breaking news
Nizamabad District News
-
డైట్ బిల్లులు వచ్చేదెప్పుడో?
● జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్లకు కొన్ని నెలలుగా నిలిచిన నిధులు ● ఇబ్బందుల్లో విద్యార్థులు, వార్డెన్లుఆర్మూర్టౌన్: జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాలకు కొన్ని నెలలుగా డైట్ బిల్లులు రావడం లేదు. దీంతో విద్యార్థులు, వార్డెన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో వార్డెన్లు తమ జేబుల్లోంచి డబ్బులు వెచ్చించి, విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తున్నామని వాపోతున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని అవేదన వ్యక్తం చేస్తున్నారు. సరఫరా నిలిచే ప్రమాదం... హాస్టల్స్కు రైస్, పప్పులు, చింతపండు, గుడ్లు, చికెన్, కూరగాయలు, వంటగ్యాస్ సరఫరా జరుగుతున్నప్పటికీ బకాయిలు ఎక్కువ కావడంతో సరఫరాదారులు వెనుకంజ వేస్తున్నారు. ఈ పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే, విద్యార్థులకు ఆహార పదార్థల సరఫరా నిలిచే ప్రమాదం ఉంది. సరఫరాదారులు బిల్లులు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొంటున్నారు. పలుచోట్ల హాస్టల్ వార్డెన్లు తమ జేబుల్లోంచి డబ్బులు వెచ్చించి, విద్యార్థులకు సమస్యలు రాకుండ చూస్తున్నారు. అలాగే హాస్టల్స్లో వందలాది కుక్లు, కాంటీన్ సిబ్బంది, వాచ్మెన్లకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వేతనాలు అందడం లేదు. దీంతో వారు జీతాలు లేకి కుటుంబ పోషణ కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల అద్దె భవనాల్లో హాస్టల్స్ నిర్వహిస్తుండగా, ఇంటి యజమానులకు కొన్ని నెలలుగా బిల్లులు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు చెల్లించాలని పలువురు కోరుతున్నారు.బిల్లులు రాకపోవడంతో వసతి గృహం నిర్వహణ కష్టంగా మారింది. హాస్టల్ భవనం అద్దె, పిల్లకు కాస్మెటిక్ చార్జీలు కొన్ని నెలలుగా రావడం లేదు. నిధులు లేక జిల్లాలోని వసతి గృహాల అధికారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి. – సౌడ సురేష్, హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు -
బాల్ బ్యాడ్మింటన్ రాష్ట్రజట్టుకు ఇద్దరు జిల్లావాసుల ఎంపిక
నిజామాబాద్ నాగారం: రాష్ట్ర సబ్ జూ నియర్ బాల్ బ్యాడ్మింటన్ జట్టులో ఇద్ద రు జిల్లావాసు లు ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన ఎంపిక పోటీల్లో జిల్లా క్రీడాకారులు ఎ. రీతిక (జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తిమ్మాపూర్), శ్రీరోహణ్ (ఉప్పల్వాయి) తెలంగాణ జట్టుకు ఎంపికయ్యారు. వీరు రాష్ట్రజట్టుతో కలసి ఈనెల 24 నుంచి 28 వరకు తమిళనాడు లో జరిగే 44వ జాతీయస్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొంటారని జిల్లా బాల్బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర జట్టుకు ఎంపికై న క్రీడాకారులను సంఘ ప్రతినిధులు, వివిధ క్రీడా సంఘాల సభ్యులు అభినందించారు. -
స్వగ్రామానికి చేరిన మృతదేహం
మాచారెడ్డి: మండలంలోని చుక్కాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల బహ్రెయిన్ దేశంలో మృతిచెందగా, మంగళవారం మృతదేహం స్వగ్రామానికి చేరింది. వివరాలు ఇలా.. మండలంలోని చుక్కాపూర్ గ్రామానికి చెందిన కామటి ఎల్లయ్య(49) మూడు నెలల క్రితం బహ్రెయిన్ వెళ్లాడు. ఈ నెల 12న చాతిలో నొప్పంటూ కుప్పకూలిపోయాడు. వెంటనే ఎల్లయ్యను స్నేహితులు ఆస్పత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. మృతుడి బంధువులు, అక్కడి స్నేహితులు మృతదేహం స్వగ్రామానికి వచ్చేలా కృషి చేయడంతో మంగళవారం చేరింది. ఎల్లయ్య మృతదేహాన్ని చూసి గ్రామస్తులు, కుటుంబసభ్యులు కంటతడి పెట్టారు. ప్రభుత్వం స్పందించి మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. నవీపేట: మండల కేంద్రంలోని సుభాష్నగర్ కాలనీకి చెందిన నందిపేట కృష్ణ(33) అదృశ్యమైనట్లు ఎస్సై తిరుపతి మంగళవారం తెలిపారు. ఈనెల 19న కూలీ పనులకు వెళ్లిన కృష్ణ ఇప్పటికీ ఇంకా ఇంటికి తిరిగిరాలేడు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట పోలీస్స్టేషన్లో విధులు నిర్వహించే మహిళా కానిస్టేబుల్ను బెదిరించిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపారు. మండలంలోని పోచారం ప్రాజెక్టు వద్ద ఇటీవల ‘ప్రాజెక్టు వద్దకు ఎవరూ వెళ్లవద్దని’ అక్కడ హెచ్చరిక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన మహ్మాద్ సైఫుల్లాఖాన్, మహ్మాద్ సనాహుల్లాఖాన్, మహ్మాద్ అబ్దుల్ వదూద్ ఖురైషి, లులుఖాన్ అనే వ్యక్తులు సదరు ఫ్లెక్సీని తొలగించి కారులో ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. దీంతో వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని కానిస్టేబుల్ అన్వరీ వారిని హెచ్చరించారు. కానీ వారు వినిపించుకోకుండా కానిస్టేబుల్పై బెదిరింపులకు పాల్పడ్డారు. కారుతో కానిస్టేబుల్ను ఢీకొట్టేలా భయపెట్టారు. దీంతో నలుగురిపై కేసునమోదు చేసినట్లు ఆయన తెలిపారు. డిచ్పల్లి: డిచ్పల్లి ఆర్టీసీ బస్టాండ్లోని బోరుమోటారును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. బస్టాండ్ సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించి ఆర్టీసీ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఆర్టీసీ ఆధికారులు మంగళవారం బస్టాండ్ను సందర్శించి బోరును పరిశీలించారు. వెంటనే డిచ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నట్లు ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపారు. -
ముగిసిన కబడ్డీ జట్టు శిక్షణ శిబిరం
నిజామాబాద్ నాగారం: నగరంలోని జిల్లా కబడ్డీ జట్ల శిక్షణ శిబిరం మంగళవారం ముగిసినట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు అంద్యాల లింగయ్య, ప్రధాన కార్యదర్శి గంగాధర్ రెడ్డి తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా జట్టుకు ఎంపికై న అండర్–16 బాలబాలికల జట్ల వివరాలను ప్రకటించారు. బాలుర కబడ్డీ టీం కోచ్ అన్వేష్, మేనేజర్ వినోద్, బాలికల కబడ్డీ టీమ్ కోచ్ సాయిలు, మేనేజర్ అనురాధ సమక్షంలో ఇట్టి క్రీడాకారులను ఎంపిక చేసినట్లు వివరించారు. ఈ నెల 25 నుంచి 28 వరకు ముప్కాల్ భుదేవ్ ఇండోర్ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో ఇట్టి క్రీడాకారులు పాల్గొననున్నట్లు తెలిపారు. ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ సభ్యులు పాల్గొన్నారు. -
బ్రాహ్మణ కాలనీలో 30 తులాల బంగారం దొంగతనం
ఖలీల్వాడి: నాగారంలోని బ్రాహ్మణ కాలనీకి చెందిన పవన్ శర్మ అనే అర్చకుడి ఇంట్లో చోరీ జరిగినట్లు నార్త్ సీఐ బూస శ్రీనివాస్ తెలిపారు. వివరాలు ఇలా.. బ్రాహ్మణకాలనీకి చెందిన పవన్ శర్మ మంగళవారం ఉదయం ఇంటికి తాళం వేసి, పూజలు చేయడానికి బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం అతడు తిరిగి ఇంటికి రాగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దుండగులు ఇంట్లోని లాకర్ను ధ్వంసం చేసి, అందులో ఉన్న 30 తులాల బంగారంను ఎత్తుకెళ్లారు. పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా, ఇద్దరు గుర్తు తెలియని యువకులు బైక్పై వచ్చిన ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లినట్లు తెలిసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రం పరిధిలోని జాతీయ రహదారి 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. వివరాలు ఇలా.. మండల పరిధిలోని వజ్జపల్లి గ్రామానికి చెందిన లింగాల సాయికుమార్, దూస్గాం శ్రీకాంత్ మంగళవారం బైక్పై కామారెడ్డి నుంచి వజ్జపల్లి బయలుదేరారు. మండల కేంద్రం సమీపంలో వీరి బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారిలో శ్రీకాంత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎల్లారెడ్డి: పట్టణానికి చెందిన ఓ యువకుడు తప్పిపోగా, మండలంలోని ఓ వ్యక్తి అతడిని గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించాడు. వివరాలు ఇలా.. ఎల్లారెడ్డిలోని బీసీ కాలనీకి చెందిన హమీద్ నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ఎల్లారెడ్డికి వస్తున్నట్లు కుటుంబసభ్యులకు తెలిపాడు. కానీ అతడు ఇంటికి చేరకపోవడంతో కుటుంబసభ్యులు అతడి వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈక్రమంలో ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన రామాగౌడ్ హైదరాబాద్కు వెళ్లగా బొల్లారం రైల్వేస్టేషన్ దగ్గర అతడికి హమీద్ కనిపించాడు. వెంటనే అతడు హమీద్ని కలిసి కుటుంబసభ్యులకు సమచారం అందించారు. అనంతరం హమీద్ను అతడి బంధువులకు అప్పగించారు. దీంతో రామాగౌడ్ను స్థానికులు అభినందించారు. జక్రాన్పల్లి: మండలంలోని తొర్లికొండ గ్రామంలో చోరీకి పాల్పడ్డ నిందితుడికి ఆర్మూర్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించినట్లు ఎస్సై మాలిక్ రహమాన్ తెలిపారు. వివరాలు ఇలా.. తొర్లికొండ గ్రామంలోని గడ్డం భూమేశ్వర్ ఇంట్లో మార్చి 27న చోరీ జరిగింది. దుండగుడు ఇంటి తాళాలు పగుల గొట్టి ఇంట్లోని డబ్బులు, వంట సామగ్రిని ఎత్తుకెల్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. నిందితుడిగా అదే గ్రామానికి చెందిన నూనె కిరణ్ను గుర్తించారు. దీంతో అతడిని పట్టుకొని ఆర్మూర్ కోర్టులో హాజరుపర్చారు. జడ్జి విచారణ జరిపి నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించిట్లు ఎస్సై తెలిపారు. -
అర్బన్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
● నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ● నగరంలోని పలు డివిజన్లలో పర్యటనసుభాష్నగర్: నిజామాబాద్ కార్పొరేషన్లోని ప్రజలకు మౌలిక వసతులు కల్పించి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని 45వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో మంగళవారం ఆయన మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్తో కలిసి పర్యటించారు. ఈసందర్భంగా కాలనీవాసులు పలు సమస్యలను ఎమ్మెల్యే, కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాల హనుమాన్ మందిరం పక్కన కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టి శాశ్వత పరిష్కారం చూపుతానని కాలనీవాసులకు హామీనిచ్చారు. డ్రెయినేజీ సమస్యలు తలెత్తకుండా మున్సిపల్ సిబ్బంది నిత్యం డ్రెయినేజీ పూడికలు తీయాలని, అవసరమున్నచోట డ్రెయినేజీ పునర్నిర్మాణం చేపట్టాలని కమిషనర్కు సూచించారు. నగరంలో వీధి దీపాల సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని తెలిపారు. నగరంలో అభివృద్ధి పనుల కోసం స్పెషల్ ఫండ్ రూ.100 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొన్నారు. నగరంలో రాత్రి సమయంలో ఆకతాయిలు మద్యం తాగి న్యూసెన్స్ చేస్తున్నారని కాలనీవాసులు విన్నవించగా, ఏసీపీతో మాట్లాడి రాత్రి సమయంలో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీనిచ్చారు. మున్సిపల్ ఏఈ పావని, బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, నాయకులు ఆకుల శ్రీనివాస్, నరేష్, బొబ్బిలి వేణు, ఎర్రన్న, పవన్, ఆనంద్, కాలనీవాసులు, తదితరులు ఉన్నారు. -
జాతీయస్థాయి బ్యాడ్మింటన్లో ప్రతిభ
సుభాష్నగర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయపూర్లో ఇటీవల నిర్వహించిన జాతీయస్థాయి విద్యుత్ బాడ్మింటన్ పోటీల్లో ఓపెన్ డబుల్స్ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన జిల్లాకు చెందిన ఇంజినీర్ బి కృష్ణకాంత్ను ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రాపెల్లి రవీందర్ మంగళవారం సన్మానించారు. అలాగే వరంగల్లో నిర్వహించిన ఇంటర్ సర్కిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్, చెస్ చాంపియన్షిప్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్టు ఈవెంట్ విభాగంలో తృతీయ స్థానంలో నిలిచింది. వ్యక్తిగత విభాగంలో బి కృష్ణకాంత్ (బషీరాబాద్) ద్వితీయ స్థానం, డబుల్ విభాగంలో శివతేజ రెడ్డి (తాడ్వాయి) ద్వితీయ స్థానం సాధించారు. టీమ్ ఈవెంట్ విభాగంలో రూప్సాయి, ప్రశాంత్ జట్టులో కీలకపాత్ర పోషించి తృతీయస్థానంలో నిలిచేలా ప్రతిభ కనబర్చడంతో ఎస్ఈ అభినందించారు. కార్యక్రమంలో డీఈ వెంకటరమణ, ఏఏవో గంగారాం, జేఏఓ సురేశ్కుమార్, పోశెట్టి, గోపి, రఘువీర్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
గ్రామ పాలన అధికారుల విధులివే..
మీకు తెలుసా? సమాచారం..కమ్మర్పల్లి: బ్యాంకులో ఖాతా తెరవాలంటే పాన్కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఇందుకోసం మనం వాడుతున్న సెల్ఫోన్లోనే దరఖాస్తు చేసుకొని, కొద్ది నిమిషాల్లోనే సులభంగా ఈ–పాన్ కార్డు పొందవచ్చు. మొదటగా గూగుల్లో ’ఈ–ఫిల్లింగ్ అని టైప్ చేయాలి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హోమ్ పేజీలోకి వెళ్లి ఇన్స్టంట్ ఈ–పాన్ అనే ఐచ్చికాన్ని ఎంచుకొని ’గెట్ న్యూ పాన్ కార్డు’ అని నమోదు చేయాలి. తర్వాత ఆధార్ నంబర్ను నమోదు చేయగానే జనరేట్ ఆధార్ ఓటీపీ అని సూచిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే ఆధార్ కార్డుకు లింక్ ఉన్న ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ నమోదు చేయగానే ఆధార్లో ఉన్న వివరాలు కనిపిస్తాయి. సరి చూసుకుని అనుమతించాలి. అనంతరం దరఖాస్తు చేసుకున్నట్లు అక్నాలెడ్జ్మెంట్ నంబర్ మన ఫోన్కు సందేశం వస్తుంది. మళ్లీ మన విన్నపాన్ని ఆమోదించినట్లు కొద్ది గంటల్లోనే సందేశం వస్తుంది. రాగానే ఈ–ఫైలింగ్లోనే మళ్లీ హోం పేజీకి వెళ్లి ఇన్స్టంట్ ఈ–పాన్ని ఎంచుకోవాలి. డౌన్లోడ్ ఈ–పాన్ మీద క్లిక్ చేసి ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ అడుగుతోంది. ఓటీపీ ఎంటర్ చేయగానే పాన్ కార్డు ఫైల్ రూపంలో డౌన్లోడ్ అవుతుంది. ఫైల్ను ఓపెన్ చేయాలంటే పుట్టినరోజు తేదీని ఎంటర్ చేస్తే పాన్కార్డు ఓపెన్ అవుతుంది.రామారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల క్లస్టర్ల వారీగా ఒక్కో గ్రామానికి ఒక్కో గ్రామ పాలన అధికారిని నియమించింది. వారు నిర్వహించే విధుల వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామస్థాయిలో భూఖాతా(విలేజ్ ఎకౌంట్) నిర్వహణ. పహాణీల నమోదు. రెవెన్యూ మాతృదస్వరం నిర్వహణ అన్ని రకాల భూముల నిర్వహణ మార్పులు, చేర్పులు. లావుణీ అసైన్డ్, దేవాదాయ వర్క్స్, ప్రభుత్వం సేకరించిన భూముల నిర్వహణ. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, నీటి వనరుల కింద భూముల పరిరక్షణ. అన్యాక్రాంతం, ఆక్రమణలపై చర్యలకు సహకరించడం. భూమి ఖాతాల నిర్వహణ, మార్పులు, చేర్పులు నమోదు. భూ సర్వేకు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే సేవలందించడం. ప్రకృతి విపత్తులు సంభవిస్తే నష్టం అంచనా. గ్రామస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులను గుర్తించడం. -
వారం రోజులు.. రెండు భారీ చోరీలు
● ఇటీవల నగరంలోని ఓ ఇంట్లో 19తులాల బంగారం, రూ.10లక్షల విదేశీ కరెన్సీ అపహరణ ● తాజాగా అర్చకుడి ఇంట్లో..ఖలీల్వాడి: నగరలో శివారు కాలనీలోని తాళం వేసిన ఇళ్లనే దొంగలు టార్గెట్ చేస్తున్నారు. గత వారం రోజుల్లో దుండగులు నగరంలో రెండు భారీ చోరీలకు పాల్పడ్డారు. ఇటీవల నగరంలోని ఐదో టౌన్ పరిధిలోగల ఆసద్బాబానగర్లో తాళం వేసిన ఇంట్లోకి దుండగులు చొరబడి బీరువాలో ఉన్న 19 తులాల బంగారం, రూ.10లక్షల విదేశీ కరెన్సీని చోరీ చేశారు. ఈ ఘటన మరువకముందే తాజాగా మంగళవారం నాగారంలోని బ్రహ్మణకాలనీలో ఓ అర్చకుడి ఇంట్లోని 30 తులాల బంగారంను చోరీ చేశారు. వారం రోజుల్లో రెండు భారీ చోరీలు చోటుచేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దసరా సెలవుల నేపథ్యంలో.. దసరా సెలువులు రావడంతో కుటుంబసభ్యులు ఇళ్లకు తాళాలు వేసి పిల్లలతో కలిసి బంధువుల ఇళ్లకు వెళుతున్నారు. ఈక్రమంలో దుండగులు తాళం ఉన్న ఇళ్లను గుర్తించి, తమకు అనుమైన సమయంలో, జనసంచారం తక్కువ ఉన్న ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. ఈనేపథ్యంలో ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి, ఊర్లకు వెళ్లినట్లయితే తమకు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండ, సేఫ్టీ ప్రదేశాల్లో, బ్యాంకు లాకర్లలో ఉంచాలని పేర్కొంటున్నారు.కుటుంబసభ్యులతో కలిసి బయటకు వెళ్లేటప్పుడు ఇంటికి తాళం వేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అలాగే ఇంట్లో బంగారం, నగదు ఉంచవద్దు. కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే డయల్ 100కు సమాచారం అందించాలి. ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలి. – బూస శ్రీనివాస్, నార్త్ సీఐ, నిజామాబాద్ -
అర్సపల్లిలో ఆయుర్వేద వైద్య శిబిరం
నిజామాబాద్ నాగారం: నగరంలోని ఆర్సపల్లి గ్రామంలో వివేకానంద యోగా కేంద్రంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని మంగళవారం అడిషనల్ కలెక్టర్ అంకిత్ ప్రారంభించారు.ఈసందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో ఔషధ మొక్కల ప్రాధాన్యత, వంట ఇంట్లో లభించే వస్తువుల ప్రాముఖ్యతను వివరించారు. డీఎంహెచ్వో రాజశ్రీ మాట్లాడుతూ రోజు రోజుకు ఆయుర్వేదం, యోగాకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. జిల్లా ఆయుష్ విభాగం ఇన్చార్జి గంగా దాస్ మాట్లాడుతూ ధన్వంతరి జయంతి సందర్భంగా ఉచిత ఆయుర్వేద శిబిరం, రక్త పరీక్షలు, షుగర్, బీపీ ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశామన్నారు. ఈశిబిరంలో ఆయుర్వేద వైద్యులు ప్రేమలత, మమత, లలిత, జ్యోత్స్న వెంకటేష్, జయప్రకాష్ తిరుపతి, ఆయుష్ డీపీఎం వందన రెడ్డి ఆయుష్ విభాగం ఫార్మసిస్టులు పురుషోత్తం, వరలక్ష్మీ, స్వరూప, జయరాజ, ఉమాప్రసాద్ మురళి, నీరజ, వివేకా నంద యోగా కేంద్రం అధ్యక్షుడు ఇంద్రకరణ్ రెడ్డి, యోగా ప్రభాకర్, కిషన్, సిర్ప హన్మాండ్లు, మాజీ ఎంపీటీసీ, యువ నాయకుడు ప్రీతం, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
నల్లబ్యాడ్జీలతో నిరసన
నిజామాబాద్ నాగారం: మహబూబాబాద్ మెడికల్ కాలేజీ అనుబంధ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్పై దాడి ఘటనకు వ్యతిరేకంగా మంగళవారం నిజామాబాద్ మెడికల్ కాలేజీ – జీజీహెచ్ అధ్యాపకులు,వైద్య విద్యార్థులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వైద్యులపై, మెడికల్ సూపరింటెండెంట్ పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. డాక్టర్లకు సురక్షితమైన పని వాతావరణం క ల్పించాలని, అన్ని ప్రభుత్వ ఆస్పపత్రులలో స్పెషల్ పోలీసు ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
ధర్పల్లి: రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ధీమా వ్యక్తం చేశారు. ధర్పల్లి మండల కేంద్రంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇ చ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్ర భుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. కేసీఆర్ పాలనలో ప్రవేశపెట్టిన అనేక ప్రజా సంక్షేమ పథకాలు యావత్ దేశానికి దిక్సూచిగా మారినట్లు పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని సీ ఎం రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు. బీఆర్ ఎస్ నాయకులను ,కార్యకర్తలు ఇబ్బంది పెడితే ఊ రుకునేది లేదని, అధికారంలోకి వచ్చాక అందరి లె క్కలు తేలుస్తామని ఆయన హెచ్చరించారు. కార్యకర్తలకు తాను ఎప్పుడు అండగా ఉంటాని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజ్పాల్ రెడ్డి, రమాకాంత్, శ్రీనివాస్ నాయక్, వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సిరికొండ : మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన మైలారం తొలి సర్పంచ్, సిరికొండ సొసైటీ తొలి చైర్మన్ మద్దగారి రాజపండరి అంత్యక్రియల్లో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ మృతదేహనికి బాజిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించి, పాడె మోశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
నిజామాబాద్ సిటీ: వర్షాలకు పంటనష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ డిమాండ్చేశారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని కోటగల్లీని ఎన్ఆర్ భవన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లపు వెంకటేశ్ మాట్లాడుతూ.. రైతులు కష్టపడి పంటలకు పెట్టుబడి పెట్టి పంట చేతికి వచ్చే సమయంలో ధర్పల్లి, భీమ్గల్ మండలాల్లో పెద్దమొత్తంలో రైతులకు పంట నష్టం జరిగిందన్నారు. ఈనెల 29న తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి.భూమన్న, నాగలక్ష్మి ,దేవేందర్ సింగ్, ముత్తన్న తదితరులు పాల్గొన్నారు.సిరికొండ: మండలంలోని సర్పంచ్తండాకు చెందిన బాదావత్ జైపాల్నాయక్ రెండు రోజుల క్రితం వెలువడిన నీట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ఎస్టీ కోటాలో 342 ర్యాంకు సాధించాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సోమవారం ఎంబీబీఎస్లో అడ్మిషన్ తీసుకున్నాడు. ఈసందర్భంగా తండావాసులు, బంజార సేవ సంఘం నాయకులు పేదరికాన్ని జయించి ఎంబీబీఎస్లో సీటు సాధించిన జైపాల్ను అభినందించారు. సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి పెర్కిట్(ఆర్మూర్): విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసు కుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఆకాంక్షించారు. ఆర్మూర్ మండలం పిప్రి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఇటీవల నూతనంగా నిర్మించిన సైన్స్ల్యాబ్ భవనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత సాంకేతికకు అ నుగుణంగా విద్యార్థులు తమ దృక్పథాన్ని మార్చుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో పిప్రి కాంప్లెక్స్ హెచ్ఎం విశ్వనాథ్, హెచ్ఎంలు నవీన్, విజయ్ కుమార్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఆనంద్, విద్యార్థులు పాల్గొన్నారు. ఫుడ్ సైన్స్ కాలేజీలో బతుకమ్మ సంబురాలు రుద్రూర్: మండలంలోని ఆహార శాస్త్ర విజ్ఞాన కాలేజీలో మంగళవారం బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. కాలేజీ ఆవరణ, వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని రంగురంగుల పువ్వులను సేకరించి బతుకమ్మలను తయారు చేశారు. పూజలు నిర్వహించి కళాశాల ఆవరణలో బతుకమ్మ పాటలు పాడుతూ ఆడారు. విద్యార్థునులతో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు. -
నిజామాబాద్కు కొత్త రైళ్లు
● ఎంపీ అర్వింద్ ధర్మపురి ● నగర రైల్వేస్టేషన్ అభివృద్ధి పనుల పరిశీలన ఖలీల్వాడి: నిజామాబాద్ రైల్వే స్టేషన్కు త్వరలో మరిన్ని కొత్త రైళ్లు అందుబాటులోకి వస్తాయని ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. నగరంలోని రైల్వే స్టేషన్ను మంగళవారం మధ్యాహ్నం ఆయన, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతోకలిసి సందర్శించారు. స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. రైల్వే అధికారులతో మాట్లాడి, పనుల వివరాలను తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులతో ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు. స్టేషన్లో మరో రెండు రైల్వే లైన్లు, రెండు ప్లాట్ఫామ్స్ పెరుగుతున్నట్లు చెప్పారు. కొత్త రైళ్ల రాకతో ప్రయాణికుల రాకపోకలు కూడా పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ రూరల్: బాన్సువాడలోని లక్ష్మీనర్సింహ కల్యాణ మండపంలో ఈనెల 25న ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు సంఘ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజుతోపాటు సంఘం రాష్ట్రకమిటీ, రీజినల్ కమిటీ సభ్యులు తదితరులు హాజరవుతారన్నారు. కార్యక్రమానికి బాన్సువాడ డిపో పరిధిలోని ఆర్టీసీ కార్మికులతో పాటు రీజియన్ పరిధిలోని అన్ని డిపోల అధ్యక్ష, కార్యదర్శులు హాజరై విజయవంతం చేయాలని సంఘ సభ్యులు కోరారు. -
మిల్లు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్ సిటీ: రైస్మిల్లుల్లో పనిచేస్తూ మృత్యువాత పడ్డవారిని, క్షతగాత్రులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వడంతోపాటు రైస్మిల్ యాజమాన్యంపై చర్యలుతీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. కోటగిరి మండల కేంద్రంలో మంగళవారం పురాతన రైస్మిల్ గోడకూలి పక్కనగల ఇంటిపై పడడంతో ఆ ఇంటిలో నిద్రిస్తున్న ముగ్గురిలో మహేష్, అతని కూతురు అక్కడికక్కడే మృతి చెందగా, అతని భార్య మహేశ్వరి గాయాలతో బయటపడింది. పాత గోడను తొలగించడంపై నిర్లక్ష్యం చేసిన రైస్ మిల్ యాజమాన్యంపై చర్యలు తీసుకొని మహేశ్వరికి ప్రభుత్వం రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించడంతోపాటు, ఇందిరమ్మఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి వై.ఓమయ్య, సాయమ్మ, భూలక్ష్మి, కౌసల్య, లింగవ్వ,పుష్ప, కిష్టయ్య,సిర్పూర్ సాయిలు,శంకర్ పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో శ్రీ వారాహిదేవి పల్లకీ సేవ
సుభాష్నగర్ : నగరంలోని అమ్మనగర్లోగల శ్రీ వారాహి మాతా ఆలయంలో అమ్మవారి పల్లకీ సేవ మంగళవారం రాత్రి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పంచలోహ నూతన విగ్రహాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి భక్తి భావంతో మంగళవాయిద్యాల నడుమ ప్రత్యేక శోభాయాత్రగా వారాహి మాతా ఆలయానికి తీసుకొచ్చారు. అర్చకులు వేలేటి పశుపతి శర్మ మంత్రోచ్చారణల మధ్య వారాహి అమ్మవారు వేంచేశారు. భవానీ మాలాధారులు, భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి అమ్మవారి దివ్యదర్శనం చేసుకున్నారు. ఈసందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ మాట్లాడుతూ శ్రీవారాహి దేవి ఆలయం ఇందూరులో భక్తి శ్రద్ధలకు కేంద్ర బిందువుగా అవతరించనుందని తెలిపారు.కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మంచాల శ్రీలక్ష్మి, భవానీ మాలాధారులు, భక్తులు పాల్గొన్నారు. -
సకల దేవతల నెలవు.. బొమ్మల కొలువు..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సాయి టవర్స్లో మంగళవారం దేవీ నవరాత్రుల సందర్భంగా సకల దేవతల స్వరూపంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఆకట్టుకుంటుంది. సాయిటవర్స్కి చెందిన నిర్మల–రాముశర్మ దంపతులు ఏటా నవరాత్రుల్లో బొమ్మల కొలువును ఏర్పాటుచేస్తారు. శ్రీనివాసుని కల్యాణం, మహావిష్ణువు దశావతారాలు, దుర్గానవరాత్రుల ప్రత్యేక నవశక్తి రూపాలు ఇలా పదుల సంఖ్యలో పురాతన ఇతిహాస ఘటనలను తెలిపేలా బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. ఇంటి ఆచారం, ఆనవాయితీ ఆధారంగా ఆడపిల్లలతో మెట్టుమెట్టుగా బొమ్మలను అమర్చుతారు. ఇవి ఎప్పుడు బేసి సంఖ్యలోనే ఉంటాయి. ఈ బొమ్మల కొలువు స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటుంది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
బాలాత్రిపురసుందరిగా..
నగరంలో దేవిశరన్నవరాత్రి వేడుకలను ఆయా మండపాల నిర్వహకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం నగరంలో, గ్రామాల్లో దుర్గామాత బాలా త్రిపురసుందరీ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చింది. దుర్గాదేవి మండలపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మండపం వద్ద కుంకుమార్చనలు, ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. నగరంలోని వినాయక్ నగర్లో 51 శక్తి పీఠాల రూపంలో దుర్గామాత విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డిచ్పల్లిలోని ఏడో బెటాలియన్లో దుర్గామాత మండపం వద్ద భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. నిజామాబాద్ రూరల్/డిచ్పల్లి బెటాలియన్లో అమ్మవారికి పూజలు చేస్తున్న సుహాసినులు -
నిధుల దారి మళ్లుతోంది
రైతులకు సరిపడా యూరియా బుధవారం శ్రీ 24 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025– 8లో uజిల్లాకు ఆరెంజ్ అలర్ట్ నిజామాబాద్అర్బన్: జిల్లాకు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కాగా జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి , మంగళవారం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా కోటగిరిలో 36.4 మి.మీటర్లు , వర్నిలో 23.4, పొతంగల్లో 18.3 , చందూర్లో 22.8, భీమ్గల్లో 22.4, డిచ్పల్లిలో 15.0, నందిపేటలో 13.5, రెంజల్లో 18.6, మోపాల్లో 14.1 మి.మీటర్ల వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 11.0 మి.మీటర్ల వర్షం కురిసింది. మధ్యాహ్నం వేళ రెండు గంటలపాటు ఏకధాటిగా వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో రోడ్లు జలమయమయ్యాయి. రైల్వేస్టేషన్, బస్టాండ్ పరిసరాల్లో వర్షపు నీరు నిలువడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దసరాకు ఆర్టీసీ ప్రత్యేక లక్కీ డ్రా ఖలీల్వాడి: దసరా సందర్భంగా ప్రయాణికుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ ప్రత్యేక లక్కీ డ్రా స్కీమ్ను ప్రకటించిందని ఆర్ఎం జ్యోత్స్న మంగళవారం తెలిపారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు సెమీ డీలక్స్, డీలక్స్, సూపర్ లగ్జరీ, లహరి, నాన్–ఏసీ, అన్ని ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారు లక్కీ డ్రాకి అర్హులని తెలిపారు. ప్రయాణికులు తమ బస్ టికెట్ల వెనుక పేరు, చిరునామా, ఫోన్ నంబర్ వివరాలు రాసి ఆ టికెట్లను బస్సు స్టేషన్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బాక్స్లలో వేయాలని సూచించారు. సేకరించిన అన్ని టికెట్లలో నుంచి అక్టోబర్ 8వ తేదీన రీజినల్ కార్యాలయంలో లక్కీ డ్రా తీయనున్నట్లు తెలిపారు. రీజియన్ నుంచి ముగ్గురు విజేతలకు బహుమతులు అందజేస్తామని, నగదు బహుమతులు ఉంటాయన్నారు. మొదటి బహుమతి రూ.25 వేలు, రెండో బహుమతి రూ. 15 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు ఇస్తామని వివరించారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి లక్కీడ్రాలో పాల్గొనాలని ఆమె కోరారు. ఎంపిక చేసిన కేసులను ఇన్వెస్టిగేట్ చేయండి ● ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లకు సీపీ సాయి చైతన్య ఆదేశాలు ● వీడియోకాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం ఖలీల్వాడి: ఎంపిక చేసిన కేసులను ఇన్వెస్టిగే ట్ చేయాలని ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లను సీపీ సాయిచైతన్య ఆదేశించారు. డీజీపీ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని కమిషనరేట్ నుంచి ఆయన మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఏఎస్సైలు, హెడ్కానిస్టేబుళ్లతో మాట్లాడారు. మిస్సింగ్, అసహజ మరణాల వంటి 89 కేసులను ఇన్వెస్టిగేట్ చేయాలన్నారు. ప్రజలకు సత్వర న్యాయం ఏ విధంగా అందుతుందో వివరించారు. హెచ్ సీలు, ఏఎస్సైలు నిర్దేశిత కేసులను ఇన్వెస్టిగేట్ చేస్తే, ఎస్సైలు, సీఐలకు ఇతర ముఖ్యమైన కేసుల ఇన్వెస్టిగేషన్కు సమయం దొరుకుతుందన్నారు. వీడియోకాన్ఫరెన్స్లో అదనపు డీసీపీ (అడ్మిన్) జి బస్వారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇ చ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లిస్తోందని, దీంతో జిల్లాలో నిర్దేశిత పనులకు నిధులు అందక ఆగిపోతున్నాయని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నా రు. ఎంపీ అధ్యక్షతన కలెక్టరేట్లో మంగళవా రం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ (దిశ) స మావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిఽ ద శాఖల్లో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్య క్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ.. జాతీయ రహదారుల విషయంలో మొత్తం ఎనిమిది ప్యాకేజీలు ప్రతిపాదిస్తే, రాష్ట్ర ప్ర భుత్వం కోత విధించి రెండు మాత్రమే మంజూరు తీసుకుందన్నారు. జిల్లాలో ఉన్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఏం చేస్తున్నారన్నారని ప్రశ్నించారు. మాధవనగర్, మామిడిపల్లి రైల్వే వంతెనలకు సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తనవద్దే పెట్టుకుందని, మామిడిపల్లి వంతెన పూర్తయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రూ.3.5 కోట్లు ఇవ్వకపోవడంతో బీటీ రోడ్డు వేయడం లేదన్నారు. అర్సపల్లి వంతెన విషయంలో భూసేకరణ చేయడం లే దని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై దసరా తరువాత మూడు వంతెనల వద్ద ఆందోళనలు చేయాలని బీజేపీ శ్రేణులకు ఎంపీ పిలుపునిచ్చారు. డబ్బులు ఎలా ఇవ్వరో చూద్దామన్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, భూపతిరెడ్డిలకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు కనిపించడం లేదా? ఎన్నిసార్లు గుర్తు చేయాలంటూ అసహనం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మహేశ్కుమార్గౌడ్ జిల్లాకు రూ.20 కోట్లు కూడా నిధులు తెప్పించుకోలేని స్థితిలో ఉన్నారా అని అన్నారు. ● అమృత్ పథకం కింద జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు రూ.497 కోట్లు మంజూరైతే అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, నీటిసరఫరా పనులు రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు కేవలం 10 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారని, అమృత్పై దసరా తర్వాత ప్రత్యేకంగా సమీక్ష చేస్తానన్నారు. ఎంపీ లాడ్స్ నిధులతో జరిగే పనులకు కాంగ్రెస్ నాయకులు అడ్డుపడుతున్నారని విమర్శించా రు. కేంద్రం నిధులతో జరిగిన పనులకు నేమ్ బో ర్డులు ఎందుకు పెట్టడం లేదని అధికారులను ప్రశ్నించారు. ● నిజామాబాద్–ఆర్మూర్ మార్గంలో అటవీ భూమికి సంబంధించి సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వివాదాన్ని కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించానని, దీంతో రెండు ప్రదేశాల్లో రోడ్డు విస్తరణకు మార్గం సుగుమమైందని తెలిపారు. ● భారీ వర్షాల కారణంగా జిల్లాలో 40 వేల ఎకరాలకు పైగా పంటలు నష్టపోతే అధికారులు 17 వేల ఎకరాల్లో మాత్రమే నష్టం జరిగినట్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారన్నారు. మరోసారి సర్వే చేసి బాధిత రైతులందరికీ నష్టపరిహారం అందేలా చూడాలని ఎంపీ అధికారులను కోరారు. ● నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో వార్డుల వారీగా రావాల్సిన పన్ను వివరాలను తెలుపాలన్నారు. ఆర్మూర్ డివిజన్లో రోడ్ల పనుల విషయంలో సరైన సమాధానాలు చెప్పనందుకు డీఈ రాజేశ్వర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలని సూచించారు. ● నిజామాబాద్ నగరంలో పన్ను చెల్లించని వ్యాపారులతోపాటు భవనాలు చాలా ఉన్నాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నా రు. సుమారు రూ.20 కోట్లు బకాయిలున్నాయని తెలిపారు. పులాంగ్ వాగు ముబారక్నగర్ వరకు చాలా చోట్ల ఆక్రమణలకు గురైందన్నారు. నాగారం వద్ద నిజాంసాగర్ కాలువ సైతం కబ్జా అయిందన్నారు. బోధన్ రోడ్డులోని రామర్తి చెరువు, బొందెం చెరువులు సైతం భారీగా ఆక్రమణలకు గురయ్యాయన్నారు. నగరపాలకంలో రెవెన్యూ విభాగం స్క్రీనింగ్ చేయాలన్నారు. సమావేశంలో కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఎఫ్వో వికాస్ మీనా, ట్రైనీ కలెక్టర్ కరోలినా చింగ్తియాన్ మావి, నగరపాలక కమిషనర్ దిలీప్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, దిశ కమిటీ సభ్యులు హన్మంతరావు, ఆశన్న, లింగం, విజయ పాల్గొన్నారు. బాల్కొండ: మహారాష్ట్ర ప్రాంతం నుంచి భారీ వరదలు వచ్చే అవకాశాలున్నాయనే సమాచారంతో శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్ అధికారులు అప్రమత్తమయ్యా రు. గత మూడు రోజులుగా ఇన్ఫ్లో పెరుగుతూ త గ్గుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ నీటి మట్టా న్ని తగ్గిస్తూ పెంచుతూ వచ్చారు. కానీ ఇన్ఫ్లోతో సంబంధం లేకుండా మంగళవారం రోజున 2.85 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం 80.5 టీఎంసీల నుంచి సాయంత్రం వరకు 70 టీఎంసీల కు తగ్గిపోయింది. సాయంత్రానికి ఇన్ఫ్లో 2.20 లక్షల క్యూసెక్కులు పెరిగింది. మహారాష్ట్ర నుంచి భారీ వరదలు వచ్చే అవకాశం ఉందని, గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్ అధికారులు సూచించారు. కొనసాగుతున్న నీటి విడుదల వరద గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. 40 గేట్ల ద్వారా 2.85 లక్షల క్యూసెక్కుల నీటిని వి డుదల చేస్తున్నారు. అలాగే వరద కాలువ ద్వారా 6,735 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 5,500, ఎస్కేప్ గేట్ల ద్వారా 2,500, లక్ష్మి కాలువ ద్వారా 200, సరస్వతి కాలువ ద్వారా 400, అలీసాగర్ లిఫ్ట్ ద్వారా 180 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మిషన్భగీరథ అవసరాలకు 231 క్యూ సెక్కులను వినియోగిస్తుండగా ఆవిరి రూపంలో 709 క్యూసెక్కుల నీరుపోతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థా యి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగు లు కాగా మంగళవారం సాయంత్రం 1088.00 (70 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. అంతర్రాష్ట్ర వంతెనను ఆనుకుని.. రెంజల్(బోధన్): రెండు రోజులపాటు నిలకడగా ప్రవహించిన గోదావరి మంగళవారం మళ్లీ పోటెత్తింది. ఎగువన వర్షాలు కురుస్తుండడంతోపాటు మహారాష్ట్ర నుంచి భారీ వరద వస్తుండడంతో కందకుర్తి వద్ద అంతర్రాష్ట్ర వంతెనను ఆనుకుని ప్రవహిస్తోంది. కందకుర్తి పుష్కరక్షేత్రంలోని పురాతన శివాలయం పూర్తిగా నీట మునిగింది.మోపాల్: జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏవో) మేకల గోవిందు అన్నారు. మండలంలో ని బాడ్సి సొసైటీ పరిధిలో ఎరువుల గోదామును డీఏవో మంగళవారం తనిఖీ చేశారు. యూరియా నిల్వ, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల అవసరం మేరకు ఎరువులు ఉన్నాయని, ఆందోళన చెందొద్దని స్పష్టం చేశారు. డీలర్లు ఎరువులను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించాలని, ప్రయోజనాలను వివరించాలన్నారు. ఆయన వెంట బాడ్సి సొసైటీ చైర్మన్ నిమ్మల మోహన్రెడ్డి, సీఈవో నర్సయ్య, రైతు మహిపాల్రెడ్డి ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్రం వాడుకుంటోంది అభివృద్ధి పనులు నిలుస్తున్నా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు దసరా తరువాత ఆర్వోబీల వద్ద ఆందోళనలు చేస్తాం దిశ కమిటీ సమావేశంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎస్సారెస్పీలోకి భారీ ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉందని సమాచారం ప్రాజెక్టు నీటి మట్టాన్ని తగ్గిస్తున్న అధికారులు 70 టీఎంసీలకు పడిపోయిన నీటి నిల్వ -
మక్క రైతుకు మద్దతేదీ?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మొక్కజొన్న పంట కోతలు మొదలై పక్షం రోజులు దాటినప్పటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఇది అదునుగా మక్క రైతులను దళారులు దోపిడీ చేస్తున్నారు. మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2,400 ఉన్నప్పటికీ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు తప్పని పరిస్థితుల్లో దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. అయితే దళారులు రైతులకు క్వింటాలుకు రూ.1,800 నుంచి రూ.1,900 మాత్రమే ధర చెల్లిస్తున్నారు. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. జిల్లాలో 52,093 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఈ ఏడాది భారీ వర్షాలతో జిల్లాలో 1,100 ఎకరాల్లో మొక్కజొన్న పంట నాశనమైంది. ఇది అధికారుల ప్రాథమిక అంచనా మాత్రమే. అనధికారికంగా ఈ నష్టం మరింత ఎక్కువగా ఉండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. కాగా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో నష్టాన్ని అంచనా వేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ మంగళవారం జరిగిన దిశ కమిటీ సమావేశంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఇప్పటికీ వర్షాలు ఆగకపోతుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దిక్కుతోచడంలేదని రైతులు చెబుతున్నారు. కాగా ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారు. సహకార సంఘాలు, మార్క్ఫెడ్ ద్వారా మక్కలు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ● కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యంపై రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డిని సంప్రదించగా ఈ విషయమై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు లేఖ రాసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డి ద్వారా ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మొక్కజొన్న పంటను కొ నుగోలు చేసేందుకు నిజా మాబాద్ రూరల్ ఎమ్మె ల్యే డాక్టర్ భూపతిరెడ్డి ద్వారా తగిన ప్రయత్నాలు చేస్తున్నాం. రైతులకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఎమ్మెల్యే ఇప్పటికే రాష్ట్ర ఉన్నతాధికారులతో చర్చించారు. – మునిపల్లి సాయిరెడ్డి, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ఆందోళనలు చేస్తాం మార్క్ఫెడ్, సహకార సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వం తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. రైతులను వ్యాపారులు, దళారులు దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం. ఇప్పటికే వర్షాలతో నష్టపోయిన రైతులపైన కనికరం చూపాలి. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తాం. – పాట్కూరి తిరుపతిరెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పంట కోత మొదలై పక్షం రోజులైనా ఏర్పాటు కాని కొనుగోలు కేంద్రాలు రైతులను దోపిడీ చేస్తున్న దళారులు మద్దతు ధర క్వింటాలు రూ.2,400 ఉండగా.. రూ.1,900 లోపే చెల్లింపు -
గుడ్డు పట్టుకొచ్చిన సభ్యురాలు
అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలకు తక్కువ బరువు, నాణ్యత లేనివి గుడ్లను సరఫరా చేస్తున్నారని దిశ కమిటీ సభ్యురాలు విజయ అన్నా రు. గుడ్డు తీసుకొచ్చి సమావేశంలో చూపించి ఫి ర్యాదు చేశారు. దీంతో ఎంపీ చిన్నసైజు గుడ్ల స రఫరాపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 నుంచి 60 గ్రాములు ఉండాల్సిన కోడి గుడ్డు 30 గ్రాములు మాత్రమే ఉండడం చూస్తుంటే అవినీ తి జరుగుతున్నట్లు అర్థమవుతోందన్నారు. చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ఇచ్చే పౌష్టికాహారం విషయంలో కక్కుర్తి పడితే కేసీఆర్కు పట్టి న గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందన్నారు. కోడిగుడ్ల సరఫరాపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని కలెక్టర్కు ఎంపీ సూచించారు. అలాగే పాఠశాలల్లో మధ్యాహ్న భోజన బిల్లులను 1 నుంచి 8 తరగతుల వరకు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తోందని, మిగతా తరగతులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో భోజన ఏజెన్సీలకు బకాయిలు ఉన్నాయన్నారు. -
సంస్కరణలు కాదు.. భారీ ఊరట
సుభాష్నగర్: జీఎస్టీ తగ్గింపు సంస్కరణలు కాదని.. దేశ ప్రజలకు భారీ ఊరట అని ఎంపీ అర్వింద్ ధర్మపురి పేర్కొన్నారు. దేశ ప్రజలకు ప్రధాని దేవీనవరాత్రుల కానుకు ఇచ్చారన్నారు. వాహన, ఎలక్ట్రా నిక్స్ షోరూములతోపాటు ఓ సూపర్ మార్కెట్ను ఎంపీ సందర్శించి జీఎస్టీ తగ్గింపునకు సంబంధించిన పోస్టర్లను పరిశీలించారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డితో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లా డారు. జీఎస్టీ తగ్గింపుతో అన్నిరకాల కార్ల ధరలు రూ.60 వేల నుంచి రూ.2లక్షల వరకు తగ్గడంతోపాటు ఇన్సురెన్స్, రోడ్డు ట్యాక్స్ సైతం తగ్గుతాయని తెలిపారు. ముఖ్యంగా లైఫ్, హెల్త్ ఇన్సురెన్స్లపై జీరో జీఎస్టీ, స్టేషనరీ సహా 220 నిత్యావసర వస్తువుల ధరలపై 18శాతం నుంచి 5 శాతానికి జీఎస్టీ తగ్గిందన్నారు. జీఎస్టీని తగ్గించడంతో జీడీపీ దాదా పు 1శాతం పెరిగే అవకాశముందన్నారు. కాంగ్రెస్ ఏడుపు.. జీఎస్టీని తగ్గింపుతో ప్రజలు సంతోషంగా ఉంటే.. కాంగ్రెస్ ఏడుస్తోందని అర్వింద్ విమర్శించారు. జీ ఎస్టీ తగ్గింపుతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.7వేల కోట్లు నష్టం జరిగిందని సీఎం సహా మంత్రులు పేర్కొన డం సిగ్గుచేటన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు న్యా లం రాజు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పాట్కూ రి తిరుపతిరెడ్డి, దిశా కమిటీ సభ్యులు ప్రదీప్రెడ్డి, లింగంపల్లి లింగం, హన్మంత్రావు పాల్గొన్నారు. దేశ ప్రజలకు ప్రధాని మోదీ నవరాత్రుల కానుక జీఎస్టీ తగ్గింపుపై ఎంపీ అర్వింద్ ధర్మపురి వాహన, ఎలక్ట్రానిక్స్ షోరూమ్లతోపాటు సూపర్మార్కెట్ సందర్శన -
పనులను సత్వరం పూర్తి చేయాలి
● అధికారులకు కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశం ● అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పనుల ప్రగతిపై సమీక్ష నిజామాబాద్ అర్బన్: అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ బడుల్లో కొనసాగుతున్న పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు వీలుగా చేపట్టిన పనుల ప్రగతిపై కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలెక్టరేట్లో మంగళవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఆయా పాఠశాలలకు మంజూరు చేసిన అదనపు తరగతి గదులు, వాటర్ సప్లయ్, టాయిలెట్స్ తదితర పనులు ఏ దశలో ఉన్నాయి, ఎన్ని పనులు పూర్తయ్యాయి, ఇంకా గ్రౌండింగ్ కాని పనులు ఎన్ని తదితర వివరాలను మండలాల వారీగా అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతుల మెరుగు కోసం జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా రూ. 42 కోట్ల విలువ చేసే పనులను మంజూరు చేయగా, రూ.23 కోట్ల విలువైన పనులు జరిగాయని కలెక్టర్ తెలిపారు. వివిధ దశల్లో కొనసాగుతున్న పనులను వేగంగా చేపట్టి పూర్తి చేసేలా చర్య లు తీసుకోవాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. నిధులు అందుబాటులో ఉన్నందున పట్టణ ప్రాంతాల్లోని బడుల్లో అవసరమైన చో ట యుద్ధ ప్రాతిపదికన టాయిలెట్స్, తాగునీరు, వి ద్యుత్ వసతి వంటి పనులను చేపట్టాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మంజూరు లభించిన పనుల వివరాలను సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తెలపాలని ఎంఈవోలను ఆదేశించారు. కాగా, ప్రతి పాఠశాల లో విద్యార్థుల అపార్ ఐడీ తప్పనిసరి జనరేట్ చే యాలని కలెక్టర్ సూచించారు. ఓపెన్ టెనన్త్, ఇంటర్లో ప్రవేశాల కోసం అర్హులైన వారందరూ దరఖా స్తు చేసుకునేలా చొరవ చూపాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీఆర్డీవో సాయాగౌడ్, డీఈవో అశోక్, హౌసింగ్ పీడీ పవన్కుమార్, ఆయా శాఖల ఇంజినీరింగ్ విభాగం అధికారులు, ఎంఈవోలు, ఐకేపీ, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. -
పెళ్లి కావడం లేదని యువకుడి ఆత్మహత్య
కామారెడ్డి క్రైం: పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ద్యాప మహేశ్(29) ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి రెండేళ్ల క్రితం తిరిగి వచ్చాడు. గల్ఫ్లో ఉన్నప్పుడే అతని తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. తిరిగి వచ్చాక పెళ్లి చేసుకొని తండ్రిని చూసుకుంటూ ఇక్కడే ఉండిపోవాలని భావించాడు. రెండేళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఎంతకీ సంబంధం కుదరకపోవడంతో కొద్దిరోజులుగా మనస్తాపానికి గురువుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇటీవల రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి సైతం పాల్పడి ప్రాణాలతో బయటపడ్డాడని తెలిసింది. ఆదివారం రాత్రి ఇంటినుంచి బయటకు వెళ్లిన మహేశ్ ఇంటికి తిరిగి రాలేదు. తండ్రి సాయిలు, ఇతర కుటుంబసభ్యులు చాలా చోట్ల గాలించారు. సమీపంలోని రైలు పట్టాలపై మహేశ్ మృతదేహాన్ని గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఉరేసుకొని ఒకరు..నవీపేట: మండలంలోని మోకన్పల్లి గ్రామానికి చెందిన గడ్డం రాజు (45) సోమవారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. కొన్నిరోజులుగా రాజు మద్యానికి బానిసైనట్లు పేర్కొన్నారు. భార్య పుట్టింటికి వెళ్లిందని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదన్నారు. మృతుడి సోదరుడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని చేస్తున్నట్లు తెలిపారు.కామారెడ్డి క్రైం: మద్యం సేవించి వాహనాలు నడపొద్దని పట్టణ ఎస్హెచ్వో నరహరి సూచించారు. జిల్లా కేంద్రంలో ఇటీవల డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన 29 మందిని కోర్టులో హాజరుపర్చగా నలుగురికి జైలు శిక్ష, జరిమానా, మరో 25 మందికి జరిమానాలు విధించింది. వారందరికీ సోమవారం పట్టణ పోలీస్స్టేషన్లో ఎస్హెచ్వో నరహరి కౌన్సిలింగ్ నిర్వహించారు. క్రమం తప్పకుండా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. రామారెడ్డి: రామారెడ్డి పోలీస్స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం. దీనిపై పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం బయటకు రానివ్వడం లేదు. కూతురిపై వేధింపులతో తండ్రిపై, ఇదే వ్యవహారంలో మరో వ్యక్తిపై కేసు నమోదు చేసి ఆదివారం రిమాండ్కు తరలించినట్లుగా విశ్వసనీయ సమాచారం. బోధన్టౌన్(బోధన్): బోధన్ పట్టణ శివారులోని మర్రి మైసమ్మ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. ఆలయ తాళాన్ని పగులగొట్టి ఆలయంలోని పూజోపకరణ సామగ్రి, 10 కిలోల ఇత్తడి దీపం, శఠగోపం, యాంప్లిఫైర్తోపాటు హుండీలోని నగదును అపహరించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకట నారాయణ తెలిపారు. మాచారెడ్డి: మండలంలోని ఎల్లంపేటలో సోమవారం వర్షం కురుస్తుండటంతో పలువురు రైతులు చెట్టు కింద కూర్చున్నారు. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తోందని గ్రహించి కొద్దిదూరం వెళ్లగానే చెట్టుపై పిడుగుపడింది. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఆర్ఎంను కలిసిన కామారెడ్డి డీఎం
ఖలీల్వాడి: నిజామాబాద్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జ్యోత్స్నని కామారెడ్డి డిపో మేనేజర్ దినేశ్ కుమార్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన ఇటీవల ఖమ్మం డిపో నుంచి కామారెడ్డి డిపోకు బదిలీపై వచ్చారు. గతంలో నిజామాబాద్ అసిస్టెంట్ డిపో మేనేజర్గా పనిచేశారు. రుద్రూర్: రుద్రూర్ ప్రాంతీయ చెరకు, వరి పరిశోధన కేంద్రం అధిపతిగా డా. పవన్ చంద్రారెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన 2007 నుండి 2013 వరకు రుద్రూర్ పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా సేవలందించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఏరువాక కేంద్రానికి బదిలీపై వెళ్లారు. 2017 వరకు ఏరువాక కేంద్రం అధిపతిగా పనిచేశారు. రుద్రూర్ పరిశోధన కేంద్రంలో ఆరు నెలలపాటు పదోన్నతిపై సీనియర్ శాస్త్రవేత్తగా విధులు నిర్వర్తించారు. 2018 నుంచి 2023 వరకు రాజేంద్రనగర్లోని వ్యవసాయ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్గా, 2023 నుంచి 2025 వరకు హైదరాబాద్లోని నేల ఆరోగ్య యాజమాన్య సంస్థలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేశారు. రుద్రూర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం అధిపతిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ చంద్రారెడ్డిని బోధన, బోధనేతర సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ● రోడ్లపై మక్కల రాసుల వద్ద సూచికలుగా రేడియం డబ్బాలు మోర్తాడ్(బాల్కొండ): అతని ఆలోచన చిన్నదే కానీ.. పెద్ద ప్రమాదాలను నివారించేలా ఉండటంతో వాహనదారుల ప్రశంసలు అందుకుంటున్నాడు. రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోసి పక్కన బండరాళ్లు పెడుతుండడంతో తరచూ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. మోర్తాడ్కు చెందిన పోలోజు శ్రీకాంత్ ధాన్యం వద్ద బండరాళ్లకు బదులుగా రేడియం స్టిక్కర్లు ఉన్న డబ్బాలను పెడుతూ వాహనదారులను అప్రమత్తం చేస్తున్నాడు. మోర్తాడ్ నుంచి పాలెం, తిమ్మాపూర్, సుంకెట్, రామన్నపేట్, దొన్కల్, రెంజర్ల తదితర ప్రాంతాల్లో వంద రేకు డబ్బాలను సూచికలుగా ఏర్పాటు చేశాడు. రేడియం స్టిక్కర్ల డబ్బాల ఏర్పాటుతో మక్కలు ఆరబోసిన విషయాన్ని గుర్తించి వాహనదారులు నెమ్మదిగా వెళ్లడం జరుగుతుందని శ్రీకాంత్ తెలిపారు. -
బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ ధ్రువపత్రం తీసుకోవాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డినిజామాబాద్అర్బన్: ఆస్పత్రులన్నీ బయో మెడికల్ వ్వర్థాల నిర్వహణ ధ్రువపత్రం తీసుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులతోపాటు ల్యాబ్లు, స్కానింగ్ సెంటర్లు, బ్లడ్ బ్యాంకులు ఎక్స్రే, క్లినిక్లు బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ ధ్రువపత్రం తీసుకోవాలన్నారు. ధ్రువపత్రం లేకుండా కొనసాగితే చర్యలు తీసుకుంటామన్నారు. జక్రాన్పల్లి మండలం పడకల్లో ఉన్న బయో మెడికల్ వేస్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి తరలించాలని సూచించారు. సమావేశంలో ట్రెయినీ కలెక్టర్ కరోలినా చింగ్తియాన్ మావీ, సబ్ కలెక్టర్లు వికాస్ మహాతో, అభిజ్ఞాన్ మాల్వియా, డీఎంహెచ్వో రాజశ్రీ, డీసీహెచ్ఎస్ శ్రీనివాస్ ప్రసాద్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లక్ష్మణ్ ప్రసాద్, మెడికేర్ బయో మెడికల్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్వాహకులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి రిమాండ్
ఖలీల్వాడి: బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇ ద్దరిని రిమాండ్కు తరలించినట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. ఈ నెల 19న సిరికొండ మండలం తూంపల్లి గ్రామ పరిధిలోని వర్జిన్ తండాకు చెందిన భూక్య విఠల్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద పా ర్క్ చేసిన తన బైక్ కనిపించకపోవడంతో ఫిర్యాదు చేశాడు. సోమవారం ఉదయం దేవీరోడ్ వద్ద వా హనాల తనిఖీ చేపడుతుండగా నిర్మల్ జిల్లా భైంసాలోని ఓవైసీ నగర్కు చెందిన హనువాతే భీమ్, హనువాతే సుభాష్ దొంగిలించిన బైక్పై వస్తూ పో లీసులను చూసి పారిపోయేందుకు యత్నించారు. వారిని పట్టుకొని విచారించగా నగరంలోని 50 క్వా ర్టర్స్లో నివాసముంటూ మద్యం, జల్సాల కోసం బైక్ దొంగతనాలు చేస్తున్నట్టు ఒప్పుకున్నారు. భైంసా, నందిపేట్, బాల్కొండ ప్రాంతాల్లో కూడా బైక్ దొంగతనాలు చేసినట్లు నిందితులు వెల్లడించారు. వారి నుంచి నాలుగు బైక్లు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
కాసర్లకు కాళోజీ పురస్కారం
నిజామాబాద్ సిటీ: తెలుగు భాషోపాధ్యాయుడు, ప్రముఖ పుస్తక రచయిత, సిర్పూర్ జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు డాక్టర్ కాసర్ల నరేశ్రావు కాళోజీ జాతీయ పురస్కారం అందుకున్నారు. సోమవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో నరేశ్రావుకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి, తెరసం రాష్ట్ర అధ్యక్షుడు నాళేశ్వరం శంకర్ అవార్డు అందజేశారు. జిల్లాకు చెందిన మరో కవి చందన్రావుకు డాక్టర్ సినారె అవార్డు అందుకున్నారు. నిజామాబాద్నాగారం: స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24న అండర్–19 ఫుట్బాల్ (బాలుర) జిల్లా జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు డీఐఈవో తిరుమలపుడి రవికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ కళాశాల స్థాయి బాలురు ఈ పోటీలలో పాల్గొనేందుకు 24న ఉదయం 10 గంటలకు నిజామాబాద్లోని రాజారాం స్టేడియానికి తరలిరావాలని పేర్కొన్నారు. ఈ పోటీల్లో ఎంపికై న జట్టు ఈ నెల 25, 26, 27 తేదీల్లో జనగాంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొంటుందని తెలిపారు. బాల్కొండ: ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి వరద నీరు కొనసాగుతుంది. సోమవారం గరిష్టంగా 2 లక్షల 54 వేల క్యూసె క్కులు వచ్చిన వరద, క్రమంగా తగ్గు తూ సాయంత్రానికి లక్షా 80 వేల క్యూసెక్కులకు చే రింది. గోదావరిలోకి 39 వరద గేట్ల ద్వారా 2 లక్షల 54 వేల క్యూసెక్కుల నీటిని నిరంతరం వదులుతున్నారు. ప్రాజెక్ట్ నుంచి కాలువల ద్వారా 15వేలకు పైగా క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆ విరి రూపంలో 709 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీ ఎంసీలు) అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి 1090.6(78.8 టీఎంసీలు) అడుగుల నీటిమట్టం నిల్వ ఉందని అధికారులు తెలిపారు. నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు, కౌ లాస్ ప్రాజెక్టులకు భారీ ఇన్ఫ్లో వస్తోంది. ని జాంసాగర్ ప్రాజెక్టులోకి 60,630 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు పది గేట్లను ఎత్తి 77,446 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు. -
ప్రజావాణికి 89 ఫిర్యాదులు
నిజామాబాద్అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 89 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్తోపాటు నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ భూమిని కాపాడండినందిపేట్ (ఆర్మూర్): నందిపేట మండలంలోని ఆంధ్రానగర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుతూ సోమవారం ఆ గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గ్రామ పరిధిలోని టెలిఫోన్ ఎక్స్చేంజ్ పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని ఎలవర్తి రమేశ్ అనే వ్యక్తి 12 సంవత్సరాల క్రితం కబ్జాకు పాల్పడ్డారని పే ర్కొన్నారు. అలాగే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గల సామగ్రిని దొంగిలించిన వ్యక్తులపై విచారణ చేపట్టాలని కోరారు. -
వాకింగ్కు వెళ్లి అనంతలోకాలకు..
● చెరువులో పడి పదో తరగతి విద్యార్థి మృతి ● హాస్టల్ నుంచి వచ్చిన మరుసటి రోజే ఘటనమద్నూర్(జుక్కల్): దసరా పండుగకు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన విద్యార్థి మరుసటి రోజే దుర్మరణం చెందిన ఘటన మద్నూర్ మండలం చిన్న ఎక్లారలో సోమవారం చోటు చేసుకుంది. ఉదయం వాకింగ్కు వెళ్లిన కొద్దిసేపటికే చెరువులో పడి చనిపోయాడన్న వార్త తల్లిదండ్రులు, గ్రామస్తులను శోకసంద్రంలో ముంచింది. వివరాలు ఇలా ఉన్నాయి. మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లార గ్రామానికి చెందిన సంజు హోటల్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సంజుకి ఒక కూతురు, కొడుకు సాయిచరణ్(15) ఉన్నారు. సాయిచరణ్ మద్నూర్లోని బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు ఉండటంతో ఆదివారం ఇంటికి వచ్చాడు. సోమవారం ఉదయం వాకింగ్ చేసి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన సాయిచరణ్ గ్రామ శివారులో ఉన్న చెరువులో శవమై కనిపించాడు. కాలకృత్యాల కోసం వెళ్లిన సాయిచరణ్ ప్రమాదవశాత్తు చెరువులో ఉన్న పెద్ద గుంతల్లో పడటంతోనే ఈ ఘటన జరిగిందని గ్రామస్తులు చెప్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు ఇక లేడని తెలుసుకున్న ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై విజయ్కొండ తెలిపారు. విద్యుదాఘాతంతో యువకుడు..బాన్సువాడ రూరల్: మండలంలోని మొగులాన్పల్లి గ్రామానికి చెందిన మహ్మద్(35) అనే యువకుడు సోమవారం విద్యుదాఘాతంతో మరణించాడు. బీర్కూర్ చౌరస్తాలో నిర్మాణంలో ఉన్న ఇంట్లో టైల్స్ పని చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. గమనించిన తోటి కార్మికులు మహ్మద్ను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యు లు.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బాన్సువాడ సీఐ అశోక్ తెలిపారు. -
వైరల్ హెపటైటీస్ ప్రమాదకరం
● ల్యాబ్లు, బ్లడ్ బ్యాంకులు రోగుల వివరాలు ఇవ్వాలి : డీఎంహెచ్వో నిజామాబాద్నాగారం: జిల్లాలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న వైరల్ హెపటైటీస్ అనే వ్యాధి ఎయిడ్స్ కంటే ప్రమాదకరమైందని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల ల్యాబ్లు, బ్లడ్బ్యాంకులు రోగుల వివరాలు నమో దు చేసి ఇవ్వాలని డీఎంహెచ్వో బద్దం రాజశ్రీ ఆదేశించారు. సోమవారం ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్లు, బ్లడ్బ్యాంకుల నిర్వాహకులతో సోమవారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెప టెటీస్ వ్యాపించకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసు కోవాలన్నారు. హెపటైటీస్లో ప్రధానంగా సిర్రోసిస్ ఆఫ్ లివర్, లివర్ క్యాన్సర్ యాంటీ ప్రమాదకరమైన లక్షణాలు కనిపిస్తాయన్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసులను తెలపాలని పేర్కొన్నారు. ప్రోగ్రాం అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ మాట్లాడుతూ వైరల్ హెపటైటీస్ను 2030 సంవత్సరం వరకు నియంత్రించాలన్నారు. ప్రభు త్వ, ప్రైవేటు ఆస్పత్రుల మధ్య సమన్వయం ఉండా లన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వోలు రమేశ్, అంజన, సమత, టీహబ్ డాక్టర్ దివ్య తదితరులు పాల్గొన్నారు. -
భక్తి మార్గంలో యువత
డొంకేశ్వర్(ఆర్మూర్): ఆది పరాశక్తిగా భావించే దుర్గామాతకు ఏటా భక్తులు పెరుగుతున్నారు. యువత ఎక్కువ సంఖ్యలో మాలను ధరించడం వారిలో భక్తిభావాన్ని పెంచుతోంది. సోమవారం నుంచి దేవీశరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఊరూరా దుర్గామాతను ప్రతిష్టించగా, యువకులు పెద్ద ఎత్తున మాలలు ధరించడం విశేషం. చిన్న పిల్లలు, మహిళలు సైతం దుర్గమ్మ సేవపై ఆసక్తితో మాలలు, కండువాలు ధరించారు. దుర్గామాత మాల అంటే అత్యంత పవిత్రమైంది. దీనిని ధరిస్తే కఠిన నియమాలు పాటించాలి. హరిషడ్వర్గాలు (కామం, క్రోదం, మోహం, లోబం, మదం, మశ్చ్యరం) అదుపులో పెట్టుకోవాలి. నియమనిష్టలతో ఉపవాస పూజలు చేయడంతో ఇది సాధ్యం అవుతుందని పండితులు, పది పర్యాయాలు మాల ధరించిన పెద్దలు చెప్తున్నారు. పిల్లలు చిన్నప్పుడే మాల ధరించడంతో వారిలో భక్తి భావం పెరగడమే కాకుండా క్రమశిక్షణ అలవర్చుకోవడానికి అవకాశముంది. యువత చెడు అలవాట్లను దూరం చేసుకొని మంచి సన్మార్గంలో నడవడం, పనిపై ఏకాగ్రత కూడా పెరుగుతుంది. దుర్గాదేవిని మనసు పెట్టి కొలిస్తే కోరిన కోర్కెలు తీరుతాయనే నమ్మకం కలుగడంతో మాలను ధరించే భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఈ ఏడాది ప్రతీ ఊరిలో కనీం 50 మందికి తగ్గకుండా మాలలు ధరించారు.మాలను ధరించి దుర్గామాత ను పూజిస్తే అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. యువత ప్రాధాన్యతతో మాలలు వేయడం మంచి తరుణం. దీంతో దురలవాట్లు దూరం అవుతాయి. జపం చేయడంతో ఏకాగ్రత పెరుగుతుంది. శరీర చక్రాలన్నీ యాక్టివ్ అవుతాయి. – గున్నాల నరేశ్, పండితులు, డొంకేశ్వర్ దుర్గామాతకు ఏటా పెరుగుతున్న భక్తులు మాలధారణతో క్రమశిక్షణ, భక్తిభావం పిల్లలు, మహిళల్లో సైతం దుర్గమ్మ సేవపై ఆసక్తి -
భూసేకరణను నెలాఖరులోగా పూర్తి చేయాలి
నిజామాబాద్అర్బన్: జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనులకు అవసరమైన స్థల సేకరణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి సీఎం సోమవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. దసరాకు ముందే అన్ని పనులు పూర్తి కావాలని సీఎం స్పష్టం చేశారు. కోర్టు కేసులు ఉన్న భూములకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు. టైటిల్ సమస్యలు ఉన్న భూములకు పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేసి సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రహదారుల నిర్మాణ పనుల్లో జాప్యం జరగకుండా ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలని ఆదేశించారు. జిల్లాల వారీగా సమీక్షించి పురోగతిని పరిశీలిస్తానని జాప్యం జరిగితే చర్యలు తీసుకుంటామని అన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం రాష్ట్ర అభివద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదలకు కీలకమని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ టి వినయ్కృష్ణారెడ్డి, డీఎఫ్వో వికాస్మీనా, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, ప్రగ్యాన్ మాల్వియ, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
● మరొకరి పరిస్థితి విషమండిచ్పల్లి: డిచ్పల్లి మండలం ధర్మారం (బి) గ్రామంలో సోమవారం కారు అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్సై మహమ్మద్ షరీఫ్ తెలిపిన వివరాలు ప్రకారం.. ధర్మారం(బి)కి చెందిన సుశాంత్(22), మమ్ము అనే ఇద్దరు యువకులు కారులో ప్రధాన రోడ్డుపై అటుఇటుగా ప్రయాణిస్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు గమనించి కారులో ఇరుక్కున్న వారిని బయటికి తీశారు. కాగా, కారులో ఉన్న సుశాంత్(22) ఘటనా స్థలంలోనే మరణించాడు. తీవ్రంగా గాయపడిన మమ్మును 108 అంబులెన్స్లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వమ్ము పరిస్థితి విషయంగా ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
నేడు దిశ సమావేశం
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లా అభివృద్ధి సమ న్వయ మానిటరింగ్ కమిటీ (దిశ) సమావేశాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు డీఆర్డీవో సా యాగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉద యం 10.30గంటలకు ఎంపీ ధర్మపురి అర్వి ంద్ అధ్యక్షతన సమావేశం జరుగుతుందని, కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు హాజరుకావాలని ఆయన కోరారు. సీసీ కెమెరాలు నిరంతరం పని చేయాలి నిజామాబాద్అర్బన్: ఈవీఎంలను భద్రపర్చిన గోదాము వద్ద సీసీ కెమెరాలు నిరంతరం పని చేయాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం డిప్యూటీ సీఈవో హరిసింగ్, అదనపు కలెక్టర్ కిరణ్కుమార్, ఈవీఎం నోడల్ అధికారి ప్రసాద్ తదితరులతో కలిసి నిజామాబాద్ నగరంలోని వినాయకనగర్లో ఉన్న ఈవీఎం గోదామును కలెక్టర్ సోమవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోదాము సీల్ ను తెరిచి ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్ లు, ఎన్నికల సామగ్రి భద్రపర్చి గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. వారి వెంట వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం సిబ్బంది సాత్విక్, జితేందర్ తదితరులు ఉన్నారు. బస్టాండ్ వద్ద ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలి ఖలీల్వాడి: నిజామాబాద్లోని బస్టాండ్ వద్ద ట్రాఫిక్ సమస్యను పరిష్కారించాలని డి పో–1 మేనేజర్ ఆనంద్, ఆర్టీసీ విజిలెన్స్ సీ ఐ మహిపాల్ ప్రభాకర్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్యకు విన్నవించారు. సోమవారం సీపీని వారు మర్యాద పూర్వకంగా కలిశారు. నిజామాబాద్ బస్ స్టేషన్ పరిసరాల్లో ట్రా ఫిక్ సమస్యతోపాటు తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల గురించి సీపీకి వివరించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. రాష్ట్రస్థాయి సెపక్తక్రా టోర్నీలో సత్తా నిజామాబాద్ నాగారం: రాష్ట్రస్థాయి సెపక్ తక్రా టోర్నీలో జిల్లా మహిళల, పురుషుల జ ట్లు సత్తాచాటాయి. మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 20 నుంచి సోమవారం వరకు 11వ సెపక్ తక్రా సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ మహిళల, పురుషుల టోర్నమెంట్ నిర్వహించగా.. జిల్లా మహిళల జట్టు ప్రథమ స్థానంలో, పురుషుల జట్టు తృతీయ స్థానంలో నిలిచి నట్లు జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ ప్రధా న కార్యదర్శి గాదారి సంజీవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా జట్ల విజయంపై అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శు లు కేశ వేణు, గాదారి సంజీవరెడ్డితోపాటు ఉపాధ్యక్షులు దీపిక, ల్యాబ్ గంగారెడ్డి, బాగారెడ్డి, సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మళ్లీ భారీ వర్ష సూచన నిజామాబాద్అర్బన్: జిల్లాకు మళ్లీ భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా అందులో నిజామాబాద్ జిల్లా సైతం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో సోమ, మంగళవారాల్లో భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కాగా, సోమవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. 4.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా నంది పేట మండలంలో 24.0 మిల్లీ మీటర్లు, నవీపేటలో 15.2. డొంకేశ్వర్లో 8.3, సిరికొండలో 10.7, పొతంగల్లో 12.3, మోస్రాలో 7.5, సాలూరాలో 8.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తొమ్మిది మండలాల్లో సాధార ణం కన్నా ఎక్కువ వర్షం కురవగా, 23 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. -
సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించాలి
● వైభవంగా బతుకమ్మ సంబురాలు ● అన్ని శాఖలు భాగస్వాములు కావాలి ● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్అర్బన్: తెలంగాణ సంస్కతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా బతుకమ్మ సంబురాలను జిల్లాలో వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సమీ కృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమ వారం ఆయా శాఖల జిల్లా అధికారులతో సమావేశమైన కలెక్టర్ బతుకమ్మ వేడుకల నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. ఉత్సవాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నేపథ్యంలో జిల్లాలో వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. కలెక్టరేట్తోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుద్దీపాలతో అందంగా ముస్తాబు చేయాలని, ముఖ్య కూడళ్లు, జన సంచారంతో రద్దీగా ఉండే ప్రదేశాల్లో హోర్డింగ్స్, బతుకమ్మ నమూనాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బతుకమ్మ ఆడే ప్రదేశాలతోపాటు నిమజ్జనం చేసే నీటి వనరుల వద్ద లైటింగ్, సౌండ్ సిస్టమ్ వంటి సౌకర్యాలను కల్పించాలన్నారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఈ నెల 26వ తేదీన ఎడపల్లి మండలం అలీసాగర్ రిజర్వాయర్ వద్ద నిర్వహించనున్న ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని, పెద్ద ఎత్తున మహిళలు, యువతులు, బాలికలతోపాటు మహిళా ఉద్యోగులు పాల్గొనేలా చూడాలని, ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. ఉత్సవాల్లో అన్ని శాఖలు భాగస్వాములు కావాలని, ప్రతి రోజూ ఒక శాఖ తరఫున బతుకమ్మ పండుగను నిర్వహించాలన్నారు. 30వ తేదీన సద్దుల బతుకమ్మను పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఆర్డీవో సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్, మెప్మా పీడీ రాజేందర్, డీపీవో శ్రీనివాస్రావు, డీఎంహెచ్వో రాజశ్రీ, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ సురేశ్కుమార్, పంచాయతీరాజ్ ఈఈ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
తగ్గిన జీఎస్టీపై అవగాహన కల్పించాలి
● తగ్గిన ట్యాక్స్ వివరాలను బోర్డులపై ప్రదర్శించాలి ● రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ కె. హరిత నిజామాబాద్నాగారం: జీఎస్టీ తగ్గిన వివరాలు అందరికీ అర్థమయ్యేలా వ్యాపారులు బోర్డులపై ప్రదర్శించాలని, అధికారులు మరింత అవగాహన కల్పి ంచాలని రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రానికి సోమవారం వ చ్చిన కమిషనర్.. డివిజన్ పరిధిలో పన్నుల వివరా లు, ఆదాయ లక్ష్య సాధన, జీఎస్టీలో ఇటీవల జరిగిన మార్పులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ట్యాక్స్ ప్రాక్టీషనర్స్తో సమీక్షించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. రిటర్నులు సమయానికి, సక్రమంగా దాఖలు చే యాలన్నారు. వినియో గదారులకు ఆ ప్రయోజనాలు అందేలా చూ డాలన్నారు. బోధన్ చలాన్ స్కామ్కు సంబంధించిన పాత బకాయిలపై సమీక్షిస్తూ.. కచ్చితంగా చెల్లించాల్సిందేనని రైస్మిల్లర్స్ను ఆదేశించారు. తక్షణమే పెండింగ్ బకాయిలు క్లియర్ చేయాలన్నారు. చెల్లించని వారికి ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయన్నారు. చెక్కుల కేసులను సర్కిల్ వారీగా సమీక్షించిన కమిషనర్.. వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు నీలకంఠేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జాయింట్ కమిషనర్ గోపాల్రావు, మేనేజర్ ఈశ్వర్, సీటీవోలు, ఏసీటీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
భారీ ఆదా
మధ్యతరగతికి ఆత్మనిర్భర్ భారత్ దిశగా.. జీఎస్టీ కొత్త శ్లాబుల అమలుతో వివిధ వర్గాల్లో సంతోషం ● హర్షం వ్యక్తం చేస్తున్న వ్యాపార, ఉద్యోగ, మహిళలుసామాన్యుడు, మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి పెరిగేందుకు ఈ జీఎస్టీ తగ్గింపు శ్లాబులు ఉపయోగపడతాయి. అదేవిధంగా స్వదేశీ ఉత్పత్తులకు మరింత వైభవం తీసుకొచ్చేందుకు మోదీ ప్రభుత్వం కచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళుతోంది. ఆత్మనిర్భర్తోనే వికసిత భారత్ సాధ్యం అవుతుంది. విద్యార్థులకు ఉపయోగపడే స్టేషనరీ లాంటి వస్తువులకు జీరో ట్యాక్స్, ఆరోగ్య బీమాకు పన్ను లేకుండా చేశారు. గ్రాసరీస్, కిరాణా, వ్యవసాయ పరికరాలు, ఔషధాలపై 5 శాతానికి పన్ను తగ్గించారు. చిన్న కార్లు, బైకులు, కంప్యూటర్లు, వివిధ రకాల గృహోపకరణాలపై 28 శాతం నుంచి 18 శాతానికి జీఎస్టీ తగ్గించడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు మరింత మేలు కలుగనుంది. – ధర్మపురి అర్వింద్, జీఎస్టీ కొత్త శ్లాబుల అమలుతో వివిధ వస్తువుల ధరలు తగ్గనుండడంతో ఆయా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. గతంలో ఉన్న 5, 12, 18, 28 శాతం శ్లాబుల స్థానంలో 5,18 శాతం శ్లాబులు మాత్రమే ఉండేలా కేంద్ర ప్రభు త్వం నిర్ణయించింది. దీంతో వినియోగదారులు, వ్యాపారులు, రైతులు, గృహిణులు, విద్యార్థులు, యువత తమకు భారీగా ఆదా అవుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కార్ల ధరలు భారీగా తగ్గనుండడంతో మధ్యతరగతి వారు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. సిగరెట్లు, గుట్కా, పాన్మసాలాలపై 40 శాతం జీఎస్టీ విధించడంపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో వివిధ వర్గాల వారు ‘సాక్షి’ తో అభిప్రాయాలు పంచుకున్నారు. –సాక్షి ప్రతినిధి, నిజామాబాద్జీఎస్టీ తగ్గింపు ఊరటనిచ్చే అంశం అనేక రకాల సామగ్రిపై జీఎస్టీ తగ్గించడం ఎంతో ఊరటనిచ్చే అంశం. జీఎస్టీ తగ్గింపు వల్ల ధరలు తగ్గడంతో పాటు కొనుగోళ్లు పెరగడానికి అవకాశం ఉంది. సామాన్యులకు ఆర్థిక భారం తగ్గుతుంది. విలాసవంతమైన సామగ్రిపై జీఎస్టీ భారం ఉన్నా మధ్య తరగతి వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. – లక్ష్మీనారాయణ, లెక్చరర్, జూనియర్ కళాశాల మోర్తాడ్ నిత్యావసరాల ధరలు తగ్గడం సంతోషం మెడికల్ ఉత్పత్తులు, నిత్యావసర వస్తువుల ధరల తగ్గింపు మహిళలకు ఆర్థికభారం తగ్గించే మార్గం సంతోషంగా ఉంది. పేద, మధ్య తరగతుల ప్రజలకు ఆర్థిక భారం తగ్గడంతో కుటుంబ నిర్వహణ సులభతరం అవుతుంది. మహిళలు అర్థికంగా అభివృద్ధి చెందుతారు. – రాజమణి, ఆర్మూర్ -
ఉత్సవం ఉత్సాహంగా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా కేంద్రంలో స్థానికంగా ఉన్న వివిధ వర్గాల ప్రజలతోపాటు దేశంలోని ఆయా రాష్ట్రాలకు చెందిన వారు నివసిస్తున్నారు. దీంతో ఉత్సవం ఏదైనా ఉత్సాహంగా, ఘనంగా నిర్వహిస్తున్నారు. భవసార్ క్షత్రియ సమాజ్, సింధీ, మార్వాడీ సమాజ్ల ఆధ్వర్యంలో చేసే పండుగలకు ప్రాధాన్యం ఉంటోంది. దీంతో దుర్గా నవరాత్రులు, గణపతి ఉత్సవాలు, శ్రీరామనవమి, శివరాత్రి, హోళీ ఉత్సవాలను కలసికట్టుగా చేసుకుంటున్నారు. ఇక ఇందూరుకే ప్రత్యేకమైన ఊర పండుగ, వీరహనుమాన్ విజయయాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అయితే రాష్ట్రంలో సంప్రదాయ ఉత్సవమైన బతుకమ్మ ఉత్సవాల విషయంలో మాత్రం జిల్లాలో రానురాను మరింత కళ వస్తోంది. మహిళలంతా ఒక్కచోట చేరి బతుకమ్మ ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఇందుకోసం భారీ స్థాయిలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కమిటీలు వేసుకుంటున్నారు. రెడ్డి రీఫామ్ ఆధ్వర్యంలో బతుకమ్మ నగరంలోని లక్ష్మి కల్యాణ మండపంలో రెడ్డి రీఫామ్ మహిళల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బతుకమ్మ వేడుకలు సాంస్కృతిక వైభవానికి అద్దం పట్టాయి. మాజీ ఎంపీ కేశ్పల్లి గంగారెడ్డి సతీమణి లక్ష్మీకాంతమ్మకు వచ్చిన ఆలోచనతో రెడ్డి రీఫామ్ సొసైటీ ఏర్పాటు చేశారు. రెడ్డి కులస్తులు ఆడంబరంగా నిర్వహిస్తున్న శుభకార్యాలు, వివాహాలకు భారీ ఖర్చు చేస్తున్నారని, ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు ప్లాస్టిక్ నిషేధంలో తమవంతు పాత్ర పోషించాలనే లక్ష్యంతో ఈ సొసైటీని ఏర్పాటు చేశారు. వంటలు సైతం ఎక్కువగా చేసి ఆహారాన్ని వృథా చేయొద్దనే నినాదాన్ని వినిపించేందుకు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. ఆస్తులు అమ్ముకునే స్థాయిలో వేడుకలు చేయొద్దని ప్రచారం చేస్తున్నారు. ‘సింపుల్ వెడ్డింగ్, సింపుల్ లివింగ్, సింపుల్ ఈటింగ్, విమెన్ వెల్ఫేర్, స్టూడెంట్ వెల్ఫేర్’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. బతుకమ్మ వేడుకల్లో లక్ష్మీకాంతమ్మ, ఇందిరారెడ్డి, సరళ మహేందర్రెడ్డి, డాక్టర్ కవితారెడ్డి, నల్ల స్రవంతిరెడ్డి, విశాలిని రెడ్డి, సృజనరెడ్డి, సౌజన్యరెడ్డి, సంగీతరెడ్డి, స్వరూపారెడ్డి, నిర్మలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంస్కృతి సంప్రదాయల వైభవాన్ని చాటుతూ సంబురాలు బతుకమ్మ, దేవీ నవరాత్రులు, శ్రీరామనవమి.. పండగ ఏదైనా పెరుగుతున్న ప్రాధాన్యం ఇందూరుకు ప్రత్యేకం వీరహనుమాన్ విజయయాత్ర, ఊర పండుగ -
క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి మోపాల్: మండలంలోని కంజర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్ఎంపీ వైద్యుడు మృతిచెందాడు. ఎస్సై సుస్మిత తెలిపిన వివరాలు ఇలా..నర్సింగ్పల్లికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు వెల్దుర్తి గంగాధర్ (53) శనివారం అర్ధరాత్రి నర్సింగ్పల్లి నుంచి మోపాల్ వైపు బైక్పై బయలుదేరాడు. కంజర్ రెసిడెన్సియల్ స్కూల్ ఎదుట మలుపు వద్ద ప్రమాదవశాత్తు బైక్ అదుపు తప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లాడు. ఈవిషయాన్ని రెసిడెన్సియల్ స్కూల్ వాచ్మెన్ గమనించి పోలీసులకు ఫిర్యాదుచేశాడు. పోలీసులుఘటనాస్థలానికి చేసుకుని గంగాధర్ను పరీక్షించారు. అప్పటికే మృతిచెందగా, కుటుంబీలకు సమాచారం ఇచ్చారు. మృతదేహానికి పంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్సపొందుతూ వివాహిత .. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఆత్మహత్యకు యత్నించిన ఓ వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై భార్గవ్గౌడ్ వివరాలు ఇలా.. నాగిరెడ్డిపేట మండలంలోని అచ్చాయపల్లి గ్రామానికి చెందిన కొంపల్లి కమలాకర్కు, మెదక్కు చెందిన భవాని(22)కి కొన్ని నెలల క్రితం వివాహం జరిగింది. గత ఆరునెలలుగా దంపతుల మధ్య విభేధాలు తలెత్తడంతో ఇటీవల కుటుంబసభ్యులు జోక్యం చేసుకొని ఇరువురి మధ్య రాజీ కుదిర్చారు. ఈక్రమంలో ఈనెల 16న భవాని పొలానికి వెళ్లి అక్కడ గుర్తుతెలియని విషపదార్థం తాగి, అపస్మారకస్థితిలో పడిపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆమెను నిజామాబాద్కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా 19న చికిత్సపొందుతూ ఆమె మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలి తల్లి శనివారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు. అనారోగ్యంతో కాంగ్రెస్ నాయకుడు.. తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని నందివాడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నా యకుడు సామ రాంరెడ్డి మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మూడు రోజుల క్రితం రాంరెడ్డి అనారోగ్యానికి గురికావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అ క్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడన్నారు. రాంరెడ్డి గతంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్య క్షుడిగా పనిచేశారు. ఆయన సతీమణి నందివాడ సర్పంచ్గా పనిచేసింది. గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రం శివారులోని పేకాట స్థావరంపై దాడి చేసి పేకాడుతున్న ఏడుగురిని పట్టుకున్నట్లు ఏఎస్సై ప్రకాశ్ ఆదివారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు కామారెడ్డి పోలీసులు, స్థానిక పోలీసులతో కలిసి పేకాట స్థావరంపై దాడి చేసినట్లు తెలిపారు. ఏడుగురిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.6,190 నగదు, ఐదు బైక్లు, ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్సై తెలిపారు. -
దుర్గమ్మ పూజకు వేళాయే..
● నేటి నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ● జిల్లావ్యాప్తంగా సిద్ధమైన మండపాలు నిజామాబాద్ రూరల్: అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో జిల్లావ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాల్లో వివిధ సంఘాల ఆధ్వర్యంలో దేవి మండపాలను అందంగా ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాల్లో పదకొండు రోజులపాటు అమ్మవారు పదకొండు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవారిని భక్తులు పూజించి, నైవేధ్యాలు సమర్పిస్తారు. అలాగే మండపాల నిర్వాహకులు సైతం అమ్మవారి దీక్ష చేపట్టి, 11 రోజులు నిష్ఠతో పూజలు నిర్వహిస్తారు. గత 19 సంవత్సరాల నుంచి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలుస్తున్నాం. కోరిన కోరికలు తీరస్తు అమ్మవారు ప్రతి ఏటా గాజులపేటలో కొలువుదీరుతుంది. పదకొండు రోజుల పాటు అమ్మవారికి కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు భక్తులు నిర్వహిస్తాం. –ఔదాగిరి సుధీర్, గాజులపేట దేవిశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత పదకొండు రోజుల పాటు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనుంది. ప్రతిరోజు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలు సమర్పించనున్నారు. అలాగే మండపాల్లో అన్నదానాలు, ఆధ్మాత్మిక కార్యక్రమాలు, నిర్వహిస్తారు. –సురేష్, గాజులపేట -
వరిలో తెగుళ్లు.. నివారణ చర్యలు
రుద్రూర్: జిల్లాలోని వివిధ మండలాల్లో రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు పర్యటించి వరి పంటకు బాక్టీరియా ఎండాకు తెగులు, కాండం తొలుచు పురుగు ఉధృతి ఉన్నట్టుగా గుర్తించారు. ఈ సందర్భంగా తెగుళ్లు ఆశించడానికి కారణాలు, యాజమాన్య చర్యలను వ్యవసాయ పరిశోధన కేంద్రం అధిపతి, శాస్త్రవేత్త సమతా పరమేశ్వరి వివరించారు. కారణాలు: ●జిల్లాలో సాగు చేస్తున్న వరి రకాలు తెగులు తట్టుకోలేకపోవడం. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అధిక వర్షాలు కురవడం వల్ల ఈ తెగులు ఉధృతి అధికంగా ఉంది. ●బ్యాక్టీరియా ఎండాకు తెగులు దుబ్బు చేసే దశ నుంచి చిరు పొట్ట దశలో ఉన్న వరి పంటను ఆశించే అవకాశం ఉంది. ●ఈ తెగులు ఆశించినప్పుడు ఆకుల మీద అంచుల వెంబడి అలల మాదిరిగా నీటి రంగు డాగు మచ్చలు ఏర్పడతాయి. ఆకుల అంచుల వెంబడి కొన నుంచి కింది భాగం వరకు వ్యాప్తి చెంది ఆకులు ఎండి పోతాయి. ●దుబ్బు చేసే దశ నుంచి చిరుపొట్ట దశలో ఈ ఆకులు ఎండిపోవడం వల్ల దిగుబడిపైన ప్రభావం చూపుతుంది. ●ఈ తెగులు ఆశించిన మొక్కలను గమనిస్తే వాటి ఆకుల వెంబడి బ్యాక్టీరియాకు సంబంధించిన జిగురు ఉండలు ఉదయం వేళలో కనిపిస్తాయి. ఇది ఒక మొక్క నుంచి మరొక మొక్కకి లేదా ఇంకొక పొలంలోకి నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ●పంట నీటి ముంపునకు గురయినపుడు ఎండాకు తెగులు ఉధృతి ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ తెగులు చూడడానికి పోషక లోపంలాగా కనిపిస్తునందున రైతులు గుర్తించడానికి ఇబ్బంది పడుతారు. యాజమాన్య చర్యలు.. ●తొలిదశలో గుర్తిస్తే తెగులు నివారించడానికి రాగి దాతు శీలింద్ర నాశనం అయిన కాపర్ హైడ్రాకై ్సడ్ మందును ఒక లీటర్ నీటికి రెండు గ్రాములు వాడాలి. లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములుతోపాటుగా స్ట్రీప్టో మైసిన్ సల్ఫేట్ లేదా ప్లాంటో మైసిన్ అనే బ్యాక్టీరియా శిలీంద్ర నాశిని 0.4 గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి. ●వరి పంట పూత దశలో ఉన్నప్పుడు బ్యాక్టీరియా తెగులు లక్షణాలు గమనిస్తే ఈ రాగిదాతు శిలీంద్ర నాశనులను పిచికారీ చేయవద్దు. చిరు పుట్ట దశలో ఈ తెగులు తట్టుకునే శక్తిని పెంపొందించడానికి మ్యూరేట్ ఆఫ్ పోటాష్ ఎకరానికి 15 నుంచి 20 కేజీలు వేసుకుంటే బ్యాక్టీరియా లక్షణాలు తట్టుకునే శక్తిని కూడా మొక్క గ్రహిస్తుంది. ●కాండం తొలుచు పురుగు ఉధృతి నివారణకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్పి 2 గ్రాములు వాడాలి. లేదా క్లోరాంత్రనిలిప్రోల్ 18.5 ఎస్.సి 0.3 మి. లీ. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ●రైతులు సరైన సమయంలో చీడపీడలను గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చు. -
కాలేయం జాగ్రత్త
నిజామాబాద్● అవగాహన, జాగ్రత్తలు అత్యవసరం ● నేడు ప్రైవేట్ వైద్యులు, అధికారులతో వైద్యారోగ్యశాఖ ప్రత్యేక సమావేశం సోమవారం శ్రీ 22 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025కదిలొచ్చిన అమ్మ.. సుభాష్నగర్: దుర్గాదేవి శరన్నవరాత్రులు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో నగరంలోని ఇంద్రప్రియదర్శిని కాలనీ వాసులు దుర్గామాత ఆగమనం కా ర్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ము ఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూ ర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలందరూ కలిసిమెలసి నవరాత్రులు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. జీఎ స్టీని తగ్గించి నరేంద్రమోదీ దేశ ప్రజలకు దసరా, దీపావళి బహుమతి అందజేశారన్నారు. మాజీ కార్పొరేటర్ నిచ్చెంగ్ లతాకృష్ణ, ఆనంద్, పవన్ పాల్గొన్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కమ్మర్పల్లి: మండల కేంద్రంలోని మిసిమి హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతు న్న డి అక్షిత్, ఎల్ రేవంత్ జాతీయ స్థాయి చౌక్ బాల్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల కరెస్పాండెంట్ బాలి రవీందర్ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు జిల్లా జట్టు తరఫున పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చార న్నారు. ఈనెల 25 నుంచి 28 వరకు విశాఖపట్టణంలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున పాల్గొంటార న్నారు. ఆదివారం విద్యార్థులతోపాటు, పీఈటీ సంజీవ్ను సన్మానించారు. నేటి నుంచి టీపీటీఎఫ్ అధ్యయన తరగతులు కామారెడ్డి టౌన్ : జిల్లాలో ఈనెల 22, 23వ తేదీలలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫె డరేషన్(టీపీటీఎఫ్) రాష్ట్ర స్థాయి అధ్యయన తరగతులు నిర్వహించనున్నట్లు సమాఖ్య జిల్లా అధ్యక్షుడు లింగం ఒక ప్రకటనలో తెలిపారు. పాత రాజంపేట్ రైల్వే గేట్ వద్దనున్న లేపాక్షి హోమ్స్ కమ్యూనిటీ హాల్లో తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు అనిల్కుమార్తో పాటు రాష్ట్ర, జిల్లా నేతలు పాల్గొంటారని తెలిపారుచాపకింద నీరులా విస్తరిస్తున్న హెపటైటీస్ బీ, సీశరీరంలో ప్రధానమైన కాలేయం పనితీరును హెపటైటీస్ దెబ్బకొడుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న వైరస్ ప్రాణాల మీదికి వచ్చేంత వరకు బయటపడడం లేదు. హెపటైటీస్ బీ, సీ బాధితుల సంఖ్య జిల్లాలో పెరుగుతోంది. వైరస్పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడంతోపాటు అప్రమత్తం చేసేందుకు వైద్యారోగ్యశాఖ చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు వచ్చే ప్రతి రోగికి స్క్రీనింగ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు సోమవారం జిల్లాలోని ప్రైవేట్ వైద్యులు, వైద్యారోగ్యశాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. నిజామాబాద్నాగారం: జిల్లాలో హెపటైటీస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది! ఏ, బి, సీ, డీ, ఈ ఐదు రకాల వైరస్లలో బీ, సీ రకాలు ప్రమాదకరం. హె పటైటీస్ బీ ని టీకాల ద్వారా నయం చేసే అవకాశం ఉన్నప్పటికీ ‘సీ’ బారిన పడిన వారు కోలుకోవడం కష్టమే. హెపటైటీస్ ఏ, డీ, ఈ అనే వైరస్ కేవలం కలుషితమైన ఆహారం, నీరు కారణంగా వస్తుంది. చాలా మంది ఈ మూడు వైరస్ల బారిన పడుతున్నప్పటికీ కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. హెపటైటీస్ ‘బీ’కి అందుబాటులో టీకాలుస్క్రీనింగ్ ద్వారా హెపటైటీస్ బీ బారిన పడింది లేనిదీ తెలుసుకోవచ్చు. హెపటైటీస్ చాపకింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ.. హై రిస్క్లో వైద్య సేవలందించే స్టాఫ్ నర్సులకు ఇప్పటికే టీకాలు ఇచ్చింది. ఈ టీకాలు మూడు దఫాలుగా తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి టీకా తీసుకున్న నెల రోజులకు మరో డోసు, మళ్లీ 6 నెలలకు చివరి డోసు తీసుకోవాల్సి ఉంటుంది. జీజీహెచ్లో విధులు నిర్వర్తిస్తున్న 200 మందికిపైగా స్టాఫ్ నర్సులకు హెపటైటీస్ బి రాకుండా ఉండేందుకు వారం రోజులక్రితం మొదటి డోసు టీకాలు ఇచ్చారు. త్వరలో జీజీహెచ్లో ప్రత్యేక వార్డు హెపటైటీస్ బీ, సీ బాధితులకు చికిత్స అందించేందుకు జీజీహెచ్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాలని వైద్యఽశాఖాధికారులు ఇప్పటికే ప్రణాళికలు రచిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వజనరల్ ఆస్పత్రి(జీజీహెచ్లో) వార్డు కేటాయించనున్నారు. ఈ మేరకు సోమవారం ప్రత్యేకంగా జీజీహెచ్ సూపరింటెండెంట్, ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులతో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు సమావేశం కానున్నారు. అవగాహన కల్పించేందుకు చర్యలు హెపటైటీస్ ఏ, బీ, సీ, డీ, ఈ అనే వైరస్పై జి ల్లాలోని ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని ప్రతి పీహెచ్సీ పరిధిలో గ్రా మాల్లోని ప్రజలకు హెపటైటీస్పై అవగాహన కల్పిస్తాం. మా సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి మరీ చైతన్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. – తుకారాం రాథోడ్, జిల్లా నోడల్ అధికారిజిల్లాలో బాధితులు.. జిల్లాలో హెపటైటీస్ బీ బారినన పడిన వారు 140 మంది, హెపటైటీస్ సీ బారిన పడిన వారు 60 మందికిపైగా ఉన్నారు. బీ, సీ రకాల వైరస్లు అత్యంత ప్రమాదకరమైనవి. రెండు రకాల వైరస్లు వివిధ రకాలుగా వ్యాపిస్తాయి. ట్రాన్స్జెండర్లు, డ్రగ్స్ తీసుకునేవారు, సెక్స్ వర్కర్లు ఎక్కువగా బాధితులుగా ఉంటారు. అలాగే తల్లికి ఉంటే పుట్టబోయే బిడ్డకు, సెలూన్లలో బ్లేడ్లతో, సింగిల్ యూజ్ సిరింజీలు, రక్తాన్ని పరీక్షించే సూదుల కారణంగా, టాటూ వేయించుకునే వారికి, డయాలాసిస్ రోగులకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సీ్త్ర, పురుష బేధం లేకుండా ఒకరికి ఉంటే సెక్స్ ద్వారా మరొకరికి వ్యాపిస్తుంది. రక్షణ లేని లైంగిక సంపర్కంతో వైరస్ ముప్పు ఉంటుంది. హెపటైటీస్ సీ బారినపడిన వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందేనంటున్నారు వైద్యాధికారులు. కాలేయ వాపు, మచ్చలు, చివరకు కాలేయ క్యాన్సర్కు దారి తీస్తుందంటున్నారు. ‘సీ’ వైరస్ సోకడా నికి ప్రధాన కారణంగా అప్పటికే వైరస్ సోకిన వారితో లైంగిక సంబంధాలు, అనారోగ్యకర సూదుల వినియోగం, రక్తమార్పిడి, సురక్షితం కాని శృంగారం కారణమవుతుంది. -
ఠంచన్గా బడికి..
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): ప్రభుత్వ పాఠశాలల్లో ఆగస్టు 1 నుంచి ప్రారంభించిన ఉపాధ్యాయల ఆన్లైన్ హాజరు సత్ఫలితాలనిస్తోంది. డీఆర్సీ–ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నిషన్ బేస్డ్ అటెన్డెన్స్) యాప్ అమలులోకి వచ్చిన తర్వాత జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుల హాజరుశాతం పెరిగింది. ఉపాధ్యాయులు సమయానికి వస్తుండడంతో వి ద్యార్థులకు అభ్యసన ప్రయోజనం కలుగుతోంది. అయితే విద్యార్థులకు అమలు చేస్తున్న ముఖ హా జరు అంతంత మాత్రంగానే ఉంది. ఇంటర్నెట్ సిగ్నల్ లేకపోవడం, యూడైస్ మాడ్యుల్లోని వి ద్యార్థులను ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాల పరిధిలోకి తీసుకరావడానికి ప్రయత్నం చేసినా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు పట్టించుకోకపోవడం, యాప్లో కొన్ని లోపాల కారణంగా విద్యార్థుల హా జరు నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. ఆగడాలకు చెక్ ఎఫ్ఆర్ఎస్ విధానం అమలులోకి రాక ముందు చాలా మంది ఉపాధ్యాయులు పాఠశాలలకు సమయానికి వచ్చేవారు కాదు. అలాగే కొందరు ప్రధాన ఉపాధ్యాయ సంఘాల నాయకులు డుమ్మాలు కొట్టడం, మరికొందరు రియల్ ఎస్టేట్, ఇతర ఫైనాన్స్ లు నడిపిస్తూ పాఠశాల ముఖం అప్పుడప్పుడు చూసేవారు. ఎఫ్ఆర్ఎస్ అమలులోకి వచ్చిన తరువాత ఈ నెల 4వ తేదీన 94.7 శాతం మంది ఉపాధ్యాయులు సమయానికి బడికి వెళ్లారు. ఈ విద్యా సంవత్సరం బడిబాట విజయవంతం కావడంతో గతేడాదితో పోలిస్తే అధికంగా దాదాపుగా 3వేల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారు. ఈ పాఠశాలల్లో తక్కువ.. ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ జిల్లాకు ఇచ్చిన నివేదిక ప్రకారం జిల్లాలో సాలూర మండలంలో పెంటాకుర్దు కాంప్లెక్స్ పాఠశాల, ఆర్మూర్ మండలంలోని ఆర్మూర్, పెర్కిట్ పాఠశాల సముదాయాలు, మెండోరా మండలంలో పోచంపాడ్ కాంప్లెక్స్, మోపాల్ మండలంలోలు బోర్గాం (పి) పాఠశాల సముదాయం విద్యార్థుల ముఖహాజరులో చాలా వెనుకబడి ఉన్నాయి. ఆయా కాంప్లెక్స్ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు 50 శాతం కూడా దాటలేదు. అలాగే జిల్లాలో ధర్పల్లి మండలం లోని హోన్నాజిపేట్ కాంప్లెక్స్ పాఠశాల 90శాతం విద్యార్థుల ముఖహాజరు నమోదుతో ప్రథమస్థానంలో ఉంది. ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో ప్రైవేట్ యాజమాన్యాలు బదిలీ చేయకపోవడం కూడా హాజరు శాతం తక్కువ నమోదుకు కారణమని పలువురు పేర్కొంటున్నారు. దీనిపై జిల్లా విద్యా శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 1,162 ఉపాధ్యాయులు 6,466, విద్యార్థులు 1,01,144 విద్యార్థుల హాజరు తగ్గడానికి కారణాలెన్నో.. ఎఫ్ఆర్ఎస్ (ముఖ హాజరు) అమలుతో ఓ వైపు ఉపాధ్యాయుల హాజరు పెరిగినప్పటికీ విద్యార్థుల హాజరు అంతంతమాత్రంగానే ఉంటోంది. ప్రతిరోజూ వివిధ కారణాలతో 10 నుంచి 20 శాతం మంది విద్యార్థులు బడికి రావడం లేదు. అలాగే వచ్చిన విద్యార్థులకు సంబంధించి ముఖ హాజరు నమోదులో ఉపాధ్యాయులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యాప్లో లోపాల కారణం ముఖహాజరు రావడం లేదు. అలాగే ముఖ హాజరుకే ఎక్కవ సమయం నెట్ డాటా వృథాకావడంతో ఉపాధ్యాయుల దీనిపై తగిన ఆసక్తి చూపడం లేదు. కొన్ని మారుమూల గ్రామాల్లో సిగ్నల్ సమస్య తీవ్రంగా ఉంటోంది. సమయానికి బడులకు చేరుకుంటున్న ఉపాధ్యాయులు పెరిగిన ఉపాధ్యాయుల హాజరుశాతం సత్ఫలితాలనిస్తోన్న ఫేస్ రికగ్నిషన్ బేస్డ్ అటెన్డెన్స్ -
చూడు.. ఒక వైపే
● సాంకేతిక పరిజ్ఞానానికి రెండు కోణాలు ● మనం ఎలా ఉపయోగిస్తే అలాంటి ఫలితాలు● బీటెక్ పూర్తి చేసిన నిజామాబాద్ నగరానికి చెందిన ఓ యువకుడు చేతిలోని ఫోన్ను వాడుతూ ఆన్లైన్ బెట్టింగ్కు ఆలవాటు పడ్డాడు. అప్పులపాలై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించి గాయాలతో బయటపడ్డాడు. ● స్మార్ట్ ఫోన్లో క్లాసులు విని నిజామాబాద్ నగరంలోని నామ్దేవ్వాడకు చెందిన ఓ విద్యార్థిని రెండేళ్ల క్రితం నీట్ ర్యాంక్ సాధించింది. ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతోంది. ఖలీల్వాడి: మానవ మనుగడ, అభివృద్ధిలో సాంకేతిక పరిజ్ఞానం(టెక్నాలజీ) పాత్ర కీలకంగా మారింది. మనం ఉన్నచోటి నుంచి సప్తసముద్రాల అవతల ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడో.. ఎటు వెళ్తున్నాడో నేరు గా చూడగలుగుతున్నాం. ఏఐ టెక్నాలజీలో మనిషి అవసరం లేకుండా పని చేసే పరిస్థితి వచ్చింది. ఆన్లైన్లో సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఉన్నత విద్యను అందిపుచ్చుకుంటున్నారు. ఇదంతా నాణేనికి ఒక వైపు. మన అరచేతిలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం అనే నాణేనికి మరో వైపు చూసే వారి జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి. బంగారు భవిష్యత్ నాశనమవుతోంది. అందుకే సాంకేతిక పరిజ్ఞానాన్ని ‘చూడు.. ఒ క వైపే’ అనే పరిస్థితి ఉంది. మనం ఏది చేస్తే అదే.. ఏది కోరుకుంటే అదే.. సాంకేతికతకు ఒకవైపే ఉందామా. రెండో వైపునకు వెళ్లి దారి తప్పుదామా అంతా మన చేతుల్లోనే ఉంది. మంచికి ఉపయోగిస్తే మంచి ఫలితాలు నేడు ఏ రంగంలో రాణించాలన్నా సాంకేతికతను ఉపయోగించాల్సిందే. ఏ సమాచారం కావాలన్నా మనకు ఇంటర్నెట్లో పుష్కలంగా లభిస్తుంది. పా ఠ్యాంశాలు, విశ్లేషణలు, గణిత సమస్యల పరిష్కారం, కళలు, చిత్రాలు ఇలా ఏదిపడితే అది మన ముందుకు వస్తుంది. వీటిని విద్యార్థులు ఉపయోగించుకోవచ్చు. ఏ అంశంౖపైనెనా నిపుణుల సలహాలు, సూచనలు లభిస్తాయి. అలాగే వ్యాపారంలో మెలకువలు, వ్యాపారం ఎలా చేసుకోవాలి, ఎలా ముందకు వెళ్లాలి అనే అంశాలూ ఉంటాయి. దీంతోపాటు వ్యవసాయం, చదువు, ఉద్యోగం, ఏదైనా ఉపాధి రంగాల్లో మనకు అవసరమైన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సాంకేతికత సహాయంతో ప్రాజెక్టులను తయారు చేసి జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారు. కేసుల దర్యా ప్తు, చోరీల నివారణకు పోలీసులు సాంకేతికను వినియోగించుకుంటున్నారు. పోలీసులు లోకేషన్ ట్రాక్ చేసి నిందితులను అరెస్ట్ చేసిన ఘటనలూ ఉన్నాయి. చెడుకు ఉపయోగించొద్దు సాంకేతికతను చెడుకు ఉపయోగిస్తే కష్టాలు తప్ప వు. ప్రస్తుతం ఎంతో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. దీనిని మంచికి ఉపయోగించుకుంటే అనేక ప్రయోజనాలుంటాయి. చాలా మంది నేరాల కు, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డ దారిలో డబ్బు సంపాదించడానికి ఉపయోగిస్తున్నారు. చెడుకు ఉపయోగిస్తే చట్టం తనపని తాను చేస్తుంది. – వెంకటేశ్వర్రావు, ఏసీపీ, సైబర్ క్రైం, నిజామాబాద్ -
రేషన్ బియ్యం పట్టివేత
ఆర్మూర్ టౌన్: మండలంలోని అంకాపూర్ గ్రామపంచాయతీ సమీపంలో ఆదివారం విజిలెన్స్ అధికారులు, ఆర్మూర్ పోలీసులు సంయుక్తంగా కలిసి రేషన్ బియ్యంను పట్టుకున్నట్లు ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ తెలిపారు. లారీలో 250 బస్తాల్లో ఉన్న బియ్యంను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. బియ్యంను తరలిస్తున్న అంజి, మహేందర్, రాజయ్య, నరేష్పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత వేల్పూర్: మండలంలోని రామన్నపేట్లో అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను శనివారం అర్ధరాత్రి గ్రామస్తులు పట్టుకొని మోర్తాడ్ పోలీసులకు అప్పగించారు. గ్రామస్తు లు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని వాగు నుంచి కొందరు వ్యక్తులు రాత్రిపూట ఇసుకను అక్రమంగా రవాణాకు పాల్పడుతున్నారని గుర్తించి నిఘా పెట్టామన్నారు. గ్రామం నుంచి జాగిర్యాల్ రోడ్డు వైపు ఇసుకను తీసుకెళ్తున్న ట్రాక్టర్లను గుర్తించి పట్టుకున్నామన్నారు. వెంటనే మోర్తాడ్ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ట్రాక్టర్లను పోలీస్స్టేషన్కు తరలించారని పేర్కొన్నారు. -
104 సిబ్బంది సర్దుబాటు
● డీఈ ఆపరేటర్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ స్టాఫ్ కామారెడ్డి మెడికల్ కళాశాలకు బదిలీ ● ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నిషియన్ల బదిలీలకు తాత్కాలిక బ్రేక్నిజామాబాద్నాగారం: నిజామాబాద్ జిల్లాలో సంచార వైద్య సేవలు అందించే 104 వాహన సిబ్బందికి బదిలీలు చేయనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా జిల్లాలో ఔట్సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న 35మంది ఉద్యోగులను కామారెడ్డి జిల్లాకు కేటాయించనున్నట్లు తెలిసింది. ఆదేశాలు నేడో.. రేపో రానున్నాయి. ఇప్పటికే కామారెడ్డి మెడికల్ క ళాశాలకు డీఎంఈ నుంచి మెయిల్ వచ్చినట్లు సమాచారం. సొంత జిల్లాలో బదిలీ చేయకుండా పక్క జిల్లాకు బదిలీ చేయనుండటంతో జిల్లాలో పని చేస్తున్న 104 ఉద్యోగులు నేడు డీఎంఈ(డైరెక్ట ర్ ఆఫ్ హెల్త్)ను కలవడానికి వెళ్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 84 మంది ఉద్యోగులు 2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రజలకు ఇంటివద్దనే వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో 104 పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 104 వాహనాలు 12 కేటాయించారు. ప్రతి వాహనంలో ఫార్మసిస్టు, ల్యాబ్టెక్నిషిన్, డాటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్ ఉండేవారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 84 మంది ఔట్సోర్సింగ్ పద్ధతిన సిబ్బంది ఈ విభాగంలో పనిచేస్తున్నారు. 2022లో 104 సేవలను అప్పటి ప్రభుత్వం నిలిపివేసింది. ఈక్రమంలో సిబ్బందిని ఇతర వి భాగాల్లో సర్దుబాటు చేస్తుండగా డాటా ఎంట్రి ఆపరేటర్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులను కామారెడ్డి జిల్లాకు బదిలీ చేయనున్నారు. తక్కువ జీతాలతో ఏళ్ల తరబడిగా విధులు నిర్వహిస్తున్న చిరుద్యోగులను ఉన్న ఫలంగా ఇతర జిల్లాకు కేటాయించడంపై వారు ఆవేదన చెందుతున్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ, జీజీహెచ్ పరిధిలో ఎక్కడ ఖాళీలు లేవని చెప్పడంతో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉన్నందున 35 మంది (డాటా ఎంట్రీ ఆపరేటర్లు, డ్రైవర్లు, సెక్యూరిటీగార్డులు) అక్కడికి వెళ్లి విధులు నిర్వహించాలని ఆదేశాలు వచ్చాయని కన్నీరుపెట్టుకుంటున్నారు. ఫా ర్మసిస్టులు, ల్యాబ్ టెక్నిషియన్ల బదిలీకి మాత్రం తాత్కాలికంగా పెండింగ్ పడింది. ఈ రెండు కేటగిరీలు వైద్యారోగ్యశాఖ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో కోటా ఇచ్చినందున ప్రభుత్వ ఉద్యోగులు వచ్చే అవకాశం ఉంది. అందుకే రిక్రూట్మెంట్ పూర్తయిన తర్వాతా మిగిలి ఉంటే బదిలీ చేయనున్నారు. అప్పటి వరకు కూడా జీతాలు రావని అధికారులు చెప్పిన్నట్లు సిబ్బంది ఆరోపిస్తున్నారు. -
సార్లూ.. ఇదేమి పాడు బుద్ధి
● నగరంలోని నాల్గో టౌన్ పోలీస్స్టేషన్లో నెలక్రితం ఓ ప్రైవేటు కాలేజీకి చెందిన లెక్చరర్, విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆమె కుటుంబ సభ్యులకు తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసులో లెక్చరర్ జైలు పాలయ్యాడు. ఖలీల్వాడి: విద్యార్థులకు చదువు, సంస్కారం నే ర్పాల్సిన ఉపాధ్యాయులు, లెక్చరర్లు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో మంచీ చెడు చెప్పాల్సిన వారే సమాజంలో తలదించుకునే పనులు చేస్తున్నారు. వెకిలి చేష్టలతో కీచకులుగా మారుతున్నారు. తండ్రి లాంటి వ యస్సులో ఉన్న వారు విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ పవిత్రమైన వృత్తికి కళంకం తెచ్చిపెడుతున్నారు. కాగా, కొంతమంది పిల్లలు తమకు జరిగిన ఘటనలను తల్లిదండ్రులకు వివరించినా, మరికొందరు ఎవరికీ చెప్పుకోలేక మానసికంగా కుంగిపోతున్నారు. కొందరు చేస్తున్న ఈ చేష్టలతో మిగతా టీచర్లు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇటీవల జిల్లాలో వరుసగా విద్యార్థినులపై గురువుల అఘాయిత్యాలు పెరగడంతో పోక్సో కేసులు నమోదవుతున్నాయి. టీచర్లు ఇలా ప్రవర్తించడంతో ఎవరిని నమ్మాల్లో.. ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి తల్లిదండ్రుల్లో నెలకొంది. శిక్షలు పడుతున్నా.. పోక్సో కేసు నమోదైన తర్వాత పోలీసులు ఆరు నెలల్లో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేస్తున్నారు. జిల్లాలో పోక్సో కోర్టు అందుబాటులో ఉండటంతో కేసుల విచారణ త్వరగా జరిగి శిక్షలు పడుతున్నాయి. పోక్సో కేసులలో దోషులకు 20 ఏండ్ల వరకు శిక్ష ఖరారు అవుతుంది. 2022 సంవత్సరం నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు 322 పోక్సో కేసులు నమోదు కావడమే అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. తల్లిదండ్రుల చేతుల్లో బాలికల భద్రత ● బాలికల తల్లిదండ్రులు పిల్లలపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాల్సి ఉంటుంది. ● ఇంటి పరిసర ప్రాంతాలు, పాఠశాలల్లో ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తున్నారా? అని అడిగి తెలుసుకోవాలి. ● గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే చాక్లెట్లు, మిఠాయిలను సున్నితంగా తిరస్కరించేలా పిల్లలకు అవగాహన కల్పించాలి. ● ఎదుగుతున్న పిల్లలను మగవారితో సన్నిహితంగా మెలగనివ్వొద్దు. ఇంటి పక్కవారు, బంధువులతో పిల్లలను సినిమాలు, షాపింగ్, పర్యాటక ప్రాంతాలకు పంపొద్దు. పోక్సో కేసుల వివరాలు నెలక్రితం నగరంలోని ఐదో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే టీచర్ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ టీచర్పై పోక్సో కేసు నమోదు చేసి, జైలుకు పంపారు. అసభ్యకరంగా ప్రవర్తిస్తే కేసులే.. విద్యార్థినులను బ్యాడ్ టచ్ చేయొద్దు. శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తే పోక్సో కేసు నమోదు చేస్తాం. స్కూల్స్, కాలేజీల్లో షీటీమ్స్తో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, కాలేజీల్లో కమిటీ ఏర్పాటు చేశాం. స్కూల్ యాజమాన్యం, ప్రధానోపాధ్యాయుల దృష్టికి వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. లేకుంటే వారు కూడా శిక్షార్హులే. – రాజావెంకట్రెడ్డి, ఏసీపీ, నిజామాబాద్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న కొందరు గురువులు జిల్లాలో ఇటీవల వెలుగులోకి పలు ఘటనలు పలువురిపై పోక్సో కేసులు ఆందోళనలో తల్లిదండ్రులు -
త్వరలో తెయూలో వ్యవసాయ కళాశాల
● పీసీసీ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్ ● ట్రస్మా ఆధ్వర్యంలో ఘనంగా ‘గురుపూజోత్సవం’ డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): సమాజంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉందని, విద్యార్థుల భవిష్యత్ ను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్కుమార్ అన్నారు. తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) ఆధ్వర్యంలో శుక్రవారం బర్దీపూర్ శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో గురుపూజోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హా జరైన మహేశ్ కుమార్ గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. దేశనిర్మాణంలో ఉపాధ్యాయుల పా త్ర ఎంతో కీలకమన్నారు. గురుశిష్యుల అనుబంధం సక్రమంగా ఉంటే వారికి తిరుగే ఉండదన్నారు. సీఎం రేవంత్రెడ్డి విద్య, వైద్యరంగాలకు అధిక ప్రా ధాన్యతనిస్తున్నారని, వచ్చే మూడేళ్లలో నిజామా బాద్ జిల్లాను ఎడ్యుకేషన్ హబ్గా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. తాను చదువుకునే రోజు ల్లో ప్రతిదినం అటెండర్ రెండు మోపుల కర్రలతో వచ్చేవాడని, అప్పట్లో టీచర్లతో దెబ్బలు తినడంతోనే నేడు అనేకమంది ఉన్నతస్థాయిలో ఉన్నారని చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థులు చదువకుంటే ఉపాధ్యాయులు కొట్టడం కాదు కదా గట్టిగా మందలించే పరిస్థితులు లేవన్నారు. అయినా విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు తమ బాధ్యతను మరువొద్దని సూచించారు. విద్యార్థులు మంచి పౌరులుగా ఎదిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి మాట్లాడుతూ పేర్కొన్నారు. చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు వినయం, విధేయత, దేశభక్తిని నేర్పించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. అర్బన్కు ఇంటిగ్రేటెడ్ స్కూల్ను మంజూరు చేయాలని, అందుకు పీసీసీ అధ్యక్షుడు బాధ్యత తీసుకోవాలని కోరారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న వారికి అవార్డులు అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి వినయ్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్గౌడ్, డీఈవో అశోక్ కుమార్, ట్రస్మా రాష్ట్ర గౌరవాధ్యక్షుడు శేఖర్రావు, రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి, రాష్ట్ర కోశాధికారి జయసింహాగౌడ్, జిల్లా అధ్యక్షుడు నిత్యానందం, ప్రధాన కార్యదర్శి అరుణ్, కోశాధికారి ఉప్పాల మధు, ప్రోగ్రాం కన్వీనర్ మోహన్, కో కన్వీనర్ టీఎం విక్రాంత్, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు సీఎం ఆమోదం గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో దూరదృష్టి, విజన్ లేకపోవడంతో రాష్ట్రం రూ.8 లక్షల కోట్ల అప్పు ల్లో మునిగిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి నెలకు రూ.6 వేల కోట్లు వడ్డీలు చెల్లించడానికే సరిపోతుందన్నారు. అయినా ఇటీవల రూ.600 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు సీఎం రేవంత్రెడ్డి ఆమోదం తెలిపారన్నారు. తాను ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్రెడ్డిని ఒప్పించి తెలంగాణ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయించినట్లు పేర్కొన్నారు. త్వరలో తెయూలో వ్యవసాయ కళాశాల ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తామని, చదువుతోపాటు క్రీడలు ముఖ్యమే నని పేర్కొన్నారు. ప్రైవే టు పాఠశాలల ఉపాధ్యాయులకు హెల్త్ కార్డుల జారీ విషయమై సీఎంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. రూరల్ నియోజకవర్గంలో ట్రస్మా భవన నిర్మాణానికి స్థలం కేటాయించేలా చూడా లని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మహేశ్కుమార్ గౌడ్ సూచించారు. -
హెపటైటిస్తో అప్రమత్తంగా ఉండాలి
● డీఎంహెచ్వో రాజశ్రీ నిజామాబాద్నాగారం: జిల్లాలో హెపటైటిస్ వ్యాధి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా వై ద్యాధికారి రాజశ్రీ తెలిపారు. శుక్రవారం తన చాంబర్లో వైరల్ హెపటైటిస్పై జిల్లాస్థాయి సమన్వ య కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 149 హెపటైటిస్–బి, 39 హెపటైటిస్–సి పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. ట్రాన్స్జెండర్లు, డ్రగ్స్ వాడేవారు, సెక్స్ వర్కర్లు, ఆరోగ్య సేవలు అందించే సిబ్బంది, టాటూ వేయించుకునేవారు, సెలూన్లో పనిచేసేవారు, డయాలసిస్ రోగులను హెపటైటిస్ హైరిస్క్ గ్రూపులుగా గుర్తించినట్లు తెలిపారు. బి, సి చికిత్స కేంద్రాలుగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని గుర్తించినట్లు తెలిపా రు. హెపటైటిస్–బి, సీ ర్యాపిడ్ టెస్టులు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని, నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా పాజిటివ్ కేసుల లైన్ లిస్టును తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆఫీసర్ డాక్టర్ తుకారాం రాథోడ్, డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస ప్రసాద్, గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి నోడల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రమోహన్, ఫార్మసీ సూపర్వైజర్ నారాయణ, డీపీఎం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
తగ్గుతున్న ధరలు
మోర్తాడ్(బాల్కొండ): మొక్కజొన్న, సోయా సా గు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మా రింది. కోత దశకు చేరుకున్న పంటలను విక్రయించి సొమ్ము చేసుకోవాలని ఆశించిన రైతుల కు నిరాశ మిగిలే పరిస్థితులే కనిపిస్తున్నాయి. పంట విక్రయించే సమయంలో ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల కింద మక్కలకు క్వింటాలుకు రూ.2,700 ఉండగా, సోయాల ధర రూ.5,100 పలికింది. ప్రస్తుతం మక్కలకు రూ.2,200 – రూ.2,300, సోయాలకు రూ.4,700 ధర మాత్రమే లభిస్తోంది. వారం వ్య వధిలో రెండు రకాల పంటలకు క్వింటాలుకు రూ.400 వరకు ధర పడిపోవడంతో పెద్ద మొత్తంలో నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యేనా? సోయా ఎకరానికి 8 నుంచి 13 క్వింటాళ్లు, మొ క్కజొన్న విడిగా సాగు చేస్తే 18 నుంచి 28 క్వింటాళ్లు, పసుపులో అంతర పంటగా సాగు చేస్తే మాత్రం 12 నుంచి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో సోయాకు క్వింటాలుకు రూ.5,328, మక్కలకు రూ.2,400 మద్దతు ధర లభిస్తుంది. కాగా, వర్షాకాలం పంటల కొనుగోలు కోసం ఇప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉండడంతో సోయా, మక్కలను వ్యాపారులకే విక్రయించాల్సి వస్తోంది. పాత పంటలకు ధరలు లభించినా, కొత్త పంటలకు ధరలు తగ్గిపోవడంతో తమకు నష్టమే అని రైతులు అంటున్నారు. కొనుగోలు కేంద్రాలు తెరుచుకుంటేనే మార్కెట్లో సోయా, మక్కలకు వ్యాపారులు ఎక్కువ ధర చెల్లించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ధరలు తగ్గితే నష్టమే.. సోయా, మక్కలకు ధర ప డిపోతే రైతులకు నష్టమే. ప్రభుత్వం స్పందించి కొ నుగోలు కేంద్రాలను ఆ రంభించాలి. అలా చేస్తేనే వ్యాపారులు ధరలు పెంచుతారు. సోయా, మక్కల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి. – ఏనుగు రాజేశ్వర్, రైతు, మోర్తాడ్ మక్క, సోయా రైతుల పాట్లు అమ్మకాలు మొదలయ్యే సమయంలో పడిపోయిన రేట్లు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఎదురు చూపులు -
విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు
● డీఎంహెచ్వో రాజశ్రీ ● నందిపేట్ పీహెచ్సీ తనిఖీనందిపేట్(ఆర్మూర్): సీజనల్ వ్యాధుల పట్ల అప్ర మత్తంగా ఉండాలని, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వ హిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి రాజశ్రీ హెచ్చరించారు. నందిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరుతోపాటు ఓపీ రికార్డులను పరిశీలించా రు. రోగులకు అందుతున్న వైద్య సేవలను వైద్యాధి కారి ప్రవీణ్ను అడిగి తెలుసుకున్నారు. ‘స్వస్థ్ నారీ సశక్తి పరివార్’లో భాగంగా మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. శిబిరంలో 113 మంది మహిళలు పలు పరీక్షలు జరిపినట్లు వైద్యాధికారి వివరించారు. వైద్య సిబ్బంది శ్రీకాంత్, గురురాజ్, స్వాతి, పీహెచ్ఎన్ పద్మావతి, భాస్కర్, హేమలత తదితరులు పాల్గొన్నారు. మాలపల్లి వైద్య శిబిరం పరిశీలన నిజామాబాద్ నాగారం: నగరంలోని మాలపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రంలో కొన్నసాగుతున్న వైద్యశిబిరాన్ని జిల్లా వైద్యాధికారి రాజశ్రీ శుక్రవారం పరిశీలించారు. వెద్యులు రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. డిప్యూటీ డీఎంహెచ్వో అంజన, శ్యామల, షాదుల్లా, సిబ్బంది పాల్గొన్నారు. -
స్కూల్తండాలో గంజాయి మొక్కలు సీజ్
రామారెడ్డి(ఎల్లారెడ్డి): మండలంలోని స్కూల్తండాలో గంజాయి సాగు చేస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్సై లావణ్య సిబ్బందితో కలిసి శుక్రవా రం దాడులు నిర్వహించారు. తండాకు చెందిన గంగావత్ రాజేందర్ తన ఇంటి పెరట్లో అక్రమంగా 25 గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. అనంతరం గంజాయి మొక్కలను తొలగించి సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు. అలాగే నిందితుడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్ను సైతం సీజ్ చేశామన్నారు. నిందితుడు విచారణలో తాను వ్యక్తిగత వినియోగం, అమ్మకాల కోసం గంజాయి సాగు చేస్తున్నట్లు అంగీకరించినట్లు ఎస్సై తెలిపారు. న్యాయం చేయాలంటూ పురుగుల మందు డబ్బాతో ఆందోళన కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ఓ మాజీ కౌన్సిలర్ ఇంటి ముందు శుక్రవారం బాధితుడు మహదేవ్ న్యాయం చేయాలంటూ పురుగుల మందు డబ్బాతో ఆందోళన చేశారు. బాధితుడు మాట్లాడుతూ.. పాల్వంచ మండలం భవానిపేట గ్రామంలోని సర్వేనెంబర్ 769/186లో ఐదు ఎకరాల 10 గుంటల భూమిని మాజీ కౌన్సిలర్ భర్త వద్ద రూ. 70లక్షలకు కొనుగోలు చేయగా, సేల్ డీడీ చేసి ఇచ్చారన్నారు. కానీ తన పేరుపైన పాస్ పుస్తకం చేసి ఇస్తానని చెప్పి రెండు సంవత్సరాలు అవుతుందని, అడిగితే భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరారు. -
భారత న్యాయ విద్యకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు
● అంతర్జాతీయ న్యాయవాది డాక్టర్ శ్రీనివాస రావు ● తెయూ న్యాయశాస్త్ర విభాగంలో అంతర్జాతీయ సదస్సు తెయూ(డిచ్పల్లి): భారతీయ న్యాయవాదులు, న్యా య విద్యకు ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో గుర్తింపు ఉందని అంతర్జాతీయ న్యాయవాది, అమెరికాకు చెందిన డాక్టర్ కావేటి శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో న్యాయ కళాశాల సీనియర్ అధ్యాపకులు డాక్టర్ జెట్లింగ్ ఎల్లోసా ఆధ్వర్యంలో శుక్రవారం ‘వలస చట్టాలు – వ్యక్తిగత అంతర్జాతీయ చట్టాలపై అవగాహన’ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీనివాసరావు ముఖ్యవక్తగా హాజరై ప్రసంగించారు. ఇతర దేశాలకు వలసలు వెళ్లేవారు ఆయా దేశాల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అప్పుడే వీసాలు సులభంగా పొందవచ్చన్నారు. ప్రపంచవ్యాప్తంగా రూల్ ఆఫ్ లా అమలు జరగడం లేదన్నారు. అంతర్జాతీయంగా భారతీయులకు న్యా య విభాగంలో గొప్ప గుర్తింపు ఉందన్నారు. వ్యక్తు ల మద్య అంతర్జాతీయంగా వివాదాలు ఏర్పడితే ఏ ఏ న్యాయస్థానాల్లో కేసులు వేయవచ్చు అనే విషయాలపై అవగాహన కల్పించారు. కెనడా పౌరసత్వం కలిగిన బోధన్కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త గ్లోబల్ ఇఆర్టీ సొల్యూషన్స్ డైరెక్టర్ డాక్టర్ ఉత్తం మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా ప్లేస్మెంట్ అవకాశాలు ఉన్నాయని, తెయూ విద్యార్థులు స ద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెయూ రిజిస్ట్రార్ యాదగిరి మాట్లాడుతూ.. విద్యార్థులు ఉ న్నతమైన లక్ష్యాలతో మహోన్నతంగా ఎదగాలన్నా రు. ప్రిన్సిపాల్ ప్రసన్నరాణి, అధ్యాపకులు స్రవంతి, నాగజ్యోతి, తదితరులు ఉన్నారు. -
యాక్షన్ షురూ
నిజామాబాద్500 టీఎంసీల వరద శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు 500 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. శనివారం శ్రీ 20 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025– IIలో uనిజామాబాద్ సిటీ: మున్సిపల్ కార్పొరేషన్లోని రెవెన్యూ విభాగంలో ప్ర క్షాళన మొదలైంది. బల్దియాలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, రెవెన్యూ సమస్యలపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. దీంతో ము న్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ దిద్దుబాటు చర్యలకు పూ నుకున్నారు. రెవెన్యూ విభాగం ఉన్నతాధికారి, డీసీ రవిబాబును రెవెన్యూ బాధ్యతల నుంచి తప్పించారు. అడిషనల్ కమిషనర్ రవీంద్రసాగర్కు ఆ బాధ్యతలను అప్పగించారు. కిందిస్థాయి సిబ్బంది నుంచి కాకుండా ఉన్నతస్థాయి అధికారి నుంచి రెవెన్యూ ప్రక్షాళన ప్రారంభించడం కొసమెరుపు. తరచూ వివాదాల్లో రవిబాబు డిప్యూటీ కమిషనర్ రవిబాబు తరచూ వివాదాల్లో నానుతుంటారు. రవిబాబు గతంలోనే బల్దియాలో డిప్యూటీ కమిషనర్గా బాధ్యతలు నిర్వహించారు. మాజీ మేయర్ భర్తతో గొడవ పెట్టుకుని ఘర్షణ పడి వెళ్లిపోయాడు. గతంలో పని చేసిన నిర్మల్ మున్సిపాలిటీ, చింతమడక కార్పొరేషన్లోనూ ఇదే పరిస్థితి. దూకుడు స్వభావం, నోటి దురుసు, అందరితో తగవులు పెట్టుకుంటారనే విమర్శలున్నాయి. తక్కువ సమయంలోనే చెడ్డపేరు.. డిప్యూటీ కమిషనర్ రాజేంద్రకుమార్ గత మార్చిలో పదవీవిరమణ పొందగానే పోస్టు ఖాళీ అయింది. ఆ తర్వాత ఏఎంసీ జయకుమార్ బాధ్యతలు నిర్వహించారు. జూన్ 24న రవిబాబు డిప్యూటీ కమిషనర్గా బదిలీపై కార్పొరేషన్లో అడుగుపెట్టాడు. రాగానే రెవెన్యూ సిబ్బందితో మాట్లాడటం, ఉద్యో గుల అటెండెన్స్ పరీక్షించడం, తన బృందాన్ని సి ద్ధం చేసుకున్నారు. దీంతో కమిషనర్ దిలీప్కుమార్ ఈయనకు రెవెన్యూతోపాటు శానిటేషన్ బాధ్యతలను జూలై 18న అప్పగించారు. కాగా, విధుల్లో చేరి న వెంటనే పాత ఫైళ్లను బయటకు తీసి విచారణ ప్రారంభించారు. ఫైల్కు ఇంత అని రేటు ఫిక్స్ చేసి రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో ఒత్తిడిపెంచారు. మ్యుటేష న్లు, ఇంటి నెంబర్లు, అసెస్మెంట్లు, రీఅసెస్మెంట్లు, పేరు మార్పులు వంటి పనులకు నేరుగా డ బ్బులు తీసుకోవడం ప్రారంభించారు. డబ్బులిచ్చి న వారి పనులు వేగంగా, నిరాకరించిన వారిని ము ప్పుతిప్పలు పెట్టడంతో వివాదాలు పెరిగాయి. దీంతో బల్దియా మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. తక్కువ స మయంలోనే డీసీ చెడ్డపేరు తెచ్చుకున్నారు. చివరికి ఆర్ఐ శ్రీనివాస్ ఏసీబీ చేతికి చిక్కేవరకు వెళ్లింది. రెవెన్యూ విభాగంలో అంతర్గత బదిలీలుబల్దియాలో ఏసీబీ దాడులతో కమిషనర్ దిలీప్కుమార్ దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. రెవెన్యూ ఆఫీసర్ ఖయ్యూమ్ను బదిలీ చేసి ఆయన స్థానంలో సీనియర్ అసిస్టెంట్ స్వప్నను నియమించారు. ఆర్ఐ శ్రీనివాస్ స్థానంలో టౌన్ప్లానింగ్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్గా ఉన్న అనురాధకు బాధ్యతలు అప్పగించారు. ప్రత్యేకాధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సమీక్షల్లో రెవెన్యూ ఫైళ్లలో అవకతవకలు, మ్యుటేషన్ల కోసం పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకోవడం, ఆఫీసులోనే లంచం తీసుకోవడం, ట్రేడ్ లైసెన్సుల జారీలో అక్రమాలు వంటి పలు అంశాలు బయటపడ్డాయి. దీంతో డీసీ రవిబాబును రెవెన్యూ బాధ్యతల నుంచి తప్పించి, ఆయన స్థానంలో అడిషనల్ కమిషనర్ రవీంద్రసాగర్ను నియమించారు. బల్దియా రెవెన్యూలో ప్రక్షాళన పైస్థాయి నుంచి ప్రారంభించిన కమిషనర్ డీసీ రవిబాబుకు రెవెన్యూ విభాగం కట్ అడిషనల్ కమిషనర్ రవీంద్రసాగర్కు కేటాయింపు ఇక పాత ఫైళ్లకు మోక్షం -
ఎస్సారెస్పీలోకి 500 టీఎంసీల వరద
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు 500 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద గురువారం రాత్రికి తగ్గి, శుక్రవారం ఉదయం నుంచి పెరిగింది. గరిష్టంగా 3లక్షల 68 వేల క్యూసెక్కులకు పెరుగగా, సాయంత్రానికి 2లక్షల 16వేల క్యూసెక్కులకు తగ్గి, కొనసాగుతుంది. ప్రాజెక్ట్లో నీటి నిల్వ కోసం గోదావరిలోకి నీటి విడుదలను ప్రాజెక్ట్ అధికారులు తగ్గించారు. ప్రాజెక్ట్ 12 వరద గేట్ల ద్వారా 35 వేల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి పోతుంది. వరద కాలువ ద్వారా 6500 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 4 వేల క్యూసెక్కులు, ఎస్కెప్ గేట్ల ద్వారా 4 వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 400 క్యూసెక్కులు, లక్ష్మి కాలువ ద్వారా 200 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 701 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్ట్లోకి 1090.60(79.5 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. -
నల్లబెల్లం, పటిక పట్టివేత
ఖలీల్వాడి: గుడుంబా తయారీకి ఉపయోగించే నిషేధిత నల్లబెల్లం, పటికను పట్టుకున్నట్లు ఆర్పీఎఫ్ సీఐ సుబ్బారెడ్డి తెలిపారు. వివరాలు ఇలా.. ఆపరేషన్ సత్కార్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ రైల్వేస్టేషన్లో గురువారం రాత్రి నాందేడ్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న రైలులో రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో 2వేల కిలోల నల్లబెల్లం, 200 కిలోల పటికను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. నల్ల బెల్లం విలువ రూ. 8లక్షలు, 200కిలోల పట్టిక రూ. 40 వేలు ఉంటుందన్నారు. పట్టుకున్న నల్ల బెల్లం, పటికను నిజామాబాద్ ఎకై ్సజ్ అధికారులకు అప్పగించామన్నారు. రైల్వే ఎస్సై సాయిరెడ్డి, ఎకై ్సజ్ అధికారులు ఉన్నారు. -
ఊర్లకు వెళ్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి
● కాలనీల్లో గస్తీ దళాలను ఏర్పాటు చేసుకోవాలి ● సీపీ సాయిచైతన్య ఖలీల్వాడి: ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి, ఊర్లకు వెళ్లి నట్లయితే, ముందుగా పోలీ సులకు సమాచారం అందించాలని సీపీ పోతరాజు సాయిచైతన్య తెలిపారు. దసరా సెలవుల నేపథ్యంలో ప్రజలకు పలు సూచనలు, సలహాలు ఇస్తూ ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు దసరా పండుగకు సెలవులకు ఊరికి వెళ్లే వారు నిబంధనలు పాటించాలని –ప్రజలు తమ కాలనీల్లో ఉదయం వేళ పేపర్లు, ఖాళీ సంచులు, పూల మొక్కలు, పాత ఇనుపసామాగ్రి వస్తువులను విక్రయించే వారిపై నిఘా పెట్టాలి. ● రాత్రివేళల్లో అనుమానంగా సంచరించే వారిని ప్రశ్నించాలి. ● ఇళ్లకు తాళాలు వేసి ప్రయాణాలకు వెళ్తే, ఇరుగు పొరుగు వారిని ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పాలి. ● వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకొని ఇంటికి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ● పక్కింటి వారి ద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ● ఇంట్లో మహిళలు, వృద్ధులు ఉంటే ‘అపరిచి తులు‘ సమాచారం పేరుతో ఇంటికి వస్తే నమ్మకుండా ఉండాలి. ● విలువైన వస్తువులను పక్కింటి వారికి ఇచ్చి, నమ్మి వెళ్లకూడదు. ● ఊరు వెళ్లేటప్పుడు ఖరీదైన వస్తువులను ఇంటిలో ఉంచకపోవడమే మంచిది. వాటిని బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం ఉత్తమం ● కాలనీల వారిగా గస్తీ దళాలను ఏర్పాటు చేసుకోవాలి. ● పోలీస్ శాఖ వారికి అనుమానితుల సమాచారం అందించి దొంగతనాల నివారణకు సహకరించాలి. ● చుట్టుపక్కల వారి ఫోన్ నంబర్లను తెలుసుకొని, ఉంచుకోవాలి. ● బయటకు వెళ్తున్న సంగతి వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దు. ప్రయాణం పూర్తయ్యక, ఇంటికి వచ్చిన తర్వాత మాత్రమే ఫోటోలు, సమాచారం షేర్ చేసుకోవాలి. ● విద్యుత్, గ్యాస్ లైన్, ఫ్రిజ్ మొదలగు వాటిని సరిగ్గా ఆఫ్ చేయాలి. ● ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వదలుచుకునేవారు మీ సమీప పోలీస్ స్టేషన్లను సంప్రదించండి. లేదా డయల్ 100 ను సద్వినియోగం చేసుకోవాలి. -
కొనసాగుతున్న కబడ్డీ శిక్షణా శిబిరం
నిజామాబాద్నాగారం: ముప్కాల్ మండల కేంద్రంలో జిల్లా కబడ్డీ జట్టు సభ్యులకు నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం కొనసాగుతోంది. అండర్–16 బాలబాలికలకు ఈ నెల 18 నుంచి 24 వరకు శిబిరం నిర్వహిస్తామని జిల్లా అధ్యక్షుడు అంధ్యాల లింగయ్య, ప్రధాన కార్యదర్శి కోమటిరెడ్డి గంగాధర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఇట్టి శిక్షణలో ఎంపికై న క్రీడాకారులు ఈనెల 25 నుంచి 28 వరకు జరగబోయే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొననున్నట్లు తెలిపారు. లయన్స్ క్లబ్ ఛైర్మన్ సాగర్రెడ్డి, కొమ్ముల నర్సయ్య, ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ నునుగొండ అంజయ్య, పీడీ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా దయాకర్ గౌడ్
నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ ఎస్సీ, ఎస్టీ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా దయాకర్ గౌడ్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. గతంలో జర్నలిస్టుగా ప్రస్థానం ప్రారంభించిన దయాకర్ గౌడ్, న్యాయవాదిగా పనిచేస్తునే కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు. నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్ పీఏగా, కాంగ్రెస్ పార్టీ న్యాయవిభాగం లీగల్ సెల్ రాష్ట్ర కో–కన్వీనర్గా సైతం విధులు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయనను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేంధర్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అభినందించారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మాల్తుమ్మె ద విత్తనోత్పత్తి క్షేత్రంలో విత్తన తయారీకి ఉపయోగపడని 429 క్వింటాళ్ల ధాన్యానికి శుక్రవారం సంబంధిత అధికారులు వేలం పాట నిర్వహించారు. విత్తన క్షేత్రంలో నిర్వహించిన వేలం పాటలో ఏడుగురు పాల్గొనగా వారిలో నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం గ్రామానికి చెందిన స్కైలాబ్ గౌడ్ అనే వ్యక్తి క్వింటాల్కు రూ.1,590 చొప్పున పాడి ధాన్యాన్ని దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా వ్యవసాయాధికారి మోహన్ రెడ్డి, తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ ఆర్ఎం రఘు, విత్తనక్షేత్ర ఏడీఏ ఇంద్రసేన్, ఏవో అచరిత, ఎల్లారెడ్డి ఏఎంసీ కార్యదర్శి శ్రీనివాస్, ఏఈవో శ్యాంసుందర్ రెడ్డి, విత్తనోత్పత్తి క్షేత్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతి
ఖలీల్వాడి: నగరంలోని గంజ్ మార్కెట్లో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఒకటవ టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. ఈనెల 16న నగరంలోని గంజ్ మార్కెట్లోని కూరగాయల షాపు వద్ద గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి, అతడు మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవని పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 55–60ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. ఒంటిపై బూడిద రంగు బనియన్, క్రీమ్ కలర్ ప్యాంటు ఉన్నట్లు తెలిపారు. మృతుడి వివరాలు ఎవరికై నా తెలిసినచో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ 8712659714ను సంప్రదించాలన్నారు. నగరంలో.. ఖలీల్వాడి: నగరంలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద గుర్తుపట్టలేని స్థితిలో వ్యక్తి మృతదేహం లభించిందని ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవన్నారు. మృతుడి వయస్సు సుమారు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. ఈ వయస్సు ఉన్న వారు ఎవరైనా తప్పిపోయినచో ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ 8712659837, 8712659714కు సమాచారం అందించాలన్నారు. నవీపేట: మండలంలోని నాగేపూర్ శివారులో శుక్రవారం ఉదయం ప్లాస్టిక్ సంచిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవన్నారు. మృతుడి వయస్సు సుమారు 30–40 ఏళ్లలోపు ఉంటుందన్నారు. దుండగులు హత్య చేసి ప్లాస్టిక్ సంచిలో మూట కట్టినట్లు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహం పూర్తిగా కూలిపోయి ఉందని, మృతదేహంపై నలుపు రంగు ప్యాంటు, ఎరుపు రంగు టీషర్టు ఉందన్నారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
క్రీడాకారులు యూనివర్సిటీకి గుర్తింపు తేవాలి
తెయూ(డిచ్పల్లి): క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి తెలంగాణ యూనివర్సిటీకి గుర్తింపు తేవాలని వర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరి సూచించారు. తెయూ అంతర కళాశాల కబడ్డీ జట్ల (పురుషుల విభాగం) ఎంపిక పోటీలను శుక్రవారం రిజిస్ట్రార్ ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్న తర్వాత ఆయన మాట్లాడుతూ.. వర్సిటీ పరిధిలో క్రీడలు, క్రీడాకాారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు కర్ణాటక రాష్ట్రం బెలగావి రాణిచెన్నమ్మ యూనివర్సిటీలో అక్టోబర్ 4 నుంచి 7 వరకు జరగబోయే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ టోర్నమెంట్లో పాల్గొంటారని తెలిపారు. ఆ పోటీల్లో చక్కని ప్రతిభ కనబర్చి విజేతగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్, పీఆర్వో పున్నయ్య, స్పోర్ట్స్ డైరక్టర్ బాలకిషన్, పీడీలు బాలమణి, అనిల్కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బీఆర్ నేత, నరేష్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. -
పెట్రోల్ బంకుల్లో ఉచిత సేవలు
ఖలీల్వాడి: పెట్రోల్ బంక్లో వాహనదారులకు ఉచితంగా పలు రకాలైన సేవలను నిర్వాహకులు అందించాలి. ● పెట్రోల్, డీజిల్ నాణ్యతను తెలుసుకునేందుకు అవసరమైన పరీక్షల కోసం ఫిల్టర్ పేపర్లు అందుబాటులో ఉంచాలి. ● ప్రథమ చికిత్స కిట్లు, సాధారణ మాత్రలు ఉండాలి. ● ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయాలి. ● మూత్రశాలలు, తాగునీరు సౌకర్యం కల్పించడంతోపాటు, వాహనాల టైర్లలో ఉచితంగా గాలి నింపేందుకు యంత్రాలు ఉండాలి. ● యజమాని, సంస్థ పేరు, ఏదైనా అవసరమైతే ఎవరిని సంప్రదించాలి, వారి ఫోన్ నెంబర్లు కనిపించేలా బోర్డు ఉంచాలి. ● బంకు తెరవడం, మూసివేసే సమాచారం ప్రదర్శించాలి. ● బంకులో రోజుకు 10 వేల లీటర్ల ఇంధనం అమ్మితే, దాని ద్వారా వచ్చిన ఆదాయంలో రూ.600 సౌకర్యాల కల్పనకు కేటాయించాల్సిన నిబంధన ఉంది. ● బంకులో సౌకర్యాలు లేకపోతే సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ( CPGRAMS) పోర్టల్ ఫిర్యాదు చేయవచ్చు. ● చమురు సంస్థల సేల్స్ మేనేజర్, లేదా స్థానిక తహసీల్దారుకు కూడా ఫిర్యాదు చేయొచ్చు. సమాచారం.. -
ప్రకృతి సౌందర్యాన్ని పెంచే పండుగే బతుకమ్మ
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ, ఇది ప్రకృతి సౌందర్యాన్ని, సీ్త్రల ఐక్యత, ప్రకృతి వనరుల సంరక్షణను సూచిస్తుందని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీ యాదగిరిరావు అన్నారు. తెయూ ఉమెన్ సెల్ డైరెక్టర్ భ్రమరాంబిక ఆధ్వర్యంలో గురువారం ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వీసీ యాదగిరిరావు, అతిథిగా రిజిస్ట్రార్ ఎం యాదగిరి హాజరై బతుకమ్మలకు పసుపు, కుంకుమ సమర్పించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అంటేనే ప్రకృతిని ఆరాధించడమన్నారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సీహెచ్ఆరతి, డీన్ ప్రొఫెసర్ కే.లావణ్య, అధ్యాపకురాళ్లు శాంతాబాయి, వాణి, ప్రసన్న శీలా, రాజేశ్వరి, జ్యోతి, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. -
ఒకే పోర్టల్లో స్కాలర్షిప్లు
ఖలీల్వాడి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు అందించే స్కాలర్షిప్లను ఒకే దగ్గర దరఖాస్తు చేసుకోవడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయిం తీసుకుంది. ఇదివరకు ఉన్న ఎన్ఎస్పీ (నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్)ను అందుకు అనుకూలంగా మార్పు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా వివిధ ప్రభుత్వ రంగ సంస్థల స్కాలర్షిప్ల కోసం ఇదే పోర్టల్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. దరఖాస్తు చేసుకోవడం ఇలా ముందుగా ఎన్ఎస్పీ పోర్టల్లో అభ్యర్థి వన్టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సెల్ఫోన్కు ఓటీపీ వస్తుంది. వచ్చిన అఫ్లికేషన్లో పూర్తి వివరాలు నమోదు చేయాలి. కుల, ఆదాయ ధ్రువపత్రాలు, విద్యార్హతలు, మెయిల్ ఐడీ, బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేసి వాటిని అప్లోడ్ చేయాలి. ఒకటో తరగతి నుంచి పీజీ, పీహెచ్డీ వరకు చదివే అన్నివర్గాల విద్యార్థులు.. ప్రీమెట్రిక్, పోస్టు మెట్రిక్, ఎంఎంఎన్ఎస్, టాప్క్లాస్ ఎడ్యుకేషన్(ఎస్సీ, ఎస్టీలకు), యూజీసీ, ఇషాన్, ఉదయ్, సింగిల్ గర్ల్ చైల్డ్, ఏఐసీటీఈ సెంట్రల్ సెక్టార్ స్కీం ఆఫ్ స్కాలర్షిప్ తదితర వాటన్నింటికీ ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ పోర్టల్ అక్టోబర్ 31 వరకు తెరిచి ఉంటుంది. సమాచారం.. -
రైతులు నానో యూరియా వాడాలి
డీఏవో మేకల గోవింద్ డొంకేశ్వర్(ఆర్మూర్): రైతులంతా బస్తాల్లో లభించే యూరియా కాకుండా బాటిళ్లలో ద్రవరూపంలో ఉండే నానో యూరియాను వినియోగించాలని జిల్లా వ్యవసాయాధికారి మేకల గోవింద్ సూచించారు. గురువారం డొంకేశ్వర్ మండల కేంద్రానికి వచ్చిన ఆయన సొసైటీ గోదాములను పరిశీలించారు. ఎరువుల నిల్వలు, అమ్మకాలను రిజిస్టర్లలో తనిఖీ చేశారు. జిల్లాలో యూరియా కొరత ఏమాత్రం లేదని, రైతులు అవసరానికి మించి కొనుగోలు చేయకూడదన్నారు. యూరియాను ఎక్కువగా వినియోగించడంతో నేలకు, పంటలకు ప్రమాదమన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా వచ్చిన ఎలాంటి దుష్ప్రభావాలు లేని నానో యూరియాను వాడాలని సూచించారు. ఇది రెండు బస్తాలతో సమానమని, రైతులకు శ్రమ కూడా తగ్గుతుందన్నారు. అనంతరం నూత్పల్లిలో వరి పంటను పరిశీలించారు. సరిపడా ఎరువులు సరఫరా చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు గొడిశరం భూమేశ్ రెడ్డి, రైతులు కలిసి డీఏవోను సన్మానించారు. మండల వ్యవసాయాధికారి మధుసూదన్, ఏఈవోలు మౌనిక, ప్రశాంత్ ఉన్నారు. -
మాటల తూటాలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఉమ్మడి జిల్లాలో మాటల తూటాలతో రాజకీయం గరంగరంగా మారింది. డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి తాజాగా చేసిన ప్రసంగం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. బాన్సువాడ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి చేసిన విమర్శలకు ప్రతిగా భాస్కర్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఎవరేమిటో తేల్చుకుందామంటూ భాస్కర్రెడ్డి సవాళ్లు విసిరాడు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి ‘లక్ష్మీపుత్రుడు కాదు.. శని పుత్రుడు’ అంటూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ భాస్కర్రెడ్డి విరుచుకుపడ్డారు. జీవన్రెడ్డి ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. 2018లో 36 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచిన జీవన్రెడ్డిని ప్రజలు గత ఎన్నికల్లో మూడోస్థానానికి నెట్టేశారన్నారు. జీవన్రెడ్డీ ఇదీ నీ బతుకు అంటూ వాఖ్యలు చేయడం గమనార్హం. నువ్వు జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఎంతమంది ఎమ్మెల్యేలను గెలిపించావు అంటూ ప్రశ్నించారు. జీవన్రెడ్డిని ఇంటరాగేట్ చేస్తే అతను చేసిన అసాంఘిక కార్యకలాపాలను కక్కేస్తాడన్నారు. భారీగా డబ్బులు సంపాదించి విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. ● దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖం చూసి నాడు బాన్సువాడలో ప్రజలు బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించారని భాస్కర్రెడ్డి అన్నారు. 2014, 2018 ఎన్నికల్లో బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్, ఏనుగు రవీందర్రెడ్డిలు కలిసి మంత్రి పదవిపై కన్నేసి పోచారం శ్రీనివాసరెడ్డిని ఓడగొట్టేందుకు కుట్రలు చేశారన్నారు. ఏనుగు రవీందర్రెడ్డి ఏ ఎండకా గొడు గు పడుతున్నాడన్నారు. ● వేముల ప్రశాంత్రెడ్డి ఉమ్మడి జిల్లా నుంచి మంత్రిగా ఉండి ఏం సాధించారంటూ ఎద్దేవా చేశారు. ప్రశాంత్ రెడ్డికి నిజామాబాద్ జిల్లాలో ఏ ఒక్క ఎమ్మెల్యే గౌరవం ఇవ్వలేదన్నారు. కా మారెడ్డి జిల్లాలోని ఎమ్మెల్యేలు మాత్రమే గౌ రవించారన్నారు. గత ఎన్నికల్లో కొద్ది తేడాతో ప్రశాంత్రెడ్డి గెలుపొందారన్నారు. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ డీసీసీబీ చైర్మన్గా ఉన్న తనను దించేందుకు చేసిన కుట్రలో భాగస్వామి అయ్యారన్నారు. ప్రశాంత్రెడ్డి, రమేష్రెడ్డికి పదవి కట్టబెట్టేందుకు తనకు వెన్నుపోటు పొడిచారన్నారు. పోచారం తండ్రిలాంటివారని చెప్పిన ప్రశాంత్రెడ్డి, మరి పోచారం కొడుకుకే వెన్నుపోటు పొడవడమేమిటన్నారు. రమేష్రెడ్డి ప్రాతిని ధ్యం వహిస్తున్న ప్రశాంత్రెడ్డి సొంత ఊరు వే ల్పూర్ సొసైటీలో అవిశ్వాసం పెట్టే అవకాశం ఉన్నప్పటికీ పెట్టలేదన్నారు. పార్టీకి సైతం వె న్నుపోటు పొడిచారన్నారు. ఇది వాస్తవం కాదా అని భాస్కర్రెడ్డి ప్రశ్నించారు. దీనిపై ఏ గుడికి వచ్చి చెప్పమన్నా చెబుతా.. బాల్కొండ నియోజకవర్గానికి రమ్మంటావా.. బాన్సువాడ నియోజకవర్గానికి వస్తావా అంటూ భాస్కర్రెడ్డి సవా ల్ చేశారు. ఈ విషయమై హరీశ్రావు, కేటీఆర్ కు చెప్పినప్పటికీ పట్టించుకోలేదన్నారు. వర్ని మండలం సిద్ధాపూర్ సమావేశంలో పోచారం భాస్కర్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్నివర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. రానున్న రోజుల్లో ఈ మాటల యు ద్ధం మరింత ముదిరే అవకాశమున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డిపై పోచారం భాస్కర్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు ప్రశాంత్రెడ్డి మంత్రిగా ఉండి పూర్తిగా విఫలమయ్యారంటూ విమర్శలు వెన్నుపోటుతో డీసీసీబీ పీఠం నుంచి తనను దించారంటూ ఆరోపణలు వైఎస్ఆర్ ముఖం చూసి బాజిరెడ్డిని గెలిపించారంటూ ఎద్దేవా.. -
చిన్నారులకు సరైన పోషణ అందించాలి
● డీడబ్ల్యూవో రసూల్ బీ ● అంగన్వాడీ టీచర్లకు ముగిసిన శిక్షణ డిచ్పల్లి: చిన్నారులకు సరైన పోషకాహారాన్ని అందించాలని, 0–5 సంవత్సరాల లోపు పిల్లల్లో ముందుగానే లోపాలను గుర్తించి తల్లిదండ్రులకు తగిన సలహాలు ఇచ్చి డాక్టర్కు రిఫర్ చేయాలని జిల్లా సంక్షేమాధికారిణి (డీడబ్ల్యూవో) రసూల్ బీ సూచించా రు. డిచ్పల్లి ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్ల కు ‘పోషణ్ బీ–పడాయి బీ’ అనే అంశంపై మూడు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు గురువారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ము ఖ్యఅతిథిగా హాజరైన డీడబ్ల్యూవో మాట్లాడుతూ 0–3 సంవత్సరాల లోపు పిల్లలకు నవచేతన ద్వారా ప్రేరణ కలిగించాలన్నారు. 3–6 సంవత్సరాల పిల్లలకు ఆథశిల ద్వారా ప్రీస్కూల్ విద్యను నేర్పించాలన్నారు. ఎత్తుకు తగ్గ బరువులో సాధారణ బరువు వచ్చే వరకు పోషకాహారం కొనసాగించాలన్నారు. దివ్యాంగ పిల్లలకు యూడీఏడీ కార్డులు ఇప్పించాలన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని మానవతసదన్లో 92, నడిపల్లి రైతువేదిక లో 94, ధర్మారం(బి) రైతువేదికలో 97 మందికి శిక్షణ నిచ్చినట్లు సీడీపీవో జ్యోతి తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు మమత, బుజ్జి, శోభ, వరలక్ష్మి, భాగ్యలక్ష్మి, రాధలక్ష్మి, సునీత, సరిత సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రక్షాళన జరిగేనా!
నిజామాబాద్ఉన్నత లక్ష్యాలను.. విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి విద్యార్థులకు సూచించారు. శుక్రవారం శ్రీ 19 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025– 8లో uనిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ, టౌన్ప్లానింగ్ విభాగాలపై ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో ప్రత్యేకాధికారి, కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. తరచూ సమీక్షలు ఏర్పాటు చేస్తూ బల్దియా అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. రెవెన్యూ పెండింగ్ ఫైళ్లను బయటికి తీయించిన ఆయన.. వివరాలను ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలోనైనా బల్దియాలో ప్రక్షాళన సాధ్యమవుతుందా అని నగరవాసులు అంటున్నారు. నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని రెవెన్యూ, టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాలపై ప్రత్యేకాధికారి, కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. కార్పొరేషన్కు నేరుగా వస్తూ తరచూ సమీక్షలు నిర్వహిస్తూ ప్రతి ఫైల్కు సంబంధించిన వివరాలు తెలుసుకుంటుండడంతో బల్దియా అధికారుల వెన్నులో వణుకుపుడుతోంది. కోర్టు పరిధిలో ఉన్న కేసుల వివరాలను సైతం తెలుసుకుంటున్నారు. కార్పొరేషన్లో తరచూ రివ్యూలు నిర్వహిస్తున్న కలెక్టర్.. పెండింగ్ ఫైళ్లన్నీ బయటికి తీయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సుమారు 2వేల వరకు ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయని గుర్తించిన కలెక్టర్.. వాటిని వెంటనే క్లియర్ చేయాలని సూచించారు. బుధవారం సైతం రివ్యూ నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ ఫైళ్లు పెండింగ్లో లేకపోవడంపై సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్.. అనుమతులు లేకుండా బిల్డింగ్ల నిర్మాణం, ఆక్రమణల ప్రోత్సాహం, టౌన్ప్లానింగ్ సూపర్వైజర్ల పనితీరుపై అదే సమయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. బల్దియా అధికారులను కలెక్టర్ పరుగులు పెట్టిస్తుండడంతో గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న రెవెన్యూ ఫైళ్లకు ఎట్టికేలకు మోక్షం లభిస్తోంది. సుమారు 2 వే ల ఫైళ్లను బయటికి తీసిన అధికారులు వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది మొత్తం గురువారం నుంచి వారం రోజులపాటు ఈ ఫైళ్ల క్లియరెన్స్ పనిలో ఉండనున్నట్లు తెలిసింది. ట్రేడ్ లైసెన్స్ల జారీలో ఇద్దరు శానిటరీ ఇన్స్పెక్టర్లు చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలున్నాయి. షాపింగ్మాల్స్, పెద్ద వ్యాపారస్తులు ట్రేడ్ లైసెన్సులు తీసుకోకుండానే వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. ఖలీల్వాడి, హైదరాబాద్ రోడ్డు వంటి ప్రధాన ప్రాంతాల్లో కార్పొరేట్ ఆస్పత్రులను ఎన్వోసీలు లేకుండానే ప్రారంభిస్తున్నారు. హైదరాబాద్ రోడ్డులో ఇటీవల కొత్తగా వెలిసిన వస్త్రదుకాణం నుంచి ఫీజుతోపాటు మరో రూ.లక్ష అదనంగా తీసుకుని అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కలెక్టర్ దీనిపై దృష్టి సారిస్తే బల్దియాకు ఆదాయం సమకూరడంతోపాటు అవినీతి అధికారుల ఆటలకు అడ్డుకట్ట పడుతుందని నగరవాసులు అంటున్నారు. రెవెన్యూ విభాగంలో కొన్ని నెలలుగా ఫైళ్లు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించాం. సరైన పత్రాలున్న వాటిని క్లియర్ చేయాలని డిప్యూటీ కమిషనర్ను ఆదేశించాం. అనుమతుల్లో సమస్యలుంటే వెంటనే దరఖాస్తుదారుకు సమాచారం ఇవ్వాలని సూచించాం. బల్దియా పాలనా వ్యవహారాలను ఎప్పటికప్పుడు ప్రత్యేకాధికారి, కలెక్టర్ నోటీసులో ఉంచుతున్నాం. – దిలీప్కుమార్, మున్సిపల్ కమిషనర్ పెండింగ్ ఫైళ్లను పరిశీలిస్తున్న రెవెన్యూ సిబ్బంది (ఫైల్) రెవెన్యూలో.. బల్దియాకు గుండెకాయ వంటి విభాగమైన రెవెన్యూ సెక్షన్లో పైసలివ్వనిదే పని కావడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితిపై పలువురు ప్రజావాణిలో సైతం ఫిర్యాదు చేశారు. అయితే కలెక్టర్ కార్పొరేషన్పై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో రెవెన్యూ సెక్షన్ ప్రక్షాళనకు కమిషనర్ దిలీప్ చర్యలు చేపట్టారు. ముందుగా రెవెన్యూ ఆఫీసర్ ఖయ్యూమ్ను ఎస్టాబ్లిష్ మెంట్ సెక్షన్కు మార్చి ఆయన స్థానంలో సీనియర్ అసిస్టెంట్ స్వప్నను ఆర్వోగా నియమించారు. అలాగే ఆర్ఐ బాధ్యతలను సీనియర్ అసిస్టెంట్ అనురాధకు అప్పగించారు. కార్పొరేషన్లో రివ్యూలు నిర్వహిస్తూ అధికారులను పరిగెత్తిస్తున్న జిల్లా కలెక్టర్ రెవెన్యూ, టౌన్ప్లానింగ్పై దృష్టి పెండింగ్ ఫైళ్లపై ఆరా బల్దియా సిబ్బందిలో వణుకు -
ఆరోగ్యకర ఆహారం కోసం..
జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు 05 అంగన్వాడీ సెంటర్లు 1501బాలింతలు 61,200గర్భిణులు 9,821చిన్నారులు 81,262నిజామాబాద్నాగారం : అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు తాజా, ఆరోగ్యకర పోషకాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో మొత్తం 1501 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 400 సెంటర్లకు సొంత భవనాలు ఉండగా.. కూరగాయల సాగు కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పోషణ్ వాటిక’ (న్యూట్రి గార్డెన్) కార్యక్రమానికి 300 సెంటర్లను ఉన్నతాధికారులు ఎంపిక చేశారు. అంగన్వాడీ కేంద్రాల ఆవరణలోని ఖాళీ స్థలాల్లో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఒక్కో సెంటర్కు రూ.10 వేల చొప్పున నిర్వహణ నిధులు అందించనున్నారు. జిల్లాకు చేరిన విత్తనాలు పోషణ్ వాటికలో భాగంగా అంగన్వాడీ సెంటర్ల ఆవరణలో కూరగాయల సాగు కోసం ఇప్పటికే జిల్లాకు విత్తనాలు సరఫరా అయ్యాయి. రూ.500 ఖరీదు చేసే విత్తన ప్యాకెట్లు జిల్లా కార్యాలయానికి రాగా300 కేంద్రాలకు పంపిణీ చేశారు. ప్యాకెట్లలో పాలకూర, వంకాయ, తోట కూర, టమాట, చిక్కుడు విత్తనాలున్నాయి. సేంద్రియ పద్ధతిలో కూరగాయాలు సాగు చేయనున్నారు. ముందుగా ప్రతి సెంటర్కు రూ.2వేలు వెచ్చించి భూమి చదును చేయించనున్నారు. ఒక్కో సెంటర్కు మొత్తం రూ.10వేల వరకు ఖర్చు చేయనున్నారు. గతంలో నెరవేరని లక్ష్యం గతంలో అంగనవాడీ కేంద్రాలకు ఆకుకూరలు, కూరగాయలను కాంట్రాక్టర్లు సరఫరా చేసేవారు. సరఫరా బాధ్యతలు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నాణ్యత లేని కూరగాయలు, ఆకుకూరలు అంటగట్టేవారు. దీంతో కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యం నెరవేరలేదు. అటు తర్వాతా అంగన్వాడీ టీచర్లే గత కొన్ని సంవత్సరాలుగా కూరగాయలు కొంటూ వంట చేయిస్తున్నారు. బిల్లులు సక్రమంగా రాకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. పోషణ్వాటిక పథకానికి జిల్లాలోని 300 కేంద్రాలను ఎంపిక చేశారు. ఐదు రకాల విత్తనాల ప్యాకెట్లను సరఫరా చేయడం జరిగింది. పథకం అమలు బాధ్యత అంగన్వాడీ టీచర్లే చూసుకోవాల్సి ఉంటుంది. స్థలాల కొరత కారణంగా కొన్ని కేంద్రాల్లో అమలు చేయడం లేదు. బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు బలవర్థక ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా పథకాన్ని పక్కాగా అమలు చేస్తాం. – రసూల్బీ, జిల్లా సంక్షేమాధికారిణి నిరాసక్తత..! పోషణ్వాటిక కింద కూరగాయలు సాగు చేయాలనే ప్రభుత్వ నిర్ణయం మంచిదే అయినా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదని కొందరు అంగన్వాడీ టీచర్లు అంటున్నారు. సెంటర్ల చుట్టూ ప్రహరీలు లేకపోవడం, పని భారం అడ్డంకిగా మారుతుందని అంటున్నారు. కూర గాయలు, ఆకుకూరల సాగుకు ఇబ్బందులు తలెత్తుతాయని, పశువులు, కోతుల బెడదతో సాగు చేసే పరిస్థితి కనిపించడం లేదని నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ సెంటర్లలో పోషణ్ వాటిక చిన్నారులు, గర్భిణులకు తాజా, నాణ్యమైన భోజనం అందించడమే లక్ష్యం జిల్లాలోని 300 కేంద్రాల్లో అమలు కేంద్రాలకు విత్తనాల పంపిణీ ఒక్కో సెంటర్కు రూ.10వేల వరకు ఖర్చు వెయ్యికిపైగా కేంద్రాల్లో స్థలాల కొరత -
కిటికీ చువ్వలు తొలగించి దొంగతనం
● 19 తులాల బంగారం.. ● రూ.10 లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీ ఎత్తుకెళ్లిన దుండగులు ● నిజామాబాద్ నగరంలో ఘటనఖలీల్వాడి: ఇంటి కిటికీ చువ్వ(గ్రిల్స్)లను స్క్రూడ్రైవర్తో తొలిగించిన దుండగులు 19 తులాల బంగారు ఆభరణాలతోపాటు రూ.10 లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని ఐదో టౌన్పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న బాబన్సాహెబ్ పహాడ్లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. బాబన్ సాహెబ్ పహాడ్కు చెందిన నిషాత్ ఆఫ్రిన్ భర్త సౌదీలో ఉంటున్నాడు. తన ఇద్దరు కుమారులతో కలిసి బుధవారం రాత్రి ఇంటికి తాళం వేసి ఆఫ్రిన్ అహ్మదీబజార్లో బంధువుల ఫంక్షన్కు వెళ్లింది. రాత్రి వేళ ఇంటి కిటికీ చువ్వలను స్క్రూడ్రైవర్తో తొలగించి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు బీరువాను ధ్వంసం చేసి అందులోని బంగారం, విదేశీ కరెన్సీని ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చిన ఆఫ్రిన్.. కిటికీ చువ్వలు తొలగించి ఉండడంతోపాటు బీరువాను గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న సీసీఎస్ ఏసీపీ నాగేంద్రచారి చోరీ జరిగిన ఇంటికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీమ్తో ఆధారాలను సేకరించారు. ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. సీసీఎస్, ఐదో టౌన్ పోలీసులు రంగంలోకి దిగి నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే స్థానికులే చోరీ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
ఇన్స్ట్రుమెంటేషన్ సెంటర్ డైరెక్టర్గా సత్యనారాయణరెడ్డి
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగాధిపతి మావురపు సత్యనారాయణ రెడ్డి ఇన్స్ట్రుమెంటేషన్ సెంటర్ డైరెక్టర్గా నియామకమయ్యారు. తెయూ వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు ఆదేశా ల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి గురువారం సత్యనారాయణరెడ్డికి నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో డైరెక్టర్గా నియమించిన వీసీ, రిజిస్ట్రార్లకు కృతజ్ఞతలు తెలిపారు. గర్ల్స్ హాస్టల్ వార్డెన్గా జ్యోత్స్న తెయూ ఇంగ్లిష్ విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎల్.జ్యోత్స్న గర్ల్స్ హాస్టల్ వార్డెన్గా నియామకమయ్యారు. వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ యాదగిరి గురువారం ఆమెకు నియాకమ ఉత్తర్వులు అందజేశారు. సుభాష్నగర్: జిల్లా పంచాయతీ కార్యాలయ పరిపాలనా అధికారి(ఏవో)గా రాజాబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్న రాజాబాబు పదోన్నతి పొందారు. డీపీవో కార్యాలయ ఏవో పోస్టు ఖాళీగా ఉండటంతో ఆయనకు జిల్లాలోనే కేటాయించారు. రాజాబాబును డీపీవో శ్రీనివాస్రావు, డీఎల్పీవోలు శ్రీనివా స్, నాగరాజు, శివకృష్ణ, ఉద్యోగులు కృష్ణ, ఆ దిత్య, నరహరి తదితరులు అభినందించారు. బాన్సువాడ: బోర్లం క్యాంపులో నిర్వహించే జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్కు సంబంధించిన వాల్పోస్టర్లను గురువారం డీఎస్పీ విఠల్రెడ్డి ఆవిష్కరించారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో వాలీబాల్ టోర్నీ కొనసాగుతుందని, జిల్లాలోని వివిధ మండలాల క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు ధరావత్ రవి తెలిపారు. మొదటి బహుమతి రూ.20 వేలు, ద్వితీయ బహుమతి రూ.10 వేల నగదుతో పాటు మెమోంటోలు అందజేస్తామని వారు తెలిపారు. -
అంతర్రాష్ట్ర వంతెన పైనుంచి రాకపోకల నిలిపివేత
అంతర్రాష్ట్ర వంతెన సమీపంలో రోడ్డుకు అడ్డంగా డ్రమ్ములు, బారికేడ్లురెంజల్(బోధన్) : మహారాష్ట్రలోని విష్ణుపురి, గైక్వాడ్ ప్రాజెక్టులతోపాటు కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తుండడంతో గోదావరి, మంజీర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కందకుర్తి త్రివేణి సంగమంలో వరద పోటెత్తుతోంది. అంతర్రాష్ట్ర వంతెనను ఆనుకుని నీరు ప్రవహిస్తుండడంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు. గోదావరి నది పరీవాహక గ్రామాల్లో దండోరా వేయించారు. ప్రజలు, రైతులు, బర్ల, గోర్ల కాపరులు నది ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తహసీల్దార్ శ్రావణ్కుమార్, ఎస్సై చంద్రమోహన్ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నా రు. పుష్కరక్షేత్రంలోని సీతారాం త్యాగి ఆశ్రమం నుంచి సీతారాం త్యాగి మహరాజ్తోపాటు ఆయ న శిష్యులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. -
వరద కాలువలో వృద్ధురాలి మృతదేహం
● మోర్తాడ్ మండల నివాసిగా గుర్తింపు మల్యాల: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని నూకపల్లి శివారు వరద కాలువలో ఓ వృద్ధురాలి మృతదేహం కొట్టుకొచ్చింది. మృతదేహం మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన ప్రభావతిగా మల్యాల పోలీసులు గుర్తించారు. ఎస్సై నరేశ్కుమార్ కథనం ప్రకారం.. కామణి ప్రభావతి (66) కొంతకాలంగా మతిస్థిమితం లేక బాధపడుతోంది. ఈ నెల 16న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. బంధువులు మోర్తాడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కుమారుడు శ్రీనివాస్ వెతుకుతున్నాడు. వరద కాలువలో శవం కొట్టుకురావడంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. శ్రీనివాస్ను పిలిపించగా తన తల్లిగా గుర్తించాడు. కేసు నమోదు చేసినట్లు మల్యాల పోలీసులు తెలిపారు. మిలిటరీ మద్యం అమ్మొద్దు.. కొనొద్దు మాచారెడ్డి: మిలిటరీ మద్యాన్ని అమ్మినా, కొనుగోలు చేసినా నేరమేనని కామారెడ్డి ఎకై ్సజ్ సీఐ సంపత్ కృష్ణ అన్నారు. గురువారం పాల్వంచ మండలం ఆరేపల్లిలో ఒకరి ఇంట్లో నిల్వ చేసిన మిలిటరీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యం నిల్వ చేసిన సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. ఈ దాడిలో ఎస్సైలు విక్రమ్, శ్రీనివాసరావు, సిబ్బంది పాషా, మైస రాజు, దేవాకుమార్ పాల్గొన్నారు. -
గొడవపడ్డ నలుగురికి రూ.20 వేల జరిమానా
ఎల్లారెడ్డి: ఇంటి విషయంలో గొడవపడిన నలుగురికి రూ.20 వేల జరిమానా విధిస్తూ ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి సుష్మ తీర్పు ఇచ్చినట్లు పోలీసులు గురువారం తెలిపారు. 2019లో నీల సిద్దిరాములు అనే వ్యక్తితో ఇంటి విషయంలో దండు నర్సింలు, దండు శివరాములు, దండు అంజయ్య, దండు గణేశ్ల మధ్య ఘర్షణ జరిగింది. ఘటనపై నీల సిద్దిరాములు ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై మోహన్ కేసు నమోదు చేసి చార్జ్షీట్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా కోర్టు కానిస్టేబుల్ వినోద్ కుమార్ చాకచక్యంగా వ్యవహరించి సాక్షులను సమయానికి హాజరుపర్చారు. సాక్ష్యాలు, వాదనలు విన్న అనంతరం, న్యాయమూర్తి నిందితులు ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు తెలిపారు. దీంతో నిందితులు జరిమానా మొత్తాన్ని చెల్లించారు. బోధన్: ఎడపల్లి మండలంలోని ఎమ్మెస్సీ ఫారం వద్ద బోధన్–నిజామాబాద్ ప్రధాన రోడ్లో గురువారం గ్యాస్ సిలిండర్ లోడ్తో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆటో బోల్తా పడింది. ఘటనలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆర్టీసీ బస్సును ఎడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకురావాలి
సుభాష్నగర్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నష్టాల్లో ఉన్న డీసీసీబీ శాఖలను లాభాల్లోకి తీసుకొచ్చేలా కృషి చేయాలని ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి అన్నారు. నగరంలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయా బ్రాంచీల అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. బ్యాంకు వ్యాపార కార్యకలాపాలు రూ.2400 కోట్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రమేశ్రెడ్డి మాట్లాడుతూ.. రూ.2400 కోట్లలో రూ.787 కోట్లు డిపాజిట్లు, రూ.1613 కోట్ల రుణాలు ఉన్నాయని వివరించారు. ప్రతి ఉద్యోగి లక్ష్యాన్ని నిర్దేశించుకుని నిబద్ధతతో పని చేయడంతో ఈ ఘనత సాధ్యమైందన్నారు. నష్టాల్లో ఉన్న శాఖలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ క్షేత్రస్థాయిలో శాఖాధికారులకు దిశానిర్దేశం చేస్తున్న సీఈవో నాగభూషణం వందే, ఇతర ఉన్నతాధికారులను చైర్మన్ ప్రత్యేకంగా అభినందించారు. డీజీఎంలు లింబాద్రి, అనుపమ, సుమమాల, గజానంద్, ఉన్నతాధికారులు, 63 బ్రాంచీల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వర్ని: విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను ప్రతి వి ద్యార్థి నిర్దేశించుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మోస్రా మండలంలోని చింతకుంట ప్రాథమికోన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని, ఏకాగ్రతతో ముందుకు సాగి తే ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చని సూ చించారు. అంకిత భావం, పట్టుదల, క్రమశిక్షణతో కృషి చేస్తే ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించుకోవచ్చున ని దిశానిర్దేశం చేశారు. చదువులో ఎలా రాణించాలి, పరీక్షల్లో ఎలా విజయం సాధించాలి, లక్ష్యానికి అనుకూలంగా సిలబస్ను ఏవిధంగా సకాలంలో పూర్తి చేయాలి, జీవితంలో ఉన్నత స్థితికి ఎదగడానికి ఏం చేయాలన్న దానిపై విద్యార్థులకు సలహాలు సూచనలు అందజేశారు. అంతకుముందు పాఠశాల, అంగన్వాడీల్లో మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని తెలుసుకున్నారు. మెనూ తప్పకుండా పాటించాలని ప్రధానోపాధ్యాయుడిని ఆదేశించారు. ప్రైమరీ పాఠశాలలో టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలని ఎంపీడీవోను ఆదేశించారు. -
శిక్షణ పూర్తి చేసుకొని స్వయం ఉపాధి పొందాలి
● ఎస్బీఐ ఏజీఎం రంజిత్కుమార్ నాయుడు డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్ధ (ఆర్ఎస్ఈటీఐ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పొందాలని ఎస్బీఐ ఏజీఎం (ఏవో, నిజామాబాద్) రంజిత్కుమార్ నాయుడు సూచించారు. డిచ్పల్లి ఆర్ఎస్ఈటీఐను గురువారం ఆయన సందర్శించారు. మగ్గం వర్క్, టైలరింగ్, బ్యూటీ పార్లర్ కోర్సుల్లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో మగ్గం వర్క్, టైలరింగ్, బ్యూటీపార్లర్లకు మంచి డిమాండ్ ఉందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు తమ గ్రామాలకు వెళ్లిన తర్వాత స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా కుటుంబానికి ఆసరాగా నిలబడాలని సూచించారు. ఆర్ఎస్ఈటీఐ ద్వారా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలోని గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఈటీఐ డైరెక్టర్ రవికుమార్, ఎస్ఐబీ చీఫ్ మేనేజర్ రవికుమార్, సంస్థ సిబ్బంది రామకృష్ణ, నవీన్, భాగ్యలక్ష్మి, లక్ష్మణ్, గెస్ట్ ఫ్యాకల్టీ ఫరీదా, సుజాత తదితరులు పాల్గొన్నారు. -
అనుకూల సమయాల్లో పంటలు విక్రయించుకోవాలి
● ఐసీఎం హైదరాబాద్ ఉపసంచాలకుడు డా.ఎస్ శ్యాంకుమార్ నిజామాబాద్ రూరల్: రైతులు పండించిన పంటలను గోదాముల్లో భద్రపరచి, అనుకూల సమయంలో మార్కెట్లో విక్రయించడం ద్వారా మెరుగైన ఆదాయం పొందవచ్చునని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్ (ఐసీఎం) హైదరాబాద్ ఉప సంచాలకుడు డా.ఎస్ శ్యాంకుమార్ పేర్కొన్నా రు. మాధవనగర్లో గురువారం గిడ్డంగుల అభివృద్ధి, నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో రైతులు, వ్యాపారులు, మిల్లర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీఎం మాట్లాడుతూ వేర్హౌస్ రసీదుల ఆధారంగా రైతులు బ్యాంకుల నుంచి రుణ సౌకర్యాన్ని పొందవచ్చని తెలిపారు. అనంతరం రైతులను నిజామాబాద్ ఏఎంసీ, శ్రద్ధానంద్గంజ్కు తీసుకెళ్లి గోదాం సదుపాయాలు, నిల్వ విధానాలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి ఎన్ శ్రీనివాసరావు, సహాయక రిజిస్ట్రార్ సరస్వతి, సీనియర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పీఏసీఎస్ మాధవనగర్ అధ్యక్షుడు దాసరి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు పోతరెడ్డి, డైరెక్టర్లు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
మద్యం తాగొద్దన్నందుకు ఆత్మహత్య ఖలీల్వాడి: అతిగా మద్యం సేవించొద్దని భార్య మందలించినందుకు మనస్తాపం చెంది భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ రైల్వే పోలీస్స్టేషన్ పరిధి లో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్సై సాయిరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అర్సపల్లిలోని భగత్సింగ్ కాలనీకి చెందిన ఎనుగందులు మహేశ్(33) నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో లేబర్గా పనిచేసేవాడు. కొంతకాలం నుంచి మహేశ్ మద్యానికి బానిస కావడంతో భార్య తాగు డు మానుకోవాలని మందలించింది. దీంతో మనస్తాపం చెందిన మహేశ్ బుధవారం అర్ధరాత్రి నిజామాబాద్–జానకంపేట్ రైల్వేస్టేషన్ల మధ్య రైలు రాకను గమనించి అడ్డుగా వెళ్లడంతో రైలు ఢీకొని అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎల్లారెడ్డి: మండలంలోని కళ్యాణి గ్రామానికి చెందిన బండారి సాయిలు (42) మద్యానికి బానిసై జీవితంపై విరక్తితో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పా ల్పడినట్లు ఎల్లారెడ్డి ఎస్సై–2 సుబ్రహ్మణ్యచారి గురువారం తెలిపారు. మద్యానికి బానిసైన సాయిలు కుటుంబంలో బుధవారం రాత్రి గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన సాయిలు గురువారం వేకువజామున బహిర్భూమికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లాడు. గ్రామ శివారులోని తన పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. కాకతీయ కాలువలో పడి యువకుడు.. బాల్కొండ: మెండోరా మండలం పోచంపాడ్కు చెందిన షేక్ అస్గర్(42) ప్రమాదవశాత్తు కాకతీయ కాలువలో పడి బుధవారం మృతి చెందాడు. ఎస్సై సుహాసిని తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ అస్గర్ బుధవారం సాయంత్రం కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం కాకతీయ కాలువలో దిగాడు. ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతయ్యాడు. గమనించిన స్థానికులు కాలువలో గాలింపుచర్యల చేపట్టగా గల్లంతైన చోటే మృతదేహాం లభ్యమైంది. కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం కోసం ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. బాన్సువాడ : పట్టణంలోని కల్కి చెరువులో గుర్తుతెలియని మహిళ (45– 50) మృతదేహం గురువారం లభ్యమైంది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జాలర్ల సహాయంతో మహిళ మృతదేహాన్ని బయటకి తీశారు. మెరూన్ కలర్ చీర, ఆకుపచ్చని జాకెట్ ధరించి ఉందని, గుర్తు పట్టనంతగా మృతదేహం ఉబ్బిందని సీఐ అశోక్ తెలిపారు. వివరాలకు 8712686167ను సంప్రదించాలని సూచించారు. -
కేసుల విచారణ త్వరగా పూర్తిచేయాలి
ఖలీల్వాడి: పోక్సో, గ్రేవ్ కేసుల్లో విచారణ త్వరితగతిన పూర్తిచేయాలని సీపీ పోతరాజు సాయిచైతన్య అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని క మాండ్ కంట్రోల్ హాల్లో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్ల అధికారులతో నెలవారీ సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులలో పూర్తి పారదర్శకంగా విచారణ చేయాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ, ప్ర జలకు అందుబాటులో ఉంటూ సమర్ధవంతమైన సేవలు అందజేయాలని సూచించారు. గ్రామ పో లీస్ అధికారులు ప్రతి రోజు గ్రామాన్ని సందర్శించి, ప్రజలతో మమేకమవుతూ నేర నియంత్రణకు కృషి చేయాలని పేర్కొన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గ్రామాలలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వినియోగంపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. బ్లాక్ స్పాట్లను గుర్తించాలి ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలలో బ్లాక్ స్పాట్లుగా గుర్తించి సైన్ బోర్డులను ఏర్పాటు చేయించాలని సీపీ సాయిచైతన్య సూచించారు. హైవే రోడ్లను కలుపుతూ ఉండే లింక్ రోడ్లకు స్పీడ్ బ్రేకర్స్ వేయించడం, రోడ్డుకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించాలని తెలిపారు. నేషనల్ హైవే, స్టేట్ హైవే అథారిటీ ఇతర సంబంధిత అధికారుల సమన్వయంతో ప్రమాదాల నివారణకు కృషి చేయాలని చెప్పారు. ప్రతిరోజు పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. దొంగతనాలు జరగకుండా పాతనేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి, మాదకద్రవ్యాల సరఫరా, క్రయవిక్రయాలు, జూదం, రేషన్ బియ్యం అక్రమరవాణా లాంటి వా టిపై ఉక్కుపాదం మోపాలన్నారు. తరచూ ఇలాంటి నేరా లకు పాల్పడేవారిపై పీడీ యాక్టు కోసం పంపాలని ఆదేశాలు జారీచేశారు. సమీక్షలో డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు రాజావెంకట్ రెడ్డి, జె. వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీశైలం ఉన్నారు. సిబ్బందికి ప్రశంసాపత్రాలు వినాయక చవితి, మిలాద్–ఉన్–నబీ పండుగలను శాంతియుతంగా నిర్వహించిన అధికారులు, సిబ్బందికి సీపీ సాయిచైతన్య అభినందనలు తెలిపా రు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన పలు వురికి ప్రశంసా పత్రాలను అందజేశారు. వచ్చే దేవీ నవరాత్రి ఉత్సవాలు, దీపావళి పండుగలను ప్రజలందరూ శాంతియుతంగా నిర్వహించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి నెలవారీ సమీక్షా సమావేశంలో సీపీ సాయిచైతన్య -
తాళం వేసిన ఇంట్లో పట్టపగలే చోరీ
బోధన్: ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి గ్రామంలో బుధవారం పట్టపగలే తాళం వేసిన ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ తెలిపిన ప్రకారం.. కుర్నాపల్లి గ్రామానికి చెందిన తులసిగారి నరేందర్ తన సతీమణితో కలిసి అత్తగారి గ్రామం మెంట్రాజ్పల్లికి వెళ్లారు. సాయంత్రం తన బంధువు ఫోన్ చేసి ఇంటి తాళం పగుల గొట్టబడి ఉందని తెలపడంతో వెంటనే స్వగ్రామానికి వచ్చారు. దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న రెండున్నర తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణాలు, రూ.15 వేలు నగదు దోచుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఘటనా స్థలాన్ని బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్బాబు, ఎస్సై రమ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమ తెలిపారు. -
లక్షల క్యూసెక్కుల వరద
● ఓ దశలో 3లక్షల క్యూసెక్కులు దాటి.. ● ఎస్సారెస్పీలోకి పోటెత్తిన ఇన్ఫ్లో ● 39 గేట్ల ద్వారా గోదావరిలోకి 1.85 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల ఎస్సారెస్పీలో ప్రస్తుత నీటి మట్టంబాల్కొండ: మహారాష్ట్రతోపాటు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 2 లక్షల 15 వేల క్యూసెక్కులుగా కొనసాగిన ఇన్ఫ్లో రాత్రికి లక్షా 92 వేలకు తగ్గింది. గురువారం ఉదయం 6 గంటలకు 2 లక్షల 48 వేల క్యూసెక్కులకు పెరిగింది. క్రమంగా పెరిగిన ఇన్ఫ్లో మధ్యాహ్నం సమయానికి 3 లక్షల 10 వేల క్యూసెక్కులకు చేరి సాయంత్రం వరకు అదే స్థాయిలో కొనసాగింది. రాత్రి సమయానికి 2.75లక్షలకు తగ్గింది. 39 వరద గేట్ల ద్వారా లక్షా 85 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ నీటిమట్టాన్ని అధికారులు భారీగా తగ్గించారు. వరద కాలువ ద్వారా 6,500 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 4 వేలు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4 వేలు, సరస్వతి కాలువ ద్వారా 400, లక్ష్మి కాలువ ద్వారా 200, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.701 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతోంది. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం
● బోధన్లో ఘటన.. బయటే వేచి ఉన్న సబ్ రిజిస్ట్రార్ ● 36 నెలలుగా అద్దె చెల్లించని వైనం ● ఉన్నతాధికారుల జోక్యంతో శాంతించిన యజమానులు బోధన్టౌన్(బోధన్): భవనం అద్దె 36 నెలలుగా చె ల్లించకపోవడంతో యజమానులు గురువారం బో ధన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం వేశారు. కార్యాలయానికి తాళం వేయడంతో చేసేది లేక సబ్ రిజిస్ట్రార్తోపాటు సిబ్బంది బయటే నిలబడ్డారు. రి జిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుని వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం అద్దె నెలకు రూ. 74 వేలు కాగా.. 36 నెలలకు సంబంధించి యజమానులకు రూ.26,64,000 చెల్లించా ల్సి ఉంది. అద్దె చెల్లించాలని యజమానులు పలుమార్లు అడిగినా స్పందించకపోవడంతో గురువా రం కార్యాలయానికి తాళం వేశారు. యజమానులు ఈ నెల 8వ తేదీన సబ్ రిజిస్ట్రార్కు నోటీసు సైతం అందించారు. ఈ ఘటనపై సబ్ రిజిస్ట్రార్ సాయిబాబాను వివరణ కోరగా.. అద్దె చెల్లించాల్సిన విష యం వాస్తవమేనని, ఉన్నతాధికారులకు వివరించామన్నారు. జిల్లా ఉన్నతాధికారులు భవన యజమానులతో మాట్లాడి అద్దె బకాయి చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో చివరకు తాళం తీశారు. దీంతో యథావిధిగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింది. -
బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో యూరియా కొరత రోజురోజుకూ తీవ్రమవుతోందని, దీనికి బా ధ్యత వహిస్తూ కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని మాజీ మంత్రి, బా ల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. రైతాంగానికి సరిపడా యూరియాను తె ప్పించలేని బీజేపీ ఎంపీలు ఎందుకని ప్రశ్నించారు. వేల్పూర్లో బుధవారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. నెల రోజుల నుంచి బీఆర్ఎస్ తరఫున అన్ని వేదికల నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా మన్నారు. మళ్లీ చెప్పులు, పాస్బుక్కులు లైన్లలో పెట్టే దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కోసం రైతులు నిద్రాహారాలు మాని కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తుంటే.. అర్వింద్ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ వద్ద పలుకుబడి ఉందని చెప్పుకునే ఆయన.. యూరియా కొరతపై ఎందుకు నోరుమెదపడం లేదన్నారు. వెంటనే ప్రధానితో మాట్లాడి యూరియా తెప్పించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీని నిలదీసే ధైర్యం కాంగ్రెస్ ఎంపీలకు ఎందుకు లేదన్న ప్రశాంత్రెడ్డి.. బడే భాయ్ కు కోపం వస్తుందా? ఆయనకు కోపం వస్తే.. చోటేభాయ్కు జైలు శిక్ష పడుతుందా అని ఎద్దేవా చే శారు. ఢిల్లీకి మూటలు పంపడంపై ఉన్న ధ్యాస.. రైతులపై కాంగ్రెస్కు లేదని విమర్శించారు. యూరియా ఎటువెళ్లింది.. జిల్లాకు 75వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే 72వేల మెట్రిక్ టన్నులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారని, మరి వచ్చిన యూరియా ఎటు వెళ్లిందన్నారు. కాంగ్రెస్ నేతలు బ్లాక్ మార్కెట్కు తరలించారా అని ఆరోపించారు. యూరియా సరిపడా సరఫరా చేసే సత్తా లేక.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు అవగాహన లేక రైతులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో రైతులు యూరియా కోసం లైన్ కట్టే పరిస్థితి రాలేదని, ముందు చూపుతో వ్యవహరించి సరిపడా తెప్పించారని గుర్తుచేశారు. పోలీస్స్టేషన్లో టోకెన్లు పంపిణీ చేసే పరిస్థితి ఎప్పుడైనా ఉందా..? అని ప్రశ్నించారు. యూరియా బస్తా ఇవ్వలేని అసమర్థ కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలన్నారు. వెంటనే మంత్రులు బృందాన్ని పంపించి యూరియా సరిపడా అందుబాటులో ఉంచాలని ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. యూరియా ఇప్పించలేని కేంద్రమంత్రులు, పార్లమెంట్ సభ్యులు ఎందుకు? అర్వింద్కు పలుకుబడి ఉంటే యూరియా తెప్పించాలి మళ్లీ చెప్పులు, పాస్బుక్లు లైన్లో పెట్టే దౌర్భాగ్యం కేసీఆర్ ముందుచూపుతో గతంలో యూరియా కొరత రాలేదు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి -
బైక్ అదుపు తప్పి మామ, కోడలు మృతి
మాక్లూర్ /నందిపేట్ (ఆర్మూర్): బైక్ అదుపు త ప్పిన ఘటనలో మామ, కోడలు మృతి చెందారు. ఈ ఘటన మాక్లూర్ మండలం దుర్గానగర్ శివారు లో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. నందిపేట మండలం తల్వేదకు చెందిన చింటు కు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొజన్కొత్తూర్కు చెందిన పూజ(25)తో 10 నెలల క్రిత మే వివాహం జరిగింది. బీటెక్ చదివిన పూజ పెళ్లికి ముందు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేది. పెళ్లి సమయంలో ఉద్యోగం మానేసిన ఆమె మళ్లీ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. ఇందులో భాగంగానే ఇంటర్వ్యూ కోసమని హైదరాబాద్కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై తమను నిజామాబాద్ రైల్వే స్టేషన్ వద్ద వదిలేసి రావాలని తండ్రి నారాయణ (58)ను చింటు కోరాడు. ముగ్గురూ కలిసి బైక్పై బయల్దేరారు. చింటు డ్రైవ్ చేస్తుండగా దుర్గానగర్ శివారులో బైక్ అదుపు తప్పి కిందపడిపోయారు. నారాయణ తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాలపాలైన పూజతోపాటు చింటును అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉదయం 10 గంటల సమయంలో పూజ మృతి చెందింది. మామ కోడలు మృతితో తల్వేదలో విషాదచాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఘటనా స్థలాన్ని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ పరిశీలించారు. -
పేదలకు సన్న బియ్యం
‘సన్న బియ్యం’ పంపిణీ ద్వారా ప్రజలకు మరింత మేలు చేస్తున్నామని, రూ.13 వేల కోట్ల వ్యయంతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది జూలై 14 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించామన్నారు. మహా లక్ష్మి పథకం ద్వారా రూ.500 లకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను ఇస్తున్నామన్నారు. జిల్లాలో ఈ పథకం కింద 2,19,330 గ్యాస్ వినియోగదారులకు, 10,19,994 సిలిండర్లకు సబ్సిడీ విడుదలకు రూ.30.73 కోట్లు ఖర్చు చేశామన్నారు. ● సన్న ధాన్యం రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కింద 29 లక్షల పంపు సెట్లకు ఉచిత కరెంట్ సరఫరా చేస్తున్నామన్నారు. ఇందుకు గాను రూ.16,691 కోట్ల సబ్సిడీని విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నామన్నారు. జిల్లాలో 2024–25 వానాకాలం సీజన్లో 4,91,497 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 78,488 మంది రైతుల నుంచి కొనుగోలు చేసి రూ.1,140 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. యాసంగి సీజన్లో 8,40,279 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 1,16,000 రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి రూ.1,949 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఖరీఫ్, రబీ సీజన్లలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. -
అభివృద్ధి, సంక్షేమ ఫలాలు
అన్నివర్గాలకు వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. వాతావరణంలో తేమ అధికంగా ఉంటుంది. అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయి.త్వరలో జీవాలకు.. రెండేళ్ల క్రితం నిలిచిపోయిన జీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ త్వరలో ప్రారంభం కాబోతోంది. – 8లో uమహిళల ఆరోగ్య సంరక్షణే లక్ష్యం నిజామాబాద్నాగారం: మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణే తమ లక్ష్యమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణగుప్తా అన్నారు. స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం వర్చుల్గా ప్రారంభించగా, కలెక్టరేట్ నుంచి బుధవారం ఎమ్మెల్యే వీక్షించారు. అనంతరం దుబ్బ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారు లతో కలిసి స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ మెగా ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగుతుందని, జిల్లా వ్యాప్తంగా దాదాపు 40 కేంద్రాల్లో వైద్యారోగ్య అధికారులు మహిళలకు సేవలందిస్తారన్నారు. కరోలిన్ చింగ్తియాన్ మావీకి ఎమ్మెల్యే స్వస్త్ నారీ సశక్త్ సర్టిఫికెట్ను అందజేశారు. డీఎంహెచ్వో రాజశ్రీ, జీజీహెచ్ సూపరిండెంట్ శ్రీనివాస్, డిప్యూ టీ డీఎంహెచ్వో అంజన, డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, వైద్యురాలు సుశానా, తాజా మాజీ కార్పొరేటర్ పంచరెడ్డి ప్రవళిక, శ్రీధర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కమీషన్లను ప్రోత్సహించొద్దు నిజామాబాద్నాగారం: రోగులను రిఫర్ చేసే ఆర్ఎంపీ, పీఎంపీలకు కొన్ని ప్రైవేట్ ఆస్పత్రు లు కమీషన్లు ఇస్తున్న ట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్వో రాజశ్రీ హెచ్చరించారు. స్కానింగ్, ఆస్పత్రుల్లో రిఫరల్ దందాలపై ఇటీవల ‘సాక్షి’లో కథనాలు ప్రచురితం కావడంతో డీఎంహెచ్వో బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కమీషన్లను ప్రోత్సహించే ఆస్పత్రుల యాజమాన్యాలతోపాటు ప్రాక్టిషనర్లపై చర్యలుంటాయని హెచ్చరించారు. కమీషన్ దందాపై ఆధారాలతో సహా తమ దృష్టికి తీసుకురావాలని, ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు. ఈ మేరకు ఓ నిఘా బృందాన్ని సైతం నియమించినట్లు తెలిపారు. లింగాపూర్ మత్స్య సొసైటీ రద్దుకు నోటీసు డొంకేశ్వర్(ఆర్మూర్): కోటగిరి మండలం లింగాపూర్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం రద్దుకు జిల్లా మత్స్య శాఖ అధికారి నోటీసు జారీ చేశారు. సొసైటీలో 40 మంది సభ్యులు ఉండగా అందరూ ఇతర కులస్తులకు చెందిన వారు ఉన్నట్లుగా గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న సొసైటీకి నోటీసు జారీ చేశారు.సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాపాలన చేస్తున్నట్లు, ముఖ్యమంత్రి సలహాదారు (ప్రజావ్యవహారాలు) వేం నరేందర్రెడ్డి పేర్కొన్నారు. ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిజామాబాద్ కలెక్టరేట్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తన ప్రసంగంలో నరేందర్ రెడ్డి జిల్లా ప్రగతి నివేదికను వివరించారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపారు. 1948 సెప్టె ంబర్ 17న హైదరాబాద్ సంస్థానం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం రేవంత్రెడ్డి ప్రభుత్వం గాంధీజీ కలులుగన్న గ్రామస్వరాజ్యం దిశగా వెళుతూనే, అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడంలో స్వర్గధామంగా పేరు తెచ్చుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందన్నారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. గ్రామస్థాయిలో, పట్టణాల్లో వార్డు స్థాయిలో సదస్సులు నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరించేందుకు ‘ప్రజాపాలన’ పేరిట కార్యక్రమం తీసుకొచ్చామన్నారు. రైతులకు రూ.755.29 కోట్ల రుణమాఫీ రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగరాసి అన్నదాతల సంక్షేమానికి 1.13 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇక గత ఏడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలో 25.35 లక్షల మంది రైతులకు రూ.20,616 కోట్ల రుణమాఫీ చేసి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా చరిత్ర సృష్టించామన్నారు. జిల్లాలో ఇప్ప టి వరకు 97,696 మంది రైతులకు 755.29 కోట్ల రుణమాఫీ అయిందన్నారు. ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం ఇస్తున్నామన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈ వానాకాలం సీజనులో ఇప్పటి వరకు 2,72,589 మంది రైతుల బ్యాంకు ఖాతాలలో రూ.316 కోట్లు జమ చేశామన్నారు. ● కీలక సంస్కరణల్లో ఒకటిగా భూభారతి చట్టం నిలిచిందన్నారు. దీని ద్వారా భూపరిపాలనలో పారదర్శకత, భద్రత, ప్రజలకు సులభమైన సేవలు అందించే దిశగా ముందడుగు వేశామన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇంటి స్థలం ఉన్న వారు, ఇల్లు లేని వారు, అద్దె ఇళ్లల్లో నివాసం ఉన్న వారికి అర్హత ప్రకారం ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం ఇస్తున్నామన్నారు. తొలివిడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఇందుకు రూ.22,500 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. గ్రీన్ ఛానెల్లో నిధులు విడుదల చేస్తున్నామన్నారు. జిల్లాలో 19,397 ఇందిరమ్మ ఇళ్లు లక్ష్యం కాగా, 18,155 ఇళ్లు మంజూరు అయ్యాయన్నారు. ● గృహ జ్యోతి పథకం ద్వారా మార్చి 2024 నుంచి జూలై 2025 వరకు ప్రతి నెల 2,67,707 మంది వినియోగదారులకు ‘జీరో’ బిల్లులు మంజూరు చేశామన్నారు. ఇందుకు గాను రూ.174.90 కోట్లు విడుదల చేశామన్నారు. ● అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద 760 పాఠశాలల్లో అత్యవసర మరమ్మతు పనులు చేశామన్నారు. ఇందుకు గాను జిల్లాలో ఇప్పటివరకు రూ.22.20 కోట్లు వెచ్చించామన్నారు. మరోవైపు ధర్పల్లి, ఇందల్వాయి, మెండోర, రుద్రూర్, మోపాల్ మండలాల్లో కేజీబీవీల్లో ఇంటర్ విద్యను ప్రవేశపెట్టామన్నారు. ● జిల్లాలో కళ్యాణలక్ష్మి ద్వారా 2025–26లో 1,080 మంది లబ్ధిదారులకు రూ.10.81 కోట్లు అందించామన్నారు. షాదీ ముబారక్ ద్వారా 672 మందికి రూ.6.72 కోట్లు ఇచ్చామన్నారు. ● కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, కలెక్టర్ టి వినయ్ కష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.నవీపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల సాంస్కృతిక ప్రదర్శనసిద్ధార్థ కళాక్షేత్రం ఆధ్వర్యంలో భరతనాట్య ప్రదర్శన ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాపాలన కీలక సంస్కరణగా నిలిచిన భూభారతి చట్టం ధాన్యం బోనస్, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి పథకాలతో రైతులు, మహిళలకు మరింత మేలు ధాన్యం సేకరణలో ప్రథమ స్థానంలో నిలిచిన జిల్లా ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి -
ఎస్సారెస్పీలోకి భారీ వరద
● 1.92 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ● 38 గేట్ల ద్వారా 2.82 లక్షల అవుట్ ఫ్లోబాల్కొండ: ఎగువ నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి లక్షా 92వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. మంగళవారం సాయంత్రానికి లక్షా 67 వేల క్యూసెక్కులకు తగ్గిన వరద.. బుధవారం ఉదయం 7 గంటల నుంచి క్రమంగా పెరిగింది. ఉదయం 10 గంటలకు 2 లక్షల 15 వేల క్యూసెక్కులకు చేరింది. బుధవారం సాయంత్రం వరకు ఇన్ఫ్లో నిలకడగా ఉండగా రాత్రి సమయానికి లక్షా 92వేలకు తగ్గింది. 38 వరద గేట్ల ద్వారా 2 లక్షల 82 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. వరద కాలువ ద్వారా 6500 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 4 వేలు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4 వే లు, సరస్వతి కాలువ ద్వారా 400, లక్ష్మి కాలువ ద్వారా 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నా రు. మిషన్ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తుండగా ఆవిరి రూపంలో 701 క్యూసెక్కులు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా బుధవారం రాత్రి సమయానికి 1087.06(68.04 టీఎంసీలు) అడుగులు నీరు నిల్వ ఉంది. -
రక్తదానంతో మేలు
● వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు తెయూ(డిచ్పల్లి): రక్తదానం చేయడమంటే ప్రాణదానమేనని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీ.యాదగిరిరావు అన్నారు. రక్తదాన్ అమృత్ మహోత్సవ్ 2.0 కార్యక్రమంలో భాగంగా బుధవారం తెయూలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ కే.రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ సంవత్సరంలో కనీసం మూడుసార్లు రక్తదానం చేయాలని సూచించారు. దీంతో తలసేమియా వ్యాధితోపాటు అత్యవసర చికిత్సలు అవసరమున్న వారికి ఎంతో మేలు చేసినట్లవుతుందన్నారు. రక్తదాన కార్యక్రమాలతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి అన్నారు. వర్సిటీ విద్యార్థులతోపాటు జీజీ కాలేజ్, ఎస్ఎస్ఆర్, వాగ్ధేవి (నిజామాబాద్), ఆర్కే డిగ్రీ కాలేజ్ (కామారెడ్డి), తెలంగాణ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ జిల్లా అధ్యక్షుడు బుస్స ఆంజనేయులు, పీఆర్వో పున్నయ్య, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు స్వప్న, స్రవంతి, అలీమ్ఖాన్, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా
నిజామాబాద్నాగారం: దివ్యాంగుల సమస్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడి పరిష్కారానికి కృషిచేస్తానని విశ్రాంత ఐఏఎస్ అధికారి డి చక్రపాణి అన్నారు. బుధవారం నగరంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్లో నిర్వహిస్తున్న దివ్యాంగుల పాఠశాల ను విశ్రాంత ఐఏఎస్ అధికారి డి చక్రపాణి సందర్శించి మాట్లాడారు. జిల్లా కేంద్రంలో 33 ఏళ్ల క్రితం కలెక్టర్గా పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. అనంతరం టీఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతు, సైనికుడిని సన్మానించా రు. కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి సి ద్ధయ్య, ప్రిన్సిపాల్జ్యోతి, మానసిక పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, రమణస్వామి, టీఎన్ఆర్ ఫౌండేషన్ అశోక్ కుమార్, జిల్లా సైనిక వెల్ఫేర్ అధ్యక్షుడు హరప్రసాద్ పాల్గొన్నారు.ప్రోత్సాహకాలు అందజేత మోపాల్: నగరశివారులోని బోర్గాం(పి)లో ఎన్డీసీసీబీ వైస్ చైర్మన్, సొసైటీ చైర్మన్ నల్ల చంద్రశేఖర్రెడ్డి తల్లి నల్ల మంగమ్మ మృతిచెందడంతో వారి కుటుంబాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్ గౌడ్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, బాడ్సి సొసైటీ చైర్మన్ మోహన్రెడ్డి, మోపాల్ మండల అధ్యక్షుడు ఎల్లోల్ల సాయిరెడ్డి, అశోక్ తదితరులు ఉన్నారు.విద్యార్థులకు జామెట్రీ బాక్సులు అందజేతనిజామాబాద్ రూరల్: శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం జెడ్పీహెచ్ఎస్ కాలూర్ పాఠశాల విద్యార్థులకు 80 జామెట్రీ బాక్సులు, 150 పెన్నులను అందజేశారు. వి ద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు తెలిపారు. సంస్థ ప్రతినిధులు రామ్ మోహన్, శ్రీనివాస్, రాజశేఖర్, బాలశేఖర్, ఇన్చార్జి హెచ్ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.ధర్పల్లి: మండలంలోని దుబ్బాక ఉన్నత పాఠశాలలో 9, 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న 60 మంది విద్యార్థులకు ఉల్లాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం రూ. వెయ్యి చొప్పున ఆర్థికసాయాన్ని అందజేశారు. ఎంఈవో రమేశ్, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు రాజారెడ్డి సహకారంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందిస్తున్న ఉల్లాస్ ట్రస్ట్ ప్రతినిధులు అశ్విన్ స్వప్న దంపతులు తెలిపారు.అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలో అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యమైనట్లు ఐదో టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. చంద్రశేఖర్ కాలనీకి చెందిన సుమయ్య బేగమ్ తన ఎనిమిదేళ్ల కొడుకు మహమ్మద్ హుస్సేన్ను భారతీరాణి కాలనీలో ఉన్న తన అమ్మ సమీనా బేగం ఇంటి వద్ద మంగళవారం వదిలి వెళ్లింది. బాలుడు బుధవారం ఉదయం 8 గంటల సమయంలో బయట ఆడుకోడానికి వెళ్లి సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబీకులు చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో సమీనాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు. బాలుడు ఆడుకుంటూ సమీపంలో ఉన్న బాబన్ సాహబ్ పహడ్ దర్గా వద్ద ఉన్నట్లు గుర్తించారు. వెంటనే బాలుడిని అతని తల్లి దండ్రులకు అప్పగించినట్లు ఎస్సై గంగాధర్ పేర్కొన్నారు.డ్రంకన్ డ్రైవ్లో ఒకరికి రెండు రోజుల జైలుఖలీల్వాడి: డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డ ఒకరికి మెజిస్ట్రేట్ నూర్జహాన్ రెండు రోజుల జైలు శిక్షను విధించినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ బుధవారం తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో మద్యం సేవించి పట్టబడ్డు 13 మందిని కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ పేర్కొన్నారు. ఇందులో 12 మందికి రూ. 15 వేల జరిమానా విధించగా ఆర్మూర్కు చెందిన సయ్యద్ అజ్జుకు రెండు రోజుల జైలు శిక్షను మెజిస్ట్రేట్ విధించినట్లు సీఐ ప్రసాద్ తెలిపారు.జీపీకి ఫ్రీజర్ అందజేతడిచ్పల్లి: మండలంలోని ఘన్పూర్కు చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు బుధవారం మృతదేహాన్ని పరిచే ఫ్రీజర్ను జీపీకి అందించారు. కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, జీపీ కార్యదర్శి, హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
పోరాటయోధుల చరిత్ర భావితరాలకు తెలపాలి
● అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సుభాష్నగర్: నిజాం నవాబు నిరంకుశ పాలనకు ఎదురు తిరిగిన తెలంగాణ పోరాట యోధుల చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారితో కలిసి ధన్పాల్ సూర్యనారాయణ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రాంజీ గోండ్, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, దాశరథి కృష్ణమాచార్యులు, షోయబుల్లా ఖాన్ వంటి ఎందరో మహనీయులు ప్రాణాలు అర్పించారని గుర్తుచేశారు. తెలంగాణ బిడ్డల ఆత్మఘోషను గ్రహించిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ 1948 సెప్టెంబర్ 17న నిజాం మెడలు వంచి ఇక్కడి ప్రజలకు విముక్తి కల్పించారన్నారు. నిజాం ఆనవాళ్లను పూర్తిగా చెరిపేసి, నిజామాబాద్ పేరును ఇందూరుగా మార్చాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, ఉపాధ్యక్షులు పాలెపు రాజు, జిల్లా కార్యదర్శి జ్యోతి, మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం
● జాతీయ జెండాలను ఆవిష్కరించిన నేతలు, అధికారులు నిజామాబాద్ సిటీ/ సిరికొండ/ ధర్పల్లి/ డిచ్పల్లి/ మోపాల్/ సుభాష్నగర్/ నిజామాబాద్ రూరల్/ నిజామాబాద్నాగారం/ నిజామాబాద్ లీగల్/ జక్రాన్పల్లి: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ పా లన వివరిస్తూ ప్రజాపాలన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు.జిల్లా కేంద్రంలోని బల్దియా కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ అంకిత్, నుడా కార్యాలయంలో చైర్మన్ కేశవేణు, కాంగ్రెస్ భవన్లో జిల్లా గ్రంథాలయ చైరమ్న్ అంతిరెడ్డి రాజారెడ్డి జాతీయ జెండాలను ఆవిష్కరించా రు. సిరికొండ, ధర్పల్లి, డిచ్పల్లి, మోపాల్, నిజామాబాద్ రూరల్ మండలాల్లో ప్రజాపాలన వేడుకలను నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో స్ జిల్లా కార్యాలయ ఆవరణలో జిల్లా అధ్యక్షుడు సుమన్ కుమార్, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రి న్సిపాల్ ఎన్ కృష్ణమోహన్, జిల్లా కోర్టు ప్రాంగ ణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, జక్రాన్పల్లిలో అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. -
ముగిసిన ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పరీక్షలు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు బుధవారం ముగిసినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. వర్సి టీ కళాశాలలో జరిగిన ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం నాలుగో సెమిస్టర్ పరీక్షలలో మొత్తం 28 మంది విద్యార్థులకు 28 హాజరైనట్లు పేర్కొన్నారు.గాయపడిన వ్యక్తిని అంబులెన్స్లో తరలించిన సీపీడిచ్పల్లి: డిచ్పల్లి పోలీస్స్టేషన్ పరిధి నడిపల్లి శివారులోని పెట్రోల్ బంక్ సమీపంలో బుధవారం ద్విచక్రవాహనంపై వెళుతున్న అశో క్ గాబ్రీ అదుపుతప్పి కిందపడగా తలకు బలమైన గాయాలయ్యాయి. అదే సమయంలో డిచ్పల్లి ఖిల్లా గ్రామానికి వెళ్తున్న సీపీ పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య వెంటనే తన వాహనాన్ని నిలిపివేశారు. 108 అంబులెన్స్ను పిలిపించి తీవ్రంగా గాయపడిన అశోక్ను వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీపీ వెంట డిచ్పల్లి ఎస్సై ఎండీ షరీఫ్, సిబ్బంది ఉన్నారు.జెండా ఎగురవేసిన సీపీఖలీల్వాడి: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సీపీ సాయిచైతన్య బుధవారం జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో డీసీపీలు బస్వారెడ్డి, రాంచందర్ రావు, సైబర్ క్రైమ్ ఏసీపీ వై వెంకటేశ్వర్లు, సీసీఎస్ ఏసీపీ నాగేంద్ర చారి, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీశైలం, సీఐలు, ఆర్ఎస్సై, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.విశ్వేశ్వర శర్మకు డాక్టరేట్తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఆంగ్ల విభాగంలో పరిశోధక విద్యార్థి ఏ.విశ్వేశ్వర శర్మ పీహెచ్డీ డాక్టరేట్ సాధించారు. రిటైర్డ్ ప్రొఫెసర్ జి.మనోజ పర్యవేక్షణలో ‘అప్లికేషన్స్ అండ్ రేసియల్ ఆఫ్ నాదిన్ గార్డెమర్’ అనే అంశంపై విశ్వేశ్వర శర్మ పరిశోధన పూర్తి చే సి సిద్ధాంత గ్రంథం సమర్పించారు. బుధవా రం తెయూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సెమినార్ హాల్లో నిర్వహించిన ఓపెన్ వైవాకు ఓయూ ప్రొఫెసర్ సవిన్ ఎక్స్టర్నల్ ఎగ్జామినర్గా వ్యవహరించారు. ఆర్ట్స్ డీన్ ప్రొఫెసర్ లావ ణ్య, హెచ్వోడీ రమణాచారి, బీవోఎస్ చైర్మన్ సమత, అధ్యాపకులు పాల్గొన్నారు. -
త్వరలో జీవాలకు నట్టల నివారణ మందులు
డొంకేశ్వర్(ఆర్మూర్): రెండేళ్ల క్రితం నిలిచిపోయిన జీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ మళ్లీ ప్రారంభం కాబోతుంది. త్వరలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు జిల్లాకు కావాల్సిన మందులు ఎన్నో పశుసంవర్ధక శాఖ అధికారులు రాష్ట్ర శాఖకు ఇండెంట్ పంపించారు. ఐదుగురు అధికారులతో కూడిన కమిటీ నాలుగు రకాల మందులను గుర్తించింది. అయితే, ప్రభుత్వం వీటిని ఈ నెలాఖరు నాటికి జిల్లాకు పంపనుంది. జిల్లాలో 6లక్షలకు పైగా జీవాలు జిల్లాలో మేకలు, గొర్రెలు కలిపి 6,02,703 ఉన్నాయి. ప్రధానంగా నట్టల వ్యాధితోపాటు బద్దె పురుగులు, కార్యపు జలగలు, బొంత పురుగుల వ్యాధులను సైతం అధికారులు గుర్తించారు. వీటికి కూడా మందులు వేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో నట్టల నివారణ మందులు ఉచితంగా జిల్లాకు వచ్చాయి. ప్రస్తుత ప్రభుత్వంలో ఇప్పటి వరకు మందులు రాలేదు. ఏడాదిలో కనీసం మూడుసార్లు మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందులు వేయాలి. దీంతో జీవాల పెంపకందారులైన గొల్ల, కుర్మలు డబ్బులు వెచ్చించి మందులు కొనుగోలు చేస్తున్నారు. త్వరలో నట్టల నివారణ మందులు ఇస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో గొల్ల, కుర్మలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి మందులు జిల్లాకు చేరుకోనుండగా అక్టోబర్ మొదటి వారంలో పంపిణీ చేసేందుకు పశుసంవర్ధక శాఖ ప్రణాళిక తయారు చేస్తోంది. తేదీ ఖరారైన వెంటనే గ్రామాల వారీగా షెడ్యూల్ను ప్రకటించనున్నారు. అయితే, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం వాస్తవమే. నెలాఖరు నాటికి జిల్లాకు పంపుతామన్నారు. వచ్చే నెల మొదటి వారంలో పంపిణీ చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తాం. – రోహిత్ రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఇండెంట్ పంపిన పశుసంవర్ధక శాఖ నెలాఖరు నాటికి జిల్లాకు మందుల సరఫరా అక్టోబర్ మొదటి వారంలో పంపిణీకి ఏర్పాట్లు -
రైతులను ఆదుకోండి
నిజామాబాద్ రూరల్: ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా జిల్లాకు వచ్చిన సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డికి కంఠేశ్వర్లోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గంలో వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, పీసీసీ డెలిగెట్ శేఖర్గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, నూడా చైర్మన్ కేశవేణు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, మునిపల్లి సాయారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
రిటైర్డ్ ఐఏఎస్ చక్రపాణి
చదువుతోనే భవిష్యత్తు నిజామాబాద్ రూరల్: చదువుతోనే విద్యార్థుల భవిష్యత్తు ఉందని విద్యావేత్త, విశ్రాంత ఐఏఎస్, పూర్వ కలెక్టర్ డీ చక్రపాణి పేర్కొన్నారు. నగరంలోని ఖిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు రామాలయంలో బుధవారం అవగాహన సద స్సు నిర్వహించారు. విద్యార్థులు ధారాళంగా ఇంగ్లిష్ మాట్లాడడం నేర్చుకోవాలని, ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవాలని సూచించారు. అంతకు ముందు చక్రపాణిని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కృపాల్సింగ్, ప్రిన్సిపాల్, అధ్యాపకులు సన్మానించారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్ వీరేశం, రమణ స్వామి తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
కుక్కల దాడిలో మేకల మృతి నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండల కేంద్రంలో కుక్కల దాడిలో రెండు మేకలు మృతి చెందాయి. నందిపేటకు చెందిన ఎస్కే. అజీం తన ఇంటి ఎదుట రెండు మేకలను కట్టేసి ఉంచాడు. కాగా, ఒక్కసారి గుంపులుగా వచ్చిన కుక్కలు దాడి చేసి రెండు మేకల గొంతులను పట్టేసాయి. మేకల అరుపులు విని కుక్కలను తరిమివేసే ప్రయత్నం చేసినా కుక్కలు మేకలను విడిచి పెట్టకుండా వాటి తల, మొండెం భాగాలను వేరు చేశాయి. ఎల్లారెడ్డిరూరల్: రేసు కుక్కలు గొర్రెల మందపై దాడి చేయడంతో 9 గొర్రెలు, ఒక మేక మృతి చెందినట్లు బాధితుడు రవి తెలిపారు. మండలంలోని తిమ్మారెడ్డి కట్టకింది తండాకు చెందిన రవి గొర్రెల మందపై రేసు కుక్కలు దాడి చేశాయి. ఘటనా స్థలాన్ని బీట్ ఆఫీసర్ మౌనిక పరిశీలించారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చూడాలని బాధితుడు కోరారు. మెండోరాలో భారీ చోరీ ● ఆరు తులాల బంగారం అపహరణ బాల్కొండ: మెండోరా మండల కేంద్రంలోని ఓ ఇంట్లో బుధవారం పట్టపగలు చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేర రామకృష్ణ దంపతులు మెండోరా మండల కేంద్రంలో కిరాణాషాపును నిర్వహిస్తారు. రోజూ ఇంటికి తాళం వేసి వచ్చి షాపులో ఉంటారు. పట్టపగలు గుర్తుతెలియని దుండగులు తాళం పగుల గొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న 6 తులాల బంగారం, 10 తులాల వెండి, రూ. 30 వేల నగదు ఎత్తుకెళ్లారు. సాయంత్రం పాఠఽశాల నుంచి ఇంటికి వచ్చిన కుమారుడు తాళం పగుల గొట్టి ఉండడాన్ని గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. దీంతో కుటుంబసభ్యులు ఇంటికి వచ్చి చూసేలోపు భారీ చోరీ జరిగింది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్సై సుహాసిని ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
యూరియా కోసం బారులు తీరిన రైతులు
సిరికొండ: మండలంలోని తూంపల్లి సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు బుధవారం బారులు తీరారు. సొసైటీకి మంగళవారం 225 సంచుల యూరియా వచ్చింది. బుధవారం పంపిణీ చేస్తారని ఉదయం ఆరు గంటల నుంచే రైతులు సొసైటీ వద్దకు తరలివచ్చారు. అధికారులు వచ్చేంత వరకు వరుసలో నిలబడలేక చెప్పులను వరుసలో ఉంచారు. పోలీసుల సహకారంతో ఏవో నర్సయ్య, సొసైటీ సీఈవో దేవిలాల్, సిబ్బంది ఒక్కో రైతుకు రెండు సంచుల చొప్పున యూరియాను పంపిణీ చేశారు. నిజామాబాద్ లీగల్: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి. ఉదయభాస్కర్ రావు అన్నారు. నగరంలోని అంబేడ్కర్ కాలనీలో బుధవారం న్యాయ చైతన్య సదస్సు నిర్వహించా రు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఏడాదికి రూ. మూడు లక్షలకన్నా ఆధాయం తక్కువ ఉన్న వారికి ఉచిత న్యా య సహాయం అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు,కాలనీవాసులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్: నగరంలోని సీతారాంనగర్ కాలనీలో ఉన్న అభయాంజనేయ ఆలయం వద్ద యువ నేత్ర యూత్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో యూత్ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు. -
తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజు
● వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ చరిత్రను 1948 సె ప్టెంబర్ 17 మలుపుతిప్పిన రోజని, శతాబ్దాల బాని స సంకెళ్లను తుంచి స్వాతంత్య్రం పొందిన ఉద్విఘ్న సందర్భమని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొ ఫెసర్ యాదగిరిరావు అన్నారు. ప్రజాపాలన దినో త్సవం సందర్భంగా బుధవారం తెయూ పరిపాల నా భవనం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజరికం పరిసమాప్తమై తెలంగాణ సమాజం నిజాం కబందహస్తాల నుంచి విమోచన పొందిన రోజన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి, వర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ మామిడాల, అ ధ్యాపకులు పాత నాగరాజు, శాంతాబాయి, పీఆ ర్వో పున్నయ్య, టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
సీపీఐఎంఎల్ ఆధ్వర్యంలో విద్రోహ దినం
నిజామాబాద్ సిటీ/ డిచ్పల్లి: భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని నెత్తుటేరులో ముంచిన సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు చీకటి రోజని, తెలంగాణ ప్రజలకు విద్రోహ దినమని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు. కోటగల్లి ఎన్ఆర్భవన్లో సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో విద్రోహ దినం సదస్సు నిర్వహించారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులను అణచడానికి జవహాల్లాల్ నెహ్రూ కుట్రలు పన్నారని అన్నారు. సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి పుట్ట వరదయ్య ఆధ్వర్యంలో నాగారంలో విద్రోహ దినోత్సవం నిర్వహించారు. నాందేవ్వాడలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షురాలు సుజాత అధ్యక్షతన తెలంగాణ సాయుధ రైతాంగ సభ నిర్వహించారు. కార్యదర్శివర్గ సభ్యురాలు నూర్జహాన్, నాయకులు పాల్గొన్నారు. డిచ్పల్లిలో సీపీఐ ఎంఎల్ మాస్లైన్ ప్రజాపంథా డిచ్పల్లి మండల కార్యదర్శి బోశెట్టి మురళి ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ సభ నిర్వహించారు. మాస్లైన్ ప్రజాపంథా నాయకులు పాల్గొన్నారు. -
సీఎం సలహాదారుకు వినతులు
నిజామాబాద్నాగారం: ఉద్యోగుల సమస్యలపై జిల్లాకు వచ్చిన సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డికి టీఎన్జీవోస్, రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో విన్నవించారు. అనంతరం వేం నరేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్, రెవె న్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, టీఎన్జీవో కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు జాఫర్ హుస్సేన్, జాకీర్ హుస్సేన్, శశికాంత్ రెడ్డి, విశాల్, మారుతి, సునీల్ పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణతో రోస్టర్ పాయింట్ల విధానంలో మాలలకు అన్యాయం జరుగుతుందని వెంటనే తమకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ ఆధ్వర్యంలో జిల్లా మాల మహానాడు కార్యవర్గ సభ్యులు సీఎం సలహాదారుడికి వినతిపత్రం అందజేశారు. జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు చొక్కం దేవీదాస్, నాంది వినయ్ కుమార్, ఆసది గంగాధర్, పి.చంద్ర కాంత్, బీస భూమయ్య, శంకరయ్య, బాలస్వామి, దొడ్డి మోహన్, భూషణ్, గంగాధర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ బిల్లు చెల్లించాలి
● సీఎం సలహాదారుకు వినతి ఖలీల్వాడి: పెండింగ్లో ఉన్న బిల్లులను అందించాలని జిల్లా పోలీసుల సంఘం అధ్యక్షుడు షకీల్పాషా కోరారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవనంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డిను బుధవారం కలిసిన జిల్లా పోలీసుల సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. 2024 జనవరిలో డిపార్ట్మెంట్కు రావాల్సిన ఎస్ఎల్ఎస్, అడిషనల్ ఎస్ఎల్ఎస్–5, జీపీఎఫ్, 2018 పీఆర్సీ బకాయిలు ఇవ్వాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అందరు ఉద్యోగులకు పీఆర్సీ అందించారని, పోలీసులకు ఇవ్వలేదని తెలిపారు. ఉద్యోగులు తమ పిల్లలకు అకడమిక్ ఇయర్ నుంచి ఫీజులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరారు. -
ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు
సుభాష్నగర్/ ధర్పల్లి/ సిరికొండ/ మోపాల్/ నిజామాబాద్ రూరల్: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో బీజేపీ నాయకులు, అభిమానులు బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరై మాట్లాడారు. ప్రధాని మోదీ యుగపురుషుడని అన్నారు. జీజీహెచ్లో పార్టీ నాయకులు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ధర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ మండలాధ్యక్షుడు మహిపాల్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, ఆలయంలో పూజలు నిర్వహించారు. సపాయి కార్మికులకు చేతు గ్లౌజులు, డెటాల్ సబ్బులను అందజేశారు. సిరికొండ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర నాయకుడు పెద్దోళ్ల గంగారెడ్డి హాజరయ్యారు. శుభోదయం పాఠశాలలో దివ్యాంగ విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. మోపాల్ మండల కేంద్రంలోని కేజీబీవీలో పదోతరగతి విద్యార్థినులకు బీజేపీ నాయకులు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు. నగరంలోని గాజుల్పేటలో ఉన్న గురుద్వారాలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
● ఘనంగా ప్రజాపాలన దినోత్సవంనిజామాబాద్నాగారం: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో ప్రజాపాలన దినోత్సవాన్ని బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హాజరై జాతీ య పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకల్లో భాగంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. సిద్దార్థ కళాక్షేత్ర, నవీపేట, కంజర సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలు, బోర్గాం(పి) ప్రభుత్వ పాఠశాల, డిచ్పల్లి మానవతా సదన్ చిన్నారులు చూడచక్కని నృత్యాలు ప్రదర్శించారు. ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ఆర్.భూపతి రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశవేణు, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీసీసీబీ చైర్మన్ రమేశ్రెడ్డి, జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
డిచ్పల్లి: విద్యార్థులు చదువుతో పాటు క్రీడాపోటీల్లో రాణించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య సూచించారు. బుధవారం మండలంలోని డిచ్పల్లి ఖిల్లా జెడ్పీ పాఠశాలను సీపీ సందర్శించారు. పాఠశాలకు రూ.60వేలు విలువ గల క్రీడాపరికరాలను ప్రముఖ పారిశ్రామికవేత్త ఏనుగు దయానంద్రెడ్డి వితరణ చేశారు. ఈ క్రీడాపరికరాలను సీపీ చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. సీపీ మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. అనంతరం జిల్లా స్థాయి ఉత్తమ పీడీగా అవార్డు తీసుకున్న పీడీ స్వప్నను సీపీ సన్మానించారు. కార్యక్రమంలో డిచ్పల్లి సీఐ వినోద్, ఎస్సై ఎండీ షరీఫ్, పాఠశాల హెచ్ఎం బి.సీతయ్య, ఖిల్లా రామాలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సావిత్రి, గ్రామపెద్దలు బూస సుదర్శన్, నర్సారెడ్డి, యాదగిరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా విశ్వకర్మ జయంతి
నిజామాబాద్ రూరల్/ సిరికొండ/ ధర్పల్లి: ఆర్యనగర్లోని హనుమాన్ మందిర కమిటీ హాల్లో విశ్వకర్మ జయంతిని విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు బుధవారం ఘనంగా నిర్వహించారు. విశ్వ సృష్టికర్త విశ్వకర్మ భగవాన్కు పూజలు చేశారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు వెంకటేశం, రమేశ్, అంజయ్య, గంగేశ్వర్, లక్ష్మీనారాయణ, రామస్వామి, విశ్వనాథ్, సంఘ సభ్యులు వెంకట చారి, గంగాధర్, పురుషోత్తం, దేవ శర్మ, అశోక్, రాంబాబు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని న్యావనందిలో విశ్వకర్మ చిత్ర పటానికి విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు పూజలు చేశారు. ధర్పల్లిలో మండలంలో మైలారంలో విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు శోభాయాత్ర నిర్వహించారు. వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో పూజలు చేశారు. -
పాడి రైతులు జాగ్రత్తలు పాటించాలి
● జిల్లా పశువైద్యాధికారి రోహిత్ రెడ్డి నిజామాబాద్ రూరల్: పాడి రైతులు పశువుల పట్ల తగు జాగ్రత్తలు పాటించాలని జిల్లా పశు వైద్యాఽ దికారి రోహిత్ రెడ్డి అన్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని అర్సపల్లిలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 36 పశువులకు గర్భకోశ, 42 దూడలకు నట్టల నివారణ మందులు, 48 పశువులకు సాధారణ చికిత్సలు, మూడు పశువులకు కృత్రిమ గర్భధారణ చేశారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి బాబురావు, జిల్లా పశువైద్య ఆస్పత్రి డాక్టర్ హనుమంత్ రెడ్డి, అర్సపల్లి సబ్సెంటర్ రమేశ్, వీఎల్వో శ్రీనివాస్, ఎల్ఎస్ఏ సిబ్బంది, గోపాల మిత్రలు, ట్రెయినీ డాక్టర్లు పాల్గొన్నారు. -
కామన్ స్కూల్ విద్యా విధానం కావాలి
నిజామాబాద్ సిటీ: విద్యా వ్యవస్థలు అన్నీ ఒకే విధమైన విద్యావిధానం పాటించాలని ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని న్యూ అంబేడ్కర్ భవన్లో పీఆర్టీయూ జిల్లా సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి ముఖ్యఅతి థిగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాల ల్లో అన్ని కులాలకు చెందిన పేద, నిరుపేద పిల్లలు చదువుతున్నారని, నాణ్యమైన విద్యను అందించాలని తెలిపారు. సీపీఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు పుల్గం దామోదర్ రెడ్డి, భిక్షం గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, గుండు లక్ష్మణ్, వంగ మహేందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, కిషన్, పెంట జలంధర్, వెంకటేశ్వర గౌడ్, తుమ్మల లక్ష్మణ్, అంకం నరేశ్, గంట అశోక్, సరిత తదితరులు పాల్గొన్నారు. -
పంటలను గిడ్డంగుల్లో భద్రపర్చుకోవాలి
● జిల్లా సహకార అధికారి శ్రీనివాస్రావు మోపాల్: రైతులు పండించిన పంటలను గిడ్డంగుల్లో భద్రపర్చుకోవాలని, గిట్టుబాటు ధర వచ్చిన సమయంలో విక్రయించుకోవాలని జిల్లా సహకార అధికారి శ్రీనివాస్రావు సూచించారు. బుధవారం నగర శివారులోని బోర్గాం(పి) సొసైటీలో గిడ్డంగుల అభివృద్ధి నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గిడ్డంగుల్లో పంటలను భద్రపర్చుకున్న సమయంలో పొందిన రసీదుల ఆధారంగా రైతులు బ్యాంకుల ద్వారా రు ణాలు పొందవచ్చని తెలిపారు. అనంతరం గిడ్డంగుల అభివృద్ధి నియంత్రణ సంస్థ ఐసీఎం డాక్టర్ శ్యాంకుమార్ మాట్లాడుతూ.. రైతులు గోదాములను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సహకార శాఖ అధికారి సరస్వతి, సొసైటీ వైస్ చైర్మన్ జయకృష్ణారెడ్డి, డైరెక్టర్లు గంగదాస్, సాయిరెడ్డి, మోహన్, నారాయణ, రైతులు సూర్యారెడ్డి, చిట్టి సాయిరెడ్డి, సుభాష్, రాజారెడ్డి, హన్మాండ్లు, పండరి, వ్యాపారులు, సొసైటీ సిబ్బంది నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
వీరుల విముక్తి పోరు
నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం తెలంగాణ మరో 13 నెలల పాటు వీరోచిత పోరాటం చేయాల్సి వచ్చింది. జిల్లాలో ఏడు వందల మంది పోరాటంలో పాల్గొన్నారు. ఖిల్లా జైలు గోడలపై దాశరథి కృష్ణమాచార్య బొగ్గుతో రాసిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ నినాదం నిజాం విముక్తి పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. ఈ పోరాటంలో ఆర్యసమాజ్ కీలక పాత్ర పోషించింది. జైలులో అనేక చిత్రహింసలను అనుభవించిన సమరయోధులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలంగాణ విముక్తి పోరాటంలో రాధాకృష్ణ మోదాని, సర్దార్ ప్రేమ్సింగ్, సర్దార్ వామాన్ సింగ్, నల్ల నర్సింహారెడ్డి తదితరులు ప్రాణాలు అర్పించారు.సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: భారతదేశంలో భాగమయ్యేందుకు గాను తెలంగాణ విముక్తి కోసం నిజాం నవాబుపై ఇందూరు వీరులు చేసిన పోరా టం తిరుగులేనిది. జిల్లాకు చెందిన 700 మందికి పైగా ప్రాణాలకు తెగించి పోరాటం చేశారు. పలువురు అమరులయ్యారు. పోరాట ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ గడ్డపై త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. దేశానికి 1947 ఆగస్టు 15న బ్రిటి ష్ వాళ్ల నుంచి స్వాతంత్య్రం లభించినప్పటికీ తెలంగాణ మాత్రం అదనంగా మరో 13 నెలల పాటు వీరోచిత పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో నిజాంకు వ్యతిరేకంగా రాసిన సాహిత్యం ప్రధాన పాత్ర పోషించింది. అనేక మంది కవులను వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన నిజాం పాలకులు కొంతకాలం పాటు నిజామాబాద్ ఖిల్లా జైలు లో బంధించారు. వీరిలో దాశరథి కృష్ణమాచార్యు లు, వట్టికోట ఆళ్వారులు లాంటివారు ఉన్నారు. దాశరథి కృష్ణమాచార్య నిజామాబాద్ జైలులో మూడు నెలల పాటు ఉన్నట్లు సమాచారం. ఈ సమయంలో దాశరథి జైలు గోడలపై పళ్లు తో ముకునే బొగ్గుతో నిజాం పాలనకు వ్యతిరేకంగా సాహిత్యాన్ని రాశారు. ‘నా తెలంగాణ కోటి అందా ల జాణ.. నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని గోడలపై రాశారు. ఈ నినాదం అప్పటి నిజాం విముక్తి పోరాటంలో తిరుగులేని విధంగా ఉద్యమాన్ని ముందుకు నడిపింది.1939 సెప్టెంబర్ 2న ఇందూరు గంజ్ కమాన్ వద్ద ఒక అరబ్బు వ్యక్తి పోలీసు స్టేషన్ వద్దరాధాకృష్ణ మోదానిని కత్తితో పొడిచి చంపాడు.1939 అక్టోబర్లో రజాకార్లు దసరా ఊరేగింపుపై దాడి చేసి సర్దార్ ప్రేమ్సింగ్, సర్దార్ వా మాన్సింగ్లను చంపారు.1946 నవంబర్ 28న ప్లేగు శిబిరంలో నల్ల నర్సింహారెడ్డిని రజాకార్లు కాల్చి చంపారు.1947 జూన్ 3న దత్తోపంత్ నాయక్ బాంబు పేలుడులో మరణించారు.1931లో హైదరాబాద్ రాష్ట్రంలో సాగిన ‘సివిల్ డిస్ ఒబిడియెన్స్’ ఉద్యమంలో నల్ల నరసింహారెడ్డి అరెస్టయ్యారు. 1947లో హైదరాబాద్ రాష్ట్ర విలీనోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. దీంతో రజాకార్లు క్రూరంగా కాల్చి చంపారు. నిజామాబాద్లో నల్ల నర్సింహారెడ్డి పేరుతో ఒక వీధి ఉంది. జిల్లా స్వాతంత్య్ర సమరయోధుల సంఘం వారు నగరంలో ఈయన పేరిట ఒక స్థూపాన్ని ప్రతిష్ఠించారు.ఇందూరులోని గాజుల్పేట్కు చెందిన బెల్లాల్ మాణిక్రెడ్డి నిజాం రజాకార్ల వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర పోషించారు. న్యాయవాద విద్యనభ్యసించిన మాణిక్రెడ్డి ఆర్యసమాజ్ బృందాలతో కలిసి ఇందూరు యువకులకు రాత్రి సమయాల్లో కర్రసాము, కరాటే, నాటు తుపాకీ వాడకం, బాంబుల తయారీలో శిక్షణ ఇచ్చారు. పోరాట యోఽ దులు కనిపిస్తే కాల్చేయమని నిజాం పోలీసులు ఉత్తర్వులు జారీ చేసిన సమయంలో అనేకమంది వీరులకు తన పొలంలో, ఇంట్లో ఆశ్రయం కల్పించి వారి బాగోగులు, వారి కుటుంబాల బాగోగులు చూసుకున్నారు. అప్పట్లో మాణిక్రెడ్డి ఇల్లు స్వాతంత్య్ర ఉద్యమకార్లకు భోజన సత్రంగా ఉండేదని నాటి సమరయోధులు చెప్పేవారు. రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ర్యాలీలు, సత్యాగ్రహ దీక్షల్లో తాను ముందుండి నాటి యువకులకు స్ఫూర్తిగా నిలిచారు. ఈ క్రమంలో జైలుకు వెళ్లారు. తరువాత కాలంలో ఎమర్జెన్సీ సమయంలోనూ మాణిక్రెడ్డి అప్పటి ఇందిర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పోరాటాల్లో ముందున్నారు. చంపేస్తామని అప్పటి కాంగ్రెస్ నాయకులు బెదిరించినప్పటికీ వెరవలేదు.మిఠాయి గంగారాం అనే స్వాతంత్య్ర సమరయోధుడు 1921లో నిజామాబాద్లో జన్మించారు. ని జాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈయన తన వృత్తినే వదిలేసి పాల్గొన్నారు. ఆనాటి ఉద్యమంలో వీరి పాత్ర అమోఘమైనది. ఎవరికీ జంకని వీరపురుషుడీయన అంటారు. ఉద్యమంలో పాల్గొన్నందుకు నై జాం ప్రభుత్వం గంగారాంను హైదరాబాద్, సికింద్రాబాద్ జైళ్లలో విడతలవారీగా ఉంచింది. 1947 జూలై 5 నుంచి 1948 అక్టోబర్ 7 వరకు జైలులో ఉన్నారు. జైలు లో అనేక అవస్థలు పడ్డారు. జైలు నుండి విడుదలైన తరువాత గంగారాం అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఆర్యసమాజ్, విశ్వహిందూ పరిషత్ కార్యకలాపాల్లో, హనుమాన్ వ్యాయామశాల స్థాపన నిర్వహణలో చాలా కృషి చేశారు.త్రయంబకరావు పాఠక్ 1920 డిసెంబర్ 1న ఇందూరులో జన్మించారు. తల్లిదండ్రులు అందూబా యి, రామచంద్రరావు. వ్యవసాయ కుటుంబం. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన పాఠక్ రజాకార్ల అరాచకాలను చూడలేకపోయారు. హృదయవిదారక ఘటనలు చూసి విప్లవ భావాలు పెంచుకున్నారు. ఆ కసాయివాళ్లను ఆయుధాలతోనే ఎదురించాలనుకుని, తన భార్య గాజులను అమ్మేసి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్లో తన మిత్రుడు దత్తోపంత్తో బాంబులు తయారు చే యించారు. ఇందుకు సీహె చ్బీ విఠల్దాస్, కేవీ గంగాధర్లు సహకరించారు. అయితే బాంబులను రహస్యంగా చేరవేస్తున్నప్పుడు పేలుడు సంభవించి దత్తోపంత్ అనే సమరయోధుడు మరణించారు. ఇది పోలీసులకు తెలియడంతో అందరినీ బంధించి వేర్వేరు జైళ్లలో ఉంచారు. త్రయంబకరావును 1947 డిసెంబర్ 14న హైదరాబాద్ జైల్లో పెట్టారు. 1948 అక్టోబర్ 7న విడుదలయ్యారు. స్వాతంత్య్ర సమరంలో ఈయన పాత్రను గుర్తించిన భారత ప్రభుత్వం 1973 ఆగస్టు 15న తామ్రపత్రానిచ్చి గౌరవించింది. పాఠక్ ఆనాడు నిజామాబాద్ ప్రాంతంలో జరిగిన అన్ని ఉద్యమాల్లో పాల్గొన్నారు. హిందూ మహాసభకు జిల్లా కార్యదర్శిగా, ఆర్యసమాజ్ సభ్యులుగా వ్యవహరించారు. తరువాత భారత్ సేవక్ సమాజ్లోనూ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లోనూ, కాంగ్రెస్ పార్టీ, జనతా పార్టీలలో సభ్యులై ఎన్నో కార్యకలాపాలను నిర్వహించారు.బృందాలుగా సత్యాగ్రహాలు..ఇందూరులో 1934 ఆగస్టు 24న ఆర్యసమాజ్ కార్యకలాపాలు ప్రారంభించారు. మొదటి కార్యవర్గంలో ప్రధాన్గా నల్ల రుక్మారెడ్డి వకీలు, మంత్రిగా మునిపల్లె గంగారాం, కోశాధికారిగా గజవాడ మాణిక్యం నియమితులయ్యారు.నిజాం విముక్తి పోరులో బృందాలుగా సత్యాగ్రహ కార్యక్రమాలు నిర్వహించారు. 1938, 1939లో బృందాలుగా ఏర్పడి పోరాటాలు చేశారు. మాణిక్యరెడ్డి, గడియారం సాంబయ్య, మునిపల్లె గంగారాం, రాధాకృష్ణ మోదా నిలు అరెస్టయ్యారు.ఇందూరు జైలులో ఉప్పొంగిన దేశభక్తి..1948 జనవరి 11న ఇద్దరు ఇత్తెహాదుల్ ముస్లిమీన్ కార్యకర్తలను రాజకీయ ఖైదీలున్న బ్యారక్ లో ఉంచారు. వీళ్లిద్దరూ స్టేట్ కాంగ్రెస్ ఖైదీలతో గిల్లికజ్జాలు పెట్టుకోసాగారు. జైలులో వందేమాతర గీతం ఆలపించకూడదని ఇద్దరు ఖైదీలు అభ్యంతరం చెప్పారు. అయినప్పటికీ వందేమాతరం ఆలపించడంతో ఇత్తెహాదుల్ ముస్లిమీన్కు చెందిన ఖైదీలు 4వ బ్యారక్లో ఉన్న సత్యాగ్రహులను కర్రలతో విచక్షణరహితంగా కొట్టారు. అలారం మోగించారు. జైలు వార్డెన్లు, పోలీసులు, కొందరు బయటి వ్యక్తులు జైలులోకి చొచ్చుకొచ్చి దాడిలో పాల్గొన్నారు. అందరూ కలిసి సత్యాగ్రహులను, వందేమాతరం ఆలపించిన వారిని క్రూ రంగా కొట్టారు. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. తలలు పగిలాయి. కొందరి కాళ్లూ, చేతులు విరిగాయి. 150 మంది సమరయోధులు తీవ్రంగా గాయపడడంతో రక్తసిక్తమైంది. జలియన్ వాలాబాగ్ను తలపించిన ఈ ఘటనను దేశ వ్యాప్తంగా ఖండించారు. ఆ రోజుల్లో తెలంగాణ జైళ్లలోని వార్డెన్లందరూ రాష్ట్రం బయటి నుంచి వచ్చినవారే. దీంతో ఈ జైలు రాజకీయ ఖైదీలకు అగ్నిగుండంలాగా తయారైంది. అప్పట్లో ఈ జైలును ‘‘సియాసీ ఖైదియోంకా ఖబరస్తాన్’’ (‘‘రాజకీయ ఖైదీల బొందలగడ్డ’’) అనేవారు. -
తాళ్లరాంపూర్లో ఉద్రిక్తత
మోర్తాడ్(బాల్కొండ): గ్రామస్తులు, గీత కార్మికుల మధ్య నెలకొన్న వివాదంతో ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం ఓ వ్యక్తి తన ఇంటి స్థలంలోని ఈత చెట్టును నరికేయగా దీనిపై గీత కార్మికులు ఎకై ్సజ్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వివాదం ముదిరింది. గతంలోనే తాటి చెట్లను గీసే విషయంలో గ్రామంలోని కొన్ని కుల సంఘాలు, గీత కార్మికులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ అంశంపై గ్రామంలో న్యా య సేవాధికార సంస్థ అవగాహన సమావేశాన్ని నిర్వహించి గ్రామాభివృద్ధి కమిటీ రద్దు చేసేలా కృషి చేసింది. గ్రామాభివృద్ధి కమిటీ రద్దు చేసినట్లు ప్రకటించినా గ్రామంలోని రెండు వర్గాల మధ్య సఖ్యత కుదరలేదు. సోమవారం రా త్రి నుంచి ఈనెల 21 వరకు 163 సెక్షన్ అమలు చేస్తూ తహసీల్దార్ మల్లయ్య ఉత్తర్వులు జారీ చేశా రు. గ్రామంలో పోలీసు బలగాలు మోహరించాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడం లేదు. రోడ్లు, వీధులు నిర్మానుష్యంగా మారాయి. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయా స్టేషన్ల ఎస్సైలు, ప్రత్యేక పోలీసు బలగాలు గ్రామంలో పికెటింగ్ నిర్వహించారు. పోలీసుల తీరుపై నిరసన బీడీ కంపెనీలో పనికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటికి వచ్చిన ఆడెపు లక్ష్మి అనే మహిళతోపాటు ఆమె భర్త నర్సయ్యపై పోలీసులు దాడి చేశారని తా ళ ్లరాంపూర్ గ్రామస్తులు అంటున్నారు. పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన బోనగిరి లావ ణ్యను పోలీసులు తమ వాహనంలో ఎక్కించుకుని తీసుకవెళ్తుండగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో చివరకు వదిలేశారన్నారు. పోలీసులు తమపై అకారణంగా దాడులు చేస్తున్నారని కొందరు ఫొటో లు తీసి సీపీ సాయి చైతన్యకు సామాజిక మా ధ్య మాల ద్వారా చేరవేయడంతో ఎవరిపై దాడికి పాల్పడవద్దని ఆ యన ఆదేశించినట్లు తెలిసింది. తాళ్లరాంపూర్లో చోటు చేసుకున్న వివాదంపై ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్వాన్ మాల్వియా, అదన పు పోలీసు కమిషనర్ బస్వారెడ్డి మోర్తాడ్లో ఇరువర్గాలతో చర్చలు నిర్వహించారు. అధికారులు ఈనెల 19న మరోసారి చర్చలు నిర్వహించి సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. గ్రామస్తులు, గీత కార్మికుల మధ్య ముదిరిన వివాదం ఈ నెల 21 వరకు 163 సెక్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ భారీగా మోహరించిన పోలీసు బలగాలు -
పదిహేను లక్షల బస్తాలు
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో యూరియా అమ్మ కాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్లో ఏకంగా 70వేల మెట్రిక్ టన్నుల మార్క్ను దా టింది. అంటే 15లక్షల 40వేల యూరియా బస్తాల ను రైతులు కొనుగోలు చేసి తీసుకెళ్లారు. ఇది గతే డాది ఖరీఫ్తో పోలిస్తే 2వేల మెట్రిక్ టన్నులు ఎ క్కువ. అయితే వేరే జిల్లాల్లో యూరియా దొరక్క రైతు లు ఇబ్బందులు పడుతుంటే, మన జిల్లాలో అధికారుల ముందు చూపు కారణంగా అలాంటి పరి స్థితి లేదనే చెప్పొచ్చు. రైతులంతా వరికి మూడో డోసు కూడా యూరియా వేశారు. ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే యూరియా అవసరం ఒక్కసారిగా ఏర్పడడంతో అక్కడి మండలాలకు వ్యవసాయ శా ఖ యూరియా సరఫరా చేస్తోంది. మంగళవారం బాల్కొండ, భీమ్గల్ మండలాల్లో సొసైటీల ముందు రైతులు బారులు తీరడంతో టోకెన్లు ఇచ్చి బస్తాలు పంపిణీ చేశారు. నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ నియోజకవర్గాల్లో కొరత ఏర్పడే అవకాశం ఉందన్న సమాచారం మేర కు స్టాకును తెప్పించి ఆయా మండలాలకు పంపుతున్నారు. ప్రస్తుతం జిల్లా అంతటా 50 పాయింట్లలో యూరియా అమ్మకాలు కొనసాగుతున్నాయి. యాసంగి కోసం ఇప్పుడే.. ఖరీఫ్లో 5,24,506 ఎకరాల్లో వివిధ పంటలు సాగవగా, 4,36,695 ఎకరాల విస్తీర్ణంలో వరి ఉంది. ప్రస్తుతం మొక్కజొన్న కోతలు ప్రారంభం కాగా కొన్ని చోట్ల ఇరవై రోజుల్లో వరి కోతలు ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. ఇలాంటి సమయంలో రైతులు ఇంకా యూరియాను కొనుగోలు చేయడంపై వ్యవసాయాధి కారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వచ్చే యాసంగి పంటలకు కూడా ఇప్పుడే యూరియాను కొనుగోలు చేసి దాచి పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.అధికారులు కూడా ఇదే విష యాన్ని స్పష్టం చేస్తున్నారు. గతేడాది 68,300 మెట్రిక్ టన్నులు పంపిణీ జరిగిన యూరియా ఇప్పుడు అదనంగా 2వేల మెట్రిక్ టన్నులు అమ్ముపోయింది. అంటే ఇది దాదాపు 18 వేల ఎకరాలకు సరిపడా యూరియా. ఈ లెక్కన జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం పెరగాలి. కానీ అలా జరగలేదు. జిల్లాకు అవసరమైన యూరియా (అంచనా) 75 వేల మెట్రిక్ టన్నులు వచ్చిన యూరియా 71 వేల మెట్రిక్ టన్నులు అమ్ముడైన యూరియా 70 వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్న స్టాక్ 1,000 మెట్రిక్ టన్నులు జిల్లాలో ఇప్పటి వరకు రైతులు కొనుగోలు చేసిన యూరియా 70 వేల మెట్రిక్ టన్నుల పంపిణీ గతేడాదితో పోలిస్తే 2 వేల మెట్రిక్ టన్నులు అదనం అయినా కొన్ని చోట్ల రైతుల బారులు చర్యలు చేపడుతున్న వ్యవసాయ శాఖ అవసరం ఉన్న రైతులే కొనాలి ఖరీఫ్లో సాగవుతున్న పంటలు దాదాపు చివరి దశకు చేరాయి. ఇంకా అక్కడక్కడ మాత్రమే యూరియా అవసరం ఉంటుంది. అవసరం ఉన్న రైతులే యూరియాను కొనాలి. కొరత లేకుండా జిల్లాలో ఎక్కడికి కావాలంటే అక్కడికి బస్తాలను పంపుతున్నాం. జిల్లాకు మరికొంత కోట రావాల్సి ఉంది. దీనిని రోజు వారీగా నెలాఖరు వరకు తెప్పిస్తాం. – మేకల గోవింద్, జిల్లా వ్యవసాయాధికారి -
పరిమితులు లేకుండా పరిహారం అందించాలి
నిజామాబాద్నాగారం: వరద కారణంగా నష్టపోయిన వారికి పరిమితులు లేకుండా పరిహారం అందించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డి మోహన్రెడ్డి కోరారు. వరద వల్ల పంటలు నష్టపోయిన రైతులతో కలిసి మంగళవారం ఆయన కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ప్రాంతంలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. బాధితులకు పరిహారం అందించని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కూరెళ్ల శ్రీధర్, బోధన్ రూరల్ మండల అధ్యక్షుడు సిర్ప సుదర్శన్, బోధన్ పట్టణ అధ్యక్షుడు గోపికిషన్, సాలూర మండల అధ్యక్షుడు గంగాధర్, బోధన్ రూరల్ మండల మాజీ అధ్యక్షుడు రాజు మనోహర్, బోధన్ నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. -
పెద్దమల్లారెడ్డిలో యువకుడి ఆత్మహత్య
భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసు కున్నట్లు భిక్కనూరు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన ఎల్క తిరుపతి (20) గత కొన్నేళ్లుగా తాగుడుకు బానిసయ్యాడు. గతంలో అమ్మాయిలను వేధించిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈక్రమంలో సోమవారం రాత్రి అతడు డబ్బులు కావాలని తల్లి రామవ్వపై ఒత్తిడి చేశాడు. ఆమె డబ్బులు లేవని చెప్పడంతో, అతడు ఇంటికి వెళ్తున్నానని చెప్పి దూలానికి ఉరి వేసుకున్నాడు. మంగళవారం ఉదయం ఉరి వేసుకున్న కొడుకును చూసి తల్లి రోదించింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హెడ్కానిస్టెబుల్ అంజయ్య ఘటన స్థలానికి చేరు కుని పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసు కున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. -
‘ప్రజాపాలన’ వేడుకలకు ముస్తాబైన కలెక్టరేట్
నిజామాబాద్నాగారం: నగరంలోని కలెక్టరేట్ నేడు నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవానికి ముస్తాబైంది. ఏర్పాట్లను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, ఉదయం 10.00 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు విచ్చేయనున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. -
నిర్ణీత గడువులో దరఖాస్తులను పరిష్కరించాలి
● పరిశీలనలో జాప్యం చేయవద్దు ● అధికారులకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశంబోధన్: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించాలని, పరిశీలన ప్రక్రియలో జాప్యం చేయవద్దని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సాలూర మండల తహసీల్దార్ ఆఫీస్ను మంగళవారం కలెక్టర్, సబ్ కలెక్టర్ వికాస్ మహతోతో కలిసి తనిఖీ చేశారు. రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తుల వివరాలను తహసీల్దార్ శశిభూషణ్ను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులు తిరస్కరణ అయితే అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని కలెక్టర్ సూచించారు. సాదాబైనామా, పీఓటీలకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి వెనువెంటనే నోటీసులు జారీ చేస్తూ క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలన జరపాలన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను వెనువెంటనే పరిశీలిస్తూ అర్హులకు ఆమోదం తెలుపాలన్నారు. ఎస్ఐఆర్( స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ కోసం ముందస్తుగానే అవసరమైన జాబితాను సిద్ధ చేసుకోవాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఎస్ఐఆర్ను పకడ్బందీగా నిర్వహించేలా సన్నద్ధమై ఉండాలని కలెక్టర్ అన్నారు. -
నగరంలో గుర్తుతెలియని వ్యక్తి..
ఖలీల్వాడి: నగరంలోని బస్డిపో–1 ప్రహరీ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్హెచ్వో రఘుపతి మంగళవారం తెలిపారు. ఈనెల 14న ఉదయం సదరు వ్యక్తి అపస్మారకస్థితిలో ఉండటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే అతడిని చికిత్స నిమ్తిం జీజీహెచ్కు తరలించారు. కానీ వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు వద్ద ఎలాంటి ఆధారలు లభించలేవని, అతడు బూడిద రంగు షర్టు, నలుపు రంగు ప్యాంటు ధరించాడని పోలీసులు తెలిపారు. మృతుడు భిక్షాటన చేసుకునే వ్యక్తిగా కనపడుతున్నట్లు చెప్పారు. ఎవరికై నా అతడి వివరాలు తెలిస్తే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు. -
ఆలయంలో చోరీ
గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రం శివారులోని గుట్టమీద గల శివభక్త మార్కండేయ ఆలయంలో చోరీ జరిగినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఆలయంలోని హుండీని సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగుడు ఆలయ ఆవరణలో పగులగొట్టి డబ్బులు దొంగిలించినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయినట్లు పేర్కొన్నారు. ఆలయ కమిటీ సభ్యుడు ఆశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అలాగే మండల కేంద్రంలో ఇంటి ముందర నిలిపిన బైక్ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు ఎస్సై తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జక్రాన్పల్లి: బైక్ చోరి కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై మాలిక్ రెహమాన్ తెలిపారు. జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఆయన వివరాలు వెల్లడించారు. మండలంలోని గాంధీనగర్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా, వారిని పట్టుకుని విచారించారు. వారి వద్దనున్న బైక్ను గత నెల 18న జక్రాన్పల్లి బస్టాండ్ వద్ద నుంచి చోరీ చేసినట్లు తెలిపారు. అనంతరం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ ప్రాజెక్టుకు ది గువన ఉన్న నాగమడుగు లోలెవల్ వంతెన వద్ద వర ద నీటిలో ఒకరు గల్లంతయ్యారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామానికి చెందిన చాకలి ప్రవీణ్ (30) మంగళవారం అచ్చంపేట గ్రామంలోని బంధువుల వద్దకు వెళ్లాడు. సాయంత్రం తిరిగి వస్తుండగా నాగమడుగు వద్ద వరద నీరు ఉధృతంగా ఉండటంతో ఈత కొట్టాడు. దీంతో అతడు నీటమునిగి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. వరద నీటిలో రాత్రి వరకు గాలించారు. అయినా అతడి ఆచూకీ లభించలేదు. నిజామాబాద్ రూరల్: మండలంలోని గుండారం గ్రామంలో 600 గ్రాములు నిషేదిత అల్ప్రాజోలంను నార్కోటిక్ అధికారులు పట్టుకున్నట్లు రూరల్ ఎస్హెచ్ మహ్మద్ ఆరీఫ్ మంగళవారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం రావడంతో గుండారం కల్లు బట్టిపై దాడి చేసి అల్ప్రాజోలంను పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులైన అశోక్, రమేశ్ గౌడ్లపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. మాచారెడ్డి: మండలంలోని ఘన్పూర్ శివారులో మంగళవారం ఓ భారీ ట్రక్కు టైర్ పంక్చర్ కావడంతో రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో రోడ్డు కు ఇరువైపులా వాహనాలు గంటపాటు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న మాచారెడ్డి పోలీసులు పొక్లెయిన్ సహాయంతో ట్రక్ను తొలగించి, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు. -
ఉద్యమాల పోరుగడ్డ ‘ఇందూరు’
మోర్తాడ్(బాల్కొండ): నిజాం రజాకార్ల గుర్రపు డెక్కల చప్పుళ్లకు వెరవని ధీరులు ఇందూరు ఉద్యమకారులు. 1947 ఆగష్టు 15న దేశమంతటా త్రివర్ణ పతాకం ఎగురవేయడానికి సన్నాహాలు జరుగుతుంటే నిజాం పాలనలో ఉన్న మనకు ఆ స్వేచ్ఛను రజాకార్లు హరించారు. మన సమరయోధులు మాత్రం రజాకార్ల ఆజ్ఞలను లెక్క చేయకుండా మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. ఫలి తంగా జైలు ఊచలు లెక్కించారు. అహింస– హింస మార్గాల్లో.. మొదటి స్వాతంత్య్ర సంగ్రామంలో మన ప్రాంతానికి చెందిన కౌలాస్ రాజు దిలోప్ సింగ్ చూపిన పోరాట పటిమ, ఝాన్సీ లక్ష్మిబాయ్ ప్రదర్శించిన తెగువతో తెలంగాణకు విముక్తి కోసం కొందరు సాయుధ పోరాటానికి నాంది పలుకగా, మరికొందరూ గాంధీ బాటలో సత్యాగ్రహం ద్వారా స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరి పోశారు. ఇలా తెలంగాణ విముక్తి కోసం హింస, అహింస మార్గాల్లో వేరువేరుగా పయనించిన యోధులకు పుట్టినిల్లుగా ఇందూరు గడ్డ నిలుస్తోంది. పల్లెలపై దాడులు చేస్తు అమాయక ప్రజల ధన, మాన ప్రాణాలను హరిస్తున్న రజాకార్ల గుంపుపై మోర్తాడ్ జమీందార్ రుక్మారెడ్డి ఫిరంగులతో దాడికి పాల్పడ్డాడు. దీంతో నిజాం పాలకులు అతడిని ఇనుప సంకెళ్లతో బంధించి జైళ్లో ఉంచారు. అలాగే ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో స్వామి రామానంద తీర్థ స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. చౌట్పల్లి నారాయణరెడ్డి ఆర్య, చౌట్పల్లి శ్రీనివాస్రెడ్డి, పడిగెల హన్మాండ్లు, నారాయణ లింగారెడ్డి, నీలకంఠ నారాయణ, పడకల్ శ్రీనివాస్రెడ్డి, శంభులింగం, లక్ష్మాగౌడ్, బ్రహ్మయ్య, వెంకటస్వామి, బొంబాయి నర్సింహారెడ్డి, నర్సింహారావు, నరసింహాశాస్త్రి, కొండా నారాయణ, ఉప్పు లక్ష్మయ్య, హన్మంత్రెడ్డి, రంగారెడ్డిలు రామానంద తీర్థ స్టేట్ కాంగ్రెస్ ఉద్యమానికి ప్రభావితులైనారు. నిజాం రజాకార్లపై తెగింపుతో ప్రతిదాడులు చేసిన జిల్లా ఉద్యమకారులు ఎందరో... నేడు నిజాంపాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిన రోజు -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
● 12(టీ) బెటాలియన్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్ట్నెంట్ కల్నల్ ప్రియాజిత్ సూర్ ● నగరంలోని గిరిరాజ్ కళాశాలలో ‘హైదరాబాద్ లిబరేషన్ డే’ ఫొటో ఎగ్జిబిషన్ నిజామాబాద్నాగారం: హైదరాబాద్ విమోచనం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని 12(టీ) బెటాలియన్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్ట్నెంట్ కల్నల్ ప్రియాజిత్ సూర్ అన్నా రు. నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ఆవరణలో మంగళవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ‘హైదరాబాద్ లిబరేషన్ డే’ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ప్రియాజిత్ సూర్ హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ లిబరేషన్లో పోరాడిన నాయకులు చారిత్రక అంశాలను ఫొటో ఎగ్జిబిషన్లో పొందుపరిచారన్నారు. అనంత రం సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ధర్మనాయక్ మాట్లాడుతూ.. ఈ ఎగ్జిబిషన్లో నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబా ద్ సంస్థానాన్ని విముక్తి చేసేందుకు పోరాడిన రామ్ జి గోండు, కుమురం భీమ్, చాకలి ఐలమ్మ, భాగ్యరెడ్డి వర్మ, తదితరుల ప్రముఖుల ఫొటోలను ఏర్పా టు చేశామన్నారు. బైరాన్పల్లి ఘటన, ఆపరేషన్ పో లో వంటి ప్రధాన ఘట్టాలను వివరించే ఫొటోలు కూడా ప్రదర్శనకు ఉంచామన్నారు. ఈ ఎగ్జిబిషన్ ఈనెల 18 వరకు కొ నసాగుతుందన్నారు. అనంతరం విద్యార్థులకు ని ర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కళాశాల ప్రి న్సిపాల్ రామ్మోహన్ రెడ్డి, డిస్ట్రిక్ ఉమెన్ వెల్ఫేర్ ఆఫీసర్ రసూల్ బి, పోస్టల్ డిపార్ట్మెంట్ సీనియర్ సూపరింటెండెంట్ జనార్దన్ రెడ్డి, ఎన్వైకే కోఆర్డినేటర్ శైలీ బెల్లాల్, ఆల్ ఇండియా రేడియో ఎగ్జిక్యూ టివ్ ఆఫీసర్ మోహన్దాస్ పాల్గొన్నారు. -
ఉద్యమకారుల నుంచి ప్రజాసేవకులుగా..
మోర్తాడ్(బాల్కొండ): తెలంగాణ విముక్తి ఉద్యమంలో పాలుపంచుకున్న ఉద్యమకారులు తరువాత రాజకీయాల్లో చేరి ఉన్నత పదవులను అలంకరించారు. మోర్తాడ్ మండలం సుంకెట్కు చెందిన నారాయణరెడ్డి ఎంపీగా, ఎమ్మెల్యేగా జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. జక్రాన్పల్లి మండలం అర్గుల్కు చెందిన అర్గుల్ రాజారాం బాల్కొండ నియోజకవర్గానికి నాలుగుమార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడంతో పాటు చేనేత, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రిగా విశిష్టమైన సేవలు అందించారు. చౌట్పల్లికి చెందిన హన్మంత్రెడ్డి జిల్లా పరిషత్ మొట్టమొదటి చైర్మన్గా ఎంపికై ప్రజాసేవలో కొనసాగారు. వీరితోపాటు అనేక మంది తమ సొంత గ్రామాలలో సర్పంచ్లుగా, సహకార సంఘాల చైర్మన్లుగా ఎంపికై ప్రజలకు విశేషమైన సేవలు అందించారు. -
కొనసాగుతున్న నీటి విడుదల
బాల్కొండ: ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్ట్ నుంచి గోదావరిలోకి నీటి విడుదల కొనసాగుతుంది. 36 వరద గేట్ల ద్వారా 2లక్షల 32వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఇన్ ఫ్లో తగ్గినా గోదావరిలోకి నీటి విడుదలను ప్రాజెక్ట్ అధికారులు తగ్గించలేదు. దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం క్రమంగా తగ్గింది. ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా 6500 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 4 వేల క్యూసెక్కులు, ఎస్కెప్ గేట్ల ద్వారా 4 వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 800 క్యూసెక్కులు, లక్ష్మి కాలువ ద్వారా 200 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 684 క్యూసెక్కులు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు ) అడుగులు కాగా మంగళవారం సాయంత్రానికి 1089.80(75. 7టీఎంసీలు ) అడుగుల నీరు నిల్వ ఉంది. రెంజల్(బోధన్): గోదావరి నదికి వరద పొటెత్తుతోంది. స్థానికంగా కురుస్తున్న వర్షాలతోపాటు ఎగువన గల నదుల నుంచి వరద నీరు రావడంతో కందకుర్తి వద్ద వరద తాకిడి గంటగంటకు పెరుగుతుంది. దీంతో అంతర్రాష్ట్ర వంతెనకు ఆనుకుని వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కందకుర్తి వద్ద గోదావరిలోని పురాతన శివాలయం పూర్తిగా నీట మునిగింది. -
ఎస్ఐఆర్ పకడ్బందీగా నిర్వహించాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్నిజామాబాద్ నాగారం: ఓటరు జాబితాలో భాగంగా చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. నగరంలోని కలెక్టరేట్లో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా సబ్ కలెక్టర్లు, ఆర్డీవో, తహసీల్దార్లతో ఎస్ఐఆర్ అమలు ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఎన్నికల సంఘం ఆదేశాలు అందిన మీదట ఈ ప్రక్రియను క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సి ఉంటుందన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, మెప్మా పీడీ రాజేందర్, డీడబ్ల్యూవో రసూల్బీ, డీఎంహెచ్వో రాజశ్రీ, తదితరులు పాల్గొన్నారు. -
సిరికొండ మండలంలో గత స్మృతులు
సిరికొండ: మండలంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ఛాయలు నేటికి కదలాడుతున్నాయి. 1946 నుంచి 1951 వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మండలంలో విస్తృతంగా సాగినట్లు ఆనాటి పెద్ద మనుషులు చెబుతుంటారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ప్రాంతానికి చెందిన అణభేరి ప్రభాకర్రావు నేతృత్వంలో అదే సిరిసిల్లకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అమృత్లాల్ శుక్లా, శివాయిపల్లెకు చెందిన బల్రాంలు ఇక్కడ రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించారు. రజాకార్ల ఆకృత్యాలకు వేదికగా మారుతోందని హోన్నాజీపేట్ గడిపై వీరి ముఠా దాడి చేసింది. దాడితో గడి దొర ప్రతాప్రెడ్డి హైదరాబాద్కు పారిపోయాడు. ప్రభాకర్రావు బృందం మండలంలోని వివిధ గ్రామాల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకొని భూస్వాముల చెరలో ఉన్న భూములను పేదలకు పంచిపెట్టారు. వీరి సారధ్యంలో ఉద్యమం నడుస్తుండగా రజాకార్లకు పన్నులు కట్టడం, పశువులు మేపుకున్నందుకు చెల్లించే పన్నులను చెల్లించడం మానివేశారు. అలాగే గడ్కోల్ గ్రామంలో దొరల వద్ద గుమాస్తాగా పని చేసే జంగం గంగన్నను ఉద్యమకారులు గ్రామ నడిబొడ్డున కాల్చి చంపారు. -
ప్లాస్టిక్ నిరోధానికి స్టీల్ బ్యాంకులు
● రెంజల్, తాడ్బిలోలి గ్రామాల్లో శ్రీకారం ● స్టీల్ ప్లేట్లను వినియోగిస్తున్న గ్రామస్తులురెంజల్(బోధన్): పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ భూతాన్ని తరిమేందుకు గ్రామాల్లో స్టీల్ బ్యాంకులు ఏర్పాటవుతున్నాయి. శుభకార్యాలు, అన్నదానాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనాలు చేస్తుండడంతో అనారోగ్య సమస్యలు దరి చేరుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడాకాన్ని తగ్గించాలనే ఆలోచనతో రెంజల్ మండల కేంద్రంలో శివాజీ సేవా సమితి, తాడ్బిలోలి గ్రామంలో శ్రీరామాలయం కమిటీలు స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేశాయి. ఈ రెండు గ్రామాల్లో జరిగే శుభకార్యాలు, పెళ్లిళ్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను తగ్గించే దిశగా కమిటీలు ముందుకెళ్తున్నాయి. ప్లాస్టిక్ ప్లేట్లకు బదులు స్టీల్ ప్లేట్లను వాడేలా కృషి చేస్తున్నాయి. భయపెడుతున్న ప్లాస్టిక్ భూతం జిల్లాలో ప్లాస్టిక్ భూతం భయపెడుతోంది. నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. 120 మైక్రాన్లలోపు కవర్లు, గ్లాసుల నిషేధం అమలుకు నోచడంలేదు. 2022 జూలై నుంచి ప్లాస్టిక్ను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కానీ, వ్యాపారులు, ప్రజలు నిబంధనలు పాటించడం లేదు. మరోవైపు ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. సూపర్ మార్కెట్లు, టిఫిన్ సెంటర్లు, కూరగాయల మార్కెట్లు, హోటల్స్, పానీపూరి, చిరు వ్యాపారులు, వైన్స్ల వద్ద పర్మిట్ రూంలు, స్వీట్ షాపులు, పండ్ల దుకాణాల తదితర వాటిల్లో తక్కువ మైక్రాన్ల కవర్లను వినియోగిస్తున్నారు. వాటిని వినియోగించే ప్రజలు రోగాలబారిన పడే ప్రమాదం ఉంది. ప్లాస్టిక్ కవర్లు విక్రయించే వారికి భారీ మొత్తంలో జరిమానాలు విధించే అవకాశం ఉన్నా, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల వాడకాన్ని నియంత్రించేందుకు శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో 300 స్టీల్ ప్లేట్లు, గ్లాసులు తీసుకొచ్చాం. శుభకార్యాలకు ఉచితంగా అందిస్తున్నాం. స్టీల్ బ్యాంకు ప్లేట్లు, గ్లాసులు తీసుకున్న వారు చార్జీలు కాకుండా మరిన్ని స్టీల్ ప్లేట్లు అందించాలని సూచిస్తున్నాం. ఎవరినీ బలవంతం చేయడం లేదు. – లక్ష్మణ్గౌడ్, రెంజల్ శివాజీ సేవా సమితి ప్రతినిధిప్లాస్టిక్ వాడకంతో కలిగే అనర్థాలను గుర్తించి ఇటీవల ఆలయ కమిటీ ద్వారా 800 స్టీల్ ప్లేట్లు, గ్లాసులు తెప్పించాం. కేవలం ఆలయాల్లో నిర్వహించే అన్నదానాలకు ఉచితంగా అందిస్తున్నాం. – కార్ఖానా శ్రీనివాస్, శ్రీరామాలయం కమిటీ చైర్మన్, తాడ్బిలోలి -
ప్రజాపాలన దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు
● ముఖ్య అతిథిగా హాజరుకానున్న సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ● కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి వెల్లడిసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఈ నెల 17న నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవానికి విసృత్త ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో సోమవారం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. వేడుకకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. ముఖ్య అతిథితోపాటు ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. వేదిక, సీటింగ్ తదితర వాటిపై సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. 17న స్వస్థనారీ స్వశక్తి పరివార్ ప్రారంభం మహిళల ఆరోగ్యం పెంపొందించేందుకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వస్థనారీ స్వశక్తి పరివార్ కార్యక్రమాన్ని ఈ నెల 17న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. మహిళల ఆరోగ్యమే ప్రధాన ధ్యేయంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో సాధారణ ఆరోగ్య శిబిరాలు, ప్రత్యేక నిపుణుల వైద్య శిబిరాలను జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు 10 చోట్ల నిర్వహిస్తారని తెలిపారు. శిబిరాల్లో గైనకాలజీ, చర్మవ్యాధి, దంత, కంటి, మానసిక, పిల్లల వైద్య నిపుణులు పాల్గొని పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. వ్యాధి నిర్ధారణ, రక్తదాన శిబిరాలు ఉంటాయని తెలిపారు. డీఆర్డీవో, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు క్షేత్రస్థాయిలో మహిళలకు అవగాహన కల్పించి ప్రత్యేక పరీక్షలు చేయించుకునేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీఆర్డీవో సాయాగౌడ్, డీఎంహెచ్వో రాజశ్రీ, డీసీహెచ్ఎస్ శ్రీనివాస్ ప్రసాద్, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని ముదెల్లిలో సోమవారం విద్యుదాఘాతంతో గ్రామానికి చెందిన కౌలు రైతు కర్రోల్ల సాయిలు(52) మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. సాయిలు అదే గ్రామానికి చెందిన ఒకరి పొలం కౌలుకు తీసుకొని వరి పంట సాగు చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం సాయిలు, భార్య లలిత కలుపు తీసేందుకు పొలానికి వెళ్లారు. పొలానికి నీళ్లు పారించేందుకు సాయిలు బోరు మోటారు స్టార్టరు ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. ఖలీల్వాడి: నిజామాబాద్ రైల్వేస్టేషన్లో రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని రైల్వే పోలీసులు కాపాడినట్లు ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. సాలూరా మండలంలోని హాజీపూర్కు చెందిన పవన్ (28) ఇంజినీరింగ్ పూర్తి చేసి నిజామాబాద్లో ఉంటున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్, మద్యానికి బానిస కావడంతో అప్పులయ్యాయి. అప్పుల బాధలు ఎక్కువ కావడంతో రైలు కిందపడి ఆత్మహత్యకు యత్నించినట్లు చెప్పారు. గాయపడిన పవన్ను రైల్వే పోలీసులు ఆస్పత్రికి తరలించారు. నవీపేట: మండలంలోని యంచ సమీపంలో గోదావరిపై నిర్మిస్తున్న బ్రిడ్జికి వాడే ఐరన్ రాడ్లను ఎత్తుకెళ్లిన నిందితుడిని సోమవారం పట్టుకున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. అనూష ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బ్రిడ్జికి వినియోగించే ఇనుప రాడ్లను యంచ సమీపంలో నిల్వ చేశారు. యంచ గ్రామానికి చెందిన పీరాజి వ్యాకంటి కొన్ని రోజులుగా ట్రాక్టర్లో ఇనుమును దొంగిలించాడని పేర్కొన్నారు. దాదాపు రెండు టన్నుల ఇనుప రాడ్లను దొంగిలించినట్లు తెలిపారు. ప్రాజెక్టు మేనేజర్ పార్థసారథి ఫిర్యాదు మేరకు ఈ నెల 10న కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. చోరీకి పాల్పడిన పీరాజి వ్యాకంటిని సోమవారం అరెస్టు చేసి, రెండు టన్నుల ఇనుప రాడ్లను రికవరీ చేశామని ఎస్సై తెలిపారు. చోరీకి ఉపయోగించిన ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. -
అర్జీలను పెండింగ్లో పెట్టొద్దు
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● ప్రజావాణికి 115 ఫిర్యాదులుసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 115 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీవో సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్లకు వివరించారు. కాగా, ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. -
అంగన్వాడీల ఆందోళన ఉద్రిక్తం
● పీసీసీ చీఫ్ ఇంటి ముట్టడికి యత్నం ● సీఐటీయూ నాయకుల ముందస్తు గృహనిర్బంధాలు ● ధర్నాచౌక్ వద్ద అంగన్వాడీల నిరసననిజామాబాద్నాగారం: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్లు, ఆయాలతోపాటు సీఐటీయూ నాయకులు సోమవారం నిర్వహించిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. చలో హైదరాబాద్కు వెళ్లనున్న అంగన్వాడీ టీచర్లు, నాయకులను ఉదయం పోలీసులు గృహనిర్భంధం చేశారు. పలువురిని పోలీసు స్టేషన్లకు తరలించి, అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కాగా, జిల్లా కేంద్రంలోని వినాయక్నగర్లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఇంటి ముట్టడికి అంగన్వాడీ కార్యకర్తలు యత్నించారు. సీఐటీయూ నాయకులు, అంగన్వాడీలు పెద్దసంఖ్యలో తరలిరావడంతో పోలీసులు అప్రమత్తమై అడ్డుకున్నారు. కార్యకర్తలు, నాయకులను అరెస్టుచేసి స్టేషన్కు తరలించారు. అనంతరం మిగతా అంగన్వాడీ కార్యకర్తలు ధర్నాచౌక్ వద్ద నిరసన తెలిపారు. ధర్నాలో సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్బాబు మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, శాంతియుతంగా చేపట్టే కార్యక్రమాలను పోలీసులు అడ్డుకోవడం, అక్రమ నిర్భందాలు చేయడం సరికాదని అన్నారు. సమస్యల పరిష్కారంపైన చూపాల్సిన శ్రద్ధ నాయకుల అరెస్టులపై పెట్టారని ఎద్దేవా చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం ప్రీ ప్రైమరీ కేంద్రాలను అంగన్వాడీ కేంద్రాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లకు రూ. 18వేల వేతనం ఇవ్వాలన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే మరో ఉద్యమం చేపడతామన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు స్వర్ణ, చంద్రకళ, మంగాదేవి, వాణి, విజయ, లక్ష్మి, వసంత, సూర్యకళ, రాజ్యలక్ష్మి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. -
విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలి
● సీపీ సాయి చైతన్యసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఇంజినీర్లు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో సోమవారం ఇంజినీర్స్ డే నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీ సాయిచైతన్య హాజరై మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజినీరింగ్ విభాగంలో ఉమ్మడి ఏపీతోపాటు దేశానికి విశ్వేశ్వరయ్య చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం భారతరత్న ఇచ్చిందని గుర్తు చేశారు. యువత ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. డ్రగ్స్కు దూరంగా ఉండాలని తెలిపారు. అనంతరం కళాశాల టాపర్లకు గోల్డ్మెడల్, బిగాల కృష్ణమూర్తి ట్రస్ట్ నుంచి రూ.10వేల చెక్కు, సర్టిఫికెట్ను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ భారతి, పూర్వ విద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి తోట రాజశేఖర్, సహా అధ్యక్షుడు కేఎల్వీ రమణ, సంయుక్త కార్యదర్శి సత్యనారాయణ, వినోద్, మోహన్ కుమార్, బాలచందర్, బాబా శ్రీనివాస్, వై గణేశ్, కళాశాల అధ్యాపకులు నాగరాజ్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘తైక్వాండో’ పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారుడు
మోపాల్: ఏషియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ తైక్వాండో చాంపియన్షిప్ పోటీల్లో బిగ్ ఫైటర్స్ తైక్వాండో హబ్ క్రీడాకారుడు కుమ్మరి మోక్షిత్ సత్తా చాటినట్లు మాస్టర్ నరహరి నాయక్ తెలిపారు. హైదరాబాద్లో సోమవారం చాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరహరి నాయక్ మాట్లాడుతూ మోక్షిత్ అద్భుతమైన ప్రతిభ కనబర్చాడన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం ఆనందంగా ఉందన్నారు. మోక్షిత్ విజయం సాధించడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేశారు.వేల్పూర్: వేల్పూర్ మండలం రామన్నపేట్ గ్రా మాభివృద్ధి కమిటీని రద్దు చేసినట్లు వీడీసీ అధ్యక్షుడు గుమ్ముల కిషన్, ఉపాధ్యక్షుడు రాజేశ్వర్, క్యాషియర్ లింబాద్రి, సభ్యులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీడీసీని రద్దు చేసినట్లు ఇన్చార్జి తహసీల్దార్ శ్రీకాంత్, ఎస్సై సంజీవ్కు వినతిపత్రం అందజేశారు. ఇక నుంచి గ్రామంలో వీడీసీ ఉండదని వారు పేర్కొన్నారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న ఎంఈడీ పరీక్షలు సోమవారం ముగియగా, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో ఎంఈడీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 1, 2, 3, 4వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలలో మొత్తం 30 మందికి 28 మంది హాజరుకాగా ఇద్దరు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. తెయూ క్యాంపస్ కళాశాలలో జరిగిన ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల్లో మొత్తం 28 మందికి 26 మంది హాజరు కాగా ఇద్దరు గైర్హాజరైనట్లు ప్రొఫెసర్ చంద్రశేఖర్ తెలిపారు. నిజామాబాద్నాగారం: సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నీరడి లక్ష్మణ్ నియమితులయ్యారు. సోమవారం కౌన్సిల్ నేషనల్ చైర్మన్ కె విజయ్కుమార్ నియామకపత్రాన్ని అందజేశారు. జిల్లాలో హ్యుమన్ రైట్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. డ్రంకెన్డ్రైవ్ కేసులో రెండు రోజుల జైలు భిక్కనూరు: మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తికి న్యాయమూర్తి చంద్రశేఖర్ రెండు రోజుల జైలు శిక్షతోపాటు రూ.1000 జరిమానా విధించినట్లు భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు సోమవారం తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రానికి చెందిన స్వామి మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. దీంతో స్వామిని అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా రెండ్రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. -
దౌర్జన్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి
తోటలకు వెళ్లేందుకు దారి కోసం తమ భూమి ఇవ్వాలని కొందరు వ్యక్తులు ఇబ్బంది పెడుతున్నారని బాల్కొండ మండలం వన్నెల(బి) గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. తమ భూమిలో నుంచి ఇతర కులస్తులు దారి తీసుకునేందుకు దౌర్జన్యం చేస్తున్నారని పేర్కొన్నారు. విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేతనాలు చెల్లించండి రెండు నెలల వేతనాలను చెల్లించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు, పారిశుద్ధ్య కార్మికులు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం ఉమ్మడి జిల్లా సంయుక్త కార్యదర్శి రమేశ్ మాట్లాడుతూ రెండు నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదని పేర్కొన్నారు. -
‘బోను ఏర్పాటు చేస్తాం’
మద్నూర్: చిరుత పులి జాడ కోసం గాలిస్తున్నామని, దానిని పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేస్తా మని అటవీశాఖ రేంజ్ అధికారి సంతోష తెలిపారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యలయానికి సో మవారం మద్నూర్ గ్రామస్తులు, రైతులు తరలి వచ్చి చిరుత పులిని పట్టుకోవాలని తహసీల్దార్ ము జీబ్కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం తహసీల్ కార్యలయానికి వచ్చిన అటవీశాఖ అధికారులు రై తులతో సమావేశమయ్యారు. పులిని పట్టుకోవడాని కి డ్రోన్ కెమెరాలను, బోన్లను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా అ టవీశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి సుజాత, బీట్ అధికారి రాంచందర్, రైతులు బాల్కిషన్, రాములు, హన్మండ్లు, పరశురాం, అజయ్ తదితరులు పాల్గొన్నారు. నాగిరెడ్డిపేట: మాల్తుమ్మెద విత్తన క్షేత్రంలో ఈనెల 19న మధ్యాహ్నం పంట ఉత్పత్తులను వేలం వేయనున్నట్లు క్షేత్రం ఏడీఏ ఇంద్రసేన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విత్తన క్షేత్రంలో విత్తనం కోసం ఉపయోగపడని కేఎన్ఎం–1638 సన్నరకానికి చెందిన 492 క్వింటాళ్ల ధాన్యం నిల్వ ఉందని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విత్తన క్షేత్ర కార్యాలయంలో వీటిని వేలం వేయనున్నట్లు తెలిపారు. వేలంపాటలో పాల్గొనేవారు రూ.2 వేల డిపాజిట్ చెల్లించాలని సూచించారు. వేలం తర్వాత నిర్ధారించిన సొమ్ములో సగం డబ్బులను రెండురోజులో చెల్లించాలని, మిగతా మొత్తాన్ని వారంలో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు వేలం పాటలో పాల్గొనాలని సూచించారు. -
మహిళా సంఘాల్లో నగదు రహిత లావాదేవీలు
నందిపేట్ (ఆర్మూర్): మహి ళా సంఘాల్లో నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందు కు జిల్లాలో పైలట్ మండలంగా నందిపేట్ను ఎంపిక చేశా రు. సోమవారం మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయంలో గ్రామ సంఘం ప్రతినిధులు, అసిస్టెంట్లకు ఒక్కరోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర సెర్ప్ అధికారి వెంకట్ మాట్లాడుతూ.. వీవో అధ్యక్షులు, సిబ్బంది డిజిటల్ లా వాదేవీలపై చిన్న సంఘ సభ్యులందరికీ అవగాహన కల్పించాలన్నారు. గూగుల్ పే, ఫోన్ పే నుంచి రోజుకు రూ. లక్ష వరకు, చిన్న మొబైల్ నుంచి రోజుకు రూ. 5000 వరకు లావాదేవీలు చేసుకోవచ్చని వివరించారు. రేపటి నుంచి అన్ని గ్రామాలలో అన్ని సంఘాలకు సీసీలు, సీఆర్పీలు, వీవోఏలు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏడీఆర్డీవో మధుసూదన్, డీపీఎం సంధ్యారాణి, జిల్లా సమాఖ్య పాలకవర్గ సభ్యులు, ఏపీఎం ఖాందేశ్ గంగాధర్, బ్యాంకు అధికారులు, సీసీలు, సీఆర్పీలు, వీవోఏలు, వీవో ప్రతినిధులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ఎస్ఐఆర్
● పొరపాట్లు, తప్పిదాలకు తావుండొద్దు ● వీసీలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి సుదర్శన్రెడ్డి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)–2026 ప్రక్రియను అన్ని నియోజకవర్గాల పరిధిలో పకడ్బందీగా చేపట్టేందుకు సన్నద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్రెడ్డి సూచించారు. కలెక్టర్, ఈఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ఆయన ఎస్ఐఆర్ ప్రక్రియపై మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నుంచి ఆదేశాల వచ్చిన వెంటనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను చేపట్టాలని, అందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. బీహార్ రాష్ట్ర సాధారణ ఎన్నికల దృష్ట్యా ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యిందని గుర్తు చేశారు. మన వద్ద సైతం ఎలాంటి పొరపాట్లు, తప్పిదాలకు తావులేకుండా ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. 2002 ఓటరు జాబితాతో 2025 జాబితాను సరిపోల్చుకోవాలని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ నిర్వహణపై సూపర్వైజర్లు, బీఎల్వోలకు శిక్షణ అందించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ టి వినయ్కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, కిరణ్మయి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, ఎన్నికల విభాగం సిబ్బంది సాత్విక్, జితేందర్ తదితరులు పాల్గొన్నారు. పక్కాగా పోషణ మాసం.. పిల్లల్లో పోషలోపాన్ని అధిగమించేందుకు పోషకాహారాన్ని అందించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా, నిజాయితీగా పని చేయాలని కలెక్టర్ టి వినయ్కృష్ణారెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి నిర్వహించనున్న పోషణ మాసం కార్యక్రమాన్ని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం సాయంత్రం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. పోషణమాసం కార్యక్రమాల అమలు తీరును సమీక్షించి, అధికారులకు సూచనలు చేశారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు పోషణ మాసాన్ని పక్కాగా నిర్వహించాలన్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపంపై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు. చిన్న పిల్లలు, మహిళల్లో పోషకాహార లోపాన్ని గుర్తించి పరిష్కరించడమే పోషణ మాసం ముఖ్య ఉద్దేశమని అన్నారు. డీఆర్డీవో సాయాగౌడ్, డీడబ్ల్యూవో రసూల్ బీ, డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ, డీఈవో అశోక్, ఐసీడీఎస్ సీడీపీవోలు, సూపర్జర్లు పాల్గొన్నారు. -
ప్రాజెక్టులకు మళ్లీ పోటెత్తిన వరద
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి రెండు లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ● నిజాంసాగర్లోకి 38వేల క్యూసెక్కులుబాల్కొండ: ఎగువ ప్రాంతాల నుంచి సోమవారం రాత్రి 7గంటలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి వరద నీరు పోటెత్తింది. ఆదివారం నుంచి నిలకడగా లక్ష క్యూసెక్కులు వచ్చిన వరద సోమవారం సాయంత్రానికి లక్షా 33 వేల క్యూసెక్కులకు చేరుకుంది. రాత్రి ఇన్ఫ్లో లక్షా 51 వేల క్యూసెక్కులకు పెరగడంతో మొదట 26 వరద గేట్ల ద్వారా లక్షా 33 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మళ్లీ వరద పెరడగంతో రాత్రి 7 గంటలకు 36 వరద గేట్ల ద్వారా లక్షా 82 వేల క్యూసెక్కులకు నీటి విడుదలను పెంచారు. ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా 8 వేలు, కాకతీయ కాలువకు 4 వేలు, ఎస్కెప్ గేట్ల ద్వారా 5 వేలు, సరస్వతి కాలువకు 800, లక్ష్మికాలువకు 200, అలీసాగర్ లిప్టు ద్వారా 180, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 684 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా సోమవారం రాత్రి నిండుకుండలా ఉంది. నిజాంసాగర్ నుంచి నాలుగు గేట్ల ద్వారా.. నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 38,829 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 4 వరద గేట్ల ద్వారా 27,128 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నామన్నారు. ప్రధాన కాలువకు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు(17.8 టీఎంసీలు) కాగా 1,404.72 అడుగుల(17.397 టీఎంసీలు) నీరు నిల్వ ఉందన్నారు. ఎస్సారెస్పీ నుంచి విడుదలవుతున్న నీరు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి మంజీరలోకి.. -
స్కానింగ్ సెంటర్లపై నిఘా ఉచాలి
నిజామాబాద్నాగారం: స్కానింగ్ కేంద్రాల పనితీరుపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులను, సలహా సంఘ సభ్యులను జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిణి రాజశ్రీ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశాన్ని సోమ వారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ.. ప్రతి స్కానింగ్ కేంద్రాన్ని తప్పుకుండా మూడు నెలలకోసారి తనీఖీ చేయాలన్నారు. రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించి రూ పొందించాలన్నారు. స్కానింగ్ సెంటర్లలో తాగునీరు, మూత్రశాలలు ఉండాలని, ధరల పట్టిక, ఐ ఈసీ, సమాచార సూచికలు, వేచి ఉండే గది అందుబాటులో ఉండాలన్నారు. అర్హత లేని వారు స్కానింగ్కు రిఫర్ చేయొద్దని, రేడియాలాజిస్ట్, గైనకాలజిస్ట్ లేకుండా స్కానింగ్ సెంటర్లను నిర్వ హించే వారిపై చట్ట ప్రకారం చర్యలుంటాయని స్పష్టం చేశారు. కొత్తగా రెండు స్కానింగ్ సెంటర్లకు అనుమతులివ్వడంతోపాటు నాలుగు సెంటర్లకు రెన్యువల్ చేసినట్లు తెలిపారు. ఆర్మూర్ డివిజన్లో ఓ స్కానింగ్ కేంద్రాన్ని మూసివేయాలని సభ్యులు తీర్మానం చేశారు. సమావేశంలో పీవో పీసీఎన్డీటీ డాక్టర్ సుప్రియ, పీవో ఎంసీహెచ్ డాక్టర్ శ్వేత, సభ్యులు పాల్గొన్నారు. మూడు నెలలకోసారి తనిఖీలు చేయాలి అర్హత లేకుండా స్కానింగ్కు రిఫర్ చేయొద్దు డీఎంహెచ్వో రాజశ్రీ -
దిశ సమావేశం 23కు వాయిదా
డొంకేశ్వర్(ఆర్మూర్): ఈ నెల 16న ఎంపీ ధర్మపురి అర్వింద్ అధ్యక్షతన జరగాల్సిన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ (దిశ) సమావేశం అనివార్య కారణాలతో 23వ తేదీకి వాయిదా పడినట్లు డీఆర్డీవో సాయాగౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దిశ కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. ఖలీల్వాడి: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 23 ఫిర్యాదులు వచ్చాయి. కమిషనర్ ఆఫ్ పోలీ స్ సాయిచైతన్య ఫిర్యాదుదారుల సమస్యల ను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల ని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమే యం లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవ లను వినియోగించుకోవాలని తెలిపారు.వరల్డ్ బాక్సింగ్లో పతకాల పంట ● జిల్లాకు చెందిన కోచ్ ఎత్తేసామొద్దీన్ నేతృత్వంలో..నిజామాబాద్నాగారం: ప్రపచం బాక్సింగ్ చాంపియన్షిప్లో జిల్లాకు చెందిన కోచ్ ఎత్తేసామొద్దీన్ నేతృత్వంలో మన దేశానికి చెందిన బాక్సింగ్ క్రీడాకారిణిలు జాస్మిన్, మీనాక్షి ఉదాలు బంగారు పతకాలు సాధించారు. నుపుర్ షియోరాన్ (రజతం), పూజారాణి (కాంస్య) పతకాలు సాధించారు. ఇంగ్లాడ్లో ఈ నెల 4 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించిన వరల్డ్ బాక్సింగ్ టోర్నమెంట్లో మొత్తం నాలుగు పతకాలుసాధించా రు. భారత బాక్సింగ్ జట్టుకు కోచ్గా జిల్లా కు ఎత్తేసామొద్దీన్ వ్యవహరించడంతో జిల్లా కు చెందిన క్రీడాకారులు, క్రీడాభిమానులు ఆనందనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు చెందిన బాక్సింగ్ క్రీడాకారులు, జాతీయస్థాయి అథ్లెట్, గోల్డ్ మెడలిస్టు సయ్యద్ ఖైసర్ ఎత్తేసామొద్దీన్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
లేబర్ రేట్లు పెంచాలని పనుల నిలిపివేత
సుభాష్నగర్: లేబర్ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ సర్కిల్ పరిధిలో కొనసాగుతున్న అన్ని పనులను మంగళవారం నుంచి నిలిపేస్తున్నామని ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె వెంకట్రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రవీందర్కు వినతిపత్రం అందజేశారు. అంతకుముందు పవర్హౌస్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. 2021లో ఉన్న లేబర్ రేట్లకు, ప్రస్తుతమున్న రేట్లకు వ్యత్యాసం ఉందని, దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని అన్నారు. ఈవిషయాన్ని పలుమార్లు సీఎండీ దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు మంగళవారం నుంచి పనులు ఆపేయాలని అసోసియేషన్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. పరిస్థితిని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి సమ్మెకు సహకరించి న్యాయం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు రవి యాదవ్, సంతోష్, భాస్కర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
బాధిత రైతులకు ఊరట
● పొలాల్లో ఇసుక మేటలు తొలగిస్తున్న ఉపాధి కూలీలుడొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో ఇటీవల కురిసిన భా రీ వర్షాల కారణంగా పంటపొలాల్లో వేసిన మట్టి, ఇసుక మేటల తొలగింపు సోమవారం నుంచి మొదలైంది. ఎస్టిమేషన్లు వేసిన అధికారులు ఉపాధి కూ లీల ద్వారా తొలగిస్తున్నారు. ఖర్చు లేకుండా ప్రభుత్వమే చర్యలు చేపట్టడంతో బాధిత రైతులకు కొంత ఊరట లభిస్తోంది. జిల్లాలో మొత్తం 270 ఎకరా ల పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. వర్ని, వేల్పూర్, ఇందల్వాయి, ధర్పల్లి, భీ మ్గల్, సిరికొండ మండలాలు కలిపి 389 మంది రైతులు బాధితులుగా ఉన్నారు. వరికి ఎక్కువగా నష్టం వాటిల్లగా, జరిగిన నష్టం నుంచి కోలుకునే చర్యల్లో భాగంగా ప్రభుత్వం పొలాల్లో వేసిన ఇసుక, మట్టిని ఉపాధి కూలీల సహాయంతో తొలగింపజేస్తోంది. ఇటు ఉపాధి కూ లీలకు కూడా పని లభిస్తోంది. వా రం, పది రోజుల్లోగా పొలాల్లోని ఇసుక, మట్టి మేటలను తొలగించాలని సిబ్బందికి ఆదేశాలిచ్చామని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయాగౌడ్ తెలిపారు. -
హిందువులను స్వయంసేవకులుగా చేయడమే లక్ష్యం
సుభాష్నగర్: ప్రతీ హిందువును స్వయంసేవక్గా తయారు చేయడమే శతాబ్ది ఉత్సవాల లక్ష్యమని ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘ్ చాలక్ డాక్టర్ కాపర్తి గురుచరణం అన్నారు. ఇందుకోసం రానున్న విజయదశమి నుంచి ఏడాది పాటు వివిధ కార్యక్రమాలను రూ పొందించినట్లు తెలిపారు. నగరంలోని న్యూ హౌసింగ్బోర్డ్ కాలనీ కమ్యూనిటీ హాల్లో ఆదివారం ఆర్ఎస్ఎస్ కంఠేశ్వర్, నాందేవ్వాడ ఉప నగరాల ఆధ్వర్యంలో గణవేశ్ధారి స్వయంసేవకుల సంఘీక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గురుచరణం ముఖ్య వక్త గా విచ్చేసి, మాట్లాడారు. సామాజిక సమరసత, ప్రకృతి పరిరక్షణ, కుటుంబ వ్యవస్థ సంరక్షణ ఆధారంగా బాధ్యతాయుతమైన సమాజాన్ని నిర్మించడం కోసమే సంఘం పని చేస్తుందన్నారు. అంతకు ముందు హౌసింగ్ బోర్డ్ కాలనీలో పథ సంచలన్ నిర్వహించారు. నగర కార్యవాహ అర్గుల సత్యం, ఉపనగర కార్యవాహలు మధుకర్, ప్రవీణ్ తదితరులు పా ల్గొన్నారు. -
చికిత్స పొందుతూ వివాహిత..
లింగంపేట(ఎల్లారెడ్డి): ఆత్మహత్యకు యత్నించిన ఓ వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై దీపక్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని అయ్యపల్లితండాకు చెందిన దేవసోత్ సుజిత(20) అత్తింటివారి వేధింపులు భరించలేక ఆగస్టు 10 గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు.. ఖలీల్వాడి: నిజామాబా ద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో గుర్తుతెలియ ని వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఐదో టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపారు. నగరంలోని న్యాల్కల్ రోడ్లోగల కల్లు బట్టి సమీపంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి స్పృహ లేని స్థితిలో గుర్తించారు. వెంటనే సదరు వ్యక్తిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యా హ్నం మృతిచెందాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడు లేత ఆరెంజ్ రంగు, కలర్ ఫుల్ షర్ట్, ముదురు నీలి రంగు ప్యాంటు ధరించినట్లు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 65 ఏళ్ల వరకు ఉంటాయని, న్యాల్కల్ రోడ్లో భిక్షాటన చేసేవాడని అన్నారు. అతని దగ్గర ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ఎవరికై నా సమాచారం తెలిస్తే ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలన్నారు. నవీపేట: నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో గుర్తుతెలియ ని వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. నవీపేట ఎస్సై తిరుపతి తెలిపిన వివరాలు ఇ లా.. నవీపేట శివారులో ని అయ్యప్ప ఆలయ సమీపంలో ఈనెల 12న గుర్తుతెలియని ఓ వ్యక్తి అస్వస్థతకు గురైయ్యాడు. వెంటనే స్థానికులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. మృతుడి వయస్సు సుమారు 36ఏళ్లు ఉంటాయని ఎస్సై అన్నారు. -
షార్ట్సర్క్యూట్తో రెండు ఇళ్లు దగ్ధం
ధర్పల్లి: మండల కేంద్రంలోని గోసంగి కాలనీలో షార్ట్ సర్క్యూట్తో రెండు ఇళ్లు దగ్ధమైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా.. గోసంగి కాలనీలో సల్ల భాగ్య, తురపాటి సాయమ్మ కుటుంబ సభ్యులతో కలిసి పాత సా మాన్ల కొనుగోలు వ్యాపారం చేసుకుంటూ నివాసం ఉంటున్నారు. ఈక్రమంలో వారు ఎప్పటిలాగానే ఆదివారం ఉదయం బయటకు వెళ్లారు. మధ్యాహ్నం సల్ల భాగ్య ఇంట్లో విద్యుత్ తీగలు కాలిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనంతరం పక్కన ఉన్న తూరపాటి సాయమ్మ ఇంట్లోకి మంటలు వ్యాపించాయి. స్థానికులు గమనించి మంటలను ఆర్పి వేశారు. కానీ అప్పటికే రెండు ఇళ్లలోని సామాన్లు పూర్తిగా కాలి బూ డిదయ్యాయి. సల్ల భాగ్య ఇంట్లో తులం బంగారం, వెండి ఆభరణాలు, రూ.3లక్షల నగదు కాలిపోగా, తూరపాటి సాయమ్మ ఇంట్లో కొంత నగదుతోపాటు వంట సామగ్రి, దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు కాలి పోయాయి. సుమారు రెండు ఇళ్లల్లో కలిపి సుమారు రూ. 5లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధి తులు వాపోయారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు వేడుకున్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ బాలరాజ్ బాధిత కుటుంబాలను పరామర్శించి వంట సామగ్రి, దుస్తులను అందజేశారు. -
కరెంట్షాక్తో నెమలి మృతి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని కృష్ణాజివాడి గ్రామ శివారు లో కరంట్ వైర్లకు నెమలి తగిలి షాక్తో మృతిచెందినట్లు గ్రా మస్తులు తెలిపారు. గ్రామంలో శనివారం రాత్రి అకస్మాత్తుగా కరంటు సరఫరా నిలిచిపోవడంతో ట్రాన్స్కో అధికారులు, సిబ్బంది వచ్చి స్తంభాలను, వైర్లను పరిశీలించారు. సమస్యను గుర్తించకపోవడంతో వేరే లైన్కు కనెక్షన్ ఇచ్చారు. తిరిగి ఆదివారం అధికారులు గ్రామశివారులో గల విద్యుత్ స్తంభాలు, వైర్లను పరిశీలించారు. శివారులోని వైర్లపై నెమలి పడి చనిపోయినట్లు కనిపించిందన్నారు. దీంతో వైర్లపై మృతి చెంది ఉన్న నెమిలిని కిందికి తీసి యథావిధిగా కరంటు కనెక్షన్ ఇచ్చారు. -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
మోపాల్/ఖలీల్వాడీ: నగరశివారులోని బోర్గాం(పి) జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల 1991–92 బ్యా చ్ విద్యార్థులు, గురువులు ఆదివారం కిసాన్ ము న్నూరు కాపు కల్యాణ మండపంలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 33 ఏళ్ల తర్వాత విద్యార్థులందరూ ఒకే వేదికపై కలుసుకోవడంతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ అనాటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్నారు. నాడు చదువు నే ర్పిన ఉపాధ్యాయులను సమ్మేళనానికి ఆహ్వానించి, సన్మానించారు. పూర్వ విద్యార్థి, సినీ రచయిత బండోజి సతీష్ తన వ్యాఖ్యానంతో ఆకట్టుకుంటూ గు రుశిస్యుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆహ్లాదపరిచాడు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. యోగా గురువుకు సన్మానం రుద్రూర్: మండల కేంద్రానికి చెందిన యోగా గురువు డాక్టర్ విశ్వనాథ్ మహాజన్ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆదివారం సన్మానించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశేష సేవలందించిన వారిని సికింద్రాబాద్లో ఘనంగా సత్కరించారు. ఇటీవల యోగా ఆంధ్రాలో భాగంగా రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సెమినార్కు విశ్వనాథ్ మహాజన్ హాజరై యోగా ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో భారత స్వాభిమాన్ ట్రస్ట్ పతంజలి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్రావ్ పాల్గొన్నారు. -
తల్లిని చంపిన కొడుకు అరెస్టు
బాన్సువాడ: తల్లిని సాకలేక మంజీర నదిలో తోసేసిన కొడుకును అరెస్ట్ చేసినట్లు బాన్సువాడ డీఎస్పీ విఠల్రెడ్డి తెలిపారు. బాన్సువాడ డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. బోర్లం గ్రామానికి చెందిన సాయవ్వ(75)కు కొడుకు బాలయ్య ఉన్నాడు. వృద్ధురాలైన సాయవ్వ గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురయింది. ఆమెకు సేవలు చేయడానికి ఇంట్లో ఎవరూ లేరు. దీంతో కొడుకు బాలయ్య ఆమెను సాకలేక ఈనెల 8న ఓ మైనర్తో కలిసి సాయవ్వను బైక్పై ఎక్కించుకొని బోలక్పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి బ్రిడ్జి పైనుంచి నదిలోకి తోసివేశాడు. ఈ 11న సాయవ్వ మృతదేహం నదిలో తేలడంతో ఈనెల 12న బోర్లం గ్రామ పెద్దలు బాలయ్య వద్ద ఉన్న మైనర్ను పట్టుకొని ప్రశ్నించారు. అతడు సాయవ్వను కొడుకే నదిలో పడేశాడని తెలిపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కొడుకు కోసం గాలింపు చేపట్టారు. ఈనెల 14న నిందితుడు ఎర్రోళ్ల బాలయ్యతోపాటు మైనర్ కలిసి బోర్లం నుంచి వస్తుండగా కొయ్యగుట్ట చౌరస్తా వద్ద అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. వారి వద్ద ఉన్న బైక్ను, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. బాలయ్యను రిమాండ్కు తరలించామని, మైనర్ను జువైనల్ అబ్జర్వేషన్ హోంకు తరలించామని అన్నారు. -
అంగన్వాడీల ఆందోళన బాట
నిజామాబాద్నాగారం: సమస్యల పరిష్కారానికి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఉద్యమబాట పట్టాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల బాగోగులను అంగన్వాడీ టీచర్లు, ఆయాలు చూసుకుంటున్నారు. నిత్యం వారికి పాలు, గుడ్లు, పౌష్టికాహారంతోపాటు ప్రీ ప్రైమరీ విద్యను అందిస్తున్నారు. ఇవే కాకుండా శ్రీమంతాలు, అక్షరాభ్యాసం తదితర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే, కనీస వేతనం, ఉద్యోగ భద్రత లేదని, పనిభారం పెరుగుతోందని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రూ.18వేల వేతనం, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేసి, ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవే కాకుండా ఖాళీలను భర్తీ చేయాలని, మూడు నెలల పీఆర్సీ, సమ్మె కాలపు వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర డిమాండ్ల సాధనకు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా సోమవారం మంత్రుల ఇళ్లను ముట్టడించి ధర్నా చేపట్టనున్నారు. అయినా స్పందించక పోతే 25న చలో సెక్రటేరియట్, అక్టోబర్ 8న జిల్లా కేంద్రాల్లో 5కి.మీల పాదయాత్ర, 17వ తేదీ నుంచి ఆన్లైన్ సమ్మె చేపట్టాలని నిర్ణయించారు.జిల్లాలో సీడీపీవో ప్రాజెక్టులు 5 మొత్తం అంగన్వాడీలు 1501 బాలింతలు 61,200 గర్భిణులు 9821 చిన్నారులు 81,262 టీచర్లు 1427 ఆయాలు 901 నేడు మంత్రుల ఇళ్ల ఎదుట ధర్నాలు 25న చలో సెక్రటేరియట్ అక్టోబర్ 8న జిల్లా కేంద్రాల్లో పాదయాత్ర 17 నుంచి ఆన్లైన్ సమ్మెకు పిలుపుఏళ్ల తరబడిగా సమస్యలు పరిష్కరించాలని ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. పనిభారం పెరిగిపోతుంది. జీతాలు తక్కువగానే ఉన్నాయి. ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకే ఉద్యమిస్తున్నాం. – పి స్వర్ణ, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిమేము న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వాల ఎదుట ఉంచాం. గత ప్రభుత్వాలు నమ్మించి మోసం చేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సమస్యలు పరిష్కరించాల్సిందే. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో ఆందోళన చేస్తాం. – కై రి దేవగంగు, జిల్లా అధ్యక్షురాలు -
పద్మశాలి వసతిగృహం అధ్యక్షుడిగా యాదగిరి
నిజామాబాద్ నాగారం: నగరంలోని కోటగల్లి పద్మశాలి వసతిగృహం అధ్యక్షుడిగా దీకొండ యాదగిరి గెలుపొందారు. ఆయన ప్యానెల్లోని 11 మంది అభ్యర్థులు విజయం సాధించారు. ఎన్నికల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ఓటర్లు పాల్గొన్నారు. నగరంలోని పద్మశాలి ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్లో 85 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 894 ఓట్లకు 757 ఓట్లు పోలయ్యాయి. 11 పదవులకు 34 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. దీకొండ యాదగిరి, ఎస్ఆర్ సత్యపాల్, కొండి రమేశ్ ప్యానెళ్లు బరిలో నిలిచాయి. సాయంత్రం ఐదు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కాగా రాత్రి వరకు కొనసాగింది. యాదగిరికి 441 ఓట్లు రాగా, సమీప అభ్యర్థి సత్యపాల్కు 236 ఓట్లు వచ్చాయి. ఎన్నికల అధికారిగా న్యాయవాది రేగొండ గంగాప్రసాద్, అసిస్టెంట్ ఎన్నికల అధికారులుగా పగిడిమారి యాదగిరి, కర్లం రాములు వ్యవహరించారు. ఎన్నికలకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నూతన కార్యవర్గం ఇదే.. అధ్యక్షుడిగా దీకొండ యాదగిరి, ప్రధాన కార్యదర్శి గంట్యాల వెంకటనర్సయ్య, కోశాధికారిగా కన్న రాజు, ఉపాధ్యక్షులుగా గుజ్జేటి వెంకటనర్సయ్య, ఎనగందుల మురళి, నూకల విజయసారథి, సహాయ కార్యదర్శి బొమ్మెర తులసీప్రసాద్, లక్కపత్రి దేవిదాస్, గాలిపల్లి వెంకటేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కై రంకొండ మురళి, కల్చరల్ సెక్రెటరీగా తన్నీరు శ్రీనివాస్ ఎన్నికయ్యారు.