NTR district Latest News
-
గంగాభవానీ అమ్మవారిని తాకిన సూర్యకిరణాలు
కోడూరు: భక్తుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న కోడూరు గంగాభవానీ అమ్మవారి మూలమూర్తిని ఆదివారం ఉదయం సూర్యకిరణాలు తాకాయి. ఉదయం 6.47గంటల సమయంలో సూర్యకిరణాలు నేరుగా గర్భాలయంలో ఉన్న అమ్మవారి శిలపై పడ్డాయి. అమ్మవారి శిలకు ఇత్తడి తొడుగు కూడా ఉండడంతో ఆ కిరణాల వెలుగుల మధ్య అమ్మవారు ప్రకాశించారు. గతంలో ఎన్నడూ ఇలా నేరుగా అమ్మవారిపై సూర్యకిరణాలు పడలేదని, తొలిసారి అమ్మవారి శిలను సూర్యకిరణాలు తాకాయని ఆలయ ప్రధానార్చకుడు కోమ్మూరి శ్రీనివాసశర్మ తెలిపారు. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దరఖాస్తు గడువు పెంపు చిలకలపూడి(మచిలీపట్నం): బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ కులాల వారికి స్వయం ఉపాధి పథకాల కోసం దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 25వ తేదీ మంగళవారం వరకు పొడిగించినట్లు బీసీ కార్పొరేషన్ ఈడీ కె.శంకరరావు ఆదివారం తెలిపారు. ఈ–బీసీ, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్కు సంబంధించిన లబ్ధిదారులకు వివిధ పథకాల ద్వారా సబ్సిడీ మంజూ రు చేసేందుకు దరఖాస్తుదారులు ఏపీవోబీఎంఎంఎస్ ద్వారా పేరును ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. ప్రస్తుతం ఈ గడువు 20వ తేదీ వరకు పొడిగించారన్నారు. కాపు కార్పొరేషన్కు సంబంధించి వయో పరిమితిని 21 నుంచి 60 ఏళ్లుగా నిర్ణయించారన్నారు. అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ‘సబ్కా కృష్ణా’ నూతన కార్యవర్గం ఎన్నిక పటమట(విజయవాడ తూర్పు): ేస్టట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఉమ్మడి కృష్ణా జిల్లా శాఖ(సబ్కా కృష్ణా) 2025–26 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. ఆదివారం లబ్బీపేటలోని అసోసియేషన్ కార్యాలయంలో కృష్ణా జిల్లా సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గౌరవాధ్యక్షుడిగా కలిదిండి కృష్ణం రాజు, కృష్ణాజిల్లా అధ్యక్షుడిగా మండ వ సాయి, కార్యదర్శిగా లింగం రవికిరణ్, ఉపాధ్యక్షుడిగా కోటిరెడ్డి, మురళీధర్ ఎన్నికయ్యారు. ట్రెజరర్గా వెంకటేశ్వర రాజు, జాయింట్ సెక్రటరీలుగా రవికుమార్, సురేష్ కుమార్, భూపతి రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా పూర్ణ, శ్రీధర్, వీరబ్రహ్మం, శ్రీనివాసరెడ్డి, శేషగిరి రావు, శ్రీనివాసరావు, హరికృష్ణలు ఎన్నికవ్వగా అడ్వైజర్లుగా సకలారెడ్డి, రత్నారావు, అమర్ బాబు, సుధీర్ ఎన్నికయ్యారు. గ్రంథాలయ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా గుమ్మా పటమట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం, కృష్ణాజిల్లా శాఖ అధ్యక్షుడిగా ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ గుమ్మా సాంబశివరావు, కార్యదర్శిగా కె.బి.ఎన్.కళాశాల గ్రంథపాలకుడు వై. శ్రీనివాసరాజు ఎన్నికయ్యారు. జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం ఆదివారం ఉదయం బెంజిసర్కిల్ వద్ద ఉన్న సర్వోత్తమ భవనంలో జిల్లా శాఖ అధ్యక్షుడు వేములపల్లి కేశవరావు అధ్యక్షతన జరిగింది. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావి శారద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మైలవరం లకిరెడ్డి బల్రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల లైబ్రేరియన్ టి. సాంబశివరావు ఉపాధ్యక్షుడిగా, కృష్ణాజిల్లా అభ్యుదయ రచయితల సంఘ కార్యదర్శి పి.అజయ్ కుమార్ సహాయ కార్యదర్శిగా, మరో ఐదుగురిని కార్యవర్గ సభ్యులుగాను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో గ్రంథాలయరంగ పరిస్థితులపై సభ్యులు చర్చించి, పలు అంశాలపై తీర్మానించారు. -
గీత.. కన్నీటి గాథ!
జి.కొండూరు: గ్రామీణ ప్రాంతాలలో ఫామ్ వైన్గా పిలుచుకునే తాటికల్లు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. తరతరాలుగా తాటికల్లును తీస్తూ ప్రజలకు అందిస్తున్న గౌడన్నలు ఆ వృత్తిని వదిలేస్తున్నారు. దశాబ్దాలుగా ప్రభుత్వాల ఆదరణ కరువై ఆర్థికంగా ఎదుగుదల లేక.. ఆరోగ్యం సహకరించక, తాటిచెట్లు ఎక్కలేక ఒక్కొక్కరిగా వెనకడుగు వేస్తున్నారు. తాము దశాబ్దాలుగా పడిన కష్టాలు భవిష్యత్తులో తమ కుటుంబాలు పడకూడదనే ఆలోచనతో పిల్ల లను చదివించి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు పంపుతున్నారు. ప్రస్తుతం నలభై ఏళ్లు పైబడిన వారు గౌడ సామాజిక వర్గంలో ఒకటి రెండు శాతం మంది మాత్రమే ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తు తరాలు తాటికల్లు గురించి పుస్తకాలలో చదువుకోవాల్సి వచ్చేలా ఉంది. బెల్టు షాపులతో కల్లుకు కాటు.. గతంలో తాటికల్లు లీటరు రూ.60 నుంచి రూ.100 వరకు ప్రాంతాల వారీగా డిమాండ్ను బట్టి విక్రయించేవారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా బెల్టుషాపులను తెరిచి మద్యం విక్రయించడంతో పాటు మద్యం రూ.99కి క్వార్టర్ను అందుబాటులోకి తీసుకురావడంతో కల్లుకు డిమాండ్ తగ్గింది. తక్కువ ధర ఎక్కువ కిక్కు ఇస్తుండడంతో గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్యానికి మేలు చేసే కల్లును వదిలేసి మద్యం వైపు పరుగులు తీస్తున్నారు. దీనితో గీతకార్మికులు తాటి చెట్ల నుంచి తీసిన కల్లును తాగేవాళ్లు లేక పారబోస్తున్నారు. ఒక్క ఆదివారం మినహా మిగతా రోజుల్లో కల్లు విక్రయాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయని చెబుతున్నారు. మితం హితమే.. తాటికల్లు అనేక పోషకాలతో నిండి ఉంటుందని, తాజా కల్లుని మితంగా తీసుకోవడం వల్ల మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పోటాషియంతో పాటు విటమిన్లు బీ,సీ,ఈ, ఐరన్ పుష్కలంగా ఉంటాయంటున్నారు. అదే సమయంలో కల్లుని అతిగా తాగినా, నిల్వ ఉంచి పులిసిన కల్లుని తాగినా ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాల ఆదరణకు నోచుకోని కల్లుగీత కార్మికులు ఒక్కొక్కరిగా వృత్తిని వదిలేస్తున్న గౌడన్నలు ఉమ్మడి కృష్ణాజిల్లాలో 12వేల మంది కల్లుగీత కార్మికులు బెల్టు షాపులతో తీరని నష్టం -
ఆగని కూటమి నేతల దోపిడీ పర్వం
కృష్ణాజిల్లాలో ఇసుకదందా జోరుగా సాగుతోంది. కూటమి నాయకుల కనుసన్నల్లో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. ప్రజాప్రతినిధుల అండతో వారి అనుచరగణం అధికారమే పరమావధిగా క్వారీల్లో ఇసుకను దోచేస్తూ భారీగా లబ్ధి పొందుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో కృష్ణానది పరీవాహక ప్రాంతమైన కంకిపాడు మండలం మద్దూరు, తోట్లవల్లూరు మండలం రొయ్యూరు, నార్తువల్లూరు, ఘంటసాల మండలం శ్రీకాకుళం రేవుల్లో ఇసుక తవ్వకాలు గత కొంతకాలంగా యథేచ్ఛగా సాగు తున్నాయి. గతంలో ఇచ్చిన అనుమతులు ఫిబ్రవరి 6తో ముగియటంతో అధికారులు అదే రీచ్లకు రెన్యువల్ చేసి జూలై 14 వరకు అనుమతులు మంజూరు చేశారు. కూటమి ఎమ్మెల్యేల అండదండలతో ఆయా రీచ్లలో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు రాత్రి, పగలు తేడా లేకుండా జరుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా భారీ లోడుతో లారీలు ఇసుకను రవాణా చేస్తున్నాయి. ఇరవై టన్నుల లోడుతో వెళ్లాల్సిన లారీలు నలభై టన్నులు పైగా ఇసుకను రవాణా చేస్తుండటంతో రహదారులు దెబ్బతింటున్నాయి. ఇసుక లారీల రవాణాతో రోడ్లు దుమ్మెత్తిపోతున్నాయి. అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు ఆయా క్వారీల వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కంచికచర్ల: ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల్లో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. కృష్ణానది, మునేరు, వైరా ఉపనదుల పరీవాహక ప్రాంతాల్లో ఉన్న ఇసుకను తెలుగుతమ్ముళ్లు నిత్యం దోచుకుంటున్నారు. పగలూరాత్రి తేడా లేకుండా రీచ్ల వద్ద అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం కాసరబాద ఇసుక రీచ్లో బిల్లులు లేకుండా ఒక్కో లారీకి రూ.10వేలు చెల్లిస్తే చాలు లోడింగ్ ఎంతైనా ఇసుక నింపుతాం అంటూ నిర్వాహకులు ఓపెన్ ఆఫర్ చేస్తున్నారు. ఇలా రోజుకు రూ. 10లక్షల ఆదాయం దోచుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. తెలంగాణాకు అక్రమ రవాణా.. నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతంలోని ఇసుకకు తెలంగాణాలో భారీ డిమాండ్ ఉంది. మునేరు, కృష్ణానది ఇసుకకు అక్కడ మంచి ధర లభిస్తోంది. లారీ ఇసుక ధర ఖమ్మం, వైరా రూ.45వేల నుంచి రూ. 60వేలు వరకు డిమాండ్ ఉంది. అదే హైద్రాబాద్లో రూ. 90 వేల నుంచి రూ.1లక్ష వరకు ధర ఉంటుంది. అధికారపార్టీకి చెందిన ఎంపీతో పాటు, టీడీపీ నాయకులు ఆయా ప్రాంతాలకు ఇసుకను తరలించి లాభాలు ఆర్జిస్తున్నారు. ఇటీవల తెలంగాణా రాష్ట్ర సరిహద్దులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 14 లారీలను అధికారులు పట్టుకున్నారు. అయినా ఇసుక దందా ఆగటంలేదు. కంచికచర్ల మండలం కీసర మునేరు ఉపనది నుంచి టీడీపీకి చెందిన ఓ చోటా నాయకుడు పగటి పూట ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలించి గ్రామంలో ఓ దేవాలయం సమీపంలో డంపింగ్ చేసి రాత్రి సమయంలో ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నాడు. అటువైపు కనీసం రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు అధికారులపై మండిపడుతున్నారు. నందిగామ మండలం మాగల్లు, పెనుగంచిప్రోలు మండలం శనగపాడు, జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు, చిట్యాల, మునేరు నుంచి కూటమి నేతలు ఇసుకను తవ్వి ఇతర రాష్ట్రాలకు లారీలతో తరలిస్తున్నారు. కృష్ణమ్మకు గర్భశోకం.. కృష్ణానది మధ్యలో ఇసుక తవ్వకాలు భారీగా జరుపుతున్నారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద కృష్ణా నదిలో అధికారుల అనుమతులు లేకుండా కూటమి నాయకులు భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు. నదీ గర్భంలో ఇసుకను తవ్వకూడదనే ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. వాల్టా చట్టానికి తూట్లు పొడిచి నదీ గర్భంలో డ్రెడ్జింగ్ యంత్రాలు వినియోగించి ఇసుకను తవ్వేస్తున్నారు. అయినప్పటికీ ఇల్లు నిర్మించుకునే అసలైన లబ్ధిదారులకు ఇసుక దొరకటం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కృష్ణా, ఎన్జీఆర్ జిల్లాల్లో దోచుకో.. పంచుకో.. ఉచితం మాటున భారీగా ఆదాయార్జన ఎన్టీఆర్ జిల్లాలో ఎంపీ కనుసన్నల్లో అంతా! స్థానిక అధికారపార్టీ ప్రజా ప్రతినిధులకూ వాటాలు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తున్న అక్రమ ఇసుక పట్టించుకోని మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు -
నిబంధనల మేరకు ఖైదీలకు సదుపాయాలు
గన్నవరం: స్థానిక సబ్జైలును ఆదివారం ప్రిన్సిపల్ జిల్లా జడ్జి అరుణసారిక, జిల్లా లీగల్ సెల్ అథారిటీ చైర్మన్ కేవీ రామకృష్ణ సందర్శించారు. సబ్జైలులో ఖైదీల వివరాలను, వారికి కల్పిస్తున్న సదుపాయాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సబ్జైలులోని వంటిగది, ఖైదీల కోసం సిద్ధం చేసిన ఆహర పదార్థాలను పరిశీలించారు. అనంతరం జిల్లా జడ్జి అరుణసారిక మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగా ఖైదీలకు సదుపాయలను కల్పించాలని చెప్పారు. ఖైదీల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని వైద్య పరీక్షలు చేయించాలని సూచించారు. కొత్త భవన సముదాయం నిర్మించాలి.. అనంతరం జిల్లా జడ్జిని బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గారపాటి రవికుమార్, రామకూరి ప్రకాశరావు నేతృత్వంలో నూతన కార్యవర్గం మర్యాద పూర్వకంగా కలిశారు. శిథిలావస్థకు చేరుకున్న పాత భవనం స్థానంలో కోర్టుల కొత్త సముదాయం నిర్మించాలని కోరారు. అనంతరం అరుణసారికను బార్ అసోసియేషన్ కార్యవర్గం సత్కరించింది. ఉపాధ్యక్షుడు ఎల్. వేణుబాబు, కోశాధికారి ఆర్. విమల్కుమార్, మహిళా ప్రతినిధి భాగీరథీ పలువురు సభ్యులు పాల్గొన్నారు. జిల్లా జడ్జి అరుణసారిక -
గంగమ్మ ఒడికి ఆలివ్ రిడ్లే
● సముద్రబాట పట్టిన తాబేళ్ల పిల్లలు కోడూరు: బుల్లి బుల్లి తాబేళ్ల పిల్లలు బుడిబుడి అడుగులు వేసుకుంటూ సముద్రుడి ఒడిలోకి చేరాయి. హంసలదీవి సాగరతీరంలోని పాలకాయతిప్ప సంతానోత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి అయిన 300 తాబేళ్ల పిల్లలను మైరెన్ ఎస్ఐ పూర్ణమాధురి సిబ్బందితో కలిసి ఆదివారం సముద్రంలోకి విడిచిపెట్టారు. సముద్రం కలుష్యాన్ని తగ్గించే అరుదైన ఆలీవ్ రిడ్లే జాతి తాబేళ్ల పిల్లలను కేంద్రంలో నిర్ణీత ఉష్టోగ్రత దగ్గర పెంచుతారు. ఈ కేంద్రంలో ఇప్పటి వరకు రెండు వేల తాబేళ్ల గుడ్లను సేకరించినట్లు అటవీ రేంజర్ శ్రీసాయి తెలిపారు. మే నెలాఖరు లోపు సుమారు ఐదు వేల పిల్లలను సముద్ర బాట పట్టించేలా ప్రణాళిక రూపొందించినట్లు ఆయన వివరించారు. బగళాముఖి సేవలోహైకోర్టు న్యాయమూర్తి చందోలు(కర్లపాలెం): చందోలు శ్రీ బగళాముఖి అమ్మవారిని ఆదివారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గుణరంజన్ సతీమణి విజిత, కుమారుడు గిరీష్, కుమార్తె గ్రీష్మ, రైల్వే కోర్టు జడ్జి పి.రమాదేవి, నూజివీడు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వరరావు దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి, అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి చిత్రపటాలను, ప్రసాదాలను వారికి ఈవో అందజేశారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 20257నేడు కలెక్టరేట్లో ‘పీజీఆర్ఎస్’ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. కిక్కిరిసిన కార్తికేయుని ఆలయం మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ఆదివారం కోలాహలంగా మారింది. నాగపుట్ట, నాగ మల్లి వృక్షం వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఇసుక.. కూటమి నేతలకు కాసులు కురిపిస్తోంది. ఎలాంటి నిబంధనలు వారికి వర్తించడం లేదు. తమకు నగదు చెల్లిస్తే చాలు ఎంతైనా లోడ్ చేసేస్తామంటూ బహిరంగంగా ప్రచారం చేసుకుంటున్నారు. బిల్లు కావాలంటే రూ. 10వేలు, బిల్లు వద్దనుకుంటే రూ. 8వేలు చెల్లిస్తేచాలట.. 20 టన్నుల నుంచి 40 టన్నుల వరకూ లోడ్ చేసేస్తామని ఓపెన్ ఆఫర్ ఇచ్చేస్తున్నారు. అర్ధరాత్రి వేళ లారీలకు లారీలు రాష్ట్ర సరిహద్దులను దాటించేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నామమాత్రపు దాడులతో సరిపెడుతూ కాలం గడుపుతున్నారు. తోట్లవల్లూరు మీదుగా రాత్రి వేళ యథేచ్ఛగా సాగుతున్న ఇసుక రవాణా ఇఫ్తార్ సహరి (సోమ) (మంగళ) విజయవాడ 6.24 4.50 మచిలీపట్నం 6.23 4.49అదే పంథా..న్యూస్రీల్ -
26న వైఎస్సార్ సీపీ ఇఫ్తార్ విందు
పటమట(విజయవాడతూర్పు): రంజాన్ సందర్భంగా ఈ నెల 26వ తేదీన ఇఫ్తార్ విందు ఇస్తున్నట్లు వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. ఆదివారం గుణదలలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించే ఇఫ్తార్ విందులో మాజీ సీఎం, పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటున్నారన్నారు. నగరంలోని గురునానక్ కాలనీలో ఉన్న ఎన్ఏసీ కల్యాణ మండపంలో ఇఫ్తార్ విందు ఇస్తున్నామని, ముస్లింలకు జగన్ మాత్రమే అండగా నిలబడ్డారని, పదవులు ఇవ్వటం నుంచి పథకాలు అమలు చేసే వరకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ఘనత జగన్కే దక్కుతుందని పేర్కొన్నారు. ముస్లిం పక్షపాతి వైఎస్ జగన్.. ఎమ్మెల్సీ రుహుల్లా మాట్లాడుతూ ముస్లింలకు జగన్ చేసిన మేలు మర్చిపోలేనిదన్నారు. ముస్లింల పక్షపాతిగా వైఎస్సార్ సీపీ ఎంతో న్యాయం చేసిందని, జగన్ సారధ్యంలోనే ముస్లింలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందారని కొనియాడారు. పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు ఆసిఫ్ మాట్లాడుతూ ముస్లిం ఉన్నత స్థానాలలో స్థిర పడే విధంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరి జగన్ కూడా తన వంతు సహాయం చేశారని, తండ్రి బాటలో హజ్ యాత్రకు వెళ్లేవారికి అన్ని సౌకర్యాలు, రాయితీలు కల్పించారని పేర్కొన్నారు. ద్రోహులు కూటమి నేతలు.. పార్టీ నందిగామ నియోజకవర్గ ఇన్చార్జ్ మొండి తోక జగన్ మోహనరావు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ హయాంలో ముస్లింలందరికీ మంచి జరిగిందని, కుటమి ప్రభుత్వం ముస్లింలను మోసం చేస్తోందన్నారు. పార్టీ నేత పోతిన మహేష్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ముస్లింలకు ఎప్పుడూ అండగా ఉంటుందని, చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ముస్లింల ద్రోహులని, ముస్లింలకు మంచి జరగటం వారికి ఇష్టం ఉండదన్నారు. కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి, వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మహబూబ్ షేక్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, మునీర్ అహ్మద్ షేక్లతోపాటు పలువురు కార్పొరేటర్లు రాష్ట్ర జిల్లాస్థాయి పార్టీ నేతలు పాల్గొన్నారు హాజరుకానున్న మాజీ సీఎం వైఎస్ జగన్ విజయవాడలోని ఎన్ఏసీ కల్యాణ మండపంలో ఏర్పాట్లు వివరాలు వెల్లడించిన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ -
ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన పలు అర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు కొనసాగింది. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఘాట్రోడ్డు, మహా మండపం లిప్టు, మెట్ల మార్గంలో కొండపైకి చేరుకున్నారు. రూ. 500, రూ.300, రూ.100 టికెట్తో పాటు సర్వ దర్శనం క్యూలైన్లో భక్తుల రద్దీ కనిపించింది. సర్వ దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది. అర్జిత సేవల్లో ఉభయదాతలు తెల్లవారుజామున ప్రధాన ఆలయంలో అమ్మవారి మూలవిరాట్ వద్ద నిర్వహించిన ఖడ్గమాలార్చన, ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, యాగశాలలో నిర్వహించిన చండీహోమం, శాంతి కల్యాణంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. అర్జిత సేవల్లో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలో అమ్మవారి దర్శనానికి అనుమతించారు. రూ. 500 టికెట్ కొనుగోలు చేసిన భక్తులతో పాటు వీఐపీలు, సిఫార్సు లేఖలపై వచ్చిన భక్తులకు అంతరాలయ దర్శనం కల్పించారు. అంతరాలయ రద్దీ తగ్గుముఖం పట్టిన కొంత సమయం తర్వాత రూ.300 క్యూలైన్లో వేచి ఉన్న భక్తులను ముఖ మండప దర్శనానికి అనుమతించారు. భక్తులకు అమ్మవారి బంగారు వాకిలి దర్శనం కల్పించడంతో త్వరిత గతిన అమ్మవారి దర్శన భాగ్యం కలిగింది. భక్తులకు ఇబ్బంది కలగకుండా.. రద్దీ నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏఈవో చంద్రశేఖర్ క్యూలైన్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎండల కారణంగా ఆలయ ప్రాంగణంతో పాటు మహామండపం, గోశాల, కనకదుర్గనగర్, ఘాట్రోడ్డులో దేవస్థానం భక్తులకు మంచినీటిని సరఫరా చేసింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత భక్తుల రద్దీ మరింత పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దర్శనం పూర్తయిన భక్తులకు దేవస్థానం ఉచిత అన్న ప్రసాద వితరణ చేసింది. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలోనూ భక్తులు, ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. కిటకిటలాడిన క్యూ సర్వ దర్శనానికి రెండు గంటలు -
రక్త నిల్వల కొరత!
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో ప్రాణాధారమైన రక్త నిల్వలు తగ్గిపోతున్నాయి. ఏ బ్లడ్ బ్యాంక్కు వెళ్లినా నో స్టాక్, నో బ్లడ్ అన్న సమాధానమే. జిల్లాలో రక్త నిల్వల కొరత ఎదురవుతోంది. రక్తం అవసరం ఉన్న రోగుల బంధువులు బ్లడ్ బ్యాంక్ల చుట్టూ తిరుగుతున్నా నిరాశే ఎదురవుతోంది. ఈ పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నో స్టాక్.. నో బ్లడ్జిల్లాలో తొమ్మిది బ్లడ్ బ్యాంకుల పరిధిలో 2023– 24లో మొత్తం 19,550 యూనిట్ల రక్తసేకరణ జరిగింది. 2024– 25 ఫిబ్రవరి నెల వరకు 12,845 యూనిట్లు మాత్రమే సేకరణ చేశారు. ఏటా మే, జూన్ నెలల్లో రక్తం కొరత అధికంగా ఉంటోంది. అయితే ఈ ఏడాది మార్చిలోనే ‘కొరత’ ఎదురవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి బ్లడ్ బ్యాంక్ రోజుకు 5 నుంచి 15 యూనిట్ల వరకూ రోగులకు రక్తం అందిస్తుంటాయి. ప్రధానంగా రక్తం నిల్వచేసే రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో నో స్టాక్.. నో బ్లడ్ అన్న సమాధానం ఎదురవుతోంది. శనివారం వరకు రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంకులో కేవలం మూడు యూనిట్లు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 20 యూనిట్లు, కొన్ని బ్లడ్ బ్యాంకుల్లో సింగిల్ యూనిట్లు, మరికొన్ని చోట్ల నిల్వలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నిరాశే..రక్తం కొరత ప్రభావం.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిపై తీవ్రంగా పడుతోంది. తలసేమియా వంటి రోగులు రక్తదాతలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. బ్లడ్ కోసం ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంక్ల చుట్టూ తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదు. గర్భిణులు, యాక్సిడెంట్స్లో గాయాల పాలైన వారు రక్తం కోసం పరుగులు పెడుతున్నారు. అక్కడ వారికి నిరాశే ఎదురవుతోంది. వేసవిలో ఇబ్బందే..రోగుల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కొన్ని రకాల శస్త్రచికిత్సలను వేసవిలోనే నిర్వహిస్తారు. వీటి నిర్వహణకు కూడా రక్తం యూనిట్లు నిల్వల అవసరం మరింత పెరుగుతోంది. సాధారణంగా రక్తం సేకరణకు కళాశాలలు, పలు సంస్థల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారు. ప్రస్తుతం వాటి నిర్వహణ ఊసే లేదు. రానున్నది వేసవి కావడంతో ప్రజలు రక్తదానం చేయడానికి విముఖత చూపుతారు. కళాశాలలకు కూడా సెలవులు ప్రకటిస్తారు. ఇలాంటి కారణాలతో రక్త నిల్వలు తగ్గిపోతాయి. దీంతో సమస్య మరింత జఠిలమవుతుందని పలువురు వైద్యులు అంటున్నారు. ప్రజల్లో అవగాహన పెరగాలి..ప్రముఖల జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదాన సేకరణను పెంచాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా సంబంధిత అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది. రక్తం నిల్వల సేకరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. రక్తదాతలూ.. రండి ఏటా వేసవిలో సమస్య ఈ ఏడాది మార్చిలోనే నిల్వలు తగ్గడంతో ఆందోళన మరింత తీవ్రమయ్యే అవకాశం అన్ని చర్యలు తీసుకుంటున్నాం గడిచిన కొద్దిరోజుల నుంచి ఎండ తీవ్రత అధికం కావడం, విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కావడంతో రక్త సేకరణ తగ్గింది. రోగుల అవసరం మేరకు యూనిట్లను సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది. నిల్వలు పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. –హనుమంతయ్య, మెడికల్ ఆఫీసర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్, మచిలీపట్నం -
జెడ్పీటీసీ సభ్యురాలి భర్త రమేష్కు రిమాండ్
కంచికచర్ల(నందిగామ): ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లకు చెందిన వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యురాలు ప్రశాంతి భర్త వేల్పుల రమేష్ను ఆదివారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో సాయంత్రం నందిగామలోని జడ్జి ఎదుట రమేష్తో పాటు తలమాల మరియమ్మ, గారపాటి ఆంధ్రియను పోలీసులు హాజరు పరిచారు. వారికి జడ్జి 14రోజుల రిమాండ్ విధించారని ఎస్ఐ బోనగిరి రాజు తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిర మండలం బయ్యారం గ్రామానికి చెందిన తుమ్మల జోజి మొదటి భార్య కుమార్తె వాణికి కంచికచర్ల మండలం కీసర గ్రామానికి చెందిన సుధీర్తో 2009లో వివాహమైంది. వాణి, సుధీర్కు ముగ్గురు సంతానం. ఈ ఏడాది ఫిబ్రవరి 23న సుధీర్ ప్రమాదవశాత్తు కాలుజారి నేలబావిలో పడి మరణించాడు. సుధీర్ కర్మకాండలకు జోజి వచ్చారు. అప్పుడు వాణి అత్త తలమాల మరియమ్మ, కుల పెద్ద గారపాటి ఆంధ్రియ, వేల్పుల రమేష్ అతని ఆస్తిలో వాణికి అరెకరం పొలం రాయాలని కోరారు. పెద్దల మాట విన్న జోజి కుమార్తె వాణికి అర ఎకరం పొలం స్వాధీన అగ్రిమెంట్ చేశాడు. అయితే తన పేరుతో ఉన్న పొలాన్ని కుమార్తె వాణికి రాయాలని పెద్దలు బలవంతం చేశారని, భయంతో పొలాన్ని స్వాధీన అగ్రిమెంట్ చేశానని కంచికచర్ల పీఎస్లో నాలుగు రోజుల క్రితం జోజి ఫిర్యాదు చేశాడు. వాణి అత్త మరియమ్మ, కులపెద్ద గారపాటి ఆంద్రియ, వేల్పుల రమేష్పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వారిని నందిగామలోని జడ్జి ఎదుట హాజరుపర్చామని రిమాండ్ విఽధించారని ఎస్ఐ తెలిపారు. ఆదివారం ఉదయం అరెస్ట్ రమేష్తోపాటు మరియమ్మ, ఆంధ్రియకు రిమాండ్ -
భాష, సంస్కృతి వికాసానికి కృషి
విజయవాడ కల్చరల్: భాష, సంస్కృతి వికాసానికి కవులు, రచయితలు కృషి చేయాలని ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గజల్ చారిటబుల్ సంస్థ, సేవ్ టెంపుల్ ఆధ్వర్యంలో దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ నృత్య సంగీత కళాశాలలో ఆదివారం ఉగాది వేడుకలు, కవి పండితులకు సత్కారం, జాతీయ కవి సమ్మేళనం నిర్వహించారు. బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కవులు సమాజాన్ని అధ్యయనం చేయాలన్నారు. న్యాయవాది వేముల హజరత్తయ్య మాట్లాడుతూ గజల్ సాహిత్యానికి చేసిన సేవలను వివరించారు. గజల్ శ్రీనివాస్ సభకు అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ 2026లో గుంటూరులో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తునట్లు తెలిపారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను వివరిస్తూ స్వీయ గజల్ను గానం చేశారు. వివిధ రంగాలకు చెందిన గోళ్ళ నారాయణరావు, డోగిపర్తి శంకరావు,చలపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పరామర్శకు వెళ్తూ అనంతలోకాలకు.. తిరువూరు రూరల్/దమ్మపేట: పరామర్శకు వెళ్తున్న తల్లీకుమారులను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృత్యువాత పడ్డారు. ఘటన తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గాంధీనగరం గ్రామ శివారులో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన తల్లీకుమారులు అరిసెపల్లి సరస్వతి(66), అరిసెపల్లి కృష్ణ(49). సరస్వతి సోదరుడి కుమారుడు అనారోగ్యం బారిన పడ్డాడు. వారిని పరామర్శించడానికి తల్లీకుమారులు ద్విచక్రవాహనంపై తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం గ్రామంలోని బంధువుల ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో గాంధీనగర్ గ్రామ సమీపంలో గుర్తు తెలియని వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తల్లీకుమారులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్లో ఆశ్వారావుపేటకు తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ సాయికిషోర్రెడ్డి తెలిపారు. ముష్టికుంట్లలో విషాదఛాయలు తల్లీకుమారుల మృతితో ముష్టికుంట్లలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడు కృష్ణ గ్రామంలో నాయీ బ్రాహ్మణ వృత్తితో పాటు, బ్యాండ్ మేళం ట్రూప్లో పని చేస్తూ కుటుంబపోషణ చేస్తున్నాడు. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అతని కుమారుడు ప్రైవేట్ ఉద్యోగి. కుమార్తెకు వివాహమైంది. కృష్ణ మృతితో కుటుంబం పెద్దదిక్కును కోల్పోయామని భార్యా పిల్లలు కన్నీరు మున్నీరవుతున్నారు. సరస్వతి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వంట పని చేస్తుంటుంది. 70 ఏళ్ల భర్త వేలాద్రికి చేదోడుగా ఉంటుంది. మరో కుమారుడు మల్లేశ్వరరావు కూలి పని చేస్తూ జీవిస్తున్నాడు. ఒకేసారి ఆ కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో వారి వేదన వర్ణనాతీతంగా ఉంది. -
ప్రజాక్షేత్రంలో ‘కూటమి’ విఫలం
దేవినేని అవినాష్గుణదల(విజయవాడ తూర్పు): ప్రజాక్షేత్రంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ సీపీ తూర్పు ఇన్చార్జి దేవినేని అవినాష్ విమర్శించారు. గుణదలలోని ఆయన కార్యాలయంలో ఆదివారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ప్రభుత్వ డొల్లతనం బయటపడిందని ఎద్దేవా చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారిందని తెలిపారు. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అన్ని వర్గాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వైఎస్సార్ సీపీ కృషి చేస్తోందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ చేస్తున్న అరాచకాలను నేతలు, కార్యకర్తలు నిలదీయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ కార్యాచరణ పై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు, కార్పొరేటర్లు కలపాల అంబేద్కర్, వియ్యపు అమర్నాఽథ్, తంగిరాల రామిరెడ్డి, భీమిశెట్టి ప్రవల్లిక, తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి కృష్ణా సీనియర్స్ రగ్బీ జట్ల ఎంపిక
నున్న(విజయవాడరూరల్): ఉమ్మడి కృష్ణా జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యాన ఆదివారం నున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీనియర్ పురుషులు, మహిళల జిల్లా రగ్బీ జట్ల ఎంపికలు జరిగాయి. వీటిలో 25 మంది బాలురు, 20 మంది బాలికలు పాల్గొన్నారని కార్యదర్శి ఎన్.చంద్రకళ తెలిపారు. పురుషుల జట్టుకు జి.బిళ్లహరి, సీహెచ్ మోహనవంశీ, ఎం.లక్ష్మీనారాయణ, (విజయవాడ), వై.జిక్రిరెడ్డి (జూనియర్ కళాశాల,పాయకాపురం), కె.రాహుల్(ధనేకుల), నున్న వికాస్కు చెందిన పి.సాయి ధనుష్, యు.వెంకట రమణ, ఎండి ఫిరోజ్ జిలానీ,ఎం. లక్ష్మణస్వామి (సంగమూడి), పి.రవినాగ శంకర్లు ఎంపికయ్యారు. మహిళల జట్టుకు ఉంగుటూరుకు చెందిన వై.నందిని, ఎస్.కీర్తన, ఒ.సుధారాణి, కె.నందిని, జి.గంగా భవాని, (హనుమాన్ జంక్షన్), విజయవాడకు చెందిన వి.గీతశ్రీ, బి.నిహారిక, సీహెచ్ జాహ్నవి. డి.చిన్ని నున్న కు చెందిన ఎ.గౌతమి, పి.జెస్సికా ఎంపికయ్యారు. -
అమరావతి బ్రాహ్మణ సేవా సంఘానికి నూతన కార్యవర్గం
విజయవాడ కల్చరల్: అమరావతి బ్రాహ్మణ సేవా సంఘానికి 2025–2026, 2026–2027 సంవత్సరాలకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు సేవా సంఘం ప్రధాన కార్యదర్శి తాళ్లూరి వెంకట దశరథ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. గాంధీనగర్లోని కౌతా పూర్ణానందం కళావేదికపై ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో సంస్థ అధ్యక్షుడిగా కామర్స్ విజయభార్గవ రాజేష్, కాశీభట్ల సూర్యనారాయణ శాస్త్రి ఉపాధ్యక్షుడు, కోశాధికారి అనుముల సోమశేఖర్, సీతారాంబాబు, ఈసీ సభ్యులుగా డాక్టర్ యడ్లపాటి శేషసాయి, భమిడిపాటి గణపతి, దత్తా ప్రసాద్,కుందేటి రత్నకుమార్, కావూరి సూర్యనారాయణమూర్తిని ఎన్నుకున్నారని పేర్కొన్నారు. -
సమీకృత నీటి కుంటల ఏర్పాటుకు ప్రోత్సహించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పొలా ల్లో సమీకృత నీటికుంటలు ఏర్పాటు చేసుకోవడం వలన కలిగే ప్రయోజనాలపై రైతులకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. వర్షాకాలం నాటికి కుంటలు ఏర్పాటు చేసుకునేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉపాధి హామీ పథకం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం వర్చువల్గా సమావేశం నిర్వహించారు. సమావేశానికి కలెక్టరేట్ నుంచి అధికారులతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ జిల్లా నీటి యాజమాన్య సంస్థ, పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడుతూ నీటి కుంటల్లో చేపలు పెంచుతూ, కుంట గట్లపై కూరగాయల పెంపకం చేపట్టి అదనపు ఆదాయం కూడా పొందవచ్చన్నారు. జిల్లాలో 289 గ్రామ పంచాయతీల పరిధిలో 2,713 కుంటలు మంజూరయ్యాయని, యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించి, పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. సమా వేశంలో డ్వామా పీడీ ఎ.రాము, డీపీవో పి.లావణ్య కుమారి పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ -
ఇచ్చింది గోరంత
నష్టం కొండంత...జి.కొండూరు: గతేడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన భారీ వర్షాలకు బుడమేరు కనీవినీ ఎరుగని బీభత్సం సృష్టించింది. ఈ వరదలతో ఇటు మైలవరం నియోజకవర్గంతో పాటు విజయవాడ రూరల్ మండలాల్లో జనజీవనం అతలాకుతలమైంది. వందలాది మూగజీవాలు, ప్రజలు ప్రాణాలు కోల్పోగా వందల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ వరదలకు కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని అప్పట్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. ఈ క్రమంలో బుడమేరు డైవర్షన్ కెనాల్కు ఎడమవైపున కొండపల్లి శాంతినగర్కు సమీపంలో పడిన మూడు భారీ గండ్ల వలనే విజయవాడ పరిసర ప్రాంతాలు రోజుల తరబడి వరద ముంపులోనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గండ్లు పడిన ప్రదేశాన్ని పరిశీలించి బుడమేరు ప్రక్షాళన చేస్తామంటూ మీడియా ముందు ఊదరగొట్టారు. ఆ తర్వాత బుడమేరు ప్రక్షాళనకు రూ.500 కోట్లతో మొదటి దశ ప్రణాళిక అంటూ ఆర్భాటంగా ప్రకటించి తదనంతరం ఈ వ్యవహారాన్ని పట్టించుకోకుండా వదిలేశారు. ఈ క్రమంలో బుడమేరు ఆధునికీకరణ, హెడ్ రెగ్యులేటర్ మరమ్మతులు, గండ్లు పూడ్చిన ప్రదేశంలో లీకేజీల వలన వరద ప్రవాహంపై ‘సాక్షి’ పలుమార్లు కథనాలను ప్రచురించింది. ‘సాక్షి’ కథనాలకు స్పందించిన కలెక్టర్ లక్ష్మీశ సైతం ఇటీవల హెడ్ రెగ్యులేటర్ను, గండ్లు పడిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఆ తర్వాత రెగ్యులేటర్ మరమ్మతులు, గండ్లు పడిన ప్రదేశంలో లైనింగ్ పనులకు గానూ రూ.39.77 కోట్లు నిధులు విడుదల చేస్తున్నామంటూ అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖ మంత్రి ప్రకటించారు. ఈ నిధులపై ప్రభుత్వం శుక్రవారం జీఓని విడుదల చేసింది. చేయాల్సింది కొండంత... బుడమేరుకు వచ్చిన వరద ఉధృతితో వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎగువన అంటే బుడమేరు ప్రారంభం వరకు 42 కిలోమీటర్ల మేర ఉన్న బుడమేరు కాల్వకు 80కి పైగా గండ్లు పడ్డాయి. వీటిని అధికారులు 65 పనులుగా నిర్ధారించి రూ.29 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనాలు తయారు చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి మూడు నెలల క్రితం ప్రతిపాదనలు పంపారు. ఈ నిధులు ఇప్పటివరకు విడుదల చేయలేదు. ఈ గండ్లను శాశ్వతంగా పూడ్చడంతో పాటు ఆక్రమణలు తొలగించి బుడమేరుకు ఇరువైపులా కట్టలు బలోపేతం చేయాల్సి ఉంది. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణానది వరకు 11.90 కిలోమీటర్ల మేర ఉన్న బుడమేరు డైవర్షన్ కెనాల్కు ఎడమ వైపు కట్టకు మూడు గండ్లు, కుడి వైపు కట్టకి ఏడు చోట్ల గండ్లు పడ్డాయి. ఈ గండ్లను అప్పట్లో తాత్కాలికంగా పూడ్చారు. ఈ 11.90 కిలోమీటర్ల డైవర్షన్ కెనాల్ను 37,555 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యానికి పెంచుతూ లైనింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. అయితే కేవలం అర కిలోమీటరు లైనింగ్ పనులకు మాత్రమే నిధులు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎనికేపాడు వరకు 13.25 కిలోమీటర్ల మేర ఆక్రమణలు తొలగించాల్సి ఉంది. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని బుడమేరులో 202 ఎకరాలకు గానూ 70 ఎకరాల వరకు ఆక్రమణల చెరలో ఉన్న బుడమేరుకు ఆక్రమణలు తొలగించి మోక్షం కలిగించాల్సి ఉంది. ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు 50.6 కిలోమీటర్ల మేర బుడమేరుకు ఇరువైపులా గట్లను బలోపేతం చేయాల్సి ఉంది. ఇవే కాకుండా మైలవరం నియోజకవర్గంలోని పులివాగు, కోతులవాగుతో పాటు పలు వాగులకు పడిన గండ్లు, ఎన్ఎస్పీ కాల్వలు, 32 చెరువులకు పడిన గండ్లకు శాశ్వతంగా మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. వీటికి గానూ రూ.30 కోట్లకు పైగా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ పనులకు నిధులు విడుదల చేయలేదు. ఈ పనులను చేపట్టకపోతే వచ్చే వర్షాకాలంలో పది సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనా విజయవాడను మరోసారి వరద ముంచెత్తే ప్రమాదం ఉంది. ప్రభుత్వం అరకొర నిధులు కేటాయించి చేతులు దులుపుకొంటే మరో ఉప్పెనను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రక్షాళనకు రూ.500 కోట్లు అంటూ రూ.39.77 కోట్లకు జీఓ విడుదల హెడ్ రెగ్యులేటర్కు ఎగువ బుడమేరు గండ్లకు విడుదల కాని నిధులు డైవర్షన్ కెనాల్ పూర్తి ఆధునికీకరణ ప్రశ్నార్థకమే వచ్చే ఏడాదీ వరద ముంపు తప్పదని ప్రజల ఆందోళన నిధుల విడుదల ఇలా... ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం వెలగలేరు వద్ద బుడమేరు హెడ్ రెగ్యులేటర్ మరమ్మతుల కోసం రూ.180 లక్షలను కేటాయించారు. డైవర్షన్ కెనాల్కు ఇరువైపులా కొండపల్లి శాంతినగర్ సమీపంలో పడిన గండ్ల వద్ద 3.840 కిలోమీటర్ల నుంచి 4.340 కిలోమీటర్ల వరకు అర కిలోమీటరు లైనింగ్ పనులకు గానూ రూ.3,797 లక్షలను కేటాయించారు. మొత్తంగా ఈ పనులకు రూ.39.77 కోట్లను కేటాయించి చేతులు దులుపుకొన్నారు. -
నైపుణ్యాల పెంపునకు క్రీడలు దోహదం
విజయవాడస్పోర్ట్స్: సంకల్పం, లక్ష్యాలను నిర్దేశించే నైపుణ్యాన్ని పెంచుకునేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటక్చర్ ఇనిస్టిట్యూట్(ఎస్పీఏ) డైరెక్టర్ రమేష్ శ్రీకొండ అన్నారు. ఎస్పీఏ జాతీయ క్రీడా పోటీలు విజయవాడలోని ఎస్పీఏ ఇనిస్టిట్యూట్లో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. క్రీడా జ్యోతి వెలిగించి ఈ పోటీలను రమేష్ శ్రీకొండ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృషి, పట్టుదల, స్నేహభావం ప్రాముఖ్యతను క్రీడలు తెలియజేస్తాయన్నారు. క్రీడాకారులు సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉంటారని, నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో క్రీడాకారులు ముందు వరసలో ఉంటారని తెలిపారు. చదువుతో పాటు ప్రతి ఒక్క విద్యార్థి క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. ఈ జాతీయ పోటీల్లో ఢిల్లీ, భోపాల్, విజయవాడ ఇనిస్టిట్యూట్ల విద్యార్థినీ విద్యార్థులు ఫుట్బాల్, క్రికెట్, బాస్కెట్బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్ క్రీడాంశాల్లో తలపడతారని వివరించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 300 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ట్రోఫీలను రమేష్ శ్రీకొండ ఆవిష్కరించారు. ఇనిస్టిట్యూట్ రిజిస్ట్రార్ కె.ఉమామహేశ్వరరావు, డీన్ స్టూడెంట్ అఫైర్స్ ఎస్.వి.కృష్ణకుమార్, ఆర్కిటెక్చర్ హెచ్వోడీ శ్రీనివాస్, అసిస్టెంట్ ప్రొఫెసర్, స్పోర్ట్స్ కమిటీ సభ్యురాలు డి.జగత్కుమారి, ప్లానింగ్ హెచ్వోడీ ప్రశాంత్వర్థన్ పాల్గొన్నారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ డైరెక్టర్ రమేష్ శ్రీకొండ ఎస్పీఏ ఇనిస్టిట్యూట్ ప్రాంగణంలో అట్టహాసంగా ప్రారంభమైన జాతీయ క్రీడలు -
ఆదాయంలో విజయవాడ డివిజన్ రికార్డు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇంకా 11 రోజులు ఉండగానే విజయవాడ రైల్వే డివిజన్ రూ.5,638 కోట్ల ఆదాయం సాధించి సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. అందులో సరకు రవాణా ద్వారా రూ.4,092.21 కోట్ల ఆదాయంతో రవాణాలోనే సుస్థిరమైన వృద్ధి సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.5,625 కోట్ల స్థూల ఆదాయం రాగా, అందులో సరకు రవాణా ద్వారా రూ.4,032 కోట్లు ఆదాయం లభించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు డివిజన్ స్థూల ఆదాయం రూ.5,638 కోట్లు కాగా, అందులో 72.6 శాతం భాగం సరుకు రవాణా ద్వారా రూ.40,98 కోట్లు, 23.78 శాతం ప్రయాణికుల ఆదాయంతో రూ.1,342 కోట్లు, 1.9 శాతంతో ఇతర కోచింగ్ సేవలు (పార్శిల్, టికెట్ తనీఖీలు) ద్వారా రూ.109 కోట్లు, 1.6 శాతం ఇతర మార్గాల ద్వారా రూ.89 కోట్లు ఆదాయం సమకూర్చుకుంది. ఆదాయంలో డివిజన్ వృద్ధి సాధించడం పట్ల సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు, సీనియర్ డీఓఎం డి.నరేంద్రవర్మలను డీఆర్ఎం ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5,638 కోట్ల స్థూల ఆదాయం 72.6 శాతం సరకు రవాణా ఆదాయం -
ట్రాఫిక్ డీసీపీ నాయుడుకి మహోన్నత సేవా పథకం
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మహోన్నత సేవా పథకానికి ట్రాఫిక్ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) ఎం.కృష్ణమూర్తి నాయుడు ఎంపికయ్యారు. పోలీస్ శాఖలో సమర్థంగా పనిచేసి ప్రజలకు విశిష్ట సేవలు అందించినందుకు గాను 2025వ సంవత్సరానికి మహోన్నత సేవా పథకానికి ఎంపికయ్యారు. 1989లో కృష్ణమూర్తి నాయుడు ఎస్ఐగా సర్వీస్ ప్రారంభించి అంచెలంచెలుగా డీసీపీ స్థాయి హోదాకు ఎదిగారు. సేవా పథకానికి ఎంపికై న కృష్ణమూర్తి నాయుడుని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు ప్రత్యేకంగా అభినందించారు. ఎస్ఆర్ఆర్ కళాశాలలో పీ4 జిల్లా స్థాయి పోటీలుమధురానగర్(విజయవాడసెంట్రల్): మాచవరం ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం పేదరిక నిర్మూలన అనే అంశంపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఆధ్వర్యంలో వ్యాసరచన, వక్తృత్వం, పోస్టర్ మేకింగ్ జిల్లా స్థాయి పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఎన్టీఆర్ జిల్లాలోని పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొని తమలోని సృజనాత్మకతను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు ఈ పోటీలు నిర్వహించామన్నారు. పోటీలలో విజేతలకు జిల్లా కలెక్టర్ చేతులమీదుగా బహుమతి ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఎన్టీఆర్ జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కొల్లేటి రమేష్, డాక్టర్ శాంతకుమారి, డాక్టర్ అజయ్ బాబు, డాక్టర్ రాధిక, డాక్టర్ పీఎల్ దాస్, డాక్టర్ భాను ప్రసాద్ వ్యవహరించారు. సుబ్రహ్మణ్యుని సన్నిధిలోసీఐఎస్ఎఫ్ బృందం మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని కొల్కత(వెస్ట్ బెంగాల్) సీఐఎస్ఎఫ్ బృందం శుక్రవారం దర్శించుకుంది. ఉదయం ఆలయానికి చేరుకున్న వీరికి చల్లపల్లి సీఐ ఈశ్వరరావు, ఆలయ సిబ్బందితో కలసి స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ చేసిన అనంతరం నాగపుట్ట లో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు విరూప్ శర్మ స్వామివారికి అభిషేకం నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. కొల్కత నుంచి కన్యాకుమారికి సైకిల్ యాత్ర చేపట్టిన సీఐఎస్ఎఫ్ బృందానికి ఆలయ అధికారి మధుసూదనరావు, స్థానిక ఎస్ఐ సత్యనారాయణ, ఆలయ సిబ్బంది, గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు. నీరు అత్యంత విలువైన వనరు గుడివాడటౌన్: ప్రపంచంలో అత్యంత విలువైన వనరు నీరు అని 11వ అదనపు జిల్లా జడ్జి జి.సుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు. నీటి వాడకంలో మార్పులను ప్రేరేపించడానికి ఇది ఒక మంచి అవకాశం అన్నారు. శనివారం జరగనున్న ప్రపంచ నీటి దినోత్సవంను ప్రజలు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. నీటి నిల్వలు పెరిగేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి నీటిని సంరక్షించాలని, నీటి వినియోగంపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. నీటిని వృథా చేయకుండా ఉండటం, పరిశుభ్రమైన నీటిని తాగడం ప్రతి ఒక్కరి హక్కు అని తెలిపారు. నీటి కాలుష్యం తగ్గేలా, నీటిలో ప్రమాదకరమైన రసాయనాల విడుదల అరికట్టేలా అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. పర్వతాలు, అడవులు, చిత్తడి నేలలు, నదులు, జలాశయాలు, సరస్సులు వంటి నీటి సంబంధిత పర్యావరణ వ్యవస్థను రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. -
దొడ్డదేవరపాడులో
నీటికి కటకట గాంధీనగర్( విజయవాడ సెంట్రల్): భౌగోళికంగా ఎన్టీఆర్ జిల్లాకు ఓ వైపు కృష్ణమ్మ, మరో వైపు కట్టలేరు, వైరా, మున్నేరు ప్రవహిస్తున్నాయి. వేసవి ఆరంభంలోనే ఎన్టీఆర్ జిల్లాలో తాగు నీటి కష్టాలు మొదలయ్యాయి. కృష్ణానది చెంతనే ఉన్నా ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు. జిల్లాలో సగభాగానికి కూడా కృష్ణానది నీరు సరఫరా కావడం లేదు. జిల్లాలోకి ప్రవహించే ఉపనదులు వైరా, కట్టలేరు, మున్నేరులలో నీటి జాడ కనిపించడం లేదు. మున్నేరు పూర్తిగా ఎండిపోగా... కట్టలేరు, వైరా యేరుల్లో నీటి చారికలు కనిపిస్తున్నాయి. దీంతో ఉపనదులపై నిర్మించిన రక్షిత మంచినీటి పథకాలు ఆశించిన స్థాయిలో రక్షిత నీరు అందించ లేకపోతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు ఆర్వో ప్లాంట్ల నీటిని కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. ప్రమాణాలు పాటించకపోయినప్పటికీ ప్రజలు వేరే గతి లేక ఆర్వో ప్లాంట్ల నీటినే కొనుగోలు చేసి తాగవలసి వస్తోంది. మార్చి నెలలోనే నీటి కష్టాలు మొదలు కావడంతో ఇక ఏప్రిల్, మే నెలలో పరిస్థితి ఏమిటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చుక్క నీరు కానరాని కట్టలేరు తిరువూరు నియోజకవర్గం నుంచే కట్టలేరు ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ప్రస్తుతం కట్టలేరులో నీరు లేదు. కట్టలేరు ఒడ్డున మోటార్లు ఏర్పాటు చేసి రక్షిత మంచినీటి పథకాల ద్వారా నీటిని సరఫరా చేస్తారు. కానీ కట్టలేరులో నీరు లేకపోవడంతో మోటార్లు దెబ్బతింటున్నాయి. నియోజకవర్గ పరిధిలోని గంపలగూడెం మండలంలోని ఊటుకూరు, కొణిజర్ల, పెనుగొలను గ్రామాల్లో తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎ.కొండూరు మండలంలో స్థానికంగా తాగేందుకు అనువుగా ఉండవు. ఇక్కడకు పూర్తిస్థాయిలో కృష్ణాజలాలు సరఫరా కావడం లేదు. ట్యాంకర్ల ద్వారా అరకొరగా నీటిని అందిస్తున్నారు. వేసవి మరింత ముదిరే నాటికి ట్యాంకర్ల సంఖ్య పెంచి నీటి ఎద్దడి లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. నందిగామ నియోజకవర్గంలో కట్టలేరు పక్కనే ఉన్న దొడ్డదేవరపాడు గ్రామానికి సరిపడా తాగునీరు సరఫరా జరగడం లేదు. వి.అన్నవరం వద్ద వైరా యేరులో మోటార్లు ఏర్పాటు చేసిన నీటిని అందిస్తున్నారు. అవి చాలకపోవడంతో స్థానికంగా ఏర్పాటు చేసిన మోటరు ద్వారా నీటిని ట్యాంకుకు ఎక్కించి సరఫరా చేస్తున్నారు. వీటిలో లవణ శాతం అధికంగా ఉండడం వాడకానికి కూడా వినియోగించే పరిస్థితి లేదు. కట్టలేరు ఒడ్డునే ఉన్న ఈ గ్రామానికి రాబోయే రెండు మూడు నెలలు నీటికి కటకటలాడాల్సిన పరిస్థితి. వీరులపాడు మండలం చౌటపల్లి గ్రామానికి వీరులపాడు నుంచి తాగునీరు సరఫరా అవుతున్నప్పటికీ జనాభా అవసరాలకు సరిపోవడం లేదు. కంచికచర్ల మండలంలోని ఏటిపట్టు గ్రామాల్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. కృష్ణా నది ఒడ్డు వెంబడి నీరు లేకపోవడంతో మోటార్లు ఆడే పరిస్థితి లేదు. మున్నేరు వైరా ఏరు కలిసే చోట ఉన్న కీసర, పెండ్యాల గ్రామాల్లో వేసవి ప్రారంభంలోనే నీటి ఎద్దడి మొదలైంది. ఎస్.అమరవరం, మోగులూరు గ్రామాల్లో నీటికి ఇబ్బందులు పడుతున్నారు. చెవిటికల్లు పైలెట్ ప్రాజెక్టు ద్వారా కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో కొన్ని గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. చెవిటికల్లు వద్ద కృష్ణానదిలో నీరు లేకపోవడం, లీకేజీల కారణంగా సక్రమంగా సరఫరా జరగడం లేదు. విజయవాడ నగరంలో ఊర్మిళానగర్లో పాయకాపురం తదితర ప్రాంతాల్లో రంగుమారిన నీరు వస్తోందని ప్రజలు చెబుతున్నారు. సరిగా శుద్ధి చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. నీటి ఎద్దడి కారణంగా సరైన ప్రమాణాలు పాటించని ఆర్వో ప్లాంట్ల నీటినే కొనుగోలు చేయాల్సి వస్తోంది. వారానికో రోజు తాగునీరు చెవిటికల్లు పైలెట్ ప్రాజెక్టు ద్వారా మా గ్రామానికి వారానికి ఒక రోజు మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. తాగునీటికి ఇబ్బందిగా ఉంది. మార్చిలోనే పరిస్థితి ఈ తీరుగా ఉంటే.. మే నెలలో పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. సరిపడా తాగునీటిని అందించాలి. –జల్లి కార్ల్మార్క్స్, జుజ్జూరు నాలుగైదు రోజులకోసారి మంచినీరు మా ఊరు మున్నేరు ఒడ్డునే ఉంది. మున్నేరు ఎండిపోయింది. మాకు నాలుగైదు రోజులకోసారి మంచినీరు వస్తోంది. మేం కూలి పనులకు వెళ్లేవాళ్లం. మంచినీళ్లు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు తాగునీటి ఇబ్బందులను తొలగించాలి. –కోలగట్ల సత్యవతి, కీసర ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 286 గ్రామ పంచాయతీలు, 794 ఆవాసాల్లో 19 సమగ్ర రక్షిత నీటి సరఫరా పథకాలు, 366 రక్షిత నీటి సరఫరా పథకాలు, 63 చిన్న రక్షిత నీటి సరఫరా పథకాలు, 439 డైరెక్ట్ పంపింగ్ పథకాలు, 7,917 చేతిపంపులు ఉన్నాయి. వీటితో పాటు 44 ప్రభుత్వ, 594 ప్రయివేట్ ఆర్వో ప్లాంట్స్ ఉన్నాయి. ఇవే ప్రజలకు ప్రధాన తాగునీటి వనరు. వేసవి ప్రారంభమై నెల రోజులు కావడంతో గ్రామాల గొంతెండుతోంది. నీటి ఎద్దడి ముంచుకొస్తుంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో రెండు రోజులకోసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అవి కూడా అరకొరగా వస్తున్నాయి. రక్షిత మంచినీటి పథకాలు దశాబ్దాల కిందట నిర్మించడం, అప్పట్లో వేసిన పైపులైన్లకు లీకులు ఏర్పడడంతో నీరు వృథా అవుతోంది. లీకేజీల కారణంగా రక్షిత మంచినీరు సరఫరా కావడం లేదు. దీనికి తోడు జనాభా పెరుగుదల, నీటి వాడకం పెరగడంతో పథకాలు తాగునీటి అవసరాలు తీర్చలేకపోతున్నాయి. గొంతెండుతున్న పల్లెలు ముంచుకొస్తున్న నీటి ఎద్దడి ఎండిపోయిన ఉప నదులు కృష్ణానది చెంతనే నీటి కష్టాలు రెండు రోజులకోసారి తాగునీటి సరఫరా -
గ్రామీణ వైద్యులపై దుష్ప్రచారాలు తగదు
హనుమాన్జంక్షన్ రూరల్: దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందిస్తూ, స్వయం ఉపాధి పొందుతున్న ఆర్ఎంపీ, పీఎంపీలపై అవాస్తవాలను దుష్ప్రచారం చేస్తున్నారని కృష్ణాజిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బి.వెంకట రాజు, ప్రధాన కార్యదర్శి ఎన్.రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక నూజివీడు రోడ్డులోని పౌల్ట్రీ ఫ్మార్మర్స్ వెల్ఫేర్ సిండికేట్ హాల్లో హనుమాన్జంక్షన్ ఏరియా గ్రామీణ వైద్యుల సమావేశం శుక్రవారం జరిగింది. అనంతరం సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వెంకటరాజు, రాంబాబు మాట్లాడుతూ గ్రామీణ వైద్యులు యాంటీ బయోటిక్స్, స్టెరాయిడ్స్ అధికంగా వాడుతున్నారనే దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం అందించి జీవనోపాధి పొందుతున్న ఆర్ఎంపీల వ్యవస్థను నిర్వీర్యం చేయాలనే తలంపు మంచిది కాదన్నారు. దీనిపై మరింత విస్తృతంగా చర్చించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు అనంతపురంలో ఈ నెల 24, 25 తేదీల్లో రాష్ట్ర ఫెడరేషన్ కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. అంతకు ముందుగా ప్రభ హాస్పిటల్ (ఏలూరు) ఆధ్వర్యంలో ఎముకలు, కీళ్ల వైద్య నిపుణడు డాక్టర్ సునీల్ సందీప్ ఆర్ఎంపీలకు పలు ప్రాథమిక వైద్య సేవలపై అవగాహన కల్పించారు. సంఘం జిల్లా కోశాధికారి రంగారావు, హనుమాన్జంక్షన్ ఏరియా అధ్యక్షుడు కె.నరసింహారావు, కార్యదర్శి కోటా చైతన్య, కోశాధికారి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
నర్సింగ్ వృత్తి పవిత్రమైంది
గన్నవరం రూరల్: నర్సింగ్ వృత్తి పవిత్రమైనదని, ఒత్తిడిని జయించి నర్సింగ్ వృత్తిలో రాణించాలని ఏపీ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సుశీల సూచించారు. మండలంలోని చిన అవుటపల్లి డాక్టర్ సి. శోభనాద్రి సిద్ధార్థ నర్సింగ్ అండ్ స్కూల్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన రాష్ట్ర స్థాయి నర్సింగ్ కాన్ఫరెన్స్కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన వర్క్ షాప్ను ఉద్ధేశించి ఆమె మాట్లాడుతూ అసాధారణ ఒత్తిడి ఉద్యోగ జీవితంలో ప్రభావితం చేయరాదన్నారు. సెల్ఫోన్, సోషల్ మీడియా ప్రభావంతో మానవ సంబంధాలు విచ్ఛిన్నం అవుతున్నాయని, బాధ్యతాయుత వృత్తిలో ఉన్న నర్సులు వీటికి దూరంగా ఉండాలన్నారు. ఒత్తిడిని జయించేందుకు మార్గాలను వివరించారు. ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ నర్సులు చిరునవ్వుతో సేవలందించాలన్నారు. రోగులను నిరంతరం కనిపెట్టుకుని ఉండేది నర్సులేనన్నారు. రాష్ట్రంలోని 18 నర్సింగ్ కళాశాలల నుంచి విద్యా ర్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు వర్క్ షాప్నకు హాజరయ్యారు. రిసోర్స్ స్పీకర్స్గా సిస్టర్ ఫ్లోరెన్స్, కోటేశ్వరమ్మ, ప్రిన్సిపాల్ జె.వందన, డాక్టర్ ఝాన్సీ రాణి వ్యవహరించారు. మెడికల్ కళాశాల డైరెక్టర్ జనరల్ డాక్టర్ సి.నాగేశ్వరరావు, డైరెక్టర్ డాక్టర్ సీవీ రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ భీమేశ్వర్, నర్సింగ్ కళాశాల కన్వీనర్ వి.శశికళ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఏపీ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ సుశీల -
హ్యాండ్బాల్ రాష్ట్ర విజేత పశ్చిమగోదావరి
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి అండర్–19 జూనియర్ బాలికల హ్యాండ్బాల్ పోటీల్లో పశ్చిమగోదావరి జిల్లా సత్తా చాటింది. ఈ నెల 20వ తేదీన విజయవాడలోని ఆంధ్రా లయోల కాలేజీలో ప్రారంభమైన ఈ పోటీలకు 12 ఉమ్మడి జిల్లాలు ప్రాతినిధ్యం వహించారు. లీగ్ కం నాకౌట్ పద్ధతిలో జరిగిన ఈ పోటీల్లో పశ్చిమగోదావరి జట్టు వరుస విజయాలను సాధించింది. శుక్రవారం జరిగిన ఫైనల్స్లో ప్రత్యర్థి తూర్పుగోదావరి జిల్లా జట్టును ఓడించి విన్నర్ ట్రోఫీని అందుకుంది. తూర్పు గోదావరి జిల్లా రన్నర్ ట్రోఫీని అందుకుంది. మూడో స్థానం కోసం కృష్ణా, విశాఖపట్నం జిల్లాలు తలపడ్డాయి. ఈ పోటీల్లో కృష్ణాజిల్లా జట్టు విజయం సాధించి తృతీయ బహుమతిని అందుకుంది. విజేతలకు ఆంధ్రప్రదేశ్ హ్యాండ్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మల్లేశ్వరరావు, లయోల కాలేజీ వ్యాయామ విద్యా విభాగాధిపతి డాక్టర్ కె.సుజాత ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో హ్యాండ్బాల్ సంఘం రాష్ట్ర కార్యదర్శి పెనుమత్స సత్యనారాయణరాజు, కృష్ణాజిల్లా హ్యాండ్బాల్ సంఘం కార్యదర్శి ఎన్.వంశీకృష్ణప్రసాద్ పాల్గొన్నారు. రన్నరప్గా తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాకు మూడో స్థానం -
గుడులు, గోవులకూ రక్షణ కరువు
మధురానగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వంలో గుడులు, గోవులకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. జీవీఆర్ నగర్ ట్రెండ్ సెట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న వినాయక ఆలయాన్ని వీఎంసీ అధికారులు కూల్చివేయటం దారుణమని మండిపడ్డారు. అధికారులు పొక్లయినర్లతో కూల్చివేసిన ఆలయాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఆలయాన్ని కూల్చివేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోసియేషన్ సభ్యులకు కనీస సమాచారం అందించకుండా.. అప్పటికప్పుడు రెండు పొక్లయినర్లతో కూల్చివేయటం ఏమిటని ప్రశ్నించారు. గత ఏడాది కాలంగా ట్రెండ్ సెట్లో ఆలయ నిర్మిస్తామని.. అభ్యంతరాలు ఉంటే ప్రాథమిక దశలోనే ఎందుకు నిలుపుదల చేయలేదని ప్రశ్నించారు. పైగా గర్భగుడిలోకి జేసీబీలను పంపించటం.. కూటమి ప్రభుత్వ అహంకారానికి అద్దం పడుతోందన్నారు. కౌన్సిల్ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తారని చెప్పారు. కూల్చివేతల పరంపర.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక మధురానగర్ కాలువగట్టుపై 40 ఏళ్ల నాటి నాగేంద్రస్వామి పుట్టని తొలగించటంతో పాటు దుర్గాదేవి ఆలయం, రాజరాజేశ్వరి దేవి ఆలయం, శ్రీకృష్ణ మందిరం వద్ద ఏర్పాటు చేసిన గోశాలను కూడా దౌర్జన్యంగా కూల్చివేశారని మల్లాది విష్ణు గుర్తు చేశారు. గతంలోనూ హిందూ దేవాలయాలపై దాడులు, కూల్చివేతలు అత్యధికంగా జరిగినది టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి అధికారాన్ని పంచుకున్న సమయంలోనేనని మల్లాది విష్ణు విమర్శించారు. కృష్ణా పుష్కరాల సమయంలోనూ నగరంలో 23 దేవాలయాలను కూల్చివేసిన చరిత్ర చంద్రబాబుదని.. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వాటిని పునర్నిర్మించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి, నాయకులు మార్తి చంద్రమౌళి, సామంతకూరి దుర్గారావు, డి.దుర్గారావు, పవన్ రెడ్డి, నగరి ప్రసాద్, ఓంకార్ రెడ్డి, చైతన్య, రమేష్, తదితరులు పాల్గొన్నారు. వినాయక ఆలయం కూల్చివేత దారుణం వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు -
నాణ్యమైన రెవెన్యూ సేవలే లక్ష్యం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజలకు నాణ్యమైన రెవెన్యూ సేవలు అందించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా సూచించారు. విజయవాడ గవర్నర్పేట రైతు శిక్షణ కేంద్రం సమావేశ మందిరంలో శుక్రవారం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం ఆధ్వర్యంలో రెవెన్యూ సేవల పంపిణీపై అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలకు శిక్షణ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, సీసీఎల్ఏ జి.జయలక్ష్మి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రెవెన్యూ సేవలు అందించడంతోపాటు ఏవైనా సమస్యలు ఎదురైతే వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, నిరంతర పర్యవేక్షణ, క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం తదితరాలపై మార్గనిర్దేశం చేశారు. రెవెన్యూ అంశాలకు సంబంధించి వచ్చే ఆరు నెలల సమయం చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో ఎక్కడా జాప్యం లేకుండా రోజువారీ కార్యకలాపాలు నిర్వహించేందుకు, డేటా నమోదులో కచ్చితత్వానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ల్యాండ్ ఎన్ క్రోచ్ మెంట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కచ్చితంగా అమలు చేసి కేసులు నమోదు చేయాలన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పేపర్ లెస్, స్మార్ట్ గవర్నన్స్ అందించాలన్నారు. రీసర్వేపై సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల డైరెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, ఇనామ్, ఎస్టేట్, పీవోటీ చట్టాలపై విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ లక్ష్మీ నరసింహం, రికార్డ్ ఆఫ్ రైట్స్, భూ ఆక్రమణలు, ల్యాండ్ గ్రాబింగ్పై విశ్రాంత ఐఏఎస్ అధికారి బి.రామయ్య శిక్షణ ఇవ్వగా.. వెబ్ల్యాండ్ సంబంధిత అంశాలపై ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.రచన వివరించారు. వివిధ సందేహాలను నివృత్తి చేశారు. శిక్షణ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా -
సీఎం చంద్రబాబుకు ఉగాది పచ్చడి పంపుతాం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వలంటీర్లకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరుతూ సీఎం చంద్రబాబు నాయుడుకు ఉగాది పచ్చడి పంపబోతున్నట్లు వలంటీర్ల అసోసియేషన్ ప్రకటించింది. శుక్రవారం విజయవాడ హనుమాన్ పేట సీపీఐ కార్యాలయంలో వలంటీర్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు ఉగాది పచ్చడి తింటూ.. వలంటీర్లకు తీపి కబురు చెబుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తానని, నెలకు రూ. 5వేలు ఎలా సరిపోతాయి? పెరిగిన డీజిల్, పెట్రోల్, గ్యాస్, నిత్యవసర సరుకులు ధరలకు అనుగుణంగా రూ. 10వేలు గౌరవ వేతనం పెంచుతామని హామీ ఇచ్చారన్నారు. ఎన్నికల ప్రచారంలో అనేక సభల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, పురంధేశ్వరి వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారన్నారు. కానీ అధికారంలోకి వచ్చి తర్వాత 10 నెలలు గడుస్తున్నా వలంటీర్లకు ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. మార్చి 30 ఉగాది సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వలంటీర్లు సీఎం చంద్రబాబు నాయుడుకు ఉగాది పచ్చడి పంపాలని పిలుపునిచ్చారు. వలంటీర్లు పంపిన పచ్చడి తిని వలంటీర్లకు ఇచ్చిన హామీని గుర్తు తెచ్చుకోవాలన్నారు. సమావేశంలో నాయకులు మమత, షైని, నరేష్, కల్యాణ్, శివ పార్వతి, స్వప్న, దమ్ము రమేష్ పాల్గొన్నారు. ఏపీ గ్రామ, వార్డు వలంటీర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ -
సమన్వయంతో మాదకద్రవ్యాల కట్టడి
విజయవాడస్పోర్ట్స్: అన్ని ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలను సమన్వయం చేసుకుని జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసు అధికారులు కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు సూచించారు. మినిస్టరీ ఆఫ్ సోషల్ జస్టిస్, ఎంపవర్మెంట్–గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణపై పోలీసు అధికారులకు కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు సరఫరా చేసే ముఠాల ఆట కట్టించడానికి పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాదక ద్రవ్య వినియోగ సమస్యను ఎదుర్కోవడానికి టాస్క్ ఫోర్స్, ఈగల్ టీం, నార్కోటిక్ సెల్ వంటివి పని చేస్తున్నాయని, త్వరలో సరికొత్త ప్రణాళికతో కమిషనరేట్లో మాదక ద్రవ్య వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలనే లక్ష్యంతో ఈ వర్క్ షాప్ నిర్వహించామని తెలిపారు. మొదట అలవాటు.. తర్వాత బానిస.. జీజీహెచ్ వైద్యురాలు డాక్టర్ స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ డ్రగ్స్ తరచూ వినియోగించే వారి మెదడులోని రివార్డుపాత్వే అనే భాగం సిగ్నల్ ఇవ్వడం ద్వారా తరచూ వాటికి అలవాటు పడి చివరిగా బానిసలు అవుతున్నారని వివరించారు. ఈ డ్రగ్స్ వినియోగం శరీరంలోని ఊపిరితిత్తులు, కిడ్నీ, మెదడు, కళ్లు తదితర అవయవాలపై దుష్ప్రభావం చూపుతుందన్నారు. క్యాన్సర్, లుకేమియా వంటి వ్యాధుల బారిన పడతారని హెచ్చరించారు. ప్రస్తుతం పాత గవర్నమెంట్ హాస్పిటల్లో సైక్రియాటిక్ విభాగంలో డీ అడిక్షన్పై చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ డాక్టర్ కల్యాణి మాట్లాడుతూ ఎన్డీపీఎస్ యాక్ట్లో కేసులు నమోదు చేసేటపుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ కె.జి.వి.సరిత, గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ చైర్ పర్సన్ ఉమారాజ్, టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ ఎ.శ్రీనివాసరావు, ఏసీపీలు ఉమామహేశ్వరరెడ్డి, కిరణ్ పాల్గొన్నారు. వర్క్షాప్కు హాజరైన అధికారులు, సిబ్బందికి సర్టిఫికెట్లు అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖరబాబు -
విజేతలుగా గుంటూరు, విజయవాడ ఉద్యోగులు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): భీమవరంలో జరిగిన ఆల్ ఇండియా సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్ 45 ప్లస్ డబుల్స్ కేటగిరీలో విజయవాడ, గుంటూరు డివిజన్ల ఉద్యోగులు విజేతలుగా నిలిచారు. ఈ నెల 20న జరిగిన ఫైనల్స్లో విజయవాడ డివిజన్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్లో టెక్నీషియన్ సంపత్కుమార్, గుంటూరులోని అమరావతి బెంచ్ రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ అదనపు రిజిస్ట్రార్ రాజేంద్ర ప్రసాద్ చాంపియన్స్గా నిలిచారు. హారాహోరీగా జరిగిన ఫైనల్లో ఖమ్మంకు చెందిన వెంకటేశ్వరరావు, పాల్వంచ నుంచి భాస్కరరావులతో వారు పోటీపడి విజేతలుగా గెలిచారు. -
ప్రజా క్షేమం, నగరాభివృద్ధే అజెండా
పటమట(విజయవాడతూర్పు): ప్రజల క్షేమం, నగరాభివృద్ధే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని వీఎంసీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో వీఎంసీ బడ్జెట్ 2024–25కి సంబంధించి చేసిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఆ వివరాలు ఇవి.. ● రూ.40.9 కోట్లతో 47.46కి.మీ. మేర సీసీ రోడ్లు, రూ.6.80కోట్లతో 4.33 కి.మీ. మేర బీటీ రోడ్లు వేశామని మేయర్ చెప్పారు. ● 15వ ఆర్థిక సంఘం నిధులతో 24.91కి. మీ. మేర రూ.17 కోట్లను ఆమోదించి కొండ ప్రాంతంలో మెట్లు, ల్యాండింగ్, ర్యాంప్ వంటి పనుల కోసం రూ. 2.95 కోట్లను వెచ్చించామన్నారు. ● 40వ డివిజన్లో 1500 లీటర్ల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ను రూ. 3.30 కోట్లతో నిర్మించామని, వేసవిలో తాగునీరు అందించే విధంగా రిజర్వాయర్ని పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. 46వ డివిజన్లో 500లీటర్ల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ 90% పనులు పూర్తి చేశామన్నారు. ● 30వ డివిజన్లో దావు బుచ్చయ్య కాలనీలో రూ.1.5 కోట్లతో 4.5 కిలోమీటర్ల నూతన పైప్ లైన్ వేశామని, రూ.3.29 కోట్లతో 3 కి.మీ. పైప్ లైన్ పనులు చేపట్టామని చెప్పారు. ● రూ.14.16 కోట్లతో 3 నియోజకవర్గాలు డ్రెయినేజీలను నిర్మించామని, రూ.1.9కోట్లతో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ 33.54 కి.మీ నిర్మాణ పనులు చేపట్టామని, రూ. 6కోట్లతో విద్యాధరపురంలో ఇండోర్ స్టేడియం నిర్మిస్తున్నామన్నారు. ● రూ.17.4కోట్లతో 3.20 మీటర్ల పొడవుతో రైల్వే అండర్ బ్రిడ్జిని మధురానగర్లో ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ● మూడు నియోజకవర్గాల పరిధిలోని రూ.3 కోట్లతో పార్కులు, కెనాల్ సుందరీకరణ చేశారని, నగరంలోని ప్రధాన కాలువల్లో పేరుకుపోయిన 12 వేల టన్నుల చెత్తని తొలగించామన్నారు. ఆదాయం రూ. 168.8కోట్లు.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 163.8 కోట్లు రెవెన్యూ ఆదాయం వచ్చిందని మేయర్ తెలిపారు. ఆస్తి పన్నులు 109.23 కోట్ల ఆస్తి పన్ను ఈ ఏడాది వసూలు అయిందని, ఖాళీ స్థలాల పన్ను రూ.9.80 కోట్లు, రూ.18.46 కోట్లు నీటి పన్ను వసూలు అయిందన్నారు. సీవేజ్ చార్జీలు రూ. 18కోట్లు వచ్చాయని, రూ.6.59 కోట్లు వాటర్ మీటర్ చార్జీలు వసూలు అయ్యాయన్నారు. పట్టణ ప్రణాళికలో 1216 దరఖాస్తులు రాగా వాటి ద్వారా వీఎంసీకి రూ.56.13 కోట్లు, లేఅవుట్ రెగ్యులేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్) 2020లో భాగంగా రూ. 26.25 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. కారుణ్య నియామకం ద్వారా 10 మందికి ఉద్యోగాలు కల్పించామని, పార్కులు, షాపులు, కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్, ఆడిటోరియం, కర్మల భవన్ నుంచి రూ.19.20 కోట్లు వీఎంసీకి సమకూరాయన్నారు. డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు. విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి నేడు వీఎంసీ బడ్జెట్ సమావేశం విజయవాడ నగరపాలక సంస్థ 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్పై శనివారం కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీఎంసీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో శనివారం ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. -
నిర్లక్ష్యమే ప్రాణం తీసింది!
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): బుడమేరు కాలువ లీకేజీల పూడ్చివేతలో అధికారులు నిర్లక్ష్యం ఓ విద్యార్థి ప్రాణం బలి తీసుకుంది. కొండపల్లి శాంతినగర్ వద్ద శుక్రవారం లీకేజీలతో ఏర్పడిన గుంత లో ప్రమాదవశాత్తూ పడి బలుసుపాటి కుమార్(14)అనే విద్యార్థి మృత్యువాత పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. కవులూరు గ్రామానికి చెందిన బలుసుపాటి పద్మారావు, నాగమణి దంపతులకు ఇద్దరు కుమారులు. రిక్షా తొక్కి కాయకష్టంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు బిడ్డలను స్థానిక జెడ్పీ పాఠశాలలో చదివిస్తున్నారు. పెద్ద కుమారుడు ప్రస్తుతం టెన్త్క్లాస్ పరీక్షలకు హాజరవుతుండగా, రెండో కుమారుడు బలుసుపాటి కుమార్ 9వ తరగతి చదువుతున్నాడు. పాఠశాల సమీపంలో ఉన్న లీకేజీ గుంతల వద్దకు తన స్నేహితుడితో కలిసి వెళ్లగా ప్రమాదవశాత్తూ కాలుజారి గుంతలో పడి విద్యార్థి మృత్యువాత పడ్డాడు. మరో విద్యార్థి ద్వారా విషయం తెలుసుకున్న గ్రామస్తులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. అల్లారుముద్దుగా పెంచి పోషించుకున్న కుమారుడు కళ్లముందు నిర్జీవంగా ఉండటాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు. ఈ పాపం ఎవరిది? గత ఆగష్టు, సెప్టెంబర్లలో వచ్చిన వర్షాలతో కొండపల్లి వద్ద బుడమేరు కట్టలకు భారీస్థాయి గండ్లు పడి విజయవాడలో అనేక ప్రాంతాలను నీటితో ముంచెత్తింది. గండ్లను తాత్కాలికంగా పూడ్చి పని అయిపోయినట్లు ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంది. అయితే పూడ్చిన గండ్లు వద్ద అనతి కాలంలో లీకేజీలు ఏర్పడి రైతులు పంటపొలాల్లో నీరు ప్రవహించి భారీస్థాయి గుంతలు ఏర్పడ్డాయి. వీటిని ఇప్పటికీ పూర్తిస్థాయిలో పూడ్చక పోవడంతో ఆ గుంతలో పడిన విద్యార్థి ప్రాణం కోల్పోయాడు. దీంతో తల్లిదండ్రులకు తీరని వేదన మిగిలింది. బుడమేరు లీకేజీ గుంతలో పడి బాలుడు మృతి -
దీర్ఘకాలిక రోగులను ‘స్పాట్’ నుంచి మినహాయించాలి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): త్వరలో జరిగే పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ విధుల నుంచి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని మినహాయించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, ఎ.సుందరయ్య కోరారు. ఈ మేరకు డీఈఓ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి యు.వి.సుబ్బారావును కలిసి గురువారం వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దీర్ఘకాలిక జబ్బులు, సుదూర ప్రాంతాల వారు, 60 ఏళ్లు నిండిన, గర్భిణులు, దివ్యాంగులు, బాలింతలను స్పాట్ విధుల నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ విద్యాసంస్థల్లో రివర్షన్కు గురైన ఉపాధ్యాయుల జీతాలు, ఇతర సమస్యలు గురించి నాయకులకు డీఈఓకు వినతిపత్రాన్ని అందించారు. వీటిపై పరిశీలించి ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని డీఈఓ సుబ్బారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎ.గోపాలకృష్ణ, వి.కొండలరావు, ఎం.శ్రీనివాసరావు, ఎస్.చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పేర్లు నమోదు చేసుకోవాలి
పెనమలూరు: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, వివిధ రాయితీలు పొందటానికి ఉద్యం రిజిస్ట్రేషన్ పోర్టల్లో వారు పేర్లు నమోదు చేసుకోవాలని కృష్ణా జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆర్.వెంకట్రావు సూచించారు. కానూరు ఆటోనగర్ క్లస్టర్ భవనంలో గురువారం ఉద్యం రిజిస్ట్రేషన్ క్యాంపు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జీఎం వెంకట్రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సూక్ష్మ, చిన్న పరిశ్రమల వృద్ధిలో భాగంగా ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) సెక్టార్ అభివృద్ధికి చర్యలు చేపట్టిందని వివరించారు. ప్రభుత్వం అందించే సబ్సిడీలు, రుణ సదుపాయం లబ్ధిపొందాలంటే ఉద్యం రిజి స్ట్రేషన్ సర్టిఫికెట్ తప్పనిసరని తెలిపారు. పారి శ్రామికవేత్తలు, వ్యాపారులు తమ యూనిట్లకు సంబంధించి ఉద్యం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆటోనగర్ క్లస్టర్ ఎండీ అన్నే శివనాగేశ్వరరావు, డైరెక్టర్లు, పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు పాల్గొన్నారు. -
మచిలీపట్నం చేరుకున్న సీఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీ
చిలకలపూడి(మచిలీపట్నం): దేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన భద్రతను అందిస్తున్న పారా మిలటరీ దళమైన కేంద్ర పారిశ్రామిక భద్రత దళం సీఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీ గురువారం సాయంత్రం మచిలీపట్నం చేరుకుంది. జెడ్పీ కన్వెన్షన్ హాలులో అడిషనల్ ఎస్పీ సి.సత్యనారాయణ ఈ సైకిల్ ర్యాలీ బృందానికి స్వాగతం పలికారు. అనంతరం జరిగిన అభినందన సభలో బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. సీఐఎఫ్ డెప్యూటీ కమాండెంట్లు హ్రిషబ్, ప్రభాకర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు సీఐఎస్ఎఫ్ను స్థాపించి ఈ నెల పదో తేదీ నాటికి 55 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సురక్షిత తీరం – సమృద్ధి భారత్’ పేరుతో ఆరు వేల కిలోమీటర్లకు పైగా సముద్రతీర ప్రాంతంలో దేశ భద్రత, సమైఖ్యతను పెంపొందించేందుకు ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల ఏడో తేదీన పశ్చిమబెంగాల్లోని బఖ్ఖలి నుంచి 60 మంది సభ్యులతో తమిళనాడులోని కన్యాకుమారి వరకు సముద్ర ప్రాంతం గుండా ఈ ర్యాలీ కొనసాగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు శ్రీనివాస్, శిఖర్ లోహియా, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
మైలవరం: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం మైలవరం మండలం వెల్వడం అడ్డ రోడ్డు వద్ద జరిగింది. జి.కొండూరుకు చెందిన భార్యాభర్తలు లంకా కోటేశ్వరమ్మ, వెంకటేశ్వరరావు గురువారం ఉదయం ద్విచక్రవాహనంపై ఆగిరిపల్లిలోని తమ మామిడి తోటలను చూసేందుకు వెళ్లారు. మధ్యాహ్నం తిరిగి జి.కొండూరు బయలుదేరారు. మైలవరం మండలం వెల్వడం సమీపంలోని గణపవరం అడ్డరోడ్డు మలుపు వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొనడంతో కోటేశ్వరమ్మ (50) అక్కడికక్కడే మృతిచెందింది. వెంకటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. తన కళ్ల ముందే భార్య మృతి చెందడాన్ని తట్టుకోలేక తల్లడిల్లాడు. -
పోలవరం బిల్లుకు సవరణ చేయించండి
కృష్ణలంక(విజయవాడతూర్పు): పోలవరం ప్రాజెక్టును డెడ్ స్టోరేజీ ప్రాజెక్టుగా నిధుల విషయంలో కేంద్ర బడ్జెట్లో పెట్టిన బిల్లుకు తక్షణమే సవరణ చేయించాలని రాష్ట్ర ఎంపీలను ప్రత్యేక హోదా విభ జన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కోరారు. లేకపోతే శాశ్వతంగా నష్టపోతా మని ఆందోళన వ్యక్తంచేశారు. గవర్నర్పేట బాలో త్సవ భవన్లో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ఎనిమిదేళ్ల కిత్రం పోలవరం ప్రాజెక్టు రూ.55 వేల కోట్లకు ఆమోదం పొందితే మొన్న జరిగిన బడ్జెట్లో రూ.30 వేల కోట్లకు కుదించడమే కాకుండా 150 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టాన్ని 135 అడుగులకు పరిమితం చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం ఇప్పటి వరకు అర్ధ రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. సాధన సమితి ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, మాజీ ఎంపీ పి.మధు, ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య, కాంగ్రెస్కిసాన్ సెల్ నేత కిరణ్కుమార్రెడ్డి, ఆంధ్ర మేధావుల సంఘం నేత ప్రొఫెసర్ విశ్వనాథం, సాధన సమితి సంయుక్త కార్యదర్శి నరసింహారావు పాల్గొన్నారు. -
చిన్నారుల సంక్షేమానికే ‘మిషన్ వాత్సల్య’
జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నిస్సహాయ స్థితిలో ఉన్న చిన్నారుల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న మిషన్ వాత్సల్యను లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఏర్పాటైన గ్రామ, వార్డు స్థాయి కమిటీలు క్రియాశీలకంగా పనిచేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. గురువారం కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్లో మిషన్ వాత్సల్య–శిశు సంక్షేమ, రక్షణ జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. ప్రత్యేక కమిటీలు.. కలెక్టర్ మాట్లాడుతూ శిశు సంరక్షణ చట్టాలు, కుటుంబ ఆధారిత సంరక్షణకు ప్రోత్సాహం, సంస్థాగత మద్దతు, ఆర్థిక సహకారం, శిశు సంరక్షణ పథకాలు తదితరాల అనుసంధానంతో మిషన్ వాత్సల్య అమలుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ క్రమంలో సర్పంచ్, కౌన్సిలర్, కార్పొరేటర్ చైర్మన్గా గ్రామ, వార్డుస్థాయి కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీలు 15 రోజులకోసారి తప్పనిసరిగా సమావేశం కావాలని సూచించారు. డివిజన్ స్థాయిలో కమిటీలకు వర్క్షాప్లు నిర్వహించాలని.. బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాల నిర్మూలన, విద్యా సాధికారత, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)లో శిశు మద్దతు కార్యకలాపాలు, ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు తదితరాలపై కమిటీ సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా న్యాయసేవల సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి కేవీ రామకృష్ణయ్య, డీసీపీ కేజీవీ సరిత, జెడ్పీ సీఈవో వై.కన్నమనాయుడు, ఐసీడీఎస్ పీడీ డి.శ్రీలక్ష్మి, జిల్లా శిశు సంరక్షణ అధికారి ఎం.రాజేశ్వరరావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జి.మహేశ్వరరావు, ఏసీపీ కె.లతాకుమారి, సాంఘిక సంక్షేమ అధికారి కేఎస్ శిరోమణి పాల్గొన్నారు. -
దీర్ఘకాలిక రోగులను ‘స్పాట్’ నుంచి మినహాయించాలి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): త్వరలో జరిగే పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ విధుల నుంచి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని మినహాయించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, ఎ.సుందరయ్య కోరారు. ఈ మేరకు డీఈఓ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి యు.వి.సుబ్బారావును కలిసి గురువారం వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దీర్ఘకాలిక జబ్బులు, సుదూర ప్రాంతాల వారు, 60 ఏళ్లు నిండిన, గర్భిణులు, దివ్యాంగులు, బాలింతలను స్పాట్ విధుల నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ విద్యాసంస్థల్లో రివర్షన్కు గురైన ఉపాధ్యాయుల జీతాలు, ఇతర సమస్యలు గురించి నాయకులకు డీఈఓకు వినతిపత్రాన్ని అందించారు. వీటిపై పరిశీలించి ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని డీఈఓ సుబ్బారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎ.గోపాలకృష్ణ, వి.కొండలరావు, ఎం.శ్రీనివాసరావు, ఎస్.చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
సామూహిక లైంగిక దాడి కేసును ఛేదించిన పోలీసులు
గన్నవరం: బాలికపై జరిగిన సామూహిక లైంగికదాడి కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను ఆత్కూరు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు గన్నవరం పోలీస్స్టేషన్లో కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు సమక్షంలో నిందితులను అరెస్ట్ చూపించారు. అనంతరం ఎస్పీ కేసు వివరాలను మీడి యాకు వెల్లడించారు. ఎస్పీ కథనం మేరకు.. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరుకు చెందిన 14 ఏళ్ల బాలిక తమ ఇంటి పక్కనే ఉండే కుటుంబంతో సన్నిహితంగా మెలిగేది. ఈ నెల తొమ్మిదిన గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో జరిగిన అమ్మవారి జాతరకు సదరు కుటుంబంతో పాటు బాలిక కూడా వచ్చింది. ఈ నెల 13వ తేదీ రాత్రి ఆ బాలిక కనిపించకుండా పోవడంతో వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 17వ తేదీ రాత్రి ఓ ఆటో డ్రైవర్ ద్వారా బాలిక మాచవరం పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. ఈ విషయం తెలుసుకున్న ఆత్కూరు పోలీసులు ఆమె తల్లిదండ్రుల సమక్షంలో బాలికను తీసుకొచ్చి పెద్ద ఆవుటపల్లిలోని బంధువుల ఇంటికి పంపించారు. అనంతరం కడుపు నొప్పితో బాధపడుతున్న ఆ బాలికను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఉమెన్ ఎస్ఐ నేతృత్వంలో విచారణ జరపగా సామూహిక లైంగికదాడి విషయం బయటపడింది. ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆ బాలికను ఆమె స్వగ్రామంలో దింపుతామని వీరపనేనిగూడెం గ్రామానికి చెందిన కొంత మంది యువకులు నమ్మబలికారు. అనంతరం ఆ బాలికను వేర్వేరు ప్రాంతాలకు మార్చుతూ యువకులు ఆమైపె సామూహిక లైంగిక దాడికి పాల్పొడ్డారని విచారణలో తేలింది. ఆ బాలిక నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు రేప్ కేసుగా మార్చి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన వీరపనేనిగూడెంనకు చెందిన బాణవతు లక్ష్మణజితేంద్రకుమార్నాయక్, పగడాల హర్షవర్ధన్ను అరెస్టు చేశారు. మరో ఆరుగురు యువకులను పట్టుకోవాల్సి ఉందని, వారిలో మైనర్లు ఉన్నారని పోలీ సులు తెలిపారు. కేసు దర్యాప్తులో చాకచాక్యంగా వ్యవహరించిన అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, సీఐ కె.వి.వి.ఎన్.సత్యనారాయణ, ఆత్కూరు ఎస్ఐ చావా సురేష్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. డీఎస్పీ సీహెచ్.శ్రీనివాసరావు, గన్నవరం ఎస్ఐ శ్రీధర్ పాల్గొన్నారు. -
డ్వాక్రా రుణాల పేరుతో మోసపోయిన మహిళలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో డ్వాక్రా రుణాల పేరుతో తమను ఆర్పీ, సీఓ మోసగించారని పలువురు మహిళలు ఆరోపించారు. వారి కథనం మేరకు.. టేకోవర్ గ్రూప్స్ ఉన్నాయని, వాటిలో చేరి రూ.2 లక్షలు పొదుపు చేస్తే బ్యాంకుల నుంచి రుణాలు వస్తాయని వైఎస్సార్ కాలనీకి చెందిన పది మంది మహిళలను రిసోర్స్ పర్సన్ బూదాల రాణి, కమ్యూనిటీ రాజేష్ నమ్మించారు. వారి వద్ద పొదుపు రూపంలో రూ.2 లక్షలు వసూలు చేశారు. ఆ మొత్తాన్ని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో కట్టించారు. అనంతరం ఆ మహిళల వద్ద ఉన్న బ్యాంకు డాక్యుమెంట్లను రాణి, రాజేష్ తీసుకుని వాటిపై ఇతర బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. లోన్ వచ్చే సమయానికి డబ్బు కట్టిన మహిళలను తప్పించి, లోన్ కింద వచ్చిన మొత్తాని వారిద్దరూ వాడేసుకుంటున్నారని పేర్కొంటున్నారు. అదేమని అడిగితే ‘మీ డాక్యుమెంట్లతో లోన్ కోసం పెట్టాం కాబట్టి రూ.లక్షకు రూ.5 వేల కమీషన్ ఇస్తామని, తీసుకుని సైలెంట్గా ఉండాలని అంటు న్నారని పేర్కొన్నారు. బ్యాంక్ రుణంగా ఇచ్చిన రూ.20 లక్షలు, తాము రూ.2 లక్షల చొప్పున చెల్లించిన పొదుపు సొమ్ము ఇవ్వకుండా రిసోర్సు పర్సన్ రాణి, కమ్యూనిటీ ఆర్గనైజర్ రాజేష్ మోసం చేశారని బాధిత మహిళలు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని పలువురు మహిళలు గురువారం సాయంత్రం కొత్తపేట పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు. -
ఒకే పని.. రెండు బిల్లులు
అవనిగడ్డ: నిధులులేక ఎన్నో సంవత్సరాల నుంచి పలు చోట్ల పంట కాలువల్లో పూడికతీత పనులు జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవనిగడ్డలో మాత్రం ఒకే పంట కాలువకు రెండు రకాల బిల్లులతో పనులు జరుగుతున్నాయి. ఒక పక్క యంత్రాలతో కాంట్రాక్టర్ పంటకాలువ పూడిక తీత పనులు చేపట్టారు. మరో వైపు అదే కాలువలో ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలతో పూడికతీత పనులు జరుగుతున్నాయి. ఒకే పనిని రెండు రకాలుగా చేయడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆరు రోజులుగా పనులు అవనిగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 16 పంట కాలువల్లో పూడికతీత పనులను రూ.39.90 లక్షలకు విజయవాడకు చెందిన ఓ కాంట్రాక్టర్ టెండర్ దక్కించుకున్నారు. ఈ మేరకు ఆరు రోజుల నుంచి యంత్రాలతో పూడిక తీత పనులు చేపట్టారు. ఈ పనుల్లో భాగంగా అవనిగడ్డ మండల పరిధిలోని అశ్వరావుపాలెం – మందపాకల పంటకాలువ పూడిక తీతను రెండు రోజుల క్రితం క్రితం చివరి ప్రాంతం నుంచి ప్రారంభించారు. ఇదే కాలువకు మొదలులో నాలుగు రోజుల నుంచి రోజుకు 50 నుంచి 60 మంది ఉపాధి కూలీలు ఉపాధిహామీ పథకం ద్వారా పూడికతీత పనులు చేస్తున్నారు. ఈ పంటకాలువకు సంబంధించి ఇప్పటి వరకూ ఉపాధి కూలీలు రూ.80 వేలు విలువగల పనులు పూర్తి చేశారు. ఈ కాలువకు సంబంధించి ఎవరు ఎన్నిచోట్ల పనులు చేసినా కాంట్రాక్టర్కు కేటా యించిన నిధులు మాత్రం ఆయనకు ఇవ్వాల్సి ఉంటుంది. చాలా చోట్ల డ్రెయిన్లు, పంట బోదెలకు సంవత్సరాల తరబడి పూడికతీయలేదు. దీంతో కొద్దిపాటి వర్షాలకు సైతం డ్రెయిన్లు పొంగి పంటపొలాలను ముంచెత్తడం దివి సీమలో పరిపాటిగా మారింది. గత ఏడాది ఖరీప్లో కురిసిన భారీ వర్షాలకు ఆరు మండలాల్లో 23 వేల ఎకరాలు వరిపంట ముంపునకు గురైన విషయం విదితమే. అవసరమైన చోట పనులు చేయకుండా ఒకే కాలువకు రెండు విధాలుగా పనులు చేయిస్తూ ప్రజాధనం వృథా చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల కోసం ముసలి కన్నీరు కారుస్తున్న స్థానిక ప్రజాప్రతినిధి ఒకేపనికి రెండు విధాలా ప్రజాధనం వృథా అవుతుంటే ఏమి చేస్తున్నారని కొంత మంది రైతులు ప్రశ్నిస్తున్నారు. పనుల నిర్వహణపై ఇరిగేషన్ డీఈ పులిగడ్డ వెంకటేశ్వరరావును వివరణ కోరగా.. అశ్వరావుపాలెం – మందపాకల కాలువకు ఉపాధి కూలీలు పనులు చేస్తున్న విషయం తనకు తెలియదన్నారు. రేపటి నుంచి పనులు ఆపేస్తామని చెప్పారు. ఏపీఓ రవి కుమార్ని వివరణ కోరగా.. ఇరిగేషన్ అధికారుల ఆదేశాల మేరకే కూలీలతో ఉపాఽధి పనులు చేపట్టామని చెప్పడం గమనార్హం. ఎగువ నుంచి యంత్రాలతో పనులు చేపట్టిన కాంట్రాక్టర్ దిగువ నుంచి ఉపాధి హామీ పథకంకూలీలతో జరుగుతున్న పనులు ఒకే కాలువకు రెండు విధాలా పనులపై విస్మయం ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని విమర్శలు -
అదనపు పనులు చేయలేం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీలను పూర్తిస్థాయిలో వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలోకి తేవాలని ఏపీ యునైటెడ్ విలేజ్ అండ్ వార్డ్ హెల్త్ సెక్రటరీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ నందు గురువారం అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ధర్నాను ఉద్దేశించి అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాధవి, సంధ్యారాణి మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయ హెల్త్ సెక్రటరీలు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, డీఎంహెచ్ల పరిధిలో పనిచేయడం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఒకే సమయంలో వేర్వేరు శాఖల పనులతో పనిభారం పెరిగిందన్నారు. పనిభారం తగ్గించాలని ఉన్నతాధికారులను కోరుతున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదన్నారు. అదనపు పనులు చేయించవద్దని వైద్య ఆరోగ్యశాఖ జారీ చేస్తున్న ఉత్తర్వులను క్షేత్రస్థాయిలో అధికారులు అమలు చేయడం లేదన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలన్నారు. అసోసియేషన్ గౌరవ సలహాదారుడు ఏవీ నాగేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు జగన్మోహన్రావు, కార్యనిర్వాహక అధ్యక్షుడు అన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ధర్నాలో గ్రామ, వార్డు సచివాలయాల హెల్త్ సెక్రటరీలు -
ఉద్యమంలా ప్రకృతి వ్యవసాయం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన ప్రకృతి వ్యవసాయం – ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికపై సమన్వయ సమావేశం గురువారం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. రసాయన పురుగు మందులు, ఎరువులు మనిషి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. సాగులో సేంద్రియ ఎరువులు, జీవ ఉత్ప్రేరకాలు, కషాయాలు, ద్రావణాల వినియోగం వల్ల ఆరోగ్యకరమైన వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని సూచించారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్లోనూ రైతులకు సాయపడాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో రైతులను ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రోత్సహించాలని, శాసీ్త్రయ ఆధారాలతో అపోహలను తొలగించాలని కోరారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ప్రకృతి సాగు దిశగా నడిపించాలని, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు. ర్యాలీలు, పొలం సందర్శనలు, ప్రకృతి వ్యవసాయాన్ని విజయవంతంగా చేస్తున్న రైతులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ (జెడ్బీఎన్ఎఫ్) విధానాలు నేలసారం తగ్గకుండా పంటకు సత్తువనిస్తాయని, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని వివరించారు. ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పులనూ తట్టుకునే సామర్థ్యం ఈ విధానాల పంటలకు ఉంటుందన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చేయూతతో నిమ్మ, సపోటా, డ్రాగన్ ఫ్రూట్, ఆపిల్ బేర్, దానిమ్మ తదితర పండ్ల తోటలతో పాటు పూల తోటలు 19 రకాల ఉద్యాన పంటలను చేపట్టవచ్చని పేర్కొన్నారు. ఉద్యాన పంటల సాగుదిశగా నడిపించాలని సూచించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో వ్యవసాయ రంగ వృద్ధిని ఆరు శాతం నుంచి 15 శాతానికి తీసుకెళ్లేందుకు అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రకృతి సాగుతో ముందుకెళ్తున్న రైతులు వెంకట గురుప్రసాద్ (నున్న), శ్రీనివాస్రెడ్డి (రెడ్డిగూడెం)ని కలెక్టర్ సత్కరించారు. జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, డ్వామా పీడీ ఎ.రాము, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కల్పన, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారి పి.ఎం.సుభాని, జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ కె.ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. ఖరీఫ్ కార్యాచరణ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశుక్రవారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2025 ఇఫ్తార్ సహరి (శుక్ర ) (శని) విజయవాడ 6.23 4.53 మచిలీపట్నం 6.22 4.51బందరు చేరిన సైకిల్ ర్యాలీ దేశంలో అత్యున్నత భద్రతను అందించే కేంద్ర పారిశ్రామిక భద్రత దళం సీఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీ గురువారం మచిలీపట్నం చేరుకుంది. నిత్యాన్నదానానికి విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి గుడివాడకు చెందిన సుంకర బాలాంబ కుటుంబం రూ. 2,00,116 విరాళాన్ని అందజేసింది. –8లోuఈవీఎం గోడౌన్కు పటిష్ట భద్రత భవానీపురం(విజయవాడపఽశ్చిమ): ఈవీఎం, వీవీప్యాట్స్ ఉన్న గోడౌన్కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఆయన విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోగల వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని ఈవీఎం, వీవీప్యాట్లు భద్రపరిచన గోడౌన్ను అధికారులు, రాజకీయ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. సీసీ కెమెరాల పని తీరు, అగ్నిమాపక దళ పరికరాలు తదితరాలను తనిఖీ చేశారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్ల గోడౌన్ను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను అందిస్తున్నామని తెలిపారు. డీఆర్ఓ ఎం. లక్ష్మీనరసింహం, కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ చంద్రమౌళి, వై. రామయ్య (టీడీపీ), ఎం. వినోద్ కుమార్ (బీఎస్పీ), తరుణ్ కాకాని (బీజేపీ), వై ఏసుదాసు (ఐఎన్సీ) పాల్గొన్నారు. విజయవాడ డివిజన్కు ప్రతిష్టాత్మక అవార్డు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రోజువారీ విధుల్లో అధికార భాషను అమలు పరచడంలో విశేష కృషి చేసినందుకు గానూ ప్రతిష్టాత్మకమైన ‘రఘువీర్ చాల్ వైజయంతి’ షీల్డ్ను విజయవాడ డివిజన్ సాధించింది. గురువారం న్యూఢిల్లీలోని రైల్భవన్లో జరిగిన అధికార భాష అమలు కమిటీ సమావేశంలో డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్, డివిజన్ రాజభాష అధికారి ఎం.కె.నాగరాజుతో కలసి రైల్వేబోర్డు చైర్మన్ సతిష్కుమార్ చేతుల మీదుగా షీల్డ్ను అందుకున్నారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మాట్లాడుతూ రాజభాష అమలులో ఎంతో ప్రతిష్టాత్మక అవార్డు రావటం డివిజన్కే గర్వకారణమన్నారు. డివిజన్ సాధించిన విజయంతో పాటుగా గుంటుపల్లిలోని రాయపాడు వ్యాగన్ వర్కుషాపునకు రాజభాష అమలులో ‘ఆదర్శ కార్ఖానా’గా గుర్తింపు వచ్చినట్లు తెలిపారు. 31వరకే ధాన్యం కొనుగోలు కేంద్రాలు చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి 2024–25 ధాన్యం సేకరణ ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే కొనుగోలు చేస్తారని జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ గురువారం తెలిపారు. జిల్లాలోని రైతులు పండించిన ధాన్యాన్ని ఇంకా విక్రయించాల్సిన వారు ఉంటే సంబంధిత కేంద్రాలకు వెళ్లి విక్రయించుకోవాలని ఆమె సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 70,718 రైతుల నుంచి రూ. 1,333.43 కోట్ల విలువ కలిగిన 5,83,117 టన్నులు ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేశామని చెప్పారు. వర్సిటీల్లో సమస్యలను పరిష్కరించాలని వినతి మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను తక్షణమే భర్తీ చేయలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ మధు మూర్తిని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆయన కార్యాలయంలో గురువారం కలిసి వినతిప్రతం అందజేశామని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకట గోపి ఓ ప్రకటనలో తెలిపారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే మంజూరు చేసే లా ప్రభుత్వంతో చర్చలు జరిపి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడా లని, వర్సిటీల అభివృద్ధికి ప్రత్యేక గ్రాంట్ విడుదల చేయాలని కోరామని పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చిన విధంగా జీఓ 77ను రద్దుచేసి పీజీ విద్యను అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విన్నవించామన్నారు. ఏబీవీపీ జాతీయ సమితి సభ్యుడు యాచంద్ర, పరిషత్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు అఖిల్కుమార్ రెడ్డి, సురేంద్ర, పరిషత్ సభ్యులు వినతిపత్రం అందజేసిన వారిలో ఉన్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: గత ఏడాది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు మునేరు ఊహించని విధంగా ఉప్పొంగి.. రైతులను దారుణంగా ముంచేసింది. దాదాపు 3.50 లక్షల కూసెక్కుల మేర వరద ప్రవాహం రావడంతో భారీగా ఇసుక మేటలు వేసింది. భూములు పెద్ద ఎత్తున కోతకు గురయ్యాయి. మునేరు పరిధిలోని కాలువలకు 70చోట్ల గండ్లు పడ్డాయి. అంతేకాక 212 మైనర్ ఇరిగేషన్ చెరువులకూ గండ్లు పడి ధ్వంసం అయ్యా యి. ఇందులో ప్రధానంగా మునేరు పక్కన ఉన్న తువ్వకాలువకు 40 చోట్ల వరకు గండ్లు పడి నాశనమైంది. వత్సవాయి మండలం ఆళ్లూరుపాడు, వేములనర్వ వద్ద నాలుగు, పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు వద్ద ఒక పెద్ద గండి పడింది. వీటికి శాశ్వత ప్రాతిపదికన గండ్లు పూడ్చలేదు. ఫలితంగా రైతులకు కడగండ్లు తప్పడం లేదు. అన్నదాతల ఆందోళన.. తెలంగాణ నుంచి వచ్చే మునేరు 240 కిలోమీటర్ల మేర ప్రవహించి ప్రకాశం బ్యారేజి ఎగువన కృష్ణా నదిలో కలుస్తుంది. వత్సవాయి మండలం పోలంపల్లి నుంచి ప్రారంభమయ్యే మునేరు ప్రాజెక్టు పరిధిలో మెయిన్కాలువ ఉంది. ఇది వత్సవాయి మండలం ఆళ్లూరుపాడు, వేమవరం.. పెనుగంచిప్రోలు మండలంలోని ముచ్చింతాల, పెనుగంచిప్రోలు, అనిగండ్లపాడు, గుమ్మడిదుర్రు, నందిగామ మండలం సోమవరం వరకు విస్తరించి ఉంది. దీని పరిధిలో 22,000 ఎకరాలకు పైగా సాగు ఉంది. దీనికి పడిన గండ్లు తాత్కాలికంగా పూడ్చారు తప్ప శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేయలేదు. ఇక తువ్వ కాలువ వత్సవాయి మండలం ఆళ్లూరుపాడు నుంచి పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదుర్రు వరకూ ప్రవహిస్తుంది. తువ్వకాలువ(పెనుగంచిప్రో లు) బ్రాంచ్ కింద సుమారు 3 వేల ఎకరాల వరకు సాగవుతోంది. కాలువకు వేమవరం, ఆళ్లూరుపాడు వద్ద పెద్ద గండ్లు పడ్డాయి. ఆయా చోట్ల తాత్కాలికంగా పూడ్చారు. శాశ్వత ప్రాతిపదికన పనులు చేయ లేదు. దీంతో మళ్లీ వరద వస్తే ఇబ్బందులు తప్పవనే ఆందోళన రైతుల నుంచి వ్యక్తం అవుతోంది. రెండు సీజన్లు కోల్పోయిన రైతులు.. గండ్లు పడటంలో ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు విలువైన పంట కోల్పోయారు. అంతేకాక పొలాల్లో ఇసుక మేట వేయటం, భూములు కోతకు గురి కావటం, మోటార్లు, బోర్లు పాడవడంతో రైతులు దారుణంగా నష్టపోయారు. అయితే వరదలు పోయి ఆరు నెలలు అవుతున్నా గండ్లు పూడ్చటంపై అధికారులు దృష్టి పెట్టటం లేదు. దీంతో ఖరీఫ్తో పాటు రబీ సాగు కూడా రైతులు కోల్పోయారు. కొద్ది మంది రైతులు మాత్రం పొలాలను సొంత డబ్బు ఖర్చు పెట్టి రబీ సాగు చేశారు. నేటికీ చాలా పొలాల్లో ఇసుక మేటలు అలాగే ఉన్నాయి. అరకొరగా నష్టపరిహారం.. ● వరదలకు వత్సవాయి మండలం ఆళ్లూరుపాడు, వేమవరంలో సుమారు 200 ఎకరాల్లో పంట పాడవగా 100 ఎకరాల్లో ఇసుక మేట వేసింది. ● పెనుగంచిప్రోలు మండలంలో 3097 ఎకరాల్లో వరి పంట నాశనమైంది. అందులో 300 ఎకరాల్లో ఇసుక మేట వేసింది. ● ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు మాత్రం నామమాత్రంగా పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంది. ఇసుక మేటకు, కోతకు గురైన భూములకు ఎలాంటి నష్ట పరిహారం చెల్లించలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ సీజన్లో పనులు చేయకపోతే, వర్షాకాలంలో మునేరుకు వరద వస్తే కడగండ్లు తప్పవని ఆందోళన చెందుతున్నారు. ● ప్రభుత్వం మాత్రం గండ్లు పూడ్చటానికి కేవలం ప్రతిపాదనలు సిద్ధం చేసిన, నిధులు మంజూరు చేయలేదు. దీంతో గండ్లు పూడ్చడంపై సందిగ్ధత నెలకొంది. మునేరు మెయిన్ కాలువకు పడిన గండి(ఫైల్)● మునేరుకు వచ్చిన భారీ వర్షాలకు 70చోట్ల గండ్లు పడ్డాయి. తాత్కాలిక మరమ్మతులకు రూ.7కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.43.02 కోట్లు, మొత్తం రూ.50.02 కోట్లు అవుతాయని అంచనా వేశారు. ● మైనర్ ఇరిగేషన్ చెరువులకు సంబంధించి 212 చోట్ల గండ్లు పడగా, తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.21.656కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.38.62 కోట్లు, మొత్తం రూ.53.276కోట్లు అవుతాయని ప్రతిపాదనలు రూపొందించారు. ● మునేరు, చెరువులకు కలిపి మొత్తం 282 గండ్లకు రూ.103.296కోట్లు నిధులు అవసరమని అంచనాలు రూపొందించారు. ● అయితే అక్కడక్కడ తాత్కాలికంగా గండ్లు పూడ్చినా.. శాశ్వత పనులకు ఇప్పటి వరకు నిధులు మంజూరు చేయలేదు. దీంతో ఈ ప్రతిపాదనలన్నీ అటకెక్కాయి. చర్లపల్లి–కన్యాకుమారి మధ్య వారాంతపు ప్రత్యేక రైళ్లు లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ ప్రయాణికుల సౌకర్యార్థం సమ్మర్ వారాంతపు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు డివిజన్ సీనియర్ డీసీఎం ప్రదీప్కుమార్ గురువారం తెలిపారు. చర్లపల్లి–కన్యాకుమారి వయా గుంటూరు డివిజన్ మీదుగా ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు ప్రత్యేక రైలు(07230) ప్రతి బుధవారం నడపనున్నట్టు వివరించారు. ఈ రైలు చర్లపల్లి స్టేషన్ నుంచి రాత్రి 9.50 గంటలకు బయలుదేరి రెండో రోజు అర్ధరాత్రి 2.30 గంటలకు కన్యాకుమారి స్టేషన్కు చేరుకుంటుందని వెల్లడించారు. అలాగే కన్యాకుమారి–చర్లపల్లి రైలు(07229) ఏప్రిల్ 4 నుంచి జూన్ 27 ప్రతి శుక్రవారం నడపనున్నట్టు వివరించారు. ఈ రైలు కన్యాకుమారి స్టేషన్ నుంచి తెల్లవారు జామున 5.15 గంటలకు బయలు దేరి మరుసటి రోజు రాత్రి 11.40 గంటలకు చర్లపల్లి స్టేషన్కు చేరుకుంటుందని వెల్లడించారు. నాగాయలంక: ఆలీవ్ రిడ్లే తాబేళ్ల ప్రాణహాని కలిగించే చర్యలకు పాల్పడవద్దని పాలకాయతిప్ప కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ సిబ్బంది గురువారం తీరగ్రామాల ప్రజలకు అవగాహన కల్పించారు. మండలంలోని ఎదురుమొండి, గుల్లలమోద, ఏటిమొగ, దీనదయాళపురం గ్రామాల్లో వివిధ అంశాలపై విస్త్రృత ప్రచారం, హెచ్చరికలు జారీ చేశారు. సముద్రపు తాబేళ్లు గుడ్లు పెట్టే సమయం కావడంతో చేపల వేటలో మత్స్యకారులు వాటికి ప్రాణహాని కలిగించే నిషేధిత వలలు(టేకు వల, మూడు పొరల వల వంటివి) ఉపయోగించకూడదని చెప్పారు. అలాగే వేట సమయంలో వలల్లో చిక్కిన తాబేళ్లను సురక్షితంగా సముద్రంలో వదిలిపెట్టాలని సూచించారు. మైరెన్ పోలీస్ సిబ్బంది, ఆయా గ్రామాల పెద్దలు, మత్స్యకారులు పాల్గొన్నారు. నాగాయలంక మండలం ఏటిమొగ వద్ద స్థానికులకు అవగాహన కల్పిస్తున్న మైరెన్ పోలీసులు7న్యూస్రీల్ గత సెప్టెంబర్లో కురిసిన వర్షాలకు 70 చోట్ల గండ్లు 212 మైనర్ చెరువులకు నష్టం 25వేల ఎకరాలకు పైగా ఆయకట్టు ప్రశ్నార్థకం పలు ప్రాంతాల్లో మేటలు వేసిన ఇసుక, కోతకు గురైన భూమి ఇప్పటి వరకు పట్టించుకోని ప్రభుత్వం ప్రతిపాదనలు ఇలా.. మార్క్స్ టేబులేషన్ ప్రక్రియ.. స్పాట్ వాల్యూయేషన్లో భాగంగా జవాబు పత్రాల మూల్యాంకనంతో పాటుగా మార్క్స్ టేబులేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. గతంలో అసిస్టెంట్ ఎగ్జామినర్ మూల్యాంకనం చేసిన పత్రాలను చీఫ్ ఎగ్జామినార్ పరిశీలించి వాటిని ఇంటర్మీడియెట్ బోర్డుకు పంపించేవారు. అక్కడ కోడ్ ప్రకారం విద్యార్థులకు మార్కులు కేటాయించి అంతిమంగా ఫలితాలను విడుదల చేసేవారు. అయితే దీనిలో కొంత జాప్యం జరుగుతుండటంతో స్పాట్ వాల్యూయేషన్లోనే జవాబు పత్రాలు మూల్యాంకనం అయిన తరువాత మార్క్స్ టేబులేషన్ను (స్కానింగ్ ప్రక్రియ) నిర్వహిస్తున్నారు. దీనివల్ల జాప్యం లేకుండా ఫలితాలను త్వరగా ప్రకటించటానికి అవకాశం ఏర్పడుతుంది. గత ఏడాది నుంచి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ ప్రక్రియను ప్రారంభించింది. గ్రామాల్లో పాలకాయతిప్ప కోస్టల్ సెక్యూరిటీ సిబ్బంది అవగాహన -
ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇటీవల ముగిసిన ఇంటర్మీడియెట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఎన్టీఆర్ జిల్లాలో ప్రారంభమైంది. విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాలలో ఈ ప్రక్రియకు ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాట్లు చేసింది. ఈ నెల మొదటి తేదీన ప్రారంభమైన ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్లో ప్రధాన సబ్జెక్ట్ల పరీక్షలు ఇటీవలే పూర్తయ్యాయి. దీంతో ఈ నెల 17 నుంచి మూల్యాంకనం ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. గురువారం నుంచి అధ్యాపకులు పూర్తి స్థాయిలో మూల్యాంకనం ప్రక్రియకు హాజరవుతున్నారు. జిల్లాకు వచ్చిన జవాబు పత్రాలు.. ఎన్టీఆర్ జిల్లాకు వివిధ జిల్లాల నుంచి సుమారుగా 4,08,565 జవాబు పత్రాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల ఏడో తేదీ నాటికి సంస్కృతం పేపర్లు జిల్లాకు చేరుకున్నాయి. అప్పుడే అరకొరగా మూల్యాంకనాన్ని ప్రారంభించినా ఈ నెల 17వ తేదీకి పూర్తిస్థాయిలో పేపర్లు చేరుకోవటంతో తాజాగా గురువారం నుంచి ఊపందుకుంది. ప్రస్తుతం సంస్కృతం, తెలుగు, ఇంగ్లిష్, హిందీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులకు సంబంధించిన పేపర్లు జిల్లాకు చేరుకున్నాయి. మరో ఒకటి, రెండు రోజుల్లో ఫిజిక్స్, ఎకనామిక్స్ పేపర్లకు సంబంధించిన మూల్యాంకనం ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. దఫదఫాలుగా అధ్యాపకులు.. జిల్లాలో జరుగుతున్న మూల్యాంకనం కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 450 మంది అధ్యాపకులు గురువారం నాటికి అధికారులకు రిపోర్ట్ చేశారు. అందులో భాగంగా సంస్కృతం 13, తెలుగు–6, ఇంగ్లిష్–21, హిందీ–1, మ్యాథ్స్–40, సివిక్స్–6 చొప్పున బోర్డులను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బోర్డులో ఒక చీఫ్ ఎగ్జామినార్, ఐదుగురు అసిస్టెంట్ ఎగ్జామినర్లతో పాటుగా ఒక స్కూృట్నీజర్ ఉంటారు. అదేవిధంగా ఈ నెలలో మరో మూడు దఫాల్లో మరికొంతమంది అధ్యాపకులు ఈ మూల్యాంకనంలో పాల్గొననున్నారు. ఏప్రిల్ మొదటి వారం వరకూ కొనసాగనున్న స్పాట్ వాల్యూయేషన్ జిల్లాకు చేరుకున్న 4,08,565 పేపర్లు రిపోర్ట్ చేసిన 450 మంది అధ్యాపకులు మార్క్స్ టేబులేషన్ ప్రక్రియ.. స్పాట్ వాల్యూయేషన్లో భాగంగా జవాబు పత్రాల మూల్యాంకనంతో పాటుగా మార్క్స్ టేబులేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. గతంలో అసిస్టెంట్ ఎగ్జామినర్ మూల్యాంకనం చేసిన పత్రాలను చీఫ్ ఎగ్జామినార్ పరిశీలించి వాటిని ఇంటర్మీడియెట్ బోర్డుకు పంపించేవారు. అక్కడ కోడ్ ప్రకారం విద్యార్థులకు మార్కులు కేటాయించి అంతిమంగా ఫలితాలను విడుదల చేసేవారు. అయితే దీనిలో కొంత జాప్యం జరుగుతుండటంతో స్పాట్ వాల్యూయేషన్లోనే జవాబు పత్రాలు మూల్యాంకనం అయిన తరువాత మార్క్స్ టేబులేషన్ను (స్కానింగ్ ప్రక్రియ) నిర్వహిస్తున్నారు. దీనివల్ల జాప్యం లేకుండా ఫలితాలను త్వరగా ప్రకటించటానికి అవకాశం ఏర్పడుతుంది. గత ఏడాది నుంచి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ ప్రక్రియను ప్రారంభించింది. అధ్యాపకులను స్పాట్కు పంపించాలి.. స్పాట్ వాల్యూయేషన్ విధులకు నియమించిన అధ్యాపకులను కళాశాల ప్రిన్సిపాల్స్ రిలీవ్ చేసి పంపించాలి. ఇప్పటికే స్పాట్ పూర్తిస్థాయిలో ప్రారంభమైంది. ఏప్రిల్ మొదటి వారం వరకూ ఈ మూల్యాంకనం ప్రక్రియ కొనసాగనుంది. కళాశాల ప్రాంగణంలో ఉన్న సదుపాయాలు, పేపర్ల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకులను రెండు మూడు దఫాలుగా హాజరయ్యే విధంగా ఏర్పాటు చేశాం. విధులు కేటాయించిన అధ్యాపకులు తప్పనిసరిగా హాజరు కావాల్సిందే. – సీఎస్ఎస్ఎన్ రెడ్డి, ఆర్ఐవో, ఎన్టీఆర్ జిల్లా -
సమగ్రాభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి
ఎన్టీఆర్ జిల్లా ప్రత్యేక అధికారి జి. జయలక్ష్మి గుణదల(విజయవాడ తూర్పు): పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచే దిశగా అన్ని శాఖల అధికారలు సమష్టిగా కృషి చేయాలని జిల్లా ప్రత్యేక అధికారి జి. జయలక్ష్మి అన్నారు. గుణదలలోని హయత్ ప్లేస్ హోటల్లో స్వచ్ఛతా గ్రీన్ లీఫ్ రేటింగ్, టూరిజం రంగ అభివృద్ధిపై ప్రత్యేక సదస్సు బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ పర్యాటలకులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. హోటల్ యాజమాన్యాలు సైతం పర్యాటక మిత్ర విభాగాలుగా పనిచేయాలన్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి జిల్లాల మధ్య పోటీతత్వంతో పాటు సమన్వయం అవసరమని పేర్కొన్నారు. వృద్ధి సాధించాలి.. అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర లక్ష్యాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఆర్థిక వ్యవస్థలో 66 శాతం సేవా రంగానికి వాటా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న రంగంలో వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో 22.22 శాతం వృద్ధి లక్ష్యాన్ని నిర్ధేశించామన్నారు. రాత్రి 12గంటల వరకే అనుమతి.. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నగరంలో హోటళ్లు రాత్రి 12 గంటల వరకు తెరచి ఉంచే విధంగా పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు. మూడు నెలల తరువాత పొడిగింపుపై నిర్ణయిస్తామని పేర్కొన్నారు. విజయవాడ పర్యాటకానికి అనుకూలమైన నగరమని టూరిస్టులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శాంతి భద్రతలను పరిరక్షించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు నగరంలో 3500 సీసీ కెమెరాలను వినియోగిస్తామన్నారు. కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, ఏపీ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్. వీరాస్వామి, ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పొట్లూరి భాస్కర్, జిల్లా పర్యాటక అధికారి ఎ. శిల్ప, జిల్లా పరిశ్రమల అధికారి బి. సాంబయ్య, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఎన్టీటీపీఎస్ కోల్ప్లాంట్లో అగ్ని ప్రమాదం
ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ కోల్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోల్ ప్లాంట్ లోని టీపీ–9, 4ఏ2బెల్డ్ వద్ద మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ప్రమాదంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను అదుపు చేసేందుకు బుధవారం తెల్లవారుజాము వరకు అగ్నిమాపక సిబ్బంది శ్రమించారు. విద్యుత్ ఉత్ప త్తి కోసం వ్యాగన్ టిప్లర్ వద్ద నుంచి బెల్ట్ల ద్వారా బొగ్గు సరఫరా చేయాల్సి ఉంది. ఈ ప్రాంతంలో అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కాకుండా ఆలస్యంగా స్పందించడంతో బొగ్గు సరఫరా బెల్ట్తో పాటు వివిధ రకాల సామగ్రి కాలిబూడిదగా మారి మరింత నష్టాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 50లక్షల మేరకు సంస్థకు నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. కోల్ప్లాంటులో వేసవిలో అగ్ని ప్రమాదాలు జరుగుతాయనే అంచనా ఉన్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ప్రమాదం జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే జరిగిన ప్రమాదాన్ని పక్కన పెట్టి బెల్డ్, తదితర సామగ్రికి ఇన్సూరెన్స్ ఉందనే వాదన అధికారులు తెరపైకి తేవడం గమనార్హం. -
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం
గూడూరు: మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. గూడూరుకు చెందిన లంకపల్లి నరసింహారావు(64) అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం పొలం వెళ్లి వస్తుండగా గూడూరు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ప్రమాదంలో తలకు, కాలికి బలమైన గాయాలవ్వడంతో వెంటనే మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. గూడూరు ఏఎస్ఐ స్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటోలో బ్యాగ్ను మర్చిపోయిన మహిళ
గంటలో రికవరీ చేసిన పోలీసులు పాయకాపురం(విజయవాడరూరల్): బంగా రపు వస్తువులున్న బ్యాగ్ను ఓ మహిళ ఆటోలో మర్చిపోయింది. బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించిన నున్న పోలీసులు గంట వ్యవధిలోనే ఆ బంగారం వస్తువులున్న బ్యాగ్ను రికవరీ చేసి, బాధితురాలికి అందజేసిన ఘటన బుధవారం జరిగింది. సుందరయ్య నగర్కు చెందిన ఐలూరి ప్రసన్న అనే మహిళ విజయవాడ ఆర్టీసీ బస్టాండు వద్ద పరిమళ పాపారావు ఆటో ఎక్కింది. బంగారం వస్తువులున్న బ్యాగ్ను మర్చిపోయి ఇంట్లోకి వెళ్లింది. కొద్దిసేపటికి ఆటోలో బ్యాగ్ మర్చిపోయినట్టు గుర్తు తెచ్చుకున్న ఆమె నున్న పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సీఐ పి.కృష్ణమోహన్ ఆదేశాల మేరకు క్రైమ్ పోలీసులు సీసీ కెమెరాల ద్వారా ఆటోని గుర్తించారు. అందులో చూడగా బంగారపు వస్తువులున్న బ్యాగ్ యథావిధిగా ఉంది. ఆ బ్యాగ్ను తిరిగి బాధితురాలికి సీఐ అందజేశారు. దీంతో బాధితురాలు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
ముగిసిన ప్రజాప్రతినిధుల క్రీడా పోటీలు
విజయవాడస్పోర్ట్స్: ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్రీడా పోటీలు ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో రెండో రోజు బుధవారం హోరాహోరీగా సాగాయి. క్రికెట్, టగ్వార్, మ్యూజికల్ చైర్, వాలీబాల్, 100 మీటర్ల రన్నింగ్, కబడ్డీ, బ్యాడ్మింటన్, టెన్నిస్, త్రోబాల్, టేబుల్ టెన్నిస్ క్రీడాంశాల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జట్లు తలపడ్డాయి. 100 మీటర్ల రన్నింగ్ రేస్ పురుషుల 50 ఏళ్ల లోపు విభాగంలో శ్రీధర్, విజయ్చంద్ర, 60 ఏళ్ల లోపు విభాగంలో కె.ఇ.శ్యామ్, సత్యకుమార్, 60 ఏళ్లు పైబడిన విభాగంలో రామాంజనేయులు, గద్దె రామ్మోహన్, 100 కేజీల బరువు కేటగిరీలో కె.శ్రీకాంత్, విజయ్కుమార్, మహిళల షాట్పుట్లో పి.సింధూరరెడ్డి, ఆర్.మాధవిరెడ్డి, పురుషుల 60 ఏళ్ల లోపు విభాగంలో విజయ్కుమార్, ఆదిరెడ్డి వాసు, 60 ఏళ్లు పైబడిన విభాగంలో కామినేని శ్రీనివాస్, గద్దె రామ్మోహన్ వరుసగా విన్నర్, రన్నర్లుగా నిలిచారు. త్రోబాల్, వాలీబాల్ మహిళల విభాగంలో బి.అఖిలప్రియరెడ్డి–వంగలపూడి అనిత జట్లు ఫైనల్స్లో తలపడ్డాయి. మ్యూజికల్ చైర్ పోటీల్లో మిర్యాల శిరీష(ప్రథమ), ఎస్.సవిత(ద్వితీయ), పి.సింధూరరెడ్డి(తృతీయ) సత్తా చాటారు. మిగిలిన క్రీడాంశాల్లో పోటీలు ఫ్లడ్ లైట్ల వెలుగులో రాత్రి వరకు కొనసాగాయి. నేడు బహుమతి ప్రదానం.. పోటీలు బుధవారం రాత్రితో ముగిశాయని, విజేతలకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గురువారం ట్రోఫీలు, మెడల్స్ అందజేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు వెల్లడించారు. శాప్ ఎండీ పి.ఎస్.గిరీషా, స్పోర్ట్స్ ఆఫీసర్ కోటేశ్వరరావు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల డీఎస్డీవోలు ఎస్.ఏ.అజీజ్, జాన్సీ పోటీలను పర్యవేక్షించారు. క్రీడా ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. -
సన్నచిన్నకారు రైతులకు ‘ఉపాధి’ ఊతం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ చందర్లపాడు(నందిగామ రూరల్): ఉపాధి హామీ పథకంలో చిన్నసన్నకారు రైతులకు నూరు శాతం రాయితీపై ఉద్యాన పంటలను చేపట్టి ఆర్థిక పరిపుష్టి పొందుతున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో చందర్లపాడు మండలం ముప్పాళ్ల సమీపంలో చేపడుతున్న డ్రాగన్ ఫ్రూట్, నిమ్మతోటలను బుధవారం ఆయన పరిశీలించి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా రైతులు కోనంగి భారతి, కొనంగి తిరుపతమ్మ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా అర ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్, రెండెకరాలలో నిమ్మ తోట సాగు చేస్తున్నట్లు తెలిపారు. 1300 ఎకరాల్లో సాగు.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో 1300 ఎకరాలలో పండ్లు, పూలు, మునగ తోటల సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహించామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. మామిడి, జామ, నిమ్మ, సపోట, నారింజ, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్, జీడిమామిడి, దానిమ్మ, నేరేడు, ఆపిల్బేర్, తదితర పండ్ల తోటలతో పాటు మునగ, పామాయిల్ వంటి మొక్కల పెంపకాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. రైతులు వారికి అవసరమైన పండ్లు, పూలు, మొక్కలు, ఎరువులను నేరుగా కొనుగోలు చేసేందుకు అయ్యే ఖర్చును ఉపాధి హామీ పథకం ద్వారా చెల్లిస్తున్నట్లు తెలిపారు. మొక్కలు నాటేందుకు గుంతలు తీయటం, మొక్కలు నాటిన తర్వాత మూడేళ్ల పాటు మొక్కల పెంపకం నిర్వహణకు ఉపాధి హామీ పని దినాలను కేటాయిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం పీడీ రాము, ఆర్డీవో బాలకృష్ణ, ఇన్చార్జ్ మండల అధికారి నాంచారయ్య, ప్లాంటేషన్ జిల్లా మేనేజర్ ఉషారాణి, సూపర్వైజర్ వెంకటేశ్వరరావు, ఏపీవో వెంకటేశ్వర్లు, టెక్నికల్ అసిస్టెంట్ సాయికృష్ణ, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ వంశీకృష్ణ పాల్గొన్నారు. -
చాపచుట్టేశారు!
అత్యవసర పశు వైద్యానికి మంగళంపామర్రు: గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం తర్వాత పాడి పరిశ్రమే. పల్లెల్లో రైతుల జీవన ప్రమాణాలు మెరుగు పడాలంటే పాడి పంటలు ఎంతో ముఖ్యం. వ్యవసాయం కలిసి రాక పోయినా పాడి ద్వారా కుటుంబ పోషణకు ఇబ్బంది ఉండదు. అటువంటి పాడి పశువులకు అత్యవసర వైద్య సేవలను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం సంచార అంబులెన్సులను నియోజకవర్గానికి రెండు చొప్పున ఏర్పాటు చేసింది. వీలైతే ఇంటి వద్దకే వైద్యం, మెరుగైన వైద్యం అవసరమైతే ఆస్పత్రికి తరలించేందుకు వీలుగా అంబులెన్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ సేవను కూటమి ప్రభుత్వం నిలిపి వేసింది. కక్షపూరితంగా.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉమ్మడి కృష్ణాజిల్లాలో 2021లో మొదటి విడతలో 9, రెండో విడతలో 10 వాహనాలు మంజూరు చేసింది. ఒక్కొక్క వాహనంలో వైద్యులు, టెక్నీషియన్, ఫార్మసిస్టులు, పైలెట్ కలిపి నలుగురు ఉంటారు. మారుమూల గ్రామాల్లోనూ పశువులకు అత్యవసర వైద్య సేవలు అవసరమైతే 1962 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేస్తే అంబులెన్సులు నేరుగా ఇంటికి వెళ్లి వైద్య సేవలందిస్తాయి. అత్యాధునికంగా హైడ్రాలిక్ సిస్టమ్తో పశువులను నేరుగా అంబులెన్సులోకి ఎక్కించి ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందించి తిరిగి తీసుకు వచ్చే విధంగా వీటిని రూప కల్పన చేశారు. వీటి ద్వారా రైతులకు పైసా ఖర్చు లేకుండా ఇంటి వద్దనే వైద్యం అందేది. రాష్ట్ర వ్యాప్తంగా వీటి నిర్వహణ బాధ్యతలను జీవీడీ ఫౌండేషన్కు అప్పగించింది. దీనికి గత నెలలో గడువు ముగిసింది. ఫలితంగా మార్చి 1వ తేదీ నుంచి మొదటి ఫేజ్లో మంజూరైనా 9 అంబులెన్సులు నిలిపి వేసి అందులో పని చేసే వారిని ఇంటికి పంపారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్కారు వైఖరిపై మండిపడుతున్నారు. సంచార అంబులెన్సుల నిలిపివేత పాడి రైతులకు శాపంగా పరిణమించిన ప్రభుత్వ నిర్ణయం వైద్యులు, టెక్నీషియన్, ఫార్మసిస్టులు, పైలెట్ కొలువులు గోవిందా గత ప్రభుత్వ పథకాలపై కూటమి సర్కార్ కక్ష -
హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం
అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్ పటమట(విజయవాడతూర్పు): రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయటానికి దూకుడుగా వ్యవరిస్తోందని అఖిల భారత మాలసంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవీప్రసాద్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ, క్యాబినెట్ నిర్ణయం, ఆర్ఆర్ మిశ్రా నివేదికకు వ్యతిరేకంగా బుధవారం విజయవాడ నగరంలోని ధర్నాచౌక్లో పోలీస్ అనుమతితో శాంతియుతంగా ధర్నా చేపట్టామని, ముందు అనుమతి ఇచ్చి తర్వాత లేదని తమను గృహ నిర్భంధం చేయటంపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం మాలల పురోగతిని అణచివేయాలని చూస్తోందని, ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేపట్టిన తమను హోంమంత్రి కనుసన్నల్లో నిర్భందించి తమ హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు జేఏసీ సభ్యులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు దుర్మరణం
గూడూరు: పెడన సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గూడూరు మండలం లేళ్లగరువు పీఏసీఎస్ మాజీ చైర్మన్ రాయపురెడ్డి శ్రీనివాసరావు(57) దుర్మరణం చెందారు. పెడన పల్లోటీ పాఠశాల సమీపంలో ఉన్న చెరువు దగ్గరకు వెళ్లి తిరిగి ద్విచక్రవహనంపై ఇంటికి వస్తున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీ కొనడంతో శ్రీనివాసరావు వాహనంతో పాటు పడిపోయారు. ఆ సమయంలో తలకు బలమైన గాయమవ్వడంతో తీవ్ర రక్తస్రావమైంది. హుటాహుటిన మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారు. శ్రీనివాసరావు గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో లేళ్లగరువు పీఏసీఎస్ చైర్మన్గా వ్యవహరించారు. 2006లో ఆయన సతీమణి రాయపురెడ్డి శ్రీలక్ష్మి గ్రామ సర్పంచిగా పనిచేశారు. శ్రీనివాసరావుకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. పెడన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాసరావు మృతి పట్ల రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. -
ఏకపక్షంగా కేసులు కట్టడం సరికాదు
వైఎస్సార్ సీపీ కార్యకర్తల అక్రమ అరెస్ట్పై డీసీపీకి వినతి పెనుగంచిప్రోలు/లబ్బీపేట(విజయవాడ తూర్పు): వైఎస్సార్ సీపీ కార్యకర్తల అక్రమ అరెస్ట్పై సరైన న్యాయం చేయాలంటూ వైఎస్సార్ సీపీ నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం విజయవాడలో డీసీపీ మహేశ్వరరాజుకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మవారి చిన్నతిరునాళ్ల సందర్భంగా ఈనెల 18న తెల్లవారు జామున పసుపు–కుంకుమ బండ్లు సమర్పించేందుకు అన్ని పార్టీల వారు ప్రభలు కట్టుకుని వస్తుండగా పెనుగంచిప్రోలు పోలీస్స్టేషన్ సెంటర్లో టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగిందన్నారు. దీనిపై పోలీసులు ఏకపక్షంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తల పైన మాత్రమే కేసులు పెట్టటం బాధాకరమన్నారు. ఈ విషయాన్ని నిశితంగా పరిశీలించి, పోలీసులు వారికి గాయాలయ్యేందుకు కారణమైన ఇరుపార్టీల వారిపై కేసులు కట్టాలని వారు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీపీల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మార్కపూడి గాంధీ, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఏలూరి శివాజీ, శ్రీకనకదుర్గమ్మవారి ఆలయ మాజీ డైరక్టర్ నంబూరి రవి, న్యాయవాది పృధ్వీ, ఎస్సీసెల్ నాయకులు కన్నమాల శామ్యూల్, తదితరులు పాల్గొన్నారు. ఘర్షణ కేసులో 16 మందికి రిమాండ్ పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మవారి చిన్న తిరునాళ్లలో భాగంగా మంగళవారం తెల్లవారు జామున ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి బుధవారం 16 మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్టు జగ్గయ్యపేట సీఐ పి.వెంకటేశ్వర్లు తెలిపారు. న్యాయమూర్తి వారికి 14 రోజులు రిమాండ్ విధించారన్నారు. -
మధ్యాహ్న భోజన కార్మికుల ఆకలి కేకలు
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఎద్దేవా చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ.3 వేల వేతనమా? అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల తమ పిల్లలకు ఒక పూట భోజనానికి ఎంత ఖర్చు పెడుతు న్నారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ‘మీకో న్యాయం. పేద పిల్లలకో న్యాయమా? ప్రభుత్వానికి సిగ్గుండాలి’ అంటూ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్నం భోజన పథకం వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో వేతనాలు, మెస్ చార్జీలు పెంచాలని విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో బుధవారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లా డుతూ.. కార్మికులకు కనీసం వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టిన డెప్యూటీ సీఎం పవన్కల్యాణ్ కార్మికులకు వేతనాలు పెంచకుండా వారి డొక్కలు ఎండబెడుతున్నారని దుయ్యబట్టారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు కనీస అవగాహన లేదని ఎద్దేవాచేశారు. నెలకు కేవలం రూ.3 వేల వేతనంతో ఒక కుటుంబం ఎలా జీవిస్తుందని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చలసాని వెంకటరామారావు, ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. రమేష్బాబు, ఏఐటీయూసీ డెప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్.వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ.. పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు వేతనాలు పెంచా లని మంత్రులను కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. కార్మికులకు కనీసం రూ.10 వేల వేతనం చెల్లించాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ బుచ్చిబాబు, చాంద్ బాషా, పుల్లారావు, ప్రమీలమ్మ, ఈశ్వరమ్మ, బాషా, లాజర్, కవిత, సులోచన, వేణుగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక కుటుంబానికి రూ.3 వేల వేతనం ఎలా సరిపోతుంది? మీ పిల్లలకు ఇలానే ఖర్చు చేస్తున్నారా? ప్రభుత్వాన్ని నిలదీసిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ -
మొక్కవోని హాబీ
అందాల బోన్సాయ్ ● అడీనియం మొక్కలకు చిరునామాగా వెలివోలు ● పచ్చని సీమలో ఎడారి మొక్కల అందాలు ● కనువిందు చేస్తున్న బోన్సాయ్ మొక్కలు ● నాలుగేళ్లలో 12 నుంచి 10 వేలకు చేరిన మొక్కలు చల్లపల్లి: పచ్చని సీమలో ఎడారి మొక్కల అందాలు కనువిందు చేస్తున్నాయి. హాబీగా చేపట్టిన బోన్సాయ్ మొక్కల పెంపకం సిరులు కురిపిస్తోంది. ఎడారికి అందాలు అద్దే అడీనియం మొక్కలకు మండలంలోని వెలివోలు గ్రామం చిరునామాగా మారింది. ఈ కుగ్రామం నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు అడీనియం మొక్కలు సరఫరా అవుతు న్నాయి. వెలివోలు గ్రామానికి చెందిన కుంభా సాంబ శివరావు ప్రైవేటు స్కూల్లో వ్యాయామోపాధ్యాయుడగా పనిచేసేవారు. 2020లో తన హాబీ మేరకు తెలిసిన వారి దగ్గర నుంచి 12 రకాల అడీనియం మొక్కలను తెచ్చి తన ఇంటి పెరటిలో నాటారు. కరోనా సంక్షోభం కారణంగా ఓ పక్క స్కూల్స్ మూతపడటం, మరోపక్క చేసేందుకు ఎక్కడా పని దొరక్కపోవటంతో తన దృష్టిని ఎడారి మొక్కల పెంపకంపై కేంద్రీకరించారు. తన పెరటిలో ఉన్న 12 అడీనియం మొక్కల నుంచి విత్తనాలను సేకరించి, వాటి నుంచి మొక్కలను పునరుత్పత్తి చేయడం ప్రారంభించారు. మక్కువే పెట్టుబడి కరోనా తరువాత ఉద్యోగం లేక పనిదొరక్క ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. మొక్కల పెంపకంపై ఉన్న నా మక్కువను అడీనియం మొక్కల వ్యాపారా నికి పెట్టుబడిగా పెట్టా. 12 మొక్కలతో ప్రారంభించిన నర్సరీ 10 వేల మొక్కలకు విస్తరిం చింది. మారుమూల గ్రామమైన వెలివోలు నుంచి దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు మొక్కలు సరఫరా చేస్తున్నా. ఇష్టమైన అలవాట్లను వ్యాపార అవకాశాలుగా మార్చుకుంటే తప్పక విజయం సాధిస్తామని నా నమ్మకం. –కుంభా సాంబశివరావు, నర్సరీ యజమాని, వెలివోలు రెండు పద్ధతుల్లో మొక్కల పునరుత్పత్తి తన పెరటిలో ఉన్న అడీనియం మొక్కలతోపాటు థాయ్ల్యాండ్, కేరళ, తమిళనాడు నుంచి మరికొన్ని రకాల మొక్కలను సాంబశివరావు దిగుమతి చేసుకున్నారు. వాటి ద్వారా అరుదైన అడీనియం రకాలను సృష్టించడం ప్రారంభించారు. తన ఇంటి పెరట్లో 12 మొక్కలతో ప్రారంభమైన నర్సరీ నేడు 75 సెంట్ల స్థలంలో సుమారు 10 వేల అడీనియం మొక్కలతో విరాజిల్లుతోంది. ఇక్కడ మొక్కలను రెండు రకాలుగా పునరుత్పత్తి చేస్తున్నారు. అంటుకట్టు పద్ధతిలో ఇప్పటి వరకూ 100 రంగులకు పైగా పూలు పూసే మొక్కలను ఉత్పత్తి చేశారు. రెండో పద్ధతిలో విత్తనాలు నాటడం ద్వారా మరో 200 రకాల మొక్కలను సృష్టించినట్లు సాంబశివరావు తెలిపారు. -
మంగినపూడి బీచ్ ఉత్సవాలకు సిద్ధం కావాలి
చిలకలపూడి(మచిలీపట్నం): త్వరలో మంగినపూడి బీచ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సంసి ద్ధంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో బీచ్ ఉత్సవాల నిర్వహణపై బుధవారం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ముఖ్య మంత్రి నిర్వహించే కలెక్టర్ల కాన్ఫరెన్స్ తరువాత మంత్రి కొల్లు రవీంద్రతో బీచ్ ఉత్సవాలపై చర్చించి నిర్వహణ తేదీలను నిర్ణయిస్తామని కలెక్టర్ తెలిపారు. గతంలో మాదిరిగా మ్యూజికల్ నైట్, ఫుడ్ స్టాల్స్, పిల్లలు ఆడుకునే వస్తువులు, ఎగ్జిబిషన్, హ్యాండీ క్రాఫ్ట్స్, హెలికాప్టర్ రైడింగ్, సాంస్కృతిక కార్యక్ర మాలు, వాటర్ స్పోర్ట్స్తో ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అయ్యే ఖర్చుల అంచనాల నివేదికను సిద్ధం చేయాలని సూచించారు. పార్కింగ్ ప్రదేశాన్ని దూరంగా ఏర్పాటు చేసి, అక్కడి నుంచి పర్యాటకులు ప్రభుత్వ వాహనాల్లో సముద్రతీరం వద్దకు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జేసీ గీతాంజలిశర్మ, రాష్ట్ర సాంస్కృతికశాఖ సంచాలకుడు మల్లికార్జునరావు, జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, మెప్మా పీడీ పి.సాయిబాబు, డీపీఓ అరుణ, పంచాయతీ రాజ్ ఎస్ఈ రమణారావు, బందరు మునిసిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
భూముల రీసర్వే పరిశీలన
చందర్లపాడు(నందిగామ టౌన్): ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతున్న భూ రీ సర్వేలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. చందర్లపాడు మండలం ఉస్తేపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న రెండో దశ రీసర్వే ప్రక్రియను ఆయన బుధవారం తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అత్యంత జవా బుదారీ తనంతో భూముల లెక్కలను పక్కాగా తేల్చేందుకే రీసర్వే జరుగుతోందన్నారు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన గ్రామంలో సర్వే, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో రీసర్వే చేస్తున్నారని తెలిపారు. రైతుల అనుమానా లను నివృత్తి చేస్తూ ఎటువంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా కచ్చిత రికార్డుల రూపకల్పనకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం రైతులతో మాట్లాడి రీ సర్వేతో చేకూరే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో నందిగామ ఆర్డీఓ బాలకృష్ణ, సర్వే, భూ రికార్డులు అసిస్టెంట్ డైరెక్టర్ త్రివిక్రమరావు, మండల సర్వేయర్, వీఆర్వోలు పాల్గొన్నారు. నిత్యాన్నదానానికి పలువురు భక్తుల విరాళాలుఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి బుధవారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. విజయవాడ పటమటకు చెందిన కొల్లి నాగశివ మారుతీధర్ కుటుంబ సభ్యులు నిత్యాన్నదానానికి రూ.1,16,001 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. గుంటూరు గోరంట్లకు చెందిన వాసా భాస్కరరావు రూ.లక్ష విరాళం సమర్పించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. దాతలకు వేద పండితులు ఆశీర్వచనం, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.2.65 కోట్లు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు భక్తులు రూ.2.65 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులు, ముడుపుల రూపంలో సమర్పించారు. అమ్మవారికి భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను బుధవారం మహా మండపం ఆరో అంత స్తులో లెక్కించారు. రూ.2,65,88,961 నగదు, 500 గ్రాముల బంగారం, 4.358 కిలోల వెండి సమకూరాయని ఆలయ ఈఓ కె.రామచంద్రమోహన్ తెలిపారు. కార్యక్రమాన్ని ఆలయ డీఈఓ రత్నరాజు, దేవస్థాన ఏఈఓలు, సూప రింటెండెంట్లు, దేవదాయ శాఖ అధికారులు పర్యవేక్షించారు. సేవలందించిన విద్యార్థులకు సత్కారంపెనమలూరు: మండలంలోని కానూరు పీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 341 ఇంజినీరింగ్ కాలేజీల నుంచి 31 మంది సిబ్బంది, 155 మంది విద్యార్థులు అటల్ టింకరింగ్ ల్యాబ్ మెంటార్లుగా సేవలందించారు. వారిని ఘనంగా సత్కరించారు. ఇంజినీరింగ్ కాలేజీల సిబ్బంది, విద్యార్థులు సమీపంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ప్రాథమిక సాంకేతిక పరిజ్ఞానంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఏపీ ఉన్నత విద్యా మండలి, బే కన్సర్వేషన్ డెవలప్మెంట్ కమిషన్ (బీసీడీసీ), యూనిసెఫ్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనిసెఫ్ ఇండియా చీఫ్ ఆఫీసర్ జెలాలెం బి.టఫెస్సే, సమగ్ర శిక్ష రాష్ట్ర అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎఆర్.ప్రసన్నకుమార్, నీతి ఆయోగ్ ప్రోగ్రాం మేనేజర్ ప్రతీక్దేశ్ముఖ్, బీసీడీఐ కార్యదర్శి ప్రొఫెసర్ ఎం.ఎల్. ఎస్.దేవకుమార్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శివాజీబాబు, పలు సంస్థల ప్రతినిధులు శేషగిరి, సుదర్శన్, శిఖరాణా, కిషోర్ గైక్వాడ్, డాక్టర్ శ్యామ్ పాల్గొన్నారు. -
5 వేల మొక్కల విక్రయం
సాంబశివరావు నర్సరీలో అరబికం, ఉబేసం, నోవా టాంజానియా, క్రిస్పం, స్వాజికం, సోమాలియన్స్, మల్టీఫ్లోరం, సోకోట్రానమ్, బహుమీనియం, తాయ్ సోకోట్రానమ్ వంటి రకాలు, ఉప రకాల మొక్కలు ఉన్నాయి. మూడు నెలల నుంచి పదేళ్లవయసు మొక్కలు కొలువుదీరాయి. ప్రత్యేకంగా సృష్టించిన రకాల్లో టవర్ఫామ్, రూట్ ట్రెయిన్ప్లాంట్, అన కొండ వంటివి ఉన్నాయి. నాలుగేళ్లలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఢిల్లీ, మేఘాలయ ప్రాంతాలు మినహా దాదాపు మిగిలిన అన్ని రాష్ట్రాలకు ఐదు వేలకు పైగా మొక్కలను ఎగుమతి చేశారు. తన SambaAdeniums అనే ఇస్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్ల ద్వారా ఆర్డర్లు సేకరించి ఈ మొక్కలు సరఫరా చేస్తున్నట్లు సాంబశివరావు తెలిపారు. రూ.150 నుంచి రూ.25 వేల విలువైన, అరుదైన మొక్కలు తన వద్ద ఉన్నట్లు చెప్పారు. ప్రతి నెలా రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకూ మొక్కల విక్రయం ద్వారా తనకు ఆదాయం వస్తోందని వివరించారు. -
ఆక్టోపస్ మాక్డ్రిల్ అదుర్స్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): బుధవారం అర్ధరాత్రి సమయం.. దుర్గ గుడి వద్ద నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.. ఆలయం పరిసరాలను పారి శుద్ధ్య సిబ్బంది శుభ్రం చేస్తున్నారు.. కొద్ది గంటల్లో అమ్మవారి సుప్రభాత సేవకు సమయం దగ్గర పడుతుండటంతో ఎవరి హడావుడిలో వారున్నారు.. మహా మండపం మొదటి అంతస్తులో భక్తులు పిల్లా పాపలతో కలిసి నిద్ర చేస్తున్నారు.. ఒక్క సారిగా మహా మండపం, ఆలయ ప్రాంగణాల్లో చిమ్మ చీకట్లు అలుముకున్నాయి.. ఆరుగురు ఆగంతకులు ముఖాలకు ముసుగులు ధరించి పొగ బాంబులు విసురుతూ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించారు.. ఒక్క ఉదుటున భక్తుల మధ్యకు చేరి భయభ్రాంతులకు గురిచేశారు.. ఆలయ సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమై స్పెషల్ ఫోర్స్ కమాండోలకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ఆక్టోపస్ కమాండోలు ధైర్యసాహసాలతో భక్తుల మధ్య దాక్కుని ఉన్న ఆగంతకులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇదంతా నిజం కాదు. ఆక్టోపస్ కమాండోల మాక్డ్రిల్. ఈ నిజం తెలుసుకున్న భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై బుధవారం రాత్రి ఆక్టోపస్ మాక్ డ్రిల్ నిర్వహించింది. దుర్గామల్లేశ్వర స్వామి వార్లను ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. అనుకోని రీతిలో, విపత్కర పరిస్థితుల్లో తీవ్రవాదులు ఆలయంపై దాడులు చేస్తే వారికి ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లకుండా ఏ విధంగా కాపాడాలనే దానిపై క్షేత్ర స్థాయిలో మాక్ డ్రిల్ నిర్వహించారు. మాక్డ్రిల్లో వంద మందికి పైగా కమాండోలు, అధికారులు భాగస్వాములయ్యారు. మధ్యాహ్నం దేవస్థానానికి చెందిన జమ్మిదొడ్డి ఆవరణలోని పరిపాలనా భవనంలోని బోర్డు మీటింగ్ హాల్లో ఆక్టోపస్ బృందానికి చెందిన కమాండోలు ఆలయ అధికారులతో సమావేశమై భద్రతా వ్యవహా రాలపై చర్చించారు. దేవస్థానంలో కీలక ప్రాంతా లను పరిశీలించిన ఆక్టోపస్ బృందాలు భద్రతా అంశాలపై పలు సూచనలు చేశాయి. ఆలయ ఈఓ కె.రామచంద్రమోహన్, ఇంజినీరింగ్ అధికారులు, సెక్యూరిటీ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. మాక్డ్రిల్ నిర్వహిస్తున్న ఆక్టోపస్ కమాండోలు -
ఉత్సాహంగా ప్రజాప్రతినిధుల క్రీడా పోటీలు
విజయవాడస్పోర్ట్స్: ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో మంగళవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 173 మంది సభ్యులు పాల్గొంటున్నట్లు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్రెడ్డి ప్రకటించారు. మంగళవారం క్రికెట్, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, బ్యాడ్మింటన్, త్రో బాల్, టెన్నిస్, కబడ్డీ పోటీల్లో ప్రజాప్రతినిధుల జట్లు తలపడ్డాయి. ఆహ్లాదభరిత వాతావరణంలో జరిగిన ఈ పోటీల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఉత్సాహభరితంగా తలపడ్డారు. శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల డీఎస్డీవోలు ఎస్.ఎ.అజీజ్, జాన్సీ, స్పోర్ట్స్ ఆఫీసర్ కోటేశ్వరరావు ఈ పోటీలను పర్యవేక్షించారు. -
సమష్టి కృషితోనే సారా కట్టడి సాధ్యం
తిరువూరు: తిరువూరు డివిజన్లో సారా రాక్షసి విజృంభిస్తున్న విధానంపై ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలకు జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. నవోదయం 2.0 కార్యక్రమాన్ని మంగళవారం కలెక్టర్ లక్ష్మీశ ప్రారంభించారు. స్థానిక శ్రీవాహినీ ఇంజినీరింగ్ కళాశాలలో సారా నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై పలు శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరువూరు డివిజన్లోని 4 మండలాల్లో 26 గ్రామాలలో కాపుసారా తయారీ తీవ్రంగా ఉందని, ఎన్ని చర్యలు తీసుకున్నా కట్టడి జరగట్లేదన్నారు. గ్రామస్థాయి అధికారుల నుంచి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి సమష్టిగా కృషి చేస్తేనే సారా సమగ్ర నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. సారా తయారీ, అమ్మకాలే జీవనోపాధిగా కలిగిన వారికి సబ్సిడీ లోన్లు ఇచ్చి ఇతర వృత్తుల్లోకి మళ్లిస్తామని, వారిలో మార్పు తీసుకువస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. 2047 విజన్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బాగుపడాలనే లక్ష్యంతో, పేదరిక నిర్మూలన ధ్యేయంగా జిల్లాలో పీ4 సర్వే చేస్తున్నామన్నారు. మార్పు వస్తేనే ఫలితం.. నవోదయం 2.0 విజయవంతం కావాలంటే మార్పు తీసుకురావాలని సూచించారు. తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కె. మాధురి మాట్లాడుతూ ఏకొండూరు మండలంలో కిడ్నీ వ్యాధికి గురైన కుటుంబాలు సారా సేవించడమే కారణమన్నారు. కేసులు నమోదు చేస్తే సారా నియంత్రణ కాదని, తయారీదారులు, అమ్మకందారుల్లో పరివర్తన తీసుకురావడమే తక్షణ కర్తవ్యమని సూచించారు. సారా కట్టడికి కలిసి కృషి చేస్తామని అధికారులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేశారు. ఎకై ్సజ్ డెప్యూటీ కమిషనర్ టి. శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ వై. శ్రీనివాస చౌదరి, ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ జిల్లా అధికారి ఎస్. శ్రీనివాసరావు, తిరువూరు ఎకై ్సజ్ జె. శ్రీనివాసరావు, తిరువూరు సీఐ గిరిబాబు, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కె. శ్రీనివాసరావు, తిరువూరు, గంపలగూడెం, ఏకొండూరు, రెడ్డిగూడెం, విస్సన్నపేట మండలాల అధికారులు, గ్రామ సారా నిషేధ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
30 నుంచి వసంత నవరాత్రులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో 30వ తేదీన విశ్వావసు నామ సంవత్సరాది, వసంత నవరాత్రుల వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 7వ తేదీ వరకు కొనసాగనున్న ఉత్సవాలలో అమ్మవారికి ప్రతి రోజు ఒక విశేషమైన పుష్పార్చన నిర్వహిస్తారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజా కార్యక్రమాలను జరిపిస్తారు. అమ్మవారి స్నపనాభిషేకం నేపథ్యంలో తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ, వస్త్రాలంకరణ సేవ, ఖడ్గమాలార్చన, నవగ్రహ శాంతి హోమం, పల్లకీ సేవలను దేవస్థానం రద్దు చేసింది. అమ్మవారికి స్నపనాభిషేకం అనంతరం ఉదయం 9 గంటలకు దర్శనం ప్రారంభమవుతుంది. పంచాంగ శ్రవణం.. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయంలో పంచాంగ శ్రవణం చేస్తారు. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం ఎదుట కళావేదికపై మధ్యాహ్నం 3 గంటలకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఇక సాయంత్రం నాలుగు గంటలకు మండప పూజ, అగ్నిప్రతిష్టాపన జరుగుతాయి. సాయంత్రం 6 గంటలకు వెండి రథోత్సవాన్ని దేవస్థానం నిర్వహిస్తోంది. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు వెండి రథంపై నగర పురవీధుల్లో విహరిస్తారు. ప్రత్యేక పుష్పార్చనలు.. వసంత నవరాత్రులలో భాగంగా 30వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రత్యేక పుష్పార్చనలు జరుగుతాయి. 30వ తేదీ ఉదయం 9.15 గంటలకు కలశస్థాపన, అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతి మందిరం వద్ద జరుగుతుంది. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమయ్యే విశేష పుష్పార్చనలో రోజుకో ప్రత్యేకమైన పుష్పాలతో అమ్మవారికి అర్చన చేస్తారు. 7వ తేదీ ఉదయం 10 గంటలకు అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. 5 నుంచి శ్రీరామనవమి వేడుకలు ఏప్రిల్ 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు శ్రీరామనవమి వేడుకలను దుర్గమ్మ సన్నిధిలో నిర్వహించనున్నారు. ఇంద్రకీలాద్రి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారికి 5వ తేదీ ఉదయం 6 గంటలకు అభిషేకాలు, నాగవల్లీ దళార్చన (తమలపాకుల) జరుగుతుంది. ఘాట్రోడ్డులోని స్వామి వారి ఆలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 6వ తేదీ అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కళావేదికపై సీతారాముల కల్యాణం, 7వ తేదీ శ్రీరాముల వారి పట్టాభిషేక మహోత్సవాలు జరుగుతాయి. ఏప్రిల్ ఏడో తేదీ వరకూ ఇంద్రకీలాద్రిపై ఉత్సవాలు -
కార్మికులపై కక్ష సాధింపులు ఆపాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్లో నిధులు పెంచాలని, కార్మికులకు వేతనాలు, మెనూ చార్జీలు పెంచాలని కోరుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు రోడ్డెక్కారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. పథకంలో పనిచేస్తున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ. 10వేలు వేతనం పెంచాలని, మెనూ చార్జీలు పాఠశాల విద్యార్థులకు రూ.20, కాలేజీ విద్యార్థులకు రూ.40 పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపాలన్నారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయా రమాదేవి, యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఉత్తర, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి. రమాదేవి, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, సీఐటీయూ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఎ.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ధర్నా -
నందిగామ ప్రయోజనాలను కాలరాయొద్దు
నందిగామ రూరల్: ప్రమాద సమయంలో ప్రతి నిముషం విలువైనదేనని, నందిగామ పట్టణంలో చేపడుతున్న వంద పడకల ఆస్పత్రిని ప్రస్తుతం ఉన్న ఆస్పత్రి స్థలంలో కాకుండా ప్రజలకు ఆమోదయోగ్యమైన ప్రాంతంలో నిర్మించాలని కోరుతూ శాసన మండలి సభ్యుడు డాక్టర్ మొండితోక అరుణకుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంగళవారం లేఖ రాశారు. లేఖలోని వివరాల మేరకు.. పట్టణంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా గత ప్రభుత్వంలో అప్పటి శాసన సభ్యుడు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు వంద పడకల ఆస్పత్రి అవశ్యకతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. స్పందించిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే మంజూరు చేశారు. ఆస్పత్రి నిర్మాణానికి రూ. 31.98 కోట్లు, స్థల సేకరణకు రూ. 2.5 కోట్లు మంజూరు చేస్తూ 2023, ఏప్రిల్లో జీవో నంబర్ 46ను జారీ చేశారు. ప్రజా అవసరాల దృష్ట్యా చేపడుతున్న ఆస్పత్రి నిర్మాణానికి రైతులు, తదితరులు మార్కెట్ ధరలకు కాకుండా బడ్జెట్లో కేటాయించిన ధరకు జాతీయ రహదారి పక్కనే ఉన్న ఐదెకరాల భూములను అందించేందుకు ముందుకు రావటంతో జిల్లా కలెక్టర్, పలువురు ఉన్నతాధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. మారిన పరిస్థితులు.. శంకుస్థాపన తర్వాత జరిగిన ఎన్నికలలో ప్రభుత్వం మారటంతో ప్రస్తుత నందిగామ ఎమ్మెల్యే ఆకాంక్ష మేరకు 2024 డిసెంబర్ 12న హెచ్డీఎస్ సమావేశం నిర్వహించి.. ప్రస్తుతం ఉన్న ఆస్పత్రి ఆవరణలోనే నూతనంగా వంద పడకల ఆస్పత్రి నిర్మించేందుకు తీర్మానం చేశారు. ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం అంగీకరిస్తూ 2025 ఫిబ్రవరి 12న జీవో నంబర్ 82ను విడుదల చేసింది. ఇబ్బందులు తప్పవు.. ఆస్పత్రి నిర్మాణ స్థలాన్ని మార్చాలనే ఎమ్మెల్యే నిర్ణయం సరైనది కాదని పెద్దలు, మేధావులు అంటున్నారు. ప్రస్తుతం ఆస్పత్రి ఉన్న 2.4 ఎకరాలలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి అనువుగా లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సైతం చెప్పింది. 2.4 ఎకరాలలో వంద పడకల ఆస్పత్రి నిర్మిస్తే భవిష్యత్లో అవసరమైన అదనపు భవనాల నిర్మాణానికి ఇబ్బందులు తలెత్తుతాయి. విషయాన్ని పరిశీలించి జీవో నంబర్ 46 ప్రకారం గతంలో సేకరించిన ఐదెకరాల స్థలంలో వంద పడకల ఆస్పత్రి నిర్మించి మెరుగైన వైద్య సేవలను ప్రజలకు అందిచేలా చర్యలు తీసుకోవాలని అరుణకుమార్ లేఖలో కోరారు. తాము సేకరించిన స్థలంలో ఆస్పత్రి నిర్మించటం ఇష్టం లేకపోతే మరొక చోట ఐదెకరాల భూమిని ప్రభుత్వ బడ్జెట్ ధరకు కొనుగోలు చేసి వంద పడకల ఆస్పత్రిని నిర్మించాలని ఆయన విన్నవించారు. వంద పడకల ఆస్పత్రిపై సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ అరుణకుమార్ లేఖ -
మే 15 నుంచి ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు
లోగో ఆవిష్కరించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) 17వ జాతీయ మహాసభలు మే 15 నుంచి 18 వరకు తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన్, సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తెలిపారు. ఈ మహాసభలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జాతీయ మహాసభల లోగో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఎన్నో ఉద్యమ ఆటుపోట్లను ఎదుర్కొన్న అఖిల భారత యువజన సమాఖ్య పోరాడి వయోజనులకు ఓటు హక్కు సాధించిందన్నారు. ‘జాబ్ ఆర్ జైల్’, ‘సేవ్ ఇండియా చేంజ్ ఇండియా’ నినాదాలతో ఉద్యమించిందని అన్నారు. జాతీయ 17వ మహాసభలలో నిరుద్యోగ యువత, ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించి భవిష్యత్ ఉద్యమ రూపకల్పన చేస్తామన్నారు. జాతీయ మాజీ కార్యదర్శి జి. ఈశ్వరయ్య, జాతీయ కార్యదర్శి నక్కి లెనిన్ బాబు, రాష్ట్ర అధ్యక్షుడు ఎం. యుగంధర్, ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు. -
భవిష్యత్తులో ప్రమాదమే..
ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా గండ్లు మాత్రమే పూడ్చేందుకు నిధులు విడుదల చేసి చేతులు దులుపుకుంటే భవిష్యత్తులో పెను ప్రమాదమే జరుగుతుంది. బుడమేరుకు వెల్లటూరు వద్ద పడిన గండ్ల వల్ల నేను సాగు చేసిన ఆరు ఎకరాల్లో వరిపైరు కుళ్లిపోయింది. రెండో సారి నాట్లు వేయాల్సి వచ్చింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం సైతం పడిపోయింది. ప్రభుత్వం సమగ్రమైన ప్రణాళికతో బుడమేరు ప్రక్షాళన చేపడితేనే మేలు జరుగుతుంది. – దొడ్డా విష్ణువర్థన్రావు, రైతు, ఆత్కూరు, జి.కొండూరు మండలం -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాబుధవారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2025u8లో ఇఫ్తార్ సహరి (బుధ) (గురు) విజయవాడ 6.23 4.56 మచిలీపట్నం 6.22 4.53నిత్యాన్నదానానికి విరాళం ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి విజయవాడ భవానీపురానికి చెందిన కనమర్లపూడి రామకృష్ణ, సౌమిత్రి పద్మవల్లి రూ. 1,00,116 విరాళాన్ని అందజేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డు, మండలంలోని కొత్తపేట గ్రామ సచివాలయాల్లో శనగల కొనుగోలు కేంద్రాలను మంగళవారం ప్రారంభించారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: బెజవాడ దుఃఖదాయినిగా మారిన బుడమేరు ఆధునికీకరణపై కూటమి ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను మభ్య పెడుతోంది. గత ఏడాది వరదల సమయంలో విజయవాడ కలెక్టరేట్లో వారం రోజులకుపైగా బసచేసి, నగరంలో ముంపు నివారణ కోసం ఎన్నికోట్లు అయిన ఖర్చు చేస్తామని హడావుడి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మళ్లీ దాని గురించి పట్టించుకోవటం లేదు. ముఖ్యంగా బుడమేరు ఆధునికీకరణ విషయంలో అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తొలుత బుడమేరు ప్రక్షాళన అంటూ మొదలు పెట్టి.. తొలి దశకు రూ.500 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశారు. తీరా బడ్జెట్లో చూస్తే ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు బుడమేరు మళ్లింపు కాలువలకంటూ కొన్ని నిధులు విధిల్చారు. మంగళవారం జరిగిన మంత్రి వర్గంలో రూ.37.97 కోట్లను కేటాయించారు. కేవలం గండ్లు పడిన ప్రాంతంలో వరద నివారణకు రక్షణ గోడల నిర్మాణానికి మాత్రమే జలవనరులకు శాఖకు పరిపాలన అనుమతులు ఇచ్చారు. ఆధునికీకరణ ఊసే ఎత్తలేదు. దీంతో బుడమేరు పరీవాహక ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బాధితుల తరఫున వైఎస్సార్ సీపీ పోరాటం.. మొదటి నుంచి వైఎస్సార్ సీపీ బుడమేరు బాధితులకు అండగా నిలిచింది. బాధితులకు సాయంతోపాటు, ఆధునికీకరణ పనులు చేపట్టాలని ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా చేపట్టింది. గవర్నర్ను కలిసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇదే సమస్యపై మండలిలో రెండుమార్లు డాక్టర్ మొండితోక అరుణకుమార్ సమస్యను ప్రస్తావించి, న్యాయం చేయాలని కోరారు. బుడమేరు బాధితులకు జరిగిన అన్యాయాన్ని ఆయన ఎమ్మెల్సీ రుహుల్లాతో కలిసి కళ్లకు కట్టినట్లు వివరించారు. ఆ సమయంలో సాక్షాత్తూ విపత్తుల శాఖ మంత్రి బాధితులను ఆదుకోవడానికి రూ.497.07 కోట్ల విరాళాలు వచ్చాయని, వీటితో బాధితుల సహాయం కోసం రూ.274.95కోట్లు, ఖర్చు చేశామని చెప్పారు. అయితే మిగిలిన నిధులతో అయినా కనీసం పనులు నిర్వహించకపోవడం గమనార్హం. వెలగలేరు వద్ద బుడమేరుపై ఉన్న హెడ్ రెగ్యులేటర్ లాకులు పూర్తిగా కిందకు దిగకపోవడంతో నీరు లీకవ్వకుండా వేసిన ఇసుక బస్తాలు కవులూరు శివారులో గండ్లు పూడ్చిన ప్రదేశంలో లీకవుతున్న నీరు7న్యూస్రీల్బుడమేరు యాక్షన్ ప్లాన్ అమలేది? వరదలు వచ్చిన సమయంలో విజయవాడ ప్రజలను ముంపు నుంచి రక్షించాలనే లక్ష్యంగా ఆపరేషన్ బుడమేరు యాక్షన్ ప్లాన్ కార్యాచరణ రూపొందించారు. నగరాన్ని ముంపు రహిత మార్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రులు హడావుడి చేశారు. ప్రాథమికంగా మొదటి దశలో బెజవాడలో బుడమేరు కాలువ సామర్థ్యాన్ని 5వేల నుంచి 10 వేల క్యూసెక్కులకు పెంచాలని ప్రతిపాదించారు. ఈ మేరకు దాదాపు రూ.500 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. 13.25 కిలోమీటర్ల వరకు బుడమేరు ఆక్రమణలకు గురైందని తేల్చారు. ఇందులో విద్యాధరపురం నుంచి గుణదల వరకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 202 ఎకరాలకు గానూ 70 ఎకరాలు ఆక్రమణకు గురికాగా, వీటిలో 3,051 ఇళ్ల నిర్మాణాలు జరిగినట్లు గుర్తించారు. బుడమేరుకు వచ్చే వరద నీటిని సమాంతరంగా కాలువ తవ్వి మళ్లించే విధంగా ప్రణాళిక రచించారు. దీంతో పాటు చీమలవాగు, కేసరపల్లి, ఎనికేపాడు, యూటీల సామర్థ్యం పెంచాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు వెళ్లే 50.6 కిలో మీటర్ల కాలువ గట్లను మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రస్తుతం ఈ యాక్షన్ ప్లాన్ అమలుకు ప్రభుత్వ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. బెజవాడ దుఃఖదాయినిని పట్టించుకోని కూటమి ప్రభుత్వం హడావుడి చేసి చేతులెత్తేసిన వైనం కేవలం గండ్లు పూడ్చేందుకు మాత్రమే నిధుల కేటాయింపు ఈ సీజన్లో పనులు చేయకపోతే వచ్చేది కష్టకాలమే ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు -
చిన్న తిరునాళ్లలో అపశ్రుతి
ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మవారి చిన్న తిరునాళ్ల ఉత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. వత్సవాయి మండలం కొత్త రేగులగడ్డకు చెందిన సోదరులు గింజుపల్లి సాయిమణికంఠ (24), గింజుపల్లి గోపి మంగళవారం రాత్రి తిరునాళ్లకు వచ్చారు. ఎగ్జిబిషన్లోని క్రాస్ జయింట్ వీల్ ఎక్కారు. ప్రమాదవశాత్తు తొట్టి లింక్ ఊడటంతో వారు ఇద్దరు పైకి లేచి పక్కనే ఉన్న సీసీ రోడ్డుపై పడిపో యారు. ఈ ప్రమాదంలో సాయిమణికంఠ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. గోపికి కాలు, చెయ్యి విరగ టంతో 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇద్దరికీ వివాహం కాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాయిమణికంఠ సాఫ్ట్వేర్ ఇంజినీరుగా ఉద్యోగం చేస్తూ తిరునాళ్లకు ఇంటికి వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు సరైన భద్రతా చర్యలు పాటించక పోవటంతోనే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. -
అటవీ భూముల రక్షణకు పటిష్ట నిఘా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో అటవీ భూములు ఆక్రమణకు గురి కాకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయా లని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. అర్హులకు ఇబ్బంది లేకుండా ఆర్ఓఎఫ్ఆర్ (రికార్డ్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) పట్టాల పంపిణీకి సంబంధించి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన అటవీ శాఖ సమీక్ష సమావేశం మంగళవారం జరిగింది. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీ, హరిత విస్తీర్ణం పెంపు, ఆక్రమణల నియంత్రణ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. జిల్లాలో అటవీ భూముల రక్షణకు పటిష్ట నిఘా అవసరమన్నారు. ఏవైనా ఆక్రమణలను గుర్తిస్తే అటవీ, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో కూడిన జాయింట్ తనిఖీల బృందాలు క్షేత్రస్థాయి తనిఖీలు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు జిల్లాస్థాయిలో అటవీ శాఖకు సంబంధించి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. హరితాంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు జిల్లాలో పకడ్బందీగా అమలయ్యేలా చూడాలన్నారు. పచ్చదనం పెంచేలా వినూత్న కార్యాచరణతో అడుగులు వేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలోని వివిధ నీటి వనరుల గట్ల వెంబడి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మొక్కల వల్ల పర్యావరణానికి మేలు జరగడంతో పాటు గట్లు కూడా బలంగా ఉంటాయని వివరించారు. ఈ సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, డీఎఫ్ఓ జి.సతీష్, ఎఫ్ఆర్ఓ కె.శ్రీనివాసులురెడ్డి, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఎ.రవీంద్రరావు, కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్ సీహెచ్.దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నేడు అశోక్ లేల్యాండ్ ప్లాంట్ ప్రారంభం హనుమాన్జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం మల్లవల్లిలోని ఏపీఐఐసీ పారిశ్రామిక వాడలో ఏర్పాటు చేసిన అశోక్ లేల్యాండ్ బస్ బాడీ బిల్డింగ్ తయారీ పరిశ్రమను మంత్రి నారా లోకేష్ బుధవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. 75 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన బస్ బాడీ బిల్డింగ్ తయారీ యూని ట్లో పెండింగ్ పనులను పూర్తి చేయటంతో పాటు ఇటీవలే ట్రయన్ రన్ నిర్వహించారు. ఈ యూనిట్లో అత్యాధునిక సాంకేతికతతో ఈవీ, బీఎస్–6 నాణ్యాతా ప్రమాణాలతో బస్సులను తయారు చేయనున్నారు. ఈ ప్లాంట్ ఏటా 4800 బస్సుల ఉత్పత్తి సామర్థ్యంతో ఐదు వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించనుంది. మంత్రి లోకేష్ పర్యటన నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ మంగళవారం సాయంత్రం ఏర్పాట్లను పరిశీలించారు. అశోక్ లేల్యాండ్ మల్లవల్లి ప్లాంట్ హెడ్ శ్రీధరన్ను కార్యక్రమ ఏర్పాట్లను కలెక్టర్కు వివరించారు. గుడివాడ ఆర్డీఓ బాల సుబ్రహ్మణ్యం, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్.వెంకట్రావు, బాపులపాడు తహసీల్దార్ బండ్రెడ్డి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలపై ప్రత్యేక దృష్టిపెట్టండి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ -
పరిశ్రమల ఏర్పాటుకు తక్షణ అనుమతులు
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా దరఖాస్తు చేసుకున్న వెంటనే సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ డి.కె.బాలాజీ సబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమా వేశం మంగళవారం జరిగింది. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. జిల్లాలోని పారిశ్రామికవాడల్లో సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. సింగిల్ విండో పద్ధతిపై పరిశ్రమల ఏర్పాటుకు తక్షణ అనుమతులు, రాయితీలు కల్పించాలన్నారు. పరిశ్రమల ఏర్పాట్లలో మౌలిక వసతులకు సంబంధించి ఆయా శాఖల వద్దకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిబంధనల ప్రకారం వసతులు కల్పించాలన్నారు. సముద్రపు నాచు పెంపకం ప్రాజెక్టు ఏర్పాటు కోసం స్థలం కొనుగోలుకు సొంత నిధులను వెచ్చిస్తామని, రోడ్డు, విద్యుత్ సౌకర్యాలు కలిగిన తీర ప్రాంతంలో అనువైన స్థలాన్ని కేటాయించాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్త కోరారు. కలెక్టర్ స్పందిస్తూ మత్స్యశాఖ జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే చర్యలు చేపట్టా లని సూచించారు. పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్.వెంకట్రావు, జెడ్పీ సీఈఓ కె.కన్నమ నాయుడు, డీఆర్డీఏ పీడీ వై.హరి హరనాథ్, ఎల్డీఎం రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కష్టజీవిని కావ్య నాయకుడిని చేసిన శ్రీశ్రీ
గుణదల(విజయవాడతూర్పు): తెలుగు సాహిత్యానికి శ్రీశ్రీ మార్గదర్శి అని బెంగళూరు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య కొలకలూరి ఆశాజ్యోతి పేర్కొన్నారు. ఆంధ్ర లయోల కళాశాల ప్రాచ్య భాషల విభాగం ఆధ్వర్యంలో శ్రీశ్రీ సాహిత్యంపై మంగళవారం జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆశాజ్యోతి ఆన్లైన్ ద్వారా ముఖ్య అతి థిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యంలో విశిష్టమైన మహా ప్రస్థానం అమృతోత్సవం సందర్భంగా శ్రీశ్రీ సాహిత్యంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. శ్రీశ్రీ సాహిత్యంలోని ప్రగతిశీల భావాలను విద్యార్థులు అలవరుచుకోవాలని సూచించారు. కష్టజీవిని కావ్య నాయకుడిగా చేసిన ఘనత శ్రీశ్రీకే దక్కుతుందన్నారు. సభకు అధ్యక్షత వహించిన లయోల కళాశాల ప్రిన్సిపాల్ రెవరెండ్ ఫాదర్ డాక్టర్ జి.ఎ.పి.కిశోర్ మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యాన్ని మరో మలుపు తిప్పిన మహా కవి శ్రీశ్రీ అని కొనియాడారు. కళాశాల రెక్టార్ రెవ రెండ్ ఫాదర్ డాక్టర్ జాన్బాబు మాట్లాడుతూ శ్రీశ్రీ ఎంతో మంది కవులను ప్రభావితం చేశారని చెప్పారు. వాషింగ్టన్ నుంచి ఆన్లైన్ ద్వారా మాధురి ఇంగువ విశిష్ట అతిథిగా పాల్గొని శ్రీశ్రీ కవితా తత్త్వాన్ని విశ్లేషించారు. గౌరవ అతిథిగా పాల్గొన్న హైదరాబాద్ ప్రభుత్వ సిటీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడు డాక్టర్ కోయి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. శ్రామికవర్గ సౌభాగ్యాన్ని, కార్మిక లోక కల్యాణాన్ని శ్రీశ్రీ తన కవిత్వంలో అద్భుతంగా చిత్రించారని పేర్కొన్నారు. మరో అతిథి శ్రీశ్రీ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ బాల్యం నుంచి శ్రీశ్రీ కవిత్వం ద్వారా ప్రేరణ పొందానని అన్నారు. కీలకోపన్యాసం చేసిన గరికపాటి రమేష్బాబు మాట్లాడుతూ.. శ్రీశ్రీ సాహిత్య ప్రస్థానం అభ్యుదయ సాహిత్య ఉద్యమానికి దారి, దీపమై నిలిచిందని, విప్లవోద్యమానికి ప్రేరణ ఇచ్చిందని వివరించారు. ప్రాచ్య భాషల విభాగం అధ్యక్షుడు, సదస్సు కన్వీనర్ డాక్టర్ కోలా శేఖర్ ఈ సదస్సు లక్ష్యాలను వివరించారు. తెలుగు అధ్యాపకులు అమృతరావు సభకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సంస్కృత అధ్యాపకుడు వెంకటేశ్వరావు వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా పరిశోధకుల పత్రాలతో కూడిన వ్యాససంకలనాన్ని అతిథులు ఆవిష్కరించారు. డాక్టర్ గుమ్మా సాంబశివరావు, డాక్టర్ విజయానందరాజు, దివి కుమార్, అనిల్ డానీ, వెన్నా వల్లభరావు, కళాశాల అధ్యాపకులు కృపారావు, స్నేహల్ విమల్ శుక్ల తదితరులు పాల్గొన్నారు. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం పుస్త కాన్ని పాకెట్ సైజ్లో ముద్రించి విశ్వేశ్వరరావు కళాశాల విద్యార్థులకు ఉచితంగా బహూకరించారు. శ్రీశ్రీ సాహిత్య నిధి కన్వీనర్ సింగంపల్లి అశోక్ కుమార్ వంద శ్రీశ్రీ బుల్లెట్ పుస్తకాలను విద్యార్థులకు, పరిశోధకులకు బహూకరించారు. -
మినుము కొనుగోళ్లకు సన్నాహాలు
కంకిపాడు: మినుము కొనుగోళ్లకు అధికారులు ఎట్టకేలకు చర్యలు చేపట్టారు. మార్కెట్లో ధర అర కొరగా దక్కుతున్న స్థితిలో రైతులు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితిపై ‘సాక్షి’లో ఈ నెల తొమ్మిదో తేదీన ‘మినుము రైతు దిగాలు’ శీరిక్షన కథనం ప్రచురితమైంది. ఈ కథనంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఆఘమేఘాలపై జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి మినుము కొనుగోలు చేపట్టేందుకు సన్నాహాలు చేశారు. ఇందులో భాగంగా తొలుత కంకిపాడు మార్కెట్ యార్డు ప్రాంగణంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించనున్నారు. 45 శాతం మినుము తీతలు పూర్తి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది రబీ సీజన్లో 2,84,237 ఎకరాల్లో మినుము సాగు చేపట్టారు. ఇప్పటికే 45 శాతం మినుము తీతలు పూర్తయ్యాయి. పంట మార్కెట్కు చేరుతోంది. ఎకరాకు సరాసరిన ఆరు నుంచి ఎనిమిది బస్తాల వరకూ దిగుబడి వస్తోంది. దిగుబడులు ఫర్వాలేదనిపించినా మార్కెట్లో ధర ఆశాజనకం లేకపోవటంతో రైతులు ఆర్థికంగా నష్టాన్ని చవిచూస్తున్నారు. క్వింటా మినుము ధర ప్రస్తుతం రూ.7400 నుంచి రూ.7500 వరకు పలుకుతోంది. గత సీజన్లో ఇదే సమయంలో క్వింటా మినుముల ధర రూ.9100. మార్కెట్లో కొందరు వ్యాపారులు సిండికేట్గా మారి ధరను పెరగనివ్వకుండా అడ్డు కుంటున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆ కార ణంగానే గడిచిన పది రోజులుగా మార్కెట్లో ధర స్ధిరంగా ఉందని రైతులు అంటున్నారు. ఎకరాకు మినుము సాగుకు తెగుళ్లు ప్రభావంతో యాజమాన్య చర్యలతో కలిపి రూ.40 వేలపైగా పెట్టుబడులయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరను బట్టి రైతులకు ఖర్చులు కూడా చేతికందని దుస్థితి. ప్రభుత్వం మద్దతు ధర రూ.7,400 ప్రభుత్వం క్వింటా మినుముల మద్దతు ధరను రూ.7400గా నిర్ణయించింది. ఆఖరికి అది కూడా దక్కే పరిస్థితి లేకపోవటంతో మినుము రైతుల కష్టాలుపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావటంతో అధికారుల్లో కదలిక వచ్చింది. మార్క్ఫెడ్ అధికారులు జిల్లాలో సాగు అధికంగా ఉన్న 12 ప్రాంతాలను గుర్తించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసింది. బాపులపాడు మండలం ఆరుగొలనులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుకానుంది. మిగిలిన మోదుగుమూడి ఆర్ఎస్కే (అవనిగడ్డ), మల్లేశ్వరం ఏఎంసీ (బంటుమిల్లి), పెరికీడు ఆర్ఎస్కే (బాపులపాడు), గుడ్లవల్లేరు ఏఎంసీ (గుడ్లవల్లేరు), కంకిపాడు ఏఎంసీ (కంకిపాడు), మొవ్వ ఆర్ఎస్కే (మొవ్వ), పెడన ఏఎంసీ (పెడన), గంగూరు ఆర్ఎస్కే (పెనమలూరు), బొడ్డపాడు ఆర్ఎస్కే (తోట్లవ ల్లూరు), ఆత్కూరు ఆర్ఎస్కే (ఉంగుటూరు), ఉయ్యూరు ఏఎంసీ (ఉయ్యూరు) ప్రాంతాల్లో డీసీఎంఎస్ ద్వారా కొనుగోలు ప్రక్రియ చేపట్టనున్నారు. ఆయా కేంద్రాల పరిధిలోని 144 రైతు సేవా కేంద్రాల ద్వారా నిర్దేశించిన కొనుగోలు కేంద్రం నుంచి కొనుగోళ్లు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. నేడు తొలి కేంద్రం ప్రారంభం జిల్లాలో తొలుత కంకిపాడు కేంద్రంగా మినుము కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు మార్క్ ఫెడ్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు కంకిపాడు ఏఎంసీ కార్యాలయ ప్రాంగణంలో కొనుగోళ్లను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ‘సాక్షి’ కథనంతో కదిలిన అధికారగణం జిల్లాలో 12 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నేడు కంకిపాడులో కొనుగోలు కేంద్రం ప్రారంభం మద్దతు ధర పొందాలి మినుము సాగు రైతులు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి. బయట మార్కెట్లో ధర ఆశాజనకంగా లేకపోతే తక్షణమే రైతు సేవా కేంద్రంలో పేర్లు నమోదు చేసుకుంటే మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేపట్టాం. దళారులను ఆశ్రయించి మోస పోకుండా మద్దతు ధరను పొందాలి. – మురళీకిషోర్, డీఎం, మార్క్ఫెడ్, కృష్ణాజిల్లా -
మలేరియా ల్యాబ్ టెక్నీషియన్లకు పునశ్చరణ శిక్షణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా మలేరియా విభాగంలో ల్యాబ్ టెక్నీషియన్లుగా విధులు నిర్వహిస్తున్న వారికి రెండు రోజుల పాటు నిర్వహించే పునశ్చరణ శిక్షణ మంగళవారం ప్రారంభమైంది. అజిత్సింగ్నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న మొదటి బ్యాచ్ శిక్షణను డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ శిక్షణ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్లు సుశిక్షతులై రాబోయే రోజుల్లో మలేరియా, పైలేరియా వంటి వ్యాధుల నియంత్ర ణలో బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలన్నారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మోతీ బాబు మాట్లాడుతూ.. మలేరియా విభాగంలో పనిచేసే ఎల్టీలను మూడు బ్యాచ్లుగా విభ జించి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి బ్యాచ్కు రెండు రోజుల శిక్షణ ఇస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ డైరెక్టర్ రామనాథ్రావు, మలేరియా పూర్వ అధికారులు రత్నజోసఫ్, ఆదినారాయణ పాల్గొన్నారు. తిరుపతమ్మ ఆలయానికి రూ.1.03 కోట్ల ఆదాయం పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మవారి ఆలయం వద్ద వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకునేందుకు మంగళవారం ఆలయ బేడా మండపంలో బహిరంగ వేలం జరిగింది. ఈ వేలంలో ఆలయానికి రూ.1,03,55,000 ఆదాయం సమకూరిందని ఈఓ కిషోర్కుమార్ తెలిపారు. ఆలయం వద్ద ఏడాది పాటు కొబ్బరికాయలు విక్రయించుకునే హక్కును రూ.58.50 లక్షలు, పొంగళి షెడ్ల నిర్వహణ, పొంగలి తయారీ సామగ్రి విక్రయించుకునే హక్కునకు రూ.29.55 లక్షలకు పచ్చల శివప్రసాద్ హెచ్చు పాటదారుగా నిలిచి దక్కించుకున్నారు. దేవస్థానం ప్రాంగణంలో పొంగలి షెడ్డు వద్ద మట్టికుండలు విక్రయించుకునే హక్కును కె.వీరవర ప్రసాద్ రూ.15.50 లక్షలకు పొందారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ జంగాల శ్రీనివాసరావు, పాలకవర్గ సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. శనగల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కంచికచర్ల: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు, మండలంలోని కొత్తపేట గ్రామ సచివాలయంలో శనగల కొనుగోలు కేంద్రాలను మార్క్ఫెడ్ డీఎం కె.నాగమల్లిక మంగళవారం ప్రారంభించారు. ఈ మేరకు డీఎం మాట్లా డుతూ.. సీఎం యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి రైతూ తమకు కేటాయించిన తేదీ ప్రకారం కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చి తాము పండించిన శనగ పంటను విక్రయించుకోవచ్చని తెలిపారు. క్వింటా శనగల మద్దతు ధర రూ.5,650గా ప్రభుత్వం నిర్ణయించింద న్నారు. నిర్ణీత తేమశాతం, నాణ్యతా ప్రమాణాలు ఉంటేనే శనగలను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. నగదు మాత్రం రైతుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమవుతుందని డీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ కార్యదర్శి ఎస్.శ్రీనివాస్, సూపర్వైజర్ కె.నరేష్కుమార్ పాల్గొన్నారు. -
మహిళలపై వేధింపుల కేసులను త్వరితగతిన పరిష్కరించాలి
కృష్ణలంక (విజయవాడ తూర్పు): మహిళలపై వేధింపుల కేసులు త్వరితగతిన పరిష్కరించాలని మహిళా సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గవర్నర్ పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో మహిళా సంఘాల ఐక్యవేదిక నేతలు సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ.. సినీ నటి కాదంబరి జత్వానిపై పెట్టిన అక్రమ కేసులన్నింటినీ న్యాయబద్ధంగా తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ రావాలంటున్నారని, ఆ రిపోర్టు రావడానికి ఎన్నాళ్లు పడుతుందని ప్రశ్నించారు. నటి జత్వాని మాట్లాడుతూ.. తన మీద పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తివేసి తనకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనితను కోరారు. తన కేసును సీఐడీకి షిఫ్ట్ చేసిన తర్వాత ఇంతవరకు నిందితుల మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జత్వాని కేసును గాలికి వదిలేశారన్నారు. సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానని, వేలాది మంది మహిళలు గత ప్రభుత్వ పాలనలో అదృశ్యమయ్యారని ఆరోపించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మహిళా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ -
నూతన కౌలు చట్టాన్ని తీసుకురావాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో కౌలు రైతుల రక్షణ, సంక్షేమం కోసం తక్షణమే సమగ్ర కౌలు చట్టాన్ని తేవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసింది. అనంతరం సంఘం ప్రతినిధులు డీఆర్వో లక్ష్మీనరసింహంను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సంద ర్భంగా కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జలమయ్య మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 32 లక్షల మంది కౌలురైతులు ఉన్నారని, వీరి రక్షణ, సంక్షేమం కోసం సమగ్రమైన కౌలు చట్టం వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో 90శాతానికి పైగా కౌలు రైతులే ఉంటున్నారన్నారు. కౌలు కార్డులు లేని కారణంగా వారికి ఎక్స్గ్రేషియా అందడం లేదన్నారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్నీడి యల్లమందారావు, ఎన్టీఆర్ జిల్లా కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి మేకల డేవిడ్, ఉపాధ్యక్షుడు పెయ్యల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం డిమాండ్ -
మా భూమి నుంచి 11 సెంట్లు కబ్జా
నా భార్య పేరిట సర్వే నంబర్ 7–1డీలో 52 సెంట్లు, 8–1సీలో 15 సెంట్ల భూమి ఉంది. ఈ 67 సెంట్ల రిజిస్టర్ పట్టా భూమి నుంచి 15 ఏళ్లుగా పక్క పొలంవారు 11 సెంట్లు అక్రమించుకున్నారు. అందు లోని సుబాబులు పంటను వారే అనుభవిస్తున్నారు. అదేమని అడిగితే మాపై దౌర్జన్యం చేస్తున్నారు. దీనిపై గతంలో ఎమ్మార్వో కార్యా లయంలో ఫిర్యాదు చేసినా సమస్యను పరిష్కరించలేదు. వృద్ధాప్యంతో అధికారుల చుట్టూ తిరగలేకపోతున్నా. కలెక్టర్ స్పందించి మా 11 సెంట్ల భూమిని అప్పగించాలని కోరుతున్నా. – పరిమళ్ల కోటేశ్వరరావు, వీరులపాడు మండలం -
తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్గా చోరీలు
నందిగామ టౌన్: తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని పట్టపగలు చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ తిలక్ పేర్కొన్నారు. స్థానిక ఏసీపీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చందర్లపాడు మండలంలోని లక్ష్మీపురం, కాండ్రపాడు గ్రామాలలో వరుస చోరీలకు పాల్పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని వారిలో ఒకరు మైనర్ ఉన్నట్లు తెలిపారు. సీసీ ఫుటేజ్, సెల్ఫోన్ సిగ్నల్స్, తదితర సాంకేతిక పరిజ్ఞానంతో నాలుగు ప్రత్యేక బృందాలు రెండు తెలుగు రాష్ట్రాలలో గాలించి పట్టుకున్నట్లు చెప్పారు. తెలంగాణాలోని సూర్యాపేట ప్రాంతానికి చెందిన నాగరాజుతో పాటు అతనికి అనుచరునిగా ఉన్న గుంటూరు జిల్లా అచ్చంపేటకు చెందిన మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. గత కొంత కాలంగా నందిగామ, జగ్గయ్యపేట, అచ్చంపేట పరిసర ప్రాంతాలలో తొమ్మిదిళ్లలో చోరీలకు పాల్పడ్డారన్నారు. వీరి వద్ద నుంచి 300 గ్రాముల బంగారం, 400 గ్రాముల వెండి వస్తువులు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న నందిగామ రూరల్ సీఐ చవాన్, చందర్లపాడు ఎస్ఐ దుర్గామహేశ్వరరావు, ఐడీ పార్టీ కానిస్టేబుల్ జాలయ్యలను ఆయన అబినందించారు. సీఐ చవాన్, ఎస్ఐ దుర్గామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు -
బాల్ బ్యాడ్మింటన్ విజేత సిద్ధార్థ మహిళా కాలేజీ
విజయవాడస్పోర్ట్స్: కృష్ణా యూనివర్సిటీ అంతర కళాశాలల బాల్ బ్యాడ్మింటన్ మహిళల పోటీల్లో శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కాలేజీ జట్టు సత్తా చాటింది. విజయవాడలోని సిద్ధార్థ మహిళా కాలేజీ క్రీడా ప్రాంగణంలో సోమవారం జరిగిన పోటీల్లో గెలుపొంది విన్నర్ ట్రోఫీని కై వసం చేసుకుంది. ఈ పోటీల్లో వైవీఎన్ఆర్ అండ్ జేడీ కాలేజీ (కై కలూరు) ద్వితీయ స్థానం, శ్రీపద్మావతి హిందు డిగ్రీ మహిళా కాలేజీ (మచిలీపట్నం) మూడో స్థానం, డాక్టర్ ఎల్హెచ్ఆర్ అండ్ జీడీ కాలేజీ (మైలవరం) నాలుగో స్థానం సాధించాయి. విజేతలకు సిద్ధార్థ మహిళా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.కల్పన, కన్వీనర్ శ్రీ లలిత్ప్రసాద్, స్పెషన్ ఆఫీసర్ డాక్టర్ ఆర్.మాధవి, ఫిజకల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.హేమ బహుమతులు అందజేశారు. ఈ నెల 29 నుంచి చెన్నయ్ అలగప్ప యూనివర్సిటీలో జరిగే జాతీయ అంతర విశ్వవిద్యాలయాల బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే కృష్ణా వర్సిటీ జట్టులో తమ విద్యార్థినులు ఎం.ఉమామహేశ్వరి, పి.భువనేశ్వరి, కె.సరస్వతి, ఎ.శ్రీరాజిని చోటు దక్కించుకున్నారని ప్రిన్సిపాల్ కల్పన ఈ సందర్భంగా తెలిపారు. -
ప్రజాప్రతినిధులక్రీడలకు సర్వం సిద్ధం
విజయవాడస్పోర్ట్స్: ప్రజాసేవలో తలమునకలయ్యే ప్రజాప్రతినిధులకు ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం తలపెట్టిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల క్రీడలను సమర్థంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు అంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ నెల 18న ఈ పోటీలు ప్రారంభమవుతాయని, రెండు రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని వెల్లడించారు. పోటీలకు ఏర్పాట్లను ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బొజ్జల సుధీర్రెడ్డి, సుందరపు విజయ్కుమార్, పీవీజీఆర్ నాయుడు (గణబాబు), ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాజగోపాల్రెడ్డి, పంచుమర్తి అనురాధ, శాప్ పరిపాలన అధికారి రమావత్ వెంకటరమణనాయక్తో కలిసి సోమవారం పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల క్రీడా సంబరాల్లో 13 క్రీడలను నిర్వహించనున్నామని, మంగళవారం మధ్యాహ్నం క్రీడాశాఖామంత్రి, స్పీకర్ కలిసి క్రీడలను ప్రారంభిస్తారన్నారు. 20వ తేదీన క్రీడలు ముసిగిన తర్వాత గెలుపొందినవారికి బహుమతులు ప్రదానం చేస్తారన్నారు. శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు -
ముగిసిన హెల్త్ వర్సిటీ క్రీడా పోటీలు
గన్నవరంరూరల్: వైద్య విద్యార్థులు క్రీడల్లో రాణించటం అభినందనీయమని సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు అన్నారు. మండలంలోని డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో జరుగుతున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పురుషుల 26వ ఇంటర్ క్రీడా పోటీలు సోమవారంతో ముగిశాయి. ఓవరాల్ చాంపియన్షిప్ను రాజమండ్రి జీఎస్ఎల్ మెడికల్ కళాశాల కై వసం చేసుకుంది. బ్యాడ్మింటన్లో విన్నర్గా రాజమండ్రి జీఎస్ఎల్ మెడికల్ కళాశాల, రన్నర్గా ఏలూరు ఆశ్రం మెడికల్ కళాశాల నిలిచాయి. టేబుల్ టెన్నిస్లో విన్నర్గా శ్రీకాకుళం గ్రేట్ జీఈ మెడికల్ కళాశాల, రన్నర్గా అనంతపురం మెడికల్ కళాశాల, టెన్నిస్లో విన్నర్గా గుంటూరు కాటూరి మెడికల్ కళాశాల, రన్నర్గా రాజమండ్రి జీఎస్ఎల్ మెడికల్ కళాశాల, ఫుట్బాల్లో రాజమండ్రి జీఎస్ఎల్ మెడికల్ కళాశాల, నెల్లూరు ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కళాశాల మెడికల్ విద్యార్థులు రాణించారు. విజేతలకు ట్రోఫీలు, పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. కళాశాల డైరెక్టర్ జనరల్ డాక్టర్ సి.నాగేశ్వరరావు, డైరెక్టర్ డాక్టర్ సీవీ రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ భీమేశ్వర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్, హెల్త్ యూనివర్సిటీ స్పోర్ట్స్ సెక్రటరీ డాక్టర్ ఇ.త్రిమూర్తి, ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవినేని రవి తదితరులు పాల్గొన్నారు. -
నూతన కౌలు చట్టాన్ని తీసుకురావాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో కౌలు రైతుల రక్షణ, సంక్షేమం కోసం తక్షణమే సమగ్ర కౌలు చట్టాన్ని తేవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసింది. అనంతరం సంఘం ప్రతినిధులు డీఆర్వో లక్ష్మీనరసింహంను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సంద ర్భంగా కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జలమయ్య మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 32 లక్షల మంది కౌలురైతులు ఉన్నారని, వీరి రక్షణ, సంక్షేమం కోసం సమగ్రమైన కౌలు చట్టం వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో 90శాతానికి పైగా కౌలు రైతులే ఉంటున్నారన్నారు. కౌలు కార్డులు లేని కారణంగా వారికి ఎక్స్గ్రేషియా అందడం లేదన్నారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్నీడి యల్లమందారావు, ఎన్టీఆర్ జిల్లా కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి మేకల డేవిడ్, ఉపాధ్యక్షుడు పెయ్యల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం డిమాండ్ -
ఐటీడీఏ ఏర్పాటుకు తీర్మానం చేయండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నాచౌక్లో ధర్నా చేసింది. ధర్నాలో పాల్గొన్న ఆదివాసీ సంక్షేమ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబయోగి మాట్లాడుతూ శ్రీకాకుళ సాయుధ గిరిజన రైతాంగ పోరాటం తర్వాత దేశవ్యాప్తంగా ఆదివాసీలకు ఐటీడీఏలు వచ్చాయన్నారు. శ్రీకాకుళం జిల్లాకు మాత్రం ఐటీడీఏ లేకపోవడం బాధాకరమన్నారు. ప్రస్తుతం ఉన్న శ్రీకాకుళం జిల్లా ఎనిమిది నియోజకవర్గాలతో ఏర్పడిందని, 16 మండలాల్లో ఆదివాసీలు సుమారు రెండు లక్షల మంది ఉన్నారన్నారు. వీటిలో ఐదు సబ్ ప్లాన్ మండలాలు ఉన్నాయన్నారు. కనీసం ఒక్క గ్రామం 5వ షెడ్యూల్లో లేకపోవడం విచారకరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన పలాస, పాతపట్నం బహిరంగ సభలలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీకాకుళం జిల్లాకు ఐటీడీఏ ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలన్నారు. ఈ ధర్నాకు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సంఘీభావం ప్రకటించింది. ధర్నాలో రాష్ట్ర నాయకులు వంకల మాధవరావు, కె.కల్యాణ్ కృష్ణ, కె. పొలారి, జమ్మయ్య, భాస్కర్ రావు, పాపారావు, ఆదివాసి సంక్షేమ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. విజయవాడలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా -
ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): మద్యానికి బానిసైన యువకుడు అప్పులపాలు కావడంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేఎల్రావునగర్ 5వ లైన్లో మొకర నాగజ్యోతి, రాము(24) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరిద్దరు ప్రేమించుకుని ఐదేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. రాము పాలప్రాజెక్టులో పని చేస్తుండగా, జ్యోతి బందరురోడ్డులోని ఓ హోటల్లో పని చేస్తుంటుంది. గత కొంత కాలంగా రాము మద్యానికి బానిసై తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. అప్పులు తీర్చే మార్గం లేదని రాము తరచూ భార్య వద్ద బాధపడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం జ్యోతి డ్యూటీకి వెళ్లగా, ఆ సమయంలో రాము పనికి వెళ్లాడు. రాత్రి ఇంటికి వచ్చిన రాముకు భార్య ఫోన్ చేసినా తీయలేదు. సోమవారం ఉదయం భర్త స్నేహితుడైన దుర్గారావుకు ఫోన్ చేసి ఇంటికి వెళ్లి చూడాలని జ్యోతి చెప్పింది. రాము ఇంటికి వచ్చిన దుర్గారావుకు ఇంటి తలుపులు వేసి ఉండటంతో బలంగా నెట్టగా లోపల వంట గదిలో హుక్కు చీరతో ఉరి వేసుకుని కనిపించాడు. దీంతో వెంటనే దుర్గారావు జ్యోతికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఆమె హుటాహుటిన ఇంటికి వచ్చింది. ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు రాము మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం జి.కొండూరు: ద్విచక్రవాహనంపై వెళ్తున్న తండ్రీకొడుకులు యూటర్న్ తీసుకుంటున్న ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టిన ఘటనలో కొడుకు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా, నందిగామకు చెందిన తమ్మిశెట్టి నర్సింహారావు, ఆయన పెద్ద కుమారుడు రవి(42) ఇద్దరూ ద్విచక్ర వాహనంపై సోమవారం ఉదయం 7గంటల సమయంలో మైలవరం మండల పరిధి గణపవరంలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఉదయం 10.30గంటల సమయంలో జి.కొండూరు మండల పరిధి కట్టుబడిపాలెం గ్రామం వద్దకు రాగానే ద్విచక్ర వాహనానికి మందు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ లారీ అకస్మాత్తుగా యూటర్న్ తీసుకుంది. దీంతో ద్విచక్రవాహనం ఆ ట్యాంకర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తమ్మశెట్టి రవి మీదుగా లారీ ఎక్కడంతో తీవ్ర గాయాలయ్యాయి. తండ్రి నర్సింహారావుకి కూడా స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు ఇరువురిని 108 అంబులెన్స్లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే రవి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి నర్సింహారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్ కుమార్ తెలిపారు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ: వ్యక్తి మృతి కృత్తివెన్ను: లారీ, బైక్ ఢీ కొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రగాయాలపాలైన సంఘటన కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం వద్ద సోమవారం ఉదయం జరిగింది. పోలీసులు కథనం మేరకు 216 జాతీయ రహదారిపై లక్ష్మీపురం లాకు సెంటర్ సమీపంలో పశ్చిమగోదావరి జిల్లా నాగిడిపాలెం నుంచి బైక్పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో వి. రాధాకృష్ణ (57) ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి బర్రె నారాయణస్వామి తీవ్రగాయాలపాలయ్యాడు. తీవ్రంగా గాయపడిన నారాయణస్వామిని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించినట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య కేసులో నిందితులు అరెస్ట్ ఇబ్రహీంపట్నం: స్థానిక ఫెర్రీలో ఈనెల 14వ తేదీ తెల్లవారుజామున రౌడీ షీటర్ జరబన వెంకటేష్ (41) హత్యకేసులో ముగ్గురు నిందితులను ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. జూపూడి బస్టాప్ వద్ద సోమవారం తెల్లవారుజామున సంచరిస్తున్న నిందితులు పొనమాల వేణు, చింతా వీరాంజనేయులు, కొప్పనాతి వీర్రాజును సీఐ ఏ.చంద్రశేఖర్ తన సిబ్బందితో అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టిన అనంతరం విజయవాడ కోర్టులో హాజరు పరిచామని సీఐ చంద్రశేఖర్ తెలిపారు. న్యాయమూర్తి ముగ్గురికి రిమాండ్ విధించినట్లు ఆయన చెప్పారు. ఎండీయూ వ్యాన్పై విజిలెన్స్ దాడి నిల్వ లెక్క తేలని 71 బియ్యం బస్తాలు గుర్తింపు సంగమేశ్వరం(నాగాయలంక): మండలంలోని సంగమేశ్వరం, పాత ఉపకాలి చెందిన 36, 11నంబర్ల రేషన్ దుకాణాల ఎండీయూ వ్యాన్పై మంగళవారం రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి దాడి చేసి లెక్క ప్రకారం నిల్వ ఉండాల్సిన 71బస్తాల ఆచూకీ లేకపోవడంతో కేసు నమోదు చేశారు. ఈ రెండు షాపులను డీలర్ విశ్వనాథపల్లి ఉదయలోల నిర్వహిస్తున్నారు. షాపులను తనిఖీ చేయగా ఒక షాపు కింద 56బస్తాలు, మరో షాపు కింద 15బస్తాల రేషన్ బియ్యం తరుగు ఉండటాన్ని గుర్తించారు. ఎండీయూ వాహనాన్ని సీజ్ చేసి, తదుపరి చర్యలు నిమిత్తం పీడీఎస్ డెప్యూటీ తహసీల్దార్ ఖాసిమ్బాబుకు అప్పగించారు. కాగా పూర్తి వివరాలతో బుధవారం సమగ్ర నివేదికలు రూపొందించి తదుపరి చర్యలు తీసుకుంటామని డీటీ వివరించారు. -
ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు ప్రారంభం
● పరీక్ష కేంద్రాలను పరిశీలించిన డీఈఓ, కలెక్టర్ ● తొలి రోజు 268 మంది విద్యార్థులు గైర్హాజరు వన్టౌన్(విజయవాడపశ్చిమ): జిల్లాలో పదో తర గతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 168 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 27,711 మంది రెగ్యులర్ విద్యార్థులకు, 27,443 మంది పరీక్షకు హాజరయ్యారు. 268 మంది గైర్హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. 44 మంది ప్రైవేట్ విద్యార్థులకు 39 మంది హాజరయ్యారని వెల్లడించారు. తొలి రోజు జరిగిన తెలుగు పరీక్షకు 99.03 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏపీ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించిన పరీక్షలకు ఒకరు గైర్హాజర య్యారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. వంద మీటర్ల పరిధిలో జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో హాజరయ్యేలా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడిపింది. హాల్టికెట్లు ఉన్న విద్యార్థులను బస్సుల్లో ప్రయాణానికి ఉచితంగా అనుమతించారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రత్యేకంగా విధులు నిర్వహించారు. పరీక్ష కేంద్రంలోకి అరగంట ముందుగా విద్యార్థులను అనుమతించారు. పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ విజయవాడలోని పలు పరీక్ష కేంద్రాలను జిల్లా అధికారులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు వేర్వేరుగా పరిశీలించారు. కలెక్టర్ లక్ష్మీశ చుండూరి వెంకటరత్నం నగరపాలకసంస్థ పాఠశాలలో నిర్వహించిన పరీక్షను పరిశీలించారు. పరీక్ష జరుగుతున్న తీరు, వసతుల కల్పనపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు అత్యవసర మందులు అందు బాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రం గదుల్లో ఏర్పాట్లను కూడా పరిశీలించారు. ఏపీ సార్వత్రిక విద్యాపీఠం డైరెక్టర్ జిల్లాలో జరుగుతున్న పరీక్షలను పరిశీలించారు. జిల్లా పరిశీలకుడు కృష్ణమోహన్ నాలుగు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. తొలి రోజు ప్రశాంతం పదో తరగతి పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా జరిగాయని డీఈఓ యు.వి.సుబ్బారావు తెలిపారు. ఆయన నగరంలోని సీవీఆర్ మునిసిపల్ స్కూల్, ఫిట్జీ, ఎస్కేఆర్ఎంఆర్ ఉన్నతపాఠశాల, నిర్మల హైస్కూల్, ఎస్వీబీవీఎన్ మునిసిపల్ హైస్కూల్, పటమట జెడ్పీ హైస్కూల్, డాక్టర్ కేకేఆర్ గౌతమ్ హైస్కూల్, డాన్బాస్కో తదితర పాఠశాలలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 63 పరీక్ష కేంద్రాల్లో తనిఖీలు చేశాయి. -
ప్రజాప్రతినిధులక్రీడలకు సర్వం సిద్ధం
విజయవాడస్పోర్ట్స్: ప్రజాసేవలో తలమునకలయ్యే ప్రజాప్రతినిధులకు ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం తలపెట్టిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల క్రీడలను సమర్థంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు అంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ నెల 18న ఈ పోటీలు ప్రారంభమవుతాయని, రెండు రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని వెల్లడించారు. పోటీలకు ఏర్పాట్లను ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బొజ్జల సుధీర్రెడ్డి, సుందరపు విజయ్కుమార్, పీవీజీఆర్ నాయుడు (గణబాబు), ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాజగోపాల్రెడ్డి, పంచుమర్తి అనురాధ, శాప్ పరిపాలన అధికారి రమావత్ వెంకటరమణనాయక్తో కలిసి సోమవారం పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల క్రీడా సంబరాల్లో 13 క్రీడలను నిర్వహించనున్నామని, మంగళవారం మధ్యాహ్నం క్రీడాశాఖామంత్రి, స్పీకర్ కలిసి క్రీడలను ప్రారంభిస్తారన్నారు. 20వ తేదీన క్రీడలు ముసిగిన తర్వాత గెలుపొందినవారికి బహుమతులు ప్రదానం చేస్తారన్నారు. శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు -
గ్రేటర్ వద్దు.. ఎన్నికలే ముద్దు
● తాడిగడప మునిసిపాలిటీ ఎన్నికలకు సన్నాహాలు ● గ్రేటర్ విజయవాడలో విలీనంపై నీలినీడలు ● జూన్ లేదా జూలైలో ఎన్నికలంటూ ప్రచారం పెనమలూరు: గ్రేటర్ విజయవాడలో తాడిగడప విలీనం ప్రశ్నార్థకంగా మారింది. వైఎస్సార్ తాడిగడప మునిసిపాలిటీకి ఎన్నికలు నిర్వహించటానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేపట్టిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికలు నిర్వహించటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికార పార్టీ నేతలే ప్రచారం చేస్తున్నారు. 2020వ సంవత్సరంలో తాడిగడప మునిసిపాలిటీగా ఆవిర్భవించింది. పోరంకి, తాడిగడప, యనమలకుదురు, కానూరు గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తాడిగడప మునిసిపాలిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో పంచాయతీలను విలీనం చేసి పలు మునిసిపాలిటీలుగా ఏర్పాటు చేయటంపై వివాదం తలెత్తి పలువురు కోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టే ఉత్తర్వుల నేపథ్యంలో తాడిగడప మునిసిపాలిటీకి ఎన్నికలు జరగలేదు. మునిసిపాలిటీ ఆవిర్భావం నుంచి నేటి వరకు తాడిగడప అధికారుల పాలనలోనే ఉంది. గ్రేటర్లో విలీనంపై వెనుకడుగు తాడిగడప మునిసిపాలిటీని విజయవాడ కార్పొరేషన్లో విలీనం చేసి గ్రేటర్ విజయవాడగా మార్చు తారని ఇంతకాలం ప్రచారం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం తాడిగడపను గ్రేటర్లో విలీనం చేయడం లేదని సమాచారం. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉండటంతో తాడిగడపను విలీనం చేయాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వం వెనక్కు తగ్గిందని చెబుతున్నారు. ఎన్నికలు జరగకపోవటంతో తాడిగడప మునిసిపాలిటీకి ఇప్పటికే 15 ఆర్థిక సంఘం నిధులు అందలేదు. తాజాగా 16వ ఆర్థిక సంఘం నిధులు కూడా చేజారే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తాడిగడపకు ఎన్నికలు జరిపే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం. ఎన్నికలు జరిగితే రూ.50 కోట్లకు పైగా ఆర్థిక సంఘం నిధులు తాడిగడప మునిసిపాలిటీకి సమకూరే అవకాశం ఉంది. ఎన్నికలు సకాలంలో జరగకపోతే ఆర్థిక సంఘం నిధులకు చేజారే అవకాశం ఉంది. కార్పొరేషన్లో మునిసిపాలిటీని విలీనం చేస్తే ప్రజలపై అదనంగా పన్నుల భారం పడుతుందని, దీని వల్ల పార్టీ మైలేజీ దెబ్బతింటుందని టీడీపీ నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లారని సమాచారం. టీడీపీ నేతల సమావేశం తాడిగడప మునిసిపాలిటీ ఎన్నికలపై స్థానిక టీడీపీ నేతలు రెండు రోజుల క్రితం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారని తెలిసింది. జూన్ లేదా జూలైలో తాడిగడపలో ఎన్నికలు జరుగుతాయని పార్టీ శ్రేణులకు ఈ సమావేశంలో చెప్పినట్లు ప్రచారం జరుగు తోంది. ఈ మేరకు స్థానిక టీడీపీ నేతలు ఎన్నికలకు సంబంధించి కసరత్తు చేస్తున్నారు. మునిసిపాలిటీ పరిధిలో పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సమాచారం ఇచ్చారు. అధికారంపైనే ఆశ అధికార పార్టీ నేతలకు తాడిగడప మునిసిపాలిటీ బంగారు బాతుగుడ్డులా మారింది. విజయవాడ నగర శివారులో ఈ మునిసిపాలిటీ ఉండటంతో రియల్ ఎస్టేట్, అపార్టుమెంట్లు, అక్రమ నిర్మాణాలు, అక్రమ లేఅవుటులు జోరుగా సాగుతున్నాయి. అధికార పార్టీ నాయ కులు, అధికారులకు ఈ మునిసిపాలిటీ కాసుల వర్షం కురిపిస్తోందన్న ప్రచారం ఉంది. తాజాగా ఎన్నికలు జరిగి, అధికారం చేపడితే దండిగా దండుకోవచ్చని అధికార పార్టీ నాయకులు ఆశతో ఉన్నారని సమాచారం. తాజాగా ఎన్నిలు జరుగుతాయన్న సమాచారంతో రాజకీయ పార్టీల్లో కదలిక మొదలైంది. -
విజయవాడ సిటీ
మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2025 ఇఫ్తార్ సహరి (మంగళ) (బుధ) విజయవాడ 6.23 4.56 మచిలీపట్నం 6.22 4.53బాబా సేవలో ధనుంజయ శర్మ మధురానగర్(విజయవాడసెంట్రల్): ముత్యాలంపాడు సాయిబాబా మందిరాన్ని అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా చల్లా ధనుంజయ శర్మ సోమవారం దర్శించుకున్నారు. మందిర గౌరవాధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి పాల్గొన్నారు. ఎస్పీని కలిసిన వీసీ రాంజీ కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణా వర్సిటీ వీసీ రాంజీ సోమవారం ఎస్పీ ఆర్.గంగాధరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీకి మొక్క అందజేసి, వర్సిటీ భద్రతపై చర్చించారు. 7 -
బాల్ బ్యాడ్మింటన్ విజేత సిద్ధార్థ మహిళా కాలేజీ
విజయవాడస్పోర్ట్స్: కృష్ణా యూనివర్సిటీ అంతర కళాశాలల బాల్ బ్యాడ్మింటన్ మహిళల పోటీల్లో శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కాలేజీ జట్టు సత్తా చాటింది. విజయవాడలోని సిద్ధార్థ మహిళా కాలేజీ క్రీడా ప్రాంగణంలో సోమవారం జరిగిన పోటీల్లో గెలుపొంది విన్నర్ ట్రోఫీని కై వసం చేసుకుంది. ఈ పోటీల్లో వైవీఎన్ఆర్ అండ్ జేడీ కాలేజీ (కై కలూరు) ద్వితీయ స్థానం, శ్రీపద్మావతి హిందు డిగ్రీ మహిళా కాలేజీ (మచిలీపట్నం) మూడో స్థానం, డాక్టర్ ఎల్హెచ్ఆర్ అండ్ జీడీ కాలేజీ (మైలవరం) నాలుగో స్థానం సాధించాయి. విజేతలకు సిద్ధార్థ మహిళా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.కల్పన, కన్వీనర్ శ్రీ లలిత్ప్రసాద్, స్పెషన్ ఆఫీసర్ డాక్టర్ ఆర్.మాధవి, ఫిజకల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.హేమ బహుమతులు అందజేశారు. ఈ నెల 29 నుంచి చెన్నయ్ అలగప్ప యూనివర్సిటీలో జరిగే జాతీయ అంతర విశ్వవిద్యాలయాల బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే కృష్ణా వర్సిటీ జట్టులో తమ విద్యార్థినులు ఎం.ఉమామహేశ్వరి, పి.భువనేశ్వరి, కె.సరస్వతి, ఎ.శ్రీరాజిని చోటు దక్కించుకున్నారని ప్రిన్సిపాల్ కల్పన ఈ సందర్భంగా తెలిపారు. -
సొరంగానికి మరమ్మతులు
ప్రమాదరహితంగా తీర్చిదిద్దేందుకు వీఎంసీ ప్రణాళికవన్టౌన్ నుంచి భవానీపురం, గొల్లపూడి, విద్యాధరపురం ప్రాంతాలకు వెళ్లే వారికి సొరంగ మార్గం ఎంతో అనువుగా ఉంటుంది. నిత్యం వందలాది మంది సొరంగం నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. అంతటి విశిష్టత కలిగిన సొరంగం రాబోయే తరాలకు కూడా సేవలు అందించేలా పతిష్టంగా చేయాలని పనులు చేపట్టారు. సొరంగం కొండపై ఉన్న పలు నివాసాలను తొలగించాలని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇప్పటికే పలు మార్లు కొండ ప్రాంతంలో పర్యటించిన కార్పొరేషన్ అధికారులు త్వరలోనే తుది నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సొరంగం కొండకు ఇరువైపులా సుమారు 40 ఇళ్లను తొలగించాలని కార్పొరేషన్ ఇంజినీరింగ్ విభాగం గుర్తించి, ఆయా ఇళ్లకు మార్కింగ్ చేశారు. దీంతో పాటు ఆయా నివాసితులతో మాట్లాడి వారి నుంచి అనుమతి పత్రాలను తీసుకున్న తర్వాత పునరావాసంపై ఆలోచన చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. చిట్టినగర్(విజయవాడపశ్చిమ): అరవై ఏళ్ల చరిత్ర కలిగిన చిట్టినగర్ సొరంగాన్ని పటిష్ట పరిచేందుకు కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. గత కొన్ని నెలలుగా సొరంగంలో వస్తున్న నీటి ఊట ఇప్పుడు ధారలుగా కిందకు కారుతోంది. దీంతో సొరంగ మీదుగా ప్రయాణం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అలాగే కొండపై నుంచి తరచూ రాళ్లు, మట్టి జారిపడటంతో వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. దీంతో రంగంలోని దిగిన కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులు సొరంగం పటిష్టత దెబ్బతినకుండా, అదే సమయంలో ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు కార్యాచరణ రూపొందించారు. ప్రమాదాలకు నిలయంగా.. ఇక ఇటీవల సొరంగం లోపల నీటి ఊట వస్తున్న ప్రాంతంలో నివారణ చర్యలు చేపట్టారు. సొరంగం మధ్య నుంచి వస్తున్న నీటి ధారలు రోడ్డు మధ్యలో పడటం, ఆ ప్రాంతమంతా బురదమయంగా మారి వాహన చోదకులు జారిపడుతున్న ఘటనలు ఇటీవల అనేకం చోటు చేసుకున్నాయి. తరచూ సొరంగంలో రోడ్డు ప్రమాదాల జరిగిన అనేక మంది గాయాలు పాలు కావడంతో పాటు పలువురు మృతి చెందిన ఘటనలు జరిగాయి. దీంతో కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులు రంగంలోకి దిగి సొరంగంలో నీటి ఉట, నీటి ధారలు రాకుండా ఉండేందుకు అవసరమైన పనులు చేపట్టారు. సొరంగం కొండపై ఉన్న నివాసాలను పరిశీలించి, చర్యలకు సిద్ధపడ్డారు. భారీ వాహనాల రాకపోకలు నిషేధిస్తే.. సొరంగం నుంచి భారీ వాహనాల రాకపోకలను నిషేధించినట్లయితే కొంత మేర ఫలితం ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. పగటి వేళ కాలేజీ, స్కూల్ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే వాటి వల్ల పెద్ద ప్రమాదం ఏమీ లేకపోయినా, రాత్రి వేళ టన్నుల బరువుతో లారీలు, టిప్పర్లు మితిమీరిన వేగంతో ప్రయాణించడం వల్ల సొరంగం కొండ కంపిస్తోందని పేర్కొంటున్నారు. నీటి ధారలు అరికట్టేందుకు చర్యలు కొండపై ఇళ్లను తొలగించాలని సూచన త్వరలోనే నివాసితుల తరలింపు పలు ఇళ్లకు మార్కింగ్.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనూ పనులు.. సొరంగం దెబ్బతినకుండా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కొన్ని పనులు చేపట్టింది. సొరంగానికి అవతలి వైపున కొండకు ఇరువైపులా రాళ్లు జారి పడుకుండా రూ. లక్షల వ్యయంతో ఐరన్ మెష్ ఏర్పాటు చేయించింది. కొండపై ప్రమాదకరంగా ఉన్న చెట్లు, కొండ చరియలను తొలగింపు పనులు పలుమార్లు నిర్వహించింది. -
పసుపు–కుంకుమ ఉత్సవం
కనుల పండువగా పుట్టింటి అనిగండ్లపాడు(పెనుగంచిప్రోలు): శ్రీతిరుపతమ్మ అమ్మ వారి చిన్న తిరునాళ్ల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన అమ్మ వారి పుట్టినిల్లు అనిగండ్లపాడు గ్రామం నుంచి పసుపు – కుంకుమ బండ్లు తీసుకువచ్చే కార్యక్రమం సోమవారం రాత్రి కనుల పండువగా సాగింది. అమ్మవారి వంశీకులు కొల్లా శ్రీనివాసరావు ఇంటి వద్ద ఆలయ వేద పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రంగురంగుల విద్యుత్ దీపాలలు, పూలతో అలంకరించిన బండిపై పసుపు – కుంకుమ ఉంచి గ్రామంలో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి పుట్టినింటికి చేరుకొని ఆనంద పరవశులయ్యారు. గ్రామంలో రోడ్ల వెంట భక్తులు బారులు తీరి పసుపు – కుంకుమ బండ్లను వీక్షించటంతో పాటు వార్లు పోసి పూజలు నిర్వహించారు. కోలాట నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకు న్నాయి. అర్ధరాత్రి 12 గంటల తరువాత పసుపు – కుంకుమ బండ్లు పెనుగంచిప్రోలులోని అమ్మ వారి ఆలయానికి చేరాయి. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ జంగాల శ్రీనివాసరావు, ఈఓ బి.హెచ్.వి.ఎస్.ఎన్.కిషోర్కుమార్, ఈఈ ఎల్.రమ, డీసీపీ మహేశ్వరరాజు, నందిగామ ఏసీపీ తిలక్, ఎంపీటీసీ సభ్యురాలు పొందూరు విజయలక్ష్మి, తహసీల్దార్ ఎ.శాంతిలక్ష్మి, ఏఈ రాజు, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు ప్రారంభం
● పరీక్ష కేంద్రాలను పరిశీలించిన డీఈఓ, కలెక్టర్ ● తొలి రోజు 268 మంది విద్యార్థులు గైర్హాజరు వన్టౌన్(విజయవాడపశ్చిమ): జిల్లాలో పదో తర గతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 168 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 27,711 మంది రెగ్యులర్ విద్యార్థులకు, 27,443 మంది పరీక్షకు హాజరయ్యారు. 268 మంది గైర్హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. 44 మంది ప్రైవేట్ విద్యార్థులకు 39 మంది హాజరయ్యారని వెల్లడించారు. తొలి రోజు జరిగిన తెలుగు పరీక్షకు 99.03 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏపీ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించిన పరీక్షలకు ఒకరు గైర్హాజర య్యారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. వంద మీటర్ల పరిధిలో జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో హాజరయ్యేలా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడిపింది. హాల్టికెట్లు ఉన్న విద్యార్థులను బస్సుల్లో ప్రయాణానికి ఉచితంగా అనుమతించారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రత్యేకంగా విధులు నిర్వహించారు. పరీక్ష కేంద్రంలోకి అరగంట ముందుగా విద్యార్థులను అనుమతించారు. పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ విజయవాడలోని పలు పరీక్ష కేంద్రాలను జిల్లా అధికారులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు వేర్వేరుగా పరిశీలించారు. కలెక్టర్ లక్ష్మీశ చుండూరి వెంకటరత్నం నగరపాలకసంస్థ పాఠశాలలో నిర్వహించిన పరీక్షను పరిశీలించారు. పరీక్ష జరుగుతున్న తీరు, వసతుల కల్పనపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు అత్యవసర మందులు అందు బాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రం గదుల్లో ఏర్పాట్లను కూడా పరిశీలించారు. ఏపీ సార్వత్రిక విద్యాపీఠం డైరెక్టర్ జిల్లాలో జరుగుతున్న పరీక్షలను పరిశీలించారు. జిల్లా పరిశీలకుడు కృష్ణమోహన్ నాలుగు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. తొలి రోజు ప్రశాంతం పదో తరగతి పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా జరిగాయని డీఈఓ యు.వి.సుబ్బారావు తెలిపారు. ఆయన నగరంలోని సీవీఆర్ మునిసిపల్ స్కూల్, ఫిట్జీ, ఎస్కేఆర్ఎంఆర్ ఉన్నతపాఠశాల, నిర్మల హైస్కూల్, ఎస్వీబీవీఎన్ మునిసిపల్ హైస్కూల్, పటమట జెడ్పీ హైస్కూల్, డాక్టర్ కేకేఆర్ గౌతమ్ హైస్కూల్, డాన్బాస్కో తదితర పాఠశాలలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 63 పరీక్ష కేంద్రాల్లో తనిఖీలు చేశాయి. -
నేడు కృష్ణాతీరంలో మాక్డ్రిల్
నాగాయలంక: ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో నాగాయలంక శ్రీరామ పాదక్షేత్రం వద్ద కృష్ణాతీరం వెంబడి మంగళవారం వరదలు వంటి విపత్తులపై మాక్డ్రిల్ నిర్వహిస్తామని సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మాక్ డ్రిల్ సన్నాహక సమావేశంలో భాగంగా ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన అధికారులతో సోమవారం టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. బందరు ఆర్డీఓ కె.స్వాతి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో మాక్డ్రిల్పై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎడ్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ పరికరాలతో సిద్ధంగా ఉండాలన్నారు. మాక్ డ్రిల్ క్షేత్రస్థాయి పర్యవేక్షణలో తాను స్వయంగా పాల్గొంటానని తెలిపారు. మెప్మా పీడీ పి.సాయిబాబు, జెడ్పీ డెప్యూటీ సీఈఓ ఆనందకుమార్, తహసీల్దార్ ఎం.హరనాథ్, ఎంపీడీఓ జి.సధాప్రవీణ్, అవనిగడ్డ సీఐ యువకుమార్, ఎస్ఐ కె.రాజేష్, ఇరిగేషన్ ఏఈ పి.రవితేజ తదితరులు పాల్గొన్నారు. రైల్వే రస్క్రాప్ ద్వారా రూ.101.64 కోట్ల ఆదాయం రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వే డివిజన్ స్క్రాప్ విక్రయంతో రూ.101.64 కోట్ల ఆదాయం సాధించి రికార్డు సృష్టించింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన రూ.79 కోట్ల స్క్రాప్ విక్రయ లక్ష్యాన్ని గత డిసెంబర్లోనే అధిగ మించి రూ.100 కోట్ల మార్కును దాటింది. ఈ ఏడాది ఈ–వేలం ద్వారా రైలు వ్యర్థాలు, ఎస్ అండ్ టీ వ్యర్థాలు, ఇంజినీరింగ్ వ్యర్థాలు, ఇతర లోహాల స్క్రాప్ 18,908 టన్నులు విక్రయించింది. స్క్రాప్తో ఇంత ఆదాయం సాధించడంలో కృషిచేసిన సీనియర్ డివిజనల్ మెటీరియల్ మేనేజర్ కె.బి.తిరుపతయ్యను డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ అభినందించారు. ప్రసవాలను నమోదు చేయాలి లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగే ప్రసవాలను విధిగా హెల్త్ అండ్ మెడికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఐఎస్) పోర్టల్లో నమోదు చేయా లని డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని ఆదేశించారు. కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు నమోదులో జాప్యం చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి జననాన్ని తప్పకుండా సివిల్ రిజిస్టర్ సిస్టమ్(సీఆర్ఎస్) పోర్టల్లో అప్లోడ్ చేయాల్సిన బాధ్యత ప్రైవేటు ఆస్పత్రుల యాజమా న్యాలపై ఉందన్నారు. ఈ నిబంధనను ఉల్లఘించిన ఆస్పత్రులపై ఆంధ్రప్రదేశ్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ పరిధిలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్ష కేంద్రాల్లో ఎస్పీ తనిఖీలుకోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు సోమవారం మచిలీపట్నంలోని పదో తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత పాండు రంగ మునిసిపల్ హై స్కూలును సందర్శించి పోలీసు బందోబస్తును పరిశీలించారు. అక్కడి నుంచి భాష్యం స్కూలుకు వెళ్లి పరీక్ష విధానం, సిబ్బంది పనితీరును పరిశీలించారు. అనంతరం నిర్మల హైస్కూల్, కేకేఆర్ గౌతమ్ స్కూల్ను సందర్శించారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. సీఐలు ఏసుబాబు, నబీ, పరమేశ్వరరావు, పలువురు ఎస్ఐలు పాల్గొన్నారు. ఏపీ జేఏసీ డెప్యూటీ సెక్రటరీ జనరల్గా విద్యాసాగర్ గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీ జేఏసీ డెప్యూటీ సెక్రటరీ జనరల్గా ఎ.విద్యాసాగర్ ఎన్నికయ్యారు. గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ హోంలో సోమవారం జరిగిన ఏపీ జేఏసీ సమావేశంలో విద్యాసాగర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో 50 ఉపాధ్యాయ, ఉద్యోగ క్యాడర్ సంఘాలు పాల్గొని ప్రస్తుత ఏపీ ఎన్జీజీఓ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న విద్యాసాగర్ను ఏపీ జేఏసీ డెప్యూటీ సెక్రటరీ జనరల్గా ఎన్నుకున్నాయి. అనంతరం విద్యాసాగర్ను రాష్ట్ర వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం అధ్యక్షుడు డి.వేణుమాధవరావు, వ్యవసాయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సాయికుమార్ ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విస్తరణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బి.జాన్ క్రిస్టోఫర్, ప్రధాన కార్యదర్శి ఐ.హానస్కుమార్ రాయ్ తదితరులు పాల్గొన్నారు. -
మా భూమి నుంచి 11 సెంట్లు కబ్జా
నా భార్య పేరిట సర్వే నంబర్ 7–1డీలో 52 సెంట్లు, 8–1సీలో 15 సెంట్ల భూమి ఉంది. ఈ 67 సెంట్ల రిజిస్టర్ పట్టా భూమి నుంచి 15 ఏళ్లుగా పక్క పొలంవారు 11 సెంట్లు అక్రమించుకున్నారు. అందు లోని సుబాబులు పంటను వారే అనుభవిస్తున్నారు. అదేమని అడిగితే మాపై దౌర్జన్యం చేస్తున్నారు. దీనిపై గతంలో ఎమ్మార్వో కార్యా లయంలో ఫిర్యాదు చేసినా సమస్యను పరిష్కరించలేదు. వృద్ధాప్యంతో అధికారుల చుట్టూ తిరగలేకపోతున్నా. కలెక్టర్ స్పందించి మా 11 సెంట్ల భూమిని అప్పగించాలని కోరుతున్నా. – పరిమళ్ల కోటేశ్వరరావు, వీరులపాడు మండలం -
ఆర్భాటం ఎక్కువ.. పరిష్కారం తక్కువ
ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. ఇబ్రహీంపట్నం మండలం, పరిసర ప్రాంతాలకు చెందిన దివ్యాంగులం ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మా అభ్యర్థన మేరకు 35 ఏళ్ల క్రితం ఇబ్రహీంప ట్నంలో ఆర్ఎస్ నంబర్ 230/1లో చెరువుగా ఉన్న భూమిలో పది సెంట్లు కేటాయిం చడంతో దాతల సాయంతో రేకుల షెడ్డు నిర్మించి సంఘ కార్యకలాపాలు సాగిస్తున్నాం. విజయవాడకు చెందిన రైల్వే ఉద్యోగి, అంధుడు జి.ఎస్.కె.స్వామి తమను కలసి, అందరం కలసి కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసుకుని, దానిని అభివృద్ధి చేసుకుందామని నమ్మబలికి, మా వద్ద నుంచి భారీగా చందాలు వసూలు చేశాడు. కొంత కాలం గడిచాక ఓ రోజు అర్ధరాత్రి కొంత మంది వ్యక్తులతో రేకుల షెడ్డును తొలగించి ఆ స్థలాన్ని ఆక్రమించాడు. దీనిపై సంఘ సభ్యులం స్థానిక పోలీస్ స్టేషన్, మండల కార్యాలయం, కలెక్టర్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎటు వంటి స్పందన లేదు. – పెండెం గాంధీ, దివ్యాంగుడు గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) అమలు తీరు ప్రచార ఆర్భాటం ఎక్కువ.. సమస్యల పరిష్కారం తక్కువ.. అన్న చందంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ సమస్యలపై ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి భారీగా అర్జీలు వస్తున్నాయి. వాటిలో కొన్నింటికి మాత్రమే పరిష్కారం లభిస్తోంది. మేజర్ సమస్యల అర్జీలు పెండింగ్లో ఉంటున్నాయి. కొందరు మండల స్థాయి అధికారులు అర్జీదారులను పిలిపించు కుని, వారి సంతకం తీసుకుని ఆ అర్జీ పరిష్కారమయినట్లు ఆన్లైన్లో చూపుతున్నారు. దీంతో అర్జీదారులు సమస్య పరిష్కారం కోసం కలెక్టరేట్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. సమస్య పరిష్కారం కాలేదంటూ అధికారులు రీ ఓపెన్ చేస్తు న్నారు. అయితే అవి పరిష్కారానికి నోచకుండానే ఆన్లైన్ నుంచి మాయమైపోతున్నాయి. డ్యాష్ బోర్డు లెక్కలు తప్పుల తడక కూటమి ప్రభుత్వం గతేడాది జూన్ 15న పీజీ ఆర్ఎస్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి సోమవారం గ్రామం, మండలం, డివిజన్, జిల్లా కేంద్రం (కలెక్టరేట్) స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కలెక్టరేట్లో అందే అర్జీల్లో అత్య ధికంగా రెవెన్యూకు సంబంధించిన సమస్యలే ఉంటున్నాయి. రెండో స్థానంలో పోలీసు కేసులకు సంబంధించి ఉంటున్నాయి. ఆ తర్వాత పెన్షన్లు, ఇతర సమస్యలపై అర్జీలు ఉంటున్నాయి. వీటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని నిర్ణయించారు. పది నెలల కాలంలో వివిధ సమస్యలపై ప్రజలు కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో 2,770 అర్జీలు అందజేశారు. వాటిలో 281 ప్రగతిలో ఉన్నాయి. మిగిలిన 2,419 అర్జీలు పరిష్కారమైనట్లు డ్యాష్ బోర్డు లెక్కలు చెబుతున్నాయి. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కొందరు తమ సమస్యలు పరిష్కారం కాలేదంటూ కలెక్టరేట్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్కు వచ్చి అర్జీలు సమర్పిస్తున్నారు. ఇక కొత్త పెన్షన్ల కోసం పీజీఆర్ఎస్లో అర్జీ చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. వాటికి అతీగతీ లేదు. ఇక రెవెన్యూ సమస్యలైతే కింది స్థాయి అధికారుల దయ.. తమ ప్రాప్తం అన్నట్లు ఉంది. చందర్లపాడు మండలం ఏటూరి గ్రామంలో 2023 జూన్లో నాయని సుధాకర్ వద్ద ఎకరం రెండు సెంట్ల పొలం కొనుగోలు చేశాను. పట్టాదారు పాసుపుస్తకాలు అన్ని నా పేర వచ్చాయి. పొలంలో సుబాబుల్ వేశాను. ఈ పంట కూడా నా పేర నమోదైంది. ఏటూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఉన్నం నరసింహారావు అండతో కొందరు నకిలీ దస్తావేజులు సృష్టించి భూమి కాజేయాలని చూస్తున్నారు. కరణం సీతామహాలక్ష్మి, కరణం గంగయ్య, ఉన్నం నరసింహారావు, నలజాల నాగేశ్వరరావు, మణ్యం వెంకటరావు, ఉప్పుటూరి వెంకటరావు పొలంలో పనిచేస్తున్న నాపై దాడికి ప్రయత్నించారు. ఇతర వ్యక్తులను పంపి బెదిరించారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోని పోలీసులు నన్ను పొలం అమ్మేయాలని బెదిరిస్తున్నారు. సీఐ అర్జీ రాసి దానిపై సంతకం చేయాలని బెదిరించారు. నా కొడుకుపై రేప్ కేసు పెడతామని బెదిరించారు. – కొప్పురావూరి సూర్యలక్ష్మి, చింతలపూడి, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా అర్జీదారులకు భరోసా ఇవ్వని పీజీఆర్ఎస్ కాళ్లు అరిగేలా తిరుగుతున్న అర్జీదారులు క్షేత్రస్థాయిలో స్పందనలేక రీ ఓపెన్ అవుతున్న అర్జీలు డ్యాష్బోర్డు లెక్కలకు, వాస్తవ పరిస్థితికి కుదరని పొంతన టీడీపీ నాయకుడు భూమి కాజేయాలని చూస్తున్నాడు విజయవాడ కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్కు 133 అర్జీలు అందాయి. ఈ అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, గ్రామ/వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి తదితరులతో కలిసి ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులు సంతృప్తి చెందేలా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, గడువులోగా పరిష్కరించాలన్నారు. పీజీఆర్ఎస్కు 133 అర్జీలు నా పేరు కొమ్మినేని కృష్ణారావు. మాది తిరువూరు మండలం రాజు గూడెం. కో ఆపరేటివ్ సొసైటీలో రూ.25 వేల వ్యవసాయ రుణం తీసుకున్నాను. 2006లో అప్పటి ప్రభుత్వం రుణమాఫీ చేసింది. రుణ మాఫీ విషయాన్ని తొక్కిపెట్టి అధిక వడ్డీ వేసి రూ.50 వేలు వసూలు చేశారు. మా కుటుంబ సభ్యుల నుంచీ అలాగే వసూలు చేశారు. ఒరిజినల్ దస్తావేజులు తిరిగి ఇవ్వలేదు. అదేమని అడిగితే డాక్యుమెంట్లు పోయాయని చెబుతున్నారు. తప్పుడు లెక్కల తాలూకు వివరాలతో ప్రతి సోమవారం పీజీఆర్ఎస్లో అర్జీ పెడుతున్నా. నా సమస్యను పరిష్కరించాలని సహకార శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించినా ఫలితం లేకుండా పోయింది. -
మంచి ఉపాధి అవకాశాలు చూపే కోర్సులు, కళాశాలలే టార్గెట్
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇంటర్మీడియెట్ పరీక్షలు ముగిశాయి. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువులకు ఎక్కడ చేర్పిస్తే బాగుంటుంది? ఏది చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది? ఏ కోర్సు చేస్తే ఉపాధి అవకాశాలు మెండుగా వస్తాయి? అనే అంశాలపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఇంటర్మీడియెట్లో ఎంపీసీ గ్రూప్ చేసిన విద్యార్థుల తల్లిదండ్రులంతా దాదాపు ఇదే ఆలోచనల్లో మునిగి తేలుతున్నారు. ఇప్పటికే పలువురు విజయవాడకు సమీపంలో ఉన్న ప్రైవేటు విశ్వ విద్యాలయాలను సందర్శించడంతో పాటు, ఆయా యూనివర్సిటీలు అడ్మిషన్స్ కోసం నిర్వహించే పరీక్షల వివరాలు, ఫీజుల వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. ప్లేస్మెంట్స్కే ప్రాధాన్యం.. ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగం మందకొడిగా నడుస్తోంది. అధిక నైపుణ్యం ఉన్న విద్యార్థులే ప్లేస్మెంట్స్ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మంచి ఆఫర్లు ఏ కళాశాల, యూనివర్సిటీల్లో ఎక్కువ వస్తున్నాయో తల్లిదండ్రులు ఆరా తీస్తున్నారు. అంతేకాక ఇంజినీరింగ్, డిగ్రీలో ఏ కోర్సులు చేసిన వారికి ప్లేస్మెంట్స్ వస్తున్నాయో కూడా తెలుసుకుంటున్నారు. తల్లిదండ్రుల ఆలోచనలకు అనుగుణంగానే ప్రైవేటు విశ్వ విద్యాలయాలు, కళాశాలలు తమ వద్ద చేరితే వంద శాతం ప్లేస్మెంట్స్ వస్తాయి.. ఈ విద్యా సంవత్సరంలో ఇంత మంది ప్లేస్మెంట్ పొందారంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రాల వద్ద సైతం అదే తరహా కరపత్రాలను యూనివర్సిటీ, కళాశాలల యాజమాన్యాలు పంపిణీ చేశారు. డిగ్రీకి పెరిగిన క్రేజ్.. ప్రస్తుతం డిగ్రీలోని పలు కోర్సులకు క్రేజ్ పెరిగింది. వాటిలో బీబీఏతో పాటు, బీఎస్సీ కంప్యూటర్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి వాటిపై విద్యార్థులు దృష్టి పెడుతున్నారు. ఆయా కోర్సులు చేసిన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తుండటంతో డిగ్రీ కాలేజీల్లో ఆ కోర్సుల్లో చేరేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. వాటితో పాటు సివిల్స్, గ్రూప్–1, గ్రూప్–2 వంటి ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టి పెట్టిన వారు బీఏలో చేరుతున్నారు. ఇప్పుడు డిగ్రీతో పాటు, సివిల్స్, గ్రూప్స్లో శిక్షణ ఇచ్చే కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో బీఏలో చేరే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ముగిసిన ఇంటర్మీడియెట్ పరీక్షలు విద్యార్థుల ఉన్నత చదువులపై దృష్టిసారిస్తున్న తల్లిదండ్రులు డిగ్రీ, ఇంజినీరింగ్ కోర్సుల్లో అవకాశాలు వేటిలో ఎక్కువుంటాయంటూ ఆరా ప్రైవేటు యూనివర్సిటీలు, కళాశాలల వివరాలు తెలుసుకుంటున్న వైనం పేరెంట్స్కు ఫోన్లు చేస్తున్న ప్రైవేటు కళాశాలల పీఆర్ఓలు -
అలా కవర్ చేశారు!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘ఉపాధి’లో నాణ్యత డొల్ల శీర్షికన సాక్షి దినపత్రికలో శనివారం ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. నాసిరకంగా వేసిన రోడ్లకు మరమ్మతులు చేపట్టారు. వివరాలు ఇవి.. కొత్తూరు తాడేపల్లి పంచాయతీలో రూ.1.04 కోట్లతో వేసిన సిమెంటు రోడ్లు నాసిరకంగా ఉన్నాయి. గ్రావెల్ స్థానంలో చెరువు బురద, మట్టి వేశారు. దీనిపై కథనం రావడంతో అధికారులు దానిని చదును చేసి, దానిపైన డస్ట్ వేసి కవర్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే వేమవరంలో ప్రారంభానికి ముందే రోడ్లు పగుళ్లు వచ్చిన విషయాన్ని సాక్షి హైలెట్ చేయడంతో రోడ్డు దెబ్బ తిన్న ప్రాంతంలో వాటిని పగులగొట్టి, మళ్లీ కొత్తగా సిమెంటుతో పూడ్చారు. దీంతో ఆ పంచాయతీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల నాణ్యతపై విజిలెన్స్ అధికారులతో విచారించాలని కోరుతున్నారు. -
ఎకై ్సజ్.. ఎక్సర్సైజ్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: తిరువూరు నియోజకవర్గంలో నాటుసారా నిర్మూలన కోసం సాక్షి దిన పత్రిక చేపట్టిన యజ్ఞం సత్ఫలితాలను ఇస్తోంది. వరుస కథనాలతో ప్రభుత్వ యంత్రాంగంలో కొంత కదలిక వచ్చింది. ఎకై ్సజ్శాఖ రాష్ట్ర అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా తిరువూరు ఎకై ్సజ్ పోలీసుస్టేషన్ను తనిఖీ చేశారు. తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక అధికారులకు సూచనలు చేశారు. దీంతో స్థానిక ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. మూలాలపై దృష్టి.. సారా నిర్మూలనలో భాగంగా ఇప్పటి వరకు తయారీ, విక్రయాలు చేస్తున్న వ్యక్తులపై మాత్రమే ఎకై ్సజ్శాఖ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అయితే నాటుసారా తయారీకి వినియోగించే బెల్లం, పటిక, పాత్రలు, డ్రమ్ములు, చెక్కలు విక్రయించే వ్యక్తులతో పాటు ఆర్థికంగా అండగా ఉంటున్న వ్యక్తులు, సపోర్టుగా ఉంటున్న పెద్ద మనుషులపై అధికారులు దృష్టి పెడుతున్నారు. నాటుసారా తయారీకి సహకరించే వ్యక్తులపైనా కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే మేడూరులో నాటుసారా తయారీకి బెల్లం విక్రయిస్తున్న అద్దగిరి వేణుబాబు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని నుంచి 71కేజీల బెల్లంను స్వాధీనం చేసుకున్నారు. కలెక్టర్ సైతం.. సారా రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ‘నవోదయం’ కార్యక్రమంలో భాగంగా తిరువూరు శ్రీ వాహిని ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 18న నాటుసారా నిర్మూలనపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నసారా నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన గ్రామ కమిటీలు, మండల కమిటీలు, ఎకై ్సజ్శాఖ అధికారులతో సమీక్ష జరపనున్నారు. సారాపై ‘సాక్షి’ కథనాలతో కదిలిన యంత్రాంగం తిరువూరు చేరిన రాష్ట్ర ఎకై ్సజ్శాఖ ఉన్నతాధికారులు మూలాలను వెతికే పనిలో నిమగ్నం నిందితులపై పీడీ చట్టాన్ని ప్రయోగించాలని ఆదేశాలు రేపు జిల్లా కలెక్టర్ తిరువూరులో సమావేశం -
ఇంద్రకీలాద్రిపై భక్తజన కోలాహలం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన రద్దీ సాయంత్రం వరకు కొనసాగింది. ఆదివారం ఒక్క రోజే సుమారు 60 వేల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. రద్దీ నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అంతరాలయ దర్శనాలను రద్దు చేసి, ముఖ మండప దర్శనానికే అనుమతించారు. అయితే దేవస్థానం పండుగలు, పర్వదినాలతో పాటు వీకెండ్లో ఏర్పాటు చేసిన వీఐపీ, ప్రొటోకాల్ ప్రత్యేక సమయాలు అమలు కాకపోవడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కిక్కిరిసిన కొండ.. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారి ప్రధాన ఆలయంలో ఖడ్గమాలార్చనతో పాటు లక్ష కుంకుమార్చన, చండీహోమం, శ్రీచక్రనవార్చన, శాంతి కల్యాణంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఆలయప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్యోపాసన సేవ నిర్వహించారు. ఆర్జిత సేవలలో పాల్గొనే ఉభయదాతలు, అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణంతో పాటు ఘాట్రోడ్డు, మహామండపం లిఫ్టు మార్గాలు కిటకిటలాడాయి. ఉదయం 10 గంటలకే అన్ని క్యూలైన్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉండటంతో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. ప్రముఖులతో పాటు సిఫార్సులపై దర్శనానికి విచ్చేసే వారిని ముఖ మండప దర్శనానికి అనుమతించారు. మహా మండపం వైపున వచ్చే భక్తులను 5వ అంతస్తు వరకు అనుమతించి అక్కడి నుంచి క్యూలైన్లోకి మళ్లించారు. మరో వైపున అమ్మవారికి మహా నివేదన నిమిత్తం అరగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేశారు. 12.20 గంటలకు తిరిగి దర్శనాలు ప్రారంభం కాగా రెండు గంటల వరకు రద్దీ కొనసాగింది. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలోనూ ఉభయదాతలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి అంతరాలయ దర్శనం రద్దు అమలు కాని వీఐపీ, ప్రొటోకాల్ టైం స్లాట్ సామాన్య భక్తులకు తప్పని ఇబ్బందులు -
శోభాయమానం.. దివ్య ప్రభోత్సవం
పెనుగంచిప్రోలు: తిరుపతమ్మవారి చిన్న తిరునాళ్లలో మూడో రోజు ఆదివారం రాత్రి 90 అడుగుల దివ్య ప్రభోత్సవం కమనీయంగా జరిగింది. దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తయిన ప్రభగా గుర్తింపు పొందిన ఈ దివ్య ప్రభోత్సవం 1928 నుంచి జరుగుతున్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ముందుగా అమ్మవారికి రజకులు, శాలివాహనులు కుంభం పోసి ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం ఆలయ ఈవో బీహెచ్వీఎస్ఎన్ కిషోర్కుమార్, చైర్మన్ జంగాల శ్రీనివాసరావు, ఆలయ ఈఈ ఎల్ రమ ఆధ్వర్యంలో రంగురంగుల విద్యుత్ దీపాలంకరణతో అలంకరించిన ఇనుప ప్రభపై ఉత్సవ విగ్రహాలను ఉంచి దేవస్థానం వారు గ్రామానికి చెందిన రైతుల ఎడ్లను కట్టి రథాన్ని గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించారు. ప్రభ ముందు డప్పు వాయిద్యాలు, కొమ్ము వాయిద్యాలు, నృత్యాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నందిగామ ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట సీఐ పి. వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఎస్ఐ అర్జున్ పోలీసు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె. బాలకృష్ణ, ఆలయ ఏఈఓలు ఉమాపతి, తిరుమలేశ్వరరావు, ఏఈ రాజు ఆలయ పాలకరవ్గ సభ్యులు, గ్రామపెద్దలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మూడో రోజు కొనసాగిన తిరుపతమ్మ చిన్న తిరునాళ్ల -
నిర్మూలనపై సమీక్ష..
నాటుసారా నిర్మూలనపై సాక్షి ప్రచురించిన వరుస కథనాలతో ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్దేవ్ శర్మ స్పందించారు. తిరువూరు ఎకై ్సజ్శాఖ పోలీసుస్టేషన్ను శనివారం తనిఖీ చేశారు. ఇప్పటి వరకు నమోదైన కేసులు, నిందితుల వివరాలకు సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎకై ్సజ్ శాఖ జిల్లా అధికారి ఎస్. శ్రీనివాసరావు, రాష్ట్ర టాస్క్ఫోర్స్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మధుబాబు, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రాంశివ, తిరువూరు ఎకై ్సజ్ సీఐ జె. శ్రీనివాస్తో సమీక్ష జరిపారు. నాటుసారా నియంత్రణలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని హెచ్చరించినట్లు సమాచారం. పదేపదే పోలీసులకు చిక్కుతున్న నిందితులపై పీడీ యాక్టును ప్రయోగించాలని సూచించినట్లు తెలిసింది. ఈ యాక్టులో కేసు నమోదై రుజువైతే ఒకటి నుంచి రెండు సంవత్సరాలపాటు నిందితులు జైలుపాలవుతారు. -
దుర్గమ్మ సన్నిధిలో ప్రముఖులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హీరో నితిన్, రాబిన్ హుడ్ దర్శకుడు వెంకి, నిర్మాత రవిశంకర్లతో పాటు సంగీత దర్శకుడు తమన్ వేర్వేరుగా అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. హీరో నితిన్ తన నూతన చిత్రం విజయవంతం కావాలని అమ్మవారిని వేడుకున్నానని పేర్కొన్నారు. ● దుర్గమ్మను రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, హడ్కో అధికార బృంద సభ్యులు ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన మంత్రి నారాయణ, హడ్కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) సంజయ్ కులశ్రేష్ఠ, కార్పొరేట్ ప్లానింగ్ డైరెక్టర్ ఎం.నాగరాజు, ఫైనాన్స్ డైరెక్టర్ దిల్జిత్సింగ్ కఠారి, ఏపీ రీజనల్ చీఫ్ బి.ఎన్.ఎ.మూర్తి, ఎస్.ఎం.శ్రీనివాస్, టి.సుబ్బారావుతో కూడిన బృందానికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. -
పంచాయతీకో మోడల్ ప్రైమరీ స్కూల్ కావాలి
కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. విజయవాడ గవర్నర్పేటలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో యూటీఎఫ్ ఆధ్వర్యాన సంఘ రాష్ట్ర ఆడిట్ కన్వీనర్ టి.ఎస్.మల్లేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం విద్యారంగ – ఆర్థిక సమస్యల సాధనకు రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథి లక్ష్మణరావు మాట్లా డుతూ.. రాష్ట్రంలోని 13,325 గ్రామ పంచాయతీల్లో మోడల్ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని పంచాయతీల్లో సాధ్యం కాకపోతే విడుతల వారీగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఐదు తరగతులకు ఐదుగురు టీచర్లతో పాటు ఐదు తరగతి గదులు, అన్ని సౌకర్యాలు ఉండే విశాలమైన పాఠశాలగా తీర్చిదిద్దాలన్నారు. అందుకు బడ్జెట్ కేటాయించాలన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలో 60 మంది పైగా విద్యార్థులు ఉంటే హైస్కూల్గా అప్గ్రేడ్ చేయాలని, లేకపోతే యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రజలు ప్రభుత్వ పాఠశాలల వైపు చూసే విధంగా తీర్చిదిద్దాలన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. విద్యారంగంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంస్కరణలు, దాని ఫలితాలు, భవిష్యత్లో ఏర్పడబోయే సమస్యలు, ఎలా పరిష్కరించాలి అనే అంశాలపై రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. మొదటి సదస్సును విజయవాడలో నిర్వహించామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్.ప్రసాద్, సహాధ్యక్షులు కుసుమకుమారి, లక్ష్మీరాజా, సుభాషిణి, శ్రీలక్ష్మి, ఉమామమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
వట్టిపోయిన మున్నేరు
కంచికచర్ల: నాడు నిండుకుండలా జలకళతో కనపడిన మున్నేరు నేడు నీటిచుక్కలేక వట్టి పోయింది. మున్నేరులో జల లేక తాగునీరు, సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రబీ సీజన్లో రైతులకు సాగునీరు అందక పంటలన్నీ ఎండిపోతున్నాయి. పూర్తి వేసవి రాక ముందే గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. కంచికచర్ల మండలం మున్నేరు ఉపనది నుంచి మున్సిపాలిటీ అయిన నందిగామ, మండల కేంద్రం కంచికచర్ల, గండేపల్లి, కీసర, పెండ్యాల, వేములపల్లి, పెండ్యాల, ఎస్.అమరవరం, మోగులూరు, పేరకలపాడు, గండేపల్లి తదితర గ్రామాలకు మున్నేరు నుంచి రక్షిత మంచినీటి పఽథకం ద్వారా తాగునీరు సరఫరా అవుతుంది. మున్నేరులో నీరు లేక రక్షిత మంచినీటి పథకానికి ఏర్పాటు చేసిన బోర్లకు నీరు అందడంలేదు. మరమ్మతులకు గురవుతున్న విద్యుత్ మోటార్లు, బోర్లు మున్నేరు ఉపనదిలో నందిగామ, కంచికచర్ల పట్టణాలతో పాటు పలు గ్రామాలకు చెందిన రక్షిత మంచినీటి పథకానికి గత ప్రభుత్వాలు బోర్లు ఏర్పాటు చేశాయి. మున్నేరులో నీరు లేక ఈ బోర్లకు నీరు అందకపోవడంతో వాటికి ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్లు మరమ్మతులకు గురవుతున్నాయని ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు అంటున్నారు. విద్యుత్ మోటార్లు కాలిపోవడం.. పంచాయతీలో నిధులు లేకపోవటంతో సకాలంలో మోటార్లను బాగు చేయటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పూర్తి వేసవి రాకముందే గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు ఆరోపిస్తున్నారు. రబీలో అందని సాగునీరు రైతులు మున్నేరు పరిసర ప్రాంతాల్లో రబీ సీజన్లో మొక్కజొన్న, మినుము, తదితర పలు రకాల పంటలను సాగుచేశారు. నీరు లేకపోవడంతో మున్నేరుపై ఉన్న ఎత్తిపోతలకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు అంటున్నారు. పశుపక్ష్యాదులు కూడా అల్లాడిపోతున్నాయి. మినరల్ వాటర్ ప్లాంట్లే దిక్కు రక్షిత మంచినీటి పథకం ద్వారా గ్రామాలకు తాగునీరు సక్రమంగా సరఫరా జరగక కొంతమంది తాగునీటిని కొనుగోలు చేసి దాహార్తిని తీర్చుకుంటున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న మినరల్ వాటర్ప్లాంట్ల నిర్వాహకులు ఒక్కో 20 లీటర్ల క్యాను రూ. 20 నుంచి రూ.30 వరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో మినరల్ వాటర్ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఎమ్మెల్యేకు చెప్పినా.. స్పందన లేదు పరిటాల గ్రామానికి తాగునీరు సక్రమంగా సరఫరా కావట్లేదని చెవిటికల్లులోని కృష్ణానది నుంచి తాగునీటి పైపులువేసి గ్రామానికి సరఫరా కావడానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు గ్రామస్తులు విన్నవించారు. పైలెట్ ప్రాజెక్టు కింద నిధులు మంజూరు చేసి గ్రామానికి తాగునీటి ఇబ్బందుల్లేకుండా చూడాలని పలుమార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని టీడీపీ నాయకులే ఆరోపిస్తున్నారు. వారానికి ఒకసారి వచ్చే తాగునీటితో కాలం వెళ్లబుచ్చుతున్నా మని చెప్పినా ఫలితం లేదని మహిళలు అంటున్నా రు. పాలకులు, అధికారులు స్పందించాల్సి ఉంది. నాడు మున్నేరుకు జలకళ నేడు చుక్క నీరు లేదు తప్పని తాగునీటి తిప్పలు పలుగ్రామాల్లో వారానికి ఒకసారి నీటి సరఫరా పట్టించుకోని పాలకులు, అధికారులు -
పొట్టి శ్రీరాములుకు నివాళి
విజయవాడస్పోర్ట్స్: ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతిని విజయవాడ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. శ్రీరాములు చిత్రపటానికి సీపీ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు విశేషంగా కృషి చేశారని, మహాత్మాగాంధీ బోధించిన సత్యం, అహింస మార్గాల్లో పయనించారన్నారు. మద్రాసు రాజధానిగా ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో తెలుగువారి కష్టాలకు చలించి భాష ప్రయుక్త రాష్ట్రం కావాలని ఉద్యమించి అమరులయ్యారని తెలిపారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తే సహించబోం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం నియమ, నిబంధనలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించే వారిని సహించేది లేదని రాష్ట్ర అధ్యక్షుడు రామస్వామి అన్నారు. అలా వ్యవహరించేవారిని సంఘం పదవుల నుంచి తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు. విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్క్లబ్లో విశ్వబ్రహ్మణ సంఘం సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ.. కొందరు సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని పేర్కొన్నారు. మాతృ సంఘాన్ని స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవాలని చూస్తున్నారని వివరించారు. అటువంటి వారందరినీ రాష్ట్ర సంఘ కార్యకలాపాల్లో పాల్గొనకుండా బహిష్కరిస్తున్నామన్నారు. సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడిగా చేవూరు రామస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఫిరంగి చంద్రశేఖర్, గౌరవ సలహాదారులు సూర్యనారాయణ, మహిళా కమిటీ అధ్యక్షురాలిగా బి.నీరజ, రాష్ట్ర మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీదేవి, గురజాడ రాజేశ్వరి, వర్కింగ్ ప్రెసిడెంట్గా విజయలక్ష్మి, లత, వరలక్ష్మిని ఎన్నుకున్నామని ఆయన తెలిపారు. -
అన్ని వర్గాలను ఆకట్టుకునే ‘రాబిన్హుడ్’
లబ్బీపేట(విజయవాడతూర్పు): కామెడీ, క్రైమ్, థ్రిల్లర్ అంశాలతో కూడిన రాబిన్హుడ్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆ చిత్ర హీరో నితిన్ అన్నారు. ఈ చిత్రంలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక పాత్రలో ప్రేక్షకులను కనువిందు చేయనున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 28న విడుదల కానున్న రాబిన్హుడ్ చిత్ర ప్రమోషన్లో భాగంగా యూనిట్ సభ్యులు ఆదివారం నగరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎంజీ రోడ్డులోని ఓ హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. నితిన్ మాట్లాడుతూ దుర్గమ్మ ఆశీస్సులతో చిత్ర ప్రమోషన్ను విజయవాడ నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో గతంలో తాను నటించిన భీష్మ చిత్రం విజయవంతమైందని, రాబిన్హుడ్ కూడా అదే రీతిలో సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ విజయవాడలో చదువుకుని దర్శకుడిగా మారినట్లు తెలిపారు. నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ నితిన్ అన్ని క్యారెక్టర్లకు సరిపోయే హీరో అన్నారు. క్రికెటర్ వార్నర్ను తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ద్వారా పరిచయం కానున్నారన్నారు. త్వరలో పుష్ప 3 చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందని, మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. చిత్ర హీరో నితిన్ -
మంచి ఉపాధి అవకాశాలు చూపే కోర్సులు, కళాశాలలే టార్గెట్
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇంటర్మీడియెట్ పరీక్షలు ముగిశాయి. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువులకు ఎక్కడ చేర్పిస్తే బాగుంటుంది? ఏది చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది? ఏ కోర్సు చేస్తే ఉపాధి అవకాశాలు మెండుగా వస్తాయి? అనే అంశాలపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఇంటర్మీడియెట్లో ఎంపీసీ గ్రూప్ చేసిన విద్యార్థుల తల్లిదండ్రులంతా దాదాపు ఇదే ఆలోచనల్లో మునిగి తేలుతున్నారు. ఇప్పటికే పలువురు విజయవాడకు సమీపంలో ఉన్న ప్రైవేటు విశ్వ విద్యాలయాలను సందర్శించడంతో పాటు, ఆయా యూనివర్సిటీలు అడ్మిషన్స్ కోసం నిర్వహించే పరీక్షల వివరాలు, ఫీజుల వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. ప్లేస్మెంట్స్కే ప్రాధాన్యం.. ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగం మందకొడిగా నడుస్తోంది. అధిక నైపుణ్యం ఉన్న విద్యార్థులే ప్లేస్మెంట్స్ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మంచి ఆఫర్లు ఏ కళాశాల, యూనివర్సిటీల్లో ఎక్కువ వస్తున్నాయో తల్లిదండ్రులు ఆరా తీస్తున్నారు. అంతేకాక ఇంజినీరింగ్, డిగ్రీలో ఏ కోర్సులు చేసిన వారికి ప్లేస్మెంట్స్ వస్తున్నాయో కూడా తెలుసుకుంటున్నారు. తల్లిదండ్రుల ఆలోచనలకు అనుగుణంగానే ప్రైవేటు విశ్వ విద్యాలయాలు, కళాశాలలు తమ వద్ద చేరితే వంద శాతం ప్లేస్మెంట్స్ వస్తాయి.. ఈ విద్యా సంవత్సరంలో ఇంత మంది ప్లేస్మెంట్ పొందారంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రాల వద్ద సైతం అదే తరహా కరపత్రాలను యూనివర్సిటీ, కళాశాలల యాజమాన్యాలు పంపిణీ చేశారు. డిగ్రీకి పెరిగిన క్రేజ్.. ప్రస్తుతం డిగ్రీలోని పలు కోర్సులకు క్రేజ్ పెరిగింది. వాటిలో బీబీఏతో పాటు, బీఎస్సీ కంప్యూటర్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి వాటిపై విద్యార్థులు దృష్టి పెడుతున్నారు. ఆయా కోర్సులు చేసిన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తుండటంతో డిగ్రీ కాలేజీల్లో ఆ కోర్సుల్లో చేరేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. వాటితో పాటు సివిల్స్, గ్రూప్–1, గ్రూప్–2 వంటి ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టి పెట్టిన వారు బీఏలో చేరుతున్నారు. ఇప్పుడు డిగ్రీతో పాటు, సివిల్స్, గ్రూప్స్లో శిక్షణ ఇచ్చే కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో బీఏలో చేరే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ముగిసిన ఇంటర్మీడియెట్ పరీక్షలు విద్యార్థుల ఉన్నత చదువులపై దృష్టిసారిస్తున్న తల్లిదండ్రులు డిగ్రీ, ఇంజినీరింగ్ కోర్సుల్లో అవకాశాలు వేటిలో ఎక్కువుంటాయంటూ ఆరా ప్రైవేటు యూనివర్సిటీలు, కళాశాలల వివరాలు తెలుసుకుంటున్న వైనం పేరెంట్స్కు ఫోన్లు చేస్తున్న ప్రైవేటు కళాశాలల పీఆర్ఓలు -
మర్యాదపూర్వక కలయిక
కోనేరుసెంటర్: కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.రాంజీ ఆదివారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. అమరావతిలో కేంద్ర మంత్రిని కలిసిన ఆయన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కృష్ణా విశ్వవిద్యాలయంలో అంతర్గత రహదారులు, ఇతర అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు. అనంతరం యూనివర్సిటీ ప్రాంగణంలో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులను ఆయనకు వివరించారు. తొలుత కేంద్ర మంత్రి పెమ్మసానిని వీసీ శాలువా కప్పి సత్కరించి మొక్కను బహూకరించారు. మదర్స్ మిల్క్ బ్యాంక్ ప్రారంభం లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోనే తొలిసారిగా విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్లో మదర్స్ మిల్క్ బ్యాంకు ఏర్పాటు చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ మిల్క్ బ్యాంకును ఆదివారం సినీ హీరో మహేష్బాబు సతీమణి నమ్రత లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం నమ్రత మీడియాతో మాట్లాడుతూ.. నవజాత శిశువుల కోసం మదర్స్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గుండె జబ్బులున్న చిన్నారులకు సేవా భావంతో సర్జరీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సేవా కార్యక్రమాల్లో తమ భాగస్వామ్యం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆస్పత్రి పిడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పి.వి.రామారావు మాట్లాడుతూ.. మదర్స్ మిల్క్ బ్యాంకు ద్వారా ఏటా సుమారు 7200 మంది నవజాత శిశువులు లబ్ధిపొందే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ పి.వి.రమణమూర్తి, ఫీటల్ స్పెషలిస్టు డాక్టర్ పద్మ, రోటరీ ప్రతినిధి డాక్టర్ కామినేని పట్టాభిరామయ్య పాల్గొన్నారు. -
కృష్ణానదిలో యువకుడి మృతదేహం లభ్యం
ఇబ్రహీంపట్నం: కృష్ణా నదిలో గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని ఫెర్రీ స్నాన ఘాట్ వద్ద ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని వయసు సుమారు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటాయని, ఎత్తు 5.7 అడుగులు ఉన్నట్లు గుర్తించారు. వంకాయ కలర్ టీషర్ట్, బ్లాక్ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. జేబులో ఇంటితాళాలు, రెండు చెవులకు పోగులు కలిగి ఉన్నాడు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 94406 27084, 90591 21109 నంబర్లకు సమాచారం అందివ్వాలని గుంటుపల్లి సెక్టార్ ఎస్ఐ విజయలక్ష్మి అన్నారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. -
అమరజీవి త్యాగం.. చిరస్మరణీయం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కోరుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం చాలా గొప్పదని, ఆయన చేసిన త్యాగం చిరస్మరణీయమని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష చేసి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాముల త్యాగనిరతిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ప్రేమ, నిస్వార్థంతో కూడిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులు, యువత గొప్ప వ్యక్తుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత స్థానాలకు చేరేందుకు కృషిచేయాలని సూచించారు. చిన్న తిరుపతికి కూరగాయల వితరణ గన్నవరం: ద్వారకాతిరుమలలోని శ్రీవారి సన్నిధిలో జరిగే నిత్య అన్నసమారాధనకు గన్నవరం గ్రామస్తులు 3,500 కిలోల కూరగాయలను వితరణగా అందజేశారు. ఈ మేరకు ఆదివారం స్థానిక శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం వద్ద కూరగాయల లోడ్తో వెళ్తున్న వ్యాన్ను పుర ప్రముఖులు నెక్కలపూడి ఈశ్వరరావు, మండల వెంకటప్రభాకరరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మండవ మాట్లాడుతూ గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి 11 టన్నులు, శ్రీశైలం ఆలయానికి 4 టన్నులు కూరగాయలను గన్నవరం నుంచి పంపించినట్లు తెలిపారు. తొలిసారిగా చిన్నతిరుపతికి కూడా కూరగాయలను అందజేసినట్లు చెప్పారు. స్వచ్ఛందంగా ముందుకువచ్చి కూరగాయలను వితరణగా అందజేసిన భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. పుర ప్రముఖులు తుమ్మల మురళీకృష్ణ, కాసన్నేని బాబురావు, కొణసాని నాగేశ్వరరావు, కాసన్నేని శ్రీనివాసరావు, చిలకపాటి సీతారామయ్య, తుమ్మల జితేంద్ర, ఆలయ ఈఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా కలెక్టర్కు అభినందన సర్టిఫికెట్ చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టర్ డీకే బాలాజీకి అభినందన సర్టిఫికెట్ మచిలీపట్నం యోగా గురువు గురునాథబాబు, ఆల్ ఇండి యా యోగా ప్రిన్సిపాల్ డాక్టర్ దమయంతి శర్మ అందజేశారు. ఆదివారం కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా పరిషత్ కల్యాణమండపంలో 150 మంది యోగా సభ్యులతో కలిసి 108 రౌండ్ల సూర్య నమస్కారాలు చేశారు. ఈ నమస్కారాలు చేసినందుకు యోగా గురువులు, ప్రిన్సిపాల్ ఆయనకు అభినందన సర్టిఫికెట్ను అందజేశారు. కార్యక్రమంలో యోగా గురువులు పాల్గొన్నారు. ముగిసిన జూడో రాష్ట్ర క్రీడా పోటీలు విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి జూడో జూనియర్ బాల, బాలికల క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో రెండు రోజుల పాటు ఈ పోటీలు హోరాహోరీగా సాగాయి. పోటీల అనంతరం ఈ నెల 28 నుంచి డెహ్రాడూన్లో జరిగే జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టులో విజయవాడకు చెందిన పి.ప్రవళ్లిక, ఎం.కీర్తన, బి.భావన, ఆర్.కోటేశ్వరి, జి.గగన్సాయి చోటు దక్కించుకున్నారు. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, జూడో రాష్ట్ర సంఘం సీఈవో వెంకట్ నామిశెట్టి, అధ్యక్షులు గణేష్ సుబ్బారావు, కార్యదర్శి ఎన్.పవన్సందీప్, ప్రతినిధులు విజేతలకు మెడల్స్ అందజేశారు. -
తిప్పలు పడుతున్నాం
గ్రామంలో తాగునీరు వారానికి ఒకసారి వస్తుంది. అరకొరగానే కుళాయిల నుంచి వస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో నివసించే వారికి ప్రధాన పైపుల ద్వారా తాగునీరు సరఫరా కావట్లేదు. అధికారులు ట్రాక్టర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయడం లేదు. దీంతో తిప్పలు పడుతున్నాం. మేజర్ గ్రామమైనా తాగునీటి కష్టాలు తప్పడం లేదు. –కంచర్ల పద్మావతి, బీసీ కాలనీ, పరిటాలతాగునీటిని కొనుగోలు చేస్తున్నాం కాలనీకి వారానికి ఒకసారి కూడా తాగునీరు రావడం లేదు. మినరల్ వాటర్ ప్లాంట్ల వద్దకు వెళ్లి తాగునీటిని కొనుగోలు చేసి దాహార్తిని తీర్చుకుంటున్నాం. నీటి సరఫరాపై అనేకసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకునేవారే లేరు. –బొక్కా కుమారి, అరుంధతీ నగర్, కంచికచర్ల ● -
వైభవంగా నృసింహుని పుష్పయాగోత్సవం
మంగళగిరి: మంగళాద్రిలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం పుష్పయాగోత్సవం వైభవంగా నిర్వహించారు. 11 రోజుల నుంచి జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారికి వివిధ రకాల పుష్పాలతో యాగోత్సవం చేశారు. ఆలయ ఆస్థాన మండపంలో జరిగిన ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని పుష్ప సేవ చేశారు. ఉత్సవానికి కై ంకర్యపరులుగా నందం సాంబశివరావు, శాంతికుమారి వ్యవహరించగా ఆలయ ఈవో ఎ.రామకోటిరెడ్డి పర్యవేక్షించారు. -
సౌకర్యాల ఏర్పాటుకు ప్రాధాన్యం
పెనుగంచిప్రోలు: అమ్మవారి భక్తులకు సదుపాయాలు కల్పించడానికి ఆలయ అధికారులు ప్రాధాన్యమివ్వాలని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ సూచించారు. పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ ఆలయ అభివృద్ధికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన రూ.4.75కోట్లతో నిర్మించిన కేశఖండనశాల, టాయిలెట్ బ్లాక్తోపాటు హైదరాబాద్కు చెందిన చిన్నం యాగయ్య జ్ఞాపకార్థం ఆయన సతీమణి కృష్ణవేణి కుటుంబ సభ్యులు రూ.కోటితో నిర్మించిన డార్మెటరీని ఆదివారం ఆయన ప్రారంభించారు. మున్నేరు పక్కన కరకట్ట నిర్మాణానికి సంబంధించి ఆలయ అధికారులు, గ్రామపెద్దలతో సమీక్షించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. డార్మెటరీని నిర్మించిన దాతలు కృష్ణవేణి కుటుంబసభ్యులను అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలతో సత్కరించారు. కార్యక్రమంలో చైర్మన్ జంగాల శ్రీనివాసరావు, ఆలయ ఈవో కిషోర్కుమార్, సర్పంచ్ వేల్పుల పద్మకుమారి, ఈఈ ఎల్.రమ, ఏఈవో ఉమాపతి, ఏఈ రాజు, నాయకులు చింతల సీతారామయ్య, కొత్తపల్లి సతీష్, ఆలయ మాజీ చైర్మన్లు కాకాని శ్రీనివాసరావు, కర్ల వెంకటనారాయణ, కల్లూరి శ్రీవాణి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
అలరించిన భక్తప్రహ్లాద నాటక ప్రదర్శన
విజయవాడ కల్చరల్: ఏపీ సాంస్కృతిక శాఖ, సృజనాత్మక సమితి, దక్షిణమండల సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యాన 6 రోజులపాటు నిర్వహించే సురభి నాటకోత్సవాలు దుర్గాపురంలోని సంగీత కళాశాలలో శనివారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు శ్రీ వెంకటేశ్వర సురభి థియేటర్, విజయ భారతి నాట్యమండలి ఆధ్వర్యాన సురభి జయచంద్రవర్మ పర్యవేక్షణలో భక్తప్రహ్లాద నాటకాన్ని రసరమ్యంగా ప్రదర్శించారు. ఒకే కుటుంబానికి చెందిన 50 మంది చిన్నా పెద్దా కళాకారులు పాల్గొనడం విశేషం. తొలుత నాటకోత్సవాలను గ్రీవెన్స్ అధికారి చిన్నారావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సురభి నాటకాలకు 140 సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. భాషా సాంస్కృతిక శాఖ ఉప సంచాలకుడు పెంచలయ్య సురభి నాటకంపై మాట్లాడారు. నర్తనం ప్రధాన సంపాదకురాలు మాధవి పురాణం సురభి నాటక ప్రస్తానం అంశంగా ప్రసంగించారు. కార్యక్రమాన్ని అంతర్జాతీయ నాట్యాచారిణి స్వర్ణలత నిర్వహించారు. -
వినియోగదారులు హక్కులను పరిరక్షించుకోవాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వినియోగ దారులు హక్కులపై తప్పనిసరిగా అవగాహన పెంపొందించుకుని పరిరక్షించుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. తొలుత కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పౌర సరఫరాల శాఖ దీపం 2 పథకం, ఆహార భద్రత ప్రమాణాలు, తూనికలు– కొలతల శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ సందర్శించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు చేసిన వస్తువు నాణ్యత, పరిమాణం, ధర ప్రమాణాలకు సంబంధించి తగిన సమాచారాన్ని కలిగి ఉండడమే కాక ఏదైనా దుష్ప్రవర్తనకు వ్యతిరేకంగా రక్షించే హక్కు వినియోగదారు హక్కు అని వివరించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ వినియోగదారులేనని, నిత్య జీవితంలో రోజూ ఏదో ఒక వస్తువును కొనుగోలు చేస్తుంటారన్నారు. ప్రజలు మోసానికి గురైతే పోనీలే అనే నిర్లిప్త ధోరణిని వీడి వినియోగ దారుల హక్కులను కాపాడుకోవాలన్నారు. ఈ ఏడాది సుస్థిర జీవనశైలికి మార్పు ఇతివృత్తంతో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని జరుపుకొంటున్నామని వివరించారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణలో స్వచ్ఛంద సంస్థలు కీలక భాగస్వాములవుతున్నాయని తెలిపారు. అధికారులు కూడా ఫిర్యాదు వచ్చినప్పుడు మాత్రమే కాకుండా అప్రమత్తతతో వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కృషిచేయాలన్నారు. మారుతున్న అవసరాలు, మార్కెట్ ధోరణులు, సాంకేతికత అనుసంధాన ఈ–కామర్స్, ఆన్లైన్ లావాదేవీలకు అనుగుణంగా వినియోగదారుల రక్షణ చట్టాలు అమలవుతున్నాయని జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యులు శశికళ వివరించారు. యూఎన్వో మార్గదర్శకాలు తదనంతరం చట్టాల రూపకల్పన, 1986 నాటి చట్టం, 2019 చట్టంలోని ముఖ్యాంశాలు తదితరాలను వివరించారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం, డీఎస్వో ఎ.పాపారావు, లీగల్ మెట్రాలజీ అధికారి ఎ.కృష్ణచైతన్య, ఫుడ్ ఇన్స్పెక్టర్ రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు.ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
పీఎస్కు వాహనం బహూకరణ
నాగాయలంక: ప్రకృతి విపత్తులకు గురవుతున్న తీరప్రాంతమైన మండలంలో శాంతి భద్రతలు, ప్రజా సంరక్షణ సులభతరం కావడానికి నాగాయలంక పోలీస్స్టేషన్కు లిఖిత ఇన్ఫ్రాస్టక్చర్ ప్రై.లిమిటెడ్ అధినేత గడ్డపాటి శ్రీనివాసరావు రూ.13 లక్షల విలువైన వాహనం బహూకరించారు. తమ కంపెనీ సీఎస్ఆర్ నిధులతో ఈ వాహనాన్ని సమకూర్చారు. దాత శ్రీనివాసరావుకు ఎస్పీ గంగాధరరావు జిల్లా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో దాత గడ్డిపాటి శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు. వాహనానికి ఎస్పీ, దాత జెండా ఊపి నాగాయలంక పంపించారు. స్థానిక స్టేషన్కు ఆధునిక వాహనం అందజేసిన శ్రీనివాసరావును కలిదిండి ఎస్ఐ రాజేష్, సిబ్బంది, గ్రామ ప్రముఖులు, ప్రజలు అభినందించారు. 18న జాబ్మేళా గన్నవరం/చిలకలపూడి(మచిలీపట్నం): స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 18వ తేదీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, శిక్షణ సంస్థ ఆధ్వర్యాన జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి దేవరపల్లి విక్టర్బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి.నరేష్కుమార్ శనివారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. దీనిలో బజాజ్ క్యాపిటల్, ఫ్లిప్కార్డ్, శ్రీరామసాయి ఆఫీస్ సొల్యూషన్స్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. టెన్త్, డిప్లమో, ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన 18 నుంచి 30 ఏళ్లలోపు వారు జాబ్మేళాకు అర్హులని తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు ఆసక్తికరమైన వేతనం, ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నైపుణ్యాభివృద్ధి వెబ్సైట్లో రిజిస్టర్ కావడం, బయోడేటా ఫాంతో పాటు పాన్కార్డ్, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో మంగళవారం హాజరుకావాలని సూచించారు. ఇతర సమాచారానికి 94940 05725 నంబర్లో సంప్రదించాలని సూచించారు. సొరంగం లీకేజీలకు మరమ్మతులు చిట్టినగర్(విజయవాడపశ్చిమ): విజయవాడలోని చిట్టినగర్ సొరంగంలో లీకేజీలకు మరమ్మతులు చేపట్టారు. సొరంగంలో లీకవుతున్న నీటిధారలు వాహనచోదకులు, పాదచారులపై పడుతున్నాయి. దీనికోసం కొద్ది రోజుల క్రితం నీటిధారలు పడుతున్న ప్రాంతంలో గడ్డర్లు ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం వాటి వద్ద మరమ్మతులు చేపట్టారు. దీంతో సాయంత్రం 6 గంటల నుంచి సొరంగం మీదగా రాకపోకలను నిలిపివేశారు. కాలేజీలు, ట్యూషన్ల నుంచి వచ్చే వారు కబేళా, పాలప్రాజెక్టు మీదగా తిరిగి రావాల్సి వచ్చింది. పాదచారులు, సైకిల్పై వచ్చే వారిని మాత్రం సొరంగం లోపల నుంచి అనుమతించారు. కార్పొరేషన్ అధికారులు ముందస్తుగా ఎటువంటి సూచనలు లేకుండా రాకపోకలు నిలిపివేయడంపై వాహనచోదకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఉదయానికి మరమ్మతులు పూర్తవుతాయని కార్పొరేషన్ సిబ్బంది పేర్కొంటున్నారు. సారా కట్టడికి కఠిన చర్యలు తిరువూరు: కాపు సారా నిర్మూలనకు మరింత కఠినంగా వ్యవహరించాలని ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్దేవ్ శర్మ తిరువూరు ఎకై ్సజ్ అధికారుల్ని ఆదేశించారు. శనివారం తిరువూరు ఎకై ్సజ్ స్టేషన్ను తనిఖీ చేసిన ఆయన అధికారులకు, సిబ్బందికి పలు సూచనలిచ్చారు. నవోదయం అమలు, సారా నిర్మూలన విషయంలో అలసత్వం వద్దని సూచించారు. పదే పదే నేరాలు చేసే నిందితులపై పీడీ చట్టం నమోదు చేయాలని శర్మ తెలిపారు. అనంతరం వేమిరెడ్డిపల్లి తండాలో జరిగిన నవోదయంలో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఎకై ్సజ్ అధికారి ఎస్.శ్రీనివాసరావు, రాష్ట్ర టాస్క్ఫోర్స్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మధుబాబు, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రాంశివ, తిరువూరు ఎౖక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ప్రజాప్రతినిధులకు సమాచారమివ్వండి
చిలకలపూడి(మచిలీపట్నం): ఉమ్మడి కృష్ణా జిల్లాలో అధికారులు క్షేత్రస్థాయిలో కార్యక్రమం చేసేటప్పుడు ప్రజాప్రతినిధులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ హాల్లో శనివారం స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు. తొలుత స్వచ్ఛాంధ్రలో భాగంగా సభ్యులు, అధికారులతో ఆమె ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జరిగిన గ్రామీణాభివృద్ధి స్థాయి సంఘ సమావేశంలో ఉపాధి కల్పన అధికారి విక్టర్బాబు నిరుద్యోగులకు జాబ్మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. జాబ్మేళాలపై తమకు సమాచారమిస్తే గ్రామాల్లో తెలియజేస్తామని, చెప్పకుండా నిర్వహిస్తే ఎలా అని జెడ్పీటీసీ సభ్యులు వాపోయారు. దీనిపై చైర్పర్సన్ స్పందిస్తూ జాబ్మేళా నిర్వహించేటప్పుడు మైక్ ఎనౌన్స్మెంట్, టాంటాం ద్వారా తెలియజేయాలన్నారు. ఎంపీడీవోలకు కూడా సమాచారమివ్వాలన్నారు. పదిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా చూడండి విద్య, వైద్య స్థాయి సంఘ సమావేశంలో చైర్పర్సన్ హారిక మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి జరగనున్న ‘పది’ పరీక్షల్లో జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించేలా చూడాలన్నారు. స్ఫూర్తి మెటీరియల్, పౌష్టికాహారంతో విద్యార్థులు బాగా చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధించేలా చూడాలని అప్పుడే తాము కేటాయించిన నిధులకు సార్ధకత చేకూరుతుందన్నారు. వైస్చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు మాట్లాడుతూ నూజివీడు మండలంలో మూగ, చెవుడు, అంగవైకల్యం కలిగిన విద్యార్థులు సుమారు 50 మంది వరకు ఉన్నారని వీరికి ప్రత్యేక ఉపాధ్యాయులను కేటాయింలన్నారు. చైర్పర్సన్ స్పందిస్తూ రాబోయే విద్యాసంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేసి సబ్జెక్టు ఉపాధ్యాయులు ఉండేలా సర్దుబాటు చేయాలన్నారు. పిల్లలను పాఠశాలలకు పంపడానికి సమ్మర్లో క్యాంపెయిన్ నిర్వహించాలన్నారు. నష్టపరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకోండి కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయని అందుకు పశుసంవర్ధక శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారని చైర్పర్సన్ అడిగారు. పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారి చిన నరసింహులు మాట్లాడుతూ బర్డ్ఫ్లూ వ్యాధి సోకిన ప్రాంతాల్లో పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. కొన్నిప్రాంతాల్లో బొబ్బలు వచ్చి దూడలు చనిపోతున్నాయని పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేయించి కాపాడాలని సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. పీఎం సూర్యఘర్ ద్వారా సౌర ఫలకాల ఏర్పాటుకు అవగాహన కల్పించాలన్నారు. మత్స్యకార భరోసా కింద వేట నిషేధ భృతిని అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. చేనేత కార్మికులకు ష్యూరిటీ లేకుండా ముద్ర రుణాలు అందేలా బ్యాంకు అధికారులతో మాట్లాడాలన్నారు. గూడూరు జెడ్పీటీసీ సభ్యుడు వేముల సురేష్ మాట్లాడుతూ గూడూరు సీహెచ్సీలో గతంలో ఓపీ 200 పైగా ఉండేదని ప్రస్తుతం 50 మంది కూడా రావడం లేదన్నారు. ఎక్స్రే తీయడానికి సీఆర్ మిషన్ లేక వినియోగంలో లేదని దాన్ని వాడుకలోకి తీసుకురావాలని కోరారు. అనంతరం సీ్త్ర, శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం, పనులు, ఆర్థిక స్థాయీ సంఘ సమావేశాల్లో పలు అంశాలను సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, డెప్యూటీ సీఈవో ఆర్సీ ఆనందకుమార్, జెడ్పీటీసీ సభ్యులు ఊట్ల నాగమణి, కూనపరెడ్డి స్వరూపరాణి, భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి, సీహెచ్ అనూష, సువర్ణరాజు పాల్గొన్నారు. బడి ఈడు పిల్లలను పాఠశాలలో చేర్చేందుకు సమ్మర్లో క్యాంపెయిన్ నిర్వహించాలి చేనేత కార్మికులకు రుణాలపై బ్యాంకర్లతో మాట్లాడండి స్థాయీ సంఘ సమావేశాల్లో జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక -
యువగళం హామీలు అమలు చేయాలని ధర్నా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యార్థులు, యువతకు యువగళం పాదయాత్ర సందర్భంగా మంత్రి లోకేష్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని లెనిన్ సెంటర్ వద్ద ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ శనివారం ధర్నా జరిగింది. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీఓ 77 రద్దు, పీజీ కామన్ ఎంట్రెన్స్ పరీక్షను పాత పద్ధతుల్లో నిర్వహించాలని, వెటర్నరీ విద్యార్థుల స్టైపెండ్ రూ.25 వేలకు పెంచాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే 107, 108 జీఓలను రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. ఈ ధర్నాను ఉద్దే శించి శివారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని దుయ్యబట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. పీజీ కామన్ ఎంట్రన్స్ పరీక్షలు రద్దు చేసి, ఆయా యూనివర్సిటీలు సొంతగా ప్రవేశ పరీక్షలు నిర్వహించే వెసులుబాటు కల్పించాలని కోరారు. రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వలరాజు, బందెల నాసర్ జీ మాట్లాడుతూ.. పశువైద్య విద్యార్థుల డిమాండ్లు పరిష్కరించాలన్నారు. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరెర్స్ కుళ్లాయిస్వామి, సాయికుమార్, చలపతి, నాగభూషణం, ఫణీంద్ర, షాబీర్ బాషా, నవ్య శ్రీ, రాష్ట్ర సమితి సభ్యులు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాఆదివారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2025 ఇఫ్తార్ సహరి (ఆది) (సోమ) విజయవాడ 6.23 4.56 మచిలీపట్నం 6.22 4.55కంకిపాడు: పసుపును బంగారంతో పోలుస్తారు. పసిడి ధర మాత్రం ఆకాశాన్నంటుతుంటే పచ్చబంగారం మాత్రం నేలచూపులు చూస్తోంది. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా గిట్టుబాటు ధర లేక ఆరుగాలం శ్రమించి పంటను కాపాడుకున్న రైతు ఆందోళన చెందుతున్నాడు. నాణ్యమైన దిగుబడులకు మంచి ధర వస్తుందనే ఆశతో అన్నదాతలు సాగు పనుల్లో నిమగ్నమవుతున్నారు. పచ్చబంగారంగా పిలిచే పసుపు పంట ప్రధాన వాణిజ్య పంటల్లో ఒకటి. ఈ ఏడాది కృష్ణా జిల్లా వ్యాప్తంగా 5,031 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లాలోని 707 ఎకరాల్లో పసుపు సాగు జరిగింది. కడప, మైదుకూరు, ప్రగతి, శీలం, స్థానిక విత్తన రకాలను రైతులు సాగుకు ఎంపిక చేసుకున్నారు. పంట కాలం పూర్తికావడంతో గడిచిన 20 రోజులుగా రైతులు పసుపు ఆకుతీత, దుంప తవ్వకం పనులను చేపడుతున్నారు. ఖర్చు అధికం ఈ ఏడాది పసుపు సాగు ఖర్చులు భారీగా పెరిగాయి. ఎకరాకు ఆరు పుట్టు పసుపు విత్తనం కొనుగోలు చేసి సాగు చేసుకున్నారు. గతంలో రూ. 3,500 నుంచి రూ.4 వేలకు విత్తనం పసుపు కొమ్ములు లభించేవి. విత్తనం కొమ్ములు లభ్యత లేకపోవడంతో డిమాండ్ పెరిగింది. ఆరు పుట్టు విత్తనం కొనుగోలుకే రూ.60 వేల నుంచి రూ.65 వేలు వరకూ పెట్టుబడులు పెట్టారు. కౌలు ఒప్పందం రూ. 35 వేల నుంచి రూ.40 వేలు ఉంది. పంట సాగు, యాజమాన్యానికి మరో రూ.60 వేల వరకూ పెట్టుబడులు పెట్టారు. పంట కాలంలో కురిసిన భారీ వర్షాలు, ఏటిపాయ వెంట సాగు చేపట్టిన పసుపు పొలాలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీనికి తోడు వర్షాలకు పసుపు చేలల్లో నీరు నిలిచి దుంప కుళ్లు ఆశించింది. దీంతో పంట సంరక్షణ చర్యలకు రైతులు నానా పాట్లు పడ్డారు. ప్రస్తుతం ఆకుతీత, దుంప తవ్వకం పనులు చేపట్టేనాటికి రూ.1.50 లక్షల నుంచి రూ.1.70 లక్షల వరకూ పెట్టుబడులు పెట్టారు. దిగుబడులు ఆశాజనకమే భారీ వర్షాలు, తెగుళ్ల సమస్యతో దిగుబడులు తగ్గుతాయని రైతులు భావించారు. దుంప కుళ్లు ఆశించిన ప్రాంతాల్లో మినహా దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. ఎకరాకు పచ్చి కొమ్ములు 65నుంచి70 పుట్టు (పుట్టు 225 కిలోలు) వస్తుందంటున్నారు. వంట పూర్తి చేసి, ఎండబెట్టిన తర్వాత ఎకరాకు సుమారుగా 20 నుంచి 26 క్వింటాళ్ల వరకూ దిగుబడి చేతికందే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. ధర రోజు రోజుకీ తగ్గుముఖం పసుపు పంట ధర చూసి రైతులు నీరసించిపోతున్నారు. మార్కెట్లో రోజు రోజుకీ ధర తగ్గుముఖం పడుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది ఇదే సీజన్లో క్వింటా పసుపు కొమ్ముల ధర రూ.14,500 నుంచి రూ. 15,000 పలికింది. క్రమంగా రేటు తగ్గుతూ వచ్చింది. సిండికేట్ మాయాజాలం కారణంగా చాలా రోజులు క్వింటా ధర రూ.12 వేలు దాటని దుస్థితి. ప్రస్తుతం పంట చేతికొస్తోంది. ఈ పరిస్థితుల్లో రైతులు మార్కెట్లో గంపెడాశతో ఉన్నారు. క్వింటా రూ.13 వేలు చేరుతుందని ఆశించారు. అయితే మార్కెట్లో మాత్రం రూ.9500–రూ.9800 లోపు పలుకు తోంది. నాణ్యమైన పంట దిగుబడులు ఉన్నాయని, మార్కెట్లో మంచి ధర లభిస్తే పెట్టుబడులు పూర్తిగా చేతికొచ్చి సాగు లాభదాయకంగా ఉంటుందని రైతులు ఆశిస్తున్నారు. వంట పనులు చేసేనాటికి ధర ఆశాజనకంగా ఉండొచ్చని ఆశలు భావిస్తున్నారు.7న్యూస్రీల్ జిల్లాలో మొదలైన పసుపు దుంప తవ్వకాలు దిగుబడులు ఆశాజనకం మార్కెట్లో తగ్గుతున్న ధర రేటు పెరుగుతుందనే ఆశతో రైతులుప్రశ్నపత్రానికి క్యూఆర్ కోడ్ ఈ ఏడాది సైతం సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి పరీక్షలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ప్రశ్నపత్రానికి ఒక క్యూఆర్ కోడ్ను ఇవ్వడంతో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు చోటు ఇవ్వకుండా చర్యలు తీసుకున్నారు. నో మొబైల్ జోన్గా పరీక్ష కేంద్రాలను, 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఎంతో ఆశతో ఉన్నాం రెండెకరాల్లో పసుపు పంట సాగు చేశాను. విత్తనం ధర భారీగా పెరగడంతో పెట్టుబడులు కూడా రూ.1.60 లక్షలు ఎకరానికి అయ్యాయి. వంట పూర్తై, ఎండ బెట్టిన కొమ్ములు మార్కెట్కు వచ్చే నాటికి మరో రూ.50 వేలు దాటుతుంది. ధర క్వింటా రూ.9600 అంటున్నారు. దిగుబడి నాణ్యంగా ఉంది. ధర కూడా పెరుగుతుందనే ఆశతో ఉన్నాం. – దేవిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, రైతు, చలివేంద్రపాలెం -
వైభవంగా తిరుపతమ్మ రథోత్సవం
పెనుగంచిప్రోలు: తిరుపతమ్మ చిన్న తిరునాళ్లలో రెండో రోజు శనివారం రాత్రి గోపయ్యసమేత తిరుపతమ్మ రథోత్సవం వైభవంగా జరిగింది. తొలుత ఉత్సవమూర్తులను అలంకరించిన రథంపై ఉంచారు. రథం ముందు రజకులు, శాలివాహనులు కుంభం పోసిన అనంతరం డప్పు వాయిద్యాలు, మేళతాళాల మధ్య రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈఓ బీహెచ్వీఎస్ఎన్ కిషోర్కుమార్, చైర్మన్ జంగాల శ్రీనివాసరావు, ఈఈ ఎల్.రమ, పాలకవర్గసభ్యులు బెజవాడ శ్రీనివాసరావు, పాలాది వెంకటరమణ కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రథోత్సవం సాగింది. కార్యక్రమంలో తహసీల్దార్ ఎ.శాంతిలక్ష్మి, ఏఈవోలు ఉమాపతి, తిరుమలేశ్వరరావు, ఏఈ రాజు, చుంచు రమేష్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆదివారం రాత్రి గం.9.05 గంటలకు దివ్య ప్రభోత్సవం జరుగుతుందని ఈఓ తెలిపారు. -
స్వచ్ఛ చల్లపల్లి రాష్ట్రానికే ఆదర్శం
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ చల్లపల్లి: స్వచ్ఛ సుందర చల్లపల్లి రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తోందని, రానున్న నెల రోజుల్లో ప్లాస్టిక్ క్యారీబాగుల వాడకాన్ని పూర్తిగా తగ్గించి గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సూచించారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యాక్రమంలో భాగంగా శనివారం తెల్లవారుజామున కలెక్టర్ బాలాజీ స్థానిక అధికారులు, స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలతో కలిసి గ్రామాల్లోని వీధులను శుభ్రం చేశారు. ఎంపీడీఓ కార్యాలయం, చల్లపల్లి ప్రధాన సెంటర్, షాబుల్బజార్ వీధిలో చీపురు చేతపట్టి పరిసరాలను శుభ్రపరిచారు. ప్రజల నుంచి వేరువేరుగా సేకరిస్తున్న చెత్తను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే ఎక్కడే లేని విధంగా కొన్ని సంవత్సరాల నుంచి నిత్యం తెలవారుజామున స్వచ్ఛ కార్యకర్తలు వీధులను శుభ్రం చేస్తుండటంతో చల్లపల్లికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. దుకాణాల్లో ప్లాస్టిక్ క్యారీబ్యాగుల విక్రయాలను అరికట్టేందుకు చర్యలు చేపడతామన్నారు. వ్యాపారులు కూడా వినియోగదారులకు ప్లాస్టిక్ క్యారీబ్యాగులకు ప్రత్యామ్నాయాలను వాడాలని సూచించారు. స్వచ్ఛ సుందర చల్లపల్లిని తీర్చిదిద్దడంతో కృషి చేస్తున్న సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి, కార్యదర్శి పేర్ని మాధవేంద్రరావును అభినందించారు. స్వచ్ఛ చల్లపల్లి రథసారథులు డాక్టర్ డి.ఆర్.కె.ప్రసాద్, పద్మావతి దంపతులు, స్వచ్ఛ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎ.వి. రమణ తదితరులు పాల్గొన్నారు. -
సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్తో అనర్థాలు
భూపరిపాలన చీఫ్ కమిషనర్ జయలక్ష్మి ఇబ్రహీంపట్నం: సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్తో అనేక అనర్థాలను ఎదుర్కోవాల్సి వస్తుందని రాష్ట్ర భూపరిపాలన చీఫ్ కమిషనర్ (సీసీఎల్ఏ) జి.జయలక్ష్మి పేర్కొన్నారు. మండలంలోని జూపూడిలో శనివారం జరిగిన స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర దివస్ కార్యక్రమంలో ఎమెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ కమిషనర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ను తిరిగి వినియోగించకుండా మనం చేసే చిరు ప్రయత్నం భావి తరాల బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతుందన్నారు. వాడేసిన ప్లాస్టిక్ లోని మైక్రో ప్లాస్టిక్తో క్యాన్సర్ వంటి రోగాలు వస్తాయని హెచ్చరించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. స్వచ్ఛత ఔన్నత్యాన్ని చాటి చెప్పి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ను తిరిగి వినియోగించకుండా పెద్దఎత్తున అవగాహన ర్యాలీలు నిర్వహించాలన్నారు. ప్లాస్టిక్ నిషేధంతో ఆస్పత్రులు, పారిశ్రామిక యూనిట్లు, పాఠశాలలు, కాలేజీలు, బస్టాండ్లు, మార్కెట్ యార్డులు, ప్రభుత్వ కార్యాలయాలు ఇలా ప్రతి చోటా స్వచ్ఛతా పరిమళాలు వెల్లివిరియాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ నిషేధాన్ని ఓ ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చారు. చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాన్ని సందర్శించి వర్మీ కంపోస్టు తయారీ, విక్రయాల ప్రక్రియను పరిశీలించి మొక్కలు నాటారు. ప్లాస్టిక్ నిషేధంపై ప్రతిజ్ఞ చేయించి, ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న, సర్పంచ్ కె.దేవమాత, డీపీఓ పి.లావణ్య కుమారి, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని, తహసీల్ధార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ సునీతశర్మ, ఈఓపీఆర్డీ మనోజ్, పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ద్విచక్ర వాహనాల చోరీ కేసులో నిందితుడి అరెస్టు
సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): ఎస్ఎన్పురం పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నాలుగు వాహనాలను సీజ్ చేశారు. సీఐ లక్ష్మీనారాయణ కథనం మేరకు.. సత్యనారాయణపురంలోని పలు ప్రాంతాలలో వరుసగా ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి. ఈ చోరీలపై బాధితుల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల పుటేజీ అధారంగా చోరీలకు పాల్పడింది వించిపేటకు చెందిన గేదెల యోసోబు అలియాస్ జాన్బాబుగా గుర్తించారు. శనివారం నిందితుడిని అరెస్టు చేసి చోరీ చేసిన నాలుగు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. -
రౌడీషీటర్ దారుణ హత్య
● వెంకటేష్ను హతమార్చిన మిత్రులు ● మద్యం మత్తులో వివాదమే కారణం ఇబ్రహీంపట్నం: రౌడీషీటర్ జరబల వెంకటేష్ (42) తన స్నేహితుల చేతుల్లో దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో జరిగిన వివాదంలో మిత్రులు బండరాళ్లు, కర్రలతో వెంకటేష్పై దాడి చేశారు. ఇబ్రహీం పట్నం ఫెర్రీ లాంచీ రేవు సమీపంలో శనివారం తెల్లవారుజాము రెండు గంటల సమయంలో జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎస్ఐ విజయలక్ష్మి కథనం మేరకు.. కంచికచర్లకు చెందిన జరబల వెంకటేష్ ఐదేళ్లుగా ఇబ్రహీంపట్నం ఆర్టీసీ కాలనీలో నివసిస్తున్నాడు. టీడీపీ సానుభూతి పరుడిగా ఉండే వెంటేష్ స్థానికులతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి స్నేహితులు పెరుమాల వేణు, సీహెచ్.వీరాంజనేయులు, కొప్పనాతి వీర్రాజుతో కలసి మద్యం తాగాడు. మద్యం మత్తులో నలుగురు మధ్య తలెత్తిన గొడవ ఘర్షణకు దారితీసింది. వేణు, వీరాంజనేయులు, వీర్రాజు బండరాళ్లు, కర్రలతో దాడిచేసి వెంటేష్ను తీవ్రంగా గాయపర్చారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న వెంకటేష్ను చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి అతను మృతి చెందాడు. మృత దేహానికి పంచ నామా నిర్వహించి పోస్ట్మార్టం కోసం తరలించారు. నిందితులు వేణు, వీరాంజనేయులు, వీర్రాజును గంటల వ్యవధిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నారు. ఏడేళ్ల క్రితం అప్పటి టీడీపీ ప్రభుత్వంలో కంచికచర్లకు చెందిన యార్లగడ్డ విజయ్ హత్యకేసులో వెంకటేష్ నిందితుడు కావడంతో పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. వెంకటేష్ హత్యపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ విజయలక్ష్మి తెలిపారు. -
ముగిసిన ఇంటర్ ప్రధాన పరీక్షలు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ప్రధాన పరీక్షలు శనివారంతో ముగిశాయి. ఒకేషనల్ కోర్సులకు సంబంధించి మూడు పరీక్షలు మినహా మిగిలిన పరీక్షలన్నీ పూర్తయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలో సుమారు 103 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో సుమారు 80,272 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అందులో ఓకేషనల్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు 2,285 మంది ఉన్నారు. ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరైన వారిలో మొదటి ఏడాది విద్యార్థులు 40,008 మంది కాగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 37,979 మంది పరీక్షకు హాజరయ్యారు. ఒకేషనల్, బ్రిడ్జి కోర్సులకు సంబంధించి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు రెండు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మూడు చొప్పున పరీక్షలు జరగాల్సి ఉంది. వీటికి హాజరయ్యే వారి సంఖ్య చాలా స్వల్పంగా కొన్ని కేంద్రాల్లో మాత్రమే పరీక్షలు జరగనున్నాయి. స్వస్థలాలకు బయలుదేరుతున్న విద్యార్థులు శనివారం పరీక్ష రాసిన తరువాత పరీక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు సందడి చేశారు. పరీక్షలు పూర్తికావటంతో హాస్టళ్లను ఖాళీచేసి స్వస్థలాలకు బయలుదేరారు. ప్రధానంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో అనేక వేల మంది విద్యార్థులు హాస్టల్స్లో ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇంటర్మీడియెట్ మొదటి ఏడాది విద్యార్థులు గురువారమే తమ ఊర్లకు వెళ్లిపోయారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు శని వారం బయలుదేరారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
హనుమాన్జంక్షన్ రూరల్: చైన్నె–కోల్కతా జాతీయ రహదారిపై బాపులపాడు మండలంలో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. మండలంలోని ఎ.సీతారామపురం వద్ద హైవేపై ముందు వెళుతున్న కంటైనర్ లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో వృద్ధురాలు మృతి చెందింది. కారు డ్రైవర్ రవి అతి వేగంతో నిర్లక్ష్యంగా కారు నడపటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన పెద్దు పద్మావతి (72), ఆమె కుమారుడు వేణుమాధవ్, కోడలు తేజస్వినితో కలిసి కొవ్వూరులోని శ్రీరాజేశ్వరి అమ్మవారి దేవస్థానానికి వెళ్లి, తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం కంటైనర్ లారీ కింద ఇరుక్కుపోవటంతో డ్రైవర్ పక్క సీటులో కూర్చున్న పద్మావతి తల భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న వీరవల్లి పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. కారులో ఇరుక్కుపోయిన పద్మావతి మృతదేహాన్ని వెలికి తీశారు. స్వల్ప గాయాలతో బయట పడ్డ డ్రైవర్ రవి, వేణుగోపాల్, తేజస్వినిలను చికిత్స నిమిత్తం పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించారు. పద్మావతి మృతదేహానికి గన్నవరం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనపై వీరవల్లి ఎస్ఐ శ్రీనివాసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హోసన్నా మందిరం వద్ద... జాతీయ రహదారిపై హనుమాన్జంక్షన్ శివారులోని హోసన్నా మందిర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శేరీనరసన్నపాలెంకు చెందిన బొల్లిగర్ల నాగేశ్వరరావు (42) దుర్మరణం చెందాడు. కాలినడకన వెళుతున్న నాగేశ్వరరావును వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. హనుమాన్జంక్షన్ ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
గురుకులం వద్ద ఉద్రిక్తత
ఐఐటీ–మెడికల్ అకాడమీ వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అర్థాంతరంగా అకాడమీని తరలించడంతో తమ చదువులు ప్రశ్నార్థకం అవుతాయని, వసతులు లేక ఇబ్బందులు పడే అవకాశం ఉందంటూ నినాదాలు చేశారు. రెండో సంవత్సరం విద్య పూర్తయ్యే వరకూ మెడికల్ అకాడమీని ఇక్కడే కొనసాగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళన విషయం తెలుసుకున్న ఉమ్మడి కృష్ణాజిల్లా కోఆర్డినేటర్ ఎ.మురళీకృష్ణ, అకాడమీ డైరెక్టర్ బ్యూలాతో కలిసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపారు. కుంటముక్కల, ఇతర గురుకులాల్లో మెరుగైన విద్య అందేలా, అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఫ్యాకల్టీని కూడా పూర్తి స్థాయిలో కుంటముక్కలలో అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. అయితే అద్దె భారం అనుకోకుండా అకాడమీని కొనసాగించి తమ చదువులు, భద్రతకు భరోసా ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ విషయమై మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకెళ్తామని వివరించారు. ఇదే సమయంలో ఎస్ఎఫ్ఐ నేతలు అకాడమీకి చేరుకుని విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. సంఘం జిల్లా కార్యదర్శి ఎస్.సమరం నేతృత్వంలో అధికారులకు సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. విద్యార్థులకు అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. -
అనుమానాస్పద స్థితిలో విద్యుత్ కార్మికుడు మృతి
ఇబ్రహీంపట్నం: అనుమానాస్పద స్థితిలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఎన్టీటీపీఎస్ చన్నీటి కాలువలో పడి ఉన్న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గుంటుపల్లి విద్యుత్ సబ్ స్టేషన్లో స్విచ్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు మణికుమార్ బుధవారం నుంచి కనిపించడంలేదు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఎన్టీటీపీఎస్ కాలువలో మృతదేహం ఉన్నట్లు గుర్తించిన సంస్థ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు మణికుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
వాలీబాల్ డెప్యూటీ చీఫ్ రిఫరీగా డానియేల్
గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): గుంటుపల్లి రైల్వే వ్యాగన్ వర్క్షాపునకు చెందిన అంతర్జాతీయ వాలీబాల్ రిఫరీ ఎం.డానియేల్ నేషనల్ డెప్యూటీ చీఫ్ రిఫరీగా ఎంపికయ్యారు. న్యూఢిల్లీకి చెందిన రైల్వే ప్రమోషన్ బోర్డు సభ్యులు తనను డెప్యూటీ చీఫ్ రిఫరీగా ఎంపిక చేసిన ఉత్తర్వులను శుక్రవారం ఆయన అందుకున్నారు. రైల్వే స్పోర్ట్స్ విభాగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక వాలీబాల్ మ్యాచ్లకు రిఫరీగా ఆయన సేవలు అందించినందుకు ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా వ్యాగన్ వర్క్షాపు చీఫ్ మేనేజర్ ఎస్.శ్రీనివాస్, డెప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ ఎ.చంద్రశేఖర్, స్పోర్ట్స్ అధికారి హనుమనాయక్, పర్సనల్ అధికారి శైలా సుధాకర్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు బ్రహ్మాజీ, కార్యదర్శి దయాకర్ తదితరులు డానియేల్ను ఘనంగా సత్కరించారు. -
పౌర్ణమి వేళ.. దుర్గమ్మ సన్నిధి కిటకిట
స్వర్ణకవచంలో దర్శనమిచ్చిన దుర్గమ్మ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఫాల్గుణ పౌర్ణమి, శుక్రవారం, హోళీ సెలవు, వివాహ సుముహూర్తాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. పౌర్ణమిని పురస్కరించుకుని దుర్గమ్మ స్వర్ణకవచంతో భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ సాయంత్రం వరకు కొనసాగింది. శుక్రవారం ఒక్క రోజే సుమారు 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు పేర్కొన్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లు కిటకిటలాడాయి. అంతరాలయ దర్శనం రద్దు... శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి కనిపించింది. ఉదయం 10 గంటలకు ఘాట్రోడ్డులోని సమాచార కేంద్రం వరకు క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. మరో వైపున మహా మండపం మీదగా వచ్చే భక్తులను 5వ అంతస్తు వరకే అనుమతించారు. 10 గంటల తర్వాత భక్తుల రద్దీ మరింత పెరగడంతో రూ.500 టికెట్ల విక్రయాలను నిలిపివేసి అంతరాలయ దర్శనం రద్దు చేశారు. అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు 11–40 గంటల నుంచి 12–15 గంటల వరకు అన్ని దర్శనాలు నిలిపివేశారు. ఆ తర్వాత కూడా అంతరాలయ దర్శనం రద్దు చేసి ముఖ మండప దర్శనం కల్పించారు. సర్వ దర్శనం క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. పౌర్ణమి, శుక్రవారం నేపథ్యంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన అన్ని ఆర్జిత సేవలకు డిమాండ్ కనిపించింది. తెల్లవారుజామున అమ్మవారి ప్రధాన ఆలయంలో మూలవిరాట్ వద్ద నిర్వహించే ఖడ్గమాలార్చనలో గతంలో ఎన్నడూ లేని విధంగా 41 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీచక్ర నవార్చన, లక్ష కుంకుమార్చన, చండీహోమం, శాంతి కల్యాణంలోనూ ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. సాయంత్రం అమ్మవారి పంచ హారతుల సేవ, పల్లకీ సేవలోనూ భక్తులు విశేషంగా పాల్గొన్నారు. -
గవర్నర్ను కలిసిన కృష్ణా వర్సిటీ ఉపకులపతి రాంజీ
కోనేరుసెంటర్: రాష్ట్ర గవర్నర్, కృష్ణా విశ్వ విద్యాలయం చాన్సలర్ అబ్దుల్ నజీర్ను ఉపకులపతి ఆచార్య కె.రాంజీ శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. సదరు అంశాలకు సంబంధించిన పనులు చేపట్టడానికి ప్రభుత్వం నుంచి అనుమతి పొందారు. అనంతరం అబ్దుల్ నజీర్కు వీసీ శాలువా కప్పి సత్కరించి మొక్కను బహూకరించారు. నేడు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు శనివారం నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు శుక్రవారం తెలిపారు. జెడ్పీ సమావేశ హాల్లో ఉదయం 10 గంటలకు గ్రామీణాభివృద్ధి, 12 గంటలకు విద్య, వైద్య స్థాయీ సంఘ సమావేశాలు జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన జరుగుతాయన్నారు. 11 గంటలకు వైస్చైర్మన్ గరికిపాటి శ్రీదేవి అధ్యక్షతన వ్యవసాయ స్థాయీ సంఘ సమావేశం, మధ్యాహ్నం ఒంటి గంటకు ఉంగుటూరు జెడ్పీటీసీ సభ్యురాలు దుట్టా సీతారామలక్ష్మి అధ్యక్షతన సీ్త్ర, శిశు సంక్షేమం, 2 గంటలకు వైస్చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు అధ్యక్షతన సాంఘిక సంక్షేమ స్థాయీ సంఘ సమావేశాలు జరుగుతాయన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చైర్ పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన పనులు, ఆర్థిక సమావేశాలు నిర్వహిస్తారని సీఈవో తెలిపారు. ఉమ్మడి జిల్లా అధికారులు శాఖాపరంగా పూర్తి సమాచారంతో హాజరు కావాలని ఆయన కోరారు. కనులపండువగావేణుగోపాలుని తిరుకల్యాణం తిరువూరు: నెమలి శ్రీవేణుగోపాలస్వామి తిరుకల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి అంగరంగవైభవంగా జరిగింది. పెళ్లి కుమారుడైన వేణుగోపాలుడిని సంప్రదాయబద్ధంగా గరుడ వాహనంపై ఉంచి మేళతాళాలతో ఆలయ ప్రాంగణంలోని కల్యాణ వేదికపైకి తోడ్కొని వచ్చారు. పెళ్లి కుమార్తైలెన శ్రీదేవి, సత్యభామలను పల్లకీలో తీసుకువచ్చారు. వేలాది మంది భక్తుల సమక్షంలో స్వామివారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కల్యాణోత్సవాన్ని చూసి తరించేందుకు వచ్చిన భక్తులతో శుక్రవారం ఉదయం నుంచి ఆలయం కిటకిటలాడింది. కల్యాణోత్సవం అనంతరం గరుడవాహనంపై స్వామివారిని, దేవేరులను ఆలయ ప్రవేశం చేయించారు. భక్తుల కోలాట నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. విజయవాడ ఎంపీ చిన్ని దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. 260 మంది దంపతులు పీటలపై కూర్చున్నారు. తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఘనంగానాంచారమ్మ జాతర పెదప్రోలు(మోపిదేవి): మండలంలోని పెదప్రోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీఅద్దంకి నాంచారమ్మవారి ఆలయ వార్షిక జాతర మహోత్సవాలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. రాత్రి గుడి సంబరం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అన్నమాచార్య కీర్తనలు, కూచిపూడి–భరతనాట్యం, భక్త చింతామణి, బాల నాగమ్మ నాటకం, సినీగాయని శ్రావణ భార్గవి, రవి మెలోడిస్ ఆర్కెస్ట్రా, అఘోరా వేషాలు, తీన్మార్ వాయిద్యాలు, మిమిక్రీ షో, మ్యాజిక్ షో, మురళీ కోలాటాలు నిర్వహించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నసమారాధన నిర్వహించారు. పెద్దఎత్తున భక్తులు పాల్గొ న్నారు. ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల వెంకట్రామ్మయ్య, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గురుప్రసాద్, ఆలయ కార్యదర్శి కూరపాటి కోటేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
‘ఉపాధి’లో నాణ్యత డొల్ల
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘ఉపాధి’లో సిమెంట్ రోడ్ల నాణ్యత డొల్లగా మారింది. బరంతుగా బురద మట్టి వేసి మమ అనిపిస్తున్నారు కాంట్రాక్టర్ల ముసుగులోని కూటమి నేతలు. కాసులకు కక్కుర్తిపడి రోడ్ల నిర్మాణాన్ని నాసిరకంగా చేస్తున్నారు. పనులన్నీ నామినేషన్పైనే కూటమి నేతలకు కట్టబెట్టారు. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేశారు. కొత్తూరు తాడేపల్లి పంచాయతీలో నిర్మించిన రోడ్లను ప్రారంభించకుండానే పగుళ్లు ఏర్పడ్డాయి. రోడ్లకు బరంతుతోపాటు, రహదారి, డ్రెయినేజీకి మధ్య గ్యాప్లో గ్రావెల్ వాడాల్సి ఉన్నా చెరువులో బురద మట్టిని తెచ్చి వేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లాలో ఉపాధి హామీ పఽథకం కింద రూ.80 కోట్లతో 532 పనులు చేపట్టారు. ఇందులో భాగంగా కొత్తూరు తాడేపల్లి పంచాయతీకి రూ.1.04 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ పనులను గన్నవరం నియోజకవర్గ ప్రజా ప్రతినిధి తన ముఖ్య అనుచరుడికి అప్పజెప్పడంతో, ఆయన ఇష్టారాజ్యంగా పనులను చేశారు. రోడ్లకు బీటలు ఇందులో వేమవరం కాలనీలో నాలుగు సీసీ రోడ్లు వేశారు. రెండు సీసీ రోడ్లకు రూ.29.10 లక్షలు, రెండు సిమెంటు రోడ్లకు రూ.22.80 లక్షలతో పనులు చేశారు. కొత్తూరు ఎస్సీ కాలనీలో రూ.15 లక్షలతో పనులు పూర్తి చేశారు. ఇప్పటికే రూ.67లక్షలతో పనులు పూర్తయ్యాయి. ఇంకా రూ.34 లక్షల పనులకు సంబంధించి ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఈ సిమెంటు రోడ్లు ప్రారంభించకుండా పగుళ్లు రావడంపై ఆ గ్రామాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రావెల్ బదులుగా చెరువులో బురద వేయడంతో, రోడ్లు మరింత అధ్వానంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పనుల విషయాన్ని పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. మొత్తం మీద పల్లె పండుగలో భాగంగా చేపట్టిన సిమెంటు రోడ్లపైన విజిలెన్స్ విచారణ చేస్తే అసలు విషయాలు బయటికి వస్తాయని పలువురు పేర్కొంటున్నారు. తక్షణం ఉన్నతాధికారులు స్పందించి నాసిరకం పనులపైన విచారణ చేయాలని కోరుతున్నారు. కొత్తూరు తాడేపల్లి పంచాయతీలో రూ.1.04 కోట్లతో సిమెంటు రోడ్లకు నిధులు సీసీ రోడ్లకు గ్రావెల్కు బదులు బురద మట్టి మూడు నెలలకే పగుళ్లు -
విశాఖ స్టీల్ప్లాంట్ని పరిరక్షించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించాలని మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. విజయవాడ ధర్నా చౌక్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల అనంతరం విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మిక నాయకులకు రాతపూర్వకంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఎన్డీఏ కూటమి నేతృత్వంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ చిత్త శుద్ధిని పార్లమెంటు, అసెంబ్లీ తీర్మానం ద్వారా దేశ ప్రజానీకానికి, ప్రత్యేకంగా ఆంధ్ర ప్రజలకు విశ్వాశాన్ని కల్పించాలన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల బలిదానాలు, నాటి విద్యార్థుల ప్రాణ త్యాగాలతో వచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ను రక్షించుకోవడం ఆంధ్ర ప్రజల హక్కు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమ నాయకుడు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రామకృష్ణ, టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు మరీదు ప్రసాద్ బాబు తదితరులు ప్రసంగించారు. ఎన్టీఆర్ జిల్లా సీఐటీయూ అధ్యక్షుడు ఎ.వెంకటేశ్వరరావు, ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు సాంబశివరావు వ్యవహరించారు. సీఐటీయూ నాయకులు కమల, టీయూసీఐ నాయకురాలు ఎం.సంధ్య తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి వడ్డే డిమాండ్ -
నాగావళిలో బాలుడి దుర్మరణం
రాయగఢ: స్థానిక చెక్కాగుడ సమీపంలోని నాగావళి నదిలో మునిగి ఒక యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. మృతుడు విజయవాడలోని పాడుమెట్టలో నివసిస్తున్న పి.మురళి కుమారుడు సాయికృష్ణ(16)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పి.మురళి కుటుంబంతో సహా మొత్తం 16 మంది మజ్జిగౌరి అమ్మవారి దర్శనానికి వచ్చారు. అనంతరం చెక్కాగుడలోని రోప్వే బ్రిడ్జిని సందర్శించేందుకు వెళ్లారు. రోప్ వే బ్రిడ్జి కింద పారుతున్న నాగావళి నదిలో సాయికృష్ణ స్నానానికి దిగాడు. ఈ సందర్భంగా నది మధ్యలోకి వెళ్లి ఫొటోలు తీసుకునే ప్రయత్నం చేశాడు. దీంతో నది తీవ్రతకు అదుపు తప్పి కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ఇటువంటి తరహా ప్రమాదాలు తరచూ ఇక్కడ చోటు చేసుకుంటుండడంతో జిల్లా యంత్రాంగం రోప్ వే బ్రిడ్జిని నిషేధిస్తూ పర్యాటకులు వెళ్లకుండా ప్రవేశ ద్వారాన్ని ఇదివరకే మూసివేసింది. అయితే కొంతమంది పర్యాటకులు రోప్ వేని చూసేందుకు వెళ్లి ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జనాభా గణనలో మాల ఆది ఆంధ్రులకు అన్యాయం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎస్సీ ఉప వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ ప్రతిపాదించిన రెల్లి కులానికి ఒక శాతం, మాదిగ కులానికి ఆరున్నర శాతం, మాల కులానికి ఏడున్నర శాతం రిజర్వేషన్లను ఉప వర్గీకరించడానికి తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం నేతలు తెలిపారు. గాంధీనగర్ ప్రెస్క్లబ్లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యాన విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు నూతలపాటి జగదీష్ మాట్లాడుతూ 2024 ఆగస్టు ఒకటవ తేదీన సుప్రీంకోర్టు ఎస్సీ ఉప వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చనే హక్కును తెలియజేస్తూ వాటికి నియమ నిబంధనలు విధించిందన్నారు. కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడెన్సును పూర్తిగా పక్కకు పెట్టి, జనాభా దామాషా ప్రకారం ఉప వర్గీకరణ చేస్తామని ఒక వార్తను బయటకు విడుదల చేసిందన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అయితే తప్పనిసరిగా ఎస్సీల వెనుకబాటుతనాన్ని నిర్ధారించడానికి ఎస్సీల వాస్తవ గణాంకాలను సేకరించాలని, అందుకు ఉద్యోగాలు, సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్యాపరమైన విషయాలను పరిగణనలోకి తీసుకుని వివిధ కులాల వెనుకబాటుతనాన్ని నిర్ధారించి అప్పుడు మాత్రమే ఉప వర్గీకరణ చేయాలన్నారు. సమావేశంలో సంఘం కార్యదర్శి అంబటి అనిల్ కుమార్, అఖిలభారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవి ప్రసాద్, నాయకులు శ్యామ్ కుమార్, డాక్టర్ ముద్ద అంకయ్య, బేతాళ సుదర్శనం, సయ్యద్ భావన, పలువురు ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు. -
మా భవిష్యత్తుతో ఆటలాడొద్దు
కంకిపాడు: కోటి ఆశలతో ఐఐటీ–మెడికల్ అకాడమీలో సీటు దక్కించుకుని విద్యనభ్యసిస్తున్న తమ జీవితాలతో ఆటలాడొద్దని, ఐఐటీ–మెడికల్ అకాడమీ తరలింపుతో తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చొద్దంటూ విద్యార్థులు గళం విప్పారు. రెండో సంవత్సరం కూడా ఐఐటీ–మెడికల్ అకాడమీని కొనసాగించి తమ బంగారు భవితకు పునాదులు వేయాలని, ఆడ పిల్లల చదువులను నిర్లక్ష్యం చేయొద్దంటూ మొరపెట్టుకున్నారు. ఈడుపుగల్లు గ్రామ పరిధిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ ఐఐటీ–మెడికల్ అకాడమీ తరలింపు నేపథ్యంలో విద్యార్థులు, వారికి మద్దతుగా తల్లిదండ్రులు శుక్రవారం అకాడమీ వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి వద్ద నుంచి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ప్రదర్శనగా అకాడమీ వద్దకు చేరుకుని బైఠాయించారు. పోటీ పరీక్షలు రాసి సీటు దక్కించుకున్నామని, ఐఐటీ–మెడికల్ సీట్లు సాధించాలనే తమ లక్ష్యాన్ని నీరుగార్చొద్దంటూ నినాదాలు చేశారు. ప్రతిభ గల విద్యార్థులను కేవలం భవనం అద్దె సాకుతో నిర్లక్ష్యం పాలుచేయొద్దంటూ ఆవేదన వెలిబుచ్చారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఈ ఏడాది ఐఐటీ నోటిఫికేషన్ నిలుపుదల చేశారని, మొదటి సంవత్సరం చదివిన తమను రెండో సంవత్సరం విద్య కూడా మెడికల్ అకాడమీలోనే పూర్తి చేయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న మూడు ఐఐటీ అకాడమీల్లో బాలికలకు ప్రత్యేక అకాడమీ ఈడుపుగల్లు ఒక్కటేనని, ఆడపిల్లల చదువును నిర్లక్ష్యం చేయొద్దంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించి 2025–26 విద్యాసంవత్సరానికి అకాడమీని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈడుపుగల్లులోనే మెడికల్ అకాడమీ కొనసాగించాలి అకాడమీ వద్ద విద్యార్థులు, వారికి మద్దతుగా తల్లిదండ్రుల నిరసన -
వైభవంగా తిరుపతమ్మ చిన్నతిరునాళ్ల
పెనుగంచిప్రోలు: తిరుపతమ్మవారి చిన్న తిరునాళ్ల పౌర్ణమి శుక్రవారం ఉదయం 6.02 గంటలకు అఖండజ్యోతి స్థాపనతో వైభవంగా ప్రారంభమయ్యాయి. మహాసంప్రోక్షణ అనంతరం ఈఓ బీహెచ్వీఎస్ఎన్ కిషోర్కుమార్, చైర్మన్ జంగాల శ్రీనివాసరావు, పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో తిరునాళ్ల మొదలయ్యాయి. ఆలయ ప్రధానార్చకుడు మర్రె బోయిన గోపిబాబు, అర్చకులు పాపమాంబ వంశీకులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం జ్యోతి వెలిగించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్, సర్పంచ్ వేల్పుల పద్మకుమారి, ఆలయ ఈఈ రమ, ఏఈవో తిరుమలేశ్వరరావు, ఉమాపతి, ఏఈ రాజు, తదితరులు పాల్గొన్నారు. తెల్లవారు జాము నుంచే భక్తులు మునేరులో స్నానాలు చేసి అమ్మవారికి బోనాలు సమర్పించారు. భక్తుల కోసం దేవస్థానం వద్ద తాత్కాలికంగా పోలీస్ ఔట్పోస్టు, హెల్త్ క్యాంప్లు, పలు శాఖలకు చెందిన కార్యాలయాలను ఏర్పాటు చేశారు. విద్యుత్ దీప కాంతులతో ఆలయం మెరిసిపోతోంది. నందిగామ ఏసీపీ తిలక్ ఆధ్వర్యాన జగ్గయ్యపేట సీఐ పి.వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల సందడి చిన్న తిరునాళ్లలో మొదటి రోజు పలు జిల్లాల నుంచి వచ్చిన భక్తులు అమ్మ వారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మునేరులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కేశఖండనశాలలో భక్తులు తలనీలాలు తీయించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. మునేరులో నీరు లేక పోవడంతో ఆలయ అధికారులు తాత్కాలికంగా జల్లుస్నానాలు ఏర్పాటు చేశారు. -
రైతుకు సున్నా!
మార్కెట్లో డిమాండ్ ఉన్నా... పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పుచ్చకాయకు పెరిగిన డిమాండ్ జి.కొండూరు: వేసవి తాపాన్ని తీర్చే కాయగా పేరొందిన పుచ్చకాయకు డిమాండ్ పెరిగింది. మామిడి కాయ తర్వాత ఆ స్థాయిలో డిమాండ్ ఉన్న పుచ్చకాయ పేద, మధ్య తరగతి ప్రజలకు మరింత ప్రియంగా మారుతోంది. ఏడాది పొడవునా లభించే పుచ్చకాయ వేసవిలో మాత్రం ధరలు తగ్గి ప్రజలకు అందుబాటులో ఉండాల్సింది పోయి దిగుబడి తగ్గిపోవడంతో పాటు మరో వైపు రంజాన్ మాసం నడుస్తుండడంతో డిమాండ్ పెరిగి పుచ్చకాయ కేజీ రూ.30కి చేరుకుంది. పుచ్చకాయ కొనాలని ఆశగా దుకాణాల వద్దకు వెళ్లిన ప్రజలు ధరలు చూసి నిరాశగా వెనుదిరుగుతున్నారు. సాగుకు వెనకడుగు సాగుపై అవగాహన లోపం, ప్రకృతి వైపరీత్యాలు, పురుగులు, తెగుళ్ల వలన నష్టాలు వస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాల్లో పుచ్చకాయ సాగుకు రైతులు వెనకడుగు వేస్తున్నారు. అతి తక్కువ సాగు కాలం 70 నుంచి 80 రోజుల్లో పుచ్చకాయ పంట చేతికొస్తుంది. అయినప్పటికీ ఎన్టీఆర్ జిల్లాలో ఏటా సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. ఈ ఏడాది జిల్లాలో కేవలం 26 ఎకరాలలో మాత్రమే పుచ్చ పంటను సాగు చేశారు. దీనిలో ఒక్క జి.కొండూరు మండలంలోనే 19 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ పంటకు తామర పురుగు ఆశించి దిగుబడి తగ్గిపోవడంతో పాటు కాయలకు మంగు రావడంతో పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదని రైతులు చెబుతున్నారు. డిమాండ్ అధికం పుచ్చకాయలకు ఎన్టీఆర్ జిల్లాలో యమా డిమాండ్ ఉంది. విజయవాడ ప్రూట్స్ మార్కెట్లో పుచ్చకాయలను హోల్సేల్గా విక్రయించే దుకాణాలు ఏడు ఉన్నాయి. ఈ దుకాణాలకు రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఏడాదికి 5వేల టన్నులకు పైగా పుచ్చకాయలు దిగుమతి అవుతూ ఉంటాయి. ఇదే కాకుండా వేసవిలో రహదారుల వెంబడి స్టాల్స్ను ఏర్పాటు చేసి నేరుగా దిగుమతి చేసుకుని మరో వేయి టన్నుల వరకు పుచ్చకాయలను విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రతి ఏటా ఈ సమయంలో మార్కెట్లో హోల్సేల్గా పుచ్చకాయలు కేజీ రూ.10 చొప్పున రిటైల్ వ్యాపారులకు విక్రయిస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది దిగుబడి లేకపోవడంతో పాటు రంజాన్ మాసం జరుగుతుండడంతో మార్కెట్లోనే క్వాలిటీని బట్టి పుచ్చకాయ కేజీ రూ.18నుంచి రూ.20 వరకు విక్రయిస్తున్నారు. రిటైల్ వ్యాపారులు కేజీ రూ.30 నుంచి రూ.40 వరకు ప్రాంతాలను బట్టి విక్రయిస్తున్నారు. స్థానికంగా జిల్లాలో పుచ్చకాయ సాగు వైపు రైతులు మొగ్గు చూపితే ధరలు తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం అతి తక్కువ కాలంలో పంట చేతికొస్తుంది. రబీలో ఈ పంట సాగుకు ఎన్టీఆర్ జిల్లా అనుకూలంగా ఉంటుంది. మల్చింగ్కు హెక్టారుకు రూ.16వేలు, రాయితీపై డ్రిప్ పరికరాలను కూడా ఇస్తున్న నేపథ్యంలో ఈ పద్ధతిలో సాగు చేస్తే నీటి వినియోగం కూడా తగ్గించుకోవచ్చు. పురుగులు, తెగుళ్లను అరికట్టడానికి రసాయనిక పద్ధతులే కాకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలను కూడా రైతులు చేపడితే ఫలితాలు వస్తాయి. పుచ్చకాయ విత్తనాలకు హెక్టారుకు రూ.3వేలు ఇస్తున్నాం. మార్కెట్ మూవ్మెంట్ను గ్రహించి సాగు చేపడితే పుచ్చసాగులో లాభాలను ఆర్జించవచ్చు. –పి.బాలాజీకుమార్, ఎన్టీఆర్ జిల్లా హార్టీకల్చర్ అధికారి పుచ్చకాయ వలన కలిగే లాభాలు పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉండడం వలన శరీరానికి తగినంత నీటిని అందించి డీహైడ్రేషన్ను తగ్గిస్తుంది. పుచ్చకాయలో ఉండే పొటాషియం, లైకోపిన్లు గుండె జబ్బులను తగ్గిస్తాయి. పుచ్చకాయలో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మెరుగు పరుస్తాయి. పుచ్చకాయలో ఉండే ‘సి’విటమిన్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పుచ్చకాయలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పుచ్చకాయలో ఉండే విటమిన్‘ఎ’ కంటిచూపును మెరుగుపరుస్తుంది. పుచ్చకాయలో కేలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. పుచ్చకాయలో ఉండే ఎలక్ట్రోలైట్లు కండరాల నొప్పులను తగ్గిస్తాయి. పుచ్చకాయను ఎక్కువగా తినడం వలన శరీరంలో వేడిని తగ్గించడంతో పాటు కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా పుచ్చకాయ తినడం వలన మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు. పుచ్చసాగుకు వెనకడుగు వేస్తున్న స్థానిక రైతులు ఎన్టీఆర్ జిల్లాలో రబీలో 26 ఎకరాలలో మాత్రమే సాగు ఏడాదికి 5వేల టన్నుల పుచ్చకాయ దిగుమతి రిటైల్గా పుచ్చకాయ కేజీ రూ.30 -
ఈ అంశాలపై ఫిర్యాదు చేయొచ్చు
వినియోగదారుడు లేకపోతే సంస్థలే లేవు. ఈ సున్నిత అంశాన్ని సంస్థలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. నాణ్యమైన వస్తువులు, సేవలను అందించడంలో మభ్యపెడుతున్నాయి. తూకం, నాణ్యత, సేవల్లో ప్రజలను కుడి ఎడమల దగా చేస్తున్నాయి. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టంపై అవగాహన లేమి కారణంగా మోసాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వీటిపై అవగాహన పెంచుకుంటే మోసాలకు చెక్ పెట్టవచ్చని కన్స్యూమర్ ఫోరం సభ్యులు అంటున్నారు. వినియోగదారులు జాగ్రత్తలు పాటించాలి అమ్మకం దారుడికి, వినియోగదారుడికి నష్టం జరగకుండా చూడటమే మా శాఖ ముఖ్య ఉద్దేశం చెప్పారు. నిత్యావసరాలను లూజుగా కొనుగోలు చేసేటప్పుడు తూకం విషయంలో వినియోగదారులు చాలా జాగ్రత్తలు పాటించాలి. వేయింగ్ మిషన్పై అనుమానం వస్తే ఆ మిషన్ సీల్ను పరిశీలించాలి. పెట్రోల్ బంక్లోని మీటర్లో జీరో వచ్చిన తర్వాతే పెట్రోల్ కొట్టించుకోవాలి. అవసరమైతే 1967 నంబరులో ఫిర్యాదు చేయొచ్చు. –పి.సుధాకర్, డెప్యూటీ కంట్రోలర్, తూనికల కొలతల శాఖ, ఎన్టీఆర్ జిల్లా వన్టౌన్(విజయవాడపశ్చిమ): మాయా ప్రపంచంలో వినియోగదారుడు తరచూ మోసాల బారిన పడుతూనే ఉన్నాడు. వ్యాపారుల మోసాలకు ఆర్థిక నష్టమే కాకుండా, కొన్ని సందర్భాల్లో ఆరోగ్యాన్ని కూడా వినియోగదారులు కోల్పోతూ ఉంటారు. వ్యాపారుల మోసాలకు చెక్ పెట్టి వినియోగదారుల హక్కులకు గొడుగు పడుతోంది ‘వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం’. వీటిపై అవగాహన లేకపోవడంతో మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. నాణ్యత ఇతర అంశాలపై.. ఉమ్మడి కృష్ణాలో ప్రధానంగా ఎలక్ట్రానిక్ వస్తువుల గ్యారెంటీ లేదా వారంటీ గడువులోపు పని చేయకపోవడం, సంస్థ ఇచ్చిన నిర్ణీత సేవలు సరిగా లేకపోవడం, వస్తు నాణ్యతలో తేడా ఉండటం వంటి అంశాలపై కేసులు నమోదవుతున్నాయి. వాటికి తోడు ఆరోగ్య బీమా సంస్థల సేవలపై అధికంగా కేసులు నమోదవుతున్నాయి. రియల్ఎస్టేట్ వ్యాపారంలో రియల్టర్ అనుకున్న సమయానికి ప్లాట్ అందించకపోవడంపై కేసులు నమోదవుతున్నాయి. వాటితో పాటు బ్యాంకింగ్ రంగ అంశాలపై ఉమ్మడి జిల్లాలో కేసులు నమోదవుతున్నట్లుగా ఆయా సంస్థల ప్రతి నిధులు వివరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో రోజూ 70 నుంచి వంద కిలోలకు పైగా బంగారం విక్రయాలు జరుగుతున్నాయి. ఉమ్మడి కృష్ణాలో 1,200 నుంచి 1,500 వరకూ బంగార ఆభరణాల విక్రయ దుకాణాలు పని చేస్తున్నాయి. వీటికి సంబంధించి బంగారం నాణ్యత, తూకంలో చాలా మోసాలు చోటు చేసుకుంటున్నట్లు ఆ రంగంలోని వ్యక్తులు వివరిస్తున్నారు. ఐరన్ తూకంలోనూ, ఆహార విషయంలోనూ మోసాలు జరుగుతున్నట్లు సంబంధిత రంగ నిపుణులు చెబుతున్నారు. ఏ అంశాలపై చట్టంతో ప్రయోజనం పొందొచ్చంటే.. ఆర్థికంగా ప్రతిఫలం చెల్లించి ఏవస్తువునైనా కొనుగోలు చేసిన వ్యక్తి వినియోగదారుడిగా పరిగణించబడతాడు. ఏ సేవలకై నా ప్రతి ఫలాన్ని చెల్లించినా, లేదా ఉపయోగించినా ఈ చట్టం వర్తిస్తుంది. వస్తువును తిరిగి అమ్మకాలు చేసే ఉద్దేశంతో కొనుగోలు చేసిన వ్యక్తిని వినియోగదారుడిగా పరిగణించరు. సుస్థిరమైన జీవనశైలికి న్యాయమైన పరివర్తన కుడి ఎడమల దగా...దగా...! ఉమ్మడి కృష్ణాలో నాణ్యత, తూకం, సేవల్లో ప్రజలకు మోసం వినియోగదారులకు అండగాకన్స్యూమర్ రైట్స్ కృష్ణాలో 683 కేసులు, ఎన్టీఆర్ జిల్లాలో 255 కేసులు ఇంకా అవగాహన లేమే.. నేడు వినియోగదారుల హక్కుల దినోత్సవం ఆహారం, ఎలక్ట్రానిక్స్, మందులు, సౌందర్య సాధనాలు, ఆర్థికరంగంలో బ్యాంకింగ్ సర్వీసులైన డీడీలు ఇవ్వడం, చెక్కులు మార్చుకోవడం తదితర విధుల్లో జాప్యం జరిగినా, వడ్డీ, లెక్కలు సరిగా లెక్కించకపోయినా తదితర బ్యాంకింగ్ సేవల్లో లోపాలు ఈ చట్ట పరిధిలో ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు, రియల్ఎస్టేట్, స్థానిక సంస్థల నుంచి పొందే రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, మంచినీటి సదుపాయాల కల్పనపై చేసిన వాగ్దానాలకు విరుద్ధంగా వ్యవహరించే అంశాలపై పరిహారాన్ని పొందవచ్చు. విద్యాసంస్థల్లో అందించే సేవలు, వైద్యుల నిర్లక్ష్యంపై కారణంగా రోగికి జరిగే కష్టనష్టాలకూ ఈ చట్టం పరిహారాన్ని ఇప్పిస్తుంది. జీవిత బీమా పరిహారం చెల్లింపులో సేవా లోపాలు, రోడ్డు రవాణా, పార్సిళ్లు, సేవలు సక్రమంగా లేకపోవడం, పోస్టల్ జాప్యం తదితర అంశాలు కూడా ఈ చట్ట పరిధిలోకి వస్తాయి. వ్యాపారుల అనుచిత లేదా అక్రమ వ్యాపార పద్ధతులతో జరిగే నష్టం, హాని కలిగిందని భావించినా, సేవల్లో లోపం ఉందని, నిర్ధారిత ధర కంటే ఎక్కువ వసూలు చేసినా, అపాయకరమైన వస్తువులు, సేవలు అమ్మకానికి పెట్టినా కేసు నమోదు చేయవచ్చు. వెంటాడుతున్న అవగాహన లేమి వినియోగదారుల హక్కులు, చట్టం తదితర అంశాలపై అవగాహనా లేమి వెంటాడుతోంది. మా పరిధిలో గడిచిన మూడేళ్లలో 255 కేసులు నమోదు కాగా అందులో 250 కేసులు పరిష్కరించారు. వస్తువుల కొనుగోలు, బీమా చెల్లింపు తదితర అంశాలను పూర్తిగా చదువుకోవాలి. –ఎ.వెంకటరమణ, సభ్యుడు, కన్స్యూమర్ ఫోరం–2, ఎన్టీఆర్ జిల్లా చర్యలు తీసుకునేవారే లేరు మార్కెట్లో చేపల తూకంలో మోసాలు బహిరంగంగా జరుగుతున్నా దీనిపై చర్యలు తీసుకునేవారు లేరు. చేపల మార్కెట్లలో కవర్లలో, ట్రేలలో నీళ్లతోపాటు చేపలను తూకం వేసి అమ్ముతున్నారు. చేపల ధరలు కూడా మార్కెట్లో ధరల పట్టిక ఉండదు. పట్టిక గురించి ప్రశ్నిస్తే ఎవరూ సమాధానం చెప్పరు. ప్రభుత్వం దృష్టి సారించాలి. –నాగార్జున, వినియోగదారుడు -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా ఇఫ్తార్ సహరి (శని) (ఆది) విజయవాడ 6.23 4.58 మచిలీపట్నం 6.21 4.56శనివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2025రంగుల పండుగను పిన్న, పెద్ద ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు. ఆటపాటలు, ఆధ్యాత్మిక మేళవింపుతో శుక్రవారం ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా హోలీ పండుగను ఘనంగా చేసుకున్నారు. వివిధ వర్ణాలతో మెరుస్తూ ఆటపాటలతో తుళ్లుతూ హోలీ ఆడారు. అందరూ రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. చిన్నారులు గన్లలో రంగునీళ్లను నింపుకొని సందడి చేశారు. హోలీ తమ జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని కోరుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ 7న్యూస్రీల్హోలీ... -
జీజీహెచ్కి మైక్రోస్కోప్లు వితరణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): రామవరప్పాడు సర్కిల్ యూనియన్ బ్యాంక్ బ్రాంచి వారు తమ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వాస్పత్రికి రూ. లక్ష విలువైన రెండు అత్యాధునిక మైక్రోస్కోప్లను అందజేశారు. రోగులకు నాణ్యమైన సేవలు అందించేందుకు ఉపయోగపడే బైనాక్యులర్ మైక్రోస్కోప్, ట్రైనాక్యులర్ హెడెడ్ బైనాక్యులర్ మైక్రోస్కోప్ విత్ డిజిటల్ కెమెరా ఉన్న వాటిని ఆ బ్యాంక్ చీఫ్ మేనేజర్ సీహెచ్ నాగార్జున జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏ వెంకటేశ్వరరావుకు గురువారం అందజేశారు. వాటిని మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావుకు సూపరింటెండెంట్ అందజేశారు. కాగా పరికరాలు బ్యాంకు వారితో అందించేందుకు కృషి చేసిన ల్యాబ్ నోడల్ అధికారి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్. శుభాలక్ష్మి, గ్రేడ్–1 ల్యాబ్ టెక్నీషియన్ పి. నాగరాజులను సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు అభినందించారు. యూనియన్ బ్యాంకు డెప్యూటీ రీజనల్ హెడ్ బి. హరీష్, రీజనల్ హెడ్ ఎం. శ్రీథర్ డాక్టర్ ప్రసాద్బాబు, డాక్టర్ సరితా తదితరులు పాల్గొన్నారు. వాటర్ డిస్స్పేన్సరీ ప్రారంభం.. వేసవి నేపథ్యంలో సీరాలజీ ల్యాబ్లో పనిచేసే సిబ్బందికి ఉపయోగపడేలా గ్రేడ్–1 ల్యాబ్ టెక్నీషియన్ పి. నాగరాజు వాటర్ డిస్స్పేన్సరీని అందజేశారు. దానిని గురువారం సూపరింటెండెంట్ డాక్టర్ ఏ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. -
రోజుకు రూ. 3.5లక్షల ఆదాయం..
కృష్ణానది నుంచి తవ్విన ఇసుకతో కూటమి నాయకులు రోజుకు సుమారు 500 ట్రాక్టర్లు రవాణా చేస్తున్నారు. ప్రతిరోజు 10 పెద్ద సైజు పడవలు, 15 చిన్న సైజుల పడవల ద్వారా రోజుకు సుమారు 500 ట్రాక్టర్ల రవాణా చేస్తున్నారు. పరిసర గ్రామాల నుంచి వచ్చిన ట్రాక్టర్లకు లోడింగ్ చార్జీలు ఒక్కొక్కటి రూ.700 చొప్పున వసూలు చేసి రోజుకు రూ.3.50 లక్షలు సంపాదిస్తున్నారు. ఈ లెక్కన నెలకు రూ.1.05 కోట్లు, ఏడాదికి రూ.12.60 కోట్లు అక్రమ సంపాదన వెనకేసుకునేందుకు కూటమి నేతలు ఇసుక దందాకు పాల్పడుతున్నారు. వీరి ఇసుక అక్రమ రవాణాకు స్థానిక ప్రజాప్రతినిధి అండదండలు ఉండటంతో మూడుపువ్వులు ఆరు కాయలుగా అక్రమ ఇసుక వ్యాపారం వర్థిల్లుతోంది. అయితే ఇటీవల కూటమి నేతల్లో వచ్చిన ఆధిపత్య పోరుతో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. దీంతో అధికారులు దాడులు చేయగా కళ్లు చెదిరే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రెండు రోజుల క్రితం ఇసుక రవాణాకు సిద్ధంగా ఉన్న 24 ట్రాక్టర్లు, లోడింగ్ చేస్తున్న 18 క్రేన్లు, ఇసుక ఒడ్డుకు తీసుకొచ్చిన 10 పడవలు సీజ్ చేశారు. ట్రాక్టర్ల డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. -
వీఆర్వోల సమస్యలు పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వీఆర్వోలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వీఆర్వోల సంఘం ప్రతినిధులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశకు విన్నవించారు. గురువారం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశను కలిసి వినతి పత్రం అందజేశారు. సచివాలయల రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా వీఆర్వోలకు జరుగుతున్న నష్టాన్ని కలెక్టర్కు వివరించారు. పనిభారం తగ్గించాలని, ఇతర శాఖల పనులు కేటాయించడంతో రీ సర్వే పనులు నిలిచిపోతున్నాయని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. వీఆర్వోల సమస్యలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కలెక్టర్ను కలిసిన వారిలో జిల్లా వీఆర్వోల సంఘం అధ్యక్షుడు రాచకొండ శ్రీనివాసరావు, నందిగామ డివిజన్ అధ్యక్షుడు కె. లీలా ప్రసాద్, విజయవాడ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ బాజీ, ప్రచార కార్యదర్శి హుస్సేన్ తదితరులు ఉన్నారు. షాపుల నిర్వహణకు వేలం మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో వివిధ షాపుల నిర్వహణకు టెండరుదారులను గురువారం ప్రకటించారు. దేవస్థానం ప్రాంగణంలో దేవదాయశాఖ అధికారి శ్రీనివాసరావు సమక్షంలో ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 ఏడాది కాలానికి గాను సీల్డ్ టెండర్లు ఓపెన్ చేసినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. భక్తులకు చెవి కుట్టి, చెవి పోగులు విక్రయించుకొను లైసెన్స్ హక్కును మోపిదేవికి చెందిన లకోజి బ్రహ్మనందం రూ. 7,91,000కు దక్కించుకున్నారన్నారు. సీసీ కెమెరాలు రిపేరు, సర్వీసు చేసేందుకు మచిలీపట్నంకు చెందిన టి. కేదార్నాథ్ రూ. 1,62,000కు, పెరుగు అన్నం సప్లయి చేసేందుకు మోపిదేవికి చెందిన వీఎల్కే గుప్త లీటరు పాలకు రూ. 74, స్వామివారి నిత్యాన్నదానానికి అరటి ఆకులు సరఫరా చేసే లైసెన్సు హక్కును మోపిదేవికి చెందిన కె. రాఘవేంద్రరావు 100 ఆకులకు రూ. 109కు దక్కించుకున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ బాల్బ్యాడ్మింటన్ జట్టు ఎంపిక విజయవాడస్పోర్ట్స్: జాతీయ అంతర విశ్వవిద్యాలయాల బాల్ బ్యాడ్మింటన్ పురుషుల పోటీలకు ప్రాతినిధ్యం వహించే డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ జట్టును ఎంపిక చేసినట్లు వర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డాక్టర్ ఇ.త్రిమూర్తి తెలిపారు. ఇటీవల నిర్వహించిన ఎంపిక పోటీల్లో అత్యుత్తమ క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన కె.జస్వంత్కుమార్రాజు, కె.వి.జె.జస్వంత్కుమార్, ఎం.ఉదయభాస్కర్, ఎం.ఓబులేసు, ఎన్.శంకర్నాయక్, పి.బాలాజిరెడ్డి, పి.రవికిరణ్, టి.రవికిషోర్, ఎం.కౌశిక్ శశాంక్ చౌదరి, పి.శ్రీవివేక్కుమార్ జట్టులో చోటు దక్కించుకున్నట్లు వివరించారు. ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు బెంగళూరులో జరిగే జాతీయ అంతర విశ్వవిద్యాలయాల పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందన్నారు. ఈ జట్టుకు మేనేజర్గా సెయింట్ జోసఫ్ డెంటల్ కాలేజీ(ఏలూరు) పీడీ ఎన్.నల్లయ్య వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. జట్టు బృందాన్ని వర్సిటీ రిజిస్ట్రార్ వి.రాధికరెడ్డి వర్సిటీ ప్రాంగణంలో బుధవారం అభినందించారు. స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీకి అత్యాధునిక యంత్రం భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ విద్యాధరపురంలోని ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజికి చైన్నెకు చెందిన జెడ్ఎఫ్ సీవీసీఎస్ ఇండియా లిమిటెడ్ సంస్థ బహూకరించిన ఎయిర్ బ్రేక్ డీబీఎస్ బీఎస్–6 వర్కింగ్ మోడల్ మెషిన్ను ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ బస్సుల బ్రేక్ సిస్టమ్పై డ్రైవర్లు, మెకానిక్లకు మెరుగైన అవగాహన కల్పించేందుకు ఈ మెషీన్ ఉపయోగపడుతుందని తెలిపారు. తద్వారా బస్ బ్రేక్ డౌన్లు, యాక్సిడెంట్లు తగ్గటానికి ఎంతగానో దోహపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్ఎఫ్ సీవీసీఎస్ ఇండియా లిమిటెడ్ సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్పీ సాంబశివరావు, ఏరియా మేనేజర్ ఎన్. సుమన్, ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ సీహెచ్ రవివర్మ (అడ్మిన్), టి. చెంగల్రెడ్డి(ఇంజినీరింగ్), జి. విజయరత్నం (జోన్–2), జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజి ప్రిన్సిపాల్ బి. నీలిమ పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశుక్రవారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2025 ఇఫ్తార్ సహరి (శుక్ర ) (శని) విజయవాడ 6.22 4.58 మచిలీపట్నం 6.21 4.56తిరుపతమ్మ సేవలో.. పెనుగంచిప్రోలు: తిరుపతమ్మవారిని గురువారం ట్రైనీ ఎీస్పీ మనీషారెడ్డి దర్శించుకుని, పూజలు నిర్వహించారు. డీసీపీ మహేశ్వరరాజు, నందిగామ ఏసీపీ తిలక్ తదితరులున్నారు. నిత్యాన్నదానానికి విరాళం ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి విజయవాడ కస్తూరిబాయి పేటకు చెందిన మోటూరు శివమోహన్రావు, కమలారాణి రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణమ్మకు కన్నీటి శోకమే మిగులుతోంది. ఇసుకాసురులు నదీగర్భంలో తూట్లు పొడిచి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. విజయవాడకు కూత వేటు దూరంలో ఈ దందా జరుగుతున్నా ప్రభుత్వ పెద్దలు తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్తూ.. అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. కృష్ణమ్మకు గర్భశోకం.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద కృష్ణానదిలో అనుమతులు లేకుండా కూటమి నాయకులు భారీ యంత్రాలతో ఇసుక తవ్వి తరలిస్తున్నారు. నదీ గర్భంలో ఇసుక తవ్వకాలు జరపకూడదనే ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, అధికారుల హెచ్చరికలను పెడచెవిన పెట్టి యథేచ్ఛగా ఇసుక తవ్వుతున్నారు. వాల్టా చట్టానికి తూట్లు పొడిచి నదీగర్భంలో డ్రెడ్జింగ్ యంత్రాలు వినియోగిస్తున్నారు. దోపిడీని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మైనింగ్, రెవెన్యూ అధికారులపై దౌర్జన్యానికి దిగుతున్నారు. దీంతో అధికారులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా.. కృష్ణానదిలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. వాల్టా చట్టం ప్రకారం కృష్ణా నదిలో పడవల ద్వారా ఇసుక తవ్వాలంటే పీడబ్ల్యూడీ, జలవనరుల శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అనుమతులు ఉన్నా కూడా నీటి మట్టానికి 3.5మీటర్ల లోతులోనే మాన్యువల్గా ఇసుక తవ్వకాలు జరపాల్సి ఉంది. అయితే ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా భారీ డ్రెడ్జింగ్ యంత్రాలు కలిగిన పడవలతో నదిలో రిగ్బోరు ద్వారా యథేచ్ఛగా ఇసుక తోడేస్తున్నారు. దీంతో నది గర్భంలో పెద్దసైజు గుంతలు ఏర్పడి ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ఇటువంటి గుంతలతోనే 2017లో ఫెర్రీ వద్దకు వచ్చిన పర్యాటకుల పడవ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 22 మంది పర్యాటకులు మృత్యువాత పడ్డారు. కూటమి నాయకుల కనుసన్నల్లోనే.. ఇబ్రహీంపట్నం ఫెర్రీ, గుంటుపల్లి గ్రామాల్లో కృష్ణా నది నుంచి ఇసుక తవ్వకాలు కూటమి నాయకులు కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. నెలరోజుల క్రితం నదిలో ఇద్దరు కూటమి నాయకులు రెండు పడవలతో ఇసుక తవ్వకాలు మొదలు పెట్టగా వారికి పోటీగా ఇప్పుడు సుమారు 25పడవల యజమానులు ఇసుక తవ్వకాలు ప్రారంభించారు. పెద్ద సైజు పడవలో సుమారు 30నుంచి 40ట్రాక్టర్ల ఇసుక తీసుకొస్తున్నారు. చిన్న పడవల్లో 10ట్రాక్టర్ల ఇసుక చేరవేస్తున్నారు. నది ఒడ్డుకు చేరిన పడవల్లోని ఇసుకను 18 మాన్యువల్ క్రేన్ల ద్వారా ట్రాక్టర్లకు లోడింగ్ చేస్తున్నారు. పడవలు పాడైపోయిన యజమానులు వారి వద్ద ఉన్న క్రేన్, ఆ స్థలం నెలకు రూ.3లక్షల చొప్పున అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. నది మధ్యలో డ్రెడ్జింగ్ చేసి పడవల్లో ఇసుక లోడ్ చేస్తున్న దృశ్యంరబీ ధాన్యం సేకరణకు సన్నద్ధం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో రబీ (2024–25) సీజన్ ధాన్యం కొనుగోలుకు సన్నద్ధంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. గురువారం పౌర సరఫరాల కమిషనర్ సౌరభ్ గౌర్, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ డాక్టర్ మంజీర్ జిలానీ.. రబీ ధాన్యం సేకరణ సన్నద్ధతపై వర్క్షాప్తో పాటు ఎంఎల్ఎస్ పాయింట్ల ఇన్స్పెక్షన్ మాడ్యూల్, బఫర్ గోదాముల వినియోగం, కాగిత రహిత డిజిటల్ లావాదేవీలు తదితరాలపై వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టరేట్ నుంచి కలెక్టర్తో పాటు పౌర సరఫరాలు, వ్యవసాయం, సహకార, రవాణా తదితర శాఖల అధికారులు హాజరయ్యారు. రబీ సీజన్ ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా చేపట్టాల్సిన చర్యలపై ఎండీ మంజీర్ జిలానీ పలు సూచనలు చేశారు. లక్ష్యాల మేరకు కొనుగోలు.. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఖరీఫ్కు సంబంధించి 149 రైతు సేవా కేంద్రాల (ఆర్ ఎస్కే) ద్వారా 16,353 మంది రైతుల నుంచి దాదాపు రూ. 257 కోట్ల విలువైన 1,10,738 టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. ఇదే విధంగా రబీకి కూడా సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో ఈ–పంట నమోదు ఆధారంగా చూస్తే రబీలో 20,422 హెక్టార్లలో వరి వేశారని, 1,60,413 టన్నుల మేర ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశముందని తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని లక్ష్యాల మేరకు మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. రబీ ధాన్యం సేకరణకు జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ చైర్మన్గా ఆర్డీవోలు, పౌర సరఫరాల డీఎం, డీఎస్వో, డీఏవో తదితర అధికారులు సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేశామన్నారు. డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, పౌరసరఫరాల డీఎం ఎం.శ్రీనివాసు, డీఎస్వో ఎ.పాపారావు, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయ కుమారి తదితరులు పాల్గొన్నారు. 7న్యూస్రీల్ ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు అమలు కాని వాల్టా చట్టం ఇసుక రవాణాకు అనువుగా అక్కడే పడవల తయారీ రోజుకు 500 ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణా రూ. లక్షలు దోచుకుంటున్న కూటమి నేతలు డ్రెడ్జింగ్ యంత్రాలతో నదీ గర్భానికి తూట్లుఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
కాసారా.. కటకటాలే!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: తిరువూరు నియోజకవర్గంలో నాటుసారా రక్కసి ఎన్నో ఏళ్లుగా వేధిస్తోంది. కల్తీ నాటుసారా తాగి ఎందరో అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఎందరో నిరుపేదలు ఆర్థికంగా చితికిపోయి కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. దశాబ్దాలుగా జరుగుతున్న ఈ అక్రమ, అరాచకపు దందాను నిర్మూలించడంతో పాటు, నాటుసారా మహమ్మారిని రూపుమాపేందుకు మేము సైతం అంటూ ‘సాక్షి’ నడుం బిగించింది. సారా క్రయ, విక్రయాలు.. దానిని తాగడం వల్ల గిరిజన తండాలు, గ్రామీణ ప్రాంత ప్రజలకు జరుగుతున్న తీరని నష్టంపై ఈ నెల 10వ తేదీ నుంచి ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురించింది. దీనిపై స్పందించిన ఎకై ్సజ్ శాఖ అధికారులు తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం, విస్సన్నపేట, ఎ. కొండూరు మండలాల్లో మెరుపుదాడులను నిర్వహించారు. నాటుసారా నిర్మూలనకు ‘సాక్షి’ స్పందించిన తీరుపై నియోజకవర్గ ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ముమ్మరంగా దాడులు.. తిరువూరు నియోజకవర్గంలో నాటుసారా స్థావరాలను కూకటి వేళ్లతో పెకిలించాలని ఉమ్మడి కృష్ణా జిల్లా ఎకై ్సజ్ డీసీ టి. శ్రీనివాసరావు సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు ప్రణాళిక రూపొందించి పకడ్బందీగా అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా సారా తయారీ దారులు, విక్రయదారులపైన నిఘా ఏర్పాటు చేసి కేసులు నమోదు చేసే విధంగా మానిటరింగ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎకై ్సజ్ సీఐ జె. శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధికారులు మెరుపుదాడులు జరుపుతున్నారు. మామిడితోటల్లో, అటవీ ప్రాంతాల్లో, ఇళ్ల ప్రాంగణాల్లో నిల్వ ఉంచిన బెల్లం ఊటను ధ్వంసం చేస్తున్నారు. సారా తయారీ దారులను అరెస్టులు చేస్తున్నారు. పాత నేరస్తులను అదుపులోకి తీసుకొని బైండోవర్లు చేస్తున్నారు. సారా విక్రయదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. సారా తయారీ, విక్రయాల వల్ల జరిగే నష్టాలపై గ్రామాలలో అవగాహన కల్పిస్తున్నారు. నాటుసారాపై నిరంతర నిఘా ఉండేలా టీంలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక ప్రణాళికతో నాటుసారా నిర్మూలనకు ఎకై ్సజ్శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. గంపలగూడెం మండల పరిధి మేడూరులో బెల్లం ఊటను స్వాధీనం చేసుకున్న ఎకై ్సజ్శాఖ పోలీసులు సారా తయారీదారులపై అధికారుల వరుస దాడులు బెల్లం ఊటను ధ్వంసం చేసి పలువురిపై కేసులు నమోదు హర్షం వ్యక్తం చేస్తున్న తిరువూరు నియోజకవర్గ ప్రజలు నాలుగు రోజుల్లో కేసులు ఇవే.. నాటుసారా తయారీ, విక్రయాల వల్ల కలిగే నష్టాలపై ‘సాక్షి’ ఈ నెల 10వ తేదీన ‘సారా ఏరులు’ కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన ఎకై ్సజ్శాఖ అధికారులు అదే రోజు గంపలగూడెం మండల పరిధి అమ్మిరెడ్డిగూడెంలో సారా కాస్తున్న పి. నర్సింహారావు, కొత్తపల్లి గ్రామంలో పి. మోహన్రావుని అదుపులోకి తీసుకున్నారు. కనుమూరులో పాత నేరస్తుడు జెర్రి పోతుల కోటేశ్వరరావు, విస్సన్నపేట మండల పరిధిలోని నరసాపురానికి చెందిన పాత నేరస్తులు ఉమ్మడి రాంబాబు, బాణావతు బుజ్జి, కాటూరి చెన్నారావు, వేమిరెడ్డిపల్లి తండాలో అజ్మీరా బాబురావులను బైండోవర్ చేశారు. ఈ నెల 11న విస్సన్నపేట మండల పరిధిలో పాత నేరస్తులు 8మందిన బైండోవర్ చేశారు. ఈ నెల 12వ తేదీన విస్సన్నపేట మండల పరిధిలోని వేమిరెడ్డిపల్లి తండాలో సారా తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న 17మందిని బైండోవర్ చేశారు. మరలా 13వ తేదీన ‘సారా నిర్మూలనే పల్లెలకు రక్ష’ అనే కథనాన్ని సాక్షి ప్రచురించడంతో ఎకై ్సజ్శాఖ అధికారులు నియోజకవర్గంలో పలు చోట్లు మరోసారి దాడులు జరిపి బెల్లం ఊటను ధ్వంసం చేసి కేసులు నమోదు చేశారు. గంపలగూడెం మండల పరిధిలోని మేడూరు గ్రామంలో నిల్వ ఉంచిన 400లీటర్లు బెల్లంఊటను ధ్వంసం చేసి సారా కాసే వ్యక్తితో పాటు బెల్లం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసులు నమోదు చేశారు. -
ఇక్కడే పడవల తయారీ..
నదిలో ఇసుక తవ్వకాలకు అవసరమైన భారీసైజు పడవలను ఫెర్రీలోనే తయారీ చేస్తున్నారు. రెవెన్యూ, జలవనరులు, అగ్నిమాపక శాఖ అధికారుల అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలం కబ్జా చేసి భారీస్థాయిలో పడవలు తయారు చేస్తున్నా.. సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. డ్రెడ్జింగ్ యంత్రాలు కలిగిన ఒక్కొక్క పడవ సుమారు రూ.30నుంచి 35లక్షల వరకు వరకు ధర పలుకుతున్నాయి. తయారైన పడవలు వెంటనే పక్కనే ఉన్న కృష్ణానదిలోకి దించి ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టడం ఇక్కడ పరిపాటిగా మారింది. -
మొల్లమాంబ సాహిత్య సేవలు చిరస్మరణీయం
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్):రామాయణాన్ని అందరికి అర్థమయ్యేరీతిలో సంస్కృతం నుంచి తెలుగులోకి అనుమదించిన తొలి తెలుగు మహిళా కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) అందించిన సాహిత్య సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ కొనియాడారు. కలెక్టర్ కార్యాలయంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో గురువారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) జయంతిని నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ కవయిత్రి మొల్ల చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రచయిత్రి మొల్ల చిరుప్రాయంలోనే శ్రీరామచరిత్రను వచన కావ్యంగా రచించారన్నారు. మొల్ల చురుకుదనం, ప్రజ్ఞను గమనించిన రాయలవారు ఆమెను సత్కరించి ప్రోత్సహించారన్నారు. మొల్ల జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని పేర్కొన్నారు. శ్రీకంఠేశ్వరుని దేవాలయంలో ఐదు రోజులపాటు రేయింబవళ్లు మల్లమ్మ పద్య రామాయణంను మూడు ప్రతులుగా పూర్తి చేశారన్నారు. మొదటి రామాయణ ప్రతి హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చేరిందని అప్పటి విద్యాశాఖ మంత్రి ఆదేశాలతో ముద్రణ గావించి మొల్ల రామాయణంగా ప్రసిద్ధి పొందిందన్నారు. రెండో ప్రతి తమిళనాడులోని తంజావూరు సరస్వతీ గ్రంథాలయం, మూడో ప్రతి కడప జిల్లా సి.పి. బ్రౌన్ గ్రంథాలయానికి చేరాయన్నారు. తెలుగు సాహిత్య రంగానికి మొల్లమాంబ చేసిన సేవలు, తేట తెలుగు పద్య కావ్యం మొల్ల రామాయణం, ఆమె వర్ణనా మాధుర్యం తదితరాలను స్మరించుకున్నారు.కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీ నరసింహం, కలెక్టరేట్ ఏవో ఎస్.శ్రీనివాసరెడ్డి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జి.మహేశ్వరరావు, సహాయ బీసి సంక్షేమ అధికారి పి.శ్రీనివాసరావు, వసతి గృహ సంక్షేమ అధికారులు ఎ రజినీ కుమారి, బి.హేమ ప్రియా, కె.మోజస్, టి.ఆంజనీయులు, పర్యవేక్షకులు ఎస్.జయజ్వోతి, గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయ పర్యవేక్షకులు, సిహెచ్ గంగాధరం, బీసీ సంక్షేమశాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ ఎస్టీ విభాగం అధ్యక్షుడిగా ధరావత్ ధర్మారావు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఎస్టీ విభాగం అధ్యక్షుడిగా తిరువూరు నియోజకవర్గానికి చెందిన ధరావత్ ధర్మారావును నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. వెబ్సైట్లో డీఎస్సీ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల జాబితా చిలకలపూడి(మచిలీపట్నం): సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో ఉంచినట్లు సాంఘిక సంక్షేమశాఖ డీడీ షేక్ షాహెద్బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబితాలో ఉన్న అభ్యర్థులు మార్చి 15వ తేదీలోగా ఎంప్యానల్డ్ కోచింగ్ సంస్థలను ప్రాధాన్యతలను నమోదు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులకు వారి ప్రాధాన్యత ప్రకారం ఉచిత డీఎస్సీ ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు వివరించారు. సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): పవిత్ర పుణ్యక్షేత్రాలైన సప్త జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు భక్తులు, యాత్రికుల కోసం ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) విజయవాడ నుంచి భారత్ గౌరవ్ పర్యాటక రైలును నడపనున్నట్లు ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ ఎం.రాజా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల లోని యాత్రికులు ఏప్రిల్ 8 నుంచి 19వ తేదీ వరకు దేశంలోని ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు ఈ రైలును నడుపుతున్నట్లు వివరించారు. ఈరైలు విజయవాడ నుంచి ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్ మీదుగా ప్రయాణిస్తుందన్నారు. 11రాత్రులు, 12రోజులపాటు సాగే ఈ ప్రయాణంలో ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, ద్వారకాలోని నాగేశ్వర్, సోమనాథ్లోని సోమనాథ్ జ్యోతిర్లింగం, పూణేలోని భీమశంకర, నాసిక్లోని త్రయంబకేశ్వర్, ఔరంగాబాద్లోని గ్రిష్ణేశ్వర జ్యోతిర్లింగాల దర్శనం ఉంటుంది. ఈ యాత్రలో ఉదయం అల్పహారం, మధ్యాహ్నం, రాత్రి బోజన సదుపాయంతోపాటుగా పర్యటక ప్రదేశాలను దర్శించుకునేందుకు రోడ్డుమార్గంలో రవాణా సదుపాయం, హోటల్స్లో బస ఏర్పాట్లు ఉంటాయన్నారు. ప్రతి కోచ్కు ఎస్కార్ట్, టూర్ గైడ్, టూర్ మేనేజర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్యాకేజీ వివరాలు... మూడు కేటగిరీలుగా ఉన్న ప్యాకేజీలో ఎకానమి(స్లీపర్ క్లాస్)లో పెద్దలకు ఒక్కొక్కరికి రూ.20,890, పిల్లలకు రూ.19,555, స్టాండర్డ్ (3ఏసీ) పెద్దలకు రూ.33,735, పిల్లలకు రూ.32,160, కంఫార్ట్ (2ఏసీ) పెద్దలకు రూ.44,375, పిల్లలకు రూ.42,485గా ధర నిర్ణయించారు. అసక్తికలిగిన వారు విజయవాడలోని ఐఆర్సీటీసీ కార్యాలయం లేదా సెల్నంబర్లు 9281495848, 92810 30714లో సంప్రదించాలన్నారు. ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ద్వారా కూడా టిక్కెట్లు బుక్చేసుకోవచ్చని వివరించారు. 46 మందికి జరిమానా విజయవాడలీగల్ : నగరంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 46 మంది వాహనచోదకులకు ఎనిమిదో అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి లెనిన్బాబు జరిమానా విధించారు. నగర పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు నగరంలో వివిధ ప్రదేశాల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 46 మంది వాహనదారులను గురువారం 2, 4 ట్రాఫిక్ పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి వీరిలో 12మందికి ఒక్కొక్కరికి రూ.15వేలు, 34మందికి రూ.10వేల చొప్పున జరిమానా విధించారు. ప్రతిరోజు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహించి పట్టుబడిన వారిపై కేసులు నమోదుచేస్తామని, వాహనచోదకులు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి సురక్షిత ప్రయాణం చేయాలని పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు సూచించారు. బోరుగడ్డ అనిల్కు 14 రోజులు రిమాండ్ రాజమండ్రి జైలుకు తరలింపు చిలకలపూడి(మచిలీపట్నం): బోరుగడ్డ అనిల్కు 14 రోజులు రిమాండ్ విధిస్తూ రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి గురువారం రాత్రి తీర్పు వెల్లడించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం మండల పరిధిలోని బెరాక వసతి గృహంలో మైనర్ బాలిక చనిపో యిన కేసులో బోరుగడ్డ అనిల్ సోషల్ మీడియా ద్వారా పోలీసు అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై నమోదైన కేసుకు సంబంధించి ఇటీవల నాన్ బెయిల్బుల్ వారెంట్ జారీ చేశారు. దీంతో ఆయనను పోలీసులు అనంతపురంలో అరెస్ట్ చేసి మచిలీపట్నం తీసుకువచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. పూర్వాపరాలను విచారించిన అనంతరం అనిల్కు న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు అనిల్ను రాజమండ్రి జైలుకు తరలించారు. నదిలో పడి వ్యక్తి మృతి కంచికచర్ల : మొక్కజొన్న విత్తనాలను కాటా వేసేందుకు వెళ్లిన ఓవ్యక్తి బహిర్భూమికని వెళ్లి కృష్ణానదిలో ప్రమాదవశాత్తు కాలుజారి పడి మృతిచెందిన సంఘటన గురువారం కంచికచర్ల మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజు కథనం మేరకు వీరులపాడు మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన పడిగెల సురేష్బాబు(43) తోటికూలీలతో కలసి మొక్కజొన్న విత్తనాలను కాటా వేసేందుకు బుధవారం మండలంలోని కొత్తపేట గ్రామానికి వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో బహిర్భూమికి కృష్ణానది వైపు వెళ్లి, ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడి గల్లంతయ్యాడు. అయితే సురేష్ ఇంటికి వెళ్లాడనుకుని తోటి కూలీలు వారి గ్రామాలకు వెళ్లారు. సురేష్ ఇంటికి చేరకపోవడంతో రాత్రంతా అతనికోసం వెతికారు. కాని అతని జాడ తేలియలేదు. ఈక్రమంలో గురువారం ఉదయం కుటుంబసభ్యులు, తోటి కూలీలు తిరిగి కొత్తపేట గ్రామానికి వెళ్లి కృష్ణానదిలో వెతుకగా, సురేష్ మృతదేహం నదిలో తేలియాడుతున్నట్లు గుర్తించి వెంటనే పోలీసులకు తెలియజేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడు సురేష్కు భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె ప్రస్తుతం ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తోంది. సురేష్ మృతితో ఆకుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. -
జన జాతరకు వేళాయె
నేటి నుంచి తిరుపతమ్మ చిన్న తిరునాళ్ల ప్రారంభం ఉత్సవ కాంతులు.. విద్యుత్ దీపాలంకరణలతో మెరిసిపోతున్న తిరుపతమ్మవారి ఆలయం పెనుగంచిప్రోలు: భక్తుల ఇలవేల్పుగా విరాజిల్లుతున్న పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ చిన్న తిరునాళ్ల ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 18 వరకు కొనసాగనున్న ఈ తిరునాళ్ల ఉత్సవాలకు కృష్ణా, ఖమ్మం, గుంటూరు, ప్రకాశం, నల్గొండ జిల్లాల నుంచే కాక ఉభయగోదావరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి భక్తులు తరలి వస్తారు. ఆలయ చైర్మన్ జంగాల శ్రీనివాసరావు, ఈఓ బీహెచ్వీఎస్ఎన్ కిషోర్కుమార్ భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. ఆలయాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా ముస్తాబు చేశారు. ఉత్సవాలు ఇలా.. మార్చి14న ఉదయం 6.02 గంటలకు ఫాల్గుణ శుద్ధ పౌర్ణమిన అఖండ జ్యోతి స్థాపనతో ఉత్సవాలు మొదలవనున్నాయి. 15న సాయంత్రం 6.56 గంటలకు గ్రామంలో ఉత్సవమూర్తుల రథోత్సవం, 16న రాత్రి 9.05గంటలకు 90 అడుగుల దివ్య ప్రభోత్సవం, 17న సాయంత్రం 4.53గంటలకు చిన్న తిరునాళ్లల్లో ప్రధాన ఘట్టమైన తిరుపతమ్మ పుట్టినిల్లు అనిగండ్లపాడు గ్రామం నుంచి పసుపు– కుంకుమల బండ్లు పెనుగంచిప్రోలు ఆలయానికి చేరుకుంటాయి. 18న ఉదయం 5.30 గంటల నుంచి భక్తుల బోనాల సమర్పణతో తిరునాళ్ల ఉత్సవాలు ముగుస్తాయి. జల్లు స్నానాలు.. తిరునాళ్ల ఐదు రోజుల ఉత్సవాలకు మునేరు నీరు లేనందున షవర్ బాత్లు 300 ఏర్పాటు చేస్తున్నారు. తాత్కాలిక టాయిలెట్లు 50, వాటర్ ట్యాంక్లు, చేతి పంపులు, మునేరులో తాత్కాలిక కేశఖండన శాల, ఆలయం చుట్టూ చలివేంద్రాలు, వాటర్ ప్యాకెట్స్ అందుబాటులో ఉంచుతున్నారు. -
మాలల తిరుపతి సభకు తరలిరండి
పటమట(విజయవాడతూర్పు): ఈనెల 23న తిరుపతిలో నిర్వహించనున్న మాలల సింహగర్జనకు రాష్ట్రంలోని మాలలందరూ తరలిరావాలని అఖిల భారత మాలల సంఘాల జేఏసీ చైర్మన్, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి డాక్టర్ ఉప్పులేటి దేవీప్రసాద్ పిలుపునిచ్చారు. గురునానాక్ కాలనీలో సంస్థ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వర్గీకరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసాలు, మాలలపై ప్రభుత్వం చేస్తున్న కుట్రను సభలో వివరిస్తామన్నారు. ఈ సందర్భంగా మాలల సింహగర్జన పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాయలసీమ మాలల సింహగర్జన గౌరవాధ్యక్షులు చెరుకూరి అశోక్రత్నం, సహాయ కార్యదర్శి ఎనుముల రాజ్కుమార్, కొప్పెర రాజేంద్ర, మాధవరం రంగస్వామి, జేఎసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఘనంగా మొల్లమాంబ జయంతి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్):రామాయణాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించిన తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ అని కుమ్మర శాలివాహన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య అన్నారు. తుమ్మలపల్లి క్షేత్రంలో గురువారం ఏపీ కుమ్మర శాలివాహన సంఘం ఆధ్వర్యంలో మొల్లమాంబ జయంతిని ఘనంగా నిర్వహించారు. మొల్లమాంబ విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఐలాపురం వెంకయ్య మాట్లాడుతూ కుమ్మరి కులస్తులకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలతోపాటు కుండల తయారీకి ఆధునిక పరికరాలను అందించాలని కోరారు. జిల్లా కేంద్రంలో శాలివాహన సంఘ భవనానికి ప్రభుత్వం ఐదెకరాల స్థలాన్ని కేటాయించడంతోపాటు కుమ్మరులు తయారు చేసిన వస్తువులను మార్కెట్ లో విక్రయించేందుకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలన్నారు. 50ఏళ్లు నిండిన కుమ్మర కుల వృత్తిదారులకు పింఛన్ ఇవ్వాలని, బడ్జెట్లో కుమ్మరుల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించాలన్నారు. గ్రామాల్లో కుల సంఘ భవనాలు నిర్మించుకునేందుకు ప్రభుత్వ స్థలాలతో పాటు నిధులు కేటాయించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ ఐలాపురం రాజా, సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్ శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ బొమ్మని శ్రీనివాస్, నగర ప్రెసిడెంట్ భర్తవరపు దుర్గాప్రసాద్, సత్యనారాయణమూర్తి కులసంఘీయులు పాల్గొన్నారు.