయించిన ఏజెంట్ ఎడారిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైనం తన తండ్రిని ఇంటికి రప్పించాలని ప్రవాసి ప్రజావాణిలో కూతురి వేడుకోలు -
పత్రిక స్వేచ్ఛను హరిస్తే ఊరుకోం
సాక్షి ఎడిటర్పై అక్రమంగా నమోదు చేసిన కేసులను ఏపీ ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి. ‘సాక్షి’కి కూట మి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. అక్రమాలను వెలికితీస్తున్న ‘సాక్షి’ని అభినందించకుండా, తప్పుడు వార్తల పేరిట యాజమాన్యంపై కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేయడం ప్రజాస్వామ్యంలోనే అవమానకరమైన ఘటన. –గణేష్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి నిజామాబాద్అర్బన్: పత్రిక స్వే చ్ఛను హరిస్తే ఊరుకో మని జిల్లాలోని జర్నలిస్టులు, వివిధ సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి మీడియాపై కూ టమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో వారు నిరసన వ్యక్తం చేశారు. సాక్షి బ్యూరో ఇన్చార్జి భద్రరెడ్డి, ఎడిషన్ ఇన్చార్జి ప్రభాకర్, అడ్వడైజర్ మేనేజర్ సంపత్, ఆర్సీ ఇన్చార్జి, జర్నలిస్టులు పాకాల నర్సింలు, మండే మోహన్, ఏబీవీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ హర్షవర్ధన్రెడ్డి తదితరులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ప్రజాస్వామ్య విధానాలను పట్టించుకోకుండా కక్షపూరితమైన పరిపాలన కొనసాగిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని మంటగలిపి ప్రజల హక్కుల్ని కాలరాస్తున్నారు. ప్రజా సమస్యల కోసం ఎప్పుడు ముందుండే ‘సాక్షి’ మీడియాను గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న అక్రమాలను వెలుగు తీస్తే కేసులు పెట్టి నిర్బంధించడం సరైనది కాదు. –జన్నారపు రాజేశ్వర్, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి -
నేడు సెపక్తక్రా అండర్–14 జట్ల ఎంపికలు
నిజామాబాద్నాగారం: కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పోతంగల్ ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఎస్జీఎఫ్ ఉమ్మడి జిల్లా సెపక్తక్రా అండర్–14 బాలబాలికల విభాగంలో జిల్లా జట్ల ఎంపికపోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి నాగమణి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనడానికి జిల్లా జట్టుకు ఎంపికలు చేస్తారన్నారు. నిజామాబాద్నాగారం: కామారెడ్డి జిల్లా దోమకొండలో నేడు ఎస్జీఎఫ్ అండర్–14, 17 బాలబాలికల విభాగంలో ఆర్చరీకి ఎంపికలు నిర్వహించనున్నట్లు క్రీడల కార్యదర్శి నాగమణి తెలిపారు. వివరాలకు 94900 15388ను సంప్రదించాలన్నారు. నిజామాబాద్అర్బన్: ఆర్మూర్ ఎస్సై వినయ్ కుమార్ను వీఆర్కు అటాచ్ చేస్తూ సీపీ సాయిచైతన్య ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఇటీవల ఆర్మూర్లోని పాత బస్టాండ్లో ఓ కిరాణ దుకాణ యజమానిని ఎస్సై వేధించినట్లు ఓ వీడియో వైరల్ అయింది. ఈ విషయం సీపీ దృష్టికి రావడంతో ఎస్సైను వీఆర్కు అటాచ్ చేసినట్లు సమచారం. బీసీ బంద్కు కాంగ్రెస్ మద్దతు నిజామాబాద్ సిటీ: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ బీసీ సంఘాలు ఇచ్చిన రాష్ట్ర బంద్కు జిల్లా కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార సంఘాల సొసైటీ చైర్మన్ మానాల మోహన్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ బీసీ బంద్లో పాల్గొనాలని సూచించారు. కాంగ్రెస్ బీసీ పక్షాన నిలబడుతోందన్నారు. బంద్ సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం రద్దుచేసినట్లు తెలిపారు. సీఎంకు కృతజ్ఞతలు.. జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేసినందుకు సీఎం రేవంత్రెడ్డికి మానాల మోహన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి పెద్దపీఠ వేస్తున్న సీఎంకు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. -
ఆర్టీసీ లక్కీడ్రా విజేతలకు చెక్కుల ప్రదానం
నిజామాబాద్ సిటీ: దసరా సీజన్ నేపథ్యంలో ఆర్టీసీ వారు ‘లక్కీడ్రా’ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్లోని జూబ్లీ బస్టాండ్ వరకు ఆర్టీసీ లగ్జరీ, సూపర్ లగ్జరీ, రాజధాని బస్సులపై ప్రయాణించిన వారికి డ్రాలో పాల్గొనే అవకాశం కల్పించింది. దీంతో సదరు ప్రయాణికులు తమ టికెట్ల వెనుకాల తమ ఫోన్ నంబర్లను రాసి, బస్టాండ్లోని లక్కీడ్రా పెట్టెలో వేశారు. జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లోగల ఆర్ఎం కార్యాలయంలో ఇటీవల డ్రా తీశారు. విజేతలకు శుక్రవారం ఏసీపీ రాజా వెంకట్రెడ్డి చెక్కులు అందించారు. మొదటి బహమతి కింద యస్.చంద్రయ్యకు రూ.25 వేలు, రెండో బహుమతి కింద షేక్ బాబర్కు రూ.15 వేలు, మూడో బహుమతి కింద రాంప్రసాద్కు రూ.10వేలు అందించారు. కార్యక్రమంలో ఆర్ఎం జోత్స్న, డిప్యూటీ రీజినల్ మేనేజర్ మధుసూదన్, పరమాత్మ, ఆనంద్ బాబు, డీఎం–1 ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
670 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
● కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించాలి ● కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి వర్ని: రైతులు పండించిన వరి ధాన్యాన్ని సేకరించేందుకు జిల్లావ్యాప్తంగా 670 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వెల్లడించారు. మోస్రా, చందూర్, వర్ని మండల కేంద్రాల్లో శుక్రవారం ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జిల్లాలో 300 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, ఆయా ప్రాంతాల అవసరాలను బట్టి రైతులకు లబ్ధి చేకూర్చేందుకు మరిన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. రైతులు తెచ్చిన ధాన్యం నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉన్నట్లయితే వెంటనే తూకం జరిపి నిర్ధేషిత రైస్ మిల్లులకు పంపిస్తామన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించిన పూర్తి వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని, రైతులకు సంబంధిత రసీదు అందజేయాలని, క్రాప్ బుకింగ్ డేటాలో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. రాక్ సీట్లు వచ్చిన వెంటనే ట్యాబ్ ఎంట్రీలు పూర్తి చేయాలని దీని ద్వారా రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపు జరుగుతుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ధాన్యాన్ని ఆరబెట్టి, శుభ్రపరిచి కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే పూర్తిస్థాయి మద్దతు ధర పొందవచ్చునన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సివిల్ సప్లయ్ డీఎం శ్రీకాంత్ రెడ్డి, సహకార శాఖ అధికారి అంబర్ సింగ్, వర్ని ఏఎంసీ చైర్మన్ సురేష్ బాబా పాల్గొన్నారు. -
గాలికుంటు వ్యాధికి టీకాతో చెక్
● జిల్లాలో ప్రారంభమైన పశువులకు వ్యాక్సినేషన్ ● ఈనెల 15 నుంచి నవంబర్ 14 వరకు కొనసాగనున్న కార్యక్రమం బోధన్రూరల్/ఆర్మూర్: పాడిరంగంలో అభివృద్ధి సాధించాలంటే పాడి పశువుల సంపూర్ణ ఆరోగ్యం అత్యంత కీలకమైనది. అలాంటిది పాడి పశువులకు గాలికుంటు వ్యాధి సోకితే తీవ్రమైన నష్టాలను చవిచూడాల్సివస్తుంది. వ్యాధి సోకిన పశువులు నీరసించిపోవడంతోపాటు, పాలదిగుబడి తగ్గిపోతుంది. దీంతో ఈ వ్యాధిని నివారించడానికి గేదె, ఆవు జాతి పశువులకు ప్రతియేటా ఉచితంగా వ్యాధి నివారణ టీకాలను వేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం ఈనెల 15న ఈ టీకాల కార్యక్రమం ప్రారంభం కాగా, నవంబర్ 14 వరకు కొనసాగనుంది. జిల్లాలో మొత్తం 82 టీంలను ఏర్పాటు చేసి ప్రాంతాల వారీగా పాడి పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నారు. జిల్లాలోని పశువులు ఇలా.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 2019లో చేపట్టి పశు గణాంకాల ప్రకారం జిల్లాలో గేదె జాతి పశువులు 2లక్షల 6వేల 898 ఉండగా, గో జాతి (ఆవులు, ఎడ్లు) పశువులు 1లక్ష 1వెయ్యి 252గా ఉన్నాయి. ఇప్పటికే పోషణ కరువై పశువులు, జీవాల సంఖ్య సుమారు 20 శాతం వరకు తగ్గిందని అధికారులు పేర్కొంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి రహిత జిల్లాగా మార్చడానికి ప్రస్తుతం పశువులకు టీకాలు వేస్తూ విశేష కృషి చేస్తోంది. గాలికుంటు వ్యాధిని నివారించగలిగితే ప్రత్యక్షంగా పశువుకి వ్యాధి వల్ల కలిగే బాధ నుండి ఉపశమనంతో పాటు ఆ పశువు పైన ఆధారపడిన రైతుకి ఆర్థిక స్వావలంబన చేకూరనుంది. -
జిల్లాకు వ్యవసాయ కళాశాల
డొంకేశ్వర్(ఆర్మూర్) : వ్యవసాయాధారిత జిల్లాగా పిలువబడే నిజామాబాద్లో వ్యవసాయ కళాశాల ఏర్పాటు కానుంది. ఈ మేరకు గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది ఏర్పాటైతే విద్యార్థులకు, రైతులకు బహుళ ప్రయోజనాలు కలుగనున్నాయి. వ్యవసాయ రంగానికి మరింత ఊతం ఇచ్చినట్లు అవుతుంది. ఐతే, అగ్రి కోర్సులు చేసే నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల్ విద్యార్థులకు వ్యవసాయ కళాశాల వరమనే చెప్పవచ్చు. తెలంగాణ యూనివర్సిటీలో ఇటీవల ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇప్పుడు వ్యవసాయ కళాశాలను తేవడం నిజామాబాద్కు మరింత వన్నె తెస్తుంది. వ్యవసాయ కళాశాలను కూడా యూనివర్సిటీ పక్కనే ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో ఎస్సారెస్పీ, నిజాంసాగర్ ప్రాజెక్టులు పంటలకు పుష్కలంగా సాగునీటిని అందిస్తున్నాయి. దీంతో జిల్లాలో ఆరు లక్షల ఎకరాలకు పైగా పంటలు సాగవుతున్నాయి. వరి అత్యధికంగా 4.5 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. పసుపు, మొక్కజొన్న, సోయా, జొన్నలు, సజ్జలు కూడా ఎక్కువగా సాగవుతున్నాయి. జిల్లాలో పండించిన పంటలు ఇతర ప్రాంతాలు, దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. రాష్ట్రంలో అత్యధిక పంటలు, రైతులు ఉన్న జిల్లాల్లో ఒకటిగా నిజామాబాద్ ఉంది. అందుకే ఇక్కడ వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు డిమాండ్ ఏర్పడింది. ప్రజాప్రతినిధుల చొరవతో కేబినెట్ ద్వారా ఇప్పుడు ఆమోద ముద్ర పడింది. చెరుకు పరిశ్రమలు అలాగే రుద్రూర్ కృషి విజ్ఞా కేంద్రం, కమ్మర్పల్లి పసుపు పరిశోధన కేంద్రాలకు తోడుగా వ్యవసాయ కళాశాల రావడంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఎంచక్కా విద్య... స్థానికంగా పరిశోధన... ఇందూరు కేంద్రంగా వ్యవసాయ కళాశాల ఏర్పాటైతే చుట్టు పక్కనున్న జిల్లాల విద్యార్థులు నిజామాబాద్లోనే వ్యవసాయ కోర్సులు పూర్తి చేయడానికి అవకాశం ఉంది. వ్యవసాయ కోర్సులు చేయాలంటే హైదరాబాద్లోని రాజేంద్రనగర్, జగిత్యాల ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అంతదూరం వెళ్లి చదువు, పరిశోధనలు చేయాలంటే విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. ఇప్పుడు నిజామాబాద్ వ్యవసాయ కళాశాలలోనే పట్టభద్రులుగా, పరిశోధకులుగా, ప్రొఫెసర్లుగా తయారు కావొచ్చు. వ్యవసాయానికి అనువుగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో పంటలపై ప్రయోగాలు సులువుగా చేయాడానికి వీలుంటుంది. కొత్త వంగడాలు ఇక్కడి వాతావరణానికి అనుకూలంగా తయారు చేయవచ్చు. రైతులు, ఆదర్శ రైతులు కూడా కళాశాలను సందర్శించి శాస్త్రవేత్తలను కలిసి వ్యవసాయంలో కొత్త పద్ధతులను తెలుసుకోవచ్చు. వ్యవసాయ, ఇతర అనుబంధ శాఖలకు కూడా అగ్రి కాలేజీ బలాన్ని చేకూరుస్తుందని చెప్పవచ్చు. భవిష్యత్తులో రాష్ట్రానికి, దేశానికి ఇక్కడి నుంచే వ్యవసాయానికి ఊపిరిలూదే అవకాశం లేకపోలేదు.Ýë„ìS {糆-°«¨, °gê-Ð]l*»ê§Šæ : ï³ïÜïÜ A«§ýlÅ-„ýS$yýl$ »ŸÐ]l$à Ð]l$õßæÔŒæ MýS$Ð]l*ÆŠæ VúyŠæ Ý÷…™èl hÌêÏOò³ ™èl¯]lO§ðl¯]l Ð]l¬{§ýl ÐólçÜ$¢-¯é²Æý‡$. VýS™ólyé¨ ï³ïÜïÜ `‹œ V> »ê«§ýlÅ-™èlË$ ¡çÜ$-MýS$¯]l² çÜÐ]l$-Ķæ$…ÌZ C_a¯]l àÒ$-ÌS¯]l$ Ð]lÆý‡$-çÜV> ¯ðlÆý‡-ÐólÆý‡$-çÜ$¢¯é²Æý‡$. Cç³µ-sìæMóS ™ðlÌS…-V>׿ ĶæÊ°-Ð]l-ÇÞsîæÌZ C…h-±-Ç…VŠæ MýSâê-Ô>ÌS Ð]l$…þÆý‡$ ^ólƇ$$…-^éÆý‡$. ™égêV> C糚yýl$ Ð]lÅÐ]l-ÝëĶæ$ MýSâê-Ô>ÌS Ð]l$…þÆý‡$ ^ólƇ$$…-^éÆý‡$. VýS$Æý‡$ÐéÆý‡… fÇ-W¯]l MóS¼-¯ðlsŒæ çÜÐ]l*-Ðól-Ôèæ…ÌZ Æ>çÙ‰…ÌZ Ð]lÊyýl$ ^ørÏ Ð]lÅÐ]l-ÝëĶæ$ MýSâê-Ô>-ÌSË$ Ð]l$…þÆý‡$ ^ólçÜ*¢ °Æý‡~Ķæ$… ¡çÜ$-MýS$¯é²Æý‡$. Ð]l¬QÅ-Ð]l$…{† °Äñæ*-f-MýSÐ]lÆý‡Y… Möyýl…VýSÌŒæ, E™èl¢ÐŒl$ MýS$Ð]l*ÆŠæ Æð‡yìlz °Äñæ*-f-MýS-Ð]lÆý‡Y… çßæ$kÆŠæ ¯]lVýSÆøÏ, Ð]l$õßæÔŒæ VúyŠæ MýS–íÙ™ø °gê-Ð]l*»ê§Šæ hÌêÏÌZ HÆ>µ-r$MýS$ °Æý‡~Ƈ$$…-^éÆý‡$. yìl^Œl ç³ÍÏ Ð]l$…yýl-ÌS…ÌZ° ™ðlÌS…-V>׿ ĶæÊ°-Ð]l-ÇÞsîæ ç³MýSP¯]l Æý‡*.124 MørÏ °«§ýl$-ÌS™ø Ð]lÅÐ]l-ÝëĶæ$ MýSâê-Ô>ÌS HÆ>µ-r$MýS$ °Æý‡~-Ƈ$$…-^éÆý‡$. CMýS Ñ$W-ͯ]l Ð]l$Æø àÒ$ ™èlÓÆý‡ÌZ ¯ðlÆý‡-Ðól-Æý‡$-Ý뢯]l° Ð]l$õßæÔŒæ VúyŠæ "Ýë„ìS'MìS ™ðlÍ-´ëÆý‡$. «§ýlÆý‡Ã-ç³#-Ç&-Mö…yýl-VýS-r$t&-ÐólÐ]l¬ÌS-Ðé-yýl&-Í…-»ê{¨ VýS$rt&-»ê-çÜÆý‡ sñæ…ç³#ÌŒæ Æøyýl$z Æý‡çßæ§éÇ °Æ>Ã׿… MøçÜ… Æý‡*.450 Mør$Ï Ð]l$…þÆý‡$ ^ólƇ$$…^ól…§ýl$MýS$ Cç³µ-sìæMóS {ç³™ólÅ-MýS…V> {糆-´ë§ýl-¯]lË$ ^ólíÜ-¯]lr$Ï õ³ÆöP-¯é²Æý‡$. ఆమోదం తెలిపిన రాష్ట్ర కేబినెట్ ఏర్పాటైతే వ్యవసాయ రంగానికి మరింత ఊతం విద్య, పరిశోధనలతో పాటు కొత్త వంగడాల సృష్టికి అవకాశం -
నిజామాబాద్
‘సాక్షి’ గొంతు నొక్కేందుకు కుట్రలువాతావరణం ఆకాశం మేఘావృతమవుతుంది. చల్లనిగాలులు వీస్తాయి. మబ్బులతో కూడిన ఎండ ఉంటుంది.ఇళ్ల నిర్మాణాలను.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం శ్రీ 17 శ్రీ అక్టోబర్ శ్రీ 2025– IIలో uసాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ నిరంతరం అక్షరయజ్ఞం చేస్తున్న ‘సాక్షి’ దినపత్రికపై అక్రమ కేసులు బనాయించి గొంతు నొక్కేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కు ట్రలు చేస్తోంది. ఈ అన్యాయాలను, కుట్రలను అ న్ని వర్గాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. సా మాజిక రుగ్మతలపై, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం పాటుపడుతున్న ‘సాక్షి’ పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి మీద వరుసగా కేసులు పెడు తుండడంతోపాటు విచారణల పేరిట వేధింపుల కు గురిచేయడం పట్ల చంద్రబాబు ప్రభుత్వంపై సర్వత్రా వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో ప లువురు ప్రజాసంఘాల నాయకులు ‘సాక్షి’పై చే స్తున్న కక్షసాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను ఎండగట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు నిజామాబాద్ నగరపాలక సంస్థ కూడలిలో నిరసన కార్యక్రమం జరుగనుంది. జర్నలిస్టు, రా జకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక, విద్యార్థి, యువజన సంఘాలు పాల్గొననున్నాయి.సాక్షి పత్రికపై ఏపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడం సరికాదు. వాస్తవాలు ప్రజలకు చేరవేసే సాక్షి వంటి ప్రజా పత్రికా విలేఖరులపై అక్రమ కేసులు బనాయించడమంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతోంది. ఏపీ ప్రభుత్వ చర్యలను సీపీఐ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో దాడులు, భయభ్రాంతులకు గురిచేయడం హేయమైన చర్యలు. – ఓమయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి పత్రికలు ప్రజాసమస్యలు వెలికితీసి పరి ష్కారానికి కృషి చేస్తాయి. ప్రజా సమస్యలను సాక్షి పత్రిక బయటపెడుతుంటే ఏపీలోని కూటమి ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోంది. ఏపీ ప్రభుత్వం విద్య, వైద్యాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించకుండా పత్రికలు ప్రజాపక్షం వహిస్తే అ క్రమ కేసులు బనాయించి భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ కుట్రలను ప్రజాస్వామికవాదులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. సాక్షిపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలి. – ముస్కె సుధాకర్, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రజా సమస్యలపై ప్రజలను చైతన్య పరుస్తున్న పత్రికలపై ప్రభుత్వాలు కక్ష కట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. పత్రికా స్వేచ్ఛను హరించడం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొత్తకాదు. సాక్షి పత్రికపై, ఎడిటర్, రిపోర్టర్లపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. కేసులు ఉపసంహరించునేవరకు ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారు. – వి.ప్రభాకర్, సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ ప్రజాపంథ రాష్ట్ర నాయకుడు పత్రికలపై కేసులు పెట్టి భయభ్రాంతుల కు గురి చేయడం సరికాదు. సాక్షి పత్రికపై పదే పదే నకిలీ కేసులు పెట్టి వే ధించడాన్ని ప్రజాస్వామ్యవాదులు, మేధావులు తీవ్రంగా ఖండిస్తున్నారు. పత్రికల్లో తప్పుడు కథనాలు వస్తే సంజాయిషీ అడగవచ్చు, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్ర యించవచ్చు తప్ప తప్పుడు కేసులు పెట్టి వేధించడం సరికా దు. నిరంకుశత్వంతో అణగదొక్కుతామంటే ప్రజలు చూ స్తూ ఊరుకోరు. ప్రజల నుంచి తీవ్ర నిరసనను పాలకులు ఎదుర్కోక తప్పదు. – రమేశ్బాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి -
లిక్కర్కు మహా కిక్కు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : 2025–27 సంవత్సరాలకు గాను మద్యం దుకాణాల టెండర్ల దరఖాస్తులకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన గడువు శనివారంతో ముగియనుంది. లాటరీ పద్ధతిలో కేటాయించే దుకాణాల టెండర్లకు ఎకై ్సజ్ శాఖ గత నెల 26 నుంచి ఈ నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 102 మద్యం దుకాణాలు ఉండగా, కామారెడ్డి జిల్లాలో మొత్తం 49 దుకాణాలు ఉన్నాయి. వీటికి 2023–25 సంవత్సరాలకు సంబంధించి 5,963 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో నిజామాబాద్ జిల్లాలోని దుకాణాల కోసం 3,759 దరఖాస్తులు, కామారెడ్డి దుకాణాలకు సంబంధించి 2,204 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ దరఖాస్తుల్లో 95 శాతం చివరి రెండు రోజుల్లోనే వచ్చాయి. అందువల్ల గతంలో మాదిరిగానే ఈసారి కూడా చివరి రెండు రోజుల్లో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో 1,106 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో నిజామాబాద్ జిల్లా దుకాణాల కోసం 687 దరఖాస్తులు, కామారెడ్డి దుకాణాల కో సం 419 దరఖాస్తులు వచ్చాయి. అయితే 1,106 ద రఖాస్తుల్లో 422 దరఖాస్తులు గు రువారం ఒక్కరోజు వచ్చినవే కావడం గమనార్హం. దీన్నిబట్టి చివరి రెండు రోజుల్లో భారీగా దరఖాస్తులు రానున్నట్లు అంచనా. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా చివరి రెండు రోజుల్లో దరఖాస్తులు వెల్లువెత్తనున్నాయి. ఇందుకు తగినట్లుగా అన్ని ఏర్పాట్లు చేశాం. ఈనెల 18న అర్ధరాత్రి వరకు దరఖాస్తులు స్వీకరిస్తాం. సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి సైతం టెండర్లు వేసేందుకు ఆసక్తి చూపుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. బోధన్, బిచ్కుంద దుకాణాలకు సంబంధించి మహారాష్ట్ర వారి నుంచి దరఖాస్తులు మరింతగా వస్తాయని భావిస్తున్నాం. – సోమిరెడ్డి, ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ బోధన్, జుక్కల్ నియోజకవర్గాల్లోని వైన్స్లపై మహారాష్ట్ర వ్యాపారుల ఆసక్తి తెలంగాణతో పోలిస్తే పొరుగు రాష్ట్రంలో మద్యం ధర ఎక్కువ ఉండటమే కారణం నేడు, రేపు మద్యం దుకాణాల కోసం టెండర్ల జాతర ! -
కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి
సుభాష్నగర్ : రాష్ట్రంలో వరి కోతలు మొదలు పెట్టి 15 రోజులు కావస్తున్నా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించలేదని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య అన్నారు. యుద్ధప్రాతిపదికన కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వర్షానికి ధాన్యం తడిసిపోతోందన్నా రు. రైతులు గత్యంతరం లేక క్వింటాలుకు రూ. 1600 నుంచి రూ.1700 వరకు దళారులకు అమ్ము కుని తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. తరుగు పేరు తో అధికారులు, రైస్మిల్లర్లు కుమ్మకై ్క రైతులను మోసం చేస్తున్నా రని, సీఎంఆర్ ఇవ్వని రైస్మిల్లులను బ్లాక్ లిస్టులో పెట్టాల్సి ఉన్నా అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. యాసంగి పంటకు బోనస్ డబ్బులు చెల్లించాలన్నారు. సమావేశంలో కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు శ్రీనివాస్రెడ్డి, సీనియర్ నాయకులు న్యాలం రాజు, లక్ష్మీనారాయణ, హరీశ్ రెడ్డి, పంచరెడ్డి శ్రీధర్, శ్రీనివాస్, ఇప్పకాయల కిషోర్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు. -
డీలర్ల పరేషన్
● కమీషన్ కోసం ఎదురుచూపులు ● ఐదు నెలలుగా పెండింగ్ ● జిల్లాలో రూ.3 కోట్లకుపైనే బకాయిలు సుభాష్నగర్ : ప్రజాపంపిణీ పథకం కింద పేదలకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న డీలర్లు కమీషన్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ఐదు నెలలుగా కమీషన్ డబ్బులు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని డీలర్లకు ఐదు నెలలకు సంబంధించి రూ.3 కోట్లకుపైనే బకాయిలు పేరుకుపోయాయి. జిల్లాలో 759 రేషన్దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా 4,47,788 వరకు కార్డుదారులకు బియ్యం పంపిణీ అవుతోంది. ప్రతినెలా సుమారు 7,650 మెట్రిక్ టన్నుల బియ్యం డీలర్లు పంపిణీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి రేషన్షాపుల డీలర్లకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.140 చొప్పున కమీషన్ చెల్లిస్తోంది. ప్రభుత్వం కొత్త రేషన్కార్డుల పంపిణీ, సభ్యుల చేరికతో గత మూడు నెలల నుంచి అన్ని దుకాణాల్లో బియ్యం కోటా పెరిగింది. మార్చి వరకు సజావుగా కమీషన్ డబ్బులు జమ చేసిన ప్రభుత్వం.. ఇటీవల ఏప్రిల్ కమీషన్ జమ చేసింది. మే నుంచి సెప్టెంబర్ వరకు బకాయిలు పేరుకుపోయాయి. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త నిబంధనల ప్రకారం వేర్వేరుగా కమీషన్ జమ చేస్తుండటంతో డీలర్లు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. రేషన్డీలర్లకు అక్టోబర్ 1లోపు పెండింగ్లో ఉన్న కమీషన్ డబ్బులు జమ చేయాలి. కమీషన్ కోసం ఇప్పటికే సంబంధిత మంత్రితో పాటు కమిషనర్ను కలిసి విన్నవించాం. అయినా స్పందించడంలేదు. దీపావళి తర్వాత రాష్ట్ర కమిటీతో చర్చించి బియ్యం పంపిణీని నిలిపివేసే ఆలోచనలో ఉన్నాం. అదేవిధంగా ప్రతినెలా ఒకటో తేదీనే కమీషన్ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. కమీషన్ను పెంచే విధంగా చర్యలు చేపట్టాలి. – అతిమల నగేష్, జిల్లా అధ్యక్షుడు, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘంఆర్థిక ఇబ్బందుల్లో డీలర్లు ఐదు నెలలుగా కమీషన్ డబ్బులు జమ చేయకపోవడంతో డీలర్లు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. దుకాణాల అద్దె, బియ్యం సరఫరా కు అవసరమైన సిబ్బంది జీతం, ఎంఎల్ఎస్ పా యింట్ నుంచి లారీల్లో వచ్చిన బియ్యాన్ని దుకా ణాల్లో దిగుమతి చేసిన హమాలీల చార్జీల చెల్లింపు, తదితర ఆర్థికపరమైన అంశాల్లో డీలర్లు సతమతమవుతున్నారు. మరోవైపు ప్రభుత్వం మే నెల కమీషన్ పెండింగ్లో ఉంచడంతోపాటు, జూన్, జూలై, ఆగస్ట్ నెలల బియ్యం వర్షాల నేపథ్యంలో ఒకేసారి జూన్ నెలలోనే సరఫరా చేసేసింది. ఆ మూడు నెలలతోపాటు సెప్టెంబర్ కమీషన్ కూడా బకాయి ఉంది. ఐదు నెలల కమీషన్ డబ్బులు జమ కాకపోవడంతో అప్పుల పాలు కావాల్సి వస్తోందని రేషన్డీలర్లు వాపోతున్నారు. -
అభిప్రాయ సేకరణ.. ఆసక్తికరం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి పార్టీ నాయకత్వం చేపట్టిన వడపోత కార్యక్రమం జిల్లాలో రోజురోజుకూ ఆసక్తిని మరింతగా పెంచుతోంది. పైగా పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లా కావడంతో ఉత్కంఠ కలిగిస్తోంది. ఈ సీటును బీసీకి అప్పగిస్తారా.. ఓసీకి కేటాయిస్తారా అనే విషయంలో కచ్చితమైన నిర్ణయానికి రాకపోయినప్పటికీ ఏఐసీసీ పరిశీలకుడు, కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ ప్రతి అంశాన్ని కూలంకశంగా పరిశీలిస్తున్నారు. ఈ పీఠం కోసం పోటీలో ఉన్నవారితో ఇప్పటికే ఈ నెల 14న ఒకసారి ముఖాముఖి నిర్వహించారు. తాజాగా గురువారం మరోసారి ముగ్గురితో ముఖాముఖి నిర్వహించారు. బాడ్సి శేఖర్గౌడ్, మార చంద్రమోహన్రెడ్డి, బాస వేణుగోపాల్యాదవ్లతో పరిశీలకుడు రిజ్వాన్ అర్షద్ ముఖాముఖి మాట్లాడారు. శుక్రవారం కాటిపల్లి నగేష్రెడ్డితో ముఖాముఖి నిర్వహించనున్నారు. పరిశీలకుడు ఆయా నియోజకవర్గాల వారీగా అందులో బ్లాకులవారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సీనియర్ నాయకులతో మాట్లాడి మొదటి, రెండో ప్రాధాన్యత అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. డీసీసీ ఎన్నికపై నియోజకవర్గాలవారీగా సమావేశాలు ఇప్పటికే బోధన్, ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ అర్బన్లలో పూర్తి నేడు నిజామాబాద్ రూరల్లో, రేపు బాన్సువాడలో.. నియోజకవర్గాల్లో మారుతున్న సీనియర్ల ప్రాధాన్యతలు -
డిప్యుటేషన్లు, బదిలీలకు దరఖాస్తులు
ఖలీల్వాడి : జిల్లాలోని లోకల్ కేడర్ తాత్కాలిక డిప్యుటేషన్లు, బదిలీల కోసం అర్హత కలి గిన ఉద్యోగులు ఆన్లైన్లో దరఖాస్తులు చే సుకోవాలని డీఈవో అశోక్ కుమార్ ఒక ప్రక టనలో తెలిపారు. జీవో నెంబర్ 190, జనర ల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంట్ జీవో నెంబ ర్ 190 ప్రకారం సబ్–కమిటీ సిఫార్సులలో ఉన్న సబ్జెక్టు ఖాళీలకు లోబడి దరఖాస్తులకు ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు. పాఠశాల విద్య (ఎస్పీఎఫ్ఐఐ) జీవో నెంబ ర్ 25ను ఈనెల 12న ఉత్తర్వులు జారీ చేసిన ట్లు చెప్పారు. నిబంధనల ప్రకారం జిల్లాలో ని బోధన, బోధనేతర ఉద్యోగులు అక్టోబర్ 17 నుంచి 24 వరకు ఇంటర్ లోక ల్ కేడర్ తాత్కాలిక డిప్యుటేషన్ల కోసం schooledu. telangana.go.in పోర్టల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులు ● రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిజామాబాద్అర్బన్ : నూతన ఓటర్లకు గు ర్తింపు కార్డులను తపాలా శాఖ ద్వారా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూ చించారు. గురువారం హైదరాబాద్ నుంచి ఇతర అధికారులతో కలిసి సీఈవో సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్న్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో 100 సంవత్సరాల వయసు కలిగిన ఓటర్లను గుర్తించి వారి వయసును తగిన ఆధారాలతో సమర్పించాలన్నారు. బూత్ స్థాయి అధికారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని, ఫారం 6, 7, 8 దరఖాస్తులను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెనన్స్లో కలెక్టర్ టి వినయ్ కష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, ఏవో ప్రశాంత్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా మాక్లూర్ మండల కేంద్రంలోని ప్రభు త్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.కోటి విరాళం ఇచ్చారు. గురువారం ఆ యన తన సోదరుడు బిగాల మహేశ్తో కలి సి కలెక్టరేట్కు వచ్చి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో అశోక్ పాల్గొన్నారు. -
సిర్పూర్ కాగజ్నగర్లో రుద్రూర్వాసి మృతి
రుద్రూర్: మండల కేంద్రానికి చెందిన కర్రోళ్ల శ్రీనివాస్ (53) అనే వ్యక్తి గురువారం కుమురం భీం జిల్లా సిర్పూర్ కాగజ్నగర్ రైల్వేస్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు రైలు కింద పడి దుర్మరణం చెందినట్టు స్థానికులు తెలిపారు. కూలి పని నిమిత్తం పది రోజుల క్రితం వెళ్లిన శ్రీనివాస్ మృతి చెందాడన్న సమాచారం తెలుసుకున్న బంధువులు సిర్పూర్ కాగజ్నగర్కు బయల్దేరి వెళ్లారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గాంధారి శివారులో మృతదేహం గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్ర శివారులోని గాంధారి–చద్మల్ రహదారి పక్కన గుంతలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గురువారం లభించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. రైతుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి మృతదేహాన్ని పరిశీలించారు. దుండగులు గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి పెట్రోలు పోసి దహనం చేసినట్లు తెలుస్తోంది. మృతదేహం పాక్షికంగా దహనం అయింది. సదాశివనగర్ సీఐ సంతోష్ కుమా ర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్స్క్వాడ్ను రప్పించి విచారణ చేశారు. మృతదేహాన్ని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 30–35 ఏళ్ల మధ్య ఉంటుందని, నీలిరంగు జీన్ ప్యాంటు, తెల్లని బనియన్, నల్లచారలు కల్గిన తెల్లచొక్కా ధరించి ఉన్నాడు. సంబంధీకులు ఎవరైనా 8712686165, 8712686163 నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలని తెలిపారు. తిరుమలయ్య ఆలయంలో చోరీ ఇందల్వాయి: నల్లవెల్లి గ్రామంలోని తిరుమలయ్య స్వామి ఆలయంలో బుధవారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. 6 గ్రాముల బంగారు, 4 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు ఎస్సై సందీప్ కుమార్ తెలిపారు. వీడీసీ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తాళం వేసిన ఇంట్లో .. నిజామాబాద్ రూరల్: మండలంలోని గుండారం గ్రామంలో తాళం వేసిన ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడిన ఘటన గురువారం వెలుగుచూసింది. రూరల్ ఎస్హెచ్వో మహ్మద్ ఆరీఫ్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండారం గ్రామానికి చెందిన స్వర్గం లక్ష్మి అదే గ్రామంలోని బంధువుల ఇంట్లో బుధవారం రాత్రి నిద్రించింది. ఇదే అదనుగా భావించిన దుండగులు లక్ష్మి ఇంటి తాళం పగులగొట్టి 2 గ్రాముల బంగారం, 10 తులాల వెండి అపహరించారు. అయితే, చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. నిజామాబాద్ అర్బన్: నగరంలోని దుబ్బ ప్రాంతంలో అనుమతి లేకుండా టపాకాయలు విక్రయిస్తున్న దుకాణంపై మూడో టౌన్ పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు కలిసి గురువారం దాడులు చేశారు. రూ. మూడు లక్షల విలువచేసే 29 రకాల టపాకాయలను సీజ్ చేసినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. నిబంధనలు పాటించకుండా రాఘవ ఉపాధ్యా య అనే వ్యక్తి టపాకాయలు విక్రయిస్తున్నట్లు వారు తెలిపారు. కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. -
బీసీ బంద్కు అఖిలపక్షం మద్దతు
నిజామాబాద్నాగారం: రాష్ట్రవ్యాప్త బీసీ బంద్కు అఖిలపక్ష పార్టీల మద్దతు ఉందని బీసీ జేఏసీ ప్రతినిధులు తెలిపారు. నగరంలోని గీతాభవన్లో గురువారం ఏర్పాటు చేసిన రౌండ్టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 18న తలపెట్టిన బీసీ బంద్కు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ ప్రజాపంథా, ఎంఐఎం పార్టీలు, కుల సంఘాలు, ప్రజాసంఘాలు, డాక్టర్లు, లాయర్లు, జర్నలిస్టులు మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. అన్ని సంఘాలు ప్రత్యక్షంగా బంద్లో పాల్గొంటామని బీసీ జేఏసీకి హామీ ఇచ్చాయని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యే వరకు శాంతియుత ఉద్యమం చేస్తామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ చైర్మన్ పోతనకర్ లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ బొబ్బిలి నర్సయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్న గారి విఠల్రావు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్, కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్, సీపీఐ నగర కార్యదర్శి ఓమయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, ఆయా పార్టీలు, కుల సంఘాల, డాక్టర్స్, పీఎంపీ, స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. గోడప్రతుల ఆవిష్కరణ రాష్ట్ర బీసీ జేఏసీ బంద్కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. గురువారం బంద్కు సంబంధించిన గోడపత్రులను ఆయన ఆవిష్కరించా రు. బీసీలంటే తనకు ఎనలేని గౌరవమని, వారి కో సం తాను ముందు వరుసలో ఉండి న్యాయం చేసే లా చూస్తానని అన్నారు. కార్యక్రమంలో నరాల సుఽ దాకర్తోపాటు బుస్స ఆంజనేయులు, ఆకుల ప్రసా ద్, దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, బసవసాయి చంద్రకాంత్, చైతన్య పాల్గొన్నారు. -
ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● అధికారుల అలసత్వంపై ఆగ్రహంనిజామాబాద్అర్బన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి కనిపించేలా క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. లక్ష్య సాధనకు కృషి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, డబుల్ బెడ్రూంల పంపిణీ ప్రక్రియపై కలెక్టర్ గురువారం ఎంపీడీవోలు, ఎంపీవోలు, హౌసింగ్ ఏఈలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సుదీర్ఘ సమీక్ష జరిపారు. మండలాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణాలలో వెనుకంజలో అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తూ, నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం స్పష్టమైన దిశానిర్దేశం చేస్తున్నప్పటికీ, ఎందుకు పురోగతి సాధించడం లేదని మండిపడ్డారు. మంజూరీలు పొందిన వారందరూ తక్షణమే ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా లబ్ధిదారులను ప్రోత్సహిస్తూ, క్షేత్రస్థాయిలో పక్కాగా పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఉచిత ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని సూచించారు. సమీక్షలో ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, జెడ్పీ డిప్యూటీ సీఈవో సాయన్న తదితరులు పాల్గొన్నారు. సర్వేలో భాగస్వాములు కావాలి రానున్న రోజులలో రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభు త్వం తెలంగాణ రైజింగ్ విజన్–2047 అంశాలతో డాక్యుమెంటును రూపొందిస్తోందని, ఈ సర్వేలో ఉద్యోగులు, అన్నివర్గాల వారు భాగస్వాములు కావాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందిస్తున్న ఈ విజన్ 2047 డాక్యుమెంట్ తయారీలో ప్రతి ఒక్క పౌరుడు పాల్గొనేలా సిటిజన్ సర్వే చేపట్టారన్నారు. ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగే సర్వేలో ఉద్యోగులు పాల్గొనడంతోపాటు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. జిల్లా పౌరులు http//www.telangana.gov.in/ telanganarising/ అనే లింక్ ద్వారా సర్వేలో పాల్గొనాలని కలెక్టర్ కోరారు. -
వరద గేట్ల మూసివేత
బాల్కొండ: ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వరద గేట్లను అధికారులు మూసివేశారు. రెండ్రోజుల నుంచి ప్రాజెక్ట్లోకి ఇన్ఫ్లో తగ్గుతూ, పెరుగుతూ ఉండటంతో గోదావరిలోకి నీటి విడుదలను పెంచుతూ.. తగ్గించారు. గురువారం ఉదయం వరద మరింత తగ్గడంతో గేట్లను మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్లోకి 9,654 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ వ్వారా 5 వేలు, ఎస్కేప్ గేట్ల ద్వారా 3 వేలు, సరస్వతి కాలువ ద్వారా 650, లక్ష్మి కాలువ ద్వారా 200, ఆవిరి రూపంలో 573, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా గురువారం సాయంత్రానికి నిండుకుండలా ఉందని అధికారులు తెలిపారు. ● ఎస్సారెస్పీలోకి తగ్గిన ఇన్ఫ్లో ● గోదావరిలోకి నిలిచిన నీటి విడుదల మూసి ఉన్న ఎస్సారెస్పీ వరద గేట్లు -
వాహనాల చోరీ నిందితుల అరెస్టు
● వివరాలు వెల్లడించిన సీపీ సాయి చైతన్య నిజామాబాద్అర్బన్: జిల్లాలో పలు చోట్ల వాహనా ల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను అ రెస్టు చేసినట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. సీసీ ఎస్ పోలీస్స్టేషన్లో సీపీ గురువారం వివరాలు వెల్లడించారు. కొందరు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్ప డి బోధన్, నిజామాబాద్, ఆర్మూర్, ముథోల్లో ఆటోలు, బైక్లను చోరీ చేసి కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆటోనగర్కు చెందిన షేక్ ఫజల్, మహ్మద్ నవాజ్ను అదుపులోకి తీసుకొని విచారించగా షేక్అలీ, వహిద్, అలీమ్లతో కలిసి 9 ఆటోలు, మూడు బైక్లు చోరీ చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. అపహరించిన వాహనాలను కోరుట్లలో విక్రయించినట్లు పేర్కొన్నారు. దొంగ వాహనాలను కొనుగోలు చేసిన మహ్మద్ ఇమ్రాన్, మహ్మద్ ఇలియాస్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో ముగ్గురిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కేసును త్వరిగతిన ఛేదించిన సీసీఎస్ ఏసీపీ నగేంద్రచారి, సీఐ సాయినాథ్, ఇతర పోలీసు సిబ్బందిని సీపీ అభినందించారు. -
మొక్కజొన్న తూకంలో మోసం
● రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ వ్యాపారులు భిక్కనూరు: మండలంలోని గుర్జకుంట గ్రామంలో తూకంలో మోసం చేస్తూ వ్యాపారులు పట్టుబడ్డ ఘటన గురువారం చోటుచేసుకుంది. గాంధారి ప్రాంతానికి చెందిన గిరిజన వ్యాపారులు భిక్కనూరు మండలం గుర్జకుంటలో ఒక ఏజెంట్ను పెట్టుకొని మొక్కజొన్నలను కోనుగోలు చేస్తున్నారు. మొక్కజొన్న బస్తాను 62 కిలోల చొప్పున తూకం వేస్తున్నట్లు రైతులను నమ్మించి 72 కిలోల మొక్కజొన్నలను బస్తాలో నింపి వాహనాల్లో వేశారు. రైతులకు అనుమానం రావడంతో తూకం వేసే ఎలక్ట్రానిక్ కాంటా 10కిలోలు మైనస్లో చూపించడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెంట్ను, గాంధారి వ్యాపారులను నిలదీశారు. ఒక దశలో తూకంలో మోసానికి పాల్పడిన వారిని చెట్లకు కట్టివేయాలని పలువురు రైతుల యత్నించగా మిగతా రైతులు వారిని సముదాయించారు. చివరికి వ్యాపారులకు జరిమానా విధించి వదిలిపెట్టారు. -
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
మాక్లూర్: చదువులో వెనుకబడి ఉన్నానన్న మనస్తాపంతో మండలంలోని చిక్లీ గ్రామానికి చెందిన దీమర వెంకట్(16) గురువారం సాయంత్రం గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ కథనం ప్రకారం.. చిక్లీ గ్రామానికి చెందిన దీమర సాయిరెడ్డి, మంజుల కుమారుడు వెంకట్ డిచ్పల్లి మండలం ధర్మారం(బి)లోని ఓ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. చదువులో నెలవారీగా నిర్వహించే కామన్ పరీక్షలలో తోటి స్నేహితుల కంటే తక్కువ మార్కులు వస్తున్నాయన్న బాధతో ఉండేవాడని తెలిపారు. దీపావళి పండుగ కోసం నాలుగు రోజుల ముందే చిక్లీకి వచ్చాడు. గురువారం వెంకట్ గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి సాయిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగాస్థాన్–1 లక్ష్మీనరసింహ అపార్టమెంట్లో గురువారం రాత్రి ఏసీపీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో సీసీఎస్ సీఐ సురేశ్, సాయినాథ్, ఎస్సైగోవింద్ కలిసి పేకాట స్థావరంపై దాడి చేశారు. పేకాడుతున్న 9 మందిని పట్టుకొని, 9 సెల్ ఫోన్లు, రూ.49,250 స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల కోసం రూరల్ ఎస్హెచ్వో మహ్మద్ ఆరీఫ్కు అప్పగించారు. రుద్రూర్లో ముగ్గురు.. రుద్రూర్: మండలంలోని అక్బర్నగర్ శివారులో పేకాట స్థావరంపై బుధవారం రాత్రి ఎస్సై సాయ న్న ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. పేకాడు తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.1100 స్వాధీనం చేసుకున్నారు. కేసు నమో దు చేసినట్టు ఎస్సై సాయన్న తెలిపారు. రెంజల్(బోధన్): మండలంలోని కందకుర్తి శివారులో ఏర్పాటు చేసిన చెక్పోస్టును గురువారం తహసీల్దార్ శ్రావణ్కుమార్ తనిఖీ చేశారు. మహారాష్ట్ర నుంచి ధాన్యం అక్రమంగా జిల్లాలోకి ప్రవేశించకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు రోజుల కిందట చెక్పోస్టును ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో 24 గంటల నిఘా ఉంటుందన్నారు. జిల్లాలో కొనుగోళ్లు పూర్తయ్యే వరకు చెక్పోస్టు కొనసాగుతుందని తెలిపారు. -
జాతీయ స్థాయిలో రాణించాలి
● ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగమణి ● అండర్–17 జిల్లా స్థాయి తైక్వాండో క్రీడాకారుల ఎంపిక నిజామాబాద్నాగారం: క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించి జిల్లాకు బంగారు పతకాలు తేవాలని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగమణి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్నారై కాలనీలో తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ అకాడమీ క్రీడా ప్రాంగణంలో గురువారం అండర్–17 బాలబాలికల విభాగంలో ఎంపికల పోటీలు నిర్వహించారు. ప్రతిభచూపిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. వచ్చే నెలలో నల్గొండ జిల్లాలో అండర్–17 తైక్వాండో పోటీలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో పీడీ ఈశ్వర్, కోచ్ ఫారుకి అబ్దుల్లా, కోచ్లు వినోద్ నాయక్, గయాస్, మనోజ్, వినోద్, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం తైక్వాండో అండర్–17 క్రీడాకారులు నియామక అబ్జర్వర్లను ఘనంగా సన్మానించారు. ఎంపికై న బాలికలు : సారా ఫాతీమా, ఇన్సర్ నూరేన్, జైనాబ్, సాన్వి, సయ్యద్ సిమ్రా ఫాతిమా, అన్సరా మిదాత్, జామ్ల దర్శిని, నివేదిత, వర్షిణి, ఊర్మిళ, నేహ వాసవి, నూరేన్ బాలుర విభాగంలో.. అబ్దుల్ అజాన్షేక్, షేక్ అబ్దుల్లా ఓమర్, రయాన్ అబ్దుల్లా ఫారూఖ్, షేక్ ముస్తాపా రజన్, హరీశ్, ఇబ్రహీం ఎండీ అబ్దుల్, అమాన్ సింగ్, కాంచిపూరం సిద్ధార్థ, షేక్ రిజ్వాన్, రహీం, వేదాన్స్, హుస్సేన్, అమాన్ -
గురుకులాల్లో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరానికి 5 నుంచి 9వ తరగతులలో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకుల విద్యాలయా ల సంస్థ జిల్లా సమన్వయ అధికారి మాధవీలత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 23 ఫిబ్రవరి 2025న నిర్వహించిన ప్రవేశపరీక్షకు విద్యార్థులు హాజరై ఉండాలని పేర్కొన్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో ఏదైనా ప్రభు త్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 4, 5, 6, 7, 8వ తరగతులు పూర్తిచేసి ఉండాలన్నారు. లాటరీ పద్ధతిలో సీట్లు కేటాయిస్తారన్నారు. ఈ నెల 17, 18వ తేదీల్లో హాల్టికెట్, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల ఒరిజనల్, జిరాక్స్ ప్రతులతో డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలి కల పాఠశాల/కళాశాలలో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. నిజామాబాద్ అర్బన్: ఈ నెల 21న నిర్వహించే పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పోలీసులకు సంబంధించిన అంశాలపై షార్ట్ ఫిల్మ్ తీసేందుకు ఆసక్తి ఉన్న ఫొటో, వీడియోగ్రాఫర్లు దర ఖాస్తు చేసుకోవాలని సీపీ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. 2024 అక్టోబర్ నుంచి 2025 అక్టోబర్ వరకు అత్యవసర సమయాల్లో పోలీసుల సేవలు, ప్రకృతి వైపరీత్యాల్లో పోలీసుల విధులు, సైబర్ నేరాలు, ర్యాగింగ్ మత్తు పదార్థాల నిషేధంలో పోలీసుల కృషి తదితర అంశాలపై ఫోటోలు, వీడియోలు ఉండాలన్నారు. వివరాలకు 94400 1827 నెంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. ● ఒక్కటైన ప్రేమజంట నిజాంసాగర్(జుక్కల్): మహ్మద్నగర్ మండలం తెల్గాపూర్ గ్రామానికి చెందిన దనుల రవీందర్, నేపాల్కు చెందిన మాయ ఒక్కటయ్యారు. గురువారం తెల్గాపూర్ గ్రామంలో వేద పండితుడు, గ్రామస్థుల సమక్షంలో ఇద్దరి పెళ్లి సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. తెల్గాపూర్ గ్రామానికి చెందిన దనుల వెంకవ్వ, ఎల్లయ్య దంపతులు రెండో కుమారుడు రవీందర్ ఏడు సంవత్సరాల నుంచి దుబాయ్లో ఉంటూ ఉపాధి పొందుతున్నాడు. రవీందర్ పని చేస్తున్న కంపెనీలోనే నేపాల్కు చెందిన మాయ పనిచేస్తోంది. మూడు సంవత్సరాల నుంచి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. పది రోజుల కిందట రవీందర్తోపాటు మాయ దుబాయ్ నుంచి తెల్గాపూర్ గ్రామానికి వచ్చారు. రవీందర్ తన తల్లిదండ్రులను ఒప్పించి మాయను వివాహం చేసుకున్నారు. -
తమ్ముడి ఇంట్లో అన్న చోరీ
● వ్యాపారంలో నష్టాలొచ్చాయని.. ● కేసును ఛేదించిన పోలీసులు నిజామాబాద్ అర్బన్: వ్యాపారంలో నష్టాలు, అప్పులు పెరగడంతో తమ్ముడి ఇంట్లో అన్న చోరీకి పాల్పడ్డాడు. నగరంలోని రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పది రోజుల క్రితం జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. నగర సీఐ శ్రీనివాస్రాజ్ గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 6న మహ్మదీయకాలనీకి చెందిన మహ్మద్ సాబీక్ పాషా ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు తిరిగిరాగా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. నగదుతోపాటు బంగారం చోరికి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన రెండో టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించగా ఇంటి పక్కనే ఉన్న అతని అన్న మహ్మద్ షఫీ పాషాను అనుమానించి విచారించగా తానే దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. వ్యాపారంలో నష్టాలు రావడం, అప్పులు పెరగడంతో తమ్ముడి ఇంట్లోకి చొరబడి రెండు తులాల బంగారం, రూ.7 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. షఫీ పాషాను అరెస్టు చేసి బంగారం, డబ్బులు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. కేసు విచారణలో టౌన్ ఎస్సై సయ్యద్ ముజాయిద్తోపాటు సిబ్బందిని అభినందించారు. -
పసుపు పరిశోధన కేంద్రం సందర్శన
కమ్మర్పల్లి: మండల కేంద్రంలోని పసుపు పరిశోధన కేంద్రాన్ని వరంగల్ స్పైస్ బోర్డు ఆధ్వర్యంలో నేక్కొండ, కేసముద్రం, చింతపల్లి, ఒడిశా ప్రాంత రైతులు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మహేందర్ పసుపు రకాలు, యంత్రాలు, పరిశోధనలపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు. మనోహరాబాద్లో పసుపు పరిశ్రమ.. జక్రాన్పల్లి : మండలంలోని మనోహరాబాద్లో ఉ న్న పసుపు రైతుల ఉత్పత్తిదారుల సంఘం పరిశ్రమ ను వరంగల్ జిల్లా రైతులు గురువారం సందర్శించారు. జాతీయ పసుపు బోర్డు ,స్పైసెస్ బోర్డు వరంగల్ సంయుక్తంగా నిర్వహించిన పసుపు రైతుల విజ్ఞానయాత్రలో భాగంగా వరంగల్ జిల్లా నేకొండా ఎఫ్పీసీఎల్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 40 మంది రైతులు జేఏం కేపీఏం ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ను సందర్శించారు. కార్యక్రమంలో జేఎంకేపీఎం సూపర్వైజర్ రుత్విక్, స్పైసెస్ బోర్డు అసిస్టెంట్ డైరెక్టర్ జ్యోతిష్, సిబ్బంది వెంకటేశ్, మాధవ్, సంస్థ చైర్మన్ తిరుపతిరెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి పాల్గొన్నారు . నిజామాబాద్నాగారం: తెలంగాణ రాష్ట్ర జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 18న జాతీయస్థాయి టోర్నీకి రాష్ట్ర బృందం ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కిరణ్రెడ్డి, స్వామి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని ది గార్డియన్ స్కూల్లో తెలంగాణ రాష్ట్ర ఆర్టిస్ట్ జిమ్నాస్టిక్స్ క్రీడాకారుల ఎంపిక జరుగుతుందన్నారు. ఎంపికై న క్రీడాకారులు నవంబర్ 6 నుంచి 9 వరకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో నిర్వహించే జాతీయస్థాయి టోర్నీలో పాల్గొంటారని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు 9849193002 నెంబర్లో సంప్రదించాలని తెలిపారు. -
సీపీఆర్పై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్అర్బన్: ఆకస్మిక గుండెపోటుకు గురైన వ్యక్తులకు సకాలంలో సీపీఆర్ చేసి ప్రాణాలను రక్షించవచ్చని, దీనిపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి పేర్కొ న్నారు. ఐడీవోసీ సమావేశ మందిరంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సీపీఆర్పై అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఆకస్మికంగా కొందరికి గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, అలాంటి వారికి సీపీఆర్తో ప్రథమ చికిత్స చేస్తే ప్రాణాపా య స్థితి నుంచి బయటపడతారన్నారు. జిల్లాలో సీ పీఆర్పై ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు అ వగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపా రు. అనంతరం సీపీఆర్ ఎలా చేయాలన్న దానిపై మాస్టర్ ట్రైనర్స్ డాక్టర్ వెంకటేశ్, వేణుగోపాల్ అ వగాహన కల్పించారు. కార్యక్రమంలో ట్రెయినీ కలె క్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఎంహెచ్వో రాజ శ్రీ, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, డిప్యూటీ సీఈవో సాయన్న తదితరులు పాల్గొన్నారు. -
నెట్బాల్ ప్రాబబుల్స్ క్రీడాకారుల ఎంపిక
నిజామాబాద్నాగారం: ఉమ్మడి జిల్లా (నిజామాబాద్, కామారెడ్డి) నెట్బాల్ అండర్–19 విభాగంలో బాలబాలికల ప్రాబబుల్స్ జిల్లా జట్టుకు ఎంపిక నిర్వహించారు. సారంగాపూర్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో బుధవారం పోటీలు నిర్వహించి ప్రతిభకనబర్చిన వారిని ఎంపిక చేశారు. శిక్షణ అనంతరం తుది జట్లను ఎంపిక చేయనున్నారు. బాలికల విభాగం: డి అనుప్రియ, ఎన్ సింధు, డి ప్రతిభ, కె సరు, బి అక్షయ, యూ శృతి, ఏ రక్షిత, ఎం ప్రణీత, సీహెచ్ పురంధరేశ్వరి, యూ సంకీర్తన, కె కీర్తన, పి రక్షిత, బి సింధు, డి బాణవి, పి అలేఖ్య. బాలుర విభాగం: జాన్ ప్రభాస్, ఐ అజయ్కుమార్, కె అరవింద్, పి దేవేందర్, డి అభ్యుదయ, డి సాయికుమార్, టి మహేశ్, హెచ్ నివర్తి, డి రాహుల్, ఎం నవనీత్, ఎండీ ముబాసిర్, ఎస్ అభిలాష్, వి నిఖిల్, శివకాంత్. -
విద్యార్థులకు ఇబ్బందులు కలిగించొద్దు
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ యాజమాన్యాలతో సమావేశం నిజామాబాద్ అర్బన్: బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద ప్రయివేటు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు యాజమాన్యాలు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కరెస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్తో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూన.. ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. బెస్ట్ అవైలబుల్ స్కీం విద్యార్థులు పట్ల వివక్షను ప్రదర్శించకూడదని స్పష్టం చేశారు. బకాయిల చెల్లింపుల విషయమై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, విద్యార్థులకు మెరుగైన విద్య, నాణ్యమైన వసతుల కల్పనకు చొరవ చూపాలన్నారు. అదనపు కలెక్టర్ అంకిత్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
పీసీసీ చీఫ్ది అవగాహనరాహిత్యం
సుభాష్నగర్: రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ)లకు కేంద్రం నిధులు ఆగడం వల్లే పనులు ఆలస్యమవుతున్నాయని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ అనడం అవగాహనారాహిత్యానికి నిదర్శనమని ఎంపీ అర్వింద్ ధర్మపురి విమర్శించారు. జిల్లాలోని మాధవనగర్, అర్సపల్లి, అడవి మామిడిపల్లి ఆర్వోబీలకు దీపావళి తర్వాత మూడు, నాలుగు రోజుల్లో నిధులు విడుదల చేయాలని, లేకపోతే నిరాహార దీక్షకు దిగుతానని అన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహేష్కుమార్గౌడ్కు అవగాహన లేక కేంద్రంపై నెట్టేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. సబ్జెక్ట్ తెలుసుకుని మీడియా ముందు మాట్లాడాలని హితవుపలికారు. మాధవనగర్ ఆర్వోబీలో సగం నిధులు తప్ప మిగతా అన్ని ఆర్వోబీలు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మిస్తున్నామన్నారు. ఆయా ఆర్వోబీలకు సంబంధించి 75శాతానికి పైగా నిధులు రాష్ట్ర ఖజానాలో కేంద్రం జమ చేసిందని అర్వింద్ తెలిపారు. పథకాలు, అభివృద్ధి పనులు, వరద నష్టం, ఇతర బిల్లులకు నిధులు విడుదల చేయాలని కోరితే డబ్బులు లేవని సీఎం చెప్పడం సిగ్గుచేటన్నారు. జిల్లాకేంద్రంలో పసుపు బోర్డు కార్యాలయానికి రెండెకరాల స్థలం కేటాయించాలని ఎంపీ డిమాండ్చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో బీజేపీపై బురదజల్లే కుట్రలు చేస్తున్నారని, ఢిల్లీలో బీసీ ధర్నా చేసినప్పుడు రాహుల్గాంధీ ఎందుకు రాలేదన్నారు. రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంట్లో బీసీ బిల్లు ఆమోదం తెలపాలని, అందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నమేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి పార్టీలని ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ల చోరీ జరిగిందని కేటీఆర్ ఆరోపిస్తున్నారని, వాళ్ల హయాంలోనే ఆ ఓట్లు నమోదయ్యాయేమోనని అర్వింద్ విమర్శించారు. జూబ్లీహిల్స్లోనే అధికంగా క్లబ్లు ఉంటాయని, బీఆర్ఎస్ పాలనలో క్లబ్లకు డ్రగ్స్ సరఫరా ఎవరి కనుసన్నల్లో జరిగిందని ప్రశ్నించారు. ఆ బీఆర్ఎస్ కీలక నాయకుడెవరు.. కేసులు నమోదైతే నిర్వీర్యం చేసిందెవరో అందరికీ తెలుసన్నారు. కల్వకుంట్ల కుటుంబంతో దేశభద్రతకే ముప్పు అని విమర్శించారు. సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, నాయకులు న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, ప్రదీప్రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్వోబీ నిధులు విడుదల చేయకపోతే నిరాహార దీక్ష బీసీ రిజర్వేషన్లపై బీజేపీపై బురదజల్లే కుట్ర మీడియాతో ఎంపీ అర్వింద్ ధర్మపురి -
టీకా కోసం వెళ్తూ అనంతలోకాలకు..
భిక్కనూరు : టీకా వేయించేందుకు మూడు నెలల పసికందుతోపాటు వెళ్లిన ముగ్గురిని టిప్పర్ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. భిక్కనూరు మండలం జంగంపల్లి బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై బుధవారం చోటు చేసుకున్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. తాడ్వాయి మండలం కరడ్పల్లి గ్రామానికి చెందిన మెరుగు కిషన్ (54) అనే వ్యక్తి 20 ఏళ్లుగా ఆదిలాబాద్ జిల్లా రణదీవ్నగర్ చర్చిలో పాఽస్టర్గా పనిచేస్తున్నాడు. వృద్ధులైన తల్లిదండ్రుల బాగోగులను ఒక నెల కిషన్, మరో నెల తన సోదరుడు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో తన వంతు వచ్చినప్పుడు కిషన్ కామారెడ్డికి వచ్చి శాబ్దీపూర్ శివారులో ఉన్న అద్దె ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు. కిషన్ కుమార్తె జాస్లీన్ (30)కు ఖమ్మం జిల్లా ముష్టికుంటకు చెందిన పాస్టర్ ఆగమని ప్రకాశ్తో వివాహం చేశాడు. జాస్లీన్కు జోయల్ ప్రకాశ్(4), మూడు నెలల జాడ్సన్ అనే పసికందు ఉంది. జాస్లీన్ ఇటీవల తన కుమారులతో కామారెడ్డికి వచ్చి తండ్రి, నానమ్మ–తాతయ్యలతో కలిసి ఉంటోంది. జాడ్సన్ నెల టీకాకు సమయం అయ్యింది. కాగా, భిక్కనూరు ప్రభుత్వాసుపత్రిలో ఆశవర్కరుగా పనిచేసే బంధువును కలిసి జాడ్సన్కు ఇప్పించవచ్చని భావించిన జాస్లీన్ ఈ విషయాన్ని తండ్రి కిషన్కు వివరించింది. దీంతో కిషన్ తన ఎలక్ట్రిక్ స్కూటీపై జాస్లీన్, మనుమలు జోయల్ ప్రకాశ్, జాడ్సన్లను తీసుకొని భిక్కనూరుకు బయల్దేరాడు. జంగంపల్లి వద్ద జాతీయ రహదారిపై వెళ్తుండగా ఎదురుగా రాంగ్ రూటులో టిప్పర్ వేగంగా వచ్చి ఎలక్ట్రిక్ స్కూటీని ఢీకొట్టింది. దీంతో నలుగురు గాలిలో ఎగిరి కిందపడ్డారు. కిషన్, జాస్లీన్లు అక్కడికక్కడే మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న చిన్నారులు జోయల్ ప్రకాశ్, జాడ్సన్లను కామారెడ్డి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించారు. ఘటనా స్థలాన్ని ఎల్లారెడ్డి డీఎస్పీ, కామారెడ్డి ఇన్చార్జి శ్రీనివాస్ రావు, రూరల్ సీఐ రామన్ పరిశీలించారు. డ్రైవర్ అజాగ్రత్తగా టిప్పర్ను రాంగ్రూట్లో నడపడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని తెలిపారు. కేసు నమోదు చేసుకొని నలుగురు మృతికి కారణమైన డ్రైవర్ రాజిరెడ్డిని అరెస్టు చేశామని ఎస్సై ఆంజనేయులు వివరించారు. టిప్పర్ రూపంలో ఎదురుగా వచ్చిన మృత్యువు తాత, ఇద్దరు మనుమలు, కుమార్తె మృతి జంగంపల్లిలో నెత్తురోడిన జాతీయ రహదారి -
ధాన్యం సేకరణ ప్రారంభించాలి
బోధన్: ధాన్యం సేకరణను వెంటనే ప్రారంభించాలని రైతులు డిమాండ్చేశారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ ధాన్యం సేకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎడపల్లిలోని బోధన్ – నిజామాబాద్ రహదారిపై రైతులు బుధవారం బైఠాయించారు. రాస్తారోకో కారణంగా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఎస్సై ముత్యాల రమ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ఎస్సై సముదాయించడంతో వారు ఆందోళనలను విరమించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. సొసైటీలు, ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ ధాన్యం సేకరించడం లేదని, తాము పక్షం రోజులుగా ఎదురు చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
మక్క కొనుగోళ్లకు పచ్చ జెండా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : మొక్కజొన్న కొ నుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో గురువారం నుంచి స హకార సంఘాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసి, కొనుగోళ్లను ప్రారంభించాలని మార్క్ఫెడ్ అధికారులకు ఇప్పటికే మౌఖిక ఆదేశాలు అందా యి. తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చే సుకోవాలని సహకార సంఘాలకు సూచనలు వచ్చాయి. దీంతో బుధవారం కలెక్టరేట్లో అద నపు కలెక్టర్ కిరణ్కుమార్ ఆధ్వర్యంలో మా ర్క్ఫెడ్ అధికారులు సొసైటీల నిర్వాహకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మొక్కజొన్న పంట దిగుబడులను రైతుల నుంచి పక్కాగా సేకరించాలని అదనపు కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 14 మండలాల్లో మొత్తం 26 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. కేంద్రాలను సమర్ధవంతంగా నిర్వహించి రైతులకు క్వింటాల్కు మద్దతు ధర రూ.2,400 దక్కేలా చ ర్యలు తీసుకోవాలన్నారు. కాగా జిల్లాలో ఈ సీ జన్లో 52,093 ఎకరాల్లో మొక్కజొన్నను రైతు లు సాగుచేశారు. పంట కోతలు మొదలై మూ డు వారాలు దాటింది. అయితే మక్క కొనుగోలు కేంద్రాల ఏర్పాటును ప్రభుత్వం ఆలస్యం చేయడంతో 40 శా తం పంటను రైతులు ఇప్పటికే ప్రైవేటు వ్యాపా రులకు అమ్ముకోవాల్సి వచ్చింది. ప్రతికూల వా తావరణం నేపథ్యంలో పలువురు రైతులు తక్కు వ ధరకే అమ్ముకున్నారు. ఈ క్రమంలో తాజాగా మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనుండడంతో పంట చేతిలో ఉన్న రైతులు తమకు మద్దతు ధర దక్కనుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గు రువారం నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల ఎకరాల్లో రైతులు మొ క్కజొన్న సాగు చేశారు. జిల్లాలోనే ముందుగా పంట చేతికి వచ్చింది. కొనుగోలు కేంద్రాలు లే కపోవడంతో రైతులు దళారులకు రూ.1900కే అమ్ముకున్నారు. దీంతో మార్క్ఫెడ్ ద్వారా మ క్క కొనుగోళ్లు చేయాలని కోరుతూ గత నెల 23 వ తేదీన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు లేఖ రాశా. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లకు ఎమ్మెల్యే లు సుదర్శన్రెడ్డి, డాక్టర్ భూపతిరెడ్డి చొరవ తీ సుకున్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలను స ద్వినియోగం చేసుకోవాలి. – ఎస్. అన్వేష్రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర శాఖ నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి. దీంతో వెంటనే సమాచారాన్ని సహకార సంఘాలకు చేరవేశాం. గురువారం మొదట గా జక్రాన్పల్లి మండలం మునిపల్లిలో కొ నుగోలు కేంద్రం ప్రారంభించనున్నాం. జి ల్లాలో 26 చోట్ల వీటిని ఏర్పాటు చేయను న్నాం. రైతులు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మద్దతు ధరను పొందాలి. – మహేశ్కుమార్, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ మార్క్ఫెడ్కు ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు జిల్లాలోని 26 సహకార సంఘాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నేటి నుంచి ప్రారంభం కానున్న కొనుగోళ్లు -
అభిప్రాయాల సేకరణ తర్వాతే డీసీసీ నియామకం
నందిపేట్(ఆర్మూర్): క్షేత్రస్థాయిలో కచ్చితమైన అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే డీసీసీల నియామకాలు చేపడతామని కర్ణాటక ఎమ్మెల్యే, ఏఐసీసీ పరిశీలకులు రిజ్వాన్ అర్షద్ అన్నారు. నందిపేట మండలంలోని వెల్మల్ గ్రామంలో బుధవారం ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట, మాక్లూర్, డొంకేశ్వర్ మండలాల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా రిజ్వాన్ అర్షద్ను నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం రిజ్వాన్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసేందుకు ప్రక్రియలో భాగంగానే డీసీసీ పదవి నియామకంలో పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయ సేకరణ చేపట్టామన్నారు. అభిప్రాయల నివేదికను పార్టీ అధిష్టానానికి పంపిస్తామని తెలిపారు. అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. పార్టీ సంస్థాగత నిర్మాణానికి మరింత బలోపేతం చేసేందుకు డీసీసీల పదవుల నియామకానికి ఏఐసీసీ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మార చంద్రమోహన్, మంద మహిపాల్, భూమేశ్వర్రెడ్డి, రవి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం సేకరణకు విస్తృత ఏర్పాట్లు
నిజామాబాద్ అర్బన్ : కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ సజావుగా సాగేలా విస్తృత ఏర్పాట్లు చేశామని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధాన్యం సేకరణపై సమీక్షించారు. జిల్లాలో ధాన్యం సేకరణ ఏర్పాట్ల వివరాలను కలెక్టర్ మంత్రులకు వివరించారు. బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో ధాన్యం దిగుబడులు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 274 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. గత సీజన్ లో 606 కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈసారి 676 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అలాగే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. జిల్లాకు 1582 అదనపు టార్పాలిన్లు కేటాయించాలని కలెక్టర్ కోరారు. వీసీ అనంతరం ధాన్యం సేకరణపై కలెక్టర్ సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ కిరణ్కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, డీఎస్వో అరవింద్రెడ్డి, సివిల్ సప్లయీస్ డీఎం శ్రీకాంత్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, డీసీవో శ్రీనివాస్, డీటీవో ఉమామహేశ్వర్ రావు, మార్కెటింగ్ ఏడీ గంగవ్వ, తూనికలు కొలతల శాఖ అధికారి సుజాత్ అలీ తదితరులు పాల్గొన్నారు.నిజామాబాద్ అర్బన్: ప్రజలకు మరింత మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలో కొనసాగుతున్న వివిధ పనులను కలెక్టర్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మాధవనగర్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) పనులతోపాటు ఖలీల్వాడిలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు, అహ్మదీబజార్ వద్ద ఖిల్లా రోడ్డును ఆనుకుని అధునాతన సదుపాయాలతో నిర్మించిన సమీకృత మార్కెట్ సముదాయ భవనాన్ని, 80 క్వార్టర్స్, కలెక్టరేట్ పక్కన నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా శాఖల అధికారులతో కలెక్టరేట్లో పనులపై సమీక్షించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ అంకిత్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్, హౌసింగ్ డీఈ నివర్తి, నిజామాబాద్ సౌత్ తహసీల్దార్ బాలరాజు తదితరులున్నారు. పొరుగు రాష్ట్రాల ధాన్యం రాకుండా సరిహద్దుల్లో గట్టి నిఘా జిల్లాకు అదనంగా టార్పాలిన్లు కేటాయించండి వీడియోకాన్ఫరెన్స్లో మంత్రులతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి -
ఒకే కుటుంబంలోని ముగ్గురి ఆత్మహత్యాయత్నం
● మృతిచెందిన తండ్రి, చికిత్స పొందుతున్న తల్లి, కొడుకు ● పెళ్లి విషయమై గొడవలే కారణం నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని శివాజీనగర్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఇందులో తండ్రి మృతి చెందగా, తల్లి, కొడుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండో టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపిన వివరాలు ఇలా.. శివాజీనగర్ కు చెందిన దాసరి కిషన్(68)కు భార్య నాగమణి, ఇద్దరు కొడుకులు వంశీ, బాలకృష్ణ ఉన్నారు. పెద్దకొడుకు వంశీ గల్ఫ్కు వెళ్లి తిరిగి వచ్చి, మద్యానికి బానిసయ్యాడు. చిన్న కొడుకు బాలకృష్ణతో కలిసి కిషన్ కర్రీ పాయింట్ నిర్వహిస్తున్నాడు. బాలకృష్ణకు వివాహం జరుగగా, వంశీకి పెళ్లి కాలేదు. ఈవిషయమై మంగళవారం అతడు తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. దీంతో వంశీ గడ్డిమందు తాగి చనిపోతానంటూ మందు తాగాడు. వెంటనే వంశీ నుంచి తల్లి గడ్డిమందు డబ్బా తీసుకొని ఆమె తాగింది. ఆమె నుంచి కిషన్ డబ్బా తీసుకొని తాగాడు. దీంతో ముగ్గురు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. స్థానికులు గమనించి వారిని వెంటనే చికిత్స కోసం ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. బుధవారం తెల్లవారుజామున కిషన్ చికిత్స పొందుతు మృతిచెందగా, మిగిలిన ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. ఈ ఘటనపై మృతుడి చిన్నకుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఘటన స్థలానికి వెళ్లి వారు విచారణ చేపట్టారు. కిషన్ మృతిచెందిన విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు ఇవ్వకపోవడం, మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించడంపై పోలీసులు ఆస్పత్రికి నోటీసులు జారీ చేశారు. -
భవిష్యత్ను ఉన్నతంగా తీర్చుదిద్దుకోవాలి
బోధన్: సంఘసంస్కర్తలు మహాత్మ జ్యోతిరావుపూలే, సావిత్రిబాయి దంపతులను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు భవిష్యత్ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్భాస్కర్రావు సూచించారు. పట్టణంలోని ఆచన్పల్లి ప్రాంతంలోగల మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల, బెల్లాల్ ప్రాంతంలోని ఎస్సీ బాలుర గురుకుల కళాశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఆయన విద్యార్థినులతో మాట్లాడారు. నేటి పోటీ ప్రపంచంలో చదువు ప్రాముఖ్యతను వివరించి, లక్ష్యంతో చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని తెలిపారు. చదువుకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా ఉపాధ్యాయులతో అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం బెల్లాల్ ప్రాంతంలోని ఎస్సీ బాలుర గురుకుల కళాశాలను సందర్శించారు. ఇరుకుగా ఉన్న తరగతి గదిలోనే నిద్రిస్తున్నామని విద్యార్థులు జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడిపరిస్థితుల సమగ్ర నివేదికను ఉన్నత న్యాయస్థానానికి నివేదిస్తామని ఆయన వెల్లడించారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సిబ్బంది శ్రావణ్, మృణాళిని, పారాలీగల్ వలంటీర్స్ పద్మాసింగ్, రమణారెడ్డి, న్యాయవాది ఆశా నారాయణ తదతరులు ఉన్నారు. -
స్తంభాన్ని ఢీకొన్న బైక్: ఒకరి మృతి
ఎల్లారెడ్డి: మండలంలో బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. ఎస్సై మహేశ్ వివరాలు ఇలా.. వెల్లుట్ల గ్రామానికి చెందిన పండుగ లక్ష్మణ్(36) బుధవారం మోటార్ సైకిల్పై బాన్సువాడ నుంచి గ్రామానికి బయలుదేరాడు. ఆజామాబాద్ గ్రామ శివారులోని మూల మలుపు వద్ద బైక్ అదుపుదప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొన్నాడు. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. రైలు ప్రమాదంలో ఒకరు.. నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ రైల్వేస్టేషన్–జాన్కంపేట స్టేషన్ల మధ్య రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. వివరాలు ఇలా.. జిల్లా కేంద్రంలోని దుబ్బకు చెందిన ట్రాన్స్జెండర్ మీరా అలియాస్ నారాయన్ కామాజీ అనే వ్యక్తి బుధవారం మధ్యాహ్నం నిజామాబాద్ రైల్వేస్టేషన్–జాన్కంపేట స్టేషన్ల మధ్య పట్టాలపై వస్తున్న రైలుకు ఎదురువెళ్లారు. ఈక్రమంలో రైలు ఢీకొని తీవ్రగాయాలై మృతిచెందారు.ఈ ఘటన కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఎల్లారెడ్డి: చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ నీటిలో ము నిగి మృతిచెందిన వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమయ్యింది. వివరాలు ఇలా.. బాలాజీనగర్ తండాకు చెందిన రుడావత్ గణేశ్ (48) మంగళవారం చేపలు పట్టడానికి ఎల్లారెడ్డి పెద్దచెరువులో దిగగా ప్రమాదవశాత్తూ జారిపడి మృతి చెందాడు. పోలీసులు మృతదేహం కోసం గాలించగా బుధవారం మధ్యాహ్నం లభ్యమయ్యింది. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
ఎర్రజొన్నకు బదులు మొక్కజొన్న
ఆర్మూర్: ఎర్రజొన్న రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగువైపు మొగ్గుచూపుతున్నారు. జిల్లాలో ప్రతీ ఏటా ఎర్రజొన్న రైతులను విత్తన వ్యాపారులు సిండికేట్గా మారి మోసం చేస్తుండటంతో అన్నదాతలు పంట మార్పిడి విధానాన్ని అవలంభించి వారి మోసాల బారిన పడకుండా జాగ్రత్త పడుతున్నారు. అందులో భాగంగా ఈ యాసంగిలో ఎర్రజొన్నకు బదులుగా మొక్కజొన్నను పండించడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత సీజన్లో ఎర్రజొన్న విస్తీర్ణం తగ్గి మొక్కజొన్న విస్తీర్ణం గణనీయంగా పెరగనుంది. గతంలో.. మార్కెట్లో మొక్కజొన్నకు డిమాండ్ ఉన్నా.. పెట్టుబడి వ్యయం, శ్రమ ఎక్కువ కావడంతోపాటు తెగుళ్లు సహా ఇతర కారణాలతో గతంలో మొక్కజొన్న విస్తీర్ణం గణనీయంగా తగ్గి, ఎర్రజొన్న విస్తీర్ణం పెరిగింది. కానీ ప్రతియేటా ఎర్రజొన్న విత్తన వ్యాపారులు బైబ్యాక్ ఒప్పందాలు చేసుకొని పంట చేతికి వచ్చిన సమయంలో కొనుగోలు చేయకుండా ముఖం చాటేయడంతో రైతులు వచ్చిన నామమాత్రపు ధరకే ఎర్రజొన్న పంటను అమ్ముకొని ఆర్థికంగా నష్టపోతున్నారు. దీంతో అన్నదాతలు ప్రస్తుతం ఎర్రజొన్నకు బదులుగా మొక్కజొన్న పండించడానికే ఆసక్తి చూపుతున్నారు. అక్టోబర్ నెలలో విత్తుకొనే ఎర్రజొన్నల విస్తీర్ణం ప్రతీ ఏటా గణనీయంగా తగ్గుతూ వస్తోంది. 2023–24 యాసంగిలో 34,086 ఎకరాల్లో, 2024–25లో 25,447 ఎకరాల్లో ఎర్రజొన్నలు పండించారు. ప్రత్యామ్నాయంగా మొక్కజొన్నను పండించడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. వ్యవసాయ శాఖ ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ యాసంగిలో మొక్కజొన్న పంట విస్తీర్ణం 30 వేల ఎకరాలకు చేరువలో ఉండబోతోంది. మొక్కజొన్న పచ్చి బుట్ట పంట 90 రోజుల్లో చేతికొస్తుంది. ఇలా వచ్చిన పచ్చి బుట్టల దిగుబడికి బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎర్రజొన్న విత్తన వ్యాపారులు బై బ్యాక్ ఒప్పందాన్ని ఉల్లంఘించి ప్రతీయేటా రైతులను మోసం చేస్తూనే ఉన్నారు. సిండికేట్గా మారిన వారిని ని యంత్రిండంలో ప్రభుత్వం వి ఫలం అవుతోంది. కాబట్టి ఎర్రజొన్నకు బదులు గా రైతులు మొక్కజొన్నను పండించడానికి ఆసక్తి చూ పుతున్నారు.–బార్ల మనీష్, రైతు, ఆలూర్ మండలం రైతులు మొక్కజొన్న పంట పండించే సమయంలో మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ పంట దిగుబడిని పెంచుకోవాలి. ఆర్మూర్, అంకాపూర్లో పచ్చిబుట్ట కొనుగోలుకు వ్యాపారులు ఆసక్తి చూపుతారు. కాబట్టి ఈ మార్కెట్ను ఉపయోగించుకోవాలి. – హరికృష్ణ, వ్యవసాయశాఖ అధికారి, ఆర్మూర్ యాసంగిలో పెరుగుతున్న మక్క సాగు విస్తీర్ణం ఎర్రజొన్న వ్యాపారుల మోసాలతో విసిగిపోతున్న రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు మొగ్గు -
ట్యాంకర్ను ఢీకొన్న బస్సు
● ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు డిచ్పల్లి: మండలలోని హైవేపై ఓ ప్రయివేట్ బస్సు అదుపుతప్పి ఇంధన ట్యాంకర్ను ఢీకొని, సమీపంలోని ఏడో బెటాలియన్ పెట్రోల్ బంక్లోకి దూసుకెళ్లింది. ఈఘటనలో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. డిచ్పల్లి ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపిన వివరాలు ఇలా.. హరికృష్ణ ట్రావెల్స్కు చెందిన బస్సు బుధవారం హైదరాబాద్ నుంచి జగిత్యాలకు బయలుదేరింది. డిచ్పల్లిలోని పోలీస్ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే బస్సు ముందు వెళుతున్న ట్యాంకర్ను ఢీకొని బంకులోకి దూసుకెళ్లింది. దీంతో పెట్రోల్ బంక్లో ఉన్న వాహనదారులు, సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే బస్సు సమీపంలోకి వచ్చి నిలిచిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో ఉన్న ముగ్గురు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. అజాగ్రత్తగా బస్సు నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ప్రభాకర్ తేజపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఆర్మూర్టౌన్: పట్టణంలో ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. ఆర్టీసీ బస్సు నిజామాబాద్ నుంచి హన్మకొండకు బయలుదేరింది. ఈక్రమంలో పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో బైక్ను బస్సు వెనుకనుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. ఆర్టీసీ డ్రైవర్ ఆజాగ్రత్తగా వాహనాన్ని నడపడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి, ఇరువురిని పోలీస్ స్టేషన్కు తరలించారు విద్యుత్ షాక్తో జీపీ కార్మికుడికి .. బీబీపేట: మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్మికుడు విద్యుత్ షాక్తో గాయపడ్డాడు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన జీపీ కార్మికుడు కొంగరి చంద్రం బుధవారం పెద్దమ్మ ఆలయం సమీపంలో విద్యుత్ బల్బులు అమర్చడానికి స్తంభం ఎక్కాడు. అప్పటికే విద్యుత్ సరఫరా ఉండడంతో అతని చేతులకు విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు. దీంతో కుడి కాలు విరిగింది. స్థానికులు వెంటనే అతడిని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. -
మరోసారి రెండుగా చీలిన తొర్తి
● గతంలో నమోదైన కేసులలో రాజీ కుదరకపోవడంతో విడిపోయిన గ్రామస్తులు ● ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పికెటింగ్ ఏర్పాటు చేసిన పోలీసులు మోర్తాడ్(బాల్కొండ): ఏర్గట్ల మండలం తొర్తి గ్రామస్తులు మంగళవారం మరోసారి రెండు వర్గాలుగా విడిపోయారు. గతంలో నమోదైన కేసులలో రాజీ కుదురకపోవడంతో ఒక వర్గానికి చెందిన దాదాపు వంద కుటుంబాలు ఒకవైపు, మెజార్టీ కులాలకు చెందిన 320 కుటుంబాలు మరోవైపు ఉండిపోయారు. దీంతో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటాయనే సందేహంతో పోలీసులు మంగళవారం నుంచి పికెటింగ్ నిర్వహిస్తున్నారు. 2021లో వరి కోతల విషయంలో రెండుగా చీలిపోయిన తొర్తిలో కొంత కాలం వర్గపోరు కొనసాగింది. పోలీసులు, రెవెన్యూ అధికారులు సంప్రదింపులు జరిపి గ్రామస్తులను ఐక్యం చేశారు. ఈక్రమంలో వంద కుటుంబాలు ఉన్న వర్గం వారిపై గతంలోనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఆ కేసు కోర్టులో విచారణకు రాగా సాక్షులుగా ఉన్నవారు కోర్టుకు హాజరయ్యారు. గ్రామంలో అందరం కలిసిపోయినా కేసుల విషయంలో రాజీ కుదురకపోవడంతో వంద కుటుంబాల వారు మళ్లీ కట్టడి చేసుకున్నారు. గతంలో మాదిరిగానే విడిపోయి ఉండాలని తీర్మానించుకున్నారు. రెండో వర్గం వారు దీనిని విభేదించడంతో గ్రామంలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. గ్రామస్థులు కలిసిపోయిన సమయంలోనే కేసుల విషయంలో రాజీ కుదిరి ఉంటే ఇప్పుడు వివాదం ఏర్పడేది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. క్రైం కార్నర్తొర్తిలో ఏర్పడిన వివాదం వల్ల శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ఉండటానికి పోలీసు పికెటింగ్ నిర్వహిస్తున్నాం. ఇరు వర్గాలు పోలీసులకు సహకరించాలి. ఎవరైన చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. –పడాల రాజేశ్వర్, ఎస్సై, ఏర్గట్ల -
విద్యార్థి అదృశ్యం
రెంజల్(బోధన్): మండలంలోని సాటాపూర్ గ్రామానికి చెందిన అక్మత్బేగ్ అనే ఇంటర్ విద్యార్థి అదృశ్యమైనట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. సదరు విద్యార్థి బుధవారం బోధన్లోని కళాశాలకు వెళుతున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు అతడి కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో విద్యార్థి తండ్రి కరామత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బీబీపేటలో ఒకరు.. బీబీపేట: మండల కేంద్రానికి చెందిన బట్టుపల్లి నాగరాజుగౌడ్ (33) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్సై ప్రభాకర్ బుధవారం తెలిపారు. నాగరాజు గౌడ్ మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో అతడి తండ్రి సిద్దరామగౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేశారు. ఎవరికై న అతడి ఆచూకీ తెలిస్తే పోలీసు స్టేషన్లో తెలపాలని ఎస్సై పేర్కొన్నారు. -
భారీ అక్రమాలు
రేషన్ కార్డుల్లోనిజామాబాద్అర్బన్ : ప్రజాపాలన కింద నూతన రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తోంది. జిల్లాలో ఇప్పటికే 3,83,384 రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్తగా మంజూరైన రేషన్ కార్డుల్లో లక్షా 18 వేల మంది పేర్లు చేరాయి. ఇదిలా ఉండగా అనర్హులకు సైతం రేషన్ కార్డులు దక్కినట్లు పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందులో కొందరు అధికారు లు, రెవెన్యూ సిబ్బంది భారీగా వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పౌరసరఫరాల శాఖ కమిషనర్కు ఫిర్యాదులు వెళ్లగా ఆయన అక్రమార్కుల జాబితాను జిల్లాకు పంపి విచారణ కోసం ఆదేశించినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం.. అధికారులు దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారిని గుర్తించి రేషన్ కార్డు మంజూరు చేయాలి. అదేవిధంగా రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలి. ఈ ప్రక్రియ మూడు నెలల పాటు కొనసాగింది. ఇదే అదునుగా భావించిన కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది భారీగా వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఏ మాత్రం అర్హత లేని వారికి రేషన్ కార్డులు మంజూరు చేశారని సమాచారం. నూతనంగా రేషన్ కార్డు పొందడం కోసం ఒక్కొ క్కరి వద్ద నుంచి రూ.10 వేల నుంచి రూ. 15 వేల వరకు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ‘మీ సేవ’ కేంద్రాల నిర్వాహకులు ప్రధాన భూమిక పోషించారు. మీ సేవ కేంద్రాలకు వచ్చే అనర్హులైన దరఖాస్తుదారుల నుంచి రేషన్ కార్డులు మంజూరు చేయిస్తామని చెప్పి వసూళ్లకు పాల్పడ్డారు. దరఖాస్తుదారులను తహసీల్ కార్యాలయా లకు తీసుకెళ్లి భరోసా ఇప్పించారు. ఈ క్రమంలో జరిపిన వసూళ్లలో రెవెన్యూ సిబ్బందికి వాటాలు పంచినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ సౌత్ మండ లం తహసీల్ కార్యాలయంలో అత్యధిక అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో పని చేసే ఉద్యోగి ఏకంగా 34 మంది నుంచి భారీ మొ త్తంలో డబ్బులు తీసుకున్నట్లు అధికారులు విచారణలో తేలింది. అదేవిధంగా జిల్లా కేంద్రంలో మూ డు మీ సేవా కేంద్రాలను, ధర్పల్లి, సిరికొండ, రెంజల్, ఎడపల్లి, నవీపేట మండల కేంద్రాల్లోని మీసే వ కేంద్రాలు అక్రమాలకు అడ్డాగా గుర్తించారు. వీటి పై విచారణ పూర్తయ్యింది. బాల్కొండ, భీమ్గల్, కమ్మర్పల్లి మండల కేంద్రాల్లోని రెవెన్యూ సిబ్బంది భారీ మొత్తంలో వసూలు చేశారని తెలిసింది. ని జామాబాద్ అర్బన్లో బోగస్ రేషన్ కార్డుల జారీ ఎక్కువగా జరిగినట్లు అధికారులు గుర్తించారు. జిల్లా కేంద్రంలో పని చేసే ఓ ప్రభుత్వ ఉద్యోగి ఏ కంగా రూ. 20 వేలు ఇచ్చి సౌత్ మండలంలో మూ డు రేషన్ కార్డులు పొందినట్లు తెలుస్తోంది. గాంధీచౌక్లోని వ్యాపార నిర్వాకుడు, వినాయక నగర్లో ని పెట్రోల్ బంక్ యజమాని, బోధన్ రోడ్డులోని ఓ ప్రైవేట్ పాఠశాల యజమాని రేషన్ కార్డులు పొందినట్లు అధికారుల అధికారులు గుర్తించారు.పది మండలాల్లో.. జిల్లాలోని పది మండలాల్లో 22 మంది రెవెన్యూ సిబ్బంది, అధికారులు రేషన్ కార్డుల జారీలో అక్రమాలకు పాల్పడినట్లు విచారణ అధికారులు తేల్చారు. దరఖాస్తుదారుడు రేషన్ కార్డు కోసం ఆన్లైన్లో మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోగానే మండల కార్యాలయంలోని సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలి. రేషన్ కార్డుకు అర్హతలు గుర్తించి కార్డు మంజూరు కోసం పౌరసరఫరాల శాఖకు సిఫార్సు చేయాలి. ఈ క్రమంలోనే రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ పేరిట దరఖాస్తుదారుడు అనర్హురుడు అయితే డబ్బులు వసూలు చేసి అర్హుడిగా సిఫార్సు చేశారు. ఇలా వందలాది మంది అనర్హులకు రేషన్ కార్డులు జారీ చేశారు. మండల కార్యాలయంలో పనిచేసే కొందరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, మరికొందరు తహసీల్దారులు కూడా ఈ అక్రమాల్లో భాగస్వాములైనట్లు తెలుస్తోంది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నెల రోజుల క్రితమే అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ పూర్తయ్యింది. అక్రమార్కులకు గుర్తించారు. అయితే అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో మీనవేషాలు లెక్కిస్తున్నారు. దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు సమాచారం.జిల్లాలో రేషన్ కార్డుల జారీలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఆదేశించినా తగిన ఫలితం కనిపించడం లేదు. రేషన్ కార్డుల జారీలో కొన్ని మండలాల్లో అనర్హులను ఎంపిక చేశారు. అక్రమాలకు పాల్పడిన అధికారులు, సిబ్బంది పేర్లు, ఎవరు ఎంతెంత వసూలు చేశారనే వివరాలతో కమిషనర్ జిల్లా అధికారులకు జాబితాను పంపినట్లు తెలుస్తోంది. విచారణ జరిపిన అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారు.చర్యలు శూన్యం! భారీ వసూళ్లు.. అనర్హులకు రేషన్ కార్డుల జారీ అక్రమార్కుల్లో రెవెన్యూ అధికారులు, సిబ్బంది ‘మీసేవ’ కేంద్రాల నిర్వాహకుల ప్రధాన భూమిక రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆగ్రహం విచారణ పూర్తి చేసిన జిల్లా అధికారులు -
క్షేత్రస్థాయి నుంచి జల్లెడ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ షురువైంది. ఈ పీఠాన్ని బీసీకి అప్పగిస్తారా.. ఓసీకి కేటాయిస్తారా అనే విషయమై కచ్చితమైన నిర్ణయానికి రాకపోయినప్పటికీ ఏఐసీసీ నుంచి వచ్చిన పరిశీలకుడు, కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ ప్రతి అంశాన్ని జల్లెడ పడుతున్నారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి నుంచి కచ్చితమైన అభిప్రాయాలను సేకరించేందుకు స్వయంగా ఆయా నియోజకవర్గాల్లోని బ్లాక్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమావేశాలను సాధారణంగానే నిర్వహిస్తుండగా, ఆయా నియోజకవర్గంలోని కీలక నేతల, సీనియర్ నాయకుల, బ్లాక్, మండలాల అధ్యక్షుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఇందుకు గాను వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో మాట్లాడుతూ మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత వివరాలు తీసుకుంటున్నారు. ఇందులో సామాజిక సమీకరణలను సైతం బేరీజు వేస్తున్నారు. అభిప్రాయ సేకరణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు పార్టీ నాయకత్వం నిర్ణయించింది. దీంతో పీఠం ఆశిస్తున్న నాయకులు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలను తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. క్షేత్రస్థాయి నుంచి పరిశీలకుడు వడపోత కార్యక్రమం నిర్వహిస్తుండడంతో ఆయా నియోజకవర్గాన్ని బట్టి ప్రాధాన్యతాక్రమాలు మారుతున్నాయి. దీంతో డీసీసీ కోసం దరఖాస్తు చేసుకున్న నాయకులు తమ సొంత నియోజకవర్గం నుంచి భారీగా మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పరిశీలకుడికి తమ పేర్లు చెప్పాలంటూ శ్రేణులను కోరుతున్నారు. మరోవైపు ఐదేళ్ల ముందు నుంచి పార్టీలో పనిచేస్తున్నవారికే డీసీసీ పీఠం అప్పగించేందుకు పార్టీ నిర్ణయించడంతో స్క్రూటినీలో కొందరి దరఖాస్తులు ఎగిరిపోనున్నట్లు సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడంతో ఈ డీసీసీ పీఠం విషయంలో ఎంపిక ఏవిధంగా ఉంటుందనే విషయమై పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ● క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణలో భాగంగా ఏఐసీసీ పరిశీలకుడు మంగళవారం బోధన్ నియోజకవర్గంలో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని బ్లాకుల వారీగా సమావేశం నిర్వహించారు. అనంతరం అన్ని మండలాలకు చెందిన సీనియర్ నాయకులు, ఆయా మండలాల అధ్యక్షులతో వ్యక్తిగతంగా మాట్లాడి వివరాలు సేకరించారు. ఒక బీసీ నాయకుడికి, మరొక ఓసీ నాయకుడికి అక్కడి నాయకులు మొదటి, ద్వితీయ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. అలేగే పరిశీలకుడు బుధవారం ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలకు సంబంధించిన సమావేశాలు, అభిప్రాయ సేకరణ చేయనున్నారు. ఆర్మూర్లోని రెండు బ్లాకులకు సంబంధించి నందిపేట మండలం వెల్మల్లో, ఆర్మూర్లో వరుసగా సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం బాల్కొండ నియోజకవర్గంలో బ్లాకుల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. కీలకమైన ఈ సమావేశాల అనంతరం వ్యక్తిగత అభిప్రాయ సేకరణలో ఆయా నాయకులు, సీనియర్ కార్యకర్తలు ఎలాంటి అభిప్రాయాలు చెబుతారనే విషయమై అందరిలో ఉత్కంఠ నెలకొంది. డీసీసీ అధ్యక్షుడి ఎంపికలో ఒకటో ప్రాధాన్యత.. రెండో ప్రాధాన్యత పకడ్బందీగా అభిప్రాయ సేకరణ చేస్తున్న ఏఐసీసీ పరిశీలకుడు సెగ్మెంట్లవారీగా మారుతున్న సమీకరణలపై విశ్లేషణ గత ఐదేళ్ల కాలాన్ని కటాఫ్గా పెట్టిన నాయకత్వం -
చెక్డ్యాం బ్యాక్ వాటర్తోనే ముప్పు!
మోర్తాడ్(బాల్కొండ) : శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోని మిగులు జలాలను సద్వినియోగం చేసుకోవడానికి నిర్దేశించిన వరద కాలువకు గండి ఏర్పడిన ఘటనపై ఇంజినీరింగ్ అధికారుల బృందం విచారణ పూర్తి చేసింది. పెద్దవాగు ప్రవాహానికి అడ్డు లేకుండా వరద కాలువ నీటిని మళ్లించడానికి గాండ్లపేట్ వద్ద నిర్మించిన అక్విడెక్ట్ను నిర్మించారు. దీని సమీపంలోనే చెక్డ్యాం నిర్మించడం అందులో నీరు నిలచి ఉండటం వల్లనే వరద కాలువకు ముప్పు ఏర్పడటానికి ప్రధాన కారణం అని అధికారులు నిర్దారించారు. చెక్డ్యాం ఇటీవలే కొట్టుకపోయినా ఎంతో కాలం నీరు నిలచి ఉండటం వల్లనే వరద కాలువ కింది భాగంలోని మట్టి కరిగిపోయి ఇప్పుడు ముప్పు వాటిల్లిందని ఇంజినీరింగ్ అధికారులు గుర్తించారు. వరద కాలువకు ఇటీవల గండి ఏర్పడి నీరు అంతా పెద్దవాగులో ప్రవహించిన విషయం విదితమే. దీనిపై ఎస్సారెస్పీ ఛీఫ్ ఇంజినీర్ సుధాకర్ రెడ్డి, సెంట్రల్ డిజైనింగ్ ఛీఫ్ ఇంజినీర్ సత్యనారాయణరెడ్డి, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఛీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్ గండిపడిన చోటును పరిశీలించారు. ఎంతో కాలం మనుగాల్సిన వరద కాలువకు గండి ఏర్పడిన అంశం, అందుకు గల కారణాలపై ప్రభుత్వానికి నివేదికను అందించినట్లు తెలిసింది. వరద కాలువ అక్విడెక్ట్కు 300ల మీటర్ల దూరంలోనే చెక్డ్యాంను నిర్మించడం ఎక్కువ మొత్తంలో నీరు నిలచి ఉండటం వల్లనే గండి ఏర్పడటానికి ప్రధాన కారణం అని అధికారులు గుర్తించారు. కనీసం కిలోమీటర్ దూరంలో చెక్డ్యాంను నిర్మించి ఉంటే బ్యాక్ వాటర్ దూరంలోనే ఆగిపోయేదని అధికారులు భావిస్తున్నారు. అక్విడెక్ట్కు సమీపంలో చెక్డ్యాం నిర్మించడానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉన్నతాధికారుల అనుమతి తీసుకోలేదని తెలిసింది. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలోనే చెక్డ్యాం నిర్మించినా వరద కాలువను పర్యవేక్షిస్తున్నవారితో సంప్రదింపులు జరుపకపోవడం గమనించాల్సిన విషయం. వరద కాలువ కింది భాగంలోని మట్టి దశలవారిగా కొట్టుకపోయి ఒక్కసారి నీటి ప్రవాహం పెరగడంతో గండి పరిమాణం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా వరద కాలువకు గండి ఏర్పడటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లోని మిగులు జలాలను గోదావరి నదిలోనే వదలాల్సి వస్తుంది. గండిని పూడ్చి ముందు ముందు ఎలాంటి ముప్పు ఏర్పడకుండా ఉండటానికి పకడ్బందీగా మరమ్మత్తులు చేయాల్సి ఉంది. ఇంజినీరింగ్ అధికారులు అంచనాలను రూపొందిస్తున్నారు. సిమెంట్ గోడ కింద మట్టి పూర్తిగా కొట్టుకపోవడం శాశ్వత ప్రాతిపదికన మరమ్మత్తులపై అధ్యాయనం చేయడానికి సాంకేతిక నైపుణ్యంగల అధికారి ఒకరు ఒకటి రెండు రోజుల్లో గండి ఏర్పడిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారని తెలుస్తుంది.వరద కాలువకు గండి ఏర్పడిన చోట మరమ్మత్తులు పూర్తి చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నాం. గండి ఏర్పడటానికి ప్రధాన కార ణం గుర్తించారు. మరమ్మత్తులు చేసి ముందు ముందు ఎలాంటి ముప్పు ఏర్పడకుండా ఉండటానికి పక్కా ప్రణాళికను సిద్దం చేస్తున్నాం. – చక్రపాణి, ఈఈ, ఎస్సారెస్పీ ఇటీవల గాండ్లపేట్ వద్ద వరద కాలువకు గండి ఇంజినీరింగ్ అధికారుల బృందం విచారణ పూర్తి మరమ్మతుల కోసం అంచనాలు తయారు చేస్తున్న అధికారులు -
విద్యార్థుల సంక్షేమంపై దృష్టి పెట్టండి
నిజామాబాద్అర్బన్ : బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి ని కేంద్రీకరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక ప్రణాళిక, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర సాంఘిక, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిజామాబా ద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సంక్షేమ శాఖల అ ధికారులు ఈ వీసీలో పాల్గొన్నారు. ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూ ల్స్ స్కీం కింద ఎంపిక చేసిన పాఠశాలలో చదివే షె డ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన విద్యా ర్థుల సంక్షేమంపై ఆయా జిల్లాల కలెక్టర్లు నిరంత రం పర్యవేక్షించాలన్నారు. విద్యార్థులకు అందిస్తు న్న బోధన, ఆరోగ్యం, మెనూ ప్రకారం భోజనం, ఇతర మౌలిక వసతుల అమలుపై పాఠశాలలను సందర్శించి పరిశీలించాలన్నారు. ఎంపికైన ప్రతి వి ద్యార్థి పాఠశాలలో ఉండాలని, సమస్యల పరిష్కారంపై ఆయా పాఠశాలల యాజమాన్యాలతో చర్చించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థు లకు ఎలాంటి ఆటంకం లేకుండా విద్యాబోధన కొ నసాగేలా చూడాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జి ల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకు లు రజిత, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నాగురా వు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అ ధికారి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్’ను సమీక్షించండి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్, అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క -
మార్కెట్యార్డు అభివృద్ధికి సమష్టి కృషి
● రూ.3 కోట్లతో కవర్షెడ్, టాయిలెట్ల నిర్మాణం ● నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి సుభాష్నగర్ : నిజామాబాద్ మార్కెట్ యార్డు అభివృద్ధికి మంత్రి, జిల్లా ఎమ్మెల్యేల సహకారంతో అధి కారులు, పాలకవర్గం సమష్టిగా కృషి చేస్తోందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగా రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని వ్యవ సాయ మార్కెట్ కార్యాలయంలో పాలకవర్గ సాధా రణ సమావేశం జరిగింది. చైర్మన్ గంగారెడ్డి మాట్లా డుతూ మార్కెట్యార్డులో కవర్ షెడ్, కూరగాయల మార్కెట్లో రెండు టాయిలెట్స్ బ్లాకుల నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. రూ.97 లక్షలతో గాంధీగంజ్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. కూరగాయల మార్కెట్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. మార్కెట్లో కవర్ షెడ్, సీసీ కెమెరాల పునరుద్ధరణ, నూతనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు, అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపించాలని పాలకవర్గం తీర్మానించింది. వైస్ చైర్మన్ రాంచంద ర్ మాట్లాడుతూ చైర్మన్, పాలకవర్గ సభ్యుల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. సమావేశంలో సెల క్షన్ గ్రేడ్ సెక్రటరీ అపర్ణ, గ్రేడ్–1 సెక్రటరీ విజయ్కి షోర్, డైరెక్టర్లు మారుతీ మల్లేష్, గంగారెడ్డి, రాజలింగం,బాగారెడ్డి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
నిధులు విడుదల చేయాలి
పెండింగ్లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కు సంబంధించి 250 కోట్ల రూపాయలను విడుదల చేయాలని బోధన్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. నాయకులు నవాతే ప్రతాప్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కు సుమారు 250 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని, వాటిని వెంటనే రిలీజ్ చేయాలన్నారు. లేదంటే రాష్ట్రంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు. నాయకులు దేవర్ల నాగరాజు, రాజన్న, గౌతమ్ కుమార్, సంజయ్, మోసిన్, బాలరాజ్, ప్రశాంత్, శ్రీకాంత్ మోహన్, కిరణ్, సతీష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన అటవీశాఖ స్పోర్ట్స్ మీట్
నిర్మల్టౌన్: జిల్లాకేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో అటవీశాఖ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహించిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఆదివారం రాత్రి అట్టహాసంగా ముగిసింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జిల్లా జడ్జి శ్రీవాణి, అటవీశాఖ బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ శర్వానన్ హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పోటీల్లో నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన సుమారు 350 మంది అటవీశాఖ క్రీడాకారులు పాల్గొనగా 35 రకాల క్రీడలు నిర్వహించారు. టగ్ ఆఫ్ వార్ పురుషుల విభాగంలో నిర్మల్ జట్టు, మహిళల విభాగంలో ఆదిలాబాద్ జట్టు విజేతగా నిలిచాయి. వాలీబాల్లో ప్రథమ విజేతగా ఆదిలాబాద్, రన్నరప్గా నిర్మల్ జట్టు, క్రికెట్లో నిజామాబాద్ జట్టు, కబడ్డీ పురుషుల విభాగంలో నిజామాబాద్, మహిళల విభాగంలో నిర్మల్ జట్టు, త్రోబాల్ మహిళల విభాగంలో ఆదిలాబాద్ జట్టు, మార్చ్పాస్ట్లో నిర్మల్ జట్టు విజేతగా నిలిచాయి. ఓవరాల్ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్మల్ జట్టు కై వసం చేసుకుంది. నిజామాబాద్ డీఎఫ్వో వికాస్ మీనా, నిర్మల్ డీఎఫ్వో నాగిని భాను, అధికారులు సుధాకర్రావు, శివకుమార్, నాలుగు జిల్లాల అటవీశాఖ అధికారులు, సిబ్బంది తదితరు లు పాల్గొన్నారు. -
పోలీస్ ప్రజావాణికి 20 ఫిర్యాదులు
నిజామాబాద్అర్బన్: నగరంలోని పోలీస్ కమిషనరేట్లో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణి కార్యక్రమంలో 20 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి సీపీ సాయి చైతన్య అర్జీలను స్వీకరించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారుల అర్జీలను చట్టప్రకారం పరిష్కారం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. సమస్య, స్థితిని పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరావీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకుంటూ, సమస్యలను చట్టప్రకారం పరిష్కరించుకోవాలన్నారు. పోలీసులు ప్రజలకు మరింత దగ్గర అయ్యేలా శాంతిభద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందన్నారు. -
దేవుడి ముందు పెట్టిన దీపం అంటుకొని ఇల్లు దగ్ధం
బాల్కొండ: దేవుడి ఫొటోల ముందు ఉన్న దీపంతో ఇంటికి నిప్పు అంటుకొని కాలిపోయిన ఘటన మెండోరా మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. మెండోరాలోని రాజారపు భార్గవి సోమవారం ఇంట్లో దేవుడి ఫొటోల ముందర దీపం ముట్టించింది. అనంతరం ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లింది. కొంత సమయం తర్వాత ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని చుట్టుపక్కల వారు గమనించి, ఇంటి తాళాలు పగలగొట్టారు. కానీ అప్పటికే ఇంట్లో సామగ్రి, నగదు కాలి బూడిదయ్యాయి. విషయం తెలసుకున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ చారి ఘటన స్థలాన్ని పరిశీలించారు. సుమారు రూ. లక్ష నష్టం వాటిల్లినట్లు తెలిపారు. బాధితులకు తక్షణ సహాయం కింద రేషన్ బియ్యాన్ని అందించారు. ప్రభుత్వం నుంచి సహాయం అందేలా ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తానన్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు. -
నిందితుడిని అరెస్టు చేయాలి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై దాడికి యత్నించిన నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనుక ప్రమోద్, ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. ప్రమోద్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి అంటే ప్రజాస్వామ్యం మీద దాడిగా చూడాలన్నారు. గవాయి దళితుడు కాబట్టి ఈ దాడి జరిగిందన్నారు. జిల్లా అధ్యక్షుడు సరికెల పోశెట్టి సీనియర్ నాయకులు మైలారం బాలు. జాతీయ ఉపాధ్యక్షుడుగంగారం, సురేష్ నాంపల్లి, మారుతి, యమున, స్వప్న, భూమయ్య, ప్రవీణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
లింబాద్రి గుట్ట జాతరలో పాల్గొనాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం
కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్లోని లింబాద్రి గుట్ట(నింబాచలం) లక్ష్మీ నరసింహస్వామి జాతరలో పాల్గొనాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డిని సోమవారం ఆలయ అర్చకులు పార్థసారథి ఆహ్వానించారు. ఈమేరకు ఎమ్మెల్యేను హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి, ఆహ్వాన పత్రికను అందజేసి, ఆశీర్వదించారు. వచ్చే నెల 5న జరిగే జాతరకు హాజరుకావాలని కోరారు. దోమకొండ: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని గాంధీచౌక్ వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు. జనాభాలో ఎక్కువ శాతం ఉన్న బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతుందన్నారు. ప్రతి పార్టీ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నాయకులు ఐరేని నర్సయ్య, తీగల తిర్మల్గౌడ్, అబ్రబోయిన స్వామి, రాజేందర్, మర్రి శేఖర్, తదితరులు పాల్గొన్నారు. -
హెచ్యూఐడీ నంబరు అనే మాటే లేదు
బంగారు, వెండి ఆభరణాల వ్యాపారంలో లీగ ల్ మెట్రాలజీ శాఖ కేవ లం ఎలక్ట్రానిక్ కాంటా లు, తూకంల తనిఖీకే పరిమితమవుతోంది. వినియోగదారులు బంగారు, వెండి ఆభరణాల నాణ్యత విషయంలో మోసపోతున్నారు. అధికారులు నాణ్యత పరీక్షలు నిర్వహించడం లేదు. దీంతో వ్యాపారులు బిల్లులపై హెచ్యూఐడీ నంబరు వేయకుండానే విక్రయాలు చేస్తున్నా రు. వినియోగదారుల మండలి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 28వ తేదీ వర కు అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలపై కార్యక్రమాలు చేస్తున్నాం. వినియోగదారులను చైత న్యవంతులను చేస్తూ, నాణ్యతా లోపాలతో మోసపోయిన వినియోగదారులు.. వినియోగదారులు కమిషన్లలో ఫిర్యాదు చేసేవిధంగా కార్యక్రమాలను రూపొందించాం. దే శంలో ఇటీవల కాలంలో ఏకంగా 546 హాల్మా ర్క్ కేంద్రాల లైసెన్సులు రద్దు కావడాన్ని వినియోగదారుల హక్కుల పరిరక్షణ దృష్ట్యా అతిపెద్ద సమస్యగా పరిగణించాలి. ప్రపంచంలో అన్నివర్గాల ప్రజలకు పొదుపు మాంద్యంగా ఉన్న బంగారంపై ప్రమాణాల విధానం కఠినంగా అమలు చేయాల్సి ఆవశ్యకత ఉంది. – సాంబరాజు చక్రపాణి, వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి -
నాణ్యతపై నిఘా ఏదీ?
నిజామాబాద్ఫిర్యాదులను సత్వరమే.. ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు అధికారులకు సూచించారు. మంగళవారం శ్రీ 14 శ్రీ అక్టోబర్ శ్రీ 2025– 10లో uసాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఆహార పదార్థాలతోపాటు బంగారం, వెండి ఆభరణాలు, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు, కార్లు, బైక్స్ తదితర ఆటోమొబైల్స్, మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు, సిమెంట్, స్టీల్ తదితర ఇతర అన్నిరకాల వస్తువులకు సంబంధించి ‘బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్’(బీఐఎస్) నిర్దేశించిన మేరకు నాణ్యతాప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా అందరికీ ప్రియమైన, ప్రస్తుతం రోజురోజుకూ భారీగా ధర పెరుగుతున్న బంగారం విషయానికి వస్తే హెచ్యూఐడీ (హాల్మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్) నంబరు విషయంలో మాయాజాలం జరుగుతోంది. అయితే రాష్ట్రంలో, దేశంలోనూ ఈ ప్రమాణాలు పాటించడం సంగతి అటుంచితే.. ఇందుకు సంబంధించి నిఘా పెట్టే వ్యవస్థ సక్రమంగా పనిచేయలేని పరిస్థితి. ప్రతి రాష్ట్రంలో ఒక్కచోట మాత్రమే ఉండే బీఐఎస్ కార్యాలయాలకు తగినంతమంది సిబ్బంది లేకపోవడంతో ఇన్స్పెక్షన్లు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో తగిన చర్యలు తీసుకునే అవకాశాలు లేవు. దీంతో నాణ్యతా ప్రమాణాల విధానాలు ఆశించినవిధంగా అమలు కావడం లేదు. అక్టోబర్ 14 అంతర్జాతీయ ప్రమాణాల దినోత్సవం నేపథ్యంలో కథనం.. అన్నిరకాల వస్తువులకు సంబంధించి నాణ్యత పరంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రమాణాలు (స్టాండర్డ్స్)ను నిర్ణయిస్తుంది. ఈ మేరకు ఆయా వస్తువుల అమ్మకాలు చేపట్టాలి. అప్పుడే వినియోగదారులకు ఆర్థికపరంగా, ఆరోగ్యరీత్యా రక్షణ ఉంటుంది. అన్నింటిలో ఖరీదైన, పెట్టుబడి వస్తువుగా ఉన్న బంగారు ఆభరణాలకు ప్రమాణాలతోపాటు ఆరు అంకెల హాల్మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (హెచ్యుఐడీ)ని తప్పనిసరిగా ముద్రించాలి. ఈ నంబర్ రసీదుపైనా ఉండాలి. అయితే ఈ ప్రమాణాల విధానం సరైనదే అయినప్పటికీ అమలులో లోపాల కారణంగా వినియోగదారులు నిరంతరం మోసపోతూనే ఉన్నారు. ప్రమాణాల అమలుపై బీఐఎస్ విభాగానికి సంబంధించి రాష్ట్రంలో ఒక్క కార్యాలయం మాత్రమే ఉండడంతోపాటు తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో తనిఖీలు చేసే పరిస్థితి లేదు. దీంతో ప్రమాణాలు సరిగానే అమలు చేస్తున్నారా? లేదా? అని పర్యవేక్షించే పరిస్థితి లేదు. మరోవైపు వినియోగదారులకు ప్రమాణాల విషయమై అవగాహన లేకపోవడంతో ముఖ్యంగా బంగారు ఆభరణాలపై లోపాలతో కూడిన నకిలీ ముద్రలు, ఇతర వస్తువులపై అసలు ముద్రలే (బీఐఎస్, ఐఎస్ఐ) లేకపోవడంతో దారుణంగా మోసపోతున్నారు. తెలంగాణలో బంగారు ఆభరణాలపై హెచ్యూఐడీ ప్రమాణాల ముద్రలు వేసే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనుమతించిన 22 హాల్మార్కింగ్ కేంద్రాల్లో 16 కేంద్రాల లైసెన్సులు తాత్కాలికంగా రద్దు చేశారు. ఇక దేశవ్యాప్తంగా 546 హాల్మార్కింగ్ కేంద్రాల లైసెన్సులు రద్దు చేయడం గమనార్హం. ఈ లైసెన్సులు కలిగి ఉన్న కేంద్రాలు ముద్రలు వేసే విషయంలో అనేక అవకతవకలకు పాల్పడడంతో వాటిని రద్దు చేశారు. అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఒక్కోటి మాత్రమే ఉన్న బంగారం హాల్మార్క్ కేంద్రాల లైసెన్సులు రద్దు చేయడంతో వినియోగదారులకు ముద్రలు లేకుండానే అమ్మకాలు చేస్తున్నారు. కచ్చితమైన ప్రమాణాల నిబంధనలు ఉన్నప్పటికీ వినియోగదారులు మోసపోతున్న పరిస్థితి.మనం వాడే, మనకు అవసరమైన వస్తువుకు ప్రాముఖ్యత దాని నాణ్యతాప్రమాణంపై ఆధారపడి ఉంటుంది. మరి వస్తువు నాణ్యతాప్రమాణాల కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ విధానాలు సూచించినప్పటికీ అమలు మాత్రం అంతంతగానే ఉండటం గమనార్హం. అతి విలువైన బంగారం కొనుగోళ్ల సందర్భంగా వినియోగదారులు మోసపోతూనే ఉన్నారు. ప్రమాణాల విధానాలు సరే.. అమలు అంతంతేనా..? గృహోపకరణాలు, ఆటోమొబైల్స్, సిమెంట్, స్టీల్ తదితరాల ప్రమాణాలపై లేని పట్టింపు అందరికీ ప్రియమైన బంగారంలో అనేక లోపాలు హెచ్యూఐడీలో మాయాజాలం అక్టోబర్ 14 అంతర్జాతీయ ప్రమాణాల దినోత్సవం -
శిక్షణ కేంద్రంలో సౌకర్యాలను మెరుగుపర్చాలి
బోధన్ : పోలీసు ట్రెయినింగ్ సెంటర్లో సౌ కర్యాలు, వసతిని మరింత మెరుగుపర్చాల ని సంబంధిత అధికారులను సీపీ సాయిచైత న్య ఆదేశించారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామశివారులోని జిల్లా పోలీస్ శిక్ష ణ కేంద్రాన్ని సీపీ సోమవారం సందర్శించా రు. కేంద్రం పరిసరాల్లో కలియదిరిగారు. గ దులు, వంటశాల, నీటిసరఫరా, మరుగుదొడ్లు, అవుట్ డోర్ పరేడ్ గ్రౌండ్, ఫైరింగ్ రేంజ్ పరిశీలించారు. సీపీ వెంట బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్బాబు, ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ, శిక్షణా కేంద్రం ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు. వైన్ షాపులకు 232 దరఖాస్తులు నిజామాబాద్ అర్బన్: జిల్లాలోని 102 మ ద్యం దుకాణాలకు ఇప్పటి వరకు మొత్తం 232 దరఖాస్తులు అందినట్లు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు. సోమవారం 83 దరఖాస్తులు అందాయని, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం ఖలీల్వాడి : డైట్ కళాశాలలో తాత్కాలిక ప్రాతిపదికన అతిథి అధ్యాపక పోస్టుల (గెస్ట్ లెక్చరర్)భర్తీ కోసం అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ టి శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునే సమయానికి అభ్యర్థుల వయస్సు 65 సంవత్సరాల లోపు ఉండాలని, రిటైర్డ్ లెక్చరర్లు, టీచర్లు, ప్రధానోపాధ్యాయులు, నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇంగ్లిష్, తెలుగు మీడియంలో ఫిలాసఫీ, సోషి యాలజీ సబ్జెక్టుల్లో ఒక పోస్టు, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో ఒక పోస్టు, ఉర్దూ మీడియంలో రెండు పోస్టులు మ్యాథమేటిక్స్, ఫిలా సఫీ/సోషియాలజీ/సైకాలజీ సబ్జెక్ట్స్లో ఖా ళీలు ఉన్నాయని వివరించారు. అభ్యర్థు లు సంబంధిత సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్తోపాటు ఎంఎడ్ అర్హత కలిగి ఉండాలని సూచించారు. ఎంఎడ్ అభ్యర్థులు అందుబాటులో లేనిపక్షంలో సంబంధిత సబ్జెక్టుకు బీఎడ్ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు కళాశాలలో ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. మెరిట్ ప్రాతిపదికన 1:5 నిష్పత్తిలో డెమో, ఇంటర్వ్యూ నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు. రేపు జాబ్ మేళా నిజామాబాద్ నాగారం: నిరుద్యోగులకు ప్రైవేట్రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు బుధవారం జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బీపీ మధుసూదన్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరుణ్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాబ్మేళా ద్వారా సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ గార్డు, సలహాదారు, క్యాషియర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి, ఏదైనా డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు నిజామాబాద్నగరంలోని శివాజీనగర్లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో బుధవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం వరకు ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలిపారు. ఇతర వివరాలకు 99594 56793, 99487 48428, 63057 43423 నంబర్లను సంప్రదించాలని సూచించారు. పోలీస్ సిబ్బందికి ఉలెన్ జాకెట్లు పంపిణీ నిజామాబాద్అర్బన్: ఏఆర్, సివిల్ పోలీస్ సిబ్బందికి సీపీ సాయిచైతన్య సోమవారం త న కార్యాలయంలో ఉలెన్ జాకెట్లు, హవర్ సాక్సులు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్తగా అందజేశామని, సిబ్బంది ఉలెన్ జాకెట్లు, హవర్ సాక్సు లు తమ వెంట ఉంచుకుని ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ సబ్ ఇన్స్పెక్టర్ సంతోష్రెడ్డి, ఆర్ఎస్సైలు నిశిత్, సుమంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సారెస్పీలోకి మళ్లీ పోటెత్తిన వరద
● నాలుగు గేట్ల ద్వారా 12,500 క్యూసెక్కుల నీటి విడుదల ● నిండుకుండలా శ్రీరాంసాగర్ వరద గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి వరద ఆదివారం మధ్యాహ్నం నుంచి మళ్లీ పోటెత్తింది. ప్రాజెక్ట్లోకి గరిష్టంగా 60 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో 16 వరద గేట్లను ఎత్తి గోదావరిలోకి 50 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రానికి క్రమంగా ఇన్ఫ్లో 34 వేల 709 క్యూసెక్కులకు పడిపోయింది. దీంతో దిగువకు నీటి విడుదలను తగ్గించారు. 8 వరద గేట్ల ద్వారా 25 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రాత్రి సమయానికి ఇన్ఫ్లో మరింత తగ్గి 23 వేల క్యూసెక్కులకు పడిపోవడంతో నాలుగు గేట్ల ద్వారా 12,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువ ద్వారా 5 వేల క్యూసెక్కులు, ఎస్కేప్గేట్ల ద్వారా 3 వేలు, సరస్వతి కాలువ ద్వారా 650, లక్ష్మి కాలువ ద్వారా 200, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, ఆవిరి రూపంలో 709 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా అంతే స్థాయి నీటి మట్టంతో ప్రాజెక్ట్నిండుకుండలా ఉందని అధికారులు తెలిపారు. -
పార్టీ కోసం పనిచేసేవారికే పదవులు
నిజామాబాద్ సిటీ: డీసీసీ, సీసీసీ అధ్యక్ష పదవులను త్వరలో భర్తీచేస్తామని, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ కోసం పనిచేసే వారికే పదవులు కట్టబెడతామని ఏఐసీసీ పరిశీలకుడు, కర్ణాటక రాష్ట్ర ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని హరిత హోటల్లో డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార సంఘం లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలో ఖాళీగా ఉన్న పదవులన్నింటిని ఏఐసీసీ ఆదేశాల మేరకు త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. అన్ని జిల్లాల్లో డీసీసీ, సీసీసీ పోస్టులను ముందుగా భర్తీ చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నాయకుల అభిప్రాయలను సేకరిస్తామని, ఇప్పటికే బ్లాక్ లెవల్ కాంగ్రెస్ నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్నామన్నారు. వారం రోజులపాటు జిల్లాలో ఉండి అన్ని నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్లు రిజ్వాన్ తెలిపారు. ఈనెల 14న బోధన్లో, 15న ఆర్మూర్లో, 16న బాల్కొండ, 17న నిజామాబాద్ రూరల్లో, బాన్సువాడ నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్లు వివరించారు. సమావేశంలో బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార సంఘం లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, నుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్గౌడ్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ కె నగేశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు కేతావత్ యాదగిరి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటాం నియోజకవర్గాల వారీగా పర్యటిస్తా ముందుగా డీసీసీ, సీసీసీ పోస్టుల భర్తీ ఏఐసీసీ పరిశీలకుడు, ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ -
మక్క కొనుగోళ్లకు ఏర్పాట్లు!
● 26 సెంటర్లను ఖరారు చేసిన అధికారులు ● ఇక ప్రభుత్వ ఆదేశాలే తరువాయి డొంకేశ్వర్ మండలం తొండాకూర్ శివారులో మక్కలను ఆరబెడుతున్న రైతులుడొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో మక్క కొనుగోళ్లకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఎన్ని సెంటర్లు, ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై కసరత్తు చేసిన అధికారులు.. జిల్లా వ్యాప్తంగా 14 మండలాల్లో 26 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేపట్టనుండగా సహకార సంఘాల ద్వారా మక్కలను సేకరించనున్నారు. ఈ మేరకు ఎంపిక చేసిన సొసైటీల్లో ఈ–పాస్ యంత్రాలను అందుబాటులో పెట్టుకోవాలని మార్క్ఫెడ్ అధికారులు సహకార శాఖకు లేఖ రాశారు. అయితే మక్క కొనుగోళ్లపై మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇటీవల ప్రకటన చేయడంతో రెండు, మూడు రోజుల్లో జీవో ద్వారా ఆదేశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఆదేశాలు రాగానే కేంద్రాలను తెరిచేందుకు సిద్ధంగా ఉండాలని సొసైటీ సీఈవోలకు సూచించారు. కేంద్రాల్లోనే మద్ధతు ధర జిల్లాలో ఖరీఫ్ సీజన్కుగాను 52,093 ఎకరాల్లో మొక్కజొన్నను రైతులు సాగు చేశారు. సుమారు 1.45లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పంట కోతలు మొదలై 20 రోజులవుతున్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దీంతో వేచి చూసే పరిస్థితి లేక క్వింటాల్కు రూ.2,100 రేటు వచ్చినా రైతులు అమ్మేస్తున్నారు. ప్రభుత్వం మొక్కజొన్నకు రూ.2,420 మద్దతు ధర ప్రకటించినప్పటికీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో మద్ధతు ధరను పొందలేకపోతున్నారు. మొక్కజొన్న కోతలు దాదాపు పూర్తి కాగా, మార్కెట్లో 40 శాతం మక్కలు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించారు. సెంటర్ల ఏర్పాటుపై ప్రభుత్వం ఇంకా ఆలస్యం చేస్తే వ్యాపారులు మరింత తక్కువ ధరకు కోనే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. మక్కలను కొనుగోలు చేసేందుకు జిల్లాలో సెంటర్లను ఎంపిక చేశాం. సొసైటీల ద్వారా రైతుల నుంచి మక్కలను కొంటాం. ప్రభుత్వం నుంచి రెండు, మూడు రోజుల్లో ఆదేశాలు వచ్చే అవకాశాలున్నాయి. రాగానే కేంద్రాలను తెరుస్తాం. – దాసోజు మహేశ్, మార్క్ఫెడ్ డీఎం -
అక్రమాలకు తావిస్తే క్రిమినల్ కేసులు
● ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు ఎదురైతే అధికారులదే బాధ్యత ● వీడియోకాన్ఫరెన్స్లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డినిజామాబాద్ అర్బన్: ధాన్యం సేకరణలో అక్రమాలకు తావిస్తే క్రిమినల్ కేసులు పెడతామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. ఏ దశలోనూ రైతులకు ఇబ్బందులు ఎదురుకాకుండా, ధాన్యం సేకరణ ప్రక్రియ సాఫీగా సాగేలా సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సబ్ కలెక్టర్లు, ఆర్డీవో, తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం సేకరణ సందర్భంగా ఎక్కడైనా రైతులు ఆందోళనలకు దిగితే సంబంధిత అధికారులనే బాధ్యులుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. తహసీల్దార్లు క్రియాశీలక పాత్ర పోషిస్తూ, బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించడంతోపాటు ఎఫ్ఏక్యూ ప్రమాణాలకు లోబడి బాగా ఆరబెట్టి, శుభ్రపర్చిన ధాన్యాన్ని తీసుకువచ్చేలా క్షేత్ర స్థాయిలో రైతులను చైతన్యపర్చాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. పచ్చి ధాన్యం కోయకుండా రైతులు, హార్వెస్టర్ల యజమానులకు అవగాహన కల్పించాలన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిజ్ఞాన్ మాల్వియా, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, ఆర్డీవో రాజేంద్రకుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, డీఎస్వో అరవింద్రెడ్డి, సివిల్ సప్లయీస్ డీఎం శ్రీకాంత్రెడ్డి, డీసీవో శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర్రావు, మార్కెటింగ్ శాఖ ఏడీ గంగవ్వ, తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచండి
● డీఎంహెచ్వో రాజశ్రీ ● నగరంలో వైద్యాధికారులు, నర్సింగ్ ఆఫీసర్లతో సమీక్ష నిజామాబాద్నాగారం: వైద్య సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని జిల్లా వైద్యాధికారి రాజశ్రీ అన్నారు. నగరంలోని కలెక్టరేట్లోగల డీఎంహెచ్వో కార్యాలయంలో సోమవారం ఆమె వైద్యాధికారులు, నర్సింగ్ అధికారులకు, పీహెచ్సీ వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రాజశ్రీ మాట్లాడుతూ.. ప్రతి ఆరోగ్య ఉపకేంద్రం పరిధిలో ఏఎన్ఎం, ఆశలు, అర్హులైన గర్భిణుల జాబితాను ఉంచుకోవాలన్నారు. రక్తహీనత గల గర్భిణులను ముందే గుర్తించి వారికి పోషకాహారం ఐరన్ మాత్రలు, ఐరన్ సూక్రోజ్ తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అత్యంత ప్రమాదకర లక్షణాలు గల గర్భిణులకు మాత్రమే శస్త్ర చికిత్సలు చేయాలని, మిగతా గర్భిణులకు సాధారణ ప్రసవాలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తక్కువగా ప్ర సవాలు చేసిన పీహెచ్సీ వైద్యాధికారులతో మాట్లా డి, ప్రసవాలు పెంచేలా కృషి చేయాలని ఆదేశించా రు. ప్రసవానికి ముందే బర్త్ ప్లాన్ ప్రకారం గర్భిణులను ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకెళ్లాలని అన్నారు. తద్వారా మాతాశిశు మరణాలను తగ్గించవచ్చన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్ శ్వేత, అశ్విని, డిప్యూటీ డీఎంహెచ్వో రమేష్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి అశోక్, ఏవో రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. సీపీఆర్పై అవగాహన అవసరంనిజామాబాద్ నాగారం: ప్రతిఒక్కరికి సీపీఆర్ (కార్డియో పల్మనరీ రీసెర్సిటేషన్)పై అవగాహన ఉండాలని డీఎంహెచ్వో రాజశ్రీ అన్నారు. సీపీఆర్ వారోత్సవాల్లో భాగంగా నగరంలో సోమవారం ఆమె సీపీఆర్పై వివరించారు. ప్రతి ఒక్కరూ పోషకాహారం తీసుకుంటూ ఉప్పును తగ్గించాలని, జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలని, జీవనశైలి మార్పుల ద్వారానే జీవన శైలి వ్యాధులను అరికట్టవచ్చనన్నారు. వారంపాటు జిల్లావ్యాప్తంగా మూడు డివిజన్లలో సీపీఆర్పై అవగాహన కల్పించామన్నారు. కార్యక్రమంలో వైద్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైద్యశాఖ కార్యాలయాల తనిఖీ నిజామాబాద్నాగారం: జిల్లాకేంద్రంలోని డీఐవో, మలేరియా, పీవోడీటీటీ కార్యాలయాలను, డిప్యూటీ డీఎంహెచ్వో ఆఫీస్ను సోమవారం డీఎంహెచ్వో రాజశ్రీ తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాల్లోని రికార్డులను పరిశీలించారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. -
బీసీ జేఏసీ జిల్లా కమిటీ నియామకం
నిజామాబాద్ నాగారం: నగరంలోని గీతాభవన్లో సోమవారం బీసీ కమిటీల అన్ని సంఘాలు, జేఏసీ రాష్ట్ర కమిటీ సూచన మేరకు జిల్లా కమిటీని నియమించినట్లు నాయకులు రేవంత్ తెలిపారు. జిల్లా చైర్మన్గా పోతనకార్ లక్ష్మి నారాయణ, కో–చైర్మన్గా బొబ్బిలి నర్స య్య నియమితులయ్యారు. ప్రతి కుల సంఘం నుంచి ఒక ప్రతినిధిని కో–కన్వీనర్గా నియమించినట్లు పేర్కొన్నారు. బీసీ నాయకులు నాగరాజ్, సభ్యులు పాల్గొన్నారు.నిజామాబాద్నాగారం: నగరంలోని కలెక్టరేట్లో సోమవారం జాతీయ పోషణ మాసోత్సవాలకు సంబంధించిన వాల్పోస్టర్లను అడిషనల్ కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 16 వరకు జరిగే పోషన్ మాసోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని, విజయవంతం చేయాలన్నారు. ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, జిల్లా సంక్షేమాధికారిణి రసూల్బీ తదితరులు పాల్గొన్నారు. డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో మక్క కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిల భార త రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు సోమవారం జిల్లా కేంద్రంలోని మార్క్ఫెడ్ డీఎం దాసోజు మహేశ్కు వినతిపత్రం అందజేశారు. జిల్లాలో మక్క కోత లు మొదలై 20 రోజులైనా ప్రభుత్వం నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు. వీలైనంత త్వరగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, రైతులకు మద్దతు ధర దక్కేలా చూడాల ని కోరారు. నాయకులు సాయిరెడ్డి, ఆకుల పా పన్న, సాయిలు, దేవన్న, గంగాధర్, మోహన్ తదితరులు ఉన్నారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఎంఈడీ 2వ సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగినట్టు అకాడమిక్ ఆడిట్సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో జరిగిన పరీక్షకు మొత్తం 29 మంది అభ్యర్థులకు గాను అందరూ హాజరయ్యారైనట్లు ఆయన తెలిపారు. పోతన్కర్ లక్ష్మీనారాయణ బొబ్బిలినర్సయ్య -
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
● అదనపు కలెక్టర్ అంకిత్ ● ప్రజావాణిలో 88 వినతుల స్వీకరణ నిజామాబాద్అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమ వారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జి ల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్తో పాటు డీఆర్డీవో సాయాగౌడ్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, బోధన్ ఏసీపీ శ్రీనివాస్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. మొత్తంగా 88 ఫిర్యాదులు అందాయి. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


